retired dgp
-
విశ్రాంత డీజీపీ దారుణ హత్య
యశవంతపుర: కర్ణాటకలో సంచలనం చోటుచేసుకుంది. విశ్రాంత డీజీపీ ఓం ప్రకాశ్ (68) అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆదివారం బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీసుస్టేషన్ పరిధిలోని నివాసంలో ఆయన కత్తి పోట్లకు గురయ్యారు. శనివారం రాత్రి ఘటన జరగ్గా ఆదివారం ఉదయం బయటపడింది. ప్రకాశ్ భార్య పల్లవి ఈ విషయం బంధువులకు తెలపగా, వారు పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి చూడగా మూడంతస్తుల నివాసం గ్రౌండ్ ఫ్లోర్లోని ఓ గదిలో ఓం ప్రకాశ్ రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించారు. ఆయన శరీరంపై అనేక కత్తి గాట్లున్నాయి. కత్తితో పాటు ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన ఆయన భార్య పల్లవితోపాటు కుమార్తెను పోలీసులు ప్రశి్నస్తున్నారు. విషయం తెల్సిన సీనియర్ పోలీసు అధికారులు ఆయన నివాసానికి తరలివచ్చారు. ఓం ప్రకాశ్ దంపతుల మధ్య కొంతకాలంగా ఆర్థిక సంబంధమైన గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. తనకు దగ్గరి వారి నుంచే ప్రాణహాని ఉన్నట్లు ప్రకాశ్ ఇటీవల కొందరు సన్నిహితులతో ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఘటనకు ప్రకాశ్కు సన్నిహితులైన కుటుంబసభ్యులే కారణమై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. ప్రకాశ్ బిహార్లోని చంపారన్ వాసి. అక్కడే జియాలజీలో పీజీ చేశారు. 1981లో ఐపీఎస్కు ఎంపికయ్యారు. బళ్లారిలో ఏఎస్పీగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన కెరీర్లో పూర్తికాలం కర్ణాటకలో పనిచేశారు. భత్కల్ మత కలహాల నివారణ సహా పలు ముఖ్య ఆపరేషన్లలో పాల్గొన్నారు. -
వీడెవడో మామూలోడు కాదు.. రిటైర్డ్ డీజీపీ ఇంటిని కూడా వదల్లేదు
సాక్షి, బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్ నెం.10(సీ)లోని ప్లజెంట్ వ్యాలీలో నివసించే రిటైర్డ్ డీజీపీ రాయ్ వినయ్ రంజన్(62) ఇంట్లో రూ.5 లక్షల నగదు చోరీకి గురైంది. ఈ మేరకు ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో పనిచేస్తున్న సీపీఎల్ హెడ్ కానిస్టేబుల్ ప్రభుదాస్, పనిమనిషి కుమారిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. తన బెడ్రూమ్లో బ్రీఫ్కేస్లో రూ.2 వేల నోట్లు, రూ.500 నోట్లతో రూ.5 లక్షల నగదు పెట్టడం జరిగిందని, ఈ నెల 4వ తేదీన ఈ చోరీ జరిగిందని ఆయన తెలిపారు. తన ఇంట్లో పనిచేస్తున్న వారిపైనే అనుమానాలు ఉన్నాయని, వారు మాత్రమే ఈ డబ్బును దొంగిలించే అవకాశం ఉందని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. దర్యాప్తు బృందం మాజీ డీజీపీ ఇంట్లో తనిఖీలు చేసి పలు ఆధారాలు సేకరించారు. అనుమానితులను విచారిస్తున్నారు. కిటికీ గ్రిల్స్ తొలగించి భారీ చోరీ జవహర్నగర్: ఇంట్లో నిద్రిస్తుండగానే గుర్తుతెలి యని దుండగులు కిటికీ గ్రిల్స్ తొలగించి అల్మారా లోని బంగారం, నగదు అపహరించుకుపోయారు. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని వంపుగూడ బ్యాంక్కాలనీలో చోటు చేసుకుంది. సీఐ భిక్షపతిరావు వివరాల ప్రకారం.. కోనేరు సుధారాణి 15 సంవత్సరాలుగా బ్యాంక్కాలనీలో నివసిస్తోంది. ఆమె కూతురు అదే కాలనీలో వెనుక వీధి లో నివాసముంటున్నారు. గతనెల 15న ముత్తూట్ ఫైనాన్స్ నుంచి తాకట్టులో ఉన్న బంగారం విడిపించి బెడ్రూంలోని అల్మారాలో దాచిపెట్టింది. ఈనెల 5వ తేదీన అదే కాలనీలో బంధువుల దశదినకర్మ ఉండటంతో వెళ్లి రాత్రి వచ్చి బీపీ, షుగర్ మందులు వేసుకుని హాల్లో నిద్రలోకి జారుకుంది. మంగళవారం ఉదయం బెడ్రూమ్లోకి వెళ్లి చూడగా 23 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.1.88 లక్షల నగదు కనిపించలేదు. ఫిర్యాదు మేర కు ఘటనా స్థలానికి చేరుకున్న జవహర్నగర్ పోలీ సులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రిటైర్డు డీజీపీ మెయిల్ నుంచి మెసేజ్ రావడంతో..
బనశంకరి(కర్ణాటక): సైబర్ నేరగాళ్లు ఐటీ సిటీలో చెలరేగిపోతున్నారు. పోలీస్ పెద్దలను కూడా విడిచిపెట్టడం లేదు. విశ్రాంత డీజీపీ శంకరబిదిరి ఈమెయిల్ను హ్యాక్ చేసి డబ్బు పంపాలని స్నేహితులకు మెసేజ్ పంపి డబ్బులు కొల్లగొట్టిన నాగాల్యాండ్ కు చెందిన ముగ్గురిని బుధవారం సీఇఎన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 4 మొబైల్స్, 13 పాన్ కార్డులు, 6 ఆధార్ కార్డులు, 2 ఏటీఎం కార్డులు సుమారు 20 కి పైగా బ్యాంకుల్లో ఉన్న రూ. 2 లక్షల నగదు ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దియా, సరోపా, ఇస్పర్ కోన్సాక్. ఇటీవల బిదరి ఈమెయిల్ను హ్యాక్ చేసి ఆయన స్నేహితులకు డబ్బు పంపాలని మెయిల్ పంపారు. బిదరినే పంపారేమోనని ఒకరు రూ.25 వేలు ఖాతాలో వేశారు. తరువాత నిజం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగేళ్ల క్రితం నాగాల్యాండ్ నుంచి బెంగళూరుకు వచ్చిన నిందితులు బ్యూటీపార్లర్, మాల్స్లో పనిచేసేవారు. నాగాల్యాండ్ కు చెందిన నిరుద్యోగ యువకులకు డబ్బు ఆశ చూపించి వారి పాన్, ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలను తీసుకుని నగదును ఆ ఖాతాల్లోకి వేయించేవారు. చదవండి: చంపి అయినా ‘పరువు’ కాపాడుకోవాలనుకుని.. బిర్యానీ ప్యాకెట్లలో బంగారు ముక్కు పుడకలు -
నయీమ్ కేసును లైట్ తీసుకోండి!
-
నయీమ్ కేసును లైట్ తీసుకోండి!
సెటిల్మెంట్ కోసం రంగంలోకి ఓ రిటైర్డ్ డీజీపీ ► విచారణ ఎదుర్కొంటున్న వారంతా ఆయన శిష్యులే ► వారం క్రితం సీఎం కార్యాలయానికి వెళ్లిన వైనం ► సాదాసీదా చర్యలు తీసుకోవాలంటూ ఒత్తిడి ► ఈ ఒత్తిళ్లను పట్టించుకోని పోలీసు శాఖ ► నయీమ్ డైరీలో 22 పేజీలు మాయంపై సందేహాలు! సాక్షి, హైదరాబాద్ ఆయనో సీనియర్ ఐపీఎస్.. కేంద్ర సర్వీసుల్లో కీలక విభాగాలకు అధిపతిగా పనిచేసిన రాష్ట్ర కేడర్ అధికారి. ఇటీవలే పదవీ విరమణ సైతం పొందారు. ఉమ్మడి రాష్ట్రంలో కీలకమైన విభాగాలకు చీఫ్గా పనిచేశారు. ఆ సమయంలోనే నయీమ్, నయీమ్తో అంటకాగిన ఖాకీలతో సంబంధాలు అల్లుకున్నాయి. పదమూడేళ్ల కింద కేంద్ర సర్వీసుకు వెళ్లిపోయిన ఆయన తిరిగి ఇటువైపు కన్నెత్తి చూడలేదు కూడా. కానీ ఆ అధికారి, అదీ పదవీ విరమణ పొందిన తర్వాత నయీమ్ కేసును ప్రభావితం చేసేందుకు రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. ఆ రిటైర్డ్ డీజీపీ రాష్ట్రంలో పనిచేసిన సమయంలో తన శిష్యులుగా ముద్రపడ్డ ఆరుగురు అధికారులు నయీమ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. తమపై చర్యలు తప్పవని గ్రహించిన ఆ అధికారులు.. వెళ్లి రిటైర్డ్ డీజీపీ వద్ద మొరపెట్టుకున్నారు. తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చిన ఆయన.. వారం క్రితం నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లినట్లు సమాచారం. రాష్ట్రంలో కీలక అధికారిగా ఉంటూ, సీఎంకు నమ్మినబంటు అయిన ఓ సీనియర్ అధికారి వద్దకు నేరుగా వెళ్లి లాబీయింగ్కు ప్రయత్నించినట్లు తెలిసింది. నయీమ్ కేసులో తమ వారిపై ఏవో చిన్న చిన్న చర్యలు తీసుకోవాలని ఆయన ప్రతిపాదించగా.. సదరు సీనియర్ అధికారి మాత్రం దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చారని సమాచారం. సీఎం వద్ద తనకంత సీన్ లేదని, సిట్ నివేదిక పూర్తి ఆధారాలతో ఉందని ఆ అధికారి స్పష్టం చేసినట్లు తెలిసింది. అంతేకాదు తానేం చెప్పినా సరే.. ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు నివేదించినదానినే సీఎం ఆమోదిస్తారని పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఎలాగైనా ప్రయత్నం చేసి తమ వారిని రక్షించాలని సదరు రిటైర్డ్ డీజీపీ వేడుకున్నట్టు పోలీసు వర్గాలు అంటున్నాయి. సీఎంకే చెప్పండి! రిటైర్డ్ డీజీపీ ప్రతిపాదనను సంబంధిత సీనియర్ అధికారి పోలీసు ఉన్నతాధికారులకు వివరించారు. సస్పెన్షన్, విచారణ జరగకుండా చూడాలని కోరినట్లు తెలిసింది. అయితే ఉన్నతాధికారులు సైతం మొహమాటం లేకుండా సమాధానమిచ్చినట్లు సమాచారం. ‘మీరు ఏదైనా చెప్పాలని అనుకుంటే నేరుగా ముఖ్యమంత్రికి చెప్పండి. అంతేగానీ మా వద్ద ఇలాంటి పైరవీలు చేయొద్దు..’అని సూటిగా స్పష్టం చేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దీంతో చేసేదేమీ లేక ఇటు సీఎంఓ అధికారి, అటు రిటైర్డ్ డీజీపీ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. నయీమ్ డైరీలో ఆ పేజీలెక్కడ..? తాను చేసిన ప్రతి పని, సెటిల్మెంట్లు, దందాలు, అందించిన నజరానాలు.. ఇలా ప్రతీ అంశాన్ని నయీమ్ తన డైరీలో రాసిపెట్టాడు. నయీమ్ ఎన్కౌంటర్ జరిగిన వెంటనే అల్కాపురికాలనీలోని అతడి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించి.. డాక్యుమెంట్లు, ఆయుధాలు, నగదు, బంగారం వంటి వాటితో పాటు పలు డైరీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ డైరీల్లో దాదాపు 22 పేజీలు మాయమవడంపై సందేహాలు తలెత్తుతున్నాయి. సోదాలు చేసిన సమయంలోనే పోలీసు అధికారులు ఆ పేజీలను చించేశారా? నయీమే ఆ పేజీలను చింపేసి ఉంటాడా అన్న విషయంలో స్పష్టత లేదు. అయితే నయీమ్ భార్య, సోదరి ఇచ్చిన వాంగ్మూలాల మేరకు.. నయీమ్ తన డైరీల్లో ప్రతీ విషయం రాసుకునే వాడని, ఏ ఒక్క పేజీ కూడా చింపేవాడు కాదని చెప్పినట్టు తెలిసింది. నయీమ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొని సాధారణ పనిష్మెంట్లకు గురైన ఓ సీనియర్ అధికారి నేతృత్వంలోని బృందమే మొదటగా నయీమ్ ఇంట్లో సోదాలు నిర్వహించి డైరీలు, డాక్యుమెంట్లు, ఆయుధాలు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. ఆ అధికారి నేతృత్వంలోని బృందమే డైరీల్లోని పేజీలు చించేసి ఉంటుందన్న కోణంలో సిట్ విచారణ సాగిస్తోంది. నయీమ్ ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీ కూడా డిలీట్ కావడం దీనికి ఆధారంగా భావిస్తోంది. సంబంధిత అధికారి, సిబ్బందిని మళ్లీ విచారిస్తే అసలు విషయాలన్నీ బయటకు వస్తాయని సిట్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఆ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై క్రిమినల్ కేసులు! ఇక నయీమ్ కేసును మూసేస్తారన్న భావన నెలకొన్న తరుణంలో ఒక్కసారిగా సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై పూర్తి ఆధారాలతో డీజీపీకి నివేదిక అందించగా.. పోలీసు శాఖ చర్యలు కూడా చేపట్టింది. మరి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంగతేమిటని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పుడు తదుపరి టార్గెట్ రాజకీయ నాయకులే అని సిట్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇప్పటికే ఒక ఎమ్మెల్యేను ప్రశ్నించామని.. మరో ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్సీలను ప్రశ్నించాల్సి ఉందని చెప్పారు. ఈ నలుగురితోపాటు నియోజకవర్గ ఇన్చార్జులుగా ఉన్న మరో ఇద్దరు నేతలు కూడా నయీమ్తో చేసిన దందాలపై ప్రభుత్వానికి పూర్తి నివేదిక పంపించామని వెల్లడించారు. ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇస్తే వారందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ చేపడతామని, చార్జిషీట్లో వారి పేర్లు చేర్చాల్సి ఉంటుందని.. దీనిపై వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు.