Top Stories
ప్రధాన వార్తలు

నోరు మెదపరేం చంద్రబాబు!
సాక్షి,తాడేపల్లి: దేశ విద్యుత్తు రంగ చరిత్రలోనే కూటమి సర్కార్ కనీవినీ ఎరుగని స్కామ్కు తెర తీసింది! యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో కూటమి సర్కారు ఇప్పుడు యూనిట్ ఏకంగా రూ.4.60 చొప్పున కొనుగోలుకు సిద్ధమైంది. ఈ విద్యుత్ కొనుగోలుపై వైఎస్సార్సీపీ ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక యూనిట్ను రూ.2.49పైసలకే కొనుగోలు చేస్తే విషం చిమ్మిన మీరు ఇప్పుడు ఏకంగా రూ.4.60 పైసలకు ఎలా ఒప్పందం చేసుకుంటారు’అని ప్రశ్నించింది. ఈ ఒప్పందం ప్రకారం ప్రభుత్వం వచ్చే 25 ఏళ్ల పాటు ఒక్క యూనిట్ విద్యుత్ను రూ.4.80కి కొనుగోలు చేయనుంది. ఈ ధర, గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల కంటే రెండింతలు ఎక్కువ. దీని ప్రభావం రాష్ట్ర ప్రజలపై భారీగా ఆర్థిక భారం పడనుంది. అందుకే ఇది విద్యుత్ రంగంలో చోటుచేసుకున్న అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటిగా నిలుస్తోంది. 'Axis' of Loot - 'Power'ed By Naidu-nomicsThe TDP-led coalition government has signed a power deal with Axis Energy to buy electricity at Rs 4.80 per unit for 25 years. This deal is almost double the rate of earlier agreements and will place a heavy burden on the people of… pic.twitter.com/UW7ueXBm97— YSR Congress Party (@YSRCParty) May 5, 2025మరి దీనిపై చంద్రబాబు నోరెందుకు మెదపడం లేదు. ఈ ఒప్పందం ప్రైవేట్ కంపెనీలకు లాభం చేకూర్చే, ప్రజలకు భారమయ్యే ప్రణాళికతో చేసిన కుట్ర అని ఆరోపిస్తూ ట్వీట్లో పేర్కొంది.

ఎవరిపై మీ సమరం?
ఈ సమయంలో సమరం కాదు..సమయస్ఫూర్తి కావాలి. ప్రభుత్వ ఉద్యోగులందరికీ నేను మనవి చేస్తున్నా. మనమంతా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కోతుల గుంపునకు అప్పగించొద్దు. తెలంగాణను అభివృద్ధి పథం వైపు నడిపించుకుందాం – సీఎం రేవంత్రెడ్డిసాక్షి, హైదరాబాద్: ‘ఎవరి మీద సమరం చేస్తారు? ఎవరిని నిందించదల్చుకున్నరు? ఎవరిని కొట్టదల్చుకున్నరు? ఉద్యోగా లిచ్చి జీతాలు ఇస్తున్న ప్రజలపైనా మీ యుద్ధం? ప్రజలకు జవాబుదారీగా ఉంటూ వారికి కష్టాలు వస్తే ఆదుకోవాల్సిన వాళ్లు.. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు సమరం ప్రకటిస్తున్నారు. ఆ సంఘాల నాయకులను అడుగుతున్నా. ప్రజలకు మంచి చేసేందుకే ఇక్కడ ఉన్నాం. సమరం చేయడానికి లేము. ప్రజలపై యుద్ధం చేసిన వాళ్లెవరూ బాగుపడలేదు’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉద్యోగ సంఘాల నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ‘తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్ జీ అవార్డులు’ కార్యక్రమానికి రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి సీఎం రేవంత్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన 22 మంది పోలీస్ సిబ్బంది, అధికారులకు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. నన్ను కోసినా రూపాయి రాదు.. ‘ప్రభుత్వం అంటే నేను ఒక్కడినే కాదు. ప్రజాప్రతినిధు లు, ప్రభుత్వ ఉద్యోగులు అంతా కలిస్తేనే ప్రభుత్వం. మనం పాలకులం కాదు.. సేవకులం. రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారవద్దని ఉద్యోగులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని.. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని.. ప్రభుత్వం సాఫీగా నడవొద్దని కొన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఉంటది. మీరు వాళ్ల ఉచ్చులో పడి వాళ్ల చేతుల్లో పావులుగా మారొద్దు. రాజకీయ నాయకుల చేతుల్లో చురకత్తుల్లా మారి ప్రజల గుండెల్లో గుచ్చితే అది గాయంగా మారుతుంది తప్ప ప్రయోజనం ఉండదు. నన్ను కోసినా ఒక్క రూపాయి కూడా రాదు. నెలకు రూ. 18,500 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం లేదు. వాస్తవ పరిస్థితి ఇది. మరి నన్ను ఏం చేస్తరు? నన్ను కోసుకొని వండుకొని తింటరా?’అని ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దుబారా తగ్గిస్తున్నా.. ‘ఉద్యోగుల జీతాలు, ఫించన్లు, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు ప్రతి నెలా రూ. 22,500 కోట్లు కావాలి. ప్రభుత్వానికి వస్తున్న రూ. 18,500 కోట్లలో ప్రతి నెలా అప్పులకు రూ. 7 వేల కోట్లు, ఉద్యోగుల వేతనాలు, పింఛన్లకు రూ. 5,500 కోట్లు పోను నా దగ్గర మిగిలేవి రూ. 6 వేల కోట్లు. దీనిలో ఏయే పథకాలు అమలు చేయాలి? అవకాశం ఉన్న ప్రతి దగ్గర ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయతి్నస్తున్నా. సీఎం హోదాలో ఎక్కడికి పోయినా ప్రత్యేక విమానం తీసుకెళ్లే వెలుసుబాటు ఉన్నా మామూలు విమానాల్లో ఎకానమీ క్లాస్లో సాధారణ ప్రయాణికులతో కలిసే వెళ్తున్నా. దుబారా తగ్గిస్తున్నా’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఏది ఆపమంటారో మీరే ప్రజలకు చెప్పండి.. ‘మీ కోరికలు తీర్చాలంటే ఏం చేయాలి? కావాలంటే నేనే బహిరంగ సభ ఏర్పాటు చేస్తా. 10 లక్షల మందిని కూడా తీసుకొస్తా. ఇట్లా చేస్తే బాగుంటదని సభలో మీ ఉద్యోగుల సంఘాల నాయకులే మాట్లాడండి. ఏ పథకం ఆపాలో మీరే ప్రజలకు చెప్పండి. ఫలానా పథకం ఆపేసి మేం జీతాలు పెంచుకుంటాం. బోనస్లు తీసుకుంటాం. మేం తిన్నాక మిగిలిందే మీకు ఇస్తామని ప్రజలకు చెప్పండి. లేదంటే రూ. 100 ఉన్న పెట్రోల్ రూ. 200 చేద్దామా? బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు ధరలు రెండింతలు చేద్దామా? మీరే చెప్పండి. ధరలు పెంచకుండా ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు. నిరసనలు, ధర్నాలు, బంద్లు చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పకూలుతుంది. నాకు పోయేది కూడా ఏమీ లేదు. చిన్న గ్రామం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడమే ప్రజలు నాకిచి్చన గొప్ప గౌరవం అనుకుంటా. ఆ గౌరవం బతికి ఉన్నంత కాలం ఈ గౌరవం నిలబెట్టేందుకు పనిచేస్తా’అని సీఎం రేవంత్ చెప్పారు. అప్పంతా బకాయిలకే.. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లో తెచి్చన అప్పు రూ. 1.58 లక్షల కోట్లు. అందులో రూ. 1.52 లక్షల కోట్లు పాత అప్పులు, అసలు, మిత్తికి చెల్లించాం. గత ప్రభుత్వం మొత్తం రూ. 8.29 లక్షల కోట్ల బకాయిలు పెట్టిపోయింది. మేం తెచ్చిన అప్పులో సొమ్మంతా పాత బకాయిలకు పోయింది తప్ప ఏ సంక్షేమ కార్యక్రమాలు చేయలేకపోయాం. ఈ 16 నెలల్లో సరాసరిన నెలకు రూ. 9 వేల కోట్లు చెల్లించుకుంటూ వస్తున్నా. ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వాల్సి వస్తుందనే గత ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసు మూడేళ్లు పెంచింది. ఇప్పుడు రిటైరవుతున్న వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ల కింద రూ. 8,500 కోట్ల బకాయిలు చెల్లించాలి. వాటిని ఒకవైపు క్రమబద్ధీకరిస్తూనే సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నాం. అదనంగా ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రూ. 500 బోనస్, రూ. 500కే గ్యాస్ సిలిండర్లు, పేదల ఇళ్లకు 250 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 16 నెలల్లో కేవలం రైతులకే రూ. 30 వేల కోట్లను వాళ్ల ఖాతాల్లోకి బదిలీ చేశా’అని సీఎం పేర్కొన్నారు. బ్యాంకర్లను కలిసేందుకు వెళ్తే దొంగల్లా చూస్తున్నరు.. ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. అప్పు పుడతలేదు. బ్యాంకర్లను కలిసేందుకు వెళ్తే తెలంగాణ ప్రతినిధులను దొంగల్లా చూస్తున్నరు. ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు. దేశం ముందు తెలంగాణది ఆ పరిస్థితి ఉంది. కుటుంబ పరువు తీయొద్దని కుటుంబ పెద్దగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వ లెక్కలు కావాలంటే ఆర్థికశాఖ అధికారుల వద్ద కూర్చొని చూడండి’అని సీఎం రేవంత్ ఉద్యోగ సంఘాల నేతలకు సూచించారు. కేసీఆర్ది పైశాచిక ఆనందం.. ‘డైలీ ఫైనాన్స్లో రూ. 10 మిత్తికి తెచ్చుకొనే వాడికంటే అద్వానంగా అప్పులు తెచి్చపెట్టిండు ఆయన (మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి). రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మీ సావు మీరు సావండని హ్యాపీగా ఫాంహౌస్లో దుప్పటి కప్పుకొని పడుకుండు. మూడు నెలలకొకసారి బయటికి వచ్చి అది ఫెయిల్.. ఇది ఫెయిల్ అని తిడతడు. రైతుబంధు ఫెయిల్ అని, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదని చెప్పేటప్పుడు బాధతో కాదు.. ఆయన ముఖం వెయ్యి వోల్టుల బుల్బులా వెలుగుతది. ఇదేం పైశాచిక ఆనందం?’అని సీఎం రేవంత్ మండిపడ్డారు. నిమిషం నిర్లక్ష్యంగా ఉన్నా పోలీస్ శాఖకు చెడ్డపేరు.. ‘శాంతిభద్రతలు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం. శాంతిభద్రతలు బాగున్నందునే 16 నెలల్లో రూ. 2.28 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలిగాం. దీనంతటికీ కారణం పోలీస్ శాఖ అని నేను గర్వంగా చెబుతున్నా. విధుల్లో ఒక్క నిమిషం నిర్లక్ష్యం చేసినా మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డపేరు వస్తుంది. డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపి అణచివేయాలి, సైబర్ నేరాలను నియంత్రించాలి. పోలీస్శాఖకు అవసరమైన పూర్తి సహకారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ హైదరాబాద్ సహా నగరాల్లో పోలీసులు చేపడుతున్న డ్రగ్స్ కట్టడి గ్రామీణ ప్రాంతాల్లోనూ పక్కాగా కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సీఎస్ రామకృష్ణారావు, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, డీజీపీ జితేందర్, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, పలువురు సీనియర్ ఐపీఎస్లు పాల్గొన్నారు.

ఉగ్రబుద్ధిపై వక్రభాష్యం!
పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన రోజు నేను అమెరికాలో ఉన్నాను. సాధారణంగా నేను టెలివిజన్ వార్తలు చూడను, కానీ ఈ మారణహోమం మాతృభూమిలో జరుగుతున్నప్పుడు వేల మైళ్ల దూరంలో ఉండవలసి వచ్చింది. మూడు దశాబ్దాలుగా నా రిపోర్టింగ్ బీట్ కూడా ఇదే. ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్న 26 మంది కశ్మీర్ పర్యాటకులను ఘోరంగా చంపిన ఘటనపై ఆదుర్దాతో నేను హోటల్లో టీవీ ఛానెళ్లు, వార్తాపత్రికలు వెతికాను.‘ఘర్షణ’గా మాత్రమే చూపారు!నిజానికి ఈ అనాగరిక దాడి జరిగిన రోజు అమెరికా ఉపాధ్య క్షుడు జె.డి. వాన్ ్స భారతదేశంలోనే ఉన్నారు కాబట్టి దాడిపై అమెరి కన్ మీడియా ఆసక్తి చూపించాల్సి ఉంది. పైగా, ఉగ్రవాదులు తమ ప్రణాళికను వాన్ ్స రాకకు ముందే ముగించారు. వారి ఆ కార్యా చరణను 25 ఏళ్ల నాటి పూర్వఘటన నుండి తీసుకున్నారు. 2000లో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఢిల్లీలో అడుగు పెట్టినప్పుడు కశ్మీర్ లోయలోని చిట్టిసింగ్పురా గ్రామంలో 36 మంది సిక్కులను ఉగ్రవాదులు ఊచకోత కోశారు. అప్పటిలాగే ఇప్పుడు కూడా, కశ్మీర్ సమస్యపై మరింతగా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడం ఉగ్ర వాదుల లక్ష్యం. కానీ ఆ సమయంలోనే జరిగిన ఒక ప్రముఖ ఘటన కారణంగా భారత్లో ఉగ్రదాడిపై అమెరికా దృష్టి దాదాపుగా కను మరుగై పోయింది. ఆశ్చర్యకరంగా, అమెరికా నెట్వర్క్లలో అందు బాటులో ఉన్నదంతా పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం గురించి గంటల తరబడి కార్యక్రమాలు మాత్రమే. కొన్ని వార్తా పత్రికలలో ఉగ్రదాడిపై నివేదికలు లోపలి పేజీలలో క్లుప్తంగా ఉన్నాయి. ఈ దాడి ఘటనను అమెరికన్ మీడియా దాదాపుగా ఒక సాధారణ భద్రతకు సంబంధించిన ‘ఘర్షణ’గా మాత్రమే చూపింది.పశ్చిమాన లోపించిన ప్రస్తావననేను భారతదేశానికి తిరిగి రావాలని త్వరపడుతున్నాను. జరి గిన దాడి భారత్ నుండి తీవ్రమైన సైనిక ప్రతిస్పందనకు దారి తీయవచ్చని, నేను కలిసిన వారికి వివరించాను. ఇది యుద్ధ చర్య అని నొక్కి చెప్పాను. భారతదేశం తదనుగుణంగానే స్పందించవచ్చునని కూడా అనుకున్నాను. నేను ఇలా చెబుతున్నప్పుడు చాలామంది సహోద్యోగులు, స్నేహితులు నన్ను ప్రశ్నార్థకంగానే చూశారు. వారు చూస్తుండే టీవీ, ప్రింట్ లేదా డిజిటల్ మీడియాలలో పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి ప్రస్తావన చూడలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ప్రతిదాడి స్వభావం, లక్ష్యం, ప్రతిస్పందన సమయం’పై నిర్ణయం తీసుకోవడానికి సాయుధ దళాలకు ‘పూర్తి స్వేచ్ఛ’ ఇచ్చేశారు. దీంతో, భీతిల్లిపోయిన పాక్, తదుపరి 24–36 గంటల్లోనే భారత్ దాడి జరగవచ్చని ప్రకటించేంతవరకు వెళ్లింది. ఒక పాకిస్థాన్ మంత్రి బహిరంగంగానే బెదిరింపు ప్రకటన చేశారు. ‘‘అణ్వాయుధా లను అలంకరణ కోసం తయారు చేయలేదు’’ అని కఠినంగా అన్నారు. ‘సాయుధ దాడి..’ అని రాశారు! ఇప్పటికైనా ప్రపంచ మీడియా అంతా ఈ దాడికి సంబంధించిన భౌగోళిక రాజకీయ ఫలితం గురించి ఆలోచిస్తుందని మీరు అనుకుంటారు కదా! కానీ అలాంటిదేమీ లేదు. ఉగ్రదాడిపై కవరేజ్ నామ మాత్రంగానే ఉంది. ఇంకా దారుణంగా, ప్రారంభ రోజుల్లో ప్రచురి తమైన కొన్ని వార్తా నివేదికలను చూస్తే, పాశ్చాత్య వార్తాపత్రికల లోపలి పేజీలలో ఈ దాడి ఘటనపై ఉపయోగించిన భాష వారి స్వంత కథను వినిపించింది. అదేమిటంటే – జరిగిన దాడి ఘటనకు ‘ఉగ్రవాదం’ అనే పదాన్ని ఉపయోగించడానికి తీవ్రంగా నిరాకరించడం! దానికి బదులుగా, సాయుధులు, తీవ్రవాదులు వంటి మూస పోత పదాలతో ఎప్పటిలాగే వర్ణించారు.సైనిక దుస్తులు ధరించిన ఉగ్రవాదులు గుంపులోని పురుషులను ఒక్కొక్కరిగా చంపేశారు, కానీ వారు హిందువులా లేదా ముస్లింలా అని అడిగిన తర్వాత మాత్రమే చంపారని ప్రత్యక్ష సాక్షుల కథనాలు వెల్లడిస్తున్నాయి. ఉగ్రవాదులతో పోరాడి వారి తుపాకీని లాక్కోవడా నికి ప్రయత్నించిన స్థానిక కశ్మీరీపై కూడా తూటాలు గుప్పించారు.ఇది ‘ఉగ్రవాదం’ అనిపించలేదా?!లష్కరే తోయిబాకి నీడలాగా ఉన్న ‘ది రెసిస్టెన్ ్స ఫ్రంట్’ ఈ దాడికి తక్షణ బాధ్యత వహించింది. తరువాత, పాకిస్థాన్పై ఒత్తిడి పెరగడంతో వారు సైబర్ హ్యాక్ ద్వారా ఈ ప్రకటన జరిగిందని మాట మార్చారు! లష్కర్ తోయిబా ఇంతకు మునుపే అమెరికా అధికారికంగా విడుదల చేసిన ఉగ్రవాద సంస్థల జాబితాకెక్కింది. ముంబైలో జరిగిన 26/11 ఉగ్రవాద దాడిలో ఆరుగురు అమెరికన్లు మరణించారు. పాకిస్థాన్లో దాక్కున్న ప్రదేశం నుండి ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా బయటకు తీసుకెళ్తే అమెరికన్లు ఎలా భావిస్తారు? దీన్ని కూడా వారు సాయుధుల చర్య గానే వర్ణిస్తారా?చివరికి ఇప్పుడు భారతదేశం ‘చర్యకు ప్రతి చర్య’ సూత్రం ప్రాతిపదికన ప్రతీకార చర్యకు సిద్ధమవుతుండగా, పశ్చిమ దేశాలు స్పందించడం ప్రారంభించాయి. వాషింగ్టన్ నుండి కొన్ని ప్రకటనలు సంఘీభావం ప్రకటించాయి. పహల్గామ్ ఘటనకు కారణమైన ఉగ్ర వాదులను శిక్షించడంలో భారత్కు పాకిస్థాన్ సహకరించాలని వాన్ ్స కోరుతూనే, భారతదేశం ‘పెద్ద ప్రాంతీయ సంఘర్షణ’కు దారితీయని విధంగా స్పందిస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు.భారతదేశ సైనిక పరమైన చర్యల ఎంపికలకు అమెరికన్లు అడ్డంకులు కల్పించే అవకాశం లేదు. కానీ 2023 అక్టోబర్ 7 తర్వాత ఏ అమెరికన్ రాజకీయ నాయకుడూ ఇజ్రాయెల్తో ఇలా (ఉద్రిక్తతలు తలెత్తకుండా ఒకరికొకరు సహకరించుకోవాలని) చెప్పి ఉండక పోవచ్చు. యెమెన్ లోని హౌతీలపై తాము నిరంతరం బాంబు దాడి చేస్తూ మరొకవైపు భారతదేశం సైనిక సంయమనం పాటించాలని అమెరికా నేతలు కోరటాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఇప్పటికీ వారి తీరులో భారీ ద్వంద్వ వైఖరి ఉందనే చెప్పాలి.కశ్మీర్ లోపల... కశ్మీర్ వెలుపలా.!పహల్గామ్ ఉగ్రవాద దాడి స్థానికంగా జరిగిన ‘భద్రతా సంఘ టన‘ కాదనీ; అది భారత్, పాక్ల మధ్య కొనసాగుతున్న ఏదో ఒక రకమైన ‘వివాదానికి’ సంబంధించిన మరొక అభివ్యక్తి కాదని ప్రపంచం ఇంకా అర్థం చేసుకోనే లేదు. కశ్మీర్లోనూ, కశ్మీర్ వెలుపల కూడా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఆయుధంగా ఉపయోగించుకుంటోందని 26/11 ముంబై దాడులు గుర్తు చేస్తూనే ఉంటాయి. ఈసారి మాత్రం ఒక నమూనా మార్పు జరిగింది. భారతదేశం పాకిస్థాన్ యుద్ధం అంచున ఉన్నాయి. కానీ ఈ సంఘర్షణ... అది తలెత్తిన రోజు నుండే పాశ్చాత్య మీడియా, పాశ్చాత్య ప్రభుత్వాల దృష్టి నుంచి తప్పిపోయింది. ఉగ్రదాడి గురించి వారు తప్పుగా నివేదించారు, తప్పుగా అర్థం చేసుకున్నారు.బర్ఖా దత్వ్యాసకర్త జర్నలిస్టు, రచయిత్రి

మితవాదానికి మరో ఓటమి
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గమనించుకుంటున్నారో లేదో గానీ ప్రపంచంలో ఎక్కడ ఎన్ని కలు జరిగినా ఆయన చర్చనీయాంశం అవుతున్నారు. గెలుపోటముల్ని ప్రభావితం చేస్తున్నారు. ఇటీవల కెనడా ఎన్నికల్లో ట్రంప్ పట్ల మెతకగా వ్యవహరించిన కన్సర్వేటివ్లు ఓటమిపాలై, ఊహించని రీతిలో అధికార లిబరల్ పార్టీ గెలుపొందింది. ఇప్పుడు ఆస్ట్రేలియాలోనూ అదే జరిగింది. అచ్చం ట్రంప్ విధానాలనే అనుకరిస్తూ ఆస్ట్రేలియా ఎన్నికల్లో తిరుగులేని గెలుపు సాధించాలనుకున్న విపక్ష కన్సర్వేటివ్ పార్టీ అపజయాన్ని మూటకట్టుకోవటమే కాదు... ఆ పార్టీ గెలిస్తే ప్రధాని అవుతారనుకున్న నాయకుడు పీటర్ డటన్ సైతం ఓటమి పాలయ్యారు. 2004 తర్వాత వరసగా రెండోసారి కూడా అధికారం నిలబెట్టుకున్న పార్టీగా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ నేతృత్వంలోని లేబర్ పార్టీ చరిత్ర సృష్టించింది. ఇక సింగపూర్లో ఎప్పటిలా పద్నాలుగోసారి సైతం అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ) తిరిగి అధికారంలోకి రావటం వింతేమీ కాదుగానీ... ఆ పార్టీ నేత, ప్రధాని లారెన్స్ వాంగ్ ప్రచారసభల్లో ట్రంప్పై రణభేరి మోగించారు. అమెరికా విధించిన సుంకా లకు ప్రతీకార సుంకాలుంటాయని ప్రకటించారు. అసలు అమెరికాకు సింగపూర్ నుంచి ఎగుమతులు చేసేదే లేదని స్పష్టం చేశారు. 97 స్థానాలున్న సభలో ఆ పార్టీ 87 స్థానాలు గెల్చుకోవటం గతంలో కూడా జరిగినా ఈసారి వోటు శాతాన్ని సైతం 66.57కి పెంచుకుని చరిత్ర సృష్టించింది. ఇక రుమేనియాలో మాత్రం ట్రంప్ను తలకెత్తుకున్న తీవ్ర మితవాదపక్షం అలయెన్స్ ఫర్ ది యూనిటీ ఆఫ్ రుమేనియన్స్ (ఏయూఆర్) నాయకుడు జార్జి సైమన్ తొలి రౌండ్లో గెలుపొందారు. ఈ నెల 18న జరగబోయే రెండో రౌండ్ ఎన్నికల్లో సైతం ఆయనదే విజయమన్న అంచనాలున్నాయి. వచ్చే సెప్టెంబర్లో ఎన్నికలు జరగబోయే నార్వేలో కూడా ట్రంప్ ప్రభావం కనబడుతోంది. అక్కడి అధి కార లేబర్ పార్టీకి ఓటమి తప్పదని జనవరిలో వివిధ సర్వేలు ప్రకటించగా, ఆ మరుసటి నెలకల్లా అంతా మారిపోయింది. ఇప్పుడు లేబర్ పార్టీయే గెలుపుగుర్రంగా కనబడుతోంది.కరోనా దాపురించినప్పటి నుంచీ ఆస్ట్రేలియా ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. ముఖ్యంగా మూడేళ్లుగా ఆ దేశంలో ఉత్పాదకత తీవ్రంగా దెబ్బతింది. ద్రవ్యోల్బణం పెరిగింది. దాన్ని తగ్గించటానికి ఆస్ట్రేలియా రిజర్వ్బ్యాంక్ 13 సార్లు వడ్డీరేట్లు పెంచింది. ఫలితం లేకపోగా అధిక ధరల కారణంగా కొనుగోళ్లు ఆగిపోయి గృహనిర్మాణ రంగం పడకేసింది. వీటన్నిటి వల్ల జీవన ప్రమాణాలు పడిపోయాయి. ఇవన్నీ చూసి తదుపరి ఎన్నికల్లో తమదే విజయమని కన్సర్వే టివ్ పార్టీ కలలుగంది. అమెరికాలో ట్రంప్కు పెరుగుతున్న మద్దతు చూసి అదే తరహా ప్రకటనలు చేసి ఆ పార్టీ నాయకుడు డటన్ మొదట్లో వోటర్ల మెప్పు పొందినమాట వాస్తవం. ప్రభుత్వ రంగంలో 40,000 ఉద్యోగాలు రద్దుచేస్తామని, వలసల విషయంలో కఠినంగా వుంటామని, ఉదార వాద విధానాలైన భిన్నత్వం, అందరినీ కలుపుకొనిపోవటం వగైరాలకు కాలం చెల్లిందని ఆయన పదే పదే ప్రకటించారు. ఆస్ట్రేలియా మొదటి నుంచీ అమెరికా మిత్ర దేశమే. అయినా ట్రంప్ ఏమాత్రం కనికరించలేదు. అందరితోపాటు ఆస్ట్రేలియాపైనా భారీయెత్తున సుంకాలు పెంచుతా మని ప్రకటించారు. ఇవింకా అమల్లోకి రాకపోయినా అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం కారణంగా అసలే అంతంతమాత్రంగా వున్న ఆర్థిక వ్యవస్థ మరింత అనిశ్చితిలోకి పోయింది. ఈ దశలో డటన్ తనకు ట్రంప్తో వున్న వ్యక్తిగత సాన్నిహిత్యం వల్ల ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థను సునాయాసంగా గట్టెక్కిస్తానని హామీ ఇచ్చారు. కానీ ట్రంప్ దూకుడు కారణంగా స్టాక్ మార్కెట్లన్నీ బోల్తా కొట్టడంతో డటన్కు దిక్కుతోచలేదు. దాంతో ట్రంప్ ప్రస్తావన మానుకున్నారు. కానీ అప్పటికే జరగా ల్సిన నష్టం జరిగిపోయింది. జనం లేబర్ పార్టీకే వోటేయాలన్న నిర్ణయానికొచ్చారు. సింగపూర్ సైతం ఆర్థిక అస్థిరతలో కొట్టుమిట్టాడుతోంది. అసలే వాణిజ్యం దెబ్బతిని వుండగా ట్రంప్ అధిక సుంకాల ప్రకటన మరింత దెబ్బ తీసింది. ఆస్ట్రేలియా మాదిరే ఆ దేశంలోనూ పౌరులకు సొంతిళ్లు సమకూర్చుకోవటం సమస్యగా మారింది. పెరిగిన ద్రవ్యోల్బణం, ఆర్థికమాంద్యం, ఉద్యో గాలు కోల్పోతామన్న భయాందోళనలు ప్రజల్ని వణికిస్తున్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అంచనాల కన్నా జీడీపీ చాలా తగ్గి 3.8 శాతానికొచ్చింది. వచ్చే త్రైమాసికంలో అది 2 శాతం మించక పోవచ్చు. ట్రంప్ సుంకాల బెదిరింపు సరేసరి. అందుకే ఈ అనిశ్చితిలో పాలకపక్షాన్నే మరోసారి గెలిపించటం ఉత్తమమన్న నిర్ణయానికొచ్చారు. కనుకనే పీఏపీ వోట్ల శాతం 61.2 నుంచి 65.67కి పెరి గింది. సింగపూర్ ఎన్నికల్ని విదేశీ మదుపుదార్లు, అంతర్జాతీయ మీడియా, వివిధ దేశాల ప్రభుత్వాలు శ్రద్ధగా గమనించాయి. ఈ అయిదేళ్లూ సింగపూర్ ఎదుర్కొన్న సమస్యలు అలాంటివి మరి.ఏతావతా ఇప్పటికి ఒక్క రుమేనియా మినహాయించి ట్రంప్ను చూసి వాతలు పెట్టుకుంటున్న నాయకులంతా ఊహించని ఓటమితో ఖంగుతింటున్నారు. నిరుడంతా మితవాద పక్షాలు ఎక్కడి కక్కడ విజయం సాధించగా, ప్రస్తుతం ఆ పక్షాలకు ఎదురుగాలి వీస్తోంది. అయితే గెలిచిన పక్షాలు చుట్టుముడుతున్న ఆర్థిక సంక్షోభాలకు ఎదురీదటం, జనం మెప్పు పొందటం అంత సులభమేమీ కాదు. ప్రపంచంతోపాటే మనమూ అని ఈ సంక్షోభాల్ని సరిపెట్టుకునే పరిస్థితుల్లో వారు లేరు. కనుక సమస్యలకు దీటైన పరిష్కారాలు కనుగొనటానికి గద్దెనెక్కిన నాయకులు ప్రయత్నించాల్సి వుంది. వారి మాటెలావున్నా ప్రపంచమంతటా తన కారణంగా మితవాద పక్షాలు బోల్తా కొట్టడాన్ని చూసైనా ట్రంప్ తన విధానాలను మార్చుకుంటారా, లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఆర్బీఐ ఖజానాలో పసిడి మెరుపులు
ముంబై: పసిడిపై ఆర్బీఐ మోజు కొనసాగుతూనే ఉంది. గత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో 25 టన్నుల పసిడిని ఆర్బీఐ కొనుగోలు చేయగా.. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 57 టన్నుల బంగారాన్ని అదనంగా సమకూర్చుకుంది. దీంతో ఆర్బీఐ వద్ద బంగారం నిల్వలు మార్చి నాటికి 879.59 టన్నులకు చేరినట్టు అధికారిక డేటా తెలియజేస్తోంది. ఈ కాలంలో పసిడి ధరలు 30 శాతం ర్యాలీ చేయడం గమనార్హం. గత ఏడేళ్లలోనే ఆర్బీఐ అత్యధికంగా పసిడిని గత ఆర్థిక సంవత్సరంలోనే కొనుగోలు చేసింది. అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగిపోయిన తరుణంలో సురక్షిత సాధనమైన బంగారానికి ఆర్బీఐ ప్రాధాన్యం పెంచినట్టు తెలుస్తోంది. ఇక ఆర్బీఐ పసిడి నిల్వల్లో 512 టన్నులు స్థానిక ఖజానాల్లో ఉంటే, 348.62 టన్నులు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) వద్ద, మరో 18.98 టన్నులు గోల్డ్ డిపాజిట్ల రూపంలో కలిగి ఉంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఆర్బీఐ తన బంగారం నిల్వల్లో కొంత మొత్తాన్ని స్థానిక ఖజానాలకు మళ్లించడం గమనార్హం. 2024 మార్చి నాటికి స్థానిక నిల్వలు 408 టన్నులే కాగా, గత సెప్టెంబర్ నాటికి 510.46 టన్నులకు పెంచుకుంది. ఫారెక్స్ నిల్వల్లో 11.70 శాతం.. ఇక విదేశీ మారక నిల్వల్లో (ఫారెక్స్) బంగారం వాటా 2024 మార్చి నాటికి 9.32% కాగా, 2025 మార్చి నాటికి 11.70 శాతానికి పెరిగింది. ఇక 2024 సెప్టెంబర్ నాటికి 706 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు ఉంటే, ఈ ఏడాది మార్చి నాటికి 668.33 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఇవి 10.5 నెలల దిగుమతుల అవసరాలకు సరిపోతాయి.

earthquake: తెలంగాణలో పలు చోట్ల భూకంపం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రతతో సోమవారం సాయంత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూమి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కొడిమ్యాలలో ఆరు సెకన్లపాటు.. పెద్దపల్లి నియోజకవర్గంలో మూడు సెకన్లపాటు భూమి కంపించింది. అటు నిర్మల్ జిల్లాలోనూ భూప్రకంపనలు సృష్టించాయి. ఖానాపూర్, కడెం, జన్నారం, లక్సెట్టిపేటలో ప్రకంపనలు ప్రజల్ని ఆందోళనకు గురి చేశాయి. భూమి కంపించడంతో ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు.మరోవైపు, మేడిపల్లి మండలంలో భూ ప్రకంపనలతో పల్లె అర్జున్ అనే రైతు ఇల్లు కూలింది. ఇల్లు కూలే సమయంలో ఇంట్లో ఉన్న అర్జున్ కుటుంబ సభ్యులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

ప్యాట్ కమ్మిన్స్ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
ఐపీఎల్-2025లో ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ బంతితో మ్యాజిక్ చేశాడు. తన అద్బుత బౌలింగ్తో ఢిల్లీ క్యాపిటల్స్ టాపర్డర్ను కుప్పకూల్చాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే కరుణ్ నాయర్ను ఔట్ చేసి తన జట్టుకు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు.ఆ తర్వాత మూడో ఓవర్ మొదట బంతికి ఫాఫ్ డుప్లెసిస్, ఐదో ఓవర్ మొదటి బంతికి అభిషేక్ పోరెల్ను కమ్మిన్స్ పెవిలియన్కు పంపాడు. కమ్మిన్స్ ఓవరాల్గా తన 4 ఓవర్ల కోటాలో 19 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో కమ్మిన్స్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో ఒక ఇన్నింగ్స్ పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన కెప్టెన్గా కమ్మిన్స్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఒక ఇన్నింగ్స్ పవర్ ప్లే ఏ కెప్టెన్ కూడా మూడు వికెట్లు సాధించలేకపోయాడు. అక్షర్ పటేల్(ఢిల్లీ క్యాపిటల్స్), జహీర్ ఖాన్(ఢిల్లీ క్యాపిటల్స్), షాన్ పోలాక్(ముంబై ఇండియన్స్) వంటి కెప్టెన్లు ఐపీఎల్ ఇన్నింగ్స్ పవర్ ప్లేలో 2 వికెట్లు పడగొట్టారు. తాజా మ్యాచ్తో ఈ త్రయాన్ని కమ్మిన్స్ అధిగమించాడు.మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన 7 వికెట్ల నష్టానికి ఢిల్లీ 133 పరుగులు చేసింది. 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఢిల్లీని స్టబ్స్(41 నాటౌట్), ఆశుతోష్ శర్మ(41) ఆదుకున్నారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమ్మిన్స్ మూడు, ఉనద్కట్, హర్షల్ పటేల్, మలింగ తలా వికెట్ సాధించారు.

Mock drills: భారత్లో మాక్ డ్రిల్.. 1971భారత్-పాక్ యుద్ధ సమయంలో
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న వేళ రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు జారీ చేసింది. 1971లో భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ జరిగింది. అదే సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ను బుధవారం (మే7న) నిర్వహించాలని కేంద్ర హోంశాఖ సూచించింది. సోమవారం ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, హోంశాఖ కార్యదర్శి, రక్షణ శాఖ కార్యదర్శితో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. సమావేశం అనంతరం కేంద్రం రాష్ట్రాలకు ఈ ఆదేశాలు చేయడం గమనార్హం.అయితే, మాక్ డ్రిల్ నిర్వహించాలని భారత్ - పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లకు కేంద్రం హోం శాఖ సూచించింది. పౌరుల రక్షణ కోసం మే 7న మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించింది. Ministry of Home Affairs has asked several states to conduct mock drills for effective civil defence on 7th May.Following measures will be undertaken1.Operationalization of Air Raid Warning Sirens2. Training of civilians, students, etc, on the civil defence aspects to… pic.twitter.com/DDvkZQZw3A— DD News (@DDNewslive) May 5, 2025శత్రువుల వైమానిక దాడి సమయంలో తమను తాము రక్షించుకునే విధానం పై పౌరులు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని తెలిపింది. ఎయిర్ రైడ్ సైరన్స్ పనితీరు పరీక్షించడం, సైరన్ ఇచ్చి ప్రజలను ఎలా అప్రమత్తం చేయాలనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహణ ఉంటుంది. వీటితో పాటు క్రాష్ బ్లాక్ అవుట్ రిహార్సల్స్, కీలకమైన సంస్థల ముందస్తు రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, తరలింపు చర్యల సన్నద్ధత ఉండనుంది. గత ఆదివారం ఫిరోజ్పూర్ కంటోన్మెంట్ ప్రాంతంలో 30 నిమిషాల పాటు బ్లాక్ ఔట్ రిహార్సల్స్ జరిగాయి. బ్లాక్ ఔట్ రిహార్సల్స్ భాగంగా రాత్రి 9 నుంచి 9:30 వరకు అన్ని లైట్లు, వాహనాల లైట్లు ఆపివేసి ఉంచారు.

ఉరుములు, మెరుపులతో హైదరాబాద్లో భారీ వర్షం
హైదరాబాద్: హైదరాబద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి పలుచోట్ల భారీ వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ , పంజాగుట్టలో కుండపోత వర్షం కురిసింది. ఈరోజు(సోమవారం) మధ్యాహ్నం ఎండలు మండిపోగా, సాయంత్రానికి వాతావరణం చల్లబడింది. ఉరుములు, మెరుపులతో హైదరాబాద్లో భారీ వర్షంఅనంతరం రాత్రి 9 గంటల ప్రాంతంలో వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వర్షం రాకతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కల్గింది. ఆఫీసులు ముగించుకుని ఇంటికి వెళ్లే ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. Raining in Nampally #HyderabadRains pic.twitter.com/Np4eJ5jUlN— Weatherman Karthikk (@telangana_rains) May 5, 2025 #Hyderabadrains Now scattered intense thunder storm rains for going in Hyderabad City not good news for #SRHvsDC Hope after 10:30 rain reduce chance high let's see ⛈️⚠️ pic.twitter.com/I6KNqEDfYK— Telangana state Weatherman (@tharun25_t) May 5, 2025 Lighting caught on camera in Tolichowki SHAIKPET Manikonda Golconda areas#tolichowki#manikonda#Hyderabad #hyderabadrains@balaji25_t @Hyderabadrains pic.twitter.com/jOWHSnLLSH— TajKeProperties (@Mawt777) May 5, 2025

UPIలో కీలక మార్పులు: జూన్ 16 నుంచే అమలు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI).. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI)లో కీలక మార్పులు చేయనున్నట్లు వెల్లడించింది. యూజర్ల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈ అప్డేట్ చేయనున్నట్లు, ఇది 2025 జూన్ 16 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది.యూపీఐ వినియోగదారులు.. లావాదేవీలు చేయడానికి కనీసం 30 సెకన్ల సమయం కేటయించాల్సి ఉంది. ఈ సమయాన్ని తగ్గించడానికి NPCI చర్యలు తీసుకుంటోంది. ఇది అమలులోకి వచ్చిన తరువాత.. ట్రాన్సక్షన్స్ మరింత సులభతరం అవుతుంది.ఇదీ చదవండి: పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలులావాదేవీలు, డెబిట్, క్రెడిట్ సేవల కోసం యూజర్ ఇప్పుడు 30 సెకన్ల సమయం వెచ్చించాల్సి ఉంది. దీనిని 15 సెకన్లకు పరిమితం చేయనుంది. లావాదేవీ స్థితిని తనిఖీ చేసే సమయాన్ని 30 సెకన్ల నుంచి 10 సెకన్లకు పరిమితం చేయనుంది. లావాదేవీలు చేయడానికి సంబంధించిన టైమ్ తగ్గితే.. యూజర్ల సమయం కూడా ఆదా అవుతుంది.
మితవాదానికి మరో ఓటమి
ఉగ్రబుద్ధిపై వక్రభాష్యం!
ఎవరిపై మీ సమరం?
సారీ సార్! యుద్ధమొస్తే నేనూ వెళ్లిపోతా...
రైలు బండి... ఇక పొగ రాదండీ
3జీ క్యాపిటల్ చేతికి స్కెచర్స్
మహీంద్రా కొత్త ప్లాంట్
త్రీడీలో జగదేక వీరుడు... అతిలోక సుందరి
భారీ ఐపీవోకి అవాడా గ్రూప్
ఆర్బీఐ ఖజానాలో పసిడి మెరుపులు
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్తో తెరమరుగు..
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
నా కొడుకును సంపేయండి
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
ఫెన్సింగ్ కింద పాక్కుంటూ వెళ్లి.. గుంతలో దాక్కుని
TG: హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్లు
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
‘ఎల్లమ్మ’ దొరకట్లేదు.. ఇప్పుడెలా?
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
బంగారం భారీగా పడిపోతుంది!
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
బాలకృష్ణ విలన్ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
ఇంట్లో పాముల కలకలం
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
3 నిమిషాలకో మరణం
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
‘ఛీ’నా రాజకీయం...
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
కొందరికే ‘భరోసా’
శ్రీకృష్ణ లీలలు
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
హైదరాబాద్లో హై అలర్ట్
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
భారత్తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
నచ్చిన వారితో శృంగారం.. అజిత్పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
'లాహోర్ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
మూడో పంటగా సౌర విద్యుత్తు!
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
బెల్లంకొండ హీరో దెయ్యం సినిమా.. గ్లింప్స్ రిలీజ్
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
ఉత్కంఠపోరు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
పాక్ నడ్డి విరిగేలా..
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్నే’
తండ్రికి బైక్ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
నీట్–2025కు పకడ్బందీ ఏర్పాట్లు
శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకం
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
ఏప్రిల్లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్కేర్ రివల్యూషన్..!
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ఒకే ఇల్లు.. ఒకే వంట
వన్నెతగ్గుతోన్న .. పాలిటెక్నిక్ విద్య
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
ఈపీఎఫ్ క్లెయిమ్కు వెళ్తున్నారా..?
‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
మళ్లీ ఉగ్ర కాండ!
రెడ్ మిర్చిలా రెజీనా... విష్ణుప్రియ మౌంటైన్ ట్రిప్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
ముష్కర మూకలకు ముచ్చెమటలు
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
చిన్నప్పటి నుంచి చదువులో టాప్
మితవాదానికి మరో ఓటమి
ఉగ్రబుద్ధిపై వక్రభాష్యం!
ఎవరిపై మీ సమరం?
సారీ సార్! యుద్ధమొస్తే నేనూ వెళ్లిపోతా...
రైలు బండి... ఇక పొగ రాదండీ
3జీ క్యాపిటల్ చేతికి స్కెచర్స్
మహీంద్రా కొత్త ప్లాంట్
త్రీడీలో జగదేక వీరుడు... అతిలోక సుందరి
భారీ ఐపీవోకి అవాడా గ్రూప్
ఆర్బీఐ ఖజానాలో పసిడి మెరుపులు
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్తో తెరమరుగు..
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
నా కొడుకును సంపేయండి
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
ఫెన్సింగ్ కింద పాక్కుంటూ వెళ్లి.. గుంతలో దాక్కుని
TG: హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్లు
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
‘ఎల్లమ్మ’ దొరకట్లేదు.. ఇప్పుడెలా?
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
బంగారం భారీగా పడిపోతుంది!
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
బాలకృష్ణ విలన్ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
ఇంట్లో పాముల కలకలం
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
3 నిమిషాలకో మరణం
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
‘ఛీ’నా రాజకీయం...
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
కొందరికే ‘భరోసా’
శ్రీకృష్ణ లీలలు
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
హైదరాబాద్లో హై అలర్ట్
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
భారత్తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
నచ్చిన వారితో శృంగారం.. అజిత్పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
'లాహోర్ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
మూడో పంటగా సౌర విద్యుత్తు!
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
బెల్లంకొండ హీరో దెయ్యం సినిమా.. గ్లింప్స్ రిలీజ్
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
ఉత్కంఠపోరు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
పాక్ నడ్డి విరిగేలా..
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్నే’
తండ్రికి బైక్ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
నీట్–2025కు పకడ్బందీ ఏర్పాట్లు
శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకం
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
ఏప్రిల్లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్కేర్ రివల్యూషన్..!
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ఒకే ఇల్లు.. ఒకే వంట
వన్నెతగ్గుతోన్న .. పాలిటెక్నిక్ విద్య
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
ఈపీఎఫ్ క్లెయిమ్కు వెళ్తున్నారా..?
‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
మళ్లీ ఉగ్ర కాండ!
రెడ్ మిర్చిలా రెజీనా... విష్ణుప్రియ మౌంటైన్ ట్రిప్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
ముష్కర మూకలకు ముచ్చెమటలు
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
చిన్నప్పటి నుంచి చదువులో టాప్
సినిమా

సిల్క్ డ్రస్సులో తమన్నా.. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ని గుర్తుపట్టారా?
జిమ్ లో తెగ కష్టపడుతున్న హీరోయిన్ సోనాల్ చౌహాన్హిట్ 3 సక్సెస్.. అందరికీ థ్యాంక్స్ చెప్పిన శ్రీనిధి శెట్టిసిల్క్ డ్రస్సుల్లో సెగలు రేపుతున్న తమన్నా భాటియావంటింట్లో టీ పెట్టి, పకోడీ చేసేసిన రాశి సింగ్'భజరంగీ భాయ్ జాన్' బాలనటి హర్షాలీ మెహతా ఇప్పుడిలాసైడ్ తిరిగి నవ్వుతో మాయలో పడేస్తున్న ఆషికా రంగనాథ్ఎండలో రుహానీ శర్మ స్టైలిష్ పోజులు View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Raashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Rukshar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ కోసం చిరంజీవి, శ్రీదేవి రెమ్యునరేషన్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం మళ్లీ విడుదల కానుంది. దీంతో ఈ చిత్రం గురించి పలు పాత విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు ఎంత బడ్జెట్ అయింది..? చిరు, శ్రీదేవిల రెమ్యునరేషన్ ఎంత..? బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు రాబట్టింది..? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలు సోషల్మీడియాలో కనిపిస్తున్నాయి. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం 1990 మే 9న విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచింది. 35 ఏళ్ల తర్వాత ఈ మూవీని రీ–రిలీజ్ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 9న 2డీతో పాటు 3డీ వెర్షన్లోనూ విడుదల కానుంది.‘జగదేకవీరుడు అతిలోకసుందరి’.. వంటి సెల్యులాయిడ్ వండర్ వెనక చాలామంది ఛాంపియన్స్ ఉన్నారు. ఇళయరాజా అందించి ట్యూన్స్, దర్శకుడు రాఘవేంద్ర రావు విజన్, డీఓపీ విన్సెంట్, అద్భుతమైన సెట్స్తో మైమరపింపజేసిన ఆర్ట్ డైరెక్టర్ చలం.. పాటలు, మాటలతో మెస్మరైజ్ చేసిన వేటూరి గారు, జంధ్యాల గారు ఇలా ఎందరో ఈ సినిమాకు పనిచేశారు. తెలుగు సినిమా చరిత్రలోనే ఒక వండర్, ఒక మైల్ స్టోన్ , ఓ హిస్టారికల్ ల్యాండ్ మార్క్గా నిలిచిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ కోసం రూ. 2 కోట్లు ఖర్చు అయిందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేశాయి.మే 9న రీ-రిలీజ కానున్న ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాను మీరు చూస్తే రూ. 2 కోట్లతో ఇంతటి రిచ్ సినిమాను నిర్మించారా అంటూ ఆశ్చర్యపోతారు. ఇప్పట్లో అయితే, ఈ ప్రాజెక్ట్ కోసం కనీసం రూ. 200 కోట్లు పైగానే ఖర్చు చేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా విడుదల సమయంలో భారీ వర్షాల వల్ల మొదటి వారం కలెక్షన్స్ పెద్దగా లేవు. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడటంతో ప్రింట్స్ పెరిగాయి. ఎక్కడ చూసిన కూడా థియేటర్స్ నిండిపోయాయి. అలా ఏకంగా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 15 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకు గాను చిరంజీవి రూ. 25 లక్షలు, శ్రీదేవి రూ. 20 లక్షలు రెమ్యునరేషన్గా తీసుకున్నారని అప్పట్లో కథనాలు వచ్చాయి.

'ఆదిపురుష్'-కొడుక్కి క్షమాపణ.. మాట మార్చేసిన సైఫ్
ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్'.. థియేటర్లలో రిలీజై ఓటీటీలోకి వచ్చినప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇదంతా రెండేళ్ల కిందటి ముచ్చట. మళ్లీ కొన్నిరోజుల క్రితం నుంచి ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. తన సినిమా ఫ్లాప్ కాదని దర్శకుడు ఓం రౌత్ వాదించడం, ఈ మూవీలో నటించినందుకు కొడుక్కి సారీ చెప్పానని సైఫ్ అలీ ఖాన్ అనడం పెద్ద చర్చకు దారితీసింది.కొడుకు తైమూర్కు 'ఆదిపురుష్' సినిమా చూపించానని, అతడిలో ఏ స్పందన లేకపోయేసరికి సారీ చెప్పానని సైఫ్ అన్నాడు. ఆల్రెడీ ఫ్లాప్ అయిన సినిమా గురించి మళ్లీ మళ్లీ ఎందుకు ఇలా అంటున్నారని ప్రభాస్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. నటుడు సైఫ్ అలీ ఖాన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడీ నటుడు మాట మార్చేశాడు. (ఇదీ చదవండి: స్నానం కూడా చేయలేదు.. అమ్మ జీవితాంతం నన్ను..: రష్మీ) 'నేను ఆదిపురుష్ మూవీలో విలన్ గా నటించాను. అందులో కేకలు వేస్తూ అందరితో యుద్ధం చేస్తుంటాను. అది చూసి ఈసారి ఇలాంటి సినిమాలో హీరోగా చేయమని అన్నాడు. దీంతో ఓకే చెప్పాను. విలన్ గా నటించినందుకు సారీ చెప్పాను. నేను పనిచేసిన అన్ని చిత్రాల్ని గౌరవిస్తాను. ఆదిపురుష్ ని కూడా అలానే చూస్తాను' అని సైఫ్ కవరింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.ఆదిపురుష్ లో సైఫ్ రావణుడి పాత్ర చేశాడు. అయితే ఇతడి పాత్ర వేషధారణ నుంచి ట్రోలింగ్ మొదలైంది. తర్వాత లంకని గ్రాఫిక్స్ లో దారుణంగా చూపించడం, గబ్బిలాల్లాంటి పక్షులతో ఫైటింగ్.. ఇవన్నీ కూడా సగటు ప్రేక్షకుడికి చిరాకు తెప్పించాయి. దీంతో ఆదిపురుష్.. ఫెయిలైంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)

ముద్దు సీన్ కోసం అదనంగా కోటి చెల్లించిన హీరో
ఈ కాలం సినిమాల్లో రొమాంటిక్ సీన్లు చాలా కామన్.. అదే 40 ఏళ్ల క్రితం అలాంటి సీన్లు థియేటర్స్లో రన్ అయితే పెద్ద చర్చనీయాంశం అని చెప్పవచ్చు. 1988లో బాలీవుడ్లో విడుదలైన 'దయావన్' సినిమా పెద్ద సన్సేషన్ అని చెప్పవచ్చు. ఆ కాలం నాటి సినిమాలను ఫాలో అయ్యే వారికి దాని ప్రభావం ఏంటో బాగా తెలుసు. వినోద్ ఖన్నా, మాధురీ దీక్షిత్ నటించిన 'దయావన్' మూవీ విడుదలైన సమయంలో ఎన్నో సంచలనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో వారిద్దరి మధ్య తెరకెక్కించిన మోస్ట్ రొమాంటిక్ సీన్ ఉండటంతో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఈ చిత్రం విడుదల సమయానికి మాధురీ దీక్షిత్ వయస్సు కేవలం 20 సంవత్సరాలు. ఆపై ఆమె ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగులేస్తుంది. ఈ క్రమంలో తనేంటో నిరూపించుకోవడానికి ఆమె గట్టిగానే ప్రయత్నాలు చేసింది. కానీ, వినోద్ ఖన్నా అప్పటికే బాలీవుడ్లో పాపులర్ హీరోగా ఉన్నారు. వీరి కాంబినేషన్లో అలాంటి సీన్ రావడంతో అందరూ షాక్ అయ్యారు.'దయావన్' సినిమా గురించి ఆ రోజుల్లో చాలా కథనాలు వెలువడ్డాయి. అప్పట్లో వచ్చిన నివేదికల ప్రకారం.. రొమాంటిక్ సీన్ తీస్తున్న సమయంలో వినోద్ ఖన్నా పరిది దాటిపోయాడట. స్క్రీప్ట్ ప్రకారం కాకుండా తనకు నచ్చినట్లు చేయడం ఏంటి అంటూ దర్శకుడు కూడా పలుమార్లు కట్ అని చెప్పాడట. అయినప్పటికీ మాధురితో రొమాంటిక్ సీన్ ఆపలేదట. ఆ సమయంలో ముద్దు పెడుతున్న క్రమంలో ఆమె పెదవిని కూడా ఖన్నా కొరికేశాడని దాంతో ఆమె చాలా ఇబ్బందులకు గురైందని చెప్పుకొచ్చారు. ఈ సీన్ తర్వాత మాధురి చాలా ఇబ్బంది పడిందట. విషయం తెలుసుకున్న వినోద్ ఖన్నా క్షమాపణలు కూడా చెప్పారట.సినిమా విడుదల తర్వాత అసలు రచ్చ మొదలైంది. ఆ సీన్ను తొలగించాలంటూ కోర్టు నుంచి నోటీసులు కూడా ఇచ్చారు. ఆ సీన్ను తెరపై చూసిన తర్వాత మాధురికి కూడా నచ్చలేదట. దీంతో దానిని తొలగించాలని ఆమె కూడా కోరారట. కానీ, దర్శకుడు ఫిరోజ్ ఖాన్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. అందుకు గాను డైరెక్టర్, హీరో కలిసి రూ.1 కోటి అదనంగా చెల్లించారు. ఆ సీన్ తర్వాత వచ్చే సాంగ్కు ఇప్పటికీ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. డింపుల్ కపాడియాతో కూడా మరో సినిమాలో వినోద్ ఖన్నా ఇలాంటి పనే చేశాడని చాలామంది చెబుతుంటారు.ఓషో ఆశ్రమంలో నిరాడంబర జీవితంపేరు, డబ్బు, ప్రేమించి, పెళ్లి చేసుకున్న గీతాంజలి, ఇద్దరు కుమారులు (రాహుల్ ఖన్నా, అక్షయ్ ఖన్నా).. వినోద్ ఖన్నా జీవితం బ్రహ్మాండంగా ఉంది. అయితే జీవితం అంటే ఇదేనా? అనిపించిందాయనకు. అప్పటికే ఆధ్యాత్మిక గురువు ‘ఓషో’ బోధనలకు ఆకర్షితుడయ్యారాయన. చివరికి 1982లో సినిమాలకు ‘రిటైర్మెంట్’ ప్రకటించి, అమెరికాలోని రజనీష్ పురంలో గల ఓషో ఆశ్రమానికి వెళ్లిపోయారాయన. అక్కడ నిరాడంబర జీవితం గడిపారు. టాయ్లెట్స్ శుభ్రం చేసేవారు. గిన్నెలు కడిగేవారు. తోటమాలిగా చేసేవారు. అయితే వినోద్ ఖన్నా ఇంటికి దూరం కావడం ఆయన భార్యా, పిల్లలకు ఇబ్బందిగా మారింది. అదే ఆయన్ను వాళ్లకు దూరం చేసింది. వినోద్, గీతాంజలి విడాకులు తీసుకున్నారు. ఓషో ఆశ్రమంలో నాలుగేళ్లు ఉండి, ఇండియాకి వచ్చేసరికి వినోద్ ఖన్నా ఒంటరిగా మిగిలిపోయారు. మళ్లీ ‘ఇన్సాఫ్’ (1987)తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి, వరుసగా సినిమాలు చేశారు. మొదటి భార్య నుంచి విడిపోయిన ఐదేళ్లకు కవితను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కొడుకు (సాక్షి), కూతురు (శ్రద్ధ) ఉన్నారు. మూత్రాశయ క్యాన్సర్తో బాధపడుతూ 2017 ఏప్రిల్ 27న ఆయన మరణించారు.
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

అతడు ఇంకో ఆరేళ్లపాటు ఐపీఎల్ ఆడతాడు: వరుణ్ చక్రవర్తి
కోల్కతా నైట్ రైడర్స్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ (Andre Russel)పై ఆ జట్టు బౌలర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) ప్రశంసలు కురిపించాడు. ఇప్పట్లో అతడు రిటైర్ కాబోడని.. కనీసం మరో ఆరేళ్లపాటు ఐపీఎల్ ఆడతాడని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025 (IPL 2025) మెగా వేలానికి ముందు కేకేఆర్ రసెల్ను రూ. 12 కోట్లకు అతడిని రిటైన్ చేసుకుంది.అయితే, తాజా ఎడిషన్ ఆరంభం నుంచి ఈ జమైకన్ స్టార్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. గత ఏడు ఇన్నింగ్స్లో కేవలం డెబ్బై రెండు పరుగులే చేశాడు. అయితే, ఆదివారం రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో మాత్రం రసెల్ దుమ్ములేపాడు.PC: BCCI25 బంతుల్లోనే 57ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన రసెల్ 25 బంతుల్లోనే 57 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లతో పాటు ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఇక రసెల్ ఇన్నింగ్స్ కారణంగా 200కు పైగా స్కోరు సాధించిన కేకేఆర్ రాజస్తాన్పై జయభేరి మోగించింది.ఇంకో ఆరేళ్లపాటు ఐపీఎల్ ఆడతాడుఇక రసెల్ ఇప్పటికి పదకొండు మ్యాచ్లలో కలిపి 129 పరుగులు పూర్తి చేసుకున్నాడు. గత మ్యాచ్లలో బ్యాటర్గా విఫలమైనప్పటికీ ఆ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్.. బౌలర్గా ఎనిమిది వికెట్లు తీయగలిగాడు. కాగా ఫామ్లేమి, వయసు దృష్ట్యా ఐపీఎల్-2025 తర్వాత రసెల్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో రాజస్తాన్పై గెలుపు అనంతరం కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ విషయంపై స్పందించాడు. ‘‘ఇంకో రెండు మూడు సైకిళ్ల పాటు అతడు ఐపీఎల్లో ఆడాలని భావిస్తున్నాడు. అంటే.. ఇంకో ఐదారేళ్లన్న మాట. అతడు ఫిట్గా ఉన్నాడు. బాగున్నాడు.వయసుతో పనేంటి?అలాంటపుడు వయసుతో పనేంటి? జట్టు ప్రయోజనాల కోసం తన వంతు కృషి చేసినంత కాలం ఓ ఆటగాడు ఆడుతూనే ఉంటాడు. ఫ్రాంఛైజీ క్రికెట్ యాజమాన్యాలు ఇలాగే ఆలోచిస్తాయి. ఇలాంటి ఆలోచనా విధానాన్ని ఎవరూ ప్రశ్నించలేరు’’ అని వరుణ్ చక్రవర్తి తెలిపాడు. కాగా రసెల్ స్పిన్నర్ల బౌలింగ్లోనూ చితక్కొట్టగలడని ఈ సందర్భంగా వరుణ్ స్పష్టం చేశాడు. కాగా 37 ఏళ్ల రసెల్ 2014 నుంచి కోల్కతాతోనే కొనసాగుతున్నాడు.కాగా ఈడెన్ గార్డెన్స్లో ఆదివారం నాటి మ్యాచ్లో కేకేఆర్ రాజస్తాన్పై ఒకే ఒక్క పరుగు తేడాతో గెలిచింది. తద్వారా ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది. ఇప్పటికి ఈ సీజన్లో రహానే సేన ఆడిన పదకొండు మ్యాచ్లలో ఐదు గెలిచి.. పట్టికలో ఆరోస్థానంలో ఉంది.ఐపీఎల్ 2025: కోల్కతా వర్సెస్ రాజస్తాన్👉కోల్కతా స్కోరు: 206/4 (20)👉రాజస్తాన్ స్కోరు: 205/8 (20)👉ఫలితం: ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్పై కేకేఆర్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆండ్రీ రసెల్.చదవండి: ఏం ఆడుతున్నార్రా బాబూ! గుడ్లు ఉరిమి చూసిన రియాన్.. ఒక్క చూపుతోనే.. 𝙍𝙪𝙨𝙨𝙚𝙡𝙡 𝙈𝙖𝙣𝙞𝙖 𝙖𝙩 𝙀𝙙𝙚𝙣 𝙂𝙖𝙧𝙙𝙚𝙣𝙨 💪Display of brute force from #KKR's very own Andre Russell 💥Updates ▶ https://t.co/wg00ni9CQE#TATAIPL | #KKRvRR | @Russell12A pic.twitter.com/YfXiU3dF6h— IndianPremierLeague (@IPL) May 4, 2025

IPL 2025: వర్షం కారణంగా ఎస్ఆర్హెచ్- ఢిల్లీ మ్యాచ్ రద్దు
IPL 2025 SRH vs DC Live Updates: వర్షం కారణంగా ఎస్ఆర్హెచ్- ఢిల్లీ మ్యాచ్ రద్దుఐపీఎల్-2025లో సన్రైజర్స్ హైదరాబాద్కు తీవ్ర నిరాశ ఎదురైంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, ఎస్ఆర్హెచ్ మధ్య జరుగుతున్న కీలక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి సన్రైజర్స్ నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బౌలర్లు అద్బుతంగా రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ రైజర్స్ బౌలర్లు దాటికి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 133 పరుగులకే పరిమితమైంది. దీంతో ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ విజయం ఖాయమని అంతా భావించారు. సరిగ్గా ఇదే సమయంలో వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీ బ్యాటింగ్ అనంతరం భారీ వర్షం కురిసింది. దీంతో మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికి మైదానం సిద్దం చేసేందుకు దాదాపు గంటకుపైగా సమయం పట్టే సూచనలు కన్పించాయి. దీంతో అంపైర్లు మ్యాచ్ రద్దు చేశారు. ఈ క్రమంలో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. 13 పాయింట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో స్దానానికి చేరుకుంది. అయితే ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలన్న హైదరాబాద్ ఆశలు మాత్రం ఆడియాశలు అయ్యాయి. ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ కేవలం మూడింట మాత్రమే విజయం సాధించి ఇంటిముఖం పట్టింది. వర్షం ఆటంకం..రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ అనంతరం వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఇంకా మొదలు కాలేదు.ఎస్ఆర్హెచ్ టార్గెట్ ఎంతంటే?ఐపీఎల్-2025లో ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన 7 వికెట్ల నష్టానికి ఢిల్లీ 133 పరుగులు చేసింది. 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఢిల్లీని స్టబ్స్(41 నాటౌట్), ఆశుతోష్ శర్మ(41) ఆదుకున్నారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమ్మిన్స్ మూడు, ఉనద్కట్, హర్షల్ పటేల్, మలింగ తలా వికెట్ సాధించారు.17 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 105/617 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. క్రీజులో అశుతోష్ శర్మ(30), స్టబ్స్(26) ఉన్నారు.ఢిల్లీ ఆరో వికెట్ డౌన్..62 పరుగుల వద్ద ఢిల్లీ ఆరో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన విప్రజ్ నిగమ్.. రనౌట్ రూపంలో పెవిలియన్కు చేరాడు. క్రీజులో స్టబ్స్(15), ఆశుతోష్(0) ఉన్నారు.పీకల్లోతు కష్టాల్లో ఢిల్లీ క్యాపిటల్స్..సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ప్ 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. నాలుగో వికెట్గా అక్షర్, ఐదో వికెట్గా కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. కమ్మిన్స్ మూడు, హర్షల్ పటేల్ తలా వికెట్ సాధించారు.కమ్మిన్స్ ఆన్ ఫైర్.. కష్టాల్లో ఢిల్లీఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ నిప్పులు చేరుగుతున్నాడు. అతడి బౌలింగ్ దాటికి ఢిల్లీ 15 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మూడో వికెట్గా అభిషేక్ పోరెల్ ఔటయ్యాడు.ఢిల్లీ రెండో వికెట్ డౌన్..ఫాఫ్ డుప్లెసిస్ రూపంలో ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన డుప్లెసిస్.. కమ్మిన్స్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. 4 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ రెండు వికెట్ల నష్టానికి 15 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ పోరెల్(8), రాహుల్(3) ఉన్నారు.ఢిల్లీ తొలి వికెట్ డౌన్టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ అదిలోనే భారీ షాక్ తగిలింది. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్లో తొలి బంతికే ఔటయ్యాడు. 2 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది.ఐపీఎల్-2025లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఎస్ఆర్హెచ్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. సన్రైజర్స్ తుది జట్టులోకి అభినవ్ మనోహర్, సచిన్ బేబి వచ్చారు. మరోవైపు ఢిల్లీ జట్టులోకి నటరాజన్ ఎంట్రీ ఇచ్చాడు.తుది జట్లుసన్రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సచిన్ బేబీ, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, ఎషాన్ మలింగఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్

IPL 2025: సీఎస్కే జట్టులోకి ఫాస్టెస్ట్ సెంచరీ వీరుడు..
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రయాణం ముగిసిన సంగతి తెలిసిందే. వరుస ఓటములతో మరో మూడు మ్యాచ్లు మిగిలూండగానే ప్లే ఆఫ్స్ రేసు నుంచి సీఎస్కే నిష్క్రమించింది. అయితే మిగిలిన మూడు మ్యాచ్లో ఎలాగైనా గెలిచి తమ పరువు కాపాడుకోవాలని సీఎస్కే భావిస్తోంది.సీఎస్కే తమ తదుపరి మ్యాచ్లో మే 7న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల అన్క్యాప్డ్ వికెట్ కీపర్-బ్యాటర్ వన్ష్ బేడీ చీలమండ గాయం కారణంగా మిగిలిన సీజన్కు దూరమయ్యాడు. అతడి స్దానంలో బరోడా బ్యాటర్ ఉర్విల్ పటేల్ను చెన్నై తమ జట్టులోకి తీసుకుంది. "ఎడమ చీలమండ గాయం కారణంగా టోర్నమెంట్లోని మిగిలిన మ్యాచ్లకు వన్ష్ బేడీ దూరమయ్యాడు. అతడి స్దానంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఉర్విల్ పటేల్తో ఒప్పందం కుదుర్చుకుంది" అని ఐపీఎల్ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి.26 ఏళ్ల ఉర్విల్ పటేల్కు టీ20 క్రికెట్లో అద్బుతమైన రికార్డు ఉంది. గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉర్విల్ పటేల్ విధ్వంసం సృష్టించాడు. త్రిపురపై కేవలం 28 బంతుల్లోనే సెంచరీ చేసి పటేల్ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డును ఉర్విల్ బద్దలు కొట్టాడు. అదే టోర్నీలో ఉత్తరాఖండ్పై కూడా 36 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఈ క్రమంలోనే ఉర్విల్ పటేల్తో సీఎస్కే ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటివరకు ఉర్విల్.. 47 టీ20 మ్యాచ్లు ఆడి 170 స్ట్రైక్ రేట్తో 1162 పరుగులు చేశాడు.

గుజరాత్ టైటాన్స్కు అదిరిపోయే శుభవార్త
దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్, గుజరాత్ టైటాన్స్ పేసర్ కగిసో రబడ (Kagiso Rabada)కు భారీ ఊరట లభించింది. అతడిపై ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంస్థ (వాడా) తాత్కాలికంగా విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ విషయాన్ని సౌతాఫ్రికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రగ్ ఫ్రీ స్పోర్ట్స్ (SAIDS) సోమవారం ధ్రువీకరించింది. రబడపై నిషేధం తొలగిపోయిందని.. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. దీంతో అతడు వెంటనే గుజరాత్ టైటాన్స్ జట్టుతో చేరేందుకు మార్గం సుగమమైంది.రూ. 10.75 కోట్లకు కొనుగోలుకాగా ఐపీఎల్-2025 (IPL 2025)లో గుజరాత్ ఫ్రాంఛైజీ రబడను రూ. 10.75 కోట్ల మేర భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో రెండు మ్యాచ్ల అనంతరం అతడు ‘వ్యక్తిగత కారణాలతో’ దక్షిణాఫ్రికాకు వెళ్లిపోయాడు. అయితే, ఇందుకు గల స్పష్టమైన కారణాన్ని మాత్రం ఐపీఎల్ యాజమాన్యం బయటకు వెల్లడించలేదు. రబడ త్వరలో మళ్లీ జట్టుతో చేరతాడని కూడా టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ టోర్నీ మధ్యలో ప్రకటించాడు.PC: BCCI/IPLఅలాంటివి ఇందులో ఉన్నాయి.. అయితే..అయితే కొన్ని రోజుల క్రితం అసలు వాస్తవం బయటకు వచ్చింది. డోపింగ్ పరీక్షలో పాజిటివ్గా దొరికిపోవడంతో రబడపై సస్పెన్షన్ వేటు పడింది. సరదా కోసం తీసుకునే (రిక్రియేషనల్) డ్రగ్ను రబడ వాడినట్లు తేలడంతో ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంస్థ (వాడా) అతనిపై తాత్కాలిక నిషేధం విధించింది. అయితే, పూర్తి స్థాయిలో ఇంకా ఎంత కాలం సస్పెన్షన్ వేటు పడుతుందనేదానిపై స్పష్టత రాలేదు.తాజాగా SAIDS ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. రబడపై నెల రోజుల పాటు పడిన నిషేధం తొలగిపోయినట్లు తెలిపింది. ‘‘రబడపై సస్పెన్షన్ నేపథ్యంలో అతడు ఇండియా నుంచి వెంటనే సౌతాఫ్రికాకు తిరిగి వచ్చాడు.అయితే, డ్రగ్స్ వాడకానికి సంబంధించి రబడ తన తప్పును అంగీకరించాడు. కానీ దురుద్దేశంతో వాటిని వాడలేదన్న అతడి వాదన సబబుగానే ఉంది. వెంటనే అతడు మళ్లీ మైదానంలో దిగవచ్చు.క్రీడా రంగం వెలుపలి సమాజంలో ఈ పదార్థాలు ఎక్కువగా దుర్వినియోగమవుతాయి కాబట్టి వీటిని అందరూ తప్పుగానే చూస్తున్నారు. కొకైన్, హెరాయిన్, ఎండిఎంఎ/ఎక్సటసీ, టీహెచ్సీ వంటివి ఇందులో ఉన్నాయి’’ అని సోమవారం నాటి ప్రకటనలో వెల్లడించింది.కాగా క్రీడల్లో మెరుగైన ప్రదర్శనకు ఉపయోగపడే డ్రగ్స్ తరహాలో కాకుండా కొకైన్, హెరాయిన్, గంజాయివంటివాటిని రిక్రియేషనల్ డ్రగ్స్గా వ్యవహరిస్తారు. పోటీలు లేని సమయంలో ఆటగాళ్లు వీటిని వాడుతుంటారు. సాధారణంగా ఇలాంటి డ్రగ్స్ వాడితే నిబంధనల ప్రకారం గరిష్టంగా నాలుగేళ్ల వరకు నిషేధం పడుతుంది. సరదా కోసమే వాటిని వాడానని నిరూపిస్తేఅయితే తాను సరదా కోసమే వాటిని వాడానని, ఆ సమయంలో ఎలాంటి మ్యాచ్లు జరగడం లేదని సదరు ప్లేయర్ నిరూపించగలిగితే కేవలం 3 నెలల నిషేధం విధిస్తారు. ఇక రబడ విషయానికొస్తే.. సొంతగడ్డపై జరిగిన సౌతాఫ్రికా టీ20 లీగ్ టోర్నీ సమయంలో అతడు ఈ డ్రగ్ తీసుకున్నట్లుగా సమాచారం. ఇక ఇప్పుడు నెల రోజుల నిషేధం తొలగిపోవడంతో అటు గుజరాత్ టైటాన్స్తో చేరడంతో పాటు జూన్లో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2025 ఫైనల్లోనూ అతడు ఆడేందుకు లైన్ క్లియర్ అయింది.కాగా ఐపీఎల్-2025లో కగిసో రబడ రెండు మ్యాచ్లు ఆడి రెండు వికెట్లు తీశాడు. ఇక గుజరాత్ టైటాన్స్ ఇప్పటికి పది మ్యాచ్లు పూర్తి చేసుకుని ఏడు విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇక రబడ రాకతో ఆ జట్టు పేస్ దళం మరింత పటిష్టంగా మారుతుందనడంలో సందేహం లేదు. కాగా టైటాన్స్లో మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిద్ కృష్ణ, గెరాల్డ్ కోయెట్జి తదితర ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. వీరిలో ప్రసిద్ పది మ్యాచ్లలో 19 వికెట్లు కూల్చి ప్రస్తుతం పర్పుల్ క్యాప్ తన దగ్గర పెట్టుకున్నాడు. గుజరాత్ తమ పదకొండో మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో మంగళవారం తలపడుతుంది.చదవండి: ఏం ఆడుతున్నార్రా బాబూ! గుడ్లు ఉరిమి చూసిన రియాన్.. ఒక్క చూపుతోనే..
బిజినెస్

30 మందికి మాత్రమే ఈ కారు: ధర ఎంతో తెలుసా?
అమెరికన్ కార్ల తయారీ సంస్థ 'జీప్'.. ఇండియన్ మార్కెట్లో రాంగ్లర్ కొత్త లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్ విల్లీస్ '41 స్పెషల్ ఎడిషన్' లాంచ్ చేసింది. దీని ధర రూ. 73.24 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఈ కొత్త ఎడిషన్ భారత సైన్యానికి గుర్తుగా స్పెషల్ కలర్ పొందింది.కంపెనీ లాంచ్ చేసిన ఈ స్పెషల్ ఎడిషన్ కేవలం 30 యూనిట్లకు మాత్రమే పరిమితం. అంటే ఈ కారును 30 మంది కస్టమర్లు మాత్రమే కొనుకోలు చేయగలరు. జీప్ రాంగ్లర్ టాప్ స్పెక్ రూబికాన్ వేరియంట్ ఆధారంగా నిర్మితమైన ఈ కారు.. 1941 అనే డెకాల్ హుడ్పై ఉండటం చూడవచ్చు. ఈ కారు ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.ఇదీ చదవండి: ఏప్రిల్లో 4.80 లక్షల సేల్స్: ఈ బ్రాండ్ వాహనాలకే డిమాండ్!కొత్త స్పెషల్ ఎడిషన్ రాంగ్లర్లో పవర్డ్ సైడ్ స్టెప్, కొత్త ఇంటీరియర్ గ్రాబ్ హ్యాండిల్స్, వెదర్ ఫ్లోర్ మ్యాట్లు, ఫ్రంట్ అండ్ రియర్ డాష్క్యామ్లు కూడా ఉన్నాయి. డిజైన్ కొంత కొత్తగా అనిపించినప్పటికీ.. అదే ఇంజిన్ పొందుతుంది. కాబట్టి అదే 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 270 హార్స్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది.

ఎయిర్టెల్, టాటా చర్చలకు చెక్
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్, ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా గ్రూప్ మధ్య డైరెక్ట్ టు హోమ్(డీటీహెచ్) బిజినెస్ విలీనానికి చెక్ పడింది. విలీన చర్చలను విరమించుకున్నట్లు ఎయిర్టెల్ తాజాగా వెల్లడించింది.చర్చలలో రెండువైపులా సంతృప్తికర ఫలితాలను సాధించకపోవడంతో వెనక్కి తగ్గినట్లు తెలిపింది. డీటీహెచ్ బిజినెస్ల విలీనానికి టాటా గ్రూప్ డీటీహెచ్ విభాగం టాటా ప్లేతో అనుబంధ సంస్థ భారతీ టెలిమీడియా చర్చిస్తున్నట్లు 2025 ఫిబ్రవరి 26న ఎయిర్టెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో రెండు సంస్థలూ సరైన పరిష్కారాన్ని సాధించలేకపోవడంతో చర్చలు విరమించుకున్నట్లు వివరించింది.

పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలు
దిగ్గజ ఇన్వెస్టర్ & బెర్క్షైర్ హాత్వే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) వారెన్ బఫెట్.. ఇటీవల తన వాటాదారుల ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్థిక లోటుకు సంబందించిన విషయాలను హైలెట్ చేస్తూ.. పెట్టుబడిదారులు కేవలం యూఎస్ డాలర్ మీద మాత్రమే కాకుండా, ఇతర కరెన్సీలలో కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు.అమెరికాలో ఆర్థిక లోటు సమస్య ఎప్పటి నుంచో పరిష్కారం లేకుండా ఉంది. ఈ పరిస్థితి ఇంకా ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుందో నిర్ణయించలేకపోతున్నామని బఫెట్ అన్నారు. మనం చాలా కాలంగా భరించలేని ఆర్థిక లోటుతో పనిచేస్తున్నాము. ఇది ప్రస్తుతం నియంత్రించలేని స్థాయికి చేరిందని వెల్లడించారు.యూఎస్ డాలర్ పతనావస్థలో ఉంది. ఒక దేశంగా మనకు ఎప్పుడూ చాలా సమస్యలు ఉంటాయి. కానీ ఇది మాత్రం మనమే తెచ్చుకున్న సమస్య. అమెరికా ఆర్ధిక విధానాలు, వాణిజ్య విధానం వంటివన్నీ డాలర్ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని బఫెట్ వివరించారు.సీఈఓగా వారెన్ బఫెట్ పదవీ విరమణశనివారం (2025 మే 3) జరిగిన బెర్క్షైర్ హాత్వే వార్షిక సమావేశంలో.. దిగ్గజ ఇన్వెస్టర్ 'వారెన్ బఫెట్' ఊహించని ప్రకటన చేశారు. తాను 2025 చివరి నాటికి కంపెనీ సీఈఓ పదవి నుంచి వైదొలగనున్నట్లు, తరువాత 'హువర్డ్ బఫెట్' కంపెనీ ఛైర్మన్గా బాధ్యతలు చేపడతారని పేర్కొన్నారు. గ్రెగ్ అబెల్ సంస్థ సీఈఓగా ఉంటారని అన్నారు.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే కీలక ప్రకటన: గెలిచినోళ్లకు రూ.5 లక్షల ప్రైజ్

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 294.85 పాయింట్లు లేదా 0.37 శాతం లాభంతో.. 80,796.84 వద్ద, నిఫ్టీ 114.45 పాయింట్లు లేదా 0.47 శాతం లాభంతో 24,461.15 వద్ద నిలిచింది.టాప్ గెయినర్స్ జాబితాలో అషిమా, యూనివర్సల్ కేబుల్స్, నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా, పరాగ్ మిల్క్ ఫుడ్స్, ఆర్ఆర్ కాబెల్ వంటి కంపెనీలు చేరగా.. జీ-టెక్ జైన్ఎక్స్ ఎడ్యుకేషన్, కేసాల్వ్స్ ఇండియా, లోటస్ ఐ కేర్ హాస్పిటల్, వీ-మార్ట్ రిటైల్, సిల్వర్ టచ్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).
ఫ్యామిలీ

మిస్ వరల్డ్తో మోక్షం.!
బంజారాహిల్స్: ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ సిటీ ముస్తాబవుతోంది. మే 7 నుంచి 31 వరకు హైటెక్స్లో జరిగే పోటీల కోసం సుందరాంగులు నగరానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నగరాన్ని సుందరీకరించే దిశలో వివిధ శాఖలు సమన్వయంతో ముందుకుసాగుతున్నాయి. ముఖ్యంగా అందగత్తెలు రాకపోకలు సాగించే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరిన ట్రాన్స్ఫార్మర్లు, వేలాడుతున్న వైర్లు, తుప్పుబట్టిన కరెంటు స్తంభాల తొలగింపు, మరమ్మతులు చేస్తోంది. ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సబ్స్టేషన్ల పరిధిలో టీజీఎస్పీడీసీఎల్ అధికారులు, లైన్మెన్లు, సిబ్బంది ఆదివారం మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. బంజారాహిల్స్ రోడ్డు నం.12లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు ఈనెల 18న సుందరాంగులు రానున్న నేపథ్యంలో ఈ రోడ్డులో శిథిలావస్థకు చేరిన 12 ట్రాన్స్ఫార్మర్లను మార్చారు. తుప్పుబట్టిన కరెంటు స్తంభాల స్థానంలో కొత్తవి వేశారు. వేలాడుతున్న కేబుల్ వైర్లను సరిజేశారు. ప్రపంచ నలుమూలల నుంచి విచ్చేస్తున్న సుందరాంగులు తమ షెడ్యూల్లో భాగంగా వివిధ ప్రాంతాలను సందర్శించనున్నారు. అలాగే పోటీలు జరిగే హైటెక్స్కు కూడా ఈ ప్రాంతాల నుంచే వెళ్తారు. ఇక్కడ ఉన్న స్టార్ హోటళ్లలోనే వారంతా బస చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. దీంతో టీజీఎస్పీడీసీఎల్ అధికారులు గత వారం రోజులుగా సుందరాంగులు రాకపోకలు సాగించే, పర్యటించే ప్రాంతాలను సర్వే చేశారు. రోడ్డు మార్గంలో వెళ్లే క్రమంలో ఎక్కడెక్కడ ట్రాన్స్ఫార్మర్లు శిథిలావస్థకు చేరాయో వాటిని గుర్తించారు. ఓవైపు ఒరిగిన ట్రాన్స్ఫార్మర్ల జాబితాను తయారు చేశారు. దీని ఆధారంగానే ఆదివారం నుంచి మరమ్మతులు చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు ఈ పనులు కొనసాగనున్నాయి. టీజీఎస్పీడీసీఎల్ ఫిలింనగర్ సబ్స్టేషన్ ఏఈ పవిత్ర పర్యవేక్షణలో 30 మంది సిబ్బంది ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. దాదాపు అన్ని సబ్స్టేషన్ల పరిధిలోనూ పనులు చేస్తున్నారు. ఇదీ చదవండి: దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలు

ఊ(రి)ట బావులు : అంతుచిక్కని రహస్యాలు?
ఒకప్పుడు మంచి నీరు కావాలంటే బావికి వెళ్లాల్సిందే. తెల్లారితే చాలు గ్రామాలు, చిన్నపాటి పట్టణాల్లో కావిడి భుజాన వేసుకుని, చేతిలో చేద పట్టుకుని వీధుల నిండా జనం కనిపించేవారు. ఊరంతటికీ మంచినీటి బావి ఒకటుండేది. అక్కడకు వెళ్లే అందరూ మంచినీరు తెచ్చుకునే వారు. బావి లేని ఊరుండేది కాదు. రానురానూ బోర్లు, మంచినీటి పథకాలు అందుబాటులోకి వచ్చాక చాలా వరకూ బావులు కనుమరుగైపోయాయి. మంచినీటి మాట అటుంచితే కనీసం వాడుకలో కూడా లేకుండా పోయాయి. బావులు అంటే ఏమిటో భావితరాలకు తెలియని రీతిలో కనుమరుగయ్యాయి. కానీ చరిత్రలో తాము ఉన్నామంటూ కొన్ని బావులు మాత్రం ఇప్పటికీ ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. ఒక్కో బావి చుట్టూ ఒ క్కో విశ్వాసం పెనవేసుకుపోయింది. దీంతో ఆ బావుల్లో నమ్మకాల ఊట ఇప్పటికీ ఊరుతూనే ఉంది. అలాంటి బావులివి..గో.. - పిఠాపురంబొటన బావి కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చదలవాడ తిరుపతి క్షేత్రంలోని శ్రీ శృంగార వల్లభ స్వామి వారి ఆలయంలో ఉంది. సుమారు 9 వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయ నిర్మాణమంతా ఈ బావి నీటితోనే చేసినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఆలయానికి ఆగ్నేయ మూలలో చతురస్రాకారంలో ఈ బావి ఉంది. చుట్టూ రాళ్లు పేర్చి చేసిన ఈ నేలబావి నిర్మాణం వింత గొలుపుతుంది. ఈ బావి నీటితోనే ఆలయంలోని మూలవిరాట్టుకు అభిషేకాలు నిర్వహిస్తూంటారు. ఈ బావిలోని నీటితో స్నానం చేసి, స్వామిని దర్శించుకుని, మొక్కుకుంటే కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, సంతానం వంటి కోరికలు తీరుతాయని పలువు రు విశ్వసిస్తారు. కార్తిక మాసంలో ఈ బావి నీటితో స్నానం చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందన్నది భక్తుల నమ్మకం. కార్తిక పౌర్ణమి నాడయితే మరింత ప్రాశస్త్యమని చెబుతారు. అది కూడా అర్చకులతో నీరు తోడించుకుని స్నానం చేస్తూంటారు. చైత్రం, శ్రావణం, ధనుర్మాసాల్లో భక్తులే స్వయంగా స్నానం చేస్తారు. ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ బావి నీటిని సీసాల్లో నింపి, తీర్థంలా తమతో తీసుకుని వెళ్లి, మామూలు నీటితో కలిపి స్నానం చేస్తారు. ఎంత వర్షాభావ పరిస్థితులున్నా ఎప్పుడూ ఈ బావి ఎండిన ఆనవాళ్లు లేవని స్థానికులు చెబుతారు. ఎంత నీరు తోడినా ఈ బావి ఎప్పుడూ నిండుకుండలా కళకళలాడుతూంటుంది.ఇదీ చదవండి: దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలుగొల్లగుంట నుయ్యి కాకినాడ జిల్లాలో మండల కేంద్రమైన ఉప్పాడ కొత్తపల్లిలో ఈ బావి పూర్వం నుంచీ పేరెన్నికగన్నది. గతంలో కొత్తపల్లి, కుతుకుడుమిల్లి, వాకతిప్ప గ్రామాలకు ఇదే మంచినీటి బావి. ఈ మూడు గ్రామాల ప్రజలు ఈ బావి నుంచే మంచినీరు తెచ్చుకునే వారు. వందల ఏళ్ల నాటి ఈ బావి నుంచే పిఠాపురం మహారాజా వారి సంస్థానానికి గుర్రపు బగ్గీలపై మంచినీరు తీసుకెళ్లేవారని పెద్దలు చెబుతారు. సముద్ర తీరం దగ్గరలో ఉన్న ఈ గ్రామాల్లో ఎక్కడ తవ్వినా ఉప్పు నీరే పడగా ఈ బావిలో మాత్రమే మంచినీరు.. అదీ కొబ్బరి నీళ్లలా ఉండటంతో ఆయా గ్రామాల ప్రజలందరూ దీనినే మంచినీటికి ఉపయోగించే వారు. ఎంతమంది ఎన్ని నీళ్లు తోడుకున్నా ఈ బావి ఎప్పుడూ ఎండిపోకపోవడం విశేషంగా చెబుతారు. ఎన్ని రకాల మంచినీటి పథకాలు వచ్చినా ఇప్పటికీ కొందరు ఈ బావి నీటినే తాగుతూంటారు.కవలల బావి తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం పాత దొడ్డిగుంట గ్రామంలోని బావి కవల పిల్లల బావిగా పేరొందింది. ఈ బావి నీరు తాగితే కవల పిల్లలు పుడతారనే నమ్మకం పలువురిలో బలంగా ఉంది. ఈ గ్రామంలో ఏకంగా 110 మందికి పైగా కవల పిల్లలు పుట్టడమే దీనికి నిదర్శనమని చెబుతారు. ఈ గ్రామంలో ఆరు నెలల చిన్నారుల నుంచి 60 ఏళ్ల ముసలివాళ్ల వరకూ కవలలున్నారు. గతంలో మూర్తి అనే ఒక ఉపాధ్యాయుడు గ్రామంలో జనాభా లెక్కల కోసం రాగా ఎక్కువగా కవల పిల్లలుండటం చూసి ఆశ్చర్యపోయారు. కొన్నాళ్లకు ఆయన అదే గ్రామానికి ఉపాధ్యాయుడిగా వచ్చి, అక్కడే నివాసం ఉన్నారు. కొద్ది రోజులకు ఆయనకు కూడా కవల పిల్లలు పుట్టారు. దీంతో, ఆ గ్రామంలోని బావి నీరు తాగడంతో కవల పిల్లలు పుడుతున్నారని అందరికీ చెప్పడంతో అప్పటి నుంచీ ఇది కవల పిల్లల బావిగా పేరొందింది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచమంతా ఈ బావి పేరు మార్మోగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి సైతం జనం వచ్చి ఈ బావి నీటిని తీసుకెళ్తున్నారంటే ఎంతగా పేరొందిందో అర్థం చేసుకోవచ్చు. ఇలా కవలలు ఎక్కువగా ఉండడం వల్లే తమ ఊరికి గుర్తింపు వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు.నిండు కుండలా.. సామర్లకోటలోని మాండవ్య నారాయణస్వామి వారి ఆలయంలో ఉన్న పురాతన బావి ఎప్పుడూ నిండుకుండలా ఉంటుంది. మామూలు బావుల్లో వేసవిలో నీరు అడుగంటుతూంటుంది. కనీసం నీరు తగ్గుతుంది. కానీ ఈ బావిలో నీరు ఎప్పుడూ ఒకే స్థాయిలో ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు.బావి నీరు వల్లే కవలలు మా గ్రామంలోని బావి నీరు తాగడం వల్లే కవలలు పుడుతున్నారన్నది మా నమ్మకం. ఎక్కువ మంది కవలలు ఒకే గ్రామంలో పుట్టడం అరుదుగా ఉంటుంది. అలా మా గ్రామంలో వంద మందికి పైగా కవలలు పుట్టారంటే దీనికి కారణం మా గ్రామంలోని బావి నీరేనని అందరూ నమ్ముతున్నారు. మాకు కవలలే పుట్టారు. గతంలో చాలా మంది నమ్మేవారు కాదు. కానీ, ఈ బావి నీరు తీసుకెళ్లిన దూర ప్రాంతాల వాళ్లకు కూడా కవలలు జన్మించినట్లు చెబుతూండటంతో అందరూ ఈ విషయం నమ్మి తీరుతున్నారు. – అడబాల రామదాసు, కవల పిల్లల తండ్రి, దొడ్డిగుంట, రంగంపేట మండలంకోరికలు తీర్చే బావిగా నానుడి మా ఊరి గుడిలోని బొటన బావి నీటితో స్నానం చేసి, స్వామిని దర్శించుకుని, మొక్కుకుంటే కోరికలు తీరుతాయనే నమ్మకం భక్తుల్లో ఉంది. అలా కోరికలు తీరిన వారు మా గ్రామంలో చాలా మంది ఉన్నారు. అందుకే ఇక్కడకు దర్శనానికి వచ్చేవారు తప్పకుండా ఈ బావి నీటితో స్నానం చేయడం లేదా తాగడం చేస్తారు. తమతో పాటు నీటిని తీసుకెళతారు. ఈ బావి నీటిని స్వామి వారి తీర్థంగా భావిస్తారు. అంత పవిత్రంగా చూస్తారు. కోరిన కోర్కెలు తీరాక వచ్చి, స్వామి వారికి తులాభారాలు ఇస్తూంటారు. – కూనపురెడ్డి కోదండ రామయ్య, తిరుపతి, పెద్దాపురం మండలంఅపోహే.. ఇదిలా జరుగుతుందని మానసికంగా అపోహపడటం తప్ప బావి నీరు తాగడం వల్ల కవల పిల్లలు పుట్టడం, సంతానం కలగడం వంటివి ఉండవు. సంతాన ఉత్పత్తి జన్యుపరంగా జరుగుతుంది. మానసికంగా ఒక నమ్మకం కలిగించుకుంటారు తప్ప వాటి వల్ల ఎలాంటి సంతానం కలిగే అవకాశం శాస్త్రీయంగా లేదు. – డాక్టర్ కాటన్, మానసిక వైద్యుడు, జీజీహెచ్, కాకినాడచదవండి: Yoga: ఎమోషషన్స్ను బ్యాలెన్స్ చేసే యోగాసనం ఏదో తెలుసా?బావి నీటి వల్ల కాదు కవలలు పుట్టడం, సంతానం కలగడం వంటివి భార్యాభర్తల మధ్య జన్యుపరంగా జరిగేవే. బావి నీటి వల్ల కాదు. అలాగైతే పూర్వం అన్ని గ్రామాల్లో బావులుండేవి. అందరికీ కవలలు పుట్టాలి కదా! ఇదంతా ఒక నమ్మకం మాత్రమే. ఎక్కువగా ఆడపిల్ల ఇంట్లో కవలలు పుట్టిన వారు ఉంటే ఆ కుటుంబంలో మిగిలిన వారికి కవలలు పుట్టే అవకాశం ఉంటుంది. దొడ్డిగుంటలో ఇదే జరిగి ఉండవచ్చు. కేవలం రెండు అండాలు విడుదలవ్వడం వల్ల మాత్రమే కవలలు జన్మిస్తూంటారు. అంతే తప్ప బావి నీరు తాగడం వల్ల మాత్రం కాదు. – డాక్టర్ అనిత, గైనకాలజిస్టు, పిఠాపురం

Inspiration దశరథుడి మంత్రి మండలి
రాచరికాలు నడిచిన ప్రాచీన కాలంలో కూడా సమర్థులైన పాలకులెవరూ నిరంకుశులుగా, నియంతలుగా, కేవలం తమ ఇచ్చ వచ్చినట్టు పరిపాలించటం ఉండేది కాదు. మన పురాణేతిహాసాలలో ప్రసిద్ధులైన రాజులందరూ, రాజ్య పాలనకు సంబంధించిన కీలక నిర్ణయాలను, మేధావులయిన తమ మంత్రుల బృందాలతోనూ, ఇతర నిపుణులతోనూ, అవసరమయితే పౌర ప్రముఖులతోనూ, సామంతులతోనూ, జానపదులతోనూ విస్తృతంగా చర్చించిన తరవాతే తీసుకొనేవాళ్ళని కనిపిస్తుంది. అల్పబుద్ధులూ, ఆసురీ స్వభావులు మాత్రమే అధికార మదాంధకారంతో ధర్మాధర్మ విచక్షణ లేకుండా, నిరంకుశంగా, ఇష్టారాజ్యంగా పాలించి, అందరినీ అవస్థలు పెట్టి, అపయశస్సు కూడగట్టుకొని, ఆయువు తీరగానే కాలగర్భంలో కలిసిపోయే వాళ్ళు.దశరథుడు అరవయి వేల సంవత్సరాలపాటు ధర్మబద్ధంగా, ప్రజారంజకంగా పాలన చేశాడని రామాయణం చెబుతుంది. ఏ కీలక నిర్ణయమైనా, ఆయన సంబంధితులందరితో విస్తృతంగా చర్చించిగానీ తీసుకొనేవాడు కాదు అని వాల్మీకి వక్కాణించాడు. దశరథుడికి ఒక సమర్థమైన మంత్రిమండలి ఉండేది. వాళ్ళలో ప్రధానమైన మంత్రులు ఎనిమిది మంది: ధృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు. వీళ్ళుగాక, దశరథుడికి వసిష్ఠుడు, వామదేవుడు ముఖ్య పురోహితులుగా, ధర్మ నిర్దేశకులుగా, గురువులుగా ఉండేవాళ్ళు. వాళ్ళ వాళ్ళ నేపథ్యం గురించి ఎంతో పరిశోధన జరిపించిన తరవాతే, దశ రథుడు తన మంత్రులను నియమించుకొనేవాడు. వాళ్ళు ఎన్నో పరీక్షలు నెగ్గవలసి ఉండేది. అందుకే ఆ మంత్రులందరూ పరువు ప్రతిష్ఠలు కలవారుగా, సంస్కా రులుగా, శాస్త్ర జ్ఞాన నిష్ణాతులుగా ఉండేవారు. వాళ్ళు కుశాగ్ర బుద్ధులు, విద్యావంతులు, లోకజ్ఞులు, నీతి వేత్తలు. ఎప్పుడూ రాజు శ్రేయస్సునూ, రాజ్య శ్రేయస్సునూ కాంక్షించే నిస్వార్థపరులు, నిజాయతీపరులు. అపరాధులయితే, సొంత పుత్రుల నయినా నియమానుసారం దండించే నిష్పక్షపాతులు. ఇంతటి నిపుణులతో, నీతిమంతులతో, ధర్మజ్ఞులతో అన్ని విషయాలూ కూలంకషంగా చర్చించిన తరవాతే అన్ని ముఖ్యమైన నిర్ణయాలూ తీసుకోవటం జరిగేది. కనకనే దశరథుడి సుదీర్ఘ పాలనలో ప్రజలంతా ధర్మమార్గంలో తృప్తిగా, సుఖశాంతులతో జీవించారు అని వాల్మీకి రామాయణం వర్ణిస్తుంది.– ఎం. మారుతి శాస్త్రి

నోని కీర్తికి స్త్రీ శక్తి పురస్కారం
‘పరిశ్రమ స్థాపించిన ప్రతి మహిళ వెనుక ఒక కథ ఉంటుంది. అందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ’ అని చెక్ బయో ఆర్గానిక్స్ కో–ఫౌండర్ కీర్తి అంటున్నారు. ఇటీవల నగరంలోని నోవోటెల్ హోటల్ వేదికగా స్త్రీ శక్తి పురస్కార ప్రదానోత్సవం జరిగింది. తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్స్ నిర్వహించిన కార్యక్రమంలో ఎంటర్టైన్మెంట్, బ్యూటీ, టూరిజమ్, వైద్యం, ఎంటర్ప్రెన్యూర్ వంటి వివిధ విభాగాల్లో 30 మంది మహిళలు పురస్కారాలను అందుకున్నారు. వారిలో చెకోటి కీర్తి రెడ్డి ఎంటర్ప్రెన్యూర్ జర్నీ వైవిధ్యమైనది. ఆమె ఏనాడూ ఒక పారిశ్రామికవేత్త కావాలని కల కనలేదు. కంప్యూటర్ రంగాన్ని ఎంచుకున్న కీర్తి, హైదరాబాద్కి కంప్యూటర్ పరిచయమైన తొలినాళ్లలో కోచింగ్ సెంటర్ నిర్వహించారు. కానీ జీవితం ఆమెను వ్యవసాయం, పరిశ్రమల రంగం వైపు నడిపించింది. పరిశ్రమను నడిపించడంలో ఆమె పాటించిన నియమాలే ఆమెను తన రంగంలో వన్ అండ్ ఓన్లీగా నిలిపాయి. ‘రైతు నేస్తం, ఏరువాక, నాచురల్ హెల్త్ సైన్స్ అసోసియేషన్ అవార్డు, ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్’ పురస్కారాలు ఆమెకు గతంలో గుర్తింపునిచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ఢిల్లీ వేదికగా ప్రకటించిన ‘నారీశక్తి’ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆ కీర్తి ప్రస్తుతం స్త్రీ శక్తి పురస్కారం అందుకుని మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలిచారు. పాతిక ఉత్పత్తులకు ప్రభుత్వ అనుమతులు..‘తొగర చెట్టు.. ప్రకృతి మనదేశానికి అందించిన వరం. సంజీవని వంటి తొగర పండు మీద పాశ్చాత్య దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. కానీ ఆ చల్లటి వాతావరణంలో ఈ చెట్లు మనలేవు. మా కుటుంబ సభ్యులకు నోని ఫ్రూట్ ఔషధంగా పని చేయడంతో నేను ఆ పండు మీద అధ్యయనం మొదలుపెట్టాను. దీని కోసం పొలం కొని పంట వేశాను. పండ్లతో జ్యూస్లు, లోషన్, షాంపూ, హెయిర్ ఆయిల్ వంటి పాతిక ఉత్పత్తులకు ప్రభుత్వ అనుమతులు లభించాయి. కేవలం పరిశ్రమ నిర్వహణ మాత్రమే కాకుండా వ్యవసాయం, ఆరోగ్యం కలగలిసి ఉండడంతో నాకు ‘ఫార్మర్స్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ వెల్నెస్ ప్రోడక్ట్స్’ విభాగంలో ఈ పురస్కారం లభించింది. నోని పండు మీద చేసిన పరిశోధనల కారణంగా ‘నోని కీర్తి’ నయ్యాను. ఈ స్త్రీ శక్తి పురస్కారం ఎంపిక ప్రక్రియలో దేశ విదేశాలకు చెందిన వివిధ రంగాల నిపుణులు పాతిక మంది పాల్గొన్నారు. జ్యూరీ సభ్యులు పురస్కార గ్రహీతలను జూమ్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేశారు’ అని వివరించారు కీర్తిరెడ్డి. ఈ కార్యక్రమంలో 30 మంది మహిళలు స్త్రీశక్తి పురస్కారాన్ని అందుకున్నారు. వీరితోపాటు తెలంగాణ సంప్రదాయ గోంద్లడ్డు, నారాయణపేట చీరలు, టెర్రకోట బొమ్మలు వంటి హస్తకళాకృతులను తయారు చేస్తున్న ఐదుగురు గ్రామీణ, ఆదివాసీ మహిళలు స్త్రీ రత్న పురస్కారాలను అందుకున్నారు. (చదవండి: అందాల తారల ఆగమనం..)
ఫొటోలు
అంతర్జాతీయం

మాకు కావాల్సింది భాగస్వాములు.. బోధకులు కాదు: జై శంకర్
న్యూఢిల్లీ: యూరోపియన్ దేశాలపై భారత విదేశాంగ మంత్రి ఎన్ జైశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశాలు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై ధ్వజమెత్తారు జైశంంకర్. యూరోపియన్ దేశాలు భారత భౌగోళిక రాజకీయ వైఖరిని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయంటూ విమర్శలు చేశారు. భారతదేశానికి భాగస్వాములు కావాలని, అంతే కానీ బోధకులు అవసరం లేదని చురకలంటిచారు. న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో జరిగిన ఆర్కిటిక్ సర్కిల్ ఇండియా ఫోరం సమావేశంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఐస్లాండ్ మాజీ అధ్యక్షుడు గ్రిమ్సన్ తదితరులతో జరిగిన చర్చావేదికలో యూరప్ తీరును జైశంకర్ బహిర్గతం చేశారు. యూరప్ దేశాల నుంచి భారత్ ఏం కోరుకుంటుదని అడిగిన ప్రశ్నలో భాగంగా జై శంకర్ఇలా సమాధానమిచ్చారు. ‘మనం ప్రపంచాన్ని చూసినప్పుడు, భాగస్వాముల కోసం చూస్తాం. ముఖ్యంగా కొన్ని విదేశాలు చాలా బోధనలు చేస్తారు, వాటిని సొంత దేశంలో ఆచరించరు. కొన్ని యూరప్ దేశాలు ఇప్పటికీ ఈ సమస్యతో పోరాడుతున్నాయని నేను నమ్ముతున్నాను’ అని అన్నారు.ఇప్పుడు యూరప్ దేశాలు వాస్తవిక వైపు అడుగులు వేయగలరా లేదా అనేది చూడాలి. మనం భాగస్వామ్యాన్ని చేసుకోవాలంటే, కొంత అవగాహన ఉండాలి, కొంత సున్నితత్వం ఉండాలి, పరస్పర ప్రయోజనాల పట్ల అవగాహ ఉండాలి, ప్రపంచం ఎలా పనిచేస్తుందో గ్రహించాలి, ఈ విషయంలో కొన్ని యూరప్ దేశాలు సమర్థవంతంగా ఉండగా, మరికొన్ని వెనుకబడి ఉన్నాయన్నారు.గతంలో కూడా యూరప్ దేశాల తీరుపై జైశంకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి సమస్యల్ని ప్రపంచ సమస్యలుగా చూపిస్తారని, ప్రపంచ సమస్యల్ని మాత్రం వారు పట్టించుకోరంటూ వ్యాఖ్యలు చేశారు.

‘మీరు యుద్ధంలో పాల్గొంటారా?.. లేదు.. ఇంగ్లండ్ పారిపోతా’
కరాచీ: తమపై భారత్ యుద్ధానికి దిగితే ఏంటనే పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్ లో కనిపిస్తోంది. భారత్ తో పోరాడే పూర్తి శక్తి సామర్థ్యాలు ఏ రకంగా చూసే పాక్ కు లేవు. పైకి ఏదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ నిజంగా భారత్ యుద్ధానికి దిగితే మాత్రం తమకు చుక్కలే కనిపిస్తాయనే భావన కొందరి నాయకుల్లో కనిపిస్తోంది. నాలుగు రోజుల క్రితం ఒక పాక్ ఎంపీ చేసిన వ్యాఖ్యలే అందుకు ఉదాహరణ. ఒకవేళ తమతో భారత్ యుద్ధానికి దిగితే తాను ఇంగ్లండ్ కు పారిపోతానంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఆ ఎంపీ సరదాగా చేసినా సీరియస్ గా ఈ వ్యాఖ్యలు చేసినా ప్రస్తుత పాకిస్తాన్ ప్రభుత్వాన్ని చేతగాని ప్రభుత్వంగానేఅభివర్ణించినట్లు ఆయన మాటల్లో కనబడుతోంది. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీకి చెందిన ఎంపీ షెర్ అఫ్జల్ ఖాన్ మర్వాత్.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక లోకల్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సదరు ఎంపీ ఈ కామెంట్స్ చేశారు. పాక్ పై భారత్ యుద్ధానికి దిగితే మాత్రం తాను ఇంగ్లండ్ వెళ్లిపోతానంటూ తేల్చిచెప్పారు.ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోదీని వెనక్కి తగ్గమని చెప్పొచ్చు కదా.. అని అడిగిన మరో ప్రశ్నకు ‘నేను చెబితే వినడానికి.. మోదీ జీ ఏమైనా మా బంధువా.? అంటూ చమత్కరించారు ఎంపీ షెర్ అఫ్జల్ ఖాన్ మర్వాత్.Pakistaniyon ki fat ke char ho gayi hai🧵Journalist : Aapko nahi lagta Modi ko thoda pichhe hatna chahiyeSher Afzal Khan Marwat, a lawyer and senior #PTI leader : Modi kya meri Khala ka beta hai, jo mere kehne pe ruk jayega😂Journalist : Agar india ne attack kar diya to?… pic.twitter.com/jNu5H3lzQ1— KashmirFact (@Kashmir_Fact) April 30, 2025 ప్రస్తుతం పాక్ జైల్లో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా ఉండేవారు ఎంపీ షెర్ అఫ్జల్ ఖాన్. పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ) తరఫున ఆయన ఎంపీగా ఉన్నారు. గతంలో అంటే ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ ఎంపీ హవా నడిచేది. పీటీఐలో కీలకంగా వ్యవహరించేవారు షెర్ ఆఫ్జల్ ఖాన్,.గత కొన్నినెలలుగా ప్రస్తుత పాకిస్తాన్ ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు అఫ్జల్ ఖాన్,. ఈ క్రమంలోనే భారత్ తో యుద్ధాన్ని పాక్ తట్టుకోలేదనే సంకేతం వచ్చేలా వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు ఎంపీ అఫ్జల్ ఖాన్.

అదే జరిగితే.. భారత్కు పాక్ మరోసారి అణు బెదిరింపులు
మాస్కో: పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపడుతున్న చర్యలు.. పాక్ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తోంది. తాజాగా రష్యాలోని పాక్ దౌత్యవేత్త మహమ్మద్ ఖలీద్ జమాలీ అణు బూచిని భారత్కు చూపించి బెదిరించే యత్నం చేశారు. ఒక వేళ న్యూఢిల్లీ తమపై దాడి చేస్తే.. అణ్వాయుధాలు సహా పూర్తి శక్తిని వినియోగిస్తామని పేర్కొన్నారు. రష్యా ఛానల్ ఆర్టీకి ఇంటర్వ్యూ ఇస్తూ.. భారత్కు చెందిన బాధ్యతారాహిత్య మీడియా నుంచి వస్తున్న ప్రకటనలు మమ్మల్ని తప్పనిసరిగా స్పందించేలా చేస్తున్నాయి. ఇటీవల లీకైనట్లు చెబుతున్న పత్రాల్లో భారత్ కొన్ని చోట్ల కచ్చితంగా దాడులు చేయబోతున్నట్లు తెలిసింది. ఆ దేశంతో యుద్ధం విషయానికి వస్తే ప్రజల మద్దతుతో మా సంప్రదాయ, అణు బలంతో పూర్తిస్థాయిలో స్పందిస్తాం’’ అని జమాలీ పేర్కొన్నారు. గత వారం ఆ దేశ రైల్వేశాఖ మంత్రి హనీఫ్ అబ్బాసీ మాట్లాడుతూ తమ వద్ద ఉన్న ఘజన్నవీ, ఘోరీ, షహీన్ క్షిపణులు, 130 అణ్వాయుధాలు భారత్ కోసమే ఉంచినట్లు ప్రకటించారు. పాక్ ప్రేరిత ఉగ్రవాదులు పహల్గాంలోని బైసరన్ లోయలో దాడి చేసి 26 మంది అమాయకుల ప్రాణాలు తీయడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ టెర్రరిస్టులు పాక్ జాతీయులని తేలింది. దీంతో భారత్ ప్రతిచర్యలకు దిగింది. ఇప్పటికే సింధుజలాల ఒప్పందాన్ని నిలిపివేసి ఇస్లామాబాద్కు భారత్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఉగ్రవాదులు, ఆ మూకలకు మద్దతు ఇచ్చే వారిపై చర్యలు తీసుకొనే విషయంలో భద్రతా దళాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఎక్కడ, ఎప్పుడు ఎలా దెబ్బకొట్టాలో వారే నిర్ణయిస్తారన్నారు. సైనిక చర్య కూడా ఉండొచ్చన్న ఆందోళనతో.. యుద్ధం వస్తే తాము అణ్వాయుధాలు వాడతామంటూ పాక్ ప్రకటనలు గుప్పిస్తోంది.

భారత్తో టెన్షన్ వేళ పాక్కు షాక్.. ఊహించని దెబ్బకొట్టిన బీఏల్ఏ
క్వెట్టా: పహల్గాం ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ దాయాది దేశానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్ సైన్యానికి బలోచ్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఊహించని షాక్ తగిలింది. పాక్ సైన్యానికి సవాల్ విసురుతూ కీలకమైన మంగుచోర్ పట్టణాన్ని బీఎల్ఏ స్వాధీనం చేసుకుంది. ఇదే సమయంలో సైనిక, ప్రభుత్వ అధికారులను సైతం బందీలుగా పట్టుకుంది. అలాగే, బీఎల్ఏ బలగాలు.. క్వెట్టా నగరం దిశగా వెళ్తున్నట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యాన్ని టార్గెట్ చేసిన బీఎల్ఏ దాడులు చేసింది. ఇక, తాజాగా పాక్ సైన్యంపై తిరుగుబాటు చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యంపై బలోచ్ లిబరేషన్ ఆర్మీ సవాల్ విసిరింది. కీలకమైన మంగుచోర్ పట్టణాన్ని బీఎల్ఏ స్వాధీనం చేసుకుంది. బీఎల్ఏకు చెందిన అత్యంత క్రూరమైన, ప్రత్యేక శిక్షణ పొందిన 'డెత్ స్క్వాడ్' బృందం ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్లు సమాచారం. ఈ బృందం మంగుచోర్ పట్టణంలోకి చొచ్చుకెళ్లి, అక్కడ ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను, భద్రతా సంస్థల ప్రాంగణాలను తమ అదుపులోకి తీసుకుంది. ఇంతటితో ఆగకుండా, పట్టణంలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉన్నత స్థాయి సైనిక, ప్రభుత్వ అధికారులను సైతం బందీలుగా చేసుకుంది.బలుచిస్తాన్ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని బీఎల్ఏ పోరాడుతోంది. ఈ క్రమంలో బీఎల్ఏ వరుస దాడులతో బలూచిస్తాన్పై పాకిస్తాన్ నియంత్రణ కోల్పోతోంది. ఇక, ఇప్పటికే బీఎల్ఏ దాడుల్లో వందలాదిమంది పాక్ సైనికులు మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం పాక్ సైనికులు వెళుతున్న ట్రైన్ని హైజాక్ చేసిన బీఎల్ఏ.. పాక్ సైనికులను హతమార్చింది. కొద్ది రోజుల క్రితం బీఎల్ఏ పాక్ సైన్యం కాన్వాయ్పై ఐఈడీ దాడి చేయడంతో ఏకంగా 10 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వారు ఎంత దూకుడుగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నారో పాక్ ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తున్నారు.Baloch sarmachars are roaming openly through Mangocher city, seizing control of banks, as well as government and military assets. Certain handles suggest that government personnel have been forced to evacuate, and that several state institutions are no longer operational.… https://t.co/h9KewE0JZc pic.twitter.com/P4mdw3l6aG— Char (@cqc_coffee_guns) May 3, 2025ఇదిలా ఉండగా.. పాకిస్తాన్లోని నైరుతి ప్రాంతమే బలూచిస్తాన్. ఇది పాక్లో ఒక ప్రావిన్స్గా ఉంది. పాకిస్తాన్ మొత్తం విస్తీర్ణంలో 44 శాతం బలూచిస్తాన్ ఉంటుంది. విస్తీర్ణంపరంగా పాకిస్థాన్లో అతి పెద్ద ప్రావిన్స్గా బలూచిస్తాన్ ఉంది. అలాగే మిగతా అన్ని ప్రావిన్స్లో కెల్లా అతి తక్కువ జనాభా ఉన్న ప్రావిన్స్ కూడా బలూచిస్తానే. బలూచిస్తాన్లో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు వనరులు పుష్కలంగా ఉన్నాయి. బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయకముందువరకు బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగానే ఉండేది. బ్రిటిష్ వారి నుంచి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత దేశ విభజన తర్వాత పాకిస్తాన్లో భాగమైంది. ఆ తర్వాత కొంత కాలానికి స్వతంత్ర దేశం కోసం బలూచిస్తాన్ నుంచి డిమాండ్ పుట్టుకొచ్చింది.అలాగే ఆ ప్రావిన్స్లో పాక్ సాగిస్తున్న మారణకాండ కూడా తిరుగుబాటుకు మరో కారణం. 2011 నుంచి 2024 జనవరి వరకు పాక్లో మొత్తం 10,078 మంది అదృశ్యం అయ్యారు. అదృశ్యమైనవారిలో 2,752 మంది బలూచ్ పౌరులే. 2001-2017 మధ్య 5,228 మంది బలూచ్ పౌరులు అదృశ్యం కావడం గమనార్హం. ప్రస్తుతం బీఎల్ఏ యాక్టివ్గా వేర్పాటువాద కార్యకలాపాలు సాగిస్తోంది. బలూచిస్తాన్ స్వతంత్ర దేశం కావాలనే డిమాండ్తో బీఎల్ఏ ఏర్పాటైంది. దశాబ్ద కాలంగా పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తోంది.
జాతీయం

బాంబులు గుర్తింపు.. జమ్ముకశ్మీర్లో జైళ్లకు భద్రత పెంపు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉన్న జైళ్లపై ఉగ్ర దాడికి కుట్ర జరుగుతున్నట్టు సమాచారం. జైళ్లపై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. తాజాగా పూంజ్ జిల్లాలో ఉగ్రవాదులు అమర్చిన ఐదు ఐఈడీ బాంబులను భద్రతా బలగాలు గుర్తించాయి. వాటిని నిర్వీర్యం చేశాయి. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్, శ్రీనగర్లో భద్రతను ప్రభుత్వం పెంచింది. జైళ్ల భద్రతపై ఉన్నతాధికారులతో సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ సమీక్ష నిర్వహించారు. కాగా, 2023 నుంచి CISF జైళ్ల భద్రతను పర్యవేక్షిస్తోంది. కాగా, కశ్మీర్ జైళ్లలో ఉన్న హైప్రొఫైల్ ఉగ్రనాయకులను విడిపించేందుకు భారీ కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. ఈక్రమంలో శ్రీనగర్ సెంట్రల్ జైల్, కోట్ బాల్వాల్ జైల్, జమ్మూలోని జైళ్లకు భారీఎత్తున భద్రత కల్పించారు. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో భాగంగా చాలామంది స్లీపర్ సెల్స్, ఓవర్ గ్రౌండ్ వర్కర్లను తీసుకొచ్చి ఈ జైళ్లలో ఉంచారు. వీరితోపాటు ఆర్మీ వాహనంపై దాడి కేసులో నిందితులైన నిస్సార్, ముష్తాక్ సహచరులను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది. ఈనేపథ్యంలో జైళ్లపై దాడి జరగొచ్చనే సమాచారం నిఘా వర్గాలకు చేరింది.ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఏమాత్రం చల్లారడం లేదు. దాయాది కవ్వింపు చర్యలు ఆగడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం వరుసగా కాల్పులకు తెగబడింది. జమ్ము కశ్మీర్లో కుప్వారా, పూంచ్, రాజౌరీ, మేంధార్, నౌషేరా, సుందర్బనీ, అఖ్తర్ తదితర 8 ప్రాంతాల్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. వాటిని సైన్యం గట్టిగా తిప్పికొట్టింది.దీర్ఘకాల సెలవులు రద్దుఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల సిబ్బందికి దీర్ఘకాల సెలవులు రద్దు చేస్తూ మ్యునీషియన్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్) ఆదేశాలు జారీ చేసింది. ఎంఐఎల్ పరిధిలో 12 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలున్నాయి. సైన్యానికి అవసరమైన ఆయుధాలు వాటిలో తయారవుతాయి. ఆయుధ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికే సెలవులు రద్దు చేసినట్లు ఎంఐఎల్ అధికారి ఒకరు చెప్పారు.

వక్ఫ్ చట్టం చట్టబద్ధతపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా
న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వక్ఫ్ చట్టం(Waqf Amendment Act) రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణ మే 15కి వాయిదా వేసిందిసీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం పిటిషన్లపై విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా వక్ఫ్ కేసు విచారణను జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనానికి బదిలీ చేసింది. మే 13న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ కన్నా రిటైర్ కానున్న నేపథ్యంలో కేసు బదిలీపై నిర్ణయం తీసుకుంది.వక్ఫ్ కేసులలో తదుపరి విచారణ జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం విచారణ కొనసాగించనుంది.వక్ఫ్ (సవరణ) చట్టం2025 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన 72 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖయ్యాయి. ఇప్పటికే పలుసార్లు విచారించిన సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) కేంద్రం విజ్ఞప్తి మేరకు నేటి వరకు గడువు ఇచ్చింది. గత విచారణ సమయంలో చట్టంలోని రెండు వివాదాస్పద నిబంధనలను తాత్కాలికంగా కేంద్రం నిలిపివేసింది. మే 5వ తేదీ వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని తెలిపింది. గత వాదనల్లో.. వక్ఫ్ కౌన్సిల్, బోర్డుల్లో ముస్లిమేతరులను నియమించొద్దని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. గత విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. అన్నిరకాలుగా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే చట్టాన్ని రూపొందించినట్లు పేర్కొంది. ప్రభుత్వం తరపున పూర్తిస్థాయి వాదనలు వినకపోవడం సముచితం కాదని పేర్కొన్నారు. మరోవైపు.. వక్ఫ్గా న్యాయస్థానాలు ప్రకటించిన ఆస్తులను ప్రస్తుతానికి వక్ఫ్ జాబితా నుంచి తొలగించొద్దని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. వక్ఫ్ బోర్డులు, కేంద్ర వక్ఫ్ మండలిలో ఎక్స్అఫీషియో సభ్యులు మినహా మిగతా సభ్యులంతా కచ్చితంగా ముస్లింలే అయ్యుండాలనీ చెప్పింది. మతంతో సంబంధం లేకుండా ఎక్స్ అఫీషియో సభ్యులను నియమించొచ్చని.. ఈ మేరకు వక్ఫ్(సవరణ) చట్టంలోని కొన్ని కీలక నిబంధనలపై స్టే విధించేందుకు ప్రతిపాదించింది.

మైసూరులో పాకిస్తానీ మహిళ
మైసూరు(కర్ణాటక): మైసూరులో పాకిస్తాన్కు చెందిన మహిళ స్వదేశానికి వెళ్లలేక ఇబ్బందులు పడుతోంది. పాకిస్తాన్లో ఉన్న తన భర్త పిలుచుకుపోతాడని ఆమె భారత్– పాకిస్తాన్ సరిహద్దులకు వెళ్లింది, కానీ భర్త రాకపోవడంతో ఒంటరిగా వెళ్లలేక ఉస్సూరంటూ మైసూరుకు తిరిగి వచ్చింది. మైసూరులో నివాసం వివరాలు.. మైసూరులోని ఉదయగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో పాకిస్తాన్కు చెందిన మహిళ ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటోంది. 10 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ వ్యక్తితో వివాహమైంది. కొన్ని సంవత్సరాల పాటు భర్తతో కలిసి పాకిస్తాన్లో జీవించింది, పిల్లలు కూడా అక్కడే పుట్టారు. కొన్ని కారణాల వల్ల ఆమె, పిల్లలతో కలిసి మైసూరుకు వచ్చి ఉంటోంది. పహల్గాంలో ఉగ్రవాదుల మారణహోమం తరువాత పాకిస్తాన్ పౌరులందరూ వారి దేశానికి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం తెలిసిందే. ఫలితంగా ఆ మహిళ పాకిస్తాన్కు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. భర్తకు ఫోన్ చేయగా పిల్లలతో కలిసి సరిహద్దుల వద్దకు రా, నేను వచ్చి తీసుకెళ్తాను అని చెప్పాడు. ఆమె పిల్లలను వెంటేసుకుని సరిహద్దులకు వెళ్లింది. భర్తకు కాల్ చేయగా ఫోన్ స్విచాఫ్ అని వచ్చింది. మళ్లీ మైసూరుకు తిరిగి వచ్చింది. ఆమె విజిటర్స్ వీసాతో మైసూరులో ఉంటోంది.

అసెంబ్లీలో ‘మ్యాచ్ ఫిక్సింగ్’?.. ఎమ్మెల్యే అరెస్ట్!
ఆయనో యువ ఎమ్మెల్యే. అవినీతి మీద చట్ట సభలో ప్రశ్నలు సంధించారు. ఆనక.. నోరు మెదపకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో డబ్బు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టాడు. రాజస్థాన్లో ఓ సిట్టింగ్ ఎమ్మెల్యేను ఏసీబీ ఆదివారం అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. జైపూర్: భారత్ ఆదివాసీ పార్టీ (బీఏపీ) ఎమ్మెల్యే జైకృష్ణ పటేల్ జైపూర్ జ్యోతి నగర్లోని తన అధికార నివాసంలో ఒక మైనింగ్ కంపెనీ యజమాని నుంచి రూ 20 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినట్లు ఆ రాష్ట్ర ఏసీబీ వెల్లడించింది. కరౌలి జిల్లాలోని తోడభీమ్ బ్లాక్లోని కొన్ని మైనింగ్ లీజులకు సంబంధించిన మూడు ప్రశ్నలను గత అసెంబ్లీ సమావేశాల్లో అడిగారు. అయితే ఆ ప్రశ్నలను ఉపసంహరించుకునేందుకు మైనింగ్ యజమాని నుంచి ఎమ్మెల్యే మొత్తంగా రూ.10 కోట్లను డిమాండ్ చేశారు. అయితే చివరకు డీల్ రూ.2.5 కోట్లకు కుదరడం, కొంత కొంతగా చెల్లించేందుకు ఎమ్మెల్యే ఒప్పుకోవడం జరిగిపోయిందట. అదే సమయంలో ఈ ఏప్రిల్లోనే ఏసీబీకి ఆయన సమాచారం అందించాడట.ఈ క్రమంలో.. ఇప్పటికే లక్ష చెల్లించగా.. ఆదివారం మరో రూ.20 లక్షలు ఇచ్చేందుకు ఓ యజమాని ప్రయత్నించాడు. దీంతో.. ఏసీబీ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, స్పీకర్ వాసుదేవ్కి తెలియజేసి అరెస్ట్కు ముందస్తుగానే అనుమతి పొందారు. సరిగ్గా డబ్బు తీసుకుంటున్న సమయంలో ఎమ్మెల్యేను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ డైరెక్టర్ జనరల్ రవి ప్రకాష్ మెహర్దా మీడియాకు తెలియజేశారు. అంతేకాదు.. ఎమ్మెల్యే కృష్ణ పటేల్ డబ్బు తీసుకుంటున్న టైంలో ఆడియో, వీడియో ఫుటేజీలు ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఎమ్మెల్యే అనుచరుడొకరు డబ్బు సంచితో ఉడాయించినట్లు, అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారాయన. లోక్ సభ ఎన్నికలతో పాటు కిందటి ఏడాది జరిగిన బగిడోరా నియోజవర్గం(బంస్వారా జిల్లా) ఉప ఎన్నికల్లో కృష్ణ పటేల్(38) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే. భారత్ ఆదివాసీ పార్టీకి మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అరెస్టు తరువాత ఎమ్మెల్యేను ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఇదిలా ఉంటే.. ఈ పరిణామంపై భారత్ ఆదివాసీ పార్టీ కన్వీనర్, బంస్వారా ఎంపీ రాజ్కుమార్ రావోత్ స్పందించారు. ఇది బీజేపీ కుట్ర అయ్యి ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ కృష్ణపటేల్ హస్తం ఉన్నట్లు తేలితే చర్యలు ఉంటాయని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. చట్టం ముందు అందరూ సమానమేనని, రాజకీయాల్లో అవినీతి పనికి రాదని ఆ పార్టీ కీలక నేత సచిన్ పైలట్ అన్నారు. అదే సమయంలో దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని బీజేపీ చేస్తున్న రాజకీయాలపైనా చర్చ జరగాలని కోరారాయన. ఈ ఆరోపణలపై బీజేపీ స్పందించాల్సి ఉంది.
ఎన్ఆర్ఐ

సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్కు చెందిన ప్రేమ్సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

టంపాలో నాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను టంపాలో నాట్స్ నిర్వహించింది. మొత్తం 12 వాలీబాల్ జట్లు, 5 మహిళా త్రోబాల్ జట్లు, 350 మందికిప గా తెలుగు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లతో తమ ప్రతిభను చాటేందుకు పోటీ పడ్డారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా రావడంతో క్రీడా ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మహిళల త్రోబాల్ టోర్నమెంట్లో మొదటి బహుమతిని సన్షైనర్స్ జట్టు కైవసం చేసుకుంది. పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ ఛాంపియన్లుగా డైనమిక్ రచ్చ జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ విజేతలకు బహుమతులు జూలై 4 నుండి 6 వరకు జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో బహుమతులు పంపిణి చేయనున్నారు. నాట్స్ కమ్యూనిటీ సేవల బృందం నుండి రంజిత్ పాలెంపాటి అవిశ్రాంత కృషి ఈ టోర్నమెంట్లు దిగ్విజయంగా జరగడంలో కీలక పాత్ర పోషించింది.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు. క్రీడాకారులు టోర్నమెంట్లో చూపిన క్రీడాస్ఫూర్తిని మల్లాది ప్రశంసించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాధవి యార్లగడ్డ, అపర్ణ కొడాలి, కార్తీక్ తుమ్మటి, శ్రీకాంత్ పాత్ర, శ్యామల, విజయ్ చిన్నం తదితరులు ఈ టోర్నమెంట్ల నిర్వహణకు తమ మద్దతును, సహకారాన్ని అందించారు. జూలైలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఇదే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను నాట్స్ టంపాలో నిర్వహించనుంది. నాట్స్ సంబరాల కమిటి, నాట్స్ క్రీడా కమిటీలు ఈ పోటీల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగనుంది. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు విజేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అందరూ టంపా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

NATS శాండియాగో లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
శాండియాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాలను ప్రారంభిస్తూ తెలుగు వారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే శాండియాగోలో నాట్స్ విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ శాండియాగో చాప్టర్ సమన్వయకర్తగా ప్రశాంతి ఊడిమూడి, మహిళా సాధికార సలహా మండలి సమన్వయకర్తగా హైమ గొల్లమూడికి బాధ్యతలు అప్పగించారు. శాండియాగో నాట్స్ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కామ్య శిష్ట్లా, సోషల్ మీడియా సమన్వయ కర్త గా తేజస్వి కలశిపూడి, సేవా కార్యక్రమాల సమన్వయకర్త గా రామచంద్ర రాజు ఊడిమూడి, క్రీడా స్ఫూర్తి సమన్వయ కర్తగా సత్య హరిరామ్, ఆది మోపిదేవి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీరామనవమి నాడు శాండియాగో లో నాట్స్ విభాగం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని శాండియాగో నాట్స్ సమన్వయకర్త ప్రశాంతి ఊడిమూడి అన్నారు. శాండియాగో లో నాట్స్ తెలుగు వారికి శ్రీరామరక్షలా మారేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తనుష్ భగవత్ ,వీణ-ఋత్వ ఊడిమూడి గానామృతం, వయోలిన్తో ధ్రువ గౌరిశెట్టి ,పియానోతో విహాన్ మండపాక అందరిని అలరించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి,నాట్స్ సెక్రటరీ మధు బోడపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ మద్దినేని పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా లాస్ ఏంజెలెస్ చాప్టర్ నుండి నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి,జాతీయ మహిళా సాధికారత సమన్వయ కర్త రాజ్యలక్ష్మి చిలుకూరి,లాస్ ఏంజెలెస్ చాప్టర్ సమన్వయ కర్త మురళి ముద్దన, హెల్ప్ లైన్ సమన్వయ కర్త శంకర్ సింగం శెట్టి పాల్గొన్నారు. నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ఆధ్వర్యంలో నూతన చాప్టర్ సభ్యులను మనోహర్ మద్దినేని సభకు పరిచయం చేశారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి తమ అభినందనలు సందేశం ద్వారా పంపారు. భవిష్యత్తులో శాండియాగో నాట్స్ విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి భరోసా ఇచ్చారు. అమెరికాలో తెలుగు సమాజ అభివృద్ధి దిశగా నాట్స్ జాతీయ వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందన్నారు. అమెరికాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి మదన్ పాములపాటి వివరించారు. శాండియాగో చాప్టర్ ఏర్పాటులో నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారే కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు. శాండియాగోలో ఇక నుంచి తెలుగువారికి నాట్స్ అండగా ఉందనే భరోసాను కల్పించే దిశగా శాండియాగో నాట్స్ సభ్యులు కృషి చేయాలని కోరారు.

డల్లాస్లో నిరాశ్రయుల ఆశ్రయ గృహంలో పేదలకు ఆహారం
తెలంగాణా పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (Telangana Peoples Association of Dallas) మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో 'ఫుడ్ డ్రైవ్'తో అన్నార్తుల ఆకలి తీర్చింది. Austin Street Homeless Shelter లో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒక రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో TPAD సభ్యులు స్వయంగా పాస్తా, చికెన్, మాష్డ్ పొటాటో తదితర వంటకాలు తయారు చేసి.. అన్నార్తులకు వడ్డించారు. 450 మందికి పైగా నిరాశ్రయుల ఆకలి తీర్చారు. అనురాధ మేకల (ప్రెసిడెంట్), రావు కల్వల (FC చైర్), పాండు పాల్వే (BOT చైర్), రమణ లష్కర్ (కోఆర్డినేటర్), దీపికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఫుడ్ డ్రైవ్లో 450 మందికి పైగా నిరాశ్రయులకు ఆహారం వడ్డించామని, టీప్యాడ్ చెందిన 50 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు తెలియజేశారు. టీప్యాడ్ సీనియర్ నాయకుడు రఘువీర్ బండారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. (మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
క్రైమ్

పాముకాటుకు వివాహిత మృతి
కడెం(మంచిర్యాల): పాముకాటుకు గురై వివాహిత మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. పెద్దూర్కు చెందిన నేరెళ్ల రజిత (35), దాసు భార్యభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేసు కుంటూ జీవనం సాగిస్తున్నారు. అద్దె ఇంటి డబ్బుల భారంతో గత కొన్నినెలలుగా పెద్దూర్ సమీపంలోని డబుల్ బెడ్రూం ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటి పరిసరాల్లో రజిత తోటకూర తెంపుతుండగా పాము కాటేసింది. కుటుంబ సభ్యులు ఆమెను కడెంలో ప్రథమ చికిత్స చేయించి, నిర్మల్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతిచెందింది. తల్లి మృతదేహం వద్దమృతదేహం వద్ద రోదిస్తున్న కూతురు కూతుళ్ల రోదన అందరిని కంటతడి పెట్టించింది. పెద్ద కూతురు వివాహం నిశ్చయం కాగా, అంతలోనే తల్లి మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయ లు అలముకున్నాయి. భర్త ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.కృష్ణసాగర్రెడ్డి తెలిపారు.

ప్రియురాలి చేతిలో ట్రావెల్ ఏజెంట్ హత్య
అన్నానగర్(తమిళనాడు): మద్యం, మాంసంలో నిద్రమాత్రలు కలిపి దుబాయ్ ట్రావెల్స్ సీఈఓను హత్య చేసిన ప్రియురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. తూత్తుక్కుడి కి చెందిన త్యాగరాజన్(69) ఇతను కోయంబత్తూరు వచ్చి ఖతీమా నగర్లో నివశించే సమయంలో గోమతి అనే మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది. గోమతికి నీల, శారద అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2016లో శారదతో గొడవపడిన ఆమె భర్త గుణవేల్ను హత్య చేసి త్యాగరాజన్ జైలుకు వెళ్లాడు. అనంతరం బెయిల్పై వచ్చాడు. ఈ క్రమంలో శారద పని నిమిత్తం దుబాయ్ వెళ్లింది. ఆ సమయంలో తిరువారూరు జిల్లాకు చెందిన ట్రావెల్ ఏజెంట్ సిగమణి(47)తో శారదకు అక్రమ సంబంధం ఏర్పడింది. శారదకు, సిగమణికి డబ్బులు ఇచ్చి పుచ్చుకునే దాంట్లో సమస్య వచ్చింది. దీంతో శారద కోవైకి తిరిగి వచ్చింది. శారదను శాంతింపజేసేందుకు సిగమణి 21న కోయంబత్తూరుకు వచ్చాడు. అతనిని శారద తన ఇంటికి తీసుకెళ్లింది. ఆ సమయంలో త్యాగరాజన్ నెల్లైకి చెందిన ప్రముఖ రౌడీ పశుపతిపాండియన్ సహచరుడు పుదియవన్ కోయంబత్తూరుకు ఆహ్వానించారు. ఆ తర్వాత 22వ తేదీ రాత్రి మద్యం, మాంసంలో 30కి పైగా నిద్ర, నొప్పి నివారణ మాత్రలు కలిపి సిగమణిని హత్య చేశారు. అనంతరం సిగమణి మృతదేహాన్ని త్యాగరాజన్, శారద, పుదియవన్ కారులో తీసుకెళ్లి కరూర్ పొన్నమరావతి పక్కన పడేసి, పారిపోయారు. మిగిలిన ఇద్దరు తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. దీనిపై సిగమణి భార్య ప్రియా(69) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోయంబత్తూరు బీలమేడు పోలీసులు విచారణ చేపట్టారు. త్యాగరాజన్(69), ఇతని వివాహేతర ప్రియురాలు గోమతి (53), ఆమె కూతుళ్లు నీల (33), శారద (35), కోడలు స్వాతి (26), పుదియవన్(48) సిగమణిని హత్య చేసినట్లు తేలింది. ఆదివారం శారదతోపాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

భర్త వివాహేతర సంబంధం.. గుండెపోటుతో భార్య మృతి..!
ఖమ్మంక్రైం: వరుసకు వదిన అయిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి తన భార్యను కొట్టి చంపినట్లు సమాచారం. ఈ ఘటన హైదరాబాద్లో జరగగా.. మృతురాలిది ఖమ్మం. వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన సాహితి (30)కి ఖమ్మం పట్టణానికి చెందిన రేగుల అనిల్తో కొన్నేళ్ల కిందట వివాహమైంది. అనిల్ హైదరాబాద్లోని పోలీస్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తుండటంతో దంపతులు అక్కడే ఉంటున్నారు. కాగా, అనిల్ వరుసకు వదిన అయిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. పద్ధతి మార్చుకోవాలని పెద్దల సమక్షంలో హెచ్చరించినా మార్పు రాలేదు. శనివారం రాత్రి సాహితిని విపరీతంగా కొట్టడంతో ఆమె మృతిచెందగా గుండెపోటుతో మృతిచెందినట్లు చిత్రీకరించేందుకు అనిల్ యత్నంచాడని మృతురాలి బంధువులు ఆరోపించారు.మృతురాలి శరీరంపై కూడా గాయాలున్నాయని, హైదరాబాద్ నుంచి మృతదేహన్ని తీసుకొచ్చి ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. సీఐ బాలకృష్ణ వారితో మాట్లాడి అనిల్పై ఫిర్యాదు చేయాలని, పోస్టుమార్టంలో హత్య అని తేలితే కేసు నమోదు చేస్తామని, సర్దిచెప్పగా మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. టూటౌన్ పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. అనిల్ పరారీలో ఉన్నాడు. వారికి ఇద్దరు పిల్లలున్నారు.

ప్రాణాలు తీసిన పెంపుడు కుక్క..!
వెంగళరావునగర్(హైదరాబాద్): తాను పెంచుకుంటున్న శునకమే ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొన్న ఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన డి.పవన్కుమార్ (37) తన స్నేహితుడు సందీప్తో కలిసి పదేళ్లుగా మధురానగర్లోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో గదిలో నిద్రపోయాడు. పక్కనే అతని పెంపుడు కుక్క కూడా ఉంది. ఉదయం సందీప్ తలుపు తట్టగా పవన్ లేవలేదు. అనుమానం వచ్చి చుట్టుపక్కల వారితో తలుపు పగులకొట్టి లోనికి వెళ్లి చూడగా పవన్ విగతజీవిగా కనిపించాడు. అతని మర్మాంగాలు రక్తంతో ఉన్నాయి. అతని పెంపుడు కుక్క నోటి నిండా రక్తం ఉంది. కుక్క అతడి మర్మాంగాలను గాయపర్చడం వల్లే మృతి చెంది ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. పవన్కుమార్కు గతంలో వివాహమైంది. భార్యతో విడాకులు కావడంతో నగరంలో ఉంటున్నాడు. స్నేహితుడు సందీప్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.