Unclaimed Deposits
-
అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల రికవరీ సులభతరం
భారతదేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఎవరూ క్లెయిమ్ చేయని డబ్బును తిరిగి చెల్లించేందుకు వీలుగా చర్యలు చేపడుతున్నాయి. బ్యాంకు ఖాతాదారులు, వారి నామినీలు రూ.78,213 కోట్లకు పైగా క్లెయిమ్ చేయని డిపాజిట్లను తిరిగి పొందడంలో సహాయపడటానికి ఒక క్రమబద్ధమైన ప్రక్రియను అవలంబించేందుకు బ్యాంకులు సన్నద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సాధారణ దరఖాస్తు ఫారాలు, డాక్యుమెంటేషన్ ప్రక్రియను 2026 ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తిగా ఆన్లైన్లో అమలులోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నాయి. ఇది భారతీయ బ్యాంకింగ్ రంగంలో మరింత పారదర్శకతను పెంచేందుకు తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.రాష్ట్రాల బడ్జెట్తో సమానంక్లెయిమ్ చేయని డిపాజిట్లు భారత ఆర్థిక వ్యవస్థకు నిరంతర సవాలుగా మారుతున్నాయి. సేవింగ్స్ ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా ఇతర బ్యాంకింగ్ సాధనాల్లో తరచుగా నిధులు పేరుకుపోతున్నాయి. ఖాతాదారులు తమ డబ్బును ఉపసంహరించుకోవడంలో విఫలమైనప్పుడు లేదా నామినీలకు వారి అర్హతల గురించి తెలియనప్పుడు ఇది మరింతగా పెరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరూ క్లెయిమ్ చేయని రూ.78,213 కోట్ల డబ్బు బ్యాంకుల వద్ద మూలుగుతుంది. ఈ మొత్తం కొన్ని రాష్ట్రాల వార్షిక బడ్జెట్తో సమానం ఉండడం గమనార్హం.డిజిటలైజేషన్ వల్ల లాభాలు..ప్రస్తుత నిబంధనల ప్రకారం అన్క్లెయిమ్డ్ నగదును క్లెయిమ్ చేయాలంటే విస్తృతమైన పేపర్ వర్క్, వ్యక్తిగత విజిట్లు ఉంటున్నాయి. దాంతో చాలామంది వీటిని క్లెయిమ్ చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. అయితే దీన్ని సరళతరం చేస్తూ కొన్ని కామన్ అప్లికేషన్ ఫారాలను ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనలున్నాయి. ఇది కార్యరూపం దాలిస్తే బ్యాంకులకు అతీతంగా ఆన్లైన్లో కామన్ వివరాలు నమోదు చేసేందుకు వీలవుతుంది. ఇది ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది. దీనితో పాటు అవసరమైన డాక్యుమెంట్ల ప్రామాణీకరణ గందరగోళం, జాప్యాన్ని తగ్గిస్తుంది. నామినీలు లేదా ఖాతాదారులు ఇకపై బ్యాంక్ నిర్దిష్ట పేపర్ వర్క్ కోసం కష్టపడాల్సిన అవసరం ఉండదు.ఇదీ చదవండి: బంగారు ఆభరణాలు అమ్మితే పన్ను చెల్లించాలా?ఇంటర్నెట్ వాడుతున్న వారికి ప్రయోజనం2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ మొత్తం పునరుద్ధరణ ప్రక్రియ ఆన్లైన్లో అందుబాటులోకి రానుంది. ఈ మార్పు దరఖాస్తుదారులు అప్లికేషన్ సమర్పించడానికి, పత్రాలను అప్లోడ్ చేయడానికి, వారి అభ్యర్థనలను తాము ఉన్న ప్రదేశంలో నుంచే ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇటీవలి అంచనాల ప్రకారం 80 కోట్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులన్న దేశంలో ఇలా ఆన్లైన్లో క్లెయిమ్ సేవలందించడం ఎంతో తోడ్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారికి ఇది కీలకంగా మారనుందని చెబుతున్నారు. -
సంపద వెలికితీద్దాం పదండి..!
ఎప్పుడో పది, ఇరవై ఏళ్ల క్రితం బ్యాంకులో డిపాజిట్ చేసి మర్చిపోయారా..? తల్లిదండ్రులు లేదా పూర్వికుల పేరిట స్టాక్, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు మరుగున పడి ఉన్నాయా?.. ఏమో ఎవరు చూసొచ్చారు. ఓసారి విచారిస్తేనే కదా తెలిసేది..! రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు క్లెయిమ్ లేకుండా, నిష్ప్రయోజనంగా ఉండిపోయినట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో సుమారు రూ.78,200 కోట్లు బ్యాంకు డిపాజిట్ల రూపంలో ఉన్నాయి.ఫిజికల్ షేర్ల రూపంలో ఉన్న మొత్తం సుమారు రూ.3.8 లక్షల కోట్లు. రూ.36 వేల కోట్లు మ్యూచువల్ ఫండ్స్ రూపంలో ఉంటే, క్లెయిమ్ చేయని డివిడెండ్లు రూ.5 వేల కోట్ల పైమాటే. ఉలుకూ, పలుకూ లేకుండా ఉండిపోయిన ఈ పెట్టుబడులకు అసలు యజమానులు ఎవరు, నిజమైన వారసులు ఎవరు?.. ఏమో అందులో మన వాటా కూడా ఉందేమో..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం... – సాక్షి, బిజినెస్ డెస్క్ కుటుంబ యజమాని తాను చేసిన పెట్టుబడుల వివరాలను జీవిత భాగస్వామితో పంచుకునే అలవాటు గతంలో అతి కొద్ద మందిలోనే ఉండేది. స్టాక్ మార్కెట్ ఆరంభంలో ఇన్వెస్ట్ చేసి, కాలం చేసిన వారి పేరిట పెట్టుబడుల వివరాలు కుటుంబ సభ్యులకు తెలియకపోవచ్చు కూడా. ఇంట్లో ఆధారాలుంటే తప్పించి ఆయా పెట్టుబడుల గురించి తెలిసే అవకాశం లేదు. అవేవో పత్రాలనుకుని, పక్కన పడేసిన వారు కూడా ఉండొచ్చు.లేదా భౌతిక రూపంలోని షేర్ సర్టీఫికెట్లు కనిపించకుండా పోవచ్చు. ఎక్కడో పెట్టి మర్చిపోవచ్చు. ఏళ్లకేళ్లకు క్లెయిమ్ లేకుండా ఉండిపోయిన పెట్టుబడులు ‘ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ’ (ఐఈపీఎఫ్ఏ/పెట్టుబడిదారుల అక్షరాస్యత, సంరక్షణ నిధి)కు బదిలీ అయిపోతాయి. ఐఈపీఎఫ్ఏ కిందకు ఇలా చేరిపోయిన లిస్టెడ్ కంపెనీల షేర్ల విలువ ఎంతన్నది అధికారిక సమాచారం లేదు. సెబీ నమోదిత ‘ఫీ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఎల్ఎల్పీ’ అంచనా ప్రకారం.. ఈ మొత్తం 2024 మార్చి నాటికి సుమారు రూ.77,033 కోట్లుగా ఉంటుంది. ఐఈపీఎఫ్ఏ కిందికి..లిస్టెడ్ కంపెనీలకు సంబంధించి వాటాదారులు వరుసగా ఏడు సంవత్సరాలు, అంతకుమించి డివిడెండ్ క్లెయిమ్ చేయకపోతే కంపెనీల చట్టంలోని సెక్షన్ 124 కింద ఆయా వాటాలను ఐఈపీఎఫ్ఏ కిందకు కంపెనీలు బదిలీ చేయాలి. గతంలో డివిడెండ్లు ఎన్క్యాష్ (నగదుగా మార్చుకోవడం) కాకపోవడం, చిరునామాలో మార్పులతో అవి కంపెనీకి తిరిగి వచ్చేవి. నేటి రోజుల్లో డీమ్యాట్ ఖాతాతో అనుసంధానమై ఉన్న బ్యాంక్ ఖాతా ఇనాపరేటివ్ (కార్యకలాపాల్లేని స్థితి)గా మారిన సందర్భాల్లో వాటాదారులకు డివిడెండ్ చేరదు. ఇలా పదేళ్ల పాటు కొనసాగితే, ఆయా వాటాలు ఐఈపీఎఫ్ఏ కిందకు వెళ్లిపోతాయి. గుర్తించడం ఎలా..? కార్పొరేట్ వ్యవహారాల శాఖ కింద ఐఈపీఎఫ్ఏ పనిచేస్తుంటుంది. అన్ క్లెయిమ్డ్ షేర్ల వివరాలను ప్రతి ఒక్కరూ తెలుసుకునేందుకు వీలుగా gov. in/ login పోర్టల్లో డేటాబేస్ అందుబాటులో ఉంది. ఇన్వెస్టర్లు తమ మొబైల్ నంబర్, ఈమెయిల్ వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం లాగిన్ అయి, పాన్ నంబర్ ఆధారంగా తమ పేరు, తమ తల్లిదండ్రులు, వారి పూర్వికులలో ఎవరి పాన్ నంబర్ లేదా పేరుమీద షేర్లు ఐఈపీఎఫ్ఏ కింద ఉన్నాయేమో పరిశీలించుకోవచ్చు.ఒకవేళ ఐఈపీఎఫ్ఏకు ఇంకా బదిలీ కాకుండా, కంపెనీ వద్దే ఉండిపోయిన అన్క్లెయిమ్డ్ షేర్లు, డివిడెండ్ల వివరాలు కూడా పోర్టల్లో లభిస్తాయి. ఫోలియో నంబర్తోనూ చెక్ చేసుకోవచ్చు. దీనికంటే ముందు ఒకసారి ఇల్లంతా వెతికి ఒకవేళ భౌతిక పత్రాలుంటే, వాటిని డీమ్యాట్ చేయించుకోవడం సులభమైన పని. ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్ సంస్థలు ఇన్వెస్టర్లకు పాన్ నంబర్ ఆధారంగా కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ (సీఏఎస్)ను నెలవారీగా పంపిస్తుంటాయి.ఇన్వెస్టర్ ఈమెయిల్స్ను పరిశీలించడం ద్వారా వారి పేరిట పెట్టుబడులను తెలుసుకోవచ్చు. తమ తల్లిదండ్రులు లేదా సమీప బంధువు ఇటీవలి కాలంలో మరణించినట్టయితే, వారి పేరిట పెట్టుబడులను తెలుసుకునేందుకు మరో మార్గం ఉంది. వారి ఆదాయపన్ను రిటర్నులను పరిశీలిస్తే వివరాలు తెలియొచ్చు. ఎన్ఎస్డీఎల్ లేదా సీడీఎస్ఎల్కు లేఖ రాస్తూ, తమ వారి పేరిట ఉన్న పెట్టుబడుల సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. తాము వారికి చట్టబద్ధమైన వారసులమన్న రుజువును లేఖకు జత చేయాలి. రికవరీ ఎలా..? ఐఈపీఎఫ్ఏ నుంచి షేర్లు, డివిడెండ్ను రికవరీ చేసుకోవడానికి కొంత శ్రమించక తప్పదు. ‘షేర్ సమాధాన్’ వంటి కొన్ని సంస్థలు ఫీజు తీసుకుని ఇందుకు సంబంధించి సేవలు అందిస్తున్నాయి. ఐఈపీఎఫ్ఏ వద్ద క్లెయిమ్ దాఖలు చేసి, షేర్లు, డివిడెండ్లను వెనక్కి తెప్పించుకోవడానికి చాలా సమయం పడుతుందని షేర్ సమాధాన్ చెబుతోంది.ప్రస్తుతం క్లెయిమ్ ఆమోదం/తిరస్కారానికి ఆరు నెలల నుంచి మూడేళ్ల సమయం తీసుకుంటున్నట్టు షేర్ సమాధాన్ డైరెక్టర్ శ్రేయ్ ఘోషల్ తెలిపారు. కొన్ని కంపెనీలు, ఆర్టీఏలు ఈ విషయంలో మెరుగ్గా స్పందిస్తుంటే.. కొన్నింటి విషయంలో ఒకటికి రెండు సార్లు సంప్రదింపులు నిర్వహించాల్సి వస్తున్నట్టు చెప్పారు. ఏదైనా కంపెనీలో వాటాలున్నట్టు గుర్తించి, అవి ఇంకా ఐఈపీఎఫ్ఏ కిందకు బదిలీ కాకపోతే.. కంపెనీ ఆర్టీఏను సంప్రదించాలి. నిర్దేశిత డాక్యుమెంట్లను సమర్పించి, వాటిని క్లెయిమ్ చేసుకోవచ్చు. డీమ్యాట్ చేసుకోవాలి..? 2019 ఏప్రిల్ నుంచి షేర్ల క్రయ, విక్రయాలకు అవి డీమ్యాట్ రూపంలో ఉండడాన్ని సెబీ తప్పనిసరి చేసింది. వాటాదారులు మరణించిన కేసుల్లో వారి వారసుల పేరిట బదిలీకి మాత్రం మినహాయింపు ఉంది. ఇప్పటికీ పత్రాల రూపంలో షేర్లు కలిగి ఉంటే, ఆయా కంపెనీల ఆర్టీఏలను సంప్రదించి డీమెటీరియలైజేషన్ (డీమ్యాట్) చేయించుకోవాలి. షేర్ హోల్డర్ పేరు, ఫోలియో నంబర్ వివరాలతో ఆర్టీఏను సంప్రదిస్తే.. ఏయే పత్రాలు సమర్పించాలన్నది తెలియజేస్తారు.నిబంధనల మేరకు దరఖాస్తును పూర్తి చేసి, కేవైసీ, ఇతర పత్రాలను జోడించి ఆర్టీఏకి పంపించాలి. దరఖాస్తును ఆమోదిస్తే, ధ్రువీకరణ లేఖను ఆర్టీఏ జారీ చేస్తుంది. అప్పుడు దీన్ని డీమ్యాట్ ఖాతా కలిగిన డిపాజిటరీ పార్టీసిపెంట్ (సీడీఎస్ఎల్/ఎన్ఎస్డీఎల్)కు సమర్పించిన అనంతరం షేర్లు జమ అవుతాయి. ఈ విషయంలో కొందరు బ్రోకర్లు, కన్సల్టెన్సీ సంస్థలు సేవలు అందిస్తున్నాయి. వాటి సాయం తీసుకునే ముందు ఆయా సంస్థల వాస్తవికతను నిర్ధారించుకోవడం అవసరం. బ్యాంక్ డిపాజిట్లు.. బ్యాంక్ ఖాతాలో రెండేళ్లకు పైగా ఎలాంటి లావాదేవీ లేకపోతే అది ఇనాపరేటివ్గా మారిపోతుంది. ఖాతాదారు మరణించిన సందర్భంలో ఇలా జరగొచ్చు. అటువంటప్పుడు మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు నామినీ తన కేవైసీ డాక్యుమెంట్లను బ్యాంక్ శాఖలో సమర్పించాలి. ఖాతాను మూసేసి, అందులోని బ్యాలన్స్ను నామినీకి బదిలీ చేస్తారు. ఒకవేళ నామినీ లేకపోయినప్పటికీ, ఇనాపరేటివ్ ఖాతాలో బ్యాలన్స్ రూ.25 వేల లోపు ఉంటే బ్యాంక్ స్థాయిలోనే పరిష్కరించుకోవచ్చు.అంతకుమించి బ్యాలన్స్ ఉంటే చట్టబద్ధమైన వారసులు (జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలు, సోదరులు/సోదరీమణులు) కోర్టుకు వెళ్లి సక్సెషన్ సర్టీఫికెట్ తెచ్చుకోవాలి. క్లెయిమ్ కోసం ఒకరికి మించి ముందుకు వస్తే, అప్పుడు ఇండెమ్నిటీ సర్టి ఫికెట్ను సైతం బ్యాంక్ కోరొచ్చు. డిపాజిట్ అయినా, ఖాతాలో బ్యాలన్స్ అయినా 10 ఏళ్లపాటు క్లెయిమ్ లేకుండా ఉండిపోతే, ఆ మొత్తాన్ని డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్కు బదిలీ చేయాల్సి ఉంటుంది. అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను తమ పోర్టల్లో అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ గతంలో బ్యాంక్లను ఆదేశించింది. కనుక పేరు, పుట్టిన తేదీ, పాన్ తదితర వివరాలతో తమ పేరు, తమ వారి పేరిట డిపాజిట్లు ఉన్నాయేమో బ్యాంక్ పోర్టల్కు వెళ్లి పరిశీలించుకోవచ్చు. లేదంటే బ్యాంక్ శాఖకు వెళ్లి విచారణ చేయాలి. అన్క్లెయిమ్డ్ షేర్లు డీమ్యాట్ రూపంలో ఉంటే..?⇒ అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించడం ద్వారా వాటిని తమ పేరిట బదిలీ చేయించుకోవచ్చు.⇒డీపీ వద్ద దరఖాస్తు దాఖలు చేయాలి. షేర్లు పత్రాల రూపంలో ఉంటే? ⇒ విడిగా ప్రతి కంపెనీ ఆర్టీఏ వద్ద డీమెటీరియలైజేషన్కు దరఖాస్తు చేసుకోవాలి.⇒ అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలి. అవన్నీ కచ్చితమైనవని నిర్ధారించుకున్న తర్వాత, అప్పుడు డీమ్యాట్ ఖాతాకు బదిలీ అవుతాయి. .ఐఈపీఎఫ్ఏకు బదిలీ అయిపోతే..? ⇒ వాటాలున్న ప్రతి కంపెనీ ఆర్టీఏ నుంచి ఎంటైటిల్మెంట్ లెటర్ను పొందాలి. ⇒ ఐఈపీఎఫ్–5 ఈ–ఫారమ్ను ఐఈపీఎఫ్ఏ వద్ద దాఖలు చేయాలి. ⇒ కంపెనీ ఆమోదం తర్వాత క్లెయిమ్ను ఐఈపీఎఫ్ఏ ఆమోదిస్తుంది. దాంతో షేర్లు అసలైన యజమానులు లేదా వారసులకు బదిలీ అవుతాయి. ⇒ సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ (ఎస్ఆర్ఎన్) జారీ అవుతుంది. దీని ఆధారంగా ఆయా కంపెనీల ఆర్టీఏ వద్ద 7–10 రోజుల్లోగా డాక్యుమెంట్లను సమర్పించాలి.ఫండ్స్ పెట్టుబడుల సంగతి..? బ్యాంక్ డిపాజిట్లకు, బీమా పాలసీలకు మెచ్యూరిటీ ఉంటుంది. కానీ ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు అలాంటిదేమీ ఉండదు. అయినప్పటికీ పదేళ్లకు పైగా ఒక ఫోలియోపై ఎలాంటి లావాదేవీలు లేకుండా, కేవైసీ అప్డేట్ చేయకపోతే వాటిని అన్క్లెయిమ్డ్గా పరిగణించొచ్చు. డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్కు సంబంధించి డివిడెండ్లు క్లెయిమ్ కాకపోయి ఉండొచ్చు.చిరునామా, కాంటాక్ట్ వివరాలు మారిపోయి, ఇన్వెస్టర్ మరణించిన సందర్భాలు, బ్యాంక్ ఖాతా ఇనాపరేటివ్గా మారిపోయిన కేసుల్లోనూ ఇది చోటు చేసుకోవచ్చు. ఇలాంటి పెట్టుబడులను ఐఈపీఎఫ్ఏ కిందకు బదిలీ చేసినట్టయితే, షేర్ల మాదిరే నిర్దేశిత ప్రక్రియలను అనుసరించి వాటిని సొంతం చేసుకోవచ్చు. ఫండ్స్ పెట్టబడుల వివరాలను గుర్తించేందుకు క్యామ్స్, కే–ఫిన్టెక్ సాయం తీసుకోవచ్చు.యాక్టివ్గా లేని ఫండ్స్ పెట్టుబడులను తెలుసుకునేందుకు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ‘మిత్రా’ పేరుతో (ఎంఎఫ్ పెట్టుబడుల గుర్తింపు, రికవరీ) ఒక ప్రాజెక్ట్ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ త్వరలో అందుబాటులోకి రానుంది. అప్పుడు, తమ పేరు, తమ వారి పేరిట ఉన్న ఫండ్స్ పెట్టుబడి వివరాలను సులభంగా గుర్తించొచ్చు.ఇలా చేస్తే సమస్యలకు దూరం..⇒ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు సంబంధించి (ట్రేడింగ్ ఖాతాకు అనుసంధానంగా ఉన్న) బ్యాంక్ ఖాతాను యాక్టివ్గా ఉంచుకోవాలి. ⇒ పెట్టుబడుల వివరాలను జీవిత భాగస్వామితో పంచుకోవాలి. లేదంటే ఒక డైరీలో అన్ని పెట్టుబడులు, ఆర్థిక వివరాలను నమోదు చేసి, ఇంట్లో భద్రపరచాలి. ⇒ ప్రతి పెట్టుబడికి నామినీని నమోదు చేయాలి. ⇒ వీలునామా లేదా ఎస్టేట్ ప్లానింగ్ చేసుకోవాలి. దీనివల్ల భవిష్యత్తులో వారసులకు క్లెయిమ్ సమస్యలు ఎదురుకావు. ⇒ చిరునామా, ఫోన్ నంబర్, బ్యాంక్ ఖాతా ఇలా కేవైసీకి సంబంధించి ముఖ్యమైన వివరాల్లో మార్పులు జరిగితే వెంటనే బ్యాంక్లు, మ్యూచువల్ ఫండ్స్, డీపీలు, బీమా కంపెనీల వద్ద అప్డేట్ చేసుకోవాలి. బీమా ప్రయోజనాలూ అంతే..ఎల్ఐసీ సహా కొన్ని బీమా సంస్థల పరిధిలో మెచ్యూరిటీ (గడువు) ముగిసినా, ఎలాంటి క్లెయిమ్ చేయని పాలసీలు చాలానే ఉన్నాయి. ఒక పాలసీదారు పేరిట క్లెయిమ్ చేయని మొత్తం రూ.1,000కి మించి ఉంటే, ఆ వివరాలను తమ వెబ్సైట్లలో బీమా సంస్థలు ప్రదర్శించాలని ఐఆర్డీఏఐ ఆదేశించింది. పాలసీదారు పేరు, పాలసీ నంబర్, పాన్, పుట్టిన తేదీ వివరాలతో వీటి గురించి తెలుసుకోవచ్చు. క్లెయిమ్ బ్యాంక్ డిపాజిట్ల మాదిరే ఉంటుంది. -
బ్యాంకుల్లో అన్క్లైమ్డ్ డిపాజిట్లు రూ.78,213 కోట్లు
బ్యాంకుల్లో అన్క్లైమ్డ్ డిపాజిట్ల విలువ 2024 మార్చితో గడచిన ఒక్క ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 26 శాతం పెరిగి రూ.78,213 కోట్లకు చేరింది. ఖాతాదారులు లేదా వారసుల కోసం ఒకవైపు ప్రయతి్నస్తూనే... మరోవైపు ఇలా ఎవ్వరూ క్లైమ్ చేయకుండా మిగిలిపోయిన మొత్తాలను డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎవేర్నెస్ ఫండ్లో (డీఈఏ) బదలాయించడం జరుగుతుంది. ఈ ఫండ్ ఇలాంటి నిధుల మొత్తం 2023 మార్చి నాటికి రూ.62,225 కోట్లు ఉంది. బ్యాంకులు 10 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలుగా తమ ఖాతాలలో ఉన్న క్లెయిమ్ చేయని డిపాజిట్లను ఆర్బీఐ పర్యవేక్షణలోని డీఈఏకు బదలాయిస్తాయి. ⇒ భారత్ ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్తో ప్రారంభమైన ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలోనూ 7 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుంది. కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, వాటిని సమతౌల్యం చేసే సానుకూల పరిస్థితులూ ఉన్నాయి. 2022–23లో ఎకానమీ 7 శాతం పురోగమిస్తే, 2023–24లో వాస్తవిక జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతంగా నమోదుకానుంది. 2024–25లో వృద్ధి రేటు 7 శాతంగా నమోదయ్యే వీలుంది. తద్వారా ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీగా భారత్ తన హోదాను కొనసాగించనుంది. ⇒ ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ 2024 మార్చి 31 నాటికి 11.08 శాతం వృద్ధితో రూ.70.48 లక్షల కోట్లకు చేరింది (దాదాపు 845 బిలియన్ డాలర్లు). పాకిస్తాన్ జీడీపీ 340 బిలియన్ డాలర్లకంటే ఇది 2.5 రెట్లు అధికం. ⇒ అంతర్జాతీయంగా దేశీయ కరెన్సీ రూపీని మరింత చలామణీలోకి తేవడంలో భాగంగా భారత్ వెలుపల నివసిస్తున్న వ్యక్తులు (పీఆర్వోఐ) విదేశాల్లోనూ రూపీ అకౌంట్లను తెరిచేందుకు అనుమతి.⇒ 2023–24 ఆర్థిక సంవత్సరంలో సావరిన్ గోల్డ్ బాండ్లలో ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ భారీగా పెరిగి రూ.27,031 కోట్లకు చేరింది. పరిమాణంలో ఈ విలువ 44.34 టన్నులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. 2022–23లో ఈ విలువ, పరిమాణం వరుసగా రూ.6,551 కోట్లు, 12.26 టన్నులుగా ఉంది. 2015లో ఈ పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి 67 విడతల్లో విక్రయాలు జరిగాయి. రూ.72,274 కోట్లు సమకూరగా, పరిమాణంలో 146.96 టన్నులకు ఈ విలువ ప్రాతినిధ్యం వహిస్తోంది. ⇒ బ్యాంకింగ్ రంగంలో మోసాల సంఖ్య మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారీగా 13,564 నుంచి 36,075కు ఎగసింది. అయితే మోసాలకు సంబంధించిన విలువ మాత్రం 46.7 శాతం పడిపోయి రూ.13,930కోట్లకి చేరింది. -
బ్యాంకుల్లో రూ .78,213 కోట్లు.. ఎవరిదీకానిది ఈ సొమ్ము!
దేశంలోని వివిధ బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు భారీగా పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గురువారం విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం.. బ్యాంకుల వద్ద ఉన్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు 2024 మార్చి చివరి నాటికి 26 శాతం పెరిగి రూ .78,213 కోట్లకు చేరుకున్నాయి.సహకార బ్యాంకులతో సహా వివిధ బ్యాంకుల్లో 10 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ కాలం ఇన్యాక్టివ్గా ఉన్న ఖాతాల్లోని సొమ్మును అన్క్లెయిమ్డ్గా పరిగణించి ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ నిధికి బదిలీ చేస్తాయి. ఇలా 2023 మార్చి నాటికి డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్లో ఉన్న మొత్తం రూ.62,225 కోట్లు.ఖాతాదారులకు సహాయపడటానికి మరియు ఇన్యాక్టివ్ ఖాతాలకు సంబంధించి ఇప్పటికే ఉన్న సూచనలను క్రమబద్ధీకరించడానికి, రిజర్వ్ బ్యాంక్ ఈ ఏడాది ప్రారంభంలో సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. ఖాతాలు, డిపాజిట్లను ఇన్ యాక్టివ్ లేదా అన్ క్లెయిమ్డ్ గా వర్గీకరించడంతోపాటు బ్యాంకులు అమలు చేయాల్సిన చర్యలను ఈ మార్గదర్శకాల్లో పొందుపరిచారు.నవీకరించిన మార్గదర్శకాలు అన్ని వాణిజ్య బ్యాంకులు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో సహా), సహకార బ్యాంకులకు వర్తిస్తాయి. 2024 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. వివిధ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లను కేంద్రీకృత పద్ధతిలో వెతికే ప్రక్రియను సులభతరం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఉడ్గామ్ (అన్ క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్) అనే వెబ్ పోర్టల్ను రూపొందించింది. -
అన్క్లెయిమ్డ్ డిపాజిట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం!
ముంబై: క్లెయిమ్ చేయని డిపాజిట్ల విషయంలో ఆర్బీఐ సమగ్ర మార్గదర్శకాలు వెలువరించింది. సదరు ఖాతాదారుల ఆచూకీ తెలుసుకునేందుకు తరచుగా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని బ్యాంకులకు సూచించింది. ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను తగ్గించేందుకు, ఆ నిధులను వాటి అసలు యజమానులకు తిరిగి అందించేందుకు బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ తీసుకుంటున్న చర్యలకు ఈ మార్గదర్శకాలు అదనంగా ఉండనున్నాయి. నోటిఫికేషన్ ప్రకారం వినియోగంలో లేని ఖాతాలు, అన్క్లెయిమ్డ్ డిపాజిట్లకు సంబంధించి లేఖలు, ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఖాతాదారులను సంప్రదించేందుకు బ్యాంకులు ప్రయత్నించాలి. ఈమెయిల్/ఎస్ఎంఎస్లను మూడు నెలలకోసారి ప్రాతిపదికన పంపాలి. అవసరమైతే ఖాతాదారును కనుగొనేందుకు ఇంట్రడ్యూసర్ను, నామినీని కూడా సంప్రదించాలి. -
చనిపోయినవారి ఖాతాలో డబ్బులు ఏమౌతాయి..?
బ్యాంకుల వద్ద క్లెయిమ్ చేసుకోకుండా మిగిలిపోయిన డిపాజిట్లు ఏటా పెరుగుతున్నాయి. అందులో కొందరు ఖాతాదారులు చనిపోయి ఉంటారు. మరికొందరు ఇతర కారణాల వల్ల వారి డబ్బుకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు చేయరు. దాంతో అవి ఎవరు క్లెయిమ్ చేయకుండా అలాగే బ్యాంకుల్లో పోగవుతాయి. అలా అని ఆ డబ్బును బ్యాంకు వాటి కార్యకలాపాలకు ఉపయోగించేందుకు మాత్రం నిబంధనలు ఒప్పుకోవు. కచ్చితంగా ఆ డబ్బును సదరు ఖాతాదారులకే చెల్లించేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అయితే ఎవరు క్లెయిమ్ చేయని (అన్క్లెయిమ్డ్) డిపాజిట్లు ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.42,270 కోట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాది కాలంతో పోలిస్తే 28 శాతం పెరిగాయి. పది లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాటు పనిచేయకుండా ఉన్న అకౌంట్లలోని డిపాజిట్లను అన్క్లెయిమ్డ్ డిపాజిట్లుగా పరిగణిస్తారు. కిందటేడాది మార్చి 31 నాటికి రూ.32,934 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయి. అవి ఈ ఏడాది మార్చి నాటికి రూ.42,272 కోట్లకు చేరిందని ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్ కే కరాద్ పార్లమెంట్లో వెల్లడించారు. ఈ ఫండ్స్ను ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (డీఈఏ)ఫండ్లో ఉంచుతారు. ఈ అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను తిరిగి సదరు ఖాతాదారులకు పంపేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకుంటోందని కరాద్ వెల్లడించారు. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లకు సంబంధించిన పూర్తి వివరాలను బ్యాంకులు తమ వెబ్సైట్లో ఉంచాలని ఇప్పటికే ఆర్బీఐ సూచించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ ఖాతాలకు సంబంధించి కస్టమర్లను సంప్రదించాలని, ఒకవేళ అకౌంట్ హోల్డర్ చనిపోతే వారి లీగల్ వారసులకు వివరాలు అందించాలని ఆర్బీఐ ఆదేశించింది. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను గుర్తించేందుకు బోర్డు ఆమోదంతో కొన్ని రూల్స్ రెడీ చేయాలని, గ్రీవెన్స్ రిడ్రస్సల్ మెకానిజంను ఏర్పాటు చేయాలని తెలిపింది. అన్క్లెయిమ్డ్ డిపాజిట్ స్టేటస్ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలని ఆర్బీఐ సలహా ఇచ్చిందని మంత్రి పేర్కొన్నారు. రూ.1,432.68 కోట్లు రిటర్న్.. డిపాజిట్ల వివరాలు తెలుసుకునేందుకు సెంట్రలైజ్డ్ వెబ్సైట్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్వే టూ యాక్సెస్ ఇన్ఫర్మేషన్ ను ఆర్బీఐ అందుబాటులోకి తీసుకొచ్చిందని కరాద్ అన్నారు. దీనికి తోడు ‘100 డేస్ 100 పేస్’ క్యాంపెయిన్ను కూడా ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాల్లోని టాప్ 100 అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను 100 రోజుల్లో బ్యాంకులు సెటిల్ చేయనున్నాయి. ఈ ప్రచారం ఈ ఏడాది జూన్ 1న మొదలై సెప్టెంబర్ 8 వరకు కొనసాగిందని మంత్రి వెల్లడించారు. క్యాంపెయిన్ ముగిసే సమయానికి 31పెద్ద బ్యాంకులు రూ.1,432.68 కోట్లను నిబంధనల ప్రకారం అర్హత ఉన్న వారికి రిటర్న్ చేసినట్లు వివరించారు. ఇదీ చదవండి: జీడీపీలో తగ్గుతున్న వ్యవసాయం వాటా.. కారణం చెప్పిన మంత్రి -
బ్యాంకుల్లో మిగిలిపోయిన డిపాజిట్లు.. మీవీ ఉన్నాయా? ఆర్బీఐ పోర్టల్లో చెక్ చేయండి..
ముంబై: అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను అన్వేషించేందుకు, క్లెయిమ్ చేసుకునేందుకు తోడ్పడేలా కేంద్రీకృత వెబ్ పోర్టల్ ఉడ్గమ్ (అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ – గేట్వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్)ను గురువారం రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రారంభించారు. వివిధ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయకుండా ఉండిపోయిన తమ డిపాజిట్లన్నింటి గురించిన వివరాలను కస్టమర్లు ఒకే చోట తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (రెబిట్), ఇండియన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ అండ్ అలైడ్ సర్వీసెస్ (ఐఎఫ్టీఏఎస్), భాగస్వామ్య బ్యాంకులు కలిసి దీన్ని రూపొందించాయి. ప్రస్తుతం ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ధన్లక్ష్మి బ్యాంక్, సౌతిండియా బ్యాంక్, డీబీఎస్ బ్యాంక్ ఇండియా, సిటీబ్యాంక్ వంటి ఏడు బ్యాంకుల్లోని అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలు ఈ పోర్టల్లో ఉన్నాయి. ఇతర బ్యాంకుల వివరాలను కూడా అక్టోబర్ 15 నాటికి దశలవారీగా అందుబాటులోకి తేనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి దాదాపు రూ. 35,000 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆర్బీఐకి బదలాయించాయి. సిసలైన యజమానులు, లబ్ధిదారులకు ఆయా డిపాజిట్లను అందించాలనే ఉద్దేశంతో ఆర్బీఐ పలు చర్యలు తీసుకుంటోంది. ఇదీ చదవండి: గుడ్న్యూస్: అత్యధిక వడ్డీ స్కీమ్ గడువు పొడిగింపు -
బ్యాంకుల్లో మూలుగుతున్న డిపాజిట్లు..అంత డబ్బును బ్యాంక్లు ఏం చేశాయంటే?
న్యూఢిల్లీ: బ్యాంకింగ్లో ఎవ్వరూ క్లెయిమ్ చేయని రూ.48,461.44 కోట్లను 2023 మార్చి 31వ తేదీ నాటికి డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ (డీఈఏఎఫ్)కు బదలాయించినట్లు ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. 16,79,32,112 కోట్లకు ఈ నిధులు సంబంధించినవని కూడా ఆయన తెలిపారు. రెండు సంవత్సరాలకుపైగా నిర్వహణలో లేని ఖాతాలకు సంబంధించి ఖాతాదారులు/చట్టబద్ధమైన వారసుల ఆచూకీని కనుగొనడం కోసం ప్రత్యేక డ్రైవ్ను ప్రారంభించే అంశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని బ్యాంకులకు సూచించినట్లు మంత్రి వెల్లడించారు. కార్పొరేట్ వ్యవహారా శాఖ సహాయమంత్రి కూడా అయిన కరాద్ చేసిన ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు... ►ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ (ఐఈపీఎఫ్) వద్ద ఉన్న నిధులు మొత్తం (31 మార్చి 2023 నాటికి) రూ.5,715 కోట్లు. ►2018లో దేశం నుంచి పారిపోయిన ఆర్థిక నేరస్తులపై చట్టం అమల్లోకి వచ్చింది. 2023 ఆగస్టు 2వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపిన సమాచారం ప్రకారం, ఎనిమిది మంది ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులు దేశం నుంచి పారిపోయారు. ఆగస్టు 2 నాటికి పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల నేరాలకు సంబంధించి రూ. 34,118.53 కోట్ల జప్తు జరిగింది. అందులో రూ. 15,838.91 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. జప్తయిన ఆస్తులను ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిధిలో ఉంచడం జరిగింది. ►ఉద్దేశపూర్వక ఎగవేతదారులు రాజీ పరిష్కారాన్ని అమలు చేసిన తర్వాత 12 నెలల వరకు తాజా రుణాన్ని పొందలేరు. ►జూలై 1 నాటి ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించి ఆర్బీఐ మాస్టర్ సర్క్యులర్ ప్రకారం, ఉద్దేశపూర్వక ఎగవేతదారు లేదా మోసం అని వర్గీకరణ కిందకు చేరినవారు రుణగ్రహీతలకు శిక్షార్హులు అవుతారు. ►రూ. 500 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ రుణ పరిమాణం కలిగిన షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్లు (ఎస్సీబీ), అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్లు (యూసీబీ), రూ. 5 కోట్లు, అంతకంటే ఎక్కువ మొత్తం రుణాలకు సంబంధించి రుణగ్రహీతల నిర్దిష్ట క్రెడిట్ సమాచారాన్ని సెంట్రల్ రిపోజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్కు(సీఆర్ఐఎల్సీ) తెలియజేయాలి. ►ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎన్బీ) ఫిబ్రవరి 2023 నాటికి గడచిన 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఆపరేట్ చేయని దాదాపు రూ.35,012 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)కి బదిలీ చేశాయి. ఇవి దాదాపు రూ.10.24 కోట్ల అకౌంట్లకు సంబంధించినవి. సంబంధిత బదలాయింపులకు సంబంధించి తొలి స్థానాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (రూ.8,086 కోట్లు), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (రూ.5,340 కోట్లు), కెనరా బ్యాంక్ (రూ.4,558 కోట్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ.3,904 కోట్లు) ఉన్నాయి. చదవండి👉 బ్యాంకుల్లో 'అన్క్లెయిమ్డ్ డిపాజిట్', అందులో పేరుంటే మీకే సొంతం.. చెక్ చేసుకోండిలా! -
బ్యాంకుల్లో 'అన్క్లెయిమ్డ్ డిపాజిట్', అందులో పేరుంటే మీకే సొంతం.. చెక్ చేసుకోండిలా!
ఈ ఏడాది 2023-24కు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టాక మే నెలలో తొలి ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి(ఎఫ్ఎస్డీసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేశ ఆర్థిక వ్యవస్థపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ క్లయిమ్ డిపాజిట్లపై మాట్లాడారు. వీలైనంత త్వరగా బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేసి మరిచి పోయినా, లేదంటే అన్వేక కారణాల వల్ల తీసుకోలేకపోయిన ఖాతాదారులకు లేదంటే వారి కుటుంబ సభ్యులకు అందేలా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ సైతం అన్ క్లయిమ్ డిపాజిట్ల యుద్ధప్రాతిపదికన లబ్ధి దారులకు చేరేలా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో బ్యాంక్కు సంబంధించిన సేవింగ్ అకౌంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్లలో డబ్బులు దాచి మరచిపోయిన సొమ్మును లబ్ధిదారులకు అందించేలా 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేలా బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమం జూన్ 1నుంచి మొదలవుతుందని ఆర్బీఐ ప్రకటించింది. దీంతో పలు బ్యాంక్లు 'అన్క్లెయిమ్డ్ డిపాజిట్'లను తెలుసుకునేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశాయి. క్లెయిమ్ చేయని బ్యాంక్ డిపాజిట్లు అంటే ఏమిటి ? బ్యాంక్కు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ , ఫిక్స్డ్ డిపాజిట్లలో డబ్బులు దాచి మరచిపోయిన వారెందరో. అయితే ఇలా వివిధ బ్యాంక్లలో మర్చిపోయిన సొమ్ము మొత్తం దాదాపు రూ.35 వేల కోట్ల మేర ఉందని ఆర్బీఐ ఇటీవల ప్రకటించింది. ఆ భారీ మొత్తాన్ని లబ్ధి దారులకు చేరేలా బ్యాంక్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఒక వేళ అన్వేక కారణాల వల్ల మనకు తెలియకుండా కుటుంబ సభ్యులు బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు దాచారో? లేదో? తెలుసుకోవచ్చు. వాటిని తిరిగి తీసుకోవచ్చు. ఆ మొత్తాన్ని బ్యాంకుల నుంచి ఎలా తిరిగి తీసుకోవాలో తెలుసుకుందాం. హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లను ఇలా తనిఖీ చేయండి ►ముందుగా ఇక్కడ పేర్కొన్న (https://leads.hdfcbank.com/applications/webforms/apply/HDFC_Inoperative_acc/HDFC_Inoperative_acc.aspx) లింక్ ను క్లిక్ చేయాలి. ► ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు అన్క్లెయిమ్డ్ డిపాజిట్ అనే సెర్చ్ బార్ కనిపిస్తుంది. ►ఆ సెర్చ్ బార్లో మీ పేరు ఎంటర్ చేయాలి. ట్యాప్ చేస్తే మీరు ఏ బ్రాంచ్ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేశారో తెలుపుతుంది. ఒకవేళ మీ అన్ క్లయిమ్డ్ డిపాజిట్లు ఉంటే బ్యాంకుల్ని సందర్శించాలి. అకౌంట్లో ఉన్న డబ్బుల్ని డ్రా చేసుకోవాలి. ఇందుకోసం ఆయా బ్యాంకుల నిబంధనలు పాటించాలి. ►కస్టమర్లు వ్యక్తిగతంగా సమీప బ్రాంచ్ని సందర్శించాలి. ►అక్కడ మీరు డబ్బుల్ని ఎందుకు క్లయిమ్ చేసుకోలేదో లేఖ రాయాలి. పర్సనల్ అకౌంట్స్లో డబ్బుల్ని పొందాలంటే ►అడ్రస్ ప్రూఫ్తో పాటు ఇతర బ్యాంకుకు కావాల్సిన వ్యక్తిగత వివరాల్ని అందించాలి ► వీటితో పాటు ఆయా బ్యాంకుల రూల్స్కు అనుగుణంగా అప్లయి చేయాలి. పర్సనల్ అకౌంట్లు కాకపోతే ► ఆయా బ్యాంక్లకు రిక్వెస్ట్ లెటర్లు రాయాలి. ఉపయోగంలో ఉన్న ఐడీ కార్డులతో పాటు సంతకాలు చేయాలి ► అడ్రస్ ప్రూఫ్లను సబ్మిట్ చేయాలి. అనంతరం బ్యాంక్ అధికారులు ఆయా ఖాతాలను క్షణ్ణంగా పరిశీలించి మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తారు. చదవండి👉 ఊహించని విధంగా వందల కోట్ల నష్టం.. 50 స్క్రీన్లను మూసేస్తున్న పీవీఆర్? -
ఆర్బీఐ కీలక నిర్ణయం..బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక!
ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు వద్ద తమ దగ్గర ఖాతాదారులు క్లెయిమ్ చేయకుండా ఉండిపోయిన డిపాజిట్లను తగ్గించుకునేందుకు 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేలా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమం జూన్ 1 నుంచి మొదలవుతుందని ఆర్బీఐ ప్రకటించింది. ఇటీవల అన్ క్లయిమ్ డిపాజిట్లపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ పార్లమెంట్లో మాట్లాడుతూ.. ప్రభుత్వ బ్యాంకుల్లో క్లయిం చేయని డిపాజిట్లు వేల కోట్లలో పేరుకుపోయాయని వాటిని ఆర్బీఐ ఆధ్వర్యంలోని ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్’కు బ్యాంకులు బదిలీ చేసినట్లు తెలిపారు. తాజాగా, ఆర్బీఐ బ్యాంకుల్లో మూలుగుతున్న వేలకోట్ల డిపాజిట్లపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా బ్యాంక్లు తమ దగ్గర అన్క్లెయిమ్డ్గా ఉన్న టాప్–100 డిపాజిట్లను ఖాళీ చేయడంపై (తిరిగి చెల్లించడం/క్లియరెన్స్) దృష్టి పెడతాయని వెల్లడించింది. పదేళ్లుగా ఎలాంటి లావాదేవీలు లేని సేవింగ్స్/కరెంట్ ఖాతాల్లోని డిపాజిట్లు, గడువు ముగిసిపోయి పదేళ్లు అయినా తీసుకోకుండా ఉండిపోయిన టర్మ్ డిపాజిట్ల మొత్తాన్ని బ్యాంక్లు అన్క్లెయిమ్డ్ డిపాజిట్లుగా పరిగణిస్తుంటాయి. పదేళ్లు ముగిసిన అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను బ్యాంక్లు ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్’కు బదిలీ చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా బ్యాంక్లు ప్రతీ జిల్లా పరిధిలో టాప్–100 అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల సంబంధీకులను గుర్తించి చెల్లింపులు చేసేందుకు చర్యలు చేపడతాయని ఆర్బీఐ తన ప్రకటనలో పేర్కొంది. రూ.35వేల కోట్లు.. ఏదైనా బ్యాంకు ఖాతాలోని నగదు పదేళ్లుగా లేదా అంతకు ముందు నుంచీ వాడుకలో లేకుండాపోతే, దాన్ని అన్క్లెయిమ్డ్ డిపాజిట్గా పరిగణిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అటువంటి 10.24 కోట్ల ఖాతాలకు చెందిన రూ.35,012 కోట్లను ప్రభుత్వరంగ బ్యాంకులు ఆర్బీఐకు మరలించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వీటిలో ఎస్బీఐవే అత్యధికంగా రూ.8,086 కోట్లు ఉండగా.. రూ.5,340 కోట్లతో పంజాబ్ నేషనల్ బ్యాంకు రెండో స్థానంలో నిలిచింది. చదవండి👉 కడుపు నిండా తిండి పెట్టి.. ఉదయాన్నే చావు కబురు చల్లగా చెప్పిన ఐటీ సంస్థ!