Karimnagar District Latest News
-
నైపుణ్యంతోనే ఉద్యోగావకాశాలు
పెద్దపల్లి: నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. పెద్దపల్లిలోని వెంకటపద్మ ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగిన మెగా జాబ్మేళాలో మంత్రి మాట్లాడారు. 77 కంపెనీల్లో 4,000 ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహించగా.. 4,156 మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. అందులో 1,500 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేమని అన్నారు. టాస్క్ సెంటర్లో శిక్షణ పొందిన వారిలో 261 మందికి ఉపాధి కల్పించామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని వివరించారు. త్వరలోనే డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ప్లాట్ఫామ్, ఫినిషింగ్ స్కిల్ పాఠశాల ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రతీఒక్కరు ఏఐ సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకోవాలని, డాటా సైన్స్ నైపుణ్యం కలిగి ఉండాలని కోరారు. ప్రభుత్వ విప్ విజరమణారావు మాట్లాడుతూ, ఉత్పత్తుల బ్రాండింగ్ కేంద్రంగా పెద్దపల్లి నిలవాలన్నారు. రెండేళ్లక్రితం పెద్దపల్లిలో టాస్క్ సెంటర్ ఏర్పాటు చేశామని, ఇందులో శిక్షణ పొందిన 261 మంది ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీల్లో అధిక వేతనాలతో ఉద్యోగాలు సాధించారని చెప్పారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ వైఖరితోనే నిరుద్యోగ సమస్య పెరిగి, యువకులు కొందరు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ ఖాళీలు భర్తీ చేయడంతోపాటు ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ, మంచిర్యాలలో మెగా జాబ్ మేళా నిర్వహించాలని మంత్రి శ్రీధర్బాబును కోరారు. జాబ్ మేళాకు భారీ స్పందన మెటీ జాబ్ మేళాకు స్పందన లభించిందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా పరిశ్రమల శాఖ, టాస్క్ సహకారంతో చేపట్టిన మేళాకు 77 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారని వివరించారు. అగ్నివీర్, పోలీస్ ఉద్యోగాల ఎంపిక కోసం ఆసక్తిగల నిరుద్యోగ యువతకు జిల్లాలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాలు సాధించిన వారితో మంత్రి శ్రీధర్బాబు, విప్ విజయరమణారావు, ఎంపీ వంశీకృష్ణఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న కంపెనీల ప్రతినిధులు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మెగాజాబ్ మేళాకు విశేష స్పందన -
● జన సమీకరణకు 4 రోజులుగా కరీంనగర్లో మకాం వేసిన కేంద్ర మంత్రి ● పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల సమావేశాలతో బిజీబిజీ
కరీంనగర్: ఈనెల 10న సికింద్రాబాద్లోని పరేడ్ మైదానంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభను భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చుట్టుపక్కల జిల్లాల నుంచి భారీఎత్తున జనాన్ని సమీకరించే పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో జన సమీకరణ చేయడంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. 4 రోజులుగా కరీంనగర్లోనే మకాం వేసి ఇతర కార్యక్రమాలను పక్కనపెట్టి పార్టీ నేతలతో జన సమీకరణపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం కరీంనగర్లో గ్రామాలవారీగా వార్డు సభ్యులు, ఉప సర్పంచులు, సర్పంచులు, కౌన్సిలర్లు. మాజీ ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. మరోవైపు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, కంటెస్టెట్ కార్పొరేటర్లతోనూ మీటింగ్లు నిర్వహించారు. జిల్లాలవారీగా మండలాల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులతోనూ భేటీ అయ్యారు. గ్రామాలు, మండలాలు, మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్లవారీగా జన సమీకరణ లక్ష్యాన్ని నిర్దేశించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఏకంగా వెయ్యి కార్లు, 250 బస్సులను ఏర్పాటు చేసి వేలాది మందిని సభకు తరలించాలని నిర్ణయించారు. నేటి నుంచి సికింద్రాబాద్లో మకాం బండి సంజయ్కుమార్ గురువారం నుంచి సికింద్రాబాద్లోనే మకాం వేయనున్నారు. పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభకు సిటీ నుంచే భారీఎత్తున జనాన్ని సమీకరించడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు ముషీరాబాద్ అసెంబ్లీ నేతలతో బర్కత్పురాలోని సిటీ కార్యాలయంలో భేటీ కానున్నారు. -
బీఆర్క్, బీబీప్లానింగ్లో ‘అల్ఫోర్స్’ విద్యార్థుల ప్రతిభ
కొత్తపల్లి(కరీంనగర్): ఐఐటీ–జెఈఈ (మెయిన్) బీఆర్క్, బీప్లానింగ్–2026 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యా సంస్థల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ డా.వి.నరేందర్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని అల్ఫోర్స్ టూనీటాట్స్లో బుధవారం ఏర్పాటు చేసిన అభినందన సమావేశంలో విద్యార్థులను సత్కరించారు. బీఆర్క్లో ఎస్.శ్రీహిత 174వ ర్యాంకుతో అత్యున్నత స్థానంలో నిలవగా, పటేల్ అక్షయ 189వ ర్యాంకు, డి.తనుశ్రీ 227, వి.రితిక 287, ఎస్.ఆధ్య 319, టి.వెంకట నిహిత్ 903, సి.హెచ్.భీమ 1107, ఆర్.నేహగాయత్రి 1719, పి.శ్రీనిధి 1776, పి.హర్షిణి 2325, ఉమైరా సన్నున్ 2626, పి.అక్షయప్రియ 2786వ ర్యాంకు సాధించిందన్నారు. బీప్లానింగ్లో వి.ప్రణతి 858వ ర్యాంకు, పి.క్రిష 1281, ఎమ్.వివేక్ రెడ్డి 1554, ఎమ్.షాలిని 1757, రహీన్ ఉమేద 2448, జి.మహాలక్ష్మి 3053, పి.ఆదిత్యలక్ష్మి 3122వ ర్యాంకు సాధించారన్నారు. రాబోయే ఐఐటీ (అడ్వాన్) పరీక్ష రాసేందుకు ఎంపికై న విద్యార్థులకు అధ్యాపక బృందంతో కోచింగ్ ఇస్తున్నామని తెలిపారు. ఐఐటీ, నీట్, ఈఏపీసెట్ పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులతో ప్రతిష్టాత్మక కళాశాలల్లో అడ్మిషన్లు పొందుతున్నట్లు పేర్కొన్నారు. -
యూరియా ఎటెళ్లినట్టు..?
యూరియా వాడకంపై కేంద్ర ప్రభుత్వం సునిశిత పరిశీలనకు ఆదేశించింది. గత యాసంగి కన్న ఈసారి యూరియా వాడకం విపరీతంగా పెరిగింది. ఈక్రమంలో క్షేత్రస్థాయి పరిశీలన చేసి తదనుగుణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో జిల్లా వ్యవసాయ శాఖను అలర్ట్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా.. ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. అయితే యాప్ ద్వారా యూరియా కొనుగోళ్లు జరిగినా.. హోల్సేల్ దగ్గరి నుంచే పక్కదారి పట్టిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు తమ చెప్పుచేతల్లో ఉంటారన్న హోల్సేల్ డీలర్ల అత్యుత్సాహంతో ఇష్టారీతిగా యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించారన్న ఆరోపణలున్నాయి. మిల్క్ డెయిరీల్లోనూ కుప్పలు తెప్పలుగా వినియోగించారని తెలుస్తోంది.కరీంనగర్ అర్బన్: అవసరానికి మించి యూరియా వాడకమనేది పోషకాల అసమతుల్యతకు దారి తీయడమే కాకుండా నేల ఆరోగ్యం దెబ్బతింటుంది. దీర్ఘకాలంలో వ్యవసాయ రంగానికి ప్రతికూలమే. సదరు కారణంతో మండలస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పలు జాగ్రత్తలు చేపట్టాలని సూచించింది. తరచూ ఎరువు కొనుగోలు చేస్తున్నవారి వివరాలు పరిశీలించడం.. ఏ డీలర్ల నుంచి కొనుగోలు చేశారు.. ఏ పంటలకు వాడారు.. సాగేతర వాటికి తరలించారా అనే అంశాలను పరిశీలించనున్నారు. రైతు యూరియాపైనే అక్రమార్కుల కన్ను రైతులకు రాయితీపై ఇచ్చే యూరియా కిలో రూ.6కే లభిస్తోంది. వ్యవసాయేతర రంగాలు యూరియా వినియోగించాలంటే టెక్నికల్ గ్రేడ్ యూరియా వాడాల్సి ఉంటుంది. అయితే ఇది మార్కెట్లో కిలో రూ.65కు లభిస్తోంది. దీంతో ఇతర రంగాల వ్యాపారులు సబ్సిడీ యూరియాకే మొగ్గు చూపుతున్నారు. అధికారులతో మామూలు బంధాలు నెరుపుతూ పక్కదారి పట్టిస్తుండగా.. మరికొందరు రాజకీయ బలాన్ని చాటుతున్నట్లు తెలుస్తోంది. రాయితీ యూరియాను 15 రకాల పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. యాడ్ బ్లూ యూనిట్లు, పశువుల దాణా తయారీ యూనిట్లు, ప్లయ్వుడ్, మిల్క్ డెయిరీలు మొదలైన వాటిలో యూరియా వాడుతున్నారు. క్లాజు 25, ఫెర్టిలైజర్(కంట్రోలు) ఆర్డర్ 1985 ప్రకారం వ్యవసాయ యూరియా వేరే పరిశ్రమల్లో వాడకం నిషేధం. అలా వాడే ప్రదేశాలను తనిఖీ చేయడం, చర్యలు తీసుకోవడం చేయాలి. అయితే ఎరువుల కేటాయింపు, పంపిణీ అనేది ఫెర్టిలైజర్ మూవ్మెంట్ కంట్రోల్ ఆర్డర్, 1973 ప్రకారం జరుగుతోంది. ఒక జిల్లాకు, ఒక రాష్ట్రానికి కేటాయించిన దాన్ని వేరొక చోటుకు డైవర్షన్, రవాణా చేయడం నిషేధం. అక్రమాలు నిగ్గు తేలేనా..? యూరియా వినియోగంలో అక్రమాలు వెలుగుచూస్తాయా అన్నది అనుమానమే. తనిఖీ చేసే అధికారులు వారి తప్పులను వారెలా బయటకు చెప్పుకుంటారన్నది ఇక్కడ ప్రశ్న. జిల్లాలో ఎక్కువగా హోల్సేల్ డీలర్ల నుంచే అక్రమాలు జరుగుతున్నాయని ఇంటాబయట వినిపిస్తున్న మాట. యాప్ వినియోగంతో కూడా యూరియా అక్రమార్కులకు చేరిందని తెలుస్తోంది. గతంలో సాగు భూములను సర్వే చేసిన వ్యవసాయ శాఖ.. సదరు భూములకు రైతు భరోసా ఇవ్వడం లేదు. కాగా యాప్లో అలా లేదని తెలుస్తోంది. పట్టా పాస్బుక్లో ఉన్న విస్తీర్ణం ప్రకారం యూరియా కేటాయింపు జరుగుతోంది. అంటే సాగులో లేని భూమికి కూడా యారియా వెళ్లిందన్న మాట. -
కొనసాగుతున్న సర్వే
కరీంనగర్ అర్బన్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గణాంకశాఖ ఆధ్వర్యంలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే కొనసాగుతోంది. జాతీయ గణాంక శాఖ 2026 సంవత్సరానికి గాను ప్రజల ఉపాధి స్థితిగతులను నమోదు చేస్తున్నారు. గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో సర్వే చేస్తుండగా ప్రజల జీవన స్థితిగతులను నివేదించనున్నారు. తొలి విడతలో కుటుంబ యజమాని పేరు, సభ్యులు, విద్యార్హతలు, చదువు మానేసిన, ఉన్నత చదువులు, వృత్తివిద్యా కోర్సులు, ఉద్యోగం, సరోజువారీ కూలీ అయితే వారంలో ఏ పని చేశారో, వేతన వివరాలతో పాటు మహిళలు స్వయం ఉపాధి పొందే వారయితే వారి ఆదాయ వివరాలను కూడా నమోదు చేసుకుంటామని తెలిపారు. బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో సర్వే జరగగా కార్పొరేటర్ గంట శ్రీనివాస్, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ నాగారపు హరికృష్ణ, మున్సిపల్ మెప్మా సెక్షన్ సిబ్బంది ఆర్పీలు రమ్య, కల్పన, మున్సిపల్ సిబ్బంది తంగళ్లపల్లి కల్యాణ్ పాల్గొన్నారు. ఎస్సీసెల్ పరిశీలకుడిగా అరుణ్కుమార్కరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్ ఎస్సీసెల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిశీలకుడిగా కరీంనగర్కు చెందిన కొరివి అరుణ్కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ నియామక ఉత్తర్వులు జారీచేశారు. పీసీసీ ఎస్సీసెల్ చైర్మన్గా కవ్వంపల్లి నియామకం తర్వాత, నూతన కమిటీలను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలోనే పాత కమిటీలన్నింటిని రద్దు చేశారు. కొత్త కమిటీల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పరిశీలకుడిగా కరీంనగర్ జిల్లా ఎస్సీసెల్ మాజీ అధ్యక్షుడు అరుణ్కుమార్ను నియమించారు. అరుణ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించి, ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షుల అనుమతితో స్థానిక కాంగ్రెస్ నాయకులతో సమావేశాల ద్వారా ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం నివేదికను కవ్వంపల్లికి అందించనున్నారు. -
దోపిడీకి స్కెచ్!
గురువారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2026● దేశవ్యాప్తంగా సుశిక్షితులైన 70 మందితో క్రిమినల్ నెట్వర్క్ ● బిహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లో కేసులు ● చోరీ చేసిన మొబైళ్లు, ఎన్క్రిప్టెడ్ యాప్స్ (ఫేస్టైంతోసహా)తో జైలు నుంచే వీడియో కాల్స్ ద్వారా రియల్ టైం మానిటరింగ్ ద్వారా ఆదేశాలు. ● గోల్డ్ లోన్ కంపెనీలు, నగల దుకాణాలు, జువెల్లరీ షోరూంలే టార్గెట్ ● అనుచరులకు వేతనాలు, నేరాల్లో ప్రతిభ కనబరిస్తే బోనస్లు ● పలు రాష్ట్రాల్లో తనిష్క్, మణప్పురం, ముత్తూట్ తదితర సంస్థల నుంచి 30కిలోలకు పైగా బంగారం తస్కరణ. ● పారిపోయేందుకు ప్రత్యామ్నాయాలు, దోపిడీకి ముందు రెక్కీ ఈ గ్యాంగ్ ప్రత్యేకత. ● ప్రస్తుతం బిహార్, వెస్ట్బెంగాల్లో కేసులు. బిహార్ జైలు నుంచివెయ్యి కార్లు.. 250 బస్సులుసాక్షిప్రతినిధి,కరీంనగర్ : జులాయి సినిమాలో విలన్ ఒక దొంగ.. చోరీ చేసిన ప్రతిసారీ పోలీసులకు తప్పుడు క్లూ వదిలి.. తాను మాత్రం మరో మార్గంలో పరారవుతుంటాడు. దీనినే పోలీసు పరిభాషలో ‘అటెన్షన్ డైవర్షన్’ అంటారు. ఈ టెక్నిక్నే కరీంనగర్లోని పీఎంజే జువెల్లరీ దోపిడీలో దొంగలు వినియోగించినట్లు తెలుస్తోంది. దేశంలోని అనేక జువెల్లరీ షాపులను నిలువుదోపిడీ చేసిన బిహార్కు చెందిన ‘గోల్డ్ థీఫ్’ అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ గ్యాంగ్ ఉత్తర భారతంలో దోపిడీలు, కిడ్నాప్లు, అక్రమ వసూళ్లకు ప్రసిద్ధి. దేశవ్యాప్తంగా గోల్డ్ థీఫ్కి క్రిమినల్ నెట్వర్క్ ఉంది. ఇతను కన్నేశాడంటే.. ఇతని అనుచరులు పథకం పన్ని బంగారం మొత్తం ఊడ్చి పారేస్తుంటారు. సుశిక్షితులైన దొంగలు కావడంతో ఇప్పటివరకు అన్నీ భారీ చోరీలే నమోదయ్యాయి. ప్రస్తుతం గోల్డ్ థీఫ్ బిహార్ జైలులో ఉన్నాడు. అక్కడ నుంచే దోపిడీకి ప్రణాళిక రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ధర్మపురికి వచ్చింది మొత్తం ఆరుగురు.. ఈనెల 3న.. కరీంనగర్ పీఎంజే జువెల్లరీస్లో దొంగతనం చేసింది ఐదుగురు కాదు.. ఆరుగురిగా పోలీసులు గుర్తించారు. ఈనెల ఒకటిన ఉదయం ధర్మపురిలోని విజయలక్ష్మి లాడ్జిలో తొలుత నలుగురు, తర్వాత మరొకరు వచ్చారు. ఇంకోవ్యక్తి సాయంత్రం వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అతడే ఈ ఽఐదుగురిని ధర్మపురి నుంచి ఛత్తీస్గఢ్ లేదా ఝార్ఖండ్ వైపు తప్పించి ఉంటాడని అనుమానిస్తున్నారు. జార్ఖండ్కు చెందిన సౌరభ్కుమార్మిశ్రా పేరుతో విజయలక్ష్మి లాడ్జిలో రూ.1200కు గది అద్దెకు తీసుకున్నారు. ధర్మపురిలో దైవదర్శనం కూడా చేసుకున్నట్లు ఆధారాలు లభించాయి. ఉత్తరభారతంలో దొంగలు చోరీకి ముందు పూజలు చేయడం ఆనవాయితీ. ఏప్రిల్ 27నుంచి 30వరకు దొంగలు పెద్దపల్లిలోని పరమేశ్వర లాడ్జిలో బస చేశారు. అక్కడ నుంచే దొంగతనానికి ప్లాన్ చేసినట్లు సమాచారం. అక్కడ కూడా జార్ఖండ్కు చెందిన చిరునామాతో గుర్తింపుకార్డులు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే వ్యక్తులు మార్చి నెలలోనూ ఇదే లాడ్జిలో బస చేసినట్లు కూడా దర్యాప్తులో తేలింది. చోరీకి ముందు సిద్దిపేట పరిసరాల్లోనూ ఈ ముఠా సంచరించినట్లు సమాచారం. ఘటనాస్థలంలో మహారాష్ట్రకు చెందిన బ్యాగు, గోదావరి తీరంలో బైక్ను అటెన్షన్ డైవర్షన్ కోసమే కావాలని వదిలేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పల్సర్ బైకు చాసీస్ను గుర్తించిన పోలీసులు అది ఢిల్లీదిగా తేల్చారు. బ్యాగు, బైకు విషయంలో పోలీసులను తప్పుదోవ పట్టించి దర్యాప్తు జాప్యానికి కారణమైనట్లు అనుమానిస్తున్నారు. అది అనుభవమున్న దొంగలకే సాధ్యం. చోరీలో పాల్గొన్న వారి ఆచూకీని ఇప్పటికే కనుగొన్న పోలీసులు బిహార్లోని నిందితుల ఇళ్లు, నిందితులు, స్నేహితుల ఇళ్ల వద్ద నిఘా పెట్టారు. ఎలాగైనా రెండు రోజుల్లో పట్టుకుంటామని ధీమాగా ఉన్నారు. -
మున్నూరుకాపు కార్పొరేషన్ చైర్మన్గా బొమ్మ శ్రీరాం
కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్ర మున్నూరుకాపు కార్పొరేషన్ చైర్మన్గా నగరానికి చెందిన బొమ్మ శ్రీరాంచక్రవర్తి నియమితులయ్యారు. నామినేటెడ్ పదవుల పందేరంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పలు కార్పొరేషన్లకు చైర్మన్, వైస్చైర్మన్లను ప్రకటించింది. మున్నూరుకాపు కార్పొరేషన్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొమ్మ శ్రీరాంను నియమించింది. మాజీ ఎమ్మెల్యే, బొమ్మ వెంకటేశ్వర్ కుమారుడు శ్రీరాం ఏళ్లుగా కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హౌజ్ఫెడ్ చైర్మన్గా పనిచేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా, యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. మున్నూరుకాపు సామాజిక కార్యక్రమాలు, సంఘం వ్యవహారాల్లో శ్రీరాం చురుకై న పాత్ర పోషిస్తున్నారు. మున్నూరుకాపు విద్యార్థి వసతిగృహం చైర్మన్గా, మున్నూరుకాపు సంఘం గౌరవ అధ్యక్షుడిగా, మున్నూరుకాపు రాష్ట్ర అపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు. కాగా తన నియామకంపై సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాకు తొలి కార్పొరేషన్ పదవి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేండ్లకు కరీంనగర్కు తొలి కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. గతంలో మహిళా కమిషన్ చైర్పర్సన్గా రామడుగు మండలానికి చెందిన నేరెళ్ల శారద నియమితులు కాగా.. సుడా, లైబ్రరీ, ఆర్టీఏ తదితర పదవులను భర్తీ చేయడం తెలిసిందే. రాష్ట్ర స్థాయిలోని కార్పొరేషన్ చైర్మన్ పదవి తొలిసారిగా శ్రీరాం ద్వారా కరీంనగర్కు వచ్చింది. -
సిటీకి మరో రూ.1,150 కోట్లు!
కరీంనగర్ కార్పొరేషన్: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పట్టణాల్లో అమలు చేయనున్న అర్బన్ చాలెంజ్ ఫండ్ (సీయూఎఫ్)పథకంలో కరీంనగర్ నగరాన్ని చేర్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, న గరపాలకసంస్థ భాగస్వామ్యం కలిగిన ఈ పథకంలో ఆమోదం లభిస్తే సుమారు రూ.1150 కోట్ల నిధులతో నగరంలో అభివృద్ధి పనుల జాతర నెలకొననుంది. ఈ పథకం నిధుల్లో ఎక్కువ భాగం నగరపాలకసంస్థయే భరించాల్సి ఉండగా...ఆస్థాయిలో ఆదాయాన్ని ఎలా సృష్టించుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. అర్బన్ చాలెంజ్ ఫండ్.. నగరపాలకసంస్థ ఆదాయం అంతంతమాత్రంగానే ఉండడం, ప్రభుత్వాల నుంచి పెద్దగా నిధులు రాకపోవడం నగర అభివృద్ధిపై ప్రభావం చూపుతోంది. ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయిస్తే తప్ప నగర అభివృద్ధి అనుకున్న మేర సాగే అవకాశం లేదు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం అర్బన్ చాలెంజ్ ఫండ్ పథకాన్ని తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పట్టణాలకు నిధులు కేటాయించే ఈ పథకానికి, ఐదు సంవత్సరాల కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.లక్ష కోట్లు కేటాయించింది. పట్టణాల ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఈనెల 11వ తేదీలోగా ఆయా మున్సిపల్ పాలకవర్గాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాల్సి ఉంది. బల్దియాపైనే భారం... అర్బన్ చాలెంజ్ ఫండ్ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నగరపాలకసంస్థ భాగస్వామ్యంగా ఉంటాయి. ఎంపికై న పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం 25 శాతం నిధులు నేరుగా ఇస్తుంది. మరో 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం లేదా నగ రపాలకసంస్థ వాటా ఉంటుంది. మిగతా 50 శాతం నిధులు నగరపాలక సంస్థ బాండ్లు, బ్యాంక్ రుణాలు, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) ద్వారా సమీకరించుకోవాలి. అంటే అధిక బాధ్యత బల్దియాపైనే ఉంది. రూ.1,150 కోట్లతో ప్రతిపాదనలు అర్బన్ చాలెంజ్ ఫండ్ స్కీంలో భాగంగా రూ.1150 కోట్లతో నగరపాలకసంస్థ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. సుమారు రూ.650 కోట్లతో నగరంలో రో డ్లు, డ్రైనేజీల ని ర్మాణం, మిగతా నిధులతో డంప్యార్డ్, ఎస్టీపీ, ఆదాయం వచ్చే వాణిజ్య భవనాలు, సుందరీకరణ, పర్యాటకానికి కేటాయించనున్నారు. బుధవారం కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ అదనపు కార్యదర్శి డి.తారా మున్సిపల్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు, నగరం నుంచి రావాల్సిన ప్రణాళికలు, ప్రతిపాదనలపై చర్చించారు. కరీనగర్ నుంచి మేయర్ కొలగాని శ్రీనివాస్, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పాల్గొన్నారు. అమలైతే.. అద్భుతమే.. సీయూఎఫ్ పథకం సాఫీగా అమలైతే కరీంనగర్ సిటీ స్వరూపమే మారిపోనుంది. గతంలో స్మార్ట్ సిటీలో నగరం ఎంపిక కావడంతో సుమారు రూ.1000 కోట్లతో అభివృద్ధి జరగడం తెలిసిందే. అయినప్పటికీ అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, నాలాలు తదితర సమస్యలు అలానే ఉన్నాయి. సీయూఎఫ్ పథకం ఆచరణకు నోచుకొంటే నగర రూపురేఖలు మారిపోనున్నాయి. నేడు అత్యవసర సమావేశం అర్బన్ చాలెంజ్ ఫండ్లో ఎంపిక చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి తీర్మాణం పంపించేందుకు గురువారం నగరపాలకసంస్థ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు నగరమేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రూ.1150 కోట్ల ప్రతిపాదనలపై చర్చించి, యూసీఎఫ్లో నగరపాలకసంస్థను చేర్చాలని కోరుతూ తీర్మానించనున్నారు. -
మాయామురళి..సాహసికుడు
చాలాకాలం క్రితం నీలగిరి పర్వతాల మధ్య ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఆర్యన్ అనే ఒక ధైర్యవంతుడైన యువకుడు ఉండేవాడు. ఆ గ్రామానికి దగ్గర్లో చీకటి అడవి ఉండేది. ఆ అడవిలోకి వెళ్లిన వారు ఎవరూ తిరిగి రారని అక్కడి ప్రజలు నమ్మేవారు. ఒకరోజు గ్రామంలోని పంటలన్నీ ఎండిపోయి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అప్పుడు ఒక ముసలితాత ‘అడవి మధ్యలో ఒక మాయా మురళి ఉంది. దానిని ఊదితే వానలు కురుస్తాయి..నేల పచ్చబడుతుంది’ అని చెప్పాడు. సాహసం ప్రారంభం గ్రామస్తుల కష్టాలను చూడలేక ఆర్యన్ ఒంటరిగా అడవిలోకి బయలుదేరాడు. అడవిలో వింతవింత శబ్దాలు.. దట్టమైన పొగమంచు అతన్ని భయపెట్టాయి. కానీ... ఆర్యన్ వెనకడుగు వేయలేదు. దారిలో అతనికి ఒక గాయపడిన పక్షి కనిపించింది. ఆర్యన్ దానికి చికిత్సచేసి, తన దగ్గర ఉన్న నీటిని తాగించాడు. ఆ పక్షి ఒక అడవి దేవతగామారి, ‘నీ దయాగుణానికి మెచ్చాను. ఈ దారిలో వెళ్తే నీకు మురళి కనిపిస్తుంది. కానీ.. దాన్ని పొందే ముందు నువ్వు నీ అహాన్ని వదులుకోవాలి’ అని చెప్పి మాయమైపోయింది. ముగింపు చివరికి ఆర్యన్ ఒక పెద్ద గుహలోకి చేరుకున్నాడు. అక్కడ బంగారంలా మెరుస్తున్న మురళి ఉంది. దాన్ని తాకగానే, ఒక గంభీరమైన స్వరం వినిపించింది: ‘దీన్ని నువ్వు నీ స్వార్థం కోసం వాడుకుంటావా? లేక ఇతరుల కోసమా?’ అని శబ్ధం వచ్చింది. ఆర్యన్ ఏమాత్రం ఆలోచించకుండా, ‘నా గ్రామం క్షేమం కోసమే నాకు ఇది కావాలి’ అని సమాధానమిచ్చాడు. అతని నిస్వార్థానికి మెచ్చి ఆ మురళి ఆర్యన్ చేతికి చిక్కింది. అతను గ్రామానికి వచ్చి మురళిని ఊదగానే, ఆకాశం నుంచి వర్షం కురిసి గ్రామం మళ్లీ పచ్చదనంతో నిండిపోయింది. ఆర్యన్ అందరికి హీరో అయ్యాడు. నీతి: నిస్వార్థమైన మనసుతో చేసే ఏ ప్రయత్నమైనా ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తుంది. మనన్, బాలరచయిత 4వ తరగతి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, గ్రామం: రాచ్పల్లి, మండలం: ధర్మారం జిల్లా: పెద్దపల్లి -
ఉచిత కీళ్ల మార్పిడి శిబిరం విజయవంతం
కరీంనగర్: కరీంనగర్లోని రెనే హాస్పిటల్, శ్రీలక్ష్మి మహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మోకాలి కీళ్ల మార్పిడి శిబిరం విజయవంతమైంది. ప్రొఫెసర్ డాక్టర్ బంగారి స్వామి, డాక్టర్ బంగారి రజని ప్రియదర్శిని ఆధ్వర్యంలో ఎంపికై న 18 మంది లబ్ధిదారులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించి, వారిని ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్ చేశారు. ప్రతీ ఏడాది నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమాన్ని ఈసారి ఆరోసారి నిర్వహించారు. మార్చి 2026లో జరిగిన మెడికల్ క్యాంపుకు హాజరైన సుమారు 600 మంది పేషెంట్లలో నుంచి లక్కీ డ్రా విధానం ద్వారా 18 మందిని ఎంపిక చేసి ఉచితంగా శస్త్రచికిత్సలు చేశారు. వీరిలో 8 మందికి అత్యాధునిక జాన్సన్ అండ్ జాన్సన్ రోబోటిక్ సాంకేతికతతో కీళ్ల మార్పిడి చేయగా.. మిగతావారికి సాధారణ పద్ధతిలో చికిత్స అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. సుమారు రూ.40లక్షల విలువైన వైద్య సేవలను ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు. ఆధునిక రోబోటిక్ వైద్యసేవలను జిల్లాకు తీసుకురావడమే కాకుండా పేదలకు అందించడం గొప్ప విషయమని కొనియాడారు. డాక్టర్ బంగారి స్వామి మాట్లాడుతూ... తన తల్లిదండ్రుల స్ఫూర్తితో ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రెనీ హాస్పిటల్ వైద్యులు మునిష్, కృష్ణారెడ్డి, లతీశ్రెడ్డి, సురేశ్కుమార్, సుధీర్ ద్వారాక్ నాయుడు, నిఖిల్ లక్ష్మణ్, విశాల్, వైభవ్, కమలుద్దీన్, పులి స్ఫూర్తి, నవ్య, సారా ఫాతిమా, ఆదిత్య, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. 18 మందికి ఆపరేషన్లు చేసిన డాక్టర్ బంగారి స్వామి -
సరిహద్దులు దాటిన సాహితీ పరిమళాలు
హాజరైన కవులు కవి సమ్మేళనంలో మాట్లాడుతున్న జీవీ శ్యాం ప్రసాద్లాల్కరీంనగర్ కల్చరల్: సాహితీ పరిమళాలు సరిహద్దులు దాటి ఫరిడవిల్లుతోంది. రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటి నే పాల్లో అరుదైన రీతిలో తెలుగుకవి సమ్మేళనం జరిగింది. ఇండో– నేపాల్ కవి సమ్మేళనం పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో 20 మందికి పైగా ప్రఖ్యాత కవులు కవితా గానం చేశారు. వంద మందికి పైగా తెలుగు వారు దీనికి హాజరయ్యారు. ఖాట్మాండులోని క్రిస్టల్ పశుపతి హోటల్ ఈ సమ్మేళనానికి వేదికై ంది. ఐఏఎస్ అధికారి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్ మిత్ర బృందం ఆధ్వర్యంలో 135 మంది తెలుగు వారితో చేపట్టిన నేపాల్ యాత్రలో భాగంగా ఈ కవి సమ్మేళనం నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం ప్రొఫెసర్ ఎస్.రఘు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జీవీ శ్యాంప్రసాద్లాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కవి అన్నవరం దేవేందర్ కవి సమ్మేళనాన్ని ప్రారంభించారు. శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యం విశ్వజనీనమైందన్నారు. సమ్మేళనంలో బూర్ల వెంకటేశ్వర్లు, గాజుల రవీందర్, నాంపల్లి సుజాత, మాడిశెట్టి గోపాల్, రావికంటి శ్రీనివాస్, స్థంభంకాడి గంగాధర్, సీవీ శ్రీనివాస్, డాక్టర్ కూరెళ్ల పద్మాచారి, కృష్ణ గోపాల్, ముత్తినేని శ్రీనివాసరావు, డాక్టర్ దాసోజు జ్ఞానేశ్వర్, సంపత్, అశోక్, జ్యోతి, గోనె శ్రీనివాస్, ప్రేమలత తదితరులు కవితలు వినిపించారు. మల్లికార్జున్ దేవ్, నల్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఖాట్మాండులో తెలుగు కవి సమ్మేళనం -
క్లుప్తంగా
అరుణాచలం, రామేశ్వరం ప్రత్యేక బస్ విద్యానగర్(కరీంనగర్): తీర్థయాత్రల ప్రత్యేక టూర్ ప్యాకేజీలో భాగంగా కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, కంచి, చిదంబర నటరాజ ఆలయం, శ్రీరంగం, మధురై, జంబుకేశ్వర్, రామేశ్వరం, జోగులాంబ దర్శనాలకు కరీంనగర్ 1 డిపో నుంచి రాజధాని ఏసీ బస్సు వెళ్తున్నట్లు డీఎం ఐ.విజయమాధురి తెలిపారు. ఈనెల 14న మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్ బస్టాండ్ నుంచి బయలుదేరి 19 తిరిగి చేరుకుంటుందని వివరించారు. పెద్దలకు రూ.8,800, పిల్లలకు రూ.6,600 టికెటు ఉంటుందని తెలిపారు. వివరాలకు 73828 49352, 99592 25920, 80746 90491లలో సంప్రదించాలని కోరారు. గంజాయి అమ్మితే సమాచారం ఇవ్వండివేములవాడ: గంజాయి అమ్మిన వారి సమాచారం ఇవ్వాలని డీఎస్పీ శ్రీనివాసులు కోరారు. పట్టణంలోని పెద్దమ్మగుడి ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో బుధవారం దాడి చేశారు. బైక్పై వచ్చిన నాంపల్లికి చెందిన జడల నాగరాజు(50), వడిచర్ల జాన్ ప్రతాప్రెడ్డి(60)ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి నుంచి 160 గ్రాముల గంజాయి (రూ.8 వేల విలువ), మొబైల్ ఫోన్, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2026
వెదిరలో రాస్తారోకో చేస్తున్న రైతులుశంకరపట్నం మండలం కరీంపేటలో తడిసిన ధాన్యంహుజూరాబాద్ మండలంలో తడిసిన ధాన్యంవెదిరలో రాస్తారోకోలో చిక్కుకున్న 108 వాహనంరామడుగు/శంకరపట్నం/హుజూరాబాద్ రూరల్: ఆరుగాలం కష్టపడిన అన్నదాతకు ధాన్యం విక్రయించుకునేందుకు తిప్పలు తప్పడం లేదు. కల్లాల్లోని ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ అన్నదాతలు ఆగ్రహానికి గురవుతుండగా, పలుచోట్ల అకాల వర్షాలు నిండా ముంచుతున్నాయి. ఎటుతిరిగీ అన్నదాతే నష్టపోతుండగా.. కొనుగోళ్లు వేగిరం చేయాల్సిన అవసరం ఉంది. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తూకం వేయడం లేదని, వేసిన ధాన్యానికి 4కిలోల తరుగు తీస్తున్నారని కరీంనగర్– జగిత్యాల జాతీయ రహదారిపైన వెదిరలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. దాదాపుగా గంటపాటు ఆందోళన చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గంగాధర ఎస్సై వంశీకృష్ణ రైతులకు నచ్చజెప్పి అందోళన విరమింప జేసే ప్రయత్నం చేసినప్పటికీ వినిపించుకోలేదు. తహసీల్దార్ రాజేశ్వరి వచ్చి రైతులతో మాట్లాడారు. సమస్యను ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. శంకరపట్నం మండలంలో మంగళవారం కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయింది. కరీంపేట, కొత్తగట్టు, మొలంగూర్, మెట్పల్లిలో అకాలవర్షంతో సంచుల్లో కాంటా వేసిన ధాన్యంతో పాటు కుప్పలు తడిసిపోయాయి. హుజూరాబాద్ మండలంలోని సింగాపూర్, సిర్సపల్లి, చెల్పూర్ గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి ధాన్యం కొట్టుకు పోయింది.అన్నదాత అరిగోస -
నేతన్నకు తోడుగా..
కరీంనగర్కల్చరల్: చేనేత వస్త్రాలంటే మక్కువ లేని మగువలు చాలా అరుదు. సంప్రదాయం, అందం, హుందాతనం కలిసిన ఈ హస్తకళను కరీంనగర్ ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో కళాసిల్క్ సంస్థ ముందుకొచ్చింది. కోర్టు చౌరస్తా సమీపంలోని శ్రీ రాజరాజేశ్వర కల్యాణ మండపంలో చేనేత వస్త్రాలు, హస్తకళల ప్రదర్శనతో పాటు అమ్మకాల స్టాళ్లు ఏర్పాటు చేశారు. నేతన్నలకు ఆర్థికంగా చేయూత అందించడమే కాకుండా చేనేత కళను ప్రతి ఇంటికీ చేర్చేందుకు నిర్వాహకులు కృషి చేస్తున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు అద్భుత అల్లికలతో తయారు చేసిన సిల్క్, కాటన్ వస్త్రాలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. ఎగ్జిబిషన్లో పలు రాష్ట్రాల ప్రత్యేకతలు తెలంగాణలోని గద్వాల్, నారాయణపేట, పోచంపల్లి; ఆంధ్రప్రదేశ్లోని ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, కలంకారి, ఉప్పడ, అస్సాంలోని మూగా, ఎరి సిల్క్, బిహార్లోని బాగల్పూర్ సిల్క్, టస్సర్, ఛత్తీస్గఢ్లోని కోసా సిల్క్, ట్రైబల్ వర్క్స్, గుజరాత్ బంధని, కచ్ ఎంబ్రాయిడరీ, జమ్ము– కశ్మీర్ పాష్మీనా షాల్స్, కర్ణాటక ప్రింటెడ్ శారీస్, మధ్యప్రదేశ్ చందేరి, మహేశ్వరి, రాజస్థాన్ కోటా, బంధని, బ్లాక్ ప్రింట్స్, ఉత్తరప్రదేశ్ బనారస్, లక్నో డ్రెస్ మెటీరియల్స్ వంటి అనేక రాష్ట్రాల ఉత్పత్తులు లభిస్తున్నాయి. అదనంగా హర్యానా బెడ్ కవర్లు, కుషన్ కవర్లు, కుర్తీలు, డోర్ కర్టెన్లు, హ్యాండీక్రాప్ట్స్’ న్యూట్రిషన్ ఫుడ్ ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. రంగురంగుల వస్త్రాలతో సందడి ప్రత్యేక స్టాళ్లతో ఆకట్టుకుంటున్న ప్రదర్శన పలు రాష్ట్రాల ఉత్పత్తులు ఒకేచోట కొనుగోలుదారుల్లో పెరుగుతున్న ఆసక్తిచేనేత వస్త్రాలు, హస్తకళల ను ప్రోత్సహించండి. కళా కారుల అల్లికలతో రూపొందించిన సిల్క్, కాటన్ వస్త్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలు స్తున్నాయి. దేశం నలుమూలల కళాకారుల ఉత్పత్తులను ఒకేచోట అందించేందుకు ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాం. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని నేతన్నలకు చేయూత అందించాలని కోరుతున్నాం. – ఎన్.వినోద్, ఎగ్జిబిషన్ మేనేజర్ -
మీ హయాంలో జరిగిన హత్యలకు మీదే బాధ్యతా?
కరీంనగర్ కార్పొరేషన్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన న్యాయవాదుల జంట హత్య, దొంగతనాలు, ఇతర నేరాలకు కేసీఆర్, కేటీఆర్లే బాధ్యత వహిస్తారా అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ డిమాండ్ చేశారు. దొంగతనం జరిగిన జువెల్లరీ షాప్ను మంగళవారం సందర్శించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఆర్అండ్బీ అతిథిగృహంలో మాట్లాడుతూ అంతర్రాష్ట్ర దొంగలకు సీఎం రేవంత్రెడ్డికి ముడిపెట్టే నీచస్థితికి కేటీఆర్ దిగజారారని ధ్వజమెత్తారు. డ్రగ్స్ ఎడిక్ట్ అయి, ఫామ్హౌజ్లో గడుపుతున్న కేటీఆర్ విలాసవంతమైన జీవితాన్ని ప్రజలకు తెలియచేసేందుకు డ్రోన్కెమెరాలతో చిత్రీకరిస్తే రేవంత్ను జైలుకు పంపించారన్నారు. అప్పుడు అక్రమంగా అరెస్ట్ చేసి, ఇప్పుడు దొంగలతో సంబంధాలు అంటగడుతున్నారన్నారు. 2014 నుంచి 2023 వరకు జరిగిన హత్యలు,దోపిడి, దొంగతనాలకు అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కారణమా చెప్పాలన్నారు. జువెల్లరీ దొంగతనం జరిగితే హుటాహుటిన వచ్చిన కేటీఆర్, తమ ప్రభుత్వ హయాంలో నేరెళ్ల, కొండగట్టు బాధితులను ఎందుకు పరామర్శించలేదన్నారు. దొంగలను పట్టుకొనేందుకు 15 ప్రత్యేక బందాలను ఏర్పాటు చేశామని, నిందితులను పట్టుకోవడానికి ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మొగోడైతే కాళేశ్వరం కేసులో కేసీఆర్కు సీబీఐ నోటీసులు ఇప్పించాలని లక్ష్మణ్కుమార్ సవాల్ విసిరారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, కాంగ్రెస్ కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు, పడిశెట్టి భూమయ్య, ఆకుల నర్సయ్య, ఆకుల ఉదయ్, మహమ్మద్ అమీర్, అబ్దుల్ రెహమాన్, మహమ్మద్ ఇమ్రాన్ పాల్గొన్నారు. -
అమ్మా.. బతకాలని ఉంది..!
గొల్లపల్లి: వారిది నిరుపేద కుటుంబం. కూలీపనులు చేసుకుంటూ.. ఉన్నంతలో ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతుందనుకుంటున్న ఆ కుటుంబంలో పెద్ద ఆపద వచ్చిపడింది. కుమారుడికి కొన్నాళ్ల క్రితం తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ముందుగా జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్య సిబ్బంది ప్యాంక్రియా టైటిస్గా గుర్తించారు. అక్కడ వైద్యం అందించినా.. నయం కాకపోవడంతో చేతిలో చిల్లిగవ్వలేకున్నా.. అప్పు చేసి హైదరాబాద్లోని యశోధ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడిని బతికించుకునేందుకు ఆ కుటుంబం తాపత్రయపడుతోంది. ఆపన్నహస్తం కోసం ఎదరుచూస్తోంది. కన్నీరు పెట్టిస్తున్న బాలుడి కథ గొల్లపల్లి మండలం భీంరాజ్పల్లి గ్రామానికి చెందిన రజితను మల్యాల మండలం పోతారం గ్రామానికి చెందిన ఆరే తిరుపతికి ఇచ్చి 20ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి కుమారుడు దీక్షిత్, కూతురు ఉన్నారు. తండ్రి తిరుపతి ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. పిల్లల ఆలనాపాలన తల్లి రజిత చూసుకుంటోంది. దీక్షిత్ కొన్నాళ్ల క్రితం అనారోగ్యం బారిన పడడంతో రజిత ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు అతడికి ప్యాంక్రియాటైటిస్ వ్యాధి వచ్చినట్లు గుర్తించారు. మందులు వాడినా.. తీవ్రమైన కడుపునొప్పి కారణంగా అల్లాడుతున్నాడు. ఏడాది కాలంగా దీక్షిత్ పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో ఆ తల్లి కొడుకును కాపాడుకునేందుకు జగిత్యాలతోపాటు కరీంనగర్, హైదరాబాద్ వంటి ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తోంది. అప్పుల ఊబిలో కుటుంబం కుటుంబం గడిచేందుకే ఆ కుటుంబం పడరానిపాట్లు పడుతోంది. ఇక దీక్షిత్ చికిత్స కోసం మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ కుటుంబానికి సొంత ఇల్లు లేదు. గుంటభూమి లేదు. చేతిలో చిల్లి గవ్వ లేదు. అప్పు చేసి.. సుమారు రూ.7లక్షల వరకు వైద్యం కోసం ఖర్చు చేశారు. అయినా ఫలితం కనిపించడం లేదు. వ్యాధి మళ్లీ మళ్లీ తిరగబెడుతోంది. తీవ్ర కడుపునొప్పితో కొడుకు విలవిల్లాడిపోతుంటే ఆ తల్లి ఏం చేయాలో తెలియక మౌనంగా రోదిస్తూ.. లోలోపల కుమిలిపోతోంది. చదువులో ముందంజ అనారోగ్యంతో ఉన్నా దీక్షిత్కు చదువుపై ఆసక్తి తగ్గలేదు. మందులు వాడుతూనే పదో తరగతి పరీక్షలు రాశాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించాడు. ఉపాధ్యాయులు అతడిని అభినందించి.. ఆయన దీనస్థితిని చూసి చలించిపోయారు. దాతల సాయం కోసం ఎదురుచూపులు ‘నా కొడుకుకు ప్రాణభిక్ష పెట్టండి.. దేవుడా.. బతికించు..’ అంటూ ఆ తల్లి కలిసిన ప్రతిఒక్కరికీ చేతులెత్తి దండం పెడుతోంది. కళ్లముందే కొడుకు దీనస్థితికి చేరడం.. వైద్యం అందిస్తామన్నా.. చేతిలో చిల్లిగవ్వలేకపోవడంతో ఆ తల్లి వేదన వర్ణణాతీతం. ప్రస్తుతం దీక్షిత్కు హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే రూ.7లక్షలు ఖర్చయ్యాయని, మరో రూ.7లక్షలు అయితే కొడుకు బతికే అవకాశం ఉందని ఆ తల్లి వేడుకుంటోంది. దాతలు స్పందించి తన కొడుకును బతికించాలని అర్థిస్తోంది. మృత్యువుతో పోరాడుతున్న 17 ఏళ్ల బాలుడు ప్యాంక్రియా టైటిస్గా గుర్తించిన వైద్యులు అప్పు చేసి వైద్యం అందిస్తున్న పేద కుటుంబం ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు దాతలు స్పందించాలని వేడుకోలు సహాయం చేయాలనుకునే దాతలు 96664 21275 నంబర్లో సంప్రదించాలని వేడుకుంటోంది. -
దొంగల బస!
ధర్మపురిలో సాక్షిప్రతినిధి,కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జువెల్లరీస్లో భారీ దోపిడీ కేసులో పోలీసులు దర్యాప్తులో పురోగతి సాధించారు. ఈ నెల ఒకటిన జగిత్యాల జిల్లా ధర్మపురిలోని విజయ లక్ష్మి లాడ్జిలో బసచేసి, కరీంనగర్లో చోరీ అనంతరం 3వ తేదీన లాడ్జి ఖాళీచేశారు. అంతకన్నా ముందు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనూ బసచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది ఇలాఉంటే దొంగలు వినియోగించిన నల్లరంగు పల్సర్ (220 సీసీ), హెల్మెట్ను ధర్మపురి గోదావరి తీరంలోని ఇటుకబట్టీల సమీపంలో మంగళవారం ఉదయం కనుగొన్నారు. టీఎస్ 08 ఎఫ్జీ 6876 నంబరు ప్లేటుతో ఉన్న ఈ బండిని దుండగులు చోరీ కోసం వినియోగించిందేనని ధ్రువీకరించారు. కానీ.. ఈ బైకుది ఫేక్ నంబరు ప్లేటుగా పోలీసులు తేల్చారు. హైదరాబాద్లోని ముషీరాబాద్కు చెందిన రమేశ్ అనే వ్యక్తికి చెందిన కారుదిగా గుర్తించారు. బండి చాసీస్ నంబరు ఆధారంగా ప్రయత్నించినా.. దాన్ని కూడా ముందే ధ్వంసం చేయడంతో బైకులను సెకండ్ హ్యాండ్లో కొన్నారా? లేక ఎత్తుకొచ్చారా? అన్న విషయంపై ఇంకా స్పష్టత రా లేదు. చోరీ కోసం వినియోగించిన మరో బైకు అపాచీ(తెలుపు) ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దానికి పెట్టిన నంబరు ప్లేట్ కూడా ఫేక్గానే భావిస్తున్నారు. -
ఆడుకోవడం.. కథలు వినడం
ఎండాకాలం సెలవులో ఎగిరిన మధురస్మృతులు. వేసవి సెలవులు వచ్చినాయి అంటే అమ్మమ్మ ఊరు పెద్దపహాడ్ వెళ్లడం మేనమామలతో రామాయణం భారతం కథలు చెప్పించుకోవడం ఒక జ్ఞానం. ఇంకా ఆ కాలంలో చుట్టాలు ఇళ్లల్లో తిరగడం కూడా ఒక అలవాటు.మా ఊర్లో ఉన్నప్పుడు ఎండాకాలం సెలవులు లోనే చెరువులలో భావులలో ఈత నేర్చుకునేది. చింత చెట్టు కింద చిర్రగోని ఆట ఆడేది. ఇంటిదగ్గర చింతపండు కొట్టేది . వ్యవసాయ పనులు చేసేది. అట్లాగే రానున్న తరగతి పుస్తకాలను పాత వాటిని సగం ధరకు కొనుక్కునేది. పుట్టలేసుకునేది. రేడియో పాటలు వినడం. ఇంటి బయట వాకిలిలో పడుకొని మా తాత చెప్పే కథలు వినడం అలవాటు. ఇప్పటి యువతరం కూడా ముఖ్యంగా సెల్ ఫోన్లకు టీవీలకు కంప్యూటర్లకు దూరంగా ఉండి శారీరక శ్రమకు సంబంధించిన ఆటలలో పాల్గొనాలి. సాహిత్య కళాత్మక క్రీడా రంగాలలో తర్ఫీదు పొందాల్సిన అవసరం ఉంది. డిజిటల్ మాధ్యమ సాధనాలకు దూరం జరగాల్సిన అవసరం ఉంది. – అన్నవరం దేవేందర్, కవి, రచయిత, దాశరధి పురస్కార గ్రహీత -
వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవం
గంభీరావుపేట(సిరిసిల్ల): వ్యవసాయ రంగంలో సరికొ త్త విప్లవానికి నాంది పలుకుతూ గడ్డిని ముడిసరుకుగా ఉపయోగించి బయోగ్యాస్ ఉత్పత్తి చేసే బృహత్తర ప్రా జెక్టును ప్రజాప్రభుత్వం కార్యరూపంలోకి తెస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నా రు. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలకేంద్రంలోని పంతులుగారి తోటలో బయోస్ట్రాటమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి మంగళవారం మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ సాధారణంగా రైతులు పొలాల్లోనే గడ్డిని కాల్చివేయడం ద్వారా వాతావరణం కలుషితమై ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోతుందన్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం ఈ వినూత్న ఆలోచనను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా పర్యావరణానికి రక్షణతోపాటు రైతులకు వ్యవసాయ వ్యర్థాల ద్వారా అదనపు ఆదాయం లభించే అవకాశం ఉందన్నారు. పంట వ్యర్థాలను కాల్చకుండా బయోగ్యాస్ ప్లాంట్లకు సరఫరా చేయాలని కోరారు. వ్యవసాయాన్ని మరింత లాభాసాటిగా మార్చేందుకు రైతులు పంట మార్పిడి విధానాన్ని పాటించాలని సూచించారు. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి కొత్త పద్ధతులు పాటించాలని సూచించారు. 11 విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటుకు శంకుస్థాపన సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లోని 11 ప్రాంతాల్లో రూ.30కోట్ల అంచనాతో ఏర్పాటు చేయనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లకు గంభీరావుపేటలోని సబ్స్టేషన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, సర్పంచ్ మల్లుగారి పద్మ, ఏఎంసీ చైర్పర్సన్ కొమిరిశెట్టి విజయ, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బయోగ్యాస్ ఉత్పత్తికి ప్రభుత్వ ప్రోత్సాహం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గంభీరావుపేటలో కాంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన -
ప్రత్యామ్నాయ పంటలే మేలు
మానకొండూర్: రైతుల ఆర్థిక ఎదుగుదలకు ప్రత్యామ్నాయ పంటలు ఎంతో ఉపయోగకరమని డీఏవో భాగ్యలక్ష్మీ, జిల్లా ఉద్యానశాఖ అధికారి కమలాకర్రెడ్డి అన్నారు. మానకొండూర్ మండలం అన్నారం గ్రామంలో మంగళవారం ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భా గంగా ఉద్యాన పంటల సాగు, ఆయిల్ఫాం సాగు విస్తీర్ణం పెంపుదల, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు తిరుమల్రెడ్డి, సర్పంచ్ బొట్ల స్వరూప, కె.తిరుపతి, ఉప సర్పంచ్ సతీశ్, స్పెషల్ ఆఫీసర్ ఈశ్వరయ్య, డీసీవో రామానుజచార్యులు, ఏడీఏ శ్రీధర్, ఏవో శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. ‘సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం’కరీంనగర్టౌన్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై చేసిన వ్యాఖ్యల ను ఖండిస్తున్నామని పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య రాజకీయాల్లో విధానా లపై, ప్రజాసమస్యలపై విమర్శలు ఉండాలి కానీ.. వ్యక్తిగత దూషణలు అనైతికమన్నారు. కేటీఆర్ మాజీ సీఎం చంద్రశేఖర్ రావు కుమారుడని నిరూపించుకోవాలని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమైనవని పేర్కొన్నారు. బండి సంజయ్ వంటి నాయకులు ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వంటి సంస్థల్లో ఆయనకు ఇదే శిక్షణ ఇచ్చారా అని ప్రశ్నించారు. కరీంనగర్ టౌన్: ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు పని చేసిందని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం కరీంనగర్లోని బద్ధం ఎల్లారెడ్డి భవన్లో మాట్లాడుతూ వామపక్షాలకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందనేది వాస్తవమన్నారు. కానీ కమ్యూనిస్టు సిద్ధాంతం అజేయమైందన్నారు. రాష్ట్ర ఏఐటీయూసీ 4వ మహాసభలు సెప్టెంబర్లో కరీంనగర్లో నిర్వహించడం జరుగుతుందని, కార్మిక లోకం కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మికవర్గానికి పితామహుడు, కార్పొరేట్, పెట్టుబడిదారుల గుండెల్లో గునపం లాంటి మహోన్నతమైన వ్యక్తి కారల్ మార్క్స్ అని కొనియాడారు. పార్టీ జిల్లా సమితి ఆధ్వర్యంలో కారల్ మా ర్క్స్ 209వ జయంతిని నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కటికరెడ్డి బుచ్చన్న, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, ఏఐటీయూసీ రాష్ట్ర నిర్మాణ బాధ్యులు వీఎస్బోస్, కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల కార్యదర్శులు పంజాల శ్రీనివాస్, రామడుగు లక్ష్మణ్, తాండ్ర స దానందం,విశ్వనాథం, సుదర్శన్ పాల్గొన్నారు. ప్రధానాసుపత్రిలో విజిలెన్స్ తనిఖీలుకరీంనగర్: కరీంనగర్ ప్రభుత్వ ప్రధానాసుపత్రి (జీజీహెచ్)లో మంగళవారం విజిలెన్స్ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు. జీజీహెచ్, ఎంసీహెచ్, ఫార్మసీ, స్కానింగ్లు, ఆపరేషన్ థియేటర్, ఓపీ, ఐపీ విభాగాల్లో తనిఖీలు చేపట్టారు. రోగుల సంఖ్య, డాక్టర్ల హాజరుపట్టిక, అటెండెన్స్ తీరును పరిశీలించారు. మెడికల్ కళాశాల నుంచి అటెండెన్స్ కాపీలు తెప్పించుకొని పరిశీలించారు. ఆస్పత్రిపై ఏవైనా ఫిర్యాదులు రావడం వల్ల తనిఖీ లు నిర్వహించారా..? లేదా సాధారణ తనిఖీ లా..? అనే అంశంపై సూపరింటెండెంట్ వీ రారెడ్డిని వివరణ కోరగా, ఎలాంటి ఫిర్యాదులు అందలేదని సాధారణ తనిఖీలేనని తెలిపారు. 7న అవగాహన సమావేశంకొత్తపల్లి(కరీంనగర్): రాష్ట్ర ఇంధనశాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 9వ తేదీ వరకు రైతు వారోత్సవాలు నిర్వహి స్తున్నారు. అందులో భాగంగానే ఈ నెల 7న ప్రతి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ‘వ్యవసాయ క్షేత్రాలు– సౌర విద్యుత్ కేంద్రాలు (పీఎం కుసుమ్) అంశంపై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ రాపెల్లి రవీందర్ తెలిపారు. రైతులు, రైతు సంస్థలు, సహకార సంఘాలు హాజరుకావాలన్నారు. -
రూ.70 కోట్లతో పనులు
కరీంనగర్ కార్పొరేషన్: స్మార్ట్ సిటీ నిధులు రూ.70 కోట్లతో నగరంలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని స్మార్ట్సిటీ బోర్డు సమావేశం నిర్ణయించింది. బోర్డు సమావేశం మంగళవారం హైదరాబాద్లో జరిగింది. సీడీఎంఏ శ్రీదేవి, ఈఎన్సీలతో పాటు మేయర్ కొలగాని శ్రీనివాస్, నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ హాజరయ్యారు. రూ.70 కోట్ల గ్రాంట్తో నగరంలోని టవర్సర్కిల్ వద్ద మల్టీ పార్కింగ్ భవనం నిర్మించాలని తీర్మానించారు. మదీనాకాంప్లెక్స్ వద్ద గతంలో నిర్మించిన భవనం ఉపయోగంలోకి రాకపోగా, శిథిలావస్థకు చేరడం తెలిసిందే. తాజాగా స్మార్ట్ సిటీ నిధులు సుమారు రూ.50 కోట్లతో మల్టీపార్కింగ్ భవనం నిర్మించాలని నిర్ణయించడంతో టవర్సర్కిల్ వద్ద పార్కింగ్ తిప్పలు తప్పే అవకాశం ఉంది. ప్రతి వర్షాకాలం నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పడుతున్న ముంపును నివారించేందుకు నిధులు కేటాయించారు. మంచిర్యాల చౌరస్తా, ముకరాంపుర, రాంనగర్, ఆర్టీసీ వర్క్షాప్, కోతిరాంపూర్ తదితర ప్రాంతాల్లో వరద ముంపును తప్పించేందుకు నాలా నిర్మాణాలను చేపట్టనున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. -
చేతకాకపోతే తప్పుకోండి
కొత్తపల్లి(కరీంనగర్)/కరీంనగర్: రైతులు ఆరుగా లం కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అరిగోస పెడుతోందని, కొనుగోళ్లు చేతకావడం లేదని తప్పుకుంటే కేంద్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ పేర్కొన్నారు. కొత్తపల్లి మండలం ఖాజీపూర్ లో కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. కమాన్పూర్లో రూ.20 లక్షల జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా మంజూరైన పనిముట్లను లబ్ధి దారులకు అందజేశారు. సంజయ్ మాట్లాడుతూ వడ్ల కొనుగోలు కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారని, ఎంతమంది రైతులు చస్తే స్పందిస్తారని నిలదీశారు. వడ్ల కొనుగోలుకు టోకెన్లు ఇవ్వడానికి దళారులు కమీషన్లు తీసుకోవడం దురదృష్టకరని, వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు వెళ్తే మంత్రులను రైతులు కొట్టేలా ఉన్నారన్నారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వస్తే...ఇప్పటిదాకా 15 లక్షల మెట్రిక్ టన్నులే కొంటారా? అంటూ మండిపడ్డారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఖాజీపూర్, కమాన్పూర్ సర్పంచ్లు కోమటిరెడ్డి అంజనికుమార్, నునుగొండ మానసప్రవీణ్, నాయకులు తిరుపతి, రతన్కుమార్, అనిల్కుమార్ పాల్గొన్నారు. మోడీ సభకు వాల్ రైటింగ్ ఈనెల 10న సికింద్రాబాద్లో నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు తరలిరావాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం కరీంనగర్ చైతన్యపురిలోని తన నివాసం వద్ద గోడపై వాల్ రైటింగ్ చేశారు. ప్రతి ఒక్క నాయకుడు, ప్రజాప్రతినిధి సహా కార్యకర్తలంతా తమ తమ డివిజన్లలో మోదీ సభ తేదీ, సమయం, ప్రాంతం తెలిసేలా వాల్ రైటింగ్తోపాటు వినూత్న రీతిలో ప్రచారం చేయాలని కోరారు. సాయంత్రం నగరంలోని ఓ ఫంక్షన్హాల్లో జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. బండి సంజయ్ తోపాటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్రావు, పార్టీ సీనియర్ నేతలు బాస సత్యనారాయణ, డీ.శంకర్, గుగ్గిళ్లపు రమేశ్, రాష్ట్ర అధికార ప్రతినిధి జే.సంగప్ప, బి.ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు. -
పాముకాటుతో మహిళ మృతి
గొల్లపల్లి: మండలంలోని మల్లన్నపేటకు చెందిన బండారి లక్ష్మి (55) నాగుపాము కాటుతో మృతిచెందింది. కుటుంబ సభ్యుల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి సమయంలో బయటకు వెళ్లిన లక్ష్మిని పాము కాటేసింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. వడదెబ్బతో వృద్ధుడి..బుగ్గారం: మండలంలోని చిన్నాపూర్కు చెందిన బియ్యాల బాపురావు (65) వడదెబ్బతో మృతిచెందాడు. భార్య మోకాలి శస్త్రచికిత్స చేయించుకుని కరీంనగర్లోని కుమారుల వద్ద ఉంటోంది. బాపురావు తన కూతురు గ్రామమైన మల్యాల మండలం మద్దుట్లకు రెండు రోజుల క్రితం వెళ్లాడు. మంగళవారం చిన్నాపూర్ వచ్చాడు. ఇంట్లో నిద్రపోయాడు. రాత్రి అయినా ఆయన బయటకు రాకపోవడంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా.. అప్పటికే మృతిచెందాడు. విషయాన్ని కుటుంబసభ్యులకు చేరవేశారు. కాలువిరిగిన ఉపాధిహామీ కూలిచందుర్తి(వేములవాడ): ఉపాఽధిహామీ పనులు చేస్తున్న స్థలంలో ప్రమాదవశాత్తు కాలు జారి గుంతలో పడి కూలీ కాలు విరిగింది. ఈ సంఘటన చందుర్తి మండలం నర్సింగపూర్లో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు. చందుర్తి మండలం నర్సింగపూర్లో ఉపాధిహామీ పథకంలో కందకాల పనులు చేస్తున్నారు. ఈ పనులు చేస్తున్న సమయంలో కూలీ దేశవేని లక్ష్మి(45) కాలు జారి గుంతలో పడడంతో కాలు విరిగింది. దీంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. మొక్కజొన్న పంట దగ్ధంమల్లాపూర్ : షార్ట్ సర్క్యూట్తో ఎకరంన్నర మొక్కజొన్న పంట దగ్ధమైన ఘటన మండలంలోని వేంపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుమ్ముల లత ఎకరంన్నర మొక్కజొన్న సాగుచేసింది. కూలీలతో కంకులను రాశిగా పోసింది. ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగి మొక్కజొన్న పంటకు అంటుకున్నాయి. బాధితురాలు, కుటుంబసభ్యులు, స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. మొత్తంగా రూ.1.50లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితురాలు పేర్కొంది. ఆర్ఐ అశోక్, సర్పంచ్ గుగ్లావత్ రాజేందర్, ఉపసర్పంచ్ రొడ్డ హరీకరాజు వెళ్లి పంటను పరిశీలించారు. -
మూడు నెలలకోసారి జాబ్మేళా
కరీంనగర్టౌన్: జిల్లాలో మూడు నెలలకు ఒకసారి జాబ్మేళా నిర్వహిస్తామని కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్మేళాను పర్యవేక్షించారు. ఎంతమంది హాజరయ్యారు, ఏయే కంపెనీలకు అవకాశం కల్పించారు.. తదితర వాటిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఇతర ప్రాంతాల్లో మూడు నెలలకోసారి జాబ్మేళా ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలో నిరుద్యోగులకు వివిధ కంపెనీల్లో అవకాశాలు కల్పిస్తామని, తద్వారా వారి ఆర్థిక అభ్యున్నతికి తోడ్పడుతామన్నారు. మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వివిధ రంగాలకు చెందిన 90 కంపెనీలు నియామక ప్రక్రియను నిర్వహించాయి. మూడు వేల మంది యువత హాజరుకాగా, 997మంది వివిధ ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికయ్యారు. మరో 478 మందిని వివిధ కంపెనీలు తక్షణమే ఉద్యోగాలకు ఎంపిక చేయగా, త్వరలో వారికి నియామక పత్రాలు అందజేయనున్నారు. ఆర్డీవో కే.మహేశ్వర్, జిల్లా ఉపాధి కల్పన అధికారి తిరుపతిరావు, డీవైఎస్వో శ్రీనివాస్గౌడ్, పరిశ్రమలశాఖ జీఎం సాల్మ న్ రాజు, పీడీ మెప్మా స్వరూపరాణి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి పాల్గొన్నారు. -
చెట్టంత ఆలోచనతో కథ రాశాను
వేసవి కాలం, ఎండ తీవ్రతకు అంతా ఇబ్బంది పడుతున్న విషయంపై నేను రాసిన కథ అందరికి నచ్చింది. తోవ వెంబడి ఒక్క చెట్టు లేదు అని వృద్దుడు చెప్పిన విషయంతో చెట్లు నాటితే అవి మనుషులకు ఎంత సేవ చేస్తాయే రాశాను. స్వచ్ఛమైన గాలిని ఇవ్వడమే కాదు.. నీడనిచ్చి పండ్లను ఇచ్చే చెట్టుకు ఉన్న ప్రాధాన్యతను కథలో వివరించాను. అందరు చెట్లు నాటి వాటిని సంరక్షించాలని కథలో చెప్పాను. మేము కూడా కథలు రాయగలమని మా టీచర్లు ప్రోత్సహించారు. – చిగురు ప్రణయ్, 8వ తరగతి కథలు, కవితలు రాయాలంటే పెద్ద చదువులు చదివి ఉండాలని అనుకునేదాన్ని. మా స్కూల్లో పెద్ద సారు, తెలుగు టీచర్ మాతో కథలు రాయించారు. మనం చూసినవి, విన్నవి, మన చుట్టూ జరిగే సంఘటనలతో కథలు రాయవచ్చని చెప్పారు. పెద్ద పెద్ద పదాలు అవసరం లేదన్నారు. అలా నేను కూడా మామిడిపండ్ల గంప పేరుతో కథ రాశాను. అది అందరికీ నచ్చింది. ఆటపాటలతోపాటు చదువు ఉండాలని, అల్లరి ఒక స్థాయి వరకే అని చెప్పే కథ ఇది. – కీర్తన, పదో తరగతి -
డీఎఫ్వో బాధ్యతల స్వీకరణ
కరీంనగర్ అర్బన్: కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల ఫారెస్ట్ అధికారి(డీఎఫ్వో)గా ఎస్.సత్యనారాయణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్నాళ్లు ఇక్కడ డీఎఫ్వోగా వ్యవహరించిన బాలమణి కొమురంభీం అసిఫాబాద్ జిల్లాకు బదిలీ అయిన విషయం తెలి సిందే. సత్యనారాయణ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నుంచి ఇక్కడికి బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన డీఎఫ్వోను అటవీ అధికా రుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ఎఫ్ఆర్వోలు, డిప్యూటీ ఆర్వోలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. భూసార పరీక్షలు చేయించుకోవాలికొత్తపల్లి: ప్రతిరైతు భూసార పరీక్షలు చేయించుకోవాలని రైతు శిక్షణ కేంద్రం వ్యవసాయ ఉప సంచాలకుడు డీడీఏ డిప్యూటీ డైరెక్టర్ ఉషారాణి సూచించారు. ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సోమవారం కొత్తపల్లి రైతు వేదికలో చింతకుంట, రేకుర్తి, సీతారాంపూర్ రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. నేల ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారిస్తూ సేంద్రీయ ఎరువులు వాడితే అధిక దిగుబడి వస్తుందన్నారు. ఆయిల్ ఫామ్ సాగు, వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్ల వినియోగం, పంట రుణాలు, సహజ వ్యవసాయం, నాణ్యమైన విత్తనాలు, సమతుల ఎరువులపై అవగాహన కల్పించారు. పచ్చిరొట్టె ఎరువులు వాడాలని ఏవో అనూష తెలిపారు. ఏఈఓ రాము, ఆదర్శ రైతులు చిట్కూరు శ్రీనివాస్, చింతల శ్రీనివాస్ రెడ్డి, కోదాడ శంకర్ పాల్గొన్నారు. సమ్మక్క చెరువు ప్రాంతంలో ‘ఇనార్ట్’ వ్యర్థాలుకరీంనగర్ కార్పొరేషన్: డంప్యార్డ్లో చెత్తను బయోమైనింగ్ చేసిన అనంతరం వెలువడే ‘ఇనార్ట్’ వ్యర్థాలను నగరంలోని 7వ డివిజన్ సమ్మక్క సారలమ్మ గద్దె సమీపంలోని లోతట్టు ప్రాంతంలో వేయడం వివాదంగా మారింది. డంప్యార్డ్లో చెత్తను యంత్రాల ద్వారా జల్లెడ పట్టినప్పుడు వెలువడే రీసైకిల్కు వీలులేని వ్యర్థాలను ఇనార్ట్ అంటారు. ఈ వ్యర్థాలను సమ్మక్క సారలమ్మ గద్దెల సమీపంలో ఎస్టీపీ పక్కన లోతట్టు ప్రాంతంలో నగరపాలకసంస్థ సిబ్బంది పడేస్తున్నారు. దీంతో సోమవారం స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకొని ఇనార్ట్ వ్యర్థాలను తీసుకొచ్చిన లారీని అడ్డుకొని ఆందోళన చేపట్టారు. ఈ వ్యర్థాలు వేయడం మూలంగా తమ ప్రాంతం కలుషితం అవుతుందని, ఇప్పటికే దుర్వాసన వస్తుందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ కార్పొరేటర్ ఆకుల ప్రకాశ్ పాల్గొన్నారు. రూ.50 కోట్లతో అభివృద్ధి పనులుకరీంనగర్ కార్పొరేషన్: నగరంలో రూ.50 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. నగరపాలకసంస్థ 40వ డివిజన్ తిరుమల్నగర్లో రూ.10లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు స్థానిక కార్పొరేటర్ నలువాల పుష్పలత రవీందర్తో కలిసి సోమవారం ఆయన భూమిపూజ చేశారు. అనంతరం కాలనీలో పలు డ్రైనేజీ సమస్యలు, రోడ్డు సమస్యలను స్థానిక ప్రజలు మేయర్ దృష్టికి తేవడంతో వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రూ.50 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. -
సాక్షితోనే ఉత్తమ ఫలితాలు
ఇల్లంతకుంట(మానకొండూర్): పదోతరగతి విద్యార్థులకు ‘సాక్షి’ స్టడీ మెటీరియల్ ఉపయోగపడిందని పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు తెలిపారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో చాలామంది విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు. ‘సాక్షి’ యాజమాన్యం 10వ తరగతి పరీక్షలకు రెండు నెలల ముందు నిష్ణాతులైన అధ్యాపక బృందం ఆధ్వర్యంలో ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్ స్టడీ మెటీరియల్ను రూపొందించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అందజేసింది. ఈక్రమంలోనే మండలంలోని రహీంఖాన్పేట మోడల్స్కూల్కు 10 సాక్షి దినపత్రికలను కూడా అందించారు. విద్యార్థులకు అందజేసిన స్టడీ మెటీరియల్తో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు సులభతరమయ్యాయని విద్యార్థులు పేర్కొన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించడంతోపాటు ఉత్తీర్ణత శాతం పెరిగిందని ఉపాధ్యాయులు తెలిపారు. ● స్టడీ మెటీరియల్ ఉపయోగపడిందన్న విద్యార్థులు ● ఉత్తమ మార్కులతో విద్యార్థుల ఉత్తీర్ణత ఉపాధ్యాయులు సిలబస్ను డిసెంబర్ వరకే పూర్తి చేశారు. సెప్టెంబర్ నుంచి అదనపు త రగతులు నిర్వహించారు. పరీ క్షలకు రెండు నెలల ముందు ‘సాక్షి’ స్టడీమెటీరియల్ ఫిజి క్స్, మ్యాథమెటిక్స్ ఉచితంగా అందించారు. ఉపాధ్యాయులందించిన నోట్స్తోపాటు సాక్షి స్టడీ మెటీరియల్ చదువుకోవడం జరిగింది. సులభతరంగా ఉంది. 588 మార్కులు సాధించడంలో దోహదపడింది. సాక్షి యాజమాన్యానికి కృతజ్ఞతలు. – ఎం.హర్షిత, రహీంఖాన్పేట మోడల్స్కూల్ ‘సాక్షి’ యాజమాన్యం అందించిన స్టడీ మెటీరియల్ సులభతరంగా ఉంది. నోట్స్తోపాటు స్టడీమెటీరియల్ చదవడంతో కఠినంశాలు సులభంగా అర్థమయ్యాయి. సాక్షి స్టడీ మెటీరియల్తోపాటు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో 582 మార్కులు సాధించాను. – నారెడ్డి మహిత, రహీంఖాన్పేట మోడల్ స్కూల్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న సమయంలో ‘సాక్షి’ స్టడీ మెటీరియల్ ఉచితంగా అందించారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహానికి స్టడీ మెటీరియల్ తోడు కావడంతో 572 మార్కులు సాధించాను. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్లో మార్కులు స్కోరు కావడానికి స్టడీ మెటీరియల్ దోహదపడింది. – అప్సా తహమీనా, రహీంఖాన్పేట మోడల్స్కూల్ -
విద్యుత్ భద్రత వారోత్సవాలపై విస్తృత ప్రచారం
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ భద్రత వారోత్సవాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నామని టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ రాపెల్లి రవీందర్ తెలిపారు. గృహ వినియోగదారులు, రైతులు విద్యుత్తో జాగ్రత్త వహించాలని కోరారు. జీరో ప్రమాదాలే లక్ష్యంగా ఈనెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు సర్కిల్వ్యాప్తంగా విద్యుత్ భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి సర్కిల్ పరిధిలో వాల్ పోస్టర్లు, కరపత్రాలు పంపిణీ చేస్తూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అడవి పందుల నుంచి పంట పొలాలను రక్షించడానికి కరెంట్ ఫెన్సింగ్ అమర్చడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. నాసిరకం వైరింగ్, నాణ్యతలేని పరికరాలు, ఎర్తింగ్ లేకపోవడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. -
గంట ముందే స్పాట్కు!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: నగరంలోని పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఎలాంటి బెరుకూ లేకుండా ఉదయాన్నే భారీ దోపిడీ చేసి, యథేచ్ఛగా పారిపోయిన వైనాన్ని సవాలుగా తీసుకున్నారు. దొంగల సంచారం, కదలికలు, వారి చిరునామా, నేరచరితపై కీలక సమాచారం సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను మహారాష్ట్ర, బిహార్కు పంపినట్లు సమాచారం. మరికొంతమంది పోలీసులు సీసీ ఫుటేజీలను విశ్లేషిస్తున్నారు. వారి ఫొటోల ఆధారంగా క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఏ) సాయంతో నిందితులను ఇప్పటికే గుర్తించినట్లు తెలిసింది. నిందితుల్లో ఒకరు పుణే, మరొకరు నందూర్బర్ జిల్లాలతో పాటు బిహార్కు చెందిన వారిగా గుర్తించినట్లు సమాచారం. సీసీ ఫుటేజీని ‘రివర్స్ మేనర్’(ఎలా వచ్చారు? అన్న విజువల్స్)లో విశ్లేషించినప్పుడు దొంగలంతా దోపిడీకి కేవలం గంట ముందే కరీంనగర్కు వచ్చినట్లు రికార్డు అయ్యింది. అంటే ముందు రోజు ఎక్కడా బస చేసిన దాఖలాలు లేవు. కొంతకాలంగా రెక్కీ నిర్వహించి, పారిపోయేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కాబట్టే నింపాదిగా వచ్చారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్ర బ్యాగే పట్టిస్తోంది..? చోరీ సమయంలో నిందితుల్లో ఒకరి బ్యాగు కీలకంగా మారింది. ఆ బ్యాగుపై ‘ఐ లవ్ నందూర్బర్’ అని రాసి ఉంది. నందూర్బర్ ఉత్తర మహారాష్ట్రకు చెందిన జిల్లా. గుజరాత్ సరిహద్దులో ఉంటుంది. నిందితుల్లో మరొకరు పుణే జిల్లాలో నేరచరిత కలి గిన పఠాన్గా గుర్తించినట్లు తెలిసింది. మహారాష్ట్రకు పారిపోవాలంటే పెద్దపల్లి, మంథని మీదుగా వెళ్లవచ్చు. కానీ.. ఆ మార్గంలో ట్రాఫిక్, చెక్పోస్టులు ఎక్కువ. అందుకనే చోరీ అనంతరం శాతవాహన యూనివర్సిటీ, మల్కాపూర్, రామడుగు, లక్ష్మీపూ ర్, రుద్రారం, గుండి, పెగడపల్లి, జగిత్యాల మీదుగా మహారాష్ట్ర వైపు వెళ్లినట్లుగా సీసీ ఫుటేజీని పోలీసులు సంపాదించారు. ప్రధాన రహదారుల వెంట వెళ్తే సులువుగా పట్టుబడతామని, పోలీసుల కళ్లు గప్పేందుకు గ్రామీణ రహదారిని ఎంచుకున్నారు. వీరిని పట్టుకునేందుకు నాలుగు బృందాలు ఆదివారం సాయంత్రం మహారాష్ట్ర, బిహార్కు బయల్దేరాయి. మరో నాలుగు బృందాలు (ఒక్కో బృందంలో నలుగురు చొప్పున సభ్యులు) కరీంనగర్ నుంచి జగిత్యాల మీదుగా మహారాష్ట్ర, బీహార్, ఇటువైపు హైదరాబాద్ వరకు వందలాది సీసీ కెమెరాల ఫుటేజీని వడపోస్తున్నారు. నిందితులు వాడిన అపాచీ, పల్సర్ బైకు నంబర్లు స్పష్టంగా లేకపోవడంతో గుర్తింపు కష్టంగామారింది. నిందితులు సిరిసిల్ల వైపు వెళ్లినట్టే వెళ్లి దారిమార్చి, వాహనాలనూ మార్చినట్లు పోలీసులు గుర్తించారు. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞాన్ని విస్తృతంగా వాడుతున్నారు. నిందితుల ఫొటోల ఆధారంగా నేషనల్ ఇంటిగ్రేటెడ్ గ్రిడ్ (నాట్గ్రిడ్) సాఫ్ట్వేర్ సాయంతో వారి నేరచరిత, ఎఫ్ఐఆర్, జైలు జీవితం, ఫోన్నంబర్లు తదితర వ్యక్తిగత వివరాలతో సహా కీలక అంశాలను ఇప్పటికే సేకరించారు. బందిపోట్లు, కరుడుగట్టిన నేరస్తులు, ఉగ్రవాదుల డేటాను నాట్గ్రిడ్లో పొందుపరుస్తారు. ఇది తిరిగి సీసీటీఎన్ఎస్తో అనుసంధానంగా ఉంటుంది. ఈ డేటాబేస్ను ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (ఆర్ఏడబ్ల్యూ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తదితర జాతీయ దర్యాప్తు సంస్థలు వినియోగిస్తాయి. గతేడాది నుంచి ఈ డేటాబేస్ ఎస్పీ ర్యాంకు ఆఫీసర్లకు ఉగ్రవాద, ఇతర కీలక కేసుల్లో దర్యాప్తు కోసం యాక్సెస్ కల్పించారు. వచ్చిన వారు ఉగ్రవాదులు అయి ఉంటారన్న అంశాన్ని పోలీసులు కొట్టిపారేయకపోవడం గమనార్హం. నిందితులు వచ్చిన మార్గంలోని అన్ని సెల్టవర్ల పరిధిలో అనుమానిత సెల్ఫోన్ సంభాషణల కోసం డంప్ (సెల్ టవర్ నుంచి వెళ్లిన కాల్స్ వివరాలు)ను సీడాట్ పద్ధతిలో జల్లెడ పడుతున్నారు. ఇందులోనూ కొన్ని అనుమానిత నంబర్లను పోలీసులు గుర్తించారు. ఆ నంబర్ల సంచారం ఆధారంగానే పోలీసులు దొంగలను వెంటాడుతూ వెళ్లారని సమాచారం. చోరీ అనంతరం దొంగలు ఆ నంబర్లను మార్చడం గమనార్హం. -
దేశ విభజనవాదులకు గుణపాఠమిది
కరీంనగర్: దేశాన్ని ఉత్తరాది– దక్షిణాది పేరుతో విభజించాలనే ప్రయత్నాలు చేసిన వారికి ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు గుణపాఠంగా మారాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతోందంటూ వ్యాఖ్యలు చేసిన తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రజలు సరైన సమాధానం ఇచ్చారని అన్నారు. బెంగాల్లో బీజేపీ కార్యకర్తల పోరాటాలు, త్యాగాల ఫలితంగానే ఆ పార్టీకి అధికారం దక్కిందని పేర్కొన్నారు. కరీంనగర్లోని వెంకటాద్రి, రేనే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పీఎంజే జువెలర్స్ సిబ్బందిని సోమవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్ ఘటనను దారుణమైందన్నారు. ఇలాంటి సందర్భాల్లో బాధితులను పరామర్శించడం మానవత్వమని, బీఆర్ఎస్ నేతలు అనవసర ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఈ ఘటనకు తాను రాజీనామా చేయాలనడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్రావు పాల్గొన్నారు. -
అర్జీ భద్రం.. పక్కా పరిష్కారం
కరీంనగర్ అర్బన్: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజావాణి లక్ష్యమని, అర్జీలను నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేదిలేదని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయాశాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ప్రతీ అర్జీని సునిశితంగా పరిశీలించి పరిష్కారం చూపాలని, సదరు సమాచారం అర్జీదారుకు తెలుపాలని స్పష్టం చేశారు. కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అర్జీలను స్వీకరించారు. ప్రధానంగా భూ సమస్యలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దరఖాస్తులు అధికమొత్తంలో రాగా మొత్తం 99 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు. మండలస్థాయి, డివిజన్స్థాయి, మునిసిపల్ స్థాయిలో ప్రజావాణి జరుగుతుండటంతో అర్జీలు తగ్గాయి. డివిజనల్ ప్రజావాణి షురూ డివిజన్స్థాయిలో ప్రజావాణి నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశం మేరకు సోమవారం కలెక్టరేట్లో డివిజన్స్థాయి ప్రజావాణిని నిర్వహించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలోనే ఓ వైపున కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్డీవో కుందారపు మహేశ్వర్ అర్జీలను స్వీకరించగా ఆయాశాఖల డివిజన్స్థాయి అధికారులకు బదలాయించారు. గ్రామంలోని 207, 301 సర్వే నంబర్లలో 6.08ఎకరాల భూమి ఉంది. కొంత భూమి సంపత్ పేరుపై కనిపిస్తోంది. ఇదెక్కడి అన్యాయమని అధికారులను కలిస్తే ఎవరూ సమాధానం ఇవ్వడం లేదు. ఏ రకంగా అతని పేరున మారిందో వివరాలివ్వాలని ఏడాదికాలంగా తిరుగుతుంటే జవాబు లేదు. ఒకరి భూమిని మరొకరి పేరున ఇష్టారీతిగా మార్చేందుకే అధికారమిచ్చిందా ప్రభుత్వం? – కె.చిన్నరాజయ్య, ముత్తారం, శంకరపట్నంజిల్లాకు మంజూరైన ఈఎస్ఐ డిస్పెన్సరీని అందుబాటులోకి తీసుకురావాలి. డిస్పెన్సరీ మంజూరై నెలలు గడుస్తున్నా ప్రారంభించడం లేదు. జిల్లాలో అనేకమంది ఈఎస్ఐ కార్డు కలిగిన కార్మికులు ఉన్నారు. డిస్పెన్సరీ పనిచేయకపోవడంతో చిన్న చికిత్సలకై నా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. – శ్రవణ్, భారతీయ మజ్దూర్ సంఘ్ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ఇష్టారీతిగా దోచుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా క్వింటాల్కు 8కిలోలు అదనంగా తూకం వేస్తున్నారు. అక్కడి నుంచి మిల్లుకు వెళ్లాకా మిల్లర్లు 2కిలోలు తరుగు తీస్తున్నారు. నిబంధనలను అమలు చేయకుండా అక్రమాలకు పాల్పడుతుండగా సెంటర్ నిర్వాహకులు, సంబంధిత అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. – రైతులు, బొమ్మకల్, సైదాపూర్గ్రామంలో పెద్దచెరువు ప్రధాన జల వనరు. రానున్న రోజుల్లో లోటు వర్షపాతం ఉంటుందని వాతావరణశాఖ చెబుతోంది. ఈ క్రమంలో పెద్దచెరువు మరమ్మతు పేరుతో నీటిని విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు. కేవలం చేపల కాంట్రాక్టర్ కోసం గ్రామ పాలకవర్గం ప్రయత్నాలు చేస్తోంది. నీటిని వదలకుండా కలెక్టర్ తక్షణమే చొరవ చూపాలి. – రైతులు, ఎలగందుల, కొత్తపల్లి మొత్తం అర్జీలు: 99 డీఆర్డీవో: 33, డీపీవో:09 సీపీ ఆఫీస్: 07 ఆర్డీవో హుజూరాబాద్: 08 -
దొంగలను పట్టుకుంటాం
కరీంనగర్ కార్పొరేషన్: జువెల్లరీ దొంగలను పట్టుకొని, ఆభరణాలను రికవరీ చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. దొంగతనం జరిగిన పీఎంఏ జువెల్లరీని సోమవారం సందర్శించారు. దొంగల దాడిలో గాయపడ్డ సిబ్బందిని హాస్పిటల్లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాయపడ్డ వారిని మెరుగైన చికిత్సకోసం అవసరమైతే హైదరాబాద్ తరలిస్తామన్నా రు. దొంగతనంపై గంగుల కమలాకర్, పాడి కౌశిక్రెడ్డి పోలీస్ శాఖ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్ కల్చర్, పబ్కల్చర్, గంజాయిలపై ఈగల్ను తీసుకువచ్చి ఉక్కుపాదం మోపారన్నా రు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వామన్రావు దంపతులను నడిరోడ్డుపై చంపిన దిక్కులేదని, దిశలాంటి ఎన్నో కేసులు జరిగాయని గుర్తు చేశారు. ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం మూడు రోజుల్లో విరమింప చేస్తే బీఆర్ఎస్ తట్టుకోలేకపోతుందన్నారు. పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్ పాల్గొన్నారు. -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
ధర్మపురి: మండలంలోని తిమ్మాపూర్కు చెందిన మెంగెని రాజ్కుమార్ (35) అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్కుమార్ ఇటీవల ఇల్లు కట్టుకొని అప్పుల పాలయ్యాడు. అప్పుల సమస్యలతో పాటు ఇంట్లో కుటుంబ కలహాలు మొదలవడంతో భరించలేక ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో పురుగుల మందు సేవించాడు. కుటుంబసభ్యులు గమనించి 108కు సమాచారం అందించగా చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతుడి తండ్రి మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకొని..మేడిపల్లి: ఇటీవల ప్రకటించిన పదోతరగతి ఫలితాల్లో తన తోటి విద్యార్థుల కంటే తక్కువ మార్కులు వచ్చాయని ఆవేదనతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన భీమారం మండలం ఒడ్యాడ్ గ్రామంలో చోటుచేసుకుంది. మేడిపల్లి ఎస్త్సె శ్రీధర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఒడ్యాడ్కి చెందిన నిమ్మల రక్షిత(15) ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసింది. అయితే తన తోటి విద్యార్థుల కంటే మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపంతో సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో సీలింగ్ ప్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి సుజాత ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అత్తారింటి వేధింపులకు వివాహిత...ఇల్లంతకుంట(మానకొండూర్): సంతానం కలగడం లేదని భర్త, అత్త, ఆడబిడ్డలు తరచూ వేధించడంతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై–2(ఆర్) లక్పతి తెలిపారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లికి చెందిన ఎలుక మల్లేశంతో కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన బాలమణికి 11 ఏళ్ల క్రితం వివాహమైంది. సంతానం కలగకపోవడంతో బాలమణి(35)ని భర్త మల్లేశం, ఆడబిడ్డలు, అత్తలు వేధించడంతో ఆదివారం ఇంట్లో క్రిమిసంహారక మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న బాలమణిని అంబులెన్స్లో కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. మృతురాలి తల్లి సామర్ల వినోద ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలమణి అంత్యక్రియలు తల్లిగారి గ్రామం కోనరావుపేట మండలం నిమ్మపల్లిలో నిర్వహించారు. బాలమణి భర్త ఇరిగేషన్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు. -
నిచ్చెనలెక్కుదాం
వైకుంఠపాళి(కై లాసం) ఆట ఇంట్లో కూర్చుని పిల్లలు, పెద్దలు ఆడుకుంటారు. చిన్నారులు నాయనమ్మలు, అమ్మమ్మలతో కూర్చుని ఆడుకోవడం ద్వారా కుటుంబ విలువలు, మానవీయ విలువలు పిల్ల లకు అర్థం అవుతాయి. ఇది ఈ ఆట పరమార్థం. ఆట ఇలా... వైకుంఠపాళి ఆటను ఎంతమందైనా ఆడవచ్చు.. ఒక్కొక్కరు వేరువేరు రకాల పావులు అమర్చుకోవాలి. ఆట ఆడేవారంతా పటానికి ఎదురుగా కూర్చోవాలి. నాలుగు గవ్వలతో వందెం వేయాలి. పటంలో 1నుంచి 132 గళ్లు ఉంటాయి. గళ్లల్లో రకరకాల బొమ్మలు ఉండి గళ్లకు కింది భాగాన పాములు, ఏనుగులు ఉంటాయి. ఆటను 1 నుంచి(పాతాళం) మొదలుపెట్టి పావులను కదుపుతూ ఆట ఆడుతారు. కన్ను, రెండూ, మూడు, నాలుగు, ఎనిమిది వంటి పదాలు చెలామణిలో ఉన్నాయి. పటంలో 16, 19, 30, 41, 52, 63, 65, 74, 79, 87 సంఖ్యల గళ్లల్లో నిచ్చెనలు ఉంటాయి. పందెం వేసిన సంఖ్యను బట్టి నిచ్చెన ఎక్కవచ్చు. పుణ్యం చేసిన వారు నిచ్చెన సహాయంతో సులభంగా స్వర్గం చేరుతారనేది ఈ ఆటలో నమ్మకం. పటంలో అక్కడక్కడా పాములు ఉంటాయి. పావు పాము నోటిలో పడితే ఆటగాడు కిందకు జారి పోతాడు. ఇలా పావులతో నిచ్చెనలు ఎక్కుతూ పాములు మింగేస్తూ ఆట ముందుకు సాగుతుంది. – సాక్షి, కరీంనగర్ డెస్క్ -
శుభకార్యానికి వెళ్లివస్తూ..
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిధర్మపురి: శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తూ ట్రాక్టర్ ఢీకొనడంతో ఓ వ్యకిత మృతి చెందాడు. ఎస్సై మహేశ్ కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండం దమ్మన్నపేటకు చెందిన మైదం రాజన్న (65) శుభకార్యానికి హాజరయ్యేందుకు ఆదివారం ద్విచక్ర వాహనంపై ఓ గ్రామానికి వెళ్లాడు. రాత్రివేళ ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో ధర్మపురిలోని తమ్మల్లకుంట వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని వెంటనే 108 అంబులెన్సులో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. హుజూరాబాద్రూరల్: వరంగల్ – కరీంనగర్ ప్రధాన రోడ్డు మందాడిపల్లి గ్రామ సమీపంలో కంటైనర్ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బిహార్కు చెందిన హమాలీ రాజు మంజిత్ (18) అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. సిరిసిల్లలో హమాలీ పని చేసుకునే కూలీలు స్వగ్రామానికి వెళ్లేందుకు కరీంనగర్ వరకు బస్సులో వచ్చారు. అక్కడి నుంచి వరంగల్కు ఆటో మాట్లాడుకున్నారు. ఆటో మందాడిపల్లి వద్దకు చేరుకోగానే వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్తున్న కంటైనర్ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆటో పూర్తిగా ధ్వంసమైంది. కంటైనర్ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైలు నుంచి పడి యువకుడు.. జమ్మికుంట: మండలంలోని బిజిగిరిషరీప్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. రామగుండం రైల్వే హెడ్కానిస్టేబుల్ గంగారపు తిరుపతి తెలిపిన వివరాలు.. ఖమ్మం జిల్లా చింతకాని గ్రామానికి చెందిన దేవళ్ల రాజేశ్(33) రెండేళ్లుగా వరంగల్ పట్టణంలో కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. రాజేశ్ సెల్ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని మృతుడి అన్న సతీశ్ ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదు చేశా తిరుపతి వివరించారు. -
సమ్మర్ క్యాంపుపై సందిగ్ధం
కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్లో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో యేటా నిర్వహించే వేసవి క్రీడా శిబిరాలపై ఈసారి సందిగ్ధం నెలకొంది. ఏడేళ్లుగా (కరోనా వైరస్, ఎన్నికల కోడ్ మినహా) నిరంతరంగా కొనసాగుతున్న శిబిరాలు ఈసారి ఉంటాయా? లేదా? అన్న సందేహం కోచ్లు, తల్లిదండ్రులు, చిన్నారులను కలవరపెడుతోంది. 2017 నుంచి వేసవి శిబిరాలను ప్రారంభించిన నగరపాలక సంస్థ 2020, 2021లో కరోనా వైరస్ కారణంగా, 2024లో ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిర్వహించలేదు. ఈసారి ఎలాంటి అడ్డంకి లేకున్నా శిబిరాల నిర్వహణపై నగరపాలక సంస్థ మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే వేసవి సెలవులు ప్రారంభం కాగా.. శిబిరాలపై ఎలాంటి ప్రకటన లేకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. భారం అనుకుంటున్నారా? నగరంలోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు సరైన వేదిక కల్పించాల్సిన బాధ్యత బల్దియాపై ఉందని నగర ప్రజలు గుర్తుచేస్తున్నారు. చిన్నారులకు ఇచ్చే పాలు, గుడ్లు, అరటి పండ్లు, కోచ్లకు ఇచ్చే గౌరవ వేతనాల భారం తప్పించుకోవడానికే శిబిరాలను పక్కన పెడుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్రీడలపై ఆసక్తి పెంచే ఈ శిబిరాలు నిలిచిపోతే, యువతలో నైపుణ్యాల అభివృద్ధి దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికారులు స్పందించి శిబిరాల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం హామీలకే పరిమితం కాకుండా, వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని కోరుతున్నారు. శిబిరం నిర్వహణపై బల్దియా మౌనం ఉచిత శిక్షణ శిబిరాల సంప్రదాయానికి బ్రేక్? నిరాశలో చిన్నారులు, తల్లిదండ్రులు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు నిర్వహణ ఇలా ఏడాది క్రీడలు కోచ్లు చిన్నారులు గౌరవవేతనం 2017 17 28 1,500 రూ.5,000 2018 20 40 2,500 రూ.5,000 2019 22 45 2,600 రూ.5,000 2022 27 72 3,200 రూ.5,000 2023 28 70 3,000 రూ.8,000 2025 17 35 1,700 ఇవ్వలేదు -
కల్లు దుకాణాల్లో నియంత్రణ కరువు
జగిత్యాలక్రైం: కల్లు షాపులపై అధికారుల నియంత్రణ కరువైంది. కొద్దిపాటి కల్లులోనే రసాయనాలు కలిపి భారీగా తయారుచేస్తూ సీసాల్లో నింపి ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. చిన్నారులకు మద్యం విక్రయించవద్దని ఉన్నా అవేమీ పట్టించుకోకుండా కల్లు షాపుల్లో ఇష్టారాజ్యం కొనసాగుతోంది. వారు విక్రయించే కల్లుతో ఎంతోమంది చిన్నారులు, పెద్దలు అస్వస్థతకు గురవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్రోడ్లో తండ్రితో కలిసి ఓ నాలుగేళ్ల బాలుడు వచ్చినా నిర్వాహకులు అడ్డుచెప్పలేదు. పైగా అతడికి తండ్రే కల్లు తాగిపించడం గమనార్హం. దీంతో బాలుడే అక్కడే నిద్రమత్తులోకి జారుకున్నాడు. బాలుడు కల్లు తాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తండ్రితో కలిసి చిన్నారి కల్లు సేవిస్తున్నా అక్కడి షాపు యజమానులు చూసీచూడనట్లు వ్యవహరించారు. ఇటీవల కల్లు దుకాణాలపై ఎకై ్సజ్ అధికారుల పర్యవేక్షణ కూడా కరువవడంతో ప్రజలకు అనారోగ్యం కలిగించే రసాయనాలు కలిపి కల్లు విక్రయిస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని షాపుల్లో మత్తు పెంచేందుకు గుల్ఫారామ్ వంటి పదార్థాలు కలుతున్నా వాటిని పరిశీలించే వారే కరువయ్యారన్న ఆరోపణలు వెల్లువెతుతున్నాయి. తండ్రితో కలిసి కల్లు తాగిన బాలుడు కల్లు నిర్వాహకుల ఇష్టారాజ్యం -
ప్రశాంతంగా నీట్
కరీంనగర్ టౌన్/సప్తగిరికాలనీ(కరీంనగర్)/కరీంనగర్ అర్బన్: వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయస్థాయిలో నిర్వహించిన నేషనల్ ఎంట్రెన్స్ పరీక్ష ఆదివారం కరీంనగర్లో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాకేంద్రంలోని ఏడు కేంద్రాల్లో మొత్తం 2,928 మంది అభ్యర్థులకు 2,865 మంది పరీక్ష రాశారు. మహిళా డిగ్రీ కళాశాలలో 725 మంది, ఎస్సారార్ కళాశాలలో 704 మంది, కేంద్రీయ విద్యాలయంలో 376 మంది, మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 305మంది, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో 283 మంది, టీజీఎస్డబ్ల్యూ చింతకుంటలో 239 మంది, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో 233 మంది పరీక్ష రాశారు. పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు. మెటల్ డిటెక్టర్లు, బయోమెట్రిక్ విధానం ద్వారా పారదర్శకతను పాటించారు. పరీక్షా ప్రశ్నాపత్రం ఈ ఏడాది మధ్యస్థంగా ఉన్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు మంచి ర్యాంకులు వస్తాయన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు కలెక్టర్ చిత్రామిఽశ్రా తెలిపారు. కరీంనగర్లోని మహిళా డిగ్రీ కళాశాల, ఎస్ఆర్ఆర్ కళాశాల, కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను సందర్శించారు. పరీక్ష నిర్వహణ తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కోఆర్డినేటర్లతో వసతులు, అభ్యర్థుల హాజరు తదితర అంశాలపై ఆరా తీశారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న మొత్తం అభ్యర్థుల్లో అత్యధిక సంఖ్యలో హాజరై పరీక్ష రాశారని, హాజరుశాతం సంతృప్తికరంగా నమోదయిందన్నారు. ఏడు కేంద్రాల్లో 100శాతం బయోమెట్రిక్ హాజరు నమోదు చేసినట్లు తెలిపారు. -
కనికరించని మానవత్వం
● అనారోగ్యంతో యువకుడి మృతి ● తోపుడు బండిపై శవాన్ని ఇంటికి తీసుకెళ్లిన కుటుంబసభ్యులు శంకరపట్నం: మండలంలోని కేశవపట్నంలో ఆదివారం రాత్రి అనారోగ్యంతో యాకుబ్(35) మరణించగా, కుటుంబసభ్యులు తోపుడు బండిపై శవాన్ని ఇంటికి తీసుకెళ్లారు. కేశవపట్నం గ్రామానికి చెందిన వీరయ్య, రుక్కమ్మకు కొడుకు యాకుబ్, కూతురు ఉన్నారు. వీరికి పెళ్లిళ్లు అయ్యాయి, యాకుబ్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా ఆటో నడుపుకుంటూ జీవించేవాడు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు, వీరయ్య, రుక్కమ్మలు రోడ్డు పక్కన టేలాలో చెప్పులు విక్రయించగా, ప్రస్తుతం వ్యాపారం లేక పోవడంతో కేశవపట్నం మేన్ రోడ్డుపై తోపుడు బండిపై పండ్లు అమ్ముకుంటున్నారు. యాకుబ్ రోడ్డుపక్కన గదిలో ఉండగా ఆదివారం రాత్రి చనిపోయాడు. శవాన్ని ఇంటికి తీసుకెళ్లందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో తోపుడు బండిపై యాకుబ్ శవాన్ని తల్లిదండ్రులతో పాటు సోదరి, బావ తీసుకెళ్లారు. సాహిత్యంతో పౌర సమాజం జాగృతంకరీంనగర్కల్చరల్: పండితుల పామరుల హృదయాలను కదిలించగలిగే సాహిత్యంతో పౌర సమాజం జాగృతం అవుతుందని ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నందిని సిధారెడ్డి అన్నారు. ఆదివారం ఫిలింభవన్లో తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం, శాతవాహన లయన్స్ క్లబ్, లీడ్ ఇండియా నేషనల్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి రచించిన ఆదివారం ‘కవన గోదారి’ కవితా సంపుటిని ఆవిష్కరించి మాట్లాడారు. తరుగుతున్న మానవీయ విలువలను తన కవిత్వంతో తట్టి లేపడానికి బుర్ర మధుసూదన్ రెడ్డి కృషి చేయడం అభినందనీయమన్నారు. సభాధ్యక్షత వహించిన ప్రముఖ సాహితీవేత్త దాస్యం సేనాధిపతి మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి కవి, రచయిత, కాలమిస్టు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, సమాజ సేవకులుగా పలు రంగాల్లో తమదైన విలక్షణ ప్రతిభను చాటుకుంటూ దూసుకుపోతున్నారన్నారు ఈ కార్యక్రమంలో కవులు అన్నాడి గజేందర్రెడ్డి, డాక్టర్ మచ్చ హరిదాసు, కొత్త అనిల్ కుమార్, బొమ్మకంటి కిషన్, అనిత పాల్గొన్నారు. -
నేటి నుంచి రైతు వారం
కరీంనగర్ అర్బన్/జగిత్యాలఅగ్రికల్చర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతు వారం నిర్వహిస్తోంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల కార్యాచరణను రూపొందించగా సోమవారం నుంచి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రభుత్వం సాగు రంగానికి చేసిన సేవలు, విప్లవాత్మక మార్పులు, పంట రుణాలు, గతంలో చేసిన రుణమాఫీ, సాంకేతికత వినియోగం వంటి అంశాలను రైతులకు క్షేత్రస్థాయిలో వివరిస్తారు. అందులో భాగంగా ఈ నెల 4నుంచి 9 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతు వారం నిర్వహించనున్నారు. వ్యవసాయంతో పాటు అనుబంధ విభాగాలైన పట్టు పరిశ్రమ, ఉద్యాన శాఖ, ఆత్మ, వ్యవసాయ మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ అధికారులు అన్నదాతకు అవగాహన కల్పించనున్నారు. కాగా, రైతు వేదికలే వేదికగా ప్రతి రోజూ కార్యక్రమాలను నిర్వహిస్తామని అధికారులు వివరించారు. కార్యక్రమాలు ఇలా.. ● 4వ తేదీన: సాగు భూమి ఆరోగ్య పరిరక్షణ, సమతుల ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం, వినియోగదారులు కోరుకునే సన్నరకాల సాగు వంటి వివరాలను వివరించనున్నారు. ● 5న: ఉద్యాన పంటల ద్వారా వచ్చే ఆదాయం, ఆయా పంటల అభివృద్ధి, ఆయిల్పాం సాగు విస్తీర్ణం పెంపుదల, ప్రత్యామ్నాయ పంటల సాగు. ● 6న పంట పెట్టుబడులకు బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలతో పాటు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా రైతులకు అందించే సేవలు, మార్కెటింగ్ అవకాశాలు. ● 7న: వ్యవసాయ క్షేత్రాలు, సౌర విద్యుత్ కేంద్రాలు, పీఎం కుసుమ్, వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్స్. ● 8న: వ్యవసాయంలో కీలకమైన పాడి పరిశ్రమ– పశుజాతి అభివృద్ధి, దూడల ప్రదర్శన, గడ్డి విత్తనాలు, వేసవిలో పశువుల సంరక్షణ వంటి వివరాలు. ● 9న: చెరువుల్లో కంప చెట్లు, గుర్రపు డెక్క తొలగింపు, సమతుల్య నీటి వినియోగం, కార్యాలయాల పరిశుభ్రత. వివిధ కార్యక్రమాల రూపకల్పన రైతు వేదికల్లో నిర్వహణ భూసార పరీక్ష ఫలితాల వెల్లడి -
ఆలయాల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పూజలు
గన్నేరువరం/చిగురుమామిడి: జిల్లాలోని పలు ఆలయాల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివకుమార్ దంపతులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గన్నేరువరం మండలం ఖాసీంపేట శ్రీ మానసాదేవిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేశారు. పారువెల్ల శ్రీ లక్ష్మీగణపతి, మైలారంలోని స్వయం భూ శ్రీ మల్లికార్జునస్వామి వారి ని దర్శించుకున్నారు. చిగురుమామిడి మండలం ఇందుర్తి రేణుక ఎల్లమ్మతల్లి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆయా ఆలయ కమిటీల చైర్మన్లు ఏలేటి చంద్రారెడ్డి, వరాల పర్శరాములు, బద్దం తిరుపతిరెడ్డి న్యాయమూర్తికి తీర్థప్రసాదాలు అందజేసి, శాలువాలతో సన్మానించారు. ఆలయ ప్రధాన అర్చకుడు పెండ్యాల ఆమర్నాథ్ శర్మ, మామి డాల నాగసాయిశర్మ, జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్యాల ప్రతాప్, తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లింగంపల్లి నాగరాజు, సర్పంచ్లు కర్నె చంద్రయ్య, చింతపూల నరేందర్ పాల్గొన్నారు. 5న మెగా జాబ్ మేళాకరీంనగర్స్పోర్ట్స్: జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు మే 5న మెగాజాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ఆదివారం జాబ్మేళా వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. డీఈఈట్, టాస్క్, ఉపాధి కల్పన కార్యాలయ సమన్వయంతో సుమారు 100 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు విద్యా సంస్థలతో సమన్వయం చేసుకుని డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. కళాశాలల పూర్వ విద్యార్థుల వివరాలను సేకరించి, నిరుద్యోగులుగా ఉన్నవారికి సమాచారం చేరేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధశాఖల అధికారులు శ్రీనివాస్గౌడ్, తిరుపతిరావు పాల్గొన్నారు. పవర్కట్ ప్రాంతాలుకొత్తపల్లి: 33/11 కె.వీ. శాతవాహన విశ్వవిద్యాలయ సబ్స్టేషన్లో నూతన 8.0 ఎంవిఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తున్న సందర్భంగా సోమవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చింతకుంట, కమాన్పూర్, మల్కాపూర్, లక్ష్మీపూర్ గ్రామాల్లో విద్యుత్ సరఫరా కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల పనులు చేపడుతున్నందున ఉదయం 9.30 నుంచి 9.30 గంటల వరకు 11 కె.వీ.అల్కాపూరి పీడర్ పరిధిలోని అల్కాపురి, నాగుల ఎల్లమ్మ ఆలయం, సవరన్ స్కూల్ వీధి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. -
అంతా నిమిషాల్లోనే..
చికిత్స పొందుతున్న ముస్తాక్కమలాసన్మధుకర్రాజేశ్నాడు మొరాదాబాద్ దొంగలు 2022 సెప్టెంబరు 5న కరీంనగర్లోని సెవెన్హిల్స్ సమీపంలో సాయివాణి రెడీమిక్స్కు చెందిన రూ.15 లక్షలు చోరీ చేసిన ముఠా కూడా అపాచీ, పల్సర్ బైకులనే వాడింది. ఒకరు చింతకుంట మీదుగా సిరిసిల్ల వెళ్లగా.. మరొకరు తిమ్మాపూర్ మీదుగా పారిపోయి చివరికి సిద్దిపేట వద్ద కలుసుకున్నారు. తరువాత నాంపల్లిలో రైలెక్కి ఉత్తర్ప్రదేశ్లోని మొరాదాబాద్ వెళ్లారు. నిందితులు ధరంపాల్, మనీశ్, పింటూ, ఏక్తా అని గుర్తించి పోలీసులు రూ.10లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నాడు ఆ దొంగల ను టాస్క్ఫోర్స్ సీఐగా ఉన్న సృజన్రెడ్డి అరెస్టు చేసి పట్టుకురావడం గమనార్హం. మొత్తంగా కొ న్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న నగరం ఆదివారం ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది.సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్క్రైం: ఆదివారం ఉదయం.. నగరం ప్రశాంతంగా ఉంది. నిత్యం రద్దీగా ఉండే జ్యోతినగర్ – విద్యుత్ కార్యాలయం ప్రధాన రహదారి.. సెలవు రోజు కావడంతో సందడి తక్కువగా ఉంది. ఇదే దారిలో ఉన్న పీఎంజే జ్యువెల్లర్స్ను అప్పుడే తెరిచారు. సిబ్బంది లాకర్లలో ఉన్న బంగారాన్ని లెక్కచూసుకుంటూ తీసుకొచ్చి కౌంటర్లు, డిస్ప్లేలో పెడుతున్నారు. ఇంతలో పెళ్లి ఉంది.. బంగారం కావాలంటూ ఓ వ్యక్తి ఉదయం 11 గంటలకు షాపులోకి వచ్చాడు. బంగారం కొన్నట్లు నటించి, ఐదు నిమిషాల తువాత మిగితా నలుగురిని లోనికి రమ్మని సైగలు చేశాడు. 11.06 గంటలకు వారు షాపులోకి ప్రవేశించారు. తుపాకులతో బెదిరించి సిబ్బందిని తాళ్లతో బంధించారు. చేతికి అందిన బంగారాన్ని బ్యాగులో సర్దుకున్నారు. అడ్డువచ్చిన నలుగురిపై కాల్పులు జరిపా రు. సరిగ్గా 11.11 గంటలకు బైకులపై మల్కాపూర్, చింతకుంట మీదుగా సిరిసిల్ల వైపు పారిపోయారు. విషయం నిమిషాల్లో దావనంలలా వ్యాపించడంతో సీపీ గౌస్ ఆలం, ఏసీపీ వెంకటస్వామి, సీఐ సృజన్రెడ్డి, క్లూస్టీం సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుల వేలిముద్రలు సేకరించారు. ఘటనా స్థలంలో బుల్లెట్ షెల్స్, మ్యాగ్జిన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని, రూ.కోటిన్నర విలువైన కిలోకు పైగా బంగారం చోరీకి గురైందని సీపీ ఆలం ‘సాక్షి’కి తెలిపారు. దోపిడీ ఘటనతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. ప్రధాన రహదారులు దిగ్బంధించి, తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఘటనా స్థలాన్ని హై దరాబాద్ నుంచి వచ్చిన క్లూస్టీం సిబ్బంది రాత్రి పరిశీలించారు. పలు ఆధారాలు సేకరించారు. బీదర్ లేదా మహారాష్ట్ర వైపు? జ్యోతినగర్లో ఉన్న జ్యువెల్లరీ దుకాణం అయితే చోరీకి అనువుగా ఉంటుందని పక్కాగా రెక్కీ చేశా రు. కస్టమర్లు, జనసంచారం తక్కువగా ఉంటుందని ఆదివారాన్ని ఎంచుకున్నారు. చోరీ అనంతరం పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల రూట్లోకి లేదా జగిత్యా ల రూట్లో పారిపోవచ్చని స్కెచ్ వేసుకున్నారని తెలుస్తోంది. ఇలాంటి దొంగతనాల్లో రైలుమార్గాలు దగ్గర ఉన్న ప్రాంతాలను ఎంచుకొని పారిపోతుంటారు. నిందితులు సిరిసిల్ల వైపు వెళ్లారని, ముందుగానే ప్లాన్ చేసి కామారెడ్డి మీదుగా హైదరాబాద్, బీదర్ లేదా మహారాష్ట వైపు వెళ్లి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మ్యాగ్జిన్.. బులెట్లు స్వాధీనం ఘటనా స్థలంలో ఓ షార్ట్ వెపన్ మ్యాగ్జిన్, మూడు కాలిన తూటాలు, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇక్కడ లభ్యమైన మ్యాగ్జిన్, బులెట్లపై ఉన్న క్లూస్ ఆధారంగా అవి ఎక్కడ కొనుగోలు చేశారన్న వివరాలు సేకరిస్తున్నారు. దోపిడీ అనంతరం దొంగలు వెళ్లిన దారితోపాటు వచ్చిన దారి సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఆదివారం జనసంచారం తక్కువగా ఉంటుందని తెలుసుకున్నారంటే తప్పకుండా వారం రోజులకుపైగా రెక్కీ నిర్వహించి ఉంటారని అనుమానిస్తున్నారు. పలువురి పరామర్శ ఘటనా స్థలాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. దుండగుల దాడిలో గాయపడిన జువెల్లరీస్ సిబ్బంది ముస్తాక్, మధుకర్, రాజేశ్, కమలాసన్ను ఆస్పత్రి లో పరామర్శించారు. ఘటనపై ఆరా తీశారు. జువెల్లరీ షాపు ఘటనను గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి రాజకీయం చేయడం తగదని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రరెడ్డి సూచించారు.ఎక్కువశాతం దొంగతనాలకు పాల్పడేవారు తమను గుర్తు పట్టకుండా ముఖానికి మాస్కులు, హెల్మెట్ ధరిస్తుంటారు. పీఏంజే ఘటనలో దొంగలు దర్జాగా, ఎలాంటి భయం లేకుండా చోరీకి పాల్పడడం చూస్తే ఈ ప్రాంతం వారు కాదని తెలుస్తోంది. వారు బైకులపై హెల్మెట్లు, ముఖానికి మాస్క్లేకుండా లేకుండా రావడం, పారిపోవడం చూస్తే ఉగ్రవాదులా..? అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. కేవలం 5 నిమిషాల్లో దోపిడీకి పాల్పడిన ముఠా దుకాణం సిబ్బందిని బెదిరించి వారి చేతులు వెనక్కి కట్టేసి, వాష్ రూంలో భయంతో దాక్కున్న మహిళను కూడా సినీఫక్కీలో బయటకు తీసుకొచ్చి బెదిరించారు. చోరీచేసి బయటకు వస్తున్న క్రమంలో గాలిలోకి కాల్పులు జరుపుతూ బైకుపై వెళ్లిపోయారు. నగలు ఎత్తుకెళ్తున్న ఓ బ్యాగు అక్కడే పడిపోగా.. దోపిడీ ముఠా సభ్యుడు కూడా కిందపడిపోయాడని, తర్వాత కొంతదూరం పరిగెత్తి బైక్ ఎక్కాడని అక్కడ ఉన్న పలువురు చర్చించుకున్నారు. దోపిడీ జరిగిన తీరు చూస్తుంటే నిందితులు పాత నేరస్తులు లేదా ఉగ్రశిక్షణ పొంది ఉండి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
వలస బతుకులు.. ప్రసవ బాధలు
● ఈనెల 2న బిహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్ జిల్లాకు చెందిన సీతాదేవి (25) తన భర్తతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా గూడూర్ రైల్వేస్టేషన్లో శుక్రవారం రాత్రి దర్భాంగా వెళ్లే భాగ్మతి రైలు ఎక్కారు. టికెట్ లేకుండానే ఎస్–6 బోగీలో కూర్చున్నారు. శనివారం వేకువజామున వరంగల్ రైల్వేస్టేషన్ దాటాక సీతాదేవికి పురిటి నొప్పులు వచ్చి కూర్చున్న చోటనే సుఖప్రసవమై ఆడ శిశువుకు జన్మనిచ్చింది. రామగుండం: బతుకుదెరువు కోసం బిహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి నిరక్షరాస్యులైన దంపతులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పనులు చేసుకునేందుకు వలస వెళ్తుంటారు. ఇటీవల రైలు ప్రయాణాల్లో గర్భిణులు ప్రసవించడంపై సంబంధిత అధికారుల్లో ఆందోళన నెలకొంది. పలువురు అనారోగ్యంతో సొంతూరు వెళ్లే క్రమంలోనే రైళ్లలో మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. కాగా, వీరందరూ నిరక్షరాస్యులు కావడం గమనార్హం. మూసివేసి ఉన్న ఎమర్జెన్సీ హెల్త్ రూమ్ సూదూర ప్రాంతాలకు రైళ్లలో వెళ్లే ప్రయాణికులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే కనీసం రైల్వే ప్లాట్ఫాంపై ప్రాథమిక వైద్య సేవలు అందించని దుస్థితిలో రామగుండం రైల్వేశాఖ ఉంది. ప్రాథమిక చికిత్స కోసం అత్యవసర గదిని ఏర్పాటు చేసి బోర్డు తగిలించినా తెరుచుకున్న పాపానా పోలేదు. అమృత్ భారత్ పథకంలో కోట్లాది నిధులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నా.. ప్రయాణికులకు అత్యవసర వైద్య సేవలు అందించలేని దుస్థితిలో రైల్వేస్టేషన్ ఉంది. అవగాహన లేమితో నిండు గర్భిణుల రైలు ప్రయాణం రామగుండం రైల్వేస్టేషన్లో రెండు ఘటనలు స్టేషన్లో అత్యవసర వైద్యసేవలు కరువునెలలు నిండిన గర్భిణులు, అస్వస్థతతో ఉన్న వ్యక్తులు రైళ్లలో ప్రయాణం చేయడం సరికాదు. అత్యవసరంగా ఆరోగ్య సమస్యలు తలెత్తితే పెద్ద సిటీలలో వైద్య సేవలకు అనుకూలత ఉంటుంది. అటవీ ప్రాంతం సమీపంలో ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న సమయంలోనే రైలు ప్రయాణాలు చేయాలి. – తిరుపతి, ఇన్చార్జి రైల్వే పోలీస్, రామగుండం -
హిందూ ఏక్తాయాత్రతో చరిత్ర సృష్టిద్దాం
కరీంనగర్: కరీంనగర్లో ఈనెల 12న నిర్వహించే ‘హిందూ ఏక్తా యాత్ర’ను దిగ్విజయవంతం చేసి చరిత్ర సృష్టిద్దామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ కార్పొరేటర్లు, కంటెస్టెడ్ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాత్రకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తరలివచ్చి హిందూ సంఘటిత శక్తిని చాటి చెప్పాలన్నారు. ఏక్తా యాత్రపై మీడియా, సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం నిర్వహించాలని కోరారు. పార్టీ నాయకులంతా వార్డులు, గ్రామ, మండలాల్లో ఇంటింటికీ వెళ్లి వినూత్న రీతిలో బొట్టు పెట్టి యాత్రకు రావాలని ప్రజలను ఆహ్వానించాలని సూచించారు. మే 12న సాయంత్రం 4 గంటలకు, వైశ్యా భవన్ నుంచి హిందూ ఏక్తాయాత్ర ప్రారంభం అవుతుందన్నారు. మోడీ సభకు స్వచ్ఛందంగా తరలిరండి ఈనెల 10న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను కనీవిని ఎరగని రీతిలో విజయవంతం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా సభకు తరలిరావాలని, ముఖ్యంగా కరీంనగర్ జిల్లా నుంచి అధిక సంఖ్యలో ప్రజలను సమీకరించాలని ఆయన సూచించారు. సభకు వచ్చే వారికి రవాణా, భోజన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. అభివృద్ధి పనులకు శ్రీకారం జ్యోతినగర్లోని కేడీఆర్ పార్కు వద్ద బండి సంజయ్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక 50వ డివిజన్ కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్ రావుతో కలిసి రూ.16 లక్షల సాధారణ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. పనులు వేగవంతం చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. -
సబ్స్టేషన్ ఆవరణలో మంటలు
కొత్తపల్లి(కరీంనగర్): 220 కె.వీ. దుర్శేడ్ విద్యుత్సబ్స్టేషన్ ఆవరణలోని పోల్ సెంటర్లో ఆదివారం రా త్రి మంటలు చెలరేగాయి. గాలి దుమారం రావడంతో అల్గునూర్, హుజూరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే 32 కె.వీ. లైన్లు ఒకదానికొకటి రాపిడి జరిగి అగ్ని రవ్వలు కిండపడ్డాయి. అక్కడున్న చెత్త, గడ్డి అంటుకొని మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనలకు గురైన విద్యుత్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై దుర్శేడ్ సబ్స్టేషన్ను ఆఫ్ చేసి ఫైరింజన్కు సమాచారం ఇచ్చారు. ఫైరింజన్ వచ్చి మంటలు ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. దీంతో విద్యుత్ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ విద్యుత్ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదని ట్రాన్స్కో డీఈ భూమయ్య వెల్లడించారు. తాళం వేసిన ఇంట్లో చోరీజగిత్యాల క్రైం: జగిత్యాలలోని వాణీనగర్కు చెందిన విద్యుత్ శాఖ లైన్మన్ రమేశ్ ఇంట్లో గుర్తుతెలియని దొంగలు పడి రూ.15 వేలు ఎత్తుకెళ్లారు. రమేశ్ మూడు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి శుభకార్యం నిమిత్తం వెళ్లాడు. ఆదివారం తిరిగి వచ్చి చూసేసరికి తాళాలు పగులగొట్టి ఉండడంతో ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా.. బీరువాలో డబ్బులు కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అమ్మానాన్న లేని అభాగ్యులు
● ఏ ‘ఆధార’మూ లేని చిన్నారులు ● చేరదీసిన అమ్మమ్మ, నాన్నమ్మ ● ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు వీర్నపల్లి(సిరిసిల్ల): ఆ బాలుడు పుట్టు మూగ. కన్నవారి ప్రేమకు నోచుకోలేదు. ఏ ఆధారమూ లేదు. కనీసం ఆధార్ కార్డు కూడా లేని అభాగ్యుడు. వీర్నపల్లి మండలం బంజేరు గ్రామపంచాయతీ పరిధి బీరప్పతండాకు చెందిన బట్టు శంకు పుట్టుకతోనే మూగ. అతడు పుట్టిన ఏడాదికే తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్లారో, ఏమయ్యారో ఇప్పటికీ తెలియదు. అప్పటి నుంచి తన అమ్మమ్మ బట్టు నానుకు వద్దే పెరుగుతున్నాడు. కనీసం ఆధార్ కార్డు కూడా లేక దివ్యాంగుల పింఛన్, చదువు, ఇతర పథకాలకు దూరమయ్యాడు. మనవడే ప్రాణం భర్త మరణించిన తర్వాత నానుకు అండగా నిలిచేవారు కరువయ్యారు. వృద్ధాప్య పింఛన్ కోసం రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. కనీసం ఉండడానికి ఇల్లు లేక, చిన్న పూరిగుడిసెలో కాలం వెళ్లదీస్తోంది. మనవడు శంకును సాకడం ఆమెకు భారంగా మారింది. వయసు మళ్లినా కూలీ పనులకు వెళ్తే వచ్చే ఆదాయంతోనే ఇద్దరూ జీవనం సాగిస్తున్నారు. తాను ఉన్నన్ని రోజులు ఏదోలా రెక్కలు ముక్కలు చేసుకుంటానని, తర్వాత తన మనవడిని ఎవరు చూసుకుంటారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం స్పందించి బాలుడికి ఆధార్ ఇప్పించి, పింఛన్ సౌకర్యం కల్పించాలని తండావాసులు కోరుతున్నారు. మరో బాలుడిది అదే వ్యథ బీరప్పతండాకే చెందిన మరో బాలుడు బట్టు శివ పరిస్థితి కూడా ఇంతే. అతడి తల్లిదండ్రులు ఎటు వెళ్లారో తెలియదు. నాన్నమ్మ బట్టు సక్కుబాయి వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. తల్లిదండ్రుల మమకారానికి దూరమై, తోటి పిల్లలను చూస్తూ ఈ చిన్నారులు పడుతున్న వేదన వర్ణనాతీతం. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి సదరు పిల్లలను ఆదుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. బీరప్ప తండాలో బట్టు నాను, ఆమె మనవడు శంకు పడుతున్న ఇబ్బందులు మా దృష్టికి వచ్చాయి. తక్షణమే ఆ బాలుడికి ఆధార్ నమోదు చేయించి, బట్టు నానుకు పింఛన్ వచ్చేలా కృషి చేస్తాం. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో భరోసా కల్పించేలా చూస్తాం. – బట్టు కృష్ణ, సర్పంచ్, బంజేరు -
మండుటెండల్లో పచ్చని పందిరి
మండుతున్న ఎండ.. నిప్పులు కురిపిస్తున్న భానుడు.. నిర్మానుష్యంగా రహదారులు.. ప్రధాన రహదారుల్లో నిలువ నీడలేక ప్రజలు అల్లాడిపోతుండగా.. నగరంలోని అంబేడ్కర్ స్టేడియం దారిలో ఇరువైపుల ఏపుగా పెరిగిన చెట్లు పచ్చని పందిరిని తలపిస్తున్నాయి. భగత్సింగ్ విగ్రహం నుంచి అంబేడ్కర్ స్టేడియం మీదుగా ఎల్ఐసీ చౌరస్తా వరకు వాహనదారులు, ప్రయాణికులు, వాకర్లు, చిరువ్యాపారులకు చల్లని నీడనిస్తున్నా యి. ఈ రహదారి గుండా వెళ్లే వాహనదారులు కాసేపు ఆగి స్వచ్ఛమైన గాలిని పీల్చుతూ సేదతీరుతున్నారు. 50 మందికి పైగా చిరువ్యాపారులు ఈ చెట్లనీడన ఉపాధి పొందుతున్నారు. పచ్చని తోరణంలాంటి ఈ వాతావరణం కాంక్రీట్ అడవిలో ప్రకృతి ఇచ్చిన గొప్ప బహుమతిగా కనిపిస్తోంది. పర్యావరణాన్ని కాపాడుకుంటే అది మనల్ని ఎలా కాపాడుతుందో చెప్పడానికి ఈ మార్గం చక్కని ఉదాహరణ. – కరీంనగర్స్పోర్ట్స్ భగత్సింగ్ విగ్రహం నుంచి ఇండోర్ స్టేడియం గేట్ రహదారిలోఎల్ఐసీ కార్యాలయానికి వెళ్లే రహదారిలో పచ్చని చెట్లు -
నేటి నుంచి డివిజన్స్థాయి ప్రజావాణి
కరీంనగర్ అర్బన్: ప్రతీ సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజావాణితో పాటు ఇక రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి డివిజన్ స్థాయి ప్రజావాణి నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కరీంనగర్, హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ల పరిధిలో ప్రజావాణి కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగే జిల్లాస్థాయి, డివిజన్ స్థాయి అధికారులు రెవెన్యూ డివిజన్ స్థాయిలో జరిగే ప్రజావాణికి తప్పనిసరిగా హాజరై, ప్రజల వినతులను స్వీకరించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులను ప్రజావాణి పోర్టల్లో నమోదు చేసి తీసుకున్న చర్యల నివేదికలను పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రజలు తమ ఫిర్యాదుల స్థితిని ఆన్లైన్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్విని యోగం చేసుకోవాలని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషికరీంనగర్ కార్పొరేషన్: నగర ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించేందుకు ముందుంటానని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం నగరంలోని 21వ డివిజన్లో నగరపాలకసంస్థ సాధారణ నిధులు రూ.17.20 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డితో కలిసి ఆయన భూమిపూజ చేశారు. నగర ప్రజలకు సదుపాయాలు కల్పించడమే తమ పాలకవర్గ ధ్యేయం అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నాయకత్వంలో నగరపాలక సంస్థ పరిధిలోని 66 డివిజన్లను అభివృద్ధి పరుస్తామన్నారు. శివారు ప్రాంతాలు, విలీన గ్రామాల డివిజన్లను ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అర్బన్ చాలెంజ్ ఫండ్ లో అన్ని డివిజన్లకు నిధులను కేటాయించి, ప్రజలకు సదుపాయాలు కల్పిస్తామన్నారు. కార్పొరేటర్లు వరాల నర్సింగం, పర్వతం మల్లేశం, కాంతాల జగన్రెడ్డి పాల్గొన్నారు. -
పోటెత్తిన భక్తులు
వేములవాడ: మండుతున్న ఎండలను లెక్క చేయకుండా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఆదివారం పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో వేములవాడకు చేరుకుని తమ ఇలవేల్పు రాజన్న, భీమన్నలకు మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీని గమనించిన ఆలయ అధికారులు భక్తులకు సరిపడా సౌకర్యాలు కల్పించారు. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు తాగునీటి క్యాన్లను అందుబాటులో ఉంచి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులచే నీటి సరఫరా చేయించారు. భీమన్న సేవలో సుడా చైర్మన్ వేములవాడ భీమన్నను శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు స్వామివారి మండపంలో శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం, ఆశీర్వచనాలు అందించారు. -
అభివృద్ధి.. సంక్షేమమే లక్ష్యం
కరీంనగర్ అర్బన్: కరీంనగర్ అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమ పథకాల అమలే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిలతో కలిసి శనివారం కలెక్టరేట్లో నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. సమస్య ల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. వివిధ శాఖల అధికారులు తమ శాఖల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను వివరించారు. మేయర్, సుడా చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. అధికారులు సమస్యల పరి ష్కారానికి కృషి చేయాలని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నగర్ పాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తోందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అరైవ్ అలైవ్తో పాటు అనేక కార్యక్రమాలను చేపడుతున్నదన్నారు. పేదలు సంక్షేమ పథకాలను వినియోగించు కోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. శాఖలవారీగా సమస్యల పరిష్కారం గంగాధర: ప్రజా సంక్షేమానికే అధిక ప్రాధాన్యమిస్తూ, అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలోని ఫంక్షన్ హాలులో నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేసి, సాగునీటి సమస్య లేకుండా చేస్తామన్నారు. ఇప్పటికే రూ.23.50 కోట్లు మంజూరయ్యాయని, మరో రూ.20 కోట్లు మంజూరవుతాయన్నారు. మద్ధతు ధరతో ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రతి గ్రామంలో కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ను కోరారు. కలెక్టర్ చిత్రామిశ్రా మాట్లాడుతూ సీ్త్ర, శిశు సంక్షేమం, స్థానిక సంస్థలు, ఇందిరమ్మ ఇల్లు, ప్రజావాణి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నియోజకవర్గస్థాయి క్లస్టర్ ఆఫీసర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డీవో మహేశ్వర్, ఎంపీడీవో రాము, తహసీల్దార్ రజిత పాల్గొన్నారు. -
అనుమతి తప్పనిసరి!
కొత్తపల్లి(కరీంనగర్): గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ పరిశ్రమలు తప్పనిసరిగా గ్రామ పంచాయతీల అనుమతి తీసుకోవాల్సిందేనని అధికారులు తేల్చి చెప్పారు. కొన్నేళ్లుగా గ్రామ పంచాయతీ అనుమతుల్లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ పరిశ్రమల అక్రమాలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. వరుస కథనాలపై పంచాయతీ పాలకవర్గాల్లో కదలిక మొదలైంది. నిధులలేమితో నిర్వీర్యంగా మారిన గ్రామ పంచాయతీలను ఓ గాడిలో పెట్టేందుకు ఆదాయ వనరులపై పాలకవర్గాలు దృష్టిసారించాయి. ఈ క్రమంలోనే గ్రానైట్ పరిశ్రమల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్, ఎలగందుల, ఖాజీపూర్, నాగులమల్యాల, బద్ధిపల్లి, కమాన్పూర్ గ్రామాల్లో గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ పరిశ్రమలతో పాటు గ్రానైట్ క్వారీలు, పెట్రోల్ బంక్లు, ఫాంహౌజ్లు, ఫంక్షన్ హాళ్లు ఉన్నాయి. పారిశ్రామిక ప్రాంతంగా పేరుగాంచిన కొత్తపల్లి మండలంలోని గ్రామాల్లో నిత్యం రూ.కోట్ల వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. అయినప్పటికీ పంచాయతీల్లో ఆదాయం కనిపించడం లేదు. బావుపేట పాలకవర్గ అడుగుజాడల్లో గ్రామ పంచాయతీలకు నిధులు సేకరించడమే లక్ష్యంగా బావుపేట గ్రామ పంచాయతీ పాలకవర్గం తరహాలోనే మిగిలిన గ్రామ పంచాయతీలు కదిలేందుకు సిద్ధమవుతున్నాయి. అనుమతిలేని గ్రానైట్ పరిశ్రమలు, ఫంక్షన్హాల్లు, పెట్రోల్ బంక్లు, ఫాంహౌజ్లు, క్రషర్లను గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నారు. స్పందించకపోతే సీజ్ చేస్తున్నారు. బావుపేటలో ఒక గ్రానైట్ పరిశ్రమను సీజ్ చేయడంతో మిగిలిన ఐదు పరిశ్రమలు అనుమతులు పొంది ఇంటి నంబర్ తీసుకునేందుకు సిద్ధమయ్యాయి. పంచాయతీ పాలకవర్గంపై రాజకీయ ఒత్తిడి ప్రయోగించిన్పటికీ ఆదాయమే ప్రధాన ఎజెండా కఠిన నిర్ణయం తీసుకోవడంతోనే గ్రానైట్ పరిశ్రమల యజమానులు దారికొస్తున్నారు. అనుమతులకు సంబంధించిన మొత్తం చెల్లించేందుకు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం వేదికగా నిర్ణయం జరగడంతో నోటీసులిచ్చిన ‘గ్రానైట్ పంచాయతీ’ కొంతమేర సమసింది. ఇదే తరహాలో ఖాజీపూర్, బద్ధిపల్లి తదితర గ్రామ పంచాయతీలు ముందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. అనుమతిలేని నిర్మాణాలపై దృష్టి కొత్తపల్లి మండలంలో అనుమతిలేని నిర్మాణాలపై పంచాయతీ పాలకవర్గాలు దృష్టి సారించాయి. అనుమతిలేని ఫంక్షన్ హాళ్లు, ఫాంహౌజ్లు, పెట్రో ల్ బంక్లను గుర్తించి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అనుమతుల అంశాన్ని అమాత్యులకు తెలపకుండా క్షేత్రస్థాయిలో కొంతమంది వారి పేర్లు చెబుతూ పంచాయతీ అధికారులను బెదిరించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అసలు విషయం తెలియని అమాత్యులు అనవసరంగా బదనాం అవుతున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. -
ఇలాగైతే ఎలా
ధరలను తగ్గించాల్సిందిపోయి ఏటికేడు ధరలను పెంచుతున్నారు. కమర్షియల్ గ్యాస్ ధర ఒకప్పుడు రూ.2వేలు ఉండేది. మూడున్నరేళ్లలో రూ.3వేలకు పైగా చేరింది. ఈ ధరను సాకుగా చూపి వినియోగదారులపై భారం వేస్తున్నారు. – శిరీష, కట్టరాంపూర్టిఫిన్ సెంటర్తో ఉపాధి పొందుతున్న. ఇప్పటికే మా రంగంలో పోటీ ఎక్కువ. ఇపుడేమో గ్యాస్ ధరను ఏకంగా రూ.993 పెంచారు. ఆ ధరతో టిఫిన్లు చేయడం.. ఇపుడున్న ధరతోనే కస్టమర్కు టిఫిన్ సరఫరా చేయాలంటే మాకు గిట్టుబాటు కాదు. టిఫిన్ ధర పెంచితే కస్టమర్లు వస్తారో.. రారో..? – అనిల్, వ్యాపారి -
ఎస్సారార్లో రెండు కొత్త కోర్సులు
కరీంనగర్ సిటీ: కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి రెండు నూతన అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రాం(ఏఈడీపీ) కోర్సులు మంజూరు చేశారని ప్రిన్సిపాల్ కె.రామకృష్ణ శనివారం తెలి పారు. కొత్తగా మంజూరు చేసిన బీకాం బీఎఫ్ ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్), బీఎస్సీ హెల్త్ కేర్ ఏఈడీపీ కోర్సులు ఈ ఏడాది నుంచి ప్రారంభం కానున్నాయని తెలిపారు. వీటితో పాటు బీఎస్సీ లైఫ్ సైన్స్లో ‘మెడికల్ ఫిజియాలజీ’ అనే కొత్త సబ్జెక్టు కూడా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి పలు కోర్సుల్లో సీట్ల పెంపు చేపట్టినట్లు తెలిపారు. బీఎస్సీ లైఫ్సైన్స్లో 300 సీట్లకు అదనంగా 60, బీఎస్సీ ఫిజికల్ సైన్స్లో 60 , బీఏ (సీబీసీఎస్) ఇంగ్లిష్ మీడియంలో 60, బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్లో 60 సీట్లు పెంచినట్లు పేర్కొన్నారు. దీంతో కళాశాలలో మొత్తం సీట్లు 1,980కు పెరిగినట్లు తెలిపారు. నూతన కోర్సులు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకి ష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఎ. శ్రీదేవసేన, కళాశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్లు ప్రొఫెసర్ రాజేందర్ సింగ్, ప్రొఫెసర్ పి.బాల భాస్కర్, కళాశాల విద్య జేఏసీ చైర్మన్ డాక్టర్ కె. సురేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కొత్తపల్లి(కరీంనగర్): అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ విద్యుత్ భద్రతపై రైతులు, వినియోగదారులకు అవగాహన కల్పించాలని టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ రాపెల్లి రవీందర్ సూచించారు. శనివారం సర్కిల్ ఆఫీస్లో విద్యుత్ భద్రత వారోత్సవాల ఆవశ్యకతను వివరించి ప్రమాణం చేయించా రు. విద్యుత్ ప్రమాదాలను జీరోస్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశింంచారు. స్తంభంపై సిబ్బంది పనిచేసేటప్పుడు విధిగా సేఫ్టీ బెల్ట్, ఎర్త్ రాడ్, హెల్మెట్, ఓల్టేజ్ డిటెక్టర్, ఇతర పరికరాలు ధరించాలని సూచించారు. ప్రమాద సూచనలు కనిపిస్తే వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం ఇవ్వాలని లేదా 1912 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు. డీఈలు ఉపేందర్, రాజం, ఏడీఈలు పి.శ్రీనివాస్, ఎం.లావణ్య పాల్గొన్నారు. విద్యానగర్(కరీంనగర్): మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ శక్తి పథకం ద్వారా కరీంనగర్ అశోక్నగరలో ప్రకృతి పర్యావరణ సంస్థ నిర్వహిస్తున్న శక్తి సదన్ కేంద్రాన్ని శనివారం జిల్లా మొదటి అదనపు సెషన్స్ జడ్జి డి.వెంకటేశ్ సందర్శించారు. శక్తి సదన్ నిర్వహణ, బాధితులకు అందిస్తున్న సేవలు, కల్పిస్తు న్న సౌకర్యాలను పరిశీలించారు. శక్తి సదన్ సూపరింటెండెంట్ ఎ.రమాదేవి, సిబ్బంది వసంత, రజిత, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. కరీంనగర్టౌన్: నేడు జరిగే నీట్ ప్రవేశ పరీక్షకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కరీంనగర్లోని ఎస్సారార్ డిగ్రీ కాలేజీ, మహిళా ఉమెన్స్ డిగ్రీ కాలేజీ, అలుగునూరులోని కేంద్రీయ విద్యాలయం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్, ఉజ్వల పార్కు సమీపంలోని బాలికల పాలిటెక్నిక్ కళాశాల, చింతకుంట ఎస్సీ రెసిడెన్షియల్ స్కూలు, కేబుల్ బ్రిడ్జి సమీపంలోని మైనార్టీ స్కూల్లో పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతాయి. పటిష్ట భద్రత కరీంనగర్క్రైం: నీట్ పరీక్షకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేలా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలి పారు. పరీక్షా సమయంలో కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు , ఇంటర్నెట్ కేంద్రాలను మూసివేయించాలని ఆదేశించారు. -
టెండర్ల మతలబేమిటి?
కరీంనగర్ కార్పొరేషన్: డంప్యార్డ్లో చెత్తను బయోమైనింగ్ చేసేందుకు పిలిచిన టెండర్లను ఎందుకు ఓపెన్చేయడం లేదని మాజీ మేయర్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ ప్రశ్నించారు. శనివారం నగరంలో మాట్లాడుతూ డంప్యార్డ్లో చెత్తను తగ్గించేందుకు ఇటీవల రూ.2 కోట్లతో బయోమైనింగ్ కోసం టెండర్ పిలిచారన్నారు. టెండర్లో ఐదుగురు పాల్గొన్నారని, టెండర్ ఓపెన్చేయడం లేదన్నారు. తమకు నచ్చిన వారికి రాదనే భయంతోనే టెండర్ ఓపెన్కు అధికారులు వెనుకాడుతున్నట్లున్నారని విమర్శించారు. ఓ వైపు డ ంప్యార్డ్తో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతుంటే, టెండర్లో జాప్యం ఎందుకున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కార్పొరేటర్లు, వారి భర్తలపై కేసులు పెడుతున్నారన్నారు. అదే కాంట్రాక్టర్లు తిట్టినా అధికారులు కిమ్మనడం లేదని మండిపడ్డారు. కార్పొరేటర్లపై కేసులు పెట్టడంలో ఉన్న ఉత్సాహం అవినీతి అధికారులపై కేసులకు ఉండడం లేదన్నారు. కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ నగర ప్రజల కష్టాలను గాలికి వదిలేశారని విమర్శించారు. నగరపాలకసంస్థ కమిషనర్, ఎస్ఈ అవినీతిపై తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ చేసి రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవన్నారు.ఉద్యమం ఏదైనా కరీంనగర్ నుంచే మొదలవుతుందని, కార్పొరేటర్లంతా ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ నాయకులు తుల భాస్కర్రావు, దండబోయిన రాము, మల్లేశం, మైకెల్ శ్రీనివాస్, కెమసారం తిరుపతి, రంగు శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. -
శివారు కాలనీలకు ప్రాధాన్యం
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని శివారు కాలనీలు, విలీన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. నగరపాలకసంస్థ 21వ డివిజన్ విద్యానగర్లో రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, తాగునీటి పైప్లైన్ పనులకు కార్పొరేటర్ వరాల నర్సింగంతో కలిసి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగర ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే తమ పాలకవర్గం లక్ష్యం అన్నా రు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ ఆదేశించారు. శుక్రవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో హౌసింగ్, మున్సిపల్శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇండ్లు త్వరగా పూర్తయ్యేలా కృషి చేయాలన్నారు. మొదటి విడతలో ఇండ్లు మంజూరై నిర్మాణాలు చేపట్టలేమని నగరపాలకసంస్థకు రాసిచ్చిన వారిస్థానంలో కొత్తగా అర్హులైనవారిని ఎంపిక చేయాలని సూ చించారు. డివిజన్లవారీగా ఎల్–1లో ఉన్న లబ్ధి దారులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి నిజమైన అర్హులను ఎంపిక చేయాలన్నారు. డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియొద్దీన్ పాల్గొన్నారు. కొత్తపల్లి(కరీంనగర్): వానాకాలంలో రైతులు నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి జె.భాగ్యలక్ష్మి సూ చించారు. లైసెన్స్ కలిగిన విక్రయ కేంద్రాల్లో విత్తనాలు కొనుగోలు చేసి, బిల్ తీసుకోవా లన్నారు. కొత్తపల్లి రైతు వేదికలో శుక్రవారం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో పలు సూచనలు చేశారు. తక్కువ యూరియా వాడాలని, సాగు ఖర్చును తగ్గించాలని, నేల ఆరోగ్యాన్ని కాపాడాలని, సుస్థిర ఆదాయాన్ని పొందాలన్నారు. మార్కెట్లో గిరాకీ ఉన్న పంటలను ఎంపిక చేసుకోవాలన్నారు. వరిలో సాగుచేసే రకాల గురించి ఆర్ఏఆర్ఎస్ పొలా స శాస్త్రవేత్త డా.మధుకర్; కోతుల బెడదలేని ఆయిల్ పామ్ పంట సాగు గురించి సహాయ వ్యవసాయ సంచాలకుడు కె రణధీర్రెడ్డి వివరించారు. సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలని ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ బి.చత్రు నాయక్ పేర్కొన్నారు. ఏవో కె.సంతోష్కుమార్, ఏఈవో రాము పాల్గొన్నారు. కరీంనగర్ టౌన్: జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిగా వి.ఆంజనేయరావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. పెద్దపల్లి ఇంటర్ విద్యాధికారి డి.కల్పన, ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లు వి.సత్యవర్ధన్రావు, ఏ.సత్యనారా యణ, సీహెచ్.శశిధర్శర్మ, కె.రాజేశ్వర్రావు, రాష్ట్ర ప్రిన్సిపా ల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రవీందర్రెడ్డి, జిల్లా జూనియర్ కళాశాలల లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, లైబరీయన్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్మోహన్, ఇంటర్ విద్యా బాధ్యులు కిరణ్, బల్బీర్సింగ్ అభినందించారు. కొత్తపల్లి(కరీంనగర్): మేడేకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ‘శ్రమశక్తి’ అవార్డుకు టీజీ ఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ పరిధిలోని అలుగునూరు సెక్షన్ ఏఏవో కొండూరు శ్రీనివాస్ ఎంపికయ్యారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. -
జలగల దందా.. అడ్డుందా!
ఆటోలో ఉన్న క్యాన్లను పరిశీలించారా.. ఏ క్యానూ శుభ్రంగా లేదు. నగరంలోని భగత్నగర్లో గల శుద్ధజల కేంద్ర వాహనమిది. రోజు వేల లీటర్ల విక్రయాలు జరుగుతుండగా శుభ్రత శూన్యం. వినియోగదారులకు నీటిపై అవగాహన లేకపోవడంతో శుద్ధ జలమని తాగేస్తున్నారు.కరీంనగర్ అర్బన్: వేసవి అవసరాలను ఆధారంగా చేసుకుని విచ్చలవిడిగా మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టుకొస్తున్నాయి. కరీంనగర్, జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి, కొత్తపల్లి, తిమ్మాపూర్, మానకొండూరు, గంగాధర, రామడుగు, శంకరపట్నం, తదితర ప్రాంతాల్లో సుమారు 750 వరకు మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. పట్టణాల నుంచి పల్లెల వరకు విస్తరించాయి. వీటిలో బీఎస్ఐ అనుమతి ఉన్న కేంద్రాలు కేవలం నాలుగే కాగా, మిగతావన్ని నామమాత్రపు అనుమతితో నడుస్తున్నవే. జిల్లా అధికారులుండే కరీంనగరంలోనే వందల సంఖ్యలో కేంద్రాలు దర్జా ఒలకబోస్తూ ప్రజల ప్రాణాలతో అటలాడుతున్నాయి. విచ్చలవిడి ప్లాంట్లు.. లక్షల వ్యాపారం జిల్లాలో 750కి పైగా శుద్ధజల కేంద్రాలు ఉండగా నాలుగింటికి అనుమతి ఉంది. అనధికారికంగా నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్లలో కరీంనగర్ నగరపరిధిలో 200 వరకున్నాయి. కూల్వాటర్, మినరల్ వాటర్ పేరుతో దందా నిర్వహిస్తున్నారు. నీటిని శుద్ధి యంత్రాలకు ప్రభుత్వపరంగా గుర్తింపు లేకపోవడం గమనార్హం. గంటకు 2వేల లీటర్ల నుంచి వెయ్యి లీటర్ల సామర్థ్యం గల వాటర్ ప్లాంట్లు నివాస ప్రాంతాల్లో చిన్న చిన్న గదుల్లో నిర్వహిస్తున్నారు. ప్లాంట్లలో వినియోగించే పైపులు, నిల్వ చేసే ట్యాంకులు స్టీలువి వినియోగించాల్సి ఉండగా ప్లాస్టిక్ వాడుతున్నారు. ప్రతిరోజూ సరఫరా అయ్యే నీటిని తనిఖీలు చేయాల్సి ఉన్నా ఏ ఒక్కచోటా అది జరగడం లేదు. నీటి కోసం ము న్సిపల్శాఖ అనుమతి లేకుండానే బోర్లు వేస్తున్నారు. ప్లాంట్ ఏర్పాటుకు కనీసం 5గుంటల స్థలం కావాల్సి ఉండగా, 200 అడుగుల గదుల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. మినరల్ వాటర్ క్యాన్లు నింపడానికి ప్రత్యేక సదుపాయాలతో గదులు కావాల్సి ఉండగా ఆరుబయట పైపుల ద్వారా నింపుతున్నారు. క్యాన్లను శుద్ధిచేసే ప్రక్రియ వేడి నీటిని ఉపయోగించి ప్రెజర్ బ్రష్లతో చేయాల్సి ఉండగా దానిని పూర్తిగా విస్మరించారు. కొందరు మున్సిపల్ కుళాయిల్లో వస్తున్న నీటినే క్యాన్లలో నింపి మినరల్ వాటర్ పేరుతో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కేంద్రాల్లో ఇవెక్కడ? వాటర్ ప్లాంట్ నెలకొల్పాలంటే మున్సిపాలిటీల్లో కమిషనర్, గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శి నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ పొందాలి. శుద్ధజల కేంద్రాన్ని నిర్వహించాలంటే భారత ప్రమాణాల సంస్థ నిబంధనల ప్రకారం మైక్రో బయోలజిస్టు, కెమిస్టులు ఉండాలి. శుద్ధి చేసిన నీటిలోని పీహెచ్ను పరీక్షిస్తూ ఉండాలి. నీటిలో పూర్తిగా కరిగిన లవణాలను పరీక్షించాలి. పీహెచ్ 7.5శాతం కన్నా తగ్గితే కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కొత్తగా నీటి ఽశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే కనీసం 10 గదులుండాలి. వాటర్ ప్లాంట్లో నీటిని శుద్ధి చేసేందుకు ఏర్పాటు చేసిన యంత్రాలు, వాటి నిర్వహణ, నాణ్యత ప్రమాణాలను ఫుడ్ కంట్రోల్ శాఖాధికారులు తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు అనధికారికంగా నడిచే వాటర్ ప్లాంట్ల వైపు కన్నెత్తి చూడడం లేదు. అధికారులేం చేస్తున్నట్లు.. పుట్టగొడుగుల్లా వాటర్ ప్లాంట్లు వెలుస్తుండగా సంబంధితశాఖలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. ఏనాడు సదరు కేంద్రాలపై కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. వాస్తవానికి అక్రమంగా కేంద్రాన్ని కొనసాగించాలంటే సాహసంతో కూడుకున్న పని. అలాంటిది ఏళ్లకు ఏళ్లుగా దర్జాగా దందా చేస్తున్నారంటే అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీటి లభ్యత ఆధారంగా భూగర్బజల శాఖ నీటి ఏర్పాటుకు ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఏ విధమైన పైపులు వాడుతున్నారు, నీటి శుద్ధికి ఏ పదార్థాలు ఎంత పరిమాణంలో ఉపయోగిస్తారనే దానిని ఆహార తనిఖీ అధికారులు పరీక్షించాలి. శుద్ధి చేసిన నీటిని తాగేందుకు అనువుగా ఉందా లేదా అనేది వైద్యారోగ్యశాఖ అధికారులు నిర్ధారించాలి. -
చిరునవ్వులు చెదిరి‘పోయాయి’
అది వంద కిలోమీటర్ల వేగంతో వెళ్లే రహదారి. ఏమైందో ఏమో. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఆరు నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. ఒక్కరు మాత్రమే కొన ఊపిరితో చావుబతుకుల్లో ఉన్నారు. వేసవి సెలవుల్లో ముగ్గురు చిన్నారుల చిరునవ్వులు చెదిరిపోయాయి. అమ్మానాన్నలతో కలిసి సరదాగా వెళ్లి ఆ పసి హృదయాలు రోడ్డు ప్రమాదంలో ఆగిపోయాయి. హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగు రోడ్డు ప్రమాదంలో సిరిసిల్ల వాసులు ఆరుగురు మరణించడం విషాదం నింపింది.● హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో సిరిసిల్ల వాసుల మృతి ● ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం ● అందులో ముగ్గురు పిల్లలు ● చిన్న కారు.. పెద్ద ప్రమాదంసిరిసిల్ల: సిరిసిల్లలోని సర్ధార్నగర్కు చెందిన బొల్లి శివకుమార్కు వ్యాగనార్(టీఎస్23ఎఫ్2298) కారు ఉంది. అందులో అతడి భార్య బొల్లి లాస్య, కూతు రు బొల్లి రిషిత, బావ కోడం శ్రీనివాస్(ఓ ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్, వేములవాడ), చెల్లెలు శ్వేత(ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది), అల్లుళ్లు కోడం కృష్ణచంద్ర, కోడం మాధవ్తో కలిసి ఆలయానికి వెళ్లి వస్తుండగా.. అతివేగంగా వెళ్తూ శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డులో ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. కోడం శ్వేత కొన ఊపిరితో ఉన్నారు. ఆమెను కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. చిన్న కారు పెద్ద ప్రమాదానికి కారణమైంది. ఇంటికి తాళం వేసి.. సిరిసిల్లకు చెందిన బొల్లి రాజు బీడీ కంపెనీ టేకేదార్. సర్ధార్నగర్లో నివాసముండే రాజు–భాగ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు శివకుమార్, శిరీష్, ఒక కుమార్తె శ్వేత. ప్రమాదంలో కొడుకు, అల్లుడు, కోడలు, వాళ్ల ముగ్గురు పిల్లలు మరణించగా.. కూతురు శ్వేత చావుబతుకుల్లో ఉంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించడంతో సిరిసిల్లలో విషాదం అలుముకుంది. ప్రమాద ఘటన సమాచారం తెలియగానే బొల్లి రాజు కుటుంబం ఇంటికి తాళం వేసి హుటాహుటిన హైదరాబాద్కు తరలివెళ్లారు. చివరి సెల్ఫీలో మృతులు ఆరుగురు.. సరదాగా నవ్వుతూ ఆ రెండు కుటుంబాలు ఎంతో ఉల్లాసంగా తీసుకున్న ఆ సెల్ఫీ చివరిదైంది. ఏడుగురు తీసుకున్న సెల్ఫీలోని ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఆ ఫొటోలోని ఆరుగురు విగత జీవులు కాగా.. ఓఆర్ఆర్పై శవాలను ఉంచడం సిరిసిల్ల వాసులను ఆవేదనకు గురి చేసింది. ఆఖరు సెల్ఫీలో ఉన్న వారిలో ఒక్క శ్వేత తప్ప అందరూ మరణించడం బాధాకరం. హైదరాబాద్ తరలిన ఆత్మీయులు రెండు కుటుంబాలకు చెందిన ఆత్మీయులు హైదరాబాద్కు తరలివెళ్లారు. శవాలు గాంధీ ఆస్పత్రి మార్చురీలో ఉండగా.. శ్వేత కిమ్స్ ఆస్పత్రిలో చావుబతుకుల్లో ఉంది. సిరిసిల్లకు చెందిన పలువురు హైదరాబాద్ తరలివెళ్లారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫోన్లో బొల్లి రాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
చెట్టుకు ఢీకొన్న ఆటో.. ఒకరికి తీవ్ర గాయాలు
మల్లాపూర్: మల్లాపూర్ మండలంలోని రేగుంట శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లికి చెందిన వాసం మురళి గూడ్స్ ఆటోలో గొర్రెపల్లి నుంచి రేగుంట వైపు వస్తుండగా, అతివేగంతో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. స్థానికులు అందించిన సమాచారంతో కుటుంబసభ్యులు ఘటనస్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడ్డ మురళిని అంబులెన్స్లో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మల్లాపూర్ ఎస్సై అనిల్, పోలీసు సిబ్బందితో ఘటనస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. -
ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచాలి
కరీంనగర్ టౌన్: సమాజ అభివృద్ధిలో కీలకమైన కార్మికుల ఆరోగ్యం, భద్రతకు అన్ని విధాలుగా అండగా ఉంటామని కలెక్టర్ చిత్రామిశ్రా భరోసానిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలశాఖ ఆధ్వర్యంలో మే డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన భవన నిర్మాణ రంగ కార్మికులను వెల్ఫేర్ బోర్డు కింద నమోదు చేయించాలని అధికారులను ఆదేశించారు. కార్మికులకు ప్రభుత్వం అందించే పథకాలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, ఆర్థిక సాయం గురించి తెలిసేలా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. వీధి వ్యాపారులు, గ్రిగ్, మున్సిపల్ తదితర విభాగాల్లో పనిచేస్తూ, అసంఘటిత కార్మికులుగా నమోదు కాకుండా ఉంటే వెంటనే నమోదు చేయించాలని ఆదేశించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల ఆరోగ్యం, కుటుంబ భద్రతకు పెద్దపీట వేస్తుందన్నారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికుల శ్రమతోనే దేశం, రాష్ట్రం, నగరం అభివృద్ధి చెందుతున్నాయన్నారు. శానిటేషన్ కార్మికుల భద్రత, బీమా, సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. డిప్యూటీ మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి కలిసికట్టుగా కృషి చేద్దామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మికశాఖ బ్రోచర్ ఆవిష్కరించారు. బెస్ట్ ఎంప్లాయీమెంట్, బెస్ట్ మేనేజ్మెంట్, స్పెషల్ కేటగిరీ పురస్కారాలు అందించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి జిల్లా డిప్యూటీ లేబర్ కమిషనర్ కోలా ప్రసాద్, జిల్లా ఎంప్లాయీమెంట్ ఆఫీసర్ తిరుపతిరావు, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ గంగాధర్రెడ్డి, ఐటీఐ ప్రిన్సిపాల్ అశోక్ పాల్గొన్నారు. పక్కాగా నియోజకవర్గస్థాయి కార్యక్రమాలుకరీంనగర్ అర్బన్: ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం నిర్వహించే నియోజకవర్గస్థాయి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. శుక్రవారం రాత్రి కరీంనగర్లో శనివారం జరిగే నియోజకవర్గస్థాయి సమావేశాలు, ధాన్యం కొనుగోలు..నీట్ పరీక్ష ఏర్పాట్లు.. రైతువారం విజయవంతంపై సమీక్షించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా చేపట్టాలని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని సూచించారు. ఆదివారం జరగనున్న నీట్ పరీక్షకు పక్కా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ నెల 4నుంచి ప్రారంభమయ్యే రైతువారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక 99వ రోజుల కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగ యువతకు ఈ నెల 5న మెగా జాబ్మేళాను నిర్వహించనున్నట్లు కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో టాస్క్, ఎంప్లాయీమెంట్, ఇండస్ట్రియల్, స్పోర్ట్స్శాఖల అధికారుల సమక్షంలో జాబ్మేళా పోస్టర్ విడుదల చేశారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
తిమ్మాపూర్: మండలకేంద్రంలో రాజీవ్రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం భాషాగూడకు చెందిన బడావత్ ప్రదీప్ నాయక్ (24) మృతిచెందాడు. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న మరో ఇద్దరు గాయపడ్డారు. ఏప్రిల్ 30న మధ్యాహ్నం ప్రదీప్ తన స్నేహితుడి మహీంద్రా థార్ను తీసుకొని సోదరి నందిని, ఆమె స్నేహితురాలు, స్నేహితుడు పవన్, మంచిర్యాలకు బయల్దేరారు. నందిని స్నేహితురాలిది మంచిర్యాల కావడంతో ఆమెను దించి రాత్రి అక్కడే ఉన్నారు. తిరిగి శుక్రవారం ఉదయం మహేశ్వరం బయల్దేరారు. మండలంలోని మహాత్మానగర్ వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ప్రదీప్నాయక్ అక్కడికక్కడే మృతిచెందాడు. వాహనంలో ఉన్న నందిని, పవన్కున గాయాలయ్యాయి. వీరిని 108లో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు. ప్రదీప్ తండ్రి బదావత్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్ఎండీ పోలీసులు తెలిపారు. మరో ఇద్దరికి గాయాలు తిమ్మాపూర్ మండలకేంద్రంలో ఘటన -
గీత కార్మికుడి బలవన్మరణం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన పంది ర్ల శ్రీనివాస్గౌడ్(56) అనే గీతా కార్మికుడు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్లో శ్రీనివాస్గౌడ్ కుటుంబ సభ్యులతో నివసిస్తున్నాడు. తన భార్య గ్రామంలోని ఓ శుభకార్యానికి వెళ్లింది. అనంతరం తన గదిలో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. కొంతకాలంగా శ్రీని వాస్గౌడ్ అప్పులతో బాధ పడుతున్నాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. లిఫ్ట్ ఇస్తానని చైన్ చోరీముస్తాబాద్(సిరిసిల్ల): అమ్మలాంటిదానివని నమ్మించి.. బైక్పై లిఫ్ట్ ఇస్తానని వృద్ధురాలిని ఎక్కించుకున్న అపరిచిత వ్యక్తి పుస్తెలతాడు దొంగిలించాడు. నిందితుడి ఫొటోలను ముస్తాబాద్ ఎస్సై గణేశ్ శుక్రవారం విడుదల చేశారు. ఎస్సై వివరాల ప్రకారం.. గత నెల 20న ఆవునూర్కు చెందిన పొన్నాల యాదమ్మ(65) అనే వృద్ధురాలు సిద్దిపేటలో ఉన్న కుమార్తె ఇంటికెళ్లింది. తిరుగు ప్రయాణంలో సిద్దిపేట ఎల్లమ్మ గుడి వద్ద యాదమ్మ బస్సు కోసం వేచి ఉండగా.. గుర్తుతెలియని వ్యక్తి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావమ్మా అంటూ యాదమ్మను పలకరించాడు. ముస్తాబాద్కు వెళ్లాలని యాదమ్మ చెప్పగా.. తాను అటే వెళ్తున్నానని, అమ్మలాంటిదనివని బైక్పై ఎక్కించుకున్నాడు. ముస్తాబాద్ శివారులోకి రాగానే యాదమ్మ మెడలోని బంగారు పుస్తెలతా డును లాక్కొని పరారయ్యాడు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఎస్సై వివరించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా యాదమ్మను మోసం చేసిన వ్యక్తి ఫొటోలు, వీడియోలు వెలుగు చూశాయన్నారు. సదరు గు ర్తుతెలియని వ్యక్తి తెల్లని షర్టులో ఉన్నాడని, మర్యాదస్తుడిలా కనిపిస్తూ మోసాలకు పాల్ప డుతున్నట్లు గుర్తించామని అన్నారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెద్దరాతుపల్లి గ్రామ శివారులోని మానేరు తీరంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించాడు. జిల్లాలోని ముత్తారం మండల కేంద్రానికి చెందిన తడవేన పోచాలు(35) పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెద్దరాతుపల్లి గ్రామ శివారులో శుక్రవారం చేపల వేటకు వెళ్లాడు. అక్కడ ఏమైందో ఏమోగానీ స్థానికులకు మృతి చెంది కనిపించాడు. వడదెబ్బతో మృతి చెందాడా? లేదా వేరే ఇతర కారణంతో మృతి చెందాడా? అనేది తెలియడం లేదు. ఈవిషయం పోలీసులు విచారణ చేయాల్సి ఉంది. -
ప్రత్యామ్నాయం.. ప్రశాంత ప్రయాణం
● రద్దీ రూట్లలోనూ సులభంగా రైలు టికెట్లు ● పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల సందర్శనకు అవకాశం రామగుండం: ప్రస్తుత వేసవిలో పర్యాటక, పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయి తే, తక్కువ వ్యయంతో సుఖంగా, ప్రశాంతంగా ప ర్యటన సాగేందుకు రైలు ప్రయాణానికే మొగ్గుచూపుతున్నారు. సుదూర ప్రాంతాలను సందర్శించాలనుకునే వారికి.. ముఖ్యంగా సందర్శన స్థలాలకు రైల్వే కనెక్టివిటీ, రైళ్ల వివరాలు తదితర అంశాలపై కొంత అవగాహన ఉండాలని అధికారులు సూచిస్తు న్నారు. వారణాసి, న్యూఢిల్లీ, బెంగళూరు, చైన్నె త దితర ప్రాంతాలకు నడిచే డైరెక్ట్ రైళ్లు రెండు నెలల ముందే రిజర్వేషన్లు పూర్తవుతాయి. సాధారణ బో గీల్లో కనీసం అడుగు పెట్టలేని పరిస్థితి ఉంటుంది. ఒకవేళ అప్పటికప్పుడు టూర్కు వెళ్లాలని నిర్ణయించుకున్నా ప్రైవేట్ ట్రావెల్స్ను ఆశ్రయించాల్సిందే. తద్వారా ఖర్చుభారం పెరుగుతుంది. ఇందుకు ప్ర త్యామ్నాయంగా సమీప ప్రాంతాలకు వెళ్లే రైళ్లపై ప్ర త్యేక దృష్టి సారిస్తే.. టికెట్లు సులభంగా లభ్యమ య్యే అవకాశం ఉంది. న్యూఢిల్లీ వైపు వెళ్లాలంటే హ జ్రత్ నిజాముద్దీన్, డెహ్రాడూన్, చైన్నె వైపు వెళ్లేవా రు ఎగ్మోర్, తాంబరం, పెరంబూర్, చెంగల్పట్టు, అ రక్కోణం, గూడూర్, రేణిగుంట, బెంగళూరు వైపు వెళ్తే యశ్వంతపూర్ తదితర రైళ్ల ద్వారా ప్రధా న కేంద్రాలకు సులభంగా చేరుకోవచ్చు. వీటిపై అవగాహన ఉంటే ప్రయాణం సుఖమయమవుతుంది.వారణాసి వైపు వెళ్లేందుకు.. ప్రయాగ్రాజ్, వారణాసి, అయోధ్య సందర్శించాలనుకునే వారికి రైలు సౌకర్యం బాగానే ఉంది. ప్రధానంగా సికింద్రాబాద్ నుంచి వారణాసికి నేరుగా రెండు రైళ్లు నడుస్తున్నాయి. వీటికి రెండునెలల ముందే బుకింగ్ పూర్తయ్యింది. అయితే, ప్రత్యామ్నాయంగా వారణాసికి 16 కిలోమీటర్ల దూరంలో పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ(డీడీయూ) రైల్వేస్టేషన్ మీదుగా అనేక రైళ్లు నడుస్తుంటాయి. ఈ రైళ్లను ఆశ్రయిస్తే డీడీయూ రైల్వేస్టేషన్లో దిగి రోడ్డు మార్గం ద్వారా వారణాసి, అయోధ్య వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. -
గల్ఫ్లో గుండెపోటుతో గొల్లపల్లి వాసి మృతి
● స్వగ్రామం చేరిన మృతదేహం ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఉన్న ఊర్లో ఉఫాధి లేక పొట్ట చేత పట్టుకొని గల్ఫ్ వెళ్లిన రైతు అక్కడే గండెపోటుతో మరణించగా.. శుక్రవారం మృతదేహం స్వగ్రామం చేరింది. శవపేటిక రావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వివరాలు.. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి గ్రామానికి చెందిన పొన్నాల వెంకట్రెడ్డి(48) అనే గల్ఫ్ కార్మికుడు మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురై మలేషియాలో మృతిచెందాడు. స్వగ్రామంలో ఉపాధి లేక కుటుంబ పోషణ కోసం ఆరేళ్ల క్రితం కంపెనీ వీసాపై గల్ఫ్కు వెళ్లాడు. 22 నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి కొద్ది రోజులు ఇక్కడ ఉండి తిరిగి మలేషియాకి వెళ్లిన వెంకట్రెడ్డి గదిలోనే గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. ఈ సమాచారాన్ని అక్కడి మిత్రులు మంగళవారం కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి పంపించాలని సిరిసిల్ల శాసన సభ్యుడు కేటీఆర్ను కోరగా.. స్పందించిన కేటీఆర్ అక్కడి అధికారులతో మాట్లాడి 4 రోజుల్లో మృతదేహం ఇంటికొచ్చేలా చర్యలు తీసుకున్నారు. అంత్యక్రియల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, సర్పంచ్ కొండ రమేశ్గౌడ్ పాల్గొన్నారు. మృతుడికి భార్య వనజ, కుమార్తె జావలి ఉన్నారు. -
విద్యుదాఘాతంలో వ్యక్తి మృతి
కోరుట్ల రూరల్: పట్టణంలోని హాజిపురాకు చెందిన వావిలాల నవీన్ (28) అనే వ్యక్తి శుక్రవారం విద్యుదాఘాతంలో మృతి చెందినట్టు ఎస్సై చిరంజీవి తెలిపారు. పట్టణ శివరులోని ఎల్లమ్మ గుడి వద్ద గల వాగులో చేపలు పట్టేందుకు కరెంటు వైర్ ఉపయోగించగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడని అన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. షార్ట్ సర్క్యూట్తో హోటల్ దగ్ధం వీర్నపల్లి: మండలంలోని కంచర్లలో షార్ట్ సర్క్యూట్తో బస్టాండ్ వద్ద ఓ గుడిసెతో పాటు చాట్ల శంకర్ అనే వ్యక్తికి చెందిన హోటల్ దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ.20 వేలవరకు నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. జీపీకి సంబంధించిన బోరుమోటార్ వైర్లు కూడా కాలిపోవడంతో, సుమా రు రూ.10 వేల వరకు నష్టం జరిగింది. సర్పంచ్ సామల్ల దేవరాజ్, జీపీ సిబ్బంది రైతులు మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. -
ఒకేరోజు 11 అగ్ని ప్రమాదాలు
కరీంనగర్క్రైం: జిల్లావ్యాప్తంగా శుక్రవారం 11 అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఆయా ప్రాంతాలకు సమయానికి చేరకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పివేశారు. ఫైర్ అధికారుల వివరాల ప్రకారం కరీంనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో కేబుళ్లు, గంగాధర మండలం కురిక్యాల, కొత్తపల్లి మండలం మల్కాపూర్లో పంటచేలు, కరీంనగర్ రూరల్ మండలం ఎలబోతారంలో శక్తి కాటన్ ఇండస్ట్రీస్లో మంటలు చెలరేగాయి. చొప్పదండి మండలం మల్లన్నపల్లిలో, గుమ్లాపూర్లో పంటచేలు దగ్ధమయ్యాయి. శాతవాహన యూనివర్సిటీ సమీపంలో ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. అల్గునూర్లో గడ్డివాము దగ్ధమైంది. హుజూరాబాద్ కోతుల నడుమలో గడ్డివాము, జయశంకర్ భూపాలపల్లి మండలం మొగుళ్లపల్లి మండలం ఎల్లారెడ్డిపేటలో మొక్కజొన్న చేనులో మంటలు తలెత్తడంతో జమ్మికుంట ఫైర్ సిబ్బంది వెళ్లి మంటలు ఆర్పారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఆయా ఘటనల్లో కరీంనగర్, మానకొండూర్, చొప్పదండి, జమ్మికుంట ఫైర్ సిబ్బంది పాల్గొన్నట్లు డివిజన్ ఫైర్ అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లావ్యాప్తంగా పలు రైస్మిల్లుల్లో అగ్నిప్రమాదాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. -
ప్రమాదవశాత్తు బావిలోపడి యువకుడు మృత్యువాత
తిమ్మాపూర్: ప్రమాదవశాత్తు యువకుడు బావిలోపడి మృతి చెందిన ఘటన తిమ్మాపూర్లో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం పొరండ్ల గ్రామానికి చెందిన బొజ్జ రాజ్కుమార్(32) డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శుక్రవారం ఉదయం మిత్రుడితో కలిసి మానేరు జలాశయం వైపు వెళ్లాడు. సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ముఖం కడుక్కునేందుకు యత్నించాడు. ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడ్డాడు. రాజ్ కుమార్కు ఈత రాకపోవడంతో తోటి మిత్రులు కుటుంబ సభ్యులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మృతదేహాన్ని వెలికి తీశారు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. రాజకుమార్కు కుమార్తె, కుమారుడు ఉన్నారు. రాజ్కుమార్ మృతికి కేంద్ర మంత్రి బండి సంజయ్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంతాపం వ్యక్తం చేశారు. అతని భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
బాలల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
కరీంనగర్: పిల్లల ఆరోగ్యం, భద్రత, సమగ్ర అభి వృద్ధికి సమాజం కలసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ సూచించారు. ప్రజాపాలనా ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ జనరల్ ఆ స్పత్రిలో నిర్వహించిన బాలల భద్రత, రక్షణ, సంక్షేమ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అ మలు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లా టీబీ కంట్రోల్ ఆఫీసర్ రవీంద్రరెడ్డి పాల్గొన్నారు.మాట్లాడుతున్న డీఎంహెచ్వో వెంకటరమణ -
మేడే.. ‘ఫ్రై’డే
ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 11 దాటితే బయటికి వెళ్లాలంటే భయమేస్తోంది. నెత్తిపై నిప్పుల కుంపటి కురుస్తోంది. శుక్రవారం 43 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రలు నమోదైన క్రమంలో ప్రజలు అల్లాడిపోతున్నారు. శుక్రవారం మేడే సందర్భంగా కార్మికులకు విశ్రాంతి దొరకగా.. చిరువ్యాపారులు ఎండకు తల్ల డిల్లిపోయారు. ఉష్ణోగ్రతలు ఆందోళనకర స్థాయికి చేరగా వేడిమిని తట్టుకునేందుకు ప్రజలు, వాహనదారులు ప్రత్యామ్నాయాలు అనుసరిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యం
కొత్తపల్లి(కరీంనగర్)/సిరిసిల్ల/హుజూరాబాద్: విద్యుత్ వినియోగదారుల్లో భద్రతాపరమైన అవగాహనను పెంపొందించే లక్ష్యంతో మే 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఎన్పీడీసీఎల్ పరిధిలోని 18 సర్కిళ్లలో విద్యుత్ భద్రతా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు సంస్థ సీఎండీ కర్ణాటి వరుణ్రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ డివిజన్ సింగాపూర్ సబ్స్టేషన్, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సర్కిల్ ఎస్ఈ ఆఫీస్లో గురువారం వారోత్సవాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వరుణ్రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ లైన్లను పరిశీలిస్తూ.. అంతరాయరహితంగా విద్యుత్ సరఫరా అందించాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో పర్యటించి, ప్రజలకు ,రైతులకు విద్యుత్ భద్రతపై సమగ్ర అవగాహన కల్పించాలని సీఎండీ ఆదేశించారు. సమావేశాలు, ప్రచార కార్యక్రమాల ద్వారా భద్రతా ప్రమాణాలపై పూర్తి అవగాహన కలిగించాలని అన్నారు. విద్యుత్ ప్రమాదాలు అధికశాతం నిర్లక్ష్యం, అజాగ్రత్త, అవగాహన లేక జరుగుతున్నాయని తెలిపారు. జాగ్రత్తలు పాటిస్తే విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చన్నారు. విద్యుత్ పరికరాలను నిర్లక్ష్యంగా వినియోగించడం, నాసిరకమైన లేదా పాడైపోయిన తీగలను వాడడం, సరైన ఎర్తింగ్ సదుపాయం లేకపోవడం, తడి చేతులతో విద్యుత్ పరికరాలను తాకడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ప్రమాదకరమైన లైన్లు, వంగిపోయిన స్తంభాలు, తక్కువ ఎత్తులో ఉన్న తీగలను పొడవాటి స్తంభాలను అమర్చి ఎత్తు పెంచడం , ప్రజలకు సురక్షితంగా విద్యుత్ సరఫరా అందించేందుకు అన్ని చర్యలూ యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయని వరుణ్రెడ్డి వివరించారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం రోజూ 24 గంటలూ అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నంబర్ 1912 కు వెంటనే సంప్రదించాలన్నారు. కరీంనగర్ ఎస్ఈ ఆర్.రవీందర్, రాజన్న సిరిసిల్ల ఎస్ఈ టి.వేణుమాధవ్, డీఈలు లక్ష్మారెడ్డి, చంద్రమౌళి, అనిల్ కుమార్, ఏడిఈ శ్రీనివాస్, ప్రశాంత, ఏఈ రమేష్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నెల రోజుల్లోనే 860 వ్యవసాయ విద్యుత్ సర్వీసులను మంజూరు చేశామని సిరిసిల్ల సర్కిల్ ఎస్ఈ వి.వేణుమాధవ్ గురువారం తెలిపారు. జిల్లాలో గత ఏడాది 1,752 విద్యుత్ సర్వీసులు మాత్రమే మంజూరు అయ్యాయని, నెల రోజుల్లోనే 860 అనుమతులు ఇచ్చామన్నారు. పెండింగ్ ఉన్న 1540 సర్వీసులన్నీ జూన్లోగా పూర్తిచేశామని వివరించారు. జిల్లాలో అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, కండక్టర్లు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, పనులు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగిస్తామని వేణుమాధవ్ తెలిపారు. నేటి నుంచి విద్యుత్ భద్రత వారోత్సవాలు 7వ తేదీ వరకు వినియోగదారులకు విద్యుత్ భద్రతపై అవగాహన పోస్టర్ ఆవిష్కరించిన టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరణ్రెడ్డి -
మరణించి.. ముగ్గురికి ఆయువు పోసి..
కోల్సిటీ(రామగుండం): మంచిర్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో విషాదం నింపినా.. ఓ ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. స్ఫూర్తిగా నిలిచిన ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటుచేసుకుంది. అవయవదానం ద్వా రా మరణానంతరం కూడా జీవించి చూపించిన ఆ యువకుడు, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. గురువారం గోదావరిఖనిలో అవయవదాతకు కన్నీటితో అంతియయాత్ర నిర్వహించారు. వివరాలు.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీనగర్కు చెందిన పెరుక శ్రీనివాస్(43) ఓ బ్యాంకులో తాత్కాలిక కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. గత నెల 23న రాత్రి మంచిర్యాల సమీపంలోని నస్పూర్ సీసీసీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా పరిస్థితి విషమించింది. దీంతో హైదరాబా ద్లోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు శ్రమించినా ఫలితం లేకపోయింది. శ్రీనివాస్ బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఈ విషాదవార్తను కుటుంబ సభ్యులకు తెలియజేయగా.. దుఃఖంలోనూ ధైర్యంగా ముందుకొచ్చిన భార్య పి.సంధ్యారాణి.. తన భర్త అవయవదానానికి అంగీకారం తెలిపారు. వైద్యులు 28న బ్రెయిన్ డెడ్గా నిర్ధారించిన అనంతరం 29న లివర్, కిడ్నీలు, కార్నియాలను సేకరించి అవసరమైన పేషెంట్లకు అమర్చారు. తద్వారా ముగ్గురికి పునఃర్జన్మతోపాటు మరో ఇద్దరికి కంటి చూపు ప్రసాదించినట్లయ్యింది. భర్తను కోల్పోయిన దుఃఖాన్ని దిగమింగుకుంటూ మానవత్వాన్ని ముందుకు తీసుకొచ్చిన సంధ్యారాణి నిర్ణయం సమాజానికి ఆదర్శంగా నిలిచింది. ‘అవయవదానం మహాదానం’ అనే నానుడిని ఈ ఘటన మరోసారి సార్థకం చేసింది. మృతుడు శ్రీనివాస్కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శ్రీనివాస్ మృతికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేయడంతోపాటు అవయవదానం చేయడానికి అంగీకారం తెలిపిన భార్యతోపాటు కుటుంబ సభ్యులను జీవన్ధాన్ సంస్థ, సదాశయ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు అభినందించారు. మరో ఇద్దరికి కంటి వెలుగులు ఇచ్చి.. బ్రెయిన్డెడ్తో బ్యాంక్ ప్రైవేట్ ఉద్యోగి మృతి భర్త అవయవాలను దానం చేసిన భార్య విషాదంలోనూ స్ఫూర్తిగా నిలిచిన కుటుంబం -
మీనం విలవిల
ఎండ సలసల.. బోయినపల్లి(చొప్పదండి): మునుషులకే కాదు.. చేపలకూ ఎండదెబ్బ తగులుతోంది. భానుడి ప్రతాపానికి చెరువులు, కుంటల్లో నీరు వేడెక్కుతోంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రత కారణంగా చెరువులు, కుంటల్లో నీరు తగ్గి ప్రాణవాయువు కొరత ఏర్పడుతోంది. నీటి నాణ్యత తగ్గడం, గాఢత పెరగడం తదితర కారణాలతో చేపలు తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. కొన్ని సందర్భాల్లో పెద్ద మొత్తం చేపలు చనిపోతుంటాయి. రోగకారక సూక్ష్మజీవులు వల్ల వాటికి వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఎక్కువవుతాయి. నాలుగు ప్రాజెక్టులు, 340 చెరువులు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 13 మండలాల్లో 340 వరకు చెరువులు, కుంటలు ఉన్నాయి. బోయినపల్లి మండలం మాన్వాడలో మిడ్మానేరు, గంభీరావుపేట మండలంలో ఎగువమానేరు, ఇల్లంతకుంట మండలంలో అన్నపూర్ణ, కోనరావుపేట మండలంలో మల్కపేట ప్రాజెక్టులు ఉన్నాయి. గతేడాది సీజన్లో జిల్లాలోని పలు ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో 1.35 కోట్ల మేర చేపపిల్లలు వదిలినట్లు సంబంధిత అధికారి తెలిపారు. ● రోజూ చెరువులోని నీటి నాణ్యత, లోతు, విస్తీర్ణం, చేపల కదలిక గమనిస్తూ ఉండాలి. చెరువులోని కొన్ని చేపలను పట్టి వాటి పెరుగుదల, రంగు, తోక, రెక్కల స్వభావం, మొప్పెల రంగు, పై జిగురు తదితర లక్షణాలను పరిశీలించాలి. తేడాలు గమనిస్తే, సంబంధిత శాఖ అధికారి సలహాలు తీసుకోవాలి. ● ఉదయం 5 నుంచి 6 గంటల సమయంలో చేపలు చెరువు పైభాగాన నోరు తెరచుకొని తిరుగుతూ ఉంటే ప్రాణవాయువు కొరత ఉందని గమనించాలి. అలాంటి సందర్భాల్లో చెరువులో నీరు పెట్టడం లేదా పెద్దగా పెరిగిన చేపలను పట్టి విక్రయించాలి. దీంతో చేపల సాంద్రత తగ్గి ప్రాణవాయువు కొరతను అధిగమించవచ్చు. చేపలు మార్కెట్ సైజు రాలేదని, రేటు లేదని, ఐస్ దొరకలేదనే కారణాలతో మత్యకారులు నిర్లక్ష్యం చేయొద్దు. ● చెరువులో ప్రాణవాయువు లోటు ఉన్నట్లు అనిపిస్తే ఎకరాకు 1 కేజీ కాల్షియం పెరాకై ్సడ్ను ఇసుకతో కలిపి చెరువు నీటిలో చల్లాలి. దీంతో ప్రాణవాయువు పెరుగుతుంది. చెరువులోని నీటి నాణ్యత తగ్గినపుడు ఒక హెక్టారుకు 100 నుంచి 250 కేజీల వరకు సున్నం చెరువులో చల్లితే నీటి నాణ్యత, ప్రాణవాయువు శాతం పెరిగి ఉదజని సూచికను అదుపులో ఉంచుతుంది. ● చెరువులోని కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తగ్గించాలి. లేకుంటే రాత్రి సమయాల్లో అవి కేవలం కార్బన్ డై ఆకై ్సడ్ విడుదల చేయడం వల్ల చేపలకు ప్రాణవాయువు కొరత ఏర్పడి చనిపోతుంటాయి. అలాంటి సందర్భాల్లో మత్యకారులకు ఎవరైన గిట్టనివారు విషం కలిపారని అనుమానిస్తూ ఉంటారు. విషం కలిపితే కార్పు జాతి చేపలే కాకుండా కొర్రమట్ట (మర్రల్), మార్పు, జెల్లలు, తక్కువ ఆక్సిజన్ను తట్టుకునే చేపలు, కప్పలు, నీటి పాములు కూడా చనిపోతాయి. అలాంటి అనుమానాలు నిజమా కాదా అని నిర్ధారించుకోవాలి. ● వ్యాధితో చేపలు చనిపోయినప్పుడు వెంటనే వాటిని తొలగించి చెరువుకు దూరంగా కాల్చివేయాలి లేదా గొయ్యి తీసి పూడ్చివేయాలి. అనంతరం ఒక హెక్టారుకు 100 నుంచి 250 కిలోల సున్నం మోతాదులో చల్లాలి. ఇంకా అదుపులోకి రాకుంటే నీటి నాణ్యత పెంచే రసాయనాలను (బెంజాల్ కొలియం క్లోరైడ్) ఒక హెక్టారుకు ఒక లీటరు చొప్పున నీటిలో కలిపి చెరువులో చల్లాలి. ఈ చర్యల వల్ల నీటి నాణ్యత పెరగడమే కాకుండా చేపలపై ఉన్న పరాన్నజీవులు చనిపోతాయి. ఇన్ని చేసినా ఎలాంటి మార్పు లేకుంటే చివరి అస్త్రంగా యాంటిబయాటిక్ మందులను సూచించిన మోతాదులో మేతతో పాటూ కలిపి ఇవ్వాలి. ● ప్రాణవాయువు పెంచుకోవడానికి చెరువులోని నీటిని మోటార్ల ద్వారా తిరిగి చెరువులోనికి పంపింగ్ చేసుకుంటే విష వాయువులు తగ్గి ప్రాణవాయువు శాతం పెరుగుతుంది. పైన తెలిపిన సందర్భాల్లో కొన్ని చేపలను పట్టివేయడం అత్యంత శ్రేయస్కరం. 8 వేల మంది మత్స్యకారులు జిల్లాలో చేపల పెంపకం ద్వారా సుమారు 8,642 మంది మత్స్యకార్మికులు ఉపాధి పొందుతున్నారు. అలాగే 135 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు, మహిళ మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలతో పాటు, ఎగువ మానేరులో మత్స్యకార్మిక సొసైటీ ద్వారా కార్మికులు చేపలతో జీవనోపాధి పొందుతున్నారు. అలాగే పలు చెరువుల్లో చేపలు పట్టడంతో మత్స్యకారులకు ఉపాధి దొరుకుతోంది. చేపలకు ఎండదెబ్బ భానుడి ప్రతాపానికి చెరువులు, కుంటల్లో వేడెక్కుతున్న నీరు ముందు జాగ్రత్తలే రక్ష ఉదయం, సాయంత్రం చేపల వేట శ్రేయస్కరం ప్రాజెక్టులు : మిడ్మానేరు, ఎగువ మానేరు, అన్నపూర్ణ, మల్కపేట చెరువులు, కుంటలు : 340 చేపపిల్లలు వదిలిన ప్రాజెక్టులు : మిడ్మానేరు, అన్నపూర్ణ వేసిన చేప పిల్లలు : 1.35 కోట్లు మత్స్య కార్మికులు : 8,642 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు : 135 -
జిల్లా జైలు సందర్శన
కరీంనగర్క్రైం: జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి టి.రాణి గురువారం జిల్లా జైలును సందర్శించారు. ఖైదీల న్యాయసేవ, ఆరోగ్య సమస్యలపై ఆరా తీశారు. జైలులో క్యాంటీన్, ఆస్పత్రి ములాఖత్, టెలిఫోన్ సౌకర్యం, లైబ్రరీ, వంటశాల, జైలు ఇండస్ట్రీలో పని తీరును పరిశీలించారు. కొత్త చట్టాలపై ఖైదీల ను అవగాహన కల్పించారు. మహిళా ఖైదీల బాగోగులు, జైలులో కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. లాయర్ను పెట్టుకునే స్థోమత లేనివారికి ప్రభుత్వ లాయర్ను నియమిస్తామన్నారు. జైలు సూపరింటెండెంట్ విజ యదేని, జైలర్లు పి.శ్రీనివాస్, రమేశ్, డిప్యూటీ జైలర్లు ఎస్.సుధాకర్రెడ్డి, ఎల్.రమేశ్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ తణుకు మహేశ్ పాల్గొన్నారు. సమర్థవంతంగా ఆరోగ్య మహిళ కరీంనగర్: ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని డీఎంహెచ్వో వెంకటరమణ సూచించారు. ఆరోగ్య మహిళ హెల్త్క్యాంపుల్లో స్క్రీనింగ్ చేసిన అందరిని రీస్క్రీనింగ్ చేస్తూ ఫాలోఅప్ చేయాలన్నారు. గురువారం సప్తగిరికాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రం, పద్మనగర్ బస్తీ దవాఖానాను సందర్శించారు. ఆస్పత్రుల్లో హాజరు రిజిస్టర్, అవుట్ పేషెంట్, ఎన్సీడీ రిజిస్టర్, ఫార్మసీ స్టోర్స్ను తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక రక్తపోటు, డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు ప్రభుత్వం సరఫరా చేసే మందులనే వాడేలా ప్రోత్సహించాలన్నారు. ప్రజలకు వడ దెబ్బ గురించి వివరించాలన్నారు. గర్భిణులకు చెకప్స్, అభాకార్డుల క్రియేషన్ సంఖ్య పెంచాలన్నారు. పీవో ఎంహెచ్ఎన్ సన జవేరియా, పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సఫీర్ పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2026
సాక్షిప్రతినిధి, కరీంనగర్ ●: తిడితే కాంట్రాక్టర్లే తిట్టాలి.. దౌర్జన్యం చేస్తే వాళ్లే చేయాలి.. కుర్చీలు, బల్లలు కాంట్రాక్టర్లు విసిరేస్తే ఓకే.. అలా కాదని కార్పొరేటర్లు తిడితే ఆగమేఘాలపై పోలీసు కేసులు పెట్టుడే.. అవసరమైతే జైలుకు పంపుడే.. వివాదాస్పదంగా మారుతున్న నగరపాలకసంస్థ ఉద్యోగులు, అధికారుల తీరిదీ. ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే కాంట్రాక్టర్ల దౌర్జన్యాలపై కిమ్మనని అధికారులు, ప్రజా సమస్యలపై కార్పొరేటర్లు గట్టిగా గొంతెత్తితే చాలు పోలీసు కేసులు పెట్టడం, జైళ్లకు పంపడం, పైపెచ్చు ఉద్యోగ సంఘాలతో ఆందోళన చేయించడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. కాంట్రాక్టర్ల దౌర్జన్యాలపై కిమ్మనరెందుకో? పనులు, టెండర్లు, బిల్లుల విషయంలో కాంట్రాక్టర్లు నిత్యం కార్యాలయంలో అధికారులతో ‘టచ్’లో ఉండడం తెలిసిందే. సహజంగానే కొంతమంది కాంట్రాక్టర్లు, అధికారుల నడుమ వీటి విషయంలో తేడాలొస్తుంటాయి. నగరపాలకసంస్థలో వివాదాస్పద కాంట్రాక్టర్గా ముద్రపడ్డ వ్యక్తి ఒకరు ఇవే విషయాల్లో అధికారులపై పలుమార్లు దౌర్జన్యాలకు పాల్పడ్డాడు. పలువురు కాంట్రాక్టర్లు ఇంజినీరింగ్ అధికారులను వారి చాంబర్లలో, కారిడార్లలో, కార్యాలయ ఆవరణలో బూతులు తిట్టడం, కుర్చీలు పడవేయడం జరిగింది. కొద్దిరోజుల క్రితం కాంట్రాక్టర్లు, ఓ డీఈల నడుమ బూతు పురాణం చోటుచేసుకొంది. ఏళ్లకాలంగా కాంట్రాక్టర్లు కార్యాలయంలోనే అధికారులపై దౌర్జన్యం చేస్తున్నా, ఇప్పటివరకు ఒక్క పోలీసు కేసు నమోదు కాకపోవడం గమనార్హం. కార్పొరేటర్లయితే కేసులే ప్రజా సమస్యల పరిష్కారానికి నగరపాలకసంస్థ అధికారులతో కార్పొరేటర్లు చర్చిస్తుంటారు. ప్రజాప్రతినిధులుగా సమస్యలను పదేపదే అధికారుల దృష్టికి తీసుకువచ్చినా, పరిష్కారం కాని సందర్భంలో కార్పొరేటర్లు ఆగ్రహం చెందుతుంటారు. గత పాలకవర్గ సమయంలో టౌన్ప్లానింగ్కు సంబంధించిన ఓ ఫైల్ పెండింగ్ విషయంలో అప్పటి కార్పొరేటర్ మెండి శ్రీలత భర్త, మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ టీపీఎస్ తేజస్విని, కమిషనర్ చాహత్ బాజ్పేయ్తో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయనపై రాత్రికి రాత్రే వన్టౌన్పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి, కొన్ని గంటల్లోనే జైలుకు పంపించారు. చివరకు ఎస్సీ కమిషన్ ఎదుట అధికారులే చంద్రశేఖర్కు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. తాజాగా రూపాయి అంత్యక్రియల పథకం వర్తించడానికి స్థానిక ఆధార్, రేషన్కార్డులు లేవనే సాకుతో అడ్డుచెప్పడంపై మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ సుమన్పై ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. ఆయన కార్యాలయానికి వచ్చి కుర్చీ,టేబుల్ పడవేశాడని, శానిటేషన్ సూపర్వైజర్ను తిట్టాడంటూ వన్టౌన్ పోలీసు స్టేషన్లో రాత్రికి రాత్రే కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించే క్రమంలో నేతల ఒత్తిడితో రిమాండ్కు బదులు స్టేషన్ బెయిల్తో బయటకు వచ్చారు. కార్పొరేటర్ల సంఘీభావం పోలీసు స్టేషన్లో ఉన్న మాజీడిప్యూటీ మేయర్గుగ్గిళ్లపు రమేశ్కు పార్టీలకతీతంగా కార్పొరేటర్లు సంఘీభావం పలికారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్, కాంగ్రెస్ కార్పొరేటర్లు వైద్యుల అంజన్కుమార్, చాడగొండ కవిత బుచ్చిరెడ్డి, సరిళ్ల రాజకుమారి ప్రసాద్, బీజేపీ కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్రావు వన్టౌన్ పోలీసు స్టేషన్కు వెళ్లి రమేశ్కు ధైర్యం చెప్పారు. కార్పొరేటర్లలో కూడా ఐక్యత తెచ్చేందుకు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సర్ధార్ రవీందర్ సింగ్ తెలిపారు. వాళ్లపై కేసులు...వీళ్లతో రాజీలు ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు.. తమను తిట్టారని, దౌర్జన్యానికి పాల్పడ్డారని కేసులు పెట్టడం, ఉద్యోగ సంఘాలు వచ్చి ఆందోళనలు చేయడం సహజమే. విధుల్లో ఉన్న ఉద్యోగులు, అధికారులు తమను తిడితే పడాలని ఎక్కడా లేదు. కాంట్రాక్టర్లు తిడితే కిమ్మనకపోవడం, కార్పొరేటర్లు తిట్టారని కేసులు పెట్టి జైళ్లకు పంపడంపై నగరవాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒకరు తిడితే ఆత్మగౌరవం దెబ్బతింటుంది...మరొకరు తిడితే ఆత్మగౌరవానికి వీసమెత్తు కూడా నష్టం వాటిల్లని ‘తేడా’ ఎందుకనేది ప్రస్తుతం నగరంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇందులో ఉన్న ‘మతలబేమిటో’ బల్దియా ఉద్యోగులే వెల్లడించాల్సి ఉంది. -
చెట్టుకు కారు ఢీకొని యువకుడి మృతి
రాయికల్: రాయికల్ మండలం కుమ్మరిపల్లి శివారులో కారు చెట్టును ఢీకొనడంతో చాపల్లి రాంబాబు (31) అనే వలస కూలీ అక్కడికక్కడే మృతిచెందినట్లు ఏఎస్సై సైఫోద్దీన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కొండేపి గ్రామానికి చెందిన రాంబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి రాయికల్ మండలం కుమ్మరిపల్లిలో పదేళ్లుగా మేసీ్త్ర పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఉదయం కూలీల కోసం కారులో జగిత్యాలకు వెళ్తుండగా.. కుమ్మరిపల్లి శివారుకు చేరగానే.. అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రాంబాబుకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. డాడీ.. ఒక్కసారి మమ్మల్ని చూడు అంటూ ఐదేళ్ల చిన్నారులు రాంబాబు మృతదేహంపై ఏడ్వడం అందరినీ కలిచివేసింది. భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆలూరులో ఏడిళ్లలో చోరీరాయికల్: రాయికల్ మండలం ఆలూరులో ఒకేసారి ఏడు ఇళ్లలో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. గొల్ల పల్లి దుబ్బయ్య ఇంట్లో నుంచి రెండు తులాల బంగారం, పదహారు తులాల వెండి, పిట్టల సుజాత ఇంట్లో నుంచి రెండు తులాల బంగారం, రూ.40 వేలు, రాజారపు మనోహర్ ఇంట్లో నుంచి తులం బంగారం, సురతాని రాజు ఇంట్లో నుంచి 10 గ్రాముల వెండి ఎత్తుకెళ్లారు. గొల్లపల్లి భూమరాజం, రాజారపు రాజేందర్, చిల్ముల మల్లక్క ఇళ్లలో దొంగతనానికి యత్నించారు. జగిత్యాల రూరల్ సీఐ సుదాకర్, ఎస్సై సుధీర్రావు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్, డ్యాగ్స్క్వాడ్తో ఆధారాలు సేకరించారు. వడదెబ్బతో వ్యక్తి మృతివెల్గటూర్: వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఎండపల్లి మండలం సూరారంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జాడీ లచ్చయ్య (62) పంటపొలం కోయిస్తుండగా.. వడదెబ్బకు గురై స్పృహ తప్పి పడిపోయాడు. కుటుంబ సభ్యులు అతడిని ఇంటికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించేందుకని 108కు అంబులెన్స్కు సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. లచ్చయ్య భార్య రాజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. క్యాటరింగ్కు వెళ్లి వస్తూ.. ఆటో బోల్తా ● ఒకరి మృతి.. ఇద్దరికి గాయాలు మంథనిరూరల్: శుభకార్యంలో క్యాటరింగ్ చేసి ఆటోలో తిరిగి వస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరో ఇద్దరు గాయపడిన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్పూర్ గ్రామ సమీపంలోని గాడుదులగండి వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో గోదావరిఖని గంగానగర్కు చెందిన రజిత(35) మృతి చెందగా, ధనలక్ష్మి, శ్రవణ్కుమర్కు తీవ్రగాయాలయ్యాయి. వివరాలు.. గోదావరిఖని గంగానగర్కు చెందిన రజిత, ధనలక్ష్మి క్యాటరింగ్ చేస్తుంటారు. గురువారం ఉదయం కాటారంలో జరిగిన ఓ శుభకార్యానికి ఆటోలో వెళ్లి క్యాటరింగ్ చేసి తిరిగి వస్తున్నారు. రేగులగూడెం వద్ద కమాన్పూర్కు చెందిన శ్రవణ్కుమార్ అనే పురోహితుడు మంథనికి వచ్చేందుకు ఈ ఆటోలో ఎక్కాడు. అయితే గాడుదులగండి మూలమలుపు వద్దకు రాగానే ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో రజిత అక్కడికక్కడే మృతి చెందగా ధనలక్ష్మి, శ్రవణ్కుమార్కు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళ మృతదేహంతోపాటు గాయడిన వారిని మంథని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బంది రావొద్దు
చిగురుమామిడి/కరీంనగర్ సిటీ: చిగురుమామిడి మండలంలోని 17గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా అధికారులు పర్యవేక్షించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. చిగురుమామిడి మండలపరిషత్ సమావేశ మందిరంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణలో భాగంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మండలంలో 21 కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. సుందరగిరిలో వేసిన బోర్ మోటారుకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంపై విద్యుత్ అధికారులు, పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హుస్నాబాద్– కొత్తపల్లి రోడ్డు పనుల్లో పైపులైన్ ఎందుకు షిఫ్ట్ చేయలేదని ప్రశ్నించారు. అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, డీపీవో జగదీశ్వర్, డీఆర్డీవో శ్రీధర్, జెడ్పీసీఈవో శ్రీనివాస్ పాల్గొన్నారు. యూరియా వాడకాన్ని తగ్గించాలి రైతులు తక్కువగా యూరియా వాడి సాగు ఖర్చు తగ్గించుకోవాలని మంత్రి ప్రభాకర్ కోరారు. చిగురుమామిడి రైతువేదికలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాల మేరకు నూతన ఒరవడిలో వ్యవసాయం చేస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. మహాలక్ష్మి ఫంక్షన్హాల్లో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ కార్యకర్తలు అధికారులతో కలిసి అభివృద్ధి పనుల్లో సహకరించాలని కోరారు. ఎస్యూ ఇంజినీరింగ్ కళాశాలకు అన్ని వసతులు హుస్నాబాద్లో అన్ని వసతులతో కూడిన ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటవుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉమ్మాపూర్లో నిర్మించనున్న కళాశాల భవన నిర్మాణాల స్థలాన్ని పరిశీలించారు. స్థల పత్రాలను ఎస్యూ వీసీ ఉమేశ్కుమార్, రిజిస్ట్రార్ సతీశ్కుమార్కు అందించారు. హుస్నాబాద్లో ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని పేర్కొన్నారు. -
ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూల ఫలితాలు
కరీంనగర్: ఐదురాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఎ లా ఉన్నా క్షేత్రస్థాయిలో బీజేపీకి ఉన్న రిపోర్టు, అంచనాలకు అనుగుణంగా గణనీయ విజయాలు సా ధిస్తుందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ పార్లమెంట రీ కమిటీ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. గురువా రం కరీంనగర్లోని ఓ హోటల్లో మాట్లాడుతూ తె లంగాణ రాజకీయాల్లో మార్పునకు నాంది పలికేలా ఈ నెల 10న మనప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్నారని, ఈ సందర్భంగా ఏర్పాటు చేసే భారీ బహిరంగసభను విజయవంతం చేయాలని కోరా రు. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూ ర్ గవర్నమెంట్ అని విమర్శించారు. బీఆర్ఎస్కు ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చారని, ఆ పార్టీ అవుట్ డేటెడ్దిగా వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరీంనగర్లో తొలి మేయర్గా బీజేపీ అభ్యర్థి గెలవ డం ప్రజల్లో మార్పునకు సంకేతమన్నారు. మేయ ర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి టి.శ్రీనివాస్గౌడ్ ఉన్నారు. కాంగ్రెస్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ 10న మోదీ సభ ద్వారా తెలంగాణకు దిశా నిర్దేశం ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ -
ఎల్నినో హెచ్చరికలతో నిద్రలేచిన సీఎం
జగిత్యాలటౌన్: ఎల్నినో హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడితే రాష్ట్ర ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందనే భయంతోనే సీఎం రేవంత్ తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు అంటూ కొత్త ఎత్తులు వేస్తున్నారని మాజీమంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి అన్నారు. 152 మీటర్లకు మహా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని 148 మీటర్లకు ఇరు రాష్ట్రా ల మధ్యం ఒప్పందం కుదిరిన విషయం తెలిసి కూడా కా లయాపన కోసమే 150 మీటర్ల ఎత్తు అంటూ కొత్త కుట్రకు తెరతీస్తున్నారని విమర్శించారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకొచ్చి 30నెలలు గడిచి, మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పటికీ మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు తుమ్మడిహట్టి పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ఆయన కుటుంబ ఆర్థిక లబ్ధి కోసమే ఫోర్త్ సిటీ అంటున్నారని, రాష్ట్ర ప్రయోజనాలను మాత్రం గాలికొదిలేశారన్నారు. తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం.. కేసీఆర్ను దోషిగా చూపెట్టడం తప్ప మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదన్నారు. మేడిగడ్డ కుంగిపోయి 30నెలలు గడుస్తుంటే రేవంత్రెడ్డి ఇప్పుడు నిద్రలేచాడని అన్నారు. మేడిగడ్డకు మరమ్మతు చేయాలని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఎందుకు పునరుద్ధరణ చేపట్టలేదని ప్రశ్నించారు. ఎల్నినో హెచ్చరికలతో వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఏర్పడి తెలంగాణ ఎడారిగా మారితే దోషిగా నిలవాల్సి వస్తుందన్న భయంతోనే ఎత్తు పెంపు బాధ్యత కేంద్రమంత్రి కిషన్రెడ్డిదే అంటూ కొత్త పల్లవి అందుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ్మిడిహెట్టి ప్రాజెక్టు 152మీటర్ల ఎత్తుకు ఫడ్నవీస్ను ఒప్పించాలని కోరారు. ఇరు రాష్ట్రాల మధ్య జరిగే ఒప్పందంలో కేంద్రమంత్రి పాత్ర ఏముంటుందని ప్రశ్నించారు. కిషన్రెడ్డిని బూచిగా చూపి మరింత కాలయాపనకు రేవంత్ కుట్ర చేస్తున్నారని, ఇదంతా ప్రజలు గ్రహిస్తున్నారని అన్నారు. మాయమాటలు మానుకుని రాష్ట్రంలో తాగు, సాగునీటి కష్టాలు రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. దావ వసంత, హరిచరణ్రావు ఉన్నారు. -
బీ–థర్మల్లో ఊసేలేని తుక్కు వేలం
రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం మూతపడి జూన్ 4వ తేదీకి రెండేళ్లు పూర్తికానుంది. 1971 అక్టోబర్లో ప్రారంభమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18,743 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసింది. అనేక రికార్డులు సాధించింది. దీనిస్థానంలో త్వరలోనే 800 మెగావాట్ల సామర్థ్యంతో సూపర్ క్రిటికల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు కానుంది. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. బీ– థర్మల్ విద్యుత్ కేంద్రంలోని తుక్కు వేలం వేసి.. అదేస్థలంలో కొత్త కరెంట్ యూనిట్ స్థాపనకు శంకుస్తాపన చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కన్సల్టెన్సీల నియామకం లేదు.. తుక్కు వేలం నిర్వహణకు తొలుత వివిధ విభాగాల ఇంజినీర్లు ఆయా పరికరాల విలువ అంచనా వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సుమారు రెండు నెలల సమయం పడుతుంది. అంచనా నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలి. తుక్కు వేలానికి టెండర్ ప్రకటన జారీచేయాల్సి ఉంటుంది. తుక్కు విక్రయించే ప్రక్రియ పూర్తయ్యేందుకు దాదాపు ఏడాది పట్టే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కానీ, ఇప్పటివరకు కన్సల్టెన్సీల నియామకం చేయలేదు. ఇంకా నియామకం కాని అంచనా వ్యయ కన్సల్టెన్సీలు -
గ్రానైట్ అక్రమాలకు అడ్డుపడేనా?
కొత్తపల్లి(కరీంనగర్): గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ పరిఽశ్రమల అక్రమాలకు అడ్డుపడేలా లేదు. కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్లో అనుమతి లేకుండా నడిపిస్తున్న క్షేత్ర, శ్రీఅంబిక, వి నాయక, శ్రీసాయి, శ్రీహర్ష, మహానంది గ్రానైట్ కటింగ్, పా లీషింగ్ పరిశ్రమలకు గ్రామ పంచాయతీ నోటీసులు జారీ చేసింది. స్పందించిన శ్రీమహానంది పరిశ్రమ యజమాని డబ్బులు చెల్లించి, పంచాయతీ అనుమతి పొందినట్లు వెల్ల డైంది. క్షేత్ర, అంబిక, వినాయక, శ్రీసాయి, శ్రీహర్ష గ్రానైట్ పరిశ్రమల యజమానులు సమయం కోరినట్లు తెలిసింది. అంబిక గ్రానైట్ పరిశ్రమ యజమాని గ్రానైట్ కటింగ్, పాలీ షింగ్ అసోసియేషన్ ప్రతినిధిగా ఉండటం గమనార్హం. రాజ కీయ పలుకుబడితో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ యూనిట్లకు గ్రామ పంచాయతీ ఝలక్ ఇచ్చింది. కంగుతిన్న యజమానులు పంచాయతీకి సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎలాగైనా నోటీసుల నుంచి తప్పించుకునేందుకు సమయం కావాలంటూ, సుడాకు చెల్లించామంటూ సాకులు చెబుతున్న గ్రానైట్ పరిశ్రమల యజమానులు గ్రామ పంచాయతీపై రాజకీయంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ యూనిట్లకు టీఎస్ ఐపాస్ నుంచి సాంకేతిక అనుమతులున్నట్లు చెబుతూ గత కొన్నేళ్లుగా గ్రామ పంచాయతీ అనుమతులు పొందకుండా, పన్నులు చెల్లించకుండా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. పంచాయతీకి రావల్సిన పన్నులను ఎగవేస్తూ గ్రానైట్ పరిశ్రమలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ భూముల్లో స్లర్ (గ్రానైట్ వేస్ట్) పోస్తూ పర్యావరణానికి పాతరేస్తున్నాయి. గ్రానైట్ పరిశ్రమల అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు మామూలుగా తీసుకుంటుండంతో ఆడిందే ఆటగా మారింది. తహసీల్దార్కు ఫిర్యాదు ప్రభుత్వ భూముల్లో స్లర్ (గ్రానైట్ చూర్ణం) పోస్తున్న అంబికా, క్షేత్ర గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ యూనిట్లపై తహసీల్దార్కు పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు చేశారు. ఆసిఫ్నగర్ పంచాయతీ పరిధిలోని 278 సర్వే నంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి డస్ట్ పోస్తున్న పరిశ్రమలపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని విన్నవించారు. గత కొన్నేళ్లుగా ఈ కార్యకలాపాలు కొనసాగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం విచారకరం. ఇప్పటికై నా సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం కోరుతోంది. ఆసిఫ్నగర్లో పర్యావరణాన్ని పరిరక్షించడమే ప్రధాన ఎజెండాగా సర్పంచ్, పాలకమండలి సభ్యులు ముందుకెళ్తున్నారు. ప్రభుత్వ భూములతో పాటు ఎక్కడపడితే అక్కడ డస్ట్ను పోస్తూ గ్రానైట్ పరిశ్రమలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ప్రతి పరిశ్రమలో శానిటేషన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ప్లాంటేషన్ కనిపించాలి. అలాలేని పరిశ్రమలను సీజ్ చేస్తాం. ప్రతి పరిశ్రమ పంచాయతీ అనుమతి తీసుకోవాలి. దుమ్మును నివారించాల్సిన అవసరముంది. – రేవంత్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి, ఆసిఫ్నగర్ -
మొక్కజొన్న పంట దగ్ధం
మల్లాపూర్: దగ్ధమైన పంట రాయికల్: మంటలు ఆర్పుతున్న హమాలీలు మల్లాపూర్/రాయికల్: సమీప రైతులు చెత్తకు నిప్పటించగా.. ప్రమాదవశాత్తు నిప్పురవ్వలు ఎగిసిపడి మూడెకరాల మొక్కజొన్న పంట దగ్ధమైన ఘటన మల్లాపూర్ మండలం రేగుంటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాలసాని రాజన్న కంకలను కుప్పగా పోశాడు. గురువారం తోటి రైతులు చెత్తను కాల్చేందుకు మంట పెట్టారు. దీంతో మంటలు ఎగిసిపడి రాజన్న మొక్కజొన్న చేనును చుట్టుముట్టాయి. బాధితుడు, రైతులు కలిసి మంటలను ఆర్పేశారు. అప్పటికే కంకులు కాలిపోయాయి. రూ.లక్ష నష్టం వాటిల్లినట్లు బాధితడు వాపోయాడు. ఏఈవో వంశీ పంటను పరిశీలించారు. రాయికల్లో తప్పిన ప్రమాదం రాయికల్: మండలంలోని ఆల్యనాయక్ తండాలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు ధాన్యం రాశులను చుట్టుముట్టాయి. ఆ సమయంలో రైతులెవరూ లేకపోవడంతో హమాలీలే స్పందించి మంటలను ఆర్పేశారు. సకాలంలో స్పందించిన హమాలీలను సర్పంచ్ సంతోష్, తిరుమల్నాయక్, రైతులు అభినందించారు. -
ఆన్లైన్ విధానానికి బ్రేక్
పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోళ్లు కరీంనగర్రూరల్: ధాన్యం కొనుగోళ్లకు ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానాన్ని జిల్లా యంత్రాంగం నిలిపివేసింది. పాత పద్ధతిలోనే కొనుగోళ్లు పూర్తి చేయాలని సివిల్సప్లైశాఖ కేంద్రాల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది. ఆన్లైన్ ట్రక్షీట్ విధానంతో రైతులు ఎదుర్కొంటున్న ఇ బ్బందులపై ‘సాక్షి’లో ఇటీవల కథనాలు ప్రచురించగా, స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ చిత్రమిశ్రాకు సూచించారు. మూడురో జులుగా సాంకేతిక సమస్యలతో కొనుగోళ్లను నిలిపివేసిన నిర్వాహకులు, గురువారం ధాన్యం కాంటా పెట్టి రైతులకు ట్రక్షీట్ జారీ చేసి, మిల్లులకు ధాన్యం పంపించారు. ఆన్లైన్ ట్రక్ షీట్తో ఇబ్బందులు యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం ఆన్లైన్ ట్రక్షీట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. కేంద్రాల్లో ధాన్యం కాంటా పెట్టి ట్యాబ్లో రైతుపేరు, సెల్ నంబరు, ఆధార్ నంబరు, బ్యాంకుఅకౌంట్ నంబరు ఆన్లైన్లో నమోదు చేయగానే రైస్మిల్లు అలాట్మెంట్ వస్తుంది. ధాన్యం లోడింగ్ వెంటనే ఆన్లైన్లో వివరాలను నమోదు చేసేందుకు సివిల్సప్లై యాప్లో సాంకేతిక సమస్యలు నెలకొనడం, ఇంటర్నెట్ సిగ్నల్ లేకపోవడంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ట్రాక్టర్లకు జీపీఎస్ ట్రాకర్ ఉండాలనే నిబంధనతో యజమానులు ట్రాక్టర్లను పెట్టేందుకు ముందుకు రాలేదు. రైతుల ఇబ్బందులపై స్పందించిన మంత్రి పొన్నం వెంటనే పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోళ్లను చేపట్టాలని కలెక్టర్ చిత్రామిశ్రాకు సూచించారు. కలెక్టర్ సివిల్సప్లై అధికారులతో మాట్లాడి ఇక నుంచి గతంలో ధాన్యం కొనుగోలు చేసినట్లుగానే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.చెర్లభూత్కూర్లో ధాన్యం కాంటా -
అల్ఫోర్స్ డిగ్రీ కళాశాలలో ప్లేస్మెంట్ డ్రైవ్
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ సూర్యనగర్లోని అల్ఫోర్స్ మహిళా డిగ్రీ, పిజి కళాశాలలో గ్రాడ్ గురు ఇన్నోవేషన్స్ కంపెనీ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. 150 మంది విద్యార్థినులు పాల్గొనగా, 40మంది బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఉద్యోగాలకు ఎంపికై నట్లు అల్ఫోర్స్ మహిళా డిగ్రీ, పిజి కళాశాల కరస్పాండెంట్ వి.ర వీందర్రెడ్డి తెలిపారు. విద్యార్థుల వార్షిక వేతనం రూ.3 లక్షల నుంచి రూ.6లక్షల వరకు ఉంటుందన్నారు. భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులకు ఉత్తమ ప్లేస్మెంట్ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రాడ్గురు సంస్థ సీనియర్ మేనేజర్ ఆర్తి చౌదరి, మేనేజర్ వినయ్ తదితరులు పాల్గొన్నారు. -
స్థానం పదిపోయింది!
కరీంనగర్టౌన్: పదోతరగతి ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ఈ ఏడాది జిల్లా ఉత్తీర్ణతశాతంలో 8వ స్థానం దక్కించుకుంది. గత ఫలితాలతో పోలిస్తే వరుసగా వెనకపడిపోతోంది. ఈసారి పరీక్షలకు 6,856 మంది బాలురు హాజరుకాగా 6,734 మంది ఉత్తీర్ణత సాధించారు. 98.22శాతంగా నమోదు చే సుకున్నారు. 6,281మంది బాలికలు పరీక్ష రాయగా 6,215 మంది ఉత్తీర్ణత సాధించి 98.95శాతంగా నమోదు చేసుకున్నారు. మొత్తంగా 13,137మంది పరీక్షలు రాయగా 12,949మంది ఉత్తీర్ణత సాధించి, 98.57శాతం ఉత్తీర్ణత నమోదు చేసుకున్నారు. 188 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. సత్తా చాటిన మోడల్, కేజీబీవీ, సోషల్ వెల్ఫేర్లు జిల్లావ్యాప్తంగా 12 కేజీబీవీల నుంచి 465 మందికి 463 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 11 మోడల్ స్కూళ్ల నుంచి 920 మంది పరీక్ష రాయగా 918మంది ఉత్తీర్ణత సాధించారు. 9 మైనార్టీ రెసిడెన్సియల్ స్కూళ్ల నుంచి 408 మంది పరీక్ష రాయగా 405మంది పాసయ్యారు. 125 జిల్లా పరిషత్ పాఠశాలల నుంచి 2,676 మంది పరీక్షలకు హాజరుకాగా, 2,619 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆరు సాంఘీక సంక్షేమ పాఠశాలల నుంచి 390మందికి 390మంది పాసయ్యారు. 20 ప్రభుత్వ పాఠశాలల నుంచి 802 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 729 మంది ఉత్తీర్ణులయ్యారు. రెండు ఎయిడెడ్ పాఠశాలల నుంచి 160 మందికి 156మంది ఉత్తీర్ణులయ్యారు. 11 బీసీ వసతి గృహాల నుంచి 680మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 677 మంది ఉత్తీర్ణత సాధించారు. 145 ప్రైవేటు పాఠశాలల నుంచి 6,636 విద్యార్థులు పరీక్షలు రాయగా 6,592 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 25 మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల నుంచి 1,743 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా 1,739 మంది ఉత్తీర్ణత సాధించారని ఉమ్మడి జిల్లా కో– ఆర్డినేటర్ అంజలి తెలిపారు. జూన్ 5 నుంచి సప్లిమెంటరీ ఫెయిల్ అయిన విద్యార్థులు నేటి నుంచి మే 14 వరకు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వారికి జూన్ 5 నుంచి 12 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు ఫారం కోసం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలి. -
రేవంత్ పాలనలో మహిళలకు పెద్దపీట
● కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం ● సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ కరీంనగర్ కార్పొరేషన్: సీఎం రేవంత్రెడ్డి పాలనలో మహిళలకు పెద్దపీట వేస్తున్నట్లు సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ సమీక్ష సమావేశం బుధవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే గొప్ప ఆలోచనను తమ ప్రభుత్వం చేస్తోందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, అందులో భాగంగానే పెట్రోల్బంక్లు, ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులుగా చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు మహిళలే యజమానులని, వారి ఖాతాలో రూ.5లక్షలు వేస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ మహిళానాయకుల జాబితా తయారు చేసి తనకు ఇవ్వాలని, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్లతో కలిసి ఇన్చార్జీ మీనాక్షినటరాజన్ను కలిసి నామినేటెడ్ పదవులు ఇచ్చేలా చూస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన ధర్మపురి నియోజకవర్గంలో ఏడు మండలాలలో ఒక్కో మండలంలో వెయ్యి మంది మహిళలతో ప్రత్యేకంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. మహిళల వాటా సాధిస్తాం: మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ వచ్చే ఎన్నికల నాటికి చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ను సాధిస్తామని, రాష్ట్రంలో 50 మంది మహిళా ఎమ్మెల్యేలు అవుతారని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ధీమా వ్యక్తంచేశారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు పట్ల చిత్తశుద్ధి ఉంటే, డీలిమిటేషన్తో కలిపి బిల్లును బీజేపీ ఎందుకు తీసుకువచ్చిందన్నారు. ప్రతి మహిళ కార్యకర్త క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. పార్టీలో సంవత్సరాలుగా ఉంటూ కష్టపడుతున్న మహిళా నాయకులకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలంటూ పలువురు కోరారు. డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నరెడ్డి, ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ మహాలక్ష్మి, సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, చర్ల పద్మ, వెన్నం రజిత రెడ్డి, పూదరి రేణుక గౌడ్,పడిశెట్టి వసంత లక్ష్మి పాల్గొన్నారు. -
చిల్డ్రన్ కరెన్సీ చూసి దొంగనోట్లని ప్రచారం
మర్రిగడ్డ శివారులోని ఒర్రె ప్రాంతంలో చిల్డ్రన్ కరెన్సీ నోట్లు పరిశీలిస్తున్న పోలీసులు చందుర్తి(వేములవాడ): మండలంలోని మర్రిగడ్డ గ్రామ శివారు బోగవాగు ఒర్రె ప్రాంతంలోని చెట్లపొదల్లో రూ.500 దొంగనోట్ల ఉన్నాయన్న ప్రచారం మంగళవారం కలకలం రేపింది. ఉపాధి హామీ కూలీలు వాటిని గమనించి సర్పంచ్ భర్త దూది శ్రీనివాస్రెడ్డికి సమాచారమిచ్చారు. ఆయన వాటిని పూర్తిగా పరిశీలించకుండానే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఏఎస్సై ఆనందం, పోలీసులు వాటిని పరిశీలించి చిన్నపిల్లలు ఆడుకునేందుకు మనోరంజన్ బ్యాంకు పేరిట తయారు చేసిన రూ.500 కూపన్లు గుర్తించారు. సదరు కూపన్లు రూ.500 నోటును పోలి ఉండడంతోనే నకిలీ నోట్ల ప్రచారానికి తెరలేపినట్లయింది. కాగా, మర్రిగడ్డలో నకిలీ డంపు ఉందన్న ప్రచారంతో అప్పటికే పలు వురు విలేకర్లు, పోలీసులకు ఫోన్ చేశారు. చిన్న పిల్ల లు ఆడుకునేందుకు తయారు చేసిన కరెన్సీ కూపన్ నోట్లని, ప్రజలు పుకార్లు నమ్మవద్దని పోలీసులు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేపట్టారు. -
ఆటో డ్రైవర్ కుటుంబానికి మేయర్ అండ
కరీంనగర్ కార్పొరేషన్/కొత్తపల్లి(కరీంనగర్): ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ గాండ్ల శ్రీకాంత్ కుటుంబానికి కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ భరోసా కల్పించారు. ఉండటానికి నీడ లేక శ్మశానవాటికలో తలదాచుకుంటున్న హృదయ విదారక ఘటనపై స్పందించారు. కరీంనగర్లోని గాంధీనగర్లో అద్దెకుంటూ ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ గాండ్ల శ్రీకాంత్ కుటుంబాన్ని అద్దె ఇంటి యజమాని ఇంట్లోకి రానివ్వకపోవడంతో, ఆ కుటుంబం పద్మనగర్ శ్మశానవాటికలో నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న మేయర్ పద్మానగర్ శ్మశానవాటికకు వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రీకాంత్ కుటుంబసభ్యులకు ధైర్యం చెబుతూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిత్యవసర సరుకులను అందజేశారు. ఆడ పిల్లల చదువు విషయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి, పూర్తి సహకారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. నాలుగు చోట్ల కర్మకాండ నిలయాలు అద్దె ఇంట్లో ఉంటూ మృతి చెందిన కుటుంబాలు ఇబ్బంది పడకుండా నగరంలోని నాలుగు చోట్ల కర్మకాండ నిలయాల నిర్మాణం చేపట్టనున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సూచనల మేరకు ఇప్పటికే శ్మశాన వాటికల సమీపంలో అనువైన స్థలాలను ఎంపికచేశామన్నారు. మార్కండేయ కాలనీ, అలకాపురి కాలనీ, కేబుల్ బ్రిడ్జి, రేకుర్తి శ్మశాన వాటికల ప్రాంతాల్లో జీప్లస్ వన్ అంతస్తుతో భవనాలను నిర్మిస్తామన్నారు. కర్మకాండ నిలయాలను అద్దె ఇండ్లలో నివసించే కుటుంబాలకు అందుబాటులోకి తెస్తామన్నారు. కరీంనగర్లో చాలా చోట్ల కిరాయి ఇండ్లలో నివసిస్తున్న కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తి అంత్యక్రియలు ముగిసే వరకు ఇంటి యజమానులు రానివ్వని దుస్థితి నెలకొందన్నారు. ఎవరూ ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు నాలుగు దిక్కుల నాలుగు కర్మకాండ నిలయాలను నిర్మించి అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. ఒక్కో కర్మకాండ నిలయానికి రూ.50 లక్షల నిధులు కేటాయించి, అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామన్నారు. రూపాయి..పై ఇబ్బంది పెట్టొద్దు.. నగరపాలక సంస్థలో విజయవంతంగా సాగుతున్న అంతిమయాత్ర అఖరి సఫర్ (రూపాయి)పథకం పై నిబంధనల పేరిట ఇబ్బందులు పెట్టొద్దని అధికారులను మేయర్ ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న నిబంధనల్లో కొన్ని మార్పులు చేసేందుకు తగిన చర్యలు చేపట్టామని తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెంది కరీంనగర్లో నివాసం ఉంటూ చనిపోతే ఆధార్ కార్డు వివరాలు ఎక్కడున్నా, స్థానిక కార్పొరేటర్, సంబంధిత ఏరియా జవాన్ ధృవీకరణ చేస్తే వారికి రూపాయి అంత్యక్రియలను అందిస్తామన్నారు. పాలకవర్గం సహకారంతో త్వరలోనే క్షేత్రస్థాయిలో అమలు చేస్తామని స్పష్టం చేశారు. అండగా ఉంటామన్న పోలీసులు శ్రీకాంత్ కుటుంబానికి కరీంనగర్ టూ టౌన్, కొత్తపల్లి పోలీసులు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. పద్మనగర్ శ్మశాన వాటికలో నివాసం ఉంటున్న మృతుడి కుటుంబ సభ్యులను మంగళవారం టూటౌన్ సీఐ సృజన్రెడ్డి, కొత్తపల్లి ఎస్సై తిరుపతి పరామర్శించారు. గాంధీనగర్లోని అద్దె ఇంటి యజమానితో మాట్లాడి అద్దె ఇంట్లో ఉండేందుకు ఒప్పించే ప్రయత్నం చేశారు. లేదంటే ఏదైనా లాడ్జిలో రూం ఇప్పిస్తామని, కర్మకాండ జరుపుకునేందుకు ఫంక్షన్హాల్ ఇప్పిస్తామని పోలీసులు అభయమిచ్చారు. అయినప్పటికీ మృతుల కుటుంబ సభ్యులు పద్మనగర్ శ్మశాన వాటికలోనే ఉండేందుకు మొగ్గు చూపినట్లు పోలీసులు స్పష్టం చేశారు. శ్మశానవాటికలో తలదాచుకున్న శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు పరామర్శ నిత్యావసర సరుకులు అందజేత నగరంలో నాలుగుచోట్ల కర్మకాండ నిలయాలు -
సతి సర్పంచ్.. పతి సంతకం
వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని ఓ అంగన్వాడీ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో అధికారిక రిజిస్టర్లో సర్పంచ్కు బదులు ఆమె భర్త సంతకం చేయడం చర్చనీయాంశమైంది. వివరాలు.. రంగంపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం ఆఫ్టర్ కేర్ (అనాథ పిల్లల సంరక్షణ) కార్యక్రమాన్ని అంగన్వాడీ టీచర్ లక్ష్మీనర్సవ్వ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి సూపర్వైజర్ మమత హాజరై, 18 ఏళ్లు పైబడిన అనాథ పిల్లలకు ప్రభుత్వం కల్పించే ఉపాధి, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథుల వివరాల కోసం రిజిస్టర్లో సంతకాలు సేకరించారు. ముందుగా గ్రామ సర్పంచ్ సంతకం చేయాలి. కానీ, సర్పంచ్ భర్త నక్క పర్శరాములు తానే సర్పంచ్ అని చేయగా, తర్వాత ఆమె భార్య భాగ్యలక్ష్మి సంతకం చేశారు. ఇది చూసిన అధికారులు, స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. కాగా, గ్రామ పంచాయతీ వ్యవహారాల్లో సర్పంచ్ భర్తే పెత్తనం చలాయిస్తున్నారని, ప్రతీ విషయంలోనూ తలదూర్చుతూ అయోమయానికి గురిచేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. అధికారిక రిజిష్టర్లో సంతకం చేసిన సర్పంచ్ భర్త -
ప్రచండ భానుడు
కరీంనగర్ అర్బన్: గత నాలుగైదు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు హెచ్చరిక స్థాయికి చేరాయి. వాతావరణ శాఖ కొలమానం ప్రకారం 35 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైతే ప్రజలకు, పంటలకు వప్రయోజనం. 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీలు నమోదైతే జాగ్రత్తగా వ్యవహరించాలి. 41 నుంచి 45 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైతే అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు చెబుతున్నారు. ఇక 45 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరిందంటే మానవాళి ప్రమాదంలో ఉన్నట్లు లెక్క. ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతల నమోదు.. ప్రాణాలను హరించే వేడిగాలులు.. ప్రకృతి విపత్తులకు కారణమేంటి..? ఎక్కడుంది లోపం.? ఇసుక అక్రమ రవాణా, కాలం చెల్లిన వాహనాలు, వీడని ప్లాస్టిక్ భూతం, కాసారాలుగా మారిన పరిశ్రమలతో పర్యావరణం మరణపు అంచున ఘోషిస్తోంది. అందుకే మనం మారాలి.. ఇతరులను మార్చాలి. తగ్గని ప్లాస్టిక్ వినియోగం ప్లాస్టిక్ వినియోగం నిత్య జీవితంలో తప్పనిసరైంది. 40 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన పాలిథిన్ కవర్లను ప్రభుత్వం నిషేధించినా నియంత్రణలో అధికారులు విఫలమవుతున్నారు. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఈ సంచులను మురుగుకాలువల్లో పారేయడంతో నీటి ప్రవాహాలకు అడ్డు తగులుతున్నాయి. భూమిలో కరిగిపోకుండా పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. జిల్లాలో రోజుకు సగటున 500 వాహనాలు కొత్తగా చేరుతున్నాయి. రవాణాశాఖ అధికారుల అంచనాల ప్రకారం జిల్లాలో గత డిసెంబర్ నాటికి 1.51 లక్షలకు పైగా వాహనాలున్నాయి. వీటి ద్వారా పొగ, ధ్వని కాలుష్యం చేరి వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. వనంపై గొడ్డలి వేటు భూ విస్తీర్ణంలో 33శాతం అడవులు ఉండాలి. పచ్చని చెట్లు గొడ్డలి వేటుకు గురవడం మానవాళి మనుగడకు ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి జిల్లా గణాంకాల ప్రకారం గతంలో ఉన్న పశ్చిమ డివిజన్లో 80వేల హెక్టార్లు, తూర్పు డివిజన్లో 1.50లక్షల హెక్టార్లలో అడవులు విస్తరించి ఉండేవి. కాలక్రమేణ అక్రమార్కులు పెరిగిపోవడంతో ఏటికేడు అభయారణ్యాలుగా ఉన్న అడవులు ఎడారులను మరిపిస్తున్నాయి. దీంతో 23శాతానికి చేరింది. నూతన కరీంనగర్లో మాత్రం కేవలం 0.02శాతమే అడవులున్నాయి. అక్రమార్కుల వేటుకు అన్ని మొక్కలు అంతరించిపోతున్నాయి. గడిచిన అయిదేళ్ల కాలంలో పోడు వ్యవసాయం కోసం సుమారు 40 వేల హెక్టార్లలో అడవులు నరికినట్లు అధికారులు గుర్తించారు. వందల మందిపై కేసులు నమోదు చేశారు. కానీ వనమేధం మాత్రం ఆగడం లేదు. హరితహారంలో సైనికులమవుదాం హరితహారం పథకం గతంలో ఆశించిన స్థాయిలో ఫలితాన్నివ్వలేదు. వర్షాభావ పరిస్థితులతో 2016–19వరకు కోట్ల మొక్కలు నర్సరీల్లో మిగిలిపోయాయి. 2018లో మొక్కలు నాటినా వాటి సంరక్షణ చర్యలు పడకేయడంతో సగం మొక్కలు జీవం కోల్పోయాయి. ఈ క్రమంలో మనమంతా మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడంలో సైనికులమైతే పర్యావరణానికి పూర్వవైభవం సంతరించుకుంటుంది. నివాసాల్లో, రహదారులు, అడవుల్లో వీటిని వృద్ధి చేస్తే విపత్తులు రాకుండా ఉంటాయి.2022 45.7 2023 45.1 2024 45.3 2025 45.4 2026 45 (ఏప్రిల్28) ఏటా ప్రమాదకరంగా ఉష్ణోగ్రతలు (డిగ్రీల సెల్సియస్లో)గత ఐదు రోజులుగా నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా (డిగ్రీల సెల్సియస్లో)తేది జగిత్యాల కరీంనగర్ సిరిసిల్ల పెద్దపల్లి 24 42.6 42.5 42.4 42.6 25 44.1 43.8 43.4 44.3 26 44.4 42.3 44.0 42.5 27 44.1 43.0 43.6 45.9 28 45.8 45.6 45.2 45.9 -
కాంగ్రెస్లో రచ్చరచ్చ
కరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ సమావేశం రసాభాసగా మారింది. కుర్చీ కోసం మొదలైన పంచాయితీ.. షరా మామూలుగానే పాత కొత్త నాయకుల గొడవకు దారితీసింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని, టికెట్లు వచ్చినవాళ్లే ఇంకా కుర్చీలు కావాలంటున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండు గ్రూప్లు ఒకరిని ఒకరు నెట్టుకొన్నారు. డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, పీసీసీ కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ ఎదుటే ఈ గొడవ చేటుచేసుకుంది. ఇలానే చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేయిస్తానంటూ మేడిపల్లి సత్యం హెచ్చరించడంతో గొడవ సద్దుమణిగింది. ‘కుర్చీ’ కోసం గొడవ బూత్ లెవెల్ ఏజెంట్లు, బ్లాక్, మండల, డివిజన్ అధ్యక్షుల నియామకంపై చర్చించేందుకు మంగళవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే, మాజీ కార్పొరేటర్ గంట కల్యాణిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానించిన క్రమంలో మహిళలకు రిజర్వేషన్ అంటారు.. వేదికపై మహిళలకు కుర్చీ వేయలేదని కల్యాణి అనడంతో వివాదం మొదలైంది. సబ్జెక్ట్ మాట్లాడాలంటూ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి సూచించారు. ఇదే సమయంలో ముల్కల కవిత, మాసూంఖాన్, పెద్దిగారి తిరుపతి తదితరులు సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నా, తమకు టికెట్లు రాలేదు, మీకు కార్పొరేటర్ టికెట్లు ఇచ్చినా ఇంకా కుర్చీలు వేయలేదంటున్నావా అంటూ కల్యాణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ స్క్రాప్ అంటూ ప్రోగ్రాం చేసి, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్లోకి వచ్చి కార్పొరేటర్ అయ్యారంటూ మండిపడ్డారు. కొంతమంది కల్యాణికి మద్దతుగా రాగా, రెండు వర్గాల నడుమ తోపులాట సాగింది. మేడిపల్లి సత్యం జోక్యం చేసుకొని పద్ధతి మా ర్చుకోకపోతే సస్పెండ్ చేయిస్తానని హెచ్చరించారు. -
జైశ్రీరాం.. జై హనుమాన్
మల్యాల: కొండగట్టులోని శ్రీఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. వేసవి నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఉదయమే తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా కోనేరులో స్నానాలు ఆచరించారు. నృసింహునికి వసంతోత్సవంధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామివారి నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం అభిషేకాలు, హారతిమంత్ర పుష్పం నిర్వహించారు. ఉదయం అన్నకూటోత్సవం చేశారు. సాయంత్రం ఆలయ ఉత్సవమూర్తులకు వివిధ చెట్ల ఆకులతో పల్లవోత్సవం, పండ్ల రసాలతో వసంతోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాస్, భక్తులు పాల్గొన్నారు. -
బతుకు పోరాటం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘మీ ఇంట్లో పిల్లలు ఎంత మంది. ఏం చదువుతున్నారు. ఎక్కడ చదువుతున్నారు.. మా పాఠశాల/కళాశాలలో చేర్పించండి. నాణ్యమైన బోధన ఉంటుంది. ఫలితాలు చూడండంటూ’ పేపర్లు చూపుతున్నారు. సీటు ఇప్పుడు కన్ఫార్మ్ చేసుకుంటే ఫీజులో రాయితీ ఇప్పిస్తామంటూ చెబుతున్నారు. తల్లిదండ్రుల నంబర్లు తీసుకుని రోజూ నాలుగైదు సార్లు ఫోన్లు చేస్తున్నారు. తమకు టార్గెట్లు ఉన్నాయంటూ వేడుకుంటున్నారు. ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాలు లేక 45 డిగ్రీల సెల్సియస్ ఎండల్లో ఉదయం, సాయంత్రం యాజమాన్యాలు ఇచ్చిన టార్గెట్ల కోసం కష్టపడుతున్నారు. మండే ఎండలు ఒకవైపు, వీధి కుక్కలు మరోవైపు, పిల్లల కోసం తలుపులు తడితే ఛీత్కరించుకునే ఇంటి యజమానుల మాట లను భరించుకుంటూ బతుకు బండి లాగేందుకు ప్రయాసపడుతున్నారు ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు టీచర్లు. సెలవులు లేని కొలువు పనిచేసేది పాఠశాలలోనైనా సెలవనే మాట ఉండదు. ఆదివారమైనా.. వేసవి సెలవులైనా, పండుగలైనా.. పాఠశాల కోసం పని చేయాల్సిందే. ఇక కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. యాజమాన్యం ఇచ్చి న టార్గెట్ చేయించకపోతే ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో తెలియదు. అందుకే వేసవి సెలవుల్లోనూ ఇంటింటికి తిరుగుతూ ‘మీ పిల్లలను మా విద్యాసంస్థల్లో చేర్పించండి.. ఫీజులో రాయితీ కూడా ఇప్పిస్తాం’ అంటూ తల్లిదండ్రులను బతిమాలుకుంటున్నారు. మెడపై అడ్మిషన్ల కత్తి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది మెడపై అడ్మిషన్ల కత్తి వేలాడుతోంది. 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు భారీగా చేయాలంటూ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఆ సంఖ్యను బట్టే జీతా ల చెల్లింపు.. ఇంక్రిమెంట్లు, ఉద్యోగభద్రత ఉంటుందని చెప్పడంతో కంటి మీద కునుకు లేకుండా పోతోంది. యాజమాన్యాలు టార్గెట్లు పెట్టి మానసిక క్షోభకు గురి చేస్తున్నాయని, ఉదయం, సాయంత్రం సమావేశాలు నిర్వహించి దురుసుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలల్లో 15 వేల మందికిపైగా బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తుండగా అందరిదీ అదే పరిస్థితి.ఉద్యోగులతో వెట్టిచాకిరీ... అడ్మిషన్ల టార్గెట్లే కాకుండా.. యాజమాన్యాలు వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ 10 నుంచి 12గంటలు పని చేయాలని, శని, ఆదివారం, జాతీయ సెలవు దినాలు, పండుగ రోజుల్లోనూ స్కూళ్లు, కళాశాలలకు వెళ్లాల్సిందేనని వాపోతున్నారు. పనికి తగ్గ వేతనాలు ఇవ్వడం లేదంటున్నారు. టీటీసీ, బీఈడీ, ఎంఈడీ, పీజీ, ఎంబీఏ తదితర కోర్సులు చేసి ఉపాధి కోసం పని చేస్తున్నామని, ఇక్కడ ఉద్యోగ భద్రత లేకపోగా పని ఒత్తిడి చేస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉమ్మడి జిల్లా వివరాలు జిల్లా ప్రైవేటు పాఠశాలలు ఉపాధ్యాయులు కరీంనగర్ 298 6,254 రాజన్న సిరిసిల్ల 132 1,555 పెద్దపల్లి 192 4,224 జగిత్యాల 292 3,480 -
బీఎల్ఏ నియామకం పూర్తి చేయాలి
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో బీఎల్ఏ నియామకాలు పూర్తి చేయాలని డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్’ ప్రక్రియ ద్వారా దళితులు, మైనార్టీల ఓట్లు తొలగించే క్రుట జరుగుతోందన్నారు. సర్పంచ్ల్లో అధిక స్థానాలు గెలిచినా, కార్పొరేషన్లో అనుకున్న స్థానాలు పొందలేకపోయామన్నారు. బీఎల్ఏలు తమ బూత్ల పరిధిలో అర్హుల ఓటు తొలగించకుండా చూసుకోవచ్చన్నారు. చొప్పదండి, హుజురా బాద్ మానకొండూరు నియోజకవర్గాల్లో బీఎల్ఏ నియామకం పూర్తయిందని, కరీంనగర్లో బుధవారం లోగా పూర్తి చేయాలన్నారు. -
ఇంటర్ బోర్డు నిఘా పెట్టాలి
ప్రైవేట్ విద్యాసంస్థల్లో అడ్మిషన్ల పేరుతో టీచర్లు, అధ్యాపకులను మానసికంగా వేధించడం మానుకోవాలి. సెలవు దినాల్లోనూ పనులు చేయించుకునే పద్ధతికి స్వస్తి చెప్పాలి. టీచర్లు, అధ్యాపకులను బోధనేతర పనులకు ఉపయోగించుకోవడం సరికాదు. వర్క్షాపుల పేరుతో మానసిక ఇబ్బందులకు గురి చేస్తే స హించేదిలేదు. ఇన్ని చేస్తున్నా చాలా విద్యాసంస్థల్లో జీతాలు కూడా సరిగా ఇవ్వ డం లేదు. ఇలాంటి యాజమాన్యాలపై ఇంటర్బోర్డు కఠిన చర్యలు తీసుకోవాలి. – కె.రాణాప్రతాప్, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి -
ప్రమాదవశాత్తు మామిడి చెట్లు, వరిపొలం దగ్ధం
చందుర్తి(వేములవాడ): మండలంలోని సనుగుల గ్రామంలో మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని పలువురి పండ్ల చెట్లు, వరిపొలం దెబ్బతిన్నాయి. స్థానికుల కథనం ప్రకారం.. పిట్టల సత్తవ్వకు చెందిన మామిడి చెట్లు, సనుగుల హన్మాండ్లకు చెందిన అరటి, ఎండీ రజాక్ వరిపొలం మంటలకు దెబ్బతిన్నాయి. స్థానికులు వెంటనే అప్రమత్తమై వరిపొలంలో మంటలను ఆర్పివేశారు. మంటలు అదుపులోకి రాకుంటే పండ్ల తోటల పక్కనే ఉన్న ఇళ్లకు నిప్పు అంటుకుని భారీగా నష్టం జరిగేదని గ్రామస్తులు తెలిపారు. -
ఇసుక ట్రాక్టర్ ఢీకొని లష్కర్ మృతి
మల్లాపూర్: ఇసుక ట్రాక్టర్ ఢీకొని మండలంలోని నడికుడకు చెందిన లష్కర్ యార గంగారాం(50) మృతిచెందిన ఘటన పాతదాంరాజుపల్లి శివారులో మంగళవారం చోటుచేసుకుంది. గంగారాం ఇరిగేషన్లో లష్కర్గా పనిచేస్తున్నాడు. బైక్పై మల్లాపూర్ వెళ్లి విధులు ముగించుకుని స్వగ్రామానికి వస్తుండగా.. జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. గంగారాంకు భార్య దేవగంగు, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురుకు పెళ్లయ్యింది. వచ్చేనెల 8న చిన్న కూతురుకు వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో గంగారాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం స్థానికులను కలచివేసింది. మృతదేహం వద్ద భార్యాపిల్లల రోదన మిన్నంటింది. ఎస్సై అనిల్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దేవగంగు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వాహనం ఢీకొని తాపీ మేసీ్త్ర..పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి శివారులోని రంగంపల్లి కోర్టు సమీపంలో మంగళవారం గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఆవునూరి బాపయ్య(33) అనే తాపీమేసీ్త్ర దుర్మరణం పాలయ్యాడు. జూలపల్లి మండలం కుమ్మరికుంటకు చెందిన బాపయ్య.. పనినిమిత్తం రంగంపల్లికి వచ్చి పెద్దపల్లి వైపు వెళ్తున్నాడు. ఈక్రమంలో రంగంపల్లి కోర్టు ప్రాంతంలో వెనకాల వేగంగా, నిర్లక్ష్యంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని ఎస్సై లక్ష్మణ్రావు తెలిపారు. తలకు తీవ్రగాయమై బాపయ్య అక్కడికక్కడే మృతి చెందాడని పేర్కొన్నారు. మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మృతుడికి భార్యతోపాటు కుమారుడు రిశ్విత్, కుమార్తె అశ్విత ఉన్నారు. -
పెట్రో.. మొర్రో
హుజూరాబాద్: అన్నదాతలను డీజిల్ కష్టాలు వెంటాడుతున్నాయి. గత రెండు రోజులుగా బంకుల్లో డీజిల్, పెట్రోల్ నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో ద్విచక్ర వాహనదారుల నుంచి మొదలుకొని పెద్దపెద్ద వాహనాలకు పెట్రోల్, డీజిల్ దొరకకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం వరికోతలు ప్రారంభం కావడంతో హార్వెస్టర్లకు, ట్రాక్టర్లకు డీజిల్ తప్పనిసరి. బంకుల్లో కొరత ఉండడంతో రైతులు, ట్రాక్టర్ డ్రైవర్లు క్యాన్లతో బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. హుజూరాబాద్ పట్టణంలో క్యాన్లతో బంకుల వద్ద రైతులు బారులు తీరారు.హుజూరాబాద్లో డీజిల్ కోసం క్యూలో పెట్టిన క్యాన్లుపెట్రోల్, డీజిల్ కొరతలేదుకరీంనగర్ అర్బన్: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో పెట్రోల్ బంకుల యజమానులు, గ్యాస్ డీలర్లతో గ్యాస్, పెట్రోలు సప్లయ్పై సమీక్ష నిర్వహించారు. వరి కోతల నేపథ్యంలో హార్వెస్టర్లు, ధాన్యం తరలించే లారీలు, ట్రాక్టర్లకు ఎలాంటి డీజిల్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలో గ్యాస్కు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. పెట్రోల్ బంకులు డ్రై లేకుండా చూసుకోవాలని, ఏదైనా ఇబ్బందులు ఉంటే పౌరసరఫరాల అధికారికి సమాచారం ఇవ్వాలని సూచించారు. రామగుండం ఆయిల్ డిపోలో సరిపడే ఆయిల్ నిల్వ లు ఉన్నాయనిపేర్కొన్నారు. ప్రజలంతా లేనిపోని వదంతులు నమ్మవద్దని తెలిపారు. -
అనాథ ఆశ్రమానికి వృద్ధులు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మలిసంధ్యలో కంటికి రెప్పలా కాపాడాల్సిన వారు కరువైనా, విధి వంచించినా మేమున్నామంటూ ముందుకొచ్చారు గడ్డం తిరుమల శ్రీనివాస్. వేములవాడ రాజన్న సన్నిధిలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఇద్దరు వృద్ధులకు తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్లోని ‘అమ్మా అనాథ వద్ధాశ్రమం’లో ఆశ్రయం కల్పించి మానవత్వం చాటుకున్నారు. వివరాలు.. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన పదిరే రేణుక, నర్సంపేట ప్రాంతానికి చెందిన భూమేళ్ల సమ్మక్క కొద్దిరోజులుగా వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నారు. వీరికి రక్త సంబంధీకులు ఎవరూ లేక నిస్సహాయ స్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. పోలీసుల సహకారంతో ఆశ్రమానికి.. వీరి దీన స్థితిని గమనించిన పలువురు సామాజిక కార్యకర్తలు అమ్మా అనాథ వృద్ధాశ్రమ నిర్వాహకులు గడ్డం తిరుమల శ్రీనివాస్కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన శ్రీనివాస్ సంబంధిత పోలీస్స్టేషన్ ఎస్సైని సంప్రదించి వారి అనుమతితో ఇద్దరు వృద్ధులను ఆశ్రమానికి చేర్చారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆదరణ కోల్పోయిన వృద్ధులకు సేవ చేయడమే తమ ఆశ్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మానవత్వం చాటుకున్న తిరుమల శ్రీనివాస్ -
‘సహకారం’లో సోలార్ వెలుగులు
● 5,500 యూనిట్ల ఉత్పత్తితో ప్రాజెక్టుకు శ్రీకారం ● ఆర్థిక బలోపేతం దిశగా మంథని పీఏసీఎస్ ● గుంజపడుగులో రూ.3.50కోట్లతో నిర్మాణం ● పనులు పరిశీలించిన నాబార్డు.. కార్యదర్శుల బృందాలు మంథనిరూరల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే రైతులకు అనేక విధాలుగా సేవలు అందిస్తున్న సహకార సంఘాలకు ఆర్థిక పరిపుష్టి చేకూర్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలోనూ సహకార సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నా బార్డు సహకారంతో పెద్దపల్లి జిల్లా సహకార బ్యాంకు 4శాతం వడ్డీతో మంథని సహకార సంఘానికి రూ.3.50కోట్ల రుణం అందించగా పనులు ఇటీవలే ప్రారంభం అయ్యాయి. ● పెద్దపల్లి జిల్లాలో నాలుగు ప్లాంట్లు పెద్దపల్లి జిల్లాలోని సహకార సంఘాల ద్వారా నాలుగు పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో మంథని, రాఘవాపూర్, నందిమేడారం, కాల్వ శ్రీరాంపూర్లో పనులు ప్రారంభం అయ్యారు. ఇందులో మంథని మండలం గుంజపడుగు శివారులో ఏర్పాటు చేస్తున్న సోలార్పవర్ ప్లాంట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ● ఐదెకరాలు.. రూ.3.50కోట్ల వ్యయం మంథని మండలం గుంజపడుగు శివారులో ఐదు ఎకరాల స్థలంలో రూ.3.50కోట్ల వ్యయంతో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గతేడాది ఆగస్టు 11న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఈ పవర్ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించిన ఎనిమిది నెలల్లోనే తుదిదశకు చేరుకున్నాయి. ● మంత్రి శ్రీధర్బాబు చొరవతో.. సహకార సంఘాలను బలోపేతం చేయాలనే ఆలోచనతో మంత్రి శ్రీధర్బాబు ప్రత్యేక చొరవ తీసుకుని మంథని సహకార సంఘం ఆధ్వర్యంలో సోలార్పవర్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణ విషయంలో కలెక్టర్ సైతం ప్రత్యేక పర్యవేక్షణ చేస్తూ పనులను పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ● ఎన్పీడీసీఎల్ విద్యుత్ కొనుగోలు.. ప్రతీరోజు 5,500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను ఎన్పీడీఎల్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే పనులు చివరిదశలో ఉండగా మరో నెలరోజుల్లో పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ విద్యుత్ ఉత్పత్తిలో సహకార సంఘానికి ఏడాదికి రూ.40నుంచి రూ.50లక్షల ఆదాయం సమకూరే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ● పలు బృందాల పరిశీలనలు గుంజపడుగులో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సోలార్పవర్ ప్లాంట్ను పలు బృందాలు పరిశీలించాయి. వారం క్రితం రంగారెడ్డి జిల్లా సహకార సంఘాల కార్యదర్శుల బృందంతో పాటు ఇటీవల నాబార్డు అధికారుల బృందం పరిశీలన చేశారు. ఈ సందర్భంగా సోలార్ ద్వారా ఎంత పవర్ఉత్పత్తి అవుతుందని అడిగి తెలుసుకున్నారు. సహకార సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ఎంత మేర ఆర్థికాభివృద్ధి సాధించుకోగలమనే విషయాలను తెలుసుకున్నారు. -
పనులు పూర్తి చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని పెండింగ్ అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సూ చించారు. మంగళవారం ఇంజినీరింగ్ అధికా రులతో సమీక్ష నిర్వహించారు. డివిజన్లలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేసి, టెండర్ పూర్తి చేయాలన్నారు. డ్రైనేజీ కల్వర్టుల సిల్ట్ తొలగింపు, హై లెవల్, లో లెవల్లో తాగు నీటి సరఫరా లో ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నా రు. వీధి దీపాలు వెలిగేలా చూడాలని, మరమ్మతులు చేయాలన్నారు. స్వీయ గణనపై అవగాహన పెంచాలి స్వీయ గణనపై ప్రజల్లో అవగాహన పెంచాల ని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. జనగణన పోర్టల్లో తమ వివరాలను సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేశారు. జనగణన ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియుద్దీన్, ఎస్ఈ రాజ్ కుమార్, టౌన్ ప్లానింగ్ డీసీ పి.బషిరొద్దీన్ పాల్గొన్నారు. రూపాయి అంత్యక్రియలకు నిబంధనల సాకు కరీంనగర్ కార్పొరేషన్: నిరుపేదల ఆఖరి ప్రయాణానికి అండగా నిలిచిన ’అంతిమ యాత్ర– ఆఖరి సఫర్’ పథకం ఇప్పుడు వివా దాలకు వేదికై ంది. మానవత్వంతో మొదలైన ఈ గొప్ప పథకాన్ని అధికారులు నిబంధనల పేరుతో సామాన్యులకు దూరం చేస్తున్నారా అనే అనుమానాలకు రెండు రోజులుగా జరిగిన ఘటనలు బలం చేకూరుస్తున్నాయి. రెండు రోజుల క్రితం 35వ డివిజన్కు చెందిన వ్యక్తి మరణిస్తే, స్థానిక ఆధారం లేదని అధికారులు నిరాకరించడం, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్ గొడవ చేయడం, ఆయనపై పోలీసు కేసు కావడం తెలిసిందే. తాజాగా 7వ డివిజన్ హౌసింగ్బోర్డుకాలనీలో వీరబ్రహ్మేంద్ర అనాథాశ్రమంలో వృద్ధుడు మరణిస్తే, సోమవారం సాయంత్రం అంత్యక్రియలు జరగాల్సి ఉండగా, గుర్తింపు కార్డులు లేవంటూ అధికారులు అడ్డు చెప్పారు. స్థానిక కార్పొరేటర్ ఆకుల నందిని ఉదయ్ అనాథకు గుర్తింపు కార్డులు ఏమిటని, తమను కూడా గొడవ చేయమంటారా అంటూ పలుమార్లు హెచ్చరించడంతో మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్తి చేశారు. కరీంనగర్ అర్బన్: ఏళ్లుగా ఉద్యోగుల నిరీక్షణ, పడిగాపులకు చెక్ పడాలంటే సంఘటిత గళంతో ముందుకు సాగాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ(టీఈజేఏసీ) రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలన్నీ జేఏసీ నీడలో సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. మంగళవారం జేఏసీ భాగస్వామ్యపక్షాలతో స్థానిక టీఎన్జీ వో భవన్లో అత్యవసర సమావేశం నిర్వహించారు. టీఈజేఏసీ ఆధ్వర్యంలో మే 5న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జి ల్లాల కలెక్టరేట్ల ఎదుట నిర్వహించనున్న ఒక్కరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని, అనేక కీలక సమస్యలు సంవత్సరాలుగా పెండింగ్లోనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలకు ఒకసారి ఇవ్వాల్సిన డీఏలు, సంవత్సరానికి ఒకసారి ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లు, ఐదు సంవత్సరాలకు ఒకసారి అమలు చేయాల్సిన పీఆర్సీ వంటి హక్కులను కాలానుగుణంగా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఓపీఎస్ పునరుద్ధరణపై ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, సీపీఎస్ రద్దుపై ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ దారం శ్రీనివాస్రెడ్డి, కన్వీనర్ మడిపల్లి కాళిచరణ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి కటకం రమేశ్, పెండ్యాల కేశవరెడ్డి, వివిధ ఉపాధ్యా య, ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు. -
నూతన కార్యవర్గం
కరీంనగర్ సిటీ: శాతవాహన యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఎస్యూసీటీఏ) నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనివర్సిటీ క్యాంపస్లో జరిగిన సమావేశంలో అధ్యాపకులు సంఘం ప్రతినిధులను ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డాక్టర్ ఎం. మనోజ్ కుమార్, జనరల్ సెక్రటరీగా డాక్టర్ జి. రమేశ్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్స్గా డాక్టర్ డి. విజయ్ కుమార్, అనిల్ కుమార్, జాయింట్ సెక్రటరీస్ డాక్టర్ టి.కృష్ణకుమార్, వి.ప్రదీప్ రాజ్, కోశాధికారిగా కె. తిరుపతిని ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా, కాలేజీ ఇన్చా ర్జిలుగా డాక్టర్ కె. రాజు, డి.విజయ్ ప్రకాష్, జె.అశ్విని, కె.సావిత్రి, వై. ప్రసాద్ ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా డాక్టర్ ఏ.రవి కుమార్, ఎస్.కిరణ్, ఎం.అర్జున్ గౌడ్, కె. తిరుపతి రెడ్డి, డి. యశ్వంత్ రావును ఎన్నుకున్నారు. అనంతరం శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్కుమార్ను కలవగా నూతన కార్యవర్గాన్ని అభినందించారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
సిరిసిల్లటౌన్: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని మంగళవారం పోలీసులు గుర్తించారు. సిరిసిల్ల టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. సిరిసిల్ల కొత్త బస్టాండ్ వద్ద ఉదయం 9 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెంది ఉండడాన్ని స్థానికులు సమాచారం ఇచ్చారు. మృతుడి వయస్సు 40–45 ఏళ్ల వరకు ఉంటుందని, 5.6 అడుగుల ఎత్తు, గుండ్రటి ముఖం, చామనచాయ రంగులో ఉండి, ఎరుపు రంగు చొక్కా , గ్రీన్ రంగు ప్యాంటు, గ్రీన్ కలర్ బనియన్ ధరించి ఉన్నట్లు సీఐ తెలిపారు. ఎడమ చేతిపై సుజాత, కుడి చేతిపై ఎస్ఎస్ అని పచ్చబొట్టు ఉన్నాయని, ఎవరికై నా మృతుడి ఆచూకీ తెలిస్తే టౌన్ సీఐ 87126 56366, ఎస్సై 87126 56368 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లగొల్లపల్లి గ్రామానికి చెందిన పొన్నాల వెంకటరెడ్డి(48) అనే గల్ఫ్ కార్మికుడు మంగళవారం వేకువజామున గుండెపోటుతో మలేషియాలో మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. వెంకట్రెడ్డి స్వగ్రామంలో ఉపాధిలేక కుటుంబ పోషణకు ఆరేళ్ల క్రితం కంపెనీ వీసాపై గల్ఫ్ వెళ్లాడు. 22నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి కొద్ది రోజులు ఇక్కడ ఉండి తిరిగి మలేషియాకు వెళ్లిన వెంకట్రెడ్డి రూంలోనే గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. ఈ సమాచారాన్ని అక్కడి మిత్రులు మంగళవారం కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వెంకట్రెడ్డి మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తీసుకొచ్చేలా చొరవ తీసుకోవాలని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ను కోరారు. అలాగే వాట్సాప్ ద్వారా వెంకట్రెడ్డికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కు సైతం పంపించినట్లు సర్పంచ్ కొండ రమేశ్గౌడ్ తెలిపారు. బాధిత కుటుంబాన్ని సర్పంచ్, ఉప సర్పంచ్ పొన్నాల మణెమ్మ పరామర్శించారు. మృతుడికి భార్య వనజ, కూతురు జావలి ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని సర్పంచ్ కోరారు. పరీక్ష ఫీజు చెల్లించాలి కరీంనగర్ సిటీ: పీజీ ప్రఽథమ, ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంబీఏ బీఎల్ఐసీ ప్రథమ, 1వ సెమిస్టర్ 2025–26 విద్యా సంవత్సరం పరీక్ష ఫీజు ఆన్లైన్లో చెల్లించాలని డా.బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రాంతీయ సమన్వయ కేంద్రం అధికారి డా.ఎం సత్యప్రకాశ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుం రూ.500తో చెల్లించేందుకు ఈనెల 30వరకు అవకాశం ఉందన్నారు. మరిన్ని వివరాలకు అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలని పేర్కొన్నారు. -
పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోళ్లు
సైదాపూర్: పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్ర రవాణా, బీసీసంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సైదాపూర్లోని విశాల సహకార సంఘం ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశం, మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో కొత్త నిబంధనలు ఇబ్బందిగా ఉన్నాయని, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ, ఇప్పటివరకు తూకం వేయలేదని, అకాల వర్షాలతో రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని కార్యకర్తలు మంత్రి దృషికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఽపాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న విద్యా, ఆరోగ్య, అభివృద్ధి కమిటీలతో అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని, మహిళా సంఘాలకు పంపిణీ చేసిన స్టీలు పాత్రలు వాడాలన్నారు. మండలంలోని పలు గ్రామాలకు మంజూరు కావాల్సిన సీసీరోడ్లు, అంతర్గత రోడ్ల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చిత్రా మిశ్రా, అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) శ్రీనివాసరెడ్డి, డీఆర్డీవో శ్రీధర్, ఆర్డీవో రమేశ్బాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్, తహసీల్దార్ గుర్రం శ్రీనివాస్, ఎంపీడీవో యాదగిరి పాల్గొన్నారు. -
సమస్యలపై స్పందించడం లేదు
రామగుండం: ప్రజాయోగ్యమైన సమస్యలను పరిష్కరించేందుకు అనుకూలంగా ఉన్నా అధికారుల నుంచి స్పందన కరువైందని, డీఆర్యూసీసీ ప్రతినిధి అనుమాస శ్రీనివాస్ అన్నారు. పలు ఎక్స్ప్రెస్ రైళ్ల హాల్టింగ్స్, వేళల మార్పు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగిందన్నారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో మంగళవారం డివిజనల్ యూజర్స్ అండ్ కన్సల్టేటివ్ కమిటీ(డీఆర్యూసీసీ) సమావేశం జరిందిందని చెప్పారు. రామగుండం ప్రతినిధి అనుమాస శ్రీనివాస్ హాజరై పలు సమస్యలను రైల్వే జీఎం, డీఆర్ఎంల దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా సాక్షి దినపత్రికలో మార్చి 12వ తేదీన ‘పది రూపాయలకే 45 కి.మీ.ప్రయాణం’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై చర్చ సాగినట్లు తెలిపారు. కాగజ్నగర్ నుంచి బోధన్ మెమూ రైలు.. కాగజ్నగర్–కరీంనగర్ వరకు వెళుతుందని అనౌన్స్మెంట్ చేయడంతో బోధన్ వెళ్లే ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నాని అన్నారు. నేరుగా కాగజ్నగర్ నుంచి బోధన్ వరకు వెళుతుందని అనౌన్స్మెంట్ చేస్తే ప్రయాణికుల సంఖ్య పెరిగి అక్యుపెన్సీ వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇందులో రైల్వే శాఖ తప్పిదంతోనే మెమూకు స్పందన కానరావడం లేదని అన్నారు. రైల్వే ప్లాట్ఫారంపై అత్యవసరంగా ఫస్ట్ ఎయిడ్ వైద్యం ఏర్పాటు చేయాల్సి ఉన్నా గది మూసి వేసి ఉందన్నారు. ఫలితంగా ఇద్దరు గర్భిణులు ప్లాట్ఫారంపైనే పురుడు పోసుకున్నారని, మరో ఇద్దరు గుండెపోటుతో మృత్యువాత పడ్డారని తెలిపారు. ఇటీవల ప్రకటించిన ప్రత్యేక రైళ్లకు రామగుండంలో హాల్టింగ్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. భాగ్యనగర్ తర్వాత రామగుండం–కాజీపేట మధ్య కాజీపేట(రైలు నం.17036) ఎక్స్ప్రెస్ రైలును సికింద్రాబాద్ వరకు పొడిగించి సమయ వేళలు మార్చాలని, నవజీవన్, జైపూర్, తమిళనాడు తదితర ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించే అవకాశం ఉన్నా అధికారులు స్పందించడం లేదని వాపోయారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి రైల్వేజంక్షన్ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని పెద్దపల్లికి చెందిన డీఆర్యూసీసీ సభ్యుడు నారాయణ్దాస్ తివారి కోరారు. అమృత్భారత్లో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం నెమ్మగించిందన్నారు. పెద్దపల్లి–కూనారం మధ్య వంతెన నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలన్నారు. చీకురాయి బీ–క్యాబిన్ పనులు సైతం త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులకు రైలు ప్రయాణంలో రాయితీలను పునరుద్ధరించాలని కోరారు. తెలంగాణ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్, రాయపూర్, మైసూర్–జైపూర్, వందేభారత్ ఎక్స్ప్రెస్, భగత్కీకోఠి ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని విన్నవించారు. సమావేశంలో చర్చకు వచ్చిన ‘సాక్షి’ కథనాలు డీఆర్యూసీసీ సమావేశంలో అనుమాస శ్రీనివాస్ -
వీక్లీ రైళ్లను రెగ్యులర్గా నడిపించాలి
రామగుండం: తెలంగాణలో నూతనంగా ప్రత్యేక రైళ్ల కేటాయింపులపై మే 10న హైదరాబాద్ పర్యటనకు విచ్చేయనున్న ప్రధాన మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం అధ్యక్షుడు కంకటి ఫణిందర్ తెలిపారు. ● ఉమ్మడి రాష్ట్ర హయాంలో తిరుపతి–న్యూఢిల్లీ మధ్య నడిచే ఏపీ సంపర్క్ క్రాంతి రైలు తరహాలోనే తెలంగాణ సంపర్క్ క్రాంతి పేరుతో ప్రత్యేక రైలు నడిపించాలి. దీనిని హైదరాబాద్–యోగానగరి రిషికేశ్ మధ్య నడిపిస్తే పుణ్యక్షేత్రాలు పర్యటించే యాత్రికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండనుంది. ● నందిగ్రామ్ (రైలు నం.11001/02) ఎక్స్ప్రెస్ రైలును కాజీపేట జంక్షన్ వరకు పొడగించాలని, ఈ రైలు ముంబాయి–బల్హర్షా మధ్య వారాంతపు (వీక్లీ) ఎక్స్ప్రెస్గా నడుస్తుండగా రోజూ నడిపించాలి. ఈ రైలు ముంబాయిలో బయలుదేరి నాసిక్, షిర్డీ, మన్మాడ్, కేబీ ఆసిఫాబాద్, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి మీదుగా కాజీపేట వరకు నడిపించాల్సిన అవసరం ఉంది. ● హైదరాబాద్–షాలిమార్ (కోల్కత్తా) వయా బల్హర్షా మీదుగా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు నడిపించాలి. ఈ రైలు హైదరాబాద్ నుంచి బయలుదేరి కాజీపేట, పెద్దపల్లి, నగ్భీర్, రాయ్పూర్, గోండియా, బిలాస్పూర్, ఝార్సీగూడ, రూర్కెలా, ఖరగ్పూర్, టాటానగర్ మీదుగా కోల్కతా (షాలీమార్) చేరుకుంటుంది. ఈ రైలు నడిపిస్తే కాగజ్నగర్, పెద్దపల్లి, బసంత్నగర్, హైదరాబాద్లోని ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ కార్మికులకు సౌకర్యవంతంగా ఉంటుంది. వీటన్నింటిపై కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్లతో ఇప్పటికే చర్చించడం జరిగిందని, వీరి సహకారంతో ఫోరం ప్రతినిధుల బృందం ప్రధాని మోదీని కలిసి నూతన రైళ్లను ప్రవేశపెట్టాలని కోరనున్నట్లు అధ్యక్షుడు పేర్కొన్నాడు. ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం ప్రతినిధుల డిమాండ్ -
చోరీకేసులో నిందితుడి అరెస్టు
కరీంనగర్క్రైం: జల్సాలకు అలవాటు పడి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని కరీంనగర్ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.5లక్షల నగదు, 10 గ్రాముల బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. సీపీ గౌస్ ఆలం సోమవారం కేసు వివరాలు వెల్లడించారు. కరీంనగర్ మండలం దుర్శేడ్ గ్రామానికి చెందిన బొద్దుల యుగేందర్(32) పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉండి, పీడీయాక్ట్పై జైలుశిక్ష అనుభవించాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా తన ప్రవర్తనలో మార్పురాలేదు. ఈ నెల 26న వేకువజామున మంకమ్మతోటలోని శ్రీ చైతన్య కాలేజీ ఆఫీసు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. బీరువాలో దాచి ఉంచిన రూ.5లక్షల నగదు, బంగారు చైన్ చోరీ చేశాడు. ఆ సొత్తును తన ఇంటి వెనుక ఉన్న కట్టెలమండిలో దాచిపెట్టాడు. కళాశాల యాజమాన్యం ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా సమాచారంతో నిందితుడిని అరెస్టు చేశారు. రూ.5లక్షల నగదు, బంగారు చైన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గతంలోనూ చింతకుంట ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో అంగీకరించాడు. ఏసీపీ వెంటకస్వామి, సీఐ సృజన్రెడ్డి పాల్గొన్నారు. -
ట్రాక్టర్ దగ్ధం
కొడిమ్యాల: రన్నింగ్లో ఉన్న ఓ ట్రాక్టర్లో మంటలు లేచి పూర్తిగా దగ్ధమైన ఘటన మండలంలోని నల్లగొండలో చోటుచేసుకుంది. నమిలకొండ గ్రామానికి చెందిన ఇటుకబట్టీల నుంచి వేములవాడ వైపు ఇటుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ ట్రాక్టర్ను రోడ్డు పక్కకు ఆపి కిందకు దూకాడు. ఎండ తీవ్రతతో ఇంజిన్ అధికంగా వేడెక్కి షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు వ్యాపించాయని అక్కడున్న వారు చర్చించుకున్నారు. పిచ్చికుక్క దాడిలో ముగ్గురికి గాయాలుపెగడపల్లి: మండలంలోని లింగాపూర్ గ్రామంలో పిచ్చికుక్క దాడి చేయగా ముగ్గురు గాయపడ్డారు. గ్రామానికి చెందిన చెనాల విజయ, జున్నమరియా, జున్న పురుషోత్తం ఆదివారం రాత్రి ఆరుబయట నిద్రిస్తుండగా వారిపై దాడి చేసి గాయపర్చింది. బాధితులు జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. గ్రామంలో కుక్కుల బెడద ఎక్కువైందని, నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. మహీంద్రా కంపెనీలో ఉద్యోగావకాశాలుకరీంనగర్ అర్బన్: జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ యువతీ, యువకులకు మహీంద్ర కంపెనీలో ఉద్యోగావకాశాలున్నాయని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీధర్ తెలిపారు. ఈ నెల 30న కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియం పక్కన గల స్వశక్తి కళాఽశాలలోని ఈజీఎంఎం కార్యాలయంలో ఉదయం 10గంటలకు ఇంటర్వ్యూలు ఉంటాయని వివరించారు. వేతనం హోదాను బట్టి రూ.13వేల నుంచి రూ.15,300 వరకు ఉంటుందని, వయసు 18– 25 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. ఎస్సెస్సీ, ఇంటర్, ఐటీఐ అర్హతతో 300 వరకు ఉద్యోగాలున్నాయని వివరించారు. సబ్సిడీతో కూడిన భోజనంతో పాటు ఉచిత రవాణా సౌకర్యం ఉంటుందని, ఆసక్తి గల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కుల బహిష్కరణపై కేసు నమోదుగంగాధర: గంగాధర మండలం మల్లాపూర్ గ్రామంలో కుల బహిష్కరణపై కేసు నమోదైంది. మల్లాపూర్ గ్రామంలో కొలెపాక కుటుంబ సభ్యులకు, ఇదే గ్రామానికి చెందిన మరికొన్ని కుటుంబాల మధ్య వివాదం కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం సర్పంచ్ సమక్షంలో పంచాయితీ నిర్వహించి శుభ, అశుభ కార్యాలకు వెళ్లవద్దని తీర్మానం చేశారు. బాధితుల కుటుంబం నుంచి సురేశ్ అనే యువకుడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కుల పంచాయితీ నిర్వహించిన సర్పంచ్ కొలెపాక కవిత, పెద్ద మనుషులు కొలెపాక దిలీప్, కొలెపాక రాజయ్య, కొలెపాక స్వామి, కొండయ్య, నర్సయ్య, ఎల్లయ్య, బాబు, రమేశ్, మొండయ్య, మల్లేశ్, హరీశ్పై ఎస్సై వంశీకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అడవికి ఆపద
మంథని: కరీంనగర్ తూర్పు డివిజన్లో సుమారు 80 కిలో మీటర్ల దూరంలో విస్తరించిన ఉన్న అడవిలో ప్రతీ వేసవిలో ఆపద వస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కాలిపోతోంది. ఏటా వేసవిలో అడవి ఇలా కాలిపోతున్నా అటవీ శాఖ అదికారులు పట్టించుకోవడం లేదు. మంథని–కాటారం ప్రధాన రహదారితో పాటు తూర్పు మండలాలను ఆనుకొని రింగ్ రోడ్డులో మంటలు చెలరేగుతున్నాయి. దారి వెంట ప్రయాణించే ఆకతాయిల చర్యల వల్ల అడవి అంటుకొని మంటలో అడవి జంతువులకు అపాయం జరుగుతుందని పలువురు ఆవేదన చెందుతున్నారు. తూర్పు డివిజన్ల్లో అడవి అంటుకుంటే మండల ఆర్పటానికి అటవీశాఖ వద్ద పరికరాలు ఉన్నాయి. కానీ వాటిని సకాలంలో ఉపయోగించపోవడంతో నష్టం వాటిల్లుతోంది. అడవి అంటుకుంటున్న సమాచారం అటవీశాఖకు సరైన సమయంలో చేరకపోవడంతో ప్రమాదం జరుగుతుందనే వాదనలు ఉన్నాయి. -
లారీని ఓవర్టేక్ చేయబోయి అదుపుతప్పిన బైక్
సిరిసిల్ల అర్బన్: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు శివారులో లారీని ఓవర్టేక్ చేయబోయి ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ముగ్గురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు. సోమవారం సాయంత్రం బైక్పై బీవై నగర్కు చెందిన రామ్చరణ్(17), బద్దెనపల్లికి చెందిన యశ్వంత్(16), సిరిసిల్లకు చెందిన నవీన్(16) వేములవాడ వైపు వెళ్తున్నారు. రగుడు ఎల్లమ్మ గుడి ప్రాంతంలో ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ద్విచక్రవాహనం అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రామ్చరణ్ తలకు తీవ్రగాయాలు కాగా, యశ్వంత్ కాలు విరిగింది. నవీన్కు చెవి తెగిపోయింది. వీరిని 108 వాహనంలో ఏరియా ఆస్పత్రికి తరలించారు. రామ్చరణ్ పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్కు తరలించినట్లు వైద్యులు తెలిపారు. ముగ్గురికి తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు ఒకరి పరిస్థితి విషమం -
రైలు ఢీకొని ఒకరి దుర్మరణం
మేడిపల్లిః రైల్వేట్రాక్ దాటే సమయంలో ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మేడిపల్లి రైల్వేస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీస్ హెడ్కానిస్టేబుల్ హనుమండ్లు కథనం ప్రకారం మండలంలోని తొంబరావుపేటకు చెందిన పుల్లురి భీమయ్య(52) వ్యవసాయకూలీగా పనిచేస్తుంటాడు. పనులు ముగించుకుని ఇంటికి వెళ్లే క్రమంలో రైల్వేట్రాక్ దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. కరీంనగర్ వైపు వెళ్లే ప్యాసింజర్ రైలు లోకోపైలట్ ట్రాక్పై ఉన్న మృతదేహాన్ని చూసి రైల్వే పోలీస్లకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. భీమయ్యకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మైనర్లే దొంగలు● చోరీ కేసును 24 గంటల్లో చేధించిన పోలీసులు ధర్మపురి: ధర్మపురికి చెందిన రాపర్తి ప్రభాకర్ ఇంట్లో ఈనెల 26న దొంగతనానికి పాల్పడింది ఇద్దరు మైనర్లు అని పోలీసులు గుర్తించారు. ప్రభాకర్ ఇంటితాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలతోపాటు నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. సీఐ రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై మహేష్ సోమవారం నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు మైనర్లు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పట్టుకుని విచారించగా.. నేరం ఒప్పుకున్నారు. వారిని జువైనల్ జడ్జి ముందు హాజరుపర్చి జువైనల్ హోంకు తరలించారు. ఉద్యోగం పేరిట మోసం చేసిన వ్యక్తికి మూడేళ్ల జైలు గోదావరిఖనిటౌన్(రామగుండం): సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తికి గోదావరిఖని ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వెంకట సచిన్రెడ్డి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు చెప్పారు. వివరాలు.. 2016లో యైటింక్లయిన్కాలనీకి చెందిన దాడి లక్ష్మయ్య కొడుకు మధుకర్కు సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి అదే కాలనీకి చెందిన రేపాల సురేందర్ రూ.11 లక్షలు తీసుకున్నాడు. కాలం గడిచిపోతున్నా ఉద్యోగం ఇప్పించలేదు. తీసుకున్న డబ్బులు ఇవ్వాలని నిలదీసిన లక్ష్మయ్యను సురేందర్ బెదిరింపులకు గురిచేయడంతో అతను టూటౌన్ పోలీసులను ఆశ్రయించాడు. అప్పటి ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో సాక్ష్యాలను టూటౌన్ సీఐ ప్రసాద్రావు నేతృత్వంలో హెడ్ కానిస్టేబుల్ మల్లేశం సమర్పించగా ఏపీవో నహేద పర్హీన్ వాదనలు వినిపించారు. జడ్జి సాక్ష్యాధారాలు పరిశీలించి సురేందర్కు 3 ఏళ్ల జైలు, రూ.4వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. -
రైతు ముంగిటే శాస్త్రవేత్తలు
● ఈ నెల 27నుంచి మే 23వరకు నిర్వహణ ● ఎనిమిది బృందాలు.. 60 సదస్సులు కరీంనగర్ అర్బన్: మూస ధోరణిలో కాకుండా కాలానుగుణ సాగుకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైతులను చైతన్యవంతులను చేయడంతో పాటు మార్కెటింగ్ మెలకువలు, సస్యరక్షణ చర్యలపై అవగాహనకు శాస్త్రవేత్తలను రంగంలోకి దించింది. రైతు ముంగిటే శాస్త్రవేత్త పేరుతో కార్యక్రమాన్ని రూపకల్పన చేయగా జిల్లాలో 60 సదస్సులు నిర్వహించనున్నారు. తెలంగాణ రైతు విజ్ఙాన కేంద్రం, వ్యవసాయ పరిశోధన స్థానం, కృషి విజ్ఙాన కేంద్రం శాస్త్రవేత్తలతో కలిపి 8బృందాలుగా విభజించగా జిల్లా క్లస్టర్ ఇన్చార్జిగా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఅర్డినేటర్ డా.బోగారి హరికృష్ణను నియమించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగనుండగా రైతులకు అవగాహన కల్పించనున్నారు. సోమవారం జిల్లావ్యాప్తంగా కార్యక్రమం ప్రారంభం కాగా శాస్త్రవేత్తలు, అధికారులు అన్నదాతలకు అవగాహన కల్పించారు. ఎనిమిది బృందాలు.. బృందానికి ఇద్దరు శాస్త్రవేత్తలు రైతు వేదికల సంఖ్య క్రమంలో శాస్త్రవేత్తలతో బృందాలను ఏర్పాటు చేశారు. ఎనిమిది బృందాల్లో 16మంది శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు అందించనున్నారు. శాస్త్రవేత్తలు డా.బి.హరికృష్ణ, కె.మదన్మోహన్రెడ్డి, బి.రాంప్రసాద్, జి.ఉషారాణి, ఈ.రజనీకాంత్, ఈ.ఉమారాణి, ఐ.తిరుపతి, జె.రాకేష్, కె.రాజేంద్రప్రసాద్, కె.స్వాతి, అఖిల, పి.రవి, కె.రామకృష్ణ, పి.మధుకర్, జి.మౌలిక సాగులో వైవిధ్యం, లాభాలు, సేద్యంలో ఎదురయ్యే సమస్యలు, చీడపీడల నివారణ, సాగు భూమి సస్యరక్షణ తదితర వివరాలను వివరించనున్నారు. చిరుధాన్యాలు.. ఆరుతడి పంటలు చిరుధాన్యాలు, ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించనున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయన్న సంకేతాల క్రమంలో వచ్చే వానాకాలం, యాసంగి సీజన్లలో ఏ ఏ పంటలు వేయాలనే అంశాలను వివరిస్తున్నారు. వరి, పత్తిని తగ్గించి మక్క, కంది, పెసర, మినుములు, అలసంత, పసుపు, మిరప, సోయాబీన్, ఆవాలు, నువ్వులు, కుసుమ, జొన్న, సజ్జ, ఆనుములు, గోధుమలు, వేరుశనగ, పొద్దుతిరుగుడు అలాగే పప్పు దినుసులు, నూనెగింజలు, కూరగాయలు సాగు చేయాలని చెబుతున్నారు. యూరియా వాడకం తగ్గింపు, యాప్ ద్వారా యూరియా బుకింగ్, సాగు నీటి ఆదా, సేంద్రియ ఎరువుల వాడకం, భూసార పరీక్షల నిర్వహణ, పెట్టుబడి ఖర్చు తగ్గింపు, ఎఫ్పీవోల విస్తరణ, పంట ఉత్పాదకాల కొనుగోలులో జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. సమస్యలపై రైతుల ఏకరవు రైతు ముంగిటే శాస్త్రవేత్త కార్యక్రమాల్లో రైతులు తమ సమస్యలు, డిమాండ్లను ఏకరవు పెడుతున్నారు. ప్రధానంగా కోతులు, అడవి పందుల బెడదను నివారిస్తే ఏ పంట వేయమన్న వేస్తామని రైతులు స్పష్టం చేశారు. అన్ని రకాల విత్తనాలకు 50శాతం రాయితీ ఇవ్వాలని, అతివృష్టి, అనావృష్టితో పంట నష్టానికి పరిహారం ఇవ్వాలని, రైతువారిగా పంటల బీమా అమలు చేయాలని కోరుతున్నారు. భూసార పరీక్షలను విస్తృతం చేయాలని, కూలీల కొరత లేకుండా ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించాలని, బిందు, తుంపర సేద్య పరికరాలు రాయితీపై ఇవ్వాలని వివరించారు. అన్ని పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర, నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులపై ఉక్కుపాదం మోపాలని కోరారు. రైతుల దగ్గరికే శాస్త్రవేత్తలు వస్తున్నందున ప్రతీ రైతు హాజరై అవగాహన పెంచుకోవాలి. శాస్త్రవేత్తలు చెప్పే అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆచరణలో చూపాలి. రైతులు తమ సమస్యలను ప్రస్తావిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. – డా.బోగారి హరికృష్ణ, జిల్లా క్లస్టర్ ఇన్చార్జి -
ఆన్లైన్లో విద్యుత్ బిల్లులు చెల్లించండి
కొత్తపల్లి(కరీంనగర్): వినియోగదారులు ఆన్లైన్లో విద్యుత్ బిల్లులు చెల్లించే అవకాశాన్ని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీజీఎన్పీడీసీఎల్) కల్పించింది. ప్రస్తుత డిజిటలైజేషన్ నేపథ్యంలో రోజురోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ విద్యుత్ సంస్థ ప్రత్యేక యాప్ల ద్వారా బిల్లుల స్వీకరణకు శ్రీకారం చుట్టింది. గంటల తరబడి క్యూలైన్లో నిలబడి సమయాన్ని వృథా చేసుకోకుండా ఉండే పరిస్థితులకు స్వస్తి పలుకుతూ మొబైల్లోనే ప్రత్యేక యాప్ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించే సదవకాశాన్ని టీజీఎన్పీడీసీఎల్ ఐటీ వింగ్ ఏర్పాటు చేసింది. ఈ విధమైన చెల్లింపుల ద్వారా సకాలంలో విద్యుత్ చెల్లింపులు చేపట్టడటంతో పాటు అనవసరంగా ఆఫీసు చుట్టూ తిరగడం తప్పనుంది. వేసవిలో తీవ్రమైన ఎండల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో వినియోగదారులు ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందే సౌలభ్యాన్ని కల్పిస్తోంది. ఈ అవకాశాన్ని వినియోగదారులు వినియోగించుకుంటూ సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగితే సంస్థకు ఉపయోగకరంగా ఉండనుంది. 2024– 25 ఆర్థిక సంవత్సరంలో 1,36,351 మంది వినియోగదారులు ఆన్లైన్ చెల్లింపులు చేయగా..2025–26 ఆర్థిక సంవత్సరంలో 1,49,068 మంది చెల్లించినట్లు విద్యుత్ శాఖ గణాంకాల ద్వారా తెలిసింది. వినియోగదారులు ఆన్లైన్ చెల్లింపుల వైపు దృష్టి సారించేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఎండల నుంచి రక్షణ పొందండి ప్రత్యేకంగా టీజీఎన్పీడీసీఎల్ యాప్ అదనంగా గూగుల్పే, ఫోన్పే, పేటీఎం యాప్లు -
ఇసుక డంపులు సీజ్
కథలాపూర్: మండలంలోని గంభీర్పూర్, బొమ్మెన శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను సోమవారం సాయంత్రం సీజ్ చేసినట్లు మైనింగ్ శాఖ ఏడీ జైసింగ్ తెలిపారు. వాగులో నుంచి ఇసుకను తీసి శివారులో డంప్ చేశారు. స్థానికులు ఇక్కడి అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదు. దీంతో మైనింగ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రత్యేక తనిఖీలు చేయగా.. ఇసుక డంపులు కనిపించగా సీజ్ చేసినట్లు జైసింగ్ తెలిపారు. కొందరికి మినహాయింపుపై వివాదం ఇసుక అక్రమ తరలింపు విషయంలో అధికారులు కొందరికి మినహాయింపు ఇస్తున్నారని ఆరోపణలున్నాయి. వాగుల నుంచి పలుకుబడి గల వ్యక్తులు ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తుంటే అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలున్నాయి. కొత్తగా ఇసుక వ్యాపారం చేస్తున్నవారిపై కఠినంగా వ్యవహరించడం వివాదాలకు దారి తీసిందని సమాచారం. ఈ క్రమంలోనే బొమ్మెన, గంభీర్పూర్ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపుల విషయంలో జిల్లా అధికారులకు ఫిర్యాదు వెళ్లడంతో తనిఖీలు చేసినట్లు తెలిసింది. ఉన్నతాధికారులు స్పందించి ఇసుక తరలింపు విషయంలో కఠినంగా వ్యవహరించాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
కొత్త విధానంలో కొనుగోళ్లు
కరీంనగర్రూరల్: యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలు చేస్తోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏ రోజు ధాన్యం లోడ్ చేస్తే అదేరోజు రైతు, ధాన్యం వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. గతంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేసిన తర్వాత మాన్యువల్ ట్రక్షీట్తో రైస్ మిల్లులకు పంపించారు. అనంతరం సొసైటీ, ఐకేపీ సిబ్బంది ట్రక్షీట్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసినపుడు రైతుకు ఓటీపీ వచ్చేది. కాగా, కొత్త విధానంతో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యమేర్పడే అవకాశముందని కేంద్రాల నిర్వాహకులు పేర్కొంటున్నారు. నేటి నుంచి కొనుగోళ్లు జిల్లాలో యాసంగి సీజన్లో 2.73లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 6.46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.ఽ ఐకేపీ, సహకార సంఘాలు, డీసీఎంఎస్ల ఆధ్వర్యంలో మొత్తం 318 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటివరకు సుమారు 205 కేంద్రాలను ఎమ్మెల్యేలు, అధికారులు లాంఛనంగా ప్రారంభించగా సోమవారం నుంచి ఆయా కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ప్రభుత్వం ప్రస్తుత యాసంగి సీజన్ నుంచి ధాన్యం కొనుగోళ్లలో అమలు చేయనున్న కొత్త విధానం ఆందోళన కలిగిస్తోంది. కొత్త విధానం ప్రకారం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు ధాన్యం తూకం వేసిన వెంటనే రైతు పేరు, ఎన్ని క్వింటాళ్ల ధాన్యం వివరాలను ఆన్లైన్లో నమోదు చేయగానే రైతుకు ఓటీపీ వస్తోంది. అనంతరం ఆన్లైన్ ట్రక్షీట్ జారీ చేయడం ద్వారా ధాన్యం, రైసుమిల్లు వివరాలు రైతు తెలుసుకునే అవకాశముంది. అంతేకాకుండా ఆన్లైన్లో చూపించిన రైసుమిల్లుకు మాత్రమే జీపీఎస్ ఉన్న ట్రాక్టర్లు, లారీల్లో ధాన్యం లోడ్ పంపించాల్సి ఉంటుంది. అయితే కేంద్రాలకు ఒక్కటే ట్యాబ్ ఇవ్వడంతో ఏ రోజు ధాన్యం లోడ్ చేస్తే అదే రోజు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడంలో జాప్యమేర్పడే అవకాశముందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. సోమవారం నుంచి చేపట్టనున్న ధాన్యం కొనుగోళ్లతో క్షేత్రస్థాయిలో కొత్త విధానంలో నెలకొన్న సమస్యలను గుర్తించే అవకాశముందని కరీంనగర్ సొసైటీ కార్యదర్శి రమేశ్ తెలిపారు. -
వాసవీ మాత జయంతి
కరీంనగర్అర్బన్/కరీంనగర్టౌన్/కరీంనగర్కల్చరల్: ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి కార్యక్రమాన్ని కలెక్టరేట్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వాసవీ మాత చిత్రపటానికి కలెక్టర్ చిత్రామిశ్రా, ఆర్యవైశ్య ప్రతినిధులు నివాళులర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆర్య వైశ్యులు సమాజంలో వివిధ రకాల సేవ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. వారి ఆధ్వర్యంలో నడుస్తున్న వృద్ధాశ్రమంతో పాటు వైశ్య భవనం, వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని సందర్శిస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్రెడ్డి, ఆర్డీవో కె.మహేశ్వర్, కార్పొరేటర్లు వంగాల పవన్కుమార్, కొలిపాక రమ్య శ్రీనివాస్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు కన్న కృష్ణ, వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్, సంఘం నాయకులు చిదుర సురేశ్, కటకం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. డంప్యార్డ్ పరిష్కార బాధ్యత లేదా?కరీంనగర్కార్పొరేషన్: డంప్యార్డ్ సమస్యను పరిష్కరించే బాధ్యత కేంద్ర మంత్రిగా, కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్కి లేదా అని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి ప్రశ్నించారు. డంప్యార్డ్కు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నట్లు గతంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ను తీసుకువచ్చి చేసిన హడావుడి మరిచిపోయావా అంటూ నిలదీశారు. ఆదివారం నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో మాట్లాడారు. హుజురాబాద్తో పాటు కరీంనగర్కు కూడా సంజయ్ ఎంపీగా ఉన్నారని, నగరపాలకసంస్థలో బీజేపీయే అధికారంలో ఉందని తెలిపారు. అప్పుడేమో డంప్యార్డ్ పరిష్కారం అయిపోతుందని భ్రమలు కల్పించి, ఇప్పుడేమో హుజురాబాద్లో ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ నేతల ఇళ్ల ముందు జంతుకళేబరాలు వేస్తానంటూ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని మరోసారి కరీంనగర్ కో ఆప్షన్ ఎన్నికల్లో రుజువైందన్నారు. హుజురాబాద్లోనూ డంప్యార్డ్ పేరిట రెండు పార్టీలు కలిసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. కేంద్ర మంత్రిగా డంప్యార్డ్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తప్పకుండా సహకారం అందిస్తామని, అలా కాకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తే ప్రజలు ఊరుకోరన్నారు. కార్పొరేటర్లు వరాల నర్సింగం, పర్వతం మల్లేశం, కాంతాల జగన్రెడ్డి, నాయకులు ఎండీ తాజ్, గుండాటి శ్రీనివాస్రెడ్డి, దండి రవీందర్, ఇట్టెపు వేణు, మ్యాకల నర్సయ్య, జీడి రమేశ్, వంగల విద్యాసాగర్, నాగుల సతీశ్, హనీఫ్, ఉప్పరి అజయ్, ఖలీల్ పాల్గొన్నారు. ఏబీవీపీ దీక్ష విరమణకరీంనగర్/కరీంనగర్టౌన్: కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఏబీవీపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేయాలనే ప్రభుత్వ యత్నాలను వ్యతిరేకిస్తూ నిర్వహించిన 24 గంటల నిరాహార దీక్ష ఆదివారం విరమించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు మంగు నరసింహాద్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు రూ.10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఏటా దాదాపు 14 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని, దీనికోసం కేవలం రూ.2,500 కోట్లు కేటాయిస్తే సరిపోతుందన్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా ప్రభుత్వం తగిన నివేదిక సమర్పించి, పెండింగ్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీక్షకు జిల్లా ప్రముఖ్ రాచకొండ గిరిబాబు మద్దతు తెలిపారు. అనంతరం దీక్షను విరమింపజేశారు. జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు, ఎస్ఎఫ్డీ రాష్ట్ర కోకన్వీనర్ అజయ్, రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ నందు, నగర కార్యదర్శి యోగేశ్, మురళి, నాగరాజు, వంశీ, శివ, మనోజ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా పూర్ణాహుతి
కరీంనగర్కల్చరల్: శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా ఆదివారం కరీంనగర్లో కమాన్ వద్ద గల ఆలయంలో హోమం, పూర్ణాహుతి, విశేష పూజలు, భజన కార్యక్రమాలు చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఆల య కమిటీ చైర్మన్ ముత్తోజు రాంకుమార్, ధర్మకర్తలు వెగ్గలం రామకృష్ణ, ఎదులాపురం మహేశ్, గోగులకొండ నరసింహాచారి, వంగల నవీన్, కరుణాకర్ పాల్గొన్నారు. దేశాభివృద్ధికి జనగణన కీలకంకరీంనగర్కార్పొరేషన్: జనగణన భవిష్యత్ ప్రణాళికలు రూపొందించేందుకు ఎంతగానో దోహదం చేస్తుందని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. ఆదివారం 2వ డివిజన్ పరిధి తీగలగుట్టపల్లిలోని తన నివాసంలో స్వీయ గణనను ప్రారంభించి మాట్లాడారు. దేశాభివృద్ధికి జనగణన కీలకమని చెప్పారు. నగర ప్రజానీకానికి స్వీయ గణన ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, ప్రజలు స్వీయ గణన చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మే 11 నుంచి జనాభా లెక్కల కోసం వచ్చే ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు సరైన వివరాలు తెలియజేయాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన జనగణన ప్రక్రియను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియొద్దిన్, పట్టణ ప్రణాళిక విభాగం ఏసీపీలు వేణు, శ్రీధర్ ఆధ్వర్యంలో తన ఇంటి, కుటుంబ వివరాలు ఆన్లైన్లో నమోదు చేశారు. అలాగే సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి నగరపాలకసంస్థ అధికారుల సమక్షంలో స్వీయ గణన ప్రక్రియను పూర్తి చేశారు. -
ఎండా.. రోగాలే నిండా
కరీంనగర్: ఎండాకాలం వచ్చిందంటే కొన్ని రకాల వ్యాధులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి. మునుపెన్నడూ లేని విధంగా ఏప్రిల్లో పగటి ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎండలో బయటకు వెళ్లాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 11 గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో వ్యాధులు కూడా అదే స్థాయిలో వ్యాపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాసుపత్రి, ఏరియా ఆస్పత్రులు, పీహెచ్సీలు, యూపీహెచ్సీలలో రోగుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో రోజూ 1,200 నుంచి 1,500 వరకు ఓపీ నమోదవుతుంది. అయితే ఇన్పెషెంట్లు ఎక్కువగా ఉండడం లేదని వైద్యులు చెబుతున్నారు. ఓపీతోనే జ్వరాలు, ఇతర సీజనల్ వ్యాధులు తగ్గుతున్నాయని పేర్కొంటున్నారు. జాగ్రత్తలతోనే వ్యాధులు దూరమవుతాయని వెల్లడిస్తున్నారు.అప్రమత్తంగా ఉండాలి వేసవిలో వచ్చే వ్యాధులపై ముందస్తు అప్రమత్తం అవసరం. వీటి నుంచి ఉపశమనం పొందడానికి నీటిని ఎక్కువగా తాగాలి. ఓఆర్ఎస్ ద్రావణం తీసుకోవాలి. అన్నిరకాల వ్యాధులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు ఎండలో తిరగకుండా జాగ్రత్త పడితే మంచిది.– డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్వో -
స్వీయ గణన.. దేశ పండగ
కరీంనగర్అర్బన్: జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ప్రతి ఒక్కరూ తమ వివరాలను స్వయంగా నమోదు (స్వీయ గణన) చేసుకోవాలని కలెక్టర్ చిత్రామిశ్రా పిలుపునిచ్చారు. ఆదివారం కలెక్టరేట్లో మాట్లాడారు. స్వీయ గణన ఈ నెల 26 నుంచి మే 10వరకు కొనసాగుతుందన్నారు. జన గణనలో గృహ నివాసయోగ్య స్థితి, వసతులు, కుటుంబ యజమాని పేరు తదితర వివరాలతో కూడిన 34 రకాల ప్రశ్నలు ఉంటాయని తెలిపారు. ఈ సమాచారం దేశ ప్రగతికి దోహదపడుతుందన్నారు. http:// se. census. gov. in పోర్టల్ ద్వారా ప్రజలు తమ మొబైల్ నంబర్తో లాగిన్ అయి గృహాన్ని జియోట్యాగ్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. తర్వాత హెచ్తో ప్రారంభమయ్యే 11అంకెల సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడీ జనరేట్ అవుతుందని, ప్రజలు తమ కుటుంబ వివరాలను సుమారు 15 నిమిషాల్లో నమోదు చేసి ఈ ప్రత్యేకమైన సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ ఐడీ పొందవచ్చన్నారు. ఇళ్ల గణన సమయంలో ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్కు ఐడీ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. తొలిదశ మే 11 నుంచి జనాభా గణన తొలిదశ మే 11నుంచి జూన్ 10వరకు కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. రెండో దశ 2027 ఫిబ్రవరి 9నుంచి 25వరకు వ్యక్తిగత వివరాల సేకరణ ఉంటుందని, స్థానికులతోపాటు ఇతర రాష్ట్రాలు, జిల్లాల వారు ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతంలోనే జనగణనలో పాల్గొనాలని సూచించారు. స్వీయ గణన సందర్భంగా ఏమైనా ఇబ్బందులు తలెత్తితే టోల్ ఫ్రీ నంబర్ 1855కు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు. జిల్లాలోని 16 మండలాలు, జమ్మికుంట, హుజురాబాద్, చొప్పదండి మున్సిపాలిటీలు కలుపుకొని 1,227 హౌస్ లిస్టింగ్ బ్లాక్లుగా విభజించామని, ఇందులో 1,234 మంది ఎన్యుమరేటర్లు, 215 మంది సూపర్వైజర్లు పాల్గొంటారని తెలిపారు. కరీంనగర్ బల్దియాలో 666 బ్లాకులుగా విభజించగా 733 ఎన్యుమరేటర్లు, 122 మంది సూపర్వైజర్లు విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్రెడ్డి, ఆర్డీవో కే.మహేశ్వర్, జిల్లా ప్రణాళిక అధికారి రామ్దత్తారెడ్డి, ఎస్వో కిషన్ రావు, జిల్లా సెన్సెస్ ఇన్చార్జి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ స్వీయ గణన జనగణనలో భాగంగా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదివారం స్వీయ గణన వివరాలు స్వయంగా నమోదు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతీ పౌరుడు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని కచ్చితమైన సమాచారం అందించి జనగణన సిబ్బందికి సహకరించాలని కోరారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, జిల్లా ప్రణాళిక అధికారి రామ్దత్తారెడ్డి తమ వివరాలు నమోదు చేసుకున్నారు. -
వీబీజీ రాంజీ చట్టం రద్దు కోసం దేశవ్యాప్త పోరాటం
కరీంనగర్టౌన్: ఉపాధి కూలీలకు నష్టం చేసే వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేసే వరకు దేశవ్యాప్తంగా సంఘటిత ఉద్యమాలు ఉధృతం చేయాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వర్ణ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ముకుందలాల్ మిశ్రాభవన్లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 13వ మహాసభలను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులు కేటాయించాలని కొత్త చట్టంలో పేర్కొన్నా ఒక్క రూపాయి కూడా ఉపాధి హామీ పథకానికి కేటాయించలేదన్నారు. మహాసభల సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి అజయ్ జెండా ఆవిష్కరించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పునుటి శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మిల్కూరు వాసుదేవరెడ్డి ప్రసంగించారు. సంఘం ప్రధాన కార్యదర్శి వడ్ల రాజు, మాతంగి శంకర్, రాయికంటి శ్రీనివాస్, కనకం దుర్గాప్రసాద్, సుంకరి సంపత్, మిర్యాల రవి, మాడెం శెట్టి యుగేంధర్, లక్ష్మయ్య, రేణుక, రజిత పాల్గొన్నారు. -
బహుజన రాజ్యం సాధిస్తాం
● బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం శేఖర్ బోయినపల్లి(చొప్పదండి): తెలంగాణలో బహుజన రాజ్యం సాధిస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం శేఖర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రామన్నపేటకు చెందిన బహుజన నాయకుడు ఉమ్మడి రాష్ట్రంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కన్నం రఘు సంస్మరణ సభ స్వగ్రామంలో ఆదివారం ఏర్పాటు చేశారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం శేఖర్ మాట్లాడుతూ కన్నం రఘు ఆశయాలు నెరవేర్చాలంటే బహుజన సమాజం ఒక్కతాటిపై నిలవాలన్నారు. -
యంత్రాలతో పనులు తేలిక
వరి కోతకు హార్వెస్టర్లు రావడంతో పనులు తేలికగా మారాయి. కూలీలతో ఎకరం పొలం కోయించి ధాన్యాన్ని మార్కెట్కు తీసుకెళ్లే వరకు దాదాపు రూ.10వేల వరకు ఖర్చు వచ్చేది. ఇప్పుడు శ్రమ తగ్గడంతోపాటు ఎకరం పొలం ఖర్చు రూ.3వేల లోపే అవుతుండటం రైతులకు కలిసి వస్తోంది. – ఏలేటి జలేందర్, ఇటిక్యాల, రాయికల్(మం) పొలమంతా ఉన్న గడ్డిని ఇంటికి తీసుకెళ్లడం కష్టంగా మారడంతో కాలబెట్టేవాడిని. ఇప్పుడు, వరి గడ్డి కట్టలు కట్టే యంత్రం రావడంతో కట్టలు కట్టించి ఇంటికి తెచ్చుకుంటున్నా. నాకున్న పాడి గేదేలకు ఆరు నెలల పాటు పశుగ్రాసంగా ఉపయోగపడుతుంది. – సత్యనారాయణ రెడ్డి, సారంగాపూర్ -
పిల్లల మానసిక వికాసానికి ప్రాధాన్యం
ఇల్లంతకుంట/చందుర్తి: పిల్లల మానసిక వికాసమే లక్ష్యంగా విద్యార్థి కేంద్రీకృత బోధన కొనసాగుతోందని ఉపాధ్యాయుడు మహేశ్చంద్ర తెలిపారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని హైస్కూల్లో పనిచేసే ఉడుత మహేశ్చంద్ర ఈనెల 20 నుంచి 25 వరకు ఫిన్లాండ్ దేశంలో బోధనపై అధ్యయనానికి వెళ్లారు. ఈనెల 26న తిరిగి వచ్చారు. అక్కడ యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకి, టీచర్ ట్రైనింగ్ స్కూల్, ఒకేషనల్ టెక్నికల్ ఇనిస్టిట్యూట్స్ను సందర్శించారు. యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకి ప్రొఫెసర్లతో పలు అంశాలపై చర్చించారు. బోధన పద్ధతులు, బోధకుల శిక్షణ విధానాలు, పాఠశాల విద్య, వృత్తి శిక్షణ వ్యవస్థలను అధ్యయనం చేశారు. ఆయన మాట్లాడుతూ ఫిన్లాండ్ విద్యావ్యవస్థలో ఉపాధ్యాయులకు అపార గౌరవం ఉంటుందన్నారు. ఈ ఎక్స్పోజర్ విజిట్ ద్వారా పొందిన అనుభవాన్ని మన ప్రాంతంలోని విద్యావ్యవస్థ అభివృద్ధికి ఉపయోగపడేలా ప్రభుత్వానికి సమగ్ర నివేదిక రూపంలో సమర్పించనున్నట్లు తెలిపారు. శిక్షణ సర్టిఫికెట్లు ఫిన్లాండ్ ఎక్స్పోజర్ టూర్లో భాగంగా రాష్ట్రానికి చెందిన ఉపాధ్యాయ బృందానికి అక్కడి యూనివర్సిటీ ఆధ్వర్యంలో శిక్షణ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 40 మంది ఉపాధ్యాయులు వెళ్లగా.. ఆ బృందంలో రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన ఇద్దరు టీచర్లు ఉన్నారు. ఇల్లంతకుంటలో పనిచేసే మహేశ్చంద్ర, చందుర్తి మండలం తిమ్మాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయిని రామగిరి స్వరాజ్యలక్ష్మి వెళ్లిన వారిలో ఉన్నారు. ఉపాధ్యాయుడు మహేశ్చంద్ర ముగిసిన ఫిన్లాండ్ యాత్ర -
శ్మశానవాటికలో పోచమ్మ విగ్రహాలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లోని శ్మశానవాటికలో ప్రభుత్వ అనుమతులు లేకుండానే పోచమ్మ విగ్రహాలను కొందరు నాలుగైదు రోజుల క్రితం ఏర్పాటు చేశారు. దీన్ని గ్రామస్తులు వ్యతిరేకించి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. అన్ని కుల సంఘాల పక్షాన స్థలాలు ఉన్నాయని తమకు కూడా స్థలం ఉండాలని ఓ వర్గం భావించి సదరు స్థలంలో పోచమ్మ విగ్రహాలు ఏర్పాటు చేశారు. అయితే గ్రామస్తులు ఈ విషయంపై నాలుగు రోజుల క్రితం తహసీల్దార్ సుజాతకు ఫిర్యాదు చేశారు. వెంకటాపూర్లో ప్రధాన రహదారిని ఆనుకుని సర్వే నంబర్ 494లో 13 గుంటలు పరంపోగు భూమి శ్మశానవాటిక పేరిట 2006లో రిజిస్ట్రేషన్ అయ్యింది. సదరు భూమిని గ్రామస్తులు 396 సర్వేనంబర్లోని స్థలంలో శ్మశానవాటికను ఏర్పాటు చేసి 494లో ఉన్న స్థలంలో స్నానాలు చేయడానికి ఉపయోగిస్తున్నారు. అది గ్రామస్తులకు చెందిన స్థలమని ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్ఐ శ్రావన్ శనివారం విగ్రహాలు ఏర్పాటు చేసిన స్థలాన్ని పరిశీలించారు. పరంపోగు భూమి అని, శ్మశానవాటిక ఉన్నట్లు తెలిపారు. అక్కడ ఏర్పాటు చేసిన విగ్రహాలను అనుమతులు లేకుండా పెట్టిన వ్యక్తులపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామన్నారు. విగ్రహాలు పెట్టిన వ్యక్తులు తొలగించకపోతే తామే తొలగిస్తామని తహసీల్దార్ సుజాత తెలిపారు. వారు తొలగించకపోవడంతో ఆదివారం జేసీబీ సహాయంతో రెవెన్యూ అధికారులు తొలగించారు. గ్రామస్తుల అభ్యంతరం రెవెన్యూ అధికారుల పరిశీలన జేసీబీతో తొలగింపు -
అన్యాక్రాంతమవుతున్న ఆర్ఎఫ్సీఎల్ భూమి
ఫెర్టిలైజర్సిటీ: పెద్దపల్లి జిల్లా రామగుండం ఫర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారానికి చెందిన కోట్ల విలువ చేసే భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. కర్మాగారం నుంచి ఎఫ్సీఐ క్రాస్ రోడ్డు వరకు ఆర్ఎఫ్సీఎల్ భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇరువైపులా 80 ఫీట్ల విస్తర్ణం ఉండాల్సి ఉండగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ప్రగతినగర్లో ఆర్ఎఫ్సీఎల్ భూమిలో గుర్తు తెలియని వ్యక్తులు షెడ్లు నిర్మించారు. ఇదే అదునుగా మరికొందరు రాజకీయ పలుకుబడితో పరిసర ప్రాంతాల్లో ప్రధాన రహదారిపై ఉన్న భూములను కబ్జా చేస్తున్నారు. దీనిపై స్పందించాల్సిన ఆర్ఎఫ్ిసీఎల్ ఎస్టేట్ విభాగం అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇప్పటికే గౌతమినగర్ ప్రధాన చౌరస్తాలో పూర్తిస్థాయిలో ఆర్ఎఫ్సీఎల్ స్థలం కబ్జాకు గురైంది. ఇప్పటికై నా ఆర్ఎఫ్సీఎల్, కార్పొరేషన్ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలు తొలగించి రహదారి విస్తరణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అక్రమ నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. -
ముగిసిన రీజియన్స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
జ్యోతినగర్: ఎన్టీపీసీ రామగుండం పర్మినెంట్ టౌన్షిప్లోని కేంద్రీయ విద్యాలయంలో మూడు రోజులుగా జరుగుతున్న రీజియన్స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. 35 విద్యాలయాల నుంచి అండర్ 14, 17, 19 విభాగాల్లో 137 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ సర్దార్ భాషా బహుమతులు అందజేశారు. విజేతల వివరాలు.. అండర్ 19 బాలికల విభాగంలో చంద్రిక, జాహ్నవిప్రియ, శ్రీవర, బాలుర విభాగంలో వైష్ణవ్ నాగసాయి, కుమార్ రావత్, రేవంత్ దత్తా, అంజు గోస్వామి, అండర్–17 బాలికల విభాగంలో మనస్వి, రాశికుమారి, సాన్వి, మనోజ్ఞ, బాలుర విభాగంలో సత్యం యాదవ్, ప్రణయ్గౌడ్, ప్రేమ్ అభినవ్, మణిశంకర్, అండర్–14 బాలికల విభాగంలో షణ్ముఖ ప్రియ, జవ్విత, చైత్ర రెడ్డి, బాలుర విభాగంలో ఆకుల రాంచరణ్ తేజ, చంద్ర కిశోర్, మైఖేల్ రియాన్, రామ చతుర్వేదిలు విజేతలుగా నిలిచారని ఎన్టీపీసీ రామగుండం కేంద్రీయ విద్యాలయ ఇన్చార్జి ప్రిన్సిపాల్ సర్దార్ బాషా తెలిపారు. ఎన్టీపీసీ రామగుండం పీటీఎస్లో నిర్వహించిన బ్యాడ్మింటన్ క్రీడలు ఆహ్లాదాన్ని అందించాయి. అండర్17లో పో టీల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. గోల్డ్ మెడల్ సాధించాం. జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొంటాం. – మనస్విని, సాన్వి, పికెట్, సికింద్రాబాద్ కేంద్రీయ విద్యాలయం రీజియన్ స్ధాయిలో బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. తిరుమలగిరి విద్యాలయం, బోయినపల్లి కేంద్రీయ విద్యాలయం నుంచి అండర్–17లో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించాం. – ప్రణయ్ గౌడ్, తిరుమలగిరి, భవిష్యకుమార్ బోయినిపల్లి విజేతలకు బహుమతులు అందజేత -
సౌకర్యాలు బాగున్నాయి
ఎన్టీపీసీ రామగుండం కేంద్రీయ విద్యాలయంలో జరిగిన బ్యాడ్మింటన్ పోటీల్లో సౌకర్యాలు చాలా బాగున్నాయి. ఆట స్థలంతో పాటు క్రీడాకారుల సహకారం బాగుంది. ఎన్టీపీసీ సంస్థ ఏర్పాట్లు బాగున్నాయి. – షణ్ముఖ ప్రియ, గోల్కొండ–1 ఎన్టీపీసీ రామగుండం సంస్థ ఆవరణలో రీజియన్ స్ధాయి క్రీడాపోటీల నిర్వహణ బాగుంది. క్రీడా స్థలంతో పాటు ఏర్పాట్లు ఎంతో ఉత్సాహాన్ని అందించాయి. – జాహ్నవి ప్రియ, అండర్–19 క్రీడాకారిణి, కాకినాడ కేంద్రీయ విద్యాలయ రీజియ న్ స్థాయి బ్యాడ్మింటన్ పోటీల ని ర్వహణకు ఎన్టీపీసీ రామగుండ ం సంస్థ పూర్తిస్థాయి సహకారం అందించింది. అసౌకర్యాలు కలుగకుండా ఏర్పా ట్లు చేయడంలో అండగా నిలిచింది. రుణ పడి ఉంటాం. – సర్దార్ భాషా, కేంద్రీయ విద్యాలయం, రామగుండం, ఇన్చార్జి ప్రిన్సిపాల్, -
మల్లాపూర్లో కుల బహిష్కరణ
గంగాధర: కుల వివక్ష, రెండు గ్లాసుల పద్ధతులు, ఆలయాల్లోకి ప్రవేశ నిషేధం వంటివి గ్రామాల్లో ఉండకూడదని, అలా ప్రవరిస్తే చట్టరీత్యా నేరమవుతుందని అధికారులు గ్రామాల్లో పౌరహక్కుల దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో తీరు మారడం లేదు. కొన్ని కుటుంబాలను తమ కులం నుంచి బహిష్కరిస్తూ ఏకంగా సర్పంచు సమక్షంలో కుల పెద్దలు తీర్మానం చేసిన ఘటన నాలుగురోజుల క్రితం జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన బాధితుడు గజ్జెల సురేశ్ తెలిపిన వివరాలు.. మల్లాపూర్లో ఎస్సీ కులానికి చెందిన గజ్జెల, సింగారపు, మహంకాళి, చిలుముల, నాగని, మచ్చ అనే ఇంటి పేర్లతో ముప్పై కుటుంబాలు ఉంటాయి. గ్రామంలో వీరిని చిన్నమాదిగలు అంటారు. ఇదే గ్రామంలో కొలెపాక ఇంటి పేరు గల (పెద్దమాదిగ) వారు ఉన్నారు. కొన్నేళ్లుగా చిన్నమాదిగలను కొలెపాక వారు చిన్నచూపు చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం గజ్జెల సురేశ్ కొలెపాక కుటుంబాల వారిని తిట్టాడని తప్పుడు ప్రచారం చేసి పంచాయితీకి పిలవగా సదరు వ్యక్తి వెళ్లలేదు. దీంతో పంచాయితీ పెద్దలు సమావేశమై కొలెపాక కుటుంబాల వారు ఇతరుల (చిన్న మాదిగల) శుభ, అశుభ కార్యాలకు వెళ్లకూడదని, ఎవరైనా వెళ్తే వారిని కూడా కులం నుంచి దూరం పెడుతామని తీర్మానం చేశారు. తమపై వివక్ష చూపుతున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు, ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు సురేశ్ పేర్కొన్నాడు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
ధర్మారం: ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామ శివారులోని దుర్గామాత గుడి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎండపల్లి మండల కేంద్రానికి చెందిన సంగ మల్లవ్వ అలియాస్ కత్తరవ్వ (58) అనే మహిళ మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగ మల్లవ్వ తన కుమారుడు కుమార్తో కలిసి ఎండపల్లి నుంచి పెగడపల్లి మండలం కీచులాటపల్లికి ద్విచక్రవాహనంపై వెళ్తోంది. ప్రవీణ్తో పాటు మరో యువకుడు కరీంనగర్ నుంచి మోటార్సైకిల్పై ఎదురుగా వస్తుండగా ప్రమాదవశాత్తు రోడ్డుపై పడి ఉన్న విద్యుత్ వైరు మోటారు సైకిల్కు చుట్టుకోవడంతో రెండు మోటారు సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. మల్లమ్మ తలకు తీవ్రగాయాలు కాగా ప్రవీణ్ కాలు ప్రాక్చర్ అయింది. వీరిద్దరిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మల్లమ్మ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తి ఆత్మహత్యతంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన దర్జీ తెంబరవేణి శ్యామ్(57) ఆదివారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసికొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. బట్టలు కుడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న శ్యామ్ ఆర్థిక పరిస్థితి సరిగా లేక అప్పులపాలయ్యాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య లావణ్య, కూతురు హరిప్రియ ఉన్నారు. తంగళ్లపల్లి పోలీసులు శ్యామ్ ఆత్మహత్య ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ధర్మపురిలో చోరీధర్మపురి: పట్టణంలోని హన్మాన్వాడకు చెందిన రాపర్తి ప్రభాకర్ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి బంగారం, వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రభాకర్ ఈనెల 24న హైదరాబాద్లో ఉన్న తన బంధువుల ఇంటికి కుటుంబసభ్యులతో కలిసి వెళ్లాడు. ఆదివారం ప్రభాకర్ బంధువులు వచ్చి చూడగా ఇంటి తాళం పగులగొట్టి ఉంది. వెంటనే ప్రభాకర్కు సమాచారం అందించారు. ఇంటికి చేరుకుని చూడగా బీరువాలో ఉన్న పావు తులం బంగారం, జతకమ్మలు, 17 తులాల వెండి వస్తువులు, రూ.4500 ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి ఎస్సై మహేష్తోపాటు సిబ్బంది చేరుకున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కోడెమొక్కులు..అభిషేకాలు
వేములవాడ: భీమన్న క్షేత్రం ఆదివారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఆలయ అధికారులు తాగునీటి సౌకర్యం కల్పించారు. భీమన్న ఆలయంలో కోడె మొక్కులు, అభిషేకాలు, అన్నపూజలు చెల్లించుకున్నారు. ప్రవచనకర్త బాచంపల్లి సంతోష్కుమార్శాసీ్త్ర స్వామివారిని దర్శించుకున్నారు. అమెరికాలోని న్యూ జెర్సీలో శివవిష్ణు ఆలయం నిర్మాణంలో సేవలందించిన రఘుశర్మ, ప్రధానమంత్రి సలహాదారులు ఆదిత్య దీక్షిత్ దర్శించుకున్నారు. -
వ్యవ‘సాయం’లో ఆధునిక యంత్రం..
జగిత్యాలఅగ్రికల్చర్: వ్యవసాయ రంగంలో ఎప్పటికప్పుడు ఆధునిక యంత్రాలు వస్తుండటంతో రైతులు కూలీల కొరతను అధిగమించి మంచి దిగుబడి సాధిస్తున్నారు. ఆధునిక యంత్రాలు రంగప్రవేశం చేయడంతో రైతులు తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేసి ఆదాయం పొందుతున్నారు. జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో సాగు చేసే వరి కోత నుంచి అమ్మకం వరకు ఆధునిక యంత్రాలను వాడటం, ఐకేపీ, సింగిల్ విండో కేంద్రాల ద్వారా గ్రామాల్లోనే వరి ధాన్యం ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుండటం రైతులకు కలిసి వస్తోంది. కంబైన్డ్ హార్వెస్టర్తో సులువుగా కోతలు ఒకప్పుడు వరి కోతలు వచ్చాయంటే రైతులు భయపడే పరిస్థితి. కూలీలు దొరికేవారు కారు. కూలీలు దొరికినా రూ.300 ఇవ్వాల్సి వచ్చేది. ప్రస్తుతం పొలాలు కోసేందుకు కంబైన్డ్ హార్వెస్టర్లు రావడంతో వరి కోతలు సులువుగా మారాయి. టైర్ హార్వెస్టర్ అయితే గంటకు రూ.1800 నుంచి రూ.2000 వరకు తీసుకుంటున్నారు. గంటకు ఎకరం వరకు కోస్తారు. కంబైన్డ్ హార్వెస్టర్లో ఫ్యాన్ ఉండటంతో తూర్పార పట్టే అవకాశం లేకుండా పోయింది. గింజపూర్తిగా ఎండిన తర్వాత తేమ లేకుండా హార్వెస్టర్తో కోయిస్తున్నారు. రైతులు నేరుగా హార్వెస్టర్ నుంచే గ్రామాల్లోని ఐకేపీ కేంద్రానికి ధాన్యాన్ని ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. అలాగే భూమి తేమగా ఉన్న వరి పొలాలను కోయించేందుకు చైన్ హార్వెస్టర్లను ఉపయోగిస్తున్నారు. దీని ఖర్చు గంటకు రూ.3వేల నుంచి రూ.4వేలు వసూలు చేస్తున్నారు. ఎకరం పొలం కోయాలంటే గంటన్నర పడుతుంది. హార్వెస్టర్తో వరి కోయించడం వల్ల రైతుకు కనీసం రూ.4వేల నుంచి రూ.5 వేలు ఆదా అవుతాయి. పశుగ్రాసం సేకరణ మరింత సులభం హార్వెస్టర్తో వరి పొలాలు కోయిస్తే గడ్డి పొలం అంతా పడుతుంది. గడ్డిని మోపులు కట్టి తరలించడం రైతులకు కష్టంగా మారడంతో రైతులు పొలాల్లోనే వరి గడ్డిని తగలబెడుతున్నారు. దీనివల్ల చాలాచోట్ల పశుగ్రాసం కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో వరిగడ్డిని కట్టలు కట్టే యంత్రాలు(బేలర్ మిషన్) వచ్చాయి. ఈ మిషన్ పొలంలో ముక్కలుగా ఉన్న గడ్డిని నిమిషాల వ్యవధిలో పోగు చేసి కట్టలు కడుతుంది. ధీని ధర రూ.3లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుంది. గ్రామాల్లో బేలర్ యంత్రాలు కొని అద్దె ప్రతిపాదికన నడిపిస్తున్నారు. ఎకరం పొలంలో 50 నుంచి 60 గడ్డి కట్టలు అవుతాయి. ఒక్కో కట్టకు రూ.40 నుంచి రూ.50 వరకు తీసుకుంటున్నారు. దీనివల్ల తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో రైతులకు కలిసి వస్తుంది. ధాన్యాన్ని తూర్పార పట్టడం మరింత తేలిక వరి ధాన్యాన్ని అమ్మకానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లిన తర్వాత కొనుగోలు నిర్వాహకులు ధాన్యంలో తప్ప, తాలు ఉందని కొర్రీలు పెడుతున్నారు. ఇద్దరు చాటలను ఊపుతూ ఉంటే వచ్చే గాలితో మరొకరు ధాన్యాన్ని గాలికి ఎగబోసేవారు. రైతుల శ్రమను తగ్గించేందుకు ధాన్యాన్ని తూర్పార పట్టే యంత్రం అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ.5లక్షల నుంచి రూ.6లక్షలు ఉంటుంది. దీన్ని 3 హెచ్పీ మోటర్తో అనుసంధానం చేస్తారు. ఇందులో ఫ్యాన్లు ఉంటాయి. ధాన్యం కుప్ప వద్ద ఈ యంత్రాన్ని పెట్టి అందులోఽ ధాన్యం పోయగానే శుభ్రం చేస్తుంది. తర్వాత కూలీలతో సంచులు నేరుగా నింపి, తూకం వేయవచ్చు. ప్రతి కొనుగోలు కేంద్రంలో తూర్పార పట్టే మిషన్లను ఒక్కటి రెండు చొప్పున అందుబాటులో ఉంచుతున్నారు. కూలీల కొరతను అధిగమిస్తున్న రైతులు కోత నుంచి పంట అమ్మే వరకు యంత్రాల వినియోగం -
● కెమెరా కంటికి చిక్కిన వన్యప్రాణులు ● జన్నారం అడవుల్లో స్వేచ్ఛగా విహారం
వనమంతా మాదేమంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్, కవ్వాల్ అభయారణ్యంలో తాళ్లపేట రేంజ్లో వన్యప్రాణుల అడవంతా తమదే అన్నట్లుగా స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. పగలు ఎండ తీవ్రతకు పొదల మాటున ఉంటున్న జంతువులు చీకటి పడగానే అడవంతా తమదే అన్నట్లుగా స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. ఈ క్రమంలో అటవీశాఖ అధికారులు అమర్చిన నిఘా కెమెరాలకు చిక్కుతున్నాయి. తాజాగా కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాల్లో చిరుతపులి, ఎలుగుబంటి, దుప్పి, ముళ్లపందులు తమ సహజ సిద్ధమైన ప్రవర్తనతో కదలుతూ కనిపించాయి. తాళ్లపేట రేంజ్ అధికారి సుష్మారావు మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ నిఘా కెమెరాలు వన్యప్రాణుల స్థితిగతులను పర్యవేక్షించేందుకు ఎంతో దోహదపడుతున్నాయని తెలిపారు. ఈ సాంకేతికత ద్వారా జంతువుల ప్రవర్తనా తీరును అర్థం చేసుకోవడంతోపాటు, అడవిలో వన్యప్రాణుల జనాభాను మరింత కచ్చితంగా అంచనా వేసేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు. – జన్నారం -
● రిమ్స్లో ఘనంగా ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ డే ● ముఖ్య అతిథిగా హాజరైన కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీ రమేశ్రెడ్డి
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో 2020–26 బ్యాచ్ వైద్య విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రమేశ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, అదనపు కలెక్టర్ చిత్రులో కలిసి వైద్య విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేశారు. అంతకుముందు మెడికోలు గుస్సాడీ నృత్యాలతో అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రమేశ్రెడ్డి మాట్లాడుతూ, కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వైద్య విద్యను అభ్యసించి పట్టా పొందడం అభినందనీయమని ప్రశంసించారు. ఉస్మానియా, గాంధీ వంటి ప్రముఖ వైద్య కళాశాలలకు దీటుగా రిమ్స్లో నాణ్యమైన విద్యాబోధన అందుతుందన్నారు. డాక్టర్ పూర్తిచేసుకున్న మెడికోలు పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. నిరంతర విద్యార్థిలా భవిష్యత్లో ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా సేవలు అందించాలని సూచించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులందరూ పీజీ సీట్లు సాధించాలన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కేరింతలు, చప్పట్లతో ప్రాంగణం మార్మోగింది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలతో ఫొటోలూ దిగుతూ సందడి చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వంజారి, వైస్ ప్రిన్సిపల్ సరోజ, విద్యావిల్సన్, మెడికల్ డిప్యూటీ సూపరింటెండెంట్లు నరేందర్ బండారి, దీపక్ పుష్కర్ తదితరులు పాల్గొన్నారు. -
బోగస్ బిల్లులు!
● ఇటీవల ప్రజాపాలనలో భాగంగా నిర్వహించిన 2 కే రన్ నిర్వహణలో వాడిన టీషర్డులు, టోపీలకు రూ.70 వేలు ఖర్చు చేశారు. వీటి కొనుగోలు ప్రింటింగ్ కోసం కోరుట్లలో లేని ఫ్లెక్సీ ప్రింటర్ షాపు పేరిట బిల్లు పెట్టారు. బిల్లులో చూపిన ‘మౌనిక ఫ్లెక్సీ ప్రింటర్’ షాపు ఎక్కడుందని ఎవరిని ఆరా తీసినా ఏమో తెలియదు.. అనే జవాబు వస్తుండడం గమనార్హం. ఇంతకీ షాపు ఉందో లేదో..సదరు అధికారులే చెప్పాలి. ● కోరుట్ల మున్సిపాల్టీలో ప్రతినెలా వివిధ విభా గాల్లో వాడుతున్న వాహనాలకు డీజిల్ ఖర్చులు ఎంత తక్కువ అనుకున్నా రూ.4 నుంచి రూ.6లక్షల వరకు చూపుతున్నారు. వాస్తవానికి ఈ బిల్లులు రూ. 4 లక్షలకు మించవని సమాచారం. బంకు నిర్వాహకుల వద్ద ఖాళీ రశీదులు తీసుకుని వాటిలో బిల్లులు రాసి డబ్బులు కాజేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇవీ.. కోరుట్ల మున్సిపాల్టీలో జరుగుతున్న అవినీతి తంతుకు నిదర్శనం. మున్సిపాలిటీలోని ప్రతి విభాగంలో ఎంతో కొంత మిగుల్చుకోవాలన్న ధ్యాసతో అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు విచారకరం. కోరుట్ల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన సాకుగా కొంత మంది కోరుట్ల మున్సిపల్ అధికారులు అవినీతికి తెరతీశారు. ప్రజాపాలనలో భాగంగా 20 రోజుల క్రితం నిర్వహించిన 2కె రన్ కోసం టీషర్టులు, టోపీలు కొనుగోలుతో పాటు ప్రింటింగ్ ఖర్చుల కోసం రూ.70వేలు బిల్లు పెట్టారు. కేవలం 50 మంది హాజరు కాని ఈ 2కే రన్కు అదనంగా బిల్లులు పెట్టారని కొంతమంది మున్సిపల్ కౌన్సిలర్లు ఆ సమయంలోనే ఆరోపించారు. ఆ బిల్లు స్థానికంగా ఎక్కడా లేని మౌనిక ఫ్లెక్సీ ప్రింటర్స్ పేరిట చూపడం గమనార్హం. దీనికి స్థానికంగా ఉన్న ఓ ఫ్లెక్సీ ప్రింటర్ వారు కోట్ చేసినట్లు రెండింటిలో మౌనిక ఫ్లెక్సీ ప్రింటర్స్ ధర తక్కువగా ఉందని.. ఆ షాపు వారికి ఆర్డర్ ఖరారు అయినట్లు ఓ బిల్లు జత చేసి చూపారు. ఆ షాపు ఎక్కడుందో..? దానికి ట్రేడ్ లైసెన్స్ జత చేశారా..? అన్న విషయంలో ఎలాంటి స్పష్టతా లేదు. నెలకు రూ.లక్షన్నర హాంఫట్..!? కోరుట్ల మున్సిపాలిటీలో చెత్త తరలింపు, పారిశుధ్యం నిర్వహణ, జేసీబీలు, అధికారులు వాడుతున్న కార్లకు ప్రతినెలా ఎంత తక్కువ అనుకున్నా రూ.4లక్షల నుంచి రూ.6లక్షల బిల్లు చూపుతున్నట్లు సమాచారం. వాస్తవంగా వాడుతున్న డీజిల్ బిల్లుకు అదనంగా రూ.లక్షన్నర వరకు బోగస్ బిల్లులు పెడుతున్నట్లు సమాచారం. పట్టణంలోని ఓ బంక్ నిర్వాహకుల నుంచి మున్సిపల్ సిబ్బందికి కొన్ని ఖాళీ రశీదులు తీసుకుని అదనంగా బిల్లులు సృష్టిస్తున్నట్లు తెలిసింది. ఈ లెక్కన ప్రతినెలా రూ.లక్షన్నర అదనపు బిల్లులు జత చేసి కాజేస్తున్నట్లు సందేహాలు ఉన్నాయి. ఈ విషయంలో కింది స్థాయి సిబ్బంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా పైస్థాయి అధికారుల ఒత్తిడితో డీజిల్ బిల్లుల పేరిట ఎంతో కొంత పక్కన వేసుకునే తంతు యథేచ్ఛగా సాగుతున్నట్లు సమాచారం. మున్సిపాలిటీలో ఎలాంటి అవినీతి తావు లేకుండా పనులు చేపడుతున్నాం. అవకతవకలు జరిగినట్లు ఎవరైనా ఫిర్యాదు చేస్తే పూర్తి స్థాయిలో విచారించి తగిన రీతిలో అవసరమైన చర్యలు తీసుకుంటాం. – రవీందర్, మున్సిపల్ కమిషనర్, కోరుట్ల -
అధికార పార్టీలో పదవుల పండుగ
కరీంనగర్ అర్బన్: అధికార పార్టీ నేతలకు పదవుల పండుగ వచ్చినట్లే. ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలు లేవని తేలిపోగా, ద్వితీయ శ్రేణి నేతలకు నామినేటెడ్ పోస్టులు దక్కనున్నాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీల తరహాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) పాలక మండళ్ల నియామకానికి రాష్ట్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన ఈ నెల 23న రాష్ట్ర కేబినెట్ సమావేశమైన విషయం తెలిసిందే. పీఏసీఎస్లకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పద్ధతిలో డైరెక్టర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. సహకార సంఘాలకు పాలకమండళ్లు ఏర్పాటుచేశాక జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీ), సహకార మార్కెటింగ్ సమాఖ్య (డీసీఎంఎస్)లకు కూడా ఇదే తరహాలో పాలకవర్గాలు ఏర్పాటు చేయనున్నారు. మొదలైన పైరవీలు ప్రభుత్వం నామినేటెడ్గా పీఏసీఎస్లను నియమించేందుకు నిర్ణయం తీసుకోవడంతో ఆశావహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పాలకవర్గాన్ని స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రతిపాదిస్తారు. అధికార పార్టీ ఎమ్మెల్యే లేని నియోజకవర్గాల్లో జిల్లా మంత్రి ప్రతిపాదన మేరకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది. మొత్తం 131 పీఏసీఎస్లుండగా సుమారు 1,703 మంది డైరెక్టర్లు అయ్యే అవకాశముంది. 131 చైర్మన్, 131 వైస్ చైర్మన్ పదవులు వరించనున్నాయి. దీంతో ద్వితీయ శ్రేణి నేతలు పైరవీలపై దృష్టిసారిస్తున్నారు. డీసీసీబీ, డీసీఎంఎస్లలోనూ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులతోపాటు డైరెక్టర్ పదవులు ఉంటాయి. అధికార పక్షం ప్రజాప్రతినిధులు ఆయా పదవులకు అభ్యర్థులను ప్రతిపాదించే అవకాశం ఉండటంతో నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి 2025 ఫిబ్రవరిలోనే పీఏసీఎస్ల పాలక మండళ్ల పదవీకాలం పూర్తయింది. ప్రభుత్వం వీటిపై మార్గదర్శకాలను విడుదల చేసి త్వరలోనే నియామక ప్రక్రియ మొదలు పెట్టే అవకాశముంది. కేడీసీసీబీ పరిధిలో 131 పీఏసీఎస్(ప్యాక్స్)లు కరీంనగర్ డీసీసీబీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఉండగా 131 ప్యాక్స్లు ఉన్నాయి. సుమారు 10.5లక్షల మంది రైతులకు సభ్యత్వాలున్నాయి. వీరు తొలుత డైరెక్టర్లను ఓటింగ్ ద్వారా ఎన్నుకొనేవారు. ఇలా ఒక్కో సహకార సంఘంలో 13మంది డైరెక్టర్లుంటారు. వీరి మద్దతుతో చైర్మన్, వైస్ చైర్మన్లు నియమితులయ్యేవారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇక వీరంతా నామినేటెడ్ పద్ధతిలోనే భర్తీ కానున్నారు. ఎన్నికై న పీఏసీఎస్ చైర్మన్లు డీసీసీబీ, డీసీఎంఎస్ పాలక మండళ్లను ఎన్నుకుంటారు. వీటిని నామినేటెడ్ విధానంలోనే నియమించే అవకాశం ఉంది. ప్యాక్స్ల సంఖ్య పెరగనుందా? రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్యాక్స్ల సంఖ్య పెంచే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే కేడీసీసీబీ కూడ ప్రతిపాదనలు పంపింది. సుమారు 20కి పైగా సంఖ్య పెరగనుండగా రాజకీయ ఉపాధి మరింత పెరగనుంది. ప్రభుత్వం కూడా ఇదివరకు ప్రతిపాదనలు తీసుకోగా ఒక్కో మండలంలో రెండు ప్యాక్స్లు కూడా ఉన్నాయి. కొన్ని మండలాల్లో ఒకటే ఉంది. స్థానిక అవసరాలు, రైతుల సేవలకు అనుగుణంగా సంఖ్య పెరగవచ్చు. -
కొనుగోళ్లలో జాప్యం.. రైతన్నలకు శాపం
సిరిసిల్లఅర్బన్/కోనరావుపేట: రైతులు ఎంతో శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు అంతకన్నా ఎక్కువగా శ్రమించాల్సి వస్తోంది. యాసంగి సాగులో చేతికొచ్చిన పంటను కోసిన రైతులు కేంద్రాలకు ఇప్పటికే తీసుకొచ్చారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనప్పటికీ తూకం వేయడం లేదు. ఫలితంగా చాలా మంది రైతులు పది రోజులుగా కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. విలీన గ్రామాల్లో విలాపమే.. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని విలీన గ్రామాలు సర్దాపూర్, పెద్దూరు, బోనాల, చంద్రంపేట, రగుడులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ తూకం వేయడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రాలు ధాన్యంతో కళకళలాడుతున్నాయి. ధాన్యం ఆరబోసి 10 నుంచి 15 రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు లేకపోవడంతో కేంద్రాల్లోనే రైతులు ఉంటున్నారు. ఎండలు తీవ్రంగా కొడుతుండడంతో 17 శాతం తేమ కంటే మరింత పడిపోయే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భయపెడుతున్న వాతావరణం వాతావరణంలో కలుగుతున్న మార్పులతో అక్కడక్కడ కురుస్తున్న వర్షాలకు వడ్లు తడిసిపోయాయి. ఇటీవల ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, తంగళ్లపల్లి మండలాలతోపాటు సిరిసిల్ల శివారు గ్రామాల్లో వడగండ్లు కురిశాయి. వడ్లు తడిసిపోవడంతో రైతులు మళ్లీ ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. కోనరావుపేట మండలం మరిమడ్లలో 10 రోజుల్లోనే రెండు సార్లు కురిసిన వడగండ్లతో రైతులకు తీవ్ర నష్టం కలిగింది. కోనరావుపేటలో అధ్వానం కోనరావుపేట మండలంలోని కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు తూకాలు వేయలేదు. మండలంలోని కొలనూర్ సింగిల్విండో పరిధిలో 5 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు 600 బస్తాలు మాత్రతే కొనుగోలు చేశారు. గతేడాది ఈ సమయానికి 60 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. ఐకేపీ ఆధ్వర్యంలో 15 సెంటర్లు ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు 320 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. గతేడాది సుమారు 20 వేల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. కోనరావుపేట సింగిల్విండోలో 9 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతేడాది ఈ సమయానికి 18 వేల క్వింటాళ్లు కొనుగోలు చేయగా ఈసారి 300 క్వింటాళ్లు మాత్రమే కొన్నారు. నేను ఐదు ఎకరాల్లో వరిపంట వేసిన. 15 రోజుల క్రితం పంట కోసి కేంద్రానికి ధాన్యం తెచ్చిన. అకాల వర్షానికి వడ్లు తడిసిపోయాయి. ప్రస్తుతం 17 శాతం తేమ వచ్చి వారం అవుతోంది. ఇప్పటి వరకు ఇంకా కొనుగోళ్లు ప్రారంభించలేదు. – గంగుల బాలయ్య, పెద్దూరు -
ఒత్తిడి లేని విద్య..!
జన్నారం: ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థ కలిగిన దేశంగా గుర్తింపు పొందిన ఫిన్లాండ్లోని బోధనా పద్ధతులను అధ్యయనం చేసేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వెళ్లిన నలుగురు ఉపాధ్యాయులు ఐదు రోజుల ఎక్స్పోజర్ విజిట్ను విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి వచ్చారు. ఒత్తిడి లేని అభ్యాసం, ప్రాక్టికల్స్కు ప్రాధాన్యత, విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానాలను నేరుగా పరిశీలించడం ద్వారా తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు ఈ బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఫిన్లాండ్ విద్యా విధానం ప్రత్యేకతలు ఫిన్లాండ్ విద్యా వ్యవస్థ ‘చదువు అంటే ఒత్తిడి కాదు, ఒక ఆనందకరమైన అనుభవం’ అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది. అక్కడ విద్యార్థులకు చాలా తక్కువ హోంవర్క్ ఉంటుంది, ట్యూషన్ల అవసరం అసలే ఉండదు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడం, పాఠశాలల్లో ఆటలకు, కళలకు సమాన ప్రాధాన్యం ఇవ్వడం, విద్యార్థుల సామర్థ్యాలను బట్టి వొకేషనల్ కోర్సులను ప్రోత్సహించడం వంటి అంశాలు ఫిన్లాండ్ను అగ్రస్థానంలో నిలబెట్టాయి. తెలంగాణ బృందం సందర్శించిన సంస్థలు తెలంగాణ విద్యాశాఖ తరఫున వెళ్లిన ఈ బృందంలో జైపూర్ ఎంఈవో బి.శ్రీనివాస్, జన్నారం మండలంలోని కిష్టాపూర్ హైస్కూల్ ఉపాధ్యాయుడు దాముక కమలాకర్, పొనకల్ అక్కపల్లిగూడ ఎంపీఎస్ ఉపాధ్యాయుడు జాజాల శ్రీనివాస్, ఆదిలాబాద్ జిల్లా ఏమాయికుంట ఎంపీఎస్ ఉపాధ్యాయుడు బి.గంగయ్య ఉన్నారు. వీరు తమ పర్యటనలో హెల్సింకిలోని పలు పాఠశాలలు, యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకి, టీచర్ ట్రైనింగ్ స్కూల్స్, వివిధ వొకేషనల్, టెక్నికల్ ఇనిస్టిట్యూషన్లు సందర్శించారు. అక్కడి ప్రొఫెసర్లతో సమావేశమై బోధనా పద్ధతులపై, శిక్షణ విధానాలపై లోతైన చర్చలు జరిపారు.ప్రభుత్వానికి సమగ్ర నివేదికఈ పర్యటనలో తాము నేర్చుకున్న అంశాలను, ఫిన్లాండ్ విద్యా వ్యవస్థలో తాము గమనించిన కీలక మార్పులను క్రోడీకరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను సమర్పించనున్నారు. ముఖ్యంగా జీవిత నైపుణ్యాలను పెంపొందించే విలువలతో కూడిన అభ్యాసం, తరగతి గదుల్లో ప్రయోగాత్మక బోధనా పద్ధతుల అమలు వంటివి తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఎలా ఉపయోగపడతాయో ఈ నివేదికలో పొందుపర్చనున్నారు. ఈ పర్యటన ద్వారా అందిన అనుభవాలు భవిష్యత్తులో తెలంగాణ విద్యారంగంలో సృజనాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనున్నాయని ఉపాధ్యాయ బృందం ధీమా వ్యక్తం చేసింది. -
సహజ మరణానికి రూ.10 లక్షలు
గోదావరిఖని: సింగరేణి ఉద్యోగులకు బీమాపై ధీమా కల్పించేందుకు యాజమాన్యం ముందుకు వచ్చింది. సంస్థపై ఆర్థిక భారం పడకుండా చర్యలు తీసుకుంటోంది. ఈమేరకు అత్యధిక బ్యాంకు ఖాతాలు ఉన్న ఎస్బీఐతో ఒప్పందం చేసుకుంది. సహజ మరణానికి రూ.10 లక్షల బీమా సౌకర్యం వర్తించేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఈనెల 23న సింగరేణి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఎస్బీఐ అధికారులతో ఒప్పందం కుదిరింది. ఇప్పటివరకు ప్రమాదాల్లో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.కోటి చెల్లించే బీమా పథకాన్ని అమలు చేస్తోంది. 2021–22 నుంచి ప్రమాద బీమా పథకం అమలవుతోంది. 50 మందికి రూ.30కోట్ల చెల్లింపు ఎస్బీఐ ప్రమాద బీమా సింగరేణి ఉద్యోగులను ఆదుకుంటోంది. ఇప్పటివరకు జరిగిన పలు ప్రమాదాల్లో మృతి చెందిన 50 మంది ఉద్యోగుల కుటుంబాలకు రూ. 30కోట్ల ప్రమాద బీమా సొమ్ము చెల్లించింది. ఆరోగ్య బీమా కూడా.. కార్పొరేట్ సాలరీ ఖాతా కలిగిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు రూ.8,906 ప్రీమియం చెల్లిస్తే భార్యాభర్తలతోపాటు ఇద్దరు పిల్లలకు రూ.50 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని కూడా ఎస్బీఐ అందిస్తోంది. సాధారణ ఆరోగ్య బీమా ప్రీమియంతో పోల్చితే తక్కువ ఇన్స్టాల్మెంట్తో కార్పొరేట్ సాలరీ ఖాతాదారులకు అందిస్తోంది. రూ.కోటి ప్రమాద బీమాతో పాటు పాక్షిక అంగవైకల్యం, సంపూర్ణ అంగవైకల్యానికి కూడా నిబంధనల ప్రకారం రూ.కోటి బీమా సొమ్ము చెల్లిస్తోంది. రిటైర్డ్ కార్మికులకు రూ.30లక్షలు రిటైర్డ్ కార్మికులకు కూడా రూ.30 లక్షల ప్రమాద బీమా పథకాన్ని 70ఏళ్ల వరకు అందిస్తోంది. మృతుడి కుటుంబంలోని పిల్లలు 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నవారు చదువుతూ ఉంటే అబ్బాయి అయితే రూ.8లక్షలు, అమ్మాయి అయితే రూ.10 లక్షలు చదువు కొనసాగించడానికి బ్యాంకు చెల్లిస్తోంది. వివాహ వయసు కలిగిన పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి రూ.ఐదు లక్షలు చొప్పున గరిష్టంగా ఇద్దరికి కలిపి రూ.10 లక్షల వరకు చెల్లిస్తోంది. ప్రమాదాల్లో గాయపడిన వారికి ప్లాస్టిక్ సర్జరీ అవసరమైతే రూ.5లక్షల చెల్లిస్తామని, తమ బ్యాంకుతో పాటు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఉచితంగా లావాదేవీలు జరుపుకునే అవకాశం ఉందని, ఇంకా అనేక సౌకర్యాలు ఈ ఒప్పందంలో పొందుపరిచామని సింగరేణి ఉన్నతాధికారులు వెల్లడించారు. సింగరేణి ఉద్యోగులకు బీమా సౌకర్యం ఎస్బీఐతో ఒప్పందం చేసుకున్న యాజమాన్యం -
‘దేవి పుత్రిక’ అభినందనీయం
కరీంనగర్: ఆడపిల్ల పుడితే భారమనే వివక్షను వీడి, లక్ష్మిదేవిలా భావించినప్పుడే సమాజంలో లింగనిష్పత్తి తేడాలు తొలగుతాయని జిల్లా అదనపు, సెషన్స్ జడ్జి నీరజ అన్నారు. కరీంనగర్లో రోహన్ ఆసుపత్రి ప్రారంభించి 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ‘దేవిపుత్రిక’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద ఆడపిల్ల పుడితే నార్మల్ డెలివరీ అయినా, సిజేరియన్ అయినా సంవత్సరం పాటు పూర్తిగా ఉచిత వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు ఎనమల్ల శ్రీదేవి, ఎనమల్ల నరేశ్ ముందుకొచ్చారు. శనివారం ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బీఎన్ రావుతో కలిసి ‘దేవిపుత్రిక’ పోస్టర్ ఆవిష్కరించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమాజంలో ఆడపిల్లల విషయంలో ఉన్న వివక్షను తొలగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. జిల్లా అదనపు, సెషన్స్ జడ్జి నీరజ -
కొడుకు హత్యకు తల్లి ప్లాన్
● చిన్న కొడుకును ప్రేరేపించిన తల్లి ● పెట్రోల్పోసి నిప్పంటించిన వైనం ● చావుబతుకుల్లో పెద్దకుమారుడు ● లక్కేపూర్ గ్రామంలో ఘటన మంథనిరూరల్: కన్న కొడుకు నే మరోకొడుకుతో అంతం చే యాలని చూసిందో తల్లి.. అర్ధ రాత్రి నిద్రిస్తున్న అన్నపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసేందుకు యత్నించిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం లక్కేపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మంథని మండలం లక్కేపూర్ గ్రామానికి చెందిన కొత్త రఘుపై అతడి తమ్ముడు అనిల్ పెట్రోల్ పోసి నిప్పంటించగా తీవ్రగాయాలు కావడంతో ఎంజీఎంకు తరలించారు. బాధితుడి సోదరి పాలడుగు సౌజన్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం ప్రకారం.. రఘు తండ్రి 15ఏళ్లక్రితం చనిపోయాడు. తల్లి జ్యోతి తన తమ్ముళ్లతో కలిసి గ్రామంలోనే ఉంటున్నారు. తల్లి ప్రవర్తన బాగా లేకపోవడంతో తరచూ పెద్ద తమ్ముడు గొడవ పడుతుండేవాడు. శుక్రవారం రాత్రి సైతం గొడవ జరగడంతో తనకు అడ్డుగా వస్తున్నాడని భావించిన తల్లి.. తన చిన్న కొడుకుతో పెద్ద కొడుకును చంపాలని పథకం వేసింది. ఈ క్రమంలో అంతకుముందే తెచ్చుకున్న పెట్రోల్ను నిద్రిస్తున్న రఘుపై పోసి నిప్పంటించాడు. మంటల తీవ్రతకు అరవడంతో స్థానికులు గమనించి వెంటనే కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. విచారణ జరిపి తన పెద్ద తమ్ముడిపై హత్యాయత్నం చేసి చిన్నతమ్ముడు అనిల్, తల్లి జ్యోతిపై తగిన చర్యలు తీసుకోవాలని సౌజన్య తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్నట్లు మంథని పోలీసులు తెలిపారు. -
కమ్ముకున్న మేఘం.. రైతుల్లో భయం
● కోతదశలో హైబ్రిడ్(ఆడ, మగ) వరి ● ఈ సమయంలో వర్షాలు కురిస్తే పైరుకు తీవ్ర నష్టం ● చిరుజల్లులకే గింజలు నేలరాలే స్వభావం ● ఆందోళనలో సీడ్ వరి రైతులు ● జిల్లాలో 1.20లక్షల ఎకరాలలో సాగు వీణవంక: రెండ్రోజులుగా ఆకాశం మేఘావృతమై మబ్బులు కమ్ముకున్నాయి. ఎప్పుడు ఆకాల వర్షాలు పడతాయోనని విత్తనోత్పత్తి రైతులు కలవరపడుతున్నారు. వారం రోజుల్లో ఆడ, మగ వరి కోతలు ప్రారంభం కానుండగా వాతావరణం చల్లబడుతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉత్తర తెలంగాణలోనే హైబ్రిడ్ సాగులో కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. మరో వారం రోజుల్లో పంట కోతలు ప్రారంభిచనున్నారు. కరీంనగర్ జిల్లాలో వీణవంక, జమ్మికుంట, శంకపట్నం, పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్, ఓదెల, ముత్తారం, జగిత్యాల జిల్లాలో పెగడపల్లి, ధర్మారం మండలాల్లో హైబ్రిడ్ సీడ్ను సాగు చేస్తున్నారు. ఈ సారి 1.20లక్షల ఎకరాల్లో వరిసాగులోకి వచ్చినట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పుతున్నారు. ఆడ వరి కన్నా వారం ముందు మగ వరి కోయాల్సి ఉంటుంది. మగ వరి కోతలు ప్రారంభం కాగా.. ఆడవరి కోతలు ఇంకా ప్రారంభం కాలేదు. ప్రస్తుతం ఆడపైరులో బెరుకు తీసే పనిలో రైతులు బిజీగా ఉన్నారు. చిరుజల్లులకే నేలరాలే స్వభావం మగ వడ్లను కంపెనీలు కొనుగోలు చేయవు. ఆడ వడ్లను మాత్రమే దిగుమతి చేసుకుంటాయి. క్వింటాల్కు రూ.7వేల నుంచి రూ.20వేల వరకు కంపెనీలు చెల్లిస్తున్నాయి. మగ వడ్లను రైతులు ప్రైవేట్గా విక్రయించాల్సిందే. ఆడవడ్లకు ఈదురుగాలులు, చిరుజల్లులకే నేలరాలే స్వభావం ఉంటుంది. కంపెనీ ప్రతినిధులు వచ్చి సర్టిఫై చేస్తేనే వరి కోయాల్సి ఉంటుంది. లేకుంటే ధాన్యం రిజెక్ట్ చేసే అవకాశం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 28నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించడంతో రైతులు దిక్కుతోచన స్థితిలో పడ్డారు. పెట్టుబడి ఎక్కువే సాధారణ వరి సాగు చేస్తే ఎకరాకు రూ.20వేల నుంచి రూ.25వేల పెట్టుబడి అవుతుంది. ఆడ, మగ సాగు చేస్తే రూ.40వేల నుంచి రూ.50వేల పెట్టుబడి అవుతుంది. ఎకరం నాటు(హైబ్రిడ్)కు 20మంది కూలీలు అవసరం. సాధారణ వరికి 12మందితో పూర్తి చేస్తారు. వాతావరణం అనుకూలిస్తే హైబ్రిడ్ వరికి రూ.లక్ష నుంచి రూ.1.50లక్షల మధ్య దిగుబడి వస్తుంది. జిల్లాలోనే వీణవంక మండలం బేతిగల్, మల్లారెడ్డిపల్లి గ్రామాలు దిగుబడిలో మొదటిస్థానంలో ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం మండలం ఓడేడు గ్రామం సాగులో ఆదర్శంగా నిలస్తుంది. వరుణుడు 15రోజులు గడువు ఇస్తే రైతులు గట్టెక్కనున్నారు. లేకుంటే తీవ్ర నష్టపోయే ప్రమాదముంది. మూడేళ్లుగా వరి సాగు వివరాలు(ఎకరాల్లో 2024 68,000 2025లో 85,000 2026లో 1.20,000 ఐదు ఎకరాలలో ఆడ, మగ వరి పంట వేసిన. మగ వరి కోసి రెండు రోజులవుతుంది. ఆడ వరి కోయడానికి కంపెనీ ప్రతినిధులు ఇంకా అనుమతి ఇవ్వలేదు. రెండు రోజులుగా మబ్బులు కమ్ముకుంటుంటే ప్రాణం వణుకుతోంది. పంట చేతికి వచ్చిన సమయంలో ఆకాల వర్షాలు పడితే కోలుకోలేం. ఇప్పటికే ఎకరాకు రూ.40వేల పెట్టుబడి పెట్టిన. పది రోజులు వరుణుడు కరుణిస్తే గండం నుంచి గట్టెక్కుతా. – శ్రీనివాస్, రైతు, బేతిగల్ -
జడ్జి పోస్టు ముళ్ల కిరీటం
వేములవాడ: జడ్జి పోస్టు ముళ్ల కిరీటంలాంటిదని, ఒక్కో రోజు కేసులు పూర్తిస్థాయి పరిష్కరించేందుకు రాత్రి అవుతుందని, కేసుల్లో బ్యాలెన్స్ చేయడంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి వస్తుందని సీనియర్ సివిల్ జడ్జి అజయ్కుమార్ జాదవ్ పేర్కొన్నారు. వేములవాడ జూనియర్ సివిల్ జడ్జిగా మూడేళ్లపాటు విధులు నిర్వహించి ఖమ్మంకు బదిలీపై వెళ్తున్న జ్యోతిర్మయిని బార్ అసోసియేషన్ హాలులో శనివారం సత్కరించారు. ఈ సందర్భంగా అజయ్కుమార్ జాదవ్ మాట్లాడుతూ ఎంతో మంది అభాగ్యులు న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తారని, ఈక్రమంలో తమపై ఎంతో బాధ్యత ఉంటుందన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిట్టల మనోహర్ మాట్లాడుతూ జడ్జిగా విధులు నిర్వహించిన సమయంలో జూనియర్లకు ఎంతో అవకాశం కల్పించారని, బార్ అండ్ బెంచ్ సత్సంబంధాలతో కొనసాగాయన్నారు. మహిళలకు ఆదర్శం వేములవాడ జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న క్రమంలోనే ఆగస్టు 16న వేములవాడ ప్రభుత్వాస్పత్రిలో నార్మల్ డెలివరీతో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి సర్కార్ ఆస్పత్రులపై నమ్మకం పెంచారన్నారు. ఇలా మహిళలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఏ ఆడపిల్లకై నా మొదటి డెలివరీ తల్లిగారింట్లో జరుగుతుందని.. అందుకే జడ్జి జ్యోతిర్మయికి వేములవాడ పుట్టినిల్లులాంటిదన్నారు. ఈక్రమంలో తమ సోదరికి వీడ్కోలు పలుకుతున్నట్లు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సీనియర్ సివిల్ జడ్జి అజయ్కుమార్ జాదవ్ జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయికి వీడ్కోలు కంటతడి పెట్టిన జడ్జి జ్యోతిర్మయి కంటతడి పెట్టిన జడ్జి జ్యోతిర్మయి అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని వేములవాడ జూనియర్ సివిల్ జడ్జిగా నియమితులైన జ్యోతిర్మయి వేములవాడను తన పుట్టినిల్లుగా మార్చుకున్నారంటూ పలువురు అడ్వకేట్లు కొనియాడడంతో భావోద్వేగానికిలోనయ్యారు. జడ్జి జ్యోతిర్మయి మాట్లాడుతుండగా కంటతడి పెట్టుకున్నారు. బార్ అసోసియేషన్ హాలులో శనివారం జరిగిన వీడ్కోలు సమావేశంలో ఆమె తన అనుభవాలను వివరిస్తూ వేములవాడను మరచిపోలేనని, తనను ఇంతగా ఆదరించిన వేములవాడ అడ్వేకేట్ల సేవలు గుర్తుండిపోతాయన్నారు. ఈక్రమంలో పలువురు అడ్వకేట్లు, కోర్టు సిబ్బంది సైతం భావోద్వేగానికి లోనయ్యారు. -
ముచ్చటగా మూడు కొలువులు
సిరిసిల్ల: ప్రభుత్వ ఉద్యోగం ఒకటి సాధించడమే కష్టంగా ఉన్న నేటి పోటీ ప్రపంచంలో పట్టుదలకు ప్రయత్నం తోడైతే విజయాలు క్యూ కడతాయని నిరూపిస్తున్నారు సిరిసిల్ల అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్(ఏఎంవీఐ) బేర పృథ్వీరాజ్వర్మ. ఒక్కటి కాదు...రెండు కాదు.. ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. చదువు ఒక్కటే మనల్ని ముందుకు నడిపిస్తుందని.. సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడుతుందంటున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఏఎంవీఐగా పనిచేస్తున్న పృథ్వీరాజ్వర్మ గ్రామీణ నేపథ్యంలో ఎదిగి వచ్చి శ్రీఖాకీశ్రీ యూనిఫామ్పై ఉన్న మక్కువతో మూడు ఉద్యోగాలు సాధించారు. ప్రజలకు నేరుగా సేవచేసే అవకాశం ఖాకీ దుస్తులకే ఉందని నమ్మారు. ఉద్యోగ అన్వేషణలో పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న నేటితరం యువతకు స్ఫూర్తినిస్తున్న పృథ్వీరాజ్వర్మ విజయగాథపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ● మధ్యతరగతి కుటుంబం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లికి చెందిన బేర శ్రావణి, రాజమౌళి దంపతులకు ఇద్దరు కొడుకులు పృథ్వీరాజ్వర్మ, భరద్వాజ్. లక్షెట్టిపేటలో ఎస్ఎస్సీ వరకు చదివిన పృథ్వీరాజ్వర్మ పదోతరగతిలో 526 మార్కులు సాధించారు. హైదరాబాద్లో ఇంటర్, వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో బీటెక్ (మెకానికల్) పూర్తి చేశారు. 2017లో బీటెక్ పట్టాతో బయటకు వచ్చిన పృథ్వీరాజ్వర్మ హోండా కంపెనీలో సర్వీసు ఇంజినీరుగా రెండేళ్లపాటు పనిచేశారు. అనంతరం మరో సిమెంట్ కంపెనీలో పనిచేశారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయన ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలగా ఖాళీ సమయంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. ● బీట్ ఆఫీసర్గా ప్రస్తానం 2019లో పోటీపరీక్షలు రాసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా తొలి ఉద్యోగం సాధించారు. శిక్షణ అనంతరం జన్నారం కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్ట్లో ఉద్యోగం. అడవిని, వన్యప్రాణులను రక్షించే ఉద్యోగం. బీట్ ఆఫీసర్గా పనిచేస్తూ పోటీ పరీక్షలకు సిద్దమయ్యారు. 2023లో తెలంగాణ ప్రభుత్వం నేరుగా అసిస్టెంట్ మోటార్ వాహన తనిఖీ అధికారి(ఏఎంవీఐ) ఉద్యోగాలకు పరీక్షలను నిర్వహించింది. ఆ పరీక్షలకు పట్టుదలగా ప్రిపేర్ అయ్యారు. ఆ పరీక్షల ఫలితాలు రాక ముందే 2024లో పోలీస్ కానిస్టేబుల్(సివిల్) ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారు. కానిస్టేబుల్ ఉద్యోగం చేరకుండా.. ఏఎంవీఐ ఉద్యోగ ఫలితాల కోసం నిరీక్షించారు. ఉద్యోగం పోతుందని, వెంటనే చేరాలని అనేక మంది సలహా ఇచ్చినా అప్పటికే ఓ ఉద్యోగం ఉంది, మరో ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాను అనే ధీమాతో ఉండగా.. ఏఎంవీఐగా ఎంపికయ్యారు. మూడు ఖాకీ డ్రెస్ వేసుకునే ఉద్యోగాలు రావడంతో చివరగా.. ఏఎంవీఐగా ఉద్యోగంలో చేరారు. ● తమ్ముడూ.. భార్యా ఇంజినీర్లే పృథ్వీరాజ్వర్మ తమ్ముడు భరద్వాజ ఆర్అండ్బీలో ఏఈఈగా పనిచేస్తున్నారు. ఆయన భార్య కీర్తి ఇరిగేషన్ శాఖలో ఏఈఈగా మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్నారు. ఇంట్లో ఇద్దరు అబ్బాయిలు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడడంతో తల్లిదండ్రులు శ్రావణి, రాజమౌళి దంపతుల ఆనందానికి అవధుల్లేవు. చిన్నప్పటి నుంచి చదువు ఒక్కటే దారి చూపుతుందని నమ్మిన ఆ తల్లిదండ్రులు పిల్లలను ప్రయోజకులను చేశామని ఆత్మసంతృప్తితో ఉన్నారు. చదువు.. పట్టుదల.. విజయం అన్నీ ‘యూనిఫామ్’ సర్వీసులే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ టు ఏఎంవీఐపట్టుదలగా చదువాలి. చదువును నిర్లక్ష్యం చేయొద్దు. వెనకడుగు వేయొద్దు. నిజా నికి బీట్ ఆఫీసర్గా ఉండగా మళ్లీ చదువు ఎందుకు అని చాలా మంది సలహా ఇచ్చా రు. ఉన్న ఉద్యోగం పోతుందన్నారు. అప్పటికే పోటీపరీక్షల పేపర్లు లీక్ కావడం, రాసిన పరీక్షలు రద్దు కావడం జరిగింది. దీంతో చాలా మంది ఉన్న ఉద్యోగంలోనే చేరమన్నారు. కానీ మనపై మనకు నమ్మకం ఉంటే.. ఇది పోతే ఇంకోటి వస్తుందిలే అనే ధీమాతో రెండేళ్లు ఇంటి ముఖం చూడకుండా హైదరాబాద్లోనే ఉండి చదువుకున్న. కృషికి తోడుగా.. పట్టుదల ఉంటే.. ఏదైనా సాధిస్తామనే ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతోనే మూడు ఉద్యోగాలు సాధించాను. అన్ని ఖాకీ యూనిపామ్ సర్వీసులే కావడం ఆనందం అనిపించింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. చదువును మరువద్దు. – పృథ్వీరాజ్వర్మ, ఏఎంవీఐ, రాజన్న సిరిసిల్ల -
బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తి అరెస్ట్
జగిత్యాలక్రైం: జగిత్యాలకు చెందిన బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై పోక్సో, కిడ్నాప్, అత్యాచారం కేసులు నమోదు చేసి నింది తుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. హౌసింగ్బోర్డు కాలనీలో ని వాసముంటున్న మనువాడ విష్ణువర్దన్ కొద్దిరోజు ల క్రితం పట్టణానికి చెందిన ఓ బాలికను కిడ్నాప్ చే సి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యా దు మేరకు నిందితుడిని రిమాండ్కు పంపించినట్లు సీఐ తెలిపారు. దాడి చేసిన వ్యక్తి రిమాండ్చందుర్తి(వేములవాడ): పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని దాడిచేసిన చందుర్తి మండలం జోగాపూర్కు చెందిన ఓ వ్యక్తిని శనివారం అరెస్టు చేసినట్లు ఎస్సై జిల్లెల్ల రమేశ్ తెలిపారు. ఎస్సై రమేశ్ తెలిపిన వివరాలు. చందుర్తి మండలం జోగాపూర్కు చెందిన గొంటి లక్ష్మణ్ రోడ్డుపై వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన నామాల ఉరఫ్ మ్యాదరి నర్సయ్య ఈనెల 5న గొడ్డలి కామతో దాడి చేశాడు. బాధితుడు లక్ష్మణ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు. -
ఈతకొడుతుండగా నీటమునిగి యువకుడి మృతి
రామగుండం: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామ శివారులోని చెరువుకట్ట సమీపంలో నివాసముండే బుడిగజంగాల కుటుంబానికి చెందిన పస్తం పవన్(18) శనివారం ఈతకొడుతుండగా పిట్స్ రావడంతో నీటమునిగి చనిపోయాడు. మరోఇద్దరు యువకులతో కలిసి చెరువులో ఈదుతుండగా పిట్స్ వచ్చినట్లు స్థానికులు తెలిపారు. యువకుడు కొన్నేళ్లుగా పిట్స్తో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా పస్తం రాంచందర్కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు పవన్ ఉన్నాడు. రాంచందర్కు ఉన్న ఏకై క కుమారుడు పవన్ మృత్యువాత పడడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై వెంకటస్వామి తెలిపారు. జగిత్యాలక్రైం: బీర్పూర్ మండలకేంద్రంలో ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో అదేగ్రామానికి చెందిన చీర్నేని బుచ్చన్నకు తీవ్రగాయాలయ్యాయి. బుచ్చన్న తన ద్విచక్ర వాహనంపై పొలం పనులకు వెళ్తుండగా.. జన్నారం నుంచి జగిత్యాలకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో బుచ్చన్న తలకు తీవ్రగాయాలుకాగా.. స్థానికులు 108 ద్వారా జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బీర్పూర్ ఎస్సై రాజు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. -
సమీకృత కలెక్టరేట్ను సిద్ధం చేయండి
కరీంనగర్ అర్బన్/కరీంనగర్ టౌన్: సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించా రు. శనివారం ఐడీఓసీ బ్యాలెన్స్ పనులపై అధికారులతో సమీక్షించారు. జూన్ రెండులోగా కాంప్లెక్స్ను అన్ని రకాలుగా ప్రారంభానికి సిద్ధం చేసి ఉంచాలన్నారు. అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో కే మహేశ్వర్, ఆర్అండ్బీ ఎస్ఈ కే.రాం, ఈఈ నరసింహచారి, తదితరులు పాల్గొన్నారు. బాలల భద్రతలో అగ్రభాగాన నిలవాలి బాలల భద్రత, సంక్షేమంపై కొనసాగనున్న కార్యక్రమంలో జిల్లాను అగ్రభాగాన ఉంచేందుకు అధికా రులు కృషి చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్లో మహిళా శిశు సంక్షేమశాఖ, సఖి, స్వధార్, చైల్డ్ హెల్ప్లైన్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈనెల 27 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బాలల భద్రత రక్షణ సంక్షేమం కార్యక్రమాలను ప్రణాళిక ప్ర కారం నిర్వహించాలన్నారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, సంక్షేమాధికారి సరస్వతి పాల్గొన్నారు. పలువురు సీఐల బదిలీకరీంనగర్క్రైం: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో పలువురు సీఐలు బదిలీ అయ్యారు. కరీంనగర్ ఎస్బీ విభాగంలో పనిచేస్తున్న వీరబత్తిని శ్రీనివాస్ హుజురాబాద్ రూరల్కు, అక్కడ పనిచేస్తున్న పులి వెంకటిని జమ్మికుంట రూరల్కు బదిలీ చేశారు. వరంగల్ కమిషనరేట్ నుంచి బొల్లం రమేశ్ను తిమ్మాపూర్ సర్కిల్కు, అక్కడి నుంచి గడ్డం సదన్కుమార్ను ఐజీ కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. -
ధాన్యం త్వరగా దిగుమతి చేసుకోవాలి
కరీంనగర్ అర్బన్: కేంద్రాల నుంచి వచ్చే ధా న్యాన్ని త్వరితగతిన దింపుకోవాలని, జా ప్యం చేస్తే కఠినచర్యలు తప్పవని అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. శని వారం కలెక్టరేట్లో రైస్మిల్లర్లు, అధికారులతో సమీక్షించారు. ప్రతీ రోజు ధాన్యం కొనుగోళ్ల ఏజెన్సీల అధికారులతో సమీక్షిస్తున్నామని, సకాలంలో బ్యాంకు గ్యారంటీలు సమర్పించా లని మిల్లర్లను ఆదేశించామని తెలిపారు. ధా న్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు, రైస్ మిల్లర్ల నిర్లక్ష్యం వంటి వాటిపై ఫిర్యాదు చేసేందుకు జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, ఫిర్యా దు చేసేవారు 9154249727 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. యాసంగి సీజన్కు గానూ 318 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు 105మంది రైతుల నుంచి 739 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వివరించారు. దొడ్డు రకాలు 703 మెట్రిక్ టన్నులు, సన్నరకాలు 36 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని వెల్లడించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, పౌరసరఫరాల సంస్థ మేనేజర్ యం.రజనీకాంత్, రైస్మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్రావు, వీరకుమార్ పాల్గొన్నారు. నిందితులకు శిక్ష పడేలా కృషిచేయాలి కరీంనగర్క్రైం: నేరాలు చేసినవారికి శిక్ష పడేలా చేయడంతో పాటు, బాధితులకు న్యాయం చేయడమే ప్రాసిక్యూటర్ల బాధ్యత అని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఎస్.సాంబశివరెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 99రోజుల కార్యక్రమం చేపట్టగా, శని వారం కరీంనగర్ ప్రాసిక్యూషన్ యూనిట్ను సందర్శించారు. ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యూషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, న్యాయవాదుల సమన్వయంతో ముందుకెళ్లాలని ప్రాసిక్యూటర్లకు సూచించారు. ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ధరావత్ శరత్, ఏడీపీవో లక్ష్మిప్రసాద్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ పాల్గొన్నారు. నగరంలో పవర్కట్ కొత్తపల్లి: విద్యుత్ లైన్లు, డీటీఆర్ పనులు చేపడుతున్నందున ఆదివారం ఉదయం 7 నుంచి 11 గంటల వరకు 11 కె.వీ.వెంకటసాయి ఫీడర్ పరిధిలోని పద్మశాలి వీధి, లక్ష్మీనగర్, రాఘవేంద్రనగర్, పాతబజార్, ఉదయం 6 నుంచి 11 గంటల వరకు జిల్లా గ్రంథాలయం,టూటౌన్ పోలీస్స్టేషన్, వాణినికేతన్ డిగ్రీ కళాశాల, జాఫ్రీ మసీద్, ముకరంపుర, సర్కస్ మైదానం, ఐబీ చౌరస్తా, తెలంగాణ చౌక్, కార్పెంటర్స్ సొసైటీ, సంతోషిమాత ఆలయం ప్రాంతాలతో పాటు ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు 11 కె.వీ.ఉజ్వల పార్కు ఫీడర్ పరిధిలోని కట్టరాంపూర్ మెయిన్ రోడ్, తిరుమలనగర్, రెడ్డికాలనీ, మైనార్టీ స్కూల్, గిద్దె పెరుమాండ్ల ఆలయం, హనుమాన్నగర్, జయశంకర్ కాలనీ, శ్రీనివాసనగర్, గణేశ్నగర్ బైపాస్, కమాన్, ఎన్టీఆర్ విగ్రహం, అల్కాపురి, ఐటీఐ, పాలిటెక్నికల్ కళాశాలలు, ఐటీ హబ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1, 2 ఏడీఈలు పి.శ్రీనివాస్ గౌడ్, ఎం.లావణ్య తెలిపారు. ఢిల్లీ సదస్సులో కమిషనర్కరీంనగర్ కార్పొరేషన్: ఢిల్లీలో కేంద్ర పట్టణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సదస్సు కు బల్దియా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అర్బ న్ చాలెంజ్ఫండ్ స్కీంతో పాటు, దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల పురోగతి, ప్రాజెక్టుల రూపకల్పనపై సదస్సులో చర్చించారు. -
పశువైద్య సేవలు భేష్
కరీంనగర్ అర్బన్: పశు సంవర్థకశాఖ వైద్య సేవలు జిల్లాలో భేష్ అని ఆ శాఖ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ సుబ్బారాయుడు ప్రశంసించారు. శనివారం జిల్లాలో పర్యటించారు. రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హోదాలో ఆబోతుల వీర్య కేంద్రాన్ని సందర్శించారు. పశువుల కృత్రిమ గర్భధారణకు ఉపయోగించే వీర్య నాళికల తయారీ, పంపిణీ తీరును ఆరా తీశారు. నగరంలోని కామధేను గోశాలను సందర్శించి అక్కడి ఆవులు ఒకే సమయంలో ఎదకు వచ్చి గర్భధారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి లింగారెడ్డికి సూచించారు. చిగురుమామిడి మండలంలో ఎన్ఎల్ఎం పథకం కింద లబ్ది పొందిన సమ్మిరెడ్డి గొర్రెల ఫారాన్ని సందర్శించారు. అనంతరం జిల్లా పశు సంవర్థక శాఖ కార్యాలయాన్ని సందర్శించగా ప్రాంతీయ పశు సంవర్థక శిక్షణ కేంద్రం కార్యక్రమాలను సమీక్షించి మొక్కలను నాటారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన పెద్ది పోచమ్మకు రూ.లక్ష ఎక్స్గ్రేషియా అందించారు. వి కన్వెన్షన్లో జరిగిన ప్రపంచ పశు వైద్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి డా.ఎన్ లింగారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ డా.రవి కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. -
ఎండల్లో హాయి.. హాయి
కొద్దిరోజులుగా మండుతున్న ఎండలకు తట్టుకోలేక జిల్లాలోని ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఈ క్రమంలో పెట్రోల్ బంకుల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మిషన్లు వేడెక్కి ఎక్కడ నిప్పంటుకుంటాయో అన్న భయంతో నగరంలోని జ్యోతినగర్లో ఉన్న పెట్రోల్ బంక్ నిర్వాహకులు వినూత్న రీతిలో ఆలోచన చేశారు. అటు మిషన్లు, ఇటు కష్టమర్లను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా బంక్ చుట్టూ వాటర్ స్ప్రింక్లర్లు మంచుకురిసే విధంగా ఏర్పాటు చేశారు. వాహనాల్లో పెట్రోల్ పోసుకున్న వారు ఎండల్లో హాయి..హాయి అంటూ కొద్దిసేపు అక్కడే సేదతీరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
కమలానికే కో ఆప్షన్!
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ కో ఆప్షన్ స్థానాలు ఊహించినట్లుగానే కమలం ఖాతాలోకి చేరాయి. శనివారం నిర్వహించిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఐదుగురు ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకున్నారు. అవసరం పడనప్పటికీ అనూహ్యంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు నలుగురు బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. మరో వైపు ఈ ఎన్నిక నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందంటూ అదే పార్టీకి చెందిన సర్ధార్ రవీందర్ సింగ్ డీసెంట్ నోటీసు ఇచ్చారు. విజేతలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అభినందించారు. కో ఆప్షన్ ఎన్నికల్లో గెలుపు తరువాత బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఏకపక్ష విజయం ఐదు కో ఆప్షన్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికా ర బీజేపీ ఏకపక్ష విజయం సాధించింది. ఉదయం 11 గంటలకు ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని నగరపాలకసంస్థ కౌన్సిల్ హాల్లో నిర్వహించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటి మేయర్ యాదగిరి సునీల్రావు సహా 34 మంది బీజేపీ కార్పొరేటర్లు హాజరయ్యారు. 69 మంది సభ్యులకు గాను కోరం ఉండాలంటే 35 మంది హాజరుకావా ల్సి ఉంటుంది. ఎక్స్అఫిషియో సభ్యుడి హోదాలో ఓటు హక్కు కలిగిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నగరంలో ఉన్నప్పటికీ రాలేదు. కోరం కావాలంటే మరో సభ్యుడు అవసరం ఉన్న సమయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎంఐఎం కార్పొరేటర్లు సమావేశానికి హాజరుకావడంతో ఎన్నికకు మార్గం సుగమమైంది. ముందుగా జనరల్ కేటగిరీలోని మూడు స్థానాలకు పోటీపడ్డ 27 మంది పేర్లు చదవగా, బీజేపీకి చెందిన కన్న కృష్ణ, చిగిరి వెంకటమ్మలకు 34 మంది బీజేపీ, ఇద్దరు బీఆర్ఎస్ సభ్యులు చేతులెత్తారు. ఎలగందుల నందకుమార్కు 34 మంది బీజేపీ, ముగ్గురు బీఆర్ఎస్ సభ్యులు చేతులెత్తారు. మైనార్టీ కోటాలోని రెండు స్థానాలకు 13 మంది పేర్లు చదవగా, బీజేపీ అభ్యర్థులైన హఫీజాబేగంకు 34 మంది బీజేపీతో పాటు, ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేతులెత్తి ఓటు వేశారు. బల్బీర్సింగ్కు 37 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీ అభ్యర్థులు కన్న కృష్ణ, ఎలగందుల నందకుమార్, చిగిరి వెంకటమ్మ, హఫీజాబేగం, బల్బీర్సింగ్లు విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఢిల్లీలో సమావేశానికి వెళ్లగా, డిప్యూటీ కమిషనర్ వేణుమాధవ్ విజేతలకు ధ్రువపత్రాలు అందించారు. మేయర్ ప్రమాణస్వీకారం చేయించారు. విజేతలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అభినందించి, శాలువాలతో సత్కరించారు. డీసెంట్ నోటీసు మున్సిపల్ చట్టం, నిబంధనలు ఉల్లంఘించి కో ఆ ప్షన్ ఎన్నికను నిర్వహించారంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్ రవీందర్ సింగ్ డీసెంట్ నోటీసు ఇచ్చారు. ఎంతమంది పోటీచేస్తున్నారనే విషయం కార్పొరేటర్లకు ముందుగా తెలపలేదని, జనరల్ బాడీలో ప్రాతినిథ్యం లేని మైనార్టీలనే ఎన్నుకోవాల్సి ఉండగా, ప్రాతినిథ్యం ఉన్న వాళ్లనే ఎన్నుకుంటున్నారని, ఇది నిబంధనలకు విరుద్దమంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు. నోటిఫికేషన్ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికకు కాంగ్రెస్ దూరం కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎన్నికకు దూరంగా ఉన్నా రు. శనివారం ఉదయం ఆర్అండ్బీ అతిథిగృహంలో సమావేశమైన 18 మంది కార్పొరేటర్లు, ఎన్నిక ప్రక్రియలో పాల్గొనరాదని నిర్ణయించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల క్రాస్ ఓటింగ్ కో ఆప్షన్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్లో నెలకొన్న సమన్వయలోపం మరోసారి బయటపడింది. అవసరం లేనప్పటికి నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీకి ఓటు వేయడం పార్టీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కో ఆప్షన్ పదవులకు బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు పలువురు దరఖాస్తు చేసుకొన్నప్పటికి పోటీనుంచి తప్పుకుంటున్నట్లు ఐదుగురు మరోసారి దరఖాస్తు చేశారు. మిగతావాళ్లు ఆ దరఖాస్తు కూడా ఇవ్వలేదు. సాంకేతికంగా వీరంతా పోటీలో ఉన్నట్లు అధికారులు పేర్లు చదివినప్పటికి, సభలోనే ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎవరూ వీరికి ఒక్క ఓటు వేయలేదు. పైగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ, సుదగోని మాధవి, ఎస్.కె.యూసుఫ్, సమీనా పర్వీన్ బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయడం రాజకీయంగా కలకలం సృష్టించింది. సమావేశానికి కాంగ్రెస్ కార్పొరేటర్లు 18 మంది మినహా బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కార్పొరేటర్లు 48 మంది హాజరయ్యారు. 42 మంది మాత్రమే హాజరు పట్టికలో సంతకాలు చేయడంతో అధికారులు వారినే పరిగణలోకి తీసుకున్నారు. ఈ లెక్కన 22 మంది ఓట్లు వేస్తే మెజార్టీ సరిపోతుంది. బీజేపీ సభ్యులు 34 మంది ఓటు వేసినా, ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారు. కాని బీజేపీ కార్పొరేటర్లకు తోడుగా, బీఆర్ఎస్ కార్పొరేటర్లు నలుగురు ఓటు వేయడం దేనికి సంకేతం అనే చర్చ బల్దియా రాజకీయాల్లో మొదలైంది. ఇదిలాఉంటే అసలు ఎన్నికనే నిబంధనలకు విరుద్దంగా జరుగుతుందంటూ, బీఆర్ఎస్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ ఇచ్చిన డీసెంట్ నోటీసుపై పది మంది కార్పొరేటర్లు సంతకం చేయగా, అందులోనుంచి నలుగురు మళ్లీ బీజేపీకి ఓటు వేయడం గమనార్హం. పట్టు సాధించాం: మేయర్ కొలగాని శ్రీనివాస్ కో ఆప్షన్ ఎ న్నికల్లోనూ బీజేపీ పట్టు సాధించిందని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. ఎన్నిక అనంతరం నగరపాలకసంస్థ కార్యాలయ ఆవరణలో బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. బండి సంజయ్ నేతృత్వంలో ఈ విజయాలు సొంతమయ్యాయన్నారు. కో ఆప్షన్ విజయంతో తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు. -
ఆర్టీసీలో సంబురాలు
కరీంనగర్టౌన్: ఆర్టీసీ కార్మికులు కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో సంబురాలు నిర్వహించారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం, 11శాతం పీఆర్సీ ప్రకటించడంతో పాటు అన్ని డిమాండ్లు నెరవేర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఆర్టీసీ కార్మికులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఆర్టీసీ కార్మికుడు కోలా శంకర్గౌడ్కు నివాళి అర్పించారు. ఆర్టీసీ ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి టీఆర్రెడ్డి, ముస్తాక్ అహ్మద్, కుంబాల రాజు కుమార్ పాల్గొన్నారు. విద్యార్థుల నిరాహార దీక్ష కరీంనగర్/కరీంనగర్ టౌన్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఏబీవీపీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. పెండింగ్లో ఉన్న రూ.10వేల కోట్లకు పైగా బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆ శ్రయించిన నేపథ్యంలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడం వల్లే విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోవచ్చని మధ్యంతర ఉత్తర్వులు వచ్చినట్లు ఏబీవీపీ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు అన్నారు.గోస్కు ల అజయ్, బామండ్ల నందు, యోగేశ్, మురళి, శ్రీపతి వంశీ, నాగరాజు, విఘ్నేశ్, అనూష పాల్గొన్నారు. -
వరదకాలువ.. మెట్ట రైతులకు వరం
బోయినపల్లి(చొప్పదండి): వరిపంటలు పొట్ట దశలో ఉండి ఈనే సమయంలో ఎల్లంపల్లి నీరు వరదకాలువకు విడుదల చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మార్చి రెండో వారంలో పంటలకు ఎల్లంపల్లి నీరు అందడంతో చేలు పచ్చగా మారాయి. వరదకాలువ ఆధారంగా యాసంగి సీజన్లో వరి పంటలు వేసిన రైతులు మెజార్టీగా పంట కోశారు. ఇంకా కొందరు వరి కోతలకు సిద్ధంగా ఉన్నారు. వరదకాలువలోని నీటి స్టోరేజీ కెపాసిటీ 1.7 టీఎంసీలు. ప్రస్తుతం వరదకాలువలో సుమారు ఐదు మీటర్ల మేర నీరు ఉంది. జలయజ్ఞంలో నిర్మాణం జలయజ్ఞంలో భాగంగా దివంగత నేత వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో వరదకాలువ నిర్మించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎస్సారెస్పీ నుంచి జగిత్యాల, కరీంనగర్ జిల్లాల మీదుగా రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి క్రాస్ రెగ్యూలేటరీ వరకు 122 కిలోమీటర్ల మేర వరదకాలువ విస్తరించి ఉంది. నాలుగు జిల్లాల పరిధిలోని వరదకాలువ పరిసరాల్లో ఉన్న రైతులకు ఈ నీరు పంటలకు జీవం పోస్తుంది. ఏటా వానాకాలం సీజన్లో వరదకాలువ నీటితో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 70 వేలకు పైగా ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఇందులో జగిత్యాల జిల్లాలో వరదకాలువ ఆధారంగా అత్యధికంగా సుమారు 50 వేల ఎకరాల్లో రైతులు వరి పంట వేస్తారు. వరి పంటలను ఆదుకున్న ఎల్లంపల్లి నీరు ప్రస్తుత యాసంగి సీజన్లో వరదకాలువ ఆధారంగా చాలా మంది రైతులు వరి సాగుచేశారు. కాగా వరి పంటలు ఈనే సమయంలో నీటి కొరత ఏర్పడింది. ఈక్రమంలో ఎల్లంపల్లి నీరును వరదకాలువకు విడుదల చేయాలని రైతులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు విన్నవించారు. ఎమ్మెల్యే సత్యం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో మాట్లాడి వరదకాలువకు నీరు విడుదల చేయించి పంటలను కాపాడారు. ఐదు డివిజన్లు ఏర్పాటు చేశారు. ఐదు డివజన్ల పరిధిలో ఐదుగురు ఈఈలు, ఇద్దరు ఎస్ఈలు పర్యవేక్షిస్తారు. జీవనదిలా.. వరదకాలువలో నిల్వ ఉండే నీరు సుమారు 18 మీటర్ల లోతు ఉంటుంది. ఈనీటితో నిజామాబాద్ జిల్లాతో పాటు, ఉమ్మడి కరీంనగర్లో ఉన్న జగిత్యాల, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల జిల్లా పరిధిలోని మండలాల్లో రైతులు వానాకాలం సీజన్లో సుమారు లక్ష ఎకరాల మేర వరి సాగు చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ఇబ్రహీంపట్నం, మెట్పల్లి, కథలాపూర్, కోరుట్ల, మేడిపెల్లి, మల్యాల మండలాల్లో సుమారు 50 వేల ఎకరాల్లో, కరీంనగర్ జిల్లా పరిధిలోని గంగాధర, రామడుగు మండలాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో, రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో ఐదు వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వరదకాలువ నీటితో జగిత్యాల జిల్లాలో ఎక్కువగా వరి సాగు అవుతోంది. రైతులు వరదకాలువకు ఇరువైపులా మోటార్లు అమర్చుకుని వ్యవసాయ భూములకు పైపులైన్ల ద్వారా నీరు అందిస్తూ సేధ్యం చేస్తున్నారు. ఎల్లంపల్లి నీరు చేరికతో జలసిరి ఎండాకాలంలో సైతం వరదకాలువలో నీరు గత వానాకాలం, యాసంగి పంటలకు నీరు ఎస్సారెస్పీ నుంచి 122 కి.మీ. మేర వరదకాలువవరదకాలువ స్వరూపం పొడవు : 122 కిలోమీటర్లు విస్తరించి ఉన్న జిల్లాలు: నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల డివిజన్లు: 05 స్టోరేజీ కెపాసిటీ : 1.7 టీఎంసీ ప్రస్తుతం ఉన్న నీరు : సుమారు ఐదు మీటర్లు


