breaking news
Karimnagar District Latest News
-
2 రోజులైనా కానరాని యువకుడి జాడ
రామగుండం: కళ్లు మూసినా.. తెరిచినా.. ఏ శబ్దం వచ్చినా.. ఎవరైనా తలుపు తట్టినా.. ఎవరి పిలుపు విన్నా.. ఫోన్ శబ్దమైనా.. ఉలిక్కిపాటుకు గురవుతూ తన కొడుకే వస్తున్నాడనే భ్రమతో మది నిండా కన్న కొడుకునే ధ్యానిస్తూ ఓ తల్లి రోదిస్తోంది. కళ్లలో కన్నీరు ఇంకిపోయి.. 2 రోజులుగా ఇంట్లో ఓ మూలన కూర్చొని అదే మూగరోదన. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక అక్బర్నగర్కు చెందిన నారకట్ల సత్యం–మహేశ్వరి దంపతుల కుమారుడు రాజేశ్యాదవ్(24) శుక్రవారం గణపతి నిమజ్జన వేడుకల్లో గోదావరి నదిలో గల్లంతైన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆదివారం రాత్రి వరకు గోదావరి నదిలో వివిధ ప్రాంతాల్లో గాలించినా ఎలాంటి ఆచూకీ లేదు. కనీసం కడసారి చూపుకై నా నోచుకోలేదని రోదిస్తుండడంతో.. కాలనీ ప్రజలు సైతం కన్నీటిపర్యంతమవుతున్నారు. నోరు ఎండిపోతే తోబుట్టువులు నీటి చుక్కలతో తడుపుతున్నా ఆమె రోదన మాత్రం ఆపడం లేదు. ఇప్పటికే పలుమార్లు లోబీపీతో ఆస్పత్రిలో చేరినా.. తన కొడుకు లేని బతుకు నాకెందుకంటూ గుండెలు బాదుకుంటోంది. రాజేశ్ తల్లిదండ్రులను ఓదార్చడం స్థానిక కాలనీవాసుల తరం కావడం లేదు. 2 రోజులుగా ఏం తినకుండా వేయి కళ్లతో ఎదురుచూపులు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వరద నీటి విడుదల అరికట్టడంతో.. గోదావరి నదిలో వరద నీటి ప్రవాహం పూర్తిగా తగ్గి ఇసుక తిన్నెలు కనిపిస్తున్నాయి. ఎక్కడో ఓచోట రాజేశ్ మృతదేహాన్ని గుర్తించే అవకాశముంటుందని, వివిధ ప్రాంతాల్లో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని గోదావరిఖని టూటౌన్ సీఐ ప్రసాదరావు తెలిపారు. శుక్రవారం ఉదయం గోదావరిలో గల్లంతైన రాజేశ్ నా కొడుకు ఎక్కడంటూ రోదిస్తున్న మాతృమూర్తి -
పీటీఎస్లో ఆగని చోరీలు
జ్యోతినగర్: ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టులో ప్రజా సంబంధాలు కరువయ్యాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రాజెక్టు ప్రభావిత, పునరావాస ప్రాంతాల్లో వైద్య శిబిరాలు, పశు వైద్యశిబిరాలతోపాటు పలు అభివృద్ధి పనులపై ప్రజలకు విషయాలను తెలియజేయడంలో ముందుండేది. కాని కొద్ది నెలలుగా అసలు ప్రాజెక్టులోని సీఎస్సార్ విభాగం ఏం చేస్తోంది.. అభివృద్ధి పనులను ప్రజలకు ప్రజా సంబంధాల విభాగం ఎందుకు తెలియజేయడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. గోప్యం ఎందుకు.. 2 నెలల క్రితం ప్రాజెక్టులో క్రషర్ హామర్స్ చోరీ జరిగిన విషయాన్ని సాక్షి పత్రిక వెలుగులోకి తీసుకొచ్చిన మరుసటి రోజు చోరీ నిందితులను ఎన్టీపీసీ పోలీసులకు అప్పగించిన పలు విషయాలను సైతం సంబంధిత విభాగం గోప్యంగా ఉంచడంలో ఆంతర్యమేమిటని చర్చించుకుంటున్నారు. ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టుకు సింగరేణి సంస్థ నుంచి రైలు మార్గం ద్వారా వచ్చే బొగ్గును కొందరు చోరీ చేస్తున్న విషయాలపై సరైన దృష్టి సారించకపోవడం, పోలీసులు సైతం చోరీ పట్టనట్లుగా వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. చివరకు సీఐఎస్ఎఫ్ విభాగం నిఘా చేపట్టి నిందితులను పట్టుకొని ఎన్టీపీసీ పోలీసులకు అప్పగిచిన విషయాన్ని సైతం పూర్తిస్థాయిలో తేటతెల్లం చేయకపోవడం వంటి విషయాలపై స్థానికులు పలు విధాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇటీవల పర్మినెంట్ టౌన్షిప్ నుంచి ఓ ట్రాక్టర్, హైడ్రాలో ఇనుస సామగ్రిని చోరీ చేసి స్క్రాప్ దుకాణదారుడికి విక్రయిస్తున్న విషయంపై సీఐఎస్ఎఫ్ దృష్టి సారించి చోరీని నియంత్రించడంతోపాటు నిందితులను సైతం అదుపులోకి తీసుకొని ఎన్టీపీసీ హెచ్ఆర్ అధికారులకు అప్పగించారు. అయినా చోరీ నిందితులు, చోరీకి సంబంధించిన విషయాలను ప్రజా సంబంధాల ద్వారా ప్రజలకు తెలియజేయకపోవడంతో అసలు ప్రజా సంబంధాలు ఏమయ్యాయని విమర్శిస్తున్నారు. ఓ ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన భవన నిర్మాణ పనుల వద్ద ఓ వ్యక్తిని హత్య చేసి అతడి మృతదేహాన్ని ట్రాక్టర్లో గోదావరిఖని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లిన అనంతరం పీటీఎస్ సెక్యూరిటీ సిబ్బందికి తెలియకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గుర్తింపు సంఘం ఎన్నికల వివరాల వెల్లడిలో సైతం.. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు ఉద్యోగ గుర్తింపు సంఘం ఎన్నికలు జరగడం అందరికీ తెలిసిందే. ఈనెల 25న గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఉత్తర్వులు వెలువరించిన అధికార యంత్రాంగం.. ఎన్నికల షెడ్యూల్ను ప్రజా సంబంధాలు తెలపకపోవడం ఏమిటని పలు యూనియన్లు చర్చించుకుంటున్నాయి. ఎన్నికల తేదీలు, సంబంధిత అధికారుల వివరాలు, నామినేషన్ ప్రక్రియ, ఎన్నికల నియమావళిని సైతం విడుదల చేయకపోవడంతో ఒక యూనియన్కు యాజమాన్యం అనుసంధానంగా వ్యవహరిస్తున్నట్లు పీటీఎస్లో ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరగాలని, ఏకపక్షంగా జరగకుండా చర్యలు తీసుకోవాలని కొన్ని యూనియన్లు న్యూఢిల్లీ కార్పొరేట్ సెంటర్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పెరుగుతున్న చోరీలు పర్మినెంట్ టౌన్షిప్లో ఇటీవల చోరీలు అధికమయ్యాయని ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఎన్టీపీసీ సంస్థ అధికారులు, ఉద్యోగుల నివాస సముదాయానికి రెండువైపులా ఏ, బీ గేట్లున్నాయి. వాటి వద్ద 24 గంటల నిఘా ఉంటుంది. కాని చోరీలు మాత్రం ఆగడం లేదు. పోలీసులు, సీఐఎస్ఎఫ్ అధికారులు కొంతమేర నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. సంవత్సరం క్రితం ఎన్టీపీసీ పీటీఎస్ సెక్యూరిటీ విభాగానికి 24 గంటల కోసం ఓ వాహనం ఉండేది. దానిలో పీటీఎస్లో నిరంతరం గస్తీ చేపట్టేవారు. వాహనాన్ని తొలగించడంతో సెక్యూరిటీ సిబ్బంది తమ సొంత వాహనాలపై గస్తీని చేపడుతున్నారు. ఒక్కోసారి వాహనం లేక గస్తీ చేపట్టలేక చోరీలు అధికమవుతున్నాయని తెలుస్తోంది. ప్రజా సంబంధాలు ఏమయ్యాయి..? సంస్థ చేపట్టే కార్యకలాపాలతోపాటు పలు అభివృద్ధి పనులు, ప్రాజెక్టు పనితీరు తదితర అంశాలను ప్రజలకు తెలిపేందుకు ఏర్పాటు చేసిన ప్రజా సంబంధాల విభాగం కేవలం ఉన్నామా.. వచ్చామా.. పోయామా అనేలా వ్యవహరిస్తోందనేది జగమెరిగిన సత్యం. ప్రాజెక్టు పనితీరు, ప్రభావిత గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన విభాగం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండకపోవడంతోపాటు మాకేంది అనే విధంగా వ్యవహరించడంతో.. ప్రాజెక్టులోని పలు ఉత్తమమైన కార్యకలాపాలు, పనితీరు ప్రజలకు తెలియడం లేదు. ఎన్టీపీసీ సంస్థ గతంలో వ్యవహరించిన తీరు.. ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీపీసీలో ప్రజా సంబంధాలు కరువు సెక్యూరిటీ సిబ్బందికి వాహనం లేకపోవడంతో నిఘా విఫలం గుర్తింపు సంఘం ఎన్నికల షెడ్యూల్ను బహిర్గతం చేయకపోవడంలో ఆంతర్యమేమిటో.. అంతర్గతంగా ఏం జరుగుతుందో తెలియని వైనం -
కొండగట్టు ఆలయ ద్వార బంధనం
మల్యాల: చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకొని ఆదివారం మధ్యాహ్నం శ్రీకొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం ద్వార బంధనం చేశారు. ఆలయ అర్చకులు, అధికారులు స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం ఆలయ ప్రధాన ద్వారం మూసేశారు. ఆలయ పరిసరాలు భక్తులు లేక వెలవెలబోయాయి. సోమవారం పుణ్యహచనము, సంప్రోక్షణ, తిరుమంజనము, ఆరాధన నిర్వహించిన అనంతరం ఉదయం 7.30 గంటల నుంచి భక్తులు ఆంజనేయస్వామివారిని యధావిధిగా దర్శనం చేసుకోవచ్చని ఆలయ అర్చకులు తెలిపారు. స్థానాచార్యులు కపీందర్, ప్రధాన అర్చకుడు జితేంద్రస్వామి, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవి, లక్ష్మణప్రసాద్, హరిహరనాథ్, ఉమామహేశ్వర్, ఏఎస్సై రమణారెడ్డి పాల్గొన్నారు. -
సేవా ‘కుసుమా’లు
సిరిసిల్లకల్చరల్: సిరిసిల్ల చరిత్రలో పదోతరగతిలో రాష్ట్రస్థాయి ర్యాంకులతో ఉత్తీర్ణులైన తొలి తరం విద్యార్థులు వాళ్లు. కటిక పేదరికంలో పుట్టి కష్టపడి ప్రయోజకులయ్యారు. మల్లేశం సివిల్ ఇంజనీర్గా ఏఈ హోదాలో ఉద్యోగ విరమణ పొందారు. తన తొలి ప్రయత్నంలోనే మెడిసిన్లో సీటు సంపాదించిన ప్రతిభాశాలి విఠల్. శ్రీహరి పరిశోధక రంగంలో స్థిరడ్డారు. పేద విద్యార్థులకు సాయం చేయాలి.. వాళ్ల పురోగతిలో భాగస్తులం కావాలి.. సాధ్యమైన సౌజన్యాన్ని పంచాలనుకొని సమాజ సేవలో తరిస్తున్నారు. పట్టణంలో సాధారణ నేత కార్మికులైన కుసుమ రామయ్య–శాంతవ్వ దంపతులకు మల్లేశం, విఠల్, శ్రీహరితోపాటు ముగ్గురు కూతుళ్లున్నారు. పాఠశాల విద్య పూర్తి చేసేందుకు కూడా సహకరించని ఆర్థిక పరిస్థితుల మధ్య నానా ఇబ్బందులు పడుతూ చదువుకున్నారు. పసితనం నుంచే చురుగ్గా ఉండే మల్లేశం, విఠల్, శ్రీహరి తల్లిదండ్రులకు సహాయపడుతూనే చదువుపై ఆసక్తి పెంచుకున్నారు. ఫలితంగా శివనగర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతిలో ప్రతిభావంతుడిగా మల్లేశం, పక్కనే జెడ్పీ హైస్కూల్ నుంచి ఎస్సెస్సీలో స్టేట్ ఐదో ర్యాంకుతో విఠల్ ఉత్తీర్ణుడయ్యాడు. గాంధీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్, ఎండీ జనరల్ మెడిసిన్ కోర్సులు, పెళ్లి తరువాత అమెరికాలో గ్యాస్ట్రో ఎంటరాలజీలో సూపర్ స్పెషలైజేషన్ చేసి అక్కడే స్థిరపడ్డారు. పండుగకు వచ్చి.. చలించి.. పండుగకు సిరిసిల్లకు వచ్చిన విఠల్.. చదువుకున్న బడికి వెళ్లారు. వర్షాకాలం కావడంతో పైకప్పు నుంచి ఉరుస్తున్న దృశ్యానికి చలించిపోయారు. పాఠశాల పురోగతి కోసం రూ.15లక్షల విరాళం ప్రకటించాడు. తన తండ్రి పేరుతో కుసుమ రామయ్య జెడ్పీ హైస్కూల్గా స్థిరపడింది. కంప్యూటర్ విద్య కోసం రూ.5లక్షలు, జెండా వందనాలు, పిల్లల పండుగలు, ఫర్నీచర్కు ప్రతి ఏటా కొంత నిధిని సమకూరుస్తున్నారు. యూఎస్ఏలో ప్లాస్టిక్ సర్జన్గా పని చేస్తున్న కొడుకు శశిధర్తో ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా వైద్యశిబిరాన్ని నిర్వహించి 100కు పైగా శస్త్ర చికిత్సలు చేయించారు. గాంధీ మెడికల్ కళాశాలకు రూ.15లక్షలు విరాళం, హైదరాబాద్లో ఉన్న పద్మశాలీ, ఉమెన్స్ హాస్టళ్లకు ఆర్థిక చేయూత, అమెరికాలోని ఆలయాలు, ఆసుపత్రుల అభివృద్ధి కోసం దాదాపు రూ.30లక్షల వరకు వెచ్చించారు. పెన్షన్ నిధితో ప్రతిభా పురస్కారాలు పుట్టి పెరిగిన ప్రాంతంపై అభిమానంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించాలనుకున్నారు కుసుమ మల్లేశం. సివిల్ ఇంజనీర్గా ఏఈ హోదాలో ఉద్యోగ విరమణ చేసిన ఆయన తనకు వచ్చిన పెన్షన్ డబ్బుల్లోంచి కొంత మొత్తాన్ని ప్రభుత్వ పాఠశాలల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. తద్వారా వచ్చే వడ్డీ డబ్బులతో ప్రతి ఏటా ప్రతిభావంతులకు నగదు పురస్కారాలు అందజేసేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు అగ్రహారంలోని ఎస్ఆర్ఆర్ పాలిటెక్నిక్ కళాశాల, శివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కుసుమ రామయ్య జెడ్పీ హైస్కూల్, గీతానగర్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానాచార్యులకు డిపాజిట్ చేసిన పత్రాలను అందజేశారు. యూనియన్ బ్యాంకు, కేడీసీసీ బ్యాంకుల్లో రూ.1.5లక్షల చొప్పున డిపాజిట్ చేసిన పత్రాలను ఇటీవలే ఆయా విద్యాసంస్థల ప్రధాన నిర్వాహకులకు అందజేశారు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ప్రోత్సాహం సర్కార్ బడుల బాగు కోసం ఆర్థిక చేయూత -
అనిల్కుమార్కు పురస్కారం
కరీంనగర్ కల్చరల్: త్రివర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బిర్లా ప్లానిటోరియం భాస్కర ఆడిటోరియంలో ఆదివారం దక్షిణ భారత భాషా కవి సమ్మేళనం నిర్వహించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు డా.నందిని సిధారెడ్డి చేతుల మీదుగా కరీంనగర్కు చెందిన కవి కొత్త అనిల్కుమార్ ప్రజాకవి కాళోజీ నారాయణరావు సాహిత్య పురస్కారం అందుకున్నారు. అన్నాడి గజేందర్రెడ్డికి గుర్రం జాషువా పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆచార్య కొలకూరి ఇనాక్, ఎమ్మెల్సీ ఇక్బాల్, బైస దేవదాస్, దొమ్మటి శంకర్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన సాహితీవేత్తలు పాల్గొన్నారు. -
వరి పంటపై గడ్డి మందు
● భూ తగాదాలతో ప్రత్యర్థి పనేనంటున్న బాధితుడు సైదాపూర్: రెండేళ్ల నుంచి కొనసాగుతున్న భూ తగాదాలో భాగంగా పచ్చని వరి పంటకు ప్రత్యర్థులు గడ్డి మందు కొట్టి నాశనం చేశారని ఓ రైతు వెన్నంపల్లిలోని వరి చేనులో బోరున విలపించాడు. బాధితుడి వివరాల ప్రకారం.. ఆరెపల్లికి చెందిన బాగోతపు వెంకటయ్య అనే రైతు వెన్నంపల్లికి చెందిన మొలుగూరి లింగయ్య అనే రైతు వద్ద సర్వే నం.300/2లో 2.25 ఎకరాలు కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటున్నాడు. 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాడు. రెండేళ్ల నుంచి మొలుగూరి రాజయ్య అందులో 0.20 గుంటల భూమి ఉందని గొడవ పడుతున్నాడు. వెంకటయ్య వేసిన పంటలను ప్రతి ఏటా ధ్వంసం చేస్తున్నాడు. వెంకటయ్య పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నాడు. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకుల చుట్టూ తిరుగుతున్నాడు. ఇప్పటికీ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. 25 రోజుల క్రితం వరి నాటు వేశాడు. పచ్చగా ఉన్న వరి పంటను శుక్రవారం రాత్రి గడ్డి మందు కొట్టి ధ్వంసం చేశారని వెంకటయ్య వరి చేనులో విలపిస్తూ ఆరోపించాడు. భూ సమస్యను పరిష్కరించి పంట ధ్వంసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. -
ముంబయి–కరీంనగర్ మధ్య మరో వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు
రామగుండం: రాబోయే దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకొని పలు రూట్లలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మధ్య రైల్వే జోన్ పరిధిలోని ముంబాయి డివిజన్ రైల్వే అధికారులు అక్టోబర్ 1 నుంచి నవంబర్ 26 మధ్య రైలు నడపనుంది. రైలు నం.01067 ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్(సీఎస్ఎంటీ) లోకమాన్య తిలక్ టర్మినస్(ఎల్టీటీ) ముంబాయి నుంచి కరీంనగర్ మధ్య రాకపోకలు సాగించి అక్టోబర్ 1, 8, 15, 22, 29, నవంబర్ 5, 12, 19, 26ల్లో కరీంనగర్కు ఉదయం 8.30 గంటలకు చేరుకోనుంది. రైలు నం.01068 తిరుగు ప్రయాణం కరీంనగర్–ముంబయి వరకు అదే తేదీల్లో కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం ముంబాయి చేరుకుంటుంది. కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూర్, నిజామాబాద్ జంక్షన్, బాసరలో హాల్టింగ్స్ కల్పించారు. ఈ రైలులో షిర్డీ వెళ్లే భక్తులు నాగర్సోల్లో దిగి వెళ్లేందుకు అవకాశముంటుంది. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకునేందుకు నాసిక్లో హాల్టింగ్ ఉంది. ఈ రైలుకు ఫస్ట్ క్లాస్ ఏసీ–1, 2, సెకండ్క్లాస్ ఏసీ–2, థర్డ్ ఏసీ–6, స్లీపర్ క్లాస్–8, జనరల్ బోగీలు 3 ఉంటాయి. ఈ రైలు కరీంనగర్ రైల్వే స్టేషన్లో కనీసం 9 గంటలు ప్లాట్ఫారంపై ఉండడంతో దానిని కాగజ్నగర్ వరకు పొడిగించే అవకాశాలను పరిశీలించాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
హైకోర్టుకు మెటా నిందితులు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: మెటా ఫండ్ క్రిప్టో కరెన్సీ పేరిట ఉమ్మడి జిల్లాలో రూ.కోట్లు వసూలు చేసిన నిందితుల విషయంలో కరీంనగర్ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. అధిక లాభాలు ఆశ చూపించి రూ. లక్షలు పెట్టుబడుల కింద తీసుకుని, బోర్డు తిప్పేసిన కంపెనీ విషయంలో పోలీసులు మెతక వైఖరి అవలంబిస్తున్నారని బాధితులు మండిపడుతున్నా రు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్కు హైకోర్టును ఆశ్రయించడమే ఇందుకు ఉదాహరణ అని ఆరోపిస్తున్నారు. అధిక లాభాల పేరిట పలువురు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారుల వద్ద నుంచి ఒక్క కరీంనగర్ జిల్లాలోనే రూ.30 కోట్లు, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలు రాష్ట్రవ్యాప్తంగా రూ.100 కోట్ల వరకు వసూలు చేసిన మెటా ఫండ్ ప్రతినిధుల్లో ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడం, నిందితులు యథేచ్ఛగా తిరుగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండుసార్లు పిటిషన్, ఒక కేసు మెటా కుంభకోణం కొత్తదేం కాదు. మే, జూన్లో క రీంనగర్ కమిషనరేట్ పరిధిలోని రూరల్, టూ టౌన్, కొత్తపల్లి పీఎస్ పరిధిల్లో పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఆయా ఠాణా ల్లో ఎస్హెచ్వోలు ఈ కేసు గ్రావిటీ తెలిసినప్పటికీ నిందితులతో చేతులు కలిపారని బాధితులు ఆరోపిస్తున్నారు. రూ.కోట్లు మోసం చేసిన వారికి అనుకూలంగా వ్యవహరించి, పిటిషన్ వెనక్కు తీసుకునేలా చేయడంలో పోలీసులు సఫలీకృతమయ్యారని అంటున్నారు. జూలైలో ఇదే మెటా ఫండ్ కేసులో దాస రి రమేశ్, దాసరి రాజుపై పిటిషన్లు ఇచ్చినా.. ఈ రూ.కోట్ల కుంభకోణం గురించి వార్తాపత్రికల్లో కథనాలు వస్తున్నా.. నిందితులపై కేసుగా నమోదు చేయడంలో పోలీసులు తాత్సారం ప్రదర్శించారు. పిటిషనర్లు కూడా కేసు పెట్టేందుకు వెనకాడారు. తిరిగి అదే వ్యక్తులపై మూడోసారి పిటిషన్ రావడం, ఈసారి పిటిషనర్ బలంగా నిలబడటంతో విధిలే క కేసు నమోదు చేసి, దర్యాప్తుకు మీన మేషాలు లె క్కించారు. బాధితులు ఉన్నతాధికారులను కలి సేందుకు సిద్ధపడ్డారు. కేసు దర్యాప్తులో జాప్యాన్ని నివా రించేందుకు కేసును సీసీఎస్కు అప్పగించారు. ఈ విషయం లీకవడంతో నిందితులు విజయవాడకు పరారై అక్కడ నుంచి ముందస్తు బెయిల్కోసం హై కోర్టును ఆశ్రయించారు. దీనికి కరీంనగర్ పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు.ఐదుగురిలో ముగ్గురు పరారీ..ఈ కేసులో హైదరాబాద్కు చెందిన లోకేశ్, కరీంనగర్కు చెందిన దాసరి రమేశ్, దాసరి రాజు, ప్రకా శ్, సతీశ్ మాస్టర్మైండ్స్గా ఉన్నారు. వీరు కులాన్ని, లాభాలను ఎరగా వేసి రోజుకు రూ.6లక్షల చొప్పున ఆదాయాన్ని పొందవచ్చని పెట్టుబడులు పెట్టించారు. వసూలు చేసిన మొత్తంతో ఇప్పటికే లోకేశ్ థాయ్లాండ్కు, రమేశ్, రాజులు విజయవా డకు పారిపోయారు. ఇక మిగిలింది సతీశ్, ప్రకాశ్ లే. వీరిలో సతీశ్ అనే వ్యక్తి దర్జాగా అధికార కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుండటం విశేషం. పెట్టుబడి పెట్టిన వారిలో అధికశాతం రెవెన్యూ, పోలీసు, ప్రభుత్వ టీచర్లు, రియల్టర్లు ఉన్నారు. ఇ దే నిందితులకు అనుకూలంగా మారుతోంది. ఈ ప్రభుత్వ ఉద్యోగులను మెటా ప్రతినిధులు ప్రభు త్వ అనుమతి లేకుండా సింగపూర్, బ్యాంకాక్, మలేషియా దేశాలకు మసాజ్ల కోసం విహారయాత్రలకు తీసుకువెళ్లారు. తీరా ఇప్పుడు కేసులు పెడితే.. ఎక్కడ తమ ఉద్యోగాలు పోతాయో.. అ న్న భయంతో కేసులకు వెనకాడుతున్నారు. అందులోనూ వీరి పెట్టుబడి పెట్టిన డబ్బంతా అక్రమార్జన, నల్లడబ్బు కావడంతో తేలుకుట్టిన దొంగల్లా.. తెరవెనక నుంచి సెటిల్మెంట్ కోసం యత్నిస్తున్నారు. -
ఇల్లు కట్టు.. చిత్రాలు పెట్టు
కరీంనగర్ అర్బన్: ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లు చెల్లింపులో జాప్యానికి చెక్ పెడుతూ ప్రభుత్వం నూతన విధానం తీసుకొచ్చింది. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలో ఆలస్యం చేసినా లబ్ధిదారే ఫొటో అప్లోడ్ చేసేలా యాప్లో ప్రత్యేక ఆప్షన్ ఇచ్చింది. బిల్లుల కోసం ప్రతిపాదనలు పంపడంలో ఎదురవుతున్న జాప్యాన్ని నివారించేందుకు లబ్ధిదా రుకే చిత్రాలను అప్లోడ్ చేసే అవకాశం కల్పించింది. ఇల్లు నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి నిర్మాణ దశలను గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, మునిసిపాలిటీలో వార్డు అధికారి చిత్రాలను తీసి ఇందిరమ్మ ఇళ్ల యాప్లో అప్లోడ్ చేయాలి. అవి గృహనిర్మాణ శాఖ ఏఈ లాగిన్కు అటు నుంచి డీఈ, పీడీ తర్వాత కలెక్టర్కు వెళ్తాయి. బేస్మెంట్ పూర్తయితే రూ.లక్ష, గోడల దశలో మరో రూ.లక్ష, స్లాబు పూర్తయితే రూ.2లక్షలు, రంగులు వేశాక మరో రూ.లక్ష చొప్పున మొత్తం రూ.5 లక్షలు విడతల వా రీగా లబ్ధిదారు బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. ఈ ప్రక్రియలో ఆలస్యం కావడం, డబ్బులు డి మాండ్ చేస్తుండటంతో చిత్రాలను అప్లోడ్ చేసే అవకాశం లబ్ధిదారుకే ఇ చ్చారు. అధికారులు మళ్లీ ఆయా చిత్రాలు నిజమైనవేనా అని క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతారు. -
జీపీవోలొస్తున్నారు
కరీంనగర్ అర్బన్: గ్రామ పాలన అధికారు(జీపీవో)లొస్తున్నారు. నాలుగైదు రోజుల్లో విధుల్లో చేరనుండగా రెవెన్యూ సమస్యలు గాడిన పడనున్నాయి. భూ రికార్డుల నిర్వహణలో ఇక వీరే కీలకం కానున్నారు. 2020 సెప్టెంబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన విషయం విదితమే. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త హోదాను సృష్టిస్తూ గ్రామస్థాయి రెవెన్యూ సేవలను పునరుద్ధరించింది. వీఆర్వోల్లో ప్రతిభ గల వారిని గుర్తించి ఈ నెల 5న జీపీవో నియామక పత్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి అందజేశారు. సదరు జీపీవోలను జిల్లాకు అలాట్మెంట్ చేయగా ఈ నెల 8న కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇవ్వనున్నారు. గ్రామ పాలనలో వీరే కీలకం పల్లెలు ప్రగతి సాధించాలంటే క్షేత్రస్థాయిలో అన్నిశాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి. గ్రామాల్లో ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ, వైద్య, విద్య.. ఇలా దాదాపు 16 రకాల సిబ్బంది అందుబాటులో ఉన్నారు. రెవెన్యూపరమైన సమస్యల పరిష్కారానికి, భూముల హద్దుల గుర్తింపునకు గతంలో సేవలందించిన వీఆర్వో, వీఆర్ఎలను తొలగించారు. వారి స్థానాన్ని భర్తీ చేయడంతోపాటు గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు గ్రామ పాలనాధికారి వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. జీపీవో పోస్టుల భర్తీకి గతంలో రెవెన్యూశాఖలో వీఆర్వోలు, వీఆర్ఎలుగా పనిచేసిన వారిలో ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించి రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించగా జిల్లా పరిధిలో 163 మంది ఉత్తీర్ణత సాధించారు. జీపీవోల జాబ్చార్ట్ ఇదే ప్రభుత్వ, ప్రైవేటు భూములు, సర్వే నంబర్లు, చెరువులు, కుంటలు, శిఖం భూములు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పర్యవేక్షణ.. తదితర ప్రభుత్వ పరిపాలన వ్యవహారాలన్నీ జీపీవోలు పర్యవేక్షిస్తారు. జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో ఈ పోస్టులను ప్రభుత్వం కొత్తగా తీసుకురాగా 11 రకాల జాబ్చార్ట్ను అనుసరించనున్నారు. భూభారతి చట్టంలో భాగంగా భవిష్యత్లో ప్రతి రిజిస్ట్రేషన్–మ్యుటేషన్కు గ్రామ పటం జోడించడంలో వీరు సహాయకారిగా పనిచేయనున్నారు. గ్రామ స్థాయిలో భూఖాతా (విలేజ్ ఎకౌంట్) ని ర్వహణ, పహాణీల నమోదు, రెవెన్యూ మాతృ ద స్త్రం నిర్వహిస్తారు. అన్నిరకాల భూముల నిర్వహణ, మార్పు చేర్పులు చేస్తారు. లావోణి, లసైన్డ్, దేవాదాయ, వక్స్, ప్రభుత్వం సేకరించిన భూ ముల నిర్వహణ చూస్తారు. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, నీటివనరుల కింద భూములను పరిరక్షిస్తారు. భూమి ఖాతాల నిర్వహణ, మా ర్పు, చేర్పుల నమోదు చేస్తారు. భూ సర్వేకు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే సేవలందిస్తారు. ప్ర కృతి విపత్తులు వాటిల్లితే నష్టం అంచనా వేస్తా రు. గ్రామస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల కు అర్హుల ఎంపికలో విచారణ చేస్తారు. జనన, మరణ విచారణలు నిర్వహిస్తారు. ఎన్నికల సమయంలో గ్రామస్థాయిలో సహకారం. వివిధ ప్ర భుత్వశాఖల మధ్య సమన్వయంగా పనిచేస్తారు. జిల్లాలో మొత్తం గ్రామాలు: 318కార్పొరేషన్: 01(కరీంనగర్) మున్సిపాలిటీలు: 03(హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి) సాగు విస్తీర్ణం: 3,38,450 ఎకరాలు వ్యవసాయేతర భూమి: 33,007ఎకరాలు ప్రభుత్వ భూమి: 40,366వక్ఫ్భూములు: 517 ఎకరాలు అటవీ భూములు: 1,748 ఎకరాలు ఖాతాల సంఖ్య: 1,92,687మొత్తం సర్వేనంబర్లు: 3,51,545 రెవెన్యూ డివిజన్లు: 02(కరీంనగర్, హుజూరాబాద్) రెవెన్యూ క్లస్టర్లు: 255రెవెన్యూ గ్రామాలు: 205జీపీవోలు: 163 -
● ప్రభుత్వ బడులకు రేటింగ్ ● ఆరు అంశాల ఆధారంగా నిర్ణయం ● రేటింగ్ సాధించిన స్కూళ్లకు పురస్కారాలు
కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి. పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్(ఎస్హెచ్వీఆర్) పేరుతో మెరుగైన సౌకర్యాలు, పారిశుధ్య నిర్వహణపై దృష్టిసారించాయి. పాఠశాలలు పరిశుభ్రంగా ఉంటే విద్యార్థుల ఆరోగ్యాలు బాగుంటాయని, వారి ఆరోగ్యాలు బాగుంటే నాణ్యమైన చదువు అందుతుందని భావించిన కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి 2020 వరకు పాఠశాలలకు ఏటా ప్రత్యేక పురస్కారాలు అందించింది. ఐదేళ్లుగా నిలిచిన ఈ కార్యక్రమాన్ని మళ్లీ విద్యా సంవత్సరం ప్రారంభించింది. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్(ఎస్హెచ్వీఆర్) పేరుతో ప్రత్యేక పురస్కారాలు అందించనుంది. మూత్రశాలలు, పారిశుధ్య నిర్వహణ, మరుగుదొడ్ల వినియోగం, నీటివసతి తదితర అంశాలను పక్కాగా అమలు చేస్తున్న పాఠశాలలకు రేటింగ్ ఇవ్వనున్నారు. 60అంశాల ఆధారంగా 1–5 రేటింగ్ కేటాయించనున్నారు. అత్యుత్తమ రేటింగ్ సాధించి, జాతీయస్థాయికి ఎంపికై న పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష నజరానా అందించనుంది. జిల్లాలో 651 పాఠశాలలు జిల్లావ్యాప్తంగా 651 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 35వేల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. మనఊరు– మనబడి, అమ్మ ఆదర్శ పాఠశాలల అమలుతో చాలా పాఠశాలల రూపురేఖలు మారాయి. కిచెన్ గార్డెన్ల వినియోగం, మరుగు దొడ్ల నిర్వహణ మెరుగుపడ్డాయి. ఇలాంటి పాఠశాలల్లో ఆరు ప్రధానాంశాలను నమోదు చేసి, దాన్నిబట్టి రేటింగ్ ఇస్తారు. మొత్తం 60 ప్రశ్నలకు 125 మార్కులు సాధిస్తే అయిదు స్టార్స్ ఇస్తారు. నీటి సంరక్షణ, తాగునీటి వసతికి 22 మార్కులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, చేతుల శుభ్రతకు 27, మొక్కలు తోటల పెంపకానికి 14, వ్యర్థాల నిర్వహణకు 21, విద్యుత్తు పొదుపు, సోలార్ వినియోగానికి 20, పర్యావరణ పరిరక్షణ అవగాహనకు 21 మార్కులు ఉంటాయి. అయిదు రేటింగ్స్ సాధించిన పాఠశాలలకు కేంద్రం పురస్కారాలు అందించే అవకాశం ఉంది. పాఠశాలలను అభివృద్ధి చేసి, నిర్వహణలో తమవంతు కృషి చేస్తున్న హెచ్ఎంలు చొరవ తీసుకొని నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఆరు అంశాల ఆధారంగా పాఠశాలల రేటింగ్ను నిర్ణయిస్తారు. జాతీయస్థాయి వరకు పోటీ స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్(ఎస్హెచ్వీఆర్) కార్యక్రమంపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు ఇప్పటికే ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఈనెల 4 నుంచి 30వ తేదీ వరకు ఉపాధ్యాయులు వారి పాఠశాలల వివరాలు ఎస్హెచ్వీఆర్ యాప్ లేదా ఎస్హెచ్వీఆర్.ఎడ్యుకేషన్.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో యూడైస్ కోడ్తో లాగిన్ అయి నమోదు చేయాల్సి ఉంటుంది. జిల్లాస్థాయి నుంచి రాష్ట్ర, జాతీయస్థాయి వరకు పోటీ పడేందుకు ఆరు అంశాల ఆధారంగా రేటింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు.స్వచ్ఛ పాఠశాలలే లక్ష్యంగా.. -
రాజన్నకు భక్తుల నీరాజనం
వేములవాడ: రాజన్నను శనివారం 15వేల మంది భక్తులు దర్శించుకున్నారు. అభిషేకాలు, అన్నపూజలు, కల్యాణాలు, సత్యనారాయణ వ్రతాల మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్నను సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ(సెర్ప్) అడిషనల్ సీఈవో కాత్యాయనిదేవి, రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ కమిషనర్ సీతాలక్ష్మి వేర్వేరుగా దర్శించుకున్నారు. నాగిరెడ్డి మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఈవో రమాదేవి, పర్యవేక్షకులు జి.శ్రీనివాస్శర్మ, ఆలయ ఇన్స్పెక్టర్ నూగూరి నరేందర్, ప్రొటోకాల్ అధికారులు అశోక్, సింహాచార్యులు పాల్గొన్నారు. అలరించిన ‘ట్రినిటి’ ఫ్రెషర్స్ డేకరీంనగర్కల్చరల్: నగరంలోని శుభం గార్డెన్లో శుక్రవారం రాత్రి నిర్వహించిన ట్రినిటి జూనియర్ కళాశాల (గర్ల్స్) ఫ్రెషర్స్ డే వేడుకలు అలరించాయి. ట్రినిటి వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్రెడ్డి, ట్రినిటి గ్రూప్ చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డిలు జ్యోతిప్రజ్వలన చేసి మాట్లాడుతూ ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ముందుఆ నిర్వహించే ఆలోచన ఉన్నందున ఆ దిశగా విద్యార్థులు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని సూచించారు. మీ ప్రయాణం ఆధ్యాత్మికత, విద్య, క్రీడా, సాంస్కృతిక అభివృద్ధితో నిండి ఉండాలని అన్నారు. ఇంటర్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన సర్టిఫికెట్లు, ట్రోఫీలు అందజేశారు. విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. కాత్యాయనిదేవికి స్వామి వారి ప్రసాదాలు అందజేస్తున్న అర్చకులుసోషల్ వెల్ఫేర్ కమిషనర్ సీతాలక్ష్మికి ప్రసాదాలు అందిస్తున్న అర్చకులు -
ఇయర్ ఫోన్స్ వాడొద్దు
ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. ప్రజలు మరింత సౌలభంగా ఉండేందుకు వీలుగా ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు. ప్రస్తుతం వచ్చిన ఇయర్ ఫోన్స్లో శబ్ద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. చెవి నొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యం కోసం ఇయర్ ఫోన్న్లను తక్కువ వాడటమే ఉత్తమం. – రాజు, ఈఎన్టీ వైద్యుడు, హుజూరాబాద్ ‘హుజూరాబాద్కు చెందిన శ్రావణికి (పేరు మార్చాం) ఫోన్లో రీల్స్ చూడడం.. పాటలు వినడం అలవాటు. ఎప్పుడు చూసినా ఇయర్ ఫోన్లు పెట్టుకొనే కనిపిస్తుంది. దీంతో ఆమె కర్ణభేరి దెబ్బతింది. రెండు చెవులు వినిపించడంలేదు. మెదడులో నరాలు దెబ్బతిన్నాయి. అప్పుడప్పుడు మతిస్థిమితం లేకుండా వ్యవహరిస్తోంది. డాక్టర్లను సంప్రదిస్తే అతిసీపం నుంచి శబ్ధం.. అంటే ఇయర్ ఫోన్స్ లాంటివి వాడితే ఇలాంటి ఇబ్బందులు వస్తాయని తెలిపారు. ఇప్పుడామెది ఏమీ వినలేని పరిస్థితి.’ ‘సిరిసిల్లకు చెందిన పరమేశ్కు(పేరు మార్చాం) ఇయర్ ఫోన్స్ పెట్టి సెల్ఫోన్లో పాటలు వినడం, సినిమాలు చూడడం అలవాటు. క్రమంగా ఆయన వినికిడి శక్తిని కోల్పోయాడు. చెవిలో అతిదగ్గరినుంచి శబ్దం వినడంతో కర్ణభేరికి ఇబ్బందిగా మారిందని వైద్యులు చెప్పారు. ఇప్పుడాయనా చెవికి వినికిడి పరికరం అమర్చుకున్నాడు. లేదంటే ఆయన ఎలాంటి శబ్ధం వినలేడు’.చెవి ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలంలో వినికిడి సమస్య తలెత్తుతుంది. అందుకే లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు. చెవుల్లో శబ్దాల హోరు చిన్న శబ్దాలను కూడా వినలేకపోవడం చెవుల్లో తరచూ ఇన్ఫెక్షన్లు, నొప్పి అధికంగా గులిమి ఏర్పడడం చెవిపై ఒత్తిడి పెరగడంతో వర్దిగో సమస్య -
2,206 విగ్రహాలు నిమజ్జనం
కరీంనగర్ కార్పొరేషన్/కరీంనగర్ కల్చరల్/కొత్తపల్లి/కరీంనగర్ టౌన్/ మానకొండూర్: వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం ప్రారంభమై శనివారం సాయంత్రం వరకు కొనసాగింది. నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో మానకొండూరు, కొత్తపల్లి చెరువు, చింతకుంట కెనాల్ వద్ద నిమజ్జన కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 2,206 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. వీటితో పాటు దుర్శేడ్, గోపాల్పూర్, బొమ్మకల్లోని చెరువులు, వాగుల్లోనూ నిమజ్జనం చేశారు. విగ్రహాల శిథిలాల తొలగింపును ఆదివారం నుంచి చేపట్టనున్నారు. ప్రతిసారి నిమజ్జనం అనంతరం ఆయా చెరువులు, కాలువల్లో విగ్రహ శిథిలాలు రోజుల తరబడి పేరుకుపోవడం, స్థానికుల ఫిర్యాదుల నేపథ్యంలో ఈసారి ముందుగానే శిథిలాల తొలగించడానికి నగరపాలకసంస్థ రంగం సిద్ధం చేసింది. నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా విగ్రహ శిథిలాల తొలగింపునూ టెండర్లో చేర్చింది. మానకొండూరు చెరువు నుంచి విగ్రహాలు, శిథిలాలు తొలగించడానికి రూ.98 వేలు, కొత్తపల్లి చెరువు నుంచి తొలగించేందుకు రూ.95 వేలు,చింతకుంట కెనాల్ నుంచి తొలగించేందుకు రూ.99 వేలు కేటా యించారు. ఆదివారం నుంచి శిథిలాల తొలగింపును ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం వరకు కొనసాగిన నిమజ్జనం మానకొండూర్, కొత్తపల్లి చెరువు, చింతకుంట కెనా ల్లో శనివారం సాయంత్రం వరకు నిమజ్జన కార్యక్రమం కొనసాగింది. మానకొండూర్ చెరువుకు వేకువజాము వరకు భారీ విగ్రహాలు తరలివచ్చా యి. 844 పెద్దవి, 174 చిన్న విగ్రహాలు నిమజ్జనం చేసినట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్ రాంనగర్లోని మిత్ర యూత్ క్లబ్ భారీ గణేశుడిని చింతకుంట కెనాల్లో నిమజ్జనం చేయడంతో వేడుకలు సంపూర్ణంగా ముగిశాయి. కొత్తపల్లి చెరువులో 535 విగ్రహాలు, చింతకుంట ఎస్సారెస్పీ కెనాల్ వద్ద 488 విగ్రహాలు నిమజ్జనం చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిమజ్జన వేడుకలు విజయవంతంగా ముగిశాయని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ తెలిపారు. శనివారం కొత్తపల్లి చెరువు, చింతకుంట ఎస్సారెస్పీ కెనాల్ను పరిశీలించారు. భారీ గణేశుడి శోభాయాత్రకు అడ్డంకులు కరీంనగర్లోని రాంనగర్లో మిత్ర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 35అడుగుల భారీ మట్టి వినాయకుడి శోభాయాత్రకు విద్యుత్ తీగలు, సీసీ సర్వేలెన్స్ కెమెరాల స్తంభాలు అడ్డంకిగా మారాయి. దీంతో శుక్రవారం రాత్రి నుంచే రాంనగర్ చౌరస్తాలో శోభాయాత్ర నిలిచిపోయింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశాలతో మేరకు మాజీ మేయర్ వై.సునీల్రావు విద్యుత్శాఖ, నగరపాలక సంస్థ కమిషనర్తో మాట్లాడారు. అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలు, కెమెరా స్తంభాలను తొలగించి శోభయాత్రకు మార్గం సుగమం చేయడంతో గణేశుడు చింతకుంటకు నిమజ్జనానికి తరలాడు. కలెక్టర్, కమిషనర్లకు అభినందనలు కరీంనగర్లో గణేశ్ నిమజ్జన ఉత్సవాలు దిగ్విజయంగా పూర్తి చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో కార్యక్రమం నిర్వహించిన కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం, మున్సిపల్ కమి షనర్ ప్రఫుల్ దేశాయ్ సహా అన్నిశాఖల అధికారులను ఒక ప్రకటనలో ప్రత్యేకంగా అభినందించారు.మానకొండూర్ 1,018 కొత్తపల్లి 535 చింతకుంట 488 దుర్శేడ్ 78 బొమ్మకల్ 48 గోపాల్పూర్ 39 మొత్తం 2,206 -
వెనకబడిన విద్యార్థులపై దృష్టి పెట్టండి
కొత్తపల్లి(కరీంనగర్)/కరీంనగర్: ఉపాధ్యాయులు నిరంతరం నేర్చుకోవడంతో పాటు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కొత్తపల్లి శివారులోని ఓ ఫంక్షన్ హాలులో తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు చదువుతో పాటు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, నైతిక విలువలు బోధించాలన్నారు. గంజాయి, మత్తు పదార్థాలకు బానిస కాకుండా గమనించాలని సూచించారు. ప్రభుత్వం తరఫున ప్రైవేటు పాఠశాలల టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ (ఎస్హెచ్వీఆర్)లో పాల్గొనాలని సూచించారు. డీఈవో చైతన్య జైనీ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులకు ప్రశంశాపత్రాలు అందించి సత్కరించారు. ఓల్డ్ హైస్కూల్ భవనాన్ని సైన్స్ మ్యూజియంగా మార్చాలి నగరంలోని ఓల్డ్ హైస్కూల్ భవనాన్ని సైన్స్ మ్యూజియంగా ఆధునీకరించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. పురాతన ఉన్నత పాఠశాల భవనంలో కొనసాగుతున్న సైన్స్ మ్యూజియాన్ని శనివారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, బల్దియా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఈవో చైతన్య జైనీతో కలిసి సందర్శించారు. పురాతన పాఠశాల తరగతులను నూతన భవనంలోకి మార్చాలన్నారు. అక్కడే కొనసాగుతున్న డీసీబీ కార్యాలయాన్ని మరోచోటకు, ఓపెన్ స్కూల్ కేంద్రాన్ని సీతారాంపూర్లోని ఎంపీపీఎస్ పాఠశాల సమీప భవనంలోకి తరలించాలన్నారు. పురాతన పాఠశాల భవనాన్ని పూర్తిగా సైన్స్ మ్యూజియానికే కేటాయించాలన్నారు. సైన్స్ మ్యూజియంలో రోబోటిక్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్, ఆర్ట్, క్రాప్ట్ కంప్యూటర్ ల్యాబ్ కోసం ప్రత్యేక గదులు, విద్యార్థుల కోసం సెమినార్ హాల్ ఏర్పాటు చేయాలన్నారు. సమగ్ర శిక్ష జిల్లా కోఆర్డినేటర్ అశోక్, జిల్లా సైన్స్ అధికారి జైపాల్ పాల్గొన్నారు. -
కొడుకు పుట్టనో..చెట్టునో పట్టుకుని ఉంటడు
● జాడ కోసం గోదావరిలో గాలించండి ● రాజేశ్ యాదవ్ తల్లిదండ్రుల ఆవేదన ● వినాయక నిమజ్జన ప్రదేశంలో కన్నీటి పర్యంతం ● నదిలో కొనసాగుతున్న గాలింపు చర్యలు రామగుండం/యైటింక్లయిన్కాలనీ: ‘నా కొ డుకు చెట్టునో పుట్టనో పట్టుకొని ఉంటడు.. ఒక్కగానొక్క కొడుకు.. ఓ కన్ను పోయినా సాదుకుంటా.. ఓ కాలు తెగినా సాదుకుంటా దేవుడా.. ఎంతో అందంగా ఉన్న సక్కనోడు.. అమ్మా.. నాన్న ఒక్కడు పనిచేస్తే డబ్బులు సరిపోతలేవు.. దసరా పోయినంకా నేను కూడా పనికి పోతనే.. నీకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో నీవు పనిచేసే పరిస్థితి లేదు కదా.. నేను, నాన్న ఇద్దరం కలిసి పనికి పోతమే.. ఏడాదిలో రెండు గదులతో ఇల్లు కట్టుకుందామే.. అంటివి బిడ్డా.. మొన్ననే సెల్ఫోన్ కొనిత్తిని.. వినాయకుడా.. నాకు కడుపుకోత పెట్టకు.. గోదారమ్మ తల్లీ.. నా కొడుకును నువ్వు తీసుకుంటే నేను, మా ఆయన ఇద్దరం కలిసి నీ ఒడిలోకి చేరుతం’ అని ఆ తల్లి రోదించిన తీరు స్థానికులను కంట తడిపెట్టించింది. వివరాలు.. స్థానిక అక్బర్నగర్ కాలనీలో నివాసం ఉంటున్న నారకట్ల మహేశ్వ రి – సత్యం దంపతుల కుమారుడు రాజేశ్యా దవ్ ఉన్నాడు. అదేకాలనీలో గణపతి విగ్రహాన్ని శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గోదావరిఖని గంగానగర్ సమీప గోదావరిలో నిమజ్జనం చేసేందుకు మండప నిర్వాహకులతో కలిసి వెళ్లాడు. శనివారం వేకువజామున విగ్రహం నిమజ్జనం కోసం క్రేన్ కొక్కేనికి తగిలించే క్రమంలో టేబుల్పైకి రాజేశ్యాదవ్ ఎక్కాడు. దానిపై అడ్డుగా ఉన్నతీగలు కాలికి తగలడంతో అదుపుతప్పి ప్రమాదవాశాత్తు గోదావరిలో పడిపోయాడు. మధ్యాహ్నం 12 గంటల వరకూ యువకుడి ఆచూకీ లభించలేదు. ఈ ఘటనను నిరసిస్తూ అక్బర్నగర్ కాలనీవాసులు నది వంతెనపై బైఠాయించి నిరసన తెలిపారు. వినాయక నిమజ్జనం ప్రశాంతంగా పూర్తియ్యిందనుకునే సమయంలోనే గో దావరిలో యువకుడు గల్లంతుకావడంతో విషా దం నెలకొంది. ఎమ్మెల్యే మక్కాన్సింగ్ ఠాకూ ర్, బీఆర్ఎస్ కార్మిక సంఘం నేత కౌశిక హరి, కాంగ్రెస్ నేత అయోధ్యసింగ్ఠాకూర్, ఏసీపీ రమేశ్, సీఐలు ప్రసాదరావు, ఇంద్రసేనారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వంతెన పిల్లర్ల నుంచి సుందిళ్ల బ్యారేజీ వరకు రెండు స్పీడ్ బోట్లు, నాలుగు నాటు పడవలు, ఇరవై మందితో గా లింపు చర్యలు చేపట్టామని ఏసీపీ రమేశ్ తెలి పారు. కాగా, మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ మా ట్లాడుతూ, రాజేశ్యాదవ్ కుటుంబానికి రూ. 2లక్షల నగదు పరిహారంగా అందిస్తామని, ఇందిరమ్మ పథకంలో ఇల్లు ఇప్పిస్తామన్నారు. ఊహించని పరిణామమని బీఆర్ఎస్ కార్మిక సంఘం నేత కౌశిక హరి అన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
చెవికి తీవ్ర నష్టం
సెల్ఫోన్ వచ్చాక చెవుడు సమస్యలు ఎక్కువయ్యాయి. 12–34 ఏళ్ల మధ్య 24శాతం మంది పర్సనల్ లిసెనింగ్ డివైజ్ (హెడ్ఫోన్స్, ఇయర్ బడ్స్) వాడుతూ, 48శాతం మంది 85 డిసెబుల్స్ కన్నా ఎక్కువ శబ్దాన్ని వింటూ వినికిడి సమస్యల బారిన పడుతున్నారు. తీవ్రమైన శబ్దం వినడం వల్ల శ్రవణ వ్యవస్థలో ఉండే సూక్ష్మమైన హెయిర్ సెల్స్ దెబ్బతిని చెవుడు ఏర్పడుతుంది. డీజే సౌండ్ లాంటి అధిక వాల్యూమ్తో శాశ్వత చెవుడు వచ్చే అవకాశముంది. మ్యూజిక్, వాయిస్కాల్స్ హెడ్ఫోన్స్, ఇయర్ బడ్స్తో ఎక్కువ సమయం వినడం వల్ల బ్రెయిన్ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇయర్ఫోన్స్, హెడ్ఫోన్స్, సెల్ఫోన్, డీజే సౌండ్ను ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మేలు. – ప్రశాంత్, ఈఎన్టీ నిపుణుడు -
ప్రభుత్వ భూమిలోని భవనం స్వాధీనం
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి తహసీల్దార్ పరిధి సీతారాంపూర్లోని సర్వే నంబర్ 26 ప్రభుత్వ శిఖం భూమిలో అక్రమంగా నిర్మించిన భవనాన్ని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశా ల మేరకు శనివారం రాత్రి అధికారులు స్వాధీ నం చేసుకున్నారు. తహసీల్ధార్ వెంకటలక్ష్మి, నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొయినొద్దీన్ ఆధ్వర్యంలో భవనంలోని సామగ్రిని ఖాళీ చేయించే ప్రయత్నం చేయగా.. మ హిళలు అడ్డుకున్నారు. తప్పుకోవాలంటూ తహసీల్దార్ చెప్పినప్పటికీ వినకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ బిల్లా కోటేశ్వర్ అక్కడికి చేరుకుని భవనాన్ని ఖాళీ చేయించారు. భవనాన్ని ఓపెన్ స్కూల్కు అప్పజెప్పనున్నట్లు అధికారులు వెల్లడించారు. భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని ఇటీవల కలెక్టర్కు గ్రామానికి చెందిన పాదం శివరాజ్, ఎడ్ల లక్ష్మణ్ ఫిర్యాదు చేశారు. ఎంఈవో ఆనందం, ఆర్ఐలు నదీమ్, రజనీకుమార్ పాల్గొన్నారు. కరీంనగర్కల్చరల్: పదోతరగతి, ఇంటర్ ఫెయిలైన స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులను తెలంగాణ ఓపెన్ స్కూల్లో చేర్పించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. మెప్మా, డీఆర్డీవో అధికారులతో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, ఉల్లాస్ రిజిస్ట్రేషన్లపై శనివారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. రిజిస్ట్రేషన్ల గడువు ముగియకముందే మీసేవ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించి, ఓపెన్ స్కూల్లో చేర్పించాలన్నారు. స్వయం సహాయక సంఘాల్లోని ప్రతి మహిళ అక్షర జ్ఞానం కలిగి ఉండాలన్న ఉల్లాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. డీఆర్డీవో శ్రీధర్, మెప్మా పీడీ సరూపారాణి పాల్గొన్నారు. జమ్మికుంట: వ్యవసాయ సాంకేతిక ప్రయోగ పరిశోధన సంస్థ(ఏటీఏఆర్ఐ) హైదరాబాద్ ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరులో ఈ నెల 4వ తేదీన 2024 ఏడాదికి సంబంధించి వార్షిక సమీక్ష నిర్వహించారు. తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల జోన్–ఎక్స్ పరిధి 72 కేవీకేల్లో జమ్మికుంట కేవీకే(కృషి విజ్ఞాన కేంద్రం)కు మూడో ర్యాంకు వచ్చింది. రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించింది. హైదరాబాద్ జోన్–ఎక్స్ డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్ మీరా, తమిళనాడు అవినాశలింగం విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ భారతి హరిశంకర్ల చేతుల మీదుగా జమ్మికుంట కేవీకే హెడ్, సీనియర్ శాస్త్రవేత్త వెంకటేశ్వర్లు ప్రశంస పత్రం అందుకున్నారు. కేవీకే ప్రధాన కార్యదర్శి విజయగోపాల్రెడ్డి మాట్లాడుతూ ప్రశంసపత్రం మరింత బాధ్యత పెంచిందని హర్షం వ్యక్తం చేశారు. ఇల్లందకుంట: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని కరీంనగర్ డివిజన్ దేవాదాయధశాఖ పరిశీలకుడు సత్యనారాయణ పర్యవేక్షణలో శనివారం లెక్కించారు. 4నెలల 14 రోజులకు గాను 23 హుండీలను లెక్కించారు. రూ.8,59,861 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఇన్చార్జి ఈవో కందుల సుధాకర్ తెలిపారు. దేవస్థాన కమిటీ చైర్మన్ ఇంగిలే రామారావు, ధర్మకర్తలు మూడేత్తుల మల్లేశ్ యాదవ్, గోపాల్రెడ్డి, కిషన్రెడ్డి, నాగరాజు, అర్చకులు శేషం వంశీధరాచార్యులు, నవీన్శర్మ పాల్గొన్నారు. -
జేఎన్టీయూ.. అరకొర వసతులు
వేములవాడఅర్బన్: రాజన్నసిరిసిల్ల జిల్లాకు జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ మంజూరుతోనే సరిపెట్టారు. ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేసిన ప్రభుత్వం పక్కా భవనం నిర్మాణం మరిచిపోయింది. దీంతో తాత్కాలికంగా అగ్రహారం డిగ్రీ కాలేజీలో నిర్వహిస్తున్నారు. డిగ్రీ కాలేజీలో ఉన్న వసతులు ఇంజినీరింగ్ విద్యార్థులకు సరిపోయేలా లేవు. అయినా తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 2021–02 విద్యాసంవత్సరంలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను ప్రారంభించారు. అప్పటి నుంచి అగ్రహారం డిగ్రీ కాలేజీలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. చాలీచాలని తరగతి గదులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తరగతి గదుల్లోని సగం గదులను తాత్కాలికంగా జేన్టీయూ కళాశాలకు వినియోగిస్తున్నారు. నాలుగేళ్లుగా అరకొర గదుల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఎనిమిది గదుల్లో తరగతులు కొనసాగుతున్నాయి. అగ్రహారం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఐదు కోర్సుల్లో 1,032 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ దాదాపుగా 20 తరగతి గదులు అవసరం ఉంటుంది. కానీ అరకొర గదులతోనే నెట్టుకొస్తున్నారు. కొండగట్టులో ప్రాక్టికల్స్ కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్ మాత్రమే ఉంది. ఈసీఈ, మెకానికల్ కోర్సు విద్యార్థులకు ప్రాక్టికల్స్ కోసం కొండగట్టు జేఎన్టీయూ కళాశాలకు తీసుకెళ్తున్నారు. సివిల్ కోర్సు విద్యార్థులను సమీపంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలోని ల్యాబ్కు తీసుకెళ్తున్నారు. మిగతా కోర్సులకు అంతంతే ల్యాబ్ సౌకర్యం ఉంది. అద్దె భవనాల్లో హాస్టల్ వసతి అగ్రహారంలోని ఎనిమిది అద్దె భవనాల్లో విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించారు. ఉదయం, మధ్యాహ్నం కళాశాలలోని మెస్లో టిఫిన్, భోజనం అందుబాటులో ఉంటుంది. రాత్రి కొందరు మెస్లో తింటున్నారు. దూరంగా ఉన్న హాస్టల్ విద్యార్థులకు అక్కడికి భోజనం పంపుతున్నారు. హాస్టల్ నుంచి కాలేజీకి దాదాపు కిలోమీటర్ దూరం ఉంది. హాస్టల్ నుంచి కాలేజీకి నడుచుకుంటూ రావాల్సిందే. ఇద్దరే ప్రభుత్వ ప్రొఫెసర్లు కళాశాల ప్రారంభించి నాలుగేళ్లు అవుతున్నా ఇద్దరే రెగ్యులర్ ప్రభుత్వ ప్రొఫెసర్లు ఉన్నారు. ఒకరు ప్రిన్సిపాల్, మకొకరు ఈసీఈ ప్రొఫెసర్. కాంట్రాక్ట్ పద్ధతిన ఐదుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 40 మంది గెస్ట్ ఫ్యాకల్టీ విధులు నిర్వర్తిస్తున్నారు. అగ్రహారం డిగ్రీ కాలేజీలో తరగతులు సరిపోని తరగతి గదులు కిలోమీటర్ దూరంలో హాస్టల్ అద్దె భవనం.. అసౌకర్యాలు ఇబ్బందిపడుతున్న విద్యార్థులుకళాశాలలో కోర్సులు, విద్యార్థులు కోర్సు ఫస్టియర్ సెకండియర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ సివిల్ 14 61 60 59 ఈఈఈ 16 62 60 63 మెకానికల్ 0 01 59 56 ఈసీఈ 54 68 66 64 సీఎస్ఈ 67 65 69 68 మొత్తం 151 257 314 310 -
తీరని యూరియా కష్టాలు
కాల్వశ్రీరాంపూర్/సుల్తానాబాద్/ఎలిగేడు(పెద్దపల్లి): యూరియా కోసం అన్నదాతలు అన్నిపనులూ వదిలేసి మండల కేంద్రాలు, పట్టణాలకు పరుగులు పెడుతున్నారు. వరి, పత్తి తదితర పంటలకు ప్రస్తుతం యూరియా ఎంతోఅవసరమని, అదను దాటితే ఎంతవేసినా ప్రయోజనం ఉండదనే ఆతృతతో అన్నదాతలు వేకువజాము నుంచే దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు. వచ్చే ఒకట్రెండు లోడ్లో వరుసలో ముందున్న వారికే సరిపోవడం లేదని, వెనుకాల ఉన్నవారి వంతు వచ్చేవరయే స్టాక్ ఖాళీ అవుతోందని రైతులు వాపోతున్నారు. శనివారం కూడా జిల్లావ్యాప్తంగా యూరియా కోసం రైతులు ఉదయమే సింగిల్విండోలు, దుకాణాలు, గ్రోమోర్ తదితర గోదాముల ఎదుట బారులు తీరి కనిపించారు. పోలీస్ బందోబస్తు మధ్య పంపిణీ సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి యూరియా వచ్చిందనే సమాచారంతో పలు గ్రామాల రైతులు ఉదయమే గోదాము వద్దకు చేరుకుని బారులు తీరారు. లారీలోడ్లో 340 బస్తాల యూరియా రావడంతో పట్టాదారుపాస్ పుస్తకాలు, సాగు విస్తీర్ణం ఆధారంగా ఒక్కో రైతుకు ఒకట్రెండు యూరియా బ్యాగులు అందజేశారు. రైతుల సంఖ్య అధికంగా ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎస్సై శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేశారు. మిగతా వారికి సోమవారం యూరియా స్టాక్ వస్తుందని చెప్పి పంపించి వేశారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని పీఏసీఎస్ కార్యదర్శి సంతోష్కుమార్, ఇన్చార్జి చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ తెలిపారు. క్యూలైన్లో చెప్పులు.. రైతుల పాట్లు కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలోని ఆగ్రోస్ కేంద్రం వద్దకు రైతులు ఉదయమే చేరుకున్నారు. అదేవిధంగా ఇదేగ్రామంలోని సాయికృష్ణ ఫెర్టిలైజర్స్ దుకాణం ఎదుట కూడా వందల సంఖ్యలో క్యూలో నిల్చున్నారు. యూరియా స్టాక్ రాక ఆలస్యం కావడంతో తమవంతు లైన్లో చెప్పులు ఉంచారు. రైతులు భారీ సంఖ్యలో తరలి రావడంతో పాస్బుక్కు జిరాక్స్ ఆధారంగా ఒక్కో రైతుకు ఒక బస్తా యూరియా, నానో లిక్విడ్ బాటిల్ ఇస్తున్నారు. పొద్దంతా పడిగాపులు కాస్తే.. ఒకబస్తా సైతం అందలేని, వరి పొట్టదశకు వచ్చిందని, పత్తి పూతపూసి గుంజర వచ్చేందుకు సిద్ధంగా ఉందని, ఈ సమయంలో యూరియా వేయాల్సి ఉన్నా.. దొరకడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీరని యూరియా కష్టాలు ఎలిగేడు మండలం ధూళికట్ట సహకార సంఘానికి యూరియా లోడ్ వచ్చిందనే సమాచారంతో ఎండను సైతం లెక్కచేయకుండా రైతులు ఉదయమే తరలివచ్చారు. క్యూలైన్లో ఒక్కసారిగా గందరగోళం నెలకొనడంతో పంపిణీని కాసేపే ఆపివేసారు. సాయంత్రం 5గంటలకు పోలీసులు రావడంతో పంపిణీని మళ్లీ ప్రారంభించారు. ధూళికట్టలో ఎకరాకు ఒకబస్తా చొప్పున 340 బస్తాలు, ఎలిగేడులో టోకెన్కు రెండు బస్తాల చొప్పున 540 బస్తాల యూరియా పంపిణీ చేసినట్లు ఏవో ఉమాపతి తెలిపారు. ఏఈవో శరణ్య పాల్గొన్నారు. మూడు రోజులు బారులు తీరినా.. వీర్నపల్లి: మండల కేంద్రంలో మూడురోజులుగా రైతులు బారులు తీరుతున్నా యూరియా లభించ డం లేదు. శనివారం ఉదయం నుంచి రైతువేదికకు 220 యూరియా బస్తాలు రాగా.. క్యూలో నిలబడితే.. ఒకేఒక్క యూరియా బస్తా ఇవ్వడంతో ఇవేమీ కష్టాలని రైతులు ఆవేదన చెందారు. రైతులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆవేదన చెందారు. టోకెన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.. చందుర్తి: విప్ ఆది శ్రీనివాస్ ఆదేశాలకు మేరకు శనివారం 330 యూరియా బస్తాలను సరఫరా చేశారు. సమాచారం అందుకున్న రైతులు ఉదయం నుంచే బారులు తీరారు. 156 మంది రైతులకు రెండు బస్తాల చొప్పన సిబ్బంది పంపిణీ చేశారు. సగం మందికి కూడా సరిపడా యూరియా అందలేదు. దీంతోవారు నిరాశతో వెనుదిరిగారు. మరికొందరు రైతులకు వ్యవసాయాధికారులు టోకెన్లు ఇచ్చారు. మరోలోడ్ వచ్చేక ప్రాధాన్యత ప్రకారం యూరియా అందిస్తామని చెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. గూడెంలో రైతుల జాగరణ ఓదెల(పెద్దపల్లి): గూడెం గ్రామంలో రైతులు యూరియా కోసం జాగరణ చేశారు. రాత్రి సమయంలో 140 బస్తాల యూరియా లోడ్ రాగా.. 400 మంది దాకా రైతులు గుమిగూడారు. తమకు ఇవ్వాలని ఆందోళనకు దిగారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో ఎస్సై రమేశ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒక్కో రైతుకు ఒక యూరియా బ్యాగ్ పంపిణీ చేయడంతో ఆందోళన విరమించారు. దుకాణాల ఎదుట ఉదయం నుంచే బారులు అయినా, అందరికీ సరిపడా అందని బ్యాగులు నిరాశతో వెనుదిరుగుతున్న అన్నదాతలు అదను దాటిపోతుందనే ఆందోళనలో రైతులు -
చాలా ఇబ్బందులు
కళాశాలలో మె స్ చిన్నగా ఉండటంతో ఇ బ్బందిగా ఉంది. షిప్టుల వారీ గా తింటున్నాం. హాస్టల్ నుంచి కళాశాల కి లోమీటరుకు పైగా దూరం ఉంటుంది. రోజు నడుచుకుంటూ వ స్తున్నాం. సెలవు రోజు కళాశాలకు వచ్చి తిని వెళ్లాలి. కళాశాలలో హా స్టల్ వసతిలేక ఇబ్బందిగా ఉంది. – సాయివర్ధన్, విద్యార్థి తరగతిగదులు సరిపోతలేవు కళాశాలలో మొత్తం ఎనిమిది తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. ఆ గదుల్లోనే షిప్టుల వారీగా తరగతులు నిర్వహిస్తున్నారు. సరిపోయే సంఖ్యలో గదులు లేక ఇబ్బందులు పడుతున్నాము. – అంజలి, విద్యార్థినిల్యాబ్, లైబ్రరీ లేదు ఇంజినీరింగ్ కళాశాలలో లైబ్రరీ లేదు. ల్యాబ్లు మాత్రం కొన్ని కోర్సులకే ఉన్నాయి. ల్యాబ్ అవసరం ఉంటే కొండగట్టు జేఎన్టీయూకు, దగ్గరలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలకు వెళ్లాల్సి వస్తుంది. – సాయిచరణ్య, విద్యార్థిని నిధులు ఇస్తే బాగు తంగళ్లపల్లి మండలం మండెపల్లి గ్రామ శివారులో 20 ఎకరాల భూమిని జేఎన్టీయూ కళాశాల కోసం కేటాయించారు. కానీ నిధులు మాంజూరు చేయలేదు. అధ్యాపకుల పోస్టులు కూడా మంజూరు చేయలేదు. – వేణుగోపాల్, జేఎన్టీయూ ప్రిన్సిపాల్, అగ్రహారం -
22 తర్వాత కొందాం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కారు, బైక్ షోరూంలు కొనుగోళ్లు లేక వెలవెలబోతున్నాయి. జీఎస్టీ శ్లాబులు తగ్గుతాయని కేంద్రం ప్రకటన దరిమిలా.. ఇప్పటికిప్పుడు బండి (కారు లేదా బైక్) కొందామనుకున్న ప్రతీ ఒక్కరూ వాయిదా వేశారు. సెప్టెంబరు 22 తరువాత తగ్గించి న జీఎస్టీ అమలులోకి రానుండటంతో కారు, బైకుల ధరలు 10శాతం వరకు తగ్గనున్నాయి. ఫలితంగా మధ్యతరగతికి భారీ ఊరట కానుంది. ప్రతీ బైకుపై కనిష్టంగా రూ.8,000 నుంచి గరిష్టంగా రూ.20వేల వరకు ధరలు తగ్గనున్నాయి. కార్లపైనా రూ.60వేల నుంచి రూ.1.50లక్షల వరకు తగ్గనున్నాయి. దీంతో ప్రస్తుతం షోరూముల్లో బుకింగులు నిలిచిపోయాయి. కొనుగోళ్లు లేక వెలవెలబోతున్నాయి. సెకండ్ హ్యాండ్ మార్కెట్కు కుదుపు జీఎస్టీ కొత్త శ్లాబులు అమలు కానుండటంతో షోరూంల్లోనే కాదు, ఇటు సెకండ్ హ్యాండ్ మార్కెట్పైనా ప్రభావం పడింది. బైకుల ధరలు పెట్రోల్ వేరియంట్లలో రూ.8000 నుంచి రూ.20,000 వర కు తగ్గింపు వర్తించనుండడం, కార్లకు రూ.60వేల నుంచి రూ.1.50లక్షల వరకు తగ్గనుండడంతో ఇంతకాలం సెకండ్ హ్యాండ్ కొందామనుకున్న వారంతా కొత్త బండ్ల వైపు చూస్తున్నారు. ఫలితంగా సెకండ్ హ్యాండ్ మార్కెట్ వెలవెలబోతోంది. ఆగస్టు 13 నుంచే కటకట సెప్టెంబరు 3వ తేదీన కొత్త జీఎస్టీ శ్లాబులను కేంద్రం ప్రకటించింది. దాంతో 4వ తేదీ నుంచి షో రూంలు, సెకండ్ హాండ్ మార్కెట్లు బోసిపోతున్నా యి. ఆటోమొబైల్ రంగానికి ఈ కుదుపు ఆగస్టు 13నే తాకింది. ఆ రోజు రాత్రి ప్రతీ వాహనంపై 2శాతం ట్యాక్స్ను పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో మరునాటి నుంచి కొనుగోళ్లపై ప్రభావం కనిపించిందని షోరూం నిర్వాహకులు తెలిపారు. ఆగస్టు 15న కేంద్రం జీఎస్టీ విషయంలో దీపావళికి తీపి కబురు చెబుతానడటంతో ఆటోమొబైల్ రంగం ఆందోళన చెందింది. దీపావళి వరకు కొనుగోళ్లు బోసిపోతాయని కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఈనెల 3న ప్రకటన రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొత్త ఆఫర్లు.. డిస్కౌంట్లు ప్రస్తుతం షోరూం నిర్వాహకులు వాహనాలు బుకింగ్ చేసుకోవచ్చని, డెలివరీ సెప్టెంబరు 22 తరువాతే ఇస్తామని సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తూ.. కొనుగోళ్లు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు తమ పాత వాహనాలను క్లియర్ చేసేందుకు 10శాతం వరకు డిస్కౌంట్ ఇస్తామని కస్టమర్లను ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. అయినా, పెద్దగా కొనుగోళ్లు పుంజుకోవడం లేదని షోరూం నిర్వాహకులు వాపోతున్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాహనాల కొనుగోళ్లు అధికంగానే జరుగుతాయి. మధ్యతరగతి వారు అధికంగా వినియోగించే 350 సీసీలోపు బైకులపై జీఎస్టీని 28శాతం నుంచి 18శాతానికి తగ్గించారు. అంటే దాదాపు 10శాతం వరకు తగ్గింపు ఉంది. ప్రస్తుతం ప్రతీ 100 సీసీ ఆపై సామర్థ్యం ఉన్న బైకులు రూ.లక్షకుపైనే పలుకుతున్నాయి. ఎలక్ట్రిక్ బైకుల ధర రూ.30వేల నుంచి మొదలవుతుంది. వీటికి సైతం 10శాతం జీఎస్టీ తగ్గింపు వర్తిస్తుంది. ప్రతీ నెలా కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల షోరూముల్లో కలిపి దాదాపు 3000కుపైగా బైకులను విక్రయిస్తారు. ఈ లెక్కన ఎలక్ట్రిక్ బైకులపై రూ.3000, పెట్రోల్ బైకులపై రూ.8000 వరకు కనిష్టంగా ధరలు తగ్గనున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తంగా నెలకు రూ.2.40కోట్ల వరకు వినియోగదారులకు లబ్ధి చేకూరతుందని అంచనా వేస్తున్నారు. ఇక పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ కార్లు నెలకు 500 నుంచి 550 వరకు కార్లు అమ్ముడుపోతాయి. 1200 సీసీ లోపు సామర్థ్యం ఉన్న కార్లపై జీఎస్టీని 18శాతానికి తగ్గించారు. ప్రతీ నెలా రూ.2.6 కోట్ల చొప్పున ఏటా రూ.31.2 కోట్ల వరకు వినియోగదారులకు కలిసి రానుంది. బైక్, కార్ల కొనుగోళ్లలో ఉమ్మడిజిల్లా కస్టమర్లకు దాదాపుగా రూ.60 కోట్ల వరకు కలిసి రానుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
వినాయకా.. వీడ్కోలిక
కరీంనగర్కల్చరల్/కరీంనగర్క్రైం/విద్యానగర్/ కరీంనగర్ కార్పొరేషన్/కొత్తపల్లి/మానకొండూర్: డప్పు చప్పుళ్లు.. భక్తి గీతాలు.. మహిళల కోలాట నృత్యాలు.. ఒగ్గుడోలు విన్యాసాలతో భక్తజనం వెంట నడవగా.. నవరాత్రులు ఘనమైన పూజలందుకున్న విఘ్నేశ్వరుడి నిమజ్జన శోభాయాత్ర కరీంనగరంలో కన్నుల పండువగా సాగింది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం వేకువజామున వరకు నగరం సందడిగా మారింది. గణపతి బొప్పా మోరియా, జై బోలో గణేశ్ మహారాజ్కీ నినాదాలతో మార్మోగింది. ప్రతీ గణనాథుడు శోభాయాత్రగా టవర్సర్కిల్, కమాన్ చౌరస్తా, రాంనగర్కు చేరుకోగానే గణేశ్ ఉత్సవ కమిటీ, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం, నగర కమిషనర్ ప్రఫుల్దేశాయ్, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ సభ్యులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి విగ్రహాలను మానకొండూర్, కొత్తపల్లి చెరువులు, చింతకుంట కెనాల్కు శోభాయాత్రగా తరలించి నిమజ్జనం చేశారు. శనివారం వేకువజామున వర కూ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. టవర్సర్కిల్ వద్ద గోగుల ప్రసాద్ ఈవెంట్ ఆధ్వర్యంలో సంగెం రాధాకృష్ణ బృందం చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కాగా.. గణేశ్ నిమజ్జనోత్సవం పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. సీపీ గౌస్ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి నిమజ్జన ప్రాంతాలైన కొత్తపల్లి, మానకొండూరు చెరువులను, చింతకుంట కెనాల్ను సందర్శించారు. క్రేన్సాయంతో కొన్ని విగ్రహాలను స్వయంగా నిమజ్జనం చేశారు. నిమజ్జనానికి 867 మంది పోలీసతో బందోబస్తు నిర్వహించామని సీపీ గౌస్ ఆలం తెలిపారు. ఇద్దరు అడిషనల్ డీసీపీలు, ఐదుగురు ఏసీపీలు, 20 మంది సీఐలు, 40 మంది ఎస్సైలు, 350మంది కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు, 100 మంది హోంగార్డులు, 150 మంది ఎన్సీసీ కెడెట్లు, 200మంది వలంటీర్లు విధుల్లో ఉన్నారన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రశాంత వాతావారణంలో వినాయ క నిమజ్జనం జరిగేలా ఏర్పాట్లు చేశామని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ వివరించారు. -
పింఛన్లు పెంచకుండా మోసం చేస్తున్న ప్రభుత్వం
మానకొండూర్/గంగాధర: ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం 21నెలలుగా ప్రజలను మోసం చేస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగా మండిపడ్డారు. మానకొండూర్, గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో శుక్రవారం దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులతో సమావేశం అయ్యారు. సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల సమయంలో నెల రోజుల్లో పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రశ్నించాల్సి ఉండగా, ప్రజల్లోకి రాకుండా గడీలకే పరిమితం అయ్యారన్నారు. ఉన్నత కుటుంబంలో పుట్టిన రేవంత్రెడ్డి, కేసీఆర్కు పేదల బాధలు తెలియవని, తాను కడు పేదరికం నుంచి వచ్చాను కాబట్టి పేదల బాధలు తెలుసన్నారు. ప్రభుత్వం పింఛన్లు పెంచాలని ఈ నెల 8న కలెక్టరేట్లు, 12న తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేస్తామన్నారు. 20వ తేదీన విజయవాడ– హైదరాబాద్ జాతీయ రహదారి బంద్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. 21 నుంచి 26వరకు గ్రామ పంచాయతీల ఎదుట దీక్షలు చేపడతామన్నారు. వీహెచ్పీఎస్ నాయకులు గోపాల్, అనవేని కౌసల్య, జిల్లా ఇన్చార్జి మంద రాజు, మానకొండూర్ మండల ఇన్చార్జి కనకం అంజిబాబు, రాష్ట్ర నాయకుడు చిలుము ల రాజయ్య, ఎమ్మార్పీఎస్ గంగాధర మండలాధ్యక్షుడు గంగాధర రవి, జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ పాల్గొన్నారు.ఉత్తమ అవార్డులు అందుకున్న అధ్యాపకులుకరీంనగర్క్రైం: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణి, శాసనమండలి సభ్యుడు పి.శ్రీపాల్రెడ్డి, శాతవాహన విశ్వవిద్యాలయ వీసీ ఉమేశ్కుమార్ చేతుల మీదుగా ఉన్నత విద్యా విభాగంలో రాష్ట్ర ఉత్తమ అధ్యాపకులుగా శ్రీవాణి, కాంపల్లి అర్జున్ అవార్డులు స్వీకరించారు. వీరిని వీసీ రిజిస్ట్రార్ రవికుమార్ జాస్తి, హరికాంత్, సూరేపల్లి సుజాత, ఎస్సారార్ ప్రిన్సిపాల్ కె.రామకృష్ణ అభినందించారు. పిల్లల భవిష్యత్ను తీర్చిదిద్దండికరీంనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దాలని డీఈవో చైతన్య జైనీ సూచించారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన వారిని సంఘం జిల్లాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సత్కరించారు. ముఖ్య అతిథిగా డీఈవో చైతన్యజైనీ హాజరై గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయులకే ఉందన్నారు. విద్యాశాఖలో ఎన్ని రకాల అధికారులు ఉన్నా.. ప్రత్యక్షంగా సేవలందించే అవకాశం ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకే ఉంటుందన్నారు. జిల్లా పరీక్షల బోర్డు కార్యదర్శి భగవంతయ్య మాట్లాడుతూ నూతన ప్రధానోపాధ్యాయులు సేవాభావంతో ముందుకు వెళ్లాలని సూచించారు. సంఘం జిల్లాశాఖ అధ్యక్షుడు నలుమాచు సుదర్శనం, సర్వ శిక్ష అభియాన్ కోఆర్డినేటర్లు కర్ర అశోక్రెడ్డి, ఆంజనేయులు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రాపల్లి శ్రీనివాస్, కోశాధికారి అనురాధ పాల్గొన్నారు. రేపు ఇల్లందకుంట రామాలయం మూసివేతఇల్లందకుంట: జిల్లాలోని ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ఈ నెల 7న ఆదివారం చంద్రగ్రహణం సందర్భంగా మూసివేయనున్నట్లు కార్యనిర్వాహణాధికారి సుధాకర్ తెలిపారు. 7న మధ్యాహ్నం 12గంటల నుంచి మూసివేయనున్నారు. 8న సోమవారం మహా సంప్రోక్షణ అనంతరం ఉదయం 10 గంటల నుంచి స్వామివారికి యథావిధిగా అభిషేకాలు, ఆర్జిత సేవలు కొనసాగుతాయని ఈవో పేర్కొన్నారు. -
లడ్డూ.. అ‘ధర’హో
కొత్తపల్లి(కరీంనగర్)/కరీంనగర్ కల్చరల్/సప్తగిరికాలనీ(కరీంనగర్): కరీంనగర్లోని పలు మండపాల్లో వినాయక నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలంపాట అ‘ధర’హో అనిపించింది. రేకుర్తి కాళోజీనగర్లో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూను రూ.1.85 లక్షలకు సంకిటి స్వరూప శ్రీని వాస్రెడ్డి దంపతులు దక్కించుకున్నారు. సూర్యనగర్– 3 వినాయకుడి లడ్డూను రూ.1.82లక్షలకు శనిగరపు మంజుల నర్సయ్య దంపతులు దక్కించుకున్నారు. రేకుర్తి ద్వారకానగర్లోని శ్రీ అమృతేశ్వర మహాశివాలయంలోని లడ్డూను రూ.42,500లకు కొత్త శ్రీనివాస్ దంపతులు, సూర్యనగర్ (శుభంగార్డెన్) లడ్డూను రూ.37,516లకు వుల్లెంగుల మౌనిక సాయిరాం, సీతారాంపూర్ బాలాజీనగర్ లడ్డూను రూ.21,500లకు తిరుణహరి సురేఖ ప్రశాంత్ దంపతులు కై వసం చేసుకున్నారు. నగరంలోని పాత బజార్ ఒకటోనంబర్ వినాయకుడి లడ్డూను సీనియర్ కరాటే మాస్టర్ కె.వసంత్ కుమార్ రూ.20వేలకు దక్కించుకున్నారు. కోతిరాంపూర్ వినాయకుడి లడ్డూ రూ.9999 పలికింది. భాగ్యనగర్ యూత్ ఆధ్వర్యంలోని లడ్డూను రూ.30,116కు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి కూతురు రిషితారెడ్డి దక్కించుకున్నారు. -
రాత్రనకా.. పగలనకా..
చెర్లభూత్కూర్ గోదాం వద్ద రైతుల తోపులాటచిగురుమామిడిలో యూరియా కోసం రాత్రిపూట వరుసలో రైతులుకరీంనగర్రూరల్/హుజూరాబాద్/చిగురుమామిడి/శంకరపట్నం/రామడుగు: జిల్లాలో పగలనకా.. రాత్రనకా.. పండుగనకా.. పబ్బమనకా.. యూరి యా కోసం రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి. యూరియా బస్తాల కోసం వాగ్వాదానికి దిగుతున్నారు. కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్ ఎరువుల గోదాంకు శుక్రవారం 400 యూరియా బస్తాలు వచ్చాయి. ఎఈవో స్వర్ణలత రైతుల నుంచి పట్టాదారు పాసుపుస్తకాలను తీసుకుని టోకెన్లను జారీ చేశారు. క్యూలో ఉన్న రైతులు యూరియా కోసం ఒకరికొకరు వాగ్వాదానికి దిగారు. ఒకేసారి రైతులందరూ గోదాంలోకి చొచ్చుకెళ్లారు. దీంతో అధికారులు యూరియా పంపిణీ నిలిపివేశారు. 160 మందికి టోకెన్లు జారీ చేయగా 70బస్తాలు పంపిణి చేశామని సీఈవో రమేశ్ తెలిపారు. దుర్శేడ్ సహకార సంఘంలో 380 యూరియా బస్తాలకు 146 బస్తాలను పంపిణీ చేశామని సీఈవో వేణుమాధవ్ తెలిపారు. నగునూరులోని ఆగ్రోస్లో 120 యూరియా బస్తాలు పంపిణీ చేసినట్లు ఏవో సత్యం తెలిపారు. దుర్శేడ్, చెర్లభూత్కూర్లో మిగిలిన బస్తాలను శనివారం పంపిణీ చేస్తామన్నారు. హుజూరాబాద్ సింగిల్ విండో ఎదుట శుక్రవారం వేకువజామున నుంచే బారులు తీరారు. అధికారులు ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున టోకెన్లు అందించారు. చిగురుమామిడిలోని రైతుడిపోకు శుక్రవారం సాయంత్రం వరకు లారీ యూరియా వచ్చింది. చీకట్లోనూ క్యూలో నిల్చున్న రైతులు యూరియా తీసుకుని వెళ్లారు. శంకరపట్నం మండలం కరీంపేట గ్రామంలో యూరియా కోసం రైతులు తోపులాడుకున్నారు. మహిళలు సైతం ఇంటి పనులు పక్కనపెట్టి క్యూలో ఉన్నారు. కన్నాపూర్, కాచాపూర్లో పోలీసుల పహారాలో పంపిణీ చేశా రు. రామడుగు మండలం వెదిర సహకార సంఘం గోదాం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరగా.. ఒక్కో రైతుకు ఒక్కో బస్తా అందించారు. -
రోడ్డెక్కిన కాంగ్రెస్ వర్గపోరు
కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ వర్గపోరు రోడ్డెక్కింది. ఇటీవల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జీ వెలిచాల రాజేందర్రావు పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ ఫొటో లేదంటూ గొడవ మొదలైంది. ప్రోటోకాల్ ఉల్లంఘించిన కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జీ వెలిచాల రాజేందర్రావుపై చర్యతీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, దళిత సంఘాలు నగరంలోని తెలంగాణచౌక్లో రాస్తారోకో చేశాయి. డీసీసీ,పీసీసీ అధ్యక్షుడి చిత్రపటాలను పాలతో అభిషేకించాయి. కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొరివి అరుణ్కుమార్, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కాదాసి ప్రభాకర్, మాదిగ విద్యార్థి నాయకుడు మాతంగి రమేశ్ మాట్లాడుతూ పీసీసీ, డీసీసీ అధ్యక్షుల ఫొటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం క్రమశిక్షణను ఉల్లంఘించడమేనన్నారు. దళితుడనే కవ్వంపల్లి ఫొటోలు ఫ్లెక్సీల్లో ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. దళితుల ఆత్మబంధువు ‘వెలిచాల’ దళితుల ఆత్మబంధువు వెలిచాల రాజేందర్రావుపై నిందలు వేయడం సరికాదంటూ ఆయన అభిమానులు పేర్కొన్నారు. నగరంలోని తెలంగాణచౌక్లో రాజేందర్రావు ఫ్లెక్సీని పాలతో అభిషేకించారు. ఈ సందర్భంగా వెలిచాల రాజేందర్రావు యువసేన అధ్యక్షుడు కిరణ్కుమార్ మాట్లాడుతూ మచ్చలేని నేతపై ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అంటే ఎంతో గౌరవం ఉందని, ఆ ఫ్లెక్సీల ఏర్పాటుతో రాజేందర్రావుకు సంబంధం లేదన్నారు. -
రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకురాలిగా శ్రీవాణి
కరీంనగర్క్రైం: శాతవాహన యూనివర్సిటీ అధ్యాపకురాలు డాక్టర్ కొడూరు శ్రీవాణి రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. టీచర్స్ డే సందర్భంగా నేడు హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకోనున్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు గ్రామానికి చెందిన శ్రీవాణి అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఏపీ ఎకనామిక్స్ ఆండ్ స్టాటిస్టిక్స్, అసిస్టెంట్ స్టాటిటికల్ ఆఫీసర్, డిగ్రీ కాలేజీ లెక్చరర్ ఇలా.. ఆరు ఉద్యోగాలు ఏకకాలంలో సాధించారు. ప్రస్తుతం శాతవాహన యూనివర్సిటీలో అర్థశాస్త్ర విభాగం అధ్యాపకురాలిగా కొనసాగుతున్నారు. వర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్గా, బాలికల వసతి గృహం చీఫ్ వార్డెన్గా పనిచేశారు. ఎగ్జామినేషన్ బ్రాంచ్ అడిషనల్ కంట్రోలర్గా ఉంటూ.. ఈ ఏడాదికి ఉత్తమ అధ్యాపకురాలిగా ఎంపికయ్యారు. వీసీ ఉమేశ్కుమార్ అభినందించారు. -
ఈవీఎం గోదాం తనిఖీ
కరీంనగర్ అర్బన్: కలెక్టరేట్ కార్యాలయం సమీపంలోని ఈవీఎం గోదాంను అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గనిర్ధేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీప్యాట్ గోదాంను తనిఖీచేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలిపారు. ఈవీఎంల రక్షణ భద్రతకు సంబంధించిన ఏర్పాట్ల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బంది హాజరు తీరుపై ఆరా తీశారు. ఈవీఎం గోదాం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు మడుపు మోహన్, సత్తినేని శ్రీనివాస్, నాంపల్లి శ్రీనివాస్, బర్కత్ ఆలీ, కల్యాడపు ఆగయ్య, సిరిసిల్ల అంజయ్య పాల్గొన్నారు. -
నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు
కరీంనగర్క్రైం/హుజూరాబాద్/జమ్మికుంట: గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామ ని సీపీ గౌస్ఆలం పేర్కొన్నారు. చొప్పదండి ఎస్సారెస్పీ కా లువ, బొమ్మకల్ చెరువు, హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి శివారులో ఉన్న ఎస్సారెస్పీ కెనాల్, జమ్మికుంటలోని నాయిని చెరువు వద్ద నిర్వహించే వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జన ప్రదేశాలలో గజ ఈతగాళ్లు, లైఫ్ జాకెట్లు, లైఫ్బోయ్స్తో పాటు మొబైల్ బైక్లను ఫైర్ అధికారులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఏసీపీలు విజయ్కుమార్, శ్రీనివాస్జి, సీఐలు ప్రదీప్కుమార్, నిరంజన్రెడ్డి, వెంకట్, రామకృష్ణ, ఎస్సైలు ఉన్నారు. -
ఉత్తమ టీచర్గా సత్యనారాయణ
కరీంనగర్: వీణవంక మండలం ఎల్బాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు కె.సత్యనారాయణ(స్కూల్ అసిస్టెంట్, ఇంగ్లిష్) రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. 17 అక్టోబర్ 2002లో ఎస్జీటీగా విధుల్లో చేరారు. తరువాత స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొందారు. చెల్పూర్ పాఠశాలలో పనిచేసినకాలంలో 36మంది విద్యార్థులు బాసర ట్రిపుల్ఐటీకి ఎంపిక కావడంలో ప్రత్యేకశ్రద్ధ తీసుకున్నారు. 32మంది విద్యార్థులను నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ ఎంపికయ్యేలా కృషి చేయడం పాటు పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను 500కు పెంచారు. ఎల్బాక జెడ్పీహెచ్ఎస్కు జూలై 2018లో పదోన్నతిపై రాగానే 18మంది విద్యార్థులు ఉన్న సంఖ్యను 73కు పెరిగేలా కృషి చేశారు. 2024–25 విద్యా సంవత్సరంలో పాఠశాల నుంచి మరో ఇద్దరు విద్యార్థులను నేషనల్ మీన్స్ స్కాలర్షిప్కు ఎంపికయ్యేలా చేశారు. ముగ్గురిని టీఎస్ఆర్జేసీకి సెలెక్ట్ అయ్యేలా శిక్షణ ఇచ్చారు. విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్, స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాలు చేపట్టారు. -
13న జాతీయ లోక్ అదాలత్
కరీంనగర్క్రైం:ఈనెల 13న జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యా యసేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి వెంకటేశ్ తెలిపారు. ఇందులో రాజీ చేయదగిన క్రిమినల్ కేసులు 2,525, సివిల్ కేసులు 215ల ను గుర్తించి, కక్షిదారులకు నోటీసులు పంపించినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమపైన ఉన్న కేసులను రాజీద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. నేడు రేషన్ దుకాణాలు బంద్కరీంనగర్ అర్బన్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు డీలర్లకు రూ.5వేల గౌరవ వేతనం, కమీషన్ పెంపు అ మలు చేయకపోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం రేషన్ పంపిణీ బంద్ చేస్తున్నట్లు రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రొడ్డ శ్రీనివాస్ పేర్కొన్నారు. 5 నెలల కమీషన్ను వెంటనే విడుదల చేసి మేనిఫెస్టోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఈ నెల 5న ఒక్కరోజు రాష్ట్రవ్యాప్త బంద్ చేపట్టినట్లు వివరించారు. జిల్లాస్థాయి క్విజ్ పోటీలు సప్తగిరికాలనీ(కరీంనగర్): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గురువారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఆర్ఏఏ క్విజ్ పోటీలు నిర్వహించారు. విజేలుగా నిలిచి న విద్యార్థులకు జిల్లా విద్యా శాఖ అధికారి చైతన్య జైనీ బహుమతులు ప్రదానం చేశారు. -
నిమజ్జనానికి వేళాయె
కరీంనగర్క్రైం/కరీంనగర్ కార్పొరేషన్/విద్యానగర్/కొత్తపల్లి/మానకొండూర్: జిల్లావ్యాప్తంగా నేటి వినాయక నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నగరానికి చెందిన విగ్రహాలు మానకొండూర్, కొత్తపల్లి చెరువులతో పాటు చింతకుంట కెనాల్ వద్ద నిమజ్జనం చేయనున్నారు. డప్పు చప్పుళ్లు, నృత్యాలు, భక్తిశ్రద్ధలతో శోభయా త్ర నిర్వహించేందుకు కరీంనగర్ ప్రజలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నగరంలోని టవర్ సర్కిల్ వద్ద విశ్వహిందూ పరిషత్, భజరంగ్దళ్, హిందూ ఉత్స వ కమిటీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించిన తరువాత గణనాథులు నిమజ్జనానికి తరలనున్నాయి. సీపీ గౌస్ ఆలం పర్యవేక్షణలో, ఇద్దరు అడిషనల్ డీసీపీలు, నలుగురు ఏసీపీలు, 15 మంది సీఐలు, 30 మంది ఎస్సైలతో పాటు మరో 650మంది పోలీ సు సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉండనున్నారు. ఏర్పాట్లు పూర్తి.. ఇన్చార్జి బాధ్యతలు నిమజ్జనోత్సవానికి మానకొండూర్, కొత్తపల్లి చెరు వు, చింతకుంట ఎస్సారెస్పీ కాలువ వద్ద క్రేన్లను సిద్ధంగా ఉంచారు. ఫ్లడ్లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. టవర్సర్కిల్, రాంనగర్ తదితర ప్రాంతాల్లో స్వాగ త వేదికలు ఏర్పాటు చేశారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు బల్దియా సిబ్బందికి బాధ్యతలు కేటాయించారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఒక బ్యాచ్, రాత్రి 8 గంటల నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు మరో బ్యాచ్ ఆయా పాయింట్ల వద్ద విధులు నిర్వర్తిస్తారు. చింతకుంట కెనాల్ వద్ద డీఈ శ్రీనివాస్, ఏఈ సల్మాన్, శానిటరీ సూపర్వైజర్ అనిల్కుమార్, మానకొండూరు వద్ద శానిటరీ సూపర్వైజర్ శ్యాంరాజ్, పర్యావరణ ఇంజినీర్ స్వామి, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ సంతోష్, కొత్తపల్లి వద్ద ఎంహెచ్వో సుమన్, డీఈ లచ్చిరెడ్డి, ఏఈ భీంవర్ధన్రెడ్డి ఇన్చార్జీలుగా వ్యవహరిస్తారు. టవర్సర్కిల్, రాంనగర్, చింతకుంట, కొత్తపల్లికి పశువైద్యాధికారి దుర్గాప్రసాద్రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డీఈ అరుణ్కుమార్, ఏఈ అయూబ్, బొమ్మకల్, దుర్శేడ్, గోపాల్పూర్కు డీఈ దేవేందర్, ఏఈ గట్టుస్వామిలను ఇన్చార్జీలుగా నియమించారు.హుజూరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వచ్చే వాహనాలు మానకొండూర్ బస్టాండ్ నుంచి ముంజంపల్లి, పోరండ్ల వైపు మళ్లిస్తారు. తిమ్మాపూర్ రాజీవ్ రహదారి మీదుగా కరీంనగర్ వెళ్లొచ్చు. కరీంనగర్ నుంచి హుజూరా బాద్ వైపు వెళ్లే వాహనాలకు దారి మళ్లింపు లేదు. జగిత్యాల నుంచి కరీంనగర్ వైపు వచ్చే వాహనాలు వెలిచాల ఎక్స్రోడ్డు, మల్కాపూర్, చింతకుంట, పద్మనగర్ ఎక్స్రోడ్డు, ఎన్టీఆ ర్ విగ్రహం మీదుగా నగరంలోకి వెళ్లొచ్చు. 5తేదీ నుంచి 6వ తేదీ వరకు గ్రానైట్, ఇతర భారీవాహనాలను సిటీలోకి అనుమతించడం లేదని పోలీసులు తెలిపారు.నగరంలోని గాంధీచౌక్ నుంచి రాజీవ్చౌక్, క్లాక్ టవర్, కమాన్, అల్గునూర్ మీదుగా మానకొండూర్కు గణనాథులు వెళ్తాయి. తెలంగాణ చౌక్ నుంచి వచ్చేవి బస్టాండ్, సీఎస్ఐ చర్చి, అమరవీరుల స్తూపం, రాజీవ్చౌక్, క్లాక్ టవర్, కమాన్, అల్గునూర్ మీదుగా మానకొండూర్ చేరుకుంటా యి. హౌజింగ్బోర్డు కాలనీ, కాపువాడ, మంగళి వాడ, మారుతినగర్, అశోక్నగర్ నుంచి వచ్చే ప్రతిమలు బోట్చౌరస్తా, మారుతినగర్ చౌరస్తా, పాతబజార్, రాజీవ్చౌక్, క్లాక్టవర్, కమాన్, అల్గునూర్ నుంచి నిమజ్జనానికి వెళ్తాయి. గోదాం గడ్డ నుంచి ఉమెన్స్ కళాశాల, టూటౌన్చౌరస్తా, మంకమ్మతోట, రాంనగర్, పద్మనగర్ మీదుగా చింతకుంట కెనాల్కు చేరుకుటాయి. జ్యోతినగర్ నుంచి సెయింట్ జాన్స్ స్కూల్, కొత్తపల్లి పీఎస్, చింతకుంట కెనాల్కు వెళ్తాయి. అపోలోరీచ్ హాస్పిటల్, మంచిర్యాల చౌరస్తా, కోర్టు చౌరస్తా, చైతన్యపురి, ఎస్సారార్ కళాశాల మీదుగా కొత్తపల్లి చెరువుకు వెళ్తాయి. శివ థియేటర్ చౌరస్తా మీదుగా వచ్చేవి సెయింట్ జాన్స్ స్కూల్, శాతవాహన యూనివర్సిటీ, విజయపురికాలనీ, రేకుర్తి, కొత్తపల్లి చెరువుకు చేరుకుంటాయి. -
హిందూ పండుగలపై వివక్ష ఎందుకు?
హిందువుల పండుగలంటే మొదటి నుంచి కాంగ్రెస్కు వివక్షేనని, గణేశ్ నిమజ్జనోత్సవానికి కరీంనగర్లో ఏర్పాట్లు చేయడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా తను వస్తే ఒక్క అధికారి కూడా నిమజ్జన కేంద్రం వద్ద ఉండరా అంటూ మండిపడ్డారు. చింతకుంటలోని వినాయక నిమజ్జనం కేంద్రం ఎస్సారెస్పీ కెనాల్ను గురువారం పరిశీలించారు. నిమజ్జనం శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమవుతున్న వేళ ఒక్కక్రేన్ లేదు..లైట్లు లేవు..ఒక్క అధికారి లేకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. నాయకులు పిల్లి మహేశ్గౌడ్, భూక్య తిరుపతినాయక్, కాసారపు శ్రీనివాస్గౌడ్, నరేందర్ పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర
● కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గణేశ్ నిమజ్జనోత్సవా న్ని ప్రశాంతంగా జరుపుకోవాలని కేంద్ర హో ంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమా ర్ సూచించారు. శుక్రవారం ఉదయం నుంచే విగ్రహాలను నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. మానకొండూర్ చెరువు, చింతకుంటలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన పాయింట్లను గురువారం పరిశీలించారు. కరీంనగర్లో పదేళ్లుగా ప్రశాంతంగా గణేశ్ నిమజ్జోత్సవం జరుపుకుంటున్నామని, ఈసారి అదే తరహాను అవలంబించాలని తెలిపారు. మంత్రి వెంట ఆర్డీవో కుందారపు మహేశ్వర్, మున్సిపల్ ఎస్ఈ రాజ్కుమార్, మాజీ మేయర్ సునీల్ రావు, గుగ్గిలపు రమేశ్ పాల్గొన్నారు. -
ఎస్సారార్ నుంచి అర్జున్
కరీంనగర్క్రైం: నగరంలోని ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ కే.అర్జున్ రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లికి చెందిన కే.అర్జున్ 2013, జనవరి 1న అప్పటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా నియామకం అయ్యాడు. 12ఏళ్లుగా కామర్స్ సబ్జెక్టు బోధిస్తూ జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్లో తన పరిశోధనన పత్రాలు ప్రచురించారు. ప్రస్తుతం ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం, జిల్లా నోడల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. అర్జున్ను ప్రిన్సిపాల్ కలువకుంట రామకృష్ణ, కడారు సురేందర్రెడ్డి, నితిన్పాఠక్, టి.రాజయ్య అభినందించారు. -
వినూత్నం.. విజ్ఞానం
సిరిసిల్ల ఎడ్యుకేషన్: పుస్తకాల్లో ఉన్న విజ్ఞానాన్ని విద్యార్థులకు బోధించడం పరిపాటి. కానీ మిషన్–100 లక్ష్యంగా విద్యార్థులతో నూతన ఆవిష్కరణలు చేయిస్తున్నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా దమ్మన్నపేట జిల్లా పరిషత్ హైస్కూల్ భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడు తాడూరి సంపత్కుమార్. తన ఉద్యోగ విరమణలోపు కనీసం 100మంది గ్రామీణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఆవిష్కరణకర్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మిషన్–100 కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. ఇప్పటివరకు 61మంది వివిధ ఆవిష్కరణలు ప్రదర్శించగా.. వీరిలో 8మంది అంతర్జాతీయస్థాయి, 16మంది జాతీయస్థాయి, 30మందికి పైగా రాష్ట్రస్థాయి బహుమతులు గెలుచుకున్నారు. 2021, 2023లో ఇద్దరు విద్యార్థుల ఆవిష్కరణలు హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నాయి. బోచ్, ఎన్ఐఎఫ్, టీజీఐసీ సంస్థలు పిల్లల ఆవిష్కరణలకు పేటెంట్ హక్కులు పొందేందుకు సహకారం అందిస్తున్నాయి. సంపత్ కుమార్ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2024లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందించింది.● నూతనంగా ఆలోచిస్తున్న ఉపాధ్యాయులు ● విభిన్న బోధనలతో ఆకట్టుకుంటున్న వైనం ● ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఉత్తమ అవార్డులకు పలువురి ఎంపిక ● నేడు టీచర్స్ డేఅమ్మ జన్మనిస్తుంది.. నాన్న జీవితాన్ని ఇస్తాడు. ఆ జీవితాన్ని సక్రమ దారిలో నిలబెట్టే ఏకై క వ్యక్తి గురువు. బుడిబుడి అడుగులు వేస్తూ ఓనమాలు దిద్దే వయసు నుంచి డిగ్రీ, పీజీలు పూర్తిచేసి ఉద్యోగం, వ్యాపారంలో స్థిరపడే వరకు మార్గదర్శిగా నిలుస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠశాల, కళాశాల, యూనివర్సిటీల్లోని గురువురు వినూత్నంగా విద్యాబోధన అందిస్తున్నారు. పుస్తకాల్లోని పాఠాలను అర్థమయ్యే రీతిలో ప్రత్యక్షంగా వివరిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. ప్రపంచీకరణ వేగాన్ని అందుకునే విధంగా సలహాలు.. సూచనలు ఇస్తూ.. విద్యార్థులు వివిధ రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతున్నారు. వివిధ రకాల ప్రయోగాలు చేయిస్తూ.. జాతీయస్థాయిలో పేరుపొందేలా ప్రోత్సహిస్తున్నారు. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పలువురు పాఠశాల ఉపాధ్యాయులు, కళాశాల అధ్యాపకులు ఉత్తమ గురువులుగా ప్రశంసలు పొందుతున్నారు. నేడు దేశ తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనాలు..కాల్వశ్రీరాంపూర్: విద్యార్థుల్లో ఒకరిగా ఫ్రెండ్లీ బోధనతో వినూత్నంగా ఆలోచిస్తున్నారు ఉపాధ్యాయురాలు కోయాల్కర్ స్వప్న. 13 ఏళ్లుగా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని వివిధ పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్నా రు. ప్రస్తుతం కాల్వశ్రీరాంపూర్ ఎస్సీకాలనీ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంగా కొనసాగుతున్నారు. 2008లో శంకరపట్నం మండలం రాజాపూర్లో విధులు ప్రారంభించారు. ముస్తాబాద్ మండలం కొండాపూర్, కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాలలో పనిచేశారు. ఉత్తమ విద్యాబోధన, విద్యార్థులతో ఫ్రెండ్లీగా ఉంటూ ఆటపాటలతోపాటు కృత్యాధారణ బోధన (టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) చేస్తూనే మండలస్థాయిలో నిర్వహించే ఎఫ్ఎల్ఎన్లో రిసోర్స్ పర్సన్గా ప్రశంసలు అందుకుంటున్నారు. కాల్వశ్రీరాంపూర్ ఎస్సీ కాలనీకి గతేడాది బదిలీపై వచ్చిన స్వప్న 50మంది నుంచి 60మందికి విద్యార్థుల సంఖ్యను పెంచారు. -
పీహెచ్సీలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
కొత్తపల్లి(కరీంనగర్): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డీఎంహెచ్వో వెంకటరమణ సూచించారు. కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టిక, అవుట్ పేషెంట్ రిజిష్టర్, రికార్డులను పరిశీలించారు. ఎన్సీడీ క్లినిక్లో అసంక్రమిత వ్యాధుల రికార్డులను పరిశీలించారు. అధిక రక్తపోటు, షుగర్ వ్యాధిగ్రస్తుల వివరాల నమోదును పరిశీలించి, వారికిస్తున్న మందుల తీరును గమనించారు. ఆపరేషన్ థియేటర్, ప్రసూతి గది పరిశుభ్రతలను పరిశీలించారు. కొత్తపల్లి పీహెచ్సీ డాక్టర్ నజీమా సుల్తానా పాల్గొన్నారు. -
రహదారి పనులు వేగవంతం చేయండి
కరీంనగర్ అర్బన్/రామడుగు: కొత్తపల్లి– హుస్నాబాద్ నాలుగు వరుసల రహదారి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సదరు రహదారి పనుల ప్రగతిపై గురువారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. నాలుగు వరుసల రహదారి కోసం ఇప్పటికే మార్కింగ్ పూర్తయినందున ఎలక్ట్రికల్ వర్క్స్, బావుల పూడ్చివేత, చెట్లు తొలగించే పనులు వేగవంతం చేయాలని అన్నారు. గ్రామాల మీదుగా వెళ్తున్న రహదారి నిర్మాణం కోసం గ్రామసభలు ఏర్పాటు చేసి తీర్మానం చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, జిల్లా అటవీ అధికారి బాలమణి, ఆర్అండ్బీ ఈఈ నరసింహచారి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. మెలకువలతో విద్యాబోధన చేయాలి ఉపాధ్యాయులు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో విద్య బోధన చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. రామడుగు మండలం దేశరాజ్పల్లి జిల్లా పరిషత్ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, పల్లె దవాఖానాను గురువారం తనిఖీ చేశారు. ఏడోతరగతిలో మ్యాఽథ్స్ పాఠం వింటున్న విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని పెద్దగదిలోకి మార్చాలని సూచించారు. పల్లె దవాఖానాను తనిఖీ చేసి వైద్య పరీక్షలు చేసుకుంటున్న రోగులను సేవలను అడిగి తెలుసుకున్నారు. డీఎంహెచ్వో వెంకటరమణ, ప్రోగ్రాం ఆఫీసర్ సనా, తహసీల్దార్ రాజేశ్వరీ, ఎంపీడీవో రాజేశ్వరీ పాల్గొన్నారు. -
వీధికుక్కల స్వైర విహారం
ఎలిగేడు/రాయికల్/గంభీరావుపేట: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట, జగిత్యాల జిల్లా రాయికల్, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాచర్ల బొప్పాపూర్లో వీధికుక్కలు స్వైర విహారం చేశాయి. నడుచుకుంటూ వెళ్తున్నవారిపై దాడి చేసి గాయపర్చాయి. రాయికల్లో ముగ్గురిని వెంటపడి కరిచాయి. బాధితులు జగిత్యాలలో వైద్యం చేయించుకున్నారు. గంభీరావుపేట మండలం రాచర్లబొప్పాపూర్లో ప్రభుత్వ లెక్చరర్ నీరటి విష్ణు ప్రసాద్ కళాశాలకు వెళ్తుండగా కుక్కలు ద్విచక్రవాహనానికి అడ్డుగా వచ్చాయి. వాటిని ఢీకొని కిందిపడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. అదేవిధంగా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో నాలుగేళ్ల బాలుడు అల్లి జయఆదిత్య బుధవారం ఉదయం కిరాణానికి వెళ్లి వస్తుండగా కుక్క ఒక్కసారిగా దాడి చేసి గాయపర్చింది. చెంపపై కరవడంతో తీవ్రగాయమైంది. వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నట్లు తండ్రి మనోజ్కుమార్ తెలిపారు. -
మానేరు నీళ్లు చెరువుకు వచ్చాయి
ఎగువ మానేరు ప్రాజెక్టు నీళ్లు మా ఊర చెరువుకు రావడంతో నిండింది. చెరువు కింద 200 ఎకరాలకు నీరు వస్తుంది. పెనంమడుగు నుంచి నీళ్లతో మా ఊరి చెరువు నిండింది. దీనికింద 200 ఎకరాలకుపైగా వరి పండుతుంది. – రాయిని అంజయ్య, సింగారం మానేరు ప్రాజెక్టు నీళ్లు మా ఊరిలోని కొండసముద్రం, చింతల చెరువులకు వచ్చా యి. భారీ వరదతో కెనాల్ ద్వారా వచ్చిన నీరు చెరువులను నింపింది. చెరువు కింద భూములు సాగులోకి వచ్చాయి. రైతులందరం సంతోషంగా ఉన్నాం. యాసంగి సాగుకు ఢోకా లేదు. – శాడ శ్రీనివాస్, గూడెం వానాకాలం పంటల సాగు సమయంలోనే ఎగువమానేరు ప్రాజెక్టు నిండింది. భారీ వరదతో ప్రాజెక్టు కింద ఉన్న చెరువులకు మళ్లించాం. ఇక్కడ సరైన వానలు లేకున్న, మానేరు నీటి ద్వారా చెరువులు నింపే ప్రయత్నం చేశాం. రబీసాగు వరకు నీటికి ఇబ్బంది లేదు. – రవికుమార్, డీఈఈ -
మానీటి గలగల.. ఆయకట్టు కళకళ
● కనుచూపు మేరలో పచ్చని పంటలు ● 14వేల ఎకరాల సాగుకు ప్రాజెక్టు నీరు ● మూడు మండలాల్లోని చెరువులకు నీరు ● సాగు, తాగునీటికి ప్రాజెక్టు ముస్తాబాద్(సిరిసిల్ల): సిరిసిల్ల మెట్టప్రాంతానికి గుండెకాయ ఎగువమానేరు ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతోంది. మునుపెన్నడు లేని విధంగా ప్రాజెక్టు అవుట్ ఫ్లో లక్ష క్యూసెక్కుల వరద కింది ప్రాంతానికి వెళ్లింది. దీంతో మానేరు ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం పంటలే కాదు రబీ సీజన్కు ఢోకా లేదని సంబరపడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సరైన వర్షపాతం నమోదు కాకున్నా ఎగువ ప్రాంతం కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు వరద వచ్చింది. సిద్దిపేట జిల్లా నుంచి కూడవెళ్లి, కామారెడ్డి జిల్లా నుంచి పాల్వంచ వాగులు ఉధృతంగా ప్రవహించడంతో భారీగా వరదవచ్చి ఎగువ మానేరు మత్తడి పోసింది. చెరువుల్లోకి మళ్లింపు ఎగువమానేరు ప్రాజెక్టులోకి ఆగస్టు 20వ తేదీ వరకే భారీ వరద వచ్చి చేరింది. దాదాపు 25 అడుగుల నీటి మట్టానికి చేరింది. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్ సందీప్కుమార్ ఝా వివరాలు తెలుసుకొని కుడి, ఎడమ కాలువలకు నీటిని వదలాలని ఆదేశించారు. దీంతో ప్రాజెక్టు కింద ఉన్న చెరువులకు నీరు వచ్చి చేరుతోంది. ఆ సమయంలోనే ఆగస్టు 27వ తేదీ నాటికి ఎగువన అతివృష్టితో ప్రాజెక్టులోకి లక్ష క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. దీంతో మానేరువాగు ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా కుడి కాలువ ద్వారా పది చెరువుల్లోకి నీరు వచ్చింది. దీంతో చెరువుల కింద ఆయకట్టుకు ఢోకా లేదని రైతులు భరోసాగా ఉంటున్నారు. వానాకాలం పంటలతోపాటు రబీ సీజన్కు 2 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుంది.చెరువు గ్రామం ఆయకట్టు (ఎకరాలు) కొత్తచెరువు కొండాపూర్ 250 చింతలచెరువు గూడెం 240 మల్లారెడ్డిచెరువు నామాపూర్ 100 దేవరకుంట గూడూరు 50 కొండసముద్రం గూడెం 500 వీరసముద్రం పోతుగల్ 150 లోతుచెరువు మల్లారెడ్డిపేట 450 పెనంమడుగు మల్లారెడ్డిపేట 550 గర్లకుంట, ఊరచెరవు నర్మాల 150 వెంకటాద్రి గంభీరావుపేట 180 -
గణేశ్ ఉత్సవాల్లో గంజాయి దందా
గోదావరిఖని: గణేశ్ ఉత్సవాల్లో యువతకు మత్తెక్కించేందుకు గంజాయి దందాకు సిద్ధమైన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు గోదావరిఖని ఏసీపీ రమేశ్ తెలిపారు. బుధవారం పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ఆటోడ్రైవర్గా పనిచేస్తున్న కొత్తగూడెంలోని బూడిదగడ్డ ప్రాంతానికి చెందిన కోడూరి అభినవ్వర్ధన్, గోదావరిఖని శివాజీనగర్కు చెందిన చెరుకు శ్రీనివాస్ అడ్డగుంటపల్లి సిరి ఫంక్షన్హాల్ వెనుకాల చెట్లపొదల్లో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఎస్సై రమేశ్ తన సిబ్బందితో దాడి చేశారు. 1.220 కిలోల డ్రై గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే గంజాయి విక్రయిస్తున్నారు. అభినవ్వర్ధన్ జల్సాలకు అలవాటు ఈ దందా ఎంచుకున్నాడు. గతంలో ఈ ఇద్దరు రెండు, మూడుసార్లు గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో విక్రయించారు. కొత్తగూడెం టూ గోదావరిఖని.. గోదావరిఖని చెందిన శ్రీనివాస్ అక్క కొత్తగూడెంలో నివాసం ఉంటోంది. అక్కడికి వెళ్లిన సమయంలో అభినవ్తో పరిచయం ఏర్పడింది. ఇది గంజాయి రవాణాకు తెరతీసింది. శ్రీనివాస్ తొలుత 250 గ్రాములు తీసుకొచ్చి ఒకవ్యక్తికి విక్రయించాడు. గోదావరిఖనిలో మంచిడిమాండ్ ఉందని, ఎక్కువ డబ్బులు సంపదించొచ్చని ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. గణేశ్ నవరాత్రులు, నిమజ్జనం సందర్భంగా విక్రయాలు చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఆశతో వ్యాపారులతో బేరం కుదుర్చుకున్నాడు. కిలోకు రూ.15 వేలకు ఒప్పందం చేసుకుని రూ.5వేలు అ డ్వాన్స్ ఇచ్చాడు. ఈక్రమంలో పోలీసులకు చిక్కారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్సైలు రమేశ్, అనూష, క్రైంపార్టీ హెడ్ కానిస్టేబుళ్లు రమేశ్, శ్రీనివాస్ సదానందం, కానిస్టేబుళ్లు రమేశ్, మధూకర్, మధుసూదన్ను ఏసీపీ అభినందించారు. వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్ట్ గోదావరిఖని ఏసీపీ రమేశ్ వెల్లడి -
రాజన్న సేవలో ఇస్కాన్ చైర్మన్
వేములవాడ: రాజన్నను దక్షిణ భారతదేశ ఇస్కాన్ ఆలయాల అధ్యక్షుడు, రాజమండ్రి ఇస్కాన్ ఆలయ గురువు సత్య గోపీనాథ్ దాస్ బుధవారం దర్శించుకున్నారు. స్వామి వారికి కోడెమొక్కు చెల్లించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ఆలయ పర్యవేక్షకులు జి.శ్రీనివాస్శర్మ, ప్రొటోకాల్ పర్యవేక్షకులు శ్రీకాంత్చార్యులు, సీనియర్ అసిస్టెంట్ బొడుసు మహేశ్ ఉన్నారు. భార్యను వేధించిన భర్తకు మూడేళ్ల జైలుముస్తాబాద్(సిరిసిల్ల): భార్యను వేధింపులకు గురిచేసి మద్యం మత్తులో దాడి చేసిన భర్తకు మూడేళ్ల జైలుతోపాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ సిరిసిల్ల ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ప్రవీణ్ తీర్పు వెలువరించారు. ముస్తాబాద్ ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. ముస్తాబాద్ మండలం గూడెంకు చెందిన సడిమెల రామచంద్రం మద్యం సేవించి తరచూ భార్య కనకవ్వను వేధించేవాడు. 2016 డిసెంబర్ 2న కనకవ్వపై భర్త రామచంద్రం టార్చిలైట్తో దాడి చేశాడు. భర్త వేధింపులు భరించలేని భార్య ముస్తాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రామచంద్రంపై కేసు నమోదు చేసిన అప్పటి ఎస్సై ప్రవీణ్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. రామచంద్రంపై నేరం రుజువు కావడంతో మేజిస్ట్రేట్ ప్రవీణ్ మూడేళ్ల జైలుశిక్ష, రూ.10వేలు జరిమాన విధిస్తు తీర్పు వెలువరించారని ఎస్సై వివరించారు. ఇద్దరి రిమాండ్వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని సీతారాంనాయక్తండాకు చెందిన బానోత్ శ్రీనివాస్ నాలుగు రోజుల క్రితం చంద్రుని కర్రతో కొట్టాడు. జవహర్లాల్ నాయక్తండాకు చెందిన అజ్మీర రాజు 2021లో ఫారెస్ట్ అధికారుల విధులకు ఆటంకం కలిగించాడు. ఫారెస్ట్ అధికారులపై దాడి చేయడంతో వారెంట్ జారీ చేశారు. ఈమేరకు ఇద్దరు బానోత్ శ్రీనివాస్, అజ్మీర రాజును బుధవారం రిమాండ్కు తరలించారు. -
రోడ్డుప్రమాదంలో యువకుడి మృతి
తిమ్మాపూర్: కారు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని సుభాష్నగర్ స్టేజీ వద్ద జరిగింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఆదివారంపేట గ్రామానికి చెందిన ఇల్లందుల సన్నీ(23) బుధవారం సాయంత్రం తిమ్మాపూర్ నుంచి గ్రామానికి బైక్పై వెళ్తుండగా సుభాష్నగర్ స్టేజీ వద్ద యూ–టర్న్ తీసుకునే సమయంలో హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వేగంగా వస్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో సన్నీ తీవ్రంగా గాయపడగా కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సన్నీ మామ సదయ్య ఫిర్యాదుతో కారు డ్రైవర్ పల్లెర్ల రమేశ్పై కేసు నమోదు చేశామని ఎస్ఐ శ్రీకాంత్గౌడ్ తెలిపారు. బొమ్మకల్ బైపాస్లో భార్య.. ● భర్తకు స్వల్ప గాయాలు కరీంనగర్రూరల్: బొమ్మకల్ బైపాస్లో బుధవారం ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో భార్య అక్కడికక్కడే మృతిచెందగా భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. కరీంనగర్లో ఉంటున్న కుమారుడు, కుమార్తెను చూసేందుకు వచ్చి భార్య మృత్యువాత పడటంతో భర్త రోధించిన తీరు స్ధానికులను కంటతడి పెట్టించింది. కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పందిళ్ల గ్రామానికి చెందిన దబ్బెట మల్లయ్య–రాధ(47) దంపతులు కరీంనగర్లో ఉంటున్న కుమారుడు శివ, కుమార్తె మంగేశ్వరీని కలిసేందుకు ద్విచక్రవాహనంపై బొమ్మకల్ బైపాస్ రోడ్డులో వెళ్తున్నారు. ఎస్ఆర్ పెట్రోల్బంకు సమీపంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. కింద పడిన రాధ పైనుంచి లారీ వెళ్లడంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. మల్లయ్య రోడ్డు కింద పడటంతో స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. -
పల్లెల్లో బతుకమ్మ సందడి
● సిరిసిల్ల శివారులో షూటింగ్ సందడి ● ఆటపాటలతో తాడూరు, గోపాల్రావుపల్లెల్లో సందడి సిరిసిల్ల: తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ. ప్రకృతిని పూజిస్తూ మన ప్రాంత ఆడబిడ్డలు సంతోషంగా కొలిచే పూలపండుగ. పూలను పూజించే సంస్కృతి తెలంగాణ ప్రత్యేకం. పల్లె, పట్టణం అని తేడా లేకుండా.. గౌరమ్మను పూజించే సంస్కృతి మనది. ఆ పండగకు దాదాపు నెల రోజులు ఉన్నా రాజన్న సిరిసిల్ల జిల్లాకు ముందే పండుగ కళ వచ్చింది. తంగళ్లపల్లి, గోపాల్రావుపల్లి, తాడూరు శివారుల్లో బుధవారం ‘బహుజన బతుకమ్మ’ రంగురంగుల పూలతో ముస్తాబైంది. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలుగు రాష్ట్రాల అధ్యక్షురాలు విమలక్క బృందం, జానపద కళాకారుడు వంతడ్పుల నాగరాజు పర్యవేక్షణలో ‘బహుజన బతుకమ్మ’ పాట షూటింగ్ జరిగింది. ఒగ్గు కళాకారుడు, డోల్ కళాకారులు, బతుకమ్మలతో మహిళలు.. ఆట పాటలతో సందడి చేశారు. ఉద్యమ గీతాలతో ఉర్రూతలూగించే విమలక్క బతుకమ్మతో చెరువు గట్టుపై తెలంగాణ సాంస్కృతిని ఆవిష్కరించారు. ప్రకృతి ఆరాధనే బతుకమ్మ పండగ ప్రకృతి రక్షణే.. ప్రజల రక్షణగా బహుజన బతుకమ్మగా ఈ ఏడాది ప్రజల్లోకి వెళ్తున్నారు. సెప్టెంబరు 20 నుంచి అక్టోబర్ 3 వరకు బహుజన బతుకమ్మను జరుపుకుందామంటూ పాట చిత్రీకరించారు. గత దశాబ్దకాలంగా బహుజన బతుకమ్మను అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నిర్వహిస్తుంది. ఈ ఏడాది ప్రకృతి రక్షణను థీమ్గా ఎంచుకుని ముందుకురావడం విశేషం. ఈ షూటింగ్లో ప్రొఫెసర్ లక్ష్మి, కులనిర్మూలన సంఘం ప్రతినిధులు జ్యోతి, వహీద్, అరుణోదయ ఉపాధ్యక్షురాలు డాక్టర్ అనిత, రాష్ట్ర కార్యదర్శి పోతుల రమేశ్, బుల్లెట్ వెంకన్న, రాకేశ్, కళాకారులు పాల్గొన్నారు. -
కోళ్ల పందెం స్థావరంపై పోలీసుల దాడి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులో గుట్టుచప్పుడు కాకుండా కోళ్ల పందెం ఆడుతున్న ఆరుగురిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై ఉపేంద్రచారి తెలిపిన వివరాలు. సిరిసిల్లకు చెందిన గుంజ మోహన్, వెంకట్రావు, కుంచల వెంకట్రావు, తన్నీరు శ్రీనివాస్, జిందం రాజ్కుమార్, కామారెడ్డికి చెందిన పరుచూరి అశోక్ కోళ్లపందేలు నిర్వహిస్తుండగా పట్టుకున్నారు. వారి నుంచి రూ.45,160 నగదు, మూడు బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిపై కేసు -
పక్కాగా పంటల లెక్క
● మొబైల్ యాప్లో వివరాల నమోదు ● క్షేత్రస్థాయిలో పంట.. సాగు విస్తీర్ణం పరిశీలన ● ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్న ఏఈవోలు ● పెద్దపల్లి జిల్లాలో ప్రారంభమైన క్రాప్ బుకింగ్ ప్రక్రియ మంథనిరూరల్: వానాకాలం సీజన్లో సాగు చేసిన పంటల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. క్రాప్బుకింగ్పై ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేయడంతో వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నమోదు ప్రక్రియ ప్రారంభించారు. మంథని మండలంలోని 35 గ్రామపంచాయతీల్లో ఆయా క్లస్టర్ల ఏఈవోలు పంటల నమోదు వివరాలను శరవేగంగా సేకరిస్తున్నారు. వెనువెంటనే ఆన్లైన్లో నమోదు చేయడంతో పంటలు, సాగు విస్తీర్ణం లెక్కలు పక్కగా తేలుతాయని భావిస్తున్నారు. 35 పంచాయతీలు.. ఆరు క్లస్టర్లలో.. మంథని మండలంలోని 35 గ్రామపంచాయతీలకు ఆరు క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో క్లస్టర్ కింద ఐదు నుంచి ఆరు గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఈ ఆరు క్లస్టర్లలో ఆరుగురు వ్యవసాయ విస్తరణ అధికారులు పంటలను పరిశీలించి ఆన్లైన్లో పారదర్శకంగా నమోదు చేస్తున్నారు. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా.. గత ప్రభుత్వం తొలుత పంటలు, సాగు విస్తీర్ణం వివరాలు సేకరించి ఆ తర్వాత ట్యాబ్లలో నమోదు చేసేవారు. ఈసారి అందుకు భిన్నంగా క్షేత్రస్థాయిలో ఏఈవోలు పంట, విస్తీర్ణం పరిశీలించిన తర్వాతే ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అన్ని వివరాల సేకరణ.. క్రాప్ బుకింగ్ ప్రక్రియలో రైతుపేరు, సర్వే నంబర్, బ్యాంకు ఖాతా నంబర్, పట్టాదారు పాసుబుక్, ఫోన్ నంబర్తోపాటు ఏఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేశారనే వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా పక్కాగా లెక్క ఉండేలా పారదర్శకంగా నమోదు ప్రక్రియను చేపట్టారు. 15 వేల ఎకరాల్లో వరి.. 8 వేల ఎకరాల్లో పత్తి.. మంథని మండలంలో ఈ వర్షాకాలం సీజన్లో సుమారు 15 వేల ఎకరాల్లో వరి, 6వేల నుంచి 8 వేల ఎకరాల్లో పత్తి పంట సాగు చేసినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. అయితే, ప్రస్తుతం చేపట్టిన సర్వే ద్వారా క్రాప్ బుక్ంగ్ ద్వారా ఏ ఏ పంటలు ఎంత విస్తర్ణంలో సాగు చేశారనేది పక్కాగా తేలనుంచి. ప్రభుత్వ ఆదేశాల మేరకు నెలరోజుల్లోగా క్రాప్ బు కింగ్ పూర్తిచేయాల్సి ఉంటుంది. మండలంలోని ఆ రు క్లస్టర్లలో మా సిబ్బంది క్షేత్రస్థాయిలో పంటలు ప రిశీలించి ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తున్నారు. – అంజనీమిశ్రా, ఏడీఏ, మంథని -
ప్రభుత్వ భూమి జప్తు
ఇల్లంతకుంట(మానకొండూర్): అక్రమంగా పట్టా చేసుకున్న ప్రభుత్వ భూమిని మండల రెవెన్యూ అధికారులు బుధవారం జప్తు చేశారు. మండలంలోని సిరికొండకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ తడిసిన సత్తయ్య గ్రామంలోని సర్వేనంబర్ 125/18లోని 5 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారు. ఈ విషయమై గ్రామస్తులు ఇటీవల కలెక్టర్ సందీప్కుమార్ ఝాకు ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారులు విచారణ జరిపిన అనంతరం మండల రెవెన్యూ అధికారులను భూమి జప్తు చేసుకోవాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బుధవారం ఆర్ఐ సంతోష్కుమార్ సిరికొండకు వెళ్లి గ్రామస్తుల సమక్షంలో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని జప్తు చేసుకొని, ఆ భూమిలో ఎలాంటి పనులు చేయొద్దని సత్తయ్యకు సూచించారు. విచారణలో గ్రామస్తులు లచ్చయ్య, చంద్రమౌళి, రాజయ్య, గ్రామ కార్యదర్శి సరస్వతి తదితరులు పాల్గొన్నారు. -
కుంకుమార్చనలు.. అన్న ప్రసాదాలు
క్యాంపు కార్యాలయంలో భోజనం వడ్డిస్తున్న కలెక్టర్ పమేలా సత్పతిభగత్నగర్ ఛత్రపతి శంభాజీ యువసేన ఆధ్వర్యంలో 108 ప్రసాదాల నైవేద్యంచిగురుమామిడి: సీతారాంపూర్లో కుంకుమ పూజలుగణపతి పూజల్లో పాల్గొన్న సీపీ గౌస్ ఆలంకరీంనగర్ జిల్లావ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం కుంకుమార్చనలు.. ప్రత్యేక పూజలు.. అన్న ప్రసాద వితరణలతో ఊరూవాడ మండపాల వద్ద సందడి నెలకొంది. వినాయక పూజల్లో భాగంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అన్నప్రసాద వితరణ చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి సొంతంగా భోజనాలు తయారు చేసి, క్యాంపు కార్యాలయంతో పాటు కలెక్టరేట్ సిబ్బందికి స్వయంగా వడ్డించారు. పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో సీపీ గౌస్ఆలం ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నప్రసాద వితరణ చేశారు. భగత్నగర్లోని ఛత్రపతి శంభాజీ యువసేన ఆధ్వర్యంలో గణపతికి 108 రకాల ప్రసాదాలు సమర్పించారు. చిగురుమామిడి మండలం సీతారాంపూర్లో మహిళలు కుంకుమ పూజలు చేశారు. – కరీంనగర్ అర్బన్/కరీంనగర్ క్రైం/కరీంనగర్కల్చరల్/చిగురుమామిడి -
యూరియా తిప్పలు.. రైతుల ఆందోళనలు
హుజూరాబాద్/చొప్పదండి/శంకరపట్నం: జిల్లాలో యూరియా తిప్పలు తప్పడం లేదు. యూరియా కోసం బుధవారం హుజూరాబాద్ వ్యవసాధికారి కార్యాలయం ఎదుట రైతులు నిరసనకు దిగారు. ఏవో భూమిరెడ్డిని అడ్డుకుని, యూరియా ఏదని నిలదీశారు. రెండు రోజుల్లో వస్తుందని చెప్పడంతో రైతులు శాంతించారు. శంకరపట్నం మండలం లింగాపూర్ గోదాం ఎదుట రైతులు బారులు తీరారు. గోదాంకు బుధవారం 275బస్తాల యూరియా రాగా క్యూలో ఉన్న రైతులకు ఒక్కో బస్తా ఇచ్చారు. చొప్పదండి మండలం కొలిమికుంట గోదాములో చొప్పదండి పీఏసీఎస్ ద్వారా యూరియా పంపిణీ చేశారు. చీకట్ల లక్ష్మి అనే మహిళ యూరియా తీసుకొని వెళ్తుండగా బస్తా కింద పడటంతో కొద్దిగా యూరియా మట్టిలో కలిసింది. ఇంతటి యూరియా కష్టం ఎన్నడు రాలేదని కింద పడ్డ యూరియాను కొంగులో కట్టుకొని వెళ్లింది. కొలిమికుంటలో ఒక్కో రైతుకు ఒక్క బస్తా కూడా ఇవ్వలేదన్నారు. -
కాళేశ్వరం అవసరం లేకుండానే సాగునీరు
తిమ్మాపూర్: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోయకుండానే రెండేళ్లుగా పంటలకు సాగునీరు అందిస్తున్నామని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. దిగువమానేరు జలాశయం నుంచి కాకతీయ కాలువకు బుధవారం ఉదయం నీటి ని విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ప్రకృతి సహకారంతో వర్షాలు కురుస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 22.534 టీఎంసీలకు చేరిందని తెలిపారు. ఎస్ఈ రమేశ్ పాల్గొన్నారు. అర్హత ఉంటేనే చేయూతకరీంనగర్ అర్బన్: అర్హత ఉంటేనే చేయూత పింఛన్లు మంజూరు చేయాలని సెర్ప్ సామాజిక భద్రత డైరెక్టర్ గోపాల్రావు అన్నారు. నగరంలోని కళాభారతిలో బుధవారం 11 రకాల చేయూత పింఛన్లు, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం(ఎన్ఎఫ్బీఎస్)పై ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ సెక్రటరీలు, బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వివిధ సమస్యలతో నిలిచిపోయిన పింఛన్లపై విచారణ జరిపి మండలస్థాయిలో గ్రీవెన్స్, వెరిఫికేషన్ రిపోర్ట్తో రోల్ బ్యాక్ చేసుకోవాలని, ఫేషియల్ రికగ్నిషన్ మొబైల్ యాప్ ద్వారా, పంచాయతీ సెక్రటరీ అథెంటిఫికేషన్పై డీవోపీ పోస్టల్ ద్వారా పింఛన్ల పంపిణీపై అవగాహన కల్పించారు. డీఆర్డీవో వి.శ్రీధర్ పాల్గొన్నారు. పవర్కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ లైన్లను సరిదిద్దే పనులు చేపడుతున్నందున గురువారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 11 కేవీ గీతా భవన్, రాంనగర్ ఫీడర్ల పరిధిలోని జయరాం హాస్పిటల్, రాజీవ్పార్కు, రాంనగర్, మంకమ్మతోట, మార్క్ఫెడ్, లేబర్ అడ్డ, పారమిత పాఠశాల పద్మనగర్, ప్రగతినగర్, పద్మనగర్, రాంనగర్ ఫిష్మార్కెట్, సత్యనారాయణ స్వామి ఆలయం, లిటిల్ పార్కు, వాసర హాస్పిటల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్– 2 ఏడీఈ ఎం.లావణ్య తెలి పారు. వినాయకుల నిమజ్జనం సందర్భంగా విద్యుత్ లైన్లను సరిచేసే పనులు కొనసాగుతున్నందున ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 33/11 కె.వీ.కొత్తపల్లి సబ్స్టేషన్ పరిధిలోని కొత్తపలి, తూర్పువాడ ప్రాంతాలు, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల వరకు 33/11 కె.వీ.పద్మనగర్, శాతవాహన సబ్స్టేషన్ల పరిధిలోని చింతకుంటలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రూరల్ ఏడీఈ గాదం రఘు పేర్కొన్నారు. ఎల్ఎండీ నుంచి లీగల్ మెట్రాలజీ విధులుకరీంనగర్ అర్బన్: జిల్లా తూనికలు, కొలతలశాఖ అధికారులు ఇక ఎల్ఎండీ నుంచే విధులు నిర్వహించనున్నారు. ఇన్నాళ్లపాటు నగరంలోని భగత్నగర్లో అద్దె భవనంలో కార్యాలయం కొనసాగించగా తాజాగా ప్రభుత్వ భవనానికి మార్చారు. ఎల్ఎండీ కాలనీలోని కొత్త ప్రభుత్వ భవనంలోకి షిఫ్ట్ చేశారు. ఏసీ లీగల్ మెట్రాలజీ కార్యాలయం, జిల్లా లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ కార్యాలయం, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ కార్యాలయాలను ఇప్పటికే తరలించగా గురువారం నుంచి ఎల్ఎండీ కొత్త భవనంలోనే విధులు నిర్వహించనున్నారని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. -
భవితకు బాట వేయాలి
కరీంనగర్: విద్యారంగంలో ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివని, విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేయాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవా రం కలెక్టరేట్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధ్యా యులు తల్లిలాంటి వారని, పిల్లలకు చక్కటి విద్యాబుద్ధులు నేర్పాలన్నారు. అవార్డు స్వీకరించిన వారు మాత్రమే కాకుండా చాలామంది ఉపాధ్యాయులు తమ సేవలను గోప్యంగా అందిస్తున్నారన్నారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడు తూ పాఠశాలస్థాయిలో ఉపాధ్యాయులు విద్యార్థులను గమనిస్తూ ఉండాలని, వారు ఎలాంటి ఒత్తిళ్లకు లోనవ్వకుండా చూసుకోవాలని అన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 43మంది, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 17 మంది ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేశారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, డీఈవో చైతన్య జైనీ, విద్యాశాఖ కోఆర్డినేటర్లు అశోక్రెడ్డి, మిల్కూరి శ్రీనివాస్, ఆంజనేయులు, కృపారాణి, జిల్లా సైన్స్ అధికారి జైపాల్రెడ్డి పాల్గొన్నారు. -
సీఈవోల బదిలీపై హైకోర్టు స్టే
కరీంనగర్రూరల్: జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈవోల బదిలీలను నిలిపివేస్తూ హైకోర్టు బుధవారం స్టే ఇచ్చింది. జిల్లాలో మొత్తం30 ప్రాథమిక సహకార సంఘాలుండగా గత నెల 26న ఒకే సంఘంలో సీఈవోగా మూడేళ్లకు పైబడి పనిచేసిన 23 మందిని బదిలీ చేశారు. తక్షణమే విధుల్లో చేరాలని డీఎల్ఈసీ ఉత్తర్వులు జారీ చేసినప్పటికి జీతాల చెల్లింపు, రిటైర్మైంట్ బెనిఫిట్స్ సౌకర్యాలపై స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో పలువురు సీఈవోలు హైకోర్టును ఆశ్రయించారు. బదిలీ ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ స్టే పిటిషన్ దాఖలు చేశారు. ఒకేసారి కోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో సీఈవోలు వ్యక్తిగతంగా విడతల వారీగా పిటిషన్లు దాఖలు చేస్తూ స్టే తెచ్చుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 23మందిని బదిలీ చేయగా ఇప్పటివరకు 15మంది స్టే తెచ్చుకోవడంతో యథాస్థానంలో విధులు నిర్వహిస్తున్నారు. -
రోడ్లే బాగోలేవు.. ఫైన్ ఎందుకు కట్టాలి?
కొత్తపల్లి: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న రేకుర్తి వద్ద కరీంనగర్– జగిత్యాల ప్రధాన రహదారిపై గుంతలు పడ్డ ప్రాంతంలో బుధవారం కరీంనగర్కు చెందిన ఓ సామాజిక కార్యకర్త నిరసన తెలిపాడు. గుంతలు పడ్డ ప్రాంతంలో తన ద్విచక్ర వాహనంతో బైఠాయించి జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ గారు అంటూ ‘రోడ్డుపైన నేను ఏది ధరించకపోయినా.. అన్నింటికీ ఫైన్ కడుతున్నాను. అసలు రోడ్లే సరిగా లేవు. మరి మీరు నాకెందుకు ఫైన్ వేస్తున్నారు.. మీ భారతీయుడు’ అనే ఫ్లకార్డు ప్రదర్శిస్తూ కోట శ్యామ్కుమార్ నిరసన చేపట్టాడు. -
జీపీవో పోస్టుకు పైరవీలు
కరీంనగర్ అర్బన్: భూ భారతి చట్టం అమలులో కీలకంగా మారనున్న గ్రామ పాలన అధికారుల(జీపీవో) నియామకాలకు ముందే పైరవీలు జోరందుకున్నాయి. రేపో, మాపో ప్రభుత్వం జీపీవోల నియామకాలు చేపట్టనుందనే ప్రచారంతో ఓ కార్యాలయం వేదికగా ఒకరిద్దరు బేరసారాలకు తెరలేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం వీఆర్ఎ, వీఆర్వోల వ్యవస్థను రద్దుచేసి ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన వారిని మాతృశాఖకు తీసుకొచ్చేందుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. గత మే 27, జులై 27న పరీక్షలు నిర్వహించగా 163 మంది అర్హత సాధించారు. ఈ నెల మొదటివారంలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు పంపిణీ చేస్తారని రెవెన్యూ వర్గాల్లో ప్రచారం జరగడంతో పైరవీలకు కారణమవుతోంది. జిల్లాలో ప్రస్తుతం 210 రెవెన్యూ గ్రామాలు ఉండగా రెండు, మూడు రెవెన్యూ గ్రామాలు కలుపుకొని 142 క్లస్టర్లు ఉన్నాయి. జిల్లాలో జీపీవో పరీక్ష అర్హత సాధించిన వారు 163 మంది ఉండగా.. వారికే క్లస్టర్ల బాధ్యతలు అప్పజెప్పుతారనే మాట రెవెన్యూ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఫలితంగా ఆదాయం ఎక్కువ ఉండే క్లస్టర్లను దక్కించుకోవాలని కొందరు కీలక విభాగ ఉద్యోగులను సంప్రదించడంతో.. ఇదే అదనుగా సంబంధీకులు జీపీవో అభ్యర్థులకు నేరుగా ఫోన్లు చేయడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కొందరు సొంత మండలాల్లో పని చేస్తుండగా.. మరికొందరు కుటుంబాలకు దూరంగా ఉంటూ ఆయా శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు. దగ్గరగా ఉన్న క్లస్టర్లను కేటాయించాలని కొందరు.. సొంత మండలం నుంచి దూర ప్రదేశాలకు తరలించవద్దని మరికొందరు పైరవీలు చేస్తూ అధికారులపై ఒత్తిళ్లు తెచ్చేందుకు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారనే చర్చ జరుగుతోంది. అభ్యర్థుల విద్యార్హత, సమర్థత ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్లు కేటాయించాలని.. మెజార్టీ అభ్యర్థులు కోరుతున్నారు. మరి కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. పాతవా.. కొత్తవా జిల్లాలో ఇప్పటికే 142 క్లస్టర్లుగా గుర్తించగా మరిన్ని పెంచే అవసరముందని ఇటీవల ప్రభుత్వం ప్రతిపాదనలు కోరింది. ఈ క్రమంలో 255కు పెంచాలని జిల్లా అధికారులు నివేదించినట్లు సమాచా రం. పాత క్లస్టర్ల ప్రకారమైతే ఉత్తీర్ణులైనవారు ఎక్కువగా ఉండగా కొందరు మిగలనున్నారు. కరీంనగర్ అర్బన్లో 3 క్లస్టర్లుండగా మరో 6 క్లస్టర్లు పెంచాలని ప్రణాళిక రూపొందించగా కొత్తపల్లి మండలంలో 9 ఉండగా మరో 7, కరీంనగర్ రూరల్లో 9 ఉండగా మరో 9, రామడుగులో 10 ఉండగా మరో 8, మానకొండూరులో 13 ఉండగా మరో 7, తిమ్మాపూర్లో 10 ఉండగా మరో 7, చిగురుమామిడిలో 8 ఉండగా మరో 7, చొప్పదండిలో 8 ఉండగా మరో 7, గంగాధరలో 11 ఉండగా మరో 8, గన్నేరువరంలో 6 ఉండగా మరో 4, హుజూరాబాద్లో 10 ఉండగా మరో 10, జమ్మికుంటలో 9 ఉండగా మరో 11, శంకరపట్నంలో 10 ఉండగా మరో 6, వీణవంకలో 10 ఉండగా మరో 7, సైదాపూర్లో 9 ఉండగా మరో 6, ఇల్లందకుంటలో 7 ఉండగా మరో 3 క్లస్టర్లు పెంచాలని ప్రభుత్వానికి నివేదించారు. అయితే పాత క్లస్టర్ల ప్రకారం నియామకాలుంటాయా.. నివేదికల క్రమంలో క్లస్టర్లను పెంచి నియామకాలు చేపడుతారా అన్నది త్వరలోనే తేలనుంది. -
బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే నజరానా
కరీంనగర్టౌన్: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కమలం గుర్తుపై పోటీ చేసే అభ్యర్థులను గెలిపించుకుంటే నజరానాలు అందిస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రారావు తొలి సారి కరీంనగర్కు విచ్చేసిన సందర్భంగా బుధవా రం పార్టీ శ్రేణులు రేణికుంట టోల్గేట్, అల్గునూరు చౌరస్తా వద్ద ఘన స్వాగతం పలికారు. కరీంనగర్లోని కొండా సత్యలక్ష్మీ గార్డెన్లో ఏర్పాటు చేసిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బూత్ అధ్యక్ష, కార్యదర్శుల సమావేశానికి రామచంద్రారావుతో కలిసి హాజరైన బండి సంజయ్ మాట్లాడారు. ఏ గ్రామంలోనైతే బీజేపీ అభ్యర్థిని ఎంపీటీసీగా గెలి పించుకుంటారో, ఆ గ్రామానికి రూ.5లక్షలు, మండలం అయితే రూ.10 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చా రు. 9వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు , వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ఆరంభంలోనే 1 నుంచి 6వ తరగతి చదివే విద్యార్థులకు మోదీ కిట్లు అందిస్తానని తెలిపారు. 20 నెలల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధికి ఒక్కపైసా ఇవ్వలేదన్నారు. కేంద్ర నిధుల కోసమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారు. బీఆర్ఎస్ చేసిన అవినీతిలో బాధ్యలపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడానికి ప్రధాన కారణం కేసీఆర్తో కాంగ్రెస్ పెద్దలు లాలూచీ పడటమే అని ఆరోపించారు. అందుకే విచారణల పేరుతో జాప్యం చేస్తున్నారన్నారు. బీజేపీ అభ్యర్థులుగా స్థానిక సంస్థల్లో పోటీచేసే అందరినీ గెలిపించుకునే బాధ్యత తనదేనని బండి సంజయ్ అన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలు గెలిచే అవకాశం లేకపోతే పార్టీ, నామినేటెడ్ పదవులిచ్చి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీలు చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమురయ్య, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ మేయర్లు సునీల్రావు, శంకర్, మాజీ డిప్యూటీ మేయర్ రమేశ్ పాల్గొన్నారు. -
ట్రెసా జిల్లా అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి
కరీంనగర్ అర్బన్: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) జిల్లా అధ్యక్షుడిగా నల్ల వెంకట్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ట్రెసా జిల్లా కమిటీ ఎన్నికలు మంగళవారం రెవెన్యూ భవన్లో నిర్వహించారు. 2025–28 సంవత్సరానికి గానూ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నల్ల వెంకట్రెడ్డి(జమ్మికుంట తహసీల్దార్), ప్రధాన కార్యదర్శిగా పెద్ది విజయ్కుమార్(నాయబ్ తహసీల్దార్), కోశాధికారిగా ఇ.సంతోష్కుమార్(గిర్దావర్), అసో సియేట్ అధ్యక్షులుగా కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్, ఎన్.రాజేష్(తహసీల్దార్, కరీంనగర్ రూరల్), ఉపాధ్యక్షులుగా ముబీన్ అహ్మద్, మాధవి, విశాలి, కమ్రుద్దీన్, సురేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా షరీఫ్, సుమలత, త్రిపాల్, లక్ష్మారెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా శంకర్, సందీప్, ఉష, రంజిత్రెడ్డి, అంజయ్య, స్పోర్ట్స్, కల్చరల్ సెక్రటరీలుగా బషీర్, భవాని, జిల్లా కమిటీ మెంబర్లుగా అన్వర్, కమలేశ్, అరుణ్, శంకర్, బాలకిషన్, అజహర్, కిషన్రెడ్డి, అనిల్, అనిల్కుమార్, రాజలింగం, అశోక్, సంపత్, కొమురయ్య నియామకం అయ్యారని ఎన్నికల అధికారి (ట్రెసా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు) రాజ్కుమార్ వివరించారు. యూరియా కోసం ధర్నాగంగాధర: గంగాధర మండలం కురిక్యాల ప్రాథమిక సహకార సంఘం పరిధిలోని కురిక్యాల, ఉప్పరమల్యాల, గట్టుభూత్కూర్, హిమ్మత్నగర్, గోపాల్రావుపల్లి, మల్లాపూర్ గ్రామాల రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. మంగళవారం యూరియా కోసం వచ్చిన రైతులు విసిగిపోయి కరీంనగర్– జగిత్యాల ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఎస్సై వంశీకృష్ణ కురిక్యాలకు చేరుకొని రైతులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. అధికారులు వచ్చి రైతులకు కూపన్లు ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. లారీ అడ్డగింతగన్నేరువరం: యూరియా బస్తాలతో వెళ్తున్న లారీని జంగపల్లి ఎక్స్రోడ్డులో హన్మాజీపల్లి, గోపాల్పూర్ రైతులు అడ్డుకున్నారు. జంగపల్లి ఎక్స్రోడ్లోని సహకార సంఘం షాపు వద్ద వంద బస్తాలు అన్లోడ్ చేసిన తరువాత లారీ జంగపల్లి వెళ్తోంది. లారీలో మరో 300బస్తాలు ఉండగా వాటిని కూడా ఇక్కడే అన్లోడ్ చేయాలని రైతులు అడ్డుకున్నారు. ఎస్సై నరేందర్రెడ్డి అక్కడికి చేరుకొని ఏవో కిరణ్మయికి ఫోన్లో సమస్యను వివరించారు. రైతులతో మాట్లాడి లారీని అక్కడి నుంచి పంపించారు. పవర్కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులతో పాటు లైన్ మెయింటెనెన్స్ పనులు చేపడుతున్నందున బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కె.వీ.కాపువాడ ఫీడర్ పరిధిలోని అహ్మద్పుర, గౌరీశంకర్ కాంప్లెక్స్, అశోక్నగర్, ఎన్ఎన్ గార్డెన్, మీరా ఆసుపత్రి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్– 1 ఏడీఈ పంజాల శ్రీనివాస్గౌడ్ తెలిపారు. వినాయక నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా విద్యుత్ లైన్ల పనులు, మధ్య స్తంభాల ఏర్పాటు పనులు చేపడుతున్నందున బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొత్తపల్లి, తూర్పువాడలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. -
‘మహాలక్ష్మి’ అమలులో ఇబ్బంది రానీయొద్దు
జగిత్యాలటౌన్: ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ (ఈడీ)సోలోమాన్ అన్నారు. మంగళవారం జగిత్యాల డిపోను సందర్శించిన ఆయనకు డిపో మేనేజర్ కల్పన, సిబ్బంది స్వాగతం పలికారు. డిపో పరిసరాలను పరిశీలించి సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని, ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. మహాలక్ష్మి పథకంలో ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. డిపో గ్యారేజీలో పరివర్తన ప్రోగ్రాంను అమలు చేయాలని కోరారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల పెంపుతోపాటు ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అసిస్టెంట్ ఇంజినీర్ కవిత, ఎస్టిఐ శ్రీనివాస్, డిపో సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ జోన్ ఈడీ సోలోమాన్ -
● జిల్లాకు సరిపడా యూరియా సరఫరా ● అయినా అందరినీ వేధిస్తున్న కొరత ● పక్క జిల్లాలు.. పొరుగు రాష్ట్రానికి తరలింపు
మంథని: జిల్లాలో యూరియా కొరత లేదని, సరిపడా సరఫరా అవుతోంద ని జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పదేపదే ప్రకటనలు గుప్పిస్తున్నారు. కానీ, యూరియా కోసం జిల్లాలో చాలాచోట్ల రైతులు వ్యవసాయ సహకార సంఘాలు, ఇతరత్రా గోదాముల ఎదుట బారులు తీరడం, ధార్నాలకు దిగడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. అయితే, సరిపడా సరఫరా అవుతున్నా అన్నదాతలు ప్రత్యక్ష ఆందోళనకు దిగే పరిస్థితులు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయని, ఇందుకు కారకులు ఎవరు? అనేదానిపై సమాధానాలు చెప్పేవారు కరువయ్యారు. అయితే, అధికారుల ముందుచూపు లేమి ప్రధాన కారణమని జిల్లావ్యాప్తంగా చర్చ జోరందుకుంది. పక్క జిల్లాలు.. పొరుగు రాష్ట్రాలకు యూరియా.. జిల్లాలో సాగు చేసిన పంటల ఆధారంగా సుమారు 28 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈమేరకు 20 వేల పైచిలుకు మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్లు చెబుతున్నారు. మూడు దశల్లో యూరియాను పంట పొలాలకు రైతులు ఉపయోగిస్తారు కానీ.. ఇప్పటికే మూడు విడదలకు సరిపడా జిల్లాకు వచ్చిచేరినట్లు తెలియవచ్చింది. జిల్లాలో ఆలస్యంగా వరినార్లు వేసుకునే మంథని మండలంలోని 32,500 మంది రైతులకు 80 వేల బస్తాలు అవసరం ఉంటుంది. ఇప్పటికే 70 వేల యూరియా బస్తాలు సరఫరా చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మూడోవిడతలో యూరియా చల్లేందుకు ఈనెల చివరి వరకు సమయం ఉంది. కానీ, ఈసీజన్కు సరిపడా యూరియాను అధికారులు ఇప్పటికే రైతులకు సరఫరా చేశామంటున్నారు. అయినా, ఆగ్రోస్, ఎరువుల దుకాణాలు, వ్యవసాయ సహకార సంఘాల ఎదుట ఆందోళనకు దిగడం నిత్యకృత్యమైంది. సమీపంలోనే ఉన్న మంచిర్యాల జిల్లాతోపాటు మహారాష్ట్రలోని సిరొంచ ప్రాంతాలకు యూరియా పెద్దఎత్తున తరలిపోయిందనే వాదనలు ఉన్నాయి. ఈక్రమంలోనే జిల్లా రైతులకు యూరియా కష్టాలు వచ్చాయని అంటున్నారు. ముందే కట్టడి చేస్తే కష్టాలు ఉండేవి కావు.. జిల్లాలో యూరియా కొరత తలెత్తడంతో అధికారులు ఆలస్యంగా తేరుకున్నారు. జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమంగా రావాణా చేస్తున్న యూరియాను పట్టుకుంటున్నారు. అంతా అయిపోయాక హడావుడి అన్నట్లున్న వారితీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందు కట్టడి చేస్తే ఈ పరిస్థితి ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు. ప్రాథమిక సహకార సంఘాలు, ఎరువుల దుకాణాల్లో పెద్దఎత్తున నిల్వలు ఉన్న సమయంలో స్థానిక రైతులు కొనుగోలుకు ముందుకు రాలేదు. ఇదేఅదనుగా భావించిన పక్క జి ల్లా, పొరుగు రాష్ట్రానికి చెందిన రైతులు, కొందరు అక్రమార్కులు ఇక్కడి యూరియాను కొనుగోలు చేసుకొని నిల్వ చేసుకొని పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలోనే స్థానిక రైతులకు యూరియా కష్టాలు ఎదురవుతున్నాయంటున్నారు. అధికారులు ముందే అప్రమత్తంగా ఉంటే ఈ పరిస్థితులు ఉండేవి కాదని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు చెక్పోస్టులు, ఇతరరత్రా కట్టడి చర్యలు తీసుకోవడంలో అర్థం లేదని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అలసత్వం.. అన్నదాతలకు శాపం అభద్రతా భావంతో నిల్వలు కొందరు రైతులు అభద్రతా భావంతో సీజన్కు సరిపడా యూరియా ముందే కొనుగోలుచేసి తమ ఇళ్లలో నిల్వ చేసుకున్నారు. అంతేకాకుండా మంథని సమీపంలోని మంచిర్యాల జిల్లాకు చెందిన చెన్నూర్, జైపూర్, శివ్వారం గ్రామాల రైతులు ఇక్కడినుంచి ఎరువులు తీసుకెళ్లే ఆనవాయితీ కొనసాగుతోంది. ఇలాంటి కారణాలతో యూరియా కొరత ఏర్పడింది. మంథని ప్రాంత రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా స్టాక్ తీసుకొచ్చి నిల్వచేశాం. కలెక్టర్ శ్రీహర్ష ఆదేశాలతో గ్రామాల వారీగా పంపిణీ చేస్తున్నాం. – అంజని, ఏడీఏ, మంథని -
స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా..
కరీంనగర్టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ మే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు బుధవారం కరీంనగర్ పర్యటనకు రానున్నారు. రాష్ట్ర అధ్యక్షహోదాలో తొలిసారి కరీంనగర్ రానుండటంతో పార్టీ శ్రేణులు భారీ స్వాగతానికి ఏర్పాట్లు చేశారు. ఉదయం 10:30కు గుండ్లపల్లి టోల్గేట్ వద్ద కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్తో పాటు వందలాది మంది కార్యకర్తలు ఘన స్వాగతం పలకనున్నారు. మధ్యాహ్నం 12గంటలకు కరీంనగర్లోని కొండా సత్యలక్ష్మీ గార్డెన్లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని బూత్ అధ్యక్షులు, కార్యదర్శులు, జిల్లాస్థాయి నాయకులతో ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై రామచంద్రరావు, బండి సంజయ్ దిశానిర్దేశం చేయనున్నారు. గత ఆరేళ్లలో కరీంనగర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.20,000 కోట్లకు పైగా నిధులు, బండి సంజయ్ చొరవతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యచరణ రూపొందించారు. ప్రత్యేకంగా 10వ తరగతి విద్యార్థులకు ఉచిత సైకిళ్లు, శాతవాహన యూనివర్శిటీకి 12బీ హోదా, కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, సైనిక్ స్కూల్, ఆర్వోబీలు వంటి పలు మేజర్ ప్రాజెక్టుల వివరాలను గ్రామస్థాయిలో ప్రచారం చేసేలా వ్యూహరచన చేయనున్నారు. -
ఇష్టారాజ్యం!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్ల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అడ్మిషన్ల షెడ్యూల్ వెలువడక ముందే కొన్ని కళాశాలలు సీట్లు అమ్ముకుంటున్న విషయం వెలుగుచూసింది. ఈ వ్యవహారంపై ఉన్నత విద్యామండలికి వరుస ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో సదరు కళాశాలలు అనుసరిస్తున్న అక్రమ విధానాలపై ఉన్నత విద్యామండలి అధికారులు ఫోకస్ పెట్టారని సమాచారం. ముందస్తు అడ్మిషన్ల విషయంలో కొన్ని కళాశాలలు అనుసరిస్తున్న అక్రమ వ్యవహారాలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు.అసలేం జరిగింది?ఉన్నత విద్యకు కరీంనగర్ కేంద్రబిందువు. తిమ్మాపూర్ శివారులో మూడు ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. రెండు కళాశాలల నిర్వాహకులు తెలంగాణ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (టీజీఈఏపీసీఈటీ) నుంచి షెడ్యూలు వెలువడకముందే సీట్లను విక్రయించుకున్నారు. ఈ వ్యవహారం సాఫీగా నడిచేందుకు ప్రత్యేకంగా కొందరు పీఆర్వోలను కమీషన్ పద్ధతిన నియమించుకున్నారు. వీరు జూన్కు ముందే విద్యార్థులను వెతికి పట్టుకువచ్చారు. తెలంగాణ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (టీజీఈఏపీసీఈటీ) షెడ్యూల్ ప్రకారం.. జూన్ 28 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కావాలి. శివారులోని రెండు కళాశాలలు జూన్28కి ముందు.. అంటే జూన్ 23నే ఇంజినీరింగ్ (ఈఈఈ) మేనేజ్మెంట్ కోటా సీటు కోసం రూ.10వేలు వసూలు చేశాయి. ఆ కళాశాల సమీపంలోనే మరో కళాశాల అదే ఇంజినీరింగ్ (ఈఈఈ) సీటు కోసం ఏకంగా జూన్ 23వ తేదీన రూ.45,000కు అలాట్ చేసింది. ఇప్పుడు సదరు విద్యార్థులు చెల్లించిన ఫీజు రిసిప్టులు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి. సోషల్మీడియాలోనూ వైరల్గా మారాయి. వాస్తవానికి ఈ తరహాలో పీఆర్వోలు అనేక ఇంజినీరింగ్ సీట్లను నిబంధనలకు విరుద్ధంగా కమీషన్ పద్ధతిన అప్పగించారని విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ఇష్టానుసారంగా ఇంజినీరింగ్ సీట్లు అమ్ముకోవడంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.ఉత్తమ ఉపాధ్యాయులు 60 మందితిమ్మాపూర్ పరిధిలోని రెండు ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలపై ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులు వెళ్లాయి. నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ షెడ్యూల్కు ముందే సీట్ల విక్రయాలు జరిగాయంటూ పలువురు ఉన్నత విద్యామండలిని ఆశ్రయించారు. వాస్తవానికి తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ప్రతీ కళాశాలకు ఫీజు నిర్ణయిస్తుంది. ఇక్క డ రెండు కళాశాలలు ఆ నిబంధనలను తుంగలోకి తొక్కడం గమనార్హం. ఈ రెండు కళాశాలల్లో ఒకటి మేనేజ్మెంట్ కోటాలో సీటుకు రూ. 63,000గా నిర్ణయించింది. సదరు కళాశాల అదనంగా రూ.7000 జోడించి రూ.70,000గా ఫీజు అని చెప్పింది. ఈ విషయంలో కాలేజీకి, విద్యార్థికి మధ్య విభేదాలు తలెత్తాయి. తన వద్ద అదనపు ఫీజు వసూలు చేయడంపై సదరు విద్యార్థి ఉన్నత విద్యామండలికి రిసిప్టులతో కలిపి ఫిర్యాదు చేశాడు. పొరుగున మరో కళాశాల అయితే ఏకంగా రూ.20,000 అదనంగా కలిపి వసూలు చేస్తోంది. వాస్తవానికి డెవలప్మెంట్ ఫీజు, అడ్మిషన్ ఫీజులో అదనపు వసూళ్లు కళాశాలలే నిర్ణయిస్తాయి. కానీ, బోధన ఫీజులోనూ కాలేజీలో మార్పులు చేయడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. త్వరలోనే ఈ వ్యవహారంపై ఉన్నత విద్యామండలి సదరు కాలేజీలకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. -
ఉపాధి ఉత్సవం
పెద్దపల్లిరూరల్: ‘జైబోలో గణేశ్ మహరాజ్కీ.. గణపతి బొప్ప మోరియా’ నినాదాలతో జిల్లాలోని పల్లెలు, పట్టణాల్లో ఆదిదేవుని నామస్మరణ హోరెత్తుతోంది. గతనెల 27న వినాయక చవితి సందర్భంగా మండపాల్ల కొలువుదీరిన గణపయ్య.. నవరాత్రోత్సవాల నిర్వహణలో అనేకమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరికింది. గణేశుని విగ్రహాల తయారీ మొదలు.. పూజాకార్యక్రమాల నిర్వహణ వరకూ.. పురోహితులు, మండపాల వద్ద అన్నదానాలు.. వంటలతయారీ వాకెచ విగ్రహాలను మండపాలకు, ఆఖరు రోజున నిమజ్జనోత్సవానికి తీసుకెళ్లే సమయాల్లో బ్యాండ్ మేళాల వారికి, ఇక మండపాల ఏర్పాటుకు టెంట్హౌస్, మేదరులు, విద్యుత్దీపాల అలంకరణ పనుల్లో డెకోరేషన్ నిర్వాహకులు బిజీ అయ్యారు. నవరాత్రోత్సవాలు పూర్తయ్యేదాకా ఆదిదేవుని అలంకరణ కోసం వస్త్రాలు, పూలు, పండ్లు, పూజాసామగ్రి తదితర వ్యాపారాలు కూడా ఊపందుకున్నాయి. విగ్రహ తయారీతో.. వినాయక చవితి పండుగ వస్తుందంటే నాలుగు నెలల ముందు నుంచే విగ్రహాల తయారీ పనులను కళాకారులు ముమ్మరం చేస్తారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఆయా జిల్లా కేంద్రాల్లో పెద్దషెడ్లు ఏర్పాటు చేసి తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇందుకోసం అనేక ఆకృతుల్లో ఆకట్టుకునేలా గణపతి విగ్రహాలను తీర్చిదిద్దే పనులతో కేవలం పెద్దపల్లి జిల్లాలోనే దాదాపు 1,500 మంది ఉపాధి పొందుతున్నారు. మండపాల ఏర్పాటుతో ప్రధానకూడళ్లు.. గల్లీల్లో ఏటా ఏర్పాటు చేసుకునే ప్రాంతాల్లో గణనాథులను కొలువుదీర్చే నిర్వాహకులు మండపాల తయారీకి టెంట్హౌస్, చలువపందిళ్లు నిర్మించారు. ఇందుకు సెంట్రింగ్ కార్మికులు, టెంట్హౌస్, మేదరులకు చేతినిండా పనిదొరుకుతోంది. ఆకర్షణీయంగా అలంకరణలు.. మండపాల్లో కొలువుదీరిన గణపయ్యలు ఆకర్షణీయంగా కనిపించేలా అలంకరించారు. డెకోరేషన్ చేసేపనుల్లో టెంట్హౌస్ యజమానులు తలమునకలయ్యారు. విద్యుత్ దీపకాంతులు వెదజల్లేలా ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి జిల్లాలో 300 వరకు నిమజ్జనోత్సవం నిర్వహ/ంచే దాకా పనుల్లో బిజీగా ఉంటూ ఉపాధి పొందుతున్నారు. కిరాణాలు.. కూరగాయలు.. వినాయక మండపాల వద్ద ప్రసాదాలు, నిత్య అన్నదానాలు చేస్తుంటారు. ఇందుకు కిరాణా సామగ్రి, కూరగాయలు అవసరం. స్థానిక అవసరాలను బట్టి నిర్వాహకులు తయారు చేయిస్తుంటారు. అందుకు వాటర్ప్లాంట్ల నుంచి తాగునీరు, ఇస్తార్లు, గ్లాసుల వ్యాపారం కూడా జోరందుకుంది. వంటవారికీ ఉపాఽధి.. మండపాల వద్ద నవరాత్రోత్సవాల సందర్భంగా చేసే అన్నదానాలకు అవసరమైన వంటలను సిద్ధంచేసే పనులతో వంటవారికీ ఉపాధి లభిస్తోంది. వంట తయారీకి అవసరమైనంత మంది కూలీలు కూడా అవసరమవుతారు. దాదాపు వెయ్యిమందికి పైగానే చవితి పండుగ పని కల్పిస్తోంది. కళాప్రదర్శనలు.. డప్పుచప్పుళ్లు.. గణపతి మండపాలకు విగ్రహాల తరలింపు.. నిమజ్జనానికి తరలించేటప్పుడు తప్పనిసరిగా డప్పుచప్పుళ్లు, మంగళవాయిద్యాలతో ప్రదర్శన నిర్వహిస్తుంటారు. ఇంకా కొందరైతే నిత్యం ఏదోరకమైన కళాప్రదర్శన సైతం నిర్వహిస్తుంటారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన ఒగ్గు, డోలుదెబ్బ కళాకారులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అవసరాలను బట్టి కళాకారులను రప్పిస్తుంటారు. ఇక డప్పు కళాకారులకు చేతినిండా పనే. దాదాపు 300 మంది వరకు ఇలా ఉపాధి పొందుతారు. వాహనాలకూ గిరాకీ.. వినాయక విగ్రహాలను మండపాలకు తీసుకురావడం.. నవరాత్రులపాటు పూజలు అందుకున్న తర్వాత నిమజ్జనం చేసేందుకు తీసుకెళ్లేందుకు వాహనాలు అవసరం. ఇందుకు వారి అవసరాలను బట్టి మండప నిర్వాహకులు ట్రాక్టర్లు, డీసీఎం వ్యాన్లు, లారీలను వినియోగిస్తుంటారు. ఇందుకు దాదాపు రెండు వేలకుపైగా వాహనాలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఏది ఏమైనప్పటికీ వేలాది మందికి నవరాత్రి ఉత్సవాలు ఊరూరా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. నవరాత్రి వేడుకలతో ఊరూరా ఉపాధి ప్రధాన కూడళ్లలో గణపతి మండపాలు భక్తిభావంతో భక్తుల పూజలు వేలాది మందికి ఉపాధి కల్పించిన వేడుకలు -
ఎండాకు తెగులు.. సస్యరక్షణే మేలు
కరీంనగర్ అర్బన్: అసలే వర్షాలు సకాలంలో కురవక ఇబ్బందులుపడ్డ రైతులను తెగుళ్లు ఆందోళనకు గురి చేస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతం వరి పిలక దశలో ఉండగా పంటకు బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశిస్తోంది. ఇది పంట దుబ్బు కట్టే దశలో ముఖ్యంగా సన్నగింజ రకాల్లో మరింతగా సోకుతుందని డాట్ సెంటర్ కోఆర్డినేటర్ డా.హరికృష్ణ వివరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎండాకు తెగులు గుర్తించగా నివారణ చర్యలను వివరించారు. అయితే ఆలస్యంగా నాట్లు వేసిన ప్రాంతాల్లో సెప్టెంబర్లో సోకనుండగా నివారణకు ఎలాంటి మందులు లేవు. లక్షణాలు గుర్తించి సస్యరక్షణ చ ర్యలు చేపట్టడం ఒక్కటే మార్గం. ఈ నేపథ్యంలో తె గులు సోకిన పంటకు అనుసరించాల్సిన యా జమాన్య చర్యలను డా.హరికృష్ణ వివరించారు. ఎండాకు తెగులు లక్షణాలిలా.. తెగులు ఆశిస్తే ఆకుల మీద పసుపురంగు నీటి డాగు మచ్చలు ఏర్పడి అంచుల వెంట పైనుంచి కింది వరకు అలల మాదిరిగా వ్యాప్తి చెందుతుంది. ఉదయం వేళ ఈ మొక్కలను గమనిస్తే ఆకుల నుంచి పచ్చని జిగురు పదార్థం కనిపిస్తుంది. ఇది సూర్యరశ్మికి గట్టిపడి చిన్న ఉండలుగా మారి గాలి వీస్తే నీటిలో పడతాయి. తర్వాత ఇతర మొక్కలు, పొలాలకు వ్యాపిస్తాయి. ఈ లక్షణాలపై రైతులకు అవగాహన ఉండాలి. లేదా స్థానిక వ్యవసాయాధికారిని సంప్రదించాలి. యాజమాన్య చర్యలు రైతులు నిత్యం పొలాన్ని గమనిస్తూ ఉండాలి. లక్షణాలు 5శాతం కంటే ఎక్కువైతే నత్రజని వేయడం తాత్కాలికంగా ఆపేయాలి. తెగులు సోకిన పొలం నుంచి ఇతర పొలాలకు నీరు పారకుండా చూడాలి. పొటాష్ను దమ్ములో, ఆఖరి దఫాగా ఎకరానికి 15 కిలోలు వేయాలి. ఏటా తెగులు సోకితే తట్టుకునే రకాలు సాగు చేయాలి. దుబ్బుకట్టే దశ నుంచి చిరు పొట్ట దశలో గమనిస్తే కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. ప్లాంటా మైసిన్ లేదా పోషమైసిన్ లేదా అగ్రిమైసిన్ 0.4గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. దీంతో తెగులు వ్యాప్తిని కొంతమేర నియంత్రించొచ్చు. తెగులుకు పలు కారణాలు గాలిలో తేమశాతం అధికంగా ఉండడం, ఎడతెరిపి లేని చిరుజల్లులు కురవడం, గాలులు వేగంగా వీయడం, సగటు ఉష్ణోగ్రతలు 22–26 సెంటీ గ్రేడ్ మధ్య ఉండడం వంటి కారణాలతో తెగులు సోకుతుంది. రైతులు పైపాటుగా అధిక మోతాదులో నత్రజని వాడడంతో ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వరిని వెంటాడుతున్న సమస్య -
గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు
కొత్తపల్లి(కరీంనగర్)/మానకొండూర్: గణేశ్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. నీటిపారుదల, విద్యుత్, అగ్నిమాపక, పోలీసు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిమజ్జనానికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. మానకొండూర్, కొత్తపల్లి చెరువులు, చింతకుంట ఎస్సారెస్పీ కాలువ వద్ద నిమజ్జన కేంద్రాలను మంగళవారం సీపీ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డితో కలిసి సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిమజ్జన ప్రాంతాల్లో భారీకేడ్లు, తగిన సామర్థ్యంతో ఉన్న క్రేన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. చెరువులో బోట్లు, ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ గణేశ్ నిమజ్జ్జనం నేపథ్యంలో నగరంలో, నిమజ్జన ప్రాంతాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా దారి మళ్లింపు, వన్వే చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్డీవో కుందారపు మహేశ్వర్, ఏసీపీ విజయ్కుమార్, కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు పాల్గొన్నారు. భూ సేకరణ సమస్యలు పరిష్కరించండికరీంనగర్ అర్బన్: జిల్లా మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి 563 నిర్మాణానికి భూసేకరణ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. భూ సేకరణ సమస్యలపై మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. భూములు కోల్పోయిన వారికి అందిన పరిహారం, మార్కెట్ రేటు, భూమి అప్పగించకపోవడానికి కారణాలను తెలుసుకున్నారు. సేకరణ విషయంలో అభ్యంతరాలు ఉన్నవారితో మాట్లాడి భూ సేకరణకు సహకరించేలా చూడాలని అన్నారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మికిరణ్, జాతీయ రహదారి సంస్థ ప్రాంతీయ అధికారి శివశంకర్, వరంగల్ ప్రాజెక్ట్ సంచాలకుడు నాగరాజు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్బాబు పాల్గొన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ భూసేకరణ వేగవంతం చేయాలి మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణంలో భాగంగా నదికి ఇరువైపులా ఉన్న ప్రైవేటు వ్యక్తుల నుంచి భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ భూముల సర్వేనంబర్లు, భూ సేకరణ విస్తీర్ణం తదితర అంశాలపై ఇరిగేషన్ రెవెన్యూ, అధికారులతో చర్చించారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కిరణ్ ప్రకాశ్, ఇరిగేషన్ డీఈలు వేణుగోపాల్, సంతోష్ పాల్గొన్నారు. -
● జోహార్ వైఎస్సార్
కరీంనగర్ కార్పొరేషన్: తెలుగు ప్రజల్లో చెరగని ముద్ర దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. మంగళవారం వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. డీసీసీ కార్యాలయంలో సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్రెడ్డి వైఎస్సార్ చిత్రపటానికి నివాళి అర్పించారు. పులి ఆంజనేయులుగౌడ్, శ్రవణ్నాయక్, కొరివి అరుణ్కుమార్, వెన్న రాజమల్లయ్య, గుండాటి శ్రీనివాస్రెడ్డి, కల్వ లామ చందర్, మాదాసు శ్రీనివాస్ పాల్గొన్నారు. నగరంలోని వృద్ధులు, వికలాంగుల వసతిగృహంలో పీసీసీ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. మాజీ కార్పొరేటర్ కట్ల సతీశ్, వీర దేవేందర్ పటేల్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు ఆధ్వర్యంలో ప్రజాకార్యాలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళి అర్పించారు. -
● నిధులు ‘నిమజ్జనం’
కరీంనగర్ కార్పొరేషన్: వినాయక నిమజ్జనం సందర్భంగా నగరవ్యాప్తంగా చేపడుతున్న పనులు అభా సుపాలవుతున్నాయి. గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వీలుగా, రోడ్లపై గుంతలను పూడ్చే పనులను సంబంధిత కాంట్రాక్టర్లు మంగళవారం నుంచి ప్రారంభించారు. నగరపాలకసంస్థ రూ.59.93 లక్షలతో 24 పనులకు టెండర్ పిలవడం తెలిసిందే. కేవలం రోడ్లపై గుంతలు పూడ్చేందుకు సుమారు రూ.24 లక్షలు కేటాయించారు. ఈ సివిల్ వర్క్స్ పొందిన కాంట్రాక్టర్లు నగరంలోని ఆయా డివిజన్లలో పనులు మొదలు పెట్టారు. కొంతమంది కాంట్రాక్టర్లు ౖపైపెనే పనులు చేస్తూ, బిల్లులు ఎత్తుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అశోక్నగర్లోని గుంతల్లో స్టోన్చిప్స్ నింపి గంటలు గడవకముందే గుంతలు మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. నిమజ్జనం జరిగేందుకు మరో రెండు రోజులు గడువు ఉండగా, ఆ లోగా రోడ్డు గుంతలతో మళ్లీ మామూలు స్థితికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. నగరపాలకసంస్థ అధికారులు ౖపైపె పనులు కాకుండా, వినాయక విగ్రహాల వాహనాలు సాఫీగా వెళ్లే విధంగా రోడ్లను చదును చేయాల్సిన అవసరం ఉందని నగర ప్రజలు కోరుతున్నారు. -
గణేశునికీ జియోట్యాగింగ్
జగిత్యాలక్రైం: వినాయక నవరాత్రులు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. జగిత్యాల జిల్లాలోని వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించినవారు తమ వివరాలను ఆన్లైన్ పోర్టల్లో పొందుపర్చాలని ఆదేశాలివ్వడంతో నిర్వాహకులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. వినాయక చవితి వేడుకల్లో ఎలాంటి అపశృతి చోటుచేసుకోకుండా పోలీసు శాఖ గట్టి నిఘా ఏర్పాటు చేసింది. ప్రతీ విగ్రహానికి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్ని విగ్రహాలు..? ఎన్ని మండపాలు పెడుతున్నారో పూర్తిస్థాయిలో వివరాలను సేకరించేందుకు పోలీస్శాఖ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తోంది. అనుమతి లేకుండా విగ్రహాలు పెడితే చర్యలు తీసుకుంటామని ఇదివరకే ఆదేశాలు జారీ చేయడంతో యువజన సంఘాల సభ్యులు, మండప నిర్వాహకులు సహకరిస్తున్నారు. జిల్లాలో అధికారికంగా 3,076 మండలపాలను ఏర్పాటు చేసినట్లు తెల్సింది. వాటికి వంద శాతం జియో ట్యాగింగ్ పూర్తి చేశారు. వీటి వద్ద అనుకోని ఘటనలు జరిగితే పోలీసులు నేరుగా అక్కడికి చేరుకోవడానికి వీలుంటుంది. అడ్రస్ సరిగా తెలియక ఆలస్యం కాకుండా ఇప్పుడిక నిమిషాల్లో చేరుకునేలా ప్రణాళిక రూపొందించింది. అనుమతి తప్పనిసరి సాంకేతికను జోడించడానికి పోలీసులు వినాయక నవరాత్రులు ప్రశాంతంగా నిర్వహించేందుకు ముందు నుంచి ప్రణాళిక ప్రకారం సాగుతున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకు ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఠాణాల వారిగా వచ్చిన దరఖాస్తులను పోలీసు అధికారులు పరిశీలించి అనుమతి ఇచ్చారు. వీటిల్లో కొలువుదీరిన విగ్రహాలకు జియోట్యాగింగ్ చేశారు. మండపాల వద్దగానీ, శోభాయాత్ర సమయంలో గానీ అనుకోని ఘటనలు జరిగితే క్షణాల్లో అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే అవకాశం ఉంది. ఇలా చేస్తున్నారు ఎస్సైతోపాటు బ్లూకోల్ట్స్, 100 డయల్ సిబ్బంది వద్ద ట్యాబ్లు ఉన్నాయి. వీరందరూ పట్టణాలు, గ్రామాల్లోని గణపతి మండపాలను పరిశీలిస్తున్నారు. కమిటీ నిర్వాహకుల పేర్లు, ఫోన్ నంబర్లు, మండపం ఏ ప్రాంతంలో ఉందో అనే వివరాలను సేకరించి ఆ తర్వాత ట్యాబ్లో గణపయ్య విగ్రహాన్ని ఫొటో తీసి ఆన్లైన్ ద్వారా జియోట్యాగింగ్ చేస్తున్నారు. అందులోని లొకేషన్ ఆప్షన్ను నొక్కగానే వెంటనే మండపం ఏర్పాటు చేసిన ప్రాంతంలోని గుర్తులు నమోదు అవుతాయి. అలాగే నిమజ్జనం ఏ రోజున, ఏ చెరువులో చేస్తారనే వివరాలను సేకరిస్తున్నారు. ఆన్లైన్లో విగ్రహాల వివరాలు ప్రతీ మండపంపై ప్రత్యేక నిఘా జగిత్యాల జిల్లాలో 3,076 విగ్రహాల ఏర్పాటు 100 శాతం జియోట్యాగింగ్ పూర్తి మండప నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రివేళ తప్పనిసరిగా ఉండాలి. విగ్రహాలను గుర్తించేందుకు ప్రతి విగ్రహం వద్దకు సిబ్బంది వెళ్లి ఫొటో తీసి ఆన్లైన్లో పెడుతున్నారు. రాత్రివేళ గస్తీ ముమ్మరం చేశాం. బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్, 100 డయల్ సిబ్బంది నిరంతరం వినాయక మండపాలపై పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. వందశాతం జియోట్యాగింగ్ పూర్తయింది. – అశోక్కుమార్, జిల్లా ఎస్పీ -
కునుకే బంగారమాయేనే..
కరీంనగర్టౌన్/హుజూరాబాద్: నిద్ర చోటెరగదు అంటారు. దానిని ఆపడం ఎవరితరమూ కాదు. మహాఅయితే ఒకరోజు ఆపగలమేమోగానీ.. కునుకు తీయకుండా మాత్రం ఉండలేం. అయితే.. మారిన జీవన విధానాలు, చుట్టుముడుతున్న ఆర్థిక, కుటుంబ సమస్యల మధ్య యువత, వృద్ధుల్లో కంటినిండా నిద్ర కరువవుతోంది. ముఖ్యంగా మధ్య వయసు్కలు పగలంతా కష్టం చేసి రాత్రి అయ్యాక కంటినిండా నిద్రపోవడం ఒక కలగా మారుతోంది. నిద్రలేమితో బాధపడుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. వీటిలో ప్రధానమైనవి కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య లేకపోవడం, యాంత్రిక జీవనం, మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు, మద్యం సేవించడం, ఇతర సమస్యలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.నిద్రలేమితో సమస్యలివీ..● ఏకాగ్రత, జ్ఞాపకశక్తి లోపించడం, చురుకుదనం తగ్గడం● రోడ్డు ప్రమాదాలకు గురికావడం● చిరాకు, కోపం, పనులపై దృష్టి కోల్పోవడం● రక్తపోటు, గుండెజబ్బులకు దారితీయడం● తలనొప్పి, కండరాల నొప్పి● జీవనక్రియ లోపాలు, హార్మోన్ల అసమతుల్యత● బరువు పెరగడం, మానసిక రుగ్మతలు, రోగ నిరోధకశక్తి తగ్గిపోవడంఏం చేయాలి? ● బరువును నియంత్రణలో పెట్టుకోవడం● రోజూ ఒకే సమయానికి పడుకోవడం, లేవడం చాలా ప్రధానం● మంచి నిద్ర కోసం పడకగదిని సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి● నిద్రపోయే సమయానికి గంట ముందు సెల్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లు కట్టేయాలి● సంగీతం వినాలి, పుస్తకాలు చదవాలి. పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం, నచ్చిన వారితో గడపటం లాంటి చర్యలతో ఒత్తిడి, ఆందోళన నుంచి బటయ పడొచ్చు.● వ్యాయామంతో మంచి నిద్ర పడుతుంది. రోజూ కనీసం గంటపాటు నడక, ఈత, సైక్లింగ్ లాంటివి చేయాలి.● కుటుంబ సంబంధాలు సరిగా ఉండడమూ ముఖ్యమే. భార్యాభర్తలు ఇద్దరూ పనిచేస్తే.. ఇంటి పనిలో ఇద్దరూ భాగస్వామ్యం తీసుకోవడం వల్ల ఒక్కరిపైనే ఒత్తిడి పడకుండా ఉంటుంది.కారణాలు ఎన్నో..∙ వృత్తి, వ్యక్తిగతంగా చాలామంది ఒత్తిడికి గురవుతుంటారు. ఆందోళన ఎక్కువై కునుకు రావడంలేదు. కొందరిలో జీవనశైలి మార్పులతోనూ ఈ ఇబ్బంది ఎదురవుతోంది.∙ రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం, ఎక్కువగా తినడం వల్ల పొట్టలో అసౌకర్యం, గ్యాస్ సమస్యతో నిద్రపట్టదు. కొందరికి పగటి నిద్ర అలవాటు. దీంతో రాత్రి నిద్రపట్టదు.∙ కుంగుబాటు, రక్తపోటు, నొప్పి నివారణ, బరువు తగ్గించే మందులు నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. ఏదైనా తీవ్రమైన సంఘటన జరిగితే మానసిక ఆందోళనతో నిద్రరాదు.∙ అధిక బరువుతో గురక(స్లీప్ అప్నియా) నిద్రలేమికి కారణమవుతుంది.∙ స్మోకింగ్, ఆల్కాహాల్ అలవాటు నిద్రలేమిని మరింత ఎక్కువ చేస్తాయి. ఆల్కాహాల్ తీసుకున్న తర్వాత కొద్ది గంటలు నిద్రపట్టినట్లు ఉంటుంది. కానీ.. మత్తు వదిలిన తర్వాత నిద్రపట్టదు. 6–8 గంటలు నిద్రించాల్సిందే..ఒక్కోసారి విపరీత నిర్ణయాలు తీసుకునేందుకు నిద్రలేమి కూడా ఒక కారణమని చెబుతున్నారు. తాజాగా కరీంనగర్లోని ఓ యువకుడు నిద్రలేమికి చికిత్స తీసుకుంటూ అపస్మారక స్థితికి చేరుకొని ఆస్పత్రి పాలయ్యాడు. ప్రతీ వ్యక్తికి రోజూ 6–8 గంటలపాటు నాణ్యమైన నిద్ర అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.పురుషులే అధికం మహిళ, పురుçషుల్లో గమనిస్తే పురుషులు 81 శాతం మంది కనీసం 6 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నట్లు తెలుస్తోంది. అదే మహిళల విషయానికి వస్తే 60 శాతం మంది 6 గ ంటలలోపు నిద్రపోతున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక, కుటుంబ, ఉద్యోగపరమైన ఒత్తిళ్లతో పురుషులు అధిక ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. ఉరుకులు పరుగుల జీవితంవ్యాపారంలో ఉన్న పోటీని తట్టుకొని నిలబడాలంటే కష్టమర్ల అభిరుచికి అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేయాల్సి వస్తుంది. దీంతో తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడిని తట్టుకొని పనిచేయడం వల్ల లేనిపోని సమస్యలు తలెత్తుతున్నాయి.– వెన్నం శ్రీనివాస్, వ్యాపారి, కరీంనగర్ఒత్తిడే ప్రధాన సమస్యసాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే ఏసీ గదుల్లో పనిచేస్తున్నామనే ఆనందమే తప్ప మానసికంగా తీవ్ర ఒత్తిడి ఉంటుంది. వారంవారం షిఫ్టులు మారినప్పుడు నిద్రలేమి సమస్యలు వస్తాయి. కూర్చొని పనిచేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడుతుంటాయి.– జి.సంతోషిణి, సాఫ్ట్వేర్ ఉద్యోగిఆందోళనలు పక్కనపెట్టాలి అనవసరపు ఆందోళనలు పక్కన బెట్టి నిద్ర కోసం ఉపక్రమించాలి. మంచి నిద్ర ఉంటేనే తెల్లవారి బ్రెయిన్ చురుకుగా ఉండి పనులు చేసుకోవచ్చు. నిద్రపోయే ముందు 15 నిమిషాల పాటు కళ్లు మూసుకొని ఏకాగ్రతతో ఉంటే నిద్ర ఉపక్రమిస్తుంది. – వర్షి, మానసిక వైద్యనిపుణులు, హుజూరాబాద్మెదడు పనితీరు తగ్గుతుందినిద్రలేమి వల్ల మెదడు పనితీరు తగ్గిపోయి మతిమరుపు, ఏకాగ్రత లోపం, నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం ఏర్పడుతుంది. ఇమ్యూనిటీ దెబ్బతినడంతో వైరల్స్, బాక్టీరియా వ్యాధులపై శరీరం పోరాడే శక్తి కోల్పోతుంది. రోజూ కనీసం 7–8 గంటలు ప్రశాంతమైన నిద్రపోవడం తప్పనిసరి చేసుకోవాలి.– డాక్టర్ ఉపేందర్రెడ్డి, క్రిటికల్కేర్ నిపుణులు -
సమస్యల వాణి.. పరిష్కరించాలని
కరీంనగర్ అర్బన్: సమస్యలు పరిష్కరించాలని ప్రజలు ప్రజావాణిని ఆశ్రయించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో అత్యధికం వచ్చిన ఫిర్యాదులే మళ్లీ మళ్లీ రావడం విశేషం. సంబంధిత అధికారులు సమస్యలను పరిష్కరించామని కాగితాల్లో చూపుతుండగా ఆచరణలో మాత్రం విరుద్ధ పరిసి్?థ్త అని అర్జీదారులు వాపోతున్నారు. ప్రధానంగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, నివేసన స్థలాలు, పింఛన్లు, రేషన్కార్డుల కోసం దరఖాస్తులు రాగా పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు కలెక్టర్ పమేలా సత్పతి చొరవ చూపారు. దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్లు లక్ష్మీకిరణ్, అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు అర్జీలను స్వీకరించారు. మొత్తం 269 దరఖాస్తులు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురిని ‘సాక్షి’ పలకరించగా తమ ఆవేదనను వివరించారు. వివరాలు వారి మాటల్లోనే.. మొత్తం అర్జీలు: 269 ఎక్కువగా మునిసిపల్ కమిషనర్: 57 వారఽధి సొసైటీ: 21, డీపీవో: 15 ఆర్డీవో కరీంనగర్: 15 తహసీల్దార్ గంగాధర: 12 తహసీల్దార్ మానకొండూరు: 11 సీపీ ఆఫీస్: 08 -
దర్జాగా బేస్మెంట్ నిర్మాణం
గ్రామ ప్రజల సౌకర్యార్థం నల్లాల బావి వద్దకు వెళ్లేందుకు 2007లో గ్రామ సభ తీర్మాణం చేసి 20 ఫీట్ల దారి తీశారు. 4ఫీట్ల డ్రైనేజీ నిర్మించారు. మహేశ్ అనే వ్యక్తి డ్రైనేజీని పూడ్చివేసి రోడ్డుకు అడ్డంగా బేస్మెంట్ నిర్మించాడు. దీంతో నీరు నిలిచి, దోమలు పెరిగి దుర్వాసన వెదజల్లుతోంది. సదరు నిర్మాణాన్ని కూల్చేలా చర్యలు చేపట్టండి. – మోతె గ్రామస్తులు, రామడుగు భర్త రామకృష్ణ వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. 2019లో రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని మృతిచెందాడు. కుటుంబ పోషణ భారంగా ఉంది. కూలీ పనులు చేసుకుంటూ కూతురిని చదివిస్తున్న. వితంతు పింఛన్ కోసం ఐదేళ్లుగా తిరుగుతున్నా. ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. – రజిత, కరీంనగర్ -
ఆందోళనలు పక్కనపెట్టాలి
అనవసరపు ఆందోళనలు పక్కన బెట్టి నిద్ర కోసం ఉపక్రమించాలి. మంచి నిద్ర ఉంటేనే తెల్లవారి బ్రెయిన్ చురుకుగా ఉండి పనులు చేసుకోవచ్చు. నిద్రపోయే ముందు 15 నిమిషాల పాటు కళ్లు మూసుకొని ఏకాగ్రతతో ఉంటే నిద్ర ఉపక్రమిస్తుంది. – వర్షి, మానసిక వైద్యనిపుణులు, హుజూరాబాద్ నిద్రలేమి వల్ల మెదడు పనితీరు తగ్గిపోయి మతిమరుపు, ఏకాగ్రత లోపం, నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం ఏర్పడుతుంది. ఇమ్యూనిటీ దెబ్బతినడంతో వైరల్స్, బాక్టీరియా వ్యాధులపై శరీరం పోరాడే శక్తి కోల్పోతుంది. రోజూ కనీసం 7–8 గంటలు ప్రశాంతమైన నిద్రపోవడం తప్పనిసరి చేసుకోవాలి. – డాక్టర్ ఉపేందర్రెడ్డి, క్రిటికల్కేర్ నిపుణులు -
పాస్బుక్ ఇవ్వలే
ఆరెపల్లిలో మా అమ్మ పేరున సర్వే నంబర్ 364/ఆ లో 22 గుంటలన్నర ఉండగా, తండ్రి పేరున 365, 366 సర్వే నంబర్లలో 23 గుంటల భూమి ఉంది. సదరు భూమికి సంబంధించి మా పేరున ప్రొసీడింగ్ బి/1259/2020 ఇచ్చారు. కానీ ఆన్లైన్లో నమోదు కాలేదు. పాస్బుక్ రాలేదు. భూభారతిలో దరఖాస్తు ఇచ్చినా మా సమస్య పరిష్కారం కాలేదు. – రామచంద్రం, మహేశ్, ఆరెపల్లి, కరీంనగర్పద్మనగర్ జంక్షన్ పనుల్లో విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారు. ఎటువంటి వర్క్ స్లిప్ లేకుండా సరైన ఎస్టిమెట్ లేకుండా పనులు చేశారు. సరైన అంచనాలతో అప్రూవల్ తీసుకుని పనులు ప్రారంభించాలి కానీ అవేవీ లేవు. మాధవ కన్స్ట్రక్షన్ చేపట్టిన పనులపై అనేక ఫిర్యాదులుండగా మళ్లీ వారికే పనులు అప్పగించడమేంటీ.? పనులకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోండి. – బండారి వేణు, మాజీ కార్పొరేటర్, కరీంనగర్ -
హెల్త్ సెంటర్ను ప్రభుత్వ భవనంలోకి మార్చాలి
● కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్టౌన్/కరీంనగర్కార్పొరేషన్: సప్తగిరికాలనీ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రభుత్వ భవనంలోకి మార్చాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ భవనా న్ని పరిశీలించారు. విశాలంగా ఉన్న ఈ భవనంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని, శుక్రవారం సభ నిర్వహించాల ని సూచించారు. డీఎంహెచ్వో వెంకటరమణ, మాజీ కార్పొరేటర్ బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. గడువులోగా పూర్తిచేయాలి కరీంనగర్అర్బన్: ప్రభుత్వ పథకాలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. 15 ఏళ్లు నిండిన బాలికలు, 50 ఏళ్లు పైబడిన మహిళలు, దివ్యాంగులను స్వయం సహాయక సంఘాల్లో చేర్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల ముఖ గుర్తింపు హాజరును ఉపాధ్యాయుల సాధారణ సెలవులతో సోమవారం నుంచి లింక్ చేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు అన్ని ప్రభుత్వ వసతి గృహాలను సందర్శించి వసతులు, సౌకర్యాల నివేదిక సమర్పించాలని సూచించారు. అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్బాబు పాల్గొన్నారు. ఆడిటోరియం పనుల పరిశీలన కలెక్టరేట్ ఆడిటోరియంలో జరుగుతున్న ఆధునికీకరణ పనులను కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. మండపాల వద్ద ప్రత్యేక నిఘాకరీంనగర్క్రైం: మహిళలు, యువతులు, బాలికల భద్రతకు వినాయక మండపాలు, ఊరేగింపుల వద్ద షీ టీంలు ప్రత్యేక నిఘా పెడుతున్నట్లు సీపీ గౌస్ ఆలం పేర్కొన్నారు. వినాయక నవరాత్రుల్లో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, అభ్యంతరకర ఫొటోలు, వీడియోలు తీసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వేధింపులకు గురైనప్పుడు విద్యార్థినులు, మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. కాలేజీలు, పాఠశాలల్లో ర్యాగింగ్, ఈవ్టీజింగ్, పని ప్రదేశాల్లో వేధింపులు, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా వేధింపులకు గురైనప్పుడు నేరుగా సంప్రదించలేనివారు 87126 70759 నంబర్కు లేదా డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఆగస్టులో అందిన ఫిర్యాదుల ఆధారంగా 4 క్రిమినల్ కేసులు నమోదు చేయగా, 10 మందికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. 70 హాట్స్పాట్లలో నిఘా ఏర్పాటు చేయడంతో పాటు 30 మంది పోకిరీలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కౌన్సెలింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు. జిల్లా పశుసంవర్థక శాఖ అధికారిగా లింగారెడ్డి కరీంనగర్అర్బన్: జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి(డీవీహెచ్వో)గా డా.నల్ల లింగారెడ్డి నియమితులయ్యారు. సుధాకర్ ఇటీవల ఉద్యోగ విరమణ చేయగా లింగారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాంతీయ పశుసంవర్థక శిక్షణ కేంద్రం ఏడీగా వ్యవహరిస్తున్న లింగారెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించింది. కాగా సోమవారం బాధ్యతలు స్వీకరించగా పశుసంపద వృద్ధి, పాడి రైతులకు సత్వర సేవలందించేందుకు కృషి చేస్తానని లింగారెడ్డి తెలిపారు. ఏడీహెచ్లు వినోద్కుమార్, రామస్వామి, మహేందర్, సూపరింటెండెంట్లు గూడ ప్రభాకర్రెడ్డి, జగన్, డాక్టర్లు కోటేశ్వర్రావు, దివ్య, సాయిచైతన్య, సురేందర్రెడ్డి, భారతి, అరవింద్రెడ్డి, సుష్మిత, శశికాంత్, సాంబరావు, మనోహర్, కార్యాలయ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. -
‘పరిషత్’ ఎన్నికలకే మొగ్గు
కరీంనగర్: స్థానిక సంస్థల ఎన్నికలు ఈనెల 30లోగా నిర్వహించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించడంతో ఆ దిశగా కసరత్తు మొదలైంది. మొదట పరిషత్, తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాలతో అధికార యంత్రాంగం తలమునకలైంది. ఇందులో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించి వాటిపై అభ్యంతరాలు స్వీకరించి, తుది జాబితా ప్రదర్శనకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జెడ్పీ సీఈవోలు ఆయా మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 6న జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాలను జెడ్పీ, మండల పరిషత్తులలో ప్రదర్శించాలని ఆదేశాలు అందాయి. 8న జిల్లా, మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని ఎన్నికల సంఘం సూచించింది. వాటిపై అభ్యంతరాలుంటే 8 వరకు లిఖిత పూర్వకంగా దరఖాస్తుకు అవకాశం కల్పించారు. వాటిని 9లోగా పరిష్కరించి, 10న తుది జాబితా ప్రదర్శించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో పల్లెల్లో రాజకీయ సందడి నెలకొంది. -
తప్పని నిరీక్షణ
చొప్పదండి/చిగురుమామిడి/శంకరపట్నం/తిమ్మాపూర్: రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. వేకువజాము నుంచే కేంద్రాల వద్ద నిరీక్షిస్తున్నారు. సోమవారం చొప్పదండి పీఏసీఎస్కు 1,120 బస్తాలు రాగా ఈపాస్ యంత్రంలో వివరాలు నమోదు చేసిన అనంతరం రైతుల మొబైల్కు ఓటీపీ వచ్చాక పంపిణీ చేశారు. ఈ విధానంతో పంపిణీ ఆలస్యం అవుతోంది. చిగురుమామిడి పీఏసీఎస్లో 250 మందికి 500 బస్తాలు అందజేశారు. బస్తాలు దొరకని రైతులు సింగిల్విండో ఎదుట కరీంనగర్–హుస్నాబాద్ రహదారిపై ధర్నా చేపట్టారు. సీఐ సదన్కుమార్, ఎస్సై సాయికృష్ణ రైతులను సముదాయించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. శంకరపట్నం మండలం మెట్పల్లిలో ‘గణపతి బొప్పామోరియా.. మాకు కావాలి యూరియా’ అంటూ నినాదాలు చేశారు. ముత్తారంలో మహిళా రైతులు సైతం క్యూకట్టారు. సుమారు 400 మంది క్యూ కట్టడంతో తోపులాడుకున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో ఒక బస్తా చొప్పున పంపిణీ చేశారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ సొసైటీ వద్ద ఆదివారం రాత్రి నుంచే క్యూకట్టారు. మన్నెంపల్లి గోదాం వద్ద సైతం రైతులు వర్షంలో తడుస్తూ నిరీక్షించారు. -
6–8 గంటలు నిద్రించాల్సిందే..
ఒక్కోసారి విపరీత నిర్ణయాలు తీసుకునేందుకు నిద్రలేమి కూడా ఒక కారణమని చెబుతున్నారు. తాజాగా కరీంనగర్లోని ఓ యువకుడు నిద్రలేమికి చికిత్స తీసుకుంటూ అపస్మారక స్థితికి చేరుకొని ఆస్పత్రి పాలయ్యాడు. ప్రతీ వ్యక్తికి రోజూ 6–8 గంటలపాటు నాణ్యమైన నిద్ర అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పురుషులే అధికం మహిళ, పురుషుల్లో గమనిస్తే పురుషులు 81 శాతం మంది కనీసం 6 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నట్లు తెలుస్తోంది. అదే మహిళల విషయానికి వస్తే 60 శాతం మంది 6 గంటలలోపు నిద్రపోతున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక, కుటుంబ, ఉద్యోగపరమైన ఒత్తిళ్లతో పురుషులు అధిక ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. -
పెన్షన్ భిక్ష కాదు.. ఉద్యోగుల హక్కు
కరీంనగర్ అర్బన్: పెన్షన్ భిక్ష కాదు అని ఉద్యోగుల హక్కు అని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ దారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం పెన్షన్ విద్రోహక దినం సందర్భంగా రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు నల్ల బ్యాడ్జీలు, టీషర్ట్లు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోసం దశాబ్దాల తరబడి అహర్నిశలు శ్రమించే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వరా అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల జీవితం బజారున పడడమే కాకుండా దాచుకున్న డబ్బు, మెడికల్, జీపీఎఫ్ బిల్లులు తదితర వాటి కోసం ధర్నాలు చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందన్నారు. ఇలాగే కొనసాగితే ఏ ఉద్యమానికై నా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళిచరణ్గౌడ్, టీఎన్జీవోల సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మణరావు, గెజిటెడ్ అధికారుల జిల్లా కార్యదర్శి అరవింద్ రెడ్డి, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పెండ్యాల కేశవరెడ్డి, లింగయ్య, టీచర్ల సంఘం నాయకులు రఘుశంకర్రెడ్డి, రవీంద్రచారి, కరుణాకర్రెడ్డి, టీఎన్జీవోల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఉరుకులు పరుగుల జీవితం
వ్యాపారంలో ఉన్న పోటీని తట్టుకొని నిలబడాలంటే కష్టమర్ల అభిరుచికి అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేయాల్సి వస్తుంది. దీంతో తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడిని తట్టుకొని పనిచేయడం వల్ల లేనిపోని సమస్యలు తలెత్తుతున్నాయి. – వెన్నం శ్రీనివాస్, వ్యాపారి, కరీంనగర్ సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే ఏసీ గదుల్లో పనిచేస్తున్నామనే ఆనందమే తప్ప మానసికంగా తీవ్ర ఒత్తిడి ఉంటుంది. వారంవారం షిఫ్టులు మారినప్పుడు నిద్రలేమి సమస్యలు వస్తాయి. కూర్చొని పనిచేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడుతుంటాయి. – జి.సంతోషిణి, సాఫ్ట్వేర్ ఉద్యోగి -
బాల భీముడు
● సాధారణ ప్రసవంలో ఆరో సంతానముగా నాలుగుకిలోల శిశువు జననం మానకొండూర్: మానకొండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం వైద్యాధికారులు రెండు సాధారణ ప్రసవాలు చేశారు. అందులో బిహార్కు చెందిన ఓ మహిళకు 6వ సంతానంగా 4 కిలోల బరువున్న మగబిడ్డ జన్మించాడు. వివరాలు.. బిహార్కు చెందిన అఖిలేశ్, కాజల్దేవి దంపతులు కొద్దిరోజులుగా అల్గునూర్ సమీపంలోని కోళ్ల ఫాంలో పని చేస్తూ జీవిస్తున్నారు. వీరికి ఐదుగురు ఆడపిల్లలు సంతానం. గర్భిణి అయిన కాజల్దేవికి సోమవారం నొప్పులు రావడంతో మానకొండూర్ పీహెచ్సీలో చేర్పించగా, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆరో సంతానంగా సాధారణ ప్రసవంలో 4 కిలోల బరువున్న బాబు పుట్టడంతో ఆశ్చర్యపోతున్నామని, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్ సల్మాన్ తెలిపారు. మరో కాన్పులో మానకొండూర్లో స్వీట్ హౌజ్ నడుపుకుంటున్న రాజస్తాన్కు చెందిన ఓ వ్యక్తి కూతురు తార గుర్జార్ మూడున్నర కిలోల మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైధ్యాధికారులు తెలిపారు. సీహెచ్వో రాజునాయక్, హెల్త్ సూపర్వైజర్ జుబేర్, స్నేహలత తదితరులు పాల్గొన్నారు. కేశవపట్నం పీహెచ్సీలో.. శంకరపట్నం(మానకొండూర్): మండలంలోని కేశవపట్నం పీహెచ్సీలో సోమవారం పురిటినొప్పులతో బాధడుతున్న మహిళకు వైద్యులు సాధారణ కాన్పు చేశారు. మండల కేంద్రంలో వినాయక విగ్రహాలు తయారు చేసే లలిత్సారంగ్కు పురిటినొప్పులు రావడంతో పీహెచ్సీకి తరలించారు. వైద్యులు శ్రావణ్కుమార్, శ్రావణి సాధారణ కాన్పు చేయగా, 3 కిలోల శిశువు జన్మించాడు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యాధికారి తెలిపారు. -
మంథని @ సీబీఐ
సాక్షి పెద్దపల్లి: మంథని అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా మరోసారి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. హైకోర్టు న్యాయవాది గట్టు వా మన్రామవు దంపతుల హత్యలు, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లీకేజీలు, నాణ్యతా ప్రమాణాలపై సందేహాలతో మంథని పేరు రాష్ట్రంలోనే మార్మోగింది. ఇటీవల మేడిగడ్డ బ్యారేజీ పగుళ్లు తెరపైకి రావడం.. తాజాగా ఘోష్ కమిటీపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో సీఎం ఈ కేసును సీబీఐకి అప్పగించనున్నట్లు ప్రకటించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. 15రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో రెండు కేసులను సీబీఐకి అప్పగించడం, ఆ రెండూ మంథని అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినవే కా వడం జిల్లా రాజకీయాలను కుదిపేస్తున్నాయి. న్యాయవాద దంపతుల హత్య కేసు.. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గట్టు వామన్రావు న్యాయవాద దంపతుల హత్య కేసు నాలుగేళ్ల క్రితం.. 2021 ఫ్రిబవరి 17న రామగిరి మండలం కల్వచ ర్ల గ్రామ శివారులో జరిగింది. గట్టు వామన్రావు, ఆయన భార్య నాగమణిని కొందరు నడీరోడ్డుపై కత్తులతో అత్యంత దారుణంగా హత్యచేశారనే వీడియా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇది లైవ్గా ఉండడంతో రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కేసులో ప్రధాన నిందితులతోపాటు వారికి సహకరించిన ఏడుగురిని పోలీసులు అప్పట్లోనే అరెస్టు చేసి జైలుకు తరలించారు. కొద్దిరోజుల తర్వాత నిందితులు బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చారు. హత్య కేసులో టీఆర్ఎస్ నేతకు సంబంధం ఉందంటూ వామన్రావు తండ్రి కిషన్రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈనేపథ్యంలోనే ఆగస్టు 12న కేసును సీబీఐకి అప్పగించి విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. దీంతో మంథని మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో తెరపైకి వచ్చింది. కాళేశ్వరంతో ఇంకోసారి.. గత ప్రభుత్వం పెద్దపల్లి జిల్లాలోని మంథని అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి చోటుచేసుకుందని, దానిని తేల్చేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిష న్ను వేసింది. తాజాగా కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై విచారణకు సీబీఐకు అ ప్పగిస్తూ ప్రస్తుత ప్రభత్వుం నిర్ణయం తీసుకుంది. గత ప్ర భత్వుం 2022లో రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా నిషేధం విధించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ నిషేధ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. ఈ రెండు కేసులనూ సీబీఐకి అప్పగిస్తుండగా, ఆ రెండు మంథని అసెంబ్లీ నియోజకవర్గంతో సంబంధం ఉండడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సీబీఐ ఎంట్రీతో జిల్లాలోనే కాదు.. రాష్ట్ర రాజకీయాల్లోనూ అనూహ్య పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందనే చర్చసాగుతోంది. ఈ కేసుల ఎఫెక్ట్తో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి జిల్లా రాజకీయ ముఖచిత్రంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని అన్ని రాజకీయ పార్టీల్లోని కార్యకర్తలు ముచ్చటించుకుంటున్నారు. -
స్వాతంత్య్రసమరయోధుడు కిష్టయ్య కన్నుమూత
మంథని: పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన ప్రముఖ స్వాతంత్య్రసమరయోధుడు రాంపెల్లి కిష్టయ్య(98) ఆదివారం రాత్రి హైదరాబాద్లో తుదిశ్యాస విడిచారు. హైదరాబాద్లో మృతి చెందిన రాంపెల్లి కిష్టయ్య పార్థివదేహాన్ని ఆయన నివాసానికి తీసుకురాగా.. మంథని ఆర్డీవో సురేశ్, తహసీల్దార్ కుమారస్వామి సోమవారం సందర్శించారు. అధికారికంగా నివాళి అర్పించారు. అనంతరం గోదావరి తీరంలో ఆయన కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఆనాడు నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో రాంపెల్లి కిష్టయ్య ఒకరు. ఆంగ్లేయుల పాలన నుంచి స్వేచ్ఛ లభించినా.. తెలంగాణకు నిజాం సంస్థానం నుంచి ప్రజలకు స్వాతంత్య్రం లభించలేదు. అయితే మమారాష్ట్రలోని చాందా క్యాంపులో సైనిక శిక్షణ పొంది.. సాయుధ పోరాటం ద్వారా నిజాం పాలనకు వ్యతిరేకంగా కిష్టయ్య పోరాటం చేశారు. మంథని ప్రాంతం నుంచి చాలామంది సాయుధ పోరాటంలో పాల్గొనగా.. అందులో అందరూ ఇదివరకే మృతి చెందారు. వారిలో మిగిలిన రాంపెల్లి కిష్టయ్య కూడా కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. కిష్టయ్య లేనిలోటు తీర్చలేనిది మంథని: కాగా, రాంపెల్లి కిష్టయ్య లేనిలోటు తీర్చలేదని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. రాంపెల్లి కిష్టయ్య మృతి సమాచారం తెలుసుకున్న మంత్రి.. ప్రభుత్వం పక్షాన శ్రద్ధాంజలి ఘటించారు. -
అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయ్
కరీంనగర్: కాంగ్రెస్ అబద్ధాల పాలనను ఆపేసి, ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదేశాల ప్రకారం సోమవారం బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ పొన్నం అనిల్కుమార్గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు లోయర్ మానేరుడ్యాం నుంచి కాళేశ్వరం జలాలను సేకరించి మార్కెట్రోడ్లో గల అమరవీరుల స్తూపానికి జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నారదాసు, అనిల్ మాట్లాడుతూ, రాజకీయ దురుద్దేశంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కేసీఆర్ పేరును అప్రతిష్ట పాలు చేసేలా రేవంత్రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. కేవలం రెండు ఫిల్లర్లలో మాత్రమే పగుళ్లు వచ్చాయని, వాటికి మరమ్మతు చేపట్టకుండా విచారణ పేరిట ప్రాజెక్టును అపవిత్రం చేశారన్నారు. ఇలాంటి చర్యల ద్వారా తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని, వారి ఆత్మలు శాంతించాలని అమరవీరుల స్తూపానికి కాళేశ్వరం నీటితో జలాభిషేకం చేసినట్టు తెలిపారు. గ్రంథాలయ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, పిల్లి శ్రీలత, తిరుపతినాయక్, కాసారపు శ్రీనివాస్గౌడ్, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. స్తూపాన్ని శుద్ధి చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు -
అధికారుల వేధింపులతో ఆత్మహత్యాయత్నం
కరీంనగర్రూరల్: డిపార్ట్మెంట్ అధికారుల వేధింపులు భరించలేక ఓ కానిస్టేబుల్ సోమవారం పురుగులమందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు తెలిపిన వివరాలు.. దుర్శేడ్కు చెందిన గుజ్జేటి మనోహర్ చొప్పదండి ఫైర్స్టేషన్లో ఫైర్మెన్గా పనిచేస్తున్నాడు. డిపార్ట్మెంట్కు చెందిన అధికారులు డ్యూటీల పేరిట వేధిస్తున్నారు. వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ అవమానిస్తున్నారు. సోమవారం అధికారులు పలు రకాలుగా వేధింపులకు గురిచేయడంతో మనోహర్ ఇరుకుల్ల శివారులో పురుగులమందు తాగి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే చికిత్స కోసం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. సీఐ నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో మనోహర్ నుంచి పోలీసులు వాంగ్మూలం సేకరించారు. -
భగీరథ బురద నీరు
మండలాలు : 12 మున్సిపాలిటీలు : సిరిసిల్ల, వేములవాడ ఆవాస ప్రాంతాలు : 359 తాగునీరు పొందే జనాభా : 6 లక్షలు నల్లాలు : 1,26,766 నిర్మాణ వ్యయం : రూ.1,085 కోట్లు పైపులైన్ పొడవు :1,263.77 కిలోమీటర్లు నీళ్ల ట్యాంకులు : 625 పాత నీళ్ల ట్యాంకులు : 378 కొత్తగా నిర్మించినవి : 247 రోజుకు అవసరమైన నీరు : 10 కోట్ల లీటర్లు వినియోగించే మోటార్లు : 20 అవసరమయ్యే విద్యుత్ : 5.976 మెగావాట్స్ ఆధారం : మధ్యమానేరు జలాశయం ● నల్లాల్లో మురికి నీరు సరఫరా ● మధ్యమానేరు ఫిల్టర్బెడ్ చుట్టూ వరదనీరు ● క్లోరినేషన్ చేసినా శుద్ధికాని వైనం ● ఆ నీరు తాగొద్దు.. మిషన్ భగీరథ ఈఈ అన్వర్ ఇది మధ్యమానేరు జలాశయంలోని రుద్రవరం వద్ద ఉన్న ఇన్టెక్ వెల్. ఇటీవల వర్షాలు, వరదలతో జలాశయంలో పూర్తి స్థాయిలో 26 టీఎంసీలు నిండింది. ఇన్టెక్ వెల్ చుట్టూరా వరదనీరు చేరింది. తెల్లగా తేటగా ఉండాల్సిన మధ్యమానేరు జలాశయం నీరు ఇలా ఎర్రగా బురదరంగులోకి మారింది. ఈ నీటిని పంపింగ్ చేస్తూ రాజన్నసిరిసిల్ల జిల్లాలోని అన్ని గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. ఫలితంగా శుద్ధి చేసినా వరదనీటిలోని బురద వీడడం లేదు. -
మొన్నటి దాకా మంచి నీరు వచ్చింది
మొన్నటి వరకు నల్లాల ద్వారా మంచినీరు వచ్చింది. ఇప్పుడు మురికినీరు వస్తోంది. ఆ నీటిని తాగుదామంటే మనసు ఒప్పడం లేదు. మా రగుడులో అందరి ఇళ్లలోనూ ఇలాగే రంగుమారి వస్తున్నాయి. ఆ నీళ్లు ఎవ్వరూ తాగడం లేదు. పైపులైన్ లీకేజీ అయిందని అనుకున్నాం. మున్సిపల్ అధికారులు ఇప్పటికై నా మంచినీరు సరఫరా చేయాలి. – గుగ్గిళ్ల కనకయ్య, రగుడు ఐదు రోజులుగా నల్లాల ద్వారా రంగు మారిన నీరు వస్తుంది. ఆ నీళ్లు ఎవరూ తాగడం లేదు. అంతకుముందు తెల్లగా వచ్చేవి. వానలు పడ్డప్పటి నుంచి నల్లా నీరు మంచిగా వస్తలేదు. మా తండావాసులు వాటర్ ప్లాంటు వద్దకు వెళ్లి ఫిల్టర్ వాటర్ తెచ్చుకుని తాగుతున్నారు. అధికారులు నల్లా నీటిని పరిశీలించి వెంటనే మంచినీరు సరఫరా అయ్యేలా చూడాలి. – భూక్యా అరుణ, భూక్యాతండా భారీ వర్షాలతో మధ్యమానేరులోకి వచ్చిన వరదతో నీరు బురదగా మారింది. ఆ నీటిని సిరిసిల్లలోని 120 ఎంఎల్డీ శుద్ధి కేంద్రంలో నిత్యం శుద్ధి చేస్తున్నా క్లియర్ కావడం లేదు. క్లోరినేషన్ చేసినా నీరు పరిశుభ్రం కావడం లేదు. ఐదు రోజులపాటు, ఆ నీరు క్లియర్ అయ్యేంత వరకు తాగొద్దు. ఇతర అవసరాలకు వినియోగించుకోవాలి. తప్పనిసరైతే కాచి చల్లార్చిన నీటిని తాగాలి. – ఎండీ ముజాహిద్ అన్వర్, మిషన్ భగీరథ ఈఈ, రాజన్న సిరిసిల్ల -
ఉపాధిలో అవకతవకలు.. రికవరీకి ఆదేశాలు
గన్నేరువరం(మానకొండూర్): ఉపాధి హామీ పనుల్లో రూ.2,13,620 అవకతకలు జరుగగా, వాటిలోంచి కొందరు పెనాల్టీ విధించగా, మరికొందరి నుంచి రికవరీకి ఆదేశాలు జారీ చేశారు. మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు మొత్తం రూ.4,64,61,662 పనులు చేపట్టారు. ఈ పనులపై సోమవారం డీఆర్డీవో శ్రీధర్ ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక మండలకేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించారు. వివిధ గ్రామాల్లో చేపట్టిన పనుల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. వీటిలో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందికి సంబంధించి గ్రామాలవారీగా పెనాల్టీ, రీకవరి డబ్బులు ఇలా ఉన్నాయి.. గన్నేరువరం రూ.4812, చొక్కారావుపల్లె రూ.600, యాస్వాడ రూ.96,921, గునుకులకొండాపూర్ రూ.10,336, మాదాపూర్ రూ.17,649, చాకలివానిపల్లె రూ.4,000, మైలారం రూ.12,400, సాంబయ్యపల్లె రూ.1,600, జంగపల్లి రూ.8,604, పీచుపల్లి రూ.5,790, హన్మజిపల్లె రూ. 10,988, గోపాల్పూర్ రూ.1,496, ఖాసీంపేట రూ.12,537, పారువెల్ల రూ.13,411, చీమలకుంటపల్లె రూ.10,976, గుండ్లపల్లి రూ.1,500 అవకతవకలు జరిగాయి. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీవో శ్రీనివాస్, పీఆర్ ఏఈ సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్షాక్తో మహిళారైతు దుర్మరణం
● వెల్దుర్తిలో విషాదం జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన పెంట రాజవ్వ (60) సోమవారం తన పంట చేను వద్ద విద్యుత్షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. రాజవ్వ ఉదయం గ్రామ శివారులోని మొక్కజొన్న చేను వద్ద పిట్టలు కొట్టేందుకు వెళ్లింది. రాత్రి భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షానికి విద్యుత్ వైరు తెగి కిందపడింది. దానిని గమనించకుండా వెళ్లిన రాజవ్వ వైరుపై కాలు పడటంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. రాజవ్వ కుమారుడు పెంట తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. చేపల వేటకు వెళ్లి.. కరెంట్ షాక్కు గురై.. ధర్మారం(ధర్మపురి): పెదపల్లి జిల్లా ధర్మారం మండలం గోపాల్రావుపేట గ్రామానికి చెందిన మేకల రవి(50) ఆదివారం రాత్రి చేపలవేటకు వెళ్లి ప్రమాదవాశాత్తు కరెంట్ షాక్కు గురై మరణించినట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారంగా.. గ్రామ శివారులోని చెరువు మత్తడి వద్ద చేపలు పట్టేందుకు రవి రాత్రి వెళ్లాడు. మత్తడి సమీపంలోని ఓ రైతు కరెంట్ మోటార్ స్టార్టర్ బాక్స్ నుంచి జే వైరును మత్తడి వరకు తీసుకువెళ్లాడు. వైరును నీటిలో వేసి స్టార్టర్ ఆన్చేశాడు. అయితే, ప్రమాదవాశాత్తు రవి కుడికాలుకు వైర్తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. మృతుడి భార్య సునీత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కరీంపేట మాజీ సర్పంచ్ మృతిశంకరపట్నం(మానకొండూర్): మండలంలోని కరీంపేట మాజీ సర్పంచ్ కేతిరి వెంకట్రెడ్డి(70) సోమవారం వేకువజామున మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. వెంకట్రెడ్డి 3 పర్యాయాలు సర్పంచ్గా, ఒకసారి ఎంపీటీసీగా పని చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సకలజనుల సమ్మె కొనసాగుతుండగా సర్పంచ్ పదవికి రాజీనామా చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందారు. మండలంలోని మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు నివాళి అర్పించారు. -
ప్రపంచం గర్వించే బీమా సంస్థ ఎల్ఐసీ
కరీంనగర్: ప్రపంచం గర్వించే అత్యుత్తమ బీమా సంస్థ ఎల్ఐసీ అని కరీంనగర్ సీనియర్ డివిజనల్ మేనేజర్ శివనాగప్రసాద్ అన్నారు. ఎల్ఐసీ 69వ ఆవిర్భావ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం డివిజనల్ కార్యాలయంలో సంస్థ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మలుచుకోవడం ద్వారా ఎల్ఐసీ మార్కెట్ లీడర్గా కొనసాగుతోందని పేర్కొన్నారు. పేపర్ లెస్ ఆఫీస్ ఏర్పాటు దిశలో డిజిటలైజేషన్ నడుస్తోందని, భవిష్యత్లో మరింత టెక్నాలజీని అందుబాటులోకి తెస్తామని తెలిపారు. గైనకాలజిస్ట్ విజయలక్ష్మి మాట్లాడుతూ, ఎల్ఐసీ లాంటి నమ్మకమైన సంస్థ మరొకటి లేదన్నారు. అహ్మదాబాద్ ఎయిర్ క్రాఫ్ట్, ఆపరేషన్ సింధూర్ ఘటనల్లో అందరికీ ఎల్ఐసీ మాత్రమే ఉదారంగా క్లెయిమ్స్ చెల్లించిందని, సామాజిక బాధ్యత ఉన్న ఏకై క బీమా సంస్థ అని కొనియాడారు. మార్కెటింగ్ మేనేజర్ సోమశేఖర్, సేల్స్ మేనేజర్ రాజేశ్ఖన్నా, రాజనరేందర్, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చోరీ కేసును చేధించిన పోలీసులు
ధర్మపురి: ఆగస్టు 30న ధర్మపురికి చెందిన రెడీమేడ్ బట్టల వ్యాపారి కోలేటి మల్లికార్జున్ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. చోరీకి పాల్పడింది ఇద్దరు మైనర్లు.. పైగా అన్నదమ్ములుగా గుర్తించారు. స్థానిక సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. మల్లికార్జున్ బట్టల వ్యాపారి. ఆగస్టు 30న ఇంటికి తాళం వేసి వెళ్లాడు. కుటుంబం ఆర్థికంగా లేకపోవడం.. జల్సాలకు అలవాటుపడిన ఇద్దరు మైనర్ బాలురు(అన్నదమ్ములు) తాళం పగులగొట్టి ఇంట్లో బీరువాలో ఉన్న 22.71 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై ఉదయ్కుమార్, రవీందర్ రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేశారు. సీసీ పుటేజీలతోపాటు ఓ మహిళ ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు చేపట్టారు. ఇందులో అన్నదమ్ములైన ఇద్దరు బాలురే దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 22.71 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జగిత్యాలలోని జువైనల్ కోర్టుకు తరలించామన్నారు. 24 గంటల్లోనే కేసును చేధించిన సీఐ, ఎస్సైలు, హెడ్కానిస్టేబుల్ రామస్వామి, కానిస్టేబుళ్లు రమేశ్నాయక్, రణధీర్గౌడ్, ఆరిఫ్, మహేందర్ను డీఎస్పీ అభినందించారు. నిందితులిద్దరూ మైనర్లు.. పైగా అన్నదమ్ములు పోలీసులను ప్రశంసించిన ఎస్పీ, డీఎస్పీ -
గర్భిణి హత్య కేసులో నలుగురి అరెస్ట్
ఇల్లందకుంట(హుజూరాబాద్): గర్భిణి హత్య కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం జమ్మికుంటరూరల్ పోలీస్స్టేషన్లో ఇన్చార్జి ఏసీపీ శ్రీనివాస్జీ వివరాలు వెల్ల డించారు. ఇల్లందకుంట మండలం టేకుర్తికి చెందిన ముద్రబోయిన రాములు కథలు చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 20 ఏళ్ల క్రితం ఇదే మండలం కనగర్తికి చెందిన రేణుకతో వివాహమైంది. వీరికి ఇద్దరు కొడుకులు అభిషేక్, బన్నీతేజ. ఒకసారి వరంగల్ వెళ్లి వస్తున్న క్రమంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ భర్తతో వేరుగా ఉంటున్న చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన తిరుమల(32)తో పరిచయం ఏర్పడింది. 8 ఏళ్ల క్రితం తిరుమలను రాములు రెండో పెళ్లి చేసుకుని టేకుర్తిలో వేరే కాపురం పెట్టాడు. దీంతో మొదటి భార్య, ఆమె కొడుకులు తిరుమలపై కక్ష పెంచుకుని తరచూ గొడవ పడుతుండేవారు. ప్రస్తుతం తిరుమల 7నెలల గర్భిణి. తిరుమల గర్భిణి కావడం ఇష్టంలేని భర్త రాములు, మొదటి భార్య రేణుక, కొడుకులు ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నారు. వీరి చిన్నకుమారుడు బన్నీతేజను హత్యకు ప్రేరేపించారు. ఆన్లైన్లో కత్తి కొనుగోలు చేశారు. అదునుచూసి తిరుమల ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో బన్నీతేజ ఆమె గొంతు కోసి, విచక్షణరహితంగా పొడిచి చంపేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సమావేశంలో జమ్మికుంట రూరల్, పట్టణ సీఐలు లక్ష్మీనారాయణ, రామకృష్ణ, ఎస్సై క్రాంతికుమార్ పాల్గొన్నారు. -
నెలక్రితం తండ్రి.. ఇప్పుడు కొడుకు..
● బైక్ అదుపుతప్పి దుర్మరణం ● తండ్రి మరణించడంతో నిద్ర కోసం బంధువుల ఇంటికి వెళ్తుండగా ప్రమాదంఇల్లంతకుంట(మానకొండూర్): నెల క్రితం తండ్రి చనిపోగా.. నిద్ర కోసం ఆదివారం తన అన్నతో కలిసి బంధువుల ఇంటికి బైకుపై వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామానికి చెందిన జక్కుల నవీన్ (30), రామచంద్రం సోదరుల తండ్రి నెలరోజుల క్రితం చనిపోయాడు. ఈక్రమంలో హైదరాబాదులో ఉన్న తన చిన్న తమ్ముడి అత్తగారింటికి నిద్ర కోసమని నవీన్, రామచంద్రం ఆదివారం మధ్యాహ్నం బైక్పై బయలుదేరారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి సమీపంలో హైవే రోడ్డుపై ప్రమాదవశాత్తు కిందపడ్డారు. ఈ ప్రమాదంలో నవీన్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందగా, రామచంద్రంకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా నవీన్కు ఇంతకుముందు ఓసారి వ్యవసాయ బావిలో పడగా గాయాలయ్యాయని, మరోసారి ప్రమాదానికి గురికాగా కాలు విరిగిందని గ్రామస్తులు పేర్కొన్నారు. మతుడికి భార్య శ్రీవాణి, కొడుకు అనన్యన్, కూతురు అనన్య ఉన్నారు. నెల వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
నిధుల్లేక.. చతికిలబడి!
కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్ప నకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మన ఊరు– మనబడి’ పథకం మధ్యలో నిలిచిపోయింది. బిల్లులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను ఆపేశారు. ‘మన ఊరు–మనబడి’ కార్యక్రమాన్ని జిల్లాలో 2021–22 ఏడాదిలో చేపట్టారు. 230 ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు రూ.36.05 కోట్లు ప్రతిపాదించారు. కొన్నిచోట్ల పనులు పూర్తయి మూడేళ్లు గడుస్తున్నా బిల్లులు చెల్లించకపోవడంతో ఎస్ఎంసీ కమిటీ చైర్మన్లు, కాంట్రాక్టర్లు తలలు బాదుకుంటున్నారు. పనులు పూర్తిచేసినా రూ.4కోట్లకుపైగా బిల్లులు రాలేదంటూ ఆందోళన చెందుతున్నారు. ‘అమ్మ’ ఆదర్శ కమిటీలతో.. ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ఎంసీ కమిటీలు రద్దయి అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పడ్డాయి. జిల్లాలో 340 పాఠశాలల అభివృద్ధికి ప్రస్తుత ప్రభుత్వం రూ.9.39 కోట్లు విడుదల చేసింది. పనులు వేగంగా పూర్తయ్యాయి. మన ఊరు– మన బడి పథకం కింద మొదటి విడతగా ఎంపిక చేసిన 230 పాఠశాలలకు గాను 130పాఠశాలల్లో పనులు ప్రారంభం కాకపోవడం గమనార్హం. నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు, ఏఎంసీ చైర్మన్లు ఈ పనులు మాకొద్దంటూ చేతులేత్తేశారు. అసంపూర్తిగా పనులు మనఊరు– మనబడి కింద మానకొండూర్ మండలంలోని 18 పాఠశాలల్లో పనులు చేపట్టారు. పచ్చునూర్లోని యాదవ్నగర్, మానకొండూర్ గర్ల్స్ హైస్కూల్, వెల్ది ఉన్నత పాఠశాలల్లో చేపట్టిన పనులకు ఇంకా బిల్లులు రాలేదు. చిగురుమామిడి మండలం ఇందుర్తి, నవాబుపేట, చిగురుమామిడి, రేకొండ, సుందరగిరిలో 50శాతం పనులు పూర్తయ్యాయి. నిధుల్లేక మిగితా పనులు నిలిచిపోయా యి. గన్నేరువరం మండలం హన్మాజీపల్లి, మాదా పూర్లో పనులు పూర్తయినా బిల్లులు రాలేదు. హుజురాబాద్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో రూ.20లక్షలతో చేపట్టిన వంటశాల పనులను నిధుల్లేక కాంట్రాక్టర్ మధ్యలో నిలిపివేశాడు.ఎంపిక చేసిన పాఠశాలలు 230 మంజూరైన నిధులు రూ.36.05 కోట్లు పనులు పూర్తయిన పాఠశాలలు 100 ఖర్చయిన నిధులు రూ.13.23 కోట్లు పనులు ప్రారంభం కాని స్కూళ్లు 130ప్రతిపాదించిన పాఠశాలలు 340 మంజూరైన నిధులు రూ.9.39 కోట్లు పనులు పూర్తయిన పాఠశాలలు 340 ఖర్చయిన నిధులు రూ.9.39 కోట్లు -
సీపీఎస్ రద్దుకు ఉద్యమిస్తాం
సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానం అమలు చేయాలి. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తాం. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హమీలను అమలు చేయాలి. సెప్టెంబర్ 1న ఉద్యోగ, ఉపాధ్యాయులు చీకటి దినంగా భావిస్తూ విధుల్లో నల్లబ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు చేపట్టాలి. – కట్టా రవీంద్రచారి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడుఐదేళ్లు ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలకు పెన్షన్ మంజూరు చేస్తున్న ప్రభుత్వం 35ఏళ్లు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసినవారికి పెన్షన్ లేదనడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. పెన్షన్ అనేది భిక్ష కాదు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పాలకులు విస్మరించడం బాధకరం. విద్రోహ దినంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు సోదర సంఘాలన్ని పాల్గొనాలి. – దాముక కమలాకర్, సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
బెట్టింగ్ బాబోయ్..
సిరిసిల్లక్రైం: క్షణాల్లో లక్షలు సంపాదించేందుకు పలువురు ఆన్లైన్లో మార్గాలను వెతుకుతున్నారు. బెట్టింగ్ యాప్లలో పెట్టుబడులు పెడుతున్నారు. నిమిషాల వ్యవధిలో పెట్టిన సొమ్ముకు ఎక్కువ రావడంతో ముందుగా రూ.వందలతో ప్రారంభించిన బెట్టింగ్.. రూ.లక్షల్లోకి చేరుకొని తీరా క్షణాల్లోనే నష్టాలను చవిచూసి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రావడం కాదు.. పోవడమే.. ఇదివరకు చాలామంది పేకాట, మట్కా ఆడుతూ లక్షల రూపాయలు పోగొట్టుకోవడమే కాకుండా కటకటాలకు వెళ్లినవారున్నారు. ప్రస్తుతం సులభంగా డబ్బు సంపాదించే ప్రక్రియ రూటు మారింది. కొంతమంది స్టాక్ మార్కెట్లో డబ్బులు వస్తున్నాయన్న ప్రచారంతో దానిలో అనుభవం లేకపోయినా పెట్టుబడి పెట్టి నష్టాలపాలవుతున్నారు. దీనికి సమాంతరంగా ప్రస్తుతం బెట్టింగ్ యాప్లు అందుబాటులోకి వచ్చాయి. ఏదేని సామాజిక మాధ్యమంలో సినిమా, సీరియల్, జోక్స్ వీక్షించే క్రమంలో వచ్చే ప్రకటనలతో ఆకర్షితులై ఆన్లైన్ యాప్లను డౌన్లోడ్ చేసుకొని పెట్టుబడులు పెడుతున్నారు. నిమిషాల వ్యవధిలో ఒకట్రెండు దఫాలుగా లాభాలు రావడంతో మరికొంత సంపాదించుకుందామనే క్రమంలో కొండంత నష్టాన్ని చవిచూస్తున్నారు. బెట్టింగ్ వ్యసనంతో పలువురు వ్యాపారులు, ఉద్యోగులు, యువకులు చివరకు చావు మీదకు తెచ్చుకుంటున్నారు. కృత్రిమ సమస్యలు సృష్టిస్తూ.. బెట్టింగ్ జరిపే సమయంలో ఇంటర్నెట్ సమస్య ఉంటే ఇక అకౌంట్లో జమ చేసిన డబ్బులన్నీ మాయం అయినట్లే. కాగా బెట్టింగ్ యాప్ నిర్వాహకులే ఎదో ఒక రకంగా ఇంటర్నెట్కు అంతరాయం కలిగించి, వందలాది మంది నుంచి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. బెట్టింగ్ చేసే వ్యక్తి ఫోన్ నంబర్ను సంబంధిత యాప్ డౌన్లోడ్ చేసే సమయంలో నమోదు చేయడంతో, ఆ నంబర్కు యాప్ నిర్వాహకులే బెట్టింగ్ సమయంలో కాల్ చేసి అంతరాయం కలిగిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. సులభమార్గంలో డబ్బు వచ్చే విధానాలను నమ్మవద్దు. బెట్టింగ్ యాప్లతో జరుగుతున్న ఆర్థిక నష్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాం. స్టాక్, సైబర్, బెట్టింగ్, రమ్మీ తదితర ఆన్లైన్ గేమ్స్పై కఠిన నిఘా కొనసాగుతోంది. యువకులు, వ్యాపారులు తమకు ఏమైనా సమస్యలు ఉంటే నిపుణుల సలహాలు తీసుకొని ముందుకెళ్లాలి. – మహేశ్ బీ గితే, ఎస్పీ, రాజన్న సిరిసిల్ల‘చందుర్తి మండలానికి చెందిన యువకుడు హైదరాబాద్లోని ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. స్నేహితులకు ఫోన్ చేసి తనకు అత్యవసరంగా రూ.2 లక్షలు కావాలని, జీతం రాగానే ఇస్తానని తెలిపాడు. కొన్నాళ్లు ఇలాగే తన ఫ్రెండ్స్ వద్ద దాదాపు రూ.50 లక్షలు అప్పు చేశాడు. అప్పు ఇచ్చినవారందరూ ఆరా తీయగా, బెట్టింగ్లో పెట్టి నష్టం వచ్చినట్లు తెలుసుకున్నారు. చివరకు అతడి అమ్మానాన్న పొలం అమ్మి అప్పులు చెల్లించారు’. ‘సిరిసిల్ల పట్టణానికి చెందిన వ్యక్తి చిట్ఫండ్స్లో పని చేసేవాడు. అతడికి రోజువారీ కలెక్షన్లో వచ్చిన సొమ్మును కొంచెంకొంచెం ఆన్లైన్ బెట్టింగ్లో పెట్టేవాడు. ఆఫీస్కు కలెక్షన్ తక్కువ చూపేవాడు. కొద్దిరోజులకు అలా తీసిన సొమ్ము రూ.లక్ష వరకు చేరింది. బెట్టింగ్లో డబ్బు పోవడంతో కలెక్షన్ చేసిన సొమ్ము ఆఫీసుకు ఎలా ఇవ్వాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నాడు’. -
ఖాళీ ప్రాంతాలు.. రోగాలకు ఆవాసాలు
సీతారాంపూర్కాలనీలో రెడ్డి ఫంక్షన్హాల్ పక్కన భవనాల మధ్య మురుగునీరురేకుర్తిలోని పాత గ్రామ పంచాయతీ భవనం వెనుక నిలిచిన మురుగునీరుశాతవాహన యూనివర్సిటీ ప్రాంతంలో నివాసాల మధ్య నిలిచిన వర్షపు నీరువాతావరణంలో మార్పులతో వైరల్ జ్వరాలు విజృంభిస్తుండగా.. ఇటీవల కురిసిన వర్షాలతో నివాసాల మధ్య నీరు నిలిచి రోగాలకు ఆవాసంగా మారుతున్నాయి. నగరంతో పాటు శివారు కాలనీల్లో ఇళ్లమధ్య ఉన్న ఖాళీ స్థలాల్లో నీరు నిలవడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. రోడ్లపై మురుగు పారుతోంది. ఓ వైపు చల్లబడ్డ వాతావరణం... మరోవైపు ఇళ్లమధ్య మురుగుతో నగర ప్రజలు రోగాల పాలవుతున్నారు. వైరల్, డెంగీ జ్వరాలతో ఆస్పత్రులకు పరుగు తీస్తున్నారు. నగరంలోని లక్ష్మీనగర్, భగత్నగర్, తిరుమల్నగర్, కోతిరాంపూర్, రాంనగర్, మారుతినగర్, హౌసింగ్బోర్డుకాలనీ, విద్యానగర్, వావిలాలపల్లితో పాటు శివారు ప్రాంతాలైన శాతవాహన యూనివర్సిటీ, రేకుర్తి, సీతారాంపూర్, తీగలగుట్టపల్లి, వల్లంపహడ్తో పాటు తదితర ప్రాంతాల్లో ఇళ్లమధ్య వర్షపునీరు నిలిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత అధికారులు ఈ విషయమై చొరవ తీసుకుని, సమస్య పరిష్కరించాలని ఆయా ప్రాంతాలవాసులు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
గణేశ్ మండపాల్లో చోరీ
బోయినపల్లి: మండలంలోని కొదురుపాక ఆర్అండ్ఆర్ కాలనీలోని పలు వినాయక మండపాల్లో శనివారం రాత్రి చోరీ జరిగింది. కొదురుపాక రోడ్ నంబర్–14 వినాయక మండపంలో రూ.55 వేల విలువ గల ఆంఫ్లీఫైర్, రోడ్ నంబర్–8 మండపంలో ఒక ఆంఫ్లీఫైర్, రెండు సౌండ్బాక్స్లు, హుండీ, రోడ్నంబర్–5 గణేశ్ మండపంలో ఆంప్లీఫైర్ను దొంగలు ఎత్తుకెళ్లినట్లు నిర్వాహకులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. పోలీసుల అదుపులో అపరిచిత వ్యక్తి బోయినపల్లి మండలం వరదవెల్లి అనుబంధ రాజన్నపేట గ్రామంలో ఓ వ్యక్తి ఇంట్లో ఆదివారం ఉదయం ఓ అపరిచిత వ్యక్తి ఒపెన్ స్లాబ్లో పడుకుని ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. రాత్రి గోడ దూకి ఆ ఇంట్లోకి చొరబడ్డట్లు చెప్పారు. దీంతో అతడిని పోలీసులకు అప్పగించారు. కాగా, అతను కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం శాంతినగర్కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు ఎస్సై రమాకాంత్ చెప్పారు. మద్యం మత్తులో వచ్చినట్లు, విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. -
● బల్దియా పరిధిలో శానిటేషన్ జవాన్ల అక్రమ వసూళ్లు ● ఏళ్లుగా ఒకే డివిజన్లో తిష్ట ● స్థానచలనంపై అధికారుల వెనకడుగు
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో శానిటేషన్ జవాన్ల అక్రమ వసూళ్ల దందా యథేచ్చగా సాగుతోంది. చెత్తనెపంతో వ్యాపారుల నుంచి, స్వచ్ఛ ఆటోల పేరిట ప్రజల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. కొంతమంది అధికారుల, మాజీ కార్పొరేటర్ల అండతో ఏళ్లుగా ఒకే డివిజన్లో తిష్టవేసిన జవాన్ల స్థానచలనం కష్టంగా మారింది. నగరపాలకసంస్థ పరిధిలోని 66 డివిజన్లకు గాను 61మంది జవాన్లు ఉన్నారు. అందులో 9మంది రెగ్యులర్ కాగా.. మిగితా వారు ఔట్సోర్సింగ్ పద్ధతిన కొనసాగుతున్నారు. ఏళ్లక్రితం 22 మందిని కౌన్సిల్ తీర్మాణం మేరకు తీసుకోగా, తరువాత మరో 24 మంది చేరారు. ఇటీవల విలీన ప్రాంతాలకు సంబంధించి అప్పటికే ఉన్న ఆరుగురిని కొనసాగిస్తున్నారు. కొంతమందికి రెండు డివిజన్ల బాధ్యతలు అప్పగించారు. వీరంతా ప్రతిరోజు తమ డివిజన్ల పరిధిలో కార్మికులతో చెత్తను తొలగించడం, తరలించడాన్ని పర్యవేక్షిస్తుంటారు. కలెక్షన్ చెత్త కాదు.. మనీ ఇళ్లు, వీధులు, రోడ్లను శుభ్రంగా ఉంచేందుకు చెత్త కలెక్షన్ చేయించాల్సిన జవాన్లు మనీ కలెక్షన్పై దృష్టిపెట్టారు. నగరపాలకసంస్థకు రావాల్సిన యూజర్ చార్జీలను కాజేస్తూ, వ్యాపారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్హాల్స్, షాపింగ్మాల్స్ నుంచి ప్రతినెల రూ.వేలు వసూలు చేస్తున్నారు. కమర్షియల్ సంస్థల నుంచి బల్దియా పేరిట యూజర్చార్జీలు వసూలు చేసి చెత్తను డంప్యార్డ్కు తరలించాల్సి ఉంటుంది. బల్దియాకు రావాల్సిన యూజర్చార్జీలను పక్కనపెట్టి, సొంతంగా వసూలు చేస్తున్నారు. తద్వారా బల్దియాకు నష్టం వాటిల్లుతోంది. ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించే స్వచ్ఛ ఆటోలు నగరపాలకసంస్థకు 18 ఉండగా, డ్రైవర్ కమ్ ఓనర్ పథకం కింద బల్దియా వాయిదాలు చెల్లించే ప్రైవేట్ ఆటోలు 70 ఉన్నాయి. ఇందులో ఇంటింటికి నెలకు వసూలు చేసే రూ.50 యూజర్ చార్జీలు ప్రైవేట్ ఆటోల ఓనర్లకు, బల్దియా ఆటోలైతే, నగర పాలకసంస్థకు చెందాలి. నెలవారి యూజర్ చార్జీలను కూడా జవాన్లు కాజేస్తున్న సంఘటనలు ఉన్నాయి. ఏళ్లుగా ఒకే చోట తిష్ట జవాన్లకు స్థానచలనం లేకపోవడం, ఏళ్లుగా ఒకే చోట తిష్టవేయడంతో తమ పరిచయాలను ఆర్థిక, రాజకీయాలకు మళ్లిస్తున్నారు. కొంతమంది మాజీ కార్పొరేటర్లకు రాజకీయంగా లబ్ధి చేకూర్చి, తమ అక్రమాలకు వత్తాసు పలికేలా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుత స్పెషల్ ఆఫీసర్ పాలనలో డివిజన్లో జవాన్ల పాత్ర అధికారికంగా కీలకం. దీన్ని అవకాశంగా తీసుకొని కొంతమంది నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తూ వివాదాస్పదమవుతున్నారు. గతేడాది జవాన్లకు స్థానచలనం కలిగిచేందుకు రంగం సిద్ధం చేసినా, ప్రజాప్రతినిధులు నుంచి వచ్చిన ఒత్తిళ్లతో సాధ్యపడలేదు. ఇప్పటికై నా జవాన్ల అక్రమ దందాపై ఉన్నతాధికారులు సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరముందని నగర ప్రజలు కోరుతున్నారు. -
ఉద్యోగుల నిరసన బాట
కరీంనగర్: ఉద్యోగ భద్రత, మంచి జీతభత్యాలు, ఉద్యోగ విరమణ అనంతరం నెలానెలా పింఛన్ ఉంటుందని ప్రభుత్వ కొలువు కొట్టేందుకు పోటీ పడుతుంటారు. కానీ ప్రస్తుతం అమలవుతున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) ప్రభుత్వ ఉద్యోగులను తీవ్రంగా కలచివేస్తోంది. ఉమ్మడిజిల్లాలో 14వేల మందికిపైగా సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారు. మూడు దశాబ్దాలకుపైగా ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన తర్వాత తమకు, తమ కుటుంబాలకు సామాజిక భద్రత లేకపోవడంతో ఉద్యమ బాటపడుతున్నారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(జాక్టో), యూఎస్పీసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులకు వినతిపత్రాలు, నల్లబ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొనాలని, భోజన విరామ సమయంలో శాంతియుత ప్రదర్శనలకు పిలుపునిచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చలో హైదరాబాద్కు సిద్ధం అవుతున్నాయి. సీపీఎస్ పింఛన్ విధానం కేంద్ర ప్రభుత్వం 2004 జనవరి 1 నుంచి, రాష్ట్ర ప్రభుత్వం అదే ఏడాది సెప్టెంబర్ నుంచి సీపీఎస్ విధానం అమలు చేస్తున్నాయి. ఈ పథకాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ ఆథారిటరీ(పీఎఫ్ఆర్డీఏ), నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్(ఎన్ఎస్డీఎల్) సమన్వయంతో అమలు చేస్తున్నారు. మూల వేతనం, డీఏలతో 10శాతం మొత్తానికి ప్రభుత్వ వాటా, 10 శాతం ఉద్యోగి మ్యాచింగ్ గ్రాంటుగా చెల్లిస్తారు. జమ చేసిన మొత్తాన్ని ప్రైవేటు ఫండ్ మేనేజర్లకు అప్పగిస్తారు. వారు వివిధ ఫండ్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు. ఉద్యోగి పదవీ విరమణ సందర్భంగా అప్పటి మార్కెట్ విలువల ఆధారంగా ఖాతా నిల్వలోని 60శాతం మొత్తాన్ని నగదుగా చెల్లిస్తారు. మిగతా 40శాతం పింఛన్గా నిర్ణయిస్తారు. మార్కెట్ ఒడిదొడుకులకు అనుగుణంగా తగ్గడం లేదా పెరగవచ్చు. పాత పింఛన్ విధానంతో లాభాలు 2004కు ముందు నియామకం అయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ విధానం అమలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి ఎలాంటి వాటా చెల్లించకుండానే పదవీ విరమణ సమయంలో తన చివరి మూలవేతనం(బేసిక్పే)లో 50శాతం పింఛన్గా నిర్దారించి, ఆ మిగతా 50శాతానికి అన్ని రకాల భత్యాలు(అలవెన్స్) కలుపుకొని చెల్లిస్తారు. ప్రభుత్వోద్యోగులకు కరువు భత్యం పెంచినప్పుడు పింఛనుదారులకు ఇది వర్తిస్తోంది. ప్రభుత్వాలు ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రకటించే వేతన సవరణ సంఘం(పీఆర్సీ) ద్వారా ఉద్యోగులతో పాటు అప్పటి ధరలకు అనుగుణంగా పింఛన్ మొత్తాన్ని పెంచుతారు. -
భార్య, కూతురును ఇంటి నుంచి గెంటేసిన భర్త
● సీఐఎస్ఎఫ్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న భర్త ● పోలీసు ఉన్నతాధికారులు న్యాయంచేయాలని వేడుకుంటున్న బాధితురాలు చిగురుమామిడి: భర్త ఇంటినుంచి గెంటేయడంతో తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది ఓ బాధితురాలు.. చిగురుమామిడి మండలంలోని చిన్నముల్కనూర్కు చెందిన స్రవంతికి ఇదే మండలం సుందరగిరికి చెందిన వ్యక్తితో 2011లో వివాహం జరిగింది. సదరు వ్యక్తి సీఐఎస్ఎఫ్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ హైదరాబాద్లో ఉంటున్నాడు. కొద్దిరోజులు వీరి కాపురం సజావుగానే సాగింది. వీరికి 12 ఏళ్ల కూతురు ఉంది. కొద్దిరోజులుగా స్రవంతిని భర్త వేధిస్తున్నాడు. ఆమె అత్తగారిల్లయిన సుందరగిరిలో ఉంటోంది. భర్త వేధింపులు భరించలేక చిగురుమామిడి, కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్లలో పలుసార్లు ఫిర్యాదు చేసింది. వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అతడి ఆగడాలకు అంతులేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో సదరు వ్యక్తి ఆదివారం సుందరగిరికి చేరుకుని స్రవంతి, కూతురును ఇంటినుంచి వెళ్లగొట్టాడు. వారి సామగ్రి బయట పడేయడంతో తల్లీకూతురు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు, గ్రామస్తులు ఎవరూ పట్టించుకోవడం లేదని, పోలీసు ఉన్నతాధికారులైనా తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటోంది. -
గణేశ్ మండపాల సందర్శన
కరీంనగర్క్రైం: నగరంలోని చైతన్యపురి, రాంనగర్, గోదాంగడ్డ, మార్వాడీమందిర్, టవర్ సర్కిల్, గాంధీరోడ్డు, నాఖా చౌరస్తా ప్రాంతాల్లోని గణేశ్ మండపాలను సీపీ గౌస్ ఆలం ఆదివారం సందర్శించారు. విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. మండప నిర్వాహకులతో మాట్లాడి నిమజ్జనం కార్యక్రమం గురించి అడిగి తెలుసుకున్నారు. మండపాల వద్ద శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి, సీఐలు రామచందర్రావు, సృజన్రెడ్డి, జాన్రెడ్డి, రమేశ్ పాల్గొన్నారు. కరీంనగర్ టౌన్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు సెప్టెంబర్ 3వ తేదీన జిల్లా పర్యటనకు వస్తున్నాడని, నగరంలోని కొండ సత్యలక్ష్మి గార్డెన్స్లో జరిగే పోలింగ్ బూత్ అధ్యక్షుల సమ్మేళనంలో పాల్గొంటారని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. కృష్ణారెడ్డి మాట్లాడుతూ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలన్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. బాస సత్యనారాయణరావు, వై.సునీల్రావు, గుగ్గిళ్లపు రమేశ్, కోమల ఆంజనేయులు పాల్గొన్నారు. కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం నగునూరు సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకుడు ఎర్రోజు వెంకటేశ్వర్లు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఫ్రొఫెసరు జయశంకర్ గౌరవార్థం వేదాస్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో వివిధ జిల్లాల నుంచి ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. హైదరాబాద్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఎర్రోజు వెంకటేశ్వర్లు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును జస్టిస్ చంద్రకుమార్, బీసీ జేఏసీ నాయకుడు కుందారపు గణేశాచారి చేతులమీదుగా అందుకున్నారు. వెంకటేశ్వర్లును ప్రిన్సిపాల్ మాలతి, వైస్ ప్రిన్సిపాల్ పద్మజ, సూపరింటెండెంట్ సురేశ్ అభినందించారు. కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్లోని పాత బజార్ గోల్డెన్ యూత్ సౌజన్యంతో జీనియస్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం మండపం వద్ద చెస్ పోటీలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 150మందికి పైగా చిన్నారులు పాల్గొన్నారు. విజేతలకు కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్, పెద్దపల్లి తహసీల్దార్ రాజ్కుమార్ బహుమతులు ప్రదానం చేశారు. గోల్డెన్ యూత్ నిర్వాహకుడు అంబ్రిష్, జీనియస్ చెస్ అకాడమీ వ్యవస్థాపకు డు కంకటి కనకయ్య, డైరెక్టర్ అనుప్ కుమార్, శ్రీనివాస్, కోడూరు ప్రకాశ్గౌడ్ పాల్గొన్నారు. కొత్తపల్లి: కొత్త డీటీఆర్ ఏర్పాటు నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు 11 కె.వీ.రాంచంద్రాపూర్కాలనీ ఫీడర్ పరిధిలోని నగరంలోని అంజనాద్రి ఆలయం, పొన్నం కనకయ్య హోటల్, రాంచంద్రాపూర్ కాలనీ, సాయిబాబా ఆలయం, అంజనాద్రికాలనీ రోడ్డునంబర్–1 నుంచి 6 వరకు, కామారపు లక్ష్మీ అపార్ట్మెంట్, ఎలైట్ ఇన్ఫ్రా అపార్ట్మెంట్, లహరి అపార్ట్మెంట్, శ్రీ కన్వెన్షన్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. -
ఆటోట్రాలీ బోల్తా.. ఇద్దరికి తీవ్రగాయాలు
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): ఆటవిడుపుగా క్రికెట్ మ్యాచ్ ఆడుకొని వస్తున్న విద్యార్థుల ఆటోట్రాలీ బోల్తాపడడంతో 13 మందికి స్వల్ప, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక పోతనకాలనీలోని ఓ గణేశ్ మండపం నిర్వాహకులు ఆదివారం 26 మంది విద్యార్థులకు సింగరేణి స్కూల్ గ్రౌండ్లో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. మ్యాచ్ అనంతరం ఆటోట్రాలీలో పోతనకాలనీకి వస్తున్న క్రమంలో మూలమలుపు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. సుమారు 15 మంది విద్యార్థులకు గాయాలు కాగా, శ్రీనేయన్, ఆద్విత్ తీవ్రంగా గాయపడ్డారు. తల్లిదండ్రులు ఘటన స్థలానికి చేరుకొని చిన్నారులను వివిధ ఆస్పత్రులకు తరలించారు. కాగా, ఒకరిని కరీంనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని టూటౌన్ పోలీసులు తెలిపారు. -
వరద దండిగా.. ప్రాజెక్టులు నిండుగా..
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాజెక్టులు గరిష్ట నీటిమట్టానికి చేరుకున్నాయి. ఉమ్మడి జిల్లాలో గోదావరిపై నిర్మించిన ఎల్లంపల్లి, మానేరుపై నిర్మించిన ఎగువ, మధ్య, దిగువమానేరు ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటితో కళకళలాడుతున్నాయి. కామారెడ్డి, ఎగువ ప్రాంతాలు, ఎస్సారెస్పీ, వరద కాలువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టింది. దీంతో మానేరు ప్రాజెక్టుల నుంచి దిగువనకు నీటి విడుదల నిలిపివేశా రు. ఎగువమానేరు పూర్తిస్థాయి నీటి మట్టం 2టీఎంసీలు కాగా, ప్రస్తుతం అదేస్థాయిలో ఉంది. ప్రాజెక్టులోకి 5,798 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. 5,798 క్యూసెక్కులు కిందికి వదులుతున్నారు. మిడ్మానేరు నుంచి నీటి విడుదల నిలిపివేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 27 టీఎంసీలు కాగా 25 టీఎంసీల నీరుంది. ప్రాజెక్టుకు కీలకమైన మూలవాగు, వరద కాలువ, మానేరు నదుల నుంచి ఇప్పటికీ 20వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. మొన్న వర్షాల సమయంలో ఇన్ఫ్లో 60వేల క్యూసెక్కుల వరకు వెళ్లిన విషయం తెలిసిందే. 12,930 క్యూసెక్కుల ఔట్ఫ్లోను వదులుతున్నారు. లోయర్మానేరు డ్యాంకు ఇన్ఫ్లో దాదాపుగా నిలిచి పోయింది. నిన్న మొన్నటి వరకు 50వేల క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో మిడ్మానేరు నీటిని నిలిపేయగానే 293 క్యూసెక్కులకు పడిపోయింది. మోయతుమ్మెద, మానేరు నుంచి వరద నిలిచిపోయింది. ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండిన నేపథ్యంలో వా నాకాలం, యాసంగి వరకు వ్యవసాయానికి ఇబ్బంది లేదని నీటిపారుదలశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎల్లంపల్లికి పోటెత్తిన వరద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద అనూహ్యంగా పెరిగింది. మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాలతో గోదావరికి వరదపోటు పెరగడమే ఇందుకు కారణం. బుధవారం వరకు 5 లక్షల క్యూసెక్కుల వరకు వచ్చిన వరద ప్రస్తుతం 7,60,652 క్యూసెక్కులకు పెరిగింది. కాగా 7,35,847 క్యూసెక్కుల ఔట్ఫ్లో కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 20 టీఎంసీలుకాగా, 13.33 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచుతున్నారు. రెండేళ్ల క్రితం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నిల్వ ఉన్న సమయంలో ఎగువ నుంచి ఆకస్మికంగా భారీస్థాయిలో వచ్చిన వరదతో గోదావరిఖని పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. అందుకే, కేవలం 13 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచి 62 గేట్లకుగాను 37 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు.ప్రాజెక్టు పూర్తిస్థాయి ప్రస్తుతం ఎగువమానేరు 2 2 మధ్యమానేరు 27 25 లోయర్మానేరు 24 21 ఎల్లంపల్లి 20 13ఎగువ మానేరుమధ్యమానేరు -
నిరీక్షణ.. నిరసన
కరీంనగర్రూరల్/గన్నేరువరం/శంకరపట్నం: యూరియా కోసం రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి. యూరియా కోసం ఉదయం నుంచి నిరీక్షించిన రైతులు ఓపిక నశించి అధికారుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్లో ధర్నా చేపట్టారు. పోలీసు బందోబస్తుతో యూరియా పంపిణీ చేశారు. దుర్శేడ్ సహకార సంఘం, తీగలగుట్టపల్లిలోని డీసీఎంఎస్, నగునూరులోని ఆగ్రోస్ కేంద్రం, చెర్లభూత్కూర్లోని ఎరువుల గోదాం వద్ద యూరియా కోసం శనివారం ఉదయం 7గంటల నుంచే రైతులు తరలివచ్చారు. గతంలో ఉదయం 8గంటల నుంచే పంపిణీ చేయగా శనివారం 10గంటల నుంచి ఏఈవోలు మాత్రమే యూరియా పంపిణీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దుకాణాలు తీయకముందే నగునూరు ఆగ్రోస్ కేంద్రం ఎదుట పాసు పుస్తకాలు వరుసలో పెట్టారు. అధికారుల నిర్లక్ష్యవైఖరిని నిరసిస్తూ చెర్లభూత్కూర్లో గోదాం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. శనివారం పాసు పుస్తకాల జిరాక్సులు ఇచ్చిన రైతులకు ఆది, సోమవారాల్లో యూరియా పంపిణీ చేస్తామని ఏవో సత్యం తెలిపారు. గన్నేరువరం సహకార సంఘం ఎరువుల దుకాణం ఎదుట రైతులు బారులు తీరారు. పోలీసుల పహారా మధ్య ఒక్కో రైతుకు రెండు బస్తాలు అందించారు. శంకరపట్నం మండలం గద్దపాక సహకార సంఘం వద్ద శనివారం వేకువజాము నుంచే మహిళా రైతులు ఇంటి పనులు పక్కన పెట్టి బారులు తీరారు. గద్దపాక, తాడికల్ సహకార సంఘాలకు శనివారం 350 బస్తాల చొప్పున యూరియా వచ్చింది. రైతులు వందలాదిగా సహకార సంఘాలకు చేరుకున్నారు. గద్దపాకలో మహిళా రైతులకు కూపన్లు జారీచేసి యూరియా పంపిణీ చేశారు. ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు రెండు, తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు ఒక్కోబస్తా చొప్పున అందించారు. యూరియా దక్కని రైతులు సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు.దుర్శేడ్లో పోలీసు పహారాలో యూరియా కోసం వరుసలో నిల్చున్న రైతులుకరీంనగర్ మండలం చెర్లభూత్కూర్లో ఆందోళన చేస్తున్న రైతులుగన్నేరువరంలో తరలివచ్చిన రైతులు -
వైరల్ వర్రీ
ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఓపీ వద్ద క్యూలో రోగులు కరీంనగర్టౌన్: వాతావరణంలో నెలకొన్న మార్పులతో జిల్లాను జ్వరాలు వణికిస్తున్నాయి. డెంగీ, వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్నాయి. నగరంతో పాటు పల్లెల్లో జ్వరాలవ్యాప్తి అధికంగా ఉంది. ప్రతీఇంట్లో ఒకరిచొప్పున మంచం పట్టారు. కొందరు పీహెచ్సీలకు వెళ్తుండగా, మరికొందరు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాసుపత్రి (జీజీహెచ్), ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇంకొందరు ఆర్ఎంపీ, పీఎంపీలను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో డెంగీ కేసులు ఇలా జిల్లావ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 52 డెంగీ కేసులు నమోదయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదయ్యే డెంగీ కేసులతో కలిపితే సంఖ్య మూడింతలు ఉండే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. వైరల్ జ్వరాల బారిన పడినవారు వేలసంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతటా జ్వరపీడితులు జిల్లాలోని అన్ని పీహెచ్సీల పరిధిలో జ్వర పీడితులు అధికంగా నమోదవుతున్నారు. వాతావరణ మార్పులు ఇందుకు కారణంగా వైద్యులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన జోరువానలతో దోమలు వృద్ధిచెంది, జ్వర బాధితులు పెరుగుతున్నారు. రెండుమూడు రోజుల కన్నా ఎక్కువగా జ్వరం ఉన్నవారు జీజీహెచ్కు వచ్చి వైద్యం పొందుతున్నారు. వీరంతా వైరల్జ్వరాలతోనే వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. భయపెడుతున్న ప్లేట్లెట్ల సంఖ్య డెంగీ, వైరల్ జ్వరాల బారిన పడిన వారికి ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోతున్నాయి. 50వేలకు తగ్గిపోగానే హడలిపోయి ఆస్పత్రులకు పరుగు తీస్తున్నారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు అందినకాడికి దండుకుంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్న రోగులకు బిల్లులు తడిసిమోపెడవుతున్నాయి. రెండు మూడు రోజుల పాటు అడ్మిట్ ఉంటే రోజుకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. వారం రోజులకే రూ.లక్ష వర కు బిల్లు వేస్తున్నారని పలువురు వాపోతున్నారు. ఆసుపత్రులు కిటకిట ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు జ్వర పీడితులతో నిండిపోతున్నాయి. జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులు 350 వరకు ఉన్నాయి. ప్రభుత్వ ప్రధానాసుపత్రితో పాటు 18 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 6 అర్భన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 కమ్యూనిటీ ఆసుపత్రులు, రెండు బస్తీ దవాఖానాలు ఉన్నాయి. ఓపీలో కొందరు చికిత్స పొందుతుండగా, మరికొందరు ఇన్పేషెంట్లుగా ఉన్నారు. -
గ్రీన్సిటీగా మార్చడమే లక్ష్యం
కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ను గ్రీన్సిటీగా మార్చడమే లక్ష్యమని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. శనివారం కలెక్టరేట్ ఆవరణలో నాటిన మొక్కలను పరిశీలించారు. ఖాళీ స్థలాల్లో మరిన్ని మొక్కలు నాటాలని సూచించారు. గ్రీన్సిటీగా మార్చేందుకు నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నామని తెలిపారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటి సంరక్షిస్తున్నామని, ప్రజలు కూడా భాగస్వాములు కావాలన్నారు. యాదాద్రి, మియావాకీ, పట్టణ ప్రకృతి వనం, రాశివనాల పేరిట మొక్కలు పెంచుతున్నామన్నారు. నగరవాసులు తమ ఇంటి పరిసరాల్లో, ఖాళీ ప్రదేశాల్లో పూలు, పండ్లు, ఔషధ మొక్కలు నాటి, సంరక్షించాలని సూచించారు. ప్రజా మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలి నగరంలోని ప్రజా మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. శనివారం నగరంలోని శాతవాహన యూనివర్సిటీ రోడ్డులోని ప్రజామరుగుదొడ్డిని, నైట్ఫుడ్ కోర్ట్, 38,39 వార్డు కార్యాలయాలను పరిశీలించారు. మరుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలన్నారు. నైట్ఫుడ్కోర్టు ప్రాంతంలో చెత్త లేకుండా చూడాలని అన్నారు. నైట్ ఫుడ్కోర్టులోని వ్యాపారులతో మాట్లాడి, సదుపాయాలు, సమస్యలపై ఆరా తీశారు. డిప్యూటీ కమిషనర్లు వేణుమాధవ్, ఖాదర్ మొహియొద్దీన్, పర్యావరణ ఇంజినీర్ స్వామి పాల్గొన్నారు. -
వృద్ధులకు భరోసా.. బాలికలకు భవిత
కరీంనగర్ అర్బన్: స్వయం సహాయక సంఘాల బలోపేతంతో మహిళలకు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరా మహిళా శక్తి’ పథకాన్ని అమలు చేస్తోంది. ఎక్కడా సభ్యత్వం లేని మహిళలు, కౌమార బాలికలు, వృద్ధులతో కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే కార్యాచరణ మొదలవగా ఈ నెలాఖరు వరకు కొనసాగించనున్నారు. వేర్వేరుగా సంఘాల ఏర్పాటు అరవై ఏళ్లు దాటిన వృద్ధులను గ్రామ సమాఖ్యల ఆధ్వర్యంలోని సంఘాల నిర్వాహకులు వయసు రీత్యా సభ్యత్వం నుంచి పక్కన పెడుతున్నారు. ప్రస్తుత కార్యాచరణలో భాగంగా అలా తొలగించిన వారిని గుర్తించి ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేస్తారు. వారికి చిరువ్యాపారాలు, ఇతర మార్గాల్లో ఆర్థిక ఊతమిస్తారన్న మాట. 15 నుంచి 18 ఏళ్ల కిశోర బాలికలతో సంఘాలను ఏర్పాటు చేసి పొదుపు ప్రాధాన్యంపై అవగాహన కల్పిస్తారు. దీంతో ఆర్థిక లావాదేవీల గురించి తెలిసొస్తుంది. విద్య ప్రాధాన్యం, ఉద్యోగావకాశాల గురించి సమావేశాల్లో వివరిస్తారు. సమాజంలో వేధింపులు, సామాజిక మాధ్యమాల మోసాలు, అత్యాచారాలు, ఇతర మహిళా వ్యతిరేక నేరాల నియంత్రణపై చైతన్యపరుస్తున్నారు. దివ్యాంగుల సంఘాలు ఇప్పటికే కొనసాగుతుండగా ఇంకా ఎక్కడైనా ఒకే ప్రాంతంలో 12 మంది ఉంటే కొత్తగా సభ్యత్వం కల్పిస్తారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు వీటి వేదికగా అందేలా చూస్తారు. బ్యాంక్ లింకేజీ రుణాలిచ్చి వర్గాల వారు సంఘాల ఏర్పాటుకు ముందుకొచ్చేలా చూడాలని సెర్ఫ్ సిబ్బంది, మండల సమాఖ్యల బాధ్యులను ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రత్యేక కార్యాచరణతో ప్రక్రియ గ్రామాల్లో ఏ సంఘాల్లో లేని మహిళలు, దివ్యాంగులు, కౌమార బాలికలను డీపీఎంలు, సీసీలు, ఇతర సిబ్బంది ఆధ్వర్యంలో గుర్తిస్తున్నారు. గ్రామాల వారీ జాబితాను రూపొందిస్తున్నారు. కొత్త సంఘాల్లో చేరితే కలిగే ప్రయోజనాల గురించి వివరించేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత సంఘాల ఆర్థిక విజయాలు చెప్పడమే కాకుండా, ఆయా సభ్యుల అనుభవాలను, నిబంధనలను పరిచయం చేస్తారు. ఈ నెల 15 నుంచి 30వరకు ముందుకు వచ్చే సభ్యులతో సంఘాలను ఏర్పాటు చేసి, వారితో బ్యాంకుల్లో పొదుపు ఖాతాలు తెరిపిస్తారు. వివరాలు ‘సెర్ప్’ వెబ్సైట్లో నమోదు చేయిస్తారు. కాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు లక్షిత వర్గాల మహిళలతో సంఘాలు ఏర్పాటు చేయిస్తున్నామని, బ్యాంక్ లింకేజీ, సీ్త్రనిధి రుణాల మంజూరు చేయిస్తామని డీఆర్డీవో వర్గాలు తెలిపాయి. -
తల్లిదండ్రులకు అండగా ఉండాలి
● కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్కల్చరల్: వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టాన్ని అనుసరించి ట్రిబ్యునల్ ఉత్తర్వులను పాటిస్తోందని, లేనిది పర్యవేక్షించాలని, తద్వారా వృద్ధులు, తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. వయోవృద్ధులు, తల్లిదండ్రుల పోషణ, సంక్షేమ చట్టం 2007 అమలు తీరు, ట్రిబ్యునల్ ఉత్తర్వులు, అమలుపై వృద్ధుల సంక్షేమ కమిటీ సభ్యులు, అధికారులు, సీపీ గౌస్ ఆలంతో కలిసి కలెక్టరేట్లో సమావేశం అయ్యారు. తల్లిదండ్రుల బాగోగులు చూడడం లేదని, శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని, బలవంతంగా ఆస్తిపత్రాలపై సంతకాలు చేయించుకుంటున్నారని రెవెన్యూ డివిజనల్ అధికారి ట్రిబ్యునల్కు చాలా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ట్రిబ్యునల్ తీర్పులను పలువురు బేఖాతరు చేస్తున్నారన్నారు. దీంతో సదరు వృద్ధులు కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. వయోవృద్ధుల కేసులకు సంబంధించి ప్రతీ శనివారం నిర్వహించే విచారణలో ఒక పోలీస్ అధికారికి విధులు కేటాయించాలని సీపీకి సూచించారు. ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్బాబు, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్, డీసీహెచ్ఎస్ కృష్ణప్రసాద్ ఉన్నారు. -
ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలి
కరీంనగర్: జిల్లాలో వంద పడకల ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గీట్ల ముకుందరెడ్డి, ఎడ్ల రమేశ్ మాట్లాడుతూ జిల్లాలో వేలాదిమంది ఈఎస్ఐ చందాదారులు ఉన్నప్పటికీ జిల్లాకేంద్రంలో ఈఎస్ఐ ఆస్పత్రి లేకపోవడంతో వైద్య సౌకర్యం పొందడం లేదన్నారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో వేల రూపాయలు బిల్లు చెల్లించాల్సి వస్తోందన్నారు. ఈఎస్ఐ చందాదారుకు సూపర్స్పెషాలిటీ వైద్యం అందించడానికి కార్పొరేట్ ఆసుపత్రులతో టైఅఫ్ చేశారన్నారు. కరీంనగర్లో ఒకటి కూడా ఎంపానల్డ్ హాస్పిటల్ లేకపోవడం బాధాకరమన్నారు. అనంతరం డీఆర్వో వి.వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. సీఐటీయు జిల్లా కోశాధికారి జి రాజేశం, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, జనగాం రాజమల్లు, జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్, నాయకులు తిరుమలయ్య, కాంపెల్లి పోచయ్య, రాజమల్లయ్య, అంజయ్య, దేవేందర్, నరేశ్, రాజేందర్, సంపత్ పాల్గొన్నారు. -
పడిగాపులు.. ఆందోళనలు
గన్నేరువరం/శంకరపట్నం/రామడుగు: జిల్లాలో యూరియా కష్టాలు తప్పడం లేదు. రైతులు గోదా ముల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఓపిక నశించి ఆందోళనకు దిగుతున్నారు. గన్నేరువరం మండలంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. గన్నేరువరం మండలంతో పాటు తిమ్మాపూర్ మండలం, సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలానికి చెందిన రైతులు గుండ్లపల్లి స్టేజీ వద్ద ఉన్న డీసీఎంఎస్కు శుక్రవారం ఉదయం వచ్చారు. యూరియా లేకపోవడంతో సాయంత్రం వరకు ఎదురుచూశారు. అయినా రాకపోవడంతో విసుగుచెంది రాజీవ్ రహదారిపై ఆందోళనకు దిగారు. యూరియా కష్టాలను పట్టించుకోవడం లేదని ధర్నా చేశారు. ట్రాఫిక్ జామ్ కావడంతో స్థానిక పోలీసులతో పాటు సిద్దిపేట సీఐ రైతులను శాంతింపజేశారు. శంకరపట్నం మండలం కేశవపట్నంలోని ఓ ఫర్టిలైజర్ దుకాణానికి లోడ్ యూరియా రావడంతో శుక్రవారం మధ్యాహ్నం 100మంది రైతులు అక్కడికి చేరుకున్నారు. రైతులకు పంపిణీ చేయకపోవడంతో మూడు గంటలు పడిగాపులు కాశారు. సాయంత్రం ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున అందించారు. రామడుగు మండలం గోపాల్రావుపేట రైతునేస్తం ఎరువుల కేంద్రానికి 420 బస్తాలు రావడంతో రైతులు భారీ చేరుకున్నారు. ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేశారు. -
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అనుమతివ్వండి
మల్లాపూర్(కోరుట్ల): ఇందిరమ్మ ఇళ్లు మంజూరైందని, ఇంటి నిర్మాణానికి గ్రామపంచాయతీ అనుమతి ఇవ్వాలని బాధితులు వేడుకున్న ఘటన మల్లాపూర్ మండలం మొగిలిపేటలో శుక్రవారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ఓదెల గజానంద్–సరోజన దంపతుల ఇళ్లు శిథిలావస్థకు చేరి కూలిపోవడంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. ఆ ఇంటి నిర్మాణానికి గ్రామపంచాయతీ అనుమతి, ఫొటో క్యాప్చర్ కోసం పంచాయతీ కార్యదర్శిని సంప్రదించగా, ఇంటి నిర్మాణ స్థలంపై ఫిర్యాదు వచ్చిందని, ఆ వివాదం పరిష్కారమయ్యే వరకు అనుమతితో పాటు ఫొటో క్యాప్చర్ తీయలేనని సమాధానమివ్వడంతో బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. తమ సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే భాగ్యం లేదా అంటూ బాధితులు నిరసన తెలిపారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి సౌజన్యను వివరణ కోరగా, ఓదెల సరోజన–గజానంద్ దంపతులు నిర్మించుకుంటున్న ఇంటి వెనుకవారితో దారి వివాదం ఉందని తెలిపారు. వివాదం పరిష్కరించుకొని అనుమతి కోసం రావాలని బాధితులకు సూచించామని పేర్కొన్నారు. -
పెద్దపల్లి– నిజామాబాద్ లైన్లో ‘వందేభారత్’
సాక్షిప్రతినిధి,కరీంనగర్: పెద్దపల్లి–నిజామాబాద్ లైన్లో వందేభారత్ ఎక్స్ప్రెస్ పరుగులు తీస్తోంది. రాత్రి 11 గంటలకు ఎగువన ఉదయం 4 గంటలకు దిగువన ఇదే మార్గంలో పెద్దపల్లి బైపాస్ మీదుగా నడుస్తోంది. ఇటీవలే ముంబయి నుంచి జాల్నా వరకు నడుస్తున్న 20706 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును నాందేడ్ వరకు పొడిగించారు. కానీ.. ఈ రైలు ప్రాథమిక నిర్వహణ చర్లపల్లిలో చేస్తున్నారు. ఇది నాందేడ్ నుంచి చర్లపల్లి వరకు వయా నిజామాబాద్– కామారెడ్డి మార్గంలో ఖాళీ రైలుతో దిగువ వైపు, మళ్లీ వచ్చేటప్పుడు కూడా చర్లపల్లి నుంచి నాందేడ్ వరకు ఖాళీ రైలుతో నడుస్తుంది. రెండు రోజుల క్రితం కామారెడ్డి రైల్వే స్టేషన్కు సమీపంలో పట్టాలు వరద నీటిలో కొట్టుకుపోవడంతో నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే రైళ్ల రాకపోకలు స్తంభించాయి. ఫలితంగా ఈ మార్గంలో నడుస్తున్న పలు రైళ్లను నిజామాబాద్– పెద్దపల్లి బైపాస్–కాజీపేట మార్గంలో దారి మళ్లించి నడుపుతున్నారు. భవిష్యత్తులో ఈ మార్గం గుండా వందే భారత్, నమో భారత్ ర్యాపిడ్, అమృత్ భారత్ లాంటి రైళ్లు ప్రవేశ పెడితే ఈ ప్రాంత ప్రయాణికులకు మరింత సౌకర్యం కలిగే అవకాశం ఉంటుందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. -
చదవాలి.. క్రీడల్లో మెరవాలి
కరీంనగర్స్పోర్ట్స్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. శుక్రవారం జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా కరీంనగర్ ప్రాంతీయ క్రీడాపాఠశాలలో హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్చంద్ చిత్రపటానికి సీపీ గౌస్ఆలంతో కలిసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చదువు ఎంత అవసరమో క్రీడలు అంతే ఉపయోగమన్నారు. క్రీడా పాఠశాలలోని సదుపాయాలను సద్వినియో గం చేసుకొని, జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. సీపీ గౌస్ఆలం మా ట్లాడుతూ హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్చంద్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ మాట్లాడుతూ కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలకు ప్రత్యేకంగా నిధులు వెచ్చించి సదుపాయాలు కల్పించామన్నారు. వివిధ క్రీడాపోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్ ప్రదా నం చేశారు. డీవైఎస్వో శ్రీనివాస్గౌడ్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్రెడ్డి, ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్రెడ్డి, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, కార్యదర్శి లక్ష్మణ్రావు, ఎస్జీఎఫ్ కార్యదర్శి వేణుగోపాల్, క్రీడా పాఠశాల హెచ్ఎవ శ్రీనివాస్ పాల్గొన్నారు. తల్లి చదువుకుంటే పిల్లలు ఉన్నత విద్యావంతులు అవుతారు శంకరపట్నం: తల్లి చదువుకుంటే పిల్లలు ఉన్న విద్యావంతులవుతారని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. శంకరపట్నం మండలం వంకాయగూడెం అంగన్వాడీకేంద్రంలో నిర్వహించిన శుక్రవారం సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. మహిళలు ప్రతీ ఆరునెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకోవా లని సూచించారు. చదువుకోని మహిళలను ఓపెన్టెన్త్లో చేర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ అయిన అనూషను చీరతో సత్కరించారు. సీడీపీవో శ్రీమతి, డీఎంహెచ్వో వెంకటరమణ, తహసీల్దార్ సురేఖ, ఎంపీడీవో కృష్ణ ప్రసాద్, ఎంపీవో ప్రభాకర్ పాల్గొన్నారు. -
బార్ అండ్ రెస్టారెంట్లలో తనిఖీలు
● నిల్వ పదార్థాలు గుర్తింపుకరీంనగర్ అర్బన్: ఫుడ్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. బస్టాండ్ పక్కన గల నటరాజ్ బార్, దర్బార్ బార్లో గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ పి.రోహిత్రెడ్డి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వి.అంకిత్రెడ్డి తనిఖీలను నిర్వహించారు. దర్బార్ బార్లో ముందు రోజు మిగిలిన మటన్, కార్న్, వెజ్ మంచూరియాను గుర్తించారు. హైజీన్ లోపాలు గుర్తించగా నోటీసులు జారీ చేశారు. అలాగే నటరాజ్ బార్లో పరిసరాల పరిస్థితి అధ్వానంగా ఉన్నట్లు గుర్తించామని అధికారులు వివరించారు. కిచెన్ దుర్వాసన రాగా, సిబ్బంది ఎటువంటి ఆహార భద్రత జాగ్రత్తలు పాటించకపోవడంతో నోటీస్ జారీ చేసినట్లు వివరించారు. -
కష్టపడి చదువుకోవాలి
కరీంనగర్: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి కె.వెంకటేశ్ ఆధ్వర్యంలో నగరంలోని బాలసదన్, శిశుగృహాలను శుక్రవారం సందర్శించారు. చిన్నారులతో ముచ్చటిస్తూ కష్టపడి చదువుకుని ప్రథమస్థానంలో ఉత్తీర్ణత సాధించాలని తెలిపారు. క్రీడాదినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. శిశుగృహలోని ఆహార పదార్థాలు నిల్వ చేసే గదులను తనిఖీ చేశారు. పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ఎలాంటి న్యాయపరమైన సేవ అవసరమైనా సంప్రదించాలని ఆదేశించా రు. సీనియర్ సివిల్ జడ్జితో పాటు లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేశ్ పాల్గొన్నారు. 2న తుది ఓటరు జాబితాకరీంనగర్ అర్బన్: గ్రామ పంచాయతీ తుది ఓటరు జాబితా సెప్టెంబర్ 2న ప్రకటించడంతో పాటు పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే తెలిపారు. గ్రామ పంచాయతీ ఓటరు లిస్ట్, పోలింగ్ కేంద్రాల లిస్ట్పై శుక్రవారం కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఓటర్ల జా బితా, పోలింగ్ కేంద్రాల జాబితా అప్డేట్ చే యడం జరుగుతోందని అన్నారు. డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ఈ నెల 28న విడుదల చేయడం జరిగిందని, అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30 లోపు తెలియజేయాలన్నారు. 31లోపు అభ్యంతరాలను పరిష్కరించి సెప్టెంబర్ 2న తుది జాబితా ప్రచురించడం జరుగుతుందని వివరించారు. డీపీవో వి.జగదీశ్వర్, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని మదీనా కాంప్లెక్స్ ప్రాంతంలో నూతన మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. గతంలో ఉన్న ఓపెన్ టాయిలెట్ పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో, నూతన ప్రజా మరుగుదొడ్డి నిర్మాణం కోసం శుక్రవారం ఆయన స్థల పరిశీలన చేశారు. కరీంనగర్: డాక్టర్ సర్వేపల్లి జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 5న జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డు ప్రదానం చేస్తామని డీఈవో చైతన్య జైనీ తెలిపారు. జిల్లా పరిషత్, ప్రభుత్వ, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలి పారు. దరఖాస్తులను ఈనెల 31వ తేదీ సా యంత్రం 5గంటల్లోగా డీఈవో కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. -
కమీషన్ రావట్లే!
కరీంనగర్ అర్బన్: జిల్లాలోని రేషన్ డీలర్లు కమీషన్ కోసం ఎదరుచూస్తున్నారు. ఐదునెలలుగా కమీషన్ జాడ లేకపోవడంతో సెప్టెంబర్ 5న రేషన్ దుకాణా ల బంద్ పాటిస్తున్నట్లు డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రొడ్డ శ్రీని వాస్ ప్రకటించారు. కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం సైతం అందజేశారు. జిల్లాకు కమీషన్ బకాయి మొత్తంగా రూ.3.9కోట్లు ఉండగా, రేషన్ దుకాణాన్ని నిర్వహించడం తలకుమించిన భారమవుతోందని డీలర్లు వాపోతున్నారు. కరోనాకాలంలో ప్రాణాలను ఫణంగా పెట్టి బియ్యం పంపిణీ చేయగా, ఇటీవల ఒకేనెలలో మూడు నెలల బియ్యం అందించినా తమ శ్రమకు గుర్తింపు ఏదని ప్రఽశ్నిస్తున్నారు. బకాయి రూ.3.9కోట్లు.. నిర్వహణ భారమే జిల్లాలో 566రేషన్ దుకాణాలున్నాయి. వాటి ద్వారా 2.90లక్షల రేషన్ కార్డుదారులకు ప్రతినెలా బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఒక్కో క్వింటాకు రూ.70 చొప్పున డీలర్కు ప్రభుత్వం కమీషన్ ఇస్తోంది. మార్చి వరకు కమీషన్ ఎప్పటికప్పుడు జమ కాగా ఏప్రిల్ నుంచి రాకపోగా ఇబ్బందులు పడుతున్నారు. కార్డులోని ప్రతి వ్యక్తికి ఆరు కిలోల చొప్పున బియ్యం ఇవ్వగా జూన్లో మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేశారు. రేషన్ కమీషన్ అందకపోవడంతో దుకాణ నిర్వహణ ఖర్చు భరించలేక అవస్థలు పడుతున్నారు. సరుకులు అన్లోడ్ చేసేందుకు హమాలీకి క్వింటాల్కు రూ.8, లారీ డ్రైవర్కు రూ.200, విద్యుత్ బిల్లు సుమారు రూ.500, గది లేదా షట్టర్ కిరాయి రూ.2వేలు చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు. ఈ– పోస్ మిషన్ రీచార్జికి రూ.200, సహాయకులకు రూ.2వేలకు పైగా ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. నెలకు రూ.5వేల నుంచి 6వేల వరకు ఖర్చు అవుతోందని, వంద క్వింటాళ్లు పంపిణీ చేస్తే వచ్చే కమీషన్ రూ.7వేలు కాగా.. ఖర్చులు పోనూ మిగిలేది రూ.వెయ్యి నుంచి రెండు వేలే అని వాపోతున్నారు. కొందరు ఇళ్లు గడవకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక చిరు వ్యాపారాలు వెతుక్కుంటున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనైతే వ్యవసాయం లేదా కూలీకి వెళ్తున్నారు. డీలర్ల డిమాండ్లు ఇవే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు కనీస గౌరవ వేతనం రూ.5వేలు, కమీషన్ రూ.300కు పెంచాలి. రేషన్ దుకాణాలను మినీ సూపర్ మార్కెట్లుగా గుర్తించి నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచాలి. బియ్యం పంచే క్రమంలో దుమ్ము,ధూళితో అనారోగ్య సమస్యలు తలెత్తుతుండగా రేషన్ డీలర్ల కుటుంబాలకు హెల్త్ కార్డులు జారీ చేయాలి. బియ్యం దిగుమతి చార్జీలను ప్రభుత్వమే భరించడంతో పాటు గత 10ఏళ్లుగా పేరుకుపోయిన బకాయిలను చెల్లించాలి. గోదాం ప్రాంగణంలో శాశ్వత ప్రాతిపాదికన వే బ్రిడ్జిల ఏర్పాటుతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో 800 కార్డులు, పట్టణ ప్రాంతాల్లో 1,200 కార్డులకు పైబడి ఉంటేనే బైఫర్కేషన్ చేయాలి. రెండేళ్లకోసారి చేపట్టకుండా ఆథరైజేషన్ రిన్యువల్స్ను శాశ్వతంగా కొనసాగించాలి. రేషన్ దుకాణాల అద్దెను ప్రభుత్వమే భరించడంతో పాటు తరుగు కింద 2శాతం బియ్యం కోటాను అదనంగా ఇవ్వాలి. డీలర్లలో ఉన్నత విద్యావంతులకు శాఖాపరమైన పదోన్నతులు కల్పించాలి.జిల్లాలో మొత్తం గ్రామ పంచాయతీలు: 313 నగరపాలక సంస్థ: 1 మున్సిపాలిటీలు: 3 మొత్తం రేషన్ డీలర్లు: 566 కార్డుదారులు: 2.90 లక్షలు రావాల్సిన బకాయి: రూ.3.9కోట్లు -
విభిన్నరూప విఘ్నేశ్వర
నగరంలోని వాడవాడల్లో కొలువుదీరిన గణనాథులు మూడోరోజు శుక్రవారం ఘనమైన పూజలందుకున్నారు. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విభిన్న గణపతులు ప్రజలను ఆకట్టుకుంటుండగా.. ప్రత్యేకంగా వెళ్లి దర్శించుకుంటున్నారు. నగరంలోని రామగుండం బైపాస్లో ఐసో టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పైలెట్ గణేశుడు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. పడవ చౌరస్తాలో ఫ్రెండ్స్యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడు ఆకట్టుకుంటున్నాడు. పాతబజార్ 1/బీలో అశ్వవాహనంపై విన్నర్స్ యూత్ ఏర్పాటు చేసిన గణేశుడు విభిన్నంగా ఉండగా.. పాతబజార్లో గోల్డెన్ యూత్ 1/ఏ ఏర్పాటు చేసిన సప్త చిరంజీవుల విఘ్నేశ్వరుడు చూడముచ్చట గొల్పుతున్నాడు. గాంధీ చౌరస్తాలో గాంధీ చౌక్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన రాధా శ్రీకృష్ణ రూపంలోని వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. విద్యానగర్లోని వాణినగర్లో గుహలో గణనాథుడు ఘనమైన పూజలందుకుంటున్నాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
కొడుకు స్ఫూర్తితో..
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ రామగుండం కృష్ణానగర్కు చెందిన వెంకట తిరుపతిరెడ్డి అంతర్జాతీయ సైక్లింగ్ పోటీల్లో సత్తాచాటాడు. ఇటీవల లండన్లో జరిగిన ఇంటర్నేషనల్ సైక్లింగ్ (లండన్–ఎడిన్బర్గ్–లండన్) 1,500 కిలోమీటర్ల సైక్లింగ్లో కుమారుడు శ్రీహర్షరెడ్డితో కలిసి పాల్గొని తండ్రీకొడుకులు మెడల్స్ సాధించారు. సింగరేణి ఓపెన్కాస్టు–5లో ఈపీ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్న తిరుపతిరెడ్డి 2022 మార్చి15న సైక్లింగ్ ప్రారంభించారు. ఇప్పటి వరకు సుమారు 45 వేల కిలోమీటర్ల మేరకు సైకిల్ మీద ప్రయాణం చేశారు. అడక్స్ ఇండియా రెండొనర్స్ నుంచి మూడుసార్లు అవార్డు సాధించారు. ఫిబ్రవరిలో కోల్ ఇండియా అథ్లెట్స్ మీట్లో సింగరేణి తరఫున పాల్గొని గోల్డ్ మెడల్ సాధించాడు. జూన్ 2025లో 1,200 కిలోమీటర్లు పోటీల్లో (హైదరాబాద్–భద్రాచలం–లంబసింగి–రాజమండ్రి–హైదరాబాద్) పాల్గొని అవార్డు అందుకున్నాడు. తన కుమారుడు ఇంజినీరింగ్ చేస్తున్న సమయంలో సైక్లింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు చెప్పడంతో తనకు ఆసక్తి కలిగిందని, కుమారుడితో కలిసి లండన్ పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని తిరుపతిరెడ్డి తెలిపారు. -
గిరిజన తండాలో పుట్టి.. కోచ్గా ఎదిగి
ధర్మారం(ధర్మపురి): ధర్మారం మండలం బంజేరుపల్లి లంబాడతండా (బి) గ్రామానికి చెందిన ఇస్లావత్ నరేశ్నాయక్ చిన్ననాటి నుంచే ఖోఖో ఆటపై మక్కువ పెంచుకున్నాడు. తండాకు చెందిన ఇస్లావత్ రూపానాయక్– సంతారికి శ్రీనివాస్, నరేశ్ సంతానం. శ్రీనివాస్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. నరేశ్ 1996లో ఇంటర్ చదువు కోసం హుస్నాబాద్ గురుకులంలో చేరాడు. అప్పుడు జరిగిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొని ప్రథమస్థానంలో నిలిచాడు. పంజాబ్, మహారాష్ట్ర, హైదరాబాద్లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటాడు. 2015లో కోచ్గా మారారు. 2006లో స్పోర్స్ కోటాలో రైల్వేలో మెకానిక్ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం సికింద్రాబాద్లోని లాలాగూడలో చీఫ్ మర్క్షాప్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలోని జరిగిన ప్రపంచకప్ పోటీల్లో మహిళల జట్టుకు స్కిల్ ఎనలైజర్గా వ్యవహరించాడు. గతంలో దక్షిణమధ్య రైల్వే జట్టు, భారత రైల్వే జట్టు, అల్టీమేట్ ఖోఖో పోటీల్లో కోచ్గా విధులు నిర్వర్తించారు. -
మారథాన్ వీరుడు
మల్యాల(చొప్పదండి): మండలంలోని రామన్నపేటకు చెందిన గుగ్గిలం అశోక్ నిజామాబాద్లోని వేల్పూరులో ఆర్టీవో విభాగంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ, క్రీడల్లోనూ మెరుస్తున్నాడు. పాఠశాల స్థాయిలోనే క్రీడలపై ఆసక్తితో ప్రాక్టీసు చేస్తూ 100,200,400మీటర్ల విభాగాలతోపాటు కబడ్డీలోనూ ప్రతిభ చూపి, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటాడు. మాస్టర్ అథ్లెటిక్స్ ఈవెంట్లో రాష్ట్రస్థాయి 5కే రన్లో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఇంటర్ స్థాయి నుంచి మారథాన్ వైపు మళ్లారు. గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, బెంగళూరు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, జమ్ముకశ్వీర్, మధ్యప్రదేశ్లో నిర్వ21,42 కిలోమీటర్ల పోటీల్లో రాణించాడు. ఇటీవల ముంబయిలో జాతీయస్థాయి టాటా మారథాన్లో ప్రతిభచూపాడు. జాతీయ, అంతర్జాతీయపోటీల్లో రాణిస్తున్న అశోక్ ఇటీవల రెండు రాష్ట్రాల ఉత్తమ క్రీడాకారుడిగా అవార్డు అందుకున్నారు. గతేడాది 10 కి.మీ పరుగు పందానికి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశారు. హిస్టారికల్ రన్ బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు. ఈ ఏడాది కామారెడ్డిలో నిర్వహించిన హాఫ్ మారథాన్కు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశారు. -
క్రికెట్లో రాణిస్తున్న శ్రీవల్లి
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామానికి చెందిన శ్రీవల్లి క్రికెట్లో రాణిస్తోంది. ఉద్యోగరీత్యా తండ్రి కట్ట లక్ష్మారెడ్డి కరీంనగర్లో ఉంటుండగా, తల్లి ఉమారాణి బ్యూటీపార్లర్ నడుపుతుంటారు. పాఠశాల స్థాయి నుంచి శ్రీవల్లికి క్రికెట్ అంటే ఇష్టం. హైదరాబాద్లో బౌలింగ్, బ్యాటింగ్లో మెలకువలు నేర్చుకుంది. జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్లో అండర్– 14 విభాగంలో పాల్గొని ప్రతిభ కనబరిచింది. 2022లో పూణేలో అండర్– 19 విభాగంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఫాస్ట్ బౌలర్గా సత్తాచాటింది. క్రికెట్లో ఫాస్ట్ బౌలర్గా రాణించడమే తన లక్ష్యమని పేర్కొంది. -
మారుమూల గ్రామం నుంచి ప్రపంచ వేదికపైకి..
కొడిమ్యాల(చొప్పదండి): మండలంలోని డబ్బుతిమ్మాయిపల్లికి చెందిన అనంతుల దేవయ్య, నర్సవ్వ కూమరుడు రవీందర్ క్రమశిక్షణతో క్రీడారంగంలో విశేష స్థానం సంపాదించుకున్నాడు. పట్టుదలతో సాధన చేస్తూ ఖోఖో వరల్డ్ కప్లో భారత జట్టుకు అంపైర్గా సేవలందించి ఆదర్శంగా నిలిచారు. కొడిమ్యాల ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఆయన.. ఇంటర్మీడియట్ మేడిపల్లి, డిగ్రీ కరీంనగర్లోని ఎస్సారార్ కాలేజీలో పూర్తిచేశాడు. ఐదో తరగతిలో ఖోఖోపై ఆసక్తి పెంచుకుని, ఏడో తరగతిలోనే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. కరీంనగర్లో చదువుకుంటున్న సమయంలో భాస్కరరావు ప్రోత్సాహం, మహేందర్రావు ఆర్థిక సాయంతో కెరీర్ను మెరుగుపర్చుకున్నారు. 2003లో బీపీఎడ్, 2006లో ఎంఎడ్ పూర్తిచేసి 2009లో మెట్పల్లిలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. 1999లో ఆల్ ఇండియా రూరల్ నేషనల్లో బంగారు పతకం, 2001లో ఆల్ ఇండియా యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్గా నిలిచారు. క్రీడలంటే ఆసక్తి ఉన్నవారు దాన్నే కెరీర్గా మలుచుకోవచ్చని, కఠిన శ్రమ, క్రమశిక్షణ, మానసిక ప్రశాంతత, శరీర సాధన తప్పనిసరి అని రవీందర్ పేర్కొన్నారు. -
గురి పెడితే పతకమే..
ఎలిగేడు(పెద్దపల్లి): ఇటీవల కెనడాలో జరిగిన ప్రపంచ యూత్ చాంపియన్షిప్లో కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో గోల్డ్మెడల్ సాధించి చరిత్ర సృష్టించింది తానిపర్తి చికిత. ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన తానిపర్తి శ్రీనివాసరావు–శ్రీలత దంపతుల కుమార్తె చికిత. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో 8వ తరగతిలోనే ఆర్చరీపై మక్కువ పెంచుకుంది. 2019 ఇంటి వద్దనే ఆర్చరీ ప్రాక్టీసు మొదలు పెట్టింది. ఎస్జీఎఫ్ క్రీడల్లో మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రతిభచాటింది. 2023లో గోవాలో జాతీయ పోటీల్లో స్వర్ణ పతకం సాధించింది. జాతీయస్థాయి సీనియర్, జూనియర్ పోటీల్లో రజత, కాంస్య పతకాలు, చైనాలోని షాంఘైలో జరిగిన టోర్నీలో సిల్వర్ మెడల్ గెలుచుకుంది. -
కాలువలో పడి యువకుడి మృతి
ఇల్లందకుంట(హుజూరాబాద్): మండలంలోని మల్యాలకు చెందిన చందగల్ల రాజు (32) ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతిచెందాడు. ఎస్సై క్రాంతికుమార్ తెలిపిన వివరాలు... వ్యవసాయ పొలం వద్దకు వెళ్లొస్తానని మంగళవారం సాయంత్రం ఇంట్లో చెప్పి రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు. బుధవారం కనగర్తి గ్రామం నుంచి మల్యాల చెరువుకు వచ్చే కాలువలో రాజు మృతదేహాన్ని చూసినవారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య కవిత, కొడుకు, కూతురు ఉన్నారు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. వ్యవసాయ బావిలో పడి ఆరోగ్య మిత్ర.. మానకొండూర్: మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన ఆరోగ్య మిత్ర గాలిపల్లి ఆంజనేయులు(40) వ్యవసాయ బావిలోపడి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు..ఆంజనేయులు కరీంనగర్లో ఆరోగ్య మిత్రగా పనిచేస్తుండగా, భార్య శకుంతల కర్నూల్లో జాబ్ చేస్తూ అక్కడే ఉంటోంది. వీరికి ఇద్దరు కొడుకులు. బుధవారం తెల్ల వారుజామున భార్య వద్దకు వెళ్లామని ఇంటి నుంచి బయలుదేరాడు. జగ్గయ్యపల్లి గ్రామ శివారులో రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావిలో పడి పోయాడు. గురువారం వ్యవసాయబావిలో మృతదేహం ఉందని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొన్ని మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా ఆంజనేయులు మృతి ప్రమాదమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తేలాల్సి ఉంది. -
మెట్పల్లిలో దొంగల కలకలం
మెట్పల్లి: పట్టణంలోని 12వార్డు శివారులో ఉన్న సిద్ధివినాయకనగర్లో దొంగల సంచారం కలకలం రేపుతోంది. ముఖాలు కనిపించకుండా ముసుగులు ధరించి ఉన్న ముగ్గురు వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కాలనీలో సంచరించారు. వీధుల్లో కలియ తిరుగుతూ పలు ఇళ్ల వద్ద రెక్కి నిర్వహించారు. తర్వాత తిరుమల అపార్ట్మెంట్కు వెళ్లారు. అక్కడ మూడో ఫ్లోర్ వరకు వెళ్లి వెనుదిరిగిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కొన్ని ఇళ్లకు తాళాలు వేసి ఉండడం.. చోరీకి అనుకూలంగా లేకపోవడంతోనే వారు వెనుదిరిగినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. గురువారం ఉదయం దొంగలసంచారం వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయ్యాయి. వాటిని చూసిన స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇదే కాలనీలో కొన్ని నెలల క్రితం పట్టపగలే చోరీ జరిగింది. ఓ మహిళ ఇంటి ముందు ఉండగా.. ఓ యువకుడు వచ్చి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు ఎత్తుకెళ్లాడు. తాజాగా రాత్రి సమయంలో ముగ్గురు దొంగలు సంచరించడం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రతిరోజు రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహించే పోలీ సులు.. ఈ కాలనీ వైపు మాత్రం కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ అధికారులు స్పందించి శివారు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కాలనీవాసులు కోరుతున్నారు. -
టీ అందించే స్థాయి నుంచి..
ఇల్లంతకుంట(మానకొండూర్): టీ అందించే స్థాయి నుంచి కోచ్గా ఎదిగాడు పండుగ ఆనంద్. ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన ఆనంద్ తల్లిదండ్రులు హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తారు. పాఠశాల స్థాయి నుంచే ఖోఖో పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. 2002 నుంచి 2016 వరకు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణించాడు. జాతీయస్థాయిలో 60 టోర్నమెంట్లో పాల్గొన్నాడు. సీనియర్ విభాగంలో 7 బంగారు, ఒక సిల్వర్ పతకం సాధించాడు. 2016లో మధ్యప్రదేశ్లోని ఇండోర్లో నిర్వహించిన మూడవ ఆసియా ఖోఖో చాంపియన్షిప్ పోటీల్లో ఇండియా టీంకు కెప్టెన్గా వ్యవహరించి బంగారు పతకం సాధించాడు. 18 ఏళ్లకే 2008లో రైల్వేలో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం సాధించాడు. 2017 నుంచి ఖేల్ తెలంగాణ సీనియర్ ఖోఖో జట్టుకు కోచ్గా వ్యవహరిస్తున్నాడు. -
కొత్త క్రీడా పాలసీలను అమల్లోకి తేవాలి
కరీంనగర్ స్పోర్ట్స్: క్రీడల అభివృద్ధికి పాటుపడుతున్నామని, జాతీయ, అంతర్జాతీయస్థాయి వేదికల్లో రాణించే క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందజేస్తామని.. ఇలా పలు రకాల పథకాలు, ప్రణాళికలతో దేశం, రాష్ట్రంలో క్రీడా రంగం రాతను మార్చేస్తామంటు క్రీడా పాలసీలు రూపొందించారు. ఇటీవలే రెండు పాలసీలు ఆమోదం పొందాయి. త్వరలో అమలుకానున్న నూతన క్రీడా పాలసీలపై క్రీడారంగ ప్రముఖుల అభిప్రాయాలు.. కొత్త క్రీడా పాలసీలో భాగంగా ప్రభుత్వం కొత్త జిల్లాల్లోని క్రీడారంగంపై దృష్టి సారించాలి. కోచ్ల నియామకాలు, పోటీలు నిర్వహించడానికి నిధులు విడుదల చేయాలి. ఇప్పటికీ కొత్త జిల్లాల్లో క్రీడా కార్యక్రమాలు అంతంతమాత్రమే జరుగుతున్నాయి. క్రీడా పాలసీలోనైనా కొత్త రూపుదాల్చాలి. – గసిరెడ్డి జనార్దన్రెడ్డి, తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి క్రీడా పాలసీలో భాగంగా జిల్లాల్లో కోచ్ల నియామకం త్వరగా చేపట్టాలి. కోచ్లు లేక చాలా వరకు స్టేడియాలు వెలవెల బోతున్నాయి. స్టేడియంలో కోచ్లు లేకుంటే ఇక క్రీడాకారుల శిక్షణ తీసుకునేందుకు ఎలా వస్తారు. వెంటనే నియమించాలి. – సీహెచ్.సంపత్రావు, రాష్ట్ర కబడ్డీ సంఘం ఉపాధ్యక్షుడు ఉన్నత విద్య, పోటీ పరీక్షల్లో అమల్లో ఉన్న క్రీడా కోటాను పెంచాలి. ప్రస్తుతం ఉద్యోగావకాశాల్లో 2 శాతం, ఉన్నత విద్యకు 0.5 శాతం క్రీడా కోటా అమల్లో ఉంది. అలాగే మరిన్ని క్రీడలను చేర్చాలి. – బి.లక్ష్మణ్, ఉమ్మడి జిల్లా హ్యాండ్బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి కరీంనగర్లోని ప్రాంతీయ క్రీడా పాఠశాలను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేయాలి. 2005లో ప్రారంభమైన ఈ పాఠశాలలో టెన్త్ వరకే ఉంది. ఆ తర్వాత విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా తయరవుతోంది. వెంటనే అప్గ్రేడ్ చేయాలి. – టి.రమేశ్రెడ్డి, రాష్ట్ర రెజ్లింగ్ సంఘం ఉపాధ్యక్షుడు -
ఖోఖో సోదరులు
కోరుట్లటౌన్: కోరుట్ల పట్టణం బీసీ కాలనీకి చెందిన వాసం శంకర్–లక్ష్మి దంపతులకు నవీన్, సంజయ్, అజయ్ సంతానం. తల్లిదండ్రులు బీడీలు చుడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ముగ్గురు పిల్లలను చదివించారు. నవీన్, సంజయ్ క్రమశిక్షణతో చదవుతో పాటు ఆటల్లో రాణించారు. ఖోఖో ఆటలో జాతీయస్థాయికి చేరుకున్నారు. నవీన్ అంతర్జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో మన దేశం తరఫున ఆడారు. ఇద్దరూ ప్రభుత్వ వ్యాయామ ఉద్యోగాలు సాధించారు. ఏడో తరగతి నుంచే.. ఏడో తరగతి నుంచే జెడ్పీ హైస్కూల్లో పీఈటీ లక్ష్మీనారాయణ సార్ ప్రోత్సాహంతో ఖోఖో ఆడడం స్టార్ట్ చేశా. నిరంతరం సాధన చేస్తూ జోనల్ లెవెల్, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి గోల్డ్ మెడల్ సాధించా. డిఫెన్స్లో స్పోర్ట్స్ కోటలో ఉద్యోగం వచ్చింది. తర్వాత పీఈటీగా జెడ్పీహెచ్ఎస్ కథలాపూర్లో ఉద్యోగం సాధించా. ప్రమోషన్ రాగా భూషన్రావుపేటలో పీడీ ఉద్యోగం చేస్తున్నా. – నవీన్ అన్నయ్య స్ఫూర్తితో.. అన్నయ్య నవీన్ స్ఫూర్తితో ఖోఖో ఆటపై ఆసక్తి కలిగింది. మండల స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు పతకాలు సాధించా. డిగ్రీలో ఎన్సీసీబీ సర్టిఫికెట్ పొందాను. రైల్వేలో ఉద్యోగం రాగా పెద్దపల్లి, మెట్పల్లి ఏరియా రైల్వే స్టేషన్లలో జాబ్ చేశా. తర్వాత మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో పీడీగా జాబ్ వచ్చింది. 2024 డీఎస్సీలో పీడీ, పీఈటీ జాబ్ రాగా మెట్పల్లి ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నా. – సంజయ్ -
నీటి గుంతలో పడి బాలుడు మృతి
జగిత్యాలక్రైం: పాఠశాలకు సెలవు రావడంతో ఆడుకుంటూ వెళ్లిన ఓ బాలుడు నీటి గుంతలో పడి మృతిచెందిన సంఘటన జగిత్యాల రూరల్ మండలం కల్లెడలో గురువారం సాయంత్రం జరిగింది. కల్లెడ గ్రామానికి చెందిన కుంట భూమయ్య కుమారుడు కుంట దినేశ్ (7) గ్రామంలో రెండో తరగతి చదువుతున్నాడు. భారీ వర్షం నేపథ్యంలో పాఠశాలకు సెలవు ఇవ్వడంతో ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు. అప్పటికే ఓ జేసీబీ నిర్వాహకుడు రోడ్డుపక్కన భారీ గుంత తవ్వాడు. రెండురోజులుగా కురుస్తున్న వర్షానికి ఆ గుంత పూర్తిస్థాయిలో నిండి నీటి ప్రవాహం వెళ్తోంది. దినేశ్తోపాటు మరో ముగ్గురు చిన్నారులు కూడా నీటిలో ఆడుకుంటూ అటువైపు వెళ్లారు. దినేశ్ ప్రమాదవశాత్తు గుంతలో పడిపోయాడు. స్థానికులు వచ్చి బాలుడి కోసం వెదకగా బాలుడు మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని పరిశీలించారు. జేసీబీ నిర్వాహకుడి నిర్వాకంతోనే ప్రమాదం కల్లెడ శివారులోని ప్రభుత్వ భూముల్లో కొద్దికాలంగా ఓ జే సీబీ నిర్వాహకుడు మైనింగ్, రె వెన్యూ అనుమతి లేకుండా ప్ర తిరోజు కూలీలతో బండరాళ్లు కొట్టించడంతోపాటు మట్టిని తోడుతున్నట్లు సమాచారం. మట్టికోసం భా రీ గుంతలు తవ్వి నిర్లక్ష్యంగా వదిలిపెట్టాడు. భారీ వర్షాలకు ఇటీవల ఆ గుంతలు నిండాయి. అటువై పు వెళ్లిన పశువులు ఆ గోతుల్లో ప్రమాదవశాత్తు ప డి మృతిచెందాయి. సదరు జేఏసీ నిర్వాహకుడు రెండుమూడేళ్లుగా ప్రభుత్వ స్థలాలు, గుట్టల్లో బండరా ళ్లు తీసుకెళ్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బాలుడి మృతికి గుంత తీసిన జేసీబీ నిర్వాహకుడే కారణమని, అతనిపై చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
నేడు ఎల్ఎండీ గేట్లు ఎత్తే అవకాశం
తిమ్మాపూర్: ఎగువ ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, మిడ్ మానేరు రిజర్వాయర్ నుంచి వచ్చే వరద నీటి ప్రవాహంతో ఎల్ఎండీ నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం 56,944 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా గురువారం సాయంత్రం వరకు 16.263 టీఎంసీలకు చేరిందన్నారు. మోయతుమ్మెద వాగు నుంచి 11,944 క్యూసెక్కులు, మధ్యమానేరు నుంచి 45 వేల క్యూసెక్కుల వరద వస్తున్నట్లు వివరించారు. శుక్రవారం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో స్పిల్వే గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. దిగువన ఉన్న ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ ఎస్ఈ పి.రమేశ్ సూచించారు. పశువులు, గొర్రెల కాపరులు, జాలరులు, రైతులు, నదిని దాటే ప్రయత్నాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. -
ప్రత్యామ్నాయమే పనికొచ్చింది
సాక్షిప్రతినిధి, కరీంనగర్: భారీ వర్షాల నేపథ్యంలో.. కామారెడ్డిలో రైల్వేట్రాక్ కొట్టుకుపోయిన క్రమంలో ప్రత్యామ్నాయంగా వేసిన పెద్దపల్లి–నిజామాబాద్ రైల్వేమార్గమే కీలకంగా మారింది. కామారెడ్డి మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లను అధికారులు ఈ మార్గం మీదుగా మళ్లించారు. గతేడాది నవంబర్లో పెద్దపల్లి సమీపంలోని రాఘవాపూర్ వద్ద రైలు పట్టాలు తప్పిన సమయంలోనూ పెద్దపల్లి– నిజామాబాద్ రైల్వేమార్గం కీలకంగా మారింది. తాజాగా కామారెడ్డిలో భారీ వర్షాల నేపథ్యంలో ఈ ప్రత్యామ్నాయ మార్గం తన ప్రాధాన్యాన్ని చాటుకుంది. ఈసారి బైపాస్ మార్గం కూడా పూర్తవడంతో ప్రతీ రైలుకు దాదాపు 30 నుంచి 40 నిమిషాలపాటు లోకో రివర్స్కు సమయం మిగలడం గమనార్హం. పెద్దపల్లి వెళ్లకుండా బైపాస్ మీదుగానే.. గతంలో బల్లార్షా–కాజీపేట మార్గం నుంచి పెద్దపల్లి–నిజామాబాద్ మార్గంలో మళ్లించాల్సి వస్తే.. ప్రతీ రైలు ముందుగా పెద్దపల్లి వెళ్లాల్సి వచ్చేది. అక్కడ రైలు ఇంజిన్ రివర్స్ తీసుకోవాలి. తిరిగి పెద్దపల్లి–నిజామాబాద్ వైపు సిద్ధమైన తరువాత సిగ్నల్ దొరకాలంటే కనీసం 40 నిమిషాల సమయం పట్టేది. ఇటీవల పెద్దపల్లి బైపాస్ అందుబాటులోకొచ్చాక.. నేరుగా బైపాస్ మీదుగా పెద్దపల్లి – నిజామాబాద్ సెక్షన్లోకి సులువుగా రైళ్లు మళ్లుతున్నాయి.ఫలితంగా లోకో రివర్స్ తీసుకునే అవసరం లేకుండా.. 40 నిమిషాల సమయం ఆదా అవుతోంది. మళ్లించిన రైళ్లు ఇవే.. కాజీపేట నుంచి బల్లార్షా, పెద్దపల్లి నుంచి నిజామాబాద్ రైల్వేమార్గాల్లో నడిచే మెమూ, పలు ఎక్స్ప్రెస్ రైళ్లను రైల్వే అధికారులు పాక్షికంగా రద్దు చేశారు. పెద్దపల్లి–నిజామాబాద్ సెక్షన్ మీదుగా పలు రైళ్లను మళ్లించడంతో ఈ మార్గంలో ట్రాఫిక్ భారం పడింది. ఫలితంగా అధికారులు కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. వాస్తవానికి బల్లార్షా–కాజీపేట, పెద్దపల్లి–నిజామాబాద్ సెక్షన్లలో వర్షాలు, ప్రతికూల పరిస్థితులు లేకపోయినా.. ఈ ప్రాంతంవాసులు మాత్రం రైలు ప్రయాణానికి దూరం కావాల్సి వచ్చింది. గతేడాది నవంబరులో రాఘవాపూర్ వద్ద రైలు పట్టాలు తప్పినపుడు ఇదేవిధంగా ఇక్కడి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ● రైలు నంబర్ 17033/17034 భద్రాచలం–బల్హర్షా– సిర్పూర్ టౌన్–భద్రాచలం సింగరేణి మెమూ ఎక్స్ప్రెస్ రైలు 29న భద్రాచలం రోడ్డు నుంచి వరంగల్ మధ్య మాత్రమే నడుస్తుంది. ఈ రైలు కాజీపేట– బల్లార్షా/సిర్పూర్ టౌన్–కాజీపేట మధ్య పాక్షికంగా రద్దయ్యింది. ● 17035 కాజీపేట నుంచి బల్లార్షా ఎక్స్ప్రెస్ గురు, శుక్రవారం కాజీపేట నుంచి బయలుదేరేది పూర్తిగా రద్దయ్యింది. బల్లార్షా నుంచి కాజీపేట వెళ్లే 17036 ఎక్స్ప్రెస్ రైలు శుక్ర, శనివారాలు రద్దయ్యింది. ● 67771/72 , 67773/74 కరీంనగర్ నుంచి సిర్పూర్ టౌన్ – కరీంనగర్, కరీంనగర్ – బోధన్ – కరీంనగర్ పుష్పుల్ మెమూ ప్యాసింజర్ శుక్రవారం ఇరువైపులా రద్దు చేశారు. ● కాగజ్నగర్ వైపు శుక్రవారం నడిచే 17233 భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ కేవలం సికింద్రాబాద్ నుంచి కాజీపేట మధ్యనే నడుస్తుంది. ఇదే ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ వైపు 17234 కాజీపేట నుంచి సికింద్రాబాద్ మధ్య మాత్రమే నడుస్తుంది. ● శుక్రవారం ఎగువ మార్గంలో నడిచే చైన్నె సెంట్రల్ నుంచి శ్రీమాతా వైష్ణోదేవి కాట్రా 16,031 వెళ్లే అండమాన్ ట్రైవీక్లీ ఎక్స్ప్రెస్.. దిగువ మార్గంలో నడిచే 16,032 శ్రీమాతా వైష్ణోదేవి కాట్రా నుంచి చైన్నె సెంట్రల్ అండమాన్ ట్రై వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. -
సిబ్బంది అలర్ట్గా ఉండాలి
కరీంనగర్ కార్పొరేషన్: భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ ఆదేశించారు. గురువారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎక్కడా వరదనీళ్లు నిలవకుండా చర్యలుతీసుకోవాలని సూచించారు. డీఆర్ఎఫ్ బృందాలు షిఫ్ట్ల వారీగా సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనాలన్నారు. వరదనీటిని మళ్లించేందుకు జేసీబీ తదితర వాహనాలను ఇంజినీరింగ్ అధికారులు రెడీగా ఉంచుకోవాలన్నారు. శిథిలావస్థలో ఉన్న యూజీడీ చాంబర్లను గుర్తించి, రిపోర్ట్ ఇవ్వాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులు డ్రైనేజీలను శుభ్రపరుస్తూ, ప్లాస్టిక్ బాటిల్స్, కొబ్బరి బొండాలు, ఇతరత్రా చెత్తను తొలగించాలన్నారు. ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేసి నీటిని శుభ్రపరుచుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్ల టౌన్ప్లానింగ్ అధికారులు గుర్తించి, అందులో ఎవరూ ఉండకుండా చూడాలన్నారు. మెప్మా సమన్వయంతో నగర వాప్తంగా రోడ్లపై ఉండే నిరాశ్రయులను గుర్తించి, నైట్ షెల్టర్కు తరలించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ వేణుమాధవ్, ఎస్ఈ రాజ్ కుమార్, ఈఈలు యాదగిరి, సంజీవ్ కుమార్, ఏసీపీలు వేణు, శ్రీధర్, డీఈలు, శానిటేషన్ సూపర్ వైజర్లు, డిజాస్టర్ అధికారులు ఏఈలు, టీపీఎస్లు, టీపీబీఓలు,శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
దంచి కొట్టిన వాన
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. కామారెడ్డిలో క్లౌడ్బరస్ట్తో సిరిసిల్ల జిల్లాలో ఎగువ మానేరు ఉప్పొంగింది. వరుణ ప్రతాపానికి వాగులు, వంకలు, నదులు పొంగాయి. బుధవారం ఉదయమే మొదలైన వర్షం గురువారం మధ్యాహ్నం వరకు విరామం లేకుండా కురిసింది. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాలలో వర్షం ప్రభావం అంతంత మాత్రంగానే ఉన్నా.. సిరిసిల్లపై అధికంగా కనిపించింది. సిరిసిల్ల జిల్లాల నర్మాలలో వ్యక్తి గల్లంతు కాగా ఐదుగురిని భారత వైమానికదళం కాపాడింది. సిరిసిల్లలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రెస్క్యూ ఆపరేషన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, విప్ ఆది శ్రీనివాస్తో కలిసి పర్యవేక్షించారు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్లతో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి అధికారులకు సూచనలు చేశారు. ముగ్గురు గల్లంతు భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లాలో ముగ్గురు గల్లంతయ్యారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ప్రమాదవశాత్త్తు ఎస్సారెస్పీ కాలువలో శేఖర్రెడ్డి (34) పడిపోయాడు. కరీంనగర్లో చింతకుంట ఎస్సారెస్పీ కెనాల్లో రహ్మన్ (21) చేపలవేటకు వెళ్లి గల్లంతయ్యాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా నర్మాలలో పంపుకాడి నాగయ్య (45) వరదలో కొట్టుకుపోయాడు. కరీంనగర్ లోయర్ మానేరు జలాశయాన్ని, మానకొండూరు చెరువులను అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సందర్శించారు. ఇన్ ఫ్లో 55 వేల క్యూసెక్కులు ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రాజెక్టులకు వరద పోటు.. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. మిడ్మానేరు 17 గేట్లు ఎత్తి 57వేల క్యూసెక్కుల నీటిని లోయర్ మానేరుకు వదులుతున్నారు. ఇక ఎల్లంపల్లికి 5,30,424 క్యూసెక్కుల నీరు వస్తుంటే..5,61,424 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. జగిత్యాలకు రెడ్ అలర్ట్.. మరో మూడు రోజులు ఉమ్మడి జిల్లాలో చెదురు మదురు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. జగిత్యాలకు భారీ వర్ష సూచన ఉందని రెడ్ అలర్ట్ జారీ చేయగా, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ప్రజలు అవసరముంటే తప్ప బయటికి వెళ్లొద్దని స్పష్టంచేశారు. కరీంనగర్ జిల్లాలో కుండపోత కురిసింది. వేకువజాము నుంచే అతి భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపారగా కుంటలు, చెరువులు అలుగు పారుతున్నాయి. ఉదయం 11 గంటల వరకు అప్రకటిత కర్ఫ్యూను మరిపించింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తుతుండగా శుక్రవారం ఉదయం 10–11 గంటల మధ్యలో ఎల్ఎండీ గేట్లు ఎత్తనున్నట్లు అధికారులు ప్రకటించారు. జాలరులు, గొర్రెలు, పశువుల కాపరులు అటువైపు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలో అత్యధికంగా తిమ్మాపూర్ లో 17సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా గంగాధరలో అత్యల్పంగా 2.6సెం.మీల వర్షపాతం నమోదైంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో కెపాసిటీ ప్రస్తుతం ఎల్ఎండీ 58,611 24 టీఎంసీ 16.6 టీఎంసీ ఎంఎండీ 57,564 27.5 టీఎంసీ 21.3 టీఎంసీ ఎల్లంపల్లి 5,30,424 20 టీఎంసీ 14.5 టీఎంసీ -
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు
● కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ● కరీంనగర్లో 15 మందికి ఎలక్ట్రిక్ ఆటోల అందజేత కరీంనగర్టౌన్: మహిళలు ఏ రంగంలోనూ తక్కువ కాదని, అవకాశమిస్తే అన్ని రంగాల్లోనూ రాణిస్తారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని కోర్టు చౌరస్తా వద్ద బుధవారం 15మంది నిరుపేద మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలను ఉచితంగా పంపిణీ చేశారు. ఒక్కో ఆటో విలువ రూ.3.5 లక్షలు ఉంటుందని, అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీతో తయారు చేశారన్నారు. కార్పొరేట్ రెస్పాన్స్ బిలిటీ ఫండ్ (సీఆర్ఎఫ్) నిధులతో ఈ ఆటోలను కొనుగోలు చేశామని తెలిపారు. 15 మంది మహిళల్లో 10 మందికిపైగా పీజీ, బీటెక్ విద్యను పూర్తి చేసిన వారు ఉన్నారని అన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో 15 మందికి 2నెలలపాటు ఉచితంగా శిక్షణ ఇవ్వగా.. డ్రైవింగ్ లైసెన్సులు అందించిన అనంతరం ఆటోలు పంపిణీ చేశామన్నారు. ఏ ఇంట్లోనైతే మహిళలకు ఇంటి తాళంచెవి అప్పగిస్తారో ఆ ఇల్లు బాగుపడుతుందన్నారు. కరీంనగర్ జిల్లా పరిపాలనా బాధ్యతలను మహిళ చేతిలో పెట్టామని, వినూత్న ఆలోచనలతో ప్రజలకు ఉపయోగపడే పనులెన్నో చేస్తున్నారని అన్నారు. అనంతరం బండి సంజయ్, సునీల్రావు ఆటోలో ప్రయాణించారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్ పాల్గొన్నారు. -
విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలి
● టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి కొత్తపల్లి(కరీంనగర్): భారీ వర్షాలు, వినాయక మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకోకుండా, విద్యుత్ సమస్యలు రాకుండా అప్రమత్తంగా ఉండాలని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి సూచించారు. విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది సెలవుపై వెళ్లకూడదని ఆదేశించారు. కరీంనగర్ సర్కిల్ కార్యాలయంలో గురువారం లోడ్ మానటరింగ్ సెల్ (కంట్రోల్ రూం)ను పరిశీలించారు. కురుస్తున్న వర్షాలతో విద్యుత్ సరఫరా, సబ్ స్టేషన్ల పనితీరు, స్తంభాలు, లైన్ల పనితీరు, స్థితిగతులను తనిఖీ చేశారు. ఎస్ఈ చాంబర్లో మాట్లాడుతూ వినాయక మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు వివరించాలన్నారు. వర్షాల విద్యుత్ వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సబ్స్టేషన్లు, డీటీఆర్లు, విద్యుత్ లైన్లు, స్తంభాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఎస్ఈ రమేశ్ బాబు, డీఈలు రాజం, పి.చంద్రమౌళి, ఎం.తిరుపతి, ఎస్ఏవో రాజేంద్రప్రసాద్, ఏడీలు పి.శ్రీనివాస్గౌడ్, లావణ్య, జి.శ్రీనివాస్, లావణ్య, ఎన్.అంజయ్య, జి.రఘు పాల్గొన్నారు. -
కరీంనగర్
బుధవారం శ్రీ 27 శ్రీ ఆగస్టు శ్రీ 2025మండపానికి తరలుతున్న గోదాంగడ్డ ప్రాంతం వినాయకుడుకరీంనగర్ టవర్ సర్కిల్ ఏరియాలో పండుగ రద్దీరావయ్యా.. పార్వతి తనయాలోక నాయకుడు.. తొలి పూజలందుకునే గణనాథుడి నవరాత్రుల వేడుకకు అంతా సిద్ధమైంది. భాద్రపదమాసం శుక్ల చతుర్థి రోజు నుంచి తొమ్మిది రోజులు లంబోదరుడు పూజలందుకోనున్నాడు. వినాయక చవితి వచ్చిందంటే పల్లె, పట్టణాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. వీధివీధిలో మండపాలు భక్తులతో కళకళలాడుతుంటాయి. తొమ్మిదిరోజుల పాటు నిత్య పూజలు, భజనలు, కుంకుమపూజలు, అన్నదానం కార్యక్రమాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్నాయి. నేటి వినాయక చవితికి జిల్లా ముస్తాబైంది. వాడవాడన గణపతుల ప్రతిష్టకు మండపాలు అలంకరించబడ్డాయి. చవితి పూజలు చేసేందుకు అవసరమైన సామగ్రి కొనుగోలుదారులతో మంగళవారం కరీంనగర్లోని టవర్ సర్కిల్, మార్కెట్ వీధులు కిటకిటలాడాయి. పూజలో ప్రధానమైన పూలు, వినాయక ప్రతిమలు రెట్టంపు ధరలు పలికాయి. చిన్న ప్రతిమను కూడా రూ.150 నుంచి రూ.300 వరకు విక్రయించారు. వినాయకునికి సమర్పించే పత్రి, వెలక్కాయ, జాపత్రి, ఏకబిల్వం, అరటి పండ్లు, మొక్కజొన్న కంకులు, బంతిపూలు మార్కెట్ను ముంచెత్తాయి. బతిపూలు కిలో రూ.150 వరకు విక్రయించారు. నగరంలోని గంజ్, టవర్ సర్కిల్, శాసీ్త్రరోడ్, బోయవాడ రావిచెట్టు, గాంధీరోడ్, కోతి రాంపూర్, మంకమ్మతోట తదితర ప్రాంతాల్లో అద్భుతమైన సెట్టింగులతో మండపాలు ముస్తాబయ్యాయి. – కరీంనగర్ కల్చరల్/విద్యానగర్(కరీంనగర్) -
కాపీ రాయుళ్లా.. మజాకా?
సాక్షిప్రతినిధి,కరీంనగర్: శాతవాహన వర్సిటీ పరిధిలో జరుగుతున్న న్యాయపరీక్షల్లో పట్టుబడుడుతున్న కాపీరాయుళ్ల వ్యవహారం కలకలం రేపుతోంది. ఇటీవల డిగ్రీ పరీక్షల్లో డిబార్ అయిన ఓ విద్యార్థికి మద్దతుగా ఉత్తారిదికి చెందిన ఓ సీనియర్ మంత్రి ఫోన్ చేసిన విషయం మరవకముందే.. అదే తరహా ఘటనలు పునరావృతమవుతున్నాయి. యథేచ్ఛగా చిట్టీలు పెట్టి రాస్తూ.. వర్సిటీ సిబ్బంది పట్టుకుంటే వెంటనే వారిపై ఒత్తిళ్లు తెస్తూ.. బెదిరిస్తున్నారు. వినకపోతే ఆఖరి అస్త్రంగా రాజకీయ నాయకులను రంగంలోకి దించుతున్నారు. వర్సిటీలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా ఉండటం చర్చానీయాంశంగా మారింది. ఓ ‘లా’ విద్యార్థి ఈనెల 18న కాపీ కొడుతూ వర్సిటీలో దొరికిపోయాడు. వదిలేయాలని కోరాడు. సిబ్బంది వినలేదు. దీంతో పలువురు రాజకీయ నాయకులతో ఫోన్ల మీద ఫోన్లు చేయించడం ప్రారంభించాడు. అప్పటికే అతన్ని డిబార్ చేసిన అధికారులు తామేం చేయలేమని చేతులెత్తేశారు. మరో ఘటనలో నగరానికి చెంది ఓ పార్టీ నాయకుడు నామినేటెడ్ పోస్టులో కొనసాగుతున్నాడు. అతను కూడా లా పరీక్షలో కాపీ కొడుతూ దొరికిపోయాడు. ఈయన సైతం సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. కాపీ కొడుతూ దొరికిన సంగతి మరిచి, తనను వదిలేయాలంటూ వాదించసాగాడు. యూనివర్సిటీ సిబ్బంది అవేమీ పట్టించుకోకుండా అతన్ని డిబార్ చేసేశారు. ఒక్క పరీక్షలో దొరికి డీబార్ అయినా నిబంధనల ప్రకారం.. మొత్తం సెమిస్టర్ పరీక్షలన్నీ వచ్చే ఏడాది రాసుకోవాలి. ఉదాహరణకు ఒక సెమిస్టర్లో ఐదు పేపర్లు ఉన్నాయనుకుంటే.. అందులో ఆఖరు పేపరు రోజు కాపీ కొట్టి దొరికితే.. మొత్తం పరీక్షల్లో డిబార్గా ప్రకటిస్తారు. దీంతో మొత్తం పేపర్లు మరో ఏడాది వరకు రాసుకోవాలి. వారం దాటినా ఆగని ఫోన్లు వాస్తవానికి ఆ ఒత్తిళ్ల వ్యవహారం ఆ ఒక్కరోజుతో ముగిసిపోలేదు. సదరు అధికారులకు వారం రోజులైనా ఫోన్ల తాకిడి ఆగలేదు. ‘మా వాడిని కొంచెం చూడండి.. డిబార్ రద్దు చేయండి’ అంటూ ఒత్తిళ్లు తెస్తున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి, సెలవు దినం అన్న తేడా లేకుండా ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. వాస్తవానికి నిబంధనల ప్రకారం.. ఒకసారి డిబార్ చేసిన తరువాత దాన్ని ఎత్తేయడం అంటూ ఉండదు. ఇదే విషయాన్ని ఫోన్ చేసే వారికి వివరించినా అర్థం కావడం లేదంటూ వర్సిటీ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు వీరి వ్యవహారం తెలిసి కొన్ని విద్యార్థి సంఘాలు కూడా వర్సిటీ సిబ్బందికి ఫోన్లు చేయడం ప్రారంభించాయి. డీబార్ ఎత్తివేస్తే ఊరుకునేది లేదని, వర్సిటీ ఎదుటే ఆందోళనకు దిగుతామంటూ స్పష్టంచేశాయి. దీంతో సిబ్బంది ఇటు కాపీ రాయుళ్లు, అటు విద్యార్థి సంఘాల మధ్య నలిగిపోతున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఇంటలిజెన్స్ దృష్టికి కూడా వెళ్లింది. దీంతో వారు రంగంలోకి దిగి.. అసలేం జరిగిందో తెలుసుకుని, ప్రభుత్వానికి నివేదిక పంపారు. వాస్తవానికి వర్సిటీలో ఈ ఘటన ఈనెల 18న జరిగింది. చాలా సాధారణ విషయం. కొందరు దీన్ని పెద్దదిగా చేసి చూపిస్తున్నారు. సహజంగానే ఈ రోజుల్లో న్యాయపరీక్షలకు ఉన్నత స్థాయి ఉద్యోగులు, రాజకీయ నాయకులు, ప్ర భుత్వ ఉద్యోగులు, పోలీసులు, డాక్టర్లు, రెవె న్యూ తదితరులు హాజరవుతున్నారు. పరీక్షల్లో కొందరు కాపీ కొడుతూ దొరకడం, వారికి మద్దతుగా రాజకీయ నాయకులు, వీఐపీలు ఫోన్లు చేయడం మాకు షరా మామూలే. – సురేశ్, కంట్రోలర్, ఎస్యూ -
సేవా దృక్పథంతో వైద్యం అందించాలి
కరీంనగర్టౌన్: ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు సేవా దృక్పథంతో పని చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులకు ‘క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, పీఎన్డీటీ చట్టం’పై వర్క్షాప్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రులు నిబంధనలు పాటించాలని అన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. 10మంది కన్నా ఎక్కువ ఉద్యోగులుంటే ఐసీసీ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేటు అంబులెన్స్లను వారి ఆస్పత్రుల్లోనే నిలుపుకోవాలని, ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద నిలిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిజేరియన్ కాన్పుల్లో కరీంనగర్ ముందుండడం బాధాకరమైన విషయమని, సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీలకు ప్రయత్నించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీఎంహెచ్వో వెంకటరమణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ధి
వేములవాడ: ఆగమశాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేపడుతామని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గుడి ఓపెన్స్లాబ్లో మంగళవారం రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆర్కిటెక్చర్ (వాస్తు శిల్పి) సూర్యనారాయణ మూర్తి వివరించారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో భక్తుల రద్దీ అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. మహాశివరాత్రి, సమ్మక్క సారలమ్మ జాతర సమయాల్లో పార్కింగ్ సమస్య రాకుండా జగిత్యాల వైపు 20 ఎకరాలు గుర్తించినట్లు తెలిపారు. 4.6 ఎకరాల్లో ఆలయ విస్తరణ, 33 ఎకరాల వరకు మాస్టర్ప్లాన్ డెవలప్మెంట్ ఏరియా ఉంటుందని తెలిపారు. ఆలయ అభివృద్ధికి రూ.110కోట్లకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు. రెండో విడతగా రూ.285కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు.ఆలయ విస్తరణ పనులు జరిగే సమయంలో భీమేశ్వర ఆలయంలో దర్శనం ఉండేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి మరో 36 గుంటల సేకరణకు చర్యలు చేపడతామన్నారు. దేవాదాయశాఖ కమిషనర్ వెంకటరావు, దేవాదాయశాఖ సలహాదారు గోవింద్హరి, ఆలయ ఈవో రాధాబాయి పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న ఆలయ విస్తరణపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ -
రేషన్ డీలర్ల కమీషన్ ఇప్పించండి
కరీంనగర్ అర్బన్: ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకంగా పనిచేసే రేషన్ డీలర్లు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, 5 నెలలుగా కమీషన్ లేక నానాపాట్లు పడుతున్నామని తెలంగాణ రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్బాబు వాపోయారు. మంగళవారం నగరంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. కేంద్ర కమీషన్ వేరు రాష్ట్ర కమీషన్ వేరంటూ డీలర్లకు కమీషన్ విడుదల చేయడం లేదని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కమీషన్ రాలేదని వివరించారు. కేంద్ర ప్రభుత్వం డీలర్లకు చెల్లిస్తున్న క్వింటాకు రూ.90 కమీషన్కు తోడుగా కనీస గౌరవ వేతనాన్ని కూడా ప్రకటించే విధంగా చూడాలని కోరారు. తెలంగాణ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షులు రొడ్డ శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డిమల్ల హన్మాండ్లు, కరీంనగర్ కార్యవర్గం గాలి గట్టయ్య, ఎ.రవీందర్, రుద్రవేణి కనుకయ్య, విజయ్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి సంజయ్కి డీలర్ల వినతి -
ఉరివేసుకుని విద్యార్థిని మృతి
గోదావరిఖని: స్థానిక అశోక్నగర్ చెందిన కాంపెల్లి అక్షర (17) మంగళవారం రాత్రి ఉరివేసుకొని మృతి చెందింది. ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఫ్యాన్కు ఉరేసుకోగా గమనించిన కుటుంబసభ్యులు అక్షరను ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మృతికి గల కారణాలు తెలియాల్సిఉంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. భార్య కాపురానికి రావడంలేదని యువకుడి ఆత్మహత్యతంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని పద్మనగర్కు చెందిన వేముల కరుణాకర్(35) మంగళవారం ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు. కరుణాకర్ భార్య పద్మ నాలుగేళ్లుగా దూరంగా ఉంటోంది. భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో కరుణాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి కొడుకు, కూతురు ఉన్నారు. తంగళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైతులకు ఆధునిక టెక్నాలజీ
జగిత్యాలఅగ్రికల్చర్: రైతులకు ఆధునాతన టెక్నాలజీని పరిచయం చేయడంతోపాటు మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా కేంద్ర ప్రభుత్వం నమోడ్రోన్ దీదీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద మహిళాసంఘాలకు ఎరువులు, రసాయనాలు పిచికారీ చేసే డ్రోన్లను సబ్సిడీపై సరఫరా చేయనుంది. రానున్న రోజుల్లో కూలీల సమస్యతో వ్యవసాయ రంగంలో డ్రోన్ల వాడకం పెరగనుండటంతో.. డ్రోన్లను అద్దెకిచ్చి మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని మహిళాసంఘాల నుంచి దరఖాస్తులు స్వీకరించి.. అర్హులైన సంఘాలను ఎంపిక చేయాలని బ్యాంకర్లకు ఆదేశాలు అందాయి. వ్యవసాయంలో ఆధునికత కోసం వ్యవసాయ రంగంలో పెరుగుతున్న సాగు ఖర్చులు, కూలీల సమస్యతో రైతులకు పెద్దగా గిట్టుబాటు కావడం లేదు. ఇటీవల పంటలపై పురుగులు, తెగుళ్ల బెడద పెరుగుతుండటంతో ప్రతి రైతు క్రిమిసంహారక, రసాయన మందులు పిచికారీ చేయాల్సి వస్తోంది. అయితే మందులు పిచికారీ చేసేందుకు కూలీలు దొరికే పరిస్థితి లేదు. సన్న, చిన్నకారు రైతుల సంఖ్యే ఎక్కువగా ఉండటం.. ఆర్థిక సమస్యలతో ఆధునిక పరికరాల వాడకం పెద్ద సమస్యగా మారింది. లక్షలు విలువ చేసే పరికరాలను కొనుగోలు చేయలేని రైతులకు అండదండగా ఉండేందుకు మహిళా సంఘాలకు డ్రోన్లు అందించి వాటిద్వారా రైతులకు అద్దెకు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. దీనివల్ల రైతులు లబ్ధిపొందేలా.. మహిళలు ఆర్థికంగా ఎదిగేలా నమో డ్రోన్ దీదీ పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకం కింద డ్రోన్లను సబ్సిడీపై కొనుగోలు చేసి అద్దెకిస్తే.. నెలకు మహిళా సంఘాల సభ్యులు రూ.లక్ష వరకు సంపాదించే వెసులుబాటు ఉంటుందని బ్యాంకర్లు చెపుతున్నారు. డ్రోన్ కొనుగోలుకు రూ.8లక్షల సబ్సిడీ ఈ పథకం కింద దేశవ్యాప్తంగా రూ.1,261 కోట్లతో 14,500 మహిళా సంఘాలకు ఆధునాతన డ్రోన్లను అందించనున్నారు. ఏ మహిళా గ్రూపు ముందుగా దరఖాస్తు చేసుకుంటుందో.. ఆ సంఘం ఎంపికయ్యే అవకాశం ఉంది. ఎంపిక చేసిన మహిళాసంఘాలకు డ్రోన్ పరికరాలను సబ్సిడీపై అందిస్తారు. డ్రోన్ ఖర్చులో గరిష్టంగా రూ.8లక్షల వరకు (80 శాతం) సబ్సిడీ ఇస్తారు. ఉదాహరణకు.. డ్రోన్ కొనుగోలుకు రూ.10 లక్షలైతే.. అందులో రూ.8లక్షల సబ్సిడీ ఇస్తారు. మరో రూ.రెండులక్షల వరకు బ్యాంకులు రుణ సదుపాయం కల్పిస్తాయి. తీసుకున్న రుణానికి ఏడాదికి కేవలం 3శాతం వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. వ్యవసాయంలో సాగు ఖర్చులు తగ్గించడం.. పంట దిగుబడి పెంచడంలో డ్రోన్ టెక్నాలజీని రైతులు విరివిగా వాడేలా చైతన్యం చేయాలని వ్యవసాయ శాఖ ద్వారా ప్రచారం చేస్తూనే.. డ్రోన్ల కొనుగోలుకు మహిళాసంఘాలు ముందుకొచ్చేలా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా మహిళలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లోకి ఇంకా డ్రోన్లు పెద్దగా రాలేవని, ఇప్పుడే డ్రోన్లు కొనుగోలు చేసి పాగా వేస్తే.. మహిళల ఉపాధికి డోకా ఉండదని అధికారులు భావిస్తున్నారు. డ్రోన్ టెక్నాలజీలో ప్రత్యేక శిక్షణ మహిళాసంఘాల గ్రూపులకు డ్రోన్లను సబ్సిడీపై అందించడమే కాకుండా డ్రోన్ టెక్నాలజీ.. ఉపయోగంపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ దాదాపు 15రోజులు ఉంటుంది. శిక్షణలో వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు పాలుపంచుకుంటారు. డ్రోన్లు ఆధునాతన జీపీఎస్, సెన్సార్ టెక్నాలజీతో రూపొందించబడి ఉంటాయి. ఏ మందును ఎంత ఎత్తులో పిచికారీ చేయాలనే దానిపై కూడా పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయి శిక్షణ ఇస్తారు. పురుగుమందులు పిచికారీ చేయడమే కాకుండా.. పొలంలో కలుపుమొక్కలు ఎక్కడున్నాయి..? నీరు ఎక్కడ లేదు..? వంటి వాటిపై కూడా డ్రోన్ శిక్షణలో మహిళలకు వివరిస్తారు. అలాగే మరమ్మతు, ఫిట్టింగ్ వంటి వాటి కోసం మరో సహాయకుడిని నియమించుకుంటే వారికీ శిక్షణ ఇస్తారు. ఈ పథకంలో డ్రోన్ డిమాండ్ అధికంగా ఉండే మహిళా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళలకు ఆర్థిక స్వావలంబన సబ్సిడీపై ‘నమో డ్రోన్ దీదీ’ జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులు ఈ పథకం కింద ధరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 15వేల డ్రోన్లు ఇవ్వనున్నందున ఎవ్వరు ముందుగా దరఖాస్తు చేసే వారికి ఈ పథకం అందనుంది. అర్హత ఉండి, ఆసక్తి గల మహిళా సంఘాలు సమీపంలోని బ్యాంకులను సంప్రదించవచ్చు. – రాంకుమార్, లీడ్ బ్యాంకు మేనేజర్, జగిత్యాల -
చదువుకుంటేనే భవిష్యత్
మానకొండూర్: చదువుకుంటే భవిష్యత్ బంగారుమయం అవుతుందని, అమ్మానాన్న పడుతున్న కష్టాలను గుర్తుచేసుకుంటూ జీవితంలో స్థిరపడాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ సూచించారు. మానకొండూర్లో మంగళవారం ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు చాలా మంది పేదవాళ్లేనన్నా రు. ప్రధానమంత్రి మోదీ ఆలోచన మేరకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టానన్నారు. తాను పేద కుటుంబం నుంచే వచ్చానని, ఆ రోజుల్లో తాను చదువుకునేందుకు పడ్డ కష్టాలను గుర్తు చేశారు. సైకిళ్లు పంపిణీతో పాఠశాలల్లో డ్రాప్ అవుట్ ఉండదని, హాజరుశాతం పెరుగుతుందన్నారు. సైకిళ్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రానున్న రోజుల్లో 10వ తరగతికి వచ్చే 9,8 తరగతుల పిల్లలకు కూడా సైకిళ్లు అందజేస్తామన్నారు. గన్నేరువరం మండలం చొక్కారావుపల్లె నుంచి మా నేరు మీదుగా ఖాజీపూర్ వరకు రూ.77 కోట్ల నిధులు తెచ్చి త్వరలో వంతెన పనులు చేపడతామని హామీ ఇచ్చారు. రూరల్ ఏసీపీ విజయ్కుమార్, డీఈవో చైతన్య జైనీ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, తహసీల్దార్ విజయ్, ఎంపీడీవో వరలక్ష్మి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రాల వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
విఘ్నేశ్వరా.. వచ్చేదెలా.. వెళ్లేదెలా?
అధ్వానంగా కట్టరాంపూర్ మెయిన్ రోడ్డుముకరాంపురలో రోడ్డుపై గుంతలుమారుతీనగర్లో రోడ్డు దుస్థితికరీంనగర్ కార్పొరేషన్: విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని రాకపోకలకు తిప్పలు తప్పడం లేదు. వాడవాడలా కొలువు తీరేందుకు వస్తున్న వినాయకుడి ప్రయాణం నగరంలో సాఫీగా సాగడం లేదు. సగంలో వదిలేసినవి.. అసలే పట్టించుకోనివి, వర్షాలు, వరదతో గుంతలు పడడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా మారి వినా యక మండపాల వారిని కలవర పెడుతున్నాయి. గుంతల్లో ప్రయాణం వినాయక చవితికి ఇప్పటికే నగరవ్యాప్తంగా వేలాది మండపాలు ఏర్పాటు చేశారు. బుధవారం విగ్రహాలు ప్రతిష్టించి పూజలు నిర్వహించనున్నారు. ఇందుకోసం వివిధ ప్రాంతాల నుంచి ప్రతిమలు కొనుగోలు చేసి తీసుకొస్తున్నారు. చాలా చోట్ల రోడ్లపై గుంతలు ఉండడంతో, భారీ విగ్రహాలను మండపాలకు చేర్చేందుకు నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విగ్రహాలను తీసుకొస్తున్న ట్రాక్టర్లు, ఆటోలు గుంతల రోడ్లపై ప్రయాణించడం కష్టంగా మారుతోంది. నగరంలోని కోతిరాంపూర్, కట్టరాంపూర్ మెయిన్రోడ్, అశోక్నగర్ రోడ్, జ్యోతినగర్ రోడ్, మారుతినగర్, హరిహరనగర్, బృందావన్కాలనీ, కిసాన్నగర్, రాంనగర్, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి తదితర ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా మారాయి. చాలా చోట్ల మట్టిరోడ్లు ఉండగా, అవన్నీ గుంతలుగా మారాయి. సొంతంగా పూడ్చుతున్న స్థానికులు ఓ వైపు వినాయకచవితి, మరో వైపు రోడ్లపై గుంతలు దీంతో స్థానికులే రోడ్లపైగుంతలు పూడుస్తున్నారు. కొన్ని డివిజన్లలో మాజీ కార్పొరేటర్లు, వివిధ పార్టీల నాయకులు, మండప నిర్వాహకులు, స్థానికులు సొంత ఖర్చులతో రోడ్లను చదును చేస్తున్నారు. వినాయక నిమజ్జనం నాటికి రోడ్లను చదును చేయడం, డస్ట్పోయడం, ప్యాచ్వర్క్ చేయడానికి నగరపాలక సంస్థ ఇప్పటికే టెండర్లు పిలిచింది. రూ.53 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న 24 పనులకు గాను కేవలం నాలుగింటికే స్పందన రావడంతో, మిగిలిన 20 పనులకు టెండర్ను 29వ తేదీ వరకు పొడిగించింది. -
కపాస్ కిసాన్.. కర్శకుని నిషాన్
కరీంనగర్ అర్బన్: నిలకడలేని పత్తి ధరలతో నష్టపోయే రైతన్నకు ఉపయుక్తమైన యాప్ అందుబాటులోకి వచ్చింది. పత్తి రైతులందరూ 2025–26 సంవత్సరానికి సంబంధించి కనీస మద్దతు ధర పొందేందుకు వీలుగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) దేశంలోనే తొలిసారిగా శ్రీకపాస్ కిసాన్శ్రీ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. పంట పండించే రైతులు తమ పేర్లను సెప్టెంబరు 1నుంచి 30 వరకు యాప్లో నమోదు చేసుకోవాలి. వివరాలు నమోదు చేసుకున్న వారే సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో తమ సరకు విక్రయించుకునే అవకాశం ఉంటుంది. నూతన కార్యక్రమంపై రైతుల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని మార్కెటింగ్ శాఖ సిబ్బందిని సీసీఐ అధికారులు ఆదేశించారు. విక్రయ సమయంలో ఇదే ఆధారం ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పత్తి క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.8,110గా ప్రకటించింది. కనీస ధర పొందాలంటే యాప్లో రిజిస్టర్ అయిన రైతులు పత్తి విక్రయ సమయంలో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ రోజు సీసీఐ కేంద్రంలో వారు విక్రయించాలో వివరాలు తెలుపుతూ యాప్ సమాచారం ఇస్తుంది. ఇలా చేయడం వల్ల రోజుల తరబడి నిరీక్షించాల్సిన బాధ తప్పుతుంది. స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. అక్రమ విక్రయాలకు ముకుతాడు పత్తి విక్రయ సమయంలో ధరల దోబూచూలాడుతూ రైతులను పీల్చిపిప్పి చేయడం వ్యాపారులకే చెల్లు. అంతిమంగా వారు చెప్పిన రేటుకే అమ్మేలా సఫలీకృతులవుతుంటారు. విక్రయాలు పూర్తయ్యాక రైతుల పేరుతో సదరు వ్యాపారులే సీసీఐకి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అసలైన రైతుకు మద్దతు ధక్కకపోగా వ్యాపారులే రెండురకాలుగా లాభాలు గడిస్తున్నారు. కరీంనగర్, జమ్మికుంట, గంగాధర, చొప్పదండి మార్కెట్లతో పాటు జిన్నింగ్ మిల్లుల్లో అక్రమాలు షరామామూలేనన్న ఆరోపణలున్నాయి. యాప్తో సదరు అక్రమాలకు చెక్ పడినట్లేనని విఽశ్లేషకులు భావిస్తున్నారు. పత్తి పంట వేస్తేనే వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. తగ్గుతున్న పత్తి సాగు గతేడాది కంటే ఈఏడాది జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం తగ్గింది. గతంలో 70–90వేల ఎకరాల్లో సాగయ్యేది. చీడపీడలతో పాటు దళారుల దోపిడీతో సాగు విస్తీర్ణం క్రమేణా తగ్గుతోంది. 2020లో 90వేల ఎకరాల్లో పత్తి సాగవగా ప్రస్తుతం 50వేలకు చేరింది. కాగా వచ్చే నెల రెండో వారం నుంచి పంట చేతికొస్తుంది. కొద్ది రోజుల నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఈసారి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. కాగా పత్తి రైతులు ‘కిసాన్ కపాస్’ యాప్ను తమ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని, తర్వాత పేర్లు నమోదు చేసుకోవాలని వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు వివరించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా మద్దతు ధర దక్కేలా చేయడమే ప్రభుత్వ ఉద్దేశం. కార్యక్రమంపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు పేర్కొన్నారు. పత్తి రైతులకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెచ్చిన సీసీఐ అక్రమ విక్రయాలకు ముకుతాడు రైతుల సంఖ్య: 2,18,012 సాగు విస్తీర్ణం: 3.33 లక్షల ఎకరాలు పత్తి సాగుచేసే రైతులు 32,019 పత్తి సాగు విస్తీర్ణం: 50,000 ఎకరాలు దిగుబడి అంచనా: 6 లక్షల క్వింటాళ్లు యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందే తొలుత ‘కపాస్ కిసాన్’ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. సదరు రైతుకు సంబంధించి భూమి రికార్డులు, రెవెన్యూ శాఖ అధికారుల ద్వారా ధ్రువీకరించిన పత్తి పంట రికార్డు, ఆధార్ కార్డు వివరాలు అందులో నమోదు చేయాలి. ఫలితంగా దేశంలో పత్తి రైతులు, పంట విస్తీర్ణం, సాంద్రత తదితర వివరాలన్నీ సీసీఐకి చేరుతాయి. వచ్చే నెలాఖరుకు రైతులు యాప్లో రిజిస్టర్ చేసుకోవాలి. -
జైలు నుంచి విడిపించండి
ప్రవాసీ ప్రజావాణిలో బాధిత కుటుంబాల ఫిర్యాదు జగిత్యాలక్రైం/సిరిసిల్ల: బహ్రెయిన్లో రెండేళ్ల జైలు శిక్ష పడిన ఐదుగురిని విడిపించాలని కోరుతూ.. బాధితుల కుటుంబ సభ్యులు మంగళవారం హైదరాబాద్లోని సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించారు. తమ కుటుంబ సభ్యులను విడిపించాలని నలుగురి తల్లులు, ఒకరి చెల్లెలు సహాయం కోసం ప్రజావాణిని ఆశ్రయించారు. సీఎంకు వినతిపత్రం సమర్పించారు. గడువు తీరిన ఆహార ఉత్పత్తుల తేదీలను ఫోర్జరీ చేసి మార్చడం.. నిల్వ పదార్థాల మార్కెటింగ్ చేసిన కేసులో అక్కడి న్యాయస్థానం ముగ్గురికి మూడేళ్లు, 19మందికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. నిజామాబాద్కు చెందిన నకిడి లింబాద్రి (డిచ్పల్లి), కర్రోల్ల లక్ష్మీనర్సింహ (మల్లారం), తిమ్మజడ సంతోష్ (తిర్మన్పల్లి), జగిత్యాలకు చెందిన గోవిందు రాకేశ్ (రత్నాపూర్), రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బంటుబాబు (కొండాపూర్)కు చెందిన ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. వీరిని విడిపించాలని ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్, అంబాసిడర్ వినోద్కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, గల్ఫ్ కుటుంబాలను సీఎం ప్రజావాణి నోడల్ అధికారి దివ్య దేవరాజన్ వద్దకు తీసుకెళ్లి వివరించారు. సీఎంవోలో కీలక అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి దృష్టికి తీసుకెళ్లారు. -
పొద్దుపొద్దున్నే గోదాంల వద్దకు..
శంకరపట్నం/ఇల్లందకుంట/జమ్మికుంట/రామడుగు: జిల్లాలో యూరియా కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. శంకరపట్నం మండలం రాజాపూర్, తాడికల్ సహకార సంఘాలకు సోమవారం రాత్రి 340 బస్తాల చొప్పున రెండు లారీల యూరియా వచ్చింది. మంగళవారం వేకువజామున్నే రైతులు బారులు తీరారు. మహిళలు సైతం ఇంటిపనులు వదలిపెట్టి క్యూలో ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కబస్తా చొప్పున పంపిణీ చేశారు. యూరియా అందని రైతులు ఆందోళన చేస్తూ ఇంటిముఖం పట్టారు. ఇల్లందకుంట సహకార సంఘానికి 450 బస్తాలు రాగా.. పోలీసు పహారాలో ఒక్కో రైతుకు ఒక్కో బస్తా అందించారు. రామడుగు, కొక్కెరకుంట సొసైటీల వద్ద మంగళవారం ఉదయం నుంచే రైతులు బారులు తీరారు. జమ్మికుంట పీఏసీఎస్కు 340 బస్తాలు రాగా.. ముందస్తుగా పేర్లు నమోదు చేసుకున్న రైతులకు రెండు బస్తాల చొప్పున 170 మందికి యూరియా అందజేశారు. -
లీగల్ సర్వీసెస్ క్లినిక్ ప్రారంభం
కరీంనగర్క్రైం: జిల్లా కేంద్రంలోని సైనిక్భవన్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లీగల్ సర్వీసెస్ క్లినిక్ను మంగళవారం రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్సింగ్ హైకోర్టు నుంచి వర్చువల్గా ప్రారంభించారు. కరీంనగర్ మొదటి అదనపు జిల్లా జడ్జి డి. వెంకటేశ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.వెంకటేశ్ పాల్గొన్నారు. త్రివిధదళాలల్లో పనిచేస్తున్న, పనిచేసిన వారి కుటుంబాలకు ఉచిత న్యాయసాయం అందించేందుకు ఈ క్లినిక్లు ఏర్పాటు చేశారన్నారు. న్యాయవాది ఎస్వీఆర్ కృష్ణ, పారా లీగల్ వలంటీర్ సదానందం సేవలందించనున్నారు. ఏపీపీ గౌరు రాజిరెడ్డి, సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ కెప్టెన్ శ్రీనివాసులు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేశ్ పాల్గొన్నారు. ‘సమాధానం చెప్పలేకే తప్పుడు ప్రచారం’కరీంనగర్కార్పొరేషన్: పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో మాట్లాడుతూ.. తప్పుడు ప్రచారం చేయడం, పక్క దారి పట్టించడం బండి సంజయ్కి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా ఆటుపోట్లను ఎదుర్కొని పీసీసీ అధ్యక్షుడైన బీసీ నాయకుడు మహేశ్గౌడ్పై అనుచిత వ్యాఖ్యలు చేయ డం బండికి తగదన్నారు. రామచంద్రాపూర్కా లనీలో ఎవరూ నివాసం లేని రేకులషెడ్డు ఇంటినంబర్పై 40 ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఎండీ.తాజ్, జీడీ రమేశ్, తిరుపతి, గుండాటి శ్రీనివాస్రెడ్డి, అస్తాపురం రమేష్ పాల్గొన్నారు. పూర్తయిన ఉపాధ్యాయుల ప్రమోషన్ల ప్రక్రియకరీంనగర్: జిల్లాలో టీచర్ల పదోన్నతుల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. 64 మంది స్కూల్ అసిస్టెంట్లు గ్రేడ్–2 హెచ్ఎంలుగా ప్రమోషన్లు పొందారు. 157 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లుగా, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలుగా పదోన్నతి పొందారు. వీరంతా ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాల నుంచి రిలీవ్ అయి 15రోజుల్లోగా ప్రమోషన్ పొందిన పాఠశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ, జెడ్పీ విభాగంలో పనిచేస్తున్న 57మంది ప్రమోషన్లు పొందేందుకు ఖాళీలు ఉన్న రోస్టర్ విధానం అడ్డంకులు, తగిన అర్హతలు లేకపోవడంతో ఆ పోస్టులు మిగిలిపోయాయి. గ్రేడ్–2 హెచ్ఎంలుగా ప్రమోషన్లు పొందిన 64 మందిలో మంగళవారం సాయంత్రం వరకు 54మంది ఆయా పాఠశాలల్లో రిపోర్టు చేసినట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. క్వింటాల్ పత్తి రూ. 7,650జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లో మంగళవారం క్వింటాల్ పత్తి రూ. 7,650 పలికింది. క్రయవిక్రయాలను ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజ పర్యవేక్షించారు. -
ఎదురెదురుగా ఢీకొన్న కార్లు
మల్యాల: మండలంలోని ముత్యంపేట శివారు దిగువ కొండగట్టు వద్ద జగిత్యాల–కరీంనగర్ రహదారిపై మంగళవారం రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో రెండుకార్లలో ఉన్న నలుగురు గాయపడ్డారు. కొండగట్టుకు చెందిన రంగు నర్సింహులు, విజయ హైదరాబాద్ నుంచి కొండగట్టుకు వస్తున్నారు. జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ భర్త అడువాల లక్ష్మణ్ కరీంనగర్ వైపు వెళ్తున్నాడు. దిగువ కొండగట్టు వద్ద రెండు కార్లు ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నాయి. కార్ల ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. కార్ల బెలూన్లు తెరుచుకోవడంతో నర్సింహులు, విజయ, అడువాల లక్ష్మణ్, మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు. ట్రాఫిక్ అంతరాయం కలగడంతో ఎస్సై నరేశ్కుమార్, కానిస్టేబుల్ మధుసూదన్ రెడ్డి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. బాధితులను 108లో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. నర్సింహులు అతివేగంగా, అజాగ్రత్తగా కారు నడిపి లక్ష్మణ్ కారును ఢీకొన్నారని, లక్ష్మణ్ బావమరిది మిట్టపల్లి సాయిప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నరేశ్ కుమార్ తెలిపారు. -
పార్టీ పాత కార్యకర్తలను
సాక్షిప్రతినిధి,కరీంనగర్/గంగాధర: ‘పదేళ్లు కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసాం. ప్రజల కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేశాం. పార్టీ కోసం కేసులు భరించాం. తీరా ఇప్పుడు ఇతర పార్టీల నుంచి నేతలు వలస రాగానే.. మాకు ప్రాధాన్యం తగ్గుతోంది. దయచేసి దశాబ్దకాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసిన కష్టాలు, కేసులు, పడ్డ అవమానాలను దృష్టిలో ఉంచుకుని పాత కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలి’ అని కాంగ్రెస్ నాయకులు ముక్తకంఠంతో అన్నారు. సోమవారం గంగాధర మండలంలోని ఎల్కే గార్డెన్స్లో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు తమ మనసులోని భావాలను, ఆవేదనను టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్కు వెల్లబోసుకున్నారు. డిమాండ్లు.. విన్నపాలు.. హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్బాబు మాట్లాడుతూ.. జనహిత యాత్ర విజయవంతమైంది. సంక్షేమ పథకాలు అందిన లబ్ధిదారుల జాబితా తీసుకుని వారిని కలవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వెంటనే కార్యకర్తలకు పదవులిస్తే రాబోయే ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేస్తారని పేర్కొన్నారు. కోరుట్ల ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ.. కార్యకర్తలు నామినేట్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ప్రొటోకాల్ సమస్య రాకుండా చేయాలని కోరారు. కేకే మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. సిరిసిల్లలో ఒక్కో కార్యకర్తపై 40 నుంచి 50 కేసులు నమోదయ్యాయని, వీలైనంత త్వరగా వాటిని ఎత్తేయాలని కోరారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. కష్టకాలంలో పార్టీ జెండా మోసినవారిని కడుపులో పెట్టుకోవాలని, అవకాశమిస్తే కరీంనగర్లో కూడా సత్తా చూపిస్తామని అన్నారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. యూరియా విషయంలో బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మాట్లాడుతూ.. మా పార్టీ నేతలు అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండేందుకు పాదయాత్రలు చేస్తాం. బీజేపీని బొందపెడతాం. రాహుల్ని ప్రధాని చేసే లక్ష్యంతో పనిచేస్తామని వెల్లడించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఎస్సీల వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కృషి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. పార్టీని అధికారంలోకి తెచ్చిన కార్యకర్తలకు పదవుల్లో పెద్దపీట వేయాలని మాజీ మంత్రి జీవన్రెడ్డి కోరారు. అనంతరం రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ..80 శాతం పదవులు పాత కార్యకర్తలకే ఇస్తామని, కొత్తవారు తమను తాము నిరూపించుకోవాలని సూచించారు. అలాగే కొత్తపల్లిలోని వెలిచాల ప్రజాభవన్లో సరల్జగ్ ట్రస్టు కార్యాలయాన్ని ప్రారంభించారు. వసతి గృహంలో శ్రమదానం మండల కేంద్రంలోని బాలుర వసతి గృహంలో గంటన్నర సేపు మీనాక్షి నటరాజన్ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. హాస్టల్ ఆవరణలో మట్టి పోయడంతో పాటు, మొక్కలు నాటారు. గోడలకు రంగులు వేసి, బాత్రూంలు శుభ్రం చేశారు. పాటలతో నాయకులు, కార్యకర్తలను ఉల్లాసపరిచారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, స్థానిక నాయకులు పాల్గొన్నారు.