Karimnagar District News
-
పెన్షనర్ల బకాయిలు చెల్లించాలి
కరీంనగర్టౌన్: రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావలసిన బకాయిలు మొత్తం చెల్లించాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ కోహెడ చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఫెన్షనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మాజీ మేయర్ రవీందర్సింగ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, జాగృతి సంస్థ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ తదితరులు మాట్లాడారు. 2024 మార్చి నన్చి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రిటైర్డ్ అయిన 24,678 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీపీఎఫ్, టీఎస్ జీఎల్ఐ, జీఐఎస్ తదితర బకాయిలు అందక నానా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చంద్రమౌళి, ప్రభాకర్రావు మాట్లాడుతూ, బకాయిలు అందక, మెరుగైన వైద్యం చేయించుకోలేక ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 250 మంది పెన్షనర్లు చనిపోయినారని అన్నారు. ఇప్పటికై నా బకాయిలు మొత్తం చెల్లించాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సుంకిశాల ప్రభాకర్రావు, కనపర్తి దివాకర్ పాల్గొన్నారు. పరిశోధన కేంద్రం సందర్శన కరీంనగర్సిటీ: నగరంలోని ఎస్సారార్ డిగ్రీ, పీజీ కాలేజీలో ఏర్పాటు చేసిన పరిశోధన కేంద్రం, వృక్షశాస్త్ర విభాగాన్ని మంగళవారం కరీంనగర్లోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కాలేజీ, లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర విభాగాధిపతులు, అధ్యాపకులు సందర్శించా రు. వృక్షశాస్త్ర శాఖాధిపతి తిరుకోవేల శ్రీనివాస్ వారికి పరిశోధనల అంశాలు వివరించారు. కార్యక్రమంలో వృక్షశాస్త్ర విభాగ సహాయ ఆచార్యులు రాధాకృష్ణ, డాక్టర్ తిరుపతి, డాక్టర్ తాహిర్హుస్సేన్, డా.కళాజ్యోతి, డాక్టర్ తిరుపతి, డాక్టర్ స్వరూపరాణి, డాక్టర్ మొహమ్మద్ తాజొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మున్నూరుకాపులు ఐక్యంగా ముందుకెళ్లాలి కరీంనగర్: మున్నూరుకాపులను గ్రామస్థాయి నుంచి ఏకతాటిపై నడిపించేందుకు కృషి చేయాలని సంఘం గౌరవ అధ్యక్షుడు గంగుల సుధాకర్పటేల్ అన్నారు. మంగళవారం మంకమ్మతోటలో నిర్వహించిన రాష్ట్ర యువజన కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. మున్నూరుకాపులు రాజకీయాలకతీతంగా ముందుకు సాగి అభివృద్ధి దిశలో పయనించాలన్నారు. సంఘం బాధ్యులు సత్తినేని శ్రీనివాస్, కూరగాయల తిరుపతి, వాసాల హరీశ్, ఆవుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయిలో జిల్లా కళాకారుల ప్రతిభ
కరీంనగర్కల్చరల్: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో మార్చి 20–25 వరకు జరిగిన జాతీయ సాంస్కృతిక పోటీల్లో తెలంగాణకు చెందిన ఉద్యోగ కళాకారులు ప్రతిభ చాటారు. సుమారు 25 రాష్ట్రాల నుంచి పాల్గొన్న ఈ కార్యక్రమాల్లో తెలంగాణ నుంచి 45 మంది కళాకారులు రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించారు. జిల్లాకు చెందిన కేబీ శర్మ సంగీత సహకారం అందించగా, కాసు మహేందర్రాజు జానపద బృంద గీతానికి నాయకత్వం వహించారు. అగస్టీన్ రూపొందించిన శ్రీకనువిప్పుశ్రీ నాటిక జాతీయస్థాయిలో ప్రశంసలు పొందగా, వేముల ఇందిర ఉత్తమ తృతీయ నటి అవార్డు సాధించారు. -
మహిళల జీవితాల్లో ‘మహాలక్ష్మి’ వెలుగులు
కరీంనగర్టౌన్: మహిళల జీవితాల్లో ‘మహాలక్షి’ పథకం వెలుగులు నింపుతోందని కలెక్టర్ చిత్రామిశ్రా అన్నారు. మంగళవారం బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. మహిళలు, విద్యార్థులు కార్యాలయాలు, పాఠశాలలు, వివిధ పనుల కోసం వెళ్లేందుకు మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకుంటున్నారని తెలిపారు. జిల్లాలో మహాలక్ష్మి పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 6.91 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఉచితంగా ప్రయాణించారని తెలిపారు. అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవో మహేశ్వర్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, మెప్మా పీడీ స్వరూపారాణి, ఆర్టీసీ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలోమన్, కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు, డిప్యూటీ రీజినల్ మేనేజర్లు పి.మల్లేశం, ఎస్. భూపతిరెడ్డి, వన్ డిపో మేనేజర్ విజయ మాధురి, పర్సనల్ ఆఫీసర్ సంపత్, అకౌంట్స్ ఆఫీసర్ రవికుమార్ పాల్గొన్నారు. గ్రామసభలు విజయవంతం చేయాలి కరీంనగర్అర్బన్: ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఈనెల 2న జిల్లాలో గ్రామసభలు విజయవంతంగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షలో మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో గ్రామసభలు విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధులు గ్రామసభల్లో తప్పనిసరిగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీవాకడే, జెడ్పీ సీఈవో శ్రీనివాస్, డీపీవో జగదీశ్వర్, డీఆర్డీవో శ్రీధర్, గృహనిర్మాణ శాఖ పీడీ శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా జైలు సందర్శన
కరీంనగర్క్రైం: జిల్లా జైలును జిల్లా న్యాయసేవ అధికార సంస్థ(డీఎల్ఎస్ఏ) కార్యదర్శి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె.రాణి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీల భోజన వసతులు, ఆరోగ్య సమస్యలు, జైలు క్యాంటీన్, ఆసుపత్రి, ములాఖత్, లైబ్రరీ, కిచెన్, జైలు ఇండస్ట్రీలను పరిశీలించారు. మహిళా జైలును సందర్శించి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్ న్యాయవాదులను పెట్టుకునే స్తోమత లేని ఖైదీలకు ప్రభుత్వ న్యాయవాదులను నియమిస్తామని చెప్పారు. జైలు సూపరింటెండెంట్ జి.విజయదేని, జైలర్లు పి.శ్రీనివాస్, బి.రమేశ్, లక్ష్మీశృతి, డిప్యూటీ జైలర్లు ఎస్.సుధాకర్రెడ్డి, ఎల్.రమేశ్, ఎస్.అజయ్చారి, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మహేశ్ పాల్గొన్నారు. పవర్కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందున బుధవారం ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు కరెంట్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్ 2 ఏడీఈ లావణ్య తెలిపారు. 11 కేవీ శ్రీరాంనగర్ ఫీడర్ పరిధి విద్యానగర్, కొత్తయాస్వాడ, హరిహరనగర్, శ్రీరాంనగర్కాలనీ, సాలంపుర, ఆదిత్యనగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. -
దాడులైనా దందా ఆగట్లే
కరీంనగర్అర్బన్: తప్పు చేస్తే అధికారులు పట్టుకుంటున్నారంటే ఎవరికై నా భయమే. కానీ నగరంలో యథేచ్ఛగా వంట గ్యాస్ దందా సాగుతుందంటే లోపమొక్కడా.. తీవ్రత లేని కేసులు నమోదు చేయడమా, అధికారులతో ఉన్న అనుబంధమా..నన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వంట గ్యాస్ పక్కదారి పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రకటనలకే తప్ప ఆచరణలో ఆమడదూరం. జిల్లా కేంద్రంలో ఇప్పటివరకు సివిల్ సప్లయ్, విజిలెన్స్, టాస్క్ఫోర్స్ అధికారులు నాలుగు సార్లు తనిఖీలు నిర్వహించగా పట్టుకున్న ప్రతీసారి పదుల సంఖ్యలో సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మంగళవారం విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు సంయుక్తంగా తనిఖీ చేపట్టారు. జెస్సికా రీఫిలింగ్ సెంటర్లో 6 సిలిండర్లు, 13 హోటల్స్లో ఉపయోగిస్తున్న 21 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. యజమానులపై 6ఏ కేసు నమోదు చేశారు. విజిలెన్స్ అధికారులు ఆకారపు దినేశ్రెడ్డి, సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ సురేందర్, ఎఫ్ఐ శ్రీనివాస్రెడ్డి పాల్గొనగా మెరుపుదాడులు నిర్వహించారు. కానీ, మరోవైపు హోటళ్లలో వినియోగం సాగుతూ..నే ఉండటం విశేషం. సరఫరాదారులపై చర్యలేవీ గ్యాస్ కొరత పుకార్ల క్రమంలో విరివిగా దాడులు నిర్వహిస్తున్న అధికారులు పాత్రధారుల వరకే కేసులను పరిమితం చేస్తున్నారు. అసలు గ్యాస్ సరఫరా చేసిందెవరు, ఏ ఏజెన్సీ నుంచి సరఫరా జరిగింది, సదరు గ్యాస్ సిలిండర్ వినియోగదారుడెవరనే కోణంలో చర్యలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సదరు ప్రక్రియలో విచారణ చేసి గ్యాస్ వినియోగదారుల గ్యాస్ కనెక్షన్ రద్దు చేయడం, గ్యాస్ ఏజెన్సీని సీజ్ చేయడం వంటి కఠినచర్యలు చేపడితే బ్లాక్ మార్కెట్ గొడవే ఉండదన్నది సుస్పష్టం. కేవలం హోటళ్లు, రీఫిల్లింగ్ సెంటర్లపై 6ఏ కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సదరు కేసుతో ఒరిగేదేం లేదని ఇటీవల పట్టుబడిన హోటల్ నిర్వాహకుడొకరు చెప్పడం కొసమెరుపు. ఇటీవల ఎక్కడెక్కడ తనిఖీలు నిర్వహించారో హెచ్చు హోటళ్లలో వంట గ్యాస్ వినియోగిస్తుండటం చట్టంలోని లోపాలా..? లోపాయికారి ఒప్పందమా..నన్న వాదన వినిపిస్తోంది. అంతటా వంట గ్యాసే వంట గ్యాస్ బ్లాక్ మార్కెట్కు చేరకుండా చర్యలు చేపట్టామని సివిల్ సప్లయ్ అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో విరుద్ధ పరిస్థితి నెలకొంది. టి ఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, ప్రముఖ హోటళ్లు, దా బాలు, ప్రైవేట్ హాస్టళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, చిరుతిళ్ల తయారీ కేంద్రాల్లో బహిరంగంగా వంట గ్యాస్ వినియోగిస్తున్నారు. పలు చోట్ల తట్టుసంచులను క ప్పి వినియోగిస్తుండగా ప్రముఖ హోటళ్లలో పదుల సంఖ్యలో డొమెస్టిక్ సిలిండర్లు దర్శనమిస్తున్నాయి. కొందరు చుట్టు పక్కల ప్రాంతాల్లో సిలిండర్లను నిల్వ చేసి అవసరమైన సమయంలో వినియోగిస్తున్నారు. కాగా కమర్షియల్ సిలిండర్లను మాత్రమే వాడాలని ఇప్పటికే స్పష్టం చేశామని, వంట గ్యాస్ వినియోగిస్తే తీవ్రంగా పరిగణిస్తామని జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు తెలిపారు. విచ్చలవిడిగా వంటగ్యాస్ వినియోగం తీవ్రతలేని కేసుల నమోదే కారణమా? క్రిమినల్ కేసులు నమోదు చేస్తేనే అడ్డుకట్ట పాత్రధారులు కాకుండా సూత్రధారులపై చర్యలేవీ? -
ఈదురు గాలులు.. వర్షం.. పంట నష్టం
అకాలవర్షం అన్నదాతను ఆందోళనకు గురి చేస్తోంది. చేతికందివచ్చిన పంట చేనులోనే నేలరాలుతుండటంతో కన్నీటిపర్యంతమవుతున్నారు. సోమవారం, మంగళవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో వీణవంక, గన్నేరువరం, కరీంనగర్రూరల్, హుజూరాబాద్, చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లో పంటనష్టం వాటిల్లింది. గన్నేరువరం మండల కేంద్రంతో పాటు మాదాపూర్, ఖాసీంపేట, పారువెల్ల గ్రామాలు, వీణవంక మండల కేంద్రంతో పాటు పోతిరెడ్డిపల్లి, రెడ్డిపల్లి, కొండపాక, కరీంనగర్ రూరల్ మండలంలో బొమ్మకల్ గ్రామాల్లో మొక్కజొన్న పంట 227 ఎకరాల్లో దెబ్బతిందని వ్యవసాయ అధికారులు ప్రాథఽమికంగా అంచనా వేశారు. గంగాధర, రామడుగు మండలాల్లో మామిడికాయలు నేలరాలాయి. 139 మంది రైతులు పంట నష్టపోయారని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి వివరించారు. కొత్తపల్లిలో విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మలు పడి కరెంట్ సరఫరా నిలిచింది. విద్యానగర్ సాలంపురలో నాలుగు స్తంభాలు, గన్నేరువరంలోని పలు గ్రామాల్లో ఆరు స్తంభాలు విరిగిపడ్డాయి. కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్, మొగ్ధుంపూర్, చామనపల్లి, నగునూరు తదితర గ్రామాల్లో వరిపంట నేలకొరిగింది. – కరీంనగర్అర్బన్/కరీంనగర్ రూరల్/హుజూరాబాద్/చొప్పదండి/ కొత్తపల్లి/రామడుగు/గంగాధర/గన్నేరువరం అకాలవర్షంతో అన్నదాత ఆగమాగం మొక్కజొన్న పంట నష్టం 227 ఎకరాలు నష్టపోయిన రైతుల సంఖ్య 139 -
ఆరోగ్య మహిళా క్యాంపులను వినియోగించుకోవాలి
కరీంనగర్: మహిళల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య మహిళ క్యాంపునకు ప్రతీ మహిళ హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ అన్నారు. మంగళవారం తీగలగుట్టపల్లి బస్తీ దవాఖానలో నిర్వహించిన ఆరోగ్య మహిళా క్యాంపును సందర్శించారు. అవుట్ పేషెంట్, ఎన్సీడీ రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఫార్మసీ స్టోర్లను పరిశీలించి, మందుల లభ్యత, నిల్వలు తదితర అంశాలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం డీఎంహెచ్వో మాట్లాడుతూ, ఆరోగ్య మహిళా క్యాంపులో 18 ఏళ్లు పైబడిన మహిళలకు నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల స్క్రీనింగ్ నిర్వహించడం, సూక్ష్మపోషక లోపాలు తదితర పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు, అవసరమైన సలహాలు అందిస్తున్నామని తెలిపారు. పీవో ఎంహెచ్ఎన్ డాక్టర్ సనాజవేరియా, వైద్యాధికారి లావణ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
కరీంనగర్
బుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026పల్లెల్లో గ్రానైట్ కాసారం!7సాక్షిప్రతినిధి,కరీనగర్/కొత్తపల్లి●: పచ్చని పల్లెలపై గ్రానైట్ పరిశ్రమలు కాలుష్య విషం చిమ్ముతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు కాలుష్యం కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ యూనిట్ల ఇష్టారాజ్యం.. అధికారుల బాధ్యతరాహిత్యం ప్రజలకు ప్రాణసంకటంగా మారింది. కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్, ఖాజీపూర్, ఎలగందుల, శ్రీరాములపల్లి, కమాన్పూర్తో పాటు గంగాధర మండలం ఒడ్యారం ప్రాంతాలను గ్రానైట్ డస్ట్ కమ్మేస్తోంది. గ్రానైట్ పరిశ్రమలతో కొత్తపల్లి మండలంలోని గ్రామాలు వాయు, శబ్ద కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయి. గాలిలో సూక్ష్మధూళి కణాలు అధికమై ప్రజలు అవస్థలు పడుతున్నారు. గ్రానైట్ పాలీషింగ్ యూనిట్ల నుంచి దుమ్ము, ధూళితో పాటు రసాయనాలు గాలిలో కలుస్తున్నాయి. పాలీషింగ్ యూనిట్ల నుంచి వెలువడే వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ డంప్ చేస్తున్నారు. దుమ్ము, ధూళి ప్రజలతో అవస్థలు పడుతున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అనుమతుల్లేకుండా, పన్నులు చెల్లించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ పరిశ్రమలపై అధికారులు చర్యలు చేపట్టడంపై వెనకడువేస్తుండటంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రానైట్ పరిశ్రమలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విధంగానే జిల్లా కలెక్టర్ స్పందించి పరిశ్రమల అక్రమాలపై నిగ్గు తేల్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.గ్రానైట్ కటింగ్ పరిశ్రమలతోనే.. కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్, ఖాజీపూర్, కమాన్పూర్, ఎలగందుల, గంగాధర మండలం ఒడ్యారం గ్రామాలు గ్రానైట్ పారిశ్రామిక కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. అయితే వీటికి అనుబంధంగా గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ పరిశ్రమలు స్థాపించారు. ఆ పరిశ్రమల నుంచి వెలువడుతున్న గ్రానైట్ చూర్ణాన్ని(డస్ట్) ఎక్కడపడితే అక్కడ అన్లోడ్ చేస్తున్నారు. సామాజిక బాధ్యతను మరచి ప్రవర్తించడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామాల్లోని పరిసరాలు కాలుష్యంతో నిండిపోతున్నాయి. జలం, వాయు కలుషితమైన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. పంటలు దెబ్బతింటున్నాయి. పొలాల మధ్యలో గ్రానైట్ మిషన్లు ఏర్పాటు చేయడంతో పంటల సాగుపై ప్రభావం పడుతోంది. అంతేగాకుండా చెరువుల్లోకి గ్రానైట్ వ్యర్థాలు చేరడంతో చేప పిల్లలు చనిపోతున్నాయి. దీంతో మత్స్యకార్మికులు నష్టపోతున్నారు. పత్తాలేని పర్యావరణ నియంత్రణ బోర్డు గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ పరిశ్రమల నుంచి వెలువడ్డ డస్ట్ను ఎక్కడపడితే అక్కడ అన్లోడ్ చేస్తున్నప్పటికీ పర్యావరణ నియంత్రణ బోర్డు అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. పర్యావరణ నియంత్రణ బోర్డు అధికారులు రామగుండంకే పరిమితమవుతున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రాణాలకు ముప్పుగా పరిణమించిన డస్ట్(స్లర్రీ) నియంత్రణకు చర్యలు చేపట్టాల్సి అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. నేడు చికెన్ సెంటర్లు బంద్ కరీంనగర్/విద్యానగర్(కరీంనగర్): రాష్ట్ర చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ ఇచ్చిన బంద్ పిలుపునకు జిల్లా చికెన్ సెంటర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. కంపెనీలు మార్జిన్ ఇవ్వకుండా వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. మంగళవారం కరీంనగర్లో సంఘం అధ్యక్షుడు ఎండీ నవాబ్ మాట్లాడారు. మార్జిన్ ఇవ్వని కొన్ని కంపెనీలు తమ దౌర్జన్యాన్ని కొనసాగిస్తూ చిన్న వ్యాపారులను నష్టాల్లోకి నెడుతున్నాయన్నారు. ప్ర స్తుత పరిస్థితుల్లో లాభాలు రావడం భారంగా ఉండగా, వ్యాపారం కొనసాగించడమే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అన్యాయానికి ని రసనగా ఈనెల 1 నుంచి చికెన్ సరఫరా వ్యవస్థలో మార్పులు చేపడుతూ, కంపెనీలు విధించిన తక్కువ మార్జిన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ బంద్కు మ ద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. వ్యాపారుల సమస్యలను ప్రభుత్వం త క్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చికెన్ వ్యాపారులకు న్యాయం జ రిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎస్వీ రాంరెడ్డి, ఉపాధ్యక్షులు ఎండీ యూనస్, బాలాజీ, జాయింట్ సెక్రటరీ రహిం పాల్గొన్నారు. -
దళితుడిని చితకబాదిన ఎస్సై తీరుపై విచారణ
సైదాపూర్(హుస్నాబాద్): దళితుడిని చితకబాదిన ఎస్సై తీరుపై హుజూరాబాద్ ఏసీపీ మాధవి సోమవారం విచారణ చేపట్టారు. వివరాలు.. గతేడాది మే 8న సైదాపూర్– మొలంగూర్ రోడ్లోని సోమారం శివారులో కెనాల్ వద్ద అప్పటి ఎస్సై ఆగస్త్య భార్గవ్, సిబ్బంది డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. ఆ సమయంలో మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన బత్తుల మహేందర్ మొలంగూర్ నుంచి సైదాపూర్ వస్తుండగా పోలీసులు ఆపారు. దీంతో పోలీసులు, మహేందర్ మధ్య గొడవ జరిగింది. పోలీసులు అకారణంగా నడిరోడ్పై చితకబాదారని, కులంపేరుతో దూషించారని, ఎస్సై భార్గవ్పై చర్యలు తీసుకోవాలని మహేందర్ జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులు, మానవహక్కుల సంఘం, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశాడు. కోర్టును సైతం ఆశ్రయించాడు. ఈనేపథ్యంలో ఏసీపీ ఘటన స్థలాన్ని పరిశీలించారు. అప్పటి సాక్షులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా ఘటన జరిగి ఏడాది కావస్తున్నా ఉన్నతాధికారులు, కోర్టు, కమిషన్లకు చేసిన ఫిర్యాదులకు కదలిక వచ్చిందని, ఇప్పటికై నా పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితుడు కోరారు. -
ప్రభుత్వ భూముల్లో స్లర్రీ డంప్లు
ఆసిఫ్నగర్, ఎలగందుల, ఖాజీపూర్, శ్రీరాములపల్లి, కమాన్పూర్ గ్రామ శివారులే కాకుండా ఎక్కడ ఖాళీ కనిపిస్తే అక్కడ గ్రానైట్ చూర్ణం (స్లర్రీ) అన్లోడ్ చేస్తున్నారు. రోడ్ల పక్కన, ఖాళీ స్థలం అనేకాకుండా ప్రభుత్వ భూముల్లో సైతం డస్ట్ అన్లోడ్ చేస్తుండగా, సంబంధిత రెవెన్యూ అధికారులు కనీసం అభ్యంతరం తెలిపే పరిస్థితుల్లో లేకపోండం శోచనీయం. గ్రానైట్ మాఫియా రాజకీయ పలుకుబడికి అధికారులు ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. ఆ స్లర్రీ ఎండిన అనంతరం వెదజల్లుతున్న చూర్ణంతో అనేక మంది శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. చలికాలం అయితే దుమ్ముతో మరింత ఇబ్బంది ఏర్పడుతోంది. ఇక్కడి పరిసరాలన్నీ కాలుష్యమవుతున్నా పర్యావరణ అధికారులు మాత్రం మామూలుగా తీసుకొంటూ కన్నెత్తి చూడటం లేదు. -
ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలి
కరీంనగర్సిటీ: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని శాతవాహన వీసీ డా.ఉమేశ్కుమార్ అన్నారు. కరీంనగర్ ఎస్సారార్ డిగ్రీ కాలేజీ జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ రామకృష్ణ అధ్యక్షతన పర్యావరణ పునరుద్ధరణ, వ్యవస్థలపై వాతావరణ మార్పుల ప్రభావాలను అంచనా వేయడం, వన్యప్రాణుల సంరక్షణ వ్యూహాలు అంశంపై రెండురోజుల జాతీయ సదస్సు మంగళవారం ముగిసింది. ఈసందర్భంగా వీసీ హాజరై మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలని తాము యూనివర్సిటీలో చేస్తున్నటువంటి పర్యావరణ హిత కార్యక్రమాలను వివరించారు. జంతు శాస్త్ర విభాగాధిపతి జాతీయ సదస్సు కన్వీనర్ డాక్టర్ కిరణ్మయి, వైస్ ప్రిన్సిపాల్ టి.రాజయ్య తదితరులు పాల్గొన్నారు. సమగ్ర పరిశోధనలు జరగాలివివిధ రకాల ఆహార పదార్థాలను సేకరించి నిల్వ చేసే విషయాలపై సమగ్రమైన పరిశోధనలు జరగాలని శాతవాహన వీసీ ఉమేశ్కుమార్ అన్నారు. విశ్వవిద్యాలయంలో డా.రమాకాంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఆహార విశ్లేషణ పద్ధతులు అనే అంశంపై రెండు రోజుల సదస్సు మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా వీసీ హాజరై మాట్లాడారు. విద్యార్థులు పరిశోధన పద్ధతులను నేర్చుకోవడమే ప్రధాన లక్ష్యమని వీటికి సదస్సులు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఫుడ్ సైన్స్ విభాగాధిపతి, కార్యశాల కన్వీనర్ డాక్టర్ జోసఫ్రాజు, అధ్యాపకులు డాక్టర్ హరిత, మస్రత్, సాయిప్రియ, డాక్టర్ సరసిజ, డాక్టర్ రాజు, డాక్టర్ కిరణ్, డాక్టర్ మధు, డా.అజయ్, డాక్టర్ రమేశ్రెడ్డి, డాక్టర్ నరసింహాచారి, డాక్టర్ మల్లారెడ్డి, శ్రీవిద్య పాల్గొన్నారు. -
ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య
చిగురుమామిడి(హుస్నాబాద్): మండలంలోని చిన్నముల్కనూర్ గ్రామానికి చెందిన మెడవేని రాధిక (25) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై పృథ్వీధర్గౌడ్ తెలిపిన వివరాలు.. మండలంలోని సుందరగిరి గ్రామానికి చెందిన రాధికను 2021లో చిన్నముల్కనూర్కు చెందిన రమేశ్కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి మూడేళ్ల కూతురు మనస్విని ఉంది. అదనపు కట్నం తేవాలంటూ రాధికను తరుచూ భర్త రమేశ్, అత్త కమలవ్వ వేధింపులకు గురిచేసేవారు. వేధింపులు తట్టుకోలేక సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా చుట్టుపక్కల వారు గమనించి 108లో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ నగరపాలక సంస్థ 18వ డివిజన్ కొత్తపల్లికి చెందిన కొత్త శ్రావణ్ (26) మంగళవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్ హౌజ్ ఆఫీసర్, ట్రైనీ ఐపీఎస్ అధికారి తెలిపిన వివరాలు.. కొత్తపల్లికి చెందిన శ్రావణ్ ఐదునెలల క్రితం జరిగిన ప్రమాదంలో కాలు విరిగి ఇంటి వద్దే ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లగా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి లచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో పేర్కొన్నారు. కరీంనగర్క్రైం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. నగరంలోని రాంనగర్లో నివాసముంటున్న ఇస్లావత్ కిషన్(55) మేసీ్త్ర పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం తన సొంత గ్రామం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం జ్యోతిరాంనాయక్ తండాకు వెళ్లాడు. మంగళవారం సాయంత్రం కరీంనగర్కు వస్తుండగా, అల్గునూర్ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే వెనకనుంచి లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి అల్లుడు రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై కేసుతిమ్మాపూర్: పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఓ యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎల్ఎండీ ఎస్సై అన్వర్ తెలిపారు. బ్లూకోల్డ్స్ సిబ్బంది అనిల్, రఘురాంరెడ్డి అలుగునూర్ వద్ద మంగళవారం రాత్రి పెట్రోలింగ్ చేస్తున్నారు. అదే ఏరియాకు చెందిన చుంచు అంజి అనే వ్యక్తి చౌరస్తా వద్ద రాంగ్ రూట్ వస్తుండడంతో పోలీసులు ఆపారు. దీంతో యువకుడు రెచ్చిపోయి నా ఊరు.. నా ఇష్టం అంటూ పోలీసులతో వాదిస్తూ సిబ్బందితో గొడవకు దిగాడు. పోలీసుల ఫిర్యాదుమేరకు సదరు వ్యక్తిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సయ్యద్ అన్వర్ వివరించారు. అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు ● రోడ్డుపక్కకు దూసుకెళ్లి ఆగిన వైనం జ్యోతినగర్: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఒకటో డివిజన్ న్యూపీకే రామయ్య కాలనీ సమీపంలో మంగళవారం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. ఉదయం గోదావరిఖని నుంచి లింగాపూర్ మోడల్ స్కూల్కు విద్యార్థులను తీసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. అక్కడ విద్యార్థులను దించి గోదావరిఖని వైపు వస్తోంది. ఈక్రమంలో అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకు వెళ్లి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంపై ఆర్టీసీ అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. వైభవంగా గజ వాహన సేవఇల్లందకుంట : సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి గజ వాహన సేవ నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు శేషం వంశీధారాచార్యుల ఆధ్వర్యంలో ఉత్సవ మూర్తులను అలంకరించి గజ వాహన సేవ కార్యక్రమం చేపట్టారు. స్వామివారిని ఆలయ మాడ వీధుల మీదుగా ఊరేగించారు. భక్తుల రామ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
మంగళవారం శ్రీ 31 శ్రీ మార్చి శ్రీ 2026
నిబంధనలకు గంతలుసాక్షిప్రతినిధి,కరీంనగర్/కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న గ్రానైట్ కట్టింగ్, పాలీషింగ్ యూనిట్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. కోట్లల్లో గ్రానైట్ వ్యాపారాలు చేస్తూ పంచాయతీలకు పంగనామాలు పెడుతున్న పరిశ్రమలపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పలు పరిశ్రమలు పంచాయతీల అనుమతులు పొందకుండానే యథేచ్చగా అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్నాయి. కానరాని నిబంధనలు కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటైన గ్రానైట్ కట్టింగ్, పాలీిషింగ్ పరిశ్రమలు ఏ ఒక్కటి కూడా నిబంధనలకు లోబడి కార్యకలాపాలు కొనసాగించడం లేదు. పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం టీఎస్ పాస్ నిబంధనలు విస్మరించడంతో పాటు గ్రామ పంచాయతీలకు నిర్మాణ ఫీజు, బెట్టర్మెంట్ చార్జ్, డెవలప్మెంట్ చార్జీలు చెల్లించకుండానే అనేక పరిశ్రమలు కొనసాగుతున్నాయి. పరిశ్రమ కోసం నిర్మించే షెడ్లు/ భవనాలకు పంచాయతీ నుంచి ప్లాన్ అప్రూవల్ పొందకుండానే అనేక పరిశ్రమలు నడుస్తున్నాయి. ఈ పరిశ్రమలకు బ్యాంక్ రుణాలు, విద్యుత్ కనెక్షన్లు ఎలా వచ్చాయన్న సందేహాలపై కొంతమంది పంచాయతీ ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల పరిశ్రమ స్థాపించేటప్పుడు అందుకు సంబంధించిన పంచాయతీ అనుమతి లేకుండానే అనేక పరిశ్రమలు విద్యుత్ కనెక్షన్లు పొందడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నివాస ప్రాంతాలకు దూరంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. గ్రామ పంచాయతీకి చెల్లించాల్సిన వార్షిక ట్రేడ్ లైసెన్స్ ఫీజు, ఇతర పన్నులు సకాలంలో చెల్లించాలి. కానీ అవేవీ పట్టనట్లు పరిశ్రమల యజమానులు వ్యవహరిస్తుండటంతో పంచాయతీలు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నాయి. గ్రానైట్ పరిశ్రమల ఆగడాలపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.‘పాడి’ క్యాంప్ ఆఫీస్పైకి కోడిగుడ్లు.. టమాటాలుహుజూరాబాద్: పట్టణ శివారులోని కేసీ క్యాంప్లో ఉన్న ఎమ్మెల్యే పాడికౌశిక్రెడ్డి క్యాంపు కార్యాలయంపైకి సోమవారం యూత్ కాంగ్రెస్ నాయకులు కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. కడియం శ్రీహరికి తక్షణమే క్షమాపణ చెప్పాలన్నారు. యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు చల్లూరి రాహుల్, మండలాధ్యక్షుడు పంజాల అరవింద్ గౌడ్, టేకుల శ్రావణ్, బండ నవీన్, శనిగరపు తరుణ్ పాల్గొన్నారు. -
బాలికల ఆరోగ్య రక్షణకు భరోసా
కరీంనగర్: బాలికల ఆరోగ్య రక్షణకు భరోసా కల్పించేందుకు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు డీఎంహెచ్వో వెంకటరమణ పేర్కొన్నారు. నగరంలోని మోతాజ్ఖానా అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో హెచ్పీవీ వ్యాక్సినేషన్ నిర్వహించబడుతుందని తెలిపారు. వ్యాక్సిన్పై ఎలాంటి అపోహలు, సందేహాలు ఉన్నా, సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి సరైన సమాచారం పొందవచ్చని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ సాజిదా సూచించారు. పీవోఎంహెచ్ఎన్ సనా జవేరియా, వైద్యాధికారి ఇమ్రాన్ఖాన్ పాల్గొన్నారు. పుకార్లు నమ్మొద్దుకరీంనగర్ అర్బన్: వంట గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని, సరఫరా సాధారణంగానే ఉందని జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని, అధికారిక మార్గాల్లో గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. భారత్ గ్యాస్ 1800224344, ఇండెన్ గ్యాస్ 7588888824, హెచ్పీ గ్యాస్ 9222201122 వాట్సాప్ నంబర్ల ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు. -
మహాత్మా.. అధికారుల మనసు మార్చవా
మహాత్మా.. నా పేరు నేరేడుకొమ్మ వేదశ్రీ, కరీంనగర్ రూరల్ మండలంలోని దుర్శేడ్లో సర్వే నంబర్ 98లో 8.24ఎకరాల భూమి ఉంది. సదరు భూమి నుంచి 1.17 ఎకరాల భూమిని ఎస్సారెస్పీ కెనాల్ కింద పోయింది. భూమి ఎవరి పేరున ఎంతెంత పోయిందో చూసి తొలగించాల్సి ఉండగా అధికారులు అలా చేయలేదు. దీంతో కొందరు మా భూమిని ఆక్రమించుకుని అమ్ముకుంటూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సమస్య పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను కలిస్తే పట్టించుకోవడం లేదు. జర మీరైనా అధికారుల మనసు మార్చరూ అంటూ కలెక్టరేట్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. -
ఆలకించి.. ఆదేశించి
● ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ ● స్వీకరించిన కలెక్టర్ చిత్రామిశ్రా ● పరిష్కారానికి ఆదేశంకరీంనగర్ అర్బన్: ప్రజావాణి అర్జీలపై విచారణ జరిపి, సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి వస్తారని, ఫిర్యాదులపై ఆయాశాఖల అధికారులు సానుకూలంగా స్పందించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. మొత్తంగా ప్రజావాణికి 225 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు. అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మికిరణ్, ఆర్డీవో కె.మహేశ్వర్, డీఆర్డీవో శ్రీధర్ అర్జీలను స్వీకరించారు.ప్రజావాణికి వచ్చిన అర్జీలు: 225 మున్సిపల్ కార్పొరేషన్: 50 తిమ్మాపూర్ తహసీల్దార్: 15 కరీంనగర్ రూరల్ తహసీల్దార్: 11 తహసీల్దార్ కొత్తపల్లి: 11 డీపీవో: 10, ఆర్డీవో కరీంనగర్: 09 ఆర్డీవో హుజూరాబాద్: 08 -
ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి
కరీంనగర్రూరల్: రాంగ్రూట్లో వస్తున్న ద్విచక్రవాహనదారుడు సైకిల్పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి కథనం మేరకు దుర్శేడ్కు చెందిన మేడ హన్మాండ్లు(63) గోపాల్పూర్లోని వైన్స్లో పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి 9.30గంటలకు పని ముగించుకుని సైకిల్పై దుర్శేడ్కు వెళ్తుండగా రాంగ్రూట్లో వచ్చిన ద్విచక్రవాహనదారుడు బలంగా ఢీకొట్టగా రోడ్డుపై కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన హన్మాండ్లును అంబులెన్స్లో ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతుడి కుమారుడు మహేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా ద్విచక్రవాహనదారుడిని చత్తీస్ఘడ్ గడ్చిరోల్కు చెందిన విలాస్బీమయ్యగా గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడిని త్వరలో పట్టుకుని చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. నాణ్యతలోపంపై ఫుడ్సేఫ్టీ కొరడాకరీంనగర్ అర్బన్: కుళ్లిన గుడ్లు.. ఎగ్పఫ్ల నుంచి దుర్వాసన, అపరిశుభ్ర వాతావరణంలో బేకరీ నిర్వహణపై ఫుడ్సేఫ్టీ అధికారులు కొ రడా ఝుళిపించారు. నగరంలోని రేకుర్తిలోని గణేశ్ బెంగళూరు బేకరీలో తనిఖీలు నిర్వహించారు. నాణ్యత లోపాలను గుర్తించి లైసెన్స్ను తాత్కలికంగా రద్దు చేశారు. ఫ్రిజ్లో నిల్వ చేసిన షుగర్ సిరప్, క్రీమ్లో పురుగులు, నిల్వ ప్రాంతంలో 14 ట్రేలు పగిలిన గుడ్లు ఉన్నట్లు గుర్తించగా పగిలిన గుడ్లతో తయారు చేసిన సుమారు రూ.7వేల విలువైన కేకులు బేకరీలో ఉన్నట్లు గుర్తించామని ఫుడ్ సేఫ్టీ అధికారులు వివరించారు. పాడైన గుడ్లు, కేకులను అక్కడికక్కడే తొలగించి పారవేశారు. నిబంధనల ప్రకారం వ్యవహరించే వరకు బేకరీ నిర్వహణకు అనుమతి లేదని వివరించారు. రగ్బీ రన్నరప్ కరీంనగర్కరీంనగర్స్పోర్ట్స్: తెలంగాణ అండర్–12 మినీ సబ్ జూనియర్ ఇంటర్స్కూల్ రగ్బీ టోర్నమెంట్లో కరీంనగర్ జిల్లా రన్నరప్ సాధించింది. హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాజట్టు ద్వితీయ స్థానాన్ని కై వసం చేసుకుంది. జట్టు క్రీడాకారులను జిల్లా క్రీడాశాఖ అధికారి వి.శ్రీనివాస్ గౌడ్, ఒలింపిక్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్ధన్రెడ్డి, జిల్లా రగ్బీ సంఘం కార్యదర్శి శివకృష్ణ అభినందించారు. -
సృజనాత్మకత మనిషి మనుగడకు మూలాధారం
● డాక్టర్ దారం రఘురామన్ కరీంనగర్కల్చరల్: ఎన్ని కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఎదురైనా మనిషి మనుగడను సృజనాత్మకతే నిలబెడుతుందని ప్రముఖ వైద్యుడు డాక్టర్ దారం రఘురామన్ అన్నారు. సోమవారం కేంద్ర సాహిత్య అకడమీ అనువాద పురస్కార గ్రహీత వారాల ఆనంద్ తెలుగులో రచించి తానే స్వయంగా ఇంగ్లి్ష్లోకి అనువదించిన ‘మానేరు తీరం’ ద్విభాషా కవితా సంకలనాన్ని ఆవిష్కరించారు. డాక్టర్ వుడుత చంద్రశేఖర్, సీనియర్ జర్నలిస్టు రావికంటి శ్రీనివాస్, కె.ఎస్.అనంతాచార్య, పి.ఎస్.రవీంద్ర, సాహితీవేత్తలు గాజుల రవీందర్, మాడిశెట్టి గోపాల్, సంకేపల్లి నాగేంద్రశర్మ, మెట్టు సుగేందర్, శ్రీపతి, పొయెట్రీ ఫోరం నిర్వాహకులు ఇందిరా రాణి, చందన పాల్గొన్నారు. విద్యార్థులను చీపురుతో కొట్టిన హాస్టల్ కుకింగ్ హెల్పర్జగిత్యాల: జగిత్యాల జిల్లాకేంద్రంలోని ఎస్టీ హాస్టల్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. హాస్టల్ కుకింగ్ హెల్పర్ శ్రీనివాస్ నిత్యం మద్యం తాగి వస్తూ విధులు నిర్వహిస్తున్నాడు. విద్యార్థులను ప్రతిరోజు చీపుర్లతో కొడుతూ వేధిస్తున్నాడు. విషయాన్ని కొందరు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. వార్డెన్ మధుసూదన్ పలుమార్లు మందలించారు. అయినా శ్రీనివాస్లో మార్పు రాలేదు. విషయం ఉన్నతాధికారుల దృష్టికెళ్లడంతో ఎస్సీ సంక్షేమ అధికారి రాజ్కుమార్ ఆధ్వర్యంలో సోమవారం విచారణ చేపట్టారు. తమను కొడుతూ.. వేధిస్తున్నట్లు విద్యార్థులు తెలపడంతో నివేదికను కలెక్టర్కు అందించారు. ఆయన వెంటనే శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాస్ ఇటీవలే డిప్యూటేషన్పై తాళ్లధర్మారం నుంచి ఇక్కడికి వచ్చాడు. -
ప్రతిభకు పరీక్ష
● ఉమ్మడి జిల్లాలో 20 పాఠశాలల ఎంపిక ● 3వ తరగతి పిల్లల అభ్యసన సామర్థ్యాల అంచనా ● నేటితో సర్వే పూర్తికరీంనగర్టౌన్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యావిధానం 2020లో భాగంగా ఢిల్లీలోని పరఖ్ (ఫర్మార్మెన్స్ ఎసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవెలప్మెంట్) ఎన్సీ ఈఆర్టీ వారు ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ) సర్వే నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 20 పాఠశాలలను ఎంపిక చేశారు. 3వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో అభ్యసన, సామర్థ్యాల పరిశీలన, అవగాహనా నైపుణ్యాలను ఎలా ఉన్నాయి అనే అంశంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ సర్వే మంగళవారంతో ముగియనుంది. కరీంనగర్ జిల్లాలో 8 పాఠశాలలు, రాజన్న సిరిసిల్లలో 3, పెద్దపల్లిలో 3, జగిత్యాల జిల్లాలో 6 పాఠశాలలు ఎంపిక చేశారు. ప్రాథమిక స్థాయిలో విద్యా ప్రమాణాలు పడిపోతున్న పరిస్థితుల్లో ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ (ఎఫ్ఎల్ఎన్)లో భాగంగా జాతీయ స్థాయిలో 3వ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతి పాఠశాల నుంచి మూడో తరగతికి చెందిన 12 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉంటుంది. కరీంనగర్లోని ఎల్ఎండీలో గల డైట్ కళాశాలకు చెందిన డీఎడ్, బీఎడ్ అభ్యర్థులను ఇన్వెస్టిగేటర్లుగా నియమించారు. కోర్సు కోఆర్డినేటర్, ఏఎంఓ కర్ర అశోక్ రెడ్డి, డైట్ ప్రిన్సిపల్ మొండయ్య ఆధ్వర్యంలో సర్వే బృందం శిక్షణ పూర్తి చేశారు. వివరాలను కేంద్ర, రాష్ట్ర విద్యాశాఖలకు అందించనున్నారు. -
విలీన.. నగర పంచాయితీ
● రూ.50 కోట్ల టెండర్లపై పీటముడి ● పాత పనుల స్థానంలో కొత్త ప్రతిపాదనలు ● అడ్డూ అదుపు లేని అక్రమ నిర్మాణాలు ● రూ.312.42 కోట్లతో వార్షిక బడ్జెట్ ● నేడు బల్దియా బడ్జెట్, కౌన్సిల్ సమావేశంకరీంనగర్ కార్పొరేషన్ : నగరపాలక సంస్థ నూతన పాలకవర్గంలో విలీన.. నగర.. పంచాయితీ ముదురుతోంది. రూ.50 కోట్లతో చేపట్టిన 87 పనుల టెండర్ను రద్దు చేయడంపై విలీన డివిజన్ల కార్పొరేటర్లు, నగర కార్పొరేటర్ల నడుమ పంచాయితీ మొదలైంది. నగరంలో అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కుక్కలు, కోతుల సమస్యలు నగరవాసులకు తీవ్రమవుతున్నాయి. నగరపాలకసంస్థ పాలకవర్గ ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారి మంగళవారం కౌన్సిల్ భేటీ అవుతోంది. ఉదయం బడ్జెట్ సమావేశం, మధ్యాహ్నం సాధారణ సర్వసభ్య సమావేశం నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన జరగనుంది. రూ.50 కోట్లపై పీఠముడి ఎన్నికలకు ముందు నగరానికి మంజూరైన రూ.50 కోట్ల నిధులపై రగడ కొనసాగుతోంది. విలీన ప్రాంతాలకు ప్రాధాన్యమిస్తూ నగరంలో పెట్టిన 87 పనులను రద్దు చేయడం, కొత్తగా ప్రతిపాదనలు సిద్ధం చేయడంపై కార్పొరేటర్లు రెండుగా విడిపోయారు. కొన్ని డివిజన్లకే పరిమితమైన పనులను రద్దు చేసి, నగరంలోని 66 డివిజన్లకు కేటాయించాలని మెజార్టీ కార్పొరేటర్లు నిర్ణయించారు. 87 పనుల్లో ఐదారు మినహా, మిగతా పనులు విలీన డివిజన్లకు కేటాయించినవే. వీటికి టెండర్ ప్రక్రియ పూర్తయినప్పటికీ, పాలకవర్గం వచ్చాక రద్దు చేశారు. కొత్త కార్పొరేటర్ల ప్రతిపాదనల మేరకు విలీన ప్రాంతాలతో పాటు, నగరంలోని అన్ని డివిజన్లలో పనులు చేపట్టేందుకు నిర్ణయించారు. ఇప్పటికే డివిజన్లవారీగా ఆయా కార్పొరేటర్ల నుంచి కొత్త పనుల ప్రతిపాదనలు తీసుకున్నట్లు సమాచారం. ఈ కొత్త పనుల ప్రతిపాదనలను మంగళవారం నాటి సమావేశంలో ఆమోదింపచేసేందుకు రంగం సిద్ధమైంది. పాత పనులు రద్దు చేయడం వల్ల తాము నష్టపోతామని విలీన డివిజన్ల కార్పొరేటర్లు అంటున్నారు. రూ.50 కోట్లతో 87 పనులకు పరిపాలనామంజూరు ఇ స్తూ సీడీఎంఏ జీఓ ఇచ్చినందున, పాత పనుల రద్దు చేసి కొత్త పనులు పెట్టడం అంత సులువు కాదని మరికొంతమంది వాదిస్తున్నారు. ఏదేమైనా రూ.50 కోట్ల టెండర్ల రద్దు పీఠముడి వీడేదెలాగ అనే ఆసక్తి నగరంలో నెలకొంది. అక్రమ నిర్మాణాలకు అడ్డేది నగరంలో అక్రమ నిర్మాణాల జోరు కొనసాగుతోంది. పట్టణ ప్రణాళిక అధికారుల కుమ్మక్కు కారణంగానే ఈ అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయని పలువురు కార్పొరేటర్లు ఫిర్యాదు చేస్తున్నారు. అక్ర మ నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తున్నా, అధికారులు చర్యలుతీసుకోవడం లేదంటున్నారు. అక్రమ నిర్మాణాల కారణంగా నగరపాలకసంస్థ లక్షలాది రూపాయల ఆదాయం కోల్పోతుందంటున్నారు. కుక్కలు..కోతులు నగరంలో కుక్కలు, కోతుల బెడద రోజురోజుకు తీవ్రమవుతోంది. నగరవ్యాప్తంగా అన్ని కాలనీలు ఈ సమస్యను ఎదుర్కొంటుంటండడం గమనార్హం. కుక్కలు, కోతులు గుంపులుగా తిరుగుతూ దాడులు చేస్తుండడం వల్ల ప్రజలు గాయపడుతున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. కోతులను పట్టే కార్యక్రమాన్ని ఏజెన్సీకి అప్పగించి, చేపడుతున్నప్పటికి వేగవంతం చేయాల్సి ఉంది. ఇక కుక్కల బెడద మాత్రం నివారించలేని పరిస్థితిగా మారింది. లైట్లు లేక చీకట్లు...తాగునీటికి ఇక్కట్లు నగరంలో వీధిదీపాల సమస్య అధికంగా ఉంది. నగరంలోని ప్రధాన రహదారులతో పాటు, కాలనీల్లో వీధిదీపాలు వెలగడం లేదు. స్మార్ట్ స్ట్రీట్లైట్లు ఉన్న ప్రాంతాలు కూడా చీకటి మయంగా ఉంటున్నాయి. వేసవిలో తాగునీటి సమస్యలు పలు కాలనీలను వెంటాడుతున్నాయి. ప్రతిరోజు తా గునీటి సరఫరా నుంచి ఇప్పటికే రోజు విడిచి రోజు నీటి సరఫరా జరుగుతోంది. చాలా కాలనీల్లో ఫ్రెషర్ లేక, లీకేజీల కారణంగా తాగునీటి సమస్య ముదురుతోంది. రూ.312.42 కోట్ల బడ్జెట్ నగరపాలకసంస్థ 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.312.42 కోట్ల అంచనాలతో బడ్జెట్కు రూపకల్పన చేసింది. కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే బడ్జెట్లు ప్రవేశపెట్టడం, అందులో ప్రత్యేకంగా నగరాలకు నిధులు కేటాయించనప్పటికి, నిధులు వస్తాయని బ డ్జెట్లో రూపొందించడం చర్చనీయాంశంగా మారింది. ఏ లెక్కన ఆ నిధులు వస్తాయని అధికారులు అంచనా వేసారో కార్పొరేటర్లు పెదవివిరుస్తున్నారు. కాగా ఉదయం 11 గంటలకు నగరపాలకసంస్థ సమావేశ మందిరంలో బడ్జెట్ సమావేశం, మధ్యాహ్నం 2 గంటలకు సాధారణ సర్వసభ్య సమావేశం మేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన జరగనుంది. సమావేశంలో 11 ఏజెండా అంశాలు రూపొందించగా, టేబుల్ ఏజెండాగా మరికొన్ని అంశాలు కౌన్సిల్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
దుబాయిలో ఉపాధి అవకాశాలు
● ఫ్రీ వీసా.. ఫ్రీ విమాన టికెట్లు ● 2, 3 తేదీల్లో వేములవాడలో ఇంటర్వ్యూలు ● మహమ్మద్ రఫీ, ఎండీ, ఏఆర్ఆర్ మ్యాన్పవర్ కన్సల్టెన్సీ సిరిసిల్ల: దుబాయ్లోని పలు కంపెనీలు ఉచిత వీసా, విమాన టిక్కెట్లు సమకూర్చుతూ ఉపాధి కల్పించేందుకు ముందుకొస్తున్నాయి. ఈ విషయాన్ని వేములవాడకు చెందిన కేంద్ర ప్రభుత్వ ఆమోదిత ఏఆర్ఆర్(మ్యాన్పవర్ కన్సల్టెన్సీ) సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ రఫీ సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. దుబాయ్ వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్న యువకులకు ఉచితంగా వీసా, విమాన టిక్కెట్ పొందే అవకాశం ఉందన్నారు. 2, 3న ఇంటర్వ్యూలు దుబాయ్(యూఏఈ)లోని క్యాటరింగ్ కంపెనీలో పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులు వేములవాడలోని ఏఆర్ఆర్ మ్యాన్పవర్ కన్సల్టెన్సీ ఆఫీస్లో ఏప్రిల్ 2, 3 తేదీల్లో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని తెలిపారు. భోజన వసతి కల్పించి నెలకు 950 దుబాయ్ దిరమ్స్(రూ.25వేలు) జీతం ఉంటుందని తెలిపారు. ఉచిత నివాసం, రవాణా, రోజుకు 9 గంటలు పని ఉంటుందని తెలిపారు. 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు, ఈసీఎన్ఆర్ పాస్పోర్టు ఉన్న వారు మాత్రమే అర్హులని వివరించారు. ఆసక్తి గల వారు 95505 60910/95506 20505/83411 65239, 96666 22890/ 70754 62519 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
ఆర్టీసీ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన
కరీంనగర్టౌన్: ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం కరీంనగర్–2వ డివో ఎదుట ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర జేఏసీ వైస్ చైర్మన్ థామస్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఎలక్ట్రికల్ బస్సులను ఉపసంహరించుకోవాలని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో వినీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. యూనియన్లను పునరుద్ధరించాలని అవుట్సోర్సింగ్ నియామకాలు రద్దు చేయాలన్నారు. రెగ్యులర్ పద్ధతిలో నియామకాలు చేపట్టాలన్నారు. యూనియన్ నాయకులు సమ్మయ్య, ఎంపీ రెడ్డి, సంపత్ రెడ్డి, శంకర్, పుల్లయ్య ఉన్నారు. -
అవగాహనతోనే రోడ్డు ప్రమాదాలకు చెక్
● సీపీ గౌస్ ఆలంకరీంనగర్క్రైం: రోడ్డు నిబంధనలు పాటించి ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చని సీపీ గౌస్ ఆలం సూచించారు. సోమవారం కమిషనరేట్లోని అస్త్ర కన్వెన్షన్ హాల్లో ఆటో డ్రైవర్లు, రాపిడో కెప్టెన్ల కోసం ఏర్పాటు చేసిన ఆరైవ్– ఆలైవ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గతేడాది కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలతో 200 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. హెల్మెట్, సీట్బెల్ట్ ధరించకపోవడం, అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి అజాగ్రత్తల వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. ఒకవ్యక్తి మరణం ఆ కుటుంబం మొత్తాన్ని వీధిన పడేస్తుందని గుర్తు చేశారు. కరీంనగర్– హైదరాబాద్, వరంగల్– జగిత్యాల, సిరిసిల్ల, చొప్పదండి వెళ్లే రహదారుల్లో ‘బ్లాక్ స్పాట్లను’ గుర్తించామని, అక్కడ ప్రత్యేక నిఘాతో పాటు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హుజూరాబాద్ పరిధిలోని లింగాపూర్ క్రాస్రోడ్డు వద్ద ఇప్పటికే సైన్ బోర్డులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి, సీఐలు సంజీవ్, కుమారస్వామి, కిరణ్ కుమార్, రాపిడో అసోసియేట్ మేనేజర్ దుర్గారావు పాల్గొన్నారు. -
నమ్ముకున్నోళ్లకు జీవన్రెడ్డి చేసిందేమిటి?
కరీంనగర్ కార్పొరేషన్: తనను నమ్ముకున్నోళ్లకు మాజీ మంత్రి టి.జీవన్రెడ్డి చేసిందేమిటని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం నిలదీశారు. కాంగ్రెస్ అంటే కేవలం ఆయన కుటుంబమేనా, కార్యకర్తల ఎదుగుదలకు ఏనాడైనా ప్రయత్నించారా అంటూ మండిపడ్డారు. ఆదివారం నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో మాట్లడుతూ సీఎం రేవంత్రెడ్డిపై జీవన్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 42 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో కాంగ్రెస్ 14 సార్లు ఎమ్మెల్యే టికెట్, మూడు సార్లు ఎంపీ టికెట్ ఇవ్వడంతో పాటు రెండు సార్లు మంత్రిని చేసిందన్నారు. కాని జీవన్రెడ్డి కాంగ్రెస్కు చేసిందేమిటన్నారు. తనను నమ్ముకున్న పార్టీ కార్యకర్తలకు ఎప్పుడైనా జీవన్ రెడ్డి నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు ఇప్పించారా అన్నారు. రాజకీయ జీవితంలో తనవెంట ఉన్న బీసీలకు, ఎస్సీలకు, వైశ్యులకు ఎవరికై నా ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారో చెప్పాలన్నారు. 2018లో తనకు టికెట్ అవకాశం వస్తే, రాజీనామా చేస్తానని బెదిరించి అడ్డుకొన్నది జీవన్రెడ్డి అని ఆరోపించారు. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా జీవన్రెడ్డికే పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందన్నారు. అవకాశం వస్తే తన తమ్ముళ్లకు పదవులు ఇప్పించుకొన్నారని విమర్శించారు. రేవంత్రెడ్డి వల్లనే కాంగ్రెస్ వేవ్ వచ్చిందని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు సముద్రాల అజయ్, గడ్డం నాగరాజు, సుద్దాల లక్ష్మణ్, ఆవాల లత, తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అంటే ఆయన కుటుంబమేనా? పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం ఫైర్ -
గొర్లకాపరులను మింగిన చెరువు
కోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గొర్రెలకు స్నానం చేయించేందుకు చెరువులోకి దిగిన ఇద్దరు గొర్లకాపరులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. ధర్మారం గ్రామానికి చెందిన గొర్లకాపరులు ముడికె లక్ష్మీరాజం(65), కుమ్మం మొండయ్య(55) రోజు మాదిరిగానే తమ గొర్రెలమందతో కలిసి గ్రామ శివారులోని పెద్దచెరువు వద్దకు వెళ్లారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో గొర్రెలను నీటిలోకి దింపి స్నానం చేయిస్తున్నారు. ఈక్రమంలో లక్ష్మీరాజం చెరువులో జారిపడి బురదలో ఇరుక్కుపోయాడు. ఈత వచ్చినా బురదలో ఈదలేక ఇబ్బందులు పడుతున్నాడు. గమనించిన మొండయ్య వెంటనే చెరువులో దిగి లక్ష్మీరాజంను కాపాడే ప్రయత్నం చేశాడు, లక్ష్మీరాజం మొండయ్య మెడపై గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరు బురదలోకి జారి గల్లంతయ్యారు. ఈతగాళ్లసాయంతో వెలికితీత ఇద్దరు గొర్లకాపరులు నీటిలోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో గల్లంతుకాగా ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. లక్ష్మీరాజంకు భార్య లక్ష్మి, కుమారుడు పర్శరాములు, కూతురు జ్యోతి ఉన్నారు. మొండయ్యకు భర్యా మంగవ్వ, కుమారులు ప్రశాంత్, వినయ్, వంశీ ఉన్నారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కోనరావుపేట ఎస్సై ప్రశాంత్రెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మీరాజం, మొండయ్య మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు కోనరావుపేట మండలం ధర్మారంలో విషాదం -
ష్.. గప్చుప్!
కరీంనగర్ కార్పొరేషన్: ప్రభుత్వశాఖల్లోని అతి ప్రధాన ఉద్యోగ ‘వ్యవస్థ’ అది. జిల్లా అధికార యంత్రాంగాన్నే శాసించే సంఘం నేతల కనుసన్నల్లో నడుస్తున్న ‘వ్యాపారం’ అది. కేవలం ఆదాయం తప్ప ‘పన్నుల’ ఖర్చు లేని దందా అది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాల్సిన రెవెన్యూశాఖ ఉద్యోగసంఘాలే బల్దియా ఆదాయానికి గండికొడుతున్నా రు. కలెక్టరేట్ ఎదురుగా ఉన్న రెవెన్యూ దుకాణ సముదాయ ఆస్తి పన్ను బకాయిలపై కథనం. ఏటా అదే తంతు... కలెక్టరేట్ ఎదురుగా ఉన్న రెవెన్యూ దుకాణ సముదా యానికి సంబంధించిన రూ.లక్షల ఆస్తి పన్ను బకా యిలు చెల్లించకపోవడం ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతల ఆధ్వర్యంలో నడుస్తున్న దుకాణసముదాయం, ఫంక్షన్హాల్, క్లబ్లు ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోవడం చర్చనీయాంశంగా మారింది. సంవత్సరాలు గా రూ.లక్షల ఆిస్తిపన్ను చెల్లించకుండా, ఏటా ఏదో ఒక సాకు చెప్పి గడుపుతుండడం అలవాటుగా మా రింది. గతేడాది కూడా నగరపాలకసంస్థ ఆస్తి పన్ను వసూళ్లలో భాగంగా రెవెన్యూ దుకాణసముదాయాలపై ఒత్తిడి పెంచింది. కాని కంటితుడుపుగా రూ.2 లక్షలు చెల్లించి ఆ ఆర్థిక సంవత్సరాన్ని దాటవేసిన ట్లు సమాచారం. ఈ ఏడాది రూ.75 లక్షలు చెల్లించా ల్సి ఉండగా, కొంతమేర చెల్లిస్తామని ఉన్నతాధికారులకు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నట్లు సమాచారం. కిరాయిదారుల నుంచి వసూళ్లు ఆస్తిపన్ను లక్షల రూపాయల్లో బకాయి పడ్డ రెవెన్యూ దుకాణసముదాయంపై నగరపాలకసంస్థ చర్యలకు దిగితే, కిరాయదారులే ఇబ్బంది పడుతుండడం సమస్యగా మారింది. దుకాణసముదాయాలను అద్దెకివ్వగా, క్రమం తప్పకుండా అద్దె చెల్లిస్తూ వస్తున్నారు.అద్దె వసూలు చేస్తున్నా, ఆ షాప్లకు సంబంధించిన ఆస్తి పన్ను మాత్రం నిర్వాహకులు చెల్లించడం లేదు. దీంతో గతేడాది దుకాణాలకు బల్దియా అధికారులు తాళం వేశారు. కాని దుకాణాలు మూసివేయడం వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, పెద్దలకు ఎలాంటి ఇబ్బంది లేదని కిరాయిదారులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి నెలకొంది. కమర్షియల్ ఉంటే మినహాయింపు లేదు ఆస్తి పన్ను నుంచి తమకు మినహాయింపు ఉంటుందని చెబుతున్నా, వాస్తవ పరిస్థితిలో అలాంటిది ఉండకపోవచ్చని ఉద్యోగ సంఘాల సీనియర్ నేతలే చెబుతున్నారు. సొసైటీ భవనాలు, సముదాయాలను వాణిజ్యపరంగా వినియోగించుకొంటే పన్ను మినహాయింపు ఉండదంటున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని నగరపాలకసంస్థ అధికారులు చెబుతున్నారు. నోరెత్తిన అధికారులు పలుకుబడి కలిగిన ఉద్యోగసంఘాల నేతల ఆధ్వర్యంలో నడుస్తున్న దుకాణ సముదాయాల బకాయిలపై నగరపాలకసంస్థ అధికారులు నోరెత్తడం లేదు. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించకపోవడంపై మీడియాలో కథనాలు వస్తుండడంపై ఉన్నతస్థాయిలో బల్దియా అధికారులపై ఒత్తిడి పెంచినట్లు తెలిసింది. బకాయిల వివరాలు చెప్పడం వల్లే కథనాలు వస్తున్నాయని, నోరెత్తవద్దంటూ వచ్చిన మౌఖిక ఆదేశాల మేరకు బల్దియా అధికారులు మీడియా ప్రతినిధుల ఫోన్లకు స్పందించడం మానేశారు. -
ఇష్టారీతిన అటవీ ఆక్రమణలు?
రుద్రంగి: రుద్రంగి ప్రాంతంలో అటవీ ఆక్రమణలు జోరుగా సాగుతున్నాయి. ఫారెస్ట్ అధికారుల అండదండలతోనే ఇదంతా జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పదుల సంఖ్యలో జేసీబీలు, ట్రాక్టర్బ్లేడు బండ్లు పెట్టి ఇష్టం వచ్చినట్లు అటవీని ధ్వంసం చేస్తున్నారు. ఇదంతా అధికారుల కళ్ల ఎదుటే జరుగుతున్నా పట్టించుకోకుండా ఫారెస్టు అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ఫారెస్టు అధికారులు నిద్రమత్తు వీడి విలువైన అటవీ సంపదను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై ఫారెస్టు బీట్ ఆఫీసర్ బాలకృష్ణను వివరణ కోరగా ఫారెస్టును ఆక్రమిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం శూన్యం గతంలో రుద్రంగి మండలంలో స్థానిక అధికారుల అండదండలతో ఇష్టానుసారంగా ఫారెస్టు ఆక్రమణలపై మానాల గ్రామస్తులు కలెక్టరేట్ వరకు వెళ్లి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేదని మానాల గ్రామస్తులతో పాటు రుద్రంగి మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. చోద్యం చూస్తున్న అటవీ అధికారులు ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం శూన్యం -
ఘనంగా శ్రీరామ పట్టాభిషేకం
కోనరావుపేట: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాయమైన మామిడిపల్లి శ్రీసీతారామస్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీరాముడి పట్టాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అధికారులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించగా యాజ్ఞచార్యులు మరిగంటి రామగోపాలచార్యులు, అర్చకులు రంగనాయకుల శ్రీనివాస్, తిరునహరి కృష్ణ, లక్ష్మణ్ అలంకరించారు. అనంతరం ఆలయ ఆవరణలో ముస్తాబు చేసిన వేదికలో శ్రీ సీతారామస్వామి ఉత్సవ విగ్రహాలను ఆసీనులు చేశారు. హనుమాన్ దీక్షాపరులు, భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పన్నాల లక్ష్మారెడ్డి, ఉపసర్పంచ్ కాసర్ల పవిత్ర, వార్డుసభ్యులు, భక్తులు పాల్గొన్నారు. -
ఫోర్టిఫైడ్ రైస్ బంద్
● పేదలకు పోషకాహారం అందేనా ? ● రైస్మిల్లుల్లో వృథాగానే మిషనరీలు ● నిలిచిన పోర్టిఫైడ్ రైస్ ఉత్పత్తులుముస్తాబాద్(సిరిసిల్ల): ప్రభుత్వం అందించే రేషన్ బియ్యంలో పోషకాలు మాయమయ్యాయి. ఫోర్టిఫైడ్ రైస్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం విరామం ప్రకటించడంతో పేదలకు బియ్యం ద్వారా పోషకాలు అందడం లేవు. చౌకధరల దుకాణాల ద్వారా ప్రతీ నెల పంపిణీ చేసే రేషన్ బియ్యంలో ఇప్పటి వరకు ఫోర్టిఫైడ్ రైస్ కలిపేవారు. ప్రతీ క్వింటాలు బియ్యానికి కిలో ఫోర్టిఫైడ్ రైస్ను కలిపి చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేశారు. తాత్కాలికంగా ఫోర్టిఫైడ్ రైస్ ఉత్పత్తిని ఆపేసింది. రైస్మిల్లుల్లో మార్చి 1 నుంచి ఫోర్టిఫైడ్ రైస్ లేకుండా సాధారణ బియ్యమే సంచుల్లో నింపాలని కేంద్ర ప్రభుత్వ అధికారులు రైస్మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఫోర్టిఫైడ్ రైస్లో ఏముంటుంది ? సూక్ష్మపోషకాల లోపాలను అరికట్టేందుకు పోషకాలు అధికంగా ఉండే ధాన్యాలను సాధారణ బియ్యంలో కలిపి అందిస్తారు. ఇందులో ఇనుము, ఫోలిక్ యాసిడ్, మిటమిన్ బీ12 ఉంటాయి. ఫోర్టిఫైడ్ రైస్ను ఎక్స్ట్రూషన్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేస్తారు. రుచిలో, బియ్యం ఉడకడంలో ఎలాంటి తేడాలు ఉండవు. ఫోర్టిఫైడ్ రైస్ను కడిగిన, వండిన పోషకాలు దెబ్బతినవు. ఫోర్టిఫైడ్ రైస్ను తినడం ద్వారా పిల్లలు, గర్భిణీలలో, బాలింతలలో రక్తహీనత ఉండదు. ఎదుగుదల లోపం లేకుండా, విటమిన్ లోపాలను అరికడుతుంది. మిల్లర్ల పరేషాన్ పోషకాలతో కూడిన బియ్యం కస్టమ్ మిల్లింగ్ రైస్లో కలిపేందుకు రైస్మిల్లర్లు ప్రత్యేక మిషన్లను బిగించారు. ఒక్కో మిల్లులో రూ.10 నుంచి 15లక్షలు వెచ్చించి ఫోర్టిఫైడ్ బియ్యం కలిపే యంత్రాలను తీసుకొచ్చారు. ప్రతీ క్వింటాలు బియ్యానికి కిలో ఫోర్టిఫైడ్ బియ్యం కలిపేలా యంత్రాలను సిద్ధం చేశారు. గతంలో అధికారుల ఆదేశాలతో జిల్లాలో 79 రైస్మిల్లుల్లో ఫోర్టిఫైడ్ కోసం ప్రత్యేక యంత్రాలను బిగించుకున్నారు. ఉమ్మడి జిల్లాలో ఫోర్టిఫైడ్ రైస్ ఉత్పత్తి కోసమే పలువురు మిల్లులను ప్రారంభించారు.పారబాయిల్డ్ రైస్ మిల్లులు : 35 రా రైస్మిల్లులు : 44 రేషన్ షాపులు : 345 రేషన్కార్డులు : 1,95,554 లబ్ధిదారులు : 5,75,463 బియ్యం : 3,700 మెట్రిక్ టన్నులు -
ఆస్పత్రుల చుట్టూ తిరిగిన..
చర్మ సంబంధిత వ్యాఽధితో మా కుటుంబ సభ్యులు ఒకరు బాధపడుతున్నారు. ఆరు నెలలపాటు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా నయం కాలేదు. బంధువులు చెప్పారు. మల్యాల బస్టాండు వద్ద ఉన్న సుందెలుక బావి నీటితో ఏడు వారాలు స్నానం చేస్తే తగ్గుతుందంటే వచ్చాం. – ఎలగందుల మహేశ్, ిసిరిసిల్ల చర్మంపై దద్దుర్లు, మంట వస్తుంది. రెండు, మూడేళ్లకోసారి ఇలా అవుతుంది. మొదటిసారి ఇలా సమస్య వచ్చినప్పుడు ఆస్పత్రికి వెళ్లి మందులు వాడిన. అయినా తగ్గలేదు. ఇక్కడి బావినీటి గురించి తెలుసుకొని వచ్చిన. నయా పైసా ఖర్చులేకుండా చర్మవ్యాధులు తగ్గుతున్నాయి. – పబ్బ ఎల్లవ్వ, సంకెపల్లి, వేములవాడ అర్బన్ -
ఫీజు ఇవ్వరు.. పన్ను కట్టరు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న గ్రానైట్ కటింగ్, పాలీిషింగ్ పరిశ్రమల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అనుమతులు పొందే సమయంలో ఒక విధంగా, నిర్మాణ సమయంలో మరో విధంగా కట్టడాలు చేపట్టి నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. పలు పరిశ్రమలు ఇంటి నంబర్లు పొందకుండానే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. సామాన్యుడు ఇంటి నిర్మాణం చేపడితే క్షణాల్లో వాలిపోయే అధికారులు.. గ్రానైట్ పరిశ్రమల విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమల నిర్వహణ కొనసాగుతున్నా సంబంధిత అధికారులెవరూ కన్నెత్తి చూడడం లేదు. పరిశ్రమల అనుమతులపై అనుమానాలు? కొత్తపల్లి మండలంలోని గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ పరిశ్రమలు పొందిన అనుమతులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం పరిశ్రమ స్థాపనకు అనుమతి పొందాలంటే టీఎస్ ఐపాస్లో దరఖాస్తు చేసుకోవాలి. వివిధ ప్రభుత్వశాఖల నుంచి ఎన్వోసీ పత్రాలు జతచేస్తూ దరఖాస్తు పూర్తి చేయాలి. సింగిల్విండో పద్ధతిలో అనుమతి మంజూరు కోసం సాంకేతిక(టెక్నికల్) అనుమతికి సుడా/డీటీసీపీ(డిస్ట్రిక్ట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీసర్)కు దరఖాస్తు ఫార్వర్డ్ చేయబడుతుంది. పరిశ్రమ స్థాపించేందుకు పరిపాలన అనుమతుల కోసం సంబంధిత గ్రామ పంచాయతీలకు సుడా /డీటీసీపీ ఆ దరఖాస్తును ఫార్వర్డ్ చేస్తుంది. పంచాయతీ అనుమతి వచ్చాక సుడా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశ్రమకు సంబంధించిన నిర్మాణం కొలతలపై విచారణ చేపట్టి సాంకేతిక (టెక్నికల్) అనుమతి ఇవ్వాలి. అప్పుడు పంచాయతీ గ్రామసభ అనుమతి పొందాక సంబంధిత పరిశ్రమ యజమాని నిర్మాణ ఫీజు, బెట్టర్మెంట్ చార్జ్, డెవలప్మెంట్ చార్జిలు చెల్లించాక అనుమతులివ్వాలి. అప్పుడే పరిశ్రమ నిర్మాణ పనులు చేపట్టాలి. కానీ వాటిని తుంగలో తొక్కుతూ సుడా అనుమతి ఉందంటూ గ్రామ పంచాయతీలకు ఫీజు చెల్లించకుండా నిర్మాణాలు పూర్తి చేస్తున్నాయి. దీంతో పంచాయతీల ఆదాయానికి గండి పడుతోంది. అనుమతులు ఒకలా.. నిర్మాణాలు మరోలా కొత్తపల్లి మండలంలోనే 300 పైగా గ్రానైట్ కలింగ్, పాలీషింగ్ పరిశ్రమలుండగా జిల్లావ్యాప్తంగా మరికొన్ని పరిశ్రమలది ఇదే పరిస్థితి అని తెలుస్తోంది. కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్, ఖాజీపూర్, ఎలగందుల, బద్ధిపల్లి, కమాన్పూర్ గ్రామాల్లోని పలు పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను విస్మరించాయి. అనుమతుల సమయంలో ఒకలా.. నిర్మాణ సమయంలో మరోలా కట్టడాలు చేపట్టారు. గ్రానైట్ పరిశ్రమల అనుమతులపై కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణ చేపడితేనే వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి. ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఎగవేత గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ పరిశ్రమలు ఇంటి శిస్తుతో పాటు ట్రైడ్ లైసెన్స్ ఫీజు కూడా ఎగవేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు 100 హార్స్పవర్(హెచ్పీ)పైన విద్యుత్ వినియోగిస్తున్న పరిశ్రమలు ఏడాదికి రూ.7 వేలు, 100 హెచ్పీ లోపు విద్యుత్ వినియోగిస్తే రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇవేవీ చెల్లించకుండా గ్రానైట్ పరిశ్రమల యజమానులు దర్జాగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయమైన జిల్లా పంచాయతీ అధికారిని ఫోన్లో వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. -
రివర్ఫ్రంట్ పనులు వేగవంతం చేయాలి
● త్వరలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తాం ● జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కరీంనగర్ కార్పొరేషన్/కరీంనగర్ అర్బన్: మానేరు రివర్ ఫ్రంట్ పనులు వేగవంతం చేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తు మ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్లోని అసెంబ్లీ కమిటీ హాల్లో మానేరు రివర్ ఫ్రంట్ పురోగతిపై మంత్రులు మంత్రి పొ న్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మానేరు రివర్ ఫ్రంట్ భూసేకరణ, ప్రస్తుత స్థితిగతులు, పెండింగ్లో ఉన్న నిధులు, ప్రాజెక్టు పూర్తికి ఎదురవుతున్న అడ్డంకులపై సుదీర్ఘంగా చర్చించారు. పనుల్లో జాప్యాన్ని నివారించి, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. పర్యాటకశాఖ నుంచి రూ.5 కోట్లతో పాటు ఈ సంవత్సరమే మరో రూ.10 కోట్లు విడుదల చేసేలా చూస్తామన్నారు. త్వరలోనే మంత్రుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి మానేరు రివర్ ఫ్రంట్ పనులను స్వయంగా పరిశీలించనున్నట్లు వెల్లడించారు. మానకొండూరు ఎమ్మె ల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ చిత్రామిశ్రా, నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్ పాల్గొన్నారు. -
వైద్యులకు ప్రాక్టికల్ విజ్ఞానం అవసరం
● సీపీ గౌస్ ఆలం కరీంనగర్రూరల్: రేపటి వైద్యులుగా మారనున్న మెడికల్ విద్యార్థులకు ప్రాక్టికల్ విజ్ఞానం ఎంతో అవసరమని కరీంనగర్ సీపీ గౌస్ అలం అన్నారు. ఆదివారం కరీంనగర్ మండలం నగునూరులో ప్రాణా–2026 పేరిట నిర్వహిస్తున్న అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాన్ఫరెన్స్ ముగింపు సమావేశంలో సీపీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెడికల్ కాన్ఫరెన్స్లు వైద్య విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ప్రతిమ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ హాసిని మాట్లాడు తూ జీవశక్తి, ఉత్సాహం, లక్ష్యం మూడు విలు వలతో ప్రాణా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం వైద్య విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ప్రిన్సిపాల్ జాన్ ఇజ్రాయిల్, వైస్ ప్రిన్స్పాల్ కిషన్రెడ్డి, సీఏవో రాంచందర్రావు, మెడికల్ సూపరింటెండెంట్ సీఎన్ ప్రసాద్, రిజిస్ట్రార్ ప్రసాద్రావు, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్వశక్తి మహిళా నిరక్షరాస్యులకు పరీక్షకరీంనగర్ కార్పొరేషన్: జిల్లాలోని మున్సిపాలి టీల వారీగా గుర్తించిన స్వశక్తి సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళలకు ఆదివారం మెప్మా ఆధ్వర్యంలో అక్షరాస్యత పరీక్ష నిర్వహించారు. నగరంలో ఏర్పాటు చేసిన 89 కేంద్రాల్లో 5,344 మంది స్వశక్తి మహిళలు పరీక్షకు హాజరయ్యా రు. కరీంనగర్ నగరపాలకసంస్థ, హుజూరాబా ద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల పరిధిల్లో ఉల్లాస్ పథకం కింద స్వయం సహా యక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 13,647 మంది నిరక్షరాస్యులను గుర్తించారు. వీరందరిని అక్షరాస్యులుగా మార్చేందుకు గతంలో ప్రత్యేక బోధనా తరగతులు నిర్వహించారు. తరగతుల్లో అక్షరాలు నేర్చుకొన్న 6,173 మందికి ఆదివారం వయోజన విద్య విభాగం ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించగా, 5,344 మంది హాజరయ్యారు. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ స్వరూపారాణి హౌసింగ్బోర్డుకాలనీలోని ప్రభుత్వ పాఠశాల, కార్ఖానగడ్డ,రాంనగర్, సప్తగిరికాలనీల్లోని పరీక్షా కేంద్రాలను సందర్శించారు. 89 కేంద్రాల్లో 221 మంది సమాఖ్య ప్రతినిధులు ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వహించారు. బీజేపీ భావాజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలికొత్తపల్లి(కరీంనగర్): బీజేపీ సిద్ధాంతం, భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పార్టీ రాష్ట్ర ప్రశిక్షణ కమిటీ సభ్యులు రంజిత్ మోహన్, రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి శ్రీధర్, రాణి రుద్రమ పిలుపునిచ్చారు. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియా న్లో భాగంగా కొత్తపల్లిలో జరుగుతున్న వెస్ట్జోన్, కొత్తపల్లి జోన్, కొత్తపల్లి రూరల్ బీజేపీ శ్రేణుల శిక్షణ శిబిరం ఆదివారం ముగిసింది. ముఖ్య అతిథులుగా హాజరైన పలువరు మాట్లాడుతూ బలమైన బీజేపీ సిద్ధాంతంతోనే నేడు పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగిందన్నారు. అనంతరం ప్రధాని మోడీ 132వ మన్ కి బాత్ ను వీక్షించారు. నాయకులు బాస సత్యనారా యణ రావు, కన్నబోయిన ఓదెలు, గుజ్జ శ్రీని వాస్, కార్పొరేటర్ వాసాల రమేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు రంగు భాస్కరాచారి పాల్గొన్నారు. నేటి నుంచి హెచ్పీవీ వ్యాక్సినేషన్కరీంనగర్: జిల్లాలోని అన్ని పీహెచ్సీలు, యూపీహెచ్సీల్లో సోమవారం నుంచి హెచ్పీవీ టీకాలు వేస్తామని డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ, డీఐవో డాక్టర్ సాజిదా అతహరి తెలిపారు. ఈ కార్యక్రమం ప్రతిరోజూ అన్ని పీహెచ్సీల్లో ఉంటుందన్నారు. టీకా కోసం బాలికలు తప్పనిసరిగా తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకులతో కలిసి రావాల్సి ఉంటుందని, ఆధార్ కార్డు వెంట ఉంచుకోవాలన్నారు. -
డీఎంహెచ్వో ఆధ్వర్యంలో సమీక్ష
కరీంనగర్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, డాక్టర్ వెంకటరమణ అధ్యక్షతన వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ మీటింగ్ హాల్లో శనివారం జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ విభాగాల శాఖల సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 వరకు ఉన్న టార్గెట్, అచీవ్మెంట్ల వివరాలు తెలుసుకున్నారు. హెచ్ఐవీ పరీక్షలు చేసి పేషెంట్లందరినీ ఏఆర్టీ సెంటర్కి పంపించి ఉచితంగా మందులు ఇప్పించాలని, గర్భిణులకు హెచ్ఐవీ, సిఫిలిసిస్ పరీక్షలు జరిపి ఎవరికై నా పాజిటివ్ వస్తే వారికి పుట్టబోయే బిడ్డకు సోకకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ సుధ రాజేంద్ర పాల్గొన్నారు. హెల్పింగ్ హ్యాండ్స్కు జాతీయ పురస్కారం మానకొండూర్: మానకొండూర్ మండలంలోని గట్టుదుద్దెనపల్లిలో హెల్పింగ్ హ్యాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ చేసిన సామాజిక సేవలకు గాను వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్ వసుంధర విజ్ఞాన వికాస మండలి ఆధ్వర్యంలో తెలంగాణ సేవారత్న జాతీయ పురస్కారం అందించింది. గ్రామంలోని 32 మంది యువకులు గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో హెల్పింగ్ హ్యాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకుని ఎనిమిది సంవత్సరాలుగా సేవ కార్యక్రమాలు అందిస్తున్నారు. వీరి సేవలను గుర్తించిన వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్ వసుంధర విజ్ఞాన వికాస మండలి తెలంగాణ సేవా రత్న జాతీయ పురస్కారం హెల్పింగ్ హ్యాండ్ సభ్యులకు హైదరాబాద్లోని రవీంద్రభారతిలో అందించింది. ఐదు టిప్పర్ల పట్టివేతకొత్తపల్లి: కొత్తపల్లి మండలం కమాన్పూర్ పంచాయతీ పరిధిలోని ఒడ్డెపల్లి వద్ద శనివారం రాత్రి అక్రమ మట్టి రవాణాకు పాల్పడుతున్న ఐదు టిప్పర్లను పట్టుకున్నట్లు కొత్తపల్లి ఎస్హెచ్వో, ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్ తెలిపారు. కొత్తపల్లి మండలం ఎలగందుల తదితర గ్రామాల నుంచి అనుమతి లేకుండా మట్టి తరలిస్తున్న టిప్పర్లతో పాటు డ్రైవర్లు సరయ్య, సూర మల్లేశం, శ్రీనివాస్, గంగాధర్, సి.రమేశ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
డ్రైవర్ల కంటిచూపే ప్రయాణికుల భద్రత
గంగాధర: రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల కంటిచూపు కీలకమని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం పేర్కొన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహిస్తున్న రెండో దశ అరైవ్– అలైవ్ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలోని ఓ ఫంక్షన్ హాలులో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీ మాట్లాడుతూ డ్రైవర్లు కంటిచూపుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. తద్వారా తమ ప్రాణాలతో పాటు ప్రయాణికుల ప్రాణాలకు భద్రత కల్పించిన వారవుతారన్నారు. ప్రతి వాహన డ్రైవర్ తరచూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఏసీపీ విజయ్కుమార్, చొప్పదండి సీఐ ప్రదీప్కుమార్, ఎంవీఐలు రవికుమార్, రజిని, ఎంపీడీవో రాము, తహసీల్దార్ రజిని, ఎస్సైలు వంశీకష్ణ, నరేశ్రెడ్డి, రాజు, సర్పంచులు వేముల భాస్కర్, ముద్దం నగేశ్, బీర్ల ఆనందం, రేండ్ల శ్రీనివాస్, దూలం కల్యాణ్ పాల్గొన్నారు. -
వందశాతం పన్ను వసూలు చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: మూడు రోజుల్లో వందశాతం ఆస్తిపన్ను వసూలు చేయాలని నగర పాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ ఆదేశించారు. శనివారం కళాభారతిలో రెవెన్యూ, టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్, శానిటేషన్ విభాగాల అధికారులు, వార్డు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025–26 ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఉన్న మూడు రోజుల్లో వందశాతం వసూలు చేయాలన్నారు. ప్రతి రోజు రూ.2.50 కోట్లు వసూలు చేయాలన్నారు. టాప్ 200 మంది మొండి బకాయిదారులతో పాటు కమర్షియల్, మిక్స్డ్, డబుల్ నెంబర్ ప్రాపర్టీలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు ప్రతి అసెస్మెంట్ను సందర్శించి, పన్నులు కట్టించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మొండి బకాయి దారులు పన్నులు చెల్లించకుంటే చట్ట ప్రకారం ప్రాపర్టీలను సీజ్ చేయాలని ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహియొద్దీన్, వేణు మాధవ్ పాల్గొన్నారు. మూడు రోజులు గడువు.. ప్రతి రోజూ రూ.2.50 కోట్లు లక్ష్యం నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ -
ఆధునిక వ్యవసాయంతోనే మనుగడ
తిమ్మాపూర్: రైతులు ఆధునిక వ్యవసాయం చేస్తేనే మనుగడ ఉంటుందని పలు జిల్లాల వ్యవసాయ అధికారులు సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలోని కరీంనగర్కు చెందిన తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం(టీఆర్వీకే), జగిత్యాల వ్యవసాయ కళాశాల, రాజన్న సిరిసిల్ల జిల్లా బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల, అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలల ఆధ్వర్యంలో తిమ్మాపూర్లో శనివారం రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన, వివిధ పంటల సాగులో సాంకేతిక, సమగ్ర యాజమాన్య పద్ధతులపై శాస్త్రవేత్తలు, రైతులతో చర్చాగోష్టి నిర్వహించారు. కరీంనగర్ డీఏవో భాగ్యలక్ష్మీ, సర్పంచ్ గంకిడి లక్ష్మారెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల వ్యవసాయాధికారులు భాగ్యలక్ష్మీ, భాస్కర్, ఛత్రునాయక్ మాట్లాడుతూ రైతులు వ్యవసాయ సాగులో మెలకువలు నేర్చుకోవాలని తెలిపారు. ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తూ నాణ్యమైన పంటలు పండించాలని, ఒక్కో రైతు తనకున్న పొలంలో కొంత మేరకై నా సేంద్రియ వ్యవసాయ చేయాలని సూచించారు. ప్రభుత్వం వద్ద మూడేళ్లకు సరిపడా ధాన్యం నిల్వలు ఉన్నాయని, అందుకే దొడ్డు రకం పండించొద్దని సూచించారు. ఆయిల్పాం పంటలపై దృష్టి పెట్టి వాటిసాగు విస్తీర్ణం పెంచాలన్నారు. ఇందుకు మన భూములు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. మిగులు ఎక్కువగా ఉండే ఆయిల్ ఫామ్ లాభదాయకంగా ఉందన్నారు. యూనివర్సిటీల్లో ఎరువుల వినియోగంపై రీసెర్చ్ జరుగాలని కోరారు. నానో యూరియా వాడాలని సూచించారు. మోటార్లకు సోలార్ పవర్ వినియోగించాలని, రాబోయే రోజుల్లో పంట చేనులకు సైతం సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం సబ్సీడీ రుణాలు ఇస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఉత్తమ రైతులను అధికారులు సన్మానించారు. ఏడీ శ్రీధర్, వ్యవసాయ శాస్త్రవేత్తలు సునీతాదేవీ, వ్యవసాయ పరిశోధన కేంద్రం హెడ్ రాంప్రసాద్, శాస్త్తవేత్తలు మధుకర్, హరిక్రిష్ణ, రాజేంద్రప్రసాద్, ఏవోలు సురేందర్, వెంకటేశ్, కిరణ్మయి, పూర్ణచందర్ పాల్గొన్నారు. రైతులకు సూచనలు చేసిన డీఏవోలు తిమ్మాపూర్లో రైతులతో చర్చాగోష్టి -
‘సాక్షి’ జర్నలిస్టుకు అవార్డు
కరీంనగర్ కల్చరల్: ‘సాక్షి’ జర్నలిస్టు గోలి కిరణ్కు రాష్ట్ర ఉత్తమ అగ్రికల్చర్ జర్నలిస్ట్ అవార్డు వరించింది. రైతుల సమస్యలు, వ్యవసాయ పథకాలు, తీరుతెన్నులపై వందల కథనాలు అందించారు. అతని సేవలను గుర్తించిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అవార్డు ప్రకటించింది. శనివారం జరిగిన రైతు సదస్సు, అగ్రికల్చరల్ ఎగ్జిబిషన్లో అవార్డు స్వీకరించారు. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, కో–ఆర్డినేటర్ బోగారి హరికృష్ణ, కరీంనగర్ వ్యవసాయ పరిశోధన స్థానం హెడ్ డీన్ రాంప్రసాద్, కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జగిత్యాల జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, ఆత్మ పీడీ ఛత్రునాయక్, పొలాస సీనియర్ సైంటిస్ సంధ్యాకిషోర్, సిరిసిల్ల కళాశాల అసోసియేషన్ డీన్ సునీత, నర్సింహరెడ్డి, ఏవోలు సురేందర్నాయక్, పున్నం చందర్ అభినందించారు. -
సమన్వయంతోనే సంఘాల అభివృద్ధి
చొప్పదండి: సహకార సంఘాల పాలకవర్గాలు, సిబ్బంది మధ్య సమన్వయంతోనే సొసైటీల అభివృద్ధి జరుగుతుందని జాతీయ ఉత్తమ పీఏసీఎస్ అవార్డు గ్రహీత వెల్మ మల్లారెడ్డి అన్నారు. పట్టణంలోని పీఏసీఎస్ వార్షిక సర్వసభ్య సమావేశం పర్సన్ ఇన్చార్జి జమునారాణి అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్భంగా తాజాగా గడువు ముగిసిన పాలకవర్గానికి సంఘ సభ్యులు సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భగా మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఎరువుల గోదాం నిర్మాణం, వడ్ల కొనుగోలు కేంద్రాలు, అయిదున్నర ఎకరాలలో సోలార్ పవర్ ప్లాంటు నిర్మాణం, రైతులకు అత్యాధునిక విధానంలో డ్రోన్ స్ప్రే సౌకర్యం వంటి అంశాలు చొప్పదండి సంఘానికి ప్రత్యేకతలుగా నిలుస్తాయన్నారు. పర్సన్ ఇన్చార్జి మాట్లాడుతూ రుణాలు తీసుకొని చెల్లించని వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. సకాలంలో రుణాలు చెల్లించాలని కోరారు. ఈ సందర్భంగా వార్షిక నివేదికను చదివి వినిపించారు. గుర్రం ఇంద్రసేనారెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్రెడ్డి, పెరుమాండ్ల గంగయ్యగౌడ్, ముద్దం మహేశ్గౌడ్, కళ్లెం తిరుపతిరెడ్డి, ఇప్పనపల్లి సాంబయ్య, ముద్దం తిరుపతిగౌడ్, గుర్రం రాజేందర్రెడ్డి, పిట్టల వెంకటేశ్, రాజన్నల రాజు పాల్గొన్నారు. -
మహిళపై దాడిచేసిన నిందితుడి రిమాండ్
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి మండలం ఖాజీపూర్ గ్రామానికి చెందిన మహిళపై దాడి చేసి బంగారు పుస్తెల తాడు అపహరించిన వ్యక్తిని పోలీసులు రిమాండ్కు తరలించారు. కొత్తపల్లి ఎస్హెచ్వో, ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్ వివరాల మేరకు.. ఈ నెల 26వ తేదీన సాయంత్రం ఖాజీపూర్లో గేదెలను మేపుతున్న గడ్డం మాధవిపై అదే గ్రామానికి చెందిన సుంకె శ్రీధర్ దాడి చేశాడు. ఆమె మెడలోని బంగారు పుస్తెల తాడు దొంగిలించి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి శ్రీధర్ను శనివారం అదుపులోకి తీసుకున్నారు. బంగారు పుస్తెలతాడు స్వాధీనం చేసుకున్నాం. నిందితుడిని కోర్టులో హాజరు పరచగా 14రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్హెచ్వో పేర్కొన్నారు. మ్యూల్ ఖాతాల కేసులో నోటీసులుకరీంనగర్క్రైం: మ్యూల్ ఖాతాలను ఉపయోగించి సైబర్ నేరస్తులతో రూ.138 కోట్ల లావాదేవీలు నిర్వహించిన కేసులో త్రీటౌన్ పోలీసులు శుక్రవారం 13 మందిని కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు వివరాలు పరిశీలించిన కోర్టు వారికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. పోలీసులు 35 బీఎన్ఎస్ఎస్ ప్రకా రం నోటీసులు అందించారు. ఈ కేసు విచా రణ కొనసాగుతుందని, మరికొంతమందిపై ఆరా తీస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. పవర్ కట్ ప్రాంతాలుకొత్తపల్లి: 33 కె.వీ.విద్యుత్ లైన్ల పనులు చేపడుతున్నందున ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రెడ్డి ఫంక్షన్హాల్, మాణికేశవనగర్, తీగలగుట్టపల్లి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. ఆస్తి తీసుకుని పోషించడం లేదని..కథలాపూర్: ఆస్తి తీసుకుని తనను పోషించడంలేదని మండలంలోని పోతారం గ్రామానికి చెందిన రండం పుల్లయ్య తన చిన్న కూ తురు లావణ్యతో కలిసి శనివారం కోరుట్ల ఆర్డీవో జివాకర్రెడ్డికి ఫిర్యాదు చేశారు. పోతా రం గ్రామానికి చెందిన రండం పుల్లయ్యకు ఇద్దరు కూతుళ్లు. ఓ కూతురు పోతారంలో నివసిస్తోంది. చిన్న కూతురు లావణ్య కోరుట్లలో ఉంటోంది. తన ఆస్తి గ్రామంలో ఉంటున్న కూతురు తీసుకుందని, వృద్ధాప్యంలో ఉన్న తనను పోషించడంలేదని పుల్లయ్య చిన్న కూతురితో కలిసి ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి న్యాయం చేస్తామని ఆర్డీవో వృద్ధుడికి సూచించారు. -
గృహప్రవేశాలకు ఏర్పాట్లు చేయాలి
తిమ్మాపూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో భాగంగా ప్రారంభించిన ఇళ్ల నిర్మాణం పూర్తిచేసుకుని గృహప్రవేశాలకు సిద్ధమయ్యేలా చూడాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. మండలంలోని నుస్తులాపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను శనివారం పరిశీలించారు. లబ్ధిదారులు తుమ్మనవేని రజిత, కుంటు రాధతో మాట్లాడారు. ఇంటి నిర్మాణానికి ఇప్పటివరకు అయిన ఖర్చు, ప్రభుత్వం నుంచి వచ్చిన బిల్లుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గృహ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసుకొని పూర్తి లబ్ధి పొందాలని సూచించారు. ఈ సందర్భంగా హౌసింగ్, పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని అన్నారు. వారికి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలని అన్నారు. ఇళ్ల నిర్మాణానికి ఇసుక సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూడాలని ఎంపీడీవోను ఆదేశించారు. మోడల్ గ్రామాలు, మొదటి దఫాలో ఎంపికై న లబ్ధిదారుల ఇళ్లు నూరు శాతం పూర్తయ్యేలా చూడాలని అన్నారు. కలెక్టర్ వెంట స్థానిక సర్పంచ్ తుమ్మనపల్లి సంధ్య శ్రీనివాసరావు గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్టు పిడి శ్రీనివాస్, డీఈ వెంకటరమణ, ఏఈ శ్రీజ, ఎంపీడీవో మల్హోత్రా, తహసిల్దార్ శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ పనుల పరిశీలన కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని ఎల్ఎండీ రిజర్వాయర్ దిగువన నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ పనులను శనివారం కలెక్టర్ చిత్రా మిశ్రా పరిశీలించారు. మున్సిపల్, రెవెన్యూ, నీటిపారుదలశాఖ, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి రివర్ ఫ్రంట్ బ్యారేజీ నిర్మాణ స్థలాన్ని సందర్శించారు. రివర్ ఫ్రంట్ నిర్మాణ అంచనా వ్యయం, చేసిన పనుల వివరాలు, చేయాల్సిన నిర్మాణాలు తదితర అంశాలను అధికారులు కలెక్టర్కు వివరించారు. రివర్ ఫ్రంట్ నిర్మాణంలో భాగంగా పర్యాటక అభివృద్ధిలో భాగంగా ఏయే నిర్మాణాలు, ఎంత విస్తీర్ణంలో, ఎక్కడ చేపడుతున్నారనే విషయాలను తెలుసుకొన్నారు. నగరపాలకసంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీఓ మహేశ్వర్, నీటిపారుదలశాఖ ఎస్ఈ రమేశ్ పాల్గొన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారుల సమస్యలు పరిష్కరించాలి కలెక్టర్ చిత్రా మిశ్రా -
రాణిస్తున్న సహకార సంఘాలు
సైదాపూర్: వ్యవసాయ సహకార సంఘాలు రైతు ఆధారిత వ్యాపార రంగాల్లో రాణిస్తున్నాయని పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జి ముంజాల శ్రీనివాస్ అన్నారు. శనివారం మండలంలోని వెన్నంపల్లి, వెన్కెపల్లి సహకార సంఘాల వార్షిక మహాసభ ఆయా సంఘాల సీఈవోల అద్యక్షతన జరిగింది. సహకార సంఘాలు రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తూనే, వ్యాపార రంగాలు విస్తరించుకొని ఆర్థికంగా స్థిరపడుతున్నాయన్నారు. రైతులకు ఎరువులు అందించేందుకు సిబ్బంది కృషి చేయాలని సింగిల్ విండో మాజీ చైర్మన్ బిల్లా వెంకటరెడ్డి కోరారు. ఆరెపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం, ఎరువుల దుకాణం ఏర్పాటు చేయాలని మాజీ సర్పంచ్ ఆవునూరి పాపయ్య కోరారు. ఎగ్లాస్పూర్లో ఎరువుల కొరత రాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని సహకార సంఘం మాజీ వైస్ చైర్మన్ రాజేశ్వర్రెడ్డి కోరారు. మహాసభలో సీఈవోలు మల్లారెడ్డి, శ్రీధర్ పాల్గొన్నారు. -
లోక్ అదాలత్లో 4,077 కేసులు పరిష్కారం
కరీంనగర్క్రైం: జాతీయ, రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా శనివారం వివిధ కోర్టుల్లో నిర్వహించిన లోక్ అదాలత్ ద్వారా 4,077 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో 106 సివిల్ కేసులు, 3,926 క్రిమినల్ కేసులు, 45 ప్రిలిటిగేషన్ కేసులు పరిష్కరించారు. సివిల్ కేసుల్లోని 86 మోటారు వాహనాల కేసుల్లో రూ.5,50,70,000 రూల నష్ట పరిహారం కక్షిదారులకు ఇన్సురెన్స్ కంపెనీలతో పాటు ఇతర సంస్థలు చెల్లించడానికి అంగీకరించాయి. జిల్లా జడ్జి శివకుమార్ మాట్లాడుతూ రాజీయే రాజమార్గమని, రాజీతోనే ఇరువర్గాలకు మేలని తెలిపారు. లోక్ అదాలత్లో కేసుల పరిష్కారం వల్ల డబ్బుతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని తెలిపారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ లోక్ అదాలత్ కార్యక్రమంలో న్యాయవాదులు, పోలీసు సిబ్బంది సహకారంతో చాలా మంది కక్షిదారులు స్వచ్ఛంధంగా ముందకు వచ్చి కేసులను పరిష్కారం చేసుకోవడం సంతోషకరమని తెలిపారు. న్యాయమూర్తి రాణి, న్యాయవాదులు పాల్గొన్నారు. లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా 16వ స్థానంలో నిలిచింది. జిల్లా జడ్జి శివకుమార్ -
సోలార్తో స్వయం సమృద్ధి సాధిద్దాం
కరీంనగర్: సోలార్ వ్యవస్థను స్వయంగా అమలు చేసి ప్రజాప్రతినిధులు ఆదర్శంగా నిలవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. వార్డు మెంబర్ నుంచి సర్పంచ్, కౌన్సిలర్ నుంచి కార్పొరేటర్ వరకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శనివారం కరీంనగర్లోని తన నివాసంపై సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేసుకున్న ఆయన, అధికారులతో కలిసి పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సూర్య ఘర్– ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని వివరించారు. దేశవ్యాప్తంగా కోటి ఇండ్లపై సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసి, ప్రతి కుటుంబానికి నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడమే లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం రూ.75 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం భారీ సబ్సిడీ అందిస్తున్నదని పేర్కొన్నారు. ఒక్కో ఇంటికి రూ.30 వేల నుంచి రూ.78 వేల వరకు సబ్సిడీ లభిస్తుందని, అదనంగా 80 శాతం వరకు రుణ సౌకర్యం కూడా అందుబాటులో ఉందని వివరించారు. వ్యవసాయ రంగంలో సౌరశక్తి వినియోగాన్ని పెంచేందుకు కేంద్రం ముఫ్త్బిజిలీ యోజన పథకాన్ని అమలు చేస్తోందని చెప్పారు. ఈ పథకం ద్వారా తెలంగాణలో 1800 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ -
బకాయిల గుదిబండ!
ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026సీతారాములకు పట్టాభిషేకం నిర్వహిస్తున్న అర్చకులుసాక్షి ప్రతినిధి, కరీంనగర్/కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి మండల పరిధిలోని గ్రానైట్ కట్టింగ్ ఫ్యాక్టరీల పన్ను బకాయిలు గ్రామ పంచాయతీలకు గుది‘బండ’గా మారాయి. పన్ను ఎగవేయడంతో గ్రామాలాభివృద్ధికి విఘాతం కలుగుతోంది. రూ.కోట్ల వ్యాపారం చేస్తూ.. రూ.వేల పన్నులు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. మూడేళ్లుగా పంచాయతీలకు రూ.కోట్లలో బకాయిలు పెండింగ్లో పడ్డాయి. నోటీసులు జారీ చేసినప్పటికీ పట్టించుకోకపోగా.. అధికారులు చోద్యం చూస్తున్నారు. కలెక్టర్ స్పందించి గ్రానైట్ మాఫియాపై కొరడా ఝళిపించాలని పంచాయతీ పాలకవర్గాలు కోరుతున్నారు. గ్రానైట్ కట్టింగ్ ఫ్యాక్టరీల పన్ను వసూలుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచిస్తున్నారు. వందల ఫ్యాక్టరీలు.. రూ.కోట్లల్లో బకాయిలు కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్, ఖాజీపూర్, ఎలగందుల, బద్దిపల్లి, కమాన్పూర్ గ్రామాల్లో సుమారు 300 పైచిలుకు గ్రానైట్ కట్టింగ్ ఫ్యాక్టరీలున్నాయి. రూ.కోట్లల్లో పెట్టుబడులు పెట్టిన యజమానులు మూడేళ్లుగా ఆయా పంచాయతీలకు రూ.వేలలో పన్ను చెల్లించడంతో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆసిఫ్నగర్లో 110 ఫ్యాక్టరీలకు 84, ఖాజీపూర్లో 170 ఫ్యాక్టరీలకు 150, ఎలగందులలో 25 ఫ్యాక్టరీలు, బద్దిపల్లిలో 21, కమాన్పూర్లో 8 ఫ్యాక్టరీలు ప్రస్తుతం గ్రానైట్ వ్యాపారం చేస్తున్నాయి. ఒక్కో ఫ్యాక్టరీ ఏరియాను బట్టి ఏడాదికి రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మూడేళ్లుగా ఏ ఒక్క ఫ్యాక్టరీ పన్ను చెల్లించడం లేదు. రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. పన్నుల వసూళ్లలో గ్రామ పంచాయతీలు పూర్తిగా విఫలమవ్వగా, ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసోసియేషన్ జోక్యం గ్రానైట్ కట్టింగ్ ఫ్యాక్టరీల పన్ను ఎగవేత విషయంలో గ్రానైట్ కట్టింగ్, పాలీసింగ్ అసోసియేషన్ జోక్యం చేసుకోవడం గ్రామ పంచాయతీలకు ఇబ్బందిగా మారింది. గతంలో ఆసిఫ్నగర్లోని ఫ్యాక్టరీలకు కొంత మొత్తం పన్ను చెల్లించాలంటూ పంచాయతీ అధికారులు ఓ పాలసీ చేస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపారు. అప్పుడున్న అసోసియేషన్ ప్రతినిధులు తమ రాజకీయ పలుకుబడితో అభ్యంతరం వ్యక్తం చేయడంతో పన్ను చెల్లింపులు అటకెక్కాయి. అప్పటి నుంచి నేటి వరకు పన్నుల చెల్లింపు ఊసేలేకపోగా.. నూతనంగా ఏర్పడ్డ పంచాయతీ పాలకవర్గాలు ఎలాగైనా పన్నులు వసూలు చేయాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో గ్రానైట్ కట్టింగ్ ఫ్యాక్టరీలు పన్నులు చెల్లించాలని పంచాయతీలు నోటీసులు జారీ చేస్తున్నాయి. అయినప్పటికీ స్పందన లేకపోగా.. కలెక్టర్ రంగంలోకి దిగి ప్రత్యేక డ్రైవ్ చేపడితే తప్ప సమస్యకు పరిష్కారం అయ్యేలా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రానైట్ ఫ్యాక్టరీలు పన్ను చెల్లించాల్సి ందే. అనేక ఫ్యాక్టరీలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. మూడేళ్లుగా పన్నులు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తుండటంతో అభివృద్ధి కుంటుపడింది. పన్నులు చెల్లించాలని నోటీసులు జారీ చేసినా స్పందించడం లేదు. కలెక్టర్ జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలి. – తాండ్ర శ్రీనివాస్, సర్పంచ్ బద్దిపల్లి -
కొండగట్టుకు శునకం పాదయాత్ర
వారు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్కు చెందిన హనుమాన్ దీక్షాపరులు. మాల విరమణ చేసేందుకు కొండగట్టుకు బయలుదేరారు. దారిలో ఓ శునకం ఎదురుపడగా దానికి ఓ బిస్కట్ ఇచ్చారు. దీంతో ఆ శునకం దీక్షాపరులతో పాటు కొండగట్టు వరకు పాదయాత్ర చేసింది. పాదయాత్ర చేస్తున్న శునకానికి కాళ్లనొప్పులు రావడంతో సాక్స్లు సైతం తొడిగారు. ఐదురోజులుగా పాదయాత్ర చేస్తుందని, వెళ్లగొట్టినా పోవడం లేదని, సుమారు 130 కి.మీ దూరం తమతో నడిచి వచ్చిందని దీక్షాపరులు తెలిపారు. శుక్రవారం కొండగట్టుకు చేరుకున్నామని పేర్కొన్నారు. – జగిత్యాల -
మ్యూల్ అకౌంట్లతో రూ.138 కోట్ల స్కాం
కరీంనగర్ క్రైం: అమాయకులకు డబ్బు ఆశచూపి వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరిపించారు. ఆ ఖాతాల ద్వారా విదేశాల్లోని సైబర్ నేరగాళతో లావాదేవీలు జరిపారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.138 కోట్లు మ్యూల్ అకౌంట్లకు మళ్లించారు. కరీంనగర్లోని కిసాన్నగర్లో ఉన్న రత్నాకర్ బ్యాంకు లిమిటెడ్(ఆర్బీఎల్) కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఆ కుంభంకోణం జరగగా.. కరంట్ అకౌంట్లు పొంది సైబర్నేరాల్లో పాల్పంచుకున్న 13మందిని కరీంనగర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సీపీ గౌస్ ఆలం ఈ కేసులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలానికి చెందిన బండారి సాయిరాం(30) అమాయకులతో పాటు డబ్బు అవసరం ఉన్నవారితో నగరంలోని ఆర్బీఎల్ బ్యాంకులో కరంటు ఖాతాలు తీయించాడు. ఇతనికి బ్యాంకు మేనేజర్ హన్మకొండకు చెందిన భువనగిరి కల్యాణ్(52), నగరానికి చెందిన చెందిన క్యాషియ ర్ ఆయేషా బేగం(30) సహకరించారు. బుగ్గారం మండలం గోపాల్పూర్కు చెందిన అనుమండ్ల రంజిత్(36), పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి చెందిన అలిగెటి మల్లేశం(37), జగిత్యాలకు చెందిన బోగ రాకేశ్(35), రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన బండి ప్రణయ్(25), పెద్దపల్లి జిల్లా ధర్మారానికి చెందిన విభూది రాంకుమార్(37), జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్కు చెందిన నాతర్ల శ్రీనివాస్(39), జగిత్యాలకు చెందిన కల్లెడ మహేందర్(36), కొండ్ర నరహరి(37), కల్లెడ రాజేశ్(27), వరంగల్కు చెందిన కర్రె రాజు(35)లకు సంబంధించిన మ్యూల్ అకౌంట్ల ద్వారా రూ.138 కోట్ల లావాదేవీలు విదేశాల్లోని సైబర్ నేరగాళ్లతో జరిపినట్లు ఆపరేషన్ క్రాక్డౌన్ ద్వారా పోలీసులు గుర్తించారు. బండారి సాయిరాం కీలకంగా వ్యవహరిస్తూ.. సదరు ఖాతాదారులకు కమీషన్లు అందించినట్లు నిర్ధారించుకున్నారు. ఈ కేసులో మొత్తం 24మంది ఉన్నట్లు గుర్తించి, పై 13మందిని అరెస్టు చేశారు. కేసును ఛేదించిన టౌన్ ఏసీపీ వెంకటస్వామి, సీఐలు తిరుమల్, సృజన్రెడ్డి, రాంచందర్రావు, సరిలాల్ను సీపీ అభినందించారు. -
మట్టికి మేలు తలపెట్టవోయ్
● ప్రతి రెవెన్యూ పరిధిలో 10 శాంపిళ్ల సేకరణ ● భూసార పరీక్షలతో భారీగా తగ్గనున్న పెట్టుబడి ● రైతన్నా మారాలి.. నూతన ఒరవడి కావాలికరీంనగర్ అర్బన్: ‘పుండొక చోటైతే మందొక చోట రాసినట్లు’ కాకుండా భూ‘సార’మెరిగి సాగడమే ఉత్తమం. భూసార పరీక్షలతో సాగు నేలలో ఏ ఏ లోపముందో స్పష్టమవనుండగా తదనుగుణ ఎరువులు వేసుకుంటే సరి. పెట్టుబడి గణనీయంగా తగ్గనుండగా దిగుబడి పెరగనుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న భూసార పరీక్షలను సద్వినియోగం చేసుకుంటే సరి. జిల్లావ్యాప్తంగా ప్రతీ రెవెన్యూ గ్రామంలో 10 మట్టి నమూనాలను తీయనుండగా మే 10లోపు ఫలితాలను రైతులకు అందజేయనున్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమం జరగనుండగా ప్రభుత్వం తదనుగుణ చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఆదేశించింది. జిల్లాలో 3.34లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు సాగవుతున్నాయి. యాప్లో వివరాల నమోదు భూసార ప్రాధాన్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. ప్రతి రైతు భూమికి సంబంధించి భూసారాన్ని పరీక్షించి ఫలితం వెల్లడించాలని యోచిస్తున్నాయి. ఒక్కో రెవెన్యూ గ్రామంలో పది నమూనాలు సేకరించాలని లక్ష్యం నిర్దేశించినా కనీసం ఐదు నమూనాలను అధికారులు తప్పనిసరిగా పంపించాల్సి ఉంటుంది. క్లస్టర్ల వారీగా వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు) సేకరించి న నమూనాలు, సర్వే నంబర్లు, గ్రామం, రైతు పేరు, పంటలతో ప్రత్యేకంగా రూపొందించిన యా ప్లో వివరాలు నమోదు చేయాలి. ఏ జిల్లాకు చెందిన మట్టి నమూనాలను అదే జిల్లాలోని ప్రయోగశాలల్లో పరీక్షించాలని సూచించింది. సేకరించిన మట్టి నమూనాలను ఏప్రిల్ 15 లోగా పరీక్షించి వా టి ఫలితాలను అంతర్జాలంలో నిక్షిప్తపరచాలి. మే 4 నుంచి 10లోగా భూసార పరీక్షల కార్డులు రైతులకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పంపిణీకి కార్డులు సిద్ధం ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద పలు మండలాలను ఎంపిక చేసి భూసార పరీక్షలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో గన్నేరువరం మండలంలో 6వేల మట్టి నమూనాలను సేకరించి పరీక్షించారు. పెద్దపల్లి జిల్లాలో కమాన్పూర్ మండలంలో 4వేలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇల్లంతకుంట మండలంలో 4వేలు, జగిత్యాల జిల్లాలో ధర్మపురి మండలంలో 6వేల మట్టి నమూనాలు సేకరించి పరీక్షించగా ఫలితాలు వచ్చాయి. కరీంనగర్ భూసార పరీక్ష కేంద్రంలో పరీక్షించగా ఫలితాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. ఏప్రిల్ 2న సదరు భూసార కార్డులను అందజేయనున్నారు. సూక్ష్మ ధాతువులే కీలకం పంట విత్తిన నుంచి అవి మొలకెత్తడం, పైరు ఎదుగుదల, కాత, నాణ్యతతో కూడిన దిగుబడి, సూక్ష్మ ధాతువులపైనే ఆధారపడి ఉంటుంది. భూసార పరీక్షలో ఇవి తేలనున్నాయి. జింకు లోపిస్తే మొక్కల ఎదుగుదల సరిగా ఉండదు. మెగ్నీషియం తక్కువుంటే పత్రహరితం తయారవదు. అలాగే ఐరన్ లోపముంటే ఆకులు త్వరితగతిన ఎండిపోతుంటాయి. బోరాన్ లేకపోతే పంట ఏపుగా ఎదిగినా కాయలు పరిపక్వత లేక నిస్సారంగా ఉంటాయి. అపరాలు పండించాలనుకునే వారికి భూమిలో సల్ఫర్ అవసరం. సల్ఫర్ ఉంటేనే నూనె తయారయ్యే పరిస్థితి ఉంటుంది. 16 రకాల పోషకాలు అవసరం మొక్క ఎదగడానికి 16రకాల పోషకాలు అవసరం. జింకు, బోరాన్, ఐరన్, మాంగనీస్, ఫాస్పరస్, పొటాషియం, నైట్రోజన్, కాల్షియం, కాపర్, సల్ఫర్, మెగ్నీషియం, మాలిబ్యూడినం, క్లోరిన్, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అవసరం. సేంద్రియ విధానం నుంచి రసాయనిక ఎరువుల వినియోగం పెంచుతూ వస్తుండటంతో గత 15ఏళ్లలో గణనీయమైన ప్రతికూల మార్పులు సంభవించాయి. రైతులు అధిక దిగుబడులు ఆఽశించి ఎక్కువగా రసాయనిక ఎరువులు వాడుతున్నారు. దీనివల్ల నేల కాలుష్యం, నీటి కాలుష్యాలు పెరుగుతున్నాయి. కొంత కాలానికి నేల తన సహజ స్వభావాన్ని కోల్పొనుంది. తర్వాత ఆ నేలలు ఆమ్లయుతంగా లేదంటే క్షారయుతంగా తయారవుతాయి. ఎన్ని ఎరువులు వేసినా ఎంత పెట్టుబడి పెట్టిన పంటలు సరిగ్గా పండవు. ప్రభుత్వం నిర్వహించే భూసార పరీక్షలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. మూస ధోరణిలో పంటలను సాగు చేయకుండా భూమిలో ఏ ఏ లోపాలున్నాయో తెలుసుకుని సస్యరక్షణ చర్యలు చేపట్టడం ఉత్తమం. దీంతో పెట్టుబడి తగ్గనుండగా నాణ్యమైన పంట చేతికొస్తుంది. – రణధీర్రెడ్డి, ఏడీఏ -
ఆలయాల అభివృద్ధికి ఎంపీ కృషి
రాయికల్(జగిత్యాల): నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు అన్నారు. రాయికల్ మండలం రామాజీపేట గ్రామంలో సీతారాముల క ల్యాణ వేదికకు ఎంపీ నిధులు మంజూరు చే యగా నిర్మించిన కల్యాణ వేదికను శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో మండల అ ధ్యక్షుడు ఆకుల మహేశ్, పట్టణ అధ్యక్షుడు కు ర్మ మల్లారెడ్డి, కిసాన్ మోర్చా నాయకులు కోల శంకర్, నాయకులు బోయిని నరేందర్, ఎనుగంటి రాజు, ఆర్మూర్ నరేందర్, కనికారపు రాజేశ్, గంగారెడ్డి, తిరుపతి పాల్గొన్నారు. -
కాశీకి వెళ్తూ... అనంత లోకాలకు..
మానకొండూర్: తన తల్లి అస్థికలు కాశీలోని గంగా నదిలో కలిపేందుకు మానకొండూర్కు చెందిన రామోజు శ్రీనివాస్(55) కుటుంబ సభ్యులతో కలిసి రైలులో వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు రైలు ప్రమాదంలో గురువారం రాత్రి మృతిచెందాడు. శ్రీనివాస్ కుల వృతి(గోల్డ్ వర్క్) చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన తల్లి మణెమ్మె 3 నెలల క్రితం చనిపోగా.. ఆమె అస్థికలు కాశీలోని గంగా నదిలో కలిపేందుకు గురువారం ఉదయం రైలులో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బయలు దేరారు. మార్గమధ్యలో మహారాష్ట్ర సేవాగ్రామ్ వద్ద శ్రీనివాస్ తాగునీరు కోసం గురువారం రాత్రి రైలు దిగాడు. అదే సమయంలో అటుగా వస్తున్న రైలు ఢీకొనడంతో శ్రీనివాస్ ప్రమాదవశాత్తు అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కళ్ల ముందే ఈ ప్రమాదం జరగడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. అంజన్న మాలధారుల ఫోన్లు చోరీఇల్లంతకుంట(మానకొండూర్): రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్లోని పెద్దమ్మ ఆలయంలో నిద్రిస్తున్న హనుమాన్ మాలధారుల 9 ఫోన్లు, రూ.9వేల నగదు గురువారం రాత్రి చోరీకి గురయ్యాయి. గ్రామస్తులు తెలిపిన వివరాలు. గ్రామంలోని పెద్ద మ్మ ఆలయంలో 12 మంది హనుమాన్ మాలధారులు నిద్రిస్తుండగా 9 మంది ఫోన్లు పోయినట్లు తెలిసింది. సెల్ఫోన్లు దొంగలించిన వ్యక్తి 12 మంది స్వాములలో ఒకరికి ఫోన్చేస్తూ బెజ్జంకిలో ఫలానా చోట మీ సెల్ఫోన్లు ఉన్నా యి తీసుకెళ్లండని ఫోన్చేయగా వెళ్లి 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. మిగతా 5 ఫోన్లు అడిగితే రూ.20వేలు తన దగ్గర ఉన్న 5 ఫోన్లలో ఒకదానికి పంపించాలని దాని పిన్నంబర్ కూడా చెప్పాలని కండీషన్ పెడుతున్నాడు. ఈ విషయంపై ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ను వివరణ కోరగా బాధితులు ఫిర్యాదు చేశారని కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని నారా యణపూర్లోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దత్తత శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలోని స్వామివారి లడ్డూకు రూ.70వేల వేళం పాటపాడా రు. ఈ లడ్డూను గ్రామానికి చెందిన వంగల లింగారెడ్డి–శోభ దంపతులు దక్కించుకున్నారు. బచ్చు మోహన్ రూ.40వేలతో స్వామి వారి వ్రతానికి మెట్లు చేయించారు. ఎల్లారెడ్డిపేట అశ్విని ఆస్పత్రి వైద్యుడు సత్యనారాయణస్వామి రూ.50వేలతో అన్నదానం చేశారు. సర్పంచ్ దొమ్మాటి నర్సయ్య, ఉపసర్పంచ్ మోతె మధుసూదన్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సాబేరబేగం, వైస్చైర్మన్ గుండాడి రామ్రెడ్డి, డీటీ ఎలుసాని ప్రవీణ్కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ మోతె లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. -
గురి తప్పని బాణం
కరీంనగర్స్పోర్ట్స్/ఎలిగేడు: పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన యువ ఆర్చర్ తానిపర్తి చికిత శుక్రవారం బ్యాంకాక్లో జరిగిన ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ టోర్నీ స్టేజ్–1లో బంగారు, రజత పతకాలు సాధించింది. మిక్స్డ్ టీమ్ విభాగంలో గోల్డ్ మెడల్, మహిళల టీమ్ విభాగంలో సిల్వర్ మెడల్ అందుకుంది. కాంపౌండ్ మిక్స్డ్ టీం విభాగంలో రజత్ చౌహాన్, తానిపర్తి చికిత జోడీ 158–156 పాయింట్ల తేడాతో మలేషియాపై విజయం సాధించి బంగారు పతకం కై వసం చేసుకున్నారు. కాంపౌండ్ మహిళల టీం విభాగంలో తానిపర్తి చికిత, రాజ్ కౌర్, తేజల్ సాల్వేలతో కూడిన జట్టు ఫైనల్లో కజకిస్థాన్పై 227–229 తేడాతో తలపడి రజత పతకాన్ని సాధించారు. -
ఐస్క్రీం వాహనాలకు నో ఎంట్రీ
స్వగ్రామానికి వలసజీవి మృతదేహం కోరుట్లరూరల్: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగిన్పెల్లి గ్రామానికి చెందిన కొండ్ర రాజేశ్ (36) 20 రోజుల క్రితం దుబాయ్లో మృతిచెందగా శుక్రవారం ఆయన మృతదేహాన్ని స్వ గ్రామానికి తీసుకొచ్చారు. స్థానికులు తెలిపిన వివరాలు.. రాజేశ్ పదేళ్ల క్రితం దుబాయ్ వెళ్లి వస్తున్నాడు. ఇక్కడే సోరియాసిస్ వ్యాధి సోకింది. వ్యాధి నివారణ కోసం అప్పులు చేశాడు. అప్పులు తీర్చేందుకు 3 నెలల క్రితం మళ్లీ దుబాయ్ వెళ్లాడు. అక్కడ వ్యాధి మరింత వ్యాప్తి చెంది శరీరంలోని అన్ని భాగాలకు విస్తరించగా దుబాయ్లోనే చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో వ్యాధి తీవ్రత ఎక్కువై 20 రోజుల క్రితం మృతిచెందాడు. మృతుడికి భార్య, మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
బాబోయ్.. ఇదేం పక్షి?
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణశివారులోని కేసీ క్యాంపు వద్ద ఉన్న ఓ తోటలో శుక్రవారం మనిషిని పోలిన తల ఉన్నట్లు ఉండే వింత పక్షి కనబడింది. కాకతీయ కెనాల్ బ్రిడ్జి పక్కన ఉన్న తోటలో ఈ పక్షిని అడే ఉన్న కోతులు తరమడంతో ముళ్లపొదల్లో చిక్కుకుంది. తీవ్రంగా గాయపడగా.. గమనించిన భాస్కర్ అనే వ్యక్తి, నలుబాల వేణుగోపాల్ రక్షించి, పశు వైద్యాధికారి రవీందర్రెడ్డి వద్దకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. అనంతరం కరీంనగర్లోని డీర్ పార్కుకు తరలించారు. – హుజూరాబాద్ -
వాళ్లు మనోళ్లే.. నో ట్యాక్స్!
కరీంనగర్ కార్పొరేషన్: మున్సిపల్ ట్యాక్స్లకు వాళ్లు అతీతులు. రూ.లక్షల్లో బకాయి పడ్డా వాళ్లపై కనీస చర్య ఉండదు. కొంతమంది ప్రభుత్వ ఉత్తర్వుల పేరిట, మరికొందరు తమకున్న పలుకుబడితో ఏళ్లుగా ట్యాక్స్ ఎగవేస్తూ వస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపులో డిమాండ్కు తగిన వసూళ్లు రాబట్టలేక నోటీసులు ఇచ్చి అధికారులు మమ అనిపిస్తున్నా రు. షరామామూలుగానే మరో ఆర్థిక సంవత్సరాన్ని మొండి బకాయి వసూళ్లు లేకుండానే దాటేస్తున్నారు. రూ.లక్షల్లో బకాయిలు ఆర్థిక సంవత్సరం ముగియడానికి మూడు రోజులే గడువు ఉంది. నగరపాలకసంస్థ అధికారులు పన్ను వసూళ్లను వేగవంతంచేశారు. మొండి బకాయిదారులపై దృష్టి సారించా రు. ఈ మొండి బకాయిదారుల్లో పెద్దలు అధికంగా ఉండడంతో రాజకీయ, అధికారిక ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారనే వి మర్శలున్నాయి. అందులోనూ ప్రభుత్వశాఖలకు సంబంధించిన బకాయిలే అధికంగా ఉండడం గమనార్హం. కలెక్టరేట్ ఎదురుగా ఉన్న రెవెన్యూ అసోసియేషన్ రూ.75 లక్షల బకాయిలకు గాను అధికారుల ఒత్తిడితో ఇటీవల రూ.5లక్షల చెక్కు ఇచ్చినట్లు సమాచారం. గతేడాది బకాయిలు చెల్లించకపోతే, నగరపాలక సంస్థ సిబ్బంది సముదాయంలోని దుకాణాలకు తాళం వేశారు. దీంతో కిరాయిదారులు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. కిరాయిదారుల నుంచి ప్రతి నెలా అద్దె వసూలు చేస్తున్నా, ఆస్తి పన్ను కట్టకపోవడం అప్పట్లోనే వివాదాస్పదమైంది. లక్షల రూపాయలు ఎవరి ఖాతాలోకి పోతున్నాయంటూ ఆరోపణలు వినవచ్చాయి. ఈ ఏడాది అదే పరిస్థితి ఏర్పడింది. రూ.70 లక్షలు చెల్లించకపోతే దుకాణాలకు తాళంవేసేందుకు బల్దియా అధికారులు సిద్ధమవుతున్నారు. ఇక ప్రైవేట్ వ్యక్తుల్లోనూ లక్షల రూపాయల పన్నుల నుంచి అనధికారికంగా మినహాయింపు పొందుతున్న వాళ్లు పదుల సంఖ్యల్లో ఉన్నారు. కాపువాడకు చెందిన లక్ష్మి రూ.21,92,735, అలుగునూరుకు చెందిన సంతోష్ రూ.16,73,580, రాంనగర్కు చెందిన లలిత రూ.13,69,696, గాంధీరోడ్లోని పద్మ పేరిట రూ.13,30,955, వావిలాలపల్లిలోని విపంచి చిట్ఫండ్ సంస్థ రూ.10,31,866 బకాయి చెల్లించాల్సి ఉంది. టీఎన్జీవోకు మినహాయింపుపై పెండింగ్ నగరంలోని టీఎన్జీవో సముదాయం రూ.28,94,450 చెల్లించాల్సి ఉండగా.. సొసైటీ కావడంతో 1991లోనే ఇ లాంటి భవనాలకు ట్యాక్స్ మినహాయింపు ఉందని టీఎన్జీవో నేతలు జీవో చూపుతున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక మున్సి పల్ చట్టంలో వచ్చిన మార్పులతో మినహాయింపు నుంచి సొసైటీలను తొలగిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై టీఎన్జీవో రాష్ట్ర నేతలు అప్పీల్ చేసుకోగా, ప్రస్తుతం సీఎంవోలో పెండింగ్లో ఉన్నట్లు చెబుతున్నా రు. పన్ను మినహా యింపు కొనసాగించాలని టీఎన్జీవో నేతల అర్జీని అంగీకరించినట్లు కాని తిరస్కరించినట్లు ప్రభుత్వం తేల్చకపోవడంతోనే పన్ను చెల్లించ డం లేదంటున్నారు. ఏదేమైనా వేల రూ పాయలు బకాయి పడ్డ సామాన్యుల ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తున్న నగరపాలకసంస్థ అధికారులు, రూ.లక్షలు బకాయి పడుతున్న పెద్దల జోలికి వెళ్లడంలేదనే అపవా దును మూట కట్టుకుంటున్నారు. -
వలకు చిక్కిన డెవిల్ ఫిష్
శంకరపట్నం: మండలంలోని కేశవపట్నం వాగులో మత్స్యకారుని వలలో ఓ రాకాసి చేప చిక్కింది. కేశవపట్నం వాగులో శుక్రవారం మత్స్యకారులు చేపలు పట్టారు. తాడవేని సమ్మయ్య వాగులో వల వేయగా వింత ఆకారంలో ఓ చేప చేపడింది. వలలోంచి బయటకు తీసి ఇది డెవిల్ ఫిష్గా గుర్తించారు. జలాశయాల్లోని చేపలను ఆది ఆహారంగా తీసుకుంటుందని తెలిపారు. సిటీలో పవర్ కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ నిర్వహణ పనులు చేపడుతున్నందున శనివారం సాయంత్రం4.30 నుంచి 5.30 గంటల వరకు కట్టరాంపూర్ మెయిన్ రోడ్, తిరుమలనగర్, రెడ్డికాలనీ, శ్రేయం అపార్ట్మెంట్, మైనారిటీ స్కూల్, గిద్దె పెరుమాండ్ల ఆలయం, హనుమాన్నగర్, తిరుమల్నగర్, ప్రొఫెసర్ జయశంకర్ కాలనీ, శ్రీనివాస్నగర్ కాలనీ, గణేశ్నగర్ బైపాస్, కమాన్, ఎన్టీఆర్ విగ్రహం, గణేశ్నగర్, అల్కాపురి, ఐటీఐ కళాశాల, ఐటీహబ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. 30న జిల్లాస్థాయి క్రీడా పాఠశాల ఎంపిక పోటీలుకరీంనగర్స్పోర్ట్స్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆదేశాల ప్రకారం ఈనెల 30న కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో జిల్లాస్థాయి క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాశాఖ అధికారి వి.శ్రీనివాస్ గౌడ్ తెలి పారు. మండల స్థాయిలో ఎంపికై న విద్యార్థులు వయసు ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్, కులం సర్టిఫికెట్, ప్రోగ్రెస్ కార్డ్, రెండు ఫొటోలతో ఉదయం 9 గంటలకు స్టేడియంలో రిపోర్ట్ చేయాలని సూచించారు. -
విద్యుత్ భవన్ ఎదుట ఆర్టిజన్ల ధర్నా
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ ఉద్యోగులతో సమానంగా ఆర్టిజన్లకు సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ గురువారం తెలంగాణ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో కరీంనగర్లోని విద్యుత్ భవన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఒకే సంస్థలో రెండు విధాల సర్వీస్ రూల్స్ అమలు చేస్తూ సుమారు 19 వేల మంది ఆర్ట్జీన్లను ఇబ్బందులకు గురిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్ సంస్థ తక్షణమే వివక్షను తొలగించాలని విజ్ఞప్తి చేసారు. పీస్రేట్ కార్మికులకు 11 జిఓ ప్రకారం కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు సంస్థలో విలీనం చేయాలని ఆర్టిజన్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఏప్రిల్ 8వ తేదీ వరకు సమస్య పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. -
రూ.50 కోట్ల టెండర్లు రద్దు!
కరీంనగర్ నగరపాలకసంస్థలో రూ.50 కోట్ల టెండర్లు రద్దయ్యాయి. ప్రత్యేక అధికారి పాలనలో రూ.50 కోట్లతో నిర్వహించ తలపెట్టిన 87 పనుల టెండర్పై పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి నీలినీడలు కమ్ముకొన్నాయి. పనుల్లో అంచనాలు భారీగా పెంచారని, ప్రజలు కోరుకొన్న చోట కాకుండా అనవసర ప్రాంతాల్లో పెట్టారంటూ కొత్తగా ఎన్నికై న కార్పొరేటర్లు తప్పుపడుతూ వచ్చారు. ఈ క్రమంలో పాత టెండర్లు రద్దు కావడం రాజకీయంగా దుమారం రేపుతోంది. – కరీంనగర్ కార్పొరేషన్ – వివరాలు IIలోu -
వ్యాపారవేత్తగా ఎదగాలంటే ఆత్మవిశ్వాసం ముఖ్యం
కొత్తపల్లి(కరీంనగర్): వ్యాపారవేత్తగా ఎది గేందుకు ఆత్మవిశ్వాసం ముఖ్యమని అల్ఫో ర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ సూర్యనగర్లోని ఆల్ఫోర్స్ మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో కరస్పాండెంట్ వి.రవీందర్ రెడ్డి అధ్యక్షతన ‘ఆవిష్కార్–2026’ పేరిట గురువారం నిర్వహించిన రాష్ట్రస్థాయి కామర్స్– మేనేజ్మెంట్ మీట్కు ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ యువ త చదువుతో పాటు వివిధ రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. వ్యాపారవేత్తగా రాణించేందుకు స్పష్టమైన ఆలోచనతో మార్కెట్ను పరిశోధించి ఫైనాన్షియల్ ప్లానింగ్తో తొలుత చిన్నగా ప్రారంభించాలన్నారు. స్కిల్క్ డెవలప్ చేసుకుంటూ నెట్వర్కింగ్ పెంచుకుంటూ మార్కెటింగ్పై ఫోకస్ చేయాలని, ఇందులో ఫెయిల్యూర్స్ను కూడా స్వీకరించాలని సూచించారు. వి.రవీందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలోని నైపుణ్యాలను వెలికితీయడానికి మీట్లు దోహదపడతాయన్నారు. రాష్ట్రస్థాయి కామర్స్–మేనేజ్మెంట్ మీట్లో యంగ్ మేనేజర్, యంగ్ కామర్స్ అవార్డ్, కార్పొరేట్ వాక్, స్ట్రెస్ ఇంటర్వ్యూ, నర్తనశాలతో పాటు 19 రకాల పోటీలు నిర్వహించామని, ఇందులో 15 కళాశాలల విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించాని తెలిపారు. ఓవరాల్ చాంప్గా నిలిచిన హన్మకొండ వాగ్ధేవి డిగ్రీ కళాశాల విద్యార్థులకు శాతవాహన యునివర్సిటీ కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ విభా గాధిపతి డా.హరికాంత్ బహుమతులు అందించారు. ● అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి -
రారండోయ్ వేడుక చూద్దాం
● నేడు శ్రీరామనవమి ● ముస్తాబైన ఆలయాలు కరీంనగర్ కల్చరల్/ఇల్లందకుంట: నేటి శ్రీరామనవమి వేడుకలకు జిల్లాలోని ఆలయాలు జిల్లాలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే కల్యాణోత్సవానికి ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12గంటలకు సీతారాముల కల్యాణ వేడుక జరిపించనున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు, కూలర్లు, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్చార్జి ప్రణవ్బాబు, ఆర్డీవో రమేశ్బాబు పరిశీలించారు. జమ్మికుంట రైస్మిల్లర్ల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించనున్నారు. నగరంలోని మహాశక్తి ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. పెళ్లి వేడుకకు హాజరయ్యే భక్తులకు వేద పండితుల ఆశీర్వచనంతోపాటు తలంబ్రాలను అందజేయనున్నారు. 25వేల మందికి అన్నదానం చేయనున్నారు. మహాశక్తి ఆలయంలో నిర్వహించే సీతారామచంద్రస్వామి వివాహ వేడుకలకు ప్రతి ఒక్కరూ తరలిరావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. -
ట్రినిటిలో క్యాంపస్ ప్లేస్మెంట్
కరీంనగర్రూరల్: బొమ్మకల్లోని ట్రినిటి ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ 94 మంది ఎంపికయ్యారు. ఎంపికై న వారిని ట్రినిటి విద్యాసంస్థల వ్యవస్థాపకుడు దాసరి మనోహర్రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి అభినందించారు. ప్రిన్సిపాల్ నాగేంద్రసింగ్, వైస్ ప్రిన్సిపాల్ కిశోర్, డైరెక్టర్ రాజగోపాల్, ఏవో రాజశేఖర్రెడ్డి, ప్లేస్మెంట్ అధికారి ప్రవీణ్కుమార్, హెచ్వోడీలు రజిత, శ్రీధర్, బలరాం పాల్గొన్నారు. కొత్తపల్లి(కరీంనగర్): లోయర్ మానేరు డ్యాంలో అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు చేపట్టిన ప్రొక్లెయిన్, టిప్పర్లను కొత్తపల్లి పోలీసులు సీజ్ చేశారు. కొత్తపల్లి ఎస్హెచ్వో, ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్ వివరాల మేరకు ఎల్ఎండీ రిజర్వాయర్లో అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు చేపడుతున్నారని నీటి పారుదలశాఖ ఏఈఈ సీహెచ్ కిరణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ నెల 23న కేసు నమోదు చేశారు. నల్గొండ జిల్లా కిట్టండ్రు మండలం కురుమర్తి గ్రామానికి చెందిన శివసత్య ఇంజినీరింగ్ కంపెనీ సూపర్వైజర్ గుర్రం రవి గత కొద్దిరోజులుగా ఎల్ఎండీలో మట్టి తవ్వకాలు చేపడుతున్నట్లు గుర్తించారు. రవిని అదుపులోకి తీసుకుని, రెండు టిప్పర్లు, ఒక ప్రొక్లెయిన్ను సీజ్ చేశారు. -
పొద్దు పొద్దున్నే ఘోరం
జగిత్యాలక్రైం/రాయికల్/రుద్రంగి: జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామానికి చెందిన తాపీమేసీ్త్ర రమణయ్య, ఆయన వద్ద పనిచేస్తున్న మనోహర్, ప్రభావతి, రాయికల్ మండలం అయోధ్యతోపాటు రామారావుపల్లికి వలస వచ్చిన ఉప్పు రమాదేవి, రుద్రంగిలో తాపీమేస్తీగా పనిచేస్తున్న దేవండ్ల రామయ్య, దుబ్బాల రత్తమ్మ, అయోధ్యలో తాపీమేసీ్త్ర వద్ద పనిచేస్తున్న దుబ్బాల కిరణ్, పునుగోటి వెంకటేశ్ శ్రీరామనవమి సందర్భంగా వారివారి స్వగ్రామాలకు హరికృష్ణ ట్రావెల్స్లో బుధవారం సాయంత్రం 4.30గంటలకు బయల్దేరారు. వీరిలో ప్రభావతి, రమాదేవి మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే చనిపోయారు. ఘటనలో దేవండ్ల రామయ్య కూడా మృతిచెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చిట్టి డబ్బులు కట్టేందుకు.. నెల్లూరూ జిల్లా దుత్తలూరు మండలం దాసరవెల్లికి చెందిన వెంకటేశ్, కిరణ్ అయోధ్యలో పోలయ్య తాపీమేసీ్త్ర వద్ద రెండు నెలలుగా ఉపాధి పొందుతున్నారు. శ్రీరామనవమి సందర్భంగా తాము తీసుకున్న చీటీ డబ్బులు చెల్లించేందుకు పోలయ్య భార్య రత్తమ్మతో కలిసి బయల్దేరారు. ఈ ప్రమాదంలో వెంకటేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేష్కు భార్య, కుమారుడు, కూతురు సంతానం. రత్తమ్మ, కిరణ్ తీవ్రంగా గాయపడ్డారు. కొడుకును కాపాడి.. తల్లి సజీవదహనం మార్కాపురం జిల్లా కనిగిరి మండలం మాడాదివరిపల్లికి చెందిన ఉప్పు మాలాద్రి భార్య రమాదేవి, కొడుకు మనోహర్తో కలిసి ఆరేళ్లుగా రామారావుపల్లిలో మేసీ్త్రగా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నాడు. స్వగ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాల కోసం రమాదేవి కుమారుడితో కలిసి బయల్దేరింది. బస్సులో మంటలు చెలరేగగానే.. రమాదేవి కొడుకును బయటకు తోసేసింది. అప్పటికే మంటలు భారీగా ఎగిసిపడడంతో రమాదేవి కాలిబూడిదైనట్లు మనోహర్ విలపిస్తూ చెప్పాడు. రామయ్య కుటుంబసభ్యుల్లో ఆందోళన కాలి బూడిదైన బస్సులో రుద్రంగికి వలస వచ్చిన తాపీమేసీ్త్ర దేవాండ్ల రాములు ఉండడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడుకు చెందిన రాములు నాలుగేళ్లుగా రుద్రంగిలో భవన నిర్మాణ పనులు చేయిస్తున్నాడు. ప్రమాదం జరగడానికి 10 నిమిషాల ముందు కుమారుడు వేణుతో ఫోన్లో మాట్లాడాడని, తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. బస్సు దగ్ధమై మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో బూడిదవడంతో మృతి చెందాడా..? లేదా..? అన్నది డీఎన్ఏ ఆధారంగా నిర్ధారిస్తామని పోలీసులు తెలిపినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. -
రూ.50 కోట్ల టెండర్లు రద్దు!
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో రూ.50 కోట్ల టెండర్లు రద్దయ్యాయి. ప్రత్యేక అధికారి పాలనలో రూ.50 కోట్లతో చేపట్టనున్న 87 పనుల టెండర్పై పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి నీలినీడలు కమ్ముకొన్నాయి. పనుల్లో అంచనాలు భారీగా పెంచారని, ప్రజలు కోరుకొన్నచోట కాకుండా అనవసర ప్రాంతాల్లో పెట్టారంటూ కొత్తగా ఎన్నికై న కార్పొరేటర్లు తప్పుపడుతూ వచ్చారు. ఈ క్రమంలో పాత టెండర్లు రద్దు కావడం రాజకీయంగా దుమారం రేపుతుండగా,అధికారులు మాత్రం టెండర్లురద్దుపై స్పష్టత ఇవ్వడం లేదు. ● టెండర్ రద్దు మున్సిపల్ ఎన్నికలకు ముందు యూఐడీఎఫ్ (అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలెప్మెంట్ ఫండ్) కింద నగరంలో రూ.50 కోట్లు కేటాయించారు. రూ.50 కోట్ల తో 87 పనులు చేపట్టేం దుకు గతేడాది అక్టోబర్ 25వ తేదీన జీవో నంబర్ 715 ద్వారా సీడీఎంఏ పరిపాలనా మంజూరు ఇచ్చింది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వాటా రూ.40 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.10 కోట్లు. 87 పనులకు సంబంధించి టెండర్ పిలిచారు . పనుల్లో 25 పనులకు ఎవరూ బిడ్ దాఖలు చేయ లేదు. 62 పనులకు కాంట్రాక్టర్ల నుంచి స్పందన లభించింది. ఇందులో 21 పనులకు టెండర్ ఓపెన్ చేశారు. మిగితా 41 బిడ్లను ఓపెన్ చేయాల్సి ఉండగా,నగరపాలకసంస్థ ఎన్నికలు రావడం, పాలకవర్గం ఏర్పడడంతో పునరాలోచన పడింది. ● 66 డివిజన్లకు కేటాయింపు! రూ. 50 కోట్ల టెండర్ రద్దు చేయగా, ఈ నిధులను 66 డివిజన్ లకు కేటాయించేలా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.ఒక్కో డివిజన్ కు రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి విలువైన పనులకు స్థానిక కార్పొరేటర్ల నుంచి ప్రతి పాదనలు తీసుకొంటున్నట్టు తెలిసింది. ఇదిలా ఉంటే టెండర్ల రద్దు రాజకీయ దుమారానికి కారణమైంది. కాగా టెండర్ల రద్దుపై అధికారులు స్పందించడం లేదు. ● 31 న బల్దియా బడ్జెట్ సమావేశం నగర పాలక సంస్థ బడ్జెట్ ప్రత్యేక సమావేశం ఈ నెల 31 వ తేదీన నిర్వహించనున్నారు. ఈ ఆర్ధిక సంవత్సరం ముగియనుండడంతో వార్షిక బడ్జెట్ సమావేశం అనివార్యమయింది. ఇప్పటికే ఎజెండా కాపీలు సభ్యులకు అందచేసినట్లు సమాచారం. 66 డివిజన్లకు కేటాయింపు? కమీషన్ల కోసమే రద్దు చేశారు కమీషన్ల కోసమే బీజేపీ, కాంగ్రెస్ కలిసి నగరపాలకసంస్థలో రూ.50 కోట్ల టెండర్లను రద్దుచేశాయని మాజీ మేయర్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. గురువారం నగరంలోని తారక హోటల్లో మాట్లాడుతూ ప్రత్యేకాధికా రి పాలనలో రూ.50 కోట్లతో 87 పనులు చేపట్టేందుకు టెండర్ పిలిచారన్నారు. విలీన ప్రాంతాలకు పనుల్లో ప్రాధాన్యత ఇవ్వాలంటూ, పరిపాలనా మంజూరు ఇస్తూ సీడీఎంఏ జీఓ 715 జారీచేశారని తెలిపారు. పాలకవర్గం ఏర్పడ్డాక మరిన్ని నిధులు తీసుకురావాల్సింది పోయి, పాత రూ.50 కోట్ల టెండర్ను బుధవారం రాత్రికి రాత్రే రద్దు చేశారన్నారు. రూ.50 కోట్ల టెండర్లను ఎందుకు రద్దు చేశారో బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ చెప్పాలన్నారు. వారికి తెలియకపోతే మంత్రి పదవులకు రాజీనామా చేయాలన్నారు. ఏ ప్రాతిపదికన టెండర్లురద్దు చేశారో, కలెక్టర్, కమిషనర్ చెప్పాలన్నారు. బీజేపీ నాయకుల బంధువులకు టెండర్ అప్పగించేందుకే పాత టెండర్ రద్దు చేశారన్నారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి
● రాచర్ల బొప్పాపూర్లో విషాదం ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల):రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కప్పుసాసర్ డివైడర్ను ఆటో ఢీన్న ఘటనలో చికిత్స పొందుతున్న రాచర్ల బొప్పాపూర్కు చెందిన బొమ్మనవేణి రాజు(39) బుధవారం మృతిచెందాడు. ఈ సంఘటన స్వగ్రామంలో విషాదం నింపింది. ఎస్సై రాహుల్రెడ్డి తెలిపిన వివరాలు. రాజు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈనెల 23న ఉదయం కరీంనగర్ డెయిరీకి చెందిన పాల క్యాన్లతో ఎల్లారెడ్డిపేటకు వస్తుండగా స్థానిక పాతబస్టాండ్లో ఆటో అదుపుతప్పి కప్పుసాసర్ డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో రాజు అపస్మారక స్థితికి వెళ్లాడు. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో మూడు రోజులపాటు మృత్యువుతో పోరాడి బుధవారం వేకువజామున మరణించాడు. మృతునికి భార్య ఉన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్రెడ్డి తెలిపారు. పాముకాటుతో వృద్ధురాలి మృతి ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధ ర్మారం మండలం పైడిచింతల పల్లి పంచాయతీ శివారులోని గురుపల్లికి చెందిన నాంపెల్లి ల స్మమ్మ(78) బుధవారం పాముకాటుతో మరణించినట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. తన ఇంటి ఎదుట చింతపండు ఆరబెట్టి అక్కడే నిద్రకు ఉపక్రమించింది. ఈ సమయంలోనే విషపాము కుడిచేతిపై కాటు వేసింది. మెలకువ వచ్చిన వృద్ధురాలు కేకలు వేసింది. స్థానికులు వెంటనే పెద్దపల్లి, అక్కడ నుంచి కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. మృతురాలి కూతురు నీరజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. -
డ్రంకెన్ డ్రైవ్లో 84 మందికి జరిమానాలు
వేములవాడ: పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో డ్రంకెన్డ్రైవ్లో పట్టుబడ్డ 84 మందిని కోర్టులో హాజ రుపరిచినట్లు టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. 17 మందికి ఒక్కొక్కరికి రూ.5వేలు, 46 మంది కి రూ.2వేలు చొప్పున జరిమానా, 21 మందికి రూ.4వేలు చొప్పున జరిమానా విధిస్తు వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి బుధవారం తీర్పు వెల్లడించినట్లు వివరించారు. మందుబాబులకు ఎస్సైలు రామ్మోహన్, సముద్రాల రాజు కౌన్సెలింగ్ నిర్వహించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ ● ప్రమాదానికి కారణమైన ఇద్దరికి జైలు పెద్దపల్లిరూరల్: మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులైన వారికి జైలుశి క్ష, జరిమానా విధిస్తూ సెకండ్ క్లాస్ ఇన్చార్జి జ డ్జి మంజుల బుధవారం తీర్పునిచ్చారని ట్రాఫి క్ సీఐ అనిల్కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోనిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ప ట్టుబడ్డ 39 మందిని కోర్టులో హాజరుపర్చామ న్నారు. వారిలో శాంతినగర్కు చెందిన నల్గొండ కోటేశ్వర్కు రెండు రోజులు, తమిళనాడు రాష్ట్రంలోని కరూర్కు చెందిన జగదీశ్కు మూ డురోజులపాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చారని వివరించారు. మిగతా 37మందికి రూ.36,500 జరిమానా విధిస్తున్నట్లు తీర్పులో పేర్కొన్నారని సీఐ పేర్కొన్నారు. ఏప్రిల్లో సమ్మర్ స్పెషల్ రైలు రామగుండం: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షి ణ మధ్య రైల్వే వచ్చే ఏప్రిల్లో హైదరాబాద్ – గోరఖ్పూర్ మధ్య ప్రత్యేక రైలు సౌకర్యం కల్పిస్తోంది. హైదరాబాద్ దక్కన్ నాంపల్లి–గోరఖ్పూర్ (07075) వైపు ఏప్రిల్ 3, 10, 17, 24వ తేదీల్లో, గోరఖ్పూర్ – హైదనాబా ద్(07076) వైపు ఏప్రిల్ 5, 12, 19, 26వ తే దీల్లో ప్రత్యేక రైలు రాకపోకలు సాగించనుంది. సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాలలో హాల్టింగ్ ఉంది. మరోవైపు.. ఓఖా – మధురై మధ్య గతంలో వారాంతపు పద్ధతిన రాకపోకలు సాగించిన మధురై( 19559/60) రైలును రెగ్యులర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా మార్చినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తామని పేర్కొంది. ఇది అకోలా, పూర్ణా, నాందేడ్, నిజామా బాద్, కామారెడ్డి, కాచిగూడ, మహబూబ్నగర్, కర్నూల్ సిటీ, ద్రోణాచలం, గుత్తి, కడప, ఎర్రగుంట్ల మార్గంలో రాకపోకలు సాగించ నుంది. ఇదే రూట్లో రామేశ్వరం–ఓఖా రైలు ఉండడంతో మరో రూట్ నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం నుంచి నడిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు. రెండిళ్లలో చోరీచొప్పదండి: రెవెళ్లిలోని రెండిళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇరుగురాల సరీన్ కుమార్ నాలుగు రోజుల క్రితం మహారాష్ట్రలో బంధువు చనిపోతే ఇంటికి తాళం వేసి కుటుంబంతో వెళ్లాడు. బుధవారం వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉంది. పోలీసుల విచారణలో సరీన్ ఇంటిలో అరతులం బంగారం పోయినట్లు గుర్తించారు. క్లూస్ టీంతో విచారణ జరుపుతున్నారు. కాగా సరీన్ ఇంటి సమీపంలో నివాసం ఉండే రేకుల లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా దొంగతనం జరిగినట్లు గుర్తించారు. లక్ష్మారెడ్డి ఖమ్మం జిల్లాలో ఉండే తన చిన్న కూతురు దగ్గరకు వెళ్లడం, అక్కడే ఉండటంతో చోరీకి ఏ వస్తువులు గురయ్యాయో తెలియలేదు. సరీన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
ఆయుష్.. పనితీరు భేష్
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గల ఆయుష్లో యునాని, హోమియోపతి, ఆయుర్వేదిక్ వైద్యసేవలు మెరుగ్గా అందిస్తున్నారు. వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నా.. జిల్లా లోని పలు ఆస్పత్రుల నుంచి ఆయుర్వేదిక్ వైద్యం కోసం ముగ్గురు వైద్యులు, యునాని, హోమి యోపతి వైద్యం కోసం ఒక్కోవైద్యుడిని డిప్యూటేషన్పై నియమించారు. దీంతో పెద్దపల్లి ఆయుష్ ఆస్పత్రిలో వైద్య సేవలు నిరంతరం అందుతాయనే నమ్మకం పేషెంట్లలో పెరిగింది. ఫలితంగా జిల్లాలోని మండలాలు, గ్రామాల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా పేషెంట్లు పెద్ద సంఖ్యలో పెద్దపల్లికి వైద్యం కోసం వస్తున్నారు. రోజూ 200 మందికి సేవలు ఆయుష్ ఆస్పత్రికి వచ్చే పేషెంట్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇక్కడ యునాని, ఆయుర్వేదిక్, హోమియోపతి సేవల కోసం ప్రతీనిత్యం సుమారు 200 మంది వరకు వస్తున్నారు. తమ వ్యాధి (బీపీ, షుగర్, కీళ్లనొప్పులు, గుండె, కిడ్నీ తదితర వ్యాధులు) నయం చేసుకునేందుకు వచ్చే పేషెంట్లకు అవసరమైన వైద్యపరీక్షలను ఇదే ఆవరణలోని టీహబ్ ద్వారా ఉచితంగానే చేయిస్తున్నారు. జబ్బు ఎలాంటిదైనా సరే.. వైద్యం అందిస్తుండడంతో పేషెంట్లకు నమ్మకం పెరుగుతోంది. కలెక్టర్ ప్రత్యేక చొరవ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయుష్ ఆస్పత్రులకు దాదాపు ఏడాదిగా మందుల సరఫరా అరకొరగానే ఉంది. దీంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్న వారికి అవసరమైన మందులను అందించలేకపోయారు. ఈ విషయాన్ని ఆయుష్ ఆస్పత్రి ఇన్చార్జి డాక్టర్ మారుతి.. ఇటీవల కలెక్టర్ కోయ శ్రీహర్ష దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ వెంటనే ఆస్పత్రిని సందర్శించి వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. అవసరమైన మందులను కేంద్ర ప్రభుత్వమే తయారు చేసే ఉత్తరాఖండ్ నుంచి తెప్పించేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ఏ ఆస్పత్రిలో మందులు లేకున్నా.. పెద్దపల్లి ఆయుష్ కేంద్రంలో మందులను అందుబాటులో ఉంచుతూ మెరుగైన వైద్యం అందించేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు డెప్యుటేషన్పై వైద్యుల నియమాకం ప్రత్యేక చొరవ చూపుతున్న కలెక్టర్ శ్రీహర్ష -
కరీంనగర్లో సినీనటి మెహరిన్ సందడి
కరీంనగర్: కరీంనగర్లో ప్రముఖ సినీనటి మెహరిన్ బుధవారం సందడి చేశారు. సుభాష్నగర్లో నూతనంగా ఏర్పాటైన డాల్ఫిన్ హాస్పిటల్స్ను ప్రారంభించారు. డాల్ఫిన్ హాస్పిటల్స్ ఫర్ ఉమెన్ – చిల్డ్రెన్ సంస్థను కరీంనగర్తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక, నాణ్యమైన, అందుబాటు ధరల్లో వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసినట్లు హాస్పిటల్ యాజమాన్యం తెలిపారు. డాల్ఫిన్ హాస్పిటల్స్ ఫర్ ఉమెన్, చిల్డ్రెన్ ప్రారంభం -
రెస్టారెంట్లో ఆకస్మిక తనిఖీలు
గోదావరిఖని: నగరంలోని హైకింగ్ బార్ అండ్ రెస్టారెంట్లో బుధవారం ఆకస్మికంగా తనిఖీలు చేశామని ఫుడ్ ఇన్స్పెక్టర్ అరవింద్రెడ్డి తెలిపారు. వంటగది, పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు, పిండి పదార్థాల్లో బొద్దింకలు ఉండడాన్ని అధికారులు గుర్తించారు. 35 కిలోల గోధుమపిండి, 10 కిలోల మైదాపిండిని పారబోయిచారు. నిల్వఉంచిన మాంసం, గడువు ముగిసిన పెరుగు, తందూరి చికెన్, పచ్చి చికెన్ స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశామన్నారు. నిల్వ ఉంచిన సలాడ్లను నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని గుర్తించి పారబోశామన్నారు. ఆహార తయారీలో ఉపయోగిస్తున్న సింథటిక్ ఫుడ్ కలర్స్ను(ఆహార రంగులు) గుర్తించి వాటిని తొలగించాలని నిర్వాహకులకు సూచించామని అన్నారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం లైసెన్సింగ్ నిబంధనలు (2011) ఉల్లంఘించినందుకు రెస్టారెంట్ యజమానులపై కేసు నమోదు చేయనున్నట్లు వివరించారు. -
బల్దియా లైన్మెన్కు విద్యుత్ షాక్
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేస్తున్న బొమ్మకల్కు చెందిన లైన్మెన్ శివ విద్యుత్షాక్తో తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం అలుగునూరులో స్ట్రీట్ లైట్ బిగిస్తున్న స మయంలో పక్కనే ఉన్న 11 కేవీ లైన్ తగలడంతో విద్యుత్ షాక్కు గురైనట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న మేయర్కొలగాని శ్రీనివా స్ వెంటనే ఆసుపత్రికి తరలించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి చేరుకొని, శివ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేసే సిబ్బంది విధుల నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మున్సి పల్ కార్మికులకు భద్రతా పరికరాలు అందించాలని మాజీ మేయర్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు. విద్యుత్షాక్తో గాయపడిన శివను ఆసుపత్రిలో పరామర్శించారు. రూ.3.46 లక్షలు కాజేసిన సైబర్ నేరస్తులువీర్నపల్లి(సిరిసిల్ల): ఆన్లైన్ మోసగాళ్ల ఉచ్చులో ప డి ఓ రైతు భారీగా నగదు కోల్పోయిన ఘటన వీర్నపల్లి మండలంలో అడవిపదిరలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాలు. అడవిపదిరకు చెందిన పొలగాని లచ్చయ్యకు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి.. తాము ధని బ్యాంక్ ప్రతినిధులమని నమ్మించారు. భారీ మొత్తంలో లోన్ ఇప్పిస్తామని చెప్పి ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో పలు విడతల్లో రూ.3,46,799 కాజేశారు. నగదు పంపిన తర్వాత సదరు వ్యక్తుల నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన లచ్చయ్య పోలీసులను బుధవారం ఆశ్రయించారు. -
లక్కీ మిరానీ.. మిరాకిల్
సప్తగిరికాలనీ(కరీంనగర్): కరీంనగర్కు చెందిన లక్కీ మిరానీ తన అసాధారణ ప్రతిభతో ప్రపంచ గుర్తింపు పొందుతున్నాడు. బాల్యంలోనే చూపు కోల్పోయినప్పటికీ, సంకల్పం, క్రమశిక్షణతో చీకటిని జ్ఞాన వెలుగుగా మలచుకుంటూ తనదైన శైలిలో మన్ననలు పొందుతున్నాడు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా శోధించబడుతున్న దృష్టి లోపం గల యువకుడిగా లక్కీ మిరానీ రికార్డు సాధించాడు. మిరానీ 10వ తరగతిలో 10 జీపీఏ, ఇంటర్లో 95.80శాతం మార్కులు సాధించాడు. యూజీసీ ఎంట్రెన్స్లో ఆలిండియా 1వ ర్యాంక్ సాధించి, తొలి ప్రయత్నంలోనే యూజీసీ నెట్ క్లియర్ చేశాడు. చదువుల్లోనే కాకుండా క్రీడల్లోనూ తన ప్రతిభ చాటాడు. గోల్బాల్ క్రీడలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించి జాతీయస్థాయిలో కాంస్య పతకం సాధించాడు. లక్కీ విజయాల వెనుక అతని తల్లిదండ్రులు దీపక్ మిరానీ, ముస్కాన్ మిరానీ నిలవడం విశేషం. ప్రస్తుతం పాలిటికల్ సైన్స్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న లక్కీ, భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్లో సేవ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. -
మంచి మందులు ఇచ్చారు
కీళ్ల నొప్పులతో బాధ పడుతూ ఆయుష్ ఆస్పత్రికి వచ్చా. వైద్యులు పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. రోగం నయమైంది. అవసరమైన అన్నిరకాల పరీక్షలను కూడా ఇక్కడి టీహబ్లోనే చేయించారు. ఆస్పత్రికి వస్తే అన్ని వసతులు ఉండడంతో పాటుమందులు కూడా అందిస్తున్నారు. – నిర్మల, సుల్తానాబాద్ సేవలందిస్తున్నాం జిల్లాలోని మండలాలు, గ్రామాల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా పేషెంట్లు వస్తున్నారు. మందుల కొరతను అధిగమించేందుకు కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అవసరమైన అన్నిరకాల మందులను తెప్పించి అందుబాటులో ఉంచారు. పేషెంట్లకు అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ మారుతి, ఆయుష్ ఆస్పత్రి ఇన్చార్జి -
శభాష్ టీం కరీంనగర్
కరీంనగర్స్పోర్ట్స్: సీఎంకప్–2025 పోటీల్లో జిల్లా జట్టు రాష్ట్రంలో మూడోస్థానాన్ని కై వసం చేసుకోగా.. 44 విభాగాల్లో 55 మెడల్స్ సాధించిన క్రీడాకారులను కలెక్టర్ చిత్రామిశ్రా అభినందించారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులు, కోచ్లు, ఒలింపిక్, క్రీడాసంఘాల బాధ్యులు బుధవారం కలెక్టర్ను కలిశారు. డీవైఎస్వో శ్రీనివాస్ గౌడ్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్రెడ్డి, ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్రెడ్డి, యోగా అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి సిద్ధారెడ్డి, కోచ్లు ఉన్నారు. -
ఇంధనం.. బంధ్నం!
కరీంనగర్ అర్బన్: పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం కరీంనగర్ను తాకిందా..? బంకులే కృత్రి మ కొరత సృష్టించాయా..? అంటే అవునో కాదో అర్థం కాని దుస్థితి. ప్రభు త్వ యంత్రాంగం ఇంధన కొరత లేదని స్పష్టం చేస్తుండగా, వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బా రులు తీరగా పలు బంక్లు మూసివేశారు. మరికొన్నింట్లో పవర్ పెట్రోలే ఉందంటూ జిమ్మిక్కులు చేశారు. ఇంధన కొరత పుకార్లతో బుధవారం ఉదయం నుంచే వాహనదారులు బంకుల వద్ద బారులు తీరగా ని యంత్రించేందుకు సిబ్బంది పాట్లు పడ్డారు. జిల్లాలో 159, నగరంలో 39 పెట్రోల్ బంకులుండగా అంతటా ఇదే పరిస్థితి. కృత్రిమ కొరత పలు పెట్రోల్ బంకుల యజమానులు ఇంధన కృత్రిమ కొరత సృష్టించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని భావించి నగరంలోని పలు బంకులు మూసివేశారు. ఇంకొందరు పవర్ పెట్రోలే ఉందని తమ విక్రయాలు పెరిగేలా జిమ్మిక్కులు చేశారు. పవర్ పెట్రోల్ పాత నిల్వ ఉండగా ఇటీవలే ధర పెరిగింది. దీంతో పాత నిల్వకు కొత్త ధరతో విక్రయించి సొమ్ము చేసుకున్నారు. కొత్త నిబంధనలే కారణమా? ఆయిల్ కంపెనీలు కొత్త నిబంధనలు అమలు చేస్తుండడమే ఇందుకు కారణమని తెలు స్తోంది. గతంలో ఆయిల్ సంస్థలు డబ్బులు తీసుకోకుండానే తొలుత డీజిల్, పెట్రోల్ సరఫరా చేసేవి. మూడు నాలుగు రోజులు గా ఎంత ఇంధనం కావాలంటే ఆ మేరకు డబ్బులు చెల్లిస్తేనే సరఫరా చేస్తామని ఆయి ల్ సంస్థలు స్పష్టం చేయడంతో పలు బంకులకు సరఫరా ఆగిపోయింది. పాతబకాయిలు జమచేయడంతో పాటు కొత్తగా స్టాక్కు డబ్బులు ముందే చెల్లించాలని చెబుతుండడంతో నగరంలో పలు చోట్ల బంకులు మూతపడ్డాయి. దీంతో పెట్రోల్ ఉన్న బంకులపై ఒత్తిడి పెరిగి ఒక్క రోజులోనే స్టాకు అయిపోతోంది. మళ్లీ స్టాకు వచ్చేవరకు ఆ బంకులు మూతపడుతున్నాయి. ఆయిల్ కంపెనీలు ఉద్దేశ పూర్వకంగానే బంకులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పెట్రోలు బంకుల యజమానులు ఆరోపిస్తున్నారు. ప్రేక్షక పాత్రలో సివిల్ సప్లయ్ కంపెనీలు, పెట్రోల్ బంకులు మధ్య ఏర్పడిన వివాదంతో బంకులు మూతపడుతు న్నా పౌరసరఫరాలశాఖ చోద్యం చూస్తోంది. పెట్రోల్, డీజిల్కు కొరత లేదని చేతులు దులిపేసుకుంటోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆలస్యం చేస్తే ఇంధనం లభించదనే ఆందోళనతో జనం బంకులకు పరుగులు తీస్తున్నా, నగరంలో బంకులు మూతపడినా పౌరసరఫరాలశాఖ స్పందించకపోవడం గమనార్హం. -
యూపీఐ లంచం!
కరీంనగర్ అర్బన్ ఎకై ్సజ్ సీఐ గుండెటి రాము వేములవాడలో పనిచేస్తున్న సమయంలో బెల్లం వ్యాపారి వద్ద రెండేళ్లపాటు తన మిత్రుడైన ఉపాధ్యాయుడు జక్కని వేణు ద్వారా యూపీఐ పేమెంట్లతో లంచం తీసుకున్నాడు. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు వెళ్లగా ఈనెల 18న రాము ఇంట్లో సోదాలు చేయగా.. రూ.20 లక్షల నగదు లభ్యమైంది. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న లారీని విడిచిపెట్టేందుకు యూపీఐ ద్వారా రూ.15వేల లంచం తీసుకున్న కేసులో గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ ఎస్సైగా పనిచేసిన వెంకటేశ్వర్లును కరీంనగర్ ఏసీబీ అధికారులు ఈనెల 24న అరెస్టు చేశారు. వెంకటేశ్వర్లు ప్రస్తుతం సిద్దిపేట త్రీ టౌన్ ఎస్సైగా ఉన్నారు.కాంట్రాక్టర్లు, ఉద్యోగుల వద్ద లంచం తీసుకున్న కేసులో కరీంనగర్ వర్క్ అకౌంట్స్ జాయింట్ కార్యాలయ సూపరింటెండెంట్ ఈగల మధుసూదన్ను ఈనెల 16న ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఓ బినామీ అకౌంట్ నుంచి యూపీఐ ద్వారా రూ.14,77,003 లంచం తీసుకున్నాడని వచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.● జిల్లాలోని అవినీతి ఉద్యోగులపై ఏసీబీ, ఇంటెలిజెన్స్, విజిలెన్స్ వర్గాలు నిఘా పెంచాయి. రెవెన్యూ, పోలీసు, ఎకై ్సజ్శాఖ, రిజిస్ట్రేషన్శాఖ, మున్సిపల్, రవాణాశాఖలతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలపై దృష్టి సారించాయి. లంచగొండి అధికారులపై కన్నేశాయి. ● రెవెన్యూశాఖలో ప్రతి పనికో రేటు నిర్ణయించి కొందరు అధికారులు కిందిస్థాయి సిబ్బంది ద్వారా లంచం తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. మీసేవా కేంద్రాలు, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యక్తుల ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, వివిధ రకాల సర్టిఫికెట్ల వ్యవహారాల్లో వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ● జిల్లాలోని పలువైన్స్లు, బార్ల నుంచి ఎకై ్సజ్శాఖ, పోలీసుశాఖ అధికారులకు మామూళ్లు అందుతున్నాయని చర్చ జరుగుతోంది. పలు వైన్స్లు, బార్ల నుంచి ఎవరు రెగ్యులర్గా మామూళ్లు వసూలు చేస్తున్నారు? ఏ రూపంలో తీసుకుంటున్నారు? ఏఏ స్థాయి అధికారులకు ఎంత మొత్తంలో వెళ్తోంది, పలువురు అధికారులు వాడిన యూపీఐ లావాదేవీలపై ఏసీబీ అధికారులు నజర్ పెట్టారు. ● రిజిస్ట్రేషన్శాఖలో కొందరు అధికారులు ఓపెన్ప్లాట్కు కొంత, నివాసానికి కొంతమొత్తాన్ని నిర్ణయించి డాక్యుమెంట్ రైటర్ల ద్వారా లంచం తీసుకుంటున్నారన్నది బహిరంగ రహస్యమే. రిజిస్ట్రేషన్శాఖలో పనిచేసే ప్రైవేట్ సిబ్బంది ద్వారా జరుగుతున్న అవినీతి, యూపీఐ లావా దేవీలపై ఫోకస్ పెడుతున్నట్లు సమాచారం. -
పెట్రోల్, డీజిల్ కొరత పుకార్లే
పెట్రోల్, డీజిల్ కొరత లేదు. అదంతా సోషల్ మీడియాలో ప్రచారం మాత్రమే. వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పుకార్లను పట్టించుకోవద్దని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి గట్టు నర్సింగరావు స్పష్టం చేశారు. జిల్లాలోని పలు పెట్రోల్ బంకుల్లో సరఫరాలో జాప్యం వల్లే తప్పా ఇంధనం సమృద్ధిగా ఉందని వెల్లడించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వినియోగదారుల ఇబ్బందుల క్రమంలో బుధవారం డీఎస్వో ‘సాక్షి’తో మాట్లాడారు. ఆయా సమస్యలపై పరిస్థితులను వివరించారు. ఎవరైనా ఇంధన కృత్రిమ కొరత సృష్టిస్తే 9154249727 నంబర్కు ఫిర్యాదు చేయాలని, కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. –కరీంనగర్ అర్బన్ -
పెన్షనర్ల నిరసన
కరీంనగర్టౌన్: పెన్షనర్లకు ఆర్థిక నష్టం కల్గించేలా ఇటీవల పార్లమెంట్లో ఆమోదించిన పెన్షన్ వాలిడేషన్ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం కలెక్టరేట్ ఎదురుగా జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు ఉస్మాన్పాషా, మహేందర్రెడ్డి మాట్లాడుతూ పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఉన్న చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతామని అన్నారు. పెన్షనర్ల సంఘం బాధ్యులు జీవీ.మనోహర్కుమార్గౌడ్, రామచంద్రం, నాగమోహన్, శంకరస్వామి, రాజిరెడ్డి ఉన్నారు. -
పోక్సో కేసులపై ఫోకస్
కరీంనగర్క్రైం: జిల్లాలో నమోదవుతున్న పోక్సో కేసులు, మహిళలకు సంబంధించిన నేరాలపై దర్యాప్తు వేగవంతం చేయాలని సీపీ గౌస్ ఆలం స్పష్టం చేశారు. కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం నెలవారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ 2024వరకు పెండింగ్లో ఉన్న కేసులు, ఈ ఏడాది నమోదైన తీవ్రమైన నేరాలపై సమీక్షించారు. ఆస్తి సంబంధిత, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, పోక్సో కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, కొరత ఉందన్న వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. అనవసరంగా పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకుంటే ప్రమాదకరమని హెచ్చరించారు. శిక్షణ ఐపీఎస్ సోహం సునీల్, అదనపు డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు వేణుగోపాల్, శ్రీనివాస్జి, విజయ్కుమార్, వెంకటస్వామి, మాధవి, యాదగిరిస్వామి, సతీశ్ పాల్గొన్నారు. డిజిటలైజేషన్లో యువత పాత్ర కీలకంకరీంనగర్ సిటీ: డిజిటలైజేషన్లో యువత ముందుండి వికసిత భారత్ నిర్మాణానికి పునా దులు వేయాలని శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఉమేష్కుమార్ సూచించారు. శాతవాహన విశ్వవిద్యాలయంలో ‘ట్రాన్స్ఫర్మేటివ్ రోల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ ది జర్నీ ఆఫ్ 2047‘ అనే అంశంపై రిజి స్ట్రార్ సతీశ్కుమార్ అధ్యక్షతన రెండు రోజుల జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన వీసీ ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఆర్థిక రంగంలో డిజిటల్ చెల్లింపులతో బ్యాంకింగ్ సేవల్లో ఆధునిక మార్పులొచ్చాయన్నారు. విద్యారంగంలోనూ 2047వరకు ఈ మార్పులు ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందాలని సూచించారు. ఆల్ ఇండియా కామ ర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ జాస్తి రవికుమార్ మాట్లాడుతూ డిజిటలైజేషన్తో వాణిజ్య, ఉత్పత్తి రంగాల్లో 2020 నుంచి 2030 వరకు అభివృద్ధికరమైన వసతులు వస్తున్నా యన్నారు. సదస్సు డైరెక్టర్, కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ హరికాంత్ మాట్లాడుతూ ఈ సెమినార్లో 130 పరిశోధన పత్రాలు సమర్పించడం జరిగిందని తెలిపారు.నేడు బార్ అసోసియేషన్ ఎన్నికలుకరీంనగర్క్రైం: కరీంనగర్ బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం జిల్లాకోర్టులో జరగనున్నట్లు ఎన్నికల అధికారి మారోజు రామకృష్ణాచారి తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ ఉంటుందని తెలిపారు. మొత్తం 1,080 మంది న్యాయవా దులు ఓటుహక్కు కలిగి ఉన్నారని వివరించా రు. ఫలితాలు రాత్రి వరకు వెల్లడించనున్నట్లు తెలిపారు. కోర్టు ఆవరణలో అభ్యర్థులు మాత్ర మే ప్రచారం చేసుకోవాలని తెలిపారు. ప్రెసిడెంట్ స్థానానికి ముగ్గురు, వైస్ ప్రెసిడెంట్ జనరల్ స్థానానికి నలుగురు, మహిళా స్థానానికి ఇద్దరు, జనరల్ సెక్రటరీ స్థానానికి నలుగురు, జాయింట్ సెక్రటరీ జనరల్ స్థానానికి ఇద్దరు, ట్రెజరర్కు ఐదుగురు, లైబ్రరీ సెక్రెటరీకి ముగ్గు రు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీకి ఇద్దరు, సీనియర్ ఈసీ మెంబర్కు నలుగురు, సీనియర్ ఈసీ మహిళకు ఇద్దరు, జూనియర్ ఈసీ జనరల్లో ఎనిమిది మంది, జూనియర్ ఈసీ మహిళాస్థానంలో ఐదుగురు పోటీ పడుతున్నారు. జాయింట్ సెక్రటరీ మహిళాస్థానానికి ఎం.అనురాధ ఏకగ్రీవమయ్యారు. 29 లోగా లెక్కలు చెప్పాలికరీంనగర్ కార్పొరేషన్: ఇటీవల జరిగిన నగర పాలకసంస్థ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయాన్ని ఈ నెల 29వ తేదీ లోగా సమర్పించాలని నగరపాలకసంస్థ కమి షనర్ ప్రఫుల్దేశాయ్ ఒక ప్రకటనలో తెలిపా రు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం 45 రోజుల్లో తమ వ్యయ లెక్కలను విధిగా సమర్పించాలని పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీలోగా సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకులకు లెక్కలు అందజేయాలన్నారు. నగరంలోని 1వ డివిజన్ నుంచి 14వ డివిజన్ వరకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎ.కిరణ్కుమార్, 15 నుంచి 28 వరకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ పి.వి.శివనాగేందర్రెడ్డి, 29 నుంచి 42 వరకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎ.అశోక్కుమార్, 43 నుంచి 54 వరకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ టి.స్వర్ణలత, 55 నుంచి 66 వరకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ కె.జమునారాణిలు ఎన్నికల వ్యయ సహాయ పరిశీలకులుగా ఉన్నారన్నారు. గడువులోగా ఆయా డివిజన్లకు చెందిన అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయ లెక్కలు అప్పగించాలని సూచించారు. -
తండ్రి పేరిట ఉన్న నగదు దేశ రక్షణ నిధికి జమ
రామగుండం: ఓ రిటైర్డ్ హెచ్ఎం తండ్రి పేరిట ఉన్న నగదును దేశ రక్షణ నిధికి జమ చేసి దేశంపై ఉన్న అభిమానాన్ని చాటారు. ఆంధ్రప్రదేశ్లోని నూజివీడుకు చెందిన కోట వెంకటశివశాస్త్రి రామగుండం హైస్కూల్లో సుదీర్ఘకాలం హెచ్ఎంగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు. తన తండ్రి ప్రఖ్యాత హరికథా భాగవతార్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట సచ్చిదానందశాస్త్రి వయోభారంతో 2024 సెప్టెంబర్లో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో తన తండ్రి పేరిట ఉన్న రూ.లక్ష నగదును సోమవారం భగత్సింగ్ వర్ధంతిని పురస్కరించుకొని నూజివీడు ఎస్బీఐ బ్యాంకులో దేశ రక్షణ నిధి అకౌంట్ నంబర్కు డిపాజిట్ చేశారు. ఈ విషయమై సదరు రిటైర్డ్ హెచ్ఎం తన పూర్వ విద్యార్థుల వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశారు. రిటైర్డ్ హెచ్ఎంకు పూర్వ విద్యార్థులు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. రిటైర్డ్ హెచ్ఎం నిర్ణయంపై హర్షం -
‘ఆపరేషన్ యాత్రి సురక్షా’లో ప్రతిభ
రామగుండం: సికింద్రాబాద్ డివిజన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగంలో నిర్వహించే ‘ఆపరేషన్ యాత్రి సురక్షా’లో భాగంగా పలు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లలో ఆర్పీఎఫ్ సిబ్బంది ఆకస్మిక సోదాలు నిర్వహించడం పరిపాటి. ఈ సందర్భంగా అనుమానితులను గుర్తించి, చోరీకి గురైన సామగ్రిని స్వాధీనం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే రామగుండం రైల్వే భద్రత దళానికి చెందిన ఏఎస్ఐ మాసాని నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ ప్రదీప్కుమార్ నిర్వహించిన ఆపరేషన్ యాత్రి సురక్షాలో ఓ దొంగను గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించారు. ఈక్రమంలో పెద్దపల్లి, మంచిర్యాల రైల్వేస్టేషన్ల మధ్య నడిచే రైళ్లలో ప్రయాణికుల మొబైల్ ఫోన్లు 8 దొంగిలించినటు్ల్ ఆర్పీఎఫ్ సిబ్బంది వెల్లడించారు. వాటి విలువ సుమారు రూ.61వేల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఇందులో ప్రతిభ కనబరిచిన ఏఎస్ఐ నాగరాజు, హెచ్సీ ప్రదీప్కుమార్ను ఉత్తమ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు సికింద్రాబాద్ డివిజనల్ ఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ నరేంద్రకుమార్వర్మ ప్రకటించారు. ఈవిషయాన్ని రామగుండం సీఐ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఉద్యోగులను డివిజనల్ కమిషనర్ ఆలకుంట నవీన్కుమార్, రామగుండం ఆర్పీఎఫ్ ఎస్సై క్రాంతి తదితరులు అభినందించారు. ఈనెలలో రూ.61వేల విలువైన వస్తువుల రికవరీ ఉత్తమ సిబ్బందిగా గుర్తించిన రైల్వే అసిస్టెంట్ కమిషనర్ -
ఘనంగా ‘సాక్షి’ వార్షికోత్సవం
ఎలిగేడు: పెద్దపల్లి జిల్లా ఎలిగేడులోని శ్రీకోదండ రామాలయంలో మంగళశారం సాక్షి దినపత్రిక 18వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ‘సాక్షి’ పాఠకులు, అభిమానుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. సర్పంచ్ కప్పల ప్రవీణ్ మాట్లాడుతూ, నిజాలను నిర్భయంగా రాస్తూ, నిత్యం ప్రజల పక్షాన నిలుస్తూ లక్షలాది మంది పాఠకుల ఆదరణ పొంది ఉన్నతస్థాయిలో నిలిచిందన్నారు. అనంతరం స్థానిక రిపోర్టర్ రంగు తిరుపతిని సన్మానించారు. సాక్షి యాజమాన్యానికి, రిపోర్టర్లకు, సిబ్బందికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ సర్పంచులు మండిగ రాయనర్సయ్య, బాసంపల్లి కొండయ్య, బూర్ల వెంకటసత్యం, మాజీ ఎంపీటీసీ గొల్లే భూమేశ్, ఆర్యవైశ్య సంఘం మండల ప్రధాన కార్యదర్శి తాటిపల్లి సతీశ్బాబు, అంబేడ్కర్ సంఘం నాయకుడు కవ్వంపల్లి చంద్రయ్య, వివిధ సంఘాల నాయకులు బుర్ర అజయ్, బుర్ర గణేశ్, మహేందర్, రాకేశ్, రాంరెడ్డితోపాటు ‘సాక్షి’ పాఠకులు, అభిమానులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ఎదుట ధర్నా
పెద్దపల్లి: అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యంరావు కోరారు. ఈమేరకు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేశారు. ముత్యంరావు మాట్లాడుతూ, 35 ఏళ్లుగా గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు కనీస వేతనం చెల్లించాలని, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. నాయకులు జ్యోతి, ర్గవి, సుజాత, మేఘమాల, స్వప్న, హేమలత, రాజేశ్వరి ఓదేశ్వరి, చంద్రకళ, స్వప్న, సుమలత, స్వరూప, సునీత, రమ తదితరులు పాల్గొన్నారు. -
భారతావనికి ఎన్టీపీసీ వెలుగులు
గోదావరిఖని/జ్యోతినగర్: దక్షిణాదితోపాటు దేశవ్యాప్తంగా విద్యుత్ అందించడంలో పెద్దపల్లి జిల్లా రామగుండంలోని తెలంగాణ ప్రాజెక్టు అగ్రభాగాన నిలిచిందని ఆ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) చందన్ కుమార్ సామంత వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ టెంపరరీ టౌన్షిప్లో మంగళవారం ఏర్పాటు చేసిన జర్నలిస్టుల సమావేశంలో ఈడీ మాట్లాడారు. ప్రాజెక్టులోని 200 మెగావాట్ల రెండో యూనిట్, 500 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల రెండు యూనిట్లు(4వ, 6వ) వార్షిక మరమ్మత్తులు పూర్తిచేసుకుని విద్యుత్లోకి వచ్చాయని వెల్లడించారు. త్వరలోనే తెలంగాణ స్టేజ్–2కు రానుందని, తెలంగాణ ప్రభుత్వం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్(పీపీఏ) ప్రక్రియ వేగవంతం చేసిందన్నారు. వేసవిలో డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించామని అన్నారు. ప్రజెక్టులో బొగ్గు , ఇంధన నిల్వలు.. థర్మల్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు, ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ఈడీ సామంత అన్నారు. 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్, 10 మెగావాట్ల గ్రౌండ్ మౌంట్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు ఉత్పత్తిలో ఉండగా, ఈనెలలోనే 176 మెగావాట్ల (120 మెగావాట్లు గ్రౌండ్, 56 మెగావాట్లు ఫ్లోటింగ్) సోలార్ ప్రాజెక్టులు కమిషనింగ్కు సిద్ధమయ్యాయని తెలిపారు. గ్రిడ్ నుంచి ఫస్ట్ టైమ్ చార్జింగ్ కోసం ఎదురుచూస్తున్నట్లు వివరించారు. ఆర్థిక సంవత్సరంలో రామగుండం థర్మల్ ప్రాజెక్టు 13.4 బిలియన్ యూనిట్లు(86.3 శాతం), తెలంగాణ స్టేజ్–1 ప్రాజెక్టు 9.3 బిలియన్ మెగావాట్లు(91.4శాతం ) విద్యుత్ ఉత్పత్తి చేశాయని ప్రకటించారు. పారదర్శకత, ప్రజావిశ్వాసాన్ని పెంపొందించడంలో మీడియా కీలకపాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. పర్యావరణ హిత చర్యలు పటిష్టం విద్యుత్ ఉత్పత్తితోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఈడీ స్పష్టం చేశారు. తక్కువ కార్బన్ ఉద్గారాల దిశగా బ్యాటరీ స్టోరేజ్ యూనిట్, కార్బనేటెడ్ బ్రిక్స్ తయారీ ప్రాజెక్టులు చేపట్టినట్లు వెల్లడించారు. పర్యావరణ నిబంధనల అమలులో భాగంగా ఎఫ్జీడీ వ్యవస్థ తెలంగాణ ప్రాజెక్టులో అమల్లో ఉండగా, రామగుండంలో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎఫ్జీడీ ద్వారా 1.35 టన్నుల జిప్సం సేకరించామని పేర్కొన్నారు. సంస్థ ప్రభావిత, పునరావాస గ్రామాల్లో విద్య, వైద్యం, వసతుల కల్పనకు సామాజిక సేవా బాధ్యతా పథకం నిధులు రూ.7 కోట్ల నుంచి రూ.15 కోట్లకు పెంచామని వెల్లడించారు. జనరల్ మేనేజర్లు ముకుల్ రాయ్, మనీష్ అగర్వాల్, అభిజిత్ దత్తా, బినోయ్ జోస్, తెలంగాణ ప్రాజెక్టు హెచ్వోడీ డీఎస్ రావత్, ఏజీఎం బిజయ్కుమార్ సిగ్దర్, సీఎస్సార్ ప్రతినిధులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. సోలార్, థర్మల్ విద్యుత్ సామర్థ్యాల పెంపు వేసవి డిమాండ్కు ముందస్తు ఏర్పాట్లు సమృద్ధిగా బొగ్గు, ఇందన నిల్వలు రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు ఈడీ చందన్ కుమార్ సామంత -
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె
పెద్దపల్లి: విద్యుత్ సంస్థలోని 23,667మంది ఆర్టిజన్లకు సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని ఆర్టిజన్స్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జేఏసీ చైర్మన్ తూళ్ల నాగరాజు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్క్లబ్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2016కు ముందు అన్నిఅర్హతలు ఉన్న వారందరినీ, ఆన్మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలన్నారు. అన్నివిభాగాల వారికి జీవో నంబర్11 ప్రకారం కనీస వేతన చట్టం, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు వర్తింపజేయాలన్నారు. లేనిపక్షంలో ఈనెల 26, 30వ తేదీల్లో డివిజన్ కార్యాలయాల వద్ద ధర్నా, ఏప్రిల్ 2న సర్కిల్ కార్యాలయాల ఎదుట వంటావార్పు చేస్తామని, ఏప్రిల్ 7న వరంగల్ డీసీఎల్ కార్యాలయం వద్ద మహాధర్నా చేస్తామని, అయినా స్పందించకుంటే ఏప్రిల్ 8న నిరవధిక సమ్మెకు వెళ్తామని స్పష్టం చేశారు. పాలకుర్తి మండలం బసంత్నగర్ధిలో పనిచేస్తున్న అర్టిజన్ గడ్డం జయదేవ్ను వేధిస్తున్న ఏఈపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు ఖలీమొద్దీన్, ఎం.కృష్ణారెడ్డి, ఎం.ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్టిజన్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా జేఏసీ నేత నాగరాజు -
విద్యుత్ షాక్తో మేకల కాపరి మృతి
సైదాపూర్: విద్యుత్ షాక్తో మేకల కాపరి, రెండు మేకలు మృతి చెందిన ఘటన సైదాపూర్ మండలం సర్వాయిపేటలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారంగా సర్వాయిపేటకు చెందిన బొల్లి సమ్మయ్య(49) ఆకునూర్ శివారులో మేకలు మేపుతున్నాడు. హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్కు చెందిన ఓ రైతు కోతుల బెడద తప్పించుకునేందుకు వరి చేను చుట్టూ కరెంట్ షాక్ పెట్టాడు. మేకలు మేపుతూ అటువైపుగా వెళ్లిన బొల్లి సమ్మయ్యకు రెండు మేకలకు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. హుజూరాబాద్ రూరల్ సీఐ పులి వెంకట్, సైదాపూర్ ఎస్సై స్వాతి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతునికి భార్య సరవ్వ, కుమారుడు ఉన్నారు. సీఎంకప్లో తృతీయ స్థానంకరీంనగర్: సీఎం కప్–2025లో రాష్ట్రస్థాయిలో కరీంనగర్ జిల్లా తృతీయస్థానం సాధించింది. హైదరా బాద్ ఎల్బీ స్టేడియంలో మంగళవారం జరిగిన ముగింపు వేడుకల్లో క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహ రి, షట్లర్ సైనా నెహ్వల్ చేతుల మీదుగా డీవైఎస్వో శ్రీనివాస్ ట్రోఫీ అందుకున్నారు. ఆదిలాబాద్ ప్రథమ, రంగారెడ్డి ద్వితీయ స్థానంలో నిలవగా కరీంనగర్ 79.4పాయింట్లతో తృతీయ స్థానం సాధించింది. కలెక్టర్ చిత్రామిశ్రా, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్ధన్రెడ్డి, తుమ్మల రమేశ్రెడ్డి, నాగిరెడ్డి సిద్ధారెడ్డి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. పేకాట ఆడుతూ పట్టుబడిన ఏఎస్సైపై వేటు?మెట్పల్లి: పేకాట ఆడుతూ పట్టుబడిన మెట్పల్లి ఏఎస్సై సత్యనారాయణను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు తెలిసింది. పట్టణంలోని రాంనగర్లో శనివారం రాత్రి ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు అక్కడకు వెళ్లి దాడి చేశారు. అందులో పట్టుబడిన పలువురిలో ఏఎస్సై సత్యనారాయణ ఉన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. కొన్ని నెలల్లో ఉద్యోగ విరమణ చేసే సత్యనారాయణ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది. -
‘పారాక్వాట్’ను నిషేధించాలి
కరీంనగర్: అత్యంత విషపూరితమైన పారాక్వాట్ గడ్డిమందును నిషేధించాలని రాష్ట్రస్థాయి వైద్య నిపుణులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలో ని ఐఎంఏ భవనంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.కిషన్ మా ట్లాడుతూ.. పారాక్వాట్కు కచ్చితమైన విరుగుడు లే కపోవడం అత్యంత ప్రమాదకరమన్నారు. స్వల్ప పరి మాణంలో సేవించినా ప్రాణాపాయం తప్పదని, ఆసుపత్రికి చేరినా చికిత్స అందించడం కష్టమని పేర్కొన్నారు. దీనికి ప్రత్యామ్నాయ మందులను రైతులకు అందుబా టులోకి తేవాలని సూచించారు. బీఎన్.రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గడ్డిమందు నిషేధంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం అన్నారు. డాక్టర్ పి.రంగారెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయంలో సులభత కోసం వాడుతున్న ఈ రసాయనం ప్రాణాంతకమైందని, రైతుల భద్రత దృష్ట్యా దీని వినియోగాన్ని నియంత్రించా లన్నారు. తానా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అరుణ్ కటారి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంట్లో ఈ మందు అందుబాటులో ఉండటం వల్ల క్షణికావేశంలో సేవించి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోందన్నా రు. బీఎన్.రావు మాట్లాడుతూ ఈ మందు ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతిని శ్వాస తీసుకోవడం కష్టమవుతుందని వివరించారు. ప్రభుత్వం దీనిపై కట్టుదిట్టమైన నియంత్రణలు అమలు చేయాలని, సురక్షిత ప్రత్యామ్నాయాలపై రైతులకు అవగాహన కల్పించాలని వైద్యులు కోరారు. ఐఎంఏ జిల్లా అధ్యక్షురాలు ఆకుల శైలజ, ప్రధాన కార్యదర్శి మహేశ్ బాబు, ట్రెజరర్ నీలిమా, అలీం, కాంగ్రెస్ డాక్టర్ వింగ్ చైర్మన్ వెంకటేశ్వర్లు, వైద్యులు శ్రీధర్, కిరణ్, రాంచందర్ పాల్గొన్నారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు పి.కిషన్ -
జాగ్రత్తలు తప్పనిసరి
ఒంటిపూట బడి..పెద్దపల్లి: ఎండల తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రప్రభుత్వం పాఠశాలలను ఈనెల 16 నుంచి ఒక్కపూటే నడిపిస్తోంది. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాతే విద్యార్థులను ఇంటికి పంపిస్తోంది. మధ్యాహ్నం తర్వాత బడిలేకపోవడంతో పిల్లలు ఆడుకునేందుకు బయటకు వెళ్తున్నారు. ఇలా అనేకమంది ఆటాపాటల్లో మునిగితేలుతున్నారు. ఇలాంటి ఆనంద సమయాల్లో విషాదాలు పొంచి ఉంటాయని తల్లిదండ్రులను గ్రహించాలి. పిల్లలపై శ్రద్ధ తీసుకోవాలి ఒంటిపూట బడిసమయంలోనూ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులపై మరింత శ్రద్ధ తీసుకోవాలి. పాఠశాలలో స్వచ్ఛమైన తాగునీటి వసతితోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రాథమిక చికిత్స కిట్లు అందుబాటులో ఉండేలా చూడాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశించారు. తరగతి గదుల్లో ఫ్యాన్లు తిరిగేటట్లు శ్రద్ధ వహించాలి. మధ్యాహ్న భోజనం నీడ కింద కూర్చుని తినేలా ఏర్పాట్లు చేయాలి. ఎండలో ఆటలాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బావులు, చెరువుల వద్దకు వెళ్లకుండా.. పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, ఉపాధిహామీలో మట్టి తీసిన గుంతల్లో ప్రస్తుతం నీరు నిల్వఉంది. విద్యార్థులు అటువైపు వెళ్లకుండా చూసుకోవాలి. బావుల్లో సరదా కోసం ఈత నేర్చుకునేందుకు వెళ్లిన పిల్లలు మునిగిపోయిన విషాద ఘటనలు ఏటా పదుల సంఖ్యలో ఉంటున్నాయి. డ్రైవింగ్ మోజులో.. ద్విచక్ర వాహనాలు, సైకిళ్లపై మోజుతో కొందరు విద్యార్థులు ఇళ్లలో చెప్పకుండా రోడ్డెక్కితే ప్రమాదాల బారిన పడే ఆస్కారం అధికంగా ఉంది. బడి వదలగానే కొందరు పిల్లలు సమయం దొరికిందని ఎండలో ఆడతారు. దీంతో వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇంట్లో ఖాళీగా వీడియో గేమ్స్, టీవీ, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. దృష్టిలోపాలతో పాటు మానసిక బలహీనులుగా మారే అవకాశం ఉంది. వీటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రులు సరదాగా సమయం కేటాయించి వారితో ఉంటూ ఆటలు ఆడిపించాలి. జాగ్రత్తలు అవసరం ఉదయాన్నే కచ్చితంగా అల్పాహారం పెట్టి పాఠశాలలకు పంపించాలి. నీళ్లసీసా వెంట ఉంచాలి. ఉదయం 7.30 గంటల్లోపు బడికి పంపించేందుకు శ్రద్ధ తీసుకోవాలి. మధ్యాహ్న భోజనం 12.30 గంటలకు వడ్డిస్తారు. దూరప్రాంతాల విద్యార్థులు ఎండలో నడిచి వెళ్లకుండా ఆటోలు తదితర వాహనాలు ఏర్పాటు చేసుకోవాలి.పిల్లలు మధ్యాహ్నం బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండేలా తల్లిదండ్రులు చూసుకోవాలి. ఎండలు ఎక్కువైన కొద్దీ పిల్లలు ఆహారం తీసుకునేందుకు మారాం చేసే అవకాశముంది. వీరికి ఇష్టమైన ద్రవ పదార్థాలు, పండ్లరసాలు ఎక్కువగా తీసుకునేలా చొరవ తీసుకోవాలి. – డాక్టర్ ఉదయ్ కుమార్, పీహెచ్సీ, గర్రెపల్లి పిల్లలను కంట కనిపెట్టాల్సిందే.. ఆడుకుంటూ వెళ్లి ప్రమాదాల బారిన పడే అవకాశం ఆటలపై దృష్టి సారించేలా చూస్తే బెటర్ -
తాళం వేసిన ఇంట్లో చోరీ
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం కల్లెడలో తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని దొంగలు సోమవారం రాత్రి చోరీకి పాల్ప డ్డారు. గ్రామానికి చెందిన గాండ్ల తిరుపతి ఇంటికి తాళం వేసి ఉపాధి నిమిత్తం ముంబయ్ వెళ్లాడు. దొంగలు చొరబడి పావుతులం బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి నగలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. మత్తు మందు చల్లి బంగారం చోరీజమ్మికుంట: మాటమాట కలిపి.. మత్తు మందు చల్లి రెండు తులాల బంగారం చోరీ చేసిన ఘటన జమ్మికుంట మండలం మడిపల్లిలో చోటు చేసుకుంది. టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం మడిపల్లి గ్రామానికి చెందిన కస్తూరి రమ పిండిగిర్ని నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి కర్చీఫ్ కట్టుకుని వచ్చి, పిండి పడుతారా అంటూ మాట కలిపి ముఖంపై మత్తుమందు స్ప్రే చేశాడు. స్పృహ కోల్పోగానే మెడలోని రెండు తులాల పుస్తెలతాడు చోరీ చేసి పారిపోయాడు. రమ స్పృహలోకి వచ్చి లబోదిబోమంటూ బోరున విలపించింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ తెలిపారు. కారు ఢీకొని ఒకరి మృతిజగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం చల్గల్– మోరపల్లి గ్రామాల మధ్య జగిత్యాల – రాయికల్ ప్రధాన రహదారిపై మంగళవారం రాత్రి కారు ఢీకొని ద్విచక్రవాహనదారుడు గాడిపల్లి లక్ష్మణ్ (40) మృతిచెందాడు. రాయికల్ మండలం సింగరావుపేటకు చెందిన లక్ష్మణ్ ద్విచక్ర వాహనంపై చల్గల్ నుంచి సింగరావుపేటకు వెళ్తున్నాడు. కారు అతివేగంగా వచ్చి వెనుక నుంచి లక్ష్మణ్ బైక్ను ఢీకొనడంతో కిందపడిపోయిన లక్ష్మణ్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. రూరల్ ఎస్సై ఉమాసాగర్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రైతు..కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం నల్లగుంటపల్లికి చెందిన రైతు వేల్పుల ఐలయ్య(65) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి వివరాల ప్రకారం.. ఈ నెల 20న ఐలయ్య తాను సాగు చేసిన కూరగాయాలను కరీంనగర్ మార్కెట్కు తరలించాడు. తిరిగి టీవీఎస్ ఎక్సెల్పై నల్లగుంటపల్లికి వెళ్తున్నాడు. దుర్శేడ్ బస్టాండ్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడడంతో కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
139మంది హజ్ యాత్రికులకు టీకాలు
కరీంనగర్: నగరంలోని షాలిమార్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన హజ్ కమిటీ ట్రైనింగ్ అండ్ వ్యాక్సినేషన్ క్యాంప్ను డీఎంహెచ్వో వెంకటరమణ, పీవో ఎంహెచ్ఎన్ డాక్టర్ సనా జవేరియా మంగళవారం సందర్శించారు. హజ్ యాత్రకు వెళ్లనున్న 139మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, వ్యాక్సినేషన్ చేశారు. 60 సంవత్సరాల పైబడిన వారికి ఎస్ఐవీ, మొనోకోకల్ మెనింజైటిస్ (క్యూఎంఎంవీ) టీకాలు ఇచ్చారు. 60ఏళ్లలోపు వారికి ఒక్కటే టీకా ఇచ్చారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సాజిద్, డిప్యూటీ డీఎంహెచ్వో రాజగోపాల్, మెడికల్ ఆఫీసర్ అలేఖ్య, హెల్త్ ఎడ్యుకేటర్ సరస్వతి, హజ్ కమిటీ సభ్యులు అజహార్, రియాజ్ అలీ, ఇర్ఫాన్ పాల్గొన్నారు. నార్మల్ డెలివరీలపై దృష్టి జిల్లాలోని పీహెచ్సీల్లో నార్మల్ డెలివరీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వో వెంకటరమణ సూచించారు. మంగళవారం తన కార్యాలయంలో ఆశా ఫెసిలిటేటర్లతో సమీక్షించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా పనితీరును సమీక్షిస్తూ, మొదటి కాన్పులకు గర్భిణులను సాధారణ ప్రసవాల వైపు ప్రోత్సహించాలని తెలిపారు. తీవ్ర పోషకాహార లోపం ఉన్న పిల్లలను, తక్కువ బరువు పిల్లలను గుర్తించి, పోషకాహార పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఆర్బీఎస్కే, 102 వాహనాలను వినియోగించాలన్నారు. -
కొత్తగా ఐదు
బుధవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2026సాక్షి ప్రతినిధి, కరీంనగర్/సాక్షి, పెద్దపల్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొత్తగా ఐదు అసెంబ్లీ స్థానాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్, పెద్దపల్లి, రామగుండం, మంథని, రాజన్న సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియలో కొత్తగా సుల్తానాబాద్, కరీంనగర్ రూరల్, జగిత్యాల రూరల్, మెట్పల్లి, ఎల్లారెడ్డిపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. కొత్తవాటితో కలుపుకుంటే ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 17కు చేరనున్నాయి. కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో కొత్త నియోజకవర్గాల ఏర్పాటు రాజకీయ సమీకరణాలను మార్చేస్తుందనే చర్చ సాగుతోంది. ఈ ప్రక్రియ ఎవరికి కలిసివస్తుంది? ఎవరికి తలనొప్పి తెస్తుందో’ అని ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. ప్రయోజనాలు ఏమిటి? మున్సిపల్, సమీప గ్రామాల ప్రజలకు ప్రత్యేక ప్రాతినిధ్యం లభించనుంది. అభివృద్ధి పనులు, నిధులు, స్థానిక సమస్యల పరిష్కారం వేగవంతమవుతుంది. జిల్లా మొత్తం సమాంతరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా రాజకీయ అవకాశాలు రాక ఎన్నికల్లో పోటీచేయలేని వారికి బరిలో నిలిచే అవకాశాలు పెరగనున్నాయి. 33 శాతం మహిళా రిజర్వేషన్తో.. కేంద్ర ప్రభుత్వం తాజాగా చేపట్టే జనాభా లెక్కలు –2026 ఆధారంగా.. మహిళా రిజర్వేషన్ కోటా నిర్ణయించనున్నారు. పాతవాటితోపాటు కొత్తగా ఏర్పడే అసెంబ్లీస్థానాలతో కలిపి రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజవర్గాలు 179కు చేరనున్నాయి. ఇందులో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పిస్తే 59 సీట్లు దక్కనున్నాయి. అప్పుడు ఉమ్మడిలోని 17స్థానాల్లో నాలుగు నుంచి ఐదు సీట్లు మహిళలకు దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే, మహిళలకు కేటాయించేవి ఏమిటి, మహిళా ఓటర్లు ఎక్కడ అధికంగా ఉన్నారే అంశాలపై నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఏమిటో? ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో చొప్పదండి, మానకొండూరు, ధర్మపురి నియోజకవర్గాలు ఎస్సీలకు కేటాయించారు. డీలిమిటేషన్ తర్వాత ఎస్సీలకు కేటాయించే స్థానాలపై ఎవరికి వారే జోరుగా లెక్కలేసుకుంటున్నారు.ప్రస్తుతం ఒక్కో నియోజకవర్గం రెండు, మూడు జిల్లాల్లో విస్తరించిఉంది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు జిల్లాలే ప్రాతిపదిక అని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టంలో స్పష్టంగా ఉంది. దీంతో జిల్లా యూనిట్గా దేశవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. అంటే.. జిల్లాలోని మండలాల ఆధారంగానే కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు సరిహద్దులను ఏర్పాటు చేయనున్నారు. ఉదాహరణకు.. సుల్తానాబాద్ మున్సిపల్, రూరల్తోపాటు సమీపంలోని ఎలిగేడు, కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండలాలతో కలిపి సుల్తానాబాద్ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అలాగే రూరల్ ప్రాంతంతో కరీంనగర్ రూరల్, రాయికల్, సారంగాపూర్, బీర్పూర్ మండలాలతో జగిత్యాల రూరల్ నియోజకవర్గం, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేటతో ఎల్లారెడ్డిపేట నియోజకవర్గం, మెట్పల్లి నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం కండి
కరీంనగర్ అర్బన్: యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం కావాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సీజన్లో 2,73,550ఎకరాల్లో వరి సాగైందని, 6,46,320 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వేస్తున్నామని వివరించారు. 3,67,776 మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశముందని, జిల్లాలో ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, డీసీఎంఎస్, హాకా ద్వారా 322 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా పౌరసరఫరాలు, కో–ఆపరేటివ్, డీఆర్డీవో, మార్కెటింగ్ తదితరశాఖల అధికారులు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగారావు, పౌరసరఫరాల సంస్థ డీఎం ఎం.రజనీకాంత్, డీఆర్డీవో శ్రీధర్, డీసీవో రామానుజాచార్య, డీఎంవో షాబోద్దీన్ పాల్గొన్నారు. పారదర్శకమైన ఓటరు జాబితాకే ఎస్ఐఆర్ ఓటరు జాబితా పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)ను ఎన్నికల సంఘం చేపట్టిందని, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇందుకు పూర్తిగా సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్లో అవగాహన సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో డూిప్లికేట్ ఓటర్లతో పాటు మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిపోయిన, రెండు ఓట్లు ఉన్నవాళ్లవి తొలగిస్తారని తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరణ తరువాత ఓటు హక్కు రానివారు ఉంటే ఆక్షేపణ చేయవచ్చని తెలిపారు. గ్యాస్ గోదాం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి గ్యాస్ సరఫరా చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చిత్రా మిశ్రా హెచ్చరించారు. నగరంలోని సీతారాంపూర్లో గల నిర్మల భారత్ గ్యాస్ ఏజెన్సీ గోదాంలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రులకు సరఫరా అవుతున్న సిలిండర్లు, వాణిజ్యపరమైన, గృహ అవసరాల సిలిండర్ల సరఫరా వివరాలు పరిశీలించారు. స్టాక్, బుకింగ్ సంఖ్య తదితర వివరాలను ఎప్పటికప్పుడు పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి తెలియజేయాలని డీలర్లకు సూచించారు. -
అన్ని రంగాల్లో నగర అభివృద్ధి
కరీంనగర్ కార్పొరేషన్: నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం నగరంలోని 44వ డివిజన్ సప్తగిరికాలనీ కస్తూరి బా గాంధీ పాఠశాలలో నాబార్డ్ నిధులు రూ.38 లక్షలతో చేపట్టనున్న సైన్స్ ల్యాబ్ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ చాడగొండ కవిత బుచ్చిరెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. 49వ డివిజన్ సంతోష్నగర్లో కార్పొరేటర్ ఎన్నం లక్ష్మి ప్రకాశ్తో కలిసి సంతోషిమాత ఆలయాన్ని సందర్శించి, పూజలు చేశారు. భాగ్యనగర్కాలనీలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.4 లక్షలతో చేపట్టనున్న తాగునీటి నీటి సరఫరా పైప్లైన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సప్తగిరి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు వాకింగ్ ట్రాక్, ఓపెన్జిమ్ ఏర్పాటు చేశామన్నారు. భాగ్యనగర్లో తాగునీటి పైప్లైన్ నిర్మాణాన్ని చేపట్టామన్నారు. కార్పొరేటర్లు బండ రమణారెడ్డి, కర్రె పద్మ అనిల్, గాజ రమ శివరాం, డీఈ శ్రీనివాస్ పాల్గొన్నారు. వన్ టైం సెటిల్మెంట్కు అవకాశం కల్పించండినగరపాలకసంస్థ ఆస్తిపన్నుకు సంబంధించి వన్టైం సెటిల్మెంట్ పథకానికి అవకాశం కల్పించాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్యమంత్రి, మున్సిపల్శాఖ మంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాశారు. 2024–25 సంవత్సరానికి ఆస్తి పన్ను బకాయిల వడ్డీ, పెనాల్టీపై 90 శాతం రాయితీ ఇస్తూ, 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని అమలు చేయాలని కోరారు. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి వడ్డీ,పెనాల్టీలతో సహా మొత్తం బకాయిలను చెల్లించిన ఇంటి యజమానులకు, వారు చెల్లించిన వడ్డీ మొత్తంలో 90 శాతాన్ని భవిష్యత్తు ఆస్తి పన్ను చెల్లింపుల్లో సర్దుబాటు చేసుకోవడానికి అనుమతించాలన్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ చెల్లించే ఇంటి యజమానులకు 5నుంచి 10 శాతం రాయితీ ఇవ్వాలని కోరారు. -
మహిళా పోలీసులు కీలకం
కరీంనగర్క్రైం: మహిళా పోలీసుల్లో నైపుణ్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో కరీంనగర్ పోలీసు కమిషనరేట్లోని అస్త్ర కన్వెన్షన్లో ‘షీలీడ్స్–2026’ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ సమాజ రక్షణలో మహిళా పోలీ సులు కీలకమన్నారు. బాధితులు, నిందితులు, ఆందోళనకారుల విషయంలో వ్యవహరించాల్సిన తీరుపై హుజూరాబాద్ ఏసీపీ వి.మాధవి అవగాహన కల్పించారు. అనంతరం ఉచి త వైద్య శిబిరం నిర్వహించారు. అదనపు డీసీ పీ వెంకటరమణ, సీటీసీ ఏసీపీ వేణుగోపాల్, ఆర్ఐలు రజినీకాంత్, కిరణ్ పాల్గొన్నారు. కరీంనగర్సిటీ: నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన జాబ్మేళాకు విశేష స్పందన లభించింది. ప్రముఖ సంస్థలైన క్వెస్ కార్ప్, ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, ఆదర్శ నెక్సా ఆటోమొబైల్స్, వరుణ్ మోటార్స్, ధ్రువంత్ సొల్యూషన్స్, డీ మార్ట్, సాయి లైఫ్ సైన్సెస్, హెటిరో ఫార్మా, ఫ్యూజన్ ఫినాన్స్, రాన్స్టాండ్ పాల్గొన్నాయి. 400 మందికి పైగా హాజరుకాగా 230మంది షార్ట్లిస్ట్ అ య్యారు. వారిని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి.వరలక్ష్మి, టీఎస్కేసీ కోఆర్డినేటర్ డి.శ్రీనివా స్, ఎఫ్టీఎం రాజశేఖర్ అభినందించారు. 28న జాతీయ లోక్ అదాలత్కరీంనగర్ క్రైం: జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కే.రాణి తెలిపారు. ఈ లోక్ అదాలత్లో సివిల్, క్రిమినల్, ఫ్యామిలీ కేసులు , మోటారు ప్రమాద, చెక్బౌన్స్, ఫ్యామిలీ, ఇన్సూరెన్స్, బ్యాంకు కేసులు ఇరు పార్టీల రాజీ ద్వారా పరిష్కరించునున్నట్లు తెలిపారు. కేసులు పరిష్కరించుకోవాలనుకునే వారు న్యాయ సేవాధికార సంస్థ, పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. -
పరిశోధనలతో సమస్యలు పరిష్కారం
కరీంనగర్సిటీ: పరిశోధనలే సమస్యల పరిష్కారానికి మూలమని శాతవాహన యూనివర్సిటీ కామర్స్, మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ డి.హరికాంత్ అన్నారు. ఎస్సారార్ కళాశాలలో కామర్స్ విభాగం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ హైదరాబాద్ సౌజన్యంతో విద్యార్థులకు పరిశోధన పద్ధతులు, ప్రాజెక్టు రిపోర్ట్ తయారీపై ఒకరోజు కార్యశాల నిర్వహించారు. ప్రొఫెసర్ వై.రామకృష్ణ, ఏ.రాకేశ్ ఫణీంద్ర పరిశోధన అంశం ఎంపిక, రూపకల్పన, డేటా సేకరణ, విశ్లేషణ, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ గురించి వివరించారు. హరికాంత్ మాట్లాడుతూ... విద్యార్థులు వ్యాపార వాణిజ్య రంగాల్లోని వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని, అవి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొనాలనే ఉద్దేశంతోనే ఈ పరిశోధన ప్రాజెక్టు రిపోర్టు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ నితిన్ పాఠక్, కామర్స్ విభాగాధిపతి రాజయ్య, టీజీసీజీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడారు సురేందర్ రెడ్డి, బుర్ల నరేశ్ పాల్గొన్నారు. -
వైభవంగా ‘రామకోటి యజ్ఞం’
హుజూరాబాద్: పట్టణంలోని ఓ కన్వెన్షన్ హాల్లో సోమవారం రామకోటి యజ్ఞం వైభవంగా నిర్వహించారు. లోక కల్యాణార్థం చేపట్టిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనగా, రామనామ స్మరణతో హాల్ మారుమోగింది. ఈ యజ్ఞంలో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ శ్వేత ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సుమారు 650 మంది మహిళలను ఏకం చేసి, ఈ ఆధ్యాత్మిక క్రతువు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. గందె శ్రీనివాస్, సుద్దాల హరిశంకర్, గర్రెపల్లి శ్రీనివాస్, పుల్లూరి శ్రీకాంత్, బల్లు పున్నం, రేణుకుంట్ల సురేష్, ఆర్యవైశ్య నాయకులు నార్ల రాజేందర్, ఎస్ఆర్పీ శివనాథుని వేణుగోపాల్, కటుకం మారుతి, శివనాథుని శ్రీనివాస్, కటుకం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యూనిఫామ్ కుట్టుపై శిక్షణ జూలపల్లి: మహిళలను అర్థికంగా బలోపేతం చేసేందుకు విద్యార్థుల యూనిఫామ్ కుట్టుపై అవగాహన కల్పించారు. స్థానిక వెలుగు సమాఖ్య కార్యాలయంలో సోమవారం శిక్షణ శిబిరం నిర్వహించగా.. సమాఖ్య అసిస్టెంట్ ప్రోగ్రాం మేనేజరు సుధాకర్ మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. 13 పంచాయతీల నుంచి 45 మంది మహిళలు శిక్షణకు హాజరయ్యారు. ట్రెయినర్లు మసూద, సీసీలు ఆనంద్, అనిత, అకౌంటెంట్ అనిత తదితరులు పాల్గొన్నారు. వైల్డ్లైఫ్ బయోలజిస్ట్కు ప్రశంసాపత్రం గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని కొత్తపల్లికి చెందిన జోగు ఎల్లం కవ్వాల్ టైగర్ రిజర్వ్లో వైల్డ్లైఫ్ బయోలజిస్టు(పులులు ఇతర వన్యప్రాణి నిపుణులు)గా పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఉన్న అటవీ అధికారులు వన్యప్రాణులను సాంకేతికంగా గణన చేయడం, టైగర్ మానిటరింగ్లో శిక్షణ ఇస్తున్నందుకు ప్రపంచ అటవీ దినోత్సవం పురస్కరించుకొని ప్రశంసాపత్రం అందుకున్నారు. అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర అటవీ సంరక్షణాధికారి సువర్ణ చేతుల మీదుగా సోమవారం హైదరాబాద్లో ప్రశంసాపత్రం అందుకున్నారు. -
అమరవీరుల త్యాగాలతోనే స్వేచ్ఛ
● నగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ కరీంనగర్ కార్పొరేషన్: అమరవీరుల త్యాగాల ఫలితంగానే దేశ ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. సోమవారం భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 95వ వర్ధంతి సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం భగత్నగర్ చౌరస్తాలోని భగత్సింగ్ విగ్రహానికి పలువురు కార్పొరేటర్లతో కలిసి పూలమాల వేసి, అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి యువత అమరవీరుల స్ఫూర్తిని అలవర్చుకోవాలన్నారు. కార్పొరేటర్లు మాసం గణేశ్, భారీ అపర్ణ, పెద్దపల్లి శ్రీలేఖ జితేందర్, నాంపల్లి రేణుక శ్రీనివాస్, కొమురయ్య, పొన్నం లక్ష్మి మొండయ్య పాల్గొన్నారు. సీతారామ కల్యాణానికి ఏర్పాట్లు సీతారాముల కల్యాణ మహోత్సవం సందర్భంగా ఈ నెల 27న నగరంలోని నాలయాల్లో నగరపాలకసంస్థ తరఫున ఏర్పాట్లు చేయాలని మేయర్ శ్రీనివాస్ ఆదేశించారు. సోమవారం బల్దియా సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నగరంలోని అన్ని ఆలయాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కల్యాణ మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆలయాల వద్ద వాటర్ ట్యాంకర్లతో తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. సహాయ కమిషనర్ దిలీప్కుమార్, ఎస్ఈ రాజ్కుమార్, ఈఈ సంజీవ్కుమార్, ఎంహెచ్వో సుమన్, డీఈలు దేవేందర్, అరుణ్కుమార్, ఓంప్రకాష్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాగట్లపల్లి శివారులో సోమవారం రాత్రి రెండు బైక్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన దంపతులు సిరిసిల్ల నుంచి ఎల్లారెడ్డిపేట వైపునకు బైక్పై వస్తున్నారు. మండలంలోని అక్కపల్లికి చెందిన చిట్టిబాబు తన బైక్పై సిరిసిల్లకు వెళ్తున్నాడు. ఈక్రమంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో దంపతులతోపాటు చిట్టిబాబు గాయపడ్డారు. చిట్టిబాబు పరిస్థితి విషమంగా ఉంది. నెల రోజుల వ్యవధిలో ఇదే ప్రాంతంలో మూడు రోడ్డు ప్రమాదాలు జరుగగా, ఒకరు మృతి చెందారు. వరుస ప్రమాదాలతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. డివైడర్ను ఢీకొన్న ఆటో ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని పాతబస్టాండ్ వద్ద సోమవారం వేకువజామున కప్ సాసర్ డివైడర్ను ఆటో ఢీకొన్న ఘటనలో ఆటోడ్రైవర్ బొమ్మనవేణి రాజు తీవ్రంగా గాయపడ్డాడు. రాచర్లబొప్పాపూర్కు చెందిన బొమ్మనవేణి రాజు ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. నిత్యం ఉదయం కరీంనగర్ డెయిరీకి సంబంధించిన పదిర, పోతిరెడ్డిపల్లి, హరిదాస్నగర్ పాల కేంద్రాల నుంచి పాలు సేకరించి ఎల్లారెడ్డిపేటలోని డెయిరీలో డెలివరీ చేస్తుంటాడు. రోజు మాదిరిగానే పదిర నుంచి పాలు తీసుకొస్తుండగా మండల కేంద్రంలోని పాతబస్టాండ్ వద్ద గల కప్పుసాసర్ డివైడర్ను ఢీకొని ఆటో ఫల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలై రక్తపు మడుగులో ఉన్న రాజును స్థానిక బీజేపీ నాయకులు గమనించి మండల కేంద్రంలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం రాజు కోమాలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీలో సమ్మె సైరన్
కరీంనగర్టౌన్: సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. రెండున్నరేళ్లుగా తమ వినతులను యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 26 తర్వాత సమ్మెకు దిగుతామంటూ ఇటీవల హైదరాబాద్లో ఎండీ వై.నాగిరెడ్డికి సమ్మె నోటీస్ అందజేయడంతో చాలా రోజుల తర్వాత ఆర్టీసీలో జంగ్ సైరన్ మోగనుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నాయకులు సమ్మె నోటీసు ఇవ్వడంతో కరీంనగర్ రీజినల్ పరిధిలోని 11 డిపోలలో ఉద్యోగులు, కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. 11 డిపోలు, 972 బస్సులు ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు కరీంనగర్ రీజినల్ పరిధిలో కరీంనగర్– 1, కరీంనగర్ 2, హుస్నాబాద్, హుజురాబాద్, మంథని, గోదావరిఖని, వేములవాడ, కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, సిరిసిల్ల డిపోలలో పని చేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు ఇతర సిబ్బంది మొత్తం 3,236 మంది సమ్మెలోకి వెళ్లనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. అవసరమైతే నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు చేపట్టి తమ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరిస్తేనే రవాణా సేవలు అంతరాయం లేకుండా కొనసాగుతాయని, లేకుంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వంలో విలీనానికి నోటీసు ఈనెల 26 తర్వాత ఏ క్షణమైనా సమ్మెకు సిద్ధం ఇటీవల జేఏసీ ఆధ్వర్యంలో ఎండీకి నోటీస్ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. 2017 నుంచి అలవెన్స్, బెనిఫిట్స్, వేతన సవరణ బకాయిలు చెల్లించాలి. రిటైర్డ్ ఉద్యోగులకు 2017 వేతన సవరణ అమలు చేయడం, 2021 వేతన సవరణ 30 శాతం ఫిట్మెంట్ చేయడం. 2025 వేతన సవరణ అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలి. మహాలక్ష్మి పథకంలో జీరో టికెట్ బదులు మహిళలకు స్మార్ట్ కార్డు ఇవ్వాలి. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ప్రతినెలా కోత విధించకుండా రూ.400కోట్లు ఇవ్వాలి. పాత బకాయిలు రూ.2,500 కోట్లు చెల్లించాలి. అన్ని కేటగిరిల్లో ఖాళీలు భర్తీచేసి అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలి. ప్రతీ కార్మికుడికి 21 రోజుల హాజరుతో ఇన్సెంటివ్ ఇవ్వాలి. ఉద్యోగి కుటుంబానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్య సౌకర్యం కల్పించాలి. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి. రిటైర్డ్ కాబోతున్న ఉద్యోగులకు ఆదేరోజు సెటిల్మెంట్ మొత్తం చెల్లించాలి. -
కులం పేరుతో దూషించిన వారిపై కేసు
చందుర్తి(వేములవాడ): సీతారామచంద్రస్వామి ఆలయ చైర్మన్ పదవి విషయంలో తలెత్తిన వివాదంలో కులం పేరుతో సర్పంచ్, ఉపసర్పంచ్తోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు చందుర్తి ఎస్సై జిల్లెల రమేశ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేటలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ చైర్మన్ పదవి విషయంలో అదే గ్రామానికి చెందిన తర్రె శేఖర్కు సర్పంచ్ నరేశ్, ఉపసర్పంచ్ ఆకుల ఎల్లయ్య, మరో వ్యక్తి సుంకి వేణులకు శనివారం రాత్రి వివాదం తలెత్తింది. ఈ వివాదంతో తర్రె శేఖర్ను సర్పంచ్ నరేశ్, ఉపసర్పంచ్ ఆకుల ఎల్లయ్య, సుంకి వేణు కులం పేరుతో దూషించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై సోమవారం వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు లింగంపేట ఆలయ ప్రాంగణంలో విచారణ చేపట్టారు. గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వేణులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయగా.. ఈ వివాదాన్ని ప్రోత్సహించిన డప్పుల అశోక్పై కేసు నమోదు చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ శ్రీరామనవమి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. ఉత్సవాలను పాత ఆలయ కమిటీ పర్యవేక్షణలో చేసుకోవాలని, అల్లర్లు సృష్టించి, గొడవలకు దిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. లింగంపేటలో విచారించిన డీఎస్పీ శ్రీనివాసులు -
వాగేశ్వరి కళాశాలకు ఎన్బీఏ గుర్తింపు
తిమ్మాపూర్(మానకొండూర్): మండలంలోని రామకృష్ణకాలనీలో గల వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాలకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ గుర్తింపు లభించినట్లు కళాశాల జనరల్ సెక్రెటరీ గండ్ర శ్రీనివాస్రెడ్డి సోమవారం తెలిపారు. జనవరిలో అధికారుల బృందం కళాశాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారని, అధికారుల నివేదిక ఆధారంగా కళాశాలలో బీటెక్ సీఎస్సీ, ఈసీఈ, ఈఈఈ కోర్సులకు మూడేళ్ల పరిమితితో నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ గుర్తింపు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సహకరించిన అధ్యాపకులు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కళాశాల ఆవరణలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. జాయింట్ సెక్రెటరీ దావు శ్రీనివాస్రెడ్డి, డైరెక్టర్లు వినోద్, ప్రకాష్రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫార్మసీ కళాశాలకు అటానమస్ మండలంలోని వాగేశ్వరి ఫార్మసీ కళాశాలకు అటానమస్ గుర్తింపు వచ్చినట్లు కళాశాల జనరల్ సెక్రటరీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఉత్తర తెలంగాణాలోనే మొట్టమొదటిసారిగా వాగేశ్వరీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలకు జేఎన్టీయూ అటానమస్ గుర్తింపు ఇచ్చిందన్నారు. మొదట నాక్ ఏ ప్లస్ వచ్చిందని, సోమవారం తమ కళాశాలకు అటానమస్ హోదా వచ్చిందన్నారు. తమ కళాశాలకు అటానమస్ రావడం సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎన్బీఏ వచ్చేలా తాము, ప్రిన్సిపాల్, ఫ్యాకల్టీ కృషి చేస్తామని పేర్కొన్నారు. -
ప్రజల సహకారంతో సుందరీకరణ
జ్యోతినగర్: రామగుండం నగర ప్రజల సహకారంతో సుందరీకరణ పనులు చేపడతామని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ఎన్టీపీసీ సింధూర కళాశాల రోడ్డు, ఎఫ్సీఐ క్రాస్రోడ్డు, రాజీవ్ రహదారి సర్వీసు రోడ్డులో కార్పొరేటర్లు వెంగల బాపు, కొలని కవితారెడ్డి, భూలక్ష్మి, స్వప్నప్రియ, ఎన్టీపీసీ ఏజీఎం బిజయ్కుమార్ సిగ్దర్తో కలిసి సోమవారం పర్యటించారు. స్వామి మాట్లాడు తూ, ఎన్టీపీసీ సోలార్ ప్రాజెక్టుకు నిర్మించిన ప్రహరీ ప్రమాదకరంగా ఉందన్నారు. ఓపెన్ డ్రైనేజీలో చెత్త పేరుకుపోయిందని, దానిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎఫ్సీఐ క్రాస్ రోడ్డులో కూల్చివేసిన సులభ్కాంప్లెక్స్ శిథిలాలను వెంటనే తొలగించి బస్షెల్టర్ను ప్రయాణికులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీకుకురావావాలని అన్నారు. త్వరలోనే ఎఫ్సీఐ క్రాస్ రోడ్డు సెంటర్ను విస్తరించి, సుందరీకరణ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్, అధికారులు, ఎన్టీపీసీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సీస్సార్ ప్రత్యేక నిధులు కేటాయించాలి రామగుండం మేయర్ మహంకాళి స్వామి -
గ్రామస్తులు ఇబ్బంది పడకుండా చర్యలు
● కలెక్టర్ చిత్రా మిశ్రా మానకొండూర్: నేషనల్ హైవే– 563 నిర్మాణంలో ఈదులగట్టెపల్లి గ్రామస్తులు దారి విషయంలో ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చిత్రామిశ్రా పేర్కొన్నారు. మండలంలోని ఈదులగట్టెపల్లికి సర్వీస్రోడ్డు లేకపోవడంతో గ్రామస్తులు రోడ్డు పనులను అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం కలెక్టర్ సర్వీస్ రోడ్డు స్థలాన్ని పరిశీలించారు. సర్వీస్ రోడ్డు నిర్మించే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పరిశీలన ఇల్లందకుంట: మండలకేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఈనెల 25 నుంచి ఏప్రిల్ 6 వరకు జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను సోమవారం కలెక్టర్ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్లు లక్ష్మీకిరణ్, అశ్వినితాకాజీ వాకాడే పరిశీలించారు. అధికారులు సమన్వయంతో పనులు పూర్తి చేసి, జాతర విజయవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమాల్లో ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్బాబు, ఏసీపీ మాధవి, తహసీల్దార్ భాస్కర్, ఎంపీడీవో రాజేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
రైలులో ప్రయాణికుడి హఠాన్మరణం
రామగుండం: కర్ణాటక రాష్ట్రంలోని యెలహంక నుంచి మధ్యప్రదేశ్లోని గ్వా లియర్కు వెళ్తు న్న ప్రయాణికుడు ధర్మేంద్రసింగ్ రాథోర్(42) సోమవారం అస్వస్థతతో హఠాన్మరణం చెందాడు. జీఆర్పీ ఔట్పోస్టు ఇన్చార్జి తిరుపతి కథనం ప్రకారం.. బెంగళూరులో టైల్స్ వర్క్ చేసే ధర్మేంద్రసింగ్రాథోర్ రైలు నంబరు 11085లో ఆదివారం సాయంత్రం గ్వాలియర్ వెళ్తున్న సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణం చేస్తున్నాడు. బోగినంబరరు ఎస్–4లో పడుకున్న ప్రయాణికుడిని సోమవారం ఉదయం టికెట్ పర్యవేక్షకుడు నిద్రలేపారు. ఎంతకీ లేకపోవడంతో సెంట్రల్కు మెసేజ్ ఇచ్చాడు. అప్పటికే రైలు కాజీపేట దాటింది. బల్హార్షా వరకు హాల్టింగ్లేదు. అత్యవసరంగా రామగుండం రైల్వేస్టేషన్లో నిలిపి రైల్వే డాక్టర్తో పరీక్షించారు. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్ ధ్రువీకరించడంతో మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆధార్కార్డు ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతికి గల కారణాలు పూర్తిగా తెలియరాలేదు. బాలుడిని కాటేసిన కరెంట్ ● మెట్లకింద ఆడుకుంటుండగా విద్యుదాఘాతం ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికెనపల్లి గ్రామానికి చెందిన బొజ్జ సంపత్ కుమారుడు బొజ్జ అభిరాం(6) సోమవారం సాయంత్రం ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురై మరణించినట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. ఇదే గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లిన అభిరాం.. సమీపంలోని బల్ల కుమార్ ఇంటి వద్ద అడుకుంటూ ఉన్నాడు. ఈక్రమంలో మెట్ల కిందికి వెళ్లగా అక్కడఉన్న కరెంట్ ఎర్త్వైర్కు ప్రమాదవశాత్తు తగిలాడు. దానితో కరెంట్ షాక్కు గురై అక్కడకక్కడే మరణించినట్లు మృతి తండ్రి సంపత్ ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసునమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. ప్రమాదఘటన చూసి.. భయంతో సొమ్మసిల్లి● మృతి చెందిన మహిళ రఘునాథపల్లి: హన్మకొండ–హైదరాబాద్ జాతీయ రహదారిలోని వెంకటాయపాలెం వద్ద సోమవారం జరిగిన ప్రమాద ఘటనను చూసిన ఓ మహిళ తీవ్ర భయాందోళన చెంది మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పందిళ్ల గ్రామానికి చెందిన ఇల్లందుల పుష్పలత (45) కుటుంబ సభ్యులతో కలిసి కారులో హైదరాబాద్కు బయలుదేరారు. వెంకటాయపాలెం వద్ద టాయ్లెట్ కోసం కారు నిలిపి పుష్పలత కిందకు దిగగా, అదే సమయంలో ఓ ద్విచక్రవాహనదారుడు ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ఘటనను చూసిన పుష్పలత సొమ్మసిల్లి పడిపోగా కుటుంబ సభ్యులు వెంటనే జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దూదిమెట్ల నరేశ్ తెలిపారు. త్వరలో క్యాథ్ల్యాబ్ సేవలు గోదావరిఖని: సింగరేణిలోనే తొలిసారి ఏర్పాటు చేస్తున్న క్యాథ్ ల్యాబ్ పనులపై ఆ సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్రాజ్కుమార్ సోమవారం సమావేశమయ్యారు. రెనే హాస్పిటల్, హాస్పిటల్ వెండర్స్ మధ్య సమావేశం నిర్వహించారు. పనులు యుద్ధ ప్రాతిపదిక పూర్తిచేసి త్వరగా ప్రారంభించాలని ఆయన సూచించారు. డాక్టర్లు బాలకోటయ్య, అంబికా, రాజేశ్వర్రావు, రమేశ్, రెనే హాస్పిటల్ చైర్మన్ బంగారి స్వామి, డాక్టర్లు పాల్గొన్నారు. -
స్కాలర్షిప్ విద్యార్థుల హక్కు
కరీంనగర్టౌన్: స్కాలర్షిప్ విద్యార్థులకు భిక్ష కాదని, హక్కు అని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు అన్నారు. పెండింగ్లో ఉన్న రూ.9,500 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని బొమ్మకల్ బైపాస్ రోడ్లో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 15 శాతం కేటాయించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఇంజినీరింగ్, ఫార్మా కళాశాలల్లో ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ నందు, మురళి, యోగేశ్, శివ, ఆకాష్, అజయ్, యశ్వంత్, కాఫీ, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.ఖైదీలకు వైద్య పరీక్షలుకరీంనగర్క్రైం: వందరోజుల హెల్త్ మిషన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా జైలులో ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈసందర్భంగా బీపీ, షుగర్, హెచ్ఐవీ, సిఫిలిస్, హైపటైటిస్ బి, సీ సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. అదనపు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధా రాజేంద్ర, జైలు సూపరింటెండెంట్ జి.విజయదేని, డాక్టర్ కె.వేణుగోపాల్, జిల్లా ఎయిడ్స్ ప్రొగ్రాం మేనేజర్ సురేందర్రెడ్డి, కన్వీనర్ మహిపాల్, ప్రాజెక్టు కోఆర్డినేటర్ దేవేందర్ పాల్గొన్నారు. -
పేషెంట్లతో జీజీహెచ్ కిటకిట
● ఒక్కరోజే 1,406 మంది పేషెంట్లకు వైద్యం కోల్సిటీ(రామగుండం): వరుసగా రెండురోజులపాటు సెలవులు రావడంతో గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్) సోమవారం పేషెంట్లతో రద్దీగా కనిపించింది. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతు ఆస్పత్రికి సుమారు 1,406 మంది తరలివచ్చారు. వీరిలో మహిళలు 814 మంది, పురుషులు 476 మంది ఉండగా, మిగిలిన వారు పిల్లలు, ఇతర విభాగాలకు చెందినవారు ఉన్నారు. ఓపీ రిజిస్ట్రేషన్ కోసం కౌంటర్ల వద్ద బారులు తీరారు. వైద్యులు, సిబ్బంది వారికి సేవలు అందించడంలో నిమగ్నమయ్యారు. సెలవులతో ముందుగా చికిత్స పొందలేకపోయిన వారు ఒకేసారి రావడంతో రద్దీ నెలకొందని తెలుస్తోంది. పేషెంట్ల రద్దీ ఉన్నా వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రతీపేషెంట్కు ఓపిగ్గా వైద్య సేవలు అందించినట్లు ఆర్ఎంవో రాజు తెలిపారు. -
యుద్ధాన్ని ఆపేందుకు చర్చించండి
కరీంనగర్టౌన్: ఒక దేశంపై మరో దేశం దాడులు చేయకుండా జరగాలంటే అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరగాలని.. ఇందుకు ఐక్యరాజ్యసమితి, దేశ ప్రధాని నరేంద్రమోదీ చొరవ తీసుకోవాలని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కోరారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డిభవన్లో సోమవారం నిర్వహించిన సీపీఐ జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయేల్ దేశాలు చేస్తున్న యుద్ధంతో చమురు, గ్యాస్ కొరత ఏర్పడుతుందన్నారు. ఈక్రమంలోనే వంటగ్యాస్ను బ్లాక్ మార్కెట్కు తరలించి కొరత సృష్టిస్తున్నారన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ప్రధాని మోదీ సంప్రదింపులు చేయాలని కోరారు. పార్లమెంటు సమావేశాల్లో అత్యధిక రోజులు పాల్గొన్నానని గొప్పలు చెప్పుకునే ప్రధాని మోదీ దేశప్రజల ప్రయోజనాల కోసం ఏం చేశౠరో చెప్పాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థలు నిర్వీర్యం అయ్యాయని, కార్పొరేట్ సంస్థలు బాగుపడ్డాయని విమర్శించారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఏప్రిల్లో ఇంటింటికీ సీపీఐ నినాదంతో ప్రజల వద్దకు వెళ్లనున్నట్లు తెలిపారు. జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు టేకుమల్ల సమ్మయ్య, పొనగంటి కేదారి, అందె స్వామి, కొయ్యడ సృజన్కుమార్, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, కసిరెడ్డి సురేందర్రెడ్డి, బత్తుల బాబు, టేకుమల్ల సమ్మయ్య, నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి, పిట్టల సమ్మయ్య న్యాలపట్ల రాజు పాల్గొన్నారు. సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి -
కరీంనగర్
మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 20267సిటీలో పవర్కట్కొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మ ల తొలగింపు పనులు చేపడుతున్నందున మంగళవా రం ఉదయం 10 నుంచి 12, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు నగరంలో పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈలు తెలిపారు. క్వింటాల్ పత్తి రూ. 7,550జమ్మికుంట: జమ్మికుంట మార్కెట్లో సోమవారం క్వింటాల్ పత్తి రూ. 7,550 పలికింది. క్రయవిక్రయాలను చైర్ పర్సన్ పూల్లూరి స్వప్నసదానందం, ఇన్చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు. ఆకాశం ప్రకాశవంతంగా ఉంటుంది. గాలిలో తేమ అంతంతే ఉంటుంది. ఉక్కపోతగా ఉంటుంది. మోస్తరు గాలులు వీస్తాయి. -
చికెన్ కుతకుత!
కరీంనగర్అర్బన్: చికెన్ ధర ఎన్నడూ లేనివిధంగా ఎగబాకింది. జిల్లా చరిత్రలోనే తొలిసారిగా రి కార్డుస్థాయికి చేరగా వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ధర ఎక్కువగా ఉండటం సహజం. అప్పుడున్న వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతల దృష్ట్యా కో ళ్లను కాపాడుకోవడమే సవాల్. డిమాండ్కు సరి పడా ఉత్పత్తి లేక ధర పెరుగుతోంది. కాగా, సా ధారణ పరిస్థితుల్లో అసాధారణ ధర ఉండడం ఆందోళనకర పరిణామం. మరో పక్షం రోజులు గడిస్తే రూ.450 చేరడం లాంఛనమే. ప్రస్తుతం కి లో కోడి ధర రూ.185 కాగా, కిలో స్కిన్లెస్ చికెన్ రూ.350 ఉండగా రిటైల్ వద్ద మరింత ఎక్కువే. తినేవారికి తప్ప అందరికీ లాభాలే బాయిలర్ కోళ్ల పరిశ్రమ నాలుగునెలలుగా లాభాల బాట పడుతోంది. పౌల్ట్రీ రంగంలోకి కార్పొరేట్ శక్తులు రావడమే కాకుండా హెచ్చు కోళ్ల ఫారాలు వాళ్ల చేతికే చేరాయి. ఫారం యజమానులు ధరల హెచ్చుతగ్గుదలతో కంపెనీకే అప్పగిస్తున్నారు. యజమానులు నిర్వహిస్తున్నవి చాలా తక్కువే. కాగా ధరల నిర్ణయం సదరు కంపెనీలే నిర్ణయిస్తుండగా ప్రభుత్వ నియంత్రణ ఏ మాత్రం ఉండదు. కోళ్ల ఫారం నిర్వహణలో యువత అమితాసక్తి చూపుతుండగా లాభాలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కోడి పిల్లలు ఉత్పత్తి చేసేవారు, దాణా విక్రేతలు, ఫారాల నుంచి కోళ్లు వేసే ట్రేడర్లు, చికెన్ సెంటర్లకు లాభాలే తప్ప నష్టం చాలా తక్కువ. ఫారం యజమానులకే లక్కీ లాటరీల ఉండేది. కానీ.. మూడునెలలుగా అందరికీ లాభాలే. 6 నెలల క్రితం వరకు 2 వేల కోళ్లను యజమాని పెంచితే రూ.20–30వేల లాభం రాగా తాజాగా రూ.లక్షల నుంచి రూ.1.50 లక్షల లాభం వస్తోందని తెలుస్తోంది. కార్పొరేట్ శక్తుల రాకతో.. పౌల్ట్రీ పరిశ్రమలో కార్పొరేట్ శక్తుల రాకతో పౌల్ట్రీ రైతులు వెట్టిచాకిరికే పరిమితమవుతున్నారు. లక్షలు వెచ్చించి షెడ్లు నిర్మించుకున్న తర్వాత పెట్టుబడులు పెట్టలేని స్థితిలో రైతులు కార్పొరేట్ శక్తులను ఆశ్రయించాల్సి వస్తోంది. అయితే కార్పొరేట్ శక్తులు కోడి పిల్లల నుంచి దాణా వరకు అంతా వారే సరఫరా చేస్తారు. అయితే రైతులు షెడ్తో పాటు విద్యుత్, కోళ్లను చూసుకోవాలి. 45 రోజుల పాటు కష్టపడాల్సి వస్తోందని, అయితే మార్కెట్లో ధర వచ్చాక కూడా తక్కువ ధరే ఇస్తున్నారని, గిట్టుబాటుకావడం లేదని రైతులు వాపోతున్నారు. పౌల్ట్రీ రైతులకు ఏదీ చేయూత పౌల్ట్రీ రైతులకు ప్రభుత్వ ప్రొత్సాహం కరువైంది. పౌల్ట్రీని ఏర్పాటు చేసుకునే రైతులకు పావలా వడ్డీ రుణాలు ఇస్తామని చెబుతున్నా అది ఎక్కడా అమలు కావడం లేదు. పావలా వడ్డే కదా..ని చాలా మంది యువ రైతులు కరీంనగర్, హుజూ రాబాద్, చొప్పదండి, తదితర ప్రాంతాల్లో పోటీపడి బాయిలర్ కోళ్ల షెడ్లను ఏర్పాటు చేసుకున్నారు. బ్యాంకు రుణం ఇచ్చే సమయంలో పావలా వడ్డీ అని చెప్పి, ఇప్పుడు ప్రభుత్వం నుంచి తమకు ఏమి రాలేదని, రూ.1.10 చెల్లించాల్సిందేనని బ్యాంకర్లు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. జిల్లాలో 20లక్షల బాయిలర్, 5లక్షల లేయర్ కోళ్ల పెంపకం జరుగుతున్నట్లు అంచనా. ధరలపై నియంత్రణ ఉంటేనే ప్రయోజనం ఇష్టారీతిగా చికెన్ ధరలు పెరుగుతుండగా వినియోగదారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఇప్పటికే గ్యాస్ కొరత, పప్పులు, నూనె ధర పెరగడంతో అదనపు భారం పడుతోంది. తాజాగా చికెన్ ధరలు పెరగడం మరింత భారమే. ప్రభుత్వ నియంత్రణలో వినియోగదారులు, కోళ్ల ఫారం నిర్వాహకులకు గిట్టుబాటు ధర నిర్ణయిస్తేనే ప్రయోజనం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కిలో రూ.350 -
పన్ను చెల్లించని కోచింగ్ సెంటర్కు తాళం
కరీంనగర్కార్పొరేషన్: ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో నగరంలో ఆస్తిపన్ను వసూళ్లను బల్దియా అధికారులు వేగవంతం చేశారు. మొండి బకాయిదారుల నుంచి వసూలు చేసేందుకు చర్యలు చేపట్టారు. సోమవారం నగరంలోని 51వ డివిజన్ పరిధి కోర్టు సమీపంలోని 3–1–777, 3–1–3777/1, 3–1–3778, 3–1–778/1 ఇంటి నంబర్లలో ఉన్న కోచింగ్ సెంటర్ను డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియుద్దీన్ తనిఖీ చేశారు. ఆస్తి పన్ను బకాయి చెల్లించక పోవడంతో సంబంధిత కోచింగ్ సెంటర్కు తాళం వేసి సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆస్తి పన్ను బకాయిదారులు సకాలంలో పన్నులు చెల్లించాలన్నారు. పన్ను చెల్లించనివారి షాప్లు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఆస్తి పన్ను చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఆదర్శంతో కూడుకున్న వృత్తి జర్నలిజంకరీంనగర్సిటీ: జర్నలిజం ఆదర్శంతో కూడుకున్న వృత్తి అని, సామాజిక బాధ్యత ఎంతో ఉంటుందని ఎస్సారార్ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ పి.నితిన్పాఠక్, టి.రాజయ్య అన్నారు. సోమవారం కళాశాలలో 27వ బ్యాచ్ జర్నలిజం సర్టిఫికెట్ కోర్స్ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్స్, తెలుగు విభాగం అధ్యక్షుడు, కోర్స్ కో ఆర్డినేటర్ డా.బూర్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ, జర్నలిజం సర్టిఫికెట్ కోర్స్ ద్వారా విద్యార్థులకు భాష, రచనా నైపుణ్యాలు పెంపొందుతాయన్నారు. విలేకరి రాసే ప్రతి అక్షరం సమాజాన్ని జాగృతం చేసేలా ఉండాలన్నారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు. ఎం.శ్రీనివాస్రెడ్డి, తెలుగు విభాగ అధ్యాపకులు బూర్ల వెంకటేశ్వర్లు, డి.ప్రకాష్, ఆర్.శ్రీనివాస్, మెట్టు వెంకటేశ్వర్లు, పాత అశోక్. పి.చైతన్య, టి.భోజన్న, పి.శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
గోదావరిలో క్రికెట్ ఆడి నిరసన
గోదావరిఖని: నిండు గోదావరి నది కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో ఎండి పోయిందని పేర్కొంటూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి ఆధ్వర్యంలో ఆదివారం సీఎం రేవంత్రెడ్డికి పిండప్రదానంన చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సమీపంలోని గోదావరి నదిలోని ఇసుక తెన్నెలపై తొలుత క్రికెట్, అష్టాచెమ్మా ఆడి నిరసన తెలిపారు. సరిగ్గా ఏడాది క్రితం నిండు గోదావరి ప్రస్తుతం ఎండు గోదారిలా మారిందని పేర్కొన్నారు. గతేడాది గోదావరి నుంచి కేసీఆర్ ఫామ్హౌస్ ఎర్రవెల్లి వరకు పాదయాత్ర నిర్వహించిన విషయం విదితమే. కాగా, వేసవిలో మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా కాలేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు సరిచేసి నీటిని నిల్వచేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బాగంగా నిండి కుండాల ఉండే గోదావరిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎడారిగా మార్చిందిని ఆరోపించారు. ఇన్నిరోజులు గడిచినా ఎందుకు రిపేర్లు చేయడంలేదని ప్రశ్నించారు. కేసీఆర్పై ఉన్న కోపాన్ని ప్రజలపై చూపించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి,ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా చూడాలన్నారు. బీఆర్ఎస్ నేతల వినూత్న కార్యక్రమం సీఎంకు పిండప్రదానం చేసిన నాయకులు -
మాస్టర్ చాంపియన్ మనోహర్రావు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన తూముల మనోహర్రావు థాయ్లాండ్ దేశంలో జరిగిన ఏసియన్ రీజియన్ మీట్లో పాల్గొని హ్యామర్త్రో మాస్టర్ చాంపియన్స్ పోటీల్లో పతకం దక్కించుకున్నారు. ఇటీవల ఆ దేశంలో జరిగిన పోటీల్లో మూడోస్థానంలో నిలిచిన మనోహర్రావును ఆదివారం జిల్లాలోని క్రీడాసంఘాల నాయకులు, రిటైర్డ్ పీడీ, పీఈటీలు తదితరులు ఘనంగా సత్కరించారు. 70ఏళ్లకుపైబడి వయసు ఉన్న మనోహర్రావు ఇప్పటికీ అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని అనేక పతకాలను సాధించి పెద్దపల్లి పేరును ఖండంతరాలు దాటించారని మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్.రాజయ్య ప్రశంసించారు. భావిక్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని క్రీడా సంఘాల నాయకులు లక్ష్మీరాజం, తోట శంకర్, దేవసాని ధర్మయ్య అన్నారు. మనోహర్రావును సత్కరించుకోవడం సంతోషకరమన్నారు. ఇంజినీరింగ్ సీటు కోసమని.. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ సీటు సాధించాలంటే క్రీడల్లో ప్రావీణ్యం ఉండాలని, దీంతోనే సీటు సాధించే అవకాశం ఉంటుందని తెలియడంతో ఆటల వైపు దృష్టి సారించానని ఉస్మానియా యూనివర్సిటీ మాజీ చైర్మన్, హ్యామర్త్రో పతక గ్రహీత తూముల మనోహర్రావు అన్నారు. అప్పట్నుంచి క్రీడలంటే ఇష్టంగా మారి ఇప్పుడు అనేక దేశాల్లో జరిగే పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొనే అవకాశం దక్కించుకున్నానని తెలిపారు. కార్యక్రమంలో షపీ, కలీం, మాతంగి శ్రీఽనివాస్, శ్రీధర్, తూముల శ్రీనివాస్, సుబ్రమణ్యం, శ్రీధర్, రాజేశం, అక్కపాక నరేశ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. థాయ్లాండ్ పోటీల్లో ప్రతిభ ఖండాంతరాలు దాటించిన పెద్దపల్లి ఖ్యాతి -
సుప్మా అధ్యక్షుడిగా జగన్గౌడ్
సిరిసిల్లటౌన్/సిరిసిల్ల ఎడ్యుకేషన్/కరీంనగర్సిటీ: శాతవాహన యూనివర్సిటీ ప్రైవేటు డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (సుప్మా) నూతన అధ్యక్షుడిగా రాజన్న జిల్లాకు చెందిన గుగ్గిళ్ళ జగన్గౌడ్ ఏకగ్రీవంగా ఎంపికయ్యాడు. ఆదివారం సుల్తానాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్కు చెందిన గోవిందవరం కృష్ణ, కోశాధికారి ధర్మపురికి చెందిన సంగోజు అంజయ్యను ఎన్నుకున్నారు. ఉమ్మడి జిల్లాలో శాతవాహన పరిధిలో ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని నూతన కార్యవర్గం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సుప్మా పూర్వ ప్రతినిధులు వెంకటేశ్వరరావు, శ్రీపాద నరేశ్, కొలనూరు శేఖర్రెడ్డి నూతన ప్రతినిధులను సత్కరించారు. -
ఏఎంసీ డైరెక్టర్ దంపతుల ఆత్మహత్యాయత్నం
ధర్మపురి/వెల్గటూర్: వెల్గటూ ర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. శనివారం అర్ధరాత్రి సమయంలో ధర్మపురి మండలం రాయపట్నం వంతెనపైకి చేరుకుని గోదావరిలో దూకారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని స్థంభంపల్లికి చెందిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగయ్య కుటుంబంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి మరోసారి గొడవ జరిగింది. రాత్రిపూట దంపతులిద్దరూ బైక్పై రాయపట్నం వంతెన వద్దకు చేరుకుని చెప్పులు, బండి, ఫోన్ వంతెనపై వదిలేసి భార్యాభర్తలిద్దరూ గోదావరిలో దూకారు. లింగయ్యకు ఈత రావడంతో చివరి క్షణంలో మనసు మార్చుకుని మునిగిపోతున్న తన భార్యను వంతెన పిల్లర్ వద్ద ఇనుప కొక్కానికి చీరతో కట్టి తాను కూడా ఇనుప కొక్కెం పట్టుకొని సహాయం కోసం కేకలు వేశాడు. అదే సమయంలో వ్యక్తిగత పని నిమిత్తం అటుగా వచ్చిన మంచిర్యాల జిల్లా గుళ్లకోట గ్రామానికి చెందిన యువకులు వారి అరుపులు విని సమీపంలో ఉన్న జాలర్లకు విషయం తెలపడంతో వారు డైరెక్టర్ దంపతులను కాపాడి తెప్పలపై బయటకు తెచ్చారు. అప్పటికే నీటమునిగి లింగవ్వ అస్వస్థతకు గురైంది. సమాచారం అందుకున్న ధర్మపురి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దంపతులిద్దరినీ అంబులెన్స్లో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ప్రాణాపాయం నుంచి బయటపడి చికిత్స పొందుతున్నట్లు తెల్సింది. అర్ధరాత్రి గోదావరిలో దూకిన వైనం సమయానికి రక్షించిన యువకులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు కుటుంబ కలహాలే కారణమా..? -
లక్ష్యం.. ఆమె ఆరోగ్యం
కరీంనగర్: మహిళల ఆరోగ్య రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. ఇందులో భాగంగా స్వయం సహాయక గ్రూపు (ఎస్హెచ్జీ) సభ్యులకు 32 రకాల వైద్య పరీక్షలు చేయించాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా ఐదు పీహెచ్సీలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఇందులో చిగురుమామిడి, చొప్పదండి, ఇల్లందకుంట, గంగాధర, కొత్తపల్లి మండలాల్లోని పీహెచ్సీల పరిధిలో మహిళలకు వైద్య పరీక్షలు చేపట్టనున్నారు. జిల్లావ్యాప్తంగా 13 వేలకు పై చిలుకు మహిళా స్వయం సహాయక (ఎస్హెచ్జీ) సంఘాలుండగా, వాటిలో 1.04 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. వీరంతా సెర్ప్, డీఆర్డీవో శాఖల ఆధ్వర్యంలో సీ్త్ర నిధితో పాటు పావలా వడ్డీ.. తదితర రుణాలు పొంది వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సభ్యులందరికీ ఉచితంగా 32 రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఎంపిక చేయబడిన పీహెచ్సీల్లో రక్త నమూనా సేకరించి జిల్లాకేంద్రంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్కు పంపిస్తారు. ఏవైన వ్యాధులు ఉన్నట్లు తేలితే వారికి వెంటనే చికిత్స అందిస్తారు. ప్రజా పాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటివరకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా 99 రోజుల పాటు పలు కార్యక్రమాలు చేపట్టనుంది. కుటుంబ ఆరోగ్యానికి మహిళల ఆరోగ్యం కీలకమనే భావనతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన పీహెచ్సీల్లో మహిళల నుంచి రక్త నమూనాలు సేకరించి జిల్లాకేంద్రంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్కు పంపిస్తారు. ఇందులో భాగంగానే ఎస్హెచ్జీ సభ్యులకు అవసరమైన 32 రకాల వైద్య పరీక్షలు చేయించేందుకు సర్కారు సిద్ధమైంది. పరీక్షల్లో ఏవైనా వ్యాధులు బయటపడితే వెంటనే చికిత్స అందించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీ ణ ప్రాంత మహిళల్లో ఆరోగ్యంపై అవగాహన పెరగడమే కాకుండా, ప్రారంభ దశలోనే వ్యాధులను గుర్తించి చికిత్స అందించే అవకాశం ఉంటుంది. -
రిమాండ్ ఖైదీకి అస్వస్థత
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్కు చెందిన యూట్యూబర్ వైష్ణవిని హత్య చేసిన కేసులో నిందితుడైన ఆమె భర్త హరిబాబు జగిత్యాల స్పెషల్ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. ఆదివారం వేకువజామున అస్వస్థతకు గురికావడంతో జైలు అధికారులు ఎస్కార్ట్ మధ్య జగిత్యాల ప్రభుత్వ ఆస్పతికి తరలించారు. తల, మెడనొప్పితో బాధపడుతున్న హరిబాబుకు వైద్యులు చికిత్స అందించారు. మధ్యాహ్నం తిరిగి సబ్ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు సబ్ జైలర్ మొగిలేష్ తెలిపారు. చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతిఇబ్రహీంపట్నం: మండలంలోని భర్ధీపూర్ గ్రామానికి చెందిన చెట్టి వెంకటేశ్ (25) గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్లి అందులోనే పడి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఈనెల 21న చేపలు పట్టేందుకు వెళ్లిన వెంకటేశ్ తిరిగి రాకపోవడంతో గోదావరి ప్రాంతంలో వెదికారు. నీటిలో శవమై కనిపించాడు. వెంకటేశ్ తల్లి రాధ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్కుమార్ పేర్కొన్నారు. చికిత్స పొందుతూ ఒకరు..జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని కరీంనగర్ రోడ్డులోగల వాసవి కల్యాణ మండపం వద్ద ద్విచక్రవాహనాన్ని ఢీకొని గాయపడిన వొద్ది హరీశ్(54) చికిత్స పొందుతూ మృతిచెందాడు. పట్టణంలోని గుట్టరాజేశ్వరి స్వామి ఆలయ ప్రాంతంలో నివాసముండే హరీశ్ శనివారం సాయంత్రం మిత్రులతో కలిసి కరీంనగర్ రోడ్డులోని ఓ రెస్టారెంట్లో భోజనం చేసేందుకు వెళ్లారు. పార్కింగ్ చేసిన కారు వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా.. పట్టణానికి చెందిన సయ్యద్ సాహిల్ తన ద్విచక్రవాహనాన్ని అతి వేగంగా నడుపుతూ హరీశ్ను ఢీ కొట్టాడు. తలకు బలమైన గాయాలు కావడంతో అతని మిత్రులు జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. హరీశ్ కుమారుడు సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి..మెట్పల్లిరూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మెట్పల్లి ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. మెట్పల్లి మండలం వేంపేటకు చెందిన నీరటి రాజేశం(47), మగ్గిడి హరీశ్ శనివారం ద్విచక్రవాహనంపై వేంపేట నుంచి మెట్పల్లికి పనినిమిత్తం బయల్దేరారు. గెదే అడ్డుగా రావడంతో బైక్పై ఉన్న రాజేశం కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన రాజేశంను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నిజామాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించగా.. ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
కొనుగోళ్లతో రైతులకు లాభం
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుతో రైతులకు లాభం జరుగుతుంది. వ్యాపారులు క్వింటాల్కు రూ.1800కు మించి కొనడం లేదు. మార్క్ఫెడ్ కొంటే క్వింటాల్కు రూ.2400 ధర రానుంది. రైతులకు రూ.600 వరకు లాభం జరుగనుంది. – నల్ల రాజిరెడ్డి, తొంబర్రావుపేట, మేడిపల్లి(మం) మొక్కజొన్న కొనుగోలుకు అవసరమైన కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. కొనుగోలుకు అవసరమైన సామగ్రి సమకూర్చుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే కొంటాం. ప్రభుత్వం నుంచి ఒక్కటి రెండు రోజుల్లో ఆదేశాలు వచ్చే అవకాశముంది. – ఎండీ.హబీబ్, మార్క్ఫెడ్ అధికారి, జగిత్యాల -
కీడు సోకిందని ఊరు ఖాళీ
జమ్మికుంట: జమ్మికుంట మండలం గండ్రపల్లిలో తరచూ ఏవరో ఒకరు చనిపోతున్నారని, గ్రామానికి కీడు సోకిందని ఆదివారం వేకువజామున గ్రామస్తులందరూ ఊరును ఖాళీ చేశారు. ఊరి బయటకు వెళ్లి వంట చేసుకున్నారు. గ్రామంలో రెండు నెలలుగా ఒకరి దినకర్మ పూర్తి కాకుండా, మరొకరు చనిపోతున్నారని, గ్రామానికి కీడు సోకడమే ఇందుకు కారణమని గ్రామస్తులు భయాందోళన చెందారు. పండితుల సలహా మేరకు గ్రామ పెద్దల అలోచనలతో ఆదివారం సూర్యోదయనికి ముందుగా ఊరును ఖాళీ చేశారు. మానేరు పరివాహక, పొలాలు, చెరువు కట్టలపైకి వెళ్లి వంటలు చేసుకుని, అక్కడే భోజనాలు చేశారు. సూర్యాస్తమయం తర్వాత తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. సివిల్ సర్వీసెస్ వాలీబాల్ పోటీలకు ఎంపికకరీంనగర్స్పోర్ట్స్: ఢిల్లీలో ఈ నెల 21నుంచి జరుగుతున్న అఖిల భారత సివిల్ సర్వీసెస్ వాలీబాల్ పోటీలకు శంకరపట్నం మండలం కేశవపట్నం జిల్లా పరిషత్ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు భక్తు రాజ్కుమార్ ఎంపికై నట్లు డీవైఎస్వో శ్రీనివాస్ తెలిపారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించి, జాతీయ పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. రాజ్కుమార్ ఎంపికపై ఎస్జీ్ఎఫ్ కార్యదర్శి వేణుపాల్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి గిన్నె లక్ష్మణ్, పెటా అధ్యక్ష కార్యదర్శులు బాబు శ్రీనివాస్, ఆడెపు శ్రీనివాస్, పీడీలు, పీఈటీలు సీహెచ్ సంపత్ రావు, కొమురోజు కృష్ణ జిట్టవేణి శ్రీనివాస్, అనూప్రెడ్డి, వీర్పాల్రెడ్డి, సంతోష్, మహేశ్ హర్షం వ్యక్తం చేశారు. -
అన్నదాతలకు డబుల్ ధమాకా
కరీంనగర్ అర్బన్: ఎన్నడూ లేని విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయం ఏకకాలంలో చేరడంపై రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఎకరాకు రూ.2వేల సాయం అందించింది. ఆదివారం నుంచి రైతు భరోసా సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖాతాల్లో జమ చేస్తోంది. జిల్లాలో 2,14,311 మంది రైతులకు ఎకరాకు రూ.6వేల చొప్పున రూ.197.10కోట్ల నగదు నేటి నుంచి జమకానుంది. జిల్లాలో ఎక్కువమంది రైతులు వరితో పాటు ఇతర పంటలు సాగుచేస్తుంటారు. గత పట్టాదారుల సంఖ్యతో పాటు కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులకు రైతు భరోసా వర్తింపజేశారు. జిల్లాలో కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూరు వ్యవసాయ డివిజన్లుండగా ఏఈవోలు అప్డేట్ చేసిన వివరాల ప్రకారం నేరుగా ఖాతాలకు జమ చేస్తున్నారు. తొలుత చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరుతుండగా తదుపరి పెద్ద రైతులకు చేరుతాయని అధికారులు వెల్లడించారు. భూభారతి పోర్టల్ వివరాలు, ఖాతా వివరాలిచ్చిన రైతుల ప్రకారం వ్యవసాయ విస్తరణ అధికారులు లాగిన్లో క్రోడీకరించారు. సదరు వివరాల క్రమంలో పెట్టుబడి సాయం పడుతుందని వివరించారు. కొత్తగా 10వేల మంది పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ధరణి పోర్టల్లో నమోదైన రైతుల జాబితాను వ్యవసాయశాఖ సేకరించింది. ఈ నెల 25 వరకు అవకాశముండగా భూములు కొన్న, కుటుంబాల్లో భూ పంపకాలతో కొత్తగా పేర్లు నమోదైన వారి పేర్లను ఇటీవల వ్యవసాయ విస్తరణ అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. రైతుభరోసా పథకంలో యాసంగి సీజన్కు కొత్తగా 10వేల మంది రైతులు అర్హత పొందారు. హుజూరాబాద్, శంకరపట్నం, మానకొండూరు, తిమ్మాపూర్, గంగాధర, రామడుగు, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాల్లో కొత్తగా నమోదైన రైతుల సంఖ్య ఎక్కువగా ఉంది. కిసాన్ సమ్మాన్ రూ.21.92కోట్లు జిల్లా రైతులకు ఇప్పటికే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద పెట్టుబడి సాయం వచ్చింది. 1,09,598 మంది రైతులకు రూ.21.92కోట్లు ఖాతాకు చేరాయి. ఇప్పటివరకు ఆరు విడతల్లో నగదు పంపిణీ కాగా ప్రతి రైతుకు రూ.2వేల చొప్పున ఖాతాల్లో జమ చేసింది. ఒక్కో రైతుకు ఏడాదికి రూ.6వేల చొప్పున మూడు విడతల్లో చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి విడతలో 72,939 మంది రైతులు రూ.14.58కోట్లు లబ్ధి పొందారు. రెండో విడతలో 93,763 మందికి రూ.18.75కోట్లు చేరాయి. మూడో విడతలో 96,558 మందికి రూ.19.31కోట్లు, నాలుగో విడతలో 1,03,024 మంది రైతులకు రూ.20.60కోట్లు, ఐదో విడతలో 1,06,558 మంది రైతులకు రూ.21.31కోట్లు వచ్చాయి. ఆరవ విడతలో 1,09,598 మంది లబ్ధి పొందారు.జిల్లా వివరాలు రెవెన్యూ గ్రామాలు: 206పోర్టల్లో పట్టాదారులు: 214311విడుదల కావాల్సిన నగదు: రూ.197.10కోట్లు -
మార్క్ఫెడ్ సిద్ధం
మక్కల కొనుగోలుకు జగిత్యాలఅగ్రికల్చర్: యాసంగి సీజన్లో సాగు చేసిన మొక్కజొన్న పంట ఇప్పుడిప్పుడే మార్కెట్కు వస్తోంది. మొన్నటి వరకు క్వింటాల్కు రూ.3వేలు పలికిన ధర.. రైతుల చేతికి రాగానే క్వింటాల్కు రూ.1800కు పడిపోయింది. దీంతో మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర రూ.2400 చొప్పున కొనుగోలు చేయాలని ప్రభుత్వంపై రైతులు, ప్రజాప్రతినిధులు ఒత్తిడి పెంచారు. ఈ మేరకు ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా మక్కలు కొనేందుకు నిర్ణయించింది. ప్రభుత్వ అదేశాలు అందిన మరుసటి రోజు నుండే కేంద్రాలను ప్రారంభించాలని అధికార యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కేంద్రాలకు 9 నుంచి 10లక్షల క్వింటాళ్ల మక్కలు జిల్లాలో వరి తర్వాత మక్కనే 35వేల ఎకరాల్లో సాగు చేసినట్లు వ్యవసాయాధికారుల అంచనా. యాసంగిలో అనుకూల పరిస్థితులు నెలకొనడంతో ఎకరాకు సగటున 30 నుంచి 35 క్వింటాళ్ల వరకు దిగుబడి రావచ్చని వ్యవసాయ, మార్క్ఫెడ్ అధికారులు భావిస్తున్నారు. ఆయా కొనుగోలు కేంద్రాలకు సగటున 40వేల నుంచి 80వేల క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. గన్నీసంచులు, ట్రాన్స్పోర్టు వ్యవస్థ సిద్ధం కేంద్రాల్లో కొనుగోలు చేసిన మొక్కజొన్నను ప్రధానంగా మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి గోదాంల్లో నిల్వ చేయనున్నారు. ఇందుకోసం లారీ యజమానులతో మాట్లాడి ట్రాన్స్పోర్టు వ్యవస్థను సిద్ధం చేసుకున్నారు. సుమారు 3 నుంచి 4లక్షల గన్నీ సంచులను తెప్పిస్తున్నారు. మార్కెట్యార్డులు, సింగిల్ విండో కేంద్రాల్లో మాత్రమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండటంతో పెద్దగా ఇబ్బందులు ఉండవని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలుతో వ్యాపారులు దారికి.. ఇక్కడి కంటే తక్కువ రేటుకే ఇతర రాష్ట్రాల నుంచి మక్కలు వస్తున్నాయంటూ దళారులు ఓపెన్మార్కెట్లో రేటు తగ్గిస్తున్నారు. ప్రభుత్వ ధర.. వ్యాపారులు పెట్టే రేటుకు క్వింటాల్కు కనీసం రూ.600 నుంచి రూ.700 నష్టపోతున్నారు. ప్రభుత్వ సంస్థ రంగంలోకి దిగితే, కనీసం వ్యాపారులు ఆ రేటుకై నా గ్రామాల్లో కొనుగోలు చేసే పరిస్థితి ఉంటుంది. జగిత్యాల జిల్లాలో 13 కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక త్వరలో ప్రారంభించేందుకు నిర్ణయం జగిత్యాలలో 13 కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికజగిత్యాల జిల్లాలో మొక్కజొన్న పంట అధికంగా ఉన్న ధర్మపురి, గొల్లపల్లి, ఇబ్రహీంపట్నం, జగిత్యాల, కథలాపూర్, కోరుట్ల, మల్లాపూర్, మెట్పల్లి, రాయికల్, బీర్పూర్, భీమారం, మేడిపల్లి మండలకేంద్రాల్లో 13 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఈ కేంద్రాలను విస్తీర్ణం, రైతుల డిమాండ్ను బట్టి పెంచే అవకాశం ఉంది. మార్కెట్ కమిటీలు, డీసీఎం, సింగిల్ విండో కేంద్రాల్లో ఏర్పాటు చేసి మార్క్ఫెడ్ అధికారులు పర్యవేక్షించనున్నారు. -
ఇన్చార్జీల విద్యాశాఖ
కరీంనగర్టౌన్: జిల్లా విద్యాశాఖలో ఇన్చార్జీల పాలన సాగుతోంది. జిల్లా విద్యాశాఖాధికారిగా రెగ్యులర్ డీఈఓ లేకపోవడంతో లోకల్ బాడీ అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. రెగ్యులర్ ఎంఈవో పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో మండలాల పరిధిలోని సీనియర్ ప్రధానోపాధ్యాయులు ఇన్చార్జీలుగా కొనసాగుతున్నారు. దీంతో పదో తరగతి పరీక్షల ఫలితాల ప్రభావం ఎలా ఉంటుందోననే సందేహం నెలకొంది. అదనపు బాధ్యతలతో ప్రధానోపాధ్యాయులు ఒత్తిడికి గురవుతున్నారు. జిల్లాలోని 16 మండలాల్లో ఎంఈవోలు లేకపోవడంతో విద్యావ్యవస్థ పర్యవేక్షణ గాడి తప్పుతోంది. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయుల పనితీరు, మధ్యాహ్న భోజన అమలు, సర్వశిక్షా అభియాన్ చేపట్టే విద్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడంలో ఎంఈఓల పాత్ర కీలకం. ఏళ్ల తరబడి రెగ్యులర్ ఎంఈఓలు లేకపోవడంతో ఖాళీగా ఉన్న వీరి స్థానాల్లో సీనియర్ ప్రధానోపాధ్యాయులను ఇన్చార్జీలుగా నియమిస్తున్నారు. ఉపవిద్యాధికారులు ఇన్చార్జీలే జిల్లాలో విద్యావ్యవస్థపై ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ పాఠశాలల నిర్వహణ, పనితీరు మధ్యాహ్న భోజనం అమలు, ఎస్ఎస్ఏ చేపట్టే ఇతర కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పరిశీలించి జిల్లా విద్యాధికారికి నివేదిక ఇవ్వాల్సిన ఉపవిద్యాధికారులు సైతం అందరూ ఇన్చార్జీలే. హుజూరాబాద్, కరీంనగర్, ఆర్ఎంఎస్ఏ పీవో, జిల్లా పరిషత్ డిప్యూటీ ఈవోలుగా రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో ఇన్చార్జీల పాలనే కోనసాగుతోంది. పరీక్షల నిర్వహణ ఎలా మార్చి 14 నుంచి పదవ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు డిపార్టుమెంటల్ అధికారుల నియామకం మాత్రమే పూర్తయింది. ఇంటర్నల్ మార్కుల జాబితా బోర్డుకు పంపి ఆమోదం పొందాలి. ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్స్క్యాడ్, సిట్టింగ్ స్క్యాడ్, రూల్ ఆఫీసర్ల నియమాకం చేపట్టాలి. ఇదంతా చేయడం కత్తిమీద సాములాంటిదే. ఈ విధులు నిర్వహించడం సీనియార్టీతో ముడుపడి ఉంటుంది. ఏ ఒక్కరి నియమాకంలో తేడా వచ్చిన పరీక్షల సమయంలో ఇబ్బందలు తప్పవు. ఇవన్నింటిని తట్టుకోవాలంటే రెగ్యులర్ డీఈవో తప్పనిసరి. పనులపై పర్యవేక్షణ ఎలా రెగ్యులర్ డీఈఓ లేకపోవడంతో విద్యాశాఖ వ్యవస్థ గాడి తప్పుతోంది. జిల్లాలో పదోతరగతి పరీక్షల నిర్వహణతో పాటు ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలతో పాటు టైప్రైటింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడర్, డ్రాయింగ్, బీఎడ్, డీఎడ్ ప్రవేశ పరీక్షలు డీఈవో నిర్వహించాల్సి ఉంటుంది. డిప్యూటి ఈవో లేకపోవంతో ఈ బాధ్యతలను కూడా డీఈవోనే నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. వీటితో పాటు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ డీఈవో లేకపోవడంతో ఇన్చార్జీగా విధులు నిర్వహించేవారు శాఖపరమైన చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పరిపాలన పరమైన ఇబ్బందులు తప్పవని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, సీనియర్ ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. డీఈవోతో పాటు 16 మండలాలకు ఎంఈవోలు ఇన్చార్జీలే హెచ్ఎంలకు అదనపు బాధ్యతలతో సతమతం -
దాతలు స్పందించినా దక్కని ప్రాణం
జ్యోతినగర్: ‘అమ్మా.. బతకాలని ఉంది’ శీర్షికన ‘సాక్షి’ 2024లో కథనం ప్రచురించిన విషయం తెలిసింది. ఈ కథనానికి దాతలు స్పందించారు. చదువులతల్లి సిరి వైద్యానికి అండగా నిలిచారు. ఆమె ఆరోగ్యం కుదుటపడాలని అనేకమంది ఆర్థికసాయం అందించారు. అయినా సిరి ప్రాణాలు దక్కలేదు. ఆదివారం ఉదయం హైదరాబాద్లోని ఆస్పత్రిలో కూనారపు సిరి(19) కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందింది. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ కృష్ణానగర్లో నివాసముంటున్న కూనారపు పోశం–వెంకటలక్ష్మి దంపతుల కుమార్తె సిరి చదువులో చాలాముందుండేది. అనారోగ్యంతో ఉన్న క్రమంలో ఆమె చికిత్సకు దాతలు సాయం అందించారు. తండ్రి కూడా తన తాహతుకు మించి వైద్యానికి ఖర్చు చేశారు. రెండు సంవత్సరాలుగా వ్యాధితో బాధపడుతూ సిరి తుదిశ్వాస విడిచింది. సిరి మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. చదువులతల్లి సిరి కన్నుమూత కిడ్నీ సంబంధిత వ్యాధితో మృతి -
షెడ్యూల్ వచ్చాక..
అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా ఎన్హెచ్జీ మహిళా సంఘాల సభ్యులకు 32 రకాల వైద్య పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఐదు మండలాల్లోని పీహెచ్సీలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. షెడ్యూల్ రాగానే వైద్య పరీక్షలు ప్రారంభిస్తాం. రోజుకు 50 నుంచి 100 మంది చొప్పున మహిళా సంఘాల సభ్యుల రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తాం. పైలెట్ ప్రాజెక్టు విజయవంతమైతే దశల వారీగా జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తాం. – డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్వో -
శృంగేరి పీఠాదీశ్వర జయంతిలో కేంద్రమంత్రి సంజయ్
కరీంనగర్: కర్ణాటకలోని శ్రీశ్రీశ్రీ శంకరాచార్య మహాసంస్థానం దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతి అనంత శ్రీ భారతీ తీర్థ మహాస్వామి 76వ జయంతి ఉత్సవాల్లో కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమా ర్ పాల్గొన్నారు. శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతి స్వామీజీ నిర్వహించిన పలు ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం శృంగేరి శారదాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. శృంగేరి పీఠ తెలంగాణ బాధ్యులు వ్యాసోజల రాధాకృష్ణ శర్మ పాల్గొన్నారు. జల సంరక్షణకు పాటుపడాలి కరీంనగర్ కార్పొరేషన్/కరీంనగర్/విద్యానగర్/కరీంనగర్స్పోర్ట్స్: జలసంరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని మేయర్ కొలగాని శ్రీని వాస్ అన్నారు. ఆదివారం ప్రపంచ జల దినో త్సవం సందర్భంగా వైశ్యభవన్లో మానేరు పర్యావరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత వేసవికాలంలో భూగర్భ జలాలు అడుగంటి పోయే పరిస్థితి ఉందన్నారు. తాగునీరు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారన్నారు. వర్షాకాలంలో వాననీరు ఒడిసిపట్టుకోవాలనే ఆలోచన చేయకపోవడంతోనే ఇలాంటి పరిస్థి తి ఏర్పడుతోందన్నారు. వర్షపు నీటిని నిల్వ చేసేందుకు, ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. శాతవా హనరోడ్డులోని వాకర్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నా రు. మానేరు పర్యావరణ సమితి అధ్యక్షుడు తోట లక్ష్మణరావు, 66వ డివిజన్ కార్పొరేటర్ వంగల పవన్, సర్వోదయ అధ్యక్షుడు పెద్ది లక్ష్మీనారాయణ, స్వరాజ్యబాబు, నారా యణ, వెంకటేశం, సత్యనారాయణ పాల్గొన్నారు. పుస్తక పఠనంతోనే జ్ఞాన సముపార్జన కరీంనగర్టౌన్: వ్యక్తి విజయం జ్ఞానంతోనే సాధ్యమవుతుందని, జ్ఞానం నిరంతరం పుస్తకాలు చదవడం వల్ల వస్తుందని, అందరూ పుస్తకాలు చదవాలని స్వేరోస్ ఫౌండర్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ఆదివార కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ దగ్గర ఓ ఫంక్షన్ హాల్లో స్వేరోస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బుక్ రీడథాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంలోకి వచ్చిన తర్వాత పుస్తకాలు చదివే వారి సంఖ్య తగ్గిందన్నారు. ఆ టెక్నాలజీ పుస్తకాలు చదవడం వల్ల వచ్చిన జ్ఞానంతోనే సాధ్యమైందని మరిచిపోవద్దని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరి చేత విక్టర్ ఈ ఫ్రాంకిల్ రచించిన అర్థం కోసం అన్వేషణ అనే పుస్తకాన్ని చదివించారు. స్వేరోస్ చీఫ్ కన్వీనర్ బల్గూరి దుర్గయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వీరయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మనోజ్, బాబు నాయక్, జిల్లా అధ్యక్షుడు అనిల్, ఆకినపల్లి శిరీష, అజయ్ పాల్గొన్నారు. పీఈటీ పోస్టులు భర్తీ చేయాలి కరీంనగర్స్పోర్ట్స్: రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని పెటా సంఘం అధ్యక్షుడు బాబు శ్రీనివాస్గౌడ్ కోరారు. ఆదివారం అంబేద్కర్ స్టేడియంలో జరిగిన పెటా సంఘం సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1,803 ఉన్నత పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయుల కొరత ఉందన్నారు. 4,703 ఉన్నత పాఠశాలలకు 2,900 మంది పని చేస్తున్నట్లు తెలిపారు. వ్యాయామ విద్యను మూల్యాంక సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని, ప్రాథమికస్థాయి నుంచి ఉన్నత విద్య వరకు తప్పకుండా వ్యాయామ విద్య ఉపాధ్యాయ పోస్టులు ఉండాలన్నారు. పెటా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆడెపు శ్రీనివాస్, కోశాధికారి డి.వీరపాల్రెడ్డి, రాష్ట్ర అసోసియేటెడ్ ప్రెసిడెంట్ గిన్నె లక్ష్మణ్ పాల్గొన్నారు. -
ఖాతా ఇచ్చారో ఖతమే!
కరీంనగర్క్రైం: మీకు బ్యాంకు ఖాతా ఉందా..? దాన్ని రెగ్యులర్గా వాడుతున్నారా..? ఎవరైనా ఖాతా నంబరు, పాస్ బుక్ అడిగితే ఇచ్చారా..? మీ అకౌంట్కు డబ్బులు పంపిస్తామని చెబితే నమ్మి సరే అన్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త.. సైబర్ నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. వాళ్లు కాజేసిన డబ్బుతో లావాదేవీలు కొనసాగించేందుకు ఇతరుల బ్యాంకు ఖాతాలు వినియోగిస్తున్నారు. వీటినే మనీ మ్యూల్ ఖాతాలు అంటారు. ఈ అకౌంట్ల మోసాలు ఇప్పుడు జిల్లాలోనూ సంచలనం సృష్టిస్తున్నాయి. నగరంలో పలువురు సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్లు అందిస్తూ ఇటీవల పోలీసులకు చిక్కారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ దారిని ఎంచుకోగా నేరం చేసిన వారందరూ 22 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారే. సైబర్ నేరాలు కొత్త పుంతలు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్ద్దీ సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సైబర్ నేరగాళ్లు కాజేసిన డబ్బును వారి ఖాతాల్లో ఉంచకుండా ఇతరుల ఖాతాలను మళ్లిస్తుంటారు. ఇందుకు కీలక ఆయుధం ‘మ్యూల్ బ్యాంక్ ఖాతా లు’. కొందరు మధ్యవర్తులు కమీషన్కు ఆశపడి అమాయక వ్యక్తుల పేర్లతో లేదా స్వయంగా బ్యాంకుల్లో సేవింగ్, కరెంట్ ఖాతాలు తెరిచి, వాటికి సంబంధించిన పాస్బుక్కులు, ఏటీఎం కార్డులు, సిమ్ కార్డులు దేశ, విదేశాల్లో ఉన్న సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నారు. సైబర్ మోసాల్లో బాధితుల నుంచి డబ్బు ముందుగా ఈ ఖాతాల్లోకి జమవుతుంది. తరువాత వేరే ఖాతాలకు బదిలీ చేయడం లేదా నగదుగా ఉపసంహరించుకోవడం జరుగుతుంది. ఇందుకోసం ఆ ఖాతాదారులకు, అప్పగించిన వారికి కమీషన్ ఇస్తుంటారు. ఉచ్చులో యువత ఈజీమనీ ఆశతో యువత సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. కొందరికి ఖాతా ఇవ్వడానికి రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు కమీషన్ ఇస్తున్నా రు. తాజాగా కరీంనగర్ పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ క్రాక్డౌన్’లో అరెస్టయిన 12 మంది 22ఏళ్ల నుంచి 26ఏళ్ల మధ్య వయసు కలిగిన యువకులే. ఈజీ మనీ సంపాదనకు అలవాటు పడి సైబర్ నేరగాళ్లకు సహకరించారు. ఇతరుల బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డులు సైబర్ నేరస్తులకు అప్పగించేవారు. కరీంనగర్లో నమోదైన ఓ సైబర్ మోసం కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు డబ్బు వెళ్లిన బ్యాంక్ ఖాతాలు ట్రాక్ చేశారు. లోతైన విచారణ జరిపి, 12మందిని అరెస్టు చేసి, బ్యాంక్ పత్రాలు, ఖాతాలు, సిమ్ కార్డులు, ఇతర కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. ఒక కేసుతోనే ఇంత మంది భయటపడ్డారంటే లోతైన దర్యాప్తు జరిగితే మ్యూల్ అకౌంట్ల ముఠాలో ఇంకా ఎంతమంది ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. తెలియని వ్యక్తులకు బ్యాంకు ఖాతాలు ఇవ్వొద్దని సూచిస్తున్నారు. మ్యూల్ అకౌంట్లలో ముందుగా బలయ్యేది ఖాతాదారులే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొంటున్నారు. ఈజీ మనీకి యువత బానిస కొవొద్దని, సైబర్ నేరగాళ్లకు సహకరించి, బంగారు భవితను నాశనం చేసుకోవద్దని కోరుతున్నారు.తెలియని వ్యక్తులకు బ్యాంక్ ఖాతాలు, ఏటీఎం కార్డులు, సిమ్ కార్డులు ఇవ్వడం చట్ట రీత్యా నేరం. డబ్బుల కో సం ఆశపడి వివరాలు ఇవ్వకూడదు. వాటితో నేరాలు జరిగితే నిందితులుగా కేసులు నమోదు చేస్తాం. సైబర్ నేరాలకు సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. యువత ఈజీ మనీ కోసం ఇలాంటి నేరాల్లో పడితే భవిష్యత్తే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. తెలియని వ్యక్తుల సూచనలతో బ్యాంక్ ఖాతాలు తెరవడం, సిమ్ కార్డులు ఇ వ్వడం, ఆన్లైన్ లావాదేవీల్లో పాల్గొనడం వంటి చర్యల నుంచి దూరంగా ఉండాలి. – గౌస్ ఆలం, కరీంనగర్ సీపీ -
సబ్సిడీ గ్యాస్.. తుస్!
కరీంనగర్ అర్బన్: మహిళలకు వంటింట చేయూతగా ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించింది. ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్నవారికి ప్రాధాన్యతనివ్వగా 6నెలల పాటు రూ.500 మహిళల పేరుతో ఉన్న గ్యాస్ కనెక్షన్లకు అందజేసింది. గ్యాస్ బుక్ చేసుకుని డోర్డెలివరీ అయిన తదుపరి మహిళల ఖాతాల్లో డబ్బులు జమయ్యేవి. క్రమేణా ఖాతాలకు జమకాకపోవడంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద ఆరా తీయడం, నిరాశగా వెనుదిరుగుతున్నారు. రూ.500 ఎవరి ఖాతాకు చేరుతున్నట్లు మహిళలకు గ్యాస్ కోసం ఇస్తామన్న రూ.500 ఎవరి ఖాతాకు చేరుతున్నాయన్నది స్పష్టత లేదు. మీమీ ఏజెన్సీ పరిధిలో ఎంతమందికి లబ్ధి చేకూరుతుందని ఆరా తీస్తే గ్యాస్ ఏజెన్సీల వద్ద స్పష్టమైన సమాచారం లేదు. తమ వద్ద సమాచారం లేదని చెప్పడం పౌరసరఫరాలశాఖ అధికారులకే చెల్లు. జిల్లాలో 3.50లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉండగా ఇందులో 2.10లక్షల వరకు మహిళల పేరున గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని సమాచారం. ఈ లెక్కన ఒక్కసారి బుక్ చేస్తే రూ.10కోట్లు ఖాతాలకు చేరాల్సి ఉండగా ఏడాదికి 8 సిలిండర్లు లెక్కేసినా రూ.84కోట్లు జమ కావాల్సి ఉంది. నగరంలోని గణేశ్నగర్కు చెందిన సావిత్రికి ఇండెన్ గ్యాస్ ఏజెన్సీలో కనెక్షన్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలోనూ దరఖాస్తు చేసింది. రెండు, మూడు సార్లు రూ.500 జమకాగా ఏడాదిన్నరగా జమ కావడం లేదు.జమ్మికుంట మండలం రామన్నపల్లికి చెందిన మర్రి సునీతకు ఇండెన్ గ్యాస్ కనెక్షన్ ఉంది. మూడుసార్లు రూ.500 ఖాతాలో జమవగా రెండేళ్లుగా జమవడం లేదు. రూ. 500కే గ్యాస్ అన్నరు.. అంతలోనే అటకెక్కించారని సునీత వాపోతోంది. ఇది వీరిద్దరి సమస్యే కాదు జిల్లావ్యాప్తంగా వేలమంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్య. ఇండెన్ గ్యాసే కాదు భారత్, హెచ్పీ గ్యాస్ ఏజెన్సీల్లోనూ ఇదే దుస్థితి.సబ్సిడీ పడాల్సింది ఇలా ప్రస్తుతం వంట గ్యాస్ ధర: రూ.985వినియోగదారు చెల్లించాల్సింది: రూ.985సబ్సిడీ జమ కావాల్సింది: రూ.500పడుతున్న భారం: రూ.485ఏడాదికి వినియోగించే సిలిండర్లు: 8ఈ లెక్కన మహిళలకు నష్టం: రూ.4వేలుఅధికారులు ఏం చెబుతున్నారంటే రూ.500కే గ్యాస్ లబ్ధిదారులుగా ఉండాలంటే ఆధార్, బ్యాంకు, గ్యాస్ కనెక్షన్ లింక్ ఉండాలని, ఈ మూడు ఒకే పేరుతో లింక్ లేకపోతే డబ్బులు జమకావని చెబుతున్నారు. ఈకేవైసీ చేయకపోవడం అంటే రేషన్ కార్డు లేదా గ్యాస్ కనెక్షన్ ఈకేవైసీ పూర్తి కాకపోతే సబ్సిడీ నిలిచిపోతుంది. బ్యాంకు వివరాల్లో తప్పులున్నా, డూప్లికేట్ గ్యాస్ కనెక్షన్ అంటే ఒక కుటుంబానికి ఒక సబ్సిడీ మాత్రమే వర్తిస్తుందని చెబుతున్నారు. ప్రజాపాలనలో అప్లికేషన్ చేయకపోతే సబ్సిడీ రాదని అధికారులు చెబుతుండగా మొదట్లో సబ్సిడీ పడి తదుపరి పడకపోవడంపై సమాధానం కరువైంది.జిల్లా వివరాలు జిల్లా జనాభా: 10,05,711 నివాసాలు: 2,58,485డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు: 3,50,000కమర్షియల్ కనెక్షన్లు: 80,000 -
పోటీ చేసి.. పెత్తనం చూపి
కరీంనగర్ కార్పొరేషన్: ‘మీరు కార్పొరేటర్, మేయర్, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ కావాలనుకుంటున్నారా..? జస్ట్ ఎన్నికల్లో నామినేషన్ వేసి పోటీలో ఉంటే చాలు కోరుకున్న పదవి చేతికొస్తుంది. ఇదేంటి..? పోటీలో ఉండాలి, ప్రజల ఆదరణ పొందాలి. రూ.లక్షల్లో ఖర్చు చేయాలి. ప్రత్యర్థిపై గెలవాలి. ఇవన్నీ లేకుండానే పోటీచేస్తే చాలు పదవి వస్తుందని ఎలా అంటున్నారని విసుక్కోకండి. ఇప్పుడు నడుస్తున్న రాజకీయ విడ్డూరం ఇదే. ఎన్నికల్లో గెలవడం అనేది ఇక్కడ అనవసరం. జస్ట్ పోటీచేస్తే చాలు పదవి వచ్చినట్లే. ఆ పదవి పేరే ‘కంటెస్టెడ్ క్యాండిడేట్’. ఫ్లెక్సీలు, కార్లకు బోర్డులు వివిధ రాజకీయ పదవులకు జరిగే ఎన్నికల్లో పోటీచేసే వారిని అప్పటి మట్టుకే అభ్యర్థులుగా పరిగణిస్తారు. ఉదాహరణకు కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీచేసిన అందరిని అభ్యర్థులనే అంటారు. గెలిచిన వారిని కార్పొరేటర్ అంటారు. ఓడిపోయిన వాళ్లకు పోటీచేసిన చరిత్ర మాత్రమే ఉంటుంది. కాని ఈ పద్ధతిని తిరగరాస్తున్న జిల్లాలో, ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో కొంతమంది నాయకులు, ఓడిపోయినా ‘కంటెస్టెడ్ క్యాండిడేట్’ అనే పదవిని తమకు తామే సృష్టించుకుంటున్నారు. ఏకంగా వారి పేరిట ‘కంటెస్టెడ్ కార్పొరేటర్’, ‘కంటెస్టెడ్ ఎమ్మెల్యే’ అంటూ విజిటింగ్కార్డ్స్, ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు. కార్లకు బోర్డులు తగిలించుకుంటున్నారు. లేని ‘అధికారం’తో పెత్తనం పదవుల్లో లేని వాళ్లు, కేవలం పోటీచేశామనే సాకుతో సొంతంగా పదవులు సృష్టించుకుని అధికారులపై పెత్తనం సాగిస్తున్నారు. ‘కంటెస్టెడ్’ను పదవిగా మలుచుకొని పైరవీలు చేయడం, తమపై గెలిచిన వాళ్లకు సమాంతరంగా అధికారాన్ని చెలాయించాలనుకొనే కొత్త సాంప్రదాయం ప్రస్తుతం తారాస్థాయికి చేరింది. ఓటమిని విజయానికి మెట్టుగా మలచుకొని మరోసారి ప్రజాతీర్పుతో పదవులు సంపాదించుకోవాలి తప్ప ‘కంటెస్టెడ్’ పదవులను సృష్టించుకుని తమకు తాము పలుచన కావద్దంటూ రాజకీయ సీనియర్లు హితవు పలుకుతున్నారు.‘ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు రంజా న్ తోఫా కిట్లు ఇచ్చింది. అధికార పార్టీగా కాంగ్రెస్ నేతలు నగరంలోని ముస్లిం కుటుంబాలకు అందించారు. రంజాన్ తోఫా కిట్లను తనకు కూడా ‘వాటా’ ప్రకారం కేటాయించాలంటూ ‘కంటెస్టెడ్ క్యాండిడేట్’ ఒకరు, నగరానికి సంబంధించిన ఓ అధికారికి ఫోన్చేశారు. తనకు వెంటనే కిట్లు పంపించాలంటూ హుకూం జారీ చేశారు. ఇంతకు మీరెవరు అని సదరు అధికారి ప్రశ్నిస్తే, తాను ఫలానా పదవికి సంబంధించిన ‘కంటెస్టెడ్ క్యాండిడేట్’నంటూ సెలవివ్వడంతో ఆ అధికారి అవాక్కయ్యాడు.’ ‘నగరంలో ఇటీవల పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ చేపట్టారు. ఓ యువకుడు బైక్పై వేగంగా వచ్చి ఆగాడు. పోలీసులు బ్రీత్ఎనలైజర్ పరీక్ష చేస్తుండగా సదరు యువకుడు ఎవరికో ఫోన్ చేసి మాట్లాడాలంటూ పోలీసులకు ఇచ్చాడు. ‘ఆ పిలగాడు మనోడే వదిలేయండి..’ అని అవతలి నుంచి ఆర్డర్ వచ్చింది. ఇంతకు మీరెవరంటూ పోలీసులు ప్రశ్నిస్తే ‘నేను కంటెస్టెడ్ ఎమ్మెల్యే’ను అంటూ సమాధానం ఇవ్వడంతో ఖంగు తినడం ఖాకీల వంతైంది.’ -
దివ్యా.. నీ వెంటే నేను
ఇల్లందకుంట: అతనో ఎస్సై.. అన్యోన్యంగా సాగుతున్న దాంపత్య జీవితం. ఈ నెల 17న కడుపునొప్పి బాధ భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. తట్టుకోలేని ఎస్సై సైతం నీవెంటే నేనంటూ.. శనివారం అత్తగారింట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు అనాథలు కాగా.. ఈ ఘటనతో కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేటలో విషాదం నెలకొంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లికి చెందిన దేసు చంద్రశేఖర్(36) ప్రస్తుతం కరీంనగర్ టూటౌన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఇల్లందకుంట మండలం సీతంపేట గ్రామానికి చెందిన దివ్య(30)తో 2016లో వివాహమైంది. నగరంలోని హనుమాన్ నగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు శుభమన్యు(4) అశ్వద్ధామ(7) ఉన్నారు. దివ్య ఆత్మహత్యతో... అన్యోన్యంగా సాగుతున్న వారి జీవన ప్రయాణంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. దివ్య కడుపునొప్పితో బాధపడుతూ ఈనెల 17వ తేదీన గన్నేరుపువ్వు, ఆకు పసరు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని దివ్య పుట్టినిల్లు అయిన ఇల్లదంకుంట మండలం సీతంపేటకు తీసుకెళ్లారు. అక్కడ అంత్యక్రియల సమయంలో దివ్య ఆత్మహత్యకు చంద్రశేఖరే కారణం అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో దాడికి ప్రయత్నించారు. దివ్య తండ్రి చంద్రశేఖర్ను ఓ గదిలో ఉంచి తాళం వేసి, అంత్యక్రియలు పూర్తిచేశారు. బట్టలు మార్చుకుంటానని వెళ్లి.. భార్య మృతితో చంద్రశేఖర్ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. మూడో రోజు కార్యక్రమానికి అత్తగారింటికి వచ్చి అక్కడే ఉంటున్నాడు. శనివా రం ఐదవ రోజు కార్యక్రమం జరిగింది. శ్మశాన వాటిక వద్ద కార్యక్రమం పూర్తిచేసుకుని అంతా ఇంటికొచ్చారు. బట్టలు మార్చుకుంటానని గదిలోకి వెళ్లిన చంద్రశేఖర్ గడియపెట్టుకుని ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకున్నాడు. గదిలోంచి ఎంతకీ బయటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు అనుమానంతో తలుపులు పగులగొట్టి చూడగా ఉరేసుకుని కనిపించాడు. వెంటనే జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఘటన సమయంలో చంద్రశేఖర్ తల్లిదండ్రులు, తమ్ముడూ అక్కడే ఉన్నారు. అనాథలైన పిల్లలు భార్య, ఇద్దరు పిల్లలు, ప్రభుత్వ ఉద్యోగం.. సాఫీగా సాగిపోతున్న జీవితంలో చీకట్లు కమ్ముకోవడంతో చంద్రశేఖర్ తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణంగా ప్రేమించే భార్య మృతి చెందడంతో మానసిక కుంగుబాటుకు లోనైనట్లు తెలుస్తోంది. తల్లి మరణాన్ని మరవక ముందే ఐదు రోజుల వ్యవధిలో తండ్రి కూడా దూరమవడంతో పదేళ్లలోపు పిల్లలిద్దరూ ‘మమ్మీ,డాడీ’ అంటూ రోదించడం అక్కడివారిని కన్నీరు పెట్టించింది. చంద్రశేఖర్ తమ్ముడు కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ మాధవి వివరించారు. భార్య మృతిని తట్టుకోలేక కరీంనగర్ టూటౌన్ ఎస్సై ఆత్మహత్య ఈ నెల 17న ఆత్మహత్య చేసుకున్న భార్య దివ్య ఐదు రోజుల వ్యవధిలో దంపతుల మృతి అనాథలైన ఇద్దరు చిన్నారులు సీతంపేటలో విషాదంఅదే నా చివరి కోరిక అంటూ..చంద్రశేఖర్ చనిపోవడానికి ముందు తన తండ్రితో మాట్లాడుతూ.. ‘నేను ఒకవేళ చనిపోతే.. నా భార్య పక్కనే నా అంత్యక్రియలు చేయండి’ అంటూ చెప్పాడు. కాసేపటికే ఆత్మహత్య చేసుకోవడంతో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సీతంపేటకు తీసుకొచ్చారు. అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించి, దివ్య అంత్యక్రియలు చేసిన చోటే చంద్రశేఖర్ మృతదేహాన్ని ఖననం చేశారు. -
ఎండుతున్న పంటలు
చిగురుమామిడి: చిగురుమామిడి మండలంలో భూగర్భ జలాలు అడుగంటిపోయి ఎండుతున్నాయి. ఆరుగాలం కష్టపడి సాగుచేసిన వరి, మొక్కజొన్న పంటలు పశువుల పాలు అవుతున్నాయి. పెట్టిన పెట్టుబడులు, చేసిన కష్టం వృథా అయ్యిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని నవాబుపేట్, కొండాపూర్, ఉల్లంపల్లి, సుందరగిరి, బొమ్మనపల్లి, చిగురుమామిడి, లంబాడిపల్లి, గాగిరెడ్డిపల్లి గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ఈ గ్రామాలకు గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి సాగునీరు రావల్సి ఉండగా పనులు సాగడం లేదు. దీంతో బావులు, బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో పొలాల్లో పశువులను మేపుతున్నారు. -
అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య
● దుబాయ్ వెళ్లినా తీరని కష్టాలు ● అసంపూర్తిగా ఇందిరమ్మ ఇల్లు ● వీర్నపల్లి మండలం శాంతినగర్లో విషాదం వీర్నపల్లి(సిరిసిల్ల): అప్పులు కుప్పలుగా మారి తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఓ అన్నదాత ప్రాణాలు తీసుకున్నాడు. కుటుంబ పెద్ద చనిపోవడంతో భార్య, ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం శాంతినగర్కు చెందిన గుగులోత్ గోపాల్(40) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సాగులో నష్టాలు రావడంతో అప్పులు పెరిగిపోయాయి. ఆ అప్పులు తీర్చేందుకు దుబాయ్ వెళ్లాడు. అక్కడ కూడా ఆశించిన స్థాయిలో ఉపాధి లభించకపోవడంతో ఇటీవల స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అప్పటికే చేసిన అప్పులకు వడ్డీలు తోడై గుదిబండలా మారడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ప్రభుత్వం మంజూరుచేసిన ఇందిరమ్మ ఇంటి పనులు మొదలుపెట్టాడు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం, ప్రభుత్వం నుంచి బిల్లులు సరిగ్గా రాకపోవడంతో ఆ పనులు కూడా అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఒకవైపు అప్పుల ఒత్తిడి, మరోవైపు గూడు లేని వేదనతో గోపాల్ శనివారం తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రోడ్డున పడ్డ కుటుంబం గోపాల్ మరణంతో అతని భార్య నిర్మలతోపాటు ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. పెద్ద కుమార్తె సరస్వతి ఇంటర్ సెకండియర్, రెండో కుమార్తె శిరీష పదో తరగతి, కుమారుడు జగ్గు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. లారీ ఢీకొని చిన్నారి మృతిశంకరపట్నం: మండలంలోని కేశవపట్నంలో శనివారం రాత్రి లారీ ఢీకొని నిత్య(3) మృతి చెందింది. కేశవపట్నం అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డు పక్కన కత్తులు, కొడవళ్లు, తయారు చేసే శ్రావణ్–పంచబూలకు నలుగురు కూతుళ్లు. మూడో కూతురు నిత్య రోడ్డు దాటుతుండగా కరీంనగర్ నుంచి హుజురాబాద్ వైపు వెళ్తున్న లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన నిత్య అక్కడికక్కడే చనిపోయింది. ప్రమాదాణానికి కారణమైన లారీని డ్రైవర్ ఆపకుండా పరారయ్యారు. కేశవపట్నం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
పీఎస్కే.. బ్రాండ్ సెట్టర్
● కొనే స్థాయి నుంచి అమ్మే స్థాయికి.. ● వ్యాపారవేత్తగా రాణిస్తున్న సిరిసిల్ల యువకుడు ● వంద మందికి పైగా ఉపాధి ● నేటి యువతకు స్ఫూర్తి పుల్లూరి శ్రీకాంత్సిరిసిల్ల: ఏం చదివామనేది ముఖ్యం కాదు.. చివరికి ఏ స్థాయిలో ఉన్నామనేదే ప్రధానం. నలుగురు నడిచిన దారిలో వెళ్లడం సాధారణం.. మనమే ఓ దారిని వేసుకెళ్లడం వినూత్నం. ఈ కోవలోకే వస్తారు సిరిసిల్లకు చెందిన పుల్లూరి శ్రీకాంత్. తన పేరుతోనే ఓ కంపెనీని మొదలుపెట్టి ఓ బ్రాండ్గా మలచడంలో సక్సెస్ అయ్యారు. వ్యాపార కుటుంబంలో పుట్టిన శ్రీకాంత్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ చదివారు. సాఫ్ట్వేర్ చదివి హార్డ్వేర్ వ్యాపారంలోకి దిగారు. పుల్లూరి శ్రీకాంత్(పీఎస్కే) పేరుతో హైదరాబాద్లో కంపెనీని ఏర్పాటు చేసి హోల్సేల్గా భవన నిర్మాణ సామగ్రిని సరఫరా చేయడం ప్రారంభించారు. ఇంజినీరింగ్ చదువు తర్వాత ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్లిన శ్రీకాంత్.. ప్రస్తుతం వందలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న పీఎస్కే కంపెనీ వ్యవస్థాపకులు పుల్లూరి శ్రీకాంత్ సక్సెస్ స్టోరీ. – వివరాలు 8లో.. -
లక్ష మందికి ఉపాధి లక్ష్యం
2030 నాటికి దేశవ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించి లక్ష మందికి ఉపాధి కల్పించడమే నా లక్ష్యం. ఆ దిశగా పట్టుదలగా అడుగులు వేస్తున్నాను. ప్రముఖ కంపెనీల కొలాబ్రేషన్తో వ్యాపారాన్ని విస్తరిస్తున్నాను. ‘అల్ఫా సర్కిల్’ను ప్రపంచ వ్యాప్తం చేస్తూ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సి ఉంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టుదలగా అనుకున్నది సాధించడమే నా లక్ష్యం. ప్రస్తుతం వ్యాపారంలో ఎంతో బిజీగా ఉన్నాను. మరింత విస్తరించి ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తా. – పుల్లూరి శ్రీకాంత్, పీఎస్కే సంస్థ వ్యవస్థాపకుడు -
అంజన్నకు కేంద్రమంత్రి బండి పూజలు
మల్యాల: మండలంలోని ముత్యంపేట కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ శనివారం పూజలు చేశారు. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, వైస్ మేయర్ సునీల్రావు, కార్పొరేటర్లతో కలిసి ఆలయానికి చేరుకోగా.. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారి శేషవస్త్రంతో సన్మానించి తీర్థ, ప్రసాదాలు అందించారు. ఆలయ ఈఓ అంజారెడ్డి, సర్పంచులు సంకూర్తి తిరుపతి, వకుళాభరణం మౌర్య, బీజేపీ మండల అధ్యక్షుడు గాజుల మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షుడు బింగి వేణు, ఉప సర్పంచ్ మల్లేశ్ యాదవ్, నాయకులు బొట్ల ప్రసాద్, కొల్లూరి గంగాధర్, బొబ్బిలి వెంకటస్వామి, కెల్లెటి రమేశ్, గుండేటి గంగారాం, ఆలయ సిబ్బంది హరిహరనాథ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. చేపల వేటకు వెళ్లి విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిరాయికల్: రాయికల్ మండలం ధర్మాజీపేటకు చెందిన గిరిజన నాయకుడు గుగ్లావత్ చిరంజీవి (40) చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఎస్సై సుధీర్రావు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుగ్లావత్ చిరంజీవి గ్రామంలోని కుంటలో చేపలు పట్టడానికి శనివారం వెళ్లాడు. పక్కనే ఉన్న కరెంట్ స్తంభానికి ఉన్న వైరు నీటిలో ఉండటంతో గమనించకుండా కుంటలోకి దిగాడు. విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. చిరంజీవికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. భార్య చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చిరంజీవి అఖిల భారత బంజార గిరిజన సేవ సంఘ్ మండల అధ్యక్షుడిగా గిరిజనులకు సుపరిచితులు. ఆయన మృతిపట్ల ఎమ్మెల్యే సంజయ్కుమార్, గిరిజన నాయకులు సంతాపం ప్రకటించారు. అనుమానాస్పద స్థితిలో లస్కర్..చిగురుమామిడి: చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ కెనాల్ దగ్గర లస్కర్గా పనిచేస్తున్న చొప్పదండి మండలం చాకుంట గ్రామానికి చెందిన తడిగొప్పుల మల్లయ్య (55) శుక్రవారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్సై పృథ్వీధర్గౌడ్ తెలిపారు. శుక్రవారం రాత్రి మల్ల య్య, అనిల్ కెనాల్పై డ్యూటీ చేశారు. రాత్రి కెనాల్ వద్దే నిద్రించారు. శనివారం ఉదయం అనిల్ నిద్రలేచి చూడగా మల్లయ్య కనిపించలేదు. కొద్దిదూరంలో ఉన్న గూడ తిరుపతి పొలం వద్ద అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నాడు. మృతదేహాన్ని పరిశీలించిన ఎస్సై, మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భక్తిశ్రద్ధలతో రంజాన్
సాలెహ్నగర్లో సందేశం వినిపిస్తున్న ముస్లిం మతపెద్దకరీంనగర్ కల్చరల్: రంజాన్ పండుగను శనివారం ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దల ప్రసంగాలు విన్నారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దానధర్మాలు ఆచరించారు. బంధు, మిత్రులను ఇళ్లకు ఆహ్వానించి విందు ఏర్పాటు చేశారు. పలు పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. సాలెహ్నగర్ ఈద్గా వద్ద ముప్తీ ఘియాస్ మొహిముద్దీన్ దైవ సందేశం ఇచ్చారు. సీపీ గౌస్ ఆలం ప్రార్థనల్లో పాల్గొన్నారు. వన్టౌన్ పోలీసు స్టేషన్ వద్ద ఉన్న పురానీ (ఖదీమ్షాహి) ఈద్గా, చింతకుంట ఈద్గా, ఆయా గ్రామాల్లోని మసీదుల వద్ద ప్రార్థనలు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా పోలీసులు పర్యవేక్షించారు.రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్న చిన్నారులు -
పరిశ్రమలు
ఉద్యమ్ పోర్టల్ ద్వారా 2025 డిసెంబర్ 22వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నమోదు చేసుకున్న వారిలో కరీంనగర్ టాప్లో నిలిచింది. ఆ తర్వాత జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలు ఉన్నాయి. ఇందులో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎక్కువ యూనిట్లు తయారీ రంగంలో కన్నా సేవారంగంలో నమోదై ఉన్నాయి.51,875కరీంనగర్జగిత్యాలసిరిసిల్లపెద్దపల్లి -
‘పాడి’పై తిరుగుబాటు!
జమ్మికుంట: హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేతలు తిరుగుబాటుకు దిగడం కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే వైఖరిపై మొదటి నుంచి పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్లు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. పలుమార్లు అధిష్టానం వద్దకు పంచాయితీ వెళ్లినా మార్పు రావడం లేదని శుక్రవారం రాత్రి మరోసారి రహస్య సమావేశం అయ్యారు. ఇందుకు జమ్మి కుంట పట్టణ పరిధిలోని ఓ ప్రైవేటు వెంచర్ వేదిక కాగా.. నియోజకవర్గస్థాయి నాయకులు హాజరై తమ అసంతృప్తిని వెల్లగక్కినట్లు సమాచారం. పార్టీ అధిష్టానా న్ని కలిసి తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే దూకూడు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తారని పేరుంది. ఇతర పార్టీలతో పాటు తమ పార్టీ నాయకులపైనా విరుచుకపడతారనే ఆరోపణలున్నాయి. ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సి పల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో ఒంటెద్దుపోకడగా వ్యవహరించార ని పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేపై పార్టీ సీనియర్ నాయకులంతా గుర్రుగా ఉన్నారు. శుక్రవారం రాత్రి జమ్మికుంటలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు రహస్యంగా సమావేశమయ్యారు. తీరుమారకుంటే ఉద్యమ పార్టీకి గుడ్బై చెప్పి అధికార పార్టీలో చేరే అంశంపై చర్చ జరిగిందని తెలిసింది. ఈ పంచాయితీని త్వరలోనే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. అధిష్టానం కూడా ఈ విషయంపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
కొడిమ్యాల: ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన కొడిమ్యాలలో చోటుచేసుకుంది. ఎస్సై సందీప్ వివరాల ప్రకారం.. నాచుపల్లికి చెందిన గుగ్గిళ్ల పవన్ (27) ఏడేళ్ల క్రితం డెయిరీఫాం ప్రారంభించాడు. నష్టాలు రావడంతో అప్పులు పెరిగాయి. బ్యాంకు లోన్ భారంతో మనస్తాపానికి గురై ఈనెల 13న ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి అతడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పవన్ తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ధర్మపురిలో వివాహిత.. ధర్మపురి: భార్యపై భర్త పెట్రోల్ పోసి నిప్పటించగా చికిత్స పొందుతూ వివాహిత శనివారం మృతి చెందినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. ధర్మపురిలోని ఎస్సీ కాలనీకి చెందిన బడగు నవీన్, మండలంలోని తుమ్మెనాలకు చెందిన రమ్య నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్యాభర్తల మధ్య తగాదాలు రావడంతో రమ్య పుట్టింటికి వెల్లింది. రమ్యపై కోపం పెంచుకున్న నవీన్ ఈనెల 16న భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. గాయపడిన రమ్యను వరంగల్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. -
తక్కువ ధరకే మెడిసిన్
● కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్: రాష్ట్రంలో మందుల కొనుగోలు సామాన్య ప్రజలకు భారంగా మారిన నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్రాలను అందుబాటులోకి తెచ్చిందని కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని ముకరంపుర డాక్టర్ స్ట్రీట్లో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. మెడిసిన్ కొనుగోలుకు పేదలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నరేంద్రమోడీ ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు తెరిచి చౌక ధరకే మెడిసిన్ అందిసున్నారన్నారు. మేయర్ శ్రీనివాస్ ఉన్నారు. ఇల్లందకుంట: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల పోస్టర్లను మంత్రి పొన్నంప్రభాకర్ శనివా రం ఆవిష్కరించారు. ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు మంత్రిని శాలువాతో సత్కరించారు. ఇన్చార్జి ఈవో సుధాకర్, ధర్మకర్తలు పరమేశ్, నారాయణరెడ్డి, రాజేందర్, మల్లేశ్, రామ్రెడ్డి, నగేశ్ పాల్గొన్నారు. వెండి ఆభరణాలు అందజేత శ్రీస్వామివారికి హుజూరాబాద్కు చెందిన కోరె ం నరసింహరెడ్డి జ్ఞాపకార్థం ఆయన భార్య శ్రీదే వి, కుటుంబసభ్యులు హరీశ్, ప్రతాప్ రెడ్డి, హిరెన్ రూ.21 లక్షల విలువైన 7.64 కిలోల వెండి ఆభరణాలు ఆలయానికి అందజేశారు. నూనె గింజల సాగుపై దృష్టి పెట్టాలిచిగురుమామిడి: రైతులు వరి కన్నా నూనె గింజలైన వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వుల పంటలపై దృష్టిసారించాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కరీంనగర్ హెడ్ ప్రొఫెసర్ హరికృష్ణ కోరారు. శనివారం చిగురుమామిడి మండలం ముదిమానిక్యం గ్రామంలో ఎరువుల వినియోగం– నూనె గింజల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అధిక మోతాదులో ఎరువులు వాడి నేలను కలుషితం చేయవద్దని సూచించారు. పంట మార్పిడి ద్వారా దిగుబడి పెరిగే అవకాశం ఉందన్నారు. సర్పంచ్ బోయిని రమేశ్ మాట్లాడుతూ రైతులు పంట వైవిద్యీకరణ, నేల ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించాలని సూచించారు. ఏవో పున్నం చందర్, ఏఈవో ఆకుల ప్రణయ్, ఉపసర్పంచ్ పూదరి పర్శరాములు పాల్గొన్నారు. విద్యారంగానికి నిధులు కేటాయించాలికరీంనగర్ టౌన్: రాష్ట్ర బడ్జెట్ను సవరించి విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలని కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులు శనివారం బడ్జెట్ ప్రతులు దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన హామీలు విస్మరించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. తక్షణమే బడ్జెట్ సవరించి విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలన్నారు. ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు భోగేశ్వర్, జిల్లా కమిటీ సభ్యుడు సందేశ్, మానస, సన్నీ, నరేశ్, నగేశ్, డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రాజ్కుమార్, సహాయ కార్యదర్శులు అశోక్, అరవింద్ పాల్గొన్నారు. -
గొర్రెల మందపై దూసుకెళ్లిన కారు
● కాపరికి తీవ్రగాయాలు.. 6 గొర్రెల మృత్యువాత సుల్తానాబాద్రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ శివారులోని రాజీవ్ రహదారిపై శనివారం గొర్రెలమందపై కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కాపరికి తీవ్రగాయాలు కాగా ఆరు గొర్రెలు మృత్యువాతపడ్డాయి. ఎస్సై చంద్రకుమార్ కథనం ప్రకారం.. సుల్తానాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న కారుకు గొర్రెల మంద అడ్డుగా వచ్చింది. గొర్రెలను తప్పించే క్రమంలో అదుపుతప్పి వాటిపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో పట్టణంలో శాసీ్త్రనగర్కు చెందిన కాపరి మేకల రాజుకు తీవ్రగాయాలు కాగా ఆరు గొర్రెలు మృతి చెందాయి. మరోనాలుగు తీవ్రంగా గాయపడ్డాయి. కారు సమీపంలోని పొలాల్లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన కాపరి రాజును వెంటనే కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. -
రూ.1.50లక్షల విరాళం
మల్యాల: హైదరాబాద్కు చెందిన పార్కంపేట వెంకటేశ్ దంపతులు శుక్రవారం కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు ఉచిత నిత్యాన్నదానం కోసం తమవంతుగా రూ.1.50లక్షలు అందజేశారు. ఈవో అంజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు యువకుల అరెస్ట్మానకొండూర్: మానకొండూర్ మండలంలోని జగ్గయ్యపల్లి గ్రామానికి చెందిన అనిల్రెడ్డి, లింగాపూర్ గ్రామానికి చెందిన భరత్ గంజాయి సేవిస్తుండగా పట్టుకున్నట్లు సీఐ శ్రీలత శుక్రవారం తెలిపారు. మానకొండూర్ రైస్మిల్లుల వద్ద గంజాయి సేవిస్తుండగా పట్టుకుని రిమాండ్కు పంపినట్లు వివరించారు. -
సమయం తక్కువ.. ఖర్చు ఆదా
గాల్లో చెక్కర్లు కొడుతూ దూసుకుపోతోంది డ్రోన్. ఒకప్పుడు పెళ్లి వేడుకలనే చిత్రీకరించిన డ్రోన్.. ఇప్పుడు వ్యవసాయ రంగంలోనూ దూసుకెళ్తోంది. ఎరువులు, పురుగుమందులను పంటలపై పిచికారీ చేయడంలో తాను సైతం అంటోంది. సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా తక్కువ నీటితో, ఖర్చు ఆదా చేస్తూ పురుగుమందులు, ఇతర మందులు పిచికారీ చేస్తోంది. పెద్దపల్లి శివారు నిట్టూరులోని వరి పొలాల్లో డ్రోన్తో పిచికారీ చేస్తూ ‘సాక్షి’ కెమెరాకు కనిపించారు కొందరు రైతులు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
పూజలు చేస్తామని నమ్మించి ఆభరణాలు చోరీ
కాల్వశ్రీరాంపూర్: పూజలు చేస్తామని నమ్మించి మత్తుమందు చల్లి బంగారు నగలు, నగదుతో ఉడాయించిన దొంగబాబా ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గోనె లక్ష్మి– రాజారాం దంపతులు, దామెర మొగిలి, బందెల కలమ్మ మల్లయ్య ఇంటికి సోమవారం వెళ్లిన దొంగ బాబా.. మీపై ఇతరుల దృష్టి పడిందని, పూజలు చేస్తే దోషం తొలగిపోతుందని నమ్మించాడు. ఇందుకోసం ఆభరణాలు, నగదు అవసరమని చెప్పా రు. ఈక్రమంలో వారు అవి అప్పగించగా వాటిని పట్టుకుని వెళ్లాడు. సుమారు రూ.లక్ష నగదు, తులంన్నర బంగారు ఆభరాణాలు పట్టుకుని పోయాడు. మళ్లీ బుధవారం తీసుకు వస్తానని చెప్పి వెళ్లిన బాబా తిరిగి రాక పోయే సరికి తాము మోసపోయామని గమనించి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిమ్మపల్లిలో మూడిళ్లలో దొంగతనానికి యత్నం కోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లిలో తాళం వేసి ఉన్న మూడు ఇళ్లలో శుక్రవారం దొంగతనానికి యత్నించారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. నిమ్మపల్లికి చెందిన ఇద్దగిరి మల్లేశం గల్ఫ్కు వెళ్లగా భార్య సుజాత బంధువుల ఇంటికి వెళ్లింది. శుక్రవారం ఇంటికి తిరిగి రాగా తాళం పగులగొట్టి ఉంది. అయితే ఎలాంటి వస్తువులు చోరీకి గురికాలేదు. అదే గ్రామానికి చెందిన ఇద్దగిరి మల్లయ్య(తండ్రి చిన్నమల్లయ్య), ఇద్దగిరి మల్లయ్య( తండ్రి రాజయ్య) ఇళ్లల్లోనూ చోరీకి యత్నించారు. కోనరావుపేట పోలీసులు విచారణ చేపడుతున్నారు. పుస్తెలు దొంగిలించిన ఇద్దరి రిమాండ్ సిరిసిల్ల క్రైం: జిల్లా కేంద్రంలోని సాయినగర్లో మహిళ మెడలోని బంగారు పుస్తెలు దొంగిలించిన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తుర్కాశినగర్కు చెందిన సయ్యద్ మౌలానా, కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరకు చెందిన మంగూరు ప్రకాశ్యాదవ్ను శుక్రవారం రిమాండ్కు తరలించారు. వారి నుంచి బంగారు పుస్తెలు, ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు. ఈనెల 17న రాత్రి సాయినగర్ ఏరియాలో మేర్గు లత ఇంటి గేటు బయటకు రాగా, ఇద్దరు వ్యక్తులు అడ్రస్ అడిగినట్లు నటించి ఆమె మెడలోని బంగారు పుస్తెలను లాక్కొని, బైక్పై పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. సయ్యద్ మౌలానా, మంగూరు ప్రకాశ్యాదవ్ను రగుడు చౌరస్తా వద్ద అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 4.4 గ్రాముల బంగారు పుస్తెలు, ఒక ద్విచక్ర వాహనం, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎగువమానేరులో యువకుడి మృతదేహం● కామారెడ్డి జిల్లావాసిగా గుర్తింపు గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టులో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్పూర్కు చెందిన దుంపటి వినయ్కుమార్(32)గా గుర్తించారు. మానేరులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. కాగా, మృతునికి నెల రోజుల క్రితమే వివాహమైనట్లు తెలుస్తోంది. గత నెల కవలల దినోత్సవం రోజున పెళ్లయినట్లు సమాచారం -
ధైర్యంగా ఉండండి.. అండగా ఉంటాం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): బీజేపీ జిల్లా వాణిజ్య సెల్ అధ్యక్షుడు చందుపట్ల రాజిరెడ్డి గుండెపోటుతో మరణించడం బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ మనోధైర్యం కల్పించారు. మృతుడు రాజిరెడ్డి కుటుంబ సభ్యులతో శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని సూచించారు. పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. రాజిరెడ్డి మృతి అనంతరం మంత్రి రెండోసారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రాజిరెడ్డి బతికున్న కాలంలో పార్టీకి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. మంత్రి ఫోన్లో మాట్లాడుతున్న సందర్భంలో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్లో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించిన మంత్రి -
ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడు మృతి
మెట్పల్లి (కోరుట్ల): పట్టణంలోని ఆర్టీసీ బస్స్టేషన్ ఇన్ గేట్ వద్ద శుక్రవారం బస్సు ఢీకొని వృద్ధుడు మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. శాంతినగర్కు చెందిన దుర్గయ్య(65) ఆర్టీసీ బస్ స్టేషన్ ఇన్గేట్ నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా, అదే సమయంలో వేగంగా లోపలికి వస్తున్న బస్సు అతన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. రాజన్న గుడి వద్ద నాగుపామువేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో రాజేశ్వరపురం వద్ద నిర్మాణం పనుల ప్రాంతంలో శుక్రవారం రాత్రి నాగుపాము ప్రత్యక్షమైంది. దీంతో పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది ఆలయ అధికారులకు సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ జగదీశ్ చేరుకుని నాగుపామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు. సివిల్ సప్లయ్ అధికారుల తనిఖీలు మంథని: పెద్దపల్లి జిల్లా మంథనిలోని పలు హోటళ్లలో సివిల్ సప్లయ్ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. గృహ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న ఆరింటిని సీజ్ చేశారు. 6 హోటళ్లపై కేసులు నమోదు చేశారు. డీసీఎస్ రవీందర్రెడ్డి, సివిల్ సప్లయ్ ఇన్స్పెక్టర్ వెంకటరాజిరెడ్డి, ఆర్ఐ అనిల్రెడ్డి పాల్గొన్నారు. పిడుగుపడి ఎద్దు మృతి ఇల్లంతకుంట(మానకొండూర్): పిడుగుపడి శుక్రవారం తెల్లవారుజామున ఎద్దు మరణించింది. ఇల్లంతకుంట మండలం గాలిపెల్లిలో కేశవేణి ఎల్లయ్యకు చెందిన పశువుల కొట్టం వద్ద రెండు ఎడ్లను కట్టివేశాడు. శుక్రవారం తెల్లవారుజామున వర్షంతోపాటు పిడుగు పడడంతో ఒక ఎద్దు చనిపోయింది. గతేడాది హఠాత్తుగా ఒక ఎద్దు చనిపోయిందని, ఇప్పుడు మరో ఎద్దు చనిపోవడంతో అప్పులపాలైనట్లు రైతు రోదించాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
ఇలాగైతే ఆడేదెలా?
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మానసిక, శారీరక వికాసం సాధించేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయి. పాఠశాల స్థాయిలో క్రీడలపై శ్రద్ధ చూపుతున్న విద్యాశాఖ కళాశాల స్థాయిలో పట్టింపు కరువైంది. విద్యార్థులు స్కూల్ లెవల్లో వివిధ పోటీల్లో పాల్గొన్న వారు ఇంటర్కు వచ్చేసరికి శిక్షకులు లేక నైపుణ్యం కరువైంది. క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్థులు సైతం శిక్షణకు దూరమై వివిధ పోటీల్లో పాల్గొనలేకపోతున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో రెండు డిగ్రీ, పది ఇంటర్ ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా అగ్రహారం డిగ్రీ కాలేజీలో మినహా ఎక్కడ కూడా పీడీ(ఫిజికల్ డైరెక్టర్)లు లేరు. దీంతో విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. లెక్చరర్లతోనే శిక్షణ ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు ఇటీవల ప్రభుత్వం ఒక్కో కాలేజీకి రూ.10వేలు కేటాయించింది. ఈ నిధులతో క్రీడా సామగ్రిని సైతం కొనుగోలు చేశారు. కానీ విద్యార్థులకు ఆటలపై పట్టు సాధించేలా శిక్షణ ఇచ్చే పీడీలు లేరు. దీంతో కాలేజీలోని వివిధ సబ్జెక్టుల అధ్యాపకులే ప్రతీ శనివారం సాయంత్రం శిక్షణ ఇస్తున్నారు. వీరి శిక్షణలో విద్యార్థులు పెద్దగా ఆటలపై పట్టు సాధించడం లేదు. దీంతో వీరు ఏ క్రీడా పోటీల్లో పాల్గొనడం లేదు. ఒకవేళ పాల్గొన్న పతకాలు రావడం లేదు. ఇదే సమయంలో గురుకులాల్లో ప్రత్యేక శిక్షకులు ఉండడంతో అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు నిత్యం సాధన చేస్తూ వివిధ క్రీడావిభాగాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. వారికి ఉన్నత విద్యలో స్పోర్ట్స్ విభాగంలో రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి. క్రీడాకోటాలో చాలా మంది విద్యార్థులు ఉద్యోగాలు సైతం సాధించారు. గురుకుల విద్యార్థులకు క్రీడలతో లబ్ధి జరుగుతుండగా ప్రభు త్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న పేద విద్యార్థులకు మాత్రం ఆ ఫలితాలు దక్కడం లేదు. జిల్లాలో పీడీలు కరువు విద్యార్థులకు అందని క్రీడాశిక్షణ క్రీడాసామగ్రికి నిధులు.. శిక్షకులు కరువు జిల్లాలో 10 జూనియర్, రెండు డిగ్రీ కళాశాలలు ఆటలకు దూరంగా విద్యార్థులు -
ప్లాస్టిక్ కవర్ల కొరత
మంథని: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం అనేక రంగాలపై ప్రభావం చూపుతోంది. ప్రధానంగా ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై నిషేధం ఉన్నా విచ్చలవిడిగా వాడుతూనే ఉన్నారు. తక్కువ పరిమాణంగల ప్లాస్టిక్ కవర్లు మార్కెట్లో అందుబాటులో ఉండడంతో అనేకమంది వాటినే ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా కూరగాయలు, నిత్యావసరాలకు వాడే పాలితిన్ కవర్లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో లేవు. ఫలితంగా ప్రజలు తప్పనిసరి బట్ట సంచులు, బుట్టలతో మార్కెట్కు వస్తున్నారు. చేతి సంచులతో సందడి పాలితిన్ కవర్ల కొరతతో పట్టణంలోని కూరగాయల మార్కెట్తోపాటు కిరాణాల్లో నిత్యావసరాలు తీసుకెళ్లే ప్రజలు చేతిసంచులు, బుట్టలతో సందడి చేస్తున్నారు. గతంలో చేతిసంచులు, బుట్టలతోనే కూరగాయలు, నిత్యావసరాలు తీసుకెళ్లే జనం.. ఇప్పుడు పాతరోజులను గుర్తుచేసుకుంటున్నారు. చేతి సంచులు, బుట్టలతో వచ్చే కస్టమర్లను ఆకర్శించడానికి వ్యాపారులు కొత్తిమీరకట్ట, ఆకుకూర కట్టలను ఉచితంగా అందిస్తున్నారు. ఇలా కొనసాగితే.. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు, పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్న ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని అధికారులు ఎన్నిమార్లు విన్నవించినా.. కొన్ని మున్సిపాలిటీల్లో జరిమానాలు విధిస్తు న్నా ప్రజలు, వ్యాపారుల్లో మార్పు రావడం లేదు. కానీ, యుద్ధం నేపథ్యంలో పాలితిన్ కవర్ల దిగుమ తికి ఆటంకం ఏర్పడింది. వాటి కొరతతో ప్రజలు పాతరోజుల్లో మాదిరిగా బుట్ట, బట్ట సంచులను వినియోగిస్తున్నారు. ఇదే పద్ధతిని జనం అలవాటు చేసుకుంటే అనేక అనర్థాల నుంచి దూరం కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బట్ట సంచిలో కూరగాయలు తీసుకెళ్తున్న స్థానికులు బట్ట సంచులకు డిమాండ్ మార్కెట్లపై యుద్ధ ప్రభావం -
తాపీమేసీ్త్ర ఆత్మహత్య
రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగెపల్లి గ్రామానికి చెందిన మట్ట రాజయ్య(48)ఉరి వేసుకుని అత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాజయ్యమేసీ్త్ర పనిచేస్తున్నాడు. కొందరి వద్ద డబ్బులు తీసుని ఇళ్లు నిర్మిస్తూ ఇచ్చేవాడు. ఈక్రమంలో అప్పుల పాలయ్యాడు. కొందరు యజమానులకు ఇళ్లు నిర్మించి ఇవ్వకపోవడంతో వారు ఇళ్లు ఎప్పుడు కట్టిస్తావని తరచూ అడిగారు. మనస్తాపం చెందిన రాజయ్య రత్నాపూర్లో స్లాబ్వర్క్ ఉందని చెప్పి శుక్రవారం ఇంట్లోంచి వెళ్లిపోయాడు. మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వెళ్లలేదు. భార్య ఓదేమ్మ ఫోన్చేసినా లిఫ్ట్ చేయలేదు. తన తమ్ముడు రాజాపూర్లోని కలవేన సంపత్కు ఆమె ఫోన్చేసి విషయం చెప్పింది. అతడు రాజాపూర్లోని ఓ కొత్త ఇంటికి వెళ్లి చూడగా తలుపులు పెట్టి ఉన్నాయి. కిటికీలోంచి చూడగా తాడుతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. తన భర్త మరణంపై అనుమానాలు లేవని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఆన్సైట్ ఎఫ్ఐఆర్ నమోదు సమాచారం అందుకున్న ఎస్సై శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి నుంచి అక్కడే ఫిర్యాదు స్వీకరించి అప్పటికప్పుడే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ పత్రాన్ని బాధితురాలికి అందజేశారు. బాధితులకు ఇబ్బందులు లేకుండా ఆన్సైట్ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నామని ఎస్సై వివరించారు. రుద్రంగిలో చిరుత కలకలంరుద్రంగి(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన నాగారం బొర్రయ్య రైతు పొలం వద్ద ఉన్న కాపాల కుక్కపై చిరుత దాడి చేసి చంపేసింది. రోజు మాదిరిగానే గురువారం రాత్రి ఆవులు, గేదెలను పాకలో కట్టేసి, రెండు కుక్కలను కాపలాగా కట్టేశాడు. శుక్రవారం ఉదయం వెళ్లి చూడగా ఒక కుక్కను చిరుత చంపివేసింది. కుక్కను రూ.8 వేలకు కొన్నట్లు రైతు బొర్రయ్య తెలిపాడు. గతంలోనూ ఇదే ఏరియాలో లేగదూడపై చిరుత దాడి చేసి చంపిందని రైతులు తెలిపారు. ఈ విషయంపై ఫారెస్టు ఆఫీనర్ రవీందర్ను వివరణ కోరగా చిరుత ఆనవాళ్లు కనిసించలేదన్నారు. కుక్కపై దాడి చేసిందని హైనా కావచ్చని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రుద్రంగి మండల కేంద్రంలోని అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తూ కుక్కను చంపిన ప్రదేశాన్ని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై మోతీరాం పరిశీలించారు. వారు మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుత సంచరించినట్లు ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే పోలీస్, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
ఈత సరదా.. విషాదం కావొద్దు
ప్రస్తుతం ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో కొందరు విద్యార్థులు ఈత నేర్చుకునేందుకు మధ్యాహ్నం వేళ చెరువులు, కుంటలు, కాలువల్లోకి వెళ్లి సరదాగా ఈత కొడుతున్నారు. ఈత సరదా ఎవరి ఇంట్లోనూ విషాదం కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, నిపుణులు సూచిస్తున్నారు. పెద్దపల్లి శివారులోని నిట్టూరు మార్గంలో ఎస్సారెస్పీ ఉపకాలువలో ఈదుతూ, కేరింతలు కొడుతూ సందడి చేస్తున్న చిన్నారులు ‘సాక్షి’ కెమెరాకు ఇలాకనిపించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్,పెద్దపల్లి -
ఉమ్మడి జిల్లాలో అల్పాహారం పథకం వివరాలు
స్కూళ్లుసిరిసిల్ల1,8202111జగిత్యాలపెద్దపల్లి8,7001215,000కరీంనగర్ 651పెద్దపల్లి 527కరీంనగర్సిరిసిల్ల 403387108,300కళాశాలలు -
ప్రజలను మోసం చేశారు
హుజూరాబాద్: రాష్ట్ర బడ్జెట్ అంకెలా గారడీలా ఉంది. సామాన్యులకు లబ్ధి ఏం లేదు. ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు సరైన నిధులు కేటాయించలేదు. ప్రభుత్వ నిర్ణయాలతో విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతోంది. విద్యార్థుల భవిష్యత్ను ప్రభుత్వం పణంగా పెడుతోంది. రైతులకు, నిరుద్యోగులకు, మహిళలకు ఎలాంటి ఆశాజనకమైన కేటాయింపులు లేవు. అన్ని వర్గాల ప్రజలను ఈ ప్రభుత్వం విస్మరించింది. సామాన్యుడికి మిగిలేది శూన్యం. – కౌశిక్ రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే -
బీమా..
కరీంనగర్శనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026అల్పాహారం!Iపశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం అనేక రంగాలపై ప్రభావం చూపుతోంది. కూరగాయలు, నిత్యావసరాలకు వాడే పాలిథిన్ కవర్లు మార్కెట్లో అందుబాటులో లేవు. ప్రజలు బట్ట సంచులతో వస్తున్నారు. – IIలోu తెలంగాణలో ప్రభుత్వ డైట్, ప్రైవేట్ కళాశాలల్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిప్లొమా, ప్రీ– స్కూల్ ఎడ్యుకేషన్ డిప్లొమాలో 2026–27లో ప్రవేశానికి నిర్వహించే డీఈఈసెట్కు నోటిఫికేషన్న్ విడుదల అయ్యింది. – IIలోu సాక్షి ప్రతినిధి, కరీంనగర్: 2026–27 రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం విద్యార్థులు, పేదలకు పెద్దపీట వేసింది. అల్పాహారం, కుటుంబ బీమాలతో ఉమ్మడి జిల్లాలో లక్షలాదిమంది లబ్ధిదారులుగా మారనున్నారు. అల్పాహారం పథకంతో 2.01లక్షల మంది పాఠశాల విద్యార్థులు, 33 వేల మందికిపైగా ఇంటర్ విద్యార్థులు లబ్ధిపొందనున్నారు. పథకం సమర్థంగా అమలు చేస్తే.. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్లు తగ్గుతాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో వరదకాలువకు రూ.249 కోట్లు, ఎల్లంపల్లికి రూ.449 కోట్లు చొప్పున కేటాయించింది. ఉమ్మడి జిల్లా నీటిపారుదలకు దాదాపు రూ.700 కోట్లు కేటాయించింది. శాతవాహన వర్సిటీకి ఏకంగా రూ.25 కోట్లు, ఏడాది జరగనున్న పుష్కరాలకు రూ.500 కోట్లు కేటాయించింది. ఉమ్మడి జిల్లాలోని ఽగోదావరి తీరాన ఉన్న ధర్మపురి, కోటిలింగాల, గోదావరిఖని, మంథని ఘాట్లలో సదుపాయాలు కల్పనకు త్వరలోనే పనులు మొదలు కానున్నాయి.హైదరాబాద్– కరీంనగర్ను అనుసంధానించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులైన కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే లైన్కు ఎంత నిధులు ఇచ్చారన్నది స్పష్టం చేయలేదు. జగిత్యాల జిల్లా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, రాజన్న ఆలయ పునరుద్ధరణ, మాస్టర్ప్లాన్ కోసం వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ)కు నిధులు, పెద్దపల్లి జిల్లాలో ప్రతిష్టాత్మక పత్తిపాక రిజర్వాయర్పై ప్రకటన, కరీంనగర్ జిల్లా శంకరపట్నంలోని కల్వల ప్రాజెక్టు నిర్మాణాల విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. -
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా
ఫ్లడ్ ఫ్లో కెనాల్ రూ.249.85 కోట్లు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు రూ.449.66 కోట్లు బొక్కలవాగు రూ.34 లక్షలు గోదావరి పుష్కరాలకు రూ.500 కోట్లు (మొత్తం రాష్ట్రానికి) శాతవాహన యూనివర్సిటీ రూ.25 కోట్లు టీఎస్ స్పోర్ట్స్ స్కూల్ వరంగల్ అండ్ కరీంనగర్ రూ.42.80 కోట్లు కరీంనగర్ స్మార్ట్ సిటీ రూ.250 కోట్లు ప్రజా వంచనకరీంనగర్: రాష్ట్ర బడ్జెట్ ప్రజా వంచనగా ఉంది. అంకెల ఆర్భాటాలు, కేటాయింపుల ప్రగల్భాలు తప్ప ప్రజలకు ఉపయోగపడే అంశాలు లేవు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచకుండా, లక్ష కోట్ల రూపాయల అప్పు భారాన్ని మోపేందుకు సిద్ధపడ్డారు. రైతు భరోసా ఎగ్గొట్టారు. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు ఎలాంటి సాయం అందలేదు. మహిళలకు హామీ ఇచ్చిన పథకాలు, వృద్ధులకు పెన్షన్ పెంపు అంశాన్ని విస్మరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగింది. మైనారిటీలకు అధిక కేటాయించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనం. – బండి సంజయ్కుమార్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి దళిత, గిరిజన, అట్టడుగు వర్గాల సాధికారతను కేంద్రబిందువుగా చేసుకుని సీఎం రేవంత్, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రూపొందించిన 2026–27 బడ్జెట్ సమగ్రాభివద్ధికి మార్గదర్శిగా నిలుస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ప్రతిపాదించిన సామాజిక న్యాయం, సమాన అవకాశాల లక్ష్యాలను ప్రతిబింబించే బడ్జెట్. – మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కరీంనగర్ టౌన్: రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంకెల గారడీలా ఉంది. ప్రభుత్వం చెప్పే దానికి చేసే దానికి పొంతన లేదు. ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలు బుట్ట దాఖలు అయ్యాయి. ఉమ్మడి జిల్లాకు కేటాయింపులు లేవు. అంకెల గారడి నీటి మూటలు దగాకోరు బడ్జెట్ ఇది. ప్రభుత్వ పతనానికి నిదర్శనంగా కనిపిస్తోంది. – గంగుల కమలాకర్, కరీంనగర్ ఎమ్మెల్యేప్రతీ కుటుంబానికి రూ.5లక్షల జీవిత బీమా ప్రస్తుతం 41 లక్షల కుటుంబాలు (2011 ప్రకారం.. 37 లక్షలు) ఇందిరమ్మ బీమా పొందే కుటుంబాలు: 8,00,000ఉమ్మడి జిల్లాకు కనీస అంచనా రూ.400 కోట్లు -
ఆరు గ్యారంటీలు పెద్ద బోగస్
కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి 1000 రోజులు కావస్తున్నా.. ఏ ఒక్క గ్యారంటీ అమలు చేయలేకపోయిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి విమర్శించారు. 6 గ్యారంటీలు, కాంగ్రెస్ హామీల వైఫల్యాన్ని ఎండగడుతూ బీజేపీ రాష్ట్రశాఖ ఇచ్చిన పిలుపు మేరకు నగరంలోని కలెక్టరేట్ ఎదుట శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టి, అడిషనల్ కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేసి చూపిస్తామని మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. 1000 రోజులు గడిచినా ఇచ్చిన హామీ నిలుపుకోలేన్నారు. ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. నాయకులు సంగప్ప, వై.సునీల్ రావు, గుగ్గిలపు రమేశ్, ఈ.నాగేశ్వర్రెడ్డి, వాసాల రమేశ్, తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.


