Karimnagar District Latest News
-
పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించండి: డీఈవో
చొప్పదండి: ప్రభుత్వ పాఠశాలలను బలోపే తం చేసేందుకు పిల్లలను చేర్పించాలని డీఈ వో శ్రీరామ్ మొండయ్య తల్లిదండ్రులను కోరా రు. చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఎస్జీటీ యూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచారరథాన్ని డీఈవో మొండయ్య, ఎంఈవో పి.మోహన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఇప్ప శ్రీని వాస్రెడ్డి, ఎస్జీటీయూ జిల్లా అధ్యక్షుడు వూ కంటి విజేందర్రెడ్డి జెండా ఊపి ప్రారంభించా రు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ పాఠశాలల్లో ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పించిందని తెలిపారు. తల్లిదండ్రులు పిల్ల లను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరా రు. సాంబయ్యపల్లి, గుమ్లాపూర్, చొప్పదండి, భూపాలపట్నం, వెదురుగట్ట గ్రామాల్లో ప్రచా రం నిర్వహించారు. జిల్లా సెక్టోరియల్ ఆఫీసర్ అశోక్రెడ్డి, రుక్మాపూర్ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీధర్, కట్టెకోల తారలక్ష్మణ్, శ్రీనివాస్, రాములు, శాంతికిరణ్ పాల్గొన్నారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయాలికరీంనగర్: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని, దేశంలో జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్లను ఖండించాలని, మావోయిస్టులతో శాంతిచర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్లోని తెలంగాణచౌక్లో నల్లజెండాలు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్రెడ్డి మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిస్టులను హతమార్చడమే లక్ష్యంగా ముందుకు సా గుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును మేధావులు, ప్రజలు, ప్రజాసంఘాలు ముందుకు వచ్చి వ్యతిరేకించాలని కోరారు. మావోయిస్టులతో చర్చలు జరపాలని, లేకుంటే వామపక్షా ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కా ర్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గుడికందుల సత్యం, గిట్ల ముకుందరెడ్డి, సీపీఐ, సీ పీఎం జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సభ్యులు మల్లయ్య, రాజు, బుచ్చన్నయాదవ్, రమేశ్, నాగమణి, రమేశ్, యుగంధర్, అంజలి పాల్గొన్నారు. లీకేజీకి అడ్డుకట్టకరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని కట్టరాంపూర్ నాగన్న చౌరస్తా వద్ద నెలకొన్న లీకేజీకి అధికారులు అడ్డుకట్ట వేశారు. పైప్లు, జాయింట్లలో లీకేజీతో ఇరవై రోజులకు పైగా భారీగా రోడ్డుపై వరద పారుతుండడం తెలిసిందే. దీనిపై ‘సిటీలో లీకేజీ వరద’ పేరిట ఈ నెల 4వ తేదీన ‘సాక్షి’లో వచ్చిన కథనానికి నగరపాలకసంస్థ అధికారులు స్పందించారు. 32, 12, తదితర డివిజన్లకు నీళ్లు అందించే ప్రధాన పైప్లైన్ కావడంతో, లీకేజీతో భారీగా నీళ్లు వృధాగా పోయాయి. ఫలితంగా నిత్యం కట్టరాంపూర్ నుంచి డ్యాం వైపు వెళ్లే మెయిన్ రోడ్డు వరదమయంగా మారింది. శనివారం పైప్లైన్ ను సరిచేసి, వరదతో దెబ్బతిన్న టైల్స్పై మట్టి వేసి చదును చేశారు. సమస్య మళ్లీ తిరగబెట్టకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు. పవర్కట్ ప్రాంతాలుకొత్తపల్లి: కొత్త డీటీఆర్ ఏర్పాటు పనులు చేపడుతున్నందున ఆదివారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 11 కేవీసీసీ ఫీడర్ పరిధిలోని ముకరంపుర, బస్టాండ్, వన్టౌన్ పోలీస్స్టేషన్, కలెక్టర్ ఆఫీసు కార్యాలయాల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు 11కేవీ ఎల్ల మ్మ ఫీడర్లో ఆటోనగర్, బీఎస్ఎన్ఎల్ టవర్ ఏరియా, మల్లికార్జునకాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–1 ఏడీఈ పి.శ్రీనివాస్ తెలిపారు. -
‘విద్యావాహిని’తో ప్రచార బాట
ప్రచార రథంతో ప్రచారం నిర్వహిస్తున్న ఎంఈవో ప్రభాకర్రావు, ఉపాధ్యాయులు కరీంనగర్: ‘మా బడిలో మంచి తరగతి గదులున్నాయి. ప్రయోగాలు చేసేందుకు సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, ఆత్మరక్షణకు కరాటే, ఆరోగ్యానికి పౌష్టికాహారం అందిస్తున్నాం. మీ పిల్లలను మా బడిలో చేర్పించండి’ అంటూ కరీంనగర్ జిల్లా గంగాధర ఎంఈవో ప్రభాకర్రావు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. బడిబాటకు ముందు సొంతంగా విద్యావాహిని పేరిట ప్రచారం రథం ఏర్పాటు చేసి, ఆ వాహనానికి బడిలో కల్పిస్తున్న వసతుల ఫొటోలు అంటించి, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఉపాధ్యాయులను వెంటేసుకుని రోజుకో గ్రామం తిరుగుతూ బడిబాటను కొనసాగిస్తున్నారు. మండలంలోని 33 గ్రామాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నట్లు ప్రభాకర్రావు తెలిపారు. కలెక్టర్పమేలా సత్పతి స్ఫూర్తితో సొంత ఖర్చులతో వాహనం సమకూర్చి బడిబాటలో భాగంగా ప్రచార జాత నిర్వహిస్తున్నారు. ప్రభాకర్రావు గతంలోనూ జిల్లా, రాష్ట్ర, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్నారు. ప్రత్యేక ప్రచార జాత నిర్వహిన్న ఎంఈవోను ఇటీవలే మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు సత్కరించారు. ప్రభాకర్రావును స్ఫూర్తిగా తీసుకోవాలని ఉపాధ్యాయ లోకానికి పిలుపునిచ్చారు. -
పాటల రూపంలో వృత్తి ధర్మాన్ని ఆచరిస్తూ..
రామగుండం: విద్యార్థులను ఆకట్టుకునే రీతిలో వివిధ అంశాలపై పాటల రూపంలో రీల్స్ తీసి పేరెంట్స్, విద్యార్థుల గుండెల్లో స్థానం పదిల పర్చుకున్నారు రామగుండం జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం అజ్మీరా శారద. బడిబాట కార్యక్రమాన్ని ఉద్దేశించి పాట రాసి రీల్స్ షూట్ చేయడం నెట్టింటా వైరల్గా మారింది. దీనిని వందేమాతరం ఫౌండేషన్ గుర్తించి బహుమతి ప్రకటించారు. నైతిక విలువలతో కూడిన బోధన, విద్య గొప్పదనం ప్రతిబింబించేలా పాట రాసి ఆలపించడం ఆకట్టుకుంది. ‘బడి బయట ఏముందిరా చిన్నా.. బడిలోనే ఆటుందిరా చిన్నా’.. అంటూ చేసిన రీల్స్ ప్రతీ ఒక్కరిని ఆలోచింపజేశాయి. ఇలా సందర్భాన్ని బట్టి ఇప్పటి వరకు 15 పాటలు రాసినట్లు హెచ్ఎం తెలిపారు. ప్రత్యేక వాహనంతో..మానకొండూర్: బడిబాటలో ఎంఈవో మధుసూదనాచారి ప్రత్యేక వాహనం, మైక్ సెట్ ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తూ వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈనెల 5 నుంచి ప్రచార రథంతో ఆయా గ్రామాల్లో తిరుగుతూ పాటల ద్వారా బడిబాట ఉద్దేశాన్ని వివరిస్తున్నారు. ఉపాధ్యాయులు ప్రచార రథం వెంట, ఇంటింటా ప్రచారం నిర్వహించి పిల్లలు ప్రభుత్వ బడిలో చేరేలా కృషి చేస్తున్నారు. -
ఫలితాలే ప్రామాణికంగా..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గత విద్యాసంవత్సరంలో వచ్చిన ర్యాంకులు, ఉత్తీర్ణతశాతంపై ఎంఈవో కృష్ణహరి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కరపత్రాలు, బ్యానర్లు, ప్లకార్డులు, వాల్ పోస్టర్లు తయారు చేయించి గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ.. పిల్లలను సర్కార్ బడుల్లో చేర్పించాలని కోరుతున్నారు. తమపై నమ్మకంతో చేర్పిస్తే వారిని నిష్ణాతులుగా తయారు చేస్తామని తల్లిదండ్రులకు భరోసా ఇస్తున్నారు. దీంతో మండలవ్యాప్తంగా 105 మంది విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ బడుల్లో చేరడానికి అంగీకార పత్రాలు రాసిచ్చారు. ఎంఈవో ముందుచూపుతో.. గత విద్యా సంవత్సరం పది ఫలితాలే ప్రామాణికంగా ఉపాధ్యాయులు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. మండలంలోని దుమాల ఉన్నత పాఠశాలకు చెందిన రామిండ్ల అర్పిత 574 మార్కులతో జిల్లాస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. అలాగే రాచర్లగొల్లపల్లి జెడ్పీహెచ్కు చెందిన పి.ప్రణవి 564 రెండోస్థానంలో నిలవగా, రాచర్లబొప్పాపూర్ స్కూల్కు చెందిన రిషిక, శ్రీవర్షిని 562, రాచర్లతిమ్మాపూర్కు చెందిన నాగవర్షిణి 559, వెంకటాపూర్కు చెందిన సురేఖ 559 మార్కులు సాధించారు. ఇలా మండలవ్యాప్తంగా 450మంది పదో తరగతి పరీక్షలు రాయగా, వారిలో 120 మంది 500లకు పైగా మార్కులు సాధించడం విశేషం. దీన్ని ఆధారంగా చేసుకుని ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఫలితాల కరపత్రాల ద్వారా ఇంటింటా ప్రచారం చేయడం కలిసివస్తోంది. ఎంఈవో ముందుచూపుతో వినూత్న ఫలితాలను చూసి సర్కార్ బడిలో చేరాలని చేసిన ప్రయత్నం ఫలించింది. ఇప్పటికే 105 మంది ప్రవేశాలకు అంగీకరించారు. వేసవి సెలవులు కలిసొచ్చాయి వేసవి సెలవులు కలిసొచ్చాయి. సెలవుల్లో నాతో పాటు ఉపాధ్యాయులు ఇంటికి పరిమితం కాకుండా కరపత్రాలు, వాల్పోస్టర్లు, ప్లకార్డులు, బ్యానర్లు ముద్రించి ఇంటింటా ప్రచారం చేయడంతో మంచి స్పందన వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో వేసవి శిబిరాల ఏర్పాటు కూడా కొత్త విద్యార్థుల చేరికకు కారణమైంది. రానున్న రోజుల్లో ఇంకా మెరుగైన ఫలితాలే లక్ష్యంగా పని చేస్తాం. – కృష్ణహరి, ఎంఈవో, ఎల్లారెడ్డిపేట -
చెట్లపసరు తాగి మహిళ మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన నేవూరి లలిత(50) చెట్లపసరు తాగి అస్వస్థతకు గురై శుక్రవారం రాత్రి మృతిచెందింది. మృతురాలి కుమారుడు నేవూరి కళ్యాణ్ ఫిర్యాదుతో పోలీసులు శనివారం కేసు నమోదు నమోదు చేశారు. ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాలు. లలిత కొంతకాలంగా బీపీ, షుగర్తో బాధపడుతోంది. ఈక్రమంలో కుటుంబ సభ్యులు గుర్తుతెలియని వ్యక్తి వద్ద చెట్లపసరు తాగించారు. దీంతో అస్వస్థతకు గురైన లలితను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలికి భర్త అశోక్రెడ్డి, కుమారుడు కళ్యాణ్ ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో మేసీ్త్ర ఆత్మహత్యముస్తాబాద్(సిరిసిల్ల): ఆర్థిక ఇబ్బందులు.. అనారోగ్య సమస్యలు భరించలేక ఓ మేసీ్త్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముస్తాబాద్ ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. ముస్తాబాద్ మండల కేంద్రానికి పెరుమాండ్ల కృష్ణ(50) నాలుగేళ్ల క్రితం కూతురు పెళ్లి కోసం రూ.4లక్షలు అప్పు చేశారు. మేసీ్త్ర పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. పనులు సరిగా లేవు. ఈక్రమంలోనే జరిగిన రోడ్డు ప్రమాదంలో చేయి విరిగింది. అప్పులు తీరే మార్గం కనిపించక గతంలో పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శనివారం వేకువజామున ఇంట్లో నుంచి వెళ్లిన కృష్ణ.. తెర్లుమద్దిచౌరస్తా వద్ద చెట్టుకు ఉరివేసుకున్నాడు. మృతుని భార్య లక్ష్మి, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు కన్నీరుమున్నీరుగా విలపించారు. భార్య లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొండగట్టులో యువకుడి హత్య?● వివాహ వేడుకల్లో వివాదం ● హత్య చేసి, పూడ్చిపెట్టినట్లు ప్రచారం ● విచారణ చేపట్టిన పోలీసులు? మల్యాల: మల్యాల మండలంలోని ముత్యంపేట (దిగువ కొండగట్టు)కు చెందిన ఓ యువకుడిని స్థానిక యువకులు హత్య చేసినట్లు సమాచారం. ఈనెల 2న ఓ వివాహ వేడుకల్లో జరిగిన వివాదంతో సుమారు 40కి పైగా దొంగతనాల కేసుల్లో నిందితుడైన యువకుడిని దాదాపు 10మంది యువకులు కలిసి హత్య చేసి, పూడ్చిపెట్టినట్లు కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది. దీంతో శనివారం రాత్రి మల్యాల పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెల్సింది. వారిచ్చిన సమాచారం మేరకు సదరు యువకుడిని పూడ్చిపెట్టినట్లు భావిస్తున్న స్థలాన్ని ఎస్సై నరేశ్కుమార్, సీఐ నీలం రవి పరిశీలించారు. పూర్తి వివరాలను ఆదివారం వెల్లడించనున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘అగ్రికల్చర్ పాలిటెక్నిక్’ నోటిఫికేషన్
జగిత్యాలఅగ్రికల్చర్: పదో తరగతి పూర్తయిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అగ్రికల్చర్ పాలిటెక్నిక్లు వరంగా మారాయి. రెండేళ్ల కోర్సు చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఉండడంతో ఇటీవల డిమాండ్ పెరిగింది. ఈ కోర్సులు చేసిన తర్వాత ఉన్నత విద్యాభ్యాసం చేయాలంటే ఎంసెట్తో సంబంధం లేకుండా బీఎస్సీ(అగ్రికల్చర్) కోర్సులో చేరవచ్చు. డిప్లొమా చేసినవారికి బీఎస్సీ అగ్రికల్చర్లో 15 శాతం సీట్లు రిజర్వ్ చేస్తారు. అయితే, వీరు డిప్లొమా తర్వాత అగ్రిసెట్ పరీక్ష రాయాలి. సీట్ల వివరాలు దరఖాస్తులను బట్టి సీట్లను కౌన్సెలింగ్ పద్ధతిలో భర్తీ చేస్తారు. రెండేళ్ల అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలు.. 9 ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్లో 240, మూడు ప్రైవేట్ కాలేజీల్లో 210 సీట్లు ఉన్నాయి. అలాగే, మూడేళ్ల అగ్రికల్చర్ ఇంజినీరింగ్ డిప్లోమో కళాశాలలు.. ఒక ప్రభుత్వ కళాశాలలో 20, ఒక ప్రైవేట్ కాలేజీలో 30 సీట్లు ఉన్నాయి. అలాగే, నాలుగేళ్ల క్రితం నూతనంగా ప్రవేశపెట్టిన రెండేళ్ల ఆర్గానిక్ అగ్రికల్చర్ డిప్లొమా కళాశాల ఒకటి ఉండగా, అందులో 60 సీట్లున్నాయి. ఈ కళాశాల వికారాబాద్ జిల్లా గింగుర్తిలో ఉండగా, ఏకలవ్య ప్రైవేట్ కళాశాల యాజమాన్యం నిర్వహిస్తుంది. ఈ కోర్సులన్నీ కూడా ఇంగ్లిష్ మీడియంలో చదవాల్సి ఉంటుంది. అలాగే, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు పాలిటెక్నిక్ కళాశాలలు ఉండగా, ఒకటి జగిత్యాల జిల్లా పొలాస, రెండోది కరీంనగర్ జిల్లా జమ్మికుంట(బాలురు)లో ఉన్నాయి. ప్రతీ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో 20 సీట్లు మాత్రమే ఉండగా, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో కలిపి మొత్తం 560 సీట్లు ఉన్నాయి. అర్హత వివరాలు ఈ ఏడాదికి గాను అగ్రికల్చర్, ఆర్గానిక్ అగ్రికల్చర్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులకు సంబంధించి నోటిఫికేషన్ శనివారం విడుదలైంది. ఈ కోర్సులు చదివేందుకు పదో తరగతి చదివి, పాలిసెట్–2025 అగ్రికల్చర్ విభాగంలో పరీక్ష రాసినవారు అర్హులు. మున్సిపల్ ఏరియాలో కాకుండా గ్రామీణ ప్రాంతాలు లేదా ప్రభుత్వ పాఠశాలలు లేదా గురుకులాల్లో నాలుగేళ్ల పాటు చదివిన విద్యార్థులకు 60 శాతం సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. ఈసారి పట్టణ ప్రాంతాల అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 15–22 ఏళ్ల మధ్య జన్మించిన వారు అర్హులు. పాలిసెట్–2025 (అగ్రికల్చర్ విభాగం)లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా సీట్లను కౌన్సిలింగ్ పద్ధతిలో కేటాయిస్తారు. ఆన్లైన్ దరఖాస్తులకు.. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ శనివారం నుంచి ప్రారంభమైంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ విద్యార్థులు రూ.600, ఇతర అభ్యర్థులు రూ.1,200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు ఫేమెంట్ రిజిస్ట్రేషన్కు ఈనెల 28, ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించేందుకు 29 చివరి తేదీ. ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు వస్తే మొదటి సెమిస్టర్కు రూ.19,645, ప్రైవేట్ కాలేజీల్లో వస్తే రూ.24 వేల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్శిటీ వెబ్సైట్ పీజేటీయూ.ఈడీయూ.ఇన్లో సంప్రదించవచ్చు. పాలిసెట్–2025 (అగ్రికల్చర్) ర్యాంకుల ద్వారా సీట్ల భర్తీ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఈనెల 29 -
రారండోయ్.. సర్కారు బడికి
ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలంటూ ఒక్కో ఊరిలో ఒక్కో విధమైన వినూత్న ప్రచారంతో ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారు. సర్కారు బడి ప్రత్యేకతలను, అందులో చదివితే వచ్చే లాభాలను గురించి తల్లిదండ్రులు, విద్యార్థులకు వివరిస్తున్నారు. నర్సరీ చదువుల నుంచే రూ.లక్షలు వసూలు చేసే ప్రైవేటు పాఠశాలల కన్నా.. ఉచిత విద్య, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందించే ప్రభుత్వ పాఠశాలలో చేరాలని సూచిస్తున్నారు. ఆడియో, వీడియో, రీల్స్, ప్రచార రథాలు, పరీక్షల ఫలితాల కరపత్రాలతో ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. ఈనెల 12 నుంచి పాఠశాలల పునః ప్రారంభం నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో బడిబాట కార్యక్రమం జోరందుకుంది. ఈసందర్భంగా సర్కార్ బడుల బలోపేతానికి పాటుపడుతున్న పలువురు ఎంఈవోలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులపై కథనం. ఏఐతో ప్రచారంఇల్లంతకుంట(మానకొండూర్): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తూ బడిబాట కార్యక్రమంలో విద్యార్థులను ప్రభుత్వ బడుల వైపు ఆకర్షించేలా చేస్తున్నాడు మండలంలోని వల్లంపట్ల హైస్కూల్ గణిత ఉపాధ్యాయుడు పత్తి వంశీధర్రెడ్డి. పాఠశాలలో జరిగిన అభివృద్ధి, విద్యార్థుల ఉత్తీర్ణత, సదుపాయాలు, ఉపాధ్యాయుల వివరాలు వివరిస్తూ ప్రభుత్వ పాఠశాలలో చేరాలని ఏఐ పరికరం యాంకరింగ్ చేస్తుంది. దీనిని వాట్సప్ గ్రూపుల్లో వైరల్ చేస్తున్నట్లు ఉపాధ్యాయుడు తెలిపారు. దీనిని స్కూల్ ప్రమోషన్ యాక్టివిటీలో భాగంగా కూడా ఉపయోగించవచ్చని పేర్కొన్నారు. బ్యాండ్మేళంతో ఆహ్వానంశంకరపట్నం(మానకొండూర్): సర్కార్ బడిలో పిల్ల లను చేర్పించాలని శంకరపట్నం మండలం వెంకటేశ్వర్లపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం కోటేశ్వర్రావు బ్యాండ్ మేళంతో ప్రచారం చేస్తారు. హెచ్ఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విద్యార్థులకు యోగా, దేశభక్తి, సత్ప్రవర్తన గురించి వివరిస్తూ నవోయద ప్రవేశం కోసం శిక్షణ ఇస్తున్నారు. సర్కార్ బడిలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, ప్రైవేట్ వద్దు– సర్కార్ బడి ముద్దు నినాదంతో గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. బడిబాటలో తల్లిదండ్రులతో పాటు అవ్వతాతలను భాగస్వామ్యులను చేసేందుకు బ్యాండ్మేళంతో ఆహ్వానిస్తూ గ్రామంలో బడిబాట ర్యాలీ నిర్వహించారు. ఇటీవల విస్తరి ఆకుల ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థులకు వాటిలో భోజనం వడ్డించడంతో హెచ్ఎంను కలెక్టర్ పమేలాసత్పతి ప్రశంసించారు. విద్యార్థులకు క్రీడాదుస్తులు, స్కూల్ బ్యాగులు అందించేలా గ్రామంలో ఆర్థికంగా ఉన్నవారిని ప్రోత్సహించడంతో గతేడాది ఇద్దరు దాతలు ముందుకొచ్చారు. మెట్పల్లి అనుబంధ గ్రామం వెంకటేశ్వర్లపల్లి స్కూల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు హెచ్ఎం వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. -
మెడికల్ కళాశాలకు పార్థివదేహం అందజేత
సుల్తానాబాద్(పెద్దపల్లి): మండల కేంద్రానికి చెందినపెగడ లక్ష్మీనారాయణ శుక్రవారం రాత్రి అనారో గ్యంతో మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఆశ యం మేరకు సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క రీంనగర్ ప్రతిమ మెడికల్ కాలేజీకి లక్ష్మీనారాయణ పార్థివదేహాన్ని శనివారం దానంచేశారు. ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి మేరుగు భీష్మాచారి సహకారంతో మృదేహాన్ని కాలేజీకి అప్పగించారు. పార్థిదేహాన్ని దానం చేసిన మృతుడి కుటుంబ సభ్యులు పెగడ రాజమౌళి, రమేశ్, అయిలయ్య, పరుశరాములు, చందు, శ్రీనివాస్, ఆంజనేయులు, కిషన్, సూర్యానికి ప్రతిమ మెడికల్ కాలేజీ అనాటమీ హెడ్, వైస్ ప్రిన్సిపాల్ కిషన్రెడ్డి, ప్రచార కార్యదర్శి వాసు, ముత్యాల నర్సయ్య అభినందించారు. -
రూ.31కోట్లతో రోడ్ల నిర్మాణం
● రాష్ట్రం ప్రతిపాదిస్తే ఎన్హెచ్ నిధులతో రాజీవ్ రహదారి విస్తరణ ● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్కొత్తపల్లి(కరీంనగర్): కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రోడ్ల నిర్మాణం, సదుపాయాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. జాతీయ ఉపాధిహామీ పథకం కింద రూ.31కోట్ల 12 లక్షలతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంతర్గత రోడ్ల నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు. కొత్తపల్లి మండలం ఖాజీపూర్లో జాతీయ ఉపాధిహామీ పథకం కింద రూ.14 లక్షలతో నిర్మించిన రోడ్డును శనివారం ప్రారంభించారు. కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్నగర్లో రూ.9.50 లక్షల ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మించనున్న మార్కెట్షెడ్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్తపల్లి మండలంలో రోడ్ల నిర్మాణం కోసం ఈ ఏడాది రూ.74 లక్షలు విడుదలైనట్లు తెలిపారు. ఖాజీపూర్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.14లక్షలతో రోడ్డు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కేంద్ర రహదారుల సదుపాయాల నిధి (సీఆర్ఐఎఫ్) కింద రూ.291 కోట్లు ఖర్చు చేసి 1341 కిలోమీటర్ల మేరకు రోడ్లను నిర్మించామని తెలిపారు. నేషనల్ హైవే నిధులతో రాజీవ్ రహదారిని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. జాతీయ రహదారుల నిర్మాణానికి దాదాపు రూ.5వేల కోట్లు ఖర్చు చేశామని, కరీంనగర్ నుంచి వరంగల్, సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి నేషనల్ హైవేల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. త్వరలోనే కరీంనగర్– జగిత్యాల రోడ్డు పనులు ప్రారంభించబోతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులుపాల్గొన్నారు. -
రారండోయ్.. సర్కారు బడికి
● ఊరూరా జయశంకర్ బడిబాట ● ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల ఇంటింటా ప్రచారం ● వినూత్న ప్రచారం.. ఆకర్షించే కార్యక్రమాలు ● పిల్లలు సర్కారు బడిలో చేరాలని పిలుపుఇంగ్లిష్ మీడియం చదువులు.. ఉచితంగా ఏకరూప దుస్తులు.. షూలు.. చదువుకునేందుకు పాఠ్యపుస్తకాలు.. ఆకలేస్తే మధ్యాహ్నం రుచికరమైన పౌష్టికాహారం.. విశాలమైన డిజిటల్ తరగతి గదులు.. క్రీడా మైదానాలు.. సకల సౌకర్యాలు.. అన్నింటికీ మించి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు.. ఇంకెందుకు ఆలస్యం.. రారండోయ్ సర్కారు బడికి అంటూ.. ఊరూరా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. రూ.లక్షలు పోసి ప్రైవేటులో చదివించే కన్నా.. అన్నీ ఉచితంగా అందిస్తున్న సర్కారు బడిలో చేరాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వినూత్నంగా ప్రచారం చేస్తూ.. పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా కృషి చేస్తున్న ఉపాధ్యాయులపై సండే స్పెషల్..ఇదే మా ఓపెన్ చాలెంజ్..● మా పిల్లల కన్నా ‘ప్రైవేటు’ వాళ్లు బాగా చదివితే రూ.500 నజరానా ● పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి స్కూల్ ఉపాధ్యాయుల వినూత్న ప్రచారం ధర్మారం: ‘ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు మా పిల్లల కన్నా బాగా చదవగలరా..? అలా ఒక్క విద్యార్థి చదివినా రూ.500 నజరానా ఇస్తాం’.. అంటూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఓపెన్ చాలెంజ్ చేస్తున్నారు. బడిబాటలో భాగంగా ఇంటింటా తిరుగుతూ.. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరుతున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సముద్రాల వంశీమోహనాచార్యులు, ఉపాధ్యాయులు కలిసి ఫిబ్రవరి 21నుంచే బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటా తిరుగుతూ ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. సర్కారు బడికి పంపించాలని కోరుతున్నారు. తమ పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి చదివే విద్యార్థుల కన్నా ప్రైవేటులో చదివేవారు ప్రతిభ కనబరిస్తే.. రూ.500నగదు బహుమతి అందిస్తాని చాలెంజ్ చేస్తున్నారు. పాఠశాల ప్రత్యేకతలను వివరిస్తూ.. ఇంటింటా కరపత్రాలు పంచుతున్నారు. ఇప్పటి వరకు పాఠశాలలో 36 మంది విద్యార్థులుండగా.. బడిబాటలో భాగంగా 14మంది అడ్మిషన్లు తీసుకున్నారని హెచ్ఎం తెలిపారు. గ్రామంలోని ప్రతీ విద్యార్థి సర్కారు బడికి వచ్చేలా చొరవ చూపుతామని పేర్కొన్నారు.– వివరాలు 10లోu -
ప్లాస్టిక్ సామగ్రి నిల్వ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం
జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలోని వాగు సమీపంలో పనికిరాని ప్లాస్టిక్ సామగ్రి నిల్వ చేసే దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించి సుమారు రూ.70 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. వివరాలు.. ధరూర్లోని కొలగాని సత్యనారాయణరావుకు చెందిన రేకులషెడ్డులో ముంబయ్కి చెందిన సల్మాన్ పనికిరాని ప్లాస్టిక్, పాత ఇనుప సామగ్రి సేకరించి, దానిని మిషనరిల ద్వారా స్క్రాప్ చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తాడు. శనివారం ప్లాస్టిక్ సామగ్రి సేకరించే సమయంలో దుకాణం పక్కనే ఓ వ్యక్తి దహన సంస్కారాలు నిర్వహించగా అక్కడి నుంచి నిప్పులు అకస్మాత్తుగా వచ్చి ప్లాస్టిక్ సామగ్రి ఉన్న చోట పడడంతో మంటలు భారీగా వ్యాపించాయి. అప్రమత్తమైన రెవెన్యూ, అగ్నిమాపక శాఖలు అక్కడకు చేరుకుని జగిత్యాల, ధర్మపురి, చొప్పదండి, మెట్పల్లి నుంచి ఫైరింజన్లను రప్పించారు. సుమారు 6 గంటల పాటు శ్రమించి మంటలు ఆర్పివేశారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్కుమార్ ఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రక్రియను పర్యవేక్షించారు. ఈప్రమాదంలో రూ.30 లక్షల రేకులషెడ్డుతో పాటు రూ.40 లక్షల విలువ గల సామగ్రి, మిషన్లు కాలిపోయాయి. మంటలు ఆర్పేయడంలో జగిత్యాల అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణకాంత్, సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించారు. సిబ్బంది మధు కాలుకు స్వల్పగాయాలు కాగా, జగిత్యాలలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు మున్సిపల్ కమిషనర్ స్పందన, తహసీల్దార్ శ్రీనివాస్ ఘటన స్థలంలో ఉండి పర్యవేక్షించారు. కాగా, ఈ ప్రమాదంతో మొదట దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. ఏం జరుగుతుందో తెలియక పరుగులు తీశారు. మంటలు అదుపులోకి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పివేత -
ముందస్తు బడిబాట
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండల ఎస్జీటీ ఉపాధ్యాయ సంఘం సభ్యులు మే చివరి వారంలో పలు గ్రామాల్లో బడిబాట కార్యక్రమం చేపట్టారు. కందికట్కూర్, ఓబులాపూర్, ఇల్లంతకుంట, సిరికొండ, జంగారెడ్డి పల్లె, బోటిమీదిపల్లె తదితర గ్రామాల్లో మండల విద్యాధికారి శ్రీనివాస్, ఎస్జీటీ యూనియన్ అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్, తదితరులు ఊరూరా తిరుగుతూ.. విద్యార్థులు సర్కార్ బడుల్లోనే చేర్పించాలని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను తల్లిదండ్రులకు వివరించారు. బడీడు పిల్లలను నమోదు చేయించాలని అంగన్వాడీ టీచర్లను కోరారు. ఇంటింటా తిరిగా.. గ్రామాల్లోని విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లకుండా ప్రభుత్వ బడుల్లో చేరేలా ఏప్రిల్ చివరలో సిరికొండ గ్రామంలో ఇంటింటా తిరిగా. ప్రైవేటు విద్యార్థుల వివరాలు సేకరించి వారి తల్లిదండ్రులతో పాఠశాలలో సమావేశం నిర్వహించా. ఎంఈఓ శ్రీనివాస్, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం తిరుపతి హాజరయ్యారు. పిల్లలకు నాణ్యమైన, గుణాత్మకమైన విద్యనందిస్తామని తల్లిదండ్రులకు అవగాహన కల్పించగా, ప్రభుత్వ బడికి పంపిస్తామని ప్రతిజ్ఞ చేశారు. – తంగళ్లపల్లి శ్రీనివాస్, ఎస్జీటీ యూనియన్ మండల అధ్యక్షుడు -
అర్థవంతమైన ‘పాట’.. బడికి బాట
సిరిసిల్ల: ‘సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది.. రారమ్మన్నదీ.. ఇంగ్లిష్ చదువు కూడా చెప్పుచున్నది.. ఎంతో నేర్పుతున్నది.. పద పదా పోదాం సర్కారూ బడికి.. పైసన్నది ఖర్చులేని అమ్మ ఒడికి’.. అంటూ సాగే అర్థవంతమైన పాట, చక్కటి సంగీతం, పాఠశాల ఫొటోలతో.. పిల్లల సాంస్కృతిక కార్యక్రమాల దృశ్యాలతో రూపొందించి సోషల్ మీడియా వేదికగా బడిబాట పాటను ప్రచారం చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా కేందంల్రోని వెంకంపేట మండల పరిషత్ ప్రాథమి పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమంపై నెల రోజుల ముందే చక్కటి ఆడియో, వీడియో పాటను చిత్రీకరించి వేసవి సెలవుల్లో ప్రజాబాహుళ్యంలోకి పంపించారు. ఇప్పుడు ఆ పాట.. బడి బాటకు పల్లవిగా మారి మారుమోగుతోంది. అడ్మిషన్లు పెంచడమే లక్ష్యంగా.. వెంకంపేట ఎంపీపీఎస్ స్కూల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉంది. ఇక్కడ ప్రస్తుతం వంద మంది విద్యార్థులు ఉండగా, మరో 50 మందికి అడ్మిషన్లు ఇచ్చే లక్ష్యంతో హెచ్ఎం మోర దామోదర్, ఉపాధ్యాయులు సీహెచ్ రాణి, కె.పద్మ, సౌభాగ్యల బృందం ఇంటింటా ప్రచారాన్ని నిర్వహిస్తుంది. వెంకంపేట ప్రాంతంలో ఉండే ప్రతీ ఇంటికి వెళ్లి.. ‘మీ పిల్లలను మా బడికి పంపించండి.. ఉచితంగానే ఇంగ్లిష్లో బోధిస్తాం’ అని చెబుతూ పిల్లలను బడిలో చేర్పించుకునే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ముందే రూపొందించిన బడి పాటను ఇంటి యజమానుల వాట్సప్ గ్రూపుల్లోకి డౌన్లోడ్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. బడిలో ఉన్న వసతులు, పక్కా భవనం, ఆటస్థలం, డెస్క్ బేంచీలు, మధ్యాహ్నం భోజనం, ఉచితంగా పుస్తకాలు, యూనిపామ్స్ ప్రభుత్వం అందిస్తుందనే విషయాన్ని వివరిస్తున్నారు. అందరి సహకారంతో.. బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టాం. నెల రోజుల ముందే పాటను రూపొందించి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశాం. అందరి సహకారంతో పాఠశాలలో వసతులు కల్పించాం. బడిలో అడ్మిషన్లు పెంచే లక్ష్యంతో బడిబాట నిర్వహిస్తున్నాం. పిల్లల తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తుంది. – మోర దామోదర్, హెచ్ఎం, వెంకంపేట స్కూల్ -
కేబినెట్లోకి ఎవరో?
● ఉమ్మడి జిల్లా నుంచి ఒకరికి అవకాశం ● కవ్వంపల్లి, ఆది, అడ్లూరిలో ఒకరికి చోటు? ● ఉత్కంఠలో ఆశావహులుసాక్షిప్రతినిధి,కరీంనగర్: ఎప్పుడెప్పుడా... అని ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో కేబినెట్ విస్తరణ ఆదివారం జరుగనుంది. కేబినెట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మంత్రి పదవి దక్కడం ఖాయమనే సమాచారం ఉంది. ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలలో ఒకరికి చోటు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి జిల్లా పరిధిలో ఒకరికి మంత్రి పదవి కట్టబెట్టి, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గురించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయాలనే ఆలోచన చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతును కూడగట్టే భాగంగా అధిష్టానం ఉమ్మడి జిల్లాలో ఒకరికి మంత్రి పదవీ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ విప్గా కొనసాగుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మున్నూరు సామాజికవర్గం కోటాలో మంత్రివర్గంలో బెర్తు ఖాయమనే ఊహగానాలు వినబడుతున్నాయి. ఎస్సీ సామాజికవర్గం నుంచి ప్రభుత్వ విప్, జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్, కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు కేబినెట్లో చోటు ఖాయమని వారి అనుచరులు ధీమాగా ఉన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే మంత్రులుగా దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్లు వ్యవహరిస్తుండగా ప్రస్తుత మంత్రివర్గంలో ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణలలో ఒకరిని తీసుకుని రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అయ్యేలా పార్టీ అధిష్టానం సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీగా వ్యవహరిస్తున్న మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ మేరకు కొత్తగా ఎన్నికై న నేతలు, సీనియర్ నేతలను సామాజిక వర్గం అంశాలను దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి కరీంనగర్ నుంచి కేబినెట్లో ఒకరిని మంత్రిగా నియమించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. ఆదివారం జరిగే కేబినెట్ విస్తరణలో జిల్లా నుంచి ఈ ముగ్గురిలో ఒకరికి చోటు దక్కి ఉత్కంఠకు తెరపడనుంది. -
విత్తనానికి తొందర పడొద్దు
వీణవంక(హుజూరాబాద్)/కరీంనగర్రూరల్: ముందస్తు రుతుపవనాల రాకతో సంబరపడిన రైతన్నకు నిరాశే మిగిలింది. వానాకా లం సీజన్ ఆరంభంలో రోహిణికార్తె ప్రవేశించిన తొలిరోజునుంచి నాలుగైదు రోజులపాటు కురిసిన తొలకరి వర్షాలకు రైతులు సంబురపడ్డారు. జిల్లాలోని పలుచోట్ల దుక్కులు దున్ని పత్తి విత్తనాలు సైతం వేశారు. అయితే కొద్దిరోజులకే చినుకు కినుకు వహిస్తోంది. వారం రోజుల నుంచి వర్షం జాడ లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మండుతున్న ఎండలతో వేసిన విత్తనం ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల విత్తనాలు వేసేందుకు ఎదురుచూస్తున్న రైతులకు చినుకుజాడ లేకపోవడంతో అదను దాటిపోతోందని ఆవేదన చెందుతున్నారు. నేటినుంచి మృగశిర కార్తె ప్రవేశిస్తుండగా.. ఈ కార్తెలోనైనా వరణుడు కరుణిస్తాడా అని ఆశతో ఎదురుచూస్తున్నారు. మృగశిరపైనే ఆశలు వానాకాలం పంటల సాగును మృగశిర కార్తె నుంచి రైతులు ప్రారంభిస్తారు. ముందస్తు నైరుతి రుతుపవనాల రాకతో కొందరు రోహిణికార్తెలోనే పత్తి, మొక్కజొన్న విత్తనా లు వేశారు. పదిరోజుల నుంచి ఎండలు దంచికొడుతుండగా ఒక్క వర్షం పడలేదు. ఆదివారం నుంచి ప్రవేశిస్తున్న మృగశిర కార్తెలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయనే ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు. వాతావరణ శాఖ రాబోయే నాలుగురోజుల పాటు వర్షాలు కురుస్తాయనే సూచనతో విత్తనాలు మొ లకెత్తుతాయనే భరోసా కల్పించింది. వర్షాలు కురిసిన అనంతరమే విత్తనాలు వేయాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. 3,43,240 ఎకరాల సాగు అంచనా జిల్లాలో ఈ వానాకాలంలో 3,43,240 ఎకరాలలో వివిధ పంటలు సాగులోకి వస్తాయని అధికారులు అంచనా వేశారు. వరి 2,76,500 ఎకరాలు, పత్తి 48వేల ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేస్తున్నారు. రోహిణి కార్తెలో ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 28వేల ఎకరాల్లో పత్తి విత్తినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. వారం రోజులుగా ఎండలు దంచి కొడుతుండడంతో విత్తనాలు మాడిపోయే అవకాశముంది. భారీ వర్షాలు పడితే కానీ.. విత్తనాలు విత్తుకోవడం, నార్లు పోయడం చేయొద్దని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. కనీస వర్షపాతం నమోదయ్యాకే వరినాట్లు వేసుకోవాలని చెబుతున్నారు. కొందరు పోసిన నార్లు ఎండలతో దెబ్బతింటున్నాయి. మృగశిరలో మంచి వర్షాలు పడితే తప్పా వ్యవసాయంలో ముందుకు సాగొద్దని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.జిల్లాలో వానాకాలం సాగు అంచనా(ఎకరాల్లో)వరి 2,76,500 పత్తి 48,000 మొక్కజొన్న 4,000 మిర్చి 1,000 కూరగాయలు, హర్టికల్చర్ 13,045 ఇతర పంటలు 695 ముఖం చాటేసిన నైరుతి రుతుపవనాలు ఊరించి.. ఉసూరు మనింపించిన రోహిణికార్తె నేటినుంచి మృగశిర ప్రారంభం మండుతున్న ఎండలు.. మొలకెత్తని పత్తి విత్తనాలు భారీ వర్షాలు పడితేనే విత్తనాలు వేయాలని సూచన -
పునర్విభజనపై రగడ
● అన్ని రాజకీయ పార్టీలకు అభ్యంతరమే ● ఓటర్ల సంఖ్యపై బల్దియా కసరత్తు ● రెండో రోజు 32 అభ్యంతరాలుకరీంనగర్ కార్పొరేషన్: డివిజన్ల పునర్విభజనపై రాజకీయ రగడ మొదలైంది. నగరాన్ని 66 డివిజన్లుగా విభజిస్తూ నగరపాలకసంస్థ ప్రకటించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్పై పార్టీలు పరస్పర ఆరోపణలకు దిగుతున్నాయి. పునర్విభజనపై అన్ని పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎక్కువగా ఆయా డివిజన్లలో పేర్కొన్న ఓట్ల సంఖ్య ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. ఇంటినంబర్లతో లెక్కకట్టిన ఓట్లు సరిగా లేవని, ఒక డివిజన్లో ఎక్కువగా, మరో డివిజన్లో తక్కువగా ఉన్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో బల్దియా కూడా ఆయా డివిజన్లలోని ఇంటినంబర్ల వారీగా మరో సారి ఓట్ల సంఖ్యను లెక్కించే పనిలో పడింది. అన్ని పార్టీలకు అభ్యంతరమే నగరంలో 66 డివిజన్ల పునర్విభజనపై అన్ని పార్టీ లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. అధికార కాంగ్రెస్తో పాటు, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు డివిజన్ల పునర్విభజన సరిగా లేదంటూ ఫిర్యాదు చేస్తున్నాయి. తాము ప్రాతినిథ్యం వహిస్తున్న డివిజన్ల విభజన సరిచేయాలంటూ కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్లు వరుసగా అభ్యంతరాలు ఇస్తున్నారు. ఓట్ల సంఖ్యలో తేడా, ఆర్అండ్బీ రోడ్డుకు రెండు వైపుల ఉన్న ప్రాంతాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఒకే డివిజన్లో చేర్చడంపై బీఆర్ఎస్ కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. ఎంఐఎం, కాంగ్రెస్లకు అనుకూలంగా విభజించారని బీజేపీ ఆరోపిస్తుండగా, బీజేపీకి అనుకూలంగా విడగొట్టారని ఎంఐఎం ఎదురుదాడి చేస్తోంది. రాజకీయపార్టీల అభ్యంతరాల్లో ఎక్కువగా ఓట్ల సంఖ్యలో తేడా, ఇంటి నంబర్ల గందరగోళం, ఆర్అండ్బీ రోడ్డుకు ఇరువైపులా ఒకే డివిజన్ అంశాలే ఉన్నాయి. ఇంటినంబర్ల వారీ గా లెక్కించిన ఓట్ల సంఖ్య ఒక డివిజన్లో ఎనిమిది వేలు, మరో డివిజన్లో రెండు,మూడు వేలు మాత్ర మే ఓట్లున్నాయని బీఆర్ఎస్ వాదిస్తోంది. అన్ని డివిజన్లను ఐదు వేల ఓట్లుగా చూపిస్తున్నా, వాస్తవ ఓట్ల సంఖ్యకు పొంతన ఉండడం లేదంటున్నాయి. ఓటర్ల సంఖ్యపై బల్దియా కసరత్తు డివిజన్లలో పేర్కొన్న ఓట్లకు, వాస్తవ ఓట్లకు పొంతన లేదంటూ వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో నగరపాలకసంస్థ ఓట్లసంఖ్యపై దృష్టి సారించింది. అభ్యంతరాల అనంతరం పరిశీలనకు సమయం ఉన్నా, ఇప్పటి నుంచే ఆయా డివిజన్లలో ఉన్న ఇళ్లు, ఓట్ల సంఖ్యపై మరోసారి కసరత్తు మొదలు పెట్టింది. డ్రాఫ్ట్లో పేర్కొన్న ఓట్లకు వాస్తవ ఓట్లకు తేడా ఉంటే, ఆ డివిజన్ల సరిహద్దులు మార్చేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. రెండో రోజు 32అభ్యంతరాలు పునర్విభజనపై రెండవ రోజు శుక్రవారం 32మంది తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఓట్లను సరిచేయాలని, ఆర్అండ్బీ రోడ్డు నిబంధన పాటించాలని బీఆర్ఎస్ నగరశాఖ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ విజ్ఞప్తి చేశారు. పాత 9వ డివిజన్, కొత్త 29వ డివిజన్ను అశాసీ్త్రయంగా విజభించారని మాజీ కార్పొరేటర్ పడిశెట్టి భూమయ్య ఫిర్యాదు చేశారు. కొత్త 9వ డివిజన్లో ఇంటినంబర్లను సరిచేయాలని మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మద కోరారు. అంబేడ్కర్నగర్లో మధ్యలో ఉన్న ఇళ్లను పక్క డివిజన్లో వేశారని, వీటిని సరిచేయాలని సామాజిక కార్యకర్త మహమ్మద్ అమేర్ కోరారు.డివిజన్ల పునర్విభజనపై కలెక్టర్కు వినతి కరీంనగర్: శాసీ్త్రయబద్ధంగా విభజన ప్రక్రియ కొనసాగించాలని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం ఇచ్చారు. నగరపాలక సంస్థ ప్రకటించిన 66 డివిజన్లలో తెలిపిన ఇంటి నంబర్లకు సంబంధించిన ఓటర్ల సంఖ్య అసంబద్ధంగా ఉందన్నారు. డీలిమిటేషన్పై వెంటనే విచారణ జరిపించి, తప్పుడు సమాచారంతో కరీంనగర్లో ప్రజలను, నాయకులను ఆందోళనకు గురిచేసిన అధికారులపై చర్య తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు కంసాల శ్రీనివాస్, గుగ్గిళ్ల జయశ్రీ, దిండిగాల మహేశ్, కుర్ర తిరుపతి, సంపత్రావు పాల్గొన్నారు. -
మావోలతో శాంతిచర్చలు జరపాలి
పెద్దపల్లిరూరల్: కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులపై సాగిస్తున్న బూటకపు ఎన్కౌంటర్లను వెంటనే నిలిపివేసి వారితో శాంతిచర్చలు జరపాలని ప్రజాసంఘాలు, వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్రానికి ప్రజాసంఘాల నేతలు చేస్తున్న వినతులను పెడచెవిన పెడుతూ ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను హతమార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తామంటూ డెడ్లైన్లు విధించడం పాలకుల రాక్షసత్వానికి నిదర్శనమన్నారు. మావోలకు మద్దతుగా ఉంటున్నారంటూ అమాయక ఆదివాసీల ప్రాణాలను బలిగొంటున్నారని ఆరోపించారు. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును మేధావులు, ప్రజలు, ప్రజాసంఘాలు ముందుకొచ్చి వ్యతిరేకించాలని కోరారు. ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నాయకులు ముత్యంరావు, సదానందం, అశోక్, జ్యోతి, ప్రశాంత్, కనకరాజు, మల్లయ్య, సూర్య, చంద్రయ్య, మల్లేశ్, లచ్చన్న, భీమన్న, కొమురయ్య, రాజన్న, శ్రావణ్, మానస్కుమార్, లెనిన్, నవీన్, రవికుమార్ పాల్గొన్నారు. -
హ్యాండ్బాల్లో కరీంనగర్ జట్టుకు గోల్డ్మెడల్
కరీంనగర్స్పోర్ట్స్: ఈనెల 4 నుంచి 6వ తేదీ వర కు నల్గొండ జిల్లా నకిరేకల్లో జరిగిన జూ యర్స్ బాయ్స్– గర్ల్స్ హ్యాండ్బాల్ టోర్నీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టు వరంగల్ జట్టుపై ఫైనల్లో 20–13స్కోర్తో విజయం సాధించి, గోల్డ్ మెడల్ దక్కించుకుంది. జట్టుకు కోచ్గా మూల వెంకటేశ్, మేనేజర్గా శ్రీకాంత్ వ్యవహరించారని తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్ కుమార్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వీర్ల వెంకటేశ్వర రావు, బాసరవేణి లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. -
ఎన్ఎంఎంఎస్లో మనోళ్ల సత్తా
● జిల్లా నుంచి 74మంది విద్యార్థుల ఎంపికకరీంనగర్: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న జాతీయ ఉపకార వేతనాల (నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్) ఎంపికలో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులను ఏటా ప్రతిభా పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తున్నారు. 2024–25 విద్యా సంవత్సరానికి పరీక్ష రాసిన విద్యార్థుల ఫలితాలను గురువారం ప్రకటించారు. జిల్లా నుంచి మొత్తం 74మంది విద్యార్థులు ఎంపికయ్యారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏటా రూ.12వేలు ఆయా పాఠశాలలు ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకొని విద్యార్థులకు శిక్షణ ఇవ్వగా, గతేడాది నవంబరు 1న నిర్వహించిన ప్రతిభా పరీక్షలో 74 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరికి ప్రతినెల రూ.1000 చొప్పున ఏటా రూ.12 వేల నగదు అందించనున్నారు. 9,10, ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఇలా నాలుగేళ్ల పాటు రూ.48 వేలు కేంద్ర ప్రభుత్వం అందించనుంది. జిల్లా పరిధిలో ఎంపికై న 74 మందికి నాలుగేళ్లలో రూ.35.52 లక్షలు ఉపకార వేతనాల రూపంలో అందనున్నాయి. సంతోషంగా ఉంది సాధారణ తరగతులతో పాటు ఉపాధ్యాయులు ప్రతిరోజు నిర్వహించిన ప్రత్యేక తరగతుల్లో మెంటల్ ఎబిలిటీ, గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులకు ప్రధానంగా సన్నద్ధమయ్యాను. నాలుగేళ్ల పాటు వచ్చే ఉపకార వేతనం నా ఉన్నత చదువులకు ఉపయోగపడుతుంది. దీంతో మా తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గుతుంది. ఇదే స్ఫూర్తితో ఇతర పోటీ పరీక్షల్లోను ప్రతిభా చూపేందుకు కృషి చేస్తా. – వరికోలు విజ్ఞత, జెడ్పీహెచ్ఎస్ జూబ్లీనగర్ పాఠశాల -
ఆర్చరీ క్వార్టర్ ఫైనల్స్కు చికిత
పెద్దపల్లిరూరల్: ప్రపంచకప్ ఆర్చరీ పోటీల్లోభారతజట్టులో స్థానం సంపాదించుకున్న తానిపర్తి చికిత స్టేజీ–3 టోర్నమెంట్ క్వాలిఫయింగ్ రౌండ్లో రాణించి క్వార్టర్ ఫైనల్స్ పోటీలకు అర్హత సాధించారని జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారి సురేశ్ శుక్రవారం తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన చికితకు ఆర్చరీపై ఉన్న ఆసక్తిని గుర్తించి అప్పటి కలెక్టర్ సంగీత సత్యనారాయణ.. క్రీడా పరికరాన్ని అందించారని ఆయన గుర్తుచేశారు. హరియాణా రాష్ట్రంలోని సోనిపట్లో పొందే శిక్షణకు కలెక్టర్ చొరవతో ఎన్టీపీసీ యజమాన్యం సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్న చికిత.. ప్రతిభను కనబర్చి పలు పతకాలను దక్కించుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ ఆర్చరీ పోటీల్లో క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించిన జట్టు ప్రపంచకప్ సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
స్పోర్ట్స్ స్కూల్ పిలుస్తోంది
● 4వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ● హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లో క్రీడా పాఠశాలలు ● 11 క్రీడలు, 60మంది బాలురు, 60మంది బాలికలకు అవకాశం ● 16 నుంచి మండల, 23 నుంచి జిల్లా, జూలై 1నుంచి రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలుకరీంనగర్ స్పోర్ట్స్: చదువుతో పాటు క్రీడల్లో ఒకేసారి రాణించాలనుకునేవారికి సువర్ణావకాశం. 4వ తరగతి నుంచి క్రీడారంగంలో తర్పీదు పొందేందుకు క్రీడాశాఖ మంచి అవకాశాన్ని కల్పించింది. రాష్ట్రంలో ఉన్న మూడు స్పోర్ట్స్ స్కూళ్లలో 2025–26 ఏడాదిలో 4వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పోర్ట్స్ స్కూల్లో చోటు దక్కితే క్రీడల్లో అంతర్జాతీయస్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. స్పోర్ట్స్స్కూల్లో ప్రవేశాలు.. దరఖాస్తులు.. ఎంపిక ప్రక్రియపై కథనం. జూన్ 16 నుంచి ప్రవేశ పోటీలు రాష్ట్రంలోని మూడు ప్రాంతీయ క్రీడాపాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరంలో 4వ తరగతిలో ప్రవేశాలకు ఎంపిక పోటీల తేదీలను క్రీడాశాఖ అధికారులు ప్రకటించారు. జూన్ 16 నుంచి 19లోపు మండలస్థాయిలో, 23 నుంచి 26వరకు జిల్లాస్థాయిలో, జూలై 1 నుంచి 5వ తేదీ వరకు రాష్ట్రస్థాయిలో ఎంపికపోటీలు జరుగుతాయి. సికింద్రాబాద్లోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో స్పోర్ట్స్ స్కూళ్లు ఉన్నాయి. విద్యార్థులకు కొన్ని శారీరక, సామర్థ్యానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించి, ఎంపికచేస్తారు. ఉత్తమ ప్రతిభ చూపినవారికి 4వ తరగతిలో ప్రవేశం దక్కుతుంది. మొత్తంగా 60మంది బాలురు, 60 మంది బాలికలకు అవకాశం కల్పిస్తారు. హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ స్కూళ్లలో 20మంది బాలురు, 20మంది బాలికల చొప్పున అవకాశం కల్పిస్తారు. దొడ్డికాళ్లు, ఫ్లాట్ఫీట్, వెన్నుముక వంగి ఉన్నవారు, గుండె సంబంధిత జబ్బులు ఉన్నవారు, బౌ లెగ్స్ ఉన్న వారు, ఎముకలు విరిగినవారు అనర్హులు. ఎంపికై న వారికి అథ్లెటిక్స్, అర్చరీ, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, రోయింగ్, వాలీబాల్, జూడో, ఫెన్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, రెజ్లింగ్ క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తారు. రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిలో రాణించిన వారికి భవిష్యత్లో రైల్వే, ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, పోలీస్, బ్యాంక్స్, పోస్టల్ డిపార్ట్మెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, పీఈటీ, పీడీ, కోచ్లు, కార్పొరేట్ సెక్టార్లలో మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నిర్వహించే ఫిజికల్ టెస్ట్లు మండల, జిల్లాస్థాయిలో ఎత్తు, బరువు, 30 మీటర్ల ఫ్లైయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్ల రన్నింగ్, 6.10 మీటర్ల షటిల్ రన్, మెడిసన్ బాల్త్రో(కిలో బరువు), వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలీటీ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్లు నిర్వహిస్తారు. రాష్ట్ర స్థాయిలో ఎత్తు బరువు, 30 మీటర్ల ఫ్లైయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్జంప్, 6.10 మీటర్ల షటిల్రన్, స్టాండింగ్ వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, మెడిసన్ బాల్ త్రో(కేజీ), 800 మీటర్ల రన్నింగ్ నిర్వహిస్తారు. కావాల్సిన ధ్రువపత్రాలు.. అర్హతలు ● ఒరిజినల్ ఆధార్కార్డు ● 4వ తరగతి చదువుతున్నట్లు సర్టిఫికెట్ ● వయసు ధ్రువీకరణ పత్రం ● 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్టు ● కమ్యూనిటీ సర్టిఫికెట్ ● ఐదు పాస్పోర్టు సైజ్ ఫొటోలు ● విద్యార్థులు 8 నుంచి 9ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి ● 01– 09– 2016 నుంచి 31–08– 2017 మధ్య పుట్టిన వారు అర్హులు. -
‘బడిబాట’ను విజయవంతం చేయాలి
● పాఠశాల ప్రారంభం రోజే పాఠ్యపుస్తకాలు, ఉచిత దుస్తులు ● కలెక్టర్ పమేలా సత్పతికరీంనగర్: బడిబాట కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల నమోదుశాతాన్ని పెంచాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. ఈనెల 12వరకు నిర్వహించనున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్లో వివిధశాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకా రం ప్రతిరోజు బడిబాట కార్యక్రమంలోని అంశాలను పాటించాలన్నారు. బాల బాలికలను ప్రభుత్వ పాఠశాలల్లో, ఆరేళ్లలోపు పిల్లలను అంగన్వాడీల్లో చేర్పించేలా చూడాలన్నారు. అంగన్వాడీల్లో కొత్త సిలబస్ ప్రకారం శిక్షణ పొందిన టీచర్ల ఆధ్వర్యంలో ప్లేస్కూల్ మెటీరియల్, యూనిఫామ్, పోషకాహారం అందజేస్తున్నామని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, పాఠశాలల్లోని సౌకర్యాల గురించి ర్యాలీలు, బ్యానర్లు, పోస్టర్ ప్రదర్శన, కరపత్రాల పంపిణీ ద్వారా డోర్టుడోర్ అవగాహన కల్పించాలన్నారు. ఈ సంవత్సరం యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్పుస్తకాలు, వర్క్బుక్స్ పాఠశాల ప్రారంభం రోజు ప్రతీ విద్యార్థికి అందించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్దేశాయ్, డీఈవో మొండయ్య, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డీఎంహెచ్వో వెంకటరమణ, విద్యాశాఖ కోఆర్డినేటర్లు అశోక్రెడ్డి ఆంజనేయులు పాల్గొన్నారు. ‘శుక్రవారం సభ’ భేష్ జిల్లాలో కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శుక్రవారం సభ అభినందనీయం అని, కార్యక్రమాన్ని రాష్ట్రమంతా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని పంచాయతీరాజ్, మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ మంత్రి డి.అనసూయ సీతక్క అన్నారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలపై హైదరాబాద్లో ఈనెల 4,5న ‘మేధో మథన సదస్స్ఙు నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో అమలు చేస్తున్న ‘శుక్రవారం సభ’ గురించి జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి వివరించారు. మంత్రి సీతక్క, ప్రభుత్వ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ కార్యక్రమాన్ని అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు సాధ్యసాధ్యాలు పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ని సత్కరించారు. -
నామినేటెడ్ పదవులు భర్తీ చేయాల్సిందే
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి మంచి ఫలితాలు రావాలంటే.. తప్పకుండా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సిందేనని కరీంనగర్ పార్లమెంటరీ నాయకులు అధిష్టానానికి స్పష్టం చేశారు. శుక్రవారం గాంధీభవన్లో కరీంనగర్ పార్లమెంటరీ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జిల్లా నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా నేతలందరి నోట దాదాపుగా ఒకే డిమాండ్ వినిపించింది. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా.. డీసీసీ, కార్పొరేషన్ చైర్మన్లు సహా ఎలాంటి నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయకపోవడంపై కిందిస్థాయి నాయకులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని వెల్లడించారు. పదవులు భర్తీ చేయలేకపోతే.. గ్రామాల్లో సమాధానం చెప్పే పరిస్థితి కూడా ఉండదని కుండబద్ధలు కొట్టారు. ఈ క్రమంలో కలుగజేసుకున్న మీనాక్షి.. త్వరలోనే పదవుల భర్తీ ఉంటుందని, కష్టపడి పనిచేసిన వారందరికీ సముచితస్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు అధిష్టానం ఇచ్చే ప్రొఫార్మా ప్రకారం.. పేర్లు పంపాలని సూచించారు. బీజేపీ, బీఆర్ఎస్ల విలీనం తథ్యం పథకాల అమలులో విపక్షాలు చేస్తున్న దుష్ప్రచా రాన్ని తిప్పికొట్టాలని, సన్నబియ్యం, ఇందిరమ్మ పథకాల అమలు తీరును జనాల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీజేపీ ధర్మం పేరుతో చేస్తున్న చర్యలను ప్రజలకు వివరించాలన్నారు. ఆపరేషన్ సిందూర్ విషయంలోనూ బీజేపీ వ్యవహరించిన తీరును, దాని వైఫల్యాలను, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మైత్రిని ఎండగట్టాలన్నారు. ఇక తా ము ఎన్నికల ముందు పార్టీ కోసం ఎన్నో త్యాగా లు చేశామని, తమకు న్యాయం జరగాలని మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్రెడ్డి, సిరిసిల్ల కాంగ్రెస్ నేత కేకే. మహేందర్ రెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు గుర్తుచేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివా స్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ భానుప్రసాద్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్రణవ్బాబు, మాజీ మంత్రి జీవన్రెడ్డి, సీనియర్ నేత కటకం మృత్యుంజయం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశ్, అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షికి స్పష్టం చేసిన కరీంనగర్ పార్లమెంటరీ నేతలు త్వరలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన మీనాక్షి నటరాజన్ -
అంగన్వాడీబాటకు సిద్ధం కావాలి
కరీంనగర్: ఈనెల 12 నుంచి 17 వరకు నిర్వహించనున్న అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమం ద్వారా ఆరేళ్లలోపు పిల్లలను అంగన్వాడీలో చేర్పించేందుకు మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు సిద్ధం కావాలని జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో శుక్రవారం సీడీపీవోలు, సూపర్వైజర్లు, పోషణ అభియాన్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 4,5 తేదీల్లో రాష్ట్రస్థాయిలో జరిగిన మేధో మథన సదస్సులో మహిళాభివృద్ధి శిశుసంక్షేమశాఖ సేవలను మరింత విస్తృతం చేసేందుకు మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో మహిళలు, పిల్లల కోసం సాక్ష్యం అంగన్వాడీ, మిషన్శక్తి, మిషన్ వాత్సల్య లక్ష్యాలు వివరించారని అన్నారు. సీడీపీవోలు సబిత, నర్సింగారాణి, శ్రీమతి, సుగుణ, పాల్గొన్నారు.స్కూళ్లలో వసతులకు నిధులుకరీంనగర్ కార్పొరేషన్: ప్రభుత్వ పాఠశాలల బ లోపేతానికి సుడా ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని చేపడుతున్న ట్లు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి తెలి పారు. ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన వసతుల కల్పనకు నిధులు కేటాయించనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం సుడా కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల పటిష్టతకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. తమవంతు బాధ్యతగా సుడా ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ 11 రోజు ల పాటు బడిబాట కార్యక్రమాన్ని చేపడుతామన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన ప్రచారరథం, కరపత్రాలు, పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తామన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, టేబుళ్లు, బెంచీలు, వసతుల కల్పనకు సుడా నిధులు వెచ్చిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతీ ఒక్కరు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. అధిక సంఖ్యలో విద్యార్థులను చేర్పించాలికరీంనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో అధికసంఖ్యలో విద్యార్థులను చేర్పించాలని డీఈవో శ్రీరాం మొండయ్య సూచించారు. బడిబాట కార్యక్రమాన్ని జిల్లాల్లోని అన్ని పాఠశాలల్లో ప్రారంభించామని వెల్లడించారు. ఉపాధ్యాయులు గ్రామాల్లోని స్వచ్ఛంద సంస్థలు, మాజీ ప్రజాప్రతినిధుల సహకారంతో విద్యార్థులు వచ్చేవిధంగా అవగాహన కల్పించాలన్నారు. మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు, బడీడు పిల్లల తల్లిదండ్రులతో ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని 16 మండలాల్లో కార్యక్రమం మొదటి రోజు విజయవంతమైందని వెల్లడించారు. క్వింటాల్ పత్తి రూ.7,400 జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మా ర్కెట్లో క్వింటాల్ పత్తి గరిష్టంగా రూ.7,400 పలికింది. శుక్రవారం మార్కెట్కు నాలుగు వాహనాల్లో 30 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.7,150, కని ష్ట ధర రూ.6,500కు ప్రైవేటు వ్యాపారులు కొ నుగోలు చేశారు. శనివారం బక్రీద్, ఆదివారం సాధారణ సెలవులు ఉంటాయని, సోమవారం యథావిధిగా క్రయ విక్రయాలు కొనసాగుతాయని ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా తెలిపారు. ‘పది’లో 14మంది గైర్హాజరుకరీంనగర్: పదోతరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ గణితం పరీక్షకు శుక్రవారం 132 మందికి 118మంది విద్యార్థులు హాజరు అయ్యారు. 14మంది గైర్హాజరయ్యారని డీఈవో శ్రీరాం మొండయ్య తెలిపారు. ప్రత్యేక తనిఖీ బృందం రెండు పరీక్ష కేంద్రాలను, ప్రభుత్వ పరీక్షల విభాగం సహాయ కమిషనర్ ఒక పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారని పేర్కొన్నారు. -
పారిశుధ్యం.. పచ్చదనం
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం చామనపల్లి గ్రామపంచాయతీ పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంపొందించడంలో రాష్ట్రస్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపికై మొదటి బహుమతి సాధించింది. గతేడాదికాలంగా గ్రామంలో పారిశు ధ్య నిర్వహణకు పంచాయతీ కార్యదర్శి కోరుకంటి మహేందర్రావు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గ్రామంలో ట్రాక్టర్ ద్వారా సేకరించిన తడి,పొడి చెత్తను పంచాయతీ సిబ్బంది వేరు చేసి కంపోస్టుషెడ్లోని ప్రత్యేక అరల్లో భద్రపరుస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, పునర్వినియోగం చేస్తున్నారు. కంపోస్టుషెడ్, రింగ్కంపోస్టులో చెత్తను సేంద్రియ ఎరువుగా తయారు చేసి నర్సరీలోని మొక్కలకు ఎరువుగా వినియోగిస్తున్నారు. నర్సరీలో ప్రత్యేకంగా విటవిన్గార్డెన్ను ఏర్పాటు చేసి గంగావళి, పాలకూర తదితర ఆకుకూరలు పెంచుతున్నారు. హరితహారంలో భాగంగా అంతర్గత రోడ్లు, ప్రధాన రహదారికి ఇరువైపుల నాటిన మొక్కలతో పచ్చదనం పరుచుకుంది. ప్రతి ప్రధాన వీధి చివరలో మురికినీరు ఇంకిపోయేలా కమ్యూనిటీ ఇంకుడుగుంతలు నిర్మించారు. అండర్గ్రౌండ్ డ్రైనేజీలతో చెత్తచెదారం లేకపోవడంతో ప్రధాన రహదారులు పరిశుభ్రంగా ఉంటున్నాయి. ఇటీవల రాజస్థాన్ ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం సభ్యలు చామనపల్లిని సందర్శించారు. స్వచ్ఛదనం– పచ్చదనంతోపాటు పారిశుధ్య నిర్వహణలో రాష్ట్రస్థాయిలో ములుగు జిల్లా మల్లంపల్లి, ఖమ్మం జిల్లా మేడేపల్లి, కరీంనగర్ మండలం చామనపల్లి ఎంపిక కాగా చామనపల్లికి మొదటి బహుమతి లభించింది. రాష్ట్రస్థాయి బహుమతి సాధించేందుకు కృషి చేసిన పంచాయతీ కార్యదర్శి మహేందర్రావును పంచాయతీరాజ్ జాయింట్ కమిషనర్ రవీందర్, డిప్యూటీ కమిషనర్ జాన్వెస్లీ, ఎస్బీఎం స్టేట్ డైరెక్టర్ సురేశ్బాబు, కరీంనగర్ ఎంపీవో జగన్మోహన్రెడ్డి, మాజీ సర్పంచ్ బోగొండ లక్ష్మిఐలయ్య అభినందించారు.● రాష్ట్ర ఉత్తమ గ్రామపంచాయతీగా చామనపల్లి.. గ్రామస్తుల హర్షం -
యశోదలో ఉచిత కిడ్నీ వైద్య శిబిరం
కరీంనగర్ టౌన్: సోమాజిగూడ యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో శుక్రవారం కరీంనగర్ యశోద మెడిక ల్ సెంటర్లో ఉచిత కిడ్నీ వైద్య శిబిరం నిర్వహించా రు. నెఫ్రాలజిస్ట్ అరుణ్ కుమార్ పొన్న సుమారు 100 మంది పేషంట్లకు కిడ్నీలో రాళ్లు, ఇన్ఫెక్షన్, కి డ్నీ సమస్యలు, డయాలసిస్ అవసరం ఉన్నవారికి ఉచిత వైద్యం అందించారు. కరీంనగర్ సెంటర్ ఇన్చార్జ్ సురభి రాజేందర్రావు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లతిమ్మాపూర్ బస్టాండ్ సమీపంలో శుక్రవారం కారు, బైక్ ఢీకొన్న సంఘటనలో ఏడుగురు గాయపడ్డారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై లక్ష్మణ్ తెలిపిన వివరాలు. గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెంకు చెందిన చల్ల గిరిధర్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నివాసముంటున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ దైవదర్శానానికి కారులో వెళ్లి తిరిగి వస్తున్నారు. మండలంలోని రాచర్లతిమ్మాపూర్ వద్ద కామారెడ్డి వైపు నుంచి బైక్పై వస్తున్న దుమాలకు చెందిన పాముల సతీశ్ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న గిరిధర్, సంగీత, రాధ, సాత్విక, సాహిత్య, మనోజ్ఞ తీవ్రంగా గాయపడ్డారు. గిరిధర్ ఫిర్యాదుతో సతీశ్పై కేసు నమోదు చేసి, క్షతగాత్రులను సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. దాడి కేసులో నలుగురికి నాలుగేళ్ల జైలువేములవాడ: దాడి ఘటనలో నలుగురికి నాలుగేళ్లు జైలు, రూ.5వేలు జరిమానా విధిస్తూ వేములవాడ జడ్జి ప్రవీణ్ శుక్రవారం తీర్పునిచ్చినట్లు రూరల్ సీఐ శ్రీనివాస్ తెలి పారు. వేములవాడఅర్బన్ మండలం అనుపురం గ్రామానికి చెందిన గంగు లక్ష్మిరాజం, అతని భార్య బాలవ్వను పాతకక్షలతో 2017లో అదే గ్రామానికి చెందిన ఎర్రం ప్రవీణ్, ఎర్రం అంజయ్య, ఎర్రం ముత్తయ్య, ఎర్రం ప్రసాద్, ఎర్రం శశి దాడిచేసి గాయపరిచారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన జడ్జి ఈమేరకు తీర్పు వెలువరించారు. కోడెలు తరలిస్తున్న వ్యక్తిపై కేసుజగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని గొల్లపల్లి రోడ్లో ఎలాంటి అనుమతులు లేకుండా మూడు కోడెలు తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కిరణ్ తెలిపారు. గొల్లపల్లి మండలం అగ్గిమల్లకు చెందిన ఎండీ నజార్ ఎలాంటి అనుమతులు లేకుండా శుక్రవారం ఉదయం మూడు కోడెలను జగిత్యాలకు తీసుకొస్తుండగా గొల్లపల్లి రోడ్లో పట్టుకొని గోశాలకు తరలించి నాజర్పై కేసు నమోదు చేశామన్నారు. రోడ్డుప్రమాదంలో మహిళా హోంగార్డుకు గాయాలువీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలో మహిళా హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న జ్యోతి శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో గాయపడింది. స్థానికులు తెలిపిన వివరాలు. వీర్నపల్లి ఠాణాలో హోంగార్డుగా జ్యోతి విధులు నిర్వహిస్తుంది. విధులు ముగించుకొని ఇంటికి లిఫ్ట్ అడిగి బైక్పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ హోంగార్డు జ్యోతిని ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనారోగ్యంతో రెండు కోడెలు మృతి● జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్రెడ్డి వేములవాడఅర్బన్: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం తిప్పాపూర్లోని రాజన్న గోశాలలో శుక్రవారం అనారోగ్యంతో రెండు కోడెలు మృతి చెందినట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్రెడ్డి ప్రకటనలో తెలిపారు. గోశాలలో ఉన్న 1,300 కోడెలలో ప్రస్తుతం మొత్తం 11 కోడెలకు వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. మరో మూడు కోడెలు అనారోగ్యంతో బాధపడుతున్నాయన్నారు. కోడెల ఆరోగ్య సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
కీర్తి మెడికల్ స్టోర్స్ ప్రారంభం
కరీంనగర్: కీర్తి మెడికల్స్ 25వ బ్రాంచ్ను కరీంనగర్లో శుక్రవారం ప్రారంభించారు. శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఉమేశ్కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అల్ఫోర్స్ నరేందర్రెడ్డి, ఐఎంఏ ప్రెసిడెంట్ ఎనమల నరేశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కీర్తి మెడికల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ తిరుపతిరెడ్డి వారికి సత్కరించారు. కరీంనగర్ ప్రజలకు కీర్తి మెడికల్స్ 24గంటలు సర్వీస్ అందుబాటులో ఉంటుందన్నారు. 30వేల రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. కరీంనగర్ ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. బెల్లంపానకం ధ్వంసం.. రూ.లక్ష జరిమానా ముత్తారం(మంథని): అడవిశ్రీరాంపూర్, ఖమ్మంపల్లి అటవీ ప్రాంతాల్లోని నాటుసారా స్థావరాలపై శుక్రవారం దాడులు చేశామని మంథని ఎకై ్సజ్ సీఐ రాకేశ్ కుమార్ తెలిపారు. సిబ్బంది రాజేందర్, శ్రీను, రఘురాం, రవి ఆధ్వర్యంలో దాడులు చేసి 200 లీటర్ల బెల్లం పానకాన్ని పారబోశామన్నారు. అలాగే ఓడెడ్– అమ్రబాద్ ప్రాంతంలో నాటుసారా విక్రయిస్తూ పట్టుబడిన ఇద్దరికి రూ.లక్ష జరిమానా విధించడంతోపాటు తహసీల్దార్ మధూసూదన్రెడ్డి ఎదుట నిందితులను బైండోవర్ చేసినట్లు సీఐ వివరించారు. వివాహితపై లైంగికదాడికి యత్నం ● నిందితుడిపై కేసు రామగుండం: అంతర్గాం మండలంలోని ఓ ప్రాంతానికి చెందిన ఓ వివాహితపై అదే ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు లైంగికదాడికి యత్నించిన ఘటనపై ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై వెంకటస్వామి కథనం ప్రకారం.. ఓ వివాహిత మంచిర్యాలలోని ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి అక్కడకు రోజూవెళ్లి వస్తున్నారు. కొంతకాలంగా అదేప్రాంతానికి చెందిన పూదరి సత్తయ్యగౌడ్ ఆమెకు తరచూ ఫోన్చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. అంతేకాదు.. ఈనెల ఒకటో తేదీన ఎవరూ లేనిసమయంలో ఏకంగా ఇంట్లోకి ప్రవేశించి తన కోరిక తీర్చాలని వేధించాడు. దీంతో బాధితురాలు ఒక్కసారిగా కేకలు వేసింది. దీంతో నిందితుడు పారిపోతూ.. ఈ విషయం ఎవరికై నా చెబితే చంపేస్తానని వివాహితను బెదిరించాడు. ఎలాగోలా ధైర్యం చేసిన బాధితరాలు పోలీసులకు ఫిర్యాదు చేసిశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై వివరించారు. -
అర్హులకే రేషన్ కార్డులు
● కొత్త కార్డుల జారీకి కసరత్తు ● అనర్హుల కార్డుల రద్దుకు కొనసాగుతున్న ప్రక్రియ ● రెవెన్యూ, పౌరసరఫరాల అధికారుల డబుల్ రోల్కరీంనగర్ అర్బన్: రేషన్కార్డులపై డబుల్ రోల్ సాగుతోంది. అనర్హుల కార్డుల ఏరివేత ప్రక్రియ సాగుతుండగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నడుస్తోంది. ఏకకాలంలో రెండు ప్రక్రియలు సాగుతుండగా రెవెన్యూ, పౌరసరఫరాలశాఖ సదరు పనిలో నిమగ్నమైంది. గతంలో పలువురు అధికారులు ఇబ్బడిముబ్బడిగా కార్డులు జారీ చేయగా మామూళ్లు పైచేయిగా మారాయి. దీంతో కార్డుల సంఖ్య కుటుంబాలకు మించి ఉండటం అప్పట్లో తీవ్రచర్చకు దారి తీసింది. క్రమేణా అనర్హుల ఏరివేత సాగుతుండగా ఈ సారి పక్కాగా వ్యవహరిస్తున్నారు. అదేస్థాయిలో కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారి వివరాలను పరిశీలిస్తూ కార్డులను జారీ చేస్తున్నారు. గడిచిన ఆరునెలలుగా బియ్యం తీసుకోని కార్డుదారుల వివరాలను గుర్తించిన ప్రభుత్వం జాబితాను జిల్లాకు చేరవేసింది. ఇంతకీ ఆ కార్డుదారులు ఉన్నారా? లేదా? అన్నది తేల్చేందుకు క్షేత్రస్థాయిలో విచారణకు ఆదేశించింది. సంబంధీకుల వివరాలతో అనర్హులను తొలగించే ప్రక్రియ మొదలైంది. సాంకేతికతతో గుర్తింపు పౌరసరఫరాలశాఖ అధికారులు చౌక దుకాణాల కు సరుకులు కేటాయిస్తుంటారు. ఈ–పోస్ యంత్రంపై వేలిముద్ర వేయడం, లేదంటే ఐరిస్ విధానం ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో సాంకేతికతను వినియోగించి కొందరు అనర్హులుగా ఉన్నట్లుగా గుర్తించింది. అందుబాటులో కి వచ్చిన సాంకేతికతతో ఒకే ఽఆధార్ నంబర్ కలి గిన లబ్ధిదారులు రెండుచోట్ల సరకులు తీసుకుంటున్నట్లుగా తేల్చారు. ఆరు నెలలుగా వేలమంది కార్డుదారులు బియ్యం తీసుకోనివారు ఉన్నట్లు వివరాలను సేకరించింది. ఇందులో వందేళ్లుదా టిన వారు, 18 ఏళ్లలోపు ఉన్నవారితో పాటు చని పోయినవారు ఉన్నారు. ప్రధానంగా మన రాష్ట్రంలో, పొరుగు రాష్ట్రాల్లోనూ కార్డులు కలిగి ఉన్న ట్లు అనుమానిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 2,90,402 రేషన్కార్డులు ఉండగా.. సన్నబియ్యం పంపిణీ మొదలైనా.. ఏప్రిల్, మే నెలలో సుమా రు 13వేల మంది కార్డుదారులు దుకాణాలకు రావడం లేదంటే వారు అర్హులా? కాదా? అన్న అనుమానాలు వస్తున్నాయి. జనవరిలో 14,343 మంది, ఫిబ్రవరిలో 16,050, మార్చిలో 17,218 మంది కార్డుదారులు దూరంగా ఉన్నారని లెక్క తేలింది. ఏప్రిల్లో సన్నబియ్యం అందించడం షురూ కాగా, మార్చితో పోలిస్తే 2వేల మంది అదనంగా బియ్యం తీసుకున్నారు. 10వేలకు పైగా కార్డుల జారీ కొత్త రేషన్ కార్డుల కోసం నిరీక్షిస్తున్నవారు జిల్లాలో 30వేల మందికి పైగా ఉన్నారని తెలుస్తోంది. దరఖాస్తు వచ్చిన తదుపరి గిర్దావర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదించడం, నాయబ్ తహసీల్దార్, తహసీల్దార్ పౌరసరఫరాలశాఖకు జాబితాను పంపడం డీఎస్వో అప్రూవ్ చేయడం కార్డు రావడం జరిగే ప్రక్రియ. సదరు విధానం త్వరత్వరగా జరిగేలా కలెక్టర్ పమేలా సత్పతి చర్యలు చేపట్టారు. కొత్త కార్డులు 10వేలకు పైగా జారీ కాగా 15వేలకు పైగా కార్డుల్లో పేర్లను చేర్చడం వంటి ప్రక్రియ చేపట్టారు. కార్డుల తొలగింపు, కొత్త కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతుందని రెవెన్యూ, పౌరసరఫరాలశాఖ అధికారులు వివరించారు.జిల్లాలో గ్రామాలు: 318 మునిసిపాలిటీలు: 4 రేషన్ దుకాణాలు: 566 రేషన్ కార్డులు: 2,90,402 ప్రతినెలా బియ్యం పంపిణీ: 5582 మెట్రిక్ టన్నులు రేషన్ తీసుకోనివారు: 13,400 -
విత్తన లెక్క.. ఇక పక్కా
● విత్తన శుద్ధి కేంద్రాలపై ధ్రువీకరణ సంస్థకు పర్యవేక్షణ బాధ్యత ● రిజిస్ట్రేషన్ను తప్పనిసరి చేసిన ప్రభుత్వం కరీంనగర్ అర్బన్: ఆరుగాలం కష్టపడే అన్నదాతకు నకిలీ విత్తనాల బెడద తప్పనుంది. అక్రమంగా విత్తనాలు తయారుచేసి విక్రయించేవారిపై ప్రభుత్వం ఇక ఉక్కుపాదం మోపనుంది. వరి, పత్తి, కంది, పెసలు, కూరగాయలు ఇతర పంటలకు విత్తన కంపనీలపై ఆధారపడటం జరిగే ప్రక్రియ. దీన్ని ఆసరా చేసుకున్న వ్యాపారులు అక్రమార్గంలో లక్షలు గడించాలనే దురాశతో ఏటా నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. తీరా సస్యరక్షణ చర్యలు చేపట్టాకా కాత దశకు వచ్చే క్రమంలో నకిలీదని తేలడంతో ఆర్థికంగా జరగాల్సిన నష్టం జరుగుతుండగా అండగా నిలవాల్సిన యంత్రాంగం పట్టించుకోవడంలేదు. ఈ నేపథ్యంలో విత్తనాల విక్రయాలు పక్కాగా జరిగితేనే అన్నదాతలకు అభయం ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం విత్తన శుద్ధి కేంద్రాలపై పర్యవేక్షణను కట్టుదిట్టం చేసింది. నిబంధనల మేరకు వ్యవహరించాల్సిందే నకిలీలకు చెక్ పెట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త విత్తన చట్టం అమలు కోసం ఇప్పటికే కసరత్తు చేస్తుండగా విత్తనశుద్ధి మిల్లులు ఎన్నో లెక్క తేల్చడం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో వ్యవసాయ శాఖకు ఉత్తర్వులు జారీచేసింది. విత్తనశుద్ధి మిల్లులు నిర్వహిస్తున్న యజమానులు ఇక నుంచి తప్పనిసరిగా ప్రభుత్వ వ్యవసాయశాఖ వద్ద విత్తన ధ్రువీకరణ సంస్థ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న మిల్లులకు మాత్రమే రైతుల నుంచి విత్తనాలు సేకరించి, వాటిని విత్తనశుద్ధి చేశాక తిరిగి విత్తన కంపనీలకు అందించే హక్కు ఉంటుంది. ఇలా చేయకుండా ఎలాంటి అనుమతుల్లేకుండా విత్తనశుద్ధి కోసం మిల్లులు నిర్వహిస్తే కొత్త విత్తన చట్టం ప్రకారం వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు విత్తనశుద్ధి మిల్లులను సీజ్చేసే అధికారం కూడా ప్రభుత్వం విత్తన ధ్రువీకరణ సంస్థకు కట్టబెట్టింది. 50కి పైగా విత్తన శుద్ధి కేంద్రాలు ఉమ్మడి జిల్లాలో విత్తన పత్తితో పాటు వరి, కందులు, పెసలు, వేరుశెనగ, కూరగాయల విత్తనాలు తిరుగు ఒప్పందం ద్వారా రైతులతో సాగు చేయించి వారి నుంచి వాటిని తిరిగి కొనుగోలు చేసి విత్తనాలను శుద్ధిచేసి మధ్యవర్తులుగా ఉండి కంపెనీల విత్తన అవసరాలు తీర్చే విత్తన శుద్ధి మిల్లులు 50కి పైగా ఉన్నాయి. ఉన్న మిల్లులు మొత్తం చాలావరకు విత్తన అవగాహన ఒప్పందం ప్రకారం నెలకొల్పినవి మాత్రమే. వీటికి ఒక రిజిస్ట్రేషన్ నంబర్ కానీ ఇప్పటివరకు లేదు. కొన్ని విత్తనశుద్ధి మిల్లులకు కనీసం స్థానికంగా ఉండే అధికారుల అనుమతి కూడా లేని దుస్థితి. ఉమ్మడి జిల్లాలో వరి, పత్తిని రైతులు విరివిగా సాగుచేస్తున్న కారణంగా ఆరేళ్లకాలంలో 20కి పైగా విత్తనశుద్ధి మిల్లులు వెలిశాయి. అన్ని విత్తన అవగాహన ఒప్పందం ప్రకారం వెలిసినవే. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా వీటి లెక్క ఇక నుంచి పక్కా కానుంది. కంపెనీలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడంతో పాటు ప్రభుత్వ కోడ్ కూడా ఉంటుంది. అదే కోడ్తో విత్తనశుద్ధి మిల్లుల నుంచి కంపెనీలకు కానీ రైతులకు కానీ.. విత్తనాలు చేరవేయాల్సి ఉంటుంది. గతంలో విత్తనశుద్ధి మిల్లులపై విత్తన ధ్రువీకరణ సంస్థకు కానీ వ్యవసాయ శాఖకు కానీ పెద్దగా పర్యవేక్షణ అధికారాలు లేకపోవడంతో మిల్లులో నకిలీ విత్తనాలు శుద్ధి చేస్తున్నారా? నాణ్యత గల విత్తనాలు శుద్ధి చేస్తున్నారా? అన్నది తెలియని పరిస్థితి. ఇక నుంచి వాటిని పర్యవేక్షించే అధికారాలు విత్తన ఽధ్రువీకరణ సంస్థ అధికారులకు కట్టబెట్టడంతో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించే వ్యవస్థ కొంత మెరగయ్యే అవకాశముంది. రూ.వెయ్యి కోట్ల విత్తన వ్యాపారం ఉమ్మడి జిల్లాలో రైతులకు తిరుగు ఒప్పందం ద్వారా ఫౌండేషన్ విత్తనాలు ఇచ్చి వాటిని తిరిగి కొనుగోలు చేసి విత్తనశుద్ధి మిల్లుల ద్వారా శుద్ధి చేసి కంపెనీలకు అందిస్తే వారు తమ సొంత విత్తన ఽధ్రువీకరణ ట్యాగ్పై సర్టిఫైడ్ విత్తనాలుగా రైతులకు అమ్ముతున్నారు. ఏటా ఉమ్మడి జిల్లాలో విత్తనశుద్ధి మిల్లుల ద్వారా రైతుల నుంచి కొనుగోలు, అమ్మకాల వ్యాపారం ఏటా రూ.800కోట్ల వరకు నడుస్తోంది. ఇంత వ్యాపారం జరుగుతున్నా విత్తన కంపెనీలు వ్యవసాయ చట్టాల్లో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులకు మొత్తం ఎగనామం పెడుతున్నారు. ఒక్క కరీంనగర్ జిల్లాలో ఏటా రూ.500 కోట్ల వరకు విత్తన వ్యాపారం జరుగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అసలు ఉత్పత్తి అయిన చోట నుంచి అమ్మకం జరిగే దాకా లెక్కలను విత్తనశుద్ధి మిల్లుల నిర్వాహకులు, విత్తన కంపెనీలు ప్రభుత్వానికి పక్కాగా చెప్పాల్సి ఉంటుంది. -
‘లక్కీ’ లాటరీ మోసాలపై స్పందించండి
● నివేదిక ఇవ్వాలని సీపీకి హెచ్ఆర్సీ ఆదేశాలు సాక్షిప్రతినిధి,కరీంనగర్: లక్కీలాటరీ మోసాలపై ఎట్టకేలకు మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) స్పందించింది. కరీంనగర్ వేదికగా పలుకంపెనీలు కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాలలోని మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని లక్కీ లాటరీలు నడిపి ప్రజలను మోసం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని 2022 అక్టోబరులో ‘లక్కీ లాటరీ మోసాలు’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఉచిత బహుమతులు, నగదు బహుమతులు ఇస్తామంటూ పేదలకు ఆశచూపించి వారి నుంచి రూ.కోట్లు కాజేసి పరారయ్యారు. ఈ విషయంలో పోలీసులు సరిగా వ్యవహరించలేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో కరీంనగర్కు చెందిన ఇమ్రాన్ అనే యువకుడు మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయించాడు. దీంతో జరిగిన ఘటనపై ఈనెల 24వ తేదీలోగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కరీంనగర్ సీపీకి హెచ్ఆర్సీ ఆదేశించింది. రాజన్న గోశాలలో మరో రెండు కోడెలు మృతివేములవాడఅర్బన్: శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం తిప్పాపూర్లోని గోశాలలో గురువారం అనారోగ్యంతో మరో రెండు కోడెలు మృతిచెందినట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్రెడ్డి ప్రకటనలో తెలిపారు. అకాలవర్షాలు, అనారోగ్య పరిస్థితులతో గోశాలలో ఇప్పటి వరకు 28 కోడెలు మృతి చెందినట్లు వివరించారు. గోశాలలో ఉన్న 1,300 కోడెలలో ప్రస్తుతం 12 కోడెలు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపారు. వీటికి వెటర్నరీ డాక్టర్లు వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దాణాపూర్ ఎక్స్ప్రెస్ నుంచి కిందపడిన యువకుడుఓదెల(పెద్దపల్లి): సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలునుంచి కిందపడిన యువకుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాలు.. గురువారం గోదావరిఖనికి చెందిన కంకణాల సంతోష్ రామగుండం వచ్చేందుకు కాజీపేట్లో దాణాపూర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కి డోర్ వద్ద కూర్చున్నాడు. పొత్కపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు కిందపడగా తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయాడు. బ్లూకోల్ట్ పోలీసులు శంకర్, శివశంకర్ వెంటనే స్పందించి పట్టాల మధ్య ఉన్న సంతోష్ను బయటకు తీసుకువచ్చి అంబులెన్స్లో సుల్తానాబాద్ ఆస్పత్రికి తరలించారు. -
తండ్రిని హతమార్చిన తనయుడు
రాయికల్: రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలో తొట్ల ఎర్రయ్య(65)ను కన్న కొడుకే గొడ్డలితో దారుణంగా హతమార్చిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఎస్సై సుధీర్రావు కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలో తొట్ల ఎర్రయ్య కొడుకు మల్లేశ్తో కలిసి జీవిస్తున్నాడు. చిన్నప్పుడే తల్లి చనిపోగా.. మల్లేశ్ మానసిక పరిస్థితి సరిగా లేదు. కొడుకు ఆలన పాలన తండ్రి ఎర్రయ్య చూసుకుంటున్నాడు. మానసిక స్థితి సరిగా లేని మల్లేశ్ బుధవారం అర్ధరాత్రి తన తండ్రిపై గొడ్డలితో తీవ్రంగా దాడిచేయగా అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలాన్ని జగిత్యాల రూరల్ సీఐ కృష్ణారెడ్డి సందర్శించారు. సంఘ నాయకుడు నాగుల గంగ మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
లారీలు ఢీ.. ఒకరు మృతి
హుజూరాబాద్: ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతున్న తుమ్మన్నపల్లి గ్రామం మీదుగా వెళ్తున్న వరంగల్–కరీంనగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరగగా.. ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా టంగుటూరు గ్రామానికి చెందిన దాచేపల్లి కృష్ణకిషోర్(44) లారీని ఎదురుగా వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. కృష్ణకిశోర్ లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అతి కష్టమ్మీద క్షతగాత్రుడికి బయటికి తీసి చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించే లోపే మృతిచెందాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. లారీ క్లీనర్ మస్తాన్, మరో డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు లారీలు బ్రిడ్జిపై ఢీకొనగా.. అటు వరంగల్, ఇటు కరీంనగర్ వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు వాహనాలను దారి మళ్లించి ట్రాఫిక్ పునరుద్ధరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద స్థలాన్ని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను సీఐ కరుణాకర్నడిగి తెలుసుకున్నారు. -
ట్రాక్టర్ బోల్తాపడి యువరైతు..
మల్లాపూర్: వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడి యువ రైతు మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట శివారులో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెదలి ప్రవీణ్(30)కు భార్య రమ్య, ఇద్దరు కొడుకులున్నారు. గ్రామశివారులోని తన వ్యవసాయ భూమిని చదును చేసేందుకు పెద్ద కుమారుడు శ్రీహాన్తో కలిసి వెళ్లాడు. పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడటంతో ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన శ్రీహాన్ను స్థానికులు మెట్పల్లి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. రమ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై రాజు తెలిపారు. -
రాష్ట్ర ఉత్తమ పంచాయతీగా చామనపల్లి
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం చామనపల్లి గ్రామ పంచాయతీ రాష్ట్రస్ధాయిలో ఉత్తమ పంచాయతీగా అవార్డు సాధించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని గురువారం హైదరాబాద్లోని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్బోర్డు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో దేవాదాయ, పర్యావరణ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా పంచాయతీ కార్యదర్శి కోరుకంటి మహేందర్రావు ఉత్తమ పంచాయతీ అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నారు. రాష్ట్రస్ధాయిలో ఈ అవార్డు కోసం మూడు గ్రామపంచాయతీలు ఎంపిక చేయగా చామనపల్లి పంచాయతీకి మొదటి స్థానం లభించింది. సాలీడ్ వేస్ట్ మేనేజ్ మెంట్, స్వచ్ఛత, పర్యావరణం, పచ్చదనం. సెగ్రేషన్షెడ్, కంపోస్టు ఎరువుల తయారీ, విటమిన్ గార్డెన్, ప్లాంటేషన్, కమ్యూనిటీ సోక్ పిట్స్ తదితర అంశాల్లో చామనపల్లి పంచాయతీ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి మొదటిస్ధానంలో నిలిచింది. ఈ సందర్భంగా గ్రామ ప్రత్యేక అధికారి, ఎంపీవో సీహెచ్.జగన్మోహన్రెడ్డి, కార్యదర్శి మహేందర్రావు, పంచాయతీ సిబ్బందిని మంత్రి సురేఖ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, టీఎస్ పీసీబీ మెంబర్ సెక్రటరీ రవి తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లికి వెళ్తూ.. మృత్యు ఒడికి
సాక్షి పెద్దపల్లి: పెళ్లి ఇంటికి చేరుకోవాల్సిన దంపతులను లారీ రూపంలో వచ్చిన మత్యువు కబళించింది. జీవితంలోనే కాదు... మరణంలోనూ తమ బంధం విడదీయరానిదంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వృద్ధురాలిని తప్పించబోయి, దంపతుల బైక్ను లారీ ఢీకొట్టిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని సుగ్లంపల్లి వద్ద రాజీవ్ రహదారిపై గురువారం రాత్రి జరిగింది. ప్రమాదంలో దంపతులు మతిచెందగా, మూడేళ్లు కూతురు తీవ్రగాయల పాలైంది. ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై శ్రావణకుమార్ తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా పాలకూర్తి మండలానికి చెందిన డ్రైవర్గా పనిచేస్తున్న గుంటిపల్లి రాము(30) భార్య అనూష(27), కూతురు సహాస్ర(03)లు కలిసి హూజూరాబాద్లోని బంధువుల పెళ్లికి వెళ్లాడానికి ద్విచక్రవాహనంపై బయల్దేరారు. ఈ క్రమంలో సుగ్లాంపల్లి వద్దకు రాగానే పెద్దపల్లి వైపు వెళ్తున్న లారీకి వృద్ధురాలు అడ్డుగా రావడంతో లారీ డ్రైవర్ ఆమెను తప్పించబోయాడు. దీంతో లారీ డివైడర్ ఎక్కి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో భార్య అనూష అక్కడిక్కడే మృతిచెందగా, భర్త సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతిచెందాడు.. కూతురుకు తీవ్రగాయాలు కాగా మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విషయం తెలుసుకున్న సీఐలు సుబ్బారెడ్డి, అనిల్లు అసుపత్రికి వచ్చి వివరాలను ఆడిగి తెలుసుకున్నారు. బసంత్నగర్లో విషాదం పాలకుర్తి: మరో రెండు రోజుల్లో బావమరిది వివాహం. ఎంతో సంబరంగా బయలుదేరిన భార్యాభర్తలు మార్గమధ్యంలో మృత్యువు కబలించడంతో బసంత్నగర్లో విషాదం నెలకొంది. తీవ్రంగా గాయపడ్డ చిన్నారి సహస్ర చావుబతుకులమధ్య వరంగల్ ఎంజీఎంలో పోరాడుతోంది. బసంత్నగర్లోని రాంనగర్కు చెందిన గుంటుపల్లి రాము స్థానికంగా లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. చిన్నప్పుడే తండ్రి కుమారస్వామి చనిపోగా, తల్లి పద్మ కాయాకష్టం చేసి కొడుకు రాము, బిడ్డ రమ్యను ఎంతో అల్లారుముద్దుగా పెంచింది. కొడుకు, కోడలు చనిపోయిన వార్త విన్న తల్లి పద్మ రోదనలు అక్కడున్నవారిని కంటతడిపెట్టించాయి. ● రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి ● వృద్ధురాలిని తప్పించబోయి దంపతులపైకి దూసుకెళ్లిన లారీ ● తీవ్ర గాయాలతో బయటపడిన మూడేళ్ల చిన్నారి -
అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి శివారులోని జగదాంబ వైన్స్ వద్ద బుధవారం రాత్రి అదే గ్రామానికి చెందిన అందె బాలఎల్లయ్య(52) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడి భార్య అంజవ్వ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు. ఎస్సై లక్ష్మణ్ తెలిపిన వివరాలు. బాల ఎల్లయ్య దినసరి కూలీగా పనిచేస్తూ.. కుటుంబాన్ని పోషించుకునేవాడు. బుధవారం సాయంత్రం బయటకు వెళ్లిన బాల ఎల్లయ్య రాత్రి 9.30 గంటల ప్రాంతంలో వైన్స్ వద్ద అచేతన స్థితిలో పడి ఉన్నాడని తెలుసుకున్న భార్య అంజవ్వ అంబులెన్స్లో మండల కేంద్రంలోని ఆస్పత్రికి తరలించింది. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. తన భర్త మరణంపై అనుమానాలు ఉన్నాయని అంజవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అప్పుల బాధతో ఆత్మహత్యమల్యాల: అప్పుల బాధ భరించలేక ఇంటి నుండి వెళ్లిపోయిన వ్యక్తి వ్యవసాయ బావిలో శవమై తేలాడు. మల్యాల ఎస్సై నరేశ్ కుమార్ కథనం ప్రకారం.. నూకపల్లి డబుల్ బెడ్రూం ఇళ్లలో నివాసముంటున్న నాగరాజు (39) రూ.4లక్షల అప్పు కావడంతో, తీర్చే మార్గం కానరాక, బుధవారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, గురువారం రాత్రి మల్యాల గ్రామ శివారులోని వ్యవసాయబావిలో శవమై తేలాడు. అప్పుల వాళ్లు ఎవరూ బాధ పెట్టవద్దని సూసైడ్ నోట్ రాసి, బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారని, కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. తాళం వేసిన ఇంట్లో చోరీమెట్పల్లి: పట్టణంలోని దుబ్బవాడలో బెజ్జారపు తార ఇంట్లో దొంగతనం జరిగింది. ఎస్ఐ కిరణ్కుమార్ కథనం ప్రకారం.. తార బుధవారం ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లింది. తిరిగి గురువారం రాగా, తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా..ఇంట్లో దాచి ఉంచిన తులం బంగారు పుస్తెల తాడు, మూడు గ్రాముల బంగారు విగ్రహాం చోరికి గురైనట్లు గుర్తించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
ఎస్సెస్సీ బోర్డు తప్పిదం.. విద్యార్థినికి అన్యాయం
రామగిరి(మంథని): ఎస్సెస్సీ బోర్డు అధికారుల తప్పిదంతో విద్యార్థినికి అన్యాయం జరిగింది. రామగిరి మండలం బేగంపేటకు చెందిన సిరిపురం వర్షిత సెంటినరికాలనీలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదివింది. వార్షిక పరీక్షల్లో 567 మార్కులు సాధించింది. చదువులో మొదటి స్థానంలో ఉండే వర్షిత తనకు వచ్చిన మార్కుల పట్ల సంతృప్తి చెందక బోర్డు అధికారులకు రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. బోర్డు ఆదేశాలతో మరోసారి పరిశీలించగా అసలు తప్పిదం బయటపడింది. పార్ట్–బీ పేపర్ కౌంట్ చేయలేదని గుర్తించి ఇప్పుడు 20 మార్కులు కలిపి మొత్తం 587 మార్కులుగా బోర్డు నుంచి మార్కుల మెమో అందజేశారు. రీ వెరిఫికేషన్లో 20 మార్కుల పెంపుతో వర్షిత జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం సాధించింది. అధికారుల తప్పిదం వల్ల తమ బిడ్డకు తీవ్ర అన్యాయం జరిగిందని వెంటనే బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. రీ వెరిఫికేషన్లో 20 మార్కులు పెంపు -
ఇసుక ట్రాక్టర్ ఢీకొని యువకుడు..
మెట్పల్లి: పట్టణంలోని వెల్లుల్ల రోడ్డులో గురువారం రాత్రి ఇసుక ట్రాక్టర్ ఢీకొని బండలింగాపూర్కు చెందిన గుగ్గిళ్ల రవి మృతి చెందాడు. రవి ఇటీవలే ఇంటర్ పూర్తి చేశాడు. పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై మెట్పల్లికి వచ్చి తిరిగి బండలింగాపూర్కు వెళ్తున్నాడు. మార్గమధ్యంలో పట్టణ శివారుకు చేరుకోగానే, ఎదురుగా వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని రోదించారు. -
ఉద్యమనేతల మాటముచ్చట
ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటాల నేపథ్యం వారిది. ఒకరు పాటతో చైతన్యం కలిగిస్తే.. మరొకరు బోధనలతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపారు. బడుగు, బలహీనవర్గాల తరఫున నేనున్నానంటూ పిడికిలి ఎత్తిన నేత మరొకరు.. వీరందరూ గురువారం ఒక్కచోట చేరారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్లో సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు కుమారుడు అభిలాశ్–శివాని వివాహం జరిగింది. ఈ పెళ్లికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీలు కోదండరాం, నెల్లికంటి సత్యం, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, జనశక్తి అగ్రనేత అమర్, విమలక్క, మాజీ ఎమ్మెల్యే చలపతిరావు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్లు పెళ్లి మండపంలో కలుసుకున్నారు. కుశలప్రశ్నలు వేసుకుంటూ గడిపారు. -
ప్లాస్టిక్ వ్యర్థాలను అరికడదాం
కరీంనగర్ టౌన్: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్లాస్టిక్ వ్యర్థాలను అరికడదాం.. పర్యావరణం కాపాడుదాం అనే శక్తివంతమైన నినాదంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్, గైనకాలజికల్ సొసై టీ సంయుక్తంగా వేడుకలు నిర్వహించా యి. ఐ ఎంఏ అధ్యక్షుడు డాక్టర్ నరేశ్ ఎనమల్ల, కార్యదర్శి డాక్టర్ సిరిపురం నవీన్కుమార్, కోశాధికారి డాక్టర్ చల్లా విజయ్కుమార్, గైనకాలజీ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ ఎం.ఎస్.ఎల్.స్రవంతి, కోశాధికారి డాక్టర్ స్వప్న నాయకత్వంలో హరితహారం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి శుభ్రం చేశారు. సీనియర్ డాక్టర్లు బి.ఎన్.రావు, మోహన్రెడ్డి, కిషన్, అలీమ్, లక్ష్మణ్, అరుణ్ కాటారి పాల్గొన్నారు. ప్లాస్టిక్ను నిషేధించాలికరీంనగర్: ప్రతీ ఒక్కరు ప్లాస్టిక్ను నిషేధించాలని డీఈవో శ్రీరామ్ మొండయ్య సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కశ్మీర్గడ్డ రైతు బజార్ వద్ద పర్యావరణ అవగాహన కార్యక్రమంలో పాల్గొని ర్యాలీ ప్రారంభించారు. వినియోగదారులకు ‘ప్లాస్టిక్ బ్యాగులను ఉపయోగించకండి– బట్ట సంచులను వాడండి’ అనే సందేశంతో బట్ట సంచులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకంతో కేన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు కలగవచ్చని హెచ్చరిస్తూ, మార్పు మీ నుండే మొదలవుతుందన్నారు. సీడీ రామస్వామి, మానసిక నిపుణులు కేఎస్.అనంతాచార్య ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీ నిర్వహించారు. జిల్లా సైన్స్ ఆఫీసర్ జయపాల్రెడ్డి, ప్లానింగ్ కో–ఆర్డినేటర్ మిలుకూరి శ్రీనివాస్, అశోక్రెడ్డి, అంజనేయులు, సైన్స్ ఫోరమ్ ప్రతినిధులు దామోదర్, అంజనేయులు పాల్గొన్నారు. పవర్కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ నిర్వహణ పనులు చేపడుతున్నందున శుక్రవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 11 కేవీ భగత్నగర్ ఫీడర్ పరిధిలోని భగత్నగర్, ఎర్రగుట్ట, వేంకటేశ్వర, విఘ్నేశ్వర, వాసుదేవ, న్యూశ్రీనగర్కాలనీల్లో, కట్టరాంపూర్ ప్రాంతాలు, ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు 11 కేవీ గౌతమినగర్ ఫీడర్ పరిధిలోని మహాలక్ష్మినగర్, శ్రీనివాసనగర్, జయశంకర్కాలనీ, శాతవాహన ఫార్మా మెడికల్ కళాశాల, చర్చి, తిరుమల్నగర్, కట్టరాంపూర్, బ్లూబెల్స్ స్కూల్ ప్రాంతాలు, కొత్త డీటీఆర్ ఏర్పాటు చేస్తున్నందున ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీరాంనర్ రోడ్ నెంబర్ 5,6,7, శ్రీరాంనగర్, ఆదిత్యనగర్, సాలంపుర, కొత్తయాస్వాడ, విద్యానగర్, శాతవాహన యూనివర్సిటీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. చెట్ల కొమ్మల తొలగింపు పనులు, నూతన డీటీఆర్ ఏర్పాటు చేస్తున్నందున ఉదయం 9 నుంచి 11 గంటల వరకు 11 కేవీ వరలక్ష్మి ఫీడర్ పరిధిలోని డీమార్ట్, వరలక్ష్మి గార్డెన్, తులసీనగర్, హెచ్పీ గ్యాస్ గోదాం, రెడ్డి ఫంక్షన్హాల్ వెనుక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–1 ఏడీఈ పి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు. కొత్తపల్లిలో.. విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులతో పాటు మధ్యస్తంభాల ఏర్పాటు పనులు చేపడుతున్నందున ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొత్తపల్లి(హెచ్), రాణిపూర్లలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్రూరల్ ఏడీఈ గాదం రఘు వివరించారు. ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలకు 15మంది గైర్హాజరు కరీంనగర్: పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మూడో రోజు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన రెండు పరీక్ష కేంద్రాల్లో 52 మంది విద్యార్థులకు 37 మంది హాజరు కాగా, 15 మంది గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి శ్రీరామ్ మొండయ్య ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రాలను ప్రత్యేక తనిఖీ బృందంతో పాటు డీఈవో, ప్రభుత్వ పరీక్షల విభాగం సహాయ కమిషనర్లు తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. -
మత్తుగా ప్రాణం తీస్తోంది!
గంజాయితో నష్టాలు ● గంజాయి మానవ శరీరంలోని వివిధ అవయవాలపై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ● తరచూ ఎక్కువ మోతాదులో తీసుకుంటే నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. ● పిచ్చిపిచ్చిగా ప్రవరిస్తుంటారు. తెలియని ఆతృత, భయం కలిగి ఉంటారు. ఇంద్రియాలు ఆధీనంలో ఉండవు. ● అతిగా తీసుకోవడంతో కళ్లు ఎర్రగా కనిపిస్తాయి. దృష్టి లోపానికి గురయ్యే ప్రమాదం ఉంది. ● హృదయ స్పందన రేటు, రక్త పోటు పెరుగుతుంది. గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ. ● ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. శ్వాసకోశ సమస్యలు ఎదురవుతాయి. ఊపిరితిత్తుల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది.● గంజాయితో జీవితాలు చిత్తు ● ఇతర రాష్ట్రాల నుంచి గుట్టుగా దిగుమతి ● గ్రానైట్ కార్మికుల్లో చాలా మంది సేవనం ● పట్టుబడి జైలుకు వెళ్లిన వారిలో కార్మికులు, యువకులే ఎక్కువ‘నేను గంజాయిని.. మీ చుట్టూ తిరుగుతున్న మహమ్మారిని.. ఒకప్పుడు మహానగరాలు.. పట్టణ ప్రాంతాల్లోనే నా ఉనికి ఉండేది. ఇప్పుడు అన్నిగ్రామాలు చుట్టివస్తున్నాను. పిల్లలు, యువకులే కాదు.. అమ్మాయిలూ నాకు దాసోహం అవుతున్నారు. ‘మత్తు’లో ముంచి.. విలువైన జీవితాలను చిత్తు చేస్తున్నాను. నా ప్రత్యేకత ఏంటనుకుంటున్నారా? మిమ్మల్ని మైకంలో ముంచి.. విచక్షణ కోల్పోయేలా చేస్తాను. నాకు యాష్ ఆయిల్, చాక్లెట్ల రూపాన్ని తీసుకొచ్చారు. భిన్నరూపాలు, మార్గాలు ఉండటంతో పోలీసులూ ఏం చేయలేకపోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మీ వద్దకు వస్తున్నా. మరి నన్ను ఆదరిస్తారా? తరమికొడతారా ? ఆలోచించుకోండి’.కరీంనగర్క్రైం: ఇతర రాష్ట్రాల నుంచి కరీంనగర్కు గంజాయి దిగుమతి అవుతోంది. బిహార్, ఛత్తీస్గఢ్, భద్రాద్రి కొత్తగూడెం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, అరకు, భీమునిపట్నం వద్ద గల ఎజెన్సీ ఏరియాల నుంచి కరీంనగర్కు గంజాయి రవాణా చేస్తున్న యువకులు పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయి. గంజాయి సేవించడంతో పాటు జల్సాల ఖర్చుల కోసం దానిని వ్యాపారంగా మార్చుకొని చాలా మంది యువకులకు అలవాటు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రానైట్, క్రషర్లు, ఇతర ఫ్యాక్టరీల్లో పని చేసే గంజాయి అలవాటు ఉన్న కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లినప్పుడు దానిని వెంట తెచ్చుకోవడంతో దందా మొదలవుతుంది. ధర తక్కువ.. మత్తు ఎక్కువ కరీంనగర్లోని కొత్తపల్లి మండలం బావుపేట, ఎలగందల్ ప్రాంతాల్లో సుమారు 300 వరకు గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. 10 వేల వరకు బిహార్, ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు చెందినవారు పనిచేస్తుంటారు. వీరంతా బావుపేట, ఎలగందల్తో పాటు కొత్తపల్లి మండలంలోనే ఎక్కువగా ఉంటారు. మద్యం తాగాలంటే రోజుకు కనీసం రూ.200 నుంచి రూ.500 వరకు కావాల్సి ఉంటుంది. కానీ, గంజాయి అయితే రోజుకు రూ.100 లోపే ఉండడంతో డబ్బులు మిగులుతాయని దీనికి అలవాటుపడుతున్నారు. కాగా, అమావాస్య రోజు గ్రానైట్ కార్మికులకు సెలవు కావడంతో ఆ రోజంతా గంజాయి సేవనం విచ్చలవిడిగా ఉంటుందని విశ్వసనీయ సమాచారం. కూలీ పనికి వచ్చి గంజాయి దందా ఇతర రాష్ట్రాల నుంచి కరీంనగర్లోని గ్రానైట్, క్రషర్, ఇటుకబట్టీలకు వేల సంఖ్యలో కార్మికులు వస్తుంటారు. బిహార్ నుంచి కూలీ పని కోసం వచ్చిన ఓ వ్యక్తి కొన్ని రోజులు పనిచేసిన తర్వాత గంజాయి సరఫరా చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని భావించి అక్కడి నుంచి కరీంనగర్కు గంజాయి దిగుమతి చేయసాగాడు. ఇటీవల అతడిని పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి కేసుల్లో పట్టుబడినవారిలో ఎక్కువ శాతం ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులే ఉన్నట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్నాయి. గంజాయి దిగుమతి చేసుకుంటున్న కూలీలు ఇతర కూలీలను టార్గెట్ చేసుకొని సిగిరెట్ల రూపంలో రూ.100 నుంచి రూ.200 వరకు అమ్మకాలు చేస్తున్నారు. గంజాయి నియంత్రణకు పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు చర్యలు చేపడుతున్నా దందాకు అడ్డుకట్ట పడడం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రహదారులు గురువారం రక్తమోడాయి. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపాయి. జగిత్యాల జిల్లా మల్యాల పరిధిలోని ముత్యంపేట వద్ద పెళ్లికారును డీసీఎం ఢీకొనడంతో చిన్నారి మృతి చెందగా.. పెళ్లి కుమారుడు సహా.. ఆరుగురు గాయపడ్డారు. ఇదే జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట శివారులో ట్రాక్టర్ బోల్తాపడి తండ్రి మృతి చెందగా.. కొడుకు గాయపడ్డాడు. మెట్పల్లిలోని వెల్లుల్ల రోడ్డులో ఇసుక ట్రాక్టర్ ఢీకొని యువకుడు చనిపోయాడు. పెద్దపల్లి జిల్లా సుగ్లాంపల్లి వద్ద లారీ ఢీకొనడంతో దంపతులు చనిపోయారు. చిన్నారి గాయపడింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పరిధిలోని తుమ్మనపల్లి వద్ద రెండు లారీలు ఢీకొని ఒక డ్రైవర్ మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. –వివరాలు 10లో.. రక్తమోడిన రహదారులు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి.. పలువురికి గాయాలు ఇతర రాష్ట్రాల నుంచి.. గంజాయి కేసుల్లో నిందితులుగా ఎక్కువ శాతం కార్మికులు, యువకులే ఉంటున్నారు. గ్రానైట్ కంపెనీల్లో ఎక్కువ శాతం బిహార్, ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తుంటారు. వీరిలో కొందరు గంజాయి దిగుమతి చేసి ఇతర కార్మికులకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తుంది. గంజాయి సేవించినా, సరఫరా చేసినా చట్టపరమైన చర్యలు తప్పవు. – నిరంజన్రెడ్డి, కరీంనగర్ రూరల్ సీఐ ‘బిహార్ నుంచి గంజాయి దిగుమతి చేసిన రాంపర్వేష్ సాయి(46)ని ఇటీవల కరీంనగర్ రూరల్సర్కిల్లోని కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 1.20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు’. ‘బిహార్ రాష్ట్రంలోని నూర్జాపూర్ నుంచి గంజాయి దిగుమతి చేసుకున్న యువకుడిని ఇటీవల కరీంనగర్లోని అశోక్నగర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు.’కరీంనగర్ కమిషనరేట్లో గంజాయి కేసుల వివరాలు సంవత్సరం కేసులు అరెస్టయిన పట్టుబడిన వారు గంజాయి (కిలోలు) 2023 22 54 27.604 2024 39 86 128.179 2025(ఇప్పటివరకు) 09 17 5.386 -
పంచాయతీ కార్యదర్శులపై పారిశుధ్య భారం
● కొత్త డీఎస్ఆర్ యాప్పై నిరసన ● నమోదు కాని హాజరుకరీంనగర్రూరల్: పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. ఓవైపు పంచాయతీ పాలకవర్గాలు లేక మరోవైపు నిధులు విడుదలకాక అప్పులు చేసి కార్యదర్శులు పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇటీవల పారిశుధ్య నిర్వహణపై జారీచేసిన గైడ్లైన్స్ భారంగా మారాయంటూ కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతనెల 24 నుంచి ప్రభుత్వం పారిశుధ్య నిర్వహణ కోసం డైలీ శానిటేషన్ రిపోర్టు యాప్ అమలు చేస్తోంది. దీని ప్రకారం పంచాయతీ కార్యదర్శులు రోజూ పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఫొటోలు, వివరాలను యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే కొత్త విధానంతో తమపై అదనపు పనిభారం పడుతుందంటూ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కార్యదర్శులు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టారు. జిల్లాలో మొత్తం 318 గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తుండగా కరీంనగర్ మండలంలో 14మంది కార్యదర్శులున్నారు. డీఎస్ఆర్ యాప్లో ఏముంది.? ప్రభుత్వం పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన డైలీ శానిటేషన్ రిపోర్టు యాప్ పంచాయతీ కార్యదర్శులకు గుదిబండగా మారింది. పంచాయతీ పరిధిలో ఎన్ని నివాస గృహాలు ఉన్నాయి, రోజు ఎన్ని గృహాలనుంచి చెత్తను సేకరిస్తున్నారో యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. తడి చెత్త, పొడి చెత్త ఎన్ని కిలోల చొప్పున సేకరించారు, మొత్తం ఎన్ని ఇళ్లనుంచి నుంచి రోజులో ఎంత పరిమాణంలో సేకరించారో పూర్తి వివరాలు నమోదు చేయాలి. డంపింగ్యార్డు, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, నర్సరీల వద్ద అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ఫొటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణతోపాటు చెత్త సేకరణ బాధ్యతను అప్పగించడంతో రోజువారీ పనులు పడకేస్తాయని పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు. మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ సమస్యతో యాప్లో వివరాలు నమోదు చేయడంలో జాప్యం కలుగుతుందని తెలుపుతున్నారు. ఇప్పటికే ఓటరు జాబితా సర్వే, రేషన్కార్డుల విచారణ, ఇందిరమ్మ ఇళ్లు, మిషన్ భగీరథ, స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమాల కారణంగా సుమారు 10 యాప్లలో వివరాలను అప్లోడ్ చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కొత్త డీఎస్ఆర్ యాప్తో అదనపు పనిభారం పడుతుందనే కారణంతో యాప్లో వివరాలను నమోదు చేయడం లేదని పలువురు కార్యదర్శులు తెలిపారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కార్యదర్శులు కొత్త యాప్లో వివరాలను నమోదు చేయాలని పంచాయతీ అధికారులు సూచిస్తున్నారు. -
చిన్నారుల ఆత్మీయ నేస్తం బాలభవన్
చిన్నారులకు ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణనిస్తూ.. బాలభవన్ ఆత్మీయ నేస్తంగా మారిందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆడిటోరియంలో విద్యాశాఖ, బాలభవన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేశారు. 45 రోజుల శిక్షణ శిబిరంలో సంగీతం, జానపద నత్యం, శాసీ్త్రయ నృత్యం, మృదంగం, కర్రసాము, అబాకస్, డ్రాయింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, చెస్, యోగా అంశాల్లో నిపుణులు చిన్నారులకు శిక్షణ ఇచ్చారు. అనంతరం విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఈవో మొండయ్య, జిల్లా విద్యా నియంత్రణ అధికారి అశోక్ రెడ్డి, బాలభవన్ సూపరింటెండెంట్ మంజులా దేవి, బాలభవన్ శిక్షకులు సంగెం రాధకృష్ట, శ్రీధర్, కృష్టకుమార్, సూర్యశ్రీ, అనూప్, రాధిక, మల్లిక, సుహాసిని తదితరులు పాల్గొన్నారు. – కరీంనగర్కల్చరల్ నృత్యం చేస్తున్న చిన్నారులు -
ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలి
మానకొండూర్: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రజలను కోరారు. లలితాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పర్యావరణ దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. గ్రామస్తులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్లాస్టిక్ వినియోగం ఆరోగ్యానికి హానికరమని, ప్రతీ ఒక్కరు ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని కోరారు. అధికారులు గ్రామాల్లో నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పంట చేతికొచ్చిన తర్వాత వ్యర్థాలను కాల్చకుండా భూమిలోనే కలియదున్నాలని సూచించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు, ఎంపీడీవో వరలక్ష్మి, ఎంపీవో కిరణ్, ఏపీవో శ్రీనివాస్, యునిసెఫ్ ప్రతినిధి కిషన్స్వామి పాల్గొన్నారు. కరీంనగర్ను గ్రీన్ సిటీగా మార్చాలి కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ను గ్రీన్ సిటీగా మార్చేందుకు, పర్యావరణాన్ని కాపాడేందుకు మొక్కలను పెంచాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ పిలుపునిచ్చారు. గురువారం పద్మానగర్లోని మానేరు పరివాహక సమీపంలో నగరపాలక సంస్థ, మెప్మా సమాఖ్య సంఘాల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. నగరాన్ని గ్రీన్ సిటీగా మార్చేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియొద్దీన్, సహాయ కమిషనర్ వేణుమాధవ్, ఈఈ సంజీవ్, డీఈలు శ్రీనివాస్రావు, లచ్చిరెడ్డి, పర్యావరణ ఇంజినీర్ స్వామి, డీఎంసీ శ్రీవాణి, టీఎంసీ మానస, సీవోలు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. -
పరిషత్ సమరానికి సిద్ధం!
గురువారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 2025ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కసరత్తు ● చర్యలు ప్రారంభించిన ఆయా జిల్లాల అధికారులు ● చకచకా ఓటర్ల తుది జాబితా, మార్పులు– చేర్పులు ● సిద్ధమవుతున్న పోలింగ్ స్టేషన్ల రూట్మ్యాప్లు ● ఈనెల 15 లేదా నెలాఖరున నోటిఫికేషన్ ?సాక్షిప్రతినిధి,కరీంనగర్: స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇటీవల పదవీకాలం ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ మేరకు ఉమ్మడి జిల్లా కలెక్టర్లు కసరత్తు ప్రారంభించారు. లోకల్బాడీ ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇటీవల సంకేతాలు వెలువడిన దరిమిలా.. ఎన్నికల ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తుండడం గమనార్హం. ఈమేరకు కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని జెడ్పీ సిబ్బంది ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం ఓటర్ల తుది జాబితాను మే 30వ తేదీన హైదరాబాద్కు పంపారు. ఇది పంపే ముందు.. ఇటీవల 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లను చేర్చడం విశేషం. ఆ తరువాత అందులో కొన్ని సవరణలు చేసి తిరిగి 31వ తేదీన మరోసారి ఓటర్ల జాబితాను హైదరాబాద్కు పంపారు. జోరుగా ఏర్పాట్లు.. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారని సమాచారం. ఈ నెల15న లేదా నెలాఖరులో నోటిఫికేషన్ విడుదల అవుతుందని, ఆ లోపు జిల్లా అధికారులు పూర్తిగా సంసిద్ధులు కావాలన్న ఆలోచనలో భాగంగానే ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే పోలింగ్ స్టేషన్ల ఖరారు చేశారు. పోలింగ్ స్టేషన్ల రూట్ మ్యాపింగ్ కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. అదే సమయంలో అసెంబ్లీ నియోజకవర్గాలలోని పోలింగ్ స్టేషన్లను ఎంపీటీసీ, జెడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాలకు అనుగుణంగా సర్దుబాటు చేసే ప్రక్రియ కూడా దాదాపుగా కొలిక్కి వచ్చింది. ఈ ప్రక్రియపై వారాంతానికి స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల జెడ్పీ కార్యాలయ సిబ్బంది ఇదే పనిలో తలమునకలయ్యారు. ఈనెలలో ఏక్షణమైనా ఎన్నికలు జరుగవచ్చన్న ప్రభుత్వ ఆదేశాలతో అంతా సిద్ధమవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజకీయ నాయకులు సైతం ఉత్సాహంగా ఉన్నారు. పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్నవారంతా ఇక రంగంలోకి దిగేందుకు సిద్ధమతున్నారు.ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలుజిల్లా ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు స్థానాలు కరీంనగర్ 170 15 జగిత్యాల 216 20 పెద్దపల్లి 140 13 రాజన్నసిరిసిల్ల 123 12 మొత్తం 649 60 -
మానవతా దృక్పథంతో సేవలందించాలి
● కలెక్టర్ పమేలా సత్పతి హుజూరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మానవతా దృక్పథంతో సేవలు అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. డయాలసిస్ కేంద్రం, ఐసీయూ, వార్డులు, ఓపీ విభాగం, నవజాత శిశువుల వార్డును పరిశీలించి శిశువుల సమస్యల గురించి తెలుసుకున్నారు. గర్భిణులు, బాలింతలతో మాట్లాడారు. తల్లిపాల ప్రాముఖ్యత, సాధారణ ప్రసవం ప్రాధాన్యం వివరించారు. అనంతరం ఆస్పత్రిలోని కాన్ఫరెన్స్ హాల్లో వైద్యాధికారులు, మెడికల్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రిలో అన్ని రకాల సేవలందించేందుకు అవసరమైన సిబ్బంది ఖాళీల వివరాలు సమర్పించాలన్నారు. ప్రసవాల సంఖ్య పెంచాలని, సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. హుజురాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరోగ్య మహిళ క్యాంపును వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. మెప్మా, ఐకేపీ సిబ్బంది ద్వారా ఆరోగ్య మహిళా ఉచిత వైద్య పరీక్షల పట్ల మహిళలకు అవగాహన కల్పించి క్యాంపును సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ఈ క్యాంప్ ద్వారా సుమారు రూ.50 వేలు ఖరీదు చేసే 47 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్న విషయం మహిళల్లోకి తీసుకెళ్లాలన్నారు. అంతకుముందు ఆస్పత్రి ఆవరణలో కలెక్టర్, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మొక్కలు నాటారు. సూపరింటెండెంట్ నారా యణరెడ్డి, ఆర్ఎంవో రమేశ్ పాలొన్నారు. ఏఎన్ఎం పోస్టులకు దరఖాస్తులు విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలోని టేకుర్తి, కొత్తపల్లి మండలంలోని ఎలగందల్, వీణవంక మండలంలోని గన్ముక్ల మోడల్ స్కూల్ గల్స్ హాస్టల్లోఖాళీగా ఉన్న ఏఎన్ఎం పోస్టుల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిన మహిళా అభ్యర్థుల నుంచి ఈనెల 6వ తేదీ సాయంత్రం 5గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి శ్రీరాంమొండయ్య తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యార్హతతో ప్రభుత్వ ఆమోదం పొందిన ఇనిస్టిట్యూషన్స్లో ఏఎన్ఎం శిక్షణ పొందిన కరీంనగర్ జిల్లావాసులు అర్హులన్నారు. ఆయా మండలాల వారికి తొలిప్రాధాన్యత ఇస్తామన్నారు. ఆసక్తి గలవారు కరీంనగర్లోని జిల్లా విద్యాశాఖాధి కార్యాలయంలో బయోడేటాను సమర్పించాలని ఆయన సూచించారు. పవర్ కట్ ప్రాంతాలు కొత్తపల్లి: విద్యుత్ పనుల్లో భాగంగా గురువారం ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు 11 కేవీ రామచంద్రాపూర్ ఫీడర్లో ఏవోఎస్ కాలనీ, సప్తగిరికాలనీ ఏరియాలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. అలాగే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొత్తపల్లి (హెచ్), రాణిపూర్ ఏరియాలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రూరల్ ఏడీఈ జి.రాజు వివరించారు. -
హత్యా.. ప్రమాదమా?
● అనుమానాస్పద స్థితిలో సింగరేణి కార్మికుడు మృతి గోదావరిఖని: అనుమానాస్పద స్థితి లో సింగరేణి కార్మికుడు మృతి చెందాడు. స్థానిక గంగానగర్లో ఉంటూ శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే–7లో జనరల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న గాదెం సాగర్(30) మంగళవారం అర్ధరాత్రి స్థానిక బస్టాండ్ సమీప సమాదుల సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుని కడుపు, తలపై గాయాలుండటంతో ఎవరైనా దాడి చేసి చంపారా? లేక కిందపడి గాయాలపాలై మృతి చెందాడా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నీతో మాట్లాడాల్సి ఉందని కొందరు ఫోన్చేసి అతిగా మద్యం తాగించి దాడిచేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఇటీవల ఓ పంచాయితీ కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే తనపై దాడిచేసిన సమయ ంలో కాపాడాలంటూ అతని మిత్రులకు కూడా మెసేజ్ లు చేసినట్లుగా పంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చేఅవకాశం ఉంది. సాగర్ బీఆర్ఎస్లో చురుకై న కా ర్యకర్తగా పనిచేశారు. సాగర్ మృతిని అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ ఎస్సై భూమేశ్ తెలిపారు. కేసు విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. -
ఇష్టారీతిన పునర్విభజన
నగరంలో చేపట్టిన డివిజన్ల పునర్విభజన ఇష్టారీతిన చేపట్టారు. ఐఏఎస్లను సైతం తప్పుదోవ పట్టించారు. జాబితాలో పేర్కొన్న ఇండ్లకు, ఓటర్లకు ఎక్కడా పొంతన లేదు. ఆర్ అండ్ బీ రోడ్లకు ఇరువైపులా ఒకే డివిజన్ ఉండరాదని నిబంధన ఉన్నా... పట్టించుకోకుండా రోడ్డుకు రెండు వైపులా ఉన్న ప్రాంతాలను కలిపి ఒకే డివిజన్ చేశారు. ఆర్ అండ్ బీ రోడ్లను ఎక్కడా హద్దులుగా తీసుకోలేదు. అసలు నగరపాలకసంస్థ పరిధిలో చూపించిన ఓట్లు కూడా సరైనవి కావు. క్షేత్రస్థాయిలో కాకుండా...హైదరాబాద్లో కంప్యూటర్లో డివిజన్లను పునర్విభజించారు. వెంటనే మళ్లీ డీలిమిటేషన్ను చేపట్టాలి. – చల్ల హరిశంకర్, నగర అధ్యక్షుడు, బీఆర్ఎస్ -
లాభాలు బాగు
సకాలంలో సాగు..● పచ్చిరొట్ట ఎరువులతో భూసారం పెంపు ● అందరికీ కేంద్ర, రాష్ట్రాల పెట్టుబడి సాయం ‘సాక్షి’ ఫోన్ఇన్లో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మికరీంనగర్ అర్బన్: సకాలంలో సాగుతో అన్నదాతలు ఆదాయం గడించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి(డీఏవో) భాగ్యలక్ష్మి అన్నారు. నూతన సాంకేతిక విధానాలను పాటిస్తూ సాగుచేస్తే మంచి ఫలితాలుంటాయని వివరించారు. సేంద్రియ పద్ధతుల ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయంతో పర్యావరణానికి మేలు చేసినవారవుతారని పేర్కొన్నారు. సీజన్కు ముందే పచ్చిరొట్ట ఎరువులు వాడటంతో భూసారం పెరుగుతుందని, అవసరమైన మేరకు విత్తనాలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వ్యవసాయ రంగ సమస్యలు.. ప్రభుత్వపర సాయంపై మంగళవారం ‘సాక్షి’ ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహించగా అనూహ్య స్పందన లభించింది. రైతులు తమ సందేహాలను వివరించగా డీఏవో భాగ్యలక్ష్మి నివృత్తి చేశారు. -
పునర్విభజన గజిబిజి
కరీంనగర్ కార్పొరేషన్: ‘కొత్తగా ఏర్పడిన 5వ డివిజన్లో 5–7–1 నుంచి 5–7–ముగింపు వరకు ఇండ్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అంటే ఆ సీరీస్లో ఉన్న ఇంటి నంబర్లన్ని (5–7–1 నుంచి 5–7–1163 వరకు) 5వ డివిజన్లోనే ఉండాలి. కానీ.. మళ్లీ 23వ డివిజన్లో 5–7–501 నుంచి 5–7–600 వరకు ఇండ్లను చేర్చినట్లు పేర్కొన్నారు. హౌసింగ్ బోర్డుకాలనీలోని 5–7– సీరిస్ మొత్తం 5వ డివిజన్లో ఉన్నట్లు పేర్కొని, మళ్లీ అదే సిరీస్లోని 5–7–501 నుంచి 5–7–600 వరకు ఇండ్లను 23వ డివిజన్లో చేర్చడంతో ఇందులో ఏది సరైందో అధికారులు వెల్లడించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.’ ‘61,62,63 డివిజన్లకు సంబంధించి పేర్కొన్న ఓట్లకు వాస్తవ ఓట్లకు తేడా ఉన్నట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 61వ డివిజన్లో జ్యోతినగర్, చైతన్యపురి, భాగ్యనగర్లలోని 1–10–837 నుంచి 2–10–1831 ఇండ్లకు చెందిన 5,320 ఓటున్నట్లుగా పేర్కొన్నారు. కానీ.. ఈ సీరిస్లో అపార్ట్మెంట్లు ఎక్కువగా ఉన్నాయని, ఓట్లు కూడా ఇంతకన్నా అధికంగా ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. అలాగే 63వ డివిజన్లో 2–10–1832 నుంచి 2–10– 2142/ఏ ఇండ్లకు చెందిన 5,305 ఉన్నట్లు పేర్కొనగా, ఓట్లు అంతకన్నా తక్కువగా ఉన్నాయనే ప్రచారం ఉంది.’ నగరంలోని 66 డివిజన్ల పునర్విభజన గందరగోళంగా మారింది. 1 నుంచి 66 డివిజన్ల వరకు ఏ డివిజన్లో ఏ ఇండ్లున్నాయి, ఓట్లు ఎన్ని ఉన్నాయనే వివరాలతో బుధవారం డ్రాఫ్ట్ నోటీసు జారీ చేశారు. కాని శాసీ్త్రయంగా కాకుండా, ఇష్టారీతిన,అవగాహన లేకుండా పునర్విభజనచేశారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాగా... రెవెన్యూ బ్లాక్లు, భౌగోళిక హద్దులు(రెగ్యులర్షేప్), ఈ ఏడాది జనవరి 6వ తేదీన పబ్లిష్ చేసిన ఓటర్ల జాబితా ఆధారంగా డివిజన్లను పునర్విభజన చేసినట్లు అధికారులు చెబుతున్నా.. వాస్తవానికి అలా జరగలేదని విపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే గురువారం నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఇంటి నంబర్లతో గందరగోళం నేటి నుంచి అభ్యంతరాలు స్వీకరణ -
చిట్ఫండ్ ఎదుట బాధితుల ఆందోళన
కరీంనగర్క్రైం: నగరంలోని ఒక ప్రైవేట్ చిట్ఫండ్ మేనేజర్ తాను వేసిన చిట్టీ ఎత్తుకొని ప్రభుత్వ ఉద్యోగులతో పూచీకత్తు పెట్టించుకొని కిస్తీలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని తను పనిచేసే చిట్ఫండ్ ఎదుట బాధితులు బుధవారం ఆందోళనకు దిగారు. బాధితుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన కె.రవికుమార్ ఒక చిట్ఫండ్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. తనకు పరిచయం ఉన్న గసికంటి మహేందర్, ఇరుగురాల నర్సయ్య అనే ప్రభుత్వ ఉద్యోగులతో పూచీకత్తు పెట్టించుకొని తాను వేసిన చిట్టీని తీసుకున్నాడు. చిట్టీ ఎత్తుకొని కట్టాల్సిన డబ్బులు కట్టకపోవడంతో పూచీకత్తు పెట్టిన వారికి కంపెనీ నుంచి నోటీసులు వచ్చాయి. దీనితో అతను ప్రస్తుతం పనిచేసే కోర్టు సమీపంలోని ప్రైవేట్ చిట్ఫండ్ కార్యాలయం వద్ద బాధితులు నిరసన తెలుపుతూ యాసిడ్ బాటిల్ పట్టుకొని ఆత్మహత్యకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న త్రీటౌన్ పోలీసులు అక్కడకు చేరుకొని బాధితులను, రవికుమార్ను అక్కడి నుంచి పంపించివేశారు. -
బీఆర్ఎస్ తప్పులే కాంగ్రెస్ కొనసాగించింది
గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పులనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం డివిజన్ల పునర్విభజన కొనసాగించింది. కాంగ్రెస్, ఎంఐఎం మెజార్టీ స్థానాలు దక్కించుకొనేలా డీలిమిటేషన్ను అశాసీ్త్రయంగా చేపట్టారు. డివిజన్లలో పేర్కొన్న ఇండ్లు, అందులో ఓట్లకు సంబంధం లేకుండా పోయాయి. క్షేత్రస్థాయిలో మ్యాప్ పరంగా, నిబంధనలకు అనుగుణంగా చేయాల్సిన డీలిమిటేషన్ను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. తప్పుదోవ పట్టించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. నిబంధనల ప్రకారం శాసీ్త్రయంగా డీలిమిటేషన్ను తిరిగి చేపట్టాలి. – గుగ్గిళ్లపు రమేశ్, మాజీ డిప్యూటీ మేయర్, బీజేపీ నేత -
రేపటి నుంచి బడిబాట
● ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదుపై దృష్టి ● విద్యాశాఖ సమాయత్తంజిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 425 ప్రాథమికోన్నత పాఠశాలలు 75 ఉన్నత పాఠశాలలు 150 మొత్తం పాఠశాలలు 650 మొత్తం విద్యార్థులు 42,322కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడమే లక్ష్యంగా ఈనెల 6నుంచి 19వ తేదీ వరకు ‘బడిబాట’ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలతో కూడిన షెడ్యూల్ను విడుదల చేసినట్లు డీఈవో శ్రీరామ్ మొండయ్య వెల్లడించారు. ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం పేరిట జిల్లా యంత్రాంగాన్ని సన్నద్ధం చేసి ఇది వరకే కలెక్టర్ పమేలా సత్పతి నేతృత్వంలో సమావేశాలు నిర్వహించారు. జిల్లా యంత్రాంగం సన్నద్ధం కలెక్టర్ నేతృత్వంలో డీఈవో, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో జిల్లాస్థాయిలో కార్యాచరణ రూపొందించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై, కెపాసిటీ బిల్డింగ్ పేరిట జిల్లాలోని వివిధ కేటగిరీల ఉపాధ్యాయులకు ఇటీవల మూడు దఫాలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాలల ప్రారంభం లోపు ఉచిత దుస్తులు, పుస్తకాలు అందించడంతో పాటు విద్యార్థుల నమోదును పెంచేందుకు కలెక్టర్ క్షేత్రస్థాయిలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. సామాజిక సేవాసంస్థలు, ఎన్జీవోలు తదితర వర్గాలను సమన్వయపరిచి బడిబాటను ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. మండలస్థాయిలో మండల పరిషత్ అధికారులు, ఎస్సైలు, ఇతర వర్గాల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఏ రోజు ఏం చేయాలనే కార్యాచరణను ఎంఈవో రూపొందిస్తారు. గ్రామస్థాయిలో కమిటీలు, బడిబాటపై అవగాహన, ప్రచార కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిర్వహిస్తారు. స్థానిక నేతల భాగస్వామ్యంతో బడిబాటలో గుర్తించిన విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియ చేపడతారు. షెడ్యూల్ ఇదీ.. ● జూన్ 6న ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులతో గ్రామసభ ● 07న ఉపాధ్యాయుల ఇంటింటి సందర్శన, బడీడు పిల్లలను గుర్తించడం ● 08,09,10న కరపత్రాలతో ఇంటింటి ప్రచారం, అంగన్వాడీ కేంద్రాల సందర్శన. బడిమానేసిన పిల్లలను గుర్తించి చేర్పించడం. ప్రత్యేకావసరాల పిల్లలను భవితకేంద్రాల్లో చేర్పించడం ● 11న నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష ● 12న అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించడం. పిల్లలకు పాఠ్య, రాత పుస్తకాల పంపిణీ, ఉచిత దుస్తుల అందజేత ● 13న సామూహిక అక్షరాభ్యాసం, బాలసభ ● 16న తొలిమెట్టు, ఉన్నతి కార్యక్రమాల దినోత్స వం. తరగతి గదుల్లో విషయాల వారీగా అభ్యసనా సామర్థ్యాల గోడప్రతుల ప్రదర్శన. పిల్లలు రూపొందించిన చార్టులతో గదుల అలంకరణ. చదవడం, గణిత సంబంధిత వాటిపై క్విజ్ పోటీలు ● 17న సమీకృత విద్య, బాలికా విద్యా దినోత్సవం నిర్వహణ. బాలికా వివాహాలు, చిన్నారులపై వేధింపులను అరికట్టేందుకు ప్రతిజ్ఞ ● 18న తల్లిదండ్రులు, పోషకులు, గ్రామస్తులు, వార్డు సభ్యులను ఆహ్వానించి తరగతి గదుల్లో చేపట్టిన డిజిటలీకరణ, సౌకర్యాలు చూపించడం, మొక్కల పెంపకం ప్రాధాన్యాన్ని పిల్లలకు వివరించడం ● 19న బడిబాట ముగింపు సందర్భంగా పిల్లలకు క్విజ్ పోటీలు విజయవంతం చేస్తాం కలెక్టర్ ఆధ్వర్యంలో అన్నిశాఖలు, అన్నివర్గాల ప్రజల సమ న్వయంతో బడిబాటను విజ యవంతం చేసేందుకు కృషి చేస్తాం. ప్రణాళికను పాటిస్తూ, ఎక్కువ మంది పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా పనిచేస్తాం. బడిబాటను విజయవంతం చేసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం. – శ్రీరామ్ మొండయ్య, డీఈవో -
అధికారులకే స్వేచ్ఛ ఇచ్చాం
డివిజన్ల పునర్విభజన ఎక్కడా జోక్యం చేసుకోలేదు. అధికారులకే పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. గతంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెచ్చి, ఇష్టారీతిన డీలిమిటేషన్ చేసిన విషయం అందరికి తెలిసిందే. కాని మేం అలాంటి తప్పులకు అవకాశం ఇవ్వలేదు. అధికారులపై ఎలాంటి ఒత్తిడి తేలేదు. ఒకవేళ ఏ డివిజన్లోనైనా పొరపాట్లు దొర్లితే, ఆధారాలతో అభ్యంతరాలు ఇస్తే అధికారులు వాటిని సరిచేస్తారు. – కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు -
లారీడ్రైవర్ నిర్లక్ష్యం.. యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
ఐనవోలు(వరంగల్): మసకచీకటిలో.. నడిరోడ్డుపై ఇండికేటర్స్ వేయకుండా ఆగిఉన్న లారీని.. వెనుకనుంచి కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని వరంగల్–ఖమ్మం రహదారి పంథిని గ్రామంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు, ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంనుంచి వరంగల్ వైపు సిమెంట్ బస్తాలతో వెళ్తున్న లారీని పంథిని గ్రామంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద నడిరోడ్డుపై ఆపిన డ్రైవర్ ఇండికేటర్స్ వేయకుండానే లారీ దిగి వెళ్లాడు. అదే సమయంలో పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరిఖనికి చెందిన యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ చింతకింది శివసాయి(29) తన పనుల నిమిత్తం సొంత కారులో ఖమ్మంనుంచి వరంగల్ వైపునకు వెళ్తున్నాడు. ఈక్రమంలో పంథిని పెట్రోల్ బంక్ వద్ద ఎదురుగా వస్తున్న వాహనాల లైట్ ఫోకస్కు దారి కనిపించకపోవడంతో ఇండికేటర్స్ వేయకుండా రోడ్డుపై నిలిపి ఉన్న లారీని ఢీకొట్టాడు. దీంతో శివసాయి తల, శరీర భాగాలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్లోని ఎంజీఎంకు తరలించారు. మృతుడికి ఇద్దరు అక్కలు, అమ్మ, నాన్న ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఇండికేటర్లు వేయకుండానే నడిరోడ్డుపై నిలిపిన లారీ వెనుకనుంచి ఢీకొట్టిన కారు.. మృతుడిది పెద్దపల్లి జిల్లా గోదావరిఖని -
ఆగ్రహించిన గ్రామస్తులు.. మట్టి లారీల అడ్డగింత
కాల్వశ్రీరాంపూర్/ఓదెల(పెద్దపల్లి): కాల్వశ్రీరాంపూర్/ఓదెల మండలాల్లో చెరువు మట్టి తరలిస్తున్న లారీలను గ్రామస్తులు బుధవారం అడ్డున్నారు. కాల్వశ్రీరాంపూర్లో ఓవర్లోడ్ లారీలతో రోడ్లు ధ్వంసమవుతున్నాయన్నారు. దుమ్ము, ధూళితో ఊపిరి ఆడటం లేదని తెలిపారు. దుమ్ము, ధూళి లేవకుండా నీటిని చల్లించాలని, లేకుంటే అడ్డుకుంటామని లారీ డ్రైవర్లను హెచ్చరించి వదిలిపెట్టారు. కాగా, పెగడపల్లిలో ఓ లారీ అతివేగంగా వెళ్లి టీవీఎస్ మోపైడ్ను ఢీకొట్టడంతో అదే గ్రామానికి చెందిన పత్తి రాజిరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. ఆగ్రహించిన గ్రామస్తులు కాల్వశ్రీరాంపూర్లో లారీని ఆపి డ్రైవరుకు దేహశుద్ధి చేశారు. అదేవిధంగా ఓదెల మండలం పొత్కపల్లిలో మట్టి లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇందుర్తి చెరువు నుంచి సుల్తానాబాద్కు మట్టి తరలిస్తున్న లారీలతో దుమ్ము, ధూళి లేచి ఇబ్బందులు పడుతున్నట్లు వారు ఆరోపించారు. దుమ్ము లేవకుండా రోడ్లపై ట్రాక్టర్తో నీళ్లు చల్లిస్తామని బాధ్యులు చెప్పడంతో ఆందోళనను విరమించారు. బీజేవైఎం జిల్లా కార్యదర్శి పుల్లూరి పృథ్వీరాజ్, గ్రామస్తులు ఆనందం, కిషన్షేట్, ఇరుకుల్ల శ్రీనివాస్, రమేశ్, సురేశ్ పాల్గొన్నారు. పెగడపల్లిలో వ్యక్తిని ఢీకొన్న లారీ డ్రైవర్కు దేహశుద్ధి చేసిన గ్రామస్తులు ఓదెల మండలం పొత్కపల్లిలోనూ నిరసనలు -
కిడ్నాప్ కలకలం
ముస్తాబాద్(సిరిసిల్ల): ఆర్థిక లావాదేవీల్లో ఏర్పడిన వివాదం ఒకరి కిడ్నాప్నకు దారితీసింది. రెండు రోజుల క్రితం కిడ్నాప్ జరుగగా ఆలస్యంగా వెలుగుచూసింది. సంచలనం సృష్టించిన కిడ్నాప్ సంఘటన వివరాలు ఎస్సై గణేశ్, బాధితుల కథనం ప్రకారం. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరుకు చెందిన జంపెల్లి పర్శరాములు రెండేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ కోనరావుపేట మండలానికి చెందిన వ్యక్తితో జరిగిన ఆర్థిక లావాదేవీలలో వివాదం ఏర్పడింది. ఈక్రమంలోనే ఏడాది క్రితం పర్శరాములు స్వగ్రామం గూడూరుకు వచ్చాడు. తిరిగి ఉపాధి కోసం మలేషియా వెళ్లాడు. అయితే పర్శరాములుకు తమకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని, ఆ డబ్బులు ఇవ్వాలంటూ కొందరు ఏడాది క్రితం తమను బెదిరించారని పర్శరాములు తల్లి మల్లవ్వ తెలిపింది. గత సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి బెదిరించారని పేర్కొంది. ఈనేపథ్యంలోనే మంగళవారం ఉదయం తన భర్త మల్లయ్య కనిపించకుండా పోయాడని తెలిపింది. మల్లయ్య కోసం గాలించిన ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై గణేశ్ సోమవారం అర్ధరాత్రి గూడూరుకు వచ్చిన వ్యక్తులపై ఆరా తీశారు. ప్రత్యేక బృందాలను నియమించి గాలింపు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో కిడ్నాపర్లు కోరుట్లలోని ఓ ఇంట్లో ఉన్నట్లు బుధవారం మధ్యాహ్నం కనిపెట్టారు. కిడ్నాపర్లు ఉన్న ఇంటిపై దాడి చేయగా.. ప్రధాన సూత్రధారులైన ఇద్దరు పరారైనట్లు సమాచారం. మల్లయ్యతోపాటు అక్కడే ఉన్న మరో ఇద్దరు కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మల్లయ్య క్షేమంగా ఉన్నాడని, వైద్యపరీక్షలు చేయిస్తున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. కాగా కిడ్నాపర్ల నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని పర్శరాములు తల్లి మల్లవ్వ, భార్య గీత ఆరోపించారు. డబ్బు విషయంలో ఏర్పడిన వివాదం తమకు తెలియదన్నారు. పర్శరాములు తండ్రి మల్లయ్యను కిడ్నాప్ చేయడంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. దుబాయ్లో ఏం జరిగింది.. డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై విచారణ చేస్తున్నామన్నారు. గల్ఫ్లో ఆర్థిక లావాదేవీల్లో వివాదం గూడూరులో కుటుంబ పెద్ద కిడ్నాప్ కోరుట్లలో పట్టివేత పోలీసుల అదుపులో ఇద్దరు కిడ్నాపర్లు ఆలస్యంగా వెలుగుచూసిన వ్యవహారం -
నాడు వైభవం.. నేడు కళావిహీనం
● కళ తప్పిన కాలనీలు.. శిథిలావస్థలో క్వార్టర్లు ● అస్తిత్వం కోల్పోయిన రామగుండం బీ థర్మల్ ● మూతపడి ఏడాది.. అనుబంధం విస్మరించని ప్రజలు రామగుండం: పట్టణంలోని బి–థర్మల్ విద్యుత్ కేంద్రం మూతపడి ఏడాది పూర్తయింది. దానితో అనుబంధం కలిగి ఉన్న ప్రజలు ఆ భావోద్వేగాల నుంచి బయటపడడం లేదు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో పనిచేసే సుమారు 300 మంది ఉద్యోగుల్లో ఇప్పటికే 70 మందిని యాదాద్రికి బదిలీ అయ్యారు. మరో రెండురోజుల్లో ఇంకో 50 మంది బదిలీ అయ్యే అవకాశం ఉంది. మిగతా ఉద్యోగులు.. ప్లాంట్ కూల్చివేత వరకూ ఇక్కడే ఉంటారని సమాచారం. 50ఏళ్ల క్రితమే.. సుమారు 50 ఏళ్ల క్రితమే ఏ–పవర్ ప్లాంట్ ప్రారంభించి.. అనతికాలంలోనే మూతపడగా అప్పటికే కొంత జనాభా తగ్గిపోయింది. ఇప్పుడు బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం మూసివేతతో రామగుండం అస్తి త్వం పూర్తిగా కోల్పోయినట్లయ్యింది. దీనిప్రభావం ప్రత్యక్షంగా బ్యాంకు, కార్మికులు, కాంట్రాక్టర్లపై ప డగా, పరోక్షంగా స్కూళ్లు, చిరు వ్యాపారులపై పడి ంది. ఉద్యోగులు తమ క్వార్టర్లను ఖాళీ చేసి వెళ్లిపోతుండడంతో అప్పటికే శిథిలావస్థకు చేరిన క్వార్టర్లు, అపరిశుభ్రంగా, చిత్తడిగా తయారయ్యాయి. ● విద్యుత్ ప్లాంట్లో ఇరవై ఏళ్లపాటు షట్డౌన్ తదితర ఓవర్హాలింగ్ పనులు చేసేవాడిని. సాంకేతిక పరిజ్ఞానం, సమస్యల సాధన పరిష్కారంపై పట్టు పెరగడంతో నామినేషన్ పద్ధతిపై చిన్నకాంట్రాక్టు పనులు తీసుకున్నా. ఇలా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించేవాడిని. ఇప్పుడు ప్లాంట్ మూతపడడంతో భరోసా కోల్పోయినట్లయ్యిందని సిరికొండ కోటి ఆవేదన చెందాడు. ● నేను ఇక్కడే పుట్టి ఇక్కడే ఉద్యోగం చేసి ఇక్కడే పదవీ విరమణ చేశా. ఐదు దశాబ్దాలపాటు పనిచేసే వారు, రిటైర్డ్ అయినవారితో బంధుత్వం ఏర్పడింది. ఆలయాలు, ఇళ్లలో జరిగే వేడుకలు, పర్వదినాల సందర్భంగా అందరం కలుసుకోవడం బాగుండేది. యాద్రాద్రికి బదిలీ అయినవారు కొందరు, ఉపాధి కోల్పోయి మరోచోటకు వెళ్లేవారు మరికొందరు.. బరువైన గుండెలతో వెళ్తుండడం చాలాబాధగా ఉందని రిటైర్డ్ ఉద్యోగి ఇరికిళ్ల రాజనర్సయ్య ఆవేదన చెందాడు. -
‘రియల్’ వ్యాపారంలో నష్టాలు
● వ్యాపారి ఆత్మహత్య జూలపల్లి(పెద్దపల్లి): రియల్ ఎస్టేట్ వ్యాపారం సరిగా సాగక నష్టాలు చవిచూసిన తెలుకుంట చెందిన రియల్టర్ కోడూరి సతీశ్కుమార్(38) ఆత్మహత్య చేసుకున్నాడు. బతుకు దెరువు నిమిత్తం కరీంనగర్ వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయగా నష్టాలు రావడంతో చొప్పదండిలో ఫాస్ట్పుడ్ సెంటర్ ప్రారంభించాడు. అదికూడా కలిసి రాకపోవడంతో అప్పుల పాలయ్యాడు. దీంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి నారాయణ ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఎస్సై సనత్ కుమార్ కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య మౌనిక, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ద్విచక్ర వాహనం అదుపు తప్పి వ్యక్తి మృతి సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి చెందిన సంఘటన కాట్నపల్లి శివారులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కూకట్ల రమేశ్(40) పనినిమిత్తం ద్విచక్ర వాహనంపై ఎలిగేడు మండలం శిపల్లికి వెళ్లి తిరుగు ప్రయాణంలో కాట్నపల్లి – శివపల్లి మధ్య అదుపు తప్పి బోల్తాపడ్డాడు. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిచారు. ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలి దుర్మరణంపెగడపల్లి: మండలంలోని నర్సింహునిపేట గ్రామంలో బుధవారం ఆర్టీసీ బస్సు ఢీకొని మ్యాన రాజవ్వ(75) మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. మల్యాలకు చెందిన మ్యాన రాజవ్వ రెండ్రోజుల క్రితం తన తమ్ముడు అడెపు భూమయ్య ఇంటికి వచ్చింది. తిరుగు ప్రయాణంలో మల్యాల వెళ్లేందుకు రోడ్డుపైకి వచ్చి బస్సు కోసం వేచి చూస్తోంది. కరీంనగర్ నుంచి పెగడపల్లి వెళ్లే బస్సు వచ్చి ఆగింది. రాజవ్వ బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా గమనించని డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. దీంతో రాజవ్వ బస్సు టైర్ల కింద పడి చనిపోయింది. బస్సు డ్రైవర్ కనుకయ్య నిర్లక్ష్యంతో తన తల్లి మృతి చెందిందని రాజవ్వ కొడుకు గంగాధర్ ఫిర్యాదుతో ఎస్హెచ్వో రవీందర్ కేసు నమోదు చేశారు. డాక్టర్పై సస్పెన్షన్ వేటు మంథని: పట్టణంలోని సామాజిక ఆస్పత్రిలో మత్తుమందు ప్రత్యేక వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ మోహన్రావు.. ట్యూబెక్టమీ ఆపరేషన్ కోసం పేషెంట్ వద్ద లంచం డిమాండ్ చేసినందుకు సస్పెండ్ చేస్తూ కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రచ్చపల్లి గ్రామానికి చెందిన పేషంట్ కొడాలి భాగ్య నుంచి ట్యూబెక్టమీ ఆపరేషన్ కోసం డాక్టర్ రూ.5వేలు లంచం డిమాండ్ చేస్తూ దొరికిపోయారని, ఆ డాక్టర్పై ఇప్పటికే పలు ఫిర్యాదులు నమోదైన నేపథ్యంలో సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
చాయ్తో.. ఆర్సీబీ విజయోత్సవ వేడుక
● రోజంతా అమృతతుల్యా ఉచితంగా చాయ్ అందజేత మల్యాల: ఐపీఎల్లో ఆర్సీబీ జట్టు విజయం సాధించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ, విరాట్ కోహ్లీ వీరాభిమాని ఉచితంగా చాయ్ పంపిణీ చేసి సంబురాలు చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ఒబులాపూర్ గ్రామానికి చెందిన జంగం రఘు మల్యాల అడ్డరోడ్డుపై అమృతతుల్య చాయ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఐపీఎల్లో ఆర్సీబీ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు 400 చాయ్లు ఉచితంగా అందజేసి, సంబురాలు చేసుకున్నాడు. రాష్ట్ర ప్రణాళిక బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, వారి వెంట ఉన్న బీఆర్ఎస్ నాయకులకు ఉచితచాయ్ని ఆస్వాదించారు. నిర్వాసితులతో సమావేశం నిర్వహించాలివేములవాడ: వేములవాడ మూలవాగు బ్రిడ్రి నుంచి రాజన్న ఆలయం వరకు చేపట్టే రోడ్ల విస్తరణలో 243 మంది నిర్వాసితులతో అధికారులు సమావేశం నిర్వహించిన తర్వాతనే పనులు చేపట్టాలనని అమర్ కోరారు. వేములవాడలో బుధవారం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అమర్ మాట్లాడారు. హైకోర్టు స్టే ఉన్నా అధికారులు, వ్యాపారులను భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. భూసేకరణలో భాగంగా వాల్యువేషన్ సక్రమంగా చేయడం లేదన్నారు. గతంలోనే రెండు బైపాస్రోడ్డులకు స్థానిక వ్యాపారులు తమ భూములను ఇచ్చారన్నారు. ఇలాంటి తరుణంలో మరోసారి రోడ్డు విస్తరణ అవసరం లేదని సమావేశంలో తీర్మానించారు. ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ నిర్వాసితులతో సమావేశం నిర్వహించాలని కోరారు. ట్రైనీ ఎస్సై, కానిస్టేబుళ్లపై చర్యలుకరీంనగర్క్రైం: సైదాపూర్ శివారులో గత నెల 8న వాహన తనిఖీ నిర్వహిస్తుండగా జరిగిన ఘటనపై ట్రైనీ ఎస్సై, కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నట్లు క రీంనగర్ సీపీ గౌస్ ఆలం ప్రకటించారు. వివరాల్లోకి వెళ్తే.. గత నెల 8న సైదాపూర్ పోలీస్ స్టేషన్ ప్రొబెషనరీ ఎస్సై అగస్త్య భార్గవ్, కానిస్టేబుళ్లు ఆకాశ్, అ జయ్ రోజువారీ విధుల్లో భాగంగా సైదాపూర్ శివా రులో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. అదే స మయంలో హుస్నాబాద్కు చెందిన బత్తుల మహేందర్ అనే వాహనదారుడిని ఆపి తనిఖీ చేయగా.. మ హేందర్, పోలీసులకు గొడవ జరిగి ఈ ఘటనపై కే సు నమోదు చేశారు. ఈ విషయంపై వాహనదా రుడు మహేందర్ సీపీకి ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన ఉన్నతాధికారుల నివేదిక ఆధారంగా ఆరో జు విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు ఆకాశ్, అజయ్పై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వారికి చార్జ్ మెమో జారీ చేసి పోలీస్ స్టేషన్ విధుల నుంచి తప్పిస్తూ హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేశారు. ట్రైనీ ఎస్సై అగస్త్య భార్గవ్పై క్రమశిక్షణా చర్యల నిమిత్తం మల్టీ జోన్ ఐజీకి నివేదిక పంపించినట్లు సీపీ తెలిపారు. -
మంత్రిగా బండికి ఏడాది
● జూన్ 9న ప్రమాణస్వీకారం చేసిన సంజయ్ ● సంబరాలకు సిద్ధమవుతున్న కమలనాథులు ● ప్రోగ్రెస్ రిపోర్టు విడుదల చేసిన ఎంపీ ఆఫీస్సాక్షిప్రతినిధి,కరీంనగర్: కేంద్ర సహాయమంత్రిగా బండి సంజయ్ ఏడాది పదవీకాలం పూర్తవుతున్న సందర్భంగా బీజేపీ నాయకులు సంబరాలకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాదికాలంలో బండి సంజయ్ చేసిన పనులు, చూపిన చొరవను వివరిస్తూ పార్టీ జిల్లా నాయకులు ప్రోగ్రెస్ రిపోర్టు విడుదల చేశా రు. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా బండి సంజయ్ విజయం సాధించారు. జూన్ 9న ప్రధాని నరేంద్రమోదీ కేబినెట్లో కేంద్ర సహా యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రిగా ఏడాది పూర్తికానుండడంతో అభిమానులు, పార్టీ నాయకులు సంబరాలకు సిద్ధమవుతున్నారు. అభివృద్ధి పనులపై దృష్టి జాతీయ ఉపాధిహామీ పథకం కింద ప్రతీ మండలానికి రూ.2కోట్లు ఖర్చు చేసి ఆయా మండలాల పరిధిలోని గ్రామాల్లో రోడ్లు నిర్మించారు. సగటున ఒక్కో గ్రామానికి రూ.5లక్షలు అంతర్గత రోడ్లకు వెచ్చించారు. ఆధునీకరణ పనుల్లో భాగంగా కరీంనగర్ రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.33కోట్లకుపైగా ఖర్చు చేశారు. పెండింగ్లో ఉన్న కరీంనగర్–జగిత్యాల జాతీయ రహదారి విస్తరణ పనులకు రూ.2వేల కోట్లతో మరో రెండు వారాల్లో టెండర్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. రైల్వేపై ప్రత్యేక శ్రద్ధ ఇటీవల కరీంనగర్ రైల్వేస్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్గా ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటితోపాటు కరీంనగర్, జమ్మికుంట ఆర్వోబీ నిర్మాణంలో జాప్యమవుతున్న విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారులతో సమావేశమై వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆగస్టు నాటికి జమ్మికుంట ఆర్వోబీ పనులు పూర్తికాకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే. కరీంనగర్–తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణంలో ఇబ్బందులను అధిగమించేందుకు రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి.. పనుల వేగవంతం చేయించడంలో సఫలీకృతులయ్యారు. వారానికోసారి నడిచే కరీంనగర్–తిరుపతి రైలును వారానికి రెండుసార్లు నడిచేలా కృషి చేశారు. అదే రైలును ఇకపై వారానికి 4 సార్లు నడిపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈమేరకు రైల్వేశాఖ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. మరిన్ని పనులివే.. ● సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు బండి సంజయ్ వినతికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. ● సిరిసిల్ల, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో నవోదయ స్కూళ్ల మంజూరులో చొరవచూపారు. ● వేములవాడ, కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను టూరిజం సర్క్యూట్గా మార్చాలన్న ప్రతిపాదలపై త్వరలోనే కేంద్రం ప్రకటన చేయనుంది. ● శాతవాహన వర్సిటీ పరిధిలో లా కళాశాల మంజూరుకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ను కలిసి మంజూరు చేయించారు. ● అంబేడ్కర్ స్టేడియంలో సింథటిక్ పార్క్, స్పోర్ట్స్ రీక్రియేషన్ సౌకర్యాలు కల్పించాలన్న ప్రతిపాదనకు కేంద్ర క్రీడాశాఖ సుముఖత వ్యక్తం చేసింది. పెండింగ్లో ఉంటున్న కరీంనగర్లో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు బండి సంజయ్ కృషి మరువలేనిది. ● కరీంనగర్ పార్లమెంటు పరిధిలో రూ.5కోట్ల సీఎస్సార్ నిధులను రాబట్టారు. వాటితో వేములవాడ, హుస్నాబాద్, హుజూరాబాద్, జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రులకు అత్యాధునిక వైద్య పరికరాలను అందించారు. ● ఈ ఏడాది 10వ తరగతి చదివే 6 వేల మంది బాలికలకు ప్రత్యేకంగా సైకిళ్లను అందించేందుకు ఆర్డర్ ఇచ్చారు. వీటిని త్వరలోనే విద్యార్థులకు అందజేయనున్నట్లు మంత్రి కార్యాలయం వెల్లడించింది. ● ఈ ఏడాది మార్చిలో థాయిలాండ్ లో సైబర్ కేఫ్ లో చిక్కుకున్న 540 మంది భారతీయులను సాక్షి కథనాలతో స్పందించిన బండి సంజయ్ ప్రత్యేక చొరవ తీసుకుని కాపాడారు. రెండు ప్రత్యేక విమానాల్లో వారిని ఇండియాకు తరలించారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
హుజూరాబాద్: హుజురాబాద్ మండలంలోని సింగాపూర్ గ్రామ శివారులో కరీంనగర్ – వరంగల్ రహదారిపై మంగళవారం ఆయిల్ ట్యాంకర్ ట్రాలీ ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో ఆటో ట్రాలీ బోల్తాపడడంతో రోడ్డుపై సిలిండర్లు చెల్లాచెదురగా పడిపోయాయి. కాగా కొన్ని సిలిండర్ల నుంచి గ్యాస్ లీకై ంది. అయినా అవి పేలకపోవడంతో ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. కాగా ట్యాంకర్ డ్రైవర్ పారిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అరుణాచల గిరి ప్రదక్షిణ యాత్రకు ప్రత్యేక బస్సుహుజూరాబాద్: అరుణాచల గిరి ప్రదక్షిణ యాత్రకు హుజూరాబాద్ ఆర్టీసీ డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం ఈ నెల 9 నుంచి ఉంటుదని, ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని హుజూరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ మంగళవారం తెలిపారు. ఈనెల 9న మధ్యాహ్నం 2గంటలకు స్థానిక బస్స్టేషన్ నుంచి బస్సు బయలుదేరి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం, మరుసటి రోజు 10న రాత్రి వరకు అరుణాచలం చేరుకుంటుందన్నారు. 11న అరుణాచల గిరి ప్రదక్షిణ అనంతరం తిరిగి సాయంత్రం 4 గంటలకు అరుణాచలంలో బయలుదేరి 12న హుజూరాబాద్కి బస్ చేరుకుంటుందని డీఎం రవీంద్రనాథ్ వివరించారు. సూపర్ లగ్జరీ బస్ చార్జి పెద్దలకు రూ.4,500, పిల్లలకు రూ.3,800 ఉంటుందని, అడ్వాన్స్ బుకింగ్ కోసం 99592 25924, 97048 33971, 92471 59535, 94414 04841 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కుడా ఉందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
కాలగర్భంలో రామగుండం బీ–థర్మల్
రామగుండం: పట్టణంలోని 62.5 మెగావాట్ల సామర్థ్యంగల రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ (ఆర్టీఎస్–బీ) కాలగర్భంలో కలిసి పోయి బుధవరాం నాటికి ఏడాది పూర్తవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలోనే తొలివిద్యుత్ కేంద్రంగా పేరు గాంచిన ఆర్టీపీఎస్.. సుమారు ఆరు దశాబ్దాలపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెలుగులు పంచింది. ఈక్రమంలోనే విద్యుత్ ఉత్పత్తి, పీఎల్ఎఫ్లో అనేక సరికొత్త రికార్డులు నెలకొల్పింది. స్థానికంగా బొగ్గు, నీరు, రవాణా వ్యవస్థకు అనువైన పరిస్థితులు ఉండడంతో రామగుండం ప్రాంతం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు నిలయంగా మారింది. దీంతో దేశంలోనే ఆధునిక విద్యుత్ కేంద్రాలతో పోటీ పడుతూ, అతి తక్కువ ధరకే విద్యుత్ ఉత్పత్తి చేసిన ఘనత బి–థర్మల్ కేంద్రానికే దక్కింది. రూ.14.8 కోట్ల వ్యయంతో 1965 జూలై 19న విద్యుత్ కేంద్రం స్థాపనకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత డిసెంబర్ 10, 2007 నుంచి నిరాటకంగా 159 రోజులపాటు విద్యుత్ ఉత్పత్తి చేసి రికార్డు సాధించింది. దానిని తిరగరాస్తూ 20 ఫిబ్రవరి 2017 తర్వాత ఒకరోజు ఎక్కువగా 160 రోజులు సాధించి రికార్డులు బద్ధలు కొట్టింది. 159 రోజుల్లో 92.64 పీఎల్ఎఫ్తో 221.74 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సైతం ఆధునిక విద్యుత్ కేంద్రాలతో పోటీపడుతూ ఉత్పత్తి, పీఎల్ఎఫ్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించింది. విద్యుత్ కేంద్రం మూతపడి నేటితో ఏడాది -
ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన
జగిత్యాలక్రైం: రోడ్డు ప్రమాదం కేసును మల్యాల సీఐ నీరుగార్చుతున్నారని, వాహనదారునికి వత్తాసు పలుకుతున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు మంగళవారం జగిత్యాల ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వివరాలు.. మల్యాల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన అల్లెపు నరేశ్ ఏప్రిల్ 28న రాజారం వద్ద లారీ ఢీకొని మృతిచెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి లారీని స్టేషన్కు తరలించారు.లారీకి ఇన్సూరెన్స్ ఉందని, పరిహారం వస్తుందని మృతుడి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. దీంతో చివరికి లారీని వదిలిపెట్టి ప్రస్తుతం లారీకి ఇన్సూరెన్స్ లేదని మల్యాల సీఐ కేసును నీరుగార్చుతున్నారని, తమను నిత్యం పోలీస్స్టేషన్కు రమ్మని రోజుకో కారణం చెబుతూ అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు. దీంతో నరేశ్ తండ్రి అల్లెపు బాలయ్య, తల్లి శారదతో పాటు పలువురు బంధువులు ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. -
యోగా నేర్చుకున్నా
శిక్షణ శిబిరంలో నేను యోగా నేర్చుకున్నా. మంచి భోజనం, వసతితోపాటు దుస్తులు కూడా అందించారు. అన్నిసౌకర్యాలు కల్పించారు. అనేక డబ్బులు ఖర్చుపెట్టినా కూడా లభించని అవకాశం మాకు ఎన్టీపీసీ కల్పించింది. భవిష్యత్లో మంచిగా చదువుకుంటా. – కసీఫానాజ్, కమాన్పూర్ కంప్యూటర్ నేర్చుకుంటున్న వేసవి శిక్షణ శిబిరంలో నేను కంప్యూటర్ నేర్చుకున్న. నాకు డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎన్టీపీసీ వేసవి శిబిరం ఏర్పాటు చేసి ఇలా నెలరోజుల పాటు ఇస్తున్న శిక్షణలో నేను పూర్తిస్థాయిలో కంప్యూటర్ నేర్చుకుని ఉత్తమ సాంకేతిక విద్య పొందుతా. – ఐశ్వర్య, పవర్హౌస్కాలనీ, గోదావరిఖని బాలికలకు ఉపయోగం ఎన్టీపీసీ సామాజిక సేవా బాధ్యతా పథకం(సీఎస్సార్) సహకారంతో బాలికా సాధికారత మిషన్–2025 విజయవంతంగా పూర్తిచేశాం. 120 మంది బాలికలకు ప్రత్యేక ప్రణాళిక ప్రకారం శిక్షణ ఇస్తున్నాం. చిన్నారుల్లోని సృజనాత్మకతను వెలికితీయడంతోపాటు ఆసక్తి ఉన్న అంశాలపై శిక్షణ అందిస్తున్నాం. – రాఖీ సామంత, అధ్యక్షురాలు, దీప్తి మహిళా సమితి, ఎన్టీపీసీ -
ఏసీబీ వలలో ఇన్చార్జి తహసీల్దార్
● భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.15 వేల బేరం ● రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ ● ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్ మధ్యవర్తితో లంచం రాయికల్(జగిత్యాల): భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.15 వేల లంచం బేరం కుదుర్చుకుని రూ.10 వేల డబ్బులను రాయికల్ ఇన్చార్జి తహసీల్దార్ గణేశ్, ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్ ముజాఫర్ మధ్యవర్తితో తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. డీఎస్పీ విజయ్కుమార్ వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం సింగరావుపేట గ్రామానికి చెందిన గాజర్ల రవి తన 1.025 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం వారం క్రితం ఇన్చార్జి తహసీల్దార్ గణేశ్ను సంప్రదించగా రూ.15 వేలు లంచం డిమాండ్ చేశాడు. మధ్యవర్తిగా ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్ ముజాఫర్ సంప్రదింపులతో బేరం కుదుర్చుకున్నారు. ఈ విషయమై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా పక్కా ప్రణాళికతో మంగళవారం తహసీల్ కార్యాలయంలో రూ.10 వేలు మధ్యవర్తి ముజాఫర్ ద్వారా ఇస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇన్చార్జి తహసీల్దార్ గణేశ్, ముజాఫర్ను రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. దాడుల్లో ఇన్స్పెక్టర్లు తిరుపతి, కిరణ్రెడ్డి పాల్గొన్నారు. -
పోలీసులంటే గౌరవం ఉండాలి
హుజూరాబాద్: ప్రజలకు పోలీసులంటే గౌరవం ఉండాలే తప్ప భయం కాదని టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర ఇన్చార్జి తిప్పారపు సంపత్ అన్నారు. ఇటీవల ఎస్సై భార్గవ్ దళిత యువకుడు మహేందర్ను తీవ్రంగా కొట్టిన వీడియోలను మీడియాకు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సై భార్గవ్ ప్రవర్తన ఒక నియంతలా ఉందన్నారు. దళితుడిని అసభ్య పదజాలతో దూషిస్తూ కొట్టడం ఏంటన్నారు. ఈ ఘటనపై పలుసార్లు ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించని కానిస్టేబుళ్లు ఆకాష్ రెడ్డి, రవి కుమార్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సైక్లింగ్తో ఆరోగ్యవంతమైన సమాజంమల్లాపూర్(కోరుట్ల): రోజూ సైక్లింగ్ చేయడంతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని రాష్ట్రపతి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, సైక్లింగ్ క్లబ్ ఫౌండర్ వాల్గొట్ కిషన్ అన్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి సైక్లింగ్తో మల్లాపూర్ మండలం మొగిలిపేటకు చేరుకుని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సైక్లింగ్తో షుగర్, రక్తపోటు, ఊబకాయాన్ని నివారించవచ్చన్నారు. ‘సైకిల్ తొక్కండి.. ఆరోగ్యంగా ఉండండి’ అనే నినాదంతో ప్రజలందరూ నిత్యం సైక్లింగ్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో గోల్కోండ రమేశ్, ఏలేటి ప్రీతంరెడ్డి, గంధం రఘు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి పలు రైళ్లు రద్దు
రామగుండం: కాజీపేట–బల్హర్షా సెక్షన్లోని పలు రైల్వేస్టేషన్ల పరిధిలో ఇంటర్ లాకింగ్ సిస్టం పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు పలు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ డీఆర్యూసీసీ మాజీ ప్రతినిధి క్యాతం వెంకటరమణ తెలిపారు. రద్దయిన రైళ్లు ● రైలు నంబరు : 67771/67772 : సిర్పూర్ – కరీంనగర్ : ఈనెల 20వ తేదీ వరకు ● రైలు నంబరు : 67773/67774 : కరీంనగర్–బోధన్ : ఈనెల 20 వరకు ● రైలు నంబరు : 17003/17004 : కాజీపేట–సిర్పూర్ కాగజ్నగర్–బల్హర్షా : ఈనెల 20 వరకు ● రైలు నంబరు : 17035/17036 : కాజీపేట–బల్హర్షా : ఈనెల 20 వరకు ● రైలు నంబరు : 12757/12758 : సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్నగర్ : ఈనెల 20 వరకు ● రైలు నంబరు : 12511 : గోరఖ్పూర్–రఫ్తిసాగర్ : ఈనెల 5, 6, 8, 12, 13, 15, 19 తేదీల్లో ● రైలు నంబరు : 12512 : రఫ్తిసాగర్–గోరఖ్పూర్ : 4, 8, 10, 11, 15, 17, 18 తేదీల్లో రద్దు ● రైలు నంబరు : 12521 : భరౌణీ–ఎర్నాకులం : ఈనెల 9వ తేదీన రద్దు ● రైలు నంబరు : 12522 : ఎర్నాకులం–భరౌణి : ఈనెల 6, 13వ తేదీల్లో రద్దు ● రైలు నంబరు : 12591 : గోరఖ్పూర్–యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రైలు ఈనెల 7, 14వ తేదీలలో రద్దు చేశారు. ● రైలు నంబరు : 12592 : యశ్వంత్పూర్–గోరఖ్పూర్ : ఈనెల 9, 16వ తేదీల్లో రద్దు -
ఈ పాపం ఎవరిది?
● కొత్తపల్లిలో 476 పట్టాలు రద్దు ● ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో 20 ఎకరాల భూమి సర్కారు పరం ● 1995 నుంచి పలువురి చేతులు మారిన భూములు ● లోకాయుక్త ఆదేశాలతో 476లో 454 పట్టాలు రద్దు ● రద్దు కానున్న మిగిలిన 22 పట్టాలు ● రెవెన్యూ, స్టాంప్స్..రిజిస్ట్రేషన్స్ శాఖలమధ్య సమన్వయ లోపం ● న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించిన బాధితులుసాక్షిప్రతినిధి,కరీంనగర్: కొత్తపల్లిలోని వివాదాస్పద 20 ఎకరాల భూమి తిరిగి ప్రభుత్వ వశమైంది. ప్రభుత్వం 476 పట్టాలు రద్దుచేసి మరీ భూమిని స్వాధీనం చేసుకోనుంది. మంగళవారం వరకు 454 పట్టాలను రద్దు చేసిన అధికారులు మరో 22 పట్టాలను కూడా అర్ధరాత్రి వరకు పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. 476 మందిలో అంతా సామాన్యులు కావడం.. పైసాపైసా కూడబెట్టుకున్న సొమ్ము కావడంతో వారంతా ఇప్పుడు రోడ్డున పడ్డారు. సర్వే నెంబరు 175, 197, 198లలోని 20 ఎకరాల భూమిలో ప్లాట్లు కొన్న వారంతా ఇపుడు లబోదిబోమంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.వందల కోట్ల సొమ్ము వెచ్చించిన భూమికి అర్థం లేకుండా పోవడంతో కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలమధ్య సమన్వయలోపానికి సామాన్యులు మూల్యం చెల్లించే దుస్థితి రావడం దురదృష్టకరం. దీంతో ఒక్కతాటిపైకి వచ్చిన బాఽధితులు హైకోర్టు గడప తొక్కారు. వారి కేసును స్వీకరించిన న్యాయస్థానం పిటిషన్ను స్వీకరించడంతో బాధితుల్లో ఆశలు చిగురించాయి. సమన్వయలోపమే శాపం.. కొత్తపల్లి రెవెన్యూ పరిధిలో 175, 197, 198 సర్వే నెంబర్లలో దాదాపు 20 ఎకరాల భూమిని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ప్రభుత్వం గతంలో స్వాధీనం చేసుకుంది. 1995 సంవత్సరంలో వివాదం మొదలైనా.. ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు లోక్సత్తా శ్రీనివాస్ లోకాయుక్తను ఆశ్రయించడంతో వివాదం బాగా ప్రాచుర్యం పొందింది. గతేడాది నవంబరులో లోకాయుక్త మూడు సర్వే నెంబర్లలోని ఇప్పటి వరకు జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కలెక్టర్ను ఆదేశించింది. దీంతో ఆర్డీవో మహేశ్వర్ గతవారం నుంచి వివాదాస్పద సర్వే నెంబర్లు 175, 197, 198లో నమోదైన పట్టాలను రద్దు చేసుకుంటూ వచ్చారు. తాజాగా ఈ 476 పట్టాలు రద్దు కావడంతో బాధితులు అంతా ఒక్క తాటిపైకి వచ్చారు. 1995 నుంచి వివాదం ఉన్నప్పుడు వీటిని బ్లాక్ లిస్టులు పెట్టని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలపై మండిపడుతున్నారు. ప్రభుత్వ విభాగాలు చేసిన తప్పుకు తామెందుకు బలవ్వాలని ప్రశ్నిస్తున్నారు. జీవితాంతం దాచుకున్న డబ్బుతో కొన్న ఇంటిజాగాలపై హక్కులేదనడంతో గుండెలు ఆగినంత పనవుతుందని వాపోతున్నారు. న్యాయస్థానంలో తమకు న్యాయం జరుగుతుందని ధీమాగా ఉన్నారు. న్యాయం కోసం హైకోర్టుకు.. కొత్తపల్లి పట్టణ పరిధిలోని 197, 198 సర్వేనెంబర్లలో గల భూమికి సంబంధించిన అన్ని ఆధారాలు కలెక్టర్కు చూపించాం. న్యాయం చేయాలని విన్నవించినప్పటికీ విన్నపాన్ని పరిగణలోకి తీసుకోకుండా 476 డాక్యుమెంట్లు రద్దు చేశారు. ఇక్కడ న్యాయం జరగకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాం. సరైన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. – మ్యాక రాజగోపాల్రెడ్డి, బాధితుడు -
చిట్టీల రాయుళ్లు!
శాతవాహన వర్సిటీలో భారీగా చూచిరాతలు ● డిగ్రీలో డిబార్ అవుతున్న వారిలో కరోనా టైంలో ‘పది’ పాసైన వారే ఎక్కువ ● మొదటి నుంచి ఆరో సెమిస్టర్ వరకు ఇదే తీరు ● పర్యవేక్షణ పెరగడంతో భారీగా పట్టుబడుతున్న విద్యార్థులు ● సోషల్ మీడియా వ్యసనం, చదవలేక పోవ డంతో అడ్డదారులు ● డిబార్ అయిన విద్యార్థికి మద్దతుగా ఉత్తరాది మంత్రి ఫోన్!సాక్షిప్రతినిధి,కరీంనగర్: కుదురుగా పది నిమిషాలు కూర్చుని పరీక్ష రాయలేరు. పరీక్ష మొదలవగానే.. జేబులో దాచిన మైక్రో జిరాక్స్లు తీయడం, కాపీ చేయడం.. ఇదీ.. శాతవాహన వర్సిటీలో డిగ్రీ విద్యార్థుల తీరు. వాస్తవానికి మునుపెన్నడూ లేని స్థాయిలో విద్యార్థులు చిట్టీలు కొడుతూ పట్టుబడి డిబార్ అవుతున్నారు. గతవారంలో ఒకేరోజు 35 మంది డిబార్ అవడం వర్సిటీ చరిత్రలోనే మొదటిసారి కావడం గమనార్హం. వాస్తవానికి విద్యార్థులు ఇలా చిట్టీలు రాయడం ఆందోళన కలిగిస్తోంది. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలన్న ఆశయంతో యూనివర్సిటీ అధికారులు ఈసారి సిబ్బందిని పెంచి ఆకస్మిక తనిఖీలు చేయిస్తుండటంతో భారీగా చిట్టీల రాయుళ్లు పట్టుబడుతున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా విద్యార్థులు డిబార్ కావడంపై వర్సిటీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. జూన్ 2 వరకు వర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలు రాస్తున్న 171 మంది డిబార్ అయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా సమయంలోని వారేనా? ఈ విషయంపై ఆరా తీసినప్పుడు పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. వాస్తవానికి ఇప్పుడు డిబార్ అవుతున్న విద్యార్థులంతా కరోనా విపత్తు సమయంలో 10వ తరగతి పాస్ అయినవారే కావడం ఆందోళన కలిగిస్తోంది. 2020 మార్చిలో ఆకస్మికంగా కరోనా విపత్తు ప్రపంచాన్ని కుదిపేసింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో జనజీవనం స్తంభించింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎలాంటి పరీక్షలు నిర్వహించలేకపోయింది. ఫలితంగా ఎలాంటి పరీక్షలు లేకుండా విద్యార్థులందరినీ పాస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత 2021లోనూ పరీక్షలు లేకుండా పది పాసయ్యారు. 2022లో మాత్రం పది పరీక్షలు నిర్వహించినా.. గతంలో ఉన్న 11 పేపర్లను ఆరుకు కుదించి తేలిగ్గా ప్రశ్నలు ఇచ్చారు. 2023లో పది పరీక్షరాసిన పిల్లలు కాస్త నయంగానీ, 2020, 2021లో అసలు పరీక్షలు లేకుండా పాసైన విద్యార్థుల ప్రతిభాపాటవాలపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియా మరో కారణం 2020, 2021లో పది పాసైన వారి ప్రతిభాపాటవాలపై ఇప్పుడు ప్రొఫెసర్లు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. డిబార్ అవుతున్న వారిలో అధికంగా వారే ఉండటం, వారంతా సోషల్ మీడియా ప్రభావంతో కాపీయింగ్ పాల్పడుతున్నారని అభిప్రాయపడుతున్నారు. సులువుగా పరీక్షలు పాసవడానికి అలవాటు పడినవారు, ఆ కోణంలో వెళ్తున్నారని అంటున్నారు. కాపీ కొడితే పట్టుబడ్డారంటూ సోషల్మీడియా రీల్స్ చూసి వీరు కూడా పాటించి దొరికిపోతున్నారని పేరు తెలిపేందుకు ఇష్టపడని ఓ ప్రొఫెసర్ తెలిపారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. డిబార్ అయిన విద్యార్థులంతా రాజకీయ నాయకులతో వారిని వదిలేయాలంటూ వర్సిటీ అధికారులపై ఒత్తిడి చేయిస్తున్నారు. వారిలో ఓ విద్యార్థిని వదిలేయాలంటూ ఉత్తరాదికి చెందిన ఓ పెద్ద మంత్రి ఏకంగా వర్సిటీకి ఫోన్ చేయడంతో విస్తుపోవడం అధికారుల వంతైంది.వారిలోనే డిబార్ సంఖ్య ఎక్కువ 2020లో పది పాసైనవారు ఇప్పుడు 6వ సెమిస్టర్, 2021లో పది పాసైనవారు 4వ సెమిస్టర్, 2022లో పది పాసైన వారు 2వ సెమిస్టర్ పరీక్షలు రాస్తున్నారు. ప్రతీ విద్యాసంవత్సరంలోనూ 1,3,5వ సెమిస్టర్లకు ఒకసారి, 2,4,6వ సెమిస్టర్లకు మరోసారి పరీక్షలు నిర్వహిస్తారు. 2023–24లో 1,3,5వ సెమిస్టర్లలో 26 మంది డిబార్ అయ్యారు. అదే 2023–24 విద్యా సంవత్సరంలో 2,4,6 సెమిస్టర్లలో 60 మంది డిబార్కు గురయ్యారు. 2024–25లో 1,3,5వ సెమిస్టర్లలో కేవలం 31 మంది డిబార్ కాగా, 2024–25 విద్యాసంవత్సరంలో 2,4,6 సెమిస్టర్లలో ఏకంగా 140 మంది డిబార్ అయ్యారంటే.. పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందులో మే 28న ఒకేరోజు 34 మంది డిబార్కావడం గమనార్హం. అందులోనూ కరీంనగర్ నడిబొడ్డున తెలంగాణచౌక్ను ఆనుకుని ఉన్న కాలేజీ నుంచి ఏకంగా 13 మంది విద్యార్థులు ఉండటం విశేషం. ఇప్పుడు డిబార్ అయిన విద్యార్థుల్లో అధికంగా 2020, 2021లో పదో తరగతి పాసైన వారే అధికంగా ఉండటం గమనించదగ్గ అంశం. శాతవాహన యూనివర్సిటీ కింద సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, సిద్ధిపేట, హన్మకొండ జిల్లాల పరిధిలో మొత్తం 120 డిగ్రీ కాలేజీలు, 28 పీజీ, 23 బీఈడీ, 7 ఎంబీఏ, ఒక ఎంఈడీ, ఒక బీపీఈడీ, ఒక లా కాలేజీలు తదితరాలు ఉన్నాయి. ఇటీవల వర్సిటీకి అదనంగా లా, ఇంజినీరింగ్ కాలేజీలు కూడా మంజూరయ్యాయి. ఇంతటి ప్రతిష్టాత్మక వర్సిటీలో ఇలాంటి విపరీత ధోరణి ఇదే తొలిసారి అని పలువురు వాపోతున్నారు. -
భూభారతితో సమస్యలు పరిష్కారం
కరీంనగర్రూరల్/కొత్తపల్లి: కొత్త రెవెన్యూచట్టం భూభారతి ద్వారా భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కరీంనగర్ మండలం దుర్శేడ్, కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను కలెక్టర్ పరిశీలించారు. అర్జీల వివరాలు రిజిష్టర్లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న సైదాపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు విజయవంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. భూ సమస్యలకు శాశ్వతంగా పరిష్కరించాలనే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, కరీంనగర్, కొత్తపల్లి తహసీల్దార్లు ఎన్.రాజేశ్, ఆర్.వెంకటలక్ష్మి, డెప్యూటీ తహసీల్దార్ వైశాలి, ఆర్ఐలు వాస్తవిక్గౌడ్, కనకరాజు, స్థానిక నాయకులు సుంకిశాల సంపత్రావు, తోట తిరుపతి, మంద రాజమల్లు, ఊరడి మల్లారెడ్డి, బుర్ర హరీశ్గౌడ్, గాజుల అంజయ్య, కె.వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు. ఆర్జీల వివరాలు రిజిష్ట్టర్లో నమోదు చేయాలి కలెక్టర్ పమేలా సత్పతి -
జమ్మికుంటకు దోస్త్ హెల్ప్లైన్ సెంటర్
జమ్మికుంట(హుజూరాబాద్): జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు దోస్త్ హెల్ప్లైన్ సెంటర్ మంజూరు కావడంపై ప్రిన్సిపాల్ డా. రమేశ్ హర్షం వ్యక్తం చేశారు. కళాశాల విద్యాశాఖ కమిషనర్ జాయింట్ డైరెక్టర్లు డా.రాజేంద్రసింగ్, డా.బాలభాస్కర్కు మంగళవారం కృతజ్ఞతలు తెలిపారు. డిగ్రీ అడ్మిషన్ల కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేటప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తితే దోస్త్ హెల్ప్ లైన్ ద్వారా పరిష్కరించడం జరుగుతుందన్నారు. గతంలో దరఖాస్తుదారులకు సమస్యలు తలెత్తినప్పుడు కరీంనగర్, హనుమకొండ వెళ్లాల్సి ఉండేదని, ప్రస్తుతం దోస్త్ సెంటర్ మంజూరుతో ఈ ప్రాంత విద్యార్థులకు సౌకర్యాంగా ఉంటుందన్నారు. సమస్యల పరిష్కారం కోసం జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల దోస్త్ కో ఆర్డినేటర్ ఎల్.రవీందర్, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీకాంత్ను 94911 14511, 99494 94549, 98496 89956 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
మూడు నెలల రేషన్.. ఇదేం పరేషాన్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు నెలల రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నాయి. కార్డుదారుల రాకతో రేషన్ దుకాణాలు కిక్కిరిసిపోతున్నాయి. ఒక రేషన్కార్డుపై బియ్యం పంపిణీ చేసేందుకు మూడుసార్లు ఈ పాస్ యంత్రంపై వేలిముద్రలు నమోదు చేయాల్సి ఉంటోంది. ఇందుకోసం సుమారు అర్ధగంట వరకు సమయం పడుతోంది. దీంతో కార్డుదారులు చెప్పులు, సంచులను వరుస క్రమంలో పెడుతున్నారు. కరీంనగర్ నగరంలోని జ్యోతినగర్, గణేశ్నగర్, వావిలాలపల్లి తదితర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. నగరంలోని ఓ రేషన్ దుకాణం ఎదుట సంచులు, బుట్టలు, చెప్పులు వరుసక్రమంలో పెట్టగా సాక్షి కెమెరాకు ఇలా చిక్కింది.– సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలి
కొత్తపల్లి(కరీంనగర్): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించాలని జిల్లా వైద్యా ఆరోగ్య శాఖాధికారి వెంటకరమణ అన్నారు. కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం జరిగిన ఆశ డే కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. సీవై– టీబీ టెస్ట్ మైకో బ్యాక్టీరియం టుబర్కులోసిస్ అంటిజెన్ ఆధారిత చర్మ పరీక్షలను ప్రారంభించారు. హాజరుపట్టిక, రికార్డులు, లేబర్ రూం, ఆపరేషన్ థియేటర్ను పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్వో మాట్లాడుతూ... పీహెచ్సీలో సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా చూడాలన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ ముందస్తు జాగ్రత్తలు తీసుకో వాలని సూచించారు. అంతకుముందు ఆసిఫ్నగర్ వెల్నెస్ సెంటర్ను సందర్శించారు. కార్యక్రమంలో ఎంసీహెచ్ పీవో సన జవేరియా, వైద్యాధికారులు డాక్టర్ వనజ, డాక్టర్ శ్రావిక, వైద్యసిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంకరీంనగర్: ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో మొదటి దఫా ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ కె.అశోక్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, డ్రాప్ట్స్మన్ సివిల్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రెస్ మేకింగ్, వెల్డర్, మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, టెక్నిషియన్ స్మార్ట్ అగ్రికల్చర్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. వెబ్సైట్ httpr://iti.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 21 లోగా రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. పవర్కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ నిర్వహణ పనులు చేపడుతున్నందున బుధవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 11 కేవీ హౌసింగ్ బోర్డు, సాయికృష్ణ ఫీడర్ల పరిధిలోని హౌసింగ్బోర్డుకాలనీ, విట్స్ కళాశాల, సుభాష్ విగ్రహం, మారుతీనగర్, బొమ్మకల్ రోడ్, వాటర్ ట్యాంక్, ముకరంపుర, తెలంగాణచౌక్, భగత్నగర్, మున్సిపల్ కార్యాలయం, జెడ్పీ ఆఫీసు ఏరియాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–1, 2 ఏడీఈలు పి.శ్రీనివాస్గౌడ్, ఎం.లావణ్య తెలిపారు. కమాన్పూర్ ఎక్స్ప్రెస్ ఫీడర్ పరిధిలో.. విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, విద్యుత్ స్తంభాల మార్పు పనులు చేపడుతున్నందున బుధవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 33/11 కేవీ శాతవాహన సబ్స్టేషన్ కమాన్పూర్ ఎక్స్ప్రెస్ ఫీడర్ పరిధిలోని చింతకుంట, కమాన్పూర్(పాక్షికం), గ్రానైట్ పరిశ్రమల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. ట్యాంకర్ల రేట్లపై ఇన్చార్జి కమిషనర్ సీరియస్కరీంనగర్ కార్పొరేషన్: ప్రైవేట్ ట్యాంకర్లకు సంబంధించి నగరపాలకసంస్థలో ఒక్కో ట్యాంకర్కు ఒక్కోరేటు వసూలు చేస్తుండడంపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్చార్జి కమిషనర్ ప్రపుల్ దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘ఇంతకీ ఏ రేటు’ అనే శీర్షికన ఈ నెల 2వ తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను పిలిచి ట్యాంకర్ల వ్యవహారంపై ఆరా తీయడంతో పాటు, ప్రైవేట్ ట్యాంకర్లకు ఒకరికి రూ.200, మరొ కరు రూ.400 వసూలు చేయడమేమిటని ప్ర శ్నించినట్లు తెలిసింది. ట్యాంకర్ల రేట్లను వెంట నే సరిచేయాలని ఆదేశించినట్లు సమాచారం. -
బావిలో మునిగి వ్యవసాయ కూలీ మృతి
ఎలిగేడు(పెద్దపల్లి): నర్సాపూర్ గ్రామానికి చెందిన కూలీ ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో మునిగి మృతి చెందాడు. ఎస్సై సనత్కుమార్ కథనం ప్రకారం.. నర్సాపూర్ గ్రామానికి చెందిన కాంపెల్లి పోచయ్య(74) ఆదివారం సాయంత్రం తన మనుమడు సాయిగణేశ్కు ఈత నేర్పేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు పోచయ్య నీట మునిగి పోయాడు. సమాచారం ఆందుకున్న కుటుంబసభ్యులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలించగా అర్ధరాత్రి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ ఆస్పత్రికి తరలించారు. మృతుని కొడుకు వేణుకుమార్ రెండేళ్ల క్రితం రైలు ప్రమాదంలో మృతి చెందాడు. ఇప్పుడు పెద్దదిక్కును కోల్పోయి ఆ కుటుంబం రోదిస్తోంది. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. చికిత్స పొందుతూ వ్యక్తి..కరీంనగర్క్రైం: పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. త్రీటౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. వావిలాలపల్లిలో ఉంటున్న జక్కం సాయిసందీప్కు 12 ఏళ్ల కిత్రం గుంటూరుకు చెందిన జక్కం గీతతో వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. సాయిసందీప్ మొదట ఒక ప్రయివేట్ ఉద్యోగం చేశాడు. ఉద్యోగం మానేసి వ్యాపారం పెట్టడంతో నష్టాలపాలయ్యాడు. అప్పటి నుంచి మనోవేదనకు లోనవుతూ చనిపోతానంటూ పలుమార్లు తన భార్యతో అనేవాడు. గతంలో సాయిసందీప్కు అతడి కుటుంబ సభ్యులు మానసిక వైద్యం కూడా చేయించారు. గతనెల 31న గీత తన పుట్టింటికి వెళ్లడంతో.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. తీవ్రంగా వాంతులు, విరేచనాలు కావడంతో తన కుటుంబ సభ్యులకు సమాచారమందించాడు. వెంటనే వారు ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా.. వారు పురుగుల మందు తాగినట్లు గుర్తించారు. అక్కడి నుంచి మరో ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తి మృతికి కారణమైన డ్రైవర్ అరెస్టుముస్తాబాద్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతికి కారణమైన డ్రైవర్ను అరెస్టు చేసినట్లు ఎస్సై గణేశ్ సోమవారం తెలిపారు. ముస్తాబాద్కు చెందిన కూర సిద్దిరాములు(54) ద్విచక్ర వాహనంపై వస్తుండగా, గూడూరు నుంచి డీసీఎం వ్యాన్తో వేగంగా ఆజాగ్రత్తగా నడిపిన ఆసిఫ్(24) ఢీకొట్టాడన్నారు. ఈ సంఘటనలో సిద్దిరాములు అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. సిద్దిరాములును ఢీకొట్టి పరారీ అయిన డ్రైవర్ కోసం గాలింపు చేపట్టామన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆసిఫ్గా గుర్తించి డీసీఎం వ్యాన్తో సహా అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు. -
ఎంపీసీ విద్యార్థుల కోసం అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కోర్సులు
● ఫార్మర్స్, స్పెషల్ కోటా సీట్ల భర్తీకి అగ్రి వర్శిటీ నోటిఫికేషన్ ● ఈనెల 27 వరకు ఆన్లైన్ దరఖాస్తులకు గడువు జగిత్యాలఅగ్రికల్చర్: ఇంటర్లో ఎంపీసీ చదివి, తెలంగాణ ఎంసెట్–2025 రాసిన విద్యార్థులు బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్), బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ), బీఎస్సీ (కమ్యూనిటీ సైన్స్)లో చేరేందుకు సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. వ్యవసాయ సంబంధిత ఇంజినీరింగ్ కోర్సులు చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి అవకాశం ఉండడంతో ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తిచూపుతున్నారు. ఫార్మర్స్ కోటా, పేమెంట్ కోటాకు సంబంధించి.. ప్రస్తుతం ఫార్మర్స్, పేమెంట్ కోటాలకు సంబంధించి వ్యవసాయ వర్శిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ ఎంసెట్ రాసిన విద్యార్థులు రెండు మార్గాలుగా అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో చేరే అవకాశం ఉంటుంది. ఉన్నత విద్యామండలి నిర్వహించే ఇంజినీరింగ్ ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా చేరవచ్చు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు ఈ కోర్సుల్లో చేరే విద్యార్థులు తమ ఆప్షన్లను ఇచ్చుకోవచ్చు. అలాగే ఫార్మర్స్ కోటా, సెల్ఫ్ఫైనాన్స్(పే మెంట్) కోటా కింద వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇచ్చిన ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారా చేరవచ్చు. రెండు మార్గాల్లోను తెలంగాణ ఎంసెట్–2025లో వచ్చిన ర్యాంకుల ఆధారంగానే సీట్లను భర్తీ చేస్తారు. రైతు కోటా కింద సీట్ల వివరాలు బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్) కళాశాల సంగారెడ్డి జిల్లా కందిలో ఉండగా, ఫార్మర్స్ కోటా కింద 20, పేమెంట్ కింద 9 సీట్లు భర్తీ చేస్తారు. అలాగే, బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కళాశాల నిజమాబాద్ జిల్లా రుద్రూర్లో ఉండగా, ఫార్మర్స్ కోటా 10, పేమెంట్ కోటా కింద 5 సీట్లు భర్తీ చేస్తారు. బీఎస్సీ (కమ్యూనిటీ సైన్స్) కళాశాల హైదరాబాద్లోని సైఫాబాద్లో ఉండగా 37 (నాన్రూరల్, రూరల్), పేమెంట్ కోటా కింద 5 సీట్లు భర్తీ చేస్తారు. అలాగే మూడేళ్ల హోం సైన్స్ చదివినవారికి హోంసైన్స్ కోర్సుల్లో 10 శాతం రిజర్వ్ చేయబడ్డాయి. పేమెంట్ కోటా కింద సీటు పొందిన వారు, సెమిస్టర్కు రూ.62,500 చొప్పున 8 సెమిస్టర్లకు రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. పేమెంట్ కోటా సైతం ఎంసెట్ ర్యాంక్ ఆధారంగానే కేటాయిస్తారు. దరఖాస్తు గడువు.. దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు ఈనెల 27 చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఆన్లైన్లో పంపించేందుకు ఆఖరు తేదీ ఈనెల 28. జనరల్, బీసీ అభ్యర్థులు రూ.3,000, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.1,500 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. అడ్మిషన్ పొందే నాటికి వయస్సు 17–22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్లు, పీహెచ్ వారికి 27 ఏళ్ల వరకు ఉండవచ్చు. రెగ్యులర్ కోర్సుల ఫీజు రూ.49,560. ఫార్మర్స్ కోటా కింద దరఖాస్తు చేసేవారు 1 నుంచి 12వ తరగతి వరకు నాలుగేళ్లు గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఉండాలి. అలాగే, ఒక ఎకరం తక్కువ కాకుండా వ్యవసాయ భూమి విద్యార్థి లేదా తల్లిదండ్రుల పేరిట ఉండాలి. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఏడాది రైతు కూలీల పిల్లలకు సైతం 15 శాతం రిజర్వేషన్ కల్పించారు. రైతు కూలీల ధ్రువీకరణ కోసం ఈజీఎస్ జాబ్ కార్డు ఉండాలి. బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ కోసం గ్రామీణ ప్రాంతాల్లో చదవని వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వ్యవసాయ వర్శిటీ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. పీజేటీఏయూ.ఈడీయూ.ఇన్లో సంప్రదించవచ్చు. -
స్లాట్ బుకింగ్ షురూ..
కరీంనగర్క్రైం: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ పద్ధతి ప్రారంభమైంది. ప్రభుత్వం తొలుత కొన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయగా.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి అన్ని కార్యాలయాల్లో ప్రారంభించారు. తొలిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలు బుక్ చేసుకున్న స్లాట్ల ప్రకారం సమయానికి వచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 14 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉండగా తొలిరోజు 145 డాక్యుమెంట్లు స్లాట్బుకింగ్ పద్ధతిలో రిజిస్ట్రేషన్ అయ్యాయి. వాట్సాఫ్లో సందేహాల నివృత్తి ఆస్తుల క్రయవిక్రయదారులు స్టాంపులు, రిజిస్ట్రేషన్శాఖ వెబ్సైట్ ద్వారా నేరుగా సందేహాలు నివృత్తి చేసుకునేందుకు 8247623578 నంబర్ ఏర్పాటు చేశారు. ఈ నంబర్ వాట్సాప్ ద్వారా కావాల్సిన విషయాలు తెలుసుకోవచ్చు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లొకేషన్, స్లాట్బుకింగ్ ఖాళీల వివరాలు, అందుబాటులో ఉండే సమయం, డీడ్వారిగా రిజిస్ట్రేషన్ చార్జీలు, మార్కెట్ విలువలు వాట్సప్ మెసేజ్ ద్వారా తెలుసుకోవచ్చు. రోజుకు 48స్లాట్లు.. ఐదు వాకిన్ రిజిస్ట్రేషన్లు ప్రతిరోజు జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ ద్వారా 48 రిజిస్ట్రేషన్లు చేయవచ్చు. అత్యవసర సమయాల్లో ఐదు వాకిన్ రిజిస్ట్రేషన్లు చేసేలా అవకాశం కల్పించారు. స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్లు ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు, వాకిన్ రిజిస్ట్రేషన్లు సాయంత్రం ఐదు గంటల నుంచి 5.30 గంటల వరకు జరిపేలా ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారు. ఒక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి 48 రిజిస్ట్రేషన్లు, వాకిన్ రిజిస్ట్రేషన్లు ఐదు అనుమతించారు. మరొక సబ్ రిజిస్ట్రార్కు పెద్దగా పని ఉండకపోవచ్చని, అదనంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ను వేరే చోటుకు సర్దుబాటు చేసే అవకాశాలున్నట్లు కార్యాలయవర్గాల్లో చర్చ జరుగుతోంది. నిరీక్షణకు తెర స్లాట్బుకింగ్ విధానంతో గంటల తరబడి నిరీక్షణకు తెరపడింది. గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రార్ వచ్చే ముందు డాక్యుమెంట్లు వరుసలో పెట్టేవారు. కార్యాలయంలో ఉదయం 10.30 వరకే కొన్ని డాక్యుమెంట్లు ఉండేవి. అవన్నీ చెక్స్లిప్ నమోదు చేయడం, స్కానింగ్, సబ్రిజిస్ట్రార్ బయెమెట్రిక్, క్రయవిక్రయదారుల వేలిముద్రలు వేయడం పద్ధతిలో రిజిస్ట్రేషన్ కొనసాగేది. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ పూర్తయ్యే వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్న సందర్భాలు అనేకం. ఇప్పుడు ముందస్తుగానే ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకొని, ఆన్లైన్లో చెక్స్లిప్ నమోదు చేయడం, క్రయవిక్రయదారులకు చెందిన ఆస్తులు, హద్దుల వివరాలు పూర్తిగా చదువుకొని సరిగ్గా ఉన్న తర్వాతే స్లాట్ బుకింగ్ చేసుకునే విధంగా ఉండడంతో సులభంగా, పారదర్శకంగా ఉంటుంది. పాత పద్ధతి కన్నా.. కొత్త స్లాట్ బుకింగ్ విధానం సులభంగా, సౌకర్యవంతంగా ఉందని క్రయవిక్రయదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్శాఖలో ప్రారంభమైన నూతన విధానం తొలి రోజు ఉమ్మడి జిల్లాలో 145 రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో తగ్గనున్న రద్దీ సమయం ఆదా అవుతుందంటున్న ప్రజలు సమయం వృథా కాదు కొత్తగా స్లాట్ విధానం సోమవారం నుంచి అమలు చేస్తున్నాం. నిర్ణీత సమయంలో ముందస్తుగా స్లాట్ బుకింగ్ చేసుకొని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వస్తే పది నిమిషాల్లో ప్రక్రియ పూర్తి చేసి పంపిస్తున్నాం. కొత్త విధానం ద్వారా క్రయవిక్రయదారులకు సమయం వృథా కాదు. – రవికుమార్, కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ స్లాట్ బుకింగ్ బాగుంది రిజిస్ట్రేషన్లలో స్లాట్ బుకింగ్ విధానం బాగుంది. మాకు సంబంధించిన ఒక ఆస్తికి చెందిన క్రయవిక్రయాలకు చెందిన విషయాలు ముందుగానే ఎంటర్ చేస్తే, కావాల్సిన సమయానికి స్లాట్ బుకింగ్ అవుతుంది. దాని ప్రకారం వెళ్తే పదినిమిషాల్లో ప్రక్రియ పూర్తి చేసి పంపిస్తున్నారు. – కాడే రమేశ్, కట్టరాంపూర్, కరీంనగర్ -
‘నలిమెల’కు కాళోజీ పురస్కారం
సిరిసిల్లకల్చరల్/కరీంనగర్కల్చరల్: ఉమ్మడి జిల్లాకు చెందిన బహుభాషావేత్త డాక్టర్ నలిమెల భాస్కర్కు ప్రతిష్టాత్మక కాళోజీ పురస్కారం వరించింది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా హైదరాబాద్ల జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతులమీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. పద్నాలుగు భాషలపై పట్టు సాధించడంతో పాటు అనువాద రచయితగా లబ్ధప్రతిష్టుడైన నలిమెలకు స్మారక శిలలు అనువాద రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందించింది. నలిమెలను జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఎలగొండ రవి, బూర దేవానందం, మానేరు రచయితల సంఘం ప్రతినిధులు డాక్టర్ పత్తిపాక మోహన్, ఆడెపు లక్ష్మన్, జూకంటి జగన్నాథం, చిటికెన కిరణ్, టీవీ నారాయణ, సిరిసిల్ల సాహితీ సమితి ప్రతినిధులు డాక్టర్ జనపాల శంకరయ్య, వెంగల లక్ష్మణ్ తదితరులు అభినందనలు తెలిపారు. -
ఐఐటీ అడ్వాన్స్డ్లో అల్ఫోర్స్కు ర్యాంకులు
ఎస్ఆర్ విద్యార్థుల విజయకేతనం కరీంనగర్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యార్థులు వివిధ కేటగిరీలలో జాతీయస్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించారు. ఎస్.పవన్ 204వ ర్యాంక్, ఎం.కార్తీక్ 1,009, బానోవత్ సుమన్ 1,049, బుర్ర మాధవ్ 1,471, నీరటి శ్రీచరణ్జోష్ 1,321, గుగులోతు శేఖర్ 1,328, ముదిగంటి రుషిశ్వర్రెడ్డి 2,318, దొనకొండ సాయిచందన 3,218, దయ్యాల రాజ్కుమార్ 6,519వ ర్యాంకు సాధించి విద్యాసంస్థల ప్రతిభను మరింత పెంచారని విద్యాసంస్థల అధినేత వరదారెడ్డి పేర్కొన్నారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల అహర్నిశల కృషి ఇంతటి ఘన విజయానికి తోడ్పడ్డాయని వివరించారు. అద్భుత ర్యాంకులు సాధించిన విద్యార్థులను, తల్లిదండ్రులను, అధ్యాపక బృందానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ సంతోష్రెడ్డి, డీజీఎం, సీఈవో, జోనల్ ఇన్చార్జిలు, అకాడమిక్ డీన్స్, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. ట్రినిటీ విద్యార్థుల విజయభేరికరీంనగర్: జేఈఈ–అడ్వాన్స్డ్ ఫలితాల్లో ట్రినిటీ జూనియర్ కళాశాలల విద్యార్థులు విజయభేరి మోగించారు. ఎ.రఘుపతి జాతీయస్థాయిలో 40వ ర్యాంకు, నిఖిత్నాయక్ 194, డి.మహేశ్ 225, రఘుపతి 226, బి.సిద్ధిక 1,107, సీహెచ్.ఐశ్వర్య 1,129, ఠాగూర్ 1,274, నవదీప్ 1,701, నిస్సీ జాస్పర్ 2,172, ఎ.అజయ్ 3,077, అక్షర 4,524 ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్రెడ్డి మాట్లాడుతూ, స్పష్టమైన ప్రణాళిక, మెరుగైన విద్యా బోధన, నిష్ణాతులైన అధ్యాపకుల పర్యవేక్షణలో ఉత్తమ ర్యాంకులు సాధించామని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి, అందుకు అనుగుణంగా బోధనా పద్ధతులు అవలంబించిడం జరుగుతుందని, ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఎస్సెస్సీలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు తమ కాలేజీలో ఫీజు రాయితీ ఇస్తున్నామని వివరించారు. ఈఏడాది నుంచి ఐఐటీ–అడ్వాన్స్డ్ లాంగ్టర్మ్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రాబోయే నీట్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కళాశాల చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ, ఉత్తమ ర్యాంకుల సాధన కేవలం ట్రినిటీ కళాశాలలకే సాధ్యమని, విద్యార్థుల కృషి, యాజమాన్యం భరోసా, అధ్యాపకుల శ్రద్ధ వల్లే ఈ ఫలితాలు అని తెలిపారు. క్యాంపస్ ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. కొత్తపల్లి(కరీంనగర్): అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు సోమవారం ప్రకటించిన ఐఐటీ అడ్వాన్స్డ్–2025 ఫలితాల వివిధ కేటగిరీల జాతీయస్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించినట్లు ఆ విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్రెడ్డి తెలిపారు. అజ్మీరా పురుషోత్త్తంనాయక్ 166వ ర్యాంకు సాధించగా.. పి.ఎన్.సాయిధృవ 557, ఎన్.అనిరుధ్సాయి 657, బి.ఆదిత్య 945, బి.విష్ణు 1,203, ఎం.అక్షిత 1,224, వి.హృషికేశ్ 1,329, ఆర్.గోవర్ధన్ 1,506, జె.వామిక 1,604, బి.చైశ్రవ్ రాజు 1,640, ఇ.శశిలాల్ 1,899, కె.విరేంద్రప్రసాద్ 2,120, డి.కార్తీక్రెడి్డ్ 2,150, ఎస్.విఘ్నేశ్ 2,293, డి.అభిరామ్ 2,349, ఎ.శశిప్రితమ్ 2,463, ఇ.అంకిత్సాయి 2,613, మహ్మద్ అబ్ధుల్ హక్ 2,766, డి.విశాల్ 2,917 ర్యాంకులు సాధించి అల్ఫోర్స్ ఖ్యాతిని పెంచారని సంతోషం వ్యక్తం చేశారు. వెయ్యి లోపు నలుగురు, 2వేల లోపు 11 మంది, 3వేల లోపు 19 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. -
నాణ్యమైన విత్తన పంపిణీ కార్యక్రమం ప్రారంభం
కరీంనగర్ అర్బన్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం గ్రామ గ్రామానికి నాణ్యమైన విత్తన పంపిణీ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించింది. సోమవారం రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్బాబు లాంఛనంగా ప్రారంభించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు రైతులకు పరిశోధనా కేంద్రాల్లో అభివృద్ధి చేసిన నాణ్యమైన విత్తనాన్ని సరఫరా చేస్తున్నారు. జిల్లాలో 207 రెవెన్యూ గ్రామాల్లో ప్రతి గ్రామంలో ముగ్గురు రైతులకు వరి, పెసర విత్తనాలు అందించనున్నట్లు కరీంనగర్ వ్యవసాయ పరిశోధనాస్థానం శాస్త్రవేత్త డా.జి.ఉపారాణి తెలిపారు. నాణ్యమైన విత్తనోత్పత్తిని గ్రామంలోనే ప్రోత్సహించేందుకు కార్యక్రమాన్ని చేపడుతున్నారని పేర్కొన్నారు. -
అమరుల త్యాగఫలమే తెలంగాణ
కరీంనగర్ కల్చరల్: తెలంగాణ విద్యార్థి, యువజనుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని తెలంగాణ రచయితల వేదిక(తెరవే) రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు, కవి, గాయకుడు గాజోజు నాగభూషణం అన్నారు. తెరవే ఆధ్వర్యంలో నగరంలోని అమరవీరుల స్తూపం వద్ద సోమవారం జరిగిన అమరుల త్యాగాల కవితా గానం కార్యక్రమంలో గాజోజు నాగభూషణం మాట్లాడారు. అమరుల కుటుంబాలను గౌరవప్రదంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, పౌర సమాజంపై ఉందన్నారు. తెలంగాణ కవులు, రచయితలు పుష్పగుచ్ఛాలు ఉంచి అమరవీరులకు నివాళి అర్పించారు. అమరుల త్యాగాల కవితాగానం కార్యక్రమంలో తెరవే బాధ్యులు సీవీ కుమార్, డాక్టర్ విజయకుమార్, నడిమెట్ల రామయ్య, విలాసాగరం రవీందర్, నెరువట్ల చైతన్య, విజయశ్రీ, గుండు రమణయ్య, బుర్ర తిరుపతి, బొల్లం బాలకష్ణ, మర్రిపల్లి మహేందర్, జనగాని యుగంధర్, మహనీయ బేగ్, ఖాలీద్, ముఖేష్, రెడ్డి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ రాజీవ్ రహదారిపై ఆదివారం బైక్ను వెనుక నుంచి ఆటో ఢీ కొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. రామగుండం మల్యాలపల్లికి చెందిన రాజేశ్ తన సమీప బంధువైన శారదను ఎన్టీపీసీ పోలీస్స్టేషన్ పరిధిలోని ఖాజిపల్లి గ్రామం నుంచి బైక్పై మల్యాలపల్లికి తీసుకెళ్తున్నాడు. ఈక్రమంలో మేడిపల్లి సెంటర్లో అదేమార్గంలో వేగంగా వచ్చిన ఆటో వెనుక నుంచి బైక్ను ఢీకొంది. దీంతో బైక్పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆటోలో గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికితీసుకెళ్లారు.కానిస్టేబుల్పై దాడికోనరావుపేట: మండలంలోని రామన్నపేటలో బోనాల ఉత్సవంలో బందోబస్తుకు వచ్చిన ఓ కానిస్టేబుల్పై దాడి జరిగింది. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు జాతరలో గొడవ పడుతుండగా అక్కడే ఉన్న కానిస్టేబుల్ రవి వీడియో తీస్తుండడాన్ని గమనించిన ఓ యువకుడు ఆగ్రహించి కర్రను కానిస్టేబుల్పైకి విసిరాడు. కానిస్టేబుల్ తలకు గాయమై తీవ్ర రక్తస్రావం కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని గూడూరు స్టేజీ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిన సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్సై చిందం గణేశ్ తెలిపిన వివరాలు. ముస్తాబాద్కు చెందిన కూర సిద్దిరాములు(56) నామాపూర్లోని ఓ రైస్మిల్లో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఆదివారం విధులు ముగించుకొని బైక్పై ముస్తాబాద్కు తిరిగి వస్తుండగా గుర్తు తెలియని డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ సిద్దిరాములు అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్ను ఢీకొట్టిన వాహనం వేగంగా కామారెడ్డి వైపు వెళ్లింది. సిద్దిరాములు మృతికి కారణమైన వాహనాన్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతుడికి భార్య లక్ష్మి, కూతురు సంగీత ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై గణేశ్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు..సుల్తానాబాద్ రూరల్(పెద్దపల్లి): కారు ఢీకొని వృద్ధుడు మృతి చెందిన సంఘటన కనుకుల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తాళ్లపల్లి కొమురయ్య(85) తన ఇంటినుంచి బస్టాండ్కు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈక్రమంలో అతివేగంగా వెళ్తున్న కారు వెనుకనుంచి వచ్చి ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలతో రక్తస్రావం జరిగి వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వృద్ధుడికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని మృతదేహం లభ్యంకరీంనగర్క్రైం: కరీంనగర్ వన్టౌన్ పరిధిలోని ఓ లాడ్జి వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వన్టౌన్ పోలీసుస్టేషన్ ఎదురుగా ఉన్న లాడ్జి సమీపంలో సుమారు 55ఏళ్ల పైబడిన వ్యక్తి మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు వెల్లడించారు. వివరాలకు వన్టౌన్ పోలీసులను సంప్రదించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు ఢీకొని నలుగురికి గాయాలు ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్ 39వ డివిజన్ గౌతమినగర్ ప్రధాన రహదారిపై ప్రగతినగర్లో ఆదివారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈప్రమాదంలో సమతకారి నరసింహస్వామి, దుగ్గల అరుణ్కుమార్, బంగారి కవినిక్, సిలివేరి అక్షయ్కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై ఉదయ్ కిరణ్ కేసు నమోదు చేసుకొన్నారు. -
క్రీడా కార్యక్రమాలకు వెళ్తూ అనంతలోకాలకు..
కరీంనగర్స్పోర్ట్స్: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ కడారి రవి(57) మృతి చెందారు. హైదరాబాద్లో 1991 సంవత్సరానికి చెందిన వ్యాయామ వృత్తివిద్య (జీసీపీఈ) కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం, సికింద్రాబాద్లోని జింఖానా గ్రౌండ్స్లో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్ పోటీలకు హాజరయ్యేందుకు కారులో బయల్దేరాడు. కొమురవెల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలు అయ్యాయి. సిద్దిపేట ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. రవికి భార్య, కుమారుడు ఉన్నారు. రవి ప్రస్తుతం కరీంనగర్లో నివాసం ఉంటూ.. పెద్దపల్లి జెడ్పీహెచ్ఎస్ (బాలుర) స్కూల్లో పనిచేస్తున్నాడు. అథ్లెటిక్స్, అర్చరీ, రైఫిల్ షూటింగ్ తదితర క్రీడలకు కోచ్గా, అథ్లెటిక్ క్రీడా సంఘానికి ప్రధాన కార్యదర్శిగా, ప్రభుత్వ వ్యాయామ విద్య ఉపాధ్యాయులకు రిసోర్స్ పర్సన్గా సేవలందించారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల డీవైఎస్వోలు శ్రీనివాస్గౌడ్, సురేశ్, రాందాస్, రవి, క్రీడా సంఘాల బాధ్యులు సంతాపం వ్యక్తం చేశారు. ఆత్మీయ సమ్మేళనంలో సంతాప సభ హైదరాబాద్ దోమలగూడలోని ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల(1991) పూర్వ విద్యార్థుల సమ్మేళనం దోమలగూడ ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాలలో ఆదివారం జరిగింది. సమ్మేళనానికి వెళ్తున్న కడారి రవి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో సమ్మేళనానికి హాజరైన 70మంది పైగా వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు సంతాపం ప్రకటించారు. కొమురవెల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం ఫిజికల్ డైరెక్టర్ కడారి రవి మృతి -
పట్టణ రూపురేఖలు మారుద్దాం
పెద్దపల్లిరూరల్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, స్వశక్తి సంఘాల మహిళలను భాగస్వాములను చేస్తూ ప్రధాన సమస్యల పరిష్కారం, కనీస మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం చేపట్టిన వందరోజుల కార్యక్రమం సోమవారం ప్రారంభిస్తారు. ప్రతీనిత్యం శ్రీఒక చర్య.. ఒక మార్పుశ్రీ నినాదంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వం కాలెండర్ రూపొందించింది. పట్టణ రూపురేఖలను మార్చేలా చర్యలు చేపట్టేందుకు అధికారయంత్రాంగం సర్వసన్నద్ధమైంది. ప్రజలు తమవంతుగా పాటించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వానాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యం నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. ఇంటిఆవరణతోపాటు వీధులను శుభ్రంగా ఉంచేలా ప్రజల్లో చైతన్యం తెస్తారు. రోడ్ల పక్కన పిచ్చిమొక్కలు, ముళ్లపొదల తొలగింపు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు.ప్లాస్టిక్తో ముప్పుపై ప్రచారంప్లాస్టిక్ వస్తువుల వినియోగంతో కలిగే ముప్పుపై ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేసి ప్లాస్టిక్ను నియంత్రిస్తారు. ప్లాస్టిక్ కవర్లు, ఇతర చెత్తను డ్రైనేజీల్లో వేస్తే జరిమానా విధిస్తామనే సంకేతాలు ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంటింటికీ వెళ్లి సేకరించిన చెత్తతో సేంద్రియ ఎరువును తయారీ చేయడంపై అవగాహన కల్పిస్తారు.ఆదాయం పెంపే లక్ష్యంగా..మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఆదాయం పెంచుకునే దిశగా అధికారులు ముందుకు సాగనున్నారు. పట్టణాల్లో వ్యాపారాలు సాగిస్తున్న వారిలో ట్రేడ్లైసెన్స్లు లేనివారిని గుర్తించి జారీచేసేలా కార్యాచరణ చేపడతారు. ఇతర రకాల పన్నుల రూపేణా మున్సిపల్కు ఆదాయం సమకూరే విషయమై దృష్టి సారిస్తారు. భువన్ సర్వే నిర్వహించి అనుమతి లేనిఇండ్లను గుర్తించి క్రమబద్ధీకరించుకునేలా ప్రోత్సహిస్తారు.కూడళ్ల అభివృద్ధి.. పార్కుల ఏర్పాటుమున్సిపల్ పరిధిలోని ప్రధాన కూడళ్లలో ఉన్న అ వాంతరాలు తొలగించేలా ఇతరశాఖల అధికారు లు, స్థానికుల సహకారంతో అభివృద్ధి చేస్తారు. కూ డళ్ల వద్ద ప్రమాదాల నియంత్రణకు చేపట్టాల్సిన చ ర్యల్లో అవసరమైన వారిని ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను అభివృద్ధి పనుల్లో భాగస్వాములు చే స్తారు. పిల్లలు ఆడుకునేందుకు వీలుగా చిల్డ్రన్ పా ర్కుల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తిస్తారు.మహిళల ఆర్థికాభ్యున్నతికి..స్వశక్తి సంఘాల్లో సభ్యులకు అవసరమైన రుణాలను ఇప్పించి ఆర్థికంగా ఎదిగేలా చర్యలు తీసుకుంటారు. స్వశక్తి సంఘాల్లో సభ్యులుగా లేనినిరుపేద మహిళలను గుర్తించి సంఘాలను ఏర్పాటు చేయిస్తారు. మహిళలు తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో వ్యాపారం చేస్తూ ఆర్థికాభ్యున్నతి సాధించేలా సూచనలిస్తారు. అంతేకాకుండా పచ్చదనం.. పరిశుభ్రత అంశాలతోపాటు మరిన్ని అంశాలపై వందరోజుల పాటు కార్యక్రమాలను నిర్వహిస్తారు. -
ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
మల్లాపూర్(కోరుట్ల): మండలకేంద్రంలోని ఒడ్డెరకాలనీకి చెందిన దండుగుల శ్రీనివాస్(22) ఆదివారం వేకువజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. దండుగుల పోశేట్టి–బక్కవ్వ దంపతులకు శ్రీనివాస్ సంతానం. ఇతడి చిన్నతనంలోనే పోశేట్టితో బక్కవ్వ విడాకులు తీసుకుంది. శ్రీనివాస్ను పెంచి పెద్దచేసింది. కొంతకాలంగా బక్కవ్వ మానసికస్థితి సరిగా ఉండపోవడంతో పాటు ఇటీవల శ్రీనివాస్ హైదరాబాద్కి వెళ్లి అప్పు చేసి టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో తీవ్రంగా సతమతమవుతున్నాడు. రెండురోజుల క్రితం మల్లాపూర్కు వచ్చిన శ్రీనివాస్ జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి చిన్నతాత శివరాత్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జి ఎస్సై రాజునాయక్ తెలిపారు. -
భూహత్యలు.. తెగిపోతున్న బంధాలు
● ప్రాణాలు తీస్తున్నారు ● హద్దుల కోసం దాడులు ● బంధాలు మరిచిపోతున్న జనం ‘వేములవాడలో తనకు వారసత్వంగా రావాల్సిన భూమిని రిజిస్ట్రేషన్ చేయలేదని తండ్రిపై కొడుకు దాడి చేశాడు. ఇంట్లోకి దూరి ప్రాణాలు తీశాడు.’ ‘సిరిసిల్లలో ఇంటి పక్కన ఉన్న 3 ఫీట్ల స్థలం కోసం రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే యువకుడు క్షణికావేశంలో చిన్నాన్న కుటుంబంపై స్నేహితులతో కలిసి దాడిచేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ చిన్నాన్న మూడేళ్ల కొడుకు ప్రాణాలు కోల్పోయాడు.’ ‘చందుర్తి మండలంలో భూవివాదంలో తన పెద్దమ్మనే కత్తితో తలపై నరికి చంపాడు ఓ యువకుడు. ఈ యువకుడు మైనర్గా ఉన్న వయసులోనూ ఒకరిని హత్య చేసి జైలుకు వెళ్లి వచ్చాడు.’సిరిసిల్లక్రైం: క్షణికావేశం.. కాంప్రమైజ్ కావాలనే ఆలోచన లేకపోవడంతో భూహత్యలు జరుగుతున్నాయి. గజం స్థలం కోసం నిండు ప్రాణాలు తీసుకుంటున్నారు. సొంత కుటుంబీకులు.. బంధువులు.. ఇంటి పక్కవారు.. ఇలా ఎవరిౖపైనెనా దాడి చేసేస్తున్నారు. ప్రాణాలు తీస్తున్నారు. బతకడం కోసం కొంత భూమి ఉండాలన్నది పాతకాలపు మాట. భూమి దక్కించుకునేందుకు ప్రాణాలు సైతం తీస్తామంటున్నారు కొందరు. వరుస హత్యలతో జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పంచాయితీలు.. సెటిల్మెంట్స్ భూమి పంచాయితీలు సాధారణంగా ఇరువర్గాల మధ్య పెద్దమనుషుల సమక్షంలో జరుగుతుంటాయి. పెద్దలు చెప్పిన తీర్పు ఒకరికి న్యాయంగా అనిపిస్తే.. మరొకరికి అన్యాయంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో గొడవలు జరుగుతున్నాయి. ఊరు పెద్దల మధ్య పంచాయితీలు తీరక.. ఠాణా మెట్లు ఎక్కుతున్నారు. అక్కడ కూడా పంచాయితీలు పరిష్కారం కాకపోవడంతో కోర్టుల చుట్టూ ఏళ్లకు ఏళ్లుగా తిరుగుతున్నారు. మరికొందరైతే ఎదుటి వ్యక్తి అడ్డు తొలగించుకునేందుకు ప్రాణాలు తీస్తున్నారు. నిబంధనలుఅతిక్రమిస్తే చర్యలు భూవివాదాలను కోర్టు పరిధిలో పరిష్కరించుకోవాలి. చట్టాలు అతిక్రమించి పంచాయితీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు. నేరచరిత్ర కలిగి ఉండి భయభ్రాంతులకు గురిచేస్తే పీడీయాక్ట్ నమోదు చేస్తాం. సమస్యలు చట్ట పరిధిలో కోర్టును ఆశ్రయించి పరిష్కరించుకోవాలి. – మహేశ్ బీ గీతే, ఎస్పీ, రాజన్న సిరిసిల్ల -
ముస్తాబాద్లో కుళ్లిన మాంసం విక్రయం
ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్లో కుళ్లిన మాంసం విక్రయాలపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ముస్తాబాద్లోని మటన్ మార్కెట్ వద్ద బుర్ర శ్రీనివాస్ ఆదివారం మాంసం కొనుగోలుకు వెళ్లాడు. శ్రీనివాస్కు తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్న మాంసం విక్రయించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుల తరబడి ఫ్రిజ్ల్లో పెట్టిన మాంసాన్ని విక్రయిస్తున్నారని శ్రీనివాస్ మండిపడ్డారు. తలకాయ కొనుగోలు చేసిన తనకు దుర్వాసన వస్తున్న మాంసాన్ని విక్రయించారన్నారు. ముస్తాబాద్లో మాంసం విక్రయాలపై అధికారుల నిఘా లేకుండా పోయిందన్నారు. పశుసంవర్థకశాఖ నుంచి అనుమతులు తీసుకోకుండానే మాంసం విక్రయాలు చేస్తున్నారని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేలా కుళ్లిపోయిన మాంసాన్ని ప్రజలకు అంటగడుతున్నారన్నారు. దీనిపై జిల్లా అఽధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకొని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు. -
నిర్ణయం హర్షణీయం
మున్సిపాలిటీల్లోని పట్టణాల్లో అవసరమైన మౌలిక వసతులను గుర్తించి ప్రజలను భాగస్వామ్యం చేసేలా 100 రోజుల కార్యాచరణ చేపట్టడం హర్షణీయం. పట్టణ పౌరులుగా, సామాజిక స్పృహ ఉన్న వారిబాధ్యత పెంచేలా అధికారులు కార్యాచరణ చేపట్టేలా ప్రోత్సహించాలి. –బొంకూరి అవినాష్, కమాన్రోడ్డు, పెద్దపల్లి పార్కులు ఏర్పాటు చేయాలి జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో మినీ ట్యాంక్బండ్ మినహా మరో పార్కులేదు. చిల్డ్రన్ పార్కు ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించాలి. స్వచ్ఛపెద్దపల్లిగా తీర్చిదిద్దడంలో పట్టణ ప్రజలు భాగస్వాములయ్యేలా అధికారులు ప్రోత్సహించాలి. – బొడ్డుపల్లి సురేశ్, తిలక్నగర్, పెద్దపల్లి పకడ్బందీగా కార్యాచరణ వందరోజుల కార్యాచరణను పకడ్బందీగా అమలు చేస్తాం. ప్లాస్టిక్ నిషేధం, స్వచ్ఛత.. పరిశుభ్రత, హరితహారం లాంటివాటిలో ప్రజలను భాగస్వాములను చేస్తాం. స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు, స్వశక్తి సంఘాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. – వెంకటేశ్, మున్సిపల్ కమిషనర్, పెద్దపల్లి -
ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు
కొత్తపల్లి: కొత్తపల్లి మండలం బావుపేట గ్రామంలోని ఓ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అతడికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి, ప్రాణాలను రక్షించారు. కొత్తపల్లి మండలం బావుపేటకు చెందిన నేరెళ్ల సన్నీ అలియాస్ దయాసాగర్ కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. ఇంట్లోని వస్తువులను చిందర వందర చేయడంతో పాటు కుటుంబసభ్యులపై దాడికి దిగాడు. గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. కానిస్టేబుల్ విజయ్రావు డయల్ 100 ద్వారా సమాచారం అందుకుని అక్కడకు చేరుకున్నాడు. వాటర్ ట్యాంక్ ఎక్కిన సన్నితో మాట్లాడుతూ కౌన్సెలింగ్ ఇచ్చాడు. సన్నీ షరతులకు అనుగుణంగా కుటుంబ సభ్యులను ఒప్పించి వాటర్ ట్యాంక్ దింపి అతని ప్రాణాలను రక్షించాడు. కానిస్టేబుల్ను కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్, సీఐ నిరంజన్ రెడ్డి, కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి అభినందించారు. -
ఆయిల్పాం తోటలో అగ్ని ప్రమాదం
ధర్మపురి: షార్ట్ సర్క్యూట్తో ఆయిల్పాం తోటలో మంటలంటుకొని సుమారు రూ.8 లక్షల విలువ గల వస్తువులు కాలిపోయిన ఘటన మండలంలోని కోస్నూర్పల్లెలో ఆదివారం సాయంత్రం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాలు.. కోస్నూర్పల్లె మాజీ సర్పంచ్ ఎన్నం లక్ష్మారెడ్డి 3 ఎకరాల్లో ఆయిల్పాం తోటను సాగు చేస్తున్నాడు. ఆదివారం ఉదయం తోటకు నీళ్లు పెట్టి ఇంటికి వెళ్లిన లక్ష్మారెడ్డి సాయంత్రం తోటలో అగ్ని ప్రమాదం జరిగిందని తెలుసుకొని స్థానికులతో కలిసి మంటలు ఆర్పడానికి ఇబ్బందులుపడ్డారు. షార్ట్సర్క్యూట్తో డ్రిప్, పైపులైన్లు కొంతవరకు ఆయిల్పాం చెట్లు కాలిపోయాయని తెలిపాడు. -
స్వగ్రామానికి మృతదేహం
మల్యాల(చొప్పదండి): మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన పంజాల వాసుగౌడ్ (40) మృతదేహం ఆదివారం స్వగ్రామానికి చేరింది. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన వాసుగౌడ్ గత ఫిబ్రవరిలో అక్కడ ఆత్మహత్య చేసుకోగా, పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని మార్చురీలో భద్రపరిచారు. రెండు నెలలు గడిచినా మృతుడి ఆచూకీ కోసం ఎవరూ రాకపోవడంతో పోలీసులు మృతుడి వేలిముద్రల ఆధారంగా తెలుసుకొని ఇండియన్ ఎంబసీకి సమాచారం అందజేశారు. ఈక్రమంలో వాసుగౌడ్ వివరాలను గల్ఫ్ కార్మికుల సంరక్షణ సమితి అధ్యక్షుడు గుండెల్లి నరసింహ, ఉపాధ్యక్షుడు శేఖర్గౌడ్ సేకరించి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. -
సర్దుబాటు చర్యను విరమించుకోవాలి
కరీంనగర్: ప్రభుత్వం ఉపాధ్యాయుల సర్దుబాటును వెంటనే విరమించుకోవాలని టీపీటీఎఫ్ జి ల్లా అధ్యక్షుడు జంకె రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం సంఘ కార్యాలయంలో మాట్లాడుతూ ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో ప్రాథమిక పాఠశాలలో 30మందికి ఒకరిని, 60మందికి ఇద్దరు ఉపాధ్యాయులను నియమిస్తే ఎలా బోధిస్తారని ప్రశ్నించారు. అసంబద్ధమైన ఉత్తర్వును వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. కామన్ స్కూల్ విద్యా విధానా న్ని ప్రవేశపెట్టాలని, ఈ వేసవిలోనే ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లు చేపట్టి విద్యా వ్యవస్థ బలోపేతం చేయడానికి ప్రభుత్వం తగువి ధంగా తోడ్పడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకుల వేల్పుల బాలయ్య, అర్కాల శ్రీనివాస్,కిషన్రావు, రామస్వామి, శ్రీధర్, ఆంజనేయరావు, శ్రీనివాస్, చంద్రశేఖర్, రాజమల్లు పాల్గొన్నారు. -
వైభవంగా మహాశక్తి ఆలయ వార్షికోత్సవం
కరీంనగర్ కల్చరల్: కరీంనగర్లోని మహాశక్తి ఆల య పంచాదశ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండిసంజయ్ కుమార్ పాల్గొన్నారు. హంపీ విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి విద్యారణ భారతిస్వామి ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీ గణపతి, శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లకు పంచామతాభిషేకం చేశారు. స్వస్తి పుణ్య హవచనం, గణపతి పూజ, అఖండ దీపారాధన, సర్వతో భద్ర మండలం, లక్ష్మీ గణపతి హోమం, రుద్ర సహిత చండీహోమం, పూర్ణాహుతి, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు. విద్యారణ్య భారతిస్వామి మాట్లాడుతూ సనాతన ధర్మమే శాశ్వతమైన ధర్మమని ఉపదేశించారు. నేటితరం తల్లిదండ్రులను గౌరవించాలని, ఆలయాలను సందర్శించాలని, ధర్మాన్ని సంరక్షించాలన్నారు. మాజీ మేయర్ వై.సునీల్రావు, మాజీ కార్పొరేటర్ బండ సుమ, భక్తులు పాల్గొన్నారు. -
‘సంజయ్ మాటలు అర్థరహితం’
కరీంనగర్ కార్పొరేషన్: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, సీఎం రేవంత్పై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి అన్నారు. నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో ఆదివారం మాట్లాడు తూ యుద్ధంపై వాస్తవాలు మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డిని దేశద్రోహి అనడమేమిటన్నారు. ఇందిరాగాంధీని విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పార్లమెంటులో అన్ని బిల్లులకు మద్దతు తీసుకుని, బీఆర్ఎస్తో అవి నీతిలో భాగస్వాములై, ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్కు ముడిపెట్టడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఎండీ తాజ్, శ్రవణ్ నాయక్, గుండాటి శ్రీనివాస్రెడ్డి, కుర్ర పోచయ్య, మ్యాకల నర్సయ్య, ఎట్టం వేణు పాల్గొన్నారు. ‘బీజేపీతో పొత్తు పెట్టుకునే కర్మ బీఆర్ఎస్కు లేదు’ కరీంనగర్: కేంద్రమంత్రి బండి సంజయ్ బా ధ్యతరహితంగా మాట్లాడటం, బీఆర్ఎస్, కేసీ ఆర్ కుటుంబంపై అబద్ధాలు ప్రచారం చేయ డం మానుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామక్రిష్ణారావు హితవు పలికారు. ఆదివారం నగరంలో మాట్లాడుతూ.. బండి సంజయ్ బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కరీంనగర్ ఎంపీగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉండి గల్లీ లీడర్గా వ్యహరిస్తున్నారని దుయ్యబట్టారు. పార్టీ స్థాపించినప్పుడు హరీశ్రావు, కవిత, కేటీఆర్లు ఉన్నారని వారసత్వ రాజకీయాలు లేవని, వారంతా పునాది రాళ్లలాగా పనిచేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మునిగిపోయే నావ లాంటి బీజేపీలో తాము కలవబోమని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబంపై అనవసరమైన వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. నాయకులు పొన్నం అనిల్గౌడ్, చీటి రాజేందర్రావు, శ్రీనివా స్గౌడ్, భాస్కర్, రవి, సంపత్, శే ఖర్, చారి, షౌకత్అలీ, వసంతరావు పాల్గొన్నారు. జూనియర్ లెక్చరర్ల ఆందోళనకరీంనగర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2023 మే 3న నియామకమైన సుమారు 3,200 మంది రెగ్యులర్ జూనియర్ లెక్చరర్లు రెండో వార్షిక ఇంక్రిమెంట్ మంజూరుపై నెలకొన్న అస్పష్టతతో తీవ్ర ఆందోళనలో ఉన్నారని లెక్చరర్ల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లింగంపల్లి దేవేందర్ అన్నారు. ఈ మేరకు ఆదివారం డీఐఈవో గంగాధర్కు వినతిపత్రం సమర్పించారు. రెండేళ్ల ప్రొబేషన్ పూర్తయినప్పటికీ, రెండో ఇంక్రిమెంట్ను వేతన బిల్లుల్లో చేర్చకపోవడం వల్ల తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. రెండో ఇంక్రిమెంట్ ప్రక్రియను వేగవంతం చే యాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అధ్యక్షుడు ప్రేమ్ సాగర్, ప్రధాన కార్యదర్శి హనుమాండ్ల శ్రీని వాస్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి అత్తినేని శ్రీనివాస్, సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి దేవయ్య రాజేశ్వర్ రావు, పెద్దపల్లి జిల్లా నుండి నరహరి, మహిళా కార్యదర్శి అరుణ, కంకణాల శ్రీనివాస్, నరసింహం, శ్రీకాంత్ పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలి కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరి ష్కరించాలని కోరుతూ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైకోర్టు ఆదేశాల కాపీని జత పరుస్తూ ప్రభుత్వానికి లేఖ పంపారు. రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల అభిమానుల చారి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుర్ర మంజుల, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.బాబా య్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నెలకు పదివేల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి దాన్ని అమలు చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించామన్నారు. హైకోర్టు రూ.17వేల జీతం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిందని, అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
సన్నబియ్యం.. డీలర్ల పరేషాన్
కరీంనగర్రూరల్: కేంద్ర ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు ఒకేసారి మూడునెలల బియ్యం పంపిణీ చేయాలనే నిర్ణయం డీలర్లకు పెద్ద సమస్యగా మారింది. ఈ పాస్ యంత్రాల్లో నెలకొన్న సాంకేతిక సమస్యతో బియ్యం పంపిణీ ఆలస్యం అవుతోంది. లబ్ధిదారులు గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. రేషన్ డీలర్లు ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినప్పటికీ.. పరిష్కరించకపోవడంతో ఆదివారం జిల్లావ్యాప్తంగా బియ్యం పంపిణీ ప్రక్రియ గందరగోళంగా మారింది. కేంద్ర ప్రభుత్వం వానాకాలంలో రేషన్ బియ్యం కోసం లబ్ధిదారులు ఇబ్బందులకు గురికావద్దనే ఉద్దేశంతో జూన్, జూలై, ఆగస్టు మాసాల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈపాస్ యంత్రాల్లో 3.2 కొత్త సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి లింక్చేశారు. ఆదివారం నుంచి డీలర్లు బియ్యం పంపిణీ ప్రారంభించారు. ఈపాస్ యంత్రాల్లో నెలకొన్న సాంకేతిక సమస్యతో డీలర్లు ఇబ్బందులకు గురయ్యారు. ఒక్కో లబ్ధిదారుడు మూడు నెలల బియ్యం పొందాలంటే ఈపాస్ మిషన్పై ఆరు పర్యాయాలు వేలిముద్ర వేయాల్సి వస్తోంది. దీంతో ఒక్కో లబ్ధిదారుడికి అరగంట సమయం పడుతోందని డీలర్లు పేర్కొంటున్నారు. సర్వర్ స్లోగా ఉండటంతో ఈపాస్ యంత్రాల్లో లబ్ధిదారుల వివరాల నమోదులో జాప్యమేర్పడుతోంది. ఈపాస్ మెషిన్లలో నెలకొన్న సాంకేతిక సమస్యలను సివిల్సప్లై అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు కరీంనగర్ మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు తాటి పూర్ణచందర్రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి నెలకు 5కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం కిలో చొప్పున వేర్వేరుగా బియ్యం కోటాను లబ్ధిదారులకు మంజూరు చేస్తుండటంతో ఒక్కొక్కరు రెండు పర్యాయాలు వేలిముద్ర వేయాల్సి వస్తోందని సివిల్సప్లై అధికారులు తెలిపారు. ఈపాస్ యంత్రంలో సాంకేతిక సమస్య మూడు నెలలకు ఆరుసార్లు వేలిముద్ర ఒక్కో లబ్ధిదారుడికి అరగంట సమయం -
ఇంతకీ ఏ రేటు?
● వాటర్ ట్యాంకర్లలో గందరగోళం ● ప్రైవేట్ ట్యాంకర్కు అమలుకాని రూ.900 రుసుం ● ఇష్టారాజ్యంగా నీటి సరఫరాకరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలకసంస్థ పరిధిలో వాటర్ ట్యాంకర్ల వ్యవహారం గందరగోళంగా మారింది. ప్రైవేట్ ట్యాంకర్లలో ఒక్కోదానికి ఒక్కో రకమైన రుసుం వసూలు చేస్తుండడం వివాదాస్పదమవుతోంది. మున్సిపల్కు చెందిన ట్యాంకర్ల ట్రిప్పుల్లోనూ సరైన లెక్కలు ఉండడం లేదనే ఆరోపణలున్నాయి. వ్యాపారపరంగా వినియోగించుకుంటున్నందున ప్రైవేట్ ట్యాంకర్లకు ఒక్కోదానికి రూ.900 వసూలు చేయాలనే బల్దియా నిర్ణయం ఇప్పటివరకు అమలుకు నోచుకోవడం లేదు. ట్యాంకర్ల ద్వారా సరఫరా వివిధ అవసరాలకు నిర్ణీత రుసుం తీసుకుని ట్యాంకర్లద్వారా నగరపాలకసంస్థ నీటిని సరఫరా చేస్తోంది. ఇందుకోసం మున్సిపల్ తరఫున హైలెవెల్, లోలెవెల్ జోన్ పరిధిల్లో సొంతంగా ఆరు ట్యాంకర్లు ఉన్నాయి. ఈ ట్యాంకర్ల ద్వారా నీళ్లు కావాలనుకునే వినియోగదారులు రూ.600 రుసుము నగరపాలకసంస్థ కార్యాలయంలో చెల్లిస్తే కోరిన చోటికి నీటిని సరఫరా చేస్తారు. ప్రైవేట్ ట్యాంకర్లు అయితే కార్యాలయంలో రూ.400 చెల్లించి తీసుకున్న రశీదును రిజర్వాయర్లలో చూపించి నీటిని నింపుకోవాల్సి ఉంటుంది. అమలు కాని రూ.900 ప్రైవేట్ ట్యాంకర్లు నగరపాలకసంస్థ నుంచి నీటిని కొనుగోలు చేసి, ఇతర అవసరాలకు అధిక ధరకు విక్రయిస్తాయి. ఇందుకోసం గతంలో ఒక్కో ట్యాంకర్కు రూ.200 మాత్రమే చెల్లించే వాళ్లు. ప్రైవేట్ ట్యాంకర్లు చేసేది వ్యాపారం కావడంతో, ఒక్కో ట్యాంకర్ (4 వేల లీటర్లు, 5 వేల లీటర్ల సామర్థ్యం)కు రూ.900 తీసుకోవాలని గతంలో నగరపాలకసంస్థ సమావేశం తీర్మాణం చేసింది. కాని వివిధ ఒ త్తిళ్ల ఫలితంగా ఇప్పటివరకు అది అమలుకు నోచుకోవడం లేదు. దీనిపై అధికారుల నుంచి స్పందన లేదు. ఒక్కో ట్యాంకర్ ఒక్కో రకంగా ప్రైవేట్ ట్యాంకర్ల వ్యవహారం గందరగోళంగా మారింది. ఒక్కో ట్యాంకర్కు ఒక్కో రకమైన రుసుం వసూలు చేస్తుండడం వివాదాస్పదమవుతోంది. రూ.900 అమలుకు నోచుకోకపోవడంతో, రూ.200 వసూలు చేసిన ట్యాంకర్కు ప్రస్తుతం రూ.400 తీసుకుంటున్నారు. ఇప్పటికీ కొన్ని ప్రైవేట్ ట్యాంకర్లకు రూ.200 చొప్పున తీసుకుని రిజర్వాయర్లలో నీళ్లను అందిస్తున్నారు. మరి కొన్నింటికి రూ.400 వసూలు చేస్తున్నారు. మీటర్లు బిగిస్తేనే మున్సిపల్ ట్యాంకర్ల విషయంలోనూ అక్రమాలు చోటుచేసుకొంటున్నాయనే ఆరోపణలున్నాయి. రూ.600 చెల్లిస్తే ము న్సిపల్ ట్యాంకర్ను పంపించాల్సి ఉంటుంది. అది కూ డా భవన నిర్మాణాలు లాంటివాటికి వినియోగించరాదు. ఒక ట్యాంకర్ను బుక్ చేసుకుని ఎక్కువ ట్యాంకర్లను తిప్పుతున్నట్లు సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రైవేట్ ట్యాంకర్లు కూడా రశీదు లేకుండానే తిప్పుతున్నట్లు చెబుతున్నారు. ఇది లా ఉంటే మున్సి పల్, ప్రైవేట్ ట్యాంకర్ల అక్రమాలు అరికట్టాలంటే మీ టర్లు, జీపీఎస్ ట్రాకింగ్ను వినియోగించాల్సి ఉంది. రిజర్వాయర్లలో మీటర్లు పెట్టడం ద్వారా ఎన్ని ట్యాంకర్లకు ఎన్ని లీటర్ల నీళ్లు నింపారనే రికార్డు ఉంటుంది. మున్సి పల్ ట్యాంకర్లు ఎక్కడికి వెళుతున్నాయనేది కూడా వెల్లడవుతుంది. దీని ద్వారా అక్రమాలను అరికట్టే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
పోలీసులకు సేవా పతకాలు
కరీంనగర్క్రైం: తెలంగాణ ఆవిర్భావ దినోత్స వం సందర్భంగా ప్రభుత్వం విధుల్లో ప్రతిభ కనబరిచిన పలువురు పోలీసులకు ఆదివారం సేవా పతకాలు ప్రకటించింది. కరీంనగర్ ఎస్బీ ఎస్సై ఎన్.శ్రీనివాస్, ట్రాఫిక్ ఏఎస్సైలు డి.శ్రీ నివాస్, సీహెచ్.రాజన్న, టూ టౌన్ ఏఎస్సై ఎన్.భాస్కరాచారి, కరీంనగర్ రూరల్ ఏఎస్సై సయ్యద్ అమ్జద్, చిగురుమామిడి ఏఎస్సై వి. తిరుపతి, వీణవంక ఏఎస్సై పి.రవి, సీఏఆర్ ఏఆర్ఎస్సై ఎండీ. అబ్దుల్ ఖుద్దూస్, కరీంనగర్ టూటౌన్ హెడ్కానిస్టేబుల్ వి.రాజయ్య, టా స్క్ఫోర్స్ హెడ్కానిస్టేబుల్ బి.విజయసాగర్, పీ టీసీ ఎస్సై ఎం.డీ.నసీమొద్దీన్లకు ఉత్తమసేవా పతకాలు ప్రకటించారు. పీసీఆర్ ఎస్సై జి.రామిరెడ్డి, ఆర్.రవీందర్, మొయిద్అలీ, ఎం.కంఠయ్య, కె.రామచంద్రారెడ్డి, ఎండీ.ఖదీర్, సీ హెచ్.శ్రీనివాస్, ఎం.డీ.ఇక్బాల్, ఏ.శంకరయ్య, ఎం.సుధాకర్, ఎం.యాదగిరి, ఎం.డీ.నజీమొద్దీన్, పి.లక్ష్మీనారాయణ, పి.రాజిరెడ్డి, ఎం.సత్తయ్య, ఎం.రాయిబోస్, పి.రాంప్రసాద్, ఎండీ.భాషు,ఎం.శ్రీనివాసాచారి,ఎం.డీ.కజ్రాపాషా,ఎ.రవీందర్, ఏ.రేణుకానందం, డి.మల్లేశం, వి.బాలరాజు, వి.మల్లారెడ్డి, కె.కరుణాకర్, పి.శ్రీనివాస్, ఎం.డీ.బగ్దాద్, బి.గౌరయ్య, ఆర్.మొగులయ్య, ఎన్.సంపత్, సయ్యద్ గయాజుద్దీన్, ఈ.వేణు, డి.రవీందర్, ఎం.స్వామిరావు, పీటీసీలో పనిచేస్తున్న ఎం.శ్రీనివాస్, టీజీఎస్పీ విభాగంలో పి.రమేశ్, ఆర్.జాకబ్, సీఐడీ విభాగానికి చెందిన జె.నరేశ్, మండిలాల్కు ఉత్తమ సేవాపతకాల ప్రకటించారు. -
ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి
కరీంనగర్ కార్పొరేషన్: తెలంగాణ ఆవిర్భావ వేడులు ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్ ఆదేశించారు. శుక్రవారం ఆవిర్భావ వేడుకల సన్నాహక సమావేశాన్ని నగరపాలకసంస్థ కార్యాలయంలోని తన చాంబర్లో నిర్వహించారు. నగరపాలకసంస్థ కార్యాలయంతో పాటు, కళాభారతికి లైటింగ్ వేయాలన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీంతో పాటు నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో నగరంలో చేయాల్సిన ఏర్పాట్లను వేగవంతంగా పూర్తిచేయాలన్నారు. తెలంగాణ అమరవీరుల స్తూపంతో పాటు, జయశంకర్ విగ్రహాన్ని, జంక్షన్ను పూలతో అలంకరించాలన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో నగరపాలకసంస్థ సహాయ కమిషనర్ వేణు మాధవ్, ఈఈ సంజీవ్ కుమార్, డీఈలు అయ్యూబ్ఖాన్, వెంకటేశ్వర్లు, ఏఈలు సతీశ్, గఫూర్ పాల్గొన్నారు.సమీక్షతో ఒరిగిందేమీ లేదుమానకొండూర్: జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమకుమార్రెడ్డి కరీంనగర్లో నిర్వహించిన సమీక్షతో జిల్లాకు ఒరిగింది ఏమీ లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు అన్నారు. మానకొండూర్లో శుక్రవారం మాట్లాడుతూ.. ప్రజాపాలనలో లక్షలాది దరఖాస్తులు వచ్చాయని, గ్రామసభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కాని ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసి, స్థానిక కాంగ్రెస్ నాయకులను ఇందిరమ్మ కమిటీల్లో సభ్యులుగా నామినేట్ చేసిందన్నారు. సిబిల్ స్కోర్ ద్వారా లబ్ధిదారులకు రుణాలకు ఇస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. రాజీవ్ యువశక్తి కాదని కాంగ్రెస్ యువశక్తిగా మారిందన్నారు. రైతుబంధు ద్వారా ఎంతమంది రైతులకు ప్రయోజనం చేకూరిందో లెక్కలేదన్నారు. వ్యవసాయ విత్తనాలు, ఎరువుల లభ్యతపై స్పష్టత లేదన్నారు. సమరశీల పోరాటాలకు సిద్ధంకరీంనగర్: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సీపీఐతో స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ ప్రజాసమస్యలపై ప్రజలపక్షాన సమరశీల పోరాటాలకు సిద్ధమయ్యామని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మర్రి వెంకటస్వామి పేర్కొన్నారు. కరీంనగర్ బద్ధం ఎల్లారెడ్డి భవన్లో శుక్రవారం జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్తో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో 16నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందన్నారు. బీజేపీని అడ్డుకోవాలంటే కమ్యూనిస్టులు రాజకీయ ప్రత్యామ్నాయం వైపు ఆలోచించాలన్నారు. శాతవాహన యూనివర్సిటీ పరిధిలోనే ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. సీఎం, హోం మినిస్టర్ వాడాల్సిన హెలికాప్టర్ను మంత్రులందరూ వినియోగించుకుంటూ వృథా ఖర్చు చేస్తున్నారన్నారు. జిల్లాలో సీపీఐ పార్టీని నిర్మాణపరంగా విస్తరించామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉందన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పొనగంటి కేదారి, అందె స్వామి, కసిరెడ్డి సురేందర్రెడ్డి, గూడెం లక్ష్మి, నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి, పిట్టల సమ్మయ్య, కిన్నెర మల్లవ్వ, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, కంది రవీందర్రెడ్డి, అందె చిన్న స్వామి, బావండ్లపల్లి యుగంధర్, మచ్చ రమేశ్ పాల్గొన్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తా సీపీఐ జిల్లా నూతన కార్యదర్శిగా పంజాల శ్రీనివాస్ శుక్రవారం స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్లో బాధ్యతలు స్వీకరించారు. మాజీ కార్యదర్శి మర్రి వెంకటస్వామితో పాటు నాయకులు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, కార్యదర్శిగా తన ఎన్నికకు సహకరించిన పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి పనిచేస్తానని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో బలము న్న చోట పోటీ చేసి పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేలా కృషి చేస్తానని వివరించారు. అలాగే కరీంనగర్లో ఏడాదిన్నర క్రితం కేటాయించిన జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. -
‘బంటియా’ ఫర్నీచర్ షోరూం ప్రారంభం
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల ఎదురుగా నూతనంగా ఏ ర్పాటు చేసిన బంటియా ఫర్నీచర్ షోరూంను శు క్రవారం బంటియా మేనేజింగ్ డైరెక్టర్ సురేందర్ బంటియాతో కలిసి సుడా చైర్మన్ కె.నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేందర్ బంటియా మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు పొందిన బంటియా ఫర్నీచర్స్ ఇప్పుడు కరీంనగర్లో తన అతిపెద్ద షోరూంను గ్రాండ్గా ప్రారంభించినట్లు తెలిపారు. ప్రపంచం నలుమూలల నుంచి దిగుమతి చేసిన తాజా, నాణ్యమైన ఫర్నిచర్ ఉత్పత్తులను అందిస్తున్నామని అన్నారు. రూ.99,999కి పైగా కొనుగోలు చేసే కస్టమర్లకు హోండా యాక్టివా 6జీ ఉచితంగా ఇవ్వడంతో పాటు ప్రత్యేక బహుమతులు, డిసౌంట్లు ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే విద్యుత్ ఆధారిత రీకై ్లనర్లు రూ.99,999లకు లభిస్తాయన్నారు. క్రేవింగ్ సోఫాలు రూ. 66,000 నుంచి ప్రారంభమవుతాయని, ప్యాకేజీలు, జీరో డౌన్ పేమెంట్ ఈఎంఐ సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
బావిలో పడిన ట్రాక్టర్.. డ్రైవర్ మృతి
మల్లాపూర్: ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో ట్రాక్టర్ పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలకేంద్రం శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. మాట్ల చిన్నపెద్దులు(61)కు భార్య సత్తమ్మ, కుమార్తె ఉన్నారు. ఉపాధి నిమిత్తం గతంలో గల్ఫ్ వెళ్లి వచ్చి కుమార్తె వివాహం జరిపించాడు. ఎనిమిదేళ్లుగా స్వగ్రామంలోనే ఉంటూ ట్రాక్టర్ నడిపించుకుంటున్నాడు. శుక్రవారం ఉదయం గ్రామానికి చెందిన శనిగారపు రమేశ్కు చెందిన వ్యవసాయ భూమిలో చిన్నపెద్దులు ట్రాక్టర్తో దుక్కి దున్నుతున్నాడు. రివర్స్ వెళ్లే క్రమంలో ట్రాక్టర్ వ్యవసాయబావిలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. నీటమునిగి చిన్నపెద్దులు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. మృతుడి భార్య సత్తెమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై రాజు తెలిపారు. -
సేవ.. స్వచ్ఛంద తోవ
● రాజన్న సేవలో మహిళలు ● ఆలయంలో వివిధ పనులకు స్వచ్ఛందంగా హాజరు ● గోశాలలోని గడ్డి ఆరబెట్టేందుకు తరలివచ్చిన అతివలు వేములవాడ: రాజరాజేశ్వరీ సేవా సమితి సభ్యులు రాజన్న సేవలో తరిస్తున్నారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో వివిధ పనులకు స్వచ్ఛందంగా హాజరవుతున్నారు. హుండీ లెక్కింపు.. ఉత్సవాల సమయాల్లో ఆలయంలో వివిధ సేవల్లో రాజరాజేశ్వరీ సేవా సమితి సభ్యులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి తడిసిన తిప్పాపూర్ గోశాలలోని గడ్డిని ఆరబెట్టేందుకు సైతం శుక్రవారం భారీగా మహిళలు స్వచ్ఛందంగా వచ్చారు. పశువులకు సేవా చేయడంలో ఉన్న సంతృప్తి వేరేదాంట్లో రాదని వారు పేర్కొంటున్నారు. దాదాపు 63 మంది మహిళలు స్వచ్ఛందంగా వచ్చి కోడెలకు ఉపయోగపడే గడ్డిని ఆరబెట్టే పనుల్లో నిమగ్నమై.. ఆదర్శంగా నిలిచారు. -
వేసవి కార్యాచరణ ప్రణాళిక విజయవంతం
కొత్తపల్లి(కరీంనగర్): టీపీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ పరిధిలో విద్యుత్ వేసవి కార్యాచరణ ప్రణాళిక విజయవంతమైందని ఎస్ఈ మేక రమేశ్బాబు అన్నారు. విద్యుత్ భవన్లోని ఎస్ఈ చాంబర్లో శుక్రవారం ఉద్యోగులు, సిబ్బందిని అభినందించారు. గత సంవత్సరం నవంబర్ నెల నుంచి వేసవి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకొని.. అందుకనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడంతో విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించామన్నారు. లోడ్ పెరిగే అవకాశమున్నచోట్ల రాచర్ల తిమ్మాపూర్, మొయినకుంట, జేపీనగర్, బోనాల, మల్లారం, రేణిగుంట ప్రాంతాల్లో 5 ఎంవీఏ, కరీంనగర్ టౌన్ బ్యాంక్ కాలనీలో 12.5 ఎంవీఏ కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్లు నెలకొల్పామని, కరీంనగర్ టౌన్ ఉజ్వల పార్క్, వాటర్ వర్క్స్, ఎస్ఆర్ఆర్, నవపేట్, వీర్నపల్లి ప్రాంతాల్లో 5 ఎంవీఏ నుంచి 8 ఎంవీఏ, సప్తగిరికాలనీ సాయినగర్(ఖాజీపూర్–2)లో 8 ఎంవీఏ నుంచి 12.5 ఎంవీఏ, కోర్కల్, వట్టములలో 3.15 నుంచి 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం వరకు పెంచామని వివరించారు. కరీంనగర్ మున్సిపల్ టౌన్, కాజిపూర్(బాబుపేట్), చిగురుమామిడి, సిరిసిల్ల జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి లోడ్ సామర్థ్యం పెంచడంతో విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నివారించగలిగామని చెప్పారు. ఇప్పటివరకు 325 కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుతోపాటు 355 ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచినట్లు పేర్కొన్నారు. కరీంనగర్ మున్సిపల్ టౌన్, కరీంనగర్ గ్రామీణ ప్రాంతాల్లో అల్గునూరు, చిగురుమామిడి, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర ప్రాంతాల్లో ఓవర్ లోడ్ తగ్గించామని, గత నవంబర్ నెల నుంచి నిరంతరాయంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటూ వేసవికాల ముందస్తు కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేశామని తెలిపారు. -
ఆవిర్భావ పండుగ అతిథులు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న జరిగే జాతీయ పతాక ఆవిష్కరణ పండుగకు జిల్లా కేంద్రాల్లో జరిగే ఉత్సవాలకు అతిథులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్లో జరిగే జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, జగిత్యాలకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, పెద్దపల్లికి రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, రాజన్న సిరిసిల్లకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్లు జెండా ఆవిష్కరించనున్నారు. -
పొగాకు నిర్మూలిద్దాం
● విచ్చలవిడిగా తంబాకు, గుట్కా వినియోగం ● బహిరంగంగానే ధూమపానం ● పెరుగుతున్న సిగరేట్లు కాల్చే వారి సంఖ్య ● నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినంకరీంనగర్టౌన్: యువత ఎంజాయ్ చేస్తున్నామనే భావనలో ప్రాణాంతక వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. సిగరేట్ కాలినట్లే తమ ఆరోగ్యం కాలిపోతుందనే విషయం గమనించలేకపోతున్నారు. జిల్లాలో యుక్తవయస్సు వచ్చిన విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు సిగరేట్, బీడీ, తంబాకు, జర్ధా, గుట్కా వంటి మత్తు పొగాకు మోజులో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సరదాగా మొదలు పెట్టి చివరకు బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. పొగాకు ఉత్పత్తులపై నియంత్రణ లేకపోవడంతో విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. వాటి వల్ల వివిధ రకాల రోగాలు వస్తాయని వైద్యులు చెబుతున్నా తినేవారిలో మార్పు రావడం లేదు. శనివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కథనం.బహిరంగ ధూమపానం నేరం ధూమపానం నష్టాన్ని గుర్తించిన పాలకులు 2003లో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నేరమని చట్టం తీసుకువచ్చారు. చట్ట ప్రకారం ప్రయాణ ప్రాంగణాలు, పార్కులు, రోడ్లపై, సినిమా థియేటర్లు, బహిరంగ ప్రదేశాల్లో పొగతాగితే చట్టరీత్యా చర్యలతో పాటు జరిమానా విధించాలి. కానీ, జిల్లాలో అలాంటి కేసులు నమోదు కావడం లేదు. సిగరేట్ తాగడం ఆరోగ్యానికి హానికరమని ప్యాకెట్లపై ముద్రించి వదిలేస్తున్నారు. పొగాకు ఉత్పత్తులపై మరింత కఠిన నియంత్రణలు విధించాలని, విద్యాసంస్థల పరిసరాల్లో గుట్కా, సిగరెట్ అమ్మకాలు పూర్తిగా నిషేధించాలని ఆరోగ్య కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. -
అంజన్న హుండీ ఆదాయం రూ.1.95 కోట్లు
మల్యాల: మల్యాల మండలం ముత్యంపేటలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపును శుక్రవారం ఆలయ అధికారి శ్రీకాంత్, పర్యవేక్షణాధికారి రాజమౌలి ఆధ్వర్యంలో చేపట్టారు. 24 రోజులకుగాను హుండీ ఆదాయం రూ.1,00,95,392 సమకూరిందని, 44 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయని తెలిపారు. భక్తులు హుండీలో వేసిన మిశ్రమ బంగారం, వెండికి సీలువేసి,తిరిగి హుండీలో వేసినట్లు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకుడు రామకృష్ణ, స్థానాచార్యుడు కపీందర్, పర్యవేక్షకుడు సునీల్కుమార్, ఎన్.చంద్రశేఖర్, హరిహరనాథ్, ఆలయ సిబ్బంది, ఏఎస్సై శ్రీనివాస్, శ్రీలలిత సేవా ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు. ఉరేసుకుని ఒకరి ఆత్మహత్యమల్యాల: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మల్యాల మండలం తక్కళ్లపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై నరేశ్ కుమార్ కథనం ప్రకారం.. మల్యాల మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన బేతి కృష్ణ(38) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. వైద్య చికిత్స కోసం లక్షలు ఖర్చు చేసినా, వ్యాధి నయం కాకపోవడంతోపాటు జీవితంపై విరక్తి చెందిన తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి తల్లి సులోచన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. బావిలో పడి వృద్ధుడు మృతిసుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): చొప్పదండి మండలం రుక్మాపూర్కు చెందిన లంక ముత్తయ్య(70) సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై శ్రావణ్కుమార్ తెలిపిన వివరాలు.. ముత్తయ్యకు కొడుకు, కూతురు ఉండగా కూతురు నర్సయ్యపల్లిలో ఉంటోంది. అనారోగ్యంతోపాటు మతిస్థిమితం సరిగా లేని ముత్తయ్య నెలరోజుల క్రితం కూతురు ఇంటికి వచ్చాడు. ఈనెల 18న ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు. ఈక్రమంలో అతడు ఇంటికి వెళ్లకపోవడంతో బంధువులు ఇళ్లలో, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం నర్సయ్యపల్లి శివారులోని వ్యవసాయ బావిలో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం కనబడడంతో ముత్తయ్యగా కుటుంబసభ్యులు నిర్ధారించారు. మృతుడి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మండలంలోని గంగారం శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కూనారం గ్రామానికి చెందిన ఎండీ అక్రం(27) మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రంలో మెకానిక్ పని చేస్తూ జీవనం సాగిస్తున్న అక్రం సాయంత్రం ఇంటికి వెళ్తుండగా ఆటోట్రాలీ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అక్రం అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్ పేర్కొన్నారు. మృతుడికి భార్య సమీరాబేగం, తల్లి దండ్రులు రేష్మ బేగం అక్బర్ పాషా ఉన్నారు. -
స్వచ్ఛనగరం కోసం 100 రోజులు
కరీంనగర్ కార్పొరేషన్: నివాసయోగ్యమైన, పర్యావరణ అనుకూల నగరంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వందరోజుల ప్రణాళికను చేపట్టింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు నగరంలో ఈ కార్యక్రమం అమల్లో ఉంటుంది. పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దడంతో పాటు, విపత్తులను సైతం ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ ప్రణాళికను రూపొందించి అమలు చేయనున్నట్లు నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్ తెలిపారు. వందరోజుల పాటు కార్యక్రమాలు.. నగరవ్యాప్తంగా మురుగు నీటి కాలువలు, నాలాల్లో పూడికలు తీయడం, పారిశుద్ధ్యంపై ఇంటింటికి అవగాహన కల్పించడం, హోం కంపోస్టింగ్ తయారు చేయడం, ఇంటి వద్దనే చెత్తను వేరుచేయడం, కమ్యూనిటీ పబ్లిక్ టాయిలెట్స్ తదితరాలు తనిఖీ చేస్తారు. రోడ్ల పక్కన పిచ్చి మొక్కలు తొలగించడం, డెంగీ, మలేరియా లాంటి విషజ్వరాల నివారణ చర్యలు, దోమల నియంత్రణ డ్రైవ్, డంపింగ్ యార్డు, పొడిచెత్త, తడిచెత్త ప్రాసెసింగ్ ప్లాంట్ల సందర్శన, బహిరంగ ప్రదేశాలను శుభ్రపరచడం, పాఠశాలలు, కళా శాలల్లో కంపోస్టింగ్ యూనిట్స్ ఏర్పాటు, మున్సి పల్ కార్మికులకు ఆరోగ్య శిబిరాల ఏర్పాటు చేస్తారు. స్వచ్ఛతపై అవగాహనను కల్పించేందుకు స్వఛ్ వాక్ ర్యాలీలు, స్వచ్ఛత, అవార్డులు, క్వీజ్ పెయింటింగ్, రంగోళి పోటీలు, కళా ప్రదర్శనలు, యానిమేషన్ ఫిల్మ్లు, షార్ట్ ఫిల్మ్లు ప్రదర్శిస్తారు. ఆస్తి పన్ను సవరణ, నల్లా కనెనెక్షన్ల ఆన్లైన్ నమోదు, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మేళ, స్ట్రీట్ఫుడ్ ఫెస్టివల్, వీధి విక్రయదారులతో గ్రూపులు ఏర్పాటు చేయడం, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీలు కల్పిస్తారు. ప్రస్తుతం ఉన్న వెండింగ్ జోన్లను సమీక్షించడంతో పాటు, పట్టణ పేద మహిళల గుర్తింపు సర్వే, స్వయం సహాయక సంఘాలు ఏర్పాటుచేస్తారు. లోతట్టు ప్రాంతాలు, గుంతలు నింపడంతో శిథిలభవనాలు తొలగిస్తారు. జంక్షన్లు, పిల్లల పార్క్ల అభివృద్ధి, వనమహోత్సవం, ఇంకుడుగుంతల ఏర్పాటు, వీధి కుక్కల సంతాన నియంత్రణ, నీటిక్లోరినేషన్ పరీక్ష లాంటి కార్యక్రమాలు చేపడుతారు. వలంటీర్లు, సిబ్బందికి శిక్షణ వందరోజుల కార్యక్రమంపై నగరపాలకసంస్థ సిబ్బంది, వలంటీర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్పేయ్ తెలిపారు. కార్యక్రమ నిర్వహణకు నోడల్ అధికారులను కూడా నియమిస్తామన్నారు. స్వయం సహాయక సంఘాలు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వంద రోజుల ప్రణాళికపై సీడీఎంఏ దిశానిర్దేశం చేశామన్నారు. ‘ఒక చర్య ఒక మార్పు’ ‘ప్రజలే ముందు’ అనే నినాదాలతో ప్రజల భాగస్వామ్యంతో వందరోజుల ప్రణాళిక విజయవంతం చేస్తామన్నారు. వచ్చేనెల 2 నుంచి సెప్టెంబర్ 10 వరకు అమలు -
పీసీసీలో మనోళ్లకు చోటు
● పీఏసీ కమిటీలో దుద్దిళ్ల, పొన్నం, ఆది ● కేబినెట్లో చోటు కోసం ఉమ్మడి నేతల ఆరాటంసాక్షిప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన వివిధ పీసీసీ కమిటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రికి చోటు దక్కింది. పీసీసీ కమిటీల్లో కీలకమైన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులుగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్లను నియమించారు. కాగా.. ఇటీవల కొంతకాలంగా పార్టీ పెద్దల తీరుపై అసంతృప్తితో రగిలిపోతున్న మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డికి సలహా కమిటీలో అవకాశం కల్పించారు. అదేవిధంగా డీలిమిటేషన్ కమిటీలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలను సభ్యులుగా నియమించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా గెలవగా, అందులో నలుగురికి పీసీసీ కమిటీల్లో అవకాశం లభించింది. మంత్రి వర్గంలో ఆది.. మంత్రి వర్గ విస్తరణ త్వరలో జరగబోతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు మరో బెర్తు ఖాయంగా కనిపిస్తోంది. కొత్తగా ఎన్నికై న ఎమ్మెల్యేల్లో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉన్నారు. మున్నూరుకాపు సామాజికవర్గం కోణంలో బెర్తు ఖాయమయ్యే అవకాశాలున్నాయని సమాచారం. మాదిగ సామాజిక వర్గం తరఫున తమకూ చోటు కల్పించాలని మరో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలు కోరుతున్నారు. మరోవైపు తనకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని ఇటీవల రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరిన విషయం విధితమే. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇప్పటికే దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్లు కేబినెట్లో ఉన్నారు. వీరికి తోడుగా మరో ఒక్క బెర్తు మాత్రమే ఖరారయ్యే అవకాశాలు ఉండటంతో ఈ ఒక్క మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
● డీఈవో శ్రీరామ్ మొండయ్యకరీంనగర్: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నాణ్యమైన, గుణాత్మక విద్య లభిస్తుందని, పాఠశాలల బలోపేతానికి ఎస్జీటీయూ ఉపాధ్యాయ సంఘం ఆరు రోజుల పాటు బడిబాట ప్రచార రథాన్ని నిర్వహించడం అభినందనీయమని డీఈవో శ్రీరామ్ మొండయ్య అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల నమోదు కోసం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల ఉమ్మడి జిల్లా ప్రచార రథాన్ని డీఈవో శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. జూన్ 5 వరకు ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలన్నారు. ఎస్జీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్రెడ్డి మాట్లాడుతూ, న్యాయపరంగా రావాల్సిన హక్కుల కోసం ఉద్యమిస్తామని, ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సెక్టోరియల్ ఆఫీసర్ అశోక్రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచాలని, విద్యార్థులు తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో విజయేందర్రెడ్డి, మంజుల హరిప్రియ, రమణారెడ్డి, సత్యం, కిషన్, సుధాకర్రావు, గాయత్రి, రోహిణిదేవి, సాగర్, మాధవ్, రామన్, వెంకటేశ్, అరవింద్, రాములు తదితరులు పాల్గొన్నారు. -
పొగాకుతో గుండెకు ముప్పు
పాన్, గుట్కా, తంబాకు, సిగరెట్లలో నికోటిన్ వంటి రసాయనాలు ఉంటాయి. ఇవి రక్తనాళాలను సంకుచితం చేస్తాయి. దీంతో రక్తప్రసరణ తగ్గి గుండైపె ఒత్తిడి పెరుగుతుంది. దీర్ఘకాలంగా వీటిని వినియోగించే వారిలో గుండెపోటు, పక్షవాతం, హైపర్టెన్షన్ వంటి తీవ్రమైన కార్డియోవాస్కులర్ సమస్యలు వస్తాయి. పొగాకు వల్ల శరీరంలో శ్రీకోలెస్ట్రాల్శ్రీ స్థాయి పెరిగి, నాళాల్లో శ్రీబ్లాక్శ్రీ ఏర్పడుతుంది. ఇది గుండెకు రక్తసరఫరాను తగ్గించి ప్రాణాపాయ పరిస్థితికి దారి తీస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, మితాహారం, వ్యాయామం పాటించడం ఎంతో అవసరం. – డాక్టర్ అనీశ్పబ్బ, కార్డియాలజిస్టు -
కస్తూర్బాలకు ‘ఇంటర్’ వెలుగులు
కరీంనగర్: కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో పేద, అనాథ బాలికలు చదువుతారు. ఇక్కడ పదో తరగతి వరకు చదివిన బాలికలు కొన్నిచోట్ల ఇంటర్మీడియెట్ లేకపోవడంతో విద్యకు దూరమవుతున్నారు. దీనిని గుర్తించిన విద్యాశాఖ 2025–26 సంవత్సరానికి జిల్లాలో మరో రెండుచోట్ల ఇంటర్కు అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించారు. కస్తూర్బాల్లో పదో తరగతి ఉత్తీర్ణులైన బాలికలు ఇంటర్మీడియెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వసతి.. నాణ్యమైన విద్య కస్తూర్బా పాఠశాలల్లో ప్రత్యేకాధికారులు, బోధకులు తాత్కాలిక పద్ధతిన పనిచేస్తారు. ఈ విద్యాలయాల్లో వసతితో పాటు నాణ్యమైన విద్య అందిస్తున్నారు. ఇక్కడి విద్యార్థినులు 2024–25 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియెట్లో ఎనిమిది కేజీబీవీల్లో వందశాతం ఫలితాలు సాధించారు. ఇప్పటికే కస్తూర్బాల్లో ఇంటర్ అమలవుతుండగా మరో రెండుచోట్ల అవకాశం కల్పించారు. జిల్లాలోని 14 కేజీబీవీల్లో ఈ విద్యా సంవత్సరం చిగురుమామిడి, తిమ్మాపూర్ కేజీబీవీల్లో రెండు కొత్త కోర్సులైన అకౌంట్స్, ట్యాక్సేషన్ను ప్రవేశపెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ విద్యా సంవత్సరానికి ప్రవేశాలు జరుగనున్నాయి. జూన్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఒక్కో పాఠశాలకు 80 సీట్లు కేటాయిస్తారు. అనాథ, పేద బాలికలు వీటిలో చదువుకునే అవకాశం కల్పిస్తారు. కొత్త కోర్సులకు అవకాశం కస్తూర్బాల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంపీహెచ్ డబ్ల్యూ కోర్సులు మాత్రమే అమలుచేసేవారు. వచ్చే ఏడాదినుంచి మరిన్ని కోర్సులు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎంఎల్టీ, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులను కూడా కేజీబీవీల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. రానున్న విద్యా సంవత్సరం నుంచి కొత్త కోర్సులతో పాటు పాత కోర్సులకు అడ్మిషన్లు జరుగనున్నట్లు అధికారులు వెల్లడించారు. బాలికలు చదువుతో పాటు ఇతర రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తారు. పాఠశాల చదువుకు భిన్నంగా.. కస్తూర్బాల్లో పాఠశాలలకు భిన్నంగా చదువు కొనసాగనుంది. ఇక్కడ చదివేవారికి వసతి సహా మూడు పూటలా పోషకాహారంతో కూడిన భోజనం అందిస్తారు. బాలికలకు ప్రత్యేకంగా ఉచిత దుస్తులు, కాస్మోటిక్ కిట్లు, దుప్పట్లు అందజేస్తారు. వేసవిలో కరాటే శిక్షణతో పాటు, ఆంగ్ల భాష నేర్చుకోవడం, బృంద చర్చలు, నృత్యాలు, చిత్రలేఖనం వంటి వాటిపై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. బాలికలు సమాజంలో ఎలా ఉండాలి. జీవితంలో ఏదైనా సాధించవచ్చో, ఎలాంటి విపత్కర పరిస్థితులను అయినా ఎదుర్కొనేలా వారిని తీర్చిదిద్దుతారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఇప్పటికే ఎనిమిది కేజీబీవీల్లో కొనసాగుతున్న ఇంటర్మీడియెట్ కోర్సులు మరో రెండు కేజీబీవీలను అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులుత్వరలో అడ్మిషన్లు ఇప్పటికే జిల్లాలోని ఎనిమిది కస్తూర్బా పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్య అమలవుతోంది. తాజాగా మరో రెండు చిగురుమామిడి, తిమ్మాపూర్ కేజీబీవీలను పాఠశాలల్లో ఇంటర్ ప్రారంభించేందుకు అనుమతి వచ్చింది. రెండు కొత్త కోర్సులు అకౌంట్స్, ట్యాక్సేషన్లను ప్రవేశపెట్టింది. వీణవంక, సైదాపూర్, కొత్తపల్లి, గన్నేరువరం కేజీబీవీలు మినహా మిగతా వాటిల్లో ఇంటర్మీడియెట్కు అనుమతులు లభించాయి. జూన్లో తరగతులు ప్రారంభిస్తాం. త్వరలో అడ్మిషన్ల ప్రక్రియ చేపడతాం. –కృపారాణి, సెక్టోరియల్ అధికారి -
నీటి సంపులో పడి చిన్నారి మృతి
మానకొండూర్: మండలంలోని నిజాయతీగూడెం గ్రామానికి చెందిన తుమ్మనపల్లి శ్రీహర్షిక(3) గురువారం ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. తుమ్మనపల్లి ప్రసాద్ కుమార్తె శ్రీహర్షిక ఇంటినుంచి ఆడుకుంటూ వెళ్లి కచ్చకాయల రామయ్య ఇంటి సమీపంలోని నీటి సంపులో ప్రమాదవశాత్తు పడిపోయింది. శబ్దం వినబడటంతో రామయ్య ఇంటి నుంచి బయటకు వచ్చి బాలికను చూసి కేకలు వేశాడు. కొందరు సంపులోకి బాలికను బయటకు తీయగా అప్పటికే మృతి చెందింది. తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ సంజీవ్ వివరించారు. ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య వీణవంక: మండల కేంద్రానికి చెందిన టేకు రాంచందర్(40) గురువారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల తెలిపిన వివరాలు.. రాంచందర్ కొంత కాలంగా నరాల సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఆసుపత్రుల చుట్టూ తిరిగినా వ్యాధి నయం కాకపోవడంతో మానసిక ఒత్తిడికిలోనై జీవితంపై విరక్తితో ఇంట్లోని ప్యాన్కు ఉరేసుకొని మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ట్రైనీ ఎస్సై సాయికృష్ణ తెలిపారు. -
క్షణికావేశంలో తండ్రిని హత్య చేసిన కొడుకు
మేడిపల్లి: క్షణికావేశంలో కన్న కొడుకే తండ్రిని దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన మేడిపల్లి మండలకేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. కోరుట్ల సీఐ సురేశ్బాబు, మేడిపల్లి ఎస్సై సుప్రియ కథనం ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన అంగడి నర్సయ్య అలియస్ గంగారెడ్డి (56) తాగివచ్చి కొడుకు వెంకటేశ్తో ఘర్షణ పడ్డాడు. దీంతో క్షణికావేశంలో వెంకటేశ్ దగ్గరలో ఉన్న ఇనుప వస్తువుతో తండ్రి తలపై బలంగా కొట్టాడు. ఈ ఘటనలో గంగారెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం వెంకటేశ్ మేడిపల్లి పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. నర్సయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు సంతానం. కొడుకు వెంకటేశ్ ఇటీవలే గల్ఫ్ వెళ్లి తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాడు. వెంకటేశ్కు ఇంకా పెళ్లి కాలేదు. ఘటన స్థలానికి చేరుకున్న సీఐ, ఎస్త్సె వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఎల్ఎల్బీ 4వ సెమిస్టర్ విద్యార్థులకు ప్రత్యేక బ్యాక్లాగ్ అవకాశం కరీంనగర్క్రైం: శాతవాహన యూనివర్సిటీ పరి ధిలో ఎల్ఎల్బీ నాల్గో సెమిస్టర్ విద్యార్థులకు బ్యాక్లాగ్ పరీక్ష ప్రత్యేక రుసుముతో అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ డి.సురేశ్కుమార్ తెలిపారు. జూన్ 3వ తేదిలోగా తమ కళాశాలల్లో ప్రతీ పేపర్కు రూ.1500 లు చెల్లించాలని పేర్కొన్నారు. కేంద్ర బృందం సందర్శన కరీంనగర్: కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆ ధ్వర్యంలోని మిషన్ శక్తి కేంద్ర బృందం గురువారం జిల్లాలో పర్యటించింది. పథకంలో భా గంగా జిల్లాలో ఏర్పాటు చేసిన మహిళా సాధి కారత కేంద్రం, సఖి వన్ స్టాప్ సెంటర్, శక్తి స దన్, సఖి నివాస్ విభాగాలను బృందం సభ్యులు, ఎన్ఐసీ సంయుక్త సంచాలకులు ఇహ జై న్, యంగ్ ప్రొఫెషనల్ రాహుల్ రానా, అంతరిక్ష భరద్వాజ్, మిషన్ శక్తి రాష్ట్ర విభాగం ఇన్చా ర్జి బ్లెస్సీ పరిశీలించారు. జిల్లాలో అమలవుతున్న పలు కార్యక్రమాల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో బృందం సభ్యులు సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మిషన్ శక్తి అమలు తీరు ఆదర్శనీయమని అధికారులు, సిబ్బందిని అభినందించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను రానున్న రోజుల్లో మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలు తమ దృష్టికి తీసుకురావచ్చని, సలహాలు, సూచనలు ఇవ్వవచ్చని పేర్కొన్నారు. మిషన్ శక్తి కార్యక్రమాలకు సంబంధించిన డాష్ బోర్డు, ప్రగతిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ధనలక్ష్మి, మహిళా సాధికారిక కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ శ్రీలత, సఖి అడ్మిన్ లక్ష్మి, శక్తి సదన్ సూపరింటెండెంట్ రమాదేవి, డీసీపీవో పర్వీన్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సంపత్, పద్మపాని ఎన్జీవో నిర్వాహకులు సత్యనారాయణరెడ్డి, ప్రకృతి ఎన్జీవో నిర్వాహకులు జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
శాతవాహనలో న్యాయ విద్య
కరీంనగర్క్రైం: లా చదవాలనే విద్యార్థులు కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ న్యాయ కళాశాల లేకపోవడంతో చాలా ఇబ్బందులుపడ్డారు. కాగా, ఇటీవల శాతవాహన యూనివర్సిటీకి న్యాయ కళాశాల మంజూరు కావడంతో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. బీసీఐ నుంచి గ్రీన్లిగ్నల్ దేశవ్యాప్తంగా ఎక్కడ లా కళాశాల ఏర్పాటు చేయాలన్నా స్థానిక ప్రభుత్వ అనుమతితో పాటు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) అనుమతి కీలకం. ఈనేపథ్యంలో శాతవాహన యూనివర్సిటీలో ఏర్పాటు చేయాలని 11 నవంబర్ 2024న వైస్ చాన్స్లర్ నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. ఈక్రమంలో శాతవాహనలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం తరగతులు నిర్వహించేందుకు ఫిబ్రవరి 2025లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతులు జారీ చేసింది. దీంతో ఎల్ఎల్బీ తరగతులకు సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. న్యాయకళాశాల భవన నిర్మాణం, ఇతరత్రా అవసరాలకు సుమారు రూ.22 కోట్లు మంజూరయ్యాయి. భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలికంగా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలోని మొదటి అంతస్తులో తరగతులు నిర్వహించేందుకు సిద్ధం చేస్తున్నారు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల టీచింగ్, నాన్టీచింగ్ కోసం 35 పోస్టులు అవసరం ఉండడంతో వీటి కేటాయింపునకు కేబినెట్లో ఆమోదం తెలుపాల్సి ఉంటుంది. కేబినెట్ సమావేశం కాగానే పోస్టుల భర్తీ జరుగుతుందని యూనివర్సిటీ వర్గాలు భావిస్తున్నాయి. పట్టా చేతిలో ఉంటే పుట్టెడు మార్గాలు ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పట్టా చేతిలో ఉంటే ఉపాధికి పుట్టెడు మార్గాలుంటాయి. సొంతంగా ఎవరి మీద ఆధారపడకుండా లా ప్రాక్టిస్ చేసుకోవడంతో పాటు వివిధ కంపెనీలకు లీగల్ అడ్వైజర్లుగా ఉండడం, జిల్లా జడ్జిలు, జూనియర్ సివిల్ జడ్జిలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు, ఇవే కాకుండా ఇతర శాఖల్లో కూడా లా చదివిన వారిని వివిధ కమిషన్ మెంబర్లు, కమిటీ మెంబర్లుగా నియమితులయ్యే అవకాశాలున్నాయి. ఎల్ఎల్ఎం చేసిన వారు ఎల్ఎల్బీ తరగతులు చెప్పడంతోపాటు ఇతర అవకాశాలు ఉండడంతో చాలా మంది న్యాయవిద్యపై ఆసక్తి చూపిస్తున్నారు. శాతవాహన యూనివర్సిటీ వ్యాప్తంగా లా కాలేజీలు రెండు మాత్రమే అవి కూడా ప్రైవేట్ కళాశాలలు మాత్రమే నడిపిస్తున్నాయి. ఇప్పుడు ఎస్యూలో ప్రభుత్వ కళాశాల ఏర్పాటు కావడంతో ఇక్కడి ప్రాంత విద్యార్థులకు బంగారు భవిష్యత్ ఉంటుందని విద్యార్థి సంఘాల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. ఎల్ఎల్బీలో 120, ఎల్ఎల్ఎం 20 సీట్లు రూ.22కోట్లతో భవన నిర్మాణ, మౌలిక సదుపాయాలు త్వరలో 35 మంది టీచింగ్, నాన్టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ ఈ అకడమిక్ నుంచే తరగతులు ప్రారంభం కోర్సు సెక్షన్లు సీట్లు ఎల్ఎల్బీ 2 120 ఎల్ఎల్ఎం 1 20 ఈ సంవత్సరం నుంచే తరగతులు శాతవాహన యూనివర్సిటీకి న్యాయ కళాశాల మంజూరైంది. ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతానికి ఆర్ట్స్ కళాశాలలో తాత్కాలికంగా తరగతులు ప్రారంభిస్తున్నాం. భవనాలు నిర్మించిన తర్వాత శాశ్వతంగా ప్రత్యేక వసతి సౌకర్యాలు ఉంటాయి. – ప్రొఫెసర్ ఉమేశ్కుమార్, శాతవాహన వీసీ -
కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ల రద్దు
గంగాధర(చొప్పదండి): కొత్తపల్లిలోని సీలింగ్ భూముల్లో అక్రమంగా జరిగిన రిజిస్ట్రేషన్ల రద్దు ప్రక్రియ గంగాధర సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ సమక్షంలో కొనసాగుతోంది. 476 అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని అధికారుల విచారణలో తేలగా గురువారం సాయంత్రం వరకు దాదాపు 150 రిజిస్ట్రేషన్లు రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కొత్తపల్లిలోని సర్వే నంబర్ 175,197,198లో 20 ఎకరాల భూమి 30 ఏళ్లుగా సీలింగ్లో ఉంది. సదరు భూమిలో ఎలాంటి క్రయవిక్రయాలు జరపరాదని కోర్టు ఆర్డర్ ఉండగా, అందులో అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని లోక్సత్తా ఆధ్వర్యంలో పోరాటం మొదలైంది. సీలింగ్ భూముల్లో లావాదేవీలు జరపవద్దని నిషేధిత జాబితాలో చేర్చాలని 1997, 1998, 2006, 2011, 2016లో కలెక్టర్ కార్యాలయం నుంచి కరీంనగర్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి నోటీసులు పంపినా.. 2016 వరకు 424 రిజిస్ట్రేషన్లు చేశారని, గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 52 రిజిస్ట్రేషన్లు జరిగాయని లోక్సత్తా ఆరోపించింది. అయినా ఎవరూ పట్టించుకోక పోవడంతో లోకాయుక్తను ఆశ్రయించారు. లోకాయుక్త ఆదేశాల మేరకు అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా రిజిస్ట్రార్కు పదిరోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు. అక్కడి నుంచి గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఆదేశాలు జారీ కావడంతో రెవెన్యూ అధికారుల సమక్షంలో రద్దు ప్రక్రియ కొనసాగుతోంది.పవర్ కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ నిర్వహణ పనులు చేపడుతున్నందున శుక్రవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కేవీ రాంనగర్ ఫీడర్ పరిధిలోని పద్మనగర్, పారమిత హెరిటేజ్ స్కూల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. -
అల్లిబిల్లి సోకులాడి సిట్టమ్మి
● ఇటు చదువు.. అటు పాటలు ● జానపదగేయాలతో రాణిస్తున్న కట్కూరి స్నేహ ● 40కి పైగా పాటలు రాసిపాడిన యువతి ‘దూసుకోను దువ్వెన తెమ్మంటది.. చూసుకోను అద్దం తెమ్మంటది.. కాటుక తెమ్మంటది.. కాళ్లకు పెట్టుమంటది.. అల్లిబిల్లి సోకులాడి సిట్టమ్మి..’ ‘బావో నా బంతి పూల దండ.. నిన్న చూస్తుంటే నా గుండెల గుదిబండ..’ అంటూ స్నేహ పాడితే యువత గుండెలు జారిపోతున్నాయి. ప్రస్తుతం సోషల్మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ జానపద పాటను రాసి, పాడింది రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన కట్కూరి స్నేహ. చదువుకుంటూనే పాటలు రాస్తున్న యువజానపద గాయని గురించి తెలుసుకుందాం.. ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని వంతడుపుల గ్రామానికి చెందిన కట్కూరి స్నేహ కరీంనగర్లో ఎంఫార్మసీ చదువుతోంది. ఇప్పటి వరకు 40కి పైగా జానపద గేయాలు రాసి, పాడింది. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న పాటల్లో చాలా మటుకు స్నేహ రాసి, పాడినవే. హైస్కూల్లో చదువుతున్న రోజుల్లో బాలల దినోత్సవం సందర్భంగా మండల స్థాయిలో నిర్వహించిన పాటల పోటీల్లో ప్రథమస్థానంలో నిలిచింది. ఈ పోటీలు ఆమెను పాటలు పాడడం వైపు మళ్లించాయి. బీ ఫార్మసీ చదువుతుండగా తనకు పాటలు రాయాలనే ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 40కి పైగా పాటలు, రాసి పాడింది. శేఖర్ మాస్టర్ కావాలంటే ఇటీవల రాసి, పాడిన ‘అల్లిబిల్లి సోకులాడి సిట్టమ్మి..’ పాట మంచి పేరు తెచ్చిందని పేర్కొంది. చదువుకుంటూనే పాటలు రాస్తానని స్నేహ చెప్పింది. సినిమా పాటలు పాడాలనేది తన జీవిత ఆశయమని పేర్కొంది. -
నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు
జగిత్యాలక్రైం: జిల్లాలో నేరాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో గురువారం నేర సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ కేసుల పురోగతి, తాజా నేరాల విశ్లేషణ, నేరాల నివారణకు చర్యలు తీసుకోవాలని, సీసీ కెమెరాల ప్రాముఖ్యత, రాత్రివేళల్లో గస్తీ బలోపేతం, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, డ్రగ్స్, అసాంఘిక కార్యకలాపాలపై సమీక్షించారు. బక్రీద్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. గోవధ, గోవుల అక్రమ రవాణాపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. గోదావరి పరీవాహక రైతులకు నకిలీ పత్తి విత్తనాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రత్యేక టాస్క్ఫోర్స్ టీంను ఏర్పాటు చేసి అమ్మకాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేశామన్నారు. అనంతరం హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు, విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంస పత్రాలు అందించారు. అదనపు ఎస్పీ భీంరావు, డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, రాములు, రంగారెడ్డి, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు ప్రత్యేక నిఘా బక్రీద్కు ఏర్పాట్లు పూర్తి చేయాలి నేర సమీక్షలో ఎస్పీ అశోక్కుమార్ -
లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు
కరీంనగర్టౌన్: జిల్లాలోని స్కానింగ్ సెంటర్లు లింగ నిర్ధారణ చేస్తే పూర్వ, గర్భస్థ పిండలింగ నిర్ధారణ నిషేధ చట్టం –1994 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి వెంకటరమణ హెచ్చరించారు. డీఎంహెచ్వో చాంబర్లో గురువారం నిర్వహించిన జిల్లా సలహా కమిటీ సమావేశంలో లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలుపై సమీక్షించారు.ఐదు స్కానింగ్ సెంటర్లకు నోటీసులు..లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని అతిక్రమించిన ఐదు స్కానింగ్ సెంటర్లకు ఈనెలలో నోటీసులు జారీచేసినట్లు డీఎంహెచ్వో తెలిపారు. అంతేకాదు.. జిల్లావ్యాప్తంగా స్కానింగ్ సెంటర్లు, మెటర్నిటీ హోంలు, ఫెర్టిలిటీ కేంద్రాల్లో తనిఖీలు చేస్తున్నామని అన్నారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. జిల్లాలోని 16 మండలాల్లో తనిఖీలు చేపడతామని, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, నిర్వాహకుల క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు, లింగనిర్ధారణ చట్టం అమలవుతున్న తీరు, స్కానింగ్ మిషనరీల అనుమతులు పరిశీలిస్తున్నామని వివరించారు.ఎస్యూలో మొదటి దశలో 5,931 డిగ్రీ సీట్ల భర్తీకరీంనగర్క్రైం: శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని దోస్త్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో 5,931 డిగ్రీ కోర్సుల సీట్ల భర్తీ జరిగింది. ఎస్యూ పరిధిలో మొత్తం 36,540 సీట్ల ఉండగా మొదటి దశలో 5,931 సీట్లు భర్తీ కాగా 30,609 సీట్లు ఖాళీగా మిగిలాయి. 13 ప్రభుత్వ కళాశాలల్లో 297 సీట్లు భర్తీకాగా, 3 ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలల్లో 2,047 సీట్లు భర్తీ అయ్యాయి. ఇదిలా ఉండగా 60 ప్రైవేట్ కళాశాలల్లో కలిపి 3,587 మంది విద్యార్థులకు సీట్ల కేటాయింపు జరిగింది. మొదటిదశలో సీట్లు పొందిన వారు జూన్ 6వ తేదీలోపు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీట్లు రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది.జిల్లా సమాచారంమొత్తం స్కానింగ్ సెంటర్లు 195మూసివేసినవి 53నిర్వహిస్తున్నవి 142ఈనెలలో నోటీసులు ఇచ్చినవి 05 -
ట్రిపుల్ ఐటీ దరఖాస్తులకు వేళాయె..
● ఈనెల 31 నుంచి ఆన్లైన్లో స్వీకరణ కరీంనగర్: రాజీవ్గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ)పరిధిలోని బాసర ట్రిపుల్ ఐటీలో 2025–26 విద్యా సంవత్సరం (1,500 మంది) ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇటీవల పదో తరగతి ఫలితాల్లో రెగ్యులర్ విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ను అనుసరించి రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు సీట్లను భర్తీ చేస్తారు. ఫీజుల వివరాలు రాష్ట్ర పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఏడాదికి రూ.36 వేల ఫీజు చెల్లించాలి. ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్కు అ ర్హులైన వారు చెల్లించాల్సిన అవసరం లే దు. ప్రవేశ సమయంలో ఆరోగ్యబీమా, ఇతరాలకు సంబందించి రూ.3,500 ఇ తరులకు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 3,000 చెల్లించాలి. క్యాషన్ (దీనిని తిరి గి ఇస్తారు) డిపాజిట్ కింద ఏ కేటగిరి అభ్యర్థులైనా రూ.2,000 చెల్లించాలి. ఇ తర రాష్ట్రాలు, గల్ఫ్ దేశాల్లో పని చేసే వారి పిల్లలు ఏడాదికి రూ.1.36 లక్షలు, ఎన్ఆర్ఐ విద్యార్థులు రూ.3 లక్షలు ట్యూషన్ ఫీజు చెల్లించాలి. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ–సేవ, మీ–సేవ, టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుం రూ. 500, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు రూ.450, వేరే రాష్ట్రం వారు రూ.1,500 చెల్లించాలి. ప్రవేశాల షెడ్యూల్, అర్హతలు ఈనెల 31 నుంచి జూన్ 21 వరకు దరఖాస్తుల స్వీకరణ, వికలాంగులు, సైనికోద్యోగుల పిల్లలు, ఎన్సీసీ, స్పోర్ట్స్, గ్లోబల్ కేటగిరీకి చెందిన వారికి 25 వరకు అవకాశం. జూలై 4న ఎంపిక జాబితా విడుదల, 7న తొలి విడత కౌన్సెలింగ్. విద్యార్థులు ప్రథమ ప్రయత్నంలో 2025–ఎస్సెస్సీ తత్సమాన పరీక్షలో రెగ్యులర్గా ఉత్తీర్ణులై ఉండాలి. 31–12–2024 నాటికి 18 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 21 ఏళ్లు నిండకూడదు. పదో తరగతిలో మార్కుల ఆధారంగా మెరిట్ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తారు. నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారి జీపీఏకు 0.4 డిప్రెవేషన్ స్కోర్ను అదనంగా కలుపుతారు. బాసర ట్రిపుల్ఐటీలో 85శాతం సీట్లను స్థానికంగా, మిగిలిన 15 శాతం సీట్లను మెరిట్ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు కేటాయించారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6, బీసీ–ఏ 7, బీసీ–బీ 10, బీసీ–సీ 1, బీసీ–డీ 7, బీసీ–ఇలకు 4 శాతం రిజర్వేషన్ ఉంటుంది. ప్రత్యేక సీట్ల కింద వికలాంగులకు 3 శాతం, సైనికోద్యోగుల పిల్లలకు 2, ఎన్సీసీ విద్యార్థులకు 1 , స్పోర్ట్స్ కోటా కింద 0.5 శాతం సీట్లను భర్తీ చేస్తారు. 33.33 శాతం సీట్లను సమాంతరంగా బాలికలకు కేటాయిస్తారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులే కాకుండా వేరే రాష్ట్రాల వారికి, అంతర్జాతీయ విద్యార్థులకు, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న వారి పిల్లలకు అదనపు సీట్లు కేటాయిస్తారు. విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యాలతో పాటు, రెండు జతల యూనిఫాం, షూలు, ల్యాప్టాప్లు, ఇతర సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తారు. -
రైతు వద్దకు శాస్త్రవేత్తలు
సైదాపూర్: వ్యవసాయ క్షేత్రాలకు వ్యవసాయ శాస్త్రవేత్తలు వెళ్లి రైతులకు వారి అనుభవాలతోపాటు నూతన విధానాలను వివరిస్తూ సాగులో మెలకువలు నేర్పుతారని తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి అన్నారు. రైతు బిడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశం మేరకు ఈనెల 5 నుంచి గ్రామాల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతుల వద్దకెళ్లి నూతన వ్యవసాయ పద్ధతులను వివరిస్తున్నారన్నారు. ప్రపంచానికి ఆహారాన్ని అందిస్తున్న భారత్లో మరింత వ్యవసాయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ పథకాన్ని కరీంనగర్ జిల్లా సైదాపూర్లో గురువారం కోదండరెడ్డి ప్రారంభించారు. జమ్మికుంట కేవీకే శాస్త్రవేత్త వెంకటేశ్వర్రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని 700 జిల్లాల్లో 2వేలకు పైగా శాస్త్రవేత్తల బృందాలు సుమారు 1.5కోట్ల రైతుల వద్దకు వెళ్లనున్నారన్నారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో ఈనెల 29 నుంచి జూన్ 12 వరకు శాస్త్రవేత్తలు పర్యటిస్తారని అన్నారు. ఇప్పటికే తెలంగాణలో ముఖ్యమంత్రి ఆదేశం మేరకు నెల రోజులుగా శాస్త్రవేత్తల బృందాలు పర్యటిస్తున్నాయన్నారు. విత్తన తయారీకి తెలంగాణలో కరీంనగర్ గుండెకాయ లాంటిదని అన్నారు. త్వరలోనే ప్రతీ గ్రామంలో వ్యవసాయంపై అనుభవమున్న రైతును ఆదర్శ రైతుగా ఎంపిక చేసి గ్రామానికో భూసార పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కొండా లక్ష్మణ్ వ్యవసాయ యూనివర్సిటీ ఉప కులపతి డాక్టర్ రాజిరెడ్డి, కోరమాండల్ ప్రతినిధి సుబ్బారెడ్డి, ఇఫ్కో ప్రతినిధి బాలాజీ, జైపాల్రెడ్డి, శాస్త్రవేత్తలు షేక్యన్ మీరా, డా.కేశవులు, సాయిరెడ్డి, సుందరం, చటర్జీ, సైదాపూర్ ఏఎంసీ చైర్మన్ సుధాకర్, ఎల్ఎస్సీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, ఏవో వైదేహీ, రైతులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సైదాపూర్లో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ పథకం ప్రారంభం -
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఇందిరమ్మ ఇళ్లను అర్హులకే కేటాయించాలని.. అనర్హులకు ఇస్తే అధికారులపై చర్యలు తప్పవని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, ధాన్యం కొనుగోలు వానాకాలం పంటలసాగు సన్నద్ధతపై కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో కలిసి రివ్యూ నిర్వహించారు. ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి. ఖరీఫ్ సీజన్లో ఎస్సారెస్పీ నీటి విడుదల ప్రణాళికలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలను భాగస్వామ్యం చేస్తాం.ఎస్సారెస్పీ సామర్థ్యం సిల్ట్ కారణంగా తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం పాలసీ ప్రకారం ఎస్సారెస్పీ రిజర్వాయర్ పూడికతీత, డీసిల్టేషన్ ఆధునిక పద్ధతుల్లో పూర్తిచేసి పూర్వపు సామర్థ్యం తీసుకొస్తాం. కడెం ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టుల్లో సిల్ట్ తొలగించేందుకు అత్యాధునిక పద్ధతులను వినియోగిస్తాం. కరీంనగర్ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తా.. ఇందుకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సహకారంతో ముందుకు వెళ్తా. సింగరేణి భూముల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. బండ్ల వాగు ఎత్తిపోతల పథకాన్ని వారం రోజులలో ప్రారంభిస్తాం. పాలకుర్తి ఎత్తిపోతల పథకం పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణ పనులకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది అని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.● రోళ్లవాగు ప్రాజెక్టు అటవీ అనుమతులు వచ్చేలా ఉన్నతాధికారులతో జగిత్యాల కలెక్టర్ నిరంతరం సంప్రదింపులు చేయాలని మంత్రి సూచించారు. నారాయణపురం రిజర్వాయర్, కొండగట్టు ఎత్తిపోతల పథకం, కలికోట సూరమ్మ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని తెలిపారు. తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలుచేస్తుందన్నారు. కలెక్టర్లు మరోవారం కొనుగోలు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అవసరమైనమేర ధాన్యం రవాణా కోసం వాహనాలు సిద్ధం చేసుకోవాలని.. లారీల కొరత ఉంటే ట్రాక్టర్లు వాడాలన్నారు. దేశంలో మొదటిసారిగా తెలంగాణలోని 84 శాతం జనాభాకు ఉచితంగా ఆరుకిలోల సన్నబియ్యం అందజేస్తున్నట్లు తెలిపారు. దేశ చరిత్రలోనే ఇది విప్లవాత్మక పథకమని.. దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకై క రాష్ట్రం మనదే అని తెలిపారు.ఇళ్ల స్థలాలపై ఆందోళన వద్దు..మీడియా మిత్రులకు ఎస్సారెస్పీ సమీపంలో అందుబాటులో ఉన్న భూములు పంపిణీకి ఉన్న సమస్యలు పరిష్కరించి త్వరలోనే ఇంటి పట్టాలు కేటాయిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. కరీంనగర్ మీడియా మిత్రులు ఇండ్ల పట్టాల పంపిణీ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్తో చర్చించి త్వరలో పట్టాలు అందించే కార్యక్రమం చేపడుతామని పేర్కొన్నారు.మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా జరిగిందన్నారు. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.51 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అకాల వర్షాలతో రైతుల నష్టపోకుండా అవసరమైన టార్ఫాలిన్ కవర్లు కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలని అధికారులను కోరారు. భూ భారతి చట్టంతో పట్టాదారులకు ఎటువంటి నష్టం రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గత పాలకుల హయాంలో రైస్ మిల్లులవద్ద తూకం పేరుతో రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఎక్కడా ఇబ్బంది లేదన్నారు. మలకపేట, సూరమ్మ, మోతె నారాయణపూర్, గౌరవెల్లి, దేవాదుల వంటి ప్రాజెక్టుల పనులు స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలోకి భూపాలపల్లి, హనుమకొండ, సిద్దిపేట జిల్లాలు వస్తాయని.. ఆయా జిల్లా కలెక్టర్లను సైతం సమీక్ష సమావేశాలకు ఆహ్వానించాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, చింతకుంట విజయ రమణా రావు, డాక్టర్ సంజయ్ కుమార్, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశ్, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు పమేలా సత్పతి, సందీప్ కుమార్ ఝా, సత్య ప్రసాద్, పెద్దపల్లి అదనపు కలెక్టర్ జె.అరుణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు. -
ఎన్నాళ్లు నకిలీ మకిలీ!
● టాస్క్ఫోర్స్ కమిటీల జాడేది? ● నకిలీ విత్తన దందాలో అక్రమార్కులు ● ఏటా రైతన్నకు శఠగోపం ● ప్రచారం లేదు.. తనిఖీల్లేవ్..నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలి. ఎంతటివారినైనా ఉపేక్షించొద్దు. టాస్క్ఫోర్స్ టీంలు సమన్వయంతో పనిచేసి కల్తీ విత్తనాలకు అడ్డుకట్ట వేయాలి. – ఇటీవల సీఎం రేవంత్రెడ్డిగతంలో కరీంనగర్లో వెలుగుచూసిన నకిలీ బాగోతమిది. పోలీసులు భారీ ఎత్తున కల్తీ విత్తనాలను పట్టుకున్నారు. క్వింటాళ్లలో దొరకగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సాక్షాత్తు జిల్లాకేంద్రంలోనే నకిలీ దందా సాగడం అప్పట్లో సంచలనం సృష్టించింది. వ్యవసాయ శాఖ డొల్లతనాన్ని చాటింది. -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
రాయికల్: మండలంలోని అల్లీపూర్కు చెందిన సిరిపురం శ్రీహరి (47) అప్పుల బాధతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సుధీర్రావు కథనం ప్రకారం.. శ్రీహరి బీడీ ప్యాకర్గా పనిచేస్తున్నాడు. కుటుంబపోషణకు కొంత అప్పు చేశాడు. ఇటీవలే కూతురు పెళ్లి చేశాడు. మొత్తం రూ.8లక్షల వరకు అప్పు ఉందని, దానిని ఎలా తీర్చలోనని నిత్యం మనస్తాపం చెందుతున్నాడు. జీవితంపై విరక్తిచెంది ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు. శ్రీహరి భార్య అంజలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పరారైన ఖైదీ కోసం లుక్ ఆఫ్ నోటీస్జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కోర్టు నుంచి మంగళవారం సాయంత్రం పరారైన జున్ను ప్రసాద్ కోసం పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ప్రసాద్ను పట్టుకునేందుకు పోలీసు శాఖ ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ ఆరు బృందాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుడు విదేశాలకు పారిపోకుండా బుధవారం ఉదయమే దేశంలోని అన్ని ఎయిర్పోర్టులకు లుక్ ఆఫ్ నోటీసు జారీ చేశారు. సిరిసిల్లలో కోవిడ్ పాజిటివ్ కేసులు?● ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్ధారించని వైద్యులు సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జ్వరంతో బాధపడుతున్న ఓ దంపతులు బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వెళ్లారు. కోవిడ్ పరీక్షలు చేయడం లేదని ల్యాబ్ నిర్వాహకులు వెనక్కి పంపించినట్లు సమాచారం. సదరు దంపతులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. నోరు రుచి, ముక్కు వాసన పోవడంతో మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆ దంపతులు కోవిడ్గా అనుమానించి ప్రభుత్వ ఆస్పత్రికి రాగా.. పరీక్షలు చేయకపోవడం గమనార్హం. -
రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు
సిరిసిల్ల: జిల్లాలో యాసంగి(రబీ) సీజన్లో రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేసినట్లు కలెక్టర్ సందీప్కుమార్ ఝా బుధవారం తెలిపారు. 242 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పటివరకు 37,223 మంది రైతుల వద్ద రూ.578 కోట్ల విలువైన 2,49,372మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. వీటిలో 2,16,258 మెట్రిక్ టన్నుల ధాన్యం వివరాలు ఆన్లైన్ చేశామని, 34,479 మంది రైతుల బ్యాంకు ఖాతాలో రూ.447 కోట్లు జమ అయ్యాయని వివరించారు. మిగతా రైతులకు త్వరలో డబ్బులు జమ అవుతాయని ప్రకటించారు. జిల్లాలో ధాన్యం సేకరణ తుది దశకు వచ్చిందని, ఇప్పటికే 133 కొనుగోలు కేంద్రాలను మూసివేశామన్నారు. ఇంకా 109 కేంద్రాల్లో కొద్దిగా ధాన్యం ఉందన్నారు. జిల్లాలో చివరి గింజ వరకు దాన్యం సేకరిస్తామని తెలిపారు. తడిసిన ధాన్యం సైతం సేకరిస్తామని రైతులెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. మూడేళ్లలో ధాన్యం సేకరణ తీరిదీ జిల్లాలో రబీ(యాసంగి) సీజన్లో మూడేళ్ల ధాన్యం సేకరణ తీరును కలెక్టర్ గణాంకాలతో వెల్లడించారు. 2022–2023లో మే 28వ తేదీ నాటికి 1,64,044 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, అదే 2023–2024 రబీ సీజన్లో ఇదే రోజు నాటికి 2,49,514 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది మే 28వ తేదీ నాటికి 2,49,372 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని అన్నారు. జిల్లాలో కొనుగోళ్లు పూర్తి అయ్యేనాటికి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు నమోదు అవుతాయని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇప్పటికే 2,49,372 మెట్రిక్ టన్నుల సేకరణ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
గొర్ల కొట్టంగా అంగన్వాడీ కేంద్రం
చిగురుమామిడి: ప్రభుత్వ సొమ్ము పరుల పాలవుతోంది. చిన్నారులు చదువుకోవాల్సిన భవనాల్లో జీవాలు సేదతీరుతున్నాయి. నిధులు లేక భవనాల నిర్మాణాలు మధ్యలో నిలిచిపోగా.. పశువుల పాకలుగా.. గొర్ల కొట్టాలుగా మారుతున్నాయి. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలోని అంగన్వాడీ నూతనభవనం గొర్రెల కొట్టంగా మారింది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాల భవనం ఆవరణలో కొన్నేళ్లుగా అంగన్వాడీ కేంద్రం నడుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అంగన్వాడీ కేంద్రానికి నూతన భవనం మంజూరైంది. నిధుల కొరతతో పనులు మధ్యలో నిలిచిపోయాయి. ఖాళీగా ఉన్న భవనంలో గ్రామానికి చెందిన కొందరు గొర్రెల మందలు ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలు చదువుకునేందుకు ఉపయోగపడే భవనాన్ని గొర్ల కొట్టంగా మార్చారు. కొన్ని నెలలుగా ఇదే తంతు సాగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని గ్రామస్తుల తెలిపారు. ఈ విషయమై ఐసీడీఎస్ అధికారులు స్పందించాలని కోరుతున్నారు. -
కోర్టు ఆవరణలో ఆటో దొంగిలించిన వ్యక్తి అరెస్ట్
జగిత్యాలక్రైం: జిల్లా కోర్టు ఆవరణలో పార్కింగ్ చేసిన ఆటోను దొంగిలించిన నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని గౌతమినగర్కు చెందిన జిలకర ప్రసాద్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ వేణుగోపాల్ తెలిపారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం బుట్టపూర్కు చెందిన మగ్గిడి కృష్ణ ఈనెల 26న జగిత్యాల కోర్టు ఆవరణలో ఆటోను పార్కింగ్ చేశాడు. దానిని ప్రసాద్ చాకచక్యంగా దొంగిలించాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఈనెల 27న పట్టణ ఎస్సై గీత జిల్లాకేంద్రంలోని గాంధీనగర్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ప్రసాద్ ఆటోలో వస్తూ అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడిన ఉంచి ఆటోను స్వాధీనం చేసుకుని నిందితుడిని బుధవారం రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఎస్సై గీత, కానిస్టేబుళ్లు జీవన్, అనిల్, వంశీ పాల్గొన్నారు. ఉద్యమకారులను ఆదుకోవాలి పెద్దపల్లిరూరల్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం పోరాడిన ఉద్యమకారులను గుర్తించి అన్నివిధాలా ఆదుకోవాలని ఉద్యమకారుల ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఐలయ్య కోరారు. స్థానిక అమరవీరుల స్తూపం వద్ద బుధవారం ఉద్యమకారులతో కలిసి నివాళి అర్పించారు. స్వరాష్ట్రం సాధించిన తర్వాత తమకు ప్రాధాన్యత దక్కుతుందని ఆశపడితే అప్పటి సీఎం ఉద్యమకారులను విస్మరించారని విమర్శించారు. కేవలం తమ కుటుంబానికే ప్రాధాన్యత ఇచ్చుకున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా తమకు మేలు కలిగేలా చూడాలని కోరారు. ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు సారయ్య, నల్ల మనోహర్రెడ్డి, రాజేశం, జ్యోతి, చంద్రకళ, సురేందర్రెడ్డి, భాస్కర్, సదాశివ, రాజిరెడ్డి, రాజు, కృష్ణ, సదయ్య తదితరులు ఉన్నారు. ఫాజుల్నగర్ ప్రాంతంలో పులి ఆనవాళ్లువేములవాడరూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని ఫాజుల్నగర్ ప్రాంతంలో పులి తిరుగుతున్నట్లు ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈవిషయంపై వేములవాడ ఎఫ్ఆర్వో కలీలొద్దీన్ను వివరణ కోరగా వేములవాడ, కొడిమ్యాల, చందుర్తి ఫారెస్ట్ ప్రాంతంలో పులి తిరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోజుకు పులి 35 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని, అది ఫారెస్టు ప్రాంతంలో అనుకూలమైన ప్రాంతానికి వెళ్తుందని తెలిపారు. -
ఇంటి అనుమతి కోసం నిలదీత
కరీంనగర్ కార్పొరేషన్: ‘మమ్మల్ని ఎన్ని రోజులు తిప్పుకుంటవ్. కావాలనే ఇబ్బంది పెడుతున్నవ్. మా ఇంటికి పర్మిషన్ ఎందుకు ఇస్తలెవ్. మాకు మాత్రమే వేరే రూల్స్ ఉంటయా’.. అంటూ ఓ మహిళ బల్దియా టీపీఎస్ సంధ్యపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంబేడ్కర్నగర్కు చెందిన సంబోజి గంగాభవాణి తన 60గజాల స్థలంలో ఇంటి నిర్మాణానికి గతంలో దరఖాస్తు చేసుకుంది. బుధవారం బల్దియా కార్యాలయానికి వచ్చి ఇంటికి అనుమతి ఇవ్వకుండా తిప్పుకుంటున్నారంటూ, టీపీఎస్తో వాగ్వాదానికి దిగింది. ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వరాదంటూ ఫిర్యాదు ఉండడంతోనే, తాను సంబంధిత ధ్రువపత్రాలు అడిగానని టీపీఎస్ సంధ్య బదులిచ్చారు. కమిషనర్ చాహత్బాజ్పేయ్ ఆదేశాలతో పత్రాలు పరిశీలించిన పట్టణ ప్రణాళికాధికారి వేణు, మరిన్ని లింక్ డాక్యుమెంట్లు కావాలని సూచించడంతో వివాదం సద్దుమణిగింది. -
లక్ష్మీపూర్లో మున్నాభాయ్ ఎంబీబీఎస్!
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ లాగా నకిలీ వైద్యుడి లీలలు బుధవారం వెలుగు చూశాయి. గ్రామంలో వంగరి గోవర్దన్ అనే వ్యక్తి ఒక ఇంటిని అద్ధెకు తీసుకుని మెడికల్ ప్రాక్టీషనర్ పేరుతో క్లినిక్ను ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా తన కొడుకు పేరుతో ఎంబీబీఎస్ లెటర్ హెడ్తో వైద్యం ప్రారంభించాడు. పేషంట్లకు ఇంజక్షన్లు, సైలెన్లు పెట్టడం, ఎంబీబీఎస్ లెటర్ హెడ్పై మందులు వ్రాయడం మొదలెట్టాడు. వస్తున్న కాసులు సరిపోవడం లేదని అనుకున్నాడో ఎమో తెలియదు కానీ ఏకంగా మహిళలకు సంతానం కలిగిస్తానంటూ కొత్త వైద్యం ప్రారంభించాడు. సాధారణంగా గైనకాలజీ డాక్టర్లు మహిళలకు సంతానోత్పత్తి కొరకు హెచ్సీజీ ఇంజక్షన్లను అన్ని వైద్య పరీక్షల అనంతరం అవసమైతేనే ఇస్తుంటారు. ప్రథమ చికిత్సలకు పరిమితం కావాల్సిన మెడికల్ ప్రాక్టీషనర్లు ఏకంగా అర్హతగల డాక్టర్ల మాదిరిగా చికిత్సలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. నకిలీ వైద్యుడి వైద్యంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజితను ‘సాక్షి’ వివరణ కోరగా వారం రోజుల క్రితమే అతడికి నోటీసులు ఇచ్చామని, ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొడుకు పేరుతో తండ్రి వైద్యం అద్దె ఇంటిలోనే పేషంట్లకు సైలెన్లు, ఇంజక్షన్లు ఇస్తున్న వైనం -
ఆపదలో ఉన్నాం.. ఆదుకోండి
రామగిరి(మంథని): భర్త అనారోగ్యం.. ఆర్థికలేమి.. ముగ్గురు పిల్లలు పోషణ.. కూలీ పనులతో కుటుంబాన్ని నెట్టుకు రావడం ఆ గృహిణికి తలకుమించిన భారంగా మారింది. దాతలు సాయం చేస్తే భర్తకు మంచి వైద్యచికిత్స అందిస్తామని, పిల్లల పోషణ చూసుకుంటానని అంటోంది ఆ గృహిణి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన దుబ్బాక కుమార్ – విజయ దంపతులు. వీరికి ముగ్గురు సంతానం కిరణ్, మహేందర్, చెర్రీ ఉన్నారు. అనారోగ్యానికి గురైన కుమార్.. పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందాడు. అయినా నయం కాలేదు. తనకున్న స్థోమత వరకు ఖర్చుచేశాడు. చేతిలో ఉన్న సొమ్మంతా ఖర్చు కావడంతో మళ్లీ ఆస్పత్రికి వెళ్లడానికి చిల్లిగవ్వకూడా లేకుండాపోయింది. కనీసం ప్రయాణానికి కూడా డబ్బులు లేని దీనస్థితిలో ఆ కుటుంబం ఉంది. విజయ కూలీ పనులకు వెళ్లి అంతోఇంతో సంపాదిస్తున్నా కుటుంబ పోషణకు కూడా సరిపోవడం లేదు. దాతలు ముందుకు వచ్చి తన భర్తను కాపాడాలని విజయ కోరుతోంది. రెండు కిడ్నీలు పనిచేయక యువకుడి నరకయాతన -
డీఈవో వ్యాఖ్యలు..ఆరని మంటలు!
● మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసిన కరీంనగర్వాసి ● చర్యలు తీసుకోవాలని మరిన్ని ఫిర్యాదులు ● క్రమంగా వెలుగులోకి జనార్దన్రావు వ్యవహారాలు ● ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఐదేళ్లుగా కరీంనగర్లో విధులు ● కలెక్టర్ కార్యాలయం తీరుపైనా విమర్శలు సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్రావు వ్యవహారం మరింత ముదిరింది. ‘భర్తలకు వంట రాకపోతే.. భార్యలు లేచిపోతారు.. తాను రెండు సంసారాలు ఈదుతున్నాను’ అంటూ తలతిక్క వ్యాఖ్యలతో శిక్షణ శిబిరాల్లో టీచర్లను బెంబేలెత్తించిన డీఈవో జనార్దన్రావుపై విమర్శలు, ఆరోపణలు ఆగడం లేదు. ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ.. కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం రాత్రి ఆదేశాలిచ్చినా.. టీచర్లు శాంతించడం లేదు. ఆయన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని కించపరిచేలా ఉన్నాయని మండిపడుతుండగా.. సామాజిక ఉద్యమకారుడు షాబుద్దీన్ మహిళా కమిషన్కు ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేశారు. డెమొక్రాటిక్ టీచర్ ఫెడరేషన్ (డీటీఎఫ్) నాయకులు జనార్దన్రావుపై హైదరాబాద్లో విద్యాశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) కూడా అతనిపై చర్యలకు డిమాండ్ చేసింది. బుధవారం కూడా సోషల్ మీడియాలో, మెయిన్స్ట్రీమ్ మీడియాలో విషయం ప్రాధాన్యం సంతరించుకోవడంపై చర్చ నడుస్తోంది. డీఈవో జనార్దన్ సిరిసిల్లకు కూడా డీఈవోగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో కామారెడ్డి డీఈవో ఎస్. రాజుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్ డైట్ ప్రిన్సిపాల్ మొండయ్య నూతన డీఈవోగా బుధవారం అదనపు బాధ్యతలు చేపట్టారు. దండిగా పెద్దల దన్ను.. జనార్దన్రావుకు ప్రభుత్వ పెద్దల నుంచి దండిగా సహకారాలు ఉన్నాయని సమాచారం. కరోనా నుంచి డీఈవోగా కొనసాగుతున్న ఈయనపై ఎన్ని విమర్శలు వచ్చినా చర్యలు తీసుకోవడంలో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ● జిల్లాలో టీచర్లకు అకారణంగా, అత్యధికంగా మె మోలు ఇచ్చిన డీఈవో అన్న ఆరోపణలు ఉన్నాయి. యూనియన్ నాయకులకు ఇంక్రిమెంట్లలో కోత విధించారన్న విమర్శలు తెలిసిందే. ● వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జిల్లాలో పనిచేసిన ప్రతీ ఉన్నతాధికారి ఎన్నికల నియమావళి ప్రకారం.. బదిలీపై వెళ్లారు. కానీ, ఈయనను కదపలేదు. ● హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, అనంతరం అసెంబ్లీ, పార్లమెంట్, ఇటీవల టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అయినా ఇతని బదిలీ జరగకపోవడం అతని పలుకుబడికి నిదర్శనం. ● ఇవన్నీ తెలిసీ.. కలెక్టర్ కార్యాలయం కూడా ఆయన బదిలీ విషయంలో అలసత్వం వహించి విమర్శలను మూటగట్టుకుంది. ● 317 జీవో సమయంలోనూ పలువురు టీచర్లు ప్రొడ్యూస్ చేసిన మెడికల్ సర్టిఫికెట్ల విషయంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ● హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయలో అప్పటి సీఎం సభను విజయవంతం చేయాలని ఆదేశాలివ్వడం, రూటు బాధ్యతలను టీచర్లకు అప్పగించడం తీవ్ర దుమారం రేపింది. ● ఇప్పుడూ తన స్వయంకృతాపరాధంతో వేటు పడిందే.. ఆయన్ను ఇక్కడ నుంచి ఎవరూ కదపలేకపోవడం గమనార్హం. -
హ్యాకర్ల చేతికి ఓదెల ఆధార్ కేంద్రం
పెద్దపల్లిరూరల్: ఆన్మోసాలు ఆగడంలేదు. సైబర్ నేరగాళ్లు, ఆన్లైన్ మోసగాళ్లు రోజుకో రూట్ మార్చుతూ ప్రజలకు ఎరవేస్తున్నారు. తాజాగా ఓదెల మండల కేంద్రంలోని మీసేవ ఆపరేటర్ తన ఆధార్ కేంద్రానికి సంబంధించి అప్డేట్ చేస్తామంటూ సైబర్ మోసగాళ్లు (సెల్ నంబరు 07427069687) నుంచి చేసిన ఫోన్కాల్కు స్పందించడంతో ఆధార్ సెంటర్ను హ్యాక్ చేశారు. కొద్ది నిమిషాల్లోనే ఆ ఐడీ ద్వారా నాలుగు ఆధార్కార్డులు డౌన్లోడ్ చేసినట్లు ఆపరేటర్కు సమాచారం రావడంతో అవాక్కయ్యాడు. ఆ వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాడు. స్పందించిన అధికారులు యూఐడీఏఐ అధికారులను అప్రమత్తం చేశారు. వారు ఆధార్సెంటర్ హ్యాకర్ల చేతికి చిక్కినట్లు నిర్ధారించారు. ఇలాంటి ఘటన ఇదివరకు నాగర్కర్నూల్ జిల్లాలోనూ జరిగినట్లు సమాచారం. జిల్లాలోని పలు ఆధార్కేంద్రాల నిర్వాహకులకు సైతం ఇలాంటి ఫోన్కాల్స్ వచ్చినట్లు ఆపరేటర్లు తెలిపారు. కొంతకాలంగా ఓదెల మీసేవ కేంద్రంలో గల ఆధార్ సెంటర్ ద్వారా సేవలు నిలిపి వేశారు. కొద్ది రోజుల క్రితమే అధికారులు అనుమతినివ్వడంతో సేవలు పునరుద్ధరించారు. ఈ క్రమంలో హ్యాకర్ల నుంచి ఫోన్కాల్ రావడంతో ఆధార్ కేంద్రం అనుమతులిచ్చే కార్యాలయ అధికారుల నుంచే ఫోన్కాల్ వచ్చిందని భావించి ఎనీడెస్క్ను హ్యాకర్లకు అప్పగించి మోసపోయినట్లు తెలిసింది. పీఈసీ కిట్లను అప్పగించొద్దు.. ఆధార్ కేంద్రాలను నిర్వహించే ఆపరేటర్లు అనధికారిక అపరిచిత వ్యక్తులు చేసే ఫోన్కాల్స్కు స్పందించొద్దని యూఐడీఏఐ అధికారులు బుధవారం రాష్ట్రంలోని ఆధార్ ఆపరేటర్లకు దిశానిర్దేశం చేశారు. ఆధార్కేంద్ర నిర్వాహకులు తమ సెంటర్లలో వినియోగించే కంప్యూటర్ నుంచి ఎనీడెస్క్, లేదా ఇతర రిమోట్యాక్సెస్ ఇచ్చి మోసపోతున్నారని, ఇది ఆధార్ డేటా భద్రతకు ముప్పు తెస్తుందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎనీడెస్క్, టీంవ్యూయర్ ఇతర రిమోట్ యాక్సెస్ సమాచారాన్ని అనధికార వ్యక్తులతో పంచుకోవద్దని సూచించారు. యూఐడీఏఐ భద్రతా విధానాలకు అనుగుణంగా అవసరం లేని రిమోట్ యాక్సెస్ టూల్స్ని అన్ఇన్స్టాల్ చేయాలన్నారు. అపరిచితుల ఫోన్కాల్స్కు స్పందించొద్దు యూఐడీఏఐ కార్యాలయ అధికారుల ఆదేశం -
సీపీఐని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లండి
కరీంనగర్: జిల్లాలో సీపీఐకి పూర్వవైభవాన్ని తెచ్చేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా మహాసభలు రెండోరోజు కొనసాగాయి. నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేశ్, భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు కిన్నెర మల్లవ్వ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మూడేళ్లలో జిల్లాలో నిర్వహించిన పార్టీ కార్యక్రమాల నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ సీపీఐకి జిల్లాలో ఘనమైన చరిత్ర ఉందన్నారు. తెలంగాణ దశాదిశా నిర్దేశించేలా క్రియాశీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఆర్ఎన్ఎన్ శక్తుల విజృంభన కొనసాగిస్తూ బీజేపీ ప్రమాదకరంగా మారిందన్నారు. రాష్ట్రంలో పెన్షన్, రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మఇళ్లు పథకాలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, మర్రి వెంకటస్వామి, పొనగంటి కేదారి, బోయిని అశోక్, కొయ్యడ సృజన్కుమార్, అందె స్వామి, బత్తుల బాబు, గూడెం లక్ష్మి పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి -
రైతుల కష్టం వరదపాలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లతిమ్మాపూర్, వెంకటాపూర్ గ్రామాల్లో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అధికారుల నిర్లక్ష్యం మూలంగా వరదపాలైంది. అకాల వర్షాలు దండికొట్టడంతో 45రోజులుగా తూకం వేయకుండా కేంద్రాల్లోనే ఉన్న ధాన్యం వర్షానికి తడిసి మొలకెత్తింది. దీంతో అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. ఐకేపీ అధికారులు, నిర్వహకుల నిర్లక్ష్యం వల్ల మాయిచ్చర్ వచ్చి 45 అయినప్పటికీ రైతులు కేంద్రాలకు తెచ్చిన వడ్లను తూకం వేయలేదు. కేంద్రాల్లో హమాలీలు లేక, నిర్వహకులు పట్టించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. తడిసి మొలకెత్తిన ధాన్యం -
పశువుల రవాణాపై అప్రమత్తంగా ఉండాలి
● సీపీ గౌస్ ఆలం చొప్పదండి: పశువుల అక్రమ రవాణా నివారణకు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సూచించారు. మండలంలోని ఆర్నకొండలో ఏర్పాటు చేసిన చెక్పోస్టును బుధవారం రాత్రి తనిఖీ చేశారు. పశువుల అక్రమ రవాణా నివారణకు ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. రాత్రి వేళల్లో ప్రతీ గూడ్స్ వాహనాన్ని తనిఖీ చేయాలని తెలిపారు. పశవుల అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలన్నారు. ఆయన వెంట రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్, సీఐ ప్రదీప్ కుమార్, ఎస్సైలు మామిడాల సురేందర్, మనీషా పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు కరీంనగర్స్పోర్ట్స్: మంచిర్యాల జిల్లాకేంద్రంలో జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించారు. యూత్ విభాగంలో ఎస్ఎల్ వరప్రసాద్, జూనియర్ విభాగంలో సుకుమార్ బంగారు పతకాలు, జి.సాకేత్ రజతం, సబ్ జూనియర్ విభాగంలో జి.హరిహర, జి.హరిణిశ్రీ కాంస్య పతకాలు సాధించినట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి కొత్తకొండ సంపత్ కుమార్ తెలిపారు. పతకాలు సాధించిన క్రీడాకారులను బుధవారం జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి వి.శ్రీనివాస్గౌడ్ అభినందించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ బాధ్యులు మోసం అంజయ్య, జి.సత్యనారాయణ పాల్గొన్నారు. మహిళలు పౌష్టికాహారం తీసుకోవాలి కరీంనగర్రూరల్: మహిళలు రుతుస్రావసమయంలో సరైన పౌష్టికాహారం తీసుకోవాలని డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ సూచించారు. కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్లోని ఇటుకబట్టీల్లో పనిచేస్తున్న మహిళాకార్మికులకు బుధవారం ఆరోగ్య పరీక్షలు చేశారు. అంతర్జాతీయ రుతుస్రావ పరిశుభ్రత దినోత్సవంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ రుతుస్రావ సమయంలో మహిళలు కనీసం రోజుకు నాలుగైదు గంటలకోసారి శానిటరీ ప్యాడ్లు మార్చుకోవాలని, బలమైన ఆహారం తీసుకోవాలన్నారు. మాత్రలను వేసుకోవడంతో హార్మోన్ల సమతుల్యత లోపిస్తుందని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని సూచించారు. అనంతరం శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేశారు. కార్మికుల పిల్లలకు వ్యాక్సినేషన్ చేశారు. యూనిసెఫ్, హోప్ ఫర్ లైఫ్ పౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఐవో డాక్టర్ సాజిదా, పీవో ఎంసీహెచ్వో సనా జువేరియా, చామనపల్లి పీహెచ్సీ డాక్టర్ ఫిరోజ్, యూనిసెఫ్ జిల్లా కోఆర్డినేటర్ కిషన్స్వామి పాల్గొన్నారు. బహుజన సామాజిక తెలంగాణే లక్ష్యం కరీంనగర్: బహుజన సామాజిక తెలంగాణే టీఆర్ఎస్(డీ) లక్ష్యమని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నరాల సత్యనారాయణ పేర్కొన్నా రు. నగరంలో బుధవారం జిల్లా అధ్యక్షుడు జయపాల్గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ చిగుర్ల రాజు ఆధ్వర్యంలో జరిగిన జిల్లా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో పార్టీ నిర్మాణం జరుగుతోందని, 119 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాలకు ఇన్చార్జీలను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీగా చిగుర్ల రాజు, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జీగా పోలే శ్రీనివా సును ప్రకటించారు. ఆదిలాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల అధ్యక్షులు గంగాధర్, గుంటుక సంపత్, వాసంపల్లి ఆనంద్బాబు, పెద్దపల్లి ఎస్సీసెల్ అధ్యక్షుడు రమేశ్ పాల్గొన్నారు. -
విత్తన రాయితీకి రాంరాం
● కేవలం జీలుగ, పచ్చిరొట్ట పంపిణీ ● ఇతర పంటలు, కూరగాయల విత్తనాల్లేవిక ● రైతులపై పెను భారంకరీంనగర్ అర్బన్: సాగులో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న ప్రభుత్వం మరోవైపు పలు రకాల విత్తనాలపై రాయితీ ఎత్తేసింది. కేవలం పచ్చిరొట్ట విత్తనాలను 50శాతం రాయితీపై అందించాలని జిల్లా వ్యవసాయశాఖను ఆదేశించింది. విత్తనాలు జిల్లాకు చేరగా రాయితీపై అందిస్తున్నారు. పిల్లిపెసరకు కూడ రాయితీ ఇవ్వగా జిల్లాకు అలాట్మెంట్ ఇవ్వలేదు. జీలుగ, జను ము విత్తనాలను మాత్రమే రాయితీపై ఇస్తున్నా రు. మొత్తంగా 97,200 క్వింటాళ్ల విత్తనాలను జిల్లాకు కేటాయించారని జిల్లా వ్యవసాయ అఽధికారి భాగ్యలక్ష్మి వివరించారు. జిల్లాలోని 18 ఆగ్రోస్ సేవా కేంద్రాలతో పాటు 31 డీసీఎంఎస్ కేంద్రాలు, 24 ప్రాథమిక సహకార సంఘాల ద్వారా అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇతర విత్తనాల రాయితీకి స్వస్తి జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో సుమారు 3.36 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని వ్యవసాయ అధికారుల అంచనా. వరి, పత్తి, కందులు, పెసర, మినుము, జొన్న వంటి పంటలు ఎక్కువగా సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మొక్కజొన్న, కందులు, అపరాలు, తృణధాన్యాలను కూడా ప్రోత్సహించనున్నారు. ప్రధాన పంటల్లో వరి లో అన్ని రకాలు, పెసర, కంది, మి నుము విత్తనాలకు రాయితీ ఇవ్వలేదు. వరి దొడ్డు రకాలు 30కేజీల బస్తా ఎంటీయూ 1010 రూ.900, కేఎన్ఎం 118 రూ.900 ఉండగా మూ డేళ్ల క్రితం రూ.450కే రాయితీపై అందించారు. అటకెక్కిన ఆర్కేవీవై ఉద్యానశాఖ ద్వారా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై) పథకం కింద రాయితీపై కూరగాయల విత్తనాల పంపిణీ చేసేవారు. గత ఏడేళ్లుగా ఊసే లేకపోవడంతో కూరగాయలు సాగు చేసే రైతుల సంఖ్య ఏటేటా తగ్గుతోంది. జిల్లాలో కరీంనగర్ రూరల్, తిమ్మాపూర్, రామడుగు, మానకొండూరు, శంకరపట్నం, హుజూ రాబాద్, జమ్మికుంట తదితర ప్రాంతాల్లో 10వేల ఎకరాల్లో కూరగాయలు సాగయ్యేవి. 2015–16 వరకు చాలా మంది సన్న, చిన్నకారు రైతులు రాయితీపై అందించే కూరగాయల విత్తనాలను తీసుకునేవారు. రాయితీకి స్వస్తి పలకడంతో ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
దళిత యువకుడిని చితకబాదిన పోలీసులు
సైదాపూర్: డ్రంకెన్డ్రైవ్లో సహకరించడం లేదని ఓ దళిత యువకుడిని 20 రోజుల క్రితం చితకబాదిన ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో చోటుచేసుకుంది. జరిగిన ఘటనపై దళిత సంఘాలు వివిధ రూపాల్లో బాధితుడికి న్యాయం చేయాలని ఆందోళనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. బాధితుడు కరీంనగర్ సీపీ, మానవ హక్కుల కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశాడు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కమిషన్ కోరినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. సైదాపూర్లో ట్రైనీ ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న అగస్త్య భార్గవ్గౌడ్ తోటి సిబ్బందితో కలిసి మండలంలోని లస్మన్నపల్లి శివారులో డ్రంకెన్డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గొల్లగూడెం గ్రామానికి చెందిన బత్తుల మహేందర్ మొలంగూర్ నుంచి సైదాపూర్ వస్తున్నాడు. పోలీసులు ఆపారు. టెస్టు చేసి చలాను వేసిన తర్వాత అతడి వివరాలు రాసుకున్నారు. ఇంతలో మహేందర్కు ఇంటి వద్ద నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతున్న బాధితున్ని సహకరించడం లేదని ఫోన్ తీసుకొని ఎస్ఐ అగస్త్య భార్గవ్గౌడ్తోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడే చితకబాదారు. చెవి కర్ణభేరి దెబ్బతిని చెవి నుంచి రక్తం కారుతున్నా వదల్లేదని, తర్వాత పోలీస్ స్టేషన్కు పిలిచి తనతో క్షమాపణ పత్రం రాయించుకున్నారని మహేందర్ కమిషన్లకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఘటనపై విచారించాలని కరీంనగర్ సీపీ హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ను ఆదేశించారు. బాధితుడి వాగ్మూలం తీసుకున్న మర్నాడే ఏసీపీ శ్రీనివాస్ బదిలీ కావడంతో పోలీసుల విచారణలో జాప్యం జరుగుతోందని బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. హెచ్ఆర్సీ, నేషనల్ ఎస్సీ కమిషన్ మాత్రం అడిషనల్ డీజీపీ, కరీంనగర్ సీపీకి విచారణ నివేదికను 20 రోజుల్లో అందజేయాలని నోటీసులు జారీ చేసింది. తాను పీజీ బీఈడీ చేసి, నిరుద్యోగిగా కూల్డ్రింకులు సరఫరా చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని, అకారణంగా చితకబాదడంతో అవమానంతో మానసికంగా భరించలేకపోతున్నాని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మహేందర్ అప్పటికే వేరే సంఘటనలో ఇతరులతో తగాదా పడి దెబ్బలు తిని వస్తున్నాడని, డ్రంకెన్డ్రైవ్ టెస్టులో సహకరించకుండా పోలీసులలో దుర్భాషలాడారని, అందుకు క్షమాపణ పత్రం రాసి ఇచ్చాడని పోలీసులు పేర్కొంటున్నారు. వాస్తవాలు ఉన్నతాధికారుల విచారణలో తేలాల్సి ఉంది. దెబ్బతిన్న బాధితుడి చెవి కర్ణభేరి హెచ్ఆర్సీ, నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు విచారించి నివేదిక ఇవ్వాలని అడిషనల్ డీజీపీ, సీపీకి నోటీసులు -
సంఘం స్థలం స్వాహాకు యత్నం?
వేములవాడ: పట్టణంలోని ఆర్యవైశ్య సంఘ స్థలం విషయంలో వివాదం ఏర్పడి పంచాయితీ ఎస్పీ వద్దకు చేరింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సుమారు 1800 సభ్యుల సంకల్పంతో 2011లో సర్వే నం.977లో 968 గజాల స్థలం కొనుగోలు చేశారు. సంఘం అధ్యక్షుడు, కార్యవర్గం పేరుపై ఉండాల్సిన భూమిని 12 మంది ప్రముఖులు ఓ ట్రస్టుగా ఏర్పడి తమ పేరుతో రిజిస్త్రేషన్ చేయించుకోవడంతో వివాదం చెలరేగింది. సంఘ సభ్యుల హితాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్లో సేవా కార్యక్రమాల కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కొన్న ఈ స్థలంలో 12 మంది ప్రముఖులు తామే యజమానులమని గత డిసెంబర్లో తమ పేతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు వెలుగు చూసింది. దీంతో సంఘ సభ్యులంతా తీవ్ర ఆగ్రహానికి లోనై ఇది కేవలం ఆస్తిపై మాత్రమే కాదు మన ఆర్యవైశ్యుల ఆత్మగౌరవంపై దాడి అంటూ పట్టణానికి చెందిన 1800 మంది సభ్యుల నమ్మకాన్ని, ఆశలను తాకట్టు పెడుతున్నారని మండిపడుతున్నారు. ఈ అంశంతో ఆర్యవైశ్య ప్రముఖులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అక్రమ రిజిస్ట్రేషన్దారులు కాంప్రమైజ్ అవుతామనీ, తమపై ఉన్న రిజిస్ట్రేషన్ రద్దు చేసుకుని తిరిగి సంఘానికి చేస్తామని చెప్పినట్లు తెలిసింది. ఈ వివాదం బుధవారం వేములవాడలో సామాజికంగా కీలకమైన అంశంగా మారింది. వైశ్య సంఘం న్యాయబద్ధంగా తమ హక్కులను తిరిగి పొందుతుందా? లేక ఈ ప్రయత్నం వ్యర్థమవుతుందా? అన్న చర్చ కొనసాగింది. వేములవాడలో ఆర్య వైశ్య సంఘ భూవివాదం ఎస్పీ వద్దకు చేరిన పంచాయితీ -
సింగరేణి స్టేడియానికి ఆధునిక హంగులు
● రూ.2కోట్లు ప్రకటించిన సీఎండీ బలరామ్ ● ప్రత్యేక సంస్థతో ప్రతిపాదనల రూపకల్పన ● త్వరలో తుదిరూపం వచ్చే అవకాశం ● సింథటిక్ ట్రాక్తోపాటు స్టేడియం విస్తరణకు చర్యలు ● కొన్ని సంగరేణి క్వార్టర్లను కూడా తొలగించే అవకాశంగోదావరిఖని: క్రీడాకారులకు అనుగుణంగా సింగరేణి స్టేడియాన్ని ఆధునిక హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని యాజమాన్యం నిర్ణయించింది. సింథటిక్ వాకింగ్ట్రాక్తో పాటు క్రికెట్ ప్లే గ్రౌండ్, వాలీబాల్ కోర్టు, ట్రాక్ విస్తరణ కోసం మైదాన్ని విస్తరించాలని కూడా నిర్ణయించింది. ఇందుకోసం సీఎండీ బలరాం ఇటీవల రూ.2కోట్లు ప్రకటించారు. దీంతో రాబోయే తరానికి ఉపయోగపడేలా సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం స్టేడియంలోని కట్టడాలు, రాబోయే రోజుల్లో విస్తరిస్తే ఎలా మార్చాల్సి ఉంటుందనే అంశంపై నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఈమేరకు స్పోర్ట్స్ అథారిటీ కంపెనీ ప్రతినిధులు మంగళవారం స్టేడియాన్ని పరిశీలించారు. సింథటిక్ ట్రాక్పైనే దృష్టి.. ప్రధానంగా సింథటిక్ వాకింగ్ ట్రాక్పై యాజమాన్యం దృష్టి సారించింది. 400 మీటర్ల వాకింగ్ ట్రాక్ లేదా 800మీటర్ల వాకింగ్ట్రాక్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మైదానం చుట్టూ సింథటిక్ వాకింగ్ట్రాక్, మధ్యలో క్రికెట్ గ్రౌండ్, ఫుట్బాల్ కోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. క్వార్టర్ల తొలగింపుపై ఆలోచన జవహర్లాల్ నెహ్రూ స్టేడియం విస్తరణలో భాగంగా మైదానాన్ని ఆనుకుని ఉన్న సీఈఆర్క్లబ్ ఎదుట గల సింగరేణి క్వార్టర్లను తొలగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే స్టేడియం వెనకాల ఉన్న కొన్ని క్వార్టర్లను కూడా తొలగించే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికి స్పోర్ట్స్ అథారిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం జవహర్లాల్ నెహ్రూ స్టేడియం అభివృద్ధి కోసం రూ.2కోట్లు కేటాయిస్తారు. ఈప్రాంత క్రీడాకారులతోపాటు సింగరేణి ఉద్యోగులకు అనుకూలంగా స్టేడియంలో అన్నిఏర్పాట్లు చేస్తాం. సింథటిక్ వాకింగ్ట్రాక్ ఏర్పాటు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాం. ఎమ్మెల్యే సూచనల మేరకు ఈప్రాంత క్రీడాకారుల కోసం స్టేడియం విస్తరణ పనులు శరవేగంగా సాగుతాయి. – లలిత్కుమార్, ఆర్జీ–1 జీఎం -
ఇందిరమ్మ ఇళ్ల కోసం నిరసన
గురువారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2025జమ్మికుంట: జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అర్హులకు మొండిచేయి చూపారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇళ్ల ఎంపికలో ఇందిరమ్మ కమిటీ, కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా జాబిత తయారు చేశారని బుధవారం జమ్మికుంట– ఉప్పల్ రోడ్డుపై బైఠాయించారు. జాబితాలో వచ్చిన పేర్లను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుల బంధువులు, దగ్గరివారికి ఇచ్చుకున్నారని పంచాయతీ కార్యదర్శి అంజిరెడ్డితో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వానికి వ్య తిరేకంగా నినాదాలు చేశారు. ఎస్సై శేఖర్రెడ్డి ఆందోళనకారులతో మాట్లాడారు. నిబంధనల ప్రకారం రెండోవిడతకు దరఖాస్తు చేసుకోవాలని, ట్రాఫిక్కు అంతరాయం కలిగించవద్దని ఆందోళన విరమింపజేశారు.న్యూస్రీల్ -
కర్బూజ రైతు నష్టాలపాలు
● అకాల వర్షాలతో ఆగం ● రూ.లక్షలు వస్తాయనుకుంటే.. ఖర్చులు కూడా రాలేదంటున్న వైనం ● పురుగు పట్టి పనికి రాకుండా పోయిన కాయలు జగిత్యాలఅగ్రికల్చర్: కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులను అతులాకుతలం చేశాయి. ముఖ్యంగా వేసవిలో కర్బూజ, తర్బూజ వంటి ఉ ద్యాన పంటలను సాగు చేసిన రైతులను కోలుకోకుండా చేశాయి. జిల్లాలో యువ రైతులు వినూత్నంగా సాగు చేసిన కర్బూజ(పుచ్చకాయ) పంటను మరో వారం రోజుల్లో మార్కెట్కు తీసుకెళ్లే తరుణంలో కురిసిన వర్షాలు దెబ్బతీశాయి. ప్రభుత్వం నష్టపరిహారం అందజేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. 100 ఎకరాల్లో సాగు.. జిల్లాలో వేసవిలో చల్లదనాన్నిచ్చే కర్బూజ, తర్బూజ, జన్నత్ వంటి పండ్ల తోటలను దాదాపు 100 ఎకరాలకు పైగా సాగు చేశారు. రెండు, మూడేళ్లుగా యువ రైతులు సాగు చేస్తూ.. నేరుగా మార్కెటింగ్ చేస్తూ మంచి అదాయాన్ని పొందుతున్నారు. సారంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన బండారి వెంకటేశ్, మల్లాపూర్ మండలం సిర్పూర్కు చెందిన నరేశ్, రాయికల్ మండలం అలూరుకు చెందిన మెక్కొండ రాంరెడ్డి, రాజు, మల్లారెడ్డి, ధర్మారంకు చెందిన రాజు, రాజిరెడ్డి అనే యువ రైతులు 25 ఎకరాల వరకు సాగు చేసి తీవ్రంగా నష్టపోయారు. తమ పంటను జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల పట్టణాల్లో నేరుగా విక్రయిస్తుండడంతోపాటు హైదరాబాద్లోని పలు కార్పొరేట్ సంస్థలతో కూడా ఒప్పందం చేసుకున్నారు. హైదరాబాద్లో వర్షాలు కురవడం, రాష్ట్రమంతా చల్లదనంగా ఉండటంతో కాయలు తెంపేందుకు వేచి చూస్తున్న తరుణంలో ఒక వర్షం తర్వాత మరో వర్షం కురవడంతో పంట పూర్తిగా ధ్వంసమైంది. విత్తన ఖర్చే రూ.35 వేలు కర్బూజ(వాటర్ మిలన్), తర్బూజ(మస్క్మిలన్), జన్నత్(సూపర్ మార్కెట్ వైరెటీ) పండ్ల తోటలను సాగు చేశారు. మార్కెట్లో ఎప్పుడు ఏ ధర ఉంటుందో తెలియదు కాబట్టి.. సగటున ధర గిట్టుబాటయ్యేందుకు ప్రతి పంటను మూడు దఫాలుగా సాగు చేశారు. ఫిబ్రవరి నెలలో సాగు చేసిన పంట.. మండు వేసవిలో మే నెలలో చేతికందుతున్న తరుణంలోనే పూర్తిగా దెబ్బతింది. వీటికి సంబంధించిన 50 గ్రాముల విత్తనాలకే దాదాపు రూ.1,600 నుంచి 1,800 వరకు ధర ఉంటుంది. ఎకరాకు దాదాపు రూ.35వేలు ఖర్చు పెట్టి హైదరాబాద్, బెంగళూర్ నుంచి విత్తనాలు తెప్పించారు. పంట పూర్తిగా నాశనం.. రైతులు సాగు చేసిన కర్బూజ కాయలు అమ్మకానికి వచ్చాయి. కాయలు తెంపే సమయంలోనే భారీ వర్షాలతో భూమిలో నీళ్లు ఆగాయి. వేరు వ్యవస్థ దెబ్బతిని కర్బూజ మొక్కలు వాడిపోయాయి. దీనికితోడు పూత రాలిపోయింది. అప్పటికే కాచిన కాయ లు కుచించుకుపోయాయి. పక్వానికి వచ్చిన కాయ ల్లో పురుగు చేరింది. దీనికితోడు రాళ్ల వానతో కాయ లు ఎక్కడికక్కడే పగిలిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్కో ఎకరానికి రూ.3లక్షల నుంచి 4లక్షలు వస్తాయనుకుంటే.. కనీసం విత్తనాలకు పెట్టిన పెట్టుబడి కూడా రాలేదని కన్నీళ్లపర్యంతమవుతున్నారు. అకాల వర్షాలతో కర్బూజ వంటి కొత్త పంటలు పెట్టాలంటేనే రైతులు భయపడే పరిస్థితి నెలకొంది. -
భూసారం తెలుసుకోవడం తప్పనిసరి
● భూసార పరీక్షతో సుస్థిర వ్యవసాయం సాధ్యం ● రామగిరిఖిల్లాలో ఉచితంగా భూసార పరీక్షలు రామగిరి(మంథని): నైరుతి రుతుపవనాల ప్రవేశం తర్వాత రైతులు వ్యవసాయానికి సిద్ధమవుతున్నారు. అంతకంటే ముందే నేలలో మట్టి పరీక్షలు చేయించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. భూసార పరీక్షలకు ఇదేసరైన సమయమంటున్నారు. పొలాల్లోని మట్టి నమునాలను సేకరించి పరీక్షలు చేయించుకుంటే భూసారం తెలియడంతో పాటు ఆ నేలల్లో ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఎంతమేర ఎరువులను వినియోగించాలనే విషయాలు రైతులు తెలుసుకోవచ్చు. రైతులు పంట పండించేందుకు మూడు పెట్టుబడులు అవసరం. అవి భూమి, విత్తనం, నీరు. వీటన్నింటికన్నా నేల ముఖ్యమైన పెట్టుబడి. అందుకే భూమిగుణగణాలు తెలిస్తే ఎలాంటి పంటలు పండుతాయో అవగాహన వస్తుంది. అందుకోసం మట్టి పరీక్షలు చేయించాలి. తద్వారా పంటలకు ఎంత మోతాదులో ఎరువులు వేసుకోవాలో తెలియడంతో ఖర్చు తగ్గించుకోవచ్చు. చాలామంది రైతులు మట్టిపరీక్షలు జరిపించకుండా ఎరువులు అధిక మోతాదులో వేస్తున్నారు. దీనివల్ల పెట్టుబడి వ్యయం పెరగడంతోపాటు పంటల్లో పురుగుల ఉధృతి కూడా ఎక్కువవుతుంది. పొలాల్లో ఎరువుల మోతాదు తెలుసుకునేందుకు కచ్చితంగా మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్ష కేంద్రాలకు పంపించాలి. దీనికోసం సాగుభూమి నుంచి మట్టిని ఇలా సేకరించాలి. మట్టి నమూనా సేకరించ కూడని ప్రదేశాలు ● పొలం వరాలు, చెట్టు నీడ, బోరుబావులు, నీరు పొసేచోటు, బండరాళ్లు ఉన్న చోటు, మందులు కలుపుకునే చోటు. మట్టి నమూనా సేకరించే విధానం ● భూసార పరీక్ష ఫలితాలు సేకరించే మట్టి నమూనాలపై ఆధారపడి ఉంటాయి. కనుక మట్టి నమూనాలను ఒక ఎకరం విస్తీర్ణంలో ఒకచోటు నుంచే కాకుండా 10 నుంచి 15 ప్రదేశాల్లో తీయాలి. ● ఎంపిక చేసిన పొలంలో జిగ్జాగ్(ఎగుడు దిగుడు) పద్ధతిలో 10 నుంచి 15 చోట్ల గుర్తులు పెట్టాలి. ● గుర్తులు పెట్టిన చోట చెత్తాచెదారం తొలిగించి శుభ్రపరచాలి. శుభ్రపర్చిన చోట గుంతలు తీయాలి. ● ఆ గుంతల్లో ఒక అంగుళం(2.5 సెం.మీ.) మట్టిని సేకరించాలి. ● పొలంలో 10 నుంచి 15 చోట్ల సేకరించిన మట్టిని ఒకకుప్పగా పోసి బాగా కలపాలి. ఈ విధంగా బాగా కలిపిన మట్టిని గుండ్రంగా చేసి నాలుగు భాగాలుగా విభజించాలి. పైరెండు భాగాలను(ఏ, సీ)లుగా, కింది రెండు భాగాలను(బీ,డీ) భాగాలుగా గుర్తించాలి. వీటిలో రెండు ఎదురెదురుగా ఉన్న భాగాలను (బీ,డీ) కలిపి మిగిలిన రెండు భాగాలను(ఏ, సీ) తొలిగించాలి. ఇప్పుడు మిగిలిన (బీ,డీ) భాగాలను బాగా కలిపి మళ్లీ గుండ్రంగా చేసుకోవాలి. ఈ విధంగా గుండ్రంగా చేసుకున్న మట్టిని మళ్లీ ముందుగా విభజించినట్లుగా నాలుగు భాగాలుగా చేసి ఎదురెరుగా ఉన్న భాగాలను(ఏ,సీ) కలిపి మిగిలిన రెండు భాగాలను(బీ,డీ)లను తొలిగించాలి. ఈ విధంగా 10–15 చోట్ల నుంచి సేకరించిన మట్టిని అర్ధకిలో మట్టి నమూనా వచ్చే వరకు చేసుకోవాలి. తర్వాత ఈ నమూనాను నీడలో ఆరబెట్టి పరిశుభ్రమైన, గుడ్డసంచిలో నింపి సమీపంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఇవ్వాలి. ఉచితంగా భూసార పరీక్షలు రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రంలో ఉచితంగా భూసార పరీక్షలు నిర్వహిస్తున్నాం. కార్డులు కూడా ఉచితంగా ఇస్తాం. భూసారాన్ని బట్టి ఏ పంటకు ఎలాంటి ఎరువులు వాడాలో కూడా రైతులకు సూచిస్తున్నాం. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ పిల్లి కిరణ్, మృత్తిక శాస్త్రవేత్త, కేవీకే, రామగిరి ఖిల్లా -
ప్రాణం పోస్తున్న ఎమర్జెన్సీ వైద్యులు
● మెడికవర్లో వరల్డ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డే కరీంనగర్టౌన్: కరీంనగర్లో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కలిగిన ఏకై క ఆసుపత్రి మెడికవర్లో అందించే సేవలతో ఎన్నో ప్రాణాలు నిలబడుతున్నాయని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. వరల్డ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డే సందర్భంగా మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పలువురు వైద్యులు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో ఎమర్జెన్సీ విభాగం ఎంతో కీలకంగా మారిందన్నారు. ఆసుపత్రిలో ఎమర్జెన్సీతో పాటు క్రిటికల్ కేర్ టీం బ్యాక్ బోన్గా పనిచేస్తుందన్నారు. కేక్ కట్ చేసి, ఎమర్జెన్సీ వైద్యులను సన్మానించారు. మెడికవర్ సెంటర్హెడ్ గుర్రం కిరణ్, వైద్యులు సత్యనారాయణ, రుత్విక్, మహేష్, జగదీప్, దిలీప్, రవికిరణ్,, వినయ్, ఉపేందర్రెడ్డి, నాగరాజు, లోకేశ్, పల్లవి, విష్ణు, రవి, మల్లారెడ్డి పాల్గొన్నారు. -
ట్రాక్టర్ కింద పడి కౌలురైతు మృతి
ఇల్లంతకుంట(మానకొండూర్): ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్తతో అతని పక్కనే కూర్చున్న కౌలు రైతు టైరు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన మంగళవారం రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నర్సక్కపేటలో విషాదం నింపింది. ఎస్సై శ్రీకాంత్గౌడ్ తెలిపిన వివరాలు. నర్సక్కపేటకు చెందిన చీకోటి నర్సయ్య(65) మండలంలోని వంతడుపుల గ్రామంలో నాలుగెకరాలను కౌలుకు తీసుకొని మొక్కజొన్న పంట వేశాడు. మంగళవారం మొక్కజొన్న కంకులను ట్రాక్టర్లో వేసుకొని సమీప పౌల్ట్రీఫామ్ వద్ద ఆరబోస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్లో నుంచి మొక్కజొన్న కంకులను దించి తిరిగి వెళ్తుండగా డ్రైవర్ పక్కనే కూర్చున్న నర్సయ్య ఎగిరి టైర్ కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. అతివేగంగా ట్రాక్టర్ నడిపిన బిహార్కు చెందిన డ్రైవర్ సురేందర్పై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని కూతురు కామభాగ్య ఫిర్యాదు చేసింది.బావిలో పడి విద్యార్థిని..మానకొండూర్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం కెల్లెడ గ్రామపరిధిలోని కందులపల్లెలో ప్రమాదవశాత్తు చేదబావిలో పడి వి ద్యార్థిని మృతి చెందింది. సీఐ సంజీవ్ వివరాల ప్రకా రం.. కందులపల్లెకు చెందిన కందుల స్వప్న, ముత్తయ్య దంపతులకు కొడుకు రాజు, కూతురు అశ్విత(20) ఉన్నారు. అశ్విత ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. మంగళవారం ఉద యం తల్లిదండ్రులు పనులకు వెళ్లారు. ఇంటివద్ద అశ్విత చేదబావిలో నీరు తోడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయింది. రాజు గేదెలకు నీళ్లుపెట్టి కాళ్లు కడుక్కునేందుకు బావి వద్దకు రాగా.. అశ్విత బావిలో పడిఉండడాన్ని గమనించాడు. స్థానికుల సాయంతో బయటకు తీయగా.. అప్పటికే చనిపోయింది. తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ మేరకు పోలీసులు పంచనామా నిర్వహించారు.రోడ్డు ప్రమాదంలో జడ్జి తల్లికి గాయాలుజగిత్యాలక్రైం: జగిత్యాలలోని గాంధీనగర్ వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాంపెల్లి కోర్టు జడ్జి సుస్మిత తల్లి వడ్లూరి దేవమ్మ గాయపడింది. దేవమ్మను గాంధీనగర్ ప్రాంతానికి చెందిన బొల్లారపు హర్షవర్ధన్ ద్విచక్రవాహనంతో ఢీకొట్టగా.. తీవ్రంగా గాయపడింది. దేవమ్మది జగిత్యాల రూరల్ మండలం తక్కళ్లపల్లి గ్రామం. గాంధీనగర్లోని తన సోదరి వద్దకు వెళ్లింది. తిరిగి తక్కళ్లపల్లి వెళ్లేందుకు రోడ్డు పక్కన ఉండగా.. హర్షవర్ధన్ ద్విచక్రవాహనంపై వస్తూ ఢీకొట్టాడు. స్థానికులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. సుస్మిత సోదరుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు హర్షవర్ధన్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మన్మథరావు తెలిపారు.రోడ్డు ప్రమాదంలో దంపతులకు..సారంగాపూర్: బీర్పూర్ మండలం ఇందిరానగర్ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ధర్మపురి మండలం నక్కలపేటకు చెందిన భూక్య భారతి, ఆమె భర్త భూక్య తిరుపతి ఇద్దరు ద్విచక్రవాహనంపై బీర్పూర్ మండలం రంగసాగర్లోని భారతి తల్లిగారింటికి వచ్చారు. తిరిగి వెళ్తుండగా ఇందిరానగర్ వద్ద వీరి వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో భారతి తీవ్రంగా, తిరుపతి స్వల్పంగా గాయపడ్డారు. వారిని జగిత్యాల ఆస్పత్రికి.. అక్కడి నుంచి కరీంనగర్ తరలించారు. -
పిడుగుపాటు.. గొర్రెలకాపరి మృతి
ఇల్లంతకుంట(మానకొండూర్): రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గొల్లపల్లిలో మంగళవారం పిడుగుపాటుకు గొర్రెలకాపరి మృతిచెందాడు. గ్రామానికి చెందిన దాసరి లక్ష్మణ్(21) గొర్రెలను మేత కోసం రేపాక శివారుకు తీసుకెళ్లాడు. మంగళవారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఆ సమయంలోనే చెట్టు కింద ఉన్న లక్ష్మణ్ పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మరణించాడు. అతనికి కొంతదూరంలో ఉన్న మరో కాపరి రాజు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఎస్సై శ్రీకాంత్గౌడ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.తల్లీబిడ్డలకు గాయాలుమల్యాల: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. తాటిపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన జేరుపోతుల సుమలత ఇంటి సమీపంలో భారీ శబ్దంతో పిడుగుపడడంతో విద్యుత్ మీటరు కాలిపోయింది. ఇంటి లోపల గోడల పెచ్చులు ఊడిపోయాయి. విద్యుత్ పైపులు కాలిపోయి, స్విచ్బోర్డు పగిలిపోయింది. ఇంట్లో ఉన్న సుమలత చేతిపై మెరుపులు పడడంతో గాయాలయ్యాయి. ఆమె కూతురు ఆరాధ్య, కుమారుడు ఫ్రాన్సిస్ స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వారిని 108లో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. పిడుగుపాటు శబ్దానికి సుమలతకు వినికిడి లోపం తలెత్తింది. మల్యాల ఎస్సై నరేశ్కుమార్, పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు.కాసారంలో గేదె మృతి..గంగాధర: మండలంలోని కాసారం గ్రామంలో పిడుగుపాటుకు పాడిగేదె మృతి చెందిందని గ్రామస్తులు తెలిపారు. పెద్దిపల్లి తిరుపతి గేదెను పొలం వద్ద కట్టి వేయగా మంగళవారం సాయంత్రం పిడుగుపడి మృతి చెందింది. బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ సర్పంచు వేముల దామోదర్ కోరాడు.నేలవాలిన వృక్షంగన్నేరువరం: మండలకేంద్రంలోని చావిడి వద్ద భారీ వృక్షం మంగళవారం వీచిన గాలివానకు నేలవాలింది. ఆయుర్వేదిక్ ఆసుపత్రి, వాటర్ ప్లాంట్ సమీపంలోని వృక్షం నేలవాలడంతో పెను ప్రమాదం తప్పింది. పక్కనే గ్రామానికి చెందిన అరిగెల వరవ్వ, రామవ్వ నివాస గృహాలు ఉన్నాయి, చెట్టు కింద పడుతున్న సమయంలో భయాందోళనకు గురై ఇంట్లో నుంచి భయటకు పరుగులు తీశారు. ఇళ్ల మధ్య పడటంతో ఊపిరిపీల్చుకున్నారు. ఏళ్లనాటి వృక్షం నేలవాలిందని గ్రామస్తులు తెలిపారు. కాగా మండలంలో గంట పాటు భారీ వర్షం కురిసింది. -
మహిళ హత్య కేసులో తల్లి, కొడుకు అరెస్టు
చందుర్తి(వేములవాడ): భూవివాదంలో మహిళను హత్య చేసిన రౌడీషీటర్, హత్యకు ప్రోత్సహించిన తల్లిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. చందుర్తి ఠాణాలో మంగళవారం నింది తులిద్దరిని సీఐ, ఎస్సైలు అరెస్ట్ చూపారు. చందుర్తికి చెందిన బొల్లు మల్లవ్వకు రౌడీషీటర్ బొల్లు మనోజ్ తల్లి మోహినవ్వకు కొద్దికాలంగా భూవివాదం ఉంది. ఈ వివాదాన్ని దృష్టిలో పెట్టుకున్న రౌడీషీటర్ మల్లవ్వను అడ్డు తొలగించేందుకు సోమవారం పెద్దమ్మ గుడి సమీపంలో కాపుకాసి కత్తితో దాడిచేసి హత్య చేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపాయాడు. ఈ హత్యకు ప్రోత్సహించిన బొల్లు మోహినవ్వ ఉరప్ మల్లవ్వ, రౌడీషీటర్ మనోజ్అను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. హత్యకు వినియోగించిన కత్తిని, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అంజయ్య, సిబ్బంది ఉన్నారు. పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా జిల్లాలోని పాతనేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. చందుర్తికి చెందిన బొల్లు మనోజ్పై 2023లో హత్యకేసుతోపాటు పలు దొంగతనాల కేసులు ఉన్నాయని, అయినా మార్పు రాకపోవడంతో 2024లో రౌడీషీటర్ తెరిచినట్లు తెలిపారు. రౌడీషీటర్లలో మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. హత్యకు వినియోగించిన కత్తి, సెల్ఫోన్ స్వాధీనం -
కొత్త పింఛన్దారులకు 3.0 పింఛన్
జ్యోతినగర్(రామగుండం): ప్రయాస్ పథకాల కింత కొత్త పింఛన్దారులకు 3.0 పింఛన్ చెల్లింపు ఉత్తర్వులు విడుదలయ్యాయని ఈపీఎఫ్వో కరీంనగర్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి నరేశ్, నోడల్ అధికారి పరశురాం తెలిపారు. ఎన్టీపీసీ మిలీనియం హాల్లో మంగళవారం నిధి పే నిక్కత్ 2.0లో భాగంగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ, భవిష్యనిధి ద్వారా కార్మికులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. కార్మికులు తమ వివరాలను ఈపీఎఫ్ సేవల వెబ్సైట్లో తెలుసుకోవచ్చని అన్నారు. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్, ప్రయాస్ పథకం, వాటాదారులకు అవగాహన కల్పించారు. ఫీఎఫ్ సమస్యలు పరిష్కరించాలి ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులు పీఎఫ్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ఈమేరకు ఈఫీఎఫ్వో ఎన్ఫోర్స్మెంట్ అధికారి నరేశ్, నోడల్ అధికారి పరశురాంకు వినతిపత్రం అందించారు. పుట్టిన తేదీల్లో పొరపాట్లు, కాంట్రాక్టర్లు ఫీఎఫ్ జమచేయకపోవడం, యజమాని మారినప్పుడు, ప్రస్తుత నంబరుపై కాకుండా పాత నంబర్పై డబ్బులు జమచేయడం, 58 ఏళ్లవయసు పూర్తిచేసిన కార్మికులకు పింఛన్ రాకపోవడం, మాన్యువల్ పద్ధతిలోని పీఎఫ్ డబ్బులు ప్రస్తుత ిపీఎఫ్ నంబర్లోకి జమకాకపోవడం తదితర సమస్యలు ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు. సర్వీస్ సర్టిఫికెట్లలో ఇంటిపేరు పూర్తిగా లేకపోవడంతో నిధులు ట్రాన్సఫర్ కావడం లేదన్నారు. ఈ సమస్యలపై కరీంనగర్ భవిష్యనిధి కార్యాలయానికి వెళ్లే కార్మికులకు సిబ్బంది సహకరించకుండా, ఇబ్బందులకు గురిచేసే విధానం మానుకోవాలని హెచ్చరించారు. ఐన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు భూమల్ల చందర్, సీఐటీయూ నాయకులు నాంసాని శంకర్, గీట్ల లక్ష్మారెడ్డి, ఐఎఫ్టీయూ నాయకులు చిలుక శంకర్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ ఈపీఎఫ్వో ఎన్ఫోర్స్మెంట్ అధికారి నరేశ్ -
రిమాండ్ ఖైదీ పరార్
● గాలిస్తున్న పోలీసులు జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని కోర్టు నుంచి జైలుకు తరలిస్తున్న క్రమంలో రిమాండ్ ఖైదీ పోలీసుల కన్నుగప్పి పరారైన సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లింగాపూర్కు చెందిన జున్ను ప్రసాద్ నిరుద్యోగులను గల్ఫ్ పంపిస్తానని, డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడ్డాడు. దీంతో బాధితులు పెగడపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఈనెల 17న కేసు నమోదు చేసి జున్ను ప్రసాద్ను జగిత్యాల జైలుకు తరలించారు. అతడిపై కొడిమ్యాల పోలీస్స్టేషన్లో కూడా గల్ఫ్ మోసంపై కేసు నమోదైంది. దీంతో కొడిమ్యాల పోలీసులు పీటీ వారెంట్ ద్వారా ప్రసాద్ను జైలు నుంచి తీసుకొచ్చి.. జగిత్యాల కోర్టులో మంగళవారం సాయంత్రం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. తిరిగి రిమాండ్కు తరలిస్తున్న క్రమంలో పోలీసుల కన్నుగప్పి పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరి పట్టివేతమెట్పల్లి: గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పట్టుకున్నట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. పట్టణ శివారులో మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా..అబ్దుల్ సోహైల్, ఓ మైనర్ బాలుడు ద్విచక్ర వాహనంపై అక్కడకు వచ్చారు. అనుమానాస్పదంగా కనిపించిన వారిని తనిఖీ చేయగా.. వారి వద్ద 120 గ్రాముల గంజాయి దొరికింది. వారిపై కేసు నమోదు చేసి బైక్, రెండు సెల్ఫోన్లు సీజ్ చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ప్రపంచ ఆర్చరీ పోటీలకు చికిత
కరీంనగర్స్పోర్ట్స్: ప్రపంచ ఆర్చరీ క్రీడాకారిణి, పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్కు చెందిన తానిపర్తి చికిత జూన్లో సింగపూర్లో, ఆగస్టులో కెనడాలో జరగబోయే ప్రపంచస్థాయి పోటీల్లో పాల్గొనే భారత మహిళల కంపౌండ్ క్రీడాకారుల జట్టులో చోటు సంపాదించింది. మహిళల కంపౌండ్ విభాగంలో ప్రపంచ ర్యాంకింగ్లో 71వ స్థానంలో కొనసాగుతోంది. ఏషియా కప్స్టేజ్ 2 పోటీలు సింగపూర్లో జూన్ 14 నుంచి 21 వరకు, వరల్డ్ యూత్ చాంపియన్ షిప్ పోటీలు ఆగస్టు 16 నుంచి 25వరకు కెనడాలోని విన్నిపెగ్లో జరుగనున్నాయి. పూణెలో జరిగిన ఇండియన్ టీంసెలక్షన్ ట్రయల్స్లో చికిత అద్భుతంగా రాణించి చోటు దక్కించుకుంది. ఏషియా, వరల్డ్ యూత్ చాంపియన్ షిప్ పోటీలకు తానిపర్తి చికిత ఎంపికకావడంపై ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్రెడ్డి, కోశాధికారి నాగిరెడ్డి సిద్దారెడ్డి, ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్రెడ్డి, మహ్మద్ కరీం, పెద్దపల్లి డీవైఎస్వో సురేశ్, బేస్బాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, ఉమ్మడి జిల్లా అర్చరీ సంఘం కార్యదర్శి కొమురాజు శ్రీనివాస్, కొమురాజు కృష్ణ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
వందేళ్ల చరిత్ర గల పార్టీ సీపీఐ
కరీంనగర్: దేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ సీపీఐ ఒక్కటేనని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నా రు. సీపీఐ కరీంనగర్ జిల్లా 23వ మహాసభలు నగరంలోని మధుగార్డెన్లో మంగళవారం ప్రా రంభమయ్యాయి. పార్టీ పతాకాన్ని సీనియర్ నా యకుడు వేముల వెంకట్రాజం ఆవిష్కరించారు. అమరవీరుల స్మారకస్తూపం చిహ్నా న్ని శ్రీరా ముల రామచంద్రం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజౖ రెన కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కమ్యూనిస్టుల ను దూరం చేసుకుని అధికారా న్ని పోగొట్టుకున్నామనే బాధలో బీఆర్ఎస్ ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సీపీఐ ఎంత కృషి చేసిందో ప్రజలకు తెలుసన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ను నమ్మే పరిస్థితి లేదన్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ కార్యవర్గ సభ్యు డు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కార్మికులందరూ నాలుగు లేబర్కోడ్లను వ్యతిరేకిస్తూ పోరా టం చేయాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, పొనగంటి కేదారి, కొయ్యడ సృజన్కుమార్, బోయిని అశోక్, అందెస్వామి, టేకుమల్ల సమ్మయ్య, సురేందర్రెడ్డి పాల్గొన్నారు. కమ్యూనిస్టులకు దూరమై బీఆర్ఎస్ అధికారాన్ని పోగొట్టుకుంది సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు