Karimnagar District Latest News
-
హనుమాన్ విజయ యాత్రకు పటిష్ట బందోబస్తు
కరీంనగర్క్రైం: హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా ఈనెల 12వ తేదీ శనివారం కరీంనగర్లో నిర్వహించనున్న శ్రీ వీరహనుమాన్ విజ య యాత్రకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. టౌన్ ఏసీపీ కార్యాలయంలో గురువారం డివి జన్లోని పోలీసు అధికారులతో సమావేశం అయ్యారు. యాత్ర వైశ్య భవన్ పక్కన గల రామాలయం నుంచి ప్రారంభమై రాజీవ్ చౌక్, టవర్సర్కిల్, గంజ్ రోడ్, రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తా, కమాన్ రోడ్ మీదుగా, బస్టాండ్, తెలంగాణ చౌక్, ఐబీచౌరస్తా, కోర్ట్ చౌరస్తా , మంచిర్యాల చౌరస్తా, గాంధీ విగ్రహం వీదుగా రామాలయం చేరుకుంటుందని తెలిపారు. ఈ యాత్రకు 500మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నాలా సమస్య పరిష్కరిస్తాం కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని శర్మనగర్, సాహెత్నగర్లకు ఇబ్బందిగా మారిన నాలా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్ అన్నా రు. గురువారం నగరంలోని 44వ డివిజన్ పరి ధి శర్మనగర్లో నాలాను పరిశీలించారు. ప్రతి వర్షాకాలం నాలాతో ఎదురవుతున్న సమస్యలను మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను పరిష్కరించాలని కమిషనర్ ఇంజినీరింగ్ అధి కారులకు సూచించారు. అనంతరం ఎన్టీఆర్చౌరస్తాలోని డ్రైనేజీ మరమ్మతు పనులను తనిఖీచేసి, వేగవంతం చేయాలని ఆదేశించారు. సహాయ కమిషనర్ వేణు మాధవ్, డీఈ ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో కోత వద్దు కరీంనగర్ అర్బన్: రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యంలో ఎలాంటి తరు గు, కోతలు విధించవద్దని చొప్పదండి ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్తో కలిసి యాసంగి ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాలశాఖ అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బ ంలు రాకుండా చూడాలన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ జిల్లాలో గత పంట సీజన్లలో ఎలాంటి కోతలూ లేకుండా ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం అదే తరహాలో కొనుగోళ్లు జరపాలని అన్నారు. పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.రజనీకాంత్, జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, రైస్మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బోయినపల్లి నర్సింగరావు, మిల్లర్లు పాల్గొన్నారు. మార్కెట్ కార్యదర్శిగా హమీద్కరీంనగర్ అర్బన్: మార్కెటింగ్శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం ‘సాక్షి’లో ‘56పోస్టులు.. 40 ఖాళీలు’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. కరీంనగర్ మార్కెట్ కార్యదర్శిగా పెద్దపల్లి గ్రేడ్–3 కార్యదర్శి సయ్యద్ హమీద్ అలీని ఎఫ్ఎసీగా నియమించగా గంగాధర మార్కెట్కు అక్కడే సూపర్వైజర్గా పనిచేసే లక్ష్మ ణ్ను ఇన్చార్జిగా నియమించారు. కాగా జిల్లా మార్కెటింగ్ ఇన్చార్జి అధికారి షాబోద్దీన్ పత్రికా ప్రకటన విమర్శలకు తావి స్తోంది. మార్కెట్ కమిటీలో సి బ్బంది కొరత లేదని పేర్కొనడం విడ్డూరం. ‘మీ సేవ’లపై నిఘాకరీంనగర్ అర్బన్: ధ్రువపత్రాల జారీలో అలసత్వం, మీ సేవ కేంద్రాల్లో విచ్చలవిడి దోపిడీకి అడ్డుకట్ట వేసేలా కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక దృష్టిసారించారు. ఈ నెల 8న ‘సాక్షి’లో ‘యువ వికాసంలో దళారుల దందా’ శీర్షికన కథనం ప్రచురితం కాగా ఆయా శాఖల అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మీ సేవ కేంద్రాల్లో నిర్ణీత రుసు ము మాత్రమే వసూలు చేయాలని, రూపాయి ఎక్కువ తీసుకున్నా సీజ్ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇక దళారులకు ఎలాంటి అవకాశమివ్వవద్దని,దరఖాస్తుదారులు మాత్ర మే కార్యాలయాలకు వచ్చేలా పర్యవేక్షణ చేయాలని తహసీల్దార్లకు నిర్దేశించారు. ఎప్పటికప్పుడు సర్టిఫికెట్లను జారీ చేయాలని, అలసత్వం చేయొద్దని ఇప్పటికే అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ రెవెన్యూ అధికారులతో స్పష్టం చేశారు. -
శుక్రవారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
గన్నేరువరం/కరీంనగర్రూరల్: జిల్లాలోని పలుచోట్ల గురువారం వేకువజామున అకాల వర్షం బీభత్సం సృష్టించింది. అన్నదాతకు అపారనష్టం కలిగించింది. గన్నేరువరం మండలం మాదాపూర్, పీచుపల్లి, జంగపల్లి, గునుకులకొండాపూర్లో అకాల వర్షానికి చేతికందిన వరి, మొక్కజొన్న దెబ్బతిన్నాయి. మామిడితోటల్లో చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. కాయలు నేలరాలాయి. మాదాపూర్ శివారులో ఆదిరెడ్డికి చెందిన ఆరు ఎకరాల్లో వరిపూర్తిగా దెబ్బతింది. గునుకులకొండాపూర్లో న్యాలపట్ల రాజయ్యకు చెందిన దున్నపోతు మృతి చెందగా, రూ.30 వేల నష్టం వాటిల్లింది. నష్టపోయిన వరి, మొక్కజొన్న పంటను మాదాపూర్, పీచుపల్లి, జంగపల్లి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో గురువారం పరిశీలించినట్లు ఏవో కిరణ్మయి తెలిపారు. 40 మంది రైతులకు చెందిన 126 ఎకరాల వరి, ఆరుగురికి చెందిన 15 ఎకరాల మొక్కజొన్న నష్టపోయినట్లు నివేదించామని వివరించారు. గురువారం సాయంత్రం ఒక్కసారిగా మబ్బులు కమ్మడంతో కరీంనగర్ రూరల్ మండలం మొగ్ధుంపూర్, చెర్లభూత్కూర్ తదితర గ్రామాల్లో పలువురు రైతులు ఆరబోసిన ధాన్యాన్ని కుప్పచేసి వర్షానికి తడవకుండా టార్పాలిన్లు కప్పారు.గాలివాన బీభత్సం అన్నదాతకు నష్టంన్యూస్రీల్ -
బువ్వ బాగుంది
● అప్పుడు విముఖత.. ఇప్పుడు సుముఖత ● సన్నబియ్యం కోసం రేషన్షాపుల ఎదుట కార్డుదారుల బారులు ● వారంలోనే 90 శాతం పూర్తయిన పంపిణీ ● వండుకోవడానికే ఆసక్తి చూపుతున్న పేదలు ● నూకలు వస్తున్నా, గంజి వార్చితే అన్నం బాగుంటుందంటున్న మహిళలుసాక్షి, పెద్దపల్లి: ‘అన్నా.. వేలిముద్ర వేసిపో.. కిలోకు రూ.10 చొప్పున నీ అమౌంట్ ఇస్తా’ అని రేషన్ డీలర్లు గతంలో లబ్ధిదారులతో బేరసారాలకు దిగేవారు. ప్రస్తుతం ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయడంతో సీన్ రివర్స్ అయ్యింది. దుకాణం తెరిచావా.. బియ్యం తీసుకోవడానికి వస్తున్నామంటూ లబ్ధిదారులే రేషన్ డీలర్లను సంప్రదిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేషన్ షాపుల ఎదుట బారులు తీరుతున్నారు. ‘పైసలు వద్దు.. సన్నబియ్యం కావాలి’ అంటున్నారు. ఉగాది నుంచి పంపిణీ చేస్తున్న సన్నబియ్యానికి కార్డుదారుల నుంచి మంచి స్పందనే వస్తోంది. గతంలో దొడ్డుబియ్యం తీసుకోవడానికి ఆసక్తి చూపనివారు.. ఇప్పుడు సన్నంబియ్యం తీసుకోవడానికి దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు. నమ్మకం కలిగిస్తున్న అధికారులు, పాలకులు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, కలెక్టర్లు తదితర అధికారులు సన్నబియ్యం తీసుకునే వారి ఇళ్లలో భోజనం చేస్తున్నారు. బియ్యం నాణ్యత, మన్నికపై నమ్మకం కల్పిస్తున్నారు. ఇప్పటికే అన్నిరేషన్ షాపులకు అధికారులు నెలవారీ బియ్యం కోటా సరఫరా చేయగా, దాదాపు అన్నిదుకాణాల్లో బియ్యం పంపిణీ 90శాతానికిపైగా పంపిణీ చేశారు. నూకలు వస్తున్నా... ముద్ద అవుతున్నా సన్న బియ్యంలో నూకలు ఎక్కువగా వస్తున్నాయని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఒకేరకంగా అనేక రకాలు ఉంటున్నాయని, కొన్నిదొడ్డుగా, పొట్టిగా ఉన్నాయని రేషన్కార్డుదారులు చెబుతున్నారు. వండితే ముద్ద అవుతుందని కొందరు, గంజి వార్చితే బాగుంటోందని మరికొందరు చెబుతున్నారు. రేషన్ దందాకు అడ్డుకట్ట ప్రతీనెల ఒకటి నుంచి 15 వ తేదీ వరకు రేషన్ దు కాణాల్లో బియ్యం పంపిణీ చేసేవారు. లబ్ధిదారుల వేలిముద్రని/ఐరిస్ స్కాన్ ద్వారా కుటుంబసభ్యుల సంఖ్య ఆధారంగా ఒక్కో వ్యక్తి పేరిట 6కిలోల బియ్యం ఇచ్చేవారు. చాలామంది అనర్హులు ఉండటం, మరోవైపు బీపీఎల్ కుటుంబాలు సైతం రేషన్ బియ్యం తినడానికి ఆసక్తి చూపేవారు కాదు. దీంతో రేషన్ డీలర్లు కిలోకు రూ.10చొప్పున చెల్లించి, దొడ్డుబియ్యాన్ని దారి మళ్లించేవారు. కొందరు బియ్యం తీసుకునేందుకు వచ్చేవారు కాదు. మిగిలిన బియ్యం నిల్వ చూపించేవారు. తర్వాత నెలలో మిగిలినవి కలిపి దుకాణానికి కేటాయింపులు చేసేవారు. ఈనెలలో ఆ పరిస్థితి కనిపించడం లేదని, సన్నబియ్యం తీసుకునేందుకు కార్డుదారులు ఆసక్తి చూపటమే కారణమని డీలర్లు వివరిస్తున్నారు.సన్నబియ్యం పంపిణీ సమాచారం జిల్లా రేషన్కార్డులు లబ్ధిదారులు రేషన్షాపులు ప్రతీనెల సరఫరా చేసే బియ్యం(మెట్రిక్ టన్నుల్లో..) కరీంనగర్ 2,75,320 8,45,761 566 5,074 పెద్దపల్లి 2,19,952 6,21,836 413 4,013 జగిత్యాల 3,07,000 8,91,000 592 5,500 సిరిసిల్ల 1,73,745 4,97,103 345 3,250డీలర్లపై తరుగు భారం కార్డుదారులంద రూ సన్నంబి య్యం తీసుకుంటున్నా.. చాలా తరుగు వస్తుందని రేషన్డీలర్లు వాపోతున్నారు. బియ్యం బస్తా 50.650 కేజీలకు 49– 48 కేజీల వరకే బరువు ఉంటోందని, తద్వారా ఒక్కోషాపులో తరుగు పేరిట క్వింటాలు నుంచి 2 క్వింటాళ్ల వరకు బియ్యం తక్కువ వస్తున్నాయని డీలర్లు వాపోతున్నారు. -
దారులన్నీ కొండగట్టుకే..
జగిత్యాల: జై శ్రీరాం.. జై హనుమాన్ అంటూ తమ ఇష్టదైవమైన కొండగట్టు అంజన్నను దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. శుక్రవారం అంజన్న చిన్న జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని కొండగట్టులోగల శ్రీఆంజనేయస్వామి ఆలయం ముస్తాబైంది. మూడురోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్కుమార్ ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అడుగడుగునా సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు, మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం లైటింగ్స్ సిద్ధం చేశారు. ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు వేశారు. కల్యాణకట్ట వద్ద నాయీబ్రాహ్మణులను అధిక సంఖ్యలో నియమించారు. జయంతి సందర్భంగా ఇప్పటికే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీక్షాపరులు మాలవిరమణ చేసి అంజన్నకు ముడుపు కట్టనున్నారు.రెండు లక్షల మంది అంచనా..అంజన్న సన్నిధి కొండమీదకు కాలినడకన, వాహనాల్లో సుమారు రెండు లక్షల మంది రానున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం వరకు భక్తులందరూ కొండగట్టుకు చేరుకుని అంజన్న సన్నిధిలో అర్ధరాత్రి వరకు సేదతీరి క్యూలైన్లలో నిలబడి మాల విరమణ చేయనున్నారు. జై హనుమాన్, జై శ్రీరాం అంటూ కొండ ప్రాంగణమంతా మారుమోగనుంది.భక్తుల దర్శనం ఇలా..ఘాట్రోడ్ మీదుగా వాహనాలపై.. మెట్లదారిలో కాలినడకన గుట్టపైకి చేరుకోవాలి. నాచుపల్లి జేఎన్టీయూ వైపు నుంచి వచ్చే భక్తుల కోసం బొజ్జ పోతన్న సమీపంలో పార్కింగ్ స్థలం సిద్ధం చేశారు. ఇక్కడ వాహనాలను పార్కింగ్ చేసి కాలినడకన కొండమీదకు చేరుకోవాలి. కొండపైకి చేరుకున్నాక ముందుగా పాత కోనేరు ఎదురుగా ఉన్న మెట్లదారి వెంట వెళ్లి అక్కడి కల్యాణకట్టలో క్యూలైన్ పద్ధతిలో మాల విరమణ చేసుకోవాలి. నూతన కోనేరు పక్కనున్న చలువ పందిళ్ల దిగువ, శ్రీరామ కోటి స్తూపం వెనకాల షెడ్డులో తలనీలాలు సమర్పించాలి. నూతన కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించాలి. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన క్యూలైన్ ద్వారా వెళ్లి స్వామి వారిని దర్శించుకోవాలి. ఆలయం వెనక వైపు నుంచి తిరుగు పయనం కావాలి. -
సన్నబియ్యం.. పప్పుచారు
● లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన కలెక్టర్ పమేలా సత్పతి, మానకొండూర్ ఎమ్మెల్యే సత్యనారాయణశంకరపట్నం: సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో కలెక్టర్ పమేలా సత్పతి, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు లక్ష్మి కిరణ్, ప్రఫుల్ దేశాయ్ భోజనం చేశారు. శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామంలోని దళిత సామాజికవర్గానికి చెందిన చలిగంటి గణేశ్–మమత ఇంట్లో గురువారం సన్నబియ్యం అన్నం, పప్పుచారుతో భోజనం చేశారు. గణేశ్ ఇంటికి కలెక్టర్, ఎమ్మెల్యే రావడంతో గ్రామస్తులు తరలివచ్చారు. సన్నబియ్యంతో భోజనం చేస్తున్నారా? ఎలా ఉందని కలెక్టర్ మహిళలను ఆరా తీశారు. అన్నం రుచిగా ఉందని వివరించారు. భోజనం వడ్డించిన గణేశ్– మమత దంపతులను సత్కరించారు. అక్కడే ప్రభుత్వ పాఠశాల యూని ఫాంతో కనిపించిన గణేశ్ కూతురు అక్షయనందనను కలెక్టర్ పలకరించారు. ఏ క్లాసు, ఎలా చదువుతున్నావని ఆరా తీశారు. బాగా చదువుకుని, మంచిపేరు తీసుకురావాలని సూచించారు. -
వేర్వేరుగా సన్న, దొడ్డు వడ్ల కొనుగోళ్లు
● నేటినుంచి ధాన్యం కొనుగోళ్లు ● ఏఈవోలకే కీలక బాఽధ్యత ● 15లోపు అన్ని కేంద్రాలు ప్రారంభంకరీంనగర్ అర్బన్: యాసంగి ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేపట్టింది. శుక్రవారం నుంచి జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించగా.. చొప్పదండిలో ప్రారంభించనున్నారని సమాచారం. క్వింటాల్కు రూ.500 బోనస్ ప్రకటించడంతో అన్నదాతలు సన్న ధాన్యానికే ప్రాధాన్యం ఇచ్చారని వ్యవసాయ గణాంకాలు చాటుతున్నాయి. ఇప్పటికే కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ పౌరసరఫరాల, వ్యవసాయ, ఐకేపీ, మార్కెటింగ్ అధికారులతో సమీక్షించారు. ఐకేపీ, ప్రాథమిక సహకార సంఘాలు, డీసీఎంఎస్, హాకాలు కొనుగోళ్లలో భాగస్వామ్యమవనుండగా ఇక ఏఈవోలే ప్రధాన భూ మిక పోషించనున్నారు. కాగా యాసంగి ధాన్యం సేకరణకు గానూ 347 కొనుగోలు కేంద్రాలు అవసరమని ప్రతిపాదించారు. ఈ నెల 15వరకు అన్ని కేంద్రాలను ప్రారంభిస్తామని పౌరసరఫరాల సంస్థ డీఎం మంగళారపు రజనీకాంత్ స్పష్టం చేశారు. అత్యధిక విస్తీర్ణం ఇక్కడే సన్నరకాలను హుజూరాబాద్, శంకరపట్నం, మానకొండూరు, వీణవంక మండలాల్లో అత్యధిక విస్తీర్ణంలో సాగు చేశారు. చిగురుమామిడి, చొప్పదండి, గంగాధర, రామడుగు, తిమ్మాపూర్, కరీంనగర్ రూరల్, సైదాపూర్ మండలాల్లో దొడ్డురకం అత్యధిక విస్తీర్ణంలో సాగైంది. కాగా సన్న ధాన్యానికి ఏ గ్రేడ్ రకం మద్దతు ధరతో పాటు క్వింటాల్కు రూ.500 అదనంగా ఇవ్వనున్నారు. జిల్లాలో 70,500 ఎకరాల్లో సన్నరకం సాగవగా 1.90లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రానుంది. సీడ్ మిల్లులకు పోనూ మార్కెట్కు వస్తుందని అంచనా. గన్నీ సంచులు, రవాణే సమస్య జిల్లాలో 347కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా గతంలో రైతుల ఎదుర్కొన్న సమస్యలను దూరం చేయాల్సి ఉంది. గన్నీ సంచుల కొరత, రవాణాలో ఆలస్యం, మిల్లర్ల దోపిడీ సమస్యల్లేకుండా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు. ప్రతీ సంవత్సరం ఏప్రిల్, మే నెలలో అకాల వర్షాలు కురుస్తుండటంతో నష్టం వాటిల్లుతోంది. నెలల తరబడి పంటను కాపాడుకునేందుకు శ్రమించిన రైతులకు వడగళ్ల వాన గంటలోనే తుడిచేస్తోంది. గత సంవత్సరం వరి, మామిడి, మొక్కజొన్న సాగు చేసిన రైతులు నష్టపోయారు. ధాన్యం రంగు మారడం తేమ సాకుతో కళ్లాల వద్దే వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో ధాన్యం విక్రయించేవరకు ఎలా గడుస్తుందోనన్న భయం వెంటాడుతోంది.జిల్లాలో సాగువిస్తీర్ణం: 2,90,000 సాగైన వరి: 2,66,896 ఎకరాలు రానున్న దిగుబడి: 6లక్షల క్వింటాళ్లు మద్దతు ధర: ఏ గ్రేడ్: రూ.2,320 సాధారణ రకం: రూ.2,300 -
గాలిలో దీపం.. గల్ఫ్లో జీవనం
సిరిసిల్ల: ఉన్న ఊరిలో ఉపాధి కరువై.. పొ ట్ట చేత పట్టకుని గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే ప్రస్థానం 45 ఏళ్ల కిందటే మొదలైంది. భాష రాని దేశంలో ఇబ్బందులు పడుతూ వలసజీవులు కాలం వెళ్లదీస్తున్నారు. గల్ఫ్ దేశాలైన యూఏఈ(దుబాయ్), మ స్కట్(ఒమన్), బహ్రెయిన్, కువైట్, ఖతర్, సౌదీ అరేబియా, ఇరాక్ వంటి దేశాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి సుమారు 2.50 లక్షల మంది ఉపాధి కోసం వెళ్లారు. గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న వలస కార్మికుల సంక్షేమానికి సమగ్ర పాలసీ రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం సలహా సంఘాన్ని గురువారం ఏర్పాటు చేసింది. ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్ బీఎం వినోద్కుమార్ చైర్మన్గా, మంద భీంరెడ్డి వైస్చైర్మన్గా, కమిటీ సభ్యులుగా వేములవాడ ఎ మ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ టి.జీవన్రె డ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నిజా మాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, టీజీఎండీసీ చైర్మన్ ఈ.అనిల్కుమార్లతోపాటు మరో ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశా రు. రెండేళ్ల కాలపరిమితితో ఈ సలహా సంఘం క మిటీ గల్ఫ్ కార్మికుల సమస్యలపై అధ్యయనం చేసి సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీని రూపొందించాల్సి ఉంది. కడసారి చూపులకు దూరమై.. ఈ వలస ప్రస్థానంలో ఎందరో అభాగ్యులు అనేక కారణాలతో మరణించారు. నెలల తరబడి మృతదేహాలు సైతం కన్నవారికి కడసారి చూపులకు నోచుకోలేదు. భారత విదేశాంగ శాఖ చొరవతో ఆ యా దేశాల్లోని భారత రాయభార కార్యాలయం స్పందించి శవాలను పంపించిన సందర్భాలు ఉన్నా యి. స్వచ్ఛంద సంస్థలు, ఎన్ఆర్ఐ విభాగాలు శవపేటికలను స్వస్థలాలకు చేర్చాయి. ఇలాంటి విషాద ఘటనల్లో మృతుల కుటుంబాలకు ఆయా దేశాల్లో కంపెనీ వీసాలు ఉంటే.. కొంతమేరకు పరిహారం అందింది. అదే వీసా లేకుండా ఆజాద్ వీసాలపై ప నిచేసే వారు.. కంపెనీ వీసాలపై వెళ్లి కల్లివెల్లి అయి న వారికి మాత్రం కంపెనీలు ఏమీ ఇవ్వలేదు. ఫలి తంగా ఆయా కుటుంబాలు ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. మృతుల కుటుంబాలకు భరోసా రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి ఎన్నికల హామీలో భాగంగా గల్ఫ్లో ఏ కారణంగా మరణించినా ఆ కుటుంబానికి రూ.5లక్షలు అందించాలని నిర్ణయించింది. 2023 డిసెంబర్ 7 నుంచి గల్ఫ్ దేశాల్లో మరణించిన వారికి పరిహారం అందిస్తున్నా రు. రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన 17 మంది గ ల్ఫ్ మృతుల వారసులకు రూ.5లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియాగా రూ.85లక్షలు మంజూరు చేసింది. ఇది వలస బాధిత కుటుంబాలకు కొండంత భరోసానిస్తుంది. కేరళ విధానం ఆచరణీయం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2.50 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతుండగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సలహా కమిటీతో వారికి మేలు జరుగుతుందని ఆశిస్తున్నారు. కేరళ ప్రభుత్వం దశాబ్దం కిందటే ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేస్తుంది. ఆ పాలసీ తెలంగాణలోనూ అమలు కు ఆచరణీయంగా ఉంటుంది. పాస్పోర్టు నుంచి వీసాల వరకు అన్ని పారదర్శకంగా ఉంటాయి. ఎవరికై నా వీసా వస్తే.. అక్కడి బ్యాంకుల అవసరమైన మేరకు రుణవసతి కల్పిస్తాయి. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు మోసాలకు గురికాకుండా ప్రభుత్వమే అధికా రిక ఏజెన్సీల ద్వారా వీసాలను సమకూర్చుతుంది. గల్ఫ్ వెళ్లే వారికి ముందే వివిధ పనుల్లో శిక్షణ ఇచ్చి .. అక్కడి భాషను, అక్కడి వాతావరణం, పనితత్వంపై అవగాహన కల్పిస్తారు. ఏదైనా కారణం చే త అక్కడ పనిచేయలేక.. ఇంటికి తిరిగొస్తే.. ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించి పాత అప్పును తీర్చుకునే వీలు కల్పిస్తారు. ఇది చట్టబద్ధంగా సాగడంతో వలసజీవులకు ఇబ్బందులు రాకుండా కేరళ ప్రభుత్వం కట్టడి చేస్తుంది. విదేశీ మారకాన్ని మన దేశాని కి ఆర్జించి పెట్టేవాళ్లుగా అన్ని సంక్షేమ పథకాలను గల్ఫ్ వలస జీవులకు అమలు చే స్తుంది. ఈ విధానాన్ని మన రాష్ట్రంలో అమలు చేసేలా విధానాలకు రూపకల్పన చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం కమిటీకి అప్పగించింది. ఆ కమిటీపై జిల్లాలోని గల్ఫ్ వలస జీవులు ఆశలు పెట్టుకున్నారు. ఉపాధి వేటలో పోతున్న ప్రాణాలు గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమానికి సలహా కమిటీ ఎన్ఆర్ఐ పాలసీ రూపకల్పనకు అవకాశం కమిటీ చైర్మన్గా ఐఎఫ్ఎస్ అధికారి కమిటీలో ఐదుగురు గౌరవ సభ్యులు.. మరో ఏడుగురు సభ్యులు -
నాలుగు దశాబ్దాల క్రితం పేలిన తూటా
● కొండాపూర్ ఎన్కౌంటర్కు 40 ఏళ్లు ● సీపీఐ(ఎంఎల్) జనశక్తికి తొలి ఎదురుదెబ్బ ● ఐదుగురు నక్సలైట్ల మృతి.. తప్పించుకున్న ఒకరు ● సంఘటన స్థలానికి వచ్చిన అప్పటి మాజీ సీఎం రుద్రంగిలో నిర్మించిన కొండాపూర్ అమరుల స్మారక స్తూపం రుద్రంగిలో స్మారకస్తూపం కొండాపూర్ అమరుల స్మారకార్థం 1991లో అప్పటి సిరిసిల్ల ఎమ్మెల్యే ఎన్వీ కృష్ణయ్య నాయకత్వంలో రుద్రంగిలో నిర్మించారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఎన్వీ కృష్ణయ్య 1989లో జనశక్తి నక్సలైట్ల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలుపొందారు. రుద్రంగిలోని ఆ స్థూపంపై కొండాపూర్ ఎన్కౌంటర్ మృతుల పేర్లు ఉన్నాయి. ఈ ఎన్కౌంటర్కు ఇన్ఫార్మర్గా పేర్కొంటూ వెంకట్రావుపేటకు చెందిన కదిరె మల్లేశంగౌడ్ను అదే పెంటివాగు సమీపంలో జనశక్తి నక్సలైట్లు ఆ తరువాత కొద్ది రోజులుగా హతమార్చారు. అప్పటికే వెంకట్రావుపేటలో పోలీస్క్యాంపు ఉండగానే మల్లేశంగౌడ్ హత్య జరిగింది. ఎన్కౌంటర్ మృతుడు: గొట్టె కిరణ్ దళనేత(ఫైల్) సిరిసిల్ల: రెండున్నర దశాబ్దాల క్రితం వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అడవిలోని అన్నలదే రాజ్యం. సీపీఐ(ఎంఎల్) పీపుల్స్వార్, సీపీఐ(ఎంఎల్) జనశక్తి విప్లవ గ్రూపులు తమకు పట్టున్న ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపించాయి. అప్పట్లో నక్సలైట్లు చెప్పిందే వేదం.. చేసిందే శాసనంగా ఉండేది. ఈతరం వారికి నక్సలైట్లు అంటే.. ఎవరు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అప్పటి సమాజంలో అన్యాయాన్ని ఎదిరించేందుకు పుట్టుకొచ్చిన విప్లవోద్యమాల ప్రతినిధులే నక్సలైట్లు. 40 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఎన్కౌంటర్ ఘటన సీపీఐ(ఎంఎల్) జనశక్తి (చండ్రపుల్లారెడ్డి గ్రూప్) నక్సలైట్ల చరిత్రలో నెత్తుటిగాయంగా మిగిలింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం కొండాపూర్–వెంకట్రావుపేట శివారులోని పెంటివాగు పక్కన 1985 ఏప్రిల్ 11న అర్ధరాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు జనశక్తి నక్సలైట్లు మరణించారు. ఆ ఎన్కౌంటర్ నుంచి ఒక్కరు తప్పించుకొని.. ఆ తర్వాత ఎన్కౌంటర్ గురించి పూసగుచ్చినట్లు చెప్పడం సంచలనంగా మారింది. అప్పటి మాజీ ముఖ్యమంత్రి ఎన్కౌంటర్ స్థలాన్ని చూసేందుకు కొండాపూర్కు వచ్చారంటే దాని ప్రభావాన్ని స్పష్టం చేస్తుంది. రక్తపుటేరుగా పెంటివాగు కోనరావుపేట మండలం నిమ్మపల్లి భూపోరాటం కేంద్రంగా ఆవిర్భవించిన నక్సలైట్ల ఉద్యమం అప్పుడే పల్లెలకు విస్తరిస్తోంది. కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన దళనాయకుడు గొట్టె రఘుపతి అలియాస్ కిరణ్, మరో దళనాయకుడు చెట్కూరి నారాయణగౌడ్ అలియాస్ రామన్న(అక్కపల్లి), దళసభ్యులు పణి సత్తయ్య(మల్కపేట), తాడి రాజయ్య(వెంకట్రావుపేట), లక్ష్మీరాజం(వెంకట్రావుపేట), దాసరి గంగారాం(రుద్రంగి) సాయుధులు. వెంకట్రావుపేటలో జనశక్తి పార్టీ సానుభూతిపరుడి వద్ద రాత్రి భోజనం చేసి కొండాపూర్ సమీపంలోని పెంటివాగు పక్కనే బావి గడ్డ వద్ద నిద్రపోయారు. ఈ విషయం అందుకున్న సిరిసిల్ల సీఐ యూసుఫ్ షరీఫ్, వేములవాడ ఎస్సై ప్రాన్సిస్, సిరిసిల్ల ఎస్సై మురళీధర్రావు, కోనరావుపేట ఎస్సై వీరస్వామిగౌడ్లు సాయుధ పోలీసులతో అక్కడికి చేరుకున్నారు. పోలీసుల కాల్పుల్లో దళనేత కిరణ్తోపాటు మరో నలుగురు దళసభ్యులు మరణించారు. ఇంకో దళనేత చెట్కూరి నారాయణగౌడ్ త్రుటిలో తప్పించుకున్నాడు. శవాలను మృతుల బంధువులకు ఇవ్వకుండా అక్కడే మర్రిచెట్టు కిందనే పోస్టుమార్టం చేసి పోలీసుల పర్యవేక్షణలో పెంటివాగులో దహనం చేశారు. ఘటన స్థలికి మాజీ సీఎం, పౌరహక్కుల సంఘాల నేతలు కొండాపూర్ ఎన్కౌంటర్ స్థలానికి అప్పటి మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్రావు, పౌరహక్కుల సంఘం నాయకులు రమామేల్కోటే, కన్నాభిరాన్, బాలగోపాల్, దామోదర్రెడ్డిలు వచ్చారు. పోలీసుల తీరు, అప్పటి సీఎం ఎన్టీ రామారావు ప్రభుత్వ తీరును ఖండించారు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని పేర్కొన్నారు. ఎన్కౌంటర్లో ప్రత్యక్ష సాక్షి రహస్యంగా బతికి ఉండడంతో పోలీసులు డిఫెన్స్లో పడ్డారు. మూడు రోజులకు కలకలం పోలీసుల కాల్పుల నుంచి తప్పించుకున్న జనశక్తి దళనేత నారాయణగౌడ్ అలియాస్ రామన్న ఎన్కౌంటర్ ఎలా జరిగిందో కళ్లకు కట్టినట్లుగా తెలపడంతో ఆ కాలంలో దినపత్రికల్లో ధారావాహికంగా కథనాలు వచ్చాయి. ఎన్కౌంటర్ జరిగిన రోజు రాత్రి తప్పించుకున్న నారాయణగౌడ్ అదే రోజు రాత్రి గద్దెగట్టు చెరువుతూమ్ వద్ద నీరు తాగి, రక్తం ఎక్కువగా కారిపోకుండా రేగడి మట్టితో కట్టువేసుకుని అక్కడి నుంచి శివంగాళపల్లి వరకు నడుచుకుంటూ చేరుకున్నాడు. అక్కడి నుంచి జనశక్తి సానుభూతిపరుడి సాయంతో సైకిల్పై వేములవాడ మండలం మారుపాకకు చేరుకుని, మరో దళనేత బోడ లక్ష్మారెడ్డి అలియాస్ భూపతిరెడ్డిని కలిసి జీపులో వరంగల్కు, అటు నుంచి అటే ఖమ్మంకు చేరుకున్నాడు. అక్కడే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మూడో రోజు నుంచే ఆ ఎన్కౌంటర్కు ఎలా జరిగిందనే విషయాన్ని అప్పటి పత్రికలకు వివరిచారు. నారాయణగౌడ్ తరువాత రామన్నపేరుతో అజ్ఞాతంలో పనిచేస్తూ గల్ఫ్కు వెళ్లి వచ్చి కోనరావుపేట మండలం ధర్మారంలో స్థిరపడి అనారోగ్యంతో తొమ్మిదేళ్ల కిందట మరణించాడు. నేను ఆ రోజు రంగంపేటలో ఉన్న మాది వెంకట్రావుపేట. నేను అప్పటికే జనశక్తిలో చంద్రశేఖర్ పేరుతో దళనేతగా పనిచేస్తున్నాను. ఆ ఎన్కౌంటర్ జరిగిన రోజు నేను రంగంపేటలో ఉన్న. చెట్కూరి నారాయణ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఎన్కౌంటర్ తరువాత కూడా ఆయన మళ్లీ పనిచేశారు. ఆ ఎన్కౌంటర్ ఎలా జరిగిందో నారాయణ వివరంగా చెప్పారు. 1991లో నేను సిరిసిల్లలో అరెస్ట్ అయ్యాను. – ఇటిక్యాల నర్సయ్య, జనశక్తి మాజీ దళనేత నేను కోనరావుపేట ఎస్సైగా పనిచేశాను కొండాపూర్ ఎన్కౌంటర్కు ముందు నేను కోనరావుపేట ఎస్సైగా పనిచేశాను. నేను సిరిసిల్లలో ఎస్సైగా ఉండగా ఆ ఎన్కౌంటర్ జరిగింది. అప్పటి ఎస్పీ అశోక్ప్రసాద్ ఆదేశాలతో అక్కడే పోస్టుమార్టం చేయించాం. కొండాపూర్ ఎన్కౌంటర్ అప్పట్లో సంచలనమే. – ముళీధర్రావు, అప్పటి సిరిసిల్ల ఎస్సై, ప్రస్తుతం రిటైర్డు ఏఎస్పీ భయం గుప్పిట్లో పల్లెలు ఆ ఎన్కౌంటర్ జరిగినప్పుడు వరికోతలు ఉండేవి. నేను వెంకట్రావుపేటలో సర్పంచ్గా ఉ న్నాను. ఆ రోజుల్లో పల్లెల్లో ఎంతో భయం ఉండేది. ఎ ప్పుడు ఏం జరుగుతుందో తె లియని పరిస్థితి. మా గ్రామపంచాయతీలోనే పో లీస్క్యాంపు ఏర్పాటు చేశారు. సాయుధ పోలీసుల రక్షణ ఉండేది. వైర్లెస్ సెట్లు ఉండేవి. వెంకట్రావుపేట–కొండాపూర్ మధ్య జరిగిన ఆ ఎన్కౌంటర్ను ఆ కాలం వారు ఎప్పటికీ మరిచిపోరు. – పల్లం నర్సయ్య, మాజీ సర్పంచ్, వెంకట్రావుపేట -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు
మల్లాపూర్: మండలంలోని పాతదాంరాజుపల్లి శివారులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. గొర్రెపల్లికి చెందిన చింతకుంట రవితేజ నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి ఆటోలో వస్తున్నాడు. కొత్తదాంరాజుపల్లికి చెందిన బోయిని హన్మంతు, పంజాల రమణ పాతదాంరాజుపల్లి నుంచి వస్తున్నారు. గ్రామ శివారులోకి రాగానే ఆటో, ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ రవితేజ, ద్విచక్రవాహనదారులు హన్మంతు, రమణ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గాయపడిన ముగ్గురిని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. మల్లాపూర్ ఎస్సై రాజు, పోలీసు సిబ్బందితో ఘటనస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. -
ఇండియన్ ఓపెన్ అథ్లెటిక్స్లో ప్రతిభ
కరీంనగర్స్పోర్ట్స్: జిల్లాకు చెందిన అథ్లెటిక్ క్రీడాకారిణి సీహెచ్.పూజ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఇండియన్ ఓపెన్ అథ్లెటిక్స్కు అర్హత సాధించిన తొలి క్రీడాకారిణి కాగా.. పోటీల్లోనూ రాణించి శభాష్ అనిపించుకుంది. లాంగ్ జంప్ అంశంలో పోటీ పడిన పూజ గురువారం జరిగిన హీట్స్లో అద్భుతంగా రాణించి 5.25 మీటర్ల దూరాన్ని దూకి 7వ స్థానంలో నిలిచింది. పూజ ప్రస్తుతం కరీంనగర్లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో చదువుతోంది. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నందెల్లి మహిపాల్, కడారి రవి అభినందించారు. -
కిలోల కొద్దీ తీసుకొచ్చి.. ప్యాకెట్లుగా చేసి..
పెద్దపల్లిరూరల్: ఆటో నడిపితే అవసరమైనంత ఆదాయం రావడం లేదని భావించి సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో గంజాయి విక్రయిస్తున్న షేక్ ఆసిఫ్ అనే యువకుడిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీసీపీ కరుణాకర్ వెల్లడించారు. ఓ కాలేజీవద్ద విక్రయించేందుకు యత్నిస్తుండగా ఆసిఫ్ను అదుపులోకి తీసుకుని రూ.50వేల విలువైన 2,041 గ్రాముల గంజాయి, వేయింగ్మిషన్, సెల్ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు కిలోల కొద్దీ గంజాయి కొనుగోలు చేసి, గ్రామాల్లో ప్యాకెట్లుగా తయారుచేసి అధిక ధరకు విక్రయిస్తున్నాడని పేర్కొన్నారు. ఇప్పటికే అతడిపై 8 కేసులు నమోదై ఉన్నాన్నారు. పీడీ యాక్టు కేసు కూడా నమోదైందన్నారు. పెద్దపల్లి ప్రాంతంలో పోలీసుల నిఘా ఎక్కువైందని భావించి కరీంనగర్ జిల్లా ముగ్గుంపూర్ గ్రామానికి మకాం మార్చి కరీంనగర్ పరిసరాల్లో ఆటోనడుపుతున్నాడన్నారు. ఇదేసమయంలో గంజాయి అమ్ముతున్నాడన్నారు. ఈమేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అతడిని పట్టుకున్న సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సైలు లక్ష్మణ్రావు, మల్లేశం, హెడ్కానిస్టేబుల్ మాడిశెట్టి రమేశ్తో పాటు కానిస్టేబుళ్లు ప్రభాకర్, సతీశ్, రాజు, అనిల్కుమార్ను డీసీపీ అభినందించారు. గ్రామాలు, పట్టణాల్లో గంజాయి జోరు జల్సాల కోసమే గంజాయి అమ్మకాలు వివరాలు వెల్లడించిన డీసీపీ కరుణాకర్ -
కాజీపేట– దాదర్ ఎక్స్ప్రెస్ రైలు పునరుద్ధరణ
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కుంభమేళా సందర్భంగా కాజీపేట నుంచి ముంబాయిలోని దాదర్ సెంట్రల్ రైల్వే స్టేషన్కు నడిచే వారాంతపు రైలు రద్దు చేయగా, తిరిగి మూడు నెలల తరువాత ఈనెల 12 నుంచి పునరుద్ధరిస్తున్నారు. ప్రతి శనివారం కాజీపేట నుంచి ఉదయం 11.30కి బయలుదేరే ఈ ట్రైన్ జమ్మికుంట, పెద్దపల్లి మీదుగా వయా బాల్లార్షా– ఆదిలాబాద్–నాందేడు నుంచి దాదర్ రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. తిరిగి ఆదివారం మధ్యాహ్నం 3.25కు దాదర్ రైల్వేస్టేషన్ నుంచి కాజీపేటకు చేరుకోనుంది. పెద్దపల్లి, జమ్మికుంటలో సదరు ట్రైన్కు రన్నింగ్ స్టాప్ సదుపాయం కల్పించటంతో ఉమ్మడి జిల్లాప్రజలకు ఉపయోగకరంగా మారనుంది. నిజామాబాద్– దాదర్ రైలు పునరుద్ధరణ ఎప్పుడో? రెండు మార్గాలల్లో దాదర్ సెంట్రల్ రైల్వే స్టేషన్కు కాజీపేట నుంచి రైలు నడవగా కుంభమేళా సందర్భంగా మూడు నెలల క్రితం రైల్లు రద్దు చేశారు. తాజాగా పెద్దపల్లి నుంచి వెళ్లే వారాంతపు రైలును పునరుద్ధరిస్తున్నా రైల్వే శాఖ, నిజామాబాద్ నుంచి వయా నాందేడ్ మీదుగా ప్రయాణించే వారాంతరపు రైలును సైతం పునరుద్ధరిస్తే 200కిలోమీటర్ల దూరం తగ్గటంతో పాటు, సమయం, రైలు చార్జీలు కలిసివస్తాయని ప్రయాణికులు అంటున్నారు. ఈ ప్రాంత ఎంపీలైన కేంద్రమంత్రి బండి సంజయ్, ధర్మపురి అరవింద్ చొరవ తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అంతర్జాతీయ చెస్ పోటీలకు జిల్లా క్రీడాకారులు కరీంనగర్స్పోర్ట్స్: కర్ణాటక రాష్ట్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నమ్మ బెంగళూరు ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్స్ బీ కేటగిరీ ఫిడే రేటింగ్ చదరంగ పోటీల్లో కరీంనగర్లోని విశ్వనాథ్ చెస్ అకాడమీ క్రీడాకారులు పాల్గొంటున్నట్లు అకాడమీ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్, కోచ్ అంతగిరి విశ్వనాథ్ ప్రసాద్ తెలపారు. గురువారం నుంచి ప్రారంభమైన ఈ పోటీలు 13 వరకు బెంగళూరులోని కంఠీరవ ఇండోర్ స్టేడియంలో జరుగనున్నట్లు తెలిపారు. స్విస్ లీగ్ పద్ధతిలో 10 రౌండ్ల పాటు జరిగే ఈ పోటిల్లో అకాడమీ నుంచి కోచ్ అంతగిరి విశ్వనాథ్ ప్రసాద్, చిట్టుమల్ల కశ్యప్, బాలసంకుల అమన్ రామ్, డి.అక్షిత్, ఈగ లిఖిత్ చైతన్య, బత్తిని శ్రీహన్, గంట అభయ్రామ్, కనుకుంట్ల అకీరా, ఈగ శివ చైతన్య పాల్గొంటున్నారని తెలిపారు. -
అంతర్ జిల్లా దొంగ అరెస్ట్
● 28.6 తులాల బంగారం స్వాధీనం ● నిందితుడిపై 25 చోరీ కేసులు జగిత్యాలక్రైం: జగిత్యాలలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్ల డించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేటకు చెందిన రాగుల రామమ్మ, కొంరయ్య కుమారుడు రాగుల అజయ్కుమార్ అలియాస్ బక్కశెట్టి కొంరయ్య ప్రస్తుతం మంచిర్యాల జిల్లాకేంద్రంలోని తిలక్నగర్లో ఉంటున్నాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంతో హైదరాబాద్ పారిపోయి ఓ లారీ ట్రాన్స్పోర్ట్లో పనికి కుదిరాడు. ఈ క్రమంలోనే దొంగతనాలకు అలవాటుపడ్డాడు. ఇలా సుమారు 25 దొంగతనం కేసుల్లో పట్టుబడ్డాడు. జగిత్యాలపై పట్టు ఉండడంతో ఇక్కడకు చేరుకుని మార్చి 28న అరవింద్నగర్లో, మార్చి 16న హన్మాన్వాడలో, జనవరి 18న పురాణిపేటలో, ఫిబ్రవరి 16న గణేష్నగర్లో, ఫిబ్రవరి 23న పద్మనగర్లో, మార్చి 7న గోవిందుపల్లెలో, మార్చి 18న కృష్ణానగర్లో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడి బంగారు అభరణాలను ఎత్తుకెళ్లాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జగిత్యాల పోలీసులు నిందితుడి కదలికలపై నిఘా వేశారు. ఈ నేపథ్యంలోనే పట్టణ పోలీసులు గురువారం కొత్త బస్టాండ్ చౌరస్తాలో వాహనాల తనిఖీ చేస్తుండగా కొంరయ్య అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని పట్టుకుని విచారణ చేపట్టగా అసలు నిజం ఒప్పుకున్నాడు. అతడి నుంచి 28.6 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో కృషి చేసిన పోలీసులను రివార్డుతో అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ రఘుచందర్, పట్టణ సీఐ వేణుగోపాల్, ఎస్సైలు కిరణ్, గీత, కానిస్టేబుళ్లు జీవన్, విశాల్, సంతోష్, మల్లేషం, గంగాధర్, రమేశ్ పాల్గొన్నారు. -
తనిఖీలు చేస్తున్నా.. మారని తీరు
కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరంలోని కొన్ని హోటళ్లు, బేకరీలు, స్వీట్హౌస్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు నాణ్యతను గాలికి వదిలేస్తున్నారు. బల్దియా అధికారులు ఆకస్మికంగా చేపట్టే తనిఖీల్లో విస్తుపోయే బాగోతాలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల ఓ బేకరీలో నాణ్యతలేని ఆహార పదార్థాలు, గడువు పూర్తయిన రసాయనాలు, ముడిసరుకులతో తయారు చేసిన తినుబండరాలను విక్రయిస్తున్నట్లు బహిర్గతమయ్యింది. దీంతో ఆ వ్యాపారికి రూ.20వేలు జరిమానా విధించారు. దీనినుంచి తేరుకోకముందే మరో నిర్లక్ష్యం వెలుగు చూసింది. గోదావరిఖని మార్కండేయకాలనీలోని తాజ్ ఫ్యామిలీ రెస్టారెంట్, ఫాస్ట్ఫుడ్ సెంటర్ను హెల్త్ అసిస్టెంట్ కిరణ్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ మధుకర్, ఎంఐఎస్ ఆపరేటర్ శ్రీకాంత్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నాణ్యతలేని సరుకులతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వాహకునికి రూ.8వేలు జరిమానా విధించారు. నాణ్యతలేని సరుకులతో ఫాస్ట్ఫుడ్ మరో రెస్టారెంట్కు రూ.8వేలు జరిమానా -
భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య
ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్ 14వ డివిజన్ ఎల్కలపల్లి గేట్ గ్రామానికి చెందిన వివాహిత కట్ల మమత(28) భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన నెత్టేట్ల లక్ష్మయ్యకు ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తె మమతను ఎల్కలపల్లి గెట్ గ్రామానికి చెందిన కట్ల గణేశ్కు ఇచ్చి 2017లో వివాహం జరిపించారు. అయితే, కొద్దిరోజుల క్రితం గణేశ్.. తన భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. మానసికంగా వేధిస్తున్నాడు. భరించలేని మమత మంగళవారం ఇంట్లో క్రిమిసంహారకమందు తాగింది. ఫోన్ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అందించిది. వారు అత్తారింటికి చేరుకొని మమతను గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎంజీఎంకు తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. మమతకు కృతిక(6), మనస్వి(4), కార్తికేయ(8 నెలల) బాబు ఉన్నారు. మృతురాలి తండ్రి నెత్టేట్ల్ల లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్ కిరణ్ కేసు నమోదు చేసుకున్నారు. చెట్టుకు బైక్ ఢీకొని ఒకరి మృతిరామడుగు: రామడుగు మండలం వెదిర గ్రామ పరిధిలోని రాజాజీనగర్కు చెందిన కుమ్మరి రాజు(28) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. కుమ్మరి రాజు గురువారం సాయంత్రం ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై పనినిమిత్తం వెదిర వైపు వస్తున్నాడు. వెదిర– రామడుగు దారిలో బైక్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయాడు. రాజుకు భార్య, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తేలుకాటుకు ప్రైవేట్ వైద్యమే దిక్కు ఇల్లంతకుంట(మానకొండూర్): తేలు కుట్టిందని ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే తాళం వేసి ఉండడంతో ప్రైవేట్ వైద్యం చేయించుకున్నట్లు బాధితుడు వాపోయాడు. బాధితుడు తెలిపిన వివరాలు. మండలంలోని నర్సక్కపేటకు చెందిన దూది సుధీర్రెడ్డి గురువారం తన మక్క చేనులో పనులు చేస్తుండగా తేలు కుట్టింది. వైద్యం కోసం ఇల్లంతకుంట పీహెచ్సీకి వెళ్లాడు. ఆస్పత్రి పల్లె దవాఖానాకు మారిందని బోర్డు చూసి అక్కడికి వెళ్లాడు. అప్పుడు సాయంత్రం 4.10గంటల సమయం కావడంతో ఆస్పత్రికి తాళం వేసి ఉండడంతో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నట్లు తెలిపాడు. దీనిపై వైద్యాధికారిణి వివరణ కోరగా.. పల్లె దవాఖానాలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకే వైద్యసేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆతర్వాత వైద్యసేవలకు సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి వెళ్లాలన్నారు. కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయం● ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం కరీంనగర్: అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేలకోట్ల రూపాయలు సంపాదించిన కేసీఆర్, కేటీఆర్, కవిత ఆస్తులపై విచారణ జరుగుతోందని.. వారు జైలుకు వెళ్లడం ఖాయమని ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం ధరణి పేరుతో వేల కోట్ల రూపాయల భూములు కాజేసి, బినామీ పేర్ల మీద అమ్ముకుందని ఆరోపించారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసి, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం కృషి చేస్తోందన్నారు. కేసీఆర్, కేటీఆర్, బండి సంజయ్ కలిసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్ అమలు చేయించాలని డిమాండ్ చేశారు. హెచ్సీయూ భూముల విషయంలో కేసీఆర్, కేటీఆర్ విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. గజ్జెల ఆనందరావు, సముద్రాల అజయ్, సుద్దాల లక్ష్మణ్, అనిల్, ప్రభాకర్, శంకర్, స్వరూప, లత, రాజయ్య పాల్గొన్నారు. -
అడిషనల్ కలెక్టర్ సందర్శన
కరీంనగర్: మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ పరిధిలోని భగత్నగర్లో ఉన్న జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ఆకస్మికంగా సందర్శించారు. హాజరు రిజిస్టర్ పరిశీలించారు. సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ అధి కారి సబిత, డీసీపీవో పర్వీన్ వెంట ఉన్నారు.సమీక్ష సమావేశంవిద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల మేనేజర్లతో బుధవారం ఆర్ఎం బి.రాజు సమీక్ష నిర్వహించారు. వేసవికాలంలో అన్ని బస్స్టేషన్లలో తాగునీరు, తగినన్ని బస్సులు అందుబాటులో ఉంచాలని సూచించారు. డిప్యూటీ రీజనల్ మేనేజర్(మెకానిక్)బి.వెంకటేశ్వర్ రావు, డి ప్యూటీ రీజినల్ మేనేజర్(ఆపరేషన్స్) ఎస్.భూపతిరెడ్డి, జి.మనోహర్రెడ్డి పాల్గొన్నారు. గల్ఫ్ సమస్యలు పరిష్కరించాలి రామడుగు: గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ను కలిసి గల్ఫ్ జేఏసీ జిల్లా ఆధ్యక్షుడు చిలుముల రమేశ్ వినతిపత్రం అందజేశారు. గల్ఫ్ దేశాల్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలతో పాటుగా ప్రమాదంలో వైకల్యంబారిన పడిన వారికి ఉపాధి మార్గం కల్పించాలని కోరారు. నకిలీ ఏజెంట్లుపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమాలకు పాల్పడితే సహించం● ‘సాక్షి’ కథనంపై అదనపు కలెక్టర్ ఆరా కరీంనగర్ అర్బన్: జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థలో అక్రమాలు, అన్యాయంపై బుధవారం ‘గాడి తప్పిన డీఆర్డీవో’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ఆరా తీశారు. ధాన్యం కొనుగోళ్లపై జరిగిన సమావేశంలో నిబద్ధతతో పని చేయకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వీవోఏల వేతనాల విషయంలో పొరపాటు జరిగితే విధుల నుంచి తొలగించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. సిబ్బందికి ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎల్సీ యాప్ను అనుసరించాలి కొత్తపల్లి(కరీంనగర్): ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ రూపొందించిన ఎల్సీ యాప్ను తప్పనిసరిగా అనుకరిస్తూనే విద్యుత్ పనులు చేపట్టాలని ఎస్ఈ మేక రమేశ్బాబు సూచించారు. కరీంనగర్లోని విద్యుత్ భవన్ లో బుధవారం 11 కె.వీ.‘ఎల్సీ’(లైన్క్లియర్) యాప్పై నిర్వహించిన శిక్షణ తరగతులను ప్రారంభించారు. వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందించడంతో పాటు విద్యుత్ ప్రమాదాల నివారణకు ఈ ఆన్లైన్ ఎల్సీ యాప్ దోహదపడుతుందన్నారు. డీఈటీ కె.ఉపేందర్, డీఈ జంపాల రాజం, ఏడీఈలు, ఏఈలు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళల భద్రతకు షీటీం
కరీంనగర్క్రైం: మహిళలు, బాలికల భద్రతకు కరీంనగర్ కమిషనరేట్లోని షీటీం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని సీపీ గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా సంస్థలు, మహిళలు పనిచేసే ప్రదేశాల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తోందన్నారు. గడిచిన నెల రోజుల్లో మహిళలను వేధిస్తున్న వారిపై ఎనిమిది క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. 15మందికి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. 65 హాట్స్పాట్లలో నిఘా ఉంచామని, ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 16మంది పోకిరీలను పట్టుకొని కౌన్సెలింగ్ నిర్వహించడం జరి గిందన్నారు. ఒంటరిగా ప్రయాణిస్తున్న వారు టీసేఫ్ యాప్ వినియోగించుకోవాలని తెలిపారు. విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైతే షీటీం 8712670759 నంబర్కు లేదా డయల్ 100కు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితో పంచుకోవద్దని సూచించారు. -
29 మంది బదులు వర్కర్ల నియామకం
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో తాత్కాలిక పద్ధతిలో 29మంది బదులు వర్కర్లను నియమించారు. ఔట్సోర్సింగ్ కింద పనిచేస్తూ అనారోగ్యానికి గురైన వర్కర్లకు బదులుగా అర్హులైన వారి కుటుంబ సభ్యులను నియమించాలనే డిమాండ్ కొంతకాలంగా ఉండడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వ్యవహారాన్ని తేల్చేందుకు ఫోర్మెన్ కమిటీని కమిషనర్ నియమించగా, ఆ కమిటీ వర్కర్ల అనారోగ్యం నిజమేనా, వారి కుటుంబసభ్యులు అర్హులేనా అనే అంశాలపై విచారణ చేపట్టింది. విచారణ పూర్తి కావడంతో 29 మందికి బుధవారం నగరపాలకసంస్థ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో కమిషనర్ చాహత్ బాజ్పేయ్ తాత్కాలిక నియామక పత్రాలు అందజేశారు. దరఖాస్తు పెట్టుకున్న మరికొంతమంది వర్కర్లపై పూర్తిస్థాయిలో విచారణ అనంతరం నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ వేణుమాధవ్, ఈఈ సంజీవ్ పాల్గొన్నారు. రికార్డు విభాగం తనిఖీ నగరపాలకసంస్థ కార్యాలయంలోని రికార్డు విభాగాన్ని కమిషనర్ చాహత్ బాజ్పేయ్ బుధవారం తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. రికార్డుల నిర్వహణపై సెక్షన్ ఇన్చార్జి నుంచి వివరాలు సేకరించారు. -
56 పోస్టులు.. 40 ఖాళీలు
● జిల్లా మార్కెటింగ్శాఖలో వెక్కిరిస్తున్న ఖాళీలు ● డీఎంవో నుంచి మార్కెట్ కార్యదర్శుల వరకు అదనపు బాధ్యతలు ● సీజనొస్తున్నా.. సిబ్బంది భర్తీ ఏది?కరీంనగర్ అర్బన్: మరోవారం, పది రోజుల్లో పంటల కొనుగోళ్లతో కళకళలాడనున్న వ్యవసాయ మార్కెట్లలో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. సిబ్బంది లేమితో పరిపాలన కునారిల్లుతుంటే భర్తీ మాటే లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. పొరుగు సేవల సిబ్బంది ఉండగా ఇచ్చే వేతనానికి నిబద్ధతతో పనిచేసే అవకాశముండదన్నది నిర్వివాదాంశం. ఆ క్రమంలో మార్కెటింగ్శాఖను గాడిన పెట్టాల్సిన అవసరం ఉంది. జిల్లా మార్కెటింగ్శాఖలో ఇద్దరే వ్యవసాయ మార్కెట్లపై పర్యవేక్షణ, అధికారుల పనితీరు, రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన గురుతర బాధ్యత జిల్లా మార్కెటింగ్ శాఖది. కానీ జిల్లా విభజనతో కార్యాలయం బోసిపోయింది. సదరు కార్యాలయ మంజూరు పోస్టులు పది. ఏడీఎం, సీనియర్ మార్కెటింగ్ అసిస్టెంట్, రికార్డర్, టైపిస్టు, జూనియర్ ఆడిటర్ ఒక్కొక్కరు ఉండాల్సి ఉండగా ఇద్దరు అటెండర్లు ఉండాలి. కానీ కార్యాలయంలో ఒక జూనియర్ ఆడిటర్, ఒక అటెండర్ మాత్రమే మిగిలారు. మిగతా పోస్టులన్ని ఖాళీయే. పొరుగు సేవల కింద డాటా ఎంట్రీ ఆపరేటర్ విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో అధికారికి జోడు పదవులు జిల్లా మార్కెటింగ్శాఖ ఖాళీలు అటుంచితే వ్యవసాయ మార్కెట్లలోనూ అదే పరిస్థితి. జిల్లాలో 8 వ్యవసాయ మార్కెట్ యార్డులుండగా ప్రధాన మార్కెట్లలోనూ ఖాళీల కొరత వెక్కిరిస్తోంది. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి మల్లేశం మినహా మిగతా మార్కెట్లకు జోడు పదవులే రాజ్యమేలుతున్నాయి. జమ్మికుంట గ్రేడ్–1 సెక్రటరీ రాజా హుజూరాబాద్ మార్కెట్ ఇన్చార్జి సెక్రటరీగా వ్యవహరిస్తుండగా గోపాల్రావుపేట, మానకొండూరు మార్కెట్లకు సెక్రటరీగా శ్రావణ్, చొప్పదండి, సైదాపూర్ మార్కెట్లకు ఇన్చార్జిలతో కాలం వెళ్లదీస్తున్నారు. కరీంనగర్ మార్కెట్ సెక్రటరీ ఏసీబీకి పట్టుబడగా ఎవరిని నియమించలేదు. మార్కెట్ ఆదాయాన్ని బట్టి సెలక్షన్ గ్రేడ్, స్పెషల్ గ్రేడ్, గ్రేడ్–1, గ్రేడ్–2, గ్రేడ్–3 కార్యదర్శుఽల నియామకం ఉంటుండగా రూ.6కోట్ల ఆదాయం గల కరీంనగర్, జమ్మికుంట మార్కెట్లకు సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి విధులు నిర్వహిస్తుంటారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి, గ్రేడ్–2 కార్యదర్శి పోస్టు ఖాళీగా ఉన్నాయి. యార్డుల్లో పర్యవేక్షణకు సంబంధించి కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో ఒక పోస్టయిన సహాయ కార్యదర్శి, అకౌంటెంట్, పర్యవేక్షకుడు, జేఎంఎస్, డ్రైవర్, వాచ్మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జమ్మికుంటలో టైపిస్టు, ఏఎంఎస్ ఒకటి, జూనియర్ మార్కెట్ సూపర్వైజర్ (జేఎంఎస్) మూడింటికి రెండు, అటెండర్ రెండింటికి రెండు, వాచ్మెన్ అయిదింటికి నాలుగు ఖాళీలే. ఆడ్తిదారులు, ఖరీదుదారులదే రాజ్యం వ్యవసాయ మార్కెట్లలో నిబంధనల మేరకు కొనుగోళ్లు, చెల్లింపుల ప్రక్రియ జరగాల్సి ఉండగా రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ప్రధాన మార్కెట్లలో తక్పట్టీల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా నగదు కోత పెట్టడం పరిపాటిగా సాగుతోంది. ఏ వ్యాపారమైనా మార్కెట్కు ఒక శాతం పన్ను కట్టాల్సి ఉండగా పూర్తిస్థాయి అధికారి లేక లక్షల ఆదాయం కోల్పోతోంది. జమ్మికుంట మార్కెట్లో ఈ– నామ్ అమలు అంతంతమాత్రమే కాగా వేలంలా ధరలను నిర్ణయించడం గమనార్హం. మార్కెట్ యార్డుల్లో పర్యవేక్షకులు, సహాయ మార్కెట్ పర్యవేక్షకులు, జూనియర్ మార్కెట్ పర్యవేక్షకుల పాత్ర కీలకం. అయితే సిబ్బంది లేకపోవడం, ఉన్న అధికారుల్లో కొందరు వీరికే దాసోహమవడం రైతన్నకు తీరని నష్టం కలుగుతోంది. ఖాళీల భర్తీపై గతంలో నివేదికలు అందజేశామని, ప్రభుత్వ నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని సంబంధిత అధికారి వివరించారు.ఇది కరీంనగర్ వ్యవసాయ మార్కెట్. మార్కెట్ కార్యదర్శి పురుషోత్తం ఇటీవల ఏసీబీకీ పట్టుబడగా సస్పెండ్ అయ్యారు. అప్పటి నుంచి ఎవరిని నియమించకపోగా సదరు కార్యదర్శే గంగాధర మార్కెట్కు ఇన్చార్జి. ఇప్పుడు ఈ రెండు మార్కెట్లకు కార్యదర్శులు లేరు.మార్కెటింగ్శాఖ జిల్లా కార్యాలయమిది. జిల్లా విభజనతో సిబ్బందిని ఇతర జిల్లాలకు సర్దుబాటు చేయడంతో అన్నీ ఖాళీలే. జిల్లా మార్కెటింగ్ అధికారిగా మంచిర్యాల డీఎంవో షాబుద్దీన్ ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నా రు. మిగతావారంత పొరుగు సేవల సిబ్బందే. మంజూరు పోస్టుల ప్రకారం భర్తీ శూన్యం. -
రివర్ ఫ్రంట్పై తలోమాట!
● వరద నివారణ పనులే చేపట్టామన్న నీటిపారుదల విభాగం ● పర్యావరణ అనుమతులు పొందుతామన్న టూరిజం ● తన నష్టాన్ని నీటిపారుదలశాఖ భరించాలన్న కాంట్రాక్టర్సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్కు తలమానికంగా చేపడుతున్న మానేరు రివర్ఫ్రంట్ ప్రాజెక్టు పనులకు పర్యావరణ అనుమతులపై ఇరిగేషన్, టూరిజం విభాగాలు, కాంట్రాక్టు సంస్థ తలోమాట అంటున్నాయి. వీణవంక మండలానికి చెందిన వెంకటరెడ్డి అనే వ్యక్తి గతేడాది మానేరు రివర్ఫ్రంట్కు పర్యావరణ అనుమతులు లేవని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆశ్రయించారు. ఈ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, రాష్ట్ర పర్యాటక శాఖ, జిల్లా కలెక్టర్, జిల్లా నీటిపారుదల శాఖలను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై ఆయా విభాగాలు తలోమాట అంటున్నాయి. ● నీటి పారుదల విభాగం అఫిడవిట్లో.. ‘మానేరు రివర్ ఫ్రంట్ (ఎంఆర్ఎఫ్) మా ప్రాజెక్టు కాదు. మేం అక్కడ కేవలం వరద నియంత్రణ చర్యలు మాత్రమే చేపడుతున్నాం. నీటి నాణ్యత పెంచడం, అక్కడి సహజ జీవావరణం పునరుద్ధరించడమే మా లక్ష్యం. వాస్తవానికి మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పర్యాటక శాఖకు సంబంధించింది. మేం కేవలం మానేరు నది పరిసరాల్లో వరద నియంత్రణ చర్యలు మాత్రమే చేపడుతున్నాం. ఎల్ఎండీ దిగువ ప్రవాహంలో నదికి రెండువైపులా రక్షణ గోడలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న చెక్ డ్యాం–2ను బలోపేతం చేయడం, హాఫ్ బరాజ్ని నిర్మించడం, ఫీడర్ కెనాల్లో తవ్వకాలు జరిపి మంచినీటిగా మార్చడం. ఇందుకోసం మేం ఎలాంటి భూసేకరణ చేపట్టలేదు. ఎలాంటి నీటి నిల్వ చేపట్టలేదు. ఈ పనులకు పర్యావరణ అనుమతులు అక్కరలేదు’ అని వివరించింది. ● మరోవైపు తాము కేవలం పర్యాటకం కోసం మాత్రమే ఎంఆర్ఎఫ్ ప్రాజెక్టును 1.50 లక్షల చదరపు మీటర్లలో చేపట్టామని పర్యాటకశాఖ ఎన్జీటికి సమర్పించిన లేఖలో పేర్కొంది. ఇందులో ‘ఎంట్రన్స్ ప్లాజా’ కోసం 2.59 ఎకరాలు, ‘వ్యూ గ్యాలరీ’ కోసం 1.15 ఎకరాలు, నదిలో కడుతున్న ‘ఫౌంటేన్’ కోసం 350 గజాల స్థలం మాత్రమే సరిపోతుందని తెలిపింది. ఈ ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల కోసం ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (ఈఐఏ) సర్వే చేపడతామని కూడా స్పష్టం చేసింది.మానేరు రివర్ ఫ్రంట్నష్టాన్ని భరించాల్సింది మీరే: కాంట్రాక్టు సంస్థ తమ పనులు నిలిపివేయాలని ఆదేశించిన ఇరిగేషన్ విభాగానికి ఈ ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్న ఎస్ఎల్ఆర్, హెచ్ఈఎస్ (వీజే) సంస్థ కూడా తన ఇబ్బందులను వివరిస్తూ లేఖ రాసింది. ప్రాజెక్టులో భూసేకరణ, డ్రాయింగ్స్, డిజైన్స్, పర్యావరణ సర్వే తదితరాలు పూర్తిగా డిపార్ట్మెంట్లకు సంబంధించినవని తెలిపింది. సంక్లిష్ట దశలో పనులు నిలిపివేయాల్సి వచ్చిందని, ఈ దశలో పనులు ఆపడం వల్ల బరాజ్లకు జరిగే నష్టానికి తాను బాధ్యత వహించబోనని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన మానవ వనరులు, యంత్రాలు, సామగ్రి అన్నీ తమ వద్ద ఉన్నాయి. ఆకస్మికంగా పనులు ఆపివేయడం వల్ల ఇవి పనికి రాకుండా పాడయ్యే ప్రమాదం ఉంది. తమ యంత్రాలు, సామగ్రిని తరలించేందుకు కావాల్సిన ఖర్చును అదనంగా డిపార్ట్మెంట్ భరించాల్సి ఉంటుంది. ప్రాజెక్టులో నిలుస్తున్న నీటిని తోడేందుకు అదనంగా డీ వాటరింగ్ చేయాల్సి ఉంటుంది. దీనికి అయ్యే ఖర్చు కూడా భరించాలని స్పష్టంచేసింది. -
‘రెడీ’మేడ్ ఉపాధి సిద్ధం
సిరిసిల్ల: సిరిసిల్ల ప్రాంతంలోని మహిళలకు శాశ్వత ఉపాధిని అందించేందుకు ఆధునిక వస్త్రాల తయారీ యూనిట్ సిద్ధమైంది. జిల్లా కేంద్రం సమీపంలోని పెద్దూరు అపెరల్ పార్క్లో రెడీమేడ్ వస్త్రాల తయారీసంస్థ టెక్స్ఫోర్ట్ కంపెనీ యూనిట్ను శుక్రవారం రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో కలెక్టర్ సందీప్కుమార్ ఝా, చేనేత, జౌళిశాఖ జేడీ ఎన్.వెంకటేశ్వర్రావు, సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, జౌళిశాఖ ఏడీ రాఘవరావు, టెక్స్ఫోర్ట్ కంపెనీ ప్రతినిధులతో బుధవారం సమీక్షించారు. రెండు వేల మందికి ఉపాధి రాజన్నసిరిసిల్ల జిల్లాలోని రెండు వేల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో టెక్స్ఫోర్ట్ కంపెనీ ముందుకొచ్చింది. రెండు ఎకరాల్లో టెక్స్ఫోర్ట్ గార్మెంట్ యూనిట్ను నిర్మించారు. అపెరల్ పార్క్లో ఇప్పటికే గోకుల్దాస్ ఇమేజెస్ గార్మెంట్ సంస్థ యూనిట్ను మూడేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఇక్కడ 500 మంది మహిళలకు ఉపాధి లభిస్తుంది. మరో వెయ్యి మందికి ఉపాధి కల్పించే దిశగా ఆ కంపెనీ యూనిట్ను విస్తరిస్తోంది. గోకుల్దాస్ సంస్థలో లోదుస్తులను తయారీచేస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తోంది. సిరిసిల్ల నుంచి నేరుగా అమెరికాకు వస్త్రాలు వెళ్తున్నాయి. ఇప్పుడు టెక్స్ఫోర్ట్ అనే మరో అంతర్జాతీయ సంస్థ సిరిసిల్లలో పరిశ్రమను స్థాపించేందుకు ముందుకు రావడంతో 1600 మంది మహిళలు, మరో 400 మంది స్టాఫ్కు ఉపాధి లభించనుంది. శుక్రవారం టెక్స్ఫోర్ట్ యూనిట్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆధునిక జీన్స్, టీషర్ట్, అండర్వేర్స్ కుట్టుపై మహిళలకు ఇప్పటికే శిక్షణ ఇస్తున్నారు. రేపు అపెరల్ పార్క్లో టెక్స్ఫోర్ట్ యూనిట్ ప్రారంభం హాజరవుతున్న నలుగురు మంత్రులు ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్ సందీప్కుమార్ ఝా -
సర్ధాపూర్లో ఆయుధాగారం ప్రారంభం
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని సర్ధాపూర్ 17వ పోలీస్ బెటాలియన్లో కొత్తగా నిర్మించిన ఆయుధగారం (బెల్ ఆఫ్ ఆర్మ్స్)ను వర్చువల్గా టీజీఎస్పీ బెటాలియన్స్ అడిషనల్ డీజీపీ సంజయ్కుమార్ జైన్ బుధవారం ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్లో సంజయ్కుమార్ జైన్ మాట్లాడుతూ బెటాలియన్ పోలీసులు అంకితభావంతో విధులు నిర్వహించాలన్నారు. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ క్రమశిక్షణ గల ఆర్గనైజేషన్ అని వివరించారు. బెటాలియన్ అభివృద్ధిలో అధికారులు, సిబ్బంది పాత్ర అభినందనీయమన్నారు. సర్ధాపూర్ బెటాలియన్కు వచ్చిన డీఐజీ సన్నీకి కమాండెంట్ సురేష్ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. బెటాలియన్లో నూతనంగా నిర్మించిన దోభీ, బార్బర్ రూమ్లను డీఐజీ సన్నీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వర్చువల్గా ప్రారంభించిన అడిషనల్ డీజీపీ సంజయ్కుమార్ జైన్ -
పర్మినెంట్ కాకుండానే పదవీవిరమణ
గన్నేరువరం: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చీమలకుంటపల్లె గ్రామ ప్రాథమిక పాఠశాలలో స్వీపర్గా పనిచేస్తున్న లింగన్న బుధవారం ఉద్యోగవిరమణ పొందారు. జిల్లాలోని తిమ్మాపూర్ మండలం వచ్చునూర్ గ్రామానికి చెందిన లింగన్న 1985లో రూ.75 జీతానికి తాత్కాలిక స్వీపర్గా విధుల్లో చేరారు. రూ.5 వేల జీతంతో బుధవారం ఉద్యోగ విరమణ పొందాడు. పర్మింనెట్ కాకుండా ఉద్యోగ విరమణ చేయడం బాధకరమని స్థానికులు తెలిపారు. 40ఏళ్లు విద్యార్థులకు, పాఠశాలకు చేసిన సేవలకు గుర్తింపుగా పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు రూ.41,116ను ఆర్థికంగా సాయంగా అందించారు. ప్రధానోపాధ్యాయుడు రవీందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రూ.75తో ప్రారంభమై.. రూ.5వేల వేతనంతో ఉద్యోగ విరమణ -
కొత్త రేషన్కార్డుల ఎంపిక ప్రక్రియ షురూ
● నేటి నుంచి క్షేత్రస్థాయిలో వార్డు అధికారుల విచారణకరీంనగర్ కార్పొరేషన్: నగరవాసులు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్కార్డు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎట్టకేలకు మొదలైంది. నగర పాలకసంస్థకు చెందిన వార్డు అధికారులు కొత్త రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయిలో ఎంపిక ప్రక్రియను చేపడుతున్నారు. గురువారం నుంచి రేషన్దుకాణాల వారీగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై విచారణ చేపట్టనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూపొందించిన ప్రత్యేక ఆప్ ద్వారా సమాచారాన్ని అప్లోడ్ చేయనున్నారు. సంవత్సరాలుగా కొత్తగా రేషన్కార్డులు ఇవ్వకపోవడం, రేషన్కార్డులో కుటుంబసభ్యులను చేర్చడం, తొలగించడం లేకపోవడంతో ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. గతంలో కొత్త రేషన్కార్డులతో పాటు, సవరణల కోసం ప్రభుత్వం దరఖాస్తులు తీసుకోవడం తెలిసిందే. వచ్చిన దరఖాస్తులను ఆయా రేషన్దుకాణాల వారీగా జాబితాగా రూపొందించారు. ఆ జాబితా ఆధారంగా వార్డు అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టనున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా వివరాలు సేకరించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు. పకడ్బందీగా చేపట్టాలి రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పగడ్బందీగా నిర్వహించాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయి ఆదేశించారు. బుధవారం నగరపాలకసంస్థ సమావేశ మందిరంలో వార్డు అధికారులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన యాప్, మార్గదర్శకాలకు అనుగుణంగా విచారణ చేపట్టాలన్నారు. ముఖ్యంగా వార్షిక ఆదాయ ధ్రువీకరణపత్రాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం వి చారణ చేసి వివరాలు అప్లోడ్ చేయాలన్నారు. -
హనుమ వాహనంపై రాములోరు
ఇల్లందకుంట: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారు బుధవారం రాత్రి హనుమత్వాహనంపై విహరించారు. ముందుగా స్వామివారి ఉత్సవమూర్తులను పూలతో అలంకరించారు. అర్చకులు శేషం రామాచార్యుల మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ ఆలయ మాఢవీధుల్లో స్వామివారు విహరించారు. అంతకుముందు ప్రభుత్వోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్చార్జి ఈవో సుధాకర్, ఆలయ కమిటీ చైర్మన్ ఇంగిలే రామారావు, కుమారస్వామి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
వంటగ్యాస్ ధర తగ్గించాలి
కరీంనగర్: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధర రూ.50ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాకేంద్రంలోని తెలంగాణ చౌక్లో పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధర రూ.50 పెంచడం మూలంగా పేద, మధ్యతరగతి ప్రజలపై తీరని భారం పడుతోందన్నారు. పెంచిన గ్యాస్ ధర తగ్గించేంతవరకు సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వర్ణ వెంకటరెడ్డి, గుడికందుల సత్యం, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
హోమియోతో మొండి వ్యాధులకు చెక్
కరీంనగర్టౌన్: హోమియోపతి ప్రపంచవ్యాప్తంగా రెండవ ప్రధాన వైద్యంగా గుర్తించబడింది. సాంప్రదాయ వైద్యానికి స్పందించని దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు ఈ వైద్యం ఎంతగానో పనిచేస్తుంది. గతంలో తెలుగు రాష్ట్రాల్లో మెదడువాపును నయం చేయడంలో, చికెన్గున్యా, స్వైన్ఫ్లూ వంటి ఎన్నో వ్యాధులను నయం చేయడంలో హోమియో వైద్యం పనితనం అందరికి తెలిసింది. పలు మొండి వ్యాధులను నయం చేయగల శక్తి ఉందనే నమ్మకంతో ఈ వైద్య విధానాన్ని ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది. జర్మనీలో 1755 ఏప్రిల్ 10వ తేదీన జన్మించిన డాక్టర్ శామ్యూల్ హానిమన్ తన రెండు దశాబ్దాల పరిశోధన అనంతరం.. ప్రపంచానికి హోమియో వైద్యాన్ని అందించారు. ఆయన స్మృత్యర్థం ఏటా ఏప్రిల్ 10వ తేదీన ప్రపంచ హోమియోపతి దినోత్సవంగా జరుపుకుంటున్నారు. జీవనశైలికి అనుగుణంగా మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. సైడ్ ఎఫెక్ట్లు లేని మందులు వాడుతూ రోగాలు నయం చేసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ఏళ్ల తరబడి మందులు వాడాల్సి వచ్చే దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసుకునేందుకు హోమియో సేవలను వినియోగంచుకుంటున్నారు. కీళ్ల, మోకాళ్ల, నడుం నొప్పులు, అర్థరైటిస్, సైనసైటిస్, షుగర్, బీపీ, థైరాయిడ్, కిడ్నీలో రాల్లు, అస్తమా, మలబద్దకం, అర్షమొలుల, సోరియాసిస్, బొల్లి వంటి చర్మవ్యాధులకు హోమియోపతిలో చికిత్స అందుబాటులో ఉంది. శాశ్వత పరిష్కారం కోసం రోగం నయం చేయడంలో కాస్త ఆలస్యమైనా ఖచ్చితంగా ఫలితం ఉంటుందనే నమ్మకమే హోమియోపతి సేవలు పెరగడానికి కారణంగా తెలుస్తోంది. శాశ్వత పరిష్కారం దొరుకుతుండడం ఒక కారణం. ముఖ్యంగా మొండి వ్యాధులకు మెరుగైన చికిత్స అందుతుండడంతో రోగులు హోమియోపతి వైపు మొగ్గుచూపుతున్నారు. రెండో ప్రధాన వైద్యంగా గుర్తింపు నేడు ప్రపంచ హోమియోపతి దినోత్సవం అన్ని వ్యాధులకు చికిత్స హోమియోలో అన్ని వ్యాధులకు చికిత్స అందుబాటులో ఉంది. సంతానసాఫల్యత, కీళ్లనొప్పులు, మెడనరాల నొప్పి, నడుమునొప్పి, సయాటికా, థైరాయిడ్, హర్మోన్ సంబంధ వ్యాధులు, కిడ్నీ స్టోన్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఖచ్చితమైన చికిత్స అందుతుంది. అస్తమా, తరచు జలుబు, జ్వరం, టాన్సిల్స్ పెరుగుదల, జ్ఞాపకశక్తి తగ్గడం, నిద్రలోమూత్ర విసర్జన వంటి అన్ని వ్యాధులకు హోమియో సమాధానం చెబుతుంది. అందువల్ల హోమియోకు ఆదరణ పెరుగుతోంది. – డాక్టర్ కొడిత్యాల శ్రీనివాస్, మాతృశ్రీ హోమియోక్లినిక్ -
స్వాతంత్య్ర సమరయోధుడు మృతి
పెగడపల్లి: మండలంలోని బతికపల్లి గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీమంత్రి జీవన్రెడ్డికి స్వయాన మామ కాలగిరి ముత్యంరెడ్డి (94) మంగళవారం రాత్రి మృతి చెందాడు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ముత్యంరెడ్డి కరీంనగర్లో మృతిచెందగా.. స్వగ్రామమైన బతికపల్లిలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, మేడిపల్లి సత్యం, పలు వురు ప్రముఖు లు ఆయన మృతదేహానికి నివా ళులర్పించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మృతుడు మాజీమంత్రి జీవన్రెడ్డికి స్వయాన మామ -
ఇంగ్లిష్ ఒలింపియాడ్లో అల్ఫోర్స్ విద్యార్థికి ర్యాంకు
కొత్తపల్లి(కరీంనగర్): హైదరాబాద్కు చెందిన ప్రముఖ పోటీ పరీక్షల సంస్థలైన యునిఫైడ్ కౌన్సిల్ ఇటీవల నిర్వహించిన జాతీయస్థాయి ఇంగ్లిష్ ఒలింపియాడ్లో కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్ విద్యార్థి ఎం.శీవేన్రెడ్డి (7వ తరగతి) అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు సాధించడంతో పాటు రూ.10 వేల నగదు బహుమతి గెల్చుకున్నట్లు విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్రెడ్డి తెలిపారు. పాఠశాలలో బుధవారం విద్యార్థిని అభినందించారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు. శీవేన్రెడ్డిని అభినందిస్తున్న అల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి -
వాగులో పడి వృద్ధురాలి దుర్మరణం
ధర్మపురి: ధర్మపురిలోని శ్రీఅక్కపల్లి రాజరాజేశ్వరస్వామి ఆలయం సమీపంలోని వాగులో పడి బుధవారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్టుపల్లికి చెందిన ఆకారపు మల్లమ్మ(68) మృతిచెందిందని ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బావిలో పడి వ్యక్తి మృతివెల్గటూర్: బావిలో పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని జగదేవుపేట గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ధర్మపురి మండలం జైన గామానికి చెందిన సంగెపు మహేశ్ (40) ఉపాధి నిమిత్తం ముంబయిలో కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. పదేళ్లుగా ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. గ్రామంలోని బంధువుల ఇంట్లో శుభకార్యం నిమిత్తం సోమవారం కుటుంబంతో కలిసి వచ్చాడు. బుధవారం బహిర్భూమికని గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. అదే సమయంలో ఫిట్స్ రావడంతో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. మృతుడి భార్య మంగ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతివెల్గటూర్: క్రిమిసంహారక మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఎండపల్లి మండలం గొడిశెలపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అల్లె లచ్చయ్య (58) కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. పదిహేనేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నా ఆరోగ్యం బాగుపడడంలేదు. జీవితంపై విరక్తి చెంది సోమవారం క్రిమిసంహారక మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం మృతిచెందాడు. మృతుడి భార్య విజయ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. తండ్రికి కూతురు తలకొరివిగొల్లపల్లి: కూతురే కొడుకై కన్నతండ్రికి తలకొరివి పెట్టిన ఘటన మండలంలోని భీంరాజ్పల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బక్కయ్యకు ఒక్కతే కూతురు. దండేపల్లి మండలం పాతగూడూరుకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. కొద్దిరోజులుగా కూతురు వద్దనే ఉంటున్నాడు. మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందాడు. దీంతో ఆయన స్వగ్రామమైన భీంరాజ్పల్లికి బుధవారం ఉదయం తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. బక్కయ్యకు కుమారులు లేకపోవడంతో కూతురు రజిత తండ్రికి తలకొరివి పెట్టింది. అక్రమ కట్టడాలు కూల్చివేతమేడిపల్లి: భీమారం మండల కేంద్రంలో ప్రభుత్వ భూములు కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను తహసీల్దార్ జి.రవికిరణ్ రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సహకారంతో కూల్చివేయించారు. మండల కేంద్రంలోని 1308 సర్వే నంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిలో కొందరు సంఘాల పేరిట నిర్మాణాలు చేపట్టారు. మరికొందరు ఆలయాలు, ఈద్గాలు నిర్మించారు. ప్రభుత్వ కార్యాలయాలకు స్థలం లేకపోవడంతో వేరే గ్రామంలో నిర్మిస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో గ్రామస్తులు భూములకబ్జా విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి వాటిని తొలగించాలని, ఆ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని తీర్మానించారు. రెండురోజుల క్రితం రైతు, కుల సంఘాలు తహసీల్దార్ కార్యాలయం ముందు బైటాయించి ఆందోళనకు దిగారు. స్పందించిన రెవెన్యూ అధికారులు సున్నితప్రాంతాలైన గుడి, ఈద్గాల అంశాన్ని ఉన్నతాధికారులకు వివరించారు. అలాగే అందులో ఉన్న కొన్ని అక్రమ నిర్మాణలను తొలగించారు. ఆర్ఐ రాజారాం, ప్రవీణ్, మేడిపల్లి ఎస్సై శ్యామ్రాజ్, గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు. -
హనుమాన్ చిన్న జయంతికి ఏర్పాట్లు చేయండి
జగిత్యాల: హనుమాన్ చిన్న జయంతికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ అశోక్కుమార్తో కలిసి బుధవారం అధికారులతో సమావేశమయ్యారు. ఈనెల 11 నుంచి జయంతి కార్యక్రమాల నేపథ్యంలో పదో తేదీలోపు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. కిందిస్థాయి ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మూడు రోజులపాటు లైటింగ్, హోర్డింగ్లు ఏర్పాటు చేయాలని, 11న రాత్రి నుంచి 13వ తేదీ ఉదయం వరకు సుమారు రెండు లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, సుమారు 45వేల మంది భక్తులు మాలవిరమణ చేస్తారని, మూడు రోజులపాటు 14 కౌంటర్లను ఏర్పాటు చేసి సుమారు 5 లక్షల లడ్డూ ప్రసాదాలను అందుబాటులో ఉంచుతామని వివరించారు. ఆలయ ప్రాంగణంలో 64 సీసీకెమెరాలు ఉన్నాయని, అదనంగా 50 సీసీకెమెరాలను ఏర్పాటు చేస్తామని, ఆరు మెడికల్ క్యాంప్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. మూడురోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, ఇందుకోసం వేదిక ఏర్పాటు చేసి వందమంది కూర్చునేలా సిట్టింగ్ ఉండాలని సూచించారు. చలువ పందిళ్లు, కోనేరు వద్ద పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని, కల్యాణ కట్ట వద్ద నాయీబ్రాహ్మణులను ఎక్కువగా నియమించుకోవాలని ఆదేశించారు. అధికారులందరూ సమన్వయంతో షిఫ్ట్ల వారిగా కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డీఎస్పీ రఘుచందర్, కొండగట్టు ఆలయ ఈవో శ్రీనివాస్రావు, మదన్మోహన్, మున్సిపల్ కమిషనర్ స్పందన పాల్గొన్నారు. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ -
కోడికోసం వెళ్లి.. బావిలో పడి
కమాన్పూర్(మంథని): వరి పంటను కోసేందుకు సిద్ధమైన రైతు నామని రాజేశం(70) ఆచారం ప్రకారం పొలం వద్ద కోడిని బలిచ్చే ప్రయత్నంలో సమీప వ్యవసాయ బావిలోపడి దుర్మరణం చెందాడు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం సిద్దిపల్లెలో బుధవారం ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామ శివారులో తనకున్న వరిపొలం వద్దకు బుధవారం ఉదయం కోడిని పట్టుకుని వెళ్లాడు. వరి పైరు కోసేందుకు ముందుగా కోడిని బలి ఇవ్వాలని నిర్ణయించాడు. తనవెంట తెచ్చుకున్న సంచిలోనుంచి కోడిని తీస్తుండగా అది ఎగిరిపోయి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడింది. రాజేశం ఆ కోడిని పట్టుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు ఆ బావిలో పడి మృతి చెందాడు. చాలాసేపటి వరకు రాజేశం ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లారు. అక్కడ అటూఇటూ చూడగా ఎక్కడా కనిపించలేదు. చివరకు వ్యవసాయ బావిలో చూడగా శవమై కనిపించాడు. అప్పటిదాకా తమతో ఉన్న రాజేశం బావిలోపడి విగతజీవిగా మారడంతో కుటుంబసభ్యుల విలపించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేసుకొన్నారు. వ్యవసాయ బావిలో పడి రైతు దుర్మరణం -
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
కరీంనగర్రూరల్: ఓ వ్యక్తి నిర్లక్ష్యానికి పసి ప్రాణం బలైంది. సదరు వ్యక్తి ట్రాక్టర్కు ఉన్న తాళం చెవిని తీయకపోవడంతో తెలియక స్టార్ట్ చేసిన చిన్నారి ట్రాక్టర్తో సహా బావిలో పడి మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లెకు చెందిన గడ్డం రమ్య– అజీందర్రెడ్డికి ఇద్దరు కూతుర్లున్నారు. పెద్దకూతురు జశ్విత(3)ను మూడు రోజుల క్రితం తన అక్కబావలు అన్నాడి మంజుల– రాజిరెడ్డి ఊరైన కరీంనగర్ మండలం బహుదూర్ఖాన్పేటకు పంపించారు. బుధవారం చింతచెట్టు కొట్టేందుకు కూలీలు రావడంతో చెట్టుకింద ఉన్న ట్రాక్టర్ను రాజిరెడ్డి కుమారుడు అభిరామ్రెడ్డి చిన్నారి జశ్వితను సీటు పక్కనే కూర్చుండబెట్టుకుని వ్యవసాయబావి ముందు నిలిపి కిందకుదిగి వెళ్లిపోయాడు. ట్రాక్టర్పై ఉన్న జశ్విత తాళం చెవిని తిప్పడంతో స్టార్ట్ అయిన ట్రాక్టర్ వేగంగా ముందుకుపోయి బావిలో పడిపోయింది. స్ధానికులు క్రేన్సాయంతో ట్రాక్టర్ను బావిలో నుంచి బయటకు తీశారు. ట్రాక్టర్ కింద పడిన జశ్విత ఊపిరి ఆడక బావిలోనే మృతిచెందింది. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు అక్కడికి వచ్చి మృతిచెందిన చిన్నారిని గుండెలకు హత్తుకుని రోధించిన తీరు చూసి స్థానికులు కంటతడిపెట్టారు. పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి జశ్విత తండ్రి అజీందర్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ ప్రదీప్కుమార్ తెలిపారు. ట్రాక్టర్తో సహా బావిలో పడి చిన్నారి మృతి -
హార్వెస్టర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
తిమ్మాపూర్: మండలంలోని ఇందిరానగర్ గ్రామంలోని సాయిబాబా ఆలయం సమీపంలో రాజీవ్ రహదారిపై బుధవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు హార్వెస్టర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సులోని పలువురితోపాటు, హార్వెస్టర్పై ఉన్న ఇద్దరు గాయపడ్డారు. డ్రైవర్ వాహనంలోనే ఇరుక్కుపోవడంతో పోలీసుల రెండు గంటలు శ్రమించి బయటకు తీశారు. ఎల్ఎండీ పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం రాత్రి 12:40 గంటల సమయంలో ఇందిరానగర్ గ్రామ సాయిబాబా గుడివద్ద కరీంనగర్ వైపు వెళుతున్న హార్వెస్టర్ను హైదరాబాద్ నుంచి కరీంనగర్వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. దీంతో హార్వెస్టర్ రోడ్డు అవతలివైపుదూసుకెళ్లి బోల్తాపడింది. బ్లేడ్లు మాత్రం బస్సులు ఇరుక్కుపోయాయి. ఈ ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో బస్సులోని పలువురితోపాటు హార్వెస్టర్పై ఉన్న ఇద్దరు గాయపడ్డారు. హార్వెస్టర్ డ్రైవర్ వాహనంలో ఇరుక్కుపోయాడు. స్థానికులు వెంటనే 108, ఎల్ఎండీ పోలీసులు సమాచారం అందించారు. దాదాపు 2 గంటలకు పైగా పోలీసులు, గ్రామస్తులు, హైవే పెట్రోల్ సిబ్బంది, మూడు 108 అంబులెన్స్ సిబ్బంది శ్రమించి బయటకు తీయగా.. మోకాలు విరిగి తీవ్ర గాయాలు అయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివేక్ తెలిపారు. -
భర్తతోనే కలిసి ఉంటా..
● కరీంపేటలో మహిళ ఆందోళన శంకరపట్నం: భర్తతోనే కలిసి ఉంటానని ఓ మహిళ ఆందోళనకు దిగగా.. పలు మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి. బాధితురాలి వివరాల ప్రకారం.. మండలంలోని కరీంపేట గ్రామానికి చెందిన గడ్డం రాజు మొదటి భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయారు. చొప్పదండి మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన స్వప్నను రెండో వివాహం చేసుకున్నారు. మూడు నెలలుగా స్వప్నను భర్త, అత్తింటివారు వేధిస్తున్నారు. కొంత డబ్బు ఇచ్చి, వదిలించుకోవాలని చూస్తున్నారని, భర్తతోనే కలిసి ఉంటానని స్వప్న ఆరోపించింది. ఆల్ ఇండియా పోలీస్ హ్యాండ్బాల్ పోటీలకు ఎంపిక కరీంనగర్స్పోర్ట్స్: ఉత్తరప్రదేశ్లోని లక్నో జరుగుతున్న ఆల్ ఇండియా పోలీస్ హ్యాండ్బాల్ చాంపియన్ షిప్ క్లస్టర్ పోటీలకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్ క్రీడాకారులు ఎంపికై నట్లు ఉమ్మడి జిల్లా హ్యాండ్బాల్ సంఘం అధ్యక్ష,కార్యదర్శులు తెలిపారు. రామడుగుకు చెందిన అనుపురం సాయికృష్ణ ప్రస్తుతం మంచిర్యాలలో, కుర్మపల్లికి చెందిన పులి మాధవి ప్రస్తుతం రామగుండం కమిషనరేట్లో పనిచేస్తున్నారు. వీరి ఎంపికపై ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కాసర్ల ఆనంద్ కుమార్, రమణారావు, సంయుక్త కార్యదర్శి ప్రభాకర్, కోచ్ మూల వెంకటేశ్, వేల్పుల సురేందర్, కృష్ణహరి, శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. -
విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి
● టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి హన్మకొండ: వాతావరణ శాఖ ఈదురు గాలులు, భారీ వర్షాలు ఉన్నాయని హెచ్చరించిన నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతాల విద్యుత్ అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి సూచించారు. సోమవారం హనుమకొండలోని టీజీఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంనుంచి 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతో వీడీయో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్రెడ్డి మాట్లాడుతూ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం పరిధిలో ఎప్పటికప్పుడు విద్యుత్ సరఫరా మానిటర్ చేస్తూ ఏదైనా అంతరాయం జరిగితే వెంటనే పునరుద్ధరించాలని అదేశించారు. చెట్లు విరిగి విద్యుత్ లైన్లపై పడితే, ట్రిపింగ్స్, బ్రేడౌన్లు సంభవిస్తే త్వరితగతిన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సూచించారు. పంటల కోతలు జరుగుతున్నందున పెండింగ్లో ఉన్న వ్యవసాయ సర్వీస్ల మంజూరు వేగవంతం చేయాలన్నారు. అత్యవసర సమయంలో కావాల్సిన మెటీరియల్ను సమకూర్చుతామన్నారు. వ్యవసాయానికి అవసరమైన చోట 63 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి సర్కిల్లో ఎల్సీ యాప్పై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి డైరెక్టర్ టి.సదర్లాల్, జీఎంలు, ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
రూ.10లక్షలు ఖర్చు చేసినా దక్కని ప్రాణం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు ఎనిమిది రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. యువకుడి ప్రాణాలు కాపాడుకోవడానికి తల్లిదండ్రులు రూ.10లక్షలు ఖర్చు చేసినా ప్రాణాలు దక్కలేదు. ఈ సంఘటన ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్లో విషాదం నింపింది. ఎస్సై రమాకాంత్, గ్రామస్తులు తెలిపిన వివరాలు. నారాయణపూర్కు చెందిన షేక్ అవేజ్(18) గత నెల 30న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆదివారం రాత్రి మృతి చెందాడు. రంజాన్ పండుగకు ముందు రోజు సిరిసిల్లలోని ఓ టైలర్లో కుట్టించిన కొత్త బట్టలు తీసుకురావడానికి తన మిత్రుడు షేక్ అఫ్రోజ్తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అవేజ్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఏడు రోజులపాటు చికిత్స అందించారు. ఒక్కగానొక్క కొడుకును కాపాడుకోవడానికి తల్లిదండ్రులు అప్పు చేసి వైద్యం అందించారు. అయినా ప్రాణాలు దక్కకపోవడంతో తండ్రి సమద్, తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గాయపడ్డ మరో యువకుడు అఫ్రోజ్ చికిత్స పొందుతున్నాడు. మృతుని కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి తదితరులు పరామర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఎనిమిది రోజులు మృత్యువుతో పోరాటం గాయపడ్డ యువకుడి మృతి నారాయణపూర్లో విషాదం -
తల్లీకొడుకుల మృతితో రుద్రంగిలో ఉద్రిక్తం
రుద్రంగి(వేములవాడ): రుద్రంగికి చెందిన తల్లీకొడుకులు కాదాసు పుష్పలత, నిహాన్ మృతితో మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అత్తమామలే విషమిచ్చి చంపారంటూ మృతురాలి తల్లిగారి కుటుంబ సభ్యులు పుష్పలత అత్తమామల ఇంటిపై సోమవారం దాడి చేశారు. వారి మృతికి కారకులను శిక్షించాలని కోరుతూ ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అడ్డుకోవడంతో ధర్నాకు యత్నించారు. బాధితులకు న్యాయం చేస్తామని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షిస్తామని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, రుద్రంగి ఎస్సై అశోక్ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తు చేపట్టారు. పుష్పలత భర్త దుబాయ్ నుంచి మంగళవారం వస్తుండడంతో అంత్యక్రియలు సోమవారం జరుపలేదు. పుష్పలత మృతదేహాన్ని వేములవాడ ఏరియా ఆస్పత్రిలో భద్రపరిచారు. అనుమానితుల ఇంటిపై మృతురాలి కుటుంబీకుల దాడి సముదాయించిన పోలీసులు -
అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య
ధర్మపురి: ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో ఓ వ్యక్తి రాయపట్నం వద్ద గోదా వరిలో దూకి ఆ త్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ఉదయ్కుమార్ వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన మహ్మద్ అలీ అహ్మద్(45) కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. జీవితంపై విరక్తి చెంది, ఆదివారం ఇంటి నుంచి బయటికొచ్చాడు. ధర్మపురి మండలం రాయపట్నం చేరుకుని గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం మృతదేహం లభ్యమైంది. మృతుడి కుమారుడు హసామ్ అహ్మద్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.ఉరేసుకుని ఒకరు..జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం గోపాల్రావుపేట గ్రామానికి చెందిన అనుసూ రి శ్యామ్సుందర్(46) సోమవారం ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నా డు. శ్యామ్సుందర్కు అతని సోదరునికి మధ్య కొద్దికాలంగా భూ వివాదం కొనసాగుతోంది. భూపత్రాలు ఇవ్వడం లేదనే మనస్తాపంతో సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య శ్రీలక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు.దుబాయ్లో అయిలాపూర్ వాసి మృతికోరుట్ల రూరల్: మండలంలోని అయిలాపూర్ గ్రామానికి చెందిన గాజర్ల శ్రీనివాస్(55) దుబాయ్ లో ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడు. శ్రీనివాస్ గత 10ఏళ్లుగా జీవనోపాధి కోసం దుబా య్ వెళ్లి వస్తున్నాడు. రెండేళ్ల క్రితం సెలవుపై వచ్చి వెళ్లాడు. ఆదివారం ఉదయం తను ఉండే గదిలోనే గుండెపోటుతో మృతి చెందాడు. శ్రీని వాస్కు భార్య జల, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నాడు. పెద్ద కూతురు లాస్యకు వివాహం కాగా చిన్న కూతురు రమ్య డిగ్రీ పూర్తి చేసింది, కుమారుడు రణధీర్ ఎంసీఏ చది వాడు. ఇంటి పెద్ద మృతి చెందటంతో శ్రీనివాస్ మృతదేహం కోసం ఎదురుచూస్తూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి..మెట్పల్లి: పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఈ నెల 5న స్థానిక పాత నటరాజ్ థియేటర్ సమీపంలో సుమారు 25ఏళ్ల యువకుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. సమాచారమందుకున్న 108 సిబ్బంది అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మరణించాడు. అప్పటి నుంచి మృతదేహాన్ని పోస్టుమార్టం గదిలో ఉంచగా, అతని సంబంధీకులు ఎవరు రాలేదు. దీంతో మృతదేహాన్ని దహన సంస్కారాల నిమిత్తం సోమవారం మున్సిపల్ సిబ్బందికి అప్పగించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.స్తంభంపల్లిలో ఒకరు..వెల్గటూర్: వెల్గటూర్ మండలం స్తంభంపల్లికి చెందిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జక్కుల రమేశ్(41)గత పదేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది ఈ నెల 4న పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు జగిత్యాల ఏరియా ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఆదివా రం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య వనిత ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.రైలు నుంచి పడి వివాహిత..జమ్మికుంట(హుజూరాబాద్): ప్రమాదవశాత్తు రైలు నుంచి పడి వివాహిత మృతిచెందింది. రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపిన వివరాలు.. మహా రాష్ట్రలోని రాజురా పట్ట ణానికి చెందిన వివాహిత ప్రతిభ రమేశ్గజ్ (46) వైద్యం కోసం కూతురు, సోదరుడితో కలిసి బల్హార్షా నుంచి సికింద్రాబాద్కు దక్షిణ్ ఎక్స్ప్రెస్లో బయలుదేరింది. ఈ క్రమంలో జమ్మికుంట రైల్వే స్టేషన్లో ప్రమాదవశాత్తు రైలు నుంచి కింద పడి మృతిచెందింది. మృతురాలికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. భర్త రమేశ్కోండ్గజ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.నిరుద్యోగ మహిళలు, యువతులకు ఈ ఆటో డ్రైవింగ్లో శిక్షణచిగురుమామిడి: చిగురుమామిడి మండలంలోని నిరుద్యోగ యువతులు, మహిళలకు ఈ–ఆటో డ్రైవింగ్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఎంపీడీవో మధుసూదన్ సోమవారం తెలిపారు. 18 నుంచి 45ఏళ్ల వయస్సున్న వారికి 60 రోజులపాటు ఎల్ఎండీకాలనీలోని దుర్గాబాయి మహిళా, శిశువికాస ప్రాంగణంలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 50మంది నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన యువతులకు ఎలక్ట్రిక్ ఆటో నడపడంలో శిక్షణ ఇచ్చి డ్రైవింగ్ లైసెన్సు జారీ చేస్తామన్నారు. ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
ఓపెన్ స్కూల్ పరీక్షలకు ఏర్పాట్లు
● కలెక్టర్ పమేలా సత్పతికరీంనగర్: ఈ నెల 20నుంచి నిర్వహించనున్న ఇంటర్, పదోతరగతి ఓపెన్స్కూల్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధశాఖల అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రశ్నపత్రాలను కేంద్రాలకు తరలించే సమయంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఇతరులు ఎవరూ కూడా పరీక్ష కేంద్రాల్లో ఉండరాదని, గుర్తింపు పొందిన వారిని తప్ప ఎవరినీ కేంద్రాలకు అనుమతించరాదని ఆదేశించారు. ఇంటర్ పరీక్షల కోసం జిల్లాలో 4 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, 881 మంది పరీక్ష రాస్తున్నారని తెలిపారు. 10వ తరగతి ఓపెన్ స్కూల్ పరీక్షల కోసం 3 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, 421 మంది పరీక్షలు రాస్తున్నారని అన్నారు. ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను నియమించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట మహిళా పోలీస్ సిబ్బందికి డ్యూటీ కేటాయించాలని సూచించారు. ఓపెన్ స్కూల్ కో– ఆర్డినేటర్ సీహెచ్ నాగేశ్వరరావు, జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, జిల్లా సైన్స్ అధికారి జైపాల్రెడ్డి పాల్గొన్నారు. -
కనుల పండువగా రామయ్య పట్టాభిషేకం
మంగళవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025ఇల్లందకుంట రాములోరి పట్టాభిషేకం సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా రామయ్యకు కిరీటాన్ని ధరించారు. వివిధ నదుల తీర్థాలతో అభిషేకం నిర్వహించారు. రాత్రి హంసవాహనంపై స్వామివారిని ఊరేగింంచారు. 108 స్వర్ణ పుష్పాలతో అలంకరించారు. ఆలయ అర్చకులు వంశీధరచార్యులు, సీతారామాచార్యుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారు హంసవాహనంపై దర్శనమిచ్చారు. పట్టువస్త్రాలు సమర్పించిన కేంద్ర మంత్రి కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పట్టభిషేకానికి హాజరయ్యారు. స్వామివారికి పట్టువస్త్రాలు అందజేజేసి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆయనను ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఈవో కందుల సుధాకర్, ఆలయ కమిటీ చైర్మన్ ఇంగిలే రామారావు, కడారి కుమారస్వామి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, నాయకులు అనిల్రెడ్డి, రమణారెడ్డి, సంపత్రావు, శ్రీరామ్ శ్యాం, మల్లేశ్, పల్లపు రవి, పవన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. – ఇల్లందకుంటన్యూస్రీల్ -
కేసీఆర్ రాసిందే ‘బండి’ చదివేది!
● సుడా చైర్మన్ నరేందర్రెడ్డికరీంనగర్ కార్పొరేషన్: కేసీఆర్ రాసి పంపిన స్క్రిప్ట్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చదువుతున్నారని సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి విమర్శించారు. సోమవారం నగరంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అర్థ్ధరహితమన్నారు. గతంలో సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దీక్ష చేస్తే అవసరం లేకున్నా.. పోలీసులతో హంగామా సృష్టించి కేసీఆర్ అరెస్ట్ చేయించారన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగా సంజయ్కి మైలేజీ రావడానికి అరెస్ట్ నాటకమాడిన కేసీఆర్, మరోసారి సంజయ్ని బీజేపీ అధ్యక్షుడిగా చేసేందుకు ప్రయత్నిస్తున్నరని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ చట్టంచేసి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల చిత్తశుద్ధిని ప్రదర్శించిందన్నారు. సంజయ్కి ఏ మాత్రం బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నా.. కేంద్రం ఆమోదించేలా చూడాలన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఎండీ తాజ్, కొరివి అరుణ్కుమార్, శ్రవణ్నాయక్, చర్ల పద్మ, జీడి రమేశ్, సాయిరాం, గుండేటి శ్రీనివాస్రెడ్డి, మాసం ఖాన్, బషీర్ , భారి, వాసు, శ్రీధర్, కీర్తికుమార్ పాల్గొన్నారు. -
ఆస్తిపన్ను వసూళ్లు సంతృప్తికరం
● నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్కరీంనగర్ కార్పొరేషన్: గత ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్లు సంతృప్తికరంగా ఉన్నాయని నగరపాలకసంస్థ కమిషనర్చాహత్ బాజ్పేయ్ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధుల లక్ష్యాన్ని చేరుకోవడంతో ఆమె అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. సోమవారం కళాభారతిలో రెవెన్యూ అధికారులు, వార్డు అధికారులు, సపోర్టింగ్ ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. గత ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్లలో సాధించిన ప్రగతి స్ఫూర్తిగా ఈ ఆర్థిక సంవత్సరం (2026–26) లక్ష్యం చేరుకోవాలన్నారు. పన్ను ఎక్కువ, తక్కువగా ఉన్న అసెస్మెంట్లను తప్పకుండా సరిచేయాలన్నారు. ట్రేడ్ లైసెన్స్లపై వార్డు అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని ఆదేశించారు. సమావేశంలో నగర పాలకసంస్థ అదనపు కమిషనర్ సువార్త, డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి, ఆర్వో భూమానందం,ఆర్ఐలు విజయలక్ష్మి, కిష్టయ్య పాల్గొన్నారు. -
తల్లీబిడ్డల ఆరోగ్యం అందరి బాధ్యత
కరీంనగర్టౌన్: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్వో వెంకటరమణ జెండాఊపి ర్యాలీ ప్రారంభించారు. అంతకు ముందు వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మహిళా సిబ్బందికి ఆరోగ్య మహిళ క్లినిక్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో వెంకటరమణ మాట్లాడుతూ... తల్లీబిడ్డల ఆరోగ్య రక్షణను ప్రభుత్వం, ప్రజలు బాధ్యతగా స్వీకరించడం అవసరమన్నారు. స్త్రీ సురక్షిత గర్భధారణ, నాణ్యమైన ప్రసూతి ప్రతీ స్త్రీ ప్రాథమిక హక్కన్నారు. కార్యక్రమంలో వైద్యులు సుధా, ఉమాశ్రీ, సాజిదా, శైలేంద్ర కుమార్, సన జవేరియా, రాజగోపాల్, విమల, స్వామి, ప్రణీత, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.క్వింటాల్ పత్తి రూ. 7,550జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లో సోమవారం క్వింటాల్ పత్తి రూ. 7,550 పలికింది. క్రయ విక్రయాలను మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజాలు పర్యవేక్షించారు.మామిడి తోటలను కాపాడుకోండిజగిత్యాలఅగ్రికల్చర్/మల్యాల: మామిడి తోట లకు ఆశిస్తున్న పురుగులను నివారించేందుకు రైతులు అప్రమత్తంగా ఉండాలని ఉద్యానవన శాస్త్రవేత్తలు సూచించారు. సోమవారం జగిత్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శ్రీకొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పర్యటించి, తోటలను పరిశీలించారు. ప్రస్తుతం మామిడికాయ వృద్ధి చెంది, టెంక గట్టిపడే దశలో ఉన్నాయని, పలు తోటల్లో తామర పురుగు ఉధృతిని గమనించినట్లు తెలిపారు. పురుగుల ఉధృతిని బట్టి లీటరు నీటిలో వేపనూనె 3మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలన్నారు. అనంతరం ఫిప్రోనిల్ 80శాతం డబ్ల్యూజీ 0.2 గ్రాములు, లేదా స్పైనోసాడ్ 45శాతం ఎస్సీ 0.3 మిల్లీ లీటర్లు, లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని, సింథటిక్ పైరిత్రాయిడ్ కీటకనాశినిలను ఉపయోగించవద్దని సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రం రామగిరిఖిల్లా శాస్త్రవేత్త డాక్టర్ వై.వెంకన్న, ఫామ్ మేనేజర్ బండారి నరేశ్, సంగారెడ్డి ఫల పరిశోధన స్థానం శాస్త్రవేత్త ఎ.నితీశ్, ఉద్యాన అధికారి మహేశ్ పాల్గొన్నారు.జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికజమ్మికుంట: మండలంలోని కోరపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎనిమిదో తరగతి విద్యార్థి వనరస్ సుశాంత్ జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికై నట్లు ఫిజికల్ డైరెక్టర్ జిట్టబోయిన శ్రీను సోమవారం తెలిపారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెలెక్షన్ ట్రయల్స్తో అత్యంత ప్రతిభ కనబరిచాడని, 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఒడిశా కెయిన్ జార్ స్టేడియంలో జరిగే 39వ సబ్ జూనియర్ జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొంటారని, విద్యార్థి ఎంపిక పట్ల హెచ్ఎం మిడిదొడ్డి సమ్మయ్య, ఎంఈవో హేమలత, ఉపాధ్యాయులు రాజయ్య, దేవదాస్, ప్రకాశ్, శ్రీనివాస్, నరహరి, రాజు, రవికాంత్ రాజ్, శ్రీనివాస్రెడ్డి, పద్మ, సంపత్, శ్రీమాన్, గీత గ్రామస్తులు అభినందించారు. -
పింఛన్ ఇప్పించండి
కూతురు పుట్టుక నుంచి మానసిక, శారీరక వికలాంగురాలు. ఇప్పుడు 7 సంవత్సరాల వయ సు. దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. వస్తదంటరు.. కానీ రాదు. సదరం సర్టిఫికెట్ కూడా ఇచ్చిన. ఎన్నాళ్లని తిరగాలే. – వడ్లూరి రవళి, వెల్ది, మానకొండూరురెండేళ్లుగా అందని ‘ఉపకారం’.. బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీంలో భాగంగా విద్యార్థులను చేర్చుకుంటున్నాం. ప్రభుత్వం లక్కీడ్రా ద్వారా పాఠశాలలకు విద్యార్థులను కేటాయిస్తున్నారు. కానీ.. స్కాలర్షిప్లు మాత్రం రావడం లేదు. రెండేళ్లుగా పెండింగ్లో ఉన్నాయి.. అధికారులను కలవడం వినతిపత్రాలు ఇవ్వడం పరిపాటిగా మారింది. – శేఖర్రావు, నందిని కాన్వెంట్ స్కూల్ -
అమ్మా.. ఆలకించరూ!
● ప్రజావాణిలో కలెక్టర్తో బాధితుల ఏకరవు ● సమస్యలు పరిష్కరించాలని వేడుకోలుకరీంనగర్ అర్బన్: సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్ బాట పట్టారు బాధితులు. నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. సాంత్వన కరవైందని వాపోయారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి వినతులు వెల్లువలా వచ్చాయి. కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్లు అర్జీలను స్వీకరించారు. పలు సమస్యలను కలెక్టర్ అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపారు. భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, రేషన్ కార్డుల అర్జీలే ఎక్కువగా వచ్చాయి. మొత్తం 246 అర్జీలు వచ్చినట్లు కలెక్టరేట్ ఏవో సుధాకర్ తెలిపారు.ప్రజావాణికి వచ్చిన అర్జీలు: 246 ఎక్కువగా మునిసిపల్ కార్పొరేషన్, కరీంనగర్: 41, ఆర్డీవో కరీంనగర్: 18 కరీంనగర్ రూరల్ తహసీల్దార్: 13 డీపీవో: 13, వీణవంక తహసీల్దార్: 9 -
పరుగెత్తితే పతకమే..
● క్రీడా పోటీల్లో ‘మోడల్’ విద్యార్థుల సత్తా ● రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తున్న చిన్నారులు వాలీబాల్లో సత్తా ఇంటర్ సీఈసీ మొదటి సంవత్సరం చదువుతున్న సింధూ అండర్–19 వాలీబాల్ పోటీల్లో జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ విజయవాడలో నిర్వహించిన జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో సత్తా చాటింది. – బి.సింధూ పట్టుదలతోనే ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న శరణ్య రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీల్లో రాణించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. అండర్–19లో మణిపూర్ రాష్ట్రంలోని ఇంపాలో ఈనెల 15 నుంచి 21 వరకు నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు సన్నద్ధమవుతోంది. – బైకని శరణ్య ఆనందంగా ఉంది తొమ్మిదో తరగతి చదువుతున్న మనోజ్ఞ ఎస్జీఎఫ్ అండర్ –17లో ఇటీవల మెదక్లో జరిగిన రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీల్లో ప్రతిభ కనబర్చింది. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. జమ్ముకాశ్మీర్లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లోనూ పాల్గొని సత్తా చాటడం ఆనందంగా ఉంది. – తుమ్మల మనోజ్ఞ ధర్మారం(ధర్మపురి): వాళ్లు పల్లెవాసులు.. క్రీడా నేపథ్యం లేని కుటుంబాల నుంచి వచ్చారు.. ఎక్క డా తర్ఫీదు కూడా తీసుకోలేదు.. కానీ, చదువుతోపాటు ఆటల్లోనూ రాణిస్తూ ఔరా అనిపిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో సత్తా చాటుతు న్నారు ధర్మారం తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు. పీఈటీ కొమురయ్య, ప్రిన్సిపాల్ రాజ్కుమార్ ప్రోత్సాహంతో మెలకువలు నేర్చుకుంటున్నారు. ఈ విద్యాలయం నుంచి ఏటా 40 నుంచి 50 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి, ఐదుగురు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు. 2024–25 సంవత్సరంలో జాతీయస్థాయి పోటీలకు ఆరుగురు విద్యార్థులు హాజరవుతున్నారు. ఈ విద్యార్థులు పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన క్రీడాకారులతో తలపడి ఆద్భుత రికార్డులో నమోదు చేస్తున్నారు. వివిధ పట్టణాలు, నగరాల్లో నిర్వహించే రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు సొంత ఖర్చులతోనే వెళ్తూ పతకాలు సాధిస్తున్నారు. పట్టుదలతోనే సాధ్యం పీఈటీ ప్రోత్సాహంతో సాఫ్ట్బాల్పై ఆసక్తి పెంచుకున్న. పట్టుదలతో ఆడుతూ రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయి పోటీలకు చేరుకున్న. మహారాష్ట్రలోని నాందేడ్లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో రాణించడం సంతోషంగా ఉంది. – బండి వైష్ణవి జాతీయ స్థాయిలో ప్రతిభ ఎనిమిదో తరగతి చదువుతున్న ఓరం సౌజ్ఞ అథ్లెటిక్స్ అండర్ –14లో జాతీయ స్తాయికి ఎదిగింది. ఆమె పరుగెత్తుతే పతకం ఖాయం. రాష్ట్రస్థాయి నుంచి జాతీయస్థాయికి ఎదిగి గుజరాత్ హమ్మదాబాద్లో జరిగిన పోటీల్లో సత్తాచాటింది. – ఓరం సౌజ్ఞ -
దళారుల దందా!
యువ వికాసంలో● సర్టిఫికెట్ల పేరుతో విచ్చలవిడిగా వసూళ్లు ● మీ సేవ కేంద్రాల్లో అదనపు దోపిడీ ● భారీగా దరఖాస్తులు.. మంజూరు అంతంతేఇతని పేరు మురళీకృష్ణ. కరీంనగర్ రూరల్ మండలం తీగలగుట్టపల్లి గ్రామం. బీసీ–డీ కాగా తన కుమారుడికి ఓబీసీ సర్టిఫికెట్ కోసం గత 16 రోజుల క్రితం మీసేవలో దరఖాస్తు చేశాడు. సదరు ఫారంతో తహసీల్దార్ కార్యాలయానికి వెళితే ఇంటి పేరుపై అనుమానమంటూ తిప్పుకుంటున్నారు. ఇప్పటికే రేషన్కార్డు, కుల సర్టిఫికెట్ జారీ చేసినవి ఉండగా వాటిని చూపినా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు.కరీంనగర్ అర్బన్: ప్రభుత్వం పథకాలు ప్రకటించడమే తరువాయి దళారుల జేబు నిండుతోంది. సామాన్యులు చేతిలో దరఖాస్తుల ఫారాలతో రెవెన్యూ కార్యాలయాలను ఆశ్రయిస్తుండగా మామూళ్లతో పనులు కానిచ్చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఇటీవల రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేయగా దరఖాస్తులు కోరిన విషయం తెలిసిందే. గత నెలాఖరు గడువు కాగా, ఈ నెల 14వరకు పొడిగించింది. ధ్రువీకరణ పత్రాలు ఇప్పించడంతో పాటు పథక లబ్ధిదారులయ్యేలా చేస్తామని దళారులు బీరాలు పలకడం విశేషం. మొత్తంగా జిల్లాలో ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. కుల, అదాయ సర్టిఫికెట్లతో పాటు రేషన్ కార్డు అవసరం కాగా ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగడం పరిపాటిగా మారింది. దళారులకు మాత్రం అప్పటికప్పుడే ధృవీకరణ పత్రాలకు అప్రూవ్ ఇస్తున్నారని దరఖాస్తుదారులు వాపోతున్నారు. విచ్చలవిడిగా వసూళ్లు పథకం ప్రయోజనం అందుతుందో లేదో కానీ లంచాల బెడద అనివార్యమైందని తెలుస్తోంది. దరఖాస్తు చేసేందుకు మీ సేవ, ఈ సేవ కార్యాలయాలకు వెళితే నిర్ణీత రుసుంకు రెండింతలు వసూలు చేస్తున్నారు. ఇదెక్కడి అన్యాయమంటే మాకు ఖర్చులు ఎక్కువ.. ఎక్కువ తీసుకుంటేనే గిట్టుబాటవుతుందంటూ సమర్థింపు మాటలు మాట్లాడటం విశేషం. దరఖాస్తు తదుపరి తహసీల్దార్ కార్యాలయానికి వెళితే బ్రోకర్ల బెడద తప్పడం లేదన్నది బాధితుల మాట. గత కొన్నేళ్లుగా మీ సేవ కేంద్రాలపై పర్యవేక్షణ లేకపోగా తనిఖీల మాటే మరిచారు. దీంతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక కరీంనగర్ రూరల్, చిగురుమామిడి, మానకొండూరు, తిమ్మాపూర్, గన్నేరువరం, గంగాధర, చొప్పదండి, రామడుగు, ఇల్లందకుంట, జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయాల్లో దళారులే అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. సర్టిఫికెట్లకు రూ.500ల నుంచి రూ.2వేల వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. సర్టిఫికెట్ల జారీలో ఎందుకింత జాప్యం ఈ నెల 1 నుంచి వచ్చిన దరఖాస్తుల సంఖ్య, జారీ సంఖ్యను పరిశీలిస్తే అధికారుల నిర్లక్ష్యం స్పష్టమవుతోంది. ఈ నెల 7వరకు అంటే వారం రోజుల్లో జిల్లావ్యాప్తంగా కుల సర్టిఫికెట్ కోసం 3,621 దరఖాస్తులు రాగా అప్రూవ్ అయినవి కేవలం 567 మాత్రమే. ఈబీసీ కోసం 130 దరఖాస్తులు రాగా జారీ అయినవి 18. ఇక ఆదాయ ధృవీకరణ పత్రం కోసం 6,928 దరఖాస్తులు రాగా అప్రూవ్ అయినవి 1,945 మాత్రమే. సదరు గణాంకాలే రెవెన్యూ అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నాయి. కరీంనగర్ రూరల్, గంగాధర, కరీంనగర్ అర్బన్, మానకొండూరు మండలాల్లో ఎక్కువగా పెండింగ్లో ఉండగా మిగతా అన్ని మండలాల్లోనూ కొంతమేర పెండింగ్ ఉన్నాయని తెలుస్తోంది. సర్టిఫికెట్ల కోసం వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి జారీ చేయాలని ఆదేశించామని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ నెల 1 నుంచి వచ్చిన అర్జీలు.. సర్టిపికెట్ల జారీ సంఖ్య గణాంకాల్లో కుల సర్టిఫికెట్కు దరఖాస్తులు: 3,621 జారీ అయినవి: 567 ఈబీసీ: 130, జారీ: 18 ఆదాయ ధృవీకరణ: 6,928, జారీ: 1,945 -
‘కేవీ’ పిలుస్తోంది
● ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం ● ఈనెల 11వ తేదీ వరకు చివరి గడువు ● 2 నుంచి 10వ తరగతి వరకు ఖాళీలు ఉంటేనే అడ్మిషన్లుకరీంనగర్: ఆధునాతన సాంకేతిక విద్యనందించే కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు వేళయింది. ఈనెల 2నుంచి అన్ని కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల సందడి మొద లైంది. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ 2025–26 సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు జారీ చేసిన నోటిఫికేషన్ విద్యాలయాలకు చేరింది. ఆన్లైన్ ద్వారా అర్హుల నుంచి దరఖాస్తు స్వీకరణ జరుగనుంది. దరఖాస్తుల గడువు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఈనెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. ఈనెల 18 నుంచి తేదీ నుంచి అడ్మిషన్లు జరుగుతాయి. విద్యార్థులకు మెరిట్ జాబితా ప్రకారం ప్రవేశాలను కల్పిస్తారు. లిస్టులో ఉన్నవారు మాత్రమే తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కేంద్రీయ విద్యాలయంలో సంప్రదించి ప్రవేశాలను పొందాలి. ఒకటో తరగతిలో ప్రవేశానికి 2025 మార్చి 31వ తేదీ నాటికి ఐదేళ్లు వయస్సు నిండి ఏడేళ్ల వయస్సు కలిగి ఉండాలి. రెండో తరగతికి అరేళ్లు, 3వ తరగతికి ఏడేళ్లు, 4వ తరగతికి ఎనిమిదేళ్లు, 5వ తరగతికి తొమ్మిదేళ్లు, ఆరో తరగతికి పదేళ్లు, ఏడో తరగతికి 11 ఏళ్లు, ఎనిమిదో తరగతికి 12 ఏళ్లు, తొమ్మిదో తరగతికి 13, పదో తరగతికి 14 ఏళ్లు నిండి ఉండాలి. ఒక్కో కేంద్రీయ విద్యాలయంలో తరగతికి 40 చొప్పున సీట్లు ఉంటాయి. తాజాగా ఒకటో తరగతికి ప్రతి విద్యాలయంలో 40 చొప్పున ప్రవేశాలను నూతనంగా కల్పిస్తారు. ఆపై విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలనుకుంటే కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఉన్నతస్థాయి అధికారులు, కేంద్ర మానవ వనరులమంత్రిత్వ శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. వీరికి ప్రాధాన్యం ప్రవేశాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ రంగంలో పనిచేసే వారికి తొలి ప్రాధాన్యత ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగులు(ఆర్టీసీ, ఎన్పీడీసీఎల్, తదితర) ఒకే సంతానం కలిగిన కుటుంబాల్లోని వారికి ప్రాధాన్యం ఉంటుంది. పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ, కేవీఎస్ ఉన్నతాధికారులు సిఫార్సు చేసిన విద్యార్థులకు ప్రవేశాల్లో ప్రాధాన్యం కల్పిస్తారు. తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి పరీక్ష ఉంటుంది. మూడు గంటల వ్యవధిలో 100 మార్కులకు పరీక్ష రాయాలి. హిందీ, ఆంగ్లం, గణితం, సైన్స్, సోషల్ పాఠ్యాంశాల్లో ఈ పరీక్ష ఉంటుంది. 100 మార్కులకు ఇతరులు కనీసం 33, ఎస్సీ,ఎస్టీ దివ్యాంగులు 25 మార్కులు సాధించాలి. ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు ప్రతిభ ఆధారంగా చేపడతారు. ఎస్సీలకు 15 శాతం(12 సీట్లు), ఎస్టీలకు 7.5 శాతం(6 సీట్లు), 3 శాతం సీట్లను దివ్యాంగులకు రిజర్వు అవుతాయి. మిగిలిన సీట్లు ఇతరులకు కేటాయిస్తారు. సీటు లభిస్తే దశ తిరిగినట్లే సీబీఎస్ఈ సిలబస్లో కేంద్రీయ విద్యాలయాల్లో బోధన ఉంటుంది. పిల్లలపై ఎటువంటి ఒత్తిడి లేకుండా నాణ్యమైన విద్యను అందిస్తారు. ఒకటో తరగతి నుంచే సాంకేతిక పరిజ్ఞానంతో పరిచయం, శాస్త్ర సాంకేతికపై అవగాహన పెంపొందించే కార్యక్రమాలు ఉంటాయి. మిగిలిన పాఠశాలలకు భిన్నంగా దీని పనివేళలు, సెలవులు ఉంటాయి. ఆటపాటలు, స్వేచ్ఛతో కూడిన విద్య అందుతుంది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నవోదయ స్కూల్స్ల్లో 9వ తరగతిలో ప్రవేశానికి ఎంట్రెన్స్ పరీక్ష ఉంటుంది.ఫీజు వివరాలు అడ్మిషన్ పొందే విద్యార్థులు రూ.25 ప్రవేశ రుసుం చెల్లించాలి. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థి వరకు నెలకు రూ.500 చెల్లించాలి. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కంప్యూటర్ బోధన కోసం అదనంగా నెలకు రూ.100 చెల్లించాలి. 9వ, 10వ తరగతి విద్యార్థులకు ట్యూషన్ ఫీజు కింద అదనంగా నెలకు రూ.200 చెల్లించాలి. 11,12వ తరగతి విద్యార్థులకు ట్యూషన్ ఫీజు కింద అదనంగా నెలకు రూ.400 చెల్లించాలి. -
ద్విచక్ర వాహనం దహనం
కోరుట్ల రూరల్: మండలంలోని యూసుఫ్నగర్ గ్రామంలో ఓ యువకుడు తన తాతకు చెందిన ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ ఘటనలో బైక్ పూర్తిగా దగ్ధమైంది. వివరాల్లోకి వెళితే మరిపెల్లి లింబయ్య ఆదివారం తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి ఎదుట నిలిపి, ఇంట్లో నిద్రించాడు. తన మనవడు మరిపెల్లి లింబాద్రి రాత్రి 10గంటల ప్రాంతంలో మధ్యం సేవించి వచ్చి, ద్విచక్ర వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇంట్లో నిద్రిస్తున్న లింబయ్య బయటకు వచ్చే సరికే బైక్ పూర్తిగా కాలిపోయింది. లింబయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ద్విచక్ర వాహనం చోరీ జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్లో నిలిపిన ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. బుగ్గారం మండలం మద్దునూర్ గ్రామానికి చెందిన గంగిపెల్లి నాగరాజు ఈనెల 1న కొత్తబస్టాండ్లో బైక్ నిలిపి కళాశాలకు వెళ్లి వెళ్లాడు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి వచ్చేసరికి గుర్తుతెలియని దొంగలు ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై మన్మధరావు తెలిపారు. -
మరింత చేరువయ్యేలా..
● ఇక అన్నదాతలందరికీ ‘రైతునేస్తం’ ● ప్రతి మండలంలో మరో రెండు వేదికల్లో ప్రారంభం కొత్తగా రైతునేస్తం ప్రారంభించనున్న రైతు వేదికలుమండలం క్లస్టర్ కరీంనగర్రూరల్ దుర్శేడ్, మొగ్ధుంపూర్ కొత్తపల్లి కమాన్పూర్, బద్ధిపల్లి మానకొండూరు చెంజర్ల, పచ్చునూరు తిమ్మాపూర్ పర్లపల్లి, రేణికుంట శంకరపట్నం మెట్పల్లి, కాచాపూర్ గన్నేరువరం గుండ్లపల్లి, మాదాపూర్ చిగురుమామిడి ఇందుర్తి, సుందరగిరి హుజూరాబాద్ కందుగుల, సిర్సాపల్లి జమ్మికుంట జమ్మికుంట, వావిలాల వీణవంక వీణవంక, వల్భపూర్ సైదాపూర్ దుద్దెనపల్లి, రాయికల్ ఇల్లంతకుంట సిరిసేడు, బుజునూరు గంగాధర గర్షకుర్తి, బూరుగుపల్లి చొప్పదండి ఆర్నకొండ, గుమ్లాపూర్ రామడుగు గోపాల్రావుపేట, రుద్రారంకరీంనగర్రూరల్: రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులందరికీ మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు మండల కేంద్రాల్లోని రైతువేదికల్లో ప్రతీ మంగళవారం రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు ప్రత్యక్ష ప్రసారం చేశారు. ప్రస్తుతం రైతులకు మరింత సేవలందించేందుకుగాను అదనంగా ప్రతీ మండలంలోని రెండు క్లస్టర్లలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండలానికో క్లస్టర్ రైతువేదిక.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన రైతువేదికల ద్వారా రైతులకు సేవలందించేందుకు వీలుగా ఆధునిక, సాంకేతిక పద్ధతులను ఉపయోగించుకుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సలహాలు, సూచనలు అందించేందుకు రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించింది. మూడేళ్లక్రితం మొదటి విడతలో ప్రయోగాత్మకంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కొత్తపల్లి రైతువేదిక, హుజూరాబాద్లో హుజూరాబాద్, చొప్పదండిలో గంగాధర, మానకొండూరులో తిమ్మాపూర్ రైతువేదికలను ఎంపిక చేశారు. అనంతరం రెండో విడతలో మండలానికో రైతు వేదిక చొప్పున కరీంనగర్రూరల్ మండలంలోని చామనపల్లి రైతువేదిక, మానకొండూరు, గన్నేరువరం మండల కేంద్రాలు, శంకరపట్నంలో కేశవపట్నం, చిగురుమామిడి, చొప్పదండి, రామడుగు, సైదాపూర్ మండల కేంద్రాలు, జమ్మికుంటలోని తనుగుల, ఇల్లంందకుంట మండల కేంద్రం, వీణవంకలోని చల్లూరు రైతువేదికలను ఎంపిక చేసి ప్రతి మంగళవారం రైతునేస్తం కార్యక్రమాలను ప్రసారం చేశారు. ప్రస్తుతం మూడో విడతలో జిల్లాలోని మొత్తం 15 మండలాల్లో రెండు క్లస్టర్ల చొప్పున రైతువేదికలను ఎంపిక చేసి వీడియో కాన్ఫరెన్స్ పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. కేవీకే ఆధ్వర్యంలో.. జిల్లాలో సాగు చేసే పంటలలో యాజమాన్య పద్ధతులపై వ్యవసాయ విశ్వవిద్యాలయం కేంద్రంగా శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు అందించారు. అయి తే జిల్లాల వారీగా పంటల సాగు పద్ధతులు, ఆశించే తెగుళ్లు వేర్వేరుగా ఉండటంతో రైతులకు సరైన సలహాలు లభించలేదు. ఇక నుంచి కృషి విజ్ఞన కేంద్రం ద్వారా స్థానిక శాస్త్రవేత్తలతో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. -
విద్యుత్ ప్రమాదాల నివారణకు ‘ఎల్సీ’
● యాప్తో సిబ్బంది భద్రతకు భరోసాకొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ మరమ్మతుల్లో భాగంగా మానవ తప్పిదాల వల్ల ప్రమాదాల నివారణకు టీజీఎన్పీడీసీఎల్ సంస్థ ఎల్సీ (లైన్ క్లియర్) యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎల్సీ తీసుకొని పనులు చేపడుతున్న సమయంలో చాలా మానవ తప్పిదాలు చోటుచేసుకోవడం, ఒక ఫీడర్కు బదులు మరో ఫీడర్ ఎంచుకోవడం, సమాచార లోపం తదితర కారణాల వల్ల ఉద్యోగులు ప్రమాదా లకు గురవుతున్నారు. దీంతో యాజమాన్యం ఎల్సీ యాప్ను రూపొందించింది. ఎల్సీ యాప్ అమలు విధానం మొదట ఎల్సీ తీసుకోవాలనుకునే లైన్మెన్ యాప్ ఓపెన్ చేసి అందులో సంబంధిత ఫీడర్లో ఎల్సీ కావాలని సంబంధిత ఏఈకి విన్నవించాలి. ఏఈ లైన్మెన్ విన్నపాన్ని ప రిశీలించి ఆ ఫీడర్లో ఎల్సీ ఇవ్వచ్చా, లేదా.. అత్యవసర అ వసరాలేమైనా ఉన్నాయా, మరే ఇతర షెడ్యూల్ చేయబ డిన పనులు ఉన్నాయా అని ఆలోచించి నిర్ణయం తీసుకో వాల్సి ఉంటుంది. ఏఈ అనుమతి ఇవ్వగానే సంబంధిత లై న్మెన్కి సమాచారం వెళ్తోంది. అలాగే సబ్స్టేషన్ ఆపరేటర్కు ఏ ఫీడర్ ఇవ్వాలో యాప్ ద్వా రా తెలుస్తోంది. ఎల్సీ ఇవ్వాల్సిన సమయంలో సబ్స్టేషన్ ఆపరేటర్ ఏమరపాటుగా చేసే పొరపాట్లను నివారించుటకు యాప్ తగు సూచనలు, జాగ్రత్తలు తెలియజేస్తుంది. అనగా.. హెల్మెట్ పెట్టుకోవాలని, హ్యాండ్ గ్లౌజ్ వేసుకోవాలని, ఎర్త్ రాడ్ వెయ్యాలని, ఏబీ స్విచ్ ఓపెన్ చేశారా లేదా అన్న విషయాలను యాప్ గుర్తు చేయనుంది. వీటన్నింటినీ సబ్ స్టేషన్ ఆపరేటర్ ఫొటో తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. ఆ ఫొటోను యాప్ ద్వారా లైన్మెన్ చూసుకొని ఆ ఫొటోలో కన్పిస్తున్న ఫీడర్, ఏబీ స్విచ్ ఓపెన్ చేశారా లేదా అని ధ్రువీకరించుకొని పనికి ఉపక్రమించాల్సి ఉంటుంది. పనిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సైతం యాప్లో సూచించనున్నాయి. లైన్మెన్ ఎంత మంది సిబ్బంది చేత పని చేయిస్తున్నాడో వారి పేర్లు యాప్లో పొందుపరచాలి. పని పూర్తికాగానే లైన్మెన్ ఆ పనికి సంబంధించిన ఫొటో, సిబ్బంది వచ్చారా లేదా అని యాప్లో పొందుపరచి ఎల్సీ రిటర్న్ చేయాల్సి ఉంది. దీంతో సబ్స్టేషన్ ఆపరేటర్కు యాప్ ద్వారా ఎల్సీ రిటర్న్ ఆదేశాలు వెళ్లనున్నాయి. అప్పుడు సబ్ స్టేషన్ ఆపరేటర్ ఎల్సీ రిటర్న్ చేసే క్రమంలో ఎర్త్ రాడ్ తీసారా, ఏబీ స్విచ్ ఓపెన్ చేశారా లేదా అని యాప్ అడుగుతోంది. ఇలా ఎల్సీ పూర్తయి సంబంధిత ఏఈకి సమాచారం వెళ్తుంది.ప్రమాదాల నివారణకు.. విద్యుత్ సేవల్లో భాగంగా మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాల నివారణకు సంస్థ ఎల్సీ యాప్ను రూపొందించింది. యాప్తో ఉద్యోగుల మధ్య సమన్వయంతో పాటు ఏ లైన్పై పనులు చేపడుతున్నారో తెలియజేయనుంది. దీంతో భద్రతా ప్రమాణాలు పెరిగి ప్రమాదాలను నివారించవచ్చు. అలాగే అనవసరమైన ఎల్సీలను తగ్గించవచ్చు. – రమేశ్బాబు, ఎస్ఈ, కరీంనగర్ సర్కిల్ -
గ్రామ పాలనకు కసరత్తు
● మళ్లీ ఆప్షన్లకు ఈ నెల 16వరకు అవకాశం ● వీఎల్వో సేవలకు పోటాపోటీ ● జిల్లాలో 600కు పైగా ఆశావహులుకరీంనగర్ అర్బన్: గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే వీఆర్వో, వీఆర్ఏల నుంచి ఆప్షన్లు స్వీకరించగా మరో అవకాశమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16వరకు అవకాశమివ్వగా మరోసారి దరఖాస్తు చేయాలని నిర్దేశించింది. రెవెన్యూశాఖలో కీలకమైన వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను గత ప్రభుత్వం రద్దు చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం వీఎల్వో పేరుతో రెవెన్యూశాఖకు జవసత్వాలిచ్చేలా చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ భూముల పరిరక్షణ వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ.. విలేజ్ లెవల్ ఆఫీసర్ను నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు కలెక్టర్కు ఆదేశాలు రాగా ఇప్పటికే ఆన్లైన్ ఆప్షన్లను స్వీకరించారు. ఇతర శాఖల్లో సర్దుబాటు అయిన వీఆర్వో, వీఆర్ఏలను తిరిగి రెవెన్యూలో కొనసాగించనుండగా సదరు ఉద్యోగులు ఆప్షన్లు ఇచ్చారు. ఇతరశాఖల్లో సర్దుబాటుకు ముందు జిల్లాలో 658 మంది వీఆర్ఏలు, 350 మంది వీఆర్వోలు ఉండేవారు. గూగుల్లో ఆప్షన్ ఫారం అందుబాటులో ఉంచగా ఆసక్తిగలవారు తమ వివరాలను నమోదు చేస్తున్నారు. జిల్లాలో 313 గ్రామ పంచాయతీలుండగా ఐదు మునిసిపాలిటీలున్నాయి. పోటీ ఎక్కువగా ఉండగా ఎవరిని సదరు పోస్టులో కొనసాగిస్తారో అన్న ఉత్కంఠ నెలకొంది. స్థానికత ఎక్కడ.. విద్యార్హత ఏంటీ డిగ్రీ లేదా ఇంటర్ అర్హతతో ఐదేళ్ల సర్వీసు ఉన్న వారికి అవకాశం ఇవ్వనున్నారు. మొదట పూర్వ వీఆర్వో, వీఆర్ఏలకే అవకాశం ఉండగా వీఆర్ఏల నుంచి ఉద్యోగ క్రమబద్ధీకరణ పొంది జూనియర్ అసిస్టెంట్లుగా లేదా రికార్డు అసిస్టెంట్లుగా విధులు నిర్వర్తిస్తున్నవారిని పరిగణనలోకి తీసుకుంటారు. సీసీఎల్ఏ పరిధిలో ఎంపిక చేసి జిల్లాకు కేటాయింపులు చేస్తారని ఓ రెవెన్యూ ఉన్నతాధికారి వివరించారు. కాగా ఫారంలో పుట్టిన తేదీ, విద్యార్హత, స్థానికత ఎక్కడ, ప్రస్తుతం ఏ జిల్లాలో పని చేస్తున్నారు, ఏ శాఖలో ఉన్నారు, ఏ బాధ్యతలు నిర్వహిస్తున్నారు, ఐడీ నంబర్, ఎప్పుడు రెగ్యులర్ అయింది, ఎప్పుడు నియామకమయ్యారు, సదరు ప్రతిని అప్లోడ్ చేయాలనే ఆప్షన్లు ఉన్నాయి. దాదాపు విధులు ఇవే వీఆర్వోలు, వీఆర్ఏలు ప్రస్తుతం వివిధశాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీఆర్వోలను పంచాయతీరాజ్, మునిసిపల్, నీటిపారుదల శాఖకు కేటాయించగా వీఆర్ఏలను మిషన్ భగీరథ, మున్సిపల్, నీటిపారుదల శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు. కాగా గ్రామ పాలన అధికారులకు వివిధ రకాల విధులు ఉండనున్నాయని సమాచారం. ఇదిలాఉండగా 61ఏళ్లు పైబడిన వీఆర్ఏల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో సర్దుబాటైన వీఆర్వో, వీఆర్ఏలను తిరిగి రెవెన్యూ శాఖలో కొనసాగించే ప్రక్రియ చేపడుతుండగా వీరి విషయంలో స్పష్టత లేకపోవడం గమనార్హం. జిల్లాలో 80కి పైగా 61 సంవత్సరాలు పైబడినవారుండగా ఇందులో కొందరు మరణించగా పలువురు మంచంపట్టారు.ఇప్పటికే ఆప్షన్లు ఇచ్చినవారు: 605 వీఆర్వో కేటగిరీ: 254 వీఆర్ఏ కేటగిరీ: 351 -
సప్తసాహితీ పుస్తకాల ఆవిష్కరణ
కరీంనగర్కల్చరల్: కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత డా.నలిమెల భాస్కర్ రచించిన మాటల మూటలు, ప్రణయ హృదయాలు, చెలిమెలు, ఆరు బెంగాలీ కథలు, తెలుగు క్రియా పదకోశం, తెలంగాణ పలుకుబడి, కుండి పుస్తకాలను సప్తతి మహోత్సవం సందర్భంగా ఆదివారం సాహితీ సోపతి ఆధ్వర్యంలో ఫిలింభవన్లో ఆవిష్కరించారు. మాటల మూటలు పుస్తకాన్ని ప్రముఖ కవి, సీనియర్ పాత్రికేయులు నగునూరి శేఖర్, ప్రణయ హృదయాలు పుస్తకాన్ని ప్రముఖ కవి, విమర్శకులు అన్నాడి గజేంద్రరెడ్డి ఆవిష్కరించారు. చెలిమెలు పుస్తకాన్ని ప్రముఖ కవి, రచయిత కాలమిస్ట్ అన్నవరం దేవేందర్, ఆరు బెంగాలీ కథలను రచయిత, కవి, గాయకులు గాజోజు నాగభూషణం, తెలుగు క్రియా పదకోశాన్ని కవి, రచయిత విమర్శకులు బూర్ల వెంకటేశ్వర్లు, తెలంగాణ పలుకుబడిని కవి కందుకూరి అంజయ్య, అనువాద నవల కుండిని కవి, విమర్శకులు కూకట్ల తిరుపతి ఆవిష్కరించారు. సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ డి.రఘురామన్, జూకంటి జగన్నాథం, పొన్నం రవిచంద్ర, పెద్దింటి అశోక్కుమార్, రంగినేని మోహన్రావు, పీఎస్ రవీంద్ర, మాడిశెట్టి గోపాల్, డా.వాసరవేణి పరశురాం, మనోహర్రెడ్డి, మోత్కుల నారాయణ, బూరె దేవానందం, మద్దికుంట లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవంకరీంనగర్టౌన్: బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. మాజీ మేయర్ సునీల్రావు తన క్యాంపు కార్యాలయంలో బీజేపీ జెండా ఆవిష్కరించి, డాక్టర్ శ్యామప్రసాద్, పండిట్ దీన్దయాళ్ చిత్రపటాలకు పూలమాల వేశారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. విద్యానగర్లోని మోదీచౌక్ జెండా గద్దె వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు. నరహరి లక్ష్మారెడ్డి, జాడి బాల్రెడ్డి, కోమాల ఆంజనేయులు, గుండారపు సంపత్, రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రేకుర్తి 18వ డివిజన్లో పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాల్రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ జెండా ఆవిష్కరించారు. నాయకులు పొన్నాల రాములు, గోదరి నరేశ్, ఎర్రోళ్ల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. 59వ డివిజన్ సుష్మా స్వరాజ్ చౌరస్తాలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. నాయకులు పబ్బాల్ల ఆంజనేయులు, దయ్యాల కరుణాకర్, సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.విజయవంతం చేయాలికరీంనగర్: ట్రైకార్లో 2019–21లో రుణాలు మంజూరై చెక్కులు సిద్ధంచేసి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడని లబ్ధిదారులు సోమవారం హైదరాబాద్లోని గిరిజన సంక్షేమ భవన్ ఎదుట జరిగే నిరసన కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బోడ మోహన్నాయక్, జి.బీమాసాహెబ్ పిలుపునిచ్చారు. జిల్లా కార్యాలయంలో వారు మాట్లాడుతూ, రాజీవ్ యువ వికాసం పేరుతో రాష్ట్రప్రభుత్వం హడావిడిగా పథకాన్ని ప్రారంభించడం వల్ల ట్రైకార్ సంస్థ పూర్తిగా నిర్వీర్యమవుతుందనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. దాదాపు 30 వేల మంది గిరిజన యువతీయువకులకు రుణాలు మంజూరు చేసి వారి ఖాతాల్లో డబ్బులు వేయకుండా రద్దు చేయాలనే కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ట్రైకార్ లబ్ధిదారులు తరలిరావాలని కోరారు. సమావేశంలో గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.పవర్కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ మరమ్మతు పనులు చేపడుతున్నందున సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు 11 కేవీ రామచంద్రాపూర్ ఫీడర్ పరిధిలోని ఆర్సీపీ బైపాస్రోడ్, లేక్ పోలీస్స్టేషన్, సప్తగిరికాలనీ, సాయిబాబా ఆలయం రోడ్, అంజనాద్రి ఆలయం, శ్రీనగర్కాలనీ, ఏఓస్ కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. -
అనారోగ్యంతో మాజీ ఎంపీటీసీ మృతి
రాయికల్: రాయికల్ మాజీ ఎంపీటీసీ కై రం పురుషోత్తం (45) అనారోగ్యంతో ఆదివారం మృతిచెందారు. ఉపాధి నిమిత్తం ముంబయి వెళ్లిన ఆయన కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆరోగ్యం క్షీణించి మృతి చెందాడు. పురుషోత్తంకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ఆయన మృతిపట్ల వివిధ పార్టీల నాయకులు, యువజన సంఘం సభ్యులు సంతాపం ప్రకటించారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు.. ● మరొకరికి గాయాలు మంథని: కాటారం – మంథని ప్రధాన రహదారి బట్టుపల్లి సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడినట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. ఎస్సై, స్థానికుల కఽథనం ప్రకారం.. మంథని మున్సిపల్ పరిధిలోని పోచమ్మవాడకు చెందిన గడి రవి(46), ఎరుకలగూడేనికి చెందిన శేఖర్ పని నిమిత్తం ద్విచక్రవాహనంపై బట్టుపల్లికి వెళ్లారు. పని ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో లారీని ఓవర్టేక్ చేస్తుండగా.. ఎదురుగా మంథని నుంచి కాటారం వైపుగా వెళ్తు కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న రవి కాలు, ఇతర శరీర భాగాల్లో బలమైన గాయాలయ్యాయి. శేఖర్కు సైతం గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న మంథని సీఐ రాజు.. గాయపడ్డవారిని మంథని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. రవికి ప్రథమ చికిత్స అందించి కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. శేఖర్కు ప్రాథమిక చికిత్స అందించి కరీంనగర్ తరలించారు. మృతుడి భార్య రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై తెలిపారు. మామిడిపల్లిలో దొంగతనంకోనరావుపేట(వేములవాడ): మండలంలోని మామిడిపల్లికి చెందిన హుస్సేన్ భీ ఇంట్లో ఆదివారం దొంగతనం జరిగింది. ఈనెల 3న హుస్సేన్ భీ ఇంటికి తాళం వేసి తన కుమారుడు అబ్దుల్ ఇంటికి వెళ్లింది. ఆదివారం వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉంది, ఇంట్లోకి వెళ్లి చూడగా 8 తులాల బంగారు ఆభరణాలు, చెవుల కమ్మలు, 20 తులాల వెండి గొలుసులు ఎత్తుకెళ్లారు. అదే గ్రామంలో మరో ఇంటిలో కూడా దొంగలు పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రశాంత్రెడ్డి తెలిపారు. నేటి నుంచి ఎస్సెస్సీ మూల్యాంకనంకరీంనగర్: పదో తరగతి పరీక్షల మూల్యాంకనం సోమవారం జిల్లా కేంద్రంలోని సెయింట్ జాన్స్ హైస్కూల్లో ప్రారంభించనున్నట్లు డీఈవో జనార్దన్రావు ప్రకటనలో తెలిపారు. పరీక్షల మూల్యాంకనానికి సంబంధించి సీఈ, ఏఈ, స్పెషల్ అసిస్టెంట్, ఓఎస్లకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందన్నారు. మూల్యాంకన విధుల ఉత్తర్వులు అందిన ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని సంబంధిత స్కూల్ కాంప్లెక్స్, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చేసి మూల్యాంకన కేంద్రంలో హాజరయ్యేలా చూడాలని పేర్కొన్నారు. స్పాట్ ఉత్తర్వులు అందిన సిబ్బంది ఉదయం 8.30 గంటలకు క్యాంప్ ఆఫీసర్కు రిపోర్టు చేయాలని, సిబ్బంది ఐడీ కార్డు కోసం ఒక ఫొటో తీసుకురావాలని సూచించారు. డైరెక్టర్ ఆదేశాల మేరుకు ఎవరూ కూడా ఫోన్లను మూల్యాంకన కేంద్రంలోనికి తీసుకురావద్దని, గేటు బయటనే భద్రపర్చుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సీసీఏ రూల్స్, మూల్యాంకన నియమాలు, యాక్ట్ట్ 25 ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. -
మాతృ మరణాలు తగ్గించడమే లక్ష్యం
సుల్తానాబాద్: మాతా, శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు జిల్లావాసుల్లో అవగాహన కల్పించేలా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమంలో భాగంగా కేంద్రప్రభుత్వం ఈమేరకు పలు రకాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వ్యాధి నిరోధక టీకాలు వేస్తోంది. పౌష్టికాహారం అందిస్తోంది. నిత్యం వ్యాయామం చేయిస్తోంది. మరణాలను నివారించి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం, సమాజం.. మొత్తంగా ప్రపంచ కూడా ఆరోగ్యం ఉంటుందని భావిస్తోంది. మానసిక ప్రశాంతత ముఖ్యం మనిషి శారీరకంగా ఎంత ఆరోగ్యంగా ఉన్నా.. మానసిక ప్రశాంతత లేకపోతే జీవనగమనం లయ తప్పుతుంది. దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే అవకాశం ఉంది. విపరీతమైన ఆలోచనలతో ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుంది. కరోనా తర్వాత మనిషి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడని డబ్ల్యూహెచ్వో ఇటీవల హెచ్చరించింది. నేడు ర్యాలీలు.. జిల్లావ్యాప్తంగా జిల్లాకేంద్రంతోపాటు అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మండల కేంద్రాలలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మండల కేంద్రాల్లో ర్యాలీ నిర్వహించనున్నారు. ఆరోగ్య సంరక్షణపై అవగాహన నేడు జిల్లాలో అవగాహన ర్యాలీలు విజయవంతం చేయాలి జిల్లా, మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. సిబ్బంది విధిగా పాల్గొని విజయవంతం చేయాలి. గర్భిణులను చైతన్యవంతం చేయడంతోపాటు నిత్యం వ్యాయామం చేసి పౌష్టికాహారం తీసుకునేలా ప్రజల్ని ప్రోత్సహించాలి. – అన్నప్రసన్న కుమారి, డీఎంహెచ్వో -
స్పోర్ట్స్ అకాడమీ, హాస్టళ్లలో ప్రవేశాలకు..
● నోటిఫికేషన్ విడుదల చేసిన క్రీడా శాఖ ● జూలై 1 నుంచి 5 వరకు ఎంపిక పోటీలు కరీంనగర్స్పోర్ట్స్: క్రీడాకారుల ఉజ్వల భవితకు పునాది వేసేవి స్పోర్ట్స్ అకాడమీ, స్పోర్ట్స్ హాస్టళ్లు. ఈనేపథ్యంలో రాష్ట్రంలోని స్పోర్ట్స్ అకాడమీ, స్పోర్ట్స్ హాస్టళ్లలో 2025–26 సంవత్సరానికి ప్రవేశాలకు క్రీడాశాఖ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 1 నుంచి 5 వరకు బాలబాలికలకు ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఎంపిక పోటీలు జరిగే ప్రదేశాలు ● సైక్లింగ్, రెజ్లింగ్ అకాడమీ, సైక్లింగ్ వెల్డ్రోమ్, ఓయు క్యాంప్లకు ఎంపిక పోటీలు ఉస్మానియా యూనివర్సిటీలోని సైక్లింగ్ వెల్డ్రోమ్ ఓయూలో జరగనున్నాయి. ● రీజినల్ స్పోర్ట్స్ హాస్టల్, హనుమకొండకు ఎంపిక పోటీలు డీఎస్ఏ హన్మకొండలో జరగనున్నాయి. ● అథ్లెటిక్స్ అకాడమీ, ఖమ్మంకు ఎంపిక పోటీలు డీఎస్ఏ హనుమకొండలో జరుగుతాయి. ● హాకీ అకాడమీ, వనపర్తికి ఎంపిక పోటీలు డీఎస్ఏ వనపర్తిలో జరుగనున్నాయి. ● వాలీబాల్ అకాడమీ, సరూర్నగర్కు ఎంపిక పోటీలు వాలీబాల్ అకాడమీ సరూర్నగర్లో జరుగనున్నాయి. ● వాలీబాల్ అకాడమీ, రాజన్న సిరిసిల్లకు ఎంపిక పోటీలు వాలీబాల్ అకాడమీ రాజన్న సిరిసిల్లలో జరుగనున్నాయి. వాలీబాల్ అకాడమీ, సిద్దిపేటకు ఎంపిక పోటీలు వాలీబాల్ అకాడమీ సిద్దిపేటలో జరుగనున్నాయి. అర్హతలు ఇవే.. క్రీడాకారులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉ ండాలి. సంబంధిత వేదికల్లో ఉదయం రిపోర్టు చే యాలి. అథ్లెటిక్స్, హాకీ, వాలీబాల్, రెజ్లింగ్, సైక్లింగ్లో ప్రవేశాలకు 12 నుంచి 16 ఏళ్లలోపు వయసు ఉండాలి. జాతీయస్థాయి సబ్ జూనియర్స్, ఎస్జీఎఫ్ పో టీల్లో పాల్గొన్న క్రీడాకారులకు ప్రాధాన్యం ఉంటుంది. తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్లు.. క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రం, ప్రస్తుత విద్యార్హత సర్టిఫికెట్, రెసిడెన్షియల్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, 10 పాస్ పోర్టు సైజ్ ఫొటోలు, క్రీడా సర్టిఫికెట్లు. సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్రంలోని క్రీడా అకాడమీ, స్పోర్ట్స్ హాస్టళ్లలో ప్రవేశ అవకాశాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రీడాకారులు సద్విని యోగం చేసుకోవాలి. వీటిలోల్లో చేరేవారు భవిష్యత్లో క్రీడల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. శిక్షణతో మేటి క్రీడాకారులుగా ఎదిగే అవకాశం ఉంటుంది. – శ్రీనివాస్గౌడ్, డీవైఎస్వో -
రామగుండంలో లోకోపైలెట్ల నిరసన
రామగుండం: ఆలిండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ కేంద్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక లోలో పైలెట్లు ఆదివారం నిరసన తెలిపారు. కేంద్రప్రభుత్వం లోకో రన్నింగ్ స్టాఫ్ డిమాండ్ల కమిటీని ఇటీవల ఏర్పాటు చేయగా అందులో రన్నింగ్ స్టాఫ్, ప్రయాణికుల సేవలకు వ్యతిరేకంగా నిర్ణయాలు ఉన్నాయని పైలెట్లు ఆరోపించారు. దీంతో స్థానిక రైల్వే ప్లాట్ఫారం ఉన్న క్య్రూ కార్యాలయం ఎదుట లోకో పైలెట్లు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను పట్టుకొని నిరసన తెలిపారు. అనంతరం వాటిని దహనం చేశారు. రైల్వేబోర్డు నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రామగుండం బ్రాంచి కార్యదర్శి సీహెచ్ రవి, ప్రతినిధులు ఎంబీ మీనా, అరుణ్తేజ్, నవీన్, రమణాచారి, పంకజ్ లష్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఫుడ్ పాయిజన్తో మహిళ మృతి
రుద్రంగి(వేములవాడ): రుద్రంగి మండల కేంద్రానికి చె ందిన కాదాసు పుష్పలత(35) అనే మహిళ ఫుడ్ పాయిజన్తో ఆదివారం మృతి చెందింది. వి వరాలు ఇలా ఉన్నాయి. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కాదాసు పుష్పలత, ఆమె కు మారుడు కాదాసు నిహాల్(6) శుక్రవారం రాత్రి ఇ ంట్లో చేసిన రొట్టెలు తిని పడుకున్నారు. అనంతరం ఇద్దరికీ వాంతులు, విరేచనాలు కావడంతో కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్కు తరలి ంచారు. పుష్పలత ఆదివారం మృతిచెందింది. మృతురాలికి భర్త కాదాసు రాజు, కొడుకు నిహాల్ ఉన్నారు. రాజు బతుకు దెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. కొడుకు నిహాల్ సీరియస్ పుష్పలత కొడుకు నిహాల్ పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. నిహాల్ వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రుద్రంగి ఎస్సై అశోక్ మృతురాలి ఇంటి వద్ద ప్రాథమిక విచారణ చేపట్టి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదు అందగానే పూర్తి విచారణ చేపడతామని తెలిపారు. మరో చిన్నారి సీరియస్ -
రూ.86కోట్లు.. 12 అంతస్తులు
సిరిసిల్లకల్చరల్: మారుతున్న పరిస్థితులు.. పెరుగుతున్న కేసుల దృష్ట్యా జిల్లాలో ప్రస్తుతం ఉన్న కోర్టు భవనాలు సరిపోవడం లేదు. కక్షిదారులు, లాయర్లు, పోలీసులు, నిందితుల బంధువులతో కోర్టు ఏరియా రద్దీగా మారుతోంది. ప్రస్తుతం జిల్లా కోర్టులు ఉన్న ప్రాంతంలోనే నూతన భవన సముదాయం నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. 5.1 ఎకరాలలో రూ.86కోట్లతో 12 అంతస్తుల్లో భవన సముదాయం నిర్మించాలని ఏర్పాట్లు చేస్తుంది. రానున్న జూలైలో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భవనం పనులు పూర్తయ్యే వరకు కోర్టు వ్యవహారాలు తాత్కాళికంగా ప్రైవేట్ భవనంలో నిర్వహించేందుకు సైతం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. నెల రోజుల్లోనే టెండర్లు సిరిసిల్లలో కోర్టు భవనాలకు నెల రోజుల్లో టెండర్లు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విశాలమైన కోర్టు హాళ్లు, కక్షిదారులకు వెయిటింగ్ హాళ్లు, తగినన్ని వాష్రూమ్స్, భవనానికి నాలుగు వైపులా పార్కింగ్ సౌకర్యంతో అధునాతనంగా నిర్మించనున్నారు . సర్దార్నగర్లో తాత్కాలిక కోర్టు నూతన భవన నిర్మాణం ప్రతిపాదన నేపథ్యంలో ప్రస్తుతం కోర్టు కాంప్లెక్స్ మరో చోటికి తరలిపోనుంది. సర్దార్నగర్లో మూడు అంతస్తుల ప్రైవేట్ భవనాన్ని తాత్కాలిక న్యాయస్థానంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో రెండు నెలల్లో తాత్కాలిక భవనం రూపుదిద్దుకోనుంది. జూన్ మూడో వారం నాటికి ప్రైవేట్ భవనంలో కోర్టు కార్యకలాపాలు ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. అక్కడ మూడు..ఇక్కడ మూడు ప్రస్తుత కోర్టుల సముదాయంలోని మూడు కోర్టులు ప్రైవేట్ భవనంలోకి వెళ్లనున్నాయి. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, మొదటి అదనపు సివిల్ జడ్జి కోర్టు, రెండో అదనపు సివిల్ జడ్జి కోర్టు ప్రైవేట్ భవనంలో కొనసాగుతాయి. సీనియర్ సివిల్ జడ్జి కోర్టు సినారె కళామందిరం సమీపంలో నిర్వహించనున్నారు. ఇక ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కోర్టు, మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు, పోక్సో కోర్టులతోపాటు న్యాయస్థాన పాలనాపరమైన కార్యాలయాలు మాత్రం పూర్వపు భవనాల్లోనే కొనసాగించాలని నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు కోసం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణకు అవకాశం లేదు. ఇందుకోసం ప్రత్యేకంగా ఉమ్మడి కరీంనగర్ కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. జిల్లాలో ఇప్పుడు ఉన్న ఏడు కోర్టులతోపాటు అదనంగా అట్రాసిటీ కేసుల విచారణ కోసం మరో న్యాయస్థానం అవసరం ఉంది. ఈమేరకు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లేందుకు నూతనంగా ఏర్పడ్డ న్యాయవాదుల సంఘం ప్రయత్నిస్తోంది. సోమవారం ఈ ప్రతిపాదనను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాకు నూతన కోర్టు భవన సముదాయం ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోనే నిర్మాణం ఐదు ఎకరాల్లో సువిశాల భవనం జూలై నుంచి పనులు మొదలుకొత్త జిల్లాల్లో తొలి న్యాయస్థానం సిరిసిల్లలోనే.. రాష్ట్ర ఆవిర్భావం తరువాత జిల్లాల పునర్వ్యవస్థీకరణలో అదనంగా 23 జిల్లాల్లో తొలి న్యాయస్థానం సిరిసిల్ల్లకే కేటాయించారు. అప్పటి ఎంపీ వినోద్కుమార్, మంత్రి కేటీఆర్తో చర్చించి జిల్లా ఏర్పడిన తొలి ఆరు నెలల్లోపే జిల్లా న్యాయస్థానం ఏర్పాటు చేసుకోగలిగాం. నూతన భవనాన్ని కూడా ఏడాదిలోపు అందుబాటులోకి తెచ్చేందుకు హైకోర్టు, ఆర్థిక, భవన నిర్మాణశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటాం. న్యాయవాదులకు దాదాపు ఏడేళ్లుగా కొత్తగా హెల్త్కార్డులు జారీ కాలేదు. రాష్ట్రంలో సుమారు 35వేల మంది, జిల్లా కేంద్రంలో 180 మంది న్యాయవాదులకు త్వరలోనే ఆరోగ్య కార్డులు ఇప్పించేందుకు ప్రయత్నిస్తాను. – జూపల్లి శ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు -
మత సామరస్యానికి ప్రతీక లొంకకేసారం
రామగిరి(మంథని): లొంకకేసారం గ్రామంలోని ఆంజనేయస్వామి అలయంలో ఆదివారం శ్రీసీతారామ కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఆరేళ్లుగా ఏటా ముస్లింల సహకారంతో రాములోరి కల్యాణం ఘనంగా నిర్వహిస్తున్నారు. నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ లొంకకేసారం తొలిసర్పంచ్గా ఎన్నికై న ఎండీ మంజూర్ అన్నీతానై స్వామివారల వివాహం జరిపించడం విశేషం. గ్రామస్తులతో కలిసి కల్యాణాన్ని వీక్షిస్తూ వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. చిన్నగ్రామమైనా.. మతాలకు అతీతంగా కల్యాణం జరుపుతుండడంతో గ్రామస్తుల్లో మతసామరాస్యం వెల్లివిరుస్తోంది. హిందు సంప్రదాయ పండుగలకు ముస్లింల సహకారం ఆరేళ్లుగా ఏటా వైభవంగా రాములోరి కల్యాణం నిర్వహణ -
అందని సర్వే గౌరవ వేతనం
రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీవేములవాడ: రాజన్నను ఆదివారం 50 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీరామ నవరాత్రోత్సవాల్లో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో హోమాలు, పూజలు చేశారు. హైదరాబాద్కు చెందిన మదుకంటి సృజన్–స్వాతి దంపతులు గోశాల, అన్నదానం ట్రస్టులకు కలిపి రూ.3,13,683 చెక్కును ఈవో వినోద్రెడ్డికి అందజేశారు. వేములవాడ అర్బన్ మండలం చింతల్ఠాణాకు చెందిన నిమిశకవి శ్రీకాంత్–స్రవంతి దంపతులు అన్నదాన ట్రస్టుకు రూ.1,41,116 ఏఈవో జయకుమారికి అందజేశారు. ఏఈవోలు బ్రహ్మన్నగారి శ్రీనివాస్, జి.అశోక్కుమార్, పర్యవేక్షకులు శ్రీనివాస్శర్మ, శ్రీకాంతాచార్యులు, ఆలయ ఇన్స్పెక్టర్ రాజేందర్ ఉన్నారు.గంభీరావుపేట(సిరిసిల్ల): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల(సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) సర్వే చేపట్టి నాలుగు నెలలు గడుస్తోంది. సర్వేలో పాల్గొన్న ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు మాత్రం గౌరవ వేతనం చెల్లించడం లేదు. జిల్లాలో గతేడాది నవంబర్ 9 నుంచి సర్వే కొనసాగింది. సర్వేలో 56 ప్రధానాంశాలతోపాటు ఇతర అనుబంధ అంశాలతో కూడిన సమాచారాన్ని సిబ్బంది ఇంటింటికి తిరిగి సేకరించారు. కాస్త ఇబ్బందులు తలెత్తిన ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా సిబ్బంది సర్వేను విజయవంతం చేశారు. జిల్లాలో రూ.1.68 కోట్లు పెండింగ్ జిల్లాలోని 12 మండలాలు.. రెండు మున్సిపాలిటీలు.. 261 గ్రామాల్లో 1,90,626 ఇళ్లను గుర్తించి 1,468 బ్లాక్లుగా చేసి ప్రతీ 150 ఇళ్ల సర్వేకు ఒక ఎన్యూమరేటర్ను నియమించారు. జిల్లా వ్యాప్తంగా 1,488 మంది ఎన్యూమరేటర్లు, 160 మంది సూపర్వైజర్లు సర్వేలో భాగస్వాములయ్యారు. సర్వేలో ఉపాధ్యాయులు, ఆశకార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఒక్కో ఎన్యూమరేటర్కు రూ.10వేలు, సూపర్వైజర్లకు రూ.12వేల చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సర్వే పూర్తయి దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు. 1,488 మంది ఎన్యూమరేటర్లకు రూ.10వేల చొప్పున రూ.1,48,80,000, 160 మంది సూపర్వైజర్లకు రూ.12వేల చొప్పున రూ.19.20 లక్షలు రావాలి. గౌరవ వేతనం విషయంలో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినా నిధులు మంజూరు కాకపోవడంతో సిబ్బంది గౌరవ వేతనం పొందలేకపోతున్నారు. సర్వేలో పాల్గొన్న సిబ్బంది మాత్రం తాము ఎన్నో ఇబ్బందులు పడ్డామని, తమ కష్టాన్ని గుర్తించి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లించాలని కోరుతున్నారు. కులగణన సర్వే పూర్తయి నాలుగు నెలలు ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు అందని డబ్బులు -
శ్రీరామనవమి శుభాకాంక్షలు
● కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్టౌన్: శ్రీరామ నవమిని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామ నవమిని ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. సీతారామచంద్రస్వామి ఆశీస్సులతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశంలో సుస్థిర పాలనను కొనసాగిస్తూ ప్రపంచ ఆర్థిక ప్రగతిలో అగ్రస్థానానికి తీసుకెళ్లేందుకు, అవినీతిరహిత పాలనను కొనసాగించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు.‘స్పేసర్ల’తో విద్యుత్ ప్రమాదాలకు చెక్ కొత్తపల్లి: ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించే ప్రమాదాలను నివారించేందుకు విద్యుత్ సంస్థ అప్రమత్తమవుతోంది. విద్యుత్ తీగలు వదులుగా, ఎక్కువ సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లో అవసరమైన చర్యలు చేపడుతోంది. గాలి దుమారాలు వచ్చినప్పుడు విద్యుత్ తీగలు ఒకటి ఒకటి తగిలి ఫేస్ టూ ఫేస్ వల్ల వైర్లు తెగడంతో పా టు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. విద్యుత్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఫీజులు పోవడంతో పాటు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయే ప్రమాదముంది. ఇళ్లల్లో షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు చోటుచేసుకోవడంతో విలువైన గృహోపకరాలు కాలిపోయే ప్రమాదం ఉంది. వీటిన్నింటిని పరిగణలోకి తీసుకున్న విద్యుత్ సంస్థ ప్రమాదాల నివారణకు కార్యాచరణ చేపట్టింది. విద్యుత్ వైర్లు ఒకటికొకటి తగలకుండా స్పేసర్ల బిగింపు పనులు చేపడుతున్నారు. కరీంనగర్ టౌన్–1 సబ్ డివిజన్ సెక్షన్ 8 పరిధిలోని అశోక్నగర్లో నిచ్చెనసాయంతో విద్యుత్ సిబ్బంది ‘స్పేసర్ల’ బిగింపు పనులు నిర్వహించారు.సిబ్బంది సాహసోపేతంగా చేపడుతున్న పనులు చూసి పలువురు అభినందిస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో నిషేధాజ్ఞలు పొడిగింపు కరీంనగర్క్రైం: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు నిషేధాజ్ఞలు నెలరోజుల పాటు కొనసాగిస్తున్నట్లు కరీంనగర్ సీపీ గౌస్ ఆలం తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సే వించడం, డీజేల వినియోగం, డ్రోన్ల వినియోగంపై ఈనెల 30వ తేదీ వరకు నిషేధం కొనసాగుతుందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై చట్టపరమైన చర్యలు తీసకుంటామని పేర్కొన్నారు. రామాయణం నిరంతర పారాయణ గ్రంథం కరీంనగర్కల్చరల్: రామాయణం నిరంతరం అందరికీ పారాయణ గ్రంథమని సాహతీవేత్త, అవధాని గండ్ర లక్ష్మణరావు అన్నారు. నగరంలోని వాగేశ్వరీ డిగ్రీ కళాశాలలో శనివారం రుద్రమ సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో మొల్ల రామాయణంపై ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మొల్ల రాసిన రామాయణం సామాన్యులకు సైతం అనుకూలంగా ఉందన్నారు. ప్రధాన వక్తగా హాజరైన విశ్రాంత ఉపన్యాసకుడు అన్నాడి గజేందర్రెడ్డి మొల్ల రామాయణం విశిష్టతతో పాటు అందులోని పద్యాలను వినిపించారు. ఏదునూరి రాజేశ్వరి మాట్లాడుతూ ఓ సీ్త్రగా గొప్పగా ఆనాటి సామాజిక పరిస్థితులను ఎదిరించి రామాయణం రచించిందని వివరించారు. -
‘గ్రీన్’ గురుకులాలు
యంగ్ ఇండియా● మంథని, హుస్నాబాద్లో నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు ● సొంతంగా విద్యుత్తు ఉత్పత్తి చేసుకునేలా చర్యలు ● తొలుత ఒక్కో స్కూల్కు రూ.145 కోట్లు వెచ్చించనున్న సర్కారు ● త్వరలో పెద్దపల్లి, రామగుండంలోనూ అందుబాటులోకి ● మంథని మండలం సోమనపల్లిలో 25 ఎకరాలు కేటాయింపు ● డిజిటల్ బోధన, క్రీడా, ఇతర ఆధునిక సదుపాయాలు ● వచ్చే ఏడాది దసరాకు విద్యార్థులకు అందుబాటులోకిసాక్షి ప్రతినిధి, కరీంనగర్: నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా బోధనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ (సమీకృత గురుకులాలు) నిర్మాణానికి అడుగులు వేస్తోంది. 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ స్కూళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ.1,100 కోట్లకుపైగా నిధులు విడుదల చేసింది. అందులో తొలిదశలో ఒక్కో పాఠశాలకు రూ.145 కోట్లు చొప్పున వెచ్చించి అత్యాధునిక సదుపాయాలు కల్పించనున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం శనివారం తొలిఅడుగు వేసింది. తొలిదశలో ఉమ్మడి జిల్లాలోని మంథని, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో ఈ సమీకృత గరుకులాలను నిర్మించేందుకు టెండర్లు పిలిచింది. త్వరలోనే టెండర్లు ఖరా రు చేసి నిర్మాణం వేగవంతం చేయనున్నారు. ఈ విద్యాలయాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేసుకునేలా గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లను సైతం ఏర్పాటు చేయబోతుండటం విశేషం. సోలార్ పలకల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేపట్టనున్నారు. వచ్చే ఏడాది దసరాకు ప్రారంభం ఈ రెండు స్కూళ్లను రూ.145 కోట్ల వ్యయంతో నిర్మించాలని ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. టెండర్లు పూర్తి కాగానే మంథని, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో స్కూళ్ల నిర్మాణ ప్రక్రియ మొదలవనుంది. ఇప్పటికే మంథని నియోజకవర్గంలోని సోమనపల్లి వద్ద ప్రభుత్వం 25 ఎకరాల చొప్పున కేటాయించగా.. మంత్రి శ్రీధర్బాబు ఈ సమీకృత గురుకులాలకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. త్వరలో నిర్మాణాలు ప్రారంభించి.. వచ్చే ఏడాది దసరాకు భవనాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి శ్రీధర్బాబు సంకల్పంతో ఉన్నారు. ప్రతీ స్కూల్ కోసం ప్రభుత్వం రూ.200 కోట్లకుపైగా నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించనుండటం గమనార్హం.ప్రత్యేకతలు ఇవే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలను 25 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మిస్తారు 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధన తరగతి గదులలో డిజిటల్ స్మార్ట్ బోర్డ్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్ క్రీడల కోసం మైదానం, సౌకర్యాలు ప్రతీ స్కూల్లో 2,500 పైగా విద్యార్థులు, వీరికి 120 మంది టీచర్లతో బోధన సొంత సోలార్ విద్యుత్తుతో లిప్టులు, వీధి దీపాలు, క్లాస్రూమ్ ఉపకరణాల నిర్వహణనైపుణ్యాలు పెంచేందుకే నేటి పోటీ యుగానికి అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలు పెంచాలన్న ఉద్దేశంతో సమీకృత గురుకులాలు ప్రారంభిస్తున్నాం. మార్కెట్లో నిలదొక్కుకునేలా నిపుణులైన మానవ వనరులను విద్యార్థి దశ నుంచే తీర్చిదిద్దుతాం. అందుకే, అత్యాధునిక సదుపాయాలతో 4 తరగతి నుంచి 12 వ తరగతి వరకు విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు ఉంటాయి. త్వరలో రామగుండం, పెద్దపల్లి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణ పనులు కూడా మొదలవుతాయి. – మంత్రి శ్రీధర్బాబు -
అలరించిన ‘అల్ఫోర్స్ ఆరేవోయిర్ 2025’
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ సూర్యనగర్లోని అల్ఫోర్స్ మహిళా డిగ్రీ కళాశాల ఫేర్వెల్ పార్టీ సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. స్థానిక ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శనివారం అల్ఫోర్స్ ఆరేవోయిర్ 2025 పేరిట నిర్వహించిన ఈ వేడుకలను అల్ఫోర్స్ మహిళా డిగ్రీ, పిజి కళాశాల కరస్పాండెంట్ వి.రవీందర్ రెడ్డితో కలిసి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యార్థులు ఉద్యోగాల్లో రాణించాలంటే విషయ పరిజ్ఞానం ఒక్కటే సరిపోదని, నైపుణ్యాలను పెంపొందించుకోవల్సిన అవసరం ఉందన్నారు. డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు వివిధ బహుళజాతి కంపెనీల్లో ప్రాంగణ నియాకమాల్లో ఎంపికై న విద్యార్థులను జ్ఞాపికలతో సత్కరించారు. కళాశాల ప్రిన్పిల్ గోలి శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్స్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఎస్సారెస్పీ భూముల ఆక్రమణ
అధికారుల నిర్లక్ష్యంతోనే అధికారుల నిర్లక్ష్యంతోనే మండలంలో ప్రభుత్వ భూములు ఆక్రమణదారుల చేతుల్లోకి వెల్తున్నాయి. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయినట్లు సంబంధిత అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదు. సర్వే చేయించి ఆక్రమదారుల చేతిలో ఉన్న ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి. – పల్లె మోహన్రెడ్డి బీజేపీ మండల అధ్యక్షుడు నిరుపేదలకు పంచాలి భూమిలేని నిరుపేదలను గుర్తించి ప్రభు త్వ భూములను పంచాలి. ప్రభుత్వం భూపంపిణీ పథకం అమలు చేసి ఆక్రమణదారుల చేతుల్లో ఉన్న భూములను స్వాధీనం చేసుకుని దళితులకు పంచాలి. – బొమ్మెన స్వామి, పెగడపల్లి నోటీసులు జారీ చేస్తాం స్థలం ఆక్రమణకు చేసిన రైతులకు నోటీసులు జారీ చేస్తాం. కాల్వ భూములు ఆక్రమణకు గురయిన మాట వాస్తవమే. ఆక్రమణ చేసిన రైతుల వివరాలను ఉన్నతాధికారలకు నివేదిస్తాం. – స్వామి, ఎస్సారెస్పీ ఏఈ చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ భూముల ఆక్రమించడం నేరం. మండలంలో ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలిస్తున్నాం. గ్రామాల వారిగా వాటి వివరాలు ఆ యా గ్రామాల పంచాయతీల వద్ద ప్రజలకు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేస్తాం. – రవీందర్, తహసీల్దార్ పెగడపల్లి: మండలంలోని పలు గ్రామాల్లో విలువైన మంచరాయి, పరంపోగు భూములతోపాటు ఎస్సారెస్పీ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. మండలంలోని పలు గ్రామాల్లో 6,748.01 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అలాగే 1200 ఎకరాల అటవిభూమి ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. ఈ భూములను ఆనుకుని ఉన్న పంటపొలాల రైతులు వాటిని ఆక్రమించుకుని సాగు చేస్తున్నారు. కొందరు ఏకంగా మామిడి తోటలు పెంచుతున్నారు. అయినా సంబంధిత అధికారులు స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలంలోని నంచర్ల శివారులో గొరిగల బోరు సర్వే నంబర్లో 352 ఎకరాలు, దులాల బోరు సర్వే నంబర్ 379లో 272, వెంకటేశ్వర బోరు సర్వే నంబర్ 440లో 68 ఎకరాలు, దోమలకుంటలో టేకుల బోరులో 150 ఎకరాలు, చింతలలొద్దిలో 70 ఎకరాలు, పెగడపల్లి ఆడ్డగుట్ట, ఎల్లాపూర్ తదితర ప్రాంతాల్లో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూముల్లో కొంతభాగాన్ని వాటిని ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాల రైతులు ఆక్రమించుకున్నారు. కొందరు మామిడి తోటలు పెంచుతుండగా.. మరికొందరు ఇతర పంటలను సాగు చేసుకుంటున్నారు. భూముల ఆక్రమణలను పరిశీలించి వాటిని స్వాధీనం చేసుకోవాల్సి ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎస్సారెస్పీ భూముల పరిస్థితి కూడా ఇదే విధంగా తయారైంది. కొందరు రైతులు కాల్వ గట్టు అంచు వరకు సాగు చేస్తుండంతో వాటి ఉనికికే ప్రమాదం ఏర్పడింది. మండలంలోని 26 గ్రామాలకు 24 గ్రామాలు ఎస్సారెస్పీ ఆయకట్టు ప్రాంతం పరిధిలో ఉన్నాయి. వందలాది కిలోమీటర్ల పొడవు ఉన్న కాలువల పక్కన ప్రాజెక్టు భూమి ఉంది. కాలువల నిర్మాణ సమయంలో ఇరువైపులా వాహనాలు వెళ్లేందుకు వీలుగా భూమిని వదిలారు. ఎస్సారెస్పీ మేజర్, మైనర్ కాలువలు కొందరు రైతులు ఆక్రమణకు చేసి కాల్వ గట్ల అంచువరకూ సాగు చేస్తున్నారు. 20 ఏళ్ల క్రితం కాలువ లైనింగ్ పనులు చేసిన సమయంలో ఎస్సారెస్పీ భూములు ఆక్రమణకు గురైనట్లు గుర్తించిన అధికారులు ప్రతి 50 మీటర్ల చొప్పున కాలువకు ఇరువైపులా హద్దురాళ్లను కూడా నాటారు. ఇక్కడ భూములకు లక్షల విలువ ఉండటంతో పాటు ఆ ప్రాంతంలో విరివిగా పంటలు పండుతుండటంతో కొందరు రైతులు హద్దురాళ్లను తొలగించి సాగు చేసుకుంటున్నారు. డి–65 నుంచి డీ–83ఏ వరకు 10 వేల ఎకరాల ఆయకట్టు కలిగి ఉంది. వీటి కింద 65, 67, 68, 69, 70, 71, 74, 75, 79, 81 డిస్ట్రీబ్యూటరీ కాల్వలున్నాయి. వీటి కింద 1ఎల్, 2ఆర్, 3ఎల్, 4ఎల్, 5ఎల్, 6ఎల్, డి–83 ఏ కింద 1ఎల్, 2ఎల్, 3ఎల్, 4ఆర్ మైనర్ కాల్వలున్నాయి. మేజర్ కాలువతోపాటు మరికొందరు రైతులు మైనర్ కాల్వ గట్లను కూడా వదలకుండా ఆక్రమించి పంటలు పండిస్తున్నారు. కోట్ల విలువైన భూములు ఆక్రమణకు గురైనట్లు గుర్తించిన అధికారులు వారిపై ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడంతో భూ భూఆక్రమణలు యధేచ్ఛగా కొనసాగుతున్నాయి. దీంతో కాల్వల ఉనికికే ప్రమాదం ఏర్పడుతున్నా సంబంధిత అధికారులు చోద్యంచూస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కాల్వల పరిస్థితి ఇలా ఉంటే ప్రాజెక్టు ఆధీనంలో ఉన్నా మొరం గడ్డలు తరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం మొరం అవసరమున్న వ్యక్తులు ముందుగానే ఎస్సారెస్పీ పేర కొంత రుసుం చెల్లించి మైనింగ్ శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. దీనికి విరుద్ధంగా ప్రధాన కాల్వ ఇరువైపులా ఉన్న మొరంగడ్డలను తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తుండటంతో ఎస్సారెస్పీ వేలాది రూపాయల ఆధాయం కోల్పోతోంది. సంబంధిత అధికారులు స్పందించి మొరం గడ్డల మట్టి తరలింపును అడ్డుకోవాలని, ఆక్రమణకు గురైనా ఎస్సారెస్పీ, ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవాలని మండల రైతులు, ప్రజలు కోరుతున్నారు. పట్టించుకోని అధికారులు -
రైతులు సేంద్రియ వ్యవసాయం చేయాలి
● కేంద్రమంత్రి జితేంద్రసింగ్ మల్లాపూర్: రైతులు సేంద్రియ వ్యవసాయం చేయాలని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని ఓ ఫంక్షన్హాల్లో ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సేంద్రియ రైతు సమ్మేళనంలో పాల్గొన్నారు. గ్రామీణ అవార్డులు ప్రదానం చేశారు. మల్లాపూర్ మండలం రాఘవపేటకు చెందిన మెండె శ్రీనివాస్ రూపొందించిన నీరటి రోబో ప్రదర్శనకు కేంద్రమంత్రి చేతులమీదుగా గ్రామీణ అవార్డు అందుకున్నారు. రసాయనాలు వాడితే మట్టిలోని సూక్ష్మజీవుల సంఖ్య తగ్గిపోతుందని, ఇది భవిష్యత్ తరాలకు ముప్పుగా మారుతుందని పేర్కొన్నారు. రెండు బైక్లు ఢీ.. ఇద్దరికి గాయాలుశంకరపట్నం: మండలంలోని తాడికల్ శివారులో శనివారం రెండు మోటర్సైకిళ్లు ఢీకొన్న సంఘటనలో ఇద్దరికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. మండలంలోని తాడికల్ గ్రామానికి చెందిన శ్రీనివాస్చారి కరీంనగర్ నుంచి స్వగ్రామం మోటర్సైకిల్పై వస్తుండగా డీబీఎల్ కంపెనీలో పని చేస్తున్న ఒడిశాకు చెందిన కృష్ణ మోటర్సైకిల్తో ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రికి తరలించారు. పంచాయతీ కార్యదర్శికి గాయాలు శంకరపట్నం: గుర్తు తెలియని వాహనం ఢీకొని మండలంలోని కన్నాపూర్ పంచాయతీ కార్యదర్శి రాజేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. కన్నాపూర్ గ్రామపంచాయతీలో శనివారం విధులకు హాజరై తిరిగి ఇంటికి బైక్పై వెళ్తుండగా ఆముదాలపల్లి శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108వాహనంలో హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గంజాయి విక్రేత అరెస్ట్జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్, టీఆర్నగర్ శివారులో గంజాయి విక్రయిస్తున్న షేక్ నజీర్ను పట్టుకున్నట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. టీఆర్నగర్కు చెందిన షేక్ నజీర్ ధరూర్, టీఆర్నగర్ శివారులో గంజాయి విక్రయిస్తుండగా పోలీ సులు తనిఖీ చేయగా 131 గ్రాముల గంజాయి లభ్యమైంది. గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. కత్తితో బెదిరించిన వ్యక్తి రిమాండ్సిరిసిల్లక్రైం: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ఇప్పలపల్లికి చెందిన సలేంద్రి రాకేశ్ అనే యువకుడు చేతిలో కత్తి పట్టుకొని పలువురిని బెదిరించిన ఘటనలో శనివారం రిమాండ్ చేసినట్లు సీఐ కృష్ణ తెలిపారు. నిందితుడు గతంలో వేములవాడలో ఓ చోరీ కేసులో జైలుకు వెళ్లివచ్చాడు. మళ్లీ కత్తితో శనివారం రాత్రి పలువురిని బెదిరించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలా నికి వెళ్లగా.. వారి విధులకు ఆటంకం కలిగించాడు. దీంతో రాకేశ్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. అతని నుంచి పోలీసులు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. -
రాజన్నా నీవే దిక్కు
వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయంలో భద్రత కరువైంది. దేశవ్యాప్తంగా ఏ ఆలయంలోకి వెళ్లినా సెల్ఫోన్ల వినియోగం నిషేధమనే బోర్డు కనిపించడమే కాకుండా భద్రత సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంటారు. అయితే రాజన్న ఆలయంలోనే ఇలాంటి తనిఖీలు కనిపించవు. సెల్ఫోన్లు వినియోగంచరాదనే బోర్డులు మాత్రమే కనిపిస్తాయి. ఈ బోర్డుల సాక్షిగానే భక్తులు తమ సెల్ఫోన్లలో సెల్ఫీలు దిగుతూ సోషల్మీడియాలో పోస్టు చేస్తుంటారు. ఇదంతా అధికారుల కళ్లముందే జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అయితే ఆలయంలో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది సైతం సెల్ఫోన్లు వినియోగిస్తూ కనిపించడం గమనార్హం. ● వేములవాడ ఆలయంలో భద్రత అంతంతే.. ● ఆలయంలో సెల్ఫోన్ల వినియోగం ● అడ్డుకోని ఆలయ అధికారులు ● పనిచేయని సీసీ కెమెరాలు ● అటకెక్కిన డోర్ మెటల్ డిటెక్టర్లుబోర్డులపైనే నిబంధనలు భక్తుల రద్దీ మధ్య నిషేధ బోర్డులు గోడలకే పరిమితమవుతున్నాయి. ఆలయంలోకి వచ్చే ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఎలాంటి తనిఖీలు చేపట్టకపోవడంతో ఆలయంలోకి సెల్ఫోన్లు యథేచ్ఛగా వస్తున్నాయి. రాజరాజేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో ‘ఫోటోలు తీయరాదు’, ‘వీడియోలు నిషేధం’ అనే బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే అధికారుల తనిఖీలు లేకపోవడంతో భక్తులు యథేచ్ఛగా ఆలయ ప్రాంగణంలోనే సెల్ఫీలు దిగుతూ కనిపిస్తుంటారు. ఈ దృశ్యాలు ఇక్కడ నిత్యకృత్యం. ఏడు దారుల్లో భద్రత ఏదీ ? రాజన్నను దర్శించుకునేందుకు ఆలయంలోకి వెళ్లేందుకు ఏడు దారులు ఉన్నాయి. తూర్పు దిశలో మూడు ద్వారాలు, దక్షిణభాగంలో రెండు, ఉత్తర–దక్షణి భాగాల్లో ఒక్కో దారి ఉంది. ఈ ఏడు దారుల్లోనూ ఎలాంటి భద్రత చర్యలు తీసుకోవడం లేదు. పేరుకు కొంత మంది ఎస్పీఎఫ్ సిబ్బంది, హోంగార్డులు విధులు నిర్వహిస్తూ సెల్ఫోన్లలో తలమునకలవుతున్నారు. కనిపించని మెటల్ డిటెక్టర్లు రాజన్న ఆలయ భద్రత కోసం ఏర్పాటు చేసిన డోర్ మెటల్ డిటెక్టర్లు కనిపించకుండా పోయాయి. కోడెలతో డోర్ మెటల్ డిటెక్టర్లు పాడవుతున్నాయనే సాకుతో వీటిని మూలనపడేశారు. కేవలం హ్యాండ్ మెటల్ డిటెక్టర్లు నామమాత్రంగా పట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరాలు ఉన్నా లేనట్టే.. రాజన్న ఆలయంలో 12కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా ఏం ఫలితం లేకుండా పోతోంది. సీసీ కెమెరాల పనితీరును ఎవరూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. సీసీ కెమెరాలున్నాయన్న ధ్యాస కూడా లేకుండా పోతోంది. ఇటీవల ఓ భక్తుడు తన డబ్బులు పోగొట్టుకుని సీసీ కెమెరాల్లో పరిశీలిస్తే ఏమాత్రం కనిపించలేదు. భద్రత చర్యలు తీసుకుంటాం రాజన్న ఆలయ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం. ఎస్పీ, లోకల్ పోలీసులతో చర్చలు జరిపి ఆలయ భద్రత మరింత పెంచేందుకు కృషి చేస్తాం. గతంలో ఏర్పాటు చేసిన మెటల్ డిటెక్టర్లను పునరుద్ధరిస్తాం. ఆలయ భద్రతపై రాజీపడేది లేదు. భక్తుల రక్షణే మా కర్తవ్యం. ఆలయ ఎస్పీఎఫ్ సిబ్బందిని సైతం అప్రమత్తం చేస్తాం. సెల్ఫోన్ల వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తాం. – కొప్పుల వినోద్రెడ్డి, రాజన్న ఆలయ ఈవో -
ఇల్లందకుంట రాములోరికి నృసింహుని నుంచి పట్టువస్త్రాలు
ధర్మపురి: కరీంనగర్ జిల్లాలో అపర భద్రాదిగా ప్రసిద్ధి చెందిన ఇల్లందకుంటలో గల శ్రీసీతా రాముల వారి కల్యాణానికి ధర్మపురి శ్రీలక్ష్మి నృసింహస్వామి దేవస్థానం పక్షాన శనివారం పట్టువస్త్రాలు, తలంబ్రాలు పంపించారు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఇల్లందకుంటలో ఆదివారం నిర్వహించనున్న స్వామివారి కల్యాణ మహోత్సవానికి ఆలయ ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ముందుగా ఆలయ నుంచి మేళతాళాలతో తరలివెళ్లారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు తదితరులున్నారు. -
విదేశీ బంగారం వ్యవహారంలో ఇద్దరి అరెస్ట్
వేములవాడ: సౌదీ అరేబియా నుంచి బంగారం తీసుకొచ్చి సినీఫక్కీలో కాజేసిన వ్యవహారంలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి తెలిపారు. స్థానిక పట్టణ పోలీస్స్టేషన్లో శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన రుద్ర రాంప్రసాద్ సౌదీ అరేబియాలోని తన సమీప బంధువు రవీందర్ ద్వారా 400 గ్రాముల బంగారం తెప్పించుకునేందుకు అతనికి రూ.35లక్షలు పంపించాడు. ఈక్రమంలో రవీందర్ తన స్నేహితుడు సౌదీలో ఉంటున్న వేములవాడకు చెందిన కాల్వ వెంకటేశ్కు పరిచయస్తులైన చందుర్తి మండలం జోగాపూర్కు చెందిన తొంటి భీరయ్య, గడ్డం అనిల్తో పంపించాడు. ఈ మొత్తం బంగారంను కాజేయాలని కాల్వ వెంకటేశ్, భీరయ్య, అనిల్ పథకం పన్నారు. ఈ విషయాన్ని వీరు తమ సమీప బంధువు ఇండియాలో ఉన్న ఏనుగుల నాగరాజుకు తెలిపారు. విమానాశ్రయంలో దిగిన వెంటనే నాగరాజుకు బంగారం బిస్కెట్లు ఇవ్వడంతో అతను మొబైల్ఫోన్ స్విచాఫ్ చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తనకు సంబంధించిన వ్యక్తులకు బంగారం ఇవ్వలేదని మల్లాపూర్కు చెందిన రాంప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈక్రమంలో ఏ1 కాల్వ వెంకటేశ్, ఏ4 నాగరాజు పరారీలో ఉన్నారని, వీరిని పట్టుకునేందుకు ఇద్దరు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బీరయ్య, అనిల్ను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. సౌదీఅరేబియాలో ఉన్న కాల్వ వెంకటేశ్, పరారీలో ఉన్న ఏనుగుల నాగరాజులను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కస్టమ్స్ అధికారుల కన్నుగప్పి పెద్ద మొత్తంలో బంగారం తీసుకురావడంలో ఇంకా ఏదైనా ముఠా హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం బంగారం రికవరీ చేయడమే కాకుండా త్వరలోనే మిగిలిన నిందితులను కూడా పట్టుకుంటామని తెలిపారు. వేములవాడటౌన్ సీఐ వీరప్రసాద్, కానిస్టేబుళ్లు ఉన్నారు. పరారీలో మరో ఇద్దరు సినీఫక్కీలో చేతులు మారిన బంగారం వివరాలు వెల్లడించిన ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి -
రారండోయ్.. వేడుక చూద్దాం
● నేడే ఇల్లందకుంట శ్రీ సీతారాముల కల్యాణోత్సవం ● పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ● హాజరుకానున్న కేంద్ర మంత్రి సంజయ్, ప్రముఖులుఇల్లందకుంట(హుజూరాబాద్): శ్రీ సీతారాముల కల్యాణ వేడుకకు అంతా సిద్ధమైంది. ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామ నవమి సందర్భంగా కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. కల్యాణ వేదికను రంగురంగుల పూలతో ముస్తాబు చేశారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణ తంతు నిర్వహించనుండగా.. ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. జమ్మికుంట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదానం నిర్వహించనున్నారు. శనివారం ధర్మపురి, కొండగట్టు దేవస్థానాల తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ఆవరణలో, కల్యాణమండపం వద్ద చలువ పందిళ్లు వేశారు. చల్లనినీరు, మజ్జిగ, కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. కల్యా ణం వీక్షించేలా ఎల్ఈడీ స్క్రీన్లు సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. నలుగురు ఏసీపీలు, 10మంది సీఐలు, 15 మంది ఎస్సైలు, ఇతర సిబ్బంది కలిపి 200 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. -
పల్లెలపై కాలుష్య మేఘాలు
మొలంగూర్ శివారులో సీడ్ప్లాంట్ నుంచి వస్తున్న పొగపచ్చని పల్లెలపై కాలుష్య మేఘాలు కమ్ముకుంటున్నాయి. గ్రామీణ ప్రజలు ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగతో ఇబ్బంది పడుతున్నారు. శంకరపట్నం మండలం మొలంగూర్ శివారులో పదుల సంఖ్యలో సీడ్ ప్లాంట్లు ఉన్నాయి. వాటి నుంచి వచ్చే పొగతో సమీప గ్రామాలైన మొలంగూర్, కేశవపట్నం, గొల్లపల్లి గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల సీడ్ప్లాంట్ నుంచి వచ్చిన పొగతో చెట్టు మాడిపోయిందని, పంటపొలాలు దెబ్బతింటున్నాయని ప్రజలు అంటున్నారు. కాలుష్యనియంత్రణ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – శంకరపట్నం(మానకొండూర్) -
ప్రభుత్వ ఆస్పత్రి కార్మికుల మెరుపు సమ్మె
కరీంనగర్టౌన్: మూడు నెలల పెండింగ్ వేతనాల కోసం ప్రభుత్వ ప్రధానాసుపత్రి కాంట్రాక్టు కార్మికులు శుక్రవారం మెరుపు సమ్మెకు దిగారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి స్పందించి ఈనెల 8వ తేదీ లోపు వేతనాలు ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షుడు బండారి శేఖర్ మాట్లాడుతూ హామీ ప్రకారం మూడు నెలల జీతాలు ఇవ్వకుంటే ఈ నెల 9వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తామని స్పష్టం చేశారు. యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.అరుణ్, టి.కళావతి, ఉపాధ్యక్షురాలు శారద, రాజు, మహేశ్, మౌనిక, రాజయ్య పాల్గొన్నారు. సాధారణ కాన్పులను ప్రోత్సహించాలి కరీంనగర్టౌన్: ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు మొదటి కాన్పుకు వచ్చే గర్భిణులను సాధారణ కాన్పులకు ప్రోత్సహించాలని డీఎంహెచ్వో వెంకటరమణ సూచించారు. శుక్రవారం ఆశా వర్కర్లతో సాధారణ కాన్పులపై సమీక్ష నిర్వహించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ సిజేరియన్ డెలివరీల పర్సంటేజీ తగ్గించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీలు పెంచాలన్నారు. గర్భిణిగా ఉన్న సమయంలో వారికి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే, పూర్తిగా చికిత్స అందించాలన్నారు. అనంతరం అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షించారు. అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ సుధ, పీవోడీటీటీ డాక్టర్ ఉమాశ్రీ, డీఐవో డాక్టర్ సాజిదా, డెమో రాజగోపాల్, డీపీహెచ్ఎన్వో విమల, డీసీఎం రవీందర్రెడ్డి పాల్గొన్నారు. రేషన్ దుకాణాలకు చేరిన సన్నబియ్యంకరీంనగర్ అర్బన్: సన్నబియ్యం రేషన్ దుకాణాలకు చేరింది. అరకొర బియ్యం సరఫరా చేయడం, మూవ్మెంట్ ఆలస్యంపై శుక్రవారం సాక్షి మినీలో ‘సన్నబియ్యం.. నో స్టాక్’ శీర్షికన కథనం ప్రచురితం కాగా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ ప్రత్యేక దృష్టిసారించారు. రేషన్ దుకాణాలకు చేరిన బియ్యమెంత, ఎంఎల్ఎస్ పాయింట్లలో ఉన్న బియ్యమెంత అని ఆరా తీసినట్లు సమాచారం. విధులను విస్మరిస్తే చర్యలు తప్పవని, ఎప్పటికప్పుడు రేషన్ బియ్యం డీలర్లకు చేరేలా చర్యలుండాలని ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జీలను హెచ్చరించారు. కాగా శుక్రవారం ఉదయం నుంచే రేషన్ బియ్యం మూవ్మెంట్ను స్పీడప్ చేయగా రేషన్ దుకాణాలకు బియ్యం చేరాయి. చేయూత అందిందికరీంనగర్ అర్బన్: చేయూత పింఛన్లు ఎట్టకేలకు లబ్ధిదారుల ఖాతాల్లో చేరాయి. గురువారం నుంచి పింఛన్దారుల ఖాతాలకు చేరుతుండగా వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నెల 2న ‘సాక్షి’లో ‘అయ్యా.. చేయూత ఏదయా’ శీర్షికన కథనం ప్రచురితమైన విష యం విదితమే. ఈ క్రమంలో పింఛన్ ఆలస్యంపై కలెక్టర్ పమేలా సత్పతి సంబంధిత అధి కారులను తీవ్రంగా మందలించినట్లు సమాచారం. దీంతో రెండ్రోజులుగా పింఛన్లు వస్తుండగా లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. నగరంలో నేడు పవర్కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్లకొమ్మల తొలగింపు పనులతో పాటు విద్యుత్ లైన్ల పనులు చేపడుతున్నందున శనివారం ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు నగరంలోని 11 కేవీ టవర్ సర్కిల్ పరిధిలోని రాజీవ్చౌక్, రూరల్ పోలీస్స్టేషన్, భారత్టాకీస్, టవర్ సర్కిల్, బ్రాహ్మణవీధి, అహ్మద్పుర, ద్వారకానగర్, వాల్మీకినగర్ ప్రాంతాలు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 11 కేవీ వావిలాలపల్లి, శ్రీచైతన్య ఫీడర్ల పరిధిలోని వావిలాలపల్లి, జెండాగద్దె, కెమిస్ట్ భవన్, శివథియేటర్, వేంకటేశ్వర దేవాలయం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–1 ఏడీఈ పి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అదే విధంగా ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు 11 కేవీ కలెక్టరేట్ ఫీడర్ పరిధిలోని కలెక్టర్ ఆఫీసు, బస్టాండ్, ముకరంపుర, ఎల్ఐసీ ఆఫీస్ ఏరియాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏడీఈ ఎం.లావణ్య పేర్కొన్నారు. -
ఇల్లందకుంట ఆలయ కమిటీ ఏర్పాటు
ఇల్లందకుంట(హుజూరాబాద్): ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ కమిటీని ఏర్పా టు చేస్తూ శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మండలంలోని శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు ఇంగిలే రామారావును చైర్మన్గా నియమించారు. కమిటీ సభ్యులుగా రిక్కల నారాయణరెడ్డి, కురిమిండ్ల చిరంజీవి, ఎడ్ల కిషన్రెడ్డి, గోలి రవికిరణ్, గొడిశాల పరమేశ్వర్, బొమ్మ లావణ్య, సింగిరెడ్డి గోపాల్రెడ్డి, మర్రి రామిరెడ్డి, కాసం నా గరాజు, మూడెత్తుల మల్లేశ్, జున్నూతుల మధుకర్రెడ్డి, వీరమల్ల తిరుపతిరెడ్డి, కారింగుల రాజేందర్ నియామకం అయ్యారు. -
పాలకా.. ఏమనాలా?
ఇంత గలీజా? ● నగరంలో అధ్వానంగా డ్రైనేజీ వ్యవస్థ ● శిథిలావస్థలో కాల్వలు.. రోడ్డుపై పారుతున్న మురుగు నీరుకరీంనగర్కార్పొరేషన్: శరవేగంగా విస్తరిస్తోన్న నగరం. పుట్టుకొస్తున్న కాలనీలు. విలీన గ్రామాలతో పరిధి పెంచుకుంటూ పోతున్న నగరపాలకసంస్థ. కానీ.. ఏళ్లుగా డ్రైనేజీ వ్యవస్థ మాత్రం మెరుగుపడడం లేదు. అధ్వానంగా మారిన డ్రైనేజీ వ్యవస్థతో నగర ప్రజలు ఇక్కట్లు పడుతున్నా, బల్దియా అధికారుల్లో చలనం కనిపించడం లేదు. నగరంలో ప్రధానంగా మూడు నాలా లున్నాయి. మొదటి నాలా పోలీసు శిక్షణా కేంద్రం (పీటీసీ) నుంచి ప్రారంభమై రాంనగర్, జ్యోతినగర్, ముకరంపుర, కలెక్టరేట్, అంబేడ్కర్ స్టేడియం, గణేశ్నగర్, లక్ష్మినగర్ మీదుగా బైపాస్ దాటి ఎల్ల మ్మ గుడి సమీపంలో వాగులో కలుస్తోంది. రెండోది కోర్టు ప్రాంతంలో ప్రారంభమై ప్రభుత్వ ఆసుపత్రి, శర్మనగర్, సాయిబాబా ఆలయం, రైతుబజార్, బొమ్మవెంకన్న భవనం, గోపాల్చెరువు మీదుగా పోతుంది. మూడో నాలా రాంపూర్లో ప్రారంభమై అలకాపురికాలనీ, సిరిసిల్ల బైపాస్, డీమార్ట్, ఎన్టీఆర్ విగ్రహం మీదుగా వాగులో కలుస్తుంది. పీటీసీ నుంచి జ్యోతినగర్కు వరకు నాలా 6 ఫీట్ల నుంచి 8 ఫీట్ల వెడల్పుతో ఉండగా, ముకరంపురకు వచ్చే సరికి 2 ఫీట్ల నుంచి 4 ఫీట్లకు కుచించుకుపోయింది. టూటౌన్ పోలీసు స్టేషన్ సమీపంలో విమానం వీధి మునగడానికి ఇదో కారణం. డ్రైనేజీలతో ఇక్కట్లు... నగరంలో 758 కిలోమీటర్ల మేర రోడ్లు ఉండగా, 624 కిలోమీటర్ల డ్రైనేజీలు ఉన్నాయి. రోడ్ల వెంట పూర్తిస్థాయిలో డ్రైనేజీల నిర్మాణం జరగలేదు. కొన్నిచోట్ల శిథిలావస్థకు చేరుకోవడం, నిర్వహణ సరిగా లేకపోవడంతో మురుగు నిలుస్తోంది. తిరుమల్నగర్, కోతిరాంపూర్, కిసాన్నగర్, విద్యానగర్, మంకమ్మతోట, హుస్సేనిపుర, దుర్గమ్మ గడ్డలో డ్రైనేజీలు సక్రమంగా లేక మురుగు ముందుకు కదలడం లేదు. ఖాళీ స్థలాల్లోకి మురుగునీళ్లు చేరి వేసవిలోనూ కుంటలను తలపిస్తున్నాయి.కట్టరాంపూర్, తిరుమల్నగర్ సరిహద్దులోని ఈ డ్రైనేజీ శిథిలావస్థకు చేరుకుంది. ఒక వైపు గోడ పగిలిపోగా, మరో వైపు గోడ లేదు. దీంతో మురుగునీరు డ్రైనేజీలోనే నిలిచిపోతోంది. అస్తవ్యస్త డ్రైనేజీ, సిల్ట్ సమస్యగా మారింది.ముకరంపురలోని టూటౌన్ పోలీసుస్టేషన్ పక్కన నాలా దుస్థితి ఇది. నిర్వహణ లోపంతో సిల్ట్ భారీగా పేరుకుపోతోంది. కల్వర్టు అవతలి వైపు నాలా కుచించుకుపోవడంతో మురుగునీరు ముందుకు కదలదు. ఫలితంగా విమానం వీధి వాసులు దశాబ్దాలుగా ఇక్కట్లు పడుతున్నారు.నగరంలోని డివిజన 60 (పాతవి) నగర జనాభా 3.50 లక్షలు నాలాలు 03 డ్రైనేజీలు 624 కిలోమీటర్లు రోడ్లు 758 కిలోమీటర్లుఎవరూ పట్టించుకోవడం లేదు సివిల్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న నాలా నిర్వహణను ఎవరూ పట్టించుకోవడం లేదు. నాలా గోడలు కూలిపోయాయి. కొన్ని చోట్ల ఆక్రమణలు జరిగాయి. వర్షాకాలం వచ్చిందంటే మురుగునీళ్లు శర్మనగర్, సాహెత్నగర్లను ముంచెత్తుతాయి. సంవత్సరాల నుంచి నాలా నిర్మాణం చేయాలంటే పట్టించుకోవడం లేదు. – నయీమొద్దీన్, సాహెత్నగర్ఏళ్లుగా ఇబ్బంది ముకరంపురలో పెద్ద మోరీ నిర్మాణం, నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నాం. గోడలు పూర్తిగా కూలిపోవడం, సిల్ట్ తీయకపోవడంతో మురుగునీరు నిలిచి దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక వర్షాకాలం వచ్చిందంటే మురుగునీళ్లు రివర్స్లో మా ఇళ్లలోకి వస్తాయి. తడిసి సామగ్రిని ఆరడానికి కనీసం నాలుగు రోజులు పడుతోంది. – డాక్టర్ బింగి శ్రీనివాస్, ముకరంపుర -
ఉద్యోగుల ఉద్యమబాట
● పీఆర్సీ, డీఏల పెండింగ్పై ఆగ్రహం ● జూన్ 9వరకు ఆందోళనలుకరీంనగర్ అర్బన్: ఏళ్లుగా పెండింగ్లో ఉన్న డీఏలు, పీఆర్సీ ఇవ్వాలని ప్రభుత్వంపై ఉద్యోగులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని ఇప్పటికే పలుమార్లు వినతిపత్రాలు ఇవ్వగా, ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత అక్టోబర్ 21తో ప్రభుత్వానికి ఎంప్లాయీస్ జేఏసీ ఇచ్చిన గడువు ముగియగా రాష్ట్ర జేఏసీ నిర్ణయాలకు అనుగుణంగా జిల్లా ఉద్యోగుల జేఏసీ అడుగులు వేస్తోంది. 57 డిమాండ్ల సాధనే లక్ష్యంగా భారీ కార్యక్రమాలు చేపడుతున్నారు. 57 డిమాండ్లతో ఆందోళనలు ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లు పరిష్కారం కోసం ఐక్య కార్యాచరణ కమిటీ ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహించింది. ఇప్పటికీ ఇలా ఐదు డీఏలు పెండింగ్లోనే ఉండగా ఐదేళ్లకోసారి పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది. కమిటీ వేసి ఏడాది దాటగా పీఆర్సీ ఊసే లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీం మాటే మాట్లాడటం లేదని, ఉద్యోగుల లీవ్ శాలరీ, జీపీఎఫ్ లోన్లు, హౌస్ బిల్డింగ్ లోన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెండేళ్లుగా పెండింగ్లోనే ఉన్నాయంటున్నారు. సీపీఎస్ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ ఏడాదిగా జమ కావడం లేదని, ఈ కుబేర్ కాకుండా ట్రెజరీ ద్వారా బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. సుడా చైర్మన్ను కలిసిన ఎంప్లాయీస్ జేఏసీ ఉద్యోగుల సమస్యలపై పరిష్కారం చూపడం లేదని ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా ఛైర్మన్ దారం శ్రీనివాస్రెడ్డి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డికి వివరించారు. శుక్రవారం స్థానిక జెడ్పీ కార్యాలయంలోని సుడా ఆఫీసులో నరేందర్రెడ్డిని కలిసి ఉద్యోగుల సమస్యలను వివరించారు. ఎంప్లాయీస్ జేఏసీ కన్వీనర్ మడిపల్లి కాళిచరణ్గౌడ్, కేంద్ర సంఘం నేతలు నాగుల నరసింహస్వామి, రాగి శ్రీనివాస్, గూడ ప్రభాకర్ రెడ్డి, సర్దార్ హర్మీందర్సింగ్, కిరణ్ కుమార్, రామస్వామి, మారుపాక రాజేశ్ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకీ మీనమేషాలు ఉమ్మడి రాష్ట్రంలో పోరాటమే.. స్వరాష్ట్రంలోనూ పోరాటమేనా.? తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగులకు బాసటగా ఉంటామన్నవారే ఇప్పుడు నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మాకు రావాల్సినవి ఇవ్వాలంటే ఎందుకింత నిర్లక్ష్యం. – దారం శ్రీనివాస్రెడ్డి, జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్తీరని అన్యాయం ఎప్పుడో పీఆర్సీ ఇవ్వాల్సి ఉండగా కాలయాపన చేస్తున్నారు. ఉద్యోగుల ఓపికను పరీక్షించడం ప్రభుత్వానికి తగదు. ఉద్యోగులను బిడ్డల్లా చూసుకోవాల్సిందిపోయి జాప్యం చేస్తున్నారు. డీఏల ప్రకారం మా వేతనాలు పెరగాలి కానీ డీఏలే ఇవ్వడం లేదు. – మడిపల్లి కాళీచరణ్గౌడ్, జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ కన్వీనర్ఎంప్లాయీస్ జేఏసీ కార్యాచరణ ఇదే ఈ నెల 30వరకు జిల్లాకేంద్రంలో సదస్సులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాల సమర్పణ మే 4న రాష్ట్రస్థాయి ఉద్యోగ సద స్సుకు భారీగా ఉద్యోగుల తరలింపు మే 15న జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం జూన్ 9న రాష్ట్రస్థాయి మహాధర్నా -
ఆరోగ్యం.. విద్యపై శ్రద్ధ చూపాలి
తిమ్మాపూర్: ఆరేళ్లలోపు చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మండలంలోని పర్లపల్లిలో మహిళాభివృద్ధి శిశు,సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మహిళలు, పిల్లల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఆరేళ్లలోపు చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా గ్రామంలోని మహిళలందరూ ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆరోగ్య మహిళ పరీక్షల ద్వారా ప్రమాదకర వ్యాధులను ముందుగా గుర్తించి నివారించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో రక్తహీనత సమస్యను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ పేర్కొన్నారు. సభ అనంతరం గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సబిత, డీఎంహెచ్వో వెంకటరమణ పాల్గొన్నారు.● కలెక్టర్ పమేలా సత్పతి -
రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ
● మంత్రి పొన్నం ప్రభాకర్ చిగురుమామిడి: దేశప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారని, అహింస పద్ధతిలో బాపూజీ దేశస్వాతంత్య్రం కోసం ఉద్యమించారని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లిలో శుక్రవారం నిర్వహించిన జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా కేంద్రంలోని బీజే పీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ ఈ ఉద్యమానికి శ్రీకా రం చుట్టిందన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. నేడు కవి సమ్మేళనం కరీంనగర్ కల్చరల్: జాతీయ సాహిత్య పరిషత్, కొత్తపల్లి శ్రీవేంకటేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 9:30 గంటలకు కొత్తపల్లి హవేలి, చిన్నగుట్టపై (సచ్చిదానందాశ్రమం) వసంతోత్సవం పేరుతో శ్రీ వేంకటేశ్వర, శ్రీరామ వైభవాలు అంశాలుగా కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు గాజుల రవీందర్, నంది శ్రీనివాస్ తెలిపారు. అనంతరం పండిత సత్కారం ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా ఐపీఎస్ అధికారి వసుంధర యాదవ్, ప్రధాన వక్తగా ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, డాక్టర్ గండ్రలక్ష్మణరావు, వడ్లూరి ఆంజనేయరాజు, డాక్టర్ ఎల్.రాజభాస్కరరెడ్డి, నరహరి నారాయణరెడ్డి, బండ గోపాల్రెడ్డి హాజరవుతారని తెలిపారు. క్వింటాల్ పత్తి రూ.7,580జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్కు శని, ఆదివారం సెలవు ఉంటుందని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, కార్యదర్శి రాజా తెలిపారు. శుక్రవారం క్వింటాల్ పత్తి రూ. 7,580 పలికిందని వారు వివరించారు. -
జాతీయపోటీలకు అల్ఫోర్స్ విద్యార్థి
కొత్తపల్లి(కరీంనగర్): మహారాష్ట్రలోని పర్బన్ జిల్లాలో జరగనున్న 4వ ఫెడరేషన్ కప్ ఆలిండియా నేషనల్ సాఫ్ట్బాల్ పోటీలకు కరీంనగర్ వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్నెక్ట్స్లో 9వ తరగతి చదుతున్న విద్యార్థి ఎస్.సాత్విక్ ఎంపికై నట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులను విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. జాతీయస్థాయి సాఫ్ట్బేస్ బాల్ పోటీలకు ఎంపికై న విద్యార్థిని గురువారం పుష్పగుచ్ఛంతో అభినందించారు. ఇన్ఫర్మేటిక్స్ ఒలింపియాడ్లో ప్రతిభజోనల్స్థాయి ఇన్ఫర్మేటిక్స్ ఒలింపియాడ్లో కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ– టెక్నో స్కూల్ విద్యార్థులు బంగారు, రజత పతకాలు సాధించినట్లు ఆ పాఠశాల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి తెలిపారు. ఇ.లిఖిత్ కుమార్ (8వ తరగతి) రజత పతకం, ఇ.సుహాన్ (8వ) బంగారు పతకం సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు పాఠశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ విద్యార్థులను అభినందించారు. గుండెపోటుతో ఉపాధిహామీ కూలీ మృతిఇల్లంతకుంట(మానకొండూర్): ఉపాధిహామీ పనులు చేస్తూ గుండెపోటుకు గురై 70 ఏళ్ల వృద్ధుడు గురువారం మరణించాడు. రాజ్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరుకు చెందిన దయ్యాల లింగయ్య(70) గురువారం ఉదయం రోజు మాదిరిగానే ఉపాధిహామీ పనులకు వెళ్లాడు. పనులు చేస్తుండగా చాతిలో నొప్పిగా ఉందని కుప్పకూలిపోయాడు. వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ చంద్రశేఖర్ 108 వాహనంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతుని కుటుంబాన్ని ఎంపీడీవో శశికళ, ఏపీవో పులి చంద్రయ్య పరామర్శించారు. అనుమానాస్పద స్థితిలో ఒకరు.. పెద్దపల్లిరూరల్: పట్టణంలో నివాసముంటూ మంథని మండలం ఖమ్మంపల్లి విద్యుత్ సబ్స్టేషన్లో పనిచేస్తున్న రాజ్కుమార్ (40) అనుమానాస్పదంగా మృతిచెందాడని పెద్దపల్లి ఎస్సై లక్ష్మణ్రావు తెలిపారు. వరంగల్ జిల్లా సంగెం మండలం చింతపల్లికి చెందిన ఒడ్డెబోయిన రాజ్కుమార్, భార్య స్వాతికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం రాజ్కుమార్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ మృతుడి భార్య స్వాతి తెలిపిందన్నారు. కొడుకును హత్య చేశారని మృతుడి తల్లి సాంబలక్ష్మి అనుమానం వ్యక్తం చేసిందని ఆమె ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలి
గోదావరిఖని: రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సింగరేణిపై అవలంబిస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ప్రైవేట్ ఫంక్షన్హాల్లో కేంద్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ యూనియన్లు ఎన్నికల సందర్భంగా హామీలు నెరవేర్చాలన్నారు. తప్పుడు హామీలతో కార్మికులను మోసం చేసిన యూనియన్లు కార్మికులకు సమాధానం చెప్పాలన్నారు. భూగర్భగనుల్లో కూడా ప్రైవేటీకరణ పెరిగిపోయిందని ఓసీపీల్లో బొగ్గు తీసేపని కూడా కాంట్రాక్టర్లకు అప్పగించారని వాపోయారు. గతంలో బొగ్గు బ్లాక్ల వేలాన్ని బీఆర్ఎస్, టీబీజీకేఎస్ అడ్డుకున్నాయన్నారు. గతంలో వేలంపాట నిర్వహించిన సత్తుపల్లి, కోయగూడెం బొగ్గు బ్లాకులు పొందిన సంస్థలకు కేసీఆర్ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. సమావేశంలో 11డివిజన్లకు చెందిన 85 మంది కేంద్ర ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు తెలంగాణ అమరవీరులు, బొగ్గుగనుల్లో పనిచేస్తూ మృతిచెందిన కార్మికులకు నివాళులర్పించారు. సమావేశంలో యూనియన్ చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపు కృష్ణ, ప్రధాన కార్యదర్శి కె.సురేందర్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రాంమ్మూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమురయ్య, అధికార ప్రతినిధి పర్లపెల్లి రవి, కేంద్ర నాయకులు చెరుకు ప్రభాకర్రెడ్డి, బడికల సంపత్, ధరావత్ మంగీలాల్, సదానందం, జె రవీందర్, కూశన వీరభద్రం, ఎల్.వెంకటేశ్, ఉపాధ్యక్షుడు వడ్డేపల్లి శంకర్, తదితరులు పాల్గొన్నారు. -
నిరుపేదను కబళించిన అప్పులు
● సిరిసిల్లలో కూరగాయల వ్యాపారి ఆత్మహత్య సిరిసిల్లటౌన్: కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు ఓ నిరుపేదను కబళించాయి. అప్పులు కట్టలేని దుస్థితిలో కూరగాయలు అమ్ముకునే ఓ చిరు వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సిరిసిల్లలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు. పట్టణంలోని ఇందిరానగర్కు చెందిన ఎర్రం కొండయ్య(58) మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు కూతుళ్లు రజిత, అనిత, కొడుకు రాకేశ్ల వివాహాలు చేశాడు. ఇంటి అవసరాల నిమిత్తం చేసిన అప్పులు లక్షల్లో పేరుకుపోగా.. వాటిని తీర్చలేనేమోనన్న బెంగతో బుధవారం ఇంట్లోంచి వెళ్లిపోయాడు. తెల్లారేసరికి సాయినగర్ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు కొండయ్య మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. మృతుడికి భార్య పుష్పలత ఉంది. రైలు కింద పడి చిరువ్యాపారి మృతి ● మృతుడి స్వస్థలం ఉత్తరప్రదేశ్ రామగుండం: రామగుండం రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంపై రైళ్లలో విక్రయించే వెండర్ ప్రమాదవశాత్తు రైలు కింద పడి మృతిచెందాడు. జీఆర్పీ ఔట్ పోస్టు ఇన్చార్జి గంగారపు తిరుపతి వివరాల ప్రకారం.. రామగుండం రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంపై వాటర్ బాటిళ్లు విక్రయించే చిరు వ్యాపారి వరుణ్కుమార్సింగ్ గురువారం భద్రాచలం వైపు వెళ్తున్న సింగరేణి ప్యాసింజర్ రైలులో ఎక్కి విక్రయిస్తున్న క్రమంలో రైలు కదిలింది. అప్పటికే బోగిలో పలువురికి వాటర్ బాటిళ్లు విక్రయించి దిగే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి రైలు కిందికి వెళ్లాడు. రైలు అతడిపై నుంచి వెళ్లడంతో దేహం రెండు ముక్కలైంది. అప్పటివరకు అందరితో కలిసి ముచ్చటించిన వరుణ్కుమార్ కొద్దిసేపట్లోనే రైలు ప్రమాదంలో విగతజీవిగా మారడంతో తోటి వ్యాపారులు రోదించారు. మృతుడు వారం క్రితమే రామగుండంకు చేరుకున్నట్లు తెలిసింది. మృతుడి స్వగ్రామం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని డియోరియా జిల్లా అఖాన్పూర గ్రామం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించి అనంతరం బంధువులకు అప్పగించనున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తిరుపతి పేర్కొన్నారు. -
వ్యవసాయంపై వాతావరణ ప్రభావం
● ఏడాదిలో వివిధ పంటల్లో అనేక సమస్యలు ● సతమతమవుతున్న అన్నదాతలు ● అభిప్రాయపడిన వ్యవసాయ శాస్త్రవేత్తలు ● పొలాసలో ఉత్తర తెలంగాణ జోన్ శాస్త్రవేత్తల సమావేశంజగిత్యాలఅగ్రికల్చర్: అత్యధిక వర్షాలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, చలి తీవ్రత వంటి వాతావరణ మార్పులు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, రైతులు సాగు చేసిన పంటల్లో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని ఉత్తర తెలంగాణ జోనల్ స్థాయి వ్యవసాయ శాస్త్రవేత్తల సదస్సు అభిప్రాయపడింది. జగిత్యాల రూరల్ మండలం పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో రెండు రోజులపాటు జరుగనున్న ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల వ్యవసాయ శాస్త్రవేత్తల, అభ్యుదయ రైతుల సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఎన్. బలరాం అధ్యక్షత వహించారు. వ్యవసాయ వర్సిటీ ఉన్నతాధికారులతోపాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సాగులో సమస్యలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉత్తర తెలంగాణలోని పది జిల్లాలో ఈ ఏడాది సాధారణ వర్షపాతం కన్నా 64 శాతం అధికంగా నమోదు కావడంతో వరి, సోయాబీన్, పత్తి, కంది వంటి పంటలకు విఘాతంగా మారింది. ముఖ్యంగా వరిలో పురుగుల, తెగుళ్ల ఉధృతి పెరిగి పంటలపై ఉల్లికోడు, కాండం తొలిచే పురుగు, ఆకుచుట్టు పురుగు, తాటాకు తెగులు ఆశించాయి. మొక్కజొన్న నీట మునగడంతో ఎదుగుదల లోపించి దిగుబడి తగ్గింది. పత్తి తొలి దశలో అధిక వర్షాలతో మొక్క పెరుగుదల లోపించి దిగుబడిపై ప్రభావం చూపింది. యాసంగి వరిలో పొడి వాతావరణం, రాత్రి తక్కువ ఉష్ణోగ్రతలతో కాండం తొలిచే పురుగు ఎక్కువగా ఆశించింది. జనవరిలో రాత్రి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదై, చలి పెరగడంతో వరి నారుమడులతోపాటు నువ్వులు, వేరుశనగ, మినుము, నేరుగా విత్తిన వరిపై ప్రభావం చూపిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ విపత్కర పరిస్థితుల్లోనూ కొన్ని రకాల విత్తనాలు ఆటుపోట్లను తట్టుకుని మంచి దిగుబడి ఇచ్చాయని పేర్కొన్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే కోతలు పూర్తి కావాలి యాసంగి సీజన్లో రైతులు ముందుగా వరి నారుమడులు పోసుకోవాలని, ఏప్రిల్ మొదటివారంలోపు వరి కోతలు పూర్తి చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత అన్నారు. ఆలస్యంగా కోయడం ద్వారా అధిక ఉష్ణోగ్రతలకు వరి గింజ పగిలి నూక శాతం ఎక్కువ అవుతుందని, ఇందుకు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. నూక శాతం పెరగడంతో ఇతర ప్రాంతాలకు ఎగుమతి కష్టంగా మారుతుందన్నారు. వ్యవసాయ వర్సిటీ డీన్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ బలరాం మాట్లాడుతూ.. పరిశోధన ప్రగతిని ఎప్పటికప్పుడు రైతులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. రైతుల ఆదాయం పెంచేందుకు పరిశోధనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పరిశోధన స్థానం డైరెక్టర్ శ్రీలత తాము చేస్తున్న పరిశోధనల గురించి వివరించారు. పరిశోధన విస్తరణకు సంబంధించిన విషయాలపై శాస్త్రవేత్తలు రాంప్రసాద్, శివకృష్ణ వివరించారు. రైతులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను శాస్త్రవేత్తల దృష్టికి తీసుకొచ్చారు. -
రెస్టారెంట్లో అగ్నిప్రమాదం
● రూ.30 లక్షల మేర ఆస్తినష్టంజ్యోతినగర్: ఎన్టీపీసీ రామగుండం కృష్ణానగర్లోని ఖుషి రెస్టారెంట్లో అగ్నిప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ఎన్టీపీసీ పోలీస్స్టేషన్ పరిధి రాజీవ్ రహదారిని ఆనుకొని ఉన్న ఖుషి రెస్టారెంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు ఎన్టీపీసీ పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి ఎన్టీపీసీ ఎస్సై టి.ఉదయ్కిరణ్తో పాటు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేసేందుకు చర్యలు చేపట్టారు. మొదటి అంతస్తులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది పూర్థిస్థాయిలో మంటలను ఆర్పివేశారు. కింది అంతస్తులో బ్యాంకు ఉండగా ఎలాంటి ప్రమాదం జరగకుండా విద్యుత్ సరఫరా నిలిపివేసి చర్యలు చేపట్టడంతో ప్రమాదం తప్పింది. ఖుషి రెస్టారెంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో భారీగా ఆస్తినష్టం జరిగిందని యజమాని గుర్రం శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవలే రెస్టారెంట్ ప్రారంభించామని, ఇంతలోనే అగ్నిప్రమాదం జరిగి సుమారు రూ.30 లక్షల మేర ఆస్తినష్టం జరిగిందని వాపోయాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
షార్ట్సర్క్యూట్తో గుడిసె దగ్ధం
● రూ.3లక్షల వరకు ఆస్తి నష్టం బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండల కేంద్రానికి చెందిన టేకు పద్మ–శంకరయ్య దంపతుల పూరి గుడిసె గురువారం ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. బాధితులు తెలిపిన వివరాలు. గురువారం ఉదయం పద్మ ఇంట్లో బట్టలు ఉతుకుతుండగా మీటర్ నుంచి పొగలు వచ్చి గుడిసె అంటుకుంది. మంటల్లో బీరువా, ఫ్రిజ్ కాలిపోయాయి. బీరువాలో నగదు, బంగారు, వెండి నగలు కాలిపోవడంతో దాదాపు రూ.3లక్షల వరకు నష్టం వాటిల్లింది. శంకరయ్య మేకలు కొనేందుకు తెచ్చిన రూ.50వేలు సైతం కాలిపోయాయి. సన్నబియ్యం పంపిణీకి వచ్చిన కలెక్టర్ సందీప్కుమార్ ఝా, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఈ విషయం తెలుసుకుని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. తక్షణ సాయంగా రూ.50వేలు అందిస్తామని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రూ.5వేలు నగదు సాయం అందించారు. -
రంగస్థలంపై మరో వసంతం
● నేడు చైతన్య కళాభారతి 40వ వార్షికోత్సవం ● కరీంనగర్ కళాభారతిలో వేడుకలు ● ‘స్వప్నం రాల్చిన అమృతం’ నాటిక 40వ ప్రదర్శన విద్యానగర్(కరీంనగర్): నాటకం సమాజంలో బాధ్యత కలిగిన ఒక హామీ. గుణాత్మకమైన బలాన్ని ఇస్తుంది. సామాజిక రుగ్మతలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, నాటకల ప్రదర్శనల ద్వారా సమాజ చైతన్యానికి చైతన్య కళాభారతి కృషి చేస్తోంది. నాటక రంగంపై మక్కువ ఉన్న కరీంనగర్కు చెందిన నాటక రచయిత స్వర్గీయ శ్రీరాముల సత్యనారాయణ 1985లో చైతన్య కళాభారతి సంస్థను ప్రారంభించారు. నాటి నుంచి నాటక రంగంలో 40మంది కళాకారులతో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ.. 40 వసంతాలు పూర్తి చేసుకుని, శుక్రవారం కరీంనగర్ కళాభారతిలో వేడుకలు జరుపుకుంటోంది. 40 ఏళ్ల ప్రస్థానం వ్యవసాయశాఖలో పనిచేసే స్వర్గీయ శ్రీరాముల సత్యనారాయణ నాటకరంగంపై ఉన్న మక్కువతో స్వర్గీయ వొడ్నాల కిషన్, కునమల్ల రమేశ్, తిప్పర్తి ప్రభాకర్, బండారి శ్రీరాములు, బండారి రవీందర్, సింహాచలం, యతిందర్తో కలిసి 1 మే 1985లో చైతన్య కళాభారతి నాటకసంస్థను స్థాపించారు. 1985 జూన్లో ఈతరం మారాలి అనే నాటకాన్ని ఎస్సారార్ కళాశాల వేదికగా తొలిసారిగా ప్రదర్శించారు. శ్రీరాముల సత్యనారాయణ రచించిన పామరులు, ఈ తరం మారాలి, ఆకలి వేట, ఆడది, మనిషి, నిరసన, కాల చక్రం, ప్రేమ పిచ్చోళ్లు, చదవరా, ఆశాపాశం, అగ్ని పరీక్ష నాటకాలు ప్రశంసలు పొందగా, చైతన్య కళాభారతి కళాకారులు 700లకు పైగా ప్రదర్శనలిచ్చారు. వొడ్నాల కిషన్ రచనల్లో విధాత, సారాయి, కాపురం, నాకు ఇల్లొచ్చింది నాటికలు 100కు పైగా ప్రదర్శనలు జరిగాయి. పరమాత్ముని శివరాం రచన, మంచాల రమేశ్ దర్శకత్వంలో దొంగలు నాటిక 148 ప్రదర్శనలు, ఈ లెక్క ఇంతే నాటిక 37 ప్రదర్శనలు, ఖరీదైన జైళ్లు నాటిక 24 ప్రదర్శనలు, చీకటిపువ్వు 66 ప్రదర్శనలు, స్వప్నం రాల్చిన అమృతం నాటిక 40ఏళ్ల వేడుకల్లో 40వ ప్రదర్శన అవుతుంది. చెల్లని పైసలు, దొంగలు, చీకటిపువ్వు నాటికల ద్వారా ఆరు నంది అవార్డులు చైతన్య కళాభారతి అందుకుంది. 4న వేడుకలు చైతన్య కళాభారతి 40వ వార్షికోత్సవం 4వ తేదీ శుక్రవారం కళాభారతిలో సాయంత్రం 6.30కు జరుగుతాయని ఆ సంస్థ అధ్యక్షుడు తిప్పర్తి ప్రభాకర్ తెలిపారు. ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, విశిష్ట అతిథిగా మానకొండూర్ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, గౌరవ అతిథిగా కలెక్టర్ పమేలా సత్పతి, ప్రత్యేక అతిథిగా ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రమేశ్బాబు పాల్గొంటారని తెలిపారు. స్వప్నం రాల్చిన అమృతం నాటక ప్రదర్శనతో పాటు కళారంగంలో రాణిస్తున్న వారికి స్మారక పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. నెహ్రూ యువ కేంద్ర కో–ఆర్టినేటర్ ప్రోద్బలంతో.. 1985లో అప్పటి కరీంనగర్ నెహ్రు యువ కేంద్ర కో–ఆర్డినేటర్ రామారావు ప్రోద్బలంతో చైతన్య కళాభారతి నాటక సంస్థను ప్రారంభించాం. నెల్లూరులో జరిగిన నాటిక పోటీల్లో సినీనటి సుమలత చేతుల మీదుగా బెస్ట్ విలన్ అవార్డు అందుకున్నా. రవీంద్రభారతిలో విధాత నాటికకు అవార్డును అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా అందుకున్నా. – తిప్పర్తి ప్రభాకర్, చైతన్య కళాభారతి అధ్యక్షుడు ఎంతో మంది కళాకారులను తీర్చిదిద్దాం కళాకారుడిగా నాటక రంగంపై ఉన్న మక్కువతో చైతన్య కళాభారతి సంస్థను ప్రారంభించాం. మా సంస్థ ద్వారా ఎన్నో నాటకాలు ఉమ్మడి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రదర్శించి, అవార్డులు, బహుమతులు అందుకున్నాం. చైతన్య కళాభారతి సంస్థ ఎప్పటికీ కొనసాగాలన్నదే మా ధ్యేయం. అందుకే కొత్త కళాకారులకు అవకాశం కల్పిస్తున్నాం. – కునమల్ల రమేశ్బాబు, చైతన్య కళాభారతి వ్యవస్థాపక సభ్యుడు నాటక రంగంలో ప్రత్యేక అధ్యాయం వ్యవసాయశాఖలో ఉద్యోగం చేస్తున్న నేను నాటక రంగం అంటే ఇష్టంతో శ్రీరాముల సత్యనారాయణ ప్రోత్సాహంతో చైతన్య కళాభారతి ద్వారా మనిషి నాటికలో నటించాను. చైతన్య కళాభారతి ద్వారా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు, కావలి నుండి కర్నూలు వరకు ఉన్న నాటక వేదికలపై వందలాది ప్రదర్శనలిచ్చి ఎన్నో బహుమతులు, అవార్డులు, రివార్డులు అందుకున్నాను. – గద్దె ఉదయ్ కుమార్, చైతన్య కళాభారతి కోశాధికారి ఉత్తమ అవార్డు అందుకున్న పరమాత్ముని శివరాం రచన, మంచాల రమేశ్ దర్శకత్వంలో ఖరీదైన జైళ్లు నాటిక 24 ప్రదర్శనలు ఇవ్వగా అందులో ఉత్తమ సహాయ నటి, ఉత్తమ నటి అవార్డులు అందుకోవడం జరిగింది. ఈ సంస్థ ఉమ్మడి రాష్ట్రాల్లో ఇచ్చిన అనేక నాటిక ప్రదర్శనల్లో నేను వివిధ పాత్రల్లో నటించడం జరిగింది. ఈ సంస్థ ద్వారా అనేక ప్రాంతాల్లో జరిగిన ప్రదర్శనల్లో అవార్డులు అందుకున్నా. – శోభ, రంగస్థల నటి, సభ్యురాలు -
విద్యుత్ వైర్లు తగిలి రైతు దుర్మరణం
జగిత్యాలక్రైం: నువ్వు పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి ఓ రైతు కిందపడిన విద్యుత్ వైర్లు కాలుకు తగిలి అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దేవి చంద్రయ్య (55) గురువారం ఉదయం తన నువ్వు పంటకు నీరు పెట్టేందుకు పొలానికి వెళ్లాడు. ఉదయం వీచిన ఈదురుగాలులకు స్తంభానికి ఉన్న విద్యుత్ వైర్లు కింద పడ్డాయి. గమనించని చంద్రయ్య చేనులోకి వెళ్తుండగా వైర్లు కాలుకు తగలడంతో విద్యుత్షాక్తో అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామంలో కరెంట్ లేదంటూ స్థానికుల ఫిర్యాదు మేరకు విద్యుత్ అధికారులు సమస్య ఎక్కడుందో తెలుసుకునేందుకు స్తంభాల వెంట వెదుకుతుండగా చంద్రయ్య శవమై కనిపించాడు. దీంతో వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రూరల్ ఎస్సై సదాకర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చంద్రయ్య కుమారుడు ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. ఆయన వచ్చాక అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
చిక్కుల్లో బంగారం ముఠా
● సౌదీ అరేబియా నుంచి రవాణా ● హైదరాబాద్ ఎయిర్పోర్టు దాటించాలని ఒప్పందం ● ఎయిర్పోర్టు దాటడంతోనే గేమ్చేంజ్ ● ఎత్తుకెళ్లిన మూడో వ్యక్తి ● వేములవాడలో కేసు నమోదుచందుర్తి(వేములవాడ): సౌదీ అరేబియా నుంచి పెద్ద ఎత్తున బంగారం తరలిస్తున్న ముఠా చిక్కుల్లో పడింది. బంగారం తీసుకొస్తున్న ఇద్దరు వ్యక్తులను కాదని వారి బంధువే దాన్ని ఎత్తుకెళ్లడంతో వీరిద్దరు ఇరకాటంలో పడ్డారు. సౌదీ అరేబియా నుంచి ఇండియాకు బంగారం పంపిన వ్యక్తి స్థానిక పోలీసులను ఆశ్రయించడంతో వేములవాడ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. చందుర్తి మండలం జోగాపూర్కు చెందిన ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు జీవనోపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లారు. ఐదు రోజుల క్రితం సౌదీ అరేబియా నుంచి స్వగ్రామం జోగాపూర్కు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమంలోనే బంగారం స్మగ్లర్లు వీరితో డీల్ కుదుర్చుకున్నారు. తీసుకొచ్చిన బంగారాన్ని హైదరాబాద్లో అప్పగించి.. తెచ్చినందుకు కమీషన్ తీసుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. డామిట్ కథ అడ్డం తిరిగింది జోగాపూర్కు చెందిన వ్యక్తి అదే మండలంలోని ఎన్గల్కు చెందిన తన బావమరిదిని హైదరాబాద్ ఎయిర్పోర్టుకు కారు తీసుకురావాలని సూచించాడు. ఎయిర్పోర్టు దాటిన తర్వాత తన బావమరిదికి సౌదీ అరేబియా నుంచి పెద్ద ఎత్తున బంగారం తీసుకొచ్చిన విషయాన్ని తెలిపారు. ఇదే అదనుగా భావించిన ఎన్గల్కు చెందిన వ్యక్తి బంగారం అప్పగించకుండానే వారి వద్ద ఉన్న మూడు సెల్ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసి హైదరాబాద్లోనే తలదాచుకున్నారు. సౌదీ అరేబియాలో బంగారం అప్పగించిన వ్యక్తి తాను మోసపోయానని గ్రహించి రెండు రోజుల క్రితమే వేములవాడ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు జోగాపూర్కు చెందిన ఇద్దరి కుటుంబ సభ్యులను పిలిపించి జరిగిన విషయాన్ని వివరించారు. ఎక్కడున్న లొంగిపోవాలని, లేకుంటే అందరిని అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిసింది. భయాందోళన చెందిన సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఇద్దరు చందుర్తి మాజీ జెడ్పీటీసీ ఆధ్వర్యంలో గురువారం తెల్లవారుజామున వేములవాడ పోలీసుల ఎదుట సరెండర్ అయినట్లు తెలిసింది. కాగా బంగారం ఎత్తుకెళ్లిన ఎన్గల్కు చెందిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. కాగా బంగారం తీసుకొచ్చిన వ్యక్తులు మాత్రం అది ఎంత బరువు ఉందో తెలియదని పోలీసులకు తెలిపినట్లు ప్రచారం. ఇదే విషయమై వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ను వివరణ కోరితే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న మాట వాస్తవమేనన్నారు. కానీ వివరాలు విచారణ ముగిసే వరకు బయటకు చెప్పబోమని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మల్లాపూర్: మండలంలోని వేంపల్లి శివారులో గురువారం రా త్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం మ ల్లాపూర్కి చెందిన సుర దివాకర్ (42) రాయికల్ మండలం కొత్తపేటలో బంధువుల ఇంటికి వెళ్లాడు. ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా.. రాయికల మండలం మూటపెల్లిలో మేసీ్త్ర పనులు చేస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు కూలీలు ద్విచక్రవాహనంపై వేంపల్లిలో కూరగాయలు తీసుకుని మూటపెల్లికి వస్తున్నారు. గ్రామ శివారులో అతివేగంగా వచ్చి దివాకర్ బైక్ను ఢీ కొట్టారు. ఈ ఘటనలో దివాకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మరో బైక్పై ఉన్న ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఎస్సై రాజు విచారణ చేపట్టారు. -
సన్నబియ్యం.. నో స్టాక్
● అరకొర కేటాయింపుతో డీలర్ల అవస్థలు ● రేషన్ దుకాణాల వద్ద కార్డుదారుల ఆగ్రహం ● సగానికి పైగా దుకాణాలు మూత ● నత్తనడకన బియ్యం సరఫరానగరంలోని వావిలాలపల్లిలోని రేషన్ దుకాణం ఇది. కార్డుల సంఖ్యకు అనుగుణంగా సన్నబియ్యం సరఫరా చేయాల్సి ఉండగా పావువంతు స్టాక్ పంపించారు. ఒక్కరోజులోనే పంపిణీ పూర్తవగా బియ్యం లేక రేషన్ దుకాణాన్ని మూసివేశారు. కార్డుదారులు రావడం, పడిగాపులు కాయడం పరిపాటిగా మారింది.జిల్లాలో గ్రామాలు: 313 మొత్తం జనాభా: 10,09,234 రేషన్ కార్డులు: 2,74,620 యూనిట్లు: 8,17,156 రేషన్ దుకాణాలు: 566కరీంనగర్ అర్బన్: సన్నబియ్యం అంతలోనే స్టాక్ అయిపోయాయి. అలా వచ్చాయో లేదో ఇలా పంపిణీ చేసేశారు. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి అరకొర కేటాయింపులే సదరు పరిస్థితికి కారణం కాగా పూర్తిస్థాయిలో మూవ్మెంట్ కాకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించగా కార్డుదారులు ఆశగా రేషన్ దుకాణాలను ఆశ్రయిస్తుండగా తీరా బియ్యం అయిపోయాయి.. వస్తాయనే సమాధానంతో నిరీక్షిస్తున్నారు. జిల్లాలో 566 రేషన్ దుకాణాలుండగా 2.74 లక్షల మంది కార్డుదారులున్నారు. ఇప్పటివరకు 30శాతం బియ్యం మాత్రమే దుకాణాలకు చేరగా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితని తెలుస్తోంది. ఇదేం చోద్యం.. పంపిణీకి జాప్యం ప్రభుత్వం స్టేజ్–1, స్టేజ్–2 ద్వారా బియ్యం సరఫరా చేస్తుండగా లోపాలను సరిదిద్దాల్సిన జిల్లా యంత్రాంగం చోద్యం చూస్తోంది. దీంతో ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జీలు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తమకు ఇష్టం లేకు న్నా విధులు కేటాయించారంటూ కూలీలతో నిష్టూ రమాడటం ఆశ్చర్యపరుస్తోంది. జిల్లాలో 2.74లక్షల కార్డుదారులుండగా 8లక్షలకు పైగా యూనిట్లున్నాయి. స్టేజ్–1 నుంచి సకాలంలో బియ్యం రాకపోవడం వల్లే ఈ సమస్య అని ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జీలు చెబుతుండగా తాము అలాట్మెంట్ ప్రకారం బియ్యం అందిస్తున్నామని అయినా తమపై ఆరోపణలేంటని స్టేజ్–1 గుత్తేదారులు మండిపడుతున్నారు. పాపం.. రేషన్ డీలర్లు, కార్డుదారులు రేషన్ దుకాణాలకు బియ్యం ఆలస్యంగా వస్తుండటంతో డీలర్ల బాధ వర్ణనాతీతం. కొంత బియ్యం ఒకసారి మరికొంత బియ్యం మరోసారి పంపిస్తుండటంతో సాధ్యమైనంత వరకు పంపిణీ చేస్తున్నా పూర్తిస్థాయిలో జరగడం లేదు. దీంతో కమిషన్తోనే బతుకు వెళ్లదీయాల్సిన డీలర్లు గిట్టుబాటు కాక ఉస్సూరుమంటున్నారు. ఇక కార్డుదారులు బియ్యం కోసం రేషన్ దుకాణాలకు చుట్టూ తిరుగుతున్నారు. ఇబ్బంది పడుతున్నాం సరైన పణాళిక లేకపోవడంతో డీలర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 1వ తేదీలోపే బియ్యం మూవ్మెంట్ కావాల్సి ఉండగా ఇప్పటికి సాగుతోంది. వచ్చిన బియ్యాన్ని వచ్చినట్లే పంపిణీ చేస్తున్నా స్టాక్ లేక రోజుల తరబడి ఖాళీ ఉంటున్నం. ఉన్నతాధికారులు చొరవ చూపి ఎవరికి ఇబ్బంది లేకుండా చూడాలి. – రొడ్డ శ్రీనివాస్, తెలంగాణ రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు -
అట్రాసిటీ కేసులు పరిష్కరించండి
కరీంనగర్: జిల్లాలో వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులను ఈ నెల 30లోగా పరిష్కరించాలని, ఉద్యోగ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం, జిల్లా అధికారులతో ల్యాండ్, ప్రభుత్వ సేవలు, అట్రాసిటీ అంశాలపై కమిషన్ చైర్మన్, సభ్యులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. అట్రాసిటీ కేసులు కోర్టులో నిలబడే విధంగా పో లీసులు బలమైన సాక్ష్యాలను సమర్పించి, నిందితులకు శిక్షపడేలా చూడాలన్నారు. పెండింగ్కేసులపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమీక్షించి, త్వరితగతిన పరిష్కరించే విధంగా చూడాలన్నారు. అట్రా సిటీ కేసుల్లో పెండింగ్లో ఉన్న వైద్య నివేదికలు పంపాలని ఆదేశించారు. కులం సర్టిఫికెట్ సమర్పించని కారణంగా పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించి, వెంటనే సంబంధిత సర్టిఫికెట్ జారీ చేయాలని తహసీల్దార్లకు సూచించారు. రెవెన్యూ పరిధిలో పెండింగ్లో ఉన్న భూమి సంబంధిత కేసులను ఈ నెల 30లోగా పరిష్కరించాలని ఆర్డీవోలను ఆదేశించారు. అంబేద్కర్ విద్యానిధికి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రతినెలా సివిల్ రైట్స్డే నిర్వహించాలన్నారు. మూడు నెలలకు ఒకసారి జిల్లాస్థాయి ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అవలంబించాలని, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయాలని పోలీసుశాఖకు సూచించారు. కరీంనగర్ బాలసదనంలో పెరిగిన అనాథ ఎస్సీ యువతికి వివాహం జరి పించిన కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా సంక్షేమ అధికారి సబితను ప్రత్యేకంగా అభినందించారు. అడిషనల్ కలెక్టర్లు లక్ష్మి కిరణ్, ప్రఫుల్దేశాయ్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కుస్రం నీలా దేవి, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణిగుంట్ల ప్రవీణ్, రాంబాబు నాయక్ పాల్గొన్నారు. ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతితెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 98వ జయంతి వేడుకలను కరీంనగర్ కలెక్టరేట్లో గురువారం ఘనంగా నిర్వహించారు. దొడ్డి కొమురయ్య చిత్రపటానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎస్సీ,ఎస్టీ కమిషన్ సభ్యులు కుస్త్రం నీలాదేవి, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణిగుంట్ల ప్రవీణ్, రాంబాబునాయక్ పాల్గొన్నారు. పోస్టుల భర్తీలో రిజర్వేషన్ తప్పనిసరి సబ్ప్లాన్ నిధులు పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
కరీంనగర్టౌన్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలని, మొదటి కాన్పు సాధారణంగా అయ్యేలా చూడాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి వెంకటరమణ ఆదేశించారు. డీఎంహెచ్వో కార్యాలయంలో గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పట్టణ ఆరోగ్య కేంద్రం, బస్తీ దవాఖానా వైద్యాధికారులు, ఎంఎల్హెచ్పీలతో సమీక్ష నిర్వహించా రు. 30ఏళ్ల వయస్సు పైబడిన వారికి అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్ ఇంప్రూవ్ చేయాలని ఆదేశించారు. క్షయ నివారణ అధికారి రవీందర్రెడ్డి క్షయ నివారణలో టార్గెట్ను పూర్తిచేయాలన్నారు. ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ విప్లవశ్రీ, సనజవేరియా, డీఐవో సాజిదా, చందు, డెమో రాజగోపాల్ పాల్గొన్నారు. అభ్యసన ఫలితాలపై దృష్టి పెట్టాలి సప్తగిరికాలనీ(కరీంనగర్): ఉపాధ్యాయులు అభ్యసన ఫలితాలపై దృష్టి పెట్టాలని డీఈవో జనార్దన్రావు పేర్కొన్నారు. పదోన్నతి పొంది న ఉపాధ్యాయులకు సుభాష్నగర్, సప్తగిరి కాలనీ, మంకమ్మతోట ఉన్నత పాఠశాలల్లో జ రుగుతున్న శిక్షణ కార్యక్రమాలను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విద్యార్థుల తరగతి గది సామర్థ్యాల సాధనపై దృష్టి పెట్టా లన్నారు. విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని వివిధ నివేదికలు తెలియజేస్తున్నాయని, ఉపాధ్యాయులు మరింత జాగ్రత్తతో విద్యాబోధన చేయాలన్నారు. అకాడమిక్ మానిటరింగ్ అధికారి కర్ర అశోక్రెడ్డి, స్టేట్ రిసోర్స్ పర్సన్ గాజుల రవీందర్ పాల్గొన్నారు. నేటి నుంచి ప్రభుత్వాసుపత్రి కార్మికుల సమ్మె కరీంనగర్టౌన్: మూడు నెలల పెండింగ్ వేతనాల కోసం కరీంనగర్ జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఏజిల్ గ్రూప్ కాంట్రాక్టు కార్మికులు సమ్మె బాట పట్టారు. గతంలోనే ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డికి సమ్మె నోటీసు ఇవ్వగా శుక్రవారం నుంచి నిరవధిక సమ్మె చేసేందుకు నిర్ణయించారు. గురువారం ఆసుపత్రి ఆవరణలో యూనియన్ గౌరవాధ్యక్షుడు బండారి శేఖర్ మాట్లాడుతూ వేతనాలు చెల్లించేవరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. ప్రతినెల 5వ తేదీలోపు కార్మికుల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 500 బెడ్సుకు బిల్లు వచ్చే విధంగా జీవో అమలు చేయాలన్నారు. కార్మికులకు గుర్తింపు కార్డులు, రెండు జతల బట్టలు, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధ్యక్షుడు పి.అరుణ్, కార్యదర్శి కళావతి, కార్మికులు పాల్గొన్నారు. పంచాయతీ కార్మికుల సమ్మె నోటీసు సప్తగిరికాలనీ(కరీంనగర్): తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ అనుబంధం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం డీపీవో వి.జగదీశ్వర్కు సమ్మె నోటీసు ఇచ్చారు. ఏప్రిల్ 19 తరువాత సమ్మెకు వెళ్తామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023లో పలు డిమాండ్ల సాధన కోసం 33రోజులు సమ్మె చేసినప్పటికీ, ప్రభుత్వం పట్టించుకోగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగ భద్రత కల్పిస్తామని నెరవేర్చలేదన్నారు. కార్మికులకు ఇచ్చిన హామీని అమలు పరచాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాచర్ల మల్లేశం, ఉపాధ్యక్షుడు కాశిపాక శంకర్, కోశాధికారి ఎండిగ రవీందర్, మొలుగురు ప్రేంకుమార్, శంకర్, వడ్లూరి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
అత్యాశల దందా
ఆన్లైన్.. బిట్కాయిన్.. క్యాసినో ● పెట్టుబడులను లాగేస్తున్న మాఫియా ● జిల్లా వ్యాప్తంగా తగ్గిన ‘రియల్’ బిజినెస్ ● కుదేలవుతున్న ‘భూ’ వ్యాపారంకరీంనగర్క్రైం: రోజురోజుకు బిట్కాయిన్, క్యాసినో సామ్రాజ్యం విస్తరిస్తోంది. మార్కెట్లో ఉన్న డబ్బంతా వీటి వైపే మళ్లుతోంది. విదేశాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుని చేస్తున్న బిట్కాయిన్ దందా జిల్లాలోని పెట్టుబడులను లాగేస్తోంది. కొంతమంది అత్యాశతో బిట్కాయిన్ వైపు వెళ్తుండగా.. మరికొందరు గోవాతో పాటు సముద్రతీర ప్రాంతాల్లో జరిగే క్యాసినోలో పెట్టబుడులు పెట్టి ఆదాయం సంపాదించాలని చూస్తున్నారు. కాగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రియల్ భూం తగ్గడానికి ఈ దందాలే ప్రధాన కారణమని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ఇతర దందాల్లో పెట్టుబడులు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా మంది డబ్బు ఉన్నవారితో పాటు మధ్యతరగతి వర్గాల వారు గతంలో భూములపై పెట్టుబడులు పెట్టి లాభం వచ్చాక అమ్మకాలు జరిపించేవారు. కొంత మంది భవిష్యత్ అవసరాల కోసం పెట్టుబడులు పెట్టగా మరికొందరు వ్యాపార ధోరణితో స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టేవారు. కానీ, గత అసెంబ్లీ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చాక ఒక్కసారిగా స్థిరాస్తుల వ్యాపారం గణనీయంగా తగ్గిపోయింది. ఆ సమయంలో ఎన్నికలు ఉండడంతో డబ్బు ఒకచోట నుంచి మరో చోటికి చేర్చడం కష్టంగా మారడంతో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోవడంతో బిట్కాయిన్, క్యాసినో వంటి దందాలు చాలా మందిని ఆకర్షించాయి. వీటి వైపునకు మళ్లిన జనం వ్యాపారంతో పాటు విలాసవంతమైన లైఫ్ స్టైల్కు అలవాటుపడి ఇలాంటి దందాల్లో వారితో పాటు, తెలిసినవారు, తోటి ఉద్యోగులు, బంధువులు ఇలా అందరితో పెట్టుబడులు పెట్టించి ఇతర రాష్ట్రాలు, విదేశీయాత్రలు ఆఫర్లు చేస్తుండడంతో విపరీతంగా ఆకర్షితులయ్యారు. ఇలాంటి దందాలు చేస్తూ పలువురు మోసపోగా, ముందుగా చేరిన వారు కొందరు మాత్రం బాగానే సంపాదిస్తున్నట్లు సమాచారం. రెవెన్యూ, పోలీసు డిపార్ట్మెంట్లతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, రాజకీయ నాయకులు సైతం ఇటు వైపుగానే పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు రూ.150 కోట్ల పెట్టుబడులు ఇతర రాష్ట్రాలు, విదేశాలకు తరలిపోతున్నట్లు అంచనా. కుదేలైన రియల్ వ్యాపారం అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గుతూ వస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత పుంజుకుంటుందని ఎదురుచూపులు చూసినా ఎంతకీ ఆశాజనకంగా లేకపోయేసరికి ఎన్నికలకు ముందు పెట్టుబడులు పెట్టిన వారు లబోదిబోమంటున్నారు. ఇప్పటికీ చాలా తక్కువగా వ్యవసాయభూములు, ప్లాట్ల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతున్నాయి. గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెలకు వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఇతర రిజిస్ట్రేషన్ల ద్వారా సుమారుగా రూ.100 నుంచి రూ.120 కోట్ల వరకు ఆదాయం సమకూరేది. కానీ ఇప్పుడు అన్నీ కలిపి రూ.40 కోట్ల లోపే ఆదాయం వస్తుండడంతో వ్యాపారం ఎంత పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. కాగా ఆన్లైన్ మోసపూరితమైన దందాల్లో పెట్టుబడులు పెడితే ఎప్పటికై నా నష్టం తప్పదని పోలీసులు సూచిస్తున్నారు.తెలిసే పెట్టుబడి పెడుతుంటారు బిట్కాయిన్ వంటి ఆన్లైన్ దందాల్లో చాలా మంది తెలిసే పెట్టుబడి పెడుతున్నారు. మోసం జరిగిన తర్వాత పోలీసుల వద్దకు వస్తున్నారు. బిట్కాయిన్ వంటి వాటిలో మోసాలు జరిగితే సైబర్పోలీసు విభాగంతో విచారణ చేపడుతున్నాం. మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రజలకు అనధికారిక యాప్లు, లోన్యాప్లు, సైబర్, క్రిప్టో కరెన్సీ మోసాలపై అవగాహన కల్పిస్తున్నాం. – గౌస్ ఆలం, సీపీ, కరీంనగర్ రియల్ వ్యాపారం తగ్గింది ఏడాదిన్నర కాలంగా రియల్ ఎస్టేట్పూర్తిగా పడిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల ప్రభావంతో తగ్గాయని అనుకున్నాం. కానీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు పూర్తయినా.. పెరగడం లేదు. చాలా మంది బిట్ కాయిన్ వంటి వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు చర్చ జరుగుతోంది. – వి.వెంకన్న, రియల్ ఎస్టేట్ వ్యాపారి, కరీంనగర్ఉమ్మడి జిల్లా సమాచారం 2023 కన్నా ముందు స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా ఒక నెలకు వచ్చిన ఆదాయం: రూ.120 కోట్లు ప్రస్తతం ఒక నెలకు వస్తున్న ఆదాయం: రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్లు బిట్ కాయిన్, క్యాసినో వంటి దందాలకు తరలిపోతున్న పెట్టుబడులు నెలకు సుమారు రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్లు -
వాళ్లు అనర్హులే!
● మొత్తం 25 మంది అనర్హులుగా గుర్తింపు ● వెలువరించిన జిల్లా కోర్టు.. స్వాగతిస్తున్న నిరుద్యోగులు ● ఫలించిన ‘సాక్షి’ కథనాల పోరాటంకోర్టు సబార్డినేట్ పోస్టుల్లో ఓవర్ క్వాలిఫై అభ్యర్థులుసాక్షిప్రతినిధి,కరీంనగర్ ●: గతంలో జరిగిన కోర్టు సబార్డినేట్ పోస్టుల విషయంలో ‘సాక్షి’ వరుస కథనాలు నిజమయ్యాయి. అటెండర్ స్థాయి పోస్టులకు అధిక విద్యార్హత (ఓవర్క్వాలిఫైడ్) ఉన్న వ్యక్తులు అక్రమంగా పరీక్షలు రాసి ఎంపికయ్యారంటూ రెండేళ్ల క్రితం ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన మాట విదితమే. తమకు అన్యాయం జరిగిందని, అనర్హులు ఉద్యోగాలకు ఎంపికవడాన్ని సవాలు చేస్తూ పలువురు ఈ కథనాల ఆధారంగా న్యాయస్థానాలను ఆశ్రయించారు. పోలీసు యంత్రాంగం విచారణ జరిపింది. పలువురు తాము అధిక విద్యార్హతలు కలిగి ఉన్నామని అంగీకరించి, స్వచ్ఛందంగా తప్పుకుని, ఉద్యోగానికి రాబోమని రాసి ఇచ్చారు. మరికొందరు తమకు ఏమవుతుందిలే అన్న ధీమాతో కొలువుల్లో చేరారన్న ఆరోపణలు ఉన్నాయి. తరువాత కాలంలోనూ అవి వెలుగుచూడటంతో వారిని కూడా తొలగించారు. రెండేళ్ల తరువాత విడుదలైన జాబితా.. వీరందరి రిక్రూట్మెంట్ ప్రక్రియ 2022లో మొదలైన దరిమిలా.. ఈ దుమారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అనర్హులు (ఓవర్ క్వాలీఫైడ్) తమ పొట్ట కొడుతున్నారని ఉద్యోగాలు రాని, పది ఫెయిలై పరీక్ష రాసిన వారంతా ఆందోళనలకు దిగారు. తాము ఆందోళనలు చేసిన ఇన్నేళ్ల తరువాత 25 మందితో కరీంనగర్ కోర్టు నుంచి అనర్హుల జాబితా విడుదల కావడంపై 2019లో పరీక్ష రాసిన అభ్యర్థులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ 25 మందిలోనూ ముగ్గురు రిక్రూట్మెంట్కు గైర్హాజరయ్యారని, ఒకరు ఫామ్నింపలేదని, ఒకరు ఉద్యోగంలో చేరి రాజీనామా చేశారని, మరో ముగ్గురు పోస్టులో చేరడానికి ఆసక్తి చూపలేదని పేర్కొన్నారు. మిగిలిన 17 మంది మాత్రం అధిక విద్యార్హతలు కలిగి ఉన్నారని విడుదల చేసిన జాబితాలో స్పష్టంచేశారు. దీంతో ఎట్టకేలకు తమ పోరాటం ఫలించిందని న్యాయాధికారుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన జాబితాకు సంబంధించిన కాపీ కరీంనగర్ కోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ‘సాక్షి’ వరుస కథనాలతో కదలిక.. 2019లో నిర్వహించిన కోర్టు సబార్డినేట్ పరీక్షకు అర్హత పదో తరగతి ఫెయిల్ ఉండాలని నిబంధన పెట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 96 పోస్టులకు ఈ పరీక్ష నిర్వహించారు. తొలుత 1:3 రేషియోలో మొత్తం 318 మందిని పిలిచిన అధికారులు.. 93 మందితో తుదిజాబితా ప్రకటించారు. ఈ అభ్యర్థుల్లో పలువురు ఓవర్ క్వాలిఫైడ్ అని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో చాలామంది తమ అర్హతలను తగ్గించి చూపించారు. తాము 10వ తరగతి ఫెయిల్ అని కొందరు, అసలు తాము 9వ తరగతితోనే చదువు ఆపేశామని చెప్పుకుని మరికొందరు పరీక్ష రాశారు. అధికారులను నమ్మించేందుకు అప్పటికే మూతబడి ఉన్న చాలా స్కూళ్ల నుంచి బోనఫైడ్ సర్టిపికెట్లను దొడ్డిదారిలో తెచ్చుకుని మరీ సమర్పించారు. దీంతో అవే స్కూళ్లలో చదివి.. ఉద్యోగం రాని వారు.. తమతోపాటు వారు చదవలేదని ఆందోళనలకు దిగారు. ఈ విషయాన్ని పలుమార్లు ‘సాక్షి’ వరుస కథనాల ద్వారా ఎత్తిచూపింది. అనంతర కాలంలో ఓ మహిళా ఉద్యోగి గ్రాడ్యుయేట్ అన్న విషయాన్ని గుర్తించిన అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకుని, ఉద్యోగం నుంచి తప్పించడం గమనార్హం.మాకు అవకాశం కల్పించాలి కరీంనగర్ కోర్టు ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. మేం తొలి నుంచి చెప్తున్న విషయం రెండేళ్ల తరువాత నిజమవడం సంతోషం. ఉద్యోగాల్లో చేరని, ఓవర్ క్వాలిఫైడ్ అభ్యర్థుల స్థానంలో తరువాత మెరిట్లో నిలిచిన నిజమైన అభ్యర్థులకు స్థానం కల్పించాలని ప్రార్థిస్తున్నాం. – రమేశ్, హుజూరాబాద్, నిరుద్యోగి -
ప్రజలను మేల్కొల్పడానికే పాదయాత్ర
● డీసీసీ అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూర్: బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంపై చేస్తున్న దాడులను అరికట్టడానికే కాంగ్రెస్ ఆధ్వర్యంలో జై బాపు, జైభీమ్, జై సంవిధాన్ పాదయాత్ర చేపట్టినట్లు డీసీసీ అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. ఇటీవల పార్లమెంటులో కేంద్ర మంత్రి అమిత్ షా గాంధీజీ, అంబేడ్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం మానకొండూర్ మండలకేంద్రంలో జై బాపూ– జై భీమ్– జై సంవిధాన్ పాదయాత్రను ప్రారంభించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. స్థానికంగా ఉన్న రేషన్షాపులో సన్నబియ్యం పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలనే ఉద్దేశంతోనే బీజేపీ పాలన కొనసాగుతోందన్నారు. దానికి నిరసనగా పాదయాత్ర చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మర్రి ఓదెలు, రామిడి తిరుమల్రెడ్డి, తాళ్లపల్లి సంపత్గౌడ్, రామిడి తిరుపతి, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సిటీకి ఓఆర్ఆర్
● సిద్ధమైన సుడా మాస్టర్ ప్లాన్ ● సరిహద్దులు నిర్ధారిస్తూ ఉత్తర్వులు ● 20 గ్రామాలను కలుపుతూ రింగురోడ్డు ● పారిశ్రామిక, వాణిజ్య కారిడార్ల ఏర్పాటు ● 90 రోజుల్లో అభ్యంతరాలు తెలపాలంటూ నోటిఫికేషన్సాక్షి ప్రతినిధి,కరీంనగర్: కరీం‘నగరం’ రూపురేఖలు మారనున్నాయి. ఐటీలో టైర్ టు సిటీగా.. స్మార్ట్సిటీలో రాష్ట్రంలో రెండో ముఖ్యనగరంగా పలు అవార్డులు సాధించిన కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రూపంలో సరికొత్తగా రూపుదిద్దుకోనుంది. నగరంతోపాటు పరిసరాల్లో ఉన్న 62 గ్రామాల పరిధిలో ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసేందుకు శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(సుడా) రూపొందించిన మాస్టర్ ప్లాన్–2041ను అధికారులు సిద్ధం చేశారు. అమృత్ స్కీమ్ గైడ్లైన్స్, అర్బన్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్(యూడీపీఎఫ్ఐ) మార్గదర్శకాలను అనుసరించి ఈ మాస్టర్ ప్లాన్ను అభివృద్ధి చేశారు. ఇందుకు ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ కూడా మొదలుపెట్టారు. మాస్టర్ప్లాన్పై ఏవైనా అభ్యంతరాలుంటే 90 రోజుల్లో తెలియజేయవచ్చని ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లో సుడా చైర్మ న్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి వెల్లడించారు. దీనిపై స్థానికంగా పలువురు తమ అభ్యంతరాలు, సలహా లు, సూచనలు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. సుడా మాస్టర్ప్లాన్ ఇదే.. ప్రస్తుతం అమలులో ఉన్న సుడా మాస్టర్ ప్లాన్–2019ను అప్పటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ప్రస్తుత మాస్టర్ ప్లాన్ ప్రకారం కొత్త సరిహద్దులు నిర్ణయించారు. దీని ప్రకారం సుడా పరిధి తూర్పున తాహెర్ కొండాపూర్, ఈశాన్య మూల నుంచి మొదలై చెర్లభూత్కూర్, ముగ్దుంపూర్, చేగుర్తి, లింగాపూర్, అన్నారం, ఈదులగట్టెపల్లి గ్రామ సరిహద్దుల వెంబడి చెంజర్ల సరిహద్దు వరకు ఉంటుంది. పడమర వైపు గునుకుల కొండాపూర్ సరిహద్దు నైరుతి మూల నుంచి మొదలై ఉత్తరం దిక్కువెళ్తూ జంగపల్లి, మాదాపూర్, కాశీంపేట, పారువెల్ల, కాజీపూర్, ఒద్యారం, నాగుల మాల్యాల, వెలిచాల, వెదిర, కిష్టాపూర్ సరిహద్దు వెంబడి వాయువ్య మూల వరకు మాస్టర్ బౌండరీగా నిర్ధారించారు. దక్షిణాన చెంజర్ల సరిహద్దు ఆగ్నేయ మూల నుంచి మొదలై పడమర వైపునకు వెళ్తూ మన్నెంపల్లి, నుస్తులాపూర్, కొత్తపల్లి (పీఎన్), రేణికుంట, గునుకుల కొండాపూర్, సరిహద్దు నైరుతి మూల వరకు హద్దులుగా నిర్ణయించారు. ఉత్తరాన కిష్టాపూర్ సరిహద్దు, దేశారాజ్పల్లి, కోనేరుపల్లి, రుక్మాపూర్, కొలిమికుంట చాకుంట, చామనపల్లి తాహేర్కొండాపూర్ ఈశాన్యం మూల వరకు సరిహద్దుగా ఉంది. వాణిజ్యం, మిశ్రమ, పరిశ్రమల జోన్లు కరీంనగర్లోని ప్రధాన రహదారుల వెంబడి ఉన్న ప్రాంతాన్ని వాణిజ్య అవసరాలకే వినియోగిస్తున్నప్పటికీ అవి రెసిడెన్షియల్ జోన్ పరిధిలో ఉన్నాయి. అందుకే నగరంలోని ప్రధాన రహదారులను వాణిజ్య జోన్ల పరిధిలోకి తీసుకొచ్చారు. నివాసప్రాంతాలు, వాణిజ్య కేంద్రాలు కలిసి ఉన్న ఏరియాలను మిశ్రమజోన్లుగా ప్రతిపాదించారు. కరీంనగర్ భవిష్యత్ ఆర్థిక అభివృద్ధి కోసం స్పెషల్ ఇండస్ట్రీయల్ జోన్లను మాస్టర్ ప్లాన్ లో ప్రతిపాదించారు. 2,289 హెక్టార్లలో ఇండస్ట్రీయల్ జోన్గా నిర్ధారించారు. ఈ జోన్ పరిధిలోకి ఆసిఫ్నగర్, ఒద్యారం, నాగులమల్యాల(కొంతభాగం), చెంజర్ల(కొంత భాగం), ఎలగందల్(కొంత భాగం), బద్దిపల్లి(కొంత భాగం) రానున్నాయి. 20 ఊళ్లను కలుపుతూ రింగ్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, వరంగల్ తరహాలో కరీంనగర్కు రింగు రోడ్డును ప్రతిపాదించారు. ఇది సుమారు 20 గ్రామాల సరిహద్దుల మీదుగా పోనుంది. 200 ఫీట్ల వెడల్పుతో 138 కిలో మీటర్ల పొడవైన ఔటర్ రింగ్ను నిర్మిస్తారు. కరీంనగర్–హైదరాబాద్ రాజీవ్ రహదారిని కలుపుతూ ఓఆర్ఆర్లోని ఒక భాగం గనుకుల కొండాపూర్, జంగపల్లి, మాదాపూర్, ఖాసింపేట, పారువెల్ల, ఒద్యారం, నాగుల మల్యాల, కొక్కెరకుంట, వెలిచాల శివారు మీదుగా వెళ్లి కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిని కలుస్తుంది. కొత్తపల్లి పట్టణం దాటిన తర్వాత కరీంనగర్–జగిత్యాల రహదారి నుంచి కొక్కెరకుంట, జూబ్లీనగర్, ఎలబోతారం, ఇరుకుల్ల, దుర్శేడు, బొమ్మకల్ గ్రామ శివారు నుంచి మానేరు నది మీదుగా మానకొండూరు, ముంజంపల్లి, పోరండ్ల, ను స్తులాపూర్ వద్ద రాజీవ్ రహదారితో కలుస్తుంది. హైదరాబాద్ను కలిపే కొత్తపల్లి– మనో హరాబాద్ రైల్వేలైన్ పూర్తయితే నగరం కనెక్టివిటీ మరింత విస్తారంగా మారుతుంది.సమగ్రాభివృద్ధి కోసమే కరీంనగర్కు సుమారు 30ఏళ్ల క్రితం నాటి మాస్టర్ ప్లాన్ అమలవుతోంది. నగరం చాలా విస్తరించింది. ఇంకా చాలా విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉంది. పాత సుడా పరిధి యూనిట్గా కొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. దీంతో ఒక ప్రణాళిక బద్ధమైన అభివృద్ధి జరుగుతుంది. ఇండస్ట్రియల్ జోన్, కమర్షియల్ జోన్, రెసిడెన్షియల్ జోన్, సెమీ కమర్షియల్, సెమీ రెసిన్షియల్గా గుర్తించి వాటిని మాస్టర్ ప్లాన్లో పొందుపరిచాం. సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ రూపొందించాం. – కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సుడా చైర్మన్ -
శ్రీరామనవమికి పటిష్ట ఏర్పాట్లు
ఇల్లందకుంట: అపర భద్రాద్రి ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ఈ నెల 4 నుంచి 16వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్రెడ్డి మాట్లాడుతూ.. అధికారులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో రాజకీయ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా చూడాలని సీపీని కోరారు. కల్యాణ మండపం వద్దకు పట్టువస్త్రాలు తీసుకొచ్చే క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీలవారిని ఒకేసారి ఆహ్వానించే విధంగా చూడాలన్నారు. జాతరకు రూ.10లక్షలు కేటాయించాలని కలెక్టర్ను కోరారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. గతం కన్నా వైభవంగా వేడుక జరగాలన్నారు. పార్కింగ్, కరెంట్, తాగునీటి సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. శ్రీరామనవమి రోజున కల్యాణానికి 50వేలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. సుమారు 350మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని సీపీ గౌస్ ఆలం పేర్కొన్నారు. 40 సీసీ కెమెరాలతో నిఘా పెడతామని తెలిపారు. అదనపు కలెక్టర్లు ప్రఫుల్దేశాయ్, లక్ష్మీకిరణ్, ఆర్డీవో రమేశ్బాబు, సీఐ కిషోర్, ఎస్సైలు రాజ్కుమార్, తోట తిరుపతి, రైస్మిల్లర్స్ జిల్లా అధ్యక్షుడు నర్సింగరావు పాల్గొన్నారు. మాతృభాషతో పాటు ఇంగ్లిష్లో బోధన కరీంనగర్రూరల్: వలస కార్మికుల పిల్లలకు ఒరియా మాతృభాషతోపాటు ఇంగ్లిష్లో బోధన చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్ జెడ్పీ పాఠశాలలో చదువుతున్న వందమంది ఇటుకబట్టీ కార్మికుల పిల్లలకు స్కూల్బ్యాగులు, డ్రాయింగ్బుక్స్, క్రేయాన్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటుకబట్టీ కార్మికుల పిల్లల చదువును ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో 500 మంది పిల్లలు చదువుతున్నట్లు తెలిపారు. పిల్లలకు యూనిఫామ్స్, మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. పిల్లలకు ఒరియాతోపాటు ఇంగ్లిష్ భాషను తప్పనిసరిగా నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. బొమ్మకల్, మొగ్ధుంపూర్, చెర్లభూత్కూర్ పాఠశాలల్లో అదనపు తరగతుల నిర్మాణానికి ఉచితంగా ఇటుకలను సరఫరా చేస్తామని బట్టీల యజమానులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, సెక్టోరియల్ అధికారి అశోక్రెడ్డి, ఎంఈవో కె. రవీందర్, ఎంపీవో జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి -
‘పోరాటానికి సన్నద్ధం కండి’
కరీంనగర్ అర్బన్: ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ మెతక వైఖరిని నిరసిస్తూ కార్యాచరణను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ స్పష్టం చేశారు. ఈ నెల 1 నుంచి ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, డిమాండ్లు నెరవేర్చేవరకు ఉద్యమం ఆగదన్నారు. నీటి పారుదలశాఖ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గూడ రాఘవరెడ్డి ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమం నగరంలో జరగగా జగదీశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగులకు న్యాయపరంగా రావాల్సిన ఐదు డీఏలు, పెండింగ్ బిల్లులు, కాంట్రిబ్యూషన్తో కూడిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీం, పీఆర్సీ అమలు చేయాలని అన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే కార్యాచరణ తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్రెడ్డి, కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, ప్రదీప్, పౌలు కిషన్, ఒంటెల రవీందర్రెడ్డి, ఒంటెల ప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛతలో వెలిచాల ఆదర్శంరామడుగు: రామడుగు మండలం వెలిచాల గ్రామం స్వచ్ఛతలో ఆదర్శంగా నిలుస్తోందని స్వచ్ఛభారత్ కేంద్ర డిప్యూటీ కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. వెలిచాల గ్రామంలో స్వచ్ఛత కార్యక్రమాలను బుధవారం కేంద్ర కమిటీ సభ్యులు పరిశీలించారు. పంచాయతీ పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు, తడిపొడి చెత్త ప్రదర్శన, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం, ఇంకుడు గుంతల నిర్వహణను పరిశీలించారు. కేంద్ర బృందం సభ్యులు నితిన్ వర్మ, జైపాల్దక్ష్, డీఆర్డీవో శ్రీధర్, మండల ప్రత్యేకాధికారి అనిల్ ప్రకాశ్, ఎంపీడీవో రాజేశ్వరీ, ఎంపీవో శ్రావణ్కుమార్, యూనిసెఫ్ సమన్వకర్త కిషన్స్వామి, రమేశ్ పాల్గొన్నారు. ఆర్టీసీ ఈడీగా బాధ్యతలు స్వీకరణవిద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పగిడిమర్రి సోలోమన్ బుధవారం కరీంనగర్ బస్స్టేషన్ ఆవరణలోని ఈడీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. బదిలీ అయిన కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రో షా ఖాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్ఎం బి.రాజు, డిప్యూటీ ఆర్ఎం(మెకానికల్) బీవీ.రావు, డిప్యూటీ ఆర్ఎం(ఆపరేషన్) ఎస్.భూపతిరెడ్డి, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ (కరీంనగర్ జోన్) విలాస్రెడ్డి, జోనల్ వర్క్స్ మేనేజర్ సుగుణాకర్, డిప్యూటీ చీఫ్ అకౌంట్స్ స్వప్న కుమారి పాల్గొన్నారు. హెచ్సీయూ భూములను కాపాడాలికరీంనగర్సిటీ: హెచ్సీయూ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని పేర్కొంటూ బుధవారం ఏబీపీవీ ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యూనివర్సిటీల భూములు కబ్జాకు గురవుతున్నాయని అన్నా రు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని 400ఎకరాలను ఆక్రమించి కార్పొరేటీకరణ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంచర్లు వేసి సొమ్ము చేసుకోవాలని చూస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై లాఠీచార్జ్ చేయించడం సిగ్గుమాలిన చర్య అన్నారు. విద్యార్థులపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని, లేకుంటే సెక్రటేరియట్ ముట్ట డిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర కార్యసమితి సభ్యులు కిరణ్మయి, జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు, యూనివర్సిటీ అధ్యక్షుడు బాలకృష్ణ, సాయి, అనూష, గౌరి, ప్రియ పాల్గొన్నారు. -
పరిశోధనలు రైతుకు చేరితేనే సార్థకత!
జగిత్యాలఅగ్రికల్చర్: వ్యవసాయ శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడి పరిశోధనలు చేసి.. అత్యుత్తమ విత్తనాలు తయారు చేసినప్పటికీ వాటి ఫలాలు వివిధ కారణాలతో రైతుల చెంతకు చేరడం లేదు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు సమన్వయంతో సాగులో సమస్యలను ఎప్పటికప్పుడు తీర్చాల్సి ఉన్నా.. ముందుకు కదలడం లేదు. ఈ నేపథ్యంలో సాగులో సమస్యలపై చర్చించేందుకు ఉత్తర తెలంగాణ జోనల్ స్థాయి శాస్త్రవేత్తల సదస్సు పొలాస పరిశోధన స్థానంలో గురువారం ప్రారంభం కానుంది. ఈ సదస్సు రెండురోజుల పాటు నిర్వహించనున్నారు. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, 10 జిల్లాల వ్యవసాయాధికారులు పాల్గొననున్నారు. మూడు ఉమ్మడి జిల్లాలకు కేంద్రం పొలాస జగిత్యాలలోని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం మూడు ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు కేంద్రం. ఈ కేంద్రం పరిధిలోనే ఆయా జిల్లాలోని వ్యవసాయ పరిశోధన స్థానాలు, డాట్ సెంటర్లు, కృషి విజ్ఞాన కేంద్రాలు పనిచేస్తాయి. వీటిల్లో దాదాపు 60 నుంచి 70 మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు పనిచేస్తుంటారు. పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో వరి, వేరుశనగ, నువ్వు పంటల సాగు విధానాలు, సాగు నీటి యాజమాన్యంపై పరిశోధనలు చేస్తుంటారు. కరీంనగర్ పరిశోధన స్థానంలో మొక్కజొన్న, పెద్దపల్లిలోని కూనారం పరిశోధన స్థానంలో వరి, మొక్కజొన్న పంటలు, ఆదిలాబాద్ పరిశోధన స్థానంలో పత్తి, జొన్న, వరి, సోయాచిక్కుడు, ముథోల్ పరిశోధన స్థానంలో వర్షాధార పత్తి, రుద్రూర్ పరిశోధన స్థానంలో చెరుకు, వరి పంటల సాగు విధానంపై పరిశోధనలు సాగుతుంటాయి. అయితే పరిశోధన ఫలాలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేసేందుకు శాస్త్రవేత్తలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ప్రతి సీజన్లో తమ పరిశోధన స్థానాల్లో సాగు చేసిన పంటలను తిలకించేలా ప్రదర్శన క్షేత్రాలు, సాగు సమస్యలు తెలుసుకునేలా కిసాన్ మేళాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ నిధుల కొరతతో ఎప్పుడో ఒకసారి మమ అన్పించేలా జరుగుతుంటాయి. సమన్వయం అంతంతే.. జిల్లాలోని ఆయా మండలాల్లో పనిచేసే వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తల మధ్య సమన్వయం లోపిస్తోంది. కనీసం ప్రతి పంటల సీజన్లో నెలకోమారు ఉండేలా సమావేశాలు కనిపించడం లేదు. రైతులకు సాగులో సమస్యలు, సందేహాలు వచ్చినప్పుడు ఎక్కడకు వెళ్లాలో తెలియడం లేదు. రైతులు కొత్త పంటలు సాగు చేద్దామనుకున్నా.. ఏ పంట విత్తనం ఎక్కడ దొరుకుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. క్షేత్రస్థాయిలో రైతులు పొలాలను సందర్శించేందుకు వెళ్లినప్పుడు వ్యవసాయాధికారులు అందుబాటులో ఉండటం లేదు. వ్యవసాయాధికారులు ఏదైనా సమస్యపై శాస్త్రవేత్తల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సకాలంలో క్షేత్ర సందర్శనకు రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రైతులు శాస్త్రవేత్తలు, అధికారుల చుట్టూ తిరగలేక ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫర్టిలైజర్ దుకాణాలను ఆశ్రయించి వారు ఇచ్చిన మందులు పిచికారీ చేస్తున్నారు. పొలాలకు చేరని పరిశోధనలు శాస్త్రవేత్తల పరిశోధనలు రైతుల చెంతకు చేరడం లేదు. శాస్త్రవేత్తలు శ్రమటోడ్చి రూపొందించిన విత్తనాలను రైతులు ఆదరిస్తుంటే.. కొన్ని రకాల విత్తనాల విషయమే రైతులకు తెలియని పరిస్థితి ఉంది. రైతులు ఏం కావాలనుకుంటున్నారు..? ఎలాంటి పరిశోధనలు చేస్తే రైతులకు ఉపయోగం ఉంటుందనే విషయాలపై ఆలోచించకుండా.. మూస ధోరణిలో ఉన్నతాధికారులు అదేశాల మేరకు పరిశోధనలు చేస్తున్నారు. రైతులు ప్రధానంగా కూలీలు, మార్కెటింగ్ సమస్యను ఎదుర్కొంటున్నారు, వాతావరణ మార్పులతో పంటల్లో తెగుళ్లు, పురుగుల విజృంభన ఎక్కువవుతుంది. ప్రతి సీజన్లో అధిక దిగుబడినిచ్చే విత్తనాల కోసం రైతులు వెతుకులాడుతున్నారు. ప్రైవేట్ విత్తన కంపెనీలు రక రకాల పేర్లతో విత్తనాలు తయారు చేసి రైతులకు విక్రయిస్తుంటే.. నిధుల కొరతతో అనుకున్న స్థాయిలో పరిశోధన స్థానాల్లో విత్తనోత్పత్తి జరగడం లేదు. రెండు రోజుల పాటు సాగు సమస్యలపై సదస్సు హాజరుకానున్న ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల శాస్త్రవేత్తలు రైతల కోసం పరిశోధనలు చేయాలి శాస్త్రవేత్తలు మూస ధోరణిలో కాకుండా రైతులకు అవసరమైన పరిశోధనలు చేసి అభిమానాన్ని చూరగొనాలి. వరి పంటకు ప్రత్యామ్నాయ పంటలు, కోతుల సమస్యపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. వాతావరణ మార్పులు రైతులకు పెద్ద సమస్యగా మారింది. వాటిపై పరిశోధనలు చేయాలి. – సత్యనారాయణరెడ్డి, జిల్లా ఉత్తమ రైతు, నాగారం, ధర్మపురి మండలం రైతుల ఆదాయం పెరిగేలా.. రైతుల ఆదాయం పెరిగేలా శాస్త్రవేత్తల పరిశోధనలు సాగాలి. సాగులోని సమస్యలను ఎప్పటికప్పుడు రైతులతో చర్చించాలి. సాగులో వస్తున్న సమస్యలు రైతులకు సవాల్ విసురుతున్నాయి. నామమాత్రంగా సమావేశాలు నిర్వహించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. – వెల్ముల రాంరెడ్డి, వ్యవసాయ వర్సిటీ సలహా మండలి మాజీ సభ్యుడు, పూడూరు -
‘లైడిటెక్టర్’ ద్వారా హత్య కేసు నిందితుల గుర్తింపు
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా బీర్పూర్ శివారులో పది నెలల క్రితం జరిగిన హత్య కేసులో లై డిటెక్టర్ టెస్టు ద్వారా నిందితులను గుర్తించినట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. బుధవారం జగిత్యాల రూ రల్ సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బీర్పూర్ శివారు రోళ్లవాగు వద్ద 2024 జూన్ 14న గుర్తు తెలియని వ్యక్తిని పెట్రోల్ పోసి, నిప్పటించి కాల్చివేశారు. అప్పటి బీ ర్పూర్ పంచాయతీ కార్యదర్శి బుర్రె చిన్ననర్సయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా హతుడు బీర్పూర్ మండలం నర్సింహులపల్లికి చెందిన అంకం లక్ష్మీనారా యణ(55)గా గుర్తించారు. ఆయన కుటుంబ స భ్యులకు సమాచారం ఇచ్చారు. హతుడి భార్య అంకం అరుణ, చిన్న కుమారుడు సాయికుమార్ వచ్చి ఆ శవం లక్ష్మీనారాయణది కాదని నిర్ధారించారు. దీ ంతో పోలీసులు సదరు వ్యక్తి ఎముక భాగాలను డీ ఎన్ఏ పరీక్షల నిమిత్తం ఎఫ్ఎస్ఎల్కు పంపారు. అ ందుకు చనిపోయిన వ్యక్తి లక్ష్మీనారాయణగా గుర్తించారు. ఈ విషయం అరుణ, సాయికుమార్కు తె లిపినా.. వారిలో కనీసం బాధ కూడా కనిపించలే దు. అతడికి కర్మకాండలు కూడా చేయలేదు. ఈ క్ర మంలో పోలీసులకు వారిపై మరింత అనుమానం పెరిగింది. వారి ప్రవర్తనపై ఆరా తీసి.. అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయినా వారు నేరా న్ని అంగీకరించలేదు. దీంతో వారికి హైదరాబాద్లోని ఎఫ్ఎస్ఎల్లో అందుబాటులో ఉన్న ఆధునా తన సాంకేతిక పరిజ్ఞానం పాలిగ్రాఫ్ (లైడిటెక్టర్) టె స్టుకు పంపించారు. అక్కడ లక్ష్మీనారాయణను హ త్య చేసింది వారేనని పోలీసులు నిర్ధారించారు. వి చారణలో భాగంగా లక్ష్మీనారాయణ రోజు మద్యం తాగుతూ.. ఏ పనిలేకుండా గొడవ చేస్తున్నాడనే ఉ ద్దేశంతో పెట్రోల్ పోసి నిప్పంటించి, కాల్చివేసినట్లు నిందితులు అంగీకరించారని డీఎస్పీ తెలిపారు. ఈ మేరకు అరుణ, సాయికుమార్ను బుధవారం అరె స్టు చేసి రిమాండ్కు తరలించామని పేర్కొన్నారు. సమావేశంలో రూరల్ సీఐ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఇద్దరు అరెస్టు వెల్లడించిన డీఎస్పీ రఘుచందర్ -
జాతీయ ఖోఖో పోటీలకు కోచ్లుగా ఉమ్మడి జిల్లావాసులు
కరీంనగర్స్పోర్ట్స్: ఒడిశా రాష్ట్రంలోని పూరిలో ఈనెల 4వ తేదీ వరకు జరుగనున్న 57వ సీనియర్స్ జాతీయ ఖోఖో పోటీల్లో పాల్గొనే తెలంగాణ జట్లకు ఉమ్మడి జిల్లాకు చెందిన పండుగ ఆనంద్ కుమార్, ఇస్లావత్ నరేష్ కోచ్లుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర పురుషుల జట్టుకు ఇల్లంతకుంటకు చెందిన రైల్వే క్రీడాకారుడు పూర్వ భారత జట్టు కెప్టెన్ పండుగ ఆనంద్, జాతీయ పోటీల్లో పాల్గొంటున్న భారత పురుషుల రైల్వే జట్టుకు ధర్మారం మండలం బంజరుపల్లి తండాకు చెందిన దక్షిణ మధ్య రైల్వే క్రీడాకారుడు ఇస్లావత్ నరేశ్ కోచ్గా వ్యవహరిస్తున్నారని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై.మహేందర్ రావు తెలిపారు. వీరిని సంఘ బాధ్యులు చిట్టి తిరుపతిరెడ్డి, కుమారస్వామి, ఏ.రవీందర్, లక్ష్మణ్, ఎస్కే మోహినుద్దీన్, సీఐ కుమారస్వామి, ఎస్సై రమేశ్, బి.శేఖర్, నవీన్, ఆర్.తిరుపతిరెడ్డి అభినందించారు.కారు ఢీకొని విద్యార్థులకు గాయాలుధర్మపురి: కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్న ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ధర్మపురికి చెందిన సంతోష్ బుధవారం సాయంత్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. అదే సమయంలో మైదానంలో మహాత్మ జ్యోతిబాపూలే డిగ్రీ కళావాల విద్యార్థులు కూర్మాదాస్, వినయ్ వాకింగ్ చేస్తున్నారు. కారు అదుపు తప్పి వీరిని ఢీకొట్టింది. ప్రహరీ, కారు మధ్యలో విద్యార్థులు ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను 108 అంబులెన్సులో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
రైతుల చూపు.. ఆధునికం వైపు..
జగిత్యాలఅగ్రికల్చర్: వ్యవసాయ రంగం రోజురోజుకూ శాస్త్ర, సాంకేతికతను సంతరించుకుంటూ ముందుకెళ్తోంది. ఒకప్పటి నాగళ్లు, కొడవళ్లు మూలకు పడ్డాయి. వాటి స్థానంలో ట్రాక్టర్లు, డ్రోన్లు వంటి ఆధునిక యంత్రాలు వచ్చాయి. ట్రాక్టర్లతోపాటు వాటికి ఉపయోగించే పరికరాల ధరలు ఆకాశానికి ఎగబాకాయి. దీంతో సామాన్య రైతులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఆధునిక యంత్రాలపై ఆధారం మనిషి శ్రమ లేకుండా.. తేలికగా యంత్రాలతో వ్యవసాయ పనులు చేయాలని రైతులు ఆలోచిస్తున్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగా ఆధునాతన యంత్రాలు కూడా రూపుదిద్దుకుంటున్నాయి. ఒకప్పుడు గ్రామానికి రెండుమూడు ట్రాక్టర్లు ఉంటే గొప్ప. అలాంటిది ఒక్కో గ్రామంలో పదుల సంఖ్యలో ట్రాక్టర్లు వచ్చాయి. రైతులకు బ్యాంకులు ఈఎంఐ పద్ధతిలో రుణ సహాయం చేస్తుండటంతో ట్రాక్టర్లు కొనుగోలు చేస్తున్నా వాటికి బిగించే పరికరాలకు మాత్రం రుణ సహాయం అందించడం లేదు. ఫలితంగా చిన్న, సన్నకారు రైతులు యంత్ర పరికరాల కోసం ప్రభుత్వ సబ్సిడీ కోసం ఎదురు చూస్తున్నారు. వ్యవసాయానికి వినియోగించే ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, సీడ్ ప్లాంటేషన్, రోటోవేటర్, గడ్డిని కట్టలుకట్టే మిషన్లు, కేజీవీల్స్ వంటి పరికరాలను సబ్సిడిపై అందించాలని రైతులు కోరుతున్నారు. స్మామ్ పథకం రైతులకు వరం ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద వ్యవసాయ యాంత్రీకరణ పథకం(స్మామ్) ద్వారా ఉమ్మడి జిల్లాకు రూ 2.61కోట్లు కేటాయించింది. వీటి ద్వారా సన్న, చిన్న కారు రైతులతోపాటు మహిళా రైతులకు బ్యాటరీ స్ప్రేయర్స్, పవర్ స్ప్రేయర్స్, రసాయన మందులు పిచికారీ చేసే డ్రోన్లు, రోటోవేటర్లు, ఎరువులు, విత్తనాలు ఒకేసారి వేసే సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్, కల్టివేటర్లు, బండ్ ఫార్మర్ (పొలం మధ్య గట్లను పోసే యంత్రం), పవర్ వీడర్, బ్రష్ కట్టర్, పవర్ టిల్లర్లు, స్ట్రాబాలర్స్ను అందించాలని నిర్ణయించారు. సన్న, చిన్నకారు రైతులకు 40శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. ఇందుకోసం మండల వ్యవసాయాధికారి కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తులను మండల పరిధిలోని తహసీల్దార్, ఎంపీడీఓ, వ్యవసాయాధికారి పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. రాయితీపై ఇచ్చే పరికరాలు రాయితీపై ఇచ్చే పరికరాలు తక్కువగా ఉండటం, దరఖాస్తులు ఎక్కువగా వ స్తుండటంతో అధికారులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. బ్యాటరీ స్ప్రేయర్స్ కరీంనగర్కు 94, జగిత్యాలకు 101, రాజన్న సిరిసిల్లకు 64, పెద్దపల్లికి 75, పవర్ స్ప్రేయర్స్ కరీంనగర్కు 94, జగిత్యాలకు 102, రాజన్న సిరిసిల్లకు 64, పెద్దపల్లికి 76, రోటోవేటర్లు కరీంనగర్కు 55, జగిత్యాలకు 51, రాజన్న సిరిసిల్లకు 24, పెద్దపల్లికి 35, కల్టివేటర్లు కరీంనగర్కు 63, జగిత్యాలకు 67, రాజన్న సిరిసిల్లకు 29, పెద్దపల్లికి 34 మంజూరయ్యాయి. ప్రతి జిల్లాకు ఒక్కటి చొప్పున డ్రోన్, మూడు చొప్పున ట్రాక్టర్లు మంజూరయ్యాయి. ఇంకా సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ కరీంనగర్కు 9, జగిత్యాలకు 12, సిరిసిల్లకు 4, పెద్దపల్లికి 6 మంజూరయ్యాయి. ఉమ్మడి జిల్లాకు బండ్ ఫార్మర్ 10, పవర్ వీడర్ 7, బ్రష్ కట్టర్ 17, పవర్ టిల్లర్ 10, స్ట్రాబాలర్స్ 9 మంజూరు కాగా ఆయా జిల్లాలకు 2,3 చొప్పున ఇవ్వనున్నారు. పరికరాలకు అందని సబ్సిడీ రాయితీ ఉంటే మరింత మందికి చేరువ ఇటీవల కేంద్రం నుంచి ఉమ్మడి జిల్లాకు రూ.2.61 కోట్లు 50 శాతం సబ్సిడీ ఇచ్చే పరికరాలు యంత్రం ధర ట్రాక్టర్ రూ.4లక్షల నుంచి రూ.13లక్షలు డ్రోన్ రూ.10లక్షలు రోటోవేటర్ రూ.90వేల నుంచి రూ.1.90లక్షలు ఎంబీ ఫ్లవ్ రూ.50వేల నుంచి రూ.1.40లక్షలు కల్టీవేటర్ రూ.36వేల నుంచి రూ.50 వేలు డిస్క్ కల్టీవేటర్ రూ.40వేల నుంచి రూ.50 వేలు బండ్ ఫార్మర్ రూ.40వేల నుంచి రూ.3.50లక్షలు రోటో ఫడ్లర్ రూ.26వేల నుంచి రూ.1.60లక్షలు పవర్ టిల్లర్ రూ.2లక్షల నుంచి రూ.2.40లక్షలు సీడ్కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ రూ.46వేల నుంచి రూ.60లక్షలు పవర్ స్ప్రేయర్ రూ.20వేలు పవర్ వీడర్ రూ.60లక్షల నుంచి రూ.80లక్షలు బ్రష్కట్టర్ రూ.40వేల నుంచి రూ.88వేలు స్ట్రాబేలర్స్ రూ.4లక్షల నుంచి రూ.4.40 లక్షలు మేజ్ షెల్లర్స్ రూ.66లక్షల నుంచి రూ.2.20లక్షలు (ట్రాక్టర్లు, డ్రోన్లు పొందాలంటే తప్పనిసరిగా 2.5 ఎకరాల భూమి ఉండాలి)ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం కొన్నేళ్లుగా సబ్సిడీపై యంత్ర పరికరాలు సరఫరా చేయలేదు. ఇప్పుడు దరఖాస్తు చేసుకుందామంటే జిల్లాకు ఒక్కటి రెండు పరికరాలు మాత్రమే ఉన్నాయి. మండలానికి ఒక్క పరికరం కూడా వచ్చేలా లేదు. రైతులకు అవసరమైన పరికరాలకు సబ్సిడీ వర్తింజేయాలి. – చీటేటి జీవన్రెడ్డి, తొంబర్రావుపేట, మేడిపల్లి మండలం దరఖాస్తులు స్వీకరిస్తున్నాం యంత్ర పరికరాల స్కీం కింద దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ప్రతి మండలానికి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. జిల్లా, మండల లెవల్ కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యంత్రం ధరలో 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. – భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి, జగిత్యాల -
ఉత్సాహంగా ‘అల్ఫోర్స్ ప్రథమోత్సవ్’
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్లోని అల్ఫోర్స్ బాలికల ఇ టెక్నో స్కూల్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. స్థానిక ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బుధవారం ‘అల్ఫోర్స్ ప్రథమోత్సవ్’ పేరిట నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలను అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డా.వి.నరేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వార్షిక ప్రణాళికలో భాగంగా నిర్వహించిన వివిధ పోటీ పరీక్షలు, ప్రతిభా పాటవ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
పంచ్ కొడితే పతకమే
● అంతర్జాతీయ కరాటే పోటీల్లో గ్రామీణ విద్యార్థిని ప్రతిభ ● మలేషియా ఇంటర్నేషియల్ పోటీలకు హాసిని ఎంపిక ● వరల్డ్ చాంపియన్లో దేశానికి మెడల్ తేవడమే లక్ష్యం ముత్తారం(మంథని): ఆమె గ్రామీణ విద్యార్థిని.. ఆర్థిక స మస్యలున్నా కరాటే పోటీల్లో పంచ్ కొడితే పతకం సాధించాలనే తపనతో ప్రతిభకు ప దును పెడుతోంది. ఇటీవల జ రిగిన జాతీయస్థాయి పోటీల్లో ప్ర తిభ చూపి మే నెలలో మలేషియాలో దేశంలో జరిగే ఇంటర్నేషనల్ కరాటే పోటీలకు ఎంపికై ంది మెట్టు హాసిని. పోటీ పడుతే పతకమే.. మంథనికి చెందిన మెట్టు దేవి – నర్సింగం దంపతులకు ఇద్దరు కూతుర్లు. పెద్ద కుతూరు మానసకు వివాహం అయ్యింది. చిన్నకుతూరు హాసిని మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు మంథని బాలికల హైస్కూల్లో చదివింది. ముత్తా రం మండలం ధర్య పూర్ మోడల్ స్కూల్లో ఇంటటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రా సింది. నాలుగో తరగతిలోనే సీనియర్ల ను చూసి కరాటే నే ర్చుకోవడమే కాదు.. అందులో రాణించాలని కంకణం కట్టుకుంది. ఇలా ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతూనే కరాటేలో శిక్షణ తీసుకుంది. అదేసమయంలో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణించింది. పోటీపడితే వెండి పతకాలతోపాటు ఇప్పటివరకు 15 బంగారు పతకాలు సాధించింది. 2024లో హరియాణాలోని పంచకుల, మధ్యప్రదేశ్లోని గాలియానాలో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో బ్లాక్బెల్ట్లో గోల్డ్మెడల్ సాధించి ఔరా అనిపించింది. గతేడాది 2024 నవంబరులో కరీంనగర్లో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే పోటీల్లో బ్లాక్బెల్ట్లో ఫస్ట్డాన్గా గోల్డ్ మెడల్ కై వసం చేసుకుంది. ఈఏడాది మే 7 నుంచి 12వతేదీ వరకు మలేషియాలో జరిగే అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభ చూపే అవకాశం దక్కించుకుంది. అమ్మ ప్రోత్సాహం.. మాస్టర్ కృషి మా నాన్న మా కుటుంబానికి దూరంగా ఉంటున్నా.. మా అమ్మ కూలీ పనిచేస్తూ అక్క పెళ్లి చేసి, నన్ను చదివిస్తోంది. ఆడపిల్లకు కరాటే పోటీలు అవసరమా అని బంధువులు, ఇరుగుపొరుగువారు సూటిపోటీ మాటలతో ప్రశ్నించేవారు. ఇది మనోవేదనకు దారితీసినా.. కరాటే మాస్టర్ సమ్మయ్య నచ్చజెప్పి మళ్లీ శిక్షణ ఇచ్చారు. ఆడవాళ్లు అంటే కుటుంబానికే పరిమితం కాదనే పట్టుదలతో కరాటేలో రాణిస్తున్నా. మలేషియాలో జరిగే పోటీల్లో మెడల్ సాధించడమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నా. నా ప్రతిభ నాలాంటి ఆడపిల్లల కుటుంబాలకు ఆదర్శంగా నిలవాలి. -
చిన్నారి మృతదేహానికి పంచనామా
వేములవాడరూరల్: బాలుడు మృతికి వైద్యులే కారణమంటూ తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీస్శాఖ, వైద్యశాఖ అధికారుల, మండల మేజిస్ట్రేట్ అబుబాకర్ సమక్షంలో బుధవారం బాలుడికి పంచనామా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వేములవాడ రూరల్ మండలం ఫాజుల్నగర్కు చెందిన దండి రాజశేఖర్ – గీతాంజలికి గతనెల 18న కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కొడుకు పుట్టాడు. శిశువు ఆరోగ్యం నిలకడగా లేకపోవడంతో వెంటనే మరో ఆస్పత్రికి, అక్కడినుంచి హైదరాబాద్లోని నిలోఫర్ దవాఖానకు తరలించగా శిశువు మృతిచెందాడు. దీంతో ఖననం చేసిన కుటుంబ సభ్యులు గతనెల 29న చిన్నారి మృతికి ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులే కారణమంటూ కరీంనగర్ రెండో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై బుధవారం కరీంనగర్ పోలీసులు చంద్రశేఖర్, దీపక్కుమార్, వైద్యులు ప్రణతిరెడ్డి వేములవాడ రూరల్ మేజిస్ట్రేట్ అబుబాకర్ సమక్షంలో ఖననం చేసిన చిన్నారికి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంకరీంనగర్: ఇండియన్ ఆర్మీలో నియామకం కోసం ఔత్సాహిక అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధికల్పన అధికారి తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియన్ ఆర్మీలో వివిధ కేటగిరీల వారీగా అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ (క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్), ట్రేడ్స్మెన్కు పదో తరగతి పాస్, అగ్నివీర్ ట్రేడ్స్మెన్ (8వ తరగతి పాస్) ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు. అభ్యర్థులు వారి అర్హత ఆధారంగా ఏవైనా రెండింటికీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు ఈనెల 10 వరకు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. సలహాలు సూచనలకు సికింద్రాబాద్లోని రిక్రూటింగ్ కార్యాలయం 040–27740205 నంబర్లో సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు. తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం మెట్పల్లి: పట్టణంలోని సాయిరాంకాలనీలో శ్యామల అనే మహిళ ఇంట్లో దొంగతనం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..హెల్త్ డిపార్ట్మెంట్లో పని చేసే శ్యామల బుధవారం ఉదయం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లింది. సాయంత్రం రాగా తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా.. బీరువాలో ఉంచిన 13తులాల బంగారు ఆభరణాలు, 20తులాల వెండి ఆభరణాలు కనిపించలేదు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. డీఎస్పీ రాములు, సీఐ అనిల్కుమార్, ఎస్సై కిరణ్కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీంతో వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. చికిత్స పొందుతూ యువరైతు మృతిఇల్లందకుంట: పంటనష్టంతో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన యువరైతు చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. ఈ ఘటన ఇల్లందకుంట మండల పరిధిలోని సిరిసేడులో చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వంగ మధు(28) తల్లిదండ్రులు గతంలోనే చనిపోయారు. సోదరుడు హైదరాబాద్లో ఉంటున్నాడు. మధు గ్రామంలో మూడెకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని ఆడమగ వరి, మొక్కజొన్న సాగు చేశాడు. పంటనష్టం రావడంతో పాటు పెట్టుబడికి అప్పులు చేశాడు. వాటిని తీర్చే మార్గం లేదని భావనతో గతనెల 30న పంటచేను సమీపంలో పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
బల్దియా కలెక్షన్ రూ.42 కోట్లు
● గతేడాది కంటే రూ.10 కోట్లు అదనం ● పర్సంటేజీతో పోలిస్తే 11 శాతం తక్కువకరీంనగర్కార్పొరేషన్: నగరపాలకసంస్థ 2024–25 ఆర్థిక సంవత్సరం రూ.41.96 కోట్లు ఆస్తి పన్ను వసూళ్లు చేసింది. ఇది గత సంవత్సరంతో పోల్చితే రూ.10 కోట్లు అదనం కాగా, డిమాండ్ పెరగడంతో గతేడాది పర్సంటేజీతో పోలిస్తే 11 శాతం వెనుకబడింది. ఆస్తి పన్ను వసూళ్లపై ఆధారపడి విడుదలయ్యే 15వ ఆర్థిక సంఘం నిధులకు బల్దియా అర్హత సాధించింది. లక్ష్యం రూ.52.45 కోట్లు నగరపాలకసంస్థ ఈ ఆర్థిక సంవత్సరం రూ.52 కోట్ల 45 లక్షల ఆస్తి పన్ను వసూళ్లు లక్ష్యంగా పెట్టుకుంది. గత సంవత్సరం డిమాండ్ రూ.31.78 కోట్లు కాగా, ఈ ఏడాది నగరంలో కొత్తపల్లి మున్సిపాల్టీతో పాటు, ఐదు గ్రామపంచాయతీలు విలీనంతో బల్దియా విస్తరించి డిమాండ్ కూడా భారీగా పెరిగింది. దీంతో 66 డివిజన్లతో కూడిన నగరపాలకసంస్థ ఆస్తి పన్ను వసూళ్ల డిమాండ్ రూ.52.45 కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది మార్చి 31 అర్ధరాత్రి వరకు రూ.41.96 కోట్లు వసూలు చేశారు. పర్సంటేజీ పరంగా గతేడాదితో పోలిస్తే ఇది 11 శాతం తక్కువ కాగా, వసూళ్ల పరంగా రూ.10 కోట్లు అదనం. చివర్లో హడావుడి ఆస్తి పన్ను వసూళ్లలో నగరపాలక అధికారులు ముందునుంచి ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తే కలెక్షన్ మరింతగా పెరిగే అవకాశం ఉండేది. ఆర్థిక సంవత్సరం ముగిసే పదిరోజుల ముందు నుంచి నగరంలో వసూళ్లను సీరియస్గా తీసుకున్నారు. మొండి బకాయిదారుల ఇళ్లు, సంస్థలకు వెళ్లి రెడ్నోటీసు ఇచ్చి, నల్లా కనెక్షన్లు కట్చేసి, ఆస్తులు సీజ్ చేశారు. అలాగే ప్రభుత్వ సంస్థల నుంచి కోట్ల రూపాయలు బకాయిలు ఉండడంతో, వాటిపైనా దృష్టి సారించి ఆస్తులు సీజ్ చేశారు. దీంతో చివరి వారంరోజులు కలెక్షన్ అనూహ్యంగా పెరిగింది. మార్చి 31 ఒక్కరోజే అర్ధరాత్రి వరకు సుమారు రూ.4 కోట్లు వసూలు కావడం ఇందుకు నిదర్శనం. అయితే ఇదే దూకుడును మార్చి మొదటి నుంచే కొనసాగిస్తే, కలెక్షన్ 90 శాతం దాటిపోయేది. అయితే అదనంగా వచ్చిపడిన వివిధ రకాల సర్వేలు కలెక్షన్లపై ప్రభావం చూపినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా 80.1 శాతం కలెక్షన్ సాధించడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు నగరపాలకసంస్థకు రావడానికి మార్గం సుగమమైంది.2023–24 ఆర్థిక సంవత్సరం డిమాండ్ కలెక్షన్ బ్యాలెన్స్ శాతం రూ.34.83 కోట్లు రూ.31.78 కోట్లు రూ.3.05 కోట్లు 91.242024–25 ఆర్థిక సంవత్సరం డిమాండ్ కలెక్షన్ బ్యాలెన్స్ శాతం రూ.52.45 కోట్లు రూ.41.96 కోట్లు రూ.10.49 కోట్లు 80.1 -
బ్యాడ్మింటన్ సమ్మర్ క్యాంప్ ప్రారంభం
కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలోని ఇండోర్ హాల్లో ముందస్తుగా బ్యాడ్మింటన్ సమ్మర్ క్యాంప్ను ప్రారంభించినట్లు మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీ అధ్యక్షుడు గుంటపల్లి స్వామి తెలిపారు. మంగళవారం క్యాంపునకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఇండోర్ స్టేడియంలో ఆధునిక వసతులు, నిష్ణాతులైన శిక్షకులతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఫీజులో 50 శాతం, ప్రైవేట్ పాఠశాలలవారికి 20 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు వివరించారు. శిక్షణ కాలం 3 నెలల పాటు ఉంటుందని అనంతరం, పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. అలాగే గృహిణులకు 30 శాతం, సీనియర్ సిటిజన్లకు 40 శాతం ఫీజులో రాయితీ ఇస్తున్నట్లు వివరించారు. ఉదయ 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫ్లడ్ లైట్ల వెలుతురలో కూడా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు 92469 66660, 83090 09610 నంబర్లను సంప్రదించాలన్నారు. సమావేశంలో కళ్ళేపెల్లి మహేశ్, రొండి బాబు, కోచ్లు రవి, లక్ష్మణ్రావు, గంగరాజు, నిరోషా తదితరులు పాల్గొన్నారు. -
ధనికులు తినే సన్నబియ్యం పేదలకిస్తున్నాం
కరీంనగర్కార్పొరేషన్: ధనికులు తినే సన్నబియ్యాన్ని తమ ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రేషన్పై సన్నబియ్యం పథకాన్ని మంగళవారం నగరంలోని హౌసింగ్బోర్డుకాలనీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జిల్లాలోని 566 రేషన్ షాప్ల ద్వారా 2,76,930 రేషన్కార్డులపై 8 లక్షల 10 వేల మందికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే అర్హులకు రేషన్కార్డులు ఇస్తామని పేర్కొన్నారు. తాగునీటికి ఢోకా లేదు కరీంనగర్లో తాగునీటికి ఎలాంటి ఢోకా లేదని మంత్రి స్పష్టం చేశారు. కొంతమంది అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. తాగునీటి అవసరాల కోసం జూలై 31 వరకు ఎల్ఎండీలో 6.90 టీఎంసీలు అవసరం ఉంటాయన్నారు. మిడ్మానేరు నుంచి ఎల్ఎండీకి 3 టీఎంసీలు వదలడం జరుగుతుందని, దీంతో ఎల్ఎండీలో 8.70 టీఎంసీల నీళ్లు ఉంటాయన్నారు. సాగుఅవసరాలకు ఈ నెల 6 వరకు 2,500 క్యూసెక్కుల నీళ్లు ఆయకట్టుకు వదులుతారని, దీంతో ఎల్ఎండీలో 6.900 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంటాయని, తాగునీటికి ఎలాంటి సమస్య ఉండదని వివరించారు. అలాగే స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని కేంద్రం ఆమోదించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం బలహీనవర్గాలకు న్యాయం చేయాలని బుధవారం బీసీ సంఘాలు ధర్నా చేపడతాయని పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి తనతోపాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, మంత్రి కొండా సురేఖ తదితరులు ధర్నాలో పాల్గొంటారని తెలిపారు. బీజేపీలోని బీసీ నాయకులు బండి సంజయ్, ఈటల రాజేందర్, లక్ష్మణ్ను కూడా కలిసి సహకరించాలని అడుగుతామన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవో మహేశ్వర్, డీఎస్వో నర్సింగరావు, సివిల్సప్లై డీఎం రజనీకాంత్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ విలాస్రెడ్డి, నాయకులు ప్రకాశ్, నేతికుంట యాదయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.● రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ -
లా కాలేజీ మంజూరు చేయండి
● కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్కు బండి సంజయ్ వినతి కరీంనగర్టౌన్/కరీంనగర్సిటీ: కరీంనగర్లోని శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో లా కాలేజీకి (న్యాయ కళాశాల) అనుమతి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మంగళవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ను కోరారు. శాతవాహన వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఉమేశ్కుమార్, రిజిస్ట్రార్ రవికుమార్, మాజీ మేయర్ యాదగిరి సునీల్రావుతో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు. శాతవా హన పరిధిలో వచ్చే విద్యా సంవత్సరానికిగా ను 120 మందితో (రెండు సెక్షన్లతో కలి పి)లా కాలేజీని నడిపేందుకు అనుమతి ఇ వ్వాలని ప్రభుత్వానికి గతంలో విజ్ఞప్తి చేసిన ట్లు తెలిపారు. బండి వినతికి సానుకూలంగా స్పందించిన అర్జున్ మేఘ్వాల్ సాధ్యమైనంత తొందర్లో లా కాలేజీకి అనుమతి ఇస్తామని హామీ ఇచ్చారు. కాగా, రాబోయే విద్యా సంవత్సరం (2025–26) నుంచే కాలేజీ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అ ధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారు. అ లాగే ఖేలో ఇండియా పథకంలో భాగంగా క రీంనగర్లోని శాతవాహన వర్సిటీ, అంబేద్కర్ స్టేడియంలో క్రీడా సదుపాయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర కార్మిక, ఉపాధి, క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి మన్సూక్ మాండవీయకు కేంద్ర మంత్రి సంజయ్, వీసీ ఉమేశ్కుమార్ వినతిపత్రం అందజేశారు. వర్సిటీకి ఖేలో ఇండియా పథకం కింద మంజూరు చేసిన నిధులు త్వరగా అందించాలని కోరారు. రాములోరి తలంబ్రాలకు బుకింగ్ల వెల్లువ విద్యానగర్(కరీంనగర్): శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే రాములోరి క ల్యాణ తలంబ్రాలను భక్తులకు అందించడానికి ఆర్టీసీ కరీంనగర్ లాజిస్టిక్స్ సెంటర్ ఏ ర్పాటు చేసింది. ఈ తలంబ్రాల కోసం భక్తు లు అధిక సంఖ్యలో బుక్ చేసుకుంటున్నట్లు కరీంనగర్ రీజియన్ లాజిస్టిక్స్ ఏటీఎం రా మారావు తెలిపారు. తలంబ్రాలు కావాల్సిన భక్తులు ఒక ప్యాకెట్కు రూ.151 ఆన్లైన్ లేదా కార్గో సెంటర్లు, ఏజెంట్ కౌంటర్ల వద్ద బుక్ చేసుకోవచ్చని సూచించారు. -
జలం.. మేల్కొంటేనే పదిలం
నీటిని పొదుపు చేద్దాం ● భూగర్భజలాలను కాపాడుకుందాం ● రోజువారీ అవసరాలు, సాగుకు నీటి వినియోగం ఎక్కువే ● వృథా చేయకుండా వినియోగిస్తేనే మేలు ● జలవనరుల సంరక్షణతోనే మనుగడకరీంనగర్అర్బన్: ప్రపంచమంతా జలవనరుల సంరక్షణ, నీటి కాలుష్యంపై దృష్టి కేంద్రీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీరు లేకుంటే ప్రపంచం లేదు.. జీవరాశుల ఉనికే లేదు. ప్రకృతి ప్రసాదించిన నీటి లభ్యతను బట్టే జనావాసాలు, గ్రామాలు ఏర్పడ్డాయి. నీరు లభ్యం కాని ప్రాంతాలు ఎడారులుగా, బీడు భూములుగా మిగిలిపోయాయి. ఈనేపథ్యంలో విచ్చలవిడిగా చెట్లను నరికేయడం, ప్లాస్టిక్ వినియోగం భూగర్భ జలాల ఉనికికే ప్రమాదంగా మారింది. తాగునీటికి అల్లాడే పరిస్థితి రాబోతోంది. భూగర్భజలాలు రోజురోజుకు పడిపోతుండటంతో నీటి ఎద్దడి తీవ్రమవుతోంది. ఈ క్రమంలో నీటిని పొదుపుగా వాడుతూ.. జల సంరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం అత్యవసరం. ఎండిపోయిన బోరుబావుల రీచార్జి ఇలా.. నగరంలోని చాలా అపార్ట్మెంట్లు, ఇళ్లలోని బోర్లు మార్చిలో వట్టిపోతాయి. ఎండిపోయిన బోర్లలో మళ్లీ సమృద్ధిగా నీరు రావాలంటే ఇంజక్షన్ బోర్వెల్ విధానం మేలని అంటున్నారు నిపుణులు. బోరుబావి కేంద్రంగా తీసుకొని 6 X6 X6 అడుగుల కొలతల ప్రకారం గుంత తీయాలి. గుంత కింద నుంచి పీవీసీ పైపు చుట్టూ ప్రతి 3 అంగుళాలకు ఒకటి చొప్పున 12ఎంఎం రంధ్రాలను 3 అడుగుల వరకు చేయాలి. ఆ రంధ్రాలు ఉన్న చోట పైపు చుట్టూ స్టీల్ జాలీ చుట్టాలి. పై ప్రాంతాన్ని పూర్తిగా అరచేయి సైజు గల దొడ్డు కంకర (60ఎంఎం లేదా 40ఎంఎం)తో నింపాలి. ఇలా నిర్మించిన ఇంకుడుగుంత ఎంత పెద్ద వర్షం కురిసినా ఆ నీరు పైపు చుట్టూ ఉన్న రంధ్రాల ద్వారా లోపలికి వెళ్తోంది. వర్షం కురిసిన తర్వాత గుంత పైభాగంలో ఒండ్రు మట్టి చేరితే దొడ్డు ఇసుకను నీటితో కడిగి మళ్లీ వాడాలి. ఇవిగో పథకాలు ప్రభుత్వం పలు పథకాల ద్వారా నీటిని పొదుపుగా వాడుకునేందుకు రాయితీలు ప్రకటించింది. వాటర్షెడ్, నాబార్డు ద్వారా రుణాలు, సూక్ష్మనీటి సేద్యం ద్వారా 90, వంద శాతం రాయితీతో బిందు, తుంపర పరికరాలు అందిస్తున్నారు. అలాగే సుస్థిర వ్యవసాయం ద్వారా బీడు భూముల్లో సాగునీరు అందించేందుకు ఫాంపాండ్లు, నీటి నిల్వ గుంతలు నిర్మిస్తున్నారు. దీంతో పాటు డీఆర్డీఏ ద్వారా నీటి ట్యాంకులు, పశువుల నీటితొట్టి, చేపల చెరువులు, పండ్ల తోటల పెంపకానికి నీటి నిల్వ కేంద్రాలను 50శాతానికి పైగా రాయితీతో నిర్మిస్తున్నారు. అలాగే బావుల్లో పూడిక తీత, నూర్పిడి కల్లాలు నిర్మిస్తున్నారు. బిందు, తుంపర సేద్యమే మేలు పంట పండాలంటే నీరు ఎంతో అవసరం. అయితే ఏ పంటకు ఎంత నీరు అవసరమవుతుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఒక్క వ్యవసాయ రంగాన్నే ప రిగణనలోకి తీసుకుంటే జిల్లాలోని జల వనరుల్లోంచి 70శాతం నీటిని ఉపయోగించుకుంటున్నాం. నీ టి వృథా కూడా వ్యవసాయంలోనే ఎక్కువని సర్వేలు వెల్లడిస్తున్నాయి. రైతులు వినియోగించుకునే ప్ర తి 5గ్యాలన్ల నీటిలో కేవలం 2 గ్యాలన్ల నీరు మా త్రం సద్వినియోగం అవుతున్నట్లు లెక్కకట్టారు. దీ ని ప్రకారం 60శాతం, కాలువ కింద భూముల్లో 45–55, బావుల కింద పొలాల్లో 15–25 శాతం నీ రు వృథా చేస్తున్నారు. వర్షపు నీటిలో 30శాతం మా త్రమే భూగర్భంలోకి, మిగిలినదంతా వృథాగా వె ళ్లి పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో బిందు, తుంపర సేద్యం ఎంతో ఉపయుక్తం. సాగునీటిని పొదుపుగా వాడుకోవడంతో విస్తీర్ణం కూ డా పెంచుకోవచ్చు. వాస్తవానికి ఎకరం వరి పండించే నీటితో నాలుగెకరాల పత్తిని సాగు చేసుకోవచ్చు.ఒక మనిషికి ఎన్ని నీళ్లు అవసరం (రోజుకు)తాగునీరు: 5 లీటర్లు వంటకు: 10 లీటర్లు కాలకృత్యాలకు: 25 లీటర్లు స్నానం చేసేందుకు: 30 లీటర్లు బట్టలు ఉతికేందుకు: 20 లీటర్లు ఇతర అవసరాలకు: 10 లీటర్లుగణాంకాల్లో నీటి వినియోగమిలా.. జిల్లా జనాభా: 10,05,711నివాసాలు: 2,58,485కుటుంబాలు: 2,90,657రోజుకు నీటి అవసరం(అంచనా): 8.05కోట్ల లీటర్లుసాగు రంగానికి వినియోగమిలా.. మొత్తం సాగుభూమి: 3,36,075 ఎకరాలు వరి సాగు: 2,75,300 ఎకరాలు ఎకరం వరికి పంట మొత్తానికి వాడుతున్న నీరు(అంచనా): 48 లక్షల లీటర్లు పత్తి ఎకరానికి వాడుతున్న నీరు: 24 లక్షల లీటర్లు మొక్కజొన్నకు ఎకరాకు : 20 లక్షల లీటర్లు మిరప: 32 లక్షల లీటర్లు పుచ్చ,కర్బూజ, దోస: 16 లక్షల లీటర్లువృథాకు ఇలా అడ్డుకట్ట పట్టణాలు, గ్రామాల్లో ఒక్కో కుటుంబం నిత్యం అన్ని అవసరాల్లో సుమారు 50లీటర్ల నీటిని వృథా చేస్తోందని అంచనా. జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ వినియోగాన్ని గణనీయంగా తగ్గించొచ్చు. వంట సమయంలో బియ్యం కడిగేటప్పుడు నీటిని వృథాగా పారబోస్తాం. ఆ నీటిని మొక్కలకు పోయడంతో ఆదా చేసినట్లవుతుంది. వంట చేసే సమయంలో చాలా మంది ట్యాప్ను ఆన్చేసి వదిలేస్తుంటారు. పాత్రల్ని కడిగే సమయంలోనూ ఇదే పరిస్థితి. మొత్తం పాత్రల్ని శుభ్రం చేసిన తర్వాత సన్నని ధారపెట్టి కడగాలి. స్నానానికి వినియోగించే బకెట్ నీటి సామర్థ్యం 15 నుంచి 20లీటర్లు. చాలామంది ట్యాప్ వదిలేసి స్నానం చేస్తుంటారు. దీంతో ఒక్కొక్కరు రెండుమూడు బకెట్ల నీటిని వినియోగించినట్లే.. ఒక్క బకెట్తో స్నానాన్ని చేయొచ్చు. బట్టలు ఉతికేటప్పుడు ఒక్కో జతకు ఒక్కో బకెట్ వాడకుండా ఒకసారి శుభ్రం చేసిన నీటిలో మరొక జతను శుభ్రం చేసి, తర్వాత మళ్లీ ఫ్రెష్ నీళ్లలో శుభ్రం చేస్తే నీటిని పొదుపు చేయవచ్చు. బ్రష్ చేసుకున్న తర్వాత దానిని ట్యాప్ కింద పెట్టి కడుగుతుంటారు. అలా చేయకుండా మగ్గులో నీటిని తీసుకుని కడుక్కోవాలి. భోజనం తర్వాత చేతులు కడిగేందుకు ట్యాప్ను పూర్తిస్థాయిలో వదిలేస్తే రెండుమూడు లీటర్ల నీరు వృథా అవుతోంది. తాగునీటిని నిర్ణీత పరిమాణం వరకు తీసుకోవాలి. చాలామంది సగం గ్లాసు తాగి మిగిలిన నీరు పారబోస్తుంటారు. కార్లు, బైకులు కడిగేందుకు చాలా మంది పైపులు ఉపయోగిస్తారు. దీంతో విద్యుత్, నీరు ఎంతో వృథా అవుతుంది. దీనికి బదులు బకెట్ నీటితో తడిగుడ్డ ఉపయోగించి వాహనాన్ని శుభ్రం చేసుకోవచ్చు. ఇంట్లో వాటర్ప్యూరిఫైడ్ యంత్రాలు వాడేవారు చాలామంది ఇంటి నీటి ట్యాంకులకు అనుసంధానం చేసి వాడుతుంటారు. నీరు శుద్ధి కావడానికి రెండింతల నీరు వృథా అవుతుంది. అయితే ఈ నీటిని బకెట్లో పట్టుకుని దుస్తులు ఉతకడానికి, వంట పాత్రలు కడగటానికి వినియోగించొచ్చు.ఒక పంట కాలానికి నీటి వినియోగం లెక్కలిలా.. ఉద్యానపంట ఎకరానికి నీరు (మిల్లీలీటర్లలో) నిమ్మ 900–1,200 అరటి 1,200–2,200 ఉల్లి 350–550 టమాట 400–800 చిక్కుడు 300–500 క్యాబేజీ 350–500 -
ఎస్సారెస్పీ కాలువలో గుర్తుతెలియని మృతదేహం
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ శివారులోని ఎస్సారెస్పీ కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం మంగళవారం లభ్యమైంది. 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సుగల వ్యక్తి శరీరంపై బ్రౌన్కలర్ ఫార్మల్ పాయింట్, మెరూన్, నలుపు రంగు పొడుగు గీతలు, ఫుల్ హ్యాండ్స్ చొక్క ఉందని రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చామని పేర్కొన్నారు. వీవింగ్ మిల్లు కార్మికుడి మృతి రామగుండం: అంతర్గాం టీటీఎస్ కాలనీకి చెందిన వీవింగ్ మిల్లు కార్మికుడు బోకం నాయుడు (60) మంగళవారం మృతి చెందాడు. వీవింగ్ మిల్లు నుంచి ప్రయోజనాలకు సంబంధించిన బకాయిలు రావాల్సి ఉంది. ఆ సొమ్ము చూడకుండానే నాయకుడు మృతి చెందాడు. ఇప్పటికే పదుల సంఖ్యలో కార్మికులు బకాయిలు పొందకుండానే మృతి చెందారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి తక్షణమే బకాయిలను చెల్లించాలని బర్మా, కాందీశీకుల సంఘం ప్రతినిధులు జమ్ముల రామారావు, ఇండిబిల్లి రవీందర్ కోరుతున్నారు. విద్యుత్ షాక్తో కౌలురైతు..గంగాధర(చొప్పదండి): మండలంలోని కురిక్యాల గ్రామానికి చెందిన కౌలురైతు ఒగ్గరి ప్రశాంత్(38) విద్యుత్షాక్తో మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. ప్రశాంత్ గ్రామంలోనే మూడెకరాల వ్యవసాయ భూమి కౌలుకు తీసుకొని వరి పంటసాగు చేస్తున్నాడు. మంగళవారం వేకువజామున కరెంట్ మోటార్ పెట్టేందుకు పొలం వద్దకు వెళ్లాడు. ఫీజులు, స్టార్టర్ డబ్బా కాలిపోయి విద్యుత్ వైర్లు విడిపోయి ఉన్నా యి. విషయం తెలియక మోటార్ ఆన్ చేసేందుకు బాక్స్ ముట్టుకోగానే విద్యుత్షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరామర్శించారు. కారు డ్రైవర్పై కేసు నమోదుధర్మపురి: అతి వేగంగా.. అజాగ్రత్తగా కారు నడిపి ఓ యువకుడి మృతికి కారణమైన కారు డ్రైవర్పై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉదయ్కుమార్ తెలిపారు. మండలంలోని తుమ్మెనాల గ్రామానికి చెందిన తొందుర్తి రాజేందర్ ధర్మపురిలోని వెంకటేశ్వర షాపులో సేల్స్ మేనేజర్గా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి పని ముగించుకుని ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ధర్మపురి సమీపంలోని నర్సయ్యపల్లి స్టేజీ వద్ద ధర్మపురి నుంచి జగిత్యాల వైపునకు వెళ్తన్న కారు డ్రైవర్, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవుకు చెందిన తమ్ముడి వినోద్ అజాగ్రత్తగా కారు నడిపి ఢీకొట్టాడు. ఈ ఘటనలో రాజేందర్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య గంగరాజు ఫిర్యాదు మేరకు దీంతో డ్రైవర్ వినోద్పై కేసు నమోదు చేశామని ఎస్సై పేర్కొన్నారు. -
లాభాల బాటలో ఆర్ఎఫ్సీఎల్
ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్) కర్మాగారం లాభాల బాటలో పయనిస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత 12.7 లక్షల మెట్రిక్ టన్నులకు 11,94,921.17 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేసి సుమారు రూ.510 ఆదాయం సమకూర్చుకుంది. ప్లాంట్ సామర్థ్యం రోజూ 3,850 మెట్రిక్ టన్నుల యూరియా, 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా ఉత్పత్తి చేస్తోంది. ఏడు రాష్ట్రాలకు సరఫరా.. ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తి చేసిన యూరియాను తెలంగాణతోపాటు 7 రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. తెలంగాణకు 4,68,954.76 మెట్రిక్ టన్నులు, ఆంధ్రప్రదేశ్కు 1,78,363.39 మెట్రిక్ టన్నులు, కర్ణాటకకు 1,91,288.07 మెట్రిక్ టన్నులు, మహారాష్ట్రకు 82,986.39 మెట్రిక్ టన్నులు, ఛత్తీస్గఢ్కు 60,640.38 మెట్రిక్ టన్నులు, తమిళనాడుకు 1,01,520.99మెట్రిక్ టన్నులు, మధ్యప్రదేశ్కు 1,11,167.19 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశారు. లక్ష్యానికి దూరంగా ఉన్నా.. ఆర్ఎఫ్సీఎల్ 2024–25 ఆర్థిక సంవత్సరంలో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేయాల్సి ఉంది. కానీ, 11,94,921.17 మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేశారు. కర్మాగారంలో నెలకొన్న సాంకేతిక సమస్యలతో దాదాపు 75,078.83 మెట్రిక్ టన్నుల యూరియా తక్కువగా ఉత్పత్తి చేశారు. ఆర్థిక సంవత్సరంలో లక్ష్యం చేరుకోలేకపోయినా.. లాభాలు ఆర్జిస్తోంది. లాభాలు ఇలా.. ఆర్ఎఫ్సీఎల్లో 22 మార్చి 2022లో నీమ్ కోటెడ్ యూ రియా ఉత్పత్తి ప్రారంభించారు. దీంతో 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.15.23 కోట్లు, 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.440.96 కోట్లు, 2024–25 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.510 కోట్ల ఆదాయం సాధించారు. ఉత్పత్తి లక్ష్యం 12.74 లక్షల మెట్రిక్ టన్నులు సాధించింది 11,94,921.17 మెట్రిక్ టన్నులు వార్షికాదాయం అంచనా సుమారు రూ.510 కోట్లు -
మార్కెట్ కమిటీలకు ‘లక్ష్మీ’ కటాక్షం
రాజన్నకు సెలవుల రద్దీవేములవాడ: ఎములాడ రాజన్నకు వరుస సెలవుల రద్దీ పెరిగింది. మంగళవారం 20 వేల మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం బద్ది పోచమ్మకు బోనం, ఒడిబియ్యం, కల్లుసాక, సమర్పించుకున్నారు. భక్తుల ఏర్పాట్లను ఆలయ అధికారులు పరిశీలించారు. ● ధాన్యం సేకరణతో రూ.20.69 కోట్ల ఆదాయం ● మొదటి స్థానంలో ధర్మపురి, చివరిస్థానంలో ఇబ్రహీంపట్నం జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల పూర్తిగా వ్యవసాయాధారిత జిల్లా. సాగునీటి వనరులు పుష్కలంగా ఉండటంతో గతేడాది అన్ని పంటలు పుష్కలంగా పండాయి. రైతులతోపాటు మార్కెట్ కమిటీలకూ భారీగా ఆదాయం సమాకూరింది. ఈ నేపథ్యంలో మార్కెట్ కమిటీలు 2024–25 ఆర్థిక సంవత్సరంలో ‘లక్ష్మీ’ కటాక్షంతో కళకళలాడుతున్నాయి. జిల్లాలో లక్ష్యాన్ని మించి అత్యధికంగా ఆదాయం సంపాదించిన దాంట్లో మొదటి స్థానంలో ధర్మపురి మార్కెట్ నిలిచింది. చివరి స్థానంలో ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ నిలిచింది. జిల్లాలో 13 వ్యవసాయ మార్కెట్ కమిటీలు జిల్లాలో జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, గొల్లపల్లి, ధర్మపురి, మల్యాల, కథలాపూర్, మేడిపల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, పెగడపల్లి, వెల్గటూర్, రాయికల్ ఇలా మొత్తం 13 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఈ మార్కెట్ యార్డులకు రైతులు తమ పంట ఉత్పత్తులను తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. కొనుగోలు చేసిన వ్యాపారులు ఉత్పత్తుల విలువపై ఒక శాతం ఫీజును మార్కెట్ కమిటీలకు చెల్లిస్తుంటారు. గ్రామాల్లో నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసినా ఆ వ్యాపారులు కూడా సంబంధిత మార్కెట్కు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వ్యాపారులే కాకుండా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే సివిల్ సప్లై, మార్క్ఫెడ్ వంటి సంస్థలు కూడా ఫీజు చెల్లిస్తుంటాయి. ఇటీవలి కాలంలో ప్రభుత్వ సంస్థలు రైతుల నుంచి ధాన్యం, మొక్కజొన్న, కందులు, మినుములు, శనగలు వంటివి కొనుగోలు చేస్తుండటంతో మార్కెట్ ఫీజు చెల్లించడం కొంచెం ఆలస్యమైనా భారీగానే ఆదాయం వస్తోంది. రికార్డు స్థాయిలో ఉత్పత్తితోనే ఆదాయం జిల్లాలో ప్రతి సీజన్లో కనీసం 5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తుంటారు. ఇందులో 3 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. వానాకాలం, యాసంగి సీజన్లోనే దాదాపు 10 నుంచి 12 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంది. మొక్కజొన్న కూడా రెండు సీజన్లలో కలిపి దాదాపు 5 నుంచి 6 లక్షల క్వింటాళ్లు దిగుబడి అవుతుంది. కందులు, పెసర్లు, అలిసంద, నువ్వులు, పత్తి, పసుపు వంటి ఉత్పత్తులు అమ్ముతుంటారు. కొన్నేళ్లుగా జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల మార్కెట్ కమిటీలకు మామిడి కాయల అమ్మకం ద్వారా మార్కెట్ ఫీజు బాగానే వస్తోంది. ఇతర జిల్లాల్లో రైతుల ఉత్పత్తులు కొనుగోలు చేసినప్పటికీ అక్కడ మార్కెట్ ఫీజు చెల్లించలేదంటే.. చెక్ పోస్టుల ద్వారా కూడా ఫీజు వసూలవుతుంది. లక్ష్యాన్ని మించి ఆదాయం ఐదేళ్లలో సాధించిన ఆదాయం ప్రకారం జిల్లాలోని మార్కెట్ కమిటీలకు ఏటా లక్ష్యాన్ని నిర్దేశిస్తుంటారు. జిల్లాలోని 13 మార్కెట్ కమిటీల్లో జగిత్యాల, ధర్మపురి, మల్యాల, కథలాపూర్, మేడిపల్లి, మల్లాపూర్, పెగడపల్లి, వెల్గటూర్, రాయికల్ మార్కెట్లు మాత్రమే లక్ష్యాన్ని మించి ఆదాయాన్ని అర్జించాయి. జిల్లాలో రూ.15.98 కోట్ల లక్ష్యానికి రూ.20.69 కోట్ల ఆదాయాన్ని(129.47 శాతం)సాధించాయి. రాబోయే ఏడాదిలోనూ మంచి ఆదాయాన్ని సంపాదించేందుకు మార్కెట్ కమిటీలు ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. జిల్లాలోని మార్కెట్ కమిటీల లక్ష్యం, ఆదాయం (రూ.కోట్లలో..), శాతం మార్కెట్ కమిటీ లక్ష్యం ఆదాయం శాతం జగిత్యాల 2.61 2.79 106.71 మెట్పల్లి 1.75 1.31 74.90 కోరుట్ల 1.47 1.01 68.80 గొల్లపల్లి 8.8 8.4 95.86 ధర్మపురి 1.81 4.86 267.45 మల్యాల 1.62 3.56 220.14 కథలాపూర్ 1.05 1.25 119.76 మేడిపల్లి 9.3 11.6 124.37 మల్లాపూర్ 7.0 8.3 105.01 ఇబ్రహీంపట్నం 4.6 3.4 74.19 పెగడపల్లి 7.5 8.4 111.74 వెల్గటూర్ 1.12 1.12 100.52 రాయికల్ 6.9 7.2 103.81 మొత్తం 15.98 20.69 129.47 మార్కెట్లలో వసతులు కల్పించాలి జిల్లాలోని అన్ని మార్కెట్లలో సరైన వసతులు కల్పించాలి. రైతులకు విశ్రాంతి భవనాలు నిర్మించాలి. మంచి నీటి సదుపాయాలు, మూత్రశాలలు సరిగ్గా లేవు. రైతుల ఉత్పత్తుల అమ్మకం ద్వారా మార్కెట్లకు వచ్చే అదాయాన్ని అభివృద్ధికే ఖర్చు చేయాలి. – వేముల కర్ణాకర్రెడ్డి, తీగలధర్మారం, ఽ ధర్మపురి మండలం ఆదాయం సంపాదించాం జిల్లాలోని అన్ని మార్కెట్లలో లక్ష్యాన్ని మించి 129.47 శాతంతో ఈ ఏడాది రూ 20.69 కోట్ల ఆదాయాన్ని సాధించాం. మార్కెట్ ఫీజును కచ్చితంగా వసూలు చేయడంతోనే అనుకున్న లక్ష్యాన్ని సాధించాం. ఈ మేరకు అయా మార్కెట్లలోని మార్కెట్ సిబ్బంది రాత్రిబవళ్లు పనిచేస్తున్నారు. – ప్రకాష్, మార్కెటింగ్ అధికారి, జగిత్యాల -
‘ఎల్లంపల్లి’లో తగ్గుతున్న నీటిమట్టం
● అప్రమత్తమైన హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు రామగుండం: పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమట్టం సగానికి పడిపోయింది. దీంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్, సీవరేజీ బోర్డు (హెచ్ఎండబ్ల్యూఎస్) అధికారులు అప్రమత్తమయ్యారు. వచ్చే మే చివరి నాటికి ప్రాజెక్టు అడుగంటిపోయే ప్రమాదం ఉంది. తద్వారా హైదరాబాద్కు తాగునీరు పంపింగ్ చేసే విద్యుత్ మోటార్లకు సరిపడా నీరు అందకుండా పోతుందని భావించిన అధికారులు.. ప్రత్యామ్నాయ చర్యలకు ఉపక్రమిస్తున్నారు. హైదరాబాద్కు రోజూ సరఫరా.. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ మహా నగరానికి రోజూ తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లిలో పంపుహౌస్ నిర్మించారు. ఒక్కోటి 6.6 కేవీ సామర్ధ్యం గల ఆరు విద్యుత్ మోటార్లతో రోజూ సుమారు 56 క్యూసెక్కులను హైదరాబాద్కు పంపింగ్ చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 148 మీటర్లు. 138.3 మీటర్ల స్థాయికి నీటిమట్టం పడిపోతే పంపుహౌస్లోని విద్యుత్ మోటార్లకు నీరు అందకుండా పోతోంది. తద్వారా పంపింగ్ నిలిచిపోతుంది. నీటిమట్టం 143.47 మీటర్లు నీటిపారుదలశాఖ శాఖ అధికారులు మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 143.47 మీటర్లు ఉంది. 9.75 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదేరోజు 142.28 మీటర్ల నీటిమట్టం ఉంటే 7.84 టీఎంసీల నిల్వ ఉంది. దీంతో గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ అధికారులు.. నీటిని ఎత్తిపోసేందుకు 125 హెచ్పీ సామర్ధ్యం గల 25 మోటార్లను సిద్ధం చేస్తున్నారు. సమీక్షిస్తున్నాం ఎల్లంపల్లి ప్రాజెక్టులో గతేడాదితో పోల్చితే ప్రస్తుతం నీటిమట్టం ఆశాజనకంగానే ఉంది. 138.3 మీటర్లకు నీటిమట్టం పడిపోతేనే పంపింగ్ కోసం ప్రత్యామ్నాయ చర్యలు చేపడతాం. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 143.47 మీటర్లు ఉంది. హైదరాబాద్వాసులకు తాగునీటి సమస్య రాకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు అధికారులతో సమీక్షిస్తున్నాం. – వెంకటేశ్, డీజీఎం, హెచ్ఎండబ్ల్యూఎస్ -
పెళ్లి కావడం లేదనే మనస్తాపంతో..
సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): తనకు వివాహం కావడం లేదనే మనస్తాపంతో పూసాల గ్రామానికి చెందిన నల్ల లింగమూర్తి(38) ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై శ్రావణ్కుమార్ కథనం ప్రకారం.. లింగమూర్తి రోజూవారీ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తాడు. ఐదేళ్లక్రితం తల్లిదండ్రులు చనిపోయారు. వీరు నలుగురు అన్నదమ్ములు. అందులో పెద్దన్న, మూడోఅన్నకు పెళ్లి అయ్యింది. లింగమూర్తి రెండో అన్నతో కలిసి ఉంటున్నాడు. ఈక్రమంలో తనకు పెళ్లి కావడం లేదనే మనస్తాపంతో మార్చి 29న రాత్రి ఎలుకల మందు తాగాడు. మరుసటి తెల్లవారుజామున కడుపు నొప్పి తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీనంగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి అన్న నల్ల రాజేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. పూసాలకు చెందిన యువకుడి ఆత్మహత్య -
అయ్యా.. ‘చేయూత’ ఏదయా
కరీంనగర్ అర్బన్: ప్రతి నెలా ఠంచన్గా రావాల్సిన చేయూత పింఛన్ నెల దాటినా దిక్కులేకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ప్రతి నెలా తొలివారంలోనే డబ్బులొచ్చేవి. క్రమేణా నెలాఖరుకు చేరగా తాజాగా నెల దాటినా పింఛన్ అలజడి లేకపోవడం ఆందోళనకర పరిణామం. పింఛన్పైనే ఆధారపడి జీవించే వృద్ధులు లేకపోలేదు. ఎప్పుడొస్తాయోనని ఎదురుచూసేవారు వేలల్లో ఉండగా పడిగాపులు అనివార్యమయ్యాయి. అధికారులను సంప్రదిస్తే డబ్బులు వస్తాయని చెబుతున్నారని, తీరా ఏప్రిల్ రావడంతో గందరగోళం నెలకొంది. ఎందుకిలా.. జిల్లాలో ఆసరా పింఛన్ల కింద మొత్తం 1,23,041 మంది లబ్ధిపొందుతున్నారు. ప్రతి నెలా దివ్యాంగులకు రూ.4016, ఇతర పింఛన్లకు రూ.2016 చెల్లిస్తున్నారు. కాగా 6 నెలలుగా సకాలంలో పింఛను రాకపోవడంతో సంబంధిత కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. పింఛన్ కోసం బ్యాంకుకు వెళ్లడం రాలేదన్న సమాచారంతో నిరాశగా వెనుదిరగడం లబ్ధిదారుల వంతవుతోంది. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి. కొత్త పింఛన్లు ఇంకెప్పుడో? లబ్ధిదారుల సంగతి అటుంచితే కొత్త దరఖాస్తులు, పాత దరఖాస్తుదారులకు నిరీక్షణ తప్పడం లేదు. నాలుగేళ్లుగా కొత్త పింఛన్లు లేకపోగా ఇప్పుడు అప్పుడంటూ ప్రభుత్వ ప్రకటనల క్రమంలో అర్జీలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతుండగా మంజూరు మాటే లేదు. దీంతో జిల్లావ్యాప్తంగా వేలమంది కొత్త పింఛన్ల కోసం నిరీక్షిస్తున్నారు. కొత్త పింఛన్లు ఇస్తామని సీఎం ప్రకటించగా నేటికి వాటి ఊసే లేదు. 57ఏళ్లు నిండినవారికి పింఛన్ ఇస్తామని గత ప్రభుత్వం వెసులుబాటు కల్పించగా వేలమంది దరఖాస్తు చేశారు. వాటి పరిశీలన ప్రక్రియ చేపట్టకపోగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో కొత్త పింఛన్లు సుమారు 20వేల వరకు వచ్చే అవకాశముండగా ఇంకా స్పష్టత లేకపోవడం ఆరోపణలకు తావిస్తోంది. పెరగనున్న లబ్ధిదారులు ఆసరా పింఛన్దారుల వయస్సు 57కు తగ్గించగా, గ్రామ, మండలస్థాయిలో పరిశీలించి జిల్లావ్యాప్తంగా 14వేలకు పైగా అర్హులు ఉన్నట్లు గుర్తించారు. దీనికితోడు కొత్త దరఖాస్తులు వేలల్లో ఉండగా అతీగతి లేదు. దివ్యాంగులకు రూ.4,016, ఇతర పింఛన్లకు రూ.2,016 చెల్లిస్తుండగా దరఖాస్తుల క్రమంలో పింఛన్లు చెల్లిస్తే లబ్ధిదారుల సంఖ్య 20వేలకు పైగా చేరుకోనుంది. జిల్లాలో మండలాల వారీగా పింఛన్ తీసుకుంటున్నవారు.. మండలం మొత్తం పింఛన్లు చిగురుమామిడి 6,692 చొప్పదండి 7,527 ఇల్లందకుంట 4,574 గంగాధర 9,946 గన్నేరువరం 3,414 హుజూరాబాద్ 6,352 హుజూరాబాద్అర్బన్ 2,256 జమ్మికుంట 5,502 జమ్మికుంటఅర్బన్ 2,599 కరీంనగర్రూరల్ 5,458 కరీంనగర్అర్బన్ 19,493 కొత్తపల్లి 6,512 మానకొండూర్ 8,706 రామడుగు 8,281 సైదాపూర్ 6,418 శంకరపట్నం 6,361 తిమ్మాపూర్ 6,991 వీణవంక 5,959 మొత్తం 123,041 మార్చి నెల దాటినా ఖాతాకు పింఛన్ చేరలే వృద్ధులు, దివ్యాంగుల పడిగాపులు కొత్త అర్జీలకు కలగని మోక్షం మందులకు పైసల్లేవు ఎప్పుడైనా ప్రతి నెలా మొదటివారంలో పింఛన్ డబ్బులు వచ్చేవి. ఏమైందో కానీ కొన్ని నెలలుగా వచ్చే పింఛన్ అవసరానికి ఉపయోగపడటం లేదు. నెలాఖరుకు పింఛన్ వేస్తున్నారు. ఇప్పుడేమో అవీ దిక్కులేదు. ఇంకా మార్చి నెల డబ్బులు రాలే. ప్రతి నెల మందులు వాడాలి. ఇప్పుడేమో చేతిలో డబ్బులు లేవు. – బి.మల్లారెడ్డి, హుజూరాబాద్ -
రెండు దుకాణాల్లో చోరీ
హుజూరాబాద్: పట్టణంలో సోమవారం వేకువజామున రెండు దుకాణాల్లో చోరీ జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. హుజూరాబాద్ పట్టణంలోని అన్నపూర్ణ థియేటర్ చౌరస్తాలో పోరండ్ల సమ్మయ్యకు చెందిన రాఘవేంద్ర కిరాణం, జనరల్ స్టోర్ షట్టర్ తాళాలు పగలగొట్టి కౌంటర్లోని రూ.25 వేల నగదును, సామగ్రి ఎత్తుకెళ్లారు. అలాగే వరంగల్ రోడ్డులోని పరమేశ్వర ఎలక్ట్రికల్, వైండింగ్ దుకాణం షట్టర్ తాళాలు తీసి కౌంటర్లోని రూ.25 వేల నగదు, ఐదు తులాల వెండి దొంగిలించారు. కాగా దొంగలు వేకువజామున 2.30 గంటలకు రాఘవేంద్ర కిరాణం, 3.30 గంటలకు ఎలక్ట్రికల్ షాప్ తాళాలు తెరిచే దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ తిరుమల్గౌడ్ తెలిపారు. -
గుండె.. ఆగిపోతోంది
వీణవంక(హుజూరాబాద్): జిల్లా ప్రజలకు గుండె దడ పట్టుకుంది. అప్పటిదాక బాగానే ఉంటున్నారు.. అంతలోనే గుండెపోటుతో అనంతలోకాలకు వెళ్తున్నారు. ఒకప్పుడు పట్టణవాసులకు ఎక్కువగా వస్తుందనేది ప్రచారం ఉండేది. కానీ, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా గుండెదడ పట్టుకుంది. పొద్దంత పనులు చేసుకొని వచ్చి ఇంటి వద్ద సేద తీరేలోపు గుండెపోటుతో మృతిచెందుతున్నారు. అయితే పౌష్టికాహార లోపం, శారీరక శ్రమ లేకపోవడం, నీళ్లు సరిగా తాగకపోవడం వల్లే గుండెపోటు వస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. 40 నుంచి 55లోపు వారే ఎక్కువ... గుండెపోటు 40 నుంచి 55ఏళ్ల లోపు వారికే ఎక్కువగా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఆరు నెలల వ్యవధిలో వివిధ వృత్తుల్లో ఉన్న దాదాపు 34 మంది గుండెపోటుతో మృతిచెందారు. కాగా గుండెపోటు ఉపాధి హామీ కూలీలపై ఎక్కువగా ప్రభావం చూపుతోంది. ఎండలో పని చేయడం, సరైన నీరు తీసుకోకపోవడం గుండెపోటుకు ఒక కారణంగా వైద్యులు పేర్కొంటున్నారు. కొంత మంది వ్యాయామం చేసినా గుండెపోటుకు గురవడం కలకలం రేపుతుంది. వణుకు పుట్టిస్తున్న గుండెపోటు ఉమ్మడి కరీంనగర్లో ఆరు నెలల వ్యవధిలో 34 మంది మృతి ఉపాధి హామీ, వ్యవసాయ కూలీలపై ఎక్కువ ప్రభావం పాటించాల్సిన నియమాలు ముఖ్యంగా ఉపాధి హామీ, వ్యవసాయం చేసే కూలీలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలి. మిట్ట మధ్యాహ్నం ఎండలో పని చేయరాదు. శ్రమకు తగ్గ నీరు లేదా నిమ్మరసం తీసుకోవాలి. శరీర ఉష్ణోగ్రత ఎక్కవగా పెరగకుండ చెట్లకింద సేద తీరాలి. క్రమం తప్పకుండా బీపీ చెక్ చేసుకోవాలి. పట్టణాలలో ఉండేవారు మానసిక ఒత్తిడికి లోనుకావద్దు. రోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్, వ్యాయామం, యోగా చేయాలి. పొగతాగడం మానేయాలి. ఆయిల్ పుడ్ సాధ్యమైనంత వరకు తగ్గించాలి. గుండెపోటు లక్షణాలు గుండెపోటు రావడానికి కారణం గుండెకు సంబంధించి కండరాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణ ఆగిపోతుంది. దీన్నే గుండేపోటు అంటారని వైద్యులు చెబుతున్నారు. ఎడమ చేతి వైపు లాగినట్లు అనిపిచ్చి, ఛాతిలో నొప్పి వస్తుంది. వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. వ్యవసాయ కూలీలకు ఎక్కవగా ఎందుకు వస్తుందంటే వారు శ్రమకు తగ్గ నీరు తీసుకోకపోవడమే ప్రధాన కారణం. ఎండలో ఎక్కవగా పని చేయడం వల్ల చెమట ద్వారా లవణాలు కరిగిపోతాయి. లవణాలు తగ్గి గుండె ఎక్కవగా కొట్టుకోవడం కాని, గుండె ఆగిపోవడం జరుగుతుంది. అయితే కూలీలు పని మీద ఉండి నీళ్లు ఎక్కువగా తీసుకోకపోవడం ఒక కారణం. వంశపార్యంగా గుండెపోటు వస్తుందని కూడా ఒక కారణంగా వైద్యులు ధ్రువీకరిస్తున్నారు. ఎండలో ఎక్కువ సమయం పని చేయడం వల్ల గుండె ఆగిపోవడం జరుగుతుంది. 7 గంటలు ఎండలో పని చేస్తే కనీసం రెండుగంటలు విశ్రాంతి తీసుకోవాలి. శారీరక శ్రమ అవసరం పతి మనిషికి శారీరక శ్రమ అవసరం. రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఊబకాయం, బీపీ, షుగర్ పొగతాగడం అలవాటు ఉన్నవారికి గుండెపోటు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. ఎండలో పని చేసినప్పుడు సరైన నీరు తీసుకోవాలి. ఎడమచేతి వైపు నొప్పి వచ్చినట్లైతే డాక్టర్లను సంప్రదించాలి. – డాక్టర్ గొట్టె శ్రావణ్, పీహెచ్సీ వైద్యుడు, శంకరపట్నం మండలం -
వస్త్రోత్పత్తికి సబ్సిడీ పవర్
సిరిసిల్ల: నష్టాల్లో కూరుకుపోయిన సిరిసిల్ల వస్త్రపరిశ్రమను గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2001 నుంచి 50 శాతం సబ్సిడీపై విద్యుత్ను సరఫరా చేస్తోంది. 24 ఏళ్లుగా ఈ సబ్సిడీని కొనసాగిస్తోంది. వస్త్రోత్పత్తి సాంచాలను కుటీరపరిశ్రమగా గుర్తిస్తూ కేటగిరీ–4లో విద్యుత్ను రూ.4కు యూనిట్ను సరఫరా చేశారు. ఇందులో ప్రభుత్వం ప్రతీ యూనిట్కు రూ.2 భరిస్తుండగా.. సాంచాల యజమానులు మిగతా రూ.2 ‘సెస్’కు చెల్లించేవారు. ఇలా 24 ఏళ్లుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా విద్యుత్ సబ్సిడీ కొనసాగుతోంది. కానీ 2001లో ఇచ్చిన జీవో ప్రకారం 20 సాంచాలు(అంటే 10 హెచ్పీల) వరకే ఈ విద్యుత్ సబ్సిడీని అందించాలని స్పష్టం చేశారు. కానీ సిరిసిల్లలో నెలకొన్న ఆకలిచావులు, ఆత్మహత్యల నేపథ్యంలో 10 హెచ్పీల నిబంధనను ఎవరూ అమలు చేయలేదు. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లి 10 హెచ్పీల నిబంధన అమలు చేయాలని ఆర్డర్ తేవడంతో సబ్సిడీ సమస్య తెరపైకి వచ్చింది. మరోవైపు చేనేత, జౌళిశాఖ డైరెక్టర్ ఎల్ఆర్.ఆర్సీ నంబరు 895/2014–పి.తేదీ: 20.05.2024 ద్వారా సిరిసిల్లలోని వస్త్రోత్పత్తి సాంచాలకు సంబంధించిన పరిశ్రమల టారిఫ్ అమలు చేయాలని 10 హెచ్పీల నిబంధనల అమలులోకి తేవాలని కోరారు. బ్యాక్ బిల్లింగ్తో సమస్యలు కోర్టు ఆదేశాలు.. చేనేత జౌళిశాఖ ఉత్తర్వుల నేపథ్యంలో సిరిసిల్లలో 119 కార్ఖానాలకు విద్యుత్ సబ్సిడీని రద్దు చేసిన సిరిసిల్ల ‘సెస్’ అధికారులు వంద శాతం బిల్లింగ్ చేశారు. 20 సాంచాల కంటే ఎక్కువ సాంచాలు ఉన్న కార్ఖానాలకు విద్యుత్ సబ్సిడీ లేకుండా వినియోగించిన ప్రతీ యూనిట్కు రూ.7.80 చొప్పున బిల్లులు ఇచ్చారు. దీంతో గతంలో ప్రతీ యూనిట్కు రూ.2 చెల్లించిన వస్త్రోత్పత్తిదారులు ఇప్పుడు రూ.7.80 చెల్లించలేక కార్ఖానాలను మూసివేశారు. 2017 నుంచి వినియోగించిన విద్యుత్కు బ్యాక్ బిల్లింగ్ పేరిట ఒక్కో కార్ఖానాకు రూ.10లక్షల నుంచి రూ.1.20కోట్ల వరకు విద్యుత్ బిల్లులు విధించారు. బ్యాక్ బిల్లింగ్ చెల్లించలేక కొందరు కోర్టును ఆశ్రయించి ఉపశమనం పొందగా.. అదీ తాత్కాలికమే కావడంతో బ్యాక్బిల్లింగ్ సమస్య పెండింగ్లో ఉంది. ఇటీవల తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ డాక్టర్ డి.నాగార్జున్ సిరిసిల్లలో బహిరంగ విచారణ చేపట్టారు. బ్యాక్ బిల్లింగ్ను రద్దు చేయాలని, 10 హెచ్పీల వరకు పవర్లూమ్స్కు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని, 10 నుంచి 25 హెచ్పీల వరకు 50 శాతం సబ్సిడీ అమలు చేయాలని వస్త్రోత్పత్తిదారులు కోరారు. దీనిపై విద్యుత్ నియంత్రణ మండలి ఏ నిర్ణయం తీసుకోలేదు. తాజాగా గతంలో ప్రకటించిన 25 హెచ్పీల వరకు 50 శాతం విద్యుత్ రాయితీ అమలుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి, నిధులు కేటాయించడం విశేషం. బ్యాక్బిల్లింగ్తో మూతపడిన కార్ఖానాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. సిరిసిల్లలోని వంద కార్ఖానాల్లో మళ్లీ సాంచాలపై వస్త్రోత్పత్తి సాగనుంది. 25 హెచ్పీలకు 50 శాతం విద్యుత్ రాయితీ 50 సాంచాల ఆసాములకు సబ్సిడీ వర్తింపు రూ.49.04 కోట్లతో అమలు సిరిసిల్లలో బ్యాక్ బిల్లింగ్ అసలు సమస్య ఇది సిరిసిల్లలోని 50 సాంచాలు(25 జోడీల) కార్ఖాన. ఇక్కడ ఎనిమిది మంది నేతకార్మికులు పనిచేస్తారు. నిత్యం రూ.250 నుంచి రూ.350 వరకు ఒక్కో కార్మికుడు ఉపాధి పొందుతుంటారు. ఇలాంటి 50 సాంచాల వస్త్రోత్పత్తి కార్ఖానాలకు యాభై శాతం విద్యుత్ సబ్సిడీ వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు గతేడాది నవంబర్లోనే తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీజీఈఆర్సీ) సిపార్సు చేసింది. గతంలో 10 హెచ్పీల సామర్థ్యం గల సాంచాల కార్ఖానాలకు 50 శాతం విద్యుత్ రాయితీ వర్తించేది. కానీ దాన్ని 25 హెచ్పీలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.49.04కోట్లతో 25 హెచ్పీల వరకు 50 శాతం విద్యుత్ రాయితీ అమలు చేయాలని ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ నిర్ణయంతో సిరిసిల్ల పట్టణంతోపాటు పరిసర గ్రామాలైన చంద్రంపేట, తంగళ్లపల్లి, రాజీవ్నగర్ ప్రాంతాల్లోని వస్త్రోత్పత్తిదారులకు ప్రయోజనం కలుగనుంది. 50 సాంచాల ఆసామికి 50శాతం విద్యుత్ సబ్సిడీ వస్తే సిరిసిల్ల ప్రాంతంలోని 90 శాతం వస్త్రోత్పత్తిదారులకు మేలు కలుగుతుంది. కేవలం వందలాది సాంచాలున్న పెద్దసేట్లకు మాత్రం 50 శాతం విద్యుత్ సబ్సిడీ వర్తించదు. అంటే.. చిన్న, మధ్యతరగతి ఆసాములు, వస్త్రోత్పత్తిదారులకు ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధి చేకూరనుంది. -
రైస్మిల్లులో గంజాయి మొక్కలు
సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): కాట్నపల్లి గ్రామ శివారులోని ఓ రైస్మిల్లులో గంజాయి మొక్కల పెంపకం సోమవారం బయటపడింది. సమాచారం అందుకున్న ఎస్సై శ్రావణ్కుమార్ రైస్మిల్లుకు చేరుకుని గంజాయి మొక్కలు పరిశీలించారు. ఆ సమయంలో యాజమాన్యం, కార్మికులు ఎవరూ అందుబాటులో లేరు. యాజమాన్యానికి సమా చారం ఇచ్చినా స్పందించలేదు. రాత్రివరకూ విచారణ చేపట్టి.. చవరకు కాట్నపల్లి గ్రామానికి చెందిన మేకల పవన్కల్యాన్, బిహార్కు చెందిన లాల్ అరోబిహార్తోపాటు కాట్నపల్లికి చెందిన రైస్మిల్లు యజమాని మట్ట శ్రీనివాస్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఏసీపీ కృష్ణ, సీఐ సుబ్బారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
పరువు హత్యకాదు.. కుట్రపూరిత హత్య
ఎలిగేడు(పెద్దపల్లి): ముప్పిరితోటకు చెందిన పూరె ల్ల సాయికుమార్ది పరువు హత్య కాదని, కుట్రపూరితంగా చేసిన హత్యేనని పౌరహక్కులు, విప్లవ రచయితలు, తెలంగాణ ప్రజాఫ్రంట్, దళిత లిబరేషన్ ఫ్రంట్ నాయకులు ఆరోపించారు. ముప్పిరితోటలో హత్య జరిగిన ప్రదేశాన్ని సోమవారం వారు సందర్శించారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం పెద్దపల్లి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాధన కుమారస్వామి, దళిత లిబరేషన్ ఫ్రంట్ ప్రధానకార్యదర్శి మార్వాడి సుదర్శన్, తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా కన్వీనర్ గుమ్మి కొమురయ్య మాట్లాడారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన పూరెల్ల పరుశరాములు–జ్యోత్స్న కుమారుడు సాయికుమార్ పదో తరగతి పూర్తిచేసి డ్రైవర్గా పనిచేస్తున్నాడని, అదే గ్రామంలోని ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ముత్యం సమత–సదయ్యల కూతురు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారని తమ నిజనిర్ధారణలో తేలిందన్నారు. ప్రేమ వ్యవహారం రెండు కుటుంబాలు, గ్రామస్తులకు తెలుసని అన్నారు. యువతి చదువు పూర్తయ్యాక పె ళ్లి చేసుకునేందుకు నిర్ణయించగా. ఇష్టం లేని యువ తి తల్లిదండ్రులతోపాటు మేనమామ సిద్ధ సారయ్య అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరి ప్రోద్బలంతో సాయికుమార్ హత్యకు కుట్ర చేశారని అన్నారు. స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న సాయికుమార్ను గొడ్డలితో నరికి చంపారని తమ విచారణలో తేలిందని చెప్పారు. గతంలో రెండుసార్లు సాయికుమార్పై దాడి జరిగినా పోలీసులు స్పందించలేదని తెలిపారు. అధికార, ప్రతిపక్షపార్టీలు ఈ ఘటనకు బాధ్యత వహించాలన్నారు. ఈ హత్యను తాము ఖండిస్తున్నామని అన్నారు. ప్రేమ, కులం, మతం పేరిట జరిగే హత్యల నివారణకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్కోర్టును ఏర్పాటు చేయాలని, సాయికుమార్ కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని వారు కోరారు. పౌరహక్కుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీపతి రాజగోపాల్, విప్లవ రచయితల సంఘం కన్వీనర్ బాలసాని రాజయ్య, నాయకులు బొంకూరి లక్ష్మణ్, ఎన్.సత్యనారాయణ, పుట్ట రాజన్న, రెడ్డిరాజుల సంపత్ పాల్గొన్నారు. సాయికుమార్ హంతకులను కఠినంగా శిక్షించాలి పౌరహక్కులు, ప్రజాసంఘాల నాయకుల డిమాండ్ -
ఉరేసుకుని యువతి ఆత్మహత్య
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలకేంద్రానికి చెందిన ఆకుల శృతి (27) సోమవారం ఉదయం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శృతి ఎంకాం పూర్తి చేసింది. పోటీ పరీక్షల కోసం ప్రిపేరవుతూ.. ఇటీవలే గ్రూప్–1, 2 పరీక్ష రాసినా మంచి ర్యాంక్ రాలేదు. వీటికితోడు శృతి తండ్రి శ్రీనివాస్ అనారోగ్యంతో మంచానికి పరిమితమయ్యాడు. మరోవైపు శృతి ఏడాదికాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. చికిత్స చేయించుకుందామంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మనస్తాపానికి గురైన శృతి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శృతి తల్లి రోజ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్కుమార్ పేర్కొన్నారు.పండుగ కోసం వచ్చి.. ప్రాణాలు వదిలి..రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతిసుల్తానాబాద్రూరల్ (పెద్దపల్లి): ఐతరాజుపల్లి గ్రామ శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన పంగ నిఖిల్(26) మృతి చెందాడు. ఎస్సై శ్రావణ్కుమార్ కథనం ప్రకారం.. పంగ భాస్కర్–పద్మ దంపతుల కుమారుడు నిఖిల్ హైదారాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఉగాది పండుగ కోసమని ఈనెల 29న స్వగ్రామానికి వచ్చాడు. ఆదివారం సాయంత్రం ఐతరాజుపల్లిలోని తన స్నేహితుడి ఇంటికి వెళ్లి రాత్రి ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి బయలు దేరాడు. ఈక్రమంలో ప్రమాదవాశాస్తు ద్విచక్ర వాహనంపై నుంచిపడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.ఈత చెట్టుపై నుంచి పడి గీతకార్మికుడి మృతిజగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన గీత కార్మి కుడు దాసరి లచ్చయ్య (54) సోమవారం ప్రమాదవశాత్తు ఈత చెట్టుపై నుంచి పడి మృతిచెందాడు. లచ్చయ్య కల్లు గీసేందుకు ఈతచెట్టు ఎక్కగా ప్రమాదశాత్తు కాలజారి కిందపడటంతో బలమైన గాయాలయ్యా యి. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య దాసరి మల్లమ్మ ఫిర్యాదు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు.పాముకాటుతో రైతు మృతితిమ్మాపూర్(మానకొండూర్): మండలంలోని గొల్లపల్లికి చెందిన రైతు కొమ్మెర నరసింహారెడ్డి(57) పాముకాటుతో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. నరసింహారెడ్డి సోమవారం వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. వరి పంటకు నీరు పెట్టి తిరిగి వస్తున్న క్రమంలో పాముకాటుకు గురయ్యాడు. గమనించిన పక్క రైతు బాధితుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ఫ్లెక్సీల తొలగింపుపై వివాదం
● బల్దియా ఎదుట యూత్ కాంగ్రెస్ నిరసన కరీంనగర్కార్పొరేషన్: నగరంలోని 14వ డివిజన్లో యూత్ కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అజీమ్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు వివాదాస్పదంగా మారింది. ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా డివిజన్లో ఏర్పాటు చేసిన దాదాపు 150 ఫ్లెక్సీలను సోమవారం నగరపాలకసంస్థ డిజాస్టర్ సిబ్బంది తొలగించారు. దీంతో అజీమ్ ఆధ్వర్యంలో నగరపాలకసంస్థ కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. డివిజన్లో ఎన్నో ఫ్లెక్సీలు ఉండగా, తన ఫ్లెక్సీలు మాత్రమే తొలగించడానికి కారణమేమిటో అధికారులు చెప్పాలంటూ అజీమ్ నిలదీశారు. రంజాన్ పండుగ రోజే తమ ఫ్లెక్సీలు తొలగించడం మైనార్టీల పట్ల వివక్షే అంటూ అధికారులు, సిబ్బందిపై మండిపడ్డారు. కాగా, ఫ్లెక్సీల తొలగింపు తమ దృష్టికి రాలేదని, సిబ్బంది తెలియక చేసిన పొరపాటంటూ అక్కడికొచ్చిన అధికారులు సర్ది చెప్పారు. అయితే డివిజన్లో యథావిధిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో వివాదం సద్దుమణిగింది. -
నేడు సన్నబియ్యం పథకం ప్రారంభించనున్న మంత్రి
కరీంనగర్కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు సన్న బియ్యం పథకాన్ని మంగళవారం నగరంలో ప్రారంభించనున్నారు. నగరంలోని హౌసింగ్బోర్డుకాలనీ రోడ్ నంబర్– 2లో గల రేషన్దుకాణంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉదయం 10 గంటలకు సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించనున్నారు. చివరి రోజు కలెక్షన్ రూ.2 కోట్లుకరీంనగర్కార్పొరేషన్: ఆర్థిక సంవత్సరం చివరి రోజున ఆస్తి పన్ను వసూలును నగరపాలక సంస్థ అధికారులు వేగవంతం చేశారు. సోమవారం రూ.కోటి 90 లక్షలు వసూలు అయ్యాయి. అంతకుముందు ప్రత్యేకంగా కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటుచేసి బకాయిదారులు పన్నులు చెల్లించేలా ఫోన్ల ద్వారా ఒత్తిడి పెంచారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను డిమాండ్ రూ.52 కోట్లు కాగా సోమవారం రాత్రి 9 గంటల వరకు రూ.39 కోట్ల 27 లక్షలు వసూలు చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రావడానికి సరిపడా పన్నులు వసూలు అయినట్టు అధికారులు తెలిపారు. కాగా నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్ కౌంటర్లను పరిశీలించి కాల్ సెంటర్ల ద్వారా బకాయిదారులపై ఒత్తిడి చేయించారు. చివరి రోజు అధికంగా కలెక్షన్ అయ్యేలా చర్యలు చేపట్టారు. కంకర రోడ్డు.. ప్రయాణం చేయలేం గన్నేరువరం(మానకొండూర్): కంకర రోడ్డుతో ఇబ్బందులు పడుతున్నామని, గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు డబుల్రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ జంగపల్లి గ్రామస్తులు సోమవారం రాస్తారోకో నిర్వహించారు. కంకరరోడ్డుపై ప్రయాణికులు, వాహనాదారులు అవస్థలు పడుతున్నారని, సమస్య తీవ్రతపై వెంటనే స్పందించి రోడ్డు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోలో అటికం శ్రీనివాస్గౌడ్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ తాడూరి వెంకటరమణరెడ్డి, పాక్స్ సభ్యులు అటికం రవి, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు మంకాళి ప్రభాకర్, బీజేపీ నాయకులు అటికం రామచంద్రం, ఆటో జేఏసీ సభ్యుడు సొల్లేటి అంజనేయులు, మాజీ వార్డు సభ్యుడు ఇరుమండ్ల ఏల్లేష్, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బొజ్జ శ్రీనివాస్, తాడూరి వంశీకృష్ణరెడ్డి, అటికం సందీప్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. హెచ్సీయూ భూముల వేలాన్ని ఆపివేయాలి కరీంనగర్సిటీ: హెచ్సీయూ భూముల వేలాన్ని ఆపివేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ శాతవాహన యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ గేట్ వద్ద నిరసన తెలిపి ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ పూసల విష్ణు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థులు చదువుకునే యూనివర్సిటీలపై కక్ష కట్టిందని, వాటి భూములను కాజేసి తన అనుయాయులకు అప్పగించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. హెచ్సీయూలో భూములను ప్రభుత్వం వేలం వేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యక్షుడు బాలకృష్ణ, నగర కార్యదర్శి నందు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విఘ్నేష్, జోనల్ ఇన్చార్జిలు విష్ణు, యోగేశ్, సాయి తదితరులు పాల్గొన్నారు. -
● త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ● ఇక ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ ● ఏప్రిల్ 1 నాటికి 18 ఏళ్లు నిండినవారు అర్హులు
కరీంనగర్అర్బన్: త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగనుంది. ఎన్నికల సంఘం ఓటరు నమోదును నిరంతర ప్రక్రియగా చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ నాటికి కటాఫ్ తేదీని ఖరారు చేసి తుది ఓటరు జాబితాగా ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా యువత ఓటరుగా నమోదు చేసుకోవడమే మేలు. నిరంతర ప్రక్రియ గతంలో ఓటర్ల నమోదుకు జనవరి1 తేదీ మాత్రమే ప్రామాణికంగా తీసుకునేవారు. సదరు తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఓటరుగా అర్హత లభించేది. సదరు విధానానికి స్వస్తి పలికారు. జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీలను సైతం ప్రామాణికంగా తీసుకోవాలని ఎన్నికల సంఘం నిర్దేశించింది. జాబితాలో లాజికల్ పొరపాట్లు, డెమోగ్రాఫికల్ పొరపాట్లను పూర్తిస్థాయిలో సవరించాలని అధికారులను ఆదేశించింది. ఓటరు నమోదుకు పలు మార్గాలు అరచేతిలోనే ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. వెబ్సైట్లోకి వెళ్లాలి. సర్వీస్ పోర్టల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. అందులో మొబైల్ నంబర్తో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం లాగిన్ అవ్వాలి. ఆన్లైన్లో కొత్త ఓటుకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, తప్పులను సరిచేసుకోవడానికి, ఓటు హక్కును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేసుకోవడానికి, జాబితాలో రెండు ఓట్లు ఉంటే ఒకదాన్ని తొలగింపు, ఇతర అంశాలకు సంబంఽధించి వేర్వేరుగా ఫారం–6, ఫారం–7, ఫారం–8 కనిపిస్తాయి. వాటిలో మీకు కావాల్సిన దానిపై క్లిక్ చేసి అందులో పొందుపర్చాల్సిన వివరాలు నమో దు చేసి సబ్మిట్ చేయాలి. వివరాలు ఏఈఆర్వోకు వద్దకు వెళ్తాయి. పరిఽశీలించి ఆమోదిస్తారు. యాప్తో కూడా.. వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోలేని పరిస్థితుల్లో మీ వద్ద ఉన్న మొబైల్లో http:/// voters. eci. gov. in యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. దానిపై క్లిక్ చేయగానే పోర్టల్ ఓపెన్ అవుతుంది. కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చు. జాబితాలో పేరుందా లేదా చూసుకునే అవకాశం కల్పించారు. గుర్తింపు కార్డు పొందడమిలా ఓటరు గుర్తింపు కార్డు కావాలనుకునేవారు వెబ్సైట్లోకి వెళ్లాలి. అందులో ఈ–ఎపిక్ కార్డు డౌన్లోడ్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మొబైల్, ఎపిక్ కార్డు నంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గుర్తింపు కార్డుకు ఫోన్ నంబర్ అనుసంధానం అయితే ఓటీపీ వస్తుంది. లేకుంటే రాదు. ఫారం–8 ద్వారా ఫోన్ నంబర్ అనుసంధానం చేసుకోవచ్చు. తర్వాత గుర్తింపు కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. నమోదుపై సందేహమా.. 1950 ఓటరు నమోదు, ఎన్నికలకు సంబంధించి 1950 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఫిర్యాదు కూడా చేయొచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సేవలు అందిస్తారు. అంతేకాకుండా అంతర్జాలం నుంచి ఈమెయిల్ ద్వారా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఫారం–6: కొత్తగా ఓటరు నమోదు చేసుకునేందుకు ఈ దరఖాస్తును పూరించాలి. ఒక ఫొటో, వయసు నిర్ధారణ పత్రం(ఎస్సెస్సీ మెమో), చి రునామా ధ్రువీకరణ ఉండే కరెంట్ బిల్లు, నల్లా బిల్లు, ఇంటి పన్ను వంటి వాటిని జతచేయాలి. ఫారం–6ఏ: విదేశాల్లో ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఫార్మాట్ రూపొందించారు. ఎన్నారైలకు రాష్ట్ర ఎన్నికల సంఘం 2018 నుంచి ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఫారం–7: ఓటరు జాబితాలో అభ్యంతరాలకు ఈ ఫారంను పూరించాలి. ఓటరు మరణించినా, ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డా వారిని జాబితా నుంచి తొలగించాలని ఈ ఫారం ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ఫారం–8ఏ: పట్టణాల్లో చాలామంది ఒక కాలనీ నుంచి మరో కాలనీకి మారుతుంటారు. ఈ క్రమంలో ఓటు వేసేటప్పుడు ఇబ్బందులు పడుతుంటారు. వారి కోసం ఈ ఫారం ఉపయోగపడుతుంది. ఒక పోలింగ్బూత్ నుంచి మరో సమీప పోలింగ్ బూత్కు మారేందుకు దరఖాస్తు చేయాలి. -
అపర భద్రాద్రిపై చిన్నచూపు
● ఈనెల 4 నుంచి 16 వరకు ఇల్లందకుంట శ్రీసీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ● సమీక్ష సమావేశాలు లేకుండానే ఉత్సవాలు ● అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయ లోపం ● తూతూమంత్రంగా ఏర్పాట్లుఇల్లందకుంట(హుజూరాబాద్): అపరభద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పట్టింపు కరువైంది. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయలోపం, నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది. ఈ నెల 4 నుంచి 16 వరకు జరిగే ఉత్సవాలకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. కాగా, జాతర ఏర్పాట్లపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. శాశ్వత కమిటీ లేకుండానే.. ఆరేళ్ల నుంచి ఏటా ఆలయ శాశ్వత కమిటీ కాకుండా రెనోవేషన్ కమిటీ ఆధ్వర్యంలో జాతర నిర్వహిస్తున్నారు. కాగా, ఈసారైనా కమిటీ ఏర్పాటు చేస్తారని అనుకున్న ఆశావహులకు నిరాశే మిగిలింది. శాశ్వత కమిటీ లేకపోవడం, ఇన్చార్జి ఈవో ఉండటం వల్లే ఏర్పాట్లలో సమన్వయం లోపిస్తుందని, శాశ్వత ఈవో, కమిటీ ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదనే భావన భక్తుల్లో నెలకొంది. జాడలేని సమీక్ష సమావేశం ఏటా జాతరకు 15 రోజుల ముందుగానే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులతో జాతరపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. కానీ ఈసారి ఇప్పటికీ సమావేశం నిర్వహించలేదు. మంత్రి స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పలుమార్లు క్షేత్రస్థాయిలో సందర్శించి అన్నిశాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు జరిగేవి. ప్రస్తుతం ఇప్పటివరకు ఏ అధికారి కూడా ఆలయాన్ని సందర్శించి సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడంతో ‘ఏ’ గ్రేడ్ స్థాయి ఆలయానికి ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు ఇదేనా అని భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మిగిలింది రెండు రోజులే.. ఈనెల 4 నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు తూతూమంత్రంగానే జరుగుతున్నాయి. ఏటా 10 రోజుల ముందుగానే బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవి ష్కరించి, ప్రచార రథాలతో ముమ్మరం ప్రచారం చేసేవారు. ఈసారి ఏదీ లేకుండా పోయింది. ఇక మిగిలింది రెండు రోజులే అయినా ఏర్పాట్లు నత్తనడకన సాగుతున్నాయి.నిర్లక్ష్యం సరికాదు రెండురోజుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నా యి. ఏర్పాట్లపై ఇంత నిర్లక్ష్యం తగదు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయలోపం స్పష్టంగా కనబ డుతుంది. జాతర ఏర్పాట్లపై అధికారుల సమీ క్ష సమావేశాలు లేకపోవడం విడ్డూరంగా ఉంది. ఇప్పటికై నా స్పందించి జాతర ఏర్పాట్లు ముమ్మరంగా చేపట్టాలి. – సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, భోగంపాడు సౌకర్యాలు కల్పించాలి వేసవిని దృష్టిలో ఉంచుకొని భక్తులకు చలువపందిళ్లతో పాటు తాగునీరు, తదితర సౌకర్యాలు కల్పించాలి. ప్రధానంగా పార్కింగ్ సమస్య ఉంది. అధికారులు దీనిపై దృష్టి పెట్టి పార్కింగ్పై భక్తులకు అవగాహన కల్పించాలి. – వొద్దుల దేవేందర్రెడ్డి, ఇల్లందకుంట ఏర్పాట్లు కొనసాగుతున్నాయి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేస్తాం. అధికారులతో సమీక్ష సమావేశం జరగనుంది. – సుధాకర్, ఆలయ ఇన్చార్జి ఈవో -
యువతా.. ఓటుందా
కరీంనగర్వాతావరణం ఆకాశం ప్రకాశవంతంగా ఉంటుంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. వడగాలులు వీస్తాయి. భక్తిశ్రద్ధలతో ఈద్– ఉల్ – ఫితర్తాగునీటి సమస్య తీర్చండిగుండె.. ఆగిపోతోంది ఒకప్పుడు పట్టణవాసులకు గుండెపోటు ఎక్కువగా వస్తుందనేది ప్రచారం ఉండేది. కానీ, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా గుండెపోటు మరణాలు కలవరపెడుతున్నాయిమంగళవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025కరీంనగర్కల్చరల్: జిల్లావ్యాప్తంగా సోమవారం ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నగరంలోని వన్టౌన్ పోలీసుస్టేషన్ సమీపంలో గల పురానీ (ఖదీమ్ షాహి) ఈద్గా, చింతకుంట, సాలెహ్నగర్ ఈద్గాలలో మతపెద్దలు సందేశమిచ్చారు. సాలెహ్నగర్ ఈద్గా వద్ద ముస్లింలకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిపొన్నం ప్రభాకర్ తన స్నేహితులు సయ్యద్షా ఖాజా మెహినుద్దీన్ ఖాద్రి, పాస మొల్ల నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ మేయర్ సునీల్రావు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్ ఫార్మసీ కరీంనగర్ ఆధ్వర్యంలో స్వీట్స్, మజ్జిగ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం పర్యవేక్షణలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రార్థనలయ్యేవరకు ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లింపు చర్యలు తీసుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాల వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ● ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఏయే ఫారం ఎందుకంటే.. న్యూస్రీల్ -
రైతన్నపై విత్తన పిడుగు
కరీంనగర్ అర్బన్: ప్రతికూల పరిస్థితులు, మార్కెట్లో గిట్టుబాటు ధర లేమితో కునారిల్లుతున్న సాగు రంగానికి విత్తన ధరను పెంచడం ఆందోళనకర పరిణామం. తెగుళ్లు, అకాల వర్షాలతో అరకొర దిగుబడులు సాధిస్తున్న పత్తి రైతులకు తాజాగా పెంచిన పత్తి విత్తన ప్యాకెట్ ధర భారంగా మారనుంది. ఇప్పటికే విత్తన రాయితీలను ఎత్తేసిన ప్రభుత్వం తాజాగా పత్తి విత్తన ప్యాకెట్ ధరను పెంచేసింది. ప్యాకెట్ ధర రూ.901గా నిర్ణయించగా గతేడాదితో పోలిస్తే ప్యాకెట్కు రూ.48 పెరిగింది. ఈ లెక్కన జిల్లా రైతులపై రూ.1.44కోట్ల భారం పడనుంది. గతంతో పోలిస్తే ఎరువులు, మందులు, కూలీల ధరలు పెరగడంతో పెట్టుబడి మరింత పెరగనుందని కర్శకులు కలవరపడుతున్నారు. బీటీ2కే ప్రాధాన్యం పత్తి రైతులు విత్తనాలను ప్రైవేటులోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పలు కంపెనీలు వివిధ రకాల విత్తనాలను మార్కెట్లో ప్రవేశపెట్టడంతో విత్తన ధరలపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ విధించింది. ఏటా విత్తన తయారీ తదితర ఖర్చులను లెక్కించి ప్రభుత్వం ధరను నిర్ణయిస్తుంది. ప్రభుత్వం ప్రకటించిన ధరకే కంపెనీలు విత్తనాలను విక్రయించాల్సి ఉంటుంది. మార్కెట్లో బీటీ1, బీటీ2 రకాలు అందుబాటులో ఉన్నా ఎక్కువ మొత్తంలో బీటీ2 విత్తనాన్ని సాగు చేస్తారు. జిల్లాలో సాగు ఎక్కువగా ఉండగా ఏటా 3లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు(450గ్రాములు) విక్రయాలు జరుగుతాయి. నకిలీ మకిలీ వీడేనా..? పత్తి సాగు చేసే ౖరైతులు ఎకరాకు 3 సంచుల విత్తనాన్ని ఉపయోగిస్తారు. ఈ లెక్కన జిల్లా సాగు విస్తీర్ణం లక్ష ఎకరాలు కాగా 3 లక్షలకు పైగా విత్తన సంచులు అవసరం ఉంటుంది. వందల రకాల్లో విత్తనాలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం బీటీ–2 పత్తి విత్తనాల సంచి ధర రూ.853 ఉంది. రానున్న సీజన్లో ఒక సంచి రూ.901తో విక్రయించుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. ఎక్కువ మొత్తంలో అవసరం ఉండటంతో ఏటా నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. సదరు అక్రమాలను అరికట్టేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అడ్డుకట్ట పడటం లేదు. సీజన్ ప్రారంభానికి మందే జిల్లాలో నకిలీ విత్తనాలను నిల్వ చేస్తున్నారు. నమ్మకస్తుల ద్వారా చేరవేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. విత్తనాలపై స్పష్టత అవసరం ఏటా నకిలీ విత్తనాలు నీడలా వెంటాడుతుంటే వ్యవసాయశాఖ తదనుగుణ చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. పత్తి విత్తనాలను ప్రభుత్వం రాయితీపై ఇవ్వడం లేదు. ప్రయివేటు కంపెనీలే ఆధారం. ఈ క్రమంలో అసలు ఏ ఏ కంపెనీలకు అనుమతి ఉంది, ఎంత ధర, తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలి. నకిలీ విత్తనాలు విక్రయించే డీలర్ల లైసెన్స్లు సస్పెండ్ చేయాలి. ఇక వచ్చే సీజన్లో ప్రతి విత్తన సంచిపై క్యూఆర్ కోడ్ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ కోడ్ ఏ కంపెనీ, ఎప్పుడు తయారు చేసింది, లాట్ నంబరు, విత్తన రకం తదితర వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. గతంలో పలు కంపె నీలు విక్రయించిన విత్తనాలు నాసిరకమని తేలా యి. కంపెనీలు విక్రయించిన విత్తనాలతో రైతులకు నష్టం జరిగితే పరిహారం ఇప్పించేలా ఒప్పందం చేసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పత్తి ప్యాకెట్ ధర రూ.48కి పెంపు జిల్లా రైతులపై రూ.1.44కోట్ల భారంజిల్లాలో సాగు విస్తీర్ణం: 3.50 లక్షల ఎకరాలు రైతులు: 1.80లక్షలు ఏటా పత్తి సాగు: లక్ష ఎకరాలు గతంలో ప్యాకెట్ ధర: రూ.853తాజా పెంపుతో ధర: రూ.901అన్నదాతలపై భారం: రూ.1.44కోట్లు -
కొత్త బట్టలతో మురిసిపోయేటోళ్లం
మాది సొంతూరు బెజ్జంకి దగ్గర దాచారం. నేను పుట్టక ముందే మా నాన్న సిరిసిల్లకు వచ్చాడు. నేను ఇక్కడే పుట్టాను. నా వయసు ఇప్పుడు 63 ఏళ్లు. మా చిన్నప్పుడు ఉగాది పండగ అంటే.. ఇంట్లో కొత్త బట్టలు కుట్టించేవాళ్లు. అవి వేసుకుని మురిసిపోతూ పంచాంగ శ్రవణం వినేవాళ్లం. ఉగాది పచ్చడి ఆకులల్ల పోసేటోళ్లు. ఎంతో సంతోషంగా అది తాగేటోళ్లం. ఇంట్లో పోలెలు చేస్తే.. ఇద్దరు అక్కలు, ఒక చెల్లె, అన్నతో కలిసి ఇంట్లో సంబురంగా తినేవాళ్లం. ఉగాది పండగ అంటే ఇంటిల్లిపాదికి ఎంతో ఆనందం ఉండేది. – డాక్టర్ గాజుల బాలయ్య, విద్యానగర్, సిరిసిల్ల -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
సిరిసిల్లక్రైం: సిరిసిల్లలోని అంబికానగర్కు చెందిన నెల్లుట్ల అంజయ్య (65) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యుల్లోని కొందరితో కలిసి మద్యం సేవించిన అంజయ్య ఉదయానికల్లా ఇంటి ఎదుట విగత జీవి గా పడి ఉన్నాడు. అంజయ్య కూరగాయల మార్కెట్లో అల్లంవెల్లుల్లి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మృతునికి రెండో వివాహం కాగా ఇద్దరు కూతుళ్లు, ముగ్గురు కుమారులు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గరెపల్లిలో మహిళ.. సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): గర్రెపల్లి గ్రామ సమీపంలోని పశువుల సంత రేకులషెడ్డులో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పత్రి కళావతి(50) శనివారం అనుమా నాస్పదస్థితిలో మృతి చెందింది. ఎస్సై శ్రావణ్కుమార్ కథనం ప్రకారం.. తంగళ్లపల్లికి చెందిన నర్సయ్య – కళావతి భార్యాభర్తలు. ఈనెల 27న సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామానికి చేరుకున్నారు. భిక్షాటన చేశాక పశువుల సంతలోని రేకులషెడ్డు తలదాచుకుంటున్నారు. శుక్రవారం రాత్రి భార్యాభర్తలిద్దరూ మద్యం తాగి పడుకున్నారు. శనివారం ఉదయం భర్త లేచి చూడగా.. ఎంతకీ నిద్రలేవలేదు. దీంతో ఆమె మృతి చెందిందని భా వించి సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. మృతదేహంపై గాయాలు కనిపించాయి. అయితే, ఐదు రోజుల క్రితం ద్విచక్రవాహనం పైనుంచి ఇద్దరూ పడిపోగా.. ఇద్దరికీ గాయాలయ్యాయని నర్సయ్య తెలిపాడు. మృతురాలి చిన్నకూతురు కల్పన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. గుండెపోటుతో ఉపాధి కూలీ... కోరుట్ల రూరల్: మండలంలోని నాగులపేట గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలి కుంట లక్ష్మీనర్సు (55)గుండెపోటుతో మృతిచెందారు. లక్ష్మీనర్సు ఎప్పటిలాగే కూలికి వెళ్లింది. తోటికూలీలతో కలిసి కాలువ పూడికతీత పనులు చేస్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురైంది. అక్కడే కుప్పకూలింది. కూలీలు 108లో కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే లక్మీనర్సు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. లక్ష్మీనర్సుకు కుమారుడు, కూతురు ఉన్నారు. -
మా తాతల కాలం నుంచి..
బోయినపల్లి(చొప్పదండి): మండలకేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో 25 ఏళ్లుగా ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. మా వంశంలో తాతలు, తండ్రుల కాలం నుంచి పంచాంగ శ్రవణం చేస్తున్నం. ప్రస్తుత విశ్వావసు నామ సంవత్సరంలో రవి రాజుగా వస్తున్నారు. పంచాంగ శ్రవణంలో రాశిఫలాలు, ఆదాయ వ్యయాలు, ధాన్యాధిపతి గూర్చి, ఎన్ని తూముల వర్షాలు కురుస్తాయి, పంటలు ఎన్ని పుట్లు పండుతాయి, రాజ్యాధికారం ఎలా ఉంటుంది, సీ్త్ర, పురుష జనన ఉత్పత్తి తదితర వివరాలు చెబుతాం. ఉగాది రోజు ప్రజలు పంచాంగ శ్రవణం వినడానికి వచ్చి తమ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటారు. – శ్రీనివాసాచార్యులు, బోయినపల్లి -
58 ఏళ్లుగా పంచాంగ పఠనం
ముస్తాబాద్(సిరిసిల్ల): ఉగాది పంచాంగ పఠనం 1967నుంచి చేస్తున్న. మా నాన్న గారు పరమపదించాక పౌరోహిత్యం చేపట్టాను. తెలుగు సంవత్సరాలు అరవై ఉండగా, మరో రెండేళ్లు గడిస్తే అన్ని సంవత్సరాలకు పఠనం చేసిన వ్యక్తిగా నిలుస్తా. ఆ రోజుల్లో ఉగాది రోజు మద్దికుంట శ్రీవేణుగోపాలస్వామి ఆలయానికి ఊరంతా వచ్చేవారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ముందుగానే తెలుసుకుంటున్నారు. నేను రైతుగా, ప్రజాప్రతినిధిగా,అర్చకులుగా గ్రామానికి సేవలను అందించాను. – మెట్టు రామశర్మ, మద్దికుంట, సిరిసిల్ల -
విశ్వశాంతికి పునాది
విద్యానగర్(కరీంనగర్): శిశిర ఋ తువుకు వీడ్కోలు పలికి వసంత ఋతువుకు స్వాగతం పలుకుతు న్న వేళ ఆరంభం అవుతున్న శ్రీ విశ్వావసు నామ సంవత్సరం విశ్వానికి సంబంధించినది. ఈ సంవత్సరం శుభఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. కుటుంబ జీవితాలలోనూ సంతో షం ఉంటుంది. దేశాల మధ్య వైరం, యుద్ధ వాతావరణం నుంచి ఉపశమనం లభించే అవకాశాలున్నాయి. విశ్వావసు అంటే ప్రపంచానికి మేలు చేసేవాడు.. అంటే ప్రజలు సహాయక స్వభావం కలిగి ఉంటారు. – నమిలకొండ రమణాచార్యులు, కరీంనగర్ ఆ ఉత్సాహమే లేదు సిరిసిల్ల: ఉగాది రోజున స్నానాలు చేసి పొద్దుగాలనే పొలంకాడికి పోయేవాళ్లం. వేపపువ్వు, మామిడికాయలు, మామిడి ఆకు, కొత్త చింతపండు తీసుకుని వచ్చి కొత్త కుండలో ఉగాది పచ్చడి చేసేవాళ్లు. కొబ్బరికాయ కొట్టి పచ్చడి పెట్టేదాకా ఇంట్లో నుంచి బయటకు వెళ్లకపోయేది. బక్ష్యాలు తిని వెళ్లి పంచాంగం వినేవాళ్లం. వచ్చే ఏడాదంతా ఎలా ఉంటుంది. ఏ రాశి వారికి రాబడి ఎంత.. ఖర్చు ఎంత..? తెలుసుకుని మురిసిపోయే వాళ్లం. ఈ రోజుల్లో ఆ ఉత్సాహమే లేదు. అంతా సెల్ఫోన్లోనే జీవిస్తున్నారు. – భైరి ప్రభాకర్, వెంకంపేట, సిరిసిల్ల -
ఉగాది తరువాతే ముగ్గు
● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జాప్యం ● ముగ్గు పోసేందుకు మొగ్గు చూపని లబ్ధిదారులుకరీంనగర్రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో క్షేత్రస్థాయిలో పురోగతి కన్పించడం లేదు. జనవరి 26న మండలానికి ఒక గ్రామం చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేశారు. మంజూరు పత్రాలు అందుకున్న వారు ని ర్మాణాలు చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం మంచిరోజులు లేవని, ఉగాది తర్వాత ముగ్గు పోస్తామంటూ చెప్పుకొస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో 2,027 ఇళ్లు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 1,48,471 దరఖాస్తులు వచ్చాయి. సొంత స్థలం ఉన్న వారిలో మొదటి విడత 68,284, రెండో విడత 16,855, మూడో విడతలో 59,942 మందిని ఎంపిక చేశారు. పైలట్ ప్రాజెక్టుగా 15మండలాల్లో ఒకగ్రామం చొప్పున ఎంపిక చేసి 2,027మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూ రు పత్రాలు అందించారు. పంచాయతీ కార్యదర్శులు, గృహనిర్మాణ సంస్థ అధికారులు కలిసి ఇంటి నిర్మాణం చేపట్టేలా ప్రోత్సహించారు. కొందరు ప్ర స్తుతం మంచిరోజులు లేవని, ఉగాది తర్వాత మంచి రోజులున్నాయని, మరికొందరు డబ్బులు లేవ ని ముగ్గుపోసేందుకు ముందుకురాలేదు. అయినప్పటికీ కార్యదర్శుల ఒత్తిడితో ఇప్పటివరకు 582 మంది ముగ్గు పోసి ఇంటి నిర్మాణపనులు ప్రారంభించారు. వీరిలో 38మంది బేస్మెంట్ వరకు పూర్తిచేశారు. ‘బేస్మెంట్ పూర్తిచేసిన లబ్ధిదారులకు రూ.లక్ష బ్యాంకుఖాతాల్లో జమచేసేందుకు చర్యలు చేపట్టాం. పండగ తరువాత ఇళ్లు వేగవంతం చేస్తాం’ అని హౌసింగ్ ఏడీ గంగాధర్ వివరించారు. -
రైతు సమస్యల పరిష్కారానికే సత్యాగ్రహ దీక్ష
కరీంనగర్టౌన్: రైతుల సమస్యలను పరిష్కరించాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు అన్నాడి రాజారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వద్ద సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం కన్నా దారుణంగా కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తోందన్నారు. రైతు రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 14 పంటలకు బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొని, సన్నవడ్లకే ఇస్తామన డం సిగ్గుచేటన్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనబడటం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రెడ్డబోయిన గోపి, యాదగిరి, కర్ర సంజీవరెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్రెడ్డి, బొడిగె శోభ, సునీల్ రావు, శంకర్, బాస సత్యనారాయణ, గుగ్గిలపు రమేశ్ పాల్గొన్నారు. పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలి కరీంనగర్ కార్పొరేషన్: ఆస్తి, వాణిజ్య, నల్లా పన్నులు చెల్లించి నగరపాలకసంస్థ అభివృద్ధికి సహకరించాలని డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి కోరారు. ఇందిరాగార్డెన్కు చెందిన పన్ను బకాయిలను నిర్వాహకులు డిప్యూటీ కమిషనర్కు చెల్లించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం రెండు రోజుల్లో ముగుస్తున్నందున, 90 శాతం వడ్డీమాఫీతో పన్నులు చెల్లించాలన్నారు. వన్టైం సెటిల్మెంట్ కింద ప్రభుత్వం కల్పించిన 90 శాతం వడ్డీ మాఫీని నగరవాసులు వినియోగించుకోవాలన్నారు. నగరపాలకసంస్థ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా, ఆన్లైన్లో, మీసేవ ద్వారా పన్నులు చెల్లించవచ్చని పేర్కొన్నారు. సిటీలో పవర్ కట్ ప్రాంతాలు కొత్తపల్లి: 100 కేవీఏ నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను అమర్చుతున్నందున శనివారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు 11 కెవీ శ్రీరాంనగర్ ఫీడర్ పరిధిలోని విద్యానగర్, బీరప్ప కమాన్, కొత్తయాస్వాడ, ఇండస్ట్రీయల్, వేంకటేశ్వర కమాన్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. సబ్స్టేషన్ల నిర్వహణ పనులు చేపడుతున్నందున శనివారం ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు 33/11 కేవీ బావుపేట, ఆసిఫ్నగర్ సబ్స్టేషన్ల పరిధిలోని ఎలగందుల, ఆసిఫ్నగర్, బావుపేట గ్రామాలతో పాటు గ్రానైట్ పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు పేర్కొన్నారు. ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు కరీంనగర్: పదోతరగతి భౌతికశాస్త్రం పరీక్ష శుక్రవారం ప్రశాంతంగా జరిగిందని డీఈవో సీహెచ్.జనార్దన్రావు తెలిపారు. జిల్లాలో రెగ్యులర్ విద్యార్థులు మొత్తం 12,521మందికి గా ను 12,506మంది హాజరయ్యారని తెలిపారు. 15మంది విద్యార్థులు గైర్హాజరు కాగా ప్రైవేట్ విద్యార్థులు 18మందికి 13మంది హాజరు అ య్యారని, ఐదుగురు గైర్హాజరైనట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన తనిఖీ బృందాలు 16 పరీక్ష కేంద్రాలను, ప్రభుత్వ పరీక్షల విభాగం సహాయ కమిషనర్ మూడు పరీక్ష కేంద్రాలను, జిల్లా విద్యాశాఖాధికారి ఒక పరీక్ష కేంద్రం, రాష్ట్ర పరిశీలకులు నాలుగు పరీక్ష కేంద్రాలను మొత్తంగా 24 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు డీఈవో వెల్లడించారు. ఆర్టీసీ జోనల్ ఆస్పత్రి తనిఖీ విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రోషాఖాన్ శుక్రవారం జోనల్ ఆసుపత్రిని తనిఖీ చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన పెల్ కౌంటర్, అల్ట్రాసౌండ్, 2డీఈకో, మానిటర్స్, డీఫిబ్రిలేటర్, ప్రతిపాదిత ఐసీయూ రూంను పరిశీలించారు. వేసవిలో సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు. జోనల్ ఆసుపత్రి సీనియర్ మెడికల్ ఆఫీసర్ గిరిసింహారావు, డిప్యూటీ రీజినల్ మేనేజర్ (మెకానికల్) బీవీ.రావు, కరీంనగర్, వర్క్స్ మేనేజర్ సుగుణాకర్, డిప్యూటీ రీజినల్ మేనేజర్లు ఎస్.మధుసూదన్, వి.మల్లయ్య, వైద్యులు వసుధ, శివ పాల్గొన్నారు. -
సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలి
● నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్కరీంనగర్ కార్పొరేషన్: ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్ ఆదేశించారు. శుక్రవారం నగరంలోని పలు రిజర్వాయర్లను సందర్శించి, నీటి సరఫరా తీరుపై ఆరా తీశారు. రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం నగరపాలకసంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విలీన గ్రామాలతో పాటు నగరవ్యాప్తంగా తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా వేసవి ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. నిర్ణీత వేళల్లో తాగునీటి సరఫరా చేయాలని, సరఫరా సమయంలో సిబ్బంది పర్యవేక్షణ తప్పని సరి అన్నారు. డీఈ, ఏఈస్థాయి అధికారులు కూడా నీటి సరఫరా సమయంలో పర్యవేక్షించాలన్నారు. నగరపాలకసంస్థ నీటి సరఫరా కన్నా, విలీన గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. రిజర్వాయర్ల వారీగా లీకేజీలు గుర్తించి మరమ్మతులు చేయాలన్నారు. రా వాటర్ సేకరణలో ఎక్కడా సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. రోజురోజుకు ఎల్ఎండీలో నీటిమట్టం తగ్గుతుండడంతో, బూస్టర్లను నడిపించి రా వాటర్ తీసుకోవాలన్నారు. ఎస్ఈ రాజ్కుమార్, ఈఈలు యాదగిరి, సంజీవ్ పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ కౌంటర్ల పరిశీలన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నగరపాలకసంస్థ కమిషనర్చాహత్ బాజ్పేయ్ ఆదేశించారు. శుక్రవారం నగరపాలకసంస్థ కార్యాలయంలోని ఎల్ఆర్ఎస్ కౌంటర్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారులు ఆన్లైన్ సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. -
ఉన్న బియ్యమెంత? రికార్డులో ఉన్నదెంత?
● రేషన్ దుకాణాలపై రెవెన్యూ నజర్ ● సీబీ, భౌతిక నిల్వలపై ఆరా ● కొన్న బియ్యాన్ని ఖాళీ చేసేందుకు డీలర్ల మల్లగుల్లాలుకరీంనగర్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీకి యుద్ధప్రతిపాదికన చర్యలు చేపడుతుండగా పాత నిల్వలపై రెవెన్యూ దృష్టిసారించింది. ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనుండగా ఇప్పటికే 40శాతం మూవ్మెంట్ పూర్తయిందని తెలుస్తోంది. ఈ క్రమంలో దొడ్డు బియ్యం నిల్వలను భౌతికంగా పరిశీలించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించగా రెవెన్యూ యంత్రాంగం ఆరా తీస్తోంది. జిల్లాలో 566 రేషన్ దుకా ణాలుండగా గిర్దావర్లు స్టాక్ను పరిశీలిస్తున్నారు. దుకాణంలో భౌతికంగా ఉన్న బియ్యం, రికార్డులో చూపిన బియ్యమెంత, క్లోజింగ్ బ్యాలెన్స్లో చూపిందెంత అనే కోణంలో ఆరా తీస్తున్నారు. అయితే పలు దుకాణాల్లో రేషన్ బియ్యం ఇంకా నిల్వ ఉండటం అనుమానాలకు తావిస్తోంది. తనిఖీలతో డీలర్ల అయోమయం ఇక సన్నబియ్యమే రానుండటంతో దొడ్డుబియ్యానికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. టిఫిన్ సెంటర్ నిర్వాహకులు, రెస్టారెంట్లు, దాబాల నిర్వాహకులు భారీ మొత్తంలో కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు రేషన్ డీలర్లు ఇప్పటివరకు కిలోకు రూ.17కు విక్రయించగా రూ.20కి పెంచేశారు. రెవెన్యూ అధికారుల ఆకస్మిక తనిఖీలతో డీలర్లలో ఆందోళన నెలకొంది. జిల్లాలో 40శాతం డీలర్లు కార్డుదారుల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు పక్కా సమాచా రం. కార్డుదారులకు ఉచితంగా బియ్యం వస్తుండగా వారివద్ద రూ.12 నుంచి రూ.14కు కొనుగోలు చేసి అదే దుకాణంలో నిల్వ చేస్తున్నారు. వచ్చిన బియ్యం, పంపిణీ చేసిన బియ్యం, కొనుగోలు చేసిన బియ్యం లెక్కల కోసం ప్రత్యేకంగా బుక్ నిర్వహిస్తున్నారు. కొనుగోలు చేసిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తుండగా ఎక్కువగా టిఫిన్ సెంటర్లు, చిరుతిళ్ల తయారీ కేంద్రాలు, ఇతర రాష్ట్రాలకు తరలించే బ్రోకర్లకు విక్రయిస్తున్నారు. అయితే ఆకస్మికంగా తనిఖీలు జరుగుతుండటంతో నిల్వలను తరలించేందుకు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం 16మండలాల్లో 40మంది గిర్దావర్లు తనిఖీలను నిర్వహిస్తున్నారు. రేషన్ దుకాణాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయని, భౌతిక నిల్వలు, క్లోజింగ్ బ్యాలెన్స్లలో తేడాలుంటే డీలర్లపై చర్యలు తప్పవని జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు స్పష్టం చేశారు. -
కొనుగోళ్లలో అప్రమత్తతే ముఖ్యం
● రుణాల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేయండి ● డీఆర్డీఏ సమీక్షలో కలెక్టర్ పమేలా సత్పతికరీంనగర్ అర్బన్/కరీంనగర్టౌన్/రామడుగు: జిల్లాలో ఐకేపీ ఆధ్వర్యంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచుతున్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. శుక్రవారం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సమీక్ష సమావేశం నగరంలోని స్వశక్తి భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను 49 నుంచి 150కి పెంచుతున్నామని వి వరించారు. ఏపీఎంలు, సెంటర్ ఇన్చార్జీలు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. తేమ యంత్రాలు సమకూర్చాలని పేర్కొన్నారు. ధాన్యం రకాలు, నిర్దిష్ట ప్రమాణాలు తెలియజేసే బ్యానర్ని కొనుగోలు కేంద్రాల వద్ద ప్రదర్శించాలని సూచించారు. అర్హత ఉన్న స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందజేయాలన్నారు. రానున్న విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ సిద్ధం చేసే అంశాన్ని చర్చించారు. డీఆర్డీవో శ్రీధర్, అడిషనల్ డీఆర్డీవో సునీత, డీపీఎంలు ప్రవీణ్, తిరుపతి, సీ్త్రనిధి అధికారి రవికుమార్ పాల్గొన్నారు. పకడ్బందీగా యూడీఐడీ కార్డుల ప్రక్రియ దివ్యాంగులకు జారీ చేయనున్న యూడీఐడీ కార్డుల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి వైద్య ఆరోగ్య అధికారులను ఆదేశించారు. కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని యూడీఐడీ కార్డుల వైద్య పరీక్షల విభాగాన్ని శుక్రవారం సందర్శించారు. వైద్య పరీక్షల కోసం వచ్చే దివ్యాంగులకు వసతులు కల్పించాలన్నారు. అవసరమైన మిషనరీ టెక్నీషియన్ల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఇదివరకే సదరం సర్టిఫికెట్ ఉన్న వాళ్లు యూడీఐడీ కార్డుకు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. సర్టిఫికెట్ జారీ కోసం ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్ఎంవో నవీన, డీఆర్డీవో శ్రీధర్ పాల్గొన్నారు. మహిళలకు 50రకాల ఉచిత వైద్య పరీక్షలు జిల్లావ్యాప్తంగా ఆర్యోగ మహిళ కార్యక్రమంలో భాగంగా ప్రతీ మహిళకు ఉచితంగా 50రకాల వైద్య పరీక్షలను నిర్వహించడం జరుగుతోందని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. రామడుగు మండలం కొక్కెరకుంట అంగన్వాడీకేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం సభను నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు తప్పకుండా శుక్రవారం సభకు హాజరుకావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి సబితా, డీఎంహెచ్వో వెంకటరమణ, ఎంపీడీవో రాజేశ్వరి, ప్రత్యేకాధికారి అనిల్ ప్రకాశ్ పాల్గొన్నారు. -
ఆత్మహత్య.. హత్య!
● దారుణాలకు దారితీస్తున్న కులాంతర ప్రేమలు ● కలకలం రేపుతున్న ప్రేమికుల హత్యలు, ఆత్మహత్యలు ● తాజాగా సాయికుమార్ను వెంటాడి నరికి చంపిన వైనం ● ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న ఉత్తరాది కల్చర్ ● మరోసారి పరువు హత్యలపై జోరుగా చర్చసాక్షిప్రతినిధి, కరీంనగర్: ప్రేమ.. త్యాగం నేర్పుతుంది అంటారు. కానీ.. యువతీ, యువకుల మధ్య చిగురించిన ప్రేమ బలికోరుతోంది. సామాజిక సమీకరణాలు కుదరక కులాల కుంపటి రాజుకుంటోంది. గ్రామాల్లో ఈ పోకడ పెరుగుతుండటం ఆందోళన కలి గిస్తోంది. తాము కనీ, పెంచిన పిల్లలు తమకు దక్కకుండా పోతారన్న భయం, పరువు పోతుందన్న ఆందోళనలో తల్లిదండ్రులు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవి హత్యల వరకు దారితీస్తున్నా యి. మరోపక్క తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించన్న భయంతో ప్రేమికులు ప్రాణత్యాగాలు చేసుకుంటున్నారు. దురదృష్టవశాత్తూ ఉమ్మడి జిల్లాలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండగా.. సామాజిక అంతరాలకు అద్ధం పడుతున్నా యి. వేర్వేరు కులాల యువతీ, యువకులు ప్రేమించుకుంటే వారిపై దాడులు సహజమే అయినా.. అది చంపుకునేదాకా వెళ్తుండడమే ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు ఉత్తరాదికే పరిమితమైన ఈ పోకడ ఉమ్మడిజిల్లాకు పాకడం గమనార్హం. పంతాలతో కుటుంబాలు నాశనం సామాజిక కట్టుబాట్లను ఛేదించలేక, అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల ప్రేమను అంగీకరించలేక పెద్దలు తీసుకుంటున్న తీవ్ర నిర్ణయాలు ఆయా కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. కుటుంబ పెద్ద జైలుకు వెళ్లడంతో ఆర్థికంగా చితికిపోతున్నా యి. వాస్తవానికి ఏ సమాజంలో ఏ పరువు కోసం హత్యలు చేస్తున్నారో.. తరువాత అదే సమాజం ఆయా కుటుంబాలకు అండగా నిలబడని విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో యుక్తవయసులో ప్రేమే సర్వస్వం అంటూ జీవితంలో స్థిరపడక ముందే ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకొని ప్రాణాలు తీసుకుని, తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగుల్చుతున్నారు.ఉమ్మడి జిల్లాలోని పలు ఘటనలు మార్చి 27న పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటకు చెందిన సాయికుమార్ను అదే గ్రామానికి చెందిన ముత్యం సద య్య తన కుమార్తెను ప్రేమిస్తున్నాడని గొడ్డలితో నరికి చంపడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కేవలం కులాలు వేరన్న కా రణమే సాయిని చంపేలా చేసింది. ఇల్లందకుంట యువకుడు, నిర్మల్ జిల్లాకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెద్దల ఆమోదం ఉండదన్న ఆందోళనతో మార్చి 17న జమ్మికుంట పరిధిలోని రైల్వేస్టేషన్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మార్చి 6న చొప్పదండికి చెందిన ప్రేమికులు ఇంట్లోవారు తమ ప్రేమను అంగీకరించరన్న భయంతో కరీంనగర్లో స్నేహితుడి ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. 2024 ఏప్రిల్లో తాను అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కులాంతర వివాహం చేసుకుని వెళ్లిపోయిందన్న బాధతో సిరిసిల్ల జిల్లాలో ఓ తండ్రి తన కుమార్తెకు పిండ ప్రదానం చేశాడు. తమ ఆశలను అడియాశలు చేసిన కూతురు మరణించిందని ఫ్లెక్సీ పెట్టించడం సంచలనంగా మారింది. 2023 నవంబరులో సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలానికి చెందిన ప్రేమికులు విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు. 2023 ఆగస్టులో కోరుట్ల పట్టణంలో తన ప్రియుడితో పరారయ్యే క్రమంలో ప్రియురాలు తన అక్కనే హత్య చేసి పరారవడం కలకలం రేపింది. 2021 ఆగస్టులో మంథనికి చెందిన ఓ ప్రేమజంటపై యువతి తండ్రి హేయంగా దాడి చేశాడు. ఈ దాడిలో ప్రేమికులు తృటిలో చావు నుంచి తప్పించుకున్నారు. 2017లో మంథనిలో మధుకర్ అనే దళిత యువకుడి అనుమానాస్పద మరణం కూడా పరువుహత్యగా ప్రాచుర్యం పొందింది. అనుమానాస్పద మరణం అని పోలీసులు, ప్రి యురాలి బంధువులే చంపారని మధుకర్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. దళితసంఘాలు ధర్నా చేయడంతో మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. అప్పట్లో ఇది జాతీయస్థాయిలో చర్చానీయాంశంగా మారింది. ఈ కేసు ఇంకా తేలాల్సి ఉంది. 2016లో తిమ్మాపూర్లోని ఓ గుడిలో ప్రేమ వివాహం చేసుకునేందుకు పీటల మీద కూర్చున్న జంటపై యువతి బంధువులు దాడి చేశారు. పెళ్లికూతురు కళ్లముందే పెళ్లి కొడుకును విచక్షణా రహితంగా పొడిచి చంపడం కలకలం రేపింది. -
విద్యుత్ తీగను పట్టుకొని వ్యక్తి ఆత్మహత్య
ధర్మపురి: వెన్ను నొప్పి భరించలేక మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ తీగను పట్టుకొని గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఉదయ్కుమార్ తెలిపారు. రాయపట్నం గ్రామానికి చెందిన గొల్ల సత్తయ్య(48) ఐదేళ్లుగా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ఆ బాధ భరించలేక ఆత్మహత్య శరణ్యమని భావించి ఇంటి ఎదుట ఉన్న ట్రాన్ఫ్ఫార్మర్ వైరును పట్టుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విద్యుదాఘాతానికి గురైన కూలీలు పెద్దపల్లిరూరల్: చీకురాయి గ్రామ సమీపంలో కొనసాగుతున్న రైల్వేలైన్ బైపాస్ పనులు చేస్తున్న బిహార్కు చెందిన ఇద్దరు వలస కూలీలు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ కూలీలు గోవింద్కుమార్, బ్రిజేశ్కుమార్ను సదరు కాంట్రాక్టర్ గోప్యంగా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాంట్రాక్టర్ తన నిర్లక్ష్యాన్ని బయటకు పొక్కకుండా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తోంది. వైరస్తో కోళ్ల మృతిగంగాధర: గంగాధర మండలంలోని లక్ష్మిదేవిపల్లి శివారులోని కోళ్లఫారంలో వైరస్సోకి శుక్రవారం వందలాది కోళ్లు మృతి చెందాయి. వాతావరణంలో మార్పులతో పాటు, ఆర్డీ వైరస్తో కోళ్లు మృతి చెందుతున్నాయని ఫారం యజమాని ఇప్పలపల్లి నర్సయ్య పేర్కొన్నాడు. ఇప్పటి వరకు ఐదారువేల కోల్లు మృతి చెందాయన్నాడు. ఐఎల్టీ, వీవీఎన్డీ వైరస్ సోకడంతో ప్రస్తుతం కోళ్లు మృతి చెందుతున్నాయని పశువైద్యాధికారి సందీప్రెడ్డి తెలిపారు. కోరుట్లలో సినీ ఫక్కీలో చోరీకోరుట్ల: పట్టణంలోని అయిలాపూర్ రోడ్డుకు ఎదురుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం సినీ ఫక్కీలో జరిగిన ఘటనలో దుండగులు రూ.1.50 లక్షలు చోరీ చేసి బైక్పై పారిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. అయిలాపూర్కు చెందిన చింతకింది శ్రీహరి శుక్రవారం బ్యాంకు నుంచి రూ,1.50 లక్షలు డ్రా చేసి తన బైక్లోని ట్యాంక్ కవర్ ఉంచాడు. తను పార్క్ చేసిన బైక్ వద్ద మరో బైక్ ఉండటంతో బైక్ను జరిపేందుకు ప్రయత్నించే క్రమంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి రూ.100 నోటును పడవేశాడు. మీనోటు పడిపోయింది చూడట్లేదా? అని శ్రీహరితో అనటంతో ఆ వంద నోటు తీసుకునేందుకు శ్రీహరి కిందికి వంగాడు. అదే క్రమంలో బైక్ ట్యాంకు కవర్లో ఉన్న రూ.1.50 లక్షల నగదును ఇద్దరు దుండగులు తీసుకొని బైక్ పై పారిపోయారు. దుండగులు పారిపోతున్న దృశ్యాలు పట్టణంలోని సీసీ కెమెరాల్లో కనిపించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
25 రోజులకు ఇంటికి చేరిన మృతదేహం
గన్నేరువరం: గల్ఫ్లో మృతి చెందిన లింగంపల్లి మొండయ్య మృతదేహం 25రోజులకు శుక్రవారం స్వగ్రామానికి చేరుకుంది. మండలంలోని గునుకులకొండాపూర్ గ్రామానికి చెందిన లింగంపల్లి మొండయ్య 17ఏళ్లుగా గల్ఫ్ వెళ్తున్నాడు. ఆనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 3వ తేదీన అక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించాలని కొడుకు క్రాంతి, గ్రామ మాజీ సర్పంచ్ సొల్లు అజయ్వర్మ, రజక సంఘం యూత్ రాష్ట్ర అధ్యక్షుడు దుబ్బాక రమేశ్ మార్చి 5న కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ని కలిశారు. ఆయన చొరవతో 25రోజుల నిరీక్షణ అనంతరం మృతదేహం శుక్రవారం గ్రామానికి చేరుకుంది. దీంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి భార్య రేణుక, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. అంత్యక్రియలకు గ్రామస్తులతో సమీప గ్రామ ప్రజలు తరలివచ్చారు. -
ఆటోలో పురుడు పోసిన 108 సిబ్బంది
కోల్సిటీ(రామగుండం): పురిటి నొప్పులతో తల్లడిల్లుతున్న ఓ గర్భిణికి సకాలంలో పురుడు పోశారు 108 సిబ్బంది. సప్తగిరికాలనీకి చెందిన బండి వెంకటేశ్ కూలీ పనులు చేసుకుంటున్నాడు. అతడి భార్య పద్మ నెలలు నిండు గర్భిణి. శుక్రవారం వేకువజామున పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆటోలో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే నొప్పులు అధికమమయ్యాయి. ఆమె తల్లడిల్లుతుండగా ఆందోళన చెందిన భర్త.. 108 సిబ్బందికి సమాచారం అందించారు. స్పందించిన ఈఎంటీ రవీందర్, పైలట్ రాజేందర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్లో తరలించే పరిస్థితి లేకపోవడంతో ఆటోలోనే గర్భిణాకి పురుడు పోశారు. ఆమె పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం శిశువుతోపాటు బాలింతను జీజీహెచ్ తరలించగా వైద్యులు శిరీష, శివరంజని చికిత్స అందించారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు 108 సిబ్బందిని అభినందించారు. -
రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందించాలి
● మంత్రి తుమ్మలను కలిసిన కవ్వంపల్లి ఇల్లంతకుంట(మానకొండూర్): రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందించాలని మా నకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారా యణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. శుక్రవారం సచి వాలయంలో కలిసి విన్నవించారు. కొడుకుకు కిడ్నీ ఇచ్చేందుకు తండ్రి నిర్ణయంమేడిపల్లి: భీమారం మండలం మన్నేగూడెంకు చెందిన మహేందర్కు కిడ్నీ ఇచ్చేందుకు తండ్రి నిర్ణయించుకున్నాడు. కిడ్నీ సంబంధిత సమస్యతో బాదపడుతున్న మహేందర్కు కిడ్నీ ఇచ్చేందుకు డోనర్ దొరకకపోవడంతో తన తండ్రి భూమయ్య కిడ్నీ ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో గ్రామస్తులు అభినందించారు. అయితే కిడ్నీ మార్పిడికి రూ.5లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో నిరుపేద కావడంతో మాజీ సర్పంచ్ తేలు నరేశ్ దృష్టికి విషయం తీసుకపోగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు విషయం తెలిపారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్సకు రూ.5లక్షలు ఎల్వోసీ మంజూరు చేయించి చికిత్సకు సహకరించారు. -
మీడియా కమిషన్ ఏర్పాటు చేయండి
● జర్నలిస్టుల సమస్యలను తక్షణం పరిష్కరించాలి ● టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్యవేములవాడ: రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంతోపాటు మీడియాలో వస్తున్న అనారోగ్యకర భాష నియంత్రణకు మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. పట్టణంలోని మున్నూరుకాపు సంఘం భవన్లో టీడబ్ల్యూజేఎఫ్ వేములవాడ నియోజకవర్గం మహాసభ శుక్రవారం జరిగింది. ఐఏఫ్ డబ్ల్యూజే కార్యదర్శి పులిపలుపుల ఆనందం, ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి విజయ్కుమార్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడితాడు బాపురావు, జిల్లా అధ్యక్షుడు పెరుక రవి, నేషనల్ కౌన్సిల్ మెంబర్ యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ నియోజకవర్గం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు వినతిపత్రం ఇవ్వాలని తీర్మానించారు. వేములవాడ నియోజకవర్గ కమిటీ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టస్ ఫెడరేషన్ వేములవాడ నియోజకవర్గం నూతన కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తొగరి కరుణాకర్, కార్యదర్శిగా సుంకరి నరేందర్, కోశాధికారిగా బొప్ప భిక్షపతి, ఉపాధ్యక్షులుగా అవధూత శ్రీధర్, కవ్వాల సురేందర్, ఎండీ షరీఫ్, సహాయ కార్యదర్శులుగా గొల్లపల్లి వేణు, కోటగిరి రాజశేఖర్, గోపు ప్రవీణ్, కార్యవర్గ సభ్యులుగా చల్లా రమేశ్, వాసం వెంకటస్వామి, ఎగుమంటి మూర్తిరెడ్డి, కళ్యాడపు వెంకటమల్లు, చక్రహరి దేవేందర్రాజు, మహమ్మద్ అబ్దుల్ రఫీక్, నడిగట్ల భిక్షపతి, సయ్యద్ షబ్బీర్లను ఎన్నుకున్నారు. -
కొదురుపాకలో దొంగతనం
● ఐదు తులాల బంగారం.. 24 తులాల వెండి చోరీబోయినపల్లి(చొప్పదండి): అంగన్వాడీ కేంద్రంలో కోడిగుడ్లు తెచ్చుకోవడానికి ఇంటికి గడియపెట్టి వెళ్తే తిరిగి వచ్చే సరికి దొంగతనం జరిగింది. ఎస్సై పృథ్వీధర్గౌడ్ తెలిపిన వివరాలు. కొదురుపాకకు చెందిన సట్ట జలజ కోడిగుడ్ల కోసం ఇంటికి గడియపెట్టి అంగన్వాడీ కేంద్రానికి వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లోని రెండు బీరువాల తలుపులు తెరిచి ఉన్నాయి. బీరువా వద్దకు వెళ్లి చూడగా అందులో ఉన్న తన అత్తమ్మ బంగారం కనిపించలేదు. గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 5 తులాల 9 గ్రాముల బంగారు నగలు, 24 తులాల వెండి ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సంఘటన స్థలాన్ని వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ పరిశీలించారు. ఫింగర్ప్రింట్, డాగ్ స్క్వాడ్ బృందంతో తనిఖీలు చేపట్టారు. -
రైల్వే హైట్గేజ్ను ఢీకొట్టిన ట్యాంకర్
● నిలిచిన వాహనాల రాకపోకలు కరీంనగర్రూరల్: తీగలగుట్టపల్లి రైల్వేగేట్ వద్ద పైన ఉన్న హైట్గేజ్కు చొప్పదండి నుంచి కరీంనగర్కు వస్తున్న రెడ్మిక్స్ ట్యాంకర్ తాకడంతో ఐరన్పోల్ విరిగిపోయింది. ఈ ఘటన ఉద యం 8 గంటలకు జరగగా.. వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఐరన్పోల్ విరిగి రోడ్డుపై వేలాడుతుండటంతో ట్రాఫిక్జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే క్రేన్సాయంతో మరమ్మతు చేసి అరగంట అనంతరం ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ఎలక్ట్రికల్ ట్రైన్లు నడిచేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్లైన్ రక్షణ కోసం హైట్గేజ్ ఏర్పాటు చేస్తారని రైల్వే అధికారులు తెలిపారు. ట్యాంకర్ డ్రైవర్ అవగాహన లేకుండా వేగంగా నడపడటంతో హైట్గేజ్ పోల్ విరిగిందని వివరించారు. ఒడిశా కార్మికుల తరలింపుజగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ శివారులోని ఇటుకబట్టీల్లో పనిచేస్తున్న ఒడిశా కార్మికులను శుక్రవారం జిల్లా కార్మిక శాఖ అధికారులు ప్రత్యేక బస్సుల్లో వారి రాష్ట్రానికి తరలించారు. సర్వేనంబర్ 437, 251లో కొంతమంది అక్రమ పట్టాలు పొంది భూమిని ఇటుకబట్టీల వ్యాపారులకు లీజుకు ఇచ్చారు. అధికారులు ఆ పట్టాలు రద్దు చేసి కొంత భూమిని స్వాధీనం చేసుకున్నారు. మరికొంత భూమిలో ఇటుక బట్టీలతో పాటు కార్మికుల నివాసాలు ఉండటంతో శుక్రవారం ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో 93మంది కార్మికులను బస్సుల్లో తరలించారు. రోడ్డు ప్రమాదంలో సింగరేణి ఉద్యోగి మృతి పెద్దపల్లిరూరల్: పట్టణానికి చెందిన ఎండీ అహమద్ (51) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారని బసంత్నగర్ ఎస్సై స్వామి తెలిపారు. అహమద్ ఈనెల 26న తన స్నేహితుడు శ్రీనివాస్తో బైక్పై విధులకు వెళ్తున్నాడు. ఈక్రమంలో పెద్దపల్లి మండలం రాఘవాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. వీరిని కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించి వైద్యచికిత్సలు చేయించారు. అహమద్ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలించి చికిత్స చేయిస్తుండగా శుక్రవారం మరణించాడు. మృతుడి భార్య జులేకబేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. బాలికను వేధించిన యువకుడికి రెండేళ్ల జైలుజగిత్యాలజోన్: మైనర్ బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంట బడి వేధించిన కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.25 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, ఫోక్సో కోర్టు ఇన్చార్జి జడ్జి జి.నీలిమ శుక్రవారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణారావు కథనం ప్రకారం.. కొడిమ్యాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన ఎండీ అంకూస్ ప్రేమిస్తున్నాంటూ వెంటపడ్డాడు. అసభ్యకరంగా ప్రవర్తిస్తూ బాలికను మానసికంగా వేధించాడు. దీంతో సదరు బాలిక కొడిమ్యాల పోలీస్స్టేషన్లో 2019లో ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్సై శివకృష్ణ కేసు నమోదు చేసుకుని, నిందితుడు అంకూస్ను అరెస్ట్ చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ అధికారులు కోర్టులో బలమైన సాక్ష్యాలను ప్రవేశపెట్టడంతో, సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం నిందితుడైన అంకూస్కు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.25 వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. -
కిలోమీటరు పొడవు.. 25 పిల్లర్లు
● పెద్దపల్లి–మంచిర్యాల జిల్లాల మధ్య వారధి పనులు షురూ ● గోదావరిపై మరో వంతెన నిర్మాణానికి రూ.125 కోట్లు మంజూరుమంథని: మంచిర్యాల – పెద్దపల్లి జిల్లా మధ్యలోని గోదావరి నదిపై మరో హైలెవల్ వంతెన పనులు మొదలయ్యాయి. ఇందుకోసం జిల్లాలోని మంథని సమీప గోదావరి నుంచి మంచిర్యాల జిల్లా శివ్వారం వరకు కిలోమీటరు పొడవుతో 25 పిల్లర్లతో వంతెన నిర్మించేందుకు ప్రభుత్వం రూ.125 కోట్లు ఇటీవల మంజూరు చేసింది. గత సంవత్సరం డిసెంబర్లో పెద్దపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ఇటీవల అటవీ, పర్యావరణ అనుమతులు వచ్చాయి. కాంట్రాక్ట్ దక్కించుకున్న ఏజెన్సీ.. నాలుగు రోజులుగా పనులు చేస్తోంది. ఈ వంతెన అందుబాటులోకి వస్తే.. రెండు జిల్లాల మధ్య దూర భారం తగ్గుతుంది. రెండు జిల్లాల్లో సంబరాలు మంథని సమీప గోదావరిపై వంతెన నిర్మాణం కోసం పెద్దపల్లి–మంచిర్యాల జిల్లాకు చెందిన ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో వారధి పనులు ప్రారంభం కావడంతో తమ కల నెరవేరబోతుందని సంబురం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి నుంచి మంచిర్యాల జిల్లా శివ్వారం, పౌనూరు, వేలాల, సోమన్పల్లికి వెళ్లేందుకు బస్సు మార్గంలో అయితే గోదావరిఖని, ఇందారం, టేకుమట్ల, శెట్పల్లి, కుందారం, కిష్టాపూర్ మీదుగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఇందుకోసం సుమారు 60 కి.మీ. – 70 కి.మీ. వరకు ప్రయాణిస్తున్నారు. అలాగే చెన్నూర్కు గోదావరిఖని, జైపూర్ మీదుగా ప్రయాణం చేస్తున్నారు. మరోవంతెన నిర్మాణం పూర్తయితే మంథని నుంచి శివ్వారం ఆరు కిలో మీటర్లు, చెన్నూర్ వరకు 26 కిలో మీటర్లు మాత్రమే దూరం ఉంటుంది. రెండు జిల్లాలకు చెందిన అనేక మంది రైతుల పంట పొలాలు మంచిర్యాల జిల్లావైపు ఉన్నాయి. జాతీయ రహదారులకు అనుసంధానం గోదావరిపై మరోవంతెన నిర్మాణం పూర్తయితే మంచిర్యాల– పెద్దపల్లి జిల్లాకు ప్రధానం చెన్నూరు పట్టణానికి దూరం తగ్గడమే కాకుండా జాతీయ రహదారులకు సమీపంలోనే అనుసంధానం అవుతుంది. అంతర్ రాష్ట్ర వంతెన నిజామాబాద్–జగ్దల్పూల్ జాతీయ రహదారి కేవలం 25 కిలో మీటర్ల దూరంలోనే ఉంటుంది. అంతేగాకుండా అన్నారం బ్యారేజీ, వంతెన 22 కి.మీ., అలాగే కొత్తగా నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవేకు పది కి.మీ. ధ్యలోనే వంతెన నిర్మిస్తున్నారు. అలా రెండు జాతీయ రహదారులకు మధ్య గోదావరి నదిపై మంథని– శివ్వారం వంతెన పూర్తయితే జిల్లా, రాష్ట్రాల మధ్య రాకపోకలు మెరుగుకానున్నాయి. మంచిర్యాల జిల్లా వేలాల కేవలం ఆరు కి.మీ. దూరంలోనే ఉంటుంది. దీంతో పుణ్యక్షేత్రానికి జిల్లానుంచి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆలయాల సమీపంలోనే.. గోదావరి తీరంలోని శ్రీగౌతమేశ్వర, రామాలయం, సరస్వతీ దేవాలాయలకు అటు వైపుగా వంతెన అప్రోచ్ రోడ్డు నిర్మించనున్నారు. గోదావరిపై నిర్మించే వంతెన పనులు కొత్త శ్మశానవాటిక పక్కనుంచి, దేవాలయాలయ సమీపం నుంచి పంట పొలాల మీదుగా, మంథని నుంచి గోదావరి వచ్చే చిన్నకల్వర్లు వద్ద కలుపనున్నారు. భూసేకరణ సమస్య పెద్దగా లేకుండా వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు.నిబంధలనకు లోబడి పనులు మంథని నుంచి శివ్వారం వరకు వంతెన నిర్మాణానికి అగ్రిమెంట్ పూర్తిచేసుకున్న ఏజెన్సీ ర్యాంపు పనులు మొదలు పెట్టింది. అన్నిరకాల పరీక్షలు, డిజైన్ పూర్తయిన తర్వాత పిల్లర్ల నిర్మాణం చేపడతారు. నిబంధనలకు లోబడి పనులు నిర్వహిస్తారు. – జఫార్, డీఈఈ, ఆర్అండ్బీ, మంథని అభివృద్ధికి ఆస్కారం మంథని వద్ద గోదావరి నదిపై వంతెన నిర్మాణంతో రెండు జిల్లాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. అటువైపు నుంచి ఆ జిల్లావాసుల వివిధ పనులు కోసం మన జిల్లాకు రావడం మొదలవుతుంది. దీంతో మంథనిలో వ్యాపార, వాణిజ్య వ్యవస్థ మరింత బాగుపడుతుంది. సమీపంలో ఉన్న శ్రీపాదకాలనీకి మేలు జరుగుతుంది. – బెజ్జంకి డిగంబర్, శ్రీపాదకాలనీ, మంథని -
రైస్మిల్లులో టాస్క్ఫోర్స్ అధికారుల సోదాలు
మంథని: సూరయ్యపల్లి రైస్మిల్లులో పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ అధికారు లు శుక్రవారం సోదాలు నిర్వహించారు. 2022–23 సంవత్సరానికి సంబంధించి సీఎమ్మార్ ప్రకారం రాష్ట్రంలోని పలు రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలపై అనుమానాలు ఉన్న జాబితా ఆధారంగా మంథనికి చేరుకున్నారు. సూరయ్యపల్లి రైస్మిల్లులో తనిఖీలు చేశారు. మిల్లులో 41,365 క్వింటాళ్ల ధాన్యం నిల్వ లు ఉండాల్సి ఉండగా మిల్లులో ధాన్యం లేదని గుర్తి ంచారు. తాను లీజు తీసుకున్న గంగాపురి సమీపంలో ధాన్యం నిల్వ ఉందని యజమాని చెప్పడంతో అధికారులు అక్కడకు వెళ్లి పరిశీలించారు. అక్కడ 9,689.08క్వింటాళ్ల ధాన్యం మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. నిర్దేశించిన ప్రకారం ప్రభుత్వానికి చెల్లింపులు చేయాల్సి ఉంటుందని, కానీ, అలా చేయక పోవడంతో సోదాల్లో వెలుగుచూసిన అంశాలను కమిషనర్కు నివేదిస్తామని స్పెషల్ ఆఫీసర్ లక్ష్మారెడ్డి తెలిపారు. రూ.కోట్ల విలువైన ధాన్యం అందుబాటులో లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పౌర సరఫరాల శాఖ అధికారులు స్ఫష్టత ఇవ్వాల్సి ఉంది. తనిఖీల్లో ఓఎస్డీ ప్రభాకర్, ఎస్ఐ జంగయ్య పాల్గొన్నారు. -
రాత్రివేళ.. పీహెచ్సీలో అందని వైద్యం
● తేలు కుట్టడంతో ఆస్పత్రికి వెళ్లిన బాధితుడు ● తలుపు తీయని సిబ్బంది ● 108లో సిరిసిల్లకు తరలింపుకోనరావుపేట(వేములవాడ): రాత్రి వేళ ఆపదలో వస్తే బాధితులకు వైద్యసేవలు అందడం లేదు. మండల కేంద్రానికి చెందిన పని గంగారాంకు గురువారం రాత్రి 10 గంటల సమయంలో తేలు కుట్టింది. వెంటనే మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా తలుపులు మూసి ఉన్నాయి. ఎంత పిలిచినా సిబ్బంది బయటకు రాకపోవడంతో.. నొప్పి తీవ్రమైంది. దీంతో 108 అంబులెన్స్లో సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. ఈ విషయమై వైద్యాధికారి వేణుమాధవ్ను వివరణ కోరగా రాత్రి వేళ మద్యం సేవించి వచ్చి విధులకు ఆటంకం కలిగిస్తున్నారన్నారు. గురువారం రాత్రి కూడా కొందరు మద్యం సేవించి వచ్చారని, వారిని వెళ్లగొట్టి తలుపులు పెట్టుకున్నట్లు తెలిపారు. మళ్లీ తలుపులు తడితే వారే కావచ్చు అని భ్రమపడ్డట్లు చెప్పారు. విధులపై నిర్లక్ష్యం వహించిన ఏఎన్ఎంకు మెమో జారీ చేశామన్నారు. ఆస్పత్రిలో 24 గంటలు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. -
ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ మృతి
సైదాపూర్: మండలంలోని జాగీర్పల్లికి చెందిన పోలుదాసరి సమ్మయ్య(57) ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. సైదాపూర్ ఎస్సై తిరుపతి వివరాల ప్రకారం.. జాగీర్పల్లికి చెందిన పోలుదాసరి సమ్మయ్య ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన కామని చంద్రయ్యకు చెందిన మొక్కజొన్న లోడ్ను తీసుకుని గురువారం ఉదయం మొలంగూర్ వైపు బయల్దేరాడు. సోమారం గ్రామ శివారులో బహుర్బూమికని ట్రాక్టర్ను ఆపాడు. కాసేపటికి ట్రాక్టర్ న్యూట్రల్ అయ్యి ముందుకు కదిలింది. దీంతో వెంటనే ట్రాక్టర్ ఎక్కి ఆపేందుకు ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పెద్దటైరు కింద పడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమ్మయ్య భార్య జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. వివాహిత ఆత్మహత్యరామగుండం: మతిస్థిమితం సరిగా లేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం పట్టణంలోని సీ–కాలనీ జెన్కో క్వార్టర్లో జరిగింది. ఎస్సై సంధ్యారాణి తెలిపిన వివరాలు.. జెన్కో ఉద్యోగి తాటిపెల్లి కృష్ణమూర్తి భార్య పద్మ (44 కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్టుకరీంనగర్క్రైం: గంజాయి తరలిస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన ముగ్గురిని కరీంనగర్ వన్టౌన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వన్టౌన్ సీఐ బిల్ల కోటేశ్వర్ వివరాల ప్రకారం.. బిహార్కు చెందిన నీరజ్కుమార్, సోనుకుమార్, దిలేంధర్కుమార్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటూ కూలీ పని చేసుకుంటున్నారు. ముగ్గురు కలిసి 1.180 కేజీల గంజాయి తీసుకుని వెళ్తుండగా అంబేద్కర్ స్టేడియం వద్ద పోలీసుల కంట పడ్డారు. పారిపోయే ప్రయత్నం చేయగా వెంటనే పట్టుకున్నారు. వారిని అరెస్టు చేసి, గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఎస్సైలు రాజన్న, భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. సైబర్ నేరస్తుడి రిమాండ్గోదావరిఖని(రామగుండం): ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ పేరిట మోసానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్క్రైం ఏసీపీ వెంకటరమణ తెలిపిన వివరాలు.. గోదావరిఖనిలో ఉంటున్న ఓ ప్రైవేట్ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకుని గతేడాది నవంబర్లో రూ.57.13లక్షలు కోల్పోయాడు. సైబర్క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా అహుల్యానగర్ మండలం, నపవాడి గ్రామానికి చెందిన శుభం నవనాథ్షెల్కేను పట్టుకుని కేసు నమోదు చేశారు. నిందితుడు జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వాట్సప్ లింక్ పంపి సైబర్మోసానికి పాల్పడినట్లు వెల్లడించారు. మొదట్లో కొన్ని డబ్బులు పెడితే డబుల్ వచ్చినట్లు ఆన్లైన్ ట్రేడింగ్ ఖాతాలో చూపించడంతో బాధితుడు నమ్మి పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టి మోసపోయాడని పేర్కొన్నారు. నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సైబర్క్రైం ఏసీపీ పేర్కొన్నారు. -
బీసీ కులాల స్థితిగతుల కోసమే పర్యటన
జగిత్యాల: బీసీ కులాల స్థితిగతులను తెలుసుకునేందుకు జిల్లాల్లో పర్యటిస్తున్నామని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు. గురువారం జగిత్యాల జిల్లాలోని మెడికల్ కళాశాల గెస్ట్ హౌస్లో విలేకరులతో మాట్లాడారు. బీసీ కులాల్లోని వీరముష్ఠి, పిచ్చకుంట్ల, దొమ్మర కులస్తులు విద్యాలయాలు, ఉద్యోగస్థలాల్లో కులం పేరు పిలిపించుకునేందుకు ఇబ్బంది పడుతున్నామని, ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలని కోరాయని, వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. వారి కులాల మార్పు కోసం ఇప్పటికే ప్రతినిధులతో చర్చించామని, ఈనెల 29న ప్రభుత్వానికి నివేదిస్తామని పేర్కొన్నారు. రాజీవ్ యువ వికాస్ పథకాని పేదలను గుర్తించి ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మీ, బీసీ సంక్షేమ శాఖ అధికారి కల్పన పాల్గొన్నారు. కమిషన్కు వినతుల వెల్లువ గాంధీనగర్లో వీరముష్ఠి, దొమ్మర, పిచ్చకుంట్ల కులాల వారు కమిషన్ను మహిళలు కలిశారు. తమ కులం పేరు మార్చాలని కోరారు. అనంతరం మేరు, బీసీసంక్షేమ, నాయీబ్రాహ్మణ, బీసీ హక్కుల సాధన కమిషన్ నాయకులు వినతిపత్రాలు సమర్పించారు. అనంతరం కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందించారు. నర్సింహుడిని దర్శించుకున్న చైర్మన్ ధర్మపురి: శ్రీలక్ష్మినృసింహస్వామిని బీసీ కమిషనర్ సభ్యులు దర్శించుకున్నారు. వారికి దేవస్థానం పక్షాన పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్ స్వామివారి శేషవస్త్రం కప్పి ఫొటో, ప్రసాదాలు అందించారు. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్