breaking news
Andhra Pradesh High Court
-
‘చీమకుర్తి’ ప్రభుత్వ భూముల్లో గ్రానైట్ అక్రమ తవ్వకాలు
చీమకుర్తి: ప్రకాశం జిల్లా చీమకుర్తి రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో గ్రానైట్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని హైకోర్టులో రిట్పిటిషన్ దాఖలైంది. అద్దంకికి చెందిన పులిపాటి హేబేలు ఈ నెల 17న న్యాయవాది జడ శ్రావణ్కుమార్ ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేశారు. సర్వే నంబర్లు 958 నుంచి 1058 వరకు ఉన్న 258.67 ఎకరాల ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు పిటిషన్లో తెలిపారు. మణికంఠ గ్రానైట్స్, కృష్ణసాయి గ్రానైట్స్, వాసవీ గ్రానైట్స్ యజమానులు అక్రమంగా అనుమతులు తెచ్చుకుని తవ్వకాలు సాగిస్తున్నారని పేర్కొన్నారు. వీరితోపాటు హంస, జయ మినరల్స్, ఎన్.వి.ఎక్స్పోర్ట్స్ తదితర క్వారీల యజమానులు ఆర్.ఎల్.పురం, బూదవాడ గ్రామ రెవెన్యూ పరిధిలో మరో 150 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపించారు. అధికారుల్ని ప్రలోభపెట్టి పేదలకు డి–పట్టాగా ఇచి్చన భూముల్ని ఆ«దీనంలోకి తీసుకుని ఈ అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. -
ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు నిప్పులు
-
13 ఏళ్లయినా మహిళ ఆచూకీ తెలుసుకోలేకపోయారా?
సాక్షి, అమరావతి: ఓ వివాహిత 13 ఏళ్ల క్రితం అదృశ్యమైతే ఆమె ఆచూకీని పోలీసులు ఇప్పటికీ తెలుసుకోలేకపోయారా.. అని హైకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. తమ కుమార్తె బతికుందో.. లేదో.. కూడా తెలియకుంటే ఆ తల్లిదండ్రుల వేదన ఎలా ఉంటుందో మీకు తెలుసా? అంటూ పోలీసులను ప్రశ్నించింది. తల్లిదండ్రుల వేదనను మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. తన కుమార్తె అదృశ్యం విషయంలో కొందరిపై అనుమానం వ్యక్తం చేస్తూ తండ్రి ఫిర్యాదు చేస్తే, వారిని సకాలంలో విచారించకపోవడంపై హైకోర్టు మండిపడింది. దర్యాప్తు ఎలా చేయాలో, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా తెలియదా? అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వ్యక్తుల అదృశ్యం కేసుల్లో ప్రతి నిమిషమూ కీలకమని స్పష్టంచేసింది. ఘటన జరిగిన మొదట్లోనే ఫిర్యాదు చేస్తే తీరిగ్గా ఆ తర్వాత ఎప్పుడో అనుమానితులను విచారిస్తే ప్రయోజనం ఏముంటుందని పోలీసులను ప్రశ్నించింది. దర్యాప్తు సాగిన తీరు విషయంలో తామెంత మాత్రం సంతృప్తికరంగా లేమంది. తాజాగా పురోగతికి సంబంధించిన వివరాలతో స్థాయీ నివేదికను తమ ముందుంచాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ, కొవ్వూరు డీఎస్పీ, తాడేపల్లిగూడెం ఎస్హెచ్వోలను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.దర్యాప్తు పక్కన పడేసిన పోలీసులు..పశ్చిమ గోదారి జిల్లా జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం గ్రామానికి చెందిన బండారు ప్రకాశరావు తన కుమార్తె మంగాదేవిని దండగర్ర గ్రామానికి చెందిన మోహన బ్రహ్మాజీ అనే వ్యక్తికిచ్చి వివాహం చేశారు. 2012 అక్టోబర్ 18న ప్రకాశరావుకు ఆయన అల్లుడు బ్రహ్మాజీ ఫోన్ చేసి మంగాదేవి కనిపించడం లేదని చెప్పారు. ప్రకాశరావు అదే రోజున తాడేపల్లిగూడెం పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తును మాత్రం పక్కన పడేశారు. దీంతో ప్రకాశరావు 2017లో హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి హైకోర్టు ఈ వ్యాజ్యంపై పలుమార్లు విచారణ జరిపింది. తాజాగా శుక్రవారం ఈ వ్యాజ్యం న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ముందు విచారణకు వచ్చింది. జిల్లా ఎస్పీ తదితరులు కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కేసులో పోలీసులు సాగించిన దర్యాప్తు తీరుపై న్యాయమూర్తి అసహనం వ్యక్తంచేశారు. అనుమానితుల్లో ఉన్న అదృశ్యమైన మహిళ భర్తను ఫిర్యాదు ఇచ్చిన ఐదేళ్ల తర్వాత విచారించడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. రైల్వేస్టేషన్లలో, మీ–సేవా కేంద్రాల్లో వెతికామంటూ రంగురంగుల ఫొటోలు వేస్తే ఏం ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించారు. దర్యాప్తు సక్రమంగా సాగినప్పుడు ఫలితం ఉంటుందని తెలిపారు. ఈ కేసులో తాజా పురోగతితో స్థాయీ నివేదికను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. -
ఏళ్ల తరబడి కౌంటర్ దాఖలు చేయరా?
సాక్షి, అమరావతి: సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ 2017లో పిటిషన్ దాఖలైతే.. ఏళ్లు తరబడిగా పోలీసులు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. ఏమిటీ నిర్లక్ష్యమంటూ మండిపడింది. కోర్టులన్నా, కోర్టు ఆదేశాలన్నా పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారంటూ పోలీసులను నిలదీసింది. తీరిగ్గా మీకు కావాల్సినప్పుడు కౌంటర్ దాఖలు చేస్తామంటే చూస్తూ ఊరుకోమంటారా? అని నిలదీసింది. ఇలాగే వదిలిస్తే.. పదేళ్ల తరువాత కూడా కౌంటర్ దాఖలు చేసినా ఏమీ కాదనే ధోరణితో అధికారులు ఉంటారని, దీనివల్ల కోర్టులపై ప్రజలకు నమ్మకంపోతుందని వ్యాఖ్యానించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి పరిస్థితిని రానివ్వబోమని స్పష్టం చేసింది. ఎనిమిదేళ్లుగా కౌంటర్ దాఖలు చేయకుండా చోద్యం చూసిన పోలీసులు ఇప్పుడు అందుకు అనుమతి కోరడాన్ని తప్పుబట్టింది. ఈ అసాధారణ జాప్యానికి రూ.10 వేలు ఖర్చుల కింద చెల్లించాలని, అప్పుడు మాత్రమే కౌంటర్ దాఖలుకు అనుమతినిస్తామని అనంతపురం జిల్లా ధర్మవరం వన్టౌన్ ఇన్స్పెక్టర్ పి.నాగేంద్ర ప్రసాద్కు స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని హైకోర్టు న్యాయవాదుల క్లర్కుల సంఘానికి చెల్లించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. కోర్టుకు సరైన వివరాలు వెల్లడించనందుకు సుమోటోగా చేపట్టిన కోర్టు ధిక్కార వ్యాజ్యంలో నాగేంద్ర ప్రసాద్కు నోటీసులు జారీ చేస్తూ దీనిపై విచారణను కూడా అదే రోజుకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు... కొందరు వ్యక్తులతో తమకున్న సివిల్ వివాదాలపై పోలీసులు జోక్యం చేసుకోవడంపై అనంతపురం జిల్లా ధర్మవరం వాసి ఏ.రాజశేఖర్ 2017లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించినా ఇప్పటివరకు దాఖలు చేయలేదు. గత వారం ఈ వ్యాజ్యం విచారణకు వచ్చిన సమయంలో ధర్మవరం వన్టౌన్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర ప్రసాద్ స్వయంగా కోర్టు ముందు హాజరయ్యారు. లక్ష్మీదేవమ్మ అనే మహిళ ఫిర్యాదు మేరకు పిటిషనర్ రాజశేఖర్పై కేసు నమోదు చేశామని 2017లో పేర్కొన్న పోలీసులు ఇటీవల అందుకు విరుద్ధంగా చెప్పారు. అసలు ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పడంపై న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ తీవ్రంగా స్పందించారు. ఇలా పరస్పర విరుద్ధ వివరాలను కోర్టు ముందుంచినందుకు నాగేంద్ర ప్రసాద్పై న్యాయమూర్తి సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు చేపట్టారు. పోలీసులకు స్పష్టమైన సందేశం ఇవ్వదలిచాంతాజాగా ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా పోలీసుల తీరుపై న్యాయమూర్తి మండిపడ్డారు. ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యం ప్రతి దశలోనూ కనిపిస్తోందన్నారు. ఇటీవల కాలంలో కోర్టుల పట్ల పోలీసులు అత్యంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. అందువల్లే పోలీసుల విషయంలో తాము కఠినంగా వ్యవహరిస్తున్నామని, తద్వారా వారికి స్పష్టమైన సందేశం పంపదలిచామన్నారు. కోర్టు ఒకసారి నోటీసులు జారీ చేసిన తరువాత పోలీసులు కౌంటర్ దాఖలు చేసి తీరాల్సిందేనని, ఇందులో ఎలాంటి మినహాయింపు లేదని స్పష్టం చేశారు. రిట్ రూల్స్ ప్రకారం 180 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలన్నారు. -
కదల్లేని విధంగా కొడతారా?
ఇటీవల మంగళగిరి సీఐ.. హైకోర్టు డ్రైవర్ను కొట్టారు. దీనిపై డ్రైవర్ ఫిర్యాదు చేసినా కూడా కేసు నమోదు చేయలేదు. మేం జోక్యం చేసుకుని ఎస్పీని పిలిస్తే అప్పుడు మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే కొట్టిన సీఐని నిందితుడిగా చేర్చలేదు. మా జోక్యం తర్వాతే సీఐని నిందితుడిగా చేర్చారు. ఫిర్యాదుదారుడిని నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలకు కూడా పంపలేదు. ఆ తర్వాత దర్యాప్తును పక్కన పడేశారు. డీజీపీని పిలిపిస్తే, ఆ తర్వాత సీఐని వీఆర్కు పంపారు. పోలీసులు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? – పోలీసులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగింది. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటామంటే కుదరదని హెచ్చరించింది. పౌరులను పోలీసుస్టేషన్కు పిలిపించడం.. అక్రమంగా నిర్బంధించడం.. చితకబాదడం పరిపాటిగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుత కేసులో పోలీసులు పిటిషనర్ను కొడితే ఎనిమిదేళ్లుగా ఇప్పటికీ ఆయన కదల్లేని పరిస్థితుల్లో ఉన్నారని, ఇది దారుణమని హైకోర్టు మండిపడింది. అసలు నిర్బంధించడం... కొట్టడం.. ఏమిటంటూ నిలదీసింది. పిటిషనర్ను కోర్టుకు పిలిపించి స్వయంగా వాస్తవాలు తెలుసుకోవాలని భావించినా ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నందున ఆ దిశగా ఆదేశాలు ఇవ్వలేకపోతున్నామని పేర్కొంది. నిర్బంధించి ఇలా కొట్టడం పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించడమేనని, పిటిషనర్ చేసింది ఎలాంటి నేరమైనా ఎనిమిదేళ్లుగా కదల్లేని విధంగా కొడతారా? చట్టాన్ని అనుసరించరా? అంటూ పోలీసుల తీరుపై కన్నెర్ర చేసింది. తనను చిత్రహింసలకు గురి చేశారంటూ పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కర్నూలు సీసీఎస్ పోలీసులపై నమోదు చేసిన కేసును తప్పుడు కేసు అంటూ మూసివేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. కేసును మూసివేయాలంటూ సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేయకపోవడాన్ని ఆక్షేపించింది. కోర్టు అనుమతి లేకుండా కేసును ఎలా మూసివేస్తారని నిలదీసింది. కేసును మూసివేసిన సంగతి కనీసం ఫిర్యాదుదారుడైన పిటిషనర్కు కూడా చెప్పకపోవడం ఏమిటంటూ మండిపడింది. ఇలా చేయడం ద్వారా పిటిషనర్ హక్కులను హరించారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును మూసివేస్తున్నట్లు చట్ట ప్రకారం కోర్టు ముందు తుది నివేదిక దాఖలు చేసి ఉంటే ఫిర్యాదుదారుడికి నోటీసు అందేనని, తద్వారా కేసు మూసివేతపై నిరసన పిటిషన్ దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉండేదని పేర్కొంది. ఫిర్యాదుదారుడికి పోలీసులు అలాంటి అవకాశం లేకుండా చేశారని, ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందంది. పోలీసుల తీరు ఆమోదయోగ్యం కాదని, ఇటీవల కాలంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం వారికి అలవాటుగా మారిపోయిందని వ్యాఖ్యానించింది. ‘‘ఇటీవల మంగళగిరి సీఐ హైకోర్టు డ్రైవర్ను కొట్టారు. దీనిపై డ్రైవర్ ఫిర్యాదు చేసినా కూడా కేసు నమోదు చేయలేదు. మేం జోక్యం చేసుకుని ఎస్పీని పిలిస్తే అప్పుడు మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే కొట్టిన సీఐని నిందితుడిగా చేర్చలేదు. మా జోక్యం తరువాతే కొట్టిన సీఐని నిందితుడిగా చేర్చారు. ఫిర్యాదుదారుడిని నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలకు కూడా పంపలేదు. ఆ తరువాత దర్యాప్తును పక్కన పడేశారు. డీజీపీని పిలిపిస్తే.. ఆ తరువాత సదరు సీఐని వీఆర్కు పంపారు. పోలీసులు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా?’’ అంటూ హైకోర్టు నిలదీసింది.కేసు మూసివేత విషయంలో కోర్టులో దాఖలు చేసిన తుది నివేదికను పిటిషనర్కివ్వాలని పోలీసులను ఆదేశించింది. ఎనిమిదేళ్లుగా కేసును కోల్డ్ స్టోరేజ్లో పెట్టారని, తదుపరి విచారణలో ఈ వ్యవహారానికి ముగింపు పలుకుతామంది. అసాధారణ జాప్యాన్ని తాము విస్మరించలేమని పేర్కొంటూ తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ పి.రామకృష్ణ స్వయంగా కోర్టుకు హాజరు కాగా తదుపరి విచారణకు మాత్రం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.తప్పుడు కేసుగా మూసివేసిన పోలీసులుకర్నూలు సెంట్రల్ క్రైం స్టేషన్ (సీసీఎస్) ఎస్హెచ్వో తనను అక్రమంగా నిర్బంధించి, అకారణంగా కస్టడీలో వేధిస్తున్నారని, దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయడం లేదంటూ కర్నూలు జిల్లా చిప్పగిరికి చెందిన గొల్లా జయపాల్ యాదవ్ 2016లో హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ ఇటీవల తుది విచారణ చేపట్టారు. పిటిషనర్ ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్ పోలీసులపై నమోదు చేసిన కేసు రికార్డులన్నింటినీ పరిశీలించారు. కర్నూలు టూ టౌన్ ఎస్ఐ ఇచ్చిన నివేదికను ఆమోదిస్తూ డీఎస్పీ 2018లో ప్రొసీడింగ్స్ ఇచ్చిన విషయాన్ని న్యాయమూర్తి గుర్తించారు. దేని ఆధారంగా ఆ ఫిర్యాదును తప్పుడు ఫిర్యాదుగా తేల్చారో అందుకు ఆధారాలేవీ రికార్డుల్లో లేని విషయాన్ని న్యాయమూర్తి గమనించారు. తప్పుడు ఫిర్యాదు అన్న విషయాన్ని సంబంధిత మేజి్రస్టేట్కు తెలియ చేశారా? లేదా? అనే విషయం రికార్డుల్లో స్పష్టంగా లేదు. ఇప్పటికీ నడవలేకపోతున్నారుపిటిషనర్ జయపాల్ యాదవ్ తరఫున సీనియర్ న్యాయవాది వి.రఘునాథ్ వాదనలు వినిపించారు. పోలీసులు పిటిషనర్ను తీవ్రంగా కొట్టారని, దీంతో అప్పటి నుంచి కదల్లేని పరిస్థితుల్లో ఉన్నారని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలను కోర్టుకు సమర్పించారు. వీటిని పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వ్యక్తిని ఇలా కూడా కొడతారా? అంటూ విస్మయం వ్యక్తం చేశారు. గత విచారణ సమయంలో కోర్టు తీవ్రంగా స్పందించిన తరువాతే పోలీసులు సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేశారని రఘునాథ్ నివేదించారు. ఈ సమయంలో పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది అడుసుమల్లి జయంతి స్పందిస్తూ తుది నివేదికకు సంబంధించి పిటిషనర్కు నోటీసు ఇచ్చామని తెలిపారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ నోటీసు ఒక్కటే ఇస్తే ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. కోర్టులో దాఖలు చేసిన తుది నివేదిక కాపీని కూడా పిటిషనర్కు ఇవ్వాలని, అప్పుడు దానిపై తగిన విధంగా స్పందించేందుకు అతడికి అవకాశం ఉంటుందని పేర్కొంటూ విచారణను ఈ నెల 24కి వాయిదా వేశారు. -
టీటీడీ అధికారులపై హైకోర్టు అసహనం!
సాక్షి, విజయవాడ: తిరుమల పరకామణి చోరీ కేసుపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. సీజ్ చేసిన ఫైళ్లు, ప్రాథమిక దర్యాప్తు నివేదికను ఉన్నత న్యాయస్థానానికి సీఐడీ సమర్పించింది. ఈ ఘటనపై కౌంటర్ దాఖలు చేయకపోవడంపై టీటీడీ ఈవోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 27న ఈవో న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆదేశించింది. -
రూ.360 కోట్ల భూమిని రూ.45 కోట్లకే ఎలా ఇస్తారు?
సాక్షి, అమరావతి: విశాఖపట్నం, మధురవాడలోని అత్యంత విలువైన 30 ఎకరాల ప్రభుత్వ భూమిని చట్ట విరుద్ధంగా నామమాత్రపు ధరకే రియల్ ఎస్టేట్ కంపెనీ సత్వా గ్రూపునకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. మార్కెట్లో ఎకరా రూ.12 కోట్లు ఉన్న భూమి కేవలం రూ.1.5 కోట్లకే కేటాయించారని, వీటిని రద్దు చేయాలని కోరుతూ జీవీఎంసీ కౌన్సిలర్ మేడపాటి వెంకటరెడ్డి ఈ పిల్ను దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సత్వా గ్రూపునకు రూ.360 కోట్ల విలువైన భూమిని రూ.45 కోట్లకే ఆ కంపెనీకి ఇచ్చేశారని తెలిపారు. ఆ భూమిలో రియల్ కంపెనీ ఆఫీసు కార్యాలయాలను నిర్మించి లీజుకిచ్చి సొమ్ము చేసుకుంటుందని పొన్నవోలు చెప్పారు. అనంతరం భూ కేటాయింపుల విధానాన్నే సవాలు చేస్తామని, అందుకు అనుగుణంగా ఈ వ్యాజ్యంలో సవరణలకు అనుమతివ్వాలని ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. -
ఏపీ మద్యం కేసు.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు
సాక్షి, ఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్లు తేలేవరకు.. ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్లు విచారించవద్దన్న ఏపీ హైకోర్టు తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బెయిల్ రద్దు, బెయిల్ పిటిషన్లను మెరిట్ ఆధారంగానే నిర్ణయించాలని స్పష్టం చేస్తూ.. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది. అక్రమ మద్యం కేసులోచెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తీర్పు సందర్భంగా.. ‘‘ఈ కేసుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ ఇమిడి ఉంది. బెయిల్ కేసులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఎదురు చూడాలనే ఆదేశం ఏమాత్రం సరికాదు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘించడమే. బెయిల్ రద్దు పిటిషన్లు గానీ, బెయిల్ పిటిషన్లు గానీ మెరిట్ ఆధారంగానే నిర్ణయించాలి’’ జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె.వి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఏ-38 నిందితుడిగా ఉన్నారు. తుడా (Tirupati Urban Development Authority) అధికార వాహనాలను ఉపయోగించి అక్రమ మద్యం డబ్బును తరలించారని, 2024 ఎన్నికల నిధుల కోసం అక్రమంగా ఆ డబ్బును వాడినట్లు సిట్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో.. ఈ ఏడాది జూన్ 18న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తానే తప్పూ చేయలేదని.. దేవుడు అంతా చూస్తున్నాడని.. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని పలుమార్లు ఆయన జైలు, కోర్టు బయట ఆవేదన వ్యక్తం చేయడం చూసిందే. మరోవైపు.. బెయిల్ కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటిదాకా ఫలించ లేదు. తాజాగా సుప్రీం కోర్టు జోక్యం నేపథ్యంలో ఆయనకు ఉపశమనం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: లిక్కర్ కేసులో మోహిత్రెడ్డికి బిగ్ రిలీఫ్ -
బాబు, పోలీసులపై కోర్టు సీరియస్
-
ఏపీ హైకోర్టుకు ముగ్గురు నూతన న్యాయమూర్తులు
సాక్షి, న్యూఢిల్లీ, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు నూతన న్యాయమూర్తులు బదిలీపై రానున్నారు. వేర్వేరు హైకోర్టుల్లో పనిచేస్తున్న ఈ ముగ్గురు న్యాయమూర్తులను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలన్న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్ హైకోర్టు నుంచి న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, అలహాబాద్ హైకోర్టు నుంచి న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేష్, కలకత్తా హైకోర్టు నుంచి న్యాయమూర్తి జస్టిస్ సుబేందు సమంత ఉన్నారు. వీరిలో జస్టిస్ రాయ్ నెంబర్ 2, జస్టిస్ రమేష్ నెంబర్ 6, జస్టిస్ సుబేందు 18వ స్థానంలో ఉంటారు. ఈ ముగ్గురూ తక్షణమే ఏపీ హైకోర్టులో బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. దీంతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కి చేరింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి చెందిన జస్టిస్ రాయ్, జస్టిస్ రమేష్ 2023లో బదిలీ అయ్యారు. అప్పటి నుంచి వీరు గుజరాత్, అలహాబాద్ హైకోర్టుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే, జస్టిస్ సుబేందు సమంత ప్రస్తుతం కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. ఈ ముగ్గురిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం ఆగస్టు 25న కేంద్రానికి సిఫారసు చేస్తూ తీర్మానం చేసిన విషయం తెలిసిందే.హైకోర్టుకి ముగ్గురు న్యాయాధికారులు..ఇదిలా ఉండగా.. న్యాయాధికారుల కోటా నుంచి ముగ్గురు న్యాయాధికారులు హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందనున్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం జిల్లా ప్రధాన జడ్జిగా ఉన్న గంధం సునీత, విశాఖపట్నం సేల్స్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ ఆలపాటి గిరిధర్, రాష్ట్ర జుడీషియల్ అకాడమీ డైరెక్టర్ చింతలపూడి పురుషోత్తం హైకోర్టు న్యాయమూర్తులు కానున్నారు. వీరి పేర్లను హైకోర్టు కొలీజియం ఇటీవల సిఫారసు చేసింది. కేంద్ర హోమ్ శాఖ నుంచి ఇంటెలిజెన్స్ నివేదిక వెళ్లగానే సుప్రీంకోర్టు కొలీజియం వీరి నియామకంపై నిర్ణయం తీసుకుంటుంది.న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ ప్రస్థానం ఇదీ..విజయనగరం జిల్లా, పార్వతీపురానికి చెందిన జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ 1964 మే 21న విశాఖపట్నంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తల్లి విజయలక్ష్మి, తండ్రి నరహరిరావు. ప్రాథమిక విద్యను పార్వతీపురంలోని ఆర్.సి.ఎం. పాఠశాలలో, ఉన్నత విద్యను విశాఖపట్నంలోని సెయింట్ అలోసియస్ ఉన్నత పాఠశాలలో అభ్యసించారు. విశాఖపట్నంలోని ఎం.వి.పి. లా కాలేజీలో న్యాయ విద్యను పూర్తి చేశారు. 1988 జూలైలో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 1988 నుంచి 2002 వరకు 14 ఏళ్ల పాటు పార్వతీపురం, విజయనగరంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ వారి కుటుంబంలో మూడో తరం న్యాయవాది. ఆయన తాత చీకటి పరశురాం నాయుడు ప్రసిద్ధ న్యాయవాది, రాజనీతిజు్ఞడు. 2002లో జిల్లా, సెషన్స్ జడ్జిగా ఎంపికైన జస్టిస్ రాయ్ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల విధులు నిర్వర్తించారు. అలాగే ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా 2015 జూలై 3 నుంచి 2018 డిసెంబర్ 31 వరకు సేవలందించారు. 2019 జనవరి 1న అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటయిన తరువాత తొలి రిజిస్ట్రార్ జనరల్గా పనిచేశారు. 2019 జూన్ 20న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2023లో గుజరాత్ హైకోర్టుకు బదిలీపై వెళ్లారు.న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేష్ ప్రస్థానం ఇదీ..చిత్తూరు జిల్లా, మదనపల్లె సమీపంలోని కమ్మపల్లికి చెందిన జస్టిస్ దొనడి రమేష్ 1965 జూన్ 27న జన్మించారు. ఆయన తల్లి అన్నపూర్ణమ్మ. తండ్రి డి.వి.నారాయణ నాయుడు. ఈయన పంచాయతీ రాజ్ శాఖలో ఇంజినీర్గా పదవీ విరమణ చేశారు. జస్టిస్ రమేష్ తిరుపతిలోనిశ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం 1987–90 కాలంలో వి.ఆర్. లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు. 1990లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు అయ్యారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, హైదరాబాద్లో న్యాయవాద వృత్తిని ఆరంభించారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్. నారాయణ వద్ద వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు. 2000 డిసెంబర్ నుంచి 2004 వరకు ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరించారు. 2007లో ఆంధ్రప్రదేశ్ సర్వ శిక్ష అభియాన్కు న్యాయవాదిగా ఉన్నారు. 2014లో ప్రత్యేక ప్రభుత్వ పక్ష న్యాయవాదిగా నియమితులై 2019 మే వరకు కొనసాగారు. 2020 జనవరి 13న హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2023 జూలై 24న అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు.న్యాయమూర్తి జస్టిస్ సుబేందు సమంత ప్రస్థానం ఇదీ.. పశ్చిమ బెంగాల్కు చెందిన జస్టిస్ సుబేందు సమంత 1971 నవంబర్ 25న జన్మించారు. హమిల్టోన్లో పాఠశాల విద్య, తమ్లుక్లో హైసూ్కల్ విద్య పూర్తి చేశారు. కలకత్తా విశ్వవిద్యాలయం హజ్రా క్యాంపస్లో లా డిగ్రీ పొందారు. తమ్లుక్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అనంతరం అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా ఎంపికయ్యారు. కలకత్తాలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయాధికారిగానూ వ్యవహరించారు. అండమాన్ నికోబార్లో జిల్లా సెషన్స్ జడ్జిగా పనిచేసిన జస్టిస్ సుబేందు.. కలకత్తా సిటీ సెషన్స్ కోర్టు చీఫ్ జడ్జిగానూ వ్యవహరించారు. 2022 మే 18న కలకత్తా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2025 ఏప్రిల్ 28న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. -
డీజీపీ నిద్రపోతున్నారా.. పోలీసు శాఖను మూసేయాలి!
సాక్షి, అమరావతి: కేసుల దర్యాప్తు, హైకోర్టులఉతర్వుల అమలు విషయంలో పోలీసుల పనితీరుపై తరచూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్న హైకోర్టు, ‘డీజీపీ నిద్రపోతున్నారా?’ అంటూ మరో సారి ఘాటుగా వ్యాఖ్యానించింది. ఒక కేసుకు సంబంధించి రికార్డులన్నింటినీ తక్షణమే సీజ్ చేయాలన్న తమ ఆదేశాలను సీఐడీ అమలు చేయకపోవడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. రికార్డులను సీజ్ చేయాలని తాము గత నెల 19న ఆదేశాలు ఇస్తే, ఇప్పటి వరకు వాటిని అమలు చేయకపోవడంపై మండిపడింది. రికార్డులను సీజ్ చేయాలని తాము సీఐడీ ఐజీని ఆదేశించామని, అయితే సీఐడీ ఐజీ పోస్టులేదంటూ ఈ నెల 6న అనుబంధ పిటిషన్ దాఖలు చేయడమేమిటని ఆక్షేపించింది.సెప్టెంబర్ 19న ఆదేశాలిస్తే, అక్టోబర్ 6వ వరకు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. డీజీపీ నిద్రపోతున్నారా? అంటూ మండిపడింది. తమ ఆదేశాలను అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఉండి ఉంటే ఐజీ లేకున్నా, మరో అధికారి చేత తమ ఆదేశాలను అమలు చేసి ఉండేవారని పేర్కొంది. గతంలో ఓ కేసులో ఇదే కోర్టు సీఐడీ ఐజీకి ఆదేశాలు ఇచ్చిందని, ఆ ఆదేశాలు అమలయ్యాయని గుర్తు చేసింది. అప్పుడు ఉన్న ఐజీ పోస్టు ఇప్పుడు ఎందుకు లేకుండా పోతుందని ప్రశ్నించింది. కోర్టు ఆదేశాల అమలు చేయనప్పుడు పోలీసు శాఖను మూసివేయాలని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలను అమలు విషయంలో పోలీసులు వారి బాధ్యతను పూర్తిగా విస్మరించారని అభిప్రాయపడింది. కోర్టు ఆదేశాల అమల్లో జాప్యం చేయడం ద్వారా ఉద్దేశపూర్వకంగా నిందితులకు సహకరించినట్లు ఉందని తెలిపింది. తమ ఆదేశాలను అమలు చేయకపోవడం వల్ల నిందితులు ఇప్పటికే రికార్డులను తారుమారు చేసే ఉంటారని వ్యాఖ్యానించింది.అయినా కూడా మీరు (పోలీసులు) చోద్యం చూస్తూనే ఉంటారంది. ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యం చాలా విషయాలను చెబుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. పోలీసు శాఖ మొత్తం నిస్సారంగా, నిరుపయోగంగా మారిపోయిందని తెలిపింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పరకామణి నుంచి రూ. 72,000 విలువైన 900 అమెరికన్ డాలర్లను దొంగిలించిన ఘటనకు సంబంధించి తిరుమల వన్టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసులో తాము కేవలం రికార్డుల సీజ్కు మాత్రమే ఆదేశాలిచ్చామని, దర్యాప్తునకు ఇవ్వలేదని గుర్తు చేసింది. అలాంటప్పుడు రికార్డులను సీజ్ చేయాలన్న ఆదేశాలను సీఐడీలో ఏ అధికారి అయినా అమలు చేసి ఉండొచ్చునంది. ఈ నిర్లక్ష్యానికి డీజీపీనే నిందించాల్సి ఉంటుందని తెలిపింది.ఈ మొత్తం వ్యవహారంలో తాము పోలీసుల తీరుపై చాలా అసంతృప్తిగా ఉన్నామంది. గతంలో తాము ఆదేశించిన విధంగా రికార్డులను సీజ్ చేయాలని, అలాగే ఈ విషయంలో టీటీడీ బోర్డు తీర్మానాలకు సంబంధించిన రికార్డులను కూడా జప్తు చేయాలని సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ని ఆదేశించింది. వీటన్నిటినీ సీల్డ్ కవర్లో ఉంచి హైకోర్టు రిజి్రస్టార్ (జ్యుడిషియల్) ద్వారా తమ ముందు ఉంచాలని డీజీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఏపీ పోలీసులపై మరోసారి హైకోర్టు సీరియస్
సాక్షి,విజయవాడ: పోలీసులపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరకామణిలో చోరీ కేసుకు సంబంధించి రికార్డులు సీజ్ చేయాలని ఇచ్చిన ఆదేశాలను సీఐడీ అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పోలీసులపై హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. పోలీసు శాఖను మూసేయాలి. డీజీపీ నిద్రపోతున్నారా?. కోర్టు ఆదేశాన్ని అమలు చేయడం తెలీదా అంటూ ధ్వజమెత్తింది. పరకామణి వ్యవహారంలో నిందితులకు సహకరిస్తున్నారని మండిపడింది.ఇప్పటికే నిందితులు సాక్షాలను తారుమారు చేసే ఉంటారు. అయినా మీరు చోద్యం చేస్తున్నారంటూ హైకోర్టు విమర్శలు గుప్పించింది. ఈ కేసులో మీ నిర్లక్ష్యం చాలా విషయాలు చెబుతోంది. మీకు నిజాయితీ ఉండి ఉంటే వెంటనే కోర్టుకు వచ్చేవాళ్లు.సీఐడీలో ఐజీ ర్యాంకు అధికారి లేకుంటే.. మరో అధికారితో పనిచేయించుకోవచ్చుగా? మేము కేవలం రికార్డులను సీజ్ మాత్రమే కదా ఆదేశించింది. ఆ ఆదేశాలను అమలు చేసే వారెవరు సీఐడీలో లేరా?.ఈ నిర్లక్ష్యానికి డీజీపీనే మేం నిందించాలి. పోలీసుల తీరుపై అసంతృప్తిగా ఉన్నామంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
సీఐ తీరుపై హైకోర్టు సీరియస్
-
జగన్ దెబ్బకు టీడీపీ మైండ్ బ్లాక్
‘‘ఆధునిక దేవాలయాలను అమ్మేస్తున్నారు..’’ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలన్న కూటమి సర్కారు నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్య. ‘‘వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో నిర్మిస్తే తప్పేంటి? నిధుల కొరత ఉండవచ్చు.. వనరుల లేమితో కోర్టు భవన నిర్మాణాలే ఆగిపోయాయి’’ - ఏపీ హైకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయం. తెలుగుదేశం మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు సహజంగానే హైకోర్టు వ్యాఖ్యలను పతాక శీర్షికలుగా చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నర్సీపట్నం వద్ద ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించడానికి వెళుతున్న రోజే ఎల్లో మీడియాలో ఈ కథనం వచ్చింది. జగన్ పర్యటనకు వచ్చిన స్పందన చూసిన తర్వాత జనాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడం కష్టం కాదు. ఆంక్షలతో అడ్డుకోవడానికి ఎన్ని కుయుక్తులు పన్ననా, జనం మాత్రం తరలి సంద్రంలా తరలి వచ్చారు. వర్షం జోరున కురుస్తున్నా ప్రజలు జగన్తో సమస్యలు విన్నవించడానికి తండోపతండాలుగా వచ్చారు. అరవై కిలో మీటర్ల దూరం ప్రయాణించడానికి ఆరు గంటలు పట్టిందంటేనే జన ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ జనాన్ని చూసి కూటమి పార్టీల నేతలకు మతిపోయి ఉండాలి. ప్రజలు ప్రైవేటీకరణపై ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థమై ఉండాలి. కొద్దిరోజుల క్రితం శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఒక సమావేశంలో మాట్లాడుతూ అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎక్కడ? అని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన జీవో ఎక్కడ అని అడిగారు. తన ప్రాంతంలో మెడికల్ కాలేజీ భవనాల నిర్మాణం జరుగుతున్నట్లు తెలిసి కూడా అయ్యన్న ఆ వ్యాఖ్య చేయడాన్ని వైసీపీ సవాల్ గా తీసుకుంది. జగన్ గతంలో చెప్పిన విధంగా తన హయాంలో చేపట్టిన మెడికల్ కాలేజీల సందర్శనకు ఇది ఒక అవకాశంగా మారింది. తదుపరి ఆయన నర్సీపట్నం టూర్ పెట్టుకున్నారు. ఆ సందర్భంగానే జగన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్రానికి 17 వైద్య కళాశాలలు ఎలా తీసుకొచ్చింది వివరించారు. భవన నిర్మాణాలకు తీసుకున్న చర్యలతోపాటు జారీ చేసిన జీవోలను కూడా చూపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్య కళాశాలలను టీడీనే తెచ్చిందని అనంతపురంలో ప్రకటించి భంగపడితే జీవోలు ఎక్కడని అడిగి స్పీకర్ అయ్యన్నపాత్రుడు అభాసుపాలయ్యారని జనమిప్పుడు వ్యాఖ్యానిస్తున్నారు. గౌరవ న్యాయస్థానం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో నడిపే ప్రతిపాదనపై అభిప్రాయం వ్యక్తం చేయడాన్ని మనం తప్పు పట్టనక్కర్లేదు. అయితే ఆ మీడియాలోనే ఆ రోజు వచ్చిన వార్తలే న్యాయమూర్తుల సందేహాన్ని తీర్చే విధంగా ఉన్నాయన్న విశ్లేషణలు వచ్చాయి. అమరావతిలో రూ.212 కోట్లతో రాజ్ భవన్ నిర్మాణం చేపట్టాలని రాజధాని అభివృద్ది సంస్థ (సీఆర్డీయే) సమావేశంలో నిర్ణయించారన్నది ఆ వార్త సారాంశం. మూడు నెలల్లో రాజధానికి ఒక రూపు తీసుకు రావాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ సమావేశంలో చెప్పినట్లు కూడా రాశారు. అమరావతిలో రూ.104 కోట్లతో క్వాంటమ్ హబ్ భవనం నిర్మాణానికి సీఆర్డీయే నిర్ణయం అన్నది ఎల్లో మీడియా ఇచ్చిన ఇంకో వార్త. ప్రధాన రోడ్లకు రూ.వెయ్యి కోట్లు వ్యయం చేయడానికి ప్రభుత్వం పాలన అనుమతులు ఇచ్చింది.గోదావరి- బనకచర్ల స్కీమును రూ.81 వేల కోట్లతో చేపట్టే విషయంలో ముందుకే వెళ్లాలని, డీపీఆర్లు సిద్దం చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు మరో కథనం. ఇంతకన్నా ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే ప్రభుత్వం రూ.257 కోట్లు వ్యయం చేసి జీ+ 7 అంతస్తుల సీఆర్డీయే కార్యాలయ భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది. వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి భవనాలు, ఇతర నిర్మాణాలు చేపడుతున్న కూటమి సర్కార్ పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం విషయానికి వచ్చేసరికి డబ్బులు లేకుండా పోయాయా? అన్న సాధారణ పౌరుల ప్రశ్నలకు జవాబు దొరకడం లేదు. గౌరవ న్యాయస్థానం కోర్టుల నిర్మాణం కూడా ఆగిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. అంటే కోర్టుల కన్నా కూడా రాజధానిలో తాము అనుకున్న విలాసవంత భవనాలే ముఖ్యమని ప్రభుత్వ అధినేతలు భావిస్తున్నారని అనుకోవాల్సి వస్తుంది కదా! ఈ తరహా వ్యాఖ్య కోర్టు జగన్ ప్రభుత్వ టైమ్లో చేసి ఉంటే ప్రభుత్వం దివాళా తీసిందని, కోర్టుల భవనాలను కూడా నిర్మించ లేకపోతోందని ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసేది. కాని ఇప్పుడు మాత్రం కోర్టు భవనాలకే డబ్బు లేనప్పుడు మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఎలా కట్టగలుగుతుందని ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది. అందుకే పీపీపీ మోడల్లో ప్రైవేటు వారికి అప్పగిస్తున్నట్లు జనాన్ని మభ్య పెట్టాలని యత్నిస్తోంది. మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.ఐదు వేల కోట్ల వనరులు లేకపోతే రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు ఎక్కడ నుంచి వస్తున్నాయి? వైఎస్ జగన్ తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో అన్ని సీట్లు మెరిట్ బేసిస్ మీదే కేటాయించాలని, సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ కింద ఎన్నారైలకు ఇవ్వడానికి వీల్లేదని చంద్రబాబు, లోకేశ్లు ఎన్నికలకు ముందు చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఒక్కో సీటును ఏకంగా రూ.57 లక్షలకు అమ్ముకోవడానికి అవకాశం ఇస్తున్నారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలలో జోక్యం చేసుకోవచ్చా అన్న సంశయం కోర్టుకు ఉండవచ్చు. ఇది కేవలం విధానానికి సంబంధించిందే కాదు. వందల కోట్ల విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారు. ఇప్పటికే నిర్మించిన భవనాలను అప్పగించేస్తారు. ఎకరా వంద రూపాయల లీజుకే ఇచ్చేయబోతున్నారు. ఈ కాలేజీలకు అనుబంధంగా ఏర్పాటయ్యే వైద్యశాలల్లో కూడా అన్ని సేవలు పేదలకు ఉచితంగా లభించే అవకాశం తక్కువే. ఒకవేళ ఇచ్చినా, వాటికి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లింపులు చేస్తుంది. ఇలా రకరకాల అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. వీటన్నిటి మీద కోర్టులో వాద, ప్రతివాదాలు జరుగుతాయో లేదో తెలియదు. కోర్టు వారు ఎలాంటి తీర్పు ఇచ్చినా, రాజకీయ పార్టీలు తమ విధానం ప్రకారం ఇలాంటి అంశాలపై నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే ఈ టెండర్లు ఖరారు కాకుండా స్టే ఇవ్వలేమని కోర్టు పేర్కొనడం గమనించదగ్గ విశేషమే. మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం పీపీపీ విధానం కింద ప్రైవేటు సంస్థలకు అప్పగించినా, తాము అధికారంలోకి వచ్చాక తిరిగి స్వాధీనం చేసుకుంటామని జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ లోగా ప్రైవేటికరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమాన్ని వైసీపీ ఆరంభించింది. ఈ రకంగా ప్రజల మనోగతాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలొ వైసీపీతో సహా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తగు పాత్ర పోషిస్తాయి. అందువల్ల కోర్టు ప్రభుత్వ చర్యలకు ఆమోదం తెలిపినా, తెలపకపోయినా, దానితో నిమిత్తం లేకుండా వైఎస్సార్ కాంగ్రెస్ తమ విధానం ప్రకారం ప్రజల అభిప్రాయాన్ని కూడగట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పాలి. జగన్ వ్యాఖ్యానించినట్లు ఆధునిక దేవాలయాల వంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అమ్మడం న్యాయం కాదని ప్రజలు భావిస్తున్నారు . జగన్ టూర్ కు జనం రాకుండా చూడడంలో పోలీసులు విఫలమయ్యారని, మంత్రులు సరిగా స్పందించ లేకపోతున్నారని.. చంద్రబాబు అభిప్రాయపడ్డారని వార్తలు వచ్చాయి. దానిని బట్టే జగన్ టూర్ సక్సెస్ అయిందని చంద్రబాబుతో సహా కూటమి నేతలంతా పరోక్షంగా ఒప్పుకుంటున్నట్లే!. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మచిలీపట్నం పోలీసులకు బిగ్ షాక్.. మేకల సుబ్బన్నకు బెయిల్
-
హైకోర్టు ఉత్తర్వులకన్నా.. ఎమ్మెల్యే ఆదేశాలే మిన్న!
సాక్షి, అమరావతి: హైకోర్టు ఆగ్రహం, ఆదేశాలను పట్టించుకోకుండా పోలీసులు గ్రామస్థాయి మొదలుకుని రాష్ట్ర స్థాయి వరకు అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకే నడుచుకుంటున్నారన్న విషయం పలు దఫాలు స్పష్టమవుతూనే ఉంది. ప్రకాశం జిల్లాలో పేరుగాంచిన శ్రీసిద్ధి భైరవేశ్వరస్వామి ఆలయం ఇందుకు తాజా ఉదాహరణ. గత మూడు దశాబ్దాలుగా ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేసిన కమిటీ పగ్గాలను కూటమి నేతలు బలవంతంగా లాక్కున్నారు. గుడి తాళాలు, హుండీలు పగలగొట్టారు.ఈ ఘటనపై వాస్తవ కమిటీ ప్రెసిడెంట్ శ్రీరంగారెడ్డి ఈ ఏడాది జూన్ 19న ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. పైపెచ్చు ఫిర్యాదును ఉపసంహరించుకోవాలంటూ శ్రీరంగారెడ్డినే వేధించడం మొదలుపెట్టారు. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై శ్రీరంగారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన హైకోర్టు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రాచర్ల పోలీసులను ఆదేశించింది. అయినా రాచర్ల పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. హైకోర్టు ఆదేశాల కన్నా అధికార పార్టీ ఎమ్మెల్యే మాటకే పోలీసులు విలువిస్తున్నారు. కోర్టు ధిక్కార పిటిషన్ల దాఖలు వరకూ పరిస్థితి.. దేవస్థానం వ్యవహారాల్లో జోక్యం వద్దని హైకోర్టు ఆదేశించినా వాటిని అమలు చేయకపోవడంతో, శ్రీరంగారెడ్డి రాచర్ల ఏఎస్ఐ వై. ఆదిశేషయ్యపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏఎస్ఐకు నోటీసులు జారీ అయ్యాయి. అలాగే, ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయాలని ఇచ్చిన హైకోర్టు ఆదేశాలను అమలు చేయలేదన్న కారణంగా, ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్రాజు, డీఎస్పీ డాక్టర్ యు. నాగరాజు, రాచర్ల ఎస్హెచ్వో పి. కోటేశ్వరరావులపై మరో ధిక్కార పిటిషన్ కూడా ఆయన దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై హైకోర్టు వచ్చే వారం విచారణ చేపట్టే వీలుంది. మరో కుట్రకు శ్రీకారం కోర్టు ధిక్కరణ పిటిషన్లు విచారణకు వస్తున్న తరుణంలోనే శ్రీరంగారెడ్డి, ఆయన సోదరుడు నెమిలిరెడ్డిని లక్ష్యంగా చేసుకుంటూ రాచర్ల పోలీసులు తాజాగా కేసు నమోదు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దేవస్థానానికి సంబంధించిన ఆభరణాలను తీసుకున్నారన్నది ఈ కేసు సారాంశం. -
మరోసారి ఎస్సీలే లక్ష్యంగా బాబు కుతంత్రం
సాక్షి, అమరావతి: ఎస్సీగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా..? అంటూ గతంలో ఎస్సీలను ఘోరంగా అవమానించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు మరోసారి ఎస్సీలను లక్ష్యంగా చేసుకున్నారు. మద్యం కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి భాస్కరరావు ఇటీవల వరుసగా బెయిళ్లు మంజూరు చేస్తూ వస్తుండటంతో చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎస్సీ అయిన ఆయన్ను లక్ష్యంగా చేసుకుని న్యాయ చరిత్రలో ఎన్నడూ, ఎవ్వరూ చేయని విధంగా తన ఆస్థాన న్యాయవాది సిద్దార్థ లూథ్రా చేత హైకోర్టులో అనుచిత వ్యాఖ్యలు చేయించారు. భాస్కరరావు నిబంధనల మేరకు తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి వైఎస్సార్సీపీ నేతలకు బెయిల్ మంజూరు చేస్తుండటాన్ని సహించలేని చంద్రబాబు.. ఆ న్యాయాధికారిపై తన అసహనాన్ని, ఆక్రోశాన్ని లూథ్రా ద్వారా వెళ్లగక్కించారు. వైఎస్సార్సీపీ ఎంపీ పీవీ మిధున్రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై గురువారం హైకోర్టు విచారణ జరుపుతున్న సమయంలో లూథ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. భాస్కరరావును ఏసీబీ కోర్టు నుంచి బదిలీ చేయించాలని తాను ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు లూథ్రా బహిరంగంగానే తెలిపారు. భాస్కరరావు తాము చేస్తున్న ప్రతీ వాదనను తోసిపుచ్చుతున్నారని, తమ వాదనలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా వైఎస్సార్సీపీ నేతలకు బెయిల్ మంజూరు చేసేస్తున్నారని లూథ్రా కోర్టుకు నివేదించారు. ఇటీవల మిధున్రెడ్డికి బెయిల్ మంజూరు సందర్భంగా తాము చేసిన ఏ వాదనను కూడా ఆయన పట్టించుకోకుండా తీర్పు ఇచ్చారని తెలిపారు. సీఆర్పీసీ సెక్షన్ 161 కింద, సెక్షన్ 164 కింద సాక్షులు ఇచ్చిన సాక్ష్యాలను సైతం ఆయన పరిగణనలోకి తీసుకోలేదన్నారు. అంతేకాక గూగుల్ టేకౌట్ను కూడా పట్టించుకోలేదన్నారు. ఎన్ని ఆధారాలు సమర్పించినా వాటిని ఆరోపణలనే పేర్కొంటూ ఆధారాల్లేవని చెబుతున్నారని తెలిపారు. మిధున్రెడ్డి ఏ నేరం చేయలేదంటూ క్లీన్ చీట్ ఇచ్చేశారన్నారు. బెయిలు మంజూరు సమయంలో భాస్కరరావు ఏ ఒక్క నిబంధనను కూడా పాటించలేదని తెలిపారు. మిధున్రెడ్డికి బెయిల్ తీర్పును కొట్టేయాలని పిటిషన్మద్యం కేసులో మిధున్రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోరుతూ సీఐడీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పులోని పలు అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తింది. ఆ తీర్పులోని అంశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి ప్రతాప గురువారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా మిధున్రెడ్డికి బెయిల్ ఇస్తూ ఇచ్చిన తీర్పులోని పలు అంశాలను స్టే చేయాలని, లేని పక్షంలో మిగిలిన నిందితులు ఆ అంశాలను ఆధారంగా చేసుకుని బెయిల్ పొందే అవకాశం ఉందని సిట్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదించారు. దర్యాప్తు మొత్తం ప్రభావితం అయ్యేలా మిధున్రెడ్డికి ఏసీబీ కోర్టు న్యాయాధికారి బెయిల్ ఇచ్చారని తెలిపారు. దీని వల్ల మొత్తం దర్యాప్తే నిర్వీర్యమై పోతుందన్నారు. మిధున్రెడ్డికి బెయిల్ మంజూరు చేసే సమయంలో అతని పాస్పోర్ట్ను స్వాధీనం చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించిందని లూథ్రా తెలిపారు. ఇదిలా ఉండగానే న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేందుకు వీలుగా పార్లమెంటరీ కార్యదర్శి నుంచి సెప్టెంబర్ 26న మిధున్రెడ్డికి మెయిల్ వచ్చిందన్నారు. అప్పుడు మిధున్రెడ్డి జైల్లో ఉన్నారని తెలిపారు. ఈ సమావేశాల్లో పాల్గొనే నిమిత్తం న్యూయార్క్ వెళ్లేందుకు వీలుగా మిధున్రెడ్డికి ఏసీబీ కోర్టు పాస్పోర్టును వెనక్కి ఇచ్చేసిందన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి షరతులు విధించలేదన్నారు. ఈ సందర్భంగా సిట్ తరఫున లూథ్రా ఏసీబీ కోర్టు న్యాయాధికారిపై పలు ఆరోపణలు చేశారు. ఏకపక్షంగా స్టే ఇవ్వలేంమిధున్రెడ్డికి బెయిలిస్తూ ఇచ్చిన తీర్పులోని అంశాలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. మిధున్రెడ్డి వాదనలు వినకుండా ఏకపక్షంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో సోమవారం చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, వెంకటేష్ నాయుడు, సజ్జల శ్రీధర్రెడ్డి తదితరుల బెయిల్ పిటిషన్లపై విచారణ ఉందని, మిధున్రెడ్డికి ఇచ్చిన తీర్పులోని అంశాలను స్టే చేయాలంటూ తాము దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను తేల్చేంత వరకు తన ముందున్న వ్యాజ్యాలపై విచారణ జరపకుండా ఏసీబీ కోర్టును నియంత్రించాలని లూథ్రా హైకోర్టును కోరారు. ఇందుకు అంగీకరించిన హైకోర్టు.. సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై తాము నిర్ణయం వెలువరించేంత వరకు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తదితరుల పిటిషన్లపై విచారణ జరపొద్దని ఏసీబీ కోర్టును ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. కాగా, సిట్ తరఫున ఇంకా హైకోర్టు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు.వ్యక్తిగత పర్యటన కాదు.. అది ప్రతిష్టాత్మక సమావేశం ఈ సమయంలో మిథున్ రెడ్డి తరఫు న్యాయవాది తప్పెట నాగార్జునరెడ్డి స్పందిస్తూ, అనుబంధ పిటిషన్కు సంబంధించిన కాపీలను సిట్ తరఫు న్యాయవాదులు ఇప్పుడే తమకు అందచేశారన్నారు. వాటన్నింటినీ పరిశీలించి తగిన విధంగా స్పందించేందుకు సమయం ఇవ్వాలని కోరారు. మి«థున్రెడ్డి పాల్గొనే సమావేశం చాలా ప్రతిష్టాత్మకమైనదని చెప్పారు. ఈ సమావేశానికి వెళుతున్న అతి తక్కువ మందిలో మిథున్ రెడ్డి ఒకరని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పార్లమెంట్ కార్యదర్శి నుంచి మెయిల్ వచ్చాక పాస్పోర్ట్ను వెనక్కి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశామన్నారు. సమావేశంలో పాల్గొనే హక్కు ఎంపీగా మిథున్రెడ్డికి ఉందని, దానిని పరిగణనలోకి తీసుకునే ఏసీబీ కోర్టు పాస్పోర్ట్ను వెనక్కి ఇచ్చిందన్నారు. మిథున్ దేశం తరఫున ఆ సమావేశానికి వెళుతున్నారే తప్ప అది వ్యక్తిగత పర్యటన కాదన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే కోర్టు బెయిల్ మంజూరు చేసిందన్నారు. బెయిల్ మంజూరు చేసిన న్యాయాధికారికి ఉద్దేశాలు ఆపాదించడం సరికాదన్నారు. ఎంపీ తన వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లడం లేదని, అధికారిక కార్యక్రమంలో భాగంగానే వెళ్తున్నారని.. ఈ ప్రోగ్రాం మొత్తాన్ని పీఎంవో పర్యవేక్షణ చేస్తుందని తెలిపారు. చెవిరెడ్డి తదితరుల బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టు సోమవారం విచారణ జరుపుతుంది కాబట్టి, మిధున్రెడ్డి బెయిల్ పిటిషన్లోని అంశాలపై స్టే ఇవ్వాలని ఎలా కోరతారని ఆయన ప్రశ్నించారు. స్టే కావాలనుకుంటే అందుకు ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. లూథ్రా సిఫారసు చేస్తే సరిపోతుందా?ఏసీబీ కోర్టు జడ్జి భాస్కరరావును అక్కడి నుంచి బదిలీ చేయించాలని తాను ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు లూథ్రా చెప్పిన నేపథ్యంలో ఓ న్యాయాధికారి బదిలీ అంత సులభమా అని సందేహం కలుగుతోంది. ప్రభుత్వం అనుకున్నంతనే న్యాయాధికారి బదిలీ జరిగిపోదు. న్యాయవాదులు ప్రభుత్వ పరిధిలో హైకోర్టు నియంత్రణలో పని చేస్తుంటారు. వారిని బదిలీ చేసే అధికారం హైకోర్టుకే ఉంటుంది. ప్రభుత్వానికి కేవలం న్యాయాధికారుల బదిలీని నోటిఫై చేసే అధికారం మాత్రమే ఉంటుంది. న్యాయాధికారుల బదిలీల విషయంలో హైకోర్టుదే తుది నిర్ణయం. న్యాయాధికారుల బదిలీల విషయంలో పరిపాలన హెడ్గా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన సహచర సీనియర్ న్యాయమూర్తులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి ఉంటారు. ఆ కమిటీనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లూథ్రా సిఫారసు చేశారనో, ప్రభుత్వం అడిగిందనో బదిలీ చేయడం ఉండదు. అందునా సీఐడీకి నచ్చని విధంగా న్యాయాధికారి వ్యవహరిస్తున్నారనే కారణంతో బదిలీ చేయడం అన్నది జరిగే పని కాదు. -
డీఎస్సీ టీచర్లకు ‘వెబ్ ఆప్షన్స్’ ప్రారంభం
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 ద్వారా ఎంపికైన అభ్యర్థులు జిల్లాల్లో పాఠశాలలు ఎంపిక చేసుకునేందుకు బుధవారం వెబ్ ఆప్షన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం వీరికి జరుగుతున్న శిక్షణ కేంద్రాల్లోనే విద్యాశాఖాధికారులు ఇందుకు ఏర్పాట్లుచేశారు. ఈనెల 10 వరకు ఇది జరుగుతుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో ఖాళీల వివరాలను ప్రకటించారు. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 3, 4 కేటగిరీ పాఠశాలలకు సంబంధించిన ఖాళీలను మాత్రమే చూపినట్లు తెలిసింది. ఉపాధ్యాయుల్లేని ప్రాంతాలు, సింగిల్ టీచర్ పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న స్కూళ్లను కొత్త టీచర్లకు కేటాయిస్తున్నట్లు సమాచారం. అలాగే, జూన్లో జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో రిలీవర్ లేక అదే స్కూళ్లలో ఉండిపోయిన వారి స్థానాలను ఇక్కడ చూపడంలేదన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. హైకోర్టు తీర్పునకు భిన్నంగా పోస్టుల భర్తీ.. ఇక డీఎస్సీ నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని, మెరిట్ లిస్టు ఇవ్వకుండానే నేరుగా అభ్యర్థులను ఎంపిక చేశారని కొందరు.. రిజర్వేషన్ ప్రక్రియ సక్రమంగా చేపట్టలేదని మరికొందరు, స్పోర్ట్స్ కోటా ఎంపికలోనూ అవకతవకలు జరిగాయని ఇంకొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అలాగే.. రెండు, మూడు పోస్టులు పొందిన వారికి తక్కువ కేటగిరీ పోస్టులు ఇవ్వడంపైనా హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కీలకమైన తీర్పును వెలవరించింది. ఉన్నతమైన పోస్టు పొందడం అభ్యర్థి హక్కు అని, వారికి ఆయా పోస్టులు ఇవ్వాలని తేల్చిచెప్పింది. ఫిర్యాదులకు సంబంధించిన పోస్టులను మినహాయించాలని కోర్టు తీర్పునిచ్చినట్లు అభ్యర్థులు చెబుతున్నారు. అయితే, అందిన ఫిర్యాదులను గ్రీవెన్స్ ద్వారా పరిష్కరించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం జిల్లా, జోనల్, రాష్ట్రస్థాయిలో 60 రోజుల్లో పరిష్కరిస్తామని ప్రకటించింది. కానీ, ఈ సమస్యలు పరిష్కరించకుండానే మొత్తం అన్ని పోస్టులను భర్తీచేసేందుకు ఏర్పాట్లుచేసింది. మొత్తం 15,941 పోస్టులను నింపి ఈ నెల 13 నాటికి కొత్త టీచర్లు స్కూళ్లలో చేరాలని ఆదేశించిడం గమనార్హం. మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి.. ఇదిలా ఉంటే.. కొత్త ఉపాధ్యాయులకు ఆన్లైన్ విధానంపై పూర్తి అవగాహన ఉండదని, వారికి మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ విద్యాశాఖను డిమాండ్ చేశారు. బదిలీల్లో ఎస్జీటీలకు అనుసరించిన విధానాన్నే వీరికి కూడా అమలుచేయాలన్నారు. అలాగే, బదిలీ అయ్యి రిలీవ్ కాని ఉపాధ్యాయుల సమస్య పరిష్కరించేలా ఖాళీలు చూపించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. ఒక్క కర్నూలు జిల్లాలో ఒక్కో అభ్యర్థి 1,650 ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుందని, దీనివల్ల అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొంది. -
కొత్త కథ బాగా అల్లారు.. యువతి మృతి కేసులో పోలీసులపై హైకోర్టు ఫైర్
సాక్షి, అమరావతి: దళిత యువతి అనుమానాస్పద మృతి కేసులో గుంటూరు జిల్లా, నల్లపాడు పోలీసులపై హైకోర్టు మండిపడింది. తనే భవనం పైనుంచి దూకానంటూ మృతురాలే వాంగ్మూలం ఇచ్చినట్లు అఫిడవిట్లో పేర్కొనడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికే ఆ యువతి మరణించిన నేపథ్యంలో, మరి ఆమె వాంగ్మూలం ఎలా నమోదు చేశారంటూ పోలీసులను ప్రశ్నించింది. పోలీసులు కొత్త కథ బాగా అల్లారంటూ వ్యాఖ్యానించింది. దీనిని బట్టి పోలీసుల దర్యాప్తు ఏ తీరులో సాగిందో అర్థమవుతోందని తెలిపింది.రాష్ట్రంలో పోలీసులకు కోర్టులన్నా.. కోర్టు ఉత్తర్వులన్నా.. కోర్టు సిబ్బంది అన్నా ఏ మాత్రం గౌరవం లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. దళిత యువతి మృతి ఘటనను ఆత్మహత్యగా పేర్కొంటూ పోలీసులు దాఖలు చేసిన అఫిడవిట్ను పరిశీలించి, దానిపై వాదనలు వినిపించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.గుంటూరు జిల్లా బుడంపాడులోని సెయింట్ మేరీస్ ఇంనీరింగ్ కాలేజీలో అమృతలూరు మండలం, గోపాయపాళెంకు చెందిన గర్నెపూడి శ్రావణ సంధ్య పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతూ 2017 ఫిబ్రవరి 28న అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. తన కుమార్తెది హత్య అని, దీనికి కాలేజీ యాజమాన్యంతో పాటు రూంమేట్స్ కారణమంటూ మృతురాలి తల్లి జయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతి కిందే కేసు నమోదు చేసి చేతులుదులుపుకున్నారు. దీంతో జయలక్ష్మి 2017 జూలై 6న హైకోర్టును ఆశ్రయించారు. సీఐడీ లేదా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని తన పిటిషన్లో కోరారు. హైకోర్టు అసహనం.. ఈ ఘటన విచారణ సందర్భంగా సెప్టెంబర్లో జస్టిస్ బట్టు దేవానంద్ పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది దర్యాప్తు పూర్తయిందని చెప్పడంతో అయితే చార్జిషీట్ ఎందుకు దాఖలు చేయలేదు, చేయవద్దని మేము చెప్పలేదుకదా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. -
హైకోర్టు ఆదేశాలను లెక్క చేయని పచ్చ ఖాకీలు
-
హైకోర్టు వాహనం డ్రైవర్ పై మంగళగిరి సీఐ పిడిగుద్దులు.. జడ్జీలు సీరియస్
-
జిల్లా జడ్జీల సీనియారిటీలో పారదర్శకతకు మార్గం
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో జిల్లా జడ్జీల అంతర్గత సీనియారిటీ విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2015 సంవత్సరానికిగాను 2022 జనవరి 5న జారీ చేసిన సీనియారిటీ జాబితాను రద్దు చేసింది. 10 శాతం బదిలీ ద్వారా వేగవంతమైన నియామక కోటా (యాక్సిలిరేటెడ్ రిక్రూట్మెంట్ కోటా) కింద నియమితులైన పిటిషనర్లు, 65 శాతం పదోన్నతి కోటా కింద నియమితులైన ఇతర న్యాయాధికారుల విషయంలో తాజాగా సీనియారిటీ జాబితాను తయారు చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. ఇందుకు నాలుగు నెలల సమయమిచ్చింది. అప్పటి వరకు 2022 జనవరి 5 నాటి సీనియారిటీ జాబితా ఆధారంగా ఎలాంటి పదోన్నతులు ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సవరించిన సీనియారిటీ జాబితా ప్రచురితమైన తరువాత పదోన్నతులను చట్ట ప్రకారం చేపట్టాలంది. తాజా సీనియారిటీ జాబితాను తయారు చేసే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీస్ రూల్స్ 2007లోని రూల్ 13(ఏ)లోని రోస్టర్ పాయింట్లను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. 2017 ఫిబ్రవరి 4న ఉమ్మడి హైకోర్టు తయారు చేసిన సీనియారిటీ జాబితాను దృష్టిలో పెట్టుకుని తాజా సీనియారిటీ జాబితాను సిద్ధం చేయాలని తేల్చి చెపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ కుంచెం మహేశ్వరరావు ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. కొన్ని ముఖ్యాంశాలు..» 2015 సంవత్సరానికి జిల్లా జడ్జీల సీనియారిటీ జాబితా 2022 జనవరి 5న జారీ అయింది. ఈ జాబితాలో రెండు వేర్వేరు కోటాల ద్వారా నియమితులు ఉన్నారు. 10 శాతం కోటా వేగవంతమైన నియామకం (డైరెక్ట్ రిక్రూట్)కాగా, 65 శాతం పదోన్నతి కోటా (సబ్ ఆర్డినేట్ జడ్జీల నుండి) కింద నియమితులైనవారు. » రెండు కోటాల నియామక ఉత్తర్వులు వేర్వేరు తేదీలలో (65 శాతం కోటా 20–1–2016, 10 శాతం కోటా 8–2–2016) జారీ అయ్యాయి. » ఈ ఆలస్యం కారణంగా 10 శాతం కోటా ద్వారా నియమితులను 65 శాతం కోటా నియమితుల కంటే జూనియర్స్గా పరిగణించడం జరుగుతుంది. రోస్టర్ పాయింట్ల ద్వారా సీనియారిటీ నిర్ణయం చేపట్టాలని సూచిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీస్ రూల్స్, 2007లోని రూల్ 13(ఏ)ను ‘రద్దయిన జాబితా’ ఉల్లంఘిస్తోందని, నిజమైన సీనియారిటీ క్రమానికి ఇది విరుద్ధమని పేర్కొంటూ న్యాయాధికారులు గుండూరి రజని, జి.అన్వర్ బాషా, పి.భాస్కర్ రావు తదితరులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాదనలను విన్న హైకోర్టు తాజాగా సీనియారిటీ జాబితా సవరణకు ఆదేశాలు ఇచ్చింది. -
పోలీసుల దర్యాప్తు ఇంత దారుణమా..?
సాక్షి, అమరావతి: ఓ దళిత విద్యార్థిని మృతి ఘటనపై దర్యాప్తులో పోలీసుల అలక్ష్యంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కేసులోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించడం సముచితమని భావిస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే, దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసే ముందు, ఈ కేసులో దర్యాప్తు పురోగతిని తెలియజేస్తూ ఒక నివేదికను అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని గుంటూరు జిల్లా ఎస్పీని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అడుగడుగునా పోలీసుల నిర్లక్ష్యం గుంటూరు జిల్లా బుడంపాడులోని సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజీలో అమృతలూరు మండలం, గోపాయపాలేనికి చెందిన గర్నెపూడి శ్రావణ సంధ్య పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతూ 2017 ఫిబ్రవరి 28న అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. తన కుమార్తెది హత్య అని, దీనికి కాలేజీ యాజమాన్యంతోపాటు రూంమేట్స్ కారణమంటూ మృతురాలి తల్లి గర్నెపూడి జయలక్ష్మి అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య అనే అనుమానంతో జయలక్ష్మి ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతి కిందే కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసు నమోదు చేయలేదు. ఆ తర్వాత అసలు ఈ కేసును దర్యాప్తు చేయకుండా పక్కన పడేశారు. దీంతో చేసేదేమీ లేక జయలక్ష్మి 2017 జూలై 6వ తేదీన హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తె మృతిపై సీఐడీ లేదా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. తాజా విచారణ సందర్భంగా శుక్రవారం నల్లపాడు పోలీసుల తరఫున ప్రభుత్వ సహాయ న్యాయవాది కొన్ని వివరాలను లిఖితపూర్వకంగా హైకోర్టు ముందుంచారు. వాటిని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, శ్రావణ సంధ్య 4వ ఫ్లోర్ నుంచి కింద పడే సమయంలో అక్కడ ఎవరూ లేరని పోలీసులు పేర్కొన్నారు. ఇదే పోలీసులు మృతురాలి హాస్టల్లో ఉంటున్న సహచరులను విచారించగా, వారు శ్రావణ సంధ్య 4వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ కింద పడి మరణించినట్లు పేర్కొన్నారు. ఈ పరస్పర విరుద్ధమైన పోలీసు స్టేట్మెంట్లను పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్... పోలీసులు ఈ కేసులో సరిగ్గా దర్యాప్తు చేయలేదని తేల్చారు. ఇందుకు ప్రాథమిక ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. పోలీసు శాఖ దారుణ దర్యాప్తునకు ఈ కేసు ఓ మంచి ఉదాహరణని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో శ్రావణ సంధ్య మృతి కేసులో పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేయలేదన్న జయలక్ష్మి తరఫు న్యాయవాది జీవీ శివాజీ వాదనలతో ఏకీభవించడం మినహా కోర్టుకు మరో అవకాశం లేకుండాపోయిందన్నారు. -
పోలీస్ బలుపుపై హైకోర్టు ఫైర్
సాక్షి, అమరావతి: అయినదానికి, కానిదానికి రాష్ట్రంలో సాధారణ పౌరులపైన తమ ప్రతాపం చూపిస్తూ వస్తున్న పోలీసులు మరోసారి ‘బలుపు’ ప్రదర్శించారు. ఎదురు చెప్పినవారిని చితక్కొట్టడమే పనిగా పెట్టుకున్న రక్షకభటులు ఏకంగా డ్యూటీలో ఉన్న హైకోర్టు ఉద్యోగిపైనే దాడి చేశారు. జడ్జీలకు కేసుల ఫైళ్లను అందజేసేందుకు వెళ్తుండగా అడ్డుకుని అత్యంత దురుసుగా ప్రవర్తించారు. బాధితుడు తాను ఎవరో వివరాలు చెప్పినా పట్టించుకోకుండా దూషిస్తూ దారుణంగా ప్రవర్తించారు. ఘటన వివరాల్లోకి వెళ్తే... ఎం.లక్ష్మీనారాయణ హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్ కమ్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. గుంటూరు పరిధిలో ఉన్న న్యాయమూర్తులకు ఆయన కేసుల ఫైళ్లు అందజేస్తుంటారు. మరుసటి రోజు విచారించాల్సిన కేసులకు సంబంధించిన ఫైళ్లను రాత్రి న్యాయమూర్తులు ఇంటి వద్దనే చదువుతారు. తద్వారా విచారణ సులభమవుతుంది. ఇలా వారికి కేసుల ఫైళ్లను అందజేయడాన్ని సర్క్యులేషన్ అంటారు. లక్ష్మీనారాయణ గురువారం హైకోర్టు వాహనంలో ఫైళ్లను తీసుకుని రెయిన్ ట్రీ విల్లాల్లో నివసిస్తున్న జడ్జీలకు ఇచ్చేందుకు మంగళగిరి మీదుగా బయల్దేరారు. ఎర్రబాలెం–మంగళగిరి రైల్వే ఫ్లై ఓవర్పై మిగిలిన వాహనాలతో వెళ్తుండగా లక్ష్మీనారాయణ వాహనాన్ని ఓ కానిస్టేబుల్ అకస్మాత్తుగా ఆపారు. ఈ దారిలో వద్దని, విజయవాడ మీదుగా వెళ్లాలని చెప్పారు. రోజూ ఇదే మార్గంలో వెళ్తుంటానని, హైకోర్టు జడ్జీలకు అత్యవసరంగా ఫైళ్లు ఇవ్వాల్సి ఉందని లక్ష్మీనారాయణ సమాధానమిచ్చారు. దారి మళ్లించిన విషయం తెలియదన్నారు. ఈ సంవాదం జరుగుతుండగానే... మంగళగిరి గ్రామీణ సీఐ వై.శ్రీనివాసరావు వచ్చారు. రావడం రావడమే లక్ష్మీనారాయణను గట్టిగా చెంపదెబ్బ కొట్టారు. హైకోర్టు ఉద్యోగినని చెప్పినా వినిపించుకోలేదు. ‘నువ్వేంటిరా.. డ్రైవర్ నా కొడుకువి.. నువ్వా నాకు చెప్పేది.. నేను సీఐను’ అని దూషిస్తూ లక్ష్మీనారాయణ పొట్టలో గట్టిగా గుద్దారు. పదేపదే ఆయన చెంపపై కందిపోయేలా కొట్టారు. అర్జంట్ అయితే జడ్జీలే ఫోన్ చేస్తారులేఇద్దరు కానిస్టేబుళ్లను పిలిచి లక్ష్మీనారాయణతోపాటు హైకోర్టు వాహనాన్ని కూడా మంగళగిరి స్టేషన్కు తీసుకెళ్లమని, ర్యాష్ డ్రైవింగ్ కింద లక్ష్మీనారాయణపై కేసు పెట్టాలని సీఐ శ్రీనివాసరావు ఆదేశించారు. కేసుల తాలూకు ఫైళ్లు ఉన్నాయని, జడ్జీలకు అందజేయడం అత్యవసరమని లక్ష్మీనారాయణ వివరించినా పట్టించుకోలేదు. మొత్తం వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు లక్ష్మీనారాయణ ప్రయత్నించగా, ఓ కానిస్టేబుల్ ఆయన ఫోన్ను బలవంతంగా లాగేసుకున్నారు. స్టేషన్కు వెళ్లాక ఫోన్ అడిగినా ఇవ్వలేదు. వ్యాన్లో అత్యవసర ఫైళ్ల గురించి చెప్పగా, అంత అత్యవసరమైతే జడ్జీలే ఫోన్ చేస్తారులే అంటూ కానిస్టేబుళ్లు దురుసుగా మాట్లాడారు. లక్ష్మీనారాయణ అరగంట బతిమిలాడాక ఆయనకు ఉన్నతాధికారి నంబరు రాసుకునేందుకు మాత్రం మొబైల్ ఇచ్చారు. నంబరు రాసుకుని... మరో వ్యక్తి ఫోన్ నుంచి జరిగిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం లక్ష్మీనారాయణను పంపించేశారు. సంఘటితమైన జడ్జీల డ్రైవర్లు... కీలక వ్యక్తి దృష్టికి.. శుక్రవారం ఉదయం హైకోర్టులోని న్యాయమూర్తుల డ్రైవర్లు అందరూ కలిసి... తమ సహచరుడిపై పోలీసుల దాషీ్టకాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో హైకోర్టులో ‘కీలక’ స్థానంలో ఉన్న వ్యక్తి వద్దకు వెళ్లి పోలీసుల దుందుడుకు చర్యలను వివరించారు. డ్యూటీలో ఉన్న ఉద్యోగి.. అందులోనూ హైకోర్టు ఉద్యోగిని కొట్టడమే కాక న్యాయమూర్తుల కేసుల ఫైళ్లున్న వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించడాన్ని హైకోర్టు వర్గాలు తీవ్రంగా పరిగణించాయి. ఆ తర్వాత లక్ష్మీనారాయణ గుంటూరు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా మంగళగిరి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ, నిందితుల జాబితాలో లక్ష్మీనారాయణపై దాడి చేసిన సీఐ శ్రీనివాసరావు పేరును చేర్చలేదు. నిందితుల కాలమ్లో ‘‘సీఐ’’ అని రాసి సరిపెట్టారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని ఆయన విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నందుకు బీఎన్ఎస్ సెక్షన్ 132 కింద కేసు పెట్టారు. గాయమవుతుందని తెలిసినా గాయం చేయాలన్న ఉద్దేశంతో గాయపరిచారంటూ సెక్షన్ 115(2) కింద కూడా కేసు నమోదు చేశారు. ఆగమేఘాలపై వచ్చిన జిల్లా ఎస్పీసీఐ శ్రీనివాసరావు ఏకంగా హైకోర్టు ఉద్యోగిని కొట్టడం, హైకోర్టు తీవ్రంగా స్పందించడంతో గుంటూరు ఎస్పీ శుక్రవారం ఉదయం ఆగమేఘాలపై హైకోర్టుకు వచ్చి ఉన్నతాధికారులను కలిశారు. మొత్తం ఘటనపై వివరణ ఇచ్చారు. ఈ సమయంలో లక్ష్మీనారాయణపై దాడి చేసిన నిందితుల జాబితాలో సీఐ అని మాత్రమే రాయడంతో హైకోర్టులోని ‘కీలక వ్యక్తి’... ఎస్పీని గట్టిగా నిలదీశారు. మరోవైపు తమ ఉద్యోగిపై చెయ్యి వేయడమంటే హైకోర్టుపై వేయడమేనని హైకోర్టు వర్గాలు ఎస్పీకి తేల్చిచెప్పాయి. డ్రైవర్ లక్ష్మీనారాయణ తప్పు చేసి ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని, దానికి ఎవరూ అభ్యంతరం చెప్పరని ఎస్పీకి స్పష్టం చేశాయి. సీఐ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తీవ్ర విషయమని తెలిపాయి. పైగా న్యాయమూర్తులకు అందజేయాల్సిన కేసుల ఫైళ్లను కూడా స్టేషన్లో ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇది కోర్టు పాలనలో జోక్యం చేసుకోవడమేనని ఎస్పీతో వ్యాఖ్యానించాయి. కాగా, పోలీసులు విధి లేని పరిస్థితుల్లో సీఐ శ్రీనివాసరావు పేరును లక్ష్మీనారాయణపై దాడి చేసిన నిందితుల జాబితాలో చేర్చారు. ⇒ హైకోర్టు ఆగ్రహంతో ఘటన తీవ్రత అర్థమైన ఎస్పీ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. డ్రైవర్ లక్ష్మీనారాయణను కొట్టిన సీఐను నిందితుల జాబితాలో చేర్చిన ఆయన తదుపరి ఏం చర్యలు తీసుకుంటారో చూడాలని హైకోర్టు వర్గాలు భావిస్తున్నాయి. కాగా, సీఐ శ్రీనివాసరావు మంగళగిరి నియోజకవర్గంలోనే అత్యంత వివాదాస్పద అధికారిగా ముద్రపడ్డారు. -
తమాషాలు చేస్తున్నారా? హైకోర్టు మాటంటే లెక్కలేదా..?
-
సవీంద్ర కేసును సీబీఐకి అప్పగించటంపై వైఎస్ జగన్ హర్షం
-
సవీంద్ర కేసును సీబీఐకి అప్పగించటంపై వైఎస్ జగన్ హర్షం
సాక్షి, తాడేపల్లి: సవీంద్ర(Savindra) కేసును సీబీఐ(CBI)కి అప్పగించటంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు ఇచ్చిన సుమోటో ఆదేశాలను తాను స్వాగతిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. సత్యమేవ జయతే హ్యాష్ ట్యాగ్తో ఎక్స్లో ఆయన పోస్టు చేశారు. హైకోర్టు నిర్ణయం రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితికి నిదర్శనమన్న వైఎస్ జగన్.. చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసులు హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవటం లేదన్నారు.‘‘ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారు. వాక్ స్వాతంత్య్రాన్ని అడ్డుకుంటున్నారు. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు. సెక్షన్ 111ని దుర్వినియోగం చేయటం నిత్యకృత్యంగా మారింది. సరైన విచారణ, ప్రజల హక్కుల పరిరక్షణ అవసరాన్ని కోర్టు ఆదేశాలు తేటతెల్లం చేశాయి’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.I welcome the Hon’ble High Court’s suo moto direction to hand over the case of social media activist Kunchala Savindra Reddy to the CBI. This decision reveals the alarming state of affairs in Andhra Pradesh, where the police under the @ncbn–led government have been crushing…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 27, 2025ఇదీ చదవండి: చంద్రబాబు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి! -
సోషల్ మీడియా యాక్టివిస్ట్ సౌందరరెడ్డి అక్రమ అరెస్టుపై సీబీఐ దర్యాప్తు
సోషల్ మీడియా యాక్టివిస్ట్ను నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా అరెస్ట్ చేసిందే కాక.. అదుపులోకే తీసుకోలేదని పోలీసులు మాకు చెప్పారు. అసలు ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియదన్నారు. ఆయన భార్య ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయలేదు. మళ్లీ అరెస్ట్ చేశామని, మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచాలంటున్నారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన సమయం, పోలీసులు చెబుతున్న విషయాలు పూర్తిగా పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. వాస్తవాలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. పోలీసుల తీరు తీవ్ర ఆక్షేపణీయం. అందువల్ల వ్యక్తి స్వేచ్ఛకు విఘాతం కలగకూడదని కేసు లోతుల్లోకి వెళ్తున్నాం. అధికరణ 226 కింద ఉన్న అసాధారణ అధికారాన్ని ఉపయోగిస్తున్నాం. –హైకోర్టుసాక్షి, అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్ట్ సౌందరరెడ్డి అలియాస్ సవీందర్రెడ్డి అక్రమ అరెస్ట్పై హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఇందులో భాగంగా సీబీఐ ఏపీ విభాగాధిపతిని సుమోటోగా ప్రతివాదిగా చేర్చింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసి, ప్రాథమిక నివేదికను తమ ముందుంచాలని ఆయన్ను ఆదేశించింది. తదుపరి విచారణ వరకు సౌందరరెడ్డిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచే ప్రక్రియను ఆపేసింది. సీబీఐ దర్యాప్తునకు ఇవ్వాల్సిన ప్రాథమిక ఆధారాలు ఈ కేసులో ఉన్నాయంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్ ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సౌందరరెడ్డి అరెస్ట్ అక్రమమనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ‘గంజాయి కేసులో సౌందరరెడ్డిని పోలీసులు ఇరికించారు. పోలీసులు వారి చట్టవిరుద్ధ చర్యలను కప్పిపుచ్చుకునేందుకు ఇలా చేశారు. తగిన అరెస్ట్ వారెంట్ లేకుండా, సుప్రీంకోర్టు నిర్దేశించిన అరెస్ట్ విధానాన్ని అనుసరించకుండా సౌందరరెడ్డిని అరెస్ట్ చేశారు. అలాగే అధికారుల విశ్వసనీయతపై కూడా మాకు సందేహాలున్నాయి. అందుకే ఈ కేసులో జోక్యం చేసుకుంటున్నాం. అన్యాయంగా, ఏకపక్షంగా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడానికి వీల్లేదు. ఈ కేసులో పోలీసుల చర్యలు చాలా దారుణంగా ఉన్నాయి’ అని ధర్మాసనం వివరించింది. 8.30కి అరెస్ట్ చేస్తే.. 7.30కే మధ్యవర్తుల నివేదిక ఎలా సాధ్యం? ‘సౌందరరెడ్డిని ఈ నెల 22వ తేదీ రాత్రి 8.30 గంటల సమయంలో అరెస్ట్ చేశామని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అదే రిపోర్టులో 7.30 గంటలకు మధ్యవర్తుల నివేదిక సిద్ధం చేసినట్లు పోలీసులు చెప్పారు. మరి 8.30 గంటలకు అరెస్ట్ చేస్తే, 7.30 గంటలకే ఎలా మధ్యవర్తుల నివేదిక సిద్ధం అవుతుంది? అలాగే తనను 22వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు అరెస్ట్ చేశారని సౌందరరెడ్డి మాకు చెప్పారు. సౌందరరెడ్డి సాయంత్రం 4.20 గంటలకు విజయవాడలో ఉన్నారని, అనంతరం అక్కడి నుంచి కుంచనపల్లికి వెళ్లారని కూడా జియో కంపెనీ తన మెమోలో ఈ కోర్టుకు చెప్పింది. ఆ తర్వాత సాయంత్రం 6.21 గంటలకు అతని ఫోన్ స్విచాఫ్ అయినట్లు కూడా జియో చెప్పింది. అటు తరువాత 7 గంటలకు సౌందరరెడ్డి భార్య లక్ష్మీప్రసన్న తాడేపల్లి పోలీస్స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయకుండా జనరల్ డైరీలో నమోదు చేశారు. 7.30 గంటల కన్నా ముందే ఆమె తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారని అర్థమవుతోంది. సౌందరరెడ్డి అరెస్ట్ విషయంలో పోలీసులు చెబుతున్న దానికీ, వాస్తవంగా జరిగిన దానికీ పొంతన కుదరడం లేదు. పోలీసులు చెబుతున్న విషయాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి’ అని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలగకూడదనే జోక్యం ‘ఓ వ్యక్తిని అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు యూనిఫాంలో ఉండి తీరాలని డీకే బసు కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అంతేకాక వారి గుర్తింపును సైతం తెలియచేయాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఈ కేసులో పోలీసులు సౌందరరెడ్డిని అరెస్ట్ చేసే సమయంలో యూనిఫాంలో లేరు. ఇదే విషయాన్ని ప్రత్తిపాడు సీఐ ధ్రువీకరించారు. సాధారణంగా మేము ఇలాంటి కేసుల్లో లోతుల్లోకి వెళ్లం. అయితే పోలీసుల తీరు అత్యంత ఆక్షేపణీయంగా ఉండటంతో లోతుల్లోకి వెళ్లక తప్పలేదు. సౌందరరెడ్డి స్వేచ్ఛకు విఘాతం కలగకూడదనే మేం జోక్యం చేసుకుంటున్నాం. అధికరణ 226కింద ఉన్న అసాధారణ అధికారాన్ని సైతం ఉపయోగిస్తున్నాం. ఓ వ్యక్తి అరెస్ట్ సక్రమమైనప్పుడే అతన్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం సాధ్యమవుతుంది’ అని జస్టిస్ రఘునందన్రావు ధర్మాసనం స్పష్టం చేసింది. ...అందుకే సీబీఐకి అప్పగిస్తున్నాం ‘సౌందరరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసుల విశ్వసనీయతపై మాకు ప్రాథమిక అనుమానాలున్నాయి. అందుకే అధికరణ 226 కింద జోక్యం చేసుకుంటున్నాం. అంతేకాక వ్యక్తి స్వేచ్ఛను హరించకుండా అడ్డుకునేందుకు ఈ అధికరణ కింద మాకున్న అధికారాన్ని ఉపయోగించకుండా ఎవరూ నిరోధించలేరు. ప్రస్తుత కేసులో లేవనెత్తిన విషయాలను, అలాగే విచారించాల్సిన వ్యక్తుల్లో రాష్ట్ర పోలీసు అధికారులు ఉన్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ చేత దర్యాప్తు చేయించడం సబబుగా ఉంటుందని భావిస్తున్నాం. అందుకే ఈ వ్యాజ్యంలో ఆంధ్రప్రదేశ్ సీబీఐ విభాగాధిపతిని ప్రతివాదిగా చేరుస్తున్నాం. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపి మాకు ప్రాథమిక నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశిస్తున్నాం. సీబీఐ ప్రాథమిక నివేదిక ఇచ్చేంత వరకు సౌందరరెడ్డిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడాన్ని నిలిపేస్తున్నాం’ అని ధర్మాసనం తేల్చి చెప్పింది. సౌందరరెడ్డి టవర్ లొకేషన్ డేటా, తాడేపల్లి పోలీస్స్టేషన్ సీసీటీవీ ఫుటేజీ, పోలీసుల రిమాండ్ రిపోర్టు, తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదుదారు లక్ష్మీ ప్రసన్న ఇచ్చిన ఫిర్యాదులను సీల్డ్ కవర్లో ఉంచామని, వాటిని సీబీఐ దర్యాప్తు అధికారికి అందజేయాలని రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)ను ఆదేశిస్తున్నామని పేర్కొంది. తన భర్తను అక్రమంగా నిర్బంధించారంటూ పిటిషన్ తన భర్త సౌందరరెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ కుంచాల లక్ష్మీప్రసన్న హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ రఘునందన్రావు ధర్మాసనం విచారణ జరిపింది. సౌందరరెడ్డిని తాము అదుపులోకి తీసుకోలేదని, ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. దీంతో ధర్మాసనం.. సౌందరరెడ్డి ఎక్కడున్నా కూడా వెతికి తమ ముందు హాజరుపరచాలని, అతన్ని ఏ కేసులో కూడా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి వీల్లేదని పోలీసులను ఆదేశించింది. అంతేకాక సౌందరరెడ్డిని అపహరించారంటూ లక్ష్మీప్రసన్న తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశానని చెబుతున్న నేపథ్యంలో ఈ నెల 22 సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. అలాగే 22న సాయంత్రం సౌందరరెడ్డి ఎక్కడ ఉన్నారో తెలియజేసేందుకు వీలుగా అతని సెల్ టవర్ వివరాలను ఇవ్వాలని జియో ఫోన్ జనరల్ మేనేజర్ను సైతం ఆదేశించిన విషయం తెలిసిందే. మొదటి నుంచీ తప్పుదోవ పట్టించిన పోలీసులు తాజాగా శుక్రవారం ఈ వ్యాజ్యంపై జస్టిస్ రఘునందన్రావు ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా లక్ష్మీ ప్రసన్న తరఫు న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో పోలీసులు మొదటి నుంచీ కోర్టును తప్పుదోవ పట్టిస్తూ వస్తున్నారని తెలిపారు. సౌందరరెడ్డి అక్రమ నిర్బంధంపై తాము 23న పిటిషన్ దాఖలు చేశామని, దీనిపై ఈ ధర్మాసనం సాయంత్రం 4 గంటలకు విచారణ జరిపిందన్నారు. ఈ సందర్భంగా పోలీసులు అసలు సౌందరరెడ్డిని తాము అరెస్ట్ చేయలేదని, ఆయన ఎక్కడున్నారో కూడా తెలియదని ఈ కోర్టుకు చెప్పారన్నారు. అయితే ఇందుకు విరుద్ధంగా పోలీసులు సౌందరరెడ్డిని అదే రోజు సాయంత్రం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారని ఆయన వివరించారు. దీన్నిబట్టి ఈ కేసులో పోలీసులు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్న విషయం స్పష్టమవుతోందన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించాలని ఆయన కోర్టును కోరారు. మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తాం.. అనుమతించండి ఈ సమయంలో పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) తిరుమాను విష్ణుతేజ స్పందిస్తూ, సౌందరరెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో అతన్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి తీరాల్సి ఉందని, ఇది తమ బాధ్యత అని తెలిపారు. సౌందరరెడ్డిని స్వేచ్ఛగా వదిలేయాలన్న హైకోర్టు ఆదేశాల వల్ల అతన్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. ఈ ప్రక్రియను కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలన్నారు.అంతిమంగా రిమాండ్ విషయంలో మేజిస్ట్రేటే తగిన నిర్ణయం తీసుకుంటారని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసు దాఖలైన నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలన్నింటినీ రికార్డ్ చేసింది. దర్యాప్తును సీబీఐకి అప్పగించేందుకు దారి తీసిన పరిస్థితులను కూడా వివరించింది. అనంతరం దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది.హైకోర్టు ఎన్నిసార్లు హెచ్చరించినా.. ఏమాత్రం మారని ఖాకీల తీరు! 18122024మెదడు ఉపయోగించకుండా యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు..‘సోషల్ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తూ బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద దర్యాప్తు అధికారి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఎలాంటి ఆధారాలు చూపలేదు. అయినా కింది కోర్టు మేజిస్ట్రేట్ ఆధారాలున్నాయనడం తప్పు. మేజిస్ట్రేట్ మెదడు ఉపయోగించకుండా, యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులిచ్చారు. పోలీసులు ఇచ్చిన నోటీసుల్లో అరెస్ట్కు గల కారణాలను చెప్పలేదు..’ – సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి తన కుమారుడు వెంకట రమణారెడ్డికి వినుకొండ కోర్టు విధించిన రిమాండ్ను రద్దు చేయాలని కోరుతూ పప్పుల చెలమారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సమయంలో హైకోర్టు వ్యాఖ్యలు.06012025కోర్టుల కన్నా ఎక్కువ అనుకుంటున్నారా..?‘సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీంద్రరెడ్డి నిర్బంధానికి సంబంధించి మేం అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు ఇవ్వాలి. రవీంద్రరెడ్డిని ఎప్పుడు నిర్బంధంలోకి తీసుకున్నారు? ఎప్పుడు అరెస్ట్ చూపారు? ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారా..? ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానాలు కావాలి. ఈ కేసులో పోలీసులు మొదటి నుంచి మా ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి తీరును సహించేది లేదు. కోర్టులకన్నా ఎక్కువ అనుకుంటున్నారా? కడప ఎస్పీ తీరు చూస్తుంటే అలాగే ఉంది. ఆరోపణలు నిజమని తేలితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి..!’ – వర్రా రవీంద్రారెడ్డి అక్రమ నిర్బంధంపై ఆయన భార్య కళ్యాణి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ సమయంలో హైకోర్టు వ్యాఖ్యలు18022025లోపలేయడం మినహా మీరేం చేస్తున్నారు?‘వ్యక్తులపై కేసులు పెట్టడం.. వారిని కొట్టడం.. లోపలేయడం మినహా మీరేం చేస్తున్నారు? కేసులు పెట్టి లోపల వేయడం మినహా ఏ కేసులోనూ దర్యాప్తు చేయడం లేదు. కోర్టు ఆదేశాలను పోలీసులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇలాంటి తీరును సహించేది లేదు. బొసా రమణ అనే వ్యక్తి అరెస్ట్ విషయంలో దర్యాప్తు చేసి ఉంటే ఆ వివరాలను మా ముందు ఉంచేవారు. దర్యాప్తు చేయలేదు కాబట్టే ఏ వివరాలను సమర్పించలేదు. అతడిపై 27 కేసులున్నాయని చెబుతున్నారు. కానీ, ఆ కేసుల దర్యాప్తు వివరాలను మా ముందు ఉంచడంలేదు. మా ఆదేశాలపై డీజీపీ ఏ చర్యలు తీసుకున్నారు..?’ – విశాఖకు చెందిన బొసా రమణ అరెస్టుపై ఆయన భార్య దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ సమయంలో హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు 25022025పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు..‘పోలీసులు వాస్తవాలను దాచిపెడుతూ తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. బొసా రమణ అరెస్టు విషయంలో డీజీపీ నివేదిక ఇస్తారని ఆశించాం. కానీ, ఎలాంటి నివేదిక రాలేదు. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని డీజీపీని నివేదిక కోరాం. డీజీపీ పోస్టుపై ఉన్న గౌరవంతో వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వలేదు. రాతపూర్వకంగా ఆదేశాలు ఇస్తేనే నివేదిక ఇస్తామని డీజీపీ భావిస్తే అలాగే ఆదేశాలు ఇస్తాం. రమణ అరెస్టు విషయంలో విశాఖ పోలీస్ కమిషనర్, ప్రకాశం జిల్లా కలెక్టర్ నివేదికలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి...’ – బొసా రమణ భార్య దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ సమయంలో హైకోర్టు వ్యాఖ్యలు.11032025‘పౌరుల స్వేచ్ఛను హరిస్తే ఊరుకోం..‘పౌరుల స్వేచ్ఛను హరిస్తామంటే చూస్తూ ఊరుకోం. ఎలా పడితే అలా అరెస్ట్ చేస్తామంటే కుదరదు. రుజువు లేకుండా ఊహల ఆధారంగా అరెస్ట్ చేస్తారా? తాము చట్టం కంటే ఎక్కువని పోలీసులు భావిస్తున్నారు. చిన్న తప్పులేనని వదిలేస్తే.. రేపు కోర్టులకు వచ్చి మరీ అరెస్టు చేస్తారు. ప్రతి దశలోనూ పోలీసులు చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారు..’ – సోషల్ మీడియా యాక్టివిస్ట్ అవుతు శ్రీధర్రెడ్డికి కింది కోర్టు విధించినరిమాండ్ చట్ట విరుద్ధమని కొట్టేసిన సందర్భంలో హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు25032025హద్దు మీరొద్దు ‘తప్పు చేస్తే.. కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం తప్పు కాదు. కానీ అరెస్ట్ చేయడానికే కేసు పెడితేనే సమస్య. మీ తప్పులను ఎన్నని ఎత్తి చూపాలి? ఎలా పడితే అలా వ్యవహరించే ముందు బాగా ఆలోచించుకోండి. పోలీసులు పరిధి దాటి వ్యవహరించడంపై మాకు చాలా విషయాలు తెలుసు. మేం కోర్టుల్లో ఉంటాం కాబట్టి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలియదని ఎంత మాత్రం అనుకోవద్దు. పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరుగుతోంది. – మాదిగ మహాసేన అధ్యక్షుడు ప్రేమ్కుమార్ అరెస్ట్పై హైకోర్టు వ్యాఖ్యలు10042025ఇది ధిక్కారమే... హైకోర్టు ఆదేశాలంటే పోలీసులకు లెక్కే లేకుండాపోయింది. సెక్షన్ 111ను ఎప్పుడు, ఎలాంటి సందర్భాల్లో వాడాలో స్పష్టంగా చెప్పాం. అయినా ఆ సెక్షన్ కింద కేసులు నమోదు చేయడమంటే మా ఆదేశాలను ధిక్కరిస్తున్నట్లే. ఎప్పుడో నమోదు చేసిన కేసులో మీ ఇష్టం వచ్చినట్లు ఇప్పుడు అదనపు సెక్షన్లు ఎలా చేరుస్తారు? అంటే ఉద్దేశ పూర్వకంగా చేస్తున్నట్లు కాదా?’ – పోసాని కృష్ణమురళిపై కేసు విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి 1932025సోషల్ మీడియా పోస్టులు వ్యవస్థీకృత నేరమంటే ఎలా? సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు వ్యవస్థీకృత నేరం కిందకు ఎలా వస్తాయి? బీఎన్ఎస్ సెక్షన్–111 ప్రకారం ఆరి్థక నేరాలు, ఒప్పంద హత్యలు, కిడ్నాప్, దోపిడీ, భూ ఆక్రమణలు, మానవ అక్రమ రవాణా, తీవ్ర పర్యవసానాలు ఉండే సైబర్ నేరాలు వ్యవస్థీకృత నేరం కిందకు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా పోస్టులు ఎలా వ్యవస్థీకృత నేర నిర్వచన పరిధిలోకి వస్తాయి? పరువుకు నష్టం కలిగించేలా పెట్టిన పోస్టులను సైబర్ నేరంతో సమానంగా ఎలా చూడగలం? – సజ్జల భార్గవ్, సింగిరెడ్డి అర్జున్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యలు 2142025పోలీసులను ఇలాగే వదిలేస్తే రేపు అందరం ఇబ్బందిపడతాం చట్టాన్ని బేఖాతర్ చేస్తున్న పోలీసులను ఇలాగే వదిలేస్తే రేపు మనం అందరం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వ్యక్తి స్వేచ్ఛకు మించి ఏదీ ముఖ్యం కాదు. ఈ విషయాన్ని పలుమార్లు పునరుద్ఘాటించినా పోలీసులు కోర్టుల ఆదేశాలను లెక్కచేయడం లేదు. పోలీసులై ఉండి చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తారు? మీరుండేది చట్టాన్ని, న్యాయాన్ని కాపాడటానికా? లేకా ఉల్లంఘించడానికా? పిల్లలు తప్పు చేశారని తల్లిదండ్రులను వేధిస్తారా? – తిరుపతికి చెందిన రిటైర్డ్ పోలీసు అధికారి సుబ్రహ్మణ్యరెడ్డి పిటిషన్పై విచారణ సందర్భంగా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం2972025సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటే సహించం ‘‘తప్పుడు కేసులతో పోలీసులు ఎలా వేధిస్తారో మాకు బాగా తెలుసు. రాజీ చేసుకోవాలని ఎలా ఒత్తిడి చేస్తారో... ఎలా బెదిరిస్తారో కూడా తెలుసు. మాకు ఏమీ తెలియదని అనుకోవద్దు. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటే సహించం. కౌన్సెలింగ్ పేరుతో పౌరులను వేధింపులకు గురి చేస్తే.. మీకు కౌన్సెలింగ్ చేయించాల్సి ఉంటుంది. – పఠాన్ కురీంసా(పిడుగురాళ్ల) అనే వ్యక్తి అక్రమ నిర్బంధం కేసు విచారణ సందర్భంగా పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ సీఐపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం 682025ఆరేళ్ల కిందట ఘటన జరిగితే ఇప్పుడు అరెస్ట్ చేస్తారా? ఆరేళ్ల కిందట ఘటన జరిగితే ఇప్పుడు అరెస్ట్ చేస్తారా? వైఎస్సార్సీపీ నేత తురకా కిశోర్ అరెస్ట్, రిమాండ్ విషయంలో పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ అయిన వ్యక్తి ఒక్క క్షణం కూడా జైలులో ఉండటానికి వీల్లేదు. అక్రమ నిర్బంధాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించం. – మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ కిశోర్ అక్రమ అరెస్ట్పై ఆయన భార్య సురేఖ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సమయంలో హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు 2982025సివిల్ దుస్తుల్లో పోలీస్ విధులా? పోలీసులు సివిల్ దుస్తుల్లో వచ్చి ఎలా విధులు నిర్వర్తిస్తారు? పోలీసు యూనిఫాంలో కాకుండా సివిల్ దుస్తుల్లో వచ్చి అరెస్ట్ చేయడానికి వీల్లేదు. అది డీకే బసు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధం. సివిల్ దుస్తుల్లో వస్తే వారు పోలీసులని ఎలా తెలుస్తుంది? సివిల్ దుస్తుల్లో వచ్చి తమ విధులను అడ్డుకున్నారంటే ఎలా కుదురుతుంది? సివిల్ దుస్తుల్లో పోలీసులు లా అండ్ ఆర్డర్ విధులు నిర్వర్తిస్తామంటే కదరదు. అసలు సివిల్ దుస్తుల్లో విధులు నిర్వర్తించే ప్రివిలేజీలేవీ పోలీసులకు లేవు. – మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి పిటిషన్పై విచారణ సందర్భంగా స్పష్టం చేసిన హైకోర్టు అరెస్ట్ .. రిమాండ్ ఇష్టారాజ్యం కాదు నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల అరెస్ట్ అవసరమా? కాదా? అనే విషయంలో పోలీసులు, మేజిస్ట్రేట్లు తగిన ఆలోచన, పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు అర్నేష్కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసులో సుప్రీంకోర్టు 2014లోనే స్పష్టత ఇచ్చింది. తాజాగా అదే తీర్పును ఉటంకిస్తూ అరెస్టులు, రిమాండ్లు యాంత్రికంగా కాకుండా, న్యాయబద్ధమైన విచక్షణతో జరగాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తూ కింది కోర్టులకు ఏపీ హైకోర్టు సర్క్యులర్ జారీ చేసింది. పౌర స్వేచ్ఛపై ‘సుప్రీం’ ఏం చెప్పిందంటే...» ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలను విమర్శించడం.. నిరసించడాన్ని నేరం అంటే ప్రజాస్వామ్య మనుగడే సాధ్యం కాదు..» స్వేచ్ఛగా మాట్లాడటం, భావ వ్యక్తీకరణ లాంటి వాటి గురించి మన పోలీసు యంత్రాంగానికి బోధించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషయంలో వారికి జ్ఞానోదయం కలిగించాలి. స్వేచ్ఛగా మాట్లాడటం, భావవ్యక్తీకరణపై ఎంత వరకు సహేతుక నియంత్రణ విధించాలన్న దానిపై అవగాహన కల్పించాలి. రాజ్యాంగం మనకందించిన ప్రజాస్వామ్య విలువల గురించి వారికి అవగాహన కల్పించాల్సిన సమయం వచ్చింది.భిన్నాభిప్రాయం, అసమ్మతి తెలియచేయడం అన్నది రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో అంతర్భాగం. ప్రతి పౌరుడు కూడా ఇతరులు వ్యక్తం చేసే భిన్నాభిప్రాయాన్ని గౌరవించాలి. ప్రభుత్వ నిర్ణయాలపై శాంతియుతంగా నిరసన తెలియజేసే అవకాశం ఇవ్వడం ప్రజాస్వామ్యంలో తప్పనిసరి.– ప్రొఫెసర్ జావీద్ అహ్మద్ హజమ్ కేసులో ‘సుప్రీం కోర్టు’ కీలక వ్యాఖ్యలు -
సవీంద్ర అక్రమ అరెస్ట్ కేసు సీబీఐకి అప్పగిస్తూ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్టు సవీంద్రారెడ్డి అక్రమ అరెస్ట్ కేసు సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 13 లోపు నివేదిక ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. పోలీసులు.. కోర్టును తప్పుదోవ పట్టించారని సవీంద్ర తరపు లాయర్ తన వాదనలు వినిపించారు. ‘‘ రాత్రి 7:30 గంటలకు అరెస్ట్ చేశామని పోలీసులు కోర్టుకు తెలిపారు. 6:30కు అరెస్ట్ చేశారని నిందితుడు చెబుతున్నాడు...కన్ఫెషన్ రిపోర్టులో రాత్రి 7.30కు అరెస్ట్ చేసినట్లు రాశారు. రిమాండ్ రిపోర్టులో రాత్రి 8.30కు అరెస్ట్ చేసినట్లు రాశారు. ప్రత్తిపాడు పోలీసులు అరెస్ట్ చేసినట్లు కోర్టుకు తెలిపారు. లాలాపేట ఎస్హెచ్వో శివప్రసాద్ అరెస్ట్ చేసినట్లు స్పష్టంగా ఉంది. రాత్రి 7 గంటలకు సవీంద్రరెడ్డి సతీమణి పీఎస్కు వచ్చినట్లు సీసీటీవీలో ఉంది. సవీంద్ర ఫోన్ సాయంత్రం 6:21కి స్విచాఫ్ చేసినట్లు స్పష్టంగా ఉంది. ఈ కేసులో నిజాలు బయటకు రావాలంటే సీబీఐ సుమోటోగా తీసుకుని విచారించాలి’’ అని సవీంద్ర లాయర్ కోరారు.‘‘సవీంద్రారెడ్డిపై గంజాయి కేసు ఎలా పెట్టారు?. సుప్రీంకోర్టు తీర్పులున్న యూనిఫాం లేకుండా ఎలా పోలీసులు సవీంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు? ఎన్ని గంటలకు అరెస్ట్ చేశారు. ఇది అక్రమ అరెస్టా లేదా తెలియాలంటే సీబిఐతో విచారించాలి’’ అని సవీంద్ర లాయర్ తన వాదనలు వినిపించారు. హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తూ.. సీబీఐ అక్టోబర్ 13వ తేదీ కల్లా కేసుకు సంబంధించిన ప్రాథమిక నివేదికను ముందు ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.కాగా, బుధవారం( సెప్టెంబర్ 24) ఈ కేసును విచారిస్తూ.. పోలీసులు యూనిఫామ్లో కాకుండా.. సివిల్ దుస్తుల్లో వెళ్లి అరెస్టులు చేస్తుండటాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో సాక్షాత్తూ సుప్రీంకోర్టు తీర్పునే పట్టించుకోరా? అని సూటిగా నిలదీసింది. ఇదెక్కడి సంస్కృతి అంటూ ప్రశ్నించింది. మఫ్టీలో వెళ్లి సోషల్ మీడియా యాక్టివిస్టు కుంచాల సౌందరరెడ్డిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. అసలు పౌరులను అరెస్ట్ చేయడానికి మఫ్టీలో ఎందుకు వెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అందరూ పాటించాల్సిందేనంది. సుప్రీంకోర్టు ఆదేశాలు మీకు వర్తించవని అనుకుంటున్నారా..? అని నిలదీసింది.తన భర్త సవీంద్రరెడ్డిని పోలీసులు ఈనెల 22న సాయంత్రమే అరెస్ట్ చేశారంటూ రాత్రి 7 గంటల సమయంలో పిటిషనర్ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తే... మీరు మాత్రం రాత్రి 7.30–8.45 గంటల మధ్య అరెస్ట్ చేశామని ఎలా చెబుతారని విస్మయం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి తాము తాడేపల్లి పోలీస్స్టేషన్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాలని నిర్ణయించినట్లు హైకోర్టు ప్రకటించింది. రాత్రి 8.30 గంటలకు సవీంద్రరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేస్తే, ఆమె 7 గంటలకే ఫిర్యాదు చేసేందుకు తాడేపల్లి పోలీస్స్టేషన్కు ఎందుకు వెళతారని ప్రశ్నించింది. -
1,036 ఎకరాల ఆలయ భూమికి హైకోర్టు 'రక్ష'!
సాక్షి, అమరావతి: వేల కోట్ల రూపాయల విలువైన 1,036.37 ఎకరాల దేవదాయ భూమిని అక్రమంగా కొట్టేసేందుకు కూటమి ప్రభుత్వ పెద్దలు చేసిన కుట్రను హైకోర్టు భగ్నం చేసింది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం వినగడప గ్రామంలోని 300 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ జగన్మోహన వేణుగోపాలస్వామి దేవస్థానానికి ఇదే మండలం నారికంపాడు గ్రామంలోని పలు సర్వే నెంబర్లలో ఉన్న ఈ భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని జిల్లా రిజిస్ట్రార్ను కోరుతూ దేవదాయశాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఈ ఏడాది ఆగస్టు 13న రాసిన లేఖ అమలును హైకోర్టు నిలిపేసింది. ఈ భూమి విషయంలో ఎలాంటి థర్డ్ పార్టీ హక్కులను సృష్టించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు దేవస్థానాలకు చెందిన భూములను తీసుకునే విషయంలో ప్రభుత్వానికి ఏం అధికారం ఉందో తేలుస్తామంది. దీనిపై లోతైన విచారణ జరుపుతామని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.అక్టోబర్ 27న తదుపరి విచారణఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, జిల్లా దేవదాయ అధికారి, జిల్లా రిజిస్ట్రార్, జిల్లా కలెక్టర్, శ్రీ జగన్మోహన వేణుగోపాలస్వామి దేవస్థానం ఈవోలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 27కి వాయిదా వేసింది. హైకోర్టు ఉత్తర్వులు 28.35 ఎకరాలకే, కానీ..వ్యాజ్యానికి సంబంధించి 1,036.37 ఎకరాల భూమిలో 28.35 ఎకరాల భూమి తమదేనంటూ మేకా తనుజ్ రంగయ్య అప్పారావు మరికొందరు 2022లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ 28.35 ఎకరాల భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని వారు కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి ఈ 28.35 ఎకరాలను మాత్రమే నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని అధికారులను ఆదేశిస్తూ గత ఏడాది అక్టోబర్ 18న తీర్పునిచ్చారు. ఈ తీర్పును అమలు చేయాలంటూ అప్పారావు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ను కోరారు. దీంతో కలెక్టర్ లక్ష్మీశ ఈ ఏడాది జనవరిలో హైకోర్టు తీర్పును జిల్లా రిజిస్ట్రార్ ద్వారా దేవదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే దేవదాయ కమిషనర్ రామచంద్ర మోహన్ ఏకంగా దాదాపు రూ. వెయ్యి కోట్ల రూపాయల విలువచేసే 1,036.37 ఎకరాల భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని జిల్లా రిజిస్ట్రార్కు లేఖ రాశారు.అప్పీల్కూ వెళ్లని వైనంఇక్కడ చెప్పుకోవాల్సిన మరో ముఖ్యాంశం ఏమిటంటే.. 28.35 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది కాదని, అది తమ భూమేనంటూ వాదించిన దేవదాయ శాఖ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్ సైతం దాఖలు చేయలేదు. ఈ భూమిని కాజేయాలని కూటమి ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కుట్రపన్నడంతో దేవదాయ శాఖ అప్పీల్ జోలికి వెళ్లకపోవడం గమనార్హం. 28.35 ఎకరాలు ప్రైవేటు వ్యక్తులకు ఎలా రిజిస్టర్ చేశారు? :పిటిషనర్ వాదనలుఈ మొత్తం వ్యవహారంపై గంపలగూడెంకి చెందిన అన్నవరపు క్రాంతికుమార్, విజయవాడకు చెందిన న్యాయవాది అనంతలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల న్యాయవాది సీవీఆర్ రుద్రప్రసాద్ వాదనలు వినిపించారు. వాస్తవానికి 28.35 ఎకరాల భూమి దేవదాయ భూమి అయినప్పుడు, దానిని ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం ఎలా సాధ్యమని ఈ సందర్భంగా వాదించారు. నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ప్రైవేటు వ్యక్తుల పేరు మీద ఎలా రిజిస్టర్ చేశారో అర్థం కావడం లేదన్నారు. ఎకరాకు రూపాయి చొప్పున భత్యం: ప్రభుత్వ వాదనలుప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, జిల్లా కలెక్టర్ ఈ భూమిని ఎకరాకు రూ.1.04 చొప్పున ఏడాదికి రూ. 1,080 భత్యం చెల్లించే ఒప్పందంతో స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. 1991 నుంచి 2006 వరకు భత్యం చెల్లించడం జరిగిందన్నారు. ఆ తరువాత ఈ భూమిని నిషేధిత భూముల జాబితాలో చేర్చడం జరిగిందని తెలిపారు.వెలుగులోకి తెచ్చిన సాక్షి1, 036.37 ఎకరాల భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలంటూ దేవదాయ శాఖ కమిషనర్ రాసిన లేఖ వెనుక కూటమి ప్రభుత్వ పెద్దలు ఉన్న విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ‘గుడి వెనుక గూడు పుఠాణీ’ పేరుతో ఈ సెప్టెంబర్ 12న ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ కథనం ప్రభుత్వ పెద్దల్లో కలవరం సృష్టించింది. -
అక్రమ మద్యం కేసులో సిట్ రాజకీయం.. బయటపడ్డ నిజాలు
-
అడ్డంగా దొరికిన పోలీసులు.. హైకోర్టు ఆగ్రహం..
-
మఫ్టీలో వెళ్లి.. పౌరుల అరెస్టులా?
సాక్షి అమరావతి: పోలీసులు యూనిఫామ్లో కాకుండా.. సివిల్ దుస్తుల్లో వెళ్లి అరెస్టులు చేస్తుండటాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ విషయంలో సాక్షాత్తూ సుప్రీంకోర్టు తీర్పునే పట్టించుకోరా? అని సూటిగా నిలదీసింది. ఇదెక్కడి సంస్కృతి అంటూ ప్రశ్నించింది. మఫ్టీలో వెళ్లి సోషల్ మీడియా యాక్టివిస్టు కుంచాల సౌందరరెడ్డిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. అసలు పౌరులను అరెస్ట్ చేయడానికి మఫ్టీలో ఎందుకు వెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అందరూ పాటించాల్సిందేనంది. సుప్రీంకోర్టు ఆదేశాలు మీకు వర్తించవని అనుకుంటున్నారా..? అని నిలదీసింది. తన భర్త సౌందరరెడ్డిని పోలీసులు ఈనెల 22న సాయంత్రమే అరెస్ట్ చేశారంటూ రాత్రి 7 గంటల సమయంలో పిటిషనర్ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తే... మీరు మాత్రం రాత్రి 7.30–8.45 గంటల మధ్య అరెస్ట్ చేశామని ఎలా చెబుతారని విస్మయం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి తాము తాడేపల్లి పోలీస్స్టేషన్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాలని నిర్ణయించినట్లు హైకోర్టు ప్రకటించింది. రాత్రి 8.30 గంటలకు సౌందరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేస్తే, ఆమె 7 గంటలకే ఫిర్యాదు చేసేందుకు తాడేపల్లి పోలీస్స్టేషన్కు ఎందుకు వెళతారని ప్రశ్నించింది. సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తాం... ఒకవేళ పిటిషనర్ లక్ష్మీప్రసన్న(సౌందరరెడ్డి భార్య) తన భర్త అక్రమ నిర్బంధంపై ఫిర్యాదు చేసేందుకు రాత్రి 7 గంటలకు తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తే పోలీసులు చెప్పేదంతా అబద్ధమని తేలిపోతుందని హైకోర్టు తేల్చి చెప్పింది. అందువల్ల ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి అదే రోజు అర్థరాత్రి 12 గంటల వరకు సీసీటీవీ ఫుటేజీని తమ ముందుంచాలని తాడేపల్లి పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈలోపు సౌందరరెడ్డిని స్వేచ్ఛగా వదిలేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణకు కోర్టు ముందు హాజరు కావాలని ఆయన్ను ఆదేశించింది. 22, 23వ తేదీల్లో సౌందరరెడ్డి ఎక్కడున్నారో నిర్ధారించేందుకు అతనున్న సెల్ఫోన్ టవర్ వివరాలను తమ ముందుంచాలని జియోను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్ల ధర్మాసనంబుధవారం ఉత్తర్వులిచ్చింది. అక్రమ నిర్బంధంపై పిటిషన్... తన భర్త సౌందరరెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ కుంచాల లక్ష్మీప్రసన్న హైకోర్టులో మంగళవారం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. అయితే సౌందరరెడ్డిని తాము అదుపులోకి తీసుకోలేదని, ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. దీంతో సౌందరరెడ్డి ఎక్కడున్నా వెతికి తమ ముందు మాత్రమే హాజరుపరచాలని, ఆయన్ను ఏ కేసులోనూ మేజి్రస్టేట్ ముందు హాజరుపరచడానికి వీల్లేదని పోలీసులను ధర్మాసనం ఆదేశించిన విషయం తెలిసిందే. బుధవారం ఈ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) తిరుమాను విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ సౌందరరెడ్డిని ప్రత్తిపాడు పోలీసులు గంజాయి కేసులో అరెస్ట్ చేశారన్నారు. సౌందరరెడ్డి ఎక్కడ ఉన్నారో తెలియదని పిటిషనర్ చెబుతున్నారని, వాస్తవానికి ఆయన ఎక్కడున్నారనే విషయం వారికి తెలుసునన్నారు. సౌందరరెడ్డిని కోర్టుకు తెచ్చినప్పుడు అక్కడికి ఆయన బావ మరిది వచ్చారన్నారు. ధర్మాసనం స్పందిస్తూ బావ మరిది కోర్టుకు రాకూడదా? దీనికి, సౌందరరెడ్డి అరెస్ట్కు ఏం సంబంధం ఉందని ప్రశ్నించింది. తన భర్తను అపహరించారని లక్ష్మీప్రసన్న ఫిర్యాదు చేస్తే దానిపై పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని నిలదీసింది. కేవలం జనరల్ డైరీలో రాసి చేతులు దులుపుకొన్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. హైకోర్టు చెప్పినా వినకుండా.. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు... ఈ సమయంలో లక్ష్మీప్రసన్న తరఫు న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణరెడ్డి స్పందిస్తూ, సౌందరరెడ్డిని మేజి్రస్టేట్ ముందు హాజరుపరచడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టంగా చెప్పినా పోలీసులు ఖాతరు చేయకుండా మేజి్రస్టేట్ ముందు హాజరుపరిచారని తెలిపారు. అది కూడా హైకోర్టులో విచారణ జరుగుతుండగానే పోలీసులు ఆయన్ను మేజి్రస్టేట్ వద్దకు తీసుకెళ్లారన్నారు. అయితే హైకోర్టు ఉత్తర్వుల గురించి తాము మేజిస్ట్రేట్ కు నివేదించడంతో ఆయన రిమాండ్ విధించకుండా సౌందరరెడ్డిని హైకోర్టు ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించారన్నారు. సౌందరరెడ్డిని పోలీసులు సివిల్ దుస్తుల్లో వచ్చి పట్టుకెళ్లారని రామలక్ష్మణరెడ్డి హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీ, ఫోటోలున్నాయన్నారు. ‘సుప్రీం’ ఆదేశాలు మీకు వర్తించవా..? ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ అసలు పోలీసులు యూనిఫామ్లో కాకుండా సివిల్ దుస్తుల్లో వచ్చి ఎలా అరెస్టులు చేస్తారని ప్రశ్నించింది. కోర్టులోనే ఉన్న ప్రత్తిపాడు సీఐ శ్రీనివాస్తో నేరుగా ధర్మాసనం మాట్లాడింది. సివిల్ దుస్తుల్లో అరెస్టులు చేయడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధం కదా? మరి మీరెందుకు సివిల్ దుస్తుల్లో వెళుతున్నారు? ఇదేం సంస్కృతి? సుప్రీంకోర్టు ఆదేశాలు మీకు వర్తించవని అనుకుంటున్నారా? మఫ్టీలో ఎందుకు అపార్ట్మెంట్ వద్దకు వెళ్లారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. యూనిఫామ్లో ఉంటే నిందితులు పారిపోతారని మఫ్టీలో ఉంటున్నామని సీఐ చెప్పారు. ఈ సమాధానంపై ధర్మాసనం సంతృప్తి చెందలేదు. నన్ను, నా భార్యను పోలీసులు బాగా ఇబ్బంది పెట్టారు... ఇంతకీ సౌందరరెడ్డి ఎక్కడ ఉన్నారని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించడంతో.. కోర్టు ముందుకు తీసుకొచ్చామంటూ పోలీసులు ఆయన్ను ప్రవేశపెట్టారు. సహ నిందితుల వాంగ్మూలం ఆధారంగా సౌందరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారని రామలక్ష్మణరెడ్డి తెలిపారు. రిమాండ్ రిపోర్టులో రాత్రి 7.30 గంటలకు అతన్ని పాతూరు రోడ్డులో అరెస్ట్ చేశారని పేర్కొన్నారని, అయితే నిర్దిష్టంగా ఏ ప్రాంతంలో అరెస్ట్ చేశారో మాత్రం పేర్కొనలేదన్నారు. వాస్తవానికి సౌందరరెడ్డిని పోలీసులు 22 సాయంత్రమే అరెస్ట్ చేశారన్నారు. అంతకు ముందు పోలీసులు మఫ్టీలో అపార్ట్మెంట్కు సైతం వచ్చి వెళ్లారన్నారు. అదే రోజు రాత్రి 7 గంటలకే లక్ష్మీప్రసన్న తాడేపల్లి పోలీస్స్టేషన్కు వెళ్లి సౌందరరెడ్డి అపహరణపై ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం కోర్టులో ఉన్న సౌందరరెడ్డితో స్వయంగా మాట్లాడటంతో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పోలీసులు తనను, తన భార్యను బాగా ఇబ్బంది పెట్టారని వెల్లడించారు. గంజాయి కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. -
‘సిట్’ తీరు మోసపూరితం
సాక్షి, అమరావతి: మద్యం విధానంపై అక్రమ కేసులో దర్యాప్తు చేస్తున్న ‘సిట్’.. సాక్షాత్తూ కోర్టు పట్ల మోసపూరితంగా వ్యవహరించిందని విశ్రాంత ఐపీఎస్ అధికారి కాల్వ ధనుంజయరెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన సిట్ రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటి వరకూ ఏ రాష్ట్రంలోనూ ఇలా అసాధారణంగా వ్యవహరించలేదన్నారు. చార్జిషీట్లో పలు లోపాలను ప్రస్తావిస్తూ, వాటిని సరిదిద్దాలని ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశించినా సిట్ ఆ పని చేయకుండా తప్పును కోర్టుపై నెట్టేస్తోందని నివేదించారు. ఇప్పటి వరకు సాగించిన దర్యాప్తులో నిందితుల పాత్రపై నిర్దిష్ట ఆధారాలు సేకరించలేకపోయిన సిట్, ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టుల గురించి చెబుతూ బెయిల్ను అడ్డుకుంటోందన్నారు. చట్ట ప్రకారం 90 రోజుల్లోపు చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంటుందని, లేని పక్షంలో బెయిల్ పొందేందుకు నిందితులకు అవకాశం ఉంటుందన్నారు. అయితే సిట్ ఉద్దేశపూర్వకంగా ప్రతిసారీ 89వ రోజునే చార్జిషీట్లు దాఖలు చేస్తోందని తెలిపారు. దర్యాప్తు పూర్తి కానప్పటికీ నిందితుల బెయిల్ను అడ్డుకునేందుకే ఇలా చేస్తూ వస్తోందని కోర్టుకు నివేదించారు. ఒకే కేసులో వేర్వేరుగా, ఎంపిక చేసుకున్న విధంగా, కావాల్సిన సమయంలో చార్జిషీట్లు దాఖలు చేస్తూ వస్తోందన్నారు. ఏ ఒక్కరూ బెయిల్పై బయటకు రాకుండా చేసేందుకే సిట్ ఇలా అనుచితంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఆధారాల్లేకపోయినా జైల్లోనే ఉంచాలని చూస్తోంది...నిందితుల వ్యక్తిగత స్వేచ్ఛే కోర్టుల పరమావధి అవుతుందని నిరంజన్రెడ్డి వివరించారు. దర్యాప్తు సంస్థలు దర్యాప్తును నిరాటంకంగా కొనసాగించుకోవచ్చునని, అయితే దర్యాప్తు పూర్తయ్యేంత వరకు నిందితులను జైల్లోనే ఉంచాలని కోరడానికి వీల్లేదన్నారు. సిట్ ప్రస్తుత కేసులో నిందితులను జైల్లోనే ఉంచాలన్న దురుద్దేశంతో వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటి వరకు కేవలం 16 మందిపై మాత్రమే చార్జిషీట్ దాఖలు చేసిందని తెలిపారు. దర్యాప్తులో కొత్తగా తేల్చేది ఏమీ లేకపోయినా, ఆధారాలు ఏమీ లేకపోయినా మిగిలిన నిందితులకు బెయిల్ రాకుండా చేసేందుకు పలు చార్జిషీట్లు దాఖలు చేస్తోందన్నారు. సిట్ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తోందన్నారు. సాంకేతిక కోణంలో ఈ కేసును చూడరాదని నిరంజన్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో ధనుంజయరెడ్డికి ఏసీబీ కోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ సిట్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేయాలని కోరారు. అనంతరం సిట్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ, దర్యాప్తు పూర్తయినంత వరకు ఆ వివరాలతో చార్జిషీట్లు దాఖలు చేస్తూ వస్తున్నామన్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు సందేహాల నివృత్తి నిమిత్తం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ రోజున తీర్పు రిజర్వ్ చేసే అవకాశం ఉంది. అన్నీ పరిగణనలోకి తీసుకున్నాకే డీఫాల్ట్ బెయిల్...వాస్తవానికి ఏసీబీ ప్రత్యేక కోర్టు తమ ముందున్న అన్ని ఆధారాలను పరిగణనæలోకి తీసుకున్నాకే ధనుంజయరెడ్డి తదితరులకు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసిందన్నారు. డీఫాల్ట్ బెయిల్ను ఎందుకు మంజూరు చేస్తుందో కూడా చాలా స్పష్టంగా చెప్పిందన్నారు. ఈ కేసులో వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛ ముడిపడి ఉందన్నారు. రాజ్యాంగం ప్రకారం అన్నింటి కంటే వ్యక్తిగత స్వేచ్ఛే సర్వోత్కృష్టమైందన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా సిట్ వ్యవహరిస్తోందని తెలిపారు. వ్యక్తిగత స్వేచ్ఛను పణంగా పెట్టడానికి రాజ్యాంగం అంగీకరించదన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకున్న ప్రాముఖ్యతను సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పిందన్నారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు 24 గంటలకు మించి తమ కస్టడీలో ఉంచుకోవడానికి వీల్లేదని, నిందితుల వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలగరాదన్నదే చట్టం ఉద్దేశమన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకు న్యాయస్థానాలు పరిరక్షకులుగా ఉంటాయన్నారు. పోలీసు కస్టడీ ముగిసిన వెంటనే నిందితుడు బెయిల్ కోసం దాఖలు చేసుకోవచ్చునని, అయితే దర్యాప్తు పెండింగ్లో ఉంటే కోర్టులు సహజంగా బెయిల్ను తిరస్కరిస్తుంటాయన్నారు. దర్యాప్తు పేరుతో నిందితులను అలా జైల్లోనే ఉంచేస్తామంటే కుదరదని, అందుకే చట్టం 60, 90 రోజుల గడువును విధించిందని నివేదించారు. ఈ గడువులోపు చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. చార్జిషీట్ దాఖలు చేసిన తరువాత నిందితులను జైల్లో ఉంచాల్సిన అవసరం ఎంత మాత్రం ఉండదని స్పష్టం చేశారు. -
జగన్ ప్రతిపక్ష హోదా పిటిషన్.. చంద్రబాబుకు బిగ్ షాక్
-
సవీంద్రరెడ్డిని తక్షణమే రిలీజ్ చేయండి: ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్టు సవీంద్రరెడ్డి(కుంచాల సౌందరరెడ్డి) అక్రమ అరెస్టును ఏపీ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలంటూ బుధవారం తాడేపల్లి పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో ఉన్నత న్యాయస్థానం పోలీసుల తీరును తీవ్రంగా ఆక్షేపించింది.సవీందర్రెడ్డి(Savindra Reddy) కేసులో తాడేపల్లి పోలీసులు హైకోర్టుకు అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఆయన్ని అరెస్టు చేసిన సమయంపై రిమాండ్ రిపోర్టులో తప్పుడు సమాచారం పొందుపర్చారు. సాయంత్రం 7గం. సమయంలో అదుపులోకి తీసుకున్నామని అందులో పేర్కొన్నారు. అయితే.. అయితే ఆయనను సాయంత్రం 4.30గంటలకే అరెస్టు చేసినట్లు సవీంద్ర రెడ్డి తరఫు లాయర్ సీసీటీవీ ఫుటేజ్ను కోర్టుకు సమర్పించారు. దీంతో పోలీసులు చెబుతున్న విషయంపై అనుమానాలు వ్యక్తం చేసిన హైకోర్టు(AP High Court).. ఆ వీడియోపై ప్రశ్నలు గుప్పించింది. ఈ వ్యవహారంలో అనుమానాలు ఉన్నాయిని.. పేర్కొంటూ సీసీటీవీ ఫుటేజీతో పాటు ఎక్కడ, ఎప్పుడు అరెస్ట్ చేశారో పూర్తి దర్యాఫ్తు చేసి నివేదిక ఇవ్వాలని మంగళగిరి కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం లోపు ఈ వివరాలను తెలియజేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. తక్షణమే ఆయన్ని విడుదల చేయాలంటూ ఆదేశించింది.అదే సమయంలో.. సవీంద ర్రెడ్డిని అరెస్టు చేసిన విధానంపైనా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నా.. అరెస్ట్ చేయడానికి యూనిఫారమ్లో ఎందుకు వెళ్లలేదని ఎస్హెచ్వోను ప్రశ్నించింది. సవీందర్రెడ్డి భార్య కంప్లైంట్ చేసినా ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, ఆ కంప్లైంట్ను కేవలం జీడీ ఎంట్రీ మాత్రమే చేయడం ఏంటని నిలదీసింది. ఈ క్రమంలో.. సవీంద ర్రెడ్డిని ఏం జరిగిందో చెప్పాలని న్యాయమూర్తులు అడిగారు. తన భార్యతో ఉండగా పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారని, గంజాయి గురించి ఏమీ తెలియదని ఆ సమయంలో సవీంద్ర కన్నీరు పెట్టుకున్నారు. ఓ పౌరుడిని పోలీసులు చాలా క్యాజువల్గా వచ్చి పట్టుకుపోయి తిప్పుతూ ఉంటే.. మేం చూస్తూ ఊరుకోవాలా? ఇంత చేస్తున్నా కూడా మేం జోక్యం చేసుకోకూడదా? తన భర్త సౌందరరెడ్డిని అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని అతడి భార్య ఫిర్యాదు ఇస్తే జనరల్ డైరీ (జీడీ)లో ఎంట్రీ చేసి మౌనంగా ఉండిపోతారా? ఓ మహిళ ఫిర్యాదు ఇస్తే దానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయరా? మీరు ఇంత చేస్తుంటే.. మమ్మల్ని చూస్తూ మౌనంగా ఉండమంటారా..?– తాడేపల్లి పోలీసులపై హైకోర్టు ఆగ్రహంఇదీ చదవండి: సవీంద్ర అక్రమ అరెస్ట్.. తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే యత్నం! -
హైకోర్టుకే అబద్ధాలు చెప్పి అడ్డంగా దొరికి చివాట్లు తిన్న పోలీసులు
-
వైఎస్ జగన్ పిటిషన్.. స్పీకర్ అయ్యన్నకి నోటీసులు
సాక్షి, అమరావతి: సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష తిరస్కరిస్తూ ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీసుకొచ్చిన రూలింగ్ను వైఎస్ జగన్ సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, స్పీకర్ కార్యదర్శి, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్తోపాటు శాసనవ్యవహారాల కార్యదర్శికి నోటీసులు జారీ అయ్యాయి. జగన్ పిటిషన్ ఆధారంగా ఈ ప్రతివాదులను కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకూడదనే ఉద్దేశంతో ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఫిబ్రవరి 5వ తేదీన ఓ రూలింగ్ను తీసుకొచ్చారు. దీనిని సవాల్ చేస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) న్యాయ పోరాటానికి దిగారు. ‘‘స్పీకర్ రూలింగ్ వెనుక రాజకీయ వైరం, పక్షపాతం ఉన్నాయి. ఇది స్పీకర్ ఒక్కరి నిర్ణయమే కాదు.. అధికార పార్టీ సమిష్టి నిర్ణయం. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందే నిర్ణయించుకున్నారు. శాసన వ్యవహారాల మంత్రి కూడా మీడియాతో ఇదే చెప్పారు. స్పీకర్ చేసిన రూలింగ్ నిష్పాక్షికంగా, తటస్థంగా లేదు. .. ప్రతిపక్ష నేత గురించి రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అలాగే చట్టంలో కూడా స్పష్టమైన నిర్వచనం ఉంది. సీట్ల ఆధారంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎక్కడా లేదు. అయినా కూడా చట్టంలోని లేని పరిమితిని స్పీకర్ తన రూలింగ్లో నిర్దేశించారు. వైఎస్సార్సీపీనే ఏకైక ప్రతిపక్ష పార్టీ. ఆ పార్టీ నాయకుడిగా నేనే ప్రతిపక్ష నేతను అవుతాను. .. ప్రతిపక్షాన్ని అణచివేయడమే స్పీకర్ రూలింగ్ లక్ష్యంగా కనిపిస్తోంది. కాబట్టి ఈ రూలింగ్ను ఆంధ్రప్రదేశ్ జీత భత్యాలు, పెన్షన్లు, అనర్హతల తొలగింపు చట్టానికి విరుద్ధంగా ప్రకటించాలి. వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్షం.. నాకు ప్రతిపక్ష నేత హోదా ప్రకటించేలా స్పీకర్ను ఆదేశించాలి’’ అని తన పిటిషన్లో వైఎస్ జగన్ కోర్టును(Jagan Petition in AP High Court) కోరారు. ఇదిలా ఉంటే.. వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న అభ్యర్థనను స్పీకర్ అయ్యన్నపాత్రుడు పెండింగ్లో ఉంచుతూ వచ్చారు. దీంతో ఈ అంశాన్ని సవాల్ చేస్తూ కిందటి ఏడాది జులైలోనే వైఎస్ జగన్ ఏపీ హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ విచారణ పెండింగ్లో ఉండగానే.. ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఓ రూలింగ్ తెచ్చారు. జగన్ చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవడం లేదంటూ ఆ రూలింగ్లో పేర్కొన్నారు. అయితే ఆ రూలింగ్ రాజకీయ ప్రేరేపితంగా ఉందంటూ జగన్ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్లో.. గతంలో పలు పార్టీలకు, వాటి అధినేతలకు సీట్ల సంఖ్య లేకపోయినా ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కిన ఉదంతాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఇదీ చదవండి: స్పీకర్ అయ్యన్న రూలింగ్ వెనుక.. -
హైకోర్టుకు జగన్.. బాబు వెన్నులో వణుకు
-
ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ పిటిషన్
-
పోలీసుల బరితెగింపు..హైకోర్టుకు బురిడీ... ఆదేశాలు బేఖాతర్
సాక్షి అమరావతి/సాక్షి,గుంటూరు: రాష్ట్రంలో పోలీసుల అరాచకాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పోలీసులే కిడ్నాపర్లుగా మారుతుండటం విభ్రాంతి కలిగిస్తోంది.అంతేకాదు.. ఏకంగా హైకోర్టుకే బురిడీ కొట్టించేందుకు యత్నించడం పోలీసుల బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. కేసు నమోదు చేయకుండా.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పాతూరులో సోషల్ మీడియా కార్యకర్త సౌందరరెడ్డి(సవీంద్రరెడ్డి)ని ప్రత్తిపాడు పోలీసులు సోమవారం రాత్రి అపహరించారు. తన భార్య లక్ష్మీప్రసన్నతో కారులో వెళ్తున్న ఆయన్ని పోలీసులు బలవంతంగా తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. సౌందరరెడ్డి భార్యను రోడ్డుపై వదిలేసి ఆయన్ను కారుతో సహా అపహరించడం తీవ్ర కలకలం రేపింది. తాము తాడేపల్లి పోలీసులమని.. ఓ కేసులో విచారించి అరగంటలో ఆయన్ను పంపేస్తామని ఆమెతో నమ్మబలికారు. అయితే ఆమె తాడేపల్లి స్టేషన్కు వెళ్లగా.. అసలు సౌందరరెడ్డిని తాము తీసుకురాలేదని అక్కడి పోలీసులు చెప్పడం గమనార్హం. దాంతో తన భర్తను పోలీసుల పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు లక్ష్మీప్రసన్న తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ ఫిర్యాదుపై ఎటువంటి కేసు నమోదు చేయలేదు. దీనిపై సౌందరరెడ్డి భార్య లక్ష్మీప్రసన్న మంగళవారం ఉదయం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. మేం అదుపులోకి తీసుకోనే లేదు.. హైకోర్టుకు పోలీసుల బురిడీ..! హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ సందర్భంగా పోలీసులు మరింత బరి తెగించారు. మంగళవారం సాయంత్రం 4గంటల సమయంలో ఈ కేసు విచారణకు రాగా... అసలు సౌందరరెడ్డిని తాము అదుపులోకి తీసుకోనేలేదని హైకోర్టుకు పోలీసులు చెప్పడం గమనార్హం. ఆయన తమ అదుపులోనే లేరని చెప్పారు. మా ఎదుటే హాజరుపరచండి.. సౌందరరెడ్డిని బుధవారం తమ ఎదుట హాజరుపర్చాలని విచారణ సందర్భంగా హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అంతేకాదు.. ఆయన్ను మరే ఇతర మేజిస్ట్రేట్ కోర్టులోనూ హాజరుపరచవద్దని కూడా స్పష్టంగా తేల్చి చెప్పింది. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు.. గుంటూరు మేజిస్ట్రేట్ కోర్టులో హాజరున్యాయస్థానం ఇంత స్పష్టంగా చెప్పినా పోలీసుల తీరు మారలేదు! హైకోర్టు ఆదేశాలు అంటే తమకు ఏమాత్రం లెక్క లేదన్నట్టు వ్యవహరించారు. సౌందరరెడ్డిపై అక్రమంగా గంజాయి కేసు బనాయించారు. ఆయన్ను సోమవారం రాత్రంతా గుంటూరు సీసీఎస్ పోలీసు స్టేషన్లో నిర్బంధించారు. అనంతరం పోలీసులు మంగళవారం ఉదయం ఆయన్ను ప్రత్తిపాడు పోలీసు స్టేషన్కు తరలించి గంజాయి కేసులో ఆరో ముద్దాయిగా అక్రమంగా చేర్చారు. అంతటితో పోలీసులు ఆగలేదు.. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మరీ సౌందరరెడ్డిని గుంటూరు ఆరో అదనపు మేజిస్ట్రేట్ కోర్టు ముందు మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో హాజరుపరిచారు. అక్రమంగా గంజాయి కేసులో నిందితుడుగా చేరుస్తూ మేజిస్ట్రేట్ కోర్టులో సమర్పించేందుకు రిమాండ్ రిపోర్ట్ రూపొందించారు. అయితే హైకోర్టు ఆదేశాలపై సమాచారం ఉండటంతో పోలీసులు అతడిని తన ఎదుట హాజరుపరచడం సరికాదని మేజిస్ట్రేట్ స్పష్టంచేశారు. సౌందరరెడ్డిని బుధవారం ఉదయం హైకోర్టు ఎదుట హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేశారు. అప్పటి వరకూ న్యాయవాది సమక్షంలో ప్రత్తిపాడు పోలీసు కస్టడీలో ఉంచాలని ఆదేశించారు.నిర్భీతిగా హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన.. రాష్ట్రంలో పోలీసులు ఎంత చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నది... అక్రమ కేసులతో ఎంతగా వేధిస్తున్నారన్నది ఈ ఉదంతం మరోసారి నిరూపించింది. అంతేకాదు.. అవాస్తవ సమాచారంతో ఏకంగా హైకోర్టునే బురిడీ కొట్టించేందుకు యత్నిచడం తీవ్రంగా విస్మయ పరుస్తోంది. ఏకంగా హైకోర్టు ఆదేశాలను నిర్భీతిగా ఉల్లంఘించడం పోలీసుల బరితెగింపును బట్టబయలు చేస్తోంది. పోలీసుల తీరుపై హైకోర్టు బుధవారం ఎలా స్పందిస్తుందన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
పౌరులను పట్టుకెళుతున్నా చూస్తూ ఊరుకోవాలా?
ఓ పౌరుడిని పోలీసులు చాలా క్యాజువల్గా వచ్చి పట్టుకుపోయి తిప్పుతూ ఉంటే.. మేం చూస్తూ ఊరుకోవాలా? ఇంత చేస్తున్నా కూడా మేం జోక్యం చేసుకోకూడదా? తన భర్త సౌందరరెడ్డిని అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని అతడి భార్య ఫిర్యాదు ఇస్తే జనరల్ డైరీ (జీడీ)లో ఎంట్రీ చేసి మౌనంగా ఉండిపోతారా? ఓ మహిళ ఫిర్యాదు ఇస్తే దానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయరా? మీరు ఇంత చేస్తుంటే.. మమ్మల్ని చూస్తూ మౌనంగా ఉండమంటారా..?– ఖాకీల తీరుపై హైకోర్టు కన్నెర్రసాక్షి, అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్ట్లపై పోలీసుల అరాచకాలు ఆగడం లేదు. హైకోర్టు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా ఖాతరు చేయడం లేదు. తీరు మార్చుకోవడం లేదు. అబద్ధాలతో న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు సైతం వెనుకాడటం లేదు. తాజాగా ఇలాగే కోర్టుకు అబద్ధం చెప్పి తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. సోషల్ మీడియా యాక్టివిస్టు కుంచాల సౌందరరెడ్డి అలియాస్ సవీంద్రరెడ్డిని అక్రమంగా నిర్బంధించిన పోలీసులు అసలు ఆయన ఎక్కడున్నాడో తమకు తెలియనే తెలియదంటూ బుకాయించి హైకోర్టును తప్పుదోవ పట్టించే యత్నం చేశారు. అయితే ఖాకీల తీరు గురించి బాగా తెలిసిన హైకోర్టు వెంటనే అప్రమత్తమైంది. సౌందరరెడ్డి ఎక్కడున్నా సరే గాలించి బుధవారం తమ ముందు హాజరుపరచాల్సిందేనని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పోలీసులను ఆదేశించింది. ఆయన్ను మరో కేసులో అరెస్ట్ చేశామంటూ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి కూడా వీల్లేదని హెచ్చరించింది. సౌందరరెడ్డిని నేరుగా తమ ముందు మాత్రమే హాజరుపరిచి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. ఒకవేళ సౌందరరెడ్డిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు సిద్ధమైతే.. అతడిని తమ ముందే హాజరుపరిచి తీరాలన్న తమ ఉత్తర్వుల గురించి సంబంధిత పోలీసులకు, మేజిస్ట్రేట్కు స్పష్టంగా చెప్పి తీరాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) టి.విష్ణుతేజకు తేల్చి చెప్పింది. సోషల్ మీడియా యాక్టివిస్టు సౌందరరెడ్డిని ఒంగోలు పోలీసు ట్రైనింగ్ అకాడమీ (పీటీఏ)లో అక్రమంగా నిర్బంధించారని పిటిషనర్ తరఫు న్యాయవాది చెబుతున్న నేపథ్యంలో, పీటీఏ డైరెక్టర్ను ఈ వ్యాజ్యంలో సుమోటో ప్రతివాదిగా చేరుస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచి తీరాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిని ఆదేశిస్తూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.అక్రమ నిర్బంధంపై లంచ్మోషన్ పిటిషన్..గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు తన భర్తను అక్రమంగా నిర్బంధించారని, అరగంటలో ఇంటికి పంపేస్తామంటూ తీసుకెళ్లారని, ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ సౌందరరెడ్డి భార్య లక్ష్మీప్రసన్న మంగళవారం అత్యవసరంగా లంచ్మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ రఘునందన్రావు ధర్మాసనం విచారణ జరిపింది.ఫిర్యాదు ఇచ్చినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు..పిటిషనర్ తరఫున న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపించారు. ఇంటికి వెళుతున్న సౌందరరెడ్డిని తాడేపల్లి పోలీసులు తీసుకెళ్లారన్నారు. ఏ కేసులో తీసుకెళుతున్నారు..? ఎక్కడికి తీసుకెళుతున్నారు..? లాంటి వివరాలు ఏమీ చెప్పలేదన్నారు. ఆయన జాడ ఇప్పటివరకు తెలియడం లేదన్నారు. పోలీసులు అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలు పెడుతున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. బాధితుడు ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో ఉన్నట్లు తెలిసిందని రామలక్ష్మణరెడ్డి చెప్పారు. దీనిపై ఫిర్యాదు ఇచ్చినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు.లలితకుమారి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. దీనిపై హైకోర్టు ధర్మాసనం పోలీసుల తరఫున హాజరవుతున్న ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది విష్ణుతేజను వివరణ కోరగా.. సౌందరరెడ్డిని ఏ పోలీసు అధికారీ తాడేపల్లి స్టేషన్కు తీసుకురాలేదని చెప్పారు. అసలు సౌందరరెడ్డి ఎక్కడున్నాడో తమకు తెలియదన్నారు. ఆయన్ను ఏ పోలీసూ అదుపులోకి తీసుకోలేదన్నారు. తన భర్తను కొందరు తీసుకెళ్లారంటూ పిటిషనర్ లక్ష్మీప్రసన్న ఫిర్యాదు చేశారని, దానిని తాము జనరల్ డైరీలో నమోదు చేశామని కోర్టుకు నివేదించారు. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకుని చెబుతానన్నారు. అయితే పోలీసుల తీరుపై అనుమానం వ్యక్తం చేసిన హైకోర్టు.. అసలు ఓ మహిళ ఫిర్యాదు చేస్తే దానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కేవలం జనరల్ డైరీలో మాత్రమే నమోదు చేయడం ఏమిటని సూటిగా ప్రశ్నించింది. లలితకుమారి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. సౌందరరెడ్డి ఎక్కడ ఉన్నా కూడా ఆచూకీ తెలుసుకుని బుధవారం తమ ముందు హాజరుపరిచి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. రిమాండ్ రిపోర్ట్ సైతం సిద్ధం చేసి..వాస్తవానికి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పోలీసులు సౌందరరెడ్డిని సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలలోపు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు సిద్ధమయ్యారు. ఆ మేరకు రిమాండ్ రిపోర్ట్ సైతం సిద్ధం చేశారు. అయితే ఈ విషయాలన్నీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదికి తెలిసినప్పటికీ ఆయన కోర్టుకు వాస్తవాలు వెల్లడించలేదు. అసలు సౌందరరెడ్డి తమ అధీనంలోనే లేరంటూ చెప్పారు. మధ్యాహ్నం 3.30 గంటలలోపు సౌందరరెడ్డిని కోర్టు ముందు హాజరుపరిచేందుకు సిద్ధమైన పోలీసులు.. అనంతరం అసలు ఆయన తమ అధీనంలోనే లేరని సాయంత్రం 4 గంటల సమయంలో హైకోర్టుకు చెప్పడం గమనార్హం.తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే యత్నం...!పరిస్థితి చేయిదాటి పోతుండటంతో పోలీసుల తప్పిదాన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వప్రత్యేక న్యాయవాది ప్రయత్నించారు. సౌందరరెడ్డిని ఏ పోలీసూ అదుపులోకి తీసుకోలేదని తొలుత చెప్పిన ఆయన తరువాత మాట మార్చారు. ఒకవేళ ఏదైనా ఇతర కేసులో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఉంటే..! అంటూ కప్పదాటు వైఖరి అనుసరించారు. అప్పటికే ధర్మాసనానికి మొత్తం వ్యవహారం అర్థం కావడంతో.. సౌందరరెడ్డిని ఏ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఏ కేసులోనైనా సరే.. సౌందరరెడ్డిని తమ ముందు మాత్రమే హాజరుపరిచి తీరాలని ధర్మాసనం పోలీసులకు అల్టిమేటం జారీ చేసింది. ఈ విషయంలో మరో మాటకు తావు లేదంటూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. -
స్పీకర్ రూలింగ్ను చట్ట విరుద్ధంగా ప్రకటించండి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: శాసనసభలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు తిరస్కరిస్తూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఇచ్చిన రూలింగ్ను సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ రూలింగ్ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రూలింగ్ను ఆంధ్రప్రదేశ్ జీత భత్యాలు, పెన్షన్లు, అనర్హతల తొలగింపు చట్టానికి విరుద్ధంగా ప్రకటించాలని కోరారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కోరారు. ఈ వ్యాజ్యంలో శాసనసభ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శి, న్యాయ, శాసన వ్యవహారాల శాఖ కార్యదర్శితోపాటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు విచారణ జరపనుంది. వైఎస్ జగన్ పిటిషన్లో ఏం చెప్పారంటే..నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని ముందే నిర్ణయంగత ఏడాది మే 21వ తేదీన కొత్తగా ఎన్నికైన శాసనసభ సభ్యులకు ప్రమాణస్వీకార కార్యక్రమం చేపట్టారు. శాసనసభలో అనుసరిస్తున్న ఆనవాయితీ ప్రకారం మొదటగా శాసనసభ పక్ష నేత లేదా అధికార కూటమి పార్టీ నాయకుడు ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత ప్రతిపక్షాల నుంచి ప్రతిపక్ష నేతగా పరిగణించే సభ్యుడి ప్రమాణ స్వీకారం జరగాలి. కానీ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అనుసరించిన విధానం మాత్రం ఈ ఆనవాయితీకి విరుద్ధంగా ఉంది. మొదట శాసనసభ పక్ష నేత అయిన ముఖ్యమంత్రి ప్రమాణం చేశారు. ఆ తర్వాత మంత్రివర్గ సభ్యులు ప్రమాణం చేశారు. ఆ తర్వాతే నా వంతు వచ్చింది. తద్వారా ప్రతిపక్ష నేత పదవిని వైఎస్సార్సీపీ శాసనసభ పక్షానికి ఇవ్వకూడదన్న నిర్ణయానికి ముందుగానే వచ్చేశారు. రాష్ట్ర ప్రజల తరఫున ప్రశ్నలు లేవనెత్తే ప్రతిపక్ష స్వరాన్ని అణచి వేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారన్నది నాకు స్పష్టంగా అర్థమైంది. తెలుగుదేశం–జనసేన–బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమే. ఎన్నికల అనంతరం కూడా వైఎస్సార్సీపీ ఒక్కటే ప్రతిపక్ష పార్టీగా శాసనసభలో ఉంది. కాబట్టి, వైఎస్సార్సీపీనే అసలైన ప్రతిపక్షం. అయినప్పటికీ 2024 జూన్ 21న అనుసరించిన సంప్రదాయ విరుద్ద విధానాన్ని బట్టి చూస్తే అధికార కూటమి నేతలు ముందుగానే నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు తేటతెల్లమవుతోంది.నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని పయ్యావుల కేశవ్ చెప్పారుగత ఏడాది జూన్ 24న నేను స్పీకర్కు లేఖ రాశాను. ప్రతిపక్ష నేత హోదా, ప్రజా సమస్యలపై మాట్లాడే విషయంలో తగినంత సమయం కల్పించాలని కోరాను. అంతేకాక గతంలో 10 శాతం సీట్లు కూడా పొందని రాజకీయ పార్టీలకు సైతం ప్రతిపక్ష నేత హోదా ఇచ్చిన ఉదంతాలను ఆ లేఖలో వివరించాను. అయితే స్పీకర్ నా లేఖ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ అధికార కూటమి ఉద్దేశాన్ని బహిరంగ పరిచారు. వైఎస్సార్సీపీకి 10శాతం సీట్లు రాకపోవడంతో నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం అసాధ్యం అని, నేను కేవలం వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ మాత్రమేనని ఆయన స్పష్టంచేశారు. అంతేకాకుండా, వైఎస్సార్సీపీకి అసలు ప్రతిపక్ష హోదా రావాలంటే 10 సంవత్సరాలు పడుతుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను ఈ వ్యాజ్యంలో వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చాను.నా పిటిషన్ పెండింగ్లో ఉండగానే స్పీకర్ రూలింగ్ నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడంపై గత ఏడాది జూలై 23న నేను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాను. ఆంధ్రప్రదేశ్ జీతభత్యాలు, పెన్షన్లు, అనర్హతల తొలగింపు చట్టం, 1953లోని 12–బి ప్రకారం నన్ను ప్రతిపక్ష నేతగా ప్రకటించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరాను. ఈ పిటిషన్లో పెండింగ్లో ఉండగానే శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఓ రూలింగ్ ఇచ్చారు. నన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించాలన్న అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆ రూలింగ్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే నేను ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశాను. స్పీకర్ రూలింగ్ అనేక చట్టాల ప్రకారం తప్పు. ఆ రూలింగ్లో అయ్యన్న పాత్రుడు ఉపయోగించిన శైలి, పదజాలాన్ని మొదటి నుంచి చివరి వరకు పరిశీలిస్తే, నా చట్టబద్ధమైన హక్కును నిరాకరించాలని ముందే నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. స్పీకర్ రూలింగ్ వెనుక రాజకీయ వైరం, పక్షపాతం⇒ అధికార పార్టీ సభ్యులు తరచూ మీడియాతో మాట్లాడుతూ, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వబోమని బహిరంగంగానే ప్రకటించారు. దీన్నిబట్టి స్పీకర్ రూలింగ్ వెనకున్న అంతరార్థం ఏమిటో స్పష్టమవుతోంది. ఇది స్పీకర్ మాత్రమే తీసుకున్న నిర్ణయం కాదు. అధికార పార్టీ సమష్టి నిర్ణయం. స్పీకర్ రూలింగ్ వ్యక్తిగత, రాజకీయ, శత్రుత్వ పూరితమైన వ్యాఖ్యలతో నిండిపోయింది. ఈ రూలింగ్ ఇవ్వడం వెనుక రాజకీయ వైరం, పక్షపాతం ఉన్నాయన్న విషయం స్పష్టమవుతోంది. న్యాయ నిష్పాక్షికత, పార్లమెంటరీ బాధ్యత, సమర్థవంతమైన ప్రతిపక్షం అనే మూల సూత్రాలను పూర్తిగా విస్మరించారు. ⇒ ప్రతిపక్ష నేత హోదా విషయంలో అధికరణ 208 కింద నిర్ధిష్టమైన నియమావళి ఉంది. దీని ప్రకారం నాకు ఆ హోదాను అధికారికంగా ఇవ్వాలి. సీట్ల సంఖ్య ఆధారంగా ప్రతిపక్ష హోదా నిబంధన ఏ చట్టంలోనూ లేదు. శాసనసభలోని మొత్తం సీట్లలో 10 శాతం సీట్లు సాధించకపోయినా ఆ పార్టీలు ప్రధాన ప్రతిపక్ష హోదా పొందిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఆ పార్టీ నేత ప్రధాన ప్రతిపక్ష నేతగా నియమితులైన ఉదంతాలున్నాయి. ఇది పార్లమెంట్లోనే కాక దేశంలోని పలు శాసనసభల్లో జరిగింది. ⇒ 1994లో మొత్తం 294 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 26 సీట్లే గెలుచుకున్నప్పటికీ, ఆ పార్టీ నేత పి.జనార్దన్రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా దక్కింది. 2015లో ఢిల్లీలో బీజేపీకి 3 సీట్లే వచ్చినప్పటికీ, పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదానిచ్చారు. ⇒ గత ఏడాది జూన్ 4 నుంచి ఈ రోజు వరకు రాష్ట్రంలో కొనసాగుతున్న హింసాత్మక సంఘటనల పట్ల కార్యనిర్వాహక శాఖ మౌనంగా ఉండిపోయింది. అధికార యంత్రాంగమంతా పాలక కూటమి రాజకీయ ప్రయోజనాలకు మడుగులొత్తుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రజల తరఫున మాట్లాడే, ప్రశ్నించే వేదిక శాసనసభే అవుతుంది. సభలో నేనే ఏకైక ప్రతిపక్ష గొంతుక అన్నది విస్మరించలేని నిజం. కాబట్టి, సభలో నా పార్టీ స్థానాల సంఖ్య ఆధారంగా కాకుండా, ప్రజల సమస్యలను ప్రతిబింబించే ప్రతిపక్ష స్వరం అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకొని నాకు మాట్లాడే హక్కును ఇవ్వాలి.⇒ పాలక పక్షం మా పార్టీ నేతలు, కార్యకర్తలపై జరిపిన క్రమబద్ధమైన హింస ప్రతిపక్షం, ప్రతిపక్ష నాయకుడి ప్రాముఖ్యతను మరింత స్పష్టం చేస్తోంది. ఈ హింస విషయంలో నేను 2024 జూన్ 7, 2024 జూలై 20వ తేదీల్లో కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశాను. అధికార కూటమి రాజకీయ ప్రయోజనాల కోసం అధికార యంత్రాంగం ముఖ్యంగా పోలీసులు పని చేస్తున్నారు. తద్వారా ప్రజల సమస్యలపై గళమెత్తే హక్కును నిరాకరిస్తున్నారు.⇒ స్పీకర్ రూలింగ్ కూటమి నేతల శతృత్వ భావాలకు, ఎన్నికల ఫలితాల తర్వాత పాలకవర్గ ప్రవర్తనకు అనుగుణంగా ఉంది. వ్యక్తిగత, రాజకీయ ద్వేషంతో కూడుకుని ఉంది. ఇది రాజ్యాంగ సూత్రాలకు, చట్టానికి విరుద్ధం. అందువల్ల దీన్ని రద్దు చేసి నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలి. -
‘గ్రూప్–1 మూల్యాంకనం’పై ముగిసిన వాదనలు
సాక్షి, అమరావతి : గ్రూప్–1 మెయిన్స్ తిరిగి నిర్వహించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)తో పాటు మరికొందరు దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేస్తూ జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథశర్మ ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇరుపక్షాలు రాతపూర్వక వాదనలు సమర్పించాలనుకుంటే సమరి్పంచవచ్చని స్పష్టం చేసింది. మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పలు వ్యాజ్యాలపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష మొత్తాన్ని, అర్హత సాధించినవారి జాబితాను కూడా రద్దు చేశారు. తిరిగి మెయిన్స్ నిర్వహించాలని, మొత్తం ప్రక్రియను ఆర్నెల్లలో పూర్తి చేయాలని ఏపీపీఎస్సీ అధికారులను ఆదేశించారు. దీనిని సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. ఉద్యోగాలు పొంది ప్రస్తుతం వివిధ హోదాల్లో కొనసాగుతున్నవారు కూడా అప్పీళ్లు వేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ ధర్మాసనం రెండు రోజులు సుదీర్ఘ విచారణ జరిపింది. ఉద్యోగాలకు ఎంపిక కాని అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాదులు కేఎస్ మూర్తి, రవిశంకర్, న్యాయవాదులు జొన్నగడ్డ సు«దీర్, షేక్ సలీమ్ తదితరులు శుక్రవారం వాదనలు వినిపించారు. హాయ్ల్యాండ్లో మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్నారు. హాయ్ల్యాండ్లో మూల్యాంకనం జరగలేదు ఏపీపీఎస్సీ తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ హాయ్ల్యాండ్లో మూల్యాంకనం జరగలేదన్నారు. అందువల్ల మూల్యాంకనానికి సంబంధించిన సీసీ ఫుటేజీ లేదని తెలిపారు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల తరఫు సీనియర్ న్యాయవాదులు చింతల విష్ణుమోహన్రెడ్డి, ఓబిరెడ్డి మనోహర్రెడ్డి, పమిడిఘంటం శ్రీరఘురాం వాదనలు వినిపిస్తూ, హాయ్ల్యాండ్లో ఎలాంటి మూల్యాంకనం జరగలేదని పునరుద్ఘాటించారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. -
హైకోర్టు ఆదేశాలు లెక్కచేయకుండా అమరావతిలో DSC వేడుకలు
-
హైకోర్టు అంటే లెక్కేలేదు
సాక్షి, అమరావతి: హైకోర్టు తీర్పయినా తమకు లెక్కేలేదన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోది. డీఎస్సీ దరఖాస్తు సమయంలో తీసుకున్న పోస్టుల ప్రాదాన్యం చెల్లదని, అభ్యర్థులు సాధించిన పోస్టుల్లో ఉన్నతమైన ఉద్యోగం ఇవ్వాలని హైకోర్టు ఇప్పటికే ఉత్తర్వులిచ్చింది. దీనిని పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకెళుతోంది. సోమవారం హడావుడిగా డీఎస్సీ ఎంపిక జాబితాను ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర సచివాలయం సమీపంలో ప్రత్యేక వేదిక సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఎంఈవోలు, హెచ్ఎంలు, ఇతర ఉపాధ్యాయులతో కోర్ కమిటీలను నియమించి ఎంపిక చేసిన 15,941 మంది అభ్యర్థులతో పాటు అదేస్థాయిలో బంధువులను అమరావతికి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. కాగా.. పోస్టుల ఎంపికపై అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు వచ్చినా అమలు చేయలేదని బాధిత అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై ప్రభుత్వం డివిజన్ బెంచ్కు వెళ్లినా సింగిల్ జడ్జి తీర్పునే అమలు చేయాలని చెప్పడంతో పాటు మొత్తం ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. ఓ పక్క హైకోర్టు ఆదేశాలు ఉండగా.. అందుకు విరుద్ధంగా ప్రభుత్వ నియామక పత్రాల పంపిణీ చేపడుతుండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. రాజకీయ మైలేజీ కోసం.. డీఎస్సీ ఎంపిక జాబితాను ఉమ్మడి జిల్లాల వారీగా ప్రకటించారు. మొత్తం 13 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 16,347 పోస్టులు ప్రకటించగా.. 15,941 మంది ఎంపికైనట్టు ప్రకటించారు. గతంలో డీఎస్సీ అభ్యర్థులకు జిల్లాల్లోనే కౌన్సెలింగ్ నిర్వహించి ఎంపికైన వారికి డీఈవో నియామక పత్రాలు అందించేవారు. కానీ, అందుకు భిన్నంగా టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం హడావుడిగా ప్రకటించిన ఎంపిక జాబితాలోని అభ్యర్థులకు అమరావతిలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయంలో కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ముందుకెళుతోంది. 15,941 మంది అభ్యర్థులతో పాటు వారి కుటుంబంలోని ఒకరు తప్పనిసరిగా హాజరు కావాలని అధికారులు సమాచారం పంపించారు. అంటే మొత్తం 32 వేల మందిని ఈనెల 19న అమరావతికి తరలించనున్నారు. ఇందుకోసం ప్రతి జిల్లాలో ఎంపికైన అభ్యర్థుల సంఖ్యను బట్టి 65 నుంచి 134 వరకు ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు. అభ్యర్థులు ఎక్కడ ఉన్నా గురువారం సాయంత్రానికి సంబంధిత జిల్లా కేంద్రానికి చేరుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. వీరంతా జిల్లా కేంద్రం నుంచి ఏర్పాటు చేసిన బస్సుల్లోనే బయలుదేరాలని స్పష్టం చేసింది. వీరిని సమన్వయం చేసేందుకు ఒక్కో బస్సుకు ఒక్కొక్క ఎంఈవో, ఒక్కో హెచ్ఎం, ఇద్దరు ఉపాధ్యాయులను నియమించింది. అంటే జిల్లాకు సరాసరిన 350 మంది సిబ్బందిని ఇందుకోసం సిద్ధం చేసింది. కాగా.. హైకోర్టు ఇంటీరియం ఆర్డర్ అమలుపై విద్యాశాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కుటుంబ సభ్యులు తప్పనిసరి కాదు డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం అమరావతిలో నియామక పత్రాల ప్రదాన కార్యక్రమానికి కుటుంబ సభ్యులు తప్పనిసరి కాదని విద్యాశాఖ తెలిపింది. బంధువులు, సన్నిహితులు, స్నేహితులను కూడా తీసుకురావొచ్చని ప్రకటించింది. కుటుంబ సభ్యుల్లో వృద్ధులు, గర్భిణులు ఉంటే వారికి బదులు మరొకరి పేరు సూచించవచ్చని చెప్పింది. ఈ అవకాశం లేని అభ్యర్థులు ఒక్కరే వచ్చేలా ఉంటే ఆ విషయం స్థానిక డీఈవోలకు తెలియజేయాలంది. -
ఏపీఈఆర్సీ చైర్మన్ను నియమించరా?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి పూర్తిస్థాయి చైర్మన్ను నియమించకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో లోకాయుక్త, మానవహక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) వంటి సంస్థలకు అధిపతులు లేకుండా (హెడ్లెస్) ఉన్నాయని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ పోస్టులను భర్తీచేయడానికి వచ్చిన ఇబ్బందేమిటని నిలదీసింది. నిర్దిష్ట గడువులోపు ఈఆర్సీ చైర్మన్ నియామకాన్ని పూర్తిచేయాలని ఆదేశించింది. లేనిపక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని కోర్టుకు పిలిపించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈఆర్సీ చైర్మన్ పోస్టును ఎప్పటిలోగా భర్తీచేస్తారో స్పష్టంగా చెప్పాలంది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఖాళీగా ఉన్న ఏపీఈఆర్సీ చైర్మన్ పోస్టును భర్తీచేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ డాక్టర్ దొంతి నరసింహారెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈఆర్సీ చైర్మన్ పోస్టు ఏడాదిగా ఖాళీగా ఉందని తెలిపారు. సభ్యుల పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ.. సభ్యుడే ఇన్చార్జి చైర్మన్గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. ఓ సభ్యుడి నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్ల సమావేశంలో బిజీగా ఉండటంతో పూర్తి వివరాలు తెప్పించుకోలేకపోయినట్లు చెప్పారు. దీంతో ధర్మాసనం గడువులోపు ఈ ఖాళీలను భర్తీచేయాల్సిందేనని తేల్చిచెప్పింది. ఎప్పటిలోపు భర్తీచేస్తారో స్పష్టంగా చెప్పాలంటూ విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. -
దేవుడి భూమిలో ఎగ్జిబిషన్, గోల్ఫ్కోర్స్ ఏమిటి?
‘‘దేవస్థానానికి చెందిన వ్యవసాయ భూములను వాణిజ్య కార్యకలాపాలకు ఉపయోగించేందుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదు. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయదలచిన 35 ఎకరాలను వాణిజ్య కార్యకలాపాలకు ఉపయోగించే ప్రతిపాదనల విషయంలో ముందుకెళ్లొద్దు’’ ‘‘ధారి్మక, ఆధ్యాతి్మక కార్యకలాపాలకు తప్ప దేవస్థానం భూములను ఇతర ఏ అవసరాలకు కేటాయించే అధికారం జిల్లా కలెక్టర్కు లేదు. దేవుడి ఆస్తికి న్యాయస్థానాలు శాశ్వత సంరక్షకులు. ఆలయ ఆస్తులను కోర్టులు ఎల్లప్పుడూ పరిరక్షిస్తుంటాయి’’ – రాష్ట్ర హైకోర్టుసాక్షి, అమరావతి: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో ఉన్న మచిలీపట్నం గొడుగుపేట శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన 40 ఎకరాల భూమి విషయంలో రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. 35 ఎకరాల్లో ‘విజయవాడ ఉత్సవ్’ పేరుతో శాశ్వత ప్రాతిపదికన వార్షిక ఎగ్జిబిషన్, 5 ఎకరాల్లో గోల్ఫ్ కోర్సు ఏర్పాటుపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఈ విషయంలో వేర్వేరుగా దాఖలైన రెండు కేసులను న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ విచారించారు. ఎగ్జిబిషన్, గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుకు ప్రతిపాదిస్తూ భూమి కేటాయించాలని దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శిని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ఈ ఏడాది జూలై 22న రాసిన లేఖ విషయంలో ముందుకు వెళ్లొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఎగ్జిబిషన్ కోసం భూమిని చదును చేసేందుకు పోసిన గ్రావెల్ను తొలగించాలని, అంతేగాక ఆ భూమిని వ్యవసాయానికి అనుగుణంగా పూర్వస్థితికి తీసుకురావాలని నిర్దేశించారు. 35 ఎకరాలు వ్యవసాయ భూమి అని, వాణిజ్య కార్యకలాపాలకు వాడకూడదని తేల్చి చెప్పారు. మొత్తం వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను అక్టోబరు 6కు వాయిదా వేశారు. » శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన 40 ఎకరాలను ఎగ్జిబిషన్, గోల్ఫ్ కోర్సుకు కేటాయించాలంటూ దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శికి కలెక్టర్ రాసిన లేఖను సవాల్ చేస్తూ మచిలీపటా్ననికి చెందిన బూరగడ్డ సుజయ్కుమార్, మరో ఇద్దరు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీరి తరఫున న్యాయవాది జేవీ ఫణిదత్ వాదనలు వినిపించారు. దేవస్థానానికి చెందిన వ్యవసాయ భూమిని ఎగ్జిబిషన్ కోసం ఇవ్వడానికి వీల్లేదన్నారు. ఆ భూమిలో ప్రస్తుతం పంటలు సాగు చేస్తున్నారని... అందుకు సంబంధించిన ఫొటోలను కోర్టు ముందు ఉంచారు. పచ్చని పంట పొలాల్లో ఎగ్జిబిషన్ కోసం మైనింగ్ వ్యర్థాలను నింపి చదును చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా ఆ భూమి ఎప్పటికీ వ్యవసాయానికి పనికి రాకుండా పోతుందని పేర్కొన్నారు. భూమిని లీజుకివ్వడంలో ఎలాంటి వేలం నిర్వహించలేదన్నారు. » రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్జీపీ) సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ, అది వ్యవసాయ భూమి కాదని అన్నారు. గతంలోనే వ్యవసాయేతర భూమిగా మార్చారని, వాణిజ్య కార్యకలాపాలకు కేటాయించవచ్చని తెలిపారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు రూ.45 లక్షలు చెల్లించారని, వాటిని దేవస్థానం అభివృద్ధికి వెచి్చస్తామని చెప్పారు. ఎగ్జిబిషన్ కేవలం 56 రోజులే ఉంటుందన్నారు. ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదని.. ఇదేమీ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదని తెలిపారు.కేవలం ప్రతిపాదనే.. నిర్ణయం తీసుకోలేదు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, గోల్ఫ్ కోర్స్ కేవలం ప్రతిపాదన మాత్రమేనన్నారు. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి దేవస్థానం భూములను ధార్మికేతర కార్యకలాపాలకు కేటాయించే అధికారం జిల్లా కలెక్టర్కు లేదని తేల్చి చెప్పారు. గోల్ఫ్కోర్స్ ఏర్పాటుకు సంబంధించిన తదుపరి చర్యలేవీ తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించారు.ఆ అధికారం కలెక్టర్కు లేదు ఇదే దేవస్థానం భూమిలో గోల్ఫ్కోర్స్ ఏర్పాటు చేయడంపైనా న్యాయమూర్తి స్పష్టమైన ఉత్తర్వులిచ్చారు. ‘‘దేవుడి భూమిలో గోల్ఫ్ కోర్స్కు సంబంధించి తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టవద్దు. దేవుడి ఆస్తులను కేవలం ఆధ్యాత్మిక, ధార్మిక, మతపర కార్యకలాపాలకే ఉపయోగించాల్సి ఉంటుంది’’ అని స్పష్టం చేస్తూ జస్టిస్ నూనెపల్లి హరినాథ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.గొల్లపూడిలోని 5 ఎకరాలలో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై తీవ్రంగా స్పందించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను అక్టోబరు 16కి వాయిదా వేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది వాదిస్తూ... చట్ట ప్రకారం దేవస్థానానికి చెందిన భూములను ధార్మిక, ఆధ్యాత్మిక కార్యకలాపాలకు తప్ప మరే ఇతర కార్యకలాపాలకు ఉపయోగించడానికి వీల్లేదన్నారు. కానీ, 5 ఎకరాల దేవస్థానం భూమిలో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారని తెలిపారు. ఇది వాణిజ్య కార్యకలాపాల కిందకు వస్తుందని, దేవస్థానం భూముల్లో ఇలా చేయడానికి చట్టం ఒప్పుకోదని, ప్రభుత్వానికి ఆ అధికారం లేదని అన్నారు. ఈ విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు చాలా స్పష్టంగా ఉన్నట్లు చెప్పారు. దేవస్థానం భూముల విషయంలో జోక్యం చేసుకునే అధికారం జిల్లా కలెక్టర్కు లేదని తెలిపారు. -
మెరిట్ను ఎలా విస్మరిస్తారు?
ఎస్జీటీకి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు వేర్వేరుగా దరఖాస్తులిచి్చ.. వేర్వేరు ఫీజులు వసూలు చేసి.. వేర్వేరుగా పరీక్షలు నిర్వహించినప్పుడు మెరిట్ను ఎలా విస్మరిస్తారు? మెరిట్ను కాదని ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకోవడం ఏమిటి? ఇది ఎంత మాత్రం సరికాదు. అందువల్ల మేము సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో ఏమాత్రం జోక్యం చేసుకోలేం. – హైకోర్టు ధర్మాసనంమెరిట్ లిస్ట్లో ఉన్నా ఎంపిక చేయలేదు నేను ఎస్టీ కేటగిరి మహిళను. మెరిట్ లిస్ట్లో స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్), ఎస్జీటీ విభాగాల్లో నా పేరు ఉంది. ఎస్జీటీలో 61.63.. ఎస్ఏలో 61.00 స్కోర్ వచ్చింది. మూడో విడతలో నాకు కాల్ లెటర్ పంపించారు. అధికారులు నా సర్టిఫికెట్లు పరిశీలించారు. తీరా సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన ఎంపిక జాబితాలో నా పేరు లేదు. – కమ్మిడి లత, డుంబ్రిగుడ, అల్లూరి సీతారామరాజు జిల్లాసాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 కింద సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ), స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులను అభ్యర్థుల మెరిట్ ఆధారంగా కాకుండా దరఖాస్తు సమయంలో వారిచ్చిన ప్రాధాన్యతల ఆధారంగా భర్తీ చేయడాన్ని హైకోర్టు ధర్మాసనం తప్పు పట్టింది. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ నిమిత్తం దరఖాస్తు సమయంలోనే అభ్యర్థుల నుంచి ప్రాధాన్యతలను తీసుకోవడాన్ని ధర్మాసనం ఆక్షేపించింది. ఇలా చేసి ఉండాల్సింది కాదని అభిప్రాయ పడింది. పరీక్షలు పూర్తయి ఫలితాలు వచ్చాక మెరిట్ ఆధారంగా ప్రాధాన్యతలను కోరి ఉంటే సబబుగా ఉండేదని పేర్కొంది. పోస్టులు ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఎస్జీటీ పోస్టులకు ప్రాధాన్యత ఇచ్చి ఉంటారని, ఆ తర్వాత రాత పరీక్షలో వారు ఎస్ఏ పోస్టులో అత్యుత్తమ ర్యాంకు సాధించినప్పటికీ, ప్రాధాన్యత కింద ఎస్జీటీ పోస్టును ఎంపిక చేసుకున్నారు కాబట్టి, ఎస్ఏ పోస్టు ఇవ్వమని చెప్పడం దారుణమంది. ఎస్జీటీ నుంచి పదోన్నతిపై ఎస్ఏగా నియమితులవుతారని, కాబట్టి మంచి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థిని ఎస్ఏగా కాకుండా ఎస్జీటీగా నియమిస్తామనడం ఎంత వరకు భావ్యమని ప్రశ్నించింది. అభ్యర్థులు ఎంతో కష్టపడి చదివి, మంచి ర్యాంకు తెచ్చుకుని కూడా తక్కువ స్థాయి పోస్టుతో సంతృప్తి చెందాలంటే వారికి ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవాలంది. ఇది అభ్యర్థుల జీవితాలకు సంబంధించిన విషయమని తెలిపింది. ఎస్జీటీ, ఎస్ఏ పోస్టులకు పరీక్షలు రాసి, రెండింటిలోనూ మంచి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఎస్ఏ పోస్టుకు అర్హులేనని, పోస్టుల భర్తీలో మెరిట్కు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యానికి ధర్మాసనం నిరాకరించింది. ఈ మొత్తం వ్యవహారంపై ఇరుపక్షాల వాదనలు వినాలని సింగిల్ జడ్జిని కోరింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగాలు లేక, వచ్చిన ఉద్యోగ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి అభ్యర్థులు ఎంతో కష్టపడి చదివి ఉత్తీర్ణత సాధించి ఉంటారని, అలాంటి వారి విషయంలో ప్రాధాన్యత పేరుతో ఏకపక్షంగా వ్యవహరించడానికి వీల్లేదని ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది.మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేయాలన్న సింగిల్ జడ్జి స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పరీక్షలో మెరిట్ సాధించిన తమను ప్రాధాన్యత పేరుతో ఆ పోస్టుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని, ఈ విషయంలో జోక్యం చేసుకుని తమను ఎస్ఏ పోస్టుకు పరిగణనలోకి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కర్నూలుకు చెందిన బండేగిరి బషీరున్, మరో తొమ్మిది మంది హైకోర్టులో వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సింగిల్ జడ్జి జస్టిస్ న్యాపతి విజయ్ విచారణ జరిపారు. మెరిట్ ఆధారంగా కాకుండా దరఖాస్తు సమయంలో అభ్యర్థులిచ్చిన ప్రాధాన్యతల ఆధారంగా పోస్టులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. మెరిట్ ఆధారంగానే పోస్టులు భర్తీ చేయాలని స్పష్టం చేశారు. మెరిట్ ఆధారంగా కాకుండా ప్రాధాన్యతల ఆధారంగా పిటిషనర్లను ఎస్ఏ పోస్టుకు పరిగణనలోకి తీసుకోకపోవడం అన్యాయమని, వారిని ఎస్ఏ పోస్టులకు పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గత వారం ఉత్తర్వులు జారీ చేశారు.సింగిల్ జడ్జి ఉత్తర్వులపై అప్పీళ్లు వేసిన ప్రభుత్వం ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసింది. ఈ అప్పీళ్లపై మంగళవారం జస్టిస్ దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం రూపొందించిన రూల్స్ను పిటిషనర్లు సవాలు చేయలేరన్నారు. దరఖాస్తుల సమయంలోనే ప్రాధాన్యతలు ఇవ్వాలని నిబంధనల్లో స్పష్టంగా ఉందన్నారు. దీనిపై పిటిషనర్లు అప్పుడు అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడు కోర్టుకొచ్చారని తెలిపారు. ఎస్జీటీ పోస్టులు ఎక్కువ ఉండటంతో పిటిషనర్లు ఆ పోస్టుకు తమ ప్రాధాన్యతలను ఇచ్చారన్నారు. దాని ప్రకారమే వారికి ఆ పోస్టులు ఇస్తున్నామని తెలిపారు. ఇప్పుడు పిటిషనర్లకు అనుకూలంగా ఉత్తర్వులిస్తే, మరింత మంది అభ్యర్థులు వేర్వేరు అభ్యర్థనలతో కోర్టుకొస్తారని, దీని వల్ల మొత్తం నియామక ప్రక్రియ ప్రభావితం అవుతుందన్నారు.ఎస్జీటీ నుంచి ఎస్ఏ కావాలంటే 20 ఏళ్లు పడుతుంది పిటిషనర్ల తరఫున జీవీఎస్ కిషోర్ కుమార్, గొట్టిపాటి కవిత వాదనలు వినిపించారు. పిటిషనర్లు రాత పరీక్షలో మంచి ఉత్తీర్ణత సాధించారని, అందువల్ల వారు ఎస్ఏ పోస్టులకు అర్హులవుతున్నారని తెలిపారు. అయితే దరఖాస్తు సమయంలో వీరు ఎస్జీటీకి తమ ప్రాధాన్యతను ఇచ్చారని, ఎక్కువ పోస్టులు ఉండటంతోనే అలా చేశారని వివరించారు. ఎస్జీటీ నుంచి ఎస్ఏ పోస్టుకు పదోన్నతిపై వెళ్లాలంటే 20 ఏళ్లు ఎదురు చూడాల్సి ఉంటుందన్నారు. మెరిట్ను కాకుండా ప్రాధాన్యతల ఆధారంగా నియామకాలు చేపట్టడం సరికాదన్నారు.ప్రాధాన్యతలే ముఖ్యమైతే మెరిట్ ఎందుకు? ర్యాంకులెందుకు?ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, నిబంధనల పేరుతో దరఖాస్తు సమయంలో అభ్యర్థులిచ్చిన ప్రాధాన్యతలకే ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తే, ఇక మెరిట్ ఎందుకని, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించింది. ఎస్జీటీకి, ఎస్ఏ పోస్టులకు వేర్వేరుగా దరఖాస్తులిచ్చి.. వేర్వేరు ఫీజులు వసూలు చేసి.. వేర్వేరు పరీక్షలు నిర్వహించినప్పుడు మెరిట్ను కాకుండా ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకోవడం ఏమిటని నిలదీసింది. మెరిట్ను పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదంది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమంది. ఈ సమయంలో ఏజీ స్పందిస్తూ, ఈ వ్యవహారాన్ని సింగిల్ జడ్జికే నివేదించి.. తుది విచారణ జరిపి పిటిషన్లపై నిర్ణయం వెలువరించేలా చూడాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ, ఈ వ్యాజ్యాల్లో ఇరుపక్షాల వాదనలు విని నాలుగు వారాల్లో నిర్ణయం వెలువరించాలని సింగిల్ జడ్జిని ధర్మాసనం కోరింది. ఈ ఉత్తర్వులతో ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను పరిష్కరించింది.ఆ విభాగంలో నేనొక్కడినే.. అయినా పోస్టు రాలేదుడీఎస్సీ నిర్వహణ తొలి నుంచి లోపభూయిష్టంగా ఉంది. కనిగిరి మండలంలో 4 నుంచి 8వ తరగతి వరకు చదువుకున్నాను. హియరింగ్ ఇంపెయిర్డ్ కోటాలో డీఎస్సీ ఫిజికల్ సైన్స్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాను. హియరింగ్ ఇంపెయిర్డ్ కోటాలో మెన్కు ఒకపోస్టు, ఉమెన్కు ఒక పోస్టు ఉన్నాయి. డీఎస్సీలో నాకు 34.55 శాతం మార్కులు వచ్చాయి. ఆ పోస్టుకు ఒక్కడినే ఉండడంతో కాల్ లెటర్ పంపించారు. ఈ నెల 2న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయింది. హియరింగ్ ఇంపెయిర్డ్ నిర్ధారణ కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి పంపించారు. తీరా సోమవారం ప్రకటించిన డీఎస్సీ జాబితాలో నా పేరు లేదు. మరోవైపు హియరింగ్ ఇంపెయిర్డ్ కోటా కింద ఉన్న ఒక పోస్టును క్యారీ ఫార్వార్డ్లో పెట్టినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. – వెంకటనారాయణ, కనిగిరి, ప్రకాశం జిల్లా‘అనంత’లో తక్కువ మెరిట్ ఉన్న వారికి ఉద్యోగాలుడీఎస్సీ–25 తుది ఎంపిక జాబితాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తక్కువ మెరిట్ ఉన్నవారి పేర్లు ఉండడంతో అర్హులైన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఎస్ఏ ఇంగ్లిష్లో ఎ.ఆంజనేయులు 48వ ర్యాంకులో ఉన్నాడు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. బీసీ–ఏ కేటగిరీకి చెందిన ఈ అభ్యర్థి కంటే వెనకున్న 49వ ర్యాంకు అభ్యర్థి ఓపెన్ కేటగిరీలో ఉన్నాడు. బీసీ–ఏ కేటగిరీకి 7 పోస్టులు ఉన్నాయి. ఈయన కంటే వెనుకున్న 8 మంది ఎంపిక జాబితాలో ఉన్నా, ఎ.ఆంజనేయులు పేరు లేకపోవడంతో డీఈఓను కలిసి విన్నవించాడు. చంద్రిక అనే అభ్యర్థిని స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, పీఈటీ రెండు పోస్టులకూ ఎంపికైంది. ఈమె కేజీబీవీలో పని చేస్తోంది. కేజీబీవీలో పని చేస్తూ బీపీఈడీ కోర్సు చేసిందనే ఫిర్యాదు రావడంతో ఆ పోస్టుకు అనర్హురాలిగా తేల్చారు. యూజీపీడీ ఉన్న కారణంగా పీఈటీ పోస్టుకు ఎంపికైంది. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. ఎంపిక జాబితాలో మాత్రం ఈమె పేరు లేదు. తన కేటగిరీలో తన కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు వచ్చాయంటూ ఆమె అధికారులను కలిసి వాపోయారు. మెంటల్లీ ఇన్హెల్త్ కేటగిరీ కింద కె.శ్రీనివాసులు అనే అభ్యర్థి మెరిట్ జాబితాలో ఉన్నాడు. ఈయనకు ‘0’ శాతం వైకల్యం ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించినా.. ఆ సర్టిఫికెట్ను ఆన్లైన్లో అప్లోడ్ చేయలేదు. ఫలితంగా ఆయన అర్హత లేకపోయినా ఉద్యోగానికి ఎంపికయ్యాడు. – సాక్షి నెట్వర్క్డీఎస్సీలో ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయాలి : కేవీపీఎస్సాక్షి, అమరావతి: డీఎస్సీలో మెరిట్ మార్కులు వచ్చిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు న్యాయం చేయాలని, సామాజిక న్యాయానికి తూట్లు పొడవద్దని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఒ.నల్లప్ప, ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెరిట్లో ఎంపికైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులను రిజర్వేషన్ కేటగిరీలోనే చూపించే ప్రతిపాదన సరికాదన్నారు.నిరుద్యోగులతో చెలగాటం : డీవైఎఫ్ఐసాక్షి, అమరావతి: నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని, డీఎస్సీ–2025లో జరిగిన గందరగోళం ఏ డీఎస్సీలోనూ జరగలేదని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న విమర్శించారు. డీఎస్సీ అభ్యర్థుల అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో అభ్యర్థులు మంగళవారం మంగళగిరిలోని విద్యాభవన్ ఎదుట నిరసన తెలిపారు. -
‘విజయవాడ ఉత్సవ్’ స్థల వివాదంపై హైకోర్టు కీలక తీర్పు
సాక్షి,వియవాడ: ‘విజయవాడ ఉత్సవ్’ స్థలవివాదంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆలయ భూమిని వాణిజ్య అవసరాలకు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయేతర అవసరాలకు దేవాదాయ భూమి ఇవ్వొద్దని సూచించింది.గొల్లపూడిలోని 40 ఎకరాల ఆలయ భూమిలో విజయవాడ ఉత్సవ్ నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. అయితే, ఆలయ భూమిని వాణిజ్యంగా ఎలా ఉపయోగిస్తారంటూ ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.గొల్లపూడిలో దేవాదాయశాఖ భూమిని వినియోగించొద్దని, గోల్ఫ్ కోర్సుకు ఐదెకరాల కేటాయింపు ప్రతిపాదన పై స్టే విధించింది. దీంతోపాటు తాత్కాలిక ఉత్సవాలు కేటాయింపు పైనా స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ భూములను యధాతధంగా ఉంచాలని హైకోర్టు వెల్లడించించింది. -
హైకోర్టును తప్పుదారి పట్టించిన సిట్
సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసులో గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిలకు ఏసీబీ కోర్టు మంజూరు చేసిన డిఫాల్ట్ బెయిల్ రద్దు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై గత వాదనల సందర్భంగా హైకోర్టును సిట్ తప్పుదారి పట్టించిందని సీనియర్ న్యాయవాది నిరంజన్రెడ్డి ధర్మాసనానికి నివేదించారు. డిఫాల్ట్ బెయిల్ మంజూరు సరైనదేనని స్పష్టం చేశారు. ముగ్గురికి డిఫాల్ట్ బెయిల్ను సవాలు చేస్తూ సిట్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. తమ చార్జిïÙట్లలో లోపాలను ఎత్తిచూపుతూ ఏసీబీ కోర్టు జారీ చేసిన ఆఫీస్ మెమోరాండంను కూడా సవాలు చేసింది. మరో నిందితుడు బూనేటి చాణక్యకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయకుండా ఏసీబీ కోర్టును నిరోధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.ఈ వ్యాజ్యాలపై గత వారం విచారణ జరిపిన న్యాయమూర్తి ఏసీబీ కోర్టు జారీ చేసిన ఆఫీస్ మెమోరాండంపై స్టే విధించిన విషయం తెలిసిందే. ఆఫీస్ మెమోరాండం ఆధారంగా ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్లోని పలు అంశాలపై కూడా స్టే ఇచ్చారు. హైకోర్టులో గురువారం ఈ కేసు విచారణ సందర్భంగా కృష్ణమోహన్రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది తప్పెట నిరంజన్రెడ్డి తన వాదనలు వినిపిస్తూ, ఏసీబీ కోర్టు నిందితులకు సీఆర్పీసీ సెక్షన్ 309 కింద రిమాండ్ పొడిగిస్తూ వచ్చినట్లు సిట్ న్యాయవాది హైకోర్టుకు చెప్పారని, హైకోర్టు సైతం ఆ విషయాన్ని అలాగే రికార్డ్ చేసి, దాని ఆధారంగా మద్యం తర ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. వాస్తవానికి ఏసీబీ కోర్టు సీఆర్పీసీ సెక్షన్ 167 (2) కింద నిందితులకు రిమాండ్ పొడిగించిందని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. క్వాష్ పిటిషన్ చెల్లదు చాణక్య తరఫు సీనియర్ న్యాయవాది ఓబిరెడ్డి మనోహర్రెడ్డి వాదనలు వినిపిస్తూ, గోవిందప్ప తదితరుల డిఫాల్ట్ బెయిల్ రద్దు కోసం సిట్ దాఖలు చేసిన వ్యాజ్యాల నుంచి తమ వ్యాజ్యాన్ని వేరు చేయాలని కోరారు. ఏసీబీ కోర్టు ఆఫీస్ మెమోరాండం కొట్టేయాలని కోరుతూ సీఆర్పీసీ సెక్షన్ 482 కింద క్వాష్ పిటిషన్ దాఖలు చేశారని, ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదఅన్నారు. మెమోరాండం పూర్తి కార్యనిర్వాహక ఉత్తర్వు అని, దీనిని సెక్షన్ 482 కింద సవాలు చేయడానికి వీల్లేదని చెప్పారు. ఆ ఆఫీస్ మెమోరాండంను సిట్ ఎలా సవాలు చేస్తుందని ప్రశి్నంచారు. ఆఫీస్ మెమోరాండంపై హైకోర్టు స్టే విధించడం వల్ల పిటిషనర్ బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టులో పెండింగ్లో ఉండిపోయిందన్నారు. తదుపరి విచారణ 17కు వాయిదా ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ఈ వ్యవహారంలో న్యాయ సంబంధిత అంశాలు ముడిపడి ఉన్నాయని, లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇరుపక్షాలు తమ తమ వాదనలతోపాటు, ఆ వాదనలను సమర్థించుకునేందుకు అనుకూలంగా ఉన్న తీర్పుల కాపీలను తమ ముందుంచాలని స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేశారు. -
రామిరెడ్డిపై కేసు కక్షసాధింపే
సాక్షి, అమరావతి: తనపై నెల్లూరు జిల్లా జలదంకి పోలీసులు నమోదు చేసిన హత్యాయత్నం కేసును కొట్టేయాలని కోరుతూ కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ కేసు డైరీ, ఇతర వివరాలను కోర్టు ముందుంచేందుకు పోలీసులకు వెసులుబాటు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. అంతకుముందు ప్రతాప్కుమార్రెడ్డి తరఫు న్యాయవాది వీఆర్ మాచవరం వాదనలు వినిపించారు. రాజకీయ కక్ష సాధింపు, దురుద్దేశాలతోనే పిటిషనర్పై కేసు నమోదు చేశారన్నారు. హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదు చేసిన సెక్షన్లేవీ పిటిషనర్కు వర్తించవన్నారు. పిటిషనర్కు పలు విద్యా సంస్థలున్నాయని, వాటికి సంబంధించి రోజూవారీ కార్యకలాపాల్లో పాలు పంచుకోవాల్సి ఉందన్నారు. సంబంధంలేని వ్యవహారంలో నిందితునిగా చేర్చారన్నారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. సిట్టింగ్ ఎమ్మెల్యేను హత్య చేయించేందుకు పిటిషనర్ కుట్ర పన్నారని తెలిపారు. నల్లపరెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదావైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా తన విధులకు ఆటంకం కలిగించారంటూ స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ మాలకొండయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్గామిట్ట పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై గురువారం విచారణ జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన కేసును కొట్టేయాలని కోరుతూ నల్లపరెడ్డి గతంలో దాఖలు చేసిన వ్యాజ్యంతో ముందస్తు బెయిల్ పిటిషన్ను జత చేయాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. రెండు వ్యాజ్యాలను కలిపి విచారిస్తామని, తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. -
సీసీ కెమెరాల్లేవ్
సాక్షి, అమరావతి: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు పోలీస్స్టేషన్లలో సరిపడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని అడ్వకేట్ కమిషనర్ ఎమ్మార్కే చక్రవర్తి హైకోర్టుకు నివేదించారు. ఉన్న కెమెరాలూ స్టేషన్ మొత్తాన్ని కవర్ చేయడం లేదని వివరించారు. రాష్ట్రంలోని అన్నీ పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్న కోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయకపోవడంతో న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రఘునందన్రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్ ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ కేసులో క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పణకు ధర్మాసనం అడ్వొకేట్ కమిషనర్ చక్రవర్తిని నియమించింది. మంగళవారం తాజా విచారణ సందర్భంగా అడ్వొకేట్ కమిషనర్ చక్రవర్తి తన నివేదికను కోర్టుకు సమర్పించారు. కృష్ణా జిల్లాలోని పెనమలూరు, గుంటూరు జిల్లాలోని అమరావతి, తుళ్లూరు, అరండల్పేట, నల్లపాడు పోలీస్స్టేషన్లలో సగటున 10 సీసీ కెమెరాలు ఉన్నాయని, మంగళగిరిలో మాత్రం 11 ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఇవి ఎంత మాత్రం సరిపోవని వివరించారు. రెండు ఫ్లోర్లు ఉన్న పోలీస్స్టేషన్లలో కింది ఫ్లోర్లో మాత్రమే సీసీ టీవీలు ఏర్పాటు చేశారని, మరో ఫ్లోర్లో వాటిని అమర్చలేదని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీసీ టీవీల లభ్యత విషయంలో ఆయా స్టేషన్ల ఇన్స్పెక్టర్లకు అధికారాలు లేవని, డిజిటల్ వీడియో రికార్డర్ నుంచి ఫుటేజీ పొందేందుకు ఆయా స్టేషన్ల అధికారులకు అవకాశం లేదని పేర్కొన్నారు. ఏదైనా కేసు దర్యాప్తు, విచారణ విషయంలో సీసీటీవీ ఫుటేజీ కావాలంటే ఎస్పీ కార్యాలయం నుంచి తెప్పించుకోవాల్సి వస్తోందన్నారు. అత్యవసరమైతే పాస్వర్డ్ ఇస్తారని, ఫుటేజీ తీసుకున్న తరువాత ఆ పాస్వర్డ్ను మార్చేస్తారని పెనమలూరు ఎస్హెచ్వో తనకు చెప్పారని అడ్వొకేట్ కమిషనర్ హైకోర్టుకు నివేదించారు. మిగిలిన స్టేషన్లకు వెళ్లినప్పుడు అధికారులు ఎవరూ లేరని, దీంతో వీడియో రికారి్డంగ్, దాని లభ్యత, డీవీఆర్ల నుంచి ఫుటేజీ సేకరణ వంటి వివరాలను పూర్తిస్థాయిలో తెలుసుకోలేకపోయానని చక్రవర్తి తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది తిరుమాను విష్ణుతేజ స్పందిస్తూ, డీవీఆర్లలో రికార్డ్ అయిన ఫుటేజీ ఎక్కడ స్టోర్ చేస్తున్నారో తెలుసుకుని చెబుతానన్నారు. విచారణను బుధవారానికి వాయిదా వేయాలని కోరారు. దీనికి న్యాయస్థానం అంగీకరిస్తూ ఆ మేర విచారణను వాయిదా వేసింది. ఈమేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. -
హైకోర్టు తీర్పు తర్వాతే ‘గ్రూప్స్’ ఫలితాలు
సాక్షి, అమరావతి: గ్రూప్–1, 2తో పాటు డీవైఈఓ, లెక్చరర్ పోస్టులపై హైకోర్టులో కేసులు ఉన్నందున.. వాటిపై తీర్పు వచ్చాకే ఈ పోటీ పరీక్షల ఫలితాలు వెల్లడిస్తామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి పి. రాజాబాబు వెల్లడించారు. విజయవాడలోని కమిషన్ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ వంతుగా మొత్తం ప్రకియ్రను పూర్తిచేశామని, కోర్టు తీర్పు రాగానే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫలితాలను వెల్లడిస్తామని ఆయన చెప్పారు. కోర్టులో వివాదాలు నడుస్తుండడంవల్లే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరీక్షలు, డిప్యూటీ ఈఓ, ఎఫ్ఆర్వో పరీక్షల ఫలితాలు ఆలస్యమవుతున్నాయని ఆయన చెప్పారు. గ్రూప్–1కు సంబంధించి స్పోర్ట్స్ కోటా విషయంలో, గ్రూప్–2 విషయంలో రిజర్వేషన్ అంశంపై కేసు ఉన్నందున ఫలితాల వెల్లడిపై హైకోర్టు స్టే ఇచి్చందన్నారు. ఇది ఇప్పటివరకు జరిగిన డీవైఈఓ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టుల ఫలితాలకూ వర్తిస్తుందన్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్వో) ఫలితాలపైనా హైకోర్టు స్టే ఉందన్నారు. దీంతోపాటు మహిళా రిజర్వేషన్ (హారిజాంటల్)కు సంబంధించి వివాదం కూడా కోర్టులో నడుస్తోందని రాజాబాబు తెలిపారు. ఇదిలా ఉంటే.. గత నోటిఫికేషన్లలో భర్తీచేయగా మిగిలిపోయిన (క్యారీ ఫార్వర్డ్) 78 ఖాళీలకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నామన్నారు. ఓఆర్ఎంలో చిన్న పొరపాటు చేసినా నష్టమే.. ఇక 691 ఫారెస్ట్ బీట్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ పోస్టులకు 1,17,958 మంది దరఖాస్తు చేసుకున్నారని.. 100 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు 19,568 మంది దరఖాస్తు చేసుకున్నట్లు కార్యదర్శి రాజాబాబు తెలిపారు. వీరికి ఈనెల 7న 13 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశామని.. అభ్యర్థులు తప్పుల్లేకుండా ఓఎంఆర్ షీట్ పూర్తిచేయాలని సూచించారు. అభ్యర్థులు బాల్పెన్తో మాత్రమే నింపి, బబ్లింగ్ చేయాలన్నారు. అభ్యర్థులు తప్పులు చేస్తే ఓఎంఆర్ షీట్ ఇన్వాలిడ్ అవుతుందని.. దిద్దినా, కొట్టివేసినా, గోళ్లతో చెరిపినా, వైట్నర్ పెట్టినా ట్యాంపరింగ్ అయినట్లుగా ఏపీపీఎస్సీ భావిస్తుందని ఆయన తేల్చిచెప్పారు. ఈ పరీక్షల్లో 1/3 నెగెటివ్ మార్కులు ఉన్న విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలన్నారు. -
అణగారిన వర్గాల విద్యార్థుల విద్య పట్టదా?
సాక్షి, అమరావతి: సర్వశిక్షాభియాన్ పథకం కింద విద్యా సంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన బోధనా సిబ్బందిని నియమించనప్పుడు వాటిల్లో చదివే అణగారిన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం ఎలా సాధ్యమవుతుందని ఒక అప్పీల్ విచారణ సందర్భంగా హైకోర్టు సోమవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. సర్వశిక్షాభియాన్ కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించేందుకు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, శాశ్వత ప్రాతిపదికన బోధనా సిబ్బంది నియామకాలు మాత్రం చేపట్టడం లేదని న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆక్షేపించింది.గెస్ట్, ఔట్సోర్స్, కాంట్రాక్ట్ బోధనా సిబ్బందితో పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం ఎలా సాధ్యమవుతుందని నిలదీసింది. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేస్తున్నా, పేద పిల్లలకు మాత్రం వాటి తాలుకు ప్రయోజనాలు ఆశించిన స్థాయిలో అందడం లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంలో ముడిపడి ఉన్న అంశాలన్నింటినీ తగిన విధంగా తేల్చాలని నిర్ణయించినట్లు తెలిపింది.శాశ్వత బోధనా సిబ్బందిని నియమించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విషయంలో వైఖరి ఏమిటో తెలియచేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. నాణ్యమైన విద్య అందించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియచేస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. నేపథ్యం ఇదీ... కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పార్ట్టైం పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ)గా పనిచేస్తున్న తమను అర్థాంతరంగా తొలగించడాన్ని సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు అధికారుల తీరును తప్పుపట్టారు. పిటిషనర్లను తొలగించడం చట్టవిరుద్ధమని, ఏకపక్షమని తీర్పులో స్పష్టం చేశారు. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్పై సోమవారం జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. -
మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి ఊరట
సాక్షి,విజయవాడ: మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఊరట దక్కింది. నెల్లూరులో ప్రవేశించొద్దన్న షరతును ఏపీ హైకోర్టు తొలగించింది. నెల్లూరు జిల్లాలో ఉండొద్దన్న పోలీసులు పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. నెల్లూరులో ఉండేందుకు కాకాణి గోవర్ధన్రెడ్డికి కోర్టు అనుమతి ఇచ్చింది. -
ఏపీ పోలీసులకు హైకోర్టు చురకలు
-
సివిల్ దుస్తుల్లో.. పోలీస్ విధులా?
సాక్షి, అమరావతి: పోలీసులు.. సివిల్ దుస్తుల్లో వచ్చి ఎలా విధులు నిర్వర్తిస్తారని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. అలా సివిల్ దుస్తుల్లో రావడానికి వీల్లేదని, అది నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పింది. పోలీసు యూనిఫాంలో కాకుండా సివిల్ దుస్తుల్లో వచ్చి అరెస్ట్ చేయడానికి వీల్లేదని, అది డీకే బసు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని స్పష్టం చేసింది. సివిల్ దుస్తుల్లో వస్తే వారు పోలీసులని ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది. సివిల్ దుస్తుల్లో వచ్చి తమ విధులను అడ్డుకున్నారంటే ఎలా కుదురుతుందని నిలదీసింది. సివిల్ దుస్తుల్లో పోలీసులు లా అండ్ ఆర్డర్ విధులు నిర్వర్తిస్తామంటే కుదరదంది. ఇంటెలిజన్స్ అధికారులు సివిల్ దుస్తుల్లో ఉన్నప్పటికీ, వారి బాధ్యత శాంతి భద్రతల పరిరక్షణ కాదని, వారున్నది కేవలం ప్రభుత్వానికి సమాచారాన్ని చేరవేయడానికి మాత్రమేనని గుర్తు చేసింది. బనియన్లు, డ్రాయర్లు, టీ షర్టుల్లో వచ్చి తాము పోలీసులమంటే ప్రజలకు ఎలా తెలుస్తుందని వ్యాఖ్యానించింది. అసలు సివిల్ దుస్తుల్లో విధులు నిర్వర్తించే ప్రివిలేజీలేవీ పోలీసులకు లేవంది. కనీసం సఫారీ దుస్తుల్లో ఉన్నా కొంతవరకు అర్థం చేసుకోవచ్చునంది. ఎస్బీ (స్పెషల్ బ్రాంచ్) పోలీసులు కోవూరు మాజీ శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి వాహనం తనిఖీ సందర్భంగా జరిగిన తోపులాటకు సంబంధించిన వీడియో ఫుటేజీని తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. అంతేకాక ఈ కేసుకు సంబంధించి కేసు డైరీని కూడా తమ ముందుంచాలంది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.నాపై కేసు కొట్టేయండి... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గత నెలలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించిన సమయంలో వాహనాలను తనిఖీ చేస్తున్న తనపై కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ తదితరులు దాడి చేసి గాయపరిచారంటూ స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) కానిస్టేబుల్ కరణం మాలకొండయ్య ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా దర్గామిట్ట పోలీసులు ప్రసన్నకుమార్రెడ్డి తదితరులపై అక్రమ కేసు నమోదు చేశారు. దాన్ని కొట్టేయాలని కోరుతూ ప్రసన్నకుమార్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తాజాగా విచారణ జరిపింది.సివిల్ దుస్తుల్లో వచ్చి... ఏమైనా చేస్తామంటే ఎలా? పిటిషనర్ తరఫున న్యాయవాది వి.రూపేష్ కుమార్రెడ్డి వాదనలు వినిపించారు. ఘటన జరిగిన ప్రదేశంలో ప్రసన్నకుమార్రెడ్డి లేరని, ఆయన ఎవరినీ తోసివేయలేదని తెలిపారు. ఫోటోలను పరిశీలిస్తే అన్ని విషయాలు తెలుస్తాయంటూ కోర్టుకు సమర్పించారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి.. సివిల్ దుస్తుల్లో విధుల్లో ఉన్న వారి గురించి ఆరా తీశారు. వారు పోలీసులని రూపేష్ చెప్పడంతో, న్యాయమూర్తి ఒకింత విస్మయం వ్యక్తం చేశారు. పోలీసులు సివిల్ దుస్తుల్లో విధులు నిర్వర్తించడం ఏమిటంటూ ప్రశ్నించారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సివిల్ దుస్తుల్లో విధులు నిర్వర్తిస్తారన్న రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ చెప్పారు. అయితే న్యాయమూర్తి దీంతో విభేదించారు. పోలీసులు ఎప్పుడూ యూనిఫాంలోనే ఉండి విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ఈ విషయంలో పోలీసు మాన్యువల్ను సైతం పరిశీలిస్తామని స్పష్టం చేశారు. సివిల్ దుస్తుల్లో వచ్చి ఏమైనా చేస్తామని అంటే ఎలా..? అని ప్రశ్నించారు. ఈ మొత్తం ఘటనలో ప్రసన్నకుమార్రెడ్డి పాత్ర కీలకమని, ఆయన ప్రోద్బలంతోనే కానిస్టేబుల్పై దాడి జరిగిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. గాయపడిన కానిస్టేబుల్కి సర్జరీ కూడా జరిగిందన్నారు.యూనిఫాంలో లేనప్పుడు పోలీసని గుర్తించడం ఎలా..? అనంతరం న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ... గాయపడ్డారని చెబుతున్న కానిస్టేబుల్ పోలీసు యూనిఫాంలో లేరని గుర్తు చేశారు. యూనిఫాంలో లేనప్పుడు పోలీసని గుర్తించడం ఎలా? అని ప్రశ్నించారు. యూనిఫాం ధరించి చట్ట ప్రకారం విధులు నిర్వర్తిస్తున్నప్పుడే ఆరోపణలకు బలం చేకూరుతుందన్నారు. ఇంటెలిజన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు యూనిఫాం ఉండదని పీపీ చెప్పగా, అలా అయితే మరి వారు లా అండ్ ఆర్డర్ విధులు ఎలా నిర్వర్తిస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీ, కేసు డైరీని తమ ముందుంచాలని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను సెపె్టంబర్ 8కి వాయిదా వేశారు. -
ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయండి
సాక్షి, అమరావతి: చిన్నారుల అక్రమ రవాణా కేసుల్లో విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్రంలోని అన్ని కోర్టుల న్యాయాధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులపై రోజూ వారీ విధానంలో విచారణ జరపాలని తేల్చిచెప్పింది. అక్రమ రవాణా కేసులు ఎన్ని ఉన్నాయి? వాటి విచారణ ఏ దశలో ఉంది? తదితర వివరాలను తమకు అందచేయాలని ఆదేశించింది. తమ సూచనలను తప్పనిసరిగా అమలు చేసి తీరాలని న్యాయాధికారులకు తేల్చి చెప్పింది. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ వైవీఎస్బీజీ పార్థసారథి ఇటీవల సర్కులర్ జారీ చేశారు. పింకీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఏప్రిల్ 15న ఓ తీర్పు వెలువరించింది. చిన్నారుల అక్రమ రవాణా కేసుల్లో విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని దేశంలోని అన్ని కోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. తమ ఆదేశాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కోర్టు ధిక్కార చర్యలు చేపడతామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని కోర్టులకు సుప్రీంకోర్టు తీర్పు గురించి హైకోర్టు వివరించింది. -
జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రమేష్ మళ్లీ రాష్ట్ర హైకోర్టుకు...
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టు నుంచి గతంలో బదిలీపై వెళ్లిన న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్రాయ్, జస్టిస్ దొనడి రమేష్లు తిరిగి రానున్నారు. జస్టిస్ రాయ్ ప్రస్తుతం గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా, జస్టిస్ రమేష్ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. వీరిద్దరిని మళ్లీ ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం సోమవారం తీర్మానం చేసింది.ఇదే సమయంలో.. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుబేందు సమంతను ఏపీ హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసులు పంపింది. దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులకు చెందిన 14 మంది న్యాయమూర్తులను బదిలీ చేస్తూ కొలీజియం తీర్మానం చేసింది. ఈ ప్రతిపాదనలకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత వారు ఆయా హైకోర్టుల్లో ప్రమాణం చేస్తారు.ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా వచ్చిన అనంతరం జస్టిస్ మానవేంద్రనాథ్ మూడో స్థానంలో కొనసాగుతారు. హైకోర్టు కొలీజియంలో సభ్యుడిగా ఉంటారు. జస్టిస్ రమేష్ 6వ స్థానంలో, జస్టిస్ సుబేందు సుమంత 29 స్థానంలో ఉంటారు. ఈ ముగ్గురి నియామకంతో రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కి చేరనుంది.పశ్చిమ బెంగాల్ నుంచి ఏపీకి...జస్టిస్ సుబేందు సమంత 1971 నవంబరు 25న జని్మంచారు. పశ్చిమబెంగాల్ హమిల్టోన్లో పాఠశాల, తమ్లుక్లో హైసూ్కల్ విద్య పూర్తి చేశారు. కోల్కతా విశ్వ విద్యాలయం నుంచి లా డిగ్రీ పొందారు. తమ్లుక్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా ఎంపికయ్యారు.కోల్కతాలో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయాధికారిగా, అండమాన్ నికోబార్లో జిల్లా సెషన్స్ జడ్జిగా పనిచేశారు. కోల్కతా సిటీ సెషన్స్ కోర్టు చీఫ్ జడ్జిగా వ్యవహరించారు. 2022 మే 18న కలకత్తా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, ఈ ఏడాది ఏప్రిల్ 28న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.మన్యం ప్రాంతం నుంచి...జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్రాయ్ స్వస్థలం పార్వతీపురం. 1964 మే 21న విశాఖపట్నంలో జని్మంచారు. తల్లి విజయలక్షి్మ, తండ్రి నరహరిరావు. వీరిది వ్యవసాయ కుటుంబం. జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ప్రాథమిక విద్య పార్వతీపురం ఆర్సీఎం పాఠశాలలో, ఉన్నత విద్య విశాఖపట్నం సెయింట్ అలోసియస్ హైసూ్కల్లో అభ్యసించారు. విశాఖపట్నం ఎంవీపీ లా కాలేజీలో న్యాయ విద్య చదివారు. 1988 జూలైలో ఏపీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 1988 నుంచి 14 ఏళ్లపాటు పార్వతీపురం, విజయనగరంలో ప్రాక్టీస్ చేశారు. 2002లో డి్రస్టిక్ట్స్ అండ్ సెషన్స్ జడ్జిగా ఎంపికయ్యారు.ఉమ్మడి ఏపీలో పలు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. 2015 జూలై 3 నుంచి 2018 డిసెంబరు 31 వరకు ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు రిజి్రస్టార్ జనరల్గా సేవలందించారు. 2019 జనవరి 1న అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటయ్యాక తొలి రిజి్రస్టార్ జనరల్గా పనిచేశారు. 2019 జూన్ 20న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్కు క్రీడలపై ముఖ్యంగా క్రికెట్పై ఆసక్తి ఎక్కువ. భార్య లక్ష్మీ, కుమార్తెలు అనిషానాయుడు, రేష్మా సాయి ఉన్నారు. 2023లో గుజరాత్ హైకోర్టుకు బదిలీపై వెళ్లారు. జస్టిస్ మానవేంద్ర రాయ్ తాత చీకటి పరశురాం నాయుడు ప్రసిద్ధ న్యాయవాది, రాజనీతిజు్ఞలు. రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు.మదనపల్లె నుంచి ఎదిగి...జస్టిస్ దొనడి రమేష్ చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపాన కమ్మపల్లి గ్రామంలో 1965 జూన్ 27న జన్మించారు. తండ్రి డీవీ నారాయణ నాయుడు పంచాయతీరాజ్ శాఖలో ఇంజనీర్గా పనిచేశారు. తల్లి అన్నపూర్ణమ్మ. జస్టిస్ రమేష్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. 1987–90 మధ్య వీఆర్ లా కాలేజీ నుంచి న్యాయవాద డిగ్రీ పొందారు. 1990లో ఏపీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదయ్యారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నారాయణ వద్ద వృత్తి నైపుణ్యం సాధించారు.హైదరాబాద్లో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2000 డిసెంబరు నుంచి 2004 వరకు ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరించారు. 2007లో ఏపీ సర్వ శిక్ష అభియాన్కు న్యాయవాదిగా ఉన్నారు. 2014లో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులై 2019 మే వరకు కొనసాగారు. 2020 జనవరి 13న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2023 జూలై 24న అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. -
YSRCP కార్యకర్త కాలు విరగొట్టిన SI.. హైకోర్టు ఆగ్రహం
-
వైఎస్సార్సీపీ అభిమాని కావడం.. పిన్నెల్లి ఫొటో పెట్టుకోవడమే పాపం!
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అభిమాని కావడం, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చిత్రాన్ని వాట్సాప్ డీపీగా పెట్టుకోవడమే ఆ యువకుడు చేసిన పాపం. రెడ్బుక్ సేవలో తరిస్తున్న పల్నాడు జిల్లా పోలీసులకు అది ఆగ్రహం తెప్పించింది. అంతే.. ఆ యువకుడిని పోలీస్స్టేషన్లో అక్రమంగా నిర్బంధించారు. వెల్దుర్తి ఎస్ఐ షమందర్ వలీ, ట్రైనీ ఎస్ఐ రాంబాబు గౌడ్, కానిస్టేబుల్ వెంకటనాయక్ కలిసి విచక్షణారహితంగా చావబాదారు. కాలు విరిగేలా కొట్టారు. తీవ్ర గాయాల పాలైన బాధితుడు దీన్ని డీజీపీ, జిల్లా ఎస్పీ దృష్టికి తేవడంతో మరింత రెచ్చిపోయిన వెల్దుర్తి పోలీసులు బెదిరింపులకు దిగారు. దీన్ని భరించలేక బాధితుడు పొనుగంటి నాగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. తనను కస్టడీలో తీవ్రంగా హింసించిన పోలీసులపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించడంతో పాటు బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా డీజీపీ, ఎస్పీలను ఆదేశించాలని అభ్యర్థిస్తూ అత్యవసరంగా లంచ్మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై స్పందించిన హైకోర్టు ఈ నెల 12వతేదీ నుంచి 14 వరకు వెల్దుర్తి పోలీస్ స్టేషన్లోని సీసీ టీవీ ఫుటేజీని భద్రపరచాలని ఎస్హెచ్వోను ఆదేశించింది. పిటిషనర్ వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకుని చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 45 నిమిషాల పాటు చిత్రహింసలు..! అంతకుముందు పిటిషనర్ తరఫు న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపించారు. ‘వెల్దుర్తి పోలీస్స్టేషన్ ట్రైనీ ఎస్ఐ రాంబాబు గౌడ్ ఈనెల 12వ తేదీ ఉదయం 9 గంటలకు పిటిషనర్ నాగిరెడ్డిని ఇంటి నుంచి పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. ఎందుకు తీసుకొచ్చారో కూడా చెప్పలేదు. సాయంత్రం 4 గంటల నుంచి దాదాపు 45 నిమిషాల పాటు నాగిరెడ్డిని ట్రైనీ ఎస్ఐ రాంబాబు, ఎస్ఐ వలీ, కానిస్టేబుల్ నాయక్ కలిసి కర్రలు, బెల్టుతో చావబాదారు. కాళ్లు, చేతులు మెలిబెట్టి అదే పనిగా కొట్టారు. రాత్రి 11 గంటల వరకు నాగిరెడ్డిని స్టేషన్లో కూర్చోబెట్టిన పోలీసులు రూ.15 వేలు డిమాండ్ చేసి తీసుకున్నారు. నాగిరెడ్డి ప్రభుత్వాసుపత్రికి వెళ్లగా కాలు విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మళ్లీ స్టేషన్కు రప్పించి కూర్చోబెట్టారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తరువాత పిటిషనర్ నాగిరెడ్డి తల్లిదండ్రులను కూడా పోలీసులు బెదిరించారు. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు వెల్దుర్తి పోలీస్స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. బాధితుడి వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకునేలా డీజీపీని ఆదేశించాలి’ అని రామలక్ష్మణరెడ్డి హైకోర్టును అభ్యర్థించారు. పోలీసుల తరఫున హోంశాఖ న్యాయవాది ఏ.జయంతి వాదనలు వినిపిస్తూ నాగిరెడ్డి బైక్పై నుంచి పడి కాలు విరగ్గొట్టుకున్నారని, ఇందులో పోలీసులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఫుటేజీ భద్రపరచడానికి ఏం ఇబ్బంది? ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, సీసీటీవీ ఫుటేజీ భద్రపరచడానికి ఇబ్బంది ఏముంటుందని ప్రశి్నంచారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి పోలీస్స్టేషన్లో సీసీ టీవీ ఉండి తీరాలని గుర్తు చేశారు. వెల్దుర్తి పోలీస్స్టేషన్లో ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు సీసీటీవీ ఫుటేజీని తగిన అధికారికి అందించేందుకు వీలుగా భద్రపరచాలని ఎస్హెచ్వోను ఆదేశిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. -
డీఏ, పీఆర్సీ బకాయిలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి
సాక్షి, అమరావతి: గత చంద్రబాబు ప్రభుత్వ హయాం నుంచి చెల్లించకుండా పెండింగ్లో ఉన్న కరువు భత్యం (డీఏ), వేతన సవరణ (పీఆర్సీ) బకాయిలను చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్ఈఏ) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై హైకోర్టు మంగళవారం స్పందించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ట్రెజరీస్ అకౌంట్స్ డైరెక్టర్, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకు ముందు పిటిషనర్ సంఘం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2018లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కరువు భత్యం, వేతన సవరణ బకాయిలను చెల్లించలేదన్నారు. కొత్త పెన్షన్ స్కీం ప్రకారం 90 శాతం బకాయిలను నగదు రూపంలోనే చెల్లించాల్సి ఉందన్నారు. మిగిలిన 10 శాతం మొత్తాన్ని పదవీ విరమణ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించిన పలు ఉత్తర్వులు అమలు కాలేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. -
మేమిచ్చిన నోటీసులే తీసుకోరా..?
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా, లక్కిరెడ్డిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ మోహన్పై హైకోర్టు మండిపడింది. మోహన్ తాము జారీ చేసిన నోటీసులను తీసుకోకుండా ఉండేందుకు, వారం రోజులుగా తాను సెలవులో ఉన్నట్లు పోస్టుమేన్ చేత రాయించారని హైకోర్టు అభిప్రాయపడింది. ఎస్ఐ చెప్పకుంటే హైకోర్టు నోటీసుల విషయంలో ఓ పోస్టుమెన్కు ఇలా రాసేంత ధైర్యం ఉండదని ఘాటుగా వ్యాఖ్యానించింది. మనదేశంలో ఏ పోస్టుమేన్ కూడా ఇలా రాసే పరిస్థితి లేదని స్పష్టం చేసింది. వరుసగా ఏడు రోజులపాటు మోహన్ సెలవులో ఉన్నారని పోస్టుమేన్ రాసిన నేపథ్యంలో, అవసరమైతే పోలీస్స్టేషన్ నుంచి హాజరుపట్టీ తెప్పించి పరిశీలిస్తామని తెలిపింది. ఎస్ఐ తాను చాలా తెలివైన వ్యక్తినని భావిస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించింది.ఏడు రోజుల పాటు ఎస్ఐ వరుసగా విధులకు హాజరు కాలేదంటే నమ్మలేకున్నామని పేర్కొంది. మరో అవకాశం ఇస్తున్నామని, నోటీసులు తీసుకోవాలని, లేకుంటే తాము విచారణ కొనసాగిస్తామని తేల్చి చెప్పింది. ఈ కేసులో ఎస్ఐ మోహన్ కౌంటర్ దాఖలు చేశారా? లేదా? అన్న దాంతో సంబంధం లేకుండా విచారణ జరుపుతామని తెలిపింది. పూర్తి వివరాల సమర్పణకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) విష్ణుతేజ సమయం కోరారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 2కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్ల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.జల్లా సుదర్శన్రెడ్డి నిర్బంధంపై పిటిషన్..తన భర్త, ఉమ్మడి కడప జిల్లా గాలివీడు మాజీ ఎంపీపీ జల్లా సుదర్శన్రెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, అందువల్ల అతన్ని కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జల్లా అరుణ గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లక్కిరెడ్డిపల్లి సీఐ కొండారెడ్డి, ఎస్ఐ మోహన్పై పలు ఆరోపణలు చేశారు. తన భర్త చొక్కా పట్టుకుని లాక్కెళ్లారని అరుణ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, కొండారెడ్డి, మోహన్లను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చింది. అనంతరం వారికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ వ్యాజ్యాలపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్రావు ధర్మాసనం తాజాగా సోమవారం విచారణ సందర్భంగా ఎస్ఐ మోహన్పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. -
AP: వీఏఏల బదిలీ వ్యవహారంపై హైకోర్టు విస్మయం
విజయవాడ: కృష్ణా, కర్నూలు జిల్లాల గ్రామ వ్యవసాయ సహాయకులు బదిలీలు రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. వీఏఏల బదిలీ వ్యవహారంపై హైకోర్టు విస్మయం వ్యకతం చేసింది. ఆ రెండు జిల్లాల్లో తిరిగి కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీలు చేపట్టాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నిబంధనలకు పాతరేసి ప్రజాప్రతినిధుల సిఫార్సులకు అధికారులు పట్టంకట్టి బదిలీలు చేయడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇవి ప్రజా ప్రతినిధుల సిఫార్సు మేరకే జరిగాయని, దీన్ని ప్రజా ప్రయోజనంగా పరిగణించలేమని హైకోర్టు పేర్కొంది. బదిలీల అమల్లో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘన జరుగుతున్నా కలెక్టర్ మౌనంగా ఉండిపోయారని, బదిలీల్లో పారదర్శకత లోపించిందని హైకోర్టు తేల్చి చెప్పింది. -
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి బెయిల్
సాక్షి,అమరావతి: మాజీ మంత్రి గోవర్ధన్రెడ్డికి బెయిల్ మంజూరైంది. రుస్తుం మైనింగ్ కేసుల్లో కాకాణికి బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ కోర్టు సోమవారం(ఆగస్టు 18)న తీర్పును వెలవరించింది. మొత్తం ఎనిమిది కేసుల్లో బెయిల్ రావడంతో 85రోజులుగా జైల్లో ఉన్న ఆయన కాకాణి గోవర్దన్రెడ్డి మంగళవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం.. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా సర్కారు పెద్దల బరితెగింపు హద్దులు మీరుతోంది. ప్రశ్నించే వారే ఉండకూడదని హూంకరిస్తూ నిత్యం తప్పుడు కేసులతో చెలరేగిపోతోంది. ఈ క్రమంలో ఈ ఏడాది మే నెలలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డిని నెల్లూరు పోలీసులు కక్షపూరితంగా అరెస్ట్ చేశారు. కేరళ రాష్ట్రంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి, అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తుండటం వల్లే కాకాణిపై తప్పుడు కేసు పెట్టారు. ఇందులో భాగంగా పొదలకూరు మండలం తాటిపర్తి రుస్తుం మైన్స్లో అక్రమ మైనింగ్ జరిగిందని ఈ ఏడాది ఫిబ్రవరిలో మైనింగ్ శాఖ ఇన్చార్జ్ డీడీ బాలాజీ నాయక్ పొదలకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్లో కాకాణి అనుచరుల ప్రమేయం ఉందని, ఆయన వారికి సహకరించారంటూ 120(బి), 447, 427, 379, 290, 506, 109 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ, సెక్షన్ 3 పీడీపీపీఎ, సెక్షన్ 3 అండ్ 5 ఆఫ్ ఈఎస్ యాక్ట్ అండ్ సెక్షన్ 21(1), 21(4) ఆఫ్ ఎంఎండీఆర్ యాక్ట్ కింద పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.ఈ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి సంబంధం లేకపోయినా.. పట్టుబట్టి, టార్గెట్ చేసి ఏ4గా చేర్చారు. తొలుత ఈ కేసులో బలం లేదని ఏ1తో పాటు మరో ఇద్దరికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కేసును మరింత పటిష్టం చేసి కాకాణిని జైలుకు పంపే కుట్రలో భాగంగా అట్రాసిటీ సెక్షన్లు జత చేశారు. ఇలా కూటమి ప్రభుత్వం కాకాణిపై అక్రమ కేసులు బనాయించడంతో వాటిపై న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ కాకాణి గోవర్దన్రెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
ఏపీ హైకోర్టులో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
-
ఏపీ వెలుపల ఇంటర్ చదివితే స్థానిక హోదా ఉండదు
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి అభ్యర్థుల ‘స్థానికత’ విషయంలో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావులతో కూడిన ధర్మాసనం బుధవారం స్పష్టత నిచ్చింది. ఈ తీర్పు ప్రతి గురువారం అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ వెలుపల విద్యను అభ్యసించినప్పటికీ, తాము రాష్ట్రంలో నివాసం ఉంటున్నామని, అందువల్ల తమను ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల్లో స్థానిక అభ్యర్థులుగా పరిగణించాలంటూ పలువురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది.రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెలుపల క్వాలిఫయింగ్ ఎగ్జామ్ (ఇంటర్) చదివిన విద్యార్థులను స్థానిక అభ్యర్థులుగా పరిగణించలేమని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది. స్థానికత విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులు చాలా స్పష్టంగా ఉన్నాయని తెలిపింది. అలాగే గతంలోనే హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం దీనిపై చాలా స్పష్టమైన తీర్పునిచ్చిందని గుర్తు చేసింది. ఇందులో తాము కొత్తగా చెప్పేందుకు ఏమీ లేదంది. తాము కూడా రాష్ట్రపతి ఉత్తర్వులకు, హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పునకు లోబడి ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. ధర్మాసనం తాజా తీర్పు ప్రకారం ఎవరు స్థానిక అభ్యర్థులు అవుతారంటే.. ⇒ ప్రవేశం కోరుతున్న విద్యారి్థ, తాను ఏ లోకల్ ఏరియా (ఎస్వీ యూనివర్సిటీ లేదా ఏయూ పరిధి)లో చదివానని చెబుతున్నాడో, ఆ ప్రాంతంలో ఆ అభ్యర్థి వరుసగా నాలుగేళ్చ్లు చదివి ఉండాలి. ఆ నాలుగేళ్లను క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్(+2)తో ముగించి ఉండాలి. అప్పుడే ఆ అభ్యర్థి ఆ ప్రాంతానికి స్థానిక అభ్యర్థి అవుతాడు.⇒ ఆ అభ్యర్థి ఆ ప్రాంతంలో (లోకల్) ఏ విద్యా సంస్థలోనూ చదవకపోయినప్పటికీ, క్వాలిఫైయింగ్ పరీక్ష రాసే నాటికి వరుసగా నాలుగేళ్ల పాటు ఆ లోకల్ ఏరియాలో నివాసం ఉన్నా కూడా ఆ అభ్యర్థి స్థానిక అభ్యర్థే అవుతాడు.⇒ అలాగే క్వాలిఫయింగ్ పరీక్ష రాసే నాటికి ఆ అభ్యర్థి లోకల్ ఏరియాలో నాలుగేళ్ల పాటు ఎక్కడా కూడా విద్యాభ్యాసం చేయనప్పటికీ, రాష్ట్రంలో ఏడేళ్ల పాటు నివాసం ఉంటే సైతం ఆ అభ్యర్థిని స్థానిక అభ్యర్థిగానే పరిగణించాల్సి ఉంటుంది. -
తాడిపత్రికి కేతిరెడ్డి.. అనంతపురం పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఏపీలో హైకోర్టులో ఊరట దక్కింది. తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. పెద్దారెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కారణ కేసును హైకోర్టు విచారించింది. తాడిపత్రి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ సందర్భంగా అనంతపురం పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనెల 18వ తేదీన కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతిచ్చిన కోర్టు .. ఆయనకు పోలీసులే భద్రత కల్పించాలని సూచించింది. -
ఏపీ హైకోర్టు పరీక్షలకు సంబంధించిన టాప్-500 బిట్స్ ఇవే...!
సాక్షి ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరీక్షలు 2025 ఆగస్టు 20 నుంచి 24 వరకు జరుగనున్నాయి. పరీక్షలకు సమయం వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాబట్టి హైకోర్టు పరీక్షల సిలబస్ ఆధారంగా.. సాక్షి ఎడ్యుకేషన్. కామ్ ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో టాప్ 500+ బిట్బ్యాంక్ ప్రిపేర్ చేయించింది. గతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీస్, కానిస్టేబుల్, గ్రామ సచివాలయం వంటి పరీక్షల్లో సాక్షి ఎడ్యుకేషన్ అందించిన బిట్స్ నుంచే అనేక ప్రశ్నలు వచ్చిన విషయం మీ అందరికి తెల్సిందే. కాబట్టి ఈ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ విజయావకాశాలు మరింత పెరుగుతాయి. మీ నిరంతర కృషికి, ఈ ప్రశ్నల సాధన తోడైతే.., మీరు ఆత్మవిశ్వాసంతో పరీక్షను ఎదుర్కొని విజయం సాధించడం ఖాయం. ఈ క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేసి... ప్రాక్టీస్ చేయడం ద్వారా.. మీ విజయానికి దగ్గర అవుతారు. -
ఎస్ఈసీ కల్పించుకుని రిగ్గింగ్ను అడ్డుకోవాల్సింది: హైకోర్టు
సాక్షి, అమరావతి: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ అక్రమాలపై వైఎస్సార్సీపీ వేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది. వైఎస్సార్సీపీ ఏజెంట్లను పోలింగ్బూత్ల్లోకి అనుమతించకుండా అడ్డుకున్నారని.. పక్క నియోజకవర్గాల నుంచి మనుషులను రప్పించి రిగ్గింగ్ చేయించారని వైఎస్సార్సీపీ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. అయితే విజేతను ప్రకటించాక కోర్టుల జోక్యం అనవసరమంటూ టీడీపీ తరఫు లాయర్ వాదించారు. ఈ క్రమంలో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మరికాసేపట్లో ఆదేశాలు జారీ చేయనుంది.వైఎస్సార్సీపీ అభ్యర్థుల తరఫున లాయర్ వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ ఉప ఎన్నికల్లో పక్క నియోజకవర్గాల టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు. మొత్తం 15 పోలింగ్బూత్ల్లోకి వైఎస్సార్సీపీ ఏజెంట్లను అనుమతించలేదు. జమ్మలమడుగు నుంచి వాహనాల్లో వచ్చారు. ఆ వాహనాలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఫొటోలు ఉన్నాయి. పక్క నియోజకవర్గాల నుంచి వచ్చిన టీడీపీ నేతలు క్యూ లైన్లో నిల్చిన ఓటేసిన ఫొటోలు ఉన్నాయి. ఓటర్లను భయభ్రంతాలకు గురి చేసి ఓట్లేశారు. కలెక్టర్ సమక్షంలో దొంగ ఓటు వేస్తున్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఎన్నికలో జరుగుతున్న దౌర్జన్యాలను అదే రోజు ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. ఎన్నిలక సంఘం ఎలాంటి జోక్యం చేసుకోలేదు. రిగ్గింగ్ జరుగుతున్నా పట్టించుకోలేదు. తమను అనుమతించలేదని వైఎస్సార్సీపీ ఏజెంట్లు ఫిర్యాదు చేశారు అని వాదించారు. అయితే.. టీడీపీ తరఫు లాయర్ వాదిస్తూ.. ఎన్నిక సంబంధమైన వివాదాల్లో జోక్యం చేసుకునే హైహక్కు కోర్టుకు లేదు. ఇప్పటికే విజేతను ప్రకటించారు. కాబట్టి కోర్టుల జోక్యం అనవసరం అన్నారు. ఈ క్రమంలో.. పిటిషనర్ల తరఫున మాజీ ఏజీ శ్రీరామ్ వాదిస్తూ.. ఎన్నికల సంఘం పరిధిలోకి కోర్టులు జోక్యం చేసుకోవద్దనే నియమం ఈ కేసుకు వర్తించదని స్పష్టం చేశారు. మోహిందర్ సింగ్ కేసులో కోర్టు రీపోలింగ్కు ఆదేశించింది. సహజన్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏదైనా జరిగినప్పుడు.. జోక్యం చసుకునే హక్కు హైకోర్టుకు ఉంది అని తెలిపారు. ఈ క్రమంలో జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ స్పందిస్తూ.. ఎస్ఈసీ కల్పించుకుని రిగ్గింగ్ను అడ్డుకోవాల్సిందని అన్నారు. అంతేకాదు.. ఇతర ప్రాంతాల వారు ఓట్లు వేస్తున్నట్లు ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల అవకతవకల పిటిషన్ వాదనలు పూర్తి కావడంతో ఆదేశాలు మధ్యాహ్నాం తర్వాత జారీ చేస్తామని తెలిపారాయన. ‘‘పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ నాయకులు బెదిరింపులు, దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడ్డారని, పోలింగ్ కేంద్రాలను ఆక్రమించి దొంగ ఓట్లు వేసుకున్నారని, ఈ నేపథ్యంలో రీ పోలింగ్కు చర్యలు చేపట్టేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని వైఎస్సార్సీపీ అభ్యర్థులు తుమ్మల హేమంత్రెడ్డి, ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. -
ఎన్నికల కమిషన్ విఫలం: హైకోర్టు
‘‘ఉప ఎన్నికల పోలింగ్ కేంద్రాలను మార్చిన విషయాన్ని పత్రికల్లో ప్రకటనగా ప్రచురించాలని నిబంధనలు చెబుతున్నాయి. అయినా కూడా ఎన్నికల కమిషన్ ఆ పని చేయడంలో విఫలమైంది.’’ ‘‘పోలింగ్ కేంద్రాల మార్పు విషయంలో ఎన్నికల కమిషన్ తన స్వీయ నిబంధనను తానే ఉల్లంఘించింది.’’ ‘‘అసలు అభ్యంతరం తెలిపే అవకాశమే లేనప్పుడు... ప్రజలు అభ్యంతరం చెప్పలేదనే కారణాన్ని చూపుతూ పోలింగ్ కేంద్రాల మార్పు విషయంలో నిర్ణయం తీసుకోవడం ఎంత వరకు సబబు?’’ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరును ఆక్షేపిస్తూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చిన విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) తీరును హైకోర్టు గట్టిగా తప్పుబట్టింది. ‘‘పోలింగ్ కేంద్రాలను మార్చిన విషయాన్ని జెడ్పీటీసీ, ఎంపీపీ కార్యాలయాల బయట అతికిస్తే సరిపోతుందా? ఈ విషయం సాధారణ ప్రజానీకానికి ఎలా తెలుస్తుంది’’ అంటూ నిలదీసింది. అసలు పోలింగ్ కేంద్రాలను మార్చినట్లు తెలిసినప్పుడే కదా... ప్రజలకు దానిపై అభ్యంతరాలను తెలిపే అవకాశం ఉంటుంది అని అభిప్రాయపడింది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎర్రబల్లి, నలగొండువారిపల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను నల్లపురెడ్డిపల్లికి మార్చడాన్ని వైఎస్సార్సీపీకి చెందిన పలువురు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ సోమవారం విచారణ జరిపారు. ఇప్పటికే 97 శాతం ఓటర్ స్లిప్పుల పంపిణీ జరగడం, ఆ స్లిప్పుల్లో పోలింగ్ కేంద్రాల వివరాలు ఉన్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల మార్పు విషయంలో జోక్యం చేసుకోలేకపోతున్నామని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఎన్నిక ప్రక్రియ కూడా మొదలైందని గుర్తుచేస్తూ... పోలింగ్ కేంద్రాల మార్పుపై దాఖలైన వ్యాజ్యాలను తోసిపుచ్చుతూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 2 కి.మీ.దూరం.. నేడు 4 కి.మీ. వైఎస్సార్సీపీకి చెందిన పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి, న్యాయవాదులు వీఆర్రెడ్డి కొవ్వూరి, యర్రంరెడ్డి నాగిరెడ్డి, వడ్లమూడి కిరణ్, సానేపల్లి రామలక్ష్మణరెడ్డి తదితరులు వాదనలు వినిపించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చిందని అన్నారు. పోలింగ్ కేంద్రాలను మార్చినట్లు ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేదన్నారు. అసలు మార్చినట్లు ఓటర్లకు కూడా తెలియదని పేర్కొన్నారు. గతంలో పోలింగ్ కేంద్రం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటే ఇప్పుడు దానిని నాలుగు కిలోమీటర్లకు మార్చిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మార్పుపై పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాల్సి ఉన్నా ఆ పని చేయలేదని తెలిపారు. ఎన్నికల సంఘం తన నిబంధనలను తానే అమలు చేయలేదన్నారు. ప్రకటన ఇవ్వలేదు.. గోడకు అతికించాంరాష్ట్ర ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, పోలింగ్ కేంద్రాల మార్పు విషయంలో నిబంధనలను అనుసరించినట్లు చెప్పుకొచ్చారు. పత్రికల్లో ప్రకటనలు ఇవ్వలేదని అంగీకరిస్తూనే... పోలింగ్ కేంద్రాల వివరాలను జెడ్పీటీసీ కార్యాలయం బయట అతికించి ప్రజల నుంచి అభ్యంతరాలు కోరామన్నారు. ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో పోలింగ్ కేంద్రాలను మార్చామని తెలిపారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వనంత మాత్రాన పోలింగ్ కేంద్రాల మార్పు గురించి ఓటర్లకు తెలియదని భావించడానికి వీల్లేదన్నారు. ఓటర్ స్లిప్పుల్లో పోలింగ్ కేంద్రాల వివరాలున్నాయన్నారు. చివరి నిమిషంలో కోర్టుకు వచ్చి ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. పోలింగ్ కేంద్రాల మార్పుపై దాఖలైన వ్యాజ్యాలను తోసిపుచ్చారు. ర్యాలీ నిర్వహించిన వారిపై ఎలాంటి చర్యలొద్దుమరో కేసులో రాష్ట్ర హైకోర్టు కీలక ఉత్తర్వులు 150 మందిపై అక్రమ కేసు వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి... వారు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా చేసి.. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో లబ్ధి పొందాలనుకున్న కూటమి సర్కారు కుతంత్రాలను హైకోర్టు అడ్డుకుంది. ప్రభుత్వ దాడులను నిరసిస్తూ పులివెందులలో ర్యాలీ చేపట్టినందుకు కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేంపల్లి సతీష్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్తో పాటు 150 మందిపై పోలీసులు నమోదు చేసిన కేసులో హైకోర్టు సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ర్యాలీ నిర్వహించినందుకు నమోదు చేసిన కేసులో నిందితులుగా ఉన్నవారి విషయంలో తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని పులివెందుల పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వ దాడులను నిరసిస్తూ ఈ నెల 6న పులివెందులలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి పోలీస్స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో వైఎస్ అవినాష్రెడ్డి, సతీష్రెడ్డితో పాటు పెద్దఎత్తున నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే, అనుమతి లేకుండా ర్యాలీ తీసి, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఎంపీడీవో కృష్ణమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, సతీష్రెడ్డితో పాటు దాదాపు 150 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసును అడ్డం పెట్టుకుని వీరందరినీ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నింది. దీంతో తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ గజ్జల గంగ మహేశ్వరరెడ్డి, కంచర్ల వెంకట సర్వోత్తమరెడ్డి, కంచర్ల జనార్దన్రెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ జ్యోతిర్మయి విచారణ జరిపారు. రాజకీయ కక్ష సాధింపునకే కేసు నమోదు పిటిషనర్ల తరఫు న్యాయవాది వీఆర్రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపిస్తూ, కేవలం రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారన్నారు. జడ్పీటీసీ ఉప ఎన్నికలో అధికార పార్టీ అనేక అక్రమాలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125 కింద పెట్టిన కేసు చెల్లదని తెలిపారు. ఎన్నికల సమయంలో వర్గాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేందుకు ఈ సెక్షన్ కింద కేసు పెడతారని, కానీ, పిటిషనర్లు అలాంటి నేరం ఏదీ చేయలేదన్నారు. ఎఫ్ఐఆర్లో పోలీసులు మొత్తం 10 మందిని నిందితులుగా పేర్కొన్నారన్నారు. వీరితోపాటు మరో 100–150 మందిని కూడా నిందితులుగా చేర్చే ప్రమాదం ఉందని వివరించారు. ఆ మరికొందరు నిందితులు ఎవరో నిర్దిష్టంగా పేర్కొనలేదని, తద్వారా వైఎస్సార్సీపీకి చెందినవారిని ఎన్నికల సమయంలో నిందితులుగా చేర్చి, వేధింపులకు గురి చేసే అవకాశం ఉందన్నారు. బీఎన్ఎస్ సెక్షన్ 223 కింద నేరుగా కేసు పెట్టే అధికారం పోలీసులకు లేదని తెలిపారు. మేజి్రస్టేట్ అనుమతి తీసుకున్న తర్వాతే ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేయాల్సి ఉంటుందని వివరించారు. పిటిషనర్లపై నమోదు చేసిన కేసులన్నీ కూడా ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడేవేనని ప్రస్తావించారు. మధ్యంతర ఉత్తర్వులొద్దన్న ప్రభుత్వ న్యాయవాది పోలీసుల తరఫున రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ పిటిషనర్లపై నమోదు చేసిన కేసులు ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడేవేనని, వారికి బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసులు ఇస్తామన్నారు. అందువల్ల ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయొద్దని కోరారు. ఒకవేళ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటే వాటిని కేవలం పిటిషనర్లకే పరిమితం చేయాలని అభ్యర్థించారు. సెక్షన్ 223 కింద పోలీసులు కేసు పెట్టడానికి వీల్లేదు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... సెక్షన్ 223 కింద పోలీసులు నేరుగా కేసు పెట్టడానికి వీల్లేదని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో పిటిషనర్ల తరఫు న్యాయవాది చేసిన వాదనల్లో బలం ఉందన్నారు. జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో పిటిషనర్లతో పాటు ఇతర నిందితులపై నమోదు చేసిన కేసులో తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టవద్దని పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేశారు. -
పోలీసులకు హైకోర్టు షాక్
సాక్షి, అమరావతి: పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా వైఎస్సార్సీపీ కీలక నేతలు లింగాల రామలింగారెడ్డి, నంద్యాల హేమాద్రిరెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద తప్పుడు కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చిం ది. వీరిపై నమోదైన కేసులో తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని సోమవారం ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ఉత్తర్వులు జారీచేశారు.పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారం చేస్తున్న తమపై వైఎస్సార్సీపీ నేతలు లింగాల రామలింగారెడ్డి, మరికొందరు దాడిచేసి గాయపరిచారంటూ టీడీపీకి చెందిన ధనుంజయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు రామలింగారెడ్డి, హేమాద్రిరెడ్డితో పాటు మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు పెట్టారు. ఇది కొట్టేయాలని కోరుతూ రామలింగారెడ్డి, హేమాద్రిరెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ జ్యోతిర్మయి విచారణ జరిపారు. ఎస్సీ, ఎస్టీ కేసు చెల్లదు.. పిటిషనర్ల తరఫు న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే పిటిషనర్లపై తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గొడవ జరిగితే, దానిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుచేయడం చెల్లదన్నారు. పైగా.. బాధితుడు ఎస్సీ, ఎస్టీ కులానికి చెందిన వ్యక్తి అయితేనే ఆ చట్టం కింద కేసు పెట్టడానికి వీలుంటుందన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో పాల్గొనకుండా చేసేందుకే పిటిషనర్లపై పోలీసులు ఈ తప్పుడు కేసు నమోదుచేశారన్నారు.అనంతరం.. పోలీసుల తరఫున పీపీ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ వ్యవహారంలో లోతుగా విచారణ జరపాల్సి ఉందన్నారు. ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని పిటిషనర్లపై తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 13కి వాయిదా వేశారు. ఈలోపు ఫిర్యాదుదారు ధనుంజయకు నోటీసులు అందజేయాలని పీపీకి సూచించారు. -
పులివెందుల పోలీసులకు హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, అమరావతి: పులివెందుల పోలీసులకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ.. వైఎస్సార్సీపీ నేతలపై నమోదైన కేసుల్లో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో తొందరపాటు చర్యలు వద్దంటూ సోమవారం కోర్టు పోలీసులకు స్పష్టం చేసింది.పులివెందుల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాలు బరితెగించి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని ఖండిస్తూ ఈ నెల 6వ తేదీన వైఎస్సార్సీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి సహా 150 మందిపై పోలీసులు కేసు పెట్టారు. పోలీసుల దాష్టీకంపై వైఎస్సార్సీపీ నేతల హైకోర్టుకు ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు.. తొందరపాటు చర్యలు వద్దని, ఎవ్వరినీ అరెస్ట్ చేయవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఇదిలా ఉంటే.. పులివెందులలో అధికార పార్టీ టీడీపీకి తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని, దాడులకు పాల్పడిన వాళ్లను వదిలేసి గాయపడ్డ వాళ్లపైనే కేసులు కడుతున్నారంటూ వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. -
శాశ్వత న్యాయమూర్తులుగా నలుగురు
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ నూనెపల్లి హరినాథ్, జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ న్యాపతి విజయ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయ శాఖ సంయుక్త కార్యదర్శి జగన్నాథ్ శ్రీనివాసన్ నోటిఫికేషన్ జారీ చేశారు. శాశ్వత న్యాయమూర్తులుగా వీరితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ వచ్చే వారం ప్రమాణం చేయించనున్నారు. జస్టిస్ హరినాథ్, జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ సుమతి, జస్టిస్ విజయ్లు 2023 అక్టోబర్ 21న హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ఆ పదవీ కాలం అక్టోబర్ 20వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో వీరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. వీరి నియామకంతో హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తుల సంఖ్య 24కి చేరింది. -
తురకా కిషోర్ కేసులో హైకోర్టు సంచలన తీర్పు
-
నిందితులుగా ఎవరినీ ఎందుకు చేర్చలేదు?
సాక్షి, అమరావతి: ‘‘కోవూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి నిందితుల జాబితాలో ఎవరినీ ఎందుకు చేర్చలేదు? ప్రసన్న సమర్పించిన ఫొటోల్లో దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు స్పష్టంగా ఉన్నారు కదా? వారిని ఎందుకు నిందితులుగా చేర్చలేదు..?’’ అని హైకోర్టు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా దర్గామిట్ట పోలీసులను ప్రశ్నించింది.ప్రసన్న ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు పురోగతి వివరాలను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. గురువారం ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ఉత్తర్వులు జారీ చేశారు. తన ఇంటిపై దాడి గురించి ఫిర్యాదు ఇచ్చినా సకాలంలో కేసు నమోదు చేయలేదని, తర్వాత కేసు నమోదు చేసినా, దాడి చేసినవారిని నిందితులుగా చేర్చలేదని, ఈ విషయంలో పోలీసులపై చర్యలకు ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రసన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ జ్యోతిర్మయి విచారణ జరిపారు. ప్రశాంతిరెడ్డి ప్రోద్బలంతోనే దాడి... పిటిషనర్ తరఫు న్యాయవాది వి.రూపేష్ కుమార్రెడ్డి వాదనలు వినిపించారు. దాడికి పాల్పడినవారి ఫొటోలను, ఆ ఘటన సీసీ ఫుటేజీని పిటిషనర్ పోలీసులకు సమర్పించారని తెలిపారు. అయినా పోలీసులు కేసు నమోదులో విపరీతమైన జాప్యం చేసి, దాడి బాధ్యులను నిందితులుగా చేర్చలేదన్నారు. ఎఫ్ఐఆర్లో నిందితుల స్థానంలో గుర్తుతెలియని వ్యక్తులు అని పేర్కొన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ప్రోద్బలంతో... పిటిషనర్ ఇంటిపై దాడి జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు.పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది (జీపీ) ఎ.జయంతి వాదిస్తూ, ఎవరిని నిందితులుగా చేర్చాలన్నది పోలీసుల విచక్షణకు సంబంధించినదని తెలిపారు. దర్యాప్తు ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలన్నది పిటిషనర్ నిర్దేశించలేరన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి, ప్రాథమిక దర్యాప్తు జరిపారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... పిటిషనర్ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో దర్యాప్తు పురోగతి ఏమిటో చెప్పాలని పోలీసులను ఆదేశించారు. అలాగే నిందితులుగా ఎవరినీ ఎందుకు చేర్చలేదో కూడా చెప్పాలన్నారు. -
'స్థానిక ఎన్నికలు' నిష్పాక్షికంగా జరిపించండి
సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ (స్థానిక) ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని సూచించింది. ఎన్నికల ప్రక్రియ మొదలైనందున ఈ వ్యవహారంలో ఇంతకుమించి జోక్యం చేసుకోలేమని పేర్కొంది. స్థానిక ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలంటూ వైఎస్సార్సీపీ సమర్పించిన వినతిపత్రాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యల నిమిత్తం డీజీపీకి పంపిందని గుర్తుచేసింది. ఈ వ్యాజ్యంలో తదుపరి ఉత్తర్వులు అవసరం లేదని స్పష్టం చేసింది. ఇంతటితో పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. ⇒ స్థానిక ఎన్నికల ప్రక్రియలో సీసీ టీవీల ఏర్పాటు, వెబ్ క్యాస్టింగ్, స్వతంత్ర పరిశీలకులు, అభ్యర్థులకు పోలీసు రక్షణ, ఎన్నికల ప్రక్రియను వీడియో తీసే విషయంలో అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదంటూ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేవారందరికీ సమాన అవకాశాలు ఉండేలా చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గురువారం విచారణ జరిపి ఉత్తర్వులు జారీ చేశారు. దాడులకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవట్లే.. పిటిషనర్ తరఫు న్యాయవాది వడ్లమూడి కిరణ్కుమార్ వాదనలు వినిపిస్తూ... స్థానిక ఉప ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతిని వివరించారు. అధికార పార్టీ కండబలం, ధనబలంతో ప్రతిపక్ష నాయకులపై దాడులకు పాల్పడుతోందని, అయినా పోలీసులు చోద్యం చూస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిష్పాక్షికంగా, స్వేచ్ఛాయుతంగా జరిగే పరిస్థితుల్లేవని పేర్కొన్నారు. పారదర్శకంగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్కు వినతిపత్రం సమర్పించినట్లు చెప్పారు. దీనిపై కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది స్పందిస్తూ, పిటిషనర్ సమర్పించిన వినతిపై స్పందించామని తెలిపారు. వారు కోరిన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి ఎన్నికల కమిషన్ సూచించిందన్నారు. అవసరమైతే అదనపు బలగాలను మోహరించాలని కూడా చెప్పిందన్నారు.ప్రశాంత ఎన్నికల బాధ్యత అధికారులదే!హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణప్రసాద్శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూసే బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని పులివెందుల డీఎస్పీ, పులివెందుల గ్రామీణ సీఐ, పట్టణ సీఐలను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలంటూ పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ తదుపరి చర్యల నిమిత్తం ఎన్నికల అధికారి (కలెక్టర్), జిల్లా ఎస్పీకి పంపిన విషయాన్ని రికార్డు చేసింది. తమ ముందు దాఖలైన వ్యాజ్యాలను పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదులకు సెల్ ఏర్పాటు చేయాలి ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోకుండా తటస్థంగా వ్యవహరించేలా పులివెందుల పోలీసులను ఆదేశించాలని... ఎన్నికల కమిషన్ ఆమోదం లేకుండా ప్రతిపక్ష పార్టీ నేతలను అరెస్టు చేయొద్దని ఆదేశాలివ్వాలంటూ పులివెందుల మండలం తుమ్మలపల్లికి చెందిన తుమ్మల హనుమంత్రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికల నిర్వహణకు తటస్థ అధికారులను వినియోగించేలా ఆదేశాలివ్వడంతో పాటు ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదులకు విభాగం (సెల్) ఏర్పాటుచేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఎన్నికల కమిషన్కూ వినతిపత్రాలు ఇచ్చామని, ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నారు. వీటిపై జస్టిస్ రామకృష్ణప్రసాద్ విచారణ జరిపారు. ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదులు వివేక్ చంద్రశేఖర్, సి.విశ్వనాథ్లు వాదనలు వినిపిస్తూ పిటిషనర్ వినతిపత్రాలను జిల్లా కలెక్టర్, ఎస్పీకి పంపామని.. ఆ మేరకు ప్రొసీడింగ్స్ కూడా జారీ అయ్యాయని తెలిపారు. ఈ వివరాలను రికార్డ్ చేసిన న్యాయమూర్తి, ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందన్నారు. -
తురకా కిషోర్ అరెస్టుపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ నేత, మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ అరెస్టుపై ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. తురకా కిషోర్ను వెంటనే విడుదల చేయాలని న్యాయ స్థానం ఆదేశించింది. కిషోర్ రిమాండ్ రిపోర్టును సస్పెండ్ చేసింది.తురకా సురేఖ హెబియస్ కార్పస్ పిటిషన్గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తన భర్త తురకా కిషోర్ను పల్నాడు జిల్లా, రెంటచింతల పోలీసులు అక్రమంగా నిర్భంధించారని, తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తురకా సురేఖ గతవారం హైకోర్టులో అత్యవసరంగా లంచ్మోషన్ రూపంలో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై హైకోర్టు వరుసగా విచారణ చేపట్టింది. ఇవాళ జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు కిషోర్ అరెస్టుపై తీవ్రంగా స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా తురకా కిషోర్ను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన సమయంలో పాటించాల్సిన నిబంధనల్ని పూర్తిగా తుంగలోకి తొక్కారు. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ను కూడా పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తురకా కిషోర్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రెంటచింతల పోలీసులకు హైకోర్టు ఆదేశాలు ఈ వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్రావు ధర్మాసనం తురకా కిషోర్పై నమోదు చేసిన కేసుకు సంబంధించిన రికార్డులన్నింటినీ తమ ముందుంచాలని రెంటచింతల పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే.బెయిల్ పిటిషన్ వేయకుంటే రిమాండ్ విధించేస్తారా..? బుధవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా, తురకా కిషోర్పై నమోదు చేసిన కేసుకు సంబంధించిన రికార్డులను పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) టి.విష్ణుతేజ ధర్మాసనం ముందుంచారు. వీటిని ధర్మాసనం క్షుణ్ణంగా పరిశీలించింది. అలాగే కిషోర్ను రిమాండ్కు పంపుతూ మేజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వులనూ మరోసారి పరిశీలించింది. అరెస్టయిన కిషోర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదు కాబట్టి, తాను రిమాండ్ విధిస్తున్నట్లు మేజిస్ట్రేట్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారని తెలిపింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేయకుంటే, రిమాండ్ విధించేస్తారా? మిగిలిన అంశాలను పరిగణనలోకి తీసుకోరా? అంటూ మేజిస్ట్రేట్ తీరును ప్రశ్నించింది.పరస్పర విరుద్ధమైన వాదనలేంటి..? ‘రిమాండ్ రిపోర్ట్ తీసుకునేందుకు కిషోర్ తిరస్కరించారని మీరు (పోలీసులు) చెబుతున్నారు. కానీ మేజిస్ట్రేట్ తన ఉత్తర్వుల్లో దీని గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు. మీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కింది కోర్టులో కిషోర్ ఏ కాగితాలను తీసుకోలేదని చెబుతారు. మరోవైపు తీసుకున్నట్లు కిషోర్ సంతకం చేసినట్లు చెబుతారు. ఏంటీ పరస్పర విరుద్ధమైన వాదనలు? నేరాంగీకార వాంగ్మూలంపై కిషోర్ సంతకం చేయలేదని అంటున్నారు. మీరు చెబుతున్నట్లు అతను కరడుగట్టిన నేరస్తుడే అనుకున్నా, అన్ని నేరాలూ చేసేశానంటూ ఒప్పేసుకుని సంతకం చేస్తారా?’ అని ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.నిర్బంధం అక్రమమైనప్పుడు ఆ వ్యక్తిని ఒక్క క్షణం కూడా జైల్లో ఉంచకూడదు ఒక వ్యక్తి నిర్బంధం అక్రమమైనప్పుడు ఆ వ్యక్తి ఒక్క క్షణం కూడా జైల్లో ఉండటానికి వీల్లేదు.. అంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని, విచారణను సోమవారానికి వాయిదా వేయాలని ఎస్జీపీ విష్ణుతేజ కోరగా.. ధర్మాసనం పైవిధంగా వ్యాఖ్యానించింది. అప్పటి వరకు కిషోర్ను జైల్లోనే ఉంచమంటారా?అప్పటి వరకు కిషోర్ను జైల్లోనే ఉంచమంటారా? అంటూ ఘాటుగా ప్రశ్నించింది. పలు కేసుల్లో కిషోర్ను అరెస్ట్ చేయాల్సి ఉందని విష్ణుతేజ చెప్పగా, వాటితో తమకు సంబంధం లేదని, తమ ముందున్న కేసుతోనే తమకు సంబంధమని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఎప్పుడో ఆరేళ్ల క్రితం ఘటన జరిగితే, ఇప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేస్తారా.. అంటూ ప్రశ్నించింది.అలాగే రెండు, మూడేళ్ల క్రితం ఘటనలు జరిగితే ఇప్పుడు అరెస్ట్లు చూపారంది. కిషోర్ అరెస్ట్, రిమాండ్ విషయంలో చట్ట నిబంధనలను అనుసరించలేదనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం స్పష్టం చేసింది. అందువల్ల కిషోర్ విడుదలకు ఆదేశాలిస్తామంది. విష్ణుతేజ జోక్యం చేసుకుంటూ, పిటిషనర్ రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేయలేదని తెలిపారు.అలా అయితే రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రధాన పిటిషన్లో సవరణ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణరెడ్డికి సూచించింది. దీంతో కిషోర్ అరెస్ట్ను, రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ తురకా సురేఖ ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అనుబంధ పిటిషన్ మధ్యాహ్నం విచారణకు రాగా, దీనిపై గురువారం విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేస్తూ ఆ మేర విచారణను వాయిదా వేసింది.జైలు నుంచి విడుదల కానున్న తురకా కిషోర్ అయితే ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు తురకా కిషోర్ అరెస్టులో పోలీసుల వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం నిబంధనల్ని సైతం తుంగలో తొక్కారని వ్యాఖ్యానిస్తూ కిషోర్ను తక్షణమే విడుదల చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక హైకోర్టు ఆదేశాలతో తురకా కిషోర్ జైలు నుంచి విడుదల కానున్నారు. -
ఏపీ సర్కార్ కు హైకోర్టు షాక్
-
శ్వేత పత్రాల ఆధారంగా సీబీఐ, ఈడీ దర్యాప్తు ఏంటి?
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వ హయాంలో అక్రమాల వల్ల ఖజానాకు నష్టం వాటిల్లిందంటూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేత పత్రాల ఆధారంగా సీబీఐ, ఈడీ విచారణకు ఆదేశించేందుకు హైకోర్టు నిరాకరించింది. శ్వేత పత్రాల ఆధారంగా సీబీఐ, ఈడీ విచారణకు ఆదేశించడమేంటంటూ ప్రశ్నించింది. తాము అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ప్రచారం, స్వప్రయోజనాల కోసం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారా? అన్న కోణంలో కూడా విచారణ జరపాల్సి ఉందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సరిగా దర్యాప్తు చేయడం లేదని ఎలా చెబుతారని.. అందుకు ఏం ఆధారాలున్నాయని పిటిషనర్ను ప్రశ్నించింది. ఈ వ్యాజ్యం దాఖలు చేసిన విధానం ఎంత మాత్రం సరిగా లేదంది. అసలు ఈ వ్యాజ్యంపై ఎందుకు విచారణ జరపాలో కూడా చెప్పాలంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసేందుకు నిరాకరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జగన్ తదితరులపై కేసుకు పిల్ గత ప్రభుత్వ హయాంలో పలు అక్రమాలు జరిగాయని, ఇందుకు సంబంధించి అప్పటి సీఎంగా ఉన్న వైఎస్ జగన్పై కేసు నమోదు చేసేలా సీబీఐ, ఈడీని ఆదేశించాలని కోరుతూ ఢిల్లీకి చెందిన న్యాయవాది మెహక్ మహేశ్వరి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖలు అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఉండేందుకు వారి దర్యాప్తును పర్యవేక్షించేందుకు ప్రముఖ విశ్రాంత న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సిట్ వేయాలని తన పిటిషన్లో పేర్కొన్నారు. జగన్ తదితరులు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని, దీనిపై నిష్పాక్షికంగా దర్యాప్తు జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. రాష్ట్ర దర్యాప్తు సంస్థలకు సామర్థ్యం లేదు ఈ వ్యాజ్యంపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ మెహక్ మహేశ్వరి వాదనలు వినిపించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం అసెంబ్లీలో పలు శ్వేత పత్రాలు విడుదల చేసిందన్నారు. వేల కోట్ల రూపాయల మేర కుంభకోణాలు జరిగినట్లు అందులో పేర్కొన్నారని తెలిపారు. అందువల్ల సీబీఐ, ఈడీ దర్యాప్తు కోరుతున్నామని ఆయన చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ఏ విషయంపై దర్యాప్తు జరగడం లేదని మీరు భావిస్తున్నారని మెహక్ మహేశ్వరిని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందని, అయితే అందులో కేంద్ర దర్యాప్తు సంస్థలకు చెందిన అధికారులు లేరన్నారు. కేసు దర్యాప్తు చేసేంత సామర్థ్యం రాష్ట్ర దర్యాప్తు సంస్థలకులేదన్నారు. మరో సిట్ ఎందుకు?ధర్మాసనం స్పందిస్తూ, ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులతో మరో సిట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. శ్వేత పత్రాల ఆధారంగా ఈ వ్యాజ్యంపై విచారణ జరపలేమంది. ప్రచారం, స్వీయ ప్రయోజనాల కోసం దాఖలు చేసే పిల్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చాలా స్పష్టంగా చెప్పిందని గుర్తు చేసింది. ఈ వ్యాజ్యం కూడా అదే కోవలోకి వస్తుందా? లేదా? అన్న దాన్ని తాము పరిశీలించాల్సి ఉందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ సిట్ మెతక వైఖరిని అవలంభిస్తోందని, మాజీ సీఎం పట్ల ఉదారంగా వ్యవహరిస్తోందని మీరు అనుకుంటున్నారా? అంటూ మెహక్ మహేశ్వరిని ప్రశ్నించింది.ఏమీ తెలియనప్పుడు మీరెలా దర్యాప్తు కోరతారు? ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, మీరు బిజీ న్యాయవాది అయి ఉండీ, ఇలా పిల్ దాఖలు చేయడం, ఢిల్లీ నుంచి వచ్చి స్వయంగా వాదనలు వినిపించడం, మీ సొంత డబ్బును ఇందుకోసం వెచ్చించడం చూస్తుంటే కొంత ఆశ్చర్యం కలుగుతోందని వ్యాఖ్యానించింది. మెహక్ స్పందిస్తూ, నిజంగా అవినీతి జరిగిందా? లేక రాజకీయ ప్రేరణతో సిట్ ఏర్పాటు అయిందా? అన్న విషయం తనకు తెలియదన్నారు. ఏమీ తెలియనప్పుడు మీరెలా దర్యాప్తు కోరతారని ధర్మాసనం ప్రశ్నించింది. ఏడాదిగా మద్యం కేసులో మాత్రమే దర్యాప్తు చేస్తున్నారని మహేశ్వరి తెలిపారు. నిందితుల జాబితాలో అప్పటి సీఎం జగన్ని చేర్చలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సి.ప్రణతి స్పందిస్తూ, ఇప్పటికే సిట్ ఏర్పాటు చేశామని, పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు సమయం కావాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 11కి వాయిదా వేసింది. -
అక్రమ నిర్బంధాలను సహించం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ నేత తురకా కిశోర్ అరెస్ట్, రిమాండ్ విషయంలో పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అరెస్ట్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నపుడు అరెస్ట్ అయిన వ్యక్తి ఒక్క క్షణం కూడా జైలులో ఉండటానికి వీల్లేదని తేల్చి చెప్పింది. తురకా కిశోర్ విడుదలకు ఆదేశాలు ఇస్తామని తెగేసిచెప్పింది. తమ ఉత్తర్వులపై అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చునని పోలీసులకు స్పష్టం చేసింది. కిశోర్ రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రధాన పిటిషన్ సవరించేందుకు పిటిషనర్కి హైకోర్టు వెసులుబాటునిచ్చింది. దీనిపై వాదనలు వింటామని తెలిపింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్లతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కిశోర్పై పలు హత్యాయత్నం కేసులు ఉన్నాయని ప్రభుత్వ న్యాయవాది చెప్పగా, ఈ రోజుల్లో ఎవరిపైనైనా హత్యాయత్నం కేసులు పెట్టడం సులభమంది. తమపై కూడా నమోదు చేయవచ్చునని వ్యాఖ్యానించింది. ఎప్పుడో జరిగిన ఘటనను ఇప్పుడు బయటకు తీసి ఇప్పుడు హత్యాయత్నం కేసు పెట్టడం ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదని పేర్కొంది. ఏ కేసులు పెట్టినా, ఏం చేసినా చట్ట నిబంధనల ప్రకారం చేయాలని తేల్చి చెప్పింది. ఆరేళ్ళ క్రితం ఘటన జరిగితే ఇప్పుడు కిశోర్పై కేసు పెట్టి అరెస్ట్ చేశారని గుర్తు చేసింది. ఇదే రీతిలో రెండేళ్లు, మూడేళ్లు క్రితం జరిగిన ఘటనల్లో కూడా ఇదే రీతిలో తప్పుడు కేసులు పెట్టారన్నారని పేర్కొంది. కిశోర్పై కేసుల నమోదు విషయంలో పోలీసులు నిర్దిష్ట విధానాన్ని అనుసరిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. అక్రమ నిర్భంధంపై హైకోర్టును ఆశ్రయించిన తురకా సురేఖ.. గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తన భర్త తురకా కిశోర్ను పల్నాడు జిల్లా, రెంటచింతల పోలీసులు అక్రమంగా నిర్భంధించారని, తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తురకా సురేఖ గతవారం హైకోర్టులో అత్యవసరంగా లంచ్మోషన్ రూపంలో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్రావు ధర్మాసనం తురకా కిషోర్పై నమోదు చేసిన కేసుకు సంబంధించిన రికార్డులన్నింటినీ తమ ముందుంచాలని రెంటచింతల పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. బెయిల్ పిటిషన్ వేయకుంటే రిమాండ్ విధించేస్తారా..? బుధవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా, తురకా కిశోర్పై నమోదు చేసిన కేసుకు సంబంధించిన రికార్డులను పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) టి.విష్ణుతేజ ధర్మాసనం ముందుంచారు. వీటిని ధర్మాసనం క్షుణ్ణంగా పరిశీలించింది. అలాగే కిశోర్ను రిమాండ్కు పంపుతూ మేజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వులనూ మరోసారి పరిశీలించింది. అరెస్టయిన కిశోర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదు కాబట్టి, తాను రిమాండ్ విధిస్తున్నట్లు మేజిస్ట్రేట్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారని తెలిపింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేయకుంటే, రిమాండ్ విధించేస్తారా? మిగిలిన అంశాలను పరిగణనలోకి తీసుకోరా? అంటూ మేజి్రస్టేట్ తీరును ప్రశ్నించింది. పరస్పర విరుద్ధమైన వాదనలేంటి..? ‘రిమాండ్ రిపోర్ట్ తీసుకునేందుకు కిశోర్ తిరస్కరించారని మీరు (పోలీసులు) చెబుతున్నారు. కానీ మేజిస్ట్రేట్ తన ఉత్తర్వుల్లో దీని గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు. మీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కింది కోర్టులో కిశోర్ ఏ కాగితాలను తీసుకోలేదని చెబుతారు. మరోవైపు తీసుకున్నట్లు కిశోర్ సంతకం చేసినట్లు చెబుతారు. ఏంటీ పరస్పర విరుద్ధమైన వాదనలు? నేరాంగీకార వాంగ్మూలంపై కిశోర్ సంతకం చేయలేదని అంటున్నారు. మీరు చెబుతున్నట్లు అతను కరడుగట్టిన నేరస్తుడే అనుకున్నా, అన్ని నేరాలూ చేసేశానంటూ ఒప్పేసుకుని సంతకం చేస్తారా?’ అని ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.నిర్బంధం అక్రమమైనప్పుడు ఆ వ్యక్తిని ఒక్క క్షణం కూడా జైల్లో ఉంచకూడదు ఒక వ్యక్తి నిర్బంధం అక్రమమైనప్పుడు ఆ వ్యక్తి ఒక్క క్షణం కూడా జైల్లో ఉండటానికి వీల్లేదు.. అంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని, విచారణను సోమవారానికి వాయిదా వేయాలని ఎస్జీపీ విష్ణుతేజ కోరగా.. ధర్మాసనం పైవిధంగా వ్యాఖ్యానించింది. అప్పటి వరకు కిశోర్ను జైల్లోనే ఉంచమంటారా? అంటూ ఘాటుగా ప్రశ్నించింది. పలు కేసుల్లో కిశోర్ను అరెస్ట్ చేయాల్సి ఉందని విష్ణుతేజ చెప్పగా, వాటితో తమకు సంబంధం లేదని, తమ ముందున్న కేసుతోనే తమకు సంబంధమని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఎప్పుడో ఆరేళ్ల క్రితం ఘటన జరిగితే, ఇప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేస్తారా.. అంటూ ప్రశ్నించింది. అలాగే రెండు, మూడేళ్ల క్రితం ఘటనలు జరిగితే ఇప్పుడు అరెస్ట్లు చూపారంది. కిశోర్ అరెస్ట్, రిమాండ్ విషయంలో చట్ట నిబంధనలను అనుసరించలేదనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం స్పష్టం చేసింది. అందువల్ల కిశోర్ విడుదలకు ఆదేశాలిస్తామంది. విష్ణుతేజ జోక్యం చేసుకుంటూ, పిటిషనర్ రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేయలేదని తెలిపారు. అలా అయితే రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రధాన పిటిషన్లో సవరణ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణరెడ్డికి సూచించింది. దీంతో కిశోర్ అరెస్ట్ను, రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ తురకా సురేఖ ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అనుబంధ పిటిషన్ మధ్యాహ్నం విచారణకు రాగా, దీనిపై గురువారం విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేస్తూ ఆ మేర విచారణను వాయిదా వేసింది. -
అరెస్టుకు కారణం ఎక్కడ?.. తప్పంతా మాదే: ఏపీ హైకోర్టు
మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ అరెస్ట్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అరెస్టుకు కారణం ఏంటన్నది ఎక్కడా పోలీసులు ప్రస్తావించలేదని, అలాంటప్పుడు అది ఇల్లీగల్ అరెస్ట్ అవుతుంది కదా అని వ్యాఖ్యానించింది. సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ నేత, మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ తరఫున దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అరెస్ట్పై కీలక వ్యాఖ్యలు చేసిన అత్యున్నత న్యాయస్థానం.. అదే సమయంలో రిమాండ్ రిపోర్టును పరిశీలిస్తూ మెజిస్ట్రేట్ల తీరుపైనా అసహనం వ్యక్తం చేసింది. ‘‘ఈ కేసులో గ్రౌండ్ ఆఫ్ అరెస్ట్(అరెస్టుకు కారణం) ఎక్కడుంది?. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్టు ఓరల్గా(నోటిమాటగా) చెప్తే కుదరదు. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్టుకు సంబంధించి ఇన్ రిటర్న్గా(రాతపూర్వకంగా) సర్వ్ చేయాలి. లేకపోతే అది ఇల్లీగల్ అరెస్ట్ అవుతుంది’’ అని పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. అదే సమయంలో.. తురకా కిషోర్ పై పెట్టిన అక్రమ కేసులు లిస్టు చదివి వినిపించిన ధర్మాసనం.. 3, 4, 5 , 6 ఏళ్ల కిందటి నాటి ఘటనల్లో తాజాగా కేసులు నమోదు చేశారంటూ వ్యాఖ్యానించింది. ‘‘ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వెంటనే పీటీ వారెంట్లు వేసి అరెస్టు చేశారు. మరీ అంత అర్జెంటుగా పీటీ వారెంట్లో వేయాల్సిన అవసరం ఏముంది?. రెంటచింతల కేసులో పోలీసులు అంత అర్జెంటుగా అరెస్టు ఎందుకు అరెస్ట్ చేశారు?. అసలు రెంటచింతల కేసులో రిమాండ్ రిపోర్టు అర్థం కావటం లేదు. తప్పు మీది కాదు... తప్పు అంతా మాదే. మేజిస్ట్రేట్లకు సరైన శిక్షణ ఇవ్వలేకపోయాం’’ అని అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం తదుపరి విచారణ రేపటికి(గురువారానికి) వాయిదా వేసింది.అన్ని కేసుల్లో(12) బెయిల్ రావడంతో తురకా కిషోర్ జులై 30వ తేదీన ఉదయం గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. అయితే అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. కుటుంబ సభ్యులను నెట్టిపడేసి మరీ బలవంతంగా ఆయన్ని లాక్కెల్లారు. ఏడు నెలల తర్వాత కోర్టులు ఊరట ఇవ్వడంతోనే ఆయన విడుదల అయ్యారని, అయినప్పటికీ పోలీసులు అక్రమ నిర్బంధానికి పాల్పడ్డారంటూ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. -
తురక కిషోర్ కేసులో పోలీసులకు షాక్
-
ఏడాది క్రితం గాయానికి ఇప్పుడు సర్టిఫికెట్టా!?
సాక్షి, అమరావతి: ఏడాది క్రితం జరిగిన ఘటనలో అయిన గాయానికి ఇప్పుడు ఊండ్ సర్టిఫికెట్ (ఎంఎల్సీ–మెడికో లీగ్ కేసు) తీసుకోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. వైఎస్సార్సీపీ నేత తురకా కిషోర్పై నమోదు చేసిన కేసుకు సంబంధించిన కేసు డైరీతో సహా పూర్తి రికార్డులను తమ ముందుంచాలని మంగళవారం పల్నాడు జిల్లా రెంటచింతల పోలీసులను ఆదేశించింది. అరెస్ట్కు గల కారణాలను, అరెస్ట్కు దారి తీసిన పరిస్థితులను తనకు అందజేయలేదని మేజిస్ట్రేట్ కు తురకా కిషోర్ చెప్పారని, అయితే మేజిస్ట్రేట్ ఈ విషయంలో సంతృప్తి చెందినట్లు గానీ, చెందనట్లు గానీ ఎక్కడా రిమాండ్ ఉత్తర్వుల్లో పేర్కొనలేదని ధర్మాసనం తెలిపింది. ఈ నేపథ్యంలో తాము పూర్తి రికార్డులను చూడాలన్న నిర్ణయానికి వచ్చామంది. గుంటూరు జిల్లా జైలు నుంచి ఇటీవల విడుదలైన తన భర్త తురకా కిషోర్ను రెంటచింతల పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, తన భర్తను కోర్టు ముందు హాజరు పరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తురకా సురేఖ గత బుధవారం హైకోర్టులో అత్యవసరంగా లంచ్ మోషన్ రూపంలో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్రావు ధర్మాసనం అసలు తురకా కిషోర్పై ఎన్ని కేసులు నమోదయ్యాయి.. వాటిని ఎప్పుడు నమోదు చేశారు.. ఎప్పుడు అరెస్ట్ చేశారు.. ఏ ఘటనలో అరెస్ట్ చేశారు.. తదితర వివరాలను తమ ముందుంచాలని పల్నాడు జిల్లా ఎస్పీని ఆదేశించింది. ఈ మేరకు కిషోర్పై నమోదు చేసిన కేసుల వివరాలను ధర్మాసనం ముందుంచిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్లతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. కోర్టును తప్పుదోవ పట్టించిన ఎస్ఐ తురకా సురేఖ తరఫు న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణరెడ్డి ఈ సందర్భంగా వాదనలు వినిపించారు. రెంటచింతల సబ్ ఇన్స్పెక్టర్ కోర్టును సైతం తప్పుదోవ పట్టించారన్నారు. అరెస్ట్కు గల కారణాలను, అరెస్ట్కు దారి తీసిన పరిస్థితులను నిబంధనల ప్రకారం నిర్బంధంలో ఉన్న వ్యక్తికి చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. అయితే పోలీసులు అలాంటి సమాచారం ఏదీ కిషోర్కు చెప్పక పోయినా, చెప్పినట్లు సబ్ ఇన్స్పెక్టర్ కింది కోర్టును తప్పుదోవ పట్టించారని వివరించారు. ఈ సమయంలో రామలక్ష్మణరెడ్డి సమర్పించిన పలు డాక్యుమెంట్లను ధర్మాసనం పరిశీలించింది. ఏడాది క్రితం జరిగిన ఘటనలో ఏర్పడిన గాయానికి ఇప్పుడు ఊండ్ సర్టిఫికెట్ ఎలా తీసుకుంటారంటూ ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. రామలక్ష్మణరెడ్డి తన వాదనను కొనసాగిస్తూ, పోలీసులు తమకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం కిషోర్కు రిమాండ్ విధిస్తూ కింది కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను పరిశీలించింది. అందులో ఎక్కడా తురకా కిషోర్కు నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన డాక్యుమెంట్లను పోలీసులు ఇచ్చినట్లు పేర్కొనలేదని తెలిపింది. రిమాండ్ ఉత్తర్వుల్లో మేజిస్ట్రేట్ ఏం చెప్పదలచుకున్నారో తమకు అర్థం కావడం లేదంది. పోలీసులు తయారు చేసిన నేరాంగీకార వాంగ్మూలంపై తురకా కిషోర్ సంతకం చేయడానికి నిరాకరించడం తప్పు అన్నట్లు మేజి్రస్టేట్ తన ఉత్తర్వుల్లో పేర్కొనడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. సంతకం చేయడానికి నిరాకరించడం తప్పా? అని ప్రశ్నించింది. మేజిస్ట్రేట్ జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులు చాలా అస్పష్టంగా ఉన్నాయని, అందువల్ల తాము ఈ కేసుకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తామని తెలిపింది. తురకా కిషోర్పై నమోదు చేసిన కేసు రికార్డులన్నింటినీ తమ ముందుంచాలని రెంటచింతల పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. -
ఏం చేస్తాం.. వారికి సరైన శిక్షణ ఇవ్వలేకపోయాం.. అది మా తప్పే
సాక్షి, అమరావతి: ఎన్నిసార్లు చెప్పినా కూడా మేజిస్ట్రేట్లు తీరు మార్చుకోకపోతుండడంపై హైకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తికి, అసహనానికి గురైంది. ‘ఏం చేస్తాం.. వారికి మేం సరైన శిక్షణ ఇవ్వలేకపోయాం.. అది మా తప్పే’.. అంటూ నిర్వేదం వ్యక్తంచేసింది. వైఎస్సార్సీపీ నేత తురకా కిషోర్ అరెస్టు విషయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని.. అయినా మేజిస్ట్రేట్ కళ్లు మూసుకుని రిమాండ్ విధించారని హైకోర్టు ఆక్షేపించింది.ఇదే సమయంలో ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టు, కోర్టు జారీచేసిన ఉత్తర్వులు, మీడియేటర్ రిపోర్ట్, సీన్ అబ్జర్వేషన్ రిపోర్ట్, ఎఫ్ఐఆర్ తదితరాలతో కూడిన పేపర్లను పిటిషనర్ (తురకా సురేఖ) తరఫు న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణరెడ్డి అందచేస్తుండగా, వాటిని తీసుకునేందుకు ప్రభుత్వ సహాయ న్యాయవాది(ఎస్జీపీ) తిరస్కరించడంపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. అసలు ఏం జరుగుతోందంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టులో తమ ముందే పేపర్లు తీసుకోవడానికి తిరస్కరిస్తారా అంటూ ఏజీపీపై హైకోర్టు ఫైర్ అయింది.పేపర్లను తీసుకోవడానికి ఏజీపీ తిరస్కరించడాన్ని హైకోర్టు తన ఉత్తర్వుల్లో రికార్డ్ చేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఇచ్చిన పేపర్లను ప్రభుత్వ న్యాయవాది తీసుకోవడానికి నిరాకరించిన నేపథ్యంలో, ఆ పేపర్లను తీసుకుని సీల్డ్ కవర్లో ఉంచి వాటిని తమ ముందుంచాలని రిజి్రస్టార్ (జ్యుడీషియల్)ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి (నేటికి) వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ తుటా చంద్రధనశేఖర్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. పోలీసుల తీరుపై హైకోర్టుకు తురకా సురేఖ.. గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తన భర్త తురకా కిషోర్ను పల్నాడు జిల్లా, రెంటచింతల పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తురకా సురేఖ బుధవారం హైకోర్టులో అత్యవసరంగా లంచ్మోషన్ రూపంలో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్రావు ధర్మాసనం అసలు తురకా కిషోర్పై ఎన్ని కేసులు నమోదయ్యాయి.. వాటినెప్పుడు నమోదుచేశారు.. ఎప్పుడు, ఏ ఘటనలో అరెస్టుచేశారు.. తదితర వివరాలను తమ ముందుంచాలని పల్నాడు జిల్లా ఎస్పీని ఆదేశించిన విషయం తెలిసిందే. మూడేళ్ల క్రితం ఫిర్యాదు చేస్తే ఇప్పుడు అరెస్టా!? ఈ నేపథ్యంలో.. సురేఖ వ్యాజ్యం సోమవారం విచారణకు వచి్చంది. ప్రభుత్వ సహాయ న్యాయవాది స్పందిస్తూ.. కిషోర్పై పోలీసు కేసులకు సంబంధించి ఎస్పీ తయారుచేసిన వివరాలను ధర్మాసనం ముందుంచారు. అందులో కొన్ని కేసులను పరిశీలించిన ధర్మాసనం పోలీసుల తీరుపై విస్మయం వ్యక్తంచేసింది. ఇందులో.. రెండు, మూడేళ్ల క్రితం ఫిర్యాదులు చేస్తే ఇప్పుడు తురకా కిషోర్ను అరెస్టుచేసినట్లు గమనించిన ధర్మాసనం దీనిపై పోలీసులను ప్రశ్నించింది. కిషోర్పై మొత్తం 16 కేసులు నమోదు చేశారని, ఇందులో మూడేళ్ల క్రితం ఫిర్యాదు చేసిన కేసులో ఇప్పుడు హడావుడిగా అరెస్టుచేయాల్సిన అవసరం ఏమొచి్చందని నిలదీసింది. కిషోర్తో బలవంత సంతకానికి యత్నం.. ఈ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది రామలక్ష్మణరెడ్డి స్పందిస్తూ.. తురకా కిషోర్ విషయంలో పోలీసులు చట్ట నిబంధనలను అనుసరించలేదన్నారు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా వినలేదన్నారు. మేజిస్ట్రేట్ సైతం వాదనలు వినలేదని, దీనిపై అభ్యంతరం చెప్పడంతో అప్పుడు వాదనలు విన్నారని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. మేజి్రస్టేట్ యాంత్రికంగా రిమాండ్ విధించారన్నారు. అంతేకాక.. పోలీసులే నేరాంగీకార వాంగ్మూలాన్ని తయారుచేసి, దానిపై కిషోర్తో బలవంతంగా సంతకం చేయించేందుకు ప్రయత్నించారని, అయితే.. సంతకం చేసేందుకు అతను నిరాకరించారని తెలిపారు. -
బలిపీఠంపై విద్యార్థుల భవిత
సాక్షి, అమరావతి: విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. అనాలోచిత నిర్ణయాలు, చట్టబద్ధత లేని జీవోలతో వారి బంగారు భవిష్యత్తును బలిచేస్తోంది. ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల వేళ ‘స్థానికత’ను సవరించి ఇచ్చిన జీవోలను న్యాయస్థానం తోసిపుచ్చడంతో ప్రభుత్వ పరిపాలనలో డొల్లతనం బయటపడింది. ఫలితంగా ఇంజినీరింగ్తో పాటు ఐసెట్, ఈసెట్ కౌన్సెలింగ్లలో సీట్లు పొందిన లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంలో పడింది. తెలంగాణలో ఇంటర్మీడియెట్ చదివి.. ఏపీ ఈఏపీసెట్లో అర్హత సాధించిన ఏపీ విద్యార్థులను స్థానికేతరులుగా (అన్రిజర్వ్డ్) మాత్రమే గుర్తిస్తూ తొలి దశ కౌన్సెలింగ్లో సీట్లు కేటాయించింది.ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారించిన సింగిల్ బెంచ్ ధర్మాసనం ఏపీలో పుట్టి పెరిగి, ఇక్కడే కుటుంబం నివాసం ఉంటున్నప్పుడు ఆ విద్యార్థులను ‘స్థానికులు’గా పరిగణించాలని తాజాగా తీర్పునిచ్చింది. దీంతో కంగుతిన్న ప్రభుత్వం ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటోంది. ఈ క్రమంలోనే అర్ధంతరంగా ఈఏపీసెట్ రెండో దశ సీట్ల కేటాయింపుతో పాటు ఏపీ పీజీఈసెట్ (ఎంటెక్) సీట్ల కేటాయింపును నిలిపివేసింది.విద్యార్థులకు న్యాయం జరిగేనా? జీవోల ప్రకారం విద్యాసంస్థల్లో స్థానికత కోటాలో 85 శాతం, స్థానికేతర (అన్రిజర్వ్డ్) కోటాలో 15 శాతం సీట్లు భర్తీకి అవకాశం కల్పించింది. అయితే, 9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు నాలుగేళ్లు ఏపీలో చదివి.. ఇక్కడి స్థానికత ఉన్న విద్యార్థులను మాత్రమే స్థానిక కోటాలో సీట్లు కేటాయించింది. ఒక్క ఏడాది బయట చదివిన విద్యార్థులను స్థానికేతర కోటాలోకి నెట్టేసింది. ఫలితంగా ఈఏపీసెట్లో ర్యాంకు సాధించినప్పటికీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ను కోల్పోయారు. పైగా స్థానికేతర కోటా కావడంతో మంచి కళాశాలలో సీటు దక్కలేదు.ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇప్పటికే ఈఏపీసెట్ తొలి దశలో 1.18 లక్షల మందికి కనీ్వనర్ కోటాలో సీట్లు కేటాయింపు పూర్తయింది. న్యాయస్థానం తీర్పును అనుసరించి విద్యార్థులకు న్యాయం చేయాలంటే తొలి దశ కౌన్సెలింగ్లో మార్పు చేయాల్సి వస్తుంది. ఇదే జరిగితే విద్యార్థుల సీట్లలో భారీ మార్పులు తప్పని పరిస్థితి. అలా కాకుండా రెండో దశలో మాత్రమే అవకాశం కల్పిస్తామంటే.. తొలిదశలో మెరుగైన కళాశాలలో సీటు వచ్చే అవకాశాన్ని కోల్పోయినట్టే అవుతుంది.ఉదాహరణకు.. ఒక విద్యార్థికి స్థానిక కోటా కిందకి వస్తే ఎక్స్ అనే కళాశాలలో సీటు వస్తుందనుకుంటే.. తొలిదశలో ఆ కళాశాలలో అన్ని సీట్లు భర్తీ అయిపోతే.. రెండో కౌన్సెలింగ్లో అవకాశం కల్పిస్తామంటే అక్కడ సీటు వచ్చే వీలు ఉండదు. పోనీ, విద్యార్థి కోరుకున్న కళాశాలకు నేరుగా సీటును మార్పు చేయడం కూడా నిబంధనలకు విరుద్ధం. పైగా కేవలం కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకున్న విద్యార్థులకే స్థానిక కోటాను వర్తింపజేస్తే.. మిగిలిన విద్యార్థులకు అన్యాయం చేసినట్టే. ఇంత గందరగోళం మధ్య ఏం చేయాలో తెలియన ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఇది ఒక్క ఈఏపీసెట్కే కాకుండా ఇప్పటికే సీట్లు కేటాయింపు పూర్తయి తరగతులు ప్రారంభమైన ఐసెట్, ఈసెట్ విద్యార్థులకూ వర్తిస్తుంది. ఇలా ఏపీకి చెందిన విద్యార్థులు స్థానికేతర కోటా సీట్లు పొందితే వారికి ప్రభుత్వం ఎలా న్యాయం చేస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది. ముందే హెచ్చరించిన ‘సాక్షి’..కూటమి ప్రభుత్వం విద్యాసంస్థల్లో స్థానికత మార్పు రాజ్యాంగానికి విరుద్ధంగా చేసిందంటూ ‘రాజ్యాంగ రక్షణలేని స్థానికత’ శీర్షికన తో మే 21 హెచ్చరించింది. పునర్విభజన చట్టం ప్రకారం గతేడాది పదేళ్ల గడువు ముగిసింది. దీనిని ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. వాస్తవానికి స్థానికత మార్పు అనేది ప్రభుత్వ ప్రధాన అజెండాగా ఉండాలి. దీనిపై కేబినెట్లో నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు అనుసరించేలా కామన్ ఆర్డర్ను తీసుకురావాలి. కానీ, కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది.ప్రవేశాలకు సమయం దగ్గర పడిన సమయంలో హడావుడిగా ఉన్నత విద్యాశాఖ ద్వారా వివిధ సెట్స్ నిర్వహణ కోసం పాత జీవోలను సవరిస్తూ స్థానికతను ఖరారు చేసింది. రాజ్యాంగంలో ఆరి్టకల్ 371డీ రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా పొందుపరిచిన అంశాలను రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే మార్పు చేయాలని, అప్పటివరకు ఆ అంశాలు ఉనికిలోనే ఉంటాయని రాజ్యాంగ నిపుణుల హెచ్చరికలను కూడా పట్టించుకోలేదు. వీటిని అనుసరించే హెల్త్ యూనివర్సిటీ, వ్యవసాయ, ఉద్యాన వర్సిటీలతో పాటు స్పెషల్ యూనివర్సిటీలు కూడా ఉత్తర్వులు ఇచ్చాయి. ఈ వర్సిటీల్లో కౌన్సెలింగ్ పూర్తయి స్థానికేతర కోటాలో సీట్లు పొందిన విద్యార్థులకు ఏవిధంగా న్యాయం చేస్తారో వేచిచూడాలి. ఏం చేసినా లాభం లేదా? ఏపీ విద్యార్థులు తెలంగాణలో ఇంటర్మీడియెట్ చదివినప్పటికీ.. ఉన్నత విద్య ప్రవేశాలల్లో స్థానికులుగా గుర్తించాలని ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే, ఏపీ హెల్త్ యూనివర్సిటీ కేసులో స్థానికతపై హైకోర్టు డివిజినల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఆధారంగానే సింగిల్ బెంచ్ ధర్మాసనం తాజాగా ఈఏపీ సెట్లో విద్యార్థులకు స్థానికత కల్పించాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ప్రభుత్వం సవాల్ చేసినా నిలబడే అవకాశం లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం ఉండదంటున్నారు.తెలంగాణ హైకోర్టు సైతం అక్కడ హెల్త్ యూనివర్సిటీ కేసులో ఆ రాష్ట్రానికి వెలుపల చదివిన విద్యార్థులను కూడా స్థానికులుగా గుర్తించాలని ఇచ్చిన తీర్పును.. అక్కడి ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కానీ, సుప్రీం ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్థించింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు వెళ్లితే తెలంగాణకు వర్తించిన తీర్పే ఇక్కడా వర్తిస్తుందని చెబుతున్నారు. ఇలా అన్నిదారులు మూసుకుపోవడంతో కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా స్థానిక కోటాను కల్పించాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా తుహిన్కుమార్ ప్రమాణం
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా తుహిన్కుమార్ గేదెల ప్రమాణం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో సోమవారం జరిగిన కార్యక్రమంలో తుహిన్కుమార్ చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు.కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులతో పాటు జస్టిస్ తుహిన్కుమార్ కుటుంబ సభ్యులు, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ ఇవన సాంబశివప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకనాథరెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం, అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, హైకోర్టు రిజిస్ట్రార్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రమాణం అనంతరం ఆయన మరో న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యతో కలిసి ధర్మాసనంలో కేసులను విచారించారు. జస్టిస్ తుహిన్ నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. -
నాటి చంద్రబాబు సర్కారు నిర్వాకం.. 15 మందిపై అవినీతి కేసులు కొట్టివేత
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ తీరుతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న పలువురు అధికారులు కేసుల నుంచి తప్పించుకున్నారు. విజయవాడలోని ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ)ను పోలీస్స్టేషన్గా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏపీ పునరి్వభజన చట్టం కింద నోటిఫై చేయకపోవడంతో ఆ అధికారులపై ఏసీబీ నమోదు చేసిన కేసులను హైకోర్టు తాజాగా కొట్టేసింది. సీఐయూను పోలీస్స్టేషన్గా నోటిఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని హైకోర్టు గుర్తుచేసింది. 2022లో నోటిఫై చేసిందని తెలిపింది. ఈ నేపథ్యంలో.. 2016–2022 మధ్య కాలంలో నమోదైన కేసులకు చట్టబద్ధత లేదని తేలి్చంది. దీంతో.. అవినీతి ఆరోపణల కింద 15 మంది అధికారులపై నమోదైన కేసులను కొట్టేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనేపల్లి హరినాథ్ శుక్రవారం తీర్పు వెలువరించారు. కేసులు కొట్టేయాలంటూ పిటిషన్లు.. ఆదాయానికి మించి ఆస్తుల కలిగి ఉన్నారన్న ఆరోపణలపై వివిధ శాఖలకు చెందిన 15 మంది అధికారులపై 2016–19 మధ్య కాలంలో విజయవాడలోని ఏసీబీ సీఐయూ అధికారులు అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదుచేశారు. వీటిని కొట్టేయాలని కోరుతూ వారు 2020, 21, 23 సంవత్సరాల్లో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. తమపై కేసులు నమోదుచేసే నాటికి విజయవాడ ఏసీబీ సీఐయూని సీఆర్పీసీ కింద పోలీస్స్టేషన్గా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేయలేదని.. అందువల్ల తమపై కేసుల నమోదు చెల్లదని ఆ అధికారులు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ విచారణ జరిపారు. నోటిఫై చేయకుండా కేసుల నమోదు చెల్లదు.. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గంటా రామారావు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లపై ఏసీబీ ఆరోపణలు నిరాధారమైనవని, కేసులు నమోదుచేసే నాటికి ఏసీబీ సీఐయూ పోలీసుస్టేషన్ కాదన్నారు. పోలీస్స్టేషన్గా నోటిఫై చేయకుండా కేసుల నమోదు చెల్లదని స్పష్టంచేశారు. 2003లో రాష్ట్రంలో పలు ఏసీబీ కార్యాలయాలను పోలీస్స్టేషన్లుగా నమోదుచేస్తూ అప్పటి ప్రభుత్వం జీఓ ఇచి్చందన్నారు. 2014 రాష్ట్ర విభజన తరువాత నాటి ఏపీ ప్రభుత్వం ఏసీబీ కార్యాలయాలను పోలీస్స్టేషన్లుగా నోటిఫై చేయలేదని ఆయన చెప్పారు.ఈ విషయాన్ని ఏసీబీ అధికారులు సమాచార హక్కు చట్టం కింద ధ్రువీకరించారని రామారావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పోలీస్స్టేషనే ఉనికిలో లేనప్పుడు కేసుల నమోదే చెల్లదని.. అందువల్ల సోదాలు, జప్తులు, వారెంట్ల జారీ తదితరాలను కోరుతూ ఏసీబీ దాఖలు చేసే దరఖాస్తులను ఏసీబీ ప్రత్యేక కోర్టులు విచారించడానికి వీల్లేదన్నారు. అన్నీ అన్వయించుకున్నట్లే భావించాలి : ఏజీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర విభజన తరువాత అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో అమలైన అన్ని చట్టాలు, సర్క్యులర్లు, మెమోలు పునరి్వభజన చట్టం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్వయింప చేసుకున్నట్లుగా భావించాల్సి ఉంటుందన్నారు. 2003లో రాష్ట్రంలో పలు ఏసీబీ కార్యాలయాలను పోలీస్స్టేషన్లుగా నమోదుచేస్తూ అప్పటి ప్రభుత్వం జీఓ ఇచ్చిందన్నారు.అందువల్ల రాష్ట్ర విభజన తరువాత ఆ జీఓ అమల్లో ఉన్నట్లేనన్నారు. 2022లో ఏసీబీ సీఐయూని పోలీసుస్టేషన్గా నోటిఫై చేసినప్పటికీ అంతకుముందు కేసులు నమోదు చేసేందుకు ఏసీబీకి అధికారం ఉందన్నారు. పిటిషనర్లపై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయని, వారిపై కేసులను కొట్టేయవద్దని ఆయన కోర్టును అభ్యరి్థంచారు. ప్రాథమిక తప్పుని ఆ తరువాత సరిదిద్దలేరు : న్యాయమూర్తి ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ తీర్పునిస్తూ.. పిటిషనర్లపై కేసులు పెట్టిన విజయవాడ ఏసీబీ సీఐయూని పోలీసుస్టేషన్గా నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఎలాంటి గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని.. అందువల్ల నోటిఫై కాని పోలీసుస్టేషన్కు ఇన్చార్జ్ అధికారిగా పోలీసు అధికారి వ్యవహరించజాలరని న్యాయమూర్తి తేల్చిచెప్పారు. 2022లో జారీచేసిన నోటిఫికేషన్ ద్వారా ప్రాథమిక తప్పుని సరిచేయలేరన్నారు. ఏసీబీ సీఐయూని పోలీసుస్టేషన్గా ప్రభుత్వం నోటిఫై చేయడానికి ముందే పిటిషనర్లపై కేసులు నమోదయ్యాయి కాబట్టి అవి చెల్లవని, వాటిని కొట్టేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా న్యాయవాది తుహిన్ కుమార్ గేదెల నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి పోస్టుకు తుహిన్ కుమార్ పేరును సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం గత నెల 2న తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ సిఫారసుకు రాష్ట్రపతి తాజాగా ఆమోదముద్ర వేశారు. తుహిన్ కుమార్ నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ వచ్చే వారం ప్రమాణం చేసే అవకాశం ఉంది.ఇదీ తుహిన్ నేపథ్యం..తుహిన్ కుమార్ది పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కత్తులకవిటి గ్రామం. తల్లిదండ్రులు.. సరోజిని నాయుడు, కృష్ణమూర్తి నాయుడు. ఆయన పాఠశాల విద్యాభ్యాసం విశాఖపట్నంలో జరిగింది. కృష్ణా కాలేజీలో ఇంటర్, విశాఖ ఎన్బీఎం న్యాయ కళాశాల నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1994లో హైకోర్టు న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2000–2004 మధ్య ఆయన హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాది (ఏజీపీ)గా పనిచేశారు. 2010–14 మధ్య కాలంలో గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ తరఫున హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్గా వ్యవహరించారు. 2016–17లో హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. -
యాంత్రిక రిమాండ్లపై శాఖాపరమైన చర్యలు తప్పవు
సాక్షి, అమరావతి : యాంత్రిక రిమాండ్ల విషయంలో మేస్ట్రేట్లకు మార్గదర్శకాలను నిర్దేశిస్తూ గత నెల 5న జారీ చేసిన సర్క్యులర్ను హైకోర్టు కొంత మేర సవరించింది. యాంత్రికంగా రిమాండ్లు ఇస్తున్న మేజి్రస్టేట్లపై కోర్టు ధిక్కార చర్యలు కాకుండా, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు రిజి్రస్టార్ జ్యుడీషియల్ తాజాగా సర్క్యులర్ జారీ చేశారు. కేవలం సోషల్ మీడియా పోస్టులు, కామెంట్లే కాకుండా ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడే అన్ని కేసుల్లో కూడా అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, ఇమ్రాన్ ప్రతాప్ గాది వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను తూచా తప్పక అమలు చేసి తీరాల్సిందేనని మేజిస్ట్రేట్లను ఆదేశించింది.‘ఇమ్రాన్ ప్రతాప్ గాది కేసులో సుప్రీంకోర్టు చెప్పిన విధంగా మూడు నుంచి ఏడేళ్ల వరకు శిక్ష పడే, విచారణకు స్వీకరించదగ్గ నేరాల్లో పోలీసులు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 173(3)ను అనుసరించేలా చూడాలి. ఏడేళ్ల వరకు శిక్ష పడే కేసుల్లో రిమాండ్ ఉత్తర్వులు వెలువరించే ముందు మేజిస్ట్రేట్లందరూ.. పోలీసులు అర్నేష్ కుమార్, ఇమ్రాన్ ప్రతాప్ గాది కేసుల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించారా? లేదా? అన్నది పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేయాలి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, ఇదే విషయానికి సంబంధించి గతంలో జారీ చేసిన సర్క్యులర్ను కఠినంగా అమలు చేసి తీరాల్సిందే. లేని పక్షంలో శాఖాపరమైన చర్యలకు బాధ్యులవుతారు’ అని తేల్చి చెప్పింది. గతంలో జారీ చేసిన సర్క్యులర్లో తమ ఆదేశాలను పాటించకుంటే దానిని చాలా తీవ్రంగా పరిగణించి, కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామన్న వాక్యాన్ని తొలగించింది. ధిక్కార చర్యలు సరికాదంటూ పిటిషన్ జూన్ 5న హైకోర్టు జారీ చేసిన సర్క్యులర్లో తమ ఆదేశాలను, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే ధిక్కార చర్యలు తప్పవని పేర్కొనడాన్ని సవాలు చేస్తూ విజయవాడకు చెందిన న్యాయవాది జయంతి ఎస్సీ శేఖర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సర్క్యులర్లోని పదజాలం మేజి్రస్టేట్లను బెదిరించేలా ఉందని ఆయన అందులో పేర్కొన్నారు. కోర్టు ధిక్కార చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పడం కూడా సరికాదన్నారు. ఈ వ్యాజ్యంపై గత నెల 9న విచారణ జరిపిన సీజే ధర్మాసనం, ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అందులో భాగంగా హైకోర్టు రిజిస్ట్రార్ గత సర్క్యులర్ను కొంత మేర సవరించారు. -
14 నెలల కిందటి ఘటనలో..నిన్న ఫిర్యాదు... కేసు... ఆ వెంటనే అరెస్టా..?
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ నేత తురకా కిషోర్పై కేసుల మీద కేసులు పెడుతూ, ఒక కేసులో బెయిల్పై బయటకు రాగానే మరో కేసులో అరెస్ట్ చేస్తున్న పోలీసుల తీరును హైకోర్టు ప్రశ్నించింది. 2024లో ఘటన జరిగితే.. సంవత్సరం రెండునెలల తరువాత కేసు నమోదు చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. అప్పటికప్పుడు కేసు నమోదు చేసి ఆ వెంటనే అరెస్ట్ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తురకా కిషోర్పై ఎన్ని కేసులు నమోదు చేశారు.. ఘటనలు ఎప్పుడు జరిగాయి.. ఎప్పుడు ఫిర్యాదు చేశారు.. ఎప్పుడు అరెస్ట్ చేశారు.. తదితర వివరాలను ఓ టేబుల్ రూపంలో తమ ముందుంచాలని పల్నాడు జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 4కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ జగడం సుమతి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.పోలీసుల తీరుపై హైకోర్టును ఆశ్రయించిన తురకా సురేఖ గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తన భర్త తురకా కిషోర్ను పల్నాడు జిల్లా రెంటచింతల పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తురకా సురేఖ బుధవారం హైకోర్టులో అత్యవసరంగా లంచ్మోషన్ రూపంలో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రఘునందన్రావు ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపిస్తూ.. తురకా కిషోర్పై ఒకదాని వెంట మరొకటి కేసులు పెడుతూనే ఉన్నారని చెప్పారు. ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 12 కేసులు నమోదు చేశారన్నారు. బుధవారం ఉదయం కిషోర్ గుంటూరు జిల్లా జైలు నుంచి బయటకు రాగానే రెంటచింతల పోలీసులు తీసుకెళ్లారని చెప్పారు. గత ఏడాది ఏప్రిల్లో ఘటన జరిగింది పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ.. కిషోర్పై హత్యాయత్నం కింద మంగళవారం ఫిర్యాదు అందిందని, దాని ఆధారంగా కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశామని చెప్పారు. అతడిని అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ఘటన ఎప్పుడు జరిగిందని ప్రశ్నించింది. గత ఏడాది ఏప్రిల్ 8న ఘటన జరిగిందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది తెలిపారు. సంవత్సరం రెండునెలల తరవాత కేసు నమోదు చేసి, వెంటనే అరెస్ట్ చేశారా.. అంటూ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కిషోర్పై ఎన్ని కేసులు నమోదు చేశారు.. ఎప్పుడు ఘటనలు జరిగాయి.. ఎప్పుడు ఫిర్యాదు చేశారు.. ఎప్పుడు అరెస్ట్ చేశారు.. తదితర వివరాలను టేబుల్ రూపంలో అఫిడవిట్ దాఖలు చేయాలని పల్నాడు జిల్లా ఎస్పీని ఆదేశిస్తూ, విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. -
టీసీఎస్కి 99 పైసలకే భూ కేటాయింపుపై వివరణ ఇవ్వండి
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో ఐటీ క్యాంపస్ ఏర్పాటు కోసం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కి 21.74 ఎకరాల భూమిని 99 ఏళ్ల పాటు 99 పైసలకు కేటాయించడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది. ఈ భూకేటాయింపులు తమ తుదితీర్పునకు లోబడి ఉంటాయని ఉత్తర్వులిచ్చింది. దీనిపై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. కేటాయింపుల ఉత్తర్వులను కొట్టేయాలంటూ పిల్ విశాఖపట్నంలో టీసీఎస్కు ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు రూ.529 కోట్ల విలువైన 21.74 ఎకరాల భూమిని 99 పైసలకే కేటాయిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 7ను సవాలు చేస్తూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ, ఎన్విరాన్మెంటల్ రైట్స్ సంస్థ జిల్లా అధ్యక్షురాలు నమ్మిగ్రేస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. జీవో 7ను రద్దు చేయడంతో పాటు ఆ జీవో అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ న్యాయవాది జడా శ్రవణ్కుమార్ వాదనలు వినిపిస్తూ.. చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఈ భూ కేటాయింపులు జరిగాయన్నారు. నిబంధనల ప్రకారం 33 ఏళ్లు, 66 ఏళ్లకు భూమి కేటాయించవచ్చునని, కంపెనీ పెట్టి విజయవంతంగా నడిపితేనే ఆ లీజును 99 ఏళ్లకు పొడిగించవచ్చని చెప్పారు. నిబంధనల్లో ఎక్కడా కూడా భూమి అమ్మకం గురించి లేదని, కానీ ప్రభుత్వం టీసీఎస్కి ఈ 21.74 ఎకరాల భూమిని అమ్మకం ద్వారా కేటాయిస్తోందని తెలిపారు. విశాఖలో టీసీఎస్ ఐటీ క్యాంపస్ ఏర్పాటు వల్ల ఎంతమందికి ఉపాధి అవకాశాలు వస్తాయని ధర్మాసనం ప్రశ్నించగా.. 12 వేలమందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. మరి టీసీఎస్ లే ఆఫ్లు చేస్తోందిగా అని ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతి స్పందిస్తూ.. కేవలం లీజు ప్రాతిపదికనే టీసీఎస్కు భూ కేటాయింపులు చేస్తున్నామని, అమ్మడం లేదని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఈ విషయం అస్పష్టంగా ఉందని తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. టీసీఎస్కు చేసిన భూ కేటాయింపులు తమ తుదితీర్పునకు లోబడి ఉంటాయని ఉత్తర్వులు జారీచేస్తూ విచారణను వాయిదా వేసింది. -
విశాఖలో లులుకు ఖరీదైన ప్రభుత్వ భూముల కేటాయింపు.. హైకోర్టులో పిటిషన్
సాక్షి,అమరావతి: విశాఖలో లులు గ్రూప్కు ఖరీదైన భూములు కేటాయించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. భూములు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషనర్ పిటీషన్ దాఖలు చేశారు. లులు సంస్థకు బిడ్డింగ్ లేకుండా ప్రభుత్వ భూములు కేటాయించడం చట్ట విరుద్ధం. గతంలో బిడ్ల ద్వారా భూమిని కేటాయించిన ప్రభుత్వం.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది.విజయవాడలో కూడా లులు గ్రూప్కు ప్రభుత్వ భూములు కేటాయింపు జరిగింది. భూ కేటాయింపులు చేసేందుకు ప్రభుత్వం జీరో జారీ చేసింది. విశాఖలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా భూములు కేటాయించారు. అయితే, భూ కేటాయింపుల్లో కనీస నిబంధనలు పాటించలేదని పిటిషనర్ తరుపు న్యాయవాది అన్నారు. లులుకు భూములు కేటాయించడాన్ని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. -
అంత అర్జెంటుగా కిషోర్ను ఎందుకు అరెస్ట్ చేశారు?: ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: రెంటచింతల పోలీసులు తనను అక్రమంగా నిర్బంధించారంటూ మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. తురకా కిషోర్ తరఫున న్యాయవాది రామలక్ష్మణ్ రెడ్డి వాదనను వినిపించారు. తురక కిషోర్పై ఇప్పటికీ 12 అక్రమ కేసులు బనాయించారని ఆయన కోర్టుకు తెలిపారు.‘‘ఒక కేసులో బెయిల్ రాగానే వెంటనే మరొక కేసు బనాయించి ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ గుంటూరు జిల్లా జైలు నుంచి తురకా కిషోర్ విడుదల కాగానే రెంటచింతల పోలీసులు జైలు బయటినుంచి తీసుకువెళ్లారు’’ అని కిషోర్ తరపు న్యాయవాది వివరించారు.సంఘటన ఎప్పుడు జరిగిందంటూ ధర్మాసనం.. పోలీసులు తరఫున న్యాయవాదిని ప్రశ్నించింది. 2024 ఏప్రిల్ 8వ తేదీన సంఘటన జరిగిందని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఘటన జరిగిన 13 నెలల తర్వాత కేసు ఎలా రిజిస్టర్ చేశారు? అంత అర్జెంటుగా తురకా కిషోర్ను ఎందుకు అరెస్ట్ చేశారంటూ ధర్మాసనం ప్రశ్నించింది.తురకా కిషోర్పై నమోదైన 12 కేసులు పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని ఎస్పీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తురక కిషోర్పై ఫిర్యాదులు ఎప్పుడు ఇచ్చారు..? సంఘటన ఎప్పుడు జరిగింది...? ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు? ఎప్పుడు అరెస్ట్ చేశారు.? ఎప్పుడు బెయిల్ వచ్చింది అనే పూర్తి అంశాలతో ఒక టేబుల్ రూపంలో కోర్టు ముందు ఉంచాలని పల్నాడు ఎస్పీని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. -
ఏపీ పోలీసులపై హైకోర్ట్ ఘాటు వ్యాఖ్యలు
-
తప్పుడు కేసులతో ఎలా వేధిస్తారో మాకు బాగా తెలుసు
సాక్షి, అమరావతి: ‘‘తప్పుడు కేసులతో పోలీసులు ఎలా వేధిస్తారో మాకు బాగా తెలుసు. రాజీ చేసుకోవాలని ఎలా ఒత్తిడి చేస్తారో, బెదిరిస్తారో కూడా తెలుసు. మాకు ఏమీ తెలియదని అనుకోవద్దు. అలా అనుకోవడానికి మేమేమీ ఈఫిల్ టవర్ మీద కూర్చొనిలేము’’ అంటూ పోలీసులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడో ఫిర్యాదులు చేస్తే ఇప్పుడు కేసులు పెడుతున్నారని వారి తీరును ఆక్షేపించింది. దీనిని రోజూ చూస్తూ నే ఉన్నామని, పోలీసులకు కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని, వారి తీరు మార్చుకోవాలని స్పష్టం చేసింది. పిటిషనర్ పఠాన్ కరీంసా విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోవద్దని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (ఎస్హెచ్వో)ను ఆదేశించింది. ఒకవేళ జోక్యం చేసుకున్నట్లు తమ దృష్టికి వస్తే తీవ్రంగా పరిగణిస్తామని ఎస్హెచ్వోను హెచ్చరించింది. పిడుగురాళ్ల పోలీసుల అక్రమ నిర్భంధంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్త పఠాన్ కరీంసా కోర్టు ఎదుట హాజరయ్యారు. దీనిని నమోదు చేసిన హైకోర్టు... తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కరీంసా భార్య పఠాన్ సైదాబీ దాఖలు చేసిన పిటిషన్ను మూసివేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ జగడం సుమతిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఎస్హెచ్వో దురుసుగా వ్యవహరిస్తున్నారు...కరీంసాను పిడుగురాళ్ల పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని సైదాబీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన ధర్మాసనం.. పఠాన్ కరీంసాను స్థానిక కోర్టులో హాజరుపరిచి వాంగ్మూలం నమోదు చేయించాలని పోలీసులను ఆదేశించింది. కరీంసాను తమ ముందు హాజరుపరచాలని సూచించింది. మంగళవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా.. కరీంసాను కోర్టులో హజరుపరిచారు. ‘‘పోలీసులు ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు? ఎప్పుడు వదిలేశారు?’’ తదితర వివరాలను ధర్మాసనం పఠాన్ కరీంసాను అడిగి తెలుసుకుంది. వ్యాజ్యాన్ని మూసేస్తామని ప్రతిపాదించింది. కరీంసా తరఫు న్యాయవాది సూరపరెడ్డి గౌతమి జోక్యం చేసుకుంటూ, పిటిషనర్కు సంబంధించిన సివిల్ వివాదంలో పిడుగురాళ్ల ఎస్హెచ్వో జోక్యం చేసుకుంటున్నారని వివరించారు. కరీంసా సైతం కల్పించుకుని వేరే వ్యక్తులపై తాము ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని ఎస్హెచ్వో తీవ్రంగా ఒత్తిడి తెస్తూ బెదిరిస్తున్నారని, దురుసుగా వ్యవహరిస్తున్నారని వివరించారు.మీకు కౌన్సెలింగ్ చేయించాల్సి ఉంటుంది...కోర్టు హాలులోనే ఉన్న ఎస్హెచ్వోను ధర్మాసనం పిలిపించి.. పిటిషనర్ చెప్పింది నిజమా అని ప్రశ్నించింది. అవి కేవలం ఆరోపణలని ఎస్హెచ్వో సమాధానం ఇవ్వగా, ‘‘సహజంగా నిజం కాదనే చెబుతారు’’ అని వ్యాఖ్యానించింది. కౌన్సెలింగ్ పేరుతో వేధిస్తే, మీకు కౌన్సెలింగ్ చేయించాల్సి ఉంటుందని ఎస్హెచ్వోను హెచ్చరించింది. మరోసారి ఫిర్యాదు వస్తే తీవ్రంగా పరిగణిస్తామని తేల్చి చెప్పింది. పోలీసులు ఒత్తిడి తెస్తే తిరిగి కోర్టుకు రావొచ్చునని పఠాన్ కరీంసాకు ధర్మాసనం వెసులుబాటు ఇచ్చింది. -
ఏపీ పోలీసులపై హైకోర్టు మరోసారి సీరియస్
సాక్షి,అమరావతి: పోలీసులపై మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటే ఉపేక్షించం అంటూ హెచ్చరించింది. గుత్తి కొండకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త పఠాన్ కరీమ్ గతంలో టీడీపీ నేతలపై ఓ కేసు పెట్టారు. ఆ కేసు విత్డ్రా చేసుకోవాలంటూ పఠాన్పై పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ మేరకు పఠాన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశంపై పఠాన్ భార్య ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తన భర్తను పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ఆ పిటిషన్పై ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.విచారణలో భాగంగా హైకోర్టులో విచారణకు హాజరైన పిడుగురాళ్ల టౌన్ సిఐ వెంకట్రావుపై ప్రశ్నలు వర్షం కురిపించింది.కేసు రాజీ చేసుకోమని పిడుగురాళ్ల సీఐ వెంకటరావు ఎలా వేధించాడో ధర్మాసనానికి పఠాన్ కరీమ్ వివరించారు. విచారణ సందర్భంగా ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. పోలీసులు ఎలా వేధిస్తారో మాకు బాగా తెలుసు. కేసు రాజీ చేసుకోవాలని ఎలా ఒత్తిడి తీసుకొస్తారో.. ఎలా బెదిరిస్తారో కూడా తెలుసు. మాకు ఏమీ తెలియదు అనుకోవద్దు. అలా అనుకునేందుకు మేమేం ఐఫిల్ టవర్పై కూర్చోలేదుఎప్పుడో ఫిర్యాదులు చేస్తే ఇప్పుడు కేసులు పెడుతున్నారు.ఇలాంటివి మేము రోజు చూస్తూనే ఉన్నాం. పోలీసులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సివిల్ వివాదంలో జోక్యం చేసుకుంటే సహించేది లేదు. పిడుగురాళ్ల టౌన్ సీఐ జోక్యం చేసుకుంటే మళ్ళీ కోర్టుకు రావచ్చు అని కరీంకు ధర్మాసనం చెప్పింది. -
హైకోర్టు జడ్జిగా జస్టిస్ దేవానంద్ ప్రమాణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ ప్రమాణం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో సోమవారం జరిగిన కార్యక్రమంలో జస్టిస్ దేవానంద్తో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. అంతకుముందు.. జస్టిస్ దేవానంద్ను ఏపీ హైకోర్టుకు బదిలీచేస్తూ రాష్ట్రపతి జారీచేసిన ఉత్తర్వులను, తదనుగుణంగా కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్ను హైకోర్టు రిజి్రస్టార్ జనరల్ (ఆర్జీ) వైవీఎస్బీజీ పార్థసారథి చదివి వినిపించారు. అనంతరం.. జస్టిస్ దేవానంద్తో సీజే ప్రమాణం చేయించారు.ఈ సందర్భంగా జస్టిస్ దేవానంద్కు సీజే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులతో పాటు జస్టిస్ దేవానంద్ కుటుంబ సభ్యులు, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ ఇవన సాంబశివప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకనాథరెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం, అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, మద్రాసు హైకోర్టు న్యాయవాదులు.. తమిళనాడు, పుదుచ్చేరి న్యాయవాద మండళ్ల ప్రతినిధులు, హైకోర్టు రిజిస్ట్రార్లు, న్యాయవాదులు పాల్గొన్నారు.అనంతరం.. హైకోర్టు న్యాయవాదుల సంఘం నిర్వహించిన తేనీటి విందులో జస్టిస్ దేవానంద్ పాల్గొన్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన సందర్భంగా ఆయన్ను పలువురు న్యాయవాదులు, శ్రేయోభిలాషులు, బంధువులు పుష్పగుచ్ఛాలతో అభినందించారు. ప్రమాణం అనంతరం మరో న్యాయమూర్తితో కలిసి ఆయన ధర్మాసనంలో కేసులను విచారించారు. ఇక జస్టిస్ బట్టు దేవానంద్ హైకోర్టులో నాల్గవ స్థానంలో కొనసాగుతారు. ఆయన నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. అడ్వొకేట్స్ ప్రొటెక్షన్ బిల్లుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి.. ఇదిలా ఉంటే.. జస్టిస్ దేవానంద్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ అమల్రాజ్, వైస్ చైర్మన్ వి. కార్తికేయన్, మద్రాసు రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ హసన్ మహ్మద్ జిన్నా, తమిళనాడు హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యదర్శి కృష్ణకుమార్, కార్యనిర్వాహక సభ్యుడు రమేష్ తదితరులు రాష్ట్ర బార్ కౌన్సిల్ను సందర్శించారు. వారిని రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకనాథరెడ్డి, వైస్ చైర్మన్ కృష్ణమోహన్, సభ్యులు చిదంబరం, యర్రంరెడ్డి నాగిరెడ్డి తదితరులు ఘనంగా సన్మానించారు.శాలువా కప్పి వారికి బుద్ధుని జ్ఞాపికను బహూకరించారు. ఈ సందర్భంగా వారందరూ కూడా దక్షిణాది రాష్ట్రాల బార్ కౌన్సిళ్ల సమావేశాన్ని చెన్నైలో నిర్వహించాలని నిర్ణయించారు. న్యాయవాదుల వృత్తిపరమైన ఇబ్బందులపై చర్చించారు. న్యాయవాదుల రక్షణ కోసం ఉద్దేశించిన అడ్వొకేట్స్ ప్రొటెక్షన్ బిల్లును త్వరగా తీసుకొచ్చేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. శాశ్వత న్యాయమూర్తులుగా నలుగురుజస్టిస్ హరినాథ్, జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ సుమతి, జస్టిస్ విజయ్ పేర్లను సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియంసాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా ఉన్న జస్టిస్ నూనెపల్లి హరినాథ్, జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ న్యాపతి విజయ్ను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నేతృత్వంలో జరిగిన కొలీజియం సమావేశంలో తీర్మానం చేశారు.సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసి నియామక ఉత్తర్వులు జారీచేసిన తరువాత ఈ నలుగురు న్యాయమూర్తులు కూడా శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణం చేస్తారు. ప్రస్తుతం హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తులు 20 మంది ఉన్నారు. ఈ నలుగురితో ఆ సంఖ్య 24కి చేరుతుంది. మరో ఐదుగురు అదనపు న్యాయమూర్తులుగా కొనసాగుతారు. వీరు కూడా 2026–27లో శాశ్వత న్యాయమూర్తులు అవుతారు. జస్టిస్ హరినాథ్, జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ సుమతి, జస్టిస్ విజయ్లు 2023 అక్టోబరు 21న హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన విషయం తెలిసిందే. -
‘మీకు ఏ అధికారం ఉంది’.. మరోసారి పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
సాక్షి,అమరావతి: పోలీసులపై ఏపీ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. గుత్తికొండకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త పఠాన్ కరీమ్ గతంలో టీడీపీ నేతలపై ఓ కేసు పెట్టారు. ఆ కేసు విత్డ్రా చేసుకోవాలంటూ పఠాన్పై పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ మేరకు పఠాన్ను అదుపులోకి తీసుకున్నారు.ఇదే అంశంపై పఠాన్ భార్య ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తన భర్తను పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ఆ పిటిషన్పై ఏపీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. పఠాన్ కరీం మీ దగ్గరే ఉన్నారా?అని పోలీసుల్ని హైకోర్టు ప్రశ్నించింది. అందుకు తమ ఆధీనంలోనే ఉన్నారంటూ పోలీసులు తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎందుకు అదుపులోకి తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది. కౌంటర్ కేసులున్నాయని.. వాటిని రాజీ చేయించేందుకే అదుపులోకి తీసుకున్నామని పోలీసుల తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు.దీంతో పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ఏ అధికారంతో కేసును విత్డ్రా చేస్తారని ప్రశ్నించింది. ఈ కేసును తానే విచారిస్తానని.. మంగళవారం పఠాన్ కరీంను తమ ముందు హాజరు పరచాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి.. పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. రేపటి వరకు పఠాన్ను తహసిల్దార్ వద్ద ఉంచాలని పోలీసులకు ఆదేశించారు. -
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం
సాక్షి, అమరావతి: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో తదుపరి దర్యాప్తునకు అనుమతినిస్తూ రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఈ నెల 22న ఇచ్చిన ఉత్తర్వుల విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఎస్సీ, ఎస్టీ కోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వలేమని స్పష్టంచేసింది. కింది కోర్టు ఇచ్చింది తదుపరి దర్యాప్తు ఉత్తర్వులు మాత్రమేనని గుర్తుచేసింది. దీనివల్ల అనంతబాబు ఏ రకంగానూ ప్రభావితం కారని తెలిపింది. పునర్ దర్యాప్తు కాకుండా తదుపరి దర్యాప్తు విషయంలో స్పష్టతనిస్తూ తగిన ఉత్తర్వులు ఇస్తామని వెల్లడించింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో తదుపరి దర్యాప్తునకు అనుమతినిస్తూ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలుచేస్తూ ఎమ్మెల్సీ అనంతబాబు గురువారం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై జస్టిస్ లక్ష్మణరావు శుక్రవారం విచారణ జరిపారు. తదుపరి దర్యాప్తు అక్కర్లేదు.. అనంతబాబు తరఫున సీనియర్ న్యాయవాది చిత్తరవు రఘు వాదనలు వినిపించారు. ఈ కేసులో 2022లో పోలీసులు దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్ దాఖలు చేశారని, ఆ తరువాత 2023లో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేశారని ఆయన తెలిపారు. కోర్టు దానిని విచారణ నిమిత్తం పరిగణనలోకి సైతం తీసుకుందన్నారు. పిటిషనర్ గన్మెన్లను సైతం విచారించారన్నారు. కొత్త ఆధారాలు ఏమీ లభ్యంకాలేదని, అందువల్ల తదుపరి దర్యాప్తు అవసరంలేదన్నారు. తదుపరి దర్యాప్తు పేరుతో అమాయకులను నిందితులుగా చేర్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే విచారించిన సాక్షులను మళ్లీ పిలుస్తారేమోనని, ఇదే జరిగితే ప్రభుత్వం మారినప్పుడల్లా పాత కేసులను తదుపరి దర్యాప్తు పేరుతో తిరగదోడుతారన్నారు. అనంతరం పోలీసుల తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. -
హైకోర్టులో పవన్ కల్యాణ్ పరువు నష్టం కేసు
-
ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ఏపీ హైకోర్టు: సంక్షేమ హాస్టళ్ళ వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు పైన దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు మండిపడింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. సంక్షేమ హాస్టల్లో పిల్లల అవస్థలు మీకు కనిపించడం లేదా?.కటిక నేలపై పిల్లలు ఎలా పడుకుంటారు? పిల్లల్ని మనం మన ఇళ్ల వద్ద అలాగే పడుకో బెట్టుకుంటున్నామా..?. కనీసం సన్నపాటి పరుపు, దుప్పటి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారా..? బడ్జెట్ కేటాయింపులన్నీ ఎక్కడికి పోతున్నాయి అని ప్రశ్నించిన హైకోర్టు..కాంట్రాక్టర్ల లబ్ధి కోసం ఆ డబ్బులు ఖర్చు చేస్తున్నారా? అని దుయ్యబట్టింది.పిల్లల సంక్షేమమే తమకు ముఖ్యమని స్పష్టం చేసిన హైకోర్టు..ప్రతి జిల్లాలో సీనియర్ అధికారి స్థాయిలో తనిఖీలు చేయాలి. సంక్షేమ హాస్టళ్లకు సంబంధించిన నివేదికలను ప్రతినెలా మా ముందు ఉంచండి అని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించడంలో రాజీ పడే సమస్య లేదు. ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సాంఘిక,బీసీ, గురుకుల సంక్షేమ శాఖ కార్యదర్శిను బాధితులుగా చేస్తామని హైకోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. సంక్షేమ హాస్టల్లో మౌలిక సదుపాయాలపై విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనంద్ ఆన్లైన్ ద్వారా కోర్టు ముందు హాజరయ్యారు. -
ఆ మృగాడికి బెయిల్ ఇవ్వలేం..
సాక్షి, అమరావతి: కామవాంఛతో యజమాని భార్యను కిరాతకంగా చంపడమే కాకుండా, ఆ తరువాత ఆమె మృతదేహంపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. మృతురాలిపట్ల పిటిషనర్ పాశవికంగా, మృగంలా ప్రవర్తించాడని హైకోర్టు తెలిపింది. ఇలాంటి వారికి బెయిల్ మంజూరుచేస్తే అది సమాజంపై దు్రష్పభావం చూపుతుందని స్పష్టంచేసింది. ‘యజమాని భార్యను హత్యచేయడం ద్వారా అతని నమ్మకాన్ని పిటిషనర్ దారుణంగా వమ్ముచేశాడు. కాంపౌండర్గా తన ఇంట్లోనే ఉండేందుకు యజమాని స్థానం కల్పించాడు. విశ్వాసంగా ఉంటూ ఇంట్లో ఒకరిగా నమ్మకం కలిగించి పిటిషనర్ ఈ నేరానికి ఒడిగట్టాడు. కామవాంఛతో రగిలిపోయి మృతురాలిపట్ల ఓ మృగంలా ప్రవర్తించాడు. తన వాంఛను తిరస్కరించడంతో ఆమె తలపై అతిదారుణంగా, విచక్షణారహితంగా కొట్టి చంపాడు. హత్య అనంతరం కూడా అతని క్రూరత్వం ఏమాత్రం ఆగలేదు. మృతదేహంతో లైంగిక చర్యకు పాల్పడ్డాడు. ఇంతటి తీవ్రమైన చర్యలకు పాల్పడిన వ్యక్తికి బెయిల్ ఇవ్వడం సాధ్యంకాదు. చార్జిషీట్ దాఖలు చేసినంత మాత్రాన ఆరోపణల తీవ్రత ఎంతమాత్రం తగ్గదు’.. అని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఇటీవల తీర్పు వెలువరించారు. బంధువని ఆశ్రయమిస్తే.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలో పశ్చిమ బెంగాల్కు చెందిన శ్రీకాంత్ బిశ్వాస్ తన తండ్రితో కలిసి గత 16 ఏళ్లుగా ఫిస్టులా ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. శ్రీకాంత్ తన భార్య అర్పితా బిశ్వాస్, తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి ఉంటున్నారు. తన దూరపు బంధువైన నయన్ బిశ్వాస్కు శ్రీకాంత్ తన ఆసుపత్రిలో కాంపౌండర్గా ఉద్యోగం ఇచ్చారు. 2024 డిసెంబరు 31న న్యూఇయర్ వేడుకల్లో భాగంగా శ్రీకాంత్, నయన్, మరో బంధువు కలిసి మద్యం తాగారు. అనంతరం ఎవరి గదులకు వారు వెళ్లి నిద్రపోయారు. నయన్ బిస్వాస్ హాలులో నిద్రపోయాడు. తెల్లవారి శ్రీకాంత్ లేచి చూసేసరికి అర్పిత ఇంట్లో లేదు. ఆమె గది నిండా రక్తం ఉంది. ఆమె కోసం వెతకగా, ఇంటికి సమీపంలో మురికికాలువలో తలపై తీవ్రగాయాలతో చనిపోయి నగ్నంగా కనిపించింది. దీంతో కావలి పట్టణ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తన లైంగిక వాంఛను తీర్చుకోవడానికి అర్పితపట్ల నయన్ అసభ్యంగా ప్రవర్తించాడని, ఆమె ఎదురుతిరగడంతో ఎక్కడ నిజం బయటకు చెప్పేస్తుందోనన్న కారణంతో ఆమెను చంపేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ కిరాతకుడిని పోలీసులు అరెస్టు చేశారు.బెయిల్ పిటిషన్లు కొట్టివేత.. నిందితుడు నయన్ బిశ్వాస్ నెల్లూరు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దానిని కొట్టేసింది. ఆ తర్వాత అతను హైకోర్టును ఆశ్రయించాడు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ మల్లికార్జునరావు ఇటీవల విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం నయన్ బిశ్వాస్కు బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరిస్తూ అతని పిటిషన్ను కొట్టేశారు. -
ప్రాణహాని ఉందని కోర్టుకొస్తే పట్టించుకోవాల్సిందే
సాక్షి, అమరావతి: తనకు ప్రాణహాని ఉన్నందున భద్రత కల్పించాలని కోరుతూ ఓ వ్యక్తి తమను ఆశ్రయిస్తే దానిని తాము సీరియస్గా తీసుకోవాల్సిందేనని హైకోర్టు స్పష్టంచేసింది. అతని ప్రాణాలకు హాని జరిగితే దానివల్ల ఆ వ్యక్తి కుటుంబానికి పూడ్చలేని నష్టం జరుగుతుందని తెలిపింది. అందువల్ల ఆ వ్యక్తికి భద్రత కల్పించాలని ఆదేశాలు ఇస్తున్నామని తెలిపింది. వైఎస్సార్సీపీ నేత లింగాల రామలింగారెడ్డికి 1+1 భద్రతను పొడిగించాలని వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. భద్రతకు అయ్యే ఖర్చులను భరించాలని రామలింగారెడ్డికి స్పష్టంచేసింది. మూడునెలల తరువాత క్షేత్రస్థాయిలో అప్పటికున్న వాస్తవ పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని లింగాల రామలింగారెడ్డి భద్రత విషయంలో ఉన్నతాధికారులకు తగిన సిఫారసు చేయాలని భద్రత సమీక్ష కమిటీ (ఎస్ఆర్సీ)ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ శుక్రవారం తీర్పు వెలువరించారు.భద్రత ఉపసంహరణపై పిటిషన్..2020లో అప్పటి ప్రభుత్వం తనకు ఇచ్చిన 1+1 భద్రతను ప్రస్తుత ప్రభుత్వం ఉపసంహరించడాన్ని సవాలుచేస్తూ వైఎస్సార్ కడప జిల్లా, వేముల గ్రామానికి చెందిన లింగాల రామలింగారెడ్డి ఈ ఏడాది ఏప్రిల్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు, పిటిషనర్కున్న 1+1 భద్రతను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సీజే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలుచేసింది. భద్రతను పునరుద్ధరించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యానికి ధర్మాసనం నిరాకరించింది. అయినా కూడా రామలింగారెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం భద్రతను పునరుద్ధరించలేదు. దీంతో.. ఆయన జిల్లా ఎస్పీపై తాజాగా కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. కీలక అంశాలను పట్టించుకోలేదు..పిటిషనర్ తరఫు న్యాయవాది తప్పెట నాగార్జునరెడ్డి, పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది (జీపీ) వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తూ.. భద్రత సమీక్ష కమిటీ అన్నీ అంశాలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. పిటిషనర్ వ్యాపార, రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నందున ఆయనకున్న ప్రాణహానిని పరిగణనలోకి తీసుకుంటూ 1+1 భద్రతను పొడిగించాలని జిల్లా ఎస్పీని ఆదేశిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. -
సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట
ఢిల్లీ: సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట లభించింది. మైనింగ్ కేసులో వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న ఏపీ ప్రభుత్వ పిటిషన్ను హైకోర్టుకు సుప్రీం కోర్టు తిప్పి పంపించింది. అరెస్టు నుంచి రక్షణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్పై గురువారం.. సుప్రీంకోర్టు విచారణ జరిపింది.హైకోర్టు తమ వాదన వినకుండానే ముందస్తు బెయిల్ ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదించారు. దాంతో కేసును ఏపీ హైకోర్టు మరోసారి విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అరెస్టు నుంచి రక్షణను సుప్రీంకోర్టు పొడిగించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. -
ప్రభుత్వ హాస్టళ్లలో సౌకర్యాల లేమి.. ఏపీ హైకోర్టు సీరియస్
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ హాస్టళ్లలో సౌకర్యాలు లేకపోవడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సౌకర్యాలు ఎలా ఉన్నాయో పరిశీలించిన లీగల్ సర్వీసెస్ అథారిటీ.. కోర్టుకు రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో భాగంగా నర్సీపట్నంలో ఉన్న బాలికల వసతి గృహంలో 228 మందికి ఒక బాత్రూమే పని చేస్తున్నట్టు రిపోర్ట్లో పేర్కొంది.మరో రెండు, మూడు హాస్టళ్లలో కూడా ఇదే పరిస్థితి ఉందని రిపోర్ట్ ఇచ్చింది. వచ్చే సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ సెక్రటరీ హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హాస్టల్స్ వసతుల కల్పన కోసం ఏ చర్యలు తీసుకుంటారో పూర్తి వివరాలు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. -
తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంలో హైకోర్టు కీలక ఆదేశాలు
-
తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారం.. హైకోర్టు కీలక ఆదేశాలు
అమరావతి: తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లడ్డూ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తు స్వతంత్రంగా నిష్పక్షపాతంగా కొనసాగాలని.. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుల కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న కేసు అని పేర్కొంది.అమూల్యమైన లడ్డూ ప్రసాదం పవిత్రతపై ఏర్పడిన వివాదంపై జరుగుతున్న దర్యాప్తు ఇది.. అందువల్ల సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి దర్యాప్తు జరగాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ దర్యాప్తును స్వయంగా సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షించాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) దర్యాప్తు అధికారిగా ఉన్న అదనపు ఎస్పీ జె.వెంకట్రావువు నియామకం తగదని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. వెంకట్రావు సుప్రీంకోర్టు సిట్ సభ్యుడు కాదని.. ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. కాబట్టి ఆయనకు దర్యాప్తు బాధ్యత అప్పగించడం సరికాదని తెలిపింది. -
పులివెందుల పోలీసులకు ఏపీ హైకోర్టు షాక్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల పోలీసులకు హైకోర్టులో మరోమారు చుక్కెదురైంది. కేసుకు సంబంధం లేని సెక్షన్లను ఎలా పెడతారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ బాలిక మిస్సింగ్ కేసులో ఆవేదనతో 7వ తేదీ రాత్రి వేంపల్లి వాసులు పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టారు. తోపులాటలో పోలీసు స్టేషన్ కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. దాదాపు 200 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అరెస్టులు చేస్తున్నారు.హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ పోలీసులు.. నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు. దీంతో బాధితులు.. హైకోర్టును ఆశ్రయించారు. పులివెందుల పోలీసుల తీరుపై మండిపడిన హైకోర్టు.. స్టేషన్ను చుట్టుముడితే హత్యాయత్నం ఎలా అవుతుందంటూ ప్రశ్నించింది. వెంటనే ఆ సెక్షన్ తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా దాడికి పాల్పడి ఉంటే సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించి.. ఆ తర్వాత 41ఏ నోటీసులిచ్చి విచారించాలని హైకోర్టు తెలిపింది. నిన్నటి నుంచీ అరెస్టులు చేస్తున్న పోలీసులు.. ఇప్పటికీ దాదాపు 70 మందిని వరకూ అరెస్ట్ చేశారు. -
KSR Comment: బాబు, లోకేశ్ కు హైకోర్టు చివాట్లు.. జాతీయ స్థాయిలో నవ్వులపాలు
-
నాపైనే పిటీషన్ వేస్తావా.. నీ అంతు చూస్తా
వైఎస్సార్: ‘నా మీద హైకోర్టులో పిటిషన్ వేస్తావా.. నీ అంతు చూస్తా.. నిన్ను ఎన్ కౌంటర్ చేస్తా.. నిన్ను వదిలే ప్రసక్తే లేదు..నీ మీద తప్పుడు కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేస్తా.. నిన్ను సబ్ జైలుకు పంపించేంతవరకూ నేను నిద్రపోను‘ అంటూ పెండ్లిమర్రి పోలీస్స్టేషన్ ఎస్ఐ మధుసూదన్రెడ్డి తనదైన శైలిలో ఫిర్యాదుదారుడిపై విరుచుకుపడ్డాడు. మంగళవారం సాయంత్రం పెండ్రిమర్రి పోలీస్ స్టేషన్కు పిలిపించి చిత్రహింసలకు గురిచేయడంతో ఈ సంఘటన కలకలం సష్టించింది. వ్యక్తిగతంగా, శారీరకంగా మానసిక వేదనకు గురిచేయడంతో అతడి భార్య, బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మండలంలోని రాళ్లపల్లి గ్రామానికి చెందిన బాలకష్ణారెడ్డిని మంగళవారం మధ్యాహ్నం సమయంలో నీ మీద కేసులు ఉన్నాయి.. మీకు నోటీసు ఇవ్వాలి.. ఎస్ఐ మధుసూదన్రెడ్డి స్టేషన్కు రమ్మంటున్నారు అంటూ హెడ్కానిస్టేబుల్ పుల్లారెడ్డి వచ్చి తీసుకెళ్లారు. ఎస్సై మధుసూదన్రెడ్డి అప్పటి నుంచి స్టేషన్కు వచ్చిన బాలకృష్ణారెడ్డిని నిర్బంధించారు.తనకు నోటీసులు ఇవ్వమని బాలకృష్ణారెడ్డి అడిగారు. వెంటనే ఎస్ఐ కోపోద్రిక్తుడై నీకు ఎందిరా నోటీసులు ఇచ్చేది. ఇప్పుడే నీ మీద గంజాయి, సారాయి స్మగ్లింగ్ తప్పుడు కేసులు పెట్టి నిన్ను సబ్ జైల్లో పెట్టేంత వరకూ నేను నిద్రపోను అంటూ బెదిరించడంతో బాలకృష్ణారెడ్డి పరిస్థితి అయోమయంగా మారింది. తప్పుడు సమాచారం.. నోటీసుల నెపంతో పోలీస్ స్టేషన్కు పిలిపించి ఎస్సై ప్రవర్తించేలా కాకుండా రౌడీ తరహాలో ఎస్సై మధుసూదన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పోలీసు వ్యవస్థకే కళంకం తెస్తోందని బాలకష్ణారెడ్డి భార్య లక్ష్మీదేవి కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుటుంబంలో చిన్నపాటి ఆస్తుల వివాదాలకు సంబంధించి ఎస్సై మధుసూదన్ రెడ్డి స్టేషన్లో వేసి పోలీసు కోటింగ్ ఇవ్వడానికి ప్రయతి్నంచగా బాలకష్ణారెడ్డిని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బాలకష్ణారెడ్డి కుటుంబ ఆస్తుల వివాదం విషయంలో ఎస్సై జోక్యం చేసుకోవద్దని ఉత్తర్వులిచ్చింది. అయినప్పటికీ ఎస్సై మధుసూదన్ రెడ్డి తన తీరు మార్చుకోకపోగా, హైకోర్టుకు వెళ్లాడనే ఉద్దేశంతో బాలకష్ణారెడ్డిని మంగళవారం మధ్యాహ్నం సమయంలో నోటీసుల నెపంతో స్టేషన్కు రప్పించారు. అనంతరం అక్కడే ఎస్సై మధుసూదన్ రెడ్డి నిర్బంధించడం ఎంతవరకు న్యాయమో జిల్లా ఉన్నతాధికారులే నిర్ణయించాలని బాధితుడి బంధువులు కోరుతున్నారు.అక్రమ నిర్బంధంపై ఎస్పీ కి ఫిర్యాదుపెండ్లిమర్రి పోలీస్ స్టేషన్లో బాలకష్ణారెడ్డిని ఎస్సై మధుసూదన్ రెడ్డి అక్రమంగా నిర్బంధించిన విషయమై బాధితులు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారించి తాను తగిన చర్యలు తీసుకుంటానని ఎస్పీ వివరించినట్లు సమాచారం. -
పార్కు స్థలం ప్రైవేటు వ్యక్తులకా?
సాక్షి, అమరావతి :గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలోని బటర్ఫ్లై పార్కు స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు అన్యాక్రాంతం చేసేందుకు విశాఖపట్నానికి చెందిన ఓ ఎమ్మెల్యే, అతని వియ్యంకుడైన ఓ రాష్ట్ర మంత్రి తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు బ్రేక్ వేసింది. విలువైన పార్కు స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి, వారికి సంబంధించిన స్థలాన్ని భూమార్పిడి కింద తాము తీసుకునేందుకు అనుమతినిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జారీచేసిన ప్రొసీడింగ్స్పై హైకోర్టు స్టే విధించింది. ఈ పార్కు స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కేటాయించరాదని గతంలో ప్రభుత్వం నిర్ణయించిందని హైకోర్టు గుర్తుచేసింది. అయినా ఇప్పుడు తిరిగి అదే పార్కు స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు భూమార్పిడి కింద ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడటంపై హైకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. భూ మార్పిడి విషయంలో పురపాలక శాఖ నియమించిన కమిటీ నివేదిక సైతం చాలా అస్పష్టంగా ఉందని అభిప్రాయపడింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్, జీవీఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను అక్టోబరుకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.ప్రైవేటు వ్యక్తులకు కేటాయింపుపై పిల్..జీవీఎంసీ వార్డు నెం.6లో ఉన్న బటర్ఫ్లై పార్కు స్థలాన్ని భూ మార్పిడి పద్ధతిన పోతిన అప్పారావు, పిళ్లా లక్ష్మణపాత్రుడికి కేటాయించేందుకు వీలుగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఈ ఏడాది మే 13న జారీచేసిన ప్రొసీడింగ్స్ను సవాలుచేస్తూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కె. శ్రీనివాసమూర్తి వాదనలు వినిపించారు. భూ మార్పిడి పేరుతో విలువైన పార్కు స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గతంలో ఇదే వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా అధికారులు నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రైవేటు వ్యక్తులు వ్యవస్థలను, అధికారులను మేనేజ్ చేసి విలువైన పార్కు స్థలాన్ని కాజేయాలని చూస్తున్నారని తెలిపారు. గతంలో ప్రైవేటు వ్యక్తులకు ఆ భూమిని ఇవ్వకూడదని నిర్ణయించిన ప్రభుత్వం, రాజకీయ జోక్యంతో తన నిర్ణయాన్ని మార్చుకుందని ఆయన వివరించారు. ప్రభుత్వం నుంచి పొందిన పార్కు స్థలంలో ప్రైవేటు వ్యక్తులు ఇప్పటికే పనులు చేస్తున్నారని, హైకోర్టు జోక్యం చేసుకోకపోతే విలువైన స్థలం చేజారిపోతుందన్నారు. -
హైకోర్టు జోక్యంతోనైనా అరాచకాలు తగ్గుతాయా?
ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానానికి అభినందనలు. రెడ్బుక్ పేరుతో రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై అరాచకాలకు తెగబడుతున్న తెలుగుదేశం పార్టీకి ముకుతాడు వేసే దిశగా న్యాయస్థానం మేలైన చర్య తీసుకుంది. సోషల్మీడియా పోస్టుల విషయంలో అరెస్ట్ అయిన వారికి రిమాండ్ ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని, పౌరుల హక్కుల పరిరక్షణకు విఘాతం కలిగితే చూస్తూ ఊరుకోబోమని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లకు జారీ చేసిన ఒక సర్క్యులర్లో స్పష్టం చేసింది. అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతున్న కొందరు పోలీసు అధికారుల ఇష్టారాజ్య పోకడలకు కొంతమేర బ్రేక్ వేసింది. హైకోర్టు విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్లు ఇకపై యాంత్రికంగా రిమాండ్ విధించరాదు. పోలీసులు పెట్టిన కేసు లోతుపాతులు, నిందితులపై మోపుతున్న బీఎన్ఎస్ సెక్షన్ల హేతుబద్ధతలను పరిశీలించిన తర్వాతే రిమాండ్పై చర్య తీసుకోవాలి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పెట్టుకోవాలి. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసులలో రిమాండ్ అవసరం లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఇటీవలి కాలంలో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్లు కొందరు అవసరమున్నా లేకపోయినా పోలీసులు మోపిన కేసుల్లో నిందితులను రిమాండ్కు పంపుతున్న విమర్శలు ఉన్నాయి. ఉన్నత న్యాయస్థానాలు అప్పుడప్పుడు రిమాండ్ తీరుతెన్నులను తప్పుపడుతున్నా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో హైకోర్టు ఈ సర్క్యులర్ జారీ చేసింది. దీనిని ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ అవుతుందని కూడా స్పష్టం చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సర్క్యులర్కు సంబంధించిన వార్తలకు తెలుగుదేశం అనుకూల మీడియా పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకపోవడం!ఏడాది క్రితం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్బుక్ పేరుతో సొంత రాజ్యాంగం అమలు చేస్తూ భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేస్తూ, రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తూ సమాజంలో భయభ్రాంతులను సృష్టిస్తున్నట్లు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్లు చట్టాలతో సంబంధం లేకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ తీవ్రంగా విమర్శిస్తోంది. లోకేష్ మరో అడుగు ముందుకేసి రెడ్బుక్ ఏదో ఘనకార్యమైనట్లు సమర్థిస్తూ మాట్లాడుతున్న తీరు ఆయన అపరిపక్వతను తెలియచేస్తుందన్న విశ్లేషణలు వస్తున్నాయి. సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు దారుణంగా కేసులు పెడుతూ వస్తున్నారు.జర్నలిస్టులను కూడా వదలి పెట్టుకుండా వేధిస్తున్నారు. చివరికి పరిస్థితి ఏ దశకు చేరిందంటే అధికారంలో ఉన్న టీడీపీ జనసేనలకు అనుకూలంగా వ్యవహరించకపోతే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై సైతం రెడ్బుక్ ప్రయోగిస్తున్నారు. సిద్ధార్థ్ కౌశల్ అనే ఐపీఎస్ ఈ రెడ్బుక్ పిచ్చి గోలతో తాను పని చేయలేనని స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. కొందరు అధికారులు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అర్ధం కాక తల పట్టుకుంటున్నారు. అధికార పార్టీ కొమ్ము కాసే కొద్ది మంది అధికారులు మాత్రం రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తూ చట్టాలను, నిబంధలను గాలికి వదిలి వేస్తున్నారు. కొందరు జిల్లా కలెక్టక్టర్లు, ఎస్పీలు 'నీవు ఫలానా కులం వాడివి కదా! అయినా వైఎస్సార్సీపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నావు’ అని అడుగుతున్నారట. దీనికి సంబంధించి ఒక వ్యక్తి చెప్పిన మాటల వీడియో వైరల్ అయింది. జిల్లా స్థాయి అధికారులే అలా ఉంటే క్షేత్రస్థాయిలో ఉండే వారు ఏమి చేయగలుగుతారు? పద్దతిగా ఉంటే శంకరగిరి మాన్యాలు పట్టవలసి వస్తుందని భయపడుతున్నారు. కొన్ని సందర్భాలలో అధికారులు తాము వేధించామనే బయట చెప్పండని నిందితులతో అంటున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటివరకు వందలాది మంది సోషల్ మీడియా కార్యకర్తలకు నోటీసులు ఇవ్వడం, అరెస్టులు చేయడం వంటివి జరిగాయి. రిమాండ్ విషయంలో తగు జాగ్రత్తలతో వ్యవహరించాలని హైకోర్టు సర్క్యులరైతే పంపింది కానీ... మెజిస్ట్రేట్లు దీని పూర్తి స్థాయిలో అమలు చేయగలుగుతారా? లేదా?అన్న చర్చ ఉంది. ఎందుకంటే మెజిస్ట్రేట్లు పోలీసులు పెట్టే సెక్షన్ల ఆధారంగా రిమాండ్కు పంపుతారని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని, వాటి పరిధిలోకి రాకుండా, అవసరం ఉన్నా, లేకపోయినా కఠినమైన సెక్షన్లతో కేసులుపెట్టే అవకాశం ఉంటుందన్నది కొందరు న్యాయవాదుల అభిప్రాయంగా ఉంది. ఉదాహరణకు ఎవరినైనా వేధించాలని భావిస్తే, సంబంధం ఉన్నా, లేకపోయినా ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. కొందరు మెజిస్ట్రేట్లు ఈ విషయాన్ని గుర్తించి ఆయా సెక్షన్లను తీసి వేయిస్తున్నా, అన్ని సందర్భాల్లోనూన అలా చేయగలుగుతారా? అన్నదానిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. అయితే హైకోర్టు సూచనలతో మెజిస్ట్రేట్లు సోషల్ మీడియా, తదితర భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన ఫిర్యాదుల విషయంలోనైనా తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటారన్న విశ్వాసం వ్యక్తం అవుతోంది. ఎన్నికలకు ముందు లోకేశ్ రెడ్బుక్ అంటూ తిరుగుతుంటే, అదేదో పిచ్చిగోలలే! తెలిసి, తెలియని మాటలులే అని అంతా అనుకున్నారు. కాని కూటమికి అధికారం రాగానే అదే ప్రమాదకరంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొన్నిసార్లు ఈ రెడ్బుక్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని ఆందోళన వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో ఒక టాక్! అయినా తన కుమారుడిని నియంత్రించలేక పోతున్నారని చెబుతున్నారు. పోలీసు అధికారులు కూడా సీఎం కంటే మంత్రి లోకేశ్ మాటలకే ఎక్కువ విలువ ఇస్తున్నారని టీడీపీ వర్గాలు సైతం అంటున్నాయి. రాజకీయ ప్రత్యర్ధులపై ఒకటికి పది చోట్ల కేసులు పెట్టి వేధించడం, ఒక కేసులో బెయిల్ వస్తే పీటీ వారంట్ల పేరుతో ఇంకో కేసులో అరెస్టు చేయడం వంటివన్నీ ఏపీలో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలకు ఇదొక బెంచ్ మార్క్ అయ్యే ప్రమాదం ఉందని ప్రజాస్వామ్య వాదులు ఆందోళన చెందుతున్నారు. నిప్పుకు గాలి తోడైనట్లుగా ఈ రెడ్బుక్ అరాచకానికి తెలుగుదేశం మీడియా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి అవ్వాలని ఉవ్విళ్లూరుతున్న లోకేశ్ హుందాగా వ్యవహరించాలని చెప్పడానికి టీడీపీ ఎవరూ సాహసించడం లేదట. అంతేకాదు. టీడీపీ నాయకత్వం అండ చూసుకుని హైకోర్టు న్యాయమూర్తులను ఇష్టం వచ్చినట్లు విమర్శించే దశకు కొందరు చేరుకున్నారు. తీర్పులను విశ్లేషించవచ్చు. కాని న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేస్తున్న తీరుపై బార్ కౌన్సిల్ సైతం తప్పు పట్టింది. జస్టిస్ శ్రీనివాస రెడ్డి కోర్టులోనే తన ఆవేదనను వ్యక్తపరిచారు.అయినా టీడీపీ తన ధోరణి మార్చుకుంటుందా?లేదా?అన్నది చెప్పలేం. ఎందుకంటే చంద్రబాబు నాయుడి నాయకత్వంలో రాజకీయ ప్రత్యర్ధుల వ్యక్తిత్వ హననం అన్నది తెలుగుదేశం పార్టీలో ఒక విధానంగా మారింది. టీడీపీ మీడియా అండగా ఉంటోంది. ఇతర పార్టీల వారి సంగతెందుకు! చివరికి 1995లో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును సైతం వదలి పెట్టకుండా దారుణమైన కథనాలు ప్రచారం చేశారు. ఒకవైపు నీతులు చెప్పడం, మరో వైపు ఇలా ఎదుటి వారి పట్ల అమానుషంగా వ్యవహరించడం అన్నది టీడీపీ వ్యూహంగా మారింది. ఈ నేపథ్యంలో హైకోర్టు జారీ చేసిన సర్క్యులర్ను న్యాయ వ్యవస్థ ఎంత గట్టిగా అమలు చేస్తుందో, పోలీస్ వ్యవస్థ ఎంతగా గౌరవిస్తుందో వేచి చూడాల్సిందే.::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మీరు చెబుతున్నదానికి.. పరిస్థితులకు పొంతన లేదు కదా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లలో లోపల, బయట అన్నీ కనిపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ధ్రువీకరిస్తూ దాఖలు చేసిన నివేదికలపై హైకోర్టు సందేహాలు లేవనెత్తింది. పోలీసులు చెబుతున్నదానికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులకీ పొంతన కనిపించడం లేదని తెలిపింది. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషనే ఇందుకు ఉదాహరణ అని పేర్కొంది. ఈ ఠాణాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని విజయవాడ అసిస్టెంట్ కమిషనర్ ధ్రువీకరించారని, ఇదే స్టేషన్కు సంబంధించి మరో కేసులో సంబంధిత మేజిస్ట్రేట్ ఒక్క సీసీ కెమెరా మాత్రమే ఉందని తమకు నివేదిక ఇచ్చారని తెలిపింది. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై వాస్తవాలను తేల్చేందుకు న్యాయవాదులతో కమిటీ ఏర్పాటు చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు? స్టేషన్ లోపల, బయట కనిపించేలా వాటిని ఏర్పాటు చేశారా? సక్రమంగా పనిచేస్తున్నాయా? తదితర వివరాలను న్యాయవాదుల కమిటీ ద్వారా తెప్పించుకుంటామని తెలిపింది. ఇప్పటికీ చాలా స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని, ఎందుకనేది వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ జగడం సుమతిల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది.» సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదంటూ న్యాయవాది తాండవ యోగేష్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. విచారణ జరిపిన ధర్మాసనం అన్ని స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ, వీటిని ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ యోగేష్ కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రఘునందన్రావు ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ యోగేష్ వాదనలు వినిపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 1,392 పోలీస్ స్టేషన్లు ఉంటే 1,001 చోట్ల మాత్రమే సీసీ కెమెరాలు పెట్టారన్నారు. మిగిలిన స్టేషన్లలో కూడా ఏర్పాటుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.అక్కడ తప్ప అన్నీ స్టేషన్లలో ఏర్పాటు చేశాంప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) టి.విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ, లాకప్లు ఉన్న అన్ని స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, లాకప్లు లేనిచోట పెట్టలేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. చాలా కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసి లాకప్లు లేని కార్యాలయాలు, పోలీసు ట్రైనింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి హింసించిన సందర్భాలున్నాయని గుర్తు చేసింది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనివి స్టేషన్ల నిర్వచనం పరిధిలోకి వస్తాయో రావో తెలుసుకుని చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.పోలీసుల దర్యాప్తు తీరుపై సందేహం కలుగుతోందిఆటో డ్రైవర్ కస్టోడియల్ టార్చర్పై స్పందించిన హైకోర్టుసాక్షి, అమరావతి: టీడీపీ కార్యకర్త ఫిర్యాదు ఇవ్వగానే ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకుని తీవ్రంగా హింసించిన ఘటనపై హైకోర్టు స్పందించింది. పల్నాడు జిల్లా, దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్, ఎస్ఐ సౌందర్య రాజు చిత్రహింసలకు గురిచేశారని బాధితుడి తండ్రి ఆరోపిస్తున్న నేపథ్యంలో మొత్తం వ్యవహారంపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని పల్నాడు ఎస్పీని ఆదేశించింది. అరెస్ట్ సహా జరిగినదంతా గమనిస్తే పోలీసుల దర్యాప్తు తీరుపై ప్రాథమికంగా సందేహం కలుగుతోందని తెలిపింది. అరెస్ట్కు దారితీసిన పరిస్థితులు, తదనంతర పరిణామాలతో ఓ అఫిడవిట్ను తమ ముందు ఉంచాలంది. గత నెల 21 సాయంత్రం 4 గంటల నుంచి 23వ తేదీ మధ్యాహ్నం వరకు దాచేపల్లి పోలీస్ స్టేషన్ నుంచి తంగేడు గ్రామం చెన్నయపాళెం క్రాస్రోడ్డు వరకు సీసీ కెమెరాల ఫుటేజీని సమర్పించాలని దాచేపల్లి పోలీసులను ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ఉత్తర్వులిచ్చారు. విచారణను బుధవారానికి వాయిదా వేశారు.దాచేపల్లి మండలం తంగెడకి చెందిన హరికృష్ణ ఎన్నికల సమయంలో తమపై బాంబులు వేశారని, తాజాగా హత్యాయత్నం చేశారంటూ టీడీపీ కార్యకర్త షేక్ హుస్సేన్ ఈ ఏడాది మే 22న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే తన కుమారుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని, విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టారని హరికృష్ణ తండ్రి ఎల్లయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. తన కుమారుడి అరెస్ట్ను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు. దీనిపై జస్టిస్ హరినాథ్ ఇటీవల విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున న్యాయవాది సూరపురెడ్డి గౌతమి వాదించారు. -
చినిగిపోతున్న లోకేష్ రెడ్ బుక్.. AP పోలీసులకు హెచ్చరిక
-
లోకేష్ రెడ్ బుక్ పతనం స్టార్ట్
-
ఖాకీల అరాచకాలు, అప్రజాస్వామిక విధానాలపై హైకోర్టు కన్నెర్ర
-
ఆంధ్రప్రదేశ్లో పోలీసుల రెడ్బుక్ అరాచకాలకు హైకోర్టు రెడ్సిగ్నల్
-
రెడ్బుక్కు రెడ్ సిగ్నల్!
ముంపు సమస్యపై పోస్టు చేసినందుకు.. భారీ వర్షాలు కురవడంతో రాజమహేంద్రవరంలోని ప్రకాశ్ నగర్ కాలనీలో ముంపు సమస్యపై పులి సాగర్ అనే దళితుడు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతే.. పోలీసులు ఆయన్ను ఓ ఉగ్రవాది మాదిరిగా అరెస్టు చేసి ఈడ్చుకెళ్లారు! స్టేషన్కు తరలించి అర్ధనగ్నంగా నిలబెట్టి పచ్చి బూతులు తిడుతూ... కొడుతూ చిత్రహింసలకు గురి చేశారు. ముక్కలుగా కోసి రైలు పట్టాలపై పడేస్తామని, శవం కూడా దొరకదని బెదిరించారు. పులిసాగర్ను అర్ధ నగ్నంగా లాకప్లో ఉంచిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్రంగా స్పందించాయి. రాష్ట్రంలో చంద్రబాబు రెడ్బుక్ వేధింపులకు ఈ ఉదంతం ఓ నిదర్శనం! సాక్షి, అమరావతి: ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తూ.. హామీల ఎగవేతపై నిలదీస్తూ పోస్టులు పెడుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులను ప్రయోగించి చంద్రబాబు సర్కారు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుండటం... మేజిస్ట్రేట్లు వారిని యాంత్రికంగా రిమాండ్కు పంపుతుండటంపై హైకోర్టు తీవ్రంగా స్పందించి ఘాటు వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రెడ్బుక్ రాజ్యాంగానికి సెల్యూట్ చేస్తున్న పోలీసుల అరాచకాలకు హైకోర్టు చెక్ పెట్టిందని న్యాయకోవిదులు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు, వ్యాఖ్యలకు సంబంధించిన కేసుల్లో సంబంధిత దర్యాప్తు అధికారి... అర్నేష్కుమార్, ఇమ్రాన్ప్రతాప్ గాది కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించాలని హైకోర్టు స్పష్టం చేయడంతో, ఇన్నాళ్లూ రెడ్బుక్ రాజ్యాంగంతో చెలరేగిన పోలీసుల్లో వణుకు మొదలైందని వ్యాఖ్యానిస్తున్నారు. తద్వారా రెడ్బుక్ పాశవిక విధానాలను ఏమాత్రం ఉపేక్షించబోమని హైకోర్టు సంకేతాలిచ్చిందంటున్నారు. యాంత్రిక రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలవుతుండడంతో మేజిస్ట్రేట్లకు తాజాగా హైకోర్టు పరిపాలనా మార్గదర్శకాలను నిర్దేశించిన విషయం తెలిసిందే. తమ ఆదేశాలను మేజిస్ట్రేట్లందరూ పాటించి తీరాల్సిందేనని, దీన్ని ఉల్లంఘిస్తే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. భారత రాజ్యాంగాన్నిఅనుసరించి విధులు నిర్వహించాలి గానీ... లోకేశ్ విరచిత, చంద్రబాబు ప్రవచిత రెడ్బుక్ రాజ్యాంగాన్ని అనుసరిస్తే పోలీసులు ఇక తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేన్నది హైకోర్టు ఆదేశాలతో స్పష్టమైంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యథేచ్ఛగా సాగిస్తున్న ప్రభుత్వ స్పాన్సర్డ్... పోలీసు మార్కు వేధింపులకు హైకోర్టు ఆదేశాలతో అడ్డుకట్ట వేసినట్లైంది. ప్రధానంగా పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులతో వేధింపులు... దర్యాప్తు ముసుగులో చిత్రహింసలకు పాల్పడుతూ రాష్ట్రంలో అరాచకం సృష్టించడంపై జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో అక్రమ అరెస్టులు, నిబంధనలకు విరుద్ధంగా రిమాండ్లకు అడ్డుకట్ట వేస్తూ హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారాయి. హైకోర్టు అంత క్రియాశీలంగా వ్యవహరించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయకపోతే పరిస్థితి చేయిదాటిపోయేంతగా ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ దిగజారిందన్నది యావత్ దేశానికి అవగతమైంది. ప్రశ్నించే గొంతులపై దాష్టీకం చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ఏడాదిగా అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలను అమలు చేయని వైనం, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారిపై పోలీసు అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ప్రధానంగా సోషల్ మీడియా యాక్టివిస్ట్లను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులతో వేధింపులకు దిగింది. ఎంతగా అంటే.. అన్నదాతా సుఖీభవ పథకం ఎప్పుడు ఇస్తారు? అని అడిగితే కేసు...! నిరుద్యోగ భృతి ఇవ్వరా..? అని ప్రశి్నస్తే కేసు...! వీధిలో లైట్లు వెలగడం లేదంటే కేసు...! సూపర్ సిక్స్ పథకాలను ప్రస్తావిస్తే చాలు కేసు..!! ఇలా ఎడాపెడా అక్రమ కేసులతో విరుచుకుపడింది. సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల మేనిఫెస్టో అమలులో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అక్రమ కేసులతో బెదిరింపులకు దిగింది. ఏడాది వ్యవధిలో సోషల్ మీడియా కార్యకర్తలు ఏకంగా 822 మందికి నోటీసులు జారీ చేసింది. 253 అక్రమ కేసులు బనాయించి ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. 86 మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్లను అక్రమంగా అరెస్టు చేసింది. దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో కేసులు నమోదు చేయలేదు. హిట్లర్ దురాగతాలను గుర్తు చేసే రీతిలో చంద్రబాబు అణచివేతలకు పాల్పడ్డారు. అక్రమ కేసులు నమోదు చేయడమే కాకుండా దర్యాప్తు పేరిట వేధించారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా, నిబంధనలను పాటించకుండా బరితెగించి వ్యవహరించారు. వ్యవస్థీకృత నేరాల కింద కేసులు.. సోషల్ మీడియా పోస్టులపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే 41 ఏ కింద నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలి. కానీ ఆ నిబంధనలను పోలీసులు నిర్భీతిగా ఉల్లంఘించారు. ఏకంగా వ్యవస్థీకృత నేరాల కింద కేసు నమోదు చేయడం ప్రభుత్వ అరాచకాలకు నిదర్శనం. ఉగ్రవాదులు, స్మగ్లర్లపై నమోదు చేయాల్సిన కేసులను సోషల్ మీడియా యాక్టివిస్ట్లపై బనాయించి కర్కశంగా వ్యవహరించారు. రాత్రికి రాత్రి ఇళ్ల నుంచి లాక్కొచ్చి బలవంతంగా పోలీసు స్టేషన్లకు తరలించారు. మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా చిత్రహింసలకు గురి చేశారు. ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో పోలీస్ స్టేషన్కు తిప్పుతూ.. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ భౌతిక దాడులకు సైతం వెనుకాడలేదు! కొమ్ముకాస్తే.. కఠిన చర్యలు.. చంద్రబాబు ప్రభుత్వం పోలీసుల ద్వారా సాగిస్తున్న దమనకాండ, అరాచకాలకు హైకోర్టు అడ్డుకట్ట వేసింది. ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణలపై అక్రమ కేసులు నమోదుకు చెక్ పెట్టింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్లు, మీడియా ప్రతినిధులు, కళాకారుల భావ వ్యక్తీకరణ హక్కుకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే పోలీసుల పట్ల కఠిన చర్యలు చేపడతామని తేల్చి చెప్పింది. కేసుల దర్యాప్తు విషయంలో పాటించాల్సిన విధి విధానాలను పోలీసులకు గుర్తు చేసింది. ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో రిమాండ్లు విధించడానికి వీల్లేదని మెజిస్ట్రేట్లకు స్పష్టం చేసింది. ఇకపై అటువంటి కేసుల్లో నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అది కూడా.. సీఐ, ఎస్సై స్థాయి అధికారులు తమంతట తాముగా కేసులు నమోదు చేయకూడదని స్పష్టం చేసింది. అటువంటి కేసుల నమోదుకు ముందు అన్ని విషయాలను పరిశీలించి డీఎస్పీ అనుమతి ఇవ్వాలని పేర్కొంది. తద్వారా అక్రమ కేసులు నమోదు చేస్తే ఇకపై డీఎస్పీనే ప్రధానంగా బాధ్యుడవుతారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటామని తద్వారా న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఇక ఈ కేసుల దర్యాప్తు పేరిట పోలీసులు నెలల తరబడి కాలయాపన చేస్తూ నిందితులను వేధిస్తుండటాన్ని కూడా హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఒకవేళ అరెస్టు చేయాల్సి వస్తే అందుకు కారణాలను కచ్చితంగా చెప్పాలి. న్యాయస్థానాలు కూడా ఎడాపెడా రిమాండ్లు ఇవ్వడానికి వీల్లేదని హైకోర్టు నిర్దేశించింది. పోలీసులు ఆ కేసుల దర్యాప్తును 14 రోజుల్లో పూర్తి చేయాలని నిర్దిష్ట కాలపరిమితి విధించింది. తద్వారా సోషల్ మీడియా యాక్టివిస్ట్లు, మీడియా ప్రతినిధులు, సృజనాత్మక కళాకారులు, ఇతరుల భావ ప్రకటనా హక్కును హైకోర్టు పరిరక్షించింది. వాటికి విఘాతం కలిగించే పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. 50 రోజుల పాటు జైల్లో..ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులు పెద్దిరెడ్డి సుధారాణి, వెంకటరెడ్డి దంపతులపై కూటమి సర్కారు తప్పుడు కేసులు బనాయించింది. 50 రోజుల పాటు జైల్లో పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వారిపై పలు జిల్లాల్లో అక్రమ కేసులు నమోదు చేసింది. పోస్టు పెట్టారని భర్తపై దాడి... భార్య అరెస్టుప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన చిలకలూరిపేటకు చెందిన దంపతులు పాలేటి కృష్ణవేణి, రాజ్కుమార్పై పోలీసులు, టీడీపీ గూండాలు వేధింపులకు పాల్పడ్డారు. కృష్ణవేణిపై అక్రమ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ కార్యకర్తలు ఆమెపై దాడికి పాల్పడ్డారు. రాజ్కుమార్ను చితకబాది నారా లోకేశ్ చిత్రపటం వద్ద మోకాళ్లపై నిలబెట్టి బలవంతంగా క్షమాపణలు చెప్పించారు.పోస్టు పెడితే దాడులు.. కేసులు!సూపర్ సిక్స్పై పోస్టు పెట్టినందుకు..సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన కె.హనుమంతరెడ్డిని పోలీసులు కిడ్నాప్ చేసి మరీ చిత్రహింసలకు గురి చేశారు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం అరవీడుకు చెందిన ఆయన్ను రెండు రోజులపాటు అక్రమంగా నిర్బంధించారు. కనీసం కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదు. వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ భౌతిక దాడులకు పాల్పడ్డారు.దివ్యాంగుడిపై పోలీసుల ప్రతాపంటీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు నంద్యాల జిల్లా మహానందికి చెందిన తిరుమల కృష్ణపై పోలీసులు దాష్టీకానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి ఆయన ఇంటిపై దాడి చేసి అక్రమంగా నిర్బంధించారు. దివ్యాంగుడైన కృష్ణను వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధించారు. దాంతో ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.ఒక్కడిపై 21 అక్రమ కేసులు..టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయాలని డిమాండ్ చేసిన విశాఖకు చెందిన ఇంటూరి రవికిరణ్ను పోలీసులు అక్రమ కేసులతో తీవ్రంగా వేధించారు. ఆయనపై వివిధ జిల్లాల్లో ఏకంగా 21 అక్రమ కేసులు నమోదు చేయడం చంద్రబాబు ప్రభుత్వ రెడ్బుక్ వేధింపుల తీవ్రతకు నిదర్శనం. ఓ కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చినా మరో కేసులో అక్రమంగా అరెస్టు చేశారు. విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండగానే మరో 4 కేసులు బనాయించారు.2018లో పోస్టు.. ఇప్పుడు అక్రమ కేసుచంద్రబాబు సర్కారు అణచివేత విధానాలు, పాశవిక ధోరణి, మానవ హక్కుల ఉల్లంఘనకు తెనాలి పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసు ఓ మచ్చు తునక. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ రాజకీయ విధానాలను ప్రశ్నిస్తూ 2018లో పోస్టు పెట్టిన ఆళ్ల జగదీశ్ అనే రైతుపై 2024లో అక్రమ కేసు నమోదు చేశారు. ఆయన్ను అక్రమంగా అదుపులోకి తీసుకుని 2 రోజులపాటు గుర్తు తెలియని ప్రదేశంలో నిర్బంధించి వేధించారు.ఫొటో ఫార్వర్డ్ చేసినందుకు..ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఓ సోషల్ మీడియా పోస్టును వాట్సాప్ గ్రూప్లో ఫార్వర్డ్ చేశారని ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కావలికి చెందిన ప్రభావతి అనే మహిళతోపాటు 12 మందిపై కూటమి సర్కారు అక్రమ కేసు నమోదు చేసింది. నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు.పోసానిపై రెడ్బుక్ వేధింపులుప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళిని చంద్రబాబు ప్రభుత్వం వేధించిన తీరు అందరినీ నివ్వెరపరిచింది. ఆయనపై ఏకంగా 16 అక్రమ కేసులు నమోదు చేయడం సర్కారు అరాచకాలకు తార్కాణం. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్ను హైదరాబాద్లో బలవంతంగా అరెస్టు చేసి రాష్ట్రానికి తరలించి వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పతూ వేధించారు. ఆయన కనీసం తన మందులను తెచ్చుకునేందుకు కూడా అనుమతించ లేదు. అక్రమ అభియోగాలతో రిమాండ్కు తరలించారు. 24 రోజులు జైల్లో ఉన్న అనంతరం ఆయన బెయిల్పై విడుదల అయ్యారు.కొమ్మినేనిపై కక్ష సాధింపుప్రముఖ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుపై చంద్రబాబు ప్రభుత్వం రెడ్బుక్ కక్ష సాధింపులకు పాల్పడింది. సాక్షి టీవీలో ఓ చర్చా గోష్టిలో ఆయన ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకపోయినా అక్రమ కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. నిరాధార అభియోగాలతో రిమాండ్కు పంపించింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సాక్షి టీవీ, కొమ్మినేని శ్రీనివాసరావుపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఏపీ జడ్జిపై ట్రోలింగ్.. న్యాయ వ్యవస్థపై దాడే!
సాక్షి అమరావతి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ట్రోలింగ్ను న్యాయవ్యవస్థపై దాడిగా రాష్ట్ర న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) అభివర్ణించింది. జస్టిస్ శ్రీనివాసరెడ్డిపై ట్రోలింగ్ను, దూషణలను తీవ్రంగా ఖండించింది. దీనికి బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జస్టిస్ శ్రీనివాసరెడ్డిపై కొద్ది రోజులుగా ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో బార్ కౌన్సిల్ చైర్మన్ ఎన్. ద్వారకానాథరెడ్డి అధ్యక్షతన ఆదివారం అత్యవసర సమావేశం జరిగింది.కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు రామిరెడ్డి, ఇతర సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిల్ పలు తీర్మానాలు చేసింది. న్యాయమూర్తిగా నిష్పాక్షికంగా తీర్పులు వెలువరించిన జస్టిస్ శ్రీనివాసరెడ్డిపై సామాజిక మాధ్యమాలు, డిజిటల్ మాధ్యమాలు, ప్రజా వేదికల్లో ట్రోలింగ్ చేయటాన్ని, నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కౌన్సిల్ తన తీర్మానంలో పేర్కొంది. న్యాయమూర్తుల వ్యక్తిత్వ హననాన్ని సహించేది లేదని హెచ్చరించింది. ఇలాంటివి పునరావృతం అవుతున్న నేపథ్యంలో దీన్ని తీవ్రంగా పరిగణించి తక్షణమే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని తీర్మానించారు. చర్యలకు రిజిస్ట్రార్ నేతృత్వంలో యంత్రాంగం!న్యాయవ్యవస్థపై దూషణలు, ట్రోలింగ్పై చర్యలు తీసుకునేందుకు రిజిస్ట్రార్ నేతృత్వంలో ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని బార్ కౌన్సిల్ హైకోర్టును కోరింది. న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో దురుద్దేశపూర్వకంగా సాగించే దాడులు, దూషణలపై దర్యాపు చేసేందుకు డీజీపీ నేతృత్వంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. న్యాయమూర్తులపై ప్రస్తుతం, గతంలో జరిగిన వ్యక్తిత్వ హనన దాడుల ఘటనలపైనా దర్యాపు జరిపేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, సుప్రీంకోర్టు, హైకోర్టు ను బార్ కౌన్సిల్ కోరింది. కారకులపై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించాలని పేర్కొంది. న్యాయ వ్యవస్థ స్వతంత్రత విషయంలో రాజీ పడేదే లేదని, న్యాయమూర్తులు నిష్పాక్షికంగా రాజ్యాంగ విధులను నిర్వర్తించేందుకు రాష్ట్ర బార్ కౌన్సిల్ సదా మద్దతు అందించాలని సమావేశంలో తీర్మానించారు.న్యాయమూర్తిపై నిందలా!జస్టిస్ శ్రీనివాసరెడ్డిపై సోషల్ మీడియాలో టీడీపీ సైకోల ట్రోలింగ్దురుద్దేశాలు ఆపాదించే రీతిలో వర్ల రామయ్య వ్యాఖ్యలుటీడీపీ మూకల ట్రోలింగ్కు ఆ పార్టీ నేతల వత్తాసుచంద్రబాబు సర్కారు అండదండలతో టీడీపీ సైకో మూకలు ఏకంగా న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకోవడం విభ్రాంతి కలిగిస్తోంది. తమకు నచ్చకుంటే ఎంతటి వారిపైన అయినా బురద జల్లుతాం..! సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తాం.. ! మానసికంగా వేధిస్తామనే రీతిలో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు బరి తెగిస్తున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ సోషల్ మీడియా విభాగం కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తుండటమే ఇందుకు నిదర్శనం. టీడీపీ సోషల్ మీడియా విభాగమే కాదు.. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ పోలీస్ అధికారి కూడా అయిన వర్ల రామయ్య సైతం జస్టిస్ శ్రీనివాసరెడ్డికి దురుద్దేశాలు ఆపాదించే రీతిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.తద్వారా న్యాయమూర్తిపై ట్రోలింగ్ తమ అధికారిక విధానమని టీడీపీ పరోక్షంగా వెల్లడించినట్లైంది. స్వయంగా న్యాయమూర్తి కొనకంటి శ్రీనివాసరెడ్డే తనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని వెల్లడించడం రాష్ట్రంలో దిగజారిన పరిస్థితులకు అద్దం పడుతోంది. ఓ కేసులో నిందితులకు బెయిల్ మంజూరు సమయంలో ఆయన హైకోర్టులో నర్మగర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడం జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఏకంగా న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేయడంపై ఏపీ బార్ కౌన్సిల్ తీవ్రంగా స్పందించింది. టీడీపీ అధికారిక విధానమే..!ఎంతటివారిపైన అయినా సరే దుష్ప్రచారం చేయటాన్ని టీడీపీ అధికారిక విధానంగా చంద్రబాబు ఏనాడో మార్చేశారు. 1995లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి తాను అడ్డదారిలో పీఠాన్ని అధిష్టించే వరకు అదే దుష్ప్రచార కుతంత్రాన్నే అస్త్రంగా చేసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో టీడీపీ దుష్ప్రచార కుతంత్రం వెర్రి తలలు వేస్తోంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డిని సైతం ఉపేక్షించకపోవడం టీడీపీ మార్కు కుట్రకు నిదర్శనం. కొద్ది రోజులుగా టీడీపీ కార్యకర్తలు ఆయన్ను లక్ష్యంగా చేసుకుని అత్యంత అవమానకర రీతిలో ట్రోలింగ్కు తెగబడుతున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల పల్నాడు జిల్లా పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి అనుమతి లేని ఓ ప్రైవేటు వాహనం ఢీకొని మృతి చెందారు.ఆ విషయాన్ని గుంటూరు ఎస్పీ సతీశ్ సైతం అధికారికంగా వెల్లడించారు. కానీ ప్రభుత్వ పెద్దలు కుట్రపూరితంగా ఆ ఉదంతాన్ని వక్రీకరిస్తూ అక్రమ కేసు నమోదు చేయించారు. వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద పడే సింగయ్య మృతి చెందారంటూ ఓ ఫేక్ వీడియోను వైరల్ చేశారు. అనంతరం ఆ వాహన డ్రైవర్గా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ రమణారెడ్డితోపాటు వాహనంలో ప్రయాణిస్తున్న వైఎస్ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజని తదితరులను నిందితులుగా చేరుస్తూ అక్రమ కేసు నమోదు చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. అసలు కారులో ప్రయాణిస్తున్నవారిపై కేసు ఎలా నమోదు చేస్తారు...? ఏ చట్టంలో అటువంటి నిబంధన ఉందని న్యాయస్థానం సూటిగా ప్రశ్నించింది.ఆ కేసులో తదుపరి చర్యలను నిలిపివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి టీడీపీ సోషల్మీడియా ఆయన్ను లక్ష్యంగా చేసుకుంది. ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తోంది. ఈ క్రమంలో కల్తీ నెయ్యి కేసులో చాలా నెలలుగా జైలులో ఉన్న నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ శ్రీనివాసరెడ్డి తనపై ట్రోలింగ్ అంశాన్ని ప్రస్తావించారు. తాను ఇచ్చిన తీర్పు సోషల్ మీడియా ట్రోలర్లకు ఓ అంశం అవుతుందని వ్యాఖ్యానించారు. అంటే న్యాయమూర్తులను కూడా టీడీపీ సోషల్ మీడియా ఉపేక్షించడం లేదన్నది స్పష్టమవుతోంది. -
బాబుకు హైకోర్టు షాక్.. మీ ఇష్టమొచ్చినట్టు అరెస్టులు చేస్తే కుదరదు
-
సోషల్ మీడియా అరెస్ట్ లపై జడ్జిలకు హైకోర్టు సంచలన ఆదేశాలు
-
ఆర్డర్.. ఆర్డర్ 'రిమాండ్లకీ రూల్సున్నాయ్'!
సాక్షి, అమరావతి: ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో నిందితులకు ఆయా కోర్టుల మేజిస్ట్రేట్లు యాంత్రికంగా రిమాండ్ విధిస్తున్న సంఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో హైకోర్టు స్పందించింది. యాంత్రిక రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రతి రోజూ పిటిషన్లు దాఖలవుతుండడంతో మేజిస్ట్రేస్టేట్లకు పరిపాలనాపరంగా మార్గదర్శకాలను నిర్దేశించింది. ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలతో ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది. ఏడేళ్ల కన్నా తక్కువ శిక్షపడే నేరాల్లో ఎలాపడితే అలా రిమాండ్ ఇవ్వడానికి వీల్లేదని.. అర్నేష్కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్దేశాలను తు.చ. తప్పక అనుసరించాలని తేల్చిచెప్పింది. అలాగే, ఇమ్రాన్ప్రతాప్ గాది వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. ⇒ రిమాండ్ విధించేటప్పుడు మార్గదర్శకాలు పాటించాలని.. పోలీసులు చట్టప్రకారం నడుచుకున్నారా? లేదా..? చూడాలని, చాలా కేసుల్లో సుప్రీం నిర్దేశించిన సూత్రాలను పాటించకుండా రిమాండ్ విధిస్తుండడంతో అనవసరమైన అరెస్టులు, శిక్షా నిబంధనల దుర్వినియోగానికి దారితీస్తోందని పేర్కొంది. ⇒ ప్రసంగాలు, రచనలు, కళల వ్యక్తీకరణలకు సంబంధించి (3–7 ఏళ్లు శిక్షపడే నేరాలు) పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసేముందు డీఎస్పీ ఆమోదంతో.. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 173(3) కింద ప్రాథమిక విచారణ జరపాలని, 14 రోజుల్లో దానిని ముగించాలని ఇమ్రాన్ప్రతాప్ గాది కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్నదని... దీనిప్రకారం రాష్ట్రంలోని మేజిస్ట్రేస్టేట్లందరూ రిమాండ్ విధించే ముందు ముఖ్యంగా సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు అధికారి... అర్నేష్కుమార్, ఇమ్రాన్ప్రతాప్ గాది కేసుల్లో సుప్రీం ఇచ్చిన ఆదేశాలను పాటించారా? లేదా? అన్నది చూడాలని హైకోర్టు తేల్చిచెప్పింది. ⇒ నిందితులు పదేపదే నేరాలు చేస్తున్నారా? రిమాండ్ ఇవ్వకుంటే సాక్షులను ప్రభావితం చేసి, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని.. అందుకని పోలీసు కస్టోడియల్ విచారణ అవసరమని మేజిస్ట్రేస్టేట్లు సంతృప్తి చెందాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను మేజిస్ట్రేస్టేట్లందరూ పాటించి తీరాల్సిందేనని ఆదేశించింది. ఉల్లంఘిస్తే తీవ్ర పర్యవసానాలతో పాటు శాఖాపరమైన విచారణతో పాటు కోర్టు ధిక్కార చర్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని మేజిస్ట్రేస్టేట్లకు హెచ్చరించింది. ఈ మేరకు హైకోర్టు శనివారం సర్క్యులర్ జారీ చేసింది.చంద్రబాబు సర్కారుకు ఝలక్..! పోలీసు రాజ్యానికి చెక్!ఏడాది కాలంగా తీవ్ర నిర్బంధంతో... తాలిబాన్ల మాదిరిగా పాలన సాగిస్తున్న చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి హైకోర్టు తాజా మార్గదర్శకాలు చెంపపెట్టులాంటివే. రెడ్బుక్ రాజ్యాంగంతో.. ఎలాంటి నిబంధనలు పాటించకుండా, లెక్కలేనితనంతో చెలరేగుతున్న పోలీసుల తీరుకు అడ్డుకట్ట పడనుంది. కక్షసాధింపు చర్యలకు దిగుతూ ఎడాపెడా అరెస్టులకు పాల్పడుతున్న ఖాకీలకు చెంపపెట్టు అని పరిశీలకులు పేర్కొంటున్నారు. హైకోర్టు తాజా మార్గదర్శకాలతో ఇకపై అడ్డగోలు అరెస్టులు, నిబంధనలకు విరుద్ధంగా రిమాండ్లు కుదరదని వివరిస్తున్నారు.⇒ కూటమి సర్కారు వచ్చాక తమ పనితీరును, వారి నేతలను విమర్శిస్తూ సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలు పెట్టినవారిపై.. మరీ ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, నాయకులపై అడ్డగోలుగా కేసు నమోదు చేస్తోంది. వ్యంగ్య ప్రదర్శన ఇచ్చినా సహించలేక కేసులు పెట్టింది. సోషల్మీడియా పోస్టులను అత్యంత కఠినమైన వ్యవస్థీకృత నేరం పరిధిలోకి తీసుకొచ్చింది. పెద్దసంఖ్యలో అరెస్ట్లు చేసి జైలుకు కూడా పంపింది. బెయిల్ రాకుండా చేసేందుకు ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అయితే, హైకోర్టు పలు సందర్భాల్లో సోషల్ మీడియా పోస్టులకు వ్యవస్థీకృత నేరం కింద ఎలా కేసు పెడతారంటూ నిలదీసింది. అవి ఆ నేరం కిందకు రావని సైతం తెలిపింది. అయినా కూడా పోలీసులు వ్యవస్థీకృత నేరం కింద కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు. ⇒ ఇక సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ల ఎదుట ప్రవేశపెట్టగా చాలామంది యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు ఇచ్చారు. ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో కూడా సహేతుక కారణాలను వెల్లడించకుండానే రిమాండ్ ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో పలువురు నిందితులు తమ రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. మొన్నటిదాక కూడా రిమాండ్ ఉత్తర్వులపై ప్రతి రోజూ పిటిషన్లు దాఖలవుతూనే వచ్చాయి.హైకోర్టు ఎన్ని వ్యాఖ్యలు చేసినా పట్టించుకోని మేజిస్ట్రేట్లుఈ వ్యాజ్యాల విచారణ సందర్భంగా హైకోర్టులోని పలువురు న్యాయమూర్తులు.. మేజిస్ట్రేట్ల తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. యాంత్రికంగా రిమాండ్ విధించడం సరికాదని హితవు పలికారు. కొన్ని సందర్భాల్లో ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అర్నేష్కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించి తీరాలని చెప్పినా ప్రయోజనం లేకపోయింది. అయినా, యాంత్రికంగా, సహేతుక కారణాలను తెలియజేయకుండా రిమాండ్లు విధించడం కొనసాగిస్తూ వచ్చారు. దీంతో హైకోర్టు చివరకు మేజిస్ట్రేట్లకు పరిపాలనా పరమైన ఉత్తర్వులు ఇవ్వక తప్పలేదు. ఈ క్రమంలో అర్నేష్కుమార్, ఇమ్రాన్ ప్రతాప్ గాది కేసుల్లో సుప్రీం ఇచ్చిన ఆదేశాలను అమలు చేసి తీరాల్సిందేనని, లేదంటే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని మేజిస్ట్రేట్లకు తేల్చి చెప్పింది.ఇదీ అర్నేష్కుమార్ కేసు...బిహార్ కు చెందిన అర్నేష్ కుమార్ కట్నం కోసం వేధిస్తున్నట్లు అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఐపీసీ సెక్షన్ 498ఎ, వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 4 కింద కేసులు నమోదు చేశారు. అర్నేష్ ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం అరెస్టుల విషయంలో కీలక మార్గదర్శకాలు జారీ చేసి వాటిని పాటించాల్సిందేనని కింది కోర్టులు, పోలీసులను ఆదేశించింది. 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన ముఖ్యమైన తీర్పు ఇది. అందులోని మార్గదర్శకాలు..1. సాధారణంగా ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష విధించే నేరాల్లో నిందితులను అరెస్ట్ చేయకూడదు. ఒకవేళ అరెస్టు చేయాలనుకుంటే.. ముందుగా నిందితుడికి వారిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలి. అలాగే వారి హక్కుల గురించి వివరించాలి.2. అరెస్టు చేయడానికి కారణాలను తప్పకుండా రికార్డు చేయాలి.3. పోలీసులు కేసు దర్యాప్తు చేసేటప్పుడు ఈ మార్గదర్శకాలను పాటించాలి.4. న్యాయమూర్తులు కూడా ఈ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకొని, అవసరమైతే ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి. -
సోషల్ మీడియా అరెస్టులు.. ఏపీ జడ్జిలకు హైకోర్టు సంచలన ఆదేశాలు
ఏపీలో అడ్డగోలుగా జరుగుతున్న సోషల్ మీడియా అరెస్టులలో జరుగుతున్న ఉల్లంఘనలపై ఉన్నత న్యాయస్థానం కన్నెర్ర జేసింది. ఈ తరహా అరెస్టులు, రిమాండ్లను కట్టడి చేసే దిశగా అడుగులేసింది. ఒకవైపు ఏపీ జడ్జిలకు స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేస్తూనే.. ఇంకోవైపు హెచ్చరికలూ జారీ చేసింది. సాక్షి, విజయవాడ: ఏపీలో సోషల్ మీడియా అరెస్టులు, రిమాండ్ల విధింపు విషయంలో జరుగుతున్న అడ్డగోలు ఉల్లంఘనలపై ఉన్నత న్యాయస్థానం కన్నెర్ర జేసింది. ఈ క్రమంలోనే ఏపీ జడ్జిలకు సంచలన ఆదేశాలు జారీ చేసింది. రిమాండ్ విధింపు విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేస్తూనే.. ఇంకోవైపు హెచ్చరికలూ జారీ చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు చేశారనే అభియోగాలతో ఈ ఏడాది కాలంలో ఏపీలో లెక్కలేనని అరెస్టులు జరిగాయి. అయితే.. ఇలాంటి కేసుల్లో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను చాలావరకు జడ్జిలు పాటించడం లేదని ఉన్నత న్యాయస్థానం గుర్తించింది. ఈ క్రమంలో న్యాయమూర్తులకు హైకోర్టు రిజిస్ట్రార్ తరఫున తాజాగా ప్రత్యేక సర్క్యులర్ జారీ చేయించింది. ‘‘సుప్రీం కోర్టు నిర్దేశించిన సూత్రాలను పాటించకుండా కొందరు జడ్జిలు రిమాండ్లు విధిస్తున్నారు. అనేక కేసుల్లో సుప్రీంకోర్టు నిర్దేశించిన సూత్రాలు పాటించడం లేదని మా దృష్టికి వచ్చింది. ఇది అనవసరమైన అరెస్టులు, శిక్షా నిబంధనల దుర్వినియోగానికి దారితీస్తోంది. రిమాండ్ విధించేటప్పుడు తప్పనిసరిగా సుప్రీం గైడ్లైన్స్ పాటించాలి. ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలి. ఇమ్రాన్ ప్రతాప్ గాంధీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు చెప్పినట్లు.. ప్రాథమిక విచారణ లేకుండా ప్రసంగాలు, రచనల, కళాత్మక వ్యక్తీకరణపై ఎఫ్ఐఆర్లు పెట్టకూడదు. డీఎస్పీ ఆమోదించాకే విచారించాలి. రిమాండ్కు ఆదేశించే ముందు పోలీసులు చట్టాన్ని పాటించారా? లేదా? పరిశీలించాలి. మొత్తం 14 రోజుల్లోనే విచారణ పూర్తిచేయాలి.. అని తాజా సర్క్యులర్లో హైకోర్టు పేర్కొంది. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లు ఖచ్చితంగా ఈ సర్క్యులర్ అమలు చేయాలని, ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని, కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాల్సి ఉంటుందని, సదరు మెజిస్ట్రేట్లు శాఖాపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. మరోవైపు.. ఇంతకు ముందు ఈ తరహా అరెస్టుల విషయంలో పోలీసుల తీరుపైనా ఉన్నత న్యాయస్థానం అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
కాకాణిపై పీటీ వారెంట్.. హైకోర్టు షాక్
-
ఇది చాలా దురదృష్టకరం
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్రెడ్డికి సహేతుక కారణాలు చెప్పకుండానే రిమాండ్ విధించడం, పీటీ వారెంట్లు జారీ చేస్తుండటంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ‘ఏం చేస్తాం.. మేజిస్ట్రేట్ల తీరు అలాగే ఉంది. ఇది చాలా దురదృష్టకరం (సారీ స్టేట్ ఆఫ్ ఎఫైర్స్)’ అని హైకోర్టు ఒకింత ఘాటుగా వ్యాఖ్యానించింది. పలు అభ్యర్థనలతో కాకాణి దాఖలు చేసిన మూడు వ్యాజ్యాల్లో హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడు పిటిషన్లు దాఖలు చేసిన కాకాణి అక్రమ మైనింగ్ ఆరోపణలపై నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ కేసులో తన బెయిల్ పిటిషన్ను కొట్టేస్తూ నెల్లూరు కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కాకాణి గోవర్ధన్రెడ్డి హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. అలాగే మట్టి తవ్వకాలకు సంబంధించి నెల్లూరు జిల్లా వి.సత్రం పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు పీటీ వారెంట్ జారీ చేస్తూ నెల్లూరు కోర్టు గత నెల 10న జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ కాకాణి మరో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాక టీడీపీ సీనియర్ నేత, సర్వేపల్లి ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఫొటోలను మారి్ఫంగ్ చేశారంటూ సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు కోర్టు తనకు పీటీ వారెంట్ జారీ చేయడాన్ని సవాలు చేస్తూ గోవర్ధన్రెడ్డి ఇంకో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మూడు వ్యాజ్యాలు గురువారం జస్టిస్ శ్రీనివాసరెడ్డి ముందు విచారణకు వచ్చాయి. ఏడేళ్లకన్నా తక్కువ శిక్ష పడే సెక్షన్లున్నా కూడా 41ఏ వర్తిందన్నారు ఈ సందర్భంగా కాకాణి తరఫున సీనియర్ న్యాయవాది ఒ.మనోహర్రెడ్డి వాదనలు వినిపించారు. మట్టి తవ్వకాలకు సంబంధించి కాకాణిపై నమోదైన సెక్షన్లన్నీ ఏడేళ్లకన్నా తక్కువ శిక్ష పడేవేన్నారు. అయినా కూడా మేజిస్ట్రేట్ సెక్షన్ 41ఏ వర్తించదన్నారని తెలిపారు. అంతేకాక సహేతుక కారణాలు తెలియచేయకుండానే పీటీ వారెంట్ జారీ చేశారన్నారు. మేజిస్ట్రేట్ యాంత్రికంగా వ్యవహరించారని తెలిపారు. ఇది ఎంత మాత్రం సరికాదన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. మేజిస్ట్రేట్ల తీరుపై వ్యాఖ్యానించారు. అంతకు ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. మైనింగ్ కేసులో కాకాణిని మరోసారి తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, దీనిపై కోర్టు విచారణ జరపనుందని తెలిపారు. అందువల్ల కాకాణి దాఖలు చేసిన అప్పీల్పై విచారణను వాయిదా వేయాలని పలుమార్లు అభ్యరి్థంచారు. దీంతో కాకాణి గోవర్ధన్రెడ్డి దాఖలు చేసిన మూడు వ్యాజ్యాల్లో విచారణను మంగళవారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. -
హైకోర్టు జడ్జిగా తుహిన్ కుమార్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి పదవికి ప్రముఖ న్యాయవాది గేదెల తుహిన్ కుమార్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని న్యాయమూర్తుల కొలీజియం ఈ మేరకు తీర్మానించింది. తుహిన్ కుమార్ పేరుకు కేంద్రం ఆమోదం తెలిపాక అది ప్రధానమంత్రి కార్యాలయానికి, అక్కడి నుంచి రాష్ట్రపతికి చేరుతుంది. రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తరువాత తుహిన్ కుమార్ నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేస్తుంది. రాష్ట్ర హైకోర్టులో ప్రస్తుతం అదనపు న్యాయమూర్తులతో కలుపుకుని మొత్తం 28 మంది న్యాయమూర్తులు ఉన్నారు. తుహిన్ నియామకంతో ఆ సంఖ్య 29కి చేరుకుంటుంది. హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37. తుహిన్ నియామకం పూర్తయితే 8 ఖాళీలు ఉంటాయి. త్వరలో ఇద్దరు ముగ్గురి పేర్లను హైకోర్టు కొలీజియం న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేసే అవకాశం ఉంది. హైకోర్టు న్యాయమూర్తి పోస్టుకు తుహిన్ పేరును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం గత ఏడాది సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం హైకోర్టు కొలీజియం సిఫారసుకు ఆమోదముద్ర వేసింది. తుహిన్ నేపథ్యం ఇది.. తుహిన్ కుమార్.. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కత్తులకవిటి గ్రామానికి చెందినవారు. తల్లిదండ్రులు సరోజిని నాయుడు, కృష్ణమూర్తి నాయుడు. తుహిన్ కుమార్ పాఠశాల విద్యాభ్యాసం విశాఖపట్నంలో జరిగింది. కృష్ణా కాలేజీలో ఇంటర్మీడియెట్, విశాఖపట్నం ఎన్బీఎం న్యాయ కళాశాల నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1994లో హైకోర్టు న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2000–2004 మధ్య హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాది (ఏజీపీ)గా పనిచేశారు. 2010–14 మధ్య కాలంలో గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ తరఫున హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్గా వ్యవహరించారు. 2016–17లో హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. -
పులివెందుల పోలీసులకు చుక్కెదురు
పులివెందుల: వైఎస్సార్ జిల్లా కడపలో ఇటీవల జరిగిన మహానాడు సందర్భంగా టీడీపీ నాయకులు పులివెందుల రింగ్ రోడ్డులో ఉన్న వైఎస్సార్ విగ్రహాల చుట్టూ టీడీపీ పచ్చ తోరణాలు, జెండాలు కట్టిన విషయంపై తలెత్తిన వివాదంలో వైఎస్సార్సీపీ నేతలపై అక్రమంగా బనాయించిన కేసుల విషయంలో పులివెందుల పోలీసులకు హైకోర్టులో చుక్కెదురైంది. వివరాలివీ..అప్పట్లో వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ జెండాలు, తోరణాలు కట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ నేతలు వాటిని తొలగించాలని కోరుతూ పులివెందుల మున్సిపల్ కమిషనర్తోపాటు, డీఎస్పీకి వినతిపత్రాలు సమర్పించారు. వీరు స్పందించకపోవడంతో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నేతలు వాటిని తొలగించారు. దీన్ని సాకుగా చూపి హోంమంత్రి ద్వారా పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బీటెక్ రవి ఆదేశాలతో ఓ టీడీపీ నాయకుడితో వారిపై ఫిర్యాదు చేయించారు. దీంతో.. టీడీపీ నేతపై దాడిచేసినట్లు వైఎస్సార్సీపీ వారిపై అక్రమంగా హత్యాయత్నం కేసు బనాయించారు.పోలీసులు వారిని అరెస్టు చేయడంతోపాటు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. దీంతో.. పోలీసులు తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వైఎస్సార్సీపీ నాయకులు జమ్మలమడుగు మేజిస్ట్రేట్కు తెలిపారు. వారికి మెడికల్ టెస్టులు నిర్వహించాలని మేజిస్ట్రేట్ ఆదేశించగా.. వారిని పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పోలీసులతోపాటు టీడీపీ నాయకులు డాక్టర్లపై ఒత్తిడి తెచ్చి దెబ్బలులేనట్లుగా రిపోర్టులు ఇప్పించారు. దీనిపై నిందితులు మళ్లీ హైకోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీవ్రంగా స్పందించి వారికి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో మెడికల్ టెస్టులు నిర్వహించాలని, నివేదిక తమకు సమర్పించాలని ఆదేశించింది.పులివెందుల పోలీసుల ఓవరాక్షన్..ఇక ఈ మెడికల్ టెస్టుల్లో తమకు వ్యతిరేకంగా నివేదిక వస్తుందనే అనుమానంతో పులివెందుల డీఎస్పీ మురళీనాయక్, అర్బన్ సీఐ చాంద్ బాషా, రూరల్ సీఐ వెంకటరమణ కర్నూలులో మకాంవేసి అధికార పార్టీ నేతల ద్వారా డాక్టర్లపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అంతేకాక.. కర్నూలు డీఎస్పీ కూడా కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని రిపోర్టులను తారుమారు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పైగా.. కర్నూలు సూపరింటెండెంట్తో పాటు వీరంతా కలిసి ఉన్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి.ఈ వీడియోలో మీడియా కంటపడకుండా సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తన ముఖం చాటేయడం కనిపించింది. వీటి ఆధారంగా పిటిషనర్లు మళ్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాక.. తమకు తగిలిన గాయాలను ప్రైవేట్ ఆసుపత్రిలో ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా గాయాలున్నట్లు తేలిన నివేదికను కోర్టుకు సమర్పించారు. దీంతో.. హైకోర్టు ఈ వారంలోగా వారికి తిరుపతి స్విమ్స్ కేంద్రంగా మళ్లీ మెడికల్ టెస్టులు నిర్వహించాలని పులివెందుల అర్బన్ సీఐ చాంద్ బాషాను ఈనెల 1న ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను గురువారం ఆయనకు అందజేశారు. -
లడ్డూ నెయ్యి కేసులో ప్రధాన నిందితులకు బెయిల్
న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి ఇటీవల పలు కీలక కేసుల్లో చట్ట నిబంధనలకు అనుగుణంగా తీర్పులు, ఉత్తర్వులు ఇచ్చారు. ఇవి ప్రభుత్వ పెద్దలకు నచ్చకపోవడంతో వారి అండతో ట్రోలర్లు గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతున్నారు. జస్టిస్ శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, పలు దురుద్దేశాలను ఆపాదిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రోలర్ల గురించి జస్టిస్ శ్రీనివాసరెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తానిచ్చిన ఈ తీర్పు ట్రోలర్లకు ఓ మంచి అంశమవుతుందంటూ చురకలంటించారు. సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారంటూ నమోదైన కేసులో ప్రధాన నిందితులైన వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్కాంత్ చావడా, బోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్లకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు షరతులు విధించింది. రూ.25 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని వారిని ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని స్పష్టం చేసింది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి గురువారం తీర్పు వెలువరించారు. లడ్డూ కల్తీ నెయ్యి సరఫరా విషయంలో సీబీఐ సిట్ నమోదు చేసిన కేసులో తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.ఈ వ్యాజ్యాలపై వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి ఇటీవల తీర్పు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన గురువారం తీర్పు వెలువరించారు. పిటిషనర్లు నాలుగున్నర నెలలకు పైగా జైల్లో ఉన్నారని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. ఇప్పటికే దర్యాప్తు మొత్తం పూర్తయిందని, కోర్టులో చార్జిషీట్ కూడా దాఖలు చేశారన్నారు. ఈ నేపథ్యంలో తదుపరి వారిని జైల్లో ఉంచాల్సిన అవసరం లేదని తెలిపారు. పిటిషనర్లు దర్యాప్తునకు సహకరించారని పేర్కొన్నారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు దర్యాప్తు సంస్థ ముందు హాజరయ్యారని, అడిగిన డాక్యుమెంట్లన్నీ కూడా అందచేశారని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. పిటిషనర్లు సాక్షులను బెదిరించారన్న సీబీఐ ఆరోపణలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. సీబీఐవి కేవలం నిందారోపణలే తప్ప, అందుకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు.నా ఈ తీర్పు ట్రోలర్లకు మంచి అవకాశం..ఈ తీర్పు వెలువరించిన అనంతరం న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి సామాజిక మాధ్యమాల ట్రోలర్ల గురించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తానిచ్చిన ఈ తీర్పు ట్రోలర్లకు ఓ మంచి అంశమవుతుందని వ్యాఖ్యానించారు. ఇటీవల ఆయన పలు కీలక కేసుల్లో చట్ట నిబంధనలకు అనుగుణంగా తీర్పులు, ఉత్తర్వులు ఇచ్చారు. ఇవి ప్రభుత్వ పెద్దలకు నచ్చకపోవడంతో వారి అండతో ట్రోలర్లు గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతున్నారు. జస్టిస్ శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, పలు దురుద్దేశాలను ఆపాదిస్తూ ట్రోల్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సింగయ్య మృతి వ్యవహారంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తదితరులపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ జస్టిస్ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఉత్తర్వులను టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఇది కూడా జస్టిస్ శ్రీనివాసరెడ్డిని ట్రోల్ చేసేందుకు కూటమి మద్దతు ట్రోలర్లకు అవకాశంగా మారింది. -
రోప్పార్టీలపై ఎందుకీ దాగుడు మూతలు?
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనకు సంబంధించిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో ఇవాళ(గురువారం, జులై 3న) విచారణ జరిగింది. పిటిషనర్ తరఫున మాజీ ఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు. హెలిప్యాడ్ కోసం సూచించిన స్థలం మనుషులు సంచరించడానికి వీల్లేకుండా ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారాయన. ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ నెల్లూరు హెలిపాడ్ అనుమతి పిటిషన్పై గురువారం విచారణ జరిగింది. ‘‘హెలిప్యాడ్కు అనుమతి ఇవ్వడంలేదని కోర్టులో పిటిషన్ వేసిన వెంటనే.. హడావిడిగా ఒక ప్రాంతాన్ని ఎంపికచేశారు. ఇదే హెలిపాడ్ అంటున్నారు. ఆ స్థలంలో తుప్పలు, డొంకలు ఉన్నాయి. మనుషులుకూడా నడవడానికి వీల్లేకుండా ఉంది. హెలిపాడ్ కోసం ఆ స్థలాన్ని సిద్ధం చేయాలంటే మూడు నుంచి నాలుగు రోజుల సమయం పట్టేలా ఉంది...మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి.. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి విషయంలో కేంద్ర ప్రభుత్వపు మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదు. ఆ మార్గదర్శకాల ప్రకారం.. జడ్ ప్లస్ భద్రత ఉన్న వ్యక్తులకు రోప్పార్టీలు ఇవ్వాలి కదా?పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నప్పుడు మేనేజ్ చేయడానికి రోప్ పార్టీలు అత్యంత అవసరం. జగన్లాంటి వ్యక్తికి సేఫ్ ల్యాండింగ్, సేఫ్ ట్రావెల్, సేఫ్ మూవ్ అనేది కల్పించాలి కదా. రోప్పార్టీలు ఇవ్వడానికి ప్రభుత్వ ఎందుకు దాగుడుమూతలు ఆడుతుందో అర్థం కావడంలేదు’’ అని లాయర్ శ్రీరాం వాదించారు. పై విషయాలన్నింటికీ ప్రభుత్వం నుంచి సమాధానాలు రావడం లేదు. పైగా వైఎస్ జగన్ భద్రత గురించి వేసిన 2 పిటిషన్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదిస్తూ.. జడ్ ప్లస్ కింద ఇవ్వాల్సిన భద్రత ఇస్తున్నామంటూ చెప్పారు. అలాంటప్పుడు రోప్ పార్టీలు లేవు కదా? అని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రీరాం మరోసారి ప్రశ్నించారు. దీంతో.. ఈ పిటిషన్పై వాదనలకు మరింత సమయం కావాలని ఏజీ కోరడంతో.. కోర్టు వచ్చే బుధవారానికి(జులై 9) విచారణ వాయిదా వేసింది. -
ట్రోలింగ్స్.. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: టీటీడీ నెయ్యి కేసు విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు రోజులు క్రితం సింగయ్య కేసులో వైఎస్ జగన్మోహన్రెడ్డి పిటిషన్ను అనుమతించిన వ్యవహారంపై సోషల్ మీడియాలో న్యాయమూర్తి శ్రీనివాస్రెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘నన్ను గత రెండు రోజులు నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్’’ అంటూ న్యాయమూర్తి శ్రీనివాస్రెడ్డి వ్యాఖ్యానించారుఇప్పుడు నెయ్యి కేసులో నిందితులకు బెయిల్ ఉత్తర్వులు కూడా ట్రోల్స్కు బాగా పనికొస్తాయంటూ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్థన్రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బెయిల్ కేసులు వచ్చే మంగళవారానికి వాయిదా వేసిన న్యాయమూర్తి.. తన ముందున్న బెయిల్ పిటిషన్లను వచ్చే వారం వేరే బెంచ్ ముందు ఉండేలా చూసుకోవాలన్నారు. -
కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుడు వాదనను ఎండగట్టిన హైకోర్టు
-
బాబు సర్కారు కుట్రలకు చెంపదెబ్బ!
ఇదో అసాధారణ కేసు.. సాధారణంగా ఎఫ్ఐఆర్ దశలో మేం జోక్యం చేసుకోం.. కానీ ఇది న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సినంత అరుదైన కేసు.. మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులు కేవలం కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మాత్రమే. సెక్షన్ 105 కింద కేసు పెట్టాలంటే ఓ వ్యక్తిని చంపాలన్న ఉద్దేశం, తమ చర్యల వల్ల ఆ వ్యక్తి చనిపోతారని స్పష్టంగా తెలిసి ఉండటం తప్పనిసరి. అయితే ఫిర్యాదును, అందులో ఇతర అంశాలను పరిశీలిస్తే.. జగన్ తదితరులకు సింగయ్యను చంపాలన్న ఉద్దేశం గానీ, తమ చర్యల వల్ల ఆయన చనిపోతారని తెలిసి ఉండటం గానీ జరగలేదు.– సింగయ్య మృతి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య మృతి ఘటనను రాజకీయం చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వానికి గట్టి చెంపపెట్టు లాంటి ఉత్తర్వులను హైకోర్టు ఇచ్చింది. సింగయ్యను ఉద్దేశపూర్వకంగానే కారు కింద పడేసి తొక్కించారంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుడు వాదనను హైకోర్టు ఎండగట్టింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులపై బీఎన్ఎస్లోని కఠిన సెక్షన్ 105 కింద కేసు పెట్టడాన్ని తప్పుబట్టింది. జీవిత ఖైదు పడే ఈ సెక్షన్ కింద జగన్ తదితరులపై ఉద్దేశపూర్వకంగా కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసును తీవ్రంగా ఆక్షేపించింది. సెక్షన్ 105 కింద కేసు పెట్టేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. సాధారణంగా ఏ కేసులో కూడా ఎఫ్ఐఆర్ దశలో తాము జోక్యం చేసుకోమని, అయితే ఇది జోక్యం చేసుకోవాల్సినంత అరుదైన కేసని, అందుకే తాము జోక్యం చేసుకుంటున్నామని ప్రకటించింది. మాజీ సీఎం వైఎస్ జగన్తోపాటు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని, జగన్ పీఏ నాగేశ్వరరెడ్డిలపై పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 105 (కల్పబుల్ హోమిసైడ్– ఓ వ్యక్తి మరణానికి కారణమైనప్పటికీ హత్య కానిది) కింద కేసు నమోదు చేయడంపై హైకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. జగన్ తదితరులు కేవలం కారులో ప్రయాణిçÜ్తున్న ప్రయాణికులు మాత్రమేనని స్పష్టం చేసింది. సెక్షన్ 105 కింద కేసు పెట్టాలంటే ఓ వ్యక్తిని చంపాలన్న ఉద్దేశం, తమ చర్యల వల్ల ఆ వ్యక్తి చనిపోతారని స్పష్టంగా తెలిసి ఉండటం తప్పనిసరి అని, అప్పుడు మాత్రమే ఆ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం సాధ్యమవుతుందని తెలిపింది. అయితే ఫిర్యాదును, అందులో ఇతర అంశాలను పరిశీలిస్తే, జగన్ తదితరులకు సింగయ్యను చంపాలన్న ఉద్దేశం గానీ, తమ చర్యల వల్ల ఆయన చనిపోతారని తెలిసి ఉండటం గానీ జరగలేదంది. సాధారణంగా తాము ఏ కేసులో కూడా ఎఫ్ఐఆర్ దశలో జోక్యం చేసుకోబోమని, అయితే ఎఫ్ఐఆర్లోని నేరారోపణలకు ప్రాథమిక ఆధారాలు లేవన్న నిర్ణయానికి వస్తే మాత్రం జోక్యం చేసుకోకుండా ఉండలేమంది. జోక్యం చేసుకోకుండా ఉండే విషయంలో ఎలాంటి నిషేధం లేదంది. అలా జోక్యం చేసుకోవాల్సినటువంటి అరుదైన కేసుల్లో ఈ కేసు కూడా ఒకటని, అందువల్ల ఈ కేసులో జోక్యం చేసుకుంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలిపింది. జగన్ తదితరులపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వుల కాపీ బుధవారం అందుబాటులోకి వచ్చింది.దుర్గారావు చెప్పింది ఇదీ...‘ఈ కేసులో నిమ్మకాయల దుర్గారావు అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఈ కోర్టు పరిశీలించింది. ఆయన చెప్పిన దాని ప్రకారం ఘటన జరిగిన రోజు ఉదయం 10.30–11 గంటలకు మాజీ సీఎం కాన్వాయి తాడేపల్లి వైపు నుంచి జాతీయ రహదారి వైపు వచ్చింది. కారు డ్రైవర్కు సమీపంలో మాజీ సీఎం నిలబడి ఉన్నారు. అక్కడికి వచ్చిన పార్టీ కార్యకర్తలందరూ ఆయన వైపు పరిగెత్తుకెళ్లారు. దీంతో మాజీ సీఎం కారు నుంచి బయటకు వచ్చి అక్కడికి వచ్చిన ప్రజలందరికీ అభివాదం చేశారు. ఈ సమయంలోనే కారు ఎడమ వైపు సర్వీసు రోడ్డులోకి తిరిగింది. ఓ వ్యక్తి డ్రైవరు వైపు ఉన్న కారు చక్రం కింద పడ్డారు. వెంటనే కాన్వాయిలో ఉన్న నలుగురు ఆ వ్యక్తిని పక్కకు తీసి చెట్ల కిందకు తీసుకెళ్లారు. ఆ తరువాత కాన్వాయి సర్వీసు రోడ్డులోకి వచ్చింది. అనంతరం గాయపడిన వ్యక్తిని చూసేందుకు వెళ్లా. కొద్దిసేపటికి అంబులెన్స్లో ఆ వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాయపడిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఆ తరువాత నాకు తెలిసింది ఏమిటంటే గాయపడిన వ్యక్తి మరణించాడు..’ అని దుర్గారావు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో తెలిపారు. పోలీసులు దుర్గారావు ఇచ్చిన ఈ వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని మొదట పెట్టిన బీఎన్ఎస్ సెక్షన్ 106 (నిర్లక్ష్యంతో మరణానికి కారణమయ్యారంటూ)ను సెక్షన్ 105 కింద మార్చారని పేర్కొన్నారు.అలా చనిపోతారని జగన్ తదితరులకు తెలుసని పోలీసులు చెబుతున్నారు...దర్యాప్తులో భాగంగా పోలీసులు మాజీ సీఎం వెంట ఉన్న భద్రతా సిబ్బందిని విచారించారని న్యాయమూర్తి తెలిపారు. వారి వాంగ్మూలాలను నమోదు చేశారని, అనంతరం జూన్ 25న పోలీసులు మేజిస్ట్రేట్ ముందు ఓ మెమో దాఖలు చేశారన్నారు. టర్నింగ్ తీసుకునే సమయంలో కారును వేగంగా నడపడం వల్ల ప్రజలు కారు కింద పడి మరణిస్తారని డ్రైవర్తోపాటు ఆ కారులో ఉన్న జగన్ తదితరులకు స్పష్టంగా తెలుసునని పోలీసులు ఆ మెమోలో పేర్కొన్నారన్నారు. జగన్ తదితరులు కారును వేగంగా నడపాలని డ్రైవర్కు చెప్పారని, అందువల్లే భారీగా జనాలు ఉన్న చోట కారును వేగంగా నడిపారని పోలీసులు ఆ మెమోలో చెప్పారని తెలిపారు. అయితే సెక్షన్ 105 వర్తించాలంటే ఓ వ్యక్తిని చంపాలన్న ఉద్దేశం గానీ, తమ చర్యల వల్ల చనిపోతాడని తెలిసి ఉండటం తప్పనిసరని, ఈ కేసులో జగన్ తదితరులకు చంపాలన్న ఉద్దేశం గానీ, తమ చర్యల వల్ల ఓ వ్యక్తి చనిపోతారని తెలిసి ఉండటం గానీ జరగలేదన్నారు. అందువల్ల వారిని సెక్షన్ 105 పరిధిలోకి తీసుకురాలేరని తేల్చి చెప్పారు. -
కాలయాపనతో... మైండ్ గేమ్!
డబ్బులు ఖర్చుచేశాం.. కాంట్రాక్టు పనులు పూర్తి చేశాం.. బిల్లులు చెల్లించండి అంటూ ఓవైపు కాంట్రాక్టర్లు ఏడాదిగా వేడుకుంటున్నారు..! కానీ.. పనుల నాణ్యతపై ఒకసారి విజిలెన్స్ విచారణ.. తప్పేమీ లేదని అందులో నివేదిక రావడంతో టెండర్ వ్యాల్యూయేషన్ ఫర్ విజిలెన్స్ అంటూ మరోసారి.. కూటమి ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది. రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో కాంట్రాక్టర్లు చివరకు కోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆ కేసులు జడ్జిమెంట్ దశకు చేరుకున్నాయి. అయినా ఏడాదిగా కోర్టు ఉత్తర్వులు వెలువడకుండా కాలయాపన చేస్తూ మైండ్ గేమ్ ఆడుతోంది. సాక్షి ప్రతినిధి, కడప: ప్రభుత్వ పెద్దలు పులివెందులలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో జాప్యం చేయాలనే ఎత్తుగడ ఎంచున్నారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) పరిధిలో పనులు చేసిన కాంట్రాక్టర్లను సీఎం చంద్రబాబు సర్కార్ వేధిస్తోంది. ఎన్నడూ లేని విధంగా మానసికంగా, ఆర్థికంగా దెబ్బకొట్టే చర్యలు తెరపైకి వస్తున్నాయి. పూర్తి చేసిన పనులకు బడ్జెట్ కేటాయించకుండా, సీఎఫ్ఎంఎస్లో ఉన్న బిల్లులను క్లియర్ చేయకుండా నాన్చుతున్నారు. ఈ పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కేసుల నంబర్లు అయ్యాయి. త్వరలో జడ్జిమెంటు ఉంటుందనుకున్న దశలో ప్రభుత్వం పనులపై తొలుత విజిలెన్స్ ఫర్ క్వాలిటీకి ఆదేశించింది. విజిలెన్స్ అధికారులు తీసుకున్న కోర్ శ్యాంపిల్స్ను విజయవాడకు తీసుకెళ్లి పరీక్ష చేయించారు. సహజంగా జిల్లాకేంద్రాల్లోని ల్యాబ్లో పరీక్ష చేయాలి. కానీ, కూటమి ప్రభుత్వం ఒత్తిడితో వేరేచోట చేశారు. అయితే, అన్ని శాంపిల్స్ (98 శాతం మెరిట్) పాస్ అయ్యాయి. నివేదికలు హైకోర్టుకు చేరితే బిల్లుల చెల్లింపులే తరువాయి అనుకున్న తరుణంలో జాప్యం కోసం కూటమి ప్రభుత్వం కొత్త ఎత్తుగడ ఎంచుకుంది.» దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పూర్తయిన పనులకు టెండర్ వ్యాల్యూయేషన్పై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సహజంగా టెండర్ వ్యాల్యూయేషన్ కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేసిన తర్వాత ఎల్–1 ప్రకటించక మునుపే చేపట్టాలి. ఇంజినీరింగ్ అధికారులు ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఎల్–1, ఎల్–2 ప్రకటిస్తారు. ఆ తర్వాత కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్ చేయించి పనులు కొనసాగిస్తారు. అగ్రిమెంట్ విధి విధానాల ప్రకారం సంబంధిత పనిని పూర్తి చేసిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ సరి్టఫికెట్ జత చేసి ఆ పనికి బిల్లు చెల్లించాల్సిందిగా ఆర్థిక శాఖకు పంపనున్నారు. ఈ మొత్తం ప్రక్రియ అయ్యాక కూడా రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, అక్కడ జాప్యం చేసేందుకు ఒకసారి విజిలెన్స్ ఫర్ క్వాలిటీ, ఆ ప్రక్రియ పూర్తికాగానే మళ్లీ మొదటికి వచ్చి టెండర్ వ్యాల్యూయేషన్ ఫర్ విజిలెన్స్ అంటూ మరోసారి కాలయాపన చేసే ఎత్తుగడను ప్రభుత్వ పెద్దలు ఎంచుకున్నారని పలువురు వాపోతున్నారు. » ప్రభుత్వం 15 నెలలుగా బిల్లులు చెల్లించకుండా వేధిస్తోందని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టులో కేసులు తీర్పు దశకు రాగా, దానిని అడ్డుకునే ప్రక్రియను చేపడుతున్నారని వాపోతున్నారు. » పులివెందుల పరిధిలో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖలలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు కొన్ని పెండింగ్లో ఉన్నాయి. వాటిని ప్రస్తుతం టీడీపీ వారు చేపడుతున్నారు. ఓవైపు బిల్లుల చెల్లింపునకు జాప్యం చేస్తూనే, టెండర్ వ్యాల్యూయేషన్ ఫర్ విజిలెన్స్, క్వాలిటీ ఫర్ విజిలెన్స్ అంటూ ముప్పుతిప్పలు పెడుతున్న ప్రభుత్వ పెద్దలు అవే పెండింగ్ పనులను కొనసాగించడం విశేషం. » వైఎస్సార్సీపీ ప్రభుత్వం కులం, మతం, ప్రాంతం చూడకుండా.. రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా అర్హులందరీకి సంక్షేమ పథకాలు అందించింది. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిçస్తున్న కుప్పం నియోజకవర్గ ప్రయోజనాలకు సైతం ఎలాంటి ఆటంకాలు లేకుండా నిధులు కేటాయించింది. కానీ, కూటమి సర్కార్ పులివెందులలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లను వేధిస్తుండడం, హైకోర్టు ఉత్తర్వులు సైతం జాప్యం అయ్యేలా మైండ్గేమ్ ఆడుతోందని విశ్లేషకులు వివరిస్తున్నారు. -
కోటిపల్లి – నరసాపురం రైల్వే లైన్కు తొలగిన ప్రధాన అడ్డంకి
సాక్షి, అమరావతి: 40 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కోటిపల్లి – నరసాపురం రైల్వేలైన్ ప్రాజెక్టుకు ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. రైల్వే లైన్ భూ సేకరణ, రీ అలైన్మెంట్ సర్వే విషయంలో గతంలో విధించిన స్టేని హైకోర్టు ఎత్తేసింది. అలైన్మెంట్ సర్వే కొనసాగించవచ్చని రైల్వే అధికారులను ఆదేశించింది. అలైన్మెంట్ మార్పు పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని తెలిపింది. ఫలానా మార్గంలోనే అలైన్మెంట్ వెళ్లాలని ఆదేశాలు ఇవ్వలేమని చెప్పింది. వీలైనంత త్వరగా సర్వే పూర్తి చేసి ప్రాజెక్టును పట్టాలెక్కించాలని అధికారులకు స్పష్టం చేసింది. రీ అలైన్మెంట్ ద్వారా ఎవరైనా రాజకీయ నేతలు, ప్రముఖులు ప్రయోజనం పొందుతున్నారా అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఆగస్టు 13కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలైన్మెంట్ మార్చడం వల్ల ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది అప్పారి సత్యప్రసాద్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కేంద్రం తరఫున సీవీఆర్ రుద్ర ప్రసాద్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్జీపీ సింగమనేని ప్రణతి వాదనలు వినిపించారు.విజయవాడ వరదల ప్రాణ నష్టానికిబాధ్యత ఎవరిది?బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలిరాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశంసాక్షి, అమరావతి: గత ఏడాది సంభవించిన విజయవాడ వరదల వల్ల 60 మంది ప్రాణాలు కోల్పోయారని, జరిగిన ప్రాణ నష్టానికి బాధ్యత ఎవరిదని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎవరూ బాధ్యులు కాదంటే కుదరదని తేల్చి చెప్పింది. తగిన విచారణ జరిపి బాధ్యులను గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో ఇదే తామిచ్చే చివరి అవకాశమని, తదుపరి విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేస్తూ.. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వరదల గురించి ముందే తెలిసినా ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, ఇందుకు బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పాత్రికేయుడు నాతాని భూపతిరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిని మానవ హక్కుల ఉల్లంఘనగా ప్రకటించాలని అందులో ఆయన పేర్కొన్నారు. -
మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే విచక్షణాధికారం మాకు ఉంది
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు సింగయ్య మృతి కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన మరణానికి బాధ్యులుగా చేస్తూ... కారులో ప్రయాణిస్తున్న మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజనీ తదితరులపై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాదనల సందర్భంగా కౌంటర్ దాఖలుకు తాము సమయం కోరుతుండగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని పోలీసుల తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వ్యతిరేకించారు. తమ వాదనలను పూర్తిగా వినిపించలేదని, అలాంటప్పుడు స్టే ఇవ్వడం సరికాదంటూ తీవ్ర స్వరంతో మాట్లాడారు. దీంతో క్వాష్ పిటిషన్లలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే విచక్షణాధికారం ఈ కోర్టుకు ఉందని జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి తేల్చిచెప్పారు.సింగయ్య మృతికి సంబంధించి నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ వైఎస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజినీ, జగన్ పీఏ నాగేశ్వరరెడ్డి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం తేలేవరకు తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని కోరారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం.. పిటిషనర్లపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. మంగళవారం జస్టిస్ శ్రీనివాసరెడ్డి మరోసారి విచారణ జరిపారు.సింగయ్య ప్రమాదవశాత్తు కారు కిందపడ్డారని సాక్షులు చెబుతున్నారు..వైఎస్ జగన్ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ సింగయ్య గుర్తుతెలియని వాహనం కిందపడి మృతి చెందారని తొలుత మీడియాకు చెప్పిన జిల్లా ఎస్పీ, తర్వాత మాట మార్చారని పేర్కొన్నారు. అనంతరం బీఎన్ఎస్ సెక్షన్ 106ను సెక్షన్ 105కు మార్చారని తెలిపారు. కోర్టు తమకు రక్షణ కల్పించిన మాట వాస్తవమేనని, అయితే తప్పుడు ఉద్దేశాలతో పెట్టిన కేసు నిలవడానికి ఎంతమాత్రం వీల్లేదని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ప్రయాణించిన కారు కిందపడే సింగయ్య మృతి చెందారంటూ ఆ కారును సీజ్ చేశారన్నారు.ఆయనను అవమానించడానికే ఇలా చేశారని.. పోలీసుల అత్యుత్సాహానికి, నిష్పాక్షికంగా దర్యాప్తు చేయడం లేదనడానికి, రాజకీయ కక్షకు ఇదో పరాకాష్ఠ అని తెలిపారు. కేసులో సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిశీలించాలంటూ దానిని చదివి వినిపించారు. సింగయ్యే ప్రమాదవశాత్తు కారు కింద పడ్డారని తెలిపారు. ఈ మేరకు వీడియోలు ఉన్నాయన్నారు. అతడు కారు కిందపడిన వెంటనే పార్టీ కార్యకర్తలు పక్కకు తీసుకొచ్చి అంబులెన్స్లో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారని, 40 నిమిషాలు బతికే ఉన్నారని వివరించారు.సోషల్ మీడియా నుంచి డౌన్లోడ్ చేసినట్లు దర్యాప్తు అధికారే చెబుతున్నారు..సింగయ్యపైకి కారు ఎక్కించినట్లు పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు సెక్షన్ను జత చేశారని సుబ్రహ్మణ్య శ్రీరామ్ తెలిపారు. నిర్లక్ష్యంగా కారు నడిపారంటూ మొదట కేసు పెట్టి, దానిని మార్చి కల్పబుల్ హోమిసైడ్ కింద కేసు పెట్టారన్నారు. సింగయ్య ప్రమాదవశాత్తు కారు కిందపడ్డారని సాక్షులు చెబుతుంటే, పోలీసులు మాత్రం కారులో ఉన్న వైఎస్ జగన్ తదితరులపై బీఎన్ఎస్ సెక్షన్ 105 కింద కేసు పెట్టారని.. ఈ సెక్షన్ కింద కేసు ఎంతమాత్రం చెల్లదని వివరించారు. ఘటనాస్థలంలో లేనివారిని కూడా సాక్షులుగా పేర్కొంటూ వారి వాంగ్మూలాల ఆధారంగా కేసు పెట్టారని కోర్టు దృష్టికి తెచ్చారు.విశ్వసనీయ సమాచారం అంటూ పోలీసులు వాస్తవాలను మరుగున పెడుతున్నారన్నారు. ఇది రాజకీయ దురుద్దేశాలను స్పష్టం చేస్తోందన్నారు. సింగయ్య కారు కింద పడిన వీడియోను సోషల్ మీడియా నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లు దర్యాప్తు అధికారి చెబుతున్నారని, ఈ రోజుల్లో కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా ఏ వీడియోనైనా సృష్టించడం చాలా తేలిక అని వివరించారు. వైఎస్ జగన్ తదితరులు కారును వేగంగా నడపాలని డ్రైవర్ను తొందర పెట్టారంటూ పోలీసులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.జగన్ భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసిందిన్యాయమూర్తి స్పందిస్తూ... కోర్టు ఇప్పటికే పిటిషనర్లకు రక్షణ కల్పించింది కదా? అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. ఏజీ కౌంటర్ దాఖలుకు గడువు కోరుతున్నారని గుర్తుచేశారు. దీనికి శ్రీరామ్ ప్రతిస్పందిస్తూ, వైఎస్ జగన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వివక్షతో వ్యవహరిస్తోందని, ఉద్దేశపూర్వకంగా భద్రతను పట్టించుకోవడం లేదని, దీంతో ఆయన పర్యటనల సందర్భంగా దురదృష్టకర ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. పొదిలి, గుంటూరు మిర్చి యార్డు, అనంతపురం జిల్లాలో జరిగిన ఘటనలు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చాటుతున్నాయన్నారు. ప్రజలను నియంత్రించేందుకు పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని, లేదంటే సింగయ్య కారు కింద పడేవారు కాదన్నారు. ఈ ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందన్నారు.అత్యవసర విచారణ అవసరం లేదువిచారణ మొదలుకాగానే ఏజీ స్పందిస్తూ, మరిన్ని ఆధారాలను కోర్టు ముందు ఉంచుతామని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని, రెండు వారాల గడువు ఇవ్వాలని, లేకపోతే వారం అయినా గడువు ఇవ్వాలని కోరారు. పిటిషనర్లకు హైకోర్టు ఇప్పటికే రక్షణ కల్పించిందని, అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... పిటిషనర్లు వైఎస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి తదితరులపై కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
వైఎస్ జగన్ భద్రతకు ప్రభుత్వం తిలోదకాలు
సాక్షి, అమరావతి: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి జెడ్ ప్లస్ భద్రత ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తగిన రక్షణ ఏర్పాట్లు చేయడం లేదని సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. నిర్దేశిత విధి విధానాలు వేటినీ పోలీసులు పాటించడం లేదని పేర్కొన్నారు. ప్రజలను నియంత్రించేందుకు రోప్ పార్టీని ఏర్పాటు చేయడం లేదన్నారు. వైఎస్ జగన్ పర్యటనకు వెళ్లిన ప్రతిచోటా అవాంఛనీయ ఘటనలకు ప్రభుత్వం, పోలీసులే ఆస్కారం కల్పిస్తున్నారని తెలిపారు. ఈ నెల 3న వైఎస్ జగన్ నెల్లూరు వెళ్తున్నారని, అక్కడ తగిన భద్రత ఏర్పాట్లు చేసేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. హెలిప్యాడ్ విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని వివరించారు. కాగా, ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు... నెల్లూరు పర్యటన సందర్భంగా వైఎస్ జగన్కు కల్పించనున్న భద్రతకు సంబంధించిన వివరాలను తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అత్యవసర పిటిషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ వైఎస్ జగన్ ఈ నెల 3న నెల్లూరు పర్యటనకు వస్తున్న సందర్భంగా తాత్కాలిక హెలిప్యాడ్ ఏర్పాటుకు అనుమతిచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పర్వతనేని చంద్రశేఖర్రెడ్డి హైకోర్టులో మంగళవారం అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ హరినాథ్ విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరామ్ వాదనలు వినిపించారు. నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని పరామర్శించేందుకు వైఎస్ జగన్ వెళ్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో హెలిప్యాడ్ల కోసం రెండు స్థలాలను సూచిస్తూ జిల్లా అధికారులకు వినతిపత్రాలు ఇచ్చామన్నారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని పేర్కొన్నారు.ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) యతీంద్రదేవ్ వాదనలు వినిపిస్తూ, నెల్లూరు జిల్లా జైలు సమీపంలో హెలిప్యాడ్ సిద్ధం చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఈ విషయాన్ని పిటిషనర్లకు చెప్పామన్నారు. వైఎస్ జగన్కు జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. కాబట్టి ప్రత్యేకంగా రోప్ పార్టీ అవసరం లేదన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ, ప్రజలను నియంత్రించేందుకు రోప్ పార్టీ ఏర్పాటు చేస్తే నష్టం ఏమిటని ప్రశ్నించారు. హైదరాబాద్ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల సందర్భంగా రోప్ పార్టీని తాను చూశానని తెలిపారు. యతీంద్రదేవ్ స్పందిస్తూ, వైఎస్ జగన్కు కల్పిస్తున్న భద్రత విషయంలో పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచుతామని.. విచారణను బుధవారానికి వాయిదా వేయాలని కోరారు. -
రెంటపాళ్ల కేసు.. వైఎస్ జగన్పై విచారణకు హైకోర్టు స్టే
రెంటళ్లపాళ్ల కేసులో పోలీసులకు, కూటమి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్ జగన్ విచారణకు ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో తదుపరి చర్యలన్నింటిని నిలిపివేస్తూ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ ప్రతీకారంతోనే తనపై కేసు పెట్టారంటూ వైఎస్ జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.సాక్షి, అమరావతి: సింగయ్య రోడ్డు ప్రమాదం కేసులో ఏపీ పోలీసులకు, కూటమి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. వైఎస్ జగన్ను పోలీసులు విచారించకుండా హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో తదుపరి చర్యలన్నింటిని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలుకు ఏజీ రెండు వారాల గడువు కోరగా.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. రాజకీయ ప్రతీకారంతోనే తనపై కేసు పెట్టారంటూ వైఎస్ జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ఈ పిటిషన్పై విచారణ జరిగింది.క్వాష్ పిటిషన్పై నిర్ణయం తీసుకోవడానికి ఎఫ్ఐఆర్ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది కదా?.. ఏజీతో హైకోర్టు బెంచ్వాదనలు వినిపించడానికి అవకాశం ఇవ్వాలి: జడ్జితో జగన్ లాయర్ వాదనలు వినాల్సిన అవసరం లేదు: జడ్జితో అడ్వొకేట్ జనరల్ సంఘటన తర్వాత నాలుగు రోజుల తర్వాత వీడియో విడుదల చేశారు: : జగన్ లాయర్ సోషల్ మీడియాలో డౌన్లోడ్ చేశామని ఎస్ఐ చెప్పారు: జగన్ లాయర్ ఏఐతో ఏదైనా సృష్టించగలిగే అవకాశం ఉంది కదా: జగన్ లాయర్ కౌంటర్ దాఖలుకు రెండు వారాల సమయం ఇవ్వండి: జడ్జితో అడ్వొకేట్ జనరల్ఆధారాలు ఉన్నా ఇంకా సమయం దేనికి?: జగన్ లాయర్పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామ పర్యటనకు వెళ్తుండగా.. వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య ప్రమాదవశాత్తూ మరణించాడు. అయితే జగన్ కాన్వాయ్ కారణంగానే సింగయ్య మరణించాడంటూ నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ వైఎస్ జగన్తో పాటు పలువురు ఆయన వ్యక్తిగత కార్యదర్శి, వైఎస్సార్సీపీ నేతలూ క్వాష్ పిటిషన్లు వేయగా.. వాటంన్నింటిని కలిపే హైకోర్టు విచారణ జరుపుతోంది. గత విచారణ సందర్భంగా.. సింగయ్య మృతికి వైఎస్ జగన్ కారకులు ఎలా అవుతారంటూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్నవాళ్లపై ఎలా కేసు పెడతారు?. ప్రమాదానికి ప్రయాణికులను ఎలా బాధ్యుల్ని చేస్తారు?. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కుంభమేళాలో తొక్కిసలాట ఘటన జరిగింది కదా’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. నేటి విచారణలో జగన్ విచారణపై ఏకంగా స్టే విధించడం గమనార్హం. -
కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట
సాక్షి, అమరావతి: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు ఊరటనిచ్చింది. తాడిపత్రిలోని ఆయన ఇంటిని కూల్చొద్దని పురపాలకశాఖ అధికారులను ఆదేశించింది. నివాస సముదాయాల కూల్చివేత విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాడిపత్రిలోని సర్వే నంబర్ 639, 640, 641లలో 577.55 చదరపు గజాల స్థలంలో తాము నిర్మించుకున్న ఇంటిని కాల్చివేసేందుకు పురపాలక శాఖ అధికారులు యత్నిస్తున్నారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ పెద్దారెడ్డి సతీమణి కేతిరెడ్డి రమాదేవి సోమవారం హైకోర్టులో అత్యవసరంగా లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ విజయ్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కామిరెడ్డి నవీన్కుమార్ వాదనలు వినిపించారు. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే పిటిషనర్ ఇంటిని నిర్మించారని నవీన్ తెలిపారు. అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా ఇచ్చారని తెలిపారు. జూన్ 21న అధికారులు సర్వే నిమిత్తం నోటీసులు జారీ చేసి, 28న సర్వేకు హాజరుకావాలని చెప్పారన్నారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఈ నోటీసులు ఇచ్చారన్నారు. సర్వే కోసం పిటిషనర్ భర్త తాడిపత్రి వెళ్లారని, అయితే పోలీసులు ఆయన్ను అడ్డుకుని వెనక్కి పంపారని తెలిపారు.అధికారులు 28న ఇంటికి వచ్చి మార్కింగ్ చేసి ఇంటి కూల్చివేతకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. చట్టవిరుద్ధంగా ఇళ్లను కూల్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు గత ఏడాది తీర్పు ఇచ్చిందన్నారు. పురపాలకశాఖ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ అధికారులు సర్వే మాత్రమే చేశారని, ఒకవేళ కూల్చివేత చేపడితే చట్ట ప్రకారం చేస్తారని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఏం చేసినా చట్ట ప్రకారమే చేయాలని, పిటిషనర్ ఇంటిని కూల్చొద్దని ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు స్పష్టంచేశారు. -
బాబుకు షాకిచ్చిన హైకోర్టు
-
ప్రయాణికులు.. ప్రమాదానికి బాధ్యులా?
సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా సింగయ్య మృతి చెందిన ఘటనకు సంబంధించి మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇతర పార్టీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని హైకోర్టు తీవ్రస్థాయిలో ప్రశ్నించింది. ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న వారిపై కేసు ఎలా నమోదు చేస్తారని విస్మయం వ్యక్తం చేసింది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సాధారణంగా ఆ వాహనం నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తారే గానీ కారులో ప్రయాణిస్తున్న వారిపై కేసు నమోదు చేయరని గుర్తు చేసింది.ప్రమాదానికి కారులో ఉన్న వారిని ఎలా బాధ్యులను చేస్తారని సూటిగా ప్రశ్నించింది. భారీ సంఖ్యలో జనం ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయని, కుంభమేళా లాంటి చోట్ల కూడా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రమాదాలు చోటు చేసుకున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. సింగయ్య మృతికి సంబంధించి నమోదైన కేసులో వైఎస్ జగన్, ఇతర నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజిని తదితరులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమ కేసు కొట్టివేయాలంటూ పిటిషన్లుసింగయ్య మృతికి సంబంధించి నల్లపాడు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తదితరులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై తేలేంతవరకు తదుపరి చర్యలన్నీ నిలిపివేయాలని తమ పిటిషన్లలో హైకోర్టును అభ్యర్థించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్రెడ్డి, సుబ్రహ్మణ్య శ్రీరాం, చిత్తరవు రఘు, న్యాయవాదులు యర్రంరెడ్డి నాగిరెడ్డి, శెట్టిపల్లి దుష్యంత్రెడ్డి, ఆర్.యల్లారెడ్డి, కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఎస్పీ మొదట వేరే కారు అని చెప్పారు.. ఆ తర్వాత మాట మార్చారు... మొదట పొన్నవోలు వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు కారులో ప్రయాణిస్తున్న వారు మాత్రమేనని, సింగయ్య మృతితో వీరికి ఎలాంటి సంబంధం లేదన్నారు. వాస్తవానికి ప్రమాదం జరిగిన రోజు గుంటూరు ఎస్పీ స్పందిస్తూ ఏపీ 26 సీఈ 0001 నంబర్ కారు ప్రమాదానికి కారణమని స్వయంగా చెప్పారని పొన్నవోలు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. మూడు రోజుల తర్వాత అదే ఎస్పీ మాట మార్చారన్నారు. ప్రమాదానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి తదితరులు ప్రయాణించిన వాహనమే కారణమంటూ మీడియా ముఖంగా చెప్పారని నివేదించారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ప్రమాదానికి వాహనంలో కూర్చున్న వ్యక్తులను ఎలా బాధ్యులను చేస్తారని ప్రశ్నించారు. వాహనంలో ఉన్న వారిని ఎలా విచారిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని చెప్పారు. పిటిషనర్లు ప్రమాదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారన్నారు. ప్రమాదం తరువాత సింగయ్యను రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారన్నారు. ఓ వ్యక్తి మరణానికి కారణమై ఇప్పుడు ఏమీ జరగలేదంటూ చెబుతున్నారన్నారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ వాహనంలో ప్రయాణిస్తున్న వారిని ఎలా విచారిస్తారని ప్రశ్నించారు. ప్రయాణికులకు ఏం పాత్ర ఉంటుంది..? వేల మంది సమూహంగా ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతుంటాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. కుంభమేళా లాంటి భారీ జన సమూహాలు ఉన్న చోట ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. వాహన ప్రమాదంలో.. ఆ వాహనంలో ఉన్న ప్రయాణికులకు ఏం పాత్ర ఉంటుందని విస్మయం వ్యక్తం చేశారు. అంత భారీ జనసమూహంలోని ఓ వ్యక్తి వాహనం కింద పడితే.. ఆ వ్యక్తిని అలా చావనివ్వండి అని ఎవరైనా పక్కన పడేసి వెళ్లిపోరుగా? అలాంటి ఉద్దేశం వాహనంలో ఉన్న వారికి ఉంటుందా? అని పోలీసులను సూటిగా ప్రశ్నించారు. దీనిపై అన్ని ఆధారాలున్నాయని, సమయం ఇస్తే వాటిని కోర్టు ముందుంచుతామని ఏజీ దమ్మాలపాటి నివేదించడంతో.. విచారణ మంగళవారానికి వాయిదా వేస్తామని, అప్పటి వరకు పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. ఈ సమయంలో పొన్నవోలు స్పందిస్తూ అప్పటి వరకు స్టే ఇవ్వాలని కోరగా, ఆ అవసరం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. వైఎస్ జగన్ భద్రతపై పోలీసుల నిర్లక్ష్యంవైఎస్ జగన్ తరఫున శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఒక మాజీ సీఎంకార్యక్రమంలో భద్రతాపరంగా తీవ్ర లోపాలున్నా పోలీసులు కనీస స్థాయిలో కూడా పట్టించుకోలేదని న్యాయస్థానానికి నివేదించారు. దీనిపై తాము న్యాయపరంగా పోరాటం చేస్తున్నామన్నారు. మొదట బీఎన్ఎస్ సెక్షన్ 106 కింద పెట్టిన కేసును పోలీసులు, తర్వాత 105 (కల్పబుల్ హోమిసైడ్) కిందకు మార్చారని కోర్టు దృష్టికి తెచ్చారు. వైఎస్ జగన్ భద్రత, జనసమూహాలను నియంత్రించే విషయంలో పోలీసులు తీవ్ర ఉదాశీనత ప్రదర్శిస్తున్నారన్నారు. భద్రత కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించారని తెలిపారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ‘ప్రభుత్వాన్ని పూర్తి ఆధారాలు కోర్టు ముందుంచనివ్వండి... ఈలోపు మీకు కావాల్సింది రక్షణే కదా? మీకు రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులిస్తా..’ అని తెలిపారు. అనంతరం శ్రీరామ్ స్పందిస్తూ.. తదుపరి విచారణ వరకు తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తూ, అప్పటివరకు పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. -
Kodali Nani: కొడాలి నానికి ముందస్తు బెయిల్
సాక్షి,విజయవాడ:మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి ముందస్తు బెయిల్ లభించింది. టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి ఘటనలో కొడాలి నానిపై కేసు నమోదైంది. అయితే, ఇదే కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కొడాలి నాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. కిందికోర్టులో బెయిల్ తీసుకోవాలని కొడాలి నానికి హైకోర్టు ఆదేశించింది. ఆదేశాల మేరకు కొడాలి నాని శుక్రవారం గుడివాడ కోర్టులో ష్యూరిటీ పత్రాలు సమర్పించారు. అనంతరం,ముందస్తు బెయిల్ పొందారు. -
Watch Live: జగన్ కి ఏంటి సంబంధం.. సింగయ్య ఘటనపై హైకోర్టు..
-
జగన్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: రెంటపాళ్ల పర్యటన కేసులో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. కారు ప్రమాదం జరిగితే.. కారులో ఉన్నవాళ్లపై కేసు ఎలా పెడతారు? అంటూ పోలీసులను నిలదీసింది. అలాగే ఈ కేసులో తదుపరి విచారణ జరిగేదాకా ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. జూన్ 18వ తేదీన పల్నాడు జిల్లా సత్తెన్నపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వైఎస్సార్సీపీ కార్యకర్త మరణించాడు. జగన్ కాన్వాయ్ వల్లే అతను మరణించాడని కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు.. నిందితుల జాబితాలో ఆయన పేరును కూడా చేర్చారు. అయితే రాజకీయ ప్రతీకారంతోనే తనపై కేసు నమోదు చేశారని, ప్రజల్ని కలవకుండా అడ్డుకునేందుకే ఈ ప్రయత్నమని పేర్కొంటూ వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్తో పాటు ఇదే కేసులో వైఎస్సార్సీపీ నేతలు వేసిన మరో నాలుగు క్వాష్ పిటిషన్లను కలిపి హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ‘‘కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్నవాళ్లపై ఎలా కేసు పెడతారు?. ప్రమాదానికి ప్రయాణికులను ఎలా బాధ్యుల్ని చేస్తారు?. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కుంభమేళాలో తొక్కిసలాట ఘటన జరిగింది కదా’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో వాదనలు వినిపించేందుకు ప్రభుత్వ లాయర్ మరింత గడువు కోరగా.. తదుపరి విచారణను మంగళవారానికి(జులై 1వ తేదీకి) వాయిదా వేసింది. అప్పటిదాకా నిందితులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. జగన్ క్వాష్ పిటిషన్లో ఏముందంటే..మృతుడి భార్య లూర్థు మేరీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) సెక్షన్ 106(1) (నిర్లక్ష్యం కారణంగా చావుకు కారకులు) ప్రకారం మొదట కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఎందుకనో.. బీఎన్ఎస్ సెక్షన్ 105 (హత్య కిందకు రాని కల్పబుల్ హోమిసైడ్), 49 (నేరానికి ప్రేరేపించడం) సెక్షన్లుగా మార్చారు. మృతుడు సింగయ్య గాయాలను చూస్తే అతడు ఆ వాహనం కిందపడి నలిగినట్లు లేదని.. పోలీసుల వాదన నమ్మదగినదిగా లేదు. ప్రమాదానికి టాటా సఫారీ వాహనం కారణమని మొదట్లో పోలీసులు తెలిపారు. ఆ వాహన యజమానిని, డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వాంగ్మూలాలను నమోదు చేసి, పూచీకత్తు తీసుకున్నాక బెయిల్పై విడుదల చేశారు.కాన్వాయ్లోని గుర్తుతెలియని వాహనం సింగయ్యను ఢీకొన్నట్లు గుంటూరు ఎస్పీ స్వయంగా ప్రకటించారు. నా పర్యటన(రెంటపాళ్ల) వివరాలను పోలీసులకు ముందుగానే అందజేసినా.. తగిన భద్రత కల్పించడంలో విఫలమయ్యారు. ప్రజలను కలవకుండా అడ్డుకోవాలనే రాష్ట్రప్రభుత్వం ఈ కేసు పెట్టింది. పై అంశాలను పరిగణనలోకి తీసుకొని నాపై నమోదుచేసిన కేసును కొట్టేయాలి -
ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ తదితరుల వ్యాజ్యాలపై నేడు విచారణ
-
వైఎస్ జగన్ తదితరుల వ్యాజ్యాలపై విచారణ నేటికి వాయిదా
సాక్షి, అమరావతి: సింగయ్య మృతికి సంబంధించి తమపై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని, వైఎస్ జగన్ పీఏ కె.నాగేశ్వరరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా... అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పూర్తి వివరాలను సమర్పించేందుకు గడువు ఇవ్వాలని కోరారు. కేసు డైరీని తెప్పించుకుని చూడాల్సి ఉందన్నారు.కొన్ని వ్యాజ్యాల్లో తాను, మరికొన్ని వ్యాజ్యాల్లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తారని తెలిపారు. కాబట్టి వైఎస్ జగన్ తదితరుల వ్యాజ్యాలపై విచారణను సోమ లేదా మంగళవారానికి వాయిదా వేయాలని కోరారు. ఈ అభ్యర్థనను పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్రెడ్డి, చిత్తరవు రఘు, యర్రంరెడ్డి నాగిరెడ్డి, శెట్టిపల్లి దుష్యంత్రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని, పిటిషనర్లపై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లేవీ చెల్లవని తెలిపారు.పిటిషనర్లపై కేసు నమోదు ద్వారా పోలీసులు న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేశారని పేర్నొన్నారు. విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తే అభ్యంతరం లేదని, అప్పటివరకు కఠిన చర్యలేవీ తీసుకోకుండా రక్షణ కల్పించాలని కోర్టును కోరారు. దమ్మాలపాటి స్పందిస్తూ అరెస్ట్ చేస్తారనే ఆందోళన కారణంగానే ఈ పిటిషన్లు దాఖలు చేశారని.. అలాంటప్పుడు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదని అన్నారు. వైఎస్ జగన్ తదితరుల తరఫు న్యాయవాదులు జోక్యం చేసుకుంటూ, మధ్యంతర రక్షణ కోరే హక్కు పిటిషనర్లకు ఉందని వివరించారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చెప్పిందన్నారు. తదుపరి విచారణ వరకు కఠిన చర్యలేవీ తీసుకోకుండా మౌఖిక హామీ ఇచ్చేలా ఏజీకి స్పష్టం చేసినా చాలని పేర్కొన్నారు. -
బైపాస్ సర్జరీ నేపథ్యంలో రెండు నెలలు పొడిగించిన హైకోర్టు
సాక్షి, అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్–1 జవాబు పత్రాల మూల్యాంకనం వ్యవహారంపై నమోదైన కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులుకు కింది కోర్టు జారీ చేసిన మధ్యంతర బెయిల్ను హైకోర్టు పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పీఎస్సార్ ఆంజనేయులు తరఫున న్యాయవాది నగేష్రెడ్డి వాదనలు వినిపించారు.అనారోగ్య కారణాలతో పిటిషనర్కు కింది కోర్టు రెండు వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చిందన్నారు. ఈ గడువు గురువారంతో ముగుస్తుందని చెప్పారు.ఈ నెల 25న పీఎస్సార్ ఆంజనేయులుకు బైపాస్ సర్జరీ జరిగిందని కోర్టు దృష్టికి తెచ్చారు. కాబట్టి ఆయన మధ్యంతర బెయిల్ను పొడిగించాలని కోరారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి... పీఎస్సార్ ఆంజనేయులుకు 2 నెలల పాటు మధ్యంతర బెయిల్ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధాన బెయిల్ పిటిషన్పై విచారణను ఆగస్టు 28కి వాయిదా వేశారు.మధుసూదన్కు వైద్య పరీక్షలు చేయించి నివేదికివ్వండిఇదే కేసులో రెండో నిందితుడిగా ఉన్న క్యామ్సైన్ సంస్థ డైరెక్టర్ పమిడికాల్వ మధుసూదన్ బెయిల్ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు తదుపరి విచారణను జూలై 1కి వాయిదా వేశారు. పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని మధుసూదన్ చెబుతున్న నేపథ్యంలో గాల్బ్లాడర్, కిడ్నీ వ్యాధుల వైద్యులతో ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు చేయించి, నివేదికను తమ ముందుంచాలని జైలు సూపరింటెండెంట్ను ఆదేశించారు. -
వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా
సాక్షి, అమరావతి: ఏపీలో వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య మృతి కేసులో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి, కేఎన్ఆర్, విడదల రజిని, పేర్ని నాని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం తరఫున న్యాయవాదులు విచారణకు సమయం కోరారు. దీంతో, తదుపరి విచారణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.ఇదిలా ఉండగా.. వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య మృతి కేసులో కుట్రపూరితంగా తన పేరును చేర్చారంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. నల్లపాడు పోలీసులు నమోదుచేసిన కేసును కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ వేశారు. జూన్ 18వ తేదీన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ గ్రామానికి వైఎస్ జగన్ వెళ్లారు. ఆ పర్యటనలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని చీలి సింగయ్య అనే దళితుడు మృతిచెందాడని నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. రాజకీయ ప్రతీకారంతోనే తనపై ఈ కేసు పెట్టారని జగన్ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. పిటిషన్లో ఏముందంటే..మృతుడి భార్య లూర్థు మేరీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) సెక్షన్ 106(1) (నిర్లక్ష్యం కారణంగా చావుకు కారకులు) ప్రకారం మొదట కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఎందుకనో.. బీఎన్ఎస్ సెక్షన్ 105 (హత్య కిందకు రాని కల్పబుల్ హోమిసైడ్), 49 (నేరానికి ప్రేరేపించడం) సెక్షన్లుగా మార్చారు. మృతుడు సింగయ్య గాయాలను చూస్తే అతడు ఆ వాహనం కిందపడి నలిగినట్లు లేదని.. పోలీసుల వాదన నమ్మదగినదిగా లేదు. ప్రమాదానికి టాటా సఫారీ వాహనం కారణమని మొదట్లో పోలీసులు తెలిపారు. ఆ వాహన యజమానిని, డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వాంగ్మూలాలను నమోదు చేసి, పూచీకత్తు తీసుకున్నాక బెయిల్పై విడుదల చేశారు.కాన్వాయ్లోని గుర్తు తెలియని వాహనం సింగయ్యను ఢీకొన్నట్లు గుంటూరు ఎస్పీ స్వయంగా ప్రకటించారు. తన పర్యటన(రెంటపాళ్ల) వివరాలను పోలీసులకు ముందుగానే అందజేసినా.. తగిన భద్రత కల్పించడంలో విఫలమయ్యారు. ప్రజలను కలవకుండా అడ్డుకోవాలనే రాష్ట్రప్రభుత్వం ఈ కేసు పెట్టింది. పై అంశాలను పరిగణనలోకి తీసుకొని నాపై నమోదుచేసిన కేసును కొట్టేయాలి అని పేర్కొన్నారు. -
హైకోర్టును ఆశ్రయించిన తాడిపత్రి మాజీ MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి