Karimnagar District News
-
పకడ్బందీగా పదోతరగతి పరీక్షలు
కరీంనగర్/కరీంనగర్ అర్బన్: పదోతరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు ఓరియంటేషన్ నిర్వహించారు. సూపరింటెండెంట్లు ప్రతీ పరీక్ష కేంద్రాన్ని సందర్శించి వసతులను పరిశీలించాలన్నారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తామని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పరీక్షకు ముందు ప్రతీ విద్యార్థికి ఓఆర్ఎస్ ద్రావణం అందించాలని సూచించారు. ఇన్విజిలేటర్లు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని ఆదేశించారు. దివ్యాంగులు పరీక్ష రాసేందుకు సౌకర్యవంతమైన ప్రదేశాన్ని ఎంపిక చేయాలని సూచించారు. డీఈవో జనార్దన్ రావు, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బ్యాలెట్ పరిశీలనపై పర్యవేక్షణ మెదక్, నిజామాబాద్,కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం అభ్యర్థుల సమక్షంలో బ్యాలెట్ పేపర్ల పరిశీలన కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగింది. కలెక్టర్ పమేలా సత్పతి బ్యాలెట్ పేపర్ పరిశీలనలో పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు.అభ్యర్థులు, అభ్యర్థుల తరఫున వచ్చిన ఏజెంట్లు బ్యాలెట్ పేపర్ల తనిఖీని పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, డీఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్ పాల్గొన్నారు. -
ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయం
కరీంనగర్ అర్బన్: ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయమని టీఎన్జీవోల కేంద్రం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర ఈ సంఘానికి ఉందని తెలిపారు. శుక్రవారం కరీంనగర్లోని టీఎన్జీవో భవన్లో జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలను ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. పరిష్కారానికి ఆయన హామీ ఇచ్చారని చెప్పారు. ఏప్రిల్లోగా పెండింగ్ బిల్లులు, 2 డీఏలను ప్రభుత్వం చెల్లిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ఎన్జీవోల సంఘం 80వ ఆవిర్భావ వేడుకలను హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. సంఘం జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, నాయకులు నాగుల నరసింహస్వామి, రాగి శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, సర్దార్ హర్మీందర్ సింగ్, ఉపాధ్యాయుల చంద్రశేఖర్, టీజీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళిచరణ్, కార్యదర్శి అరవింద్ రెడ్డి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు శంకర్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. టీఎన్జీవోల కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ -
రుక్మాపూర్ సైనిక స్కూల్లో ఘర్షణ
చొప్పదండి: చొప్పదండి మండలంలోని రుక్మాపూర్ సైనిక శిక్షణ పాఠశాలలో విద్యార్థులు ఘర్షణ పడ్డారు. గురువారం రాత్రి పదోతరగతి విద్యార్థులను ఇంటర్ విద్యార్థులు చితకబాదారు. విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం ఉదయం స్కూల్కు చేరుకోవడంతో ఈ విషయం వెలుగుచూసింది. విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. విద్యార్థుల తల్లిదండ్రుల కథనం ప్రకారం. రుక్మాపూర్ సైనిక శిక్షణ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులను గురువారం రాత్రి ఇంటర్ విద్యార్థులు చితకబాదారు. ఈ విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు తెలవడంతో వారు పాఠశాలకు చేరుకొని ఆందోళన చేపట్టడంతో విషయం వెలుగుచూసింది. ఈ విషయం ఎస్సై గొల్లపల్లి అనూషకు తెలియడంతో ఆమె స్కూల్కు చేరుకొని విచారణ చేపట్టింది. నలుగురికి గాయాలు విద్యాలయంలో గురువారం జరిగిన ఘటనలో నలుగురు విద్యార్థులు గాయపడ్డట్లు తెలిసింది. పలువురు విద్యార్థులు తల్లిదండ్రుల సమక్షంలో నే తమ గాయాలను బయటకు చూపించారు. పోలీసులు వెళ్లి విచారణ చేపట్టా.. మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా చూస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ సంఘటనపై జిల్లా ఉన్నతాధికారులను కలు స్తామని విద్యార్థులు తల్లిదండ్రులు తెలిపారు. పదోతరగతి విద్యార్థులను చితకబాదిన ఇంటర్ విద్యార్థులు విచారణ చేపట్టిన పోలీసులు -
మిల్లర్లు మారలే
జిల్లాలోని జమ్మికుంట, హుజూరాబాద్, మానకొండూర్, సదాశివపల్లి, తిమ్మాపూర్, కరీంనగర్ చుట్టు పక్కల రైస్మిల్లులు ఎక్కువగా ఉన్నాయి. ప్రతీ వానాకాలం, యాసంగి సీజన్లలో రైతుల నుంచి ధాన్యం కొంటున్న ప్రభుత్వం, పైసా ఖర్చు లేకుండా మిల్లులకు కస్టం మిల్లింగ్ రైస్(సీఎంఆర్) పేరిట సరఫరా చేస్తున్నది. ఇదే అదునుగా కొందరు మిల్లర్లు అడ్డదారులు తొక్కారు. బియ్యాన్ని తిరిగి ఇవ్వకుండా నేరుగా ధాన్యాన్నే అమ్ముకొని సొమ్ము చేసుకునే స్థాయికి దిగజారారు. ఇటీవల జమ్మికుంట, హుజూరాబాద్ ప్రాంతంలోని ఏడు మిల్లుల్లో తనిఖీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్కడ జరుగుతున్న తతంగానికి అవాక్కయ్యారు. లక్షల క్వింటాళ్ల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. జమ్మికుంటకు చెందిన ఒక మిల్లరు అక్రమాలను చూసి ఆశ్చర్యపోయారు. ఈ ఒక్క మిల్లులోనే దాదాపు 4 లక్షల క్వింటాళ్లకు పైగా ధాన్యం లోటును గుర్తించినట్లు పక్కా సమాచారం. అలాగే శంకరపట్నం మండలం మొలంగూర్లోనూ ఇదే పరిస్థితి. జిల్లాలో పదుల సంఖ్యలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం మిల్లర్ల బరితెగింపుకు తార్కాణం. -
ఎంత బరితెగింపు !
కొందరు మిల్లర్లు నిజాయితీగా సీఎంఆర్ ఇస్తుండగా మరికొందరు మాత్రం బరితెగించి వ్యవహరిస్తుండటం వ్యవస్థకే మాయని మచ్చగా మిగులుతోంది. గతంలో మిల్లర్లు బియ్యం మరాడించిన తర్వాత సీఎంఆర్ ఇవ్వకుండా అమ్ముకోవడమో, పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సీఎంఆర్ కింద ఇవ్వడమో చేసేవారు. కానీ కొంతకాలంగా ఏకంగా ప్రభుత్వమిచ్చిన ధాన్యాన్నే అమ్ముకునే స్థితికి చేరారు. బియ్యం కంటే ధాన్యం అమ్మితేనే ఎక్కువ గిట్టుబాటు అవుతుండటంతో ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు అక్రమంగా ధాన్యాన్ని తరలిస్తున్నారు. అయితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్న ఆదేశాల క్రమంలో ప్రణాళిక రూపొందిస్తున్నామని పౌరసరఫరాల సంస్థ అధికారి రజనీకాంత్ వెల్లడించారు. -
మళ్లీ నిర్లక్ష్యమే!
● సీఎంఆర్ ఇవ్వడంలో మీనమేషాలు ● సివిల్ సప్లయ్ నోటీసులకు మిల్లర్ల బేఖాతర్ ● ప్రభుత్వ ధాన్యంతో రూ.కోట్ల వ్యాపారం ● కఠినచర్యలకు రంగం సిద్ధం?కరీంనగర్ అర్బన్: గడువు మీద గడువు పొడిగించినా, నోటీసులు జారీ చేసినా, ఉన్నతాధికారులు హెచ్చరించినా పలువురు మిల్లర్లలో మార్పు లేదు. ప్రభుత్వమిచ్చిన ధాన్యాన్ని మరాడించి బియ్యంగా ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా మాయం చేస్తున్నారు. లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని అప్పనంగా అమ్ముకుని రూ.కోట్ల ఆస్తులు కూడబెట్టుకోగా ప్రభుత్వానికి మొండిచేయి చూపుతున్నారు. ఏళ్లుగా ఈ దందా సాగుతుండగా ముకుతాడు వేసేవారే కరువయ్యారు. గతంలో పౌర సరఫరాల సంస్థ అధికారులు జమ్మికుంట మిల్లర్లపైనా కేసులు పెట్టగా, శంకరపట్నం మండలంలో ఒక మిల్లరును రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. గత నెలాఖరులోగా లక్ష్యం మేరకు సీఎంఆర్ ఇవ్వాలని ప్రభుత్వం విస్పష్టం చేయగా మళ్లీ నిర్లక్ష్యమే. కాగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇటీవల తనిఖీలు చేయగా సీఎంఆర్ బియ్యం మాయం చేసినట్లు తెలుస్తోంది. కఠినచర్యలుంటాయా.. గతమే పునరావృతమా..? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా సీఎంఆర్పై కఠినంగా వ్యవహరించగా మిల్లర్లు వణికిపోయారు. గత అక్టోబర్లోగా కచ్చితంగా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేయగా గడువు మీద గడువిచ్చారు. రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేయాలని పలువురు మిల్లర్లు 2022–23 వానకాలం సీజన్కు సంబంధించి జిల్లా, ఇతర జిల్లాల రైతుల నుంచి సేకరించిన 2,96,900.440 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లుల కెపాసిటీని బట్టి కరీంనగర్ జిల్లాలోని దాదాపు అన్ని మిల్లులకు కేటాయించారు. సదరు బియ్యం ఇంకా ఇవ్వాల్సి ఉండటం విశేషం. ఇక 2022–23 యాసంగి సీజన్లో 3,74,825.280 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి మిల్లులకు అందించారు. 2,53,634,580 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా ఇంకా బకాయిలున్నా మిల్లులుండటం పర్యవేక్షణ తీరుకు నిదర్శనం. పెద్దమొత్తంలో ధాన్యాన్ని మాయం చేసినవారు బియ్యాన్ని ఏ విధంగా ఇస్తారో వేచిచూడాల్సిందే. అయితే ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించగా ఈ సారి గడువివ్వకపోగా కఠినచర్యలుంటాయన్న వాదన వినిపిస్తోంది. రెవెన్యూ రికవరీ యాక్ట్ను ప్రయోగిస్తారా.. క్రిమినల్ కేసులు నమోదు చేస్తారా.. తేలాల్సి ఉంది. -
No Headline
రైతులు యూరియా కోసం పడరానిపాట్లు పడుతున్నారు. ఉదయం నుంచి సహకార సంఘాల ఎదుట బారులు తీరుతున్నారు. శుక్రవారం మానకొండూర్, తిమ్మాపూర్, శంకరపట్నం మండలాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. ఎరువుల లోడ్ వచ్చిందని తెలుసుకొని వెళ్తున్న వారిలో కొందరికే బస్తాలు అందడం.. మిగతా వారికి దొరకకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. పలుకుబడి ఉన్న కొందరికే యూరియా బస్తాలు ఇస్తున్నారని పలువురు రైతులు ఆరోపించారు. – మానకొండూర్/తిమ్మాపూర్/శంకరపట్నంయూరియా కోసం రైతుల అరిగోస -
24న కరీంనగర్కు సీఎం రేవంత్?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఈనెల 24న సీఎం రేవంత్రెడ్డి కరీంనగర్కు రానున్నారని రానున్నారు. కరీంనగర్–మెదక్– నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లా గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వుట్కూరి నరేందర్ రెడ్డికి మద్దతుగా నగరంలోని ఎస్సారార్ కాలేజీలో సభ నిర్వహించనున్నారు. దీనికోసం కాంగ్రెస్ శ్రేణులు అన్నిఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహా తదితరులు పాల్గొంటున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈనెల 10న నామినేషన్ రోజున నరేందర్ రెడ్డి మంత్రులు ఉత్తమ్, పొన్నం, శ్రీధర్బాబు, అనసూయ, సురేఖ, జూపల్లి హాజరైన విషయం తెలిసిందే. ప్రచారం 25వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో సీఎం సభతో ముగించాలని పార్టీ లీడర్లు భావిస్తున్నట్లు తెలిసింది. -
పన్ను వసూలు వేగవంతం చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: ఆస్తిపన్ను వసూలు వేగవంతం చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణితో కలిసి రివ్యూ నిర్వహించారు. గడువు సమీపిస్తోందని.. పన్ను వసూలు వేగంపెంచాలని, సెలవు రోజుల్లోనూ కలెక్ట్ చేయాలని సూచించారు. అవసరాన్ని బట్టి డివిజన్లలో క్యాంపులు నిర్వహించాలన్నారు. మొండి బకాయిదారులపై ఒత్తిడి పెంచాలన్నారు. డివిజన్లవారీగా బకాయిదారుల పేర్లను ప్రకటించి ఫోన్ చేయాలన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, ఇతర ప్రైవేట్ సంస్థలతో పాటు, ప్రభుత్వ సంస్థల ట్యాక్స్ కూడా వసూలు చేయాలన్నారు. మ్యూటేషన్ ఫైళ్లు పెండింగ్లో ఉండొద్దని హెచ్చరించారు. ట్రేడ్లైసెన్స్లపైనా దృష్టి సారించాలన్నారు. ఐదు రోజుల పనిదినాలే ఉండాలె కరీంనగర్ అర్బన్: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు శుక్రవారం బ్యాంకుల ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఐదు రోజుల బ్యాంక్ పని దినాలు ఉండాలని, ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణను నిలిపివేయాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో అన్ని బ్యాంకుల ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సమ్మె చేపడుతామని హెచ్చరించారు. నిరసనలో తాళ్లపల్లి శ్రీనివాస్, పాకాల వేణుమాధవ్, గర్రెపల్లి పోచయ్య, త్రివేణి తదితరులు పాల్గొన్నారు. పత్తి కొనుగోళ్లు ప్రారంభంజమ్మికుంట: పదిరోజులుగా ఆధార్ అనుసంధాన్ సర్వర్ పని చేయకపోవడంతో నిలిచిపోయిన సీసీఐ కొనుగోళ్లు శుక్రవారం తిరిగి ప్రారంభమయ్యాయి. మార్కెట్ చైర్ పర్సన్ పూల్లురి స్వప్న, ఉన్నతశ్రేణి కార్యదర్శి మల్లేశం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కాగా.. శుక్రవారం క్వింటాల్ పత్తి రూ. 6,870 పలికింది.పవర్కట్ ప్రాంతాలుకొత్తపల్లి: తెలంగాణ చౌక్ ఫీడర్ పరిధిలోని 11 కేవీ లైన్, 25 కేవీఏఏ డీటీఆర్ విద్యుత్ మరమ్మతు పనులు చేపడుతున్నందున శనివారం ఉదయం 10 గంటల నుంచి 11.30 వరకు రాంనగర్, రాజీవ్పార్కు, లేబర్ అడ్డ, మంకమ్మతోట, ధన్గర్వాడీ స్కూల్, సత్య లాడ్జ్ ఏరియాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. మాతృభాషను గౌరవించాలికరీంనగర్సిటీ: విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాలలో తెలుగు, ఉర్దూ, ఆంగ్ల విభాగాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ సూరేపల్లి సుజాత మాట్లాడుతూ, అన్ని భాషలలో మాతృభాష గొప్పదని, భాషను గౌరవిస్తే తల్లిని గౌరవించినట్టేనని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య రవికుమార్ మాట్లాడుతూ, ప్రపంచీకరణ నేపథ్యంలో కొన్ని భాషలు అంతరించిపోతున్నాయని, మాతృభాష గొప్పతనాన్ని భావితరాలకు అందించడానికి ప్రతిజ్ఞ చేయాలని యువతకు పిలుపునిచ్చారు. ఉర్దూ పూర్వ విభాగాధిపతి డా.ఉమేరాతస్లీమ్ మాట్లాడుతూ, అన్ని భాషలను సమానంగా గౌరవించుకోవాలని భాషల ఔన్నత్యాన్ని విద్యార్థులకు వివరించారు. ఆంగ్ల విభాగాధిపతి విజయప్రకాశ్ మాట్లాడుతూ, పరభాషలు ఎన్ని నేర్చినా మాతృభాషను గౌరవించాలని, భాషల యొక్క గొప్పతనాన్ని వివరించారు. తెలుగు అధ్యాపకుడు డా.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, భాషలే కాక వాటి మాండలికాలను కూడా కాపాడాలని కోరారు. అధ్యాపకులు డా.ప్రదీప్రాజ్, డా.పావని, డా.రమేశ్, హరికృష్ణ, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
బల్దియాలో బదులు ఉద్యోగులు!
● ఏళ్లుగా కార్యాలయంలో తిష్ట ● పారిశుధ్య కార్మికులపైనే దృష్టి ● కార్యాలయ ఉద్యోగుల మాటేమిటి?కరీంనగర్ కార్పొరేషన్: ఏ ప్రభుత్వ శాఖల్లో లేనివిధంగా బల్దియాలో ‘బదులు’ఉద్యోగులు తిష్టవేశారు. ప్రభుత్వపరంగా ఎలాంటి అధికారిక నియామకం లేకున్నా... కీలక విభాగాల్లో సైతం ప్రైవేట్ వ్యక్తులు ‘ఉద్యోగ బాధ్యతలు’ నిర్వర్తిస్తుంటారు. రెగ్యులర్ ఉద్యోగుల అనారోగ్య కారణాల నెపంతో, వారి కుటుంబ సభ్యులు.. వారి స్థానాల్లో పనిచేస్తున్న వైనం సంవత్సరాలుగా సాగుతోంది. నగరపాలకసంస్థలో ప్రత్యేకాధికారి పాలన మొదలవడంతో, ఈ బదులు వ్యవహారంపై దృష్టిసారించారు. అయితే క్షేత్రస్థాయిలో ఉండే శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న బదులు కార్మికుల వివరాలు మాత్రమే సేకరిస్తుండగా, కార్యాలయంలో పనిచేస్తున్న బదులు ఉద్యోగుల మాటేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒకరికి బదులు మరొకరు నగరపాలకసంస్థలోని ప్రభుత్వ ఉద్యోగుల స్థానంలో ప్రైవేట్ వ్యక్తులు పనిచేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. బల్దియాలో కీలక విభాగాలైన ఇంజినీరింగ్, రెవెన్యూ, శానిటేషన్, టౌన్ప్లానింగ్ తదితర శాఖల్లో వేలాదిమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అనారోగ్య కారణాలసాకుతో రెగ్యులర్ ఉద్యోగుల స్థానాల్లో వారికుటుంబ సభ్యులు పనిచేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. అందునా కీలక విభాగాల్లో ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తుండడం వివాదాస్పదంగా మారింది. అసలు నగరపాలకసంస్థలో ఔట్సోర్సింగ్, ప్రైవేట్ వ్యక్తులనే తేడా లేకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా చెలామణి అవుతుండడం విశేషం. పాలునీళ్లలా కలిసిపోయిన వీరిని వేర్వేరుగా గుర్తించడం అధికారులకు కూడా సాధ్యపడదంటే అతిశయోక్తి కాదు. అనారోగ్యం, మరణించడం తదితర కారణాలతో ఉద్యోగి కుటుంబ సభ్యులకు కారుణ్యనియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంది. కానీ..అలా కాకుండా అనారోగ్యం ఉందంటూ, ప్రభుత్వ ఉద్యోగులకు బదులుగా, ప్రైవేట్ వ్యక్తులు నేరుగా కార్యాలయంలో బాధ్యతలు నిర్వర్తిస్తుండడం కేవలం బల్దియాకే చెల్లింది. లెక్క తేల్చాల్సిందే... కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగులకు బదులుగా పనిచేస్తున్న ప్రైవేట్ వ్యక్తుల లెక్కలను అధికారులు తేల్చాల్సిఉంది. ఏళ్లుగా తిష్టవేసి ఉండడంతో ప్రస్తు తం ఎవరు రెగ్యులర్, ఎవరు బదులు ఉద్యోగులు అనేది కూడా తెలియని పరిస్థితి కార్యాలయంలో నెలకొంది. పైగా కీలక విభాగాల్లో సదరు ప్రైవేట్ వ్యక్తులే పెత్తనం చెలాయిస్తుండడం గమనార్హం.కార్మికులేనా.. ఉద్యోగులు లేరా? బదులు ఉద్యోగుల లెక్కతేల్చాలని అధికారులు నిర్ణయించిన మేరకు శుక్రవారం శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న ఒరిజినల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కార్యాలయానికి పిలిపించారు. ఎవరు ఒరిజినల్ కార్మికులు, ఎవరు వారి స్థానాల్లో పనిచేస్తున్నారనే వివరాలను సహాయ కమిషనర్ వేణుమాధవ్, సూపర్వైజర్ శ్రీనివాస్ సేకరించారు. సాధారణంగానే శానిటేషన్ కార్మికులు అనారోగ్యం బారిన పడినా, రిటైర్ అయిన వారి స్థానంలో ఔట్సోర్సింగ్ పద్ధతిన కార్మికుల కుటుంబ సభ్యులకు అవకాశం కల్పిస్తారు. కానీ.. బయోమెట్రిక్ హాజరు నమోదు కాకపోవడంతో, బదులు కార్మికుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పనిచేసే కార్మికుల వివరాలు సేకరిస్తున్న అధికారులు, కార్యాలయంలో పనిచేస్తున్న బదులు ఉద్యోగులపై దృష్టి పెట్టకపోవడంపై కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. -
పట్టభద్రుల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం
● మంత్రి శ్రీధర్బాబుధర్మపురి: పట్టభద్రుల సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ధర్మపురిలోని బ్రాహ్మణ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో నిరుద్యోగుల నైపూణ్యాన్ని పెంచేలా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభించామని పేర్కొన్నారు. విద్యారంగ అభివృద్ధి, పట్టభద్రుల సమస్యలను తీర్చే బాధ్యత కాంగ్రెస్దేనని గుర్తు చేశారు. అంతకముందు విప్ అడ్లూరి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన అభ్యర్థి నరేందర్రెడ్డిని గెలిపిస్తే పట్టభద్రుల సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. ఉద్యోగాలకు కల్పతరువుగా ఉన్న ధర్మపురిలో శ్రీలక్ష్మీనృసింహ సంస్కృతాంధ్ర కళాశాలను మంత్రి శ్రీధర్బాబు చొరవతో ముఖ్యమంత్రితో మాట్లాడి తెరిపించానని వివరించారు. రానున్న రోజుల్లో ధర్మపురిలో ఐటీఐ, డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చిలుముల లావణ్య, నాయకులు ఎస్.దినేశ్, వేముల రాజు, చిలుముల లక్ష్మణ్, చీపిరిశెట్టి రాజేశ్ పాల్గొన్నారు. -
అప్పుల బాధతో వివాహిత ఆత్మహత్య
ముస్తాబాద్(సిరిసిల్ల): ఫైనాన్స్ వారి వేధింపులు..అప్పుల బాధలు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాలు మృతురాలు సూసైడ్ నోట్లో పేర్కొంది. ముస్తాబాద్ ఎస్సై గణేశ్, గ్రామస్తులు తెలిపిన వివరాలు. ముస్తాబాద్ మండలం ఆవునూర్కు చెందిన గట్ల సునీత(45) శుక్రవారం ఉరివేసుకుంది. భర్త నగేశ్తో కలిసి సునీత హోటల్ నడిపేది. హోటల్లో పనిచేస్తూ ఇంటికి వెళ్లివస్తానని చెప్పి వెళ్లిన సునీత తిరిగి రాలేదు. దీంతో భర్త నగేశ్ ఇంటికి వెళ్లి చూడగా.. సునీత ఉరికి వేలాడుతూ కనిపించింది. సునీతకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సునీత చనిపోయే ముందు తన ఆత్మహత్యకు అప్పుల ఇచ్చిన వారి వేధింపులే కారణమని రాసిన సూసైడ్నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి భర్త నగేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలూ.. నన్ను క్షమించండి అమ్మ శ్రీవాణి, బబ్లూ నాన్న మీరంటే నాకెంతో ఇష్టం.. నన్న క్షమించండి అంటూ సునీత సూసైడ్ నోట్లో పేర్కొంది. ఒక తల్లిగా మీ మంచి చెడ్డలు చూడాల్సిన నేను అవమానభారంతో చనిపోతున్న. మీరిద్దరు నాకు ప్రాణం. నా మనసంతా మీ మీదనే ఉంటది. నన్ను క్షమించండి ఇట్లు మీ అమ్మ అంటూ సునీత ఎంతో బాధతో సూసైడ్నోట్ రాసింది. నడిపి అక్క, పెద్దక్క, అమ్మ నా పిల్లలిద్దరిని మన ఊరికి దయచేసి తీసుకెళ్లండి అంటూ సునీత అందులో పేర్కొంది. సునీత రాసిన లేఖను చదివిన వారు కంటతడి పెట్టారు. పోలీసులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. -
‘ఆదివాసీల జీవనాన్ని దెబ్బతీస్తున్న ఆపరేషన్ కగార్’
గోదావరిఖని: ఛత్తీగఢ్లో ఆదివాసీల జీవనాన్ని దెబ్బతీసేలా కేంద్రప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిందని అరుణోదయ రాష్ట్ర నాయకురాలు విమలక్క విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆదివాసుల పొట్టకొట్టి అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడం కోసమే ఆపరేషన్ కగార్ కొనసాగుతోందన్నారు. అడవులను కాపాడుకోవడం కోసం ఆదివాసీలు చేస్తున్న పోరాటం న్యాయమమన్నారు. నక్సలైట్లు ఆదివాసులు, అడవులకు అండగా ఉంటున్నారని అన్నారు. బహుళజాతి సంస్థలకు రెడ్కార్పెట్ పరిచేందుకు ఆపరేషన్ కగార్ కొనసాగుతోందని ధ్వజమెత్తారు. నక్సలైట్లను ఏరిపారేయడం కోసమంటూ కేంద్రప్రభుత్వం మొదలుపెట్టిన ఆపరేషన్ కగార్ బూటకమన్నారు. నిజమైన దేశభక్తులు విప్లవ కారులేనని విమలక్క అన్నారు. వెంటనే ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని కోరారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో సింగరేణి పోరాటం ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణతో కార్మికులు సమస్యలతో సతమతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నాయకులు మాతంగి రాయమల్లు, మేకల పోచమల్లు, జి.రాములు, వెలుతురు సదానందం, రత్నకుమార్, పల్లె లింగయ్య, యాకూబ్, చిన్నయ్య, లావణ్య తదితరులు పాల్గొన్నారు. -
రాజన్న లడ్డూ సిద్ధం
వేములవాడ: కోరిన కోర్కెలు తీరుస్తూ ... కొంగుబంగారంగా నిలుస్తున్న వేములవాడ రాజన్న లడ్డూ ప్రసాదానికి భక్తుల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజన్న దర్శనం అనంతరం లడ్డూ ప్రసాదాన్ని కొనుగోలు చేసి తీసుకెళ్లి బంధువులు, చుట్టూ పక్కల వారికి ఇవ్వడం ఆనవాయితీగా భావిస్తారు. లడ్డూ ప్రసాదం పంపిణీ చేయడం ఆధ్యాత్మిక భావనను విస్తరించడంతోపాటు ప్రసాదాన్ని తీసుకున్న వారు సైతం చాలా పవిత్రంగా భావిస్తూ స్వీకరిస్తారు. ఇంత ప్రాశస్థ్యం గల లడ్డూ ప్రసాదాన్ని ఆలయ అధికారులు యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేయిస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయంలో ఈనెల 25, 26, 27 తేదీల్లో నిర్వహించే మహాశివరాత్రి జాతరకు 4 లక్షల వరకు భక్తుఉల వస్తారని అంచాన వేశారు. ఇందుకు అనుగుణంగా దాదాపు 5 లక్షల లడ్డూలను తయారీ చేయిస్తున్నారు. ఇప్పటికే 3 లక్షల లడ్డూలు సిద్ధం చేసి ఉంచగా, మరో 2 లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నారు. రూ.20కి ఒక లడ్డూ చొప్పున విక్రయిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొన్ని ఆంధ్రాబ్యాంక్ భవనంలో అదనంగా లడ్డూ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. రాజన్నను దర్శించుకుని దక్షిణ ద్వారం ద్వారా బయటకు వెళ్లే భక్తులు నేరుగా ప్రసాదాల కౌంటర్కు చేరుకోవచ్చు. భక్తుల కోసం తయారీ రూ.20కి ఒకటి వేములవాడలో 25 నుంచి మహాశివరాత్రి జాతర 4 లక్షల భక్తులు వస్తారని అంచనాఏటా పెరుగుతున్న ఆదాయం 2014–2015 రూ.7.30 కోట్లు 2015–2016 రూ.8.89 కోట్లు 2016–2017 రూ.8.38 కోట్లు 2017–2018 రూ7.88కోట్లు 2019–2020 రూ.6.95 కోట్లు 2020–2021 రూ.11.42 కోట్లు 2021–2022 రూ.11.46 కోట్లు 2022–2023 రూ.11.50 కోట్లు 2023–2024 రూ.11.60 కోట్లు5 లక్షల లడ్డూలు జాతరకు వచ్చే భక్తులకు రాజన్న ప్రసాదం అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ఈసారి 5 లక్షల లడ్డూలు సిద్ధం చేయిస్తున్నాం. ఇప్పటికే 3 లక్షల లడ్డూలు రెడీ అయ్యాయి. జాతర సందర్భంగా మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. – శ్రవణ్, ఏఈవో, గోదాం ఇన్చార్జి -
రజనీశ్రీ సాహిత్య పురస్కారానికి కవితా సంకలనాల ఆహ్వానం
కరీంనగర్కల్చరల్: జాతీయ సాహిత్య పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో నాట్యాచార్యుడు రజనీశ్రీ పేరుపై రజినీశ్రీ కుమారుడు, మహాత్మా జ్యోతీ బాపూలే రెసిడెన్షియల్ పాఠశాలల సంయుక్త కార్యదర్శి జీవీ శ్యాంప్రసాద్లాల్ ఏటా రజినీశ్రీ పురస్కారం ప్రదానం చేస్తున్నారు. ఈ సంవత్సరం పురస్కారం కవిత్వానికి అందిస్తున్నట్లు సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు గాజుల రవీందర్, నందిని శ్రీనివాస్ తెలిపారు. పురస్కారం కింద ప్రశంసాపత్రం, రూ.10,016 అందజేస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన కవులు, రచయితలు జనవవరి 2022 నుంచి డిసెంబరు 2024 వరకు ముద్రితమైన తమ పద్య, గేయ, వచన కవితల సంకలనాలు మాత్రమే పంపాల్సి ఉంటుంది. శతకాలు, దీర్ఘ కవితలు, ల ఘురూప ప్రక్రియలు స్వీకరించరు. ప్రతీది నాలుగు ప్రతులను మార్చి 20లోపు గాజుల రవీందర్ ఇంటి నెం.8–3–255/1, రామచంద్రాపూర్ కాలనీ, రోడ్ నెం.12, భగత్ నగర్, కరీంనగర్, 505001 చిరునా మాకు పంపాలని సూచించారు. వివరాలకు 94904 01861 నంబర్ను సంప్రదించాలని తెలిపారు. -
పది రోజుల్లో కూతురి పెళ్లి.. అంతలోనే విషాదం
ముస్తాబాద్(సిరిసిల్ల): పది రోజుల్లో పెళ్లి భాజభజంత్రీలు మోగాల్సిన ఇంటిలో చావుడప్పు వినిపించింది. ఇంటిల్లిపాది పెళ్లి పనుల్లో ఆనందంగా ఉన్న ఆ కుటుంబంలో అంతులేని విషాదం నిండింది. ప్రమాదవశాత్తు నిప్పంటుకుని పెళ్లి కూతురు తల్లి మృతిచెందడంతో ఆ ఊరిలో విషాదం అలుముకుంది. ముస్తాబాద్ ఎస్సై గణేశ్, గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్కు చెందిన చిన్ని అంజమ్మ(52) శుక్రవారం ఉదయం ఇంటి ఆవరణలో చెత్తకు నిప్పు పెడుతుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకుంటున్నాయి. గమనించిన కుటుంబ సభ్యులు అంజమ్మను సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందింది. అంజమ్మ పెద్దకూతురు భాగ్య వివాహం మార్చి 2న ఉంది. పెళ్లికార్డులు బంధువులకు ఇచ్చేందుకు అంజమ్మ భర్త బాల్రెడ్డి వెళ్లాడు. పది రోజుల్లో వివాహం జరగాల్సిన ఇంటిలో విషాదం అలుముకుంది. సంఘటన స్థలాన్ని ఎస్సై గణేశ్ పరిశీలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు నిప్పంటుకుని మహిళ మృతి -
ఒడిశా టు మహారాష్ట్ర
గోదావరిఖని: గంజాయి రాష్ట్రాల సరిహద్దులు దాటుతోంది.. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి మహారాష్ట్రకు తరలివెళ్తోంది. సీలేరు నదీతీరం నుంచి మంచిర్యాలకు రవాణా అవుతోంది. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా రవాణా ఆగడంలేదు. ఉజ్వల భవిష్యత్ ఉన్న యువత గంజాయి మత్తులో జోగుతోంది. కోవర్ట్లు ఇచ్చిన సమాచారంతో రామగుండం కమిషనరేట్ పోలీసులు ఒకేరోజు రూ.60లక్షల విలువైన 120కిలోల గంజాయి పట్టుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. కాపుకాసి 96 కిలోలు పట్టివేత ఒడిశా సరిహద్దుల నుంచి మంథని మీదుగా గంజాయి రవాణా అవుతున్న సమాచారం పోలీసులకు చేరింది. రంగంలోకి దిగగిన టాస్క్ఫోర్స్ పోలీసులు జీడీకే–11గని వద్ద మాటు వేశారు. ఈక్రమంలోనే రెండు వాహనా అక్కడకు రాగానే ఆపి తనిఖీ చేశారు. దీంతో అందులో గంజాయి ప్యాకెట్లు లభించాయి. నిందితులతో పాటు గంజాయి, రెండు కార్లను స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టులో హాజరు పర్చారు. సీసీ కెమెరాల ముసుగులో దందా.. ఒడిశా, ఆంధ్రా సరిద్దుల్లో సీలేరు నది ప్రవహిస్తోంది. దాని పరీవాహక ప్రాంతంలోని ఒడిశా అటవీప్రాంతంలో గంజాయి సాగుచేస్తూ ఇతర ప్రాంతాలకు తరలించడం కొన్నేళ్లుగా సాగుతోందని పోలీసులు చెబుతున్నారు. ఈక్రమంలో మంచిర్యాలకు చెందిన కొందరు ముఠాగా ఏర్పడి అక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే కారు వెంట రెండు మోటార్ సైకిళ్లు ఎస్కార్ట్గా రాగా ఒడిశా సీలేరు టు బీజాపూర్, మేడారం, మంథని, గోదావరిఖని మీదుగా మంచిర్యాలకు గంజాయి తరలించారు. సీసీ కెమెరాలు విక్రయించే గోడౌన్లో దానిని దాచి ఉంచారు. తీసుకొచ్చింది 30 కిలోల గంజాయిలో 6.5 కిలోలు వినియోగం కాగా మిగతాదానిని మంచిర్యాల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా యువకులే.. తక్కువ డబ్బుతో ఎక్కువ మత్తు వస్తున్న గంజాయి వైపు యువత మొగ్గు చూపుతోంది. ఈక్రమంలో చాలామంది గంజాయి మత్తులో జోగుతూ తమ లక్ష్యాలు, ఉన్నత చదువులను వదిలేస్తున్నారు. మంచిర్యాల గోడౌన్లో గంజాయి దాచిఉంచిన సంఘటనలో 11మంది పోలీసులకు పట్టుబడగా వారిలో 25ఏళ్ల వారే ఎక్కువగా ఉన్నారు. అలాగే ఇంకా పోలీసులకు చిక్కని 11మందిలో కూడా యువకులు ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. వీరిలో ఒకరు మైనర్ కూడా ఉన్నారని అంటున్నారు. సీలేరు నుంచి మంచిర్యాల రాష్ట్ర హద్దులు దాటుతున్న గంజాయి యువతే టార్గెట్గా జోరుగా వ్యాపారంఏడాది గంజాయి విలువ నిందితులు (కేజీల్లో) (రూ.లక్షల్లో) 2020 32.90 6.89 22 2021 34.48 3.70 14 2022 8.52 1.22 58 2023 34.78 7.76 58 2024 21.83 5.36 74 2025 120.27 60.13 16 (ఇప్పటివరకు)పీడీయాక్ట్ నమోదు చేస్తాం గంజాయి వ్యవహారంలో ఎంతటివారున్నా ఉపేక్షించబోం. గంజాయి తాగినా, అమ్మినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. నిందితులపై పీడీయాక్టు నమోదు చేస్తున్నాం. – శ్రీనివాస్, పోలీసు కమిషనర్ రామగుండం -
వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్
కరీంనగర్టౌన్: వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురందేశ్వరి పేర్కొన్నారు. కరీంనగర్లోని వైశ్య భవన్లో శుక్రవారం కేంద్ర బడ్జెట్పై నిర్వహించిన మేధావుల సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు స్థానిక శ్వేతా హోటల్లో మీడియాతో మాట్లాడారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులపై అవగాహన కల్పించేందుకే పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా కేటాయింపులు ఉన్నాయన్నారు. రక్షణ, విద్య, వైద్యం, వ్యవసాయం, స్కిల్ డెవలప్మెంట్స్కు ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు. రూ.12లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదన్న ప్రకటన కోట్లాదిమందికి సంతోషాన్నిచ్చిందని గుర్తు చేశారు. గరీభీ హటావో నినాదంతో దేశాన్ని దశాబ్దాలు ఏలిన కాంగ్రెస్ పేదరికాన్ని నిర్మూలించలేక పోయిందని విమర్శించారు. గత పదేళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో సాధించిన అభివృద్ధి, సంస్కరణలతో దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అభివృద్ధి మందగించిన భారత్ మెరుగైన పనితీరు సాధించిందన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనార్టీ, నిరుద్యోగుల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలను తీసుకొచ్చి చేయూతనిస్తోందన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, వికసిత్ భారత్ బడ్జెట్ ప్రోగ్రాం స్టేట్ కోఆర్డినేటర్ గంగిడి మనోహర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్రావు పాల్గొన్నారు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా రూపకల్పన ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి -
సైబర్ నేరానికి పాల్పడిన యువకుడి అరెస్ట్
మెట్పల్లి(కోరుట్ల): మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన మామిడాల నితీశ్కుమార్ను నమ్మించి రూ.6లక్షలు కాజేసిన షణ్ముఖ కృష్ణయాదవ్ను అరెస్ట్ చేసినట్లు సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. సీఐ కథనం ప్రకారం..ఉన్నత చదువుల కోసం నితీశ్కుమార్ లండన్ వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తుండగా.. కృష్ణయాదవ్ టెలిగ్రామ్ యాప్ ద్వారా మెసేజ్ పంపి అతన్ని పరిచయం చేసుకున్నాడు. తాను లండన్లో ఉద్యోగం చేస్తున్నానని, ఇండియా డబ్బులతో ఫీజు కడితే ఎక్కువ ఖర్చు అవుతోందని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ఉన్న తన బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తే, తాను లండన్ కరెన్సీతో ఫీజు చెల్లించి రశీదు పంపుతానని నమ్మబలికి అతడి ఖాతా వివరాలు పంపాడు. అనంతరం నితీశ్కుమార్ వెంటనే తన ఖాతా నుంచి రూ.25వేలు, తన తల్లి ఖాతా నుంచి రూ.5.75లక్షలను కృష్ణయాదవ్ ఖాతాలో జమ చేశాడు. తర్వాత కొన్ని రోజులకు రశీదు గురించి అడిగితే పంపకుండా సెల్ఫోన్ స్వీచ్ ఆఫ్ చేశాడు. మోసపోయాయని గ్రహించిన నితీశ్కుమార్ మల్లాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, గతేడాది మే లో కేసు నమోదు చేసి ఇమ్మిగ్రేషన్ అధికారులకు సమాచారమిచ్చారు. ఆ తర్వాత లండన్న్ వెళ్లిన నితీశ్కుమార్, అక్కడ అతని గురించి వెతకగా ఆచూకీ దొరకలేదు. గురువారం ఉదయం లండన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగిన కృష్ణయాదవ్ను ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మల్లాపూర్ ఎస్సై రాజు అక్కడకు వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకొని మెట్పల్లికి తరలించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని సీఐ పేర్కొన్నారు. ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య పాలకుర్తి(రామగుండం): అనారోగ్యం బాధ భరించలేక ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహ త్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై స్వామి కథ నం ప్రకారం.. గ్రామానికి చెందిన రావుల శంకర్(60) కొంతకాలంగా అ నారోగ్యంతో బాధపడుతున్నాడు. నెలక్రితం ఆ పరేషన్ కూడా చేయించుకున్నాడు. అయినా ఆ రోగ్యం కుదుటపడలేదు. దీంతో జీవితంపై వి రక్తి చెంది గురువారం అర్ధరాత్రి ఇంటి ఎదుట చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుమారుడు సతీశ్ ఫిర్యాదు మేరకు కే సు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. గూడెంలో పీజీ విద్యార్థి.. ఓదెల(పెద్దపల్లి): గూడెం గ్రామానికి చెందిన గూడ దామోదర్(30) పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. దామోదర్ కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తిచెంది ఇంట్లోని పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై వివరించారు. ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి జూలపల్లి(పెద్దపల్లి): కుమ్మరికుంట గ్రామానికి చెందిన దోడ్ల లచ్చయ్య(58)బావిలో మునిగి మృతి చెందాడు. ఎస్సై సనత్కుమార్, మృతుడి భార్య కనుకమ్మ కథనం ప్రకారం.. శుక్ర వారం ఉదయం చేనుకు నీళ్లు పెట్టేందుకు వెళ్లి న లచ్చయ్య.. బావిలో విద్యుత్ మోటారు పైపు సరిచేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడు. అయితే, బావిలో ఉన్న తీగె లు తట్టుకునిపైకి రాలేక నీళ్లలో మునిగి ఊపిరి ఆడక మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. -
ఒడిశా టు మహారాష్ట్ర
గోదావరిఖని: గంజాయి రాష్ట్రాల సరిహద్దులు దాటుతోంది.. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి మహారాష్ట్రకు తరలివెళ్తోంది. సీలేరు నదీతీరం నుంచి మంచిర్యాలకు రవాణా అవుతోంది. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా రవాణా ఆగడంలేదు. ఉజ్వల భవిష్యత్ ఉన్న యువత గంజాయి మత్తులో జోగుతోంది. కోవర్ట్లు ఇచ్చిన సమాచారంతో రామగుండం కమిషనరేట్ పోలీసులు ఒకేరోజు రూ.60లక్షల విలువైన 120కిలోల గంజాయి పట్టుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. కాపుకాసి 96 కిలోలు పట్టివేత ఒడిశా సరిహద్దుల నుంచి మంథని మీదుగా గంజాయి రవాణా అవుతున్న సమాచారం పోలీసులకు చేరింది. రంగంలోకి దిగగిన టాస్క్ఫోర్స్ పోలీసులు జీడీకే–11గని వద్ద మాటు వేశారు. ఈక్రమంలోనే రెండు వాహనా అక్కడకు రాగానే ఆపి తనిఖీ చేశారు. దీంతో అందులో గంజాయి ప్యాకెట్లు లభించాయి. నిందితులతో పాటు గంజాయి, రెండు కార్లను స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టులో హాజరు పర్చారు. సీసీ కెమెరాల ముసుగులో దందా.. ఒడిశా, ఆంధ్రా సరిద్దుల్లో సీలేరు నది ప్రవహిస్తోంది. దాని పరీవాహక ప్రాంతంలోని ఒడిశా అటవీప్రాంతంలో గంజాయి సాగుచేస్తూ ఇతర ప్రాంతాలకు తరలించడం కొన్నేళ్లుగా సాగుతోందని పోలీసులు చెబుతున్నారు. ఈక్రమంలో మంచిర్యాలకు చెందిన కొందరు ముఠాగా ఏర్పడి అక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే కారు వెంట రెండు మోటార్ సైకిళ్లు ఎస్కార్ట్గా రాగా ఒడిశా సీలేరు టు బీజాపూర్, మేడారం, మంథని, గోదావరిఖని మీదుగా మంచిర్యాలకు గంజాయి తరలించారు. సీసీ కెమెరాలు విక్రయించే గోడౌన్లో దానిని దాచి ఉంచారు. తీసుకొచ్చింది 30 కిలోల గంజాయిలో 6.5 కిలోలు వినియోగం కాగా మిగతాదానిని మంచిర్యాల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా యువకులే.. తక్కువ డబ్బుతో ఎక్కువ మత్తు వస్తున్న గంజాయి వైపు యువత మొగ్గు చూపుతోంది. ఈక్రమంలో చాలామంది గంజాయి మత్తులో జోగుతూ తమ లక్ష్యాలు, ఉన్నత చదువులను వదిలేస్తున్నారు. మంచిర్యాల గోడౌన్లో గంజాయి దాచిఉంచిన సంఘటనలో 11మంది పోలీసులకు పట్టుబడగా వారిలో 25ఏళ్ల వారే ఎక్కువగా ఉన్నారు. అలాగే ఇంకా పోలీసులకు చిక్కని 11మందిలో కూడా యువకులు ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. వీరిలో ఒకరు మైనర్ కూడా ఉన్నారని అంటున్నారు. సీలేరు నుంచి మంచిర్యాల రాష్ట్ర హద్దులు దాటుతున్న గంజాయి యువతే టార్గెట్గా జోరుగా వ్యాపారంఏడాది గంజాయి విలువ నిందితులు (కేజీల్లో) (రూ.లక్షల్లో) 2020 32.90 6.89 22 2021 34.48 3.70 14 2022 8.52 1.22 58 2023 34.78 7.76 58 2024 21.83 5.36 74 2025 120.27 60.13 16 (ఇప్పటివరకు)పీడీయాక్ట్ నమోదు చేస్తాం గంజాయి వ్యవహారంలో ఎంతటివారున్నా ఉపేక్షించబోం. గంజాయి తాగినా, అమ్మినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. నిందితులపై పీడీయాక్టు నమోదు చేస్తున్నాం. – శ్రీనివాస్, పోలీసు కమిషనర్ రామగుండం -
రజనీశ్రీ సాహిత్య పురస్కారానికి కవితా సంకలనాల ఆహ్వానం
కరీంనగర్కల్చరల్: జాతీయ సాహిత్య పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో నాట్యాచార్యుడు రజనీశ్రీ పేరుపై రజినీశ్రీ కుమారుడు, మహాత్మా జ్యోతీ బాపూలే రెసిడెన్షియల్ పాఠశాలల సంయుక్త కార్యదర్శి జీవీ శ్యాంప్రసాద్లాల్ ఏటా రజినీశ్రీ పురస్కారం ప్రదానం చేస్తున్నారు. ఈ సంవత్సరం పురస్కారం కవిత్వానికి అందిస్తున్నట్లు సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు గాజుల రవీందర్, నందిని శ్రీనివాస్ తెలిపారు. పురస్కారం కింద ప్రశంసాపత్రం, రూ.10,016 అందజేస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన కవులు, రచయితలు జనవవరి 2022 నుంచి డిసెంబరు 2024 వరకు ముద్రితమైన తమ పద్య, గేయ, వచన కవితల సంకలనాలు మాత్రమే పంపాల్సి ఉంటుంది. శతకాలు, దీర్ఘ కవితలు, ల ఘురూప ప్రక్రియలు స్వీకరించరు. ప్రతీది నాలుగు ప్రతులను మార్చి 20లోపు గాజుల రవీందర్ ఇంటి నెం.8–3–255/1, రామచంద్రాపూర్ కాలనీ, రోడ్ నెం.12, భగత్ నగర్, కరీంనగర్, 505001 చిరునా మాకు పంపాలని సూచించారు. వివరాలకు 94904 01861 నంబర్ను సంప్రదించాలని తెలిపారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చూపాలి
సాక్షి,పెద్దపల్లి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని, స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించే బాధ్యత తాము తీసుకుంటామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం బీజేపీ పచ్చీస్ ప్రభారి (25 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జి) సమావేశం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. జిల్లాలోనూ గుజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్రావు, కాసిపేట లింగయ్య, కోమల ఆంజనేయులు లాంటి నేతలను చంపాలని నక్సలైట్లు పోస్టర్లు కూడా వేశారని, నక్సలైట్స్కు ఎదురొడ్డిన ఆ నేతలు కాషాయ జెండాను రెపరెపలాడించారని గుర్తుచేశారు. హిందువుల జాబితాలో ముస్లింలను ఎలా కలుపుతారని ప్రశ్నించారు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చి బిల్లు పంపితే కేంద్రప్రభుత్వం ఆమోదించే ప్రసక్తే లేదన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు లేకపోతే నాయకులు లేరని, కార్యకర్తల కష్టంతోనే ఇద్దరు సీఎంలను ఓడించానన్నారు. మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, కాసిపేట లింగయ్య, గుజ్జుల రామకృష్ణారెడ్డి, బీజేపీ టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు మల్క కొమరయ్య, చిన్నమైల్ అంజిరెడ్డి పాల్గొన్నారు. ఫ్లెక్సీలో నా ఫొటో ఎక్కడ? అంతకుముందు జరిగిన మీడియా సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫొటో లేదని బీజేపీ నేత గోమాసె శ్రీనివాస్ అసంతప్తి వ్యక్తం చేశారు. తనకు గౌరవం తగ్గిదని జిల్లా అధ్యక్షుడిపై అసంతప్తి వ్యక్తం చేశారు. పోరపాటు జరిగిదంటూ సంజీవరెడ్డి సర్దిచెప్పారు. దుగ్యాల వర్గం దూరం.. బండి సంజయ్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్, పచ్చీస్ ప్రభారీకి పెద్దపల్లి అసెంబ్లీ బీజేపీ ఇన్చార్జి దుగ్యాల ప్రదీప్రావు వర్గం దూరంగా ఉండటంతో కమలం పార్టీలో గ్రూప్ రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. తమను పట్టించుకోవడం లేదని, అసంతృప్తితోనే సమావేశంకు దూరంగా ఉన్నామని దుగ్యాల వర్గం నేతలు చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి కేంద్ర మంత్రి బండి సంజయ్ -
పది రోజుల్లో కూతురి పెళ్లి.. అంతలోనే విషాదం
ముస్తాబాద్(సిరిసిల్ల): పది రోజుల్లో పెళ్లి భాజభజంత్రీలు మోగాల్సిన ఇంటిలో చావుడప్పు వినిపించింది. ఇంటిల్లిపాది పెళ్లి పనుల్లో ఆనందంగా ఉన్న ఆ కుటుంబంలో అంతులేని విషాదం నిండింది. ప్రమాదవశాత్తు నిప్పంటుకుని పెళ్లి కూతురు తల్లి మృతిచెందడంతో ఆ ఊరిలో విషాదం అలుముకుంది. ముస్తాబాద్ ఎస్సై గణేశ్, గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్కు చెందిన చిన్ని అంజమ్మ(52) శుక్రవారం ఉదయం ఇంటి ఆవరణలో చెత్తకు నిప్పు పెడుతుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకుంటున్నాయి. గమనించిన కుటుంబ సభ్యులు అంజమ్మను సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందింది. అంజమ్మ పెద్దకూతురు భాగ్య వివాహం మార్చి 2న ఉంది. పెళ్లికార్డులు బంధువులకు ఇచ్చేందుకు అంజమ్మ భర్త బాల్రెడ్డి వెళ్లాడు. పది రోజుల్లో వివాహం జరగాల్సిన ఇంటిలో విషాదం అలుముకుంది. సంఘటన స్థలాన్ని ఎస్సై గణేశ్ పరిశీలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు నిప్పంటుకుని మహిళ మృతి -
క్షుద్రపూజల కలకలం
కరీంనగర్రూరల్: మనిషి చంద్ర మండలంలోకి వెళ్తున్న ఈ కాలంలో గ్రామీణులు కొందరు ఇంకా మూఢనమ్మకాలపైనే ఆధారపడుతున్నారు. దుర్శేడ్ ఉన్నత పాఠశాల, చెర్లభూత్కూర్లో ఓ అంగన్వాడీ టీచర్ ఇంటి ఎదుట క్షుద్రపూజలు చేయడం గురువారం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. దుర్శేడ్ హైస్కూల్లో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ప్రధానోపాధ్యాయుడి గది ఎదుట పసుపు, కుంకుమతో ముగ్గులు వేసి, నిమ్మకాయలు పెట్టి, క్షుద్రపూజ చేశారు. మరుసటిరోజు ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు వాటిని చూసి, భయభ్రాంతులకు గురయ్యారు. ఇన్చార్జి హెచ్ఎం రత్నాకర్ వెంటనే వాటిని తొలగించారు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఇలా చేసి ఉంటారని, ఎవరూ భయపడవద్దని ధైర్యం చెప్పారు. అలాగే, చెర్లభూత్కూర్లో ఓ అంగన్వాడీ టీచర్ ఇంటి ఎదుట క్షుద్రపూజలకు సంబంధించిన వస్తువులను పెట్టడం చర్చనీయాంశంగా మారింది. నాటుసారా తరలిస్తున్న వ్యక్తిపై కేసుపాలకుర్తి(రామగుండం): నాటుసారా తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు రామగుండం ఎకై ్స జ్ సీఐ మంగమ్మ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పాలకుర్తి మండలంలోని జీడీనగర్కు చెందిన పల్లపు వెంకట్ గురువారం ద్విచక్రవాహనంపై నాటుసారా తరలిస్తున్నాడు. అదే సమయంలో జీడీనగర్ నుంచి బసంత్నగర్ వెళ్లే దారిలో ఎకై ్స జ్ ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. వెంకట్ను ఆపి, తనిఖీ చేయగా 8 లీటర్ల నాటుసారా లభ్యమైంది. నాటుసారా స్వాధీనం చేసుకొని, అతనిపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. తనిఖీల్లో హెడ్కానిస్టేబుల్ ఖదీర్, కానిస్టేబుళ్లు శ్రవణ్, నరేశ్, రాజు, రాజ్కుమార్ పాల్గొన్నారు. -
మహాశివరాత్రి జాతర ఉత్సవ కమిటీ ఏర్పాటు
వేములవాడ: ఎములాడ రాజన్న ఆలయంలో ఈ నెల 23 నుంచి 28 వరకు జరిగే మహాశివరాత్రి జాతరకు 29 మంది సభ్యులతో ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు దేవాదాయశాఖ కమిషనర్ శ్రీధర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ ఏర్పాటుకు కృషి చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు సభ్యులు అనుముల చంద్రం, వడ్డేపల్లి వెంకటరమణ, కె.రాజిరెడ్డి, సి.విజయలక్ష్మి, సాగరం వెంకటస్వామి, పాత సత్యలక్ష్మి, కూరగాయల కొమురయ్య, సంద్రగిరి శ్రీనివాస్, నాంపల్లి శ్రీనివాస్, పులి రాంబాబు, తూము సంతోష్, వకుళాభరణం శ్రీనివాస్, పిల్లి కనకయ్య, సంగ స్వామి, జగన్మోహన్ రెడ్డి, చేపూరి గంగయ్య, చింతపల్లి రామస్వామి, కాయతి నాగరాజు, తొట్ల అంజయ్య, ఏనుగు రమేశ్ రెడ్డి, సింగిరెడ్డి నరేశ్ రెడ్డి, ధర్న మల్లేశం, ఒలిమినేని నిత్యానందరావు, గొట్టె ప్రభాకర్, బుస్సా దశరథం, తాటికొండ పవన్, ముప్పిడి శ్రీధర్, సుగూరి లక్ష్మి, తోట లహరి కృతజ్ఞతలు తెలిపారు. కుక్క దాడిలో 10 మందికి గాయాలుసిరిసిల్ల కల్చరల్: కుక్క దాడిలో 10 మంది గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. సిరిసిల్ల బీవైనగర్కు చెందిన ఉమాదేవి, రాణి, లత, రామచంద్రం, లక్ష్మి, భూలక్ష్మి, విజయ, విట్టల్, శేఖర్తోపాటు ఐదేళ్ల పాప వైశాలిపై గురువారం కుక్క దాడి చేసింది. ఈ ఘటనలో అందరికీ గాయాలయ్యాయి. బాధితులను సుందరయ్యనగర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. డాక్టర్ సాహితి వారికి చికిత్స అందించారు. కోరుట్లలో తల్లీకూతురికి.. కోరుట్ల: పట్టణంలోని ఆదర్శనగర్కు చెందిన వెల్లుల్ల గౌతమి, ఆమె కూతురు ధాన్విలపై గురువారం రాత్రి కుక్క దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం స్థానికులు ఆ కుక్కను చంపేశారు. కారు బోల్తాజూలపల్లి(పెద్దపల్లి): పెద్దపల్లి మండలం లోకపేట కోళ్ల ఫాం వద్ద గురువారం ఓ కారు బోల్తాపడింది. అందులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడినట్లు తెలిసింది. లోకపేట నుంచి కాచాపూర్ వరకు డబుల్ రోడ్డుగా మార్చేందుకు పనులు జరుగుతున్నాయి. ఈక్రమంలో పెద్దపల్లి నుంచి వెంకట్రావుపల్లె వైపు వస్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులను సంప్రదించగా, ఎవరు ఫిర్యాదు చేయలేదని, సమాచారం కూడా లేదని జూలపల్లి ఎస్సై సనత్కుమార్ తెలిపారు. ఆర్ఐపై ఆర్డీవోకు ఫిర్యాదుమంథని: ముత్తారం ఆర్ఐ శ్రీధర్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఖమ్మంపల్లికి చెందిన తీర్థల కొమురెల్లి గురువారం ఆర్డీవోకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి వివరాల ప్రకారం.. ముత్తారం మండలం ఇప్పలపల్లి శివారులోని 9 గంటల వ్యవసాయ భూమిని పట్టా చేయిస్తానంటూ కొమురెల్లి వద్ద ఆర్ఐ శ్రీధర్ రూ.10 వేలు తీసుకున్నాడు. కానీ, పని చేయలేదు. అడిగితే డబ్బులు పాత తహసీల్దార్కు ఇచ్చానని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని బాధితుడు ఆరోపించాడు. ఆర్ఐపై చర్యలు తీసుకొని, భూమిని తన పేరిట పట్టా చేయాలని ఆర్డీవోను కోరినట్లు తెలిపాడు. -
తీర్పు రాకముందే సీఈసీ ప్రకటనా?
కరీంనగర్: సుప్రీంకోర్టు తీర్పు రాకముందే సీఈసీని ఎలా ప్రకటిస్తారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన న్యాయమూర్తి ఉండే కమిటీలో చర్చించకుండా సీఈసీగా జ్ఞానేశ్కుమార్ను ఏకపక్షంగా ప్రకటించారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలను ప్రధాని మోదీ మంటగలుపుతున్నారని, పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనను స్వాగతిస్తున్నామని, ఇదే తరహాలో దేశవ్యాప్తంగా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని, పార్టీలు మారిన వారిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలన్నారు. కమ్యూనిస్టుల గురించి కేసీఆర్ మాట్లాడటం అంటే సూర్యునిపై ఉమ్మేసినట్టేనన్నారు. మేడిగడ్డపై జ్యుడీషియల్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో రాజలింగ మూర్తి హత్య అనేక అనుమానాలు తావిస్తోందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం సీపీఐ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని సూచించారు. పార్టీ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, బామండ్లపెల్లి యుగంధర్, న్యాలపట్ల రాజు, బోనగిరి మహేందర్, నాయకులు పాల్గొన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి -
23 నుంచి ‘ఓదెల’ బ్రహ్మోత్సవాలు
ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థానంలో ఈ నెల 23న(ఆదివారం) స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అదేరోజు మహాగణపతి పూజ, గౌరీపూజ, సాయంత్రం ధ్వజారోహణం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ, 24న ఉదయం 10:30 గంటల నుంచి భ్రమరాంబ మల్లికార్జునస్వామి కల్యాణం, 25న నాకబలి, గ్రామోత్సవం, 26న మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు నిత్యోత్సవం, 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సామూహిక రుద్రాభిషేకం, రాత్రి 8 గంటలకు రథోత్సవం, 11:45 గంటల నుంచి లింగోద్భవ కాలంలో మహన్యాసపూర్వక, ఏకాదశ రుద్రాభిషేకం, మహాహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు జరగనున్నాయి. ఆలయ ప్రధాన ద్వారాలు రంగులతో ముస్తాబయ్యాయి. ఉత్సవాలకు ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రానున్నారు. నీడ కోసం పందిళ్లు, మంచినీరు, విద్యుత్ దీపాలు, కోనేరు నీరు, గదులు తదితర ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయానికి కరీంనగర్, గోదావరిఖని, హుజూరాబాద్ డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులతోపాటు సికింద్రాబాద్, కొత్తగూడెం, సిర్పూర్ కాగజ్నగర్ల నుంచి రైళ్ల సౌకర్యం ఉంది. ఏర్పాట్లు పూర్తయ్యాయి.. ఈ నెల 23 నుంచి 26 వరకు జరిగే ఓదెల మల్లన్న బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రాత్రిళ్లు జాగరణ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. – సదయ్య, ఈవో, ఓదెల దేవస్థానం -
నాంపల్లిలో వివాహిత ఆత్మహత్య
కోనరావుపేట(వేములవాడ): ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.. ఆమె భర్త నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ రెండు ఘటనలకు ఓ వ్యక్తి కారణమని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆమె మృతదేహంతో అతని ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. వారి వివరాల ప్రకారం.. కోనరావుపేట మండలం బావుసాయిపేట శివారులోని రామన్నపల్లెకు చెందిన బత్తుల మల్ల య్య గత నెల 19న రామన్నపల్లె శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దీంతో అతని భార్య రేణ(28) ముగ్గురు పిల్లలతో కలిసి, కొన్ని రోజులుగా వేములవాడ మండలంలోని నాంపల్లిలో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఆమె తీవ్ర మనోవేదనకు గురవుతోంది. గురువారం అద్దె ఇంట్లోనే ఉరేసుకుంది. అయితే, రేణ ఆత్మహత్య, ఆమె భర్త మృతికి రామన్నపల్లెకు చెందిన అంజయ్య కారణమని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. రేణ మృతదేహంతో అతని ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు అంజయ్య ఇంటి పైకప్పును ధ్వంసం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రామన్నపల్లెలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ఈ ఘటనపై ఎస్సై ప్రశాంత్రెడ్డిని వివరణ కోరగా.. రేణ ఆత్మహత్యపై బాధిత కుటుంబసభ్యుల నుంచి తమకు ఫిర్యాదు అందలేదని తెలిపారు. ¯ðlÌS {MìS™èl… Æøyýl$z {ç³Ð]l*-§ýl…-ÌZ ˘ ¿ýæÆý‡¢ Ð]l$–† రెండు ఘటనలకు ఓ వ్యక్తి కారణమని కుటుంబసభ్యుల ఆరోపణ మృతదేహంతో అతని ఇంటి ఎదుట ఆందోళన -
పెళ్లి పనులు చేసొస్తూ.. వాగులో పడి
రామగిరి(మంథని): చిన్నమ్మ కుమారుడి పెళ్లి పనులు చేసి, ఇంటికి వస్తున్నాడు.. బైక్ అదుపుతప్పి, వాగులో పడి, సింగరేణి కార్మికుడు మృతిచెందాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రామగిరి మండలం లద్నాపూర్కు చెందిన ఊరగొండ రాజ్కుమార్(39) అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో అసిస్టెంట్ ఫోర్మెన్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఉద్యోగరీత్యా సెంటినరీకాలనీలోని జోన్–1 ఎస్టీటూ 559 క్వార్టర్లో ఉంటున్నాడు. గురువారం రాంపెల్లికి చెందిన తన చిన్నమ్మ కుమారుడి పెళ్లి మంథని మండలం ఎక్లాస్పూర్లో జరగనుండటంతో బుధవారం రాత్రి వరకు రాంపెల్లిలో వివాహ పనులు చేశాడు. గురువారం ఉదయం ఇంటికి వెళ్లి, అక్కడి నుంచి పెళ్లికి హాజరవుదామని బైక్పై బయలుదేరాడు. పెద్దపల్లి–మంథని ప్రధాన రహదారిలోని కల్వచర్ల బొక్కల వాగు వద్ద వాహనం అదుపుతప్పి, వంతెన పైనుంచి వాగులో పడింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య లత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సంఘటన స్థలాన్ని మంథని సీఐ రాజుగౌడ్, ఎస్సై దివ్య పరిశీలించారు. రాజ్కుమార్ మృతదేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం పొందిన ఒక్కగానొక్క కుమారుడు తమను పోషిస్తాడనుకుంటే చనిపోయాడంటూ మృతుడి తల్లిదండ్రులు గట్టమ్మ–శంకర్ కన్నీరుమున్నీరుగా విలపించారు. సింగరేణి కార్మికుడి దుర్మరణం కల్వచర్ల బొక్కలవాగు వద్ద బైక్ అదుపుతప్పి, ఘటన -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయండి
● నిరుద్యోగులు, ఉద్యోగులకు కాంగ్రెస్తోనే మేలు ● ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుకరీంనగర్ కార్పొరేషన్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నగరంలోని డీసీసీ కార్యాలయంలో గురువారం కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ ఉమ్మడి నాలుగు జిల్లా ల కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర నాయకత్వ అభిప్రాయాల మేరకు అధిష్టానం నరేందర్రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిందన్నారు. అధిష్టాన నిర్ణయానికి అనుగుణంగా సమష్టిగా పనిచేయాలన్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు కావాలంటే కాంగ్రెస్ పటిష్టంగా ఉండాలని, అందుకు ఎమ్మెల్సీ గెలవాలన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. 13ఏళ్ల తరువాత గ్రూప్–1 పరీక్ష నిర్వహించామని, 317 జీఓ బాధితులకు ఉపశమనం కల్పించామన్నారు. ఏడాదిలోనే 56 వేల ఉద్యోగులు ఇచ్చామన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి వూట్కూరి నరేందర్రెడ్డి మాట్లాడుతూ తనపై దుష్ప్రచారం చేసేందుకు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. తాను శ్రీధర్బాబుకు రుణపడి ఉంటానని తెలిపారు. వెలిచాల రాజేందర్రావు రూపొందించిన గ్రాడ్యుయేట్ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు సత్తు మల్లేశం, పార్టీ అసెంబ్లీ ని యోజకవర్గ ఇన్చార్జీలు పురుమల్ల శ్రీనివాస్, వొడితెల ప్రణవ్, ఎమ్మెల్సీ కో–ఆర్డినేటర్ జంగ రాఘవరెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ పాల్గొన్నారు. సమన్వయలోపం.. గందరగోళం హడావుడిగా ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం సందర్భంగా పార్టీలో గందరగోళం నెలకొంది. రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయంతో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ఉందని, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్లు హాజరవుతారని ఉదయం సమాచారం పంపించా రు. ఆ తరువాత 4 గంటలకని ఒకసారి, మరోసారి 6గంటలకని, 6.30 గంటలకని పార్టీ వాట్సప్ గ్రూప్లో సమాచారం ఇచ్చారు. ఇంకోసారి మంత్రులు ఉత్తమ్, పొన్నం పర్యటన రద్దయిందన్న సమాచారంతో, సమావేశం ఉందా లేదా అనే సందిగ్దత పార్టీ శ్రేణుల్లో నెలకొంది. చివరకు శ్రీధర్బాబు వస్తున్నారని, సమావేశం కొనసాగుతుందని మరోసారి సందేశం పంపడంతో పార్టీ శ్రేణులు కార్యాలయానికి చేరుకొన్నారు. కరీంనగర్లో కొరవడిన సమన్వయలోపానికి ఈ గందరగోళం నిదర్శనమని పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు.రాజలింగం హత్య నిందితులను వదిలంరాష్ట్రంలో బీజేపీ కోసమే బీఆర్ఎస్ పనిచేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పెట్టకుండా సహకరిస్తోందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్తో ఎలా కలుస్తామని ప్రశ్నించారు. భూపాలపల్లిలో జరిగిన రాజలింగం హత్యను ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరున్నా వదిలిపెట్టేది లేదన్నారు. వామన్రావు హత్య అంశం సుప్రీంకోర్టులో ఉందన్నారు. -
ఒత్తిడి జయిస్తే.. విజయమే
● పదోతరగతి, ఇంటర్ విద్యార్థులు ప్రణాళికతో చదవాలి ● యోగా, ధ్యానం చేయాలి ● సమతుల ఆహారం తీసుకోవాలి ● సెల్ఫోన్కు దూరంగా ఉండాలంటున్న నిపుణులు ● మార్చి 5 నుంచి ఇంటర్, 21 నుంచి పదోతరగతి పరీక్షలుసప్తగిరికాలనీ(కరీంనగర్): పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు.. శోధించాలన్న తపనతో సాధన చేస్తే ఎంతటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చు. ఇటీవలి కాలంలో దీన్ని పలువురు రుజువు చేస్తూ పలు వార్షిక, పోటీ పరీక్షల్లో రాణిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. విద్యార్థులకు పరీక్షల కాలం వచ్చేసింది. మార్చి 5 నుంచి ఇంటర్, 21 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురవుతుంటారు. కానీ, పరీక్షలంటే భయం వీడాలని, ఒత్తిడి జయిస్తే విజయం సొంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల కోసం ప్రత్యేక కథనం. విద్యార్థులు, తల్లిదండ్రులు ఇవి పాటించాలి.. ● పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులు మొబైల్, ఇంటర్నెట్, సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి. ● జంక్ ఫుడ్, బయటి ఆహార పదార్థాలు తీసుకోవద్దు. ● పండ్ల రసాలు, స్వీట్, నెయ్యి, వాటర్ మిలాన్, డ్రై ప్రూట్స్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు తాగాలి. ● ప్రతీరోజు యోగా, ధ్యానం చేయాలి. దీనివల్ల చదువుపై ఏకాగ్రత వస్తుంది. పద్మాసనం, శశాంకాసనం, గోముకాసనం, శవాసనం వేస్తే మంచిది. ● రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్ర పోవాలి. 15 నుంచి 20 నిమిషాల శారీరక వ్యాయామం చేయాలి. ● విద్యార్థులు మంచి ఆహారం, విశ్రాంతి తీసుకునేలా తల్లిదండ్రులు చూడాలి. ఇతర విద్యార్థులతో పోల్చవద్దు. ● ఎక్కువ సమయం చదవాలని ఒత్తిడి చేయొద్దు. పిల్లలతో స్నేహంగా ఉండాలి. ● టీచర్లను సంప్రదిస్తూ సలహాలు తీసుకోవాలి. హెల్ప్లైన్ నంబర్లో సంప్రదించాలి పరీక్షల సమయంలో మానసిక రుగ్మతలకు గురయ్యే విద్యార్థుల కోసం తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్ప్లైన్ ఏర్పాటు చేశారు. ప్రతీరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉచిత కన్సల్టేషన్, కౌన్సెలింగ్ కోసం 94404 88571 లేదా 040–35717915 నంబర్లో సంప్రదించాలి. ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు జిల్లా పదోతరగతి ఇంటర్ ఫస్టియర్ సెకండియర్ కరీంనగర్ 12,516 17,799 17,763 జగిత్యాల 12,059 7,067 7,370 రాజన్న సిరిసిల్ల 6,768 5,065 4,245 పెద్దపల్లి 6,393 5,844 5,141టెన్షన్ పడొద్దు విద్యార్థులు టెన్షన్ పడకుండా పరీక్షలకు హాజరుకావాలి. మా పిల్లలకు ఇంటర్ విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాం. పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలో వివరించాం. – ఎ.నిర్మల, ప్రిన్సిపాల్, ప్రభుత్వ బాలికల కళాశాల, కరీంనగర్ క్లిష్టమైన టాపిక్స్పై ఫోకస్ నేను ఉదయం 3:30 గంటలకే నిద్ర లేచి, చదువుకునేదాన్ని. క్లిష్టమైన టాపిక్స్పై ఫోకస్ పె ట్టాను. అర్థం కాని పాఠ్యాంశాలను టీచర్లను అడిగి, మళ్లీ చె ప్పించుకున్న. మా అమ్మానాన్న, ఉపాధ్యాయులు సహకారం అందించారు. నేను పడిన కష్టానికి 10 జీపీఏ వచ్చింది. – దుర్శెట్టి నందిని, 2023–24 ఎస్సెస్సీ 10 జీపీఏ, కరీంనగర్ -
ఏసీబీకి చిక్కిన ల్యాండ్ సర్వేయర్
మంథని: భూ సర్వే కోసం డబ్బులు డిమాండ్ చేసిన ల్యాండ్ సర్వేయర్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా గురువారం పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాలు.. మంథని మండల రెవెన్యూ కార్యాలయంలో సర్వేయర్గా పని చేస్తున్న జాటోతు గణేశ్శ్ రెవెన్యూ గ్రామ శివారులోని రెడ్డి చెరువు వద్ద 814 /డి /1, 815/సి సర్వే నంబర్లలో ఎకరం భూ మిని కొలిచి రిపోర్టు ఇచ్చేందుకు మంథనికి చెందిన రైతు సువర్ణ క్రాంతినాగ్ను రూ.17 వేలు డిమాండ్ చేశారు. ఈ నెల 5న రూ.9 వేలు తీసుకున్నాడు. మిగిలిన డబ్బు డిమాండ్ చే యడంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించా డు. మరో రూ.3వేలు రెండో వాయిదాగా గురువారం ఇస్తానని ఫోన్ చేయగా, సర్వేయర్ ఆఫీసుకు కాకుండా బస్టాండ్కు రావాలని బాధితుడికి చెప్పా డు. దీంతో బాధితు డు రూ.3 వేలు బస్టా ండ్లో సర్వేయర్ గణేశ్కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ప ట్టుకున్నారు. అనంత రం రెవెన్యూ కార్యాలయంలో విచారణ జరిపి, వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు. ఏసీబీ సీఐలు తిరుపతి, కృష్ణకుమార్, హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్, కానిస్టేబుల్ శ్రీకాంత్, హోంగార్డులు అశోక్, సంతోష్ ఉన్నారు. భూ సర్వేకు రూ.20 వేలు డిమాండ్ రూ.3 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు -
యూరియా కోసం తిప్పలు
కరీంనగర్రూరల్: కరీంనగర్, దుర్శేడ్ ప్రాథమిక సహకార సంఘాల్లో యూరియా లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గురువారం దుర్శేడ్ సహకార సంఘానికి 20 టన్నుల యూరియా స్టాక్ రావడంతో రైతులు పెద్దసంఖ్యలో బారులు తీరారు. ఒక్కోరైతుకు 3 నుంచి 5 బస్తాల వరకు విక్రయించడంతో రెండుగంటల్లోనే స్టాక్ ఖాళీ అయ్యింది. ఆలస్యంగా వచ్చిన రైతులకు యూరియా లభించకపోవడంతో నిరాశగా వెళ్లిపోయారు. కరీంనగర్, దుర్శేడ్ సొసైటీల ఎరువుల స్టాక్ను పరిశీ లించిన ఏవో సత్యం ఇండెంట్ను మార్క్ఫెడ్ అధికారులకు పంపించారు. యాసంగికి 1,170 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటివరకు 560టన్నులు వచ్చినట్లు ఏవో తెలిపారు. దుర్శేడ్ సొసైటీకి 40టన్నులు, చెర్లభూత్కూర్కు 20, బొమ్మకల్కు 10, తీగలగుట్టపల్లికు 10, నగునూరుకు 10 టన్నుల చొప్పున శుక్రవారం స్టాక్ వస్తుందన్నారు. ఏఆర్ పోలీసులకు ముగిసిన శిక్షణ కరీంనగర్క్రైం: ఏటా ఆర్మ్డ్ రిజర్వు పోలీసులకు శిక్షణలో భాగంగా నిర్వహించే వార్షిక మొబిలైజేషన్ కార్యక్రమం గురువారం ముగి సింది. కరీంనగర్ పోలీసు కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్లో సాయుధ బలగాలు పరేడ్ నిర్వహించారు. అడిషనల్ డీసీపీ ఏ.లక్ష్మినారాయణ మాట్లాడుతూ.. శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు అదుపుచేసేందుకు ఆర్మ్డ్ రిజర్వు పోలీసుల సేవలు వినియోగించుకుంటాని తెలి పారు. సాయుధ బలగాలలకు ఆర్మ్డ్రిల్, వెపన్డ్రిల్, పరేడ్, మాబ్ ఆపరేషన్, ఫైరింగ్ అంశాల్లో 20రోజుల పాటు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. రిజర్వు ఇన్స్పెక్టర్లు రజనీకాంత్, జానీమియా, శ్రీధర్రెడ్డి, సురేశ్ పాల్గొన్నారు. వైద్య శిబిరాల సందర్శన కరీంనగర్టౌన్: ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా పట్టణ ఆరోగ్య కేంద్రాలైన సప్తగిరికాలనీ, కాశ్మీర్గడ్డ, కట్టరాంపూర్లోని చైతన్యక్లబ్లో మహిళల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.వెంకటరమణ గురువారం సందర్శించారు. శిబిరానికి హాజరైన మహిళలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ‘సునీల్రావు ఊసరవెల్లి’ కరీంనగర్ కార్పొరేషన్: ఊసరవెల్లి కన్నా వేగంగా రంగులు మార్చే మాజీ మేయర్ సునీల్రావు ఓ రాజకీయ వ్యభిచారి అని సుడా చైర్మ న్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం నగరంలోని సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో మాట్లాడు తూ.. మొన్నటి వరకు బండి సంజయ్ని విమర్శించి, కండువా రంగు మార్చగానే స్మార్ట్సిటీ ప్రదాత సంజయ్ అంటూ పొగడడం సిగ్గుచేటన్నారు. మర్రి చెట్టు లాంటి సంజయ్ నీడన ఊసరవెల్లి సునీల్రావు ఎదగలేడని ఎద్దేవా చేశారు. సంజయ్పై విమర్శలు చేస్తే కౌంటర్ ఇవ్వడానికి ఆ పార్టీ నాయకులు ఒక్కరు కూడా ముందుకు రాలేదని, నిత్యం కండువాలు మార్చే సునీల్రావు మాట్లాడం ఆ పార్టీ పరిస్థితికి నిదర్శనమన్నారు.నాయకులు ఎండీ.తాజ్, మంద నగేశ్ ముదిరాజ్, ఖమర్మ, హమ్మద్ ఆమెర్, జూపాక సుదర్శన్ పాల్గొన్నారు. 22న సంచార పుస్తక ప్రదర్శన కరీంనగర్సిటీ: జిల్లాకేంద్రంలోని ఎస్సారార్ కళాశాలలో శనివారం ఉదయం 10గంటలకు సంచార పుస్తక ప్రదర్శన ఉంటుందని తెలుగుశాఖ అధ్యక్షుడు బూర్ల చంద్రశేఖర్ తెలిపారు. సంచార పుస్తక పరిక్రమలో భాగంగా ఈనెల 21 నుంచి 23వ తేదీల్లో జిల్లాలోని వివిధ పాఠశాలలు, కూడళ్లలో ప్రదర్శన వాహనం ఉంటుందని పేర్కొన్నారు. -
భయాన్ని తొలగించాలి
పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమేనని తల్లిదండ్రులు గుర్తించాలి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూడాలి. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి. – ఎంఏ.కరీం, సైకాలజిస్టు, కరీంనగర్ మంచి ఆహారం తీసుకోవాలి పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఆహారం, త్వరగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవాలి. బయటి ఫుడ్కు దూరంగా ఉండాలి. డ్రైఫ్రూట్స్, జ్యూస్, పండ్లు ఎక్కువగా తినాలి. పడుకునే ముందు పాలు తాగాలి. – శ్వేత, డైటీషియన్, కరీంనగర్ టీవీ, ఫోన్ చూడొద్దు పరీక్షల సమయంలో విద్యార్థులు టీవీ, ఫోన్ చూడొద్దు. అవి ఎంటర్టైన్మెంట్ కన్నా ఒత్తిడినే ఎక్కువ కలిగిస్తాయి. బ్రీథింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. – డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
ఒత్తిడి జయిస్తే.. విజయమే
● పదోతరగతి, ఇంటర్ విద్యార్థులు ప్రణాళికతో చదవాలి ● సెల్ఫోన్కు దూరంగా ఉండాలంటున్న నిపుణులు ● మార్చి 5 నుంచి ఇంటర్, 21 నుంచి పదోతరగతి పరీక్షలుమార్చి.. విద్యార్థులకు పరీక్షా కాలం.. చదివిన చదువులకు ఫలితం కోసం శ్రమించే సమయం. మార్చిలో విద్యార్థులకు కీలకమైన ఇంటర్, పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. మార్చి 5 నుంచి ఇంటర్, 21 నుంచి పదోతరగతి పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు పరీక్షలంటే భయపడొద్దని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెబుతున్నారు. శోధించాలన్న తపనతో సాధన చేస్తే ఎంతటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని అంటున్నారు. ఇటీవలి కాలంలో దీన్ని పలువురు రుజువు చేస్తూ పలు వార్షిక, పోటీ పరీక్షల్లో రాణిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారని పేర్కొంటున్నారు. పరీక్షలంటే భయం వీడాలని, సెల్ఫోన్కు దూరంగా ఉండి.. ఒత్తిడి జయిస్తే విజయం సొంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు. – సప్తగిరికాలనీ(కరీంనగర్) – వివరాలు 8లోu -
వేసవిలో అంతరాయం లేని విద్యుత్ అందిస్తాం
హుజూరాబాద్: వేసవిలో అంతరాయం లేని విద్యుత్ అందించేందుకు చర్యలు చేపడుతున్నామని టీజీఎన్పీడీసీఎల్ ప్రాజెక్ట్ ఇన్చార్జి డైరెక్టర్ సదర్లాల్ పేర్కొన్నారు. హుజూరా బాద్లో నిర్మిస్తున్న సబ్స్టేషన్ పనులను గు రువారం పరిశీలించారు. డివిజన్పరిధిలో వచ్చే మూడునెలల్లో విద్యుత్ డిమాండ్ గణనీ యంగా పెరిగే అవకాశం ఉందన్నారు. లోడ్ పెరిగే ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి కొత్తగా 45 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. 36 ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచామన్నారు. 33/11 కేవీ సబ్స్టేషన్ ఎల్బాకలో కొత్తగా పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశామన్నారు. హుజూరాబాద్, అమ్మనగుర్తి, కోరపల్లిలో నూతన 33/11 కేవీ సబ్స్టేషన్ల పనులు జరుగుతున్నాయని అన్నారు. ప్రత్యామ్నాయ లైను ద్వారా విద్యుత్ సరఫరా చేసేందుకు కొత్తగా 5ఎన్ఎస్ ఇంటర్ లింకింగ్ లైన్ పనులు చేపట్టామని తెలిపారు. కరీంనగర్ ఎస్ఈ మేక రమేశ్బాబు, డీఈ లక్ష్మారెడ్డి, డీఈ కన్క్షన్ చంద్రమౌళి పాల్గొన్నారు. -
ఇస్తారా..? దాస్తారా?
● ఆస్తుల వివరాల సమర్పణకు సర్కారు ఆదేశాలు ● ప్రభుత్వ ఉద్యోగుల్లో అంతర్మఽథనం ● సరైన వివరాలు ఇచ్చేనా అని అనుమానం ● జిల్లాలో 13,423 మంది ఉద్యోగులుకరీంనగర్ అర్బన్: ఆస్తుల వివరాల సమర్పణ ఆదేశాలు ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆందోళన రేపుతున్నాయి. ఏటా రూ.లక్ష ఆదాయం దాటినవారు ఆస్తుల వివరాలు వెల్లడించాలని ప్రభుత్వం స్పష్టం చేయగా.. వీలైనంత త్వరగా ఇవ్వాలని నిర్దేశించింది. పలువురు అక్రమార్కుల్లో సదరు ఆదేశాలు గుబులు రేపుతున్నాయి. ఉన్నది ఉన్నట్లు ఇవ్వడమా.. ఉన్నది లేనట్లు ఇవ్వడమా అని అంతర్గత చర్చ సాగుతుండగా పలువురు చార్టర్డ్ అకౌంటెంట్లను ఆశ్రయిస్తున్నారు. గతంలోని ఆదేశాలను మెజార్టీ ఉద్యోగులు బేఖాతరు చేశారు. కచ్చితంగా ఇవ్వాల్సిందేనని తాజాగా ఆదేశాలు రావడంతో తప్పదని స్పష్టమవుతోంది. వివరాలిస్తారా.. దాస్తారా? ప్రభుత్వ ఉద్యోగంలో చేరినవారు నిబంధనలు పాటించాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగి కార్యాలయంలో ఉన్నప్పుడు రూ.500, బయట ఉన్నప్పుడు రూ.10వేలకు మించి నగదు దగ్గర ఉంచుకోవద్దు. నిర్ణీత మొత్తానికి మించి ఉంటే అందుకు సంబంధించిన వివరాలు డిపార్ట్మెంట్ హెడ్కు ముందస్తుగానే సమాచారమివ్వాలి. సీసీఏ నిబంధనల్లోని రూల్ నంబరు 9 ప్రకారం ప్రతీ ఉద్యోగి ఏడాదిలో సంపాదించిన రూ.లక్షకు మించి విలువైన చర, స్థిరాస్తి వివరాలను ప్రభుత్వానికి నివేదించాలి. హెచ్చు ఉద్యోగులు సదరు నిబంధనను తుంగలో తొక్కుతున్నారు. తమ సంపాదన వివరాలను ప్రభుత్వానికి ఇచ్చేందుకు విముఖత చూపుతున్నారు. ప్రభుత్వం ఈ సారి కచ్చితంగా ఉద్యోగులు తమ ఆస్తి వివరాలను సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిబంధనలివే ప్రభుత్వ ఉద్యోగులు 24 గంటలు విధుల్లోనే ఉన్నట్లుగా భావించాలని సీసీఏ నిబంధనలు వెల్లడిస్తున్నాయి. తరచూ స్థిరాస్తులు కొనడం, అమ్మడం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసినా 60 రోజుల ముందుగానే సంబంధిత అధికారి నుంచి అనుమతి పొందాలి. ఏటా నిర్ణీత క్రమపద్ధతిలో వార్షిక ఆస్తుల నివేదిక (ఆన్యూవల్ ప్రాపర్టీస్ రిటర్న్స్)ను సమర్పించాలి. జరుగుతున్నది ఇదీ ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం ఇవ్వనిదే పనికాదన్న విషయం చెప్పడానికి అవినీతి నిరోధకశాఖ దాడులే నిదర్శనం. గతంలో ఏకంగా జిల్లా వైద్యాధికారే లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. మరో ఘటనలో జిల్లా అటవీ అధికారి సొంతశాఖ అధికారుల వద్ద లంచం తీసుకుంటూ సిరిసిల్లలో చిక్కారు. ఉపాధ్యాయులు, అధికారులు స్థిరాస్తి దందాను అదనపు ఆదాయమార్గంగా ఎంచుకుని అక్రమార్జనే పెట్టుబడిగా రూ.కోట్లు గడిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎక్కువశాఖల్లో అక్రమ వసూళ్లే ● నర్సరీల నిర్వహణలో మామూళ్లు బెడదే. ఏటా వన నర్సరీలు ఏర్పాటు చేస్తుండగా పర్యవేక్షించే అధికారులు ఠంచన్గా మామూళ్లు ఇవ్వాల్సిందేనని గత ఘటనలు చాటాయి. ● పలువురు సీఐలు, ఎస్స్సైలు అక్రమాలకు సహకరిస్తూ అమ్యామ్యాలు దండుకుంటున్నారు. గతంలో పలువురు సస్పెండ్ కాగా పలువురికి స్థానచలనం తప్పలేదు. ● పంచాయతీల్లో నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేలా ఎంపీవోలు తనిఖీ చేస్తూంటారు. ఇదే అదనుగా కొంతమంది పంచాయతీకి రూ.5వేలు ధర నిర్ణయించి తనిఖీలకు వెళ్లినప్పుడు వసూలు చేస్తున్నారు. ● పలు రెవెన్యూ కార్యాలయాల్లో కుల, ఆదాయ, ఇతర పత్రాలకు రూ.500 నుంచి రూ.1000 వసూలు చేస్తున్నారు. ధరణి సేవలు మొదలయ్యాక ప్రస్తుతానికి భూ క్రయవిక్రయాలకు రెవెన్యూ వర్గాలు డబ్బులు వసూలు చేయకపోయినా.. అక్కడక్కడ సతాయింపులు తప్పడం లేదని బాధితులు వాపోతున్నారు. ● ప్రభుత్వ నిధుల బిల్లులు మంజూరు చేయడానికి ట్రెజరీ కార్యాలయాల్లో ఎంతో కొంత డబ్బు ముట్టజెప్పనిదే బిల్లులకు మోక్షం లభించడంలేదనేది బహిరంగ రహస్యమే. ● ఇంజినీరింగ్ విభాగంలో ఏ బిల్లు మంజూరు కావాలన్నా ఎంబీ తయారు చేసే ఏఈ మొదలుకుని పంచాయతీరాజ్, మున్సిపల్, ముఖ్య ప్రణాళిక, ట్రెజరీ, క్వాలిటీ కంట్రోల్ విభాగం ఒకటేమిటి బిల్లుతో సంబంధం ఉన్న అధికారికి, సిబ్బందికి మొత్తం కలిపి 15–20 శాతం లంచం సమర్పించాల్సిందేనని కాంట్రాక్టర్లు ఆరోపణలు చేస్తున్నారు.జిల్లా మొత్తం ఉద్యోగులు: 13,423 ఆర్థిక నివేదికలు సమర్పించాల్సిన ఉద్యోగులు: 8,570 నివేదికలు సమర్పించాల్సిన అవసరం లేని ఉద్యోగులు: 2,304 (నాలుగో తరగతి సిబ్బందికి మినహాయింపు) -
ప్రచారంలో కొత్త పుంతలు
● అభ్యర్థుల చేతికి ఓటర్ల ఫోన్ నంబర్లు ● ఓటు వేయాలని అభ్యర్థనలు.. ఎవరికి వేస్తారనీ సర్వేలు ● ఆన్లైన్లో వ్యక్తిత్వ హననానికి దిగుతున్న పార్టీలు ● సోషల్ మీడియాలో పరస్పర ఆరోపణలకు దిగుతున్న అభ్యర్థులు ● కులాలు, వర్గాల వారీగా ఓటర్లకు విందులు, సమావేశాలుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబా ద్ గ్రాడ్యుయేట్, టీచర్స్ నియోజకవర్గాల ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు ఓటర్లను ఆకర్షించేందుకు.. అభ్యర్థులు గెలిస్తే తామేం చేస్తామో వివరిస్తూ ముందుకు సాగేవారు. తనను గెలిపించాలని సభలు, సమావేశాలు పెట్టి విజ్ఞప్తి చేసేవారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు గతానికి భిన్నంగా జరుగుతున్నాయి. గతంలో ఇద్దరు వ్యక్తులు లేదా రెండు పార్టీల మధ్య పోటీ కనిపించేది. ఈసారి గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎన్నికల్లో అన్ని ముఖ్య పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు రంగంలోకి దిగారు.ఫలితంగా వారి ప్రచారం.. తోటి అభ్యర్థులను అవమానించేలా సాగుతోంది. ఆరోపణలు చేసుకుంటూ.. ఓటర్లను కులాల వారీగా, వర్గాలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రలోభాలకు దిగుతుండటం, ఓటర్లను ఇబ్బంది పెట్టే ధోరణిలో ఫోన్కాల్స్ చేస్తుండటం కలవర పెడుతోంది. సోషల్ మీడియాలో ఆరోపణలు గెలవాలంటూ తామేం చేస్తామో చెప్పుకునే ధోరణి కంటే.. ఎదుటి వారి లోపాలు, వారు గతంలో చేసిన తప్పులను ఎత్తి చూపడమే కొందరు ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. ముఖ్యంగా రెండు జాతీయ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు అభ్యర్థులు పార్టీ సిద్ధాంతాలను పక్కనబెట్టి వారి సోషల్మీడియా ద్వారా పరస్పరం దూషించుకుంటున్నారు. వృత్తిపరంగా వ్యవహరించిన విధానాన్ని ఇప్పుడు గుర్తు చేసి వీళ్లేం సేవ చేస్తారు..? అని వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు. ఫొటోలను డీటీపీ చేసి వారిని అవమానిస్తున్నారు. అలా నాయకులను కించపరిచేలా మార్చిన ఫొటోలను ఆయా పార్టీ, ఇతర వాట్సాప్ గ్రూపులు, సోషల్మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆయా ఫొటోల కింద ఘాటైన పదజాలంతో దుర్భషలాడుతూ కామెంట్లు పెడుతూ చెలరేగిపోతున్నారు. సూటిగా చెప్పాలంటూ ఎన్నికల ప్రచారం కంటే కూడా వ్యక్తిత్వ హననానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మరో నాయకుడు అసలు ఎన్నికలు జరుగుతున్న తీరే సరిగా లేదని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని ప్రతిన బూనిన సంగతి తెలిసిందే. ఉదయం నుంచి సర్వేలు, కాల్స్ గ్రాడ్యుయేట్స్, టీచర్స్ నియోజకవర్గాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల చేతికి ఓటర్ల ఫోన్ నంబర్ల జాబితా చిక్కింది. ఫలితంగా ఓటర్లకు ప్రైవసీ లేకుండా చేస్తున్నారు. ఓటరు జాబితాలో పేరున్న ప్రతీ ఓటరుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు వరుసగా ఫోన్లు చేస్తున్నారు. దీనికితోడు ఏ పార్టీకి ఎందుకు ఓటేస్తున్నారు..? అంటూ రోజుకు నాలుగైదు సార్లు వివిధ పార్టీలు ఐవీఆర్ ద్వారా ఫోన్లో నిర్వహిస్తున్న సర్వేలు చికాకు తెప్పిస్తున్నాయి. ఓటర్లంతా గ్రాడ్యుయేట్లే కావడంతో మీరు చెప్పిన అభ్యర్థికి ఎందుకు ఓటేయాలి..? అని చాలామంది ప్రశ్నిస్తుండటం గమనార్హం.విందులు, సమావేశాలు ఎమ్మెల్సీ ఎన్నికల పుణ్యమాని.. కుల సంఘాల నాయకులకు ఎక్కడాలేని గిరాకీ పెరగింది. పార్టీల అభ్యర్థులందరూ వీరిని మచ్చిక చేసుకుని మరీ సమావేశాలు పెడుతున్నారు. అవససరమైతే మందుపార్టీలు కూడా నడిపిస్తున్నారు. దీంతో కులసంఘాల నేతలు అభ్యర్థులందరినీ సంతృప్తి పరిచేలా వారితో తమ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లతో సమావేశాలు ఏర్పాటు చేయిస్తున్నారు. ఇక గ్రాడ్యుయేట్స్, టీచర్స్, ప్రైవేటు లెక్చరర్లను కూడా విందులతో తమ వశం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. -
120 కిలోల గంజాయి పట్టివేత
గోదావరిఖని(రామగుండం): రామగుండం కమిషనరేట్ పోలీసులు 120 కిలోల గంజాయిని పట్టుకున్నారు. గోదావరిఖని టూటౌన్ పోలీసులు జీడీకే–11 గని క్రాస్ వద్ద 96.770 కిలోలు, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ రోడ్డులోని స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా షాపింగ్ కాంప్లెక్స్ సెల్లార్లో 23.50 కిలోల గంజాయిని పట్టుకున్నారని సీపీ ఎం శ్రీనివాస్ తెలిపారు. మొత్తం 15 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం వివరాలు వెల్లడించారు. గోదావరిఖని టూటౌన్ పరిధిలో.. గోదావరిఖని టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని జీడీకే–11 గని క్రాస్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో 2 కార్లలో తరలిస్తున్న 96.770 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రాకు చెందిన ఉదయ్వీర్, రాజస్థాన్లోని దోల్పూర్కు చెందిన రాజ్లోథి, ఒడిశాలోని కోరుపుత్కు చెందిన కేశవ్ఖోరా, సోమంత ఖోరాలను అరెస్ట్ చేశారు. కారు యజమాని సూరజ్, గంజాయి సరఫరాదారు చత్తీస్గఢ్లోని జగదల్పూర్కు చెందిన అర్జున్భోరిలు పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు. గంజాయితోపాటు కార్లు, 6 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. జగదల్పూర్ నుంచి మంథని మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు పట్టుకున్నట్లు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో.. మంచిర్యాలలో సీసీ కెమెరాల వ్యాపారం ముసుగులో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు సీపీ శ్రీనివాస్ తెలిపారు. 23.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఆయ న వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ రోడ్లో స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంప్లెక్స్ సెల్లార్లో సోమ ప్రవీణ్కుమార్ వైఇన్ఫోం సొల్యూషన్స్ పేరిట సీసీ కెమెరాల గోడౌన్ నిర్వహిస్తున్నాడు. కానీ, అందులోనే గంజాయి నిల్వ ఉంచారు. పక్కా సమాచారం రావడంతో మంచిర్యాల పోలీసులు గోడౌన్ వద్దకు వెళ్లి, అనుమానస్పదంగా కనిపించిన కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని, విచారించగా గంజాయి నిల్వలు బయట పడ్డాయి. మంచిర్యాల జిల్లా రాజీవ్నగర్కు చెందిన ఇరుగురాళ్ల సతీశ్కుమార్, సప్తగిరికాలనీకి చెందిన మహమ్మద్ సమీర్, ఓ బాలుడు, అశోక్రోడ్కు చెందిన భీమ అనుదీప్, తిలక్నగర్కు చెందిన మహమ్మద్ అబ్దుల్ఉబేద్, రాజీవ్నగర్కు చెందిన జాగి రాఘవేంద్రస్వామి, నస్పూర్కు చెందిన గూడూరు రాము, ఎస్కే.అథార్హుర్, ఎస్కే.సమీర్, కరీంనగర్ హౌసింగ్బోర్డు కాలనీకి చెందిన అర్జున బాబు రావుచౌహాన్, కార్ఖానాగడ్డకు చెందిన మమమ్మద్ అజీజ్లను అరెస్ట్ చేయగా, మరో 11 మంది పరా రీలో ఉన్నట్లు సీపీ పేర్కొన్నారు. గంజాయితోపాటు 11 ఫోన్లు, 5 బైక్లు, ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సతీశ్కుమార్ డ్రైవర్గా పనిచేస్తూ సీసీ కెమెరాల వ్యాపారం చేసే ప్రవీణ్కుమార్తో కలిసి గంజాయి వ్యాపారానికి దిగినట్లు వెల్లడించారు. సీలేరు వద్ద తక్కువ ధరకు ఎండు గంజాయి తెచ్చారని పేర్కొన్నారు. గంజాయి ముఠాలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన స్పెషల్ బ్రాంచి, టాస్క్ఫోర్స్, గోదావరిఖని టూటౌన్, మంచిర్యాల పోలీసులను ఆయన అభినందించారు. పెద్దపల్లి డీసీపీ చేతన, అడ్మిన్ డీసీపీ రాజు, స్పెషల్ బ్రాంచి ఏసీపీ రాఘవేంద్ర, మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, టాస్క్ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, సీఐలు రాజ్కుమార్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. 15 మంది అరెస్టు గంజాయితోపాటు 2 కార్లు, 5 బైక్లు, 17 ఫోన్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన రామగుండం సీపీ శ్రీనివాస్ -
స్ట్రాంగ్రూం, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పరిశీలన
కరీంనగర్ అర్బన్: మెదక్– నిజామాబాద్– కరీంనగర్– ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అంబేద్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూం, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను కలెక్టర్ పమేలా సత్పతి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులకు పలు సూచనలు చేశారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల బ్యాలెట్ బాక్సులను వేరువేరుగా ఏర్పాటు, విభజన స్పష్టంగా ఉండాలని అన్నారు. పోలీస్ బందోబస్తు, బారీకేడ్ల ఏర్పాటు, పోలింగ్ స్టేషన్లు, స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ ఏర్పాట్లపై పోలీసు, రెవెన్యూ అధికారులతో చర్చించారు. స్ట్రాంగ్రూం పరిసరాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్ని వైపులా సీసీ కెమెరాలు అమర్చాలని అన్నారు. ఫైరింజన్ 24గంటలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలకు పంపే ప్రతీ బ్యాలెట్బాక్స్ను క్షుణ్ణంగా తనిఖీ చేసి లాక్ సిస్టం సరిచూసుకోవాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్డీవో మహేశ్వర్ పాల్గొన్నారు. -
టీచర్స్ టఫ్ఫైట్!
● ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి మరో వారం రోజులే గడువు ● కుల, సామాజికవర్గాలుగా విడిపోతున్న ఉపాధ్యాయులు ● విందులు, ఆత్మీయ సమ్మేళనాలతో ఊపందుకున్న పోరుకరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు వారం రోజులే గడువు ఉండడంతో ప్రచారం ఊపందుకుంది. ఈసారి ఎన్నికలు ఉపాధ్యాయుల్లో జోష్ పెంచుతున్నాయి. కులాలు, సామాజికవర్గాల వారీగా ఉపాధ్యాయులు విడిపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బీసీ నినాదం ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలోని బీసీ కులగణనపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో సామాజికవర్గాల వారీగా ఉపాధ్యాయులు సమావేశాలు నిర్వహిస్తూ గెలుపునకు ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్.. ●: టీచర్స్ ఎమ్మెల్సీ బరిలో 15 మంది ఉన్నారు. ఈ ఎన్నిక కొత్త 15జిల్లాల పరిధిలో జరగనుండగా.. మొత్తం 27,088మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. బీజేపీ తరఫున మల్క కొమురయ్య, పీఆర్టీయూ నుంచి వంగ మహేందర్రెడ్డి, టీపీటీఎఫ్, యూటీఎఫ్, యూఎస్పీసీ సంఘాల మద్దతుతో సంగారెడ్డికి చెందిన అశోక్కుమార్, ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి ఎస్టీయూ, మోడల్ స్కూల్, కేజీబీవీ, సీపీఎస్ సంఘాల మద్దతుతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మిగిలినవారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో దిగి, చాప కింద నీరులా ప్రచారం సాగిస్తున్నారు. 15 జిల్లాల పరిధిలో 27,088 మంది ఓటర్లు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని ప్రస్తుతం 15 కొత్త జిల్లాల్లో 27,088 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. ఇందులో 16,932 మంది పురుషులు, 10,156మంది మహిళా ఓటర్లున్నారు. అత్యధికంగా కరీంనగర్లో 4,305 మంది, నిజామాబాద్లో 3,751మంది, సిద్దిపేటలో 3,212 మంది ఉన్నారు. అతి తక్కువగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 83 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. హన్మకొండ జిల్లాలో 166ఓట్లు, ఆసిఫాబాద్లో 470 ఓట్లు, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 950 ఓట్లు ఉన్నాయి. విజేతఎవరో? ఈసారి వ్యాపారులు, రియల్డర్లు ఉపాధ్యాయ సంఘాల్లో రాష్ట్రస్థాయి పదవులు అనుభవించిన వారు తలపడుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డికి పీఆర్టీయూ టికెట్ నిరాకరించడంతో ఎస్టీయూ, మిగతా సంఘాలను కలుపుకుని బరిలో నిలిచారు. హైదరాబాద్లో విద్యాసంస్థలను నెలకొల్పి రియల్డర్గా పేరున్న మల్క కొమురయ్య బీజేపీ మద్దతుతో బరిలో నిలిచారు. అత్యధిక మెంబర్షిప్ కలిగిన పీఆర్టీయూ నుంచి వంగ మహేందర్రెడ్డి పోటీలో ఉన్నారు. అభ్యర్థుల విజయం కోసం టీచర్లు విందులు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. వంగ మహేందర్రెడ్డి, మల్క కొమురయ్య, రఘోత్తమరెడ్డి మధ్య పోటీ ఉండే అవకాశాలు ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘాలు వెల్లడిస్తున్నాయి. ఖరీదైన ఎన్నిక...ఈసారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఖరీదుగా మారింది. గతంతో పోలిస్తే ఓటర్ల సంఖ్య పెరగడంతో ఖర్చు తడిసి మోపెడవుతోంది. పీఆర్టీయూతో పాటు బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థులు బలమైన సామాజికవర్గంతో పాటు వ్యాపారవేత్తలు కావడంతో భారీగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మిగతా వారు కూడా ఇప్పటినుంచే విందులు, వినోదాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ఎన్నికల్లో సామాజిక వర్గాలుగా ఉపాధ్యాయులు విడిపోయి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. గతంలో జరిగిన ఎన్నికలు నాయకుల మధ్యవిగా పరిగణించగా ఈసారి కుల సమీకరణాలవారీగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం పనిచేసే వారిని గెలిపించేందుకు ఉపాధ్యాయులు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
● కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ● కలెక్టర్ పమేలా సత్పతికరీంనగర్: ఇంటర్, పదోతరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈసారి ఇంటర్మీడియట్ పరీక్షల కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఇంటర్ పరీక్షల పర్యవేక్షణ ఉంటుందన్నారు. చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఎవరికీ సెల్ఫోన్ అనుమతి లేదన్నారు. ప్రశ్నాపత్రాలను కేంద్రాలకు తరలించే సమయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఇతరులు ఎవరూ కేంద్రాల్లో ఉండొద్దన్నారు. పరీక్షలు జరిగే తేదీల్లో ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. వైద్య శాఖ అధికారులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రాలను సూచించే బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మార్చి 5 నుంచి 22 వరకు ఇంటర్ పరీక్షలు ఉంటాయన్నారు. ప్రథమ సంవత్సరం 17,799, ద్వితీయ సంవత్సరానికి 17,763 మంది పరీక్షలు రాస్తారన్నారు. మొత్తం 58 సెంటర్లు ఏర్పాటు చేయగా, కరీంనగర్లో 37 సెంటర్లు ఉన్నాయని అన్నారు. డీఈవో జనార్దన్రావు మాట్లాడుతూ వచ్చే నెల 21 నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 73 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, 12,516 మంది పరీక్షలు రాస్తారని వివరించారు. డీఆర్వో వెంకటేశ్వర్లు, డీఎంహెచ్వో వెంకటరమణ, ఆర్టీసీ, పోలీసు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో క్రీడాకారుల ప్రతిభ
జగిత్యాల: హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటిలో జరుగుతున్న 11వ రాష్ట్రస్థాయి యూత్ అథ్లెటిక్స్ పోటీల్లో జగిత్యాల విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబర్చారు. కాంస్య, వెండి పతకాలు సాధించారు. పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న వర్ష అండర్–16 బాలికల విభాగంలో లాంగ్జంప్లో కాంస్య పతకం సాధించింది. కోరుట్ల మండలం మోహన్రావుపేటకు చెందిన జాహ్నవి ట్రయల్ లిథిన్ సీ విభాగంలో వెండి పతకం సాధించింది. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ముత్తయ్య మాట్లాడుతూ జిల్లాకు క్రీడాకారులు రెండు పతకాలు సాధించారని, ఇది గర్వకారణమన్నారు. విద్యార్థినులను అభినందించారు. అధికారులను కించపరిచేలా పోస్టులు.. ఇద్దరిపై కేసు● సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ సిరిసిల్లక్రైం: అధికారులను కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన గుండారపు గణేశ్, ఆకుల శ్రీనివాస్రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ తెలిపారు. జిల్లా అధికారులను కించపరిచేలా సోషల్మీడియా వేదికగా బుధవారం పోస్టులు చేశారు. దీనిపై ప్రాథమిక దర్యాప్తు చేసిన పోలీసులు ఇరువురిపై కేసు నమోదు చేసి దీనిలో భాగస్వామ్యం ఉన్న మరికొందరిపై నిఘా పెట్టినట్లు తెలిపారు. జిల్లా అధికారుల గురించి, వారి వ్యక్తిగత విషయాలకు సంబంధించి అసభ్యకర పోస్టులు పెడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి ప్రచారాలకు అవకాశం ఇచ్చే గ్రూప్ అడ్మిన్లకు చర్యలు తప్పవని తెలిపారు. -
యువకుడి ఆత్మహత్య
ఎలిగేడు: ఎలిగేడు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన యువకుడు యాదగిరి చందు(27) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సనత్కుమార్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యాదగిరి రవి– లక్ష్మీ దంపతుల కుమారుడు చందు ఎంబీఏ పూర్తి చేశాడు. రెండేళ్లుగా ఏ పనిచేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తాను ఓ అమ్మాయిని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వారు ‘చదువుకుని ఖాళీగా ఉంటున్నావు. ఎలాంటి ఉద్యోగం చేయకుండా పెళ్లి ఎలా చేసుకుంటావని’ నిరాకరించారు. మనస్తాపానికి గురైన చందు బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చందు తండ్రి రవి ఫిర్యాదుతో జూలపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తండ్రి మందలించాడని కొడుకు.. మెట్పల్లి: తండ్రి మందలించాడని పట్టణ శివారులోని అర్బన్ హౌసింగ్ కాలనీకి చెందిన ఇమ్రాన్ (17) బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. కాలనీకి చెందిన మజార్ పండ్ల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని కుమారుడు ఇమ్రాన్ చదువుకోకుండా ఖాళీగా తిరుగుతుండడంతో మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఇమ్రాన్ కాలనీశివారులోని ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకే కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. మాజీ జెడ్పీటీసీ.. వీణవంక: మండల కేంద్రానికి చెందిన మాజీ జెడ్పీటీసీ ఆనంద రాజమల్లయ్య (75)ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నట్లు వివరించారు. మృతికి గల కారణాలు తెలియరలేదు. టీడీపీ తరఫున గెలుపొందిన ఈయన 1995–2000 సంవత్సరం వీణవంక జెడ్పీటీసీగా పనిచేశారు. దివంగత మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా గుర్తింపు పొందాడు. మృతిడికి భార్య లక్ష్మిబాయి, కుమారుడు, కూతురు ఉన్నారు. భార్యాపిల్లల మృతికి కారణమైన వ్యక్తి అరెస్ట్ పెగడపల్లి: భార్యాపిల్లల మృతికి కారణమైన మండలంలోని మద్దుపల్లి గ్రామానికి చెందిన కంబాల తిరుపతిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై రవికిరణ్ తెలిపారు. ఈనెల 13న తిరుపతి భార్య హారిక, పిల్లలు మయాంతలక్ష్మి, క్రిష్ణాంత్ అత్యహత్యాయత్నం చేయగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోయిన విషయం తెల్సిందే. ఈ ఘటనలో హారిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు తిరుపతిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోపాటు ఆమెను వివాహం చేసుకుంటానని తరచూ హారికను వేధించడంతోనే హారిక తన పిల్లలతో ఆత్మహత్య చేసుకుందని నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు తిరుపతిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు వివరించారు. తొలితరం బీఆర్ఎస్ నేత మృతి సిరిసిల్లటౌన్: బీఆర్ఎస్ పార్టీ తొలితరం నేత కాసర్ల మల్లేశం(67) బుధవారం మృతిచెందారు. కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచే పనిచేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన మల్లేశం కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడ్డారు. బుధవారం సిరిసిల్లలోని ఆస్పత్రిలో మృతిచెందారు. ఆయనకు భార్య మల్లవ్వ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
అత్యాచార నిందితుడికి 20 ఏళ్ల జైలు
జగిత్యాలజోన్: మానసిక వికలాంగురాలైన బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, పోక్సో కోర్టు ఇన్చార్జి జడ్జి జి.నీలిమ బుధవారం తీర్పు చెప్పారు. అలాగే బాధితురాలికి రూ.2లక్షల పరిహారం అందించాలని తీర్పుఇచ్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిహెచ్.రామకృష్ణారావు కథనం ప్రకారం.. మల్యాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు నలుగురు ఆడపిల్లలు, కొడుకు. పెద్ద కూతురు మానసిక వికలాంగురాలు. భార్యాభర్తలు గేదెలను కాస్తూ జీవనం సాగిస్తుంటారు. 2021 జూలై 10న గేదెలను మేపేందుకు తండ్రితోపాటు పెద్ద కూతురు, చిన్నకూతురు వెళ్లారు. సాయంత్రం కావడంతో ఇద్దరు కూతుళ్లను అదే గ్రామానికి చెందిన చెట్పల్లి నారాయణ ఆటోలో ఇంటికి పంపించాడు. అయితే నారాయణ వారిని తన ఇంటికి తీసుకెళ్లాడు. చిన్న కూతురును ఇంటికి వెళ్లాలని చెప్పి మానసిక వికలాంగురాలుపై అత్యాచారం చేశాడు. అక్క ఏదని తల్లి చిన్నకూతురును అడగగా.. నారాయణ ఇంటి వద్ద ఉందని చెప్పింది. దీంతో వారు నారాయణ ఇంటికి వెళ్లి చూడగా.. కూతురు ఏడ్చుకుంటూ కనబడింది. జరిగిన సంఘటనపై బాధితులు మల్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అప్పటి సీఐ రమణమూర్తి నారాయణను అరెస్ట్ చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ అధికారులు బి.రాజు, కేవీ.సాగర్, కిరణ్కుమార్ సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టారు. వాటిని పరిశీలించిన జడ్జి నిందితుడైన నారాయణకు 20 ఏళ్ల జైలు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. బాధితురాలికి రూ.2లక్షల పరిహారం -
పంటకు రక్షణగా..
ఉపాయం ఉండాలే కానీ ఎలాంటి అపాయం నుంచైనా తప్పించుకోవచ్చు అనేది నానుడికి సరిగ్గా సరిపోతుంది ఈ రైతు ఐడియా. తాగి పారేసిన బీరుసీసాలను చెట్టుకు కట్టి పంట పొలాన్ని పక్షులు, అడవి జంతువుల నుంచి రక్షించుకుంటున్నాడు. దారంతో ఖాళీ బీరుసీసాను వేలాడదీశాడు. అదే చెట్టుకు సీసా పక్కన మరో దారంతో రాయి లేదా ఇనుప మొలను కట్టడంతో గాలికి ఊగి బీరు సీసా మొలను తాకుతూ టింగ్టింగ్ మని చప్పుడు చేస్తుండడంతో పక్షులు, మూగజీవాలు రాకుండా పంటను ఉపాయంతో రక్షించుకుంటున్నాడు. పెద్దపల్లి జిల్లా జాఫర్ఖాన్ పేట నుంచి బేగంపేట వెళ్లే దారిలో వరిపంట పొలాల్లో గాజు సీసాల శబ్దాలు అదేపనిగా వస్తుండడంతో గమనించి ‘సాక్షి’ క్లిక్ మనిపించింది. – ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
● సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్రామడుగు(చొప్పదండి): విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికారి కె. వెంకటేశ్ సూచించారు. రామడుగు మండలంలోని వెలిచాల జిల్లా పరిషత్ పాఠశాలలో బుధవారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలను వాడొద్దన్నారు. మొబైల్ కోర్టు న్యాయమూర్తి సరళరేఖ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే కష్టపడి చదివి ఉన్నత స్థానానికి ఎదగాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై వి.శేఖర్, హెచ్ఎం కన్నం రమేశ్, న్యాయవాదులు రేణుక, గాదె నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యం● రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్విద్యానగర్(కరీంనగర్): సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ పేర్కొన్నారు. కరీంనగర్ ప్రెస్భవన్లో బుధవారం మాట్లాడుతూ రేవంత్రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో కులగణన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిందన్నారు. ఎస్సీ వర్గీకరణ ఆచరణలోకి తెచ్చి ముస్లిం రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పించిందన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి 11వేల పైచిలుకు ఉపాధ్యాయ ఉద్యోగాలను డీఎస్సీ ద్వారా భర్తీ చేయడం జరిగిందన్నారు. కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్రెడ్డి గెలుపు సామాజిక న్యాయం, రాజ్యాంగ స్ఫూర్తికి విజయమన్నారు. నిరుద్యోగులు, మేధావులు, పట్టభద్రులు, ప్రజాస్వామ్యవాదులు నరేందర్రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కమ్యూనిస్టులే ప్రశ్నించే గొంతుకలు ● సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డిశంకరపట్నం: వార్డు నుంచి ఢిల్లీ వరకు జరిగే ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థులు విజయం సాధించేందుకు కార్యకర్తలు గ్రామాల్లో పార్టీని బలోపేతం చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. బుధవారం కేశవపట్నంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కొందరు ప్రజాప్రతినిధులు రాజ్యాంగాన్ని మార్చాలంటూ మాట్లాడం సరికాదన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీకే మద్దతు ఇస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, మండల కార్యదర్శి సమ్మయ్య, అశోక్, కేదారి, సురేశ్, మణికంఠరెడ్డి, యుగేందర్, బుచ్చన్నయాదవ్, సాగర్, సదానందం, రవి, తిరుపతి, రామస్వామి, రాజేశ్వరి, రమాదేవి, రజిత పాల్గొన్నారు. హామీలు నెరవేర్చాలికరీంనగర్: ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ బుధవారం జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ కనకం కుమారస్వామి ఆధ్వర్యంలో సీఎం రేవంత్రెడ్డికి పోస్టుకార్డులు పంపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇస్తామన్న 250 గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు, పెన్షన్ రూ.25 వేలు, గుర్తింపు కార్డులు, బస్సు, రైల్ పాసులు ఇవ్వాలని డిమాండ్చేశారు. టౌన్ మహిళా అధ్యక్షురాలు కారుపకాల మున్నా, పట్టణ అధ్యక్షుడు గోడిశాల రమేశ్, ఆకాశ్, వంకర్, మొగిలి, అంజలి, హసినా, గౌరి, రాజేశ్వరి, విజయ, మల్లేశం, విజయభాస్కర్, రమేశ్, గరిగె కోటేశ్వర్ పాల్గొన్నారు. -
సదరం అక్రమాలపై కొరడా
● కమిటీ విచారణతో ఇద్దరి తొలగింపు ● ఆసుపత్రిలో పీఆర్వో వ్యవస్థకు స్వస్తి ● ఇక నుంచి సూపర్వైజర్ల పర్యవేక్షణకరీంనగర్టౌన్: జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రిని సదరం అక్రమాల వ్యవహారం కుదిపేసింది. సదరం అక్రమాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. ‘సదరం.. కాసుల వర్షం’శీర్షికన ఈనెల 12న ‘సాక్షి’ దినపత్రిలో ప్రచురితమైన కథనానికి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి స్పందించారు. అర్హులైన వారు సైతం సదరం సర్టిఫికెట్ పొందాలంటే డబ్బులు ముట్టజెప్పాల్సిందే అంటూ ఆస్పత్రిలోని కొంతమంది సిబ్బంది వ్యవహారం గుట్టు రట్టు కావడంతో చర్యలకు ఉపక్రమించారు. సదరం అక్రమాలపై నలుగురు వైద్యాధికారులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసి, ఆ నివేదిక ఆధారంగా ఒక సెక్యూరిటీ గార్డు, పీఆర్వోను ఉద్యోగాల నుంచి తొలగించారు. పీఆర్వో వ్యవస్థకు స్వస్తి ప్రభుత్వాసుపత్రిలో పేషెంట్ రిలేషన్ ఆఫీసర్ (పీఆర్వో) వ్యవస్థకు స్వస్తి పలికారు. కొంతకాలంగా అడ్డగోలు ఆరోపణలు వస్తున్న పీఆర్వోలపై వేటు వేశారు. సదరం అక్రమాల్లో ఓ పీఆ ర్వో అడ్డంగా దొరకడం, సదరం అక్రమాలతో పాటు ప్రాణాపాయ, అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చే పేషెంట్లను కమీషన్లకు కక్కుర్తి పడి... ప్రైవేటు ఆసుపత్రులకు తరలించడం, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి ఆరోపణలు రావడంతో పీఆర్వో వ్యవస్థనే రద్దు చేశారు. వీరిస్థానంలో సూపర్వైజర్లను ఏర్పాటు చేసి పర్యవేక్షించేలా కార్యాచరణ చేపట్టారు. దీంతో అక్రమాలకు చెక్ పడి అర్హులకు సదరం సర్టిఫి కెట్లు అందుతాయనే నమ్మకం కలుగుతోంది. -
చదువు వీడి చోరీల బాటలో..
మెట్పల్లి: తల్లిదండ్రులు చదువుకోవాలని మందలించడం అతనికి నచ్చలేదు. ఇంట్లో నుంచి పారిపోయి దొంగగా మారాడు. ఇప్పటివరకు అనేక చోరీలు చేసి.. పలుమార్లు జైలు పాలయ్యాడు. అయినా తన వైఖరి మాత్రం మారలేదు. మళ్లీమళ్లీ అదే దారిలో పయనిస్తున్న అతడిని పోలీసులు పట్టుకుని రూ.11లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ నిరంజన్రెడ్డి బుధవారం విలేకరులకు వెల్లడించారు. నిర్మల్ జిల్లా బైంసాకు చెందిన మిట్టపల్లి లక్ష్మణ్ (28) ఆరో తరగతి చదివేటప్పుడు పాఠశాలకు సరిగ్గా వెళ్లలేదు. దీంతో అతని తండ్రి కొట్టడంతో హైదరాబాద్ పారిపోయాడు. అక్కడ పలుచోట్ల హోటళ్లలో పనిచేసిన సమయంలో కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతడు లక్ష్మణ్ను అక్కడకు తీసుకెళ్లి దొంగతనాలు చేయించాడు. తర్వాత కొంతకాలానికి తిరిగి హైదరాబాద్కు వచ్చాడు. ఇక్కడా చోరీలు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఒంటరిగా బస్సుల్లో గ్రామాలకు వెళ్లి తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతూ జల్సా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పలుమార్లు పోలీసులకు పట్టుబడి జైలుశిక్ష అనుభవించాడు. గత డిసెంబర్లో జైలు నుంచి బయటకు వచ్చిన అతడు.. మల్లాపూర్ మండలం సిర్పూర్, ముత్యంపేట, మేడిపల్లి మండలంలోని దమ్మన్నపేటలోని ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. మెట్పల్లిలో ఓ బైక్ను అపహరించాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు ఎస్పీ అశోక్కుమార్, డీఎస్పీ రాములు పర్యవేక్షణలో సీఐ నిరంజన్రెడ్డి, ఎస్సై రాజుతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ వద్ద తనిఖీలు చేస్తుండగా.. అక్కడికి బైక్పై వచ్చిన లక్ష్మణ్ను పట్టుకొని అరెస్ట్ చేశారు. అతని నుంచి 103 గ్రాముల బంగారు, 125 గ్రాముల వెండి అభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు అతడు 40 దొంగతనాలకు పాల్పడ్డాడని, 12కేసుల్లో జైలుశిక్ష అనుభవించాడని సీఐ తెలిపారు. గతంలో జగిత్యాల, కరీంనగర్, మహబూబ్నగర్ పోలీసుల కస్టడీ నుంచి పారిపోయిన అతడిని చాకచక్యంగా పట్టుకున్నామని వెల్లడించారు. సమావేశంలో ఎస్ఐ రాజు, ఇతర సిబ్బంది ఉన్నారు. దొంగతనాల మార్గాన్ని ఎంచుకున్న యువకుడు ఇప్పటి వరకు 40 కేసులు, పలుమార్లు జైలుపాలు మరోసారి పట్టుకున్న మెట్పల్లి పోలీసులు రూ.11 లక్షల సొత్తు స్వాధీనం -
గంజాయి విక్రేతల అరెస్ట్
జగిత్యాలక్రైం: గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన రెండు కేసుల్లో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. జగిత్యాల రూరల్ పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లిలో రూరల్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా గాంధీనగర్కు చెందిన మానుక కులదీప్, గుట్రాజ్పల్లికి చెందిన బొక్కెనపల్లి పవన్కుమార్, జిల్లాకేంద్రానికి చెందిన మగ్గిడి రాకేశ్ 130 గ్రాముల గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డారు. వారి నుంచి మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. రఘురాములకోట శివారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న జగిత్యాల అరవింద్నగర్కు చెందిన కోరెపు సాయివినయ్, మార్కండేయనగర్కు చెందిన అనుమండ్ల లోకేశ్కుమార్ను పట్టుకుని వారి నుంచి 1211 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామన్నారు. సీఐ కృష్ణారెడ్డి, ఎస్సై సదాకర్, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, ఉమర్, మోహన్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
రాష్ట్ర జూడో సంఘం చైర్మన్గా బండ ప్రకాశ్
కరీంనగర్స్పోర్ట్స్: రాష్ట్ర జూడో సంఘం చైర్మన్గా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2025–29 సంవత్సరాలకు గాను తెలంగాణ జూడో సంఘం నూతన కార్యవర్గం ఎన్నికలు బుధవారం కరీంనగర్లోని హోటల్ మైత్రిలో నిర్వహించారు. ముందుగా జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించి తదనంతరం ఎన్నికలను ఎన్నికల అధికారి ఎన్.పరమేశ్వర్ నిర్వహించారు. నూతన కార్యవర్గం ఎన్నికలకు జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి పరిశీలకులుగా జాయ్ వర్గీస్ తెలంగాణ ఒలింపిక్ సంఘం నుంచి పి.మల్లారెడ్డి, తెలంగాణ రాష్ట్ర క్రీడాప్రాధికారిక సంస్థ నుంచి వి.శ్రీనివాస్ హాజరయ్యారు. నాలుగేళ్లపాటు నూతనంగా ఎన్నికై న కార్యవర్గం పనిచేస్తుందని ఎన్నికల అధికారి ఎన్.పరమేశ్వర్ ప్రకటించారు. తెలంగాణ జూడో సంఘం అధ్యక్షుడిగా వరంగల్ జిల్లాకు చెందిన బండ రాజ్కుమార్, ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్కు చెందిన గసిరెడ్డి జనార్దన్న్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కడారి అనంతరెడ్డి(కరీంనగర్), పబ్బతి బాలరాజు(యాదాద్రి భువనగిరి), బాదినేని రాజేందర్రెడ్డి(జగిత్యాల), మాటేటీ సంజీవ్కుమార్(పెద్దపల్లి), సంయుక్త కార్యదర్శులుగా రాయిరెడ్డి శంకర్రెడ్డి(సిద్దిపేట), సిలివేరి మహేందర్(పెద్దపల్లి), తిప్పారపు సత్యనారాయణ(రాజన్న సిరిసిల్ల), చందనగిరి నాగరాజు(వరంగల్), ట్రెజరర్గా రాయిరెడ్డి మహేందర్రెడ్డి(సిద్దిపేట), కార్యవర్గ సభ్యులుగా ఎ.సాయిచరణ్(ఆదిలాబాద్), వై.సాయికిరణ్(నిర్మల్), కె.తిరుపతిగౌడ్(రాజన్నసిరిసిల్ల), కె.రాకేశ్(ఆసిఫాబాద్), ఎ.రమేశ్రెడ్డి(మంచిర్యాల), ఎం.శ్రీనివాస్(జగిత్యాల) ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అదే విదంగా ఎన్నికై న నూతన కార్యవర్గాన్ని తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ శాలువాలు, పూల బొకేలతో సత్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ జూడో సంఘం చైర్మన్ బండ ప్రకాశ్ మాట్లాడుతూ తెలంగాణలో క్రీడారంగం దినదినాభివృద్ధి చెందుతున్నదని అందులో భాగంగానే తెలంగాణ వ్యాప్తంగా గ్రామ గ్రామాన జూడో క్రీడకు విశేష ఆదరణ తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ జూడో సంఘం అధ్యక్ష కార్యదర్శులు బండ రాజ్ కుమార్, గసిరెడ్డి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ జూడో క్రీడల్లో అత్యుత్తమంగా శిక్షణ కార్యక్రమాలు జరిగేలా త్వరలోనే అకాడమీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జూడో సంఘం ఉపాధ్యాక్షులు, మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి, రాజేందర్ రెడ్డి, మాటేటి సంజీవ్ కుమార్, కోశాధికారి ఆర్ మహేందర్ రెడ్డి, తో వివిధ జిల్లాల నుంచి హాజరైన అధ్యక్ష కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా రాజ్కుమార్, జనార్దన్రెడ్డి -
ఉద్యోగులు అడుక్కునే దుస్థితి ఎందుకొచ్చింది?
కరీంనగర్టౌన్: తెలంగాణకోసం తెగించి కొట్లాడిన ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇవాళ జీతభత్యాలు, సమస్యల పరిష్కారం కోసం అడుక్కునే దుస్థితి ఎందుకొచ్చిందో ఆలోచించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. బుధవారం రాత్రి ‘తపస్’ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని సీతారాంపూర్లో నిర్వహించిన అధ్యాపక, ఉపాధ్యాయ ఆత్మీయ సమ్మేళనంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డీఏలు, పెండింగ్ బిల్లులతోపాటు జీపీఎఫ్ దాచుకున్న సొమ్మును కూడా ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తొందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఉద్యోగులు సహా ఏ ఒక్కవర్గమూ సంతోషంగా లేదన్నారు. ప్రభుత్వంలోనూ లుకలుకలు మొదలయ్యాయని, సొంతపార్టీ ఎమ్మెల్యేలు అసమ్మతి పేరుతో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. రేవంత్ సర్కార్కు నూకలుచెల్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై త్వరలో అనర్హత వేటు పడటం తధ్యమన్నారు. ఎప్పుడు ఉపఎన్నికలు వచ్చినా 7 సీట్లు బీజేపీ కై వసం చేసుకోవడం ఖాయమన్నారు. కుహానా లౌకిక వాదుల నుంచి సమాజాన్ని కాపాడటంతోపాటు నిజమైన చరిత్రను ప్రజలకు తెలియజేయాలంటే చావా లాంటి సినిమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కులగణన పేరుతో ముస్లింలను బీసీ జాబితాలో చేర్చి బీసీలకు కాంగ్రెస్ నష్టం చేస్తోందన్నారు. హిందువులలో ముస్లింలను ఎట్లా కలుపుతారు? పైగా నిన్న సర్క్యులర్ చూసిన. రంజాన్ భక్తులు సాయంత్రం 4 గంటలలోపు డ్యూటీ వదిలేసి వెళ్లిపోవచ్చట. మరి అయ్యప్ప, హనుమాన్, భవానీ భక్తులు ఏం పాపం చేశారు? వాళ్లకు ఎందుకు మినహాయింపు ఇవ్వరని ప్రశ్నించారు. కాంగ్రెస్ మోసపూరిత విధానాలకు గుణపాఠం చెప్పే టైం ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో ఇప్పుడు మీకొచ్చింది. మీకోసం పోరాడుతున్న బీజేపీ అభ్యర్థులను గెలించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు, బీజేపీ నేతలు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించలేని అసమర్థ సర్కార్ కాంగ్రెస్ ఉపాధ్యాయ ఆత్మీయ సమ్మేళనంలో కేంద్రమంత్రి బండి సంజయ్ -
రేషన్కార్డు రాదాయె..
● ఫలించని లబ్ధిదారుల ఎదురుచూపు ● కొత్త అర్జీలు సరే.. పాతవాటి పరిస్థితేంటి? ● ఏళ్లుగా మంజూరుకాని వైనం ● దరఖాస్తుదారులకు తప్పని నిరీక్షణ కరీంనగర్లోని మార్క్ఫెడ్ ప్రాంతానికి చెందిన చిట్ల రంజిత్ 2018 సెప్టెంబర్లో రేషన్కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ప్రక్రియ పూర్తవగా పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి పంపించారు. డిజిటల్ సైన్ కావాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యంతో అటకెక్కింది. ఫలితంగా రంజిత్కు రేషన్కార్డు మంజూరుకాలేదు. ఇది ఒక రంజిత్ పరిస్థితే కాదు. జి ల్లాలో వేలాది మంది పడుతున్న ఇబ్బంది. కరీంనగర్ అర్బన్..●: రేషన్కార్డుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఏళ్లుగా మంజూరుకాకపోవడం.. ప్రతీసారి దరఖాస్తు చేసుకోవడంలోనే రోజులు గడిచిపోతున్నాయి. కొత్త రేషన్కార్డుల కోసం అర్జీల సంగతి దేవుడెరుగు.. గతంలో దరఖాస్తు చేసుకున్న వాటికే మోక్షం లేదు. 2018లో దరఖాస్తు చేసిన వాటికి ఇప్పటికీ మోక్షం లేదు. ఇప్పటికే 18 వేల దరఖాస్తులకు పైగా పెండింగ్లో ఉన్నాయి. ఏళ్ల తరబడి రేషన్కు దూరం 2018లో జిల్లాలో రేషన్కార్డు కోసం 34,293 దరఖాస్తులు రాగా.. 15,114 మాత్రమే మంజూరయ్యాయి. కరీంనగర్ అర్బన్తోపాటు 15 మండలాల్లో భారీగా అర్జీలు వచ్చాయి. వాటిని పరిశీలించి మంజూరు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అర్జీల్లో వివిధ కారణాలతో 831 తిరస్కరణకు గురవగా వివిధ దశల్లో 18,348 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. 2019 మార్చిలో కరోనా ప్రభావంతో కార్డుదారులందరికీ ఉచితంగా రేషన్ అందింది. ఆ సమయంలోనూ దరఖాస్తుదారులకు ఏమి దక్కలేదు. ఒక్కో వ్యక్తికి 12కిలోలు కాగా ఒక్కో కార్డుకు రూ.1500 సాయం ప్రకటించగా అన్ని అర్హతలున్న 18వేలకు పైగా కుటుంబాలు సాయానికి దూరమయ్యాయి. ఎందుకింత నిర్లక్ష్యం? మీ సేవ కేంద్రాల ద్వారా అర్జీదారులు దరఖాస్తు చేయగా వాటిని ఆర్ఐ(గిర్దావర్) క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైతే తహసీల్దార్కు నివేదిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలకు మించని కుటుంబాలే అర్హులు. కుటుంబంలోని సభ్యులందరి ఆధార్ జిరాక్స్ ప్రతులను దరఖాస్తుకు జతచేయాల్సి ఉంటుంది. మీసేవలో స్వీకరించిన దరఖాస్తులను రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలిస్తారు. అర్జీదారుడి ఆదాయ వనరులు, నివాస ప్రాంతం తదితరాలపై ఆరా తీసి అర్హులనిపిస్తే కార్డు జారీకి అమోదముద్ర వేస్తారు. అయితే సదరు ప్రక్రియ వేగవంతంగా సాగాల్సి ఉండగా ఏళ్ల తరబడి పెండింగ్లోనే ఉంటుంది. ఆర్ఐ, తహసీల్దార్ ఆమోదించిన అర్జీలకు డిజిటల్ సైన్తో ఆమోదం తెలపాల్సిన పౌరసరఫరాల శాఖ కార్యాలయంలోనే 8,266 పెండింగ్ ఉండటం గమనార్హం. ఆర్ఐల వద్ద 9,626, తహసీల్దార్ల వద్ద 456 పెండింగ్లో ఉన్నాయి. మీసేవ కేంద్రాల్లో దోపిడీ కొత్త రేషన్కార్డుల కోసం అర్జీలకు ప్రభుత్వం అవకాశమివ్వగా మీసేవ కేంద్రాల నిర్వాహకులు అదనంగా దోచుకుంటున్నారు. నిర్ణీత రుసుం కన్న ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.100 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. త్వరలోనే పాత, కొత్త దరఖాస్తులకు మంజూరు లభిస్తుందని, అదనంగా వసూలు చేసే మీసేవ కేంద్రాలపై చర్యలు ఉంటాయని పౌరసరఫరాల అధికారి వివరించారు.జిల్లాలో అర్జీల పరిస్థితి మొత్తం దరఖాస్తులు : 34,293 తిరస్కరణ : 831 పెండింగ్ : 18,348 గిర్దావర్ వద్ద పెండింగ్ : 9,626 తహసీల్దార్ వద్ద పెండింగ్ : 456 డీఎస్వో ఆఫీస్లో : 8,266 జారీ అయిన కార్డులు : 15,114రేషన్కార్డుల పెండింగ్ ఇలామండలం ఆర్ఐ డీఎస్వో చిగురుమామిడి 257 495 చొప్పదండి 649 338 ఇల్లందకుంట 214 303 గంగాధర 323 562 గన్నేరువరం 179 250 హుజూరాబాద్ 1001 382 జమ్మికుంట 603 677 కరీంనగర్ రూరల్ 698 477 కరీంనగర్ అర్బన్ 2630 1861 శంకరపట్నం 264 538 కొత్తపల్లి 988 251 మానకొండూర్ 206 590 రామడుగు 120 425 సైదాపూర్ 498 227 తిమ్మాపూర్ 385 564 వీణవంక 611 326 -
‘ఎన్నికలు సజావుగా నిర్వహించటే’్ల
కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించడం లేదని రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి రవీందర్సింగ్ ఆరోపించారు. బుధవారం కరీంనగర్లో న్యాయవాదులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ తనపై కుట్రలు చేస్తున్నారని అన్నారు. నామినేషన్ సమయంలో తమ వాహనాలను అడ్డగించి, మంత్రుల వాహనాలను లోపలికి అనుమతించిన వారిపై ఇంకా చర్యలు తీసుకోవడం లేదన్నారు. నరేందర్ రెడ్డి పేరు సీరియల్ నంబర్లో ముందుండాలని అల్ఫోర్స్ నరేందర్ రెడ్డిగా మార్పు చేశారన్నారు. అధికారులు కాంగ్రెస్కు అనుకూలంగా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. పట్టభద్రుల ఓటర్ల వివరాలను బహిర్గతం చేసే vnrm c.com అనధికార వెబ్సైట్పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. లంచం తీసుకొని, పని చేస్తున్న అధికారులు గాంధీభవన్లో కుర్చీ వేసుకొని, ఎన్నికలు జరపాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనధికార వెబ్సైట్ను బ్లాక్ చేయాలని బాధ్యులపై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులు దేవకిషన్, మురళి, లింనాగరాజు, శరత్ చందర్రావు, వినయ్, రాజ్కుమార్, సందీప్, రమేశ్, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
రెస్క్యూను తయారు చేస్తూ..
క్రీడారంగంలో నంబర్ వన్గా నిలిపేందుకు కృషి ● ఇతర సంస్థల సభ్యులకు శిక్షణ ఇస్తున్న సింగరేణి ● ఆదర్శంగా నిలుస్తున్న సంస్థ ● జాతీయ, అంతర్జాతీయ అనుభవంతో ముందుకు: జీఎం శ్రీనివాస్రెడ్డిగోదావరిఖని: కోలిండియా సంస్థలకు దీటుగా సింగరేణి పనిచేస్తోంది. జాతీయ, అంతర్జాతీస్థాయిలో సత్తాచాటి రెస్క్యూ జట్టుగా గుర్తింపు తెచ్చుకుంది. ఏటా కొత్త సభ్యులకు శిక్షణ ఇస్తోంది. రెస్క్యూ బృందాలను తయారు చేస్తోంది. గతంలో కొన్నేళ్ల పాటు ఇతర సంస్థలకు శిక్షణ అందించిన సింగరేణి రెస్క్యూ ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఇతర జట్లకు శిక్షణ ఇచ్చేందుకు సన్నద్ధమైంది. ఇందులో భాగంగా హిందూస్థాన్ జింక్ లిమిటెడ్(హెచ్జెడ్ఎల్) సంస్థకు చెందిన సభ్యులకు శిక్షణ ఇస్తోంది. 14 మంది సభ్యులు గల బృందానికి శిక్షణ ప్రారంభించింది. 15 రోజుల పాటు కొనసాగే శిక్షణతో సంస్థ రూ.14 లక్షల మేర ఆదాయాన్ని ఆర్జించడంతో పాటు ఇతర సంస్థలకు మేటిగా నిలువనుంది. కోలిండియా రెస్క్యూ పోటీల్లో సింగరేణి జట్టు అంటేనే ప్రత్యేక స్థానముంది. అలాగే సింగరేణి రెస్క్యూ ద్వారా శిక్షణ పొందిన సంస్థ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింటి. ఈ క్రమంలో సింగరేణి రెస్క్యూ శిక్షణకు మంచి డిమాండ్ ఉంది. హిందూస్థాన్ జింక్ సంస్థకు చెందిన ఏడుగురు పురుషులు, మరో ఏడుగురు మహిళల బృందానికి సంస్థ శిక్షణ ఇస్తోంది. మిగితా సంస్థలకు కూడా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. చాలా బాగుంది మైన్స్రెస్క్యూలో వాతావరణం, శిక్షణ అన్ని రకాల బాగుంది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్నారు. రెస్క్యూ రికవరీ, బ్రీతింగ్ ఆపరేటర్స్, ఫస్ట్ఎయిడ్, డ్రిల్అండ్పరేడ్లో శిక్షణ కొనసాగుతోంది. ఆరునెలల క్రితమే సంస్థలో జాయిన్ అయ్యాను. రెస్క్యూ శిక్షణకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. – జామృత్బాను, మైనింగ్ ఇంజినీర్, హెచ్జెడ్ఎల్ అన్ని వివరిస్తున్నారు.. ఇటీవలే హిందూస్థాన్ జింక్ సంస్థలో జాయిన్ అయ్యా. మహిళా రెస్క్యూ బ్రిగేడియర్గా ఎంపిక కావడం సంతోషంగా ఉంది. గత రెండు రోజుల నుండి శిక్షణ ఇస్తున్నారు. అన్ని అంశాలపై శిక్షణ కొనసాగుతోంది. ఈ శిక్షణతో మాలో మరింత ఆత్మస్థైర్యం పెరిగింది. – అనీశా, సర్వీస్ ఇంజినీర్, హెచ్జెడ్ఎల్ క్లాసులు బాగున్నాయి క్లాసులు చాలా బాగా చెబుతున్నారు. మూడు పూటలా మంచి ఆహారం అందిస్తున్నారు. భోజనం, వసతి సౌకర్యాలు బాగున్నాయి. రెస్క్యూలో శిక్షణ పొందడం ఇదే మొదటిసారి. అంతా షెడ్యూల్ ప్రకారం జరుగుతోంది. థియరీ, ప్రాక్టికల్ చాలా బాగా నేర్పిస్తున్నారు. – గంగవరపు థెరిస్సా డెీస్డీమోనా, అసోసియేట్ మేనేజర్, హెచ్జెడ్ఎల్ అనేక సంస్థలకు శిక్షణ జాతీయ, అంతర్జాతీయస్థా యి రెస్క్యూలో అనుభవం గడించాం. ఇప్పటికే అనేక సంస్థలకు శిక్షణ అందించాం. ఇక ముందూ మా వద్దకు వచ్చే స ంస్థల సభ్యులకు పూర్తిస్థాయి శిక్షణ ఇస్తాం. 15 రోజుల పాటు శిక్షణ కొనసాగుతుంది. సభ్యులకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేస్తాం. – శ్రీనివాస్రెడ్డి, రెస్క్యూ జీఎం, సింగరేణి -
కాలువలో వృద్ధుడి మృతదేహం
మంథని: మున్సిపల్ పరిధిలోని పోచమ్మవాడ శివారు కాలువలో తిప్పని శంకరయ్య (80) మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. ఆయన తెలిసిన వివరాల ప్రకారం మంచిర్యాల ఏఎస్ఆర్ నగర్కు చెందిన శంకరయ్య మద్యానికి బానిసయ్యాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోయి తిరిగి రెండు, మూడురోజుల తర్వాత ఇంటికి వస్తాడు. 15రోజుల క్రితం మద్యం తాగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రెండు రోజులైనా ఇంటికి తిరిగిరాకపోవడంతో సీసీ నస్పూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా బుధవారం పోచమ్మ వాడ శివారులోని బిరుదు సతీశ్కు చెందిన పొలం పక్కనున్న కాలువ దగ్గరికి పని నిమిత్తం స్థానికులు వెళ్లి చూడగా అక్కడ గుర్తు తెలియని శవం కనిపించిందన్నారు. శంకరయ్య కుమారుడు తిప్పని లక్ష్మణ్ సంఘటనానికి వచ్చి శవాన్ని పరిశీలించి శరీరంపై ఉన్న ఆనవాళ్ల ఆధారంగా తన తండ్రిగా గుర్తించినట్లు తెలిపారు. రెండు, మూడురోజుల క్రితమే ఎక్కడో కాలువలో పడి ఇక్కడికి కొట్టుకువచ్చి ఉంటాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
‘బీజేపీలో ఏ ఇద్దరికై నా సఖ్యత ఉందా’?
కరీంనగర్ కార్పొరేషన్: బీజేపీలో ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో ఏ ఇద్దరి మధ్యనైనా సఖ్యత ఉందో చెప్పాలని సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ని ప్రశ్నించారు. మంగళవారం నగరంలోని సిటీకాంగ్రెస్ కార్యాలయంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కేవలం ప్రచారం కోసమే కాంగ్రెస్పై సంజయ్ కామెంట్స్ చేస్తున్నారన్నారు. మైనార్టీల నెపంతో విధ్వంస రాజకీయాలు చేయడం తప్ప సంజయ్కి అభివృద్ధి చేతకాదన్నారు. నాయకులు తాజొద్దీన్, శ్రవణ్ నాయక్, కుర్ర పోచయ్య, జిడీ.రమేశ్, దన్నసింగ్, అర్ష మల్లేశం, భూమాగౌడ్, గంట శ్రీనివాస్, దండి రవి, అస్తపురం రమేశ్, నగేశ్ పాల్గొన్నారు. గణితంలో కరీంనగర్ విద్యార్థి ప్రతిభ విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్కు చెందిన మనీశ్రావు(12) జ్ఞాపకశక్తిలో అద్భుత ప్రతిభ కనబరిచి మ్యాథమెటిక్స్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ రెండు వందల వరకు జ్ఞాపకం ఉంచుకుని ప్రపంచ రికార్డు సాధించాడు. కరీంనగర్ ప్రెస్భవన్లో మంగళవారం మనీశ్రావుకు ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. వివేకానంద సీబీఎస్ఈ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్న మనీశ్రావు 200వరకు అన్ని అంకెల స్క్వేర్స్, క్యూబ్స్ కంఠస్తం చెప్పి ఈ రికార్డులు సొంతం చేసుకున్నాడు. మెమోరీ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ వేణుకుమార్, మనీశ్ తల్లిదండ్రులు శ్రీనివాస్, రాధ, చేంజ్ మెయోరీ అకాడమీ ట్రైనర్స్ తిరుపతి, హరీశ్కుమార్ పాల్గొన్నారు. ఆర్టీసీ సిబ్బందికి శిక్షణ విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మంగళవారం కరీంనగర్–1 డిపోకు చెందిన సిబ్భందికి బస్స్టేషన్ సమావేశ మందిరంలో, డిపో–2 సిబ్బందికి డిపోలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆర్టీసీ సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ.సజ్జనార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిబ్బందితో నేరుగా మాట్లాడారు. రెండు డిపోలకు సంబంధించి 80 మంది డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు. ఆర్ఎం రాజు, డిప్యూటీ ఆర్ఎంలు కె.సత్యనారా యణ, ఎస్.భూపతిరెడ్డి, డిపో–1 మేనేజర్ విజయమాధురి, డిపో–2 మేనేజర్ వి.మల్ల య్య, సూపర్వైజర్లు పాల్గొన్నారు. కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం కరీంనగర్ అర్బన్: కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. మార్క్ఫెడ్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో కేంద్రం కొనసాగుతోందని కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి పురుషోత్తం వివరించారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు రూ.7550కు ఖరీదు చేస్తారని తెలిపారు. మార్క్ఫెడ్ సిబ్బంది, డీసీఎంఎస్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఎల్ఎల్బీ షెడ్యూల్ విడుదల కరీంనగర్సిటీ: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని మూడేళ్ల ఎల్ఎల్బీ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి శ్రీరంగ ప్రసాద్ తెలిపారు. మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 28వ తేదీ నుంచి మార్చి 5వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్లో చూడాలని, సంబంధిత కళాశాలలో సంప్రదించాలని సూచించారు. -
అక్షరాస్యత శాతం
కరీంనగర్ 69.2 పెద్దపల్లి 65.6 జగిత్యాల 60.2 సిరిసిల్ల 62.7ఉపాధి హామీ కూలీలు కరీంనగర్ 1,22,862 పెద్దపల్లి 1,17,821 జగిత్యాల 1,67,355 సిరిసిల్ల 97,252కరీంనగర్ 993 పెద్దపల్లి 992 జగిత్యాల 1,036 సిరిసిల్ల 1014సీ్త్ర, పురుష నిష్పత్తి (ప్రతీ వెయ్యి మంది పురుషులకు ఉన్న మహిళల సంఖ్య)పశుసంపద (గొర్రెలు) కరీంనగర్ 6,38,706 పెద్దపల్లి 5,49,286 జగిత్యాల 6,10,985 సిరిసిల్ల 3,88,227 -
విలువిద్యలో జాతీయస్థాయిలో జిల్లా కీర్తి
మంథని: మంథనికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు కొమురోజు శ్రీనివాస్ శిక్షణలో జిల్లాలోని సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన చికిత విలువిద్య క్రీడలో ప్రపంచ స్థాయిలో రాణిస్తూ జిల్లా కీర్తిని అగ్రదేశానికి వ్యాపింపజేసింది. ఇటీవల ఉత్తరాఖాండ్లోని డెహడ్రూన్ జరిగిన 38 జాతీయ క్రీడల్లో మహిళల విభాగంలో తెలంగాణ జట్టుకు ప్లాగ్ బేరర్(పతాక దారిగా) వ్యవహారించడం జిల్లాకే గర్వకారణం. తండ్రి ప్రోత్సాహం.. కోచ్ మనోధైర్యం మధ్య తరగతి కుటుంబానికి చెందిన శ్రీనివాస్ వ్యవసాయం చేస్తూ తన కూతురు చికితకు విద్యతో పాటు క్రీడల్లో ప్రోత్సాహం అందిస్తూ వెన్నంటి ఉండి విజయానికి దోహద పడుతున్నాడు. అలాగే మంథనికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా విలువిద్య అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొమురోజు శ్రీనివాస్ చికితకు చిన్నతనం నుంచి కోచ్గా, అడ్వయిజర్గా వ్యవహరిస్తూ తన విజయానికి చేదోడువాదోడుగా నిలుస్తున్నాడు. జాతీయ స్థాయి శిక్షకుల పర్యవేక్షణలో శిక్షణ ప్రస్తుతం ఎన్సీవోఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సోనీపట్లో జాతీయ స్థాయి శిక్షకుల పర్యవేక్షణలో చికిత శిక్షణ పొందుతోంది. భారత మహిళల జట్టులో స్థానం సంపాదించి వరల్డ్, కప్ స్జేడ్ వన్, స్టేజ్కు ఽఈనెల 26న అమెరికా, చైనాలో జరిగే ప్రపంచ స్థాయి పోటీలకు ఎంపికై ంది. అంతేగాకుండా జూనియర్ ఆసియా కప్ జట్టుకు కూడా ఎంపిక కావడం విశేషం. గతేడాది గోవాలో జరిగిన 37వ జాతీయ క్రీడల్లోనూ విలువిద్య విభాగంలో బంగారు పతకం సాధించింది. కాగా చికిత విజయాలను అభినందిస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్రావు రూ.10లక్షలు ఏదేళ్ల పాటు నెలకు రూ.15 వేల చొప్పున ఉపకారవేతనం అందించేదుకు ముందుకు వచ్చినట్లు కొమురోజు శ్రీనివాస్ తెలిపారు. తాను చిన్నతనం నుంచి విద్య నేర్పిన క్రీడాకారిణి ప్రపంచస్థాయికి ఎదగడంపై ఎంతగానో గర్వపడుతున్నట్లు తెలిపారు. అమెరికాలో జరిగే ప్రపంచ స్థాయి క్రీడలకు చికిత 38వ జాతీయ క్రీడల్లో తెలంగాణ జట్టుకు ప్లాగ్ బేరర్ -
‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
● విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి ● కలెక్టర్ పమేలా సత్పతికరీంనగర్: పదోతరగతి పరీక్షల విషయంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి, విద్యార్థులు వందశాతం ఫలితాలు సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. పదోతరగతి పరీక్షల సన్నద్ధతపై మంగళవారం ఎంఈవోలతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గతేడాది పదోతరగతి డ్రాపవుట్ అయిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వారికి అవసరమైన స్టడీ మెటీరియల్ అందించాలన్నారు. వారి తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడి పరీక్షలు పూర్తయ్యే వరకు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపాలని కోరాలన్నారు. నాలుగు మోడల్ ప్రశ్నపత్రాలను ప్రత్యేకంగా తయారుచేసి విద్యార్థులతో ప్రాక్టీస్ చేయించాలన్నారు. సాయంత్రం విద్యార్థులకు స్నాక్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కామన్ డైట్ మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారో లేదో తనిఖీ చేయాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఈవో జనార్దన్రావు, జిల్లా బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్రెడ్డి, సైన్స్ అధికారి జైపాల్రెడ్డి పాల్గొన్నారు. బాలికలు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి బాలికలకు చదువుతోనే సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కశ్మీర్గడ్డలోని ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్ను అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్దేశాయ్తో కలిసి మంగళవారం రాత్రి సందర్శించారు. మెస్, బాలికల వసతిగదులు, ఆర్వోవాటర్ ప్లాంటును పరిశీలించారు. మెనూ ప్రకారం పోషకాహారం ఇస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున విద్యార్థులకు అన్ని హాస్టళ్లలో సౌకర్యాలు కల్పిస్తున్నామని, కామన్ డైట్ మెనూ ద్వారా సమతుల పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమయ్యే కెరియర్ ఆప్షన్ చాట్ను ఆవిష్కరించారు. ఆర్డీవో మహేశ్వర్, ఎస్సీ వెల్ఫేర్ ఈడీ నాగార్జున, జిల్లా బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాశ్, హాస్టల్ ప్రత్యేక అధికారి రాంబాబు, వార్డెన్ విజయలక్ష్మి పాల్గొన్నారు. -
65 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం.. చివరికి..!
పాలకుర్తి: బసంత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని జీడీనగర్లో శివరాత్రి పోచమ్మ(65)ను హత్యచేసిన నిందితుడు ధర్మపురి శ్రీనివాస్ను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పెద్దపల్లి సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. జీడీనగర్లో నివాసముంటున్న పోచమ్మ భర్త 20ఏళ్ల క్రితమే మృతిచెందగా.. కుమారుడు అంజి రామగుండంలో ఉంటున్నాడు. పోచమ్మ బీసీ కాలనీలో బిక్షాటన చేసుకుంటూ జీవిస్తోంది. అదేకాలనీలో నివాసముండే ధర్మపురి శ్రీనివాస్ మద్యానికి బానిస కావడంతో పదేళ్ల క్రితమే అతని భార్య వదిలిపెట్టి పిల్లలతో కలిసి పుట్టింట్లో ఉంటోంది, ఈనేపథ్యంలో పోచమ్మ, శ్రీనివాస్ల మధ్య పరిచయం ఏర్పడి ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. ఇద్దరు కలిసి రోజూ జీడీనగర్కు వెళ్లి గుడుంబా తాగుతుండే వారు. అయితే కొద్ది రోజులుగా పోచమ్మ తన ఇంటి సమీపంలో ఉండే పర్వతి కిష్టయ్యతో సన్నిహితంగా ఉండటాన్ని చూసిన శ్రీనివాస్ పోచమ్మను మందలించాడు. అయితే తాను ఇష్టమున్న వారితో మాట్లాడుతానని పోచమ్మ ఎదురు తిరగడంతో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో అసహనానికి గురైన శ్రీనివాస్ పోచమ్మను హత్యచేయాలని నిర్థారించుకున్నాడు. దీనిలో భాగంగానే ఈనెల 9న సాయంత్రం ఇద్దరు కలిసి జీడీనగర్లో గుడుంబా తాగడానికి వెళ్లి తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలో శ్మశానవాటిక వద్దకు చేరుకోవడంతో శ్రీనివాస్ పోచమ్మతో కావాలనే గొడవకు దిగాడు. పథకం ప్రకారం ముందే సిద్దం చేసుకున్న కర్రతో పోచమ్మ తలపై గట్టిగా కొట్టడంతో మద్యం మత్తులో ఉన్న పోచమ్మ కిందపడి పోయింది. దీంతో పోచమ్మ చనిపోయిందని భావించిన శ్రీనివాస్ శ్మశానవాటిక లోపలికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం ఏమి తెలియనట్టుగా ఇంటికి వెళ్లిపోయాడు. ఈనెల 14న శ్మశానవాటిక వద్ద సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు సంఘటన స్థలానికి వెళ్లి లభించిన ఆధార్కార్డు, ఇతర వస్తువుల ఆధారంగా మృతదేహం పోచమ్మది గుర్తించి పంచనామా నిర్వహించారు. మృతురాలి కుమారుడు అంజి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానంతో శ్రీనివాస్ను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన బసంత్నగర్ ఎస్సై స్వామితో పాటు కానిస్టేబుళ్లు శివకుమార్, సురేశ్, శ్రీనివాస్లను పెద్దపల్లి సీఐ ప్రవీణ్కుమార్ అభినందించారు. -
ఉపాధ్యాయ సమస్యలపై గళమెత్తుతా
● ఎమ్మెల్సీగా గెలిపించండి ● టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకరీంనగర్టౌన్: ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఉపాధ్యాయ, అధ్యాపక సమస్యలపై మండలిలో గళమెత్తుతానని టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య అన్నారు. మంగళవారం పలు ఉపాధ్యాయ సంఘా ల బాధ్యులు కరీంనగర్లో సమావేశమై, ఆయనకు సంపూర్ణ మద్దతు తెలిపారు. కొమురయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కారించేలా మండలిలో ఒత్తిడి తీసుకువస్తానని తెలిపారు. పీఆర్సీ, డీఏ, జీపీఎఫ్, శిశు సంరక్షణ సెలవుల పెంపు, 20 ఏళ్ల సర్వీస్కే పూర్తి పెన్షన్, అలవెన్సుల పెంపు వంటి కీలక సిఫారసులను గత సర్కారు అమలు చేయలేదని మండిపడ్డారు. బీసీ సంఘాల మద్దతు.. టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు బీసీ సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మంగళవారం కరీంనగర్లో ఆయనను కలిసి, మద్దతు ప్రకటించారు. కొమురయ్యను గెలిపించుకొని, చట్టసభలకు పంపిస్తే బీసీ వాదం బలపడుతుందన్నారు. త్వరలో బీసీల రాజ్యాధికారం వస్తుందని, 2028 ఎన్నికలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీ ఫైనల్ అని పేర్కొన్నారు. కొమురయ్య మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
డేంజర్ స్పాట్స్
● సీఎంఏ పనుల పెండింగ్ ఎఫెక్ట్ ● తరచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ● ఏడాది దాటినా కదలని అసంపూర్తి పనులుకరీంనగర్ కార్పొరేషన్: స్మార్ట్సిటీలో భాగంగా నగరంలోని అంతర్గత రోడ్ల అభివృద్ధికి ముఖ్యమంత్రి హామీ పథకం కింద రూ.132 కోట్లు కేటాయించి గతంలో పనులు మొదలు పెట్టారు. ఈ పనులు ప్రారంభదశలో ఉండగానే, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2023 డిసెంబర్లో కాంట్రాక్టర్ ఎక్కడి పనులు అక్కడే నిలిపివేశాడు. అప్పటి నుంచి సీఎంఏ పనులు చేపట్టిన ప్రాంతవాసులు నిత్యం ఇక్కట్లు పడుతున్నారు. పాత రోడ్లను తొలగించడంతో పాటు, ఇళ్ల ఎదుట డ్రైనేజీ కోసం తవ్వి వదిలివేయడంతో ఏడాదిగా ఇబ్బంది పడుతున్నారు. ప్రమాదకరంగా రోడ్డు కోతిరాంపూర్ నుంచి కట్టరాంపూర్ వైపు మెయిన్రోడ్డులో సగం వరకు సీసీ రోడ్డు వేశారు. మిగితా సగం పాత రోడ్డును తవ్వి అలానే వదిలేశారు. పూర్తయిన రోడ్డులో కూడా డ్రైనేజీ నిర్మాణం పూర్తిగా జరగలేదు. డ్రైనేజీల కనెక్టివిటీ వద్ద పరిస్థితి మరింత భయంకరంగా మారింది. రోడ్డుకు అడ్డుగా రెండు గుంతలు ఏర్పడడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకొంటున్నాయి. రాత్రి వేళల్లో ఈ పరిస్థితి భయానకంగా ఉంటోంది. ఇక జ్యోతినగర్ మోర్ సూపర్మార్కెట్ నుంచి మంకమ్మతోట వైపు రోడ్డు నిర్మాణంలో భాగంగా పాత రోడ్డు, పాత డ్రైనేజీని తొలగించారు. కాని అలానే వదిలివేయడంతో ఇండ్లల్లోకి వెళ్లేందుకు ఆ ప్రాంత వాసులు ఏడాదిగా నానా తిప్పలు పడుతున్నారు. సర్కస్ గ్రౌండ్ ప్రక్క రోడ్డులోనూ ఇదే పరిస్థితి. కిసాన్నగర్, తీగలగుట్టపల్లి, ఆరెపల్లి, సీతారాంపూర్ మంకమ్మతోట, పోచమ్మవాడ తదితర చాలా ప్రాంతాల్లో ఇంచుమించు ఇదే పరిస్థితి. మోక్షమెప్పుడో... నగరంలో పెండింగ్ పనులు పూర్తి చేస్తారంటూ ఏడాదిగా ప్రచారం జరుగుతున్నా చిన్న కదలిక ఉండడం లేదు. ఇప్పుడు, అప్పుడు అంటూ అధికారులు చెబుతూ వస్తున్నా, అసలు ఎప్పుడు కదలిక మొదలవుతుందో స్పష్టత లేదు. ఆయా ప్రాంత వాసులు అధికారుల చుట్టూ తిరిగి విసిగి వేసారి పోయారు. పెండింగ్ పనులు పూర్తి చేయకపోవడంలో జాప్యం జరుగుతుండగా, ప్రమాదకరంగా ఉన్న చోట్ల నగరపాలకసంస్థ అధికారులు తాత్కాలిక మరమ్మతులు అయినా చేపట్టకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఏడాదికి పైగా నిత్యం ప్రమాదపుటంచుల్లో ప్రయాణిస్తున్న తమకు విముక్తి ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా నగర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సీఎంఏ పనులకు మోక్షం ఎప్పుడు కలుగుతుందో అని వేయికళ్లతో ఆయా ప్రాంతవాసులు ఎదురుచూస్తున్నారు.నగరంలోని 9వ డివిజన్ అలకాపురికాలనీలో ఇటీవల జరిగిన ఓ వివాహ వేడుకకు ఇతర ప్రాంతానికి చెందిన యువకుడు హాజరయ్యాడు. వేడుక ముగిసిన తరువాత, తన ద్విచక్ర వాహనంపై శ్రద్ధ ఇన్ లేన్ నుంచి మెయిన్రోడ్డు వైపు బయల్దేరాడు. రోడ్డు వెంట నేరుగా వచ్చిన ఆ యువకుడు అకస్మాత్తుగా ముగిసిన రోడ్డును చూసి తికమక పడడంతో బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యాడు. బైక్ పక్కకు పడడంతో స్వల్పగాయాలతో బయటపడ్డాడు. నగరంలో ముఖ్యమంత్రి హామీ పథకం (సీఎంఏ) నిధులతో చేపట్టిన రోడ్డు, డ్రైనేజీ పనులను సగంలోనే వదిలివేయడంతో నెలకొన్న పరిస్థితికి ఇది తాజా నిదర్శనం. ఎన్టీఆర్ విగ్రహం ఎదురుగా సిరిసిల్ల బైపాస్ రోడ్డు, శ్రద్ధ ఇన్ లేన్ వద్ద సీఎంఏ పనులు చేపట్టిన కాంట్రాక్టర్, సంవత్సరం క్రితం నిలిపివేశాడు. అంతర్గత రోడ్డు ఎత్తులో ఉండడం...మెయిన్రోడ్డు దిగువలో ఉండడం... కింద ఉన్న డ్రైనేజీని అసంపూర్తిగా వదిలివేయడం...ఐరన్రాడ్లు తేలి ఉండడంతో అది డేంజర్ స్పాట్గా మారింది. ఏడాదిలో పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. -
మహాలక్ష్మి పథకంలో..
జిల్లా లబ్ధిదారులు సబ్సిడీ (రూ.కోట్లలో) జగిత్యాల 1,82,801 9.49 కరీంనగర్ 1,43,899 8.12 పెద్దపల్లి 1,05,913 5.54 సిరిసిల్ల 93,104 4.72జిల్లా కనెక్షన్లు సబ్సిడీ (రూ.కోట్లలో) కరీంనగర్ 1,33,872 594.82 పెద్దపల్లి 1,05,761 484.06 జగిత్యాల 1,71,940 719 సిరిసిల్ల 90,780 388.50 -
ఎన్సీడీల నివారణపై శిక్షణ
కరీంనగర్టౌన్: ఎన్సీడీల సర్వే, నివారణపై హుజూరాబాద్ డివిజన్ పరిధిలోని ఆశా కార్యకర్తలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సమావేశమందిరంలో నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తలు చేస్తున్న కృషి, సేవలను అభినందించారు. ఆరోగ్య మహిళ కార్యక్రమానికి మహిళలను తీసుకెళ్లి స్క్రీనింగ్ నిర్వహించడంతో పాటు ప్రభుత్వాసుపత్రుల్లో డెలివరీలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం ఎన్సీడీ వ్యాధులు పెరిగిపోతున్నందున, ప్రజలు సమతుల్య ఆహారం తీసుకుని, సరైన వ్యాయామం, యోగా చేయాలని తద్వారా డయాబెటిస్, హైపర్టెన్షన్, గుండెపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులు నివారించుకోవచ్చని సూచించారు. పీవోడీటీటీ ఉమాశ్రీరెడ్డి కుక్కకాటు, నివారణ చర్యలు, రేబి స్ను నివారించడంపై అవగాహన కల్పించారు. -
అక్షరాస్యత శాతం
కరీంనగర్ 69.2 పెద్దపల్లి 65.6 జగిత్యాల 60.2 సిరిసిల్ల 62.7ఉపాధి హామీ కూలీలు కరీంనగర్ 1,22,862 పెద్దపల్లి 1,17,821 జగిత్యాల 1,67,355 సిరిసిల్ల 97,252కరీంనగర్ 993 పెద్దపల్లి 992 జగిత్యాల 1,036 సిరిసిల్ల 1014సీ్త్ర, పురుష నిష్పత్తి (ప్రతీ వెయ్యి మంది పురుషులకు ఉన్న మహిళల సంఖ్య)పశుసంపద (గొర్రెలు) కరీంనగర్ 6,38,706 పెద్దపల్లి 5,49,286 జగిత్యాల 6,10,985 సిరిసిల్ల 3,88,227 -
ఇదేం పద్ధతి..!
● లారీలు విడిపించుకునేందుకు వస్తే తిడతారా..? ● ఆర్టీఏ ఆఫీస్లో లారీ యజమాని ఆందోళన ● డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపణ ● తమపైనే దాడి చేశాడన్న ఆర్టీఏ సిబ్బంది సిరిసిల్లక్రైం: అధికలోడ్తో వెళ్తున్న రెండు లారీలను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారని, వాటిని వదిలిపెట్టేందుకు ఒక్కో లారీకి రూ.30 వేలు చొప్పున డీటీవో పర్సనల్ అసిస్టెంట్ డిమాండ్ చేశాడని లారీ యజమాని మంగళవారం కార్యాలయంలో ఆందోళన చేపట్టాడు. తనను సిబ్బంది తిట్టారని ‘ఇదేం పద్ధతి’ అంటూ ప్రశినంచాడు. వివరాలు.. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన నాగరాజు.. తన రెండు లారీలు ఫ్లైయాష్ లోడ్తో సిరిసిల్లకు వస్తున్న క్రమంలో అధిక లోడ్ ఉందని ఆర్టీఏ అధికారులు కేసు నమోదు చేశారు. లారీలను విడిపించేందుకు నాగరాజు ఆర్టీఏ ఆఫీస్కు వచ్చే క్రమంలో డీటీవో పీఏ డబ్బు డిమాండ్ చేశాడ ని బాధితుడు పేర్కొన్నాడు. ఈ విషయాన్ని డీపీవో కు తెలిపి వాహనాలను విడిపించుకునేందుకు ఆరీ ్టఏ కార్యాలయానికి బాధితుడు చేరుకోగా అక్కడ ఉన్న సిబ్బంది దుర్భాషలాడారు. దీంతో కోపోద్రిక్తుడైన నాగరాజుకు సిబ్బందికి వాగ్వాదం జరిగింది. తనను దుర్భాషలాడటంతోనే కోపానికి వచ్చినట్లు లారీ యజమాని మీడియా ఎదుట తన ఆవేదన వెల్లడించాడు. కాగా, లారీ యజమాని మద్యం తాగి సిబ్బందిపై దాడి చేసినట్లు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకుని నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. నిబంధనల ప్రకారం జరిమానా చెల్లిస్తా లారీలో ఓవర్ లోడ్ ఉందని అధికారులు కేసు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం జరిమానా చెల్లిస్తా. కానీ, మధ్యవర్తిగా వేణు అనే వ్యక్తి ఒక్కో లారీకి రూ.30 వేలు అడగడం ఆవేదన కలిగించింది. ఒక్క లారీ లోడ్ అమ్మితే వచ్చేదానికి ఆరింతలు లంచాన్ని ఆర్టీఏ అధికారుల పేరిట అడిగాడు. అధికారులు ఆఫీసులో ఉంటే ప్రైవేట్ వ్యక్తి తనిఖీలు చేయడమేందో అర్థం కాలేదు. – నాగరాజు, లారీ యజమాని ఆరోపణలో వాస్తవం లేదు ఓవర్ లోడ్తో ఉన్న లారీలను పట్టుకొని కేసు నమోదు చేశాం. జరిమానా చెల్లిస్తే వాహనాలను వదిలేస్తాం. మా కార్యాలయంలో మధ్యవర్తులుగా ప్రైవేట్ వ్యక్తులు ఎవరూ లేరు. మా పేరిట డబ్బులు అడిగితే ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. పారదర్శకంగా నిబంధనలు అనుసరించి సేవలందిస్తున్నాం. – లక్ష్మణ్, రవాణాశాఖ అధికారి, సిరిసిల్ల -
మహాశివరాత్రి వేడుకలకు రండి
వేములవాడఅర్బన్: వేములవాడ రాజన్న ఆలయంలో ఈ నెల 25 నుంచి 27 వరకు నిర్వహించే మహాశివరాత్రి వేడుకులకు రావాలని సీఎం రేవంత్రెడ్డి, మంత్రులకు మంగళవారం విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు ఆహ్వానపత్రిక అందజేశారు. అనంతరం సీఎంకు అర్చకులు రాజన్న ప్రసాదం అందజేసి వేదో ఆశీర్వచనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులపై సీఎం ఆరా తీయగా, పనులు టెండర్ దశలో ఉన్నాయని విప్ వివరించారు. ఘనంగా ఏర్పాట్లు చేయాలి మహాశివరాత్రి జాతరకు అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. భక్తులకు తాగునీటి వసతి, చలువ పందిళ్లు తదితర ఏర్పాట్లు ముమ్మరం చేసి జాతర ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఆలయ ఈవో వినోద్, ఏఈవో బ్రహ్మన్నగారి శ్రీనివాస్, అర్చకులు చంద్రగిరి శరత్, గోపన్నగారి చందు, మామిడిపల్లి శరత్, వెంకన్న తదితరులు ఉన్నారు. సీఎంను ఆహ్వానించిన విప్ ఆది శ్రీనివాస్ -
‘నలిమెల’కు జాతీయ అవార్డు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): బహుభాష కోవిదుడు, కేంద్ర సాహి త్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్ సిటీ కాలేజ్ మగ్దూం మొహినూద్దీన్ జాతీ య పురస్కారానికి ఎంపికయ్యారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్కు చెందిన భాస్కర్కు 14 భాషల్లో ప్రవేశం కలదు. ఆయన పలు రచనలు వివిధ భాషల్లో అనువాదం అయ్యాయి. ఇటీవల పీవీ నరసింహారావు మెమోరియల్ పురస్కారం అందుకున్నారు. నలిమెల భాస్కర్ వివిధ సాహితీ ప్రక్రియల్లో 25 గ్రంథాలు వెలువరించారని, ఆయన కృషిని గుర్తించి జాతీయ అవార్డు ప్రకటించినట్లు అవార్డు కమిటీ అధ్యక్షుడు, సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య పి.బాలభాస్కర్ సోమవారం ప్రకటించారు. పరిహారం ఇప్పిస్తానని కుచ్చుటోపీ● పూజారిని రూ.30లక్షలకు ముంచిన నకిలీ విలేకరి శంకరపట్నం: రెవెన్యూ రికార్డుల్లో తక్కువగా నమోదైన ఎకరం భూమితోపాటు ఎస్సారెస్పీ కింద పోయిన భూమికి పరిహారం ఇప్పిస్తానని మాచర్ల రాజయ్య అనే నకిలీ విలేకరి రూ.30 లక్షలు తీసుకుని తనను మోసం చేశాడని పురోహిత్యం చేసుకుంటూ జీవించే వైరాగ్యపు రాజమల్లయ్య తన గోడు వెల్లబోసుకున్నాడు. కేశవపట్నంలో మంగళవారం విలేకరులతో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించాడు. ఆయన వివరాల ప్రకారం.. మానకొండూర్ మండలం పచ్చునూర్ గ్రామానికి చెందిన రాజమల్లయ్య పచ్చునూర్, ఊటూర్, గట్టుదుద్దెనపల్లితో పాటు శంకరపట్నం మండలం చింతగుట్ట ఆలయాల్లో పూజారి. శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో నివాసం ఉంటున్న మాచర్ల రాజయ్య తల్లి 2023లో మరణిస్తే తన స్వగ్రామం ఊటూర్లో దశదినకర్మ చేసేందుకు రాజమల్లయ్య వెళ్లాడు. ఆ సమయంలో రాజయ్య తాను ఓ టీవీ చానల్ విలేకరిగా పరిచయం చేసుకున్నాడు. ఏదైన రెవెన్యూ కార్యాలయంలో పని ఉంటే చేయిస్తానని చెప్పాడు. పచ్చునూరులో తనకున్న ఏడు ఎకరాల్లో ఎకరం భూమి పట్టా కాలేదని చెప్పడంతో రూ.లక్ష ఇస్తే పనులు చేయిస్తానని నమ్మించాడు. దీంతో రాజమల్లయ్య రాజయ్యకు గూగుల్పే ద్వారా రూ.లక్ష పంపించాడు. ఎస్సారెస్పీకాలువలో పోయిన భూమల పరిహారం వచ్చిందని, అందుకు సంబంధించిన రూ.96లక్షల ఫేక్కాపీ చూపించడంతో విడుతలవారీగా రూ.30లక్షల పైచిలుకు డబ్బులు పంపించాడు. పనులు కాకపోవడంతో మోసపోయానని గ్రహించి శంకరపట్నం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నకిలీ విలేకరిపై విచారణ చేసి, డబ్బులు ఇప్పించాలని కోరాడు. అంతర్జాతీయ మాతృభాషా సదస్సుకు కొమిరవాసిఓదెల: యూనెస్కోలో ఈనెల 24నుంచి 26వరకు జరిగే అంతర్జాతీయ మాతృభాషా సిల్వర్ జూబ్లీ సదస్సుకు ఓదెల మండలం కొమిర గ్రామానికి చెందిన కొత్తిరెడ్డి మల్లారెడ్డి ఎంపికయ్యారు. హుజూరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న మల్లారెడ్డి భారతీయ భాషల కోసం యూనిటైడ్ ఫీమెంట్ ఇంటర్న్షిప్ తరహాలో యూనిఫైడ్ లాంగ్వేజ్ ఇంటర్షిప్ ఏర్పాటు చేయాలని తెలిపారు. మల్లారెడ్డిని గ్రామస్తులు అభినందించారు. గంజాయి పట్టివేతధర్మపురి: మండలంలోని మగ్గిడి, దొంతాపూర్ గ్రామాలకు చెందిన యువకులు గంజాయి సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దుర్గం నిశాంత్, కాలువ గంగాధర్, ఎస్కె.ఆసిఫ్ నుంచి 829 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్కుమార్ తెలిపారు. -
దేశానికి మోడీ గుర్తింపు తెచ్చారు
● చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డికరీంనగర్టౌన్: అంతర్జాతీయస్థాయిలో దేశానికి గుర్తింపు తెచ్చిన గొప్ప నాయకుడు ప్రధాని మోడీ అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాలయంలో టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కకొమరయ్యతో కలిసి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డిని గెలిపించాలని కోరారు. ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ ఎదైనా ఉందంటే అది బీజేపీ అన్నారు. ఇతరపార్టీల వారికి వారి సిద్ధాంతం అంటే తెలియదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పైన నమ్మకం పోయిందని, కాంగ్రెస్ ఒకరిని తప్ప అభ్యర్థులను పెట్టకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. నాయకులు గంగాడి కృష్ణారెడ్డి, బాస సత్యనారాయణ, వై.సునీల్రావు, గుగ్గిల్లపు రమేశ్, తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, రత్నం పాల్గొన్నారు. -
...అనే నేను!
● ఎమ్మెల్సీ ఎన్నికల్లో చర్చనీయాంశంగా అభ్యర్థుల పేర్లు ● విద్యాసంస్థ పేరుతో నరేందర్ రెడ్డి ● భార్యపేరు జత చేసుకుని హరికృష్ణ గెజిట్ ● తనకు కావాలనే ప్రాధాన్యం తగ్గించారని సింగ్ ఆరోపణ ● సాధారణంగానే టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లుసాక్షిప్రతినిధి,కరీంనగర్●: కరీంనగర్– మెదక్– నిజామాబాద్– ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్స్, టీచర్స్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల పేర్లపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ మండలి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు ఇంతకాలం ఒకలా.. ఇప్పుడు ఒకలా కనిపిస్తుండటమే ఇందుకు కారణం. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంటిపేరు ముందుండి, ఆ తరువాత ఒంటి పేర్లు ఉండటం సహజం. అదే తెలుగు ఎన్ఆర్ఐలు అయితే కాస్త వైరెటీగా ఇంటి పేరును.. ఒంటి పేరు తరువాత పెట్టుకుంటారు. ఇక ఉత్తర భారతంలో అసలు పేరు తరువాతే ఇంటి పేరు ఉంటుంది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఈ పేర్ల విషయంలో అభ్యర్థులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. తమ రంగంలో తమకు గుర్తింపు తెచ్చిన పేర్లతోనే బరిలో దిగుతుండటం విశేషం. ఈ అంశంపై ప్రజల్లో, నేతల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు పేర్ల మార్పు విషయాన్ని వివాదంగా చూస్తున్నారు.. ఇదంతా పోలింగ్ బ్యాలెట్ వరుస క్రమంలో ముందుకు వచ్చేందుకు వేసిన ఎత్తుగడగా అభివర్ణిస్తున్నారు. మరికొందరు ఇందులో అసలు వివాదం ఏముంది? అని ప్రశ్నిస్తున్నారు. మార్పు కనిపించింది వీరిలోనే.. గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న ప్రధాన అభ్యర్థులందరికీ పేర్లలో చెప్పుకోదగ్గ మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదాహరణకు కాంగ్రెస్ అభ్యర్థి వుట్కూరి నరేందర్ రెడ్డి పేరును.. అల్ఫోర్స్ నరేందర్రెడ్డి వుట్కూరిగా ముద్రించారు. ఇందుకోసం ఆయన ఎలాంటి గెజిట్ను విడుదల చేయలేదు. అదే సమయంలో తాజాగా నరేందర్రెడ్డి తన సతీమణి వనజా పేరును.. వనజారెడ్డిగా మారుస్తూ ఇటీవల గెజిట్ విడుదల చేయడం గమనార్హం. ఆల్ఫోర్స్ అనేది నరేందర్రెడ్డికి ఉనికి అని, ఆ విద్యాసంస్థలతోనే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు కాబట్టి.. పేరు అలా వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం. అదే సమయంలో బీఎస్పీ అభ్యర్థి పులి హరికృష్ణ పేరును ప్రసన్న హరికృష్ణగా పబ్లిష్ చేశారు. వాస్తవానికి ఆయన పులి హరికృష్ణ అయినప్పటికీ.. పోటీ పరీక్షలకు కంటెంట్ ఇచ్చిన క్రమంలో ప్రసన్న హరికృష్ణగానే ప్రసిద్ధి చెందారు. అందుకే, ప్రాచుర్యం పొందిన పేరుతో తన అధికారిక పేరుగా గెజిట్ తెచ్చుకుని మరీ మార్చుకున్నారు. వీరిలో ఎవరు గెలిచినా ఓడినా.. ఇకపై ఇవే పేర్లతో కొనసాగనున్నారు. ఈ విషయంపై ఏఐఎఫ్బీ బీఫామ్పై బరిలో ఉన్న మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తన పేరును 11వ స్థానానికి మార్చడంలో కుట్రదాగి ఉందని, కొందరు అభ్యర్థులకు నిబంధనలకు విరుద్ధంగా మేలు చేసినట్లుగా అధికారుల తీరు ఉందని ఆరోపిస్తున్నారు. తాను ప్రముఖ పార్టీ బీఫామ్ నుంచి పోటీ చేస్తున్నా.. తన పేరును కిందికి మార్చి ప్రాధాన్యం తగ్గించారని విమర్శించారు. అదే సమయంలో స్వతంత్ర అభ్యర్థి వేముల విక్రమ్రెడ్డి అనే అభ్యర్థి పేరుకు ముందర ‘జర్నలిస్టు’ అనే పదం వచ్చి చేరడం గమనార్హం. మరో ఇండిపెండెట్ మహమ్మద్ ముస్తాక్అలీ తన పేరుకు ముందు డాక్టర్ అని ప్రచారం జరిగినా.. తీరా పోస్టల్ బ్యాలెట్లో డాక్టర్ లేకుండానే పేరు ముద్రితమవడం గమనార్హం. టీచర్స్ ఎమ్మెల్సీలో ఇలాంటి చిత్రాలు పెద్దగా చోటు చేసుకోలేదు. -
రాములపల్లిలో కుల బహిష్కరణ
ఎలిగేడు(పెద్దపల్లి): భూవివాదం విషయంతో తమను కుల బహిష్కరణ చేశారని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లి గ్రామానికి చెందిన పలుమారు కొమురయ్య, అతడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల వివరాలు.. ఓ భూవివాదం విషయంలో తన కొడుక్కు సంబంధం ఉందని గ్రామానికి చెందిన ఓ పెద్ద మనిషి కులంలోని పెద్ద మనుషులను బెదిరించి తమతో ఎవరూ మాట్లాడకుండా చేస్తున్నారని మనోవేదనకు గురయ్యారు. రెండురోజుల క్రితం ఇంట్లో మల్లన్న పట్నాలు వేసేందుకు బంధువులను పిలిపించుకున్నామని కానీ, ఓ పెద్దమనిషి ఒగ్గు కళాకారులను బెదిరించడంతో వారు పట్నం వేయకుండానే వెళ్లిపోయారని, పొలం పనులకు సైతం ఎవరూ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబసభ్యులతో ఎవరు మాట్లాడిన పదివేల రూపాయల జరిమానా విధిస్తామని ఓ పెద్దమనిషి కులంలో ఇంటింటికీ తిరిగి చెప్పించారని అన్నారు. బహిష్కరణపై జూలపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ విషయమై ఎస్సై సనత్కుమార్ను వివరణ కోరగా విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇంకా ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు. ఫిర్యాదు రాగానే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఫోన్ చేస్తే ఎత్తడు
మొదటి నుంచి అంతే.. ● ఏడాది క్రితం ఇక్కడ పనిచేసిన ఎకై ్సజ్ సీఐకి స్థానిక మద్యం వ్యాపారులతో విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో ఆమెను బదిలీ చేసి.. పెద్దపల్లిలో పని చేస్తున్న వినోద్రాథోడ్ను నియమించారు. ● ఆయన ఇక్కడ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని, ఫోన్ చేసినా స్పందించరనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ● గతంలో ఇక్కడ సీఐలుగా పని చేసిన ఏ అధికారి కూడా ఇలా వ్యవహరించకపోవడం గమనార్హం. ● రోజులు తరబడి విధులకు డుమ్మా కొడుతున్న సీఐ తీరుపై ఉన్నతాధికారులకు తెలిసినా వారు పట్టించుకోవడం లేదు. అనేక ఆరోపణలు ● విధులకు సక్రమంగా హాజరు కాని సీఐ మద్యం, బెల్టు వ్యాపారుల నుంచి మామూళ్లు మాత్రం వసూలు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ● దీనివల్లనే మద్యం వ్యాపారులు పూర్తిగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నప్పటికీ అటు వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలున్నాయి. ● ప్రధానంగా పట్టణంలోని కొన్ని మద్యం దుకాణాల వద్ద రోడ్ల పక్కన మద్యం సేవిస్తున్నారు. దీనివల్ల అటు వైపు నుంచి వెళ్లడానికి మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ● దీనిని దృష్టిలో పెట్టుకొని బహిరంగంగా మద్యం సేవించడాన్ని అరికట్టాలని పలువురు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదు. ● అలాగే ఇటీవల బెల్టు దుకాణాలకు మందు సరఫరా చేసే విషయంలో పట్టణ మద్యం, బార్ వ్యాపారుల మధ్య విభేధాలు తలెత్తాయి. ఈ వ్యవహారంలో ఎకై ్సజ్ సిబ్బంది మద్యం వ్యాపారుల సూచనతో కొన్ని బెల్టు దుకాణాలపై దాడులు చేసి సరుకును స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కనీసం కేసు నమోదు చేయలేదని తెలిసింది. ● ఈ ఒక్కటే కాదు.. బెల్టు దుకాణాల నుంచి తరుచుగా స్వాధీనం చేసుకుంటున్న మద్యాన్ని రికార్డుల్లో చూపకుండా ఆ తర్వాత లైసెన్స్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఐపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ ● సీఐ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడమే కాకుండా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, ఆయనను సస్పెండ్ చేయాలని అధికార పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం ప్రకటన విడుదల చేసిన నాయకులు.. రెండోరోజైన మంగళవారం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి సీఐ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయమై సీఐ వినోద్రాథోడ్ను వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా.. ఆయన స్పందించలేదు. విచారణ జరిపిస్తాం సీఐ వినోద్రాథోడ్పై కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలపై విచారణ జరుపుతాం. ఎక్కడైనా సమస్యలుంటే స్థానిక అధికారులకు ఫిర్యాదు చేయాలి. నా దృష్టికి తీసుకొస్తే తగిన చర్యలు తీసుకుంటాం. – సత్యనారాయణ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అందుబాటులో ఉండడు.. మెట్పల్లి ఎకై ్సజ్ సీఐ వినోద్రాథోడ్ తీరుపై విమర్శలు అతడిపై చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ నాయకుల డిమాండ్ మెట్పల్లి: ప్రభుత్వ అధికారిగా విధులు నిర్వరిస్తూ.. ప్రజా ఫిర్యాదులను పరిష్కరించాల్సిన మెట్పల్లి ఎకై ్సజ్ సీఐ వినోద్ రాథోడ్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విధులను నిర్లక్ష్యం చేస్తూ.. అందుబాటులో ఉండకపోవడం.. సమస్యలపై ఎవరైనా ఫోన్లో ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే స్పందించకపోవడం వివాదానికి దారితీస్తోంది. ఇష్టారాజ్యంగా నడుచుకుంటున్న ఆయనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఏకంగా అధికార కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది. -
వికసిత్ లక్ష్యాల సాధనలో మైనింగ్ పాత్ర కీలకం
● ఎంఈఏఐ జాతీయ సదస్సులో సింగరేణి సీఎండీ బలరాం గోదావరిఖని: మన దేశాన్ని 2047 నాటికి అగ్రదేశంగా తీర్చిదిద్దేందుకు రూపొందించుకున్న వికసిత్ లక్ష్యాలను చేరుకోవడంలో మైనింగ్ రంగం పాత్ర అత్యంత కీలకమని సింగరేణి సీఎండీ ఎన్.బలరాం పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్లోని హోటల్ తాజ్దక్కన్లో మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ ఛాప్టర్ ఆధ్వర్యంలో ‘ఖనిజ అన్వేషణ: ఆత్మనిర్భర్ వికసిత భారత్–2047 వైపు ముందడుగు’ అంశంపై రెండురోజుల పాటు నిర్వహించిన జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో మాట్లాడారు. క్రిటికల్ మినరల్స్ రంగంలో గణనీయమైన పురోగతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం పోత్సాహంతో క్రిటికల్ మినరల్ రంగం అన్వేషణలో ఉన్న అవకాశాలపై సింగరేణి అధ్యయనానికి చర్యలు తీసుకుంటునట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కూడా మైనింగ్ రంగంలో సంస్కరణలు తీసుకురావడం, బడ్జెట్లో ప్రత్యేక నిధులను కేటాయించడం ద్వారా ఈ రంగంపై దృష్టిసారిస్తోందన్నారు. లిథియం, కోబాల్ట్, నికెల్ తదితర అరుదైన ఖనిజాల అన్వేషణ చేపట్టడం ద్వారా భవిష్యత్ టెక్నాలజీ వృద్ధికి దోహదపడిన వాళ్లమవుతామన్నారు. ముఖ్యంగా మన దేశాన్ని 2070 నాటికి నెట్ జీరోగా మార్చాలన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ అరుదైన ఖనిజాల అన్వేషణ ప్రస్తుతం అత్యంత అవసరమన్నారు. సింగరేణి జీఎం(కోఆర్డినేషన్) ఎస్డీఎం.సుభాని, ఎంఈఏఐ సభ్యులు, మైనింగ్ రంగ నిపుణులు పాల్గొన్నారు. దొంగ అరెస్ట్మెట్పల్లిరూరల్: దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ తెలిపారు. మేడిపల్లి శివారులోని ఇబ్రహీంపట్నం క్రాసింగ్ వద్ద మంగళవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఓ యువకుడు అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా పలు విషయాలను చెప్పాడు. గతేడాది డిసెంబర్ రెండున మేడిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీకి పాల్పడినట్లు అంగీకరించాడు. నిందితుడిని కరీంనగర్ జిల్లా రేకుర్తి గ్రామానికి చెందిన తూర్పాటి కనకయ్యగా పోలీసులు వెల్లడించారు. కనకయ్య ఇతర ప్రాంతాల్లోని ఆలయాల్లో కూడా దొంగతనాలు చేశాడని, జైలుకు కూడా వెళ్లొచ్చాడని పోలీసులు తెలిపారు. -
ఉపాధ్యాయ ఓటర్లు ఇలా..
జిల్లా పురుషులు మహిళలు థర్డ్జెండర్ మొత్తం ఆసిఫాబాద్ 325 145 00 470 మంచిర్యాల 999 665 00 1,664 ఆదిలాబాద్ 1,095 498 00 1,593 నిర్మల్ 1,282 684 00 1,966 నిజామాబాద్ 2,176 1,375 00 3,751 కామారెడ్డి 1,307 704 00 2,011 జగిత్యాల 1,232 537 00 1,769 పెద్దపల్లి 647 464 00 1,111 కరీంనగర్ 2,663 1,642 00 4,305 రాజన్నసిరిసిల్ల 677 273 00 950 సంగారెడ్డి 1,520 1,170 00 2,690 మెదక్ 799 548 00 1,347 సిద్దిపేట 2,020 1,192 00 3,212 హన్మకొండ 126 40 00 166 భూపాలపల్లి 64 19 00 83 మొత్తం 16,932 10,156 00 27,088 -
చొప్పదండి పీఏసీఎస్ సేవలు భేష్
చొప్పదండి: పట్టణంలోని చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని సోమవారం హిమాచల్ప్రదేశ్కు చెందిన అధికారుల బృందం సందర్శించింది. హిమాచల్ ప్రదేశ్కు చెందిన సహకార సంఘాల అధ్యక్షులు, అధికా రులు చొప్పదండి సొసైటీని సందర్శించి సహకార సంఘం పనితీరును పరిశీలించారు. పీఏసీ ఎస్ అధ్యక్షుడు వెల్మ మల్లారెడ్డి వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జాతీయస్థాయిలో మూడుసార్లు చొప్పదండి సొసైటీ ఉత్తమ అవార్డులు సాధించడానికి దోహదం చేసిన అంశాలను వివరించారు. వ్యవసాయ రుణాలను వందశాతం రికవరీ చేయడంతో పాటు, ఇతర రుణాలు 85 శాతం రికవరీ అయ్యాయని, సభ్యులకు పది శాతం డివిడెంట్ అందిస్తున్నామని ఆయన అధికారుల బృందానికి తెలిపారు. సొసైటీలోని సిబ్బందికి, రైతులకు బీమా సౌకర్యం కల్పించామని, రైతులకు అందుబాటులో గ్రామాల్లో గోదాములు ఏర్పాటు చేసి ఎరువులు అందిస్తున్నామని వివరించారు. రుణాలు ఇవ్వడమే కాకుండా రైతులకు బహుముఖ సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో పీడీసీ రిసోర్స్ పర్సన్ సత్యనారాయణ, డైరెక్టర్లు, సీ ఈవో కళ్లెం తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. -
మూలన పడేశారు
● నగరపాలక ఉద్యోగుల నిర్లక్ష్యం ● బల్దియాలో వృథాగా ఫ్రీజర్లుకరీంనగర్కార్పొరేషన్: వాహనాలు, పరికరాలను వినియోగించడంలో, పనులు చేయడంలో నగరపాలకసంస్థ ఉద్యోగుల నిర్లక్ష్యానికి అంతుండడం లేదు. ఉద్యోగుల నిర్లక్ష్యంపై ఎన్నిమార్లు ఫిర్యాదులు వచ్చినా, ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేసినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. వాహనాలు, పరికరాలు చిన్న మరమ్మతుకు గురైనా, మూలనపడేసి అవి పూర్తిగా పనికిరాకుండా చేయడంలో బల్దియా అధికారులు, ఉద్యోగులది ఒక ప్రత్యేకత. నగరంలో ఎవరైనా మరణిస్తే వారి అంతిమయాత్రకు నగరపాలకసంస్థ నుంచి వైకుంఠరథం, ఫ్రీజర్లను సమకూరుస్తారు. గతంలో రూపాయికే అంతిమసంస్కారం ప్రవేశపెట్టగా, అంతిమయాత్రకు వేల రూపాయలు ఖర్చు చేయలేని నగరంలోని నిరుపేదలకు అది ఒక వరంలా మారింది. కానీ, ఈ పథకం నిర్వహణలో మాత్రం అధికారులు తరచూ విఫలమవుతూ వస్తున్నారు. ఇప్పటికే వైకుంఠరథాలు సరైన మరమ్మతుకు నోచుకోవడం లేదు. కొద్ది రోజులు పనిచేస్తే, మరికొన్ని రోజులు షెడ్కే పరిమితమవుతున్నాయి. తాజాగా మృతదేహాలను భద్రపరిచే రెండు ఫ్రీజర్లను నగరపాలకసంస్థ కార్యాలయంలో వృథాగా పడవేశారు. అంతిమసంస్కారానికి ముందు కొన్ని గంటల పాటు మృతదేహం చెడిపోకుండా ఉండేందుకు ఉపయోగించే ఫ్రీజర్లు నగరపాలకసంస్థ కార్యాలయంలో ఓ పక్కన వృథాగా పడవేయడంపై సామాజిక కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఫ్రీజర్లు పనిచేయని పక్షంలో మరమ్మతు చేసి ఉపయోగించాల్సిన అధికారులు, పట్టించుకోకుండా పక్కన పడవేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఉపయోగించకపోతే ఎవరైనా స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులకు ఫ్రీజర్లు అప్పగిస్తే బాగుండేదని, వృథాగా పడేయడంతో అవి పూర్తిగా పనికిరాకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా నగరపాలకసంస్థ ఉన్నాధికారులు రెండు ఫ్రీజర్లను వినియోగంలోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు. -
పట్టభద్రుల ఓటర్లు ఇలా..
జిల్లా పురుషులు మహిళలు థర్డ్జెండర్ మొత్తం ఆసిఫాబాద్ 4,297 1,840 00 6,137 మంచిర్యాల 19,041 11,880 00 30,921 ఆదిలాబాద్ 10,323 4,612 00 14,935 నిర్మల్ 11,497 5,644 00 17,141 నిజామాబాద్ 19,993 11,581 00 31,574 కామారెడ్డి 11,616 4,793 01 16,410 జగిత్యాల 21,667 13,614 00 35,281 పెద్దపల్లి 19,008 12,028 01 31,037 కరీంనగర్ 42,806 28,739 00 71,545 రాజన్నసిరిసిల్ల 13,772 8,625 00 22,397 సంగారెడ్డి 17,383 8,269 00 25,652 మెదక్ 8,879 3,593 00 12,472 సిద్దిపేట 21,587 11,002 00 32,589 హన్మకొండ 3,162 1,423 00 4,585 భూపాలపల్లి 1,734 749 00 2,483 మొత్తం 2,26,765 1,28,392 02 3,55,159 -
గ్రాడ్యుయేట్స్ 3,55,159, టీచర్స్ 27,088
● ఎమ్మెల్సీ ఎన్నికల తుది ఓటర్లు ఖరారు ● ఓటర్లలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ ● నేతలందరి దృష్టి కన్నారంపైనే..సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ – మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలకు తుది ఓటర్ల జాబితా ఖరారైంది. సోమవారం ఎన్నికల కమిషన్ విడుదల చేసిన గణాంకా ల ప్రకారం.. పట్టభద్రుల ఓటర్లుగా ఇప్పటివరకు 3,55,159 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 27,088 మంది ఎన్రోల్ చేసుకున్నారు. ఈనెల 3న నామినేషన్ ప్రక్రియ మొదలైంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 100 మంది అభ్యర్థులు 192 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 17 మంది అభ్యర్థులు 38 సెట్ల నామినేష న్లు వేశారు. ఉపసహంరణల అనంతరం గ్రాడ్యుయే ట్ ఎమ్మెల్సీ బరిలో 56 మంది, టీచర్స్ బరిలో 15 మంది నిలిచారు. ఇప్పటికే ఇటు గ్రాడ్యుయేట్స్, టీ చర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈనెల 27న జరిగే ఎన్నిక కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ ఓటర్ల జాబితాలో కొత్త, పాత జిల్లాలవారీగా చూసినా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముందంజలో ఉంది. మొత్తంగా 4 ఉమ్మడి జిల్లాలు, 15 కొత్త జిల్లాలలోని 3.55 లక్షల ఓటర్లలో పాత కరీంనగర్ జిల్లాలోనే 1,60,260 మంది గ్రాడ్యుయేట్లు ఎన్రోల్ అయి ఉన్నారు. ఇక టీచర్స్ నియోజకవర్గంలో మొత్తం 27,088 ఓటర్లకు 18,953మంది నమోదు చేసుకున్నారు. ఏ రకంగా చూసినా.. కొత్త, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓటర్ల పరంగా అగ్రభాగాన ఉన్న నేపథ్యంలో నాయకులంతా ఈ జిల్లాపైనే ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. టీచర్స్, గ్రాడ్యుయేట్స్ నియోజవర్గాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా అత్యల్ప ఓట్లతో చివరి స్థానంలో నిలిచింది. ఈనెల 27న పోలింగ్ జరగనుండగా.. మార్చి 3న ఓట్ల లెక్కింపు, 08న ఓటింగ్ ప్రక్రియ పూర్తికానుంది. -
కబ్జాలపై చర్యలు తీసుకోవాలి
కరీంనగర్కార్పొరేషన్: నగరపాలకసంస్థలో ఇటీవల విలీనమైన చింతకుంట గ్రామంలోని శాంతినగర్లో జరుగుతున్న ప్రభుత్వ భూముల కబ్జాలపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త ఎంఎ జమీల్ డిమాండ్ చేశారు. సోమవారం నగరపాలక్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్కి ఫిర్యాదు చేశారు. విలీన గ్రామాల్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్న వ్యవహారంపై ‘సర్కారు భూములు మాయం’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో కథనం రావడం తెలిసిందే. ఈ క్రమంలో శాంతినగర్ కాలనీలోని సర్వేనంబర్ 439లో ఉన్న ప్రభుత్వ భూమిలో కొంతమంది అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. కబ్జాలపై విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ను కోరారు.