పెళ్లి చేయండంటూ.. యువకుడు తీవ్ర నిర్ణయం! | - | Sakshi
Sakshi News home page

పెళ్లి చేయండంటూ.. యువకుడు తీవ్ర నిర్ణయం!

Published Sun, Oct 22 2023 12:08 AM | Last Updated on Mon, Oct 23 2023 3:34 PM

- - Sakshi

దుర్గం స్వామి(ఫైల్‌)

సాక్షి, మంచిర్యాల: మద్యం మత్తులో పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సాగర్‌ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన దుర్గం మొండయ్య, గుణబాయి దంపతుల చిన్న కుమారుడు దుర్గం స్వామి (28) వాంకిడి గ్రామ పంచాయతీలో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఇంటికి వచ్చిన తర్వాత తనకు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులతో గొడవకు దిగుతుండేవాడు.

శుక్రవారం సైతం రాత్రి 8 గంటల ప్రాంతంలో పెళ్లి చేయాలని కుటుంబ సబ్యులతో వాదనకు దిగాడు. మద్యం మానేస్తేనే పెళ్లి జరుగుతుందని మందలించారు. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. వాంతులు చేసుకోవడంతో గమనించిన కుటుంబ సబ్యులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఆసిఫాబాద్‌ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని తండ్రి మొండయ్య ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement