Top Stories
ప్రధాన వార్తలు

బాబు దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం ఇది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు అరాచకాలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. ‘‘చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారని.. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్గా ఉన్న బీసీ మహిళను పదవినుంచి దించేయడం, మీరు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘‘ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 98 డివిజన్లు ఉన్న విశాఖపట్నం కార్పొరేషన్లో వైఎస్సార్సీపీ గుర్తుపై పోటీచేసి 58 స్థానాలను మా పార్టీవాళ్లు గెలుచుకోగా, టీడీపీ కేవలం 30 సీట్లు మాత్రమే గెలిచింది. మరి మీకు మేయర్ పదవి ఏరకంగా వస్తుంది?..బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ యాదవకులానికి చెందిన మహిళను మేం మేయర్ పదవిలో కూర్చోబెడితే, మీరు అధికార దుర్వినియోగం చేస్తూ, కోట్లాది రూపాయలతో ప్రలోభపెట్టి, పోలీసులను దుర్వినియోగం చేస్తూ, బెదిరిస్తూ, అప్పటికీ లొంగకపోతే మా పార్టీ కార్పొరేటర్లు విడిది చేసిన హోటల్పై మీ నాయకులతోనూ, పోలీసులతోనూ దాడులు చేయించారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా వీడియోలు ఇప్పుడు ప్రజల ముందే ఉన్నాయి. మరి దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? అవిశ్వాసం ప్రక్రియ స్వేచ్ఛగా జరిగిందని అనుకోవాలని అంటారా? అధికార దుర్వినియోగం కాదా ఇది?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘మరో ఏడాది గడిస్తే ఇప్పుడున్న కౌన్సిల్ పదవీకాలం పూర్తవుతుందని తెలిసీ, మళ్లీ ఎన్నికలు వస్తాయని తెలిసి కూడా, ప్రజలకు ఫలానా మంచి చేశాను అని చెప్పి ఓట్లు అడిగే ధైర్యం చంద్రబాబూ.. మీకులేదు. అందుకే అన్యాయమైన రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని సమాధి చేస్తున్నారు. మీ అప్రజాస్వామిక విధానాలకు దేవుడు, ప్రజలే గుణపాఠం చెప్తారు.ఇన్ని ప్రలోభాలు పెట్టినా, బెదిరింపులకు గురిచేసినా తలొగ్గక పార్టీవైపు, ప్రజలవైపు నీతి, నిజాయితీగా నిలబడి చిత్తశుద్ధి చాటుకున్న వైయస్సార్సీపీ కార్పొరేటర్లను, అలాగే వామపక్షాలకు చెందిన కార్పొరేటర్లను అభినందిస్తున్నాను.రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో తమకు అధికారం లేకపోయినా అధికార దుర్వినియోగం, కండబలంతో వాటిని చేజిక్కించుకోవడానికి చంద్రబాబుగారి కుటిల ప్రయత్నాలను దీటుగా ఎదుర్కొని నిలబడుతున్న మా పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు మరోసారి హ్యాట్సాప్ చెప్తున్నా’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. .@ncbn గారు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్గా ఉన్న బీసీ మహిళను పదవినుంచి దించేయడం, మీరు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం.ప్రజలు ఇచ్చిన…— YS Jagan Mohan Reddy (@ysjagan) April 19, 2025

గెలుపు వాకిట బోర్లా పడిన రాయల్స్.. ఉత్కంఠ పోరులో లక్నోను గెలిపించిన ఆవేశ్ ఖాన్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 19) రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై లక్నో సూపర్ జెయింట్స్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగా.. రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్లో రాయల్స్ గెలుపుకు 9 పరుగులు అవసరం కాగా.. ఆవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులే ఇచ్చాడు. లక్నో ఇన్నింగ్స్లో మార్క్రమ్ 66, ఆయుశ్ బదోని 50 పరుగులు చేయగా.. ఆఖర్లో అబ్దుల్ సమద్ 10 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిచెల్ మార్ష్ (4), పంత్ (3) విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో హసరంగ 2 వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే తలో వికెట్ దక్కించుకున్నారు.ఛేదనలో యశస్వి జైస్వాల్ (74), వైభవ్ సూర్యవంశీ (34), రియాన్ పరాగ్ (39) అద్భుతంగా ఆడినప్పటికీ.. రాయల్స్ ఒత్తిడికి చిత్తై గెలుపు వాకిట బోర్లా పడింది. రాయల్స్ ఈ సీజన్లో ఇలా ఓడటం ఇది రెండో సారి. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లోనూ రాయల్స్ గెలుస్తుందనుకుంటే సూపర్ వరకు వెళ్లి ఓటమిపాలైంది. ఆవేశ్ ఖాన్ (4-0-37-3) ఒంటిచేత్తో రాయల్స్ నుంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు.

కెరీర్లో తొలి బంతికే సిక్సర్.. చరిత్రపుటల్లోకెక్కిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
14 ఏళ్ల 23 రోజుల వయసులోనే ఐపీఎల్ అరంగేట్రం చేసి లీగ్లో అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన రాజస్థాన్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ కెరీర్లో తానెదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచి మరో రికార్డు నెలకొల్పాడు. క్యాష్ రిచ్ లీగ్లో తొలి బంతికే (కెరీర్లో) సిక్సర్ బాదిన 10వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.ఐపీఎల్ కెరీర్లో తొలి బంతికే సిక్సర్ బాదిన ఆటగాళ్లు..రాబ్ క్వినీ (RR)కెవోన్ కూపర్ (RR)ఆండ్రీ రస్సెల్ (KKR)కార్లోస్ బ్రాత్వైట్ (DD)అనికేత్ చౌదరి (RCB)జావోన్ సియర్ల్స్ (KKR)సిద్దేష్ లాడ్ (MI)మహేష్ తీక్షణ (CSK)సమీర్ రిజ్వీ (CSK)వైభవ్ సూర్యవంశీ (RR)A VIDEO TO REMEMBER IN IPL HISTORY 👑- ITS VAIBHAV SURYAVANSHI..!!!! pic.twitter.com/ZuKskRWyI7— Johns. (@CricCrazyJohns) April 19, 2025ఐపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కులైన ఆటగాళ్లు..14y 23d - వైభవ్ సూర్యవంశీ (RR) vs LSG, 2025*16y 157d - ప్రయాస్ రే బర్మన్ (RCB) vs SRH, 201917y 11d - ముజీబ్ ఉర్ రెహ్మాన్ (PBKS) vs DC, 201817y 152d - రియాన్ పరాగ్ (RR) vs CSK, 201917y 179d - ప్రదీప్ సాంగ్వాన్ (DC) vs CSK, 2008మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్నో ఇన్నింగ్స్లో మార్క్రమ్ 66, ఆయుశ్ బదోని 50 పరుగులు చేయగా.. ఆఖర్లో అబ్దుల్ సమద్ 10 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిచెల్ మార్ష్ (4), పంత్ (3) విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో హసరంగ 2 వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఛేదనకు దిగిన రాయల్స్ ఆది నుంచే దూకుడుగా ఆడుతుంది. తొలి బంతికే సిక్సర్ కొట్టిన సూర్యవంశీ 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో ఆవేశ్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి నితీశ్ రాణా (8) ఔటయ్యాడు. 10 ఓవర్ల తర్వాత రాయల్స్ స్కోర్ 94/2గా ఉంది. యశస్వి జైస్వాల్ (52), రియాన్ పరాగ్ క్రీజ్లో ఉన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు విజయసాయే చక్రం తిప్పింది
విజయవాడ, సాక్షి: లిక్కర్ కేసు విచారణ సందర్భంగా రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వైఎస్సార్సీపీ కోటరీ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ పడింది. అసలు అలాంటి కోటరీ ఒకటి ఉందో లేదో ఆయనకే తెలియాలి అంటూ వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విజయసాయికి చురకలు అంటించారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయాక ఏదోరకంగా అభియోగాలు మోపాలని చూస్తున్నారు. ఆయన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆయనే కదా ప్రధానంగా చక్రం తిప్పింది. అలాంటప్పుడు పార్టీలో కోటరీ ఉందో? లేదో?.. కోటరీ నడిపిందెవరో ఆయనకు తెలియదా?. ఇప్పుడేమో నెంబర్ 2 నుంచి 2 వేల స్థానానికి పడిపోయానని ఆయనే చెప్పుకుంటున్నాడు. .. మేం అధికారంలో ఉన్నప్పుడు మా అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి నాయకులతో, అధికారులతో చర్చించాకే నిర్ణయాలు తీసుకునేవారు. మా పార్టీలో నెంబర్ 2 స్థానం అనేది ఎప్పుడూ లేదు.. రాబోయే రోజుల్లో కూడా ఉండదు. మా పార్టీలో నెంబర్ వన్ నుంచి 100 వరకూ అన్నీ జగన్ మోహన్ రెడ్డే’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ‘‘మా హయాంలో ఎలాంటి స్కాములు జరగలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు. లిక్కర్ స్కామ్ అంటూ భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. భయపెట్టి కొంతమందిని లొంగదీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. అన్నింటి పైనా న్యాయపోరాటం చేస్తాం’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

మరో ప్రపంచం పిలుస్తోంది... రండి!
వెండితెరపై ఆడియన్స్కు అద్భుతమైన విజువల్ ఎక్స్పీరియన్స్, సినిమాటిక్ టెక్నాలజీని చూపించేందుకు మన తెలుగు హీరోలు, దర్శక–నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇందుకోసం కథల్లో సరికొత్త ప్రపంచాలను, ప్రాంతాలను క్రియేట్ చేసి, ఆడియన్స్ను ఆహ్వానించేందుకు రెడీ అవుతున్నారు. ఇలా ‘మరో ప్రపంచం పిలుస్తోంది... రండి’ అంటూ ఆడియన్స్ను థియేటర్స్కు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్న కొన్ని చిత్రాలపై కథనం.విశ్వంభర వరల్డ్ఫాంటసీ జానర్లో చిరంజీవి హీరోగా ‘అంజి, జగదేకవీరుడు అతిలోక సుందరి’ వంటి సినిమాలొచ్చాయి. కొంత గ్యాప్ తర్వాత చిరంజీవి మళ్లీ ఈ జానర్లో ‘విశ్వంభర’ మూవీ చేస్తున్నారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘బింబిసార’ సినిమాలో కొంత భాగం కథ 500బీసీ టైమ్లో సాగుతుంది. ఈ సీక్వెన్స్లో వచ్చే సన్నివేశాలు సిల్వర్ స్క్రీన్పై ఆడియన్స్కు మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. కాగా మరోసారి తన విజువల్ విజన్ను ‘విశ్వంభర’ సినిమాలోనూ చూపించనున్నారు వశిష్ఠ. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్లో సరికొత్త విజువల్స్ కనిపిస్తున్నాయి.పంచభూతాలైన గాలి, నీరు, ఆకాశం, నిప్పు, భూమి ఈ సినిమా కథలో కీలకంగా ఉంటాయనే ప్రచారం సాగుతోంది. ఇలా ‘విశ్వంభర’ సినిమాలోని కొంత భాగం ఆడియన్స్ను మరో ప్రపంచానికి తీసుకువెళ్తుందని ఫిల్మ్నగర్ సమాచారం. ఒక స్పెషల్ సాంగ్ మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందని తెలిసింది. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్పై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఇక ఈ మూవీలో ఆంజనేయ స్వామి భక్తుడు భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి కనిపిస్తారని తెలిసింది. త్రిషా, ఆషికా రంగనాథ్ ఈ చిత్రంలో హీరోయిన్స్గా నటించగా, చిరంజీవి చెల్లెలి పాత్రల్లో ఇషా చావ్లా, పసుపులేటి రమ్య కనిపిస్తారని సమాచారం. యూవీ క్రియేషన్స్పై వంశీ, ప్రమోద్, విక్రమ్ రెడ్డి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.నాలుగో ప్రపంచం కూడా ఉందా? కురుక్షేత్ర యుద్ధానికి ఆరువేల సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎలా ఉండబోతోందో ఊహించి, దర్శకుడు నాగ్ అశ్విన్ తీసిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్ హీరోగా, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ ఇతర కీలక పాత్రల్లో నటించిన చిత్రం ఇది. ఈ మూవీలో 2898 ఏడీ సమయంలో కాశీ నగరం ఎలా ఉంటుందో ఊహాత్మకంగా, కల్పితంగా స్క్రీన్పై ఆడియన్స్కు చూపించారు దర్శకుడు నాగ్ అశ్విన్. అలాగే ఇదే చిత్రంలో కాంప్లెక్స్, శంభాల అనే మరో రెండు కొత్త ప్రపంచాలను కూడా చూపించారు.అయితే నాలుగో ప్రపంచం కూడా ఉందని, ఇది ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ ‘కల్కి 2898 ఏడీ పార్ట్ 2’లో కనిపిస్తుందని ఫిల్మ్నగర్ సమాచారం. ఇక ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’ సినిమా సీక్వెల్ ప్రీప్రోడక్షన్ వర్క్స్తో బిజీగా ఉన్నారు నాగ్ అశ్విన్. తొలి భాగం చిత్రీకరణ సమయంలోనే సీక్వెల్ని కూడా కొంత భాగం చిత్రీకరించారట. అయితే సీక్వెల్ చిత్రీకరణ 2026లో పూర్తి స్థాయిలో ప్రారంభం కావొచ్చని, 2028ప్రారంభంలో ఈ మూవీ రిలీజ్ అవుతుందనే టాక్ ప్రచారంలో ఉంది. ఇక ఈ మూవీని భారీ బడ్జెట్తో వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మించనున్నారు.అలాగే ప్రభాస్ హీరోగా ‘హను–మాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘బ్రహ్మరాక్షస’ అనే మూవీ రానుందని, ఈ మూవీ కోసం ప్రశాంత్ వర్మ ఓ అద్భుతమైన ప్రపంచాన్ని రెడీ చేస్తున్నారని ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఇంకా ప్రభాస్ మరో మూవీ ‘సలార్’ కోసం ఖాన్సార్ అనే ఓ కొత్తప్రాంతాన్ని సృష్టించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ ఖాన్సార్ గురించి మరింతగా ‘సలార్’ రెండో భాగం ‘సలార్: శౌర్యాంగపర్వం’లో ఉండనున్నట్లుగా తెలిసింది.సైన్స్ లోకం ఆడియన్స్ను ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లనున్నారు హీరో అల్లు అర్జున్. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ మూవీ రానుంది. ఈ మూవీ కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నారట అట్లీ. ఇందుకోసమే ప్రస్తుతం అట్లీ విదేశీ వీఎఫ్ఎక్స్ నిపుణులతో కలిసి ఈ సినిమా ప్రీప్రోడక్షన్ వర్క్స్ చేస్తున్నారు. ఈ ప్రీప్రోడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. వెండితెరపై అట్లీ చూపించనున్న ఈ సరికొత్త సైన్స్ ఫిక్షన్ మూవీలో కొన్ని కొత్త రకాల జంతువులు కూడా కనిపిస్తాయనే ప్రచారం సాగుతోంది.అంతేకాదు... ఈ మూవీలో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేస్తారని, హీరోయిన్స్గా జాన్వీ కపూర్, దిశా పటానీ, శ్రద్ధా కపూర్ల పేర్లను మేకర్స్ పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ ఏడాది చివర్లో చిత్రీకరణనుప్రారంభించనున్నారు. కళానిధి మారన్ సమర్పణలో సన్పిక్చర్స్ సంస్థ ఈ మూవీని భారీ బడ్జెట్తో నిర్మించనుంది. 2027లో ఈ మూవీ రిలీజ్ అయ్యేలా సినిమా షూటింగ్ను ప్లాన్ చేస్తున్నారట.మరోవైపు దర్శకుడు త్రివిక్రమ్తో అల్లు అర్జున్ ఓ మూవీ అంగీకరించిన సంగతి తెలిసిందే. మైథలాజికల్ ఫిల్మ్ ఇది. భారతీయ ఇతిహాసాల నుంచి ఇప్పటివరకు రాని ఓ సరికొత్త పాయింట్తో త్రివిక్రమ్ ఈ మూవీ చేయనున్నారని, ఇందుకోసం స్క్రీన్పై కొత్త ప్రపంచాన్ని టీమ్ రూపొందించనుందని సమాచారం. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై సూర్యదేవర రాధాకృష్ణ, అల్లు అరవింద్ ఈ సినిమా నిర్మించనున్నారు.అంజనాద్రిలో జై హనుమాన్బ్లాక్బస్టర్ మూవీ ‘హను–మాన్’లో దర్శకుడు ప్రశాంత్ వర్మ అంజనాద్రి అనే ఊరుని చూపించారు. తేజా సజ్జా హీరోగా నటించిన చిత్రం ఇది. నిరంజన్ రెడ్డి, చైతన్యా రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. కాగా ‘హను–మాన్’ సినిమాకు సీక్వెల్గా ‘జై హనుమాన్’ మూవీ రానుంది. ప్రశాంత్ వర్మయే ఈ సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నారు. ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి ఈ మూవీలో హీరోగా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ‘జై హను మాన్’ సినిమా ప్రీప్రోడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.ఈ ఏడాది చివర్లో ‘జై హనుమాన్’ చిత్రీకరణలో పాల్గొంటారట రిషబ్ శెట్టి. కాగా... ‘జై హనుమాన్’ మూవీలో రాముడు, లక్ష్మణుడి పాత్రల ప్రస్తావన కూడా ఉంటుందని, ‘హను–మాన్’ సినిమా క్లిప్ హ్యాంగర్ వీడియోను చూసినవారికి అర్థమయ్యే ఉంటుంది. సో... ‘జై హనుమాన్’ సినిమా మరింత పెద్ద స్పాన్తో రూపొందనుందని తెలుస్తోంది. సో... ఆటోమేటిక్గా ‘అంజనాద్రి’ స్పాన్స్ కూడా పెరుగుతుందని ఊహించవచ్చు. ఇలా... అంజనాద్రిలో ‘జై హనుమాన్’ సాహసాలు, విన్యాసాలు చూసేందుకు మాత్రం చాలా సమయం ఉంది.2027లో మూవీ రిలీజ్ కావొచ్చు. ఇంకా హను–మాన్లో నటించిన తేజా సజ్జా ఈ సినిమా సీక్వెల్ ‘జై హనుమాన్’లోనూ ఉంటారని తెలిసింది. అలాగే తేజా సజ్జా హీరోగా ‘మిరాయ్’ అనే సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ మూవీ రానుంది. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్గా కనిపిస్తారు. ఈ చిత్రం ఆగస్టు 1న విడుదల కానుంది.మిస్టిక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’ సినిమాలో రుద్రవనం అనే కల్పిత విలేజ్లో జరిగే సంఘటనలు ఆడియన్స్ను అలరించాయి. సాయిదుర్గా తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ మూవీ బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ మూవీ తర్వాత హీరో నాగచైతన్యతో దర్శకుడు కార్తీక్ దండు మరో మిస్టిక్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మిస్టిక్ థ్రిల్లర్ మూవీ చిత్రీకరణ ఆల్రెడీప్రారంభమైంది. కాగా ఈ చిత్రం కోసం ‘రుద్రవనం’ మాదిరి మరోప్రాంతాన్ని సృష్టిస్తున్నారట కార్తీక్ దండు.ఆల్రెడీ రిలీజ్ చేసిన ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఓ పక్షి కన్నులో ఓ పెద్ద పర్వతంపై నాగచైతన్య ఉన్నట్లుగా ఈ సినిమాలో కనిపిస్తుంది. అలాగే ఈ మూవీలో నాగచైతన్య ఓ స్టైలిష్ లుక్లో కనిపిస్తారని తెలిసింది. ఇక ఈ మూవీలో నాగచైతన్య సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారని తెలిసింది. సుకుమార్, బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కావొచ్చు.వెయ్యేళ్ల క్రితంఆధ్యాత్మిక ప్రపంచం ‘శంబాల’కు ఆడియన్స్ను తీసుకువెళ్లనున్నారు హీరో ఆది సాయికుమార్. జియో సైంటిస్ట్గా ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘శంబాల’. కాల్పనిక ప్రపంచం శంబాల నేపథ్యంలో యుగంధర్ ముని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పదివేల సంవత్సరాల క్రితం, వెయ్యి సంత్సరాల క్రితం, 1980... ఇలా మూడు కాలమానాల్లో ఈ సినిమా కథనం సాగుతుందని చిత్రయూనిట్ పేర్కొంది. అర్చనా అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో శ్వాసిక మరో లీడ్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా కోసం ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ను తీశారు మేకర్స్. త్వరలోనే టీజర్, ట్రైలర్, రిలీజ్ డేట్లపై స్పష్టత ఇవ్వనున్నట్లుగా మేకర్స్ ఇటీవల తెలిపారు.ప్యారడైజ్‘దసరా’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘ప్యారడైజ్’. ఈ పీరియాడికల్ ఫిల్మ్లో నాని సరికొత్తగా కనిపిస్తున్నారు. 1980 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఈ సినిమాలో సికింద్రాబాద్ కుర్రాడిలా నాని నటిస్తారని తెలిసింది. ఈ మూవీ ఆడియన్స్కు సరికొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ను ఇవ్వనుంది. అప్పటి కాలాన్ని రీ–క్రియేట్ చేసే పనిలో ఉన్నారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.ఓ తెగ నాయకుడిగా నాని కనిపిస్తారని, గుర్తింపుకోసం పోరాడే ఓ తెగ నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందని ఫిల్మ్నగర్ సమాచారం. ‘దసరా’ సినిమాను నిర్మించిన సుధాకర్ చెరికూరియే ఈ సినిమానూ నిర్మించనున్నారు. ప్రస్తుతం ‘హిట్ 3’ సినిమా ప్రమోషన్స్తో నాని బిజీగా ఉన్నారు. మే 1న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇక మే రెండో వారం నుంచి ‘ప్యారడైజ్’ సినిమా చిత్రీకరణలో నాని పాల్గొంటారని తెలిసింది. ‘ప్యారడైజ్’ సినిమాను వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.కిష్కింధపురి!ఆడియన్స్ కోసం ‘కిష్కింధపురి’ అనే హారర్ అండ్ మిస్టీరియస్ వరల్డ్ను క్రియేట్ చేస్తున్నారట బెల్లంకొండ సాయిశ్రీనివాస్. కౌశిక్ పెగళ్లపాడి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మాణంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ మూవీ చేస్తున్నారు. ఈ హారర్ అండ్ మిస్టిక్ థ్రిల్లర్ మూవీకి ‘కిష్కింధపురి’ అనే టైటిల్ను అనుకుంటున్నారట మేకర్స్. హారర్ ఎలిమెంట్స్, ప్రేతాత్మల ప్రస్తావన, ఆధ్యాత్మిక అంశాలతో ఈ మూవీ ఆడియన్స్ను ఆకట్టుకునేలా ఉంటుందని ఫిల్మ్నగర్ సమాచారం. అతి త్వరలోనే ఈ మూవీకి చెందిన మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.ఇలా ఈ తరహాలో ఆడియన్స్ను మరో కొత్త ప్రపంచానికి లేదా కొత్తప్రాంతానికి తీసుకుని వెళ్లే హీరోలు, దర్శక–నిర్మాతలు మరి కొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు

మరణమా నీ ముల్లెక్కడ?
దేవుని విమోచన కార్యక్రమంలో అత్యంత శకిమంతమైనది క్రీస్తు పునరుత్థాన శక్తే. మానవునికి మరణం తోనే జీవితం అంతం కాదని పునరుత్థానం తెలియజేసింది. ప్రతి మనిషి సదాకాలము దేవునితో కలిసి జీవించవచ్చన్న గొప్ప నిరీక్షణ కలిగింది. ఎందుకంటే యేసు అంటున్నాడు ‘పునరుత్థానం జీవం నేనే. నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును. బతికి నాయందు విశ్వాసముంచు వాడు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు’.శుక్రవారం సిలువ వేయబడిన యేసును తలచుకొని యూదా మతపెద్దలు యేసు ఇక శాశ్వతంగా మట్టిలో కలిసి పోయాడని సంబర పడ్డారు. వారిలో ఆ దుష్ట తలంపు పెట్టిన అపవాదియైన సాతాను దేవునిపై విజయం సాధించానని ఇక ఈ లోకం అంతా తన చెప్పు చేతల్లో ఉండిపోతుందని భ్రమ పడ్డాడు. అయినా ఎందుకైనా మంచిదని క్రీస్తును ప్రత్యేకంగా అరిమత్తయి ఏర్పాటు చేసిన సమాధి చుట్టూ ఎవరు తొలగించలేని పెద్ద రాతిని ఏర్పాటు చేశారు. బలమైన రోమా సైనికులను సమాధికి కాపలాగా పెట్టారు. క్రీస్తు మూడవ దినమున లేస్తానని చెప్పిన మాట నెరవేరకుండా శతవిధాలుగా తమ ప్రయత్నం వారు చేశారు. ఇక ఏసు చరిత్ర శాశ్వతంగా ఖననం చేశామని ఇక ఎప్పటికీ తామే మతపెద్దలుగా యూదా ప్రజలను తమ అధీనంలోనే వుంచుకోవచ్చని రోమా అధికారులకు లంచం కడుతూ తమ పబ్బం గడుపుకోవచ్చని కలలుగంటూ శనివారం అంతా హాయిగా నిద్రపోయారు. మరోపక్క యేసు చేసిన అద్భుత సూచక క్రియలు చూసి ఆయన పరలోక దివ్య వాక్కులు విన్న ప్రజలు యేసు సిలువ మరణాన్ని జీర్ణించు కోలేని స్థితిలో వుండిపోయారు. యూదా గలిలయా సమరియ ప్రాంతాల్లో క్రీస్తు ద్వారా స్వస్థత పొందిన గుడ్డి, కుంటి, మూగ, చెవిటి వారు, కుష్టు రోగులు మరణించి క్రీస్తుతో బతికింపబడినవారు, క్రీస్తును అభిమానించేవారు, వివిధ అద్భుతాలను చూసినవారు యేసు మరణంతో శోకసంద్రంలో మునిగిపోయారు. చివరకు యేసుతో మూడున్నర సంవత్సరాలు తిరిగిన ఆయన శిష్యులు యూదా మతపెద్దలకు భయపడి యెరూషలేము పట్టణంలో ఓ గదిలో దాక్కుండి పోయారు. అయినా దేవుని ప్రవచనాలు నెరవేరక తప్పవు కదా! భూమి పునాదులు వేయక ముందే ఆయన ఏర్పాటు చేసిన రక్షణ ప్రణాళిక అనాది సంకల్పం నెరవేరక తప్పదు కదా!తొలగింపబడిన రాయిఆదివారం ఉదయమే ఇంకా తెల్లవారకముందు యేసుద్వారా స్వస్థత పొందిన మగ్ధలేని మరియ, కొంతమంది ధైర్యవంతులైన స్త్రీలు సుగంధ ద్రవ్యాలను తీసుకొని యేసును సమాధి చేసిన చోటుకు చేరుకున్నారు. రోమా అధికారక ముద్రతో వేయబడ్డ ఆ పెద్ద రాయి ఎవరు తొలగిస్తారన్న ఆలోచన ఆ మహిళకు కలిగింది. తీరా సమాధి వద్దకు వచ్చి చూస్తే వారి జీవితంలో ఎన్నడు కలుగనంత విభ్రాంతికి లోనయ్యారు. అప్పటికే సమాధి మీద రాయి తొలగించబడింది. అంతకు క్రితమే యేసు సమాధిమీద ఉన్నరాయి పరలోకం నుండి ప్రభువుదూత దొర్లించినట్లు లేఖనాలలో రాయబడింది. ఆప్రాంతంలో భూకంపం వచ్చింది. అక్కడ కావలి వున్న రోమా సైనికులు భయపడి చచ్చినవారిలా పరుండిపోయారు. స్త్రీలు అక్కడికి వచ్చినప్పుడు రాయి దొర్లించబడి ఉండటం చూశారు. సమాధి లోపల యేసు దేహం వారికి కనిపించలేదు. అప్పుడు దూత ప్రత్యక్షమై ‘‘సజీవుడైన క్రీస్తును మృతులలో ఎందుకు వెదుకుచున్నారు? ఆయన ముందుగా చెప్పిన విధంగా లేచి యున్నాడు. ఈ శుభవర్తమానం శిష్యులకు తెలియ జేయండి’’ అని చెప్పడంతో స్త్రీలు మహానందంతో వెనుకకు తిరిగారు.పునరుత్థానుడైన క్రీస్తుయేసు చెప్పిన విధంగానే చనిపోయిన మూడవరోజు మృత్యుంజయుడై లేచాడు. దానితో ప్రపంచ చరిత్రలో మరణాన్ని గెలిచి లేచిన చారిత్రాత్మిక పురుషుడిగా నిలిచి పోయాడు. ప్రపంచ చరిత్ర క్రీస్తుపూర్వం క్రీస్తు శకంగా చీలిపోయింది. పునరుత్థానుడైన యేసు ముందుగా తనను వెదకడానికి వచ్చిన స్త్రీలకు కన్పించి వారికి శుభమని చెప్పి ముందు మీరు వెళ్ళి నా శిష్యులకు గలిలయ వెళ్ళమని చెప్పి అక్కడ వారిని కలుస్తానని చెప్పాడు.ఈలోగా సమాధికి కాపలాగా ఉన్న రోమా సైనికులు ప్రధాన యాజకుల వద్దకు పోయి యేసు మరణం నుండి లేచిన సంగతి వివరించారు. వారు రోమా సైనికులకు లంచం ఇచ్చి ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దని చెబుతూ మేము రాత్రివేళ నిద్దుర పోతుంటే యేసు శిష్యులు వచ్చి యేసు శరీరాన్ని ఎత్తుకు వెళ్ళారని అబద్ధం చెప్పండి ఒకవేళ అధికారులు ఏమన్నా హడావుడి చేస్తే వారిని మేము చూసుకుంటామని నచ్చచెప్పి పంపించి వేశారు. అయితే యేసు చెప్పిన విధంగానే గలిలయ శిష్యులకు దర్శనం ఇచ్చాడు. ఈ ఈస్టర్ పండుగ సమయంలో యేసు పునరుత్థాన శక్తి ప్రతి ఒక్కరం పొందుదం గాక! ఆమేన్!!యేసు పునరుత్థాన శక్తియేసు తన శరీరంలో సిలువ ద్వారా పాపానికి శిక్ష విధించి బలి అర్పణగా శరీరాన్ని సమర్పించడం ద్వారా మరణంపై సాతానుకున్న అధికారాన్ని నాశనం చేశాడు. మనుషుల్లో మరణం పట్ల ఉన్న భయాన్ని పునరుత్థాన శక్తితో తీసివేయడం ద్వారా దేవునితో ధైర్యంగా విశ్వాసంతో ముందుకు కొనసాగడానికి బాటలు వేశాడు. ప్రథమ మానవుడైన ఆదామును సాతాను లోబరుచుకొని మరణానికి ΄ాత్రుడుగా చేశాడు. ఫలితంగా పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే కడపటి ఆదాముగా వచ్చిన యేసు పునరుత్థానం ద్వారా ఆ శాపం పూర్తిగా తొలగించబడింది. అంటే మనుష్యుని ద్వారా ఎలా మరణం వచ్చిందో మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానం కలిగింది. ఈ ప్రక్రియ ద్వారా క్రీస్తులా ప్రతి ఒక్కరూ పునరుత్థానం పొందే అవకాశం లభించింది.– మన్య జ్యోత్స్న రావు

ప్రభుత్వ ప్రాయోజిత మత పక్షపాతం
కొత్త వక్ఫ్ చట్టాన్ని ముస్లింలు మాత్రమే వ్యతిరేకిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఒక తప్పుడు సంకే తాన్ని ఇస్తున్నాయి. ముస్లిం ధర్మాదాయ దేవాదాయ వ్యవహారాలను వక్ఫ్అంటారు. 1995 నాటి వక్ఫ్ చట్టం ఇప్పటి వరకు అమలులో వుంది. ఇప్పుడు దీన్ని ‘యునైటెడ్ వక్ఫ్ మేనే జ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్–2025 (యూడబ్ల్యూఎమ్ఈఈడీఏ)గా మార్చారు. వక్ఫ్ సవరణ బిల్లు ఏప్రిల్ 3న లోక్సభలో 288 – 232 ఓట్ల తేడాతో గెలిచింది. రాజ్యసభలో ఏప్రిల్ 4న 128 – 95 ఓట్ల తేడాతో గెలిచింది. ఆ వెంటనే రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడిపోయింది. ఇక్కడ ఒక విశేషం ఉంది. 543 మంది సభ్యు లున్న లోక్ సభలో ముస్లింలు 24 మంది మాత్రమే. 232 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు.అంటే 208 మంది ముస్లిమే తర సభ్యులు ముస్లింల పక్షాన నిలిచారు. అలాగే 245 మంది సభ్యులున్న రాజ్య సభలో ముస్లింలు 15గురు మాత్రమే. 95 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. అంటే 80 మంది ముస్లిమేతర సభ్యులు ముస్లింల పక్షాన నిలిచారు. రెండు సభల్లోనూ కలిపి ముస్లింల సంఖ్య 39 మాత్రమే. వాళ్ల పక్షాన నిలిచిన ముస్లిమేతరులు 288 మంది. కొత్త చట్టం రాజ్యాంగ ఆదర్శాలకు, హామీలకు విరుద్ధంగా ఉందనీ, దాన్ని పునఃసమీక్షించాలని కొన్ని సంఘాలు, కొన్ని రాజకీయపార్టీలు సుప్రీంకోర్టులో 70కు పైగా పిటీషన్లు వేశాయి. ఈ విషయంలోనూ ముస్లింల సంఖ్య చాలా తక్కువ. ముస్లిమేతరుల సంఖ్య చాలా ఎక్కువ. మన దేశంలో వర్ధిల్లుతున్న మతసామరస్యానికి ఇది తాజా ఉదాహరణ. దీనికి విరుద్ధంగా బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టానికి మద్దతు ప్రకటించాయి. ఒక బిల్లు ఉభయ సభల్లో మెజారిటీ సాధించి రాష్ట్రపతి ఆమోద ముద్రపడి చట్టంగా మారాక కూడ సుప్రీం కోర్టుకు చేరడం విశేషం. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఏప్రిల్ 16న ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభించింది. కొత్త చట్టంలో వివాదాంశాలు అనేకం ఉన్నాయి. ఇందులో నాలుగు అంశాలు మరింత తీవ్రమైనవి. వక్ఫ్ బోర్డులో, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో కొత్తగా ముస్లిమేతరులను అనుమతించడం తీవ్రమైన వివాదంగా మారింది. వక్ఫ్ భూముల్లో ‘వక్ఫ్ బై యూజర్’ సౌలభ్యాన్ని తొలగించి అది వక్ఫ్గా కొనసాగాలంటే రిజిస్ట్రేషన్ దస్తావేజులు చూపాలనడం ఇంకో వివాదాంశం. వక్ఫ్ ఆస్తి అవునో కాదో తేల్చడానికి జిల్లా కలెక్టర్లకు విశేషాధికారాలు కల్పించడం, కనీసం ఐదేళ్ళుగా ఇస్లామిక్ ధార్మిక ఆచరణను కొనసాగిస్తున్నవారు మాత్రమే వక్ఫ్ దానం చేయడానికి అర్హులు అనడం కూడా వివాదంగా మారింది. వక్ఫ్ భూములకు దస్తావేజులు చూపడం అసాధ్యమైన విషయం. 19వ శతాబ్దం ఆరంభం వరకు మన దేశంలో అసలు దస్తావేజులు, రిజిస్ట్రేషన్ల సంప్రదాయమే లేదు. లార్డ్ కార్న్ వాలిస్ 1793లో తొలిసారిగా శాశ్వత భూమిపన్ను విధానాన్ని తెచ్చాడు. అది కూడా ఇప్పటి బెంగాల్, బిహార్, ఒడిశాప్రాంతంలో మాత్రమే. ఆ తరువాత థామస్ మన్రో మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీల్లో రైత్వారీ విధానాలను తెచ్చాడు. భారత దేశంలో 8వ శతాబ్దం నాటికే ఇస్లాం ప్రవేశించింది. ఇస్లాం ప్రవేశించిన వెయ్యేళ్ళ తరువాత మనకు దస్తావేజులు, రిజిస్ట్రేషన్ విధానాలు వచ్చాయి. అత్యున్నత న్యాయస్థానపు ధర్మాసనం సరిగ్గా ఈ అంశాన్నే పట్టించుకుంది. ‘మనం చరిత్రను తిరగరాయలేం’ అని భారత ప్రధాన న్యాయమూర్తి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు గుర్తుచేశారు. వక్ఫ్ వ్యవహారాల్లో పారదర్శకతను ప్రదర్శించడమేగాక, రెండు మత సమూహాల సహవాసాన్ని కొత్త చట్టం ప్రోత్సహిస్తుందని, ముస్లింల గుత్తాధిపత్యాన్ని తొలగిస్తున్నదని సొలిసిటర్ జనరల్ ధర్మాసనానికి వివరించే ప్రయత్నం చేశారు. ఇలా రెండు మతసమూహాల కలయిక ఒక ఆదర్శం అని కేంద్ర ప్రభుత్వం నిజంగానే నమ్ముతోందా? నమ్మితే హిందూ ధర్మాదాయ కమిటీల్లోనూ హిందూయేతరులకు స్థానం కల్పించాలిగా? సరిగ్గా ఈ ప్రశ్ననే భారత ప్రధాన న్యాయమూర్తి వేశారు. తాము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవరకు వక్ఫ్ భూములు వేటినీ డీ–నోటిఫై చేయరాదని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.కేంద్ర ప్రభుత్వ వాదనను వినిపించడానికి ఒక వారం రోజులు గడువు ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ ధర్మాసనాన్ని కోరారు. ఇందులో ఒక కిటుకు ఉంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా మరో మూడు వారాల్లో, మే 13న పదవీ విరమణ చేయనున్నారు. ఎలాగోలా ఈ సమయాన్ని సాగదీస్తే అనుకూ లమైన తీర్పు తెచ్చుకోవచ్చు అనేది కేంద్ర ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది.- వ్యాసకర్త సమాజ విశ్లేషకులు ‘ 90107 57776'- డానీ

పైసా తక్కువ రూపాయ్!
‘‘కాసులతో ప్రలోభపెట్టారు. వినకపోతే కేసులతో భయ పెట్టారు. 27 మంది విశాఖ కార్పొరేటర్లను కూటమి నేతలు ఈ విధంగా లొంగదీసుకున్నారు. సొంత బలం లేకున్నా మేయర్పై అవిశ్వాసాన్ని నెగ్గించుకున్నారు. ఈ అప్రజాస్వామిక చర్యకు కూటమి నేతలు పెట్టుకున్న ముద్దుపేరు ‘ధర్మ విజయం’.’’ నూరు ఎలుకల్ని తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందట! (ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ చిత్రమిది)‘‘విశాఖపట్నం నుంచి విజయవాడకు విమానంలో వెళ్లాలంటే హైదరాబాద్కు వెళ్లి రావాల్సి వస్తున్నది. ఇదీ మనపరిస్థితని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు. దీన్ని బీజేపీ నేత విష్ణుకుమార్రాజు సమర్థించారు. అభివృద్ధికిబ్రాండ్ అంబాసిడర్నంటూ తన ఆటోబయోగ్రఫీని ప్రణాళికా సంఘం సభ్యులకు చంద్రబాబు వినిపించిన మరునాడే ఈపరిణామం.’’ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందట! (ఇదీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖచిత్రం)‘‘ఐటీకి ప్రోత్సాహం పేరుతో పైసా తక్కువ రూపాయ్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ముందుగా ప్రముఖ కంపెనీ టీసీఎస్కు 21 ఎకరాలు కేటాయించారు. ఆ వెంటనే ఊరూపేరూ లేని కంపెనీలు ఈ స్కీములో లైను కట్టాయి. ఐఎమ్జీ భారత్కు అయ్యలాంటి స్కెచ్.’’‘లూటీ’ కోసం కోటి విద్యలు’! (ఇది కొత్తపుంతలు తొక్కుతున్న అవినీతి చంద్రిక)‘‘మద్యాన్ని ఏరులై పారిస్తే లోకకల్యాణార్థమట. దాన్ని నియంత్రిస్తే మహా పాతకమట!’’వినేవాడు వెర్రివాడైతే, చెప్పేవాడు... ... ! (ఇదీ ఆంధ్రప్రదేశ్ సమాచార స్రవంతి)రూపాయంటే నూరు పైసలు. ఒక్క పైసా తక్కువైనా అది రూపాయి కాదు. ఆ విలువ రాదు. మాటలైనా అంతే! ఆచరణకు నోచుకోకపోతే విలువుండదు. ఆచరణయోగ్యం కాని వాగ్దానాలు చేయడం, ఎగవేయడంలో ఇప్పటికే చంద్రబాబుది ఆలిండియా రికార్డు. మాటలతో మభ్యపెట్టి పబ్బం గడుపుకోవడంలో కూడా ఆయనకే వీరతాడు వేయాలి. మంచినీళ్లడిగితే మబ్బులవంక చూపెట్టి, ‘అదిగదిగో’ అన్న చందంగా కూటమి ప్రజాపాలన సాగుతున్నది. మరోపక్కన కాంట్రాక్టుల పేరుతో కమీషన్లు, కంపెనీల పేరుతో స్వీయ కైంకర్యాల కార్యక్రమం య«థేచ్ఛగా జరుగుతున్నది.రాజధాని నిర్మాణం పేరుతో పిలిచిన 40 వేల కోట్ల రూపాయల విలువైన టెండర్లలో తొమ్మిదివేల కోట్లు ‘మూల విరాట్టు’ హుండీలోకి చేరుకునేవిధంగా మంత్రాంగం నడిచిందని ‘సాక్షి’ ఒక కథనంలో నిరూపించింది. దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం గానీ, ఖండించే సాహసం గానీ ప్రభుత్వం చేయ లేదు. చేయదు. నవ్విపోదురుగాక, నాకేటి సిగ్గు అనే ధోరణి. రాజధాని కాంట్రాక్టుల్లో ఈ లెక్కన ఇరవై రెండున్నర శాతం హుండీ ఖాతాకు చేరాలన్నమాట. ఇటీవల ప్రణాళికా సంఘం ప్రతినిధులకు ముఖ్యమంత్రి చెప్పిన వివరాలను బట్టి ఇంకో 37 వేల కోట్ల రూపాయలకు టెండర్లను పిలవాల్సి ఉన్నది.అమరావతి పేరుతో జరుగుతున్న ఈ తతంగంలో కాంట్రాక్టర్లు చేసే సంతర్పణ కంటే అక్కడ జరిగిన, జరుగుతున్న భూభాగోత లబ్ధి చాలా ఎక్కువని ఇప్పటికే పలు ఆరోపణలు, విమర్శలు వెలువడ్డాయి. అందుబాటులో ఉన్న 55 వేల ఎక రాలకు తోడు మరో 45 వేల ఎకరాలతో అమరావతి పార్ట్–2ను త్వరలో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. దీనిపైనా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రాజధాని కోసం ప్రభుత్వమే లక్ష ఎకరాలను సేకరించడం ఎందుకని విజ్ఞులూ, తటస్థ రాజ కీయవేత్తలూ ప్రశ్నిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ప్రతిపాదిత వైశాల్యం సుమారు మూడింట రెండొంతులు. అక్కడ కోటీ ఇరవై లక్షలమంది నివసిస్తున్నారు. దాని ప్రకారం ఆలోచిస్తే మొత్తం విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి – తాడేపల్లి నగరాలను పూర్తిగా ఖాళీ చేసి ఇక్కడ నింపేసినా ఇంకా సగం స్థలం ఖాళీగానే ఉంటుంది.రాజధాని నిర్మాణానికి సంబంధించి నిన్ననే ‘ఈనాడు’ పత్రిక ఒక ఆకర్షణీయమైన కథనాన్ని అచ్చేసింది. సరికొత్త సచి వాలయ టవర్ల నిర్మాణం కోసం రూ.4,688 కోట్ల అంచనా వ్యయంతో సీఆర్డీఏ టెండర్లను పిలిచిందట! ఇందులో ఐదు ఐకానిక్ టవర్లుంటాయని ఆ గ్రాఫిక్ బొమ్మను కూడా అచ్చేశారు. రాబోయే వంద సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని నిర్మించిన కొత్త పార్లమెంటు భవనాన్ని కూడా వెయ్యి కోట్ల లోపు వ్యయంతోనే పూర్తి చేశారు. ఈమధ్యనే కట్టిన తెలంగాణా సెక్రటే రియట్కయిన ఖర్చు కూడా వెయ్యి కోట్ల లోపే! అమరావతిలో మాత్రం ఎంత భారీ ఖర్చయితే అంత ప్రయోజనం అను కున్నారేమో గాని ఐదు ఐకానిక్ టవర్లను నిర్మించే పనిలో పడ్డారు. ‘ఈనాడు’ రాసిన ఈ కథనంలోనే ఇంకో గమనించదగ్గ విషయం కూడా ఉన్నది.ఈ గ్రాండ్ సెక్రటేరియట్ నిర్మాణానికి 60 వేల టన్నుల స్టీల్ అవసరమవుతుందట! దీనికోసం సీఆర్డీఏ అధికారులు రాయ గఢలోని ఫ్యాక్టరీని పరిశీలించి వచ్చారట! ఇక్కడ స్టీల్ కొనుగోలు చేసి బళ్లారి, తిరుచిరాల్లి వర్క్షాపుల్లో ఫ్యాబ్రికేట్ చేయించాలని నిర్ణయించారట! ఈ విషయం తెలిసిన తర్వాత విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు భగ్గుమంటున్నారు. మెడ మీద ప్రైవేటీకరణ కత్తి వేలాడుతున్న విశాఖ ఫ్యాక్టరీకి ప్రభుత్వ ఆర్డర్లను అప్పగిస్తే ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉండేది కదా అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఉక్కును ఆంధ్రుల హక్కుగా నిలబెట్టడంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో ఈ వ్యవహారంతో తేలిపోయిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.విశాఖ ఉక్కు సంగతే కాదు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా చంద్రబాబు సర్కార్ ఏపీ ప్రజలను మోస గిస్తున్నది. 45.72 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలబెట్టుకునేందుకు పోలవరం ప్రాజెక్టుకు గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఉన్నది. తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ కేబినెట్ ఇటీవల దాని ఎత్తును 41.5 మీటర్లకు కుదిస్తూ ఆ మేరకు నిధులనుఅందజేయాలని నిర్ణయించింది. చంద్రబాబు సర్కార్ తలూపింది. ‘పోలవరం ఆంధ్రుల జీవనాడి’ అని బాబు మాట్లాడు తూంటారు. ఇప్పుడా నాడి స్పందన కోల్పోయినట్టే! 35 మీటర్ల ఎత్తునకు పైన లభ్యత ఉంటేనే జలాలు కుడి, ఎడమ కాల్వలకు పారుతాయి. ఇప్పుడా లభ్యత 45.72 మీటర్లకు బదులుగా 41.5 మీటర్లకు మాత్రమే పరిమితం కానున్నది. నిల్వ సామర్థ్యం 194 టీఎమ్సీల నుంచి 115 టీఎమ్సీలకు తగ్గిపోతుంది. ఈ కారణం వల్ల ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, కృష్ణా ద్వారా పెన్నాతో అను సంధానం వంటి మాటలన్నీ కాకమ్మ కబుర్లు కాబోతున్నాయి.ఈ విషయాన్ని దాచేసి ప్రజలను మభ్యపెట్టడానికి ‘గోదా వరి – బనకచర్ల అనుసంధానం’ అనే పాటను చంద్రబాబు పదేపదే ఆలపిస్తున్నారు. పోలవరం ఆయకట్టుకే సరిపోనివిధంగా కుదించిన ప్రాజెక్టుతో ఈ అనుసంధానం ఎట్లా సాధ్య మవుతుందో ప్రభుత్వ ఇరిగేషన్ అధికారులైనా ప్రజలకు వివరించాలి. ఎన్నికలకు ముందు చెప్పిన ‘సూపర్ సిక్స్’ హామీలను అటకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పుడాయన ‘అభివృద్ధికి ఆరు మెట్లు’ అనే కొత్త సిద్ధాంతాన్ని ప్రవచిస్తున్నారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ప్రణాళికా సంఘం బృందానికి కూడా తన ఆరు మెట్ల సిద్ధాంతాన్ని వివరించినట్టు ‘ఈనాడు’ రాసింది.‘ఆరు మెట్ల’ అభివృద్ధిలో మొదటి మెట్టుగా పోలవరం – బనకచర్ల అనుసంధానాన్నే ఆయన ప్రస్తావించారు. ఇదెంత బోగస్ వ్యవహారమో పోలవరం ఎత్తు కుదింపుతోనే తేలిపో యింది. ఇక రెండో అభివృద్ధి మెట్టు – తాగునీటి ప్రాజెక్టట! ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు వెల్లడించిన గణాంకాలనే తీసుకుందాము. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల్లో 2019 ఆగస్టు 15 నాటికి 30 లక్షల 74 వేల గృహాలకు మాత్రమే కుళాయిల ద్వారా నీటి సరఫరా జరిగేది. 2019 ఆగస్టు 15 – 2025 మే మధ్యకాలంలోనే, అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలోనే అదనంగా 39 లక్షల 34 వేల గృహాలకు తాగునీటి కుళాయిలు అందుబాటులోకి వచ్చాయి.మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరి చివరి నాటికి 36 వేల గృహాలకు మాత్రమే కొత్తగా నీటి కుళాయిలు బిగించారు. తాగునీటి రంగంలో అభివృద్ధి మెట్టును వేసిందెవరో ఈ గణాంకాలు చెప్పడం లేదా?అభివృద్ధి మూడో మెట్టుగా పర్యాటక హబ్ల ఏర్పాటు, నాలుగో మెట్టుగా నాలెడ్జి ఎకానమీ, క్వాంటమ్ వ్యాలీ, స్కిల్ డెవలప్మెంట్ వగైరాలుంటాయట! ఐదో మెట్టుగా నౌకా శ్రయాలు, ఫిషింగ్ హార్బర్లు, మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు తదితరాలు. ఆరో మెట్టు – అమరావతి, తిరుపతి, విశాఖపట్నం గ్రోత్ సెంటర్లు. తిరుపతి, విశాఖ, అరకు వంటి ప్రాంతాల్లో జరిగిన పర్యాటకాభివృద్ధిపై ఆచరణే గీటురాయిగా ఎవరి హయాంలో ఏమి జరిగిందో చర్చకు పూనుకోవచ్చు. నాలెడ్జి ఎకానమీ, క్వాంటమ్ వ్యాలీ వంటి ‘నేమ్ డ్రాపింగ్’ వాగాడంబరం చంద్రబాబుకు పరిపాటే! మంత్రదండం చేతబూని ‘ఓపెన్ ససేమ్’ అనగానే పుట్టుకొచ్చేవి కావవి. అదొక సేంద్రియ అభివృద్ధి. అందుకు అనువైన పరిస్థితులు పూర్తిగా ఏర్పడేందుకు ఐదేళ్లు పట్టవచ్చు. పదేళ్లు పట్టవచ్చు. కానీ బాబు మాత్రం తన ఆలోచనలోకి రావడమే అమల్లోకి వచ్చినట్టుగా భావిస్తారు. అనుబంధ మీడియా తాళం వేస్తుంది. అనుయాయులు వీరతాళ్లు వేస్తారు.ఇక ఐదో మెట్టుగా నౌకాశ్రయాలు, ఫిషింగ్ హార్బర్లు, రవాణా సదుపాయాల పెంపుతో 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో నిలబెట్టాలట! కేవలం ఐదేళ్ల పదవీకాలంలోనే నాలుగు నౌకాశ్రయాలను, పది ఫిషింగ్ హార్బర్లను, ఆరు ఫిష్ ల్యాండర్ల నిర్మాణాన్ని ప్రారంభించి కొన్నిటిని పూర్తిచేసిన జగన్మోహన్రెడ్డి ఆచరణ ఎక్కడ? ఇంకో ఇరవై రెండేళ్లలో వాటిని నిర్మించాలనుకుంటున్న చంద్రబాబు ఆలోచన ఎక్కడ? మిడిమిడి జ్ఞానపు, మీడియా జ్ఞానపు మేధావులంతా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆరో అభివృద్ధి మెట్టుగా గ్రోత్సెంటర్లుగా అమరావతి, విశాఖ, తిరుపతిలను అభివృద్ధి చేయాలని పెట్టుకున్నారు. దీనిపై కూడా ఆచరణే గీటురాయిగా విస్తృత చర్చ జరగవలసిన అవసరం ఉన్నది.ఈమధ్య రాష్ట్ర ప్రభుత్వం కంపెనీల ఏర్పాటు పేరుతో పైసా తక్కువ రూపాయి పథకాన్ని ప్రారంభించింది. టీసీఎస్ ఆఫీసు ఏర్పాటు కోసం విశాఖలో విలువైన 21 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. టీసీఎస్ అనేది పేరున్న సంస్థ కనుక ఆ కంపెనీ ఏర్పాటయితే మన నిరుద్యోగులకు ఉద్యోగా లొస్తాయనే ఆశ ఉండవచ్చు. కాకపోతే ప్రభుత్వ ఐటీ పాలసీలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనే షరతు లేకపోవడంఆందోళన కలిగించే విషయం. టీసీఎస్కు భూకేటాయింపు జరిగిన వెంటనే అసలైన అవినీతి కథ మొదలైంది. ‘ఉర్సా’ అనే ఊరూపేరూ లేని, రెండు మాసాల వయసున్న ఓ కంపెనీకి విశాఖలోనే ఖరీదైన 60 ఎకరాల స్థలాన్ని ఎకరా 99 పైసలకే కట్టబెట్టారు. ఇలాంటి కంపెనీలు పైప్లైన్లో ఇంకా చాలా ఉన్నాయట!కాంట్రాక్టుల్లో కమీషన్లు, భూకేటాయింపుల్లో చేతివాటంతో అగ్రనేతలు చెలరేగుతుంటే గ్రాస్ రూట్స్ నాయకులు గడ్డి మేయకుండా ఉంటారా? అవినీతి గబ్బు ఆంధ్రావనిని అతలా కుతలం చేస్తున్నదని వార్తలు వస్తున్నాయి. వాగ్దాన భంగం కారణంగా జనంలో తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత బాహాటంగానే వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలోనే అభివృద్ధిని మబ్బుల్లో చూపడం, అవినీతిని గత ప్రభుత్వంలో చూపడమనే కార్య క్రమాన్ని కూటమి సర్కార్ తలకెత్తుకున్నది. అందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ పేరుతో ఓ నిత్యాగ్నిహోత్రాన్ని నిరంతరం మండించే పనిలో పడ్డారు. అసలు స్కామ్ అంటే ఏమిటి? ఎటువంటి ప్రభుత్వ విధానం వల్ల స్కామ్ జరిగే అవకాశం ఉంటుంది అనే మౌలికమైన ప్రశ్నల జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడుతున్నారు.మద్యం తయారీదారులకు ఉపయోగపడేలా మద్యం ఉత్పత్తులకు ఊతమిచ్చి, అమ్మకందారులు లబ్ధిపొందేలా ప్రవా హాలను ప్రోత్సహించే పాలసీలో స్కామ్ ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్కు మద్యం సరఫరా చేసిన డిస్టిలరీలలో సింహభాగం గతంలో చంద్రబాబు ప్రభుత్వం అనుమతులతో పుట్టినవేనని చెబుతున్నారు. మునుపటి చంద్రబాబు పాలనా కాలంలో ఊరూవాడల్ని మద్యం ముంచెత్తింది. గజానికో బెల్టు షాపు, పది గజాలకో పర్మిట్ రూమ్తో మహమ్మారి విలయతాండవంచేసింది. జగన్ సర్కార్ మద్య నియంత్రణను తన పాలసీగా ప్రకటించింది. కొత్తగా డిస్టిలరీలకు అనుమతులివ్వలేదు. 43 వేల బెల్టు షాపులను ఎత్తేసింది. పర్మిట్ రూమ్లను అనుమతించలేదు. షాపుల సంఖ్యను సగానికి సగం కుదించింది. అమ్మకం ద్వారా లాభాలను గడించే ప్రైవేట్ వ్యాపార వర్గాన్ని పూర్తిగా తొలగించింది. ప్రభుత్వ యాజమాన్యంలోనే నిర్ణీత వేళల్లోనే అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకున్నది. ఒకే ఒక్క ప్రశ్న: ‘మా ప్రభుత్వంలో తమ్ముళ్లకు బాగా తాపిస్తా’ అని చెప్పిన ప్రభుత్వంలో స్కామ్ ఉంటుందా? ‘మద్యం ముట్టుకుంటే షాక్ కొట్టాల్సిందే’నని హెచ్చరించిన ప్రభుత్వంలో స్కామ్ ఉంటుందా? బుద్ధిజీవులే నిర్ణయించాలి!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

ర్యాంకర్లూ కటాఫ్!
సాక్షి, హైదరాబాద్: కేంద్రీయ విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్–2025 అర్హత పరీక్ష ఫలితాల్లో దాదాపు అన్ని కేటగిరీల్లో కటాఫ్ పర్సంటైల్ గతేడాదితో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. అలాగే జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల్లో అర్హుల సంఖ్యలోనూ స్వల్పంగా తగ్గుదల కనిపించింది. మరోవైపు గతేడాదితో పోలిస్తే 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థుల సంఖ్య కూడా సగానికి పడిపోయింది.గతేడాది జేఈఈ మెయిన్ ఫలితాల్లో 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థులు 56 మంది ఉండగా ఈసారి కేవలం 24 మందే 100 పర్సంటైల్ సాధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ర్యాంకర్లు సైతం భారీగా తగ్గిపోయారు. గతేడాది జేఈఈ మెయిన్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 21 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా తాజాగా ఆ జాబితాలో నలుగురు (హర్షి ఎ. గుప్తా, వంగల అజయ్రెడ్డి, బణిబ్రత మజీ, గుత్తికొండ సాయి మనోజ్ఞ) మాత్రమే ఉండటం గమనార్హం. సాయి మనోజ్ఞ మహిళల కేటగిరీలో టాపర్గా నిలవగా అజయ్రెడ్డి ఈడబ్ల్యూఎస్ విభాగంలోనూ టాపర్గా నిలిచాడు. భారీగా దరఖాస్తులు... జేఈఈ మెయిన్–2025 కోసం విద్యార్థులు భారీగానే పోటీ పడ్డారు. జనవరి, ఏప్రిల్ రెండు సెషన్లకు కలిపి 15,39,848 మంది దరఖాస్తు చేసుకోగా 14,75,103 మంది హాజరయ్యారు. తుది ఫలితాల్లో నిర్దేశించిన కటాఫ్ పర్సంటైల్ సాధించి జేఈఈ అడ్వాన్స్డ్కు 2,50,236 మంది అర్హత సాధించారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్లో కటాఫ్ మార్కులు స్వల్పంగా తగ్గాయి. ఓపెన్ కేటగిరీలో 93.102 పర్సంటైల్గా కటాఫ్ను నిర్ణయించగా గతేడాది ఇది 93.236గా నమోదైంది.ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కటాఫ్ను 80.383గా నిర్ణయించగా గతేడాది 81.326గా నమోదైంది. ఓబీసీ కేటగిరీలో గతేడాది 79.675 పర్సంటైల్ ఉండగా ఈ ఏడాది 79.431గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో మాత్రం కటాఫ్ పర్సంటైల్ స్వల్పంగా పెరిగింది. మరోవైపు పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డ 110 మంది విద్యార్థుల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిలిపేసింది. ఈ నెల 23 నుంచి ‘అడ్వాన్స్డ్’కు రిజిస్ట్రేషన్ జేఈఈ మెయిన్ ఫలితాల్లో 2,50,236 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించడంతో అందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. మే 2 వరకు దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు ఉంది. మే 18న రెండు పేపర్లుగా అడ్వాన్స్డ్ పరీక్షలు జరగనున్నాయి. అడ్వాన్స్డ్ ఫలితాలను జూన్ 2న ప్రకటించనున్నట్లు ఐఐటీ కాన్పూర్ ప్రాథమికంగా వెల్లడించింది. అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాల ఆధారంగా ఐఐటీల్లోని 17 వేలకుపైగా సీట్లను భర్తీ చేయనున్నారు. అలాగే జేఈఈ మెయిన్ ద్వారా ప్రవేశం కల్పించే ఎన్ఐటీల్లో దాదాపు 24 వేలు, ట్రిపుల్ ఐటీల్లో 8,500, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర విద్యాసంస్థల్లో దాదాపు 9 వేల సీట్లు అందుబాటులో ఉంటాయి.

లక్నో ‘సూపర్’ విక్టరీ
జైపూర్: ఆఖరి ఓవర్... ఆఖరి బంతిదాకా ఇరు జట్లతోనూ దోబూచులాడిన విజయం చివరకు లక్నో సూపర్జెయింట్స్ను వరించింది. రాజస్తాన్ రాయల్స్ 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా... లక్నో బౌలర్ అవేశ్ ఖాన్ అద్భుతం చేశాడు. 6 పరుగులే ఇచ్చి ప్రమాదకర హిట్టర్ హెట్మైర్ను అవుట్ చేశాడు. దీంతో ఉత్కంఠ రేపిన పోరులో సూపర్జెయింట్స్ 2 పరుగులతో అనూహ్యంగా రాయల్స్పై గెలిచింది. తొలుత లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. మార్క్రమ్ (45 బంతుల్లో 66; 5 ఫోర్లు, 3 సిక్స్లు), ఆయుశ్ బదోని (34 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, ఆఖరి ఓవర్లో సమద్ (10 బంతుల్లో 30 నాటౌట్; 4 సిక్స్లు) చెలరేగాడు. హసరంగకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసి ఓడింది. యశస్వి జైస్వాల్ (52 బంతుల్లో 74; 5 ఫోర్లు, 4 సిక్స్లు), రియాన్ పరాగ్ (26 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్లు) మెరిపించారు. మార్క్రమ్, బదోని ఫిఫ్టీ–ఫిఫ్టీ పవర్ప్లే ముగియక ముందే హిట్టర్లు మార్ష్ (4), పూరన్ (11), పవర్ ప్లే తర్వాత కెపె్టన్ రిషభ్ పంత్ (3) అవుటవడంతో లక్నో 54 పరుగుల వద్ద కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో క్రీజులో ఉన్న ఓపెనర్ మార్క్రమ్, ఆయుశ్ బదోని సూపర్జెయింట్స్ స్కోరు భారాన్ని మోశారు. ఇద్దరు వేగంగా ఆడటంతో జట్టు పరుగుల జోరందుకుంది. 31 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న మార్క్రమ్ నాలుగో వికెట్కు 76 పరుగులు జోడించాక అవుటయ్యాడు. కాసేపటికి బదోని 33 బంతుల్లో బదోని అర్ధ సెంచరీ చేసిన వెంటనే నిష్క్రమించాడు. సమద్ 4 సిక్సర్లతో... 19 ఓవర్లలో 153/5 వద్ద ఓ మోస్తరు స్కోరు చేసిన లక్నో శిబిరంలో ఆఖరి ఓవర్ ఆనందం నింపింది. సందీప్ వేసిన 20వ ఓవర్లో మిల్లర్ (7 నాటౌట్) సింగిల్ తీసివ్వగా తర్వాత సమద్ 6, 6, 2, 6, 6లతో మొత్తం 27 పరుగులు వచ్చాయి. దీంతో సూపర్జెయింట్స్ స్కోరు 180కి చేరింది. జైస్వాల్ శ్రమించినా... యశస్వి జైస్వాల్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన కొత్త కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్స్లు) ఆకట్టుకున్నాడు. ఇద్దరి ఓపెనర్ల వేగం రాజస్తాన్ను లక్ష్యం వైపు నడిపించింది. తొలి వికెట్కు 85 పరుగులు జోడించాక వైభవ్ ఆటను మార్క్రమ్ ముగించగా, నితీశ్ రాణా (8)ను శార్దుల్ పెవిలియన్ చేర్చాడు.తర్వాత జైస్వాల్కు జతయిన కెపె్టన్ రియాన్ పరాగ్ రన్రేట్ తగ్గకుండా ఇన్నింగ్స్ను నడిపించారు. 31 బంతుల్లో ఫిఫ్టీ సాధించిన జైస్వాల్ దూకుడు పెంచాడు. లక్ష్యానికి చేరువైన దశలో 18వ ఓవర్లో జైస్వాల్, పరాగ్లను అవుట్ చేసిన అవేశ్...ఆఖరి ఓవర్లో హెట్మైర్ (12)కు చెక్ పెట్టాడు.స్కోరు వివరాలు లక్నో సూపర్జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి) హెట్మైర్ (బి) ఆర్చర్ 4; మార్క్రమ్ (సి) పరాగ్ (బి) హసరంగ 66; నికోలస్ పూరన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సందీప్ 11; రిషభ్ పంత్ (సి) జురేల్ (బి) హసరంగ 3; ఆయుశ్ బదోని (సి) దూబే (బి) తుషార్ 50; మిల్లర్ నాటౌట్ 7; సమద్ నాటౌట్ 30; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1–16, 2–46, 3–54, 4–130, 5–143. బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 4–0–32–1, తీక్షణ 4–0–32–0, సందీప్ శర్మ 4–0–55–1, తుషార్ దేశ్పాండే 4–0–26–1,హసరంగ 4–0–31–2. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) అవేశ్ 74; వైభవ్ (స్టంప్డ్) పంత్ (బి) మార్క్రమ్ 34; నితీశ్ రాణా (సి) అవేశ్ (బి) శార్దుల్ 8; రియాన్ పరాగ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అవేశ్ 39; జురేల్ నాటౌట్ 6; హెట్మైర్ (సి) శార్దుల్ (బి) అవేశ్ 12; శుభమ్ నాటౌట్ 3 ఎక్స్ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–85, 2–94, 3–156, 4–161, 5–175. బౌలింగ్: శార్దుల్ 3–0–34–1, అవేశ్ ఖాన్ 4–0–37–3, దిగ్వేశ్ రాఠి 4–0–30–0, మార్క్రమ్ 2–0–18–1, ప్రిన్స్ 4–0–39–0, రవి బిష్ణోయ్ 3–0–19–0. 14 ఏళ్ల 23 రోజుల వయసులో... ఐపీఎల్ వేలం సమయంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. లీగ్ బరిలోకి దిగిన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు తెచ్చుకున్న వైభవ్ తన తొలి బంతికే సిక్స్ బాది సంచలన రీతిలో మొదలు పెట్టాడు. ఎక్స్ట్రా కవర్ దిశగా ఆ షాట్ను అద్భుతంగా ఆడిన అతని సాహసానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. చెలరేగిపోతున్న దశలో అనూహ్యంగా స్టంపౌట్ కావడంతో వైభవ్ తట్టుకోలేకపోయినట్లున్నాడు. కన్నీళ్లతో అతను నిష్క్రమించాడు! బిహార్కు చెందిన ఈ ప్రతిభాశాలి ఇప్పటికే భారత అండర్–19 జట్టు తరఫున ఆడటంతో పాటు 5 రంజీ మ్యాచ్లలో కూడా బరిలోకి దిగాడు. వేలంలో వైభవ్ను రాజస్తాన్ రూ.1.10 కోట్లకు తీసుకుంది. ఐపీఎల్లో నేడుపంజాబ్ X బెంగళూరువేదిక: ముల్లాన్పూర్ ,మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి ముంబై X చెన్నై వేదిక: ముంబై రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం
భద్రతా కోణంలోనే.. రక్షణాత్మకం కాదు
ఫైనల్లో అనాహత్, వీర్
ఆటపై అభి‘రుచి’
రామ్ బాబుకు పసిడి
జాతీయ ప్రాబబుల్స్కు 39 మంది ప్లేయర్లు
ఇక ఆపుకోనక్కర లేదు
లక్నో ‘సూపర్’ విక్టరీ
డోంట్ వర్రీ సార్! ఇలా అయితేనే మీ టార్గెట్ పూర్తవుతుంది!
ర్యాంకర్లూ కటాఫ్!
భారత్లో 29 లక్షల యాడ్ అకౌంట్స్ సస్పెన్షన్: గూగుల్
ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’
వావి వరసలు మరచి.. కూతురి మామతో ప్రేమాయణం..
'పుష్ప 2' వీఎఫ్ఎక్స్ వీడియో రిలీజ్
BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం
నా భార్య వేధింపులు భరించలేకపోతున్నా.. ఇక సెలవు
హ్యాట్రిక్ కొట్టిన బంగారం.. తులం ఎంతకు చేరిందంటే..
ఏపీలో మరో ట్విస్ట్.. కొత్త రకం పన్ను వేసిన మాధవి రెడ్డి
‘సుప్రీంకోర్టు నిర్దేశిస్తుందా?.. ఇక మేము పార్లమెంట్ను మూసేస్తాం’
చల్లటి కబురు!
ఏసీబీ వలలో నస్పూర్ ఎస్సై
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రివ్యూ
బాబు దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం ఇది: వైఎస్ జగన్
విజయసాయి మాటలు నమ్మొద్దు.. ఆడియో రిలీజ్ చేసిన రాజ్ కసిరెడ్డి
మార్కెట్ మరింత పడుతుంది.. బంగారం, వెండి కొనడమే మేలు
RCB VS PBKS: చరిత్ర సృష్టించిన అర్షదీప్ సింగ్
మామిడి తోటలో మృత్యువు కాటేసింది
ఆ మర్మం ఏందో?.. స్మితా సబర్వాల్కు సీఎం సీపీఆర్వో కౌంటర్ ట్వీట్
కొండాపూర్, వనస్థలిపురంలో హైడ్రా కూల్చివేతలు..
అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ఫస్ట్ డే కలెక్షన్స్
మూతపడిన జిందాల్ స్టీల్స్
కెరీర్లో తొలి బంతికే సిక్సర్.. చరిత్రపుటల్లోకెక్కిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
వెస్టిండీస్కు గుండె కోత.. 10.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించినా..!
ఝూటా వకీల్ సాబ్ పతనం మొదలైందా?
తెలంగాణ మంత్రి దగ్గర రూ.55 లక్షల అప్పు: రాజ్తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య
మీరు కొత్త చట్టం కనిపెట్టారు.. హైకోర్టుపై సుప్రీంకోర్టు సీరియస్
తూటాకు బలైన భారతీయ విద్యార్థిని
కోకాపేటలో కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్..
అమ్మా..ఊపిరాడలేదు!
అమెరికా పౌరుడినని చెప్పినా వదలని ఐసీఈ
ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
బంజారాహిల్స్లో కలకలం.. ఆసుపత్రి బిల్డింగ్పైకి ఎక్కి దూకేస్తానంటూ మహిళ హల్చల్
అవసరాలకు అప్పు ఇచ్చి.. భార్యను లొంగదీసుకున్నాడు..
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ కృషి ఫలిస్తుంది.
రెండు దశాబ్దాల తర్వాత ‘బంధం’ కలుస్తోంది..!
అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి
కేఎల్ రాహుల్ ముద్దుల కూతురు.. పేరు రివీల్ చేసిన అతియాశెట్టి!
'డియర్ ఉమ' రివ్యూ.. మంచి ప్రయత్నం
కంగారు పడకు! నేనే ఈ సారి ఎండలు కాస్త ఎక్కవగా ఉన్నాయ్!
'గుడ్ బ్యాడ్ అగ్లీ' కలెక్షన్స్.. అజిత్ కెరీర్లో ఇదే టాప్
హమ్మయ్య.. బంగారం ఆగింది!
వచ్చేస్తోంది EPFO 3.0: ప్రయోజనాలెన్నో..
నాకన్నా చిన్నోడే కానీ, మగతనం ఎక్కువై: హీరో గురించి నటి
విశ్వమూ భ్రమిస్తోంది
రైళ్లు ఇలా మళ్లిస్తున్నారు..
వెనక్కి తగ్గని ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస రీట్వీట్లు
పెరుగుతున్న మత సమ్మతి
పీఎం మోదీ ఏసీ యోజన: కొత్త AC కొనుగోలుపై డిస్కౌంట్
‘మీరు పనులు చేయకపోతే.. న్యాయ వ్యవస్థ చూస్తూ కూర్చోవాలా?’
ఇషా అంబానీ డైమండ్ థీమ్డ్ లగ్జరీ ఇల్లు : నెక్ట్స్ లెవల్ అంతే!
తన కూతురిపై కన్నేశాడనే కడతేర్చింది
సంజూతో విభేదాలు!.. స్పందించిన రాహుల్ ద్రవిడ్
అందుకే ఓడిపోయాం.. అదే అతిపెద్ద గుణపాఠం: పాటిదార్
రెండు పెళ్లిళ్లు.. ఎందుకంటే నేను శ్రీరాముడిని ఫాలో కాను: కమల్ హాసన్
ఉపాధి హామీ పనులు.. 17జిల్లాలు అప్.. 15జిల్లాలు డౌన్..
బైరెడ్డి శబరి.. చెల్లని ఎంపీ!
అయ్యో! ఆగండయ్యా! అది అప్పుడు ఇప్పుడు మనం వాళ్ల కూటమిలో ఉన్నాం!
ఉపాధ్యాయుల సర్దుబాటుకు రంగం సిద్ధం
గెలుపు వాకిట బోర్లా పడిన రాయల్స్.. ఉత్కంఠ పోరులో లక్నోను గెలిపించిన ఆవేశ్ ఖాన్
హైదరాబాద్లో ఇళ్ల ధరలు ఎంతలా పెరిగాయంటే..
నేపాల్ పరిణామాలకు బాధ్యులెవరు?
వాట్సాప్లో రెండు కొత్త ఫీచర్స్
భూకంపం వస్తే ఏం చేయాలి?: చాట్జీపీటీ సమాధానం
'మ్యాడ్ స్క్వేర్' ఓటీటీ డేట్ ఫిక్సయిందా?
గ్రూప్–1 నియామకాలు నిలిపివేయండి
40+ ఉద్యోగులను టీసీఎస్ టార్గెట్ చేసిందా?
డోంట్ వర్రీ సార్! ఇలా అయితేనే మీ టార్గెట్ పూర్తవుతుంది!
ఈ సైకిళ్లు ఎవరికి ఇవ్వాలి దేవుడా?
'కోర్ట్' హీరో కొత్త మూవీ.. సైలెంట్గా ఓటీటీలో స్ట్రీమింగ్
సౌర వ్యవస్థకు ఆవల జీవం!
ఎవడ్రా కూసేది.. 2028 వరకు ఖాళీ లేదిక్కడ.. ఇచ్చిపడేసిన అనురాగ్ కశ్యప్
ఇంకెంత కాలం జాబ్ చేస్తారు.. ఇకనైనా మారండి
శంకర్దాదా ఎంబీబీఎస్.. ఆమె జీవితాన్నే మార్చేసింది!
ఢిల్లీపై గుజరాత్ విజయం.. అవకాశం ఉన్నా సెంచరీ పూర్తి చేయలేకపోయిన బట్లర్
ఒకే కాలనీ...56 పార్కులు ఎక్కడో తెలుసా?
ఇంటర్వ్యూ స్లాట్లు అదృశ్యం
రూ. 3 వేల కోట్ల భూమి కేవలం రూ.59కే..
మూడు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా: భారీ జరిమానా..
భారత్లో జర్మన్ కంపెనీ అరుదైన రికార్డ్
రూ. 50 కోట్ల కుక్క.. ఈడీ దాడులు!
దేశంలో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు
‘కోచ్లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
కేఎల్ రాహుల్ కామెంట్స్.. షాకైన పీటర్సన్!.. నా దోస్తులంతా ఇంతే..
విద్యార్థుల వీసాలపై పిడుగు
వేములవాడ రాజన్నకు కొత్త గుడి
విద్యార్థికి రూ.2 కోట్ల అప్పు.. వడ్డీ 40 రూపాయలు!
అప్పుడు రోజుకూలీ, ఇపుడు కోట్ల విలువ చేసే కంపెనీకి సీఈవో
ట్రిపుల్ ట్రీట్.. ఆర్య 3, కార్తికేయ 3.. ఇంకా ఎన్నెన్నో..
రూ.10 వేలలోపు టాప్ 10 మొబైళ్లు
ఏపీ ఎమ్మెల్యేకు హైడ్రా షాక్
కట్టు కథలు.. తప్పుడు ప్రచారాలు.. కూటమి సర్కార్పై మిథున్రెడ్డి ఫైర్
సచిన్ రికార్డు బద్దలు కొట్టిన పాటిదార్.. ఐపీఎల్లో భారత తొలి బ్యాటర్గా..
ఇద్దరు కొడుకుల గొంతుకోసి చంపి.. తల్లి ఆత్మహత్య
భారత్కు షింకన్సెన్ రైళ్లు
పాకిస్తాన్ సూపర్ లీగ్లో అత్యధిక పారితోషికం అతడిదే.. ఐపీఎల్తో పోలిస్తే..!
అల్లుడితో కలిసి 7 ఎకరాలు కొన్న బాలీవుడ్ నటుడు.. ఎక్కడంటే?
యూరప్ ‘మండుతోంది’
ప్రముఖ బ్యాంకులు వడ్డీ రేట్ల కోత..
‘సీఐ పొన్నూరు భాస్కర్ నన్ను టార్చర్ చేశారు సర్’..కోర్టులో కృష్ణవేణి ఆవేదన
ఆ చట్టం కేవలం కోడళ్ల కోసమే చేయలేదమ్మా: అలహాబాద్ హైకోర్టు
భద్రతా కోణంలోనే.. రక్షణాత్మకం కాదు
ఫైనల్లో అనాహత్, వీర్
ఆటపై అభి‘రుచి’
రామ్ బాబుకు పసిడి
జాతీయ ప్రాబబుల్స్కు 39 మంది ప్లేయర్లు
ఇక ఆపుకోనక్కర లేదు
లక్నో ‘సూపర్’ విక్టరీ
డోంట్ వర్రీ సార్! ఇలా అయితేనే మీ టార్గెట్ పూర్తవుతుంది!
ర్యాంకర్లూ కటాఫ్!
భారత్లో 29 లక్షల యాడ్ అకౌంట్స్ సస్పెన్షన్: గూగుల్
ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’
వావి వరసలు మరచి.. కూతురి మామతో ప్రేమాయణం..
'పుష్ప 2' వీఎఫ్ఎక్స్ వీడియో రిలీజ్
BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం
నా భార్య వేధింపులు భరించలేకపోతున్నా.. ఇక సెలవు
హ్యాట్రిక్ కొట్టిన బంగారం.. తులం ఎంతకు చేరిందంటే..
ఏపీలో మరో ట్విస్ట్.. కొత్త రకం పన్ను వేసిన మాధవి రెడ్డి
‘సుప్రీంకోర్టు నిర్దేశిస్తుందా?.. ఇక మేము పార్లమెంట్ను మూసేస్తాం’
చల్లటి కబురు!
ఏసీబీ వలలో నస్పూర్ ఎస్సై
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రివ్యూ
బాబు దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం ఇది: వైఎస్ జగన్
విజయసాయి మాటలు నమ్మొద్దు.. ఆడియో రిలీజ్ చేసిన రాజ్ కసిరెడ్డి
మార్కెట్ మరింత పడుతుంది.. బంగారం, వెండి కొనడమే మేలు
RCB VS PBKS: చరిత్ర సృష్టించిన అర్షదీప్ సింగ్
మామిడి తోటలో మృత్యువు కాటేసింది
ఆ మర్మం ఏందో?.. స్మితా సబర్వాల్కు సీఎం సీపీఆర్వో కౌంటర్ ట్వీట్
కొండాపూర్, వనస్థలిపురంలో హైడ్రా కూల్చివేతలు..
అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ఫస్ట్ డే కలెక్షన్స్
మూతపడిన జిందాల్ స్టీల్స్
కెరీర్లో తొలి బంతికే సిక్సర్.. చరిత్రపుటల్లోకెక్కిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
వెస్టిండీస్కు గుండె కోత.. 10.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించినా..!
ఝూటా వకీల్ సాబ్ పతనం మొదలైందా?
తెలంగాణ మంత్రి దగ్గర రూ.55 లక్షల అప్పు: రాజ్తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య
మీరు కొత్త చట్టం కనిపెట్టారు.. హైకోర్టుపై సుప్రీంకోర్టు సీరియస్
తూటాకు బలైన భారతీయ విద్యార్థిని
కోకాపేటలో కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్..
అమ్మా..ఊపిరాడలేదు!
అమెరికా పౌరుడినని చెప్పినా వదలని ఐసీఈ
ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
బంజారాహిల్స్లో కలకలం.. ఆసుపత్రి బిల్డింగ్పైకి ఎక్కి దూకేస్తానంటూ మహిళ హల్చల్
అవసరాలకు అప్పు ఇచ్చి.. భార్యను లొంగదీసుకున్నాడు..
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ కృషి ఫలిస్తుంది.
రెండు దశాబ్దాల తర్వాత ‘బంధం’ కలుస్తోంది..!
అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి
కేఎల్ రాహుల్ ముద్దుల కూతురు.. పేరు రివీల్ చేసిన అతియాశెట్టి!
'డియర్ ఉమ' రివ్యూ.. మంచి ప్రయత్నం
కంగారు పడకు! నేనే ఈ సారి ఎండలు కాస్త ఎక్కవగా ఉన్నాయ్!
'గుడ్ బ్యాడ్ అగ్లీ' కలెక్షన్స్.. అజిత్ కెరీర్లో ఇదే టాప్
హమ్మయ్య.. బంగారం ఆగింది!
వచ్చేస్తోంది EPFO 3.0: ప్రయోజనాలెన్నో..
నాకన్నా చిన్నోడే కానీ, మగతనం ఎక్కువై: హీరో గురించి నటి
విశ్వమూ భ్రమిస్తోంది
రైళ్లు ఇలా మళ్లిస్తున్నారు..
వెనక్కి తగ్గని ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస రీట్వీట్లు
పెరుగుతున్న మత సమ్మతి
పీఎం మోదీ ఏసీ యోజన: కొత్త AC కొనుగోలుపై డిస్కౌంట్
‘మీరు పనులు చేయకపోతే.. న్యాయ వ్యవస్థ చూస్తూ కూర్చోవాలా?’
ఇషా అంబానీ డైమండ్ థీమ్డ్ లగ్జరీ ఇల్లు : నెక్ట్స్ లెవల్ అంతే!
తన కూతురిపై కన్నేశాడనే కడతేర్చింది
సంజూతో విభేదాలు!.. స్పందించిన రాహుల్ ద్రవిడ్
అందుకే ఓడిపోయాం.. అదే అతిపెద్ద గుణపాఠం: పాటిదార్
రెండు పెళ్లిళ్లు.. ఎందుకంటే నేను శ్రీరాముడిని ఫాలో కాను: కమల్ హాసన్
ఉపాధి హామీ పనులు.. 17జిల్లాలు అప్.. 15జిల్లాలు డౌన్..
బైరెడ్డి శబరి.. చెల్లని ఎంపీ!
అయ్యో! ఆగండయ్యా! అది అప్పుడు ఇప్పుడు మనం వాళ్ల కూటమిలో ఉన్నాం!
ఉపాధ్యాయుల సర్దుబాటుకు రంగం సిద్ధం
గెలుపు వాకిట బోర్లా పడిన రాయల్స్.. ఉత్కంఠ పోరులో లక్నోను గెలిపించిన ఆవేశ్ ఖాన్
హైదరాబాద్లో ఇళ్ల ధరలు ఎంతలా పెరిగాయంటే..
నేపాల్ పరిణామాలకు బాధ్యులెవరు?
వాట్సాప్లో రెండు కొత్త ఫీచర్స్
భూకంపం వస్తే ఏం చేయాలి?: చాట్జీపీటీ సమాధానం
'మ్యాడ్ స్క్వేర్' ఓటీటీ డేట్ ఫిక్సయిందా?
గ్రూప్–1 నియామకాలు నిలిపివేయండి
40+ ఉద్యోగులను టీసీఎస్ టార్గెట్ చేసిందా?
డోంట్ వర్రీ సార్! ఇలా అయితేనే మీ టార్గెట్ పూర్తవుతుంది!
ఈ సైకిళ్లు ఎవరికి ఇవ్వాలి దేవుడా?
'కోర్ట్' హీరో కొత్త మూవీ.. సైలెంట్గా ఓటీటీలో స్ట్రీమింగ్
సౌర వ్యవస్థకు ఆవల జీవం!
ఎవడ్రా కూసేది.. 2028 వరకు ఖాళీ లేదిక్కడ.. ఇచ్చిపడేసిన అనురాగ్ కశ్యప్
ఇంకెంత కాలం జాబ్ చేస్తారు.. ఇకనైనా మారండి
శంకర్దాదా ఎంబీబీఎస్.. ఆమె జీవితాన్నే మార్చేసింది!
ఢిల్లీపై గుజరాత్ విజయం.. అవకాశం ఉన్నా సెంచరీ పూర్తి చేయలేకపోయిన బట్లర్
ఒకే కాలనీ...56 పార్కులు ఎక్కడో తెలుసా?
ఇంటర్వ్యూ స్లాట్లు అదృశ్యం
రూ. 3 వేల కోట్ల భూమి కేవలం రూ.59కే..
మూడు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా: భారీ జరిమానా..
భారత్లో జర్మన్ కంపెనీ అరుదైన రికార్డ్
రూ. 50 కోట్ల కుక్క.. ఈడీ దాడులు!
దేశంలో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు
‘కోచ్లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
కేఎల్ రాహుల్ కామెంట్స్.. షాకైన పీటర్సన్!.. నా దోస్తులంతా ఇంతే..
విద్యార్థుల వీసాలపై పిడుగు
వేములవాడ రాజన్నకు కొత్త గుడి
విద్యార్థికి రూ.2 కోట్ల అప్పు.. వడ్డీ 40 రూపాయలు!
అప్పుడు రోజుకూలీ, ఇపుడు కోట్ల విలువ చేసే కంపెనీకి సీఈవో
ట్రిపుల్ ట్రీట్.. ఆర్య 3, కార్తికేయ 3.. ఇంకా ఎన్నెన్నో..
రూ.10 వేలలోపు టాప్ 10 మొబైళ్లు
ఏపీ ఎమ్మెల్యేకు హైడ్రా షాక్
కట్టు కథలు.. తప్పుడు ప్రచారాలు.. కూటమి సర్కార్పై మిథున్రెడ్డి ఫైర్
సచిన్ రికార్డు బద్దలు కొట్టిన పాటిదార్.. ఐపీఎల్లో భారత తొలి బ్యాటర్గా..
ఇద్దరు కొడుకుల గొంతుకోసి చంపి.. తల్లి ఆత్మహత్య
భారత్కు షింకన్సెన్ రైళ్లు
పాకిస్తాన్ సూపర్ లీగ్లో అత్యధిక పారితోషికం అతడిదే.. ఐపీఎల్తో పోలిస్తే..!
అల్లుడితో కలిసి 7 ఎకరాలు కొన్న బాలీవుడ్ నటుడు.. ఎక్కడంటే?
యూరప్ ‘మండుతోంది’
ప్రముఖ బ్యాంకులు వడ్డీ రేట్ల కోత..
‘సీఐ పొన్నూరు భాస్కర్ నన్ను టార్చర్ చేశారు సర్’..కోర్టులో కృష్ణవేణి ఆవేదన
ఆ చట్టం కేవలం కోడళ్ల కోసమే చేయలేదమ్మా: అలహాబాద్ హైకోర్టు
సినిమా

రెండు పెళ్లిళ్లు.. ఎందుకంటే నేను శ్రీరాముడిని ఫాలో కాను: కమల్ హాసన్
కమల్ హాసన్, శింబు, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'థగ్ లైఫ్' (Thug Life). మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి జింగుచా పాట రిలీజైంది. ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో నటీనటులకు పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. త్రిష (Trisha Krishnan) మాట్లాడుతూ.. పెళ్లిపై తనకు నమ్మకం లేదని తెలిపింది. పెళ్లి చేసుకున్నా.. చేసుకోకపోయినా తనకు పర్వాలేదని పేర్కొంది.రెండుసార్లు పెళ్లేంటి?కమల్ హాసన్ (Kamal Haasan) మాట్లాడుతూ గతంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నాడు. 15 ఏళ్ల క్రితం అనుకుంటా.. ఎంపీ బ్రిట్టాస్ నాకు మంచి స్నేహితుడు. చాలామంది కాలేజీ విద్యార్థులు చుట్టూ గుమిగూడినప్పుడు నన్నో ప్రశ్న అడిగాడు. మంచి బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన నువ్వు రెండుసార్లు ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ అని ప్రశ్నించాడు. మంచి కుటుంబానికి, పెళ్లికి సంబంధం ఏంటి? అని అడిగాను. రాముడి తండ్రిని ఫాలో అవుతా: కమల్అది కాదు.. నువ్వు రాముడిని పూజిస్తావ్.. మరి ఆయనలాగే జీవించాలి కదా అని ప్రశ్నించాడు. దానికి నా సమాధానం ఏంటంటే.. మొదటగా.. నేను ఏ దేవుడినీ ప్రార్థించను. రాముడి అడుగుజాడల్లో అసలే నడవను. అందుకు బదులుగా రాముడి తండ్రి (దశరథుడికి ముగ్గురు భార్యలు) బాటలో నడుస్తాను అని చెప్పుకొచ్చాడు. థగ్ లైఫ్ సినిమా జూన్ 5న విడుదల కానుంది.కమల్ రెండు పెళ్లిళ్లు- విడాకులుకమల్ హాసన్ 1978లో హీరోయిన్ వాణి గణపతిని పెళ్లి చేసుకున్నాడు. దశాబ్దకాలం తర్వాత ఆమెకు విడాకులిచ్చి 1988లో సారికను పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లికి ముందే 1986లో శృతి హాసన్ జన్మించింది. పెళ్లి తర్వాత 1991లో అక్షర హాసన్ పుట్టింది. తర్వాతి కాలంలో కమల్-సారిక బంధం కూడా ఎంతోకాలం కొనసాగలేదు. 2002లో విడాకుల కోసం దరఖాస్తు చేయగా 2004లొ డివోర్స్ మంజూరయ్యాయి. ఆ మరుసటి ఏడాది నటి గౌతమితో కమల్ సహజీవనం చేశాడు. 2016లో ఆమెకు బ్రేకప్ చెప్పాడు.చదవండి: సినిమా బాగోలేదని ప్రచారం చేస్తారా?.. విజయశాంతి వార్నింగ్

తెలంగాణ మంత్రి దగ్గర రూ.55 లక్షల అప్పు: రాజ్తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య
హీరో రాజ్ తరుణ్ (Raj Tarun), అతడి స్నేహితుడు శేఖర్ బాషా వల్ల తనకు ప్రాణహాని ఉందని లావణ్య (Lavanya) ఆరోపించింది. తనకు న్యాయం చేయాలంటూ శనివారం నాడు నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ఎదుటే ప్రాణాలు విడుస్తానంది. మీడియాతో లావణ్య మాట్లాడుతూ.. ఇటీవల నాపై కొందరు దాడికి పాల్పడ్డారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిన్న రాత్రి నలుగురు వ్యక్తులు నా ఇంటిపైకి వచ్చారు. భయంతో బతుకున్నాను. నా ప్రాణం పోయాక చర్యలు తీసుకుంటారా? ఆ ఇంటి కోసమే నాపై ఇలా దాడి చేస్తున్నారు.రూ.55 లక్షల అప్పునిజానికి ఆ ఇంటిపై తెలంగాణ మంత్రి బంధువుల దగ్గరి నుంచి రూ.55 లక్షలు అప్పు తీసుకున్నాం. నాలుగేళ్లవుతోంది.. రెండేళ్లుగా మా గొడవల వల్ల వడ్డీ చెల్లించడం లేదు. కాస్త గడువు ఇవ్వమని అడుగుతూ వచ్చాం. నిన్న సాయంత్రం వారు మాకు ఫోన్ చేశారు. వారం రోజుల్లో డబ్బు ఇవ్వకపోతే ఇల్లు ఆక్రమించుకుంటామన్నారు. అందుకు నేను ఒప్పుకున్నాను. రెండుమూడురోజుల్లో ఇల్లు ఖాళీ చేస్తాను. ఇకపోతే ఆ మంత్రి పేరు నేను చెప్పలేను. నాలుగురోజుల్లో ఇల్లు ఆక్రమించుకోవడానికి వస్తారు. అప్పుడు మీకే తెలుస్తుంది.పరువు పోతుందని ఆగా..ఒకవేళ రాజ్తరుణ్.. అప్పిచ్చిన వ్యక్తికి రూ.55 లక్షలు ఇచ్చినా సరే ఆ ఇంటిని మళ్లీ రాజ్తరుణ్కు ఇవ్వకూడదని కోరతాను. ఎందుకంటే ఆ ఇంట్లో నా వాటా కూడా ఉంది. ఇప్పటికే రాజ్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో అతడిపై కేసులు కూడా వేసేందుకు సిద్ధమయ్యారు. పరువు పోతుందని ఇంతకాలం ఈ విషయం బయటకు చెప్పలేదు అని లావణ్య పేర్కొంది.చదవండి: శంకర్దాదా ఎంబీబీఎస్.. ఆమె జీవితాన్నే మార్చేసింది!

చెప్పి మరీ నటిని ఇబ్బంది పెడుతున్నారు
సోషల్ మీడియా ఉపయోగించడం ఏమో గానీ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు హ్యాకింగ్ బారిన పడుతుంటారు. నటీనటులు ట్విటర్ అకౌంట్స్ ఎప్పటికప్పుడు హ్యాక్ అవుతూనే ఉంటాయి. తాజాగా తమిళ నటి ఖుష్బూని హ్యాకర్స్ తెగ ఇబ్బంది పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఖుష్బూ తరచుగా ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఓ ఫొటో పోస్ట్ చేయగానే.. సన్నగా మారడానికి ఇంజెక్షన్ తీసుకున్నారా? అని ఓ నెటిజన్ అన్నాడు. దీంతో అతడి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది.తాజాగా ఖుష్బూ ఫోన్ నంబర్ ఎలా తెలిసిందో ఏమో గానీ యూకేకి చెందిన కొందరు హ్యాకర్స్.. నీ ట్విటర్ ఖాతాని హ్యాక్ చేస్తున్నాం అని ఖుష్బూ వాట్సాప్ కే మెసేజ్ పంపించారు. ఈమె ట్విటర్ ఖాతా క్రిప్టో కరెన్సీకి సంబంధించిన సమాచారాన్ని హ్యాకర్స్ పోస్ట్ చేస్తున్నారు. దీంతో తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులని ఖుష్బూ ఆశ్రయించింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరింది.(ఇదీ చదవండి: నాన్న కల నెరవేర్చిన తెలుగు డైరెక్టర్.. కొత్త ఇల్లు) View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar)

'డియర్ ఉమ' రివ్యూ.. మంచి ప్రయత్నం
తెలుగు చిత్రసీమలో తెలుగమ్మాయిలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. హీరోయిన్గా మెరిసేందుకు చాలా కష్టపడుతుంటారు. అలాంటిది సుమయ రెడ్డి అయితే తన తొలి ప్రయత్నంలోనే హీరోయిన్గా, రచయితగా, నిర్మాతగా భిన్న పాత్రల్ని పోషించింది. 'డియర్ ఉమ' అంటూ ఏప్రిల్ 18న వచ్చిన ఈ చిత్రం రొమాంటిక్ థ్రిల్లర్గా తెరకెక్కించారు. పృథ్వీ అంబర్, సుమయ రెడ్డి( Sumaya Reddy) హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని సాయిరాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహించాడు. మరి ఈ సుమయ రెడ్డి తొలి ప్రయత్నం ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.కథేంటి..?గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన ఉమ (సుమయ రెడ్డి) వైద్య విద్యను పూర్తి చేసి సొంతంగా ఓ హాస్పిటల్ నిర్మించి తండ్రి కలను నెరవేర్చాలని అనుకుంటుంది. మరోవైపు దేవ్కు(పృథ్వీ అంబర్) మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. భవిష్యత్లో రాక్స్టార్ కావాలని ఎన్నో కలలు కంటాడు. కానీ, చదువులో చాలా వెనుకపడిపోతాడు. తన కాలేజీ సమయంలో దేవ్ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే, మ్యూజిక్ కారణంగానే దేవ్కు ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. ప్రేమలో విఫలమైన దేవ్ రాక్ స్టార్ అవ్వాలనే ప్రయత్నంలో అంతగా సక్సెస్ కాలేకపోతాడు. చిన్నా చితకా అవకాశల కోసం గడపగడపకూ తిరుగుతుంటాడు. అలాంటి దేవ్కి ఓ సారి ఉమ డైరీ దొరుకుతుంది. తనకు గాయమై హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు తన జీవితం మారిందని.. అప్పటి నుంచే ఉమ జీవితం ఆగిపోయిందని తెలుసుకుంటాడు. అసలు ఉమకి ఏం జరిగింది..? ఉమ నేపథ్యం ఏంటి? ఉమ ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చేస్తుండేది? అనే ప్రశ్నలతో సతమతం అవుతుంటాడు దేవ్. ఇక ఉమ కోసం దేవ్ చేసిన పోరాటం ఏంటి? ఉమతో దేవ్ ప్రేమ ప్రయాణం ఎక్కడి వరకు దారి తీస్తుంది? ఈ కథలో దేవ్ అన్న సూర్య (కమల్ కామరాజ్) పాత్ర ఏంటి..? అన్నది కథ.వైద్యం పేరుతో కార్పొరేట్ హాస్పిటల్స్ చేసే మోసాలకు లవ్స్టోరీని జోడించి డియర్ ఉమ కథను సుమయ రెడ్డి రాసుకుంది. ఈ కథను సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. వైద్య రంగంలోని లోపాలను ఎత్తిచూపుతూ తెరకెక్కించాడు. ప్రస్తుత కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను గుర్తుచేస్తూ, సామాన్య ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా కథను నడిపించారు. ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.ఎలా ఉందంటే..?రధన్ సంగీతం సినిమా మూడ్కు తగ్గట్టుగా ఉంది, అయితే, కొన్ని చోట్ల మరింత మెరుగ్గా ఉండాల్సింది. రాజ్ తోట కెమెరా వర్క్ సహజంగా ఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యేకమైన షాట్స్ మిస్ అయినట్టు అనిపించవచ్చు. స్క్రీన్ ప్లే సినిమాకు ఒక బలంగా నిలిచింది, ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్ట్లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. అయితే, క్లైమాక్స్లోని ఎమోషనల్ సన్నివేశాలు కొందరికి అతిగా అనిపించవచ్చు. పతాక సన్నివేశంలోని పాట సినిమా సందేశాన్ని స్పష్టంగా చెప్పినప్పటికీ, కథలో మరింత సహజంగా కలిసిపోయి ఉంటే బాగుండేది. మొత్తానికి, "డియర్ ఉమర్" ఒక మంచి ప్రయత్నం, కానీ కొన్ని అంశాలలో మరింత శ్రద్ధ పెడితే ఇది ఒక గొప్ప చిత్రంగా నిలిచేది. తొలి చిత్రమే అయినా సుమ చిత్ర ఆర్ట్స్, నిర్మాత సుమయ రెడ్డి గొప్ప కథను అందించడంలో సక్సెస్ అయ్యారు.డియర్ ఉమ చిత్రానికి సుమయ రెడ్డి ఆల్ రౌండర్ అని చెప్పుకోవచ్చు. మంచి కథను ఇవ్వడమే కాకుండా.. ఈ కథను అనుకున్నట్టుగా తీయడంలో ఖర్చు పెట్టిన నిర్మాతగానూ సుమయ రెడ్డి సక్సెస్ అయింది. సుమయ రెడ్డిలోని రచయిత, నిర్మాతకు వంద మార్కులు వేసుకోవచ్చు. ఇక నటిగా ఇంకాస్త మెరుగు పర్చుకోవాల్సి ఉంటుందేమో. తెరపై సుమయ రెడ్డి అందంగా కనిపించారు. హీరోగా పృథ్వీ అంబర్ యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ను పలికించాడు. కమల్ కామరాజ్ పాత్ర సర్ ప్రైజింగ్గా ఉంటుంది. అజయ్ ఘోష్ పాత్ర రొటీన్ అనిపిస్తుంది. ఫైమా, లోబో, సప్తగిరి, భద్రం పోషించిన పాత్రలు అక్కడక్కడా నవ్విస్తాయి. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా డియర్ ఉమను చూస్తే తప్పకుండా మెప్పిస్తుంది.
న్యూస్ పాడ్కాస్ట్

వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు... దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకాలు

సుదీర్ఘ కాలంగా వక్ఫ్ అధీనంలో ఉన్న ఆస్తులను ఇకపై కూడా వక్ఫ్ ఆస్తులుగానే పరిగణించాలని భావిస్తున్నాం... ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటున్నాం... సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్లో ఫీజుల షెడ్యూల్కు చెల్లుచీటి... కూటమి పాలనలో గతితప్పిన ఫీజు రీయింబర్స్మెంట్... ఊసేలేని వసతి దీవెన

వక్ఫ్(సవరణ) చట్టంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్లోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం. 8 మంది సజీవ దహనం. 8 మందికి తీవ్ర గాయాలు

కొత్త సుంకాల నుంచి ఎలక్ట్రానిక్స్కు మినహాయింపు. ట్రంప్ సర్కారు తాజా ప్రకటన. అమెరికా కంపెనీల ప్రయోజనాలే లక్ష్యం

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు 125 శాతానికి పెంపు... డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతానికి ప్రతీకారంగా చైనా నిర్ణయం

చర్యకు ప్రతి చర్య తప్పదు.. అధికార దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా మొట్టికాయ వేస్తారు... ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరిక

చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన... చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు స్పష్టీకరణ

మీ కుటుంబానికి అండగా ఉంటాం... పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
క్రీడలు

లక్నో ‘సూపర్’ విక్టరీ
జైపూర్: ఆఖరి ఓవర్... ఆఖరి బంతిదాకా ఇరు జట్లతోనూ దోబూచులాడిన విజయం చివరకు లక్నో సూపర్జెయింట్స్ను వరించింది. రాజస్తాన్ రాయల్స్ 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా... లక్నో బౌలర్ అవేశ్ ఖాన్ అద్భుతం చేశాడు. 6 పరుగులే ఇచ్చి ప్రమాదకర హిట్టర్ హెట్మైర్ను అవుట్ చేశాడు. దీంతో ఉత్కంఠ రేపిన పోరులో సూపర్జెయింట్స్ 2 పరుగులతో అనూహ్యంగా రాయల్స్పై గెలిచింది. తొలుత లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. మార్క్రమ్ (45 బంతుల్లో 66; 5 ఫోర్లు, 3 సిక్స్లు), ఆయుశ్ బదోని (34 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, ఆఖరి ఓవర్లో సమద్ (10 బంతుల్లో 30 నాటౌట్; 4 సిక్స్లు) చెలరేగాడు. హసరంగకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసి ఓడింది. యశస్వి జైస్వాల్ (52 బంతుల్లో 74; 5 ఫోర్లు, 4 సిక్స్లు), రియాన్ పరాగ్ (26 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్లు) మెరిపించారు. మార్క్రమ్, బదోని ఫిఫ్టీ–ఫిఫ్టీ పవర్ప్లే ముగియక ముందే హిట్టర్లు మార్ష్ (4), పూరన్ (11), పవర్ ప్లే తర్వాత కెపె్టన్ రిషభ్ పంత్ (3) అవుటవడంతో లక్నో 54 పరుగుల వద్ద కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో క్రీజులో ఉన్న ఓపెనర్ మార్క్రమ్, ఆయుశ్ బదోని సూపర్జెయింట్స్ స్కోరు భారాన్ని మోశారు. ఇద్దరు వేగంగా ఆడటంతో జట్టు పరుగుల జోరందుకుంది. 31 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న మార్క్రమ్ నాలుగో వికెట్కు 76 పరుగులు జోడించాక అవుటయ్యాడు. కాసేపటికి బదోని 33 బంతుల్లో బదోని అర్ధ సెంచరీ చేసిన వెంటనే నిష్క్రమించాడు. సమద్ 4 సిక్సర్లతో... 19 ఓవర్లలో 153/5 వద్ద ఓ మోస్తరు స్కోరు చేసిన లక్నో శిబిరంలో ఆఖరి ఓవర్ ఆనందం నింపింది. సందీప్ వేసిన 20వ ఓవర్లో మిల్లర్ (7 నాటౌట్) సింగిల్ తీసివ్వగా తర్వాత సమద్ 6, 6, 2, 6, 6లతో మొత్తం 27 పరుగులు వచ్చాయి. దీంతో సూపర్జెయింట్స్ స్కోరు 180కి చేరింది. జైస్వాల్ శ్రమించినా... యశస్వి జైస్వాల్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన కొత్త కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్స్లు) ఆకట్టుకున్నాడు. ఇద్దరి ఓపెనర్ల వేగం రాజస్తాన్ను లక్ష్యం వైపు నడిపించింది. తొలి వికెట్కు 85 పరుగులు జోడించాక వైభవ్ ఆటను మార్క్రమ్ ముగించగా, నితీశ్ రాణా (8)ను శార్దుల్ పెవిలియన్ చేర్చాడు.తర్వాత జైస్వాల్కు జతయిన కెపె్టన్ రియాన్ పరాగ్ రన్రేట్ తగ్గకుండా ఇన్నింగ్స్ను నడిపించారు. 31 బంతుల్లో ఫిఫ్టీ సాధించిన జైస్వాల్ దూకుడు పెంచాడు. లక్ష్యానికి చేరువైన దశలో 18వ ఓవర్లో జైస్వాల్, పరాగ్లను అవుట్ చేసిన అవేశ్...ఆఖరి ఓవర్లో హెట్మైర్ (12)కు చెక్ పెట్టాడు.స్కోరు వివరాలు లక్నో సూపర్జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి) హెట్మైర్ (బి) ఆర్చర్ 4; మార్క్రమ్ (సి) పరాగ్ (బి) హసరంగ 66; నికోలస్ పూరన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సందీప్ 11; రిషభ్ పంత్ (సి) జురేల్ (బి) హసరంగ 3; ఆయుశ్ బదోని (సి) దూబే (బి) తుషార్ 50; మిల్లర్ నాటౌట్ 7; సమద్ నాటౌట్ 30; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1–16, 2–46, 3–54, 4–130, 5–143. బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 4–0–32–1, తీక్షణ 4–0–32–0, సందీప్ శర్మ 4–0–55–1, తుషార్ దేశ్పాండే 4–0–26–1,హసరంగ 4–0–31–2. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) అవేశ్ 74; వైభవ్ (స్టంప్డ్) పంత్ (బి) మార్క్రమ్ 34; నితీశ్ రాణా (సి) అవేశ్ (బి) శార్దుల్ 8; రియాన్ పరాగ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అవేశ్ 39; జురేల్ నాటౌట్ 6; హెట్మైర్ (సి) శార్దుల్ (బి) అవేశ్ 12; శుభమ్ నాటౌట్ 3 ఎక్స్ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–85, 2–94, 3–156, 4–161, 5–175. బౌలింగ్: శార్దుల్ 3–0–34–1, అవేశ్ ఖాన్ 4–0–37–3, దిగ్వేశ్ రాఠి 4–0–30–0, మార్క్రమ్ 2–0–18–1, ప్రిన్స్ 4–0–39–0, రవి బిష్ణోయ్ 3–0–19–0. 14 ఏళ్ల 23 రోజుల వయసులో... ఐపీఎల్ వేలం సమయంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. లీగ్ బరిలోకి దిగిన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు తెచ్చుకున్న వైభవ్ తన తొలి బంతికే సిక్స్ బాది సంచలన రీతిలో మొదలు పెట్టాడు. ఎక్స్ట్రా కవర్ దిశగా ఆ షాట్ను అద్భుతంగా ఆడిన అతని సాహసానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. చెలరేగిపోతున్న దశలో అనూహ్యంగా స్టంపౌట్ కావడంతో వైభవ్ తట్టుకోలేకపోయినట్లున్నాడు. కన్నీళ్లతో అతను నిష్క్రమించాడు! బిహార్కు చెందిన ఈ ప్రతిభాశాలి ఇప్పటికే భారత అండర్–19 జట్టు తరఫున ఆడటంతో పాటు 5 రంజీ మ్యాచ్లలో కూడా బరిలోకి దిగాడు. వేలంలో వైభవ్ను రాజస్తాన్ రూ.1.10 కోట్లకు తీసుకుంది. ఐపీఎల్లో నేడుపంజాబ్ X బెంగళూరువేదిక: ముల్లాన్పూర్ ,మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి ముంబై X చెన్నై వేదిక: ముంబై రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం

గెలుపు వాకిట బోర్లా పడిన రాయల్స్.. ఉత్కంఠ పోరులో లక్నోను గెలిపించిన ఆవేశ్ ఖాన్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 19) రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై లక్నో సూపర్ జెయింట్స్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగా.. రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్లో రాయల్స్ గెలుపుకు 9 పరుగులు అవసరం కాగా.. ఆవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులే ఇచ్చాడు. లక్నో ఇన్నింగ్స్లో మార్క్రమ్ 66, ఆయుశ్ బదోని 50 పరుగులు చేయగా.. ఆఖర్లో అబ్దుల్ సమద్ 10 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిచెల్ మార్ష్ (4), పంత్ (3) విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో హసరంగ 2 వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే తలో వికెట్ దక్కించుకున్నారు.ఛేదనలో యశస్వి జైస్వాల్ (74), వైభవ్ సూర్యవంశీ (34), రియాన్ పరాగ్ (39) అద్భుతంగా ఆడినప్పటికీ.. రాయల్స్ ఒత్తిడికి చిత్తై గెలుపు వాకిట బోర్లా పడింది. రాయల్స్ ఈ సీజన్లో ఇలా ఓడటం ఇది రెండో సారి. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లోనూ రాయల్స్ గెలుస్తుందనుకుంటే సూపర్ వరకు వెళ్లి ఓటమిపాలైంది. ఆవేశ్ ఖాన్ (4-0-37-3) ఒంటిచేత్తో రాయల్స్ నుంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు.

కెరీర్లో తొలి బంతికే సిక్సర్.. చరిత్రపుటల్లోకెక్కిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
14 ఏళ్ల 23 రోజుల వయసులోనే ఐపీఎల్ అరంగేట్రం చేసి లీగ్లో అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన రాజస్థాన్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ కెరీర్లో తానెదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచి మరో రికార్డు నెలకొల్పాడు. క్యాష్ రిచ్ లీగ్లో తొలి బంతికే (కెరీర్లో) సిక్సర్ బాదిన 10వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.ఐపీఎల్ కెరీర్లో తొలి బంతికే సిక్సర్ బాదిన ఆటగాళ్లు..రాబ్ క్వినీ (RR)కెవోన్ కూపర్ (RR)ఆండ్రీ రస్సెల్ (KKR)కార్లోస్ బ్రాత్వైట్ (DD)అనికేత్ చౌదరి (RCB)జావోన్ సియర్ల్స్ (KKR)సిద్దేష్ లాడ్ (MI)మహేష్ తీక్షణ (CSK)సమీర్ రిజ్వీ (CSK)వైభవ్ సూర్యవంశీ (RR)A VIDEO TO REMEMBER IN IPL HISTORY 👑- ITS VAIBHAV SURYAVANSHI..!!!! pic.twitter.com/ZuKskRWyI7— Johns. (@CricCrazyJohns) April 19, 2025ఐపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కులైన ఆటగాళ్లు..14y 23d - వైభవ్ సూర్యవంశీ (RR) vs LSG, 2025*16y 157d - ప్రయాస్ రే బర్మన్ (RCB) vs SRH, 201917y 11d - ముజీబ్ ఉర్ రెహ్మాన్ (PBKS) vs DC, 201817y 152d - రియాన్ పరాగ్ (RR) vs CSK, 201917y 179d - ప్రదీప్ సాంగ్వాన్ (DC) vs CSK, 2008మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్నో ఇన్నింగ్స్లో మార్క్రమ్ 66, ఆయుశ్ బదోని 50 పరుగులు చేయగా.. ఆఖర్లో అబ్దుల్ సమద్ 10 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిచెల్ మార్ష్ (4), పంత్ (3) విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో హసరంగ 2 వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఛేదనకు దిగిన రాయల్స్ ఆది నుంచే దూకుడుగా ఆడుతుంది. తొలి బంతికే సిక్సర్ కొట్టిన సూర్యవంశీ 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో ఆవేశ్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి నితీశ్ రాణా (8) ఔటయ్యాడు. 10 ఓవర్ల తర్వాత రాయల్స్ స్కోర్ 94/2గా ఉంది. యశస్వి జైస్వాల్ (52), రియాన్ పరాగ్ క్రీజ్లో ఉన్నారు.

వెస్టిండీస్కు గుండె కోత.. 10.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించినా..!
మహిళల వన్డే ప్రపంచ కప్ క్వాలిఫయర్స్లో వెస్టిండీస్కు గుండె కోత మిగిలింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో గెలిచినా కరీబియన్ జట్టు వరల్డ్కప్కు అర్హత సాధించలేకపోయింది. థాయ్లాండ్తో ఇవాళ (ఏప్రిల్ 19) జరిగిన డు ఆర్ డై మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన థాయ్లాండ్ 46.1 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌట్ కాగా.. వెస్టిండీస్ కేవలం 10.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అయినా 0.013 రన్రేట్ తేడాతో వరల్డ్కప్ బెర్త్ను కోల్పోయింది. పాయింట్ల పరంగా విండీస్తో సమానంగా ఉన్నప్పటికీ.. రన్రేట్ కాస్త ఎక్కువగా ఉండటంతో బంగ్లాదేశ్ ప్రపంచకప్ బెర్త్ను దక్కించుకుంది. ఈ టోర్నీలో పాక్ ఆడిన 5 మ్యాచ్ల్లో గెలిచి తొలి ప్రపంచకప్ బెర్త్ను ఖరారు చేసుకోగా.. రెండో బెర్త్ కోసం వెస్టిండీస్, బంగ్లాదేశ్ పోటీపడ్డాయి. ఇరు జట్లు చెరో 5 మ్యాచ్ల్లో తలో మూడు గెలువగా, రన్రేట్ కాస్త ఎక్కువగా ఉండటం చేత బంగ్లాదేశ్ వరల్డ్కప్కు అర్హత సాధించింది.కాగా, పాక్ వేదికగా జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్-2025లో మొత్తం ఆరు జట్లు (పాకిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఐర్లాండ్, స్కాట్లాండ్, థాయ్లాండ్) పాల్గొన్నాయి. ఇందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పాక్, బంగ్లాదేశ్ వరల్డ్కప్కు అర్హత సాధించాయి. ఈ ఏడాది అక్టోబర్లో భారత్ వేదికగా మహిళల వన్డే వరల్డ్కప్ జరుగనుంది. ఈ టోర్నీకి భారత్ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ నేరుగా అర్హత సాధించగా.. పాక్, బంగ్లాదేశ్ క్వాలిఫయర్స్ ద్వారా క్వాలిఫై అయ్యాయి.
బిజినెస్

మార్కెట్ మరింత పడుతుంది.. బంగారం, వెండి కొనడమే మేలు
రాబోయే ఆర్థిక మాంద్యం గురించి చాలామంది తీవ్ర ఆందోళనలు చెందుతున్న వేళ.. 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఓ సుదీర్ఘ ట్వీట్ చేసారు. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి.. కీలకమైన పెట్టుబడి సలహాలను సైతం పంచుకున్నారు.2025లో క్రెడిట్ కార్డ్ అప్పులు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. నిరుద్యోగం పెరుగుతోంది.. దీనివల్ల నాలుగు లక్షల కంటే ఎక్కువమంది నష్టపోయె అవకాశం ఉంది. అమెరికా తీవ్రమైన ఆర్థిక మాంద్యం వైపు పయనిస్తోందని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. అంతే కాకుండా.. అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనం రాబోతుందని గతంలోనే నేను వెల్లడించారు. అది ఇప్పుడు నిజమైందని అన్నారు.నిజానికి.. ఫేక్, హూ స్టోల్ మై పెన్షన్, రిచ్ డాడ్ పూర్ డాడ్ వంటి నేను రాసిన చాలా పుస్తకాలలో రాబోయే ఆర్థిక విపత్తు గురించి హెచ్చరించారు. నా హెచ్చరికలను పాటించిన వ్యక్తులు నేడు బాగానే ఉన్నారు. అలా చేయని వారి గురించి నేను ఆందోళన చెందుతున్నానని కియోసాకి అన్నారు.శుభవార్త ఏమిటంటే మీరు ఇప్పుడు కూడా బంగారం, వెండి, బిట్కాయిన్ వంటి వాటిని కొనుగోలు చేస్తే ధనవంతులు అవుతారు. ఆలస్యం చేస్తే.. స్టాక్ మార్కెట్ మరింత పతనం కావొచ్చు, బంగారం ధరలు ఇంకా పెరగవచ్చు. కాబట్టి కేవలం ఒక బిట్కాయిన్ లేదా కొంత బంగారం లేదా వెండిలో పెట్టుబడి పెట్టే వారు ఈ సంక్షోభం నుంచి బయటపడవచ్చు, ధనవంతులుగా మారవచ్చు.పేదలు పేదలుగానే ఉండటానికి కారణం ఏమిటంటే.. నేను దానిని భరించలేను, నేను ప్రయత్నిస్తాను, నేను వేచి ఉంటాను అనే ఆలోచనలే. ఒక పేదవాడు కొన్ని ఔన్సుల బంగారం లేదా వెండి లేదా ఒక బిట్కాయిన్లో 1/2 వంతు కొనుగోలు చేస్తే.. ఈ ఆర్థిక మాంద్యం ముగిసిన తర్వాత వారు కొత్త ధనవంతులు అవుతారని నేను అంచనా వేస్తున్నానని రాబర్ట్ కియోసాకి అన్నారు.2035 నాటికి.. ఒక బిట్కాయిన్ ఒక మిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. బంగారం, వెండి ధరలు కూడా ఊహకందని రీతిలో ఉంటాయని అన్నారు. భయంతో వేచి ఉన్నవారే.. నష్టాలను చూస్తారు. రాబోయే మాంద్యం లక్షలాది మందిని పేదలుగా చేస్తుంది.నేను ఊహించిన భారీ పతనం.. ఇప్పుడు జరుగుతున్న క్రాష్. ఇది మీ జీవిత కాలంలో గొప్ప సంపదను సాధించడానికి, మరింత ముఖ్యంగా ఆర్థిక స్వేచ్ఛను పొందడానికి అవకాశం కావచ్చు. దయచేసి ఈ భారీ క్రాష్ను వృధా చేయకండి. జాగ్రత్తగా ఉండండి, బెస్ట్ ఆఫ్ లక్ అని రాబర్ట్ కియోసాకి ట్వీట్ ముగించారు.MAKES ME SAD: In 2025 credit card debt is at all time highs. US debt is at all time highs. Unemployment is rising. 401 k’s are losing. Pensions are being stolen. USA may be heading for a GREATER DEPRESSION.I get sad because as I stated in an earlier X….Tweet….I warned…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 18, 2025 Note: బంగారం, వెండి, బిట్కాయిన్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టడం అనేది మీ సొంత ఆలోచనల మీదనే ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా.. పెట్టుబడుల విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించాలి. నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.

ఐదేళ్లలో రూ.20 లక్షలు: ఈ పోస్టాఫీస్ స్కీమ్ గురించి తెలుసా?
ప్రతి మనిషి తన సంపాదనలో కొంత మొత్తాన్ని భవిష్యత్ కోసం తప్పకుండా దాచుకోవాలి. లేకుంటే ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కొందరు చిన్న మొత్తాలలో సేవింగ్ చేసుకుంటుంటే.. మరికొందరు పిల్లల చదువులకు, వివాహం లేదా ఇల్లు కొనుగోలు చేయడానికి.. ఇలా కొంత పెద్ద మొత్తంలో కూడబెట్టాలనుకుంటున్నారు. అలాంటి వారికి 'పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్' మంచి ఎంపిక అవుతుంది.5 సంవత్సరాల్లో 20 లక్షలు ఇలా..ఐదేళ్లలో పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా రూ. 20లక్షలు పొందాలంటే.. నెలకు రూ. 28,100 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఐదేళ్లు ఈ పథకంలో డిపాజిట్ చేస్తే.. రూ. 20 లక్షలు చేతికి అందుతాయి. ఈ స్కీమ్ కింద పెట్టుబడిదారు 6.7 శాతం వార్షిక వడ్డీని పొందవచ్చు. ఇది త్రైమాసిక కాంపౌండింగ్ ఆధారంగా ఉంటుంది. అంటే.. వడ్డీ ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ మొత్తం పెట్టుబడిన కొంత పెంచుతుంది.➤మొత్తం పెట్టుబడి (రూ. 28100 x 60 నెలలు): రూ. 16,86,000➤మీ పెట్టుబడికి వడ్డీ: రూ. 3,19,382➤మెచ్యూరిటీ మొత్తం: రూ. 20,05,382ఇదీ చదవండి: నెలకు ₹5000 ఆదాతో రూ.8 లక్షలు చేతికి: ప్లాన్ వివరాలివిగో..రిస్క్ లేకుండా పొదుపు చేయడానికి పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఉత్తమమైన మార్గం. ఈ ప్లాన్ను మీరు నెలకు 100 రూపాయల పెట్టుబడితో కూడా ప్రారభించవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. ఈ పథకం పూర్తిగా ప్రభుత్వ హామీతో ఉంటుంది, కాబట్టి మీ డబ్బు పూర్తిగా సురక్షితం. వడ్డీ రేట్లలో మార్పులు ప్రతి మూడు నెలలకు సమీక్షించబడతాయి. కాబట్టి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారాలు చేసేవారు, గృహిణులు అందరూ ఈ పథకం నుండి ప్రయోజనం పొందవచ్చు.

మనుషులతో.. మరమనుషుల రన్నింగ్ - వీడియో
టెక్నాలజీ వేగంగా పరుగులు పెడుతోంది.. దాదాపు అన్ని రంగాల్లోనూ రోబోల హవా కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో చైనా మనుషులతో పోటీగా మారథాన్లో పరుగులు పెట్టే రోబోట్లను ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింలో వైరల్ అవుతోంది.శనివారం (ఏప్రిల్ 19) చైనాలో నిర్వహించిన మారథాన్లో.. మనుషులతో పాటు రోబోలు పరుగులు పెట్టాయి. మనుషులతో.. మరమనుషులు పరుగులు పెట్టడం ప్రపంచంలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మారథాన్లో పాల్గొన్న రోబోట్లను 20 కంటే ఎక్కువ కంపెనీలు అభివృద్ధి చేశాయి. రోబోట్లు మనుషులు మాదిరిగా కనిపించడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది.ఏప్రిల్లో జరగనున్న మారథాన్ బీజింగ్లోని డాక్సింగ్ జిల్లాలో నిర్వహించనున్నట్లు, 21 కిమీ మేర డజన్ల కొద్దీ హ్యూమనాయిడ్ రోబోలు 12,000 మంది మానవ అథ్లెట్లతో పోటీపడతాయని.. ఈ ఏడాది ప్రారంభంలోనే ఓ వార్త వెల్లడైంది. ఆ విధంగానే మారథాన్ నిర్వహించారు.చైనా హ్యూమనాయిడ్ రోబోలను ఎందుకు అభివృద్ధి చేస్తోందిచైనాలో వృద్ధాప్య జనాభా పెరిగిపోవడంతో.. శ్రామిక శక్తి తగ్గుముఖం పట్టింది. దీంతో దేశం జనాభాపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఇతర దేశాలతో పోటీపడాలన్న.. ఆర్ధిక వృద్ధిని పెంచాలన్నా శ్రామిక శక్తి అవసరం. దీనిని భర్తీ చేయడానికి చైనా హ్యూమనాయిడ్ రోబోలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ ప్రకారం.. చైనీస్ క్లయింట్లు 2023లో 2,76,288 రోబోట్లను ఇన్స్టాల్ చేసారు. దీన్ని బట్టి చూస్తే.. ప్రపంచంలో ఉన్న మొత్తం రోబోట్లలో చైనాలో ఉన్న రోబోట్లు 51 శాతం అని సమాచారం.The #Humanoid #Robot half-marathon in #Beijing kicked off an hour ago. #China is accelerating its dominance in the robotics and #AI race with unmatched strategic investments. While the world watches in awe, it’s clear that others including India have significant ground to cover.… pic.twitter.com/sgp42JEtGA— Rana. (@bladeit) April 19, 2025

ఇండియాకు ఎలాన్ మస్క్!.. ఎప్పుడో తెలుసా?
ప్రపంచకుబేరుడు 'ఎలాన్ మస్క్' ఈ ఏడాది చివర్లో భారతదేశాన్ని సందర్శిస్తానని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. శుక్రవారం మోదీతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత మస్క్ ఈ ప్రకటన చేశారు.సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణల్లో అమెరికాతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్తో ఈ ఏడాది ప్రారంభంలో వాషింగ్టన్ డీసీలో జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించినట్లు మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా పర్యటన సందర్భంగా మోదీ మస్క్ను కలిశారు. ఆ సమయంలో వీరిరువురు అంతరిక్ష అన్వేషణ, కృత్రిమ మేధస్సు.. స్థిరమైన అభివృద్ధిలో భారతీయ & అమెరికా సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం గురించి చర్చించారు. అయితే ఎలాన్ మస్క్ ఇప్పటికే.. పలుమార్లు ఇండియాలో పర్యటించనున్నట్లు ప్రకటించారు. కానీ అవన్నీ వాయిదా పడ్డాయి. బహుశా ఈసారి పర్యటించే అవకాశం ఉందని, భారత్తో తమ బంధాన్ని బలపరచుకుంటారని తెలుస్తోంది.ఇండియాకు టెస్లాటెస్లా కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సన్నద్ధమవుతోంది. భారత ప్రభుత్వం విధించిన నిబంధనలకు లోబడి సంస్థ ఇక్కడ కార్యకలాపాలు సాగించేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. టెస్లా షోరూమ్ల కోసం ఇప్పటికే ముంబై, ఢిల్లీ నగరాలను ఎంపిక చేసినట్లు, ఉద్యోగుల నియామకాలను కూడా చేపడుతున్నట్లు వార్తలు వినిపించాయి.ఇదీ చదవండి: అల్లుడితో కలిసి ఏడెకరాలు కొన్న నటుడు.. భూమి విలువ ఎన్ని కోట్లంటే?ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలోనే టెస్లా ఎలక్ట్రిక్ కారు.. ముంబై - పూణే నేషనల్ హైవే మీద టెస్టింగ్ దశలో కనిపించింది. ఈ కారును మోడల్ వై కారు అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికి గ్లోబల్ మార్కెట్లో అమ్ముడవుతున్న మోడల్ వై కార్ల కంటే కూడా.. టెస్టింగ్ సమయంలో కనిపించిన కారులో ఎక్కువ ఫీచర్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.It was an honor to speak with PM Modi. I am looking forward to visiting India later this year! https://t.co/TYUp6w5Gys— Elon Musk (@elonmusk) April 19, 2025
ఫ్యామిలీ

ప్రియుడితో మాజీ సీఎం కుమార్తె పెళ్లి : వైభవంగా
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ,ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. అరవింద్ కేజ్రీవాల్, సునీతా దంపతుల కుమార్తె హర్షిత వివాహం ఘనంగా జరిగింది. ఐఐటీలో క్లాస్మేట్, ప్రియుడు సంభవ్ జైన్ను వివాహమాడింది హర్షిత. బంధుమిత్రుల సమక్షంలో నిన్న (ఏప్రిల్ 18) ఢిల్లీలోని కపుర్తల హౌస్లో వైభవంగా ఈ మూడుముళ్ల వేడుక జరిగింది. ఈ గ్రాండ్ వివాహానికి పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తదితర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి.డిల్లీ మాజీ సీఎం కుమార్తె హర్షిత కేజ్రీవాల్ ప్రీ-వెడ్డింగ్ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్హంగా అరవింద్ కేజ్రీవాల్ సతీమణితో అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన హిట్ చిత్రం పుష్ప సినిమాలోని పాటకు స్టెప్పులేశారు. ఏప్రిల్ 20న ఢిల్లీలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారని సమాచారం. చదవండి: ఇషా అంబానీ డైమండ్ థీమ్డ్ లగ్జరీ ఇల్లు : నెక్ట్స్ లెవల్ అంతే!అందంగా వధూవరులుతన వెడ్డింగ్ డే కోసం, ఎరుపు లెహంగాలో గోల్డెన్ కలర్ వర్క్ బ్లౌజ్తో కళకళలాడింది. ఆమె ధరించినవీల్కూడా హైలైట్గా నిలిచింది .సంభవ్ తెల్లటి రంగు షేర్వానీ, తలపాగా నల్ల సన్ గ్లాసెస్ క్రిస్పీగా, రాయల్గా కనిపించాడు.ఇక అరవింద్ తెల్లటి షేర్వానీలో కనిపించగా, సునీత పింక్ చీర, కమర్బంద్, గులాబీ రంగు చూడీల సెట్, చక్కటి హెయిర్ బన్తో అత్తగారి హోదాలో హుందాగా కనిపించారు.ఎవరీ సంభవ్ జైన్హర్షిత, సంభవ్ IIT ఢిల్లీలో కలుసుకున్నారు. కెమికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేశారు. 2018లో గ్రాడ్యుయేషన్ తర్వాత, గురుగ్రామ్లోని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG)లో పనిచేసింది హర్షిత. ఆ తరువాత సంభవ్తో కలిసి, బాసిల్ హెల్త్ అనే స్టార్టప్ను మొదలు పెట్టింది. కస్టమర్లకు ఆరోగ్యకరమైన, అనుకూలీకరించిన భోజనాన్ని అందించడమే దీని లక్ష్యం.. హర్షిత కన్సల్టెంట్గా పనిచేస్తున్నపుడు మద్యం సేవించే అలవాటు ఉన్నప్పుడు ఈ ఆలోచన ఆమె మనసులోకి వచ్చిందట. ఇక హర్షిత సోదరుడు పుల్కిత్ కూడా IIT ఢిల్లీలో చదువుతున్నాడు.

ఇషా అంబానీ డైమండ్ థీమ్డ్ లగ్జరీ ఇల్లు : నెక్ట్స్ లెవల్ అంతే!
భారతీయ బిలియనీర్, ముఖేష్ అంబానీ కుమార్తె, ఇషా అంబానీ పిరమల్ దేశంలోని అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యాపార మహిళలలో ఒకరు. 32 సంవత్సరాల వయస్సులో, ఆమె రిలయన్స్ రిటైల్ డైరెక్టర్గా కంపెనీని పరుగులు పెట్టిస్తోంది. 2022లో వ్యాపారవేత్తను ఆనంద్ పిరమిల్ను పెళ్లాడిన ఇషా ఆదియా ,కృష్ణలకు(కవలలు) తల్లి. రిటైల్ వారసురాలు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)లో కీలక బాధ్యతల్లో ఉన్న ఇషా గత సంవత్సరం, ఫిబ్రవరి 2024లో మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డు గెల్చుకుంది. అలాగే, టైమ్ మ్యాగజైన్ టైమ్100 నెక్స్ట్ రైజింగ్ స్టార్ల జాబితాలో పేరు సంపాదించింది.ఇషా అంబానీ నివసించే విలాసవంతమైన ఇల్లు గురించి ఎపుడైనా ఆలోచించారా? ముంబై నడిబొడ్డున ఉందీ అద్భుతమైన ఇల్లు, అత్యాధునిక సౌకర్యాలు, విశాలమైన గదులు, పచ్చదనంతో నిండిన అద్భుతమైన దృశ్యాలు ఆధునిక డిజైన్ను సాంప్రదాయ అంశాల సమ్మితంగా ఉంటడంలో ఆశ్చర్యమేముంది. చక్కని వాస్తు, అద్భుతమైన ఇంటీరియర్స్, నుండి అత్యాధునిక సాంకేతికత వరకు ప్రతీ కార్నర్ అంబానీ శైలిని, గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయి.డైమండ్ థీమ్డ్ ఇల్లుఇషా అంబానీ , ఆనంద్ పిరమల్ విలాసవంతమైన నివాసం అయిదు అంతస్తుల భవనం ‘గులిటా’. ఈ అతి విలాసవంతమైన ఇల్లు భారతదేశంలోని అత్యంత సంపన్న ప్రాంతాలలో ఒకటైన ముంబైలోని వర్లిలో ఉంది. అరేబియా సముద్రం తీరాన, గాలి, అలల హొయల లయల మధ్క 3-D డైమండ్ థీమ్తో ఉంటుందీ అపార్ట్మెంట్. 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఇల్లు లగ్జరీలకు కొదువే లేదు. లండన్కు చెందిన ప్రసిద్ధ ఆర్కిటెక్చరల్ కంపెనీ ఎకర్స్లీ ఓ'కల్లఘన్ దీన్ని డిజైన్ చేసిందట. దీన్ని ఆనంద్ తల్లిదండ్రులు అజయ్ , స్వాతి పరిమల్ వివాహ బహుమతిగా ఇచ్చారట. అప్పటికి దీని విలువు దాదాపు వెయ్యి కోట్లు రూపాయలు. 2012లో హిందూస్తాన్ యూనిలీవర్ నుండి భూమిని కొనుగోలు చేసింది. దీన్ని రెన్నోవేషన్ కోసం 500 కోట్లు చెల్లించారట.ఇంటీరియర్స్ఇంద్రభవనం లాంటి ఇల్లు కళాత్మకమైన ఇంటీరియర్స్తో నిండి ఉంటుంది. ఈ ఇంటిలో11 మీటర్ల పొడవైన పైకప్పుతో అలంకరించబడిన లివింగ్ రూమ్ ,ఓపెన్ స్విమ్మింగ్ పూల్, బహుళ లివింగ్ రూములు, డైమండ్ రూమ్,మాస్టర్ బెడ్రూమ్ డబుల్-హైట్ మల్టీ-పర్పస్ లాంజ్, లాంటి అన్ని హంగులతో విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాదు పిల్లల సౌకర్యార్థం, ఇన్-హౌస్ వైద్యులు, బట్లర్లు, హౌస్ కీపింగ్ సిబ్బంది, అనేక ఇతర ముఖ్యమైన సేవలు వంటి సౌకర్యాలు మరిన్ని ఉన్నాయి.

ఒకే కాలనీ...56 పార్కులు ఎక్కడో తెలుసా?
సనత్నగర్: నగరంలో రోజురోజుకు కాలుష్య ప్రమాణాలు పెరుగుతున్న దృష్ట్యా పరిస్థితి ఆందోళనకరంగా మారుతుండగా ఆ కాలనీవాసులు మాత్రం కాలుష్యానికి దూరంగా ఉండేలా ఏడు దశాబ్దాల క్రితమే పచ్చదనానికి పచ్చజెండా ఊపారు. ఒకటి కాదు...రెండు కాదు...ఏకంగా 56 ఉద్యానవనాలు ఆ కాలనీ సొంతం. ఏ రోడ్డు కెళ్ళినా పార్కులు దర్శనమిస్తాయి. గజం జాగ కనిపిస్తే కాంక్రీట్మయంగా మార్చే ప్రస్తుత తరుణంలో 56 పార్కు స్థలాలను కేటాయించడం ఒక వంతైతే...వాటిని కబ్జా కాకుండా కాలనీవాసులంతా సమష్టిగా కాపాడుకోవడం మరో వంతు. కార్మికగడ్డగా పేరొందిన సనత్నగర్ ఎస్ఆర్టీ కాలనీకి వెళితే ఆయా పార్కుల అందాలను ఆస్వాదించవచ్చు. ఎస్ఆర్టీ కాలనీవాసులే కాకుండా పక్క కాలనీలైనా జెక్కాలనీ, రాజరాజేశ్వరీనగర్, తులసీనగర్, సౌభాగ్యనగర్, నాగరాజేశ్వరీనగర్, అల్లావుద్దీన్కోఠి, సుభాష్ నగర్ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు సైతం ఆయా పార్కులకు వచ్చి వాకింగ్ చేస్తుంటారు. ఆరోగ్యానికి వెన్నుదన్నుగా నిలుస్తోన్న ఇక్కడి పార్కుల అభివృద్ధి కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. సగం వరకు ఇప్పటికే పూర్తిస్థాయిలో అభివృద్ధి చెంది ప్రజలకు అందుబాటులోకి రాగా...మరికొన్ని క్రీడామైదానాలుగా వినియోగిస్తున్నారు. వాటికి నలువైపులా సైతం పచ్చదనాన్ని పెంపొందింపజేస్తున్నారు. ఇంకొన్ని అభివద్ధి దశలో ఉన్నాయి. సనత్నగర్ పారిశ్రామికవాడ సాక్షిగా... స్వాతంత్ర్యానంతరం తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రు దేశాన్ని పాలిస్తున్న సమయంలో అప్పటి నిజామ్ పరిపాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానాన్ని 1948లో విలీనం చేసిన విషయం తెలిసిందే. విలీనం అనంతరం సనత్నగర్ ప్రాంతంలో అల్లావుద్దీన్ కేంద్ర ప్రభుత్వం నుంచి 408 ఎకరాల భూమిని అప్పటి ప్రప్రథమ రాష్ట్రపతి ద్వారా తన పేరిట రిజి్రస్టేషన్ చేయించుకున్నారు. తదనంతరం కేంద్ర కార్మిక సంస్థ ఇక్కడి దాదాపు 150 ఎకరాల్లో చిన్నతరహా పరిశ్రమలు నిరి్మంచుకోవడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం అల్లావుద్దీన్న్ నుంచి భూమిని సేకరించింది. అలా సేకరించినదే సనత్నగర్ పారిశ్రామికవాడగా నామకరణం జరిగింది. ‘సనత్’ అంటే పరిశ్రమగా పేర్కొంటారు. అందుకే మొట్టమొదటి పారిశ్రామికవాడ కావడంతో సనత్నగర్గా ఈ ప్రాంతం పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రి చేతుల మీదుగా సనత్నగర్ పారిశ్రామికవాడ ప్రారంభమైంది. అదే పారిశ్రామికవాడ ఎదురుగా దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఆనాటి కార్మికుల ఆవాసం కోసం ఏర్పాటు చేసినదే నేటి సనత్నగర్ ఎస్ఆర్టీ కాలనీ. ఎస్ఆర్టీ (సింగిల్ రూమ్ టెనెంట్స్) పేరిట 1500 క్వార్టర్స్ ఇళ్ళ నిర్మాణం జరిపారు. ఆరు వేల జనాభా ఉన్న ఆ కాలనీలో పార్కుల కోసం 56 ఖాళీ ప్రదేశాలను విడిచిపెట్టారు. కాలక్రమంలో వాటిని కాపాడుకుంటూ అభివద్ధిపరుచుకుంటూ వస్తున్నారు. ఒక్కో పార్కు 1500 గజాల నుంచి మొదలుకొని ఎకరాల వరకు విస్తరించి ఉన్నాయి. చెట్లు,పూలమొక్కలతో ఆహ్లాదంగా... ఆయా పార్కుల్లో అభివృద్ధి పనులు కొనసాగుతుండడంతో చెట్లు, పూలమొక్కలతో కాలనీవాసులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. హరితవనం పార్కు, మార్కెట్ ఉద్యానవనం, భగత్సింగ్ గ్రౌండ్, వినాయక గ్రౌండ్, బాస్కెట్బాల్ మైదానం, నవ వనాల పార్కు, ఇండస్ట్రీయల్ పార్కు, నెహ్రు పార్కు, ఎస్ఆర్టీ–80, ఎస్ఆర్టీ–87, ఎస్ఆర్టీ–495 తదితర పార్కులు ప్రధానమైనవిగా నిలుస్తున్నాయి. క్రీడా స్థలాలను మినహాయిస్తే సుమారు 30 వరకు ఉద్యానవనాలు చెట్లు, పూల మొఇక్కలు, పచ్చికతో ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. ఒక్కో ఉద్యానవనంలో 300 పైచిలుకు వృక్షాలు ఉన్నాయి. ఎక్కడికక్కడ స్థానిక కమిటీలను ఏర్పాటుచేసి వాటి పరిరక్షణ, అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యానవన సంక్షేమ సంఘం, వినాయక సంక్షేమ సంఘం, భగత్సింగ్ ఉత్సవ కమిటీ, సనత్నగర్యువజన సంక్షేమ సంఘం వంటి వాటిని ఏర్పాటుచేసుకున్న కాలనీవాసులు ఈ ఉద్యానవనాలను ఆక్రమణదారుల పాలుకాకుండా కాపాడుకుంటున్నారు.

Kesari Chapter 2 : అనన్య పాండే పర్పుల్ కలర్ చీరలో అమేజింగ్ లుక్స్
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే చీరలో అందంగా మెరిసింది. తన కొత్త సినిమా వెంచర్ కేసరి చాప్టర్ 2 ప్రీమియర్కు హాజరయ్యేందుకు వచ్చినప్పుడు అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంది. 26 ఏళ్ల వయసులో తొమ్మిదిగజాల డిజైనర్ చీరను ధరించి స్పెషల్ లుక్లో అలరించింది.ప్రీమియర్ రెడీ లుక్తో గ్రేస్ఫుల్గా కనిపించింది. డిజైనర్ పునీత్ బలనా డిజైన్ చేసిన తొమ్మిది గజాల చీర-టోరియల్గా పర్ఫెక్ట్గా కనిపించింది. రిచ్ పర్పుల్ సిల్క్ చీరకు గోల్డెన్ అండ్ మిర్రర్వర్క్ అలంకరణలతో నిండిన చీరలో ఫ్యాషన్ స్టైల్ను చాటుకుంది. బ్యాక్లెస్ అండ్ హాల్టర్ నెక్ బ్లౌజ్ను జతచేసింది.దీనికి తగ్గట్టుగా పూల డిజైన్ తో గోల్డ్ అండ్ డైమండ్స్ పొదిగిన వాటర్ ఫాల్ స్టైల్ చెవిపోగులు ఆమె అందానికి మరింత సొబగులద్దాయి. ఆ రోజు అనన్య ధరించిన యాక్సెసరీలలో సెలబ్రిటీ స్టైలిస్ట్ ప్రియాంక కపాడియా బదానీ సౌజన్యంతో, ఏస్ హెయిర్ స్టైలిస్ట్ ఆంచల్ ఎ మోర్వానీ స్టైల్ చేయగా, సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ రిద్ధిమా శర్మ, దోషరహిత బేస్ అనన్య లుక్ కి గ్లామర్కి పర్ఫెక్ట్ స్ట్రోక్స్ ని జోడించారు. View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday)కేసరి చాప్టర్ 2బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, అనన్య పాండే , మాధవన్ నటించిన లేటెస్ట్ మూవీ 'కేసరి చాప్టర్ 2'. విషాదకరమైన జలియన్ వాలాబాగ్ ఊచకోత నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఏప్రిల్ 18న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రానికి కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించారు. సి శంకరన్ నాయర్ బయోపిక్గా తెరకెక్కిన ఈ మూవీలో అనన్య తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. అలాగే శంకరన్ నాయర్ పాత్రలో అక్షయ్ కుమార్ అద్భుతంగా నటించాడంటున్నారు విమర్శకులు.కాగా 2019లో రొమాంటిక్ కామెడీస్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మరియు పతి పత్నీ ఔర్ వో పాత్రలతో తన నటనా జీవితాన్ని బాలీవుడ్ నటుడు చుండీ పాండే కుమార్తె అనన్య పాండే. 1998లో అక్టోబర్లో పుట్టిన అనన్య చక్కని పొడుగు, అందంతో ఆకర్షణీయంగా ఉంటుంది. 2019లో రొమాంటిక్ కామెడీస్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 ,పతి పత్నీ ఔర్ వో పాత్రలతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ అభిమానులతో టచ్లో ఉంటుంది. తెలుగులో విజయ్ దేవరకొండ జోడిగా లైగర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనన్య. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ అనన్యకు పెద్దగా కలిసి రాలేదు.
ఫొటోలు


కేజీఎఫ్ బ్యూటీ చేతిలో చంటిపాప.. మనసు నిండిపోయిందంటూ..


తిరుమలలో సమంత సహా పలువురు సెలబ్రిటీలు (ఫోటోలు)


దిల్రాజు బ్యానర్ 'ఆకాశం దాటి వస్తావా' సెట్స్లో ధనశ్రీ వర్మ (ఫోటోలు)


రెడ్ రోజ్ డ్రెస్ లో 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ బ్యూటీ మీనాక్షి చౌదరి


రెట్రో లుక్లో వింటేజ్ గర్ల్ 'పూజా హెగ్డే' లుక్స్ (ఫోటోలు)


తిరుమల శ్రీవారి సేవలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ దంపతులు (ఫొటోలు)


విడాకులు తీసుకుంటాంలే.. హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ (ఫొటోలు)


బ్యాంకాక్ ఫెస్టివల్లో జగ్గు భాయ్ సందడి.. మన సంక్రాంతిలాగే ఎంజాయ్ చేశా (ఫోటోలు)


తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రీతి జింటా (ఫోటోలు)


శబరిమల అయ్యప్పకు ఇరుముడి సమర్పించిన హీరో కార్తీ (ఫోటోలు)
అంతర్జాతీయం

విద్యార్థుల వీసాలపై పిడుగు
విదేశీ విద్యార్థులపై అమెరికా కక్షగట్టినట్లుగా వ్యవహరిస్తోంది. గత నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా 1,024 మంది విదేశీ విద్యార్థుల వీసాలనో, వారి లీగల్ రెసిడెన్సీ స్టేటస్నో రద్దు చేసింది. వారంతా అమెరికాలోని 160 కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుకుంటున్నవారే. వారంతా ఆందోళనకు లోనవుతున్నారు. ఇలా ఉన్నపళంగా వెళ్లగొట్టడం ఏమిటంటూ మండిపడుతున్నారు. ‘‘చట్టప్రకారం అన్ని అనుమతులూ ఇచ్చిన ప్రభుత్వమే ఆ చట్టాలను ఉల్లంఘిస్తోంది. ఈ చర్యలను ఎలా సమర్థించుకుంటుంది?’’ అని ప్రశి్నస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వ చర్యపై పలువురు కోర్టుకెక్కారు. కొందరు అరెస్టు భయంతో చదువులు మధ్యలోనే వదిలేసి స్వదేశాలకు వెళ్లిపోయారు. పునరాలోచించాలి లీగల్ స్టేటస్ రద్దుతో వందలాది మంది విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు అమెరికా వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే ప్రభుత్వమే నిర్బంధించి బలవంతంగా వెళ్లగొట్టే పరిస్థితి నెలకొంది. హార్వర్డ్, స్టాన్ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్, ఒహాయో స్టేట్ వర్సిటీల్లోని పలువురు విద్యార్థుల లీగల్ స్టేటస్లు రద్దయ్యాయి. పలు కాలేజీల్లోని విద్యార్థులు వీసాలు కూడా రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీపై కోర్టుల్లో కేసులు దాఖలవుతున్నాయి. విదేశీ విద్యార్థులు ఇలా వెళ్లిపోతే అమెరికా వర్సిటీలు, కాలేజీల మనుగడ కష్టమవుతుందని అక్కడి నిపుణులు చెబుతున్నారు. దీనిపై పునరాలోచించాలని ట్రంప్ సర్కారుకు సూచిస్తున్నారు. కాలేజీలు, వర్సిటీల నుంచి కూడా ఈ మేరకు విజ్ఞాపనలు వెళ్తున్నాయి. రద్దయితే ఇంటికేనా? ఎఫ్–1 విద్యార్థి వీసాలను అమెరికా విదేశాంగ శాఖ పర్యవేక్షిస్తుంది. అమెరికాలోకి అడుగుపెట్టాక వారి లీగల్ రెసిడెన్సీ స్టేటస్ను పర్యవేక్షించే బాధ్యత డీఓహెచ్దే. విద్యార్థుల డేటాబేస్ దానివద్ద ఉంటుంది. విద్యాభ్యాసం పూర్తయ్యి వారు స్వదేశాలకు వెళ్లాక వర్సిటీ సూచనతో లీగల్ స్టేటస్ను తొలగించేవారు. ఇప్పుడు వర్సిటీలతో సంబంధమే లేకుండా విదేశీ విద్యార్థుల లీగల్ రెసిడెన్సీ స్టేటస్ ఉన్నపళంగా రద్దయిపోతోంది. పైగా ఆ మేరకు సమాచారం కూడా ఇవ్వడం లేదు. డేటాబేస్ను వర్సిటీ వర్గాలు తనిఖీ చేసినప్పుడు మాత్రమే ఆ విషయం తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో వీసా రద్దయినా లీగల్ రెసిడెన్సీ స్టేటస్ అలాగే ఉంటుంది. అలాంటప్పుడు విద్యాభ్యాసం కొనసాగించవచ్చు. స్వదేశాలకు వెళ్లి మళ్లీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేటస్ రద్దయితే మాత్రం అమెరికాలో ఉండడానికి అనుమతించరు. స్వదేశాలకు వెళ్లిపోవాలని సూచిస్తారు. లేదంటే బలవంతంగా పంపిస్తారు.ఎందుకీ వీసాల రద్దు? → విద్యార్థుల వీసాల రద్దుకు నిబంధనల ఉల్లంఘన ముఖ్య కారణమని వర్సిటీలు చెబుతున్నాయి. → ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా వీసా రద్దవుతోంది. గత ఉల్లంఘనలకు కూడా ఇప్పుడు వీసా రద్దు చేస్తున్నారు. → చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడినా వీసా రద్దు తప్పదు. → పాలస్తీనా సానుభూతిపరుడంటూ కొలంబియా వర్సిటీ విద్యార్థి మహమ్మద్ ఖలీల్ వీసా రద్దు చేశారు. కానీ వీసాలు, లీగల్ స్టేటస్లు రద్దవుతున్న పలువురు విద్యార్థులకు ఉద్యమాలతో, తీవ్రవాద/ఉగ్రవాద సంస్థలతో ఏ సంబంధమూ లేదని ఆయా వర్సిటీలే చెబుతున్నాయి. కారణాలేమిటో ప్రభుత్వాన్నే అడగాలంటున్నాయి. → ‘‘విదేశీ విద్యార్థులను బయటకు వెళ్లగొట్టడమే డీఓహెచ్కు పనిగా మారింది. ఈ మేరకు అనధికారింగా జాతీయ పాలసీ తెచ్చినట్టు కనిపిస్తోంది’’ అని వేన్ స్టేట్ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ ప్రతినిధులు విద్యార్థుల తరఫున కోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. బలవంతపు డిపోర్టేషన్లు ఆపాలని కోరారు. → డార్ట్మౌత్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న చైనాకు చెందిన షియాంటియాన్ లియూ తన లీగల్ స్టేటస్ రద్దుపై కోర్టును ఆశ్రయించాడు. ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తూ విద్యారి్థకి అనుకూలంగా న్యూ హ్యాంప్షైర్ ఫెడరల్ జడ్జి తీర్పు ఇచ్చారు. → ‘‘అమెరికాలోకి వచ్చిపడుతున్న విదేశీయుల పట్ల ట్రంప్ గుర్రుగా ఉన్నారు. వారందరినీ వెనక్కు పంపేయాలని పట్టుదలగా ఉన్నారు. అందుకే విదేశీ విద్యార్థులను లక్ష్యం చేసుకుంటున్నారు’’ అని మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్లో పబ్లిక్ అఫైర్స్ డైరెక్టర్ మిషెల్ మిటెల్స్టాడ్ అన్నారు.తీవ్ర పరిణామాలేఅమెరికాలో చట్టాల అమలు కఠినంగా ఉంటుంది. వాటిని పాటించకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ‘‘విద్యార్థులు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. చట్టాలను ధిక్కరిస్తామంటే ప్రభుత్వం సహించదు. ఇష్టానుసారం వ్యవహరిస్తే వీసాలు రద్దు చేసి వెనక్కు పంపుతారు. నిజాయితీగా ఉండేవారికి అమెరికాలో అద్భుత అవకాశాలున్నాయి’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మార్గరెట్ మెక్లియోడ్ అన్నారు. ఈ విషయంలో కేంద్రం ఇకనైనా మొద్దునిద్ర వీడి అమెరికాలోని మన విద్యార్థుల భవితవ్యాన్ని కాపాడాలని కాంగ్రెస్ పార్టీ సూచించింది.– సాక్షి, నేషనల్ డెస్క్

ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలపై ఆసక్తి పోయిందా?
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందంపై అమెరికా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్లో యుద్ధం ఆపడం సాధ్యం కాకపోతే తమ ప్రయత్నాలు విరమించుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో(Marco Rubio) కీలక వ్యాఖ్యలు చేశారు.ఉక్రెయిన్ (Ukraine) యుద్ధం ముగించడం సాధ్యంకాని పక్షంలో.. చర్చల ప్రయత్నాలు ఆపేసి అమెరికా తన దారి తాను చూసుకుంటుందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో తేల్చి చెప్పారు. ఈ యుద్ధాన్ని మేం ప్రారంభించలేదు. ఇన్నాళ్లూ కేవలం ఉక్రెయిన్కు సాయం చేస్తున్నాం. ఇది మా యుద్ధం కాదు కాబట్టి ముగించాలనుకుంటున్నాం అని మార్కో రూబియో అన్నారు.ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ యుద్ధాన్ని ఓ ముగింపునకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగని నెలలు, సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉండబోరు. ఆయనకు ప్రపంచంలో ఇతర ప్రాధాన్యాలు కూడా ఉన్నాయి. చర్చల్లో గనుక పురోగతి కనిపించకపోతే ఆయన దీనిని వదిలేస్తానన్నారు అని రుబియో వెల్లడించారు.తాజాగా ఐరోపా నేతలతో భేటీ సందర్భంగా ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతి తొందరలోనే ఇది సాకారం కావచ్చని పేర్కొన్నారు. అమెరికా ఓ శాంతిఒప్పందం ముసాయిదా తయారుచేసి ఐరోపా నేతలకు వెల్లడించింది. వారినుంచి సానుకూల స్పందనలు వచ్చినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇక దీనినే మార్కో రూబియో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్కు వెల్లడించారు.

విమానం హైజాక్కు యత్నం.. నిందితుడ్ని కాల్చి చంపిన తోటి ప్రయాణికుడు
బెల్మోపాన్: అమెరికా ఈశాన్య తీర దేశమైన బెలిజ్లో విమానం హైజాక్ (Hijack Plane) కలకలం రేపింది. గురువారం (స్థానిక సమయం) బెలిజ్లో ఓ అమెరికన్ పౌరుడు గాల్లో ఉండగా ఓ చిన్న ట్రాఫిక్ ఎయిర్ విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో నిందితుడు తోటి ప్రయాణికులపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ఆ తర్వాత నిందితుణ్ని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. బెలిజ్ పోలీస్ కమిషనర్ చెస్టర్ విలియమ్స్ ప్రకారం..49ఏళ్ల అమెరికా పౌరుడు అకిన్యేలా సావా టేలర్ (Akinyela Sawa Taylor) గాలిలో ఉండగా శాన్ పెడ్రోకు వెళ్తున్న విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు. తోటి ప్రయాణికులపై కత్తితో దాడి చేశాడు. ప్రతిఘటించిన తోటి ప్రయాణికుడు గన్నుతో నిందితుణ్ని కాల్చి చంపారు. ఈ సందర్భంగా టేలర్ను కాల్చి చంపిన ప్రయాణీకుడిని హీరో అంటూ కమిషనర్ విలియమ్స్ ప్రశంసించారు.కాగా,టేలర్ విమానంలోకి కత్తిని ఎలా తీసుకురాగలిగాడో అస్పష్టంగా ఉందని అధికారులు తెలిపారు.ఈ సంఘటనపై జరుగుతున్న దర్యాప్తులో సహాయం కోసం బెలిజియన్ అధికారులు అమెరికా రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు.

మెలోనీతో భేటీ.. సుంకాలపై మెత్తబడ్డ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో కాస్త మెత్తబడ్డారు. సుంకాలపై పలు దేశాలు అగ్రరాజ్యంతో చర్చలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అమెరికా అధినేతతో సమావేశమయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఆయన సానుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈయూ దేశాలపై అమెరికా 20 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అయితే దాని అమలును 90 రోజులపాటు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామాల నడుమ.. ట్రంప్ను కలిసిన తొలి యూరప్ దేశపు నేత మెలోనీనే కావడం గమనార్హం. ఐరోపా సమాఖ్య(European Union)తో పాటు ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందం అంశంపై వీరు చర్చలు జరిపారు. అయితే ఈయూతో సుంకాలపై ఒప్పందం నూటికి నూరు శాతం కుదురుతుందని ట్రంప్ భరోసా ఇచ్చారు. ఈ డీల్ విషయంలో మాత్రం తాను తొందర పడటం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రతీ ఒక్కరూ అమెరికాతో డీల్ కుదుర్చుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఒకవేళ అలా వాళ్లు అనుకోకుంటే గనుక మేమే వాళ్లతో ఒప్పందానికి దిగి వస్తాం అంటూ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఇక.. మరోవైపు ఈ భేటీలో మెలోనీని ట్రంప్ ఆకాశానికెత్తారు. ఆమె ఓ అద్భుతమైన నేత అంటూ పొగడ్తలు గుప్పించారు. మరోవైపు.. పశ్చిమాన్ని గొప్పగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, కలిసికట్టుగా ఆ పని చేయగలమని అనుకుంటున్నా’ అని ఓవల్ ఆఫీసులో రిపోర్టర్లతో మెలోనీ మాట్లాడారు. ట్రంప్ను రోమ్ను ఆహ్వానించిన మెలోనీ.. అక్కడ ఈయూ దేశాల ప్రతినిధులతో సుంకాల అంశంపై చర్చిస్తామని వెల్లడించారు. Rendiamo l’Occidente di nuovo grande - Make the West Great Again pic.twitter.com/Z499ZRGx85— Giorgia Meloni (@GiorgiaMeloni) April 17, 2025
జాతీయం

అల్లర్ల బాధితులను కలిసిన బెంగాల్ గవర్నర్
మాల్డా/కోల్కతా: పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్తోపాటు, జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్ బృందాల సభ్యులు శుక్రవారం మాల్దా జిల్లాలో ఆశ్రయం పొందుతున్న అల్లర్ల బాధితులను కలుసుకున్నారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ముర్షిదాబాద్ జిల్లాలోని ముస్లిం మెజారిటీ ఉన్న షంషేర్గంజ్, సుటి, ధులియన్, జంగీపూర్ ప్రాంతాల్లో ఈ నెల 11,12వ తేదీన చోటుచేసుకున్న అల్లర్లలో ముగ్గురు చనిపోవడం తెల్సిందే. హింసాత్మక ఘటనల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. భీతిల్లిన సామాన్యులు వందలాదిగా పొరుగునే ఉన్న మాల్దా జిల్లాకు వెళ్లి ఆశ్రయం పొందుతున్నారు. వీరి కోసం మాల్దాలోని పర్ లాల్పూర్లోని ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక సహాయ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రశాంతత కొనసాగేందుకు పర్యటనను వాయిదా వేసుకోవాలని సీఎం మమతా బెనర్జీ చేసిన సూచనను గవర్నర్ సీవీ ఆనంద బోస్ పట్టించుకోలేదు. అక్కడికెళ్లి స్వయంగా పరిస్థితులను స్వయంగా పరిశీలించి, కేంద్రానికి నివేదిక అందజేస్తానంటూ ఆయన శుక్రవారం రైలులో పర్ లాల్పూర్ చేరుకుని బాధితులతో సమావేశమయ్యారు. వారి కష్టనష్టాలను తెలుసుకున్నారు. కొందరు దుండగులు తమ ఇళ్లపై దాడులు చేసి, సర్వస్వం దోచుకుని, బయటకు గెంటేశారని బాధిత మహిళలు చెప్పారని అనంతరం గవర్నర్ ఆనందబోస్ మీడియాకు తెలిపారు. సహాయక శిబిరాల్లో వసతుల లేమిపై యంత్రాంగం నుంచి సవివర నివేదిక కోరానన్నారు. ఆయన వెంట ఉన్న రాజ్భవన్ అధికారులు ఫిర్యాదులను నోట్ చేసుకున్నారు. పార్ లాల్పూర్లో ఉద్రిక్తతలు ప్రాణభయంతో పారిపోయి వచ్చిన తమను జిల్లా అధికారులు తిరిగి వెనక్కి వెళ్లిపోవాలని బలవంతం చేస్తున్నట్లు పార్ లాల్పూర్లో ఆశ్రయం పొందుతున్న ముర్షిదాబాద్ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం తమ వద్దకు వచ్చిన జిల్లా అధికారులను వారు చుట్టుముట్టారు. ఎండిన రొట్టెలు, అరటి పండ్లు, ముక్కిపోయిన బియ్యం ఇస్తున్నారన్నారు. శిబిరాల్లో పరిస్థితులు జైలు కంటే దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. తమ సొంతూళ్లో పరిస్థితులు ఏమంత సురక్షితంగా లేవన్నారు. తమ నివాసప్రాంతాల్లో బీఎస్ఎఫ్ జవాన్లు క్యాంపులను ఏర్పాటు చేసేదాకా తిరిగి వెళ్లేది లేదన్నారు. పోలీసులు తమను మీడియాతోను, చివరికి బంధువులతో సైతం మాట్లాడవద్దని ఒత్తిడి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్చార్సీ) శుక్రవారం మాల్దాలోని పర్ లాల్పూర్లోని ప్రభుత్వ పాఠశాల సహాయ శిబిరాన్ని సందర్శించింది. కమిషన్ సభ్యులు బాధిత కుటుంబాలతో మాట్లాడారు. వీరు మూడు వారాల్లోగా ఎన్హెచ్చార్సీకి నివేదికను సమరి్పంచాల్సి ఉంది. ముర్షిదాబాద్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు ఎన్హెచ్చార్సీ ప్రకటించింది. అదేవిధంగా, జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చైర్పర్సన్ విజయా రాహత్కర్ తన బృందంతో శుక్రవారం మాల్డాలోని తాత్కాలిక సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న అల్లర్ల బాధితుల కుటుంబాలతో మాట్లాడారు. శిబిరాల్లో మహిళలు, చిన్నారులకు కల్పించిన సౌకర్యాలను చూసి షాక్కు గురైనట్లు ఆమె తెలిపారు. మహిళలను ఇళ్ల నుంచి వెళ్లగొట్టి, అనూహ్యమైన ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ను మరో బంగ్లాదేశ్ మాదిరిగా మార్చాలని టీఎంసీ ప్రభుత్వం అనుకుంటోందా? అని ప్రశ్నించారు. శనివారం ఈ బృందం ముర్షిదాబాద్కు వెళ్లనుంది. అనంతరం కోల్కతాలో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు డీజీపీతో భేటీ అవుతారు. కాగా, గవర్నర్ ఆనంద బోస్, ఎన్హెచ్చార్సీ, ఎన్సీడబ్ల్యూ బృందాల పర్యటనలు రాజకీయ ప్రేరేపితమని, పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చేందుకు ప్రయతి్నస్తున్నారని టీఎంసీ ఆరోపించింది.

రాణా ప్రతాప్, శివాజీ మన హీరోలు.. ఔరంగజేబ్ కాదు: రాజ్నాథ్
ఛత్రపతి శంభాజీ నగర్: రాణా ప్రతాప్ సింగ్, ఛత్రపతి శివాజీ మహారాజ్లు మన జాతి హీరోలని, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ కాదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. మేవాడ్ పాలకుడు మహారాణా ప్రతాప్ విగ్రహాన్ని శుక్రవారం ఛత్రపతి శంభాజీ నగర్లో ఆయన ఆవిష్కరించారు. జౌరంగజేబ్, బాబర్లను శ్లాఘించడం దేశంలోని ముస్లింలను అగౌరవపర్చడమే అవుతుందని చెప్పారు. ‘ధైర్యసాహసాలు, దేశ భక్తికి ప్రతిరూపం మహారాణా ప్రతాప్..ఛత్రపతి శివాజీ మహారాజ్కు ముఖ్యంగా గెరిల్లా యుద్దతంత్రంలో ఆయనే స్ఫూర్తి’అని రాజ్నాథ్ తెలిపారు. ఔరంగజేబ్ను పొడిగేవారు అతడి గురించి పండిట్ నెహ్రూ ఏం రాశారో తెలుసుకోవాలని సూచించారు. స్వాతంత్య్రానంతరం వామపక్ష అనుకూల భావాలు కలిగిన కొందరు చరిత్రకారులు రాణా ప్రతాప్, శివాజీలకు తగు ప్రాధాన్యం ఇవ్వలేదు సరికదా, ఔరంగజేబ్ను కీర్తించారని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని మతాలను గౌరవిస్తూ ఉపనిషత్తులను అనువదించిన దారా షికోను ఔరంగజేబ్ చంపించాడన్నారు. మొఘలులతో జరిగిన మల్దిఘాటి యుద్దంలో రాణా ప్రతాప్ సైన్యాధికారి హకీంఖాన్ సూరి ప్రాణత్యాగం చేశాడని చరిత్రను మంత్రి గుర్తు చేశారు.

ఛత్తీస్గఢ్లో 33 మంది మావోలు లొంగుబాటు
సుక్మా: ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో శుక్రవారం 33 మంది మావోయిస్టులు భద్రతా బలగాల ఎదుట లొంగిపోయారు. వీరిలో 17 మందిపై మొత్తం రూ.49 లక్షల రివార్డు ఉందని ఎస్పీ కిరణ్ చవాన్ చెప్పారు. వీరిలో 9 మంది మహిళలు సహా 22 మంది సీఆర్పీఎఫ్ ఎదుట, మరో ఇద్దరు మహిళలు సహా 11 మంది పోలీసుల ఎదుట లొంగిపోయారని వివరించారు. సైద్ధాంతిక బలం లేని మావోయిస్ట్ పార్టీ స్థానిక గిరిజనులపై అమానవీయ చర్యలకు పాల్పడుతున్నందునే తీవ్రవాదాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు వీరు చెప్పారన్నారు. లొంగిపోయిన వారిలో సుమారు 22 మంది ఛత్తీస్గఢ్లోని మా, ఒడిశాలోని నౌపడలో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని కిరణ్ చవాన్ వివరించారు. లొంగుబాట పట్టిన వారిలో ప్రముఖంగా పీఎల్జీఏ డిప్యూటీ కమాండర్ ముచాకి జోగా(33), అతడి భార్య, అదే స్క్వాడ్కు చెందిన జోగి(28) ఉన్నారని వీరిపై రూ.8 లక్షల చొప్పున రివార్డు ఉందని ఎస్పీ చెప్పారు. ఇంకా కమిటీ సభ్యులైన కికిడ్ దెవె(30), మనోజ్లపై రూ.5 లక్షల చొప్పున రివార్డు ఉందన్నారు.

ఎలాన్ మస్క్ కు ప్రధాని మోదీ ఫోన్
న్యూఢిల్లీ: టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. ఇండియన్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి త్వరలో టెస్లా అడుగుపెట్టబోతున్న నేపథ్యంతో వారిద్దరూ మాట్లాడుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మస్క్, మోదీ పలు కీలక అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. టెక్నాలజీ, ఇన్నోవేషన్ వంటి రంగాల్లో భారత్, అమెరికా మధ్య పరస్పర సహకార మరింత బలోపేతం కావాలని వారు ఆకాంక్షించారు. సాంకేతికత, నవీన ఆవిష్కరణల విషయంలో ఉమ్మడి ప్రయోజనాలు కాపాడుకొనేలా పటిష్ట వ్యూహంతో ముందుకెళ్లాలని ఉద్ఘాటించారు. మస్క్ తో సంభాషణ అనంతరం మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. మస్క్ తో చక్కటి సంభాషణ జరిగిందన్నారు. వేర్వేరు అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నామని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో తాము కలిసినప్పుడు చర్చించుకున్న అంశాలు మరోసారి ప్రస్తావనకు వచ్చాయన్నారు. ప్రధానంగా టెక్నాలజీ, ఇన్నోవేషన్ పైనే తమ మాట్లాడుకున్నామని వివరించారు. ఈ రెండు అంశాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత దృఢతరం చేసుకొనేందుకు కట్టుబడి ఉన్నామని మోదీ స్పష్టంచేశారు. మరోవైపు ఇండియన్ మార్కెట్లో ప్రవేశించానికి టెస్లా ఏర్పాట్లు చేసుకుంటోంది. తొలుత ముంబై, ఢిల్లీ, బెంగళూరులో టెస్లా కార్లు విక్రయించబోతున్నారు. వేలాది టెస్లా కార్లు ఇండియాను ముంచెత్తబోతున్నాయి.
ఎన్ఆర్ఐ

హాంగ్కాంగ్లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు
హాంకాంగ్లో ఉగాది వేడుకలు తెలుగు కుటుంబాలకు యెంతో ఉత్సాహాన్నిచ్చాయి, తెలుగు సంవత్సరాదిని ఐక్యతతో, సాంస్కృతిక సంపదతో జరుపుకుంన్నారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య (THKTS) నిర్వహించే ఈ కార్యక్రమం, అనధికారికంగా ఇరవై రెండు సంవత్సరాలుగా మరియు పదమూడు సంవత్సరాల అధికారిక సంస్థగా తెలుగు సేవ కొనసాగిస్తోంది. చింగ్ మింగ్ ఉత్సవం కారణంగా హాంకాంగ్లో సుదీర్ఘ వారాంతం సెలవలు ఉన్నప్పటికీ, విశేషమైన సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి హాంకాంగ్ & మకావులోని భారత కాన్సులేట్ జనరల్ నుంచి కాన్సుల్ శ్రీ కూచిభొట్ల వెంకట రమణ గారు; హోం అఫైర్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ జిల్లా అధికారి శ్రీ మొక్ మాంగ్-చాన్ గారు; ఎన్.ఎ.ఎ.సి టచ్ సెంటర్ ప్రాంతీయ డైరెక్టర్ శ్రీమతి కోనీ వాంగ్ గారు; మరియు హాంకాంగ్లో ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నత అధికారి శ్రీ దేవేష్ శర్మ గారు హాజరయ్యారు.చీకటిని పారద్రోలడానికి మరియు కొత్త ప్రారంభాలను స్వాగతించడానికి ప్రతీకగా గౌరవనీయ అతిథుల దీప ప్రజ్వలనతో ఉగాది వేడుకలు ప్రారంభమైంది. ప్రార్థన తర్వాత, హాజరైన వారిని "మా తెలుగు తల్లి" శ్రావ్యమైన పాట ఆకట్టుకుంది,తెలుగుతనాన్ని ప్రేక్షక హృదయాలలో ప్రతిధ్వనించింది. ప్రముఖుల ప్రసంగాలు సమాజ ప్రయాణం మరియు దాని సభ్యులను బంధించే లక్ష్యం గురించి ప్రతిబింబించాయి. శ్రీ కూచిభొట్ల వెంకట రమణ గారు తెలుగు భాష మరియు సాంస్కృతిక విలువలను పునరుద్ఘాటిస్తూ ఇది భావితరాలికి అందించాల్సిన కర్తవ్య ప్రాముఖ్యతని గుర్తుచేశారు. తెలుగు సమాఖ్య ద్వారా హాంగ్ కాంగ్ తెలుగు ప్రజలకు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు.తన ప్రసంగంలో, తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు హాంకాంగ్లోని తెలుగు వారిలో ఒక అనుబంధ భావన మరియు సంబంధాన్ని సృష్టించడం ముఖ్యోద్దేశంగా సంస్థ ప్రయాణం మరియు దాని లక్ష్యం గురించి ప్రతిబింబించారు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం మరియు సమాజానికి తిరిగి ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఆమె యెంతో అవసరం అని చెప్పారు. హాంకాంగ్ మరియు భారతదేశంలోని వెనుకబడిన వర్గాలకు మద్దతు ఇవ్వడానికి తమ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించారు.వినోదాత్మక స్కిట్ వైవిధ్యమైన ప్రదర్శనలను సజావుగా అనుసంధానించింది, ప్రేక్షకుల హర్షధ్వానాలు - కరతాళధ్వనులతో సాంస్కృతికోత్సవం ముగిసింది. ప్రదర్శలిచ్చిన కళాకారులను కాన్సల్ శ్రీ కూచిభొట్ల వెంకట్ రమణ గారు పురస్కరాలు అందజేస్తూ అభినందించారు.హాంకాంగ్లోని తెలుగు సమాజం శ్రీ విశ్వవాసు నామ ఉగాది వేడుకలను ప్రారంభిస్తున్నందున, తెలుగు నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తూ సాంప్రదాయ ఉగాది పచ్చడితో, తెలుగు భోజనంతో వేడుకలు ముగిశాయి. ఈ కార్యక్రమం సమాజం యొక్క ఐక్యత, సేవా స్ఫూర్తికి నిదర్శనం, స్నేహం మరియు సేవా బంధాలను పెంపొందించడం, ఆనందం, విజయం మరియు సద్భావనతో నిండిన సంవత్సరాన్ని వాగ్దానం చేయడం మరియు తెలుగు ప్రజల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడం తార్కాణం.అధ్యక్షురాలు తన కృతజ్ఞతా ప్రసంగంలో,గౌరవనీయులైన అతిథులు, కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, సమాఖ్య సభ్యులు, స్నేహితులు మరియు తుంగ్ చుంగ్ కమ్యూనిటీ హాల్ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

రాజాంలో విద్యార్ధులకు నాట్స్ ఉపకారవేతనాలు
జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ తాజాగా శ్రీకాకుళం జిల్లా రాజాం లో విద్యార్ధులకు ఉపకారవేతనాలు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసింది. నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీశ్ గంథం తన సొంత ఊరికి చేతనైన సాయం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాజాంలోని శ్రీ విద్యానికేతన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సతీశ్ గంథం విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందించారు. అలాగే ఇక్కడే మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు వారికి ఉచితంగా కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు పాల్గొని సతీశ్ గంథం సేవా నిరతిని ప్రశంసించారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీష్ గంథం చూపిన చొరవను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు ప్రత్యేకంగా అభినందించారు.

డల్లాస్లో నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమం
అమెరికాలో సామాజిక బాధ్యత పెంచే కార్యక్రమాలను నాట్స్ తరచూ చేపడుతోంది. ఈ క్రమంలోనే నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని డల్లాస్లోని ఫ్రిస్కో నగరంలో చేపట్టింది. డల్లాస్ నాట్స్ విభాగం ఆధ్వర్యలో ప్రిస్కోలోని మోనార్క్ పార్క్లో 50 మందికి పైగా నాట్స్ సభ్యులు, తెలుగు విద్యార్ధులు పాల్గొని పార్క్ని శుభ్రం చేశారు. ప్రకృతిని కాపాడేందుకు, శుభ్రతను ప్రోత్సహించేందుకు అడాప్ట్ ఎ పార్క్ వంటి కార్యక్రమాలు ఎంతో మేలును కలిగిస్తాయని, పార్కులను శుభ్రంగా ఉంచడం వల్ల పర్యావరణ హితమైన జీవనశైలికి మార్గం సుగమం అవుతుందని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచేందుకు నాట్స్ చేపట్టిన ఈ సామాజిక సేవా కార్యక్రమం ద్వారా విద్యార్ధుల సేవను అమెరికా ప్రభుత్వం గుర్తిస్తుందని నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత తమ విలువైన సమయాన్ని వినియోగించి పార్కును శుభ్రపరిచారు. చెత్తను తొలగించారు. చెట్లకు నీరు పట్టారు ప్రకృతి పరిరక్షణకు తోడ్పడ్డారు. విద్యార్ధులకు ఇది ఒక సామాజిక బాధ్యతగా మాత్రమే కాకుండా, భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించే గొప్ప అనుభవంగా మిగులుతుందని డల్లాస్ చాప్టర్ వ్కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జాయింట్ ట్రెజరర్ రవి తాండ్ర, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సత్య శ్రీరామనేని, నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ మీడియా రిలేషన్స్ కిషోర్ నారె, నాట్స్ సభ్యులు శివ మాధవ్, బద్రి, కిరణ్, పావని, శ్రీ దీపిక, ఉదయ్, వంశీ, వీరా తదితరులు పాల్గొన్నారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! రేపటి తరంలో సామాజిక బాధ్యత పెంచే అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన డల్లాస్ చాప్టర్ జట్టుకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి తమ అభినందనలు తెలిపారు. జూలై 4,5,6 తేదీల్లో టంపాలో జరిగే 8 వ అమెరికా తెలుగు సంబరాలకు డల్లాస్లో ఉండే తెలుగువారంతా తరలిరావాలని కోరారు.

30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన
గత మూడు దశాబ్దాల సత్ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.....“విశ్వావసు” నామ సంవత్సర ఉగాది (మార్చ్ 30, 2025) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా వంగూరు ఫౌండేషన్ ఎంపిక చేసి విజేతల వివరాలను ప్రకటించింది. అలాగే విజతలకు శాయి రాచకొండ, దీప్తి పెండ్యాల, వంగూరి చిట్టెన్ రాజు అభినందనలు తెలిపారు.వంగూరు ఫౌండేషన్ ప్రకటనఅమెరికా, కెనడా, భారత దేశం, దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఖతార్, చెకొస్లొవేకియా, అబుదాభి, బోస్ట్వానా, దుబై తదితర ప్రాంతాల నుండి ఈ పోటీలో పాలు పంచుకుని, విజయవంతం చేసిన రచయితలకు మా ధన్యవాదాలు. చేయి తిరిగిన రచయితలు, ఔత్సాహిక రచయితలూ అనేక మంది ఈ పోటీ కాని పోటీలో పాల్గొనడం సంతోషంగా ఉంది. అన్ని రచనలకూ సర్వ హక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలు, ప్రచురణకి అర్హమైన రచనలూ కౌముది.నెట్, సిరిమల్లె. కామ్ మొదలైన పత్రికలలో ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! అందుబాటులో ఉన్న విజేతల నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు ఏప్రిల్ 13, 2025 నాడు శ్రీ త్యాగరాజ గాన సభ వేదిక, హైదరాబాద్ లో నిర్వహించబడుతున్న "అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం" లో ఆహూతుల సమక్షంలో బహూకరిస్తాం.30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతలుప్రధాన విభాగం – 30వ సారి పోటీఉత్తమ కథానిక విభాగం విజేతలు“కాంతా విరహగురుణా”- పాణిని జన్నాభట్ల, Boston, MA,)“నల్లమల్లె చెట్టు” - గౌతమ్ లింగా (Johannesburg, South Africa)ప్రశంసా పత్రాలు‘లూసఫర్’ -నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్), Tampa, FL‘తెలివి’ - మురళీశ్రీరాం టెక్కలకోట, Frisco, TXఉత్తమ కవిత విభాగం విజేతలు“వర్ణాక్షరం” - గౌతమ్ లింగా, (జొహానెస్ బర్గ్, దక్షిణ ఆఫ్రికా)“కృత్రిమ మేధా వికూజనము” – స్వాతి శ్రీపాద (Detroit, MI)ప్రశంసా పత్రాలు“డయాస్పోరా ఉగాది పచ్చడి”- సావిత్రి మాచిరాజు, Edmonton, Canada“చెప్పిన మాట వింటా!”- అమృత వర్షిణి, Parker, CO, USA“మొట్టమొదటి రచనా విభాగం” -17వ సారి పోటీ“నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు‘ప్రత్యూష రాగం -కైలాస్ పులుగుర్త’ – హైదరాబాద్,“మనో నిశ్చలత” – సీతా సుస్మిత, మద్దిపాడు గ్రామం,ఒంగోలు - ప్రశంసా పత్రం“మంకెన పూలు” -సుజాత గొడవర్తి, ఆశ్వాపురం, తెలంగాణా - ప్రశంసా పత్రం"నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు“ఇంకెంత కాలమని?” కరిపె రాజ్ కుమార్, ఖానాపూర్, నిర్మల్ జిల్లా, తెలంగాణా “వర్షాగమనానికి ఆశగా ఎదురుచూసే ప్రకృతిని హృద్యంగా, కొంత కరుణాత్మకంగా వర్ణించే కవిత”“అచ్చం నాలానే” -మళ్ళ కారుణ్య కుమార్, అమ్మవారి పుట్టుగ (గ్రామం), శ్రీకాకుళం“వయసు ఒక అనిరిర్ధారిత సంఖ్య” - ప్రొఫెసర్ దుర్గా శశికిరణ్ వెల్లంచేటి, Bangalore, India-
క్రైమ్

తన కూతురిపై కన్నేశాడనే కడతేర్చింది
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణ పోలీస్స్టేషన్లో ఒక కానిస్టేబుల్ కనిపించడం లేదంటూ అతని భార్య, బంధువులు ఫిర్యాదు చేశారు. మంగళగిరిలో మిస్ అయిన కానిస్టేబుల్ నంద్యాల–కడప ఘాట్రోడ్లో శుక్రవారం శవమై కనిపించాడు. సేకరించిన వివరాల మేరకు నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ మండలం, తోటకందుకూరు గ్రామానికి చెందిన ఫారుక్ (30) ఏపీఎస్పీ రెండో బెటాలియన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కొంతకాలంగా మంగళగిరి ఆక్టోపస్ కార్యాలయంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. మంగళగిరి పట్టణంలోనే ఉంటున్నాడు. ఏప్రిల్ 8న ట్రైనింగ్ ఉందంటూ వెళ్లిన ఫారుక్ తిరిగి రాకపోవడం, ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో 12న భార్య బషీరున్ తన బంధువులతో కలిసి ఆక్టోపస్ కార్యాలయానికి వెళ్లింది. ఏప్రిల్ 9 నుంచి 12 వరకు ఫారుక్ సెలవు పెట్టాడని అక్కడి అధికారులు చెప్పడంతో మంగళగిరి పట్టణ పోలీస్స్టేషన్లో తన భర్త కనిపించడం లేదంటూ ఈనెల 14న ఫిర్యాదు చేశారు. మంగళగిరి పట్టణ పోలీసులు మిస్సింగ్గా కేసు నమోదు చేశారు. విచారణలో వెలుగు చూసిన నిజాలు ఫారుక్ ఫోన్ స్విచ్చాఫ్గా ఉండడంతో ఆక్టోపస్ అధికారుల ఆదేశాల మేరకు అతని కాల్ డేటాను పోలీసులు సేకరించారు. అందులో ఉన్న కాల్స్ ఆధారంగా విచారణ చేపట్టారు. ఫారుక్ ఫోన్ లొకేషన్ నంద్యాలలో ఉన్నట్లు తేలడంతో చివరగా ఫోన్ చేసిన వారిని నంద్యాల జిల్లా పోలీసులు విచారణ చేశారు. ఈ నేపథ్యంలో నంద్యాలకు చెందిన అనీషను కూడా విచారణ చేశారు. దీంతో అసలు నిజం బయటపడింది. ఫారుక్కు పెళ్లికాక ముందు నుంచి అనీషతో పరిచయముంది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో అనీష కుమార్తెతో కూడా ఫారుక్ సన్నిహితంగా ఉండడంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఈ విషయమై ఫారుక్తో తరచూ గొడవ పడేది. ఫారుక్ నంద్యాలలోని తెలిసిన వ్యక్తి ద్వారా అనీషకు డబ్బులు పంపిస్తున్నాడు. ఆ వ్యక్తి సన్నిహితంగా ఉండడంతో అనీష కుమార్తెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో ఫారుక్ను అడ్డు తొలగిస్తేనే పెళ్లికి అంగీకరిస్తానని అనీష చెప్పింది. పథకం ప్రకారం.. ఫారుక్ను హతమార్చేందుకు ఇద్దరూ పథకం పన్నారు. అతనికి ఫోన్ చేసి కొన్ని రోజులు సెలవు పెట్టుకుని రావాలని అనీష కోరింది. ఫారుక్ మంగళగిరి నుంచి నంద్యాలకు ఏప్రిల్ 8న సాయంత్రం బయలు దేరాడు. 9న అక్కడకు చేరుకున్న ఫారుక్ తనకు పరిచయమున్న వ్యక్తిని కలిశాడు. అక్కడి నుంచి బయటకు వెళ్దామంటూ ఆ వ్యక్తి మరో ఇద్దరిని తీసుకుని ఫారుక్తో కారులో బయలుదేరారు. మద్యం సేవించిన అనంతరం నంద్యాలలో కారులో వెళుతుండగా ఎదురు సీట్లో కూర్చున్న ఫారుక్ను వెనుక ఉన్న వ్యక్తి ఓ వైర్తో మెడకు గట్టిగా బిగించాడు. దీంతో ఊపిరి ఆడక ఫారుక్ అక్కడికక్కడే మరణించారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం వీరు మృతదేహాన్ని ఒక కవర్లో చుట్టి నంద్యాల శివారు ప్రాంతంలో ఉన్న ఓ చెరువులో పడవేశారు. కొంత సమయం తరువాత వచ్చి చూడడంతో మృతదేహాన్ని కవర్తో చుట్టడం వల్ల చెరువులో తేలుతూ కనబడింది. మరుసటి రోజు ఎవరూ లేని సమయంలో వచ్చి ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్లి నంద్యాల – కడప ఘాట్రోడ్లో ఫారెస్ట్ ప్రాంతంలో పైనుంచి కిందకు పడవేశారు. నంద్యాల సీసీఎస్ పోలీసులు అనీషను, మరో ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకోగా, మరో యువకుడు పరారయ్యాడు. ఆ ముగ్గురిని పోలీసులు తమదైన శైలిలో విచారించారు. నిందితులు తెలిపిన వివరాలతో ఫారుక్ మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఫారుక్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

బంగ్లాదేశ్ యువతులతో హైదరాబాద్లో వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: రాజధానితో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్న అనేక ముఠాలు పట్టుబడ్డాయి. ఈ బాధితుల్లో అత్యధికం బంగ్లాదేశీ యువతులే ఉంటున్నారు. దీంతో వీరు దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న విధానంపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. ప్రాథమిక ఆధారాలను బట్టి కొన్ని కీలక విషయాలు గుర్తించారు. ఈ మనుషుల అక్రమ రవాణా దందాకు పశ్చిమ బెంగాల్ కీలకంగా ఉన్నట్లు తేలింది. అక్కడి కొందరు సూత్రధారులు బంగ్లాదేశ్లోనూ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. వారి ద్వారా ఒకరిని అక్రమంగా బోర్డర్ దాటించడానికి రూ.4 వేలు చొప్పున వసూలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. కీలకంగా వ్యవహరిస్తున్న రాహుల్... బంగ్లాదేశీయులతో పాటు మయన్మారీల అక్రమ రవాణా దందాకు పశ్చిమ బెంగాల్లోని సరిహద్దు జిల్లాలు కీలకంగా మారాయి. ఆయా దేశాల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటీవలి కాలంలో అక్రమ రవాణా పెరిగింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు కొత్తగా ముఠాలు పుట్టుకువచ్చాయి. వీటికి నేతృత్వం వహిస్తున్న వ్యక్తులకు ఇటు పశ్చిమ బెంగాల్ తో పాటు అటు బంగ్లాదేశ్లోని సరిహద్దు గ్రామాల్లో అనుచరులు ఉంటున్నారు. ఇలాంటి సూత్రధారుల్లో పశ్చిమ బెంగాల్ లోని బసిర్హత్ జిల్లా సోలదాన గ్రామానికి చెందిన రాహుల్ అమన్ దాలి కీలకమని దర్యాప్తు అధికారులు గుర్తించారు. అక్రమంగా సరిహద్దులు దాటాలని భావించిన బంగ్లాదేశీయులు ఆ దేశంలో ఉన్న సరిహద్దు గ్రామాలకు చేరుతున్నారు. వీరిని సంప్రదిస్తున్న రాహుల్ అనుచరులు రూ.4 వేలకు.. డిమాండ్ ఎక్కువగా ఉంటే రూ.5 వేలకు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇక్కడి నుంచే కథ నడిపించే రాహుల్... ఈ మొత్తాన్ని ఆ యువతులతోనే బంగ్లాదేశ్లోని సరిహద్దు గ్రామాల్లో ఉండే దుకాణదారుల వద్ద భారత కరెన్సీలోకి మార్పిస్తున్నాడు. మరికొందరు దళారుల ద్వారా ఈ నగదు బ్యాంకు ఖాతా లేదా యూపీఐ ద్వారా తనకు చేరేలా చేస్తున్నాడు. ఈ మొత్తం నుంచి రూ.1000 కమీషన్గా సరిహద్దుకు అటు–ఇటు ఉన్న గ్రామాలకు చెందిన తన అనుచరులకు ఇస్తుంటాడు. అక్కడ ఉన్న వారు అనువైన ప్రాంతం, సమయంలో యువతుల్ని పంపిస్తుండగా... ఇక్కడ ఉన్న వాళ్లు రిసీవ్ చేసుకుని సురక్షిత ప్రాంతానికి తరలిస్తుంటారు. రాహుల్ ఎక్కడా తెరపైకి రాకుండా ఈ వ్యవహారం నడిపిస్తుంటాడని అధికారులు చెబుతున్నారు. 2017 నుంచి ఈ దందా చేస్తున్న రాహుల్కు కోల్కతాకు చెందిన కొన్ని ముఠాలతో సంబంధాలు ఉన్నాయి. వారి సహకారంతోనే డిమాండ్ చేసిన మొత్తం చెల్లించిన వారికి నకిలీ గుర్తింపుకార్డులు తయారు చేయించి ఇస్తున్నాడు. ఇలా ఇక్కడి ఆధార్, ఓటర్ ఐడీలు పొందుతున్న బంగ్లాదేశీ యువతులు పశ్చిమ బెంగాల్ వాసులుగా చెలామణి అవుతున్నారు. హైదరాబాద్ సహా మరికొన్ని చోట్లకు... కొందరు దళారులు సదరు యువతులను హైదరాబాద్ సహా మరికొన్ని నగరాలకు తరలిస్తున్నారు. ఉద్యోగం పేరుతో తీసుకువచ్చి వ్యభిచార కూపాల్లోకి నెడుతున్నారు. అతి తక్కువ మంది మాత్రం మసాజ్ పార్లర్లు, బార్ అండ్ రెస్టారెంట్లలో పని చేస్తున్నారు. ఇదే పంథాలో కొందరు బంగ్లాదేశ్ యువకులు కూడా అక్రమంగా సరిహద్దులు దాటి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మనుషుల అక్రమ రవాణా నెట్వర్క్ పూర్వాపరాలతో ఓ సమగ్ర నివేదికను సిద్ధం చేస్తున్నారు. ఎవరెవరు కీలకంగా వ్యవహరిస్తున్నారు? ఎక్కడ నుంచి సరిహద్దులు దాటిస్తున్నారు? తదితర అంశాలను నిఘా వర్గాలతో పాటు సరిహద్దు భద్రతా దళం దృష్టికి తీసుకెవెళ్లాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో నమోదైన మనుషుల అక్రమ రవాణా కేసుల్లో కొన్ని దర్యాప్తు నిమిత్తం జాతీయ దర్యాప్తు సంస్థకు (ఎన్ఐఏ) చేరాయి. దీంతో ఆ విభాగంతో సమన్వయం ఏర్పాటు చేసుకుని, సమాచార మార్పిడి చేసుకోనున్నట్లు తెలిసింది.

ఈ సైకిళ్లు ఎవరికి ఇవ్వాలి దేవుడా?
ఖమ్మం: వేసవి సెలవులు వచ్చేశాయి.. ఒకటి, రెండు రోజుల్లో వెళ్లి మనవళ్లను తీసుకురావాలి.. నెలపాటు వారితో ఇంట్లో సందడిగా ఉంటుంది.. అని భావించిన ఆ తాత హతాశుడయ్యే సమాచారం అందింది. మనవళ్లు ఇద్దరిని కుమార్తె హత్య చేసి ఆమె సైతం బలవన్మరణానికి పాల్పడిందని తెలియడంతో కన్నీరమున్నీరయ్యాడు. మనవళ్లు గత ఏడాది వచ్చినప్పుడు అడిగినట్లుగా కొన్న సైకిళ్లు ఎవరికి ఇవ్వాలి అంటూ ఆయన రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. పెనుబల్లి మండలం తాళ్లపెంటకు చెందిన గువ్వల వెంకటరెడ్డి సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం సత్తుపల్లిలోని బైపాస్రోడ్ టీచర్స్ కాలనీలో ఇల్లు కట్టుకుని నివస్తుండగా ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె తేజస్వినిరెడ్డి(35) వివాహం 13ఏళ్ల క్రితం సత్తుపల్లి మండలం రేజర్లకు చెందిన గండ్ర వెంకటేశ్వరరెడ్డితో జరగగా వారికి కుమారులు హర్షిత్రెడ్డి(11), అశిష్రెడ్డి(7) ఉన్నారు. కుటుంబమంతా హైదరాబాద్లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తుండగా గురువారం వెంకటేశ్వరరెడ్డి విధులకు వెళ్లొచ్చేలోగా కుమారులిద్దరిని చంపిన తేజస్విని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, వెంకటరెడ్డి కుమారుడు, తేజస్విని తమ్ముడు సైతం 14ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు కుమారుడు, ఇప్పుడు కుమార్తె, మనవళ్ల మృతితో వెంకటరెడ్డి కుటుంబీకుల రోదనలను ఆపడం ఎవరి వల్లా కాలేదు. ఘటనా సమాచారం తెలియగానే కుటుంబమంతా హైదరాబాద్ వెళ్లగా ముగ్గురి మృతదేహాలకు హైదరాబాద్లోనే అంత్యక్రియలు నిర్వహించారు.

అనుమానంతో బ్లేడుతో భార్య గొంతు కోసిన భర్త
క్రోసూరు(పల్నాడు): స్థానిక బోయ కాలనీలో భార్యపై అనుమానం పెంచుకుని భర్త బ్లేడుతో గొంతుకోసిన సంఘటన శుక్రవారం జరిగింది. స్టేషన్ రైటర్ దాసు వివరాల ప్రకారం.. బోయ కాలనీకి చెందిన చార్ల శ్రీను భార్య మల్లమ్మ. ఆమె ఎవరితోనో ఫోనులో మాట్లాడుతుండటంతో అనుమానపడి శ్రీను బ్లేడుతో దాడి చేసి గొంతు కోశాడు. చుట్టపక్కల వారు ఆమెను సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు 25 కుట్లు వేశారు. ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించాలని వైద్యులు సూచించారు. శ్రీను, మల్లమ్మలకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కూడా అయింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు రైటర్ దాసు తెలిపారు.
వీడియోలు


పెద్దిలో మగధీర కాంబినేషన్?


పార్టీ మారిన కార్పొరేటర్ల పై వరుదు కళ్యాణి సీరియస్ కామెంట్స్


విద్యార్థిని మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి హరీష్ రావు


విశాఖలో మెడికో శ్రీరామ్ ఆత్మహత్య


భారత్ కు ఇలాన్ మస్క్


విజయసాయి రెడ్డిపై వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు


అల్లు అర్జున్, అట్లీ మూవీకి పుష్ప సెంటిమెంట్!


కుట్రలు, కుతంత్రాలతో కూటమి మ్యాజిక్ ఫిగర్


మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు హైడ్రా షాక్


గచ్చిబౌలి పీఎస్ లో విచారణకు హాజరైన స్మితా సబర్వాల్