42 ఏపీపీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టండి | Take steps to fill 42 APP posts | Sakshi
Sakshi News home page

42 ఏపీపీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టండి

Published Thu, Mar 20 2025 5:08 AM | Last Updated on Thu, Mar 20 2025 5:08 AM

Take steps to fill 42 APP posts

ఏపీపీఎస్‌సీ ద్వారా నోటిఫికేషన్‌ జారీ చేయండి

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

కోర్టు ముందు హాజరైన సీఎస్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కింది కోర్టుల్లో ఖాళీగా ఉన్న 42 అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు (ఏపీపీ) పోస్టుల భర్తీకి చర్యలు ప్రారంభించాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోస్టుల భర్తీకి ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా నోటిఫికేషన్‌ జారీ చేయాలని స్పష్టంచేసింది. ఈ ప్రక్రియను రెండు నెలల్లో మొదలు పెట్టాలని తేల్చి చెప్పింది. ఏపీపీ పోస్టులను పెంచినట్లే, మిగిలిన కేడర్‌ పోస్టుల సంఖ్యను కూడా పెంచాల­ని, దీనిపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవా­ల­ని ఆదేశించింది. 

తదుపరి విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయ­మూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ఠాకూర్, న్యాయ­మూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కింది కోర్టుల్లో పీపీలు, ఏపీపీలు, అసిస్టెంట్‌ సీనియర్‌ పీపీల పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల పెండింగ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోందని, అందువల్ల పీపీల నియామకానికి చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల­ని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్‌ పిల్‌ దాఖలు చేశారు. 

ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన సీజే ధర్మాసనం... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ వ్యక్తిగత హాజరుకు ఆదే­శాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు విజ­యా­నంద్‌ బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోస్టుల భర్తీకి తీసుకుంటున్న చర్యల గురించి విజయానంద్‌ను ధర్మాసనం ప్రశ్నించింది.  

ప్రస్తుతం ఏపీపీల కేడర్‌ స్ట్రెంత్‌ 204గా ఉందని, దీనిని 209కి పెంచనున్నామని విజయానంద్‌ చెప్పారు. 42 ఖాళీలను డైరెక్టుగా భర్తీ చేస్తామని, ఇందుకు సంబంధించి ప్రక్రియను రెండు నెలల్లో ప్రారంభిస్తామని తెలి­పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
 
Advertisement