హార్వెస్టర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు | - | Sakshi
Sakshi News home page

హార్వెస్టర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

Apr 10 2025 12:29 AM | Updated on Apr 10 2025 12:29 AM

హార్వెస్టర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

హార్వెస్టర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

తిమ్మాపూర్‌: మండలంలోని ఇందిరానగర్‌ గ్రామంలోని సాయిబాబా ఆలయం సమీపంలో రాజీవ్‌ రహదారిపై బుధవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు హార్వెస్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సులోని పలువురితోపాటు, హార్వెస్టర్‌పై ఉన్న ఇద్దరు గాయపడ్డారు. డ్రైవర్‌ వాహనంలోనే ఇరుక్కుపోవడంతో పోలీసుల రెండు గంటలు శ్రమించి బయటకు తీశారు. ఎల్‌ఎండీ పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం రాత్రి 12:40 గంటల సమయంలో ఇందిరానగర్‌ గ్రామ సాయిబాబా గుడివద్ద కరీంనగర్‌ వైపు వెళుతున్న హార్వెస్టర్‌ను హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. దీంతో హార్వెస్టర్‌ రోడ్డు అవతలివైపుదూసుకెళ్లి బోల్తాపడింది. బ్లేడ్‌లు మాత్రం బస్సులు ఇరుక్కుపోయాయి. ఈ ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో బస్సులోని పలువురితోపాటు హార్వెస్టర్‌పై ఉన్న ఇద్దరు గాయపడ్డారు. హార్వెస్టర్‌ డ్రైవర్‌ వాహనంలో ఇరుక్కుపోయాడు. స్థానికులు వెంటనే 108, ఎల్‌ఎండీ పోలీసులు సమాచారం అందించారు. దాదాపు 2 గంటలకు పైగా పోలీసులు, గ్రామస్తులు, హైవే పెట్రోల్‌ సిబ్బంది, మూడు 108 అంబులెన్స్‌ సిబ్బంది శ్రమించి బయటకు తీయగా.. మోకాలు విరిగి తీవ్ర గాయాలు అయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివేక్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement