Charges frame
-
టెలికాం ఆపరేటర్లకు ఊరట.. ఎస్యూసీ ఛార్జీలు మినహాయిపు..?
దేశీయ టెలికాం ఆపరేటర్లకు స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీలను (SUC) మాఫీ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ అంశంపై కేబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్ మార్చి 10న భారత టెలికాం విభాగం(DoT), ఫైనాన్స్ మినిస్ట్రీ అధికారులతో చర్చించబోతున్నట్లు తెలిసింది. దేశ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కు కీలకంగా ఉన్న భారత టెలికాం రంగం చాలా కాలంగా ఆర్థిక సవాళ్లతో సతమతమవుతోంది. ఈ తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకోనుండడం గమనార్హం.ఎస్యూసీ అంటే ఏమిటి?స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలు(ఎస్యూసీ)..రేడియో ఫ్రీక్వెన్సీలను ఉపయోగించడానికి టెలికాం ఆపరేటర్లు ప్రభుత్వానికి చెల్లించే రుసుము. ఆపరేటర్ల సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్)లో ఈ ఛార్జీలను కొంత శాతంగా లెక్కిస్తారు. కొన్నేళ్లుగా ఎస్యూసీ టెలికాం కంపెనీలకు ఆర్థిక బాధ్యతగా ఉంటోంది. ఇది వాటి లాభదాయకతను, నిర్వహణ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీన్ని మాఫీ చేస్తే వీటి లాభాలు పెరుగుతాయనే వాదనలున్నాయి.రూ.5,000 కోట్ల ఆర్థిక ఉపశమనం2022 వేలానికి ముందు కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్కు ఈ మాఫీని వర్తింపజేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే టెలికాం ఆపరేటర్లకు సుమారు రూ.5,000 కోట్ల ఆర్థిక ఉపశమనం లభించనుంది. 2022 వేలం తర్వాత కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్పై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) ఇప్పటికే ఎస్యూసీను తొలగించింది. దాంతో గతంలో కేటాయించిన దానిపై ఈ మినహాయింపు కీలకంగా మారనుంది.టెలికాం రంగంపై ప్రభావం ఇలా..ఈ మాఫీ టెలికాం ఆపరేటర్లపై ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మౌలిక సదుపాయాలు, సాంకేతికతలో ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఆర్థిక భారాలు తగ్గడంతో టెలికాం కంపెనీలు తమ నెట్వర్క్లను విస్తరించడం, కనెక్టివిటీని మెరుగుపర్చుకోవడంపై దృష్టి సారించవచ్చు. ఈ రంగంలో ఆరోగ్యకరమైన పోటీని, సృజనాత్మకతను ప్రోత్సహించే అవకాశం ఉంటుంది.లబ్ధిదారులు ఎవరంటే..రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రధాన టెలికాం సంస్థలు ఈ మాఫీ వల్ల గణనీయంగా ప్రయోజనం పొందనున్నాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్కు రూ.1,100 కోట్లు చొప్పున ఆదా అవుతుందని అంచనా. వొడాఫోన్ ఐడియాకు సుమారు రూ.2,000 కోట్ల ఉపశమనం లభించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: వేతన పెరుగుదలలో టీచింగ్ లీడర్లదే హవా!సవాళ్లు ఇవే..ఎస్యూసీ మాఫీ సానుకూల చర్య అయినప్పటికీ ఈ రంగం ఎదుర్కొంటున్న ఇతర ఆర్థిక సవాళ్లను పరిష్కరించడం చాలా అవసరం. ఉదాహరణకు.. పరిశ్రమ ఏజీఆర్ బకాయిలు, అధిక లైసెన్స్ ఫీజులు, 5జీ టెక్నాలజీలో గణనీయమైన మూలధన పెట్టుబడి వంటి చాలా సమస్యలు టెలికాం విభాగాన్ని సవాలుగా మారుతున్నాయి. వీటిని పరిష్కరించాల్సి ఉంది. -
సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు.. కాంగ్రెస్ నేతపై హత్యాభియోగం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులు కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్ను వదిలేలా లేవు. ఈ కేసుల్లో భాగమైన గురుద్వారా పుల్ బంగశ్ హత్యల కేసులో టైట్లర్పై హత్యా నేరం అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ రౌస్ఎవెన్యూ ప్రత్యేక కోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి రాకేశ్ సియాల్ ఆదేశాలు జారీ చేశారు. టైట్లర్పై విచారణ చేపట్టేందుకు సరిపడా సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లపై గతంలో ప్రత్యక్ష సాక్షి ఒకరు వాంగ్మూలం ఇచ్చారు. ఈ వాంగ్మూలం ఆధారంగా టైట్లర్పై అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 13కు వాయిదా వేశారు. -
లోన్లపై వేసే ఛార్జీల గడువు పెంపు.. ఎప్పటి వరకంటే..
డబ్బు అవసరం అయితే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల్లో లోన్ తీసుకుంటారు. కానీ తిరిగి ఆ డబ్బు చెల్లించడంలో జాప్యం జరిగితే కొంత అధికమొత్తంగా పేచేయాల్సి ఉంటుంది. అయితే లోన్ కాంట్రాక్ట్ నోట్ ప్రకారం చెల్లించే పేనల్ ఛార్జీలను గతంలో ఆర్బీఐ సవరించింది. అందుకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. లోన్ అకౌంట్లకు సంబంధించి వేసే పేనల్ ఛార్జీలను అమలు చేయడానికి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలకు మరో మూడు నెలల సమయం దొరికింది. గతంలోని నిర్ణయించిన దాని ప్రకారం జనవరి 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రావాలి. కానీ, ఏప్రిల్ 1 వరకు ఆర్బీఐ పొడిగించింది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెంటర్(ఎన్బీఎఫ్సీ)లు ఏప్రిల్ 1 నుంచి ఇచ్చే అన్ని ఫ్రెష్ లోన్స్పై కొత్త పేనల్ ఛార్జీ రూల్స్ అమలు చేయాలని ఆర్బీఐ ప్రకటన విడుదల చేసింది. ఇదీ చదవండి: నేటి నుంచి రాబోతున్న కీలక మార్పులు ఇవే.. అయితే ఇప్పటికే ఇచ్చిన లోన్లకు సంబంధించి కొత్త నిబంధనల అమలుకు సంబంధించి ఏప్రిల్ 1 తర్వాత రివ్యూ చేయాలని తెలిపింది. కొత్త రూల్ ప్రకారం, లోన్ కాంట్రాక్ట్లోని కండిషన్స్ ఫాలో కాకపోతే బారోవర్లపై వేసే చార్జీలను పేనల్ చార్జీలుగా పరిగణిస్తారు. అంతేతప్పా పేనల్ ఛార్జీలను వడ్డీగా చూడకూడదని ఆర్బీఐ తెలిపింది. ఈ ఛార్జీ అప్పుల వడ్డీలపై కూడా పడుతుంది. రూల్స్ పాటించకపోతే తీవ్రతను బట్టి పేనల్ ఛార్జీ ఉంటుంది. పేనల్ చార్జీలపై అదనంగా వడ్డీ వసూలు చేయకూడదు. -
లఖీంపూర్ కేసు: కేంద్ర మంత్రి కుమారుడిపై అభియోగాలు
లఖీంపూర్ ఖేరి: నలుగురు రైతులు సహా మొత్తం 8 మంది మృతికి కారణమైన లఖీంపూర్ ఖేరి సంఘటనలో నిందితులపై కోర్టులో విచారణకు రంగం సిద్ధమయ్యింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాతోపాటు మరో 12 మంది నిందితులపై జిల్లా కోర్టు అభియోగాలు నమోదు చేసింది. హత్య, నేరపూరిత కుట్ర, సంబంధిత సెక్షన్ల కింద అభియాగాలు మోపింది. నిందితులపై ఐపీసీ సెక్షన్లు 147, 148(అల్లర్లు), 149(చట్టవిరుద్ధంగా గుమికూడడం), 302(హత్య), 307(హత్యాయత్నం), 326(ఆయుధాలతో గాయపర్చడం), 427, 120బీతోపాటు మోటార్ వాహన చట్టంలోని 177 కింద అదనపు జిల్లా జడ్జి సునీల్కుమార్ వర్మ అభియోగాలు నమోదు చేశారు. తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు. 13 మంది నిందితులు ప్రస్తుతం జైలులో ఉన్నారు. బెయిల్పై బయట ఉన్న 14వ నిందితుడు వీరేంద్ర శుక్లాపై ఐపీసీ సెక్షన్ 201 అభియోగాలు నమోదయ్యాయి. ఆశిష్ మిశ్రాతోపాటు కొందరు నిందితులపై ఆయుధాల చట్టంలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. 2021 అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరిలో రోడ్డుపై ధర్నా చేస్తున్న రైతులపైకి వాహనం దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించారు. అనంతరం రైతుల దాడిలో ఒక డ్రైవర్, ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఒక జర్నలిస్టు మరణించారు. రైతులపైకి దూసుకెళ్లిన వాహనంలో ఆశిష్ మిశ్రా ఉన్నాడని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇదీ చదవండి: మళ్లీ సరిహద్దు రగడ -
కశ్మీర్ వేర్పాటువాదులకు షాక్
Terror Funding Case: కశ్మీర్ వేర్పాటువాదులకు జాతీయ దర్యాప్తు సంస్థ న్యాయస్థానం షాక్ ఇచ్చింది. 2017లో కశ్మీర్ అల్లర్లకు సంబంధించి.. వేర్పాటువాద సంస్థలపై టెర్రరిస్టు ఫండింగ్ నేరారోపణలు నమోదు చేయాలని ఆదేశించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం Unlawful Activities (Prevention) Act లోని పలు సెక్షన్ల కింద నేరారోపణలు నమోదు చేయాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వేర్పాటువాదులతో పాటు పనిలో పనిగా ఉగ్రసంస్థల నేతలకూ షాక్ ఇచ్చింది కోర్టు. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయ్యద్తో పాటు హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ పేరును సైతం చేర్చింది. టెర్రర్ ఫండింగ్ కేసులో వీళ్ల పేర్లను పొందుపర్చాలని ఆదేశించింది కోర్టు. ఈ మేరకు ఢిల్లీ పాటియాలా హౌజ్లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పర్వీన్ సింగ్ మార్చి 16వ తేదీనే ఆదేశాలు జారీ చేశారు. కశ్మీర్ వేర్పాటువాదులు, ఉగ్ర సంస్థలు పక్కా కుట్రతోనే 2017లో కశ్మీర్లో అలజడులు సృష్టించారని న్యాయమూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు. తీవ్రవాద నిధుల కేసులో పలువురు నిందితులు పాకిస్థాన్తో ఉమ్మడి ఎజెండాను పంచుకున్నారని పేర్కొన్నారాయన. మొత్తం పదిహేను మంది కశ్మీరీ వేర్పాటువాద నేతలతో పాటు హఫీజ్ సయ్యద్, సయ్యద్ సలావుద్దీన్, Jammu & Kashmir Liberation Front చీఫ్ యాసిన్ మాలిక్, షబ్బీర్ షా, ముసారత్ అలమ్పై నేరారోపణలు నమోదు కానున్నాయి. -
కథువా నిందితులపై అభియోగాల నమోదు
సాక్షి, పఠాన్కోట్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జమ్మూ కశ్మీర్లోని కథువాలో ఎనిమిదేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసును విచారిస్తున్న న్యాయస్థానం ఎనిమిది మంది నిందితులకు గాను ఏడుగురిపై అభియోగాలు నమోదు చేసింది. దీంతో నిందితులపై విచారణ ప్రారంభించేందుకు మార్గం సుగమం చేసిందని అధికారులు పేర్కొన్నారు.నిందితులపై నేరపూరిత కుట్ర, హత్య, సామూహిక లైంగిక దాడి నేరాలను నమోదు చేసినట్టు జిల్లా సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జేకే చోప్రా చెప్పారు. నిందితులు సంజీ రామ్, ఆయన కుమారుడు విశాల్, ప్రత్యేక పోలీసు అధికారులు దీపక్ ఖజురియా, దీపు, సురీందర్ వర్మ, పర్వేష్ కుమార్ అలియాస్ మన్ను, హెడ్కానిస్టేబుల్ తిలక్ రాజ్, సబ్ ఇన్స్పెక్టర్ అరవింద్ దత్తాలపై అభియోగాలు నమోదయ్యాయి. బాలికను అపహరించే కుట్రకు ప్రధాన సూత్రధారిగా సంజీరామ్ను భావిస్తున్నారు. ఆ ప్రాంతం నుంచి మైనారిటీ వర్గాన్ని తరిమికొట్టే కుట్రలో భాగంగా ఇతర నిందితులతో కలిసి సంజీ రామ్ పకడ్భందీగా ఈ నేరానికి పాల్పడినట్టు భావిస్తున్నారు. కథువా హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. -
23 మంది ఉగ్రవాదులపై అభియోగాల నమోదు
ఐదేళ్ల కిందట ఢిల్లీ, హైదరాబాద్, అహ్మదాబాద్లలో జరిగిన బాంబు పేలుళ్లకు ముందు వాటికి బాధ్యత వహిస్తూ ఈమెయిల్స్ పంపిన కేసులో ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం)కు చెందిన వారుగా అనుమానిస్తున్న 23 మందిపై ఇక్కడి కోర్టు అభియోగాలు నమోదు చేసింది. దీంతో వీరిపై విచారణకు మార్గం సుగమమైంది. వీరు పేలుళ్లకు ముందే ముంబై నుంచి మీడియా సంస్థలకు, ప్రభుత్వానికి ఈమెయిల్స్ పంపినట్లు ఆరోపణలున్నాయి. ముంబై పోలీసులు అరెస్టు చేసిన వీరితోపాటు, పరారీలో ఉన్న రియాజ్, ఇక్బాల్ భత్కల్ సహా ఐదుగురిపై మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల చట్టం కోర్టు జడ్జి ‘దేశంపై యుద్ధం’ తదితర 29 నేరాల కింద అభియోగాలు నమోదు చేశారు.