కౌంటింగ్‌లో ఏజెంట్లు కీలకం! | Key Role To Election Counting Agents Who Act As Representative On Behalf Of The Candidate During Counting | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌లో ఏజెంట్లు కీలకం!

Published Thu, May 30 2024 10:19 AM | Last Updated on Thu, May 30 2024 1:41 PM

key Role to Election Counting Agents

నిబంధనలపై అవగాహన అవసరం 

నిశిత పరిశీలనకు ప్రాధాన్యం

ఓట్ల లెక్కింపులో అత్యంత అప్రమత్తం

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓట్లు లెక్కింపును జూన్‌ 4వ తేదీన చిత్తూరు సమీపంలోని ఎస్వీ సెట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించనున్నారు. ఆ మేరకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు.  ప్రశాంతవాతావరణంలో కౌంటింగ్‌ నిర్వహించేందుకు  పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో కౌంటింగ్‌ రోజున వివిధ పారీ్టల ఏజెంట్లు సైతం కీలక పాత్ర పోషించనున్నారు. ఇందుకోసం నిబంధనలపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరముందని పలువురు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని కోరుతున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.  

చిత్తూరు కలెక్టరేట్‌ : చిత్తూరు సమీపంలోని ఎస్వీ సెట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో చిత్తూరు పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును జూన్‌ 4వ తేదీన చేపట్టనున్నారు. కౌంటింగ్‌ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. కౌంటింగ్‌ సమయంలో అభ్యర్థి తరఫున ప్రతినిధిగా వ్యవహరించే ఏజెంట్ల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కౌంటింగ్‌కు మూడు రోజుల ముందు సాయంత్రం 5గంటల్లోపు కౌంటింగ్‌ ఏజెంట్ల నియామ­కానికి సంబంధించిన ఫారమ్‌–18ను సంబంధిత రిటరి్నంగ్‌ అధికారికి సమరి్పంచాలి. ఆర్‌ఓలు ఈ మేరకు ఏజెంట్లకు ఐడీ కార్డులు అందిస్తారు. కౌంటింగ్‌కు గంట ముందు అపాయింట్‌మెంట్‌ లెటర్, ఐడీ కార్డును ఏజెంట్లు సంబంధిత ఆర్‌ఓలకు అందించాల్సిఉంటుంది. ఫారమ్‌–19 ద్వారా కౌంటింగ్‌ ఏజెంట్‌ అపాయింట్‌మెంట్‌ను రద్దు చేసే అధికారం అభ్యర్థి లేదా ఎలక్షన్‌ ఏజెంట్‌కు ఉంటుంది.  

అవగాహన తప్పనిసరి 
సార్వత్రిక ఎన్నికల లెక్కింపుప్రక్రియలో ఫారమ్‌–17సీ పార్ట్‌–2 ఎంతో కీలకమైంది. ప్రతి కౌంటింగ్‌ ఏజెంట్, పరిశీలకులు, సహాయ పరిశీలకులు దీనిపై అవగాహన కలిగి ఉండాలి. కంట్రోల్‌ యూనిట్‌లో నమోదైన మొత్తం ఓట్లు, ఫారమ్‌–17సీలో పొందుపరిచిన మొత్తం ఓట్లు సరిపోల్చి చూసుకోవాలి. పార్లమెంట్, అసెంబ్లీ నియోజక­వర్గం నంబర్, పోలింగ్‌ కేంద్రం పేరు, అక్కడ వినియోగించిన కంట్రోల్‌ యూనిట్, బ్యాలెట్‌ యూనిట్ల గుర్తింపు నంబర్లను ఆ ఫారమ్‌లోనే నమోదు చేస్తారు. 

ఆ పోలింగ్‌ కేంద్రం పరిధిలోని ఓటర్ల సంఖ్య, ఓటు వేయడానికి వచ్చిన వారి సంఖ్య, పోలింగ్‌ కేంద్రంలోకి వచ్చాక ఓటు వేయడానికి నిరాకరించి వెళ్లిపోయిన వారు, ఓటింగ్‌ యంత్రంలో నమోదైన మొత్తం ఓట్ల సంఖ్య ఫారమ్‌–17సీలో ఉంటాయి. టెండర్‌ బ్యాలెట్లు, సరఫరా చేసిన పేపర్‌ సీళ్లు (ఓటరుకు పోలింగ్‌ కేంద్రంలో ఇచ్చే రెండు రంగుల స్లిప్‌లు), సీరియల్‌ నంబర్లు, ఎన్ని పేపర్లు వినియోగించారు, వినియోగించని పేపర్‌ సీళ్లు ఎన్ని తిరిగి రిటర్నింగ్‌ అధికారికి వెళ్లాయి, పాడైపోయిన పేపర్‌ సీళ్లు, సీరియల్‌ నంబర్ల వంటి వివరాలు ఇందులో ఉంటాయి. 

తేడా వస్తే..! 
కౌంటింగ్‌ సమయంలో టేబుల్‌ వద్దకు కంట్రోల్‌ యూనిట్‌తో పాటు ఫారమ్‌–17సీలోని వివరాలను ఏజెంట్లు తప్పనిసరిగా రాసుకోవాలి. కంట్రోల్‌ యూనిట్‌ డిస్‌ప్లే సెక్షన్‌లో చూసిన పోలైన మొత్తం ఓట్లు, ఫారమ్‌–17సీలో నమోదు చేసిన ఓట్ల సంఖ్య సమానంగా ఉండాలి. క్లరికల్‌ తప్పిదం, మరో కారణంతో కానీ కంట్రోల్‌ యూనిట్‌ ఫారమ్‌–17సీలో ఓట్ల సంఖ్యలో తేడా వస్తే అది వివాదాస్పదంగా మారుతుంది. అలాంటి కంట్రోల్‌ యూనిట్లను రిటర్నింగ్‌ అధికారి పక్కన ఉంచి ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందిస్తారు. కంట్రోల్‌ యూనిట్‌ టేబుల్‌ పైకి రాగానే ఏజెంట్ల పరిశీలనకు ఉంచుతారు. ఆ కంట్రోల్‌ యూనిట్‌ ఏ పోలింగ్‌ కేంద్రానికి చెందినదో ఏజెంట్లు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. 

వరుస క్రమంలో లెక్కింపు 
కౌంటింగ్‌ ఒక రౌండ్‌ పూర్తయిన వెంటనే అందులోని రెండు కంట్రోల్‌ యూనిట్లను జనరల్‌ అబ్జర్వర్‌ తన టేబుల్‌ వద్దకు తెప్పించుకుంటారు. అదనపు పరిశీలకులతో ఓట్లు లెక్కిస్తారు. కంట్రోల్‌ యూనిట్‌లోని ఓట్ల సంఖ్యకు ఫారమ్‌–17సీ, పార్టు–2లో కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌ నమోదు చేసిన ఓట్ల సంఖ్యకు సమానంగా ఉంటే ఇబ్బంది లేదు. ఒకవేళ ఏదైనా తేడా వస్తే పరిశీలకుడు తనిఖీ చేసిన మిగిలిన కంట్రోల్‌ యూనిట్లన్నిటినీ జనరల్‌ అబ్జర్వర్‌ మరోసారి లెక్కిస్తారు. అసాధారణంగా ఇద్దరు అభ్యర్థులకు కౌంటింగ్‌ ఓట్లు సమానంగా వస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రిటరి్నంగ్‌ అధికారి లాటరీ ద్వారా ఫలితం ప్రకటిస్తారు.  

మార్గదర్శకాలు ఇలా.. 
కౌంటింగ్‌ ఏజెంటకు 18 ఏళ్లు నిండి ఉండాలి. సాయుధ రక్షణ కలిగిన వారిని అనుమతించరు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, మున్సిపల్, జెడ్పీ చైర్మన్లు, పబ్లిక్‌రంగ సంస్థలు, కార్పొరేషన్ల చైర్మన్లు కూడా ఏజెంట్లుగా కూర్చునేందుకు అనర్హులు. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందేవారు, ప్రభుత్వ–ఎయిడెడ్‌ సంస్థల్లో పనిచేసే పార్ట్‌ టైమ్‌ ఉద్యోగులు, పారామెడికల్‌ స్టాఫ్, రేష¯Œన్‌ డీలర్లు, అంగ¯Œవాడీ ఉద్యోగులు పోలింగ్‌ ఏజెంట్లుగా ఉండకూడదు.  ప్రభుత్వ ఉద్యోగులు ఏజెంట్లుగా వ్యవహరిస్తే మూడు నెలల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ కలిపి విధించే అవకాశం ఉంది. సర్పంచ్‌లు, పంచాయతీ వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కౌంటింగ్‌ ఏజెంట్లుగా కూర్చునేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. భారత పౌరసత్వం కలిగిన ఎన్‌ఆర్‌ఐ కూడా కూర్చోవచ్చు.  ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి తన గన్‌మన్‌ను స్వచ్ఛందంగా వదులుకుంటే కౌంటింగ్‌ హాల్‌లో కూర్చునేందుకు అనుమతి­స్తారు. ఒక కౌంటింగ్‌ హాల్‌లో 14 టేబుళ్లు ఉంటాయి. ఆ మేరకు అభ్యర్థులు తమ ఏజెంట్లను నియమించుకోవచ్చు. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపునకు అవసరం అని భావిస్తే అందుకోసం వేరే కౌంటింగ్‌ హాల్‌లో అదనపు టేబుళ్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అప్పుడు అభ్యర్థులు అక్కడ అదనంగా మరో కౌంటింగ్‌ ఏజెంట్‌ను నియమించుకోవచ్చు.  

పకడ్బందీగా ప్రక్రియ 
ఓట్ల లెక్కింపును పకడ్బందీగా చేపడతాం. గుర్తింపు పొందిన రాజకీయ పారీ్టలవారు ఏజెంట్ల నియామకంలో ఎన్నికల సంఘం నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఈ ప్రక్రియను పక్కాగా పర్యవేక్షిస్తున్నాం. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారు ఏజెంట్లుగా ఉండకూడదు. పారదర్శకంగా కౌంటింగ్‌ నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశాం.                 – శ్రీనివాసులు, చిత్తూరు అసెంబ్లీ రిటరి్నంగ్‌ అధికారి   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement