
సాక్షి, అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 3 నుంచి 9వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలుంటాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజాబాబు ప్రకటించారు. హాల్టికెట్లను https://psc.ap.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
సొంతంగా సహాయకులను ఎంపిక చేసుకున్న దివ్యాంగులు స్క్రైబ్ వివరాలు, సర్టీఫికెట్లను పరీక్షలు ప్రారంభానికి 5 రోజుల ముందే ఈమెయిల్ ద్వారా తెలియజేయాలని చెప్పారు.