రూటు మార్చిన చంద్రబాబు.. ఏపీలో ఆర్థిక విధ్వంసం | YSRCP expressed concern over Chandrababu economic policies | Sakshi
Sakshi News home page

రూటు మార్చిన చంద్రబాబు.. ఏపీలో ఆర్థిక విధ్వంసం

Published Fri, Apr 25 2025 9:21 AM | Last Updated on Fri, Apr 25 2025 11:06 AM

YSRCP expressed concern over Chandrababu economic policies

తాడేపల్లి,సాక్షి: దేశంలో ఎప్పుడూ జరగని విధంగా కూటమి ప్రభుత్వం అప్పుల విషయంలో రాజ్యంగ విరుద్ధమైన విధానాలకు తెగబడింది. సీఎం చంద్రబాబు ఆర్థిక విధానాలపై వైఎస్సార్‌సీపీ ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ మేరకు ఎక్స్‌ వేదికగా.. అందకారంగా రాష్ట్ర భవిష్యత్‌ అంటూ ట్వీట్‌ చేసింది. ఆ ట్వీట్‌లో ‘వినాశకర ఆర్థిక విధానాలు అప్పులకోసం రాజ్యాంగ ఉల్లంఘనలు. 436 గనులను తాకట్టు పెట్టిన చంద్రబాబు. ఈ గనులన్నీ ఏపీ ఎండీసీకి అప్పగిస్తూ ఉత్తర్వులు. ఏపీఎండీసీ ద్వారా అప్పుల సృష్టి. రూ.1,91,000 కోట్ల విలువైన గనులు తాకట్టుపెట్టి రూ.9వేల కోట్ల అప్పు. భవిష్యత్తు ఆదాయాలను రుణ సంస్థలకు కట్టబెడుతూ నిర్ణయం. రుణాలిచ్చే సంస్థలు నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచే వాయిదాలు తీసుకునే అవకాశం. రుణ సంస్థలకు ఇలాంటి అవకాశం ఇచ్చిన ఏకైక ప్రభుత్వంగా నిలిచిన చంద్రబాబు సర్కారు. చరిత్రలో ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకోవడం తొలిసారి. వినాశ ఆర్థిక విధానాలతో రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అంటూ’  పేర్కొంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement