breaking news
Karimnagar District News
-
ఆహ్లాదం.. ఆరోగ్యం
● కనువిందు చేస్తున్న అటవీ ప్రాంతం ● అడవుల రక్షణకు అధికారుల చర్యలు ● సేదతీరుతున్న పర్యావరణ ప్రియులు మంథని: వేసవి ముగిసింది. తొలకరి పలకరించింది. అడవులు ఆకుపచ్చదనం సంతరించుకున్నాయి. నిన్నామొన్నటి వరకు మోడువారిన చెట్లు చిగురిస్తున్నాయి. చిగురించిన ఆకులతో పచ్చదనం కనువిందు చేస్తోంది. తూర్పు అటవీ ప్రాంతమైన మంథని నియోజవకర్గంలోని అడవులు ఆహ్లాదం పంచుతున్నాయి. పర్యావరణ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంథని నుంచి మహదేవపూర్ వరకు.. మంథని మండలం ఎక్లాస్పూర్ శివారు మొదలు అటవీ ప్రాంతంలో మహదేవ్పూర్ మండలం బూర్గుగూడెం వరకు సుమారు 120 కి.మీ. మేర అడవి విస్తరించి ఉంది. రామగిరి, కమాన్పూర్ మండలాలు మినహా నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలు, పెద్దపల్లి, రామగిరి మండలాల్లో సైతం అడవులు విస్తరించి ఉన్నాయి. ఒకప్పుడు అంతరించిపోయిన అడవులకు హరితహరం పేరిట ప్రభుత్వాలు మొక్కలు నాటుతూ జీవం పోశాయి. ప్రస్తుతం పచ్చదనం ఉట్టిపడుతుండగా అటువైపు వెళ్లే వాహనదారులు పచ్చని చెట్లఒడిలో సేద తీరుతున్నారు. స్మగ్లర్ల గొడ్డలి వేటుకు దూరంగా.. ఒకప్పుడు దట్టమైన అడవులపై స్మగ్లర్ల గొడ్డలి వేటు పడటంతో పెద్దచెట్లు అంతరించిపోయాయి. కలప అక్రమ రవాణా చేస్తూ అడవులను నాశనం చేశారు. దీంతో ఎటుచూసినా పచ్చదనం ఉట్టిపడే అడవులు కానరాకుండా పోయాయి. కానీ ప్రస్తుతం అడవులు మళ్లీ పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి. అడవుల రక్షణకు పటిష్ట చర్యలు.. గత ప్రభుత్వాలు అడవుల రక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాయి. ఇటు ఫారెస్ట్, అటు పోలీసులు సంయుక్తంగా అడవుల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. కలప స్మగ్లర్ల అక్రమ రవాణాను అడ్డుకోవడంతోపాటు వంటచెరుకును కూడా తీసుకుపోకుండా కందకాలు తవ్వారు. అడవిలో అడుగుపెట్టకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో అడవులు మళ్లీ చిగురించాయి. హరితహారం పేరుతో అడవుల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించడంతో అడవులకు పూర్వవైభవం వచ్చినట్లయ్యింది. కనువిందు చేస్తున్న పచ్చదనం.. తూర్పు అడవుల్లో చిగురించిన పచ్చని ఆకులు, చెట్లు కనువిందు చేస్తున్నాయి. నిత్యం వందలాది మంది భక్తులు కాళేశ్వరం, మేడారం, నాగులమ్మలాంటి ఆలయాలను దర్శించుకునేందుకు వెళ్తూ అటవీ ప్రాంతాల్లోని పచ్చని చెట్లకింద సేద తీరుతున్నారు. కాసేపు ఆహ్లాదకరమైన వాతావరణ అనుభూతిని పొందుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంతో కలిసి ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. చెట్ల నీడన సేదదీరుతూ ఆటాపాటనతో ఎంజాయ్ చేస్తున్నారు. -
అసలు సిసలైన హీరో శ్యామాప్రసాద్
● కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్కరీంనగర్టౌన్: భారతదేశ అసలు సిసలైన హీరో శ్యామాప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ కొనియాడారు. ఒకే దేశం.. ఒకే జెండా.. ఒకే రాజ్యాంగం ఉండాలని పరితపించడమే కాకుండా 370 ఆర్టికల్ రద్దు కోసం బలిదానమయ్యారన్నారు. తన జీవిత సర్వస్వం సిద్ధాంతానికే అంకితం చేయడమే కాకుండా.. ఆ సిద్ధాంతం కోసం అధికార పదవులను కూడా త్యజించిన మహనీయుడు శ్యామాప్రసాద్ అని స్మరించుకున్నారు. సోమవారం శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా బండి సంజయ్ కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అంతకుముందు తన మాతృమూర్తితో కలిసి మొక్కను నాటారు. దేశం కోసం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలని జనసంఘ్ కార్యకర్తలను పిలుపునివ్వడమే కాకుండా కార్యకర్తలకు తుపాకీలిచ్చి పాకిస్తాన్పై యుద్ధం చేయడానికి పంపిన వీరుడుగా చర్రితలో నిలిచాడన్నారు. దేశ ప్రజలంతా మోదీ సర్కార్కు అండగా నిలిచి భారత్ను విశ్వగురు స్థానంలో నిలపాలనే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, మాజీ కార్పొరేటర్లు బండ రమణారెడ్డి, కొలగాని శ్రీనివాస్, నాయకులు హాజరయ్యారు. -
ఎడ్ల నాగలికి భలే గిరాకీ
● పసుపు విత్తనానికి రోజుకు రూ.3,500 కిరాయి ● ప్రతి గ్రామంలో ఐదారు జతల కాడెద్దులే దిక్కు జగిత్యాలఅగ్రికల్చర్: వ్యవసాయంలో ట్రాక్టర్లు, ఆధునిక యంత్రాలు రావడంతో కాడెద్దులు కనుమరుగయ్యాయి. గ్రామానికి కేవలం ఐదారు జతల కాడెడ్లు మాత్రమే ఉన్నాయి. విత్తనాలు వేసే సమయంలో వాటికి భలే డిమాండ్ పెరిగింది. పసుపు వంటి విత్తనం వేసేందుకు కాడెడ్లతో వచ్చే రైతుకు రూ.3,500 నుంచి రూ.4వేల వరకు చెల్లించాల్సి వస్తోందంటే గ్రామాల్లో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పోషణ భారమై.. ఒకప్పుడు గ్రామాల్లో ప్రతి రైతుకు కనీసం నాలుగైదు కాడెడ్లు ఉండేవి. జత కాడెడ్లు లేని రైతులు ఉండేవారు కాదంటే అతిశయోక్తికాదు. సాగులో ట్రాక్టర్ల రాకతో ప్రతి పనికీ యంత్రాలనే వినియోగిస్తున్నారు. చిన్న గ్రామంలోనూ సుమారు 20 నుంచి 30 ట్రాక్టర్లు వచ్చాయి. దీంతో కాడెడ్లను పోషించే స్థోమత రైతులకున్నా.. వాటికి నీరు పెట్టడం, మేత వేయడం వంటి పనులు చేయలేక అమ్ముకుంటున్నారు. నాలుగైదు ఎకరాలు ఉన్న రైతు కూడా ట్రాక్టర్ కొంటున్నాడు. కాడెడ్లకు గిరాకీ వాస్తవానికి విత్తనం వేసేందుకు కాడెడ్లు తప్పనిసరి. గతంలో ఇరుగుపొరుగు రైతులు అదలుబదలు రూపంలో విత్తనాలు వేసుకునేవారు. ప్రస్తుతం ఆ విధానం మారింది. కాడెడ్ల నాగలితో విత్తనం వేస్తే బాగా మొలకెత్తే అవకాశం ఉంటుంది. దీంతో పసుపు విత్తనం వేసేందుకు రైతులు కాడెడ్లపైనే ఆధారపడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎడ్లనాగలితో వెళ్తే రూ.3,500 ఇస్తున్నారు. కొందరు రైతులు విత్తనం వేశాక అమ్ముకుంటున్నారు. కాడెడ్ల జతకు రూ.80వేల నుంచి రూ.90వేల వరకు ఉంది. పసుపు వేసేందుకు.. వ్యవసాయంలో ట్రాక్టర్లతోనే అన్ని పనులు చేస్తున్నారు. ఆధునిక యంత్రాల రాకతో నాకున్న ఎడ్లను అమ్మిన. ఇప్పుడు పసుపు విత్తనం వేసేందుకు రూ.3,500 ఇస్తున్నాం. వారంముందే ఎడ్ల నాగలి మనిషికి అడ్వాన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా గ్రామాల్లో రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. – గడ్డం గంగారెడ్డి, చల్గల్ ఎడ్లు దొరికే పరిస్థితి లేదు ఎడ్ల నాగలితో విత్తనం వేస్తేనే బాగా మొలకెత్తుతుంది. ఇందుకోసం ఎడ్లు కొందామన్నా.. ఎక్కడా దొరికే పరిస్థితి లేదు. ఒక్కో జతకు రూ.80వేల పలుకుతోంది. విత్తనం వేసే వారంముందే ఎడ్ల నాగలిని కిరాయి తీసుకుంటున్నాం. మిగతా పనులు చేయడానికి ట్రాక్టర్ ఉపయోగిస్తాను. – రాంకిషన్, వెల్దుర్తి -
డీపీఆర్ తయారీలో అగ్రగామి
సింగరేణి పాలిటెక్నిక్లో ప్రవేశాలు యైటింక్లయిన్కాలనీ(రామగుండం): మంచిర్యాల జిల్లా సీసీసీ– నస్పూర్లోని సింగరేణి పాలిటెక్నిక్లో 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి గుండా శ్రీనివాస్ సోమవారం తెలిపారు. కళాశాలలో మొత్తం 300 సీట్లు భర్తీచేస్తామన్నారు. సివిల్, కంప్యూటర్స్, ఎలిక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మైని ంగ్ కోర్సుల్లో 60 చొప్పున సీట్లు ఖాళీగా ఉన్నాయని, పాలిసెట్–2025లో ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్నారు. ఇందులో 150 సీట్లు సింగరేణి ఉద్యోగులు, మాజీ ఉద్యోగుల పిల్లలకు కేటాయించామన్నారు. ఆసక్తి, అర్హత గలవారు ఈనెల 28 నుంచి జూలై 3వ తేదీ వరకు సింగరేణి వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మిగిలిన సీట్లను కన్వీనర్ కోటా కింద ఇతరులకు కేటాయిస్తామని, వీరు తెలంగాణ ప్రభుత్వ ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా ఈనెల 24నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. ఇతర వివరాల కోసం 90102 22161, 87901 12515, 94911 44168 ఫోన్నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. రామగుండం: వ్యాప్కోస్ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మరోసారి చర్చకు వచ్చిన పేరు. జీవితకాలం ముగిసిన మేడిపల్లి ఓపెన్కాస్టు గనిలో సింగరేణి 500 మెగావాట్ల సామర్థ్యం గల పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అంతేకాదు.. ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్) తయారీ బాధ్యతలను వ్యాప్కోస్కు అప్పగించడం చర్చనీయాంశం కావడానికి కారణమైంది. ప్రఖ్యాతిగాంచిన కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర నివేదిక(డీపీఆర్)తయారీలోనూ నిర్దేశిత గడువులోగా అత్యధిక కచ్చితత్వంతో ఈ సంస్థ ప్రత్యేకత చాటుకుంది. డ్యాంలు, పంపుహౌస్లు డిజైన్ చేసి అప్పగించడంలోనూ సత్తా నిరూపించుకుంది. మేడిపల్లి ఓసీపీలో చేపట్టిన పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్ నిర్మాణానికి జియాలాజికల్, జియో టెక్నికల్, హైడ్రాలజీ, సివిల్, ఉత్పత్తి సామర్థ్యం, మెకానికల్, ఎలక్ట్రికల్, పర్యావరణ, పవర్ డిస్ట్రిబ్యూషన్, రక్షణ తదితర అంశాలపై డీపీఆర్ ఇవ్వాలని సింగరేణి వ్యాప్కోస్ను కోరింది. వ్యాప్కోస్ అంటే.. వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (ఇండియా) లిమిటెడ్ను చిన్నగా వ్యాప్కోస్గా పిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నీటి వనరులు, విద్యుత్, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పర్యావరణ అధ్యయన రంగాల్లో సేవలు అందించే ఒక ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఇది. దీనిని 1969లో స్థాపించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. వ్యాప్కోస్కు మినీరత్న సంస్థగా గుర్తింపు వచ్చింది. దేశ, విదేశాల్లో చేపట్టే ప్రాజెక్టులకు సాంకేతిక సలహాలు, ఇంజనీరింగ్ సేవలు అందిచడంలో దిట్ట. ఐఎస్వో 9001:2015 సర్టిఫికేషన్ కలిగిన సంస్థగా, గుణాత్మక సేవలకు నిదర్శనంగా పేరుంది. దేశ, విదేశాల్లో కీలకపాత్ర.. ● అఫ్ఘనిస్తాన్ హెరాత్ ప్రావిన్స్లోని సల్మాడ్యామ్ జలవిద్యుత్ ఆనకట్టను వ్యాప్కోస్ డిజైన్ చేసింది. ● భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత తాగునీటి సరఫరాకు జలజీవన్ మిషన్, మిషన్ భగీరథ ప్రాజెక్టులూ డిజైన్ చేసింది. ● ఉత్తరప్రదేశ్లోని నమామి గంగానది సంరక్షణ, కాలుష్య నియంత్రణ, ల్యాండ్ స్కేపింగ్ డిజైన్ చేసింది. విద్యుత్ రంగంలోనూ.. ● రువాండాలోని ఎగైజన్ జలవిద్యుత్ పవర్ ప్రాజెక్టు (బురుండి) డిజైన్ ● రామగుండం మేడిపల్లి ఓపెన్కాస్టు తరహాలో నిర్మించే పంప్డ్ స్టోరేజీ విధానానికి గతంలోనే 600 మెగావాట్ల సామర్థ్యం గల అప్పర్ ఇంద్రావతి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీగా సేవలు అందిస్తోంది. ● భూటాన్లోని మంగ్దేచు జలవిద్యుత్ ప్రాజెక్టుకు డిజైన్ సాంకేతిక సలహాదారుగా వ్యవహ రించింది. ● స్వచ్ఛభారత్ మిషన్, రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ కింద గ్రామీణ విద్యుదీకరణ ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. మౌలిక సదుపాయాల్లో.. ● ఫిజీదేశంలో రెండు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సాంకేతిక సలహా సేవలు అందిస్తోంది. ● అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్), స్మార్ట్ సిటీ మిషన్ పథకంలో భాగంగా నీటి సరఫరా, డ్రైనేజీ, రోడ్ల రూపకల్పన డిజైన్ చేసింది. ● మనదేశంలోని ఓడరేవులు, హార్బర్లు, ఇన్ల్యాండ్ వాటర్ వేస్ అభివృద్ధికి డిజైన్, కన్సల్టెన్సీ సేవలు అందించింది. ● ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద గ్రామీణ రోడ్ల నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తోంది. ప్రాజెక్టు రూపకల్పనలో అనుసరించే విధానం.. ● ప్రాజెక్టు ఆర్థిక, సాంకేతిక సాధ్యాసాధ్యాలను అంచనా వేయడం, హైడ్రాలిక్ డిజైన్, వ్యయ అంచనా, డ్రాయింగ్ తయారీ, భౌగోళిక, హైడ్రాలజీ అధ్యయనాలతో క్షేత్ర సర్వేలు, ప్రాజెక్టు రూపకల్పన నుంచి అమలు, నిర్వహణ వరకు సమగ్ర సేవలు అందించడం దీని ప్రధాన లక్ష్యం. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు.. వ్యాప్కోస్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో సేవలను అందిస్తోంది. ముఖ్యంగా అంగోలా, బంగ్లాదేశ్, భూటాన్, కంబోడియా, ఇథియోపియా, ఫిజీ, మంగోలియా, నేపాల్, రువాండా, శ్రీలంక, ఉగాండా, జింబాబ్వే తదితర 30 దేశాల్లో వ్యాప్కోస్ సేవలు అందించడం మనదేశానికి గర్వకారణమని అంటున్నారు. దేశ, విదేశాల్లోనూ ప్రత్యేక గుర్తింపు మినీరత్న హోదా సాధించిన ‘వ్యాప్కోస్’ -
సీసీలు అంటేనే.. కలెక్టర్ల కళ్లలో కారం!
● కొత్తపల్లిలో ఓ భూమిని అప్పటి కలెక్టర్ కర్ణన్ డిజిటల్ సిగ్నేచర్ దుర్వినియోగం చేసి రూ.12 కోట్ల భూమి చేతులు మారేలా చేశారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. ఏకంగా కలెక్టర్కు తెలియకుండా జరిగిన ఈ విషయంపై ఒకరిద్దరు కిందిస్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకున్నా.. అసలు నిందితులపై ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. అప్పటి కలెక్టర్ సీసీని భూ రికార్డులు మార్చిన తహసీల్దార్ స్థానంలోకి పంపినా.. ఆయన రెండు వారాలకు మించి ఉండలేకపోయారు. వెంటనే తిరిగి కలెక్టరేట్లోని తన పాత సీసీ స్థానంలోకి వచ్చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ● సర్ఫరాజ్ కలెక్టర్గా ఉన్న సమయంలో కిసాన్నగర్లో కరీంనగర్కు చెందిన ఓ తహసీల్దార్ భూమిని మరో తహసీల్దార్ ఇతరుల పరం చేశాడు. అందులో ప్రస్తుతం కలెక్టరేట్లో సీసీలుగా ఉంటున్న ఇద్దరు తహసీల్దార్ ర్యాంకు ఆఫీసర్లు కీలకంగా ఉన్నారు. వీరిలో ఓ తహసీల్దార్ ఆరుగుంటలు భూమి, మరో తహసీల్దార్ మూడు గుంటల భూమి బహుమతి కింద పొందారు. ఈ విషయంపై విజిలెన్స్ విచారణ జరిపినా.. నివేదికను కలెక్టర్ సీసీ సాయంతో తొక్కిపెట్టారన్న విమర్శలున్నాయి. ● సదరు సీసీలు తమ ఇంట్లో వాళ్లకు కూడా స ర్కారు, కాంట్రాక్ట్ జాబులు పెట్టించుకోవడం విశేషం. ఎలాంటి పరీక్షలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగంలో చేరి, కలెక్టర్ల కళ్లల్లో కారం కొడుతున్న వీరు.. ఏకంగా ఇపుడు కుటుంబ సభ్యులకు కూడా అడ్డదారిలో కొలువులు పెట్టించుకుంటున్న తీరు చూసి కలెక్టరేట్ సిబ్బంది విస్తుపోతున్నారు. ఒక సీసీ తన భార్యకు శాశ్వత ఉద్యోగం పెట్టించుకోగా, మరో ఇద్దరు సీసీలు కాంట్రాక్ట్ జాబ్ పెట్టించుకున్నారు. వీరి దందాకు ఉన్నతాధికారుల వద్ద కేవలం వీరు ప్రదర్శించే స్వామిభక్తి మాత్రమే పెట్టుబడి కావడం విశేషం. ● కలెక్టరేట్లో సీసీల విషయంలో వస్తున్న ఆరోపణలపై విచారణ చేయాలని, రెండు దశాబ్దాలుగా సీసీలుగా కలెక్టరేట్లో పాతుకుపోయిన వారిని బదిలీ చేయాలని కోరు తూ జమ్మికుంటకు చెందిన ప్రముఖ సా మాజిక ఉద్యమకారు డు సిలివేరు శ్రీకాంత్ సోమవారం ప్రజవాణిలో ఫిర్యాదు చేశారు. ఆయన సాక్షితో మాట్లాడు తూ.. మంగళవారం సచివాలయంలో సీఎస్ను కూడా కలిసి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.సాక్షిప్రతినిధి, కరీంనగర్ ●: కరీంనగర్ కలెక్టరేట్లో సీసీల లీలలు తవ్వినా కొద్దీ వెలుగుచూస్తున్నాయి. కారుణ్య నియామకం కోటాలో చేరిన వీరు కలెక్టరేట్లో పాగా వేయడం కాదు, పాతుకుపోయారు. జిల్లాకు ఎంతమంది కలెక్టర్లు వచ్చినా వీరిని బదిలీ చేసే సాహసం ఏ ఐఏఎస్ అధికారి చేయకపోవడం గమనార్హం. వీరి మేనేజింగ్ స్కిల్స్ ముందు రాజకీయ నాయకులు కూడా దిగదిడుపంటే కలెక్టరేట్లో వీరి పాత్ర ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పదోన్నతులు వచ్చినా, ఏళ్ల తరబడి ఒకే చోట పాతుకుపోవడానికి కారణాలు అవినీతి, అక్రమాలు. ఐఏఎస్లకు సీసీలుగా వ్యవహరిస్తూ.. వీరు జిల్లాను వీరి పిడికిల్లో బంధిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. వీరు తహసీల్దార్ ర్యాంకులో ఉండి.. సీసీలుగా వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడుతూ.. ఐఏఎస్ల కళ్లల్లో కారం కొడుతున్నారు. కనీసం ఆ అక్రమాలు బయటికి వస్తే..సదరు ఐఏఎస్ అధికారులు వీరిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న ప్రశ్నకు నేటికీ సమాధానం దొరకడం లేదు. సీసీలపై ఇంటెలిజెన్స్ నివేదిక.. సాక్షిలో కలెక్టరేట్లో సీసీలు వారి అక్రమాలపై ప్రచురితమవుతున్న వరుస కథనాలపై ఇంతకాలం మొద్దునిద్ర పోయిన ఇంటెలిజెన్స్ విభాగం ఎట్టకేలకు కదిలింది. కలెక్టర్ పేషీలో ఎవరెవరు? గతంలో ఏయే అక్రమాలకు పాల్పడ్డారు? వాటిని కలెక్టర్లు చూడకుండా ఎవరు తొక్కిపెట్టారు? వీరిని బదిలీ కాకుండా ఆపడంలో కలెక్టర్ల పాత్ర ఎంతవరకు? అన్న విషయాలపై కూపీ లాగుతున్నారు. ఈసారి లభ్యమయ్యే ఆధారాలతో ఉన్నతాధికారులకు కరీంనగర్ కలెక్టరేట్ తతంగం గురించి వివరంగా నివేదిక రూపొందించనున్నారని సమాచారం.కదలరు.. వదలరు విలువైన భూముల రికార్డులు తారుమారు కర్ణన్, సర్ఫరాజ్ సమయంలో రికార్డులు మార్చినా చర్యలేవి? కారుణ్య నియామకాల్లో వచ్చి కలెక్టరేట్లో పాగా స్వామిభక్తి ప్రదర్శించి భార్యలకు సర్కారు కొలువులు సీసీలను బదిలీ చేయాలని ప్రజావాణిలో ఫిర్యాదు -
అన్నదాతా.. రైతు వేదికకు రావా?
● కర్షకులను బతిమాలుకుంటున్న ఏఈవోలు ● సీఎం కార్యక్రమం కోసం ఏఈవోలకు టార్గెట్లు ● ప్రతీ ఆర్వీకి 200 మంది రైతులను తరలించాలని ఆదేశాలు ● ఉమ్మడి జిల్లాలో 50 వేలకుపైగా రైతుల తరలింపు ● రైతులకు ఇచ్చే టీ, స్నాక్స్ డబ్బులు మాత్రం ఇవ్వరట ● మొన్నటి కార్యక్రమానికి పెట్టిన డబ్బులే రాలేదుసాక్షిప్రతినిధి,కరీంనగర్ ●: రైతు వేదికల్లో ముఖ్యమంత్రితో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంతో ఏఈవో (అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్)లు ఇబ్బందులు పడుతున్నారు. సీఎం కార్యక్రమానికి రైతు వేదిక(ఆర్వీ)ల వద్దకు రైతులను తరలించాలని జిల్లా వ్యవసాయాధికారులు టార్గెట్లు విధించడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. ప్రతీ ఆర్వీలో కనీసం 200 మందికి తగ్గకుండా రైతులను తరలించాలని ఆదేశాల్లో స్పష్టం చేయడంతో ఏఈవోలు ఇప్పుడు అదే పనిలో తలమునకలయ్యారు. వాస్తవానికి ఈ కార్యక్రమానికి వచ్చేందుకు మెజారిటీ రైతులు సుముఖంగా లేరు. ప్రస్తుతం చాలా చోట్ల వ్యవసాయ పనులు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు సీఎంతో జరిగే ముఖాముఖిలో తప్పకుండా రైతుభరోసా లబ్ధిదారులతో సీఎం మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 వేలమంది రైతులకు ఏఈవోలు ఫోన్లు చేసి కార్యక్రమానికి రావాల్సిందిగా బతిమాలుతున్నారు. మొన్నామధ్య రైతుభరోసా ప్రారంభం సందర్భంగా కూడా రైతులతో ముఖ్యమంత్రితో ఇలాంటి కార్యక్రమాన్నే నిర్వహించారు. అప్పుడు ప్రతీ ఏఈవోలకు నిర్వహణ ఖర్చుల కింద రూ. 5 వేలు చెల్లిస్తామని చెప్పారు. దీంతో ఆ కార్యక్రమంలో హాజరైన ప్రతీ రైతుకు టీ, స్నాక్స్ను ఏఈవోలే అందించారు. ఇందుకోసం వారే చేతి నుంచి డబ్బులు పెట్టుకున్నారు. ఆ డబ్బులు ఎపుడు వస్తాయా? అని ఎదురుచూస్తుంటే.. తీరా మరోసారి అలాంటి కార్యక్రమమే నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. చేసేది లేక మళ్లీ రైతులకు ఫోన్లు చేస్తూ.. చేతి చమురు వదిలించేందుకు సిద్ధమవుతున్నారు. ఏఈవోలపై పనిభారం.. వాస్తవానికి ప్రతీ రైతు వేదికలో ఒకే ఒక ఏఈవో ఉంటారు. రైతులకు సంబంధించిన ప్రతీ విషయం వీరే చేసుకోవాలి. పంటలకు సంబంధించి ఎప్పటికపుడు రైతులకు సలహాలు సూచనలు ఇవ్వడం. సాగులో సమస్యలు తలెత్తితే పరిష్కరించడం. పీఎం కిసాన్ యోజనకు సంబంధించి కేవైసీ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, రైతు విశిష్ట సంఖ్య నమోదు చేయడం, పంటల నమోదు చేయడం, రైతుబంధు, రైతు బీమా నమోదు, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మట్టి నమూనాల సేకరణ తదితర పనులు ఉంటాయి. ఇవి కాకుండా రైతు వేదిక నిర్వహణ బాధ్యతలు కూడా చూసుకుంటారు. వీరు తప్ప మరే ఇతర సిబ్బంది లేకపోవడంతో వీరే ఉదయం వచ్చి రైతు వేదికను ఊడ్చుకోవాలి, కార్యక్రమాలు జరిగినపుడు కుర్చీలు వేయడం, వారికి టీ స్నాక్స్.. కూడా వీరే అందించాల్సి వస్తోంది. అధికారిక కార్యక్రమాలు జరిగినపుడు వచ్చిన వారంతా మరుగుదొడ్లను వినియోగిస్తున్నారు. తరువాత డబ్బులు ఇచ్చి వాటిని శుభ్రం చేయించుకోవాల్సి వస్తోంది. మొత్తానికి ఏఈవోలు నిర్వహించే ప్రతీ అధికారిక కార్యక్రమం ఇంట్లో చేసే శుభకార్యంలా ప్రతీది దగ్గరుండి చూసుకోవాల్సిన స్థితి. ఈ విషయమై పెద్దపల్లి జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డిని వివరణ కోరగా.. ఏఈవోలకు రైతుల తరలింపు విషయంలో ఎలాంటి టార్గెట్ విధించలేదని, వారే స్వచ్ఛందంగా వస్తున్నారని సమర్థించుకున్నారు.జిల్లా రైతు వేదికలు ఏఈవోలు కరీంనగర్ 75 71 జగిత్యాల 52 71 పెద్దపల్లి 54 52 సిరిసిల్ల 57 53రైతు వేదికల్లో ఇబ్బందులివీ! చాలాచోట్ల తాగునీరు సదుపాయం లేదు కుర్చీలు వేసే సిబ్బంది లేరు టీ, స్నాక్స్ ఇచ్చే దిక్కు లేదు మరుగుదొడ్లు శుభ్రం చేసే వారు లేరు వేదికకు కనీసం ఊడ్చే సిబ్బంది లేరు టెక్నికల్ ఎక్విప్మెంట్కు డబ్బులు రావు, నిర్వహణకు సిబ్బంది లేరు.. -
ఎంపిక పోటీలకు వేళాయె!
కరీంనగర్స్పోర్ట్స్: రాష్ట్రంలోని మూడు ప్రాంతీయ క్రీడాపాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరంలో 4వతరగతిలో ప్రవేశాలకు గాను ఎంపిక పోటీల ప్రక్రియ ప్రారంభం కాగా.. తొలి అంకం మండలస్థాయి పోటీలను ముగించుకొని జిల్లాస్థాయి ఎంపిక పోటీలకు సిద్ధమైంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మండలస్థాయిలో ఎంపికై న విద్యార్థులు జిల్లాస్థాయి ఎంపిక పోటీలకు హాజరు కానున్నారు. సికింద్రాబాద్లోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లో స్పోర్ట్స్ పాఠశాలలున్నాయి. జిల్లాస్థాయిలో శారీరక, సామర్థ్యానికి సంబంధించిన వాటితోపాటు పలు వాటిల్లో పరీక్షలను నిర్వహించి ఎంపిక చేస్తారు. జిల్లాస్థాయిలో టాప్ 20లో నిలిచిన బాలబాలికలను రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా క్రీడాశాఖల అధికారులు ఎంపిక చేయనున్నారు. జిల్లాస్థాయి పోటీల వివరాలు ఈనెల 25, 26ల్లో కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియంలో, 26న పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐటీఐ కళాశాల మైదానంలో, 26న జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో, 26న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజీవ్నగర్ మినీ స్టేడియంలో జరగనున్నాయి. రేపటి నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా క్రీడా పోటీలు టాప్ 20లో నిలిచిన బాలబాలికలు రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలకు అర్హత సన్నాహాలు చేస్తున్న జిల్లా క్రీడాశాఖలు జిల్లాస్థాయిలో విద్యార్థులకు నిర్వహించే శారీరక సామర్థ్య పరీక్షలు – ఎత్తు – బరువు – 30 మీటర్ల పైలయింగ్ స్టార్ట్ – స్టాండింగ్ బ్రాడ్ జంప్ – 800 మీటర్ల రన్నింగ్ – 6.10 మీటర్ల షటిల్ రన్ – మెడిసన్ బాల్ త్రో(కిలో బరువు) – వర్టికల్ జంప్ – ఫ్లెక్సిబిలిటీ టెస్ట్ అండ్ మెడికల్ పరీక్షలు సువర్ణావకాశం క్రీడాకారులుగా ఎదగాలనుకునేవారికి స్పోర్ట్స్ పాఠశాలలు సువర్ణావకాశం. తెలంగాణ స్పోర్ట్స్ పాఠశాలల్లో చదివి అంతర్జాతీయస్థాయితోపాటు ఒలింపిక్స్ లాంటి మెగా ఈవెంట్లో పాల్గొని సత్తా చాటిన క్రీడాకారులు ఎందరో ఉన్నారు. క్రీడలతోపాటు విద్యపై కూడా శ్రద్ధ చూపుతారు. – వేల్పుల సురేందర్, పెటా సంఘం అధ్యక్షుడు, పెద్దపల్లి -
విన్నపాలు వినవలె
● ప్రజావాణిలో బాధితుల మొర ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ పమేలా సత్పతిమొత్తం అర్జీలు: 263 మునిసిపల్ కార్పొరేషన్: 62 డీపీవో: 14 ఆర్డీవో కరీంనగర్: 11 మానకొండూర్ తహసీల్దార్: 09 కరీంనగర్ రూరల్ తహసీల్దార్: 09 తిమ్మాపూర్ తహసీల్దార్: 08 ఎంపీడీవో హుజూరాబాద్: 07కరీంనగర్ అర్బన్: విన్నపాలు వినవలె..నంటూ కలెక్టరేట్ బాట పట్టారు బాధితులు. జిల్లా నలుములల నుంచి ప్రజలు అర్జీలతో ఆశగా ఉన్నతాధికారులను ఆశ్రయించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి వినతులు వెల్లువలా రాగా.. కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్ స్వీకరించారు. ప్రధానంగా భూ సమస్యలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, నివేసన స్థలాల అర్జీలు రాగా వ్యక్తిగత సమస్యలను ఏకరవు పెట్టారు.వృద్ధాశ్రమ భవనానికి అనుమతి ఇప్పించండి 2003 నుంచి అనాథ వృద్దులకు సేవ చేస్తున్నాం. స్థలం కోసం 2015లో ఆమరణ నిరాహారదీక్ష చేస్తే అప్పటి ఎంపీ వినోద్కుమార్, ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ లు బొమ్మకల్ శివారులోని 128 సర్వేనంబర్లో స్థలం కేటాయించారు. దాతల సహకారంతో అనాథ వృద్ధాశ్రమ భవనం నిర్మాణం జరుగుతోంది. కానీ.. అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇప్పించడంతో పాటు కలెక్టర్ నిధుల నుంచి నిధులు కేటాయించాలి. – సి.వీరమాధవ్, వీబీ ఫౌండేషన్, కరీంనగర్ -
మధ్యాహ్న భోజనం.. నాసిరకం
ఇల్లందకుంట: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుల సంగతి పక్కన పెడితే మధ్యాహ్న కారం, మెతుకులతో కూడిన మధ్యాహ్న భోజనం పెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. స్థానిక జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం సరిగా పెట్టలేదు. ఎర్రటి కారంతో అన్నం కలుపుకుని తిన్న విద్యార్థులు.. విషయాన్ని తమ తల్లిదండ్రులు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు మండిపడుతున్నారు. మధ్యాహ్న భోజనం వండి వడ్డించడంతో విఫలమైన హైస్కూల్ హెడ్మాస్టర్తోపాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై తహసీల్దార్ రాణిని సంప్రదించగా.. నాణ్యమైన భోజనం అందించే విషయంలో రాజీపడే ప్రసక్తేలేదన్నారు. నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎంఈవో రాములు నాయక్ని వివరణ అడగగా.. కారం, మెతుకుల విషయం తన దృష్టికి రాలేదన్నారు. -
యువత మత్తుకు దూరంగా ఉండాలి
కరీంనగర్క్రైం: యువత మత్తు పదార్థలకు దూరంగా ఉండాలని, సన్మార్గంలో పయనించి లక్ష్యాలకు చేరుకోవాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. కమిషనరేట్ వ్యాప్తంగా పోలీసులు ఈనెల 26న అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం–అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా 20 నుంచి 26 తేదీ వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం సిరిసిల్ల బైపాస్ రోడ్డులో గల కమిషనరేట్ ట్రైనింగ్ సెంటర్ (సీటీసీ)లో మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీటీసీ వైస్ ప్రిన్సిపాల్ ఏసీపీ వేణుగోపాల్ , సీసీఆర్బీ ఏసీపీ విజయ్ కుమార్, ఇన్స్పెక్టర్లు సంతోష్కుమార్, సరిలాల్, శ్రీనివాస్, తిరుపతి, శ్రీనివాస్లు పాల్గొన్నారు.● సీపీ గౌస్ ఆలం -
అంతర్జాతీయ ప్రమాణాలతో..
ఉన్నత, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ స్పోర్ట్స్ స్కూల్లో దొరుకుతుంది. ఎన్ఎస్ఎన్ఐఎస్ చేసిన కోచ్ల ద్వారా శిక్షణ కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతాయి. అత్యుత్తమ శిక్షణనిస్తారు. క్రీడాకారులు వీటిలో ప్రవేశాలు పొందితే ఉన్నతంగా ఎదగడంతోపాటు దేశానికి, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చేలా ఎదుగుతారు. – గసిరెడ్డి జనార్దన్రెడ్డి, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి ఏర్పాట్లు పూర్తి జిల్లాస్థాయి క్రీడాపాఠశాలల ఎంపిక పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈనెల 25, 26ల్లో రెండు రోజులపాటు ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నాం. ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, కోచ్ల సహకారంతో విజయవంతంగా మండలస్థాయి ఎంపిక పోటీలు పూర్తి చేశాం. అదే స్ఫూర్తితో జిల్లాస్థాయి పోటీలను కూడా పూర్తి చేస్తాం. – శ్రీనివాస్గౌడ్, డీవైఎస్వో, కరీంనగర్ మేటి క్రీడాకారులను.. రాష్ట్రంలో మేటి క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా స్పోర్ట్స్ పాఠశాలలు ముందుకు సాగుతున్నాయి. క్రీడల్లో ఆసక్తి ఉన్నవారికి సువర్ణావకాశం. కేవలం క్రీడలకు అత్యంత ప్రాధాన్యముంటుంది. దేశ భక్తి పెంపొందుతుంది. దేశానికి పతకం సాధించాలన్న తపన, దేశ పతాకం ప్రపంచ వేదికల్లో రెపరెపలాడించాలన్న లక్ష్యాలతో ముందుకెళ్తారు. – అజ్మీరా రాందాస్, డీవైఎస్వో, రాజన్న సిరిసిల్ల -
మహిళలు గర్వపడేలా చీరలుండాలి
సిరిసిల్ల: రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులు ఆత్మగౌరవంతో కట్టుకునేలా సిరిసిల్ల నేతన్నలు నాణ్యమైన చీరలను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. సిరిసిల్ల ఏఎంసీ గోదాంలో సోమవారం ఇందిరా మహిళాశక్తి చీరల బట్ట సేకరణకు శ్రీకారం చుట్టారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నేతన్నలు, రైతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. గతంలో కంటే మెరుగైన ఆర్డర్లను ఇచ్చామని, సకాలంలో వస్త్రాన్ని ఉత్పత్తి చేసి సిరిసిల్ల పేరు నిలబెట్టాలన్నారు. వేములవాడలో రూ.50కోట్లతో నూలుడిపోను ఏర్పాటు చేసి 90 శాతం అరువుపై అందిస్తున్నామని తెలిపారు. చేనేత కార్మికుల రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేశామని పేర్కొన్నారు. నేతన్నలకు 4.30 కోట్ల మీటర్ల చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇవ్వగా.. ఇప్పటి వరకు 65 లక్షల మీటర్లు తయారు చేశారని, జూన్ నెలాఖరులోగా 50 శాతం పూర్తి చేయాలని సూచించారు. రూ.150 కోట్లతో రాజన్న ఆలయ అభివృద్ధి వేములవాడ రాజన్న ఆలయాన్ని రూ.150కోట్లతో నాలుగు ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నామని విప్ ఆది శ్రీనివాస్ వెల్లడించారు. ఇప్పటికే రూ.47.98కోట్లు కలెక్టర్ ఖాతాలో ఉన్నాయని, సిరిసిల్లలో పద్మశాలీ భవన్ను రూ.5కోట్లు, సిరిసిల్ల సంఘాల నుంచి మరో రూ.3కోట్లు సేకరించి రూ.8 కోట్లతో నిర్మిస్తామని, మార్కండేయ ఆలయాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా మాట్లాడుతూ చీరల ఆర్డర్ను సకాలంలో పూర్తి చేయాలని, జూన్ నెలాఖరు నాటికి సగం ఆర్డర్ పూర్తి చేయాలని సూచించారు. సేకరణ పూర్తికాగానే ఉత్పత్తి చేసిన బట్టకు బిల్లులు అందుతాయని వెల్లడించారు. కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి కె.కె.మహేందర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపరెడ్డి, చేనేత, జౌళి శాఖ జేడీ ఎన్.వెంకటేశ్వర్రావు, ఏడీ రాఘవరావు, డీడీ రవీందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, కాంగ్రెస్ నాయకులు ఆకునూరి బాలరాజు, గడ్డం నర్సయ్య, ఆడెపు చంద్రకళ, కాముని వనిత, కల్లూరి చందన, వస్త్రోత్పత్తిదారులు ఆడెపు భాస్కర్, గోవిందు రవి, మంచె శ్రీనివాస్, కార్మిక నాయకులు మూషం రమేశ్, కోడం రమణ, మాజీ కౌన్సిలర్లు, జౌళిశాఖ అధికారులు పాల్గొన్నారు. ఆత్మగౌరవంతో వాటిని కట్టుకోవాలి రాష్ట్రమంతటికి సిరిసిల్ల చీరలు సకాలంలో ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలి రూ.150 కోట్లతో రాజన్న ఆలయ అభివృద్ధి సిరిసిల్లలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -
1.86 లక్షల మంది రైతులు.. రూ.201 కోట్లు
కరీంనగర్ అర్బన్: రైతు భరోసా సాయం ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 16 నుంచి పెట్టుబడి సాయం రైతుల ఖాతాకు చేరుతుండగా ఇప్పటివరకు 1,86,952 మందికి సాయమందగా మొత్తం రూ.201కోట్లు ఖాతాలకు చేరాయి. జిల్లాలో మొత్తం రైతులు 2,10,904 రైతులు కాగా రూ.211.90 కోట్లు వానాకాలం రైతు భరోసాగా ప్రభుత్వం కేటాయించింది. వారం రోజుల వ్యవధిలో తొలుత రెండెకరాలు, మూడెకరాలు, నాలుగు ఎకరాలు, ఐదు ఎకరాలు ప్రామాణికంగా తీసుకోగా సోమవారం వరకు తొమ్మిది ఎకరాలలోపు రైతులకు రైతు భరోసా చేరింది. ఎకరాన రూ.6 వేల చొప్పున ఈ నెల 16న 1,24,727 మంది రైతులకు రూ.65.79 కోట్లు, 17న 27,307 మందికి రూ.40.25 కోట్లు, 19న 15,995 మంది రైతులకు రూ.32.91 కోట్లు, 20న 9,955 మంది రైతులకు రూ.26.39 కోట్లు, 21న 5,684 మంది రైతులకు రూ.19.36 కోట్లు, 23న 3,284 మంది రైతులకు గానూ రూ.17.11 కోట్లు ఖాతాలకు చేరాయి. విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు ఖర్చులకు గానూ వినియోగించాలని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి వివరించారు. కాగా.. మంగళవారం సాయంత్రం సీఎం రేవంత్రెడ్డి రైతు భరోసా, సన్నబియ్యం బోనస్ లబ్ధిదారులను ఉద్దేశించి రైతునేస్తం కార్యక్రమంలో వీసీ ద్వారా రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని 45 రైతు వేదికల్లో రైతులు హాజరు కావాలని కోరారు. ఖైదీల యోగ క్షేమాలు తెలుసుకున్న జడ్జికరీంనగర్క్రైం: కరీంనగర్ జిల్లా జైలును సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.వెంకటేశ్తో కలిసి సందర్శించారు. ఖైదీల యోగ క్షేమాలు, భోజన వసతులు, న్యాయసేవా, ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకున్నారు. క్యాంటీన్, ఆసుపత్రి, ములాఖత్, ఫోన్, లైబ్రరీ, వంటశాల, ఇండస్ట్రీలలో పనితీరు పరిశీలించారు. కొత్త చట్టాలు వివరించారు. మహిళా జైలును కూడా సందర్శించి కేసుల వివరాలు, బాగోగులు, సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. లాయర్లను పెట్టుకునే స్థోమత లేనివారికి ప్రభుత్వం తరఫున లాయర్లను నియమిస్తామని చెప్పారు. జైలు సూపరింటెండెంట్ విజయ డేని జైలర్లు పి.శ్రీనివాస్, బి.రమేశ్ తదితరులు ఉన్నారు. కాళేశ్వరంపై విషం కక్కడంలో చంద్రబాబు హస్తం కరీంనగర్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విషం కక్కడంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హస్తం ఉందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఆరోపించారు. సోమవారం కరీంనగర్లో మాట్లాడారు. తెలంగాణ గోదావరి నీళ్లను తరలించుకుని బనకచర్ల ప్రాజెక్టును నిర్మించుకునే కుయుక్తులో భాగంగా కేంద్ర మంత్రి సంజయ్ను వాడుకుంటూ కాళేశ్వరంపై విషం కక్కిస్తున్నారని మండిపడ్డారు. గోదావరి నీళ్లను సముద్రంలో కలవనీయకుండా అడ్డుకునేందుకు గతంలో ఏ ప్రభుత్వం కృషి చేయలేదన్నారు. కనీస విషయ పరిజ్ఞానం లేకుండా కేవలం కేసీఆర్పై విమర్శలు, దూషణలు, ఆరోపణలే పనిగా పెట్టుకుని పబ్బం గడుపుకుంటున్న కేంద్ర మంత్రి వైఖరిపై ప్రజలు చీత్కరించుకుంటున్నారని అన్నారు. ఫోన్ట్యాపింగ్ విషయంలో దమ్ముంటే సిట్కు హాజరు కావొద్దని సవాల్ చేశారు. కేంద్ర మంర్రి సంజయ్ కరీంనగర్లో కూర్చుని కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేయడం తప్ప చేసిందేమీ లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ముగ్గురు మంత్రులు, బండి సంజయ్ను ప్రజలు బహిష్కరించాలన్నారు. చల్ల హరిశంకర్, పొన్నం అనిల్గౌడ్, షౌకత్ అలీ, యాదగిరి పాల్గొన్నారు. -
ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడి మృతి
కరీంనగర్రూరల్: చొప్పదండి మండలం వెదురుగట్టకు చెందిన విష్ణువర్థన్(29) బహుదూర్ఖాన్పేట శివారులో ద్విచక్ర అదుపు తప్పి కింద పడడంతో మృతి చెందాడు. కరీంనగర్రూరల్ సీఐ ఏ.నిరంజన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నగునూర్లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్న విష్ణువర్ధన్ సోమవారం వెదురుగట్ట నుంచి ప్రతిమ ఆసుపత్రికి వస్తుండగా మార్గ మధ్యలోని బహుదూర్ఖాన్పేట వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి సమీపంలోని చెట్టుకు ఢీకొంది. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి పర్శరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు..హుజూరాబాద్: పట్టణానికి చెందిన ఓ న్యూస్ పేపర్ రిపోర్టర్ చిర్ర సుదర్శన్గౌడ్ (55) ఆది వారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. హుస్నాబాద్లో ఓ శుభకార్యానికి హాజ రై తిరిగి వస్తుండగా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గ్రామ శివారులో బైక్ అదు పు తప్పడంతో కందకంలో పడి మృతి చెందా డని. మృతుడి కుటుంబానికి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో రూ.పదివేలు అందజేశారు. మృతుడి కుటుంబ సభ్యులను టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, చంద్రశేఖర్, హుజూరాబాద్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు కా యిత రాములు, జర్నలిస్టులు పరామర్శించారు. 27న పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్ 1డిపో నుంచి ఈనెల 27న వన్ డే టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ విజయమాధురి తెలిపారు. టూర్ ప్యాకేజీలో చిలుకూరు బాలాజీ, అనంత పద్మనాభ స్వామి, ఏడుపాయల దేవాలయం, అనంతగిరి హిల్స్ను సందర్శించేందుకు సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామని అన్నారు. 27న ఉదయం 4గంటలకు కరీంనగర్ నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 9గంటలకు తిరిగి కరీంనగర్కు చేరుకుంటుందని, పెద్దలకు రూ.1.430. పిల్లలకు రూ.900 టికెట్ ఉంటుందని తెలిపారు. గ్రానైట్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్కు సమ్మె నోటీసుకొత్తపల్లి: జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా శ్రీరాములపల్లి శివారులోని జిల్లా గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ ఇండస్ట్రీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రణీతరావు, భాషకు సోమవారం సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కో శాధికారి గీట్ల ముకుందరెడ్డి, జి.రాజేశం పలు డిమా ండ్లతో కూడిన సమ్మె నోటీసు అందజేశారు. నాలు గు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, అసంఘటిత రంగ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులందరికీ జాతీయస్థాయిలో కనీస వేతనం నెలకు రూ.26వేలుగా నిర్ణయించాలని, హైకోర్టు ఆర్డర్ ప్రకారం గ్రా నైట్ కార్మికులకు వర్తించే స్టోన్ బ్రేకింగ్ అండ్ స్టోన్ క్రషింగ్ ఆపరేషన్ కనీస వేతనాల జీవో ఎంఎస్ నంబర్ 23 ఫైనల్ విజిట్ ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులకు సమానమైన పనికి సమాన వేతనం అమలు చేయాలని తదితర 20 డిమాండ్లను పరిష్కరించాలని సమ్మె నోటీసు అందించారు. -
ఠాణాలో వీఆర్ఏ ఆత్మహత్యాయత్నం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి పోలీస్స్టేషన్లో ఓ వీఆర్ఏ పురుగుల మందు తాగడం కలకలం రేపింది. ఎస్సై రామ్మోహన్ తెలిపిన వివరాలు.. మండలంలోని చీర్లవంచకు చెందిన వేల్పుల సత్తవ్వ భర్త బలరాం 15 ఏళ్ల క్రితం తన తమ్ముళ్లు వేల్పుల కృష్ణ, వేల్పుల బాలకిషన్తో కలిసి సర్వేనంబర్ 586లో 7 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. అందులో రో డ్డుకు 1.10 ఎకరాలు పోగా మిగతా భూమిని సమానంగా పంచుకున్నారు. ఐదేళ్ల క్రితం బలరాం మరణించగా వీఆర్ఏగా పనిచేస్తున్న అతడి తమ్ముడు వేల్పుల కృష్ణ మొత్తం భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించాడు. తనకు అనుకూలంగా హద్దురాళ్లను మార్చుకున్నాడు. 20 రోజుల క్రితం సత్తవ్వను ఆమె భూమిలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతోపాటు చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో సత్తవ్వ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కృష్ణపై కేసు నమోదైంది. కాగా ఆదివారం మధ్యాహ్నం 12.35 గంటలకు కృష్ణ పురుగులమందుతో పోలీస్స్టేషన్కు వచ్చాడు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు నుంచి బయటపడాలనే ఉద్దేశంతో పురుగులమందు తాగాడు. వెంటనే అతడిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రాణాపాయం తప్పింది. కాగా ఈ ఘటనపై ఎస్సై రామ్మోహన్ను వివరణ కోరగా, చట్టప్రకారమే కేసు నమోదు చేశామన్నారు. వేధింపులకు పాల్పడ్డామనడం అవాస్తవమని స్పష్టం చేశారు. న్యాయం చేయండి : వీఆర్ఏ బాధితులు వీఆర్ఏ కృష్ణ నుంచి తమ భూమిని ఇప్పించాలని బాధితులైన అతడి బంధువులు వేల్పుల సత్తవ్వ, అ నిల్కుమార్, రవీందర్ కోరారు. ఆదివారం మీడి యా ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. కృష్ణ రె వెన్యూశాఖలో పనిచేస్తుండగా తన పలుకుబడిని ఉ పయోగించి సర్వే నంబర్ 586లో రెండు గుంటల భూమికిగాను రెండెకరాల భూమి మ్యుటేషన్ చే యించుకున్నాడని ఆరోపించారు. గతంలో రవీందర్పై హత్యాయత్నానికి పాల్పడగా కేసు నమోదై, ఏ డేళ్ల జైలుశిక్ష కూడా పడిందన్నారు. కానీ, అప్పీల్కు వెళ్లి బెయిల్పై బయట తిరుగుతున్నాడని తెలిపా రు. కలెక్టర్, ఎస్పీ స్పందించి విచారణ చేపట్టి తమ కు న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు. -
జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు యోగేశ్వరి
కరీంనగర్స్పోర్ట్స్: నల్గొండ జిల్లా నకీరేకల్లో ఈనెల 4 నుంచి 6 వరకు జరిగిన జూనియర్స్ గర్ల్స్ హ్యాండ్బాల్ స్టేట్ లెవెల్ చాంపియన్షిప్ పోటీల్లో కరీంనగర్ జట్టు తరఫున ఎం.యోగేశ్వరి ప్రతిభ కనబర్చింది. ఈనెల 18 నుంచి జూలై 22 వరకు బిహార్ జరిగే జాతీయస్థాయి హ్యాండ్బాల్ హెచ్ఎఫ్ఐ పోటీలకు తెలంగాణ జట్టు తరుపున ఎంపికై నట్లు హ్యాండ్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్యామల పవన్కుమార్ తెలిపారు. ఈసందర్భంగా ఉమ్మడి కరీంనగర్ హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వీర్ల వెంకటేశ్వరరావు, బాసరవేణి లక్ష్మణ్, డీవైఎస్వో శ్రీనివాస్గౌడ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. పిల్లర్ గుంతలో పడి వ్యక్తి మృతిగంగాధర(చొప్పదండి): ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి అదుపుతప్పి పిల్లర్ గుంతలో పడి మృతిచెందిన ఘటన ఆదివారం గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో జరిగింది. ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాలు.. చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన చెరుకు వెంకటయ్య (71) గర్శకుర్తిలో పూజా కార్యక్రమానికి వచ్చాడు. ఆదివారం ఉదయం తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో గ్రామ శివారులోని పెట్రోల్ బంకు సమీపంలో వాహనం అదుపుతప్పి ఇంటి పిల్లర్ గుంతలో పడడంతో తలకు తీవ్రగాయలై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు.. శంకరపట్నం(మానకొండూర్): మండలంలోని తాడికల్ గ్రామంలో ఆదివారం గుర్తు తెలియని వాహనం ఢీకొని అనవేని కనుకయ్య(70)మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. తాడికల్ మా ర్కండేయ కాలనీకి చెందిన కనుకయ్య కిరాణ దుకాణంలో సామగ్రి కొనుక్కుని నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. సమీపంలోని రైస్మిల్లులో సీసీ పుటేజీలను పరిశీలించగా, అంబాల్పూర్ నుంచి తాడికల్ వెళ్తున్న కారు ఢీకొన్నట్లు స్థానికులు గుర్తించారు. పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని హుజూరాబాద్ మార్చురీకి తరలించారు. హోటళ్లలో వన్యప్రాణుల మాంసం?వేములవాడరూరల్: ఎండ వేడికి అడవిలో ఉన్న వన్యప్రాణులు దాహం కోసం గ్రామీణ ప్రాంతాలకు తరలివస్తున్నాయి. దీనిని ఆసరా చేసుకున్న కొంత మంది వేటగాళ్లు వన్యప్రాణులను చంపి మాంసం విక్రయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వేములవాడ మండలంలోని హన్మాజిపేట, నాంపల్లి, వట్టెంల తదితర గ్రామాల్లో వేటగాళ్లు వన్యప్రాణుల మాంసాన్ని హోటల్ యజమానులకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. సదరు మాంసాన్ని హోటల్ యజమానులు మద్యం ప్రియులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికై నా సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి వన్యప్రాణులను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు. కరీంనగర్కు మెహరాజ్ మృతదేహంకరీంనగర్క్రైం: కరీంనగర్లోని కశ్మీర్గడ్డకు చెందిన మెహరాజ్(46) ఈ నెల 16న షార్జాలో మృతిచెందగా అతడి మృతదేహాన్ని ఆదివారం నగరానికి తీసుకొచ్చారు. మెహరాజ్ ఎనిమిదేళ్లుగా షార్జాలో అల్ఖైరిన్ పాఠశాలలో పాఠాలు బోధించేవాడు. అతడి కుటుంబ సభ్యులు షార్జాకు వెళ్లి వారి బంధువుల సాయంతో మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. -
సేవామూర్తులు
ప్రజా సేవే పరమార్థంగా పలువురు స్వచ్ఛంద సంస్థల బాధ్యులు పేదలకు సహాయ సహకారాలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సోమవారం ప్రజాసేవ దినం సందర్భంగా కథనం. దివ్యాంగుల సేవలో.. జమ్మికుంట(హుజూరాబాద్): మున్సిపల్ పరిధిలోని మారుతీనగర్లో మానసిక దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక పాఠశాలను మానసిక దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 50 మంది విద్యార్థులతో పాఠశాల కొనసాగుతుంది. 1995లో ఐదుగురు దివ్యాంగ పిల్లలతో పాఠశాల ప్రారంభమై మానసిక దివ్యాంగ సేవా సంస్థగా రూపాంతరం చెందింది. 1997లో అప్పటి కరీంనగర్ జిల్లా కలెక్టర్ బీఆర్ మీనా రెండెకరాల ప్రభుత్వ స్థలం కేటాయించగా, దాతల సాయంతో స్కూల్ నిర్మాణం జరిగింది. సంతృప్తినిచ్చింది నా ఇద్దరు పిల్లలు దివ్యాంగులు కావడంతో వారి పనులు వారు చేసుకునేలా శిక్షణ, విద్యాబుద్ధులు నేర్పించాలనే సంకల్పంతో 1995లో నా సొంత ఇంట్లో పాఠశాల ప్రారంభించా. తర్వాత ప్రత్యేక పాఠశాల ఏర్పాటుతో 185 మంది వరకు విద్యాబుద్ధులు, శిక్షణ అందించగా ఉపాధితోపాటు వారి పనులు వారి ఇంటి వద్ద చేసుకుంటూ తల్లిదండ్రులకు చేదోడుగా ఉండడం సంతోషం కలిగించింది. దివ్యాంగులకు విద్య అందించడంతోపాటు సేవ చేయడం సంతృప్తినిచ్చింది. ప్రస్తుతం దాతల సాయంతో పాఠశాల నిర్వహిస్తున్నం. ప్రభుత్వం గ్రాంట్ మంజూరు చేస్తే దివ్యాంగులకు మెరుగైన శిక్షణతో వారి భవిషత్తుకు బాటలు పడుతాచి. – బచ్చిరాములు, దివ్యాంగ పేరెంట్స్ సంఘం అధ్యక్షుడు, జమ్మికుంట -
న్యాయవాద శిక్షణకు ఊతం
● ఉపకార వేతనం, గ్రాంట్ అందజేయనున్న ప్రభుత్వం ● ఎస్సీలకు సదావకాశం ● 36 నెలలపాటు నెలకు రూ.3వేల చొప్పున చెల్లింపు ● బార్ కౌన్సిల్ అడ్మిషన్ ఫీజు సైతం.. కరీంనగర్: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 2025–26 సంవత్సరంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్లో మూడు సంవత్సరాల శిక్షణ పొందేందుకు ఎంపిక చేసిన లా–పట్టుభద్రులు సీనియర్ల వద్ద శిక్షణ పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఉపకార వేతనం, గ్రాంట్ ఎంతో దోహదపడుతుంది. ఎస్సీ కులాలకు చెందిన న్యాయవాదులకు ఆర్థిక సహకారమందించే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్సు పూర్తి చేయడమే కాకుండా.. కేసులు ఎలా వాదించాలి.. దానికి సంబంధించిన పత్రాలను ఎలా సిద్ధం చేయాలి.. పేషీల అనుశీలన.. న్యాయమూర్తి తీర్పు ప్రతి గురించి తెలుసుకోవడం ఇవన్నీ న్యాయవాద వృత్తిలో భాగాలే. వీటి గురించి సమగ్రంగా తెలుసుకోవాలంటే జూనియర్లు సీనియర్ న్యాయవాదుల వద్ద శిక్షణ పొందడం తప్పనిసరి. తద్వారా పట్టు సాధించడానికి అవకాశం కలుగుతుంది. ఇలా శిక్షణ పొందడం కొంత ఖర్చుతో కూడుకున్న పని. ప్రభుత్వం ఎస్సీ కులాలకు చెందిన న్యాయవాదులకు తగిన స్లయిఫండ్, గ్రాంట్ను అందిస్తోంది. ఇటీవల ఈ మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తద్వారా న్యాయవాదులు తగిన శిక్షణ పొందేందుకు దోహదపడుతుంది. న్యాయవాద వృత్తి చేపట్టే వారి సంఖ్య ఇటీవల క్రమంగా పెరుగుతోంది. ఇంటర్ తర్వాత ఐదేళ్లు, డిగ్రీ తర్వాత మూడేళ్ల కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రత్యేకత కోసం ఎల్ఎల్ఎం కోర్సును అభ్యసిస్తారు. ఎల్ఎల్బీ పూర్తి చేసిన వారు న్యాయవాద వృత్తిలో రాణించాలంటే సీనియర్ల వద్ద శిక్షణ తప్పనిసరి. కొన్ని నెలలపాటు వారి వద్ద సెక్షన్లు, కేసులు, వాటి పూర్వాపరాలు, బెయిల్ మంజూరు, శిక్ష, జరిమానాలు ఇలా అన్ని అంశాలపై అవగాహన పెంచుకునేందుకు వీలు కలుగుతుంది. పెరిగిన సహకారం న్యాయవాది వృత్తిలోకి అడుగుపెట్టిన వారు సీనియర్ల వద్ద శిక్షణ పొందేందుకు ఖర్చవుతుంది. పుస్తకాలు, నల్ల కోటు, కంప్యూటర్ తదితర వాటిని కొనుగోలు చేయాల్సిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలకు చెందినవారికి ఆర్థిక సహకారమందించాలని నిర్ణయించి కొన్నేళ్లుగా ఆ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్నారు. ఈక్రమంలో ఇచ్చే గ్రాంట్, ఉపకార వేతనాన్ని పెంచారు. గత సంవత్సరం వరకు ప్రతి నెలా రూ.వెయ్యి ఉపకార వేతనాన్ని 36 నెలలపాటు అందజేసేవారు. దీనికితోడు వన్ టైం గ్రాంట్ పేరిట రూ.6వేలు చెల్లించేవారు. ఇటీవల ఉపకార వేతనాన్ని రూ.వెయ్యి నుంచి రూ.3వేలకు పెంచారు. వన్టైం గ్రాంటును ఏకంగా రూ.50వేలకు పెంచారు. దీనికితోడు బార్ కౌన్సిల్ నిర్ణయించిన రూ.585 అడ్మిషన్ ఫీజును సైతం షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ చెల్లిస్తుంది. ఆన్లైన్లో దరఖాస్తుకు అవకాశం ప్రభుత్వమందిస్తున్న ఉపకార వేతనం, గ్రాంట్ కోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా షెడ్యూల్డ్ కులాలకు చెందిన న్యాయవాదులు అర్హులు. ఇందుకు గాను షెడ్యూల్డ్ కులాలకు చెందిన న్యాయవాదులు.. సీనియర్ల వద్ద శిక్షణ పొందేందుకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ రోడ్డులో గల అంబేడ్కర్ భవన్లోని షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ కార్యాలయంలో జూలై 31 లోగా దరఖాస్తు చేసుకో వాలి. వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది. కమిటీలో జిల్లా జడ్జి, ఎస్సీ వెల్ఫేర్ డీడీ సభ్యులుగా ఉంటారు. మూడు సంవత్సరాలు సర్వీసు పైబడిన జూనియర్ న్యాయవాదులను సీనియార్టీ ప్రాతిపదికన ఎంపిక చేయనున్నారు. ఆగస్టు 10న అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 1 జూలై 2025 నాటికి 23 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సుండి, సంవత్సర ఆదాయం రూ.2లక్షలకు మించొద్దు. కులం, ఆదాయం, గ్రాడ్యుయేషన్ లా సర్టిఫికెట్లు, బార్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలతో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికై న వారి ఖాతాల్లో ట్రెజరీ ద్వారా డబ్బులు అందజేయనున్నారు. -
కోటిలింగాలలో పురాతన నాణేలు లభ్యం
వెల్గటూర్(ధర్మపురి): శాతవాహనుల తొలి రాజధానిగా ప్రసిద్ధి చెందిన కోటిలింగాలలో పురాతన నాణేలు లక్ష్యమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండురోజుల క్రితం కోటిలింగాల గోదావరిలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారునికి గోదావరి తీరంలో 1911 సంవత్సరానికి చెందిన ఓవైపు విక్టోరియా మహారాణి ఫొటోతో, మరోవైపు రాజు గుర్రాన్ని తోలుతున్న ఫొటోతో ఉన్న సుమారు 22 నాణేలు లభ్యమయ్యాయి. వాటిని చూసి ఆశ్చర్యపోయిన మత్స్యకారుడు మాజీ సర్పంచ్ ముత్తయ్యకు తెలుపగా ఆదివారం విషయం వెలుగుచూసింది. కోటిలింగాల గ్రామంలో గతంలో జరిపిన తవ్వకాలలో శాతవాహనులకు సంబంధించిన అనేక నాణేలు, చారిత్రక అవశేషాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటి ప్రభుత్వం తవ్వకాలను మధ్యలో ఆపేయడంతో చాలా వరకు కోటిలింగాల చరిత్ర మరుగున పడిపోయింది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కోటిలింగాలలో తవ్వకాలు చేపడితే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చారిత్రక అవశేషాలు బయటపడతాయని, కోటిలింగాల గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని చరిత్రకారులు చెబుతున్నారు. -
పసుపు పంటతో ఆదాయం
పసుపు ఇంటి పంట. జిల్లాలో ప్రతీ రైతు కనీసం ఎకరం నుంచి నాలుగెకరాల వరకు సాగు చేస్తారు. నేను 3 ఎకరాల్లో సాగు చేశా. ప్రస్తుతం రైతుల వద్ద లేనప్పుడు క్వింటాల్ ధర రూ.16 వేలకు చేరింది. పసుపు బోర్డు ఏర్పాటైనందున, ఈ ఏడాదైనా ధర వస్తుందనే ఆశతో పంట సాగు చేస్తున్నాం. – సత్యంరెడ్డి, ముత్యంపేట, మల్లాపూర్ ఇక్కడి భూములు అనుకూలం పసుపు పంటకు జిల్లాలోని ఎర్రనేలలు అనుకూలం. సాగులోనే కాకుండా దిగుబడి తీయడంలోనూ జిల్లా రైతులదే పైచేయి. ఇటీవల పంట వేసేందుకు, తవ్వేందుకు యంత్రాలు, సాగు నీరు, ఎరువుల కోసం డ్రిప్ ఉపయోగిస్తున్నారు. పెరుగుతున్న ధరలు మళ్లీ ఆశలు రేకెత్తిస్తున్నాయి. – శ్యాంప్రసాద్, జిల్లా ఉద్యానశాఖ అధికారి, జగిత్యాల -
జాతరలో ఇరువర్గాల ఘర్షణ
మెట్పల్లి(కోరుట్ల): పట్టణంలోని మఠంవాడలో ఆదివారం జరిగిన పెద్దమ్మతల్లి జాతర ఉత్సవాల సందర్భంగా రెండువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఎస్సై కిరణ్కుమార్ కథనం ప్రకారం.. ఉత్సవాలు జరుగుతున్న సమయంలో జక్కం రమేశ్, జక్కం పెద్దరాజం, జక్కం నడ్పిరాజం, జక్కం పవన్, జక్కం శేఖర్, జక్కం రాములుకు.. యామ రాజయ్య, యామ రంజిత్, యామ ప్రకాశ్, యామ మారుతి, యామ గంగాధర్తో గొడవ జరిగింది. ఈ క్రమంలోనే పరస్పరం దాడి చేసుకున్నారు. ఇందులో పలువురికి గాయాలయ్యాయి. అనంతరం ఇరు వర్గాలు పోలీస్స్టేషన్కు వెళ్లి అక్కడ కూడా గొడవపడ్డారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
పసుపు వైపే రైతన్న చూపు
జగిత్యాలఅగ్రికల్చర్: పసుపు పంటకు ఓ వైపు ప్రభుత్వ మద్దతు ధర లేకపోవడం, మరో వైపు వ్యాపారులు సిండికేట్గా మారి బహిరంగ మార్కెట్లో రేటు తగ్గించినా, పసుపు సాగుపై జిల్లా రైతుల ఆసక్తి మాత్రం తగ్గడం లేదు. ఏయేటికాయేడు ధర వస్తుందిలే అనే ఆశతో సాగు చేస్తున్నారు. అలాగే, పసుపు క్వింటాల్కు రూ.15 వేల మద్దతు ధర చెల్లించాలంటూ రైతులు ఏటా పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే, రైతుల వద్ద ఉన్న పసుపు వ్యాపారుల చేతుల్లోకి పోయిన తర్వాత క్వింటాల్కు రూ.16–17 వేల వరకు ధర పలకడంతో, మళ్లీ అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దీనికి తోడు నిజమాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుతో ధరల్లో కదలిక వస్తుందనే ఆశతో ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో దాదాపు 40 వేల ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు. ఇంటి పంటగా భావించి.. పసుపు పంటకు ధర ఉన్నా, లేకున్నా ఇంటి పంటగా భావించి జిల్లాలో పలువురు రైతులు కనీసం ఎకరం నుంచి ఐదెకరాల వరకు సాగు చేస్తున్నారు. ఇక్కడి రైతులను ఆర్థికంగా స్థితిమంతులను చేసింది కూడా పసుపు పంటే కావడం విశేషం. అనుకూలమైన ఎర్ర నేలలు, డ్రిప్ ద్వారా సాగునీరు, రసాయన ఎరువులు అందించే వెసులుబాటు ఉండటంతో రైతులు పంట వైపు ఆసక్తి చూసుతున్నారు. ఇక్కడి రైతులు అధిక దిగుబడి ఇచ్చే గుంటూర్, ఆర్మూర్, కుర్కుమిన్ శాతం ఎక్కువ ఉండే సుగుణ, సుదర్శన్ వంటి రకాలు సాగు చేస్తున్నారు. ఇటీవల కొందరు అభ్యుదయ రైతులు కుర్కుమిన్ శాతం ఎక్కువగా ఉండే కేరళ రకాలను కూడా సాగు చేస్తున్నారు. అయితే, పలువురు రైతులు విత్తనాన్ని కొనుగోలు చేయకుండా, గతేడాది పంట నుంచి నాణ్యమైన విత్తనాన్ని సేకరించుకుని వేస్తుంటారు. పెరిగిన సాగు ఖర్చు పసుపు ఏడాది పంట. దాదాపు 9–10 నెలల పాటు భూమిలోనే ఉంటుంది. పంటకాలంలో అన్నీ ఖర్చులు కలుపుకుని ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షల ఖర్చు వస్తుంది. ఎకరాకు ఒక లారీ కోడి ఎరువు(దాదాపు రూ.25 వేలు) వేస్తారు. రెండుమూడు సార్లు దున్నడానికి రూ.5 వేలు, విత్తనం వేసేటప్పుడు రూ.5 వేలు, రసాయన ఎరువులు రూ.8 వేలు, మూడుసార్లు కలుపు తీసేందుకు కూలీల ఖర్చు రూ.5 వేలు, తవ్వకం సమయంలో రూ.40 వేలు, ఉడకబెట్టి, ఆరబెట్టేందుకు రూ.6 వేలు, విత్తనాల ఖర్చు రూ.15 వేలు.. ఇలా అన్నీ కలుపుకుంటే రూ.లక్ష వరకు దాటుతుంది. మార్కెట్కు తరలించేందుకు రవాణా, అడ్తి, కమీషన్, క్యాష్ కటింగ్ వంటి చార్జీలు లెక్కలోకి తీసుకుంటే మరింత ఖర్చు వస్తుంది. ధరలు పెరుగుతాయనే ఆశతో.. ఒకప్పుడు పసుపు ధరలు బంగారంతో పోటీ పడ్డాయి. రెండేళ్ల నుంచి పసుపు ధరలు కొంత మేర ఆశాజనకంగా ఉన్నాయి. క్వింటాల్కు రూ.10–12 వేల ధరలు పలుకుతున్నాయి. ఇటీవల క్వింటాల్కు రూ.16 వేల వరకు పలకడంతో రైతులు ఉత్సాహంగా సాగుకు ఉపక్రమిస్తున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కావడం, అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగి రానున్న రోజుల్లో ఎగుమతులు పెరుగుతాయనే ఆశతో జిల్లాలోని మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, జగిత్యాల రూరల్, కోరుట్ల, కథలాపూర్, రాయికల్, మేడిపల్లి మండలాల్లో అత్యధికంగా సాగు చేస్తున్నారు. ధర ఉన్నా.. లేకున్నా జగిత్యాల జిల్లాలో 40 వేల ఎకరాల్లో సాగు పెరుగుతున్న పసుపు ధరలతో రైతుల్లో ఆశలు -
ఎస్యూలో అలరించిన క్రీడా వార్షికోత్సవం
కరీంనగర్క్రైం: కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో వార్షిక క్రీడా దినోత్సవం ఆదివారం ఉత్సాహంగా జరిగింది. ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ ఉమేశ్కుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు ఆటల్లోనూ యూనివర్సిటీని అభివృద్ధి చేస్తామన్నారు. వందేమాతరం శ్రీనివాస్, మధుప్రియలు హాజరై విద్యార్థులను ఆటపాటల్లో ఆనందపరిచారు. విద్యార్థులు హుషారుగా నృత్యాలు చేసి వేదికను హోరెత్తించారు. విశిష్ట అతిథి ఐఐసీటీ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. పీజీ తర్వాత ఉద్యోగాన్ని సాధించే విధంగా లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలని ఆకాంక్షించారు. ప్రత్యేక అతిధి కిరణ్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ విద్యార్థులకు చదువుతోపాటు ఆటపాటలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. అనంతరం వివిధ క్రీడల్లో విజేతలకు బహుమతులు అందించారు. -
బీటీఆర్ ఫౌండేషన్తో పేదలకు సాయం
ఇల్లంతకుంట(మానకొండూర్): పేదలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారు బీ టీఆర్ ఫౌండేషన్ బాధ్యులు. ఇ ల్లంతకుంట మండలం నర్సక్కపేట గ్రామానికి చెందిన బెంద్రం తిరుపతిరెడ్డి 2020లో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేశారు. సంస్థ పేరిట ఇప్పటి వరకు ఎవరి నుంచి విరాళాలు సేకరించలేదని, తన సొంత పొల ం 7 ఎకరాలు అమ్మి పేదలకు సాయం చేస్తున్నట్టు తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. కరోనా సమయంలో 505 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.2 వేల చొప్పున 12 రకాల ఆహార వస్తువులు అందించారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు (దాదా పు 965) 50 కిలోల చొప్పున బియ్యం అందజేశారు. 520 మంది ఆడపిల్లల వివాహానికి రెండు టే కు మంచాల చొప్పున అందజేశారు. ఐదేళ్ల నుంచి వి నాయక మండపాలకు ధూప దీప నైవేద్య ఖర్చులకు గాను మండలంలోని ప్రతి మండపానికి రూ. 5వేలు అందజేస్తున్నారు. 2010 నుంచి వేసవిలో ఇల్లంతకుంట బస్టాండ్ ఆవరణలో చలివేంద్రం ఏ ర్పాటు చేసి ప్రయాణికుల దప్పిక తీరుస్తున్నారు. అ ంతేకాకుండా మండలంలోని విద్యార్థులకు బస్సు పాసులు అందించడంలో సాయం చేస్తుంటారు. ఇ లా మండలంలోని పేదలకు తిరుపతిరెడ్డి సహాయ సహకారాలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ఇస్కాన్ ఆలయ నిర్మాణానికి సహకరిస్తాం
కరీంనగర్కల్చరల్:కరీంనగర్లో ఇస్కాన్ మందిర నిర్మాణానికి ప్రభుత్వపరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ సహకరిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమా ర్ పేర్కొన్నారు. జూలై 5న నిర్వహించే జగన్నాథ రథయాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. కరీంనగర్ ఇస్కాన్శాఖ పక్షాన జరుగుతున్న 4వ రథయాత్రను విజయవంతం చేయాలని సూచించారు. కరీంనగర్ పురవీధుల్లో 4వ జగన్నాథ రథయాత్ర శోభాయమానంగా సాగాల ని రాష్ట్రమంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నా రు. జగన్నాథ రథయాత్ర పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. తాను కూడా తప్పకుండా రథయాత్రలో పాల్గొంటానని తెలిపారు. ఇస్కాన్ కరీంనగర్శాఖ నిర్వాహకులు ప్రభు నరహరిదాస్, కన్నకృష్ణ, ఎల్ రాజభాస్కర్రెడ్డి, తుమ్మల రమేశ్రెడ్డి, కెప్టెన్ బుర్ర మధుసూదన్రెడ్డి, కొమురవెల్లి వెంకటేశం, పోరెడ్డి శ్రీహరిరెడ్డి, గోపాల్రెడ్డి పాల్గొన్నారు. అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించాలి కరీంనగర్: నగరపాలక సంస్థలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించి, పారదర్శకంగా డివిజన్ల ఏర్పాటు ప్రక్రియను కొనసాగించాలని మాజీ మేయర్ సర్దార్ రవీందర్సింగ్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలో మాట్లాడుతూ కార్పొరేషన్లో 5వేల ఓట్లు కలిగిన డి విజన్లకు మాత్రమే రూపకల్ప చేయాలని జీవో269ను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని, డివిజన్ల ఏర్పాటు, ఓట్లు మార్పులు, చేర్పులకు ఎంపీ ఓవైసీ, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య ఈనెల 16న హైదరాబాద్లో చర్చలు జరిగా యని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకముందే ఇలాంటి చర్చలు జరిపి జీవో 12ను ఉల్లంఘించే అవకాశం ఉందన్నా రు. కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ పారదర్శకంగా డివిజన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, పెండ్యాల మహేశ్కుమార్, కెంసారం తిరుపతి, తుల భాస్కర్రావు పాల్గొన్నారు. ‘మీ అభ్యంతరాలు ఆమోదించాం’ ● బల్దియా వ్యక్తిగత లేఖలు కరీంనగర్ కార్పొరేషన్: డివిజన్ల పునర్విభజనపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారికి నగర పాలకసంస్థ సమాధానాలు పంపిస్తోంది. వ్యక్తిగతంగా వారు తెలిపిన అభ్యంతరా లు, పరిష్కరించడాన్ని తెలియజేస్తూ లేఖలు అందిస్తోంది. నగరంలోని 66 డివిజన్ల పునర్విభజన సందర్భంగా జారీ చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్పై ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించడం తెలి సిందే. పది డివిజన్లు మినహా 56 డివిజన్ల నుంచి 242 అభ్యంతరాలు వచ్చాయి. ఈ అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిజమైనవని తేలితే వాటిని పరిష్కరించారు. మిగతా వాటిని తిరస్కరించారు. 16వ తేదీతో అభ్యంతరాల పరిశీలన ముగియగా, తుది జాబితాను 20వ తేదీ ప్రభుత్వానికి పంపించడం తెలిసిందే. ఆ తరువాత అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారికి సమాధానాలు పంపించే ప్రక్రియను నగరపాలకసంస్థ అధికారులు చేపట్టారు. డివిజన్ల హద్దులు, ఇంటి నంబర్లపై వ్యక్తంచేసిన అభ్యంతరాలను ఆమోదిస్తే, ‘మీ అభ్యంతరాలు ఆమోదించామని’, తిరస్కరిస్తే అందుకు కారణాలను తెలియచేస్తూ సమాధానాన్ని లేఖ రూపంలో వ్యక్తిగతంగా అందజేస్తున్నారు. ఉపాధ్యాయులకు పర్యవేక్షణ సరికాదు కరీంనగర్: ఉపాధ్యాయులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం సరికాదని డీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అవాల నరహరి, చకినాల రాంమోహన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల పనితీరును పర్యవేక్షించడానికి ఎస్జీటీ, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లను పర్యవేక్షణ అధికారులుగా బాధ్యతలు అప్పగించడం సరికాదని, ఇది విద్యారంగ తి రోగమన చర్య అన్నారు. ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో విద్యాప్రమాణాలకు చర్యలు తీసుకుంటామని చెబుతూనే ఇలాంటి చర్యలకు పాల్పడడం అనాలోచితమన్నారు. -
‘ఫీజు నియంత్రణ’ ఏది?
● ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల వసూళ్లపై చర్యలు శూన్యం ● కానరాని గవర్నింగ్ బాడీ ● చోద్యం చూస్తున్న విద్యాశాఖకరీంనగర్: పాఠశాల స్థాయిలో ఫీజు నియంత్రణ చట్టం అమలుకు నోచుకోవడం లేదు.చట్టం తమ చుట్టమన్నట్లుగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తు న్నాయి. వీరికి రాజకీయ, ధన బలం ఉండడంతో.. ఫీజు నియంత్రణపై విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేయడంపై తల్లిదండ్రులు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నుంచి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్టం ఏం చెబుతోంది.. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి విద్యార్థికి విద్యనందించాలి. పాఠశాల స్థాయిలో ఫీజు నియంత్రణ లేకపోవడంతో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు అందినకాడికి దో చుకుంటున్నాయి. అధిక ఫీజులు వసూలు చేస్తు న్నా వీటివైపు ఏ ఒక్కరూ కన్నెత్తి చూడకపోవడం పేద విద్యార్థులకు శాపంగా మారుతోంది. ఊసే లేని గవర్నింగ్ బాడీ ట్రస్టు పేరుతో పాఠశాలను ఏర్పాటు చేస్తేనే ఆ విద్యాసంస్థకు ప్రభుత్వ గుర్తింపు లభిస్తుంది. అలా ఏర్పాటైన పాఠశాలకు తప్పనిసరిగా గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయాలి. ట్రస్టు చైర్మన్, కరస్పాండెంట్, హెచ్ఎం, టీచర్, పేరెంట్తో గవర్నింగ్ బాడీని నియమించి.. ఏయే తరగతులకు ఎంత ఫీజు తీసుకోవాలి.. అర్హత మేరకు ఉపాధ్యాయులకు జీతం ఎంత చెల్లించాలనే నిర్ణయం తీసుకోవాలి. ఒక్క కరీంనగర్లోనే ప్రైవేట్, కార్పొరేట్ కలిపి దాదాపు 200 వరకు పాఠశాలలున్నాయి. కొన్ని పాఠశాలల్లో పేపర్పై మాత్రమే గవర్నింగ్ బాడీని చూపించి.. మిగిలిన పనులను యాజమాన్యమే చక్కదిద్దుకుంటోంది. కానరాని ఫీజు పట్టిక ప్రతి పాఠశాలలో తరగతివారీగా ఫీజు వివరాల ను నోటీసు బోర్డులో ఉంచాలి. ఉపాధ్యాయుల అర్హత వివరాలను పొందుపరచాలి. చాలా పాఠశాలల్లో ఫీజు పట్టికను ఏర్పాటు చేయడం లేదు. ఫీజు నియంత్రణ అంశంపై సాధారణ ప్రజలకు తెలియకపోవడం సాధారణం. అయితే విద్యావంతులైన అధికారులకు ఫీజు నియంత్రణ చట్టంపై కొంత వరకై నా అవగాహన ఉంటుంది. అయినా వారు నోరు మెదపకపోవడంపై సర్వ త్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధారాదత్తం చేయడానికే.. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, జూనియర్ కళా శాలల్లో అత్యధిక భాగం రాజకీయ నాయకులు, ప్రముఖులవే కావడంతో ఫీజు నియంత్రణ చట్ట మున్నా అమలు చేయడం లేదంటూ విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి. అధికారులు సైతం ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. గుర్తింపు లేకున్నా పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. -
అర్హులా.. అనర్హులా!
● చేయూత పింఛన్లపై సామాజిక తనిఖీ ● త్వరలో ఫేస్ రికగ్నైజేషన్తో పింఛన్లు కరీంనగర్ అర్బన్: చేయూత(ఆసరా) పింఛన్లపై సామాజిక తనిఖీలు (సోషల్ ఆడిట్) చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉపాధి హామీ పనులకు ఎలాగైతే ఆడిట్ చేయిస్తున్నారో అదే తరహాలో పింఛన్లను ఆడిట్ చేయించనున్నారు. అనేక మంది అనర్హులకు పింఛన్లు వస్తున్నాయనే ఆరోపణలున్నాయి. జిల్లాలో గతేడాది 212మంది సర్వీస్ పింఛన్తో పాటు చేయూత(ఆసరా) పింఛన్ తీసుకుంటున్నట్లు వెల్లడైంది. దీంతో అధికారులు చేయూత పింఛన్లను రద్దు చేశారు. అనేక మంది అనర్హులు పింఛన్లు తీసుకుంటున్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందడంతో ఆడిట్ చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. సామాజిక తనిఖీలతో అక్రమాలు బహిర్గతం జిల్లాలో 1.23లక్షల మంది వివిధ పింఛన్లు తీసుకుంటున్నారు. మున్సిపాలిటీ ప్రాంతాల వారికి నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుండగా గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసు ద్వారా నగదు పంపిణీ చేస్తున్నారు. వృద్ధులు, నడవలేనివారు, బయోమెట్రిక్ కోసం వేలిముద్రలు నమోదు కానివారికి ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శి వేలిముద్రలతో పింఛన్లు డ్రా చేస్తున్నారు. ఈ పింఛన్లు లబ్ధిదారులకు సక్రమంగా చేరుతున్నాయా లేదా అని ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తోంది. పింఛన్లపై ఆడిట్ నిర్వహిస్తే అనర్హుల గుట్టు రట్టవుతుందని భావిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు సైతం పింఛన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనర్హుల పేర్లు తొలగిస్తే ప్రభుత్వానికి ఖర్చు తగ్గడంతో పాటు మరికొందరు అర్హులకు కొత్తగా పింఛన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆధార్కార్డులో మార్పులతో అనర్హులు ఆసరా పింఛన్ పొందుతున్న వారిలో కొందరు ఆధార్కార్డుల్లో వయసును దిద్దించారు. తమకు ఎక్కువ వయస్సు ఉందని అధికారులను నమ్మించి పింఛన్లు పొందారు. అనర్హులు పింఛన్లు పొందుతున్నారంటూ గతంలోనే కలెక్టర్కు ఫిర్యాదులు కూడా అందాయి. ఈ వ్యవహారంలో కొందరు నేతలు సిఫార్సు చేసిన వారికి అధికారులు ఎలాంటి విచారణ లేకుండానే పింఛన్లు మంజూరు చేసినట్లు సర్వత్రా ఆరోపణలు వినిపించాయి. లబ్ధిదారులు మృతిచెందిన వెంటనే వారికి పింఛన్ నిలిపివేయాలి. కాని పట్టణాల్లో లబ్ధిదారుడు మృతి చెందిన తర్వాత మూడునాలుగు నెలల పాటు పింఛన్లు వారి ఖాతాల్లో జమవుతున్నాయి. కరీంనగర్, హుజూరాబాద్ కేంద్రానికి సమీపంలో ఉండే గ్రామంలో పలువురు మహిళలు ఒంటరి మహిళ పేరిట పింఛన్లు తీసుకుంటున్నారు. వాస్తవానికి వీరు వివాహమైనవారే. భర్తతో విడిపోయి తల్లిదండ్రుల ఇంటి వద్దే ఉండడంతో మానవత్వంతో వీరికి ఒంటరి మహిళల కోటాలో పింఛన్లు మంజూరు చేశారు. ఆ తర్వాత వీరు మళ్లీ వారి భర్తల ఇళ్లకు వెళ్లిపోయారు. కానీ ప్రతీ నెల పుట్టింటికి వచ్చి పింఛన్ తీసుకుంటున్నారు. ఇలా అనేక మంది అనర్హులు చేయూత పింఛన్లు పొందుతున్నారు. ముఖ ధ్రువీకరణతో పింఛన్లు త్వరలో ‘ముఖ చిత్రం ధ్రువీకరణ’ విధానం తీసుకరావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై ఇప్పటికే అధికారులకు, ఉద్యోగులకు సెర్ప్ అధికారులు అవగాహన కల్పించారు. మరికొందరు వేలిముద్రలు, ఐరిష్ రాని వృద్ధుల పింఛన్లను ఆయా గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శులు తన వేలు ముద్రలు వేసి లబ్ధిదారులకు ఇస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడంతో అక్రమాలకు ఆస్కారం లేకుండా పోయింది. ఇలాంటి అక్రమాలు అరికట్టడానికి ప్రభుత్వం మొబైల్ ఫోన్ తరహా యంతాల్లో ఫెషియల్ అథంటిఫికేషన్కు సంబంధించిన సాఫ్ట్వేర్ అప్లోడ్ చేసి ముఖం చిత్రం స్కానింగ్ ద్వారా లబ్ధిదారుల పింఛన్ డబ్బులను బ్యాంకు ఖాతాల్లో వేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.జిల్లాలో లబ్ధిదారులు : 1,23,641 వృద్ధాప్య పింఛన్దారులు : 48,918వితంతు : 34,229దివ్యాంగులు : 20,702గీత కార్మికార్మికులు : 3,767చేనేత : 2,817ఒంటరి మహిళలు : 3,271బీడీ కార్మికులు : 9,937 -
సమగ్ర అభివృద్ధికి బాటలు వేద్దాం
● పథకాల అమలులో పారదర్శకత పాటించాలి ● కష్టకాలంలోనూ పథకాలు అమలు చేస్తున్నాం ● విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యం ● జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ● మూడు శాఖలపై నాలుగు గంటలపాటు సమీక్షకరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమగ్ర అభివృద్ధికి బాసటగా నిలవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో వ్యవసాయం, విద్య, హౌసింగ్ శాఖలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి నాలుగు గంటలపాటు సమీక్షించారు. వర్షాభావ పరిస్థితులు, క్రాప్ బుకింగ్, సాగు వివరాలు, విత్తనాలు, ఎరువుల లభ్యత, రైతుభరోసా, ఆయిల్ పాం సాగు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, గ్రౌండింగ్తీరును ఆయా జిల్లాల కలెక్టర్లు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అస్తవ్యస్త పరిస్థితులను సరిచేస్తూ.. పాలన సాగిస్తున్నామని, ఎక్కడా ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. జూలై వరకు అవసరమైన విత్తనాలు, ఎరువుల స్టాక్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అవసరమైన మేరకే యూరి యా వాడాలన్నారు. ఆయిల్పాం సాగుపై మరింత శ్రద్ధ చూపి జిల్లాలకు కేటాయించిన లక్ష్యాన్ని మించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, విద్యాశాఖ అధికారులు శిథిలావస్థలో ఉన్న భవనాలను ఖాళీ చేయించాలన్నారు. ● రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ నిరుపేదలందరికీ ఇందిర మ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఎమ్మెల్యేల దృష్టిలో ఉన్న నిరుపేదల జాబితాను కలెక్టర్లకు అందిస్తే ఇందిరమ్మ కమిటీలో చర్చించి పార్టీలకతీతంగా మంజూరు చేస్తామన్నారు. కూరగాయ ల సాగు విస్తరించాలని, కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ● మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రైతు భరోసా రైతుల ఖాతాలో జమ చేస్తున్నందుకు మంత్రి తుమ్మలకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులు ఆయిల్ పాం సాగువైపు దృష్టి సారించాలన్నారు. క్యాష్ క్రాప్స్, హార్టికల్చర్ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలన్నారు. ● వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఎరువుల కొరత లేదన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు పూర్తి చేశామని, రైతుభరోసా ఖాతాల్లో జమ అవుతోందని తెలిపారు. వేములవాడలో సూరమ్మ ప్రాజెక్టు, శ్రీపాద నారాయణపురం ప్రాజెక్టుల భూ సేకరణ నిధులు విడుదల చేయాలని కోరారు. ● కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఆయిల్ పాం సాగును ప్రోత్సహించాలన్నారు. తాను 48 ఎకరాల్లో ఆయిల్ పాం సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఆయిల్ పాం ప్రాసెస్ యూనిట్ను చిగురుమామిడిలో ఏర్పాటు చే యాలని కోరారు. కరీంనగర్లో గతంలో సీఎం స్పెషల్ ఫండ్ కింద రూ.350 కోట్లతో 120రోడ్ల పనులు ప్రారంభించామని, వాటిని పూర్తి చేయి ంచాలని విజ్ఞప్తి చేశారు. కేబుల్ బ్రిడ్జి డైనమిక్ లైటింగ్ వ్యవస్థ పనితీరు పర్యవేక్షించాలన్నారు. ● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ జగిత్యాల ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరారు. ఆయిల్పాం సాగుపై అవగాహన కల్పిస్తున్నామని, పంటకు ధర పెంచేలా చూడాలని అన్నారు. ● కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో ఎమ్మెల్యేల జాబితాను పరిగణనలోకి తీసుకోవాలని కోరా రు. మెట్పల్లి హైస్కూల్ శిథిలావస్థలో ఉందని, పక్కనే జూనియర్ కళాశాల భవనం 80శాతం పూర్తయిందని, దానిని పూర్తి చేసి స్కూల్ పిల్లలను ఆ భవనానికి తరలించాలని అన్నారు. ఉర్దూ ప్రభుత్వ పాఠశాల పనులు పూర్తిచేయాలని కోరారు. ● పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు మాట్లాడుతూ వ్యవసాయంపై గ్రామాల్లో సదస్సులు పెట్టి రైతులకు సలహాలు, సూచనలను శాస్త్రవేత్తల ద్వారా ఇప్పించామన్నారు. పంట మార్పిడిపై ప్రచారం చేయాల్సిన అవస రం ఉందన్నారు. ఐదేళ్లుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పత్తి పంట తగ్గిపోతోందని, వరి, మొక్కజొన్న సాగు పెరుగుతోందని అన్నారు. ● రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఎత్తిపోతలు పూర్తి చేయడంతో అంతర్గాం, పాలకుర్తి మండలాలకు తొలిసారి సాగునీరు వచ్చిందని, గతం కంటే రెండింతల పంట పండుతోందని తెలిపారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, కేశోరాం సిమెంట్ వంటి సంస్థల డీఎంఎఫ్టీ నిధులు జిల్లాకు రావడం లేదని అన్నారు. ● మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులకు చదవడం, రాయడం, సామాన్య, గణితం వంటి విద్యా ప్రమాణాలు పెంచేలా చూడాలన్నారు. వృత్తి విద్యా కోర్సుల ద్వారా యువతను ప్రయోజకులను చేసేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటును స్వాగతించారు. ● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ చొప్పదండి ప్రాంతంలోని చేనేత కార్మికుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, గంగాధర మండలానికి డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని కోరారు. ● సమీక్ష సమావేశంలో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల కలెక్టర్లు పమేలా సత్పతి, కోయ శ్రీహర్ష, సందీప్ కుమార్ ఝా, సత్య ప్రసాద్, రాష్ట్ర మినిమం వేజ్బోర్డు సలహా మండలి చైర్మన్ జనక్ప్రసాద్, కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్లు సత్తు మల్లేశం, కేడం లింగమూర్తి, నాగుల సత్యనారాయణ, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.అకడమిక్ బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపనకరీంనగర్క్రైం: కరీంనగర్లోని మానేరు డ్యాం సమీపంలో ఉన్న శాతవాహన ఫార్మసీ కళాశాలలో అకడమిక్ బ్లాక్, ప్రహరీ నిర్మాణానికి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో నాణ్యత ప్రమాణాలు పెంచుతామని పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ శాతవాహన విశ్వవిద్యాలయ అభివృద్ధికి అన్నివిధాల సహకరిస్తామని తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ పీఎం ఉష నిధులను ఈ అకాడమిక్ బ్లాక్ నిర్మాణానికి కేటాయించినట్లు తెలి పారు. ఇందులో 60శాతం కేంద్ర ప్రభుత్వం, 40శాతం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు. వీసీ ఉమేశ్కుమార్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో సదుపాయాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. -
ప్రభుత్వ స్థలాల్లో ఈత, తాటి చెట్ల పెంపకం
● చింతకుంటలో సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణలో మంత్రి పొన్నంకొత్తపల్లి(కరీంనగర్): ప్రభుత్వ స్థలాల్లో ఈత, తాటి చెట్ల పెంపకానికి ప్రభుత్వం చేయూతనిస్తోందని, ప్రభుత్వ స్థలాలు గుర్తించి అధికారుల దృష్టికి తీసుకురావాలని బీసీ సంక్షేమం, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. చింతకుంటలో ఏర్పాటుచేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం కింద కల్లు గీత కార్మిక సొసైటీల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల తాటి, ఈత మొక్కలు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. వనమహోత్సవంలో భాగంగా ఈ మొక్కలను ఈ ఏడాది నాటాలని సూచించారు. చింతకుంటలో కల్లు కంపౌండ్ నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. గోల్కొండను పాలించిన మొట్టమొదటి తెలంగాణ రాజు పాపన్నగౌడ్ అని, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ భావితరాలకు స్ఫూర్తిదాయంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, సర్వాయి పాపన్న గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడూరి పరుశరాంగౌడ్, జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, పొన్నం సత్యనారా యణ గౌడ్. రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల స్వామిగౌడ్, నాయకులు పెరుమాండ్ల రామస్వామి గౌడ్, పిల్లి మహేశ్గౌడ్, బొమ్మ ఈశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. -
తుదిదశకు కేబుల్ బ్రిడ్జి విచారణ!
కరీంనగర్: కరీంనగర్లోని మానేరువాగుపై నిర్మించిన తీగల వంతెన పనుల్లో నాణ్యత లోపించిందని, రూ.కోట్ల దుర్వినియోగం జరిగిందనే ఫిర్యాదులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం చేపట్టిన విచారణ తుదిదశకు చేరుకుంది. నెలాఖరులోగా తీగల బ్రిడ్జి పనులపై నివేదిక అందజేయనున్నట్లు సమాచారం. మానేరువాగుపై నిర్మించిన తీగల వంతెనకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదటగా రూ.80కోట్లు కేటాయించగా, అప్రోచ్ రోడ్లతో కలిపి రూ.224 కోట్ల వ్యయంతో పనులు పూర్తి చేశారు. వంతెనను ప్రారంభించిన నాలుగు నెలల్లోనే తారు దెబ్బతినడం, డిజిటల్ లైట్లు వెలగకపోవడంపై సామాజిక కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫిరాద్యులు చేశారు. ప్రభుత్వం తీగల వంతెనకు నిధుల కేటాయింపు, పనులు జరిగిన తీరు, నాణ్యత ప్రామాణాలపై విజిలెన్స్ విచారణ చేపట్టింది. విజిలెన్స్ అండ్ ఎన్స్పోర్స్మెంట్ రోడ్లు, భవనాలశాఖ విభాగం డీఎస్పీ ఎం.శ్రీనివాస్రావు ఆధ్వర్యంలోని బృందం పనుల నాణ్యతను పరిశీలించారు. విచారణ ఏడాది పాటు కొనసాగిందని, నివేదిక తుదిదశకు చేరుకుందని, నెలాఖరులోగా తుది నివేదిక అందజేసేందుకు సిద్ధం అయినట్లు అధికార వర్గాల వెల్లడించాయి. విజిలెన్స్ విచారణ హర్షణీయం విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్లోని మానేరువాగుపై బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో నిర్మించిన తీగల వంతెన పనుల నాణ్యత, అవినీతిపై విజిలెన్స్ విచారణ చేపట్టడం హర్షణీయమని సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్రెడ్డి, సహాయ కార్యదర్శులు పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్లో శనివారం మాట్లాడుతూ.. సీపీఐ చేసిన పోరాటల ఫలితంగా ప్రభుత్వం స్పందించి విజిలెన్స్ విచారణకు ఆదేశించిదన్నారు. తీగల వంతెన నిర్మాణంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులైన కాంట్రాక్టర్, ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
తూకంలో తేడాపై రోడ్డెక్కిన రైతులు
సిరిసిల్లఅర్బన్: ఐకేపీ ద్వారా విక్రయించిన సన్ఫ్లవర్ పంట తూకంలో తేడాపై ఇల్లంతకుంట మండలానికి చెందిన రైతులు శనివారం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. మండలంలోని ముస్కానిపేట, గాలిపల్లి, చిన్నకేసన్నపల్లి, పత్తికుంటపల్లి, తాళ్లపల్లి గ్రామాలకు చెందిన సుమారు 50 మంది రైతులు కలెక్టరేట్కు తరలివచ్చారు. వారు మాట్లాడుతూ ఐకేపీ ద్వారా విక్రయించిన సన్ఫ్లవర్ పంట తూకంలో వచ్చిన క్వింటాళ్లు మార్క్ఫెడ్ తీసుకున్న తూకానికి తేడా వస్తుందన్నారు. ఒక్కో రైతుకు మూడు క్వింటాళ్ల వరకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్ సందీప్కుమార్ ఝా దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి డీఆర్డీవో శేషాద్రిని పిలిపించి తూకంలో తేడాలపై విచారణ చేపట్టి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం రైతులు డీఆర్డీవోకు వివరాలతో కూడిన వినతిపత్రం అందించారు. సుధాకర్రెడ్డి, ఐదు గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. డీఆర్డీవోకు వినతిపత్రం -
రోడ్డు ప్రమాదంలో వీఆర్ఏకు గాయాలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ ఆఫీస్ ఎదుట శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వీఆర్ఏతోపాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. వీఆర్ఏ పరిస్థితి విషమంగా ఉంది. ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాలు. మండల కేంద్రానికి చెందిన బాధ పెద్దరాములు తహసీల్దార్ ఆఫీస్లో వీఆర్ఏగా పనిచేస్తున్నారు. శనివారం విధులకు హాజరయ్యేందుకు తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. రాజన్నపేటకు చెందిన తిమోతి అనే యువకుడు బైక్పై వేగంగా వస్తూ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రాములు కుడికాలు విరిగింది. తిమోతి స్వల్పంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రాములను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు నంది కిషన్, బండారి బాల్రెడ్డి, బాధ రమేశ్ పరామర్శించారు. తహసీల్దార్ సుజాత రాములును పరామర్శించి, పరిస్థితి గురించి తెలుసుకున్నారు. రెవెన్యూశాఖ తరఫున తక్షణసాయంగా రూ.20వేలు ఆర్ఐ శ్రావణ్మార్ రాములు కుటుంబానికి అందజేశారు. పరిస్థితి విషమం -
అప్పులబాధతో నేతకార్మికుడి ఆత్మహత్య
సిరిసిల్లక్రైం: ప్రమాదంలో కాలువిరగడంతో పని చేయలేక.. అప్పులు తీర్చే మార్గం కనిపించక సిరిసిల్లలో నేతకార్మికుడు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్కు చెందిన నేతకార్మికుడు వలస రమేశ్(48) పవర్లూమ్స్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రెండేళ్ల క్రితం రమేశ్ కాలుకు దెబ్బతగిలి పనికి దురయ్యాడు. సరైన ఉపాధి లేక.. కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు రూ.5లక్షలు ఎలా తీర్చాలో తెలియక మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో స్థానిక కార్గిల్లేక్లో శనివారం దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య లావణ్య, కుమారులు సాయిచరణ్, సచిన్ ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
రాగి తీగ దొంగల అరెస్ట్
మెట్పల్లి: ట్రాన్స్ఫార్మర్ల నుంచి రాగి తీగ, ఆయిల్ను ఎత్తుకెళ్తూ.. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఇద్దరు దొంగలను మెట్పల్లి పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై కిరణ్కుమార్ కథనం ప్రకారం.. మోతె సాయి(22), పల్లపు మల్లేశం(32) ఆర్థిక ఇబ్బందుల కారణంగా దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు కలిసి పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్ల నుంచి రాగి తీగ, ఆయిల్ అపహరించి అమ్ముతూ వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. రైతుల ఫిర్యాదు మేరకు పక్కా సమాచారంతో ఇద్దరిని పట్టుకొని వారి నుంచి వంద కిలోల రాగి వైరు, ద్విచక్రవాహనం, చోరీలకు ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఇద్దరి అరెస్ట్ చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. కొత్తపల్లిలో రెండు లారీల ఢీ ● ఓ డ్రైవర్కు విరిగిన కాలు.. మరో డ్రైవర్, క్లీనర్కు గాయాలు కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలో శనివారం వేకువజామున రెండు లారీలు ఢీకొన్నాయి. కరీంనగర్– జగిత్యాల ప్రధాన రహదారి కొత్తపల్లి చెరువు స మీపంలో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్లు నిద్రమత్తులో ఉండడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు వెల్లడించారు. స్థానికులు, బ్లూకోల్ట్స్ పోలీసుల వివరాల మేరకు.. నిజామాబాద్లో రైస్మిల్లు సా మగ్రి ఖాళీ చేసి కరీంనగర్ వైపు వస్తున్న లారీ ఖ మ్మం నుంచి గ్రానైట్ లోడ్తో గంగాధర వైపు వెళ్తు న్న మరో లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ముందు భాగాలు దెబ్బతిన్నాయి. గ్రానైట్ లోడ్తో ఉన్న లారీ కొత్తపల్లి చెరువులో పడిపోయింది. ఓ లారీ డ్రైవర్ పురుషోత్తంరెడ్డి, క్లీనర్లు లారీ నుంచి బయట పడగా తలకు గాయాలయ్యాయి. లారీ యజమాని సూచనల మేరకు హైదరాబాద్ వెళ్లిపోయారు. రాజస్థాన్ రిజిస్ట్రేషన్ గల డ్రైవర్ భన్సీలాల్కు గాయాలు అధికంగా కావడంతో పాటు కాలు విరిగడంతో కరీంనగర్లోని ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న కొత్తపల్లి పోలీసులు లారీలను పోలీస్స్టేషన్కు తరలించారు. -
సగం సీట్లు ఖాళీ
● గంభీరావుపేటలో ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థినుల హాస్టల్ ● పాఠశాల విద్యార్థుల కోసం ఎస్సీ బాలుర వసతి గృహం ● రెండింటిలోనూ వంద చొప్పున సీట్లు ● అడ్మిషన్ల కోసం ప్రచారబాటలో అధికారులు గంభీరావుపేట(సిరిసిల్ల): విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన హాస్టళ్లలో సగం సీట్లు కూడా భర్తీ కావడం లేదు. అధికారుల ప్రచారం చేసినా చాలా మంది ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా సగంలోపే సీట్లు భర్తీ అవుతున్నాయి. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల విద్యార్థుల కోసం గంభీరావుపేట మండల కేంద్రంలో రెండు వసతి గృహాలను వేర్వేరుగా ఏర్పాటు చేశారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థుల కోసం ఎస్సీ బాలుర వసతి గృహం. ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థినుల కోసం మరో హాస్టల్ ఏర్పాటు చేశారు. రెండు హాస్టళ్లలో వంద సీట్ల చొప్పున కేటాయించారు. సగం సీట్లు ఖాళీ ప్రస్తుతానికి రెండు హాస్టళ్లలో సగం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. దాదాపు 50 విద్యార్థుల్లోపే ఉన్నారు. గతేడాది పొడవునా ఆ సీట్లు ఖాళీగానే ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పూర్తిస్థాయిలో భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అన్ని రకాల వసతులు ఉన్నా వసతిగృహంలో సీట్లు ఎందుకు ఖాళీగా ఉంటున్నాయో చర్చిస్తూ.. విద్యార్థుల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో అధికారులు వసతిగృహంలో చేరాలని, చేర్పించాలని ప్రచారం చేస్తున్నారు. ఇటు కళాశాల అధ్యాపకులతో.. అటు పాఠశాలల ఉపాధ్యాయులతో కలిసి ప్రచారబాటలో పాల్గొంటున్నారు. వసతిగృహాల్లో కల్పిస్తున్న సదుపాయాలపై తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. ఇతర మండలాలకు చెందిన విద్యార్థులకు సైతం ప్రవేశాలు కల్పించడం జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. వసతిగృహానికి కేటాయించిన వందసీట్లలో ఎస్సీలకు 75 శాతం, బీసీలకు 12, ఎస్టీలకు 6 శాతం చొప్పున సీట్లు కేటాయిస్తున్నారు. రెండు హాస్టళ్లలోనూ ప్రస్తుతం సగానికి పైగా సీట్లు ఖాళీగానే ఉన్నాయి. హాస్టళ్లలో పౌష్టికాహారం విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలతోపాటు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నారు. ఉదయం 7 గంటలకు రాగిజావ, పాలు ఇస్తారు. అనంతరం గంట తర్వాత బ్రేక్ఫాస్ట్లో భాగంగా ఉప్మా, పులిహోర, కిచిడి, చపాతి, పూరీ, ఇడ్లి, జీర రైస్, టమాట అన్నం.. ఇలా రోజుకో రకంగా ఇస్తారు. మధ్యాహ్నం పాఠశాలలో భోజనం ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు స్నాక్స్ కింద పల్లీపట్టీలు, అటుకులు, బిస్కెట్స్, శనగలు, బబ్బర్లు, స్వీట్స్తోపాటు ప్రతి ఆదివారం మధ్యాహ్నం చికెన్రైస్, గుడ్డు ప్రత్యేకంగా అందిస్తారు. వారంలో రెండు రోజులు గుడ్డుతోపాటు అరటిపళ్లు, ఇతర పళ్లు విద్యార్థులకు అందించనున్నారు. అవగాహన కల్పిస్తున్నాం గంభీరావుపేటలోని కళాశాల, పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన ఎస్సీ బాలుర, బాలికల వసతిగృహాల్లో అడ్మిషన్ల కోసం ప్రచారం నిర్వహిస్తున్నాం. వసతిగృహాల్లో ఉండి చదువుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పుడిప్పుడే పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమయ్యాయి. వంద సీట్లు భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. గంభీరావుపేట మండలంతోపాటు చుట్టుపక్కల మండలాల్లోనూ విద్యార్థుల తల్లిదండ్రులకు హాస్టల్ ప్రత్యేకతలను, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి అవగాహన కల్పిస్తున్నాం. – భూదేవి, వసతిగృహాల సంక్షేమాధికారి, గంభీరావుపేట -
న్యాయం చేయండి
మంథని: పోలీసులకు భయపడి తన కుమారుడు ఆత్మాహత్యకు యత్నించి ఇప్పుడు అచేతనా స్థితిలోకి వెళ్లాడని, తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం, స్థానికులతో కలిసి శనివారం పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో ధర్నాకు దిగింది. అచేతనా స్థితిలో తన కుమారుడిని అంబులెన్స్లో ఉంచి ఆవేదన వ్యక్తం చేశారు. యువకుడి తల్లి శీలం రాజేశ్వరి కథనం ప్రకారం.. మంథని పట్టణంలోని శ్రీపాదకాలనీకి చెందిన తన కుమారుడు రాజ్కుమార్ ఎంగేజ్మెంట్కు వెళ్లి ఇంటికి వస్తుండగా వడ్లకల్లం వద్ద ఇద్దరు దోస్తులు మాట్లాడుకొని ఒకరినొకరు చిన్నగా కొట్టుకున్నారు. మరుసటి రోజు 30 మంది దాకా వచ్చి కేసు పెట్టారు. దీంతో రాజ్కుమార్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొట్టడంతో మనస్తాంపం చెందాడు. తన కుమారుడిని అన్యాయంగా పోలీస్స్టేషన్ తీసుకెళ్లారని, కొంతమంది ప్రజాప్రతినిధుల పేర్లు చెబుతూ పోలీసులు కొట్టారని ఆమె వివరించింది. ఈ క్రమంలో అవమానంతో మనదపడుతూ స్నానానికి వెళ్లి బాత్రూంలేనే ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో ఎనిమిది నెలలుగా చికిత్స పొందుతున్నాడు. అయినా, ఇంకా కోలుకోలేదు. దీంతో రాజ్కుమార్ను అంబులెన్స్ లోనే తల్లిదండ్రులు, బంధువులు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాకు తీసుకొచ్చారు. మంథని ఎస్సై, కానిస్టేబుల్, స్థానిక మాజీ కౌన్సిలర్, ప్రజాప్రతినిధులు, మరికొందరు హమాలీ కార్మికులపై చర్యలు తీసుకోవాలని బంధువులు ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న మంథని సీఐ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాధితులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని నచ్చజెప్పారు. అచేతనా స్థితిలోని కుమారుడితో ధర్నా పోలీసులు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ -
చట్టాలు తెలియక కటకటాల్లోకి..
సిరిసిల్ల: బతుకుదెరువు కోసం ఉన్న ఊరిని, కన్నవారిని, కట్టుకున్న భార్యను వదిలి గల్ఫ్ దేశం వెళ్తే.. అక్కడి చట్టాలు తెలియక జైలుపాలైన ఘటన వెలుగులోకి వచ్చింది. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లికి చెందిన నక్క బాలనర్సు సౌదీ అరేబియాలో జైలుపాలయ్యాడు. తన భర్తను విడిపించాలని కోరుతూ అతని భార్య దేవేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. సౌదీ చట్టాలపై అవగాహన లేకపోవడంతో మూడున్నర ఏళ్ల జైలుశిక్ష పడింది. ప్రస్తుతం రియాద్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న జైలుపాలైన బాలనర్సుకు సౌదీలోని ఇండియన్ ఎంబసీ ద్వారా న్యాయ సహాయం అందించి, క్షమాభిక్ష ఇప్పించాలని అతని భార్య నక్క దేవేంద్ర హైదరాబాద్ ప్రజాభవన్లోని ‘ప్రవాసీ ప్రజావాణి’ని ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్చైర్మన్ మంద భీంరెడ్డి, సెలవుపై సౌదీ నుంచి వచ్చిన సామాజిక సేవకులు ఆసాని రాజిరెడ్డి, మహ్మద్ నవీద్లతో కలిసి సీఎం ప్రజావాణి ఇన్చార్జి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి దివ్యదేవారాజన్ను కలిసి గోడు వినిపించారు. ఇంటి డ్రైవర్ ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా బాలనర్సు తన అరబ్ యజమాని పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లేవాడని తెలిపింది. పిల్లలతో స్నేహపూర్వక ప్రవర్తనను యజమాని అపార్థం చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థానిక ఆచార వ్యవహారాలు, సున్నితత్వం తెలియకపోవడంతో అపోహలకు దారితీసి జైలుపాలయ్యాడని ఆమె తెలిపారు. వెంటనే స్పందించిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి దివ్యదేవారాజన్, రాష్ట్ర ఎన్నారై విభాగం ఐఏఎస్ అధికారి సీహెచ్ శివలింగయ్యతో మాట్లాడారు. రియాద్లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేస్తూ, సౌదీ అధికారుల వద్దకు క్షమాభిక్ష అభ్యర్థనను పంపడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గల్ఫ్ బాటలో జైలుపాలైన బాలనర్సు విడుదల కోసం అతని కుటుంబం నిరీక్షిస్తోంది. సౌదీ జైలులో మండెపల్లివాసి విడుదల చేయాలని ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించిన వలసజీవి భార్య మూడున్నరేళ్ల జైలుశిక్ష క్షమాభిక్ష కోసం రాష్ట్ర ప్రభుత్వ సహాయం కోరిన కుటుంబం స్పందించిన ఐఏఎస్ అధికారిణి దివ్యదేవరాజన్ -
ఉత్సాహంగా యోగా
కరీంనగర్స్పోర్ట్స్/కరీంనగర్క్రైం: జిల్లావ్యాప్తంగా యోగాడేను ఉత్సాహంగా జరుపుకున్నారు. వివిధ రకాల యోగాసనాలు వేసి ఆరోగ్యసూత్రాలను వివరించారు. కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో పతంజలి యోగా సమితి, భారత్ స్వామిమాన్ ట్రస్ట్, యువభారత్, ఆయూష్ డిపార్ట్మెంట్లు సంయుక్తంగా నిర్వహించిన యోగాడేలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, వై.సునీల్ రావు, గుగ్గిళ్లపు రమేశ్, డీఎంహెచ్వో వెంకటరమణ, యువభారత్ రాష్ట్ర అధ్యక్షుడు ముత్యాల రమేశ్ పాల్గొన్నారు. జిల్లా యువజన క్రీడాశాఖ, యోగా అసోసియేషన్ సంయుక్తంగా ప్రాంతీయ క్రీడా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యోగాలో జాతీయస్థాయిలో రాణించిన వారిని సత్కరించారు. రాష్ట్ర యోగా అసోసియేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, డీవైఎస్వో శ్రీనివాస్గౌడ్, జిల్లా యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్ రెడ్డి పాల్గొన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే మైదానంలో వికాస తరంగణి, ప్రజ్ఞ వికాస్ ఆధ్వర్యంలో, పరేడ్గ్రౌండ్లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో యోగా డే నిర్వహించారు. సీపీ గౌస్ ఆలం, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు విజయ్ కుమార్, వేణుగోపాల్, పోలీసులు పాల్గొన్నారు. -
జీతం.. సతమతం
కరీంనగర్ అర్బన్: పాడి పరిశ్రమ వృద్ధిలో కీలక పాత్ర పోషించే గోపాలమిత్రలు వేతనాలు అందక మదనపడుతున్నారు. గౌరవ వేతనంతో సేవలందిస్తుండగా 9నెలలుగా సదరు వేతనం లేక ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే 9నెలల గౌరవ వేతనం రాకపోవడంతో అప్పులతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. పశు సంపద అభివృద్ధి కోసం గ్రామాల్లో విస్తృతంగా సేవలందిస్తున్నా సక్రమంగా వేతనాలు రాక సతమతమవుతున్నారు. ఆర్ఎంపీల్లా గోపాలమిత్రలు 2000 సంవత్సరంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డిస్ట్రిక్ లైవ్ స్టాక్ డెవలప్ మెంట్ ఏజెన్సీ (డీఎల్డీఏ)) ద్వారా గోపాలమిత్ర వ్యవస్థను ఏర్పాటు చేశారు. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశువులకు కృత్రిమ గర్భధారణ చేయడంతో పాటు పాడి రైతులకు అందుబాటులో ఉంటూ పశువులకు ప్రథమ చికిత్స అందిస్తున్నారు. నట్టల నివారణ మందులు, వాక్సినేషన్, బీమా చేయడం పశువైద్యుల సూచనల మేరకు అన్ని రకాల వైద్య సేవలను అందిస్తున్నారు. వేతనంలో 40 చొప్పున కట్ ఆయా మండలాల్లో ఉన్న గోపాలమిత్ర సిబ్బంది నెలకు 80నుంచి 120 పశువులకు కృత్రిమ గర్భధారణ (నేమన్) చేయాలి. దీనికి గోపాలమిత్ర సిబ్బంది రూ.40 చొప్పున రైతుల నుంచి వసూలు చేసి ప్రభుత్వ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ప్రతి నెలా నిర్ధేశించిన లక్ష్యాన్ని గోపాలమిత్రలు పూర్తి చేయాల్సిందే. లేదంటే నెల జీతంలో కోత తప్పదు. ఒక్కో పశువుకు రూ.40 చొప్పున వారి వేతనం నుంచి కట్ చేస్తారు. ఒక్కోనెల అనుకున్న లక్ష్యం పూర్తి చేయకపోవడంతో ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనం కనీసం రెండు వేలు కూడా రావడం లేదని గోపాలమిత్రలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పోషణ భారం జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ(డీఎల్డీఏ) ద్వారా పశు సంవర్థకశాఖలో ఉమ్మడి జిల్లాలో 135 మంది గోపాలమిత్ర సిబ్బంది పని చేస్తున్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం రూ.11,050 చొప్పున గౌరవవేతనం అందిస్తోంది. చాలీచాలనీ వేతనం కూడా ప్రతినెలా అందడం లేదు. జిల్లాలో ఇప్పటికే గోపాలమిత్రలకు ఏడు నెలల వేతనం చెల్లించాల్సి ఉంది. రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన పారితోషికం సైతం రాలేదు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు గోపాలమిత్ర సిబ్బంది వాపోతున్నారు. గోపాలమిత్రలకు 9నెలలుగా అందని వేతనం కృత్రిమ గర్భధారణ లక్ష్యం పూర్తికాకుంటే జీతంలో కోత -
లెక్చరర్లు లేరు.. చదువులెట్లా?
● జూనియర్ కళాశాలల్లో వెక్కిరిస్తున్న ఖాళీలు ● కానరాని ఫిజికల్ డైరెక్టర్లుకరీంనగర్: సకల వసతులు కల్పించి విద్యార్థులను ఆకర్షించేలా ప్రభుత్వం కృషి చేస్తున్నా.. సరిపడా బోధన, బోధనేతర సిబ్బంది లేక ప్రభుత్వ జూనియర్ కళాశాలలు వెలవెలబోతున్నాయి. ఈ విద్యాసంవత్సరం నుంచి ఎలాంటి అవాంతరాలు లేకుండా తెరచుకు న్న ప్రభుత్వ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది లేకపోవడం సమస్యగా మారింది. ప్రభుత్వ కళాశాలల్లో పేద, మధ్యతరగతి విద్యార్థులు ఎక్కువగా ప్రవేశాలు పొందుతారు. బడుగు విద్యార్థుల బాగోగులే తమ లక్ష్యమని గొప్పలు చెప్పుకునే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సమస్యలను పరిష్కరించకపోవడాన్ని చూస్తుంటే విద్యావ్యవస్థపై ఎంతటి ప్రేమ ఉందో ఇట్టే తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా 11 ప్రభుత్వ కళాశాలలుండగా.. పది కళాశాలల్లో ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులు ఖాళీగా వెక్కిరిస్తున్నాయి. జిల్లాకేంద్రంలోని ఆర్ట్స్ కళాశాలలో మాత్రమే ఒకే ఒక్క ఫిజికల్ డైరెక్టర్ విధులు నిర్వహిస్తున్నాడు. మిగతా పది మంది ఫిజికల్ డైరెక్టర్లు లేకపోవడం చూస్తుంటే వ్యాయామ విద్యపై ఎంతటి మక్కువ ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్నేళ్లుగా కాంట్రాక్ట్, గెస్ట్ లెక్చరర్లతో కళాశాలల్లో తరగతులు బోధిస్తున్న ప్రభుత్వం.. గత విద్యాసంవత్సరంలో వారినే ఎక్కడికక్కడ రెగ్యులరైజ్ చేయడంతో బోధన సిబ్బంది కొరత కొంత తీరినట్లయింది. లైబ్రేరియన్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, రికార్డు అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేటర్ల నియమాక ప్రక్రియకు సంబంధించి గత విద్యాసంవత్సరంలో కొన్ని పోస్టులు భర్తీ కాగా.. మరికొన్ని పోస్టులు ఖాళీలుగానే వెక్కిరిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా సీనియర్ అసిస్టెంట్ పోస్టులు మరో ఐదు ఖాళీలుగానే ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. సబ్జెక్టులవారీగా లెక్చరర్లు లేకపోవడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు సైతం ప్రైవేట్ కళాశాలల్లో చదివేందుకే మొగ్గు చూపుతుండడం గమనార్హం. కళాశాలలు ప్రారంభమవుతుండడంతో.. బోధన, బోధనేతర సిబ్బందిని నియమించకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ప్రథమ సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ఆన్లైన్లో కొనసాగుతోంది. మరో వారం రోజుల్లో మొదటి విడత ప్రక్రియ ముగియనుంది. మున్ముందు సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కళాశాలల్లో లెక్చరర్లు లేకపోవడంతో పేద విద్యార్థులు నష్టపోయే పరిస్థితి నెలకొంది. ఇకనైనా ఇంటర్ విద్యావ్యవస్థపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని పలువురు విద్యాభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ పరిధిలోని అంశం జిల్లాలో 11 జూనియర్ కళాశాలలున్నాయి. నేటి నుంచి కళాశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 15 మంది కాంట్రాక్టు లెక్చరర్లు, 19 మంది గెస్ట్ లెక్చరర్లు, పది మంది ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బోధనేతర సిబ్బంది పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. నియామకాలకు సంబంధించిన ప్రక్రియ ఇంటర్మీడియట్ విద్యామండలి, ప్రభుత్వ పరిధిలోని అంశం. ప్రస్తుతం బోధనకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటాం. – గంగాధర్, డీఐఈవోసవతి తల్లి ప్రేమ తగదు ప్రభుత్వ విద్యావ్యవస్థపై పాలకులకు పట్టింపు లేదు. ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. ప్రైమరీ, ఇంటర్, ఉన్నత విద్యను పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా చేసిన పాలకుల వైఖరిని ఎండగట్టేందుకు విద్యార్థి లోకం ఏకం కావాల్సిన అవసరముంది. ఇకనైనా ప్రభుత్వం విద్యావ్యవస్థపై సవతి తల్లి ప్రేమను విడనాడాలి. కీలకమైన ఇంటర్ బోధనపై ప్రభుత్వం దృష్టి సారించాలి. – మచ్చ రమేశ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిఇంటర్ కళాశాలల్లో ఖాళీలిలా.. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు: 11 కాంట్రాక్ట్ లెక్చరర్లు: 15 గెస్ట్ లెక్చరర్లు: 19, ఫిజికల్ డైరెక్టర్లు: 10 -
ప్రమాదాలకు నిలయంగా రేకుర్తి వంతెన
కొత్తపల్లి(కరీంనగర్): రేకుర్తిలోని వంతెనపై తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. శనివారం మధ్యాహ్నం ఓ షిఫ్ట్కారు వంతెనపెకి దూసుకెళ్లింది. అదుపుతప్పి వాగులో పడితే పెద్ద ప్రమాదమే జరిగుండేది. ఇలాంటి ప్రమాదాలు నిత్యం చోటుచేసుకుంటున్నా వంతెనకు రక్షణ చర్యలపై దృష్టి సారించడం లేదు. సంబంధిత అధికారులు స్పందించి వంతెనకు మరమ్మత్తులు చేపట్టడంతో పాటు సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. పురాతన వంతెన కరీంనగర్ శివారు రేకుర్తిలోని పురాతన వంతెన ప్రమాదాలకు నిలయంగా మారింది. కరీంనగర్– జగిత్యాల ప్రధాన రహదారిపై గల వంతెన సైడ్బర్మ్స్ శిథిలావస్థకు చేరి ప్రమాదాలు చోటుచేసుకుంటన్నాయి. కరీంనగర్– జగిత్యాల ప్రధాన రహదారిని కలిపే ఈ వంతెనకు మరమ్మత్తులు చేపట్టడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ఈ ప్రధాన రహదారిపై గల పాత వంతెన మీదుగా జగిత్యాల వైపు నుంచి వచ్చే వాహనాలు ప్రయాణిస్తుంటాయి. నిత్యం వేలాది వాహనాలు తిరుగుతుంటాయి. దీంతో తరచూ రేకుర్తి వంతెన సమీపంలోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో గతంలో పలువురు చనిపోగా.. మరికొంతమంది గాయాల బారిన పడి బయటపడ్డారు. అయితే ఇరుకుగా ఉన్న వంతెన గోడలు దెబ్బతినడం..ఇరువైపుల రక్షణగా ఏర్పాటు చేసిన సైడ్బర్మ్స్ను వాహనాలు ఢీకొడుతుండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. -
దోమల నివారణ అందరి బాధ్యత
కరీంనగర్టౌన్: దోమల నివారణ అందరి బాధ్యత అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అన్నారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ఉమాశ్రీ ఆధ్వర్యంలో శనివారం విద్యానగర్ పట్టణ ఆరోగ్యకేంద్రం పరిధిలోని తెలంగాణ బధిరుల పాఠశాలలో దోమల మందు స్ప్రే చేయించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో దోమలు వృద్ధి చెందకుండా దోమ లార్వా నిర్మూలనకు తీసుకోవలసిన చర్యల గురించి, ప్రతి శుక్రవారం, మంగళవారం డ్రైడే పాటించడం గురించి సిబ్బందికి అవగాహన కల్పించారు. విద్యానగర్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఎన్సీడీ రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సుమన్ పాల్గొన్నారు. -
గరుడ జంక్షన్పై కమిషనర్ ఆరా
సాక్షి ప్రతినిధి,కరీంనగర్: నగరంలోని పద్మనగర్ (గరుడ) జంక్షన్ పనులపై నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆరా తీశారు. రూ.కోటి జంక్షన్ పనులకు అదనంగా, టెండర్ లేకుండానే రూ.80 లక్షల పనులు కేటాయించడం, పనుల్లోనూ అక్రమాలకు ప్రయత్నిస్తుండడంపై ఈ నెల 19వ తేదీన ‘సాక్షి’లో వచ్చిన ‘స్మార్ట్ పన్నాగం’ కథనానికి ఆయన స్పందించారు. శనివారం పద్మనగర్లో జంక్షన్ పనులను కమిషనర్ సందర్శించారు. జంక్షన్ మ్యాప్ను పరిశీలించారు. ఎం–15, ఎం–30 డిజైన్లలో ఏ డిజైన్తో పనులు చేస్తున్నారంటూ అధికారులను ప్రశ్నించారు. పనుల ఒప్పందం, నిబంధనలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనలు, నాణ్య తను పాటించాలని ఆదేశించారు. ఈఈలు సంజీవ్ కుమార్, యాదగిరి, డీఈలు లచ్చిరెడ్డి, అయూబ్ఖాన్ ఉన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలి కరీంనగర్కార్పొరేషన్: నగరం పరిశుభ్రంగా ఉండేలాచర్యలు తీసుకోవాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయి ఆదేశించారు. పరిసరాల్లో చెత్త కనిపించకుండా చూడాలని, ప్రతి స్వచ్ఛ ఆటో డీఆర్సీ సెంటర్లకు రావాలన్నారు. శనివారం నగరంలోని పలు డివిజన్లలో పారిశుధ్య పరిస్థితిని పరిశీలించారు. ఎస్ఆర్ఆర్ కళాశాల రిజర్వాయర్ పరిధిలోని డీఆర్సీ సెంటర్ను సందర్శించారు. డ్రై రిసోర్స్ కలెక్షన్కు సంబంధించిన రిజిస్టర్ను తనిఖీచేశారు. నగరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చర్యలు చేపట్టాలన్నారు. తడి చెత్తను కంపోస్టు కేంద్రాలకు, పొడి చెత్తను డీఆర్సీ కేంద్రాలకు తరలించాలన్నారు. నర్సరీల్లో పెంచే మొక్కలు ఎండి పోకుండా సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు.● పద్మనగర్లో పనులు పరిశీలన -
నిందితులకు శిక్ష పడేలా పని చేయాలి
కరీంనగర్క్రైం: వివిధ కేసుల్లో సాక్షులను సకా లంలో కోర్టులో హాజరుపరిచి నిందితులకు శిక్ష పడే విధంగా కోర్టుడ్యూటీ ఆఫీసర్లు (సీడీవో) లు విధులు నిర్వహించాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. కమిషనరేట్ పరిధిలోని సీడీవోలతో శనివారం సమీక్ష నిర్వహించారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులపై సమగ్రంగా ఆరా తీశారు. డీడీ, ఈ–పెట్టీ కేసుల పెండింగ్పై చర్చించి, త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ కేసులను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. అడిషనల్ డీసీపీ వెంకటరమణ, సీసీఆర్బీ ఏసీపీ విజయ్కుమార్, ఇన్స్పెక్టర్లు సరిలాల్, సంతోష్కుమార్ పాల్గొన్నారు. ‘కౌశిక్రెడ్డిపై కేసు సరికాదు’ కరీంనగర్: హుజూ రాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై ప్ర భుత్వం ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు నమోదు చేయడం సరికాదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ. రామకృష్ణరావు పేర్కొన్నారు. శనివారం నగరంలో మాట్లాడుతూ.. శంషాబాద్ విమానాశ్రయంలో ఎమెల్యే కౌశిక్రెడ్డిని అరెస్టు చేసి వరంగల్ సుబేదారి పోలీస్స్టేషన్కు తరలించడాన్ని ఖండించారు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రశ్నించినందుకు కౌశిక్రెడ్డిపై కేసులు పెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ తీరు మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి బండి సంజయ్ రేవంత్రెడ్డితో కుమ్ముకై బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టేలా చేస్తున్నారని ఆరోపించారు. బల్దియా కమిషనర్ను కలిసిన టీఎన్జీవోలు కరీంనగర్ అర్బన్: కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ప్రఫుల్ దేశాయ్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ డీడీగా బాధ్యతలు చేపట్టిన రంజిత చికిలేను తెలంగాణ నాన్గెజిటెడ్ ఉద్యోగుల సంఘం కరీంనగర్ ఆధ్వర్యంలో శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్రెడ్డి, కార్యదర్శి సంగెం లక్ష్మణ్రావు, టీజీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళిచరణ్, కేంద్ర సంఘం నేతలు నాగుల నరసింహాస్వామి పాల్గొన్నారు. అవకతవకలు జరగొద్దు ఇల్లందకుంట: జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదని గ్రామీణ అభివృద్ధిశాఖ జిల్లా అధికారి శ్రీధర్ పేర్కొన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో 4వ విడత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ నిర్వహించారు. డీఆర్డీఏ శ్రీధర్ ఆధ్వర్యంలో ఆడిట్ నిర్వహించారు. మండలంలోని 18గ్రామాల్లో 2024–2025 సంవత్సరానికి గాను రూ.3.82కోట్ల పనులు జరిగాయన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు రికార్డు మెయింటెనెన్స్, మస్టర్ రోల్లో పేర్లు రాయకపోవడం, రికార్డుల విషయంలో పొరపాట్లు జరిగాయాని గుర్తించారు. రికార్డుల్లో పొరపాట్లకు తావు లేకుండా పనిచేయాలని ఆదేశించారు. విజిలెన్స్ అధికారి వెంకటేశ్వర్రెడ్డి, శ్రీనివాస్, ప్రదీప్ ఎంపీడీవో పుల్లయ్య, ఏపీవో రవికుమార్ పాల్గొన్నారు. లాటరీ పద్ధతిలో ఎంపిక విద్యానగర్: జిల్లాలోని బెస్ట్ అవెలబుల్ స్కూళ్లలో 2025–26 విద్యాసంవత్సరంలో 1వతరగతి(నాన్ రెసిడెన్షియల్), 5వతరగతి(రెసిడెన్షి యల్)లో ఎస్సీ విద్యార్థుల ప్రవేశాలను ఈనెల 25న ఉదయం 11 గంటలకు కరీంనగర్ కలెక్టరేట్లో లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నట్లు షెడ్యూల్డ్ కూలాల అభివృద్ధిశాఖ ఉప సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. -
లారీ.. బారులుతీరి..
ఒకటి కాదు రెండు కాదు.. ఒకదాని వెంట మరొకటి.. వందల కొద్దీ లారీలు రైలు బోగీలను తలపిస్తూ రహదారిపై బారులు తీరాయి. లోడింగ్ ఇసుక కోసం కిలోమీటర్ల మేర నిలిచిన లారీలను చూస్తూ వచ్చిపోయే ప్రయాణికులు రైలు డబ్బాలను తలపిస్తున్నాయంటూ చమత్కరించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్ పల్లి వద్ద ఇసుక క్వారీ కొనసాగుతోంది. ఆన్లైన్లో డీడీలు కట్టి ఇసుక లోడింగ్ కోసం వచ్చిన లారీలు ఇలా రహదారిపై క్యూలో నిలపడం ‘సాక్షి’ కెమెరాకు కనిపించింది. కాగా, పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక లారీలతో తిప్పలు పడుతున్నామని రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగిన సందర్భాలు లేకపోలేదని వాపోతున్నారు రహదారి వెంట ఉన్న గ్రామాలవాసులు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
యోగానందం
● నిత్య సాధనతో ఆరోగ్యం ● ఉమ్మడి జిల్లాలో పెరిగిన అవగాహన ● ఆరోగ్యంగా జీవిస్తున్న జనం ● నేడు ప్రపంచ యోగా దినోత్సవం సిరిసిల్లటౌన్: ఆరోగ్యమే మహా భాగ్యమంటూ జిల్లా ప్రజలు యోగా సాధన చేస్తున్నారు. శారీరకంగా ధృడంగా ఉంటే ఏదైనా సాధించవచ్చనే ఉద్దేశంతో ఆరో గ్యంపై దృష్టి పెడుతున్నారు. ఈక్రమంలోనే వయసుతో సంబంధం లేకుండా నిత్యం యోగా సాధన చేస్తూ చలాకీగా జీవిస్తున్నారు. విధుల్లో ఒత్తిడి..మానసిక..శారీరక శ్రమను తట్టుకునేందుకు అందరిబాట యోగానే మారింది. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యోగా సాధనతో కలిగే ప్రయోజనాలు, సాధకుల అభిప్రాయాలు... -
టీచర్ నుంచి రాష్ట్ర జట్టు కోచ్ వరకు..
శంకరపట్నం: వెంకటేశ్వర్లపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం లక్కాకుల కోటేశ్వర్రావు 15 ఏళ్లుగా యోగాలో శిక్షణ ఇస్తున్నారు. బాబా రాందేవ్ వద్ద హరిద్వార్లో శిక్షణ పొందారు. యోగాతో ఏకాగ్రత పెరుగుతుందని, ధ్యానంతో మనసు ఉత్తేజపరుస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర జట్టుకు కోచ్గా శిక్షణ ఇవ్వడంతో తిరువనంతపురం, హిమాచల్ప్రదేశ్లో జరిగిన పోటీల్లో పతకాలు సాధించారు. సిరిసిల్లకల్చరల్: సిరిసిల్లకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉప్పల శ్రీనివాస్ జీవన ప్రయాణమే యోగగా మారింది. ఆదియోగి నిత్య యోగ సాధనాలయం పేరిట శిక్షణసంస్థను నెలకొల్పి ఇప్పటికే వందలాది శిబిరాలను ఏర్పాటు చేశారు. చాలా మంది యోగా సాధకులను తయారు చేశారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని భావించి మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. శ్రీనివాస్.. జీవనయోగం -
దేశవ్యాప్త కులగణన కాంగ్రెస్ విజయం
● ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి కరీంనగర్ కార్పొరేషన్: దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కాంగ్రెస్ సాధించిన విజయమని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎడవల్లి వెంకటస్వామి అన్నారు. రాజ్యాంగంపై జరుగుతున్న దాడులను విద్యార్థులకు వివరించేందుకు భారత్ సంవిధాన్ బచావో ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఎన్ఎస్యూఐ మాజీ ఉపాధ్యక్షుడు ఎండీ ఇమ్రా ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందిరాచౌక్ నుంచి సీవీఆర్ఎన్ రోడ్ మీదుగా అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ సాగింది. కులగణన చేపట్టిన నేపథ్యంలో రాహుల్, సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...దేశవ్యాప్త కులగణన కోసం రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచారన్నారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో కులగణన చేపట్టడం చరిత్రాత్మకమన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ఖర్గే చేపట్టిన సంవిధాన్ బచావో కార్యక్రమంలో భాగంగా వైట్ టీషర్ట్ మూమెంట్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ఆర్టీఏ సభ్యుడు పడాల రాహుల్, నగర అధ్యక్షుడు ఉప్పరి విశాల్ పాల్గొన్నారు. -
రీఫండ్ పెండింగ్ రూ.30కోట్లు !
● ప్లాట్ల రిజిస్ట్రేషన్ రద్దు చేసుకున్నా రీఫండ్ కాని డబ్బులు ● రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ప్రజలు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3వేల వరకు బాధితులు ● ఐదేళ్లుగా పెండింగ్లోనే కరీంనగర్క్రైం: ప్లాట్లు, భూములు, ఆస్తులు ఇతరత్రా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు చలాన్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వివిధ కారణాలతో రద్దయిన వారికి రీఫండ్ కావడం లేదు. గత ఐదేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుమారు 3వేల మంది రూ.30 కోట్ల డబ్బును స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించగా పలు కారణాలతో రద్దయి తిరిగి చలాన్ ఫీజు రీఫండ్ కావాలని సుమారు ఐదేళ్లనుంచి ఎదురుచూస్తున్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చకు రావడంతో కాస్త ఊపిరిపీల్చుకున్నా నేటికీ రాకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని వాపోతున్నారు. ఐదేళ్ల నుంచి ఎదురుచూపులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కలుపుకొని సుమారుగా 3వేల మంది బాధితులకు రూ.30 కోట్ల వరకు రీఫండ్ మొత్తం రావాల్సి ఉంది. రూ.10 నుండి 30 వేల వరకు చిన్న మొత్తాలు ఉన్నవారు రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకుంటే కొంతమందికి వస్తున్నట్లు సమాచారం. కానీ అంతకంటే ఎక్కువగా ఉన్న వారు సుమారుగా ఐదేళ్లనుంచి వేచి చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగినా తమ చేతిలో ఏమి లేదంటూ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చేతులెత్తేయడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. తాము చెల్లించిన రిజిస్ట్రేషన్ చలాన్ డబ్బులు వస్తాయా.. రావా అని ఆవేదన చెందుతున్నారు. ట్రెజరీ శాఖలో రిజెక్ట్ రిజిస్ట్రేషన్ శాఖలో చలాన్ డబ్బులు మొత్తం ప్రభుత్వ అకౌంట్లో జమచేస్తారు. రీఫండ్ రావాలంటే ఫైనాన్స్, ట్రెజరీ శాఖ నుంచి విడుదల కావాల్సి ఉంటుంది. ఆయా ఫైల్స్కు చెందిన ఏడాది కాలం పెండింగ్లో పెట్టిన ట్రెజరీ శాఖ అధికారులు బాధితులకు రీఫండ్ చేసేందుకు తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదన్న నెపంతో రీఫండ్ ఫైల్స్ అని రిజెక్ట్ చేయడం బాధితులకు కలవరపాటుకు గురిచేస్తోంది. పెద్ద మొత్తాల్లో ఉన్నవారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్, పెద్ద స్థాయిలో పైరవీలు చేసిన వారికి మాత్రమే వస్తున్నాయని చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ నుంచి తాము చలాన్ రూపంలో చెల్లించిన డబ్బు రీఫండ్ అయ్యేలా చూడాలని కోరుతున్నారు. -
రేపు జిల్లాకు ఇన్చార్జి మంత్రి ‘తుమ్మల’
సాక్షిప్రతినిధి,కరీంనగర్: జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం జిల్లాకు రానున్నారు. ఇన్చార్జి మంత్రిగా గతంలో ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డి స్థానంలో తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల నియామకం కావడం తెలిసిందే. మొదటిసారి ఆయన జిల్లాకు రానున్నారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించనున్నారు.డీజిల్ లేక నిలిచిన ట్యాంకర్లుకరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో డీజిల్ లేకపోవడంతో ట్యాంకర్లు నిలిచిపోయా యి. గత డీజిల్ బకాయిలు రూ.5.50 లక్షలు చెల్లించకపోవడంతో పెట్రోల్ బంక్ నిర్వాహకులు నగరపాలకసంస్థ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన వాహనాలకు డీజిల్ పోయడం నిలిపివేసినట్లు సమాచారం. దీంతో శుక్రవారం ఆయా రిజర్వాయర్లలోని వాహనాలు కదలలేదు. గత నెల రోజులుగా డీజిల్ లేక వాహనాలు నిలిచిపోవడం ఇది రెండోసారి. డీజిల్ లేక వాహనాల సేవలు అందకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారులు డీజిల్ వ్యవహారంపై దృష్టి సారించాల్సి ఉంది. 1.77లక్షల మంది రైతులు.. రూ.165 కోట్లుకరీంనగర్ అర్బన్: రైతు భరోసా రైతుల ఖాతాకు చేరుతోంది. జిల్లాలో 2,10,904 మంది రైతులకు గాను ప్రభుత్వం ఎకరానికి రూ.6 వేల చొప్పున రూ.211.90 కోట్లు కేటాయించింది. ఈనెల 16న 1,24,727 లబ్ధిదారులకు రూ.65.79కోట్లు, 17న 27307 లబ్ధిదారులకు రూ.40.25 కోట్లు, 19న 15,995 మంది రైతులకు రూ.32.91 కోట్లు, 20న 9,955 మంది రైతులకు రూ.26.39 కోట్లు మొత్తం 1,77,984 మందికి రూ.165.35 కోట్లు జమయ్యాయని డీఏవో భాగ్యలక్ష్మి వివరించారు. నేడు కళా భారతిలో సంగీత దినోత్సవం కరీంనగర్ కల్చరల్: ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ప్రవీణ్ సల్వాజీ మ్యూజికల్ గ్రూప్, సల్వాజి ఈవెంట్స్, కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి సంగీత దినోత్సవ వేడుక, కీర్తి ఘటించిన స్వర్గీయ కళాకారుల పేరిట స్మారక పురస్కారాల ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకుడు సల్వాజి ప్రవీణ్ ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఉమ్మడి 10 జిల్లాల నుంచి కళాకారులు హాజరవుతారని, సంగీత విభావరి, నత్య ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సినిమా, జానపద పాటలు పాడే కళాకారులకు వాయిద్య సహకారం కల్పిస్తామన్నారు. రేపు శాతవాహనలో వార్షిక క్రీడా దినోత్సవంకరీంనగర్స్పోర్ట్స్: శాతవాహన విశ్వవిద్యాలయంలో ఈ నెల 22న విశ్వవిద్యాలయ వార్షిక, క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వైస్చాన్స్లర్ ఆచార్య ఉమేశ్ కుమార్ తెలిపారు. ప్రతీ సంవత్సరం వార్షిక క్రీడా దినోత్సవ సందర్భంగా బోధన సిబ్బంది, విద్యార్థులకు క్రీడా పోటీలతో పాటు సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, త్రో బాల్, లాంగ్ జంప్, హైజంప్, అథ్లెటిక్స్, షటి ల్, క్రికెట్, చెస్, క్యారం, టేబుల్ టెన్నీస్ వ్యాసరచన, వకృత్వ పోటీలు ఉంటాయన్నారు. -
సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి
● జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణకరీంనగర్టౌన్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ సూచించారు. శుక్రవారం బుట్టి రాజారామ్ కాలనీ ఆరోగ్యకేంద్రంలో మహిళా హెల్త్ క్యాంపు పరిశీలించి అక్కడికి వచ్చిన మహిళలతో మాట్లాడారు. హాజరు పట్టిక, రికార్డులను తనిఖీ చేసి, ల్యాబోరేటరీ, ఫార్మసీ స్టోర్స్లో మందుల నిల్వలు పరిశీలించారు. ఎన్సీడీ క్లినిక్లోని అధిక రక్తపోటు, డయాబెటిస్ రోగులను పరీక్షిస్తున్న విధానాన్ని వివరాలను, మందుల వివరాల నమోదు రికార్డులను పర్యవేక్షించారు. ఆరెపల్లి బస్తీ దవాఖానా సందర్శించి హాజరు పట్టిక, ఎన్సిడీ రికార్డులు, ఓపీ రిజిస్టర్ను పరిశీలించారు. సనజ వేరియా, లావణ్య, రవళి పాల్గొన్నారు. -
సీసీల ముందు అంతా.. అయ్యా ఎస్లే!
● అక్రమాలకు ఆలవాలంగా సీసీలు ● ఐఏఎస్లను కీలుబొమ్మలుగా మార్చారన్న విమర్శలు ● భూరికార్డులు మార్చిన ఘనత కూడా వీరికే ● క్రిమినల్ కేసులున్నా.. అంటి పెట్టుకుంటున్న కలెక్టరేట్ కార్యాలయం ● జిల్లాలో ఏ స్కాం వెలుగుచూసినా.. అభయమిచ్చేది వీరే!సాక్షిప్రతినిధి, కరీంనగర్ ●: వారు క్యాంప్ క్లర్కులే.. హోదా చిన్నదే.. అయితేనేం.. వారి ముందు ఎవరైనా సరే.. అయ్యా..ఎస్! అంటూ మోకరిల్లాల్సిందే. వీరి వద్ద ఏం మాయ ఉందో ఏమో తెలియదు కానీ... ఉన్నత చదువులు చదువుకున్న ఆఫీసర్లు కూడా వారి చేతిలో కీలుబొమ్మలుగా మారిన వైనం ఇంకెక్కడా లేకపోవడం గమనార్హం. వీరు భూరికార్డులను మార్చినా, శ్మశాన వాటికలను మింగేసేవారికి అండగా నిలబడ్డా, చివరికి తోటి తహసీల్దార్ భూమిని సైతం ఇతరులకు మ్యుటేషన్ చేసే ఘనులు ఇక్కడ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. జిల్లాలో ఎక్కడ ఏం స్కాం వెలుగుచూసినా.. ఇక్కడ ఐఏఎస్ల కంటే ముందు వీరి వద్దకే అంతా వస్తారు.. అక్కడే వీరు చక్రం తిప్పుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఐఏఎస్ల టేబుళ్లపై ఏ ఫైల్ ఉండాలి? వారు ఏ ఫైల్ చూడాలి? ఎవరిని కలవాలి? ఎవరిని కలవద్దు? అన్న విషయాల్లో వీరి నిర్ణయమే ఫైనల్. అందుకే, ఎన్ని అవినీతి కేసులు, కుంభకోణాలు వెలుగుచూసినా.. కరీంనగర్ జిల్లాలో ఐఏఎస్ అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడానికి సీసీలే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. వీరి గాథలు ఇన్నిన్ని కాదయా? ఉద్యోగ నిబంధనలు, బదిలీలు, ఎన్నికల కోడ్ తదితరాలు వర్తించవు. ఎందుకంటే ఉన్నతాధికారులు వీరి జేబులో ఉన్నారన్న నమ్మకమే ఇక్కడ అక్రమాలకు ఎదురులేకుండా పోతుందన్న విమర్శలు ఉన్నాయి. వీరిలో అందరి కంటే సీనియర్ తహసీల్దార్ ర్యాంకులో ఓ సీసీ ఉన్నారు. ఆయన 2009 నుంచి ఇక్కడే కొనసాగుతున్నారు. ఆర్ఐ ర్యాంకులో సీసీగా వచ్చిన ఈయన ప్రస్తుతం కలెక్టర్ కార్యాలయంలో సీసీగా పనిచేస్తున్నారు. తహసీల్దార్గా పదోన్నతి వచ్చిన సమయంలో జిల్లాలో ఎక్కడా ఖాళీ లేదు. దీంతో ఆయన పెద్దపల్లికి వెళ్లాల్సి వచ్చింది. ఆలోచించాడు.. చక్రం తిప్పి కరీంనగర్ డీఆర్డీఏకు ఫారిన్ సర్వీస్ కింద వచ్చారు. తరువాత మరోసారి స్కెచ్ వేసి కలెక్టరేట్లో హెచ్–విభాగానికి సూపరింటెండెంట్గా ఉన్న తహసీల్దార్ను బలవంతంగా అక్కడ నుంచి డీఆర్డీఏకు పంపారు. ఇక తాను వెళ్లి ఆ పోస్టులో పాగా వేశారు. ఒకసారి కొత్తపల్లికి తహసీల్దార్గా వ్యవహరించిన ఓ వ్యక్తి.. కిసాన్ నగర్లోని తోటి తహసీల్దార్ భూమిని ఇతరులకు మ్యుటేషన్ చేశాడు. అతనిపై విజిలెన్స్ విచారణ జరిపి క్రిమినల్ చర్యలకు సిఫారసు చేసింది. అయితే... అపుడు ఈ సీనియర్మోస్ట్ సీసీ రంగంలోకి దిగి కలెక్టర్ కళ్లకు గంతలు కట్టారు. విజిలెన్స్ విచారణను తొక్కిపెట్టి సదరు తహసీల్దార్ను కాపాడుకున్నాడు.● కరీంనగర్లో ఇలాంటి సీసీలంతా ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరికి తహసీల్దార్ హోదాలో ఉన్న ఓ రాజగురువు తోడున్నారు. ఎవరు ఎక్కడ పనిచేయాలో ఇతను నిర్ణయిస్తాడు. జిల్లాలో ఏ స్కాం వెలుగుచూసినా.. ఇతన్ని సంప్రదిస్తే చాలు.. విచారణ లేకుండా నింది తులందరినీ కాపాడే బాధ్యత ఇతనే భుజాల కెత్తుకుంటాడు. ఈయన శశాంక కలెక్టర్గా ఉన్న సమయంలో ఇదే రాజగురువు ఓ వివా దంలో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. బొమ్మకల్లోని ఏడెకరాల భూమిని అక్రమంగా ఇతరులకు విరాసత్ చేయడంతో ఆగ్రహించిన కలెక్టర్ సదరు రాజగురువును పక్కనబెట్టా రు. ఇటీవల నకిలీ ఫ్యామిలీ లీగర్హెయిర్ సర్టిఫికెట్ కేసులో ఇతనిపై క్రిమినల్ కేసులు కూడా నమోదైంది. కానీ...ఇతను అరెస్టు కా కుండా ఉన్నతాధికారులు కాపాడుతున్నార న్న విమర్శలు రావడం దారుణమని సాక్షా త్తూ.. కలెక్టరేట్ సిబ్బందే వాపోతున్నారు. ● హెల్త్ నుంచి రెవెన్యూకు, రెవెన్యూ నుంచి ఇపుడు మున్సిపాలిటీకి ఇష్టం వచ్చినట్లు ఫారిన్ సర్వీసులకు ఇట్టే వెళ్తున్న మరో సీసీ కథలు ఇన్నీఅన్నీకావు. మాతృశాఖ అయిన డీఎంహెచ్వోలో సీసీగా ఉన్న సమయంలో కరీంనగర్లోని ప్రైవేటు నర్సింగ్ హోంల నుంచి మామూళ్లు వసూళ్లు చేస్తున్నారన్న కారణంతో అప్పటి డీఎంహెచ్వో అతన్ని వావిలాల పీహెచ్సీకి బదిలీ చేశారు. అయినా...మనోడు అక్కడ విధులు నిర్వర్తించకుండా తిరిగి రాజగురువు సాయంతో తిరిగి కలెక్టరేట్లో ఓ అడిషనల్ కలెక్టర్ వద్ద సీసీగా మకాం వేశాడు. ఇపుడు అడిషనల్ కలెక్టర్ బల్దియాకు వెళ్లడంతో అతనితోపాటు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకోవడం విశేషం. ఇతని మీద గతంలో ఏసీబీ నిఘా పెట్టిన విషయం తెలిసిందే. ● ఇక బల్దియాలో కొందరు సీసీలు రెండాకులు ఎక్కువే చదివారు. ఇక్కడ పనిచేసే వారు ఔట్ సోర్సింగ్ అయినా.. మున్సిపల్ కమిషనర్లను జేబులో ఉంచుకున్నామని కలరింగ్ ఇస్తున్నారు. ఆ ధైర్యంతో కార్పొరేషన్లో శాశ్వత సిబ్బందిని, సీనియర్ ఇంజినీర్లను అందరి ముందే పేర్లు పెట్టి పిలవడం, ‘నువ్వు’ అని సంబోధించడం వీరికి ఉన్నతాధికారులు ఇచ్చిన స్వేచ్ఛకు నిదర్శనం. బల్దియాలో విధులు నిర్వర్తిస్తున్న పలువురు మహిళలను పలు రకాలుగా వేధిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నా.. వీరిపైనా ఎలాంటి చర్యలు ఉండకపోవడం గమనార్హం. ● మొత్తానికి కరీంనగర్ జిల్లా పరిపాలనకు పార్టీలతో, ప్రభుత్వాలతో పనిలేదని.. ఇక్కడ ఏం స్కాం జరిగినా.. నిందితులు సీసీలను ఆశ్రయిస్తే చాలు.. వారే చూసుకుంటారు అన్న ప్రచారం ఉంది. అసలు సీసీల మీదే క్రిమినల్ చర్యలున్నా.. పట్టించుకోని ఉన్నతాధికారులు.. ఇక బయట వారు స్కాంలకు పాల్పడితే మాత్రం ఎలా పట్టించుకుంటారు? అన్న ప్రచారంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.కదలరు.. వదలరు -
– వివరాలు 8లోu
ఆస్తమా, బీపీ పోయాయి కరీంనగర్స్పోర్ట్స్: సర్వరోగ నివారణి యోగా అనే దానికి నేనే నిదర్శనం. యోగాసనాలు చేయకముందు బీపీ, ఆస్తమాతో బాధపడ్డాను. ఇక్కడ డేకేర్ సెంటర్కు వచ్చినప్పటి నుంచి అన్ని నయమయ్యాయి. ఇప్పుడు చాలా చురుకుగా ఉండగలుగుతున్నాను. – కె.అరుణ , కరీంనగర్యోగాతో నయమైంది కరీంనగర్స్పోర్ట్స్: 2013 నుంచి 2016 వరకు అనారోగ్యంతో బాధపడ్డాను. యోగా చేయాలని పలువురు చెప్పడంతో ప్రతీ రోజు సాధన చేస్తున్నాను. ప్రస్తుతం ఎలాంటి రోగాలు లేకుండా చాలా సంతోషంగా గడుపుతున్నాను. – కె.వందన, కరీంనగర్ -
ముగిసిన బడిబాట
కరీంనగర్: ఈ విద్యా సంవత్సరంలో ఈనెల 6 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించిన ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం సత్ఫలితాలనిచ్చింది. కలెక్టర్, ఉన్నతాధికారులు , ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు విస్తృతంగా ప్రచారం నిర్వహించి ప్రవేశాలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా ఎంఈ వోలు మూతపడిన ఎనిమిది పాఠశాలలను తెరిపించడం విశేషం. శుక్రవారం వరకు 4,521 మంది ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు తీసుకున్నారు. కొత్తగా 4,521 మంది చేరిక బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్చంద సంస్థలు, మహిళ సంఘాలను భాగస్వాములను చేశారు. దీంతో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. అంగన్వాడీ కేంద్రాల నుంచి 1,790 మంది, ప్రైవేట్పాఠశాలల నుంచి 1,330, నేరుగా ఆయా తరగతుల్లో ప్రవేశం పొందినవారు 1,401మంది మొత్తంగా 4,521 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 4521 మంది ప్రవేశాలు పొందారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య ఇంకా పెరిగే అవకాశం మెండుగా ఉంది. ఉపాధ్యాయులు ఆంగ్లంలో బోధించేలా సర్వం సిద్ధం చేశాం. తొలిరోజే పాఠ్యపుస్తకాలు, దుస్తులు, నోట్బుక్స్, వర్క్బుక్స్ 96 శాతం పంపిణీ చేశాం. – శ్రీరామ్ మొండయ్య, డీఈవో పెరిగిన ప్రవేశాలు 4,521 మంది చేరిక తెరుచుకున్న ఎనిమిది పాఠశాలలుబడిబాటలో పంపిణీ చేసిన పుస్తకాలు, దుస్తులు పాఠ్యపుస్తకాలు 3,05,520 దుస్తులు 39,098 వర్క్బుక్స్ 40,838 నోట్బుక్స్ 2,23,183విద్యార్థుల నమోదు ఇలా 1వ తరగతిలో చేరిన విద్యార్థులు 1,719 2 నుంచి 10వ తరగతి వరకు చేరినవారు 1,401 ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేరినవారు 1,330 -
బొమ్మకల్ పంచాయతీ భవనం విక్రయం!
కరీంనగర్రూరల్: కరీంనగర్ కార్పొరేషన్లో విలీనమైన బొమ్మకల్కు చెందిన గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు విక్రయించేందుకు చేస్తున్న ప్రయత్నాలు వివాదాస్పదంగా మారాయి. గురువారం మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ను వార్డు మాజీ సభ్యులు కలిసి పంచాయతీ భవనం విక్రయించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఫిర్యాదు చేశారు. కరీంనగర్ మండలం బొమ్మకల్ గ్రామ పంచాయతీగా ఉన్నపుడు సర్వే నంబరు–17లోని స్థలాన్ని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్లాట్లుగా చేసి విక్రయించింది. లేఅవుట్ నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీకి విడిచిపెట్టిన మూడు గుంటల స్థలంలో 2023 సంవత్సరంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి అప్పటి మంత్రి గంగుల కమలాకర్ భూమిపూజ చేశారు. మూడు అంతస్తుల్లో భవన నిర్మాణపు పనులను స్థానిక నాయకుడికి అప్పగించారు. పంచాయతీ నిధులు రూ.2,12,000తో విద్యుత్ మీటర్, బోరు వేసి విద్యుత్ మోటారు బిగించారు. స్లాబ్ వేసేందుకు కాంట్రాక్టర్కు పంచాయతీ నిధులు రూ.8లక్షలు చెల్లించారు. సర్పంచ్ పదవీకాలం ముగుస్తున్న క్రమంలో 26 జనవరి 2024 సంవత్సరంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆరు నెలల క్రితం బొమ్మకల్ గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం చేయడంతో భవన నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు పంచాయతీకి కేటాయించిన స్థలాన్ని జీపీకి రిజిస్ట్రేషన్ చేయలేదనే కారణంతో కొందరు మాజీ ప్రజాప్రతినిధులు భవనాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. సదరు రియల్టర్లతో కుమ్మక్కయి చేస్తున్న ప్రయత్నాలు బొమ్మకల్లో చర్చనీయాంశంగా మారాయి. అప్రమత్తమైన వార్డు మాజీ సభ్యులు గూడ తిరుపతిరెడ్డి, వరాల శ్రీనివాస్, తోట కిరణ్కుమార్, గాదె శ్రీనివాస్ గురువారం మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ను కలిసి పంచాయతీ భవనం విక్రయించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఫిర్యాదు చేశారు. భవనాన్ని స్వాధీనం చేసుకొని వార్డు కార్యాలయంగా ఏర్పాటు చేయాలని కోరగా.. విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటానని కమిషనర్ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. మాజీ ప్రజాప్రతినిధులతో కుమ్మక్కయి ప్రయత్నిస్తున్న రియల్టర్లు మున్సిపల్ కమిషనర్కు వార్డు మాజీ సభ్యుల ఫిర్యాదు -
చూస్తే చిల్లరే.. కోట్లలో దోపిడీ
కరీంనగర్ అర్బన్: కోడి కూర .. ఈ పేరు వింటేనే నోరూరుతోంది. సుట్టమొచ్చినా.. సంతోష వేడుకై నా.. విషాదమైనా ముక్కలు ఉడకాల్సిందే. జిల్లాలో వీటి వినియోగం ఎక్కువ. ఽనిత్యం 40 వేల క్వింటాళ్ల చికెన్ అమ్ముడుపోతుండగా.. చికెన్ సెంటర్ల నిర్వాహకులకు కాసుల పంటే. పేరుకు పేపర్ రేటని చెబుతూ వీలైనంత మేర దండుకుంటున్నారు. పేపర్ ధర ఒకటైతే విక్రయించేది మాత్రం కిలోకు రూ.40 అదనం. ఇదేంటంటే మేమింతే..నన్న ఈసడింపు సమాధానం. జిల్లాలో నిత్యం రూ.4.20 కోట్ల వ్యాపారం సాగుతుండగా అదనంగా రూ.1.20 కోట్లు దోచుకుంటున్నారు. ఈ లెక్కన నెలకు రూ.36 కోట్ల మేర వినియోగదారులను పిండేస్తుండగా నియంత్రించే వారే లేకపోవడంతో అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. చికెన్ సెంటర్లు.. దళారులకే లాభం కోళ్ల పరిశ్రమ స్వయం ఉపాధిగా వెలుగొందుతుండగా దీనిపై ప్రభుత్వానికి ఎలాంటి అఽధికారం లేదు. హెచరీస్, కోళ్ల ఫారం యజమానులు, ట్రేడర్స్, చికెన్ సెంటర్ల నిర్వాహకులు ఇలా వినియోగదారులకు చికెన్ చేరుతుండగా యజమానుల పరిస్థితి అటుంచితే ట్రేడర్లు, చికెన్ సెంటర్ల నిర్వాహకులే ధరలను శాసిస్తున్నారు. సొమ్మొకొడది సోకొకరిదన్నట్లు గంటల వ్యవధిలోనే లాభాలు గడిస్తున్నారు ట్రేడర్లు. పుట్టగొడుగుల్లా ట్రేడర్లు పుట్టుకొస్తుండగా.. చికెన్ సెంటర్లు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. జిల్లాలో సుమారు 10 వేలకు పైగా చికెన్ సెంటర్లు ఉండగా ట్రేడర్లు సుమారు 500లకు పైగా ఉన్నారు. కోళ్ల ఫారం యజమానుల నుంచి ఆన్లైన్ సీఎమ్మార్ ధరల ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. ఉదాహరణకు కిలో కోడి ధర రూ.90 ఉంటే మైనస్ 5, మైనస్ 10కి తక్కువగా కొనుగోలు చేస్తూ చికెన్ సెంటర్ నిర్వాహకులకు రూ.90కి అదనంగా రూ.5, 10కి ఎక్కువగా రవాణా పేరుతో విక్రయిస్తున్నారు. అంటే కిలో కోడికి రవాణా ఖర్చులు పోనూ రూ.15కు అదనంగా విక్రయిస్తున్నారు. ఒక ట్రాలీ ఆటో జాలీలో 300–800ల వరకు కోళ్లను సరఫరా చేస్తారు. ఒక కోడి యావరేజ్గా 2.300 కిలోలున్నా.. రూ.30 వేల వరకు ఆర్జిస్తున్నారు. ఇదిలా ఉంటే చికెన్ సెంటర్ల నిర్వాహకులు ట్రేడర్ సరఫరా చేసిన ధరకు రూ.5–10కి ఎక్కువ విక్రయించాలి. కానీ.. ఆచరణలో రూ.30–40వరకు ఎక్కువకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పుట్టగొడుగుల్లా ట్రేడర్లు జిల్లాలో పౌల్ట్రీఫాంల నుంచి కోళ్లను కొనుగోలు చేసి చికెన్ సెంటర్లకు సరఫరా చేసేవారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. దీంతోనే ఎక్కువ లాభం ఉండటం.. మైనస్ మంత్రాన్ని జపించడంతో అనతికాలంలో లక్షలు వెనకేస్తున్నారు. ఈ జాబితాలో కోళ్ల ఫారం యజమానులు చేరిపోతున్నారు. ఫారం ద్వారా వచ్చే ఆదాయం కంటే సరఫరా చేస్తే వచ్చే ఆదాయం ఎక్కువగా ఉండగా అదీ రెండు, మూడు రోజుల్లోనే వస్తుండటంతో ఈ వ్యాపారం వైపే మొగ్గుచూపుతున్నారు. పాపం.. కోళ్ల ఫారం యజమానులు ట్రేడర్లు, చికెన్ సెంటర్ నిర్వాహకులు, హెచరీస్లు వీలైనంత సంపాదిస్తుంటే కోళ్ల ఫారం యజమానులది దారుణ పరిస్థితి. రోజుల వ్యవధిలోనే వారంతా లాభాలు గణనీయంగా పొందుతుంటే పిల్లల నుంచి కోళ్ల వరకు రూపాంతరం చెందే వరకు శ్రమించే యజమానులకు మాత్రం మిగిలేది చిన్నమొత్తమే. జిల్లాలో సుమారు 4 వేల వరకు కోళ్ల ఫారాలున్నాయి. హెచరీస్లు కోడి పిల్లలను కోళ్ల ఫాం యజమానులకు సరఫరా చేస్తుండగా 40–45 రోజులకు పెంచి వాటిని సంరక్షించడం చేసే ప్రక్రియ. ఇక దాణా సరఫరా చేసే కంపెనీలు బస్తాలపై ఎలాంటి ముద్రణలు చేయడం లేదు. కేవలం కంపెనీ పేరు మాత్రమే ఉంటుండగా దాణాలో వాడే ముడి పదార్థాలను పేర్కొనడం లేదు. ధర ఉండటం లేదు. కంపెనీని నమ్ముకుని దాణా వేయడమే. ఈ లోపు ఏదైనా వైరస్ వచ్చినా.. మొటలిటీ(మరణించడం) జరిగినా రైతు పైనే భారం. ఇవన్నీ తట్టుకుని కోళ్లను విక్రయించే సమయానికి ట్రేడర్ల దోపిడీ అధికమవుతోంది. దీంతో చేసేదీలేక మైనస్లకు విక్రయిస్తూ పెట్టిన పెట్టుబడిలో పావు వంతు కూడా లాభం పొందడం లేదు. కోళ్ల పరిశ్రమను నమ్ముకున్నవారికి ఆశించిన ప్రయోజనం లేదని ఫారం యజమానులు వాపోతున్నారు. పౌల్ట్రీ మీట్ ఫెడరేషనే మార్గం కోళ్ల పరిశ్రమపై ఒకప్పుడు ప్రభుత్వ పర్యవేక్షణ ఉండేది. ఫారం యజమానులు నష్టపోయినా, ఏవైనా విపత్తులు సంభవించినా అరకొర సాయమందేది. దీనికి తోడు ప్రభుత్వ రాయితీలుండేవి. ప్రభుత్వ కనుసన్నలో 1985 వరకు పౌల్ట్రీ మీట్ ఫెడరేషన్ ఉండేది. కాలక్రమేణ ఫెడరేషన్ కనుమరుగైంది. నిరుద్యోగ యువతకు ఇదో చక్కని అవకాశమే కానీ... సంస్కరణలు అవసరమన్నది యజమానుల వాదన. కాగా... కోళ్ల పరిశ్రమ స్వయం ప్రతిపత్తి గల ప్రైవేట్ రంగం. వీటి ధరలపై మాకెలాంటి అధికారం లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు, ప్రొత్సాహకాలు లేవని పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. ధరలు ఇష్టారాజ్యం.. నియంత్రణ పూజ్యం వినియోగదారులను దోచుకుంటున్న చికెన్ సెంటర్లు దళారులదే రాజ్యం.. పేరుకే పేపర్ రేట్ కానీ అదనమే కోళ్ల ఫారం యజమానులకు అంతంతేకరీంనగర్ రాంనగర్కు చెందిన శ్రీధర్రావు బంధువులు వచ్చారని చికెన్ కొందామని మార్కెట్కు వెళ్లాడు. పేపర్ ధర(ఆన్లైన్ సీఎమ్మార్) ప్రకారం జనరల్ కిలో కోడి ధర రూ.91 ఉండగా కిలో కోడి ధర రూ.120కి విక్రయించారు. పేపర్ రేట్ కదా ఇదేంటంటే గిట్టుబాటు కాదని సమాధానం. పట్టణంలోనే ఇలా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో మరీ దారుణం. ఇది ఒక్క శ్రీధర్ పరిస్థితే కాదు.. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చికెన్ కొనుగోలు చేసే సగటు వినియోగదారుని పరిస్థితి. గురువారం ధరలిలా ఫారం దగ్గర కిలో కోడి రూ.91 చికెన్ సెంటర్లో కిలో కోడి రూ.113 స్కిన్తో రూ.164 స్కిన్లెస్ రూ.186 -
కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం చెల్లించాలి
జ్యోతినగర్(రామగుండం): పరిశ్రమల్లో విధులు నిర్వహించే కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని ఐఎన్టీయూసీ జాతీయ సీనియర్ కార్యదర్శి బాబర్ సలీంపాషా డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ రామగుండం పర్మినెంట్ టౌన్షిప్ యూనియన్ కార్యాలయంలో జులై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మికవర్గం విజయవంతం చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో గురువారం ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 23న యాజమాన్యాలకు సమ్మె నోటీసు అందించనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ సంఘాల ఆధ్వర్యంలో జులై9న దేశవ్యాప్తంగా 13వ సారి జరగనున్న సమ్మెలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జేఏసీ నాయకులు ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు భూమల్ల చందర్, నాంసాని శంకర్, చిలుక శంకర్, రెడపాక లక్ష్మణ్, నాగభూషణం, గీట్ల లక్ష్మారెడ్డి, బొద్దున రాజేశం, ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ నాయకులు ఆరెపల్లి రాజేశ్వర్, వేముల కృష్ణయ్య పాల్గొన్నారు. స్వగ్రామానికి మృతదేహంపెగడపల్లి: ఉపాధి కోసం దుబాయి వెళ్లి ఆత్మహత్య చేసుకున్న ఓ వలసజీవి మృతదేహం గురువారం స్వగ్రామానికి చేరింది. మండలంలోని బతికపల్లికి చెందిన పూడూరి లచ్చన్న (46) జీవనోపాధి కోసం దుబాయి వెళ్లాడు. తాను పని చేస్తున్న కంపెనీలో సరైన వేతనం లభించక కుటుంబాన్ని పోషించడం భారంగా మారింది. దీంతో మనస్తాపానికి గురైన లచ్చన్న వారంక్రితం తాను ఉంటున్న గదిలో ఉరేసుకున్నాడు. గల్ఫ్ స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు గుండెల్లి నరసింహ, ఎన్ఆర్ఐ పాలసీ అడ్వైజరీ కమిటీ ఉపాధ్యక్షుడు మంద బీంరెడ్డి సహకారంతో ఆయన మృతదేహం ఇంటికి చేరింది. విగతజీవిగా వచ్చిన లచ్చన్నను చూసిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. లచ్చన్నకు భార్య లత, ఇద్దరు కుమారులున్నారు. -
పెళ్లింట విషాదం
● నెల రోజులు గడవకుండానే నవవరుడి మృతి ● చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న కుటుంబం వేములవాడ: పెళ్లయి నెల రోజులు గడవకముందే నవవరుడి మృతి ఆ ఇంట్లో విషాదం నింపింది. మద్యం మత్తులో ఉన్న కరీంనగర్ శివారులోని రేకుర్తికి చెందిన వ్యక్తి అజాగ్రత్తగా.. అతివేగంగా కారుతో ఢీకొట్టడంతో వేములవాడకు చెందిన పండరీనాథ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మే 23న పండరీనాథ్(25) వివాహమైంది. అప్పటి వరకు కుటుంబ సభ్యులతో కలిసి ఓ వేడుకకు హాజరైన పండరీనాథ్ అంతలోనే చనిపోయాడని తెలియడంతో వారి రోదనలు మిన్నంటాయి. మద్యం మత్తులో ఉన్న కారుడ్రైవర్ అప్పటికే రెండు చోట్ల ప్రమాదాలు చేసినట్లు తెలిసింది. పెళ్లయిన 25 రోజులకే మృతి మే నెలలో పెళ్లితో కళకళలాడిన ఇల్లు గురువారం శోకసంద్రంగా మారింది. ఇటీవల పెళ్లి బంధానికి తాలూకు వేడుకలు, ఫోటోలు ఇంకా ఇంటి గోడలపై వేలాడుతుండగానే.. అదే ఇంట్లో అంత్యక్రియల ఏర్పాట్లు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. తాత, నానమ్మ, తల్లి, తండ్రిని ఓదార్చే బంధువులు కన్నీరు ఆపులేకపోయారు. నెల రోజుల్లోనే భర్తను కోల్పోయిన వధువు నిలువునా కూలిపోయింది. ఆమె రోదనలకు అంతులేకుండా పోయింది. -
మద్యం మత్తులో కారు డ్రైవింగ్
యువకుడి మృతి.. డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్లో డ్రైవర్కు 219 పాయింట్లుతంగళ్లపల్లి(సిరిసిల్ల): మద్యం మత్తులో కారును నడిపి ఓ నిండు జీవితాన్ని బలితీసుకున్నాడు. ప్రమాదం చేసిందే కాకుండా కావాలంటే పదేళ్లు జైలుకు పోతా.. నన్ను ఏమి చేయలేరంటూ వాహనదారులపై చిందులు వేశాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు. వేములవాడ మండలం చింతలఠాణా ఆర్అండ్ఆర్ గ్రామానికి చెందిన కుర్మ నరేశ్(38) బైక్పై గురువారం జక్కాపూర్ వెళ్తున్నాడు. ఈక్రమంలోనే నేరెళ్ల శివారులో సిద్దిపేట నుంచి తంగళ్లపల్లి వైపు కారు అతివేగంగా రాంగ్రూట్లో వచ్చి ఢీకొట్టింది. దీంతో నరేశ్ తలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108లో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కారు నడిపిన యువకుడు మద్యం మత్తులో ఉండి ప్రశ్నించిన వాహనదారులపైకి చిందులు వేశాడు. పదేళ్లు జైలుకు పోతానంటూ వాగ్వాదానికి దిగాడు. కారు డ్రైవింగ్ చేసిన యువకుడికి బ్రీత్ అనలేజర్ టెస్టు నిర్వహించగా 219 పాయింట్లు వచ్చింది. మృతుడి అన్న కుర్మ రాజేశం ఫిర్యాదుతో తంగళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మందుపాతరల గణేశ్
● లెంకలగడ్డ బ్లాస్టింగ్ దేశవ్యాప్తంగా సంచలనం ● శాంతిచర్చల్లో పీపుల్స్వార్ పార్టీ ప్రతినిధిగా బాధ్యతలు ● మూడు దశాబ్దాలకుపైగా ఏకే 47తోనే చెలిమి మంథని: గోదావరి పరివాహక ప్రాంతంలోని నల్లరేగడి భూముల్లో నక్సల్బరి విత్తనాలు మొలకెత్తిన తొలినాళ్లలో వరంగల్ రాడికల్ యువజన సంఘం ఉద్యమాల నుంచి అడవిబాట పట్టిన గాజర్ల రవి ఉ రఫ్ గణేశ్ చిన్నవయసులోనే పలు విధ్వంసాలు సృష్టించి కేంద్ర కమిటీ మన్ననలు పొందారు. దేశంలోనే సంచలనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల రవి ఉర్ఫ్ గణేశ్ 1992లో అజ్ఞాతంలోకి వెళ్లారు. 1993లో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల పరిధిలోని మహాదేవపూర్, ఏటూరునాగారం పీపుల్స్వార్ పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఉద్యమాన్ని బలోపేతం చేస్తూనే వర్గ శత్రు నిర్మాలనకు ప్రాధాన్యతనిచ్చారు. 1994 శాసనసభ ఎన్నికల టైంలో మంథని నియోజకవర్గంలోని మహాదేవపూర్ మండలం లెంకలగడ్డ వద్ద శక్తివంతమైన బాంబులు అమర్చి 9 మంది పోలీస్ఽ అఽధికారులను హతమార్చడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ఘటనలో ఐపీఎస్ ఐజీ స్థాయి అధికారి సాహితోపాటు ఐదుగురు పంజాబ్ కమాండోలు, మహాదేవపూర్ ఎస్ఐ వెంకటస్వామి సహా తొమ్మిది మంది మరణించారు. అప్పటి నుంచి సాహి లెంకలగడ్డ బ్లాస్టింగ్లో మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం అయింది. కీలకనేతగా ఎదిగిన గాజర్ల లెంకలగడ్డ బాంబు బ్లాస్టింగ్ అనంతరం గణేశ్ అప్పటి పీపుల్స్వార్ పార్టీలో అత్యంత కీలకనేతగా ఏదిగారు. మందుపాతరలు పేల్చడం, ఏకే–47లో వినియోగించడంలో గణేశ్కు మరొకరు సాటిలేరు అనే ప్రచారం ఉండేది. గణేశ్ తెగువను, సమర్థవంగా అమలు చేసే వ్యూహాలను పసిగట్టిన అప్పటి పీపుల్స్వార్ పార్టీ రాష్ట్ర, కేంద్ర నాయకత్వాలు ఆయనను రాష్ట్ర సభ్యుడిగా నియమిస్తూ ఉత్తర తెలంగాణ వ్యవహారాలను అప్పగించింది. ఆ తర్వాత 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహాముత్తారం మండలం కనుకునూర్కు రీపోలింగ్కు బందోబస్తుకు వెళ్తున్న పోలీ్స్ సిబ్బందిపై దొబ్బలపాడు కల్వర్టు వద్ద బాంబు బ్లాస్టింగ్ చేసిన ఘటనలో 10 మంది పోలీసులు మృత్యువాత పడ్డారు. భూపాలపల్లి సమీపంలోని బాంబుల గడ్డ వద్ద పేల్చివేత వంటి సంఘటన కూడా అప్పట్లో సంచనల సృష్టించింది. 2002లో మహాదేవపూర్ పోలీస్స్టేషన్ను పేల్చడానికి బస్సును బాంబుగా అమర్చి సరికొత్త వ్యూహంతో సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత ఏవోబీ అంధ్రా–ఒడిశా బార్డర్కు కార్యదర్శిగా నియమించారు. ఇలాంటి ఎన్నో సంఽఘటనల్లో గణేశ్ పాత్ర ఉండేది. ఆ తర్వాత పార్టీ నాయకత్వం ఆయనను కేకేడబ్ల్యూ(కరీంగర్, ఖమ్మ, వరంగల్) కార్యదర్శిగా నియమించింది. కొన్ని సంవత్సరాలు తర్వాత రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి ముఖ్యమంత్రిగా వైస్ రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో ప్రభుత్వంతో జరిగిన శాంతిచర్చల్లో పీపుల్స్వార్ పార్టీ ప్రతినిధుల బృందంలో గణేశ్ చర్చల ప్రతినిఽధిగా పాల్గొన్నారు. మూడు దశాబ్దాలకుపైగా ఏకే–47 మహాదేవపూర్ ఏరియా కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ఏకే47 తుపాకీతోనే ఆయన స్నేహం కొనసాగింది. అనేక హింసాత్మక సంఘటనలకు పాల్పడిన గణేశ్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కంటిమీద కునుకులేకుండా చేరారు. ఆంధ్రా, ఒడిషా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో గణేశ్ చనిపోయినప్పుడు ఏకే–47తోనే కనిపించాడని ఆయనతోపాటు పనిచేసిన మాజీ మిలిటెంట్లు కొందరు చర్చించుకుంటున్నట్లు సమాచారం. -
దుమాల గురుకులం ప్రిన్సిపాల్ సస్పెన్షన్
● మరిమడ్ల ప్రిన్సిపాల్కు బాధ్యతలు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య గిరిజన గురుకులం పాఠశాల ప్రిన్సిపాల్ మంజిత్ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర గురుకులాల కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం తాత్కాళికంగా కోనరావుపేట మండలం మరిమడ్ల గురుకులం ప్రిన్సిపాల్ రాము సూరత్యాదవ్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. విధులపై నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల ఆర్డర్ల అమలులో బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడంతోనే వేటు పడింది. పాఠశాలలో పనిచేస్తున్న నలుగురు జౌట్సోర్సింగ్ ఉద్యోగులను మూడు రోజుల క్రితం విధుల నుంచి తొలగించడం.. గురుకులాల ఉన్నతాధికారులు ఇచ్చిన ఆర్డర్ను పట్టించుకోకుండా వ్యవహరించడాన్ని సీరియస్గా పరిగణిస్తూ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి గత 20 ఏళ్లుగా గురుకులంలో పనిచేస్తున్న నలుగురు జౌట్సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని లంబాడ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు భూక్య గజన్లాల్ డిమాండ్ చేశారు. నాయకులు మాలోత్ కిరణ్నాయక్, గుగులోత్ రవినాయక్ ఉన్నారు. -
మానేరు రివర్ఫ్రంట్ పనులపై విచారణ జరపాలి
కరీంనగర్: నగరంలోని మానేరు రివర్ ఫ్రంట్ పనుల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరపాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డికి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి వినతిపత్రం అందించారు. మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరుతో గత ప్రభుత్వం రూ. 500 కోట్లు మంజూరు చేసిందని, అందులో టూరిజం శాఖ రూ. 100 కోట్లు, నీటి పారుదల శాఖ రూ. 100 కోట్లు నిధులు విడుదల చేసిందన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించారని తెలిపారు. పనులు పూర్తికాకుండానే బిల్లులు చెల్లించారన్నారు. చెక్ డ్యాములు నిర్మిస్తే వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయాయని, ఐదేళ్లు గడుస్తున్నా పనులు పూర్తికాలేదని ఆయన సీఎంకు వివరించారు. -
మద్యంమత్తులో బైక్కు నిప్పు
మల్యాల: మండలంలోని రాజారం శివారులో మద్యం మత్తులో ఓ యువకుడు తన బైక్కు నిప్పుపెట్టాడు. దీంతో అది పూర్తిగా కాలిపోయింది. జగిత్యాల మున్సిపాలిటీ పరిధి టీఆర్నగర్కు చెందిన సలీం గురువారం సాయంత్రం రాజారం శివారులో తన ద్విచక్రవాహనాన్ని నిలిపాడు. మద్యం మత్తులో దానికి నిప్పు పెట్టాడు. స్థానికుల సమాచారంతో బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ సురేశ్, హోంగార్డు నర్సింగరావు సంఘటనాస్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలు ఆర్పివేశారు. హత్య కేసులో ఇద్దరికి ఏడేళ్ల జైలుజగిత్యాలజోన్: మద్యం మత్తులో జరిగిన గొడవలో ఒకరిని హత్య చేసిన కేసులో ఇద్దరికి ఏడేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. రత్న పద్మావతి గురువారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జంగిలి మల్లికార్జున్ కథనం ప్రకారం.. రాయికల్ మండలం ధర్మాజిపేటకు చెందిన సావన్వెల్లి రాజుకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. ఇద్దరు కూతుళ్లకు పెళ్లయ్యింది. కొడుకు శేఖర్ వ్యవసాయంతోపాటు గ్రామంలో కూలీ పనులకు వెళ్లేవాడు. అదే గ్రామానికి చెందిన రాస రాజేశం, బలిజే నాగ భూషణంతో పరిచయం ఏర్పడింది. వారితో కలిసి కూలీ పనులకు వెళ్తూ.. వచ్చిన డబ్బులతో అందరూ కలిసి జల్సా చేసేవారు. 22 మార్చి 2022న శేఖర్ ఇంటి వద్ద ఉండగా.. సాయంత్రం 4 గంటల సమయంలో బలిజే నాగభూషణం వచ్చి శేఖర్ను ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని వెళ్లాడు. రాత్రి అయినా శేఖర్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. ఆయన కోసం వెదుకుతుండగా మరుసటి రోజు గ్రామ శివారులో శేఖర్ శవమై కనిపించాడు. మృతుడి తల్లి రాజు రాయికల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై పి.కిరణ్కుమార్ కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ వై.కృష్ణ కుమార్ కేసును దర్యాప్తు చేశారు. మద్యం మత్తులో జరిగిన గొడవలో రాస రాజేశం, బలిజె నాగ భూషణం శేఖర్ను హత్య చేసినట్లు తేల్చారు. నిందితులను అరెస్ట్ చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ అధికారులు ఎం. కిరణ్కుమార్, కె. నరేశ్ కోర్టులో సాక్ష్యాలను ప్రవేశపెట్టగా రాజేశం, నాగభూషణంకు ఏడేళ్ల చొప్పున జైలు, రూ.3వేల చొప్పున జరిమానా విధించారు. ప్రమాదవశాత్తు బావిలో పడి గొర్రెల కాపరి మృతిధర్మారం: ధర్మారం మండలం నర్సింగపూర్ గ్రామానికి చెందిన పెద్ది మల్లయ్య గురువారం ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మరణించినట్లు ధర్మారం ఎస్సై శీలం లక్ష్మణ్ తెలిపారు. గొర్రెల కాపలాకు వెళ్లిన మల్లయ్య మంచినీరు తాగేందుకు బావి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మరణించాడు. మృతుని భార్య పెద్ది పోశవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
విశిష్టత తెలిపేలా యోగా దినోత్సవం నిర్వహణ
కరీంనగర్కల్చరల్: అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని వికాస తరంగిణి, ప్రజ్ఞావికాస్ ఆధ్వర్యంలో కరీంనగర్ మహాత్మ జ్యోతిరావు పూలే సర్కస్ గ్రౌండ్లో శనివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు త్రిదండి రామానుజ జీయర్ స్వామివారి మంగళశాసనా లతో దేవనాథ రామానుజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో యోగా విశిష్టత తెలిపేలా యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ప్రజ్ఞావికాస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు, వికాస తరంగిణి జోనల్ అధ్యక్షుడు గౌతంరావు తెలిపారు. గురువా రం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతీరోజు విద్యార్థులకు యోగా నేర్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, విద్యార్థులకు విలువలతో కూడిన విద్య,కుటుంబ విలువలు, కుటుంబ ప్రాముఖ్యత అర్థమయ్యే విధంగా తెలియజేస్తామన్నారు. సమావేశంలో వికాస తరంగణి, ప్రజ్ఞా వికాస్ ఆధ్వర్యంలో యాద కిషన్, సిరికొండ వెంకటేశం, రవీందర్ రావు, ప్రభాకర్ రావు, కర్ణాకర్రావు, జగన్నాథరావు, ప్రతాప్రెడ్డి తదితరులు ఉన్నారు. -
‘డిగ్రీ’ డౌన్!
● తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య ● శాతవాహనలో సగం సీట్లు ఖాళీ ● ఇప్పటి వరకు 10,265 సీట్ల భర్తీ ● ఇంజినీరింగ్, మెడిసిన్, వివిధ కోర్సులపై ఆసక్తి ● ప్లేస్మెంట్లు లేకపోవడమే కారణమంటున్న విద్యావేత్తలుకరీంనగర్క్రైం: డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ఇంటర్ పూర్తికాగానే చాలామందికి డిగ్రీ కన్నా ఇంజినీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్, ఫార్మసీతో పాటు వివిధ కోర్సులపై ఆసక్తి పెరుగుతోంది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు వచ్చినప్పటికీ డిగ్రీలో సీట్ల భర్తీ తగ్గుతోందని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇతర కోర్సులపై ఆసక్తి ఉండడంతో పాటు ఇప్పుడు కొత్తగా వచ్చిన డిగ్రీ కోర్సుల తర్వాత విదేశాలకు వెళ్తున్నవారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు రెండు దశల్లో దోస్త్ ద్వారా సీట్లు కేటాయింపు ప్రక్రియ జరిగినప్పటికీ శాతవాహనలో 10,265 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఏటేటా తగ్గుతున్న వైనం ఏటా డిగ్రీలో చేరే వారి సంఖ్య తగ్గుతూ వ్తోంది. 2025–26లో ఇప్పటి వరకు రెండు దశలు పూర్తికాగా ఇప్పటి వరకు 10,265 సీట్లు మాత్రమే కేటాయింబడ్డాయి. మొదటి దశలో 5,931 సీట్లు కేటాయించబడగా ఇందులో 4,334 సీట్లు మాత్రమే విద్యార్థులు కన్ఫార్మ్ చేసుకున్నారు. రెండోదశలో 4,334 సీట్లు కేటాయించారు. రెండో దశలో సీటు పొందిన వారు బుధవారం వరకు మాత్రమే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీట్లు ఖరారు చేసుకోవాల్సి ఉందని శాతవాహన ప్రవేశాల విభాగం ప్రకటించింది. కనిపించని ప్లేస్మెంట్లు కోర్సులు పూర్తయ్యాక ఉద్యోగ, ఉపాధి కల్పనకు అవకాశాలు ఎక్కువగా లేకపోవడంతోనే డిగ్రీ కోర్సుల్లో ఎక్కువగా విద్యార్థులు చేరడం లేదనే చర్చ సాగుతోంది. వివిధ రంగాల్లో ప్రైవేటు కంపెనీలు ఎక్కువగా ప్రొఫెషనల్ కోర్సులు, ఇంజినీరింగ్ చేసిన వారినే నియమించుకోవడంతో డిగ్రీవాళ్లకు అవకాశాలు తగ్గిపోతున్నాయని తెలుస్తోంది. డిగ్రీ కళాశాలల్లో సైతం కోర్సులు పూర్తయ్యాక ప్లేస్మెంట్ సరిగా రావడంలేదని స్పష్టమవుతోంది. దోస్త్ మూడోదశ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు కొనసాగుతుండగా గురువారం గడువు ఉంది. మూడోదశ సీట్ల కేటాయింపు 23వ తేదీన జరగనుంది. డిగ్రీలో సాంప్రదాయ కోర్సులు కాకుండా పెద్ద ఎత్తున మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్తకోర్సులు వచ్చినప్పటికీ డిగ్రీలో చేరే సంఖ్య పెరగడం లేదని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలు ప్రభుత్వ కళాశాలలు: 13 ప్రభుత్వ ఆటానమస్: 02 ప్రైవేటు ఎయిడెడ్: 02 ప్రైవేటు ఆన్ ఎయిడెడ్: 58 సోషల్ వెల్ఫేర్: 03 ట్రైబల్ వెల్ఫేర్: 02 బీసీ వెల్ఫేర్: 03శాతవాహనలో మొత్తం సీట్లు: 36,060 విద్యా సంవత్సరం సీట్ల భర్తీ 2022–23 20,218 2023–24 16,419 2024–25 16,500 2025–26 10,265 (రెండుదశలు పూర్తయ్యాక) -
పొంచి ఉన్న ప్రమాదం
● నగరంలో వేలాడుతున్న విద్యుత్ తీగలు ● రక్షణ లేని ట్రాన్స్ఫార్మర్లు.. తేలిన విద్యుత్ వైర్లువిద్యుత్ ప్రమాదాల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్న టీజీఎన్పీడీసీఎల్ అధికారులు క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఓ వైపు ప్రమాదాలు జరుగుతున్నా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు. అసలే వర్షాకాలం.. విద్యుత్షాక్లకు ఆస్కారం ఉండే సమయం.. ఈ క్రమంలో వినియోగదారులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన సంబంధితశాఖ అధికారులు నగరంలోని పలు ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్వైర్ల పర్యవేక్షణను గాలికి వదిలేశారు. రక్షణ చర్యలు లేకపోవడంతో అటుగా వెళ్తున్న ప్రజలు ఎప్పుడు ప్రమాదాల బారిన పడతారో తెలియని పరిస్థితి. ఇప్పటికై నా అధికారులు స్పందించి రక్షణ చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
ఏసీబీ దూకుడు..!
● వరుస కేసులతో హడలెత్తిస్తున్న అనిశా ● సుప్తావస్త వీడి దాడులు మొదలుపెట్టిన వైనం ● ఏసీబీ డీజీ అక్షింతలతో చురుగ్గా కేసుల నమోదు ● కాళేశ్వరం ఇంజినీర్ల నుంచి క్లర్కుల దాకా నిఘా ● రెండు నెలలుగా ఏసీబీకి పెరిగిన ఫిర్యాదులుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: అవినీతి నిరోధక శాఖ నిద్రలేచింది. ఇంతకాలం సుప్తావస్థలో ఉన్న డిపార్ట్మెంట్.. ఏసీబీ డీ జీగా విజయ్కుమార్ బాధ్యతలు చేపట్టాక చురుగ్గా కదులుతోంది. ఇటీవల కాళేశ్వరం ఇంజినీర్ నూనె శ్రీధర్ ఇంటిపై దాడులు చేసి రూ.100 కోట్ల వరకు ఆస్తులు గుర్తించి తన మార్క్ చాటుకుంది. తాజాగా కరీంనగర్ జెడ్పీ కార్యాలయంలోనూ బిల్లుల కోసం లంచం డిమాండ్ చేసిన ఏఈ శరత్, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ను ఏసీబీ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ రెండు దాడులతో ఏసీబీ తిరిగి పూర్వపు తరహాలో దాడులు చేస్తోందన్న సంకేతాలు ఇచ్చింది. వాస్తవానికి మూడేళ్లుగా కరీంనగర్ ఏసీబీ విభాగంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఎలాంటి కేసులు నమోదు కాకున్నా.. ఉన్నతాధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించడం తెలిసిందే. అదే సమయంలో స్థానికంగా కరీంనగర్ బల్దియా, రెవెన్యూ విభాగాల్లో అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినా.. సదరెం వంటి స్కాంల విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించినా.. ఏసీబీ పెద్దగా స్పందించిన దాఖలాలు కనిపించలేదు. ప్రస్తుతం పరిస్థితి మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్ల నుంచి క్లర్కుల దాకా ఎవరినీ వదలడం లేదు. ఏసీబీ డీజీ రాకతో.. 2020, 2021లో కరోనా కారణంగా దూకుడు తగ్గిందనుకున్నా.. 2022, 2023, 2024లో చరుకుదనం తగ్గడంలో ఆంతర్యం ఏమిటో అర్థంకాలేదు. గతేడాది ఏసీబీ డైరెక్టర్ జనరల్గా ఐపీఎస్ అధికారి విజయ్కుమార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కరీంనగర్ ఏసీబీలో కాస్త కదలిక వచ్చింది. 2024 నవంబరులో పోలీసుల పాసింగ్ అవుట్ పరేడ్ (పీవోపీ) సందర్భంగా కరీంనగర్కు వచ్చిన విజయ్కుమార్.. ఇక్కడి ఏసీబీ అధికారులతో సమావేశమయ్యారు. ఆ సందర్భంలో ఏసీబీ నమోదు చేసిన కేసులు చూసి కంగుతిన్నారని సమాచారం. అసలేం చేస్తున్నారు..? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అవినీతి లేనేలేదా..? అని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో అప్పటికపుడు నిద్రలేచిన అధికారులు వేట మొదలుపెట్టారు. అప్పటి నుంచి కేసుల విషయంలో ఏసీబీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసే పలువురు ఇంజినీర్లు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఇటీవల ఏసీబీకి వరుస ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో వారి ఆస్తుల జాబితా తెప్పించుకుని పరిశీలిస్తున్నట్లు సమాచారం.రెవెన్యూ విభాగంలోనే అధికం 2019 నుంచి 2025 వరకు ఏసీబీ నమోదు చేసిన కేసుల్లో ఎప్పటిలాగే రెవెన్యూ విభాగం ముందు వరసలో ఉంది. ఏటా నమోదయ్యే కేసుల్లో ఈ శాఖకు సంబంధించినవే ఉండటం గమనార్హం. 2019లో ఆరు, 2022లో ఆరు, 2023లో నాలుగు, 2024లో ఐదు, 2025లో మూడు కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి 2020, 2021లో కరోనాతో రియల్ ఎస్టేట్ బూమ్ పడిపోయింది. ఫలితంగా రెవెన్యూకు సంబంధించి ఆ రెండేళ్లలో ఎలాంటి కేసులూ నమోదు కాలేదు. ప్రస్తుతం సిబ్బంది కొరత వేధిస్తున్నా.. కేసుల వేటలో వేగం పెంచడం శుభపరిణామం.ఫిర్యాదులు పెరిగాయిరెండు నెలలుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఫిర్యాదులు పెరిగాయి. కేసులు విషయంలో దూకుడుగా ఉన్నాం. 1064 టోల్ఫ్రీ నంబరు, ఫేస్బుక్, వాట్సాప్, ఎక్స్ వేదికగా బాధితులు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరికీ డబ్బులు చెల్లించాల్సి న అవసరం లేదు. అధికారులు లంచం అడిగితే వెంటనే మా ఫోన్ నంబర్ 91543 88954కు ఫిర్యాదు చేయండి. – విజయ్కుమార్, ఏసీబీ డీఎస్పీ -
గ్రామసభ సందర్శన
చిగురుమామిడి: చిగురుమామిడి మండలం రామంచ గ్రామంలో బుధవారం నిర్వహించిన భూ భారతి గ్రామసభను అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవో మహేశ్వర్ సందర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మీకిరణ్ మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభా రతి చట్టాన్ని తీసుకొచ్చిందని, రైతులు సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా మంచి స్పందన వస్తోందని, శాశ్వతంగా భూములు పట్టాచేయడంతో పాటు వాస్తవిక సర్వే, పహణీలో నమో దు సమస్యలను పరిష్కరిస్తామన్నారు. తామూ నివాసం ఉంటున్న గుడిసెలకు పట్టాలు లేవని, పట్టాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని మాస్టిన్ కులస్తులు ఫిర్యాదు చేశారు. గ్రామసభలో 154 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ రమేశ్ తెలిపారు. డంప్యార్డ్ తరలిస్తేనే ఓటు కరీంనగర్ కార్పొరేషన్: ‘డంప్యార్డ్ తరలిస్తేనే ఓటు వేస్తాం’.. అంటూ నగరంలోని అలకాపురికాలనీ వాసులు వినూత్న నిరసన తెలిపారు. డంప్యార్డ్ ఎత్తివేయాలని డిమాండ్తో బుధవారం కాలనీలో మహిళలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మ హిళలు మాట్లాడుతూ డంప్యార్డ్తో తాము సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఇప్పటివరకు పాలకులు పరిష్కా రం చూపించడం లేదని ఆవేదన చెందారు. డంప్యార్డ్ ఎత్తివేయాలని జేఏసీగా ఏర్పడి ఆందోళన చేస్తున్నా, అధికారులు పట్టించుకో వడం లేదన్నారు. డంప్యార్డ్ సమస్య పరిష్కరించే వరకు ఆందోళనను ఉధృతం చేస్తామని, అవసరమైన రాబోయే నగరపాలకసంస్థ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. యోగాతో జాతీయ సమైక్యత కరీంనగర్స్పోర్ట్స్: యోగా చేయడం ద్వారా జాతీయ సమైక్యత వెల్లివిరుస్తుందని డీవైఎస్వో శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. పతంజలి యోగా సమితి, ఆయుష్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన యోగావాక్ను జెండా ఊపి ప్రారంభించారు. యోగాడేను ఈనెల 21న ప్రపంచమంతా నిర్వహిస్తున్న వేళ కరీంనగర్లో పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టాలన్నారు. యువ భారత్ రాష్ట్ర అధ్యక్షుడు ముత్యాల రమేశ్, ఆయుష్ డీపీఎం ప్రవీణ్, నోడల్ ఆఫీసర్ యష్రుత్ సుల్తానా, డిప్యూటీ నోడల్ ఆఫీసర్ శేఖర్, పతంజలి యోగా సమితి జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మి నారాయణ, భారత్ స్వాభిమాన్ బాధ్యులు కొండా లక్ష్మణ్ పాల్గొన్నారు. సమ్మె జయప్రదం చేయండి సప్తగిరికాలనీ(కరీంనగర్): శతాబ్దకాలంగా భా రత కార్మికవర్గం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి, వాటి అమలుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీన్ని నిరసిస్తూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గీట్ల ముకుంద రెడ్డి పిలుపునిచ్చారు. సీఐటీయూ అనుబంధ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం బుధవార సీఐటీయూ కార్యాలయంలో జరిగింది. జనగామ రాజమల్లు, కవంపల్లి రవి, ఎర్రోళ్ల రాజయ్య, ముక్కెర బుజ్జమ్మ, కత్తెరపాక లత, జేరిపోతుల మల్లేశం పాల్గొన్నారు. 24 మందికి ఏఎస్సైలుగా పదోన్నతి కరీంనగర్క్రైం: రాజన్న సిరిసిల్ల జోన్ పరిధిలో పనిచేస్తున్న 24 హెడ్కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా పదోన్నతి పొందిన వారిలో కరీంనగర్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు చెందిన పోలీసులు ఉన్నారు. -
‘ప్రైవేటు’ దోపిడీ
కరీంనగర్: జిల్లాకేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో నియంత్రణ లేని ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అడ్మిషన్, మెయింటనెన్స్, స్పెషల్ ఫీజులంటూ నిలు వుదోపిడీ చేస్తున్నారు. పుస్తకాలు, నోట్బుక్లతో పాటు పాఠశాలపేర్లతో ఉన్న బ్యాగులు సైతం విక్రయిస్తున్నారు. ఒక్కో వస్తువుకు పదింతల ధ రలు వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. పాఠశాలలు ప్రారంభమై వారం రోజులు అవుతున్నా తనిఖీలు చేయడం లేదు. పుస్తకాల ధరలకు రెక్కలు బయట దుకాణాల్లో పుస్తకం ధర రూ.20 ఉంటే పాఠశాలలో రూ.25 నుంచి రూ.35వరకు తీసుకుంటున్నారు. మరికొన్ని పాఠశాలల్లో రూ.40 కన్నా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఒకటో తరగతి 16 టెక్ట్స్బుక్స్, 14 నోట్బుక్స్కు కలిపి రూ.6300కు పైగా వసూలు చేస్తున్నారు. రెండో తరగతి 14 టెక్ట్స్బుక్స్కు, 21 నోట్బుక్స్కు రూ.6,500, మూడో తరగతి 12 టెక్ట్స్బుక్స్, 22 నోట్బుక్స్కు కలిపి 6,700 తీసుకుంటున్నారు. వీటికి తోడు పెన్నులు, పెన్సిళ్లు, కవర్లు అంటూ రెట్టింపు ధరలకు అంటగడుతున్నారు. ఆకాశంలో బ్యాగుల ధరలు కళ్లు చెదిరే డిజైన్లు, రంగులతో చాలా రకాల బ్యా గులు అందుబాటులో ఉన్నాయి. చిన్న పిల్లల బ్యాగులు దాదాపు రూ.300 నుంచి దాదాపు రూ.700వరకు పలుకుతున్నాయి. మోడల్ను బట్టి రూ.1000 వరకు చెబుతున్నారు. కొందరు తమ పాఠశాలల పేర్లతో స్కూళ్లలోనే బ్యాగులు విక్రయిస్తున్నారు. ఫలితంగా ఉచితంగా పబ్లిసిటీ పొందుతున్నారు. ఇది చట్టప్రకారం నిషేధమైనప్పటికీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. పలు పాఠశాలలు తప్పనిసరిగా బ్రాండెడ్ షూ కొనుగోలు చేయాలని చెప్పడంతో ఒక్కోజత రూ.750 వరకు పలుకుతోంది. యూనిఫాంలు అటువైపుగానే జిల్లాకేంద్రంలో వందల సంఖ్యలో పాఠశాలలు వీదికొకటి ఏర్పడ్డాయి. యాజమాన్యం సూచించిన యూనిఫాంలనే విద్యార్థులు విధిగా ధరించాలి. ఇక్కడా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు జిమ్మిక్కులు ప్రదర్శిస్తున్నారు. తాము చెప్పిన షాపులోనే తమ పాఠశాల యూనిఫాం తీసుకోవాలని హుకూం జారీ చేస్తున్నారు. దీంతో ఆయా దుకాణాల యాజమాన్యాలు సైతం ధరలు పెంచి విక్రయిస్తుండగా.. పాఠశాల నిర్వాహకులు కమీషన్ దండుకుంటూ తల్లిదండ్రులకు కుచ్చుటోపీ పెడుతున్నారు. ప్రస్తుతం పాఠశాల యూనిఫాం జతకు రూ.1,200 నుంచి రూ.1,500 పలుకుతోంది. ప్రైవేటు స్కూళ్లలో నిబంధనలకు నీళ్లు పెన్సిల్ నుంచి నోట్బుక్స్ వరకు అక్కడే కొనుగోలు చుక్కలు చూపుతున్న ధరలు బెంబేలెత్తుతున్న తల్లిదండ్రులు పట్టించుకోని విద్యాశాఖ అధికారులుచర్యలు తప్పవు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. పాఠ్యపుస్తకాలు, తదితర వస్తువులు అధిక ధరలకు అమ్మడం నిబంధనలకు విరుద్ధం. ఫీజుల విషయంలో ప్రభుత్వ జీవోలకు అనుగుణంగా వ్యవహరించాల్సిందే. త్వరలోనే పాఠశాలల్లో తనిఖీలు నిర్వహిస్తాం. ఏ పాఠశాలలోను పుస్తకాలు, నోట్బుక్స్ అమ్మడానికి వీలులేదు. అలాంటివి జరిగితే చర్యలు తప్పవు. – శ్రీరామ్ మొండయ్య, డీఈవో -
సకాలంలో విత్తుకోవడమే మేలు
కరీంనగర్ అర్బన్: సాగులోనూ విత్తన దశ కీలకం కాగా విత్తే సమయం కూడ అత్యంత కీలకమని కరీంనగర్ వ్యవసాయ పరిఽశోధన స్థానం హెడ్డీన్, ప్రధాన శాస్త్రవేత్త డా.జి.మంజులత వివరించారు. సాగుకు అనుకూలంగా వర్షాలు కురవడంతో అన్నదాతలు పొలంబాట పడుతున్నారు. వరి నారు పోసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు పత్తి విత్తనాన్ని నాటుతున్నారు.. విత్తనాలు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వానాకాలం సీజన్లో ఏ పంటలు సాగు చేసుకుంటే మంచిది. సాగులో అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలు, చేపట్టాల్సిన విధి విధానాలపై మంజులత వివరించారు. పత్తి, వరి, పప్పు ధాన్యాలు, మొక్కజొన్న రైతులకు పలు సూచనలు చేశారు. వాతావరణ కేంద్రం అధికారుల అంచనా ప్రకారం ఈసారి వానాకాలం సీజన్లో సాధారణ వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశముంది. అందుకనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. భూసార పరీక్షల ఫలితాల ఆధారంగానే పంటల సాగును ఎంపిక చేసుకుంటే ఆశించిన దిగుబడులు సాధించవచ్చన్నారు. వివిధ రకాల ఎంపికే కీలకం -
మృత్యుముంగిట మూడేళ్ల బాబు
సిరిసిల్ల: మూడేళ్ల బాబు మృత్యువుతో పోరాడుతున్నాడు. వైద్యం చేయిస్తే బతికేందుకు అవకాశం ఉంది. సిరిసిల్ల పట్టణం బీవైనగర్కు చెందిన గూడూరి శేఖర్–సంజన దంపతుల మూడేళ్ల కొడుకు మనీశ్ అనారోగ్యంతో బాధపడుతుండడంతో స్థానిక ఆస్పత్రిలో చూపించారు. జాండీస్ వల్ల లివర్ పూర్తిగా చెడిపోయిందని, ఆరోగ్య పరిస్థితి విషమించిందని డాక్టర్లు నిర్ధారించారు. హైదరాబాదులోని ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. మనీశ్కు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స అవసరమని, ఆపరేషన్కు రూ.25 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. బాలుడి తల్లి బీడీ కార్మికురాలు, తండ్రి ప్రైవేటు వర్కర్ కావడంతో అంత పెద్ద మొత్తంలో వైద్య ఖర్చులు భరించలేని ఆ తల్లిదండ్రులు నిస్సహాయ స్థితిలో దిక్కులు చూస్తున్నారు. ఇప్పటికే అప్పులు చేసి రూ.4 లక్షల వరకు ఆస్పత్రిలో చెల్లించారు. ఇంకా రూ.21 లక్షలు ఆపరేషన్కు అవసరం ఉంది. ప్రభుత్వ అధికారులు, నాయకులు, స్వచ్చంధ సంస్థలు, దాతలు స్పందిస్తేనే ఆ పసిహృదయం ఊపిరి నిలుస్తుంది. దాతలు, స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులు స్పందించి మనీశ్ వైద్యానికి ఆర్థికసాయం అందించాలని ఆ పేద తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఆర్థికసాయం చేయాలనుకునేవారు మనీశ్ తండ్రి శేఖర్ను 94411 61257 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కు రూ.25 లక్షలు అవసరం చేతిలో డబ్బు లేక నిస్సహాయ స్థితిలో తల్లిదండ్రులు దాతల సాయం కోసం వేడుకోలు -
కారును ఢీకొన్న వ్యాన్: ఇద్దరికి గాయాలు
మల్యాల: మండలంలోని ముత్యంపేట శివారు దిగువ కొండగట్టు వద్ద కారును డీసీఎం వ్యాన్ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామానికి చెందిన బిరుదుల సాయికిరణ్ బుధవారం మల్యాలకు చెందిన మ్యాక గంగోత్రిని పూడురులోని వారి బంధువుల ఇంట్లో దించేందుకు కారులో వెళ్తున్నాడు. ముత్యంపేట శివారులో జగిత్యాల–కరీంనగర్ జాతీయ రహదారిపై జగిత్యాల వైపు వెళ్తున్న డీసీఎం వ్యాను వేగంగా వచ్చి కారును ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న సాయికిరణ్, గంగోత్రి తీవ్రంగా గాయపడ్డారు. 108 సిబ్బంది బాధితులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సాయికిరణ్ తల్లి పద్మ ఫిర్యాదు మేరకు డీసీఎం వ్యాను డ్రైవర్ జితేంద్రపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
‘అల్ఫోర్స్’ విద్యార్థినులకు హార్విన్ టెక్నాలజీస్లో ఉద్యోగాలు
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ సూర్యనగర్లోని అల్ఫోర్స్ మహిళా డిగ్రీ, పిజి కళాశాల విద్యార్థినులు ఈ నెల 15న జరిగిన హైదరాబాద్ హార్విన్ టెక్నాలజీస్ కంపెనీ ఇంటర్వ్యూలో 19 వంది బిజినెస్ డెవలప్మెంట్ ప్రాసెస్ అసోసియేట్గా ఎంపికై నట్లు కరస్పాండెంట్ వి.రవీందర్రెడ్డి తెలిపారు. సుమారు 38 మంది విద్యార్థులు హాజరుకాగా.. 19మంది ఎంపికవ్వడం సంతోషదాయకమన్నారు. తృతీయ సంవత్సరం పరీక్షల తరువాత కూడా ప్లేస్మెంట్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థినులను కళాశాల ప్రాంగణంలో బుధవారం రవీందర్రెడ్డి పుష్పగుచ్ఛాలతో అభినందించి నియామక పత్రాలు అందజేసారు. కంపెనీ ప్రతినిధులు వివేక్, రామకృష్ణ, వైష్ణవి పాల్గొన్నారు. -
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు
కరీంనగర్క్రైం: గంజాయి తరలిస్తున్న ఇద్దరిని కరీంనగర్ వన్టౌన్ పోలీసులు బస్టాండు వద్ద బుధవారం పట్టుకున్నారు. వారి నుంచి 1.80 కిలలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీఐ బిల్లా కోటేశ్వర్ వివరాల ప్రకారం తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామానికి చెందిన కొంటు అనిల్కుమార్(19), సుభాశ్నగర్కు చెందిన నీర్ల వంశీకృష్ణ(25) గంజాయికి అలవాటు పడ్డారు. అరకులో గంజాయి తక్కువకు వస్తుందని అక్కడికి వెళ్లారు. రూ.5వేలు పెట్టి కొనుగోలు చేశారు. కరీంనగర్లో గంజాయి తాగే అలవాటు ఉన్నవారికి అమ్మితే డబ్బు సంపాదించొచ్చని భావించారు. రైల్లో వరంగల్ వరకు తెచ్చారు. బస్సులో కరీంనగర్ తీసుకొచ్చారు. పక్కా సమాచారంతో బస్టాండ్ ఔట్గేటు వద్ద వన్టౌన్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. నిందితులు పోలీసులను చూపి పారిపోయే ప్రయత్నం చేశారు. ఇద్దరిని పట్టుకుని 1.80 కిలోల గంజాయి స్వాఽధీనం చేసుకున్నారు. ఎస్సైలు రాజన్న, శేఖర్, భాస్కర్రెడ్డి, సిబ్బందిని సీపీ అభినందించారు. -
ప్రపంచ అగ్రదేశంగా భారత్
జగిత్యాలటౌన్: పదకొండేళ్ల నరేంద్రమోదీ పాలనలో దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా అవతరించిందని బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చి 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచంలోనే నాలుగో ఆర్థికశక్తిగా అవతరించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు దేశ భద్రత విషయంలో మోదీ రాజీలేని పాలన సాగిస్తున్నారని కొనియాడారు. దేశం వైపు కన్నెత్తి చూసేందుకు శత్రుదేశాలు సాహసం చేయలేని విధంగా అజేయశక్తిగా తీర్చిదిద్దిన ఘనత మోదీదన్నారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలు, సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మోదీ పాలనపై రూపొందించిన 11సాల్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, నాయకులు రాగిళ్ల సత్యనారాయణ, కస్తూరి సత్యం, మరిపెల్లి సత్యం తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్రెడ్డి -
ఒలింపియాడ్లో పారమిత విద్యార్థుల ప్రతిభ
కొత్తపల్లి(కరీంనగర్): పద్మనగర్లోని పారమిత హెరిటేజ్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఇటీవల జరిగిన ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్(ఐటీవో) రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి పలు స్థానాలను కై వసం చేసుకున్నట్లు ప్రధానోపాధ్యాయులు గోపీకృష్ణ తెలిపారు. గణితంలో కె.అగస్త్య విశ్రుత్(9వతరగతి) రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు, నగదు బహుమతి గెలుపొందగా, జి.ఆరుష్రెడ్డి(6వ), సాయిరిశిత్.జె(8వ) ప్రశంసాపత్రాలు, మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్ సాధించినట్లు చెప్పారు. విద్యార్థులను విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఇ.ప్రసాదరావు, డైరెక్టర్లు రశ్మిత, ప్రసూన, అనూకర్రావు, రాకేశ్, వీయూఎం ప్రసాద్, వినోద్రావు, టీఎస్వీ రమణ, హన్మంతరావు అభినందించారు. కోఆర్డినేటర్లు రాము, నాగరాజు, గణిత ఉపాధ్యాయులు వీరలక్ష్మి, ప్రదీప్కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రైతు ఆలోచన అదిరింది
ధర్మపురి: ఎడ్ల నాగలితో వ్యవసాయం దూరమైంది. ఆధునిక యంత్రాలు, ట్రాక్టర్లు వచ్చాయి. అయితే పంటల్లో కలుపుతీసేందుకు కొన్ని యంత్రాలు వచ్చినా.. వాటి ధర సామాన్య రైతులకు అందకుండా ఉంది. కూలీలతో కలుపు తీయిస్తే ఖర్చు మోపెడవుతోంది. ఈ క్రమంలో ఖర్చును ఆదా చేసుకునేందుకు ఓ రైతు సైకిల్ ద్వారా కలుపు తీస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ధర్మపురి మండలం బుద్దేశ్పల్లెకు చెందిన మహ్మద్ సలీంకు రెండెకరాల భూమి ఉంది. అందులో వివిధ రకాల కూరగాయలు పండిస్తుంటాడు. ట్రాక్టర్, ఎడ్లనాగళ్లతో సాగు చేయగా.. ఎకరాన రూ. పదివేలు ఖర్చు రావడంతో పాత సైకిల్కు వెనుక చక్రం తీసి.. దాని స్థానంలో కలుపు మొక్కలు తొలగిపోయేలా పట్టి అమర్చాడు. హ్యాండిల్ ద్వారా సైకిల్ను నెట్టుకుంటూ వెళ్తుంటే కలుపు మొక్కలు తొలగిపోతున్నాయి. నాగలి వంటి మరో పరికరాన్ని బిగించి విత్తనాలు వేసేందుకు సాళ్లు కూడా పడుతున్నాడు. ఈ విధానం ద్వారా పని తొందరగా అవ్వడమే కాకుండా.. ఖర్చు కూడా ఆదా అవుతోందని అంటున్నాడు రైతు మహ్మద్ సలీం. వ్యవసాయంలో ఆదా కోసం సైకిల్తో వ్యవసాయం ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న సలీం -
కొడుకు చితికి నిప్పు పెట్టిన తల్లి
ధర్మపురి: కుటుంబ పెద్ద అనారోగ్యంతో మూడేళ్ల క్రితం మృతి చెందాడు. కుటుంబ భారమంతా తల్లిపై పడింది. ఆమె కష్టాలు చూడలేక ఒక్కగానొక్క కుమారుడు ఇంటికి పెద్ద దిక్కుగా మారాడు. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు రెండు నెలల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఆ యువకుడిని విధి వక్రీకరించింది. ఇటీవల ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడే మృతిచెందాడు. అతడి మృతదేహం స్వగ్రామం రాగా.. తల్లి హృదయం తల్లడిల్లింది. తనకు తలకొరివి పెట్టాల్సిన కుమారుడికి ఆమె నిప్పు పెట్టింది. ఈ విషాధ ఘటన ధర్మపురిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యశోద, పెద్దన్న దంపతులకు కుమారుడు సిద్దార్థ (19), కూతురు సంతానం. సిద్దార్థ చిన్నతనంలోనే పెద్దన్న మరణించాడు. కుటుంబాన్ని పోషించేందుకు రెండు నెలల క్రితం ఎడారి దేశం వెళ్లాడు. ఏసీ కంపెనీలో టెక్నీషియన్గా పని నేర్చుకుంటున్నాడు. వారం క్రితం ఓ బిల్డింగ్లో పనులు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. తోటి స్నేహితులు అతడిని అక్కడి ఆస్పత్రిలో చేర్పించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సిద్దార్థ మృతదేహం బుధవారం స్వగ్రామం చేరుకుంది. తలకొరివి పెట్టిన తల్లి కొడుకు చితికి తల్లి యశోధ తలకొరివి పెట్టడం అందరినీ కలిచివేసింది. మూడేళ్ల క్రితం భర్త..ఇప్పుడు ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో ఆమె రోదనలకు అంతులేకుండాపోయింది. ఎవరికోసం బతకాలె బిడ్డా అంటూ రోదించడం అక్కడున్నవారిని కదిలించింది. పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లిన యువకుడు వెళ్లిన రెండు నెలలకే గుండెపోటుతో మృతి శవాన్ని చూసి తల్లడిల్లిన తల్లి హృదయం -
కుంటయ్యకు కన్నీటి వీడ్కోలు
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా జనరల్ ఆస్పత్రి బుధవారం ఉదయం జనసంద్రమైంది. తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ మాజీ ఎంపీటీసీ కరికవేని కుంటయ్య(48) ఆత్మహత్య ఉదంతం నేపథ్యంలో జిల్లాలోని బీఆర్ఎస్ శ్రేణులు సిరిసిల్లకు తరలివచ్చాయి. కుంటయ్య మృతదేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదా ర్చారు. అన్ని విధాలా పార్టీ ఆదుకుంటుందని భరో సా ఇచ్చారు. కుంటయ్య ఆత్మహత్యకు కారణమైన వారికి ఎవ్వరనీ వదిలిపెట్టమని, న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. క్రమశిక్షణ కలిగిన గులా బీ నాయకుడిని కోల్పోయామని, హైదరాబాద్ వర కు నాకు అండగా వచ్చిన కుంటయ్య ఇలా ఆత్మహత్యకు పాల్పడడం ఎంతో బాధ వేసిందని బరువెక్కి న గుండెలతో కేటీఆర్ మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, చొప్పదండి మాజీ ఎ మ్మెల్యే సుంకె రవిశంకర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, నా యకులు ఏనుగు మనోహర్రెడ్డి, న్యా లకొండ రాఘవరెడ్డి, మాట్ల మధు, కోడి అంతయ్య తదితర నాయకులతో ఆస్పత్రి ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పోలీసు బందోబస్తు సిరిసిల్ల ఆస్పత్రి వద్ద పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. శవపంచనామా పూర్తి చేసినా కేటీఆర్ వ చ్చేంత వరకు పోస్టుమార్టం చేయలేదు. బీఆర్ఎస్ శ్రేణులతో ఆస్పత్రి నిండిపోవడంతో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. టౌన్ సీఐ కృష్ణ, రూరల్ సీఐ మొగిలి, ఎస్బీ సీఐ రవికుమార్, ఇ ంటలిజెన్స్ సీఐ వెంకటేశ్, ఎస్సైలు రామ్మోహన్, శ్రీ నివాస్రావు, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. -
మద్యం మత్తులో కారు డ్రైవింగ్.. ఇద్దరు మృతి
వేములవాడఅర్బన్: మద్యం మత్తులో కారు డ్రైవర్ రెండు ద్విచక్రవాహనాలను ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందారు. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వేములవాడ మండలం కరీంనగర్– సిరిసిల్ల ప్రధాన రహదారిలోని రుద్రవరం స్టేజీ వద్ద బుధవారం రాత్రి కారు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో దర్శి (35) అనే వ్యక్తి మృతిచెందాడు. మృతుడు గుంటూరుకు చెందిన వ్యక్తి. బతుకుదెరువు కోసం రుద్రవరం వద్ద కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఇతడికి భార్య, పిల్లలు ఉన్నారు. అలాగే అదే కారు ఆగకుండా కరీంనగర్ వైపు అతివేగంగా వెళ్లి ఆరెపల్లి స్టేజీ వద్ద వేములవాడ పట్టణం సుబ్రహ్మణ్యనగర్కు చెందిన మల్యాల పండరీనాథ్ (25) ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనం వెనుక ఉన్న చందుకు తీవ్రగాయాలయ్యాయి. కాగా, కారు డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా వాహనాలను ఢీకొనడంతో అతడి పరిస్థితి కూడా విషమంగా ఉండగా, స్థానికులు 108లో వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాలను వేములవాడ టౌన్ ఎస్సై వెంకట్రాజం పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. 133.8 కిలోల గంజాయి దహనం కరీంనగర్క్రైం: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లోని వివిధ గంజాయి కేసుల్లో సీజ్ చేసిన 133.8 కిలోల గంజాయిని పోలీసులు బుధవారం దహనం చేశా రు. కరీంనగర్ సీపీ గౌస్ ఆలం సమక్షంలో డ్రగ్ డి స్పోజల్ కమిటీ ఆధ్వర్యలో బుధవారం మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లిలో దహనం చేశా రు. ఏసీపీలు వేణుగోపాల్, విజయ్కుమార్, ఇన్స్పె క్టర్లు పుల్లయ్య, సంజీవ్, రజినీకాంత్ పాల్గొన్నారు. జాతీయ అర్చరీ పోటీల్లో వెండి పతకంవిద్యానగర్(కరీంనగర్): ఉత్తరాఖండ్లో ఈనెల 13 నుంచి 15 వరకు జరిగిన జాతీయస్థాయి అర్చరీ పోటీల్లో కరీంనగర్ ఆర్టీసీ జోనల్ వర్క్షాప్లో మెకానిక్గా పని చేస్తున్న కూన కిషన్ 50 మీటర్ల పోటీల్లో వెండి పతకం సాధించారు.ఈ సందర్భంగా కిషన్ను బుధవారం వర్క్షాప్ మేనేజర్ ప్రణీత్, అసిస్టెంట్ వర్క్స్ మేనేజర్ల శ్రీనివాసరావు, సురేందర్ అభినందించారు. -
స్మార్ట్ పన్నాగం!
● టెండరు లేకుండా రూ.80 లక్షల పనుల కేటాయింపు ● పద్మనగర్ ‘గరుడ జంక్షన్’ నిర్మాణ పనుల్లో చోద్యం ● నిబంధనలకు తిలోదకాలిచ్చినా పట్టని ఉన్నతాధికారులుసాక్షిప్రతినిధి,కరీంనగర్: ప్రభుత్వాలు మారినా స్మార్ట్ సిటీ పనుల్లో అవకతవకలు, అక్రమాలు మాత్రం ఆగడం లేదు.అంచనాలు ఇష్టారీతిన పెంచడం, నిబంధనలకు విరుద్ధంగా పనులు అప్పగించడం, నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడం సర్వసాధారణంగా మారింది. నగరంలో కొనసాగుతున్న పద్మనగర్ జంక్షన్ పనులు మరోసారి ఈ విషయాన్ని చాటుతున్నాయి. స్మార్ట్సిటీలో భాగంగా నగరంలోని పద్మనగర్ జంక్షన్ నిర్మాణాన్ని రూ.కోటి అంచనాతో చేపట్టారు. టీటీడీ నిర్మించనున్న శ్రీవేంకటేశ్వర దేవాలయానికి సమీపంలోని జంక్షన్ కావడంతో గరుడ జంక్షన్గా నామకరణంగా చేశారు. జంక్షన్ స్థలం ఇరుకుగా ఉండటం.. సిరిసిల్ల రూట్ నుంచి బైపాస్ మీదుగా నిత్యం భారీగ్రానైట్ లారీలు వెళ్తుండడంతో, ఈ జంక్షన్కు ఉన్న స్థలం సరిపోలేదు. దీంతో రహదారిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని (బుల్సెమెన్ స్థలం) తీసుకుని కొత్తగా గోడను నిర్మిస్తున్నారు. ఇక్కడ రిటెయిన్వాల్, రోడ్డు, లైటింగ్కు గాను అదనంగా రూ. 80 లక్షలు కేటాయించారు. సాధారణంగా ముందుగా నిర్ణయించిన అంచనాలకు పనులు పదిశాతం పెరిగితే, సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీకే అప్పగిస్తారు. అంచనాలు అంతకుమించితే.. టెండర్ తప్పనిసరి. కానీ..ఇక్కడ 80 శాతం నిధులు అవసరమైనప్పటికీ.. అధికారులకు టెండరు పిలవాలన్న ఆలోచన రాకపోవడం విశేషం. పనుల్లోనూ గోల్మాల్ విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పద్మనగర్ జంక్షన్ పనుల్లోనూ అక్రమాలు చోటుచేసుకొంటున్నట్లు సమాచారం. జరుగుతున్న పనులకు, బిల్లులకు పొంతన కుదరడం లేదు. పనులు కొనసాగుతుండగానే రన్నింగ్ బిల్లులు ఇవ్వడం సహహజమే అయినా, ఇక్కడే అక్రమాలకు అవకాశం ఏర్పడుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న రిటెయిన్ వాల్ నిర్మాణ పనుల్లో ఎం–15 గ్రేడ్ డిజైన్తో నిర్మాణం జరుగుతుండగా, బిల్లుల్లో మాత్రం ఎం–30 గ్రేడ్ డిజైన్తో నిర్మిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. భారీ భవంతులకు సైతం ఎం–25 గ్రేడ్ డిజైనే వాడుతారు. అలాంటిది రీటెయినింగ్ వాల్కు ఎం–30 గ్రేడ్ డిజైన్ వాడుతున్నామని నమోదు చేయడంలో ఆంతర్యం ఏంటో అధికారులకే తెలియాలి.ఆది నుంచీ వివాదాస్పదమే... స్మార్ట్ సిటీలో భాగంగా చేపట్టిన జంక్షన్ల నిర్మాణంలో పెద్దఎత్తున అవినీతి చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో రూ.70 లక్షలతో పూర్తయ్యే తెలంగాణచౌక్ జంక్షన్ను రూ.1.30 కోటికి పెంచారంటూ అప్పట్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లే ఫిర్యాదు చేశారు. అలాగే గాంధీ జంక్షన్లోనూ అంచనాలు పెంచి బిల్లులు తీసుకోవడాన్ని ‘సాక్షి’అప్పట్లో వెలికితీయడంతో, ఆ సమయంలో ఇన్చార్జి కమిషనర్గా ఉన్న ప్రస్తుత కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సదరు కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి రూ.81,450 డబ్బులు రికవరీ చేయడం సంచలనం సృష్టించింది. స్మార్ట్సిటీ పనులకు సాంకేతిక సహకారం అందించే ప్రాజెక్ట్ మేనేజింగ్ కన్సల్టెన్సీ (పీఎంసీ) పనులు పర్యవేక్షించిన ఆర్వీ కన్సల్టెన్సీ ముఖ్యప్రతినిధి సందీప్కుమార్ను సంప్రదించగా.. ఈ పనులకు తాము కేవలం సాంకేతిక సహకారం మాత్రమే అందించామని, టెండరు దాఖలు విషయాన్ని కమిషనర్ చూసుకుంటారని సమాధానమిచ్చారు. స్మార్ట్సిటీతో తమ ఒప్పందం ఇటీవల ముగిసిందని స్పష్టంచేశారు. -
ప్రభుత్వ వైద్యసేవలు భేష్
కరీంనగర్టౌన్: ప్రతి ఒక్కరూ ప్రభుత్వ వైద్యసేవలు వినియోగించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కరీంనగర్ ప్రభుత్వాసుప త్రిలో ఎండోస్కోపీ నేషల్ సర్జరీ, సెప్టో ప్లాస్టిక్టినీ దిగ్విజయంగా వైద్యుల బృందం పూర్తి చేయగా, మంగళవారం కలెక్టర్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా మట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆ ధునిక వైద్య పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్నారని, తానే స్వయంగా చూసి ఇష్టంతో సర్జరీ చేయించుకున్నానని తెలిపారు. సూపరింటెండెంట్ వీరారెడ్డి నేతృత్వంలోని వైద్యుల బృందం కలెక్టర్కు పుష్పగుచ్ఛం అందజేశారు. వైద్యు ల బృందానికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.● కలెక్టర్ పమేలా సత్పతి -
బహ్రెయిన్లో 9 మంది అరెస్ట్
● సాయం కోసం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించిన కుటుంబ సభ్యులు జగిత్యాలక్రైం: ఉన్న ఊరిలో ఉపాధి లేక గల్ఫ్ దేశం వెళ్లిన కార్మికులు చేయని తప్పునకు అక్కడ శిక్ష అనుభవిస్తున్నారు. బహ్రెయిన్లో ఆల్ మోయ్యాద్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్న 9 మంది తెలంగాణ కార్మికులను ఇంధనం దుర్వినియోగం కేసులో ఇటీవల అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన బొమ్మడి సుదర్శన్ బహ్రెయిన్లో డ్రైవర్గా పనిచేస్తాడు. ఆయనతోపాటు మరో 8 మందిని ఈనెల 4న అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి న్యాయ సహాయం అందించాలని సుదర్శన్ కుమారుడు నితిన్ మంగళవారం హైదరాబాద్లోని ప్రజాభవన్లోని ప్రవాసి ప్రజావాణిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు సింగిరెడ్డి నరేశ్రెడ్డి, గుగ్గిళ్ల రవిగౌడ్, నంగి దేవేందర్రెడ్డి, బొజ్జ అమరేందర్రెడ్డితో కలిసి వినతిపత్రం సమర్పించారు. స్టైఫండ్ చెల్లించాలికరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం నగునూరులోని ప్రతిమ మెడికల్ కళాశాల హౌజ్సర్జన్లు స్టైఫండ్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ప్రభుత్వం ప్రతి హౌజ్సర్జన్కు నెలకు రూ.25వేల స్టైఫండ్ చెల్లిస్తోందన్నారు. కళాశాల యాజమాన్యం ఎవరికీ స్టైఫండ్ ఇవ్వడం లేదని ఆరోపించారు. స్టైఫండ్ చెల్లించేవరకు ఆందోళన కార్యక్రమాలను చేపడుతామని తెలిపారు. -
సంగీతమే ఆయన ప్రాణం
● రాణిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు ● మూడుసార్లు బంగారు పతకాలు ● 26 ఏళ్లుగా కచేరీలుజగిత్యాలరూరల్: అతడికి చిన్నప్పటి నుంచే చదువుతోపాటు సంగీతం అంటే ఎంతో ఇష్టం. తన సంగీతంతో జాతీయ, రాష్ట్రస్థాయిలో పలువురి మన్ననలు పొంది అవార్డులు కూడా అందుకున్నారు. ధర్మపురికి చెందిన గుండి జగదీశ్వర్శర్మ మేడిపల్లి మండలం వల్లంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. రేడియో, టీవీ గాయకుడిగా పలు సంగీత కచేరీలు నిర్వహిస్తూ మన్ననలు పొందారు. పలు టీవీ సీరియల్స్కు సంగీతం అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి, మాదవపెద్ది సురేశ్, ఆర్పీ పట్నాయక్తో కలిసి పలు సంగీత కచేరీల్లో పాల్గొన్నారు. 26ఏళ్లలో 1,596 కచేరీలు నిర్వహించారు. ఇందులో 120 బెస్ట్ సింగర్ అవార్డులు అందుకున్నారు. దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం పేరున మూడుసార్లు, గంటసాల పేరున రెండుసార్లు అవార్డులు అందుకున్నారు. ఆయన సంగీత సేవలకు ఢిల్లీ యూనివర్సిటీ డాక్టరేట్ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అందించింది. ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి శతకం, వినాయక భక్తి గీతాలు, రాముని భక్తిగీతాలు, ఆంజనేయస్వామి భక్తి గీతాలు పాడి తన సంగీతాన్ని పలువురికి వినిపించారు. -
వర్షాకాలం.. కరెంట్తో పైలం
● విద్యుత్తో అప్రమత్తత, జాగ్రత్త తప్పనిసరి ● అత్యవసర, అంతరాలుంటే 1912 టోల్ఫ్రీని సంప్రదించండి ● కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్బాబుకొత్తపల్లి(కరీంనగర్): వినియోగదారులు/ రైతులు వర్షాకాలంలో విద్యుత్తో జాగ్రత్తగా ఉండాలని టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్బాబు సూచించారు. విద్యుత్ అంతరాయం జరిగినప్పుడు టోల్ ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించాలని పేర్కొన్నారు. మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడా రు. వినియోగదారులకు పలు సూచలు ఇచ్చారు. తడిసిన ఉపకరణాలను తాకొద్దు వర్షాలు కురుస్తున్నప్పుడు తడిసిన విద్యుత్ స్తంభాల స్టేవైరు/సపోర్టు వైరు, తడిచిన విద్యుత్ ఉపకరణాలను తాకొద్దు. తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను ముట్టుకోవద్దు. అలాంటివి గమనిస్తే విద్యుత్ సిబ్బందికి తెలియజేస్తే సరిచేస్తారు. అనుమతిలేని వ్వక్తులు/వినియోగదారులు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లకు ఫ్యూజులు మార్చడం, సర్వీసు వైర్లు, వీధి దీపాలను సరి చేయడం కారణంగా విద్యుత్ ప్రమాదాలకు గురవుతున్నారు. కావున జాగ్రత్తగా ఉండాలి. ప్లాస్టిక్ దండేలు వాడాలి బట్టలు ఆరవేసే జీఐ దండెం వైర్లపై నుంచి విద్యుత్ వైర్లు వెల్లడంతో విద్యుత్ వైర్లలో ఇన్సులేషన్ సరిగ్గా లేకపోవడం షాక్ గురయ్యే ప్రమాదం ఉంది. కనుక ప్లాస్టిక్ దండేలు ఉపయోగించాలి. ఇంటి ఎదుట రేకులకు విద్యుత్ సరఫరా అయ్యే ప్రమాదం ఉంది. విద్యుత్ సరఫరా వైర్లను ఎట్టి పరిస్థితుల్లో దండేలకు, రేకులకు తగలనివ్వకూడదు. రైతులు జాగ్రత్త రైతులు వ్యవసాయ పంపుసెట్లను వినియోగించినప్పుడు కరెంటు మోటార్లు, ఫుట్ వాల్వులు, సర్వీసు వైర్లకు ఇన్సులేషన్ విద్యుత్ ప్రసారం జరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. కరెంటు మోటార్లను కాని, పైపులను కాని, ఫుట్ వాల్వులను ఏమరపాటుతో తాకకూడదు. పంపుసెట్లను, స్టార్టర్లను విధిగా ఎర్త్ చేయించుకోవాలి. సొంత కరెంట్ పనులు చేసుకొని ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దు. పశువులను మేతకు తీసుకువెళ్లినప్పుడు కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాల దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. పొలంలో విద్యుత్ కంచెలు వేయడం సైతం చట్టవ్యతిరేకం.తెలిసినవారితో మరమ్మతు చేయించాలి ట్రాన్స్ఫార్మర్ల వద్ద అనధికారంగా ఫ్యూజులు మార్చడం, రిపేరుచేయడం, ఏబీ స్విచ్లు ఆపరేట్ చేయడం, కాలిన తీగలను సరిచేయడం ప్రమాదకరం. మోటారు రిపేరు తెలిసిన వారి చేతనే మరమ్మతు చేయించుకోవాలి. వ్యవసాయ మోటార్లకు, గృహాలలో అతుకులు లేని సర్వీసు వైరు ఉపయోగించాలి. ఎవరికై నా కరెంట్ షాక్ తగిలితే ఆ వ్యక్తిని ముట్టుకోరాదు. షాక్కు గురైన వ్యక్తిని వేరు చేయడానికి విద్యుత్ ప్రవహించని (కర్ర, ప్లాస్టిక్ లాంటి) వస్తువులను వాడాలి. విద్యుత్ లైన్ల కింద పందిరిలు వేసి జెండా గద్దెలు కట్టి విద్యుత్ ప్రమాదాలకు గురవుతున్నారు. కరెంటు లైన్ల క్రింద పందిర్లు వేయరాదు. గ్రామీణ వినియోగదారులు తమ పరిధిలోని క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బంది లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, సీనియర్ లైన్ఇన్స్పెక్టర్, సబ్ ఇంజినీర్, సెక్షన్ ఆఫీసర్ను సంప్రదించి వారిసేవలను పొందాలి. -
విధుల నుంచి అన్యాయంగా తొలగించారు
● గురుకులం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నిరసన ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య గురుకులం ఆశ్రమ పాఠశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించడంతో మంగళవారం పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగారు. పర్మినెంట్ ఉద్యోగులు రావడంతో తమను విధుల నుంచి తొలగించడంతో రోడ్డునపడ్డామని ల్యాబ్ అసిస్టెంట్ నిర్మల, కుకింగ్ మాస్టర్ బాలు, ఏఎన్ఎం సుజాత, మరోకరు ఆవేదన వ్యక్తం చేశారు. తమను తొలగించడాన్ని నిరసిస్తూ పాఠశాల ముందు బైఠాయించారు. 20 ఏళ్లుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా పని చేస్తున్న తమను అన్యాయంగా తొలగించారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏకలవ్య మోడల్ పాఠశాలల్లో పని చేస్తున్న 73 మందిని తొలగించగా, అందులో వీరు కూడా ఉన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను అన్యాయంగా తొలగించారని గిరిజన గురుకులం నాన్ టీచింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీరా పూల్సింగ్ అన్నారు. వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. ఆందోళన చేస్తున్న వారికి గిరిజన సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సై రమాకాంత్ అక్కడికి వెళ్లి పాఠశాల ప్రిన్సిపాల్, ఔట్సోర్సింగ్ సిబ్బందితో మాట్లాడి శాంతింపజేశారు. ఈ సందర్భంగా ఔట్సోర్సింగ్ సిబ్బంది మాట్లాడుతూ, పాఠశాలలో 20ఏళ్లుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా తాము విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. ఉన్నఫలంగా తొలగిస్తే తమ కుటుంబాలు రోడ్డునపడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వమే ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని కోరారు. -
పేదల రక్తం తాగుతున్న బీజేపీ సర్కార్
● కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు సిరిసిల్లటౌన్: పెంచిన నిత్యవసరాల ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మొగిలి సునీతారావు డిమాండ్ చేశారు. ధరలు తగ్గించాలంటూ మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహిళా నేతలతో ధర్నా చేపట్టి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిరుపేదల నడ్డి విరిచేలా నిత్యవసర సరుకుల ధరలు పెంచడం సమంజసం కాదన్నారు. బీజేపీ పాలనలో సంక్షేమం కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని లేకుంటే పోరాటాలు ఉధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంతకుముందు జై బాపు.. జై భీమ్.. జై సంవిదాన్.. కార్యక్రమం సందర్భంగా అంబేడ్కర్ చౌరస్తా నుంచి నేతన్న విగ్రహం వరకు వందలాది మహిళా కార్యకర్తలతో ర్యాలీ తీశారు. సంక్షేమ పాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. సిరిసిల్లలో డబుల్బెడ్ రూం లబ్ధిదారుల వద్దకు వెళ్లి భూమి పూజ నిర్వహించారు. రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీ చేశారు. అనంతరం సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేయడం జరిగిందని, మహిళలకోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, సీనియర్ నాయకురాలు మడుపు శ్రీదేవి, జనరల్ సెక్రటరీ కోడం అరుణ, రోజా, సరిత, బ్లాక్ ప్రెసిడెంట్ రమాదేవి, టౌన్ ప్రెసిడెంట్ స్వరూప, ముసుకు పద్మ, రుక్మిణి, లహరి, హారిక, వనిత, రాజ్యలక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన జెడ్పీ అధికారులు
కరీంనగర్క్రైం: జిల్లా పరిషత్లో అద్దె వాహనాలకు బిల్లు చెల్లింపు విషయంలో లంచం డిమాండ్ చేసిన ఇద్దరు అధికారులు ఏసీబీ అధికారులకు చిక్కారు. జిల్లా పరిషత్లో ఓ వ్యక్తి తన వాహనాన్ని అద్దెకు పెట్టాడు. 10నెలలు బిల్లు ఇవ్వాల్సి ఉండగా కొన్ని రోజుల క్రితం 4నెలల బిల్లు చెల్లించారు. మిగితా 6 నెలల బిల్లు ఇవ్వాలంటే రూ.8వేల లంచం ఇవ్వాలని పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ శరత్, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం సాయంత్రం జిల్లా పరిషత్లో డబ్బులు తీసుకుంటుండగా ఇంజినీర్ శరత్, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ను ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. -
లీకులతో లీడర్ల పరేషాన్
● నేడు సీడీఎంఏ వద్దకు జాబితాకరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని డివిజన్ల పునర్వి భజన తుది జాబితా బుధవారం సీడీఎంఏకు చేరనుంది. కలెక్టర్ ఆమోదం తరువాత సీడీఎంఏకు పంపించేందుకు అధికారులు సన్నహాలు చేస్తున్నా రు. మార్గదర్శకాలకు అనుగుణంగా పునర్విభజన సాగుతుందా లేదా అనేది ఆరా తీసేందుకు మంగళవారం హైదరాబాద్లో సీడీఎంఏ నిర్వహించిన సమావేశానికి బల్దియా కమిషనర్ ప్రఫుల్దేశాయ్ సహా పట్టణ ప్రణాళిక అధికారులు హాజరయ్యారు. నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన పునర్విభజన తుది జాబితాను ప్రదర్శించారు. నేడు సీడీఎంఏ వద్దకు డివిజన్ల పునర్విభజన ప్రక్రియ చివరి అంఖానికి చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం 17, 18 తేదీల్లో కలెక్టర్ పరిశీలన, ఆమోదం తరువాత 19వ తేదీన సీడీఎంఏకు జాబితాను పంపించాల్సి ఉంది. కలెక్టర్ పమేలా సత్పతి శస్త్ర చికిత్స చేసుకోవడంతో బుధవారం ఉదయం ఆమె జాబితాను పరిశీలించే అవకాశం ఉంది. ఇప్పటికే నిబంధనలకు అనుగుణంగా తుది జాబితాను రూపొందించగా, జాబితాలోని మార్గదర్శకాలను సీడీఎంఏకు సైతం వివరించారు. దీంతో పెద్దగా మార్పు లేకుండానే జిల్లా కలెక్టర్ ఆమోదించే అవకాశం ఉంది. బుధవారం రాత్రి వరకు జాబితాను సీడీఎంఏకు పంపించనున్నారు. హైదరాబాద్కు కమిషనర్ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా డివిజన్ల పునర్విభజన జరుగుతుందా లేదా అనేది పరిశీలించేందుకు సీడీఎంఏ మంగళవారం హైదరాబాద్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పునర్విభజన చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు, పట్టణ ప్రణాళిక అధికారులను రావాలని ఆదేశించింది. నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్, పట్టణప్రణాళిక విభాగం అధికారులు కరీంనగర్ నుంచి హాజరయ్యారు.అంతా ఉత్కంఠ డివిజన్ల పునర్విభజన తుది జాబితా సిద్ధం కావడంతో, మాజీకార్పొరేటర్లు, ఆశావహుల్లో ఉత్కంఠ మొదలైంది. తమ డివిజన్లు ఎలా ఉన్నా యో అంటూ ఆరా తీస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగానికి చెందిన కొంతమంది అధికారులు డివిజన్ల పునర్విభజనపై లీకులు ఇవ్వడం గందరగోళానికి దారితీసింది. లీకుల సమాచారం మేరకు తాము అనుకున్న రీతిలో కాలేదని తెలిసిన కొంతమంది నాయకులు అధికారులపై ఒత్తిడి పెంచారు. తమ పార్టీ పెద్దలతో ఫోన్లు చేయించారు. దీంతో లీకులపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. -
అల్ఫోర్స్ ఇ– టెక్నో విద్యార్థినికి గిన్నీస్బుక్లో చోటు
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్లో 5వ తరగతి చదువుతున్న బుక్క దీత్య శ్రీగిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్శ్రీలో చోటు సాధించినట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో సుమారు 2,400 మందికి పైగా కళాకారులతో కలిసి పాల్గొని ప్రతిష్ఠాత్మక గిన్నీస్బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు కై వసం చేసుకోవడం చారిత్రాత్మక విజయమన్నారు. విద్యార్థినిని మంగళవారం స్థానిక పాఠశాలలో ప్రశంసాపత్రాన్ని అందజేసి అభినందించారు. అపోలో రీచ్లో నూతనంగా గ్యాస్ట్రో, లివర్ చికిత్సలుకరీంనగర్టౌన్: నగరంలోని అపోలో రీచ్ హాస్పిటల్లో నూతనంగా గ్యాస్ట్రోఎంటరాలజీ, లివర్ డిసీజ్ విభాగం ఏర్పాటు చేసినట్లు ఏవో డాక్టర్ నాగసతీశ్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్ పరమేశ్వర్ తెలిపారు. మంగళవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన గ్యాస్ట్రో ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించారు. అత్యాధునిక ఎండోస్కోపీ పరికరాలతో జీర్ణ, ప్రేగు, లివర్ సంబంధిత రోగాలకు సమగ్ర చికిత్సలను అందించనున్నట్లు తెలిపారు. ఇజ్రాయిల్లో జగిత్యాల వాసి మృతిజగిత్యాలక్రైం: జగిత్యాలలోని 36వ వార్డుకు చెందిన రేవెల్ల రవిగౌడ్ (45) ఇటీవల ఇజ్రాయిల్ దేశంలో గుండెపోటుతో మరణించాడు. మంగళవారం జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి రవిగౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇజ్రాయిల్ దేశంలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించేందుకు జాప్యం జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డితో మాట్లాడి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్షాక్తో యువకుడు..జగిత్యాలక్రైం(సారంగాపూర్): సారంగాపూర్ మండలం పోతారంలో కొత్త ఇంట్లో వైరింగ్ చేస్తుండగా నా రపాక బల్తగిరి (25) విద్యుత్షాక్ తగిలి మృతిచెందా డు. బీర్పూర్ మండలం ఇందిరనగర్కు చెందిన నారపాక బల్తగిరి ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. మంగళవారం సా రంగాపూర్ మండలం పోతారానికి చెందిన బై రి రమేశ్ ఇంట్లో విద్యుత్ వైరింగ్ చేస్తుండగా ప్ర మాదవశాత్తు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సారంగాపూ ర్ ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిజాయితీ చాటుకున్న ఆటోడ్రైవర్ధర్మపురి: తనకు దొరికిన తులం బంగారం చైన్ను పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు ఓ ఆటో డ్రైవర్. ధర్మపురికి చెందిన నూగూరి నగేష్ ఆటో డ్రైవర్. మంగళవారం స్థానిక బస్టాండ్ సమీపంలో అతడికి తులం బంగారు చైన్ దొరికింది. దానిని ధర్మపురి పోలీస్స్టేషన్కు వెళ్లి సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై ఉదయ్కుమార్కు అందించాడు. అప్పటికే గొలుసు పోయిందని బాధితులు వెదుకుతుండగా వారిని విచారణ చేపట్టిన పోలీసులు వారికి అప్పగించారు. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ నగేష్ను శాలువాతో సన్మానించారు. -
ఆధార్ నవీకరణకు మరో ఏడాది పెంపు
కరీంనగర్ అర్బన్: ఆధార్ కార్డుల నవీకరణకు కేంద్రం మరో ఏడాది వరకు గడువు పొడిగించింది. 2026 జూన్ 30 వరకు ఆధార్ కార్డులను నవీకరించుకోవడానికి అవకాశమిచ్చింది. ఆ తర్వాత కూడా నిర్లక్ష్యం చేస్తే కార్డు సస్పెండ్ చేస్తారు. ఒకసారి ఆధార్ కార్డు సస్పెండైతే దానిని పునరుద్ధరించుకోవడానికి వివిధ ధ్రువపత్రాలు పెట్టి మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కార్డుల నవీకరణకు కొందరు ఉత్సాహం చూపుతుండగా అవగాహన లేనివారు మాత్రం దూరంగా ఉంటున్నారు. మరికొందరు మొబైల్ లో శ్రీమై ఆధార్శ్రీ యాప్ డౌన్లోడ్ చేసుకుని వివరాలను నవీకరించుకుంటున్నారు. అన్నింటికీ ఆధారం పదేళ్ల క్రితం కార్డులు పొందినవారందరూ నవీకరించుకోవాలని యూఐడీఐ నుంచి కార్డుదారులకు మొబైల్కు సంక్షిప్త సందేశాలు అందుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 2011– 12మధ్య ప్రాంతంలో 9 లక్షల మంది ఆధార్ కార్డులు తీయించారు. అప్పుడు ఊరూరా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి ఆధార్ నమోదు చేయించారు. పదేళ్ల చెల్లుబాటు అయ్యేలా నిబంధనలు విధించారు. ప్రతీ పది సంవత్సరాలకు ఒకసారి ఆధార్ ను నవీకరించుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఆధార్ కార్డు అన్నిటికీ కీలకంగా మారింది. బ్యాంకు ఖాతాలు తెరవడం, విద్యార్థుల ప్రవేశాలు, పింఛన్లు, ఉద్యోగ నియామకాలు, రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీముబాకర్, సీఎం ఆర్థికసాయం, రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలకు కూడా ఆధార్ ను తప్పనిసరి చేశారు. ఆధార్ అప్ డేట్ లేకుంటే కొందరికి రేషన్, పింఛన్లు కూడా ఆగిపోతున్నాయి. ఆధార్ కార్డులు తీసుకున్నప్పటికీ కొందరు అప్డేట్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పటికే రెండు మార్లు గడువు పొడిగించిన కేంద్రం మరో ఏడాది వరకు ఆధార్ నవీకరణ గడువు పెంచింది. ఏమేం కావాలంటే.. ఆధార్కార్డు నవీకరణకు ఏదైనా ప్రభుత్వ గుర్తింపుపత్రం తీసుకెళ్లాలి. చదువుకున్నవారు పదోతరగతి మార్కుల మెమో తీసుకెళ్తే సరి. ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, మ్యారేజ్ సర్టిఫికెట్ వెంట తీసుకెళ్తే ఆధార్ నవీకరణ పూర్తి చేసుకోవచ్చు. జిల్లాలో పాత జనాభా లెక్కల ప్రకారం 10 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇప్పుడు మరో లక్ష వరకు జనాభా పెరిగే అవకాశం ఉంది. వీరికి అనుగుణంగా ఆధార్ కేంద్రాలు పెంచాల్సిన అవసరం ఉంది. ● పదేళ్లకోసారి అప్డేట్ తప్పనిసరి -
పారిశుధ్య కార్మికులకు బాసట
● సఫాయి సురక్షా అమలు ● బీమా సౌకర్యంతో పాటు వైద్యపరీక్షలుకరీంనగర్ రూరల్: విధి నిర్వహణలో సరైన రక్షణ చర్యలు పాటించకపోవడంతో పారిశుధ్య కార్మికులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ క్రమంలో గత ఆర్నేళ్ల నుంచి కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. యూనిసెఫ్ ఆధ్వర్యంలో సఫాయి సురక్షా అమలుకు చర్యలు చేపట్టింది. జిల్లాలో 318 గ్రామపంచాయతీలతో పాటు కరీంనగర్ కార్పొరేషన్, హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 2,692 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి పీఎఫ్, ఈఎస్ఐ కల్పించేందుకు వివరాలు సేకరించారు. ఆరోగ్య రక్షణకు హెల్త్కార్డులు జారీ చేశారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రితోపాటు సంబంధిత ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ప్రతీ ఆరునెలలకోసారి ఉచితంగా వైద్యపరీక్షలు చేయించుకునే అవకాశమిచ్చారు. వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా మందులు పొందే సౌకర్యముంది. 1,332మంది కార్మికులకు ప్రధానమంత్రి సురక్ష బీమాయోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, పోస్టల్ ఇన్సూరెన్స్ పథకాల ద్వారా ఒక్కో కార్మికుడికి రూ.10 లక్షల వరకు బీమా చేయించారు. కార్మికులకు రక్షణ కిట్లు పంపిణీ చేశారు. చేతులకు గ్లౌజ్లు, కాళ్లకు బూట్లు, తల హెల్మెట్లు అందించారు. కార్మికుల రక్షణకు చర్యలు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పారిశుధ్య కార్మికుల ఆరోగ్యరక్షణ, భద్రతపై దృష్టి పెట్టాం. కార్మికుల ఆరోగ్య వివరాలు పొందు పరిచి హెల్త్కార్డులను జారీ చేయడం జరిగింది. ప్రతి కార్మికుడికి బీమా సౌకర్యంతో కుటుంబానికి ఆర్ధిక భరోసా కల్పించాం. – కిషన్స్వామి, యూనిసెఫ్ జిల్లా కో– ఆర్డినేటర్జిల్లాలో పారిశుధ్య కార్మికులు 318 గ్రామపంచాయతీల్లో: 1,313 కరీంనగర్ కార్పొరేషన్: 1,117 హుజురాబాద్ మున్సిపాలిటీ: 120 జమ్మికుంట మున్సిపాలిటీ: 102 చొప్పదండి మున్సిపాలిటీ: 40 -
పీపీలతో సీపీ సమావేశం
కరీంనగర్క్రైం: కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలో మంగళవారం పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సీపీ గౌస్ఆలం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్లో పోలీసు అధికారుల సమన్వయంతో 3,478 కేసులు పరిష్కరించినందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను అభినందించారు. కోర్టులో పెండింగ్ కేసులను పరిష్కరించడంలో పోలీ సుల సమన్వయ లోపముంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, సీసీఆర్బీ ఏసీపీ జి.విజయ్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ ఫర్ ప్రాసిక్యూషన్ డి.శరత్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ జె.శ్రీరాములు, అడిషనల్ పీపీలు రాములు, గౌరు రాజిరెడ్డి, కుమారస్వామి, ఝాన్సీ, ఏపీపీలు గాయత్రి, వీరాస్వామి, రంజిత్ కుమార్, సీఐ సంతోష్కుమార్ పాల్గొన్నారు. రిటర్నింగ్ అధికారులకు శిక్షణకరీంనగర్ అర్బన్: బూత్ లెవెల్ ఆఫీసర్ల ఎంపిక, అర్హతలు, నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలకు సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు భారత ఎన్నికల సంఘం మంగళవారం ఆన్లైన్ శిక్షణ ఇచ్చింది. బీఎల్వోల ఎంపికలో అనుసరించాల్సిన విధానం, ఉండాల్సిన అర్హతలు, వారు నిర్వర్తించవలసిన విధులు, ఓటర్లకు ఏ విధంగా సహకరించాలనే అంశాలపై ఎలక్షన్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. వచ్చే నెల 2న బూత్ లెవెల్ ఆఫీసర్లకు జిల్లాల వారీగా ఈఆర్వోల ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించనున్నారు. కరీంనగర్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఈ ఆన్లైన్ శిక్షణ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్బాబు పాల్గొన్నారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాలి కరీంనగర్టౌన్: వర్షాకాలం నేపథ్యంలో దోమలు పుట్టకుండా, కుట్టకుండా చర్యలు చేపట్టాలని డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ పిలుపునిచ్చారు. డీఎంహెచ్వో కార్యాలయంలో మంగళవారం ప్రాథమిక, పట్టణ ఆరోగ్యకేంద్రం వైద్యాధికారులకు ఎంఎల్హెచ్పీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, దోమల నిర్మూలనకు పంచాయతీరాజ్, మున్సిపల్శాఖతో కలిసి ప్రజారోగ్యం మెరుగుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 16 తేదీ నుంచి జూలై 31వరకు 45 రోజులపాటు ‘స్టాప్ డయేరియా’ కార్యక్రమం జిల్లాలో జరుగుతుందన్నారు. పిల్లలకు విరేచనాలు సోకినట్లయితే వోఆర్ఎస్, జింక్ మాత్రలు అందించాలన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ సుధా, రవీందర్ రెడ్డి, ఉమాశ్రీ, సాజిద, చందు, సనజవేరియా, విప్లవ శ్రీ, రాజ గోపాల్, స్వామి, కై క పాల్గొన్నారు. కొర్రమీను చేపల పెంపకంపై శిక్షణ కరీంనగర్ అర్బన్: కొర్ర మీను చేపల పెంపకంపై కలెక్టరేట్ ఆడిటోరియంలో శిక్షణ ప్రారంభమైంది. కొర్రమీను హెచరీ యాజమాన్యం, పెంపకం పద్ధతులపై మూడు రోజుల పాటు శిక్షణ జరగనుండగా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ హాజరై పలు సూచనలు చేశారు. చేప పిల్లల ఉత్పత్తి, నూతన పద్ధతిలో చేపల పెంపకంపై అవగాహన కల్పించారు. మత్స్యశాఖ అడిషనల్ డైరెక్టర్ మురళీకష్ణ, ఎన్ఎఫ్డీబీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ దీప, సీఐబీఐ సీనియర్ సైంటిస్ట్ రాజేశ్, నాబార్డ్ ఇన్చార్జి అర్పిత, నాబార్డ్ ఏజీఎం జయప్రకాశ్, జిల్లా మత్స్యశాఖ అధికారి భారతి, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు పిట్టల రవీందర్ పాల్గొన్నారు. -
కోవిడ్ దెబ్బకు సిరిసిల్ల విలవిల!
● 2021లో జననాల కన్నా మరణాలు అధికం ● ఆ మరణాల్లో పురుషులే ఎక్కువ ● మృతులంతా 65 ఏళ్ల నుంచి 69 ఏళ్ల వారే ● ఐరాస ‘సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్’ డేటాలో వెల్లడి ● 2022లో తిరిగి పుంజుకున్న జననాలుసాక్షిప్రతినిధి,కరీంనగర్: ప్రపంచదేశాలను గడగడలాడించిన కోవిడ్ మహమ్మారి మిగిల్చిన విషాదాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజలను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నిలువుదోపిడీ చేసి వేలాది మందిని బలితీసుకున్న ఆ వైరస్ వదలిన ఆనవాళ్లు ఇప్పట్లో చెరిగేలా లేవు. తాజాగా ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన పాపులేషన్ రిపోర్ట్ సమర్పించిన ‘సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్’ (సీఆర్ఎస్) డేటా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ డేటా ప్రకారం.. దేశంలో జననాల కన్నా అత్యధిక మరణాలు చోటు చేసుకున్న 49 జిల్లాల్లో సిరిసిల్ల జిల్లా కూడా ఒకటి. కోవిడ్ అనంతరం ప్రజల ఆరోగ్యాలు, జీవనశైలిలో మార్పులు రావడం, సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభించడంతో ఆ ఏడాది మరణాలు అధికంగా సంభవించాయి. సీఆర్ఎస్ డేటా ప్రకారం.. 2021లో నమోదైన జనన మరణాలను పరిశీలి స్తే, 5,130 మరణాలకు 5,028 జననాలు చోటు చేసుకున్నాయి. ఆ మరణాలు కేవలం సిరిసిల్ల జిల్లాకు మాత్రమే పరిమితం కాలేదు. ఆ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2,34,425 మరణాలు రికార్డయ్యాయి. అందులో 1,35,725 మంది పురుషులు, 98,700 మంది మహిళలు ఉన్నారు. ఈ గణాంకాల ప్రకారం.. మహిళల కన్నా పురుషులు 40శాతం అధికంగా మరణించారు. ఆ ఏడాది చోటు చేసుకున్న మరణాల్లో పట్టణ ప్రాంతాల్లో 61,553 పురుషులు, 46,674 మంది మహిళలు మరణించగా.. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో 1,06,327 మరణాలు సంభవించాయి. పురుషుల్లోనే మరణాలు అధికం డేటా ప్రకారం 65 నుంచి 69 ఏళ్ల వయసు వారి లో మరణాల రేటు అధికంగా ఉంది. ఈ వయసులో ఉన్న వారిలో 85,945 మరణాలు రికార్డయ్యాయి. ఇక 70 ఏళ్ల పైబడిన వారిలో 51,516 మరణాలు నమోదయ్యాయి. 55 నుంచి 64 ఏళ్ల 42,349 మంది మరణాలు, 45– 54 వయసు గ్రూపులో 12,184 మరణాలు చోటు చేసుకున్నాయి. ఈ స్థాయిలో మరణాలు చోటు చేసుకోవడానికి కోవిడ్ ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో జీవన విధానంలో మార్పులు, బీపీ, హైపర్ టెన్షన్, గుండె సంబంధిత వ్యాధులు కూడా వీరి మరణాలకు కారణమై ఉంటాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణ మరణాల రికార్డులో ముందంజలో ఉంది. 75శాతం మేరకు మరణాలు అప్పటికప్పుడే రిపోర్టు అవుతున్నాయి. మిగిలినవి తరువాత రిపోర్టు అవుతున్నాయి. సీఆర్ఎస్ డేటా ప్రకారం.. 2022లో రాజన్న సిరిసిల్లలో 3,220 మరణాలు నమోదవగా, 7647 జననాలు నమోదయ్యాయి. ఏడాది తరువాత కోవిడ్ ప్రభావం తగ్గిపోవడంతో మరణాలు కూడా తగ్గుముఖం పట్టి ఉంటాయని భావిస్తున్నారు. -
మెడికవర్లో అరుదైన శస్త్రచికిత్స
కరీంనగర్టౌన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శ్రావణ్కుమార్ అనే యువకుడికి అరుదైన శస్త్రచికిత్స చేసినట్లు ఆసుపత్రి సర్జికల్ గ్యాస్ట్రో డాక్టర్ దిలీప్రెడ్డి, జనరల్ సర్జన్ డాక్టర్ వారిస్ ఉస్మాని(తాహా) తెలిపారు. ఆసుపత్రిలో మంగళవారం మాట్లాడుతూ.. శ్రీకరీంనగర్కు చెందిన శ్రావణ్కుమార్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్తే కన్నుపై దెబ్బ తగిలిందని కుట్లు వేశారు. కడుపులో తీవ్ర గాయమై, రక్తం లీక్ అవుతుందని తెలపడంతో పలు ఆస్పత్రులకు తీసుకెళ్తే తమతో కాదన్నారు. చివరకు ప్రాణాపాయస్థితిలో మెడికవర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. శ్రావణ్కుమార్కు సీటీస్కాన్ చేయడంతో కడుపులో బ్లంట్ ఇంజ్యూరీ అబ్డామెన్ (తీవ్ర రక్తస్రావం) అవుతున్నట్లు గుర్తించాం. బైక్ హ్యాండిల్ కడుపులో బలంగా గుచ్చుకోవడంతో రక్తస్రావంతో పాటు లివర్, ఫ్రాంకియాస్, స్ల్పీన్ దెబ్బతిన్నాయి. ఆపరేషన్ చేసి లివర్కు చికిత్స చేశాం. తప్పని పరిస్థితుల్లో ఫ్రాంకియాస్ కొంతభాగం, స్ల్పీన్ (ఫ్లీహం) మొత్తం తొలగించడం జరిగిందనిశ్రీ అని వెల్లడించారు. ప్రస్తుతం శ్రావణ్కుమార్ ఆరోగ్య పరిస్థితి బాగుందని తెలిపారు. మెడికవర్ సెంటర్హెడ్ గుర్రం కిరణ్, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్ పాల్గొన్నారు. -
బండమీది బడి.. చదువుల ఒడి
● ఈ బడిలో చదివి ఉన్నతస్థానాల్లో నిలిచిన పలువురు ● ఎంతో మందికి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చిన రుద్రంగి పాఠశాలరుద్రంగి(వేములవాడ): మండల కేంద్రంలోని బండమీది బడిగా ప్రఖ్యాతి పొందిన రుద్రంగి జెడ్పీ హైస్కూల్కు బహుచరిత్ర ఉంది. సుమారు 70 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ పాఠశాలలో ఎంతో మంది విద్యార్థులు చదువుకొని ఉజ్వల భవిష్యత్తును పొందారు. ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తూ బండమీది బడి చదువుల ఒడిగా విలసిల్లుతుంది. ప్రస్తుత ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బండమీది బడిలోనే హైస్కూల్ విద్యను అభ్యసించారు. అలాగే ప్రస్తుతం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న రుద్రంగి మండల కేంద్రానికి చెందిన అంబటి నర్సయ్య, హైకోర్టు జడ్జిగా చేసి రిటైర్డ్ అయిన రుద్రంగికి చెందిన ఓలిమినేని నిరంజన్రావు ఈ బడిలో విద్యను అభ్యసించినవారే. ఉన్నత స్థానాల్లో మరికొందరు.. హన్మాజీపేట గ్రామానికి చెందిన గడ్డం జలపతిరెడ్డి రాష్ట్ర ఎస్టీవోగా చేసి రిటైర్డ్ అయ్యారు. రుద్రంగికి చెందిన మర్రిపల్లి చందన చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ మెంబర్గా ప్రస్తుతం హైదరాబాద్లో చేస్తున్నారు. దేశవేని శంకర్ ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్గా చేస్తుండగా, రుద్రంగికి చెందిన కత్తి మల్లయ్య ఆడిటర్గా పనిచేశారు. చందుర్తి మండలం లింగంపేట గ్రామానికి చెందిన ఉప్పులూటి గోవిందరావు అసిస్టెంట్ ఇంజినీర్గా, చందుర్తి మండల కేంద్రనికి చెందిన దామోదర్ వరంగల్లో ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారు. రుద్రంగికి చెందిన ఆకుల రవి ఇటీవల స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించారు. వెంకటేశం బ్యాంకు మేనేజర్గా చేసి ఉద్యోగ విరమణ పొందారు. రుద్రంగికి చెందిన మర్రిపల్లి చక్రవర్తి సేఫ్టీ కన్సల్టెంట్గా చేస్తున్నారు. ఇంకా ఎంతో మంది రుద్రంగి జెడ్పీ హైస్కూల్లో విద్యను అభ్యసించి ఉన్నత స్థానాల్లో ఉన్నారు. చదివిన బడిలోనే టీచర్గా.. బండమీది బడిలో ఉన్నత విద్యను అభ్యసించిన రుద్రంగి మండల కేంద్రానికి చెందిన గడప వేణుకుమార్ చదివిన బడిలోనే టీచర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించారు. చదివిన బడిలోనే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే అవకాశం లభించడం సంతోషంగా ఉందని తెలిపారు.రుద్రంగి బడిలో నాణ్యమైన విద్య రుద్రంగి జెడ్పీ హైస్కూల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయ బృందంతో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లలను రుద్రంగి జెడ్పీ హైస్కూల్లో చేర్పించాలి. – సమ్మిరెడ్డి, హెచ్ఎం, రుద్రంగి జెడ్పీ హైస్కూల్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి రుద్రంగికి చెందిన ఓలిమినేని నిరంజన్రావు రుద్రంగి బండమీది బడి విద్యార్థి. ఇక్కడ ఓనమాలు నేర్చిన ఆయన ఉన్నత చదువులు చదివి హైకోర్టు జడ్జిగా చేసి రిటైర్డ్ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్లో స్థిరపడ్డారు.ఏసీపీగా నర్సయ్య బండమీద బడి విద్యార్థి పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించి అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం ఏసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రుద్రంగి మండల కేంద్రానికే చెందిన అంబటి నర్సయ్య తన ప్రాథమిక, ఉన్నత, ఇంటర్, పోస్టు గ్రాడ్యుయేషన్ చదువులు అంతా ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే కొనసాగించి పోలీస్ శాఖలో ఎస్సైగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ప్రస్తుతం వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఏసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రుద్రంగి హైస్కూల్ విద్యార్థి ప్రభుత్వ విప్గా.. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వగ్రామం రుద్రంగి. రుద్రంగి బండ మీది బడిలోనే తన హైస్కూల్ విద్యను అభ్యసించారు. చదువుకున్న బడితో పాటు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసే అవకాశం లభించడం ఎంతో గర్వ కారణంగా ఉందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తుందని, విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో చేరి నాణ్యమైన విద్యను అభ్యసించి ఉన్నత స్థానాల్లో నిలవాలని కోరారు. -
కరీంనగర్
గరిష్టం/కనిష్టం34.0 /26.0బుధవారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 20257బాధ్యతల స్వీకరణకరీంనగర్ అర్బన్: జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా డాక్టర్ అశ్విని తానాజీ వాకడె మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, ఏవో సుధాకర్ స్వాగతం పలికారు.క్వింటాల్ పత్తి రూ.7,400 జమ్మికుంట: స్థానిక మార్కెట్లో క్వింటాల్ పత్తి గరిష్టంగా రూ.7,400 పలికింది. మార్కెట్కు 42 క్వింటాళ్ల పత్తిని రైతులు తెచ్చారు. కార్యదర్శులు మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా పర్యవేక్షించారు. -
పిల్లలు పుట్టడం లేదని వివాహిత ఆత్మహత్య
సైదాపూర్(హుస్నాబాద్): మండలంలోని ఆకునూర్లో ఓ వివాహిత పిల్లలు పుట్టడం లేదని ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జగిత్యాల జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కొడిపెల్లి లక్ష్మి–కిషన్ దంపతుల కూతురు తేజస్విని(26)ని నాలుగేళ్ల క్రితం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూర్కు చెందిన జెల్ల సతీశ్కు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లయి నాలుగేళ్లు కావస్తున్నా సంతానం కలగడం లేదని తేజస్విని మనోవేదనకు గురై ఈ నెల 13న ఉదయం ఇంట్లో పురుగుల మందు తాగింది. చికిత్స కోసం జమ్మికుంట ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం వేకువజామున మృతిచెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. షార్జాలో కరీంనగర్ వాసి మృతికరీంనగర్క్రైం: షార్జాలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న కరీంనగర్లోని కశ్మీర్గడ్డకు చెందిన ఖాజా మెహరాజ్(46) మృతిచెందాడు. 8 ఏళ్లుగా షార్జాలో ఉంటూ అల్ఖైరిన్ బాయ్స్ పాఠశాలలో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం అతడి కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయకపోవడంతో అక్కడే ఉన్న వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా అతను ఉండే నివాసం తలుపుతీసి చూడగా మృతిచెంది ఉన్నాడు. కాగా గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. షార్జాలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఇండియాకు తరలించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నట్లు తెలిసింది. దాడి ఘటనలో 9 మంది రిమాండ్సిరిసిల్లక్రైం: భూవివాదాన్ని దృష్టిలో పెట్టుకుని దాడికి పాల్పడ్డ సంఘటనలో తొమ్మిది మందిని రిమాండ్కు తరలించినట్లు సిరిసిల్ల సీఐ కృష్ణ తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేటకు చెందిన కొలగాని అంజయ్య, అతని అన్న కొడుకులు కొలగాని నాగరాజు, కొలకాని శ్రీనివాస్ మధ్య భూవివాదం ఉంది. ఈ నేపథ్యంలో అంజయ్య కుటుంబంపై దాడి చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు కొలగాని శ్రీనివాస్, కొలగాని నాగరాజు, కొలగాని మంగవ్వ, కొలగాని మమత, కొలగాని యెల్లవ్వ, వేముల పెద్దభూమయ్య, వేముల నాగరాజు, వేముల ప్రశాంత్, వేముల అలియాస్ గుండు మల్లేశంను రిమాండ్ చేశారు. -
యుద్ధ క్రీడ వుషు
● గ్రామాల్లో ఆదరణ తెచ్చేందుకు ప్రణాళికలు ● క్రీడా కోటను వర్తింపజేయాలని విన్నవించాం ● ‘సాక్షి’తో వుషు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్కుమార్ కరీంనగర్స్పోర్ట్స్: ప్రాచీన యుద్ధ క్రీడ.. ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేది వుషు క్రీడ అని రాష్ట్ర క్రీడా వుషు సంఘం ప్రధాన కార్యదర్శి జాల మనోహర్కుమార్ అన్నారు. రాష్ట్రంలో వుషు క్రీడ అభివృద్ధికి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యకలాపాలు, 2025–26 సంవత్సరంలో నిర్వహించే పోటీల క్యాలండర్, పలు అంశాలపై ‘సాక్షి’తో మాట్లాడారు. 2025–26 సంవత్సర క్రీడా క్యాలండర్.. 2025–26 క్రీడా క్యాలండర్ను ప్రస్తుతానికి రూపొందించాం. పలు జిల్లాల్లో పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్, బాలబాలికల, పురుషుల, మహిళల విభాగాల్లో పోటీలు నిర్వహిస్తాం. జూలైలో సబ్ జూనియర్స్, ఆగస్టు 2వ వారంలో జూనియర్స్, సెప్టెంబర్ మొదటి వారంలో సీనియర్స్ పోటీలు నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందించాం. అకాడమీల ఏర్పాటుకు.. రాష్ట్రంలో వుషు క్రీడను విస్తరించడానికి అన్ని జిల్లా కేంద్రాల్లో అకాడమీలు ఏర్పాటు చేయాలని తెలంగాణ క్రీడా ప్రాధికారిక సంస్థ, తెలంగాణ ఒలింపిక్ సంఘాన్ని కోరాం. అలాగే జిల్లా కేంద్రంలోని స్టేడియాల్లో వుషు కోచ్లను నియమించాలని విన్నవించాం. చాలా మంది క్రీడాకారులు వుషులో ఇప్పటికే ఎన్ఎస్ఎన్ఐఎస్ పూర్తి చేసి ఉన్నారు. వారి ఉపాధి కోసం కోచ్లుగా నియమించాలని కోరాం. క్రీడా కోటాలో అవకాశమివ్వాలి.. బాక్సింగ్, రెజ్లింగ్, జూడో, కిక్ బాక్సింగ్, కరాటే, డ్యాన్స్, జిమ్నాస్టిక్స్ లాంటి క్రీడల సమూహమే వుషు. పై క్రీడలన్నీ వుషులో కనిపిస్తాయి. అలాగే యూత్ ఒలింపిక్స్, కామన్వెల్త్, వరల్డ్ చాంపియన్షిప్, ఏషియన్ గేమ్స్లలో వుషు క్రీడ ఉంది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో వుషు క్రీడలో రాణించినవారికి క్రీడా కోటా అమలు చేస్తున్నారు. తెలంగాణలో కూడా ఉన్నత విద్య, ఉద్యోగావకాశాల్లో క్రీడా కోటను వర్తింపజేయాలని ఇటీవల శాట్స్, ఒలింపిక్ సంఘం ప్రతినిధులకు విన్నవించాం. ఆర్మీ, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎయిర్ఫోర్స్, ఎస్ఎస్బీ, రైల్వే, పోలీస్ తదితర సంస్థలు వుషు జట్లను వివిధ పోటీలకు పంపిస్తున్నాయి. ఇక నుంచి గ్రామాల్లో.. వుషు క్రీడను గ్రామగ్రామాన విస్తరించడానికి సంఘం ఆధ్వర్యంలో సన్నాహాలు చేస్తున్నాం. వుషులో రాణించిన వారు ధైర్యసాహసాలు, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారనే పేరుంది. జిల్లాల్లోని సీనియర్ క్రీడాకారులు, కోచ్లు, సంఘం బాధ్యులను ఏకతాటిపైకి తెచ్చి గ్రామగ్రామాన వుషు క్రీడ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. వుష క్రీడకు ఆదరణ తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం. -
వుషు సంఘం నూతన కార్యవర్గం
కరీంనగర్స్పోర్ట్స్: జిల్లా వుషు అసోసియేషన్ నూతన కార్యవర్గం సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. అధ్యక్షుడిగా బార విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి కోడూరి శేఖర్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా మొయిన్ అహ్మద్, ఎ.శ్రీనివాస్, బి.రాజు, పి.లింగమూర్తి, సంయుక్త కార్యదర్శులు బి.రాణవిక్రంగాంధీ, జె.మహేశ్, ఎండీ ముఫాజిల్, పి.నాగరాజు, కోశాధికారి కె.అఖిల, కార్యవర్గ సభ్యులు జె.విజయ్ సామ్రాట్, జి.శివకృష్ణ, బి.రమేశ్, ఎల్.రవివర్మ, కె.సత్యనారాయణ, ఎం.శ్రీనివాస్ ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి జి.అజయ్కుమార్ ప్రకటించారు. ఎన్నికల పరిశీలకులుగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి ఎన్.సిద్దారెడ్డి, జిల్లా స్పోర్ట్ అథారిటీ నుంచి వి.కిష్టయ్య వ్యవహరించారు. నూతన కార్యవర్గాన్ని వుషు అసోసియేష్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పరమేశ్, జాల మనోహర్కుమార్ తదితర సంఘాల బాధ్యులు అభినందించారు. -
దోపిడీలో ఆ పార్టీలన్నీ ఒక్కటే
సిరిసిల్లటౌన్: చట్టాలను అడ్డుపెట్టుకుని దోపిడీకి పాల్పడడంలో అధికారం చేపట్టిన, చేపడుతున్న పార్టీలన్నీ ఒక్కటేనని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. సిరిసిల్లలోని లహరి గ్రాండ్ ఫంక్షన్హాలులో సోమవారం సీపీఐ నాలుగో మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కొన్ని అంశాల్లో కాంగ్రెస్ పార్టీ బెటర్ అనుకుని ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగిందన్నారు. పౌరుషానికి ప్రతీకగా రాజన్న క్షేత్రం..పోరాటాల ఖిల్లాగా సిరిసిల్ల నిలుస్తాయని కొనియాడారు. దున్నేవాడికే భూమి పేరుతో వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం ఉద్యమించిన చరిత్ర సిరిసిల్లకు ఉందన్నారు. కార్మిక హక్కులను కాలరాయడంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లు మూడూ ఒక్కటేనని ఎద్దేవా చేశారు. కమ్యూనిస్టులు నికార్సయిన ఉద్యమకారులని, నిస్వార్థంగా ప్రజల పక్షాన పోరాడుతారన్నారు. హామీలు అమలు చేయాలి: చాడ వెంకట్రెడ్డి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ ఛత్తీస్గఢ్లో ఆదివాసీ బిడ్డలను అంతం చేసే కార్యక్రమాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. రానున్న స్థానిక సంస్థల్లో పార్టీ ప్రతినిధులను వీలైనంత ఎక్కువ మందిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, నాయకులు కడారి రాములు, పంతం రవి, ఎలిగేటి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సభల్లో సీపీఐ జిల్లా కార్యదర్శిగా ఇల్లంతకుంటకు చెందిన మంద సుదర్శన్తోపాటు 25మందితో కూడిన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు తదితరులు పాల్గొన్నారు. చట్టాల అడ్డుతో అడ్డగోలు వ్యవహారాలు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే కూనంనేని సిరిసిల్లలో సీపీఐ నాలుగో మహాసభలు -
ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
ప్రమాదాలపై విద్యుత్ శాఖ ప్రత్యేక దృష్టి సారించాలి. క్షేత్రస్థాయి సిబ్బంది ప్రమాదాలపై పూర్తిస్థాయి విచారణ చేయాలి. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎందుకు ప్రమాదం జరిగింది.. ఇకముందు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చ జరగాలి. ప్రమాదాలపై ప్రతిఒక్కరికి అవగాహన కల్పించాలి. – దావ వసంత, జెడ్పీ మాజీ చైర్పర్సన్, జగిత్యాల సిబ్బంది చనిపోవడం బాధాకరం విద్యుత్ ప్రమాదాల్లో క్షేత్రస్థాయి సిబ్బంది చనిపోవడం బాధాకరం. వినియోగదారులకు అవగాహన కల్పించినట్టుగానే క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బందికి సైతం భద్రత చర్యలపై వివరిస్తున్నాం. ప్రతి విద్యుత్ ప్రమాదం జరిగినప్పుడు ఎందుకు జరిగిందనే దానిపై పూర్తిస్థాయిలో మా బృందంతో విచారణ చేసి మరోసారి అలా జరగకుండా భద్రత చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. – సాలీయానాయక్, జిల్లా విద్యుత్ శాఖ అధికారి, జగిత్యాల -
వామ్మో.. విద్యుత్ షాక్
● కలవరపెడుతున్న కరెంట్ ప్రమాదాలు ● అవగాహన కల్పిస్తున్నా.. ఆగని వైనం ● మృత్యువాత పడుతున్న సిబ్బంది జగిత్యాలఅగ్రికల్చర్: కరెంట్తో విద్యుత్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నా.. విద్యుత్ శాఖ క్షేత్రస్థాయిలో పని చేసే తమ సిబ్బందినే కాపాడుకోలేకపోతోందనే విమర్శలు వస్తున్నాయి. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా రాత్రిబవళ్లు కష్టపడి విద్యుత్ను పునరుద్ధరించే క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బంది లైన్లు సరి చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. విద్యుత్ ప్రమాదాలకు కారణం ఏదైనా.. చనిపోయేది మాత్రం క్షేత్రస్థాయిలో పని చేసే జూనియర్ లైన్మెన్లు, లైనుమెన్లు, కూలి ప్రాతిపదికన వచ్చే విద్యుత్ కార్మికులు మాత్రమే. తాజాగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కొత్తదాంరాజ్పల్లి సబ్ స్టేషన్ పరిధిలో పని చేస్తున్న జూనియర్ లైన్మెన్ దుంపేట రాజేశం కరెంట్ తీగలు సరి చేస్తూ విద్యుదాఘాతంతో మృతిచెందాడు. 5.21లక్షల విద్యుత్ కనెక్షన్లు జిల్లాలో వ్యవసాయ, గృహ, పరిశ్రమలకు చెందిన దాదాపు 5.21లక్షల విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటికి విద్యుత్ సరఫరా చేయడంలో భాగంగా ఒక 220/132 కేవీ, ఎనిమిది 132/33 కేవీ, నూట పదిహేడు 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లు, 22,884 విద్యుత్ ట్రాన్స్ఫార్ముర్లు, 11 కేవీకి చెందిన 520 ఫీడర్లు, 41వేల ఎల్టీ ఫీడర్లున్నాయి. వీటన్నింటి ద్వారా ప్రతిరోజు 3.5 నుంచి 4లక్షల మిలియన్ యూనిట్ల విద్యుత్ పంపిణీ జరుగుతుంది. అయితే ఈ తతంగాన్ని పర్యవేక్షించేందుకు అధికారులు ఓ మోస్తారుగా ఉన్నా.. క్షేత్రస్థాయిలో పని చేసే విద్యుత్ సిబ్బంది మాత్రం సరిపోవడం లేదు. కనీసం 3వేల సర్వీసులకు ఒక లైన్మెన్, 1,000 సర్వీసులకు ఒక జూనియర్ లైన్మెన్ ఉండాల్సి ఉండగా.. ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. దీనికితోడు విద్యుత్ సబ్ స్టేషన్లలో ఆపరేటర్ పోస్టులు మంజూరు చేయకపోవడంతో.. అక్కడక్కడ లైన్మెన్లే ఆ బాధ్యతలను నెరవేరుస్తున్నారు. దీంతో సిబ్బందిపై మానసిక, పని ఒత్తిడి పెరిగి ప్రమాదాల బారిన పడుతున్నారు. లైన్ క్లియరెన్సు తీసుకుంటున్నా ప్రమాదాలే.. విద్యుత్ లైన్లలో ఎక్కడైనా సమస్య ఎదురైతే అక్కడి సబ్ స్టేషన్ నుంచి లైన్ క్లియరెన్సు తీసుకుంటారు. లైన్ క్లియరెన్సులో సబ్ స్టేషన్ ఆపరేటర్, ఆ ప్రాంత లైన్మెన్ కీలకం. లైన్ క్లియరెన్సు గురించి లైన్ మరమ్మతు పనులు కింది సిబ్బందికి కూడా తెలియజేయాల్సి ఉంటుంది. అయితే కొన్నిచోట్ల విద్యుత్ సిబ్బంది మధ్య సమన్వయం కుదరకపోవడం, అక్కడక్కడ సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికితోడు ప్రతి సబ్ స్టేషన్ పరిధిలో నాలుగైదు స్విచ్ కంట్రోల్స్ ఏర్పాటు చేసుకుంటారు. దీనివల్ల ఏ ప్రాంతంలో మరమ్మతు చేయాల్సి ఉంటుందో ఆ ప్రాంతంలో విద్యుత్ను నిలిపి మిగతా ప్రాంతాలకు విద్యుత్ను పునరుద్ధరిస్తారు. అయితే మరమ్మతు పనులు చేసే లైన్మెన్ ఒకచోట స్విచ్ కంట్రోల్ వద్ద విద్యుత్ను నిలిపి మరోచోట పనులు చేస్తున్న తరుణంలో ఎవరైనా వచ్చి స్విచ్ను ఆన్ చేస్తే విద్యుత్ సరఫరా జరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. విద్యుత్ లైన్లు ప్రతిఏటా పెరుగుతున్నప్పుడు ఆ మేరకు స్విచ్ కంట్రోల్స్ కూడా ఏర్పాటు చేయాలని క్షేత్రస్థాయి నుంచి ప్రతిపాదనలు వెళ్లినా.. ఉన్నతాధికారులు పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు కనబడడం లేదు. 475 ఘటనలు జిల్లాలో కారణం ఏదైనా గడిచిన ఐదేళ్లలో 475 విద్యుత్ ప్రమాదాలు జరిగాయి. 2020–21లో 115 ప్రమాదాలు జరగగా.. 33 మంది చనిపోయారు. 14 మంది గాయపడ్డారు. 68 పశువులు మృత్యువాత పడ్డాయి. 2021–22లో 120 జరగగా.. 29 మంది మరణించారు. 9 మంది గాయపడ్డారు. 82 పశువులు మృత్యువాత పడ్డాయి. 2022–23లో 102 జరగగా.. 32 మంది మృతిచెందారు. 11 మంది క్షతగాత్రులయ్యారు. 59 పశువులు చనిపోయాయి. 2023–24లో 81 జరగగా.. 22 మంది చనిపోయారు. ముగ్గురు గాయపడ్డారు. 56 పశువులు మృత్యువాత పడ్డాయి. 2024–25లో 57 ప్రమాదాలు జరగగా.. 14 మంది చనిపోయారు. ఇద్దరు గాయపడ్డారు. 41 పశువులు మృతిచెందాయి. -
వృద్ధ దంపతుల ఇల్లు కూల్చివేత
శంకరపట్నం(మానకొండూర్): ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని కోడలు, మనవడు కలిసి ఇంటిని కూల్చివేశారని వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. మండలంలోని రాజాపూర్ గ్రామానికి చెందిన వేల్పుల కొమురమ్మ– కనుకయ్యకు ముగ్గులు కొడుకులు. పెద్ద కొడుకు గణేశ్ చనిపోగా, మిగతా ఇద్దరు హైదరాబాద్లో పని చేస్తున్నారు. పెద్ద కోడలు లక్ష్మి, మనవడు ఉదయ్ వేరే నివాసం ఉంటుండగా, కొమురమ్మ– కనుకయ్య పెంకుటింట్లో ఉంటున్నారు. వీరికి ఇంటితో పాటు 4గుంటల ఖాళీ స్థలం ఉంది. పెద్ద కోడలుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా, ఖాళీ స్థలంలో ఇల్లు కట్టుకోకుండా తాము నివాసం ఉంటున్న పెంకుటిట్లు పై కప్పును తొలగించి, గోడలు కూల్చివేస్తున్నారని సోమవారం వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. బ్లూకోల్ట్ పోలీసులు రాజాపూర్ చేరుకుని ఇంటిని కూల్చుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. -
విద్యుదాఘాతానికి గురైన ట్రాన్స్కో తాత్కాలిక ఉద్యోగి
ఇబ్రహీంపట్నం: బర్థీపూర్ గ్రామంలో ట్రాన్స్కోలో పని చేస్తున్న తాత్కాలిక ఉద్యోగి సాంబరి హరీశ్ ఈనెల 12న విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్తంభంపై నుంచి పడి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. బర్థీపూర్ గ్రామంలో విద్యుత్ అంతరాయం కలగగా.. లైన్మెన్ రాజు సెలవులో ఉండడంతో మరమ్మతు చేసేందుకు లైన్ ఇన్స్పెక్టర్ ఫ్రాంక్లిన్ తాత్కాలిక ఉద్యోగులు హరీశ్, శ్రీకాంత్లను తీసుకెళ్లారు. స్తంభంపైకి ఎక్కి చూడాలని లైన్ ఇన్స్స్పెక్టర్ సూచించగా.. హరీశ్ పైకి ఎక్కి మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతంతో కింద పడిపోయాడు. ఏఈ సతీశ్ వచ్చి పరిశీలించి హరీశ్ను మెట్పల్లి ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని రేనె ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నాడు. హరీశ్ కుటుంబం పేద కుటుంబం కావడంతో వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక స్తోమత లేదు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి సాయమందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. 85008 56881 ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు దాతల సాయం కోసం ఎదురుచూపులు -
గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్
తిమ్మాపూర్(మానకొండూర్): ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు చేసి అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు యువకులను ఎల్ఎండీ పోలీసులు అరెస్టు చేశారు. తిమ్మాపూర్ సీఐ సదన్కుమార్, ఎస్సై శ్రీకాంత్గౌడ్ తెలిపిన వివరాలు.. పక్కా సమాచారంతో.. గంజాయి తరలిస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో సోమవారం సాయంత్రం మండలంలోని కొత్తపల్లి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా వెళ్తున్న ముగ్గురు యువకులను ఆపి తనిఖీ చేయగా, వారి బ్యాగుల్లో 5 కిలోల గంజాయి లభించింది. అరెస్టయిన వారు వేములవాడ మండలం నాగయ్యపల్లికి చెందిన గుంటి నగేశ్, వేములవాడ పట్టణానికి చెందిన కుతాడి భరత్కుమార్, కోనరావుపేట మండలం మట్టిమల్ల గ్రామానికి చెందిన చెప్పాల సాత్విక్. అమ్మకం కోసమే.. సదరు యువకులు కొంతకాలంగా గంజాయికి బానిసై, సులభంగా డబ్బు సంపాదించే ఉద్దేశంతో అమ్మకం చేస్తున్నట్లు తెలిపారు. నాలుగు రోజుల క్రితం ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు చేసి, ద్విచక్ర వాహనంపై తరలిస్తుండగా పట్టుబడ్డారు. వారి నుంచి గంజాయితో పాటు బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. -
చోరీ కేసులో ఒకరి అరెస్ట్
గంగాధర(చొప్పదండి): మండలంలోని వెంకటాయిపల్లి గ్రామంలో ఈనెల 8న చోరీకి పాల్పడిన నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు చొప్పదండి సీఐ ప్రదీప్కుమార్, గంగాధర ఎస్సై వంశీకృష్ణ పేర్కొన్నారు. గంగాధర పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. వెంకటాయిపల్లికి చెందిన ఉప్పుగండ్ల గంగారెడ్డి ఈనెల 8న ఇంటికి తాళం వేసి తాగునీరు తీసుకొచ్చేందుకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి దొంగలు ఇంటి తాళం పగలగొట్టి బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈనెల 13న ఇరువురు నిందితులను అదుపులోకి తీసుకొని 20 తులాల బంగారం స్వాధీనం చేసుకోగా, సోమవారం చందుర్తి మండలం రామరావుపల్లికి చెందిన పిట్టల అరవింద్ను అదుపులోకి తీసుకొని 3 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరికొంత మంది నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని సీఐ, ఎస్సై పేర్కొన్నారు. పోగొట్టుకున్న పుస్తెలతాడు అప్పగింతమల్యాల: మండలంలోని ముత్యంపేటలోని కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం కోసం వెళ్లి పుస్తెలతాడు పోగొట్టుకున్న మహిళకు పోలీసులు తిరిగి అప్పగించారు. ఎండపల్లి మండలం గుల్లకోటకు చెందిన సుజాత ఈనెల 15న కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చింది. ఈ క్రమంలో పుస్తెలతాడును పోగొట్టుకుంది. ఆ తాడు భక్తులకు దొరకడంతో వారు ఏఎస్సై శ్రీనివాస్కు అప్పగించారు. ఆయన మైక్లో అనౌన్స్ చేయగా.. సుజాత పోలీసులను సంప్రదించింది. దీంతో సోమవారం ఏఎస్సై రమణారెడ్డి మహిళ వివరాలు, ఆధార్కార్డు ఆధారంగా పరిశీలించి పుస్తెలతాడు అప్పగించారు. ఏఎస్సై, పోలీసులు అంజయ్య, తిరుపతి, రమేశ్కు సుజాత కృతజ్ఞతలు తెలిపింది. -
‘పోలీసులు న్యాయం చేయడం లేదు’
● పురుగుల మందు డబ్బాతో రోడ్డెక్కిన గిరిజన కుటుంబం చందుర్తి(వేములవాడ): పంట చేనులోకి వెళ్లకుండా తన బావనే అడ్డుకుంటున్నాడని రుద్రంగి పోలీసులకు ఫిర్యాదు చేసి 45 రోజులు గడుస్తున్నా న్యాయం చేయడం లేదంటూ చందుర్తి బస్టాండ్ వద్ద పురుగుల మందు డబ్బాతో ఓ గిరిజన రైతు కుటుంబం సోమవారం రోడ్డెక్కింది. బాధితుడు తిరుపతినాయక్ కథనం ప్రకారం వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం బడితండాకు చెందిన గుగులోతు తిరుపతినాయక్ తన బావ భూక్య శరమన్ పంట చేనులోకి వెళ్లకుండా అడ్డు తగులుతున్నాడని గత నెల 23న రుద్రంగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తమకు న్యాయం చేయకుండా బంధువులే కదా అని కలిసి ఉండాలని ఉచిత సలహా ఇచ్చి పంపారన్నారు. రెండు రోజుల క్రితం వర్షం పడడంతో చేను దున్నేందుకు ట్రాక్టర్ తీసుకెళ్తే దారి లేదని వెనక్కి పంపినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. తిరిగి సోమవారం రుద్రంగి పోలీసు స్టేషన్కు వెళ్తే పట్టించుకోకపోవడంతోనే చందుర్తి సీఐకి ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్లు వివరించాడు. సీఐ వెంకటేశ్వర్లు వేములవాడ బందోబస్తు డ్యూటీలో ఉన్నారని తెలపడంతో తిరుపతి తన భార్య సుమలత, కుమారుడు మోక్షిత్, కూతుళ్లు మేఘన, మనశ్రీ, తల్లితో కలిసి పురుగుల మందు డబ్బాతో రోడ్డుపై బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న చందుర్తి పోలీసులు హుటాహుటిన బస్టాండ్ ప్రాంతానికి చేరుకుని పురుగుల మందు డబ్బాను లాక్కొని.. మంగళవారం వస్తే సమస్య పరిష్కరిస్తామని నచ్చజెప్పి పంపించి వేశారు. -
డివిజన్ల ఫైనల్ లిస్ట్ రెడీ
● నేడు కలెక్టర్ వద్దకు జాబితా ● రెండు రోజుల్లోనూ సవరణలకు చాన్స్కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని డివిజన్ల పునర్విభజన జాబితా దాదాపుగా పూర్తయింది. క్షేత్రస్థాయిలో అభ్యంతరాల పరిశీలన సోమవారంతో ముగియగా, రాత్రి వరకు తుది జాబితా రూపొందించేందుకు నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయి, పట్టణ ప్రణాళిక అధికారులతో సమావేశమయ్యారు. మంగళవారం కలెక్టర్కు జాబితా అందజేయనుండగా, కలెక్టర్ ఆమోదించేందుకు ముందు సవరణలకు కూడా అవకాశం ఉంది. అభ్యంతరాల పరిశీలన పూర్తి 66 డివిజన్ల పునర్విభజనపై వచ్చిన అభ్యంతరాలపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన సోమవారం ముగిసింది. ఈ నెల 5 నుంచి అభ్యంతరాలు వస్తున్న క్రమంలోనే ఆయా డివిజన్లలో అధికారులు పరిశీలన మొదలు పెట్టారు. దీంతో ఇప్పటికే పరిశీలన, వాటి పరిష్కారం వైపు చర్యలు దాదాపు పూర్తయ్యాయి. తుది జాబితా పకడ్బందీగా ఉండాలని, ఎలాంటి పొరపాట్లు, తప్పులకు తావివ్వొద్దని కమిషనర్ ప్రఫుల్ దేశాయి హెచ్చరికలు జారీ చేయడంతో, ఒకటికి నాలుగు సార్లు టౌన్ప్లానింగ్ అధికారులు జాబితాను పరిశీలిస్తున్నారు. సోమవారం రాత్రి వరకు జాబితాకు తుది రూపు ఇచ్చినట్లు సమాచారం. నేడు కలెక్టర్ వద్దకు.. అభ్యంతరాల పరిశీలన అనంతరం నగరపాలకసంస్థ రూపొందించిన 66 డివిజన్ల తుది జాబితా మంగళవారం జిల్లా కలెక్టర్కు అందించనున్నారు. మంగళ, బుధ వారాల్లో కలెక్టర్ పరిశీలన అనంతరం 19న సీడీఎంఏకు తుది జాబితా పంపించాల్సి ఉంది. అయితే రెండురోజుల కలెక్టర్ పరిశీలనలోనూ అవసరమైతే సవరణలకు అవకాశం ఉంది. కాగా కలెక్టర్కు స్వల్ప శస్త్రచికిత్స కావడంతో ఆమె బుధవారం జాబి తాను పూర్తిస్థాయిలో పరిశీలించే అవకాశం ఉన్న ట్లు సమాచారం. ఈ క్రమంలో మంగళవారం జాబితాను క్షుణ్ణంగా మరోసారి పరిశీలించి, కలెక్టర్ ఆమోదానికి పంపించే అవకాశం ఉంది. -
ఆవేదనల నివేదనలు
కరీంనగర్ అర్బన్: ‘ప్రజావాణి’ జన జాతరను మరిపించింది. ఓ వైపు రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నా.. భూ సమస్యలకు సంబంధించి అర్జీలు రావడం గమనార్హం. అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, మునిసిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మండలస్థాయిలో పరిష్కరించే అంశాలే కాగా అలవిమాలిన నిర్లక్ష్యమే కనిపిస్తోంది. ప్రధానంగా భూ సమస్యలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, తదితర అర్జీలను అందజేశారు. ప్రజావాణికి 307 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు. ఈ సందర్భంగా పలువురిని ‘సాక్షి’ పలకరించగా వారి ఆవేదనను వివరించారు. వివరాలు వారి మాటల్లోనే.. ప్రజావాణికి 307 అర్జీలు అత్యధికం భూ సమస్యలేమొత్తం అర్జీలు: 307ఇందులో ఎక్కువగా.. మునిసిపల్ కార్పొరేషన్: 65కరీంనగర్ రూరల్ తహసీల్దార్: 17ఆర్డీవో, కరీంనగర్: 12తిమ్మాపూర్ తహసీల్దార్: 12డీపీవో: 10తహసీల్దార్ వీణవంక: 10వారధి సొసైటీ: 09ఎంపీడీవో జమ్మికుంట: 08 -
వయోవృద్ధులపై వేధింపులు బాధాకరం
కరీంనగర్: ప్రపంచ వయోవృద్ధులపై వేధింపుల నిరోధక దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వెంకటేశ్ ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ వయోవృద్ధుల వసతి గృహంలో చట్టాలపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా జడ్జి మాట్లాడుతూ, రోజురోజుకు వయోవృద్ధులపై వేధింపులు పెరిగిపోతుండడం చాలా బాధాకరమన్నారు. మనం ఈ స్థితిలో ఉన్నామంటే మన పెద్దలు, వయోవృద్ధుల సలహాలు, మార్గనిర్దేశం వల్లే అని పేర్కొన్నారు. ఏ విధమైన న్యాయ సలహాల కోసం 15100 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి సహాయం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేశ్, వయోవృద్ధుల గృహ నిర్వాహకురాలు రాధిక పాల్గొన్నారు. రైతు నేస్తం ప్రారంభంకరీంనగర్ అర్బన్: జిల్లాలోని 30 రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఎమ్మెల్యేలు, అదనపు కలెక్టర్, జి ల్లా వ్యవసాయ అధికారి పాల్గొన్నారు. మొత్తం 77 క్లస్టర్లకు గానూ 48 క్లస్టర్లలో రైతు నేస్తం అమలవనుంది. కాగా గన్నేరువరం మండలం మాదాపూర్ నుంచి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, డీఏవో భాగ్యలక్ష్మి హాజరవగా చొప్పదండి రైతు వేదిక నుంచి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ముగ్ధంపూర్ రైతు వేదిక నుంచి అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, ఆర్డీవో మహేశ్వర్, దుర్శేడ్ రైతు వేదిక నుంచి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, కమాన్పూర్ రైతు వేదిక నుంచి మునిసిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, చామనపల్లి రైతు వేదిక నుంచి జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం హాజరయ్యారు. మాస్టర్ప్లాన్పై అభ్యంతరాలుంటే చెప్పాలికరీంనగర్ కార్పొరేషన్: కొత్త మాస్టర్ ప్లాన్పై ఈ నెల 28లోగా అభ్యంతరాలు తెలియజేయాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి అన్నారు. సోమవారం సుడా కార్యాలయంలో మాస్టర్ ప్లాన్, ఇతర అంశాలపై చర్చించారు. 30 ఏళ్ల తరువాత కొత్త మాస్టర్ ప్లాన్ను అమలు చేయబోతున్నామని పేర్కొన్నారు. అభ్యంతరాల గడువు ముగిసిన తరువాత ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని తెలిపారు. తర్వాత అభ్యంతరాలు వ్యక్తం చేసినా ప్రయోజనం ఉండదన్నారు. అలాగే సుడా నిధులతో చేపట్టే అభివృద్ధి పనులు నా ణ్యతతో ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో సుడా వైస్చైర్మన్ ప్రఫుల్ దేశాయ్, సీపీవో ఆంజనేయులు, ఈఈ రొడ్డ యాదగిరి, డీఈ రాజేంద్రప్రసాద్, ఏఈ సతీశ్, ఇన్చార్జి డీసీబీ బషీర్, ఏసీపీలు వేణు, శ్రీధర్ పాల్గొన్నారు. వ్యవసాయ శాఖలో పదోన్నతులుకరీంనగర్అర్బన్: వ్యవసాయ శాఖలో పదోన్నతుల జాతర మొదలైంది. జిల్లాలో నలుగురికి రాజన్న, లవకుమార్, హరికృష్ణ, కిరణ్లకు జూ నియర్ నుంచి సీనియర్ అసిస్టెంట్గా పదో న్నతి కల్పించగా వివిధ ప్రాంతాలకు బదిలీ చే శారు. రాజన్న సిద్దిపేటకు, హరికృష్ణ రామడు గు, లవకుమార్ను కరీంనగర్ డీఏవో ఆఫీస్, కిరణ్ను కామారెడ్డి డీఏవో ఆఫీస్కు బదిలీ చే శారు. త్వరలోనే ఏఈవోలు, ఏవోలు, ఏడీఏల కు పదోన్నతులు కల్పించే అవకాశాలు ఉన్నాయని ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఏఈవో లుగా 15ఏళ్లు పనిచేస్తున్నవారుండగా ఏవోలు గా 20ఏళ్లు, ఏడీఏలుగా 10ఏళ్లుగా పనిచేస్తున్న అధికారులున్నారు. రెవెన్యూ శాఖలో మూడునాలుగేళ్లకే పదోన్నతులు లభిస్తుండగా వ్యవసా య శాఖలో మాత్రం దశాబ్దాలు దాటినా పదో న్నతులు లేవన్న అసహనం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఏఈవో, ఏవో, ఏడీఏలు వారి వారి సంఘాల నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మంత్రులకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ మేరకు పదోన్నతులకు మార్గం సుగమమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
రైతు భరోసా వచ్చిందోచ్
కరీంనగర్ అర్బన్: రైతు భరోసా (రైతుబంధు) సాయం విడుదలైంది. సోమవారం సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్ నుంచి లాంఛనంగా ప్రారంభించారు. రాత్రి నుంచే రైతుల ఖాతాకు భరోసా సాయం చేరుతోంది. గత పట్టాదారుల సంఖ్యతో పాటు కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులకు రైతు భరోసా వర్తింపజేశారు. గతంలో మాదిరి చిన్న, సన్నకారు రైతులని కాకుండా అందరి ఖాతాలకు భరోసా సాయం అందనుందని అధికారులు వెల్లడించారు. వానాకాలం భరోసా లేనట్టే? గత వానాకాలం రైతు భరోసా ఇప్పటికీ రైతుల ఖాతాకు రాలేదు. యాసంగి సీజన్కు సంబంధించి 4 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా చేరింది. ఆపై భూ విస్తీర్ణం ఉన్నవారికి ఇప్పటికీ నిరీక్షణే. యాసంగి ప్రారంభమైన రెండు నెలలకు సదరు సాయం అందగా ఈ సారి సకాలంలో సాయమందడం ఆహ్వానించదగ్గ పరిణామం. మరోసారి అవకాశం రైతు భరోసా పొందేందుకు ప్రభుత్వం మరోసారి అవకాశమిచ్చింది. జూన్ 5, 2025 వరకు ఆన్లైన్లో నమోదైన వారందరికీ సాయం అందనుంది. ఈ నెల 20వరకు దరఖాస్తుకు అవకాశమివ్వగా వ్యవసాయ అధికారులు రైతులకు సమాచారం చేరేలా చర్యలు చేపడుతున్నారు. గత సీజన్లలో డబ్బులు జమయి ప్రస్తుతం అసలే రాకపోయినా లేదా ఉన్న భూ విస్తీర్ణం కంటే తక్కువ భూమికి డబ్బు జమయినా, రైతుబంధు పోర్టల్లో పేరు కనిపించి బ్యాంకు ఖాతా వివరాలు ఇప్పటికీ ఇవ్వకపోయినా, బ్యాంకు వివరాలు తప్పుగా నమోదు కావడం, ఇతర కారణాల వల్ల డీబీటీ ఫెయిల్ అని మీకు సందేశం వచ్చి న వెంటనే దరఖాస్తుతో పాటు పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలతో వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలి. సాగుకు యోగ్యం కాని భూములకు లేనట్టే జిల్లాలో 77 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో ఏఈవో, రెవెన్యూ అధికారి సంయుక్తంగా సర్వే చేపట్టి 5,608 ఎకరాల భూమి సాగుకు పనికిరాదని తేల్చారు. నాన్అగ్రికల్చర్ ల్యాండ్, పలు స్థలాలు రాళ్లు, రప్పలు, గ్రానైట్, క్వారీలు తదితర ఉన్నాయని గుర్తించారు. 2018 మే 10న రైతు బంధు ప్రారంభమవగా సదరు గణాంకాల ప్రకారం రూ.33కోట్లు దుర్వినియోగమయ్యాయని స్పష్టమవుతోంది. ప్రధాన రహదారులు, కాలువలకు వెళ్లిన భూములు, సర్వేనంబర్లవారీగా రాళ్లూరప్పలున్న భూములు కూడా రైతుల పేరిటే ఉన్నాయి. ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పేరిట పట్టా చేయగా, జిల్లాలోని పలుచోట్ల ఇలాగే ప్రభుత్వభూమి చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా పలు ప్రాంతాల్లో భూస్వాములు గతంలో ప్రభుత్వ కార్యాలయాలు, బడులు, ఇతరత్రా వాటికి భూములను దానంగా, ఇనాంగా ఇచ్చారు. కాలక్రమంలో వాటిని మ్యుటేషన్ చేయకపోవడంతో గత ప్రభుత్వం ప్రారంభించిన ధరణి పోర్టల్లో క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలున్నా ఆన్లైన్లో మాత్రం ఆ భూములిచ్చిన వారి పేరే నమోదైంది. దీంతో రైస్ మిల్లులు, ఇటుకబట్టీలు, బీడుభూములూ పోర్టల్లో వ్యవసాయ భూములుగానే నమోదవడంతో వీరందరికీ రైతు బంధు డబ్బులు జమయ్యాయి. సాగుకు యోగ్యం కాని భూముల సర్వేనంబర్లతో పాటు విస్తీర్ణం వివరాలను అధికారులు రైతుభరోసా పోర్టల్లో ఫ్రీజింగ్ చేశారు. జిల్లాకు రూ.138 కోట్లు విడుదల మరో వైపు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 20వరకు అవకాశంజిల్లాలో.. రెవెన్యూ గ్రామాలు 206పోర్టల్లో పట్టాదారులు 2,10,904విడుదలవ్వాల్సిన నగదు రూ.211.90కోట్లు ఖాతాలిచ్చినవారు 1,94,184ట్రెజరీకి చేరిన నగదు రూ.139.08కోట్లు లబ్ధిపొందనున్న రైతులు 1,68,218 -
సాదాబైనామాలే ఎక్కువ
● పైలెట్ ప్రాజెక్టులోనూ ఇవే దరఖాస్తులు ● సివిల్ తగాదాల విషయంలోనూ ఇదే తీరు ● సర్వే నంబర్ల మిస్సింగ్పైనా భారీగా అప్లికేషన్లు ● పీవోటీ కేసులు సిరిసిల్లలో అధికం ● సాదాబైనామాల్లో జగిత్యాల టాప్సాక్షి ప్రతినిధి, కరీంనగర్: భూ భారతి పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై న ప్రతి మండలంలోనూ సాదాబైనామా దరఖాస్తులే ఎక్కువగా వచ్చాయి. తెల్లకాగితాలపై రాసుకున్న లావాదేవీల రెగ్యులరైజేషన్ కోసం గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 2016, 2020లో రెండు దఫాలుగా సాదాబైనామా దరఖాస్తులు స్వీకరించారు. 2014 జూన్2 లోపు సాదాబైనామాలకే వర్తిస్తుందనే షరతు విధించారు. తొలుత 2016లో 11.19 లక్షల అప్లికేషన్లు వస్తే 6.15 లక్షల అప్లికేషన్లను పరిష్కరించి, సరైన ఆధారాలు లేవని 3లక్షల అప్లికేషన్లను తిరస్కరించారు. మరో 2.04 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉండిపోయాయి. 2020 అక్టోబరు 12 నుంచి నవంబరు 10 వరకు మరో సారి సాదాబైనామా అప్లికేషన్లను స్వీకరించారు. ఆ సమయంలో మరో 7.20 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. పాతవాటితో కలిపితే మొత్తం అప్లికేషన్ల సంఖ్య 9.24 లక్షలకు చేరింది. అయితే వాటిని అప్పటి ప్రభుత్వం పరిష్కరించలేకపోయింది. ధరణి చట్టంలోనూ సాదాబైనామా ద్వారా పాస్బుక్కులు మంజూరు చేసే అవకాశం లేకపోవడంతో హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసి స్టే విధించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక తెచ్చిన భూభారతి చట్టం ద్వారా పెండింగ్లో ఉన్న సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి వెసులుబాటు కల్పించింది. అయితే హైకోర్టు స్టే ఎత్తివేస్తేనే పాత అర్జీలు పరిష్కారం కానున్నాయి. ఇటీవల నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో పాతవాటితోపాటు కొత్త దరఖాస్తులు కూడా వస్తున్నాయి. కొత్త దరఖాస్తులను పరిష్కరించే వెసులుబాటు భూ భారతి చట్టంలో లేదు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాపరంగా పరిశీలిస్తే సాదాబైనామా కోసం వచ్చిన దరఖాస్తుల్లో జగిత్యాలలోనే అధికంగా ఉన్నాయి. అదే సమయంలో సిరిసిల్లలో పీవోటీ (ప్రీవెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్) దరఖాస్తులు ఎక్కువగా రావడం గమనార్హం. పెద్దపల్లి జిల్లాలో పీవోటీ కేసులు అత్యల్పంగా ఉన్నాయి. పీఓటీ కేసులు ఎక్కువే.. నిబంధనల ప్రకారం అసైన్డ్ ల్యాండ్స్ అమ్మకాలు, కొనుగోళ్లు నిషేధం. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఇతర పేదలకు ఇచ్చిన భూములు అన్యాక్రాంతం కావొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం తెలంగాణ అసైన్డ్ ల్యాండ్స్(ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్) యాక్ట్– 1977 తీసుకొచ్చింది. చాలామంది పేదలు తమ అవసరాల కోసం అసైన్డ్ ల్యాండ్స్ను అమ్ముకున్నారు. కొనుగోలుదారులు కూడా అసైన్డ్ ల్యాండ్ పొందగలిగిన పేదవారే అయితే రీఅసైన్ చేసే వెసులుబాటును ప్రభుత్వం పలుమార్లు కల్పించింది. రాష్ట్రంలో చివరిసారిగా 2017లో భూరికార్డుల ప్రక్షాళన సమయంలో ఇలాంటి అవకాశం కల్పిస్తే చాలామంది వినియోగించుకున్నారు. 2017 తర్వాత అసైన్డ్ ల్యాండ్స్ కొనుగోలు చేసినవారికి ఈ వెసులుబాటు వర్తించదు. కానీ.. ఇటీవల నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో 2017 తర్వాత అసైన్డ్ ల్యాండ్ కొనుగోలు చేసిన వ్యక్తుల నుంచి రీఅసైన్మెంట్ కోసం అర్జీలు వస్తున్నాయి. మొత్తం అర్జీల్లో 15 నుంచి 20 శాతం వరకు ఇవే ఉంటున్నాయి. దీన్ని బట్టి ఒక్కో మండలంలో వందల సంఖ్యలో అసైన్డ్ ల్యాండ్స్ చేతులు మారినట్లు తెలుస్తోంది. అలాగే కొందరు తాము ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ప్రభుత్వ, ఫారెస్ట్ భూములకు పట్టాలివ్వాలని దరఖాస్తు పెట్టుకుంటున్నారు. ఇలాంటివారికి కొత్తగా భూమి అసైన్ చేయాలంటే ఎమ్మెల్యేల అధ్యక్షతన ల్యాండ్ అసైన్మెంట్ కమిటీలు నియమించాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లా వివరాలు జిల్లా సాదాబైనామా సర్వే నంబరు మిస్సింగ్ పీవోటీ పెద్దపల్లి 4,569 2,149 30కరీంనగర్ 2,204 1,162 40సిరిసిల్ల 1,523 1,180 948జగిత్యాల 6,360 3,192 76 సివిల్, మిస్సింగ్ సర్వే నంబర్లు కుటుంబ సభ్యుల మధ్య భూమి వాటాల పంపకాల్లో వచ్చిన తేడాలు, ఒకరి భూమిని మరొకరు పట్టా చేయించుకోవడం, ఒకరి భూమిపై మరొకరు కబ్జాలో ఉండడం, భూమి హక్కుపై వారసత్వం విషయంలో వివాదం, ధరణిలో, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో డబుల్ రిజిస్ట్రేషన్లు వంటి అనేక సివిల్ వివాదాలపై అప్లికేషన్లు వచ్చాయి. ఇలాంటి వివాదాల పరిష్కారం కూడా తహసీల్దార్ల చేతుల్లో లేదు. వీటి పరిష్కారానికి రెవెన్యూ కోర్టులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కోర్టులే పిటిషన్లను విచారించి హక్కుదారులను తేల్చాల్సి ఉంటుంది. భూ వివాదాలకు సంబంధించి మరో ప్రధాన సమస్య.. మిస్సింగ్ సర్వేలకు సంబంధించి కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాదిగా దరఖాస్తులు వస్తున్నాయి. -
పోలీస్శాఖకు ఎంపికవడం అదృష్టం
కరీంనగర్క్రైం: పోలీసు అనేది ఉద్యోగం మాత్రమే కాదని, సమాజానికి సేవ చేసేందుకు లభించిన మంచి అవకాశమని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం అన్నారు. నగరంలోని పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో 9 నెలల బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ను సోమవారం ప్రారంభించి మాట్లాడారు. పోలీస్శాఖకు ఎంపికవడం అదృష్టమన్నారు. శిక్షణను క్రమశిక్షణతో నేర్చుకోవాలని , ఇందులో నేర్చుకునే అంశాలే సర్వీసులో ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. చట్టాలపై అవగాహనతో పాటు ఆయుధాలపై పట్టు సాధించేలా శిక్షణ ఇస్తారని వివరించారు. ముఖ్యంగా పోలీసులు వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, సైబర్ నేరాలను అరికట్టేందుకు తీసుకునే చర్యలపై శిక్షణ ఇస్తారని, వాటిని సమర్థవంతంగా అందిపుచ్చుకోవాలన్నారు. కాగా, గతంలో వెలువడిన పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లలో ఎంపికై వివిధ కారణాలతో శిక్షణకు వెళ్లలేని వివిధ విభాగాలకు చెందిన 91 మంది కానిస్టేబుళ్లకు శిక్షణ అందించనున్నారు. కార్యక్రమంలో పోలీస్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అడిషనల్ ఎస్పీ ఎం.పిచ్చయ్య, వైస్ ప్రిన్సిపాల్ బి. మోహన్ (డీఎస్పీ), డీఎస్పీలు మల్లికార్జున్, మహేశ్బాబు, శ్రీనివాస్, విజయపాల్రెడ్డి, గంగాధర్, శివరామయ్య పాల్గొన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు శిక్షణకరీంనగర్లోని వివిధ పోలీస్స్టేషన్లలో సెక్టార్, ఇన్వెస్టిగేషన్ అధికారులుగా విధులు నిర్వహిస్తున్న 35మంది ఏఎస్సై, హెడ్కానిస్టేబుళ్లకు సోమవారం సీటీసీలో ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సీపీ గౌస్ ఆలం హాజరై మాట్లాడారు. శిక్షణలో భాగంగా ఫిర్యాదు అందుకోవడం నుంచి ఎఫ్ఐఆర్ నమోదు, ఇన్వెస్టిగేటింగ్ విధానం, క్రైం సీన్ సందర్శన, సాక్ష్యాధారాలు సేకరణ తదితర అంశాలపై అవగాహన కల్పించేలా శిక్షణనిస్తున్నామన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వేణుగోపాల్, ఇన్స్పెక్టర్ సంతోష్కుమార్, శ్రీనివాస్, సరిలాల్, బిల్లా కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ● సీపీ గౌస్ ఆలం -
ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోండి
తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ రెవెన్యూ పరిధిలో గల 574 సర్వే నంబర్లో 13.18ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. ప్రభుత్వ భూమిని కాపాడాలని అధికారులకు ఫిర్యాదు చేస్తే చోద్యం చూస్తున్నారు. వెంటనే భూ భారతి పోర్టల్లో ప్రొహిబిటెడ్ లిస్టులో చేర్చడంతో పాటు సదరు భూమికి హద్దులు నిర్ణయించి స్వాధీనం చేసుకోవాలి. – సీపీఐ నాయకులు నోటీస్ బోర్డులపై ఫీజులు ప్రదర్శించాలి ప్రైవేట్ పాఠశాలల్లో విపరీతంగా దోచుకుంటున్నారు. అడ్మిషన్, ఐడెంటీ కార్డు ఇతరత్రా పేరిట అదనంగా వసూలు చేస్తున్నారు. పుస్తకాలు, యూనిఫామ్స్ అంటూ యజమాన్యాలు ఇష్టారీతిగా డబ్బు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజులపై నియంత్రణ చర్యలు పక్కాగా ఉండాలి. ప్రతీ స్కూల్ నోటీస్బోర్డులపై ఫీజుల వివరాలు ప్రదర్శించేలా చర్యలుండాలి. నిబంధనల ప్రకారం సదుపాయాలు ఉండేలా చర్యలు చేపట్టాలి. స్కూల్ బస్సుల ఫిట్నెస్ పరీక్షలు పారదర్శకంగా జరగాలి. – నేషనల్ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు(ఎన్జీవో) -
సీలింగ్ భూమిని పట్టా చేశారు
తాహెర్కొండాపూర్ గ్రామంలో సీలింగ్ భూమిని 1993లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గ్రామసభ ద్వారా ప్రొసీడింగ్లు జారీ చేశారు. అప్పటి నుంచి కాస్తు చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా రికార్డులో మా పేర్లు చేర్చలేదు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా దాటవేత ధోరణిని ప్రదర్శించారు. రికార్డులో ఉన్న పేర్ల ఆధారంగా వారి వారసులు వారి పేరున మార్చుకుని మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఇచ్చిన భూమిని తిరిగి ఎలా స్వాధీనం చేసుకుంటారు. సీలింగ్ భూమిని ప్రభుత్వం తీసుకున్నాక అధికారులు వారి పేరున ఎలా మార్చుతారు.? – బాధితులు, చర్లబూత్కూర్ ఆదేశాలు అమలు చేయడం లేదు నా పేరుపై ఉన్న ఇల్లు, భూమిని అక్రమంగా రికార్డులో నమోదు చేసుకున్నారని గత నెల 12న ప్రజావాణిలో కలెక్టర్ను కలిశాను. అప్పుడు ఎంపీడీవో పిలిచి విచారణ చేపట్టి రికార్డు మార్చాలని ఆదేశించారు. కానీ, ఇప్పటివరకు ఏలాంటి విచారణ లేదు. దొంగ కాగితాలతో పేర్లు మార్చుకుంటే చర్యలు తీసుకోవాల్సిందిపోయి నన్నిలా ఏళ్లుగా తిప్పుకుంటున్నారు. – దుర్గం చంద్రయ్య కుటుంబం, కేశవపట్నం -
అంతా నాన్న చలవే..
సిరిసిల్లకల్చరల్: మా నాన్న మంచాల విఠల్. ఊళ్లో ఇప్పుడు చాలా మందికి తెలిసిన పేరిది. ఊరూరూ తిరుగుతూ బట్టలు అమ్మే పని నాన్నది. పొద్దునెప్పుడో మేం నిద్ర లేవక ముందే వెళ్లి పొద్దుపోయాక ఇంటికి వచ్చేవారు. ఏడుగురు చెల్లెళ్ల బరువు బాధ్యతలతో పాటు మా ముగ్గురు అన్నదమ్ముల (తమ్ముళ్లు రాజేశ్, రవి) ఆలనాపాలనా నాన్నకు ఎంత కష్టమో తల్చుకుంటే భయం కలిగేది. అయినా ఆయన పడే కష్టం పని చేసే నిష్ట మమ్మల్ని బాధ్యతాయుతంగా నడిపించింది. కడుపులో కష్టం దాచుకుని మమ్మల్ని కళ్లల్లో పెట్టుకుని పెంచారు. ఆ కష్టం మరో తరంలో రాకూడదనే బలమైన భావనను నింపుకుని నాతో పాటు తమ్ముళ్లిద్దరూ శ్రమించి చదువుకున్నారు. పదో తరగతి తర్వాత అల్ఫోర్స్లో ఇంటర్, మద్రాస్ ఐఐటీలో ఇంజినీరింగ్ 2011లో పూర్తి చేశా. నాలుగేళ్ల పాటు డేటా పవర్లో ఉద్యోగం చేసిన. సొసైటీ సర్వీస్పై ఇష్టంతో 2014లో యుపీఎస్సీ పరీక్ష రాశాను. ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ జాతీయ స్థాయిలో 160 ర్యాంకుతో సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు సర్వే ఇండియా, హైదరాబాద్లో సూపరింటెండెంట్గా స్థిరపడ్డాను. తమ్ముళ్లిద్దరూ కూడా సాఫ్ట్వేర్ రంగాల్లో స్థిరపడ్డారు. మా ఈ స్థితి, పురోగతి అంతా నాన్న చలవే. – మంచాల సంతోష్, ఐఈఎస్, సూపరింటెండెంట్ సర్వేయర్ మమ్మల్నే ఆస్తిగా భావించారు సిరిసిల్లలో ప్రైవేట్ స్కూల్ మాస్టర్ మా నాన్న. మేమిద్దరం అమ్మానాన్నకు రెండు కళ్లు. చేస్తున్న ఉద్యోగం కుటుంబానికి సరిపోదని తెలిసినా మంచి చదువు తప్ప మరేదీ స్థిరం కాదని గుర్తించారు. అంతే .. కన్న తల్లి లాంటి ఊరునీ, అయిన వాళ్లందరికీ దూరంగా కేవలం మాకు మంచి చదువు చెప్పించేందుకు హైదరాబాద్కు వలస వచ్చారు. ఇక్కడ కూడా ప్రైవేట్ స్కూళ్లో అమ్మానాన్నా ఇద్దరూ టీచర్లుగా పని చేస్తూ నిద్రాహారాలు మాని మమ్మల్ని చదివించారు. వాళ్ల అంచనాలను అందుకునే దిశగా మేమూ అదే రీతిలో కష్టపడ్డాం. ఖరగ్పూర్ ఐఐటీలో నేను, హైదరాబాద్ ఐఐటీలో తమ్ముడు ఇంజినీరింగ్ పూర్తి చేశాం. కొన్నాళ్లు టాటా స్టీల్స్లో ఉద్యోగం చేసినా మరింత పురోగమించాలనే ఆకాంక్షతో యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా. తమ్ముడు ఆదర్శ్సాయి గూగుల్, బెంగళూర్ బ్రాంచ్లో మంచి ఉద్యోగంలో ఉన్నాడు. మా ఈ జీవితం అమ్మా నాన్న ప్రసాదించిన వరంగా భావిస్తాం. ఇకపై వాళ్లకు కష్టం అవసరంలేని జీవితం ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. ఇదంతా అమ్మానాన్న వల్లే. – ఆడెపు సాయి ప్రీతమ్, ఆదర్శ్సాయి, ఐఐటీయన్స్ -
తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలి
కొత్తపల్లి(కరీంనగర్): ప్రతీ విద్యార్థి తన జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు కృషి చేయాలని శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ యు.ఉమేశ్కుమార్ పిలుపునిచ్చారు. శనివారం కరీంనగర్ సీతారాంపూర్లోని ఓ కన్వెన్షన్లో శ్రీఅల్ఫోర్స్ గ్రాడ్గాళా–25శ్రీ పేరిట నిర్వహించిన అల్ఫోర్స్ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల గ్రాడ్యూయేషన్ డే వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యాలను చేరుకుంటూ తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలన్నారు. ఉపాధ్యాయుల విలువలను గూగుల్ సంపూర్ణం చేయలేదని, అందుకే వారిని గౌరవించాలని సూచించారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు పీజీ విద్యతో పాటు రీసెర్చ్, ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలన్నారు. కళాశాల కరస్పాండెంట్ వి.రవీందర్రెడ్డి మాట్లాడుతూ, 25 ఏళ్లుగా తమ కళాశాల అనేక కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థుల బంగారు భవిషష్యత్కు బాటలు వేస్తోందన్నారు. అనంతరం 2022 నుంచి 2024 వరకు డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు వీసీ గ్రాడ్యూయేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు. శాతవాహన వీసీ ఉమేశ్కుమార్ -
అదుపుతప్పి ద్విచక్ర వాహనాలను ఢీకొన్న కారు
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని జంబిగద్దె చౌరస్తా వద్ద శనివారం రాత్రి ఓ కారు అతివేగంగా వచ్చి అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఐదు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ద్విచక్రవాహనాలు ధ్వంసం కాగా, రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళ, చిన్నారికి స్వల్పగాయాలయ్యాయి. బాధితులను స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ కథలాపూర్కు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. కాగా, డ్రైవర్ కారును వదిలి పారిపోయాడు. ఉద్యోగం రావడంలేదని ఆత్మహత్య పాలకుర్తి(రామగుండం): ఉద్యోగం రావడం లేదని బెంగతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బసంతనగర్ ఎస్సై స్వామి కథనం ప్రకారం.. కన్నాల గ్రామ పంచాయతీ పరిధి శాలపల్లి గ్రామానికి చెందిన బండి నవీన్(27) 2018లో బీటెక్ చేశాడు. అప్పటినుంచి ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అయినా.. అనుకూలమైన ఉద్యోగం రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన నవీన్ శనివారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు బండి కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, నవీన్ నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. -
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలో మూడు ద్విచక్రవాహనాలు, మడేలేశ్వరస్వామి ఆలయంలో చోరీకి పాల్పడ్డ దొంగను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. వివరాలు.. జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన వడ్లూరి నాగరాజు ఇటీవల జగిత్యాల జిల్లా కేంద్రంలోని చిన్న కెనాల్ వద్ద ఒక మోటార్సైకిల్, కొత్తబస్టాండ్లో ఒకటి, నిజామాబాద్ రోడ్లోని రాయల్ ఫంక్షన్హాల్ వద్ద మరో ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశాడు. అలాగే జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల బావి ప్రాంతంలోని మడేలేశ్వరస్వామి ఆలయంలో వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. ఈక్రమంలో పోలీసులు శనివారం మధ్యాహ్నం చిన్నకెనాల్వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ద్విచక్ర వాహనాలతో పాటు, 10 గ్రాముల వెండి స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు పట్టణసీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై మన్మదరావు, కానిస్టేబుళ్లు జీవన్, రాజిరెడ్డి పాల్గొన్నారు. -
స్వగ్రామానికి వలసజీవి మృతదేహం
మల్లాపూర్(కోరుట్ల): ఉన్న ఊరిలో ఉపాధి కరువై ఏడారి దేశానికి వలస వెళ్లిన వ్యక్తి గుండెపోటుతో మృతిచెందగా, 12 రోజులకు మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. వివరాలు.. మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన నారి సాయన్న–నర్సవ్వకు కుమార్తె, కుమారుడు తుక్కారాం(35) సంతానం. కుమార్తెకు వివాహం కాగా కుమారుడు తుక్కారాం జీవనోపాధికోసం కొద్దిరోజుల క్రితం మలేషియాకు వలస వెళ్లాడు. ఈ నెల 3న అక్కడ గుండెపోటుతో మృతిచెందాడు. శనివారం తుక్కారం మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగా కుటుంబసభ్యుల రోదనలతో గ్రామంలో విషాదం నెలకొంది. అంతిమయాత్రలో చిన్ననాటి మిత్రులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
పెన్షన్ ఇప్పిస్తానని బంగారం చోరీ
గంగాధర(చొప్పదండి): పెన్షన్ ఇప్పిస్తా అంటూ ఓ వ్యక్తి వృద్ధురాలి మెడలో బంగారు గొలు సు, చెవి కమ్మలు, నగదు తీసుకొని ఉడాయించిన ఘటన మండలంలోని మధురానగర్ బస్టాండులో శనివారం జరిగింది. ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాలు.. వేములవా డ మండలం నమిలిగుండుపల్లి గ్రామానికి చెందిన గోలి వజ్రమ్మ మధురానగర్ బస్టాండులో బస్సు దిగి ఆస్పత్రిలో చూపించుకోవడానికి నడుచుకుంటూ వెళ్తుండగా, గుర్తు తెలియని వ్యక్తి పేరు పెట్టి పిలవడంతో పాటు పంచాయతీ కార్యదర్శినని, పెన్షన్ ఇప్పిస్తానని ఆమె మెడలోని తులం బంగారు గొలుసు, చెవికమ్మలు, రూ.వెయ్యి నగదు తీసుకొని ఉడాయించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలి కొత్తపల్లి: పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని హైకోర్టు న్యాయవాది ఈవీ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షాలకు శనివారం లేఖలు రాసినట్లు ఆయన తెలిపారు. ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారని, వారికి ఒక్కొక్కరికి రూ.5 కోట్ల నష్ట పరిహారంతో పాటు వారి కుటుంబంలో ఒకరికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీఎల్ఎడ్, డీపీఎస్ఈ కోర్సుల్లో ప్రవేశాలకు షెడ్యూల్తిమ్మాపూర్: తెలంగాణలోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణా సంస్థలు, ప్రైవేట్ డీఎల్ఎడ్ కళాశాలల్లో రెండేళ్ల డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ప్రీ– స్కూల్ ఎడ్యుకేషన్న్ కోర్సుల్లో 2025– 26 విద్యాసంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన డీసెట్–2025లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల కోసం ఆన్లైన్ షెడ్యూల్ ప్రకటించింది. డీసెట్– 2025లో ఉత్తీర్ణులై, ఇప్పటివరకు ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఈనెల 14 నుంచి 17వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. సీట్ల కేటాయింపు జూన్ 20న జరుగుతుంది. సీటు కేటాయించబడిన అభ్యర్థులు 21నుంచి 24లోగా ఫీజు చెల్లించి, అలాట్మెంట్ లెటర్ను డౌన్లోడ్ చేసుకోవాలి. -
‘జ్యోతిష్మతి’ విద్యార్థులకు కార్పొరేట్ ఉద్యోగాలు
తిమ్మాపూర్: మండలకేంద్రంలోని జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైనన్స్ కళాశాల విద్యార్థులు ప్రపంచ ప్రఖ్యాత బహుళజాతి సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు సాధించినట్లు చైర్మన్ సాగర్ రావు తెలిపారు. ఈ విద్యార్థులు నైపుణ్య శిక్షణ, ఆధునిక విద్యా విధానాలు, కళాశాల సమగ్ర విధానం ద్వారా ఈ విజయాలను అందుకున్నారు. కళాశాల విద్యార్థులు ఎన్విడియా, టార్గెట్, ఇన్ఫోసిస్, క్యాప్ జెమినీ, కాగ్నిజెంట్, టీసీఎల్ వంటి 25కి పైగా ప్రముఖ బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు సాధించారు. ఏడాదికి రూ.52 లక్షలు, రూ.19 లక్షలు, రూ.16.85 లక్షలు, రూ.12.30 లక్షలు, రూ.9 లక్షలు, రూ.7 లక్షలు, రూ.6 లక్షలు, రూ.4 లక్షలు, రూ.3.50 లక్షల వేతన ప్యాకేజీలతో వందమందికి పైగా విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. ఎన్నో సంస్థల్లో ఉద్యోగాలకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నట్లు కళాశాల చైర్మన్న్ జువ్వాడి సాగర్ రావు తెలిపారు. కళాశాల సెక్రెటరీ, కరస్పాండెంట్ జవ్వాడి సుమిత్ సాయి మాట్లాడుతూ, యంత్ర విద్యతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెనన్స్ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), శాప్ వంటి కోర్సుల్లో మైనర్ డిగ్రీ పట్టాలను అందిస్తున్నట్లు తెలిపారు. యూఎస్ఎలోని లూసియానా టెక్ యూనివర్సిటీ, వరంగల్లోని ఎస్ఆర్ యూనివర్సిటీతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యా అవకాశాలను సులభతరం చేశారు. విద్యార్థులకు అభినందనలు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. అనిల్ కుమార్, డీన అకాడమిక్స్ డాక్టర్ పీకే వైశాలి, విభాగాధిపతులు, అధ్యాపక బృందం ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. -
కూతురును ఎస్సై చేసిన కూలీ తండ్రి
శంకరపట్నం(మానకొండూర్): శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన గొల్లపల్లి సమ్మయ్య–దేవేంద్ర దంపతులకు ఇద్దరు కూతుర్లు దివ్య, నవ్య. పెద్ద కూతురు దివ్యను చదువులో ముందుండడంతో సమ్మయ్య కూలీ పనులు చేస్తూ బాసరలో ఎంటెక్ చదివించాడు. తల్లితండ్రుల ప్రోత్సాహంతోనే ఎస్సై ఉద్యోగానికి ఎంపికై నట్లు వంగర పోలీస్స్టేషన్లో ఎస్సైగా పని చేస్తున్న దివ్య తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు తండ్రి కూలీ చేసిన సంపాదనతోనే చదువుకుని ప్రిపేర్ అయ్యానని, తండ్రి పడిన కష్టానికి గుర్తింపుగా ఎస్సై ఉద్యోగం రావడం సంతోషంగా ఉందని దివ్య పేర్కొన్నారు. -
‘నీట్’లో ట్రినిటి విద్యార్థుల ప్రభంజనం
కరీంనగర్: నీట్–2025 ఫలితాల్లో ట్రినిటి విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. అనేకమంది అత్తుత్తమ మార్కులు సాధించడంతో పాటు, కొందరు టాప్ 1000ర్యాంకుల్లో చోటు సాధించారు. బి.కార్తిక్(519 మార్కులు), ఎం.మానస(504), ఎం.చంద్రశేఖర్(501), వై.అశ్విత(488) ఎన్.గౌతమి(471), ఎం.శ్రీకాంత్(470), ఎం.శివప్రసాద్(469), ఎస్.అఖిల్(469), ఎం.హరిశ్చంద్ర(463), ఎం.అభినయ(461మార్కులు)సాధించారు. బి.కార్తిక్ 736వ ర్యాంకు, ఎం.చంద్రశేఖర్ 1266వ ర్యాంకు, ఎల్.ప్రతిమ 2149వ ర్యాంకు, డి.తేజస్విని 2267వ ర్యాంకు, జె.అంజని 4212వ ర్యాంకు, కె.మయూక 4286వ ర్యాంకులతో జాతీయస్థాయిలో ర్యాంకులు సాధించారు. ట్రినిటి వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్రెడ్డి మాట్లాడుతూ తమ విద్యార్థుల పట్టుదల, ట్రినిటీలో అందించే శిక్షణా పద్ధతులు, మెరుగైన విద్యా వాతావరణం ఈ గొప్ప విజయానికి కారణ అన్నారు. ఈ విజయం ట్రినిటిని దేశంలోని అత్యుత్తమ మెడికల్ శిక్షణాసంస్థల్లో ఒకటిగా నిలబెట్టిందన్నారు. -
బావిలో పడి వ్యక్తి మృతి
వెల్గటూర్: ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన ఎండపల్లి మండలం పాతగూడూర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన గంధం నారాయణ (50) తాను కౌలుకు చేసే పొలంలో నారు, ఎండిపోతున్న పత్తి చేనుకు నీరుపెట్ట్టడానికి వెళ్లి కరెంట్ మోటార్ పెడుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మృతిచెందాడు. మృతుడి భార్య వినోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు..కరీంనగర్రూరల్: అసలే రాజీవ్ రహదారి... ఆపైన అర్ధరాత్రిలో అతివేగంగా కారును నడిపిస్తు ముందున్న వాహనాన్ని ఢీకొట్టిన ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి కథనం మేరకు... మానకొండూరు మండలం లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన సుంకె సందీప్(26) స్నేహితులు రాపాక సుభాశ్, అంతగిరి శేఖర్తో కలిసి శుక్రవారం కారులో పని నిమిత్తం సుల్తానాబాద్కు వెళ్లారు. రాత్రి 12గంటల సమయంలో తిరిగి కరీంనగర్కు కారులో వస్తున్న క్రమంలో రాజీవ్ రహదారిపై మొగ్ధుంపూర్ జెడ్పీ పాఠశాల వద్ద ముందున్న గుర్తుతెలియని వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో సందీప్ గొంతు తెగిపోగా, తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. సుభాశ్, శేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. రూరల్పోలీసులు అక్కడికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన సందీప్మృతదేహాన్ని బయటకు తీశారు. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వాహనాన్ని తప్పించబోయి సింగరేణి యువ అధికారి.. యైటింక్లయిన్కాలనీ(రామగుండం): యైటింక్లయిన్కాలనీ పోస్టాఫీసు ఏరియా వద్ద శ నివారం జరిగిన రోడ్డు ప్ర మాదంలో ఉప్పటీ రమేశ్బాబు (37) ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం.. యైటింక్లయిన్కాలనీ ఎన్సీ– 107 క్వార్టర్లో నివాసం ఉంటూ ఆర్జీ–2ఏరియా ఓసీపీ–3లో అండర్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న రమేశ్బాబు.. బైక్పై కాలనీలో వ్యాపార సముదాయానికి వెళ్లారు. తన కుమార్తెకు బ్రెడ్ప్యాకెట్ కొనుగోలు చేసి మళ్లీ ఇంటికి బయలు దేరారు. ఈక్రమంలో పోస్టాఫీసు క్వార్టర్స్ మధ్య ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి కింద పడిపోయాడు. ఈ ఘటనలో తల పగిలి రక్తస్రావం జరిగి స్పృహ కోల్పోయాడు స్థానికులు 108 అంబులెన్స్లో గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. 2016లో సింగరేణిలో బాధ్యతలు స్వీకరించిన రమేశ్బాబు.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోడంతో అధికారులు ఆవేదన చెందారు. మృతుడి భార్య కిర్తీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు టూటౌన్ సీఐ ప్రసాద్రావు తెలిపారు. మృతుడికి భార్యతోపాటు ఆరెళ్ల కుమార్తె ఉన్నారు. -
కష్టపడి.. పిల్లలను తీర్చిదిద్ది..
ఇల్లంతకుంట(మానకొండూర్): పిల్లలను ప్రయోజకులను చేసేందుకు దాదాపు ఇరవై ఏళ్లుగా కష్టపడుతున్నాడు ఇల్లంతకుంట మండలం అనంతగిరికి చెందిన గొట్టపర్తి యాదగిరిగౌడ్. చిన్నవయస్సులో తండ్రి చనిపోగా కుటుంబ బాధ్యతలు చేపట్టారు. ఇతడి భార్య లక్ష్మి గృహిణి. వీరికి రాకేశ్, రవళి, రచన సంతానం. తనకున్న కొద్దిపాటి వ్యవసాయం, గ్రామంలో మోటారు వైండింగ్ పనులు చేస్తూ పిల్లలను ఉన్నతంగా చదివించాడు. పెద్దమ్మాయి రవళి ఎంకామ్ చదవగా ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తితో వివాహమైంది. రెండో అమ్మాయి రచన ఎంఎస్సీ బీఈడీ చదువుతోంది. కొడుకు రాకేశ్ గ్రూప్–4లో ఎంపికై రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రొబిషనరీ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూ, ఇటీవలే ప్రకటించిన గ్రూప్–2 ఫలితాల్లో స్టేట్లో 24వ ర్యాంకు సాధించాడు. ఇలా కష్టపడి తన పిల్లలను తీర్చిదిద్దాడు యాదగిరి. -
నీట్లో సత్తాచాటిన విద్యార్థులు
తల్లిదండ్రులతో తన్మయ రాయికల్(జగిత్యాల): రాయికల్ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు దాసరి రామస్వామి, కల్పన దంపతుల రెండో కూతురు తన్మయ నీట్లో ఆలిండియా 3,250వ ర్యాంక్ సాధించింది. ఇంటర్ బైపీసీలో 985 మార్కులు సాధించగా ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు నీట్కు సిద్ధం చేశారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో 720 మార్కులకు 582 సాధించి జాతీయస్థాయి ర్యాంక్ సాధించింది. తన్మయ మాట్లాడుతూ, భవిష్యత్లో నిరుపేదలకు వైద్యసేవలందిస్తానని తెలిపారు. డాక్టర్ కావడమే లక్ష్యం.. రాయికల్ పట్టణంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులైన ఎలిగేటి రాజ్కిశోర్, లావణ్య దంపతుల కూతురు ఎలిగేటి మధుమిత నీట్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 45,088వ ర్యాంక్, తెలంగాణ స్థాయిలో 344వ ర్యాంక్ సాధించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో డాక్టర్ కావడమే లక్ష్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాయని మధుమిత తెలిపారు. ఈ సందర్భంగా మధుమితను ఉపాధ్యాయ సంఘం నాయకులు అభినందించారు. సింగరేణి కార్మికుడి బిడ్డకు 2,481వ ర్యాంకుయైటింక్లయిన్కాలనీ(రామగుండం): నీట్ ఫలితాల్లో రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్కాలనీకి చెందిన సింగరేణి కార్మికుడి బిడ్డ రిషికశర్మ 2,481వ ర్యాంకు సాధించింది. తల్లిదండ్రులు రాజేశ్కుమార్, బబితాకుమారి. తండ్రి కరోనా సమయంలో మృతిచెందాడు. అయినా రిషికశర్మ ధైర్యం కోల్పోకుండా తల్లి ప్రోత్సాహంతో నీట్లో 588 మార్కులు సాధించి ఉత్తమ ర్యాంకు కై వసం చేసుకుంది. భవిష్యత్తులో వైద్య రంగంలో ఉన్నత స్థాయిలో ఉండి సేవ చేయాలన్నదే తన లక్ష్యమని రిషికశర్మ పేర్కొంది. -
కూతుళ్ల భవిష్యత్ కోసం..
జూలపల్లి(పెద్దపల్లి): జూలపల్లి మండలం అబ్బాపూర్కు చెందిన రైతు నౌండ్ల శ్రీనివాస్రెడ్డి, భారతి దంపతులకు ముగ్గురు కూతుళ్లు. వ్యవసాయం కలిసిరాక పోయినా, కూతుళ్లను ఉన్నత చదువులు చదివించాలన్న లక్ష్యంతో సిమెంట్ ఇటుకల పని ప్రారంభించారు. తండ్రి కష్టం తెలిసిన కూతుళ్ల పట్టుదలతో చదివి ఫలితం సాధించారు. పెద్ద కూతురు రమ్య జూలపల్లిలో పది, బాసరలో ట్రిపుల్ ఐటీ చదివి, బయోకాన్ సంస్థలో ఉద్యోగం సాధించగా పెళ్లి చేశారు. రెండో కూతురు రమ్య పది వరకు జూలపల్లిలో చదివి అగ్రికల్చర్ డిప్లొమాలో సీటు సాధించి వ్యవసాయ శాఖలో ఏఈవోగా ఉద్యోగం సాధించింది. ప్రస్తుతం సుల్తానాబాద్ మండలం గర్రెపెల్లి ఎఈవోగా విధులు నిర్వహిస్తోంది. కాగా, ఈ మధ్యనే పెళ్లి చేశారు. మూడో కూతురు నీరజ జూలపల్లిలో పదివరకు ఇంటర్, బీ ఫార్మసీ పెద్దపల్లిలో చదివింది. ప్రస్తుతం బెంగళూరులో పేరోందిన కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. తల్లిదండ్రుల కష్టం చూసిన కూతుళ్లు వారి శ్రమ వృథా కాకుండా ఉన్నతంగా స్థిరపడ్డారు. కొడుకులు లేరన్న లోటు తీర్చారు. కాయకష్టం చేసి పిల్లలను చదివించిన శ్రీనివాస్రెడ్డి దంపతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ఆడపిల్లలని ఇబ్బంది పడకుండా..
జగిత్యాల: ఇంటిపెద్దకు చదువంటే ప్రాణం. కానీ చదువుకోలేదు. ముగ్గురు ఆడపిల్లల్ని చదివించి ఉన్నతస్థాయిలో నిలిపాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కటికెవాడకు చెందిన సట్ట రవీందర్–జమున దంపతులకు ముగ్గురు కుమార్తెలు. చిన్నతనం నుంచే వారిని చదివించాలన్న ఉద్దేశంతో కష్టపడి కుటుంబాన్ని పోషిస్తూ వారిని ఉన్నతస్థాయిలో నిలబెట్టారు. రవీందర్ డ్రైక్లీనింగ్ షాపు నడుపుకుంటుండగా అతడి భార్య గృహిణి. పెద్ద అమ్మాయి అలేఖ్య ఎంఏ తెలుగు చదివి జాబ్ సెర్చ్లో ఉంది. చిన్న కూతురు అఖిల హైదరాబాద్ జేఎన్టీయూలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ చదువుతోంది. మరో కూతురు అమూల్య డాక్టర్ పూర్తి చేయగా, ఇటీవలే జూనియర్ డాక్టర్గా కరీంనగర్లోని ఓ ఆస్పత్రిలో విధుల్లో చేరింది. ముగ్గురు ఆడపిల్లలు అయినా ఆ తండ్రి ఇబ్బంది పడకుండా వారిని చదివిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. -
దుబాయిలో బతికపల్లి వాసి ఆత్మహత్య
పెగడపల్లి(ధర్మపురి): ఉపాధి కోసం దుబాయి వెళ్లిన పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన పూడూరి లచ్చన్న (46) ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. స్థానికంగా ఉపాధి లేక జీవనో పాధి నిమిత్తం మూడేళ్ల క్రితం లచ్చన్న దుబాయి వెళ్లాడు. అక్కడ సరైన పని లభించక కుటుంబాన్ని పోషించడం భారంగా మారింది. దీంతో జీవితంపై విరక్తి చెందిన లచ్చన్న తాను ఉంటున్న గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులకు గురువారం సమాచారం అందింది. ఐదు నెలల క్రితం తండ్రి మరణిస్తే స్వగ్రామానికి వచ్చి తిరిగి దుబాయి వెళ్లిన లచ్చన్న ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు. మృతుడికి భార్య లత, ఇద్దరు కుమారులు న్నారు. కాగా లచ్చన్న మృతదేహం త్వరగా స్వగ్రామానికి వచ్చేలా చూడాలని మంత్రి లక్ష్మణ్కుమార్, ప్రభుత్వాన్ని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
నగరంలో నేడు పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: చెట్ల కొమ్మల తొలగింపు పనులతో పాటు కొత్త ఏబీస్విచ్లు ఏర్పాటు చేస్తున్నందున శనివారం ఉ.8 నుంచి 11 గంటల వరకు 11కేవీ టవర్,సర్కిల్, డీఎఫ్వో ఫీడర్ల పరిధి లోని రాజీవ్చౌక్, రూర ల్ పోలీస్స్టేషన్, భారత్ టాకీస్, టవర్సర్కిల్, బ్రా హ్మణవీధి, అమ్మద్పుర, ద్వారకానగర్, వాల్మీకినగర్, సీఎంఆర్ రోడ్, డీఎఫ్వో జంక్షన్, వేంకటేశ్వర ఆలయం, జైలు పెట్రోల్బంక్, సవరన్ స్ట్రీట్, రాజా థియేటర్ ప్రాంతాలు, ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 11కేవీ.కమాన్ ఫీడర్ పరిధిలోని హుందాయ్, ఫోర్డ్ షోరూంలు, పోచమ్మ కమాన్, కోతి రాంపూర్, లక్ష్మీనగర్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1 ఏడీఈ పి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఉదయం 9.30నుంచి 11.30 గంటల వరకు 32/11కేవీ.విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలోని సప్తగిరికాలనీ, స్కూల్, మాచర్ల గార్డెన్, బ్రిందావన్ అపార్టుమెంట్, అంజుమ్ కాంప్లెక్స్, అయోధ్య కాలనీ, వేంకటేశ్వరకాలనీ, కట్టరాంపూర్, వాసుదేవ కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ లావణ్య తెలిపారు. కొత్తపల్లి, రూరల్ పరిధిలో.. విద్యుత్ సబ్స్టేషన్లలో నెలవారి విద్యుత్ మరమ్మతు పనుల్లో భాగంగా శనివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు 33/11 కేవీ బద్దిపల్లి సబ్స్టేషన్ పరిధిలోని గ్రామాలతో పాటు ఇండస్ట్రీయల్ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 33/11 కె.వీ.బొమ్మకల్ సబ్స్టేషన్ పరిధిలోని శ్రీపురంకాలనీ, రజ్వీచమన్, ప్రియదర్శినికాలనీ, విజయనగర్కాలనీ, క్రిష్ణనగర్, ఆటోనగర్, బొమ్మకల్, చలిమెడ ఆసుపత్రి, గుంటూర్పల్లి, దుర్శేడ్, గోపాల్పూర్ గ్రామాలతో పాటు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు 33/11 కె.వీ.నగునూర్ సబ్స్టేషన్ పరిధిలోని నగునూర్, వల్లంపహాడ్, తీగలగుట్టపల్లిలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడీఈ పేర్కొన్నారు. -
గేదె కోసం వెళ్తే ప్రాణం పోయింది
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): గోదావరిఖని టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధి అల్లూరు గగ్గిరెద్దులవాడలో నివాసం ఉంటున్న ఆవుల కొమురయ్య(50) శుక్రవారం గ్రామశివారులోని చెరువులో మునిగి మృతి చెందాడు. పోలీసులు కథనం ప్రకారం.. రోజులాగా చెరవు సమీపానికి పశువులను మేతకోసం తరలించాడు. పశువులు చెరువులోకి వెళ్లడంతో బయటకు పంపించేందుకు అతడూ చెరువులోకి దిగాడు. ప్రమాదవశాత్తు నీటమునిగి చనిపోయాడు. మరోపశువుల కాపరి నర్సయ్య స్థానికుడు పోచంకు విషయం చెప్పాడు. ఆయన ఇచ్చిన సమాచారంతో కుటుంబసభ్యులు చెరువు వద్దకు చేరుకుని గాలించారు. కొమురయ్యను బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి రెండో కుమారుడు రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై హైమదుల్లా తెలిపారు. మృతుడికి భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. చెరువులో మునిగి కాపరి మృతి -
మహిళల సంక్షేమమే ధ్యేయం
కరీంనగర్: మహిళల సంక్షేమమే శుక్రవారం సభ ధ్యేయమని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నా రు. కరీంనగర్లోని దుర్గమ్మగడ్డ అంగన్వాడీకేంద్రంలో మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతోపాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారని తెలిపారు. మూడునుంచి ఆరేళ్లలోపు పిల్లల ను అంగన్వాడీలకు పంపించాలని సూచించారు. ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా మహిళలకు 50రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని తెలిపారు. అనంతరం చిన్నారులకు కోడిగుడ్డు బిర్యానీ వడ్డించారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డీఎంహెచ్వో వెంకటరమణ, సీడీపీవో సబిత పాల్గొన్నారు. జల్జీవన్పై కేంద్ర బృందం తనిఖీ కరీంనగర్ అర్బన్: జల్ జీవన్ మిషన్ పథకం అమలు పర్యవేక్షణలో భాగంగా సెంట్రల్ వాటర్ కమిషన్ పరిధిలోని కేంద్ర నోడల్ అధికారుల బృందం జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఇందిరమ్మ ప్రధాన వరద కాలువ, మధ్య మానేరు కాలువలు, ఉపకాల్వలను తనిఖీ చేసింది. సెంట్రల్ వాటర్ కమిషన్ సంయుక్త కార్యదర్శి సింతల్ రాజన్ చొక్కలింగం ఆధ్వర్యంలోని ఈ కేంద్ర అధికారుల బృందం కలెక్టరేట్లో కలెక్టర్ పమేలా సత్పతి, నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమైంది. నీటిపారుదల పనులకు సంబంధించి గతంలో కేంద్రం మంజూరు చేసిన నిధులతో జిల్లాలో పూర్తిచేసిన పనుల గురించి తెలుసుకున్నారు. 92శాతం ఇందిరమ్మ వరద కాలువ పనులు పూర్తయ్యాయని ఇంజినీర్లు వివరించారు. భూ సేకరణలో ఇబ్బందుల వలన కొంతమేర పనులు పెండింగ్లో ఉన్నాయని, ఇందుకు సుమారు రూ.300కోట్లు అవసరమవుతాయని అధికారులు వెల్లడించారు. కేంద్ర బృందం సభ్యులు మాట్లాడుతూ నీటిపారుదల ప్రాజెక్టు పెండింగ్ పనులను పూర్తి చేయడానికి పూర్తి నివేదిక కేంద్రానికి అందజేస్తామని తెలిపారు. కేంద్ర బందం సభ్యులు సుధీర్ కుమార్, ఈఈ ధీరజ్ సింఘాల్, సూపరింటెండెంట్ ఇంజినీర్ సుమతీదేవి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగన్, ఎస్ఈ పెద్ది రమేశ్ పాల్గొన్నారు.● కలెక్టర్ పమేలా సత్పతి -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని దమ్మన్నపేటకు చెందిన వీరవేని భూమలింగం(50) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఎస్సై ప్రేమానందం, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. భూమలింగం గురువారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోయేసరికి కుటుంబసభ్యులు ఎంత వెదికినా ఆచూకీ లభించలేదు. భూమలింగం మృతదేహాన్ని శుక్రవారం తెల్లవారుజామున జగదాంబతండాలో స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. భూమలింగం ఇటీవల మద్యానికి బానిసైనట్లు, మద్యం మత్తులో కిందపడి మృతి చెంది ఉంటాడని బంధువులు పేర్కొన్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
● రూ.4.12లక్షల ఆభరణాలు, నగదు చోరీ ● ఐదుగురిపై కేసు, ఇద్దరి అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన సీపీ గౌస్ ఆలం కరీంనగర్క్రైం: తాళం వేసిఉన్న ఇళ్లలో చోరీ చేసిన కేసులో ఇద్దరిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు కమిషనరేట్లో శుక్రవారం సీపీ గౌస్ఆలం నిందితుల వివరాలను వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటకు చెందిన గాజుల హేమంత్, గతంలో జైలులో పరిచయమైన ఇద్దరితో కలిసి బైకు దొంగిలించారు. ముగ్గురు కలిసి ఈ నెల8న కరీంనగర్ నుంచి జగిత్యాల వైపు వెళ్తున్నారు. గంగాధర మండలం వెంకటాయపల్లిలోని తాళం వేసిఉన్న ఉప్పుగండ్ల గంగారెడ్డి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. బీరువాలోని రూ.3.87లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు దొంగలించారు. ఆ బంగారంలో కొంత కోనరావుపేటకు చెందిన కొమ్ము నవీన్, మానకొండూర్కు ఓ వ్యక్తికి విక్రయించారు. మరికొంత ప్రైవేట్ ఫైనాన్స్లో కుదవబెట్టి రూ.64వేలు తీసుకున్నారు. మిగితా పంచుకున్నారు. బాధితుడు గంగారెడ్డి ఫిర్యాదుతో గంగాధర పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. సీపీ గౌస్ ఆలం ఆదేశాలతో కరీంనగర్రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్ ఆధ్వర్యంలో వివరాలు సేకరించారు. చోరీ చేసిన ముగ్గురు, బంగారాన్ని కొన్న ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు హేమంత్ను గంగాధర క్రాస్రోడ్డు వద్ద శుక్రవారం అరెస్టు చేశారు. అతడి సమాచారంతో కొమ్ము నవీన్ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 20తులాల బంగారం, 25తులాల వెండి, ఒక బైక్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని సీపీ వెల్లడించారు. ఏసీపీ శుభం ప్రకాశ్, చొప్పదండి సీఐ ప్రదీప్, క్లూస్టీం సీఐ రాజు, గంగాధర ఎస్సై వంశీకృష్ణ, సీసీఎస్ ఎస్సై నాగరాజు సిబ్బందిని అభినందించారు. -
రైలు ప్రమాదంలో మహిళ..
రామగుండం: అంతర్గాం మండలం పెద్దంపేట రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్సు రైలు కిందనుంచి దాటే క్రమంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. జీఆర్పీ ఔట్పోస్టు ఇన్చార్జి తిరుపతి కథనం ప్రకారం.. పెద్దంపేట కు చెందిన కొలిపాక రాజమణి(57) ఉరఫ్ మణెమ్మ పెద్దంపేట రైల్వేస్టేషన్ అవతలి వైపు ఉన్న పత్తి చేనులో కూలీ పనులకు వెళ్లింది. పనులు ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో మైడో రైల్వేట్రాక్పై మూడురోజులుగా గూడ్సు రైలు ఆగి ఉంది. దాని కిందనుంచి దాటే క్రమంలో రైలు ఒక్కసారి కదిలింది. ఈ ఘటనలో ఆమె పై రైలు వెళ్లడంతో తల, మొండెం తెగిపో యాయి. మృతురాలికి ముగ్గురు కూతుళ్లు ఉ న్నారు. వారందరికీ వివాహాలయ్యాయి. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు జీఆర్పీ ఔట్పోస్ట్ ఇన్చార్జి పేర్కొన్నారు. -
మొబైల్ చూస్తున్నావని మందలించినందుకు..
రామగిరి(మంథని): నిత్యం మొబైల్ చూ స్తున్నావని తండ్రి మందలించినందుకు మనస్తాపం చెందిన లెక్కల శివశంకర్ (17) పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కథనం ప్రకారం.. రత్నాపూర్ పంచాయతీ పరిధి లక్ష్మీనగర్ ఫ్లాట్లలో నివాసం ఉండే శివశంకర్.. మొబైల్ ఫోన్లో తరచూ చాటింగ్ చేస్తున్నాడు. అలా చేయొద్దని తండ్రి వెంకన్న మందలించాడు. దీంతో ఈనెల 4న శివశంకర్ పురుగుల మందు తాగాడు. తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించగా వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందాడు. శుక్రవారం ఇంటికి తీసుకొని వస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడి తల్లి రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై చంద్రకుమార్ తెలిపారు. -
రక్తం పంచి.. ఆయువు పెంచి
● రక్తదానానికి ముందుకొస్తున్న యువత ● వాట్సాప్ వేదికగా స్పందిస్తున్న దాతలు ● నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సంకరీంనగర్టౌన్: రక్తదానం మహాదానం. ప్రాణా పాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేసి ఆదుకున్న వారు ప్రాణ బఽంధువులే. ఏ బంధం లేకున్నా మానవీయ కోణంలో స్పందించే తీరు ఐక్యతను చాటుతుంది. రోడ్డు ప్రమాదం, క్రిటికల్ డెలివరీ, రక్తహీనత, తలసేమియా, కేన్సర్, శస్త్రచికిత్స ఏదైతేనేం ఆపద సమయంలో రక్తదానం చేసి ఆదుకున్న వారు ఆప్తులకు మించిన వారు. రక్తం అవసరం ఉందనే విషయం వాట్సాప్, వివిధ రకాల సోషల్మీడియా ద్వారా తెలుసుకుని జిల్లాలోని యువత, వివిధ సంఘాల సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నేడు రక్తదాతల దినోత్సవం సందర్భంగా కథనం. మూడు నెలలకోసారి.. రోడ్డు ప్రమాదాలు, తలసేమిమయా, కేన్సర్, ప్రసవం, శస్త్రచికిత్సల సమయంలో రక్తం అత్యవసరం. జిల్లాలో ఎక్కువగా రోడ్డుమార్గం ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. క్రిటికల్ డెలికవరీలు, తలసేమియా బాధితులు కూడా ఎక్కువే. ఆపదవేళ రక్తలభ్యత సవాలుగా మారుతోంది. 18 నుంచి 65 ఏళ్ల వయసున్న ఆరోగ్యవంతులు మూడునెలలకోసారి రక్తదానం చేయవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఒకవ్యక్తి జీవిత కాలంలో 168సార్లు రక్తదానం చేయవచ్చని సూచిస్తున్నారు. 15 రోజులకోసారి ప్లేట్లెట్లు ఇవ్వొచ్చని, రక్తదానం చేసినప్పుడు ఏర్పడిన నష్టం 4 నుంచి 8 రోజుల్లో భర్తీ అవుతుందని వెల్లడిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా జిల్లాలో కొందరు సామాజిక బాధ్యతగా రక్తదానం చేస్తూ, చేయిస్తూ ముందుకు సాగుతున్నారు. సా మాజిక మాధ్యమాల ద్వారా బ్లడ్డొనేషన్ ఆర్గనైజేషన్లను నడుపుతున్నారు. నగరంలోని ఆసుపత్రులలో చికిత్స పొందేవారు రక్తం అవసరమైతే ఆర్గనైజర్లను సంప్రదిస్తుండగా, వారు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రి బ్లడ్బ్యాంక్, రెడ్క్రాస్తో పాటు మరో 13 ప్రైవేటు బ్లడ్బ్యాంకుల వద్ద దాతల ఫోన్నంబర్లు అందుబాటులో ఉన్నాయి. -
రైలు రగడ!
● తిరుపతి ప్రత్యేక రైలుపై రాజకీయ దుమారం ● వానాకాలంలో ఏసీ కోచ్లతో తిరుపతికి రైలు ● కానరాని జనరల్, స్లీపర్ కోచ్లు ● అధికస్టాపులు, ప్రయాణ సమయంపై ప్రయాణికుల పెదవి విరుపు ● వర్షాకాలంలో ఏసీ రైలుకు ఆదరణ ఉండేనా?ప్రయాణికుల అసంతృప్తి ఈ ప్రత్యేక వీక్లీ హంసఫర్ 02761/62 ఏసీ రైలుకు 16 స్టాపులు ఉన్నాయి. ఈ ప్రత్యేక రైలులో కేవలం 3వ శ్రేణి శీతల బోగీలే. స్లీపర్, జనరల్ బోగీలు లేవు. జూలైలో జోరుగా వానలు కురుస్తాయి. వర్షాకాలంలో థర్డ్ ఏసీ ప్రయాణానికి తక్కువగా మొగ్గు చూపుతారు. పైగా రిజర్వేషన్ చార్జీలు అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం తిరుపతికి నడుస్తోన్న రెగ్యులర్ బై వీక్లీ 12762/61 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు కేవలం 12స్టాప్లే. ఇందులో 3వ శ్రేణి, 2 వ శ్రేణి ఏసీ బోగీలతో పాటు, సాధారణ బోగీలు, స్లీపర్ క్లాస్ బోగీలు ఉన్నాయి. బైవీక్లీ రైలు కన్నా హంసఫర్ రైలు ప్రయాణం దాదాపు 3 గంటలు అధికంగా ఉండటం గమనార్హం. 02762 ఏసీ ప్రత్యేక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో తృతీయ శ్రేణి శీతల టిక్కెట్ ధర రూ.1355. కరీంనగర్ నుంచి తిరుపతి రెగ్యులర్ బై వీక్లీ 12762 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో తృతీయ శ్రేణి శీతల టిక్కెట్ ధర రూ.1100. రెండింటి మధ్య వ్యత్యాసం రూ.255. ఏదైనా రెగ్యులర్ రైలు వెనుక నుంచి వస్తుంది అంటే ప్రత్యేక రైళ్లను ఒక చోట ఆపి వాటిని పంపిస్తారు. ప్రత్యేక రైళ్లు సమయ పాలన పాటించడం అరుదనే చెప్పాలి. -
ఏసీబీ కోర్టు కరీంనగర్ ఇన్చార్జి పీపీగా ప్రసాద్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన వేముల లక్ష్మీప్రసాద్ను కరీంనగర్ ఏసీబీ కోర్టు ఇన్చార్జి పీపీగా నియమిస్తూ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సాంబశివారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు ప్రసాద్ అదనపు బాధ్యతలు చేపట్టారు. ప్రసాద్ మాట్లాడుతూ సాక్షులు భయపడకుండా కోర్టులో సాక్ష్యం చెప్పాలని కోరారు. ఎవరైనా నిందితులు సాక్షులను భయపెడితే పోలీస్స్టేషన్లో దరాఖాస్తు ఇస్తే పోలీసులు వారిపై కేసు నమోదు చేస్తారన్నారు. సివిల్ సర్వీస్ లాంగ్టర్మ్కు ఉచిత శిక్షణ కరీంనగర్/పెద్దపల్లిరూరల్: ఉమ్మడి కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో డిగ్రీ పాసైన అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ కోసం బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈనెల 16వ తేదీ నుంచి జూలై 8వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. అభ్యర్థులకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తారన్నారు. ఎంపికై న వారికి జూలై 25 నుంచి వచ్చే ఏడాది 30వ తేదీవరకు ఉచిత శిక్షణ ఉంటుందని వెల్లడించారు. ఆసక్తి, అర్హత గలవారు www.tgbcstudycircle.cgg.gov.in వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేయాలని వారు పేర్కొన్నారు. వివరాలకు 040–24071178 ఫోన్ నంబరులో సంప్రదించాలని అధికారులు సూచించారు. దళారుల చేతుల్లోకి దేశ సంపద ● సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుజగిత్యాలటౌన్: ప్రజల మధ్య బీజేపీ మతం పేరుతో చిచ్చు పెడుతుందని, దేశ సంపదను పెత్తందార్లకు దోచిపెట్టేందుకు మోదీ దళారీల వ్యవహరిస్తున్నారని కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. శుక్రవారం జగిత్యాల జిల్లా 4వ మహాసభలు జిల్లా కార్యదర్శి వెన్న సురేశ్ అధ్యక్షతన నిర్వహించగా ఎమ్మెల్యే, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి హాజరయ్యారు. అంతకు ముందు జగిత్యాల టవర్ సర్కిల్ నుంచి తహసీల్ చౌరస్తా మీదుగా ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బీజేపీ 11ఏళ్ల పాలనలో దేశంలో పేదరికం పోయిందనడం పచ్చి అబద్ధమన్నారు. పేదరికం పోతే ఇంకా రేషన్ కార్డులు ఎందుకని ప్రశ్నించారు. పేదల పక్షాన పోరాటం చేసే కమ్యునిస్టులంటే బూర్జువా పార్టీలకు ఎప్పటికీ నచ్చదన్నారు. ఎర్ర జెండా ఎప్పటికీ పేదలకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దగాకోరు విధానాలతో దేశ ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. అనంతరం వెంకట్రెడ్డి మాట్లాడుతూ, అంబేడ్కర్ ముందుచూపుతో పేదల హక్కులు కాపాడేలా రాజ్యాంగాన్ని రచిస్తే మోదీ ప్రభుత్వం ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కమ్యునిస్టులందరూ ఐక్యమై మోదీని గద్దె దించేలా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. నాయకులు సుతారి రాములు, ఎన్నం రాధ, ఇరుగురాళ్ల భూమేశ్వర్, ఎండీ అక్రం, వెన్న మహేశ్, మునుగూరి హన్మంతు పాల్గొన్నారు. -
భూ తగాదాలో అన్నను చంపిన తమ్ముడు
పెగడపల్లి(ధర్మపురి): భూతగాదాలో సొంత అన్నను తమ్ముడు హతమార్చిన ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయితిపల్లి గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కూన నర్సయ్య (50), కూన రాములు అన్నదమ్ములు. మద్యానికి బానిసయ్యారు. ఇద్దరి బాధలు భరించలేక ఇరువురి భార్యలు వీరిని వదిలి దూరంగా ఉంటున్నారు. ఒకే ఇంట్లో నివాసం ఉంటున్న అన్నదమ్ముల మధ్య కొంతకాలం నుంచి భూవివాదం నెలకొంది. ఈక్రమంలో గ్రామంలో జరిగిన పెద్దమ్మ బోనాల పండుగ సందర్భంగా గు రువారం రాత్రి ఇద్దరూ అతిగా మద్యం తాగారు. తాగిన మైకంలో గతంలో జరిగిన గొడవలను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు దూషించుకున్నారు. ఈ క్రమంలో ఆవేశానికి గురైన రాములు కర్రతో నర్స య్య తలపై బాదడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య రాజవ్వ ఫిర్యాదు మేరకు రాములుపై హత్యా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో రవీందర్ పేర్కొన్నారు. మల్యాల సీఐ రవి సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. కాగా నిందితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. -
కనగర్తిలో దొంగతనం
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని కనగర్తిలో శుక్రవారం దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన వంగపెల్లి శంకర్ ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాను తెరిచి వస్తువులు చిందరవందర చేశారు. చిన్నారుల కిడ్డీ బ్యాంక్ డబ్బాను పగులగొట్టి అందులోని డబ్బులు ఎత్తుకెళ్లారు. దాదాపు రూ.10వేల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఎస్సై ప్రశాంత్రెడ్డి ఆధ్వర్యంలో క్లూస్టీం, డాగ్స్క్వాడ్ నిపుణులు ఆధారాలు సేకరించారు. కేటీఆర్పై ఫిర్యాదుమల్యాల(చొప్పదండి): సీఎం రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి కేటీఆర్పై కాంగ్రెస్ నాయకుడు సంత ప్రకాశ్రెడ్డి ఆధ్వర్యంలో మల్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్రెడ్డిని చేతగానివాడు, రాష్ట్రాన్ని నడిపే సత్తాలేనివాడంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు కోరెపు వెంకటేశ్, తిపిరెడ్డి కిషన్రెడ్డి, కొత్తకొండ శ్రీనివాస్, ఏలేటి కిష్టరెడ్డి, మహేశ్రెడ్డి, కటుకం వినయ్ పాల్గొన్నారు. యువకుడి దారుణ హత్యగంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన మెండె సతీశ్యాదవ్(30) శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామ శివారులో మల్లారెడ్డిపేటకు వెళ్లేదారిలో సతీశ్ మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంది. మృతుడు స్థానికంగా వ్యవసాయపనులు, గొర్రెల కాపరీ, మేసీ్త్ర పనులు చేస్తుండేవాడని గ్రామస్తులు తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్గౌడ్, ఎస్సై ప్రేమానందం సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
దొంగస్వాముల ముఠా అరెస్టు
కొత్తపల్లి(కరీంనగర్): ఇంటి సమీపంలోని గుప్త నిధులు వెలికితీస్తే అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులు ఆరోగ్యంగా మెరుగుపడతారని నమ్మబలికి మోసానికి పాల్పడ్డ దొంగస్వాముల గుట్టురట్టయ్యింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దొంగ స్వాములను కటకటాలకు పంపారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్ వివరాల మేరకు కొత్తపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని ఎలగందుల అనుబంధ శ్రీరాముపల్లి గ్రామానికి చెందిన గజ్జి ప్రవీణ్ తండ్రి వేములవాడ డిపోలో ఆర్టీసీ డ్రైవర్ పనిచేస్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడగా కాలు విరిగింది. అతని తల్లి సైతం అనారోగ్యంతో బాధపడుతోంది. పదిరోజుల క్రితం ప్రవీణ్కు ఓ స్వామివేషంలో ఉన్న వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇంట్లో ఏంబాగా లేదని, ఇంటి పక్కన క్వింటాల్ వరకు బంగారు కడ్డీ ఉందని, దానిని బయటకు తీసి పూజలు చేస్తే కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా మెరుగవుతారని, లేకపోతే నెలరోజుల్లోనే చనిపోతారని నమ్మపలికాడు. భయపడ్డ ప్రవీణ్ పూజలు చేసేందుకు అంగీకరించగా, విడతలవారీగా రూ.3 లక్షలు, రూ.5 లక్షలు, రూ.10 లక్షలు మొత్తంగా రూ.15.30లక్షలు ప్రవీణ్ వద్ద వసూలు చేశాడు. ఓ రోజు ఇంటి సమీపంలో గొయ్యి తవ్వి పూజలు చేసినట్లు నటించాడు. గొయ్యిలోంచి ఓ డబ్బా బయటకు తీసి అందులో కిలో బంగారం ఉంటుందని దేవుని గదిలో దాచిపెట్టాలని సూచించాడు. మరికొంత డబ్బు కావాలని లేకుంటే తండ్రిని చంపి ఇక్కడే పాతిపెడతామని ప్రవీణ్ను బెదిరించగా, కొంత డబ్బు అప్పు చేసి వారికి ఇచ్చాడు. తరువాత మోసపోయానని గ్రహించి కొత్తపల్లి పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు చంద్రగిరికి చెందిన ఈర్నాల రాజు, ఆగ్రహారంకు చెందిన మిరియాల చంద్రయ్య, చీర్లవంచకు చెందిన పెనుగొండ రాజు, చల్లా అజయ్, ఈర్నాల సతీశ్ ముఠాగా ఏర్పడి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రూ.15.30 లక్షల నగదు, 7తులాల బంగారం, మూడు కార్లు, 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన కరీంనగర్ రూరల్ సీఐ ఏ.నిరంజన్రెడ్డి, కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి, ఏఎస్సై లక్ష్మారెడ్డిని సీపీ గౌస్ఆలం, ఏసీపీ శుభం ప్రకాశ్ అభినందించారు. రూ.15,30 లక్షల నగదు, 7తులాల బంగారం, 3 కార్లు, 7సెల్ఫోన్లు స్వాధీనం -
గాడిన పెట్టాల్సిందే!
● బల్దియాలో అదుపు తప్పిన పాలన ● అధికారుల్లో కొరవడిన సమన్వయం ● ఉద్యోగుల్లో లోపించిన జవాబుదారీతనం ● బాధ్యతలు చేపట్టిన కమిషనర్ ప్రఫుల్దేశాయ్ప్రణాళికాబద్ధంగా నగర అభివృద్ధి ● నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ కరీంనగర్ కార్పొరేషన్: ప్రణాళికబద్ధంగా నగరాన్ని అభివృద్ధి చేస్తామని నగరకపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు చేర్చడం, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం తమ ప్రాధాన్యతలన్నారు. శుక్రవారం నగరపాలకసంస్థ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు కమిషనర్గాఉన్న చాహత్ బాజ్పేయ్ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం ప్రఫుల్దేశాయ్ మాట్లాడుతూ వచ్చే 50 సంవత్సరాలకు అనువుగా మాస్టర్ప్లాన్ ప్రకారం నగరాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. స్మార్ట్సిటీతో పాటు ఇతర నిధులతో చేపట్టిన పనులు పెండింగ్లో ఉంటే పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువవికాసం, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్కార్డులు అర్హులకు అందేలా చూస్తామన్నారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, బర్త్, డెత్ సెక్షన్లలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అసెస్మెంట్, అండర్ అసెస్మెంట్లు, ఇంటి అనుమతులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. విలీన గ్రామాల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. పారిశుధ్యాన్ని మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. డంప్యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూస్తామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తామని, అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తామన్నారు. నిబంధనలను పాటించి డీలిమిటేషన్ చేస్తామని స్పష్టం చేశారు. కాగా.. గతేడాది ఆగస్టు 21వ తేదీన చాహత్ బాజ్పేయ్ నగరపాలకసంస్థ కమిషనర్గా బదిలీపై వచ్చారు. అప్పుడు ఇన్చార్జి కమిషనర్గా ఉన్న ప్రఫుల్దేశాయ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. తాజా బదిలీల నేపథ్యంలో కమిషనర్గా ప్రఫుల్దేశాయ్కి బాధ్యతలు అప్పగించి చాహత్ బాజ్పేయ్ వరంగల్ వెళ్లారు.కరీంనగర్ కార్పొరేషన్: అధికారుల్లో కొరవడిన సమన్వయం, ఉద్యోగుల్లో లోపించిన జవాబుదారితనం, సిబ్బంది ఇష్టారా జ్యం, అన్ని విభాగాల్లోనూ అవినీతిదే ఆధిపత్యం.. వెరసి నగరపాలకసంస్థలో పరిపాలన గాడి తప్పింది. నగరపాలకసంస్థ విస్తరించినా పౌరసేవలకు మాత్రం నగర ప్రజలు నోచుకోవడం లేదు. ఏ పని కావాలన్నా, ఏ ఫైల్ కదలాలన్నా, చేతి చమురు వదిల్చుకోవాల్సిందే. పనుల కోసం వచ్చే ప్రజలతో అధికారులు ప్రవర్తించే తీరు తరచూ వివాదాస్పదమవుతోంది. నగరం, నగరపాలకసంస్థ పరిపాలనపై పూర్తి అవగాహన ఉన్న ప్రఫుల్ దేశాయ్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టడంతో బల్దియా తీరుమారుతుందేమోననే ఆశతో నగరవాసులున్నారు. టౌన్ప్లానింగ్: మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతి గురించి చెప్పుకోవాల్సి వస్తే ముందుగా గుర్తొచ్చేది పట్టణ ప్రణాళిక విభాగమే(టౌన్ప్లానింగ్). ఒకరిద్దరు అధికారుల మూలంగా టౌన్ప్లానింగ్ అంటేనే అవినీతి కూపమనే భావన ప్రజల్లో నెలకొంది. ప్రస్తుతం పాలకవర్గం లేకపోవడంతో అన్ని పాత్రలు సదరు అధికారులే పోషిస్తున్నారు. ఎక్కడ నిర్మాణం జరిగినా రూ.లక్షలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇక నిర్మాణాలు వివాదాస్పదమైతే వారి పంట పండినట్లే. రెవెన్యూ: ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు ఇవ్వడం, కబ్జాలకు ఇంటి నంబర్లతో సాయం చేయడం, అసెస్మ్ంట్లలో చేతివాటం ప్రదర్శించడం లాంటి ఎన్నో ఘనతలు ఉన్న రెవెన్యూ విభాగంలో ప్రతిరోజు ఏదో ఒక వివాదం తప్పడం లేదు. రెండు ఆర్వో పోస్టులుంటే, డిప్యుటేషన్పై వచ్చిన ముగ్గురిని సర్దుబాటు చేసేందుకు ముగ్గురికి ఆర్వో పోస్టులు ఇవ్వడమే ఈ విభాగ పనితీరుకు నిదర్శనం. ఇంజినీరింగ్: నగర అభివద్ధిలో ప్రధాన పాత్ర పోషించే ఇంజినీరింగ్ విభాగంపై ఆజమాయిషీ లేకుండా పోయింది. కాంట్రాక్టర్లు మనోళ్లైతే చాలు, పనులకు ముందే బిల్లులు తయారు చేయడం ఇక్కడ ప్రత్యేకత. అభివద్ధి పనుల్లో నాణ్యత చూడాల్సిన కొంతమంది అధికారులు, పర్సంటేజీలు చూసి బిల్లులు చేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. అభివద్ధి పనుల టెండర్, నాణ్యతలపై ఫిర్యాదులున్నా, కాంట్రాక్టర్ చెబితే చాలు ఆగమేఘాలమీద రన్నింగ్ బిల్లుల పేరిట డబ్బులు చెల్లించడం ఇంజినీరింగ్ స్పెషల్. శానిటేషన్: నగరంలో పారిశుధ్యం (శానిటేషన్)పై ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రోడ్లు, వీధులు, డ్రైనేజీలు ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలుగా దర్శనమిస్తోంది. చివరకు చెత్త డబ్బాల వద్ద కూడా రోడ్లపై చెత్తను రోజుల తరబడి తొలగించని పరిస్థితి నెలకొంది. ఇక మెడివేస్ట్, జంతు ఎముకలు లాంటి ప్రమాదకర వ్యర్థాలు కూడా పారిశుధ్య సిబ్బంది సహకారంతో డంప్యార్డ్కు చేరుతున్నాయి. శానిటేషన్ వాహనాలు, అందులో పోస్తున్న డీజిల్కు కాకిలెక్కలే ఆధారం.ప్రక్షాళన చేయాల్సిందే కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ప్రఫుల్దేశాయ్ గతంలో పలుమార్లు ఇన్చార్జి కమిషనర్గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన తీసుకున్న విప్లవాత్మక చర్యలు అప్పట్లో సంచలనం సష్టించాయి. కలెక్షన్ ఏజెంట్లుగా మారిన ఔట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ల పీఠాలను సమూలంగా మార్చారు. బల్దియా చరిత్రలో మొదటి సారి, పనికి మించి బిల్లులు తీసుకున్న మాధవ కన్స్ట్రక్షన్ నుంచి డబ్బులు రికవరీ చేయించారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో కమిషనర్గా బాధ్యతలు చేపట్టడంతో, నగరపాలకసంస్థను గాడినపెడతారనే విశ్వాసాన్ని నగరప్రజలు వ్యక్తం చేస్తున్నారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి..
ఇల్లంతకుంట(మానకొండూర్): కుటుంబ కలహాలతో గురువారం గడ్డి మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మరణించాడు. ఎస్సై అశోక్ తెలిపిన వివరాలు. మండలంలోని జంగారెడ్డిపల్లికి చెందిన పండుగ చక్రపాణి(43) కొంతకాలంగా తన భార్య, తల్లితో విభేదాలు ఏర్పడ్డాయి. గ్రామపెద్దల సమక్షంలో అనేకసార్లు పంచాయితీలు జరిగాయి. దీంతో కలత చెందిన చక్రపాణి గురువారం గడ్డి మందు తాగాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుని అన్న అశోక్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, కూతురు ఉన్నారు. -
మాబ్ ఆపరేషన్ డ్రిల్పై శిక్షణ
కరీంనగర్క్రైం: కరీంనగర్ కమిషనరేట్ పరిధి లోని ఏఆర్, క్విక్ రియాక్షన్ టీం సిబ్బందికి సీపీ గౌస్ ఆలం ఆధ్వర్యంలో సీటీసీలో మాబ్ ఆపరేషన్పై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల సమస్యలు తలెత్తినప్పుడు అల్లరి మూకలను సమర్థవంతంగా చెదరగొట్టడానికి పోలీసులు నిర్వర్తించాల్సిన విధులను అభ్యాసం చేయడమే ఈ శిక్షణ ఉద్దేశం అన్నారు. లాఠీ డ్రిల్, గ్యాస్ గన్ పేల్చే విధానం, ఫైరింగ్, స్మోక్ గన్ ఫైరింగ్, వజ్ర వాహనం వినియోగంపై శిక్షణ ఇచ్చారు. ఆర్ఐలు రజనీకాంత్, జానీమియా, కుమారస్వామి, శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు. మున్సిపాలిటీల్లో వైద్య శిబిరాలు కరీంనగర్టౌన్: జిల్లాలోని కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్ కార్యాలయాల్లో సిబ్బందికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వైద్య శిబిరాలు నిర్వహించారు. గర్భాశయ ముఖద్వార కేన్సర్, క్యాన్సర్ స్క్రీనింగ్, కంటి పరీక్షలు, అధిక రక్తపోటు, షుగర్ స్క్రీనింగ్ చేసి మందులు అందజేశారు. సీజనల్ వ్యాధులు, నివారణ చర్యలను వివరించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, వైద్యాధికారులు ఉమాశ్రీ, సాజిదా, సనజవేరియా, విమల, అలేఖ్య, నవ్య, సాయిప్రసాద్, ప్రణీత పాల్గొన్నారు. విజయవంతం చేయండి కరీంనగర్: రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు విజయవంతం చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు కంపాటి పృథ్వీ, ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్ పిలుపునిచ్చారు. శుక్రవారం సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అంగిడి కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. జిల్లాకేంద్రంలో జూలై 12,13 తేదీల్లో నిర్వహించే రాజకీయ శిక్షణ తరగతులకు రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థి నాయకత్వం హాజరవుతుందని, ప్రొఫెసర్లు, మేధావులు వస్తున్నారన్నారు. చరణ్, దిరాజ్ వంశీ, విష్ణు,వేణు, రాహుల్, రాకేశ్, విజయ్, ప్రణయ్, సాయి, సిద్ధు పాల్గొన్నారు. నాణ్యమైన విద్య అందిస్తాంతిమ్మాపూర్: మండలంలోని రామకృష్ణకాలనీ ప్రా థమికోన్నత పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం వైభవంగా జరిగింది. డీఈవో మొండయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాణ్యమై న విద్యను అందించడంలో ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎంఈవో శ్రీని వాస్ మాట్లాడుతూ.. ఉన్నతవిద్యను అందించడానికి తమవంతు సహకారం అందిస్తామన్నా రు. హెచ్ఎం ఎం.మహేశ్వర్, కార్యదర్శి శ్రీకాంత్, సింగిల్ విండో చైర్మన్ రవీందర్రెడ్డి, కాంప్లెక్స్ హెచ్ఎంలు పి.శ్రీనివాస్, చైల్డ్ సంరక్షణ కోఆర్డినేటర్ సంపత్, జీసీడీవో కపారాణి, పాఠశాల చైర్మన్ పురంలక్ష్మి, పాల్గొన్నారు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్లకు ఆహ్వానం కరీంనగర్: తపాలశాఖ కరీంనగర్ డివిజన్ పరిధిలో, కమిషన్ బేసిస్తో తపాల జీవిత బీమా ఏజెంట్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కె.శివాజీ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై, 18–50ఏళ్ల మధ్య ఉన్న కరీంనగర్ డివిజన్కు చెందినవారు అర్హులన్నారు. దరఖాస్తులను కరీంనగర్ డివిజన్ఆఫీస్లో ఈనెల 27లోపు అందజేయాలని, ఎంపికై న అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరుకావాలని పేర్కొన్నారు. సెక్యూరిటీ డిపాజిట్గా రూ.5వేలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. క్వింటాల్ పత్తి రూ.7,400 జమ్మికుంట: స్థానిక మార్కెట్లో క్వింటాల్ శుక్రవారం పత్తి ధర గరిష్టంగా రూ.7,400 పలికింది. 31క్వింటాళ్ల పత్తిని రైతుల తెచ్చారు. శని, అదివారాలు మార్కెట్కు సెలవు ఉంటుందని కార్యదర్శి మల్లేశం తెలిపారు. -
జపాన్ సకురా సైన్స్ హైస్కూల్కు శుభశ్రీ
సప్తగిరికాలనీ(కరీంనగర్): పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏం లేదనడానికి నిదర్శనం కరీంనగర్కు చెందిన శుభశ్రీ సాహు. అగ్రికల్చర్ మిషన్ను తయారు చేసిన శుభశ్రీ ఇన్స్పైర్ మనక్ అవార్డు ప్రదర్శనలో భాగంగా ఈ నెల 15నుంచి 21వరకు జపాన్ దేశంలోని జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ నిర్వహించనున్న సకురా సైన్స్ ఎక్చేంజ్ ప్రోగ్రాంలో పాల్గొననుంది. కరీంనగర్ మంకమ్మతోటకు చెందిన శుభశ్రీ సాహు స్థానిక పారమిత పాఠశాలలో చదివింది. ప్రస్తుతం సీబీ ఎస్ఈ 12వ తరగతి చదువుతోంది. 9వ తరగతి చదువుతున్న సమయంలో ఇన్స్పైర్ మనక్కు ఎంపికై ంది. జిల్లాస్థాయిలో తాను చేసిన ప్రదర్శన అంచెలంచెలుగా అందరి ప్రశంసలు పొంది నేడు జపాన్ సకూర స్కూల్కు ఎంపికై ంది. లలిత్మోహన్ సాహు శుభశ్రీకి తండ్రి, గై డ్ టీచర్. తల్లి సుగ్యని సాహు. ఇద్దరు పా రమిత పాఠశాల ఉపాధ్యాయులే. సొంతూరు ఒ డిశా రాష్ట్రం కాగా కరీంనగర్లో సుమారు 25ఏళ్లుగా నివాసముంటున్నారు. తెలంగాణ నుంచి ముగ్గురు శుభశ్రీ పోర్టబుల్ వ్యవసాయ యంత్రాన్ని తయారు చేసింది. ధాన్యం మార్పిడి, వేరు చేయడం, గడ్డికోత, తూర్పార, సంచులను కుట్టడం వంటి నాలుగు వేర్వేరు ప్రక్రియలు ఈ యంత్రం చేస్తుంది. ఈ యంత్రాన్ని సౌరశక్తి ద్వారా నడిపించొచ్చు. 2022–23 విద్యాసంవత్సరంలో తొలిసారిగా జిల్లాస్థాయి ఇన్స్పైర్ ప్రదర్శనలో శుభశ్రీ సాహు పాల్గొంది. 2024లో హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి ప్రదర్శనలో రాణించి జాతీయస్థాయికి ఎంపికై ంది. 2024 సెప్టెంబర్లో ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి ఇన్స్పైర్ అవార్డు ప్రదర్శనలో పాల్గొని టాప్ 30లో నిలిచింది. 2025–26 సంవత్సరానికిగాను డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, న్యూ ఢిల్లీ, జపాన్ దేశంలోని సకురా సైన్స్ హైస్కూల్ ప్రోగ్రామ్ కోసం దేశవ్యాప్తంగా 54మంది విద్యార్థులను శుక్రవారం ఎంపిక చేయగా తెలంగాణ నుంచి ము గ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఇందులో శుభశ్రీ కూడా చోటు సంపాదించింది. జపాన్లో జూన్ 15నుంచి 21 వరకు ఏడు రోజుల పాటు వీరు పర్యటిస్తారు. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ, అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలను సందర్శిస్తారు. ఈ కార్యక్రమానికి పూర్తిగా విద్యార్థి ఖర్చులను భారత ప్రభుత్వమే భరిస్తుంది. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 15నుంచి 21వరకు పర్యటన -
కాంగ్రెస్ నాయకుడిపై దాడి
● కేసు నమోదు జమ్మికుంట: కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట పట్టణ మాజీ అధ్యక్షుడిపై అదే పార్టీకి చెందిన ఓ నాయకుడు దాడిచేశాడని టౌన్ సీఐ ఎస్.రామకృష్ణ గురువారం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. కొత్తపల్లిలోని కసుబోజుల వెంకన్న ఇంటికి బుధవారం రాత్రి వెళ్లిన దేశిని కోటేశ్వర్(కోటి) రాబోయే ఎన్నికల్లో తనకు సపోర్టు చేయాలని బెదిరిస్తూ కర్రతో తలపై దాడి చేశాడు. అడ్డు వచ్చిన అతని భార్యపై సైతం దాడి చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. తిరుపతికి ప్రత్యేక రైలు● మంత్రి పొన్నం విజ్ఞప్తికి స్పందించిన రైల్వే కరీంనగర్ కార్పొరేషన్/ కరీంనగర్ రూరల్: కరీంనగర్ నుంచి తిరుపతికి రైళ్ల సేవలను పెంచుతూ గురువారం రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తికి స్పందించిన రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రత్యేక రైలును జూలై 6 నుంచి నడిపించనున్నారు. ప్రతి ఆదివారం రాత్రి 7.45 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి, సోమవారం ఉదయం 10గంటలకు కరీంనగర్ చేరుకుంటుంది. సోమవారం సాయంత్రం 5.30కు కరీంనగర్ నుంచి బయలుదేరి మంగళవారం ఉదయం 8.25కు తిరుపతి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు రద్దీని బట్టి రెగ్యులర్గా నడిచే అవకాశముంది. ఈ సందర్భంగా రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్రమంత్రి బండి సంజయ్కి పొన్నం ధన్యవాదాలు తెలిపారు. ఈ రైలును ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తికి మూడేళ్ల జైలు జగిత్యాలజోన్: ఇంటర్ బాలికపై అత్యాచారా నికి యత్నించిన వ్యక్తికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.12,200 జరిమానా విధిస్తూ జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి, పోక్సో కోర్టు ఇన్చార్జి జడ్జి సి.రత్న పద్మావతి గురువారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణారావు కథనం ప్రకారం.. గొల్లపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఇంట ర్ చదువుతోంది. కరోనా సమయంలో లాక్డౌన్తో ఇంటి వద్ద ఆన్లైన్లో క్లాస్లు వింటోంది. బాలిక ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉండగా.. అదే గ్రామానికి చెందిన రెడపాక శ్రీనివాస్ ఎప్పుడూ బాలిక ఇంటి వైపు చూ స్తుండేవాడు. 26 జనవరి 2021న బాలిక తల్లి దండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లారు. బా లిక ఇంట్లో బట్టలు మార్చుకుంటోంది. శ్రీని వాస్ ఇంట్లోకి వెళ్లి ఆమైపె అత్యాచారం చేయబోయాడు. బాలిక పరుగెత్తుకుంటూ బయటకు వచ్చి తల్లితండ్రులకు ఫోన్ ద్వారా తెలి పింది. దీంతో వారు గొల్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై బి.జీవన్ కేసు దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాస్ను అరెస్ట్ చేసి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ అధికారులు కిరణ్కుమార్, శ్రీధర్, రాజు కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టారు. పరిశీలించిన జడ్జి నిందితుడైన శ్రీనివాస్కు మూడేళ్ల జైలు, రూ.12,200 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. -
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
శంకరపట్నం: మండలంలోని కాచాపూర్శివారులో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహ నం ఢీకొని తాటికొండ పుష్పలీల(65), రామస్వామి (68) దంపతులు చనిపోయారని ఎస్సై రవి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. వీణవంక మండలం బొంతుపల్లి గ్రామానికి చెందిన తాటికొండ రామస్వామి, పుష్పలీల ద్విచక్రవాహనంపై హుజూరాబాద్ వెళ్తున్నవారు. మార్గమధ్యలో మండలంలోని కాచాపూర్ శివారులో వీరి వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. పుష్పలీల అక్కడికక్కడే మరణించింది. రామస్వామికి తీవ్రగాయాలు కాగా 108 లో వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మలేసియాలో గుండెపోటుతో మల్లాపూర్ వాసి.. మల్లాపూర్: ఉపాధి కోసం మలేసియా వెళ్లిన మల్లాపూర్ మండలకేంద్రానికి చెందిన నారి తుక్కారాం (35) పదిరోజుల క్రితం గుండెపోటుతో మృతిచెందినట్లు గురువారం కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. స్థానికుల కథనం ప్రకారం.. తుక్కారాం ఉపాధి కోసం కొంతకాలంగా మలేసియాకు వెళ్లివస్తున్నాడు. ఈనెల 3న అక్కడే గుండెపోటు రావడంతో మరణించాడు. అక్కడి భారతీయుల ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తుక్కారాం మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులను కోరారు. పరుగుమందు తాగి యువకుడు ఆత్మహత్య తిమ్మాపూర్: పైళ్లెన నెల రోజుల్లోపే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రేణిగుంట గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు గ్రామానికి చెందిన పెసర శ్రీకాంత్(30)కు మే 16న వివాహమైంది. వారం క్రితం భార్య పుట్టింటికి వెళ్లింది. శ్రీకాంత్ బుధవారం అత్తగారింటికి వెళ్లి వచ్చిన తర్వాత పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఉరేసుకొని యువకుడు..యైటింక్లయిన్కాలనీ(రామగుండం): గోదావరిఖని టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధి యైటింక్లయిన్కాలనీ షిర్కెక్వార్టర్స్ ఏరియాలో నివాసం ఉంటున్న గోషిక రోహిత్(29) గురువారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన రోహిత్.. మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత తన గదిలోకి వెళ్లడంతో అతను నిద్రపోయాడని కుటుంబ సభ్యులు భావించారు. సాయంత్రం వరకూ కుమారుడు బయటకు రాకపోవడంతో గదిలోకి వెళ్లి చూడగా అప్పుడికే ఉరేసుకొని కనిపించాడు. తమ కుమారుడిని కొందరు ఆర్థికపరమైన లావాదేవిల కోసం కొంతకాలంగా వేధిస్తున్నారని మృతుని తండ్రి అశోక్ పోలీసులకు తెలిపాడు. ఈవిషయంపై తమకు ఫిర్యాదు అందలేదని గోదావరిఖని టూటౌన్ సీఐ ప్రసాద్రావు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలపూ విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వరకట్న వేధింపులకు వివాహిత.. తిమ్మాపూర్: వరకట్న వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధి అల్గునూర్కు చెందిన స్వప్నకు అదే గ్రామానికి చెందిన గూళ్ల వెంకటేశ్తో పదేళ్ల క్రితం వివాహమైంది. అదనపు కట్నం కోసం అత్తింటివారు వేదిస్తుండగా బుధవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎల్ఎండీ పోలీసులు తెలిపారు.