అంత్యక్రియలయ్యాక నాలుగు రోజులకు.. | - | Sakshi
Sakshi News home page

అంత్యక్రియలయ్యాక నాలుగు రోజులకు..

Published Wed, Nov 27 2024 7:59 AM | Last Updated on Wed, Nov 27 2024 10:53 AM

-

ఎముకల సేకరణ

మృతుడి బంధువు ఫిర్యాదు మేరకే అన్న అధికారులు

ఇల్లంతకుంట(మానకొండూర్‌): ఓ వ్యక్తి అంత్యక్రియలు పూర్తయిన నాలుగు రోజులకు మృతుడి ఎముకలు సేకరించిన ఘటన ఇల్లంతకుంట మండలంలోని ఓబులాపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓబులాపురం గ్రామానికి చెందిన పెంటల శ్రీనివాస్‌(35) గత శుక్రవారం రాత్రి ఇంట్లోనే నిద్రించాడు.

 శనివారం ఉదయం అతను మృతిచెందినట్లు కుటుంబసభ్యులు గుర్తించారు. అదేరోజు సాయంత్రం దహన సంస్కారాలు నిర్వహించారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కాగా, శ్రీనివాస్‌ మృతిపై అనుమానం ఉందని బంధువుల్లో ఒకరు ఇల్లంతకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో తహసీల్దార్‌ ఎంఏ.ఫారుక్‌, ఎస్సై శ్రీకాంత్‌ గౌడ్‌, సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు ఫాతిమా మంగళవారం ఓబులాపురం చేరుకున్నారు. మృతుడిని దహనం చేసిన స్థలానికి వెళ్లి, వైద్య సిబ్బంది సహకారంతో ఎముకలు సేకరించారు. వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించనున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement