Karimnagar District News
-
ఒలింపియాడ్లో అల్ఫోర్స్ విద్యార్థుల ప్రతిభ
కొత్తపల్లి: ప్రముఖ పోటీ పరీక్షల సంస్థ సిల్వర్ జోన్ ఫౌండేషన్ ఇటీవల నిర్వహించిన జోనల్స్థాయి స్మా ర్ట్కిడ్స్ జీకే ఒలింపియాడ్లో కొత్తపల్లిలోని అల్ఫో ర్స్ ఇ టెక్నో స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జోనల్స్థాయిలో పతకాలు సాధించినట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ డా.వి.నరేందర్ రెడ్డి తెలి పారు. పాఠశాలకు చెందిన వి.ఆశ్రిత రెడ్డి (4వ తరగతి), సి.హెచ్.సోహన్, పి.మయాంక్ రెడ్డి (5వ), సాగి శ్రీదాత్రి, యు.రితేష్ (6వ), ఇ.లిఖిత్ కుమార్ (8వ), ఇ.రాజ్ ఆరుష్ పటేల్, కె.తనీష్ రెడ్డి, కె.రిషి క్ (10వ)లు జోనల్ స్థాయిలో మెడల్స్ ఆఫ్ ఎక్స్లెన్స్ కై వసం చేసుకున్నట్లు తెలిపారు. పాఠశాలలో మంగళవారం విద్యార్థులను అభినందించారు. అలరించిన అల్ఫోర్స్ ‘బ్లూసూమ్’ వేడుకలు కిసాన్నగర్లోని అల్ఫోర్స్ హైస్కూల్ వార్షిక వేడుకలు అలరించాయి. స్థానిక ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మంగళవారం అల్ఫోర్స్ బ్లూసూమ్ పేరిట నిర్వహించిన ఈ వేడుకలకు మాజీ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్తో కలిసి అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. పాఠశాల వార్షిక ప్రణాళికలో భాగంగా వివిధ క్రీడలు, పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. -
మరో తరానికి స్ఫూర్తినిచ్చిన మహాకవులు
సిరిసిల్ల/సిరిసిల్ల కల్చరల్: మరో తరానికి స్ఫూర్తివంతమైన సాహిత్యాన్ని అందించిన ప్రసిద్ధ కవులను ప్రేరణగా తీసుకుని ఉదీయమాన కవిత్వం వెలుగుచూడాలని ఎస్సారార్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కలువకుంట్ల రామకృష్ణ అన్నారు. జిల్లాకు చెందిన సుప్రసిద్ధ కవులు డాక్టర్ నలిమెల భాస్కర్, జూకంటి జగన్నాథం సాహిత్యంపై భాషా సాంస్కృతిక శాఖ, మానేరు రచయితల సంఘం సంయుక్త నిర్వహణలో అగ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సాహిత్య సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, నిరంతర భాషాధ్యయనంతో తెలంగాణ పదకోశాన్ని రూపొందించిన భాస్కర్, ప్రపంచీకరణ నేపథ్యంలో ఉనికి కోల్పోతున్న జీవితాలపై దీర్ఘకాలంగా విశ్లేషణ చేశారని గుర్తు చేశారు. తెలంగాణ పదాలపై ఒకరు, పరిసరాలపై మరొకరు చేసిన పరిశోధనల కారణంగా స్ఫూర్తివంతమైన సాహిత్యం ఆవిర్భవించిందన్నారు. తొలిసదస్సులో నలిమెల భాస్కర్, జూకంటితో పాటు కవి, విమర్శకుడు అన్నవరం దేవేందర్, మల్లావఝల నారాయణ శర్మ, టీవీ నారాయణ పాల్గొన్నారు. మానేరు రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పత్తిపాక మోహన్ కీలకోపన్యాసం చేశారు. అనంతరం డాక్టర్ నలిమెల భాస్కర్, జూకంటి జగన్నాథంలను నిర్వాహకులు గజమాలతో ఘనంగా సత్కరించారు. అలాగే యువ కవి దూడం గణేశ్ రచించిన మాయమైన మనిషి పుస్తకాన్ని ఆవిష్కరించారు. సదస్సు కన్వీనర్ కటుకం శారద, కళాశాల ప్రిన్సిపాల్ శంకర్, వైస్ ప్రిన్సిపాల్ లావణ్య, మారసం ప్రతినిధులు ఎలగొండ రవి, వడ్డెపెల్లి సంధ్య, బూర దేవానందం, అంకారపు రవి, ఆడెపు లక్ష్మణ్, జి. శ్రీమతి, పాకాల శంకర్, కామారపు శ్రీనివాస్, మడూరి అనిత తదితరులు పాల్గొన్నారు. నలిమెల, జూకంటి సాహిత్య సదస్సులో వక్తలు -
రౌండ్ ద క్లాక్ ‘డయాలసిస్’
● కరీంనగర్ జీజీహెచ్లో మెరుగైన వైద్యం ● పాజిటివ్ కేసులకు రెండు ప్రత్యేక యూనిట్లు ● ప్రస్తుతం 10యూనిట్లతో 65 మందికి డయాలసిస్ ● 24 / 7 సేవలు.. మరో 10 మందికి అవకాశం కరీంనగర్టౌన్: ఉమ్మడి జిల్లాలో మూత్ర పిండాల బాధితులు ఏటా పెరుగుతున్నారు. మధుమేహం, పొగ, మద్యం అధికంగా తాగడం, ఫ్లోరైడ్ నీరు, ఆహార నియమాలు పాటించకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మూత్ర పిండాల సమస్యలను సకాలంలో గుర్తించకపోవడంతో డయాలసిస్ వరకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. రాళ్లు, ఇన్ఫెక్షన్లను ముందే గుర్తిస్తే నెఫ్రాలజిస్టులు అందించే చికిత్సలతో బాధితులు బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కిడ్నీలు పాడై డయాలసిస్ చేయించుకునేందుకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడేవారికి కరీంనగర్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డయాలసిస్ సెంటర్ వరంగా మారింది. తెల్లకార్డు ఉంటే చాలు ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలందిస్తున్నారు. 10 యూనిట్లతో సెంటర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాసుపత్రి ఆవరణలో డయాలసిస్ సెంటర్ను 10 యూనిట్లతో ప్రారంభించారు. ఇందులో 8 సాధారణ డయాలసిస్ యూనిట్లు కాగా పాజిటివ్ పేషెంట్ల కోసం ఒకటి హెచ్సీవీ, మరొకటి హెచ్బీఎస్ఏజీ యూనిట్లను నెలకొల్పారు. 2018 జూన్ 8నుంచి డయాలసిస్ సేవలు మొదలయ్యాయి. సెంటర్ ప్రారంభించిన నాటి నుంచి వేల మందికి ఆరోగ్యశ్రీ పథకం కింద డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే 65 మందికి సేవలు అందిస్తుండగా మరో 10 మందికి సేవలు అందించేందుకు సెంటర్ సిద్ధంగా ఉంది. ప్రభుత్వాసుపత్రిలోనే సురక్షితం ప్రభుత్వాసుపత్రి డయాలసిస్ సెంటర్లో కిడ్నీ బాధితులకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. డయాలసిస్లో వినియోగించే డయాలైజర్ అనే పరికరం అత్యంత ప్రధానమైనది. ఈ పరికరాన్ని ప్రైవేటు సెంటర్లలో నాలుగైదు సార్లు వాడుతారు. కానీ ప్రభుత్వ సెంటర్లో ఒక పేషెంట్కు ఒకసారి మాత్రమే వినియోగిస్తారు. దీంతో పేషెంట్లు ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండే అవకాశం ఉంది. ఇబ్బందుల్లేకుండా సేవలు కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎంత మంది డయాలసిస్ కోసం వచ్చినా.. సేవలు అందిస్తున్నాం. సరిపడా టెక్నీషియన్లు, వసతులు కల్పిస్తున్నాం. ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా చర్యలు చేపడుతున్నాం. రెండు యూనిట్లు హెచ్సీవీ, హెచ్బీఎస్ఏజీ పాజిటివ్ పేషెంట్ల కోసం నిర్వహిస్తున్నాం. మరో పది మందికి ఇక్కడ డయాలసిస్ చేయించుకునే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ ద్వారా దరకాస్తు చేసుకుంటే సేవలందిస్తాం. – వి.అజయ్కుమార్, డయాలసిస్ ఇన్చార్జి -
నవోదయ ఫలితాలు విడుదల
చొప్పదండి: జవహర్ నవోదయ విద్యాలయ ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. విద్యాలయంలో ఆరోతరగతిలో ప్రవేశానికి 80 సీట్లకు నిర్వహించిన ప్రవేశపరీక్షలో ఎంపికై న విద్యార్థుల హాల్ టికెట్లను ఆన్లైన్లో ఉంచారు. నవోదయ వెబ్సైట్లో ఫలితాలను చూసుకోవచ్చని ప్రిన్సిపాల్ మంగతాయారు తెలిపారు. అనంతరం విద్యాలయంలో తొమ్మిదో తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. రిజర్వేషన్, కేటగిరీ పద్ధతిలో 14 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. కలప పట్టివేతచందుర్తి(వేములవాడ): రాజన్న సిరిసిల్ల– జగిత్యాల జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న చందుర్తి– మోత్కులరావుపేట గ్రామాల మధ్య మంగళవారం వేకువజామున అక్రమంగా టేకు కలప తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్నట్లు అటవీశాఖ వేములవాడ డిప్యూటీ రేంజ్ అధికారి రాఘవేందర్రావు తెలిపారు. కలపను స్వాధీనం చేసుకుని, ట్రాక్టర్ను సీజ్ చేసినట్లు వివరించారు. చందుర్తి, సనుగుల బీట్ అధికారులు బాలకృష్ణ, అనిత, బేస్క్యాంప్ సిబ్బంది తిరుపతి, శంకర్ పాల్గొన్నారు. -
జపాన్– ఆసియా యువ విజ్ఞాన మార్పిడి కార్యక్రమానికి శుభశ్రీ
కొత్తపల్లి(కరీంనగర్): జపాన్ ఆసియా యువ విజ్ఞాన మార్పిడి కార్యక్రమంలో పాల్గొనేందుకు కరీంనగర్ పద్మనగర్లోని పారమిత హెరిటేజ్ పాఠశాల విద్యార్థిని శుభశ్రీ సాహు ఎంపికై నట్లు చైర్మన్ ఇ.ప్రసాదరావు తెలిపారు. జపాన్లో జూన్ 15 నుంచి 21వ తేదీ వరకు జరగబోయే ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో 14 ఆసియా దేశాల నుంచి యువత పాల్గొంటుండగా.. శుభశ్రీకి చోటు లభించడం గర్వంగా ఉందన్నారు. సాకురా ఎక్సేంజ్ ప్రోగ్రాం అని పిలవబడే ఈ కార్యక్రమంలో రైతుల కోసం వినూత్నంగా తయారు చేసిన వ్యవసాయ యంత్రాన్ని ప్రదర్శించనుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అయ్యే ఖర్చులన్నింటిని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. అదేవిధంగా జాతీయ స్టార్టప్ దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ హైదరాబాద్లో నిర్వహించే ఉద్యోగ మహోస్తవ్–25లో పాల్గొనడానికి ఎంపికై నట్లు తెలిపారు. ఈ మేరకు శుభశ్రీ, గైడ్ టీచర్ లలిత్ మోహన్ సాహును కలెక్టర్ పమేలా సత్పతి తన క్యాంపు కార్యాలయంలో అభినందించారు. -
ఆగిన అమ్మ గుండె.. తల్లడిల్లిన టెన్త్ విద్యార్థి
కోనరావుపేట(వేములవాడ): ఓ వైపు పదో తరగతి పరీక్షలు.. మరోవైపు కన్నతల్లి హఠాన్మరణం చెందడంతో ఆ విద్యార్థి తల్ల డిల్లిపోయాడు. కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన అమరం జనార్దన్రెడ్డి–లత దంపతుల కుమారుడు ఆమన్రెడ్డి ప్రస్తుతం కరీంనగర్లో పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. సోమవారం అనారోగ్య సమస్యతో ఆస్పత్రికి వెళ్లిన లత అక్కడే గుండెపోటుకు గురై మృతిచెందింది. పుట్టెడు దుఃఖంలో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించాడు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు షేక్ ఫిరోజ్పాషా, దేవయ్య, శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. వృద్ధురాలిపై అత్యాచారంసైదాపూర్: మండలంలోని బొమ్మకల్ గ్రామంలో ఓ వృద్ధురాలిపై ఆదివారం రాత్రి ఓ యువకుడు అత్యాచారం చేసినట్లు బాధితురాలు సైదాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్కు చెందిన యువకుడు కుటుంబంతో వృద్ధురాలి ఇంట్లో ఉంటూ గ్రామంలో చికెన్ సెంటర్ నడుపుతున్నాడు. కొద్దిరోజుల క్రితం భార్యా పిల్లలు కరీంనగర్లోని ఇంటికి వెళ్లారు. కాగా ఆదివారం రాత్రి వృద్ధురాలిపై యువకుడు అత్యాచారం చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. బండి సంజయ్పై బీఆర్ఎస్ ఫిర్యాదు కరీంనగర్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చిల్లర మాటలతో కాలయాపన చేసి, పదవీకాలం వెల్ల దీస్తున్నాడని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్గౌడ్ అన్నారు. కేసీఆర్ను దొంగనోట్లు ముద్రించాడని చేసిన ఆరోపణను ఖండిస్తూ బండి సంజయ్ కుమార్పై చర్యలు తీసుకోవాలని టౌన్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ చిల్లర మాటలతో కరీంనగర్ ప్రతిష్టను దిగజారుస్తున్నాడని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే కరీంనగర్ ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారని హెచ్చరించారు. బీఆర్ఎస్ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్రెడ్డి, శాతవాహన యూనివర్సిటీ ఇన్చార్జి చుక్క శ్రీనివాస్, బీఆర్ఎస్వీ నగర అధ్యక్షుడు బొంకూరి మోహన్, గంగాధర చందు, రవిగౌడ్, ఒడ్నాల రాజు పాల్గొన్నారు. రిజర్వాయర్లో బాలుడి గల్లంతుగొల్లపల్లి: మండలంలోని రంగధామునిపల్లి రిజర్వాయర్లో పడి నేరెల్ల నరేశ్ (12) గల్లంతైన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై సతీష్ కథనం ప్రకారం గ్రామానికి చెందిన నరేష్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి ఈత కోసం గ్రామ శివారులోని రిజర్వాయర్కు వెళ్లాడు. ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై గజ ఈతగాళ్లతో గాలించారు. రాత్రి 8 గంటల వరకు గాలించినా ఆచూకీ లభించలేదు. -
100గ్రాముల బంగారం, రూ.40వేల నగదు చోరీ
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని పాతబజార్లో వ్యాపారి దేవరకొండ కరుణాకర్కు చెందిన దుకాణంలో మంగళవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఈ ఘటనలో మొదటి అంతస్తులోని దుకాణం తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు.. 100గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.40వేల నగదు ఎత్తుకెళ్లారని యజమాని కరుణాకర్ తెలిపారు. సమాచారం అందుకున్న సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై మల్లేశ్ ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. భవనానికి మరమ్మతులు చేపట్టడంతో దుకాణాన్ని ఫస్ట్ఫ్లోర్లోకి మార్చారని, దొంగలు షటర్ను పగులగొట్టి లోనికి చొరబడి ఆభరణాలు ఎత్తుకెళ్లారని పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. -
రైతులకు పరామర్శలే ప్రాప్తం
● అటకెక్కిన పంటల బీమా పథకాలు ● ఏటా ప్రకృతి వైపరీత్యాలతో పంటల నష్టం ● కొత్త ఇన్సూరెన్స్ పథకం కోసం రైతుల ఎదురుచూపుజగిత్యాలఅగ్రికల్చర్: ఏటా రైతులు అయితే అధిక వర్షాలు.. లేకుంటే వడగండ్లు, ఈదురుగాలుల వంటి ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు కళ్లముందే ధ్వంసమై.. కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. అన్నదాతకు అండగా ఉంటామని చెబుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. కనీసం పంటల బీమా పథకాలైనా ఆదుకుంటాయని అనుకుంటే ఆ పథకాలు ఎప్పుడో అఆటకెక్కాయి. ఫలితంగా పంటలు నష్టపోయిన రైతులు తమ ఖర్మ అనుకుంటూ దేవుడిపై భారం వేస్తున్నారు. పరిహారం ఇవ్వకుండా లేనిపోని నిబంధనలు పంటలకు నష్టం వాటిల్లినప్పుడు ప్రభుత్వాలు రైతులను ఆదుకునేందుకు పరిహారం అందించాలి. కానీ ప్రభుత్వాలు ఆ ప్రయత్నాలను ఎప్పుడో మర్చిపోయాయి. పైగా పరిహారం విషయంలో ప్రభుత్వం లేనిపోని నిబంధనలు పెట్టింది. 33శాతానికి పైగా పంట నష్టం జరిగితేనే వ్యవసాయ అధికారులు నివేదిక తయారు చేసే పరిస్థితి నెలకొంది. కొన్ని అధికారులు నివేదిక పంపినా పరిహారం మాత్రం అందడం గగనంగానే మారింది. ఏటా అధిక వర్షాలతో వేలాది ఎకరాల పంట దెబ్బతిన్నప్పటికీ.. అధికారులు నివేదికలకే పరిమితమయ్యారు. మరోవైపు ప్రభుత్వం నుంచి నయాపైసా వచ్చిన పాపాన పోలేదు. ప్రస్తుత యాసంగిలో సాగుచేసిన మొక్కజొన్న, నువ్వు, వరి పంటలు ఇటీవల వడగండ్ల వర్షాలకు నేలవాలి నష్టం వాటిల్లింది. అయినా ప్రభుత్వ నిబంధనల మేరకు పంట నష్టం జరగలేదని అధికారులు నివేదిక రూపొదించడంలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు మాత్రం హడావుడి చేసి రైతులను పరామర్శిస్తున్నారు తప్పితే పరిహారం ఇప్పించే దిశగా ఆలోచన చేయడం లేదు. అటకెక్కిన బీమా పథకాలు పంటలకు నష్టం జరిగితే పరిహారం ఇచ్చి ఆదుకునేందుకు గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రెండు పంటల బీమా పథకాలు అమలయ్యేవి. మొదటిది.. పంటల బీమా పథకం (ఫసల్ బీమా యోజన), రెండోది.. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం. ఈ పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత ఇన్సూరెన్సు ప్రీమియం చెల్లిస్తుండగా.. మరి కొంత రైతులు చెల్లించేవారు. ఈ పథకాలను ప్రభుత్వాలు తీసుకొచ్చినా.. సరైన నిబంధనలు లేక రైతులకు బీమా అందడం లేదు. పంటల బీమా పథకంలో భాగంగా పంట రుణం తీసుకున్న రైతుల నుంచి బ్యాంకులు ప్రీమియం వసూలు చేసి ఇన్సూరెన్సు సంస్థలకు చెల్లించేవి. అయితే నష్టం జరిగినప్పుడు రైతులకు పరిహారం చెల్లించడంలో ఇన్సూరెన్స్ సంస్థలు మీనమేషాలు లెక్కించాయి. రైతు యూనిట్గా కాకుండా.. గ్రామాన్ని యూనిట్గా తీసుకోవడంతో ఏ ఒక్క రైతుకూ పంట నష్ట పరిహారం రాలేదు. పథకంలో పలు లోపాలున్నాయంటూ గత ప్రభుత్వం రద్దు చేసింది. వాతావరణ ఆధారిత బీమా అధిక ఉష్ణోగ్రతలు, వడగండ్లు, ఈదురుగాలుల వంటి వాతావరణ మార్పులతో మామిడి, మిర్చి, పత్తి వంటి పంటలు నష్టపోతే ఆయా పంటలకు పరిహారం వచ్చేలా ప్రభుత్వం వాతావరణ ఆధారిత పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో రైతులు చేరినా నష్టం జరిగినప్పుడు పలు నిబంధనలను సాకుగా చూపి ఇన్సూరెన్సు సంస్థలు పరిహారం ఇచ్చేందుకు వెనుకంజ వేశాయి. ఇందుకోసం మండలాల్లో ఏర్పాటు చేసిన వాతావరణ కేంద్రాలు ఇచ్చే సమాచారాన్ని ప్రమాణికంగా తీసుకున్నాయి. క్షేత్రస్థాయిలో పంట నష్టం జరిగితే వాతావరణ కేంద్రం నుంచి సరైన సమాచారం వెళ్లకపోవడంతో ఇన్సూరెన్సు సంస్థలు పరిహారం ఇచ్చేందుకు నిరాకరించాయి. దీనిపైనా రైతులు ఆందోళనలు చేశారు. అయినా ఇన్సూరెన్స్ సంస్థలు పట్టించుకోకపోవడంతో ఈ పథకాన్ని కూడా గత ప్రభుత్వం రద్దు చేసింది. ఊరిస్తున్న పంటల బీమా పథకం ఇప్పటివరకు ఉన్న బీమా పథకాలు రైతులకు న్యాయం చేయలేకపోయాయని, కొత్తగా ఆమోదయోగ్యమైన బీమా పథకాన్ని తీసుకొస్తామని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. గ్రామం యూనిట్గా కాకుండా రైతును యూనిట్గా తీసుకుంటామని, ఏ పంటకు నష్టం జరిగినా ఇన్సూరెన్సు సంస్థ పరిహారం అందించేలా చూస్తామని చెబుతోంది. ఇన్సూరెన్సు సంస్థలకు ప్రీమియం కూడా చెల్లిస్తామని చెబుతున్నా.. ఎప్పుడు అమల్లోకి వస్తుందో తెలియడం లేదు. తాజాగా వడగండ్లతో నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పరిహారం ఇవ్వాలి ఇన్సూరెన్స్ పథకాలు అమల్లో లేకపోవడంతో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం ఎకరాకు రూ.20వేల చొప్పున పరిహా రం అందించి రైతులను ఆదుకోవాలి. ఇది నాలాంటి రైతులందరి సమస్య. పంటలు సాగు చేసిన చాలామంది రైతులు పంటలు నష్టపోయి ఇబ్బంది పడుతున్నారు. – బందెల మల్లయ్య, చల్గల్, జగిత్యాల ప్రభుత్వానికి నివేదిస్తాం జిల్లాలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తాం. రైతులకు ఆమోదయోగమైన ఇన్సూరెన్స్ పథకాలు తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ విధానం అమల్లోకి వస్తే రైతులందరికీ న్యాయం జరుగుతుంది. – భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి, జగిత్యాల -
అప్పులబాధతో ఒకరు.. అనారోగ్యంతో మరొకరు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): వేర్వేరు కారణాలతో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని ఇందిరమ్మకాలనికి చెందిన నేత కార్మికుడు పరికిపెల్లి రాజు (55)కు భార్య పద్మ, కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అందరి వివాహాలు జరిపించగా రూ.5 లక్షలమేర అప్పు అయ్యింది. కొద్దిరోజులుగా పవర్లూమ్స్ పని దొరక్కపోవడంతో మనస్తాపానికిగురై మద్యానికి బానిసయ్యాడు. సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో గొడవపడిన రాజు మనస్తాపంతో బాత్రూమ్లు కడిగేందుకు ఉపయోగించే యాసిడ్ తాగాడు. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మంగళవారం మృతిచెందాడు. మండలంలోని చీర్లవంచ గ్రామానికి చెందిన మొగిలోజి విష్ణు (45) వడ్రంగి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.. రెండేళ్లక్రితం పక్షవాతం రావడంతో పనిచేయలేని పరిస్థితిలో కాలం వెళ్లదీస్తున్నాడు. అతడికి భార్య కవిత, కొడుకు, పుట్టుకతో అంధురాలైన కూతురు ఉన్నారు. మంగళవారం కవిత ఉపాధిహామీ పనికి వెళ్లగా ఇంటిలోని బాత్రూమ్లో తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు కేసులు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తంగళ్లపల్లి మండలంలో ఇద్దరి బలవన్మరణం -
కారును ఢీకొన్న టిప్పర్.. పాస్టర్ దుర్మరణం
ఫెర్టిలైజర్సిటీ/ఎల్కతుర్తి: టిప్పర్.. కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి శివారులో జరిగింది. ఎస్సై సాయిబాబు కఽథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ జ్యోతినగర్కు చెందిన కనుకపుడి కరుణాకర్(58) రామగుండం కార్పొరేషన్ 39వ డివిజన్ గౌతమినగర్లోని గ్లోరియస్ మినిసీ్ట్రస్ చర్చిలో పాస్టర్. సోమవారం రాత్రి ఒంటి గంటకు కారులో ఎల్కతుర్తి నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యంలోని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి శివారులోని ఛాయ్ విహార్ సమీపంలో ముల్కనూరు వైపు నుంచి వస్తున్న టిప్పర్ ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. ఈ ఘటనలో కారు నడుపుతున్న కరుణాకర్కు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. పాస్టర్ కరుణాకర్ మృతికి ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ సంతాపం తెలిపారు. -
పెండింగ్ కేసులు పరిష్కరించాలి
● సీపీ గౌస్ ఆలం హుజూరాబాద్: హుజూరాబాద్ డివిజన్ పరిధిలోని ఆయా పోలీస్స్టేషన్లలో నమోదైన పెండింగ్ కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని సీపీ గౌస్ ఆలం ఆదేశించారు. హుజూరాబాద్ ఏసీపీ కార్యాలయంలో డివిజన్ పోలీసులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పిటీషన్ మేనేజ్మెంట్ సిస్టంను సరైన పద్ధతిలో అవలంబించాలన్నారు. సీఐలు తమ పరిధిలోని పోలీసుస్టేషన్లను తరచూ సందర్శించాలన్నారు. రికార్డుల నిర్వహణ, కేసుల నమోదు వివరాలు సరైన పద్ధతిలో ఉండాలన్నారు. సీసీటీఎన్ఎస్, రిసెప్షన్, కోర్టుడ్యూటీ, డ్రంక్ అండ్డ్రైవ్ తనిఖీలు, బీట్, పెట్రోలింగ్, పాయింట్ బుక్ల ఏర్పాటు, సమన్ల విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. గంజాయి, ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్బియ్యం, పేకాట స్థావరాలపై నిఘా పెంచాలన్నారు. పాఠశాల, కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ, సీఐలు రవి, కిషోర్, వెంకట్, సంతోష్కుమార్, రమేశ్, సరిలాల్ పాల్గొన్నారు. -
గడువులోగా ఆస్తిపన్ను చెల్లించాలి
● నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్కరీంనగర్ కార్పొరేషన్: గడువులోగా ఆస్తిపన్ను చెల్లించి, నగర అభివృద్ధికి సహకరించాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహాత్ బాజ్పేయ్ ప్రజలకు పిలుపునిచ్చారు. మరో ఆరు రోజులే గడువు ఉన్నందున ఆ లోగా పన్ను చెల్లించాలన్నారు. మంగళవారం నగరంలోని పలువురు మొండి బకాయిదారుల ఆస్తులను ఆమె సందర్శించారు. వారిపై ఒత్తిడి పెంచి పన్నులు చెల్లించేలా చేశారు. మరికొంతమందరికి హెచ్చరికలు జారీ చేశారు. నల్లా కనెక్షన్లు తొలగించారు. నగరపాలకసంస్థ కార్యాలయంలో రెవెన్యూ విభాగంతో ఆస్తి పన్నుల వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పన్నులు చెల్లించని మొండి బకాయిదారులపై మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పన్నులు కట్టని వారి ఇళ్లకు నల్లా కలెక్షన్లు తొలగిస్తున్నామన్నారు. నగర ప్రజలు పన్నుల వడ్డీ భారం పెంచుకోకుండా సకాలంలో చెల్లించాలని కోరారు. కార్యాలయంలో ప్రస్తుతం ఉన్న రెండు కౌంటర్లకు గాను అదనంగా మరో కౌంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి, ఆర్వో భూమానందం పాల్గొన్నారు. స్వచ్ఛ కరీంనగర్గా మార్చేందుకు సహకరించాలి స్వచ్ఛ కరీంనగర్గా మార్చేందుకునగర ప్రజలు సహకరించాలని కమిషనర్ చాహత్ బాజ్పేయ్ కోరారు. మంగళవారం నగరంలోని వావిలాలపల్లితో పాటు పలుకాలనీల్లో స్వచ్ఛ సర్వేక్షణ్పై అవగాహన కల్పించారు. తడిపొడి చెత్తను వేరు చేయడం, తడి చెత్తను సేంద్రియ ఎరువులుగా మార్చడం, పొడి చెత్తలో ప్లాస్టిక్ వ్యర్థాలు,అట్టముక్కలను డీఆర్సీ సెంటర్, ఆర్ఆర్ఆర్ సెంటర్లకు తరలించడం, స్వచ్చ సర్వేక్షణ్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించడం తదితర అంశాలను ఆమె వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వేక్షన్ 2024 లో నగరపాలక సంస్థ కు మెరుగైన ర్యాకు సాధించేలా మహిళలు కృషి చేయాలన్నారు. -
ఎరువుల నిల్వల్లో తేడాలుంటే చర్యలు
కరీంనగర్రూరల్: ఈ పాస్ మిషన్, స్టాక్ రిజి స్టర్ ప్రకారం ఎరువుల నిల్వలు సక్రమంగా ఉండేలా డీలర్లు సరి చూసుకోవాలని, తేడాలుంటే తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి అన్నారు. మంగళవారం కరీంనగర్ మండలం నగునూరు, చెర్లభూత్కూర్లోని కరీంనగర్ సింగిల్ విండో గోదాం, దుర్శేడ్ సహకార సంఘం, మొగ్ధుంపూర్, చేగుర్తిలోని ఎరువుల దుకాణాలను తని ఖీ చేశారు. ఈ పాస్ మిషన్లో నమోదైన ఎరువుల విక్రయాల వివరాలు స్టాక్ రిజిస్టర్లో ఉండాలని, నిల్వ ఉన్న ఎరువులకు సరిపోవాలని సూచించారు. ఒక రైతుకు రోజుకు 20, నెలకు 50 ఎరువుల బస్తాలను మాత్రమే విక్రయించాలని, ఎక్కువగా ఉంటే తగిన చర్యలు చేపడుతామని తెలిపారు. డీఏవో వెంట ఏడీఏ రణధీర్, ఏవో సత్యం ఉన్నారు. రైతులకు అవగాహన కల్పించాలి రైతువేదికల్లో నిర్వహించే రైతునేస్తం కార్యక్రమంపై అవగాహన కల్పించి రైతులు ఎక్కువసంఖ్యలో హాజరయ్యేలా ఏఈవోలు చర్యలు చేపట్టాలని డీఏవో భాగ్యలక్ష్మి అన్నారు. మంగళవారం కరీంనగర్ మండలం చామనపల్లి రైతువేదికలో నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో డీఏవో పాల్గొన్నారు. వేసవిలో పశుగ్రాస యాజమాన్యంపై ప్రధాన శాస్త్రవేత్త బాలాజీ నాయక్, పండ్లతోటలపై విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధిపై హర్టికల్చర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ఫ్రొఫెసరు శంకర్స్వామి ప్రసంగించారు. -
తాగునీటికి తండ్లాటే..
కరీంనగర్బుధవారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2025● ఎల్ఎండీలో పడిపోతున్న నీటిమట్టం ● కొద్ది రోజుల్లోనే ప్రతీరోజు సరఫరాకు ఫుల్స్టాప్ ● ఇప్పటికే పలు ప్రాంతాల్లో రోజు విడిచి సరఫరా ● కొన్ని డివిజన్లలో రంగు మారుతున్న నల్లానీళ్లు‘దళితబంధు’ విడుదల చేయండిధాన్యం కొనుగోళ్లకు సిద్ధం చేయండి7క్వింటాల్ పత్తి రూ.7,240జమ్మికుంట: జమ్మికుంట మార్కెట్లో క్వింటాల్ పత్తి రూ.7,240 పలికింది. మంగళవారం మార్కెట్కు 10 వాహనాల్లో 165క్వింటాల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.7,200, కనిష్ట ధర రూ.7,150 పలికింది.ప్రస్తుతం తాగునీటి సరఫరా జరుగుతున్న తీరు హౌసింగ్బోర్డు రిజర్వాయర్: 24 గంటలు అంబేడ్కర్, రాంపూర్: రోజు విడిచి రోజు(కొన్ని ప్రాంతాల్లో రెండు రోజులకోసారి) కోర్టు, మార్కెట్: సవరన్స్ట్రీట్, వావిలాలపల్లి, క్రిస్టియన్కాలనీ తదితర కాలనీల్లో రోజు విడిచి రోజు భగత్నగర్, గౌతమినగర్, ఎస్ఆర్ఆర్, రాంనగర్, మల్కాపూర్: ప్రతీరోజు నీటి సరఫరా (వీటి పరిధిల్లోనూ కొన్ని ప్రాంతాల్లో రోజు విడిచి రోజు)నల్లా నీళ్లునీళ్లు సరిపోవడం లేదు కిసాన్నగర్లో మాకు రోజు విడిచి రోజు నల్లా నీళ్లు ఇస్తున్నారు. 45ని మిషాలు మాత్రమే నీళ్లు ఇస్తుండడంతో సరిపోవడం లేదు. ప్రెషర్ కూడా సక్రమంగా రావడం లేదు. నీళ్ల రంగు మారుతోంది. రోజు విడిచి రోజు ఇచ్చినా సరే కాని, సమయం మాత్రం పెంచాలి. ఫ్రెషర్తో వచ్చేలా, కలుషితం కాకుండా చూడాలి. – సాంబయ్య, కిసాన్నగర్మూడు రోజులకోసారి మా ప్రాంతంలో మూ డు రోజులకోసారి నల్లా ఇస్తున్నారు. అది ఎప్పుడిస్తరో తెలీదు. వచ్చిన నల్లా కూడా ప్రెషర్ ఉండడం లేదు. ఎల్ఎండీ పక్కనే ఉన్నం కానీ.. మాకు నీళ్లు మాత్రం రావడం లేదు. అధికారులు, సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా ఫలితం ఉండడం లేదు. ఎండాకాలం మరింత ఇబ్బంది పడాల్సి వచ్చేట్లుంది. – వై.సునీత, కోతిరాంపూర్నగరంలో రిజర్వాయర్ల వివరాలు హైలెవెల్ జోన్ పరిధి కోర్టు రిజర్వాయర్ 2 ఎస్ఆర్ఆర్ 2 అంబేడ్కర్ 2 రాంనగర్ 3 మల్కాపూర్ 1 లో లెవెల్ జోన్ పరిధి భగత్నగర్ 1 కట్టరాంపూర్ 2 గౌతమినగర్ 1 మార్కెట్ 2 హౌసింగ్బోర్డుకాలనీ 2 కరీంనగర్ కార్పొరేషన్: ఈ వేసవి కాలంలో నగరానికి తాగునీటి తండ్లాట తప్పేలా లేదు. సిటీ తాగునీటి సరఫరాకు ఏకై క వనరైన ఎల్ఎండీలో నీటిమట్టం వేగంగా తగ్గుతుండడంతో స్వల్పకాలంలోనే ప్రతిరోజు నీటి సరఫరాకు ఫుల్స్టాప్ పడనుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రోజు విడిచి రోజు నీటి సరఫరా జరుగుతుండగా, లీకేజీలు, మోటార్లతో నల్లా తగినంత ప్రెషర్ రావడం లేదు, రంగు, రుచి కూడా మారుతోంది. ఒక్కోచోట ఒక్కో రకంగా... ఎల్ఎండీ నుంచి రా వాటర్ను ఫిల్టర్బెడ్ వద్ద ఫిల్టర్ చేసి సంప్ నుంచి 17 రిజర్వాయర్ల ద్వారా నివాసాలకు సరఫరా చేస్తుంటారు. ఒక్కో చోట ఒక్కో రకంగా నీటి సరఫరా జరుగుతోంది. పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన హౌసింగ్బోర్డు రిజర్వాయర్ పరిధిలో 24 గంటలు, భగత్నగర్, ఎస్ఆర్ఆర్,రాంనగర్,గౌతమినగర్, మల్కాపూర్ రిజర్వాయర్ల పరిధిలో ప్రతి రోజు సరఫరా చేస్తుండగా, అంబేడ్కర్, రాంపూర్ రిజర్వాయర్ల పరిధిలో పూర్తిగా, మార్కెట్, కోర్టు రిజర్వాయర్ల పరిధిల్లోని కొన్నికాలనీల్లో రోజు విడిచి రోజు తాగునీరు అందిస్తున్నారు. ప్రెషర్ లేదు.. నిర్వహణ లోపంతో నగరంలో తాగునీటి సరఫరా అస్తవ్యస్థంగా మారింది. సూర్యనగర్, మారుతినగర్, కిసాన్నగర్ తదితర కాలనీల్లో నల్లా నీళ్లు సన్నగా వస్తున్నాయి. కిసాన్నగర్లో రంగుమారుతున్నాయి. నా సిరకం పైప్లైన్లు, వాల్వ్లతో లీకేజీ లు పెరుగుతుండగా, పలుచోట్ల వి ద్యుత్మోటార్లు అమర్చి నీటి చౌర్యానికి పాల్పడుతుండడంతో ప్రెషర్ తగ్గిపోతోంది. లీకేజీలు అరికట్టడంలోఅధికారులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలున్నా యి. లో లెవెల్ జోన్ పరిధిలో ఎక్కువగా లీకేజీలు కనిపిస్తున్నా యి. అంబేడ్కర్ రిజర్వాయర్ పరిధిలో గతంలో 45 నిమిషాల పాటు ప్రతీరోజు తాగునీటి సరఫరా ఇచ్చే వాళ్లు. ప్రస్తుతం రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్నా, అదే 45 నిమిషాల సమయం పాటించడం సమస్యగా మారింది. నీటి కమిటీలెక్కడ?కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ మిత్ర పథకంలో భాగంగా మహిళా సంఘాలతో ఏర్పాటు చేసిన కమిటీల జాడ కనిపించడం లేదు. గత నెలలో హౌసింగ్బోర్డు, రాంనగర్,మార్కెట్, మల్కాపూర్,కోర్టు రిజర్వాయర్లను పైలెట్ ప్రాజెక్ట్గా చేపట్టి కమిటీలు ఏర్పాటు చేశారు. ఎంపిక చేసిన రిజర్వాయర్ల పరిధిలో ఇళ్లలోకి వెళ్లి నల్లా కనెక్షన్లు నిర్ధారించడం, లీకేజీలు గుర్తించడం, మరమ్మతులు చేయించడం, నీటి నమూనా నాణ్యత సేకరించాలని కమిషనర్ చాహత్ బాజ్పేయ్ ఆదేశించారు. కానీ ఈ కమిటీలు కాగితాలు దాటి రావడం లేదు. జాగ్రత్త పడకపోతే ఇక్కట్లే ఎల్ఎండీలో నీటిమట్టం తగ్గుతుండడంతో త్వరలోనే నగరమంతటా రోజు విడిచి రోజు నీటి సరఫరా చేయాల్సిన పరిస్థితి రానుంది. లీకేజీలు సరిచేయడంతో పాటు, ఫిల్టర్ బెడ్ వద్ద విద్యుత్ మోటార్లు, బూస్టర్పంప్ల పనితీరుపై దృష్టి పెడితేనే రోజు విడిచి రోజు అయినా తాగునీటి సరఫరా సక్రమంగా జరిగే అవకాశం ఉంది. ఇదిలాఉంటే నగరంలోని పాత విలీన ప్రాంతాలైన సరస్వతినగర్, తీగలగుట్టపల్లి తదితర ప్రాంతాల్లో నల్లా కనెక్షన్ లు లేకపోవడంతో ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది. నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న దా దాపు 40 మంది ఔట్సోర్సింగ్ కార్మికులను కాలపరిమితి ముగియడంతో తొలగించారు. వారి స్థానంలో ఎవరినీ నియమించుకోకపోవడం కూడా తాగునీటి సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉంది.ఫిల్టర్బెడ్న్యూస్రీల్ఎల్ఎండీలో నీటి మట్టం వివరాలు ప్రస్తుత నీటిమట్టం(25, మార్చి) 6.816 టీఎంసీలు అవుట్ఫ్లో 5 వేల క్యూసెక్కులు(కాకతీయ కాలువ, వరంగల్) ఇన్ఫ్లో 2450 క్యూసెక్కులు (మిడ్మానేరు) నగరంలో నీటి సరఫరాకు ఉండాల్సిన నీటిమట్టం 12 టీఎంసీలు ప్రతీరోజు ఎల్ఎండీలో తగ్గుతున్న నీటిమట్టం 0.2 టీఎంసీ -
పక్కా గణాంక మదింపుతోనే మెరుగైన ఫలితాలు
కరీంనగర్ అర్బన్: గణాంక మదింపులో పక్కాగా వ్యవహరిస్తేనే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని ముఖ్య ప్రణాళిక అధికారి పి.దశరథ్ అన్నారు. మంగళవారం స్థానిక గణాంక భవన్లో జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించగా అనంతరం గ్రామపంచాయతీ అకౌంట్స్, మండల ప్రజాపరిషత్ అకౌంట్స్పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని మండల ప్రణాళిక, గణాంక అధికారులతో పాటు సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. రెవెన్యూ విలేజ్, నీటి వనరుల వారీగా పంటలు, విత్తిన విస్తీర్ణ వివరాలపై చర్చించారు. శ్వేతపత్రం విడుదల చేయాలి హుజూరాబాద్: రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ హుజూరాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వన్నేషన్– వన్ ఎలక్షన్పై వర్క్షాప్ జరిగింది. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వన్ నేషన్– వన్ ఎలక్షన్ (జమిలి ఎన్నికలు) దేశానికి ఎంతో అవసరమన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు, 420 హామీలు, అడ్డగోలు వాగ్దానాలతో ప్రజలను నయవంచనకు గురి చేస్తోందన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు, సబ్బని రమేశ్, బోరగాల సారయ్య, గంగిశెట్టి ప్రభాకర్, రావుల వేణు, అంకటి వాసు, యాంసాని శశిధర్, యాళ్ల సంజీవరెడ్డి, కొలిపాక శ్రీనివాస్ పాల్గొన్నారు. ‘సునీల్రావుతో సంజయ్ అప్రమత్తంగా ఉండాలి’కరీంనగర్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ర్యాలీకి యువత నుంచి వచ్చిన అపూర్వ స్పందన చూసి ప్రతిపక్ష నాయకులు తడబడిపోయారని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ అన్నారు. మంగళవారం 37వ డివి జన్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కేటీఆర్ను విమర్శించే స్థాయి మాజీ మేయర్ సునీ ల్రావుకు లేదన్నారు. సునీల్రావు అవినీతి పరుడని, కేంద్రమంత్రి సంజయ్ అప్రమత్తంగా ఉండాలన్నారు. కరీంనగర్ అభివృద్ధి పూర్తి గా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ల నేతృత్వంలోనే సాధ్యమైందని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ సహకారం ఏమాత్రం లేదని విమర్శించారు. 15 నెలలుగా మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ కరీంనగర్ కోసం ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై బండి సంజయ్కి మాట్లాడే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్రెడ్డి, నగర యూత్ ప్రధాన కార్యదర్శి బోనకుర్తి సాయికృష్ణ, నగర మైనార్టీ అధ్యక్షుడు షౌకత్, నగర విద్యార్థి విభాగం అధ్యక్షుడు బొంకూరి మోహన్ పాల్గొన్నారు. ‘ఆరోగ్య మహిళ’ను సద్వినియోగం చేసుకోవాలి కరీంనగర్టౌన్: మహిళల ఆరోగ్య భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆరోగ్యమహిళ కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరు సద్విని యోగం చేసుకోవాలని డీఎంహెచ్వో వెంకటరమణ సూచించారు. బుట్టి రాజారాంకాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న ఆరోగ్యమహిళా హెల్త్క్యాంప్ను మంగళవారం పరిశీలించారు. మందులు, రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ ప్రతీ మహిళకు అన్ని అనారోగ్య సమస్యలకు పరీక్షలు చేసి, మందులు అందించడం జరుగుతోందన్నారు. తీగలగుట్టపల్లి బస్తీ దవాఖానా ఆరోగ్య మహిళా హెల్త్క్యాంపును తనిఖీ చేశారు. వైద్యులు సల్మా, లావణ్య, డీపీవో స్వామి తదితరులు పాల్గొన్నారు. -
● రెండోవిడత నిలువుదలపై హైకోర్టుకు లబ్ధిదారుడు ● వెంటనే నిధులు అందజేయాలని వినతి ● రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన బకాయిలు మొత్తం రూ.324 కోట్లు ● అందులో రూ.265 కోట్లు హుజూరాబాద్వే
సాక్షిప్రతినిధి,కరీంనగర్: దళితుల సామాజిక, ఆర్థి క స్థితిగతులను మార్చాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం దళితబంధు. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసిన ఈ పథకం ప్రభుత్వం మా రడంతో నిలిచిపోయింది. అమలు చేయాలని ప్రభుత్వం నుంచి తాజా ఆదేశాలు ఉన్నా.. జిల్లాస్థాయిలో అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు హైకోర్టు గడప తొక్కింది. తనకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలని లబ్ధిదారుడు ఈ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ నేపథ్యంలో రెండో విడత బకాయిల విడుదలపై మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దాదాపు రూ.324 కోట్లు విడుదల కావాల్సి ఉండగా ఒక్క కరీంనగర్ జిల్లాలోనే రూ.265 కోట్ల వరకు బకాయిలు ఉండటం గమనార్హం. అసలేం జరిగింది? 2021 ఆగస్టులో ఈ పథకాన్ని అప్పటి సీఎం కేసీ ఆర్ హుజూరాబాద్లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. దాదాపు 18,000 కుటుంబాలను అర్హులుగా గుర్తించారు. ప్రభుత్వం రూ.2500 కోట్ల వరకు విడుదల చేసింది. వీరికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దాదాపు రూ.18,00 కోట్లకు పైగా నిధులు విడుదల చేసి, వివిధ యూనిట్లను గ్రౌండింగ్ చేశారు. ఇందులో అనేక రకాల వ్యాపారాలు, వాహనాల యూనిట్లు ఉన్నాయి. రెండో విడతలో దాదాపు 7000 మంది ఎంపికయ్యారు. వీరికి రూ.265.62 కోట్లు రిలీజ్ అయ్యాయి. వీటిని ప్రభుత్వం ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాల్లో వేసింది. ఈ డబ్బులను డ్రా చేయకుండా ఆపింది. ఇందులో లబ్ధిదారులకు రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు బకాయిలు విడుదల కావాల్సి ఉంది. గతేడాది జూన్లోనే రెండో విడత బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో అమలుకాకపోవడంతో లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. హుజురాబాద్లోనే రూ.265 కోట్లు ఆదిలాబాద్ రూ.68.08 లక్షలు, భద్రాద్రి కొత్తగూడెం రూ.69.48 లక్షలు, హన్మకొండ రూ.33.75 లక్షలు, హైదరాబాద్ రూ.10.20 లక్షలు, జగిత్యాల రూ. 42.76లక్షలు, జనగామ రూ.21.84లక్షలు, జయశంకర్భూపాలపల్లి రూ. 12.10 లక్షలు, జోగుళాంబ గద్వాల రూ. 5.80, కామారెడ్డి రూ. 8.10 లక్షలు, ఖమ్మం రూ.2.41 కోట్లు, కొమురంభీమ్(ఆసిఫాబాద్) రూ. 48.59 లక్షలు, మహబూబాబాద్ రూ. 31.79 లక్షలు, మహబూబ్నగర్ రూ. 31.79 లక్షలు, మంచిర్యాల రూ.3.90 లక్షలు, మెదక్ రూ.0.57 లక్షలు, మేడ్చల్–మల్కాజిగిరి రూ.40.46 లక్షలు నాగర్కర్నూల్ రూ.36.63 లక్షలు, నల్లగొండ రూ.25.77లక్షలు, నిజామాబాద్ రూ.4.92 లక్షలు, పెద్దపల్లి రూ.84.37లక్షలు, రాజన్నసిరిసిల్ల రూ. 79.00 లక్షలు రంగారెడ్డి రూ.7.99 లక్షలు సంగారెడ్డి రూ.44.63, సిద్దిపేట రూ. 55.80లక్షలు, సూర్యాపేట్ రూ.12.60లక్షలు, వికారాబాద్ రూ.66.46 లక్షలు, వనపర్తి రూ.14.90 లక్షలు, యాద్రాద్రి భువనగిరి రూ.1.18 కోట్లు కాగా మొత్తం రూ.11.93 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇవి కాక, పైలెట్ ప్రాజెక్టుల కింద హుజూరాబాద్ ఏసీ(కరీంనగర్) రూ.265.62 కోట్లు, హుజూరాబాద్ ఏసీ(హన్మకొండ) రూ.15.57 కోట్లు, కామారెడ్డి(నిజాంసాగర్)1.20 కోట్లు, ఖమ్మం(చింతకాని) రూ.28.05 కోట్లు నాగర్కర్నూల్(చారగొండ) రూ.1.32 కోట్లు, సూర్యపేట్(తిరుమలగిరి) రూ.90.61 లక్షలు, వాసాలమర్రి(యాద్రాద్రి) రూ.13.57లక్షలు కాగా.. మొత్తం రూ.324.75 కోట్లు నిధులు ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు విడుదల కావాల్సి ఉంది. -
● కేంద్రాల్లో సౌకర్యాలు సమకూర్చండి ● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ అర్బన్: యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కొనుగోలు కమిటీ సభ్యులను కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కలెక్టరేట్లో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ధాన్యం పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాతనే హార్వెస్ట్ చేసేలా రైతులకు, హార్వెస్టింగ్ మిషన్ ఆపరేటర్లకు అవగాహన కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకపు యంత్రాలు, తేమ యంత్రాలు, గన్నీ సంచులు, టార్ఫాలిన్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇప్పుడున్న ప్యాడీ క్లీనర్లతో పాటు మరో 15 కొనుగోలు చేయాలని సూచించారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో 24గంటలు సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు తర్వాత వెంటనే వివరా లు ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. రైతుకు సకాలంలో సొమ్ము అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సన్న, దొడ్డు రకాల ధాన్యాలు వేర్వేరు ప్రదేశాల్లో ఉండేలా చూడాలని సూచించారు. ఎండాకాలం దృష్ట్యా రైతులకు నీడ, తాగునీటి సౌకర్యం ఉండేలా చూడాలని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, జిల్లా పౌరసరఫ రాల సంస్థ మేనేజర్ మంగళారపు రజనీకాంత్, పౌరసరఫరాల అధికారి నర్సింగరావు పాల్గొన్నారు. -
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
కోరుట్ల: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేసినట్లు మెట్పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు తెలిపారు. సోమవారం ఆయన కోరుట్ల సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మెట్పల్లికి చెందిన గోల్కోండ హరీశ్, బొల్లంపల్లి అభిషేక్ మేడిపల్లి శివారు కట్లకుంట రోడ్డు సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో మేడిపల్లి ఎస్సై శ్యాంరాజ్ వెళ్లి వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. వారు పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. హరీష్, అభిషేక్ నుంచి 2.200కిలోల గంజాయి లభించింది. దాని విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుంది. నిందితులు ఒడిశాకు చెందిన దీపక్ అలియాస్ సూరజ్ నుంచి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి చిన్నచిన్న ప్యాకెట్లలోకి మార్చి జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల్లో అమ్ముతున్నారని డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చురుకుగా వ్యవహరించిన సీఐ సురేష్బాబు, ఎస్సైలు శ్యాంరాజ్, శ్రీకాంత్, కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, రాజశేఖర్, మహేశ్వర్, భగవాన్కు నగదు రివార్డులు అందించినట్లు డీఎస్పీ తెలిపారు. ‘ఉపాధి’ కూలీకి పాముకాటుకథలాపూర్: కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీ తోట మమత సోమవారం పని ప్రదేశం వద్ద పాము కాటుకు గురైంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామశివారు ఈర్లగుట్ట వద్ద కందకాలు తవ్వే పనులకు మమత వెళ్లింది. తోటి కూలీలతో కలిసి కందకాలు తవ్వుతుండగా.. కాలుపై పింజర పాము కాటు వేయడంతో అస్వస్థతకు గురైంది. తోటి కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్ ఆమెను చికిత్స నిమిత్తం కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. టెక్నికల్ అసిస్టెంట్ అంబాజీ ఆసుపత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. పెట్రోల్ బంక్ సీజ్ కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): లైసెన్స్ లేకుండా నడుపుతున్న పెట్రోల్ బంక్ను సీజ్ చేసినట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్ తెలిపారు. మండల కేంద్రంలోని భార్గవి సర్వీస్ స్టేషన్ను సోమవారం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్రభంగా లైసెన్స్ లేదని గుర్తించి సీజ్ చేశారు. అనంతరం రాజేందర్ మాట్లాడుతూ, పెట్రోల్ బంక్ యజమాని వి.రమేశ్.. ఫారం– బీ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నట్లు తేలిందన్నారు. బంక్లో రూ.20లక్షల 37 వేల 248 విలువైన 9,992 లీటర్ల పెట్రోల్, 10,022 లీటర్ల డీజిల్ కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. తనిఖీల్లో డిప్యూటీ తహసీల్దార్లు సంతోష్సింగ్, ఠాగూర్, రవీందర్, అధికారులు పాల్గొన్నారు. -
రైల్వేస్టేషన్ నిర్మించాలి
ప్రస్తుతం 1.78 కి.మీ. పొడవైన ఈ మార్గం సింగిల్ లైన్ త్వరలో డబుల్ లైన్ కానుంది. ఇప్పటికే రెండో లైన్ కోసం రైల్వేశాఖ టెండర్లు పిలిచింది. త్వరలోనే ఈ లైన్ పనులు కూడా పూర్తయి అందుబాటులోకి రానుంది. కోవిడ్ సమయంలో పెద్దపల్లి బైపాస్ రైల్వేలైన్ పనులు మొదలయ్యాయి. చీకురాయి పరిసర గ్రామాల్లో భూసేకరణ కోసం రైల్వే అధికారులు గ్రామసభలు నిర్వహించి రెండేళ్ల క్రితం పనులు ప్రారంభించగా ఇప్పటికీ పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ లైన్ వద్ద కేవలం క్యాబిన్ మాత్రమే ఉంది. త్వరలో ప్రయాణికులకు వీలుగా రైల్వేస్టేషన్ కూడా నిర్మించే ఆలోచనలో అధికారులు ఉన్నారు. చీకురాయి సమీపంలోని రైల్వేబైపాస్ ప్రాంతంలో పెద్దపల్లిటౌన్ రైల్వేస్టేషన్ నిర్మించాలి. దీంతో ఇతర ప్రాంతాల నుంచి పెద్దపల్లి పరిసర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. రైల్వే బైపాస్ అందుబాటులోకి వస్తే కరీంనగర్, పెద్దపల్లి ప్రాంతాల నుంచి ఇటు నిజామాబాద్.. అటు ముంబయి తదితర ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. – కమల్కిశోర్ శారడ, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పెద్దపల్లిత్వరలో డబుల్ లైన్..! -
విద్యారంగంలో అద్భుతాలు సృష్టిస్తాం
సుల్తానాబాద్(పెద్దపల్లి): భవిష్యత్లో విద్యా రంగంలో మరిన్ని అద్భుతాలు సృ ష్టిస్తామని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి పట్టణంలోని అల్ఫోర్స్ పాఠశాలలో సమ్మోహనం వార్షికోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. విద్యాసంస్థల అధినేత మాట్లాడుతూ, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తామన్నారు. పోటీ ఏదైనా అల్ఫోర్స్ విద్యార్థులే ముందుంటున్నారని ఆయన అన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు బానిసలై తమ భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ రంగాల్లో పతకాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య మాట్లాడు, తూగ్రామీణ ప్రాంతాల్లో సైతం కార్పొరేట్ విద్య అందిస్తున్న అల్ఫోర్స్ విద్యా సంస్థలను ప్రత్యేకంగా అభినందించాల్సిందేనన్నారు. ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయిరి మహేందర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బిరుదు సమత, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కందుకూరి ప్రకాశ్రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలుక సతీశ్, ప్రిన్సిపాల్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అల్ఫోర్స్లో అట్టహాసంగా ‘సమ్మోహనం’ -
సమస్యల పరిష్కారానికి ఆమరణదీక్ష
కోల్సిటీ(రామగుండం): డివిజన్ సమస్యల పరిష్కారం కోసం మేకల అబ్బాస్ యాదవ్ మండుటెండను సైతం లెక్క చేయకుండా సోమవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు. డివిజన్ యువకులు మద్దతుగా నిలిచారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నగర పాలక సంస్థ 48వ డివిజన్ మారుతీనగర్లోని మున్సిపల్ వాటర్ ట్యాంక్ ఎదుట రోడ్డుపై బైఠాయించిన అబ్బాస్.. సమస్యల పరిష్కారంలో అధికారులు హామీ ఇచ్చేంత వరకు నిరసన దీక్ష విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్నాడు. అబ్బాస్ మాట్లాడుతూ, అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లు, అధికారులు అసంపూర్తిగా వదిలేశారన్నారు. వాటర్ ట్యాంక్ నుంచి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వరకు రోడ్డు నిర్మించాలని, రాష్ట్రంలోనే దుమారం లేపిన స్క్రాప్ కుంభకోణం కేసు పరిష్కరించి, ఆ నిధులను డివిజన్ అభివృద్ధికి వినియోగించాలని డిమాండ్ చేశారు. వెటర్నరీ ఆస్పత్రి భవనంలోని గదిని మాజీ కార్పొరేటర్ భర్త పొన్నం లక్ష్మణ్ అక్రమంగా తన సొంత పనులకు వాడుకుంటున్నాడని, వెంటనే ఆ గదిని మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకొని వెటర్నరీ హాస్పటల్కు కేటాయించాలని డిమాండ్ చేశారు. వెటర్నరీ ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగుపర్చాలని కోరారు. దీక్ష విరిమింపజేయడానికి పోలీసులు ప్రయత్నం చేసినా.. వినలేదు. మున్సిపల్ అధికారులు, ఎమ్మెల్యే హామీ ఇచ్చేంతవరకు నిరసన విరమించేది లేదని చెప్పడంతో పోలీసులు వెనుదిరిగి వెళ్లిపోయారు. స్క్రాప్ కుంభకోణంలో నిధుల రికవరీకి డిమాండ్ మండుటెండలో యువకుని నిరాహార దీక్ష -
ఆర్జిత సేవలు బంద్
వేములవాడ: సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధిలో ఈనెల 30 నుంచి ఏప్రిల్ 6 వరకు ఎనిమిది రోజులపాటు శ్రీస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న క్రమంలో అభిషేకాలు, నిత్యకల్యాణాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో కొప్పుల వినోద్రెడ్డి సోమవారం ప్రకటించారు. ఆర్అండ్ఆర్ కమిషనర్(ఐఏఎస్) టి.వినయ్కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం దర్శించుకున్నారు. వేములవాడ అర్బన్ తహసీల్దార్ విజయ్ప్రకాశ్రావు, ప్రొటోకాల్ ఏఈవో అశోక్, పర్యవేక్షకులు శ్రీనివాస్శర్మ, శ్రీకాంతాచారి, ఆలయ ఇన్స్పెక్టర్ రాజేందర్, గొట్టం గిరి పాల్గొన్నారు. కల్యాణోత్సవం సందర్భంగా నిర్ణయం -
భవిష్యత్ అంధకారం
బస్ షెల్టరే నివాసం.. రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం ముబారక్నగర్కు చెందిన కప్పల లక్ష్మి(80) కూలీ పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటోంది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరందరికీ వివాహం జరిపించింది. ఇద్దరు కుమారులు కొన్నేళ్ల క్రితమే మృతిచెందారు. పెద్ద కూతురు–అల్లుడు స్థానికంగా ఓ గుడిసెలో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు. రెండోకూతురు మాటూరి పద్మ తన అత్తగారిల్లు ములుగు జిల్లా బయ్యారంలో ఉండేది. అక్కడ ఉపాధి లేక పొట్టచేత పట్టుకుని భర్త వీరన్న, కుమారులు పవన్, చరణ్తో కలిసి ఏడాది క్రితం రామగుండం చేరుకుంది. సొంత ఇల్లు లేక, అద్దె ఇంట్లో ఉండే స్థోమత లేక తన తల్లి లక్ష్మితో కలిసి బస్ షెల్టర్లోనే నివాసం ఉంటోంది. పద్మ కూలీ పనులకు వెళ్తుండగా, ఆమె భర్త ప్లాస్టిక్ కవర్లు, వస్తువులు సేకరించి స్క్రాప్ దుకాణంలో విక్రయిస్తున్నారు. ఇద్దరి సంపాదన కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. పద్మ కుమారులు మాటూరి పవన్, చరణ్ స్థానికంగా ఓ ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నారు. అయితే, పొద్దున బడికి వెళ్లేవచ్చే చిన్నారు.. రాత్రిళ్లు చదువుకునేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు దోమలతో సహవాసం చేస్తున్నారు. వర్షాకాలంలో బట్టలు తడుస్తుండడం, చలికాలంలో చలికి గజగజ వణుకుతూ అవస్థలు ఎదుర్కొంటున్నారు. వేసవిలో ఎండవేడికి తాళలేకపోతున్నారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని చిన్నారులు, వారి తల్లిదండ్రులు చేతులు జోడించి వేడుకుంటున్నారు. ఏడాదిగా ఓ కుటుంబం నరకయాతన -
పెద్దపల్లి బైపాస్ సిద్ధం!
● నేటి నుంచి 28 వరకు ఇంటర్లాకింగ్ పనులు ● ఉగాది నుంచి అందుబాటులోకి 1.7 కి.మీ సింగిల్ లైన్ ● ఇకపై ప్రతీ రైలుకు 40 నిమిషాలు ఆదా ● తొలుత గూడ్స్, ఆ తర్వాత ప్యాసింజర్ రైళ్లకు మేలు ● త్వరలో డబుల్ ట్రాక్.. టెండర్లు పిలిచిన రైల్వే శాఖ సాక్షిప్రతినిధి, కరీంనగర్/పెద్దపల్లి రూరల్: ఎప్పుడెప్పుడా అని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు ఎంతోఆసక్తిగా ఎదురుచూస్తున్న పెద్దపల్లి బైపాస్ రైల్వేలైన్ సిద్ధమైంది. కాజీపేట – బల్హార్షా – పెద్దపల్లి – నిజామాబాద్ సెక్షన్లను కలిపేలా నిర్మించిన రైల్వేలైన్ ఇంటర్ లాకింగ్(కమిషన్) పనులు నేటినుంచి ఈనెల 28వ తేదీ వరకు జరగనుండగా.. ఉగాది నుంచి లైన్ అందుబాటులోకి రానుంది. దాదాపు 1.78 కి.మీ. దూరం కలిగిన ఈ సింగిల్ రైల్వేలైన్.. మంగళవారం నుంచి సేవలు అందించనుంది. ఈ మేరకు ఇంటర్లాకింగ్ పనులను దక్షిణ మధ్య రైల్వే అధికారులు చేపట్టనున్నారు. ఫలితంగా ఈ మార్గంలో ప్రయాణించే ప్రతీ గూడ్స్ రైలు ఇకపై పెద్దపల్లి స్టేషన్లో సిగ్నల్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా నేరుగా ప్రయాణించే వీలు కలుగనుంది. ప్రతీరైలుకు 40 నిమిషాలు ఆదా.. వాస్తవానికి పెద్దపల్లి– నిజామాబాద్ సెక్షన్ నుంచి కాజీపేట – బల్హార్షా మీదుగా ప్రయాణించే రైళ్లు ఇంతకాలం పెద్దపల్లి స్టేషన్లో పడిగాపులు పడేవి. సరైన ఇంటర్ లాకింగ్ వ్యవస్థ లేకపోవడంతో కాజీపేట– బల్హార్షా సెక్షన్ నుంచి రైలు పెద్దపల్లి –నిజామాబాద్ సెక్షన్లోకి రావాలంటే.. నిజామాబాద్ నుంచి కాకినాడ పోర్ట్, మహారాష్ట్రకు వెళ్లాల్సిన గూడ్స్ పెద్దపల్లి రైల్వేస్టేషన్లో దాదాపు 40 నిమిషాల నుంచి 60 నిమిషాల పాటు సిగ్నల్ కోసం వేచి చూడాల్సి వచ్చేది. బైపాస్ లైన్ అందుబాటులోకి రాగానే.. ఇకపై రైళ్లు పెద్దపల్లి స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే నేరుగా రాకపోకలు సాగిస్తాయి. ప్రస్తుతం ఈ సదుపాయం కేవలం సరుకు రవాణా రైళ్లకు మాత్రమే వర్తిస్తుంది. త్వరలో ప్యాసింజర్ రైళ్లకు కూడా వర్తించనుందని సమాచారం. -
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
కోరుట్ల: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేసినట్లు మెట్పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు తెలిపారు. సోమవారం ఆయన కోరుట్ల సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మెట్పల్లికి చెందిన గోల్కోండ హరీశ్, బొల్లంపల్లి అభిషేక్ మేడిపల్లి శివారు కట్లకుంట రోడ్డు సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో మేడిపల్లి ఎస్సై శ్యాంరాజ్ వెళ్లి వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. వారు పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. హరీష్, అభిషేక్ నుంచి 2.200కిలోల గంజాయి లభించింది. దాని విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుంది. నిందితులు ఒడిశాకు చెందిన దీపక్ అలియాస్ సూరజ్ నుంచి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి చిన్నచిన్న ప్యాకెట్లలోకి మార్చి జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల్లో అమ్ముతున్నారని డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చురుకుగా వ్యవహరించిన సీఐ సురేష్బాబు, ఎస్సైలు శ్యాంరాజ్, శ్రీకాంత్, కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, రాజశేఖర్, మహేశ్వర్, భగవాన్కు నగదు రివార్డులు అందించినట్లు డీఎస్పీ తెలిపారు. ‘ఉపాధి’ కూలీకి పాముకాటుకథలాపూర్: కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీ తోట మమత సోమవారం పని ప్రదేశం వద్ద పాము కాటుకు గురైంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామశివారు ఈర్లగుట్ట వద్ద కందకాలు తవ్వే పనులకు మమత వెళ్లింది. తోటి కూలీలతో కలిసి కందకాలు తవ్వుతుండగా.. కాలుపై పింజర పాము కాటు వేయడంతో అస్వస్థతకు గురైంది. తోటి కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్ ఆమెను చికిత్స నిమిత్తం కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. టెక్నికల్ అసిస్టెంట్ అంబాజీ ఆసుపత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. పెట్రోల్ బంక్ సీజ్ కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): లైసెన్స్ లేకుండా నడుపుతున్న పెట్రోల్ బంక్ను సీజ్ చేసినట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్ తెలిపారు. మండల కేంద్రంలోని భార్గవి సర్వీస్ స్టేషన్ను సోమవారం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్రభంగా లైసెన్స్ లేదని గుర్తించి సీజ్ చేశారు. అనంతరం రాజేందర్ మాట్లాడుతూ, పెట్రోల్ బంక్ యజమాని వి.రమేశ్.. ఫారం– బీ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నట్లు తేలిందన్నారు. బంక్లో రూ.20లక్షల 37 వేల 248 విలువైన 9,992 లీటర్ల పెట్రోల్, 10,022 లీటర్ల డీజిల్ కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. తనిఖీల్లో డిప్యూటీ తహసీల్దార్లు సంతోష్సింగ్, ఠాగూర్, రవీందర్, అధికారులు పాల్గొన్నారు. -
గుడి గంటకు ఉరివేసుకుని వ్యక్తి బలవన్మరణం
ముస్తాబాద్(సిరిసిల్ల): తండ్రి పేరుతో ఉన్న పొలాన్ని విక్రయిద్దామంటే అన్న అడ్డంకిగా వస్తున్నాడని మనస్తాపంతో ఓ వ్యక్తి మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయంలోని గంటకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ముస్తాబాద్ ఎస్సై గణేశ్, బాధితులు తెలిపిన వివరాలు. మండలంలోని చిప్పలపల్లికి చెందిన గాడిచర్ల పర్శరాములు(50) పొలం పనులకు వెళ్తున్నానని ఆదివారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లాడు. రాత్రి పొద్దుపోయిన తిరిగి రాలేదు. ఆచూకీ కోసం గాలించగా పెద్దమ్మ ఆలయంలో గంటకు లుంగీతో ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. అయితే పర్శరాములుకు నలుగురు అన్నదమ్ములు ఉండగా, తండ్రి సాయిలు నుంచి వచ్చిన భూములు పంపిణీ చేసుకున్నారు. పర్శరాములు దుబాయిలో ఉండడంతో ఆయన వాటాగా వచ్చిన భూమిని ఆ సమయంలో పట్టా చేయించుకోలేదు. పర్శరాములు వాటా భూమి తండ్రి సాయిలు పేరుతో ఉండగా, ఇటీవల అప్పులపాలు కావడంతో కొంత భూమిని ఇతరులకు విక్రయించాడు. రిజిస్ట్రేషన్ సమయంలో పర్శరాములు సోదరుడు లక్ష్మీనర్సయ్య సంతకం చేసేందుకు నిరాకరించాడు. దీంతో అప్పులు ఎలా తీర్చేదని పర్శరాములు మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుని భార్య పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై గణేశ్ తెలిపారు. -
విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం
పాలకుర్తి(రామగుండం): కొత్తపల్లి గ్రామంలో వేల్పుగొండ కొమురయ్యకు చెందిన గూన పెంకుటిల్లు ఆదివారం విద్యుదాఘాతంతో దగ్ధమైంది. స్థానికుల కథనం ప్రకారం.. కొమురయ్యతోపాటు కుటుంబసభ్యులు ఉదయం పొలం పనులకు వెళ్లారు. ఇంట్లోంచి పొగ, మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు.. కొమురయ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ తర్వాత పెద్దపల్లిలోని అగ్నిమాపక సిబ్బందికీ సమాచారం చేరవేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రమాదంలో ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న రూ.2లక్షలతోపాటు 5తులాల బంగారం, గృహోపకరణాలు, బట్టలు పూర్తిగా కాలిపోయినట్లు బాధితుడు రోదిస్తూ తెలిపాడు. రేషన్బియ్యం పట్టివేతపోలీసులు పట్టుకున్న రేషన్ బియ్యం వీణవంక(హుజూరాబాద్): అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా మండలంలోని రెడ్డిపల్లి గ్రామ శివారులో ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాలు.. ఇద్దరు వ్యక్తులు వ్యాన్లో రేషన్ బియ్యం తీసుకొని కరీంనగర్ వైపు వస్తుండగా వాహనాన్ని తనిఖీ చేయడంతో 160క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. హుజూరాబాద్ మండలం శాలపల్లికి చెందిన వ్యాన్ డ్రైవర్ గద్దల రవి, జమ్మికుంటకు చెందిన తాడేం రమేశ్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
మూడునెలల కష్టం బుగ్గిపాలు
వీణవంక(హుజూరాబాద్): జాతరలో స్వీట్ దుకాణం పెట్టుకొని కాలం వెల్లదీస్తున్న ఆ కుటుంబం రోడ్డునపడింది. మూడునెలల పాటు వివిధ జాతరలు తిరిగి వచ్చిన డబ్బుతో తమ వాహనంలో ఇంటికి రాగా షార్ట్సర్క్యూట్తో మూడునెలల కష్టం బుగ్గిపాలైన ఘటన వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. నిదానం మహేందర్ వివిధ జిల్లాల్లో ఎక్కడ జాతర జరిగినా అక్కడ స్వీట్ దుకాణం పెట్టి బతుకు వెల్లదీస్తున్నాడు. మూడునెలల క్రితం తన ట్రాలీ ఆటోలో కుటుంబ సభ్యులతో కలిసి జాతర్లకు వెళ్లాడు. తిమ్మాపూర్ మండలం నల్లగొండ జాతర చూసుకొని శనివారం రాత్రి ఇంటికి చేరుకున్నాడు. అప్పటికి మహేందర్ కుటుంబం అలిసిపోవడంతో స్వీట్కు సంబంధించిన ముడిసరుకులతో పాటు, రూ.2.16లక్షలు తన ఆటోలో ఉంచి ఇంట్లో నిద్రపోయాడు. ఆటో పైన ఉన్న విద్యుత్ వైరు గాలికి తెగి ఆటోలో ఉన్న వస్తువుల మీద పడటంతో ముడి సరుకులతో పాటు నగదు కాలిపోయాయి. వేకువజామున చూసేసరికి అప్పటికే నష్టం జరిగిపోయిందని బాధితుడు విలపించాడు. ఉన్న ఆధారం బుగ్గిపాలైందని, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు. -
ప్రశాంతంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహుని బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. స్వామివారి ఆలయంలో ఈనెల 10 నుంచి 22వరకు వైభవంగా నిర్వహించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. 11 రోజులపాటు సాగిన బ్రహ్మోత్సవాల్లో భక్తుల కోసం వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. చలువ పందిళ్లు, తాగునీరు, మరుగుదొడ్లు, సీ్త్రలు బట్టలు మార్చుకునేందుకు గదులు ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా చెత్తాచెదారం కనిపించకుండా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. రూ.98.26 లక్షల ఆదాయం బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి రూ.98.26 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు 70 వేల మందికి అన్నప్రసాద వితరణ చేశారు. అందరి సహకారంతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశామని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, రైస్మిల్లర్స్, దాతలు, మున్సిపల్, పోలీస్, ట్రాన్స్కో సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. 11 రోజుల్లో 98.26 లక్షల ఆదాయం -
మూడునెలల కష్టం బుగ్గిపాలు
వీణవంక(హుజూరాబాద్): జాతరలో స్వీట్ దుకాణం పెట్టుకొని కాలం వెల్లదీస్తున్న ఆ కుటుంబం రోడ్డునపడింది. మూడునెలల పాటు వివిధ జాతరలు తిరిగి వచ్చిన డబ్బుతో తమ వాహనంలో ఇంటికి రాగా షార్ట్సర్క్యూట్తో మూడునెలల కష్టం బుగ్గిపాలైన ఘటన వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. నిదానం మహేందర్ వివిధ జిల్లాల్లో ఎక్కడ జాతర జరిగినా అక్కడ స్వీట్ దుకాణం పెట్టి బతుకు వెల్లదీస్తున్నాడు. మూడునెలల క్రితం తన ట్రాలీ ఆటోలో కుటుంబ సభ్యులతో కలిసి జాతర్లకు వెళ్లాడు. తిమ్మాపూర్ మండలం నల్లగొండ జాతర చూసుకొని శనివారం రాత్రి ఇంటికి చేరుకున్నాడు. అప్పటికి మహేందర్ కుటుంబం అలిసిపోవడంతో స్వీట్కు సంబంధించిన ముడిసరుకులతో పాటు, రూ.2.16లక్షలు తన ఆటోలో ఉంచి ఇంట్లో నిద్రపోయాడు. ఆటో పైన ఉన్న విద్యుత్ వైరు గాలికి తెగి ఆటోలో ఉన్న వస్తువుల మీద పడటంతో ముడి సరుకులతో పాటు నగదు కాలిపోయాయి. వేకువజామున చూసేసరికి అప్పటికే నష్టం జరిగిపోయిందని బాధితుడు విలపించాడు. ఉన్న ఆధారం బుగ్గిపాలైందని, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు. -
పుణ్యస్నానానికి వెళ్లి పరలోకాలకు..
వెల్గటూర్: గోదావరిలో పుణ్యస్నానాలకు వెళ్లి ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగి యువకుడు మృతి చెందిన సంఘటన వెల్గటూర్ మండలం కోటిలింగాలలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం కరీంనగర్కు చెందిన శ్రీమంతుల విఘ్నేష్ (32) ఆదివారం సెలవు దినం కావడంతో తన భార్యతో కలిసి కోటిలింగాల వద్దగల గోదావరిలో పుణ్యస్నానాలకు వచ్చారు. గోదావరిలో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందాడు. భార్య కళ్ల ముందే భర్త నదిలో మునిగి మృతి చెందడంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. మృతుడి భార్య శ్రీలత ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. గోదావరిలో మునిగి యువకుడి మృతి -
లేబర్ కార్డుకు దూరం
అవగాహన లోపం.. ● ఉమ్మడి జిల్లాలో 3.3 లక్షలకు మించని కార్డులు ● ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్న కార్మికులు ● అవగాహన కల్పిస్తే మరింత మందికి ప్రయోజనంకరీంనగర్ 1,15,705 పెద్దపల్లి 84,974 జగిత్యాల 76,146 సిరిసిల్ల 54,739 మొత్తం 3,31,564 2014 నుంచి ఇప్పటి వరకు.. క్లెయిమ్లు: 49,795 చెల్లించిన డబ్బు: రూ.22,76,82,588కరీంనగర్టౌన్: ఉమ్మడి జిల్లాలో కార్మికులకు తమ హక్కుల గురించి అవగాహన లేకపోవడంతో లేబర్ కార్డులకు దూరమవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల కోసం చాలా పథకాలు అమలులోకి తెస్తుండడంతో ఇప్పుడిప్పుడే కార్డులు పొందేందుకు ఆసక్తి చూపుతున్నప్పటికీ.. ప్రభుత్వం తరఫున కూడా అవగాహన కల్పించడంలో విఫలం అవుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో కార్మికులు సాధారణంగా లేబర్ కార్డుల గురించి అవగాహన పొందడం చాలా కష్టంగా ఉంటుంది. ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి జిల్లాలో 3.3 లక్షల కార్డులే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 30 లక్షల పైగా జనాభా ఉండగా, ఇందులో 70 శాతం మంది వివిధ రంగాల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. అంటే దాదాపు 20 లక్షల పైచిలుకు కార్మికులు ఉండగా కేవలం 3.3 లక్షల మంది మాత్రమే లేబర్ కార్డులు పొందడం గమనార్హం. ఈ గణాంకాలను చూస్తే కేవలం 10 శాతం లోపు మాత్రమే ఈ కార్డులు పొందారని తెలుస్తోంది. లేబర్ కార్డు పొందితే ప్రయోజనాలు ● లేబర్ కార్డు ఉన్న వ్యక్తి కూతుళ్ల పెళ్లికి రూ.30,000, ప్రసవానికి రూ.30,000 (ఇద్దరు కూతుళ్లకు మాత్రమే) ఒక సంవత్సరం ముందు బోర్డు నందు కార్మికుడు /కార్మికురాలుగా నమోదైనవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ● ప్రమాదం వల్ల చనిపోతే బాధిత కుటుంబానికి రూ.6,30,000, సాధారణ మరణానికి రూ.1,30,000 ఆర్థికసాయం అందుతుంది. ● కార్మికునికి దహన సంస్కార ఖర్చుల కోసం రూ.30,000 అందిస్తారు. ● ప్రమాదవశాత్తు అంగవైకల్యం కలిగినవారికి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పరిహారం అందజేస్తారు. ● తాత్కాలిక వైద్య ఖర్చుల కింద కార్మికులకు నెలకు రూ.4,500 చొప్పున గరిష్టంగా రూ.13,500 సహాయం అందుతుంది. అర్హులు తీసుకోవాలి వివిధ రంగాల్లో కార్మికులుగా పనిచేస్తున్న అర్హులందరూ లేబర్ కార్డులు తీసుకోవాలి. కార్డులు లేని చాలా మంది అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లేబర్ కార్డులపై ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేసి, కార్మికులందరికీ కార్డులు అందేలా చర్యలు చేపట్టాలి. – కన్నం లక్ష్మణ్, కార్మిక సంఘం నాయకుడు నిరంతరం అందజేస్తున్నాం లేబర్ కార్డు పొందేందుకు నిర్ణీత గడువు అంటూ ఏమీ లేదు. కార్మికులుగా పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరి దరఖాస్తును పరిశీలించి అర్హులందరికీ లేబర్ కార్డులు అందజేయడం జరుగుతుంది. 3.3 లక్షల మంది ఇప్పటి వరకు కార్డులు కలిగి ఉన్నారు. మిగతా జిల్లాలతో పోల్చితే మనం మెరుగ్గా ఉన్నాం. కార్మికులకు అవగాహన కల్పించి మరింత మంది కార్డులు పొందేలా ప్రోత్సహిస్తాం. – వెంకటరమణ, డిప్యూటీ లేబర్ కమిషనర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా -
కేడీసీసీబీ సేవలు భేష్
కరీంనగర్అర్బన్: కేడీసీసీబీ సేవలు ప్రశంసనీయమని, మరింత పురోగతి సాధించాలని రాష్ట్ర సహకార శాఖ కమిషనర్, రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ కె.సురేంద్రమోహన్ అన్నారు. ఆదివారం నుస్తులాపూర్ ప్యాక్స్తో పాటు కేడీసీసీబీలను సందర్శించారు. 2025 అంతర్జాతీయ సహకార సంవత్సర ప్రాధాన్యతతో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, వివిధ సహకార రంగ సంస్థలు చేపట్టాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. పెద్దమొత్తంలో రుణాలిచ్చే స్థాయికి ఎదగడం హర్షషీయమని, దేశానికే తలమానికంగా కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నిలుస్తోందని కొనియాడారు. ఇక్కడి మంచి విధానాలను రాష్ట్రమంతా పాటించేలా చూడాలన్నారు. రాష్ట్రంలోని కృషి విజ్ఞాన కేంద్రాలు, ఉద్యానవన శాఖలు, మార్కెటింగ్ శాఖ, వివిధ సహకార రంగ సంస్థలను అనుసంధానం చేసి రైతుల ఉత్పత్తులను సమీకరించి, అధిక లాభాలు అందేలా పనిచేయించాలన్నారు. ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రజానీకానికి నగదు రహిత లావాదేవీల నిర్వహణ, బ్యాంకులు అందించే వివిధ సేవల గురించి విస్తృత అవగాహన కల్పించాలన్నారు. సంఘాల ద్వారా జన ఔషధి కేంద్రాలను ప్రతీ మండల కేంద్రంలో స్థాపించి సభ్యులకు, ప్రజలకు చౌకగా లభించే మందులు విక్రయించాలని వివరించారు. కేడీసీసీ బ్యాంకు ముఖ్యకార్యనిర్వాణాధికారి సత్యనారాయణరావు మాట్లాడుతూ, ఇటీవల నిర్మించిన గోదాముల్లో మిగులు సామర్థ్యాన్ని ఎఫ్సీఐ, సివిల్ సప్లయి, మార్కెటింగ్ శాఖ, రైస్ మిల్లులు ఉపయోగించుకొనుటకు ప్రభుత్వపరంగా అనుమతులు ఇచ్చి సంఘాలకు అద్దెల రూపంగా డబ్బు వచ్చేలా చూడాలన్నారు. అదనపు కమిషనర్ జి.శ్రీనివాస్రావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహకార అధికారులు, ఎన్.రామానుజచార్యులు, సి.శ్రీమాల, మనోజ్కుమార్, రామకృష్ణ, సహకార అధికారులు, మార్క్ఫెడ్ అధికారులు, డీసీఎంఎస్ అధికారులు, బ్యాంకు జనరల్ మేనేజర్లు, సీనియర్ అధికారులు, బ్రాంచ్ మేనేజర్లు, సహకార సిబ్బంది పాల్గొన్నారు. సహకార శాఖ కమిషనర్ సురేంద్రమోహన్ -
ప్రశాంతంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహుని బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. స్వామివారి ఆలయంలో ఈనెల 10 నుంచి 22వరకు వైభవంగా నిర్వహించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. 11 రోజులపాటు సాగిన బ్రహ్మోత్సవాల్లో భక్తుల కోసం వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. చలువ పందిళ్లు, తాగునీరు, మరుగుదొడ్లు, సీ్త్రలు బట్టలు మార్చుకునేందుకు గదులు ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా చెత్తాచెదారం కనిపించకుండా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. రూ.98.26 లక్షల ఆదాయం బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి రూ.98.26 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు 70 వేల మందికి అన్నప్రసాద వితరణ చేశారు. అందరి సహకారంతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశామని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, రైస్మిల్లర్స్, దాతలు, మున్సిపల్, పోలీస్, ట్రాన్స్కో సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. 11 రోజుల్లో 98.26 లక్షల ఆదాయం -
తాళం వేసిన ఇళ్లలో చోరీ
వెల్గటూర్: తాళంవేసిన ఇళ్లలో దొంగలు దొంగతనం చేసిన ఘటన మండలంలోని పైడిపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామంలోని గుడికందుల తిరుపతి, రాజేశం ఇళ్లలో శనివారం రాత్రి దొంగలు పడి బీరువా తాళాలు పగులగొట్టారు. తిరుపతి ఇంట్లో రెండున్నర తులాల బంగారం, రాజేశం ఇంట్లో నుంచి రూ.80వేలు ఎత్తుకెళ్లారు. తిరుపతి వ్యాపార నిమిత్తం కరీంనగర్లో, రాజేశం ముంబయిలో ఉంటున్నారు. వారిళ్లలో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన దొంగలు చొరబడి బంగారం, నగదు దోచుకెళ్లారు. ఆదివారం ఉదయం ఇరుగుపొరుగు వారు చూసి ఇంటి యజమానులకు సమాచారం ఇచ్చారు. వారువచ్చి చూసి బీరువా తాళాలు పగుల గొట్టి ఉండడం, అందులో బంగారం, నగలు దొంగలు దోచుకెళ్లినట్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డాగ్ స్క్వాడ్ను, క్లూస్ టీంను రప్పించి వివరాలు సేకరించారు. -
ప్రజాస్వామ్య విలువలకు పెద్దపీట
కరీంనగర్అర్బన్: తమ ప్రభుత్వం రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్యానికి కట్టుబడి పని చేస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం తరఫున జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో టీఎన్జీవో ఫంక్షన్ హాల్లో ఆదివారం ఇఫ్తార్ విందు కార్యక్రమం జరగగా మంత్రి హాజరై మాట్లాడారు. తమతోపాటు సమాజం బాగుండాలన్న కోరికతో రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్ష పాటిస్తారని తెలిపారు. ఈద్ వేడుకలకు ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రజాపాలన కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు విజయవంతం అయ్యేలా ముస్లింలు ప్రార్థించాలని కోరారు. ఈ నెల 25న ముఖ్యమంత్రి హైదరాబాదులో ఇఫ్తార్ విందులో పాల్గొంటారని పేర్కొన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, కరీంనగర్లో ఎలాంటి భేదభావాలు లేకుండా అందరూ కలిసి ఉంటారని, భవిష్యత్తులోనూ ఇలాగే ఉండాలని ఆకాంక్షించారు. రంజాన్ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ఈద్గాలు, మసీదుల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ, రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్దేశాయ్, లక్ష్మీకిరణ్, ట్రైనీ కలెక్టర్ అజయ్యాదవ్, ట్రైనీ ఐపీఎస్ వసుంధర, ఆర్డీవో మహేశ్వర్, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్రెడ్డి, జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణ్రావు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ -
విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం
పాలకుర్తి(రామగుండం): కొత్తపల్లి గ్రామంలో వేల్పుగొండ కొమురయ్యకు చెందిన గూన పెంకుటిల్లు ఆదివారం విద్యుదాఘాతంతో దగ్ధమైంది. స్థానికుల కథనం ప్రకారం.. కొమురయ్యతోపాటు కుటుంబసభ్యులు ఉదయం పొలం పనులకు వెళ్లారు. ఇంట్లోంచి పొగ, మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు.. కొమురయ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ తర్వాత పెద్దపల్లిలోని అగ్నిమాపక సిబ్బందికీ సమాచారం చేరవేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రమాదంలో ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న రూ.2లక్షలతోపాటు 5తులాల బంగారం, గృహోపకరణాలు, బట్టలు పూర్తిగా కాలిపోయినట్లు బాధితుడు రోదిస్తూ తెలిపాడు. రేషన్బియ్యం పట్టివేతపోలీసులు పట్టుకున్న రేషన్ బియ్యం వీణవంక(హుజూరాబాద్): అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా మండలంలోని రెడ్డిపల్లి గ్రామ శివారులో ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాలు.. ఇద్దరు వ్యక్తులు వ్యాన్లో రేషన్ బియ్యం తీసుకొని కరీంనగర్ వైపు వస్తుండగా వాహనాన్ని తనిఖీ చేయడంతో 160క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. హుజూరాబాద్ మండలం శాలపల్లికి చెందిన వ్యాన్ డ్రైవర్ గద్దల రవి, జమ్మికుంటకు చెందిన తాడేం రమేశ్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
గ్యాస్కట్టర్లో చేయి ఇరుక్కుని..
ఎల్లారెడ్డిపేట: మండలంలోని రాచర్లగొల్లపల్లిలో గ్రాస్కట్టర్లో ఇరుక్కొని చేయి తెగిన సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. మండలంలోని రాచర్లగొల్లపల్లికి చెందిన నిమ్మత్తుల మధుకర్రెడ్డి–రజిత దంపతుల పెద్ద కుమారుడు సుదర్శన్రెడ్డి(11) ఆదివారం సెలవు కావడంతో తన తాతతో కలిసి ఆవుల షెడ్డు వద్దకు వెళ్లాడు. ఆవుల కోసం పచ్చిగడ్డిని తన తాత కట్టర్లో వేస్తుండగా పక్కనే ఉన్న బాలుడు సైతం వేసేందుకు ప్రయత్నించగా చేయి ఇరుక్కుంది. బాలుడు కేకలు వేయడంతో అప్రమత్తమైన తాత మిషన్ను ఆపివేసి బాలుడి చేతిని బయటకు తీశాడు. అయితే అప్పటికే మోచేతి కింది భాగం వరకు నుజ్జునుజ్జు అయ్యింది. వెంటనే ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. మోచేతి వరకు తొలగించారు. -
స్పెషల్ ట్యాక్స్
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో న యా ట్యాక్స్ మొదలైంది. పాలకవర్గం ఉన్న సమయంలో కొన్ని డివిజన్లలో సీ (కార్పొరేటర్) ట్యాక్స్ వసూలు చేయడం తెలిసిందే. పాలకవర్గం పదవీకాలం ముగిసి స్పెషల్ ఆఫీసర్ పాలన మొదలవడంతో న గరంలోని చాలా డివిజన్లలో నిర్మాణదారులు సీ ట్యాక్స్ గోల తప్పిందంటూ ఊపిరిపీల్చుకున్నారు. కానీ, ప్రత్యేక పాలనలో పట్టణ ప్రణాళిక విభా గానికి చెందిన ఓ అధి కారి స్పెషల్ ట్యాక్స్కు తెరతీ శారు. అడగడానికి కార్పొరేటర్లు కూడా లేకపోవడంతో సదరు అధికారి నేరుగా నిర్మాణదారులతోనే డీ ల్ కుదుర్చుకుంటున్నారు. డీల్ కుదరకుంటే తమ సిబ్బందిని పంపించి పనులు నిలిపివేయిస్తున్నారు. రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలు నగరం శరవేగంగా విస్తరిస్తున్న క్రమంలో భవన నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. నివాసగృహాలు, అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాల నిర్మాణాలు ఎక్కడో ఒక చోట కొనసాగుతూనే ఉన్నాయి. నిబంధనల మేరకు నిర్మాణాలు జరుగుతున్నాయా అనేది చూడాల్సిన పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు ఒకరిద్దరు నిబంధనల నెపంతో వసూళ్లకు పాల్పడుతున్నారనే అభియోగాలున్నాయి. ఓ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అధికారి యథేచ్ఛగా వసూళ్ల దందా నడిపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ వసూళ్లు తన ఒక్కడికే కాదని, పై అధికారులను కూడా మచ్చిక చేసుకోవాల్సి ఉంటుందంటూ నిర్మాణదారుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్న వ్యవహారం ప్రస్తుతం నగరంలో హాట్టాపిక్గా మారింది. నిర్మాణం జరుగుతున్న భవనం ఆధారంగా రూ.1లక్ష నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసిన ఉదంతాలను బల్దియాలో కథలుగా చెప్పుకుంటుండం విశేషం. భయమే పెట్టుబడి టౌన్ప్లానింగ్ విభాగ అధికారి వసూళ్ల దందాకు భవన నిర్మాణదారుల భయమే పెట్టుబడిగా మారింది. మున్సిపల్ నిబంధనలను పూర్తిస్థాయిలో పాటించి భవనం నిర్మించడం దాదాపు అసాధ్యంగా నిర్మాణదారులు భావిస్తుంటారు. నిబంధనల ప్రకారం నిర్మాణం చేపట్టినా, పూర్తిస్థాయిలో సెట్బ్యాక్లేదని, శ్లాబ్ సెంటిమీటరు ముందుకొచ్చిందని, ర్యాంప్ రోడ్డుమీదికొచ్చిందని.. ఇలాంటి కారణాలేవో చెప్పి బెదిరింపులకు పాల్పడుతుంటారు. ఒకవేళ అన్ని నిబంధనలకు లోబడి నిర్మాణాలు చేపట్టినా పక్కవాళ్లు ఫిర్యాదు చేశారంటూ రంగంలోకి దిగిపోతుంటారు. దీంతో అడిగినంత కాకున్నా ఎంతో కొంత ఇచ్చి పనులు కొనసాగించుకోవడం మేలనే స్థితికి నిర్మాణదారులు వస్తుంటారు. పైగా డబ్బు వసూలు చేసిన విషయం ఎక్కడైనా చెప్పినా, మీ భవనానికే నష్టమనే అధికారుల హెచ్చరికలు కూడా ఇక్కడ ఫిర్యాదుల వరకు రాకుండా చేస్తుంటాయి. ఒకవేళ ఎవరైనా ధైర్యంగా ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో సదరు అధికారుల వసూళ్ల దందా నిరాటంకంగా కొనసాగుతోంది. బల్దియాలో నయా కలెక్షన్ భవన నిర్మాణదారుల నుంచి వసూళ్లు ప్రత్యేకాధికారి పాలనలోనూ తప్పని వేధింపులునగర శివారులోని పాత విలీన డివిజన్ అది. ఇటీవల అక్కడ ఓ వ్యక్తి బహుళ అంతస్తుల భవన నిర్మాణం చేపట్టాడు. బల్దియా నుంచి అవసరమైన అన్ని పత్రాలు తీసుకున్నాడు. ఇదే సమయంలో.. వసూళ్లలో ఆరితేరిన పట్టణ ప్రణాళిక విభాగానికి చెందిన ఓ అధికారి కన్ను ఆ నిర్మాణంపై పడింది. ఇంకేం.. నిబంధనల నెపంతో పనులకు ఆటంకం కలిగిస్తూ, నిర్మాణదారుడికి వేధింపులు మొదలయ్యాయి. తన తప్పేంటో తెలియని సదరు నిర్మాణదారుడు భవన నిర్మాణానికి సంబంధించి అన్ని పత్రాలు చూపించాడు. కానీ మున్సిపల్ నిబంధనల ప్రకారం ఇల్లు కట్టడం ఎవరికీ సాధ్యం కాదని, అధికారులను మచ్చిక చేసుకోకుంటే పనులు కష్టమనే ఓ మధ్యవర్తి సలహా మేరకు సదరు అధికారిని కలుసుకున్నాడు. ఆ అధికారి రూ.4 లక్షలు డిమాండ్ చేస్తే, విధిలేని పరిస్థితుల్లో రూ.2 లక్షలు చెల్లించి బతుకు జీవుడా అంటూ భవన నిర్మాణ పనులు కొనసాగించాడు. ఫైలు పెండింగ్తోనే.. నిర్మాణ అనుమతులకు సంబంధించిన ఫైళ్లను పెండింగ్లో పెట్టడం ద్వారానే సదరు అధికారి వసూళ్ల దందాకు శ్రీకారం చుడుతుండడం గమనార్హం. భవన నిర్మాణాల అనుమతులు కోరుతూ చేసుకున్న దరఖాస్తులను ఓ పట్టాన తెమలనీయకుండా రోజుల తరబడి కాలయాపన చేస్తుండడం ఆ అధికారి ప్రత్యేకత. దరఖాస్తుదారుడు కార్యాలయం చుట్టూ తిరిగి విసిగి వేసారిన సమయంలో బేరసారాలకు దిగడం ఆ అధికారి స్టైల్. తమ ఫైల్ పెండింగ్లో పెట్టారంటూ ఉన్నతాధికారులకు వచ్చే ఫిర్యాదుల్లో ఈ అధికారికి చెందినవే ఎక్కువగా ఉండడం నగరపాలకసంస్థ కార్యాలయంలో బహిరంగ రహస్యమే. సదరు అధికారి వసూళ్ల దందాకు కొంతమంది పై అధికారులు కూడా సహకరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. యథేచ్ఛగా వసూళ్లు చేస్తుండడం, ఆరోపణలు, ఫిర్యాదులొచ్చినా వీసమెత్తు చర్యలు అధికారిపై లేకపోవడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. ఇదిలాఉంటే సదరు అధికారి స్థాయిలో కాకున్నా ఇతర అధికారులు కూడా తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ నిర్మాణదారులను వేధిస్తున్న ఘటనలు నగరంలో చోటుచేసుకుంటున్నాయి. ఏదేమైనా నగరంలో పేట్రేగిపోతున్న స్పెషల్ ట్యాక్స్ దందాపై ఉన్నతాధికారులు లోతుగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
ప్రతీ పనికో రేటు.. లేదంటే లేటు
● ఆ అధికారి ఎలా చెబితే అలా నడవాల్సిందే.. ● చెప్పినట్టు వినకుంటే మార్చేయడమేకరీంనగర్ అర్బన్: అతనో తహసీల్దార్. హుందాగా వ్యవహరించాల్సిన సదరు పోస్టుకు కళంకం తేవడం చర్చనీయాంఽశంగా మారింది. కార్యాలయ అధికారులు, ఉద్యోగులైనా, వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలైనా ఎవరి మాట వినడు. ప్రతీ పనికో రేటు నిర్ణయించి వసూళ్లు చేస్తుండగా కొందరు రాజకీయ నేతలు(ప్రతిపక్ష, అధికారపక్ష), కార్యాలయంలోని ఓ ఉద్యోగి కేంద్రంగా రెవెన్యూ కార్యవర్తనాలు కొనసాగడం ఆశ్చర్యకర అంశం. జిల్లాకేంద్రంలో ఓ ఉన్నతాధికారి అండ పుష్కలంగా ఉండటంతో సదరు అధికారి ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందని ఇంట, బయట వినిపిస్తున్న మాట. ప్రతీ పనికో రేటు ఇతర జిల్లాలో పనిచేసిన సదరు అధికారి ఎక్కడా కుదురుగా ఉండరన్న ఆరోపణలున్నాయి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల జారీకి రూ.50వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తుండగా ఇందుకు పలువురు అధికార, ప్రతిపక్ష రాజకీయ నేతలు రాయబారులుగా, కార్యాలయంలోని ఓ ఉద్యోగి కీలకమని తెలుస్తోంది. ఈ విషయంలో గతేడాది ఉన్నతాధికారి విచారణకు ఆదేశించగా సదరు ఆదేశాలను పక్కనబెట్టడం ఇతనికే చెల్లు. ఇక ఇటుక బట్టీలు, ఇసుక ట్రాక్టర్ల యజమానులు మామూళ్లు ఇవ్వాల్సిందే. చెప్పినట్లు వినకుంటే మార్చడమే సదరు అధికారి ఎలా చెబితే అలా నడవాల్సిందే. వినని ఓ గిర్దావర్ను కావాలని అక్కడి నుంచి బదిలీ చేయించాడనే ఆరోపణలున్నాయి. గతంలో ఓ దళితురాలికి ఇచ్చిన అసైన్డ్ భూమి విషయంలో కావాలనే భయభ్రాంతులకు గురిచేస్తున్నారని సమాచారం. ఓ జిల్లాకేంద్రంలో పనిచేసినప్పుడు కూడా విధులను నిర్లక్ష్యం చేయడం, అవినీతి ఆరోపణలతో 4నెలల్లోనే ఇతర ప్రాంతానికి బదిలీ చేశారు. మొత్తంగా సదరు అధికారి వ్యవహారంపై ఇంట, బయట తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే సదరు తహసీల్దార్పై ఫిర్యాదులు ఎక్కువవయ్యాయని, విచారణ జరుగుతోందని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి.‘జిల్లాలోని ఓ మండల పరిధిలో ఉన్న గ్రామంలో సంపన్న కుటుంబమది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కోసం తహసీల్దార్కు దరఖాస్తు చేశారు. 15ఎకరాల వ్యవ సాయ భూమి ఉండగా సర్టిఫికెట్ జారీ చేశారు. మామూళ్లు ముట్టడంతో నిబంధనలు అటకెక్కించారని సమాచారం’.‘ఓ మండలంలోని ఓ రైతు నాలా కన్వర్షన్ కోసం దరఖాస్తు చేశాడు. నిబంధనల ప్రకారం అన్నీ సక్రమంగా ఉన్నా నాలా చేయరాదంటూ మౌఖికంగా సదరు తహసీల్దార్ తిరస్కరించాడు. కొన్ని రోజులు ఇబ్బందులకు గురిచేసి తీరా మామూళ్లు ముట్టాక నాలా కన్వర్షన్ క్షణాల్లో జరిగిపోయింది’. -
టీచర్ల దమ్మేంటో చూపించాం
● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ కరీంనగర్టౌన్: టీచర్ల దమ్మేందో, తపస్ ఉపాధ్యాయ సంఘం తలుచుకుంటే ఏమైతదో ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపించామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ అన్నారు. ఆదివారం నగరంలోని శుభం గార్డెన్లో తపస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంజయ్ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులంతా టీచర్ల కోసం కొట్లాడే ఏకై క సంఘం తపస్లో చేరాలని పిలుపునిచ్చారు. తపస్ బలపర్చిన అభ్యర్థి మల్క కొమురయ్యకు టిక్కెట్ ఇప్పించి సునాయాసంగా గెలిపించిందన్నారు. తెలంగాణ సాధనలో టీచర్లు, ఉద్యోగుల పాత్ర మరువలేనిదని అన్నారు. బీఆర్ఎస్ పాలన పీడ విరగడ కావాలని ఆ పార్టీని ఓడించి కాంగ్రెస్కు అధికారం అప్పగిస్తే రేవంత్ కూడా అదే బాటలో నడుస్తున్నాడని మండిపడ్డారు. 15 నెలలుగా హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచిస్తూనే ఉందన్నారు. ఉద్యోగులకు బకాయిలు ఇచ్చేందుకు డబ్బుల్లేవని చెబుతున్న ప్రభుత్వం 18 శాతం కమీషన్ ఇస్తే మాత్రం కాంట్రాక్టర్లకు బిల్లులు క్లియర్ చేస్తోందని విమర్శించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలివ్వకుండా విద్య, వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తుందన్నారు. సమస్యలపై పోరాడాలని, తపస్ తల్చుకుంటే విద్యాశాఖ సమూలంగా ప్రక్షాళన కావాలన్నారు. ప్రభుత్వం ఉద్యోగం నుంచి తీసేస్తే, మీకు బీజేపీ టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకుంటామని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం విద్యార్థులకు కలం అందించి మహానుభావులుగా తీర్చిదిద్దాలని చూస్తుంటే, కాంగ్రెస్ అందుకు భిన్నంగా పాఠ్యపుస్తకాల్లో అర్బన్ నక్సల్స్ భావజాలాన్ని జొప్పించి తుపాకీ రాజ్యం కోసం కుట్రలు చేస్తుంటే సమాజానికి ఏ సందేశం పంపినట్లు అని ప్రశ్నించారు. అసలు ఏ ఉద్దేశంతో సీఎం రేవంత్రెడ్డి అర్బన్ నక్సల్స్ను విద్యా కమిషన్లో నియమించారో సమాధానం చెప్పాలన్నారు. ఈ విధానాన్ని తపస్ కచ్చితంగా వ్యతిరేకించి ఉద్యమం ప్రారంభించాలని, బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సమావేశంలో తపస్ రాష్ట్ర, జిల్లా బాధ్యులు పాల్గొన్నారు. -
గెలవాల్సిందే..
సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 202513 అసెంబ్లీ స్థానాలుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: రజతోత్సవ వేడుకల వేళ పార్టీని మరింత బలోపేతం చేస్తామని, కార్యకర్తలకు జిల్లా కార్యాలయాల్లో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అన్నారు. ఆదివారం కరీంనగర్లోని వీ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చా రు. బీఆర్ఎస్ హయాంలో వివిధ వర్గాలకు జరిగిన అభివృద్ధిని అంకెలతో సహా వివరించేలా కార్యకర్తలు తయారవాలన్నారు. ఇందుకోసం పార్టీ అధిష్టా నం నుంచి పరిశీలకులు, సమన్వయకర్తలు వస్తార ని వెల్లడించారు. కేసీఆర్కు కరీంనగర్ అంటే ప్రత్యేకమైన అభిమానమని, సింహగర్జన నుంచి రైతుబంధు, దళితబంధు వరకు అనేక కార్యక్రమాలు ఇక్కడే మొదలుపెట్టారని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో 13 స్థానాల్లో కేవలం ఐదుమాత్రమే గెలిచామని, అందులో జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వెళ్లారన్నారు. ఈసారి వచ్చే ఎన్నికల్లో 13 అసెంబ్లీ స్థానాలు మనమే గెలవాలని పిలుపునిచ్చారు. చెక్పోస్టులు పెట్టి మరీ: గంగుల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చెక్పోస్టులు పెట్టి మరీ ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో మానేరు రివర్ ఫ్రంట్, తీగల బ్రిడ్జి వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు మొదలుపెడితే.. వాటిని ఖతం చేశారని, ఇదేంటని కాంట్రాక్టర్ను అడిగితే.. కాంగ్రెస్ హయాంలో అనేక మంది లీడర్లు ఇబ్బందులు పెడుతున్నారని వాపోయాడని చెప్పారు. అమాయక ప్రజలను చెక్పోస్టులు పెట్టి పీల్చిపిప్పి చేస్తున్నారని కట్టెలమోపు కథ ద్వారా వివరించారు. ఒక తరాన్ని పరిచయం చేశారు బీఆర్ఎస్ పార్టీకి 25 ఏళ్లు నిండుతున్న సందర్భంగా వరంగల్లో గొప్ప సభ ఏర్పాటు చేయనున్నట్లు మాజీ ఎంపీ బి.వినోద్కుమార్ పేర్కొన్నారు. పార్టీకి ఎప్పుడు ఇబ్బందులు వచ్చినా ఆదుకునేది ఉమ్మడి వరంగల్, కరీంనగర్లే. కేసీఆర్ను శత్రువులు ఇబ్బందులు పెడితే, ఇక్కడికి వచ్చి గాలిపీలిస్తే ఆయనకు ఉత్తేజం వస్తదని తెలిపారు. శ్రీఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెడితే అందులో కేసీఆర్ లీడర్గా ఎదిగారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, నేను పోటీ చేశాం. పిల్లగాళ్లు అని కాంగ్రెస్ వాళ్లు ఎగతాళి చేసినా గెలిచి చూపించాం. అలా కేసీఆర్ కొత్త తరాన్ని రాజకీయాలకు పరిచయం చేశారు. 33 శాతం రిజర్వేషన్లను ఆధారంగా చేసుకుని మహిళలు నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్, కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్యేలు విద్యాసాగర్రావు, సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, కోరుకంటి చందర్, మనోహర్రెడ్డి, పుట్ట మధు, బాల్క సుమన్, నాయకులు రాజేశంగౌడ్, చల్మెడ లక్ష్మీనరసింహరావు, నారదాసు లక్ష్మణరావు, తోట ఆగయ్య, కర్ర శ్రీహరి, రాగిడి లక్ష్మారెడ్డి, రవీందర్రావు, గెల్లు శ్రీనివాస్యాదవ్, దావ వసంత, రాకేశ్, తుల ఉమ, కోలేటి దామోదర్, హరీశ్ శంకర్, పొన్నం అనిల్గౌడ్ పాల్గొన్నారు. జోష్నింపిన బైక్ ర్యాలీ అంతకుముందు కేటీఆర్కు ఘనస్వాగతం పలికిన గులాబీ నాయకులు మంకమ్మతోట సత్యనారాయణ స్వామి ఆలయం నుంచి బైపాస్ రోడ్డులోని వీ కన్వెన్షన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సమావేశ మందిరం నాయకులతో కిక్కిరిసిపోయింది. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల నుంచి భారీగా కార్యకర్తలు, నాయకులు తరలిరావడంతో బైపాస్ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మొత్తానికి కేటీఆర్ రాకతో బీఆర్ఎస్ నాయకుల్లో కొత్త జోష్ నిండింది. విగ్రహాలను ఆవిష్కరించేలా చూస్తాతిమ్మాపూర్(మానకొండూర్): అంబేద్కర్, జగ్జీవన్రాం విగ్రహాలను ఆవిష్కరించాలని పొలిటికల్ జే ఏసీ చేస్తున్న దీక్ష శిబిరాన్ని కేటీఆర్ సందర్శించి సంఘీభావం తెలిపారు. అసెంబ్లీలో చర్చించి విగ్రహా లను ఆవిష్కరించేలా చూస్తామని హామీ ఇచ్చారు. అక్కడి నుంచి కరీంనగర్ బయలుదేరారు. న్యూస్రీల్ ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ చెక్పోస్టులు పెట్టి కాంగ్రెస్ లీడర్లు దోచుకుంటున్నారు: గంగుల ఉద్యమ వ్యతిరేకి చేతిలో రాష్ట్ర పగ్గాలు: ఈశ్వర్ కేసీఆర్ ఒక తరాన్ని పరిచయం చేశారు: వినోద్కుమార్ జోష్ నింపిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాలీ, సమావేశంఉద్యమ వ్యతిరేకి చేతిలో.. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా పదేళ్లు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోయారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఎవరి పాలనలో అయితే సుఖశాంతులతో ఉంటా రో దాని కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘ఎన్నో పోరాటాలు, త్యాగాలతో రాష్ట్రం సా ధించుకున్నాం. ఉద్యమానికి వ్యతిరేకంగా కరీంనగర్ ప్రజల మీదకు తుపాకీ పట్టుకుని వచ్చిన వాడి చేతిలో రాష్ట్రం ఉంది. ఈ చెర నుంచి విడిపించాల్సి న బాధ్యత మనపై ఉంది’ అని పిలుపునిచ్చారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు
● మంత్రి పొన్నం ప్రభాకర్ తిమ్మాపూర్(మానకొండూర్): రాష్ట్రంలో రోడ్డు ప్ర మాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొ న్నం ప్రభాకర్ అన్నారు. తిమ్మాపూర్లోని రవా ణా శాఖ కార్యాలయ ప్రాంగణంలో రూ.8 కోట్లతో ని ర్మించనున్న ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ భవన నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారా యణతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఏఐ టెక్నాలజీ ద్వారా వా హనాల ఫిట్నెస్ నిర్ధారించేందుకు ఆటోమేటెడ్ టె స్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నూతన స్క్రాప్ పాలసీ విధానంలో 15 ఏళ్లు దాటిన వాహనాల స్థానంలో కొత్తవి కొనుగోలు చేస్తే రాయితీ ఇస్తామని తెలిపారు. కాలుష్య నివారణకు దేశంలోనే మొదటిసారిగా ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ తీసుకొచ్చామని పేర్కొన్నారు. రవాణా శాఖ కమిషనర్ సురేంద్రమోహన్ మాట్లాడుతూ, జిల్లాలో రోడ్ సేఫ్టీ క్లబ్బులు ప్రారంభించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, ఇప్పటికే 15 స్కూళ్లకు చెందిన విద్యార్థులు ట్రాఫిక్ అవగాహన పార్కును సందర్శించారని తెలిపారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ఉంటే భవిష్యత్తులో ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్దేశాయ్, సంయుక్త ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ కలెక్టర్ అజయ్యాదవ్, ఆర్డీవో మహేశ్వర్, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, జిల్లా రవాణా కమిషనర్ పురుషోత్తం, డీటీవో చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
కానిస్టేబుల్ను పరామర్శించిన సీపీ
కరీంనగర్క్రైం: బీఆర్ఎస్ బైక్ ర్యాలీలో బుల్లెట్ ఢీకొని చికిత్స పొందుతున్న మహిళా కానిస్టేబుల్ పద్మజను ఆదివారం సాయంత్రం కరీంనగర్ సీపీ గౌస్ ఆలం పరామర్శించారు. ఆమె చికిత్స వివరాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి, ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అన్ని రకాలుగా తోడుంటామని హామీ ఇచ్చారు. సీపీ వెంట రూరల్ ఏసీపీ శుభమ్ప్రకాష్, ఇన్స్పెక్టర్లు బిల్లా కోటేశ్వర్, ప్రదీప్కుమార్ ఉన్నారు. వ్యాయామ ఉపాధ్యాయ సంఘం కార్యవర్గంకరీంనగర్స్పోర్ట్స్: వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం టీఎన్జీవో సమావేశ మందిరంలో ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా గంగాధర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీడీ బాబు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా తాడికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీడీ ఆడెపు శ్రీనివాస్ ఎన్నికయ్యారు. మొత్తం 68 మంది సంఘం సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోగా బాబు శ్రీనివాస్ 6 ఓట్ల తేడాతో అంతడ్పుల శ్రీనివాస్పై, ఆడేపు శ్రీనివాస్ 10 ఓట్ల తేడాతో ఎండీ యూనిష్పాష పై విజయం సాధించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తిగౌడ్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగగా నల్గొండ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు చంద్రయ్య ఎన్నికల పరిశీలకులుగా, పెద్దపెల్లి జిల్లా ఫిజికల్ డైరెక్టర్ కడారి రవి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఎన్నికై న అధ్యక్ష కార్యదర్శులను పెటా సంఘం రాష్ట్ర, జిల్లా బాధ్యులు, పీఈటీలు, పీడీ అభినందించారు. భగత్సింగ్ స్ఫూర్తితో ఉద్యమిస్తాంకరీంనగర్: స్వాతంత్ర సమరయోధులు, దేశం కోసం ఉరికంబాన్ని సైతం చిరునవ్వుతో ముద్దాడిన భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల స్ఫూర్తితో ఉద్యమిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ నుంచి బస్టాండ్ వరకు పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా పోరాటాల ద్వారానే పీడిత ప్రజలకు దోపిడీ పీడనల నుంచి విముక్తి లభిస్తుందన్న భగత్సింగ్ స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. నాయకులు గిట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, బీమాసాహెబ్, కోనేటి నాగమణి, గజ్జెల శ్రీకాంత్, కంపెళ్ళి అరవింద్, తిరుపతినాయక్, వినయ్సాగర్, రఘుపతి, ఇసాక్, శ్రీనివాస్, పిల్లి రవి, తిప్పారపు సురేశ్, ఆకాశ్, అంజి, రాకేశ్, మోహన్, సందేశ్, రంజిత్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. అడువాల సుజాతకు పురస్కారంకరీంనగర్కల్చరల్: జిల్లాకు చెందిన రచయిత్రి, సామాజిక సేవకురాలు, రుద్రమ సాహితీ స్రవంతి మహిళా చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ అడువాల సుజాత రాష్ట్రస్థాయి మహిళాశక్తి పురస్కారాన్ని అందుకున్నారు. తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ పాలమూరు, ప్రమీల శక్తి పీఠం హైదరాబాద్ వారు సంయుక్తంగా ఆదివారం మహబూబ్నగర్లో నిర్వహించే కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షుడు ఆచార్య మసన చెన్నప్ప, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి, తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ రావూరి వనజ తదితరుల చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా సుజాతకు పలువురు కవులు, రచయితలు అభినందనలు తెలిపారు. -
చెట్టుకొమ్మలు కొడుతుండగా..
బోయినపల్లి(చొప్పదండి): చెట్టు కొమ్మలు కరెంట్ తీగలపై పడుతున్నాయని.. కొమ్మలు కొట్టే ప్రయత్నంలో ఓ కొమ్మ మేయిన్ విద్యుత్ తీగపై పడి మండలంలోని మాన్వాడ గ్రామానికి చెందిన దాసరి నర్సయ్య (58) విద్యుత్షాక్తో మృతిచెందాడు. ఎస్సై పృథ్వీధర్గౌడ్ తెలిపిన వివరాలు.. మాన్వాడకు చెందిన నర్సయ్య ఇంటి ముందు ఉన్న మునగ చెట్టు కొమ్మలు విద్యుత్ తీగలపై పడుతున్నాయని శనివారం కొమ్మలు కొట్టడానికి చెట్టు ఎక్కాడు. కొమ్మలు కొడుతుండగా ఓ కొమ్మ విద్యుత్ మేయిన్ తీగపై పడడంతో నర్సయ్యకు విద్యుత్ షాక్ తగిలి చెట్టుపైనే మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి -
మంత్రపురికి ఆధ్యాత్మిక శోభ
మంథని: నిత్యం వేద ఘోషతో పరిఢవిల్లె మంత్రపు రి మరో అరుదైన ఘట్టానికి వేదిక కాబోతుంది. మంథనిలోని లక్ష్మీ నృసింహగార్డెన్లో ఆదివారం సామూహిక గీతా పారాయణం నిర్వహించనున్నా రు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, పలువురు పీఠాధిపతులు హాజరుకానున్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదువేల మందితో.. గతంలో ఎక్కడా లేని విధంగా మంథనిలో ఐదు వేల మందితో సామూహిక గీతా పారాయణం నిర్వహించనున్నారు. అయితే ప్రపంచంలోనే ఇలాంటి ఉత్సవం జరగలేదని సనాతనధర్మ సంస్థ ప్రతినిధులు అంటున్నారు. భగవద్గీతను ఇంటింటా చేర్చడానికి ఐదేళ్ల క్రితం ఉద్యమం ప్రారంభం కాగా, 40 వేల మందికి చేర్చినట్లు ఇటీవల సంస్థ ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రంలోని 70 ప్రాంతాలకు చెందిన గీత పారాయణ భక్తులు హాజరుకానున్నారు. అలాగే తెలుగు సాహితీ వేత్త, భగవత్ గీత ప్రవచకులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి హాజరవుతారు. మంథనిలోని శ్రీలక్ష్మీనారాయణ ఆలయం నుంచి ఉదయం 8.30 గంటలకు శోభాయాత్ర నిర్వహించిన అనంతరం సామూహిక గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిసారు. 30 నుంచి శ్రీరామ నవరాత్రోత్సవాలువేములవాడ: రాజన్న సన్నిధిలో ఈనెల 30 నుంచి ఏప్రిల్ 6 వరకు శ్రీరామ నవరాత్రోత్సవాలు ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో వినోద్రెడ్డి శనివారం తెలిపారు. రోజూ ఉద యం 6.30 గంటలకు స్వామివారికి, సీతారామచంద్ర స్వామికి, పరివార అనుబంధ ఆలయాల్లో ప్ర త్యేక పూజలు నిర్వహిస్తారు. 30న ఉగాది పండుగ పురస్కరించుకుని ఉదయం 9 గంటలకు ప్రత్యేక పూజలు, సాయంత్రం 4.30 గంటలకు పంచాంగ శ్రవణము, పండిత సత్కారం నిర్వహించనున్నారు. రాత్రి 8 గంటలకు స్వామివారి పెద్దసేవపై ఊరేగిస్తారు. ఏప్రిల్ 4 నుంచి 6 వరకు భక్తోత్సవం, 6న ఉదయం 11.55 గంటలకు సీతారామచంద్రస్వామి వారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తామని ఈవో పేర్కొన్నారు. అదేరోజు సాయంత్రం పూర్ణాహుతి, రథోత్సవం, వసంతోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. -
భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు
జగిత్యాల: హనుమాన్ చిన్న జయంతికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శనివారం ఎస్పీ అశోక్కుమార్తో కలిసి కొండగట్టు ఆంజనేయస్వామి జయంతి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భక్తులకు తాగునీరు, మొబైల్ టాయిలెట్స్ తదితర వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలో నిత్యం శానిటేషన్ నిర్వహించాలన్నారు. ఏప్రిల్ 11 నుంచి 13 వరకు నిర్వహించే హనుమాన్ చిన్న జయంతికి ఇప్పటి నుంచే అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్డీవో మధుసూదన్, డీఎస్పీ రఘు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ -
అట్టహాసంగా ‘మానేరు’ వార్షికోత్సవం
సప్తగిరికాలనీ(కరీంనగర్): కరీంనగర్లోని మానేరు విద్యాసంస్థల 39వ వార్షికోత్సవ వేడుకలు శనివారం రాత్రి పద్మనగర్లోని మానేరు సీబీఎస్ఈ పాఠశాల ఆవరణలో అట్టహాసంగా జరిగాయి. తేజస్– 2025 పేరిట నిర్వహించిన వేడుకలను శాతవాహన యూనివర్సిటీ వైస్చాన్స్లర్ ఉమేశ్కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 39 ఏళ్లుగా మానేరు విద్యాసంస్థలు దిగ్విజయంగా నడుస్తుండడం అభినందనీయమన్నారు. విద్యార్థులు ఉన్నతంగా చదివి పాఠశాల, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని సూచించారు. విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి మాట్లాడుతూ, 1986లో కరీంనగర్లో 80 మంది విద్యార్థులతో ప్రారంభమైన విద్యాసంస్థలు నేడు ఎన్నో వేల మందికి అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనందించేలా రూపుదిద్దుకున్నట్లు తెలిపారు. విద్యాసంస్థలలో చదివిన చాలా మంది నేడు ఉన్నతస్థానాలకు ఎదిగారని వివరించారు. అనంతరం మానేర్ క్యాట్ 2025 పరీక్షలో టాప్ టెన్లో నిలిచిన విద్యార్థులకు నగదు పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కడారి కృష్ణారెడ్డి, కడారి సునీతారెడ్డి, మాజీ కార్పొరేటర్లు, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. -
నిందితులకు శిక్ష పడేలా చూడాలి
గోదావరిఖని(రామగుండం): నిందితులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుందని, బాధితులకు న్యాయం జరిగేలా కోర్టు కానిస్టేబుళ్లు మానవత్వంతో మెదలాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ఝా స్పష్టం చేశారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో పనిచేస్తున్న కోర్టు డ్యూటీ అధికారులు, లైజనింగ్ అధికారులతో శనివారం కమిషనరేట్ మీటింట్ హాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. నిందితులకు శిక్ష పడేలా సాక్షులను ప్రవేశపెట్టి ట్రయల్ సజావుగా జరిగేలా చూడాలన్నారు. నేరస్తులకు వారెంట్లు, సమన్లు సత్వరం ఎగ్జిక్యూట్ అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. కోర్టులో పెండింగ్లో ఉన్న ట్రయల్ కేసులు, వారెంట్లు, సమన్లు సీసీటీఎన్ఎస్లో డాటా ఎంట్రీ చేయాలని సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటే మనపై నమ్మకం పెరుగుతుందన్నారు. కాగా కోర్టు డ్యూటీ విధుల్లో క్రమశిక్షణతో పనిచేస్తూ హత్య, హత్యాయత్నం, చీటింగ్ కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా కృషిచేసిన, లోక్ అదాలత్ కేసుల్లో ప్రతిభ చూపిన అధికారులకు ప్రశంస పత్రాలు అందజేశారు. అదనపు డీసీపీ(అడ్మిన్) రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, టాస్క్ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, లీగల్సెల్ సీఐ కృష్ణ, సీసీఆర్బీసీ సీఐ సతీశ్, ఐటిసెల్ సీఐ చంద్రశేఖర్గౌడ్, సీసీ హరీశ్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం సీపీ అంబర్ కిషోర్ఝా -
పురుగులమందు తాగి.. ఆపై ఉరేసుకుని..
జూలపల్లి(పెద్దపల్లి): తెలుకుంట గ్రామానికి చెందిన వివాహిత మేకల పద్మ(48) శుక్రవారం రాత్రి పురుగులమందు తాగి, ఆ తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త మేకల తిరుపతి, ఎస్సై సనత్కుమార్ కథనం ప్రకారం.. తిరుపతి ఉపాధి కోసం 13ఏళ్ల క్రితం మలేషియా దేశానికి వెళ్లాడు. ఏడాది క్రితం స్వగ్రామానికి వచ్చాడు. అప్పట్నుంచి వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. అయితే, నెలరోజుల క్రితం అతడికి జ్వరం వచ్చింది. పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్ష చేయించగా.. వైద్యులు మందులు ఇచ్చారు. ఆ మందులు వాడినా జ్వరం తగ్గలేదు. దీంతో కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోగా టీబీ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. విదేశాలకు వెళ్లివచ్చి నందున మరికొన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. అందుకు తిరుపతి ఒప్పుకోలేదు. పరీక్షలు చేయించుకోవాలని అతడి భార్య పద్మ కూడా అనేకసార్లు చెప్పినా నిరాకరించాడు. దీంతో మనోవేదనకు గురైన పద్మ ఇంట్లోని పురుగుల మందు తాగి, దూలానికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. మృతురాలి కూతురుకు వివాహం కాగా, కుమారుడు హైదరాబాద్లో ఉంటున్నాడు. భర్త వైద్య పరీక్షలు చేయించుకోవడం లేదని మనోవేదన తెలుకుంటలో వివాహిత ఆత్మహత్య -
ఆర్టీసీ డిపోలో ట్రాక్టర్ పరికరాలు మాయం
కోరుట్ల: ఇసుక అక్రమ రవాణా కారణంగా కోరుట్ల ఆర్టీసీ డిపోలో ఉంచిన ట్రాక్టర్ నుంచి విడిభాగాలు మాయం కావడం ఆర్టీసీ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. వివరాలు.. ఫిబ్రవరి 24న అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్(టీఎస్ 21టీ 4499)ను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. అనంతరం రూ.25 వేలు జరిమానా వేసి ట్రాక్టర్ను ఆర్టీసీ డిపోకు తరలించారు. ఈక్రమంలో ట్రాక్టర్ యజమాని సంగ గంగాధర్ రెండు రోజుల క్రితం జరిమానా కట్టి రెవెన్యూ అధికారుల నుంచి ట్రాక్టర్ రిలీజ్ ఆర్డర్ తీసుకుని ఆర్టీసీ డిపోకు వెళ్లగా సుమారు రూ.5 వేలు విలువైన ట్రాక్టర్ విడి భాగాలు కనిపించలేదు. డిపోలో ఉంచిన ట్రాక్టర్ నుంచి విడి భాగాలు ఎలా మాయమయ్యాయని ఆందోళన చెందిన గంగాధర్ రెండురోజుల క్రితం డిపో మేనేజర్కు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై డిపో మేనేజర్ మనోహర్ మాట్లాడుతూ, ఆర్టీసీ డిపోలో ఉన్న సమయంలో ట్రాక్టర్ విడి భాగాలు మాయమైనట్లు తమకు ఫిర్యాదు వచ్చిందని పూర్తి స్థాయి విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. -
స్టీరింగ్ ఊడి.. బోల్తా పడి
మంథని: వ్యవసాయ పనుల కోసం కూలీలను తీసుకెళ్తున్న ఆటో పెద్దపల్లి జిల్లా కాటారం– మంథని ప్రధాన రహదారి నాగేపల్లి క్రాస్ వద్ద బోల్తాపడిన ప్రమాదంలో 16 మంది గాయపడ్డారు. ఇందులో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా కరీంనగర్, గోదావరిఖని ఆస్పత్రులకు తరలించారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మంథని మండలం బట్టుపల్లి గ్రామానికి చెందిన 16 మంది మహిళా కూలీలు శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లారంలో మిర్చి ఏరేందుకు ఆటోలో బయలుదేరారు. మార్గమధ్యలో ఆటో స్టీరింగ్ రాడ్ ఊడి అదుపుతప్పి బోల్తాపడింది. అందులోని కూలీలకు గాయాలయ్యాయి. ఆస్పత్రులకు తరలింపు.. ఆటో బోల్తాపడిన ఘటనలో గాయపడినవారిని దారివెంట వచ్చే వాహనాలతోపాటు స్థానికులు సమకూర్చిన వాహనాల్లో మంథనిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో బొందల కిష్టమ్మ తల, అప్పాల శైలజ చేయి, అప్పల వనిత భుజానికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించారు. గడ్డి మల్లక్క, సత్తమ్మ, సమత, ఎర్రమ్మ, కందుల రాజేశ్వరి, పోసక్క, కోలగాని సమ్మక్క, గౌరక్క, జంగ లక్ష్మి, కమ్మబోయిన స్రవంతి, కమల, బోధ మల్లమ్మతోపాటు మరో మహిళా కూలీని పెద్దపల్లి, గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకెళ్లారు. డ్రైవర్ సతీశ్ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న రాష్ట్రమంత్రి శ్రీధర్బాబు అధికారులను అప్రమత్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. కాంగ్రెస్ సోషల్ మీడియా నాయకులు సైతం సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడినవారిని గోదావరిఖనిలో ఏసీపీ రమేశ్, మంథని సీఐ రాజు, ఎస్సై రమేశ్తోపాటు పోలీస్ సిబ్బంది కలిసి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 16 మంది మహిళా కూలీలకు గాయాలు మిర్చి ఏరేందుకు తీసుకెళ్తుండగా బోల్తాపడిన ఆటో ముగ్గురి పరిస్థితి విషమం.. ఆస్పత్రులకు తరలింపు -
బైండోవర్ ఉల్లంఘించిన మహిళకు జరిమానా
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని అల్మాస్పూర్కు చెందిన ఓ మహిళ బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించడంతో శనివారం తహసీల్దార్ సుజాత జరిమానా విధించారు. ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు. అల్మాస్పూర్కు చెందిన భూక్య జ్యోతి గతంలో నాటుసారా తయారు చేస్తూ ఎకై ్సజ్ అధికారులకు పట్టుబడింది. జ్యోతిని అరెస్ట్ చేసిన అధికారులు తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. బైండోవర్ సమయంలో తిరిగి సాటుసారా తయారు చేయబోమని నగదు పూచీకత్తుపై అప్పటి తహసీల్దార్కు ఒప్పందపత్రం రాసి ఇచ్చారు. కాగా జ్యోతి మళ్లీ నాటుసారా తయారు చేసి విక్రయిస్తూ అధికారులకు పట్టుబడ్డారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన జ్యోతిని ఎకై ్సజ్ అధికారులు శనివారం అరెస్ట్ చేసి తహసీల్దార్ ఎదుట హాజరుపర్చగా రూ.20వేలు జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు. దాడిలో సిబ్బంది రాజేందర్, రాజు, మల్లేశ్, కిశోర్కుమార్ ఉన్నారు. -
గంజాయి విక్రయిస్తున్న యువకుడి అరెస్ట్
మెట్పల్లి(కోరుట్ల): ఓ వైపు కూలీ పని చేస్తూ.. మరోవైపు గంజాయి విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ నిరంజన్రెడ్డి కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన పోగుల అజయ్ కొంతకాలం క్రితం ఉపాధి నిమిత్తం కోరుట్లకు వచ్చి విగ్రహాలు తయారు చేసే షాపులో పని చేస్తున్నాడు. శనివారం ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ సిబ్బందితో కలిసి మేడిపల్లి క్రాసింగ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, అజయ్ బైక్పై అటు వైపు వచ్చాడు. అక్కడ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా, వెంబడించి పట్టుకున్నారు. అనంతరం అతడి జేబులను పరిశీలించగా 300 గ్రాముల గంజాయి దొరికింది. గంజాయి, బైక్, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. గతంలో కోరుట్ల పోలీస్స్టేషన్లో ఒక గంజాయి, మరో రెండు ఇతర కేసుల్లో అజయ్ అరెస్ట్ అయినట్లు సీఐ పేర్కొన్నారు. -
ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టిన స్కూల్ బస్సు
కోరుట్ల: పట్టణంలోని కృష్ణ మందిరం వద్ద జాతీయ రహదారిపై శనివారం గౌతమ్ హైస్కూల్కు చెందిన బస్సు ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టింది. బస్సులో డ్రైవర్, క్లీనర్ తప్ప ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పోలీసుల వివరాలు.. స్కూల్ ముగిసిన తర్వాత విద్యార్థులను ఇళ్లకు చేర్చి వెళ్లే క్రమంలో జాతీయ రహదారిపై యూటర్న్ తీసుకుంటుండగా డ్రైవర్ మారుతి బస్సు వేగంగా నడపడంతో రోడ్డు పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టింది. బస్సు ముందుభాగం దెబ్బతింది. ట్రాన్స్ఫార్మర్ కిందపడి పేలింది. విద్యుత్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బదులు కార్మికులపై విచారణ పూర్తి
● నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో బదులు కార్మికుల విచారణ పూర్తి చేసినట్లు కమిషనర్ చాహత్ బాజ్పేయ్ తెలిపారు. ఒకరికి బదులు మరొకరు విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికుల వ్యవహారంపై శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఫోర్మెన్ కమిటీ విచారణ చేపట్టింది. గతంలో నోటీసులు జారీ చేసిన, అర్జీలు సమర్పించిన కార్మికులు కమిటీ ఎదుట హాజరయ్యారు. డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి, సహాయ కమిషనర్ వేణు మాధవ్, ఈఈ సంజయ్కుమార్, ఏసీపీ బషీరొద్దీన్లతో కూడిన ఫోర్మెన్ కమిటీ ఆధ్వ ర్యంలో విచారణ చేపట్టారు. అసలు కార్మికుల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసి, బదులు కార్మికులను విచారించారు. విచారణ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా, మున్సిపల్ నిబంధనలకు లోబడి త్వరలో బదులు కార్మికులపై నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ వివరించారు. పూర్తిస్థాయిలో కమాండ్ కంట్రోల్ సేవలు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టం ద్వారా నగర ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందిస్తున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్పేయ్ తెలిపా రు. నగరపాలక సంస్థలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో గోలైవ్ను ప్రారంభించారు. ఐసీసీ ద్వారా నగరవ్యాప్తంగా 24 జంక్షన్లలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సిగ్నల్స్ ఏర్పాటు చేశామన్నారు. వివిధ ప్రాంతాల్లో 335 సర్వలెన్స్ కెమెరాలు, 350 ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం కెమెరాలు, 10 ఎన్విరాన్మెంటల్ సెన్సార్లు, 10 వీఎండిలు అమర్చినట్లు తెలిపారు. కమాండ్ కంట్రోల్ ప్రతినిధి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ రాయితీని సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్పై కల్పించిన 25 శాతం రాయితీని వినియోగించుకోవాలని కమిషనర్ చాహత్ బాజ్పేయ్ కోరారు. రాయితీతో ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించే గడువు ఈ నెల 31వ తేదీతో ముగుస్తున్నందున, ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు. -
జిల్లాలో 336ఎకరాల్లో పంట నష్టం
కరీంనగర్ అర్బన్: అకాల వర్షం అన్నదాతకు నష్టాన్ని తెస్తోంది. శుక్రవారం జిల్లావ్యాప్తంగా వర్షం కురియగా వ్యవసాయశాఖ నష్ట మ దింపు చేపట్టింది. 13 గ్రా మాల్లోని వరి, మొక్కజొన్న పంటలకు నష్టం జరిగిందని ప్రాథఽమికంగా గుర్తించారు. 33శాతం పంట నష్టం నిబంధన క్రమంలో ప్రాథమిక కసరత్తు చేపట్టారు. ఎక్కువగా చొప్పదండి, రామడుగు, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి జిల్లాల్లో నష్టం వాటిల్లింది. జిల్లాలోని ముగ్ధుంపూర్(కరీంనగర్ రూరల్), కొత్తపల్లి, నాగులమల్యాల(కొత్తపల్లి), చర్లబూత్కూర్(కరీంనగర్ రూరల్), ఇరుకుల్ల(కరీంనగర్ రూరల్), నగునూరు(కరీంనగర్ రూరల్), చామనపల్లి(కరీంనగర్ రూరల్), గోపాల్పూర్(కరీంనగర్ రూరల్), కాట్నపల్లి(చొప్పదండి), రుక్మాపూర్(చొప్పదండి), వెలిచాల(రామడుగు), వన్నారం(రామడుగు), గోపాల్రావుపేట(రామడుగు)లో వరి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లిందని డీఏవో భాగ్యలక్ష్మి వివరించారు. వరి 15 ఎకరాల్లో నష్టం వాటిల్లగా, మొక్కజొన్నకు 321 ఎకరాల్లో నష్టం వాటిల్లిందని వెల్లడించారు. వరి 15 ఎకరాలకు గానూ ఏడుగురు పంట నష్టపోయారని, మొక్కజొన్న 321 ఎకరాలకు గానూ 206 మంది రైతులు నష్టపోయారని వివరించారు. సదరు ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి నివేదించినట్లు పేర్కొన్నారు. -
రైతులు తలుచుకుంటే ప్రభుత్వాలనే మారుస్తారు
● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్జమ్మికుంట/కరీంనగర్రూరల్: రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తే రాజకీయ పార్టీలకు పుట్టగతులుండవని, రైతులు తలుచుకుంటే ప్రభుత్వాలను మార్చేయగలరని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ పేర్కొన్నారు. జమ్మికుంటలోని కేవీకేలో పత్తిసాగులో అధిక సాంద్రత విధానంపై నిర్వహించిన కిసాన్మేళాకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నెముక అన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాలను పక్కనబెట్టి, రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన ఎఫ్పీవో వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జమ్మికుంట కేవీకేలో 105 మంది రైతులతో 208ఎకరాల్లో అధిక సాంద్రత పద్ధతిలో సాగుచేయడం వల్ల కేంద్రప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సాంకేతిక విజ్ఞాన అనుప్రయోగ సంస్థ డాక్టర్ షేక్ఎస్మీరా, జగిత్యాల ఏడీఆర్ శ్రీలత, కరీంనగర్ డీఏవో భాగ్యలక్ష్మి, శాస్త్రవేత్త వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు. పంచాయతీ కార్మికులకు ఉత్తమ సేవలు జిల్లాలోని గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులకు కలెక్టర్ ప్రత్యేకంగా అందిస్తున్న సేవలు బాగున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ అభినందించారు. శనివారం కరీంనగర్ మండలం చామనపల్లిలో ఉచిత మెగా వైద్యశిబిరం ప్రారంభించిన అనంతరం పారిశుధ్య కార్మికులకు ప్రత్యేకంగా వైద్యపరీక్షలు చేయించారు. కార్మికులకు హెల్త్కార్డులు, ఇన్సూరెన్స్, రక్షణ పరికరాలను అందించినట్లు పంచాయతీ కార్యదర్శి మహేందర్రావు సంజయ్కి వివరించారు. కార్మికులకు అందిస్తున్న సేవలు బాగున్నాయని కేంద్రమంత్రి ప్రశంసించారు. ఎంపీడీవో సంజీవరావు, ప్రత్యేక అధికారి జగన్మోహన్రెడ్డి, కార్యదర్శులు కిరణ్రావు, వెంకటేశ్వర్రావు, సుజాత పాల్గొన్నారు. -
ఉపాధి పనికి వెళ్లి.. కుప్ప‘కూలీ’
చందుర్తి (వేములవాడ): ఉపాధి హామీ పనులు చేస్తుండగా ఓ కూలీ మృతిచెందిన ఘటన చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలో జరిగింది. స్థానికుల వివరాలు.. మండలంలోని ఎన్గల్ గ్రామానికి చెందిన పసుల లచ్చయ్య (58) శనివారం గ్రామంలో ఉపాధి పథకంలో భాగంగా మట్టిరోడ్డు నిర్మాణ పనులకు వెళ్లాడు. ఉదయం 9.30 గంటలకు భోజనం చేసేందుకు చెట్టు కిందికి వస్తున్న క్రమంలోనే స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే తోటి కూలీలు మోటారు సైకిల్పై వేములవాడ తరలించేందుకు మల్లారం గ్రామం వరకు వెళ్లగా.. అక్కడి నుంచి 108 అంబులెన్స్లో వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా వారంరోజులుగా ఎండలో ఉపాధి హామీ పనులు చేస్తుండగా వడదెబ్బతో మృతి చెందాడని అనుమానాలు వ్యక్తం కావడంతో మృతదేహానికి పోస్టుమార్టం చేయించినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య రాజేశ్వరి, కుమారుడు, కూతురు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయాలు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లగుండారం శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రగాయాలకు గురయ్యా రు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. వీర్నపల్లి మండలం మద్దిమల్ల తండాకు చెందిన భూక్య జ వహర్, లాల్సింగ్ ద్విచక్ర వాహనంపై మండలంలోని రాచర్లగొల్లపల్లికి వచ్చి తిరిగి వెళ్తుండగా అదుపుతప్పి కిందపడ్డారు. ఇద్దరికి గాయాలు కాగా లాల్సింగ్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రైవేట్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. సిరిసిల్లలో..సిరిసిల్లక్రైం: సిరిసిల్ల బైపాస్ రోడ్లో కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల వివరా లు.. సిరిసిల్ల పట్టణం అంబేడ్కర్నగర్కు చెందిన వ డ్లూరి రాజు, వడ్లూరి కిషన్ బైక్పై వెళ్తుండగా కా రు ఢీకొట్టింది. ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రి, మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ తరలించారు. చెవికమ్మ అప్పగింతశంకరపట్నం(మానకొండూర్): ఆర్టీసీ బస్సులో ఓ మహిళ చెవికమ్మ పోగొట్టుకోగా కండక్టర్ సుధాకర్ వెతికి బాధితురాలి బంధువుకు అందించిన ఘటన కేశవపట్నం బస్టాండ్లో వెలుగుచూసింది. హుజురాబాద్కు చెందిన ఓ మహిళ శనివారం హనుమకొండలో నిజామాబాద్ డిపో బస్సు ఎక్కింది. హుజూరాబాద్ బస్టాండ్ రాగానే బస్సు దిగింది. చెవి కమ్మ కనిపించకపోవడంతో బస్సు సీట్లో పడిపోయి ఉంటుందని, టికెట్ ఆధారంగా కండక్టర్కు ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో కండక్టర్ బస్సులో వెతికాడు. సదరు మహిళ కూర్చున్న సీటు వద్ద చెవికమ్మ కనిపించడంతో బాధితురాలికి విషయం తెలిపాడు. కేశవపట్నంలో తమ బంధువులు ఉన్నారని, వారిని పంపిస్తానని బాధిత మహిళ చెప్పడంతో.. స్వరూప అనే మహిళకు కండక్టర్ చెవికమ్మ అందించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతితంగళ్లపల్లి(సిరిసిల్ల): పిల్ల లు పుట్టడం లేదనే మనస్థాపంతో పురుగుల మందుతాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన తంగళ్లపల్లి మండల కేంద్రంలో జరిగింది. ఎస్సై రామ్మోహన్ తెలిపిన వివరాలు. మామిండ్ల మహేశ్(30)కు నాలుగేళ్ల క్రితం కల్పనతో వివాహమైంది. పిల్ల లు పుట్టడం లేదని మానసికంగా వేదనకు గురయ్యాడు. ఈనెల 17న పురుగుల మందు తాగగా.. ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పనితీరుతోనే ఉత్తమ గుర్తింపు
● వీడ్కోలు సభలో కలెక్టర్ పమేలా సత్పతికరీంనగర్ అర్బన్: ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రజలకు సేవలందించడం అదృష్టంగా భావించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ అజయ్ యాదవ్ శిక్షణ పూర్తిచేసుకొని హైదరాబాద్ వెళ్తున్నందున జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శనివారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్ విభిన్న సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు కలిగిన జిల్లాలో శిక్షణ పొందడం భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మికిరణ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పేయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్ పాల్గొన్నారు. ‘పది’ పరీక్ష కేంద్రాల తనిఖీ సప్తగిరికాలనీ(కరీంనగర్): జిల్లాకేంద్రంలోని పలు పదోతరగతి పరీక్ష కేంద్రాలను కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముకరంపురలోని ప్రభుత్వ పురాతన పాఠశాల, వాణినికేతన్ పాఠశాల, మంకమ్మతోటలోని ధన్గర్వాడీ పాఠశాలల్లో పరీక్షల తీరును పరిశీలించారు. అక్కడ కల్పించిన సదుపాయాలు పరిశీలించి, వేసవి దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రతీ నీటిచుక్కను ఒడిసిపట్టాలి తిమ్మాపూర్: ప్రతీవర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీకాలనీలోని మిషన్ భగీరథ కార్యాలయలో శనివారం నిర్వహించిన ‘ప్రపంచ నీటి దినోత్సవం’ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన, విలువైన తాగునీరు సరఫరా చేస్తున్నామని, ఈ నీటిని వృథా చేయొద్దన్నారు. వేసవి దృష్ట్యా అసిస్టెంట్ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. -
‘పీఎం కుసుం’ను సద్వినియోగం చేసుకోవాలి
కొత్తపల్లి(కరీంనగర్): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కుసుం పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ కోరారు. కరీంనగర్ విద్యుత్ భవన్లో రెడ్కో ఆధ్వర్యంలో పీఎం కుసుం పథకంపై శనివారం నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సోలార్ విద్యుత్తో పంప్సెట్ల ద్వారా పంటలు పండించుకోవచ్చునని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ ఎస్ఈ మేక రమేశ్బాబు మాట్లాడుతూ.. పీఎం కుసుం పథకం కింద ఎండబ్ల్యూ సోలార్ వపర్ ఫ్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చునని, 3–5 ఎకరాలున్న రైతులు అర్హులని తెలిపారు. ఐదు కిలోమీటర్ల లోపల సబ్స్టేషన్ దగ్గరున్న రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లీడ్ బ్యాంక్ అధికారి ఆంజనేయులు, కో అధికారి అజయ్ పాల్గొన్నారు. పశు సంపద గ్రామీణాభివృద్ధికి మూలం మానకొండూర్: పశు సంపద గ్రామీణాభివృద్ధికి మూలమని కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్థకశాఖ శిక్షణా కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.లింగారెడ్డి తెలిపారు. నూతనంగా నియామకమయిన పశువైద్యాధికారులకు 45రోజుల శిక్షణలో భాగంగా మండలంలోని గట్టుదుద్దెనపల్లి, నిజాయతీగూడెంలో ఏర్పాటుచేసిన ఉచిత పశువైద్య శిబిరాలను శనివా రం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాలానుగుణ వ్యాధుల నుంచి పశువులను కాపాడుకోవాలని సూచించారు. జిల్లా పశుగణన అభివృద్ధి సంస్థ అధికారి సత్య ప్రసాదరెడ్డి, శిక్షణాకేంద్రం అధ్యాపకులు ఎం.కోటేశ్వరరావు, సాయిచైతన్య, దివ్య, మానకొండూర్ పశువైద్యాధికారి సుష్మిత పాల్గొన్నారు. నీటిబొట్టును ఒడిసిపడుదాం కరీంనగర్సిటీ: నీరు వృథా కాకుండా ఒడిసిపట్టాలని కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల అకాడమిక్ కో– ఆర్డినేటర్ మనోజ్కుమార్ తెలిపారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా కళాశాల జీవశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మనోజ్కుమార్ మా ట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటు న్న పెను సవాళ్లలో నీటి సమస్య ఎంతో ముఖ్యమైందన్నారు. నీటిని పొదుపుచేయకుంటే రాబోవు తరాలకు నీరు లభించడం కష్టంగా మారుతుందని తెలిపారు. డాక్టర్ బి.తిరుపతి, ఆర్.దేవేందర్, సుజాత, అనిత, నారాయణ, రమ్య, ప్రియాంక, మౌనిక పాల్గొన్నారు. జలం.. పొదుపుతో పదిలం తిమ్మాపూర్: జీవుల మనుగడకు అవసరమైన జలాన్ని పరిరక్షించాలని జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా జిల్లా భూగర్భ జలశాఖ నేతృత్వంలో ఆదరణ సేవా సమితి సహకారంతో తిమ్మాపూర్ రైతువేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఏవో భాగ్యలక్ష్మి హాజరై మాట్లాడారు. ప్రతీ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లా భూగర్భ జలాధికారి శ్యామ్ప్రసాద్నాయక్, వ్యవసాయశాఖ అదనపు సంచాలకుడె శ్రీధర్ నీటి యాజమాన్య పద్ధతులను వివరించారు. ఆదరణ సేవా సమితి అధ్యక్షురాలు కర్రె పావని, భూగర్భ జలశాఖ సహాయ హైడ్రాలజిస్టు అభిలాష్, సీహెచ్.అఖిల, సూపరింటెండెంట్ రెహమాన్, ఏవోలు సురేందర్, శ్రీనివాస్రెడ్డి, వెంకటేశ్, కిరణ్మయి, రాజులునాయుడు పాల్గొన్నారు. -
నేడు బీఆర్ఎస్ సమావేశం
● ముఖ్య అతిథులుగా కేటీఆర్, హరీశ్రావు కరీంనగర్: తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సన్నహాక సమావేశం ఆదివారం కరీంనగర్ జిల్లాకేంద్రంలోని వీ–కన్వెన్షన్లో జరగనుంది. ఉమ్మడి జిల్లాస్థాయి సమావేశాన్ని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు హాజరు కానున్నారు. శనివారం వీకన్వెన్షన్ ఫంక్షన్హాల్ వద్ద ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఏర్పాట్లు పరిశీలించారు. సమావేశానికి పార్టీ మాజీ కార్పొరేటర్లు, మాజీ కో– ఆప్షన్ మెంబర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ కమిటీల ప్రతినిధులు, కార్యకర్తలు హాజరు కావాలని కమలాకర్ పిలుపునిచ్చారు. -
చిమ్మ చీకట్లు
● నగరంలోని చాలా చోట్ల అంధకారం ● వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తం ● పనిచేయని ‘స్మార్ట్’ దీపాలు ● పట్టించుకోని బల్దియా అధికారులునగరంలోని విద్యానగర్– మల్కాపూర్ మెయిన్ రోడ్డు ఇది. ఈ రోడ్డు గుండా నిత్యం వేలాది వాహనాలు, ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. సెయింట్ జాన్స్స్కూల్ నుంచి శాతవాహన వర్సిటీ వరకు కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదు. రోడ్డు గుండా ఉన్న దుకాణాలు మూసివేశాక చిమ్మచీకట్లు కమ్ముకుంటున్నాయి.నగరపాలకసంస్థ డివిజన్లు 60 (కొత్త విలీన గ్రామాలు కాకుండా)హౌసింగ్బోర్డుకాలనీలోని అంతర్గత రోడ్డు ఇది. సబ్స్టేషన్ పక్కనుంచి సమ్మక్క సారలమ్మ గద్దె వరకు వెళ్లే ఈ అంతర్గత ప్రధాన రోడ్డును చీకట్లు ఆక్రమించాయి. స్మార్ట్ వీధి దీపాలు వెలగకపోవడంతో ఆ ప్రాంతం అంధకారంగా మారింది. ● -
ఇఫ్తార్కు ఏర్పాట్లు చేసి వెళ్తుండగా..
శంకరపట్నం(మానకొండూర్): రంజాన్ మాసం సందర్భంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించే ఇఫ్తార్ విందుకు తండ్రికొడుకులు ఏర్పాట్లు చేశారు. అంతలోనే జరిగిన రోడ్డుప్రమాదంలో అసులువుబాసారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రా మంలో ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల క థనం ప్రకారం.. మండలంలోని మక్త గ్రామానికి చెందిన తండ్రికొడుకులు షేక్ అజీమ్ (35), షేక్ రె హమాన్ (10) శుక్రవారం కేశవపట్నంలో ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు చేసి ఇంటికి బైక్పై వెళ్తున్నారు. అదే సమయంలో మండలంలోని మెట్పల్లి గ్రామానికి చెందిన మందాడి శ్రీనివాస్రెడ్డి, ఇజ్జిగిరి హరీశ్ కూడా కేశవపట్నం నుంచి బైక్పై వెళ్తుండగా వరంగ ల్ నుంచి కరీంనగర్ వస్తున్న లారీ కేశవపట్నం బ్రిడ్జి సమీపంలో ఇరువురి బైక్లను ఢీకొంది. ఈ ప్రమాదంలో అజీమ్, రెహమాన్ తీవ్రంగా గాయపడ్డారు. మందాడి శ్రీనివాస్రెడ్డికి తీవ్ర, హరీశ్కు స్వల్పగాయాలయ్యాయి. కేశవపట్నం ఎస్సై రవి, సిబ్బంది 108వాహనంలో క్షతగాత్రులను హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో అజీమ్, రెహమాన్ను పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన లారీ ఆగకుండా వెళ్లడంతో పోలీసులు, స్థానికులు వంకాయగూడెంలో పట్టుకున్నారు. ప్రమాద స్థలాన్ని ఏసీపీ శ్రీనివాస్జీ, హుజూరాబాద్ రూరల్ సీఐ వెంకటి పరిశీలించారు. ఇఫ్తార్ విందులో పాల్గొనాల్సిన తండ్రికొడుకుల దుర్మరణం స్థానికులను కలచివేసింది. రెండు బైక్లను ఢీకొన్న లారీ తండ్రికొడుకులు మృతి మరో ఇద్దరికి తీవ్రగాయాలు -
సందడిగా అల్ఫోర్స్ ‘ఫ్లిక్కర్’
కొత్తపల్లి: వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ మైదానంలో శుక్రవారం శ్రీఫ్లిక్కర్శ్రీ పేరిట నిర్వహించిన భగత్నగర్ అల్ఫోర్స్ ఈటెక్నో స్కూల్ వార్షికోత్సవం సందడిగా సాగింది. వేడుకలను ఎస్సారార్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ వి.మధుసూదన్రెడ్డితో కలిసి అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్రెడ్డి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ 35ఏళ్లుగా అల్ఫోర్స్ విద్యా సంస్థల ద్వారా రాష్ట్ర విద్యారంగానికి విశిష్ట సేవలు అందిస్తూ తలమానికంగా నిలుస్తున్నామని తెలిపారు. అల్ఫోర్స్ ఈటెక్నో పాఠశాల, కళాశాలలో విద్యనభ్యసించిన హర్షిత్రెడ్డి ఇటీవల గేట్–2025లో ఆల్ఇండియా 60వ ర్యాంకు సాధించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. బిల్లుల కోసం మంత్రుల చుట్టూ ప్రదక్షిణలుకరీంనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన నిర్వహిస్తున్నదా లేక రాక్షస పాలన సాగిస్తున్నదా అని మాజీ సర్పంచుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు లక్ష్మీరాజం ప్రశ్నించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ అభివృద్ధి బిల్లుల విడుదలకు మోకాలడ్డుతున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా తప్పుబడుతూ, జిల్లావ్యాప్తంగా వరుస ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. బిల్లుల కోసం మంత్రుల చుట్టూ తిరిగినా, నిరాశే మిగిలిందని విమర్శించారు. అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలను కలవడం అనైతికమా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. -
వస్త్రోత్పత్తి ఆర్డర్లు సకాలంలో పూర్తి చేయాలి
సిరిసిల్ల: వస్త్రోత్పత్తిదారులు ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో శుక్రవారం వస్త్రోత్పత్తిదారులతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర శిక్ష అభియాన్, సంక్షేమశాఖల వస్త్రోత్పత్తి ఆర్డర్లను వెంటనే అందించాలన్నారు. ఇందిరా మహిళాశక్తి చీరల ఆర్డర్లను వేగంగా పూర్తి చేయాలన్నారు. చేనేత, జౌళిశాఖ ఏడీ రాఘవరావు, టెస్కో ప్రతినిధి శంకరయ్య, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్, టెక్స్టైల్ పార్క్ అధ్యక్షుడు అన్నల్దాస్ అనిల్కుమార్ పాల్గొన్నారు. కారుణ్య నియామకాలు సిరిసిల్ల మున్సిపాలిటీలో ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తూ మరణించిన ఉద్యోగుల వారసులకు కలెక్టర్ సందీప్కుమార్ ఝా కారుణ్య నియామకపత్రాలు అందించారు. ప్రజా ఆరోగ్య విభాగంలో పబ్లిక్ హెల్త్ వర్కర్గా పనిచేసే సిరిగిరి నర్సింహులు అనారోగ్యంతో 2020లో మరణించగా.. అతని కుమారుడు సిరిగిరి రాజుకు ఉద్యోగ నియామకపత్రం అందించారు. నగునూరి నాంపల్లి 2023 మరణించగా అతని భార్య నగునూరి లతకు నియామకపత్రం అందించారు. మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి పాల్గొన్నారు. అర్హులకు ఓటుహక్కు కల్పించాలి జిల్లాలో 18 ఏళ్లు నిండిన వారికి ఓటుహక్కు కల్పించాలని కలెక్టర్ కోరారు. శుక్రవారం రాజకీయ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఓటర్ జాబితా సవరణ పకడ్బందీగా చేయాలన్నారు. ఎన్నికల సమయంలో కాకుండా ఓటర్ జాబితా సవరణపై రాజకీయ నాయకుల ప్రతినిధులు ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 2,30,157 మంది పురుషులు, 2,47,977 మంది మహిళా ఓటర్లు, 38 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారని తెలిపారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు రాధాభాయి, రాజేశ్వర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు నాగుల శ్రీనివాస్, సంపత్, రాజన్న, రమేశ్, రమణ, ఎన్నికల సిబ్బంది రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా -
రాములోరికి గోటి తలంబ్రాలు
జ్యోతినగర్(రామగుండం): కల్యాణం కోసం తలంబ్రాల తయారీకి సాధారణంగా మరపట్టిన బియ్యం వినియోగిస్తారు. కానీ, శ్రీసీతారాముల కల్యాణం కోసం గోటితో వొలిచిన తలంబ్రాలు వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది. ఈక్రమంలోనే ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీలోని శ్రీసీతారామ సేవా సమితి సభ్యులు గోటితో వొలిచిన తలంబ్రాలను శ్రీసీతారామ కల్యాణం కోసం పంపించడం ఆనవాయితీగా వస్తోంది. ఈఏడాది కూడా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి సన్నిధిలో ఏప్రిల్ 6న శ్రీరామ నవమి నిర్వహించనున్నారు. స్వామివారి కల్యాణోత్సవం కోసం మహిళలు గోటితో వొలిచిన తలంబ్రాలను పంపించి భక్తిని చాటుకుంటున్నారు. గోటితో కోటి తలంబ్రాలను వొలిచే ఈ కార్యక్రమానికి సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీసీతారామ సేవా సమితి సభ్యులు కంది సుజాత, కొండు రమాదేవి, జనగామ రాజేశ్వరి, ఆలయ కమిటీ సభ్యుడు చెప్యాల సత్యానారాయణరావు తదితరులు పాల్గొన్నారు. కోటి తలంబ్రాలు ఒలిచే కార్యక్రమానికి శ్రీకారం -
విత్తనోత్పత్తికి వానగండం
వీణవంక(హుజూరాబాద్): విత్తనోత్పత్తి రైతులకు కష్టకాలమొచ్చింది. ఈ నెల 21నుంచి నాలుగు రో జుల పాటు అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించడంతో సీడ్ రైతుల్లో కలవరం మొ దలైంది. ఈ సమయంలో వర్షం పడితే మగ రేణువులు విప్పుకోక ఆడ,మగ వరి మధ్య ఫలదీకరణ జరుగదు. దీంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం ప డుతుందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే చలి కారణంగా ఆడ,మగ పైరు ఎదుగుదలలో వ్యత్యాసం ఏర్పడింది. పంటను కాపాడుకోవడానికి రసాయనాలు పిచికారీ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. జిల్లాలో ఈ యాసంగి 1.10లక్షల ఎకరాలలో హైబ్రిడ్ వరి సాగుచేస్తున్నారు. తెలంగాణలోనే కరీంనగర్ జిల్లా హైబ్రిడ్సాగులో మొదటిస్థానంలో ఉంది. ఇక్కడి నేలలు సీడ్కు అనుకూలం కావడంతో విత్తన కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఆ గంట సమయమే కీలకం ఆడ,మగ వరిసాగు కొంత కష్టమే. రెండు పైర్లమధ్య రెండు మీటర్ల ఎడం ఉంటుంది. పైరు పిలకదశలో ఉన్నప్పుడు మగవరి పుప్పొడి రేణువులు ఆడవరిపై పడేలా తాడు లేదా కర్రలతో దులుపాలి. దీంతో ఆడవరి ఫలదీకరణ చెందుతుంది. ఉదయం 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.15గంటల సమయంలో మాత్రమే ఈ పని చేయాలి. మగవరిలో రేణువులు ఈ సమయంలోనే బయటికి వస్తాయి. ఈ ఫలదీకరణ సమయం 12రోజులు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో వర్షాలు కురిస్తే గింజ తాలుగా మారి రంగు మారుతుంది. ఫలితంగా విత్తనం మొలకెత్తే స్వభావాన్ని కోల్పోతాయి. క్వింటాల్కు రూ.6వేల నుంచి రూ.20వేల వరకు హైబ్రిడ్సాగులో వీణవంక, శంకరపట్నం, జమ్మికుంటతో పాటు పెద్దపల్లి జిల్లా ముత్తారం, కాల్వశ్రీరాంపూర్, మంథని మండలాల్లో ఎక్కువగా సాగు చేస్తారు. జిల్లాలో ఆరు మల్టీనేషనల్ కంపెనీలతో పాటు 20కి పైగా వివిధ రాష్ట్రాల కంపెనీలు విత్తనం ఇచ్చాయి. ఇక్కడ పండిన పంట ఎనిమిదేళ్లయినా మొలకెత్తే స్వభావం ఉండటంతో కంపెనీలు పోటీపడి విత్తనం ఇస్తున్నాయి. క్వింటాల్కు గతేడాది విత్తనధర రూ.6వేల నుంచి 10వేల వరకు ఉండేది. ఈ సారి క్వింటాల్కు అదనంగా రూ.3వేల నుంచి రూ.4వేల వరకు పెంచాయి. దీంతో పాటు దిగుబడి వచ్చినా, రాకున్నా.. ఎకరాకు రూ.లక్ష ఇస్తామని కంపెనీ డీలర్లు ప్రకటించడంతో రైతులు పోటీపడి సాగుచేశారు. నాలుగు రోజుల పాటు వర్షసూచన భయం.. భయంగా సీడ్ రైతులు ఇప్పుడు వానలు కురిస్తే ఫలదీకరణపై తీవ్ర ప్రభావం ఇప్పటికే ఆడ, మగ వరి ఎదుగుదలలో వ్యత్యాసం పంట దిగుబడి తగ్గుతుందని ఆందోళన జిల్లాలో 1.10 లక్షల ఎకరాలలో హైబ్రిడ్ వరిసాగు -
శనివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2025
కనువిందు చేసిన సింగిడిజిల్లాలో శుక్రవారం మబ్బులు కమ్మిన ఆకాశంలో ఇంద్రధనుస్సు కనువిందు చేసింది. ఓవైపు ఎండ దంచి కొడుతుండగా.. మరోవైపు సాయంత్రం ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై ఉరుములు మెరుపులు అలికిడి చేశాయి. తర్వాత చిటపట చినుకులు వాతావరణాన్ని చల్లబరిచాయి. ఇదే సమయంలో రంగురంగుల హరివిల్లు విచ్చుకోవడం కనువిందు చేసింది. రామడుగు మండలం వెదిరలో సాయంత్రం కనిపించిన ఈ దృశ్యం చూపరులను కట్టిపడేసింది. – రామడుగున్యూస్రీల్ -
ఓటరుగా నమోదు చేసుకోండి
● అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ కరీంనగర్ అర్బన్: పద్దెనిమిదేళ్లు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ కోరారు. ఓటరు నమోదు కార్యక్రమంపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. కొత్త ఓటరు నమోదు కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. 18ఏళ్లు నిండిన వారు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని అన్నారు. కొత్తగా ఓటరు నమోదు చేసుకొనేవారు, తప్పుల సవరణ చేసుకొనేవారు, డబుల్ ఓటర్ నమోదు సవరణ చేసుకొనేవారు, ప్రాంత మార్పిడి చేసుకొనేవారు, చనిపోయిన వారి ఓటు తొలగింపుకు సంబంధించి ఫారంను ఉపయోగించాలని సూచించారు. ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో కె.మహేశ్వర్, ఏవో గడ్డం సుధాకర్, వివిధ రాజకీ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
పచ్చాందాల వరి.. సిరి!
మనిషికి ఎంతటి బాధ ఉన్నా.. మనసును ఉత్తేజపరిచే గుణం ప్రకృతిది. ఆ అందాలు చూస్తే ప్రతీఒక్కరు పులకరించాల్సిందే. మానకొండూరు మండలం ఊటూరు శివారులోని కొండలు.. కోనలు.. ఆ కొండల పక్కనే సెలయేరు (మానేరు వాగు).. దానిని ఆనుకుని ఏటిగడ్డపై పచ్చనిపైర్లు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్, దుర్శేడ్ శివారులో కనుచూపుమేర పచ్చని పొలాలు కళకళలాడుతూ పుడమికి ఆకుపచ్చని చీరకట్టినట్లు ఆకట్టుకుంటున్నాయి. అటువైపు వెళ్తున్న వారిని కనువిందు చేస్తున్నాయి. – మానకొండూర్/కరీంనగర్ రూరల్ మానకొండూర్ మండలం ఊటూరులో పచ్చని పైరు అందాలు -
రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి
సైదాపూర్(హుస్నాబాద్): ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని మండలంలోని గొల్లగూడెంకు చెందిన మర్రి సదానందం (47) మృతిచెందాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. హుజూరాబాద్కు చెందిన ప్రైవేట్ స్కూల్ బస్సు శుక్రవారం సైదాపూర్ వెళ్తుండగా బొత్తల్లపల్లి వద్ద మర్రి సదానందం ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈప్రమాదంలో సదానందం తీవ్రంగా గాయపడ్డాడు. బ్లూకోల్ట్స్ సిబ్బంది 108లో సదానందంను హుజూరాబాద్ ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రైలు ఢీకొని ఒకరి దుర్మరణం రామగుండం: రామగుండం–పెద్దంపేట రైల్వేస్టేషన్ల మధ్య గురువారం అర్ధరాత్రి దక్షిణ్ ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం చెందినట్లు జీఆర్పీ ఔట్పోస్టు ఇన్చార్జి గంగారపు తిరుపతి తెలిపారు. మృతుడి వయస్సు 35–40 మధ్య ఉంటుందన్నారు. నల్లటి జీన్స్ ప్యాంట్, బ్లూ కలర్ ఫుల్షర్టు ధరించి ఉన్నాడన్నారు. తలపగిలి నుజ్జునుజ్జు కావడంతో ముఖాన్ని గుర్తుపట్టలేని విధంగా ఉందని తెలిపారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని, పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి మార్చురీలో భద్రపరిచామని ఆయన పేర్కొన్నారు. సంబంధీకులు ఉంటే సెల్ నంబరు 99493 04574, 87126 58604లో సంప్రదించాలని ఆయన కోరారు. ఎస్సారెస్పీ కాలువలో మృతదేహం లభ్యం హుజూరాబాద్: తుమ్మన్నపల్లి గ్రామంలోని ఎస్సారెస్పీ కాలువలో శుక్రవారం ఓ మృతదేహం లభ్యమైంది. పోలీసుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన వాసాల అరవింద్(21) కరీంనగర్ జిల్లా ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో ఫైనలియర్ చదువుతున్నాడు. ఈనెల 19న స్నేహితులతో కలిసి ఎల్ఎండీలోని ఎస్సారెస్పీ కాలువ వద్దకు ఈత కోసం వెళ్లి గల్లంతైనట్లు ఎల్ఎండీ పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వృద్ధురాలు అదృశ్యంకొత్తపల్లి(కరీంనగర్): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరెం గ్రామానికి చెందిన సావనపల్లి లక్ష్మి (70) బస్సులో కరీంనగర్కు ప్రయాణిస్తూ అదృశ్యం అయింది. నలుపు రంగు, గుండ్రని ముఖం కలిగి, ఎత్తు ఐదడుగులు ఉంటుంది. గులాబీ రంగు చీర, నీలం రంగు జాకెట్ ధరించి ఉంది. ఆమె కోసం బంధువులు, పోలీసులు ఆరా తీస్తూ గాలిస్తున్నారు. అయినప్పటికీ ఆచూకీ లభించడం లేదు. ఆమె కనిపిస్తే కొత్తపల్లి పోలీస్ స్టేషన్కు ఫోన్ నంబర్లు 9494490268/ 8712670765లకు సమాచారం అందించాలని, వారికి నగదు పారితోషికం ఇవ్వబడుతుందని ఎస్హెచ్వో, శిక్షణ ఐపీఎస్ వసుంధర యాదవ్ తెలిపారు. -
ముందుకు నడిపించేది కవిత్వమే
కరీంనగర్ కల్చరల్: మానవాళిని ముందుకు నడిపించే శక్తి కవిత్వానికి ఉందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నలిమెల భాస్కర్ అన్నారు. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా నగరంలోని జ్యోతిబాపూలే మైదానంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కలం నుంచి కవిత్వం ఉద్భవిస్తుందన్నారు. కవితలకు సందర్భోచితమైన చిత్రాలను గీసి అన్నవరం శ్రీనివాస్, గుండు రమణయ్య, అన్నవరం దేవేందర్ మన్ననలు పొందారు. తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు సీవీక ుమార్, కవులు గాజోజు నాగభూషణం, దామరకుంట శంకరయ్య, కందుకూరి అంజయ్య, కె.మహేందర్రాజు, మరిపల్లి మహేందర్, కూకట్ల తిరుపతి, విలాసాగరం రవీందర్ పాల్గొన్నారు. -
ఊరూవాడా చెప్పుకోవాలి
● రైతు రుణమాఫీ, రైతుభరోసా లబ్ధిదారుల పేర్లు ప్రదర్శన ● గ్రామాల్లో ముఖ్య కూడళ్లలో ఫ్లెక్సీల ఏర్పాటుకు నిర్ణయం ● లబ్ధిదారుల వివరాలు, పేర్ల ముద్రణకు రంగం సిద్ధం ● జిల్లాలవారీగా టెండర్లు పిలిచిన వ్యవసాయశాఖ ● ఉగాది నాటికి ఏర్పాటు లక్ష్యంగా ప్రయత్నాలుసాక్షిప్రతినిధి,కరీంనగర్: చేసింది చెప్పుకోవాలి.. అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాము అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలు, అందుకోసం ఖర్చు చేసిన నిధుల వివరాలను ప్రజలకు తెలియజెప్పాలని ప్రణాళికలు రచిస్తోంది. గత ప్రభుత్వం కన్నా అధిక మొత్తంలో ఏకకాలంలో రుణమాఫీ చేశామని, రైతు భరోసా అమలు చేశామని, ఈ విషయాలను గ్రామస్తులు చర్చించుకునే విధంగా చూడాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. అందుకోసం లబ్ధిదా రుల పేర్లను గ్రామంలోని ముఖ్యవీధుల్లో ప్రదర్శించడం, తద్వారా తాము చేసిన పనులకు ఇంటింటికి తెలియజేయడం, ప్రజల మనసు గెలుచుకోవాలన్న తాపత్రయంతో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగం పొందిన పలువురు యువతకు నియామక పత్రాలను ప్రభుత్వ పెద్దలు స్వయంగా అందజేస్తున్న తరహాలోనే ఈ కార్యక్రమం సైతం చేపట్టినట్లు తెలిసింది. వచ్చే స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు ఈ ప్రచారాన్ని ముందుకు తెచ్చినట్లు సమాచారం. ఏం చేస్తారు? రైతు రుణమాఫీ, రైతు భరోసా కోసం ప్రభుత్వం రూ.కోట్లు విడుదల చేస్తోంది. అదే సమయంలో తాము అత్యధిక నిధులు విడుదల చేసి చరిత్ర సృష్టించామన్నది కాంగ్రెస్ వాదన. అదే సమయంలో రుణమాఫీ, రైతు భరోసా అమలు తీరుపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అందుకే, ప్రతిపక్షాల వాదనలను సమర్థంగా తిప్పికొట్టేందుకే ప్రభుత్వం తాము చేసిన పనులను ఊరూ, వాడా చెప్పుకునేలా ఈ ఆలోచనకు తెరతీసింది. ప్రతీ గ్రామంలో కనీసం మూడు ముఖ్యమైన కూడళ్ల వద్ద ఆ గ్రామంలో రైతు భరోసా, రైతు రుణమాఫీలో ఏ రైతుకు ఎంత లబ్ధి జరిగింది? ఆ రైతు పేరు, మాఫీ వివరాలు అంకెల్లో పేర్కొంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయనున్నారు. వీటిని వీలైనంత మంది ఎక్కువగా ప్రజలు వీక్షించేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఈ మేరకు ఉగాదిలోగా టెండర్లు, ముద్రణ పూర్తి కావాలన్న లక్ష్యంతో కలెక్టర్లు, వ్యవసాయాశాఖాధికారులు పనిచేస్తున్నారు. ఇప్పటికే అన్ని గ్రామాల రైతుల పూర్తి వివరాలు గణాంకాలతో సహా సిద్ధం చేశారు. టెండర్లు పిలిచిన వ్యవసాయశాఖ రాష్ట్రంలోని అన్నిజిల్లాల వ్యవసాయశాఖ అధికారులు రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాల్లో రైతుల పేర్ల ముద్రణకు ఫ్లెక్సీ టెండర్లు పిలిచారు. వాస్తవానికి ఈ టెండర్కు అనుకున్నంత ప్రచారం జరగలేదు. ఈ ప్రకటన ద్వారా వచ్చిన టెండర్లను ఖరారు చేసి త్వరలోనే అధికారికంగా ముద్రణకు ఆదేశాలివ్వనున్నారు. ఆరడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పుతో ఈ ఫ్లెక్సీలు ఉండనున్నాయి. ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ మంత్రి ఫొటోలు ఫ్లెక్సీలో ఉండనున్నాయి. ఈ ప్రక్రియ పూర్తి కాగా నే, ముద్రణకు ఆర్డర్ ఇవ్వడం, ఫ్లెక్సీలను గ్రామాల్లో కూడళ్లలో ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోనున్నాయి. ఉమ్మడి జిల్లాలో 2.46 లక్షల మంది రైతులకు మూడు నుంచి నాలుగు దశల్లో ఇటీవల రైతు రుణమాఫీ జరిగింది. వీరికి దాదాపు రూ.రెండువేల కోట్ల వరకు ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఈ నేపథ్యంలో ఎవరికి ఎంత మాఫీ అయిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. -
సిరిసిల్లలో సోలార్ప్లాంట్
సిరిసిల్లటౌన్/కోనరావుపేట: రాజన్నసిరిసిల్ల జిల్లాలోని రైతులు అవలంబిస్తున్న ఆధునిక సాంకేతికత వ్యవసాయాన్ని ఇండో–జర్మనీ బృందం శుక్రవారం పరిశీలించింది. రైతులు పాటిస్తున్న పద్ధతులను అభినందించారు. జిల్లాలో సోలార్ విద్యుత్ప్లాంట్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. కోనరావుపేట మండలం శ్రీరాములపల్లి, మామిడిపల్లి, నాగారం గ్రామాల్లో ట్రయల్రన్లో ఉన్న శ్రీఆక్రాట్ ప్రాజెక్టుశ్రీ పనులను తిలకించారు. ఆయా గ్రామాల్లోని ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్(ఎఫ్పీవో)కు చెందిన పంట పొలాలను సందర్శించారు. ఆక్రాట్ ప్రాజెక్టు కింద రైతులు వినియోగిస్తున్న వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, వారు పొందుతున్న లాభాల గురించి తెలు సుకున్నారు. అనంతరం సిరిసిల్ల సెస్ కార్యాలయంలో చైర్మన్ చిక్కాల రామారావు చాంబర్లో ప్రెస్మీట్లో ఫెడరల్ మంత్రిత్వశాఖ ఆసియా విభాగం ప్రధానిగా పనిచేస్తున్న మిస్ రిబెక్కా రిడ్డర్ మాట్లాడుతూ.. ఆక్రాట్ ప్రాజెక్టు విజయవంతంగా అమలవుతుండడంపై హర్షం వ్యక్తం చేశారు. ఫ్రౌన్హోఫర్ ఏఏఐ నుంచి డాక్టర్ సెబాస్టియన్, డాక్టర్ రఘు ప్రాజెక్టు పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. నాబార్డ్ డీజీఎం శ్రీకాంత్ ప్రాజెక్టు పనితీరును అభినందించారు. సెస్ సభ్యులే..పెట్టుబడి దారులు ఇండో–జర్మన్ సహకారంతో జిల్లాలో ఏర్పాటు చేయనున్న సోలార్ విద్యుత్ప్లాంటులో సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) సభ్యులు పెట్టుబడిదారులవుతారని ఆ సంస్థ చైర్మన్ చిక్కాల రామారావు తెలిపారు. ఇండో–జర్మనీ బృందం సభ్యులతో సహకార రంగంలో విద్యుత్ సరఫరా సంస్థ ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటుపై చర్చించినట్లు తెలిపారు. సోలార్ హబ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 30శాతం, కేంద్ర ప్రభుత్వం 30శాతం, జర్మనీ సంస్థ 40శాతం నిధులు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. సెస్ పరిధిలో సోలార్హబ్ ఏర్పాటైతే సంస్థ సభ్యులు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ తక్కువ ధరలో లభిస్తుందన్నారు. ఇందుకు కృషి చేస్తున్న వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, ఇండో–జర్మనీ సంస్థల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇండో–జర్మనీ బృందంలో పీజేటీఏయూ పరిశోధన డైరెక్టర్ డాక్టర్ బలరామ్, అగ్హబ్ సీఈవో విజయ్ నడిమింటి, ఆ క్రాట్ ప్రాజెక్టు మేనేజర్ ముకేశ్ రామగోని, సేవ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కృష్ణ, నాబార్డ్ కరీంనగర్ డీడీఎం జయప్రకాశ్, దిలీప్, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విజయేందర్రెడ్డి, వైస్చైర్మన్ తిరుపతి, ఏవో శ్రీనివాస్రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. సుముఖత వ్యక్తం చేసిన ఇండో–జర్మనీ బృందం కోనరావుపేట మండలంలో పర్యటన ఆక్రాట్ ప్రాజెక్ట్ సాంకేతిక ట్రయల్ పరిశీలన రైతుల సాంకేతిక సాగుపై అభినందనలు -
‘బద్దలు కొట్టాల్సింది కేసీఆర్ ఫామ్హౌస్ను’
కరీంనగర్ కార్పొరేషన్: ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బద్దలు కొట్టాల్సింది రెగ్యులేటరీ గేట్లను కాదని, కేసీఆర్ ఫామ్హౌస్నని సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి అన్నారు. నగరంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో శుక్రవారం మాట్లాడుతూ.. సాగునీటి కోసం రెగ్యులేటరీ గేట్లను బద్దలు కొడుతామని, బడ్జెట్లో కరీంనగర్కు కేటాయింపులు శూన్యమని గంగుల చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. స్మార్ట్సిటీకి రూ.179 కోట్లు, శాతవాహన యూనివర్సిటీకి రూ.35కోట్లు, వరంగల్ కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్స్కు రూ.41 కోట్లు కేటాయించారని తెలిపారు. మానేర్ రివర్ ఫ్రంట్కు నిధులు ఇవ్వకపోతే జిల్లాకే రాలేదంటున్నారని ఎద్దేవా చేశారు. కేబుల్ బ్రిడ్జి పనుల్లో నాణ్యతాలోపం, డైనమిక్లైట్ల పేరిట కోట్ల వృథాకు కారణమెవరో ప్రజలకు తెలుసన్నారు. నాయకులు శ్రవణ్ నాయక్, కాంరెడ్డి రాంరెడ్డి, స్వామిగౌడ్, దన్నసింగ్, అర్ష మల్లేశం, గుండాటి శ్రీనివాస్రెడ్డి, కుర్ర పోచయ్య పాల్గొన్నారు. ‘స్మార్ట్సిటీ నిధులతోనే కరీంనగర్ అభివృద్ధి’ కరీంనగర్టౌన్: స్మార్ట్సిటీ హోదా, రూ.800 కోట్ల నిధులతో కరీంనగర్ను అభివృద్ధి చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్కే దక్కుతుందని నగర మాజీ మేయర్ వై.సునీల్రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం కరీంనగర్లోని ఎస్బీఎస్ ఫంక్షన్హాల్లో కరీంనగర్ నగర కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. సునీల్రావు, కృష్ణారెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ కార్పొరేషన్ ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 16నెలలైనా కరీంనగర్ అభివృద్ధికి ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. మాజీ మేయర్ డి.శంకర్, బాస సత్యనారాయణరావు, గుగ్గిల్లపు రమేశ్, కోమల ఆంజనేయులు, బంగారు రాజేంద్రప్రసాద్, వాసాల రమేశ్, బోయిన్పల్లి ప్రవీణ్రావు పాల్గొన్నారు. గడువులోగా పనులు పూర్తి చేయాలి కరీంనగర్రూరల్: కరీంనగర్ రైల్వేస్టేషన్లో అమృత్భారత్ పథకంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ సూచించారు. కరీంనగర్ రైల్వేస్టేషన్లో అమృత్భారత్ పథకంలో కొత్తగా నిర్మించిన రెండో అదనపు ఫ్లాట్ఫాం, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఎక్సలెటర్ను శుక్రవారం పరిశీలించారు. రైల్వేస్టేషన్లో 90శాతం వరకు పనులు పూర్తయినట్లు అధికారులు జీఎంకు తెలిపారు. మిగితా పనులను త్వరలో పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు వివరించారు. డీఆర్ఎం అంబరీష్ కుమార్జైన్, స్టేషన్మేనేజరు రవీందర్ పాల్గొన్నారు. నెలకు రెండు ప్రసవాలు చేయాలి మానకొండూర్: ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకు రెండు ప్రసవాలు తప్పనిసరిగా చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ సూచించారు. మానకొండూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు రిజిష్టరు, రికార్డులు పరిశీలించారు. ప్రతీనెల ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయని, మందులు సరిపడ ఉన్నాయా అంటూ వైద్యాధికారులను ఆరా తీశారు. కుక్కకాటుకు మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతీరోజు విధులకు హాజరు కావాలని ఆదేశించారు. బీపీ, షుగర్ మందులు నెలకు సరిపడా ఇవ్వాలన్నారు. ఆస్పత్రి వైద్యాధికారి సల్మాన్, సీహెచ్వో బి.రాజునాయక్, జుబేర్, ఎల్టీ.మునీందర్ పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో ముదిరాజ్ నాయకులు
వేములవాడ/ముస్తాబాద్: ముదిరాజ్లను బీసీ–డీ నుంచి బీసీ–ఏకు మార్చాలని కోరుతూ శుక్రవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వగా.. జిల్లాలోని ముదిరాజ్ కుల సంఘం నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. వేములవాడ ఠాణాకు ముదిరాజ్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, వేములవాడ టౌన్ ప్రెసిడెంట్ లాల దేవయ్య, జిల్లా యూత్ నాయకుడు రెడ్డవేని పరశురాంలను అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. ముస్తాబాద్ పోలీసులు మత్స్యకార సొసైటీ జిల్లా డైరెక్టర్ గాడిచెర్ల దేవయ్యను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల ప్రయోజనానికి సొసైటీలు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం అదే రీతిలో నిధులు కేటాయించాలని కోరారు. -
మతోన్మాద విధానాలను తిప్పికొట్టాలి
కరీంనగర్: దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం చేయాలని కుట్రచేస్తున్న బీజేపీ ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టేందుకు దేశ ప్రజలంతా సిద్ధం కావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో పార్టీ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామితో కలిసి మాట్లాడారు. పార్లమెంటుస్థాయిలో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాలని జమిలి ఎన్నికలను తెరపైకి తీసుకువచ్చి దక్షిణాది రాష్ట్రాలకుు తీరని అన్యాయం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న నరేంద్ర మోడీ అప్పుల దేశంగా మారుస్తున్నాడని, గతంలో రూ.80లక్షల కోట్ల అప్పు ఉంటే తాజాగా రూ.150 లక్షల కోట్ల అప్పుచేసి కార్పొరేటు వ్యవస్థలకు కొమ్ము కాస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కొంత ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇంకా అనేక హామీలను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యుడు కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, అందెస్వామి పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం కావాలని సీపీఐ అభ్యర్థులు సిద్ధం కావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డిభవన్లో శుక్రవారం కార్యవర్గసభ్యుడు బత్తుల బాబు అధ్యక్షతన జరిగిన సీపీఐ జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో సీపీఐకి గణనీయమైన చరిత్ర ఉందని, నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేశారని, నేటికీ అనేక గ్రామాల్లో తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, సభ్యులు ఉన్నారని అన్నారు. అదే ఒరవడిని కొనసాగించేందుకు సీపీఐ శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించే దిశగా ముందుకు సాగాలని తెలిపారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి -
వ్యర్థాల ప్రాసెసింగ్తోనే స్వచ్ఛ నగరం
● కలెక్టర్, నగరపాలక ప్రత్యేకాధికారి పమేలా సత్పతికరీంనగర్ కార్పొరేషన్: వ్యర్థాలు ఉత్పత్తి అయ్యే చోట ప్రాసెసింగ్ చేయడం ద్వారానే స్వచ్ఛ కరీంనగర్ సాధ్యమవుతుందని కలెక్టర్, నగరపాలకసంస్థ ప్రత్యేకాధికారి పమేలా సత్పతి పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా శుక్రవారం నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో కార్యాలయ ఆవరణలో బల్క్ ఆర్గానిక్ వేస్ట్ మేనేజ్మెంట్పై ఎక్స్పో నిర్వహించారు. నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు,ఫంక్షన్హాళ్లు, హాస్ట ళ్లు, అపార్ట్మెంట్లు తదితర నిర్వాహకులకు ఆధునాతన సేంద్రీయ వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఎక్స్పోను ప్రారంభించిన కలెక్టర్, వివిధ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. వ్యర్థాల ద్వారా ఎరువులు తయారు చేయొచ్చని, తద్వారా పర్యావరణాన్ని కాపాడిన వారమవుతామన్నారు. కమిషనర్ చాహత్ బాజ్పేయ్ మాట్లాడుతూ తడి పొడి చెత్తను వేరు చేసి ప్రాసెసింగ్కు పంపించాలన్నారు. చెత్త డంప్యార్డ్కు పోకుండా తగ్గించుకునేందుకు ఆధునాతన సేంద్రీయ వ్యర్థాల నిర్వహణ పద్దతులను అవలంభించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, నగరపాలకసంస్థ అదనపు కమిషనర్ సువార్త, సహాయ కమిషనర్ వేణుమాధవ్, పర్యావరణ ఇంజినీర్ స్వామి పాల్గొన్నారు. క్రీడల్లో రాణించాలి కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాల విద్యార్థులు క్రీడల్లో రాణించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం అంబేద్కర్ స్టేడియంలోని స్విమ్మింగ్పూల్, ప్రాంతీయ క్రీడా పాఠశాలలోని స్విమ్మింగ్ పూల్, యోగాకేంద్రం, జిమ్నాస్టిక్స్, యోగా, అథ్లెటిక్స్, జూడో క్రీడలకు సంబంధించిన పరిసరాలను పరిశీలించారు. స్విమ్మింగ్పూ ల్ వద్ద ఖాళీ ప్రదేశంలో మొక్కలు నాటాలని సూ చించారు. విద్యార్థుల ప్రదర్శనను తిలకించారు. శిక్షణ కలెక్టర్ కలెక్టర్ అజయ్ యాదవ్, డీవైఎస్వో శ్రీనివాస్గౌడ్, ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్రెడ్డి పాల్గొన్నారు. -
అల్ఫోర్స్లో ‘బ్లింక్’ జోష్
కొత్తపల్లి: కరీంనగర్ వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ పాఠశాలలో గురువారం రాత్రి నిర్వహించిన వార్షి కోత్సవ వేడుకలు విద్యార్థుల్లో జోష్ను నింపాయి. పాఠశాల ఆవరణలో గురువారం రాత్రి అల్ఫోర్స్ ‘బ్లింక్’ పేరుతో నిర్వహించిన వేడుకలను అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్రెడ్డితో కలిసి శాతవాహన విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ ఉమేశ్కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రతిభపాటవ పోటీలు, పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. -
విద్యార్థులకు రవాణా భత్యం
కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు సర్కారు రవాణా భత్యం విడుదల చేసింది. ఒక గ్రామం నుంచి మరో గ్రామంలో ఉండే ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి చదువుకునేవారికి రాష్ట్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టం ప్రకారం రవాణా భత్యం విడుదల చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 1,776మందికి ఈ పథకం కింద రూ.1.06 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ మొదటివారంలోగా రవాణాభత్యం అందించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. 9,10 తరగతి విద్యార్థులకు వర్తింపు దూర ప్రాంతాల నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరంలో రవాణా భత్యం అందించేందుకు ఉపాధ్యాయులు ఇటీవల వివరాలు సేకరించారు. ఇది వరకు 1 నుంచి 8వ తరగతుల విద్యార్థులకు మాత్రమే రవాణా భత్యం వర్తింపజేశారు. వచ్చే ఏడాది నుంచి 9,10 తరగతులవారికి సైతం ఈ పథకాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వీరి వివరాలు సైతం సేకరించి ప్రతిపాదనలు పంపారు. విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థి ఇంటికి ప్రాథమిక పాఠశాల కిలోమీటరు దూరం, ప్రాథమికోన్నత పాఠశాల 3 కి.మీ, ఉన్నత పాఠశాల 5కి.మీ దూరంలో ఉంటే రవాణా భత్యం అందిస్తారు. ఆటోలు, తదితర ప్రైవేటు వాహనాల్లో విద్యాలయాలకు వచ్చి వెళ్లేందుకు ఈ భత్యాన్ని చెల్లిస్తారు. ఒకటి నుంచి ఎనిమిది తరగతుల విద్యార్థులకు ఒక్కొక్కరికి నెలకు రూ.600 చొప్పున పది నెలలపాటు రూ.6వేలు, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు సైతం ఇదే విధంగా వర్తింపజేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ డబ్బు విద్యార్థుల వ్యక్తిగత ఖాతాల్లో జమ అవుతుంది. ఈ మేరకు విద్యార్థి పూర్తి వివరాలు, బ్యాంకు ఖాతా సంఖ్య సమగ్రశిక్ష అభియాన్ ప్రాజెక్టు మండలి ఉన్నతాధికారులకు నివేదించారు. రవాణా భత్యానికి అర్హులైన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మంజూరు ఉమ్మడి జిల్లాలో 1,776 మందికి రూ.1.06 కోట్లు -
బయటి ఫుడ్తో ఇన్ఫెక్షన్లు
బయటి ఫుడ్ తినడం ద్వారా ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదాలున్నాయి. ఫుడ్ ఇన్ఫెక్షన్ అయితే లివర్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు తదితర అనారోగ్య సమస్యలు వస్తాయి. సకాలంలో గుర్తించి వైద్యం తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఇంట్లో చేసిన ఆహార పదార్థాలలు తినడం మంచిది. – టీవీ రాజశేఖర్రెడ్డి, జనరల్ ఫిజీషియన్, గోదావరిఖని తనిఖీల్లేకనే.. ఇటీవల ఓ బేకరీలో బ్రెడ్ కొన్నా. దానిపై తయారీ తేదీ, ఎకై ్స్పరీ డేట్, కంపెనీ పేరు లేవు. బేకరీపై నమ్మకంతో కొని, మరుసటి రోజు తినడానికి చూస్తే, బ్రేడ్ పీసుల్లో సిల్వర్ కవర్ ముక్కలు కనిపించాయి. బేకరీ నిర్వాహకులను నిలదీస్తే పొరపాటు జరిగిందని, మరోసారి ఇలా జరగకుండా చూస్తామని చెప్పి ఈజీగా తీసుకున్నారు. అధికారుల తనిఖీల్లేకనే ఇలా జరుగుతున్నాయి. నాకు జరిగిన అన్యాయంపై వినియోగదారుల ఫోరంను ఆశ్రయిస్తా. – పిట్టల రాజ్కుమార్, గోదావరిఖని చర్యలు తీసుకుంటాం నాణ్యతాప్రమాణాలు పాటించని బేకరీలు, స్వీట్హౌజ్లను ఆకస్మికంగా తనిఖీలు చేయిస్తాం. నిబంధనలు పాటించనివాటిపై బాధితులు నేరుగా ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారు. బల్దియాకు వచ్చే ఫిర్యాదుల నేపథ్యంలో శానిటేషన్ విభాగం అధికారులు పలు హోటళ్లపై తనిఖీలు చేసి జరిమానా విధించారు. – జె.అరుణశ్రీ, అదనపు కలెక్టర్ -
పది పరీక్షలకు 12,516 మంది
● టెన్త్ ఎగ్జామ్స్కు అంతా రెడీ ● నేటి నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు పరీక్షలు ● గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి ● జిల్లాలో 73 కేంద్రాల ఏర్పాటు కరీంనగర్: పదోతరగతి పరీక్షలకు యంత్రాంగం సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈమేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా రెగ్యులర్ 12,516 మంది, ప్రైవేట్ విద్యార్థులు 24 మంది పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం 73 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 73 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 73 డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఇద్దరు అదనపు డిపార్ట్మెంట్ అధికారులు, ఐదు ఫ్లయింగ్ స్క్యాడ్ బృందాలు, 694 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారని అధికారులు వెల్లడించారు. ఏర్పాట్లు పూర్తి.. కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతీరోజు పరీక్ష కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను ఆయా పోలీస్ స్టేషన్ నుంచి పరీక్ష సమయాని కంటే ముందుగా తీసుకువచ్చే విధంగా చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), డిపార్ట్మెంట్ అధికారులు (డీవో)లకు ఆదేశాలు జారీ చేశారు. సీసీ కెమెరాల నిఘా.. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. పరీక్ష పేపర్ల సీల్ ఓపెన్ చేసినప్పటి నుంచి పరీక్ష పూర్తయి వాటిని సీల్ చేసేంత వరకు సీసీ కెమెరాల్లో రికార్డు కానున్నాయి. సందేహాలుంటే కాల్చేయండి.. అత్యవసరంగా ఫిర్యాదుల కోసం డీఈవో కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. హెల్ప్లైన్ నంబరు 9441130379ను సంప్రదించాలని అధికారులు సూచించారు. సమస్యలుంటే హెల్ప్లైన్ నంబరు 9441130379 కాల్చేయొచ్చు -
భూనిర్వాసితుల టీడీఎస్ చెల్లింపుల్లో అవకతవకలు?
జగిత్యాల: భూ నిర్వాసితుల నష్ట పరిహారానికి సంబంధించి వడ్డీకి టీడీఎస్ (ట్యాక్స్ డిడెక్టెడ్ ఎట్ సోర్స్) కట్ అవుతుంది. ఈ విషయంలో ఓ ప్రైవేటు ప్రాక్టీషనర్ ద్వారా ఆర్డీవో కార్యాలయం అధికారులు అవకతవకలకు పాల్పడినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి వచ్చిన ఐటీ అధికారులు జిల్లాకేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో గురువారం విచారణ చేపట్టారు. జిల్లామీదుగా వెళ్లే రైల్వేలైన్ కోసం భూసేకరణ చేపట్టారు. 2006లో సుమారు 300 మంది రైతులు భూమి కోల్పోయారు. వారికి పరిహారం కింద ప్రభుత్వం కొంతమేర చెల్లించింది. పరిహారం తక్కువగా ఉందంటూ రైతులు అప్పట్లోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పరిహారం పెంచుతూ వడ్డీతో సహా పూర్తిస్థాయిలో చెల్లించాలని 2019లో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు పెంచిన పరిహారంతోపాటు వడ్డీ కలిపి డిపాజిట్ చేశారు. అయితే ఆ వడ్డీకి సంబంధించిన టీడీఎస్ విషయంలో అధికారులు ఓ ప్రైవేటు ప్రాక్టీషనర్తో చేతులు కలిపి అవకతవకలకు పాల్పడినట్లు తెలుస్తోంది. కొంతమంది రైతులకు పాన్కార్డు లేకపోవడంతో వచ్చిన వడ్డీలో 20 శాతం, పాన్కార్డు ఉన్న వారికి 10 శాతం టీడీఎస్ కట్ చేశారు. 20 శాతం కట్ అయిన రైతుల టీడీఎస్లో ప్రైవేటు ట్యాక్స్ ప్రాక్టిషనర్తో కలిసి ఇతరుల పాన్కార్డులు ఉపయోగించి స్వాహా చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఐటీ అధికారులు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విచారణ చేపట్టారు. కార్యాలయంలో ఉన్న అన్ని ఫైల్స్ పరిశీలించారు. జగిత్యాలలోని సంబంధిత ప్రైవేటు ప్రాక్టిషనర్ను పిలిపించి విచారించారు. ఇందులో సుమారు రూ.50 లక్షల వరకు అవకతవకలకు పాల్పడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో భూనిర్వాసితుల టీడీఎస్ చెల్లింపుల విషయంలో ఐటీ అధికారులు విచారణ చేపడుతున్నట్లు ఆర్డీవో మధుసూదన్ తెలిపారు. ఆర్డీవో కార్యాలయంలో అధికారుల విచారణ ఉదయం నుంచి రాత్రి వరకూ కొనసాగిన తనిఖీలు -
గుర్తు తెలియని మృతదేహం
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం అగ్రహారం శివారులో 25 నుంచి 30ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. మృతుడి ఒంటిపై డార్క్ బ్లూ కలర్ నిక్కర్ ధరించి, కొద్దిగా బట్టతల, కుడి కాలుకు కడియం కలిగి ఉన్నాడు. ఎవరైన గుర్తు పట్టినట్లు అయితే వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని తెలిపారు. ఎన్టీఆర్ చౌరస్తా డ్రైనేజీలో..కరీంనగర్క్రైం: కరీంనగర్లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద గల డ్రైనేజీలో గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించినట్లు వన్ టౌన్ సీఐ బిళ్ల కోటేశ్వర్ తెలిపారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉందని అన్నారు. మున్సిపల్ జవాన్ సుంకరి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. థాయ్లాండ్లో ప్రైవేట్ ఉద్యోగి మృతి● నేడు స్వగ్రామానికి మృతదేహం హుజూరాబాద్: ఉద్యోగంలో ప్రతిభ కనబర్చడంతో కంపెనీ విహారయాత్రకు పంపిస్తే విధి వెక్కిరించింది. అక్కడ రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఓ వ్యక్తి చనిపోయాడు. మృతదేహం నేడు స్వగ్రామానికి రానుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన పుల్ల సృజన్(33) ఏషియన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఉద్యోగంలో ప్రతిభ కనబర్చినందుకు థాయ్లాండ్ విహారయాత్రకు వెళ్లేందుకు కంపెనీ ఆఫర్ చేసింది. థాయ్లాండ్కు వెళ్లిన సృజన్ జనవరి 25న అక్కడ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అక్కడే ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతదేహం శుక్రవారం స్వగ్రామానికి రానుంది. సృజన్కు భార్య స్నేహ, కుమార్తె ఉన్నారు. పాతాళగంగలో పడి జమ్మికుంట విద్యార్థి..జమ్మికుంట: పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులతో కలిసి దైవదర్శనం కోసం వెళ్లిన యువకుడు శ్రీశైలంలో నీటిలో పడి మృతి చెందాడు. ఈ ఘటన జమ్మికుంటలో విషాదం నింపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం గ్రామానికి చెందిన సాగర్ల సుధాకర్– లక్ష్మి దంపతుల కొడుకు సాగర్ల సాయితేజ(19) హైదరాబాద్లో పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ నుంచి స్నేహితులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్లాడు. శ్రీశైలంలోని పాతాళ గంగవద్ద స్నానానికి వెళ్లి కాలుజారి నీటిలో మునిగి చనిపోయాడు. అక్కడివారి సమాచారంతో కుటుంబ సభ్యులు శ్రీశైలం బయల్దేరి వెళ్లారు. -
పట్టించుకోవడం లేదు
మండలంలోని పలు ప్రాంతాలలో ఇప్పటికే అనేక గుట్టబోర్లు మాయమయ్యాయి. పలుకుబడి ఉన్నవారు యథేచ్ఛగా వాటిని తవ్వి మొరం వ్యాపారం చేస్తున్నారు. పెద్దపెద్ద యంత్రాలతో రోజుల వ్యవధిలోనే అటవీప్రాంతంలోని గుట్టబోర్ల ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నారు. – పెద్దనవేణి రాగన్న, బుగ్గారం చర్యలు తీసుకుంటాం ఎవరైనా అనుమతి లేకుండా గుట్టబోర్లను తవ్వితే చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో మొరం కోసం తవ్విన ప్రాంతాలను స్థానిక అధికారులతో కలిసి పరిశీలిస్తాం. మొరం తవ్వకుండా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం. వ్యవసాయ భూముల సమీపంలో ఆక్రమణలను అడ్డుకుంటాం. – మాజిద్, తహసీల్దార్, బుగ్గారం -
మాయమవుతున్న గుట్టలు
● బుగ్గారంలో ఆనవాళ్లు కోల్పోతున్న స్థలాలు ● పట్టించుకోని అధికారులుబుగ్గారం: బుగ్గారం మండలంలోని పలు ప్రాంతాల్లో గుట్టలు, స్థలాలు మాయం అవుతున్నాయి. కొంతమంది మట్టికోసం.. మరికొందరు స్థలాన్ని కబ్జా చేసేందుకు తవ్వుతున్నారు. అనుమతి లేకుండా.. ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతుండడంతో పరిసరాలు గుర్తించలేని విధంగా మారిపోతున్నాయి. ఇదంతా అధికారుల కళ్లముందే జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలు ఇళ్ల నిర్మాణం సమయంలో, ఇతర అవసరాలకు మొరం తవ్వితేనే ఇబ్బందులకు గురిచేసే అధికారులు.. బడాబాబులు, అక్రమార్కులు ఇలా గుట్టలను మాయం చేస్తున్నా పట్టించుకోకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. మండలంలోని సిరికొండ, మద్దునూర్, యశ్వంతరావుపేట, బుగ్గారం, చిన్నాపూర్, గోపులాపూర్ పరిధిలోని గుట్టల స్థలాలను కొంతకాలంగా దర్జాగా తవ్వుతున్నారు. ప్రభుత్వానికి ఎలాంటి రుసుమూ చెల్లించకుండా.. అనుమతి పొందకుండానే అక్రమంగా తవ్వకాలు చేపడుతుండడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో మొత్తం 11 గ్రామాలున్నాయి. అనేక గ్రామాల్లో అటవీశాఖ భూములు ఉన్నాయి. రైతుల పొలాలకు సమీపంలోనే కొన్ని గుట్టలు ఉండడంతో ఆ స్థలాన్ని కలుపుకోవాలనే దురుద్దేశంతో కొంతమంది తవ్వకాలు చేస్తున్నారు. ఫలితంగా ఆ స్థలంలోని విలువైన వృక్ష సంపద కనుమరుగవుతోంది. మరికొంత మంది మొరం కోసం తవ్వుతున్నారని ప్రజలు చెబుతున్నారు. నాలుగైదేళ్లలో సిరికొండ, మద్దునూర్, యశ్వంతరావుపేట, బుగ్గారం, గంగాపూర్, చిన్నాపూర్లోని గుట్టల స్థలాలు పూర్తిగా అన్యాక్రాంతమయ్యాయి. అక్రమ తవ్వకాలపై స్థానిక నాయకులు అధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇటీవల శెకెల్ల శివారులోని గుట్ట స్థలాన్ని జేసీబీలతో రాత్రిపూట మొరం తవ్వకాలు చేపట్టారు. దీనిపై స్థానికులు సంబంధిత అధికారులకు ఫోన్లో తెలపగా.. పోలీసులకు ఫోన్ చేయండంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని సమాచారం. అదేరాత్రి మరో అధికారికి ఫిర్యాదు చేయగా.. ఆయన స్థానిక అధికారులను పంపించారు. విషయం తెలుసుకున్న అక్రమార్కులు తమకు కావాల్సిన మొరాన్ని తవ్వుకున్నారు. -
బిల్లులు ఇవ్వకుంటే సర్వే చేయం
పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా వేధిస్తూ మళ్లీ సర్వే చేయాలని చెప్పడం సరైనది కాదని... సర్వే బిల్లులు వచ్చేవరకు ప్రస్తుత లెప్రసీ సర్వే చేసేది లేదని ఆశా కార్యకర్తలు తేల్చిచెప్పారు. గురువారం డీఎంహెచ్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. స్పందించిన డీఎంహెచ్వో వెంకటరమణ బిల్లులు వచ్చాక ఖాతాలో జమచేస్తామని తెలిపారు. నిర్దిష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఆశ కార్యకర్తలు సర్వే చేసేదిలేదని తేల్చిచెప్పారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గీట్ల ముకుంద రెడ్డి, ఆశ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రంగమైన శారద, జిల్లా ప్రధాన కార్యదర్శి మారేళ్ల శ్రీలత, రాజమణి, లత, సత్యలక్ష్మి, లక్ష్మి, శంకరమ్మ, రజిత, పద్మ, ప్రియాంక, స్వప్న, సుజాత, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. – కరీంనగర్టౌన్కాలువ గేట్లు ఎత్తివేస్తాం● రైతులను ఆదుకుంటాం ● బడ్జెట్లో కరీంనగర్కు తీవ్ర అన్యాయం ● మానేర్ రివర్ ఫ్రంట్కు మొండిచేయి ● కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్: కరీంనగర్ రూరల్ మండలానికి డీ–89 కాలువ ద్వారా రావాల్సిన వాటా సాగునీరు అందకపోతే రెగ్యులేటర్ గేట్లను ఎత్తివేస్తామని, అవసరమైతే వాటిని పగులకొడతామని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ.. తలాపున ఉన్న మానేరులో నీళ్లు అడుగంటుతున్నాయని, వచ్చే రెండు నెలల్లో కరీంనగర్లో నీటి ఎద్దడి నెలకొనే ప్రమాదముందని, అయినా కాంగ్రెస్ నాయకులకు సోయిలేదని విమర్శించారు. జిల్లా నుంచి గొప్ప మంత్రులు ఉన్నా ఈ బడ్జెట్లో జిల్లాకు ఒక్కపైసా కేటాయించలేదని మండిపడ్డారు. కాకతీయ కాలువ 116 క్రాస్ జంక్షన్ వద్ద సాగునీటి సరఫరాలో సమన్యాయం పాటించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. బడ్జెట్లో బీసీలకు కనీసం తగిన నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. కరీంనగర్ నగర అభివద్ధికి బీఆర్ఎస్ హయాంలో రూ.350 కోట్లు తీసుకువచ్చామని, 2023 డిసెంబర్ వరకు వేగంగా పనులు సాగాయని గంగుల గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అన్ని పనులు నిలిచిపోయాయని అన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్కు నిధుల కేటాయింపుపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. పార్టీ నగర అధ్యక్షుడు హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్రరాజు, కంసాల శ్రీనివాస్, రాజేందర్రావు, గందె మహేశ్, బండారి వేణు, సుంకిశీల సంపత్రావు, నారదాసు వసంత్రావు, పబ్బతి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. నేడు రైల్వే జీఎం రాకకరీంనగర్రూరల్: కరీంనగర్, రామగుండం రైల్వేస్టేషన్లను శుక్రవారం దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజరు అరుణ్కుమార్ జైన్ సందర్శిస్తారని కరీంనగర్ స్టేషన్ మేనేజర్ ఎం.రవీందర్ తెలిపారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా కరీంనగర్, రామగుండం రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. జీఎం అరుణ్కుమార్ ప్రత్యేక రైలులో అధికారులతో కలిసి ఉదయం 8.30 గంటలకు కరీంనగర్ రైల్వేస్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులు పరిశీలిస్తారు. అనంతరం రామగుండం వెళ్తారని మేనేజరు వివరించారు. గనుల ద్వారా ఆదాయం ఉమ్మడి జిల్లా సహజ వనరులకు నెలవైన ప్రాంతం. బొగ్గు, గ్రానైట్, ఇసుక, ఇటుక బట్టీలు తదితర మైనింగ్ కార్యకలాపాలతో రాష్ట్రానికి ఆదాయం సమకూర్చుతుంది. ఉమ్మడి జిల్లా నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు రూ.190.62 కోట్లకు గాను రూ.156.21కోట్ల ఆదాయం ప్రభుత్వానికి తెచ్చిపెట్టింది.జిల్లా టార్గెట్ వసూలైంది (రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో) పెద్దపల్లి 2,465.99 2,264.30 సిరిసిల్ల 1,465.07 1,342.18 కరీంనగర్ 12,872.16 10,658.72 జగిత్యాల 2,259.05 1,356.26జీడీడీపీలో అంతంతే.. ఒక ఆర్థిక సంవత్సరంలో జిల్లా ఉత్పత్తి చేసిన వస్తు, సేవల మొత్తం విలువే జీడీడీపీ. జిల్లా ఆర్థికాభివృద్ధికి ముఖ్య కొలమానంగా పరిగణించే జీడీడీపీలో కరీంనగర్ మెరుగ్గా ఉంది. సిరిసిల్ల రాష్ట్రంలోనే 29వస్థానంలో నిలిచింది.జిల్లా జీడీడీపీ(రూ.కోట్లలో) ర్యాంకు కరీంనగర్ 30.216 12 పెద్దపల్లి 27,649 13 జగిత్యాల 24,011 18 సిరిసిల్ల 13,981 29తలసరి ఆదాయం భేష్.. వ్యక్తుల ఆదాయంగా పేర్కొనే తలసరి ఆదాయం విషయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు ముందంజలో ఉన్నాయి. పెద్దపల్లి టాప్లో ఉండగా, జగిత్యాల జిల్లా రాష్ట్రంలోనే చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది.జిల్లా తలసరి ఆదాయం ర్యాంకు పెద్దపల్లి 2,84,661 8 కరీంనగర్ 2,50,243 13 సిరిసిల్ల 2,13,725 28 జగిత్యాల 2,05,273 31జిల్లాల వారీగా గ్యాస్ కనెక్షన్లు జగిత్యాల 3,38,700 పెద్దపల్లి 2,34,600 కరీంనగర్ 5,90,700 సిరిసిల్ల 1,69,200 -
కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ అమలు
కరీంనగర్క్రైం: పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద శుక్రవారం నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ యాక్ట్ (భారతీయ న్యాయ సురక్షా సంహిత) అమలులో ఉంటుందని కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌస్ ఆలం గురువారం వెల్లడించారు. కేంద్రాలకు ఐదు వందల మీటర్ల దూరం వరకు ఇద్దరికి మించి ఉండరాదన్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైకులు, డీజేలతో ఉరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు చేయొద్దన్నారు. పరిసరాల్లోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు మూసివేయాలన్నారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పోలీస్ పెట్రోలింగ్ పార్టీలు విధుల్లో ఉంటాయన్నారు. -
భవిష్యత్ను చాలెంజ్గా తీసుకోవాలి
హుజూరాబాద్: విద్యార్థులు భవిష్యత్ను చాలెంజ్గా తీసుకొని ముందుకు సాగాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మండలంలోని సింగాపూర్ గ్రామంలోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో కళాశాల డైరెక్టర్ కె.శంకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కిట్సోజెన్– 25 క్రీడా సాంస్కృతిక ఉత్సవ ప్రారంభ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ అభ్యున్నతికి ఇంజినీరింగ్ విద్యార్థుల సేవలు అవసరం అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు పోటీపడి చదవాలన్నారు. కళాశాల చైర్మన్ లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ.. కళాశాలలో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. అనంతరం క్రీడా పోటీల పోస్టర్ను ఆవిష్కరించారు. కళాశాల సెక్రటరీ వొడితల సతీశ్కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.ఈశ్వరయ్య పాల్గొన్నారు. రూరల్ ఏసీపీ ఆఫీస్ తనిఖీకరీంనగర్క్రైం: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని రూరల్ ఏసీపీ కార్యాలయాన్ని గురువారం సీపీ గౌస్ ఆలం సందర్శించారు. పెండింగ్ కేసులపై సమీక్ష చేశారు. త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అర్బన్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. సైబర్నేరాల బారిన పడకుండా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. పెండింగ్ వారెంట్లు అమలు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై చర్చించారు. గంజాయి, ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్ బియ్యం రవాణాపై ఉక్కుపాదం మోపాలన్నారు. రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్ పాల్గొన్నారు. ముగిసిన ఇంటర్ పరీక్షలుకరీంనగర్: ఇంటర్ పరీక్షలు ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా జనరల్, ఒకేషనల్ విభాగాల్లో 15,554 మంది విద్యార్థులకు 422 విద్యార్థులు గైర్హాజరు కాగా 15,132 మంది పరీక్షకు హాజరైనట్లు గురువారం డీఐఈవో జగన్మోహన్రెడ్డి తెలిపారు. చివరిరోజు హుజూరాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకరు డిబార్ అయినట్లు వివరించారు. మరోవైపు పరీక్షలు ముగిసిన వెంటనే కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి నెలకొంది. కేరింతలు కొడుతూ జోష్గా కనిపించారు. పిల్లలను తీసుకెళ్లేందుకు ఆయా కళాశాలలు, హాస్టళ్ల వద్దకు తల్లిదండ్రులు చేరుకున్నారు. దీంతో ప్రధాన వీధుల్లో ఆటోలు, బస్సుల్లో రద్దీ నెలకొంది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ జనంతో కిక్కిరిసింది. ఐదుగురు ఎస్సైల బదిలీ కరీంనగర్ క్రైం: కరీంనగర్ కమిషనరేట్ పరిధి లో ఐదుగురు ఎస్సైలు బదిలీ అయ్యారు. స్పెషల్ బ్రాంచిలో పనిచేస్తున్న వంశీకృష్ణ గంగాధర ఎస్సైగా, కరీంనగర్ టాస్క్ఫోర్స్లో పనిచేసే రాజు రామడుగుకు, కరీంనగర్ ట్రాఫిక్లో విధులు నిర్వహిస్తున్న సురేందర్ చొప్పదండికి, రామడుగులో పనిచేస్తున్న శేఖర్ వీఆర్కు, గంగాధరలో విధులు నిర్వహిస్తున్న నరేందర్ రెడ్డిని వీఆర్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సిటీలో పవర్ కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ మరమ్మతు పనులు చేపడుతున్నందున శుక్రవారం మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు 11 కేవీ ఉజ్వల పార్కు, ఐటీ హబ్ ఫీడర్ పరిధి లోని కోతిరాంపూర్ మెయిన్రోడ్, కోతిరాంపూర్, బైపాస్రోడ్డు, హనుమాన్నగర్, ఎమ్మెల్సీ హనుమాన్నగర్, గణేశ్నగర్, పాలిటెక్నిక్ కళాశాల, డీమార్ట్, ఐటీ హబ్ ఏరియాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు 11 కేవీ కోర్టు ఫీడర్ పరిధిలోని క్రోమా, వివేకానంద స్కూల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని టౌన్ 1 ఏడీఈ పి.శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. -
ఉపాధి హామీలో మెరుగు..
మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు కల్పించాల్సిన పనిదినాల విషయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు రాష్ట్రంలోని మిగతా జిల్లాలకన్నా మెరుగ్గా ఉండటం విశేషం. ముందుచూపుతో రాష్ట్రంలోనే అత్యధిక పనిదినాలను కల్పించడంలో సక్సెస్ అయ్యారు.ర్యాంకు జిల్లా లక్ష్యం కల్పించిన శాతం (లక్షల్లో) పనిదినాలు 2 కరీంనగర్ 28.4 26.1 92.1 8 సిరిసిల్ల 21.8 19.6 90.0 12 జగిత్యాల 40.0 35.7 89.4 14 పెద్దపల్లి 25.5 22.8 89.4 -
నక్సల్స్పై కేంద్ర వైఖరి సరైంది కాదు
గోదావరిఖని: నియోజకవర్గాల పునర్విభజన మూలంగా దక్షణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని, నక్సల్స్పై కేంద్ర వైఖరి సరైంది కాదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. స్థానిక భాస్కర్రావు భవన్లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో నక్సలిజాన్ని, కమ్యూనిస్టులను రూపుమాపడానికి కేంద్ర చేస్తున్న నిరంకుశత్వ విధానం సరైంది కాదన్నారు. సమావేశంలో నాయకులు కలవేన శంకర్, తాండ్ర సదానందం, కె.కనకరాజ్, గోషిక మోహన్, గౌతం గోవర్ధన్, తాళ్లపెల్లి మల్లయ్య, మడికొండ ఓదెమ్మ, కోడం స్వామి, మాటేటి శంకర్, అసాల రమ, కందుకూరి రాజరత్నం, మార్కాపురి సూర్య, కుమార్, రేణికుంట్ల ప్రీతం తదితరులు పాల్గొన్నారు. -
ఆదాయం అంతంతే..
● తలసరి ఆదాయంలో పెద్దపల్లి టాప్ ● అటవీ విస్తీర్ణంలో కరీంనగర్ లాస్ట్, ఉపాధి హామీలో భేష్ ● తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్–2025లో వెల్లడిసాక్షి, పెద్దపల్లి: జిల్లాల పురోగతికి సూచికగా భావించే స్థూల జిల్లా దేశీయోత్పత్తి విలువ(జీడీడీపీ)లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు పర్వాలేదన్నట్లుగా ఉండగా.. వ్యక్తుల ఆదాయంగా పరిగణించే తలసరి ఆదాయం విషయంలో జగిత్యాల మినహా మిగతా జిల్లాలు ముందువరుసలో ఉన్నాయి. అర్బన్ జనాభాలో కరీంనగర్లో 3లక్షలు, రామగుండంలో 2.5లక్షలు, జగిత్యాలలో లక్షమంది పట్టణాల్లో నివసిస్తున్నారు. జిల్లా విస్తీర్ణంలో అత్యల్పంగా అడవులు కలిగి ఉండి రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా చివరి స్థానంలో నిలవగా, ఖనిజాల ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడంలో ఉమ్మడి జిల్లాలు ముందువరుసలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్– 2025లో ఈ అంశాలన్నీ వెల్లడయ్యాయి. -
పది పరీక్షలకు 12,516 మంది
● టెన్త్ ఎగ్జామ్స్కు అంతా రెడీ ● నేటి నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు పరీక్షలు ● గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి ● జిల్లాలో 73 కేంద్రాల ఏర్పాటు కరీంనగర్: పదోతరగతి పరీక్షలకు యంత్రాంగం సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈమేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా రెగ్యులర్ 12,516 మంది, ప్రైవేట్ విద్యార్థులు 24 మంది పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం 73 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 73 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 73 డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఇద్దరు అదనపు డిపార్ట్మెంట్ అధికారులు, ఐదు ఫ్లయింగ్ స్క్యాడ్ బృందాలు, 694 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారని అధికారులు వెల్లడించారు. ఏర్పాట్లు పూర్తి.. కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతీరోజు పరీక్ష కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను ఆయా పోలీస్ స్టేషన్ నుంచి పరీక్ష సమయాని కంటే ముందుగా తీసుకువచ్చే విధంగా చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), డిపార్ట్మెంట్ అధికారులు (డీవో)లకు ఆదేశాలు జారీ చేశారు. సీసీ కెమెరాల నిఘా.. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. పరీక్ష పేపర్ల సీల్ ఓపెన్ చేసినప్పటి నుంచి పరీక్ష పూర్తయి వాటిని సీల్ చేసేంత వరకు సీసీ కెమెరాల్లో రికార్డు కానున్నాయి. సందేహాలుంటే కాల్చేయండి.. అత్యవసరంగా ఫిర్యాదుల కోసం డీఈవో కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. హెల్ప్లైన్ నంబరు 9441130379ను సంప్రదించాలని అధికారులు సూచించారు. సమస్యలుంటే హెల్ప్లైన్ నంబరు 9441130379 కాల్చేయొచ్చు -
విగ్రహాల ఆవిష్కరణకు కృషి చేస్తా
తిమ్మాపూర్: మండల కేంద్రంలో మూడేళ్ల క్రితం నెలకొల్పిన మహనీయుల విగ్రహాలు ఆవిష్కరణకు నోచుకోకపోవడం బాధాకరమని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మండలంలోని అఖిలపక్ష నాయకులు పది రోజులుగా మహనీయుల విగ్రహాల ఎదుట రిలే నిరాహార దీక్ష చేస్తుండగా బుధవారం సంఘీభావం తెలిపారు. అనంతరం ముసుగు తొలగించని విగ్రహాలను పరిశీలించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో మాట్లాడి విగ్రహాల ఆవిష్కరణకు కృషి చేస్తానన్నారు. సమస్య పరిష్కారమయ్యేందుకు అవసరమైతే ముఖ్యమంత్రిని కలుస్తానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చందర్, మండల అధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. కార్యక్రమలో సుగుర్తి జగదీశ్వర్, దుండ్ర రాజయ్య, వంతడ్పుల సంపత్, మేడి అంజయ్య, ఆంజనేయులు, శంకర్ కొమురయ్య, రాములు పాల్గొన్నారు. -
షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం
● రూ.50వేలు ఆర్థికసాయం అందించిన కలెక్టర్ సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్టతండాలో అంగోతు రాములు ఇల్లు బుధవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. ఇంట్లో నిల్వచేసిన ధాన్యం, వంట సామగ్రి, విలువైన వస్తువులు, బట్టలు బూడిదయ్యాయి. రాములు కుమారుడు గణేశ్ చదువుకుంటున్న సర్టిఫికెట్లు కూడా కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఏఎంసీ చైర్మన్ సాబేరా బేగం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య పరామర్శించారు. ఈ విషయం కలెక్టర్ సందీప్కుమార్ ఝా దృష్టికి వెళ్లడంతో వెంటనే ప్రభుత్వం తరఫున రూ.50వేల చెక్కును అందజేశారు. ప్రమాదంలో తండ్రి మృతి.. పరీక్ష రాసిన తనయుడు సైదాపూర్: అల్లారుముద్దుగా పెంచిన తండ్రి శవం ఇంటి వద్ద ఉండగా.. ఆయన ఆశయాలు నెరవేర్చేందుకు తనయుడు ఇంటర్ పరీక్షకు హాజరయ్యారు. సైదాపూర్ మండలం ఆరెపల్లికి చెందిన బూర్గుల రాజేశ్వర్రావు కరీంనగర్లో ఓ ప్రైవేట్ కంపెనీ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గత నెల 24న సాయంత్రం డ్యూటీ కోసం కరీంనగర్ వెళ్తుండగా మానకొండూర్ ప్రాంతంలో బైక్ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ సీఎస్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. బుధవారం మృతిచెందాడు. తండ్రి మృతదేహం ఇంటి వద్ద ఉండగా.. తనయుడు అంజి ఇంటర్ ఫస్టియర్ చివరి పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష రాసి వచ్చిన తర్వాత తండ్రికి అంత్యక్రియలు నిర్వహించాడు. -
కాంగ్రెస్తోనే సాగునీటి సమస్య
కరీంనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ వైఖరి వల్లే రైతులు సాగునీటి కోసం ఉద్యమించడం, ఉపాధి కోసం వలసలు వెళ్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రామగుండం నుంచి గజ్వేల్లోని ఎర్రవెల్లి ఫాంహౌజ్ వరకు చేపట్టిన పాదయాత్ర జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకోగా బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సేఫ్గా ఉందని ఉత్తమ్కుమార్రెడ్డి అంటూనే నీటి మళ్లింపు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం రైతాంగాన్ని నట్టేట ముంచడమేనన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు పోరాటాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ రఘువీర్ సింగ్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, బీఆర్ఎస్ నాయకులు జంగిలి ఐలేందర్యాదవ్, మెతుకు దేవరాజు, తదితరులు పాల్గొన్నారు. -
మహాశక్తి ఆలయంలో పూజలు
కరీంనగర్టౌన్: కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి బుధవారం శ్రీ మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శ్రీ మహాశక్తి అమ్మవార్ల దీవెనలతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించినట్లు తెలిపారు. తన విజయం కోసం కృషిచేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం శాసన మండలిలో గళం విప్పుతానన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, మాజీ కార్పొరేటర్ కోలగని శ్రీనివాస్, బండ రమణారెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
క్రమశిక్షణతో విద్యనభ్యసించాలి
కొత్తపల్లి: విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తే విజయం సొంతం చేసుకోవచ్చని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనీటాట్స్ ప్రాంగణంలో శ్రీఫ్లోరెంట్శ్రీ పేరిట నిర్వహించిన పాఠశాల వార్షిక వేడుకలను బుధవారం రాత్రి అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్రెడ్డితో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వార్షిక ప్రణాళికలో భాగంగా నిర్వహించిన వివిధ రకాల పోటీ పరీక్షలు, ప్రతిభా పాటవ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు కలెక్టర్ బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అల్ఫోర్స్ ‘ఫ్లోరెంట్’ వేడుకల్లో కలెక్టర్ పమేలా సత్పతి -
పంపుహౌస్ వద్ద రైతుల నిరసన
ధర్మారం(ధర్మపురి): నంది మేడారం రిజర్వాయర్ నుంచి ఎల్లంపల్లి పైప్లైన్ ద్వారా గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్కు నీటిని తరలించటాన్ని నిరసిస్తూ మేడారం ఎల్లంపల్లి పంప్హౌస్ వద్ద రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాసూరి శ్రీధర్, మాజీ ఎంపీటీసీ మిట్ట తిరుపతి వారికి మద్దతు ప్రకటించారు. ఏఈఈ అఖిల్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. అయినా, రైతులు వినలేదు. మేడారం రిజర్వాయర్లో నీటి మట్టం తగ్గకుండా.. పూర్తిస్థాయి సామర్థ్యంలో నీటిని నింపిన తర్వాతే ఇతర ప్రాంతాలకు తరలించాలని రైతులు డిమాండ్ చేశారు. పరిస్థితిని ఏఈఈ అఖిల్ డీఈ బుచ్చిబాబుతో మాట్లాడి వివరించగా మరో మోటార్ను ఆన్చేస్తామని హామీ ఇవ్వటంతో రైతులు ఆందోళన విరమించారు. నీటి నిల్వలు పెంచాకే పంపింగ్ చేయాలని డిమాండ్ -
అక్రమ పట్టాదారుడు అరెస్ట్
● తహసీల్దార్తోపాటు ముగ్గురిపై కేసు చందుర్తి(వేములవాడ): పట్టాదారులకు తెలియకుండా భూమిని అక్రమ పట్టా చేసుకున్న వ్యక్తితోపాటు తహసీల్దార్, వీఆర్వోపై కేసు నమోదు చేసినట్లు చందుర్తి ఎస్సై అంజయ్య తెలిపారు. ఎస్సై అంజయ్య తెలిపిన వివరాలు. చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన దొంగరి వెంకటరాములుకు చెందిన 73 సర్వేనంబర్లో 2.08 ఎకరాల భూమిని, అదే సర్వేనంబర్లోని దొంగరి శంకర్కు చెందిన 2.07 ఎకరాలను అదే గ్రామానికి చెందిన ఈర్లపల్లి రాములు ఉరప్ చిన్నరాములు 4.15 ఎకరాల పట్టా చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో అక్రమ పట్టా చేసుకున్న ఈర్లపల్లి రాములుతోపాటు పట్టాచేసిన అప్పటి తహసీల్దార్ రాజగోపాల్రావు, వీఆర్వో రాజేశంలపై కేసు నమోదు చేశారు. అక్రమ పట్టా చేసుకున్న రాములును పోలీసులు అదుపులోకి తీసుకోగా, తహసీల్దార్, వీఆర్వోలు పరారీలో ఉన్నారు. త్వరలోనే పట్టుకోనున్నట్లు ఎస్సై తెలిపారు. చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతిమానేరువాగులో ఉదయ్ మృతదేహం ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని నారాయణపూర్కు చెందిన కమటం ఉదయ్(35) మానేరువాగులోకి చేపల వేటకు వెళ్లి మృతిచెందాడు. ఇంటి నుంచి రెండు రోజుల క్రితం వెళ్లిన వ్యక్తి వాగులో శవమై తేలడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాలు. ఉదయ్ సెంట్రింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈనెల 17న సోమవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. రెండు రోజుల నుంచి ఉదయ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లల్లో గాలించారు. ఈక్రమంలోనే బుధవారం మానేరువాగులో శవమై తేలినట్లు తెలియడంతో కుటుంబ సభ్యులు వెళ్లి ఉదయ్గా గుర్తించారు. చేపలు పడుతున్న క్రమంలో అదుపుతప్పి వాగులో పడి నీట మునిగినట్లు భావిస్తున్నారు. మృతుడికి భార్య సరళ, ఇద్దరు కూతుళ్లు అత్విక, అశ్విక ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. విద్యుత్షాక్తో ఒకరు.. మానకొండూర్: మానకొండూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన తాండ్ర దేవయ్య(54) బుధవారం ఉదయం విద్యుత్షాక్తో మృతి చెందాడు. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప్రకారం.. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన తాండ్ర దేవయ్య వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం ఉదయం ఇంటిపై ఉన్న పరదా తీయడానికి పైకి ఎక్కాడు. పరదా తీస్తుండగా, ఇనుప చువ్వల ద్వారా విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురై అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్కు తరలిస్తుండగా చనిపోయాడు. దేవయ్యకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రథోత్సవానికి తీసుకెళ్లలేదని ఆత్మహత్యధర్మపురి: ధర్మపురిలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి రథోత్సవానికి తీసుకెళ్లడం ఆలస్యమవుతుందని తండ్రి చెప్పినందుకు క్షణికావేశంలో యువతి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండలంలోని దమ్మన్నపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తోడేటి రాజమల్లు, మంజుల దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద కూతురు మహేశ్వరి (19) ఇంటర్ చదివి ఇంటి వద్దనే ఉంటోంది. నృసింహుని జాతరకు తీసుకెళ్లాలని తండ్రి కోరగా.. తాళ్లు ఎక్కివచ్చి తీసుకెళ్తానని చెప్పాడు. దీనికి మహేశ్వరి మొండికేసింది. తండ్రి తాళ్లు ఎక్కడానికి వెళ్లగా ఇంట్లోనే ఉరేసుకుంది. తల్లి మంజుల ఎంత బతిమిలాడినా తలుపులు తీయకపోవడంతో చుట్టుపక్క వాళ్లను పిలిచి తలుపులు పగులగొట్టింది. అప్పటికే మహేశ్వరి మృతి చెందింది. ఏఎస్సై రాజు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మహేశ్వరి తల్లి మంజూల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. -
రిజర్వాయర్లో మృతదేహం లభ్యం
తిమ్మాపూర్: లోయర్ మానేరు జలాశయంలో బుధవారం వృద్ధురాలి శవం లభ్యమైంది. ఎస్సై వివేక్ తెలిపిన వివరాల ప్రకారం ఎల్ఎండీ రిజర్వాయర్లో వద్ధురాలి శవాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని రిజర్వాయర్లో మృతదేహం ఉండగా సమీపంలో ఆధార్కార్డుతో పాటు బ్యాగును పోలీసులు గుర్తించారు. ఆధార్కార్డు ఆధారంగా అందె మల్లవ్వ, ఇందుర్తి అడ్రస్ ఉండడంతో పోలీసులు గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తుల ద్వారా కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో ఎల్ఎండీ పోలీసులను సంప్రదించారు. మృతదేహాన్ని ఎల్ఎండీ పోలీసులు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. కాగా వృద్ధురాలికి సంబంధించిన బంధువులు ఫిర్యాదు ఇవ్వలేదని పోలీసులు పేర్కొన్నారు. -
పెగడపల్లిలో విద్యార్థి కిడ్నాప్ కలకలం
పెగడపల్లి: పెగడపల్లి మండలకేంద్రంలో బుధవారం పట్టపగలు విద్యార్థి కిడ్నాప్ కలకలం సృష్టించింది. గంట వ్యవధిలోనే పోలీసులు కిడ్నాప్ను ఛేదించడంతో విద్యార్థి తల్లిదండ్రులు, నందగిరి గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. మండలంలోని నందగిరికి ఐలవేని రంజిత్కుమార్ మండలకేంద్రంలోని మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్నం తన స్నేహితుడు శివరాత్రి శివతో కలిసి ద్విచక్రవాహనంపై ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యంలో విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో వంతెన వద్ద కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వారు పయణిస్తున్న ద్విచక్రవాహనాన్ని అడ్డగించి రంజిత్కుమార్ను కారులో ఎక్కించుకుని కరీంనగర్ వైపు తీసుకెళ్లారు. వెంటనే తేరుకున్న శివ ఫోన్ద్వారా పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన ఎస్సై రవికిరణ్, సిబ్బంది వెంకట్రెడ్డి, శ్రీనివాస్, రవీందర్ వెంబడించి కారుతోపాటు కిడ్నాపర్లను పట్టుకున్నారు. కరీంనగర్ శివారు గ్రామమైన తీగలగుట్టపల్లికి చెందిన ఆరెపల్లి అనిల్, నవీన్కుమార్, గసికంటి వర్ధన్, మైస అంజయ్యను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నవీన్కుమార్కు చెందిన పెంపుడు కుక్కను అపహరించాడన్న అనుమానంతో రంజిత్కుమార్ను కిడ్నాప్ చేసినట్లు నిందితులు తెలిపారు. రంజిత్కుమార్ తండ్రి కోటయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. రంజిత్కుమార్ను పోలీసులు తల్లిదండ్రులకు సురక్షింతంగా అప్పగించారు. గంట వ్యవధిలో కిడ్నాప్ చేధించి బాలుడిని రక్షించిన ఎస్సై రవికిరణ్, సిబ్బంది వెంకట్రెడ్డి, శ్రీనివాస్, రవీందర్ను ఎస్పీ అశోక్కుమార్, డీఎస్సీ రఘుచందర్, మండల ప్రజలు అభినందించారు. గంటలోనే ఛేదించిన పోలీసులు ఊపిరి పీల్చుకున్న బాలుడి తల్లిదండ్రులు -
23న కేటీఆర్, హరీశ్రావు రాక
కరీంనగర్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు ఈనెల 23న కరీంనగర్కు రానున్నారని, కొండ సత్యలక్ష్మి గార్డెన్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కరీంనగర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కేటీఆర్, హరీశ్రావు పర్యటనను జయప్రదం చేయాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు, నారదాసు లక్ష్మణరావు, నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, శ్యాంసుందర్ రెడ్డి, కాసరపు శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. జిల్లాజైలును సందర్శించిన సీపీ కరీంనగర్క్రైం: సీపీ గౌస్ఆలం బుధవారం జిల్లా జైలును సందర్శించారు. జైలులోని పరిశ్రమలు, ఉత్పత్తులు, తయారీ కేంద్రాలను పరిశీ లించారు. వంటశాల, క్యాంటీన్, ఫోన్ సౌకర్యం, ములాఖత్, లైబ్రరీ, బ్యారక్ గదులు, ఆసుపత్రి, మహిళా జైలు గురించి అడిగి తెలు సుకున్నారు. పెట్రోల్ బంక్ ద్వారా ప్రజలకు సమర్థవంతంగా సేవలందిస్తున్నందుకు జైలు అధికారులను అభినందించారు. జైలు సూపరింటెండెంట్ జి.విజయడేని, మెడికల్ ఆఫీసర్ వేణుగోపాల్, జైలర్ బి.రమేశ్, డిప్యూటీ జైలర్లు శ్రీనివాస్రెడ్డి, సుధాకర్రెడ్డి, రమేశ్, అజయ్చారి పాల్గొన్నారు. నల్లానీరు వృథా చేయొద్దు కరీంనగర్ కార్పొరేషన్: నల్లానీరు వృథాగా వదిలేస్తే చర్యలు తీసుకుంటామని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్ నగరవాసులను హెచ్చరించారు. బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను పరిశీలించారు. పలు ఇళ్లలోకి వెళ్లి నల్లానీటి పరిస్థితిపై ఆరా తీశారు. నల్లాలకు ఆన్ ఆఫ్ బటన్ లేకుండా నీళ్లు వృథాగా పోతుండడాన్ని, విద్యుత్ మోటార్లు అమర్చి నీటి చౌర్యానికి పాల్పడుతుండడాన్ని పరిశీలించారు. రాంనగర్ వాటర్ ట్యాంక్లో తాగునీటి సరఫరా విభాగం ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరపాలకసంస్థ నల్లాలకు తప్పకుండా ఆన్ ఆఫ్ బటన్లు అమర్చుకోవా లని సూచించారు. ప్రస్తుతం వేసవి సీజన్ కాబట్టి నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. నల్లా నీటిచౌర్యం చట్టరీత్యా నేరమని, విద్యుత్ మోటార్లు అమర్చి నీటిచౌర్యానికి పాల్పడుతున్న వారిపై చర్యలుంటాయన్నారు. సరఫరా సమయంలో సంబంధిత లైన్మెన్, ఫిట్టర్, ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. 100శాతం సాధించారుహుజూరాబాద్/జమ్మికుంట: జిల్లాలోని హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల పరిధిలో పన్ను వసూళ్ల లక్ష్యాన్ని సాధించారు. 100శాతం పన్ను వసూలు చేసి రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిపారు. హుజూరాబాద్లో వందశాతం పన్నులు వసూలు చేసినట్లు ము న్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. ఉద్యోగులు, వార్డు ఆఫీసర్లు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం ద్వారా 15 రోజుల వ్యవధిలో 100శాతం పన్ను వసూళ్లు పూర్తి చేశామన్నారు. 30 వార్డుల్లో 8,917 నివాసాలకు గాను రూ.2.64 కోట్లు వసూలైనట్లు తెలిపారు. పోలీస్శాఖ నుంచి రూ.5.41 లక్షలు, కోర్టు బిల్డింగ్ల ద్వారా రూ.3.80 లక్షలు, ఎంపీడీవో కార్యాలయం ద్వారా రూ.1.18 లక్షలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా రూ.1.18 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. అనంతరం సిబ్బందితో కలిసి కేక్కట్ చేశారు. మేనేజర్ రావుల భూపాల్రెడ్డి, ఏఈ సాంబరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ కిషన్రావు పాల్గొన్నారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలో వందశాతం పన్ను వసూళ్లు జరిపినట్లు కమిషనర్ మహమ్మద్ అయాజ్ తెలి పారు.సహకరించిన పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మేనేజర్ రాజిరెడ్డి, ఏఈ నరేశ్, టీపీవో శ్రీధర్, జేఏవో రాజశేఖర్ పాల్గొన్నారు. -
తడికోసం తండ్లాట
‘కల్వల’కు గండి కోతగండి పడడంతో దిగువనకు వెళ్తున్న నీరుశంకరపట్నం:మండలంలోని కల్వల ప్రాజెక్టుకు రైతులు తాత్కాలికంగా వేసిన కట్టకు బుధవారం వేకువజామున గండి పడింది. నీరంతా దిగువనకు వృథాగా పోతోంది. కల్వల ప్రాజెక్టు మత్తడికి 2023 జూలై 28న గండిపడగా.. రింగ్బండ్కు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.9లక్షలు మంజూరు చేసింది. ఆ నిధులతో రింగ్బండ్ వేసినా కొన్ని నెలలకే గండి పడింది. రైతులు సొంత ఖర్చులతో తాత్కాలిక కట్ట పోశారు. ఇటీవల గండిపడగా వీణవంక, శంకరపట్నం మండలం కాచాపూర్, గద్దపాక, కల్వల గ్రామాల రైతులు మరమ్మతు చేశారు. రెండ్రోజుల క్రితం ఎస్సారెస్పీ కాలువ ఎస్కేప్ గేట్లను ఎత్తి నీటిని ప్రాజెక్ట్లోకి వదలడంతో బుధవారం కట్టకు గండి పడింది. తాత్కాలిక కట్టతో ప్రాజెక్టులో కొంతమేర నీరు ఉంటే పంటలకు వాడుకున్నామని, గండి పడడంతో చివరి దశలో పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.మానకొండూర్: జిల్లాలోని మానకొండూర్ మండలం ఖాదర్గూడెం వ్యవసాయ గ్రామం. వరి, కూరగాయలు ఇక్కడ ప్రధాన పంటలు. చిన్న గ్రామమైనా 200 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములున్నాయి. ఈ భూముల్లో పంటల సాగుకు పటేల్కుంటే ఆధారం. కుంట ఎగువన ఎంఎంఆర్–4 ఉపకాలువ, దిగువన ఎస్సారెస్పీ కాలువ నిండుకుండలై పారుతున్నా.. కుంటలోకి చుక్కనీరు చేరడం లేదు. దీంతో పంటలు ఎండిపోతున్నాయి. వాటిని కాపాడుకునేందుకు రైతులు పాట్లు పడుతున్నారు. ఎంఎంఆర్–4 ఉపకాలువకు గండి పెట్టారు. కాలువ నుంచి పటేల్కుంట వరకు కందకం తవ్వారు. కుంటలోకి కాలువ నీరు తరలిస్తున్నారు. తద్వారా పంటలకు జీవం పోస్తున్నారు. ఏటా ఇదే ప్రయత్నం చేస్తున్నారు. కుంటలోకి కాలువ నీరు చేరేలా శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు. ‘పటేల్కుంట నిండితేనే పంటలు పండుతాయని, కుంటలోకి సాగునీరు చేరడం లేదని రైతులు నా దృష్టికి తెచ్చారు. కాలువ డిజైన్లో ప్రతీకుంట నిండేలా చర్యలు తీసుకుంటాం. పూర్తిస్థాయిలో కాలువలు తవ్వడం కాలేదు. కుంటలోకి సాగునీరు వెళ్లేలా కాలువ నుంచి తూము ఉంటుంది. అది ఎక్కడ ఏర్పాటు చేస్తే సాగునీరు కుంటలోకి వెళ్తుందో సర్వే చేస్తాం. ఈ వేసవిలో కాలువల తవ్వకాలు చేపడతాం’ అని డీఈ సదానందం వివరించారు. -
ఆహార నాణ్యతపై తనిఖీలు చేపట్టండి
● కలెక్టర్ పమేలా సత్పతికరీంనగర్ అర్బన్: జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ హాస్టళ్లు, హోటళ్లు, ఆహార తయారీ కేంద్రాల్లో విరి విగా తనిఖీలు చేసి ఆహార నాణ్యత పాటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. ఆహార నాణ్యతపై ఫుడ్సేఫ్టీ జిల్లాస్థాయి సలహా కమిటీ సమావేశం కలెక్టరేట్లో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆహార కల్తీ, నాసిరకమైన ఆహారం తయారు చేయడంపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులను ఆదేశించారు. హోటళ్లు, ఐస్ పాయింట్లు, పండ్ల మార్కెట్లలో తనిఖీలు చేయాలని అన్నారు. ప్రభుత్వ వసతిగృహాలు, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న ఆహార వస్తువులు, సరుకులను పరిశీలించాలని సూచించారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో నడుస్తున్న ఆహార తయారీ కేంద్రాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అన్నారు. అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్దేశాయ్, లక్ష్మీకిరణ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఫుడ్సేఫ్టీ ఆఫీసర్ సునీత, డీఎంహెచ్వో వెంకటరమణ, డీఈవో జనార్దన్రావు పాల్గొన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు చర్యలుమాదకద్రవ్యాల నిర్మూలనకు చర్యలు తీసుకోవా లని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. మత్తు పదార్థాల నిర్మూలనలో భాగంగా పోలీస్, ఎకై ్సజ్ సహా వివిధశాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.పోలీస్, ఎకై ్సజ్, విద్యాశాఖ అధికారులు కళాశాలలు, వివిధ వసతి గృహాలను సందర్శించాలని అన్నారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ పోలీసుశాఖ తరఫున ఇప్పటికే జిల్లాలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ముత్యాల తలంబ్రాలు బుక్ చేసిన కలెక్టర్ విద్యానగర్: శ్రీరామనవమి సందర్భంగా ఈనెల 6న భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణ ముత్యాల తలంబ్రాలను బుధవారం కలెక్టర్ పమేలా సత్పతి బుక్ చేశారు. -
ప్రాజెక్టులకు పెద్దపీట
కరీంనగర్ స్మార్ట్సిటీ రూ.101 కోట్లుస్పోర్ట్స్ స్కూల్ వరంగల్– కరీంనగర్ రూ.41 కోట్లుసాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర బడ్జెట్ 2025–26లో ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు, వివిధ సాగునీటి ప్రాజెక్టుల పనులకే పెద్దపీట వేసింది. ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఎలాంటి కొత్త ప్రాజెక్టులు, తాయిలాల ప్రకటనకు ఈసారి ప్రభుత్వం దూరంగా ఉంది. ఆరు గ్యారెంటీలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, పాత ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతులకు పెద్దపీట వేసింది. కాళేశ్వరం, ఎల్లంపల్లి, వరదకాల్వల నిర్వహణకు నిధుల విడుదల చేయడం ఇందుకు నిదర్శనం. అదే సమయంలో పత్తిపాక ప్రాజెక్టుపై ప్రకటన లేకపోవడం, జగిత్యాల మెడికల్ కాలేజీ నిధులు, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీకి మిగిలిన బకాయిల ప్రస్తావన లేకపోవడం గమనార్హం. శాతవాహన వర్సిటీకి, కరీంనగర్ స్మార్ట్సిటీకి నిధులు కేటాయించిన ప్రభుత్వం.. మానేరు రివర్ఫ్రంట్కు నిధులు కేటాయించకపోవడం విశేషం. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఈ బడ్జెట్లో రూ.2,685 కోట్లు ప్రగతిపద్దులో కేటాయించడం చెప్పుకోదగిన అంశం. కేటాయింపులు ఇలా.. ● శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్ఆర్ఎస్పీ) నుంచి మిడ్మానేరును కలిపే వరద కాల్వకు రూ.299.16 కోట్లు పూర్తి కాని పనుల కోసం వాడనున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు రూ.349.66 కోట్లు స్టేజ్–2లో పూర్తిచేయాల్సిన పనులకు ఈ నిధులను వినియోగించనున్నారు. ● మానేరు ప్రాజెక్టుకు రూ.లక్ష, బొగ్గులవాగు (మంథని): రూ.34 లక్షలు, రామడుగు, గోదావరి బేసిన్: రూ.2.23 కోట్లు, చిన్న కాళేశ్వరం రూ.0, కాళేశ్వరం రూ.2,685 కోట్లు ప్రగతి పద్దు కింద కేటాయించింది. ఈ నిధులను పలుఅభివృద్ధి పనులకు వినియోగించనున్నారు. కానీ.. అంతా ఆశించిన పత్తిపాక ప్రాజెక్టు ప్రస్తావన లేకపోవడం ఉమ్మడి జిల్లా వాసులను నిరాశకు గురిచేసింది. ● శాతవాహన యూనివర్సిటీకి రూ.35 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర క్రీడా విద్యాలయాలైన కరీంనగర్–వరంగల్లకు కలిపి రూ.41 కోట్లు ప్రకటించింది. ● అదే సమయంలో కరీంనగర్లోని ప్రతిష్టాత్మక మానేరు రివర్ ఫ్రంట్ (ఎంఆర్ఎఫ్) కోసం ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరగలేదు. మొత్తం రూ.800 కోట్ల అంచనాతో మొదలైన ప్రాజెక్టు వాస్తవానికి ఈఏడాది మేలో పూర్తవాల్సి ఉంది. గత ప్రభుత్వం రెండు విడదలుగా ఒకసారి రూ.310 కోట్లు మరోసారి రూ.234 కోట్లు మొత్తం కలిపి రూ.545 కోట్ల పైచిలుకు నిధులు విడుదల చేసింది. దీనికి టూరిజం వాళ్లు మరో రూ.100 కోట్లు కలపాల్సి ఉంది. కేటాయించిన నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు చేయకపోవడం, కొత్త కేటాయింపులు లేకపోవడం, సాంకేతిక కారణాల వల్ల ప్రాజెక్టులో జాప్యం నెలకొంది. గతంలో రూ.210 కోట్లు విడుదలవగా, ఇటీవల మరో రూ.130 కోట్ల వరకు విడుదలయ్యాయని తెలిసింది. ● కరీంనగర్ స్మార్ట్సిటీ ప్రాజెక్టు రూ.101 కోట్లు ఇస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో రామగుండం, కరీంనగర్ కార్పొరేషన్లకు సాయం కింద ఏమీ కేటాయించలేదు. ● ఇందిరమ్మ ఇండ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రూ.12,500 కోట్లు కేటాయించింది. పథకంలో భాగంగా ప్రతీ నియోజకవర్గంలో 3500 మంది లబ్ధిదారుల చొప్పున ప్రతీ ఒక్కరికీ రూ.5 లక్షల వరకు ప్రభుత్వం సాయం చేయనుంది. ప్రస్తు తం కేటాయింపుల ప్రకారం..చూసినపుడు119 నియోజకవర్గాల్లో ప్రతీ నియోజకవర్గంలో దాదా పు 2100 ఇండ్లకే ఈ సాయం సరిపోతుంది. ● ఇక ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, ధర్మపురి, కొండగట్టులకు ఎలాంటి ప్రకటన లేకపోవడం భక్తులను నిరాశకు గురిచేసింది. ● కీలకమైన కాకతీయ కాల్వల ఆధునికీకరణ, కల్వల ప్రాజెక్ట్ లకు నిధులు ఇవ్వకపోవడంపైనా ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల పనులకే నిధులు ఎల్లంపల్లికి రూ.349 కోట్లు, వరదకాల్వకు రూ.299 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.2,685 కోట్లు మానేరు రివర్ ఫ్రంట్కు రిక్తహస్తమే శాతవాహన యూనివర్సిటీకి రూ.35 కోట్లు కరీంనగర్ స్మార్ట్సిటీకి రూ.101 కోట్లు 2025–26 బడ్జెట్లో కానరాని కొత్త ప్రాజెక్టుల ప్రస్తావన -
ఇసుక, మట్టి అక్రమ రవాణా
ముత్తారం(మంథని): ఖమ్మంపల్లిలో ఇసుక, మట్టి అక్రమంగా తరలిపోతోంది. మానేరు సరిహ ద్దు గుట్ట, ప్రభుత్వ భూమిలో ఎర్రమట్టితోపాటు ఇసు రవాణా చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా.. మైనింగ్, రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పట్టా భూమిలోంచి మట్టి తీస్తే అనుమతి కావాలంటున్న అధికారులు.. అక్రమ రవాణాపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ మధూసూదన్రెడ్డిని వివరణ కోరగా, అక్రమ రవాణా విషయం తమ దృష్టికి వచ్చిందని, అక్రమార్కులపై చర్యల కోసం మైనింగ్, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. -
మహిళ మెడలోంచి చైన్ చోరీ
మెట్పల్లిరూరల్: ఎల్లమ్మతల్లికి మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన ఓ మహిళ మెడలో నుంచి దుండగుడు బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన మె ట్పల్లి మండలంలో చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం మునిపల్లికి చెందిన దొడ్డ రమ్య, నర్సయ్య దంపతులు మంగళవారం వెల్లుల ఎల్లమ్మ తల్లి ఆలయానికి వచ్చారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని వంట చేసుకునే క్రమంలో వెల్లుల వైపు నుంచి ద్విచక్రవాహనంపై వచ్చిన దు ండగుడు రమ్య మెడలోని రెండున్నర తులాల బంగారు ఆభరణాలను లాక్కెళ్లాడు. భక్తుల సమాచా రంతో మెట్పల్లి సీఐ నిరంజన్రెడ్డి, ఎస్సై కిరణ్కుమార్, సిబ్బంది ఆలయం వద్దకు వెళ్లి ఆరా తీశారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్యజగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్ మండలం వెల్దుర్తికి చెందిన మతులపురం రాజం (55) అప్పుల బాధతో మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రాజంకు ఎకరంన్నర సొంత భూమి ఉంది. దాంతోపాటు కొంత భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. దిగుబడి సరిగా రాకపోవడంతో అప్పులు పెరిగిపోయా యి. ఈ క్రమంలో తనకున్న ఎకరం భూమి అమ్మి కొంత అప్పు చెల్లించాడు. ఇంకా రూ.10లక్షల వరకు అప్పు ఉంది. ఆ మొత్తం ఎలా చెల్లించాలా అని నిత్యం మదనపడుతున్నాడు. మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్సై సదాకర్ తెలిపారు. -
● సీపీ గౌస్ ఆలం ● కొత్తపల్లి పోలీస్స్టేషన్ తనిఖీ
రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టండికొత్తపల్లి(కరీంనగర్): అర్బన్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీపీ గౌస్ ఆలం ఆదేశించారు. కొత్తపల్లి పోలీసుస్టేషన్ను మంగళవారం రాత్రి అకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ కేసుల్లో పట్టుబడి పోలీస్స్టేషన్ ఆవరణలో ఉన్న వాహనాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో మాట్లాడి, సరైన పద్ధతిలో రికార్డుల నిర్వహణ, నమోదైన కేసుల వివరాలు సీసీటీఎన్ఎస్లో పొందుపరచాలని సూచించారు. నమోదైన సైబర్ నేరాల గురించి అడిగి తెలుసుకున్నారు. నూతనంగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు పలు సూచనలు చేశారు. రికార్డుల నిర్వహణ, సీసీటీఎన్ఎస్, రిసెప్షన్, కోర్టుడ్యూటీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, బీట్, పెట్రోలింగ్, సమన్లు మొదలగు విధులను సీనియర్ల ద్వారా తెలుసుకోవాలన్నారు. రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. కొత్తపల్లి పోలీస్స్టేషన్ ఎస్హెచ్వో ప్రొబేషనరీ ఐపీఎస్ వసుంధర, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ధీర సునీత రాకకోసం..
సప్తగిరికాలనీ(కరీంనగర్): క్షణమొక యుగం.. అ యినా మొక్కవోని ఆత్మవిశ్వాసం... గడ్డు పరిస్థితులు జయించి సుదీర్ఘకాలం తరువాత నేడు భూమి మీద అడుగుపెట్టనున్నారు భారతి సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్. అంతర్జాతీయ అంతరిక్షకేంద్రంలో 9 నెలల 13 రోజుల పాటు (287 రోజు లు) మనోధైర్యంతో గడిపి, భూమిపైకి దిగనున్నా రు. 2024 జూన్ 5న స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో ఐ ఎస్ఎస్కు చేరుకోగా 8 రోజుల్లోనే తిరిగి రావాలి కాని స్టార్ లైనర్లో తలెత్తిన సాంకేతిక సమస్యల కా రణంగా రాలేకపోయారు. సెప్టెంబర్ 7న స్టార్ లైన ర్ ఖాళీగానే భూమికి తిరిగొచ్చింది. దీంతో సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భూమికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సునీతా విలీయమ్స్ను స్ఫూర్తిగా తీసుకున్న, సైన్స్రంగంలో రాణిస్తున్న పలువురు విద్యార్థుల అభిప్రాయాలు.. కోట్లాది మందికి ప్రేరణ సుస్వాగతం సునీతా విలియమ్స్కు. మీ అద్భుతమైన ప్రయాణం కోట్లాది మంది విద్యార్థులకు ప్రేరణ కలిగించింది. అంతరిక్ష యానంలో మీరు చూపించిన తెగువ, పట్టుదల, మాలాంటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకం. మేం ఇటీవల పుదుచ్చెరిలో జరిగిన సౌత్ ఇండియా సైన్స్ ఫెస్టివల్లో పాల్గొని ప్రతిభ కనబరిచాం. సునీత స్ఫూర్తితో భవిష్యత్లో మరింతగా రాణిస్తాం. – వర్షిణి, వాగ్దేవి, జెడ్పీహెచ్ఎస్ (గర్ల్స్) మెట్పల్లి మనకు గర్వకారణం భారతీయ సంతతి సునీత విలియమ్స్ తొమ్మిది నెలలుగా అంతరిక్ష యానం నుంచి దిగ్విజయంగా భూమి మీదికి వస్తున్న సందర్భంగా చాలా హ్యపీగా ఉంది. మన దేశ వనితగా చెప్పుకోవడం గర్వకారణం. నాకు సైన్స్ ఉంటే చాలా ఇష్టం. రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్లలో, ఇస్రో నిర్వహిస్తున్న సైన్స్క్విజ్ల్లో పాల్గొంటున్నాను. సునీతా విలీయమ్స్ స్ఫూర్తిగా ఇంకా రాణిస్తా. – అఫ్సా మహెవీశ్, జెడ్పీహెచ్ఎస్, ఇందుర్తి, కరీంనగర్ గొప్ప ఆవిష్కరణ చూశాం సునీత విలియమ్స్ భూమి మీదకు చేరుకోవడం చాలా సంతోషం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత ఎదిగినామో అనడానికి ఇది ఉదాహరణ. ఒక మహిళలో ఇంత సాహసం నన్ను ఆశ్చర్య పరిచింది. ఆడవాళ్లు సున్నితంగా ఉంటారు అన్నది ఒక అభిప్రాయం మాత్రమే. పాఠంలో ఎన్నో విషయాలు చదివాం. కానీ మా కాలంలో ఇలాటి గొప్ప ఆవిష్కరణ చూడగలిగాం. – పి.హర్షవల్లిక, జెడ్పీహెచ్ఎస్, రుక్మాపూర్, కరీంనగర్ మహిళా పరిశోధకులకు ఆదర్శం హైదరాబాద్లో జరిగిన ఇస్రో యువికా–2024, విజయవాడలో జరిగిన దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శన–2024లో పాల్గొ న్నా. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియ మ్స్ 9 నెలల సుదీర్ఘ కాలం తర్వాత నేడు భూమిపైకి సురక్షితంగా చేరుకోవాలని కోరుకుంటున్నాను. ప్రప ంచవ్యాప్తంగా ఎంతో మంది మహిళా పరిశోధకులకు ఆమె ఆదర్శంగా నిలస్తారనడంలో సందేహం లేదు. – రంగు కీర్తన, జెడ్పీహెచ్ఎస్, రాగినేడు, పెద్దపల్లి ఎంతో స్ఫూర్తిదాయకం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఖగోళ శాస్త్రవేత్తలకు, పరిశోధకులకు సునీత స్ఫూర్తి దాయకం. భవిష్యత్లో మరిన్ని పరిశోధనలు చేయాలని కోరుకుంటుున్నా. నేను 2025 ఇన్స్పైర్ అవార్డ్స్ జాతీయస్థాయి ప్రదర్శనకు ఎంపికై నందుకు ఆనందంగా ఉంది. – పి.అభిలాష్, జెడ్పీహెచ్ఎస్, నంది మేడారం, పెద్దపల్లి మొక్కవోని ఆత్మవిశ్వాసం 2006 ఫస్ట్ అంతరిక్ష యాత్ర, 2012లో రెండోసారి అంతరిక్ష యాత్ర, 2024లో మూడోసారి అంతరిక్ష యాత్ర ఇలా మూడు సార్లు అంతరిక్ష యాత్ర చేయడం ఎంతో సహసంతో కూడుకున్నది. మొక్కవోని ఆత్మవిశ్వాసం సునీతా విలియమ్స్ది. ఆమె మాదిరిగా సైన్స్లో రాణించాలని ఉంది. – కంది శ్రీనికరెడ్డి, టీజీమోడల్ స్కూల్, సుందరగిరి (కరీంనగర్) ఎటుచూసినా విలియమ్స్ మాట రావమ్మా...సునీతమ్మా అంటూ.. విద్యార్థుల్లో రెట్టింపు ఉత్సాహం -
కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు
కరీంనగర్కార్పొరేషన్: బీసీలకు స్థానికసంస్థల్లో, విద్యా, ఉద్యోగాల్లో 42శాతం రిజర్వేషన్లు పెంచుతూ ప్రవేశపెట్టిన రెండు బిల్లులకు శాసనసభ ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్ బీసీ సెల్ ఆధ్వర్యంలో తెలంగాణచౌక్లో సంబురాలు నిర్వహించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, అసెంబ్లీ ఇన్చార్జి పురుమల్ల శ్రీనివాస్, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ యువ వికాసం పేరుతో సంక్షేమ పథకాన్ని ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం జిల్లా కాంగ్రెస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్కుమార్, ఎస్టీసెల్ అధ్యక్షుడు బానోతు శ్రావణ్ నాయక్ ఆధ్వర్యంలో స్వీట్లు పంచి సంబురాలు నిర్వహించారు. -
సీఎంవోగా కంపెనీ వైద్యాధికారే కొనసాగుతారు
గోదావరిఖని: సింగరేణి సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్గా కంపెనీ వైద్యాధికారే కొనసాగుతారని ఆ సంస్థ సీ అండ్ ఎండీ ఎన్.బలరాం పేర్కొన్నారు. మంగళవారం సింగరేణి అధికారుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీపతిగౌడ్, ప్రధాన కార్యదర్శి పెద్ది నర్సింహులుతో జరిగిన సమావేశంలో ఈ విషయం స్పష్టం చేశారు. సింగరేణి వైద్యాధికారులు ఎలాంటి అపోహలు, ఆందోళనకు గురికావద్దని సూచించారు. వైద్య సేవలను కార్పొరేట్ స్థాయిలో అందించాలనే ఆకాంక్షను సాకారం చేసేక్రమంలో విలువైన సలహాలు, సూచనలు అందించే బాధ్యతలను మాత్రమే చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ (సీఎంఎస్)గా నిర్వహిస్తారని పేర్కొన్నారు. కార్పొరేట్ తరహా వైద్యాన్ని అన్ని ఏరియాలకు విస్తరించాలన్న లక్ష్యాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి సీఎంఎస్ కృషి చేస్తారని ఆయన వివరించారు. సింగరేణి సీఎండీ బలరాం -
ఎన్ఎఫ్టీఈ నూతన కార్యవర్గం ఎన్నిక
సప్తగిరికాలనీ(కరీంనగర్): భారత్ సంచార్నిగం లిమిటెడ్ గుర్తింపు యూనియన్ ఎన్ఎఫ్టీఈ ఉమ్మడి జిల్లా తొమ్మిదో వార్షిక సమావేశం స్థానిక ఫిలిం భవన్లో జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా యూనియన్ జాతీయనాయకుడు రాజమౌళి, ఉమ్మడి జిల్లా డిప్యుటీ జనరల్ మేనేజర్ పొన్నం అజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమస్యలు, కార్మిక హక్కులు, ప్రభుత్వరంగ సంస్థల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరి సరికాదన్నారు. అనంతరం నూతన కార్యవర్గానికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉమ్మడి జిల్లా ఎన్ఎఫ్టీఈ బీఎస్ఎన్ఎల్ జిల్లా అధ్యక్షుడిగా రామినేని పని రాజారావు, ప్రధాన కార్యదర్శిగా లింగాచారి, ట్రెజరర్గా నీలం రమేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిని పలువురు అభినందించారు. -
దివ్యాంగులకు శాశ్వత గుర్తింపు
● యూనిక్ డిజేబులిటీ ఐడీ జారీకి కేంద్రం శ్రీకారం ● కొనసాగుతున్న ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ● 21 రకాల వైకల్యం ఉన్నవారికి అవకాశంకరీంనగర్టౌన్: దివ్యాంగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రయోజనాలకు ఇప్పటివరకు సదరం సర్టిఫికెట్ తప్పనిసరి. దీనికోసం మీసేవ కేంద్రాల్లో సదరం స్లాట్బుక్ చేసుకుంటే ప్రభుత్వం నిర్దేశించిన వైద్య శిబిరంలో వైద్యులు వైకల్య నిర్ధారణ సర్టిఫికెట్లు జారీ చేసేవారు. అయితే సదరం సర్టిఫికెట్లకు కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలికింది. వీటిస్థానంలో యూడీఐడీ (యూనిక్ డిజేబులిటీ ఐడెంటిటీ కార్డు) అందించనుంది. ఈ మేరకు స్వావలంబన్కార్డు.జీవోవీ.ఇన్ అనే వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో దివ్యాంగులు నేరుగా ఇంటి వద్ద నుంచి ఫోన్ లేదా ఇంటర్నెట్ సెంటర్, మీసేవా కేంద్రాల్లో కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఇలా.. ఆన్లైన్లో స్వావలంబన్కార్డు.జీవోవీ.ఇన్ వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. అప్లయ్ బటన్పై క్లిక్ చేస్తే దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి కొన్ని సూచనలు ఉంటాయి. వాటిని పూర్తిగా చదివి అర్థం చేసుకుని తరువాత అంగీకరిస్తూ సబ్మిట్ క్లిక్ చేస్తే దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది. దివ్యాంగులు వారికి చెందిన పూర్తి సమాచారం అక్కడ అడిగిన విధంగా నమోదు చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. వైద్య పరీక్షలు అనతరం వెబ్సైట్లో ఆర్జీ స్టేటస్ను నిత్యం పరిశీలించుకోవచ్చు. సేవలు సులభతరం కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన యూడీఐడీ పోర్టల్తో సేవలు సులభతరం కానున్నాయి. ఇకపై సదరం శిబిరాల కోసం మీ సేవతో పాటు యుడీఐడీ పోర్టల్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి సదరం శిబిరాలకు ఎప్పుడు హాజరు కావాలనే సమాచారం దివ్యాంగుల ఫోన్ నంబర్కు వస్తుంది. దివ్యాంగులు ఆన్లైన్లో దరఖాస్తు సమయంలో ఎలాంటి తప్పులు, అక్షర దోషాలు లేకుండా చూసుకోవాలి. 21 రకాల వైకల్యాలకు అవకాశం ఇప్పటి వరకు 7 రకాల వైకల్యం ఉన్న వారికే మీ సేవ ద్వారా సదరం శిబిరాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. అయితే యూడీఐడీ పోర్టల్లో 21 రకాల వైకల్యాలను చేర్చారు. తలసేమియా, అటిజం, యాసిడ్ బాధితులు, న్యూరో సంబంధిత బాధితులు కూడా సదరం శిబిరాల కోసం యూడీఐడీ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సదరం శిబిరంలో వైకల్య నిర్ధారణ పూర్తయిన తరువాత సర్టిఫికెట్లను స్మార్ట్కార్డు రూపంలో పోస్టల్శాఖ ద్వారా ఇంటికే పంపించనున్నారు. ఈ కార్డు చేయూత పింఛన్లతోపాటు ఇతర అన్ని సంక్షేమ ప్రయోజనాలకు దేశవ్యాప్తంగా చెల్లుబాటవుతుంది. యూనిఫైడ్ ఐడీ కార్డులను ఆన్లైన్ నుంచే డౌన్లోడ్ చేసుకునే అవకాశం కేంద్రం కల్పించింది. త్వరలో శిబిరాల తేదీలు ఖరారు సదరం సర్టిఫికెట్ల స్థానంలో కేంద్ర ప్రభుత్వం నుంచి యూడీఐడీ (యూనిక్ డిజేబులిటీ ఐడెంటిటీ కార్డు)లు రానున్నాయి. త్వరలో శిబి రాలకు సంబందించిన తేదీ లు ఖరారు అవుతాయి. శిబిరానికి హాజరైన వారి కి స్మార్ట్కార్డు రూపంలో ఈ కార్డు అందజేస్తారు. దివ్యాంగులకు రానున్న రోజుల్లో ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమ పథకాలు అందాలన్నా ఈ కార్డు ఉండాల్సిందే. దివ్యాంగులంతా ఆన్లైన్లో నమోదు చేసుకుని కార్డు పొందాలి. – డాక్టర్ వీరారెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్ -
శిక్షణతో వృత్తి నైపుణ్యం
కరీంనగర్ అర్బన్/కరీంనగర్ టౌన్: ప్రభుత్వం అందిస్తున్న శిక్షణను ఉద్యోగులు సద్వినియోగం చేసుకొని నైపుణ్యం పెంచుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. కలెక్టరేట్లోని డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి ప్రాంతీయ శిక్షణ కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. నోటింగ్, డ్రాప్టింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, పెన్షన్ రూల్స్ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడే వీడియో ఎడిటింగ్, ఫొటోషాప్పై ఎంపికచేసినవారికి శిక్షణ ఇవ్వాలన్నారు. పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల నుంచి కూడా ఉద్యోగులు శిక్షణకు హాజరవుతున్నందున అంతర్గత ఫిర్యాదుల కమిటీ గురించి వారికి అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా సూచించారు. టీబీపట్ల అప్రమత్తంగా ఉండాలి... టీబీపట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. జాతీయ టీబీ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మెట్రోసెమ్ సంస్థ ఆధ్వర్యంలో టీబీ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమం మోతాజ్ ఖానా అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక దశలో టీబీని గుర్తించి మందులు వాడితే సులభంగా నయమవుతుందన్నారు. ప్రభుత్వం తరఫున ప్రతీనెల టీబీ వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న రూ.1000 పోషకాహారానికి వినియోగించుకోవాలన్నారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా యూత్ కోఆర్డినేటర్ రాంబాబు, ఏవో సుధాకర్, డీఎంహెచ్వో వెంకటరమణ, టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ రవీందర్, ఇమినైజేషన్ ఆఫీసర్ సాజిద పాల్గొన్నారు.● కలెక్టర్ పమేలా సత్పతి -
క్వింటాల్ పత్తి రూ.7,230
జమ్మికుంట: జమ్మికుంట మార్కెట్లో పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటాల్కు రూ.7,140 ఉండగా రూ.90 పెరిగి మంగళవారం గరిష్ట ధర రూ.7,230 పలికింది. మార్కెట్కు నాలుగు వాహనాల్లో 53 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.7,100, కనిష్ట ధర రూ.6,900కు ప్రైవే టు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రయవిక్రయాలను ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా పర్యవేక్షించారు. దరఖాస్తుల ఆహ్వానం కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 6,7,8,9 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులాల సంస్థ రీజనల్ కో ఆర్డినేటర్ ఎం.అంజలి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 31 వరకు ఆన్లైన్లో మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 20న ఉంటుందన్నారు. -
ద్విచక్రవాహనం పైనుంచి పడి యువకుడి మృతి
చిట్యాల: ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో కిందపడి ఓ యువకుడు చనిపోయాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లక్ష్మీపూర్తండా గ్రామ శివారులో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పోతనవేన అజయ్కుమార్(24) వ్యక్తిగత పనుల నిమిత్తం చిట్యాల మండలం ఒడితల నుంచి మోరంచపల్లి వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. లక్ష్మీపూర్ తండా గ్రామం వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడడంతో గాయాలపాలయ్యాడు. స్ధానికులు 108 అంబులెన్స్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆస్పత్రికి తరలించగా అప్పటికే అజయ్కుమార్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి వీరేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రావణ్కుమార్ వివరించారు. ఇటలీలో ఎల్లారెడ్డిపేట వాసి..ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఉపాధి కోసం ఇటలీ దేశానికి వెళ్లిన ఓ వలస జీవి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన స్వగ్రామం ఎల్లారెడ్డిపేటలో విషాదం నింపింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ రషీద్(47) రెండేళ్ల క్రితం ఇటలీకి వెళ్లాడు. కారు డ్రైవింగ్ చేస్తుండగా ప్రమాదానికి గురై సోమవారం రాత్రి మృతిచెందాడు. ఈ విషయం అక్కడి మిత్రులు కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా మంగళవారం సమాచారం అందించారు. రషీద్ కుటుంబ సభ్యులు కొంతకాలంగా సిద్దిపేటలో ఉంటున్నారు. రషీద్ మృతదేహం బుధవారం ఎల్లారెడ్డిపేటకు రానుంది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నీటి సంపులో పడి బాలుడు..సైదాపూర్: మండలంలోని ఎలబోతారంలో మంగళవారం రెండేళ్ల బాలుడు నీటి సంపులో పడి మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన ఎలబోయిన సురేశ్–చైతన్య దంపతులకు కుమారుడు ప్రజ్ఞాన్ (2) ఉన్నాడు. ఎప్పటిలాగే ఇంటిపక్కన ఆడుకుంటుండగా నీటి సంపులో పడి మృతిచెందాడు. ప్రజ్ఞాన్ మృతితో తల్లిదండ్రులు బోరున విలపించారు. భార్య కోసం అర్ధనగ్న నిరసనహుజూరాబాద్: తన భార్యను కాపురానికి పంపడం లేదని ఓ యువకుడు అర్ధనగ్నంగా నిరసనకు దిగాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట మంగళవారం చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఘర్షనగర్కు చెందిన గుంజే రాజుకు హుజూరాబాద్కు చెందిన సంపంగి దుర్గయ్య– నీలమ్మ కూతురుతో వివాహం జరిగింది. అయితే తన భార్యను కాపురానికి పంపడం లేదని, ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తూ.. హుజూరాబాద్లోని పోలీస్స్టేషన్ ఎదుట రోడ్డుపై అర్ధనగ్నంగా బైఠాయించాడు. ఏఎస్ఐ కమల, పోలీసులు నచ్చచెప్పినా.. వినలేదు. బలవంతంగా పోలీసుస్టేషన్కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు. -
‘భట్టి’ బడ్జెట్పై ఆశలు
● స్మార్ట్ సిటీకి నిధులు దక్కేనా? ● నిజాం షుగర్స్పై ప్రకటనపై ఉత్కంఠ ● పత్తిపాక రిజర్వాయర్ పనులు మొదలయ్యేనా ● రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులపై ఉమ్మడి జిల్లాలో ఆసక్తిసాక్షిప్రతితినిధి, కరీంనగర్: నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పలు పెండింగ్, కొత్త ప్రాజెక్టులకు వచ్చే నిధులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్మార్ట్ సిటీ, జగిత్యాల మెడికల్ కాలేజీ, ముత్యంపేట షుగర్స్ ఫ్యాక్టరీ, పత్తిపాక రిజర్వాయర్కు ఎంత కేటాయిస్తారన్న దానిపై ఉమ్మడి స్పష్టత రానుంది. ● కరీంనగర్ స్మార్ట్సిటీ ప్రాజెక్టులో భాగంగా కార్పొరేషన్కు నిధులు రావాల్సి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం కేంద్రం నుంచి రూ.429 కోట్లు, రాష్ట్రం నుంచి రూ.399 కోట్లు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రూ.30 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ను విడుదల చేయాలని ఇటీవల మాజీ మేయర్ సునీల్ రావు సీఎంకు లేఖ రాశారు. ఈ నిధులపై బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని బల్దియా అధికారులు ఆశాజనకంగా ఉన్నారు. ● మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామం నిజాంషుగర్స్ బకాయిలు మొత్తం రూ.250 కోట్లు ఉన్నాయి. తొలుత రూ.43 కోట్లు, తర్వాత అది రూ.192 కోట్లకు చేరింది. మిగిలిన బకాయిలు కూడా త్వరలోనే ఇవ్వనుంది. ఫార్చున్ కన్సెల్టెన్సీ ప్రతినిధులను పిలిచి ముత్యంపేట ఫ్యాక్టరీ రిపేరు చేయాలా? కొత్తది ఇన్స్టాల్ చేయాలా? అన్న విషయాలపై నివేదిక ఇవ్వమంది. మరమ్మతులకు రూ.50 కోట్ల వరకు ఖర్చవుతుందని.. ఒకవేళ నడిపినా పదేపదే మరమ్మతుల కారణంగా నష్టాలు వస్తాయని చెప్పింది. లాభాలు రావాలంటే కొత్త ఫ్యాక్టరీ పెట్టాలని నివేదిక ఇచ్చింది. ఈ బడ్జెట్లో దీనిపై ప్రభుత్వం ఏంనిర్ణయం తీసుకుంటుపడుతోందని తీసుకోనుందని ఉత్కంఠగా మారింది. ● 2022–23 మెడికల్ కళాశాల ప్రారంభం అ య్యింది. దీని హాస్టల్స్ భవన నిర్మాణానికి 500 కోట్లనిధులు మంజూరు అయ్యాయి. ధరూర్ క్యాంపులో 27.5 ఎకరాలు కేటాయించారు. ఇప్పటివరకు విడుదలైన రూ. 30 కోట్లు మాత్రమే విడుదల అయ్యాయి. ఇంకా 360 బెడ్స్ ఆసుపత్రి నిర్మాణం కావాల్సి ఉంది. ప్రస్తుతం వంద పడకల ఆసుపత్రిలోని కొనసాగుతుంది. ఈ సారి బడ్జెట్లో మరిన్ని నిధులు కేటాయించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ● ఉమ్మడి జిల్లాలోని ఎస్సారెస్పీ ఆయకట్టు భూములకు నీరు అందించి స్థిరీకరణ చేసేందుకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తి పాక వద్ద ఒక రిజర్వాయర్ను నిర్మించాలని ప్రతిపాదించారు. దానికి బడ్జెట్లో చోటుఇస్తార ని జిల్లా వాసులు ఎదురుచూస్తున్నారు. ఇందు కు సంబంధించి డీపీఆర్ కు ఆదేశించారు. సు మారు రూ.2 వేల కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుపై ఎలాంటి ప్రకటన ఉంటుందో చూడాలి.మానేరు రివర్ఫ్రంట్ నమూనా -
డీసీసీ రేస్ షురూ!
● జిల్లా నుంచి భారీగా ఆశావహులు ● తనకు అవకాశం కల్పించాలని కోమటిరెడ్డి వినతి ● పురమల్ల, రాజేందర్రావు, పద్మాకర్రెడ్డి సైతం పోటీలో ● అధిష్టానం వద్ద ఎవరి ఫైరవీలు వారివే ● వరుస ఓటముల నేపథ్యంలో క్లిష్టంగా మారిన ఎంపికసాక్షిప్రతినిధి,కరీంనగర్: జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి(డీసీసీ)కి రేసు షురూ అయింది. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి అప్పుడే పోటీ మొదలైంది. జిల్లాలో ఎంతో కీలకమైన ఈ పోస్టు కోసం పలువురు నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టాక.. పార్టీ సంస్థాగతంగా బలోపేతం, నాయకత్వ ప్రక్షాళన తదితర అంశాలపై అధినాయకత్వం దృష్టి పెట్టిన నేపథ్యంలో డీసీసీ అధ్యక్ష పదవి ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారు. గతానికి భిన్నంగా సాగనున్న ఈ ఎంపికపై జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ నాయకత్వంలో సరికొత్త చర్చకు దారి తీస్తోంది. ఇప్పటికే అధిష్టానం వద్ద ఎవరి ఫైరవీలు వారు మొదలుపెట్టారు. గతంలోలా సిఫారసులకు తావు లేకుండా, నేతల పనితీరు, స్థానిక నేతల అభిప్రాయాల ఆధారంగా ఈ ఎంపిక జరగనుండటం ఆసక్తిరేపుతోంది. పోటీ పడుతున్నది వీరే.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి రేసులో ఉన్నారు. ప్రస్తుతం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన తనకు జిల్లా బాధ్యతలు ఇస్తే.. తానేంటో నిరూపించుకుంటానని ధీమాగా ఉన్నారు. అలాగే, పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు కూడా తనకు ఎలాగైనా డీసీసీ ఇవ్వాలని పట్టబడుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి అనంతరం తనకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని కోరిన రాజేందర్రావు.. అది దక్కకపోవడంతో ఈసారి డీసీసీ విషయంలో పట్టుదలగా ఉన్నారు. వీరితోపాటు డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పురమల్ల శ్రీనివాస్ కూడా డీసీసీ ప్రెసిడెంట్ ఆశావహుల జాబితాలో ఉన్నారని సమాచారం. ఢిల్లీలో ఈనెల 27న తెలంగాణ డీసీసీ అధ్యక్షులు, పట్ణణ కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశం జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆధ్వర్యంలో జరగనుంది. ఈ సందర్భంగా పలువురు తమ మనసులో మాటను ఆయన ముందుంచే అవకాశాలు ఉన్నాయి. స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. ఇప్పటికే కరీంనగర్లో వరుస ఓటములతో సతమతమవుతున్న పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. తొలుత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, గ్రామ పంచాయతీ, ఆపై మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా.. కరీంనగర్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే సీటును బీఆర్ఎస్ గెలవగా, కరీంనగర్ పార్లమెంటు స్థానాన్ని బీజేపీ కై వసం చేసుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఒక విధమైన నిరాశాపూరిత వాతావరణం నెలకొంది. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం పార్టీలో నైరాశ్యాన్ని మరింత పెంచింది. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ తరువాత అతిపెద్ద నగరం కావడంతో కరీంనగర్కు రాజకీయంగా ప్రత్యేక స్థానం ఉంది. స్థానిక సంస్థలతోపాటు, చొప్పదండి, జమ్మికుంట, హుజూరాబాద్ పురపాలికలను చేజిక్కించుకోవాలని పార్టీ అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో అందరినీ కలుపుకొనిపోయే బలమైన నేతకు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు అధిష్టానం యోచిస్తోంది.పురమల్ల శ్రీనివాస్ -
థాయ్లాండ్కు మరో విమానం
● బాధితులను తీసుకొచ్చేందుకు పంపనున్న కేంద్రం సాక్షిప్రతినిధి,కరీంనగర్: కొలువుల కోసమని వెళ్లి థాయ్లాండ్ పరిసరదేశాల్లో సైబర్ కేఫ్ల్లో చిక్కుకున్న యువతను ఇండియాకు తీసుకొచ్చే ఆపరేషన్ కొనసాగుతోంది. ఇటీవల అక్కడ చిక్కుకున్న యువత దయనీయస్థితిని ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చింది. స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్షా దృష్టికి తీసుకెళ్లారు. అమిత్ షా ఆదేశాలతో మయన్మార్, థాయ్లాండ్లో చిక్కుకున్న 540మంది భారతీయులను రెండు సైనిక విమానాల్లో సురక్షితంగా ఢిల్లీకి తరలించారు. వారిని సీబీఐ, ఎన్ఐఏ, ఐబీ తదితర దర్యాప్తు సంస్థలు విచారించిన అనంతరం స్వరాష్ట్రాలకు పంపారు. తా జా సమాచారం ప్రకారం.. మరికొందరు భారతీయ యువతీ, యువకులు ఇంకా అక్కడ చిక్కుకుపోయారని, వారిని కూడా రక్షించేందుకు కేంద్ర హోంశాఖ మరో విమానాన్ని థాయ్లాండ్కు పంపనుందని సమాచారం. ఈ వారాంతంలోగా మరో విమానం ద్వారా వారిని తీసుకురానున్నారని తెలిసింది. ఆస్తిపన్నులో వడ్డీమాఫీ చేయాలి కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సి పాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తిపన్నులపై వడ్డీమాఫీ పథకాన్ని ప్రకటించాలని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ డిమాండ్ చేశారు. మంగళవారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ మాదిరి గా మిగిలిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ వడ్డీమాఫీ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి రావాల్సిన ఆస్తి పన్నులను వసూలు చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో వీధి దీపాలు సరిగా వెలగడం లేదని, పారిశుధ్యం అంతంత మాత్రంగానే ఉందన్నారు. వేసవికాలం ప్రారంభానికి ముందే పలుకాలనీల్లో రోజూ తప్పించి రోజూ నీటి సరఫరా సాగుతోందని, రానున్న రోజుల్లో మరింత సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. నాయకులు సాయికృష్ణ, చందు, రవి, శ్రీనివాస్, ఇర్బాన్, రాజ్కుమార్ పాల్గొన్నారు. ఏసీపీ నరేందర్కు పదోన్నతి కరీంనగర్క్రైం: కరీంనగర్ టాస్క్ఫోర్స్ ఏసీపీగా పనిచేస్తున్న జి.నరేందర్కు అడిషనల్ ఎస్పీగా పదోన్నతి కల్పి స్తూ డీజీపీ కార్యాలయం నుంచి మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. మీ సేవల్లో ‘యువ వికాసం’ సందడి కరీంనగర్రూరల్: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది. మంగళవారం నుంచి మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 5వరకు అవకాశముంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఆర్థికసాయం మంజూరు చేస్తారు. ఒక్కో లబ్ధిదారుడికి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు ఆర్థికసాయం అందిస్తారు. కేటగిరీ–1లో రూ. లక్షకు 80శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. మిగితా 20శాతం బ్యాంకు ద్వారా రుణం మంజూరు చేస్తారు. కేటగిరీ–2లో రూ.లక్ష నుంచి రూ.2లక్షలకు 70శాతం సబ్సిడీ, కేటగిరీ–3లో రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు 60శాతం సబ్సిడీ, 40శాతం బ్యాంకు రుణం అందజేస్తారు.75 రకాల యూనిట్లకు అవకాశముంది. -
ట్యాబ్లు చోరీ చేసి.. గుట్టపై దాచి
మానకొండూర్: ప్రభుత్వ పాఠశాలలో ట్యాబ్లు చోరీకి గురయ్యాయని ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. మానకొండూర్ సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాలు.. మానకొండూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల నుంచి 23 ట్యాబ్లు దొంగలు ఎత్తుకెళ్లారని ఈ నెల 15న హెచ్ఎం శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలాన్ని ఏసీపీ, సీఐ, క్లూస్టీం పోలీసులు పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. ఇదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థి దొంగతనానికి పాల్పడ్డాడని అనుమానించి ఆ కోణంలో విచారణ జరుపగా ట్యాబ్ల జాడ తెలిసింది. 15 రోజుల క్రితం ప్రార్థన సమయంలో ప్రధానోపాధ్యాయుడు ట్యాబ్లు చూపించగా, ఎలాగైన వాటిని దొంగిలించాలని అనుకున్న విద్యార్థి ఈనెల 13న పాఠశాలకు సెలవుపెట్టి ఇంటికి వెళ్తున్నట్లు చెప్పాడు. అదే రోజు రాత్రి పాఠశాల వెంటిలేటర్ పగులగొట్టి లోనికి ప్రవేశించాడు. 23 ట్యాబ్లను దొంగిలించి కొండపల్కల గ్రామ శివారులోని రాముని గుట్ట మీద దాచిపెట్టినట్లు విద్యార్థి తెలుపగా, పోలీసులు గుట్టపైకి వెళ్లి ట్యాబ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. 24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు -
బస్సు నుంచి కిందపడ్డ ఇంటర్ విద్యార్థిని
శంకరపట్నం: మండలంలోని ముత్తారం గ్రామంలో సోమవారం ఇంటర్ విద్యార్థిని ఆర్టీసీ బస్సులో నుంచి కిందపడడతంతో తీవ్రగాయాలు అయ్యాయి. ముత్తారం గ్రామానికి చెందిన మేఘన కరీంనగర్లో ఇంటర్ పరీక్షలు రాసి బస్సులో స్వగ్రామానికి వస్తుండగా ముత్తారం గ్రామ మూలమలుపు వద్ద డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో మేఘన బస్సు నుంచి కిందపడింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను కుటుంబసభ్యులు చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు మండలంలోని కొత్తగట్టు గ్రామశివారులో జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. మొలంగూర్ గ్రామానికి చెందిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దండు కొమురయ్య మోటర్సైకిల్పై వెళ్తుండగా పెద్దపల్లి జిల్లాకు చెందిన డానియల్ బైక్ వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కొమురయ్య, డానియల్కు గాయాలయ్యాయి. అయితే ఇదే సమయంలో వరంగల్ వెళ్తున్న అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత ఘటన స్థలం వద్ద తనకారు ఆపి క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
హామీలు నెరవేర్చాలి
కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ పద్మ అన్నారు. నగరంలోని ముకుందలాల్ మిశ్రాభవన్లో సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మహిళా కార్మికుల సదస్సులో మాట్లాడారు. ఉపాధి చట్టం ప్రకారం పనిప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సుశీల, మాతంగి మానస, విజయలక్ష్మి, సరిత, వజ్రమ్మ, లక్ష్మి, అంజలి పాల్గొన్నారు. కాలువ నీటి కోసం ఆందోళనకరీంనగర్రూరల్: ఎస్సారెస్పీ కాలువ నీటిని వి డుదల చేయాలని సోమవారం పలువురు రై తులు ఆందోళన చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. 11ఆర్ ఉపకాలువ పరిధికి వచ్చే చామనపల్లి, తాహెర్కొండాపూర్, ఐతరాజ్పల్లె గ్రా మాల రైతులు కాలువ నీటి కోసం వెదురుగట్ట శివారులోని డీ86 ప్రధాన కాలువ దగ్గరికి వెళ్లా రు. 11ఆర్ ఉపకాలువలోకి నీళ్లు వచ్చేందుకు వీలుగా ప్రధాన కాలువ తూము షట్టర్ పైకి లే పేందుకు రైతులు ప్రయత్నించగా జూలపల్లి పోలీసులు అడ్డుకున్నారు. నీళ్లు రాక పంటలన్నీ ఎండిపోతున్నాయని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు రైతులు బలవంతంగా కొంతమేరకు షట్టర్ ఎత్తడంతో ఉపకాలువలోకి నీళ్లు రావడంతో వివాదం సద్దుమణిగింది.అయితే మళ్లీ రాత్రి అధికారులు షట్టర్ మూసివేయడంతో నీటి సరఫరా నిలిచిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి
చిగురుమామిడి(హుస్నాబాద్): గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని జిల్లా విద్యాధికారి ఎన్.జనార్దన్రావు కోరారు. మండలంలోని చిన్నముల్కనూర్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానమంత్రి స్కూల్స్ పథకం కింద మంజూరైన తరగతి గదిని సోమవారం ప్రారంభించి మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా పీఎంశ్రీ పథకం కింద 22 పాఠశాలలను ఎంపికచేసినట్లు పేర్కొన్నారు. జిల్లా సెక్టోరల్ అధికారులు శ్రీనివాస్, అశోక్రెడ్డి, స్కూల్కాంప్లెక్స్ హెచ్ఎం రబియాబస్రి, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ హర్జిత్కౌర్, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం శారద పాల్గొన్నారు. కుష్ఠువ్యాధి సర్వే పకడ్బందీగా చేపట్టాలి కొత్తపల్లి(కరీంనగర్): జిల్లావ్యాప్తంగా కుష్ఠు వ్యాధి సర్వే పకడ్బందీగా చేపట్టాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ సూచించారు. కొత్తపల్లి(హెచ్) పీహెచ్సీలో సోమవారం కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమంలో ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఆరోగ్య కార్యకర్తలందరూ ప్రతీ ఇంటిలోని కుటుంబ సభ్యులను పరిశీలించాలని, స్పర్శ లేని రాగిరంగు మచ్చలు ఉంటే అనుమానితులుగా నమోదు చేయాలన్నారు. వ్యాధి నిర్ధారణ అయితే లక్షణాలను బట్టి పూర్తి చికిత్స తీసుకునేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. జిల్లా అదనపు వైద్యాధికారి (లెప్రసీ అండ్ ఎయిడ్స్) డాక్టర్ సుధ మాట్లాడుతూ, కుష్ఠు వ్యాధి నిర్ధారణ అయితే 5 మచ్చలలోపు వారికి 6 నెలల చికిత్స, 5 మచ్చల కంటే ఎక్కువ ఉంటే 12 నెలలపాటు చికిత్స తీసుకుంటే నయం అవుతుందని వివరించారు. పీవోఎంసీహెచ్ డాక్టర్ సనజవేరియా, లెప్రసీ న్యూక్లియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నిక్కత్, డాక్టర్ నజియా, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ లింగారెడ్డి, ప్రకాష్, డీపీవో స్వామి పాల్గొన్నారు. ఇంటి వద్దకే రాములోరి తలంబ్రాలువిద్యానగర్(కరీంనగర్): భద్రాచలంలో ఏప్రిల్ 6న జరిగే శ్రీసీతారాముల కల్యాణం సందర్భంగా అక్కడికి వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ కార్గో ద్వారా రాములోరి తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు చేసినట్లు కరీంనగర్ రీజనల్ మేనేజర్ బి.రాజు తెలిపారు. తలంబ్రాలు కావాల్సిన వారు ఒక్కో ప్యాకెట్కు రూ.151తో ఆన్లైన్ లేదా బస్టాండ్ కార్గో సెంటర్లు, ఏజెంట్ కౌంటర్ల వద్ద బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. 621 మంది గైర్హాజరుకరీంనగర్: జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలో 621 మంది గైర్హాజరైనట్లు డీఐఈవో జగన్మోహన్రెడ్డి ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జనరల్, ఓకేషనల్ విభాగంలో 19,425 మందికి గాను 621 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా 18,804 మంది పరీక్షలకు హాజరయ్యారని పేర్కొన్నారు. క్వింటాల్ పత్తి రూ.7,140 జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లో సోమవారం క్వింటాల్ పత్తి రూ. 7,140 పలికింది. క్రయ విక్రయాలను మార్కెట్ చైర్ పర్సన్ పూల్లూరి స్వప్న, ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం పర్యవేక్షించారు. -
పునరావాసం కల్పించండి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అప్పటి పీపుల్స్వార్ పార్టీలో అజ్ఞాత దళసభ్యుడిగా పనిచేసి ప్రభుత్వానికి లొంగిపోయిన ఓ మాజీ నక్సలైట్ తనకు పునరావాసం కల్పించి ఆదుకోవాలని కోరుతున్నాడు. ఈమేరకు సోమవారం తనకు పునరావాసం కల్పించాలని కోరుతూ.. ప్రజావాణిలో కలెక్టర్ను కోరా రు. వీర్నపల్లి మండలం అడవిపదిరకు చెందిన ఉ త్తం శ్రీనివాస్ ఉరఫ్ సాగర్ అనే మాజీ నక్సలైట్ ఎ ల్లారెడ్డిపేటలో సోమవారం విలేకరులతో మాట్లాడా రు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని కామారెడ్డి, బా న్సువాడ, బిచ్కుంద దళాల్లో పనిచేస్తూ అప్పటి ఉ మ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పిలుపుమేరకు అజ్ఞా తం వీడి జనజీవన స్రవంతిలో కలిసినట్లు పేర్కొన్నారు. పలు కేసుల్లో ఏళ్లకేళ్లు జైలు జీవితం గ డిపినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటి వరకు లొంగిపోయిన నక్సలైట్లకు ఇచ్చే పునరావాసం కింద తనకు ఎలాంటి ఆర్థికసాయం అందించలేదని ఆవేదన వ్యక్తం చే శాడు. మేకల కాపరిగా పనిచేస్తూ కుటుంబాన్ని పో షించుకుంటున్నట్లు తెలిపాడు. తన భార్య సుగుణ వ్యవసాయ కూలీగా పనిచేస్తుందన్నారు. తనకు ప్రభుత్వం నుంచి పునరావాసం వచ్చేలా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి కృషి చేయాలని కోరారు. మాజీ నక్సలైట్ శ్రీనివాస్ వేడుకోలు -
షార్ట్ సర్క్యూట్తో ఆస్తినష్టం
మల్యాల(చొప్పదండి): షార్ట్ షర్క్యూట్తో ఇంట్లో మంటలు చెలరేగి సామగ్రి పూర్తిగా కాలిపోయిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సట్ట లత తన కుమారుడితో కలిసి ఇంట్లో నిద్రిస్తోంది. సోమవారం వేకువజామున సుమారు 3.30గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. దీంతో తల్లి, కుమారుడు బయటకు పరుగులు తీశారు. మంటలు అంటుకుని ఇంట్లోని ఫర్నీచర్, టీవీ, రెండు తులాల బంగారం, మంచాలు, రూ.రెండువేలు కాలిబూడిదయ్యాయి. స్థానికులు 100కు డయల్ చేయడంతో బ్లూకోల్ట్స్ సిబ్బంది మధుసూదన్ రెడ్డి, సంపత్ సంఘటనా స్థలానికి వెళ్లి, ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. వారు వచ్చి మంటలను ఆర్పివేశా రు. పరిసరాలకు మంటలు వ్యాపించకుండా స్థానికులు నీళ్లుపోసి మంటలను ఆర్పివేశారు. షార్ట్ స ర్క్యూట్తో సుమారు రూ.3లక్షల విలు వైన ఆస్తి నష్టపోయినట్లు బాధితులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్తో ఇంట్లో కాలిపోయిన ఫర్నీచర్ -
రోడ్డు ప్రమాదంలో సింగరేణి ఉద్యోగి దుర్మరణం
రామగుండం: ఎదురుగా ఉన్న టిప్పర్ను ఢీకొనడంతో వాహనదారు దుర్మరణం చెందిన ఘటన సోమవారం రాజీవ్ రహదారిపై చోటుచేసుకుంది. అంతర్గాం ఎస్సై వెంకటస్వామి కథనం ప్రకారం.. అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన బండి ప్రసాద్గౌడ్(34) జీడీకే– 11 ఇంక్లయిన్ గనిలో విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. మల్యాలపల్లి విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో కారును ఓవర్టేక్ చేశాడు. దాని ముందు వెళ్తున్న టిప్పర్ను వెనుక నుంచి ఢీకొన్నాడు. తీవ్రగాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య జ్యోతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నామని ఎస్సై పేర్కొన్నారు. ఆందోళనకు దిగిన యువకులు ఎన్టీపీసీ డ్యాం గేట్ ఎదుట మల్యాలపల్లి గ్రామ యువకులు రాత్రి ఆందోళనకు దిగారు. ఎల్కలపల్లి సమీప ఎన్టీపీసీ యాష్పాండ్ నుంచి బూడిద లోడుతో టిప్పర్లు రాజీవ్ రహదారిపైకి వస్తున్నాయని, ఈక్రమంలోనే తరచూ రోడ్డ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. రాజీవ్ రహదారిపైకి వచ్చేక్రమంలో అక్కడి మూలమలుపుతో తరచూ ప్రమాదాలో చోటుచేసుకుని వాహనదారుల ప్రాణాలు పోతున్నాయని మండిపడ్డారు. అయితే, హెచ్ఆర్ కార్యాలయానికి వస్తే గ్రామస్తుల సమక్షంలో చర్చించి ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకుంటారని ఎన్టీపీసీ భద్రతా సిబ్బంది హామీ ఇవ్వడంతో యువకులు శాంతించారు. -
ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
కథలాపూర్(వేములవాడ): మండలంలోని తాండ్య్రాల గ్రామానికి చెందిన కాసారపు రాజగంగు (50) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాజగంగు గ్రామంలో ఉంటూ బీడీలు చుడుతుంది. భర్త, కుమారుడికి సరైన పని లేకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. మనస్తాపానికి గురైన రాజగంగు సోమవారం మధ్యాహ్నం ఇంట్లోనే ఉరేసుకుంది. రాజగంగు తల్లి మామిడిపల్లి మల్లవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్కుమార్ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతిమల్లాపూర్ : మండలంలోని ముత్యంపేటలో శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మెట్పల్లి పట్టణానికి చెందిన గోనెల రాజ్కుమార్(28) మృతి చెందాడని మెట్పల్లి సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం మెట్పల్లికి చెందిన రాజ్కుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం మండలంలోని రాఘవపేటలో ఓ శుభకార్యానికి బైక్పై వెళ్లి తిరిగి వస్తుండగా.. ముత్యంపేట శివారులో అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాజ్కుమార్ను స్థానికులు, కుటుంబసభ్యులు నిజామాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. వాహనం అదుపుతప్పి..ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని గూడెం శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. ముస్తాబాద్ మండలం కొండాపూర్కు చెందిన నాగెల్లి భూదయ్య(57) తన బైక్పై ముస్తాబాద్ వైపు వస్తున్నాడు. గూడెం ప్రధాన రోడ్డు మూలమలుపు వద్ద భూదయ్య వాహనం అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడ్డ భూదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మి, ముగ్గురు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సెప్టిక్ట్యాంక్లో పడి..రాయికల్: పట్టణానికి చెందిన చిలువేరి కిరణ్కుమార్ (54) ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంక్లో పడి మృతిచెందినట్లు ఎస్సై సుధీర్రావు తెలిపారు. కిరణ్కుమార్ మద్యానికి బానిసై పట్టణ శివారులోని ఇంటి మెట్ల కింద నిర్మించిన సెప్టిక్ ట్యాంక్లో పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య నిర్మల ఫిర్యాదు మేరకు కేసు దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు. -
స్వచ్ఛ సర్వేక్షణ్లో మొదటి ర్యాంకు సాధిద్దాం
● కమిషనర్ చాహత్బాజ్పేయ్కరీంనగర్కార్పొరేషన్: స్వచ్ఛ సర్వేక్షణ్లో బల్దియాకు మొదటి ర్యాంకు వచ్చేలా కృషి చేస్తూ, ప్రజలను భాగస్వాములను చేయాలని కమిషనర్ చాహత్ బాజ్పేయ్ అన్నారు. సోమవారం మెప్మా ఎస్హెచ్జీ మహిళా సంఘ సభ్యులు, సీవోలు, శానిటేషన్ జవానులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ఎస్హెజ్జీ సంఘాల సభ్యులు, ఆర్పీలు డివిజన్ వారీగా ప్రతి ఇంటిని సందర్శించి స్వచ్ఛ సర్వేక్షణ్లో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. పారిశుధ్య జవానులు రోజూ డోర్ టూ డోర్ కలెక్షన్ చేయడంతో పాటు ఇంటి వద్దే యజమానులు చెత్త వేరు చేసేలా చూడాలని పేర్కొన్నారు. డివిజన్లలో నగరపాలక సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన డీఆర్సీసీలు, త్రిబులార్ సెంటర్ల నిర్వహణ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ ఇంటికి స్వచ్ఛ ఆటో, రిక్షా వెళ్లి చెత్తను సేకరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే 3 నెలల పాటు కొనసాగుతుందని, నగర పరిశుభ్రత విషయంలో జవానులు నిర్లక్ష్యం వహించరాదన్నారు. 21న జరిగే బల్క్ వేస్ట్ ఎక్స్పో సమావేశంలో హోటల్స్, రెస్టారెంట్స్ వారు పాల్గొనేలా జవానులు చర్యలు తీసుకోవాలన్నారు. నగర ప్రజలు స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగస్వాములై సహకరించాలని కోరారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియుద్దీన్, అసిస్టెంట్ కమిషనర్ వేణుమాధవ్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఇంట్లో నుంచి గెంటేశారు
మాకు ఒక కూతురు, ఐదుగురు కుమారులు. ఉన్నంతలో పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేస్తే ఆస్తుల కోసం ఇబ్బందులు పెడుతున్నారు. గ్రామంలో రైస్ మిల్ ఉండగా ఐదుగురికి సమాన వాటా ఇచ్చాం. ఇందుకు ప్రతినెలా రూ.3వేలు ఇవ్వాల్సి ఉండగా ఎవరూ పట్టించుకోవడం లేదు. హుజూరాబాద్ ఆర్డీవోను కలిస్తే చర్యలు లేవు. ఇటీవల పెద్ద కుమారుడు దుర్భాషలాడుతూ ఇంటి నుంచి గెంటేసి ఇల్లే తనదని బెదిరిస్తున్నాడు. తెలిసినవారి ఇంట్లో తలదాచుకుంటున్నం. వృద్ధుల చట్టమని అంటున్నారు కానీ మాకు న్యాయమేది.? – వేముల రామలింగం–పోచమ్మ దంపతులు, చల్లూర్, వీణవంక ఆదేశాల అమలేదీ ? మాకు 9.20 ఎకరాల భూమి ఉండేది. నా కొడుకు, కోడలు ఆస్తి కోసం తప్ప ఏనాడూ మమ్మల్ని పట్టించుకోలేదు. నా భర్త మల్లారెడ్డిని సరిగా సాదకపోవడం వల్లే మరణించారు. గతంలో ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే, పెద్దమనుషుల మధ్యలో మాట్లాడి 9.20 ఎకరాల భూమిలో 2 ఎకరాలను మా పేరున ఉంచాలని, రూ.8వేలు ప్రతినెలా భత్యం ఇవ్వాలని చెప్పారు. ఏదీ అమలు కాలేదు. పైగా ఉన్న 2ఎకరాల భూమిని వారి పేరున మార్చుకున్నారు. నా కూతురు, మనవని దగ్గర ఉంటే వారిని ఇబ్బంది పెడుతున్నారు. నా రెండెకరాల భూమి నా పేరున ఉంచడంతో పాటు భత్యం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. – గుర్రాల అంతమ్మ, కొండపల్కల, మానకొండూరు -
సామర్థ్యం పెంపు లక్ష్యం
పెద్దపల్లిరూరల్: ప్రభ్వు ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో చదువులో వెనుకబడిన వారిని గుర్తించడం, ఏఐ(కృత్రిమ మేధ) సాయంతో పాఠాలు బోధించడం, విద్యాబోధనలో లోటుపాట్లను సరిదిద్దడం లక్ష్యంగా చేపట్టిన కార్యాచరణ అమల్లోకి వచ్చింది. జిల్లాలోని 15 ప్రైమరీ పాఠశాలలను తొలివిడతలో ఎంపిక చేయగా.. కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు మారుమూల ప్రాంత విద్యార్థులకోసం మరో ఐదు పాఠశాలలను గుర్తించారు. దీంతో జిల్లాలో ఏఐ బోధన అమలవుతున్న ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 20కి చేరింది. ఈ విద్యాసంవత్సరంలో ఎంపిక చేసిన ప్రైమరీ స్కూళ్లలో 3, 4, ఐదో తరగతి చదివే విద్యార్థులు ఏఐ సాయంతో సాధన చేయనున్నారు. చదవడం.. రాయడంపై ప్రత్యేక శ్రద్ధ ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో చదవడం, రాయడంలో వెనకపడిన వారిని ప్రోత్సహించేలా ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తారు. కొంతమంది విద్యార్థులు అక్షరాలు, సంఖ్యను గుర్తించలేని పరిస్థితిలో ఉన్నట్లు గతంలో సర్కారు బడుల్లో చేపట్టిన అధ్యయనాలు తేల్చాయి. దాదాపు సగంమంది ఇలాంటివారే ఉన్నట్లు ఆ నివేదికల ద్వారా తెలుస్తోంది. కలెక్టర్ చొరవతో ఇంటర్నెట్.. 75 హెడ్సెట్లు మంజూరు.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సి(ఏఐ) ద్వారా జిల్లాలో చేపట్టిన విద్యా బోధనకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలిచ్చారు. దీంతో ఇంటర్నెట్ సౌకర్యం లేని 9 పాఠశాలలకు ఆ సౌకర్యం కల్పించే పనులు పూర్తయ్యాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అలాగే ఏఐ పాఠ్యాంశాలను వినేందుకు అవసరమైన హెడ్సెట్లు విద్యార్థులకు అవసరమని సంబంధిత అధికారులు చేసిన వినతికి కలెక్టర్ శ్రీహర్ష సానుకూలంగా స్పందించారు. ఆ వెంటనే 75 హెడ్సెట్లను సమకూర్చారు. ఏఐ సాయంతో విద్యాబోధన మార్గం హైస్కూల్ ఆవరణలోని ప్రైమరీ స్కూళ్లలోనే అమలు తొలివిడతలో ఎంపికై ంది 15 ప్రభుత్వ పాఠశాలలు మలివిడతలో మరో ఐదు బడుల ఎంపికకు చర్యలు శిక్షణ ఇలా.. జిల్లావ్యాప్తంగా 15 పాఠశాలల్లో అమలుకు తొలుత నిర్ణయించినా కలెక్టర్ సూచన మేరకు మరో 5 పాఠశాలల్లో(మంథని, ఎక్లాస్పూర్, కొలనూర్, అంతర్గాం, గోదావరిఖని) అమలు చేస్తున్నారు. ప్రభుత్వ, జెడ్పీ హైస్కూళ్ల ఆవరణలోని ప్రైమరీ స్కూళ్లనే ఏఐ అమలుకు ఎంపిక చేసినట్లు విద్యాశాఖ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉన్నత పాఠశాలల్లోని కంప్యూటర్లను ఇందుకోసం వినియోగిస్తున్నారు. ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో విద్యార్థి తనకు కేటాయించిన యూజర్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా వెబ్సైట్లో లాగిన్ అయి పాఠాలను సాధన చేస్తాడని ఉపాధ్యాయుడొకరు తెలిపారు. లాగిన్ అయిన విద్యార్థి సామర్థ్యాన్ని కంప్యూటర్ అంచనా వేస్తుందని, తదుపరి సాధనలో విద్యార్థి ఏదైనా అక్షరం, సంఖ్యను తప్పుగా గుర్తిస్తే ఒప్పుగా నేర్చుకునే వరకు ఉపాధ్యాయుడి పర్యవేక్షణలోనే సాధన జరుగుతుందని పేర్కొన్నారు. కొత్త విషయాలు తెలుసుకున్న కంప్యూటర్ ద్వారా తెలుగు, ఇంగ్లిష్, గణితంలో చాలా విషయాలను సులువుగా అ ర్థం చేసుకున్నా. మా టీచర్ ప్రమేయం లేకుండా నేర్చుకోవడం కొత్త అనుభూతిని ఇచ్చింది. విషయ పరిజ్ఞానం తెలుసుకోవడం ఫోన్లో ఆట ఆడినంత సులువుగా ఉంది. – అనిత, నర్సింహులపల్లి ప్రయోగాత్మకంగా అమలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులకోసం ఏఐ సాయంతో వి ద్యా బోధన చేస్తున్నాం. 3, 4, ఐదో తరగతి విద్యార్థుల కు సులువుగా అర్ధమయ్యే లా విద్యాబోధన చేస్తున్నాం. ఈ విధానంతో స ర్కారు బడులు మరింత బలోపేతం కానున్నాయి. –ప్రభాకర్, ఎంఈవో, ధర్మారం -
కరీంనగర్ అర్బన్: మలివయసులో కలెక్టరేట్ మెట్లెక్కారు వృద్ధులు. తమ సంతానం నిర్దయగా వ్యవహరించడంతో కలెక్టర్తో గోడు వెళ్లబోసుకున్నారు. అర్జీలు ఇస్తున్నా.. అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నా కాగితాలకే పరిమితమవుతోందని కన్నీటిపర్యంతమయ్యారు. సోమవారం కలెక్టరేట్ల
● సంతాన నిర్దయతో కలెక్టర్కు ఫిర్యాదులు ● ప్రజావాణిలో వృద్ధుల ఆవేదనపింఛన్ ఇప్పించండి మాది తిమ్మాపూర్ మండలం రామకృష్ణాపూర్ గ్రామం. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నం. కుమారుడు రాజుకు పసిప్రాయం నుంచి తలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నాడు. పింఛన్ కోసం అన్ని ఫారాలు ఇచ్చినా మంజూరు చేయడం లేదు. ఎన్నాళ్లని తిరగాలి. – కుమారునితో ఉబ్బిడి కనకయ్య ఇదెక్కడి న్యాయం ? మేము అమ్మ ఆదర్శ పాఠశాలల్లో వివిధ పనులు చేపట్టాం. వస్తువులు కొనుగోలు చేశాం. మాకు రావాల్సిన డబ్బులు రాకపోగా జీఎస్టీ పేరుతో మరిన్ని కట్ చేశారు. సర్వీస్ చార్జ్ ఇస్తానన్నారు ఇవ్వలేదు. జీఎస్టీ కట్ చేయడం వల్ల నష్టపోయాం. మాకు న్యాయం చేయండి. – అమ్మ ఆదర్శ పాఠశాలల చైర్మన్లు, గంగాధర -
ధర్మారంలో ప్రైవేట్ నర్సింగ్ హోమ్ సీజ్
ధర్మారం(ధర్మపురి): మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ నర్సింగ్హోమ్ను జిల్లా వైద్యాధికారి అన్నప్రసన్న కుమారి సోమవారం రాత్రి సీజ్ చేశారు. వైద్యురాలు లావణ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజులక్రితం ఆస్పత్రిని తనిఖీ చేయగా అనేక అవకతకవలు వెలుగులోకి వచ్చాయి. దీంతో హెచ్చరిక నోటీసు జారీచేశామని, అయినా, యాజమాన్యం పట్టించుకోలేదని, సామాన్యులను బిల్లుల పేరిట దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కానింగ్ యంత్రంలోని హార్డ్డిస్క్ను మాయం చేశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు రికార్డులను సైతం మాయం చేశారని మండిపడ్డారు. 9 పడకలకు బదులు 20 పడకలతో ఆస్పత్రి నిర్వహిస్తున్నారని ఆమె వివరించారు. పేషెంట్లకు అవసరం లేకున్నా విలువైన అంటీబయాటీక్ మందులను ఇస్తున్నారని ఆమె తెలిపారు. తన పరిశీలనలో అనేక అవకతవకలు వెలుగులోకి రావడంతో ఆస్పత్రిని సీజ్ చేస్తున్నట్లు డీఎంహెచ్వో ప్రకటించారు. నివేదికను కలెక్టర్కు పంపిస్తామని ఆమె వెల్లడించారు. జిల్లా వైద్యాధికారితో పాటు డీఈఎంవో వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
వేంపేటలో వీధికుక్కల వీరంగం
మెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం వేంపేటలో వీధికుక్కలు వీరంగం సృష్టించాయి. గొర్రెలు, మేకల మందపై దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో 16 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మరో ఎనిమిది మేకలు గాయాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. గ్రామానికి చెందిన రాచర్ల అంజయ్య సోమవారం మేతకు తీసుకెళ్లేందుకు కొట్టం వద్దకు వెళ్లాడు. అప్పటికే కుక్కలు దాడి చేసి గొర్రెలను చంపేశాయి. ఈ ఘటనలో సుమారు రూ.2లక్షల వరకు నష్టం జరిగిందని బాధితుడు తెలిపాడు. మెట్పల్లి మండల పశువైద్యాధికారి మనీషా, ఆర్ఐ కాంతయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్రెడ్డి మృతి చెందిన గొర్రెలను పరిశీలించారు. నష్టపరిహారం వచ్చేలా చూస్తామన్నారు. 16 గొర్రెలు మృతి -
ఎన్హెచ్ 563లో
మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2025తోటకూర ఎంతమ్మా..పాపం..పండుటాకులు!విద్యార్థులు చదువుతోపాటు వ్యాపారరంగంలో నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో పండించిన కూరగాయలతో సోమవారం కరీంనగర్ కశ్మీర్గడ్డ రైతుబజార్లో విద్యార్థులు ఏర్పాటు చేసిన మోడల్ వెజిటేబుల్ మార్కెట్ను ప్రారంభించారు. కూరగాయల విక్రయాలపై అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. డీఈవో జనార్దన్రావు, జిల్లా సైన్స్ అధికారి జైపాల్రెడ్డి, కోఆర్డినేటర్స్ అశోక్రెడ్డి, శ్రీనివాస్, జన్య ఫౌండేషన్ ఆపరేషన్ మేనేజర్ సురేందర్ పాల్గొన్నారు. – కరీంనగర్న్యూస్రీల్ -
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి..
బోయినపల్లి(చొప్పదండి): అప్పటిదాక బోయినపల్లి బస్టాండ్లో ఉండి అందరితో నవ్వుకుంటూ మాట్లాడిన వ్యక్తి అంతలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం స్థానికంగా విషాదం నింపింది. గొర్రెల మంద వద్దకు వెళ్తున్న బోయినపల్లికి చెందిన గొర్రెలకాపరి సురకాని మల్లేశం(40) సోమవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు. బోయినపల్లి నుంచి వేములవాడ వెళ్లే దారిలో ఉన్న గొర్రెలమంద వద్దకు మల్లేశం సాయంత్రం తన టీవీఎస్ వాహనంపై వెళ్తున్నాడు. గుర్తు తెలియని వాహనం స్థానిక పెట్రోల్ బంక్ పరిసరాల్లో ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. మల్లేశంకు భార్య గంగజల, కుమారుడు, కూతురు ఉన్నారు. బోయినపల్లి ఎస్సై పృథ్వీధర్గౌడ్ సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు నమోదు చేసుకున్నారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
చొప్పదండి: మండలంలోని భూపాలపట్నం గ్రామానికి చెందిన గోగులకొండ రాఘవాచారి (54) అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్ఐ అనూష కథనం ప్రకారం.. రాఘవాచారి ఈ నెల 5న ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, కుటుంబ సభ్యులు కరీంనగర్కు, అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించి చికిత్స చేయించారు. ఆరోగ్యం మెరుగైందని ఇంటికి తీసుకురాగా ఇటీవల మళ్లీ క్షీణించింది. కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. రూ.20 లక్షల వరకు అప్పు చేసి ఇంటి నిర్మాణం చేయగా, అప్పులు పెరిగి, తన వెల్డింగ్ షాపు సరిగా నడవకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య తార ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులున్నారు. విషజ్వరంతో మహిళ..కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మండలంలోని మొట్లపల్లి గ్రామానికి చెందిన ఎండీ ఆసియాబేగం (40) విషజ్వరంతో మృతిచెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. నాలుగురోజుల క్రితం ఆసియాబేగంకు జ్వరం రావడంతో జమ్మికుంటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి శనివారం కరీంనగర్ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. జ్వరంతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, డెంగీ లక్షణాలు కూడా కనిపించినట్లు వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇటీవల గ్రామానికి చెందిన జిలకర రామస్వామి కూడా విషజ్వరంతో చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో జ్వరాలు ప్రబలుతున్నాయని, వైద్య శిబిరం నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
కాలువలో గల్లంతైన మహిళ మృతదేహం లభ్యం
కోరుట్లరూరల్: మండలంలోని మోహన్రావుపేట గ్రామానికి చెందిన పూదరి దేవక్క (70) మృతదేహం మల్యాల మండలం మానాల శివారులోని ఎస్సారెస్పీ కెనాల్లో లభ్యమైంది. శుక్రవారం దేవక్క మేడిపెల్లి మండలం వల్లంపెల్లి గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కాలువలో పడి గల్లంతైన విషయం తెలిసిందే. దేవక్క బంధువులు, పోలీసులు కెనాల్ వెంట గాలించగా ఆదివారం ఉదయం మృతదేహాన్ని మానాల శివారులోని ఎస్సారెస్పీ కెనాల్లో గుర్తించి కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దేవక్కకు మతిస్థిమితం సరిగా లేదని ఆమె భర్త పూదరి నర్సయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గోదావరినదిలో.. రామగుండం: అంతర్గాం మండలం గోలివాడ సమీప గోదావరినదిలో ఆదివారం ఓ వ్యక్తి(సుమారు 40 ఏళ్ల పురుషుడు) మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి మంచిర్యాల లేదా నస్పూర్ ప్రాంతానికి చెందినవాడుగా భావిస్తున్నారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మార్చురీలో భద్రపరిచారు. మృతుడి బంధువులు ఎవరైనా ఉంటే సెల్ నంబరు 87126 56527కు సమాచారం అందించాలని ఎస్సై వెంకటస్వామి కోరారు. -
కూల్ డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగి..
ముస్తాబాద్(సిరిసిల్ల): కూల్ డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగిన వృద్ధురాలు చికిత్సపొందుతూ మృతిచెందింది. ఎస్సై గణేశ్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన జెల్ల బాలవ్వ(74) శనివారం ఇంట్లో కూల్డ్రింక్ అనుకొని సీసాలోని పురుగుల మందు తాగి తీవ్ర అస్వస్థతకు గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు బాలవ్వను ముస్తాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సిద్దిపేటలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతిచెందింది. అయితే వరిపంటకు కొట్టగా మిగిలిన పురుగుల మందును కూల్ డ్రింక్ సీసాలో ఉంచారు. ఇది తెలియని బాలవ్వ కూల్ డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగి మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాగా 25 రోజుల క్రితమే అప్పుల బాధలు భరించలేక బాలవ్వ కుమారుడు దేవయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 25 రోజుల వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరూ మరణించడంతో పోతుగల్లో విషాదం నెలకొంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి 25 రోజుల క్రితమే కుమారుడు ఆత్మహత్య -
వృద్ధురాలి దారుణహత్య
కొత్తపల్లి(కరీంనగర్): వృద్ధురాలి గొంతుకోసి హత్యచేసిన ఘటన కొత్తపల్లి (హెచ్) ఎస్సారెస్పీ కెనాల్ వద్ద జరిగింది. ప్రయాణికులు, స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్, ప్రొబేషనరీ ఐపీఎస్ వసుందరయాదవ్, కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్కుమార్ పరిశీలించారు. మృతురాలు తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామానికి చెందిన తనుకు వెంకటమ్మ (70)గా గుర్తించారు. అయితే హత్యకు గల కారణాలు, హత్య చేసింది ఎవరు.. కొత్తపల్లి కెనాల్ వద్దే చంపేసారా..ఇతర ప్రాంతంలో హత్య చేసి ఇక్కడ వదిలేసారా..? అన్న విషయాలపై పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది. కాగా కోహెడ మండలం రామచంద్రాపూర్ గ్రామానికి చెందిన మృతురాలి పెద్ద కుమార్తె లక్ష్మీ సమాచారం తెలియగానే ఆదివారం ఘటనా స్థలానికి చేరుకుంది. అయితే డబ్బుల విషయంలోనే వృద్ధురాలిని కుటుంబ సభ్యులే హత్య చేసినట్లు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. హత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో తేలనున్నాయి. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్యకరీంనగర్ క్రైం: ఒంటరితనం భరించలేక ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. కరీంనగర్లోని హనుమాన్నగర్కు చెందిన గంపల సంపత్ (38)కు భార్య, కూతురు, కొడుకు ఉండగా కుటుంబ సమస్యల కారణంగా భార్యతో విడాకులయ్యాయి. పిల్లలకు దూరంగా ఉండడంతోపాటు ఒంటరితనం భరించలేక మనోవేదనకు గురవుతున్న సంపత్ తన తండ్రి గంపల సాయిలు వద్ద ఉంటున్నాడు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఒత్తిడికి దూరంగా ఉండాలి
కరీంనగర్టౌన్: గుండె జబ్బులు ఎవరికై నా వచ్చే అవకాశం ఉందని, కేవలం నిర్లక్ష్యం కారణంగానే ఎక్కువ మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారని మెడికవర్ కార్డియాలజిస్టు డాక్టర్ అనీశ్ పబ్బ అన్నారు. ఆదివారం నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో గుండె జబ్బులు.. చికిత్స..అంశంపై అవగాహన కార్యక్రమం, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పలువురు వాకర్స్ సందేహాలకు సమాధానాలు తెలిపారు. ఈ సందర్భంగా అనీశ్ మాట్లాడుతూ, రోజూ వాకింగ్, వ్యాయామం చేస్తున్నామని భరోసాగా ఉండే పరిస్థితి లేదన్నారు. ధూమపానం, మద్యపానం, ఫాస్ట్ఫుడ్, నాన్వెజ్ తీసుకోవడం, అధిక బీపీ, షుగర్ ఉన్న 35 ఏళ్ల పైబడినవారు రిస్క్లో ఉన్నట్లేనని పేర్కొన్నారు. రిస్క్ తప్పించుకోవాలంటే లైఫ్స్టైల్ మార్చుకొని, ఒత్తిడికి దూరంగా ఉండాలన్నారు. ఏడాదికోసారి తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మెడికవర్ సెంటర్హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు నాగరాజు, వినయ్, విష్ణువర్దన్రెడ్డి, దిలీప్రెడ్డి, ఖాజామోయినొద్దీన్, రుత్విక్, రవిమల్లారెడ్డి, కోట కర్ణాకర్, సాయిచరణ్ తదితరులు పాల్గొన్నారు. -
నిన్న హత్య.. నేడు అంత్యక్రియలు
● మానవత్వం చాటిన పోలీసులు ● కుటుంబ సమక్షంలో కమలాకర్ దహనసంస్కారాలుజగిత్యాలక్రైం: క్షణికావేశంలో ఇంటిపెద్దను భార్య, కొడుకులు, కూతురు, అల్లుడు హత్య చేశారు. క్షణికావేశం నుంచి తేరుకున్నాక తండ్రి మరణాన్ని తట్టుకోలేక కొడుకులు, కూతురు కన్నీరుమున్నీరయ్యారు. స్థానికుల వివరాలు.. జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామానికి చెందిన పడాల కమలాకర్ (58)పై మొదటి భార్య జమున, పెద్ద కొడుకు చిరంజీవి, చిన్న కొడుకు రంజిత్, కూతురు శిరీష, అల్లుడు శోభన్ కలిసి క్షణికావేశంలో పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో చికిత్స పొందుతూ కమలాకర్ మృతిచెందగా అతడి బంధువులు, గ్రామస్తులు మృతదేహాన్ని చూసేందుకు కూడా ఎవరూ రాలేదు. దీంతో ఆదివారం కొంత మంది సన్నిహితుల మధ్య పోలీసులు పోస్టుమార్టం పూర్తి చేయించి మృతదేహాన్ని పొలాసకు తరలించారు. దీంతో హత్యలో ప్రమేయం ఉన్న వారంతా పోలీస్స్టేషన్లో ఉండటంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మానవత్వం చాటిన పోలీసులు ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య మొదటి భార్య జమున, కొడుకులు చిరంజీవి, రంజిత్, కుమార్తె శిరీష, అల్లుడు శోభన్ను పొలాసకు తీసుకెళ్లారు. దీంతో వారంతా కమలాకర్ మృతదేహంపై పడి రోదించడంతో స్థానికులు, బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీరుమున్నీరయ్యారు. తండ్రి చితికి నిప్పంటించాడు. అంత్యక్రియల అనంతరం నిందితులను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. మృతుడి ఇంట్లో ఆయుధాలు కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురైన పడాల కమలాకర్ ఇంట్లో ఆదివారం పోలీసులు పరిశీలించగా భారీ ఆయుధాలు లభ్యమయ్యాయి. తల్వార్లతో పాటు కత్తులు, రాడ్లు కన్పించడంతో పోలీసులు బిత్తరపోయారు. కమలాకర్ పక్కా ప్రణాళికతోనే కొన్నేళ్లుగా మారణాయుధాలు వెంట ఉంచుకుంటూ తిరిగాడని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. నిందితుల రిమాండ్జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామానికి చెందిన పడాల కమలాకర్ (58)పై పెట్రోల్ పోసి నిప్పంటించి మృతికి కారణమైన ఐదుగురిని ఆది వారం రిమాండ్కు తరలించినట్లు సీఐ కృష్ణారెడ్డి తెలి పారు. కుటుంబ కలహాలతో మొదటి భార్య జమున, పెద్ద కొడుకు చిరంజీవి, చిన్న కొడుకు రంజిత్, కుమార్తె శిరిష, అల్లుడు శోభన్బాబు కలిసి కమలాకర్పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందగా అతడి సోదరుడు రవి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదయింది. సమావేశంలో రూరల్ ఎస్సై సధాకర్ పాల్గొన్నారు. -
● కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేటీఆర్, జగదీశ్రెడ్డి దిష్టిబొమ్మల దహనం
కరీంనగర్ కార్పొరేషన్: పీసీసీ పిలుపు మేరకు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, జగదీశ్రెడ్డి దిష్టిబొమ్మలను తెలంగాణచౌక్లో దహనం చేశారు. ఈ సందర్భంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పురుమల్ల శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, ఆరెపల్లి మోహన్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొరివి అరుణ్కుమార్ మాట్లాడుతూ ఇటీవల అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్ కుమార్తో ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఏకవచనంతో మాట్లాడి సభా మర్యాదను మంటగలిపారని అన్నారు. గతంలో ఎమ్మెల్యే సంపత్ కుమార్ను అసెంబ్లీ నుంచి బర్తరఫ్ చేశారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక దళిత నాయకున్ని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేశారని అన్నారు. ఇప్పటికై నా పద్దతి మార్చుకోకపోతే బీఆర్ఎస్ నాయకులను తరిమికొట్టే రోజు వస్తుందని హెచ్చరించారు. గుండాటి శ్రీనివాస్రెడ్డి, ఆకారపు భాస్కర్రెడ్డి, కర్ర రాజశేఖర్, గడ్డం విలాస్రెడ్డి, సమద్ నవాబ్, దండి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
‘సహకార’ సభ్యులకు ప్రమాదబీమా, డివిడెంట్
కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ మహాజన సభ రెవె న్యూ గార్డెన్లో చైర్మన్ గడ్డం విలాస్రెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు పలు సూచనలు చేశారు. సభ్యులు ఎవరైనా ప్రమాదంలో చనిపోతే రూ.2లక్షల ఇన్సూరెన్స్, రెండేళ్ల డివిడెంట్ ఇచ్చేందుకు, బ్యాంకు పరిధిని 20 కిలోమీటర్ల వరకు పెంచు తూ తీర్మానాలు చేశారు. హుస్నాబాద్, చొప్పదండిలో బ్రాంచ్లు ఏర్పాటు చేసేందుకు ఆమోదించారు. సమావేశంలో చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి,మడుపుమోహన్, ముక్క భాస్కర్, బొమ్మరాతి సాయికృష్ణ, క్రాంతి, రేగొండ సందీప్, మూలలక్ష్మీ రవీందర్, విద్యాసాగర్, లక్ష్మణ్, రాజు, మహమ్మద్ సమయుద్దిన్, మంగి రవీందర్, నాగుల సతీశ్, మార్కారాజు, గంజి అంజయ్య, బ్యాంకు ముఖ్య నిర్వహణ అధికారి నునుగొండ శ్రీనివాస్, జగిత్యాల బ్రాంచ్ మేనేజర్ ఎలుక సుధాకర్ పాల్గొన్నారు. వన్నేషన్, వన్ ఎలక్షన్తో సమూల మార్పు కరీంనగర్ టౌన్: వన్ నేషన్, వన్ ఎలక్షన్(జమిలి)తో ఎన్నికల నిర్వహణలో సమూల మార్పులు వస్తాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. వన్నేషన్, వన్ ఎలక్షన్ వర్క్షాప్ ఆదివారం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రోగ్రాం కన్వీనర్, జిల్లా ఉపాధ్యక్షుడు సాయిని మల్లేశం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే సమయం ఆదా అవుతుందన్నారు. పోలింగ్శాతం కూడా పెరుగుతుందన్నారు. మోడీ ప్రభుత్వం జమిలి ఎన్నికలపై ఆ లోచన చేస్తోందన్నారు. ఈ ప్రతిపాదన చట్టంగా మారితే, లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయని, జమిలి ఎన్నికలపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. మాడ వెంకటరెడ్డి, మాజీ మేయర్లు శంకర్, సునీల్రావు, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్ పాల్గొన్నారు. ‘వైరాగ్యం’కు విశ్వ విభూషణ్ పురస్కారం అందజేత కరీంనగర్ కల్చరల్: విశ్వవిఖ్యాత ఆర్ట్ అండ్ కల్చరల్ అకాడమీ మంథని, కేఎన్డీ చారిటబుల్ ట్రస్ట్ ఖమ్మం ఆధ్వర్యంలో కరీంనగర్ చెందిన కవి, రచయిత వైరాగ్యం ప్రభాకర్కు విశ్వవిభూషణ్ అవార్డు ప్రదానం చేశారు. హైదరాబాద్లో నాని త్యాగరాయ గానసభ హాల్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు ఎస్వీఆర్ వెంకటేశ్, చీమల కోటేశ్వరి చేతులు మీదుగా అవార్డు అందుకున్నా రు. కరీంనగర్కు చెందిన కవి గంప ఉమాపతిని చతుర్ముఖ సింహ అవార్డుతో సత్కరించారు. సీఎం మాట నిలబెట్టుకోవాలి కరీంనగర్: రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకుండా ఎస్సీ వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చే యడం దారుణమని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ అన్నారు. కలెక్టరేట్ ఎదుట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష ఆదివారం 7వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఆగస్టు 1న ఇచ్చిన తీర్పును స్వాగతించిన ముఖ్యమంత్రి ప్రతీ ఉద్యోగ నో టిఫికేషన్కు ఎస్సీ వర్గీకరణ వర్తింపజేస్తామని అసెంబ్లీలో హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఆ హామీని అమల్లోకి తీసుకురాకుండా టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసి మాదిగలకు అన్యాయం చేశారన్నారు. 17వ తేదీన అసెంబ్లీలో చట్టం చేస్తామని చెబుతూనే, వర్గీకరణ అమలు చేయకుండా ఉద్యోగ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తూ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాడని మండిపడ్డారు. అంజిబాబు, వరలక్ష్మి, రాజన్న, హన్మయ్య, బాబు, సంపత్, మొగిలి, లక్ష్మణ్, విజయ్, రఘు, రమేశ్, మహేశ్ పాల్గొన్నారు. -
కరీంనగర్ వినియోగదారుల ఫోరం ఏర్పాటు: 1987 నమోదైన కేసులు: సుమారు 9వేలు బాధితులు పొందిన పరిహారం: రూ.21కోట్లు
కరీంనగర్ అర్బన్: నిర్ణీత రుసుము చెల్లించి వస్తుసేవలు పొందుతున్న ప్రతివ్యక్తీ వినియోగదారుడే. మనం ఖర్చు చేసే ప్రతీ పైసాకు నాణ్యమైన వస్తు సేవలను పొందడం మన హక్కు. కానీ నిత్యావసర, అలంకరణ, దుస్తులు, గృహ వినియోగ పరికరాలు ఒక్కటేమీ.. ఎందులో చూసినా నాసిరకమే. నిర్ణీత రుసుం చెల్లించి ప్రభుత్వం నుంచి హక్కుగా పొందాల్సిన సేవలకు సైతం కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరుగుతూ అధికారులకు ముడుపులు ముట్టజెబితే గానీ పలుశాఖల్లో సకాలంలో స్పందించడం లేదు. ఈ క్రమంలో నాణ్యమైన సేవలు పొందేందుకు విని యోగదారుల ఫోరం చక్కని వేదికగా నిలుస్తోంది. అవగాహన అవసరం జిల్లాలోని స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రభుత్వం ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తే వినియోగదారులకు మరింత లబ్ధి చేకూరుతుంది. పౌర సేవాపత్రం ప్రకారం ప్రతి పనిని నిర్ణీత సమయంలో చేయాలని నిబంధనలున్నా నేటికి ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు కావడం లేదు. దీంతో వినియోదారునికి తీరని నష్టం కలుగుతోంది. బహిరంగ మార్కెట్లో జరుగుతున్న మోసాలను, ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న సేవా లోపాలను అవగాహనతో ప్రశ్నించినప్పుడు మాత్రమే వినియోగదారులకు నాణ్యమైన వస్తు, సేవలు అందుతాయి. తమకు జరిగిన నష్టాన్ని కర్మ అని వదిలేయకుండా జిల్లా ఫోరంలో కేసులు నమోదు చేసి తమకు జరిగిన వస్తుసేవా లోపాలకు వడ్డీతో నష్టపరిహారం పొంది విజయం సాధించిన వినియోగదారులూ ఉన్నారు. రశీదు తప్పనిసరి.. బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసే వంద రూపాయాల నిత్యావసర వస్తువుల నుంచి. రూ.వేలు పెట్టి కొనుగోలు చేసే ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు ఏ వస్తువు కొనుగోలు చేసినా తప్పనిసరిగా రశీదు పొందాలి. కొన్న వస్తువుకు సరిపడా రశీదు మన వద్ద ఉన్నప్పుడు మాత్రమే మనం కొనుగోలు చేసిన వస్తువుల్లో నాణ్యత లోపించినా, నిబంధనల ప్రకారం కంపెనీ సర్వీస్ ఇవ్వకున్నా సకాలులో ఫోరంలో కేసు నమోదు చేసి వినియోగదారునికి జరిగిన వస్తు, సేవల నష్టపరిహారాన్ని వడ్డీతో సహా పొందవచ్చు. ఉండాల్సిన విషయాలు ఫిర్యాదుదారు పూర్తి పేరు, చిరునామా, అవతలి పార్టీ(వ్యాపారి, డీలర్) పూర్తి పేరు చిరునామా, ఫిర్యాదు చేయడానికి కారణాలు, ఎప్పుడు..? ఎలా..? సంబంధించి.. ఏవిధంగా నష్టపోయింది. దస్తావేజులు, రశీదులు, పూర్తి సమాచారంతో ఫిర్యాదు చేయాలి. ఏ విధమైన నష్ట పరిహారం కోరుతున్నారో వివరాలతో పాటు ఫిర్యాదుదారు సంతకం ఉండాలి. -
● నగరపాలక కమిషనర్ చాహత్బాజ్పేయ్
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్నుల వసూళ్ల కోసం కమిషనర్ చాహత్ బాజ్పేయ్ రంగంలోకి దిగారు. ఆదివారం నగరంలోని పలు డివిజన్లలో పర్యటించారు. రెవెన్యూ అధికారులు, సిబ్బందితో కలిసి మొండి బకాయిదారుల నివాసగృహాలను సందర్శించారు. కొన్నేళ్లుగా ఆస్తి పన్ను చెల్లించని బకాయిదారుల నుంచి పన్నులు వసూలు చేశారు. నగరంలోని రాంనగర్ లిటిల్పార్కుతో పాటు మార్కెట్ రోడ్డులోని పలు లాడ్జీలు, కమర్షియల్ షాపులను సందర్శించారు. మొండి బకాయిదారులను పన్నులు చెల్లించాలని డిమాండ్ చేశారు. 2024– 2025 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్నుల చెల్లింపుల గడువు ముగుస్తున్నందున మొండి బకాయిదారులపై మున్సిపల్ చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే రెడ్నోటీసులు జారీ చేసినా.. పన్నులు చెల్లించని వారి షాపులకు తాళాలు వేయడంతో పాటు నివాస గృహాలకు నగరపాలక సంస్థ ద్వారా ఇచ్చే అత్యవసర సేవలను తొలగించడంతో పాటు నల్లా కనెక్షన్లు తొలగించాలని అధికారులను ఆదేశించారు. నగర ప్రజ లు ఆర్థిక సంవత్సరం గడువులోగా ఆస్తి పన్నులు, నల్లా పన్నులు, ట్రేడ్ లైసెన్స్ పన్నులు చెల్లించి నగరపాలకసంస్థ అభివృద్ధికి సహకరించాలని కోరారు. డిప్యూటీ కమిషనర్ స్వరూప రాణి, ఇన్చార్జి ఆర్వో కరీముల్లాఖాన్ పాల్గొన్నారు. -
పైసలు మాకు!
పండుగ మీకు..● రెండు నెలల్లో జంబో కూలర్ల అద్దె రెట్టింపు ● పరిపాలన అనుమతులివ్వడంలో చేతివాటం ● అవినీతా? లేక పద్ధతి ప్రకారం లూఠీనా? ● రంజాన్ ఏర్పాట్లలో పెరిగిన ఐటెంల ఖర్చుకరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మరోసారి అవినీతి బాగోతం వెలుగుచూసింది. ఈసారి రంజాన్ పండగను ఆసరాగా చేసుకున్న అధికారులు టెండర్లలో ఐటెంల రేట్లు పెంచి తమ సత్తా చాటుకున్నారు. రెండు నెలల కాలంలో ఐటెంల రేట్లు రెట్టింపు చేసి ఖజానాకు గండి కొట్టే ప్రయత్నం చేశారు. కరీంనగర్ హౌజింగ్బోర్డ్కాలనీలో జనవరిలో స్మార్ట్సిటీ 24 గంటల నీటి సరఫరా కార్యక్రమం ప్రారంభం కోసం బల్దియా అధికారులు రూ.14.80 లక్షలతో టెండర్లు పిలిచారు. అందులో టెంట్లు, ఫ్లెక్సీలు, జనరేటర్లు, సౌండ్ సిస్టమ్, సోఫాలు, ఫైబర్ చైర్లు తదితర ఐటెంలు టెండర్ల ద్వారా తెప్పించారు. తా జాగా రంజాన్ పండుగ కోసం ఇవే ఐటెంలకు టెండర్లు పిలిచారు. అయితే, ఇక్కడే అధికారులపై విమర్శలు వస్తున్నాయి. కేవలం రెండునెలల కాలంలో కొన్ని ఐటెంల రేట్లు అమాంతంగా పెరిగిపోవడం చర్చనీయాంశంగా మారింది. కాంట్రాక్టర్లకు ఆయాచిత లబ్ధి చేకూర్చే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. అప్పుడలా.. ఇప్పుడిలా గత జనవరిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా టెంట్లు, ప్లెక్సీలు, జనరేటర్లు, సౌండ్ సిస్టమ్, సోఫాలు, ఫైబర్ చైర్లు తదితర ఐటెంలు టెండర్ల ద్వారా తెప్పించారు. ఇందులో ఒక్క జంబో కూలర్ రేటును రూ.1200, ఫైబర్ చైర్ ఒక్కదానికి రూ.8, 125 కేవీ జనరేటర్ రోజుకు రూ.15,000 చొప్పున, పైప్ అండ్ పెండల్ (టెంట్) చదరపు అడుగుకు రూ.3గా కోట్ చేసి డబ్బులు చెల్లించారు. అయితే, తాజాగా రంజాన్ పర్వదినం ప్రార్థనల కోసం సాలేహ్నగర్ ఈద్గాల కోసం జంబో కూలర్ రేటును రూ.2500గా (పది కూలర్లు), ఫైబర్ చైర్లను రూ.10గా (250 కుర్చీలు), 7.5 కేవీ జనరేటర్ (ఒక్కటి)ను గంటకు రూ.1,576గా నిర్ణయించారు. పైప్ అండ్ పెండల్ (టెంట్) చదరపు అడుగుకు రూ.3.50 (75,168 చదరపు అడుగులు)గా పేర్కొన్నారు. ● కేవలం సాలేహ్ నగర్ ఈద్గాలోనే పైప్ అండ్ పెండల్ (టెంట్) చదరపు అడుగుకు రూ.3.50 వసూలు చేశారు. అంటే గతం కన్నా రూ.0.50 పైసలు మాత్రమే అదనం. కానీ, 75,168 చదరపు అడుగులకు రూ.37,584 వేలు అదనపు చెల్లించారు. ● జంబో కూలర్ల విషయంలో రూ.1300పెంచడం వల్ల అదనంగా రూ.13 వేలు చెల్లించాల్సి వచ్చింది. ఇంకా సప్తగిరి కాలనీ, చింతకుంట ఈద్గాలను కలుపుకుంటూ.. ఐటెంల రేట్లు కలిపితే ఈ దుబారా మరింత అధికంగా (రూ.లక్షల్లో) ఉంటుంది. ● అయితే, ఈ ఐటెంల రేట్ల నిర్ణయించడానికి స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ (ఎస్ఎస్ఆర్)ను లేదా కొటేషన్లు పిలిచి వాటిని ఫాలో కావాలి. కానీ, అధికారులు ఇవేమీ పాటించినట్లు కనిపించడం లేదు. ● పండగల పేరిట ఇలాంటి పారదర్శకత లేని పనులు చేపడుతూ.. బల్దియా ఖజానాకు తూట్లు పొడుస్తున్నారు. ఇలాంటి వ్యవహారా లపై కమిషనర్, అడిషనల్ కలెక్టర్ (ఎల్అండ్బీ), కలెక్టర్ పట్టించుకోకపోవడంతో అంచనాల పెంపు సర్వసాధారణంగా మారుతోంది. -
● నగరపాలక కమిషనర్ చాహత్బాజ్పేయ్
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్నుల వసూళ్ల కోసం కమిషనర్ చాహత్ బాజ్పేయ్ రంగంలోకి దిగారు. ఆదివారం నగరంలోని పలు డివిజన్లలో పర్యటించారు. రెవెన్యూ అధికారులు, సిబ్బందితో కలిసి మొండి బకాయిదారుల నివాసగృహాలను సందర్శించారు. కొన్నేళ్లుగా ఆస్తి పన్ను చెల్లించని బకాయిదారుల నుంచి పన్నులు వసూలు చేశారు. నగరంలోని రాంనగర్ లిటిల్పార్కుతో పాటు మార్కెట్ రోడ్డులోని పలు లాడ్జీలు, కమర్షియల్ షాపులను సందర్శించారు. మొండి బకాయిదారులను పన్నులు చెల్లించాలని డిమాండ్ చేశారు. 2024– 2025 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్నుల చెల్లింపుల గడువు ముగుస్తున్నందున మొండి బకాయిదారులపై మున్సిపల్ చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే రెడ్నోటీసులు జారీ చేసినా.. పన్నులు చెల్లించని వారి షాపులకు తాళాలు వేయడంతో పాటు నివాస గృహాలకు నగరపాలక సంస్థ ద్వారా ఇచ్చే అత్యవసర సేవలను తొలగించడంతో పాటు నల్లా కనెక్షన్లు తొలగించాలని అధికారులను ఆదేశించారు. నగర ప్రజ లు ఆర్థిక సంవత్సరం గడువులోగా ఆస్తి పన్నులు, నల్లా పన్నులు, ట్రేడ్ లైసెన్స్ పన్నులు చెల్లించి నగరపాలకసంస్థ అభివృద్ధికి సహకరించాలని కోరారు. డిప్యూటీ కమిషనర్ స్వరూప రాణి, ఇన్చార్జి ఆర్వో కరీముల్లాఖాన్ పాల్గొన్నారు. -
కరీంనగర్ వినియోగదారుల ఫోరం ఏర్పాటు: 1987 నమోదైన కేసులు: సుమారు 9వేలు బాధితులు పొందిన పరిహారం: రూ.21కోట్లు
కరీంనగర్ అర్బన్: నిర్ణీత రుసుము చెల్లించి వస్తుసేవలు పొందుతున్న ప్రతివ్యక్తీ వినియోగదారుడే. మనం ఖర్చు చేసే ప్రతీ పైసాకు నాణ్యమైన వస్తు సేవలను పొందడం మన హక్కు. కానీ నిత్యావసర, అలంకరణ, దుస్తులు, గృహ వినియోగ పరికరాలు ఒక్కటేమీ.. ఎందులో చూసినా నాసిరకమే. నిర్ణీత రుసుం చెల్లించి ప్రభుత్వం నుంచి హక్కుగా పొందాల్సిన సేవలకు సైతం కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరుగుతూ అధికారులకు ముడుపులు ముట్టజెబితే గానీ పలుశాఖల్లో సకాలంలో స్పందించడం లేదు. ఈ క్రమంలో నాణ్యమైన సేవలు పొందేందుకు విని యోగదారుల ఫోరం చక్కని వేదికగా నిలుస్తోంది. అవగాహన అవసరం జిల్లాలోని స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రభుత్వం ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తే వినియోగదారులకు మరింత లబ్ధి చేకూరుతుంది. పౌర సేవాపత్రం ప్రకారం ప్రతి పనిని నిర్ణీత సమయంలో చేయాలని నిబంధనలున్నా నేటికి ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు కావడం లేదు. దీంతో వినియోదారునికి తీరని నష్టం కలుగుతోంది. బహిరంగ మార్కెట్లో జరుగుతున్న మోసాలను, ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న సేవా లోపాలను అవగాహనతో ప్రశ్నించినప్పుడు మాత్రమే వినియోగదారులకు నాణ్యమైన వస్తు, సేవలు అందుతాయి. తమకు జరిగిన నష్టాన్ని కర్మ అని వదిలేయకుండా జిల్లా ఫోరంలో కేసులు నమోదు చేసి తమకు జరిగిన వస్తుసేవా లోపాలకు వడ్డీతో నష్టపరిహారం పొంది విజయం సాధించిన వినియోగదారులూ ఉన్నారు. రశీదు తప్పనిసరి.. బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసే వంద రూపాయాల నిత్యావసర వస్తువుల నుంచి. రూ.వేలు పెట్టి కొనుగోలు చేసే ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు ఏ వస్తువు కొనుగోలు చేసినా తప్పనిసరిగా రశీదు పొందాలి. కొన్న వస్తువుకు సరిపడా రశీదు మన వద్ద ఉన్నప్పుడు మాత్రమే మనం కొనుగోలు చేసిన వస్తువుల్లో నాణ్యత లోపించినా, నిబంధనల ప్రకారం కంపెనీ సర్వీస్ ఇవ్వకున్నా సకాలులో ఫోరంలో కేసు నమోదు చేసి వినియోగదారునికి జరిగిన వస్తు, సేవల నష్టపరిహారాన్ని వడ్డీతో సహా పొందవచ్చు. ఉండాల్సిన విషయాలు ఫిర్యాదుదారు పూర్తి పేరు, చిరునామా, అవతలి పార్టీ(వ్యాపారి, డీలర్) పూర్తి పేరు చిరునామా, ఫిర్యాదు చేయడానికి కారణాలు, ఎప్పుడు..? ఎలా..? సంబంధించి.. ఏవిధంగా నష్టపోయింది. దస్తావేజులు, రశీదులు, పూర్తి సమాచారంతో ఫిర్యాదు చేయాలి. ఏ విధమైన నష్ట పరిహారం కోరుతున్నారో వివరాలతో పాటు ఫిర్యాదుదారు సంతకం ఉండాలి.