అప్పు ఇవ్వొద్దు.. పాక్‌పై భారత్‌ ఆర్థిక యుద్ధం | India Oppose International Monetary Fund Loan To Pakistan, Check Story For More Details Inside | Sakshi
Sakshi News home page

అప్పు ఇవ్వొద్దు.. పాక్‌పై భారత్‌ ఆర్థిక యుద్ధం

Published Wed, Apr 30 2025 11:43 AM | Last Updated on Wed, Apr 30 2025 11:49 AM

India Oppose International Monetary Fund Loan To Pakistan

ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడితో ప్రతీకారంతో రగిలిపోతున్న భారత్‌ .. పాకిస్తాన్‌ను ఆర్ధికంగా మరింత ఇబ్బందే పెట్టే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా దాయాది దేశంపై భారత్‌ ఆర్థిక యుద్ధం ప్రకటించింది.

పాకిస్తాన్‌కు అప్పు ఇవ్వొద్దంటూ భారత్‌ అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund - IMF) పై ఒత్తిడి చేస్తోంది. ఆ మేరకు అభ్యంతరం తెలిపింది. గతేడాదిలో ప్రకటించిన పాకిస్తాన్‌కు ఏడు బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీ విషయంలో సమీక్షించాలని  కోరింది. పాక్‌కు నిధులు ఇస్తే ఉగ్రవాదులకు మళ్ళిస్తోందని ఐఏఎఫ్ మెంబర్స్‌కు భారత్‌ వివరిస్తోంది.

మే 9న పాకిస్తాన్‌కు అప్పు ఇచ్చే అంశంపై  ఐఎంఎఫ్ బోర్డు చర్చించనుంది. ఈ తరుణంలో పాక్‌కు ఎట్టి పరిస్థితుల్లో అప్పు ఇవ్వొదని భారత్‌ వాదిస్తోంది. ఇదే అంశంపై భద్రతామండలి నాన్ పర్మినెంట్ మెంబర్స్‌తో భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ చర్చలు జరుపుతున్నారు. పాకిస్తాన్‌కు ఏడు బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీని సమీక్షించాలని కోరనున్నారు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement