ఆ పరిస్థితి తెచ్చుకోం: ఈటెల | Etela rajender comments ts budget | Sakshi
Sakshi News home page

ఆ పరిస్థితి తెచ్చుకోం: ఈటెల

Published Wed, Mar 11 2015 12:40 PM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

బంగారు తెలంగాణ లక్ష్యంగా తమ పయనం సాగుతోందని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.

హైదరాబాద్: బంగారు తెలంగాణ లక్ష్యంగా తమ పయనం సాగుతోందని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆర్థిక బడ్జెట్ 2015-16 ప్రవేశపెట్టిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ రూపకల్పన చేసినట్టు చెప్పారు. పరిశ్రమల స్థాపన, ఐటీ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు.

రాబోయే కాలంలో సంక్షేమ రంగానికి కేటాయింపులు పెంచుతామన్నారు. పూర్తి అవసరాలు తీర్చే సత్తా ఏ  ప్రభుత్వానికి ఉండదని, ఉన్న నిధులతోనే సమర్థవంతంగా పాలన సాగించాల్సివుంటుందన్నారు. తమ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించే పరిస్థితి తెచ్చుకోమని ఈటెల రాజేందర్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement