ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌పై కాంగ్రెస్‌ నేత వివాదాస్పద వ్యాఖ్యలు | Gajjela Kantham Sensational Comments On IAS Smita Sabharwal | Sakshi
Sakshi News home page

ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌పై కాంగ్రెస్‌ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Published Wed, Apr 23 2025 9:56 PM | Last Updated on Wed, Apr 23 2025 9:59 PM

Gajjela Kantham Sensational Comments On IAS Smita Sabharwal

సాక్షి,హైదరాబాద్‌: కంచె గచ్చిబౌలి భూముల వ‍్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన ధిక్కార స్వరాన్ని వినిపించిన ఐఏఎస్‌ అధికారి స్మిత సబర్వాల్‌పై కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. ‘ఆమె ఏం యాక్షన్ చేస్తుందబ్బా.. ఆమె ఐఏఎస్ అధికారిణి!’ అంటూ వ్యవంగంగా మాట్లాడారు.

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌ సోషల్‌మీడియా రీట్వీట్లను ప్రస్తావించారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటి ప్రభుత్వ నిర్ణయాలను ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం 13 ఏళ్లలో 13 లక్షల చెట్లను నరికిందని ఆరోపించారు. ఆ చెట్లను నరికి వేసినప్పుడు స్మితా సబర్వాల్‌ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు. సోషల్‌ మీడియా పోస్టులు ఎందుకు పెట్టలేదని పునరుద్ఘాటించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement