30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన | Vanguri Foundation of America Ugadi 2025 winners | Sakshi
Sakshi News home page

30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన

Published Fri, Apr 4 2025 12:58 PM | Last Updated on Fri, Apr 4 2025 12:58 PM

Vanguri Foundation of America Ugadi 2025 winners

గత మూడు దశాబ్దాల సత్ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.....“విశ్వావసు” నామ సంవత్సర ఉగాది (మార్చ్ 30, 2025) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా వంగూరు ఫౌండేషన్‌  ఎంపిక చేసి విజేతల వివరాలను ప్రకటించింది. అలాగే విజతలకు శాయి రాచకొండ, దీప్తి పెండ్యాల, వంగూరి చిట్టెన్ రాజు అభినందనలు తెలిపారు.

వంగూరు ఫౌండేషన్‌ ప్రకటన
అమెరికా, కెనడా, భారత దేశం, దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఖతార్, చెకొస్లొవేకియా, అబుదాభి, బోస్ట్వానా, దుబై తదితర ప్రాంతాల నుండి ఈ పోటీలో పాలు పంచుకుని, విజయవంతం చేసిన రచయితలకు మా ధన్యవాదాలు. చేయి తిరిగిన రచయితలు, ఔత్సాహిక రచయితలూ అనేక మంది ఈ పోటీ కాని పోటీలో పాల్గొనడం సంతోషంగా ఉంది. అన్ని రచనలకూ సర్వ హక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలు, ప్రచురణకి అర్హమైన రచనలూ కౌముది.నెట్, సిరిమల్లె. కామ్ మొదలైన పత్రికలలో ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి.

మరిన్ని  NRI  వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి! 

అందుబాటులో ఉన్న విజేతల నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు ఏప్రిల్ 13, 2025 నాడు శ్రీ త్యాగరాజ గాన సభ వేదిక, హైదరాబాద్ లో నిర్వహించబడుతున్న "అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం" లో ఆహూతుల సమక్షంలో బహూకరిస్తాం.

30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతలు

ప్రధాన విభాగం – 30వ సారి పోటీ
ఉత్తమ కథానిక విభాగం విజేతలు
“కాంతా విరహగురుణా”- పాణిని జన్నాభట్ల, Boston, MA,)
“నల్లమల్లె చెట్టు” - గౌతమ్ లింగా (Johannesburg, South Africa)

ప్రశంసా పత్రాలు
‘లూసఫర్’ -నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్), Tampa, FL
‘తెలివి’ - మురళీశ్రీరాం టెక్కలకోట, Frisco, TX

ఉత్తమ కవిత విభాగం విజేతలు
“వర్ణాక్షరం” - గౌతమ్ లింగా, (జొహానెస్ బర్గ్, దక్షిణ ఆఫ్రికా)

“కృత్రిమ మేధా వికూజనము” – స్వాతి శ్రీపాద (Detroit, MI)

ప్రశంసా పత్రాలు
“డయాస్పోరా ఉగాది పచ్చడి”- సావిత్రి మాచిరాజు, Edmonton, Canada
“చెప్పిన మాట వింటా!”- అమృత వర్షిణి, Parker, CO, USA

“మొట్టమొదటి రచనా విభాగం” -17వ సారి పోటీ

“నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు
‘ప్రత్యూష రాగం -కైలాస్ పులుగుర్త’ – హైదరాబాద్,
“మనో నిశ్చలత” – సీతా సుస్మిత, మద్దిపాడు గ్రామం,ఒంగోలు - ప్రశంసా పత్రం
“మంకెన పూలు” -సుజాత గొడవర్తి, ఆశ్వాపురం, తెలంగాణా - ప్రశంసా పత్రం

"నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు
“ఇంకెంత కాలమని?” కరిపె రాజ్ కుమార్, ఖానాపూర్, నిర్మల్ జిల్లా, తెలంగాణా 
“వర్షాగమనానికి ఆశగా ఎదురుచూసే ప్రకృతిని హృద్యంగా, కొంత కరుణాత్మకంగా వర్ణించే కవిత”
“అచ్చం నాలానే” -మళ్ళ కారుణ్య కుమార్, అమ్మవారి పుట్టుగ (గ్రామం), శ్రీకాకుళం
“వయసు ఒక అనిరిర్ధారిత సంఖ్య” - ప్రొఫెసర్ దుర్గా శశికిరణ్ వెల్లంచేటి, Bangalore, India-
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement