Top Stories
ప్రధాన వార్తలు

పోలీసు కేసులు ప్రజాదరణను దూరం చేయలేవు!
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఒక వ్యాఖ్య చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఏమవుతుందని ప్రశ్నించారు. జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచి వేయలేరని ఆయన స్పష్టం చేశారు. గతంలో తనను 16 నెలలు జైలులో పెట్టారని, పార్టీని నడిపే పరిస్థితి లేకుండా చేశారని, అయినా ప్రజలు ఆశీర్వదించారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో పార్టీ ఉందని, ఎన్ని కేసులు పెడితే ప్రజలు అంత తీవ్రంగా స్పందిస్తారని పేర్కొన్నారు. జగన్ వ్యాఖ్యలు హేతుబద్దమైనవి. మద్యం కేసుతో పాటు సీనియర్ పోలీసు అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్టు చేయడంపై ఆయన స్పందించారు. ఒక్కసారి గతంలోకి వెళితే 2011లో జగన్ కాంగ్రెస్ ఎంపీగా ఉండే వారు. తండ్రి మరణం తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన సొంతంగా పార్టీని స్థాపించుకోవాలని నిర్ణయించుకుని పదవికి రాజీనామా చేశారు. కడప లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో 5.45 లక్షల ఓట్ల అధిక్యతతో విజయం సాధించి జగన్ సంచలనం సృష్టించారు. అప్పుడు కూడా కాంగ్రెస్, టీడీపీలు కలిసే కుట్ర చేశాయి. జగన్ను ప్రజా క్షేత్రంలో ఓడించాలేమన్న భయంతో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా వ్యవహరించి కాంగ్రెస్కు అండగా నిలిచారు. ఆ తర్వాత జగన్ కంపెనీలతో సంబంధం లేని కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరరావుతో హైకోర్టులో ఫిర్యాదు చేయించడం, దానికి టీడీపీ మద్దతివ్వడం, ఆ వెంటనే హైకోర్టు ఆ కేసును సీబీఐకి అప్పగించడం జరిగిపోయాయి.తదుపరి సీబీఐ కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ముఖ్యంగా సోనియాగాంధీ ఆదేశాల ప్రకారం వ్యవహరించి జగన్ను జైలులో పెట్టింది. బెయిల్ రాకుండా కూడా అడ్డుపడ్డారు. చివరికి 16 నెలల తర్వాత బెయిల్ లభించింది. అయినా ఆయన రాజకీయంగా నిలబడ్డారు. జైలులో ఉన్నప్పుడు జరిగిన 18 ఉప ఎన్నికలలో 15 చోట్ల జగన్ పార్టీ విజయ దుంధుభి మొగించింది. ఆ అనుభవాలను మననం చేసుకుంటే సరిగ్గా అదే రీతిలో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వైసీపీ నేతలపై, కొందరు అధికారులపై కేసులు పెడుతున్నట్లు కనిపిస్తుంది. కూటమి అధికారంలోకి రాగానే రాజకీయ ముద్ర వేసి కొందరు అధికారులను సస్పెండ్ చేయడం చేశారు. పోస్టింగులు ఇవ్వకుండా వేధించారు. ఒక మోసకారి నటిని పట్టుకు వచ్చి పోలీసు ఉన్నతాధికారిపై కేసు పెట్టించి, తదుపరి ఆయనను జైలులో పెట్టారు. మరో వైపు అనేక మంది వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెడుతూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఇందు కోసం కొందరు రిటైర్డ్ పోలీసు అధికారులను కూడా ఉపయోగించుకుంటున్నారని చెబుతారు. ఆ తర్వాత తమ రెడ్బుక్ను పై స్థాయికి తీసుకు రావడానికి ప్రయత్నాలు ఆరంభించారు. దీనికి తగ్గట్లే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్షాతో కూడా ఈ కేసుపై చర్చించారని అనుకోవాలి. పైకి పోలవరం-బనకచర్ల తదితర అంశాలపై షా ను కలిసినట్లు ఎల్లో మీడియాలో వార్తలు రాయించుకున్నారు. ఆ పత్రికలలోనే జగన్పై మద్యం కేసు విషయంపై కూడా మాట్లాడారని తెలిపారు. అంటే గతంలో కాంగ్రెస్తో కుమ్మక్కై పెట్టినట్లుగానే, ఈసారి బీజేపీతో ఒప్పందమై ఇలాంటిదేదో చేయాలని చూస్తున్నట్లు ఉన్నారు.2014 టర్మ్లో బీజేపీతో పొత్తులో ఉన్నపుడు ప్రధాని మోడీని చంద్రబాబు కలిసినప్పుడల్లా కేవలం జగన్ కేసులపై ఏదో ఒకటి చేయాలని కోరుతుండేవారని, అప్పటి బీజేపీ అధ్యక్షుడు, ఇప్పటి టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆ రోజుల్లో పలుమార్లు చెప్పేవారు. అదే తరహాలో ఇప్పుడు కూడా బీజేపీ పెద్దలతో సంప్రదించి తన కుట్ర ప్లాన్ అమలు చేయాలని తలపెట్టినట్లు అనుమానాలు వస్తున్నాయి. జగన్ పై 2011 లో పెట్టిన కేసులు ఏమిటి? ఆయన కంపెనీలలో కొందరు పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టారని అందులో క్విడ్ ప్రోక్ జరిగిందని సీబీఐ ఆరోపించింది. అయితే ఇందుకు సంబంధించిన ఏ కంపెనీ కూడా జగన్పై ఫిర్యాదు చేయలేదు. అలాగే ప్రభుత్వం, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలతో జగన్కు సంబంధం లేదు. అయినా తన కంపెనీలు ఏర్పాటైన మూడేళ్ల తర్వాత కక్షపూరితంగా కేసులు పెట్టారు. ఇప్పుడు కూడా అదే మోడల్ కనిపిస్తుంది. మద్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఏ డిస్టిలరీ ఫిర్యాదు చేయలేదు. ఎవరో దారినపోయే వ్యక్తి లెటర్ రాయడం, ఆ వెంటనే దానిపై ప్రభుత్వ కార్యదర్శి ఏసీబీ విచారణకు విచారించాలని పంపడం, తదుపరి ఆగమేఘాల మీద కేసు పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో సిట్ అధికారులు బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులను బెదిరించి వాంగ్మూలాలను తీసుకోవడం, వారు హైకోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత వేధింపులు తట్టుకోలేక పోలీసు అధికారులు కోరిన స్టేట్మెంట్ పై సంతకాలు చేశారట. తదుపరి మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డిని ఒక పావుగా వాడుకున్నట్లు అనిపిస్తుంది. ఆయన తనకేదో దీని నుంచి రక్షణ కలుగుతుందని అనుకున్నారో ,ఏమో కాని, రాజ్ కెసిరెడ్డి అన్న మాజీ ఐటి సలహాదారుపై ఆరోపణలు చేశారు.దాంతో విజయసాయిని అదుపులోకి తీసుకోకుండా సిట్ బృందం వదలి వేసింది. ఆ తర్వాత సుప్రీం కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన ఎంపీ మిథున్ రెడ్డిని విచారించారు. ఆయన తన వాదన చాలా స్పస్టంగా వినిపించగలిగారు. ఆధారాలు ఉంటే కోర్టులో రుజువు చేయండని సవాల్ చేశారు. తమ కుటుంబంపై చంద్రబాబు కాని, ఎల్లో మీడియా కాని పగపట్టి ఇటీవలి కాలంలో ప్రచారం చేసిన ఉదంతాలను ఆయన మీడియా ముందు ప్రస్తావించి వాటిలో ఒక్కదానిని కూడా నిరూపించలేకపోయిన విషయాన్ని తెలిపారు. ఆ తర్వాత గోవా నుంచి హైదరాబాద్ వచ్చిన రాజ్ కెసిరెడ్డిని హడావుడిగా అదుపులోకి తీసుకున్నారు. ఎల్లో మీడియాలో ఆయనపై పలు కథనాలు రాయించారు. గోవా నుంచి హైదరాబాద్ వచ్చి, అక్కడ నుంచి చెన్నై ద్వారా విదేశాలకు వెళ్లాలని ఆయన ప్లాన్ చేశారని అర్థం, పర్థం లేని రాతలు రాశారు. నిజంగానే అలా వెళ్లదలిస్తే నేరుగా గోవా నుంచో, లేక దగ్గరలో ఉన్న ముంబై, లేదా చెన్నై వెళ్లి విదేశాలకు పోయి ఉండవచ్చు కదా అన్న ప్రశ్నకు జవాబు దొరకదు. కెసిరెడ్డిని విచారించిన సందర్భంలో కూడా పలు పరస్పర విరుద్దమైన అంశాలను సిట్ రిమాండ్ రిపోర్టులో కనిపించాయి. ఒకసారి ఆయన సీఎంఓ అధికారులకు మద్యం డబ్బు చేరవేసినట్లు, మరోసారి ఆయనే ఆయా కంపెనీలలో పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారట. నాలుగు డిస్టిలరీల నుంచే మద్యం ఎక్కువగా తీసుకోవడంపై రిమాండ్ రిపోర్టులో సందేహం వ్యక్తం చేశారు. మరి అదే తరహాలో చంద్రబాబు ప్రభుత్వంలోను జరిగింది కదా అన్నదానికి రిప్లై లేదు.అన్నిటికి మించి రిమాండ్ రిపోర్టుపై రాజ్ సంతకం పెట్టడానికి నిరాకరించారని కూడా సిట్ తెలియ చేసింది. అలాంటప్పుడు ఆ రిపోర్టుకు ఎంత విలువ ఉంటుంది? కేవలం ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియాలో బానర్లు పెట్టుకుని ఆనందపడడానికి తప్ప. జగన్ పేరేదో ఆయన నేరుగా చెప్పారన్నట్లుగా ప్రచారం చేసిన ఈ మీడియా దానిపై రాజ్ సంతకం లేదన్న అంశానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా జాగ్రత్తపడింది. అంటే దీనర్థం ఏదో రకంగా జగన్ను జనంలో పలచన చేయడం ద్వారా ప్రజలు ఆ అంశంపై చర్చించుకుంటూ, చంద్రబాబు అండ్ కో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను మర్చిపోవాలనే కదా! మరో సంగతి చెప్పాలి. విజయసాయి తననేదో వదలి వేస్తారని అనుకున్నట్లు ఉన్నారు. రాజ్ అరెస్టు కాగానే ఆయన ఒక కామెంట్ చేశారట. దొరికిన దొంగలు, దొరకని దొంగలు అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయన కూడా నిందితుడే అయినందున ఏ తరహా కిందకు వస్తారో తేల్చుకోవాలి. ఒకటి మాత్రం వాస్తవం. ప్రజలలో కూటమి సర్కార్ పై విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తోంది. అదే టైమ్లో జగన్ ఎక్కడకు వెళ్లిన వేల సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. అంటే భవిష్యత్తులో తన పార్టీకి, తన వారసులకు జగన్ పెద్ద బెడద అవుతారని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే ఈ రకమైన కక్ష రాజకీయాలు చేస్తున్నారు.అమిత్ షా తో కూడా ఇదే అంశంపై మాట్లాడడానికి ఢిల్లీ వెళ్లారంటే ఆయనకు ప్రజలకు ఇచ్చిన హామీలకన్నా, జగన్ను ఎలాగొలా ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యం ఉన్నట్లు అర్థం అవుతోంది కదా! ఇవన్ని గమనించిన తర్వాత జగన్ పీఏసీ సమావేశంలో మాట్లాడినట్లు ఆయన కాని, వైసీపీ శ్రేణులు కాని అన్నిటికి సిధ్దమైనట్ల స్పష్టం అవుతోంది కదా! ఇదే చంద్రబాబుకు అతి పెద్ద సవాల్!- కొమ్మినేని శ్రీనివాస రావు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. 38 మంది మావోయిస్టులు మృతి!
సాక్షి, ములుగు: తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ఆపరేషన్ కొనసాగుతోంది. ఐదో రోజు కూంబింగ్లో భాగంగా మావోయిస్టులకు భారీ షాక్ తగిలింది. భద్రతా బలగాల ఆపరేషన్లో ఛత్తీస్గఢ్వైపు భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు దూసుకెళ్తున్నాయి. ఐదో రోజులుగా కూంబింగ్ కొనసాగుతోంది. బలగాలకు దిశానిర్దేశం చేస్తూ గగనతలంలో హెలికాప్టర్లు, డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో శనివారం దాడుల్లో భాగంగా 38 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. శుక్రవారం తుపాకులు, బాంబుల శబ్దాలు మారుమోగాయి. ఉదయం ఏడు గంటల నుంచే నాలుగు వైమానిక దళ హెలికాప్టర్లు చక్కర్లు కొట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. గత రాత్రి 10 గంటల వరకు భారీ కాల్పులు, బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించాయని అన్నారు. దీంతో, సమీప గ్రామాల ప్రజల్లో ఆందోళన చెందుతున్నారు.మరోవైపు.. కూంబింగ్లో నిమగ్నమైన జవాన్లు ఎండల బారినపడుతున్నారు. నాలుగు రోజులుగా అడవుల్లోనే మకాం వేయడంతో ఇప్పటికే 15 మంది అస్వస్థతకు గురికాగా, శుక్రవారం మరో ఐదుగురిని హెలికాప్టర్లో వెంకటాపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ముగ్గురిని మెరుగైన చికిత్సకు భద్రాచలం తరలించారు. ఆపరేషన్ కర్రెగుట్టల గాలింపుతో అభయారణ్యం పరిసర గ్రామాల్లో జవాన్లు ఆంక్షలను విధించడం చర్చనీయాంశంగా మారింది. సమీప వ్యవసాయ క్షేత్రాలు, నీటి నిల్వ ప్రాంతాలకు వెళ్లినా హెచ్చరిస్తున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు.ఇక, తెలంగాణ, చత్తీస్గఢ్ సరిహద్దుల్లో కొనసాగుతున్న కర్రెగుట్ట ఆపరేషన్ ను వెంటనే ఆపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మావోయిస్టులు లేఖ రాశారు. తక్షణమే ఆ ఆపరేషన్ ఆపి శాంతి చర్చలకు ముందుకు రావాలని మావోయిస్టులు విజ్క్షప్తి చేశారు. మావోయిస్టు బస్తర్ ఇంచార్జి రూపేష్ పేరిట ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. తెలంగాణ సరిహద్దుల్లో కొనసాగుతున్న సైనిక ఆపరేషన్ ను వెంటనే ఆపాలని ఆ లేఖలో విజ్క్షప్తి చేశారు.గత కొంతకాలం నుంచి మావోయిస్టుల, కేంద్ర ప్రభుత్వం మధ్య శాంతి చర్చలు జరగాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి మావోయిస్టులో శాంతి చర్చలు జరపాలని ఏఐటీయూసీ కోరుతోంది. దీనిలో భాగంగా ఈనెల రెండో వారంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం, మావోయిస్టులు శాంతి చర్చలు జరుపుకోవాలని భేషరతుగా ఎదురు కాల్పులు విరమించుకోవాలని సూచించారు. అయితే తాజాగా మావోయిస్టులు.. ఈ మేరకు లేఖ రాశారు. తమతో శాంతి చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలన్నారు.

ఇండియన్ ఆర్మీ ఆన్ ఫైర్.. కశ్మీరీ ఉగ్రవాదుల ఇళ్లు నేలమట్టం
శ్రీనగర్: పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత భద్రతా బలగాలు ప్రతీకార చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో.. శుక్రవారం ఐదుగురు కశ్మీరీ ఉగ్రవాదుల ఇళ్లను అధికారులు నేలమట్టం చేశారు. సోఫియాన్, కుల్గాం, పుల్వామా జిల్లాల్లో.. కశ్మీరి ఎల్ఈటీ ఆపరేటివ్స్పై ఉక్కుపాదం మోపే క్రమంలోనే సైన్యం ఈ చర్యలకు ఉపక్రమించింది.పుల్వామాలో ఎసాన్ ఉల్ హక్, షోపియాన్లోని చోటీపోరాలోని షాహిద్ అహ్మద్ , కుల్గాంలో జకీర్ గని ఇళ్లు బుల్డోజర్, పేలుడు పదార్థాల సాయంతో నేలమట్టం చేశారు. సోషియాన్లో చోటిపోరా గ్రామంలో ఎల్టీ కమాండర్ షాహిద్ అహ్మద్ కుట్టే నివాసానికి బుల్డోజర్ సాయంతో నేలమట్టం చేసినట్లు సమాచారం. షాహిద్ అహ్మద్ గత నాలుగు ఏళ్లుగా జమ్ములో జాతి వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నాడు. కుల్గాంలోని మటలం ఏరియాలో జహిద్ అహ్మద్(జకీర్ గని) నివాసాన్ని కూల్చేశారు. #BreakingNews : The house of LeT militant Shahid Ahmad, Kuty resident of #Chotipora #Shopian active since 2022 , was destroyed in a blast in Chotipora area of Shopian. pic.twitter.com/DT79ZJ7vxb— The Lal Chowk Journal (@LalChowkJournal) April 26, 2025పుల్వామా ముర్రాన్ ప్రాంతంలో ఎషన్ ఉల్ హక్ ఇంటిని పేలుడు పదార్థాలతో నేలమట్టం చేశారు. 2018 నుంచి పాక్లో ఉగ్రశిక్షణలో ఉన్న అషన్.. ఈ మధ్యే తిరిగి కశ్మీర్లో అడుగు పెట్టినట్లు నిఘా వర్గాల సమాచారం. ఎల్ఈటీ ఉగ్రవాది ఇషాన్ అహ్మద్ షేక్కు సంబంధించిన రెండంతస్తుల భవనాన్ని కూడా నేలమట్టం చేశారు. ఇక.. పుల్వామా కాచిపోరా ప్రాంతంలో హరిస్ అహ్మద్ అనే ఉగ్రవాది ఇంటిని అధికారులు పేలుడుతో కుప్పకూల్చారు.ఇదిలా ఉంటే.. అంతకుముందు జమ్ము కశ్మీర్ లోకల్ టెర్రరిస్టులు ఆసిఫ్ షేక్, అదిల్ మహమ్మద్ ఇళ్లను తనిఖీలు చేసిన టైంలో.. అందులో అమర్చిన పేలుడు పదార్థాల ధాటికి ఇద్దరి ఇళ్లు పాక్షికంగా నేలమట్టం అయ్యాయి. ఇది సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని ఆ ఇద్దరి చేసిన ప్లాన్గా భారత బలగాలు భావిస్తున్నాయి.ఇక.. అసిఫ్ షేక్ సోదరి మీడియాతో మాట్లాడుతూ.. తన సోదరుడు ముజాహుద్దీన్ అని వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఆసిఫ్ సోదరితమ ఇల్లు నేలమట్టం కావడంతో.. ప్రస్తుతం ఆమె బంధువుల ఇంట్లో ఆశ్రయం పొందుతోందట. ఇక అసిఫ మరో సోదరుడు ప్రస్తుతం జైలులో ఉన్నట్లు వెల్లడించింది ఆమె.

జోక్ కాదు.. పాక్ క్రికెట్తో సంబంధాలన్నీ తెంచుకోండి: గంగూలీ
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ క్రికెట్తో సంబంధాలన్నీ తెంచుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి సూచించాడు. కాగా జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు మంగళవారం పాశవిక దాడికి తెగబడిన విషయం తెలిసిందే.ప్రశాంతమైన బైసరన్ లోయలో 26 మంది పర్యాటకులను లష్కర్-ఎ-తొయిబా ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ క్రమంలో భారత్- పాక్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. 2008 తర్వాత టీమిండియా ఒక్కసారి కూడా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లలేదన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పాక్ 2013లో భారత పర్యటనకు వచ్చింది.అనంతరం దాయాది దేశాల పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేకపోవడంతో ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు నిలిచిపోయాయి. అయితే, ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్ టోర్నీల్లో మాత్రం భారత్- పాక్ (Ind vs Pak) ముఖాముఖి తలపడుతున్నాయి. కానీ తాజాగా పహల్గామ్ ఘటన నేపథ్యంలో సంబంధాలు పూర్తిగా తెగిపోయే పరిస్థితి వచ్చింది.సంబంధాలు తెంచుకోవాలిఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ‘‘అవును.. వందకు వంద శాతం పాకిస్తాన్తో అన్ని సంబంధాలు తెంచుకోవాలి. కఠిన చర్యలు చేపట్టాలి. ప్రతి ఏడాది ఇలాంటి ఘటనలు జరగడాన్ని తేలికగా తీసుకోవద్దు. ఇదేమీ జోక్ కాదు. ఉగ్రవాదాన్ని సహించకూడదు. టెర్రరిజంను తుడిచిపెట్టేయాలి’’ అని పేర్కొన్నాడు.ఇక బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఇప్పటికే పాక్తో భవిష్యత్తులోనూ ద్వైపాక్షిక సిరీస్లు ఉండబోవని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఐసీసీ నిబంధనలకు అనుగుణంగా ప్రస్తుతం దాయాదితో ఆడుతున్నామని.. అయితే, పరిస్థితులన్నింటినీ ఐసీసీ కూడా గమనిస్తోందని తెలిపారు. భారత ప్రభుత్వం చెప్పినట్లే తాము నడుచుకుంటామని స్పష్టం చేశారు.ముక్తకంఠంతో ఖండించిన క్రీడా లోకంకాగా పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను భారత క్రీడా లోకం ముక్తకంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. ‘‘బాధిత కుటుంబాలు ఊహించలేని కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఈ కష్టకాలంలో భారత్తో పాటు యావత్ ప్రపంచం వారికి అండగా నిలుస్తోంది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తేలియజేస్తున్నా. న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నా’’ అని టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు.ఇక విరాట్ కోహ్లి సైతం.. ‘‘ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు శాంతి, బలం చేకూరాలని ప్రార్థిస్తున్నా. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నా. ఇలాంటి క్రూరమైన చర్యకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు.మరోవైపు.. ‘‘అమాయకులైన పర్యాటకులపై దాడి హేయమైన చర్య. దీనికి రాబోయే కాలంలో మన ధైర్యవంతమైన సైనికులు గట్టి బదులిస్తారు. జమ్మూకశ్మీర్లో శాంతికి భంగం కలగించాలనుకునే వారి ప్రణాళికలు ఎప్పటికీ విజయవంతం కావు’’ అని బాక్సర్ విజేందర్ సింగ్ తన స్పందన తెలియజేశాడు.భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు స్పందిస్తూ.. ‘‘పహల్గామ్ ఉగ్ర దాడి బాధితుల కోసం నా హృదయం తపిస్తోంది. ఎలాంటి కారణమైనా.. ఇంత క్రూరత్వాన్ని సమర్థించదు. బాధితుల దుఖం మాటల్లో చెప్పలేనిది. కానీ వారు ఒంటరి వారు కాదు. వారి వెంట యావత్ దేశం ఉంది. క్లిష్ట సమయంలో ఒకరికొకరు అండగా నిలుద్దాం. శాంతి పునరుద్ధరణ తప్పక జరుగుతుంది’’ అని పేర్కొంది.చదవండి: PSL 2025 Live Suspended: పాకిస్తాన్కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..

ట్రంప్ యూటర్న్.. అమెరికాలో విదేశీ విద్యార్థులకు గుడ్న్యూస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు విదేశీ విద్యార్థుల బహిష్కరణపై ట్రంప్ వెనక్కి తగ్గారు. తమ వీసాలు రద్దు చేయడంతో విదేశీ విద్యార్థులు అక్కడి న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో, విద్యార్థులకు అనుకూలంగా తీర్పులు రావడంతో ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు.వివరాల ప్రకారం.. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్న వందల మంది విద్యార్థులకు ఊరట లభించింది. అయితే, అమెరికాలో విదేశీ విద్యార్థులపై ట్రంప్ బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వివిధ కారణాలతో 187 కాలేజీలకు చెందిన 1200 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసా (Student Visa) లేదా వారి చట్టబద్ధ హోదాలను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో తమ వీసాల రద్దుపై విద్యార్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారు.అనంతరం.. కాలిఫోర్నియా, బోస్టన్ కోర్టుల్లో విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన ఆయా న్యాయస్థానాలు.. విద్యార్థుల వీసా రద్దును ఆపాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ట్రంప్ యంత్రాంగం చర్యలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ క్రమంలోనే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్.. ఆయా విద్యార్థుల చట్టబద్ధ హోదాను తాత్కాలికంగా పునరుద్ధరించింది. ఈమేరకు అమెరికా ప్రభుత్వానికి చెందిన ఓ న్యాయవాది తాజాగా వెల్లడించారు. దీంతో ఆయా విద్యార్థులకు చట్టబద్ధ హోదా లభిస్తుందన్నారు.ఇదిలా ఉండగా.. విదేశీ విద్యార్థులపై బహిష్కరణ వేటు కారణంగా డిపోర్టేషన్, నిర్బంధం ముప్పు పొంచి ఉండటంతో ఆ విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వీరిలో కొంతమంది ఇప్పటికే అమెరికాను వీడగా.. కొందరు రహస్య ప్రదేశాల్లో తల దాచుకున్నారు. తాజాగా కోర్టు వ్యాఖ్యలతో ట్రంప్ (Donald Trump) సర్కారు వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్పై దాడి.. పది మంది సైనికులు మృతి
ఢిల్లీ: పాకిస్తాన్ ఆర్మీకి మరోసారి బిగ్ షాక్ తగిలింది. బెలుచిస్తాన్లో పాక్ ఆర్మీపై దాడి జరిగింది. పాక్ ఆర్మీ కాన్వాయ్పై బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(Baloch Liberation Army-BLA)దాడి చేసింది. ఈ ఘటనలో 10 మంది పాకిస్తాన్ సైనికులు మృతిచెందినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. పాకిస్తాన్కు చెందిన బెలూచిస్థాన్ ప్రావిన్స్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాక్ ఆర్మీ కాన్వాయ్పై బెలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ దాడి చేశారు. ఈ దాడిలో కనీసం 10 మంది పాకిస్తాన్ సైనికులు మృతిచెందినట్టు సమాచారం. ఆర్మీ కాన్వాయ్లోని ఒక వాహనం పూర్తిగా ధ్వంసమైపోయింది. కాగా, ఇది బెలూచ్ విప్లవకారుల తాజా యుద్ధ ప్రకటనగా చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీఎల్ఏ స్వయంగా విడుదల చేసింది. ఈ వీడియోలో పేలుళ్లు, కాల్పుల శబ్దాలు, నాశనమైన పాక్ ఆర్మీ వాహనాలు కనిపిస్తున్నాయి.🚨 The Baloch Liberation Army (BLA) has taken responsibility for an improvised explosive device (IED) attack on a Pakistani Army convoy in Margat, near Quetta, on April 25, 2025. According to BLA spokesperson Jeeyand Baloch, the attack was carried out using a remote-controlled… pic.twitter.com/9SmHRfTcyr— The Tradesman (@The_Tradesman1) April 26, 2025ఇక, ఈ దాడితో పాటు బీఎల్ఏ మరోసారి పాకిస్తాన్ ఆర్మీకి భారీ హెచ్చరిక జారీ చేసింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. పాక్ ఆర్మీకి ఇకపై భద్రత ఉండదు. మేం మా హక్కుల కోసం చివరి వరకు పోరాడతాం.. అంటూ వారు ప్రకటించారు. అయితే, పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఈ ఘటనపై అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ ఘటన తర్వాత సైనిక వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. బెలూచిస్థాన్లో భద్రతా వ్యవస్థ మరింత కఠినంగా అమలు చేయబోతున్నట్టు సమాచారం.Always a big fan of video editing skills of Baloch Liberation Army 😉https://t.co/LFu7OiouoD— Kriti Singh (@kritiitweets) April 25, 2025ఇదిలా ఉండగా.. ఎన్నో దశాబ్దాలుగా స్వతంత్ర బెలూచిస్థాన్ కోసం బీఎల్ఏ పోరాడుతోంది. ఈ క్రమంలో పాక్ ప్రభుత్వం తమ హక్కులు దూరం చేస్తున్నదని ఆరోపిస్తూ వరుస దాడులకు పాల్పడుతోంది. గత కొన్ని నెలలుగా BLA కార్యకలాపాలు మరింత ఉధృతంగా మారాయి. ఈ దాడి తర్వాత పాక్లో పరిస్థితి అత్యంత అస్థిరంగా మారింది. తాజా దాడి నేపథ్యంలో ప్రజల్లో భయం, భద్రతా వర్గాల్లో ఆందోళన నెలకొంది.10 🐖 s gone! Well done Baloch Liberation Army #Pakistan #PahalgamTerroristAttack #TerrorAttack #Baloch #Kashmir pic.twitter.com/ZavhIoEBjx— Adri chatterjee (@stay_fit_mate) April 26, 2025

'నెక్ట్స్ వేకేషన్ జమ్మూ కశ్మీర్లోనే'.. కేఎల్ రాహుల్ మామ సంచలన కామెంట్స్!
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి సంచలన కామెంట్స్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తన వేకేషన్ను జమ్మూ కశ్మీర్లోనే ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. కాశ్మీర్ లోయలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి.. ఉగ్రవాదంపై పోరాటానికి భారతీయులంతా ఏకం కావాలని ఆయన కోరారు. ముంబయిలో జరిగిన లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు- 2025 వేడుకకు హాజరైన ఆయన పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. కాశ్మీర్ ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగమని.. ఇలాంటి సమయంలోనే మనం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎవరూ కూడా భయానికి కానీ.. ద్వేషానికి కానీ లోనుకావద్దని దేశ ప్రజలను సునీల్ శెట్టి కోరారు.సునీల్ శెట్టి మాట్లాడుతూ.. "మనం మానవాళికి చేసే సేవే భగవంతుని సేవ. సర్వశక్తిమంతుడు అన్నీ చూసి ప్రతిస్పందిస్తాడు. ప్రస్తుతం మనం భారతీయులుగా ఐక్యంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. భయం, ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్న వారి వలలో మనం పడకూడదు. ఇలాంటి సమయంలోనే మనమంతా ఐక్యంగా ఉండాలి. కశ్మీర్ మనదే.. ఎల్లప్పుడూ మనదే అని వాళ్లకి మనం చూపించాలి. అందుకే కాశ్మీర్లో తన విహారయాత్రను ప్లాన్ చేసుకుంటున్నా. మీరు కూడా కశ్మీర్లో పర్యటించాలని భారతీయ పౌరులను కోరుతున్నా. ఒక పౌరుడిగా మనం ఈ పని చేయాలి. మన తదుపరి వేకేషన్ కశ్మీర్లోనే ఉండాలి. ఎందుకంటే మనం భయపడలేదని.. మనకు భయం లేదని వారికి చూపించాలి' అని పిలుపునిచ్చారు.ఇప్పటికే తాను అధికారులను సంప్రదించానని.. అవసరమైతే కశ్మీర్లో పర్యటించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సునీల్ పేర్కొన్నాడు. తమ సినిమాలను సైతం అక్కడే షూటింగ్ నిర్వహిస్తామని అధికారులకు వివరించినట్లు వెల్లడించారు. ఎందుకంటే మన కశ్మీరీలు ఎప్పటికీ మనకు తోడుగా నిలుస్తారని సునీల్ శెట్టి అన్నారు. ఉగ్రదాడి తర్వాత కశ్మీర్ ప్రాంతం నుంచి పర్యాటకులు తరలివెళ్లడంతో అక్కడి స్థానికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలోనే సునీల్ శెట్టి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లోని బైసారన్ లోయ వద్ద పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు.. 26 మందిని హతమార్చారు. ఈ ఘటనతో యావత్ భారతదేశం షాకింగ్కు గురైంది. View this post on Instagram A post shared by Visitkashmirtravel In (@visitkashmirtravel.in)

ఏడాదిలో రూ.21.16 లక్షల కోట్లు గీకారు!
క్రెడిట్ కార్డు వ్యయం 2025 ఆర్థిక సంవత్సరంలో అనూహ్యంగా పెరిగి రికార్డు స్థాయిలో రూ.21.16 లక్షల కోట్లకు చేరుకుంది. వినియోగదారుల డిమాండ్, డిజిటల్ లావాదేవీలకు పెరుగుతున్న ప్రాధాన్యత కారణంగా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 15% పెరుగుదలను నమోదు చేసింది. రుణ ఆధారిత వినియోగం అధికం అవుతుండడానికిగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.పట్టణ, డిజిటల్ పరిజ్ఞానం ఉన్న వినియోగదారులు విచక్షణా వ్యయం కోసం క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. ముఖ్యంగా ఈ-కామర్స్, ట్రావెల్, డైనింగ్ వంటి రంగాల్లో దీన్ని అధికంగా ఉపయోగిస్తున్నారు.ఆన్లైన్ చెల్లింపులపై ఆసక్తి చూపడం క్రెడిట్ కార్డు వినియోగానికి ఆజ్యం పోసింది. మూడింట రెండొంతుల లావాదేవీలు డిజిటల్ రూపంలో జరుగుతున్నాయి.వ్యయాల పెరుగుదల ఆర్థిక వ్యవస్థపై స్థిరమైన విశ్వాసాన్ని సూచిస్తుంది.ఇదీ చదవండి: లేటరల్ ఎంట్రీ నియామకాలకు నోటిఫికేషన్2025 మార్చి నాటికి చలామణిలో ఉన్న క్రెడిట్ కార్డుల సంఖ్య 10.98 కోట్లకు చేరింది. ఇది ఏడాది క్రితం 10.18 కోట్లుగా ఉండేది. కొత్త కార్డుల జారీ బ్యాంకుల వారీగా భిన్నంగా ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్స్ వంటి ప్రముఖ సంస్థలు గణనీయమైన పెరుగుదలను నమోదు చేయగా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్ వంటి ఇతర సంస్థలు రెగ్యులేటరీ సవాళ్లు, భాగస్వామ్యాల్లో మార్పుల కారణంగా కార్డుల జారీలో క్షీణతను ఎదుర్కొన్నాయి. అన్ సెక్యూర్డ్ రుణాలకు సంబంధించిన రిస్క్లను తగ్గించడానికి బ్యాంకులు క్రెడిట్ క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నాయి. బ్యాంకులు ఇప్పటికే ఉన్న వినియోగదారులకు ఆర్థిక ఉత్పత్తులను క్రాస్-సెల్లింగ్ చేయడంపై దృష్టి పెడుతున్నాయి.

భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్!
వాషింగ్టన్: జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో సంవత్సరాలుగా నలుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయి అని ట్రంప్ చెప్పుకొచ్చారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా రోమ్ పర్యటనకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్టులో భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతపై ట్రంప్ను మీడియా ప్రశ్నించింది. ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ అంటే నాకు ఎంతో గౌరవం. అలాగే పాకిస్తాన్ కూడా నాకు చాలా దగ్గర. రెండు దేశాలతో నేను సన్నిహితంగా ఉంటాను. కశ్మీర్ విషయంలో భారత్, పాక్ల మధ్య చాలా ఏళ్లుగా ఘర్షణలు జరుగుతున్నాయి. అయితే, ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయి. ఈ విషయంలో ఇంతకంటే ఎక్కువగా చేసేదేమీ లేదు. ఇక, పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి చెత్త పని. ఉగ్రవాదుల దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం విచారకరం’ అని వ్యాఖ్యలు చేశారు.#WATCH | On #PahalgamTerroristAttack, US President Donald Trump says, "I am very close to India and I'm very close to Pakistan, and they've had that fight for a thousand years in Kashmir. Kashmir has been going on for a thousand years, probably longer than that. That was a bad… pic.twitter.com/R4Bc25Ar6h— ANI (@ANI) April 25, 2025అంతకుముందు ట్రంప్.. కశ్మీర్ పహల్గాం ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు అమెరికా మద్దతుగా నిలుస్తుంది. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలి. ప్రధాని మోదీ, భారత ప్రజలకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. అమెరికాలో భారత్ అంశంపై ప్రశ్నించిన పాక్ జర్నలిస్టుకు భంగపాటు ఎదురైంది. పహల్గాం ఘటన తర్వాత భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొనడంపై అమెరికా విదేశాంగ ప్రతినిధి టామ్మీ బ్రూస్ను ఓ పాక్ జర్నలిస్టు అడిగాడు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నేను దానిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయను. మనం ఇంకో సబ్జెక్టు మాట్లాడుకుందాం. ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్, మంత్రి మార్కో రూబియో మాట్లాడారు. అందుకే ఆ విషయంపై నేను మాట్లాడను. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తాను. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తాను. ఈ హీనమైన దాడికి పాల్పడిన వారికి శిక్ష పడాలని కోరుకుంటాను. పరిస్థితులు వేగంగా మారుతున్నట్లు మనం చూస్తున్నాం. వాటిని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాం. జమ్మూకశ్మీర్పై ఎటువంటి పొజిషన్ తీసుకోలేదు’ అని పేర్కొన్నారు.

Yoga: మానసిక శక్తిని పెంచే శ్వాస
నాసిక రంధ్రాల ద్వారా శ్వాసను లోపలికి తీసుకుంటూ, తిరిగి వదులుతూ చే సే ప్రాణామాయ పద్ధతులలో ముఖ్యమైనవి నాలుగు ఉన్నాయి. వాటిలో.. కపాలభాతి: ఈ ప్రాణాయామంలో వేగంగా ఊపిరి తీసుకోవడం, వదలడం ఉంటుంది. ఈ విధానం వల్ల జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. శ్వాసకోశ కండరాలు బలోపేతం అవుతాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. దీని వల్ల చేసే పనిపైన శ్రద్ధ, సృజనాత్మకత పెరుగుతుంది. ఒక ప్రశాంతమైన స్థలంలో సుఖాసనంలో కూర్చొని, ముక్కు ద్వారా శ్వాస పీల్చుతూ, వదులుతూ ఉండాలి. భస్త్రిక: ఈ ప్రాణాయామం ద్వారా శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచవచ్చు. నోటిద్వారా శ్వాసను తీసుకొని, నోటిద్వారా వదలాలి. ఈ ప్రక్రియను పది–పదిహేను సార్లు పదే పదే చేయాలి. భ్రామరి: ఈ ప్రాణాయామం ద్వారా మనస్సు ప్రశాంతంగా మారుతుంది. నోటితో తేనెటీగలాగ హమ్ చేస్తూ .. నాసిక రంధ్రాల ద్వారా గాలి పీల్చుకొని, నెమ్మదిగా వదలాలి. ఆరోగ్య సమస్యలు ఉన్న వారు వైద్యులను సంప్రదించి, నిపుణుల సలహాతో వీటిని సాధన చేయడం వల్ల మెరుగైన ఫలితాలను పొందదుతారు.
ఇదే నా ఇల్లు.. నాకు లేదా ఇందిరమ్మ ఇల్లు?
నా నియోజకవర్గంలో నువ్వు వేలు పెట్టడం ఏంటి?
సింహాల వయసుని ఎలా లెక్కిస్తారు? మీకు తెలుసా?
‘నీవు వచ్చేంత వరకూ ఇక్కడే ఉంటా తల్లీ’
రన్యారావుకు మరిన్ని కష్టాలు .. ఆ చట్టంతో ఇక బెయిల్ కష్టమే!
మారుతీ సుజుకీ వెనకడుగు..
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
సీఎం అవ్వాలనే ఆశ నాకు లేదు: కేటీఆర్
కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. 38 మంది మావోయిస్టులు మృతి!
పోలీసు కేసులు ప్రజాదరణను దూరం చేయలేవు!
చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ హిస్టరీలోనే
బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయమన్నా పోయరు!
ప్రాణాలు కాపాడిన ఉప్పు
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. మండిపడ్డ నెటిజన్స్!
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
సికింద్రాబాద్: గోదాంలో భారీగా నోట్ల కట్టలు కలకలం
తల్లికి వందనం డబ్బులు అడిగితే సంపద సృష్టించే మార్గం చెవిలో చెప్పండని వెళ్లిపోతున్నాడు!
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
IPL 2025: ప్లే ఆఫ్స్ రేసు.. ఏ జట్టు ఎన్ని మ్యాచ్లు గెలవాలంటే?
మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే..
SRH Vs CSK: గెలిచి నిలిచిన రైజర్స్
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
PSL: పాకిస్తాన్కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..
పాకిస్తాన్కు వెళ్లిపోయిన కేన్ మామ
కోడలికి రెండో పెళ్లి చేసి, కన్నీటితో సాగనంపిన ‘మామగారు’
బీరప్పా.. నువ్వు గ్రేటప్పా!
తెలంగాణకు వర్షసూచన.. ఐదు రోజులు ఈ జిల్లాల్లో గట్టి వానలే..
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
వాళ్ల సంగతేమోగానీ! వలసదారులపై మీదాడి గురించి ప్రపంచం కూడా సంతోషంగా లేదు
కొడుకు అందంగా పుట్టాడని వేధింపులు
మళ్లీ ఉగ్ర కాండ!
యాహూ! ఎట్టకేలకు భారతీయురాలిగా..! వీడియో వైరల్
సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడమే: పాక్
ఏపీ గవర్నర్ను కలిసిన వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ
విరాట్ కోహ్లి తొందరపడ్డాడు.. అప్పటి వరకు ఆడాల్సింది: సురేష్ రైనా
Sodara Review: సంపూర్ణేష్ బాబు ‘సోదరా’ మూవీ రివ్యూ
మెగా అగచాట్ల డీఎస్సీ!
పహల్గాం ఉగ్రదాడిపై పాక్ ఉప ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ఇద్దరు వధువులు.. ఒక వరుడు
Pahalgam: ‘ఆ వీడియోలో ఉన్నది మేమే.. వినయ్ సార్ కాదు’
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్!
నా భార్య వర్షిణి ఎక్కడ?.. ప్రత్యేక బ్యారెక్లో అఘోరీ అరుపులు, కేకలు!
ఒక్కరంటే పర్లేదు.. అందరూ అంతే: అసంతృప్తి వెళ్లగక్కిన ధోని
టాపర్ కాస్త హంతకుడిగా..
ఔను.. చెత్త పనులు చేశాం.. తప్పు ఒప్పుకున్న పాక్
అవినీతి 'ఐకానిక్'!
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
ఒకే ఇల్లు.. ఒకే వంట
పాక్ను ముక్కలు చేయండి
పిల్లపామును పెంచి పోషిస్తున్న హఫీజ్ సయ్యద్!
ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోండి
ఉద్యోగంలో ఉంటారా? ప్యాకేజీ తీసుకొని వెళ్తారా?
పహల్గాం ఘటన.. పాక్ కపట నాటకం
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
బయోమెట్రిక్స్, చిరునామా
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
చిరంజీవి సినిమాలో విలన్గా టాలీవుడ్ యంగ్ హీరో!
‘గోల్డెన్ ఛాన్స్ మిస్.. బుర్ర పనిచేయడం లేదా’?!.. కావ్యా మారన్ ఫైర్!
పాకిస్తానీలు వెంటనే మీ దేశానికి వెళ్లండి: తెలంగాణ డీజీపీ
ఉగ్రదాడి ఘటనపై నోరు జారిన ఎమ్మెల్యే అరెస్ట్
ఇక్రమ్.. ఇంకా ఇక్కడే!
నిశ్చితార్థం చేసుకుని ఏడాది.. మరి పెళ్లెప్పుడు?
ఐటీఆర్ ఫైలింగ్కు వేళాయే..
పహల్గాం ఘటన: ఎల్ఐసీ కీలక ప్రకటన
కోటీశ్వరుడినయ్యా.. నాకేంటి?!.. వచ్చే ఏడాది కనిపించడు: సెహ్వాగ్
SRH Vs CSK: వారెవ్వా మెండిస్.. ఐపీఎల్ చరిత్రలోనే సంచలన క్యాచ్
పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
సాక్షి కార్టూన్ 25-04-2025
ప్రపంచంలోనే తొలి డయాబెటిస్ రైస్ కుక్కర్..!
కాకమ్మకు జర్రమొచ్చింది.. చీమల పుట్టను వెతుక్కుంది
పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన పాక్ నటి.. నెటిజన్ల ఆగ్రహం!
మాజీ ఇరిగేషన్ అధికారి హరిరాం ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీగా ఆస్తి పత్రాలు..
నేనేమీ మాట్లాడలేను.. ఒంటరిగా వదిలేయండి:
జలదిగ్బంధం!
అంతర్జాతీయ ప్రయాణం .. మరింత భారం
అనుష్క చేతిలో ఏడు సినిమాలు? ప్రభాస్కు జంటగా..!
నాటి రైతు బిడ్డ... నేడు ఐపీఎల్ హీరో
విశాఖలో దంపతుల దారుణహత్య
ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి
పవన్ సినిమా వాయిదా.. ఎందుకంటే ఈ రెండు మూవీస్
సత్తా చాటిన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్: రూ.35 వేల కోట్లకుపైగా బిజినెస్
రెండోసారి ప్రెగ్నెన్సీ.. భర్తకి తెలుగు సీరియల్ నటి సర్ ప్రైజ్
శాంతి చర్చల్లో పురోగతి?.. ట్రంప్ కీలక ప్రకటన
‘అలా చేస్తే అర్జున్ టెండుల్కర్ మరో క్రిస్గేల్ అవుతాడు’
నెవ్వర్.. ఆ ఇద్దరితో విజయశాంతి నటించే ఛాన్స్ లేదు
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
పహల్గాం ఘటన.. సింగర్ చిన్మయి కాంట్రవర్సీ పోస్ట్
ప్రతిచర్యకు సిద్ధమైన పాక్.. సిమ్లా ట్రీటీకి టాటా?
వరకట్న వేధింపులకు వివాహిత బలి
బిడ్డను చంపి తల్లిపై గ్యాంగ్రేప్!
రియల్టీలోకి రూ.2.29 లక్షల కోట్లు
#SRH: సీఎస్కే కంచు కోట బద్దలు .. 12 ఏళ్ల తర్వాత తొలిసారి
పర్యాటకుల మతంపై ఆరా తీసిన పోనీ రైడ్ నిర్వాహకుడి అరెస్ట్
పీఎఫ్ ఖాతా బదిలీ.. ఈపీఎఫ్వో గుడ్న్యూస్!
కొత్త టెక్నాలజీలను ఆవిష్కరించిన టీసీఎస్
బంగారం.. కొనేదెలా..?
బీచ్లో చిల్ అవుతోన్న సుప్రీత.. తేనే కళ్లతో కవ్విస్తోన్న బిగ్బాస్ దివి!
రూటు మార్చిన చంద్రబాబు.. ఏపీలో ఆర్థిక విధ్వంసం
టూరిస్టులతో టెర్రరిస్ట్.. ‘మా పిల్లలు బాధపడుతుంటే.. మీరు సెలవులు ఎంజాయ్ చేస్తారా?’
ట్రంప్ యూటర్న్.. అమెరికాలో విదేశీ విద్యార్థులకు గుడ్న్యూస్
ముత్యాల నగరంలో..ఆభరణాల ఉత్సవం!
ఎన్టీఆర్తో శృతీ హాసన్ స్పెషల్ డ్యాన్స్?
తీన్మార్ మల్లన్నకు హైకోర్టు నోటీసులు
తాష్కెంట్ ఒప్పందానికీ చెల్లుచీటీ!
ఏఆర్ రెహమాన్కు షాక్.. రూ. 2 కోట్లు చెల్లించాల్సిందే!
పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్పై దాడి.. పది మంది సైనికులు మృతి
ఇదే నా ఇల్లు.. నాకు లేదా ఇందిరమ్మ ఇల్లు?
నా నియోజకవర్గంలో నువ్వు వేలు పెట్టడం ఏంటి?
సింహాల వయసుని ఎలా లెక్కిస్తారు? మీకు తెలుసా?
‘నీవు వచ్చేంత వరకూ ఇక్కడే ఉంటా తల్లీ’
రన్యారావుకు మరిన్ని కష్టాలు .. ఆ చట్టంతో ఇక బెయిల్ కష్టమే!
మారుతీ సుజుకీ వెనకడుగు..
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
సీఎం అవ్వాలనే ఆశ నాకు లేదు: కేటీఆర్
కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. 38 మంది మావోయిస్టులు మృతి!
పోలీసు కేసులు ప్రజాదరణను దూరం చేయలేవు!
చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ హిస్టరీలోనే
బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయమన్నా పోయరు!
ప్రాణాలు కాపాడిన ఉప్పు
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. మండిపడ్డ నెటిజన్స్!
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
సికింద్రాబాద్: గోదాంలో భారీగా నోట్ల కట్టలు కలకలం
తల్లికి వందనం డబ్బులు అడిగితే సంపద సృష్టించే మార్గం చెవిలో చెప్పండని వెళ్లిపోతున్నాడు!
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
IPL 2025: ప్లే ఆఫ్స్ రేసు.. ఏ జట్టు ఎన్ని మ్యాచ్లు గెలవాలంటే?
మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే..
SRH Vs CSK: గెలిచి నిలిచిన రైజర్స్
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
PSL: పాకిస్తాన్కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..
పాకిస్తాన్కు వెళ్లిపోయిన కేన్ మామ
కోడలికి రెండో పెళ్లి చేసి, కన్నీటితో సాగనంపిన ‘మామగారు’
బీరప్పా.. నువ్వు గ్రేటప్పా!
తెలంగాణకు వర్షసూచన.. ఐదు రోజులు ఈ జిల్లాల్లో గట్టి వానలే..
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
వాళ్ల సంగతేమోగానీ! వలసదారులపై మీదాడి గురించి ప్రపంచం కూడా సంతోషంగా లేదు
కొడుకు అందంగా పుట్టాడని వేధింపులు
మళ్లీ ఉగ్ర కాండ!
యాహూ! ఎట్టకేలకు భారతీయురాలిగా..! వీడియో వైరల్
సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడమే: పాక్
ఏపీ గవర్నర్ను కలిసిన వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ
విరాట్ కోహ్లి తొందరపడ్డాడు.. అప్పటి వరకు ఆడాల్సింది: సురేష్ రైనా
Sodara Review: సంపూర్ణేష్ బాబు ‘సోదరా’ మూవీ రివ్యూ
మెగా అగచాట్ల డీఎస్సీ!
పహల్గాం ఉగ్రదాడిపై పాక్ ఉప ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ఇద్దరు వధువులు.. ఒక వరుడు
Pahalgam: ‘ఆ వీడియోలో ఉన్నది మేమే.. వినయ్ సార్ కాదు’
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్!
నా భార్య వర్షిణి ఎక్కడ?.. ప్రత్యేక బ్యారెక్లో అఘోరీ అరుపులు, కేకలు!
ఒక్కరంటే పర్లేదు.. అందరూ అంతే: అసంతృప్తి వెళ్లగక్కిన ధోని
టాపర్ కాస్త హంతకుడిగా..
ఔను.. చెత్త పనులు చేశాం.. తప్పు ఒప్పుకున్న పాక్
అవినీతి 'ఐకానిక్'!
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
ఒకే ఇల్లు.. ఒకే వంట
పాక్ను ముక్కలు చేయండి
పిల్లపామును పెంచి పోషిస్తున్న హఫీజ్ సయ్యద్!
ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోండి
ఉద్యోగంలో ఉంటారా? ప్యాకేజీ తీసుకొని వెళ్తారా?
పహల్గాం ఘటన.. పాక్ కపట నాటకం
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
బయోమెట్రిక్స్, చిరునామా
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
చిరంజీవి సినిమాలో విలన్గా టాలీవుడ్ యంగ్ హీరో!
‘గోల్డెన్ ఛాన్స్ మిస్.. బుర్ర పనిచేయడం లేదా’?!.. కావ్యా మారన్ ఫైర్!
పాకిస్తానీలు వెంటనే మీ దేశానికి వెళ్లండి: తెలంగాణ డీజీపీ
ఉగ్రదాడి ఘటనపై నోరు జారిన ఎమ్మెల్యే అరెస్ట్
ఇక్రమ్.. ఇంకా ఇక్కడే!
నిశ్చితార్థం చేసుకుని ఏడాది.. మరి పెళ్లెప్పుడు?
ఐటీఆర్ ఫైలింగ్కు వేళాయే..
పహల్గాం ఘటన: ఎల్ఐసీ కీలక ప్రకటన
కోటీశ్వరుడినయ్యా.. నాకేంటి?!.. వచ్చే ఏడాది కనిపించడు: సెహ్వాగ్
SRH Vs CSK: వారెవ్వా మెండిస్.. ఐపీఎల్ చరిత్రలోనే సంచలన క్యాచ్
పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
సాక్షి కార్టూన్ 25-04-2025
ప్రపంచంలోనే తొలి డయాబెటిస్ రైస్ కుక్కర్..!
కాకమ్మకు జర్రమొచ్చింది.. చీమల పుట్టను వెతుక్కుంది
పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన పాక్ నటి.. నెటిజన్ల ఆగ్రహం!
మాజీ ఇరిగేషన్ అధికారి హరిరాం ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీగా ఆస్తి పత్రాలు..
నేనేమీ మాట్లాడలేను.. ఒంటరిగా వదిలేయండి:
జలదిగ్బంధం!
అంతర్జాతీయ ప్రయాణం .. మరింత భారం
అనుష్క చేతిలో ఏడు సినిమాలు? ప్రభాస్కు జంటగా..!
నాటి రైతు బిడ్డ... నేడు ఐపీఎల్ హీరో
విశాఖలో దంపతుల దారుణహత్య
ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి
పవన్ సినిమా వాయిదా.. ఎందుకంటే ఈ రెండు మూవీస్
సత్తా చాటిన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్: రూ.35 వేల కోట్లకుపైగా బిజినెస్
రెండోసారి ప్రెగ్నెన్సీ.. భర్తకి తెలుగు సీరియల్ నటి సర్ ప్రైజ్
శాంతి చర్చల్లో పురోగతి?.. ట్రంప్ కీలక ప్రకటన
‘అలా చేస్తే అర్జున్ టెండుల్కర్ మరో క్రిస్గేల్ అవుతాడు’
నెవ్వర్.. ఆ ఇద్దరితో విజయశాంతి నటించే ఛాన్స్ లేదు
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
పహల్గాం ఘటన.. సింగర్ చిన్మయి కాంట్రవర్సీ పోస్ట్
ప్రతిచర్యకు సిద్ధమైన పాక్.. సిమ్లా ట్రీటీకి టాటా?
వరకట్న వేధింపులకు వివాహిత బలి
బిడ్డను చంపి తల్లిపై గ్యాంగ్రేప్!
రియల్టీలోకి రూ.2.29 లక్షల కోట్లు
#SRH: సీఎస్కే కంచు కోట బద్దలు .. 12 ఏళ్ల తర్వాత తొలిసారి
పర్యాటకుల మతంపై ఆరా తీసిన పోనీ రైడ్ నిర్వాహకుడి అరెస్ట్
పీఎఫ్ ఖాతా బదిలీ.. ఈపీఎఫ్వో గుడ్న్యూస్!
కొత్త టెక్నాలజీలను ఆవిష్కరించిన టీసీఎస్
బంగారం.. కొనేదెలా..?
బీచ్లో చిల్ అవుతోన్న సుప్రీత.. తేనే కళ్లతో కవ్విస్తోన్న బిగ్బాస్ దివి!
రూటు మార్చిన చంద్రబాబు.. ఏపీలో ఆర్థిక విధ్వంసం
టూరిస్టులతో టెర్రరిస్ట్.. ‘మా పిల్లలు బాధపడుతుంటే.. మీరు సెలవులు ఎంజాయ్ చేస్తారా?’
ట్రంప్ యూటర్న్.. అమెరికాలో విదేశీ విద్యార్థులకు గుడ్న్యూస్
ముత్యాల నగరంలో..ఆభరణాల ఉత్సవం!
ఎన్టీఆర్తో శృతీ హాసన్ స్పెషల్ డ్యాన్స్?
తీన్మార్ మల్లన్నకు హైకోర్టు నోటీసులు
తాష్కెంట్ ఒప్పందానికీ చెల్లుచీటీ!
ఏఆర్ రెహమాన్కు షాక్.. రూ. 2 కోట్లు చెల్లించాల్సిందే!
పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్పై దాడి.. పది మంది సైనికులు మృతి
సినిమా

ఏఆర్ రెహమాన్కు షాక్.. రూ. 2 కోట్లు చెల్లించాల్సిందే!
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన సంగీతం అందించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలోని ఓ పాటపై కాపీ రైట్ కేసులో బిగ్ షాక్ తగిలింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం.. పిటిషన్దారుడికి రూ.2 కోట్లు చెల్లించాలని ఏఆర్ రెహమాన్తో పాటు చిత్ర నిర్మాణ సంస్థను ఆదేశించింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2023లో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది.పొన్నియిన్ సెల్వన్ సిరీస్లో భాగంగా తెరకెక్కించిన రెండో చిత్రం. ఈ మూవీలో విక్రమ్, రవి మోహన్, కార్తి, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ రెండు సినిమాలకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. కాగా.. పొన్నియిన్ సెల్వన్ -2 చిత్రంలోని వీరా రాజ వీరా అనే పాట సంగీతాన్ని తన తండ్రి ఫయాజుదీన్ డగర్, మామ జాహిరుదీన్ డగర్ సంగీతం అందించిన శివస్తుతి పాట నుంచి కాపీ చేసినట్లు సింగర్ ఉస్తాద్ ఫయాజ్ వసిఫుదీన్ డగర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో శుక్రవారం ఢిల్లీ హైకోర్టు మధ్యంతర తీర్పు వెలువడింది. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, చిత్ర నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ రూ.2 కోట్లను పిటిషన్దారుడికి అందించాలని ఆదేశించింది.

ఆ అనుబంధానికి పేరు పెట్టలేను!:సమంత
‘‘జీవితంలో మనం తీసుకునే ఒక నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకొని కెరీర్ ఎలా ఉంటుందో చెప్పలేం. ఒకవేళ ఎవరైనా అలా నిర్ణయిస్తే అది అబద్ధమే అవుతుంది. తెలిసీ తెలియక తీసుకున్న ఎన్నో నిర్ణయాలు కెరీర్పై ప్రభావం చూపుతాయి’’ అని సమంత అన్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఇటీవల నిర్వహించిన ‘గోల్డెన్ క్వీన్’ పురస్కారాల్లో’ గోల్డెన్ క్వీన్ అవార్డు అందుకున్నారు సమంత.అనంతరం ఆమె తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తాను. నా అదృష్టంతోపాటు నేను పడిన కష్టమే ఈరోజు ఇంతమంది అభిమానం సంపాదించుకోవడానికి కారణం అయింది. ఇది దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను’’ అని చె΄్పారు సమంత. ఇంకా తన వ్యక్తిగత జీవితం గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘నా ఆరోగ్యం బాగాలేనప్పుడు రాహుల్ రవీంద్రన్ (నటుడు, దర్శకుడు) ఉదయం నుంచి సాయంత్రం వరకూ నాతోనే ఉంటూ జాగ్రత్తగా చూసుకున్నాడు.మా అనుబంధానికి పేరు పెట్టలేను. ఫ్రెండా? సోదరుడా? కుటుంబ సభ్యుడా? రక్త సంబంధీకుడా? అనేది చెప్పలేను’’ అన్నారు. ఇక సమంత కెరీర్ విషయానికొస్తే... ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. అలాగే తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్పై ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’ మే 9న రిలీజ్ కానుంది.

ఆధ్యాత్మిక గురువు రవిశంకర్గా విక్రాంత్
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ జీవితం వెండితెరపైకి రానుంది. రవిశంకర్ జీవితంతో సినిమా రానుందని ఎప్పట్నుంచో ఓ వార్త ప్రచారంలో ఉంది. బాలీవుడ్ దర్శక–నిర్మాతలు సిద్ధార్థ్ ఆనంద్, మహావీర్ జైన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు కూడా టాక్ వినిపించింది. ఈ చిత్రంలో రవిశంకర్ పాత్రను విక్రాంత్ మాస్సీ చేయనున్నారనే ఊహాగానాలూ నెలకొన్నాయి. అందుకు తగ్గట్టు గత ఏడాది రవిశంకర్ని కలిశారు విక్రాంత్.ఆయనపాత్రలో ఒదిగిపోవడానికి కావాల్సిన సలహాలు, సూచనలు తీసుకున్నారట. ఈ చిత్రం రెగ్యులర్ షూట్ని జూలైలో ఆరంభించాలనుకుంటున్నారన్నది తాజా సమాచారం. ‘వైట్’ టైటిల్తో రూపొందనున్న ఈ చిత్రానికి యాడ్ ఫిల్మ్ మేకర్ మౌంటూ బస్సీ దర్శకత్వం వహించనున్నారు.కొలంబియాలో జరిగిన అంతర్యుద్ధాన్ని పరిష్కరించడంలో రవిశంకర్ ఏ విధంగా కీలకపాత్ర పోషించారనేది ఈ చిత్రం ప్రధానాంశమని సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రంలో రవిశంకర్పాత్రలో ఒదిగిపోవడానికి విక్రాంత్ మాస్సీ మేకోవర్ అవుతున్నారు. హిందీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించి, పలు భాషల్లో అనువదించి, రిలీజ్ చేయాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది ‘వైట్’ విడుదల కానుంది.

పవన్ సినిమా వాయిదా.. ఎందుకంటే ఈ రెండు మూవీస్
పవన్ కల్యాణ్ ఏళ్లకేళ్లుగా చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు. నాలుగైదేళ్లుగా సెట్స్ మీదే ఉంది. మే 9న పక్కా థియేటర్లలోకి వస్తామని పోస్టర్స్ మీద పోస్టర్లు వదిలారు. తీరా చూస్తే ఇప్పుడు సౌండ్ లేదు. దీంతో వాయిదా లాంఛనమే. మరోవైపు ఈ తేదీని ఇప్పుడు మరికొన్ని తెలుగు మూవీస్ పట్టేస్తున్నాయి. (ఇదీ చదవండి: రెండోసారి ప్రెగ్నెన్సీ.. భర్తకి తెలుగు సీరియల్ నటి సర్ ప్రైజ్) మే 9 టాలీవుడ్ కి చాలా అచ్చొచ్చిన తేదీ. గ్యాంగ్ లీడర్, జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి.. ఇలా చెప్పుకొంటూపోతే ఆ రోజున థియేటర్లలో రిలీజై హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. 'హరిహర..' కూడా అదే తేదీ అనేసరికి ఫ్యాన్స్ సంబరపడ్డారు. కానీ ఇప్పుడు మే 23న లేదంటే జూన్ 4న రావొచ్చని టాక్ వినిపిస్తుంది.పవన్ సినిమా వాయిదా లాంఛనమే అని తెలియడానికి మరోలా కూడా క్లారిటీ వచ్చింది. కొన్నిరోజుల క్రితం సమంత నిర్మించిన 'శుభం' మూవీ ఇదే తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు శ్రీ విష్ణు '#సింగిల్' కూడా మే 9న థియేటర్లలోకి వస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇలా వరస చిత్రాలు ఆ తేదీన రాబోతున్నాయంటే పవన్ మూవీ మరోసారి వాయిదా పడ్డట్లేగా.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు)
న్యూస్ పాడ్కాస్ట్

ఆంధ్రప్రదేశ్ రాజధానిలో దోపిడీ ఐకానిక్... ఐదు టవర్ల నిర్మాణ వ్యయం అనూహ్యంగా పెంపు...

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు... తీవ్రస్థాయికి చేరిన ఉద్రిక్తతలు

పాకిస్తాన్కు భారత్ పంచ్. పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్. దౌత్య సంబంధాలకు కత్తెర. సింధూ ఒప్పందం సస్పెన్షన్. ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ

జమ్మూకశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి... కాల్పులకు 26 మంది బలి, మరో 20 మందికి పైగా గాయాలు.. మృతుల్లో ఇద్దరు విదేశీయులు

బాబోయ్ బంగారం. దేశంలో తొలిసారి లక్ష రూపాయల మార్కును దాటేసిన పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం

ఆంధ్రప్రదేశ్లో డొల్ల కంపెనీకి ఎకరం 99 పైసల చొప్పున అత్యంత ఖరీదైన భూమిని కేటాయించిన కూటమి ప్రభుత్వం...3 వేల కోట్ల రూపాయల ఖరీదైన భూమిని కొట్టేసే ఎత్తుగ

అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు... ఎంపీ మిథున్రెడ్డి విచారణలో సిట్ బాగోతం బట్టబయలు

వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు... దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకాలు

సుదీర్ఘ కాలంగా వక్ఫ్ అధీనంలో ఉన్న ఆస్తులను ఇకపై కూడా వక్ఫ్ ఆస్తులుగానే పరిగణించాలని భావిస్తున్నాం... ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటున్నాం... సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్లో ఫీజుల షెడ్యూల్కు చెల్లుచీటి... కూటమి పాలనలో గతితప్పిన ఫీజు రీయింబర్స్మెంట్... ఊసేలేని వసతి దీవెన
క్రీడలు

‘నాపై విద్వేషం చూపిస్తున్నారు’
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో తొలి వ్యక్తిగత స్వర్ణం సాధించి భారత అత్యుత్తమ అథ్లెట్గా గుర్తింపు తెచ్చుకున్న జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు కూడా దేశంలోని దురభిమానుల నుంచి వేధింపులు తప్పడం లేదు. తాను నిర్వహించబోయే ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ టోర్నీ కి పాకిస్తాన్ ఆటగాడు, పారిస్ ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత అర్షద్ నదీమ్ను అతను ఆహ్వానించడమే అందుకు కారణం. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్తానీయులపై భారత అభిమానులు సహజంగానే ఆగ్రహంతో ఉన్నారు. దానిని ఇప్పుడు నీరజ్పై చూపిస్తున్నారు. నిజానికి ఈ ఘటన జరగక ముందే నదీమ్ను నీరజ్ ఆహ్వానించాడు. టోర్నీ జరిగే సమయంలో తాను గతంలోనే నిర్ణయించుకున్న కార్యక్రమం ప్రకారం విదేశాల్లో ఉంటున్నానని, అందుకు హాజరు కాలేనని కూడా నదీమ్ స్పష్టం చేసేశాడు. ‘సహచర భారతీయుల్లాగే నేను కూడా కశీ్మర్ ఘటన పట్ల ఎంతో బాధపడుతున్నాను. దానిపై చాలా ఆగ్రహంగా కూడా ఉన్నాను. అయితే నాపై కొందరు చూపిస్తున్న విద్వేషం ఊహించలేనిది. వారి మాటల్లో ఎన్నో తిట్లు కనిపిస్తున్నాయి. నేను సాధారణంగా ఇలాంటివి పట్టించుకోను. కానీ దానిని బలహీనతగా భావించవద్దు. పైగా దేశం పట్ల నా అంకితభావాన్ని ప్రశ్నిస్తే మాత్రం ఊరుకోను. అర్షద్కు ఆహ్వానం పంపడం ఒక క్రీడాకారుడి కోణంలోనే చూడాలి. నా ఈవెంట్కు అత్యుత్తమ ఆటగాళ్లను తీసుకురావాలనే ఉద్దేశంతో అలా చేశాను. అయతే పహల్గాం ఘటనకు ముందే అందరినీ ఆహ్వానించాం’ అని నీరజ్ గుర్తు చేశాడు. మా కుటుంబాన్ని వదిలేయండి! కశ్మీర్ ఉగ్రదాడి ఘటన తర్వాత కొందరు వ్యక్తులు తన తల్లిని కూడా వదలడం లేదని, ఏడాది క్రితం ఆమె చేసిన వ్యాఖ్యను తప్పుగా అన్వయిస్తున్నారని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. పారిస్ ఒలింపిక్స్లో అర్షద్ స్వర్ణం, నీరజ్ రజతం గెలిచిన సమయంలో ‘అర్షద్ కూడా నా కొడుకులాంటివాడే’ అని నీరజ్ తల్లి సరోజ్ చెప్పింది. ‘జనాలు తమ అభిప్రాయాలు వేగంగా ఎలా మార్చుకుంటారో ఇప్పుడు కనిపిస్తోంది. ఏడాది క్రితం మా అమ్మ ఏదో నిరాడంబరత్వం, భోళాతనంతో ఒక మాట అంది. అప్పుడు ఆమెను అందరూ అభినందించారు. ఇప్పుడేమో ఆ మాటను పట్టుకొని అమ్మను తిట్టడం బాధగా ఉంది. కొందరు నన్ను లక్ష్యంగా చేసుకోవడం, నేను వివరణలు ఇచ్చుకోవడం చాలా బాధగా ఉంది. నా గురించి తప్పుడు మాటలు ప్రచారం చేయకండి. దయచేసి నన్ను, నా కుటుంబాన్ని వదిలేయండి’ అని ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో సుబేదార్ మేజర్ హోదాలో ఉన్న నీరజ్ చోప్రా విజ్ఞప్తి చేశాడు.

KKR Vs PBKS: కోల్‘కథ’ మారేనా!
కోల్కతా: ఐపీఎల్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయిన జట్లు... 18వ సీజన్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఇలా నాలుగు జట్లు చక్కటి ఆటతీరుతో దూసుకెళ్తున్నాయి. తాజా సీజన్లో 8 మ్యాచ్లాడి 5 విజయాలు, 3 పరాజయాలతో 10 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఐదో స్థానంలో ఉన్న పంజాబ్ నేడు జరిగే మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్)తో తలపడనుంది. గత సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్... ఇప్పుడు పంజాబ్ కింగ్స్ సారథిగా ఈడెన్ గార్డెన్స్లో అడుగు పెట్టనున్నాడు. పుష్కర కాలం తర్వాత కేకేఆర్కు మూడో ఐపీఎల్ ట్రోఫీ అందించిన శ్రేయస్ అయ్యర్ను ఫ్రాంఛైజీ వేలానికి వదిలేస్తే... పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకొని కెప్టెన్ను చేసింది. కోచ్ రికీ పాంటింగ్తో కలిసి శ్రేయస్ జట్టును విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి పోరులో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. స్వల్ప స్కోర్లు నమోదైన ఆ మ్యాచ్లో కేకేఆర్ 112 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 95 పరుగులకు ఆలౌటైంది. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని కోల్కతా చూస్తుంటే... గెలుపు జోరు కొనసాగిస్తూ ‘ప్లే ఆఫ్స్’ వైపు మరో అడుగు ముందుకు వేయాలని పంజాబ్ భావిస్తోంది. మిడిలార్డర్పైనే భారం! డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగి ఈ సీజన్లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న కోల్కతా... నిలకడగా విజయాలు సాధించడంలో విఫలమవుతోంది. 8 మ్యాచ్ల్లో 3 విజయాలు, 5 పరాజయాలతో 6 పాయింట్లు సాధించిన కోల్కతా పట్టిక ఏడో స్థానంలో ఉంది. కెపె్టన్ అజింక్యా రహానే ఒక్కడే ఓ మాదిరిగా ఆడుతుండగా... మిగిలిన వాళ్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. 8 మ్యాచ్ల్లో 271 పరుగులు చేసిన రహానే జట్టులో అందరికంటే ముందున్నాడు. 19 ఏళ్ల అంగ్క్రిష్ రఘువంశీ 197 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. కోట్లు పెట్టి కొనుగోలు చేసుకున్న వెంకటేశ్ అయ్యర్... 135 పరుగులే చేయగా... ఓపెనర్లు క్వింటన్ డికాక్ 143, సునీల్ నరైన్ 147 కూడా మెరుపులు మెరిపించలేకపోతున్నారు. రింకూ సింగ్, రసెల్, రమణ్దీప్ సింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. రింకూ 8 మ్యాచ్ల్లో 133 పరుగులే చేయగా... రసెల్ 55, రమణ్దీప్ 30 పరుగులు చేశారు. ఈ ముగ్గురు ఫినిషింగ్ టచ్తో జట్టుకు భారీ స్కోర్లు అందిస్తారనుకుంటే... వారు వరస వైఫల్యాలతో సతమతమవుతున్నారు. బౌలింగ్లోనూ కేకేఆర్కు ఏదీ కలిసి రావడం లేదు. వరుణ్ చక్రవర్తి, నరైన్, మోయిన్ అలీ వంటి ముగ్గురు ప్రధాన స్పిన్నర్లు ఉన్నప్పటికీ పిచ్ వారికి అనుకూలంగా రూపొందించుకోలేక పోయిన కేకేఆర్ దానికి మూల్యం చెల్లించుకుంటోంది. పేసర్లు వైభవ్ అరోరా, హర్షిత్ రాణా ఫర్వాలేదనిపిస్తున్నారు. కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే మిగిలిన ఆరు మ్యాచ్ల్లో ఐదింట గెలవాల్సిన పరిస్థితి ఉండటంతో ఈ మ్యాచ్లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డేందుకు కోల్కతా సిద్ధమైంది. అన్నీ రంగాల్లో బలంగా... కేకేఆర్తో పోల్చుకుంటే పంజాబ్ పరిస్థితి మెరుగ్గా ఉంది. ఈ సీజన్లో శ్రేయస్ సారథ్యం... పాంటింగ్ వ్యూహాలు... ఓపెనర్ల మెరుపులు... చాహల్ స్పిన్ మాయాజాలం వెరసి పంజాబ్ బలంగా కనిపిస్తోంది. లీగ్ ఆరంభంలో దూకుడైన బ్యాటింగ్తో ఆకట్టుకున్న శ్రేయస్... గత మూడు మ్యాచ్ల్లో సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడం కాస్త ఇబ్బంది పెడుతోంది. అయినప్పటికీ అతడు 8 మ్యాచ్ల్లో 263 పరుగులతో జట్టు తరఫున అత్యధిక పరుగులు చేశాడు. అందులో 3 అర్ధశతకాలు ఉన్నాయి. ప్రియాన్ష్ఆర్య 254, ప్రభ్సిమ్రన్ సింగ్ 209, నేహల్ వధేరా 189, శశాంక్ సింగ్ 158 పరుగులు చేశారు. ఓపెనర్లు ఆర్య, ప్రభ్సిమ్రన్ జట్టుకు మంచి ఆరంభాలు ఇస్తుండగా... శ్రేయస్, ఇన్గ్లిస్, నేహల్ వధేరా, శశాంక్ సింగ్ మిడిలార్డర్లో బరిలోకి దిగనున్నారు. బౌలింగ్లో ప్రధాన పేసర్ అర్‡్షదీప్ సింగ్ ఆకట్టుకుంటుండగా... యుజ్వేంద్ర చాహల్ ఫామ్లో ఉన్నాడు. అర్ష్ దీప్ 11 వికెట్లు తీయగా... కేకేఆర్తో గత మ్యాచ్లో చాహల్ 4 ప్రధాన వికెట్లు తీసి ఆ జట్టును దెబ్బకొట్టాడు. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్లో సమతూకంగా ఉన్న పంజాబ్కు మార్కో యాన్సెన్, స్టొయినిస్ రూపంలో నిఖార్సైన ఆల్రౌండర్లు ఉండటం అదనపు బలంగా మారింది. ఈ ఇద్దరు మంచి టచ్లో ఉన్నారు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న కేకేఆర్... పంజాబ్ జోరును ఎలా అడ్డుకుంటుందో చూడాలి!34 ఐపీఎల్ చరిత్రలో కోల్కతా, పంజాబ్ జట్లు ముఖాముఖిగా 34 సార్లు తలపడ్డాయి. 21 మ్యాచ్ల్లో కోల్కతా, 13 మ్యాచ్ల్లో పంజాబ్ గెలుపొందాయి. పంజాబ్పై కోల్కతా అత్యధిక స్కోరు 261 కాగా, అత్యల్ప స్కోరు 95 పరుగులు. కోల్కతాపై పంజాబ్ అత్యధిక స్కోరు 262 కాగా, అత్యల్ప స్కోరు 111 పరుగులు.

కూర్పుపై కసరత్తు
పెర్త్: భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ్రస్టేలియా పర్యటనలో కూర్పుపై కసరత్తులు చేయనున్నట్లు భారత మహిళల హాకీ జట్టు చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ వెల్లడించాడు. ఈ టూర్లో భాగంగా భారత అమ్మాయిల జట్టు ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టుతో రెండు మ్యాచ్లు... ప్రధాన జట్టుతో 3 మ్యాచ్లు ఆడనుంది. పెర్త్ వేదికగా శనివారం ఆ్రస్టేలియా ‘ఎ’తో సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు తలపడుతోంది. మే 1, 3, 4న వరసగా ఆస్ట్రేలియా సీనియర్ జట్టుతో టీమిండియా మ్యాచ్లు ఆడనుంది. భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య ఇప్పటి వరకు 16 మ్యాచ్లు జరగగా... అందులో ఆసీస్ 10 మ్యాచ్ల్లో గెలవగా... భారత్ మూడు విజయాలు సాధించింది. ఈ నేపథ్యంలో హరేంద్ర మాట్లాడుతూ... ఇటీవల బెంగళూరులో నిర్వహించిన జాతీయ శిబిరం ప్లేయర్లకు ఉపయోగపడనుందని అన్నాడు. ‘ఈ పర్యటన మా ఆటతీరును పరీక్షించుకునేందుకు తోడ్పడుతుంది. ఇంకా ఏ రంగాల్లో మెరుగు పడాలో అర్థం చేసుకునేందుకు ఆ్రస్టేలియా కంటే మెరుగైన ప్రత్యర్థి ఉండరు. కూర్పును పరీక్షించడంతో బెంచ్ బలాన్ని మరింత పెంపొందించుకుంటాం. ఆ్రస్టేలియాలాంటి జట్టును వారి సొంతగడ్డపై ఎదుర్కోవడం అతిపెద్ద సవాల్. ఇది మున్ముందు టోర్నీలకు తోడ్పడుతుంది’ అని హరేంద్ర అన్నాడు. ఇటీవల ప్రొ లీగ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ నెదర్లాండ్స్పై విజయం సాధించి మన అమ్మాయిల జట్టు మంచి టచ్లో ఉంది. ఈ పర్యటన కోసం సలీమా సారథ్యంలో 26 మందితో జట్టును ప్రకటించారు. అందులో సీనియర్ గోల్ కీపర్ సవిత, నవ్నీత్ కౌర్, డ్రాగ్ఫ్లికర్ దీపిక ఉన్నారు. ఈ సిరీస్ కోసం ఐదుగురు కొత్త అమ్మాయిలు జ్యోతి సింగ్, సుజాత, అజ్మీన, పూజ యాదవ్, మహిమ టెటెకు అవకాశమిచ్చారు. ‘బలమైన ప్రత్యర్థితో పోరుకు సిద్ధంగా ఉన్నాం. మెరుగైన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతాం. జట్టు కూర్పు పరీక్షించుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ప్రొ లీగ్లో యూరప్ అంచె పోటీలు, మహిళల ఆసియా కప్నకు ముందు ప్లేయర్లకు ఇది మంచి అనుభవం అవుతుంది’ అని కెపె్టన్ సలీమా వెల్లడించింది.

ఆసియా అథ్లెటిక్స్ పోటీలకు జ్యోతి, నిత్య, నందిని, రజిత
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షి ప్ పోటీల్లో పాల్గొనే భారత జట్టును శుక్రవారం ప్రకటించారు. కొచ్చిలో గురువారం ముగిసిన ఫెడరేషన్ కప్లో రాణించిన క్రీడాకారులను, ఇంతకుముందు ఆసియా చాంపియన్షి ప్ అర్హత ప్రమాణాలను అధిగమించిన ప్లేయర్లను భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ఎంపిక చేసింది. మే 27 నుంచి 31వ తేదీ వరకు దక్షిణ కొరియాలోని గుమీ నగరంలో జరిగే ఈ మెగా ఈవెంట్లో భారత్ నుంచి వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 59 మంది బరిలోకి దిగుతారు. పలువురు అథ్లెట్స్ ఒకటికి మించి ఈవెంట్స్లో పోటీపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి జ్యోతి యర్రాజీ, కుంజ రజిత... తెలంగాణ నుంచి నిత్య గంధే, అగసార నందిని భారత్కు ప్రాతినిధ్యం వహించనున్నారు. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఆసియా పోటీలకు దూరంగా ఉంటున్నాడు. స్వదేశంలో మే 24న తన పేరిట జరగనున్న నీరజ్ చోప్రా క్లాసిక్ జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ బరిలోకి దిగనుండటంతో అతడిని ఆసియా పోటీలకు ఎంపిక చేయలేదని ఏఎఫ్ఐ వివరించింది. 2023లో బ్యాంకాక్లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ పోటీల్లో భారత్ 6 స్వర్ణాలు, 12 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి 27 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. జ్యోతి యర్రాజీ 100 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణం, 200 మీటర్లలో రజతం సాధించింది. భారత అథ్లెటిక్స్ జట్టుపురుషుల విభాగం: అనిమేశ్ కుజుర్ (200 మీటర్లు), అను కుమార్, కృషన్ కుమార్ (800 మీటర్లు), యూనుస్ షా (1500 మీటర్లు), అవినాశ్ సాబ్లే (3000 మీటర్ల స్టీపుల్ఛేజ్), గుల్వీర్ సింగ్, అభిషేక్ పాల్ (5000 మీటర్లు), గుల్వీర్ సింగ్, సావల్ బర్వాల్ (10000 మీటర్లు), ప్రవీణ్ చిత్రావెల్, అబ్దుల్లా అబూబకర్ (ట్రిపుల్ జంప్), సర్వేశ్ కుషారే (హైజంప్), సచిన్ యాదవ్, యశ్వీర్ సింగ్ (జావెలిన్ త్రో), సమర్దీప్ సింగ్ (షాట్పుట్), తేజస్విన్ శంకర్ (డెకాథ్లాన్), సెర్విన్ సెబాస్టియన్, అమిత్ (20 కిలోమీటర్ల నడక). 4గీ100 మీటర్ల రిలే: ప్రణవ్ ప్రమోద్ గౌరవ్, అనిమేశ్ కుజుర్, మణికంఠ హొబ్లీదార్, అమ్లాన్ బొర్గోహైన్, తమిళరసు, రాగుల్ కుమార్, గురీందర్వీర్ సింగ్. 4గీ400 మీటర్ల రిలే: విశాల్, జై కుమార్, టీఎస్ మనూ, రిన్సీ జోసెఫ్, తుషార్ మన్నా, సంతోష్ కుమార్, ధరమ్వీర్ చౌధరీ, మోహిత్ కుమార్. మహిళల విభాగం: నిత్య గంధే (200 మీటర్లు), జ్యోతి యర్రాజీ (100 మీటర్ల హర్డిల్స్), రూపల్ చౌధరీ, విత్యా రాంరాజ్ (400 మీటర్లు), ట్వింకిల్ చౌధరీ, పూజ (800 మీటర్లు), లిల్లీ దాస్, పూజ (1500 మీటర్లు), పారుల్ చౌధరీ, అంకిత (3000 మీటర్ల స్టీపుల్ఛేజ్), సంజీవని జాధవ్, సీమా (10000 మీటర్లు), విత్యా రాంరాజ్, అను (400 మీటర్లు), శైలి సింగ్, అన్సీ సోజన్ (లాంగ్జంప్), పూజ (హైజంప్), సీమా (డిస్కస్ త్రో), అన్ను రాణి (జావెలిన్ త్రో), అగసార నందిని (హెప్టాథ్లాన్). 4గీ100 మీటర్ల రిలే: నిత్యా గంధే, అభినయ రాజరాజన్, స్నేహ, శ్రాబణి నందా, దానేశ్వరి, సుధీక్ష. 4గీ400 మీటర్ల రిలే: రూపల్, స్నేహ, శుభ, జిస్నా మాథ్యూస్, కుంజ రజిత, సాండ్రామోల్ సాబు.
బిజినెస్

జియో స్టోర్స్ల్లో స్టార్లింక్ హార్డ్వేర్
భారతదేశపు ప్రముఖ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా ఉన్న తన రిటైల్ అవుట్లెట్లలో స్టార్లింక్ హార్డ్వేర్ను అందించడానికి స్పేస్ఎక్స్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. శాటిలైట్ ఇంటర్నెట్ పరికరాలను మరింత సులువుగా వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఇది దేశంలోని డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో కీలకంగా మారనుందని చెప్పింది. అయితే, స్పేస్ఎక్స్ దేశంలో తన కార్యకలాపాలు నిర్వహించేందుకు రెగ్యులేటరీ అనుమతులను పొందాల్సి ఉంది.రిలయన్స్ జియో ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాల సందర్భంగా కంపెనీ ఆర్థిక పనితీరును, భవిష్యత్తు ప్రణాళికలను హైలైట్ చేసింది. జియో విస్తృతమైన స్థానిక ఉనికిని, స్టార్లింక్ అత్యాధునిక లో-ఎర్త్-ఆర్బిట్ శాటిలైట్ టెక్నాలజీతో కలపడం ద్వారా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో మెరుగైన ఇంటర్నెట్ సర్వీసులు అందించవచ్చని ఇరు కంపెనీలు భావిస్తున్నాయి. స్టార్లింక్ పరికరాల ఇన్స్టలేషన్, యాక్టివేషన్ కోసం ప్రత్యేకమైన కస్టమర్ సర్వీస్ మెకానిజంను ఏర్పాటు చేయడం, వినియోగదారులకు అంతరాయం లేని సర్వీసులు అందించడం ఈ సహకారంలో భాగం. ఇది అందుబాటులోకి వస్తే స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు జియో ప్రస్తుత బ్రాడ్బ్యాండ్ ఆఫర్లైన జియో ఫైబర్, జియోఎయిర్ ఫైబర్లకు అనుబంధంగా ఉంటాయో లేదో తేలాల్సి ఉంది.ఇదీ చదవండి: అవి ‘అల్లం’.. ఇవి ‘బెల్లం’!జియో ప్రస్తుత చర్యలు దేశంలో డిజిటల్ అంతరాన్ని పూడ్చడానికి ఎంతో తోడ్పడుతాయని కంపెనీ నమ్ముతుంది. స్టార్లింక్ అధునాతన ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా రిమోట్ ఏరియాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడం, ఆర్థిక వృద్ధి, సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. మార్చి 2025 నాటికి రిలయన్స్ జియో 48.8 కోట్లకు పైగా చందాదారులను కలిగి ఉంది. ఇందులో 19.1 కోట్లు ట్రూ 5జీ వినియోగదారులు ఉన్నారు.

పీఎఫ్ ఖాతా బదిలీ.. ఈపీఎఫ్వో గుడ్న్యూస్!
న్యూఢిల్లీ: ఒక సంస్థలో ఉద్యోగం వీడి, మరో సంస్థలో చేరిన సందర్భాల్లో భవిష్యనిధి (పీఎఫ్) ఖాతాను ఆన్లైన్లో సులభంగా బదిలీ చేసుకునే దిశగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు కొన్ని రకాల అనుమతులను తొలగించింది.‘‘ఇప్పటి వరకు పీఎఫ్ ఖాతా బదిలీ రెండు ఈపీఎఫ్ కార్యాలయాలతో ముడిపడి ఉండేది. ఇందులో ఒకటి పీఎఫ్ జమలు జరిగిన (సోర్స్) ఆఫీస్. ఈ మొత్తం మరో ఈపీఎఫ్ కార్యాలయం పరిధిలో (డెస్టినేషన్ ఆఫీస్)కి బదిలీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసే లక్ష్యంతో క్లెయిమ్ల బదిలీకి డెస్టినేషన్ ఆఫీస్ అనుమతుల అవసరాలను తొలగించాం. ఇందుకు సంబంధించి పునరుద్ధరించిన ఫామ్ 13 సాఫ్ట్వేర్ను అమల్లోకి తెచ్చాం. ఇక నుంచి క్లెయిమ్లకు సోర్స్ ఆఫీస్ నుంచి అనుమతి లభించగానే, సభ్యుడి/సభ్యురాలి పీఎఫ్ ఖాతా ప్రస్తుత కార్యాలయం పరిధిలోకి మారిపోతుంది’’అని కేంద్ర కార్మిక శాఖ తెలిపింది.

రిలయన్స్ రికార్డ్.. రూ. 10 లక్షల కోట్లు..
ముంబై: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 2.4 శాతం పుంజుకుని రూ. 19,407 కోట్లను తాకింది. ప్రధానంగా రిటైల్ బిజినెస్ క్రమబద్ధీకరణ, టెలికం మార్జిన్లు మెరుగుపడటం ఇందుకు సహకరించాయి.అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 18,951 కోట్లు ఆర్జించింది. క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో సాధించిన రూ. 18,540 కోట్లతో పోల్చినా లాభంలో వృద్ధి నమోదైంది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 5.5 డివిడెండ్ ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ. 2.4 లక్షల కోట్ల నుంచి రూ. 2.6 లక్షల కోట్లకు బలపడింది. ఇబిటా 3.6 శాతం వృద్ధితో రూ. 48,737 కోట్లకు చేరింది. పూర్తి ఏడాదిలో మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఆర్ఐఎల్ దాదాపు యథాతథంగా రూ. 69,648 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే రూ. 10 లక్షల కోట్ల నెట్వర్త్ను సాధించిన తొలి దేశీ కంపెనీగా రికార్డు నెలకొల్పింది. ఈ బాటలో గతేడాది రూ. 20 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్(విలువ)ను అందుకున్న తొలి సంస్థగా సైతం నిలిచింది! ప్రయివేట్ ప్లేస్మెంట్ పద్ధతిలో మార్పిడిరహిత డిబెంచర్లు తదితర సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 25,000 కోట్లవరకూ సమీకరించేందుకు బోర్డు అనుమతించినట్లు ఆర్ఐఎల్ వెల్లడించింది. 2025 మార్చి31కల్లా రుణ భారం రూ. 3.24 లక్షల కోట్ల నుంచి రూ. 3.47 లక్షల కోట్లకు పెరిగింది. విభాగాలవారీగా రిలయన్స్ రిటైల్ వెంచర్స్ నికర లాభం క్యూ4లో 29 శాతం జంప్చేసి రూ. 3,545 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 16 శాతం వృద్ధితో రూ. 88,620 కోట్లయ్యింది. ఈ కాలంలో 238 స్టోర్లను కొత్తగా తెరవడంతో వీటి సంఖ్య 19,340కు చేరింది. అయితే స్టోర్ల క్రమబద్ధీకరణతో నిర్వహణ ప్రాంతం 2 శాతం తగ్గి 7.74 కోట్ల చదరపు అడుగులకు పరిమితమైంది. ఇక ఆయిల్ టు కెమికల్(ఓ2సీ) బిజినెస్ నిర్వహణ లాభం క్యూ4లో 10 శాతం క్షీణించి రూ. 15,080 కోట్లకు చేరింది. ఇంధన రిటైల్(జియో–బీపీ) బిజినెస్లో పెట్రోల్ అమ్మకాలు 24%, డీజిల్ విక్రయాలు 25% ఎగశాయి. కేజీ డీ6 క్షేత్రాలలో గ్యాస్ ఉత్పత్తి తగ్గడంతో ఇబిటా 8.6% నీరసించి రూ. 5,123 కోట్లకు పరిమితమైంది. గ్యాస్ ఉత్పత్తి రోజుకి 26.73 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్లకు చేరగా.. చమురు 19,000 బ్యారళ్లుగా నమోదైంది.జియో జోరు టెలికం, డిజిటల్ బిజినెస్ల జియో ప్లాట్ఫామ్స్ నికర లాభం క్యూ4లో 26 శాతం జంప్చేసి రూ. 7,022 కోట్లను తాకింది. పూర్తి ఏడాదిలో 22% ఎగసి రూ. 26,120 కోట్లకు చేరింది. జియో వినియోగదారుల సంఖ్య 48.21 కోట్ల(క్యూ3) నుంచి 48.82 కోట్లకు ఎగసింది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం (ఏఆర్పీయూ) రూ. 203.3(క్యూ3) నుంచి రూ. 206.2కు మెరుగుపడింది. క్యూ4 ఆదాయం రూ. 33,986 కోట్లు కాగా.. పూర్తి ఏడాదిలో రూ.1,28,218 కోట్లకు చేరింది. విలీనం తర్వాత జియోహాట్స్టార్ ఆదాయం రూ. 10,006 కోట్ల స్థాయిని అధిగమించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14న జియోసినిమా, డిస్నీప్లస్హాట్స్టార్ విలీనంతో జియోహాట్స్టార్ ఏర్పాటైంది.నిలకడగా.. ప్రపంచ బిజినెస్ వాతావరణరీత్యా గతేడాది సమస్యాత్మకంగా నిలిచింది. బలహీన ఆర్థిక పరిస్థితులు, రాజకీయ, భౌగోళిక మార్పుల నేపథ్యంలో నిర్వహణా సంబంధ క్రమశిక్షణ, కస్టమర్ కేంద్రంగా ఆవిష్కరణలు కంపెనీ నిలకడైన పనితీరు చూపేందుకు దోహదపడ్డాయి. – ముకేశ్ అంబానీ, చైర్మన్, రిలయన్స్ ఇండస్ట్రీస్

వాణిజ్య ఒప్పందంతో కొత్త అవకాశాలు
న్యూఢిల్లీ: భారత్, వాణిజ్య ఒప్పందం, అమెరికా ఉత్పత్తులకు, కొత్త అవకాశాల,ను తీసుకొస్తుందని అమెరికా వాణిజ్య ప్రతినిధి (యూఎస్టీఆర్) జైమీసన్ గ్రీర్ తెలిపారు. అంతేకాదు ఇరు దేశాల్లోని కారి్మకులు, రైతులు, వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. భారత్–అమెరికా కాంపాక్ట్ భాగస్వామ్యం ప్రాధాన్యతను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన మరోసారి ధ్రువీకరించినట్టు చెప్పారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం దిశగా పురోగతిని ప్రస్తావించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక చర్చలు వాణిజ్యం విషయంలో సమతుల్యతను తీసుకొస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. యూఎస్టీర్, భారత వాణిజ్య శాఖ, పరిశ్రమల శాఖలు చర్చలకు సంబంధించి నిబంధనలను ఇప్పటికే ఖరారు చేసినట్టు చెప్పారు. భారత మార్కెట్లో తన ఉత్పత్తులకు మరింత ప్రవేశం కల్పించడం కోసం అమెరికా చూస్తోందని, టారిఫ్, నాన్ టారిఫ్ అడ్డంకులను తగ్గించుకోవాలని అనుకుంటున్నట్టు తెలిపారు. దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా అదనపు హామీలపై చర్చించనున్నట్టు చెప్పారు. భారత్ పెద్ద ఎత్తున టారిఫ్లు విధిస్తోందంటూ అమెరికా ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఆరోపించడం గమనార్హం. భారత్తో 45.7 బిలియన్ డాలర్ల వాణిజ్యలోటును అమెరికా మోస్తోంది. 2024లో భారత్తో అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 129.2 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత ఉత్పత్తులపై అమెరికా సగటు టారిఫ్ 3.3 శాతంగా ఉంటే, అమెరికా ఉత్పత్తులపై భారత్ సగటున 17 శాతం టారిఫ్ విధిస్తుండడం గమనార్హం. టారిఫ్లకు అదనంగా సేవల మార్కెట్కు సంబంధించి సాంకేతిక పరమైన అవరోధాలు, నియంత్రణపరమైన అవరోధాలు భారత్తో అమెరికా వాణిజ్యం పెంచుకునే విషయంలో అవరోధాలు కలి్పస్తున్నట్టు జైమీసన్ గ్రీర్ తెలిపారు.
ఫ్యామిలీ

ఖాకీ రీల్స్
దేశవ్యాప్తంగా ఎంతోమంది మహిళా పోలీసులు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకొంటున్నారు. ‘ఖాకీ రీల్స్’ కొత్త ట్రెండ్గా మారింది. ఉత్తేజపరిచే వ్యక్తిత్వ వికాస ప్రసంగాల నుంచి వర్కవుట్ల వరకు ఆకట్టుకునే ‘రీల్స్’ చేస్తున్నారు....ఉత్తర్ప్రదేశ్కు చెందిన పోలీస్ ఆఫీసర్ కాంచన్ పాండేకు ఇన్స్టాగ్రామ్లో 99,900 మంది ఫాలోవర్లు ఉన్నారు. డ్యాన్స్ చేయడం, పోలీస్ యూనిఫామ్లో స్టైల్గా నడవడం, జుట్టును చలాకీగా తిప్పడంలాంటి ‘రీల్స్’ చేస్తుంటుంది. ‘హిందీ సినిమా తారలకు ఏమాత్రం తీసిపోదు’ అంటూ పాండే అందాన్ని ΄÷గుడుతుంటారు అభిమానులు. ‘ప్రతి రోజూ పరుగెత్తండి. కానీ ప్రతిరోజూ ఒక రౌండ్ పెంచండి’లాంటి సలహాలు ఆమె నోటి నుంచి వినిపిస్తాయి.మధ్యప్రదేశ్కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ సిమ్రాన్ రఘువంశీ ఒకప్పుడు మోడల్ కావాలని కలలు కన్నది. కాని ఆమె కుటుంబం ఒప్పుకోలేదు. దీంతో ‘మోడల్’ కలకు తెర వేసి పోలీస్ డిపార్ట్మెంట్లో చేరింది. ఆ తరువాత ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్గా మారింది. ‘ఖాళీ సమయాల్లో రీల్స్ చేస్తుంటాను’ అంటున్న సిమ్రాన్ను–‘పోలీస్ యూనిఫామ్లో రీల్స్ చేయవద్దని సీనియర్ అధికారులు చెప్పారా?’ అని అడిగితే...‘యూనిఫాంలో అభ్యంతరకరమైన రీల్స్ చేసినప్పుడు, అసభ్యకరమైన పాటకు యూనిఫామ్తో డ్యాన్స్ చేయడంలాంటివి చేసినప్పుడే సమస్య. అలా చేయనంత కాలం ఎలాంటి సమస్య ఉండదు’ అంటుంది సిమ్రాన్.సిక్కింకు చెందిన ఆలివా సవాడెన్ ‘లేడీబైకర్కాప్’ అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా రాష్ట్రంలోని పచ్చని చెట్ల పక్క నుంచి, పరిశుభ్రమైన రోడ్ల వెంట రైడింగ్ చేస్తున్న వీడియోలను షేర్ చేస్తుంటుంది. పోలీస్ యూనిఫామ్, సివిడ్ డ్రెస్లలో ఆమె పోస్ట్లు కనిపిస్తుంటాయి.‘ఫిట్ సురేఖ’ అనే హ్యాండిల్ ద్వారా పోలీసు అధికారి సురేఖ పవర్ లిఫ్టింగ్ నుంచి రన్నింగ్ వరకు రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. ‘మీరు గెలవాలంటే మొండిగా ఉండాలి. ఓడిపోవడానికి భయం చాలు’ అని తన పోస్ట్లో రాసింది.అస్సాంలో పోలీస్ కానిస్టేబుల్గా పని చేస్తున జిమ్మీ రోంగ్మేయ్ ఎంటీవీ రియాలిటీ షోలో పాల్గొంది, వర్కవుట్ వీడియోలు, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన గ్లింప్స్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.దిల్లీలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న అన్షు ఇన్స్టాగ్రామ్ వీడియోలతో పేరు తెచ్చుకుంది. ఆమె పోస్ట్ చేసే వీడియోలలో ఆకట్టుకునే డైలాగులు ఎన్నో ఉన్నాయి.తన సన్ గ్లాసెస్పై ‘ఐ డోండ్ కేర్’ అని రాసి ఉంటుంది.మధ్యప్రదేశ్కు చెందిన పోలీస్ ఆఫీసర్ సారిక రావత్....‘అమ్మాయిలు ఏ గులాబీపై ఆధారపడరు. వారే ఈ విశ్వపు తోటలు’ అంటుంది. సబ్–ఇన్స్పెక్టర్ పరీక్ష రాసే అభ్యర్థుల కోసం గైడెన్స్ వీడియో ను రూపొందించమని ఫాలోవవర్స్ నుంచి వచ్చిన విన్నపాన్ని ఆమె అంగీకరించింది.

కోడలికి రెండో పెళ్లి చేసి, కన్నీటితో సాగనంపిన ‘మామగారు’
కన్నవారిని, ఉన్న ఊరిని వదిలి, కోటి ఆశలతో అత్తింటికి చేరే కోడళ్లను కన్న కూతురిలా చూసుకునే కుటుంబాలు చాలా ఉన్నాయి. కానీ కొడుకు మరణం తరువాత కోడల్ని అక్కున చేర్చుకుని ఆదరించడమే కాకుండా, ఆమెకు మరో జీవితాన్ని ప్రసాదించిన కుటుంబాలు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి ఒక హృద్యమైన కథనం నెట్టింట వైరల్గా మారింది. అనేక ప్రశంసలు దక్కించుకుంది. గుజరాత్లోని అంబాజీ నివాసి ప్రవీణ్ సింగ్ రాణా. ముదిమి వయసులో ఆదు కుంటాడనుకున్న పెద్ద కుమారుడు సిద్ధరాజ్ సింగ్ అర్థాంతరంగా కన్నుమూశాడు. దీంతో తనతో పాటు కోడలు, నెలల వయస్సున్న చిన్న బిడ్డ అనాథలైపోయారు. కానీ ఇక్కడే ప్రవీణ్ సింగ్ తన పెద్దరికాన్ని చాటుకున్నాడు. కోడలికి తండ్రి స్థానంలో నిలబడ్డాడు. చక్కగా పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపాడు. కోడలి, మనవరాల్ని కన్నీటితో సాగనంపడం విశేషంగా నిలిచింది.చదవండి: Attari Border Closure : పెళ్లి ఆగిపోయింది! కొడుకు మరణం2024లో దీపావళి పండుగ సందర్భంగా ఆకస్మిక గుండెపోటు రావడంతో కన్నుమూశాడు. ఈ సంఘటనతో సిద్ధరాజ్ భార్య కృష్ణ, చిన్నారి దీక్షితతో సహా కుటుంబం మొత్తం దిగ్భ్రాంతికి లోనైంది. ఇక జీవితాంతం భర్తలేకుండా గడపాల్సి ఉంటుందని, తండ్రి లేకుండా తన కుమార్తెను ఎలా పెంచాలంటూ కృష్ణ అంతులేని శోకంలో మునిగిపోయింది. చుట్టుపక్కల సమాజం కూడా అలానే అనుకుంది.కానీ ప్రవీణ్ మనసు వేరేలా ఆలోచించింది. తన కుమార్తెలా చూసుకున్నాడు. సమాజం అభిప్రాయాలను, భయాలను పట్టించుకోకుండా, తన కొడుకు ప్రాణ స్నేహితుడు సంజయ్తో తన కోడలి కృష్ణకు వైభవంగా పెళ్లి జరిపించాడు. కోడలితో పాటు, మనవరాలు దీక్షిత తరలి పోతోంటే, తన తల్లితో వెళ్లిపోయినప్పుడు తాత భావోద్వేగంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో నెటిజన్లు ప్రవీణ్,కుటుంబంపై ప్రశంసలు కురిపించారు. ఇలాంటి ప్రేమ, ఆప్యాయతలు కదా నేటి సమాజానికి కావాల్సింది అంటూ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: రూ. 40 లక్షల నుంచి 20 కోట్లకు ఒక్కసారిగా జంప్.. ఎవరీ నటుడు?కృష్ణను రెండో పెళ్లి చేసుకున్న సంజయ్ ప్రవీణ్కు ధన్యవాదాలు తెలిపారు. సిద్ధరాజ్ తన చిన్ననాటి స్నేహితుడనీ, కృష్ణను కొంతకాలంగా తనకు తెలుసునని చెప్పారు. కృష్ణ, దీక్షితను కంటికి రెప్పలా చూసుకుంటానని సిద్ధరాజ్ కుటుంబానికి సంజయ్ హామీ ఇచ్చాడు. తన స్నేహితుడి కుమార్తె , కోడలికి కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకున్నాను. దీని గురించి ప్రవీణ్ సింగ్తో మాట్లాడాను. ఆయన మా పెళ్లికి అంగీకరించారు అని చెప్పుకొచ్చాడు. అటు కృష్ణ కూడా అత్త మామలకు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది.

Summer Tips 46-48 డిగ్రీలకు ఎండలు : జాగ్రత్తలు తీసుకోకపోతే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు గత కొన్ని రోజులుగా ఆందోళనకర స్థాయిలో పెరిగాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40–42 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. మే నాటికి 46–48 డిగ్రీల వరకు చేరుకోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా సింగరేణి కాలరీస్తోపాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వేసవికి అనుగుణంగా నడుచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వేసవి తీవ్రత.. తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాష్ట్రంలో ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. సింగరేణి ప్రాంతంలోని బొగ్గు గనుల సమీపంలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు చేరుకుంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, తేమ శాతం తక్కువగా ఉండటం వల్ల వడగాడ్పులు తీవ్రతరం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సింగరేణి కారి్మకులతోపాటు రోజువారీ కూలీలు, రైతులు, చిరువ్యాపారులు, నిర్మాణరంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఉష్ణోగ్రతలు అసాధారణ రీతిలో పెరగడం వల్ల వడదెబ్బ, డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఎక్కువ ఉందని వైద్యులు చెబుతున్నారు. అప్రమత్తత అవసరం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావడం తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరైతే గొడుగు, టోపీ, సన్్రస్కీన్ లేదా తడి గుడ్డ ఉపయోగించడం ద్వారా ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందాలని చెబుతున్నారు. టూవీలర్లపై వెళ్లే వారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, వదులైన, లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలంటున్నారు. డీహైడ్రేషన్కు గురికాకుండా ... వేసవిలో తాగిన నీరు తాగినట్టే చెమట రూపంలో వెళ్లిçపోతుంది. రోజుకు 3–4 లీటర్ల నీరు తాగడం శ్రేయస్కరం. దాహం లేకపోయినా గంటకోసారి నీటిని తాగుతూ ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. చెమట ఎక్కువగా పట్టినప్పుడు ఓఆర్ఎస్, ఉప్పు–చక్కెర కలిపిన నీరు తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు. కూల్డ్రింక్స్, బీర్లు, చికెన్, మాంసం తినడం వేసవిలో వేడిని ఇంకా పెంచుతాయి. రోజుకు 2–3 సార్లు కొబ్బరినీరు తాగితే శరీరంలో ఎలక్రొ్టలైట్స్ సమతౌల్యంగా ఉంటాయి. కాఫీ, టీ, ఆల్కహాల్ శరీరంలో నీటిని తగ్గిస్తాయి కాబట్టి వాటి బదులు హెర్బల్ టీ, తాజా పండ్ల రసాలు తాగడం మేలు. ఆహారం ముఖ్యం తేలికైన, నీరు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. పుచ్చకాయ, దోసకాయ, ఆరెంజ్, కీర దోస వంటివి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. అధిక ఉప్పు, కారం, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. బదులుగా ఉడకబెట్టిన ఆహారం, సూప్లు, సలాడ్లు తీసుకోవాలి. గుండె జబ్బులు, మధుమేహం ఉన్న వాళ్లు నీటిని అధికంగా సేవిస్తూ ఎండల్లో తిరగడం తగ్గించాల్సి ఉంటుంది. జాగ్రత్తలతోనే వేసవి నుంచి రక్షణ వేసవిలో శరీరంలో నీటి శాతం, ఎలక్ట్రోలైట్లు తగ్గిపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. శరీర ఉష్ణోగ్రత 40.5 డిగ్రీలు దాటినప్పుడు మెదడు వ్యాధులు, అవయవ వైఫల్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను శరీరం బ్యాలెన్స్ చేసుకొనేలా వ్యవహరించాలి. ఆహార నియమాలు పాటించాలి. అధిక ఎక్సర్సైజ్లు తగ్గించాలి. – డాక్టర్ కిరణ్ మాదాల, ప్రొఫెసర్ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్, ఉస్మానియా కళాశాల

స్లిమ్గా నటి మాధురి దీక్షిత్ భర్త..! మొదట తండ్రిపై ఆ తర్వాత..
బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 90లలో ఎన్నోబ్లాక్బస్టర్ హిట్ మూవీలతో వేలాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ నటి. ఇక ఆమె డాక్టర్ శ్రీరామ్ని పెళ్లాడి..సినీ రంగానికి దూరంగా ఉన్నారు. ఇటీవలే అడపదడపా బుల్లితెరపై కొన్ని షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ తళుక్కుమంటున్నారు. ఆమె ఈ వయసులో కూడా అంతే స్లిమ్గా అందంగా ఉంటారామె. అందులోనూ ఆమె భర్తే ఆరోగ్య నిపుణుడు కాబట్టి..ఫిట్నెస్పై మంచి శ్రద్ధ తప్పకుండా ఉంటుంది. అంతేగాదు ఈ ముద్దుగుమ్మ భర్త శ్రీరామ్ బరువు ఏవిధంగా తగ్గించుకోవచ్చో తనపైనే ప్రయోగాలను చేసుకుని మరీ వివరిస్తున్నారు. ఆయన చిన్న చిన్న మార్పులతో బరువు తోపాటు శరీరంలోని కొలెస్ట్రాల్ని కూడా తగ్గించుకున్నట్లు తెలిపారు. అదెలాగో చూద్దామా..!.ఇంక్టాక్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్డియాక్ థొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్ అయిన శ్రీరామ్ నేనే ఆరోగ్యంగా ఉండటంలో కీలకపాత్ర పోషించేది జీవనశైలేనని నొక్కి చెప్పారు. చక్కటి ఆరోగ్యం కోసం జీవశైలిలో మంచి మార్పులు అనే పెట్టుబడి పెట్టాలన్నారు. లేదంటే అనారోగ్యం బారిన పడక తప్పదన్నారు. వివిధ సంక్రమిత వ్యాధులకు ప్రధాన కారణం మానవులు అనుసరించే లైఫ్స్టైలేనని అన్నారు. ఆయన తన పేషెంట్లకు వచ్చే వ్యాధులను చక్కటి జీవశైలితో బయటపడేలా చేశాడు. ఆయన తండ్రి 55 ఏళ్ల వయసులో డయాబెటిస్తో బాధపడుతున్నప్పుడూ.. అతని జీవనశైలి మార్చి..మందులపై ఆధారపడకుండా నిర్వహించగలిగేలా చేశానని అన్నారు. ప్రస్తుతం ఆయనకు 86 సంవత్సరాలని అన్నారు. తన తండ్రిలో వచ్చిన మంచి పరివర్తన చూశాక.. ఓ డాక్టర్గా తాను కూడా మంచి జీవనశైలిని పాటించాలని గ్రహించానన్నారు శ్రీరామ్. అప్పుడే మంచిగా ప్రజలకు సేవల చేయగలనని విశ్వసించి..మార్పుకు శ్రీకారం చుట్టారట. ఎప్పుడైతే శ్రీరామ్ జీవనశైలిలో మంచి మార్పులు తీసుకురావడం ప్రారంభించారో..త్వరితగతిన సత్ఫలితాలను అందుకున్నారు. దాదాపు 18 కిలోల బరువు తగ్గారు, అలాగే 16శాతం శరీర కొవ్వు కూడా తగ్గిందని చెప్పారు. దీన్ని అలాగే కొనసాగించి..తదుపరి పుట్టిన రోజుకల్లా..12 నుంచి 15 శాతం కొలెస్ట్రాల్ను తగ్గించుకోవాలనేది తన లక్ష్యమని అన్నారు. ఇంతలా ఎందుకంటే..తాను ఓ మ్యాగ్జైన్ షూటింగ్లో పాల్గొనాల్సి ఉందని చెప్పుకొచ్చారు. అంటే మంచి జీవనశైలి, చక్కటి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యంగా ఉండొచ్చాని ప్రయోగపూర్వకంగా చెప్పడమే ఎందరికో స్ఫూర్తిని కలిగించారు డాక్టర్ శ్రీరామ్.(చదవండి: ChatGPT: చాట్జీపీటీ లేకపోతే ప్రాణమే పోయేది..! వైద్యులే ఆ సమస్య ఏంటో చెప్పలేకపోయారు..)
ఫొటోలు


పట్టు చీరలో పుత్తడిబొమ్మలా మెరిసిపోతున్న అనసూయ (ఫొటోలు)


కన్నీటి సుడుల నడమ.. బాధాతృప్త హృదయాలతో వీడుతూ. సరిహద్దులో భావోద్వేగ దృశ్యాలు (చిత్రాలు)


సన్రైజర్స్ vs చెన్నై మ్యాచ్లో సందడి చేసిన హీరో అజిత్, శివ కార్తికేయన్ (ఫొటోలు)


హైదరాబాద్ : ‘భారత్ సమ్మిట్-2025.. విదేశీ ప్రతినిధులకు ఘనస్వాగతం (ఫొటోలు)


నిశ్చితార్థమై ఏడాది.. కాబోయే భర్తతో 'బిగ్ బాస్' శోభాశెట్టి (ఫొటోలు)


బాబోయ్.. సుర్రుమంటున్న ఎండలు.. జనం బెంబేలు (చిత్రాలు)


త్రిష తల్లిని చూశారా? ఈమె కంటే అందంగా ఉందిగా! (ఫొటోలు)


అందంగా ఆషికా.. అద్దం ముందు నుంచి కదలట్లేదుగా! (ఫోటోలు)


సూర్య ‘రెట్రో’ మూవీ ఆడియో లాంచ్ (ఫొటోలు)


నేచురల్ స్టార్ నాని 'హిట్ 3' మూవీ స్టిల్స్
అంతర్జాతీయం

ఔను.. చెత్త పనులు చేశాం.. తప్పు ఒప్పుకున్న పాక్
అమెరికా, బ్రిటన్ కోసమే చెత్త పనులు చేశామని.. ఉగ్రవాదాన్ని పోత్సహించడం పొరబాటని అర్థమైందంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. అమెరికా కోసమే ఉగ్రవాదులను పెంచిపోషించామంటూ ఆయన తప్పును ఒప్పుకున్నారు. ఉగ్రవాదం వల్ల చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ స్వయంగా ఆ దేశ రక్షణమంత్రే అంగీకరించారు. ఓ అంతర్జాతీయ మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.పహల్గాం దాడి అనంతరం భారత్తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ‘స్కై న్యూస్’ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ, ఉగ్రవాదులకు శిక్షణ, మద్దతు ఇవ్వడంలో పాకిస్థాన్కు సుదీర్ఘ చరిత్ర ఉందని.. దీని మీరు అంగీకరిస్తారా? అంటూ జర్నలిస్టు ప్రశ్నించగా.. ‘‘అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమదేశాల కోసమే మూడు దశాబ్దాల పాటు తాము ఈ చెత్త పనులన్నీ చేస్తున్నామంటూ ఖవాజా బదులిచ్చారు.సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో మేం చేరకపోయి ఉంటే.. పాక్కు తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉండేదన్నారు. లష్కరే తోయిబాకు గతంలో పాకిస్థాన్తో కొన్ని సంబంధాలు ఉన్నాయని కూడా ఖవాజా ఆసిఫ్ అంగీకరించారు. అయితే, ఇప్పుడు ఈ ఉగ్రవాద సంస్థ అంతమైందన్నారు.

పిల్లపామును పెంచి పోషిస్తున్న హఫీజ్ సయ్యద్!
పహల్గాంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు నరమేధం జరిపి 26 మందిని పర్యాటకుల్ని పొట్టనబెట్టుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. కశ్మీర్లో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే కావడం గమనార్హం. అయితే లష్కర్-ఇ-తోయిబా(LeT) తరఫున కరడుగట్టిన టీఆర్ఎఫ్ గ్రూప్ ఈ ఘాతుకానికి పాల్పడగా.. ఆ సంస్థ కదలికలపై భద్రతా ఏజెన్సీలు ఓ అంచనాకి వచ్చాయి.లష్కరే తోయిబా విష సర్పానికి పుట్టిన పిల్ల పామే.. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్). 2019లోనే ఇది పుట్టింది. ఈ విభాగానికి తొలినాళ్లలో షేక్ సాజిద్ గుల్ సుప్రీం కమాండర్గా, చీఫ్ ఆపరేషనల్ కమాండర్గా బాసిత్ అహ్మద్ దార్ వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి లష్కరే చీఫ్ హఫీజ్ సయ్యద్(hafiz saeed) కనుసన్నల్లోనే నడుస్తోంది. డిప్యూటీ హెడ్గా సైఫుల్లా(హిజ్బుల్ ముహజిదిన్) వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరూ పాక్ నుంచే ఎల్ఈటీ కార్యకలాపాలను నడిపిస్తున్నారనే అభియోగాలు ఉండనే ఉన్నాయి. పాక్ సైన్యం, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ISI) టీఆర్ఎఫ్ గ్రూపులకు సైద్ధాంతికపరమైన మద్దతు మాత్రమే కాదు.. అన్నిరకాలుగా మద్దతు ఇస్తున్నాయని భారత గూఢచార సంస్థలు భావిస్తున్నాయి.తొలినాళ్లలో జిహాదీ పేరిట ఆన్లైన్లో The Resistance Front సంస్థ పోస్టులు చేసేది. కశ్మీరీలు భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదంలో చేరేలా గప్చుప్ ప్రచారాలు చేసేది. ఉగ్ర కార్యకలాపాల కోసం ఆన్లైన్ ద్వారా యువతను నియమించుకునేది. ఆయుధ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి చర్యలకు పాల్పడింది. ఆ సమయంలో ఈ గ్రూప్ కార్యకలాపాలను కట్టడి చేసేందుకు జమ్ము పోలీసులు చేసిన ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించలేదు. ఆ తర్వాత హిజ్బుల్ ముహజిదిన్, లష్కరే తొయిబా సభ్యులతోనే చాన్నాళ్లు నడిచింది. కానీ, ఆ తర్వాతే ఈ గ్రూపులో విదేశీ ఉగ్రవాదుల చేరిక క్రమంగా పెరుగుతూ వచ్చింది. వీళ్లకు కశ్మీర్ నుంచి స్థానిక ఉగ్రవాదుల మద్దతు లభిస్తూ వస్తోంది. అలా.. ఈ సంస్థ కశ్మీర్ లోయలో చాలా కాలంగా యాక్టివ్గా ఉంది. 2023లో కేంద్రం హోం శాఖ ఈ గ్రూప్పై విషేధం విధించింది.ఇంతకుముందు.. సోనామార్గ్, బూటా పాత్రి, గందర్బల్ దాడులకు ఈ సంస్థే కారణమని భద్రతా సంస్థలు బలంగా నమ్ముతున్నాయి. కిందటి ఏడాది అక్టోబర్లో బూటా పాత్రి ఇద్దరు సైనికులు సహా నలుగురిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. అదే నెలలో సోనామార్గ్ టన్నెల్ పనులు జరుగుతున్న ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో ఆరుగురు కార్మికులు, ఓ డాక్టర్ చనిపోయారు. పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాది హషీమ్ మూసా.. సోనామార్గ్ దాడిలోనూ పాల్గొన్నట్లు స్పష్టంగా తేలింది. అయితే సోనామార్గ్ ఘటన తర్వాత.. ఎల్ఈటీ ఏఫ్లస్ కేటగిరీ ఉగ్రవాది జునైద్ అహ్మద్ భట్ను డిసెంబర్లో దాచిగామ్ వద్ద భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఇదే ఎన్కౌంటర్లో గ్రూప్ సభ్యులు సమీపంలోని అడవుల్లోకి పారిపోయారు.సాధారణంగా దాడులకు పాల్పడ్డాక టీఆర్ఎఫ్ గ్రూప్ సభ్యులు అండర్గ్రౌండ్లోకి వెళ్లిపోతారు. దట్టమైన అడవుల్లో తలదాచుకుంటూ.. పాక్ నుంచి గ్రూప్ నేతలు ఆదేశాలు కోసం ఎదురు చూస్తుంటారు. టీఆర్ఎఫ్ను తన కనుసన్నల్లోనే నడిపిస్తున్న హఫీజ్ సయ్యదే.. పహల్గాం దాడికి మాస్టర్ మైండ్ హఫీజ్ సయ్యదే అయి ఉండొచ్చని నిఘా సంస్థలు భావిస్తున్నారు. ఏప్రిల్ 24వ తేదీన.. గురువారం జమ్ము కశ్మీర్ పోలీసులు ఉగ్రవాదులకు సంబంధించిన స్కెచ్లు రిలీజ్ చేశారు. అందులో హషిమ్ మూసా అలియాస్ సులేమాన్, అలీ బాయి అలియస్ తల్హా పాకిస్థానీలుగా జమ్ము పోలీసులు ప్రకటించారు. మిగతా ఇద్దరు అబ్దుల్ హుస్సేన్ తోకర్, అసిఫ్లు స్థానికులేనని ప్రకటిచారు. ఈ ఇద్దరూ 2018లో కశ్మీర్కు వెళ్లి.. ఎల్ఈటీలో శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత టీఆర్ఎఫ్లో సహాయకులుగా చేరి.. పహల్గాం మారణ హోమంలో భాగం అయ్యారు.ప్లాన్ ప్రకారమే..సైనికుల దుస్తుల్లో వచ్చిన టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు.. బైసరన్ లోయలోని పిక్నిక్ స్పాట్లో మూడు వేర్వేరు ప్రాంతాలను ఎంచుకుని దాడికి పాల్పడ్డారు. తొలుత పర్యాటకులతో చాలాసేపు వాళ్లు మాట్లాడారు. ఆ తర్వాత పర్యాటకుల్లో ఐదుగురిని ఒక చోట చేర్చి చంపారు. మైదానంలో మరో ఇద్దరిని కాల్చి చంపారు. పారిపోతున్న క్రమంలో.. ఫెన్సింగ్ వద్ద ఇంకొందరిని కాల్చి చంపారు. ఫెన్సింగ్ దూకిన వాళ్లు ప్రాణాలతో బయటపడగలిగారు.

తాష్కెంట్ ఒప్పందానికీ చెల్లుచీటీ!
భారత్, పాకిస్థాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దుశ్చర్యను నిరసిస్తూ సింధు నదీ జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేయడం, అందుకు బదులుగా 1972 నాటి సిమ్లా అగ్రిమెంటు అమలును పాక్ సస్పెండ్ చేయడం తెలిసిందే. తాష్కెంట్ ఒప్పందం నుంచి కూడా వైదొలగాలని పాక్ తాజాగా యోచిస్తోంది. 1965లో ఇండియాతో తలెత్తిన యుద్ధానికి ముగింపు పలికేందుకు పాక్ 1966లో తాష్కెంట్ (ఉజ్బెకిస్థాన్) శాంతి ఒప్పందానికి తలూపింది. నాటి సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వంతో 1966 జనవరి 10న తాష్కెంట్ వేదికగా భారత్, పాక్ మధ్య ఈ చారిత్రక శాంతి ఒప్పందం కుదిరింది. నాటి భారత ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి, పాక్ అధ్యక్షుడు మహమ్మద్ ఆయూబ్ ఖాన్ ఈ డిక్లరేషన్ మీద సంతకాలు చేశారు. నాటి సోవియట్ రాజకీయవేత్త అలెక్సీ కోసిజిన్ ఈ కార్యక్రమానికి సోవియట్ ప్రతినిధిగా హాజరయ్యారు. భారత్, పాక్ ఇరు దేశాలూ తమ సైనిక బలగాలను ఉపసంహరించుకుని వాటిని యుద్ధానికి ముందు నాటి స్థానాలకు మళ్లించడం, ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో రెండో దేశం జోక్యం చేసుకోకుండా నివారించడంతోపాటు దౌత్య, ఆర్ధిక సంబంధాలను పునరుద్ధరించడం వంటివి ఈ డిక్లరేషన్ ప్రధానాంశాలు. అయితే కశ్మీర్ వివాద పరిష్కారంలో తాష్కెంట్ ఒప్పందం విఫలమైంది. 1971లో భారత్, పాక్ నడుమ మరో యుద్ధం సంభవించడం, బంగ్లాదేశ్ అవతరణ పరిణామాలతో 1972లో సిమ్లా ఒప్పందం కుదిరింది. అలా కశ్మీర్లో నియంత్రణ రేఖ ఏర్పాటైంది. అప్పట్నుంచి భారత్, పాక్ ద్వైపాక్షిక సంబంధాల్లో సిమ్లా అగ్రిమెంటుకు ప్రాధాన్యం పెరగడంతో తాష్కెంట్ ఒప్పందం కొన్ని దశాబ్దాలుగా మరుగునపడింది. సిమ్లా అగ్రిమెంటుకే విలువ ఇవ్వకుండా పక్కకు తప్పుకున్న పాక్ తాజాగా ఆరు దశాబ్దాల నాటి తాష్కెంట్ ఒప్పందం నుంచి వైదొలగాలని యోచించడం పెద్ద విశేషమేమీ కాదు. కాకపొతే పాక్ వైఖరిని గమనించడానికి ఇదొక ఉదాహరణ. చారిత్రకంగా ప్రాధాన్యమున్న శాంతిపరమైన బాధ్యతలను నెరవేర్చకుండా తప్పుకోవడం, కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయంగా రచ్చ చేయాలని చూడటం వంటివి పాక్ వ్యూహాలుగా కనిపిస్తున్నాయి. ఇకపై కశ్మీర్ వివాదం ద్వైపాక్షికం కాదని వాదిస్తూనే, ఆ సమస్య పరిష్కారం కోసం తృతీయ పక్షం లేదా అంతర్జాతీయ జోక్యానికి పిలుపు ఇవ్వాలని పాక్ భావిస్తోంది. ఇందులో భాగమే తాష్కెంట్ ఒప్పందానికి పాక్ చెల్లుచీటీ! - జమ్ముల శ్రీకాంత్.

పాన్ వరల్డ్ హైవే.. 14 దేశాలను కలుపుతూ.. ఎన్నో వింతలు, విశేషాలతో..
ప్రస్తుతం అంతా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయి అంటూ తెగ చర్చ జరుగుతోంది. అయితే, దానికి కాస్తా భిన్నంగా పాన్ హైవే(PAN Highway.. గురించి ఎప్పుడైనా విన్నారా.. ఎప్పుడైనా చూశారా?. తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి.. ఈ హైవే అగ్రరాజ్యం అమెరికాలో ఉంది. ఈ రోడ్డు మార్గం పొడవు ఏకంగా 30,600 కిలోమీటర్లు (దాదాపు 19,000 మైళ్ళు). ఇది 14 దేశాలను కలుపుతూ వెళ్తోంది. అందుకే దీన్ని పాన్ అమెరికా హైవే అని పిలుస్తున్నారు. ఈ గురించి మరిన్ని వివరాలు ఇలా..రోడ్లు, హైవేలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, ప్రదేశాలు, సంస్కృతులను కలుపుతాయి. ఒక దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థ బాగుంటేనే ఆర్థికంగా ఎదిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే అమెరికాలో ప్రపంచంలోనే అతి పొడవైన రోడ్డు మార్గం నిర్మించారు. దీంతో, ఈ పాన్ అమెరికా హైవే.. రికార్డుల్లోకి ఎక్కింది.30,600 కిలోమీటర్ల పొడవు.. పాన్-అమెరికన్ హైవే.. అలాస్కాలోని ప్రుధో బేలో ప్రారంభమై అర్జెంటీనాలోని ఉషుయాలో ముగుస్తుంది. ఉత్తర అమెరికా.. దక్షిణ అమెరికాను కలుపుతుంది. ఈ రోడ్డు మార్గం దాదాపు 30,600 కిలోమీటర్లు (దాదాపు 19,000 మైళ్ళు) విస్తరించి ఉంది. ప్రపంచంలోనే అతి పొడవైన డ్రైవింగ్ చేయగల రహదారిగా రికార్డు సృష్టించింది.పాన్-అమెరికన్ హైవే ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికా అంతటా ఒకదానికొకటి అనుసంధానించబడిన రహదారుల ద్వారా విస్తరించి ఉంది. మరీ ముఖ్యంగా ప్రపంచంలోని అత్యంత సరళ రేఖలలో ఒకటిగా ఈ హైవే పరిగణించబడుతోంది. ఇది ఎలాంటి మలుపులు లేకుండా.. సరళ రేఖగా ఉంటుంది. ఈ రోడ్డు ఒక చివర నుంచి మరో చివరకు చేరుకోవాలంటే దాదాపు 60 రోజుల సమయం పడుతుంది. విరామం లేకుంగా రోజుకు 500 కిలోమీటర్లు ప్రయాణిస్తే.. గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉంది.Did you know about the Pan-American Highway? It stretches from Alaska to Argentina, covering over 19,000 miles and passing through multiple terrains, climates, and countries! Civil engineers across the Americas made it all possible.#CivilEngineering #Infrastructure #DidYouKnow pic.twitter.com/zDqErPyZ6R— CKL Engineers (@CKLEngineersLLC) April 10, 202514 దేశాలను కలుపుతూ..పాన్ అమెరికా రహదారి 14 దేశాలను కలుపుతూ వెళ్తోంది. కెనడా, యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, గ్వాటెమాల, ఎల్ సాల్వడార్, హోండురాస్, నికరాగ్వా, కోస్టా రికా, పనామా, కొలంబియా, ఈక్వెడార్, పెరూ, చిలీ, అర్జెంటీనాను కలుపుతుంది. ఇది కేవలం ఒక మార్గం మాత్రమే కాదు. ఈ రోడ్డుపై ప్రయాణ సమయంలో ఎన్నో వింతలు, ప్రకృతి దృశ్యాలు, సంస్కృతులు, చరిత్రలను తెలుసుకోవచ్చు. ఈ హైవే ఎడారులు, పర్వతాలు, వర్షారణ్యాలు, తీర ప్రాంతాలతో సహా వివిధ వాతావరణాలు కలిగిన ప్రాంతాల గుండా వెళ్తోంది. ఈ రోడ్డు నిర్మాణంపై 1920లో మొదటి సారి చర్చలు జరగ్గా.. 1937లో 14 దేశాలు పాన్-అమెరికన్ హైవే కన్వెన్షన్పై సంతకం చేశాయి. 1960లో రోడ్డు నిర్మాణం పూర్తి అయ్యి వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ రహదారిపై ట్రాఫిక్ లేకుండా వాహనాలు ప్రయాణం సాగిస్తున్నాయి. లాంగ్ రైడ్ వెళ్లాలనుకునే వారు ఈ మార్గంలో వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
జాతీయం

భూతల స్వర్గం మళ్ళీ వెలవెల!
భూతల స్వర్గంగా పేరుగాంచిన అందాల కశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడి ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న అక్కడి పర్యాటక రంగాన్ని మళ్లీ సంక్షోభంలోకి నెట్టేసింది. పహల్గాంలో ముష్కరులు 26 మంది టూరిస్టులను అత్యంత పాశవికంగా హతమార్చడం పర్యాటకుల విశ్వాసాన్ని దారుణంగా దెబ్బతీయడమే కాకుండా దాదాపు 2.5 లక్షల మంది కశ్మీరీల జీవనోపాధి, కశ్మీర్ లోయ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ప్రశ్నార్థకం చేసింది. మళ్లీ పర్యాటకుల్లో మునుపటి విశ్వాసం, ఉత్సాహం నెలకొనాలంటే ఎన్నేళ్లు పడుతుందోనని టూరిజం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. - సాక్షి, స్పెషల్ డెస్క్హోటళ్లన్నీ ఖాళీ..ఈ నెల 22న పహల్గాం సమీపంలో మినీ స్విట్జర్లాండ్గా పేరుగాంచిన బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాద దాడి ప్రభావంతో కశ్మీర్లో పర్యటించేందుకు సిద్ధమైన వేలాది మంది పర్యాటకుల్లో దాదాపు 90 శాతం మంది 24 గంటల వ్యవధిలోనే విమాన టికెట్లు రద్దు చేసుకున్నారు. మరోవైపు ఇప్పటికే కశ్మీర్ సందర్శనకు వచ్చిన పర్యాటకులు రాత్రికి రాత్రే హోటళ్లు, క్యాబ్ల బుకింగ్లు కూడా పెద్ద ఎత్తున రద్దు కావడం మొదలయ్యాయి.ఇప్పట్లో పర్యాటక పరిశ్రమ కోలుకొనే అవకాశమే లేదని ఓ ట్రావెల్ ఏజెంట్ వ్యాఖ్యానించారు. ‘మొన్నటివరకు పర్యాటకులతో కళకళలాడిన మా హోటల్ ఇప్పుడు వెలవెలబోతోంది. అసలైతే గదులన్నీ వచ్చే నెలకు కూడా బుక్ అయ్యాయి. కానీ రాత్రికి రాత్రే పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైంది. టూరిస్టులంతా భయంతో గదులు ఖాళీ చేసి వెళ్లిపోయారు’ అని ఓ హోటల్ యజమాని వాపోయారు.కేంద్రం చర్యలన్నీ బూడిదపాలు..కశ్మీరీలకు పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు. జమ్మూకశ్మీర్ వార్షిక పర్యాటక పరిశ్రమ విలువ దాదాపు రూ. 12 వేల కోట్లు. దీని విలువ 2030 నాటికి రూ. 30 వేల కోట్లకు పెరుగుతుందని అంచనా. జమ్మూకశ్మీర్కు స్పెషల్ స్టేటస్ కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని కేంద్రం 2019లో రద్దు చేయడంతోపాటు రాష్ట్ర హోదా తొలగించి జమ్మూకశ్మీర్ను లద్దాఖ్ను కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసింది. అలాగే ఏటా స్థానికంగా దాదాపు 50 వేల మందికి ఉపాధి కల్పించేలా, ఐదేళ్లలో రూ. 2 వేల కోట్ల వార్షిక పెట్టుబడులను ఆకర్షించేలా 2020లో ప్రత్యేక పర్యాటక పాలసీని తీసుకొచ్చింది. దీనికితోడు మౌలిక సదుపాయాల మెరుగుదల, విమాన కనెక్టివిటీ, విదేశీ పర్యాటకులకు ఆన్–అరైవల్ వీసా, 75 కొత్త పర్యాటక ప్రదేశాలు, 75 కొత్త వారసత్వ/సాంస్కృతిక ప్రదేశాలు, 75 కొత్త సూఫీ/మత ప్రదేశాల స్థాపన కోసం రూ. వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించింది. కశ్మీర్ను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో నేరుగా అనుసంధానించడానికి రైల్వే కూడా కసరత్తు ప్రారంభించింది.ప్రీమియం రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఇందులో ఉంది. కేంద్రం చర్యలతో 2020 నుంచి కశ్మీర్ లోయను సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2024 నాటికి పర్యాటకుల సంఖ్య సుమారు 2.36 కోట్లకు చేరుకుంది. కానీ ఇప్పుడు ఉగ్రవాద దాడితో అక్కడి పర్యాటక రంగం చుట్టూ సంక్షోభం ముసురుకుంది.

ఢిల్లీ మేయర్గా బీజేపీ నేత రాజా ఇక్బాల్ సింగ్
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారం దాదాపు రెండేళ్ల తర్వాత బీజేపీకి దక్కింది. ఆ పార్టీకి చెందిన రాజా ఇక్బాల్ సింగ్ శుక్రవారం ఢిల్లీ నూతన మేయర్గా ఎన్నికయ్యారు. 142 ఓట్లకు గాను ఇక్బాల్కు 133 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్కు చెందిన మన్దీప్ సింగ్పై ఇక్బాల్ ఘన విజయం సాధించారు. ఒక ఓటును చెల్లనిదిగా అధికారులు ప్రకటించగా, బీజేపీకి చెందిన ఎంపీ మనోజ్ తివారీ గైర్హాజరయ్యారు. కాంగ్రెస్కు మొత్తం 8 ఓట్లు పడ్డాయి. కాగా, ఈ ఎన్నికను ఆప్ బహిష్కరించింది. నెల రోజుల్లో స్టాండింగ్ కమిటీ వేసి ఢిల్లీ ప్రభుత్వం సహకారంతో ప్రజలకు సమస్యలే లేకుండా చేస్తామని ఇక్బాల్ సింగ్ ఎన్నిక అనంతరం ప్రకటించారు. ఇక్బాల్ సింగ్ నార్త్ ఎంసీడీ మేయర్గా చేశారు. 2020 దాకా పార్టీ సివిల్ లైన్స్ జోన్ చీఫ్గా వ్యవహరించారు.

సమరయోధులపై అపహాస్యమా?
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధులపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు మందలించింది. వీర సావర్కర్ను మహారాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆరాధిస్తారని గుర్తు చేసింది. ‘‘మీ నానమ్మ ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా సావర్కర్ను ప్రశంసిస్తూ లేఖ రాశారని మీకు తెలుసా? మనకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు తెచ్చిపెట్టిన వారిని ఇలా అవమానిస్తారా?’’ అంటూ ఆగ్రహం వెలిబు చ్చింది. ‘‘మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని సుమోటోగా తీసుకుంటాం’’ అని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం శుక్రవారం హెచ్చరించింది. ‘‘ఇలాగే వదిలేస్తే మున్ముందు ‘గాంధీ బ్రిటిష్వారికి సేవకుడు’ అని కూడా చెబుతారు. ఎందుకంటే వైస్రాయ్ను ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు గాంధీ ‘మీ నమ్మ కమైన సేవకుడు’ అంటూ మాట్లాడేవారు. స్వాతంత్య్ర యోధులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడాన్ని అనుమతించబోం’’ అని స్పష్టం చేసింది. సావర్కర్పై రాహుల్ వ్యాఖ్యలను బాధ్యతారాహిత్యంగా అభివర్ణించింది. యూపీలో దాఖలైన కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్పై స్టే విధించింది.

పర్యాటకుల మతంపై ఆరా తీసిన పోనీ రైడ్ నిర్వాహకుడి అరెస్ట్
న్యూఢిల్లీ: పహల్గాంలో గుర్రం స్వారీ సమయంలో నిర్వాహకుడొకరు తమను మతం గురించి అడిగాడంటూ ఓ పర్యాటకురాలు చెబుతున్నట్లుగా ఉన్న వీడియోపై గండేర్బల్ పోలీసులు కూపీ లాగారు. అతడిని గండేర్బల్లోని గోహిపొరాకు చెందిన ఐజాజ్ అహ్మద్ జుంగల్గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రదాడితో ఇతడికి సంబంధముందా అనే కోణంలో అతడిని ప్రశి్నస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు విడుదల చేసిన నలుగురు అనుమానితుల స్కెచ్లపై యూపీలోని జౌన్పూర్కు చెందిన యుక్తా తివారీ అనే పర్యాటకురాలు స్పందించారు. వారిలో ఇద్దరితో ఘటన రోజున తాను మాట్లాడినట్లు తెలిపారు. అయితే, తాను వారి పేర్లు అడగలేదని చెప్పా రు. ఆమె వెంట ఉన్న స్నేహితులు సైతం వీరిని గుర్తు పట్టారు. అతడు తమను, పేరు, మతం గురించి అడిగాడని, ఎన్నడైనా అజీ్మర్ దర్గాకు గానీ అమర్నాథ్కు గానీ వెళ్లారా అని కూడా ఆరా తీశాడన్నారు. హిందూ ముస్లిం మతాల్లో ఏదంటే ఎక్కువ ఇష్టమని మరొకడు ఆరా తీశాడని యుక్తా తివారీ పోలీసులకు తెలిపారు. ‘ఖురాన్ చదివారా, స్నేహితుల్లో హిందువులెందరు, ముస్లింలెందరు అని కూడా అడిగా డు. ఉర్దూ నాకు రాదని చెప్పగా, ఖురాన్ హిందీలోనూ ఉంటుందన్నాడు. దీంతో నాకు భయమేసింది. ఇంతలోనే అతడి ఫోన్ మోగింది. ఆ వ్యక్తి ప్లాన్ ఏ బ్రేక్ ఫెయిల్. ప్లాన్ బి 35 తుపాకులు పంపాం. వ్యాలీలో గడ్డిలో దాచామని చెప్పా డు. నేను వింటున్నట్లు తెలుసుకుని, వెంటనే మాట మార్చాడు’అని వివరించారు. అలా వారితో చాలా సేపు మాట్లాడామన్నారు. అత డు ఏడేళ్లుగా ఖురాన్ బోధిస్తున్నట్లుగా చెప్పా డన్నారు. అక్కడ తనకు పోలీసులెవరూ కనిపించకపోవడంతో ఈ విషయాలను చెప్పడం కుదరలేదని ఆమె వివరించారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఆ తర్వాత తనకు కనిపించలేదన్నారు. తమ మతం గురించి, 35 తుపాకులను గురించి మాట్లాడినందువల్లే ఆ ఇద్దరూ తనకు, తన స్నేహితులకు బాగా గుర్తుండిపోయారని తివారీ వివరించారు. కూంబింగ్ ముమ్మరం పర్యాటకులు తెలిపిన వివరాల ఆధారంగా పోలీసు విభాగం స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అనుమానితుల కోసం కథువా జిల్లాలో శుక్రవారం భారీ స్థాయిలో గాలింపు చేపట్టింది. ఘటనాస్థలి నుంచి ఆపరేషన్ మొదలైందని అధికారులు తెలిపారు. అదేవిధంగా, పుల్వామా, బారాముల్లా జిల్లాల్లో నిషేధిత జమ్మూకశ్మీర్ నేషనల్ ఫ్రంట్(జేకేఎన్ఎఫ్) సంస్థ కార్యకలాపాలు, స్థానికులకు సంబంధాలపై విచారణ మొదలు పెట్టారు. పట్టణలోని గులాం మహ్మద్ గనీ నివాసంలోనూ సోదాలు జరిపారు. ఎగ్జిక్యూటివ్ మేజి్రస్టేట్ సమక్షంలో జరిపిన తనిఖీల్లో జేకేఎన్ఎఫ్కు సంబంధించిన సాహిత్యం లభ్యమైంది. వీటిన్నిటినీ రికార్డు చేశారు.ఆ్రక్టాయ్ పోస్ట్ను మూసేసిన భారత్ జమ్మూ: జమ్మూకశ్మీర్లోని ఆర్ఎస్పురా సెక్టార్లో భారత్–పాక్ అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉన్న ఆ్రక్టాయ్ పోస్ట్ను మూసివేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ పోస్ట్ ద్వారా రెండు దేశాల పౌరుల రాకపోకలకు ఇకపై అవకాశం ఉందన్నారు. భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రధానమైన అట్టారీ ఇంటిగ్రేటెడ్ బోర్డర్ పోస్టును పూర్తిగా మూసివేయడం తెల్సిందే.
ఎన్ఆర్ఐ

పిట్స్బర్గ్లో నాట్స్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
అమెరికాలో తెలుగు వారిని కలిపే అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా పిట్స్బర్గ్ లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించింది. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ నిర్వహించిన ఉగాది వేడుకలకు స్థానిక తెలుగు వారి నుంచి మంచి స్పందన లభించింది. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో పాటు, జానపద నృత్యాలు, శాస్త్రీయ సంగీత గీతాలు, నాటక ప్రదర్శనలు, తదితర వినోద కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సంస్కృతి డాన్స్ స్కూల్ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఉగాది వేడుకల్లో భాగంగానే తెలుగు శ్లోక, తెలుగు వచనం, గణితం, చిత్రలేఖనం, లెగో డిజైన్, చెస్ పోటీలు పిల్లల కోసం నిర్వహించగా, ప్రత్యేకంగా విజేతలకు బహుమతులు అందించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన పిల్లలకు ప్రత్యేకంగా గుర్తింపు, పురస్కారాలను అందజేశారు. ఈ పోటీలు పిల్లలలో సృజనాత్మకతను, విజ్ఞానాన్ని, పోటీ భావనను పెంపొందించేందుకు ఒక గొప్ప వేదికగా నిలిచాయి ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించడంలో నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ కోఆర్డినేటర్ రవి కొండపి, నాట్స్ వెబ్ సెక్రటరీ రవికిరణ్ తుమ్మల కీలక పాత్ర పోషించారు. వారి నాయకత్వం, అంకితభావం వల్లే ఈ వేడుకలు దిగ్విజయంగా జరిగాయని స్థానిక తెలుగు వారి నుంచి ప్రశంసలు లభించాయి. ఈ వేడుకలకు వ్యాఖ్యాతలుగా శిల్పా శెట్టి, అర్చనా కొండపి, మోనికాలు వ్యవహారించారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన సంస్కృతి డ్యాన్స్ స్కూల్కి నాట్స్ ధన్యవాదాలు తెలిపింది. ఇక విందు భోజనాన్ని పిట్స్బర్గ్ తత్వా ఇండియన్ క్యూసిన్ అందింయింది., సంప్రదాయ తెలుగు విందు భోజనంతో అందరి చేత ఆహా అనిపించారు.ఉగాది వేడుకలకు సహకరించిన వారికి, వేడుకల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ పిట్స్ బర్గ్ టీం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తెలుగు వారి కోసం ఉగాది వేడుకలను దిగ్విజయంగా నిర్వహించిన పిట్స్బర్గ్ టీంకి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

అందాల బొమ్మ.. ఈ గోదావరి భామ
వీరవాసరం: పుట్టింది పల్లెటూరులో.. పెరిగింది పట్నంలో.. ఆపై ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన తెలుగమ్మాయి అక్కడ అందాల పోటీల్లో ఫైనల్కు చేరింది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు గ్రామ శివారు నడపనవారి పాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాంబాబు కుమార్తె కొత్తపల్లి చూర్ణిక ప్రియ (Churnika Priya Kothapalli). అమెరికాలో ఎంఎస్ చదువుతున్న ఆమె తెలుగు సంఘం ఆధ్వర్యంలో డల్లాస్లో నిర్వహించిన మిస్ తెలుగు యూఎస్ఏ–2025 పోటీల్లో పాల్గొంది. సుమారు 5 వేల మంది పాల్గొన్న పోటీల్లో ఆమె సత్తాచాటి ఫైనల్–20 జాబితాలో చోటు సంపాదించింది. గోదావరి (Godavari) కీర్తిని చాటింది.అమెరికాలోని డల్లాస్ (Dallas) ఐర్వింగ్ ఆర్ట్ సెంటర్ వేదికగా వచ్చే మే 25న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ పోటీలో గెలుపొందేందుకు ప్రపంచంలోని తెలుగు ప్రజల ఓట్లే కీలకం. అమెరికాలోని తెలుగు యువతులకు మాత్రమే పరిమితమైన ఈ పోటీల్లో చూర్ణిక ప్రియ అద్భుతమైన ప్రతిభను చాటుతుండటం విశేషం. బీటెక్ పూర్తి చేసిన ఈమె క్లాసికల్ డ్యాన్సర్ గానూ ప్రతిభ చాటింది.చదవండి: టాలెంట్ను ట్రంప్ కూడా ఆపలేడు

స్కాట్లాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు
స్కాట్లాండ్లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ (TAS) ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు నిర్వహించారు. ఇవి తెలుగు సంస్కృతిక ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచాయి. ఈ ఉగాది సంబరాలు స్కాట్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న మిడ్లాథియన్లోని డాల్కీత్ స్కూల్ కమ్యూనిటీ వద్ద నిర్వహించారు.శ్రీ విశ్వావసు నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సంఘం ఐక్యతను ప్రతిబింబించేలా ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కాట్లాండ్లో ఉన్న వందలాది తెలుగు కుటుంబాలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆకర్షణగా నిలిచారు. వందకి పైగా కళాకారులు తమ ప్రతిభ, ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ వేడుక ప్రస్తుత, మాజీ కమిటీ సభ్యులతో జ్యోతి ప్రజ్వలన మొదలవ్వగా, అనంతరం “మా తెలుగు తల్లికి” గేయంతో సాంస్కృతిక కార్యక్రమంతో ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా భారత కాన్సులేట్ అధికారి ఆజాద్ సింగ్, లోథియన్ ప్రాంతానికి చెందిన MSP ఫోయిల్ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని, ఇతర సంఘాల ప్రతినిధులను చైర్మన్ శివ చింపిరి, అధ్యక్షుడు ఉదయ్ కుమార్ కుచాడి, హానరరీ చైర్పర్సన్ మైథిలి కెంబూరి తదితరులు ఘనంగా సత్కరించారు.. సాంస్కృతిక కార్యదర్శి పండరి జైన్ కుమార్ పొలిశెట్టి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, కళాకారులు, ప్రేక్షకులు, స్పాన్సర్లు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య ఆకర్షణగా “మనబడి” పిల్లలు ప్రదర్శించిన “పరమానందయ్య శిష్యుల కథ” నాటకం, భాషా నేర్పరితో పాటు సాంస్కృతిక విలువలను చక్కగా చాటింది. ఈ ఉగాది సంబరాలు 2025 తెలుగు వారసత్వాన్ని ముందుకెళ్లలా, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా నిర్వహించడం తోపాటు.. TAS సంఘం ఐక్యత, సేవా ధోరణిని ప్రతిబింభించేలా నిలిచాయి.(చదవండి: న్యూజిలాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు)

న్యూజిలాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు
ఆక్లాండ్ నగరంలో తెలంగాణా అసోసియేషన్ అఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త సంవత్సరాది విశ్వవాసు సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలను నిర్వహించుకున్నారుఈ కార్యక్రమం లో తెలుగుతనం, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పంచాంగ శ్రవణంతో రాశి ఫలితాలను స్థితిగతులను విని ఆనందించారు. ఆ తర్వాత చిన్నారులు పెద్దలు వివిధ తెలుగు సాంప్రదాయ పాటలు, నృత్యాలతో అలరించడమే కాకుండా సాంప్రదాయ పిండి వంటలతో సామూహిక భోజనాలు చేశారు. కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్గా వ్యవహరించిన టే అటటు డెంటల్ క్లినిక్ మోనిక శ్రీకాంత్ తోపాటు సామజికసేవాలో ముందున్న తెలుగు ప్రతినిధులను ఉగాది పురస్కారాలతో గౌరవంగా సన్మానించుకోవడం తోపాటు చిన్నారులకు నృత్యకారులకు బహుమతులని అందజేయడం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ అద్యేక్షతన జరిగిన ఈ వేడుకలో ప్రముఖ వ్యాపారవేత్త శివ కిలారి, రవి సంకర్ అల్ల, సత్యనారాయణ తట్టల, అసోసియేషన్ మాజీ అధ్యక్షలు పట్లోళ్ల నరేందర్ రెడ్డి, మేకల ప్రసన్న కుమార్,శైలందర్ రెడ్డి, విశ్వనాధు బాల, విజేత యాచమనేని, మధు ఎర్ర, శైలజ బాలకుల్ల, లింగం గుండెల్లి, శశికాంత్ గున్నాల, కావ్య, వర్ష పట్లోళ్ల, మేకల స్వాతి,కిరణ్మయి, విశ్వనాథ్ అవిటి, సలీం, ప్రమోద్, విజయ్ శ్రీరామ్, చంద్రకిరణ్,రమేష్ రామిండ్ల, మనోహర్ కన్నం, హరీష్, రమేష్ ఆడెపు, పవన్, అనిల్ మెరుగు తదితరులతో పాటు పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.(చదవండి: హాంగ్కాంగ్లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు)
క్రైమ్

మళ్లీ పుట్టి... ఒక్కటవుతాం..!
నెల్లూరు (క్రైమ్): వారిద్దరూ ప్రేమించుకున్నారు. కారణాలు ఏవైనా వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. వారిని ఎదిరించి ఒక్కటయ్యే ధైర్యంలేక ఊరుకాని ఊరు వచ్చారు. లాడ్జిలో గదిని అద్దెకు తీసుకుని తల్లిదండ్రులకు సూసైడ్ లేఖ రాశారు. ‘‘అమ్మ, నాన్నలు క్షమించండి. మీరు మా ప్రేమను ఎలాగూ అంగీకరించడం లేదు. మళ్లీ పుట్టి అందరి అంగీకారంతో ఒక్కటవుతాం’’ అంటూ రాసి, పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. హృదయ విదారకమైన ఈ సంఘటన నెల్లూరులోని ఒక లాడ్జిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం ప్రకారం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన బాచ్చు జోసఫ్ రత్నకుమార్ (23), కృష్ణా జిల్లా కైకలూరు మండలం ఆటపాకకు చెందిన చిల్లుముంత శ్రావణి (21) మధ్య బీటెక్ చదివే సమయంలో చిగురించిన స్నేహం, అటుపై ప్రేమగా మారింది. వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 21వ తేదీన నెల్లూరు వచ్చారు. కళాశాలలో కౌన్సెలింగ్ ఉందని చెప్పి ఒక లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. కౌన్సెలింగ్ పూర్తికాలేదని మరో రోజు గదికి నగదు చెల్లించారు. 23వ తేదీన గదిని శుభ్రం చేసేందుకు లాడ్జి స్వీపర్ వెళ్లి తలుపుకొట్టగా లోపల నుంచి ఎలాంటి అలికిడి లేదు. బయటకు వెళ్లి ఉంటారని భావించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు అలానే జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం వారు అద్దెకు తీసుకున్న గది నుంచి దుర్వాసన వస్తుండటంతో లాడ్జి సిబ్బంది సంతపేట పోలీసులకు సమాచారం అందించారు. ఇన్స్పెక్టర్ జి.దశరథరామయ్య, ఎస్ఐ బాలకృష్ణ తలుపులు పగులగొట్టి చూడగా, బెడ్పై జోసఫ్ రత్నకుమార్, నేలపై శ్రావణి మృతదేహాలు కుళ్లిపోతున్న స్థితిలో పడి ఉన్నాయి. సమీపంలో గడ్డిమందు సీసా పడి ఉంది.దీంతో వారు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. వారి బ్యాగ్లను పరిశీలించగా అందులో మృతుల ఆధార్ కార్డులు, కళాశాలలకు సంబంధించిన సరి్టఫికెట్లు ఉన్నాయి. ఇరువురు తమ తల్లిదండ్రులకు రాసిన సూసైడ్ లేఖలను పోలీసులు గుర్తించి స్వా«దీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి సంతపేట ఇన్స్పెక్టర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖలో దంపతుల దారుణహత్య
విశాఖపట్నం: విశాఖ నగరం గాజువాక సమీపంలోని రాజీవ్నగర్లో భార్యాభర్తలు దారుణహత్యకు గురయ్యారు. డాక్యార్డులో పనిచేసి రిటైరైన గంపాల యోగేంద్రబాబు (66), లక్ష్మి (58) దంపతులను గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. వారు 35 ఏళ్లుగా రాజీవ్నగర్లో ఉంటున్నారు. రెండు రోజుల కిందట హైదరాబాద్ వెళ్లిన వారు గురువారం ఉదయం ఇంటికి చేరుకున్నారు.శుక్రవారం రాత్రి వరకు వారి ఇంటి తలుపులు తెరవకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో స్థానికంగా ఉన్న బంధువుల అమ్మాయి ఇంటికి వచ్చి చూసింది. ఇంటికి రెండువైపులా తాళం వేసి ఉండటాన్ని గమనించింది. అనుమానం వచ్చిన.. స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం అందించింది. సౌత్ ఏసీపీ టి.త్రినాథ్, దువ్వాడ సీఐ మల్లేశ్వరరావు అక్కడికి చేరుకుని తాళాలు పగలుగొట్టించి తలుపులు తెరిచారు. లోపలికి వెళ్లి చూస్తే హాల్లో యోగేంద్రబాబు, బెడ్రూమ్లో లక్ష్మి రక్తపుమడుగులో పడి ఉన్నారు. వారు అప్పటికే మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. యోగేంద్రబాబుది మచిలీపట్నం కాగా లక్ష్మిది శ్రీహరిపురం. 40 ఏళ్ల కిందట కులాంతర ఆదర్శ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. వారికి వివాహాలు జరిగి, అమెరికాలో స్థిరపడ్డారు. క్లూస్ టీం రంగంలోకి దిగి వివరాలు సేకరించింది.

బిడ్డను చంపి తల్లిపై గ్యాంగ్రేప్!
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) గణాంకాల ప్రకారం.. సగటున రోజుకి వందకి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. వెలుగులోకి రానివి మరెన్నో?. తాజాగా.. హర్యానాలోని జింద్లో ఘోరమైన ఘటన జరిగింది. నలుగురు దుండగులు అయిదేళ్ల చిన్నారిని హత్య చేసి, ఆమె తల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పాత గొడవల కారణాంగానే నిందితులు ఈ దారుణానికి తెగబడినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత కుటుంబం చెత్త ఏరుకుంటూ జింద్ జిల్లా(Jind) శివారులోని గుడిసెల్లో నివసిస్తోంది. కొన్నిరోజుల కిందట అమిత్ అనే వ్యక్తికి, బాధిత మహిళ భర్తకి గొడవ జరిగింది. ఈ గొడవలో ఆమె భర్త తలకు గాయం కాగా పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు నిందితుడు అమిత్పై చర్యలు తీసుకోకుండా.. గొడవను సర్దిచెప్పి పంపించారు. ఇది మనసులో పెట్టుకున్న అమిత్, అతని మైనర్ సోదరుడు కోపంతో రగిలిపోయారు. మంగళవారం రాత్రి ఆమె భర్త లేని సమయం చూసి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి గుడిసెలోకి చొరబడ్డారు. ముగ్గురు పిల్లలతో కలిసి నిద్రపోతున్న బాధితురాలిపై దాడి చేశారు. ఆమె స్పృహ కోల్పోయాక.. ఆమెతోపాటు అయిదేళ్ల చిన్నారిని పక్కనే ఉన్న ఖాళీ ప్రాంతానికి లాక్కెళ్లారు. అక్కడ చిన్నారి గొంతునులిమి హత్య చేసి, బాధితురాలిపై నలుగురూ అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న మహిళను అక్కడే వదిలేసి పారిపోయారు. చిన్నారి మృతదేహం రాత్రంతా చెత్తకుప్పలోనే ఉంది. శుక్రవారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన ఓ మహిళ వాళ్లను గుర్తించి స్థానికులకు సమాచారం అందించింది. చిన్నారిని ఖననం చేశాక.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనతో పాటు తన ఐదేళ్ల వయసున్న బిడ్డపైనా నిందితులు అత్యాచారానికి ఒడిగొట్టారని చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో స్థానిక ఎస్సై యశ్వీర్, సమాధి నుంచి పసికందు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకి తరలించారు. మరోవైపు.. బాధితురాలి ఫిర్యాదు మేరకు అమిత్తో సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లే కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది.

వరకట్న వేధింపులకు వివాహిత బలి
కర్ణాటక: వరకట్న వేధింపులతో ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తాలూకాలోని కాడదేనహళ్లిలో జరిగింది. వివరాలు.. హాసన జిల్లా అరసీకెరె తాలూకా గండసి ఫిర్కా కుడుకుంది గ్రామానికి చెందిన సోమశేఖర్ కుమార్తె కేఎన్ రశ్మి(24)కి మాలూరు తాలూకా సొసగెరె గ్రామ పంచాయతీ వ్యాప్తిలోని కాడదేనహళ్లి గ్రామానికి చెందిన దినేష్ గౌడతో 14 నెలల క్రితం వివాహం చేశారు.వివాహం అనంతరం దినేష్ గౌడ ఇంట్లో ఇంకా ఎక్కువ మొత్తంలో వరకట్నం తీసుకు రావాలని రశ్మిపై ఒత్తిడి చేసేవారు. దీంతో విసుగు చెందిన రశ్మి పైఅంతస్తులో ఉన్న గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రశ్మి తండ్రి సోమశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాలూరు ఎస్ఐ వసంతకుమార్ ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఘటనకు సంబంధించి మాలూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని రశ్మి భర్త దినేష్గౌడ, మామ అప్పాజిగౌడ, రత్నమ్మ, సరోజమ్మలను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.
వీడియోలు


సాక్షితో KTR మనసులో మాట


టీడీపీ నేత అరెస్ట్


భారత్ సైనిక ముందు పాక్ ఎంత..!


LOC వద్ద పాకిస్థాన్ ఆర్మీ కాల్పులు


నేషనల్ హెరాల్డ్ కేసులో.. సోనియా, రాహుల్ లకు గుడ్ న్యూస్


పాక్ పౌరులకు వీసా సేవలు నిలిపివేత


హిమాచల్ ప్రదేశ్ మండీ జిల్లాలో విషాదం


టాలీవుడ్ ను షేక్ చేస్తోన్న రూమర్స్ ..


నోరు అదుపు చేసుకో రఘురామ రాజుకు సీపీఎం లీడర్స్ మాస్ వార్నింగ్


గవర్నర్ను కలిసిన వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ