breaking news
Karimnagar District News
-
విశ్వవిపణిలోకి సింగరేణి
గోదావరిఖని: దసరా పండగకు ముందే ప్రభుత్వం సింగరేణికి శుభవార్త చెప్పింది. ఫ్యూచర్ సిటీలో పదెకరాలు కేటాయిస్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బహిరంగ సభలో ప్రకటించడంతో ప్రపంచస్థాయి వ్యాపార విస్తరణకు మార్గం సుగమమైనట్లయ్యింది. అయితే, ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తిచేస్తేనే స్థలం అప్పగిస్తామని సీఎం కండిషన్ పెట్టారు. ప్రపంచస్థాయి సంస్థలతో పోటీపడే అవకాశం సింగరేణికి కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మహారత్న కంపెనీలకు దీటుగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సింగరే ణి వరుస లాభాలతో మహారత్న కంపెనీలకు ధీటు గా ముందుకు సాగుతోంది. సుమారు 41వేల మంది పర్మినెంట్, మరో 30వేల మంది కాంట్రాక్టు కార్మికులతో ఏటా 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. దీంతోపాటు సోలార్, థర్మల్ విద్యుత్ రంగాల్లోనూ దూసుకెళ్తోంది. రాబోయే రోజుల్లో వ్యాపారాలను మరింతగా విస్తరించేందుకు యోచిస్తోంది. ఇప్పటికే గోల్డ్, మెటల్ మైన్స్ పరిశోధనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందిఉంది. క్లిటికల్ మినరల్ పరిశోధనలోనూ ముందుకెళ్తోంది. రామ గుండం రీజియన్లోని మేడిపల్లి ఓసీపీలో హైడ్రోపవర్ ఉత్పత్తికి కూడా ప్రయోగ్మాకంగా సిద్ధమైంది. ఇతర రాష్ట్రాలకూ విస్తరణ.. సింగరేణి తెలంగాణతోపాటు పలురాష్ట్రాల్లో వ్యాపార విస్తరణ కొనసాగిస్తోంది. గోల్డ్, కాపర్ అన్వేషణ కోసం కర్నాటక రాష్ట్రంలోని దేవదుర్గలో పరిశోధనకు లైసెన్స్ పొందింది. ఒడిశా నైనీబ్లాక్లో భారీ ప్రాజెక్టు ప్రారంభించి బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. పదెకరాల్లో కార్పొరేట్ కార్యాలయం.. సింగరేణి ప్రధాన కార్యాలయం కొత్తగూడెంలో ఉంది. కార్పొరేట్ కార్యాలయం హైదరాబాద్లో ఉంది. వ్యాపార విస్తరణకు అనుగుణంగా కార్యాలయాన్ని కూడా విస్తరించేందుకు ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం స్థలం కేటాయించినట్లు తెలుస్తోంది. సుమారు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నారు. ఓఆర్ఆర్, ట్రిపుల్ఆర్ కనెక్టివి కల్పించారు. నెట్జీరో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీ, వాణిజ్య, వసతి, పారిశ్రామిక, వినోదం ప్రాంతాలు అనుసంధానంగా ఫ్యూచర్ సిటీ ఉంటుంది. అందులో పదెకరాలు కేటాయించడం సింగరేణికి శుభసూచకమని నిపుణులు పేర్కొంటున్నారు. -
పకడ్బందీగా ‘స్థానిక’ ఎన్నికలు
● పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దు ● కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్/కరీంనగర్ అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి వివిధశాఖల ఉన్నతాధికారులతో సమీక్షించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు పూర్తి చేయాలన్నా రు. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై నవంబర్ 11 వరకు ప్రక్రియ పూర్తి కానుందని వివరించారు. జిల్లాలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. నామినేషన్ నుంచి ఓటింగ్, ఫలితాల వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. డీఆర్వో బి.వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈవో శ్రీనివాస్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్బాబు, డీపీవో జగదీశ్, జెడ్పీ డిప్యూటీ సీఈవో పవన్, కలెక్టరేట్ ఏవో సుధాకర్ పాల్గొన్నారు. బతుకమ్మ నిమజ్జనం పాయింట్ల పరిశీలనకరీంనగర్ కార్పొరేషన్: నగరంలో సద్దుల బతుకమ్మ పండుగకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ అన్నారు. సోమవారం సద్దుల బతుకమ్మ సందర్భంగా నగరంలోని రేకుర్తి, మల్కాపూర్, చింతకుంట, మానేరు డ్యాం, మార్కండేయనగర్, గౌతమీనగర్, లేక్ పోలీస్స్టేషన్, వేదభవన్, గోపాల్పూర్ తదితర ప్రాంతాల్లోని బతుకమ్మ నిమజ్జనం పాయింట్లను తనిఖీ చేశారు. ప్రతి నిమజ్జనం పాయింట్ వద్ద లైటింగ్, బారికేడింగ్, తాగు నీటి సౌకర్యం సదుపాయాలు కల్పించామని తెలిపారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. సద్దుల బతుకమ్మను నగరవాసులు ఘనంగా జరుపుకొన్నారని ఆయన తెలిపారు. కమిషనర్ వెంట ఎస్ఈ రాజ్కుమార్, ఈఈ యాదగిరి తదితరులు ఉన్నారు. రోడ్డుపై చెత్త.. హోటల్కు జరిమానాకరీంనగర్ కార్పొరేషన్: నగరంలో డంపర్బిన్ల వద్ద రోడ్డుపై చెత్త వేస్తున్న హోటల్ నిర్వాహకులకు నగరపాలకసంస్థ అధికారులు సోమవా రం జరిమానా విధించారు. నగరంలోని పలు చోట్ల డంపర్బిన్లు, అండర్ బిన్ల వద్ద రోడ్లపై చెత్త వేస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతం దుర్వాసన వెదజల్లుతోంది. యూజర్ చార్జీలు చెల్లించి, నగరపాలకసంస్థ వాహనాల్లో చెత్త వేయాల్సి ఉండగా, కొంతమంది వ్యాపారులు ఆటోల్లో చెత్త తీసుకువచ్చి డంపర్బిన్ల వద్ద రోడ్లపై పడవేస్తున్నారు. బస్స్టేషన్ వెనుకాల ఉన్న డంపర్బిన్ వద్ద రోడ్డుపై చెత్త వేస్తున్న లావిస్ మండి హోటల్కు రూ.10 వేలు జరిమానా విధించినట్లు నగరపాలకసంస్థ వైద్యాధికారి సుమన్ తెలిపారు. జరిమానా రశీదును హోటల్ నిర్వాహకులకు అందించారు. కరీంనగర్రూరల్: కరీంనగర్ నియోజకవర్గంలో అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలి చాల రాజేందర్రావు అన్నారు. సోమవారం కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్రావుతో కలిసి మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం క రీంనగర్ నియోజకవర్గానికి 4వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని, అదనంగా మరో 4వేల ఇళ్లు మంజూరు చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిపారు. దసరా పండుగ అనంతరం ల బ్ధిదారులందరూ ఇంటి నిర్మాణాలు ప్రారంభించాలని సూచించారు. నాయకులు కూర నరేశ్రెడ్డి, బుర్ర స్వామి, నారా యణ, మడ్డి రంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
చెత్త కుప్పల్లో ఫోర్టిఫైడ్ రైస్
వెల్గటూర్: ప్రజలకు బలవర్ధకమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పంపిణీ చేసిన ఫోర్టిఫైడ్ రైస్ను గుర్తు తెలియని వ్యక్తులు మండలకేంద్రంలోని పెద్దవాగు పక్కన చెత్త కుప్పల్లో పడేసి వెళ్లిన ఘటన చర్చనీయాంశమైంది. సుమారు 50కి పైగా ఫోర్టిఫైడ్ రైస్ సంచులను పడేసి వెళ్లారు. ప్రభుత్వం సరఫరా చేసే రేషన్లో ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఐరన్, పోలిక్ యాసిడ్, విటమిన్ బీ–12 పుష్కలంగా ఉంటాయి. ఇందుకోసం మిల్లర్లకు ఫోర్టిఫైడ్ రైస్ను ప్రభుత్వమే అందిస్తుంది. బియ్యాన్ని మూడు నెలలవరకు మాత్రమే నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయమై తహసీల్దార్ శేఖర్ను వివరణ కోరగా.. గడువు ముగిసిన బియ్యాన్ని ఎవరో మిల్లర్లు ఇక్కడ పడేసి ఉంటారని తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించామని, బియ్యం బహిరంగ ప్రదేశంలో పడేయడం ద్వారా పశువులు, ఇతర జీవులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని, జేసీబీతో గుంత తవ్వి అందులో పూడ్చి పెట్టామని తెలిపారు. -
స్థానిక సమరానికి బీజేపీ సై
కరీంనగర్ టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి బీజేపీ సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన కరీంనగర్ పార్లమెంట్ ప్రజల కోసం, కాషాయ జెండాను నమ్ముకున్న కార్యకర్తలను గెలిపించడం కోసం ఢిల్లీ ఎన్నికల్లోనే కాదు గల్లీ ఎన్నికల్లోనూ కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లా పరిషత్ పీఠాలపై కాషా య జెండా ఎగరేసి తీరుతాం అని స్పష్టం చేశారు. పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న కార్యకర్తలకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ టిక్కెట్లు ఇస్తామని ప్రకటించా రు. అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే సర్వే టీంలు ఒక దఫా సర్వే పూర్తి చేశాయని, రిజర్వేషన్లు ఖరా రైన నేపథ్యంలో సర్వే టీంలు రంగంలోకి దిగాయని అన్నారు. రిజర్వేషన్ల మూలంగా టిక్కెట్లు రాకపోయినా నిరాశ చెందవద్దని, ఇతరత్రా పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడాన్ని బీజేపీ పక్షాన స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. -
అస్వస్థతకు గురైన ఉపాధ్యాయుడు మృతి
పెగడపల్లి: మండలంలోని నామాపూర్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) ఐలయ్య (38) చికిత్స పొదుతూ మృతి చెందాడు. ఈనెల 25న మల్యాలలో జరిగిన ఎన్నికల శిక్షణలో పాల్గొన్న ఆయన అక్కడే అస్వస్థతకు గురయ్యాడు. అతడిని చికిత్స నిమిత్తం జగిత్యాలలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఐలయ్యకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఐలయ్య మృతిపై తపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి బోనగిరి దేవయ్య, బోయినపల్లి ప్రసాద్రావు సానుభూతి తెలిపారు. ఐలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. పోతారంలో వివాహిత అదృశ్యంమల్యాల: మండలంలోని పోతారానికి చెందిన దాసరి లత అదృశ్యమైనట్లు ఆమె భర్త రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై నరేశ్కుమార్ తెలిపారు. రవీందర్ ఈనెల 25న మర్రిపల్లిలో ఉన్న తన కూతురు ఇంటికి కొడుకుతో కలిసి వెళ్లాడు. కొద్దిసేపటికే ఆయన భార్య లత ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో రవీందర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంథనిరూరల్: పట్టణంలోని ఓ ఫెర్టిలైజర్ షాప్నుంచి అక్రమంగా తరలిస్తున్న యూరియాను అడవిసోమన్పల్లి చెక్పోస్ట్ వద్ద అధికారులు పట్టుకున్నారు. యూరియా అక్రమ రవాణాను నియంత్రించేందుకు అడవిసోమన్పల్లి వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేశారు. అయితే, సోమవారం ఓ మినీ వాహనంలో సుమారు 50 యూరియా బస్తాలు తరలిస్తుండగా సిబ్బంది తనిఖీ చేశారు. వాహనాన్ని అదుపులోకి తీసుకుని మంథనికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని సదరు యజమానికి జరిమానా విధించారు. ఇందిరమ్మ చీరలు ఎక్కడ?● ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ● బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్రావు జగిత్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలిచ్చి గద్దెనెక్కిన అనంతరం ప్రజలను విస్మరిస్తోందని, ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని, రూ.800 బతుకమ్మ చీరలు ఎక్కడిచ్చారని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్రావు ప్రశ్నించారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు తండ్రిలాంటి కేసీఆర్ను తిట్టడం తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. రూ.4 వేల పెన్షన్, రైతులకు బోనస్ వంటి ఎన్నో హామీలిచ్చి ఒక్కటీ సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో ప్రజలు బుద్ది చెప్పాలని కోరారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఎక్కడ అని ప్రశ్నించారు. మాజీ కౌన్సిలర్ దేవేందర్నాయక్, ప్రధాన కార్యదర్శి ఆనందరావు, ఉపాధ్యక్షుడు వొల్లం మల్లేశం, నాయకులు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం తప్పదు మెట్పల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్కు స్థానిక ఎన్నికల్లో భంగపాటు తప్పదని విద్యాసాగర్రావు అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. నాలుగు మండలాల నాయకులు పాల్గొన్నారు. వారికి పలు సూచనలు చేశారు. ఐక్యంగా పని చేస్తే అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామని పేర్కొన్నారు. -
వేధించినందుకే యువకుడి హత్య
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లిలో ఈనెల 27న ఎదురుగట్ల సతీశ్ (28) హత్యకు గురైన విషయం తెల్సిందే. అదే గ్రామానికి చెందిన ఓ యువతిని సతీశ్ వేధించినందుకే యువతి బంధువులు హత్య చేసినట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని పేర్కొన్నారు. రూరల్ సీఐ కార్యాలయంలో నిందితుల వివరాలు వెల్లడించారు. రేచపల్లికి సతీశ్ 20రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ యువతితో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆమెను తన ప్రేమికురాలని, ఆమెను ఎవరూ పెళ్లి చేసుకోవద్దంటూ పోస్ట్ చేశాడు. దీంతో ఆగ్రహించిన ఆమె కుటుంబ సభ్యులు ఈనెల 27న రాత్రి 7.30 గంటల సమయంలో ఇంట్లో ఉన్న సతీశ్ను బయటకు తీసుకొచ్చి కారంపొడి చల్లి కర్రలతో తలపై కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. నిందితులను అదే గ్రామానికి చెందిన నాంతారి వినాజీ, నాంతారి శాంత, జలగా గుర్తించామని, సోమవారం 10 గంటల ప్రాంతంలో రేచపల్లిలో వారిని పట్టుకుని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఓ మైనర్ పరారీలో ఉన్నాడని వివరించారు. నిందితుల నుంచి రక్తపు మరకల దుస్తులు, హత్యకు ఉపయోగించిన కర్రలు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసును త్వరితగతిన ఛేదించిన రూరల్ సీఐ సుధాకర్, సారంగాపూర్ ఎస్సై గీతను అభినందించారు. పరారీలో మైనర్ డీఎస్పీ రఘుచందర్ వెల్లడి -
అబుదాబిలో పూలపండుగ
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): అబుదిబిలోని తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. ఇండియా అండ్ సోషల్ కల్చర్ వేదికగా తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యలో ఉత్సవాలు నిర్వహించారు. యుఏఈలోని భారత రాయబార కార్యాలయం నుంచి ఫస్ట్ సెక్రటరీ కమ్యూనిటీ వెల్ఫేర్ కో ఆర్డినేషన్ జార్జీజార్జ్ ముఖ్య అథితిగా హాజరయ్యారు. ప్రతినిధులు జయచంద్రన్ నాయర్, షాజీ వీకే, సర్వోత్తమ్ శెట్టి, విజయ్ మానె, దివాకర్ ప్రసాద్, వినాయక్ అవాటె తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ కవి, గాయకుడు కోకిల నాగరాజు, యువగాయని సోని యాదర్ల బతుకమ్మ ఆటాపాటలతో ఉర్రూతలూగించారు. ఉత్సవ నిర్వాహకులు రాజా శ్రీనివాస్రావు, గంగారెడ్డి, వంశీ, సందీప్, గోపాల్, సతీశ్, పావని, అర్చన, దీప్తి, పద్మజ ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
ఇందిరమ్మ లబ్ధిదారులకు ఉపాధి
కరీంనగర్ అర్బన్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం బాసటగా నిలువాలని నిర్ణయించింది. ఇందిరమ్మ ఇళ్లనిర్మాణాలకు ఉపాధి హామీ పథకా న్ని అనుసంధానించింది. జాబ్కార్డు ఉన్నవారికి 90 రోజులు పని కల్పించి అ వేతన డబ్బులు వారి ఖాతాలోనే జమ చేయాలని నిర్ణయించింది. లబ్ధిదా రుకు జాబ్కార్డు ఉంటే రోజు కూలీ రూ.307కు గానూ గరిష్టంగా 90 రోజుల ఉపాధి పనులకు రూ.27,630 ఖాతాలో జమ చేస్తారు. స్వచ్ఛభారత్ కింద మరుగుదొడ్డి నిర్మించుకుంటే రూ.12వేలు అందించనున్నారు. పంచాయతీరాజ్ శాఖ నుంచి ఈ మేరకు ఆదేశాలు రాగా జిల్లాలో 542 మంది లబ్దిదారులకు జాబ్ కార్డులున్నట్లు తేలింది. వివిధ దశల్లో చేయూత జిల్లాలో 8,219 లబ్ధిదారులకు ప్రభుత్వం ఇందిర మ్మ ఇళ్లను మంజూరు చేసింది. 30శాతం మంది పనులు ప్రారంభించారు. జాబ్కార్డు ఉన్నవారికి ఉపాధి హామీ పఽథకం కింద ఇందిరమ్మ ఇల్లు పునాదిస్థాయి వరకు 40రోజులు, స్లాబ్ వేసేవరకు 50 పని దినాలు మొత్తం 90 రోజులు పనులు కల్పిస్తారు. వేతన చెల్లింపులకు నిర్మాణ పనుల్లో మూడుస్థాయిల్లో లబ్ధిదారు ఫొటోలను తీసుకుని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నిర్మాణ పనులు పూర్తయ్యాక పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరిస్తే లబ్ధిదా రు ఖాతాలో వేతన డబ్బులు జమవుతాయి. -
బతుకమ్మపై మాజీ సీఎం కేసీఆర్ పేరు
బీఆర్ఎస్ నాయకుడు, సెస్ మాజీ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి బతుకమ్మపై రంగులతో మాజీ సీఎం కేసీఆర్ పేరును అద్ది అభిమానాన్ని చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన మల్లారెడ్డి– సుమలత దంపతులు బతుకమ్మను పేర్చి కేసీఆర్ పేరు వచ్చేలా తీర్చిదిద్ది అబ్బురపర్చారు. గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు బతుకమ్మను చూసి సంబరపడ్డారు. – ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల) బతుకమ్మపై సీఎం కేసీఆర్ పేరుతో అభిమానం చాటుకున్న మల్లారెడ్డి -
ఇక సంగ్రామమే..
జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మొత్తం జెడ్పీ చైర్మన్ కరీంనగర్ 03 00 06 06 15 బీసీ(జనరల్) సిరిసిల్ల 03 01 05 03 12 ఎస్సీ(జనరల్) జగిత్యాల 04 01 09 06 20 మహిళ(జనరల్) పెద్దపల్లి 06 03 00 04 13 మహిళ(జనరల్)సాక్షిప్రతినిధి, కరీంనగర్: సా్థనిక ఎన్నికలకు నగారా మోగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీతోపాటు గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. తొలుత రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ.. తదుపరి మూడు దశల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. వచ్చే నెల 9నుంచి నవంబర్ 11వరకు ఎన్నికల పక్రియ కొనసాగనుంది. 33 రోజుల పాటు కోడ్ అమల్లో ఉండనుంది. పల్లెల్లో రాజకీయ సందడి జోరందుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ గెలుపే లక్ష్యంగా గ్రామాల వారీగా బలమైన అభ్యర్థుల కోసం వెతుకులాట ప్రారంభించగా, ఆశావహులు ఒక్కచాన్స్ ఇవ్వండంటూ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గతంకు భిన్నంగా... ఎప్పుడైనా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చే శాక, పంచాయతీ ఎన్నికలు నిర్వహించేవారు. ఈసారి రెండు ఎన్నికలను కలిపి నిర్వహిస్తుండటంతో పోటీ చేసి ఓడిపోతే ఇంట్లోనే కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆశావహులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 646 ఎంపీటీసీ, 60 ఎంపీపీ, 60 జెడ్పీటీసీలకు, 1,226 సర్పంచ్ స్థానాలకు, 5,968 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం సీట్ల ల్లో 50శాతం తగ్గకుండా మహిళలకు కేటాయించారు. ముగ్గురు పిల్లలుంటే అనర్హులే.. కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించేందుకు 1994లో పంచాయతీరాజ్ చట్టంలో ఈ నిబంధన తీసుకొచ్చారు. దీని ప్రకారం ముగ్గురు పిల్ల లుంటే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. తాజాగా ప్రభుత్వం ఈ నిబంధన ఎత్తివేయాలని ఆలోచించినా పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 21(3)ని సవరించలేదు. దీంతో ముగ్గురు పిల్లలు నిబంధన యథాతథంగా ఉండనుంది. కోర్టులో ఉండడంతో.. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రామచంద్రపల్లి, కుర్మపల్లి గ్రామాల విషయం కోర్టు పరిధిలో ఉండగా రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టలేదు. మరోవైపు జిల్లా రిజర్వేషన్ల ప్రక్రియ వివరాలు వెల్లడించేందుకు జిల్లా పంచాయతీ అధికారి, డీపీఆర్వో సుముఖత చూపలేదు.జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మొత్తం కరీంనగర్ 03 00 06 06 15 సిరిసిల్ల 03 01 05 03 12 జగిత్యాల 04 01 08 07 20 పెద్దపల్లి 05 03 00 05 13జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మొత్తం సిరిసిల్ల 53 30 101 76 260 జగిత్యాల 68 31 153 133 385 పెద్దపల్లి 54 06 110 93 263 కరీంనగర్ – – – – –జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మొత్తం కరీంనగర్ 39 00 73 58 170 సిరిసిల్ల 25 07 56 35 123 జగిత్యాల 26 07 52 41 126 పెద్దపల్లి 25 03 59 50 137 -
ఎకై ్సజ్ ఎస్సై నుంచి ఎంపీడీవో వరకు..
చిగురుమామిడి: కొండాపూర్ గ్రామానికి చెందిన బింగి సాయికీర్తన ఎంపీడీవో ఉద్యోగం సాధించారు. సీఎం రేవంత్రెడ్డి నుంచి నియామకపుపత్రం అందుకున్నారు. హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్న ఆమె.. గ్రూపు– 2 ద్వారా ఎకై ్సజ్ ఎస్సైగా ఉద్యోగం సాధించారు. అంతటితో ఆగకుండా గ్రూప్–1 పరీక్ష రాసి ఎంపీడీవోగా ఎంపికయ్యారు. నిజామాబాద్లో బీడీఎస్ పూర్తిచేసి.. ఏడాదిపాట ప్రాక్టీస్ చేసినా సంతృప్తి చెందలేదలేదు. ఏడాదిపాటు ఆన్లైన్లో శిక్షణ తీసుకుని పరీక్ష రాసి.. ఎంపీడీవో ఉద్యోగం సాధించారు. సాయికీర్తన తల్లిదండ్రులు సరోజన– సంపత్కు సాయికీర్తనకు ఒక తమ్ముడు ఉన్నాడు. -
ఇంటర్వ్యూకి వెళ్లి అనంతలోకాలకు..
● రైలు ప్రమాదంలో యువకుడి దుర్మరణం వీణవంక(హుజూరాబాద్): ఇంటర్వ్యూ కోసం వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు రైలు ప్రమాదంలో మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. వీణవంక మండలకేంద్రానికి చెందిన గడ్డం సాయికృష్ణ(29)హైదరాబాద్లో సీఏ పూర్తి చేశాడు. రెండురోజుల క్రితం ఓ కంపెనీలో ఇంటర్వ్యూ కోసం విశాఖపట్నం వెళ్లాడు. అక్కడి నుంచి ఓ ఫంక్షన్ కోసం శనివారం విజయనగరానికి రైలులో వెళ్తుండగా ప్రమాదవాశాత్తు రైలు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబీకులకు రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చారు. కాగా ఇంటర్వ్యూ వద్దని తల్లిదండ్రులు చెప్పినా జాబ్ కోసమని వెళ్లిన చయువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కోతులను వెళ్లగొట్టబోయి వ్యక్తి..కోనరావుపేట(వేములవాడ): కోతులను వెళ్లగొట్టే క్రమంలో కిందపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోనరావుపేట మండలంలోని సుద్దాల గ్రామానికి చెందిన బొడ్డు రాజయ్య(60) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆదివారం ఇంటి వద్ద ఉండగా కోతుల గుంపు ఇంటిపైకి రావడంతో వాటిని వెళ్లగొట్టే ప్రయత్నంలో ఒక్కసారిగా అవి మీదకి రావడంతో గట్టిగా కేకవేసి కుప్పకూలి పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. గ్రామంలో కొన్ని నెలలుగా కోతులతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, కోతుల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఒకరి మృతికరీంనగర్క్రైం: కరీంనగర్లోని హుస్సేనిపురకు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మృతిచెందాడు. త్రీటౌన్ పోలీసులె తెలిపిన వివరాల ప్రకారం.. హుస్సేనిపురకు చెందిన షేక్ ముజాయిద్ హుస్సెన్(52)కు భార్య మసేహా సుల్తానా, కూతురు, కొడుకున్నారు. రెగ్జిన్ వర్క్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 26వ తేదీన పెద్దపల్లిలో బంధువులు శుభకార్యానికి ముగ్గురు వెళ్లారు. షేక్ ముజాహిద్ హుస్సెన్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. 27వ తేదీన ఉదయం ఇంట్లోవాళ్లకు ఫోన్ చేసి మాట్లాడాడు. తరువాత ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆదివారం ఉదయం చూసేసరికి మృతిచెంది ఉన్నాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. -
ఆరు ఉద్యోగాల అశ్విని
సారంగాపూర్(జగిత్యాల): బీర్పూర్ మండలం తాళ్ళధర్మారం గ్రామానికి చెందిన శనిగారపు అశ్విని గ్రూప్– 2 ఫలితాల్లో ఎకై ్సజ్ ఎస్సైగా ఉద్యోగం సాధించింది. తల్లిదండ్రులు మల్లయ్య, లక్ష్మి. వ్యవసాయ కుటుంబం. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 7వ తరగతి, తుంగూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి చదివింది. అనంతరం బాసర ట్రిపుల్ ఐటీలో బీటెక్, ఉస్మానియాలో ఎంటెక్ చేసి, ప్రభుత్వ ఉద్యోగ సాధనకు ప్రణాళితో చదివింది. మొదట పంచాయతీ సెక్రటరీ, తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, రైల్వే ఎస్సై, సివిల్ ఎస్సై ఉద్యోగాలు సాధించింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ట్రైనీ ఎస్సైగా శిక్షణ పొంది అక్కడే బాధ్యతలు చేపట్టింది. అనంతరం వరంగల్ సీఐడీ విభాగానికి బదిలీపై వెళ్లి గ్రూప్– 1కు ప్రిపేర్ అయ్యింది. ప్రస్తుతం గ్రూప్– 2లో ఎకై ్సజ్ ఎస్సైగా ఉద్యోగం సాధించింది. ఈ సందర్భంగా అశ్విని సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో బోధనతోనే తాను ఈ స్థాయికి చేరానని చెప్పింది. -
‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధం కావాలి
కరీంనగర్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకునేందుకు సీపీఐ శ్రేణులు సిద్ధం కావాలని ఆపార్టీ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో జిల్లా కార్యవర్గ సభ్యుడు నాగెల్లి లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో సర్పంచ్, ఎంపీటీసీల పదవీకాలం ముగిసి దాదాపు 20 నెలలు అవుతుందని, దీంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని, కేంద్ర నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయన్నారు. జిల్లాలో అత్యధికంగా ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలు గెలుచుకునేందుకు ఇప్పటినుంచి అన్ని గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పొనగంటి కేదారి, స్వామి తదితరులు పాల్గొన్నారు. -
‘లయ’ తప్పుతోంది!
● వయస్సుతో సంబంధం లేకుండా.. చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని వయస్సుల వారిని గుండె జబ్బు ప్రస్తుతం వేధిస్తోంది. వాతావరణ కాలుష్యం, మారిన జీవనశైలి, ఒత్తిడితో కూడిన పని విధానం, సరైన నిద్రలేకపోవడం, ధూమపానం తదితరాలు దీనికి కారణభూతమవుతున్నాయి. జిల్లాలో గుండెపోటు రోగులు ఎక్కువవుతున్నారు. హృద్రోగ సంబంధిత వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా గుండెపోటుతో క్షణంలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఇటీవల కాలంలో 20 ఏళ్లు నిండినవారికి సైతం గుండెపోటు వచ్చి మరణించడం కలకలం రేపుతోంది. చిన్నతనం నుంచే తగు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని వైద్యులు సూచిస్తున్నారు. ● జిల్లాలో 3.5 లక్షల మంది హృద్రోగులు జిల్లాలో సుమారు 3.5 లక్షల మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా జనాభాలో ఇది దాదాపు 15 శాతం కావడం ఆందోళన కలిగిస్తోంది. హృద్రోగ సమస్యలతో నిత్యం వెయ్యి మంది రోగులు డాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో 15 మంది నిపుణులు రోగులకు సేవలందిస్తున్నారు. ● గోల్డెన్ హవర్ కీలకం ఛాతిలో నొప్పి వస్తే ఒక్కోసారి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల వచ్చిందా లేదా గుండెపోటా.. అనేది గుర్తించడం కష్టం. వీపు ప్రాంతం నుంచి భుజం మీదుగా ఛాతిలో నొప్పి వచ్చినప్పుడు.. చెమటలు పట్టి శరీరం చల్లగా అయిపోతున్నట్లు ఉంటే దాన్ని గుండెపోటుగా భావించాలి. ఇలా నొప్పి వచ్చినప్పుడు మొదటి గంటలో వైద్యం అందిస్తే రోగి తక్షణమే కోలుకుంటారు. దీన్నే గోల్డెన్ హవర్ అంటారు. అయితే మొదటి గంటలో ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు యాస్ప్రిన్ మాత్రలతో కూడిన మూడు మాత్రల కిట్ నమిలి మింగాలి. ఇలా చేస్తే గుండె జబ్బు సగం తగ్గిపోతుంది. ఒక వేళ గుండెనొప్పి కాకపోయినా యాస్ప్రిన్ మాత్ర వేసుకున్నా నష్టం జరగదు. ఆస్పత్రికి వెళ్లాక పరీక్షలు చేసి చికిత్స ద్వారా ప్రాణాపాయాన్ని నివారించొచ్చు. ● ఆధునిక జీవన విధానమే కారణం గుండె వ్యాధులకు ప్రధాన కారణం ఆధునిక జీవన విధానమే. తగిన శారీరక శ్రమలేకపోవడం, జంక్ ఫుడ్స్, తగిన విశ్రాంతి తీసుకోకపోవడం, నిద్రలేమి, అతిగా ఆయిల్ ఫుడ్ తీసుకోవడం, ఊబకాయం, మ ధుమేహం నియంత్రణలో లేకపోవడం తదితరాలు దీనికి కారణమవుతున్నాయి. పర్యావరణం కాలు ష్యం, ధూమపానం కూడా ఓ కారణమవుతోంది. కరీంనగర్టౌన్: గుండెపోటు.. ఈ పదం వింటేనే ఎంతో మందికి వణుకు పుడుతోంది. ఇది పెద్దలకే వస్తుంది.. మనకేంటనే ధీమా చాలా మంది నడివయస్కులు, యువతలో ఉండేది. అయితే మారుతున్న జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, ధూమపానం, ఒత్తిడితో కూడుకున్న పని వాతావరణం తదితర కారణాలతో దాదాపు అందరికీ ఈ ముప్పు ప్రస్తుతం పొంచి ఉంది. గుండె రక్తనాళాలు మూసుకుపోవడంతో హార్ట్ అటాక్కు గురై ఇట్టే కుప్పకూలి మృత్యువాతపడుతున్నారు. ఈ తరుణంలో హృద్రోగ సమస్యలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డే నిర్వహిస్తోంది. జిల్లాలో పెరుగుతున్న హృద్రోగ బాధితులు యువతలోనూ తీవ్రమవుతున్న సమస్య చిన్నతనం నుంచే జాగ్రత్తలు అవసరం నేడు వరల్డ్ హార్ట్ డేగతానికి భిన్నంగా యువతలోనూ గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోకూడదు. జంక్ ఫుడ్స్, ధూమపానానికి దూరంగా ఉండాలి. రోజూ కనీసం 45 నిమిషాలు నడవాలి. 30 ఏళ్లు నిండినవారు ఏడాదికోసారైనా కొలెస్ట్రాల్ లాంటి పరీక్షలు చేయించుకోవాలి. బీపీ, షుగర్ను అదుపులో ఉంచుకోవాలి. ఛాతిలో మంట, నొ ప్పి లాంటి సమస్యలుంటే దగ్గరలోని డాక్టర్ను సంప్రదించాలి. ఊబకాయం రాకుండా చూసుకోవాలి. కనీసం ఏడు గంటలైనా నిద్రపోవాలి. – డాక్టర్ వాసుదేవరెడ్డి, కార్డియాలజిస్టు -
దూలూర్ యువకుడి తీన్మార్
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలం దూలూర్ గ్రామానికి చెందిన ఆకుల శ్రీనివాస్ గ్రూప్స్ ఫలితాల్లో మూడుసార్లు సత్తాచాటాడు. గ్రూప్–2లో సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఇటీవల గ్రూప్–3 ఫలితాల్లో సత్తా చాటి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం గ్రూప్–4 ద్వారా ఎంపికై జగిత్యాలలోని కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. శ్రీనివాస్ తండ్రి ఆకుల లక్ష్మీనర్సయ్య మేడిపెల్లి ఎంఈవోగా విధులు నిర్వర్తిస్తున్నారు. -
మొదటి ప్రయత్నంలోనే..
రాయికల్(జగిత్యాల): రాయికల్ పట్టణానికి చెందిన ఆర్మూర్ శివకుమార్ జీఏడీ డిపార్ట్మెంట్లో సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం సాధించాడు. స్థానికంగా పదో తరగతి, కరీంనగర్లో ఇంటర్, హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదివాడు. మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించడంపై గ్రామస్తులు అభినందించారు. యైటింక్లయిన్కాలనీ(రామగుండం): యైటింక్లయిన్కా లనీకి చెందిన సింగరేణి కార్మికుడు వేణుగోపాల్రా వు కుమార్తె భావన గ్రూ ప్–2లో ఎంపీవో ఉద్యోగం సాధించింది. గ్రూప్–4లో సత్తాచాటి పెద్దపల్లి జిల్లాలో వాణిజ్య పన్నుల శాఖలో జూనియర్గా అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తోంది. జమ్మికుంట(హుజూరాబాద్): మండలంలోని విలా సాగర్ గ్రామానికి చెందిన కుడుతాల శ్రీరామ్ 203వ ర్యాంక్ సాధించి ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికయ్యా డు. అలాగే పట్టణంలోని అ గ్నిమాపక కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన కొత్తరాజు సత్తాచాటి ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రూపు–1 సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
నేడు సద్దుల బతుకమ్మ
కరీంనగర్కల్చరల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో బతుకమ్మ పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. మహిళలంతా ఒక చోట చేరి ఆనందంగా గడిపే పండుగ. పెత్రమావాస్య నుంచి మొదలై దుర్గాష్టమి నాడు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. మహిళలంతా కలిసి బతుకమ్మను దగ్గరలోని చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేస్తారు. సోమవారం సద్దుల బతుకమ్మ సందర్భంగా కథనం. పూలు.. పాటలు.. ప్రసాదం ప్రకృతిలో లభించే తంగేడు, గునుగు, కట్ల, గోరంట, గుమ్మడి, రుద్రాక్ష, మందార, గన్నేరు, సీతజడ పూలతో బతుకమ్మను పేర్చుతారు. తొమ్మిది రోజుల పాటు రోజుకో రకం ప్రసాదం తయారు చేస్తారు. చివరిరోజు ఆడిపాడిన తర్వాత బతుకమ్మను తీసుకొని చెరువు వద్దకు వెళ్లేటప్పుడు ప్రసాదంగా నువ్వులు, పల్లీలతో సత్తుపిండి, తులసీ దళాలు మొదలైనవి తీసుకెళ్తారు. బతుకమ్మ నిమజ్జనం అనంతరం ఒకరికొకరు సత్తుపిండితో పాటు వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు. బతుకమ్మ పండుగలో పూలకెంత ప్రాధాన్యం ఉందో పాటలకూ అంతే ఉంది. బతుకమ్మ పాటలన్నీ సరళమైన భాషతో, రాగయుక్తమైన శైలితో బతుకు చిత్రాన్ని ఆవిష్కరించే అందమైనవి. వీటిలోని సాహిత్య విలువలు అమూల్యమైనవి. జానపద, చార్రితక ఘట్టాలతో పాటు సున్నితమైన మానవ సంబంధాలు ఈ పాటల్లో ప్రధాన వస్తువులు. చివరి రోజు రెండు బతుకమ్మలు తొమ్మిది రోజుల పాటు ఆటపాటలతో సాగే వేడుకల్లో చివరి రోజు సద్దుల బతుకమ్మ నాడు మాత్రం రెండు బతుకమ్మలు పేరుస్తారు. ముఖ్యంగా మన ఇళ్లలో ఆడబిడ్డకు వివాహం చేసి, అత్తారింటికి సాగనంపినప్పడు తోడు పెళ్లి కూతురుగా మరొకరిని పంపిస్తాం. ఇదే సంప్రదాయాన్ని బతుకమ్మ పండుగలోనూ కొనసాగిస్తున్నారు. నిమజ్జనం రోజు పెద్ద బతుకమ్మను తల్లిగా, చిన్న బతుకమ్మను కూతురుగా భావించి పూలతో అందంగా పేర్చి సాగనంపుతారు. -
నేటి ప్రజావాణి రద్దు
కరీంనగర్ అర్బన్: జిల్లాలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందనే వాతావరణ శాఖ సూచనలు, జిల్లాలోని పలు చోట్ల సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్న సందర్భంగా ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు గమనించి ప్రజావాణికి రావద్దని సూచించారు.నాలుగు జెడ్పీస్థానాలు మాదిగలకు కేటాయించాలి కరీంనగర్: ప్రభుత్వం స్థానిక సంస్థల రిజర్వేషన్లు ప్రకటించిన నేపథ్యంలో ఆరు జిల్లా పరిషత్ స్థానా ల్లో నాలుగు మాదిగ సామాజికవర్గానికి కేటాయించాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ఎల్కపల్లి రాజేందర్ అధ్యకతన జరిగిన మాదిగ హక్కుల దండోరా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో గౌరవ అధ్యక్షుడు పెరుమాండ్ల రామకృష్ణతో కలిసి మాట్లాడారు. మాదిగలకు వార్డు మెంబర్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు, నామినేట్ పదవుల్లో వాటా దక్కాలని కోరారు. మొండి చేయి చూపిస్తే ఆ పార్టీల ఓటమికి మాదిగ హక్కుల దండోరా పని చేస్తోందన్నారు. రాష్ట్ర మహిళా విభాగ సమన్వయకర్త అందేలా భవానిరెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎలుకటి జనార్దన్, ఖవంపల్లి రవి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మేతరి రోజా రాణి, జిల్లా అధ్యక్షుడు మాట్ల రమేష్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మంతెన స్వామి, చిలుక రాజేశం, సప్పిపోచన్న, తాటిపల్లి బాపు పాల్గొన్నారు. -
గీత కార్మికుడి ఇంట ఎకై ్సజ్ ఎస్సై
ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని పోతుగల్కు చెందిన బత్తిని అంజాగౌడ్, అండాలు రెండో కుమారుడు రఘు గ్రూప్–2లో 600 మార్కులకు 384 సాధించి ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికయ్యాడు. తండ్రి గీత కార్మికుడు, తల్లి బీడీ కార్మికురాలు. ముస్తాబాద్లో పదో తరగతి, సిద్దిపేటలో ఇంటర్, కరీంనగర్లో బీటెక్ 2014లో పూర్తి చేశాడు. మొదట అటవీశాఖలో బీట్ ఆఫీసర్గా ఎంపికయ్యాడు. అనంతరం గ్రూప్–4, పంచాయతీ కార్యదర్శి, రైల్వేస్, కేంద్ర ప్రభుత్వ ఎస్ఎస్సీలాంటి ఉద్యోగాలు సాధించాడు. వీఆర్వో జాబ్ ఎంచుకుని ప్రస్తుతం సిరిసిల్ల కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. -
వాన.. అన్నదాత హైరానా
సద్దుల సందడిటవర్ సర్కిల్ ప్రాంతంలో..నేటి సద్దుల పండుగకు మహిళలు సిద్ధమయ్యారు. బతుకమ్మ పేర్చేందుకు అవసరమైన పూలతో కరీంనగర్లోని ప్రధాన మార్కెట్ ఆదివారం కళకళలాడింది. పూల కొనుగోళ్లతో డైలీ మార్కెట్, టవర్ సర్కిల్, కలెక్టర్ క్యాంపు ఆఫీస్, వాటర్ ట్యాంక్ ప్రాంతాలు సందడిగా మారాయి. పూలధరలు ఆకాశాన్ని అంటాయి. బంతి కిలో రూ.100 నుంచి 120 పలికింది. పట్టుగుచ్చు కట్టకు రూ.50, గునుగు రూ.10కి కట్ట చొప్పున విక్రయించారు. తంగేడు తక్కువ రాగా.. రూ.100కు విక్రయించారు. జనాల రద్దీతో మార్కెట్ ప్రాంతం ట్రాఫిక్ వలయంలో చిక్కుకుంది. పోలీసులు ఆటోలు, ఇతర పెద్ద వాహనాలు లోనికి వెళ్లకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో వన్వే ఏర్పాటుచేయడంతో ద్విచక్రవాహనదారులు ఇబ్బంది పడ్డారు. మార్కెట్, గంజ్, టవర్, పోస్టాఫీస్, మదీనా కాంప్లెక్స్ అడుగుతీసి అడుగేసేందుకు కూడా వీలు లేకుండా పోయింది. – విద్యానగర్(కరీంనగర్)/సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్కరీంనగర్ అర్బన్: వరుసగా కురుస్తున్న వర్షాలు అన్నదాతను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నెలలో 28రోజులు గడువగా 13 రోజులు వర్షం పడటం.. రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదవడం సాగురంగాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. తెరిపినిచ్చిందుకున్న వాన మళ్లీ పంటదశలో విరుచుకుపడుతుండటంతో మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు తయారైంది రైతుల పరిస్థితి. గత సీజన్లో అరకొర దిగుబడులతో ఇబ్బంది పడ్డ రైతులను ఈ సీజన్లో అతివృష్టి గుబులు రేపుతోంది. నల్లరేగడి నేలల్లోని వరి మినహా ఇతర పంటలు ఎర్రబడగా నేలలోకి దిగే పరిస్థితే లేదు. ఎర్రనేలలో పైరు ఎర్రబడటంతో పాటు ఎదుగుదల లేకపోవడం ఆన్నదాతలను ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో ఎన్నడూలేని విధంగా సెప్టెంబర్లో ఈ స్థాయిలో వర్షం కురవడం 30 ఏళ్లలో ఇదే తొలిసారని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మెట్ట ప్రాంతాల్లోనే అధికం ఒకప్పుడు మెట్ట ప్రాంతాలైనా గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాలు నేడు సాగునీటితో కళకళలాడుతున్నాయి. గతంలో కరవు మండలాలుగా ప్రకటించిన దాఖలాలుండగా ఈ మూడు మండలాలు సదరు జాబితాలో ఉండేవి. ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణ పనులతో పాటు చెట్లను వృద్ధి చేయడంతో నేడా పరిస్థితి మారిపోయింది. ఈ నెలలో ఇప్పటివరకు చిగురుమామిడి, సైదాపూర్, మానకొండూర్ మండలాల్లో అదనానికి మించి వర్షపాతం నమోదైంది. తిమ్మాపూర్, శంకరపట్నం, వీణవంక, హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో అదనపు వర్షపాతం నమోదవగా మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. పత్తి, వరి, ఆరుతడి పంటలకు నష్టం తెల్లబంగారాన్ని పండించే రైతులకు ఈ సారి గడ్డురోజులేనని స్పష్టమవుతోంది. తెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పంటపై తెగుళ్లు దాడి చేయనుండగా పైరు ఎదుగుదలపై ప్రభావం పడుతోంది. జిల్లాలో రెండే ప్రధాన పంటలు కాగా కొన్ని చోట్ల పత్తి తీత దశలో ఉండగా హెచ్చు ప్రాంతాల్లో కాయ పగిలే దశలో ఉంది. పత్తికి అత్యధిక ధర ఉండటంతో చాలామంది రైతులు పత్తికే మొగ్గుచూపారు. జిల్లాలో వ్యవసాయశాఖ అంచనాకు మించి పత్తిని సాగు చేసినట్లు సమాచారం. ఈ నెల 24 సాయంత్రం నుంచి వర్షం కురుస్తుండగా పత్తి మొక్కల ఎదుగుదలకు అవరోధంగా మారాయి. చెలక, నల్లరేగడి భూముల్లో మొక్కలు ఎర్రబడ్డాయి. గడ్డి విపరీతంగా పెరిగిపోవడం, మొక్కలకు వేరు తెగులు, పూత, కాత రాలిపోవడం వంటి తెగుళ్లు ఉధృతమయ్యాయి. సాగైన పంటలో 45శాతం వరకు తెగుళ్లు వ్యాప్తి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. అరుతడి పంటలైన కంది, మొక్కజొన్న, పెసర, మినుము పంటలకు ప్రతికూల పరిస్థితే. ఈ క్రమంలో తెగుళ్లు సోకుతుండగా నీటిలోనే పంట ఉండటంతో ఎర్రబడుతుండగా వీడని వాన నీడలా నష్టం చేస్తోంది. కందికి పచ్చపురుగు సోకగా మొక్కజొన్నలో కాండం తొలుచు పురుగు ఉన్నట్లు శాస్త్రవేత్తలు వివరించారు. ఇక ప్రధాన పంట వరి ఎర్రబారుతుండగా నియంత్రించేందుకు అదనపు శ్రమ, వ్యయం చేస్తున్నారు. కూరగాయలపై ప్రభావం రోజూ వర్షం కురుస్తుండటంతో కూరగాయల పంటలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రధానంగా టమాట కుళ్లిపోతోంది. పంట ఎదుగుదల లేకపోగా టమాట రంగు మారుతోంది. తీగజాతి కూరగాయలు కాత నిలిచిపోగా ఎక్కువ నీటి నిల్వతో జీవం కోల్పోతుందని రైతులు వాపోతున్నారు. ఇక పాడి గేదెల పెంపకందారులు వాటిని సంరక్షించేందుకు నానాపాట్లు పడుతున్నారు. గత సెప్టెంబర్లో కురిసిన వర్షం: 8 రోజులు నమోదైన వర్షపాతం: 162.6 మిల్లిమీటర్లు ఈ నెలలో(27 వరకు) కురిసిన వర్షం: 13 రోజులు నమోదైన వర్షపాతం: 275.8 మి.మీలు సాధారణం: 151.6 మి.మీలు నెల కురిసిన వర్షం కురవాల్సింది వర్షపాతం జూన్ 99.3 124.3 లోటు వర్షం జూలై 272.7 237.7 సాధారణం ఆగస్టు 283.5 203.6 అదనపు వర్షం సెప్టెంబర్ 275.8 151.6 అదనానికి మించి -
ఆటోట్రాలీ ఢీకొని బాలుడు మృతి
ముత్తారం(మంథని): ముత్తారంలోని కాసార్లగడ్డకు చెందిన తిరునహరి శ్రీనివాస్, మంజుల వికలాంగ దంపతుల రెండున్నరేళ్ల కుమారుడు ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు ఆటోట్రాలీ ఢీకొని మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. శ్రీనివాస్, మంజుల దంపతులు పొట్టకూటి కోసం కాసార్లగడ్డలో టీ స్టాల్ నడిపిస్తున్నారు. ఆదివారం టీ స్టాల్లో తల్లిదండ్రులు ఉండగా, బయట ఆడుకుంటున్న వీరి కుమారుడు ఆయూష్ సిదార్థ్ను ఆటోట్రాలీ రివర్స్ తీస్తుండగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు తెలిపారు. కాగా, ప్రమాదం జరిగిన విషయం తమ దృష్టికి వచ్చిందని, ఫిర్యాదు అందలేదని ఎస్సై రవికుమార్ పేర్కొన్నారు. -
సాగు నుంచి ఉద్యోగాల వైపు..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తల్లిదండ్రులతోపాటు వ్యవసాయం చేస్తూ మూడు ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచాడు మహేశ్. ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్నగర్కు చెందిన సిర్రం మల్లవ్వ–అంజయ్య దంపతులకు ముగ్గురు సంతానం. చిన్నకుమారుడు మహేశ్ గ్రూప్–2లో రాష్ట్ర సచివాలయంలో సెక్షన్ అధికారిగా ఎంపికయ్యాడు. గతంలో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం చేస్తూనే గ్రూప్–4 రాసి జూనియర్ అసిస్టెంట్గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం పదోన్నతి పొంది వేములవాడ ఆర్డీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యుల సహకారంతోనే మూడు ఉద్యోగాలు సాధించినట్లు మహేశ్ తెలిపాడు. -
తల్లిదండ్రుల సహకారంతో..
ధర్మారం(ధర్మపురి): ధర్మారం మండలకేంద్రానికి చెందిన మూటపల్లి తిరుపతి– భారతి దంపతుల కూతురు దివ్యశ్రీ మొదటి ప్రయత్నంలోనే గ్రూప్–2లో నాయబ్ తహసీల్దార్ ఉద్యోగం సాధించింది. ప్రాథమిక విద్య ధర్మారంలో, పదో తరగతి వరకు నవోదయ, ఇంటర్ కరీంనగర్, బీటెక్ సీబీఐటీలో చదివింది. గ్రూప్– 4లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించి కరీంనగర్లో, ప్రస్తుతం ధర్మారం తహసీల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తుంది. తల్లిదండ్రుల సహకారంతోనే ఉద్యోగం సాధించినట్లు దివ్యశ్రీ చెప్పింది. -
బతుకమ్మకు బల్దియా ఏర్పాట్లు
కరీంనగర్ కార్పొరేషన్: సద్దుల బతుకమ్మకు నగరపాలకసంస్థ ఏర్పాట్లు పూర్తి చేసింది. పండుగకు ఇప్పటికే రూ.కోటి 50 లక్షలతో 32 పనులకు టెండర్ ప్రక్రియ పూర్తి చేయగా, కాంట్రాక్టర్లు పనులు చేపట్టారు. ఇంజినీరింగ్ అధికారులు డివిజన్లవారీగా పనులు పర్యవేక్షిస్తున్నారు. నగరంలోని ఎల్ఎండీ కట్ట, వేదభవన్, తీగలవంతెన, బొమ్మకల్, కిసాన్నగర్, రేకుర్తి, కొత్తపల్లి, చింతకుంట, దుర్శేడ్, గోపాల్పూర్, గౌతమినగర్ తదితర నిమజ్జన పాయింట్ల వద్ద ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాల్లో స్థలాలను చదును చేయడంతో పాటు, వరుసగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు అధ్వానంగా మారడంతో, గుంతల్లో స్టోన్డస్ట్ పోస్తున్నారు. నిమజ్జనపాయింట్ల వద్ద, బతుకమ్మ ఆడే ప్రధాన ప్రాంతాల్లో మాత్రమే డస్ట్ పోస్తుండడం, రోడ్లు మాత్రం అలానే ఉండడంపై నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిమజ్జనపాయింట్ల వద్ద లైటింగ్ ఏర్పాటు చేశారు. దసరా రోజు రాంలీలా జరిగే మైదానాల్లో వేదికలతో పాటు , భారీగా లైట్లు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఇప్పటికే హైదరాబాద్ నుంచి లైట్లు తెప్పించారు. రేకుర్తిలోని పెంటకమ్మ చెరువు వద్ద బతుకమ్మ ఏర్పాట్లను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి పరిశీలించారు. -
‘అమృత్ భారత్’ ఇక రెగ్యులర్
రామగుండం: ఉత్తర భారత్ నుంచి వచ్చే వల స కార్మికుల కోసం దక్షిణ మధ్య రైల్వే అమృత్భారత్ గతంలో ప్రత్యేక రైలు(05293/94)ను ప్రారంభించింది. ముజాఫర్పూర్ – చర్లపల్లి మధ్య ప్రస్తుతం ఈ రైలు రాకపోకలు సాగిస్తోంది. అక్టోబర్ 14 నుంచి దీన్ని రెగ్యులర్గా నడిపిస్తారు. 14న ముజాఫర్పూర్లో ప్రారంభమై మరుసటి రోజు చర్లపల్లికి చేరుకుంటుంది. అక్టోబర్ 16న చర్లపల్లిలో ప్రారంభమై మరుసటిరోజు ముజాఫర్పూర్ చేరుకుంటుంది. కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి, సిర్ పూర్కాగజ్నగర్లో ఆగుతుంది. దీనికి 22 బోగీలుంటాయి. 11 అన్ రిజర్వుడు, 8 స్లీపర్, 2 ఎస్ఎల్ఆర్, ఒక లగేజీ కోచ్లు ఉంటాయి. పుష్పుల్ మోడ్ ఆపరేటింగ్ విధానంతో రాకపోకలు సాగిస్తుంటుంది. పల్లెల్లో ‘స్థానిక’ ముచ్చట్లుమానకొండూర్: జిల్లాలోని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. శనివా రం రాత్రి వరకు రిజర్వేషన్లు వెలువరించగా ఎక్కడెక్కడ ఏఏ రిజర్వేషన్లు వచ్చాయి..? ఏ ఎన్నికలు ముందుగా జరుగుతాయనే చర్చ జోరుగా సాగుతోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డుమెంబర్ రిజర్వేషన్లు ఒకేసారి ప్రకటించడంతో ఏ ఎన్నికలు మొదట వస్తాయోనని ఆశావహులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 8న కోర్టు తీర్పు ఏ విధంగా రాబో తుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రజల గుండెల్లో సాహిత్యం కరీంనగర్ కల్చరల్: తెలంగాణ భాష నేపథ్యంలో రూపొందించే ఏ సాహిత్య ప్రక్రియ అయినా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోతుందని జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి అన్నారు. ఆదివారం నగరంలోని భగవతి పాఠశాలలో జాతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో అనంతోజు పద్మశ్రీ రచించిన ‘బతుకమ్మ పాటల పల్లకి’ గ్రంథావిష్కరణ సభలో మాట్లాడారు. సాహితీవేత్త గండ్ర లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రంలో బతుకమ్మపై వేల పాటలు ఉన్నాయ ని, ఇప్పటికీ ఎంతోమంది కొత్తగా రచిస్తూనే ఉన్నారని కొనియాడారు. జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు గాజుల రవీందర్, బి.రమణారావు, సాహితీ గౌతమి ప్రధాన కార్యదర్శి కొత్త అనిల్ కుమార్, కేఎస్.అనంతాచార్య, అనంతోజు చంద్రమోహన్ పాల్గొన్నారు. కవి ఆచరణవాది కావాలికరీంనగర్ కల్చరల్: కవి ఆచరణవాదిగా సమాజానికి ఆదర్శంగా నిలబడాలని ప్రముఖ వైద్యుడు రఘురామన్ సూచించారు. తెలంగాణ రచయితల వేదిక (తెరవే) జిల్లాశాఖ ఆధ్యర్యంలో ఫిల్మ్భవన్లో ఆదివారం కవి పిన్నంశెట్టి కిషన్ కవితా సంపుటి ‘నల్ల పద్యం’పుస్తక పరిచయసభలో మాట్లాడారు. కవి తన రచనకు జీవితానికి అభేదం పాటేస్తేనే సాహిత్యం సమాజానికి ప్రయోజనకరం అన్నారు. అన్నవరం దేవేందర్ మాట్లాడుతూ 80వ దశకంలోని సిరిసిల్ల, జగిత్యాల ఆరాట, పోరాటా ల నేపథ్యంలో కవిగా ఎదిగిన కిషన్ కలంలో వేడి తగ్గలేదని పేర్కొన్నారు. తెరవే జిల్లా అధ్యక్షుడు సీవీ.కుమార్, బొల్లం బాలకృష్ణ, డి.అఖిల్ కుమార్, కందుకూరు అంజయ్య, నరాల వెంకటేశం పాల్గొన్నారు. హిందువుల ఐక్యతకు పంచ పరివర్తన్కొత్తపల్లి: హిందువుల ఐక్యతకు పంచ పరివర్తన్ ద్వారా ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందని ఆర్ఎస్ఎస్ విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ్ సామల కిరణ్ తెలిపారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాల్లో భాగంగా కొత్తపల్లిశాఖ ఆధ్వర్యంలో జయగార్డెన్స్లో విజయదశమి ఉత్సవం జరి గింది. గుండేటి విశ్వనాఽథం మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ఈ దేశ అఖండతకు, వ్యక్తి నిర్మాణానికి, హిందుత్వ పరిరక్షణకు చేపడుతున్న చర్యలను స్వాగతించాలని కోరారు. -
ఎస్సీ కోటాలో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంక్
ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్కు చెందిన చుంచు జితేందర్ గ్రూప్–2లో ఎస్సీ కోటలో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంక్ సాధించి సబ్రిజిస్ట్రార్గా ఎంపికయ్యాడు. చుంచు మల్లయ్య, సునంద దంపతుల కుమారుడు జితేందర్ టీజీపీఎస్సీలో అసిస్టెంట్ ఇంజనీర్గా ఉద్యోగం సాధించాడు. టౌన్ప్లానింగ్లో అధికారిగా కూడా ఎంపికయ్యాడు. చొప్పదండి నవోదయలో పదో తరగతి, ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కేంద్ర ప్రభుత్వ సీజీఎల్ సాధించిన జితేందర్ ప్రస్తుతం సివిల్ సర్వీసెస్లో మెయిన్స్ పూర్తి చేశాడు. త్వరలో ఫలితాలు రానున్నాయి. -
ఔట్సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్కు..
కరీంనగర్ అర్బన్: భూ భారతి ఆపరేటర్లకు ప్రభుత్వం తీపికబురు అందించింది. దసరా కానుకగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్నాళ్లు ధరణి ఆపరేటర్లుగా వ్యవహరించిన వారంతా ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా విధులు నిర్వహించారు. కలెక్టరేట్తో పాటు అన్ని తహసీల్దా ర్ కార్యాలయాల్లో ఒక్కో ఆపరేటర్ విధులు నిర్వహిస్తున్నారు. భూ క్రయ, విక్రయాల్లో స్లాట్ ప్రక్రి య అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వీరిదే కీలకపాత్ర. జిల్లాలో 16మంది ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ ఉండగా గతంలో ధరణి ఆపరేటర్లుగా పిలిచేవారు. ఏజెన్సీ ద్వారా రూ.12వేల జీతభత్యాలు ఆరు నెలలకోసారి, ఏడాదికోసారి వచ్చేవి. ఉద్యోగానికి భద్రత లేని దుస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వేతనాలను పెంచడంతో పాటు ఏజెన్సీ పర్యవేక్షణ నుంచి తొలగించింది. ఔట్ సోర్సింగ్ కాకుండా టీజీటీఎస్ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించింది. వేతనాన్ని రూ.28వేలకు పెంచగా కటింగ్లు పోనూ రూ.19వేల వరకు వచ్చే అవకాశముంది. ఇక ధరణి ఆపరేటర్ కాకుండా భూ భారతి ఎఫ్టీఎస్గా పిలవనున్నారు. కాగా ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని 16మందికి భరోసా లభించింది. ప్రభు త్వ నిర్ణయంతో సదరు ఉద్యోగులు భూభారతి జిల్లా కో ఆర్డినేటర్ బొల్లం వెంకటరాజన్న నేతృత్వంలో ఆదివారం సంబరాలు నిర్వహించి ప్రభుత్వానికి కృతజ్జతలు తెలిపారు. భూభారతి ఆపరేట ర్లు నరేశ్, వినయ్, విక్రమ్, ఆంజనేయులు, మౌని క, అజయ్, రాజశేఖర్, శ్వేత, వినయ్, శ్రీధర్, విక్ర మ్, కిరణ్, సాగర్, సత్యానందం, దేవేందర్, అనిల్కుమార్, రాము, జి.అనిల్కుమార్ పాల్గొన్నారు. -
మహిళలకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి
కరీంనగర్: రాష్ట్ర మహిళలకు బతుకమ్మ పండుగకు చీరలు ఇవ్వని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలోని తెలంగాణచౌక్లో బీఆర్ఎస్ నగరశాఖ ఆధ్వర్యంలో మహిళలు బతుకమ్మ ఆడుతూ వినూత్న నిరసన చేపట్టారు. అనిల్ కుమార్గౌడ్, గందె మాధవి, ఎడ్ల సరిత, గుగ్గిళ్ల జయశ్రీ, నక్క పద్మ, నందెల్లి రమాదేవి, మర్రి భావన, తాటి ప్రభావతి, వాల రమణారావు, కంసాల శ్రీనివాస్, కుర్ర తిరుపతి, మహేశ్, శ్రీకాంత్, రాములు, ఏవీ రమణ, ఐలేందర్యాదవ్ పాల్గొన్నారు. -
ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ
వేములవాడ: ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ అని.. ప్రకృతి క్షేమంగా ఉంటేనే ప్రజలు క్షేమంగా ఉంటారని.. ప్రకృతి క్షేమంగా ఉంటేనే ఆడబిడ్డలు క్షేమంగా ఉంటారని.. ఆడబిడ్డలు క్షేమంగా ఉంటేనే బతుకమ్మ క్షేమంగా ఉంటుందని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్పర్సన్ విమలక్క పేర్కొన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో శనివారం సద్దుల బతుకమ్మ వేడుకలకు మాజీ సర్పంచ్ నరాల సత్తమ్మపోచెట్టి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. మూలవాగులోని బతుకమ్మ తెప్ప వద్దకు చేరుకుని నిమజ్జనోత్సవంలో పాల్గొన్నారు. ప్రకృతి క్షేమంగా ఉంటే... ఆడబిడ్డలు క్షేమంగా ఉంటారు ఆడబిడ్డలు క్షేమంగా ఉంటే... బతుకమ్మ క్షేమంగా ఉంటుంది అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్పర్సన్ విమలక్క వేములవాడలో బతుకమ్మ వేడుకలకు హాజరు -
సీసీఎల్ డైరెక్టర్ సింగరేణి వారసుడు
గోదావరిఖని: సింగరేణి సంస్థలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన అధికారి తనయుడు అనూప్ అంజూరా సెంట్రల్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ టెక్నికల్ డైరెక్టర్గా ఎంపికయ్యారు. శనివారం నిర్వహించిన ఇంటర్వ్యూలో అనూప్ అంజూరాను సీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్గా ప్రత్యేక కమిటీ రికమండ్ చేసింది. సింగరేణి ఆర్జీ–2 ఏరియాలోని జీడీకే–9వగనిలో ఏజెంట్గా, కొత్తగూడెం ఏరియా జీఎంగా పనిచేసి రిటైర్ అయిన సీఎల్ అంజూర ఈప్రాంత వాసులకు సుపరిచితులు. ఆయన తనయుడు అనూప్అంజూరా గోదావరిఖనిలోని యైటింక్లయిన్కాలనీ సింగరేణి పాఠశాల, గోదావరిఖని సెయింట్ క్లెయిర్ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. -
అదుపుతప్పిన ఆర్టీసీ బస్సులు
మంథనిరూరల్: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శనివారం రెండు ఆర్టీసీ బస్సులు అదుపుతప్పాయి. ఒక ఘటనలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టినా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మరోఘటనలో ఆరు గొర్రెలు మృత్యువాత పడ్డాయి. వివరాలు.. మంథని మండలం వెంకటాపూర్ ఎక్స్రోడ్డు సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. మంథని మండలం ఆరెంద గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్నక్రమంలో వెంకటాపూర్ సమీపంలోని రహదారిపై ఏర్పడిన గుంతలో పడగా పట్టీలు విరిగి అదుపుతప్పింది. దీంతో పక్కకు దూసుకుపోయి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిందని ప్రయాణికులు తెలిపారు. బస్సులో 36మంది ప్రయాణికులు ఉండగా అందరూ సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న ఆర్టీసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను మరో బస్సులో మంథనికి తరలించారు. కాట్నపల్లిలో గొర్రెల మందపై దూసుకెళ్లిన బస్సు సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): కాట్నపల్లి గ్రామ శివారులోని రాజీవ్ రహదారిపై శనివారం ఆర్టీసీ బస్సు గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరు గొర్రెలు మృత్యువాతపడ్డాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కాట్నపల్లి గ్రామానికి చెందిన రాజయ్య రోడ్డు పక్క నుంచి గొర్రెలను తీసుకెళ్తున్నాడు. ఈక్రమంలో కరీంనగర్ నుంచి గోదావరిఖని వైపుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. దీంతో ఆరు గొర్రెలు మృత్యువాత పడగా, మరోరెండు గాయాలపాలయ్యాయి. మృతిచెందిన వాటి విలువ సుమారు రూ.1లక్ష వరకు ఉంటుందని బాధితుడు తెలిపాడు. వెంకటాపూర్లో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బస్సు సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు కాట్నపల్లిలో గొర్రెల మందపై దూసుకెళ్లిన వైనం ఆరు గొర్రెలు మృత్యువాత.. గాయపడిన మరోరెండు -
జగిత్యాల డిప్యూటీ కలెక్టర్గా అనంతపల్లివాసి
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లికి చెందిన కన్నం కళాప్రపూర్ణజ్యోతి–రమేశ్ల కూతురు కన్నం హరిణి గ్రూప్–1లో డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యారు. కరీంనగర్లోని నివసించే రమేశ్, కళాప్రపూర్ణజ్యోతి దంపతులు ఉపాధ్యాయులు. వీరిరి రెండో కూతురు హరిణి రాష్ట్రస్థాయిలో 55వ ర్యాంకు సాధించారు. ఎస్సీ కేటగిరీలో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్గా జగిత్యాల జిల్లాకు నియమితులయ్యారు. ఉపాధ్యాయ దంపతుల మరో కూతురు అఖిల మెడిసిన్ తృతీయ సంవత్సరం చదువుతుంది. అబ్బాయి బాలాజీ బీబీఏ చదువుతున్నారు. -
ఇంటర్ ఎస్జీఎఫ్లో గందరగోళం
కరీంనగర్స్పోర్ట్స్: స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్టీఎఫ్ఐ) ఆధ్వర్యంలో ఏటా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు అండర్–14, 17, 19 విభాగాల్లో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. సుమారు 60కి పైగా క్రీడాంశాల్లో పోటీలుంటాయి. అండర్–19 కళాశాలలస్థాయి పోటీల నిర్వహణకు జిల్లా ఇంటర్ విద్యాశాఖ ఎస్జీఎఫ్ కళాశాల కార్యదర్శిని నియమించడం ఆనవాయితీ. కానీ మూడేళ్లకాలంలో ఇంటర్ విద్యాశాఖ విచిత్ర ధోరణిలో అవలంబిస్తోంది. కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లను కాదని పాఠశాలల ఫిజికల్ డైరెక్టర్లకు అండర్–19 బాధ్యతలు అప్పగిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. 2025–26 విద్యాసంవత్సరంలో గడిచిన నెల వ్యవధిలో ఇంటర్ విద్యాశాఖ అధికారి గంగాధర్ అండర్–19లో ఇద్దరు కార్యదర్శులను అనూప్రెడ్డి(కొడిమ్యాల మోడల్ స్కూల్ పీడీ), మధు జాన్సన్ (ఆర్ట్స్ కళాశాల పీడీ)లను నియమించి, తరువాత తొలగించారు. తాజాగా పాఠశాలల అండర్–14,17 కార్యదర్శి వేణుగోపాల్కు అండర్–19 బాధ్యతలు అప్పగించారు. 2023– 24లో ఇలా.. ఇంటర్ విద్యాశాఖ తొలిసారిగా 2023–24 ఏడాదికి అండర్–19 ఎస్జీఎఫ్ కార్యదర్శిగా అప్పటి పాఠశాల ల ఎస్జీఎఫ్ కార్యదర్శిని నియమించింది. పలు కారణాలతో అండర్–14,17 బాధ్యతల నుంచి తప్పించారు. దీంతో ఇంటర్ విద్యాశాఖ అధికారి సైతం అ ండర్–19 బాధ్యతలనుంచి తప్పించారు. 2025– 26 విద్యాసంవత్సరానికి గాను అండర్ 14,17 కార్యదర్శికి అండర్–19 బాధ్యతలు అప్పగించారు. మాకివ్వండని మొరపెట్టుకున్నా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ కళాశాలలో ఒకరు, గురుకుల కళాశాలల్లో 10మందికిపైగా పీడీలుగా పని చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న సీనీయర్ పీడీని కార్యదర్శిగా నియమించాలి. ఒక్కరే ఉండడంతో అతనికే బాధ్యతలిచ్చారు. 2025–26 విద్యాసంవత్సరానికి గానూ క్రీడాపోటీల నిర్వహణకు ఔట్ సోర్సింగ్ పీడీగా పనిచేస్తున్న అనూప్రెడ్డిని ఇంటర్ విద్యాధికారి నియమించారు. దీంతో గురుకుల కళాశాలలో పనిచేస్తున్న రెగ్యులర్ పీడీలు అండర్–19 బాధ్యతలను తమకివ్వాలని డీఐఈవో గంగాధర్కు వినతిపత్రం ఇచ్చారు. దీంతో అనూప్రెడ్డి స్థానంలో మధుజాన్సన్ను నియమించారు. మధుజాన్సన్కు పక్కనపెట్టి వేణుగోపాల్ను నియమించారు. సంగారెడ్డి, జనగాంతో పాటు పలుజిల్లాల్లో అండర్–19 ఎస్జీఎఫ్ కార్యదర్శులుగా గురుకుల కళాశాల పీడీలు కొనసాగుతుండగా కరీంనగర్లో గురుకుల కళాశాలల పీడీలను పక్కన పెట్టడంపై పలువురు క్రీడారంగ బాధ్యులు ఆందోళనకు గురైయ్యారు. ఉమ్మడి జిల్లాలోని తమను కాదని పాఠశాల కార్యదర్శికి క్రీడాపోటీల నిర్వహణను అప్పగించడంలో అంతర్యమేంటోనని పలువురు పీడీలు అనుకుంటున్నారు. దీనివల్ల అండర్–19 క్రీడల్లో కళాశాలల విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చక్రం తిప్పుతున్న కార్యాలయ సిబ్బంది? కళాశాల పీడీని కాదని పాఠశాల పీడీలకు అండర్–19 బాధ్యతలు అప్పజెప్పడంలో ఇంటర్ విద్యాశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి చక్రం తిప్పుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2023–24, 2025–26 విద్యా సంవత్సరాల్లో పాఠశాల కార్యదర్శికి, ఔట్సోర్సింగ్ పీడీకి కార్యదర్శిగా నియమించడంలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఇప్పటికే ఇద్దరు కార్యదర్శులను మార్చిన వైనం కొత్తగా పాఠశాలల కార్యదర్శికి అండర్– 19 బాధ్యతలు పక్క జిల్లాల్లో ఒక రూల్... కరీంనగర్లో మరో రూల్ ఎస్జీఎఫ్ క్రీడల్లో ఇంటర్ విద్యార్థులు నష్టపోతారంటున్న పీడీలు -
రేబిస్.. ప్రాణాంతకం
● కుక్కకాటుపై నిర్లక్ష్యం వద్దు ● అవగాహన, అప్రమత్తత అవసరం ● ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా టీకాలు ● నేడు రేబిస్ నివారణ దినోత్సవం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈ బయ్యారానికి చెందిన ముత్తు బోయిన సందీప్(25) తండ్రిని నెలన్నర క్రితం పెంపుడు కుక్క కరిచింది. ఆయనకు చికిత్స చేయించాడు. దూరంగా వదిలేసేందుకు ఓ సంచిలో పెట్టుకుని వెళ్తుండగా కుక్క కాలిగోటితో గీరింది. వైద్యం చేయించుకోకుండా నిర్లక్ష్యం చేయడంతో నరాల బలహీనతతోపాటు రేబిస్ లక్షణాలు కనిపించాయి. కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా సందీప్ను పరీక్షించిన వైద్యులు.. రేబిస్ సోకినట్లు నిర్ధారించారు. చికిత్స చేస్తుండగానే ఈనెల 23న సందీప్ మృతి చెందాడు. సకాలంలో వైద్యం తీసుకుంటే యువకుడు బతికేవాడని డాక్టర్లు తెలిపారు. కోల్సిటీ(రామగుండం): విశ్వాసం ప్రదర్శించడంలో కుక్కకు మించిన ప్రాణి మరోటిలేదంటారు. అందుకే కొందరు వాటిని ఇంటికి రక్షణగా, మరికొందరు తోడుగా ఉంటుందని పెంచుకుంటున్నారు. వీటితోపాటు వీధికుక్కలు పల్లెలు, పట్టణాలు, నగరాల్లో సంచరిస్తూ దొరికిన ఆహారం తింటూ బతుకుతున్నాయి. కొన్నిసార్లు తమకు ప్రమాదం తెస్తున్నారని భావించి మనుషులను కరుస్తుంటాయి. ఈ కాటుతో రేబిస్ సోకి ఒక్కోసారి ప్రాణాపాయం తెస్తోంది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రేబిస్ నివారణకు ఉపయోగించే, ఉచితంగా లభించే ఏఆర్వీ టీకాలు ఉన్నా కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. నాటు వైద్యం వైపు మొగ్గుచూపుతూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. లూయీస్ ప్యాక్చర్ అనే ప్రముఖ శాస్త్రవేత్త రేబీస్ నివారణకు వ్యాక్సిన్ కనుగొన్నారు. ప్రజలకు రేబిస్పై అవగాహన కల్పించడానికి, లూయీస్ ప్యాక్చర్ జ్ఞాపకార్థం ఏటా సెప్టెంబర్ 28న వరల్డ్ రేబిస్ డేగా నిర్వహిస్తున్నారు. కుక్కలతో భద్రం.. రేబిస్తో బాధపడే కుక్కలు పుండ్లు, గాయం ఉన్నచోట నాకినా, కొరికినా మనుషులకు వ్యాధి సోకుతుంది. రేబిస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రమాదకరమైన వ్యాధి. ముఖ్యంగా కుక్కలు, కోతులు, పెంపుడు జంతువులు మనుషులను కరవడం, గీకడం ద్వారా రేబిస్ వ్యాపిస్తుంది. కరిచిన నాలుగైదు రోజుల తర్వాత వ్యాధి బహిర్గతమవుతుంది. అయితే కుక్క ఎక్కడ కరిచింది? ఎంతో లోతు గాయమైంది. వైరస్ శరీరంలోకి ఎంతమేరకు ప్రవేశించిందనే దానిపై వ్యాధి తీవ్రత ఆధారపడి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వైరస్ కండరాల్లోంచి నరాల ద్వారా మెదడులోకి వెళ్తుంది. కణాల సముదాయంలోకి, ఎముకలు, గ్రంథుల్లోకి వెళ్లి లాలాజలంలో ప్రవేశిస్తుంది. స్కిన్ బయాప్సీ, లాలాజలం ద్వారా వైరస్ను నిర్ధారిస్తారు. లక్షణాలు ఇలా ఉంటాయి.. తలనొప్పి, ఒళ్లునొప్పులు, గొంతునొప్పి, సాధారణ జ్వరం ఉంటాయి. దీంతోపాటు కుక్క కరిచిన ప్రాంతంలో నొప్పి పెరుగుతుంది. ఈ లక్షణాల తర్వాత వైరస్ మెదడును తీవ్రమైన ఉద్వేగాలకు లోనయ్యేలా చేస్తుంది. దీంతో గాలికి భయపడతారు. నీళ్లను చూసినా వణికిపోతారు. గొంతులోని కండరాలు బిగుసుకుపోతాయి. ఈ పరిస్థితుల్లో ఉన్న పేషెంట్ను వెంటనే ఆస్పత్రిలో చేర్చాలి. క్షణాలను బట్టి వైద్యులు చికిత్స అందిస్తారు. జాగ్రత్తలు తప్పనిసరి కుక్కకాటుకు గురైన వారు తప్పనిసరిగా వెంటనే యాంటీ రేబిస్ వ్యాక్సిన్(ఏఆర్వీ) వేయించుకోవాలి. వీరికి మొదటి, మూడు, ఏడో, 14వ, 28వ రోజుల్లో వ్యాక్సిన్ వేస్తారు. వైరస్ శరీరంలోకి ప్రవేశించి మొదడు వరకు చేరకుండా అడ్డుకోవడానికి అవసరమైన వారికి పీఈపీ టీకాలను కూడా వేస్తారు. కుక్కే కాదు.. పంది, పందికొక్కులు, కోతులు, గాడిదలు, గుర్రాలు, గబ్బిలాలు, ఎలుకలు, పిల్లులు వంటివి కరిచినా ఏఆర్వీ వ్యాక్సిన్ వేయించుకోవాలి. కుక్క కరిచిన వెంటనే గాయాన్ని శుభ్రంగా కడిగి, సకాంలో చికిత్స తీసుకోవాలి. -
నక్సలైట్గా మారేందుకు అవకాశం ఇవ్వండి
సిరిసిల్లక్రైం: అధికారుల తీరుతో పదేళ్లుగా తనకు అన్యాయం జరుగుతోందని, తనలాంటి బాధితులకు న్యాయం చేసేలా నక్సలైట్గా మారేందుకు తనకు అవకాశం ఇవ్వాలని మిడ్మానేరు ప్రాజెక్టు నిర్వాసితుడు చల్లా బాలరాజు కోరారు. ఈమేరకు శనివారం రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బీ గీతేకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా బాధితుడు బాలరాజు మాట్లాడుతూ రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో నిర్మించిన మిడ్మానేరు ప్రాజెక్టులో స్థలం కోల్పోయానని తెలిపాడు. అధికారులు తనకు పదేళ్లుగా నష్టపరిహారం చెల్లించకుండా దరఖాస్తులు, పరిశీలన అంటూ కాలయాపన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతోపాటు మిగతా వారికి నష్టపరిహారం, ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరారు. తమకు న్యాయం చేయాలని ఇప్పటికే కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేసినా.. ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇప్పటి వరకు కలెక్టర్గా పనిచేసిన సందీప్కుమార్ ఝా నిర్వాసితుల సమస్యలపై అవహేళన చేస్తూ ఇబ్బందులకు గురిచేశారన్నారు. కలెక్టర్, ఉన్నతస్థాయి అధికారులపై కేసు నమోదు తమ పరిధిలో లేదని ఎస్పీ తెలిపినట్లు చెప్పారు. జిల్లాకు కొత్తగా రానున్న కలెక్టర్ రెవెన్యూ విభాగంలోని చట్టపరిధిలో చర్యలు తీసుకుంటారని ఎస్పీ సూచించారని తెలిపారు. ఎస్పీని కలిసిన వారిలో ఇనుకొండ లక్ష్మి, మంజుల, తిరుపతి, ఉపేందర్ ఉన్నారు. అన్యాయం చేసిన అధికారులపై కేసు నమోదు చేయండి మిడ్మానేరు బాధితుడు చెల్లా బాలరాజు సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బి గీతేకు వినతి -
ఏడొద్దుల సద్దులు ఉయ్యాలో..
రామరామరామ ఉయ్యాలో అంటూ జిల్లాలోని పలు పల్లెలు మార్మోగాయి. ఆడబిడ్డల నృత్యాలతో అలరించాయి. జిల్లాలోని పలుచోట్ల శనివారం సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని బొమ్మకల్, గుంటూరుపల్లి, లక్ష్మినగర్, కృష్ణానగర్ కాలనీ, కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్(బావుపేట), ఖాజీపూర్, మానకొండూర్ మండలం శ్రీనివాస్నగర్, రాఘవాపూర్లో ఏడొద్దుల పెద్దబతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు. ఉదయం తంగేడు, గునుగు, పట్టుకుచ్చు, బంతిపూలతో ఆకర్షణీయంగా బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం వీధుల్లో చేరి సాంప్రదాయ బతుకమ్మ పాటలతో హోరేత్తించారు. డీజే పాటలు, కోలాటంతో ఆడిపాడారు. పొద్దుపోయాక బతుకమ్మలను నీటివనరుల్లో నిమజ్జనం చేసి ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కొత్తపల్లి మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలతమహేశ్, రెడ్డవేణి మధు బావుపేట వేడుకల్లో పాల్గొన్నారు. కరీంనగర్రూరల్ పోలీస్స్టేషన్లో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. రూరల్ ఏసీపీ విజయ్కుమార్, సీఐ నిరంజన్రెడ్డి, ఎస్సైలు లక్ష్మారెడ్డి, నరేశ్ హాజరయ్యారు. – కరీంనగర్రూరల్/కొత్తపల్లి/మానకొండూర్రూరల్బొమ్మకల్ పరిధిలోని వివిధ కాలనీల్లో.. -
మచ్చ లేని నేత కొండా లక్ష్మణ్ బాపూజీ
కరీంనగర్టౌన్/కరీంనగర్కల్చరల్: మచ్చలేని నాయకుడిగా సేవలందించిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ తరం నాయకులకు స్ఫూర్తిదాయకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. శనివారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీ టోపీ పెట్టుకుని ‘సిటిజన్ ప్రొటెక్షన్ కమిటీ’ పేరుతో పౌర హక్కుల కోసం పోరాడి అనేక సార్లు జైలుకు వెళ్లిన యోధుడు బాపూజీ అన్నారు. సిరిసిల్ల బైపాస్ రోడ్డు చౌరస్తాలోని లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి కలెక్టర్ పమేలా సత్పతి పూలమాల వేసి నివాళి అర్పించారు. అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్, బీసీ సంక్షేమశాఖ అధికారి అనిల్ ప్రకాశ్ పాల్గొన్నారు.ముగిసిన ఆదివాసీ శిక్షణ శిబిరంకరీంనగర్ కార్పొరేషన్: మూడురోజులపాటు డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన ఆదివాసీ శిక్షణ శిబిరం శనివారంతో ముగిసింది. ఉమ్మ డి కరీంనగర్ జిల్లావారీగా ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఈ నెల 25న మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్ ప్రారంభించారు. దాదాపు వందమందికి శిక్షణ ఇచ్చారు. ముగింపు కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య, ప్రొఫెసర్ భంగ్యానాయక్, ప్రముఖ కవి జయరాజ్, భూభారతి కమిటీ సభ్యుడు సునీల్రెడ్డి, జనవిజ్ఞాన వేదిక ప్రతినిధి రమేశ్ హాజరయ్యారు. శిక్షణ పొందినవారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఆదివాసీ సెల్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బెల్లయ్యనాయక్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా వివిధ శిబిరాల ద్వారా ఇప్పటివరకు 1,200 మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఆదివాసీ సెల్ సమన్వయకర్త కోట్యానాయక్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు బానోతు శ్రావణ్నాయక్, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు హరిలాల్ పాల్గొన్నారు. ఏటీసీ ప్రారంభంకరీంనగర్: కరీంనగర్ ఐటీ టవర్స్ సమీపంలో ఏర్పాటు చేసిన ఆధునాతన సాంకేతిక కేంద్రాన్ని శనివారం సీఎం రేవంత్రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు. కార్యక్రమానికి కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్ హాజరయ్యారు. కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు విద్యార్థులకు అందించేందుకు టాటా సంస్థ సహకారంతో ఏటీసీలో వివిధ కోర్సులు నేర్పిస్తున్నామని అన్నారు. సత్వరం ఉపాధి లభించే ఏటీసీ కోర్సుల వైపు తమ పిల్లలను ప్రోత్సాహించాలని తల్లిదండ్రులకు సూచించారు. పరిశ్రమలశాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ గంగాధర్రెడ్డి, టీజీఐసీ జోనల్ మేనేజర్ మహేశ్వర్, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ కుమార్ పాల్గొన్నారు. ఎస్యూలో పరీక్షల షెడ్యూల్ విడుదలసప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలోని వివిధ కోర్సులకు పరీక్ష తేదీలు నిర్ణయించామని శాతవాహన యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డి.సురేశ్కుమార్ శనివారం తెలిపారు. ఎంఫార్మసీ 2వ సెమిస్టర్ అక్టోబర్ 7 నుంచి 15 వరకు, బీఫార్మసీ 2వ సెమిస్టర్ అక్టోబర్ 6 నుంచి 18 వరకు, 4వ సెమిస్టర్ అక్టోబర్ 7 నుంచి 17 వరకు, ఎంఏడ్ 2వ సెమిస్టర్ అక్టోబర్ 6 నుంచి 18 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షలు ప్రతి రోజూ మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు నిర్వహిస్తామని, వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ లేదా సంబంధిత కళాశాలల్లో సంప్రదించాలని సూచించారు. -
స్థానిక సందడి!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ ●: ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. గత కొన్ని నెలలుగా గ్రామాల వారీగా ఎదురుచూస్తున్న ఆశావహుల ఉత్కంఠకు తెరపడింది. కలిసొచ్చినా రిజర్వేషన్తో పలువురు సంబరాలు జరుపుకోగా, మరికొందరు నిరాశకు గురయ్యారు. రాష్ట్రప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేయగా, దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం స్థానిక ఎ న్నికల కసరత్తును పూర్తి చేస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ఆధారంగా, బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కులగణన ఆధారంగా 42శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఎన్నికల పక్రియలో భాగంగా శనివారం తొలుత ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్స్కు రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో ఖరారు చేయగా, మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఆయా కలెక్టరేట్లలో వివిధ రాజకీయపక్షాల సమక్షంలో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలు లాటరీ పక్రియ ద్వారా నిర్ణయించారు. పూర్తిస్థాయిలో రిజర్వేషన్లు కేటాయింపులు పూర్తికాగానే జిల్లాలవారీగా రిజర్వేషన్ల గెజిట్ను కలెక్టర్లు విడుదల చేయనున్నారు. రాజకీయ పార్టీల సమక్షంలో రిజర్వేషన్లు ఖరారు చేస్తుండటంతో తమ గ్రామంలో, మండలంలో ఎంపీపీ ఎవరికి కేటాయించరో తెలుసుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపారు. తమకు రిజర్వేషన్ అనూకూలించని వారు తమ కుటుంబ సభ్యులను రంగంలోకి దించాలనే దిశగా పావులు కదుపుతున్నారు. త్వరలో స్థానిక ఎన్నికల నగారా మోగనుండటంతో పల్లెల్లో రాజకీయం వెడేక్కింది. రెండు మహిళలకు... ఎస్సీ, బీసీలకు ఒక్కోటి పెద్దపల్లి, జగిత్యాల జెడ్పీ చైర్మన్ స్థానాలను జనరల్ మహిళకు కేటాయించగా, కరీంనగర్ జెడ్పీస్థానం బీసీ జనరల్కు, సిరిసిల్ల జెడ్పీ పీఠంను ఎస్సీ జనరల్కు కేటాయిస్తూ పంచాయితీరాజ్శాఖ అధికారికంగా గెజిట్ విడుదల చేసింది. మొదలైన ఆశావహుల సందడి.. జెడ్పీటీసీ, ఎంపీపీ, గ్రామపంచాయతీల ఎన్నికలకు కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ఆశావహుల్లో హడావుడి మొదలైంది. ముసాయిదా రిజర్వేషన్ల జాబితాను శనివారం జిల్లాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల ఎదుట ప్రదర్శించా రు. కలెక్టరేట్, ఎంపీడీవో కార్యాలయాల వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు, ఆశావహులు క్యూకట్టారు. లాటరీ పక్రియలో పాల్గొన్న నేతలతో ఆశావాహులు ఫోన్లో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈసారి ఎన్నికల్లో బీసీలకు అధికంగా సీట్లు కేటాయించడంతో ఉత్సాహం నెలకొంది. స్థానిక పోరు మరింత వేడెక్కింది. ఎన్నికలు జరిగేనా.. సామాజిక న్యాయం కలిగించేలా ప్రభుత్వం బీసీవర్గాలకు 42 శాతం రిజర్వేషన్లను అమలుచేస్తూ జీవోను విడుదల చేసింది. ఎన్నికల నిర్వహణకు ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ వెలువడవచ్చన్న అంచనాలు నెలకొన్న క్రమంలో బీసీ రిజర్వేషన్ల పెంపుకు వ్యతిరేకంగా పలువురు హైకోర్డుకు వెళ్లిన నేపథ్యంతో జీవో అమలుపై సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు ఎన్నికలు నిర్వహిస్తారా, లేక మరోసారి ఎన్నికలు వాయిదా పడే అవకాశాలుంటాయా అనేదానిపై ఆసక్తి నెలకొంది. రాజకీయ ప్రతినిధుల సమక్షంలో..జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ అశ్విని తానా జీ వాకడే, జెడ్పీ సీఈవో శ్రీనివాస్ కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రిజర్వేషన్ల కేటా యింపు ప్రక్రియ నిర్వహించారు. ఈవివరాలను ప్ర భుత్వానికి, ఎన్నికల కమిషన్కు నివేదించనున్నారు. జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జనరల్ కరీంనగర్ 6 3 0 6 పెద్దపల్లి 6 3 0 4 జగిత్యాల 9 4 1 6 సిరిసిల్ల – – – –జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జనరల్ కరీంనగర్ 6 3 0 6 పెద్దపల్లి 5 3 0 5 జగిత్యాల 8 4 1 7 సిరిసిల్ల – – – –జగిత్యాల: జనరల్ మహిళకరీంనగర్: బీసీ జనరల్ సిరిసిల్ల: ఎస్సీ జనరల్పెద్దపల్లి: జనరల్ మహిళ -
పేదల సంక్షేమమే సర్కారు లక్ష్యం
కొత్తపల్లి(కరీంనగర్): పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు అన్నారు. కొత్తపల్లి మండలం కమాన్పూర్, నాగులమల్యాల గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు శనివారం ప్రొసీడింగ్స్ అందజేశారు. దసరా పండగ కానుకగా సీఎం ఇందిరమ్మ ఇండ్లు అందించడం సంతోషదాయకమన్నారు. కరీంనగర్ నియోజకవర్గానికి అదనంగా 4వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేందుకు సీఎం సానుకూలంగా ఉన్నారన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు లబ్ధిదారులు త్వరగా చేపట్టాలని సూచించారు. -
లలితాదేవిగా అమ్మవారు
కరీంనగర్ కల్చరల్/ విద్యానగర్(కరీంనగర్): దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం మహాశక్తి ఆలయంలో లలితాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. గాజులతో అలంకరణ చేశారు. లలితాసహాస్త్రనామ పారాయణం జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. కరీంనగర్ మండలం నగునూర్లోని పరివార సమేత శ్రీదుర్గాభవానీ ఆలయంలో ఆరోరోజు శనివారం దుర్గాభవానీ అమ్మవారు ఇంద్రాణీ అలంకరణలో గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధానార్చకుడు పవనకృష్ణ శర్మ ప్రత్యేక పూజలు చేశారు.అమ్మవారికి గాజులతో అలంకరణహంస వాహనంపై దుర్గాభవానీ అమ్మవారు -
ప్రత్యేక బృందం
బోనాలపల్లెకుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఎలగందులను ఆనుకుని ఉన్న బోనాలపల్లైపెకి పోలీసు తూటాలు దూసుకుపోయిన ఘటనపై రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. హైదరాబాద్ నుంచి స్పెషల్ టీం గురు, శుక్రవారాల్లో బోనాలపల్లెలో పర్యటించింది. అనూహ్యంగా తమపై దూసుకొస్తున్న తూటాలతో ప్రాణహాని పొంచి ఉందని గ్రామస్తులు కొన్ని రోజులుగా ఆందోళన చెందుతున్న విషయం తెలిసిదే. కరీంనగర్ సీపీ ఇచ్చిన సమాచారంతో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు డీజీపీ కార్యాలయం ప్రత్యేక బృందాన్ని పంపింది. ఇందులో గ్రేహౌండ్స్, ఐఎస్డబ్ల్యూ, ఇతర సాంకేతిక నిపుణులు ఉన్నారు. వీరు స్థానిక పోలీసులతో కలిసి తొలుత ఎలగందుల ఫైరింగ్ రేంజ్, అనంతరం బోనాలపల్లె గ్రామాన్ని సందర్శించి పలు విషయాలను సమగ్రంగా పరిశీలించారు. బోనాలపల్లెలో అమృతమ్మ అనే 80 ఏళ్లుపైబడిన వృద్ధురాలి తుంటికి తూటా గాయం అయిన విషయాన్ని ‘సాక్షి’ ఈనెల 22న ‘బోనాలపల్లెకు తూటా గాయం’ శీర్షికన ప్రచురించిన విషయం తెలిసిందే రిటెయినింగ్ వాల్ నిర్మించాలట ఎలగందుల ఫైరింగ్ రేంజ్లో ఫైరింగ్ జరుగుతున్న తీరు, టార్గెట్ను తాకిన తరువాత బుల్లెట్లు దిశను మార్చుకున్న తీరును ప్రత్యేక బృందం పరిశీలించింది. అనంతరం అక్కడ నుంచి పొరుగునే ఉన్న బోనాలపల్లె గ్రామానికి వెళ్లారు. అక్కడి భౌగోళిక పరిస్థితులు, బుల్లెట్లు దూసుకువచ్చిన తీరును అంచనా వేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఇకపై బుల్లెట్లు గ్రామంవైపునకు దూసుకు రాకుండా ఉండాలంటే.. ఫైరింగ్ రేంజ్ వెనకాల భారీ రీటెయినింగ్ వాల్ నిర్మించాలని అధికారులకు సూచించారు. దాంతో టార్గెట్ను తాకిన తరువాత వెనక ఉన్న రాళ్లను తాకి దిశ మార్చుకున్నా.. బులెట్లు బోనాలపల్లె వైపునకు దూసుకురాకుండా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని సీపీకి, డీజీపీకి సమర్పించబోయే నివేదికలో పొందుపరచనున్నారు. 9 ఎంఎం బుల్లెట్ కిలోమీటరు ప్రయాణం హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందానికి ఒక విషయం ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. ఫైరింగ్ రేంజ్ నుంచి దాదాపు కిలోమీటరు దూరంలో ఉన్న అమృతమ్మకు బుల్లెట్ తాకడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. అమతమ్మను తాకింది ఎస్ఎల్ఆర్ నుంచి వెలువడిన తూటా అనుకున్నారు. కానీ అది 9ఎంఎం బుల్లెట్ అని హైదరాబాద్ నుంచి వచ్చిన సాంకేతిక బృందం ధ్రువీకరించింది. సాధారణంగా 9ఎంఎం బుల్లెట్ పిస్టల్ లేదా కార్బన్ నుంచి వచ్చి ఉంటుందని అంచనాకు వచ్చారు. సాధారణంగా పిస్టల్ నుంచి వెలువడిన 9ఎంఎం బుల్లెట్ ప్రయాణించే దూరం కిలోమీటరులోపే. కానీ, బహిరంగ ప్రదేశాల్లో ఇది సాధ్యం కాదు. గాలి వీచే దిశ, ఇతర ఆటంకాలు అనేక మార్గమధ్యలో తూటా వేగాన్ని ప్రభావితం చేస్తాయి. ఇక్కడ టార్గెట్ను తాకిన తరువాత కూడా కిలోమీటరు ప్రయాణం చేయడం పోలీసు అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. ఈ విషయాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసిన అనంతరం పూర్తిస్థాయి నివేదికలో పొందుపరచనున్నారు.పోలీసులు ఫైరింగ్ చేసిన బుల్లెట్లు ఇకపై గ్రామంవైపు రాకుండా చర్యలు చేపడతాం. ఇందుకోసం ఫైరింగ్ రేంజ్ సరిహద్దులో రిటెయినింగ్ వాల్ నిర్మిస్తాం. బుల్లెట్లు బోనాలపల్లెను తాకడానికి పక్కనే ఉన్న గుట్ట ఎత్తు తగ్గడం కారణం కాదు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం సూచనల ప్రకారం రక్షణ ఏర్పాట్లు చేపడతాం. – గౌస్ ఆలం, సీపీ, కరీంనగర్ -
వృద్ధుల ఆశ్రమం సందర్శన
కరీంనగర్క్రైం: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్ నగరంలోని ప్రభుత్వ వృద్ధులు, వికలాంగుల ఆశ్రమం, స్వధార్హోమ్ను శుక్రవారం సందర్శించారు. వృద్ధులు, వికలాంగులతో ముచ్చటించారు. విద్యార్థి దశలో ఎటువంటి లైంగిక వేధింపులకు గురైనా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. అనంతరం ఆహార పదార్థాలను నిల్వచేసే గదులను తనిఖీ చేశారు. ఎలాంటి న్యాయపరమైన సేవలు అవసరమైనా సంప్రదించాలన్నారు. డిప్యూటీ లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేశ్ పాల్గొన్నారు. పెండింగ్ వేతనాలు చెల్లించండికరీంనగర్: కార్మికులకు మూడు నెలల పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ.. పండగ పూట పంచాయతీ కార్మికులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు. వెంటనే పెండింగ్ ఉన్న జీతాలు చెల్లించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, దసరా సందర్భంగా బట్టలు, సేఫ్టీ పరికరాలను ఇవ్వాలని, గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్కు వినతిపత్రం ఇచ్చారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పునీటి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు రాచర్ల మల్లేశం, జిల్లా సహాయ కార్యదర్శి వడ్లూరి లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు కాశిపాక శంకర్ పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం కరీంనగర్ కార్పొరేషన్/కొత్తపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ఆ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం నగరంలోని ప్రజా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అందె మమతతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్లు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ భ్రష్టు పట్టించిందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నాయకులు ఆకుల నర్సన్న, నిమ్మల అంజయ్య, మల్యాల రాజాగౌడ్, సుందరగిరి గంగరాజు, పెంట శేఖర్, గుండ మల్లేశం, ఆరె మల్లేశం, దుర్గం అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
రేడియేషన్ అంకాలజీలో విప్లవాత్మక మార్పులు
● యశోద హాస్పిటల్ రేడియేషన్ అంకాలజిస్టు సునీతకరీంనగర్టౌన్: ఎంఆర్ లినాక్తో పేషెంట్కు రేడియేషన్ తగ్గించి చికిత్స అందించవచ్చని, ఇది దేశంలో ఎక్కడా లేదని, మొట్టమొదటి యంత్రం యశోద ఆసుపత్రి హైటెక్సిటీలో ఉందని రేడియేషన్ అంకాలజిస్టు డాక్టర్ సునీత తెలిపారు. శుక్రవారం నగరంలోని యశోద మెడికల్ సెంటర్లో మాట్లాడారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఈ ఎంఆర్ లినాక్ ఎంఆర్ఐ స్కానర్తో రోగికి ఖచ్చితమైన చోటనే రేడియేషన్ కిరణాలు ప్రసరించి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవన్నారు. ఇప్పటి వరకు సుమారు 300 మందికి ఈ ఎంఆర్ లినాక్ చికిత్స అందించామని తెలిపారు. మెదడు, కణితులు, ప్రొస్టేట్ కేన్సర్, తల, మెడ కేన్సర్, సీ్త్రలకు సంబంధించి సర్వైకల్ కేన్సన్, గర్భాశయ కేన్సర్, ఊపిరితిత్తులు, కాలేయం ఇతర కేన్సర్లకు రేడియేషన్ సోకకుండా ఎంఆర్ లినాక్ ద్వారా చికిత్స అందించవచ్చని తెలిపారు. ఎంఆర్ లినాక్తో చికిత్స పొందడం కోసం ఆసుపత్రిలో అడ్మిట్ కావాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆసుపత్రి మేనేజర్ నవీన్ కుమార్ పాల్గొన్నారు. -
‘పట్టు’ సాధించారు
ముస్తాబాద్(సిరిసిల్ల): పట్టు అంటేనే పవిత్ర భావన. పట్టు వస్త్రాలు ధరిస్తే వచ్చే హుందాతనం వేరు. వివాహాది శుభకార్యాలలో పట్టు బట్టలకు ప్రాధాన్యం అంతా.. ఇంతా కాదు. అలాంటి పట్టు వస్త్రాల తయారీకి మూలమైన మల్బరీ తోటలు, పట్టుపురుగుల పెంపకానికి కేరాఫ్గా జిల్లా మారబోతోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 147 ఎకరాల్లో మల్బరీతోటలను రైతులు పెంచుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలతో రైతులు ‘పట్టు’ సాధిస్తున్నారు. 38 షెడ్లలో పట్టు పురుగుల పెంపకాన్ని చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం మేరా రేషమ్.. మేరా అభియాన్ ద్వారా రైతులకు శిక్షణ ఇవ్వడంతో ఆసక్తి చూపారు. జిల్లాలో పట్టుపరిశ్రమ అభివృద్ధికి అడుగులు పడడంతో గణనీయమైన పట్టు ఉత్పత్తి సాధించిన జిల్లాగా ఉత్తమ అవార్డు అందుకున్నారు. ‘పట్టు’ ఇలా సాధించవచ్చు వరికి ప్రత్యామ్నాయంగా మల్బరీ, పట్టు పురుగుల పెంపకం ద్వారా అధిక లాభాలు ఆర్జించవచ్చు. రెండెకరాలలో రెండు బిట్లుగా మల్బరీతోటను సాగు చేసి, 50, 30 అడుగుల పరిమాణంలో నిర్మించే షెడ్లకు కేంద్రం రూ.3లక్షల సబ్సిడీ ఇస్తుంది. పట్టు పురుగుల గుడ్లు అనగా చాకి పురుగులను సరఫరా చేసే రైతుల నుంచి పట్టు పురుగులు తెచ్చుకోవచ్చు. ఒక షెడ్డులో 1.70లక్షల పట్టు పురుగులను షెడ్డులో పెంచవచ్చు. 23 రోజుల వరకు పురుగులకు మల్బరీ ఆకు వేసి పెంచాలి. అనంతరం వాటిని బ్లాక్ బాక్స్ల్లో వేయాలి. వారం రోజులకు పట్టు గూళ్లతో పురుగులు వస్తాయి. ఐదు రోజుల తర్వాత పట్టుగూళ్లను జనగామ జిల్లా కేంద్రంలోని కేంద్ర ప్రభుత్వ పట్టు సేకరణ కేంద్రానికి తరలిస్తారు. కిలో పట్టుగూళ్లకు రూ.500 నుంచి 700 వరకు ధర వస్తుంది. నాణ్యతను బట్టి ధర నిర్ణయిస్తారు. ఒక క్వింటాలు పట్టుగూళ్లకు రూ.55వేల నుంచి రూ.60వేలు పలికే అవకాశం ఉంది. పురుగులు తీసుకొచ్చినప్పటి నుంచి పట్టుగూళ్లు విక్రయించే వరకు సెరికల్చర్ అధికారులు, సైంటిస్టులు రైతులకు అండగా నిలుస్తున్నారు. నెలరోజుల వ్యవధిలో ఒక పంటను తీయవచ్చు. రెండు ఎకరాల మల్బరీ, ఒక షెడ్డు ద్వారా నెల రోజుల్లో రూ.60వేలు ఆర్జించవచ్చు. మల్బరీ మొక్కలు ఒకసారి నాటితే పదేళ్ల వరకు ఉంటాయి. -
సిటీలో మహిళా బ్లూకోల్ట్స్ సేవలు
కరీంనగర్క్రైం: జిల్లాలో విజిబుల్ పోలీసింగ్ను మరింత బలోపేతం చేసేందుకు మహిళా బ్లూకోల్ట్స్ సేవలను సీపీ గౌస్ ఆలం శుక్రవారం ప్రారంభించారు. ఎంపిక చేసిన మహిళా పోలీసులకు ప్రభుత్వ స్కూటీలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో మహిళా పోలీసుల పాత్ర కీలకంగా మారుతుందని తెలిపారు. తద్వారా బీట్ పెట్రోలింగ్, వాహన తనిఖీలు, డయల్ 100 కాల్స్ అటెండ్ చేయడం వంటి విధులు సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశం ఉందన్నారు. మహిళా పోలీసులతో బాధితులకు ఆత్మస్థైర్యం పోలీసుశాఖలో 33శాతం మహిళా నియామకాలు జరుగుతుండడంతో బాధిత మహిళలకు ఆత్మస్థైర్యం లభిస్తుందని సీపీ గౌస్ఆలం అన్నారు. మహిళా పోలీసు సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని, వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు శుక్రవారం ‘సేఫ్ హాండ్స్ విత్ తెలంగాణ పోలీస్– నారి శక్తి ఇన్ కరీంనగర్ పోలీస్’ అనే నినాదంతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విజిబుల్ పోలీసింగ్లో మహిళా పోలీసుల భాగస్వామ్యాన్ని పెంపొందిస్తామన్నారు. ఇండియన్ మెడికల్ ఆసోసియేషన్ కరీంనగర్ ప్రెసిడెంట్ డాక్టర్ నరేశ్ బృందం ఆధ్వర్యంలో మహిళా పోలీసులకు సీపీఆర్పై శిక్షణ అందించారు. అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు మాధవి, యాదగిరిస్వామి, శ్రీనివాస్జి, వెంకటస్వామి, సీఐలు శ్రీలత, స్వర్ణజ్యోతి పాల్గొన్నారు. -
కొత్త వైన్స్లకు గెజిట్ విడుదల
కరీంనగర్క్రైం: జిల్లావ్యాప్తంగా 94 వైన్స్లకు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ పి.శ్రీనివాసరావు శుక్రవారం సాయంత్రం గెజిట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎకై ్సజ్ భవన్లో ఆయన మాట్లాడు తూ 94 దుకాణాల్లో గౌడ్స్కు 17, ఎస్సీలకు 9షాపులు రిజర్వేషన్ ద్వారా కేటాయించినట్లు తెలిపారు. వైన్స్ టెండర్లకు 18 అక్టోబర్ వరకు గడువు ఉండగా 23న కలెక్టరేట్లో లక్కీ డ్రా ద్వారా షాపులు కేటా యించనున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం వైన్స్లకు రూ.3లక్షలు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. కరీంనగర్లోని అర్బన్ ఎకై ్సజ్ కార్యాలయంలో ధరఖాస్తులు స్వీకరిస్తామని, హైదరాబాద్లోని నాంపల్లి ఎకై ్సజ్ కమిషనర్ కార్యాలయంలో కూడా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం సూచించి న విధంగా కరీంనగర్ అర్బన్ పరిధిలో మొత్తం 21 షాపులుండగా గౌడ్స్కు 03, ఎస్సీలకు 04, కరీంనగర్ రూరల్ పరిధిలో 26 షాపులుండగా గౌడ్స్కు 04, ఎస్సీలకు 01, తిమ్మాపూర్ సర్కిల్పరిధిలో 14 షాపులుండగా గౌడ్స్కు 3, ఎస్సీలకు 2 కేటాయించారని, హుజూరాబాద్ సర్కిల్లో 17 దుకాణాలుండగా గౌడ్స్కు 05, ఎస్సీలకు 01, జమ్మికుంట సర్కిల్లో గౌడ్లకు 02, ఎస్సీలకు 01 దుకాణాలు కేటాయించారని తెలిపారు. డివిజన్ ఒక్కటే కావడంతో ఇబ్బందులు కరీంనగర్ రూరల్ పరిధిలో పలు దుకాణాలకు ప్రత్యేకంగా కేటాయింపు ఉండడంతో ఎక్కడికక్కడే టెండర్లు వేసేవారు. ఇప్పుడు రూరల్ పరిధిలోని వి విధ గ్రామాలు, కొత్తపల్లి మండలం పలు గ్రామాలు కలిపి ఒకే డివిజన్లో ఉండడంతో వైన్స్ వచ్చిన వారు ఎక్కడయినా షాపు పెట్టుకునే అవకాశాలు ఉండడంతో నష్టం జరిగే అవకాశాలుంటాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
పూలు.. పాటల జాతర
సిరిసిల్ల: ప్రకృతిని పూజించే సంస్కృతి తెలంగాణకే సొంతం. పూలనే దేవతగా కొలిచే భక్తితత్వం ఇక్కడి మట్టి మనుషుల సొంతం. తమ భక్తిని.. ఇష్టాన్ని జానపదాలలో తెలుపుతూ సాగే సాహిత్యం ఇక్కడి జనజీవనాన్ని ప్రతిబింబింపజేస్తుంది. ఈ మట్టిమనుషులు పూజించే బతుకమ్మ సంబరాలు పల్లె, పట్నం అనే తేడా లేకుండా జోరుగా సాగుతున్నాయి. సద్దుల సంబరాలకు సిద్ధమవుతున్నారు. వేములవాడలో ఏడు రోజుల్లో శనివారం చేస్తుండగా, మిగతా ప్రాంతాల్లో తొమ్మిది రోజులు.. మరికొన్ని ఏరియాల్లో దసరా మరుసటి రోజు సద్దులు సంబరాలు చేసేందుకు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ పండగ విశిష్టతలపై ప్రత్యేక కథనం. తీరొక్క పూలజాతర పితృ అమావాస్య నాడు పెద్దలకు బియ్యం ఇచ్చినప్పటి నుంచి రోజుకో పేరుతో.. సద్దితో ఎనిమిది రోజులు బొడ్డెమ్మగా జరుపుకొని తొమ్మిది దినాల నాడు పెద్దబతుకమ్మ, సద్దుల బతుకమ్మగా సాగనంపే పండుగ ఇది. పొద్దంతా పనిచేసి సాయంత్రం ఇంటికొచ్చే ముందు అడవిలోని రకరకాల పూలు తెచ్చి సిబ్బిలో పేర్చి పసుపు ముద్ద, గుమ్మడి పూల గౌరమ్మను చేసి మధ్యలో ఉంచి చుట్టూ తిరిగి చప్పట్లు కొడుతూ ఆడుతూ సంబురంగా జరుపుకుంటారు. ప్రకృతిలో పూసే ప్రతీ పువ్వు బతుకమ్మకు అలంకారమే. చివరి రోజు సద్దుల బతుకమ్మ. ఊరంతా పూల జాతరగా మారుతుంది. తంగేడు, గుమ్మడి ప్రధానం బతుకమ్మకు ప్రతీక తంగేడు, గుమ్మడి పూలు. గుమ్మడిని గౌరమ్మగా నిలిపితే, తంగేడును బతుకమ్మగా పేరుస్తారు. తంగేడు చెట్టు తెలంగాణ పల్లె ప్రజల జీవన విధానాన్ని పోలి ఉంటుంది. నీలు లేని చెలకలో గుట్టల మీద, రాళ్ల నడుమ గాలికి ఎండకు తట్టుకుని నిలిచి తలెత్తుకునే కష్టజీవి తంగేడు చెట్టు. తెంపిన చాలా సేపటి వరకు వాడిపోని దివ్యఔషధం. ఊరి శివారుల్లోని చెలకలు, గుడ్డాలు, అటవీ భూముల్లో తంగేడు, గునుగు, గుమ్మడిపూలు విరివిగా లభిస్తాయి. కమ్మనైన అమ్మపాట బతుకమ్మ సామాజిక చరిత్రను, ఇతిహాసాలను, అన్నచెల్లెళ్ల అనుబంధాన్ని పాటల రూపంలో చెప్తారు. పాటంటే తెలంగాణ ఎత, కథ తలపోత. నవ్వినా.. ఏడ్చినా కన్నీళ్లే వచ్చినట్లు.. కష్టమైనా సుఖమైనా.. పంటపండినా.. బతుకు ఎండినా.. తెలంగాణలో అది పాటే అవుతుంది. పూర్వకాలంలో తెలంగాణలో సీ్త్రలు దొరలు, భూస్వాములు, వత్తేదార్ల కింద అష్టకష్టాలు పడేవారు. వాళ్ల కష్టాలను పాటల రూపంలో చెప్పుకోవడానికి ఈ పండుగ వేదికగా నిలిచింది. ఇది లిఖిత సాహిత్యం కాదు. సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మను సాగనంపేందుకు తీసుకెళ్లే పలహారాలు కాయ, పండ్లు, పిండిధాన్యాలే. ఈ పండుగ కాలం నాటికి పునాసపంటలు.. మక్కలు, జొన్నలు, బబ్బెర్లు, పెసర్లు, పల్లీలు, మినుములు ఇంట్లోకి వస్తాయి. వాటినే నైవేద్యంగా పెట్టి తినడం ఆచారంగా మారింది. గుడి లేని పండుగ ఎన్నో కష్టాలు ఉంటాయని పండుగలోని పాటలు చెబుతాయి. కష్టాలకు, కన్నీళ్లకు వెరవకుండా నిలవాలని తంగేడు చెట్టు చెబుతోంది. మనమంతా ప్రకృతి జీవనంలో ఓ భాగమేనని పండుగ విధానం చెబుతోంది. వెరసి బతుకమ్మ పండుగ బతికి గెలవాలని.. గెలిచి నిలవాలని హితబోధ చేస్తోంది. ఏ పండుగకు ఎలా ఉన్నా ఈ పండక్కి మాత్రం ఆడకూతుళ్ల చూపు తల్లిగారింటి వైపు ఉంటుంది. ఇంత వైభవంగా భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండక్కి ఓ గుడిలేదు.. స్తోత్రంలేదు.. శ్లోకం అంతకంటే లేదు. ప్రజల కష్టాలే పాటలు.. దొరికిన పూలే రూపాలు.. ఇంట్లోని ధాన్యాలే నైవేద్యాలు. ఇంతటి విశిష్టతను కలిగిన బతుకమ్మ పండగా ఇంటింటా సందడిని నింపింది. ఊరుకో తీరుగా.. బతుకమ్మ పండగను ఊరుకో తీరుగా నిర్వహిస్తున్నారు. రాజన్న కొలువైన వేములవాడలో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మను సాగునంపుతారు. రుద్రంగి మండల కేంద్రంలో దసరా పండుగ తరువాత సద్దుల బతుకమ్మను నిర్వహిస్తారు. సిరిసిల్లతోపాటు అన్ని ప్రాంతాల్లోనూ నవరాత్రులతో సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు. ఇలా ఊరుకో తీరుగా.. ప్రాంతానికో విధంగా పూల పండగను నిర్వహిస్తారు. ఎలా నిర్వహించినా.. బతుకమ్మ పేర్చే విధానం.. కొలిచే తీరు ఒక్కటే. అదే ప్రకృతి పూల బతుకమ్మ. -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీలో నిర్వహించిన ముఖాముఖికి హాజరైన రైతులుమంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్లకు చెరుకు గడలు అందిస్తున్న జువ్వాడి నర్సింగరావుయంత్రాల స్థితిగతులపై ఆరా తీస్తున్న పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్కుమార్మల్లాపూర్(కోరుట్ల): రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మల్లాపూర్ మండలం ముత్యంపేటలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునర్ ప్రారంభించేందుకు గల ఏర్పాట్లు, రైతులతో శుక్రవారం నిర్వహించిన ముఖాముఖిలో పరిశ్రమల ముఖ్య కార్యదర్శి సంజయ్కుమార్, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రఘునందన్రావు, షుగర్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ నర్సిరెడ్డిలతో కలిసి హాజరయ్యారు. ముందుగా షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించారు. అనంతరం ఓ పంక్షన్హాల్లో నిర్వహించిన రైతులతో ముఖాముఖిలో మంత్రి మాట్లాడారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు రూ.172 కోట్ల బకాయిలు చెల్లించినట్లు తెలిపారు. ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించడానికి అవసరమైన సాంకేతికత, స్థానిక సమస్యలపై రైతుల అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వాని నివేదించనున్నట్లు పేర్కొన్నారు. ఫ్యాక్టరీ ప్రారంభమైతే జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల రైతులకు మేలు కలుగుతుందన్నారు. ఫ్యాక్టరీని ప్రారంభించాలంటే రైతులు కనీసం 10 వేల ఎకరాల్లో చెరుకు పంటను సాగు చేయాలని కోరారు. మాజీ మంత్రి, పునరుద్ధరణ కమిటీ సభ్యుడు జీవన్రెడ్డి మాట్లాడుతు ముత్యంపేటలో 1981లో ఫ్యాక్టరీ ఏర్పాటైందని, 2002లో అప్పటి ప్రభుత్వం 51 శాతాన్ని ప్రవేటీకరణ చేసిందని, 2015లో నష్టాలు, చెరుకు పంట లేదని మూసివేశారన్నారు. ఈ ప్రాంత రైతులకు లాభసాటిగా ఉండేలా ప్రభుత్వం రాయితీలు అందించి ప్రోత్సహిస్తే ఫ్యాక్టరీకి అవసరమైన చెరుకు పంటను పండిస్తారన్నారు. వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రఘునందన్రావు మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయశాఖకు సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించి విత్తన సబ్సిడీలు అందిస్తుందని తెలిపారు. చెరుకు పంటను డ్రిప్ ద్వారా పండిస్తే నీటి వినియోగం తగ్గి నీటి వనరులను కాపాడినట్లేనన్నారు. పరిశ్రమల ముఖ్య కార్యదర్శి సంజయ్కుమార్ మాట్లాడుతూ నిజాం షుగర్ ఫ్యాక్టరీ సందర్శన, రైతుల ముఖాముఖీలో చర్చించిన అంశాలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ముత్యంపేట ఫ్యాక్టరీలో పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ మాట్లాడుతూ నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడే సమయానికి నష్టాలతోపాటు క్రషింగ్కు అవసరమైన చెరుకు సాగు కావడం లేదన్నారు. రైతులు సహకార సంఘంగా ఏర్పడితే ఫ్యాక్టరీని బాగు చేయించి అప్పగించేందుకు సిద్ధమని అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించేందుకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్కుమార్, అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీవో శ్రీనివాస్, డీఎస్పీ రాములు, కాంగ్రెస్ ఇన్చార్జి జువ్వాడి నర్సింగారావు, రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు, కొమిరెడ్డి విజయ్ ఆజాద్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర జాయింట్ కో–ఆర్డినేటర్ వాకిటి సత్యంరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎలాల జలపతిరెడ్డి, చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతుల అభిప్రాయాలు ఇవీ.. -
నెల రోజులకో పంట
నాలుగు ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నాను. ఆరేళ్ల క్రి తం వరకు వరి, మొక్కజొన్న వేసేవాడిని. ప్రత్యామ్నాయ పంటలుగా మల్బరీ వేశాను. ప్రభుత్వ సహకారంతో షెడ్డు నిర్మించాను. నాలుగు బ్యాచుల్లో నష్టం వచ్చింది. మెలకువలు నేర్చుకున్నాక నెలరోజులకో బ్యాచ్ తీస్తున్నాను. నెలలో ఖర్చులు పోను రూ.50వేల వస్తుంది. – రాజేందర్శర్మ, మల్బరీ రైతు, గూడూరు మూడేళ్ల క్రితం వరకు వరిపంట సాగుచేసిన. ప్రభుత్వ ప్రోత్సాహంతో మూడు ఎకరాల్లో మల్బరీ వేసి, షెడ్డు నిర్మించాను. చిన్నపిల్లలను పోషించినట్లుగా పట్టు పురుగుల పెంపకం చేపడితే మంచి లాభాలు వస్తాయి. పట్టుకు మార్కెట్లో డిమాండ్ ఉంది. నెల రోజుల్లో ఒక బ్యాచ్ తీయవచ్చు. – కనమేని లింగారెడ్డి, రైతు, ముస్తాబాద్ -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రం శివారు నిజామాబాద్ రోడ్లోని స్వప్న బార్లో హత్యకు పాల్పడ్డ నిందితుడు చరణ్సింగ్ను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం పట్టణ పోలీస్స్టేషన్లో మాట్లాడారు. ఈనెల 25 అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామానికి చెందిన వంగ శ్రీనివాస్ను హత్య చేసిన చరణ్సింగ్ను శుక్రవారం మధ్యాహ్నం హస్నాబాద్ గ్రామ శివారులోని ఇసుక డంప్ వద్ద పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో పట్టణ సీఐ కరుణాకర్, ఎస్సైలు రవికిరణ్, కుమారస్వామి పాల్గొన్నారు. -
మొగిలిపేటలో కుల బహిష్కరణ
మల్లాపూర్(కోరుట్ల): కుల సంఘంలో ఓ నలుగురు పెద్ద మనుషులు చెప్పిన మాట వినలేదని.. ఓ మహిళా కుటుంబాన్ని కులబహిష్కరణ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం మండలంలోని మొగిలిపేటలో ముదిరాజ్ కులానికి చెందిన ఓనవేని నర్సయ్య–భూమక్క దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడు ఓనవేని దశరథం–సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు. దశరథం ఇంటి అమ్మకానికి సంబంధంచి 2018లో అదే కులానికి చెందిన ఒకరితో గొడవలు జరుగుతున్నాయి. ఈ వివాదం పరిష్కారానికి కులసంఘం పెద్దల వద్దకు వెళ్లారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో అదే సంవత్సరం కులబహిష్కరణ చేశారు. దశరథం కుటుంబంతో ఎవరైనా వారితో మాట్లాడటం, వారి ఇంటికి వెళ్లడం లాంటివి చేయొద్దని హెచ్చరించారు. స్థానిక పోలీస్స్టేషన్లో దశరథం భార్య సుజాత ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. అప్పటి నుంచి దశరథం కుటుంబం తీవ్ర మనస్థాపానికి గురవుతూ ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది దశరథం ఉపాధి కోసం గల్ఫ్కు వలస వెళ్లగా, కుల బహిష్కరణ కేసుతో ఇబ్బంది పడుతున్న పెద్దలు అతని భార్య సుజా త కేసును వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తెస్తున్నారు. కులపెద్దల మాటను ధిక్కరించినందుకు సుజాత కులసభ్యులందరి కాళ్లు మొక్కి క్షమించాలని వేడుకుంటే తిరిగి కులంలోకి చేర్చుకుంటామని సమాచారం పంపించారు. క్షమాపణ అడగబోనని సుజాత చెప్పడంతో 15 రోజుల క్రితం కులసంఘంలోని ఓ నలుగురు పెద్దలు ఆ కుటుంబంతో ఎవరు మాట్లాడినా రూ.50వేల జరిమానా విధిస్తామని హుకుం జారీ చేశారని, అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
శనివారం శ్రీ 27 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
కరీంనగర్/కరీంనగర్టౌన్/కరీంనగర్క్రైం: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని, ఆమె పోరాట స్ఫూర్తి ఆదర్శనీయమని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కొనియాడారు. జిల్లావ్యాప్తంగా చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్లో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నగరంలోని ప్రతిమ మల్టీప్లెక్స్ వద్ద ఉన్న ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, నగరపాలక కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాశ్, రజక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రాచకొండ నరేశ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు కొత్తకొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. పోలీసు కమిషనరేట్లో సీపీ గౌస్ఆలం చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు మాధవి, యాదగిరిస్వామి పాల్గొన్నారు. -
వాననీళ్లు నిలవకుండా చర్యలు
కరీంనగర్ కార్పొరేషన్: వరుసగా వర్షాలు కురుస్తున్నందున, నగరంలో ఎక్కడా వర్షపు నీళ్లు నిలవకుండా చర్యలు తీసుకోవాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. గురువారం పారిశుధ్య విభాగ అధికారులతో నగరపాలకసంస్థ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వర్షాలతో అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాలపై దృష్టి పెట్టాలన్నారు. ఫుట్పాత్ హోల్స్లో చెత్త పేరుకు పోకుండా చర్యలు చేపట్టాలన్నారు. వర్షం నీళ్లు రోడ్లపై నిల్వకుండా డ్రైనేజీల్లోకి వెళ్లేలా చూడాలన్నారు. బయోగ్యాస్ ప్లాంట్, కొత్త డీఆర్ సీసీలు, వర్మీ కంపోస్ట్ పిట్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. పారిశుధ్య వాహనాల పార్కింగ్కు పరిశీలించిన స్థలంలో నూతన వెహికిల్ షెడ్ నిర్మించాలన్నారు. డంపింగ్ యార్డులో వాహనాలు సులువుగా వెళ్లేందుకు సీసీ రోడ్లు నిర్మించాలన్నారు. స్వచ్ఛ ఆటోలు ప్రతి ఇంటికి వెళ్లాలని, యూజర్ చార్జీలు వసూలు చేసేలా వార్డు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. డిప్యూటీ కమిషనర్లు వేణుమాధవ్, ఖాదర్ మొహియుద్దీన్, సహాయ కమిషనర్ దిలీప్ కుమార్, ఎంహెచ్ సుమన్ పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్య అందించాలి
సప్తగిరికాలనీ(కరీంనగర్)/కరీంనగర్ కార్పొరేషన్: విశ్వవిద్యాలయాలు నాణ్యమైన విద్యను అందించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. శాతవాహన యూనివర్సిటీలోని బాలికల హాస్టల్ ప్రాంగణంలో ఎస్టీ బాలబాలికల హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు హాస్టల్ వసతి అభినందనీయం అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్లో ఇంజినీరింగ్ కళాశాల, కరీంనగర్లో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, ఫార్మసీ కోర్సులు తీసుకురావడం జరిగిందన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి వీసీ ఉమేశ్ కుమార్, అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీవాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, సుడా చైర్మన్ నరేందర్రెడ్డి పాల్గొన్నారు. స్వచ్ఛత జీవితంలో భాగమవ్వాలి జీవితంలో స్వచ్ఛత భాగం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా గురువారం నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో ఎల్ఎండీ కట్టపై ఏక్ దిన్.. ఏక్ గంట.. ఏక్ సాథ్ పేరిట నిర్వహించిన శ్రమదానానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా, ప్రజల భాగస్వామ్యం లేనిదే విజయవంతం కాదన్నారు. ఎల్ఎండీ కట్ట వద్ద బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో, ఈ స్థలాన్ని పరిశుభ్రం చేయడానికి ఎంపిక చేశారన్నారు. అనంతరం మంత్రి పొన్నం స్వయంగా చీపురు పట్టి డ్యాం పరిసరాలను ఊడ్చారు. స్వచ్ఛత పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు పాల్గొన్నారు. బలహీనర్గాల అభ్యున్నతికి పాటుపడడంలో కాంగ్రెస్ పార్టీ చాంపియన్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణా శిబిరాన్ని గురువారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో అడ్లూరి లక్ష్మణ్కుమార్తో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. గిరిజన శిక్షణల్లో కూడా విద్యా అంశాన్ని ప్రధానంగా చర్చించాలన్నారు. మంత్రి అడ్లూరి మాట్లాడుతూ ఆదివాసీలకు అండగా కాంగ్రెస్ ఉంటుందన్నారు. ఆదివాసీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ పాల్గొన్నారు. -
లిక్కర్..టెండర్
సాక్షి పెద్దపల్లి/కరీంనగర్క్రైం: మద్యం దుకాణాల టెండర్లకు ప్రభుత్వం గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా జిల్లాల కలెక్టర్లు లక్కీ డ్రా ద్వారా సామాజికవర్గాల వారీగా రిజర్వేషన్లకు అనుగుణంగా దుకాణాలు కేటాయించారు. శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రస్తుతం నడుస్తున్న వైన్స్ కాలపరిమితి నవంబర్ 30తో ముగియనుండగా రెండు నెలల ముందుగానే ప్రభుత్వం టెండర్లకు ఆహ్వానించింది. దీంతో ప్రస్తుతం మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులతో పాటు గతంలో లక్కీడ్రాలో అదృష్టం వరించని వారు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమతున్నారు. లైసెన్స్ కాలం 01.12.2025 నుంచి 30.11.2027 వరకు నిర్ణయించారు. ఈ ఏడాది స్థానిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మద్యం విక్రయాలు భారీస్థాయిలో ఉండే అవకాశముంది. దీంతో గతం కన్నా పెద్దసంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎకై ్సజ్శాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 287 మద్యం దుకాణాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 287 మద్యం దుకాణాలు ఉన్నాయి. మద్యంషాపుల్లో రిజర్వేషన్ ప్రకారం.. గౌడ కులస్తులకు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం దుకాణాలను కేటాయించనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎస్టీ జనాభా తక్కువగా ఉండటంతో షాపులు కేటాయించలేదు. దీంతో 53 షాపులను గౌడ్స్, 31 దుకాణాలు ఎస్సీలకు కేటాయించారు. మిగిలిన అన్ని షాపులను ఆన్రిజర్వ్ కేటగిరీలో చేర్చారు. దీంతో ఈ దుకాణాలకు ఏ సామాజికవర్గం వారైనా టెండర్ దాఖలు చేయవచ్చును. ఒక్కో దుకాణానికి రూ.3 లక్షల ఫీజు ఉమ్మడి జిల్లాలోని ఒక్కో వ్యక్తి ఒక్కో దుకాణానికి ఎన్ని దరఖాస్తులనైనా సమర్పించవచ్చు. ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలో ఏ మద్యం దుకాణానికై నా టెండర్ వేయవచ్చు. ఒక్కో దరఖాస్తుకు గతంలో రూ.2లక్షలు (నాన్ రిఫండెబుల్) ఉండగా, ఈసారి ఆ ఫీజును రూ.3లక్షలకు పెంచారు. గతేడాది ఉమ్మడి జిల్లాలో 10,734 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి టెండర్ల ద్వారా రూ.214.68 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి ఫీజు పెరగటంతో ఆదాయం మరింత పెరగనుంది. దరఖాస్తు ఫీజును డీడీగా, చలాన్ రూపంలోగాని చెల్లించవచ్చు. దరఖాస్తులను ఆయా జిల్లా ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. ఆరు శ్లాబుల్లో లైసెన్స్ల జారీ.. మొత్తం ఆరు శ్లాబుల్లో ఎకై ్సజ్శాఖ లైసెన్స్లు జారీ చేయనుంది. 2011 జనాభా లెక్క ప్రకారం 5వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో సంవత్సరానికి ఎక్సైజ్ ట్యాక్స్ రూ.50 లక్షలు, 5వేల నుంచి 50 వేలు జనాభా ఉన్న పాంతాల్లో రూ.55 లక్షలు, 50 వేల నుంచి 1 లక్ష జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.60 లక్షలు, లక్ష నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.85 లక్షలు, ఇక 20 లక్షలపైన జనాభా ఉన్న ప్రాంతాల్లో సంవత్సరానికి ఎకై ్సజ్ ఫీజు రూ.కోటి పది లక్షలుగా నిర్ణయించారు. అయితే, లాటరీ ద్వారా లిక్కర్ షాపులను పొందిన వారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన వార్షిక ఫీజును ప్రతి ఏటా ఆరు స మాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. 25 నెలల లైసెన్స్ కాలానికి గాను 1/4వ వంతు అంటే 25 శాతం సమానమైన బ్యాంక్ గ్యారంటీ ప్రభుత్వానికి సమర్పించాలి.జిల్లా మొత్తం గౌడ్స్కు ఎస్సీలకు గతంలో వచ్చిన వచ్చిన ఆదాయం కరీంనగర్ 94 17 9 4,040 80.80 జగిత్యాల 71 14 8 2,636 52.72 పెద్దపల్లి 74 13 8 2,022 40.44 సిరిసిల్ల 48 09 6 2,036 40.72 మొత్తం 287 53 31 10,734 214.68 -
రౌడీషీటర్లపై నిఘా పెంచాలి
కరీంనగర్క్రైం: జిల్లావ్యాప్తంగా రౌడీషీటర్లపై నిఘా పెంచాలని, డ్రగ్స్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. గురువారం కమిషనరేట్ కేంద్రంలో నేరసమీక్ష నిర్వహించారు. కరీంనగర్ కమిషనరేట్కు ప్రత్యేకంగా రూపొందించిన పోలీసు నూతన లోగోను అధికారికంగా ఆవిష్కరించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ తర్వాత సొంత లోగో కలిగి ఉన్న నాలుగో కమిషనరేట్గా కరీంనగర్ నిలిచిందని పేర్కొన్నారు. పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ను సమర్థవంతంగా అమలు చేయాలని, సర్కిల్ ఇన్స్పెక్టర్లు తమ పరిధిలోని పోలీస్స్టేషన్లను తరచూ సందర్శించి సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలన్నారు. పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్ బియ్యం రవాణా, పేకాటస్థావరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. గంజాయి నిర్మూలనకు పాఠశాలలు, కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి బ్లాక్స్పాట్స్ను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలను ప్రోత్సహించాలన్నారు. అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు. -
దసరాలోపు డీలర్ల కమీషన్ వచ్చేలా చర్యలు
కరీంనగర్ అర్బన్: రేషన్ డీలర్లకు దసరాలోపు కమీషన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఐదు నెలల కేంద్ర కమీషన్ డబ్బులు రావాల్సి ఉందని రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులు కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో మంత్రిని కలిసి వివరించారు. మంత్రి స్పందిస్తూ వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. సదరు సమస్యను పండుగలలోపు పరిష్కరించాలని సూచించారు. డీలర్ల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు బత్తుల రమేశ్ బాబు రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్లో పరిస్థితిని వివరించారు. కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రొడ్డ శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డిమల్ల హన్మాండ్లు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోతరాజు రమేశ్, చిలగాని మోహన్ పాల్గొన్నారు. ఎల్వోసీఎఫ్ను వ్యతిరేకించండికరీంనగర్: యూజీసీ విడుదల చేసిన ఎల్వోసీఎఫ్ను వ్యతిరేకించాలని, శాసీ్త్రయ విద్యావిధానం అందించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్య క్ష, కార్యదర్శులు ఎస్.రజినీకాంత్, టి.నాగరాజు డిమాండ్ చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో యూజీసీ గైడ్లెన్స్కు వ్యతిరేకంగా గురువారం కోతిరాంపూర్లో నిరసన తెలిపారు. యూజీసీ విడుదల చేసిన ఆదిమ, అశాసీ్త్రయ అభ్యాస ఫలితాల ఆధారిత పాఠ్య ప్రణాళిక చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలపడం జరుగుతోందన్నారు. క్యాంపస్ల శాసీ్త్రయ దృక్పథాన్ని స్తంభింపజేసే ప్రయత్నాలకు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు ఎదురవుతాయన్నారు. ఈ కార్య క్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పూజ, కిరణ్, శంకర్, సహాయ కార్యదర్శి మమత, గజ్జెల శ్రీకాంత్, ప్రశాంత్, రాష్ట్ర కమిటీ సభ్యులు అరవింద్, విఘ్నేశ్ పాల్గొన్నారు. లింగనిర్ధారణ చేస్తే కఠిన చర్యలుకరీంనగర్ టౌన్: ప్రభుత్వం అమలు చేస్తున్న లింగనిర్ధారణ చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. గురువారం డీఎంహెచ్వో కార్యాలయంలో డిస్ట్రిక్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. డీఎంహెచ్వో మాట్లాడుతూ.. జిల్లాలో లింగనిర్ధారణ నిషేధ చట్టం అమలు తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, అతిక్రమిస్తే నేరుగా డీఎంహెచ్వో కార్యాలయంలో తెలియజేయాలని సూచించారు. జిల్లాలో అనుమతి పొందిన స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేస్తున్నామని వెల్లడించారు. డాక్టర్లు సనా జవేరియా, ఉమాశ్రీ, చందు, డెమో రాజగోపాల్ పాల్గొన్నారు. 29న సద్దులు.. గ్రామాల్లో నిర్ణయంకరీంనగర్రూరల్: బతుకమ్మ పండుగ నిర్వహణపై ప్రజల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కో క్యాలెండర్లో ఒక్కో తేదీ ఉండటంతో బతుకమ్మ పండుగను ఎప్పుడు జరుపుకోవాలో తెలియక ఆయోమయానికి గురవుతున్నారు. ఒక గ్రామంలో ఈ నెల 29న అంటే మరోగ్రామంలో 30న నిర్వహించుకోవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్లో గురువారం అధి కారులతో కలిసి గ్రామపెద్దలు బతుకమ్మ పండుగ నిర్వహణపై అర్చకుడు సత్యనారాయణ చార్యులతో చర్చించారు. 29న బతుకమ్మ, అక్టోబరు 2న దసరా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు తీర్మానం చేసి అన్ని కులసంఘాల ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. -
కుటుంబ అండదండలతో..
గోదావరిఖని/గోదావరిఖనిటౌన్: గోదావరిఖనికి చెందిన సింగరేణిలో ఓసీపీ ఈపీ ఆపరేటర్ తుంగపిండి ఆనంద్ కొడుకు తుంగపిండి శివశంకర్ప్రసాద్ 448 ర్యాంక్తో అసిస్టెంట్ ట్రెజరరీ ఆఫీసర్గా ఎంపికయ్యాడు. ప్రాథమిక విద్య సింగరేణిప్రాంతంలోనే పూర్తి చేసిన శివశంకర్ప్రసాద్ ఇంటర్ కరీంనగర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత రెండేళ్ల పాటు గ్రూప్స్, సివిల్స్ కోసం ప్రయత్నించారు. ఇంతలోనే గ్రూప్–1 నోటిఫికేషన్ రావడంతో ప్రణాళికాబద్ధంగా చదివి ఉద్యోగం సాధించారు. శివశంకర్ప్రసాద్ మాట్లాడుతూ.. కుటుంబ సభ్యుల అండదండలతోనే ఈ విజయం సాధించానని, గ్రూప్–1 ఉద్యోగం చేస్తూనే సివిల్స్ రాసి ఐఏఎస్ కావడమే తన జీవిత లక్ష్యమన్నారు. తన ఎదుగుదలలో అమ్మానాన్నల పాత్ర అమోఘమని, వారికి రుణపడి ఉంటానన్నారు. -
ఘొల్లుమన్న గోపాల్రావుపల్లె
సిరిసిల్ల/తంగళ్లపల్లి(సిరిసిల్ల): గోపాల్రావుపల్లె.. పచ్చటి పొలాలు, ఎతైన గుట్టలు.. మధ్యమానేరు బ్యాక్ వాటర్.. పాడిపంటలతో కళకళలాడే ఊరు. ఆ ఊరిలో ఉన్నత కుటుంబంలో పుట్టిన నూనూగుమీసాల యువకుడు.. నాలుగున్నర దశాబ్దాల క్రితం పీడిత ప్రజల విముక్తి కోసం ఉద్యమబాట పట్టాడు. ఈ తరం వారికి అతనెవరో తెలియదు. కానీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా అబూజ్మఢ్ అడవుల్లో సోమవారం ఎన్కౌంటర్లో మరణించిన కొస అలియాస్ కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ సాధు ఉన్నట్లు తెలియడంతో ఒక్కసారిగా గోపాల్రావుపల్లె వార్తల్లోకెక్కింది. కొస పార్థీవదేహం గురువారం ఉదయం 10.20 గంటలకు ఆ పల్లెకు చేరగానే ఆ ఊరంతా కన్నీటిసంద్రమైంది. నాలుగున్నర దశాబ్దాలుగా కంటికి, ఇంటికి దూరమైన మావోయిస్టు అగ్రనేత కొస ప్రస్థానం అంత్యక్రియలతో ముగిసింది. ● ఎరుపెక్కిన ఊరు కడారి సత్యనారాయణరెడ్డి కుటుంబ సభ్యులు ముద్దుగా పిలుచుకునే సత్యం పార్థీవదేహం రావడంతో అప్పటికే ఊరు చేరిన ప్రజాసంఘాల ప్రతినిధులు, పౌరహక్కుల నేతలు, కళాకారులు, మాజీ మావోయిస్టు నేతలు ఎర్రజెండాలు కప్పి నివాళి అర్పించారు. కొస చిత్రపటంతో కూడిన ప్లెక్సీలను ప్రదర్శించారు. సత్యనారాయణరెడ్డి మృతదేహం గ్రామానికి చేరగానే ప్రజాకళాకారులు పాటలతో కొసను తలచుకుంటూ ఉద్యమ గీతాలు ఆలపించారు. పిడికిళ్లు బిగించి నివాళులు అర్పిస్తూ, జోహార్లు చెబుతూ హోరెత్తించారు. మధ్యాహ్నం అంతిమయాత్ర ప్రారంభం కాగానే ఓ వైపు వర్షం మరోవైపు రోడ్డుపై బురద ఉన్నా.. జనం లెక్క చేయకుండా అంతిమయాత్రలో పాల్గొన్నారు. డప్పు చప్పుళ్లు, కళాకారుల ఉద్యమ గీతాలు, ఆవేశపూరిత ప్రసంగాలతో అంతిమయాత్ర సాగింది. ● తరలివచ్చిన అభిమానులు సత్యనారాయణరెడ్డి అంతిమయాత్రకు ప్రజాసంఘాల ప్రతినిధులు గాదె ఇన్నయ్య, ఉద్యోగ సంఘాల ప్రతినిధి దేవిప్రసాద్, పౌరహక్కుల సంఘం నాయకులు నక్క నారాయణరావు, మాదన కుమారస్వామి, దళిత లిబరేషన్ ఫ్రంట్ వ్యవస్థాపకులు మార్వాడి సుదర్శన్, అమరవీరుల బంధుమిత్రుల కమిటీ ప్రతినిధి పద్మకుమారి, ప్రజాసంఘాల ప్రతినిధులు శాంతి, యాదవ్వ, లక్ష్మి, భవాని, మాజీ మావోయిస్టులు జ్యోతి, అమర్, గాజర్ల అశోక్, సిదన్న, దళిత సంఘాల ప్రతినిధులు రాగుల రాములు, రంజిత్, కవులు జూకంటి జగన్నాథం, గాయకులు నాగరాజు, శ్రీకాంత్, అభిమానులు, జిల్లాలోని పలు గ్రామాల ప్రతినిధులు తరలి రావడంతో గోపాల్రావుపల్లె జనసంద్రమైంది. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపుతుందని, మోదీ, అమిత్షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలువురు నాయకులు పాడెమోశారు. వర్షంలోనూ కన్నీటి వీడ్కోలు పలికారు. ● కొస భార్య కూడా ఎన్కౌంటర్లో బలి సత్యనారాయణరెడ్డి ఇల్లు విడిచి ఉద్యమంలో చేరినప్పుడు అతనికి పెళ్లికాలేదు. నిజానికి పెళ్లి చేసుకుంటే.. విప్లవ ఉద్యమంలో పని చేయడం ఇబ్బందిగా ఉంటుందని భావించి ముందే పిల్లలు కాకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న కమిట్మెంట్ ఉద్యమకారుడు. గర్చిరోలి జిల్లా కార్యదర్శిగా ఉండగా ఆదివాసీ మహిళ అయిన చడిమేక్ రుక్మిణి అలియాస్ రాధను పెళ్లి చేసుకున్నాడు. ఉద్యమ సహచరిగా ఉన్న ఆమె బస్తర్ జిల్లా మావోయిస్టు కార్యదర్శి హోదాలో ఏడాది క్రితం ఎన్కౌంటర్లో మరణించింది. కొస కుటుంబ సభ్యులకు మాత్రం అతనికి ఇంకా పెళ్లి కాలేదని తెలిసినా, ఉద్యమంలో రాధను పెళ్లి చేసుకున్నట్లు మాజీ మావోయిస్టులు వెల్లడించారు.కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కొస(ఫైల్) కొస భార్య రాధా అలియాస్ రుక్మిణి(ఫైల్) శోకసంద్రమైన ఊరు 45 ఏళ్లకు విగతజీవిగా ఇల్లు చేరిన కడారి సత్యనారాయణరెడ్డి మావోయిస్టు కొసకు కన్నీటి వీడ్కోలు తరలివచ్చిన ప్రజలు, పౌరహక్కుల నేతలు, బాల్యమిత్రులు -
వ్యవసాయ కుటుంబం నుంచి ఆర్డీవోగా..
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణంలోని బస్టాండ్ ప్రాంతానికి చెందిన పొందుగుల భూషిత్రెడ్డి గ్రూప్–1 ఫలితాల్లో ఆర్టీవోగా ఎంపికయ్యాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన భాస్కర్రెడ్డి–విజయలక్ష్మి దంపతుల కుమారుడు భూషిత్రెడ్డి. గ్రూప్–1లో 343వ ర్యాంక్తో ఆర్డీవోగా ఉద్యోగం సాధించారు. భూషిత్రెడ్డి పాఠశాల విద్యాభ్యాసం పెద్దపల్లి, హైదరాబాద్లో ఇంటర్, వరంగల్ ఎన్ఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ప్రస్తుతం బెంగళూరులో ఇన్కంటాక్సు ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులతో భూషిత్రెడ్డి -
కోచింగ్ ఇస్తూనే ఉద్యోగం సాధించి
ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన మెన్నేని అనూష గ్రూప్–1లో రాష్ట్రస్థాయిలో 62వ ర్యాంక్తో జిల్లా పంచాయతీ అధికారిగా ఎంపికయ్యారు. ముస్తాబాద్కు చెందిన మెన్నేని జగన్మోహన్రావు కుమారుడు సంతోష్రావు సతీమణి అయిన అనూష బీటెక్ చదివి ఉస్మానియాలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. న్యాయవిద్యలో రెండు బంగారు పతకాలు సాధించిన అనూష.. డీపీవోగా ఎంపిక కావడంపై కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో భర్త సంతోష్రావుతో కలిసి కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఎంతో మంది విద్యార్థులను పోటీపరీక్షలకు సిద్ధం చేస్తున్న అనూష డీపీవోగా ఎంపికయ్యారు. -
కుటుంబపోషణ కష్టమే..
పాతికేళ్లుగా పశువులకు సేవలందిస్తున్న తమకు అందించే వేతనమే తక్కువ. అయినా ఆ వేతనాలను రెగ్యులర్గా అందించడం లేదు. దీంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపి వేతనాలు సకాలంలో ఇచ్చేలా చూడాలి. – గోపతి ప్రవీణ్, గోపాలమిత్ర గోపాలమిత్రలుగా పనిచేస్తున్న వార ంతా పేద, మధ్యతరగతి వ ర్గాలకు చెందిన వారే. అరకొర వేతనంపై ప నిచేస్తున్న తమకు ఆ వేతనాన్ని కూ డా ప్రతినెలా చెల్లించేలా చూడాలి. బకాయి ఉన్న ఆరునెలల వేతనాలను దసరా పండగకు ముందే ఇప్పించి ఆదుకోవాలి. ప్రభుత్వం ఈ దిశగా చొరవచూపాలి. – కల్వల శ్రీనివాస్, గోపాలమిత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు, పెద్దపల్లి గోపాలమిత్రలుగా పనిచేస్తున్నవారికి ఈ ఏడాది మార్చి వరకు వేతనాలు చెల్లించాం. ఏప్రిల్ నుంచి బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం నుంచి నిధులు అందగానే చెల్లిస్తాం. – సత్యప్రసాదరెడ్డి, ఈఓ, పశుగణాభివృద్ది సంస్థ -
తల్లిదండ్రుల సహకారం
ఫెర్టిలైజర్సిటీ: రామగుండం కార్పొరేషన్ 22వ డివిజన్ ఎల్కలపల్లిగేట్కు చెందిన సామల శంకరయ్య–సూరమ్మ దంపతుల పెద్దకుమారుడు సామల సతీశ్కుమార్ 154వ ర్యాంక్తో అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్గా ఉద్యోగం సాధించారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన సతీశ్కుమార్ పాఠశాల విద్యను గోదావరిఖనిలో, ఇంటర్ హన్మకొండ, బీటెక్ అనంతపురంలోని జేఎన్టీయూలో పూర్తి చేశారు. బీటెక్ పూర్తయ్యాక యూపీఎస్సీ కోసం పదేళ్ల పాటు ప్రిపేర్ అయ్యారు. ఈక్రమంలోనే సీఆర్పీఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్, సెంట్రల్ ఇంటెలిజెన్సీబ్యూరోలో ఉద్యోగం సాధించారు. ఖాళీ సమయంలో హైదరాబాద్లోని పలు ఇనిస్టిట్యూట్లలో విద్యార్థులకు యూపీఎస్సీ, పోటీ పరీక్షలపై శిక్షణ ఇచ్చేవారు. గ్రూప్–1 నోటిఫికేషన్ రావడంతో రాత్రింబవళ్లు కష్టపడి ప్రిపేర్ అయి అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్గా కొలువు కొట్టారు. అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్గా ఎంపికైన సతీశ్కుమార్ -
ఆర్థిక ఇబ్బందుల్లో గోపాలమిత్రలు
● ఆరునెలలుగా అందని వేతనాలు ● నిధులు విడుదల చేయాలని వినతి పెద్దపల్లిరూరల్: పల్లెల్లోని మూగజీవాలకు పాతికేళ్లుగా వైద్య సేవలందిస్తూ గోపాలమిత్రలుగా గుర్తింపు పొందారు. ఈ ఏప్రిల్ నుంచి వేతనాలందక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. కుటుంబపోషణ కష్టంగా మారిందని కనీసం దసరా పండగ ముందైనా వేతనాలకు నిధులు విడుదల కాక పోవడంతో పండగ పూట పస్తులుండాల్సిందేనా..అని గోపాలమిత్రలు వాపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో 119 మంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 119 మంది గోపాల మిత్రలు పనిచేస్తున్నారు. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అమలు చేసే అన్ని కార్యక్రమాల్లో గోపాలమిత్రలు సేవలందిస్తున్నారు. మూగజీవాలకు సోకే వ్యాధుల నియంత్రణతో పాటు గాలికుంటు, నట్టల నివారణ టీకాలను వేయడంలో వీరిల పాత్ర కీలకం. పశుసంతతిని వృద్ధి చేసేందుకు పశువుకు కృత్రిమగర్భాధారణ చేసే విధుల్లోనూ గోపాలమిత్రలదే ప్రధాన పాత్ర. వైఎస్సార్ వచ్చాకే గౌరవవేతనం... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పశువైద్యసేవల్లో స్వచ్ఛందంగా భాగస్వాములయ్యేలా అప్పటి పాలకులు అవకాశం కల్పించగా, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే 2006లో గోపాలమిత్రలకు రూ.1,200 గౌరవవేతనం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్ మరణానంతరం సీఎంగా వ్యవహరించిన కొణిజేటి రోశయ్య రూ.3,500కు పెంచగా.. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత బీఆర్ఎస్ పాలకులు రూ.8,500కు పెంచారు. ప్రస్తుతం పీఆర్సీతో కలిపి రూ.11,050 వేతనం పొందుతున్నారు. ప్రతి నెలా టీఎస్ఎల్డీఏ (తెలంగాణ లైవ్స్టాక్ ఏజెన్సీ) ద్వార వేతన మొత్తాన్ని విడుదల చేస్తారు. పశువులకు కృత్రిమ గర్భాధారణ చేసేందుకు కేంద్రం అందించే రూ.100 ప్రోత్సాహకం కూడా చాలా ఏళ్లుగా రావడంలేదు. ఉమ్మడి జిల్లాలో గోపాలమిత్రలు పెద్దపల్లి 39 కరీంనగర్ 39 జగిత్యాల 21 సిరిసిల్ల 20 -
ఏకపక్ష కాల్పులు సరికాదు
నేను, సత్యనారాయణరెడ్డి పెద్దపల్లిలో ఐటీఐ చేశాం. ఇద్దరం క్లాస్మెంట్లమే. ఎంతో చురుకై న విద్యార్థి. నేను ఉద్యోగంలో చేరి స్థిరపడ్డాను. ఆయన ఉద్యమంలో చేరారు. మావోయిస్టులు చర్చలకు సిద్ధమని చెబుతున్నా, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏకపక్ష కాల్పులకు దిగుతుంది. మావోయిస్టులను అంతం చేయడం కాదు.. నిరుద్యోగాన్ని, పేదరికాన్ని అంతం చేయాలి. – దేవీప్రసాద్, కొస క్లాస్మెంట్ మాది రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగళపల్లె. నేను మావోయిస్టు పార్టీలో 20 ఏళ్లు పని చేశాను. కొస దాదాతో కలిసి చాలా కాలం పని చేశాను. ఎంతో కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. ప్రజాఉద్యమాలపై పాఠాలు చెప్పేవారు. వనరుల దోపిడీ, పీడిత ప్రజల మౌలిక వసతులు, బహుళజాతి కంపెనీల ఎత్తుగడలను వివరించేవారు. పార్టీ నిర్మాణంపై దృష్టి సారిస్తూ దేశమంతటా తిరిగేవారు. ఆయన పార్టీకి ఓ లెజెండ్. – నేరెళ్ల జ్యోతి, మాజీ మావోయిస్టు, శివంగాళపల్లె మాది పెద్దపల్లి పక్కన ఓ పల్లె. మా అన్న లచ్చిరెడ్డి అలియాస్ సూరన్న తొలితరం దళనేత. సూరన్నతో కలిసి సత్యనారాయణరెడ్డి ప్రజా ఉద్యమాల్లోకి వెళ్లాడు. నిజానికి 1980లో తొలిసారి ఆదివాసీ ప్రాంతాల్లో సాయుధపోరాటాన్ని నడిపించిన మొదటి వ్యక్తి కొస. దండకారణ్యంలో ఆదివాసీ సమస్యలపై పోరాటం చేస్తూ, అక్కడి ప్రజలను ఏకం చేశారు. ఆయన స్ఫూర్తితోనే మావోయిస్టు పార్టీ దండకారణ్యంలో నాలుగున్నర దశాబ్దాలుగా మనుగడ సాధించింది. – కంది చొక్కారెడ్డి, పెద్దపల్లి -
కాలేజీల్లో ‘పేరెంట్స్ మీటింగ్’
● తల్లిదండ్రులను భాగస్వామ్యం చేసేలా.. ● నేడు అధ్యాపకులు, తల్లిదండ్రుల సమావేశం ● సీఎం పేరిట ఆహ్వానపత్రాలు అందజేత ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 51 కళాశాలలు గంభీరావుపేట(సిరిసిల్ల): ప్రభుత్వ జూని యర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు, ఉత్తీర్ణత శాతం పెంచి ఇంటర్ విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం, ఇంటర్బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మాదిరిగా జూనియర్ కళాశాలల్లోనూ పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఈ విద్యాసంవత్సరం మొదటిసారిగా అన్ని జూనియర్ కళాశాలల్లో ఈనెల 26న(శుక్రవారం) తల్లిదండ్రులు, అధ్యాపకుల సమావేశం నిర్వహించతలపెట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 51 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. తల్లిదండ్రుల సమావేశంలో... ● విద్యార్థుల హాజరు, క్రమశిక్షణ, విద్యాప్రగతి, ప్రతిభ, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించనున్నారు. ● ఇంటర్ విద్యాప్రమాణాల పెంపుదలకు తల్లిదండ్రుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. సీఎం పేరిట ఆహ్వానపత్రం ఈనెల 26న నిర్వహించే పేరెంట్ టీచర్ మీటింగ్(పీటీఎం)కు రావాలని సీఎం రేవంత్రెడ్డి పేరిట ఫొటోతో సహా ఆహ్వానపత్రాలను ఇంటర్బోర్డు అధికారులు ముద్రించారు. విద్యార్థుల విజ్ఞాన అభివృద్ధికి నిర్వహిస్తున్న ఈ సమావేశంలో తప్పనిసరిగా పాల్గొనాలని పత్రంలో కోరారు. ప్రతీ విద్యార్థికి ఉచిత, నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పిల్లల విద్యాపురోగతి, వ్యక్తిత్వ వికాసం కోసం అందరం కలిసి పనిచేయాలంటే తల్లిదండ్రుల భాగస్వామ్యం తప్పనిసరని ఆహ్వానపత్రంలో పేర్కొన్నారు. ఈ ఆహ్వానపత్రాలను అధ్యాపకులు విద్యార్థుల ఇంటికి వెళ్లి సమావేశానికి రావాల్సిందిగా కోరుతూ అందజేశారు. కళాశాలల వివరాలు సిరిసిల్ల 10 కరీంనగర్ 11 పెద్దపల్లి 14 జగిత్యాల 16 -
ఎన్టీపీసీ యువకుడు.. గ్రూప్–1 విజేత
జ్యోతినగర్: ఎన్టీపీసీ రామగుండం ప్రాంతానికి చెందిన ముద్దసాని శ్రీరాంరెడ్డి గ్రూప్–1లో 144వ ర్యాంక్తో అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్గా ఎంపికయ్యారు. స్థానిక కృష్ణానగర్కు చెందిన ముద్దసాని శ్రీనివాసరెడ్డి–ఊర్మిల దంపతుల కుమారుడు ముద్దసాని శ్రీరాంరెడ్డి స్థానిక ఓ ప్రైవేట్ స్కూల్లో పాఠశాల విద్య, ఫిట్జీలో ఇంటర్ చదివారు. తాను పనిచేస్తున్న ప్రైవేట్ ఉద్యోగానికి రాజీనామా చేసి యూపీఎస్సీకి సిద్ధమవుతున్నారు. రెండోసారి యూపీఎస్ఈ మెయిన్స్ వరకు వెళ్లారు. ఈక్రమంలో గ్రూప్–1 ఫలితాలు వెలువడడంతో ఉద్యోగం సాధించారు. శ్రీరాంరెడ్డి -
వృద్ధురాలి ఆత్మహత్య
కొత్తపల్లి(కరీంనగర్): చింతకుంట గ్రామానికి చెందిన మచ్చ భూమక్క (62) అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కొత్తపల్లి సీఐ బి.కోటేశ్వర్ తెలిపారు. మృతురాలు అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది బుధవారం రాత్రి క్రిమిసంహారక మందు తాగింది. కుటుంబసభ్యులు కరీంనగర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. మృతురాలి కొడుకు కుమారస్వామి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ పేర్కొన్నారు.బార్ అండ్ రెస్టారెంట్లో ఒకరి హత్య జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని నిజామాబాద్రోడ్లోగల స్వప్న బార్ అండ్ రెస్టారెంట్లో ఒకరు హత్యకు గురయ్యారు. వెయిటర్ శ్రీనివాస్పై వంటమనిషి చరణ్ సింగ్ బీరుసీసాతో దాడిచేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. జగిత్యాలరూరల్ మండలం మోరపల్లికి చెందిన వంగ శ్రీనివాస్ (34)15 రోజులుగా బార్అండ్ రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేస్తున్నాడు. గురువారం వేకువజామున రెస్టారెంట్లో వంటమనిషిగా పనిచేస్తున్న నేపాల్కు చరణ్ దీప్ సింగ్ తోటి కార్మికులతో వాగ్వివాదానికి దిగాడు. ఆ గొడవను సర్దిచెప్పేందుకు శ్రీనివాస్ ప్రయత్నించగా.. చరణ్సింగ్ బీరుసీసాతో దాడిచేశాడు. దీంతో తలకు బలమైన గాయం కావడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందాడు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్, పట్టణ సీఐ కరుణాకర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి భార్య వంగ సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు.కోళ్లవ్యాన్ ఢీ.. ఒకరు మృతిరామడుగు: రామడుగు మండలం కోరటపల్లి గ్రామానికి చెందిన మేకల శ్రీధర్(27) కోళ్లవ్యాన్ ఢీకొని మృతి చెందాడు. ఎస్సై రాజు వివరాల ప్రకారం.. కోరటిపల్లి గ్రామానికి చెందిన మేకల శ్రీధర్ బుధవారం రాత్రి తన ద్విచక్రవాహనంపైన రామడుగు నుంచి స్వగ్రామం కోరటపల్లికి వెళ్తున్నాడు. షానగర్ శివారులో ఎదురుగా వచ్చిన కోళ్లవ్యాన్ ఢీకొంది. శ్రీధర్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీధర్ తండ్రి సుధాకర్ ఫిర్యాదుతో పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు.రోడ్డు ప్రమాదంలో యువకుడు..కొత్తపల్లి(కరీంనగర్): సీతారాంపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. కొత్తపల్లి సీఐ కోటేశ్వర్ వివరాల మేరకు చొప్పదండికి చెందిన కొంకటి సందీప్(24) కరీంనగర్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటాడు. గురువారం ఉదయం చొప్పదండి నుంచి కరీంనగర్లోని తన కార్యాలయానికి బైక్పై వస్తున్నాడు. సీతారాంపూర్లోని కేఆర్ గార్డెన్ సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. సందీప్ తల, ముఖంపై తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగింది. 108లో కరీంనగర్లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించగా.. పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. కారు డ్రైవర్పై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. -
పేదల కోసమే పనిచేస్తా
● మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ జమ్మికుంట: నిరంతరం పేదల కోసం పని చేస్తానని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని పత్తి మార్కెట్లో బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అనాథపిల్లల పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. పేదలకోసం బాల వికాస స్వచ్ఛందసంస్థ కృషి చేయడం అభినందనీయమన్నారు. బాల వికాస ఫౌండర్ బాలథెరిస్సా, సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన, లత, మంజుల, జ్యోతి, అముల్య పాల్గొన్నారు. మహిళా చట్టాల అమలులో నిర్లక్ష్యంకరీంనగర్: దేశవ్యాప్తంగా శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యలు పని భద్ర త, సమాన పనికి సమాన వేతనం, జీతభత్యం లేని శ్రమ తదితర సమస్యల పరిష్కారానికి అనేక చట్టాలున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎం.పద్మశ్రీ అన్నారు. మంగళవారం నగరంలోని ముకుందలాల్ మిశ్రాభవన్లో మారెళ్ల శ్రీలత అధ్యక్షతన జరిగిన జిల్లా శ్రామిక మహిళా సదస్సులో మాట్లాడారు. శ్రామిక మహిళల సమస్యల పరిష్కారానికి ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు హైదరాబాద్లో నవంబర్ 1, 2 తేదీ ల్లో 13వ జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ర మేశ్, జిల్లా అధ్యక్షుడు ముకుందరెడ్డి ఉన్నారు. సారఽథి సేవలు షురూతిమ్మాపూర్: ఇన్నాళ్లు రవాణా శాఖ సేవలన్నీ రాష్ట్ర వెబ్సైట్ ద్వారా నడిచేది కానీ.. కేంద్రం దేశంలోని అన్ని రాష్ట్రాల రవాణా శాఖలను ఏకంచేస్తూ సారథి పోర్టల్ ప్రవేశపెట్టగా.. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాలు పైలట్ ప్రాజెక్టు కింద సక్సెస్ అయ్యాయి. తిమ్మాపూర్ లోని ఉమ్మడి జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో సారధి పోర్టల్ ద్వారా సేవలను ఆ శాఖ అధికారులు ప్రారంభించారు. నూతన పోర్టల్ ద్వారా సేవలన్నీ సులభంగా జరగనున్నాయి. మంగళవారం తిమ్మాపూర్ లోని ఆర్టీఏ కార్యాలయంలో సారఽథి పోర్టల్ ద్వారా మొట్టమొదటి లెర్నింగ్ లైసెన్స్ ను పొందిన మహిళకు ఎంవీఐ రవికుమార్, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ అందజేశారు. ఆర్టీసీలో దసరా లక్కీ డ్రావిద్యానగర్(కరీంనగర్): దసరా పండుగ సందర్భంగా ఈనెల 27 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు ఆర్టీసీ సెమీ డీలక్స్, డీలక్స్, మెట్రో డీల క్స్, సూపర్ లగ్జరీ, లహరీ బస్సులతో పాటు అన్ని ఏసీ బస్సుల్లో ప్రయాణం చేసినవారికి లక్కీ డ్రా స్కీం అమలు చేస్తున్నట్లు కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు తెలిపారు. ఈ స్కీంకు సంబంధించి అన్ని ప్రధాన బస్స్టేషన్లలో లక్కీ డ్రా బాక్సులు ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణికులు తమ ప్రయాణం ముగిసిన తరువాత టికెట్ వెనుక భాగంలో పేరు, చిరునామా, మొబైల్ నంబర్ రాసి బాక్స్లో వేయాలని సూచించారు. అక్టోబర్ 8వ తేదీ సాయంత్రం 4గంటలకు లక్కీ డ్రా తీస్తామని, మొదటి విజేతకు రూ.25వేలు, రెండో విజేతకు రూ.15 వేలు, మూడో విజేతకు రూ.10వేలు చెక్కురూపంలో అందిస్తామని వివరించారు. దరఖాస్తులు ఆహ్వానంకరీంనగర్: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు 2025 సంవత్సరానికి గాను షెడ్యుల్డ్ కులాల అభివృద్ధిశాఖ ద్వారా నిర్వహించబడుచున్న ‘అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం’ ద్వారా విద్యార్థులకు రూ.20లక్షలు స్కాలర్షిప్ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి ఎం.నగైలేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, జపాన్, సౌత్ కొరియా న్యూజిలాండ్ విశ్వ విద్యాలయాల్లో చదివేందుకు ఆసక్తి ఉన్నవారు నవంబర్ 19వ తేదీ వరకు www. telangana. epass. cgg. gov. in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, ఎంపికై నవారికి రూ.20లక్షలు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. -
హుజూరాబాద్ ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు
హుజూరాబాద్: హుజూరాబాద్ ప్ర భుత్వాసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని డిప్యూ టీ డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేబుల్ హెల్త్ సర్వీస్ డాక్టర్ ఎల్.కృష్ణ ప్ర సాద్ తెలిపారు. మంగళవారం ఏరి యా ఆస్పత్రిలో వైద్యులతో సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రిలో ఇప్పటివరకు రికార్డుస్థాయిలో 23,761 రక్త పరీక్షలు చేసినట్లు తెలిపారు. ఆగస్టులో 13,510మంది అవుట్ పేషెంట్లకు చికిత్స అందించామని, 1,083 మందిని ఇన్ పేషెంట్లుగా చేర్చుకున్నట్లు వివరించారు. 106 మందికి మేజర్ శస్త్రచికిత్సలు, 334 మందికి మైనర్ శస్త్ర చికిత్సలు చేశామన్నారు. 13 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, 103మందికి ఆరోగ్యశ్రీ చికిత్స జరిగినట్లు తెలిపారు. త్వరలో స్కానింగ్ మిషన్ రానుందని సూపరింటెండెంట్ డాక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. ఏవో అహ్మద్, ఏడీ నజీము ల్లా, డాక్టర్ పి.శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు. -
అక్రమ ఇంటి నంబర్లు తొలగించాలి
కరీంనగర్ కార్పొరేషన్: నిర్మాణాలు లేని స్థలాలకు ఇచ్చిన ఇంటినంబర్లను రద్దు చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. మంగళవారం నగర పాలకసంస్థలో రెవెన్యూ, టౌన్ప్లానింగ్ సెక్షన్ల అధికారులతో సమీక్ష నిర్వహించా రు. ఆస్తిపన్ను వసూళ్లు, అండర్ అసెస్మెంట్, అన్ అసెస్మెంట్లు, రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీస్, యూజర్ చార్జీల వసూళ్లు, ట్రేడ్ లైసెన్స్, నిర్మాణాలు లేకుండా ఇంటి నంబర్లు, ప్రభుత్వస్థలాల్లో అక్రమ నిర్మాణాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణాలు లేకుండా ఇంటి నంబర్లు ఇచ్చినట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే అలాంటి ఇంటినంబర్లను రద్దు చేయాలన్నారు. రెసిడెన్షియల్స్లో వ్యాపారాలు చేస్తుంటే కమర్షియల్కు మార్చాలన్నారు. వార్డు అధికారులు డివిజన్లవారిగా ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నాయో గుర్తించి, వివరాలను రిజిష్టర్లో పొందుపరిచాలన్నారు. ట్రాన్స్కో కమర్షియల్ మీటర్ల ఆధారంగా సర్వే చేసి రెసిడెన్షియల్ నుంచి కమర్షియల్కు మార్చి ఆన్లైన్లో అప్డేట్ చేయాలన్నారు. బకాయిలు చెల్లించనివారికి నోటీసులు జారీ చేసి, నల్లా కనెక్షన్లు తొలగించాలని ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియుద్దీన్, సహాయ కమిషనర్ దిలీప్కుమార్, డీసీపీ బషీరొద్దీన్, ఏసీపీ వేణు పాల్గొన్నారు. ఏక్దిన్.. ఏక్ గంటా.. ఏక్ సాథ్ స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా ఈ నెల 25వ తేదీన గంటపాటు సామూహిక శ్రమదాన కార్యక్రమాన్ని నగరపాలకసంస్థ నిర్వహిస్తోంది. ఏక్ దిన్...ఏక్ గంటా..ఏక్సాథ్ పేరిట ఈ శ్రమదానం చేపట్టింది. మానేరు డ్యాం సమీపంలోని ఐటీ టవర్ వద్ద దాదాపు వేయి మందితో ఒకే సారి గంటపాటు ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా మార్చనున్నారు. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ను మంగళవారం నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆవిష్కంచారు. ప్రతీ నిమజ్జన పాయింట్ వద్ద ఏర్పాట్లు సద్దుల బతుకమ్మ సందర్భంగా ప్రతి నిమజ్జన పాయింట్ వద్ద ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. మంగళవారం నగరంలోని మానేరు డ్యాం ప్రాంతంలో గౌతమినగర్, లేక్ పోలీసుస్టేషన్, సీఎం పాయింట్, మార్కండేయకాలనీ, హస్నాపూర్, బతుకమ్మ కాలనీ పాయింట్లను పరిశీలించారు. అన్ని పాయింట్ల వద్ద నేలను చదును చేయడంతో పాటు, లైటింగ్ సిస్టమ్, తాగునీటి సౌకర్యాలు కల్పించాలన్నారు. -
మారిందా?
తూటా దిశసాక్షిప్రతినిధి,కరీంనగర్: తుపాకీ నుంచి తూటా బయటికి వచ్చిన తరువాత.. టార్గెట్ వైపునకు దూసుకుపోతుంది. టార్గెట్ను తాకిన తరువాత దాని వేగం ఆగదు. కానీ, దిశ మార్చుకుని అదే వేగంతో మరింత ముందుకు దూసుకుపోతుంది. ఎలగందుల ఫైరింగ్ రేంజ్ సమీపంలో ఉన్న బోనాలపల్లె వైపునకు దూసుకుపోతున్న పోలీసు తూటాల విషయంలో సరిగ్గా ఇదే జరిగిందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. తూటా ప్రయాణంలో ఉండగా.. దిశ మార్చుకోవడం సహజంగా జరిగేదే అని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే బోనాలపల్లెలోని వృద్ధురాలు అమృతమ్మకు తగిలిన తూటా, అంతకుముందు అక్కడి ఇళ్ల పైకప్పుల నుంచి లోనకు దూసుకువచ్చిన బుల్లెట్లు కూడా ఇదే విధంగా వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బోనాలపల్లెలో అమృతమ్మను తాకింది ఎస్ఎల్ఆర్ నుంచి వచ్చినట్లుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బుల్లెట్ రికేషే బుల్లెట్ను తుపాకీ నుంచి పేల్చిన తరువాత లక్ష్యం వైపు దూసుకుపోతుంది. టార్గెట్ మనిషి లేదా జంతువు ఇంకేదైనా మెత్తని ఉపరితలం అయితే.. దాన్ని చీల్చుకుంటూ వెళ్తుంది. లక్ష్యానికి కలిగే నష్టం బుల్లెట్ ప్రయాణించిన దూరం మీద ఆధారపడి ఉంటుంది. నునుపు లేదా గరుకు ఉపరితలలాను సమీపం నుంచి బుల్లెట్ తాకినపుడు అది తాకిన కోణం ఆధారంగా దిశ తప్పకుండా మార్చుకుని మరో దిశకు దూసుకుపోతుంది. దీన్నే సాంకేతిక భాషలో ‘బుల్లెట్ రికేషే’ అని పిలుస్తారు. ఉదాహరణకు తుపాకీ నుంచి వెలువడిన ఒక బుల్లెట్ 15 నుంచి 45 డిగ్రీల కోణంలో ఉపరితలాన్ని తాకినప్పుడు అది తన దిశను మార్చుకునేందుకు అధిక అవకాశాలు ఉన్నాయని సినీయర్ పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో 70 నుంచి 90 డిగ్రీల కోణంలో గరుకు ఉపరితలాన్ని బుల్లెట్ తాకినప్పుడు అది తిరిగి వచ్చి కాల్చిన వ్యక్తి శరీరంలోకే దూసుకు వెళ్లే ప్రమాదముందని స్పష్టంచేస్తున్నారు. బోనాలపల్లె వైపునకు బుల్లెట్లు దూసుకువస్తున్న విధానంపై స్థానిక పోలీసులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. శిక్షణలో ఉన్న పోలీసులకు ఉన్నతాధికారులు పాయింట్22, 303, సెల్ఫ్ లోడెడ్ రైఫిల్ (ఎస్ఎల్ఆర్), ఏకే–47, పిస్టల్, కార్బన్ తదితర అన్ని రకాల తుపాకులతో సాధన చేయిస్తారు. ఏ తుపాకీ నుంచి వెలువడిన బుల్లెట్ అయినా సగటున గంటకు 4,300 కిమీలకుపైగా వేగంతో ప్రయాణిస్తుంది. ఎలగందుల ఫైరింగ్రేంజ్లో టార్గెట్ బోర్డులను తాకి వెనక ఉన్న కొండ రాళ్లను తాకుతున్నాయి. కాల్చిన తూటాల్లో చాలామట్టుకు అక్కడే ఆగిపోతాయి. కొన్ని తూటాలు రాళ్ల ఉపరితలం అంచును తాకి దిశను మార్చుకుని బోనాలపల్లె వైపుకు దూసుకొస్తున్నాయి. గతంలోనూ ఇలా తూటాలు దూసుకువచ్చాయి. కానీ, ఆ సమయంలో మైనింగ్ లేకపోవడంతో గుట్ట ఎత్తు అధికంగా ఉండేది. దీంతో అక్కడే ఆగిపోయేవి. ఈ మధ్య ఎత్తు తగ్గడంతో బోనాలపల్లె వరకు బుల్లెట్లు ప్రయాణిస్తున్నాయి. ఇలా దిశ మార్చుకున్న తూటాలు కూడా ప్రాణాంతకమే అని పలువురు పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ నుంచి బాలిస్టిక్ ఎక్స్పర్ట్స్ టీం వచ్చి అధ్యయనం చేసిన అనంతరం మరిన్ని విషయాలు తెలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
పండుగ పూట పస్తులేనా?
కరీంనగర్: బతుకమ్మ, దసరా పండుగ సమీపిస్తున్న వేళ పాఠశాలల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు, గ్రామపంచాయతీల్లోని మల్టీపర్పస్ కార్మికులు, కారోబార్లు, ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు 3 నెలలుగా జీతాలు రావడం లేదు. దీంతో పండుగ పూట పస్తులేనా అంటూ వాపోతున్నారు. కాగితాలకే పరిమితం జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులకు పెంచిన వేతనం కాగితాలకే పరిమితమైంది. జీతాల చెల్లింపుల విషయంలో జవాబుదారీగా ఎవరూ ఉండడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో తొలిమెట్టు అయిన గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లు 3 నెలలుగా వేతనాలు రాక పండుగ పూట పస్తులేనా అంటూ దిక్కులు చూస్తున్నారు. జిల్లాలోని 16 మండలాల్లోని 313 గ్రామ పంచాయతీల్లో 1,460 మంది మల్టీపర్పస్ కార్మికులు పని చేస్తున్నారు. పారిశుధ్య కార్మికులు, వాటర్మెన్, ఎలక్ట్రిషియన్, ట్రాక్టర్ డ్రైవర్, కారోబార్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో పంచాయతీలో సగటున నలుగురు కార్మికులు పని చేస్తున్నారు. నెలకు రూ.9,500 చొప్పున వీరికి వేతనంగా చెల్లిస్తున్నారు. పంచాయతీలకు ఆదాయమిలా.. జిల్లావ్యాప్తంగా జనాభాలో ఒక్కొక్కరికి రూ.166 చొప్పున కేంద్ర ఆర్థిక సంఘం పంచాయతీలకు నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం రూ.115 చొప్పున మాత్రమే చెల్లి స్తోంది. ఈ లెక్కన ప్రతి నెల జిల్లాకు రూ.8.75కోట్ల నిధులు రావాల్సి ఉంటుంది. ఇవికాకుండా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.కోటి5లక్షలు, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.62లక్షలు రావాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే ఎస్ఎఫ్సీ నిధులు వీటికి అదనం. కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. 3 నెలలుగా నిధుల్లేవు.. ప్రభుత్వ నిధులు రాకపోవడంతో పంచాయతీల్లో పాలన కుంటుపడుతోంది. కార్మికులకు వేతనాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొంది. గతంలో కేంద్ర ఆర్థిక సంఘం నిధుల నుంచి వేతనాలను చెల్లించేందుకు అవకాశం ఉండేది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను ఖర్చులకు వాడుకొని అభివృద్ధి పనులను నిర్లక్ష్యం చేస్తుండడంతో.. కేంద్ర ఆర్థిక సంఘం నిధులను జీతాల కోసం వాడుకునే అవకాశం లేకుండా నిబంధనలు సవరించారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సమానంగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులను విడుదల చేయాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. మూడు నెలల కార్మికుల వేతనాల బకాయిలు సుమారు రూ.6కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న 683 మంది స్కావెంజర్లకు 3 నెలల వేతనాలు రావాల్సి ఉంది. ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు సైతం వేతనాలు అందకపోవడంతో వారి వెతలు వర్ణనాతీతం. జిల్లావ్యాప్తంగా పని చేస్తున్న 240 మంది కారోబార్లదీ అదే పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం చిరుద్యోగుల వేతనాలు నెలలుగా చెల్లించకపోవడంతో అనేక ఇక్కట్లపాలవుతున్నారు. గ్రీన్చానల్ ద్వారా నెలనెలా వేతనాలు చెల్లిస్తామన్న ప్రభుత్వ హామీ నిలబెట్టుకోవాలి. బతుకుదెరువు కోసం 24 గంటలపాటు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల వేతనాలను నెలనెలా చెల్లించాల్సిందే. – కొప్పుల శంకర్, జీపీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
ఆయుర్వేద వైద్యాన్ని వినియోగించుకోవాలి
కరీంనగర్టౌన్: ప్రభుత్వ ఆయుర్వేద వైద్యసేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా కరీంనగర్ రాంనగర్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ఉచిత ఆయుర్వేద మెడికల్ క్యాంపు నిర్వహించారు. రోగులకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందజేశారు. కలెక్టర్ పమేలా సత్పతి ప్రదర్శనలో ఉంచిన ఆయుర్వేద ఔషధాలను, పలు రకాల ఆయుర్వేద మొక్కలను పరిశీలించారు. ఆయుష్మాన్ ఆసుపత్రిని సందర్శించి పలు సూచనలు చేశారు. ఆస్పత్రిలో ఆరోగ్య మహిళ సహా ప్రభుత్వం నుంచి లభించే ఉచిత వైద్య సేవలు, ఔషధాల వివరాలు తెలియజేయాలని ఆదేశించారు. గర్భిణులకు సాధారణ ప్రసవానికి మేలు చేసే యోగాసనాలను గురించి తెలియజేయాలన్నారు. డీఎంహెచ్వో వెంకటరమణ, యునాని సీనియర్ మెడికల్ ఆఫీసర్ యస్రబ్ సుల్తానా, డీపీఎం ప్రవీణ్ కుమార్, ఆర్.నీరజ పాల్గొన్నారు. హైపటైటిస్ వ్యాక్సినేషన్ పరిశీలన వైద్య విధాన పరిషత్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న హైపటైటిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్ఎంవో నవీనా, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి సాజిదా పాల్గొన్నారు. -
జీఎస్టీ తగ్గింది.. సందడి పెరిగింది
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబులను సడలించిన నేపథ్యంలో పలు వస్తువుల ధరలు తగ్గాయి. ఈనెల 22 నుంచి తగ్గిన ధరలు అమల్లోకి రాగా.. మార్కెట్లో తాకిడి పెరిగింది. ముఖ్యంగా టీవీలు, ఫ్రిజ్లు, ఇతర ఎలక్ట్రికల్ వస్తువులతో పాటు బైక్లు, కార్ల షోరూముల్లో సందడి కనిపించింది. నగరంలోని పలు వాహనాల షోరూములతో పాటు స్టోర్లలో వినియోగదారుల రద్దీ ఉంది. ఇటు పండుగ ఆఫర్లు.. అటు జీఎస్టీ తగ్గడంతో గిరాకీ పెరిగిందని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
వాయినాల బతుకమ్మ
సిరిసిల్లటౌన్: తెలంగాణ ప్రజల సంస్కృతి బతుకమ్మ. పూలపండుగ అంటేనే ఆడపడుచుల ఇష్టమైన పండుగ. ఏటా గడ్డిపూలను గౌరమ్మగా పేర్చి ఆడపడుచులుగా కొలుస్తుంటారు. పృకృతి సహకరించిన కాలంలో పూలు విరివిగా పూస్తాయి. లేకుంటే అడవిలో దొరికే బతుకమ్మ పూలకు సైతం కరువు ఏర్పడుతుంది. ఈనేపథ్యంలో సిరిసిల్లలో తయారయ్యే కాగితపు రంగు పూల ‘సిద్దుల బతుకమ్మలను’ పూజించడం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏళ్లుగా వస్తోంది. వాయినాల బతుకమ్మలుగా పిలుచుకునే కాగితపు రంగుల బతుకమ్మలను సిరిసిల్లకు చెందిన సిద్ధుల కులస్తులు తయారీ చేసి విక్రయిస్తుంటారు. వాయినాల బతుకమ్మలపై ప్రత్యేక కథనం. ● సిరిసిల్లకు ప్రత్యేకం సిద్ధుల బతుకమ్మ ● కాగితపు బతుకమ్మల తయారీతో ఉపాధి ● పేదలకు అందుబాటులో ధరలు బతుకమ్మలు పేర్చడానికి కావాల్సిన ఎంగిలిపూలు కరువు ఏర్పడినప్పుడు సిద్ధుల బతుకమ్మలకు డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా బతుకమ్మలకు కావాల్సిన గునుగు, తంగేడుపూలు కొరత ఎక్కువైంది. దీంతో సిద్దుల బతుకమ్మలకు ఆర్డర్లు రావడంతో కొద్ది రోజుల నుంచి బతుకమ్మలను తయారు చేస్తున్నారు. ప్రస్తుత సీజన్లో సిద్దుల బతుకమ్మలకు డిమాండ్ రావడంతో తయారీని పెంచారు. గునుగు, తంగేడు వంటి బతుకమ్మపూలు కొరతతో ఈఏడు కాగితపు బతుకమ్మలకు ఆర్డర్లు పెరుగుతున్నాయి. వెదురు పుల్లలను బతుకమ్మ ఆకారంలో పేర్చి వాటిపై కాగితపు పూలను అతికిస్తూ.. నెల రోజులుగా ఇంటిల్లి పాది బతుకమ్మలను తయారు చేసి అమ్మకానికి సిద్ధం చేశారు. ● స్పెషల్గా సిద్దుల బతుకమ్మలు కాగితపు పూలతో అందమైన బతుకమ్మలను తయారు చేయడంలో సిద్దుల కులస్తులది అందవేసిన చేయి. తరతరాలుగా వీరు కులవృత్తిగా బతుకమ్మలను తయారు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ ప్రాంతంలో సిద్దుల కులస్తులకు ప్రత్యేకంగా కాలనీ ఉంది. పండుగలకు పూజ సామాగ్రి, కుంకుమ, గవ్వలు, అలంకార సామగ్రి విక్రయించడం వీరి ప్రధాన జీవనోపాధి. బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు సుమారు ముప్పై కుటుంబాలు కాగితపు పూలతో బతుకమ్మలు తయారు చేస్తారు. ఒక్క అడుగు నుంచి పది అడుగుల పొడవు వరకు కాగితపు బతుకమ్మలను తయారుచేస్తారు. ఒక్కో బతుకమ్మ రూ.50 మొదలుకొని రూ.1200 విక్రయిస్తారు. ● వాయినాల బతుకమ్మలుగా... కొత్త కోడలుకు అత్తారింటి నుంచి మొదటి బతుకమ్మ పండుగకు కాగితపు పూల బతుకమ్మలను ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అటవీ ప్రాంతంలో బతుకమ్మ పూలు దొరకడం కష్టంగా ఉంది. దొరికిన కొద్దిపాటి పూలను రైతులు, గిరిజనులు అమ్ముకొంటూ... తక్కువ రేటుకు దొరికే కాగితపు పూల బతుకమ్మలను కొనుక్కొని వెళ్తున్నారు. -
టీజీఎన్పీడీసీఎల్ యాప్తో మరిన్ని సేవలు
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించడంలో భాగంగా టీజీఎన్పీడీసీఎల్ యాప్ను సంస్థ రూపొందించింది. వినియోగదారులకు సేవలు విస్తరించడమే లక్ష్యంగా విద్యుత్ సంస్థ ముందుకు సాగుతోంది. ఇంటి వద్ద నుంచే విద్యుత్ సేవలు పొందేలా ఈ యాప్ను విద్యుత్ సంస్థ అందుబా టులోకి తెచ్చింది. అత్యుత్తమ సాంకేతికతను జోడిస్తూ వినియోగదారులకు సౌకర్యంగా ఉండేలా 20 ఫీచర్లతో తయారు చేసిన ఈ యాప్ను ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లు వినియోగించొచ్చు. ప్లేస్టోర్లో అందుబాటులో ఉన్న యాప్ను డౌన్లోడ్ చేసుకొని విద్యుత్ సేవలు పొందొచ్చు. 20 ఫీచర్లతో.. విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ సమయం వృథా చేసుకోకుండా విద్యుత్కు సంబంధించిన ప్రతీ అంశాన్ని యాప్లో రూపొందించారు. వినియోగదారులు ఈ యాప్ను సద్వినియోగం చేసుకుంటూ విద్యుత్ సేవలు పొందొచ్చు. రిపోర్ట్ ఆన్ ఇన్సిడెంట్, కన్స్యూమర్ గ్రీవెన్సెస్, సెల్ఫ్ రీడింగ్, పే బిల్స్, బిల్ హిస్టరీ, ఆన్లైన్ పేమెంట్ హిస్టరీ, కొత్త కనెక్షన్ తీసుకునేందుకు కావాల్సి న వివరాలు, లింక్ ఆధార్ అండ్ ఫోన్ నంబర్, డొమెస్టిక్ బిల్, కొత్త కనెక్షన్ ఎలా తీసుకోవాలి, పేరు, లోడ్ మార్పు గురించి, పవర్ కంజప్టెడ్ గైడ్లైన్స్, టారిఫ్ డిటేయిల్స్, ఎనర్జీ సేవింగ్ టిప్స్, సేఫ్టీ టిప్స్, ఫీడ్ బ్యాక్, మై ఎకౌంట్, వినియోగదారుల బిల్లు సమాచారం, వినియోగదారుల పరిధిలోని అధికారి వివరాలు, కాంటాక్ట్ అజ్ వంటి ఫీచర్లు పొందుపర్చారు. వినియోగదారులకు ఉపయోగపడేలా యాప్ను రూపొందించింది. విద్యుత్ కనెక్షన్ పొందడం నుంచి బిల్లింగ్, పేమెంట్ వివరాలతోపాటు అంతరాయాల సమస్యను సంబంధిత అధికారికి తెలియజేయొచ్చు. కార్యాలయాల చుట్టూ తిరిగే అవకాశం లేకుండా ఇంటి వద్ద నుంచే యాప్ ద్వారా సేవలను పొందొచ్చు. 24/7 టోల్ఫ్రీ నంబర్లు పని చేస్తాయి. 18004250028, 1912 టోల్ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి విద్యుత్ సంబంధిత సమస్యలు పరిష్కరించుకోవచ్చు. – మేక రమేశ్బాబు, ఎస్ఈ, కరీంనగర్ 20 ఫీచర్లతో ఆండ్రాయిడ్ వెర్షన్లో యాప్ -
‘కడారి’ కడచూపునకు నిరీక్షణ
సిరిసిల్ల/తంగళ్లపల్లి(సిరిసిల్ల): మావోయిస్టు అగ్రనేత కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కొస(70) ఎన్కౌంటర్లో మరణించగా కడసారి చూపుల కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో సోమవారం ఎన్కౌంటర్లో మరణించిన తంగళ్లపల్లి మండలం గోపాల్రావుపల్లెకు చెందిన సత్యనారాయణరెడ్డి మృతదేహాన్ని తెచ్చేందుకు ఆయన సోదరుడు కరుణాకర్రెడ్డి, కుటుంబ సభ్యులు మంగళవారం తరలివెళ్లారు. నారాయణపూర్లో శవపంచనామా, పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీస్ అధికారులు జాప్యం చేయడంతో బుధవారం రాత్రి వరకు మృతదేహాన్ని అప్పగించలేదు. కనీసం తమ్ముడి శవాన్ని కళ్లతో చూసుకుంటానని కరుణాకర్రెడ్డి పోలిసులను ప్రాధేయపడినా వారు కనికరించలేదు. కాసేపట్లో శవాన్ని అప్పగిస్తామంటూ రోజంతా కాలయాపన చేశారు. చివరి 45 ఏళ్లుగా ఇంటికి, కంటికి దూరమైన తమ్ముడిని చూసేందుకు కరుణాకర్రెడ్డి కన్నీటి పర్యంతమయ్యాడు. మృతదేహాన్ని అప్పగిస్తామంటూ బుధవారం రాత్రి వరకు హామీలా పరంపరను పోలీసులు కొనసాగించారు. నింగినేలా ఏకమై.. నారాయణపూర్లో మంగళవారం రాత్రి నుంచి నింగినేలా ఏకమైనట్లు వర్షం కురుస్తూనే ఉంది. నారాయణపూర్ జిల్లా ఆస్పత్రి మార్చురీ వద్ద వరదనీరు, బురదతో కలిసి శవాన్ని తరలించేందుకు ప్రతికూలంగా ఉంది. జోరువానతో రోడ్లు బురదమయమై రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కడారి సత్యనారాయణరెడ్డి శవంతో గురువారం ఉదయం గోపాల్రావుపల్లెకు చేరే అవకాశం ఉంది. శవం అప్పగింతపై ఆరా.. మావోయిస్టు అగ్రనేత కొస మృతదేహం అప్పగింతపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆసక్తి నెలకొంది. ఆయన చదువుకున్న పెద్దపల్లి, ఉద్యమం బాటపట్టిన బసంత్నగర్తోపాటు సిరిసిల్ల జిల్లాకు చెందిన పలువురు ఆరా తీశారు. వివిధ పార్టీల నాయకులు కొసను కడసారి చూసేందుకు స్వగ్రామం గోపాల్రావుపల్లెకు వస్తామంటూ మృతదేహం అప్పగింతపై వివరాలు సేకరించారు. సత్యనారాయణరెడ్డి మృతదేహంతో ఊరు చేరేందుకు కుటుంబ సభ్యులు పడిగాపులు కాసారు. తంగళ్లపల్లి(సిరిసిల్ల): చిన్నతనంలోనే విప్లవబాట పట్టి స్వగ్రామం గోపాల్రావుపల్లెను విడిచి వెళ్లిన కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కొస అలియాస్ సాదు ఉద్యమంలోనే అసువులుబాసారు. 45 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన సత్యనారాయణరెడ్డి మళ్లీ చివరిమజిలీ కోసం స్వగ్రామానికి అమరుడై వస్తున్నాడు. స్వగ్రామంలోనే గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీంతో గోపాల్రావుపల్లెలోని సత్యనారాయణరెడ్డి ఇంటిని గ్రామస్తులు శుభ్రం చేశారు. ఇంటి చుట్టూ ఏపుగా పెరిగిన మొక్కలను తొలగించారు. నారాయణపూర్లో కుటుంబ సభ్యుల పడిగాపులు నేడు గోపాలరావుపల్లెకు చేరనున్న మృతదేహం -
పందెం కోళ్ల పెంపకంపై శిక్షణ
మంథనిరూరల్: మంథని మండలం ఎగ్లాస్పూర్ గ్రామంలో రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఎస్సీ మహిళలకు పందెం కోళ్ల పెంపకం, నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. షెడ్యూల్డ్ కులాలు, సబ్ ప్లాన్లో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేవికే శాస్త్రవేత్తలు మహిళలకు పలు సూచనలు చేశారు. దేశీకోళ్ల కాన్న అత్యధిక వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటాయని, వేగంగా పరుగెత్తడం, శత్రువులను ఎదుర్కొనే శక్తి, సామర్థ్యాలు అధికంగా ఉండడం వీటి లక్షణమన్నారు. ఆరునెలల్లోనే రెండు కేజీల నుంచి మూడు కేజీల వరకు బరువు పెరుగుతాయని తెలిపారు. ఆడకోళ్లు 120 నుంచి 140 గుడ్లు పెడతాయని వివరించారు. అనంతరం ఒక్కొక్కరికి పది కోడిపిల్లలను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు వై.వెంకన్న, కిరణ్, బండారి నరేశ్, నాయకులు పేరవేన లింగయ్య, మంథని సత్యం, ప్రభాకర్రెడ్డి, బొడ్డు శ్రీనివాస్, ఆర్ల నారాయణ, సదానందం తదితరులు పాల్గొన్నారు. -
ఫార్మసిస్ట్.. తెరవెనుక వైద్యుడు
కోల్సిటీ(రామగుండం): వ్యాధిని గుర్తించి, నివారణకు తగిన మందు సూచించేది డాక్టరు.. మందుల ఎంపిక, మోతాదు, వినియోగించే విధానం తదితర మొత్తం ప్రక్రియపై దిశ, నిర్దేశం చేసేది ఫార్మసిస్ట్.. ఇలా వైద్యులపాత్ర కూడా పోషించేది ఫార్మసిస్టే. పేషెంట్ ఆరోగ్య పరిరక్షణలో వీరే కీలకపాత్ర. ఆరోగ్య సంరక్షణలో వీరు అందిస్తున్న అమూల్య సేవలు, సహకారాన్ని గౌరవించేందుకు ఏటా సెప్టెంబర్ 25న ప్రపంచ ఫార్మాసిస్ట్ల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈఏడాది ‘థింక్ హెల్త్.. థింక్ ఫార్మసిస్ట్’ నినాదం ఎంచుకున్నారు. ఉమ్మడి జిల్లాలో ఐదు వేల మంది.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 4వేల వరకు రిటైల్ మెడికల్ షాపులు ఉన్నాయి. కరీంనగర్ జిల్లా లో 1,500 నుంచి 1,600 వరకు, పెద్దపల్లిలో 700, జగిత్యాలలో 950, రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు 650 వరకు మెడికల్ షాపులు ఉన్నాయి. వీటితోపాటు హోల్సేల్ దుకాణాలు మరో 200 దాకా ఉన్నాయి. వీటిలో సుమారు 5వేల నుంచి 6వేల మంది వరకు ఫార్మసిస్ట్లు సేవలు అందిస్తున్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ స్థాయిలో తనిఖీలు, కేసులు.. ఉమ్మడి జిల్లాలో డ్రగ్ ఇన్స్స్పెక్టర్లు(ఫార్మసీ కోర్సు పూర్తిచేసినవారు) మెడికల్షాపుల లైసెన్స్, రెన్యూవల్స్ జారీచేయడంతోపాటు మెడికల్ షాపుల్లో తనిఖీలు, మందుల నాణ్యత పరిశీలిస్తున్నారు. అనుమానం వచ్చిన మందులను ల్యాబొరేటరికి పరిశీలనకు పంపిస్తున్నారు. నాణ్యతలో లోపం ఉంటే సంబంధిత విక్రయదారు, తయారీదారుపై చర్యలు తీసుకోవడంతోపాటు కేసులు కూడా నమోదు చేస్తున్నారు. వైద్యుల తర్వాత ఫార్మసిస్ట్దే కీలకపాత్ర.. పేషెంట్లకు వైద్యం అందిచండంలో వైద్యుల తర్వాత ఫార్మసిస్టులే కీలకం. వ్యాధి త్వరగా నయం కావడానికి, మందులను ఎంత మోతాదులో వేసుకోవాలో చెబుతారు. ప్రయోజనాలు, దుష్ప్రభావాల గురించి సైతం వివరిస్తూ అత్యంత కీలకపాత్ర పోషిస్తారు. కొందరు ఫార్మసిస్ట్లు మందుల తయారీ కోసం ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో పనిచేస్తుండగా, ఔషధ పరిశోధన, అభివృద్ధి, భద్రతా పరీక్షలకు మరికొందరు సహకరిస్తున్నారు. ఔషధాల్లోని లోపాలను తగ్గించేందుకూ కృషి చేస్తున్నారు. ● డాక్టర్ పాత్ర పోషించేది వారే.. ● నేడు ప్రపంచ ఫార్మసిస్ట్ డే -
వాయినాల కోసం కొంటాం
కాగితపు బతుకమ్మలను వాయినాలకు కొంటాం. బతుకమ్మ పూలు ఎక్కువ రేట్లు పలికినప్పుడు కూడా కొనాల్సి వస్తోంది. కొత్త కోడళ్లకు బతుకమ్మ వాయినాల కోసం వాడుతుంటారు. ఇలాంటి బతుకమ్మలు సిరిసిల్ల ప్రాంతంలోనే ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ చాలా ఏళ్లుగా వస్తున్న బతుకమ్మ ఆచారాల్లో ఇదొకటి. – తాటిపాముల శ్రీచందన, సిరిసిల్ల మాది లక్ష్మిదేవిపల్లి. మా చెల్లె సిరిసిల్లలో ఉంటుంది. నాకు కొత్తగా పెళ్లయింది. అత్తగారి ంటికి పోవాలంటే వాయినా ల బతుకమ్మ కావాలని ఇంట్లోవాళ్లు చెప్పారు. మావద్ద కాగితపుపూల బతుకమ్మలు ఉండవు. చెల్లెను పండక్కి ఇంటికి తీసుకుపోవడంతోపాటు ఇక్కడ అ మ్మే వాయినాల బతుకమ్మను కొనుక్కొని పోతు న్న. ఇది మా ప్రాంతంలో కూడా ఉన్న ఆచారం. – ఉప్పునీటి శ్రీకాంత్, లక్ష్మీదేవుపల్లి(తిమ్మాపూర్) పల్లెల నుంచి ఆర్డర్లను తీసుకు ంటూ అమ్మకాలకు సరిపడా బ తుకమ్మలను చేస్తున్నాం. పల్లెల్లో బతుకమ్మ పూల కొరత ఉంది. ఈసారి కాగితపు బతుకమ్మలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ముడిసరుకులు సరిగా దొరక్క డిమాండ్కు తగ్గట్టుగా బతుకమ్మలు తయారు చేయడంలో ఇబ్బంది పడుతున్నాం. సిరిసిల్లలో ముప్పై కుటు ంబాల వాళ్లం వీటిని తయారు చేసి విక్రయిస్తుంటాం. – సిద్ధుల హరీశ్, బతుకమ్మల తయారీదారు -
ప్రతీనెల తనిఖీలు చేస్తున్నాం
ప్రతీనెల 30కిపైగా ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం. నిబంధనలు అతిక్రమించి ఔషధాలు విక్రయించే మెడికల్ షాపులపై కేసులు నమోదు చేస్తున్నాం. ఫార్మసిస్ట్ల పర్యవేక్షణలోనే మందుల క్రయ, విక్రయాలు సాగాలి. ఫార్మసీ చదివిన వారు సొంతంగానే వ్యాపారం చేయాలి. ఇతరులు వ్యాపారం చేయడానికి వారి సర్టిఫికెట్లు ఇవ్వకూడదు. పేషెంట్లు మందులు వాడడంలో ఫార్మసిస్ట్లు అవగాహన, చైతన్యం కలిగించాలి. కాలం చెల్లించిన మందులపై ఫార్మసిస్ట్లు పేషెంట్లకు దిశానిర్దేశం చేయాలి. – పిట్ట శ్రావణ్, డ్రగ్ ఇన్స్పెక్టర్ -
పోగొట్టుకున్న బంగారం అప్పగింత
హుజూరాబాద్: దారిలో దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నారు ఓ దంపతులు. వారిని హుజూరాబాద్ సీఐ సత్కరించారు. సీఐ వివరాల ప్రకారం.. మండలంలోని రంగాపూర్ గ్రామానికి చెందిన రెడ్డబోయిన రమేశ్ మూడ్రోజుల క్రితం భీమదేవరపల్లి మండలం కొప్పురు నుంచి తన కుటుంబానికి చెందిన 13తులాల బంగారంతో బైక్పై హుజూరాబాద్ వస్తున్నాడు. మార్గమధ్యలో ఇప్పలనర్సింగాపూర్ శివారులో బైక్నుంచి బ్యాగ్ జారి కిందపడిపోయింది. బంగారం పోగొట్టుకున్న రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పలనర్సింగాపూర్ గ్రామానికి చెందిన సమ్మయ్య–నఫీజా దంపతులకు బ్యాగు దొరికింది. వారు పోలీసులకు అప్పగించారు. సీఐ కరుణాకర్ దంపతులను అభినందించి, రమేశ్కు బంగారం ఉన్న బ్యాగును అప్పగించారు. ఆస్పత్రులే లక్ష్యంగా..● ద్విచక్ర వాహనాలు చోరీ ● ముగ్గురిని పట్టుకున్న పోలీసులు ● 13 బైక్లు స్వాధీనం కరీంనగర్రూరల్: ఆస్పత్రుల వద్ద పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాలు దొంగతనం చేస్తున్న ముగ్గురిని బుధవారం కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. వారినుంచి 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కరీంనగర్రూరల్ ఏసీపీ విజయ్కుమార్ కథనం ప్రకారం.. కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ద్విచక్రవాహనంపై అనుమానాస్పదంగా వెళ్తున్న ముగ్గురు మైనర్లను పట్టుకున్నారు. పోలీస్స్టేషన్కు తరలించి విచారణ చేయగా 13 ద్విచక్రవాహనాలు దొంగిలించామని, కొన్నింటిని విక్రయించి, మరికొన్ని దాచిపెట్టినట్లు తెలిపారు. చల్మెడ ఆనందరావు ఆస్పత్రి, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, అపోలో ఆస్పత్రి వద్ద వాహనాలు దొంగిలించినట్లు అంగీకరించారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుచగా రిమాండ్ చేశారు. దొంగలను పట్టుకున్న సీఐ నిరంజన్రెడ్డి, ఎస్సైలు లక్ష్మారెడ్డి, నరేశ్ను సీపీ గౌస్ ఆలం, రూరల్ ఏసీపీ విజయ్కుమార్ అభినందించారు. మానకొండూర్: మండలంలోని శంషాబాద్ గ్రామంలోని ఓ ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి మత్తుపదార్థాలు లభ్యమయ్యాయని గ్రామస్తులు తెలిపారు. హైదరాబాద్ నుంచి మత్తు పదార్థాలను తీసుకువచ్చి ఇంట్లో దాచగా విషయం తెలుసుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నారని వివరించారు. -
భూమి ఎక్కడ?
టీఎన్జీవోలసాక్షిప్రతినిధి, కరీంనగర్: వారంతా విశ్రాంత ఉద్యోగులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం వీరికి ఇంటిస్థలం కేటాయించింది. దాన్ని కబ్జాదారులు మాయం చేయగా.. మూడు దశాబ్దాల పోరాటం తరువాత మరో చోట 20ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించిన అధికారులు నేటికీ ప్రొసీడింగ్స్ ఇవ్వడం లేదు. దీంతో ఎనిమిదేళ్లుగా ముదిమి వయసులో ఇంటిస్థలానికి అనుమతులు ఇవ్వాలంటూ కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒకటి, కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు దశాబ్దాలుగా కబ్జాకు గురైన తమ స్థలానికి ప్రత్యామ్నాయం చూపాలంటూ ఈ సీనియర్ సిటీజన్లు చేస్తున్న పోరాటం నేటికీ ఆగడం లేదు. నగర శివారుల్లో టీఎన్జీవోలకు కేటాయించిన స్థలం కబ్జా అయినప్పటికీ.. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో 40ఏళ్లుగా తీరని అన్యాయమే మిగిలిందని ఆవేదన చెందుతున్నారు. తిమ్మాపూర్లో చూసినప్పటికీ బొమ్మకల్లో కబ్జా అయిన 20 ఎకరాల విలువైన స్థలం గురించి ఇటు టీఎన్జీవో పెద్దలు, అటు కలెక్టర్ కార్యాలయం, రెవెన్యూ ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ఫలితంగా రూ.కోట్లాది విలువైన స్థలం కబ్జాదారుల వశమైంది. దీంతో అప్పటి నుంచి ప్ర యత్నించగా.. ఎట్టకేలకు ప్రత్యామ్నాయ భూమిని చూపిస్తే కేటాయిస్తామన్నారు. దాదాపు మూడుదశాబ్దాలపాటు అన్వేషించిన టీఎన్జీవోలు చివరికి 2017లో తిమ్మాపూర్ మండలంలోని యాదవులపల్లి సర్వే 502, 522లలో దాదాపు 21 ఎకరాల ప్రభు త్వ ఖాళీ స్థలం ఉందని గుర్తించి అధికారులకు విన్నవించారు. నివేదికను రెవెన్యూ అధికారులు కలెక్టర్ కార్యాలయానికి పంపినా.. ఇంతవరకూ ఎలాంటి ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు. ఎనిమి దేళ్లుగా కాళ్లు అరిగేలా తిరుగుతున్నా నేటికీ న్యా యం జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి స్థలాలు రాకుండా మిగిలిన 626 మందిలో దాదాపు 100 మంది మరణించారని, 200 మందికిపైగా అనారోగ్యంతో మంచాన పడ్డారని, దాదాపు 40 ఏళ్లుగా సాగుతున్న పోరాటాన్ని ఇకనైనా గుర్తించి న్యాయం చేయాలని సీఎం, కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తున్నారు.1980లో ఉమ్మడి జిల్లాలోని 930మంది టీఎన్జీవోలు కలిసి ఇంటి స్థలాల కోసం హౌసింగ్ సొసైటీగా ఏర్పడ్డారు. తమకు ఇంటిస్థలాలు కేటాయించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. స్పందించిన అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ వీరికి మూడు చోట్ల ఇంటి స్థలాలు కేటాయించారు. తొలుత కరీంనగర్ కమాన్రోడ్లోని పాతచెరువు సమీపంలో సర్వే నంబరు 415లో 18 ఎకరాలు, ఎర్రగుంట సమీపంలో సర్వే నంబరు 918లో 14 ఎకరాలు కేటాయించారు. ఈ రెండు స్థలాలను టీఎన్జీవోలకు ప్రభుత్వం స్వాధీనం చేసింది. ఈ స్థలాల్లో 304 మంది టీఎన్జీవోలు ఇండ్లు నిర్మించుకున్నారు. మూడోచోటుగా బొమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 96లో 20ఎకరాల భూమిని కేటాయించారు. ఈ భూమి తమది అంటూ స్థానిక నేతలు అభ్యంతరం తెలిపారు. ఆ భూమిని కబ్జా చేశారు. దీన్ని స్వాధీనం చేసుకునేందుకు టీఎన్జీవోలు 2017 వరకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. -
కార్యదర్శులపై పండుగ భారం
కరీంనగర్రూరల్: ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది’ అన్నచందంగా మారింది జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి. బతుకమ్మ, దసరా పండుగల ఏర్పాట్లు పంచాయతీ కార్యదర్శులే చేయాలనే ప్రభుత్వ ఆదేశాలతో ఆందోళన చెందుతున్నారు. జీపీల్లో నిధుల కొరత వెక్కిరిస్తుండగా అధికారుల ఒత్తిళ్లతో సొంత డబ్బులు వెచ్చించి పనులు చేయిస్తున్నారు. జిల్లాలోని 318 గ్రామపంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగిసిన 2024 ఫిబ్రవరి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయడం లేదు. ఇంటి, నల్లా, వాణిజ్య సముదా యాల పన్ను వసూలు చేసి ఖజానాలో జమ చేసిన అనంతరం నిధులు విడుదల చేసుకునే అవకాశం లేకుండా పోయింది. పారిశుధ్య ట్రాక్టర్లకు డీజిల్, మరమ్మతులకు వారానికి రూ.1000 నుంచి రూ.2 వేల వరకు కార్యదర్శులు వెచ్చిస్తున్నారు. స్ట్రీట్లైట్ల నిర్వహణ, పారిశుధ్య పనులు, బోర్లు, పైపులైన్ల లీకేజీల మరమ్మతులకు నెలకు రూ.10వేల వరకు సొంతంగా ఖర్చు పెడుతున్నారు. పండుగల నిర్వహణ ఎలా? గ్రామ పంచాయతీల్లో నిధులు లేకుండా బతుకమ్మ, దసరా పండుగల నిర్వహణకు ఏర్పాట్లు ఎలా చేయాలంటూ పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. ప్రతీ గ్రామంలో బతుకమ్మ పండుగకు ప్రత్యేకంగా వీధిలైట్లు, ప్రధాన చౌరస్తాలతో పాటు బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో ఫ్లడ్లైట్లు, సీరియ ల్ బల్బులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. చిన్న గ్రామాల్లో రూ.30వేల నుంచి రూ.40వేలు, పెద్ద గ్రామాల్లో రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు విద్యుత్లైట్లకు ఖర్చు చేయాల్సి వస్తుందని కార్యదర్శులు పేర్కొంటున్నారు. దసరా రోజున శమీపూజ ఇతర కార్యక్రమాలకు ఒక్కో గ్రామపంచాయతీలో రూ.2 వేల నుంచి రూ.5వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పలు గ్రామాల్లో బతుకమ్మ ఆడే మైదానాలను చదును చేయిస్తున్నారు. రోడ్లపై గుంతలను మట్టి, డస్ట్పోసి పూడ్చివేస్తున్నారు. డ్రైనేజీల్లోని సీల్టు తొలగిస్తున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా ఎలా ఏర్పాట్లు చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పండుగల నిర్వహణకు ప్రత్యేక నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
అర్బన్ పోలీసింగ్పై దృష్టి
కరీంనగర్క్రైం: అర్బన్ పోలీసింగ్పై దృష్టిపెట్టా లని సీపీ గౌస్ ఆలం సూచించారు. కరీంనగర్ టౌన్ ఏసీపీ కార్యాలయాన్ని బుధవారం తనిఖీ చేశారు. పెండింగ్ కేసులపై సమీక్ష చేశారు. త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. రౌడీ, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వారి కదలికలను గమనించాలన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. పెండింగ్ వారెంట్లు అమలు చేయాలన్నారు. గంజాయి, ఇసుక అ క్రమ రవాణా, పీడీఎస్ బియ్యం, పేకాటను కట్టడి చేయాలన్నారు. టౌన్ ఏసీపీ వెంకటస్వామి, సీఐలు రాంచందర్రావు, సృజన్రెడ్డి, జాన్రెడ్డి, శ్రీలత పాల్గొన్నారు.57 వాహనాల బహిరంగ వేలంకరీంనగర్ పరిధిలో స్వాధీనం చేసుకున్న 57 ద్విచక్ర వాహనాలను స్క్రాప్ ప్రాతిపదికన ఈనెల 27న బహిరంగ వేలం వేయనున్నట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు సిరిసిల్ల బైపాస్లోని పీటీసీలో వేలం ఉంటుందని అన్నారు. ఆసక్తి ఉన్నవారు ఉదయం 11గంటల నుంచి వాహనాలను పరిశీలించుకోవచ్చని, ప్రభుత్వ గుర్తింపుకార్డుతో వేలంలో పాల్గొనాలని సూచించారు.విద్యుత్ క్రీడాకారులకు అభినందనలుకొత్తపల్లి(కరీంనగర్): రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వివిధ క్రీడాంశాల్లో ట్రోఫీలు సాధించిన టీజీ ఎన్పీడీసీఎల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రీడాకారులను ఎస్ఈ మేక రమేశ్బాబు అభినందించారు. స్పోర్ట్స్ కౌన్సిల్ ఉమ్మడి జిల్లా క్రీడా జట్లు ఈ నెలలో వరంగల్లో జరిగిన డిస్కం ఇంటర్ సర్కిల్ బ్యాడ్మింటన్, చెస్ టోర్నీలో రన్నరప్గా నిలిచి కప్లు సాధించగా, వాటిని బుధవారం కరీంనగర్ సర్కిల్ కార్యాలయంలో ఎస్ఈకు అందజేశారు. డీఈలు కె.ఉపేందర్, జంపాల రాజం, లక్ష్మారెడ్డి, తిరుపతి, శ్రీని వాస్, ఎస్ఏవో రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.ప్రధాని మోదీకి ధన్యవాదాలుకరీంనగర్టౌన్: ‘జీఎస్టీ సంస్కరణతో వ్యాపా రం పెరిగింది. ఎలక్ట్రానిక్ వస్తువుల ధర తగ్గింది. ప్రధానమంత్రి మోదీకి మా తరఫున థ్యాంక్స్ చెప్పండి’ అంటూ కరీంనగర్కు చెందిన పలువురు వ్యాపారులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ను కోరారు. మెడికల్, అగ్రికల్చర్ వ్యాపారులు సైతం సంజయ్ని కలిసి జీఎస్టీ పన్నుల భారం తగ్గించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సంజయ్ మాట్లాడుతూ పండుగల సమయంలో పేద కుటుంబాలకు ఇది నిజమైన బహుమతి అన్నారు. సామాన్య ప్రజలకు మోదీ జీఎస్టీ సంస్కరణలు ఊరట కలిగిస్తున్నాయన్నారు.ముంబై టు కరీంనగర్.. లోకమాన్య తిలక్ టర్మినస్ రైలు పునః ప్రారంభంకరీంనగర్రూరల్: ముంబై– కరీంనగర్ రైలును అధికారులు పునః ప్రారంభించారు. 2013 వరకు ముంబై నుంచి నిజామాబాద్ వరకు నడిచిన ఎక్స్ప్రెస్ రైలును 2018 నుంచి కరీంనగర్ వరకు పొడిగించారు. 2020లో కరోనా సమయంలో రైలును నిలిపివేశారు. మంగళవారం నుంచి ముంబై నుంచి కరీంనగర్కు రైలును పున:ప్రారంభించారు. వారానికోసారి ముంబైలోని లోకమాన్య తిలక్ టర్మినస్ నుంచి కరీంనగర్కు ప్రత్యేక రైలును నడిపించేందుకు దక్షిణమద్య రైల్వే చర్యలు చేపట్టింది. ముంబైలోని లోకమాన్య తిలక్ టర్మినస్ స్టేషన్ నుంచి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3.30గంటలకు రైలు బయల్దేరి మరుసటిరోజు బుధవారం ఉదయం 10 గంటలకు కరీంనగర్ రైల్వేస్టేషన్కు చేరుకుంటుంది. అదేరోజు సాయంత్రం 5.30గంటలకు కరీంనగర్ నుంచి ముంబైకి బయల్దేరుతోంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని కోరుట్ల, మెట్పల్లి రైల్వేస్టేషన్లలో ఎల్టీటీ ఎక్స్ప్రెస్ రైలుకు హాల్టింగ్ ఉందని కరీంనగర్ రైల్వేస్టేషన్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ భానుచందర్ తెలిపారు. -
మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం
తిమ్మాపూర్: మహిళల అభివృద్ధి, సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర,శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీలో ఉన్న మహిళా ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆమె, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఆటో డ్రైవింగ్ శిక్షణ, వివిధ వృత్తుల్లో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫి కెట్లు అందజేశారు. మహిళా ప్రాంగణాల ద్వారా భవిష్యత్తులో మరింత మంది మహిళలకు ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపడతామని మంత్రి తెలి పారు. కొత్త జిల్లాల్లో కూడా ప్రాంగణాలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... మహిళా సంఘాల ద్వారా ఎరువుల పంపిణీని చేపట్టి బలోపేతం చేస్తామన్నారు. మహిళా ప్రాంగణంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీ లిస్తామని, శిక్షణ కార్యక్రమాలు నిరంతరం జరిగేలా అధికారులు చూడాలని సూచించారు. డ్రైవింగ్ శిక్షణ పొందిన మహిళలకు రవాణాశాఖ ఉచిత డ్రైవింగ్ లైసెన్సులు అందజేస్తుందని, మహిళా సంఘాల ద్వారా 47 బస్సులు కొనుగోలుకు సహకరించి, ఆదాయ మార్గాలు సృష్టిస్తామన్నారు. కార్యక్రమంలో భాగంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి సీతక్క, అధికారులు, మహిళలు, అంగన్వాడీ టీచర్లతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం, కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. పెండింగ్ బిల్లులు ఇప్పించండి జిల్లా పోలీస్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, ధనసరి సీతక్కలకు వినతిపత్రం సమర్పించారు. సంవత్సర కాలంగా పెండింగ్లో ఉన్న వివిధ రకాల బిల్లులు ఇప్పించాలని కోరారు. జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిడాల సురేందర్, పీసీ నరేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జీపీవోలే ప్రభుత్వానికి కళ్లు, చెవులు
కరీంనగర్ అర్బన్: గ్రామస్థాయిలో ప్రజలకు, రైతులకు మేలు జరగాలనే ప్రభుత్వ సంకల్పం జీపీవో (గ్రామ పాలన అధికారులు)లు నెరవేర్చాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి అన్నారు. ఇటీవల రెవెన్యూ శాఖలో నియామకమైన జీపీవోలు అంకితభావంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు. బుధవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో గ్రామ పాలన అధికారుల ఆత్మీయ సమ్మేళనం కరీంనగర్ కలెక్టరేట్ రోడ్డులోని రెవెన్యూ గార్డెన్స్లో జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా నియామకమైన జీపీవోలకు భూభారతి చట్టంపై అవగాహన, విధులు, బాధ్యతలతో పాటు పారదర్శకత, అంకితభావంతో కూడిన పౌరసేవలపై దిశానిర్దేశం చేశారు. ఏ ఒక్కరు తప్పు చేసినా అది మొత్తం వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుందన్నారు. జీపీవోల సమస్య తీరిందని, ఇతరుల సమస్యలను విస్మరించవద్దన్నారు. కారుణ్య నియామకాలకు సంబంధించి త్వరలోనే తీపి కబురు వస్తుందన్నారు. ఉద్యోగుల జేఏసీ చైర్మైన్ లచ్చిరెడ్డి సారధ్యంలో గ్రామ పాలన అధికారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి అన్నారు. టీజీటీఏ జనరల్ సెక్రటరీ రమేశ్ పాక మాట్లాడుతూ దేశ భవిష్యత్తుకు యువత ఎంత కీలకమో, రెవెన్యూ వ్యవస్థకు జీపీవోలు అంతే కీలకమన్నారు. టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బాణాల రాంరెడ్డి, వి.బిక్షం, రాష్ట్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ చిల్లా శ్రీనివాస్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కరీంనగర్ నగర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నేరేళ్ల కిషన్, రమేష్, టీజీటీఏ కరీంనగర్ నగర్ కార్యదర్శి రాజేశ్వరి, నవాజ్ షరీఫ్, రిటైర్డ్ తహసీల్దార్ గంప శంకరయ్య, మల్లారం అర్జున్, ఆంజనేయ ప్రసాద్, సాయి కిషోర్, బాపుదేవ్ తదితరులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో నిబద్ధతతో పని చేయండి జీపీవోల ఆత్మీయ సమ్మేళనంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి -
విచ్చలవిడిగా ఎరువుల వినియోగం
వీణవంక: ఉత్తర తెలంగాణలోనే వరి సాగులో కరీంనగర్ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడి నేలలు సాగుకు అనుకూలంగా ఉండటంతో దిగుబడి కూడా గణనీయంగా ఉంటుంది. పండించిన ధాన్యానికి ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ ఉండటం రైతులకు కలిసొస్తుంది. మూడేళ్లుగా మొగిపురుగు విజృంభిస్తుంది. దీనికి తోడు వివిధ రకాల తెగుళ్లు పైరును ఆశిస్తుండటంతో రైతులు పంటను కాపాడుకునేందుకు నారుమడి నుంచే విచ్చలవిడిగా రసాయన మందులను పిచికారీ చేస్తున్నారు. ప్రస్తుతం పొలాలు పొట్టదశలో ఉండగా, కొన్ని చోట్ల పిలక దశలో ఉంది. ఇప్పటివరకు ఒక్కో రైతు సగటున నాలుగు నుంచి ఐదుసార్లు మందులను పిచికారీ చేశారు. ఇంకా పంట చేతికి వచ్చేసరికి మరో రెండుసార్లు పిచికారీ చేయాల్సి ఉంటుందని రైతులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 2.71లక్షల ఎకరాల్లో వరి సాగు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మధ్యకాలంలో రైతులు అధిక రసాయన ఎరువులు వాడుతున్నారు. దీంతో భూసారం తగ్గి పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడనుంది. రసాయన ఎరువుల వాడకం బదులు సేంద్రియ ఎరువులు వినియోగిస్తే అధిక దిగుబడులతో పాటు భూసారం పెరుగుతుంది. అయితే రైతులు వీలైనంత వరకు రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులను వినియోగిస్తే పంటకు అన్ని రకాల పోషకాలు అందుతాయని కేవీకే సీనియర్ శాస్త్రవేత్త వెంకటేశ్వర్లు చెప్పుతున్నారు. విచ్చలవిడిగా రసాయనాలు ఈ సీజన్ ప్రారంభంలో నారుమడికి మొగిపురుగు తగిలింది. దీంతో రెండునుంచి మూడుసార్లు పిచికారీ చేశారు. నాటువేసిన 15రోజులకు గుళికలతో పాటు యూరియాలో రసాయన మందులను కలిపి పొలంలో చల్లారు. మళ్లీ నెలతర్వాత మొగిపురుగుతో పాటు తెగుళ్లు వ్యాప్తిచెందాయి. దీంతో మళ్లీ పిచికారీ చేశారు. ప్రస్తుతం సుడిదోమ వ్యాప్తి చెందుతుంది. ఒక్కో రైతు పంటకాలం పూర్తయ్యే సరికి ఎకరాకు రూ.15వేల విలువగల ఖరీదైన రసాయన మందులను చల్లుతున్నారు. దీనికి బదులు సేంద్రియ ఎరువులు(జీవామృతం) వాడితే బాగుండేదని అధికారులు తెలుపుతున్నారు. పశువుల ఎరువు మేలు సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు, కంపోస్టు, ఫిల్టర్మడ్డి, వ్యవసాయ వ్యర్థ పదార్థాలు, జీవన ఎరువులు ఇలాంటి వాటిని ఎక్కువగా రైతులు వినియెగించాలి. గ్రామాల్లో పశువుల ఎరువు దొరుకుతుంది. ఏటా ఈ ఎరువును పొలంలో చల్లాలి. పంట ఏపుగా వస్తుంది. కొందరు రసాయన ఎరువులను ఇష్టానుసారంగా వాడుతున్నారు. దీంతో భూసారం కోల్పోయి పంట దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. భూసార పరీక్ష చేసుకోవాలి ఏటా భాసార పరీక్షలు చేసుకోవాలి. దీంతో భూమిలో ఎంతమేరకు ఎరువులు, ఏఏ ఎరువులు వాడాలో తెలుస్తుంది. నాట్లు వేసిన తర్వాత రైతులు సరైన సమయంలో ఎరువులు వేసుకోవాలి. వ్యవసాయాధికారుల సూచనల ప్రకారం ఎరువులను సిఫార్సు చేసిన మోతాదులో పంట చివరి దశవరకు రెండు, మూడు దఫాలుగా చల్లుకోవాలి. యూరియా రూపంలో నత్రజనిని వాడినప్పుడు బస్తా యూరియాకు 10కిలోల వేప పిండి వేసుకుంటే మంచిది. అతిగా వాడకం ప్రమాదకరమని హెచ్చరిస్తున్న నిపుణులు సేంద్రియ ఎరువులతోనే నేలకు జీవం దిగుబడితోపాటు భూసారం పెంపు జిల్లాలో 2.71 లక్షల ఎకరాల్లో వరి సాగు అంచనాసేంద్రియ ఎరువుల వాడకం మేలు రసాయన ఎరువులు విచ్చలవిడిగా పిచికారీ చేయడం మంచిది కాదు. సేంద్రియ ఎరువులు నేలకు మంచిది. సిఫార్సు మేరకే ఎరువులు వాడాలి. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి. ఒకేరకమైన పంట ఏళ్ల తరబడి వేసే బదులు పంట మార్పిడి చేస్తే పురుగు తగ్గడంతో పాటు దిగుబడి పెరుగుతుంది. – రాకేశ్ వ్యవసాయ విస్తరణాధికారి, వీణవంక -
కాగుతున్న కల్తీ నూనె
కరీంనగర్ అర్బన్: దసరా పండుగ అక్రమార్కులకు వరంగా మారింది. నూనె వినియోగం ఐదింతలు ఉంటుండగా కల్తీ రక్కసి జడలు విప్పుతోంది. నియంత్రించాల్సిన యంత్రాంగం మామూలుగా వ్యవహరిస్తుండటంతో అక్రమార్కులకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. కరీంనగర్ జిల్లాకేంద్రంగా దసరాకు ముందే కల్తీ కాగుతోంది. అరికట్టాల్సిన ఆహార నియంత్రణశాఖ, తూనికలు, కొలతల శాఖ నామమాత్రంగా మిగలడంతో కల్తీ మాఫియాకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. పండుగ పూట రూ.కోట్లలో దందా పండుగల సమయంలో వ్యాపారులు వీలైనంత మేర కల్తీ చేసి పొద్దుతిరుగుడు, పల్లీ నూనె పేరుతో విక్రయిస్తున్నారు. దసరా, క్రిస్మస్, సంక్రాంతి, ఏకాదశి పండుగల సమయాల్లో భారీగా వ్యాపారం సాగుతోంది. తక్కువ ధరకు దొరికే వివిధ రకాల నూనెలలను కొనుగోలు చేయడం వాటిని స్వల్ప నాణ్యమైన నూనెలో అధిక మొత్తంలో కలిపి విక్రయిస్తున్నారు. నగరంలోని ప్రకాశంగంజ్, మంకమ్మతోట, రాంనగర్ ప్రాంతాల్లో ఎక్కువగా కల్తీ విక్రయాలు సాగుతున్నాయని సమాచారం. చింతకుంట, బొమ్మకల్, బైపాస్ ప్రాంతాల్లోని గోడౌన్లలో విడినూనెను దించుకోవడం అక్కడి నుంచి ప్యాకెట్లు, డబ్బాల్లో నింపి దుకాణాలకు తరలించడం తంతుగా సాగుతోంది. హుజూరాబాద్, జమ్మికుంట, గంగాధర, తిమ్మాపూర్ ప్రాంతాల్లోని పలువురు వ్యాపారులు భారీగా నిల్వలు చేశారు. అంతా సోయాబీన్.. సుగంధానికి రసాయనం ఏ నూనె అయినా కల్తీ చేయడం పలువురు వ్యాపారులకు వెన్నతో పెట్టిన విద్య. హైదరాబాద్, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా ఎలాంటి వే బిల్లులు లేకుండా నూనెను కరీంనగర్కు దిగుమతి చేస్తున్నారు. ఎముకల నూనెను కూడ మిశ్రమంగా వాడుతున్నట్లుగా గతంలో తేలింది. ఇక్కడికి రాగానే తక్కువ ధరకు లభించే సోయాబీన్ నూనెను పొద్దుతిరుగుడు నూనెలో, వేరుశనగ నూనెలో కలుపుతున్నారు. కల్తీ చేసిన నూనెల నుంచి స్వచ్ఛమైన వాసన వచ్చేందుకు రసాయన పదార్థాలను వినియోగిస్తున్నారు. 48కిలోల సోయాబీన్ నూనెలో కేవలం 2 కిలోల పల్లి నూనెను కలిపి మొత్తంగా పల్తి నూనెగా విక్రయిస్తున్నారంటే కల్తీ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. సమన్వయలోపం నాణ్యమైన నూనెల విక్రయాలు, ధరల నియంత్రణ, జీరో వ్యాపారాన్ని నియంత్రించడంలో అధికారుల మధ్య సమన్వయలోపం వ్యాపారులకు కల్పతరువుగా మారింది. ఐదు క్వింటాళ్ల కన్నా ఎక్కువ నూనె నిల్వ చేసుకుంటే పౌరసరఫరాల శాఖ అనుమతి తప్పనిసరి. హోల్సేల్ వ్యాపారులు జిల్లాకేంద్రంలో అయితే 600ల క్వింటాళ్లు, ఇతర ప్రాంతాల్లో అయితే 377 క్వింటాళ్లు, జిల్లా కేంద్రంలో రిటైల్ అయితే 50 క్వింటాళ్లు, ఇతర ప్రాంతాల్లో 30 క్వింటాళ్లు నిల్వ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. అయితే అనుమతి లేని దుకాణాలు వందల్లో ఉన్నాయని తెలుస్తోంది. నిల్వలకు తమకు సంబంధమని పౌరసరఫరాల అధికారులు, కల్తీయే తమకు సంబంధమని ఆహార నియంత్రణ అధికారులు, విక్రయాలకే సంబంధమని వాణిజ్య పన్నులశాఖ అధికారులు చెబుతూ చేతులు దులుపుకుంటున్నారు. -
నేడు ఎన్టీపీసీ ఉద్యోగ గుర్తింపు ఎన్నికలు
జ్యోతినగర్(రామగుండం): పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాజెక్టులో ఉద్యోగ గుర్తింపు ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. గురువారం పోలింగ్ నిర్వహిస్తారు. మూడు సంవత్సరాల గుర్తింపు హోదా కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మూడు యూనియన్లు బరిలో నిలిచాయి. ఎన్టీపీసీ యాజమాన్యం పర్యవేక్షణలో పోలింగ్ జరుగుతుంది. ఉద్యోగ సంఘం ఎన్నికల్లో ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్(ఐఎన్టీయూసీ), ఎన్టీపీసీ కార్మిక సంఘ్(బీఎంఎస్), ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) పోటీ చేస్తున్నాయి. 60 శాతం ఓట్లు సాధించిన యూనియన్లోని ఇద్దరు ప్రతినిధులకు ఎన్బీసీ అర్హత వస్తుంది. అదేవిధంగా 60 శాతం కన్నా తక్కువ ఓట్లు వస్తే రెండోస్థానంలో ఉన్న యూనియన్కు ఒక ఎన్బీసీ సభ్యుడికి అవకాశం ఉంటుంది. ఎన్టీపీసీలో మొత్తం 212 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్కు ఏర్పాట్లు ప్రాజెక్టు పరిపాలనా భవనం ఆవరణలో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 212 మంది ఓటర్లు ఉండగా ఈవీఎం ఆధారంగా పోలింగ్ నిర్వహిస్తారు. ఇందుకోసం రెండు పోలింగ్ కేంద్రాలు ఏ ర్పాటు చేశారు. ఎన్నికల అధికారిగా ఏజీఎం(హె చ్ఆర్)బిజయ్కుమార్ సిగ్దర్ వ్యవహరిస్తున్నారు. ఉ దయం 6 గంటలకు పోలింగ్ ప్రారంభమై సా యంత్రం 3.30గంటలకు ముగుస్తుంది. ఓటుహ క్కు ఉన్న ఉద్యోగి సంస్థ ఐడీ కార్డుతో పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలి. పోలింగ్ పూర్తయ్యాక ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను వెల్లడి చేయనున్నారు. యూనియన్ల మాక్డ్రిల్ ఉద్యోగ గుర్తింపు యూనియన్ ఎన్నికలకు ఎన్టీపీసీ అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎన్నికలకు సన్నాహాలు చేస్తూ, పోలింగ్లో సజావుగా పాల్గొనేందుకు ఉద్యోగ సంఘాలు బుధవారం మాక్డ్రిల్ నిర్వహించాయి. మూడు ప్రధాన యూనియన్లు పోటీలో ఉన్నాయి. ప్రతీఒక్కటి ఉద్యోగుల మద్దతును పొందడానికి చురుకుగా ప్రచారం చేపట్టాయి. ఏర్పాట్లు పూర్తిచేసిన యాజమాన్యం -
వందల ఏళ్ల నాటి ఆచారం బతుకమ్మ
● మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ● జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సంబురాలుకరీంనగర్కల్చరల్: బతుకమ్మ పండుగ వందల ఏళ్ల నాటి సాంప్రదాయమని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆకాంక్షించారు. కరీంనగర్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నగరంలోని మ హాత్మా జ్యోతిబా పూలే మైదానంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాలకు మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి హాజరయ్యారు. బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పా ట్లు పూర్తి చేస్తున్నామన్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, తెలంగాణ ఉమెన్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభా రాణి, కలెక్టర్ పమేళా సత్పతి ఆడిపాడారు. -
అన్నపూర్ణే.. సదా పూర్ణే
గురువారం శ్రీ 25 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో వైభవంగా సాగుతున్నాయి. నగరంలోని చైతన్యపురి మహాశక్తి ఆలయంలో అన్నపూర్ణదేవిగా అమ్మవారు భక్తులు దర్శనం ఇచ్చారు. అమ్మవారిని శాకాంబరీగా అలంకరణ చేసి, 108 రకాల నైవేద్యాల సమర్పించారు. యువత, భక్తులు రాత్రి వరకు దాండియా ఆడారు. కేంద్రమంత్రి బండి సంజయ్ ఆహ్వానం మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ మహాశక్తి ఆలయాన్ని దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంజయ్ ఆహ్వానం మేరకు అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. కరీంనగర్ మండలం నగునూర్లోని పరివార సమేత శ్రీదుర్గాభవానీ అమ్మవారు నవరాత్రుల్లో భాగంగా బుధవారం కౌమారీ అలంకరణలో నెమలి వాహనంపై దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారికి చీరెసారె, ఒడిబియ్యం సమర్పించారు. చండీహోమం నిర్వహించి, గంగా హారతిచ్చారు. అనంతరం బతుకమ్మ ఆడారు. – కరీంనగర్కల్చరల్/విద్యానగర్ -
పట్టపగలే చోరీ
ఇల్లందకుంట: ఇంటి యజమాని ఆరుబయట ఉండగానే గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన మంగళవారం మండలంలోని మల్యాల గ్రామ పంచాయతీ పరిధి గాంధీనగర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన గూడెపు మల్లమ్మ ఇంటి ఆరుబయట పడుకొని ఉండగా పక్కన ఉన్న రూం కిటికీలు తెరిచి ఉండటంతో ఇంట్లోకి వెళ్లి చూసింది. బీరువా తలుపులు తెరిచి ఉన్నాయని, అందులోని రూ.2.5 లక్షలు దొంగిలించారని మల్లమ్మ ఫిర్యాదు చేసిందని, సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టామని సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సై క్రాంతికుమార్ వివరించారు. -
వ్యవసాయ బావిలో గుర్తుతెలియని మృతదేహం
జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం మోతె శివారు నవదుర్గ ఆలయ సమీపంలో ఓ వ్యవసాయ బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం మంగళవారం లభ్యమైంది. సుమారు 35 నుంచి 40 ఏళ్ల వ్యక్తిగా అనుమనిస్తున్నామని, కుడిచేతిపై ఎస్.హన్మంతరావు అని రాసి ఉందని, గోధుమరంగు నిండుచొక్కా, నెవీబ్లూ కలర్ ప్యాంట్ ఉందని, గుర్తించిన వారు రూరల్ ఎస్సై సదాకర్ను సంప్రదించాలని కోరారు. కట్నం వేధింపులు.. భర్తకు జైలుకరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్కు చెందిన కూర నిర్మలను కులంపేరుతో దూషించడంతోపాటు కట్నం కోసం వేధించడంతో భర్త అంజిరెడ్డికి మంగళవారం కోర్టు ఏడాది జైలు శిక్ష విధించినట్లు కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. నగునూరుకు చెందిన నిర్మలను వివాహం చేసుకున్న అంజిరెడ్డి రూ.5లక్షల కట్నం తీసుకురావాలని వేధించడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణ చేసిన కోర్టు అంజిరెడ్డికి ఏడాది జైలు శిక్షతోపాటు రూ.1000 జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు. ● వివరాలు వెల్లడించిన ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి వేములవాడ: భూమి కోసమే సిరిగిరి రమేశ్ హత్యకు గురైనట్లు ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి అన్నారు. మంగళవారం వివరాలు వెల్లడించారు. చందుర్తిలోని భూమిని ఎస్సీ కార్పొరేషన్ లోన్పై పెట్రోల్ బంక్ కోసం చిర్రం రవి, సిరిగిరి రమేశ్కు రిజిస్ట్రేషన్ చేశారని, అయితే పెట్రోల్ బంక్ ఇవ్వకుండా, తిరిగి భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా సదరు భూమి తనదేనంటూ రమేశ్ అమ్మకానికి ప్రయత్నాలు మొదలు పెట్టడంతో విషయం తెలుసుకున్న రవి ఆ భూమి తనకు దక్కాలంటే రమేశ్ను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు ఎద్దండి వెంకటేశ్, అలా వంశీకి సుపారీ ఇచ్చాడు. పథకం ప్రకారం ఈనెల 19న రాత్రి 8 గంటలకు పెద్దూరు సబ్స్టేషన్ సమీపంలో కారు ఆపి, కారులో నిద్రిస్తున్న రమేశ్ను వంశీ, చిర్రం రవి కదలకుండా గట్టిగా పట్టుకోగా, వెంకటేశ్ కత్తితో రమేశ్ గొంతు, ఛాతిపై పొడిచి హత్య చేశాడు. అనంతరం కారుతోపాటు మృతదేహాన్ని వేములవాడ నందికమాన్ సమీపంలోని రమేశ్కు చెందిన నందీశ్వర టౌన్షిప్ వెంచర్లో వదిలి పారిపోయారు. ఈక్రమంలో వేములవాడ శివారులోని సాయిరక్షా దాబా సమీపంలో ఎద్దండి వెంకటేశ్, అలా వంశీని పట్టుకుని, వారి నుంచి కారు, మొబైల్ఫోన్, హత్యకు ఉపయోగించిన కత్తిని సీజ్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ వివరించారు. చిర్రం రవి పరారీలో ఉన్నాడని తెలిపారు. మహిళలపై బండరాళ్లు విసిరిన వ్యక్తిపై కేసుకొత్తపల్లి: చింతకుంట శాంతినగర్లో ఈనెల 21న బతుకమ్మ ఆడుతున్న మహిళలపై బండరాళ్లతో దాడిచేసిన వ్యక్తిని రిమాండ్ చేశామని సీఐ కోటేశ్వర్ తెలిపారు. ప్రైమరీస్కూల్ ప్రాంతానికి చెందిన షేక్సజ్జు బండరాళ్లతో అక్కడే బతుకమ్మ ఆడుతున్న కాసారపు లక్ష్మి, మధు రెడ్డి, ఎల్లమ్మ, మొగిలి అకిరానంద్పై దాడిచేయగా గాయాలయ్యాయి. కాసారపు లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, షేక్సజ్జును మంగళవారం అరెస్ట్ చేశామని సీఐ తెలిపారు. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ● రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బీ గితే ● 14.945 కిలోల గంజాయి దహనం సిరిసిల్లక్రైం: రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా వివిధ పోలీసుస్టేషన్లలో నమోదైన 45 కేసుల్లో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 14.945 కిలోల గంజాయిని చట్ట ప్రకారం జి ల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలు పా టిస్తూ దహనం చేసినట్లు ఎస్పీ మహేశ్ బీ గితే తెలిపారు. మనకొండూరులోని బయోలాజికల్ ల్యాబ్లో గంజాయిని దహనం చేసినట్లు వివరించారు. గంజాయి రవాణా చేసినా, అమ్మినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి రవాణాపై నిరంతరం నిఘా పెడుతూ నార్కోటిక్ జాగిలాలతో విస్తృత తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, డీసీఆర్బీ సీఐ నాగేశ్వరరావు, ఆర్ఎస్సై రాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
యాదాద్రి జిల్లాలో గొర్రెల చోరీ
శంకరపట్నం: యాదాద్రి భువనగిరి జిల్లాలో చోరీకి గురైన గొర్రెలను మంగళవారం వేకువజామున మొలంగూరులో పోలీసులు పట్టుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పదిరోజుల క్రితం 10 గొర్రెలు చోరీకి గురయ్యాయి. అక్కడి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. విచారణలో భాగంగా చోరీకి గురైన గొర్రెలు శంకరపట్నం మండలం మొలంగూర్ శివారులోని మైదానం ప్రాంతంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. అక్కడి పోలీసులు, స్థానిక పోలీసుల సాయంతో ట్రాలీఆటోలో గొర్రెలను తీసుకెళ్లారు. గొర్రెల దొంగలు మండలానికి చెందిన వ్యక్తులుగా ప్రచారం జరుగుతోంది. మొలంగూర్లో పట్టివేత -
చికిత్స పొందుతూ డ్యాన్స్ మాస్టర్ మృతి
రామడుగు: మండలంలోని గోపాల్రావుపేట గ్రామానికి చెందిన డ్యాన్స్ మాస్టర్ దాసరి శేఖర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు... ఓ ప్రైవేటు పాఠశాలలో డ్యాన్స్ మాస్టర్గా పనిచేస్తున్న శేఖర్ మూడు రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లి అక్కడే పురుగుమందు తాగాడని, బంధువులు కరీంనగర్లోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడని, శేఖర్కు భార్య ఉందని, మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. -
‘కడారి’.. ఉద్యమమే ఊపిరి
సిరిసిల్ల/తంగళ్లపల్లి(సిరిసిల్ల): మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కోస అలియాస్ సాధు ఉద్యమమే ఊపిరిగా జీవితాన్ని ప్రజలకోసమే పణంగా పెట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాల్రావుపల్లెకు చెందిన కడారి కిష్టారెడ్డి–అన్నమ్మ చిన్న కొడుకు సత్యనారాయణరెడ్డి. 1980లో ఉద్యోగాన్ని వదిలి ఉద్యమబాటలో సాగిన ఆయన ఇంటివైపు కన్నెత్తి చూడకుండా నాలుగున్నర దశాబ్దాలపాటు మావోయిస్టు ఉద్యమంలో కీలక నేతగా ఉన్నారు. గోపాల్రావుపల్లె నుంచి ఛత్తీస్గఢ్ వరకు.. సత్యనారాయణరెడ్డి తండ్రి ఉపాధ్యాయుడు కావడంతో ఆయన పనిచేసిన ఎల్లారెడ్డిపేటలోనే చదువు సాగింది. ఆటలు, చదువులో చురుకుగా ఉండేవాడు. పెద్దపల్లి జిల్లాలో చదువు పూర్తి కావడంతో ఉద్యోగం సాధించిన సత్యనారాయణరెడ్డి అక్కడ జరిగిన కార్మిక సంఘాల గొడవల్లో జైలుపాలు కావడంతో వామపక్ష ఉద్యమాలవైపు వెళ్లాల్సి వచ్చింది. మహారాష్ట్రలోని సిరోంచా, గడ్చిరోలీ ప్రాంతాల్లో ఆర్గనైజర్గా అప్పటి పీపుల్స్వార్ దళనాయకుడిగా, జిల్లా కమిటీ సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. దేశవ్యాప్తంగా మావోయిస్టు పొలిట్ బ్యూరోలో 26 మంది సభ్యులు ఉండగా వారిలో ఒకరిగా కోస ఉన్నారు. పెళ్లి చేసుకోకుండా వ్యక్తిగత జీవితాన్ని సైతం ప్రజలకోసం త్యాగం చేసినట్లు ఆయన సన్నిహితులు చెబుతారు. అనారోగ్యంతో ఉన్నా కూడా అడవిబాట విడవకుండా దండకారణ్యంలో ప్రజాయుద్ధాన్ని కొనసాగించారు. ఛత్తీస్గఢ్ బయల్దేరిన కుటుంబ సభ్యులు నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన సత్యనారాయణరెడ్డి మృతదేహం కోసం అతడి సోదరుడు కరుణాకర్రెడ్డి, సమీప బంధువులు మంగళవారం ఛత్తీస్గఢ్కు బయలుదేరారు. పోస్టుమార్టం అనంతరం కోస మృతదేహాన్ని స్వగ్రామం గోపాల్రావుపల్లెకు తీసుకువచ్చే అవకాశం ఉంది. పోరుబాటలో అసువులు బాసిన సత్యనారాయణరెడ్డి గోపాల్రావుపల్లె నుంచి ఛత్తీస్గఢ్ వరకు 45 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణరెడ్డి(కోస)కి ఎల్లారెడ్డిపేట మండలంతో విడదీయరాని అనుబంధం ఉంది. సత్యనారాయణరెడ్డి తండ్రి కడారి కిష్టారెడ్డి గణిత ఉపాధ్యాయుడిగా మండల కేంద్రంలోని పెద్దబడిలో 1976 వరకు పనిచేశారు. ఆ సమయంలో చిన్నవయసులో ఉన్న సత్యనారాయణరెడ్డి ఇక్కడే చదువుకున్నారు. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు పెద్దబడిలో చదువుకున్నారు. నారాయణపూర్లో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో సత్యనారాయణరెడ్డి చనిపోయాడన్న వార్త ఎల్లారెడ్డిపేటలో కలకలం రేపింది. ఆ సమయంలో పెద్దబడిలో చదువుకున్న విద్యార్థులు కోసతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. వారిని కదిలించగా.. విద్యార్థి వయసు నుంచే సోషలిస్ట్ భావాలు ఉండేవని, సమాజంలోని అన్యాయాలపై ప్రశ్నించేవారని గుర్తుచేసుకున్నారు. ఎప్పుడూ సమసమాజం, పేదల బతుకులపై మాట్లాడేవారని తెలిపారు. తమతో చదువుకున్న విద్యార్థి కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగి, ఎన్కౌంటర్లో చనిపోవడంపై వారు భావోద్వేగానికి గురయ్యారు. -
ఆర్నెళ్లలో చేతికందుతుంది
ఆయిల్ పాం తోటల్లో పరా గసంపర్కం పూర్తయిన ఆ రు నెలల తర్వాత పంట చే తికందుతుంది. ఆఫ్రికన్ పు రుగులు పూతను పిందె.. కాయగా మార్చడంలో కీల క పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం ఆయిల్ పాం గెల టన్నుకు రూ.19,107గా ఉంది. ప్రతినెలా ఆదాయం పొందవచ్చు. – శ్యాంప్రసాద్, జగిత్యాల ఉద్యానశాఖాఽధికారి జిల్లాలో మూడేళ్లు దాటిన అన్ని ఆయిల్ పాం తోటల్లో ఆఫ్రికన్ పురుగులు వదులుతాం. దీనివల్ల పరపరాగ సంపర్కం జరిగి పూతంతా పిందెగా.. తర్వాత కాయగా మారుతుంది. రైతులకు దిగుబడి పెరిగి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. పురుగులను ప్రత్యేకంగా జిల్లాకు తెప్పించాం. – విజయ్భరత్, లోహియా కంపెనీ ప్రతినిధి -
మిడ్మానేరు నీటి విప్లవం
బోయినపల్లి(చొప్పదండి): రాష్ట్రంలోని ప్రాజెక్టులకు గుండెకాయగా నిలుస్తోంది రాజన్నసిరిసిల్ల జిల్లా మాన్వాడలో నిర్మించిన మిడ్మానేరు(శ్రీరాజరాజేశ్వర). 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2017–18లో పనులు పూర్తికావడంతో నీటిని నిల్వ చేస్తున్నారు. అప్పటి నుంచి ఈనెల 14 వరకు ఏడేళ్లలో ఈ ప్రాజెక్టులోకి 527 టీఎంసీల నీరు వచ్చింది. ఇక్కడి నుంచి వివిధ జలాశయాలకు 465 టీఎంసీలు వెళ్లింది. ప్రాజెక్టు సామర్థ్యం 27.55 టీఎంసీలు. 527 టీఎంసీల ఇన్ఫ్లో 2017–18 నుంచి 2025 సెప్టెంబర్ 14 వరకు మిడ్మానేరులోకి కాళేశ్వరం, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ ప్రాజెక్టులతోపాటు వరద ఆధారంగా 527 టీఎంసీల నీరు వచ్చింది. కాళేశ్వరం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి ఎత్తిపోతల ద్వారా 206.56 టీఎంసీలు వచ్చాయి. ఎస్సారెస్పీ నుంచి 153.90 టీఎంసీలు, వరద ఆధారంగా 167.09 టీఎంసీలు వచ్చి చేరాయి. అగ్రభాగాన కాళేశ్వరం మధ్యమానేరులోకి కాళేశ్వరం నీటిని 2019–20 నుంచి 2023–24 వరకు ఎత్తిపోశారు. కాళేశ్వరం నుంచి 175 టీఎంసీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. తర్వాత కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపరమైన అంశాలతో అక్కడ నీటిని నిల్వ చేయలేదు. 465 టీఎంసీలు ఔట్ఫ్లో మిడ్మానేరు నుంచి 2017–18 నుంచి 2025 సెప్టెంబర్ 14 వరకు 465 టీఎంసీల మేర నీరు ఔట్ఫ్లోగా వదిలారు. కరీంనగర్ ఎల్ఎండీలోకి 360.87 టీఎంసీలు, ఇల్లంతకుంట మండలంలోని ప్యాకేజీ–10 అన్నపూర్ణలోకి 88.04 టీఎంసీలు విడుదల చేశారు. ప్యాకేజీ–10 నుంచి సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్లకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు 17.31 టీఎంసీలు వదిలారు. మిడ్మానేరు నుంచి ఎల్ఎండీకి ఏకంగా 360.87 టీఎంసీల మేర నీరు వదలడం విశేషం. ఏడేళ్లలో 527 టీఎంసీల ఇన్ఫ్లో అత్యధికంగా 175 టీఎంసీలు కాళేశ్వరం నుంచే.. 465 టీఎంసీల ఔట్ ఫ్లో ఎల్ఎండీకి 360 టీఎంసీలు తరలింపు 2017–18లో మొదలైన నీటి నిల్వ ఏడేళ్లుగా మిడ్మానేరులోకి ఇన్ఫ్లో (టీఎంసీలలో..) సంవత్సరం కాళేశ్వరం ఎస్సారెస్పీ వరద 2017–18 – 5.89 – 2018–19 – 11.19 1.31 2019–20 65.19 2.54 3.24 2020–21 37.84 20.58 21.26 2022–23 30.77 27.00 41.61 2023–24 6.37 15.63 27.63 2024–25 23.82(ఎస్వైపీ) 31.23 16.45 2025 సెప్టెంబర్ 6.77(ఎస్వైపీ) 31.47 17.52 మొత్తం 206.56 153.90 167.09 మిడ్మానేరు నుంచి ఔట్ ఫ్లో(టీఎంసీలలో..) సంవత్సరం ఎల్ఎండీ ప్యాకేజీ–10 కుడి,ఎడమ కాలువ 2017–18 0.50 – 0.17 2018–19 9.88 – 0.23 2019–20 48.20 5.89 1.25 2020–21 64.70 11.87 1.79 2021–22 62.42 17.17 2.05 2022–23 70.60 7.52 2.95 2023–24 49.23 4.73 4.92 2024–25 41.10 20.77 3.95 2025 సెప్టెంబర్ 14.24 20.09 0.0 మొత్తం 360.87 88.04 17.31 మిడ్మానేరు ప్రాజెక్టులోకి 2017–18 నుంచి 2025 సెప్టెంబర్ 14వ తేదీ వరకు 527 టీఎంసీల మేర నీరు కాళేశ్వరం, ఎస్వైపీ, ఎస్సారెస్పీ, వరద ఆధారంగా ఇన్ఫ్లోగా వచ్చింది. మిడ్మానేరు నుంచి 465 టీఎంసీల మేర నీరు ఔట్ఫ్లోగా తరలింది. ఔట్ఫ్లోలో అధిక భాగం అంటే 360.87 టీఎంసీల నీరు ఎల్ఎండీకి తరలింది. – జగన్, ఈఈ, మిడ్మానేరు -
ఆయిల్ పాం తోటల్లో ‘ఆఫ్రికన్’ పురుగులు
జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల జిల్లాలో మూడేళ్ల క్రితం ఆయిల్ పాం సాగుకు రైతులు ముందుకొచ్చారు. ప్రస్తుతం ఆ తోటలు కాపుకొస్తున్నాయి. ఆయిల్ పాం సాగుపై రైతులకు పెదగా అవగాహన లేకపోవడంతో ఉద్యానశాఖ, కంపెనీ అధికారులు సమావేశాలు నిర్వహిస్తూ.. క్షేత్రస్థాయిలో పర్యటించి వివరించారు. రైతులు అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటించి తోటలు సాగు చేస్తున్నారు. అయితే పూతను పిందెగా మార్చి.. దిగుబడి పెంచేందుకు మల్యాల, పెగడపల్లి, గొల్లపల్లి, ధర్మపురి మండలాల్లో సాగవుతున్న ఆయిల్ పాం తోటల్లో పరాగ సంపర్కం కోసం ఉద్యానశాఖ, లోహియా ఆయిల్ పాం కంపెనీ అధికారులు ఆఫ్రికన్ పురుగులను వదిలుతున్నారు. పూతకొస్తున్న తోటలు జిల్లాలో 2022–23లో సుమారు మూడు వేల ఎకరాల్లో ఆయిల్ పాం సాగు చేశారు. ఆ తోటలు పూతకు వస్తున్నాయి. పూత పిందెగా మారి, ఆపై కాయగా మారాల్సి ఉంటుంది. అప్పుడే ఆయిల్ పాం గెలలను కోసి ప్రాసెసింగ్కు పంపించాల్సి ఉంటుంది. తోటల్లో రసాయన ఎరువులు.. పురుగు మందుల వాడకం పెరగడంతో పరాగ సంపర్కం కోసం సహజ సిద్ధంగా వచ్చే పురుగులు రావడం లేదు. దీంతో పూత దశలో ఉన్న తోటల్లో ఆఫ్రికన్ పురుగులను వదులుతున్నారు. ఎలాడోబియస్ కామెరునికాస్ అనే ఆఫ్రికన్ పురుగు ఆయిల్ పాం తోటల్లో పరపరాగ సంపర్కం జరపడంలో కీలకపాత్ర పోషిస్తుంది. చెట్టు పూతకు వస్తే.. ఆ గెలకు ఆడ, మగపుష్పాలు పూస్తాయి. ఆఫ్రికన్ పురుగులు మగ పుష్పాల పరాగ రేణువులను ఆడ పుష్పాలకు చేరవేస్తాయి. తద్వారా ఫలదీకరణం జరిగి కాయలు ఏర్పడతాయి. పరాగ సంపర్కం జరగడం ద్వారా ప్రతి చెట్టుకూ పిందెలు ఎక్కువగా తయారై, దిగుబడి బాగా పెరుగుతుంది. ఆఫ్రికన్ పురుగుల ప్రాధాన్యత ఏంటంటే..? ఆఫ్రికన్ పురుగులు 4 మిల్లీమీటర్ల పొడవుంటాయి. నల్లటి రంగులో ఉండి పరాగ సంపర్కం కలిగిస్తాయి. తొలుత ఈ పురుగులను 1980 ప్రాంతంలో మలేసియాలో ఆయిల్ పాం దిగుబడి పెంచేందుకు దిగుమతి చేసుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ కూడా ఆయిల్ పాం సాగు పెరగడంతో దిగుబడి కోసం ఆఫ్రికన్ పురుగులను తీసుకొస్తున్నారు. చెట్టుకు ఉండే మగ పుష్పాల సువాసనకు ఆఫ్రికన్ పురుగులు ఆకర్షించబడతాయి. పురుగులు వాలినప్పుడు పుప్పోడి రేణువులు వాటి శరీరానికి అంటుకుంటాయి. తర్వాత పురుగులు ఆడ పుష్పాలపై వాలినప్పుడు వాటి శరీరానికి అంటుకున్న పుప్పోడి రేణువులు పడి పరాగ సంపర్కం జరుగుతుంది. ఈ పురుగుల ద్వారా అనుకున్న స్థాయిలో పరాగ సంపర్కం జరిగితే ఆయిల్ పాం తోటల్లో గెలలు ఎక్కువగా ఏర్పడటంతోపాటు నూనె దిగుబడి పెరుగుతుంది. ఈ పురుగులు ఆయిల్ పాం తోటలకుగానీ.. మనుషులకు గాని హానికరమైనవి కావు. ఉద్యానశాఖ ద్వారా తోటల్లోకి.. దిగుబడి పెంచాలనేది లక్ష్యం -
నిబంధనల బూచీ.. కొనుగోళ్లపై పేచీ
కరీంనగర్ అర్బన్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2025–26 సీజను కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) నిర్వహించిన జిన్నింగ్, ప్రెస్సింగ్ టెండర్లకు కాటన్, జిన్నింగ్ మిల్లుల యజమానులు దూరంగా ఉన్నారు. మద్దతు ధరతో ఏటా పత్తిని కొనుగోలు చేసే సీసీఐ జిన్నింగ్ కోసం టెండర్లను ఆహ్వానించింది. మార్క్ఫెడ్ మినహా ప్రైవేటు వ్యాపారులు టెండర్లు వేయకపోవడంతో పత్తి క్రయవిక్రయాలపై ప్రభావం చూపే ప్రమాదముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే నెలలో పత్తి కొనుగోళ్లు ప్రారంభం కావాల్సి ఉన్నా.. ఇప్పటివరకు టెండర్ల పక్రియ పూర్తికాలేదు.. సీసీఐ నిబంధనలు కఠినంగా ఉండటంతో పత్తి పరిశ్రమ యజమానుల సంఘం తమ మిల్లులను సీసీఐకు అద్దెకు ఇవ్వొద్దనే నిర్ణయం మేరకు ఒక్కరు కూడా టెండర్లు వేయలేదని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో వానాకాలం సీజన్లో 4లక్షల ఎకరాలకు పైగా పత్తి సాగైంది. అధికారుల లెక్కల మేరకు 40 లక్షల క్వింటాళ్ల పత్తి వచ్చే వీలుంది. మద్దతు ధరతో పత్తిని కొనుగోలు చేసే సీసీఐ పత్తి గింజలు తీసి బేళ్లుగా మార్చి సరఫరా చేయడానికి టెండర్లు ఆహ్వానించింది. ఆగస్టు 31 వరకు గడువు ఇవ్వగా.. వ్యాపారులు టెండర్లు వేయలేదు. కొత్తగా తీసుకొచ్చినవి ఇవే.. ఒక బ్రాంచిలో రెండు, మూడు జోన్లుగా చేసి లింట్ పర్సంటేజ్లో మార్పులు చేయడంతో పాటు గతంలో కంటే ఎక్కువగా పెంచారు. వంద కిలోల పత్తిలో ఏ నెల ఎంత దూది ఇవ్వాలనే నిబంధన పెట్టారు.. గతంలో ఇది నెలవారీగా ఉండేది.. ఈ సీజన్లో నెలలో రెండు సార్లు ఇవ్వాలని సూచించారు. బేలు తయారు చేసే సమయంలో గతంలో లోటు (షార్టేజ్) 3.15 నుంచి 1.90 శాతం ఉండేది.. దాన్ని 1.25 నుంచి 0.75 శాతానికి తగ్గించారు. నిబంధనలు, బేళ్ల ధర, జిన్నింగ్లో సౌకర్యాలు, తదితర వాటిపై చర్చలు జరిపిన తర్వాతనే టెండర్లకు వెళ్తామని కాటన్ అసోసియేషన్ అంటోంది. పత్తి విక్రయాలు సజావుగా సాగేనా జిల్లాలో 40వేల ఎకరాలకు పైగా పత్తి సాగు చేశారు. 4లక్షల క్వింటాళ్లకు పైగా దిగుబడి రానుండగా కనీస మద్దతు ధర అందాలంటే ప్రభుత్వ సత్వర నిర్ణయాలే పరిష్కారం. మరో పక్షం రోజుల్లో పంట దిగుబడులు మార్కెట్ను ముంచెత్తనుండగా తదనుగుణ చర్యలు కరవయ్యాయి. జిల్లాలో 16జిన్నింగ్ మిల్లులుండగా వాటిలోనే సీసీఐ కొనుగోలు చేయనుంది. ఈ క్రమంలో టెండర్ల ప్రక్రియలో వ్యాపారులు కోట్ చేయకపోవడం, నిబంధనలను బూచీగా చూపి దూరంగా ఉండటంతో కర్శకులకు నష్టమే. ప్రభుత్వం చొరవ చూపి పత్తి విక్రయాలకు మార్గం సుగమం చేయడంతో పాటు మద్దతు ధర అందేలా చూడటం అత్యవసరం. పత్తి విక్రయాలు సజావుగా సాగేనా? -
మృత్యువుతో పోరాడి ఓడిన యువకుడు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పదమూడేళ్లుగా ఆ యువకుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు యువకుడి ప్రాణాలు కాపాడడానికి ఆస్పత్రుల్లో రూ.10లక్షల వరకు ఖర్చు చేశారు. అయినా చివరికి అతను ఓడిపోయాడు. ఈ సంఘటన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో విషాదం నింపింది. ఎల్లారెడ్డిపేటకు చెందిన జోగుల నాంపెల్లి(41) పెట్రోల్పంపులో పనిచేస్తుండేవాడు. కొంతకాలం క్రితం అనారోగ్యం బారిన పడ్డాడు. ఆస్పత్రిలో చూపించగా జాండీస్ వ్యాధికి గురైనట్లు వైద్యులు తెలిపారు. దీంతో పలు ఆస్పత్రుల్లో వైద్యం అందించారు. ఈక్రమంలోనే షుగర్ వ్యాధికి గురయ్యాడు. 13 ఏళ్లుగా వివిధ ఆస్పత్రుల్లో వైద్యం పొందడానికి మిత్రులు, కుటుంబ సభ్యులు కలిసి రూ.10 లక్షలు ఖర్చుచేశారు. కాగా ఇటీవల రెండు మూత్రపిండాలు(కిడ్నీలు) పాడవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గత 15 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. అంత్యక్రియలకు సింగిల్విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి రూ.5వేలు సాయం అందించారు. రూ.10 లక్షలు ఖర్చు చేసినా దక్కని ప్రాణం 13 ఏళ్లు మృత్యువుతో పోరాటం ఎల్లారెడ్డిపేటలో విషాదం -
పంపిణీకి సిద్ధంగా ‘దీపిక’ పుస్తకాలు
సుల్తానాబాద్(పెద్దపల్లి): రాష్ట్ర విద్యా పరిశోధన, అభివృద్ధి శిక్షణ సంస్థ ముద్రించిన అభ్యాస దీపికలు జిల్లా కేంద్ర గోదం నుంచి ఎమ్మార్సీలకు చేరాయి. దసరా సెలువుల తర్వాత వీటిని పంపిణీ చేసేందుకు జిల్లా విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. గతేడాదికన్నా ఈసారి మెరుగైన ఫలితాలు సాధించడం లక్ష్యంగా వీటిని పంపిణీ చేయాలన్నదే లక్ష్యం. సులభంగా అర్థమయ్యేలా.. పదో తరగతి విద్యార్థులకు అభ్యాసన కరదీపికలు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టామని డీఈవో మాధవి తెలిపార. ఎమ్మార్సీల నుంచి పాఠశాలలకు చేరనున్నాయని వివరించారు. వీటి ద్వారా విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. పాఠ్యాంశాలు సులభంగా అర్థమవుతాయని అన్నారు. తద్వారా ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఈ–కేవైసీ ఉంటేనే రేషన్ !
కరీంనగర్ అర్బన్: నూతనంగా రేషన్ కార్డు పొందినవారంతా తస్మాత్ జాగ్రత్త. ఈ–కేవైసీ ఉంటేనే రేషన్ సరకులు ఇవ్వనున్నారు. తుది గడువంటూ లేకపోగా వీలైనంత త్వరగా సదరు ప్రక్రియ చేసుకోవడమే ఉత్తమం. ఇటీవల రెండు నెలల కాలంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో ఈ–కేవైసీ తప్పనిసరని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కార్డులో పేర్లున్న కుటుంబ సభ్యులందరూ దగ్గరలోని రేషన్ దుకాణానికి వెళ్లి ఈ–పోస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. రెండేళ్లుగా ఈ–కేవైసీ ప్రక్రియ... రేషన్ కార్డులో ఉన్నవారందరూ ఈ–కేవైసీ నమోదు చేయుంచుకోవాలని రెండేళ్లుగా ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తిచేసింది. అయితే ఇప్పటికీ అనేకసార్లు గడువు పొడిగించింది. కరీంనగర్ జిల్లాలో 3.01లక్షల రేషన్ కార్డులుండగా 40 వేల మందికిపైగా కొత్తరేషన్ కార్డులు మంజూరయ్యాయి. కార్డులు మంజూరైన వారికి సెప్టెంబరు నెలలో బియ్యం కోటాకూడా విడుదలైంది. వారికి ఈ నెలలో బియ్యం పంపిణీ చేశారు. 32,577 మంది కుటుంబ సభ్యుల పేర్లను పాతకార్డుల్లో జత చేశారు. పాత కార్డులో కొత్తగా పేర్లు నమోదు చేసుకున్నవారు కూడా ఈ–కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. ఆధార్ అప్డేట్ లేక అవస్థలు.. ఆధార్ నవీకరణ(అప్డేట్) లేకపోవడంతో కొందరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలు ఆధార్ కేంద్రాలకు వెళ్లి అప్డేట్ ప్రక్రియ పూర్తిచేయించుకున్నప్పటికీ ఈ–కేవైసీ ప్రక్రియలో వేలిముద్రలు రావడంలేదు. కారణం తెలుసుకోవాలని బాధితులు ఇతర కేంద్రాలకు వెళ్లి వాకబు చేయగా.. ఆధార్ అప్డేట్ పూర్తి కాకపోవడంతో ఈ–కేవైసీ తీసుకోవడం లేదని పేర్కొంటున్నారు. దీంతో లబ్ధిదారులు వేర్వేరు ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. కరీంనగర్ జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో ఆధార్ కేంద్రాలు లేకపోవడంతో ప్రజలు ఇతర మండలాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్యపై అధికారులు స్పందించి మరిన్ని ఆధార్ కేంద్రాలను అందుబాటులో ఉంచితే ప్రజలకు ఉపయోగపడుతుందని పలువురు కోరుతున్నారు. కొత్త రేషన్ కార్డుదారులు ఈ–కేవైసీ చేయించుకోవాలని, సదరు ప్రక్రియకు తుది గడువు రాలేదని పౌరసరఫరాల శాఖ అధికారులు వివరించారు. కొత్త కార్డుదారులకు ప్రభుత్వ సూచన -
ఎన్టీయార్ గెస్ట్హౌస్ ఇక ఉండదు
1994లో రాజన్న దర్శనం కోసం వచ్చిన ఎన్టీయార్ లక్ష్మీపార్వతీ దంపతులు బస చేసిన గెస్ట్హౌస్ ఎన్టీయార్ గెస్ట్హౌస్లోని ఫర్నీచర్, డోర్లు తొలగించి కూల్చేందుకు సిద్ధం చేసిన ఆలయ సిబ్బంది వేములవాడలో రాజన్న ఆలయ విస్తరణలో భాగంగా గుడి పరిసరాల్లోని వివిధ భవనాలను కూల్చివేస్తున్నారు. ఇందులో భాగంగా రాజన్న గెస్ట్హౌస్ను సైతం తొలగించనున్నారు. 1994లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (ఎన్టీయార్) తన సతీమణి లక్ష్మీపార్వతితో కలిసి రాజన్నను దర్శించుకున్నారు. ఆ సమయంలో సీఎం కోసం ప్రధాన గెస్ట్హౌస్ను సిద్ధం చేశారు. ఇదే గెస్ట్హౌస్లో ఎన్టీయార్–లక్ష్మీపార్వతీ బస చేశారు. అప్పటి నుంచి ఎన్టీయార్ గెస్ట్హౌస్గా పిలుస్తుంటారు. ఆలయ విస్తరణలో భాగంగా ఈ గెస్ట్హౌస్ను కూల్చివేయనున్నారు. – వేములవాడ -
‘కొస’ముట్టని ప్రస్థానం
● ప్రజాసమస్యలపై అజ్ఞాతం ● గోపాల్రావుపల్లె నుంచి దండకారణ్యంలోకి.. ● ఆగిన 45 ఏళ్ల పోరాటం ● ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కొస మృతి ● మృతదేహాలను గుర్తించని కుటుంబ సభ్యులు సిరిసిల్ల: పీడిత.. తాడిత ప్రజల కోసం దశాబ్దాల క్రితం పోరుబాట పట్టిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు మావోయిస్టు అగ్రనేతలు ఒక్కరొక్కరుగా నేలకొరుగుతున్నారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, జిల్లాకు చెందిన కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కొస అలియాస్ సాధు మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాల్రావుపల్లెకు చెందిన కడారి సత్యనారాయణరెడ్డి 45 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ముగిసింది. విద్యావంతుల కుటుంబం సత్యనారాయణరెడ్డి తండ్రి కిష్టారెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి అన్నమ్మ గృహిణి. సోదరుడు కరుణాకర్రెడ్డి రిటైర్డు ఎంఈవో. సోదరి జయమ్మ ఇప్పటికే మరణించారు. కొస తండ్రి కిష్టారెడ్డి 2013 జూన్ 8న, తల్లి అన్నమ్మ 2012 నవంబరు 14న మరణించారు. తల్లిదండ్రులు మరణించినా చివరి చూపునకూ సత్యనారాయణరెడ్డి రాలేదు. ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా.. ప్రస్తుతం తెలంగాణలో మావోయిస్టు ప్రాబల్యం తగ్గింది. పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్రాల్లో ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మూడు కుటుంబాల్లో కలవరం మొదలవుతుంది. దండకారణ్యంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కొన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.3 కోట్ల రివార్డు ప్రకటించాయి. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన చంద్రయ్య అలియాస్ ఆజాద్, ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లికి చెందిన శ్రీనివాస్ అలియాస్ భరత్, అలియాస్ యాదన్న, తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటకు చెందిన బాలసంతుల ఉప్పలయ్య అలియాస్ చిన్నన్నలు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఆ నలుగురిలో సత్యనారాయణరెడ్డి మరణించినట్లు పోలీసులు ప్రకటించగా.. మిగిలిన ముగ్గురు ఎక్కడ ఉన్నది వారి కుటుంబ సభ్యులకు తెలియదు. పార్టీ సైతం వారి సమాచారాన్ని బహిర్గతం చేయడం లేదు. కోనరావుపేట మండలం శివంగాళపల్లెకు చెందిన జ్యోతి అలియాస్ జ్యోతక్క మూడేళ్ల క్రితం పోలీసులకు లొంగిపోయారు. 20 ఏళ్లపాటు అజ్ఞాతంలో ఉన్న జ్యోతి పోలీసులకు లొంగిపోయి స్వగ్రామంలో ఉంటోంది. బాలసంతుల ఉప్పలయ్య అలియాస్ చిన్నన్న మూడు దశాబ్దాలుగా ఎక్కడ ఉన్నారో.. ఎలా ఉన్నారో తెలియదు. ఉద్యోగం చేస్తూ ఉద్యమంలోకి.. గోపాల్రావుపల్లెకు చెందిన కడారి సత్యనారాయణరెడ్డి సిరిసిల్లలో ప్రాథమిక విద్యను అభ్యసించి పెద్దపల్లి ఐటీఐ పూర్తి చేశారు. బసంత్నగర్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరిన సత్యనారాయణ కార్మికుల హక్కుల కోసం ఉద్యమించారు. ఈక్రమంలో సిమెంట్ ఫ్యాక్టరీ మేనేజర్ హత్యకు గురికాగా.. ఆ కేసులో జైలుకు వెళ్లాడు. జైలు నుంచి వచ్చాక అప్పటి సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస)లో పనిచేస్తూ పీపుల్స్వార్లో చేరారు. 1980 ప్రాంతంలో ఉద్యమంలోకి వెళ్లిన సత్యనారాయణరెడ్డి మావోయిస్టు పార్టీలో దాదాగా, కొసగా.. సాధు పేర్లతో కొనసాగారు. కేంద్ర కమిటీ సభ్యులే టార్గెట్గా ఆపరేషన్లు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులే టార్గెట్గా కేంద్ర బలగాలు ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస బస్వరాజ్ ఎన్కౌంటర్లో మరణించగా.. మరో కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు నర్సింహాచలం అలియాస్ సుధాకర్, గాజర్ల రవి అలియాస్ గణేశ్, రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి, అలియాస్ జయరాం, పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, మోడం బాలకృష్ణ మరణించారు. తాజాగా నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మరో ఇద్దరు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కడారి సత్యనారాయణరెడ్డి, కట్ట రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ మరణించారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో కరీంనగర్ జిల్లాకు చెందిన మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేసిన ముప్పాళ్ల లక్ష్మణ్రావు అలియాస్ గణపతి, మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనూ, కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ ఉన్నారు. గోపాల్రావుపల్లైపె నిఘా కడారి సత్యనారాయణరెడ్డి సొంతూరు గోపాల్రావుపల్లైపె నాలుగు దశాబ్దాలుగా పోలీసుల నిఘా కొనసాగింది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పోలీసులు అనేక పర్యాయాలు గోపాల్రావుపల్లెకు వచ్చి వెళ్లారు. ఆయన పోస్టర్లను ఊరిలో ప్రదర్శించారు. సత్యనారాయణరెడ్డి తల్లి అన్నమ్మ, తండ్రి కిష్టారెడ్డి మరణించిన సందర్భాల్లోనూ పోలీసులు నిఘా పెట్టారు. 1996లో కొస వరంగల్ జిల్లాలో అరెస్టయి మూడునెలల జైలులో ఉండి విడుదలై మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు. 2025 జనవరిలో రాజన్నసిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ కొస స్వగ్రామంలో అతని సోదరుడు రిటైర్డు ఎంఈవో కరుణాకర్రెడ్డిని కలిశారు. కొస జనజీవన స్రవంతిలో కలిసేలా చూడాలని కోరారు. ఫొటోలు గుర్తించని కుటుంబ సభ్యులు కడారి సత్యనారాయణరెడ్డి ఫొటోను అతని అన్న కరుణాకర్రెడ్డి నిర్ధారించలేదు. అతను తమ తమ్ముడు కాదని స్పష్టం చేశారు. కానీ చాలా ఏళ్ల తరువాత తమ్ముడి ఫొటోను చూసి గుర్తించలేకపోయినట్లు భావిస్తున్నారు. మావోయిస్టు పార్టీ మరో కేంద్ర కమిటీ సభ్యుడు కట్ట రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అతని భార్య మాలతి సొంతూరు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన రామచంద్రారెడ్డితోపాటు కొస ఎన్కౌంటర్లో మరణించడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చర్చనీయాంశమైంది. -
ప్రతిభ వెలికితీసేందుకు ‘అల్ఫోర్స్ అటెంప్ట్ 2025’
కొత్తపల్లి(కరీంనగర్): విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి అల్ఫోర్స్ అటెంప్ట్ పరీక్ష నిర్వహించినట్లు అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి.నరేందర్రెడ్డి తెలిపారు. కరీంనగర్ వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనీ టాట్స్లో సోమవారం నిర్వహించిన ‘అల్ఫోర్స్ అటెంప్ట్ 2025’ పరీక్ష ప్రారంభించి మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఈ పరీక్షకు 634 మంది హాజరైనట్లు తెలిపారు. పరీక్షా ఫలితాలను రెండురోజుల్లో విడుదల చేసి ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సాహాలతో పాటు విద్యాసంస్థలో విద్యను అభ్యసించేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, వివిధ పాఠశాలల యజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎల్ఎండీకి నీటి విడుదలబోయినపల్లి: మిడ్మానేరు నుంచి ఎల్ఎండీకి 2,200 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్రాజెక్టులోకి ఎస్సారెస్పీ నుంచి 4,500, మరో 2 వేల క్యూసెక్కుల మేర వరద ఇన్ఫ్లోగా చేరుతోంది. మిడ్మానేరు నుంచి ప్యాకేజీ–9కి 561, ప్యాకేజీ–10 అనంతగిరికి 3,200 క్యూసెక్కుల మేర నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం 27.248 టీఎంసీలకు చేరింది. -
సముద్రంలోకి ‘ఎల్లంపల్లి’ నీళ్లు
రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి విడుదలయ్యే నీరు సముద్రగర్భంలో కలవడం నీటిపారుదల శాఖ అధికారుల్లో ఆశ్చర్యం రేకెత్తిస్తుంది. ఏటా జూన్ ఒకటి నుంచి మే 31వ తేదీ మధ్య ఇరిగేషన్ ఇయర్గా పరిగణిస్తారు. ఈ మధ్య కురిసిన వర్షాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, ఏటా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోవడంతో ఒకసారి అధిక స్థాయి, మరోసారి అల్పస్థాయిలోకి ప్రాజెక్టులో నీటి నిల్వలు ఉంటున్నాయి. ప్రాజెక్టు సామర్థ్యానికి మించి వచ్చే వరద నీటిని గేట్ల్ల ద్వారా దిగువన ఉన్న గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. ఈసారి గత నాలుగు నెలల్లో అత్యధికంగా నీరు గోదావరి ద్వారా సమద్రంలో కలిసిపోయిందని అధికారులు వివరిస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వివరాలు.. ప్రాజెక్టు నీటి మట్టం 148 మీటర్లు. నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు. ప్రాజెక్టులో ఆదివారం నీటిమట్టం 147.55 మీటర్లు ఉండగా, నీటినిల్వ 18.92 టీఎంసీలు ఉన్నట్లు వివరించారు. 1.57 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి 1.03 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాలుగేళ్లలో.. – 2022–23 : ప్రాజెక్టులోకి 1,240.77 టీఎంసీల ఇన్ఫ్లో రాగా గేట్లు ఎత్తి 1,182.83 టీఎంసీలను గోదావరిలోకి వదిలారు. – 2023–24 : 393.79 టీఎంసీలు ఇన్ఫ్లో రాగా 371.18 టీఎంసీలను నదిలోకి విడుదల చేశారు. – 2024–25 : 329.05 టీఎంసీలు ఇన్ఫ్లో రాగా 276.53 టీఎంసీలను గోదావరిలోకి విడుదల చేశారు. – 2025–26 : ఆరంభం నుంచి సెప్టెంబర్ 21వ తేదీ వరకు 707.82 టీఎంసీలు ఇన్ఫ్లో రాగా ఇప్పటివరకు 684.84 టీఎంసీలను గోదావరిలోకి విడుదల చేశారు. ఈ నీరంతా సముద్రంలో కలిసినట్లు అధికారులు అంటున్నారు. -
గంజాయి విక్రేతల అరెస్ట్
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల సమీపంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం తక్కళ్లపల్లికి చెందిన నర్ర హరీశ్, పట్టణంలోని మోతెమాలవాడకు చెందిన దమ్మ ఉదయ్కిరణ్ డిగ్రీ కళాశాల సమీపంలో గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. పట్టణ ఎస్సై రవికిరణ్ వారిని పట్టుకుని తనిఖీ చేయగా 250 గ్రాముల గంజాయి లభ్యమైంది. ఇద్దరిసౌ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. విద్యుత్షాక్తో జీపీ సిబ్బందికి గాయాలుశంకరపట్నం: మండలంలోని వంకాయగూడెంలో విద్యుత్షాక్తో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న చలిగంటి సురేశ్కు తీవ్రగాయాలయ్యాయి. గ్రామపంచాయతీ పక్కన మినీ ట్రాన్స్పార్మర్ను బంద్చేసి వీధిలైట్లు వేసిన సురేశ్ మరో వీధిలో వీధిలైట్లు వేసేందుకు ట్రాక్టర్ ట్రైలర్ ఎక్కి విద్యుత్ బల్బు అమర్చుతుండగా విద్యుత్షాక్కు తగిలి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన సురేశ్ను కారులో కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విద్యుత్షాక్కు గురైన విషయాన్ని ఎంపీడీవో, ఎంపీవో, డీపీవోకు దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిభావంతులకు ప్రోత్సాహం సుల్తానాబాద్(పెద్దపల్లి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ఎంఎంఎస్ (నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్లు అందిస్తోంది. ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతు న్న వారు పరీక్షల్లో ప్రతిభ చూపితే.. ఏటా ఉపకారవేతనాలు అందిస్తోంది. ప్రతీనెల రూ.వె య్యి చొప్పున సాయం చేస్తోంది. 2025–26 విద్యా సంవత్సరంలో ఎన్ఎంఎంఎస్ పరీక్ష కోసం ప్రకటన వెలువడింది. ప్రభుత్వ, స్థానిక సంస్థలె, ప్రభుత్వ ఎయిడెడ్, వసతీసౌకర్యం లేనిఆదర్శ స్కూళ్ల విద్యార్థులే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. జగిత్యాలరూరల్: జగిత్యాలరూరల్ మండలం హన్మాజీపేటలో సోమవారం ఉదయం ఆటో బోల్తాపడి నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బాలపల్లికి చెందిన సాయిలు తన ఆటోలో మహిళలను ఎక్కించుకుని జగిత్యాలకు వస్తున్నాడు. హన్మాజీపేట వద్ద ద్విచక్ర వాహనం అడ్డు రావడంతో తప్పించే క్రమంలో ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న పొరండ్లకు చెందిన నక్క గంగవ్వ, తోట గంగు, మెడపట్ల లక్ష్మీ, సాయిలుకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదంపై కేసు● రూ.13.50 లక్షలకు పైగా నష్టం ● పోలీసుల అదుపులో నిందితుడు ?కరీంనగర్క్రైం: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మగనర్ హుమెరా ఇండస్ట్రీస్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఫ్యాక్టరీలో ఆదివారం రాత్రి మంటలు అంటుకోగా ఈ ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంలో ప్లాస్టిక్ కవర్ మెటీరియల్, ఒక బైకు, డీజిల్ జనరేటర్తోపాటు వివిధ వస్తువులు కాలిపోయాయి. దాదాపు రూ.13.50లక్షలకు పైగా విలువైన సామగ్రి కాలిపోయినట్లు షాపు యజమాని హఫీజ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అడిషినల్ డీసీపీ వెంకటరమణ, టౌన్ ఏసీపీ వెంకటస్వామి, టూటౌన్ సీఐ సృజన్రెడ్డి విచారణ చేపట్టారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వ్యక్తే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనుమానితునికి, షాపు యాజమాన్యానికి మధ్య గొడవ జరగడంతో ఆదివారం ఎవరూ లేని సమయంలో నిప్పు పెట్టినట్లు విచారణలో తేలినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై ఇండస్ట్రియల్, ఫైర్ అధికారులు సైతం దర్యాప్తు చేస్తున్నారు. -
భవాని దీక్ష స్వీకరణ
కరీంనగర్కల్చరల్: శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ సోమవారం కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో భవాని దీక్ష స్వీకరించారు. ఆయన కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకుల ద్వారా దీక్షా కంకణాన్ని ధరించారు. ఈసందర్భంగా ప్రజలకు ముందస్తు దేవీ నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సేవలు ఎలా ఉన్నాయి?కరీంనగర్క్రైం: జిల్లా జైలును జిల్లా న్యాయసేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి వెంకటేశ్ సోమవారం సందర్శించారు. ఖైదీలకు అందుతున్న సౌకర్యాలు, సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విచారణ ఖైదీలతో ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాలు, గంజాయి, నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలుంటాయన్నారు. విచారణ ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. లీగల్ ఏయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేశ్, జైలు రమేశ్తో పాటు సిబ్బంది ఉన్నారు. జమ్మికుంట(హుజూరాబాద్): దళారులకు పత్తి అమ్మి రైతులు ఆర్థికంగా నష్ట పోవద్దని, నాణ్యమైన పత్తిని మార్కెట్ తీసుకొచ్చి మంచి ధర పొందాలని మార్కెట్ చైర్పర్సన్ పూల్లూరి స్వప్నసదానందం అన్నారు. సోమవారం మార్కెట్లో క్రయ విక్రయాలను పరిశీ లించి మాట్లాడారు. సీసీఐకి పత్తి అమ్ముకునే రైతులు కపాస్ కిసాన్ యాప్లో నమోదు చేసుకోవాలని సూచించారు. కాగా, మార్కెట్లో క్వింటాల్ కొత్త పత్తి గరిష్ట ధర రూ.6,222 పలి కింది. 29 వాహనాల్లో 106 క్వింటాళ్ల పత్తిని అమ్మకానికి తీసుకవచ్చారు. క్వింటాల్కు మో డల్ ధర రూ. 5,521, కనిష్ట ధర రూ.3,200 వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రయవిక్రయాలను ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా పర్యవేక్షించారు. పోక్సో కోర్ట్ స్పెషల్ పీపీగా రాజేశంకరీంనగర్క్రైం: పోక్సో కేసుల విచారణ ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టు–2 స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సీనియర్ న్యాయవాది మంచికట్ల రాజేశం నియమితలయ్యారు. సోమవారం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ శరత్ సమక్షంలో విధుల్లో చేరారు. -
ఘనంగా బతుకమ్మ వేడుకలు
బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని మహాత్మజ్యోతిబాపులే మైదానంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ తులఉమ ఆడిపాడారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి, మాజీ కార్పొరేటర్లు, మహిళలు పాల్గొన్నారు. లోయర్ డ్యాంలోని లేక్ పోలీస్ స్టేషన్ వద్ద మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరిగాయి. – కరీంనగర్ కల్చరల్ -
స్నాతకోత్సవానికి రండి
సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవానికి సిద్ధమైంది. గవర్నర్, శాతవాహన చాన్స్లర్ జిష్ణుదేవ్వర్మ నవంబర్ 7న స్నాతకోత్సవం నిర్వహణకు అనుమతినిచ్చినట్లు వర్సిటీ వైస్ చాన్స్లర్ ఉమేశ్కుమార్ తెలిపారు. ఈమేరకు ఆయన సోమవారం గవర్నర్ను కలిశారు. హైదరాబాద్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ బీజేరావు హాజరుకానున్నట్లు తెలిపారు. స్నాతకోత్సవం సందర్భంగా విద్యార్థులకు బంగారు పతకాలు, పీహెచ్డీ పరిశోధకులకు డాక్టరేట్ పట్టాలు అందజేస్తామన్నారు. 2019 ఆగస్టులో తొలిస్నాతకోత్సవం జరిగిందని, ఇప్పుడు ద్వితీయ స్నాతకోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. -
మాను ఎండింది
నగరంలోని పలుచోట్ల భారీ వృక్షాలు ప్రమాదకరంగా మారాయి. ఎండిన చెట్లు కూలిపోయే స్థితికి చేరుకున్నాయి. నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయం సమీపంలో ఎండిన వృక్షం ప్రమాదకరంగా మారింది. ఈ చెట్టు కిందినుంచి నిత్యం వేలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు. వర్షం వచ్చినప్పుడు చెట్టు కూలితే ప్రమాదం జరిగే అవకాశముంది. కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో విద్యార్థులు తిరిగే ప్రాంతంలో ఓ భారీ వృక్షం ఎండిపోయి, పడిపోయే స్థితిలో ఉంది. ప్రాణసంకటంగా మారిన ఎండిన వృక్షాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. -
నేటినుంచి అమ్మవారి నవరాత్రోత్సవాలు
విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్ మండలం నగునూర్ శ్రీ దుర్గాభవానీ ఆలయంలో సోమవారం నుంచి నవరాత్రోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఫౌండర్ చైర్మన్ వంగల లక్ష్మణ్ తెలిపారు. ఆదివారం ఆలయ ప్రాంగణంలో మాట్లాడుతూ సోమవారం ఉదయం గురు వందనం, గోపూజ, పుణ్యాహవాచనం, గ్రహారాధన, కలశస్థాపన, చండీపారాయణ చతుష్టష్యుపచారపూజ, చండీహోమం, మంగళహారతి, కన్యాసువాసినీ పూజలు జరుగుతాయని తెలిపారు. ఆమ్మవారు బ్రహ్మీ అలంకరణలో హంసవాహనంపై దర్శనమిస్తారని వివరించారు. సాయంత్రం బతుకమ్మ, పల్లకీసేవ, కోలాటం, రాజోపచార పూజలు జరుగుతాయని తెలిపారు. ప్రతీరోజు ఉదయం సాయంత్రం గంగాహారతి ఉంటుందన్నారు. 23న నందివాహనంపై మహేశ్వరీ అలంకరణలో, 24న నెమలివాహనంపై కౌమరీ అలంకరణలో, 25న గరుడవాహనంపై వైష్ణవి అలంకరణలో, 26న లలిత త్రిపుర సుందరిగా, 27న గజవాహనంపై ఇంద్రాణి అలంకరణలో, 28న రాజరాజేశ్వరిగా, 29న సరస్వతీ అలంకరణలో, 30న సింహవాహనంపై దుర్గామాతగా, 1న అన్నపూర్ణ దేవిగా, 2న విజయలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారని పేర్కొన్నారు. ఆలయ కమిటీ బాధ్యులు వేములవాడ ద్రోణాచారి, నీరుమల్ల తిరుపతి, రాచమల్ల ప్రసాద్, పల్లెర్ల శ్రీనివాస్, తొడుపునూరి వేణుగోపాల్, రాచమల్ల రమేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మహనీయుడు కొండా లక్మణ్ బాపూజీ
కరీంనగర్టౌన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తన ఇంటినే త్యాగం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కొనియాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆదివారం కరీంనగర్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్రావుతో కలిసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీ టోపీ పెట్టుకుని ‘సిటిజన్ ప్రొటెక్షన్ కమిటీ’ పేరుతో పౌర హక్కుల కోసం పోరాటం చేశారన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉపసభాపతిగా, మంత్రిగా, శాసనసభ్యుడిగా ఈ తరం నాయకులకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు జరిగిన నష్టమేమిటో చెప్పకుండా ఇడ్లీ, దోశ, వడ అంటూ పలువురు పనికిమాలిన మాటలు మాట్లాడటం సరికాదంటూ వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దక్షిణాది వ్యక్తేనని, జీఎస్టీ సంస్కరణలతో ఏదైనా సమస్య ఉంటే ఆమె దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. -
అ‘ధన’పు బాదుడు
కరీంనగర్: బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. పండక్కి నగరాలు, పట్టణాల నుంచి పల్లెలకు వస్తుంటారు. పండుగ తర్వాత తిరిగి వెళ్తుంటారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కరీంనగర్ రీజి యన్లోని పదకొండు డిపోల నుంచి ఈనెల 20 నుంచి అక్టోబరు 13 వరకు 2,651 అదనపు ట్రిప్పులు నడిపిస్తున్నారు. అక్టోబర్ 1వ తేదీ వరకు జేబీ ఎస్ నుంచి కరీంనగర్కు, 2వ తేదీ నుంచి 13 వరకు కరీంనగర్– జేబీఎస్ మధ్యలో ప్రత్యేక ట్రిప్పులు 50శాతం అదనపు చార్జీలతో నడిపించనున్నారు. ప్రత్యేక బస్సులు 2,651 రద్దీకి అనుగుణంగా ఈనెల 20 నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు జేబీఎస్ నుంచి కరీంనగర్కు 1321 ట్రిప్పులు, అక్టోబరు 2వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కరీంనగర్ నుంచి జేబీఎస్కు 1330 ప్రత్యేక ట్రిప్పులు నడపనున్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లో 50శాతం అదనపు చార్జీలు వసూలు చేయనున్నా రు. టికెట్ ధర రూ.100 ఉంటే రూ.50 కలిపి రూ.150 చెల్లించాల్సి వస్తోంది. డీలక్స్, ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ, గరుడ, తదితర బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ల సౌకర్యం కల్పించారు. ప్రయాణికులు ప్రత్యేక బస్సుల సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు. -
ట్రినిటిలో బతుకమ్మ సంబరాలు
కరీంనగర్కల్చరల్: కరీంనగర్లో ట్రినిటి గర్ల్స్ జూనియర్ కళాశాలలో ఆదివారం బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ మమతారెడ్డి ప్రారంభించారు. విద్యార్థులు బతుకమ్మ పాటలు ఆడారు. పండుగ పూట విషాదంతంగళ్లపల్లి(సిరిసిల్ల): ఎంగిలి పూల బతుకమ్మ పండుగ పూట కోరుట్ల వాసి రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన విషాద ఘటన తంగళ్లపల్లి మండలం పద్మనగర్ గ్రామ శివారులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల వివరాల ప్రకారం.. కోరుట్లకు చెందిన గుండెటి శ్రీధర్(45) తన భార్యతో కలిసి 2 రోజుల క్రితం హైదరాబాద్కు బంధువులు ఇంటికెళ్లారు. ఆదివారం రాత్రి తమ వేగన్ఆర్ కారులో తిరుగు ప్రయాణంలో తంగళ్లపల్లి మండలం పద్మనగర్ గ్రామ శివారులోకి చేరుకోగానే.. ఎదురుగా వస్తున్న హెరియర్ కారు హైదరాబాద్ వెళ్తూ రాంగ్ రూట్లో వచ్చి వేగంగా ఢీకొట్టింది. దీంతో శ్రీధర్ తీవ్ర గాయాలపాలయ్యాడు. హెరియర్ కారులో ఉన్న అంకుషాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తులు ప్రమాద స్థలం నుంచి పరారయ్యారు. క్షతగాత్రుడు శ్రీధర్ను సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. మరణించినట్లు వైద్యులు తెలిపారు. -
రియల్టర్ హత్య కేసులో మరో ఇద్దరు
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్నగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, మాజీ కౌన్సిలర్ సిరిగిరి రమేశ్(55) హత్య కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. కారులోనే రమేశ్ గొంతు కోసి హత్య చేసిన ఘటనలో మరో ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నట్లు సమాచారం. సిరిసిల్లలోని రమేశ్ ఇంటి నుంచి కారులో శుక్రవారం తీసుకెళ్లిన వేములవాడకు చెందిన ఎద్దండి వెంకటేశ్ ఇప్పటికే పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. తొలుత అతడొక్కడే హత్య చేసినట్లు చెప్పినా.. తరువాత పోలీసుల విచారణలో మరో ఇద్దరి పాత్ర ఉన్నట్లు తెలిసింది. రమేశ్ భార్య అనీల ఫిర్యాదు మేరకు వేములవాడకు చెందిన ఎద్దండి వెంకటేశ్, సిరిసిల్లకు చెందిన సిరిగిరి మురళి, లింగన్నపేటకు చెందిన రాధాకృష్ణ, ఖమ్మంకు చెందిన శేషగిరిరావు, రాము, వేములవాడకు చెందిన పాస్టర్ వేణు, తిప్పాపూర్కు చెందిన కుంటయ్య, గంగయ్యపై కేసు నమోదైంది. ఈ కేసులో ఎవరెవరి పాత్ర ఉంది..? ఎవరు పాల్గొన్నారనే అంశాలను పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఏఎస్పీ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు వేములవాడ ఏఎస్పీ శేషాద్రినీరెడ్డి ఆధ్వర్యంలో హత్య కేసు దర్యాప్తు సాగుతోంది. అన్ని ఆధారాలతో హత్య కేసును ఛేదించేందుకు పోలీసులు శాసీ్త్రయంగా విచారణ జరుపుతున్నారు. మృతుడి ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. హత్య జరిగిన ప్రదేశంలో, అటుగా వెళ్లే మార్గంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. హత్య ఎన్ని గంటలకు జరిగింది.. ఎవరెవరు సహకరించారు.. సూత్రధారులెవరనే అంశాలను పోలీసు అధికారులు సేకరిస్తున్నారు. రియల్ ఎస్టేట్ లావాదేవీలకు సంబంధించి ఈ హత్య జరిగినట్లు భావిస్తుండగా.. ఇలాంటి హత్యలు మళ్లీ జరగకుండా నిందితులకు శిక్ష పడేలా కేసు దర్యాప్తు శాసీ్త్రయంగా ఉండాలని పోలీసులు చాలెంజ్గా తీసుకున్నారు. ఏఎస్పీ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ఎస్సైల నేతృత్వంలో దర్యాప్తు సాగుతోంది. ఈ కేసులో వెంకటేశ్తోపాటు మరో ఇద్దరి పాత్ర ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. సిరిసిల్లలో అంత్యక్రియలు సిరిసిల్లలో ఆదివారం రమేశ్ అంత్యక్రియలు జరిగాయి. వేములవాడ ప్రాంతీయ వైద్యశాలలో శనివారం సాయంత్రమే పోస్టుమార్టం పూర్తి కాగా.. అతడి కొడుకు తేజస్విన్వర్మ చైన్నె నుంచి రాత్రి 11 గంటలకు సిరిసిల్లకు చేరుకున్నాడు. పెద్ద బజారు, నేతన్నచౌక్, గాంధీచౌక్ మీదుగా విద్యానగర్ శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర సాగింది. లోతుగా ఆరా తీస్తున్న పోలీసులు వేములవాడ ఏఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు సిరిసిల్లలో రమేశ్ అంత్యక్రియలు -
మట్టిలో మాణిక్యాలు
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయికి చెందిన ఎల్.నిఖిత దుమాల ఏకలవ్య గురుకులంలో చదువుతోంది. అథ్లెటిక్స్లో తనకున్న ఆసక్తిని గమనించిన పీఈటీలు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో.. 100, 200 మీటర్లలో రాష్ట్రస్థాయిలో రాణించి జాతీయస్థాయికి ఎంపికై ంది. వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన ఎల్.అక్షయ దుమా ల ఏకలవ్య గురుకులం విద్యార్థిని. కుస్తీలో తలపడితే పతకం ఖాయం చేసుకుంటుంది. మరిమడ్లలో జరిగిన పోటీల్లో కుస్తీలో సత్తా చాటి బంగా రు పతకం సాధించి జాతీయస్థాయికి ఎంపికై ంది. మహబూబాబాద్ జిల్లా కడ్తాల్కు చెందిన ఎన్.హరికి చిన్నపటి నుంచే బాక్సింగ్పై ఆసక్తి. గమనించిన స్థానిక పీఈటీ శిక్షణ ఇవ్వడంతో మెరికలా తయారయ్యాడు. ఇటీవల కొత్తగూడలో జరిగిన పోటీల్లో బాక్సింగ్లో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఒడిశాలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నాడు. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): బరిలో దిగితే పతకం ఖాయం.. బాక్సింగ్ రింగ్లో ఉంటే పంచ్ పడాల్సిందే.. వాలీబాల్ టీమ్ పాల్గొంటే ఎదుటి టీమ్ బేజార్ కావాల్సిందే.. కుస్తీ పడితే ప్రత్యర్థి లొంగిపోవాల్సిందే.. ఇదంతా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య గురుకుల విద్యార్థుల క్రీడానైపుణ్యానికి నిదర్శనం. ఏకలవ్య గురుకుల విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తున్నారు. టోర్నమెంట్లో పాల్గొంటే పతకం పట్టుకొస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారు. ఇటీవల కోనరావుపేట మండలం మరిమడ్ల, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాల పంట పండించారు. ప్రతిభ చూపి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన 47 మంది క్రీడాకారులు ఒడిశాలో అక్టోబర్ రెండో వారంలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మైదానంలో చిరుతల్లా.. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ఇద్దరు పీఈటీల ఆధ్వర్యంలో వివిధ క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. బ్యాడ్మింటన్, రెజ్లింగ్(కుస్తీ), తైక్వాండో, జూడో, యోగా, బాక్సింగ్, టేబుల్ టెన్నిస్, షాట్పుట్, అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, హాకీ క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. ఒలింపిక్స్లో పాల్గొనడమే లక్ష్యంగా విద్యార్థులను తయారు చేస్తున్నారు. బాలబాలికలకు ప్రత్యేకంగా ఇద్దరు పీఈటీలు ఉంటూ నిత్యం పర్యవేక్షిస్తున్నారు. దుమాల గురుకులంలోని మైదానంలో శిక్షణ ఇస్తూ మెరికల్లా తయారు చేస్తున్నారు. జాతీయస్థాయికి.. ఇటీవల కోనరావుపేట మండలం మరిమడ్ల, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలోని ఏకలవ్య గురుకులాల్లో రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు నిర్వహించారు. దుమాల గురుకుల విద్యార్థులు 160 మందికి పైగా పోటీల్లో తలపడి పతకాలు సాధించారు. బ్యాడ్మింటన్లో అకిర, ఆంజనేయులు, కుస్తీలో సాయిచరణ్, బాక్సింగ్లో హరి, బబ్లూ, కుస్తీలో చైతన్య, బాక్సింగ్లో శిరీష బంగారు పతకాలు, కుస్తీలో పూజిత, అక్షయ, అథ్లెటిక్స్లో నిఖిత, యోగాలో వర్షిణి, ఖోఖోలో మొదటి స్థానాలు సాధించారు. ఆయా క్రీడల్లో రజత, కాంస్య పతకాలు సాధించారు. ప్రతిభ చూపిన 47 మంది క్రీడాకారులను జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. గురుకులం విద్యార్థులు.. ఆటల్లో మెరికలు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సత్తా చాటుతున్న దుమాల ఏకలవ్య చిన్నారులు 47 మంది జాతీయస్థాయికి ఎంపిక మోతితండాకు చెందిన ఎస్.బబ్లూకు బాక్సింగ్ అంటే ప్రాణం. పీఈటీ పర్యవేక్షణలో బాక్సింగ్పై పట్టు సాధించిన బబ్లూ ఇటీవల కొత్తగూడలో జరిగిన పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించాడు. దుమాల గురుకులంలో 8వతరగతి చదువుతున్న ఎస్.ఆంజనేయులు షటిల్ బ్యాడ్మింటన్లో ప్రతిభ చూపుతున్నాడు. కొత్తగూడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి బంగారు పతకం సాధించాడు. 8వతరగతి చదివే బి.శిరీషకు బాక్సింగ్ అంటే ఆసక్తి. పీఈటీ పర్యవేక్షణలో నైపుణ్యం సాధించిన శిరీష.. మరిమడ్లలో జరిగిన పోటీల్లో బంగారు పతకం సాధించింది. ఒడిశాలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననుంది. -
తోట వద్దకే వచ్చి కొనుగోలు
వ్యాపారులు విక్రయించే పూలు నాణ్యతగా ఉండడం లేదని నేరుగా తోట వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతుల్లో ఇంకా కొత్త రకాలు పండించాలనే పట్టుదల పెరుగుతుంది. బంతి పూలతోపాటు లిల్లీ పూలు సాగు చేస్తున్న. ఎక్కువ పూలు అవసరమున్నవారికి ఇంటికి తీసుకెళ్లి విక్రయిస్తున్న. – సరసాని నర్సింహారెడ్డి, మల్లన్నపేట, గొల్లపల్లి జిల్లాలో పూల సాగుకు ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీలు ఇస్తుండడంతో సాగు పెరుగుతోంది. గతంలో 4–5 ఎకరాల్లో పూలు పండిస్తే.. ఇప్పుడు దాదాపు 100 ఎకరాల్లో పూలు సాగవుతున్నాయి. బంతి, లిల్లీ, చామంతి, గులాబీ రకాలను సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. – శ్యాంప్రసాద్, జిల్లా ఉద్యాన శాఖాధికారి, జగిత్యాల -
దినసరి కూలీ బలవన్మరణం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నారాయణపూర్కు చెందిన రాయికంటి రాజయ్య(56) అనే దినసరి కూలీ మద్యానికి బానిసై కుటుంబ సభ్యులతో గొడవ పడి ఇంట్లో ఆదివారం వేకువజామున ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై మోతీరాంనాయక్ వివరాల ప్రకారం.. రాజయ్య దినసరి కూలీగా పని చేస్తుంటాడు. వచ్చిన డబ్బులతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇటీవల పూర్తిగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగొద్దని కుటుంబ సభ్యులు చెప్పినా వినలేదు. శనివారం రాత్రి తాగి వచ్చి కుటుంబ సభ్యులతో ఘర్షణ పడ్డాడు. తాగిన మైకంలో రాత్రి తన ఇంట్లోని రేకుల షెడ్డులో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెల్లారి చూసేసరికి మృతిచెంది ఉన్నాడు. మృతుడి భార్య శోభారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వృద్ధురాలు..మానకొండూర్: ముంజంపల్లి గ్రామానికి చెందిన గట్టు నర్సమ్మ(85) అనే వృద్ధురాలు వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. సీఐ సంజీవ్ వివరాల ప్రకారం.. నర్సమ్మ ఈనెల 17న తిమ్మాపూర్ మండలం పొరండ్లలో ఉంటున్న తన కూతురు వద్దకెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. ముంజంపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో ఆదివారం మృతదేహం ఉందని తెలియడంతో.. బావి వద్దకెళ్లిన కుమారుడు వెంకటి తల్లిదేనని గుర్తించారు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. విద్యుదాఘాతంతో రైతు మృతిధర్మారం: కొత్తపల్లి గ్రామానికి చెందిన భూక్య మల్లేశ్నాయక్(45) అనే రైతు ఆదివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మరణించాడు. మల్లేశ్నాయక్ గ్రామ శివారులోని ఇప్పల వద్ద తన వరి పొలంలో పక్షులు రాకుండా మెరుపు రిబ్బన్లు కడుతున్నాడు. ప్రమాదవశాత్తు దగ్గర్లోనే ఉన్న 11కేవీ విద్యుత్ తీగలకు మెరుపు రిబ్బన్ తాకి విద్యుదాఘాతంతో మృతిచెందాడు. మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు అఖిల, రాజేశ్వరి, కుమారుడు అభిరాం ఉన్నారు. చందుర్తి(వేములవాడ): చందుర్తి మండల కేంద్రానికి చెందిన సాఫ్ట్వేర్ యువకుడు హైదరా బాద్లో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసి ంది. స్థానికుల కథనం ప్రకా రం.. దావనపల్లి అరవింద్(29) ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట గ్రామానికి చెందిన వినూత్నతో 6 మాసాల క్రితం వివా హం జరిగింది. వీరిద్దరు సాప్ట్వేర్ ఉద్యోగులు కావడంతో.. హైదరాబాద్లో ఉంటున్నారు. అరవింద్ బలవన్మరణానికి పాల్పడడంతో.. గ్రామస్తులు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. మానేరులో మునిగి వ్యక్తి..ఓదెల: పొత్కపల్లి పోలీస్ స్టేష న్ పరిధిలోని గుంపుల మానేరులో కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం రాచపల్లి గ్రా మానికి చెందిన ఆరెల్లి రవీందర్గౌడ్(45) అనే వ్యక్తి ఆదివా రం ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందాడు. గంగ స్నానం కోసం వచ్చి మా నేరులోకి వెళ్లి అకస్మాత్తుగా మునిగిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సౌదీలో తక్కళ్లపెల్లి వాసి..కథలాపూర్: తక్కళ్లపెల్లి గ్రా మానికి చెందిన సంగ మల్లయ్య(58) అనే వ్యక్తి సౌదీఅరేబియా దేశంలో అనారోగ్యంతో మృతిచెందినట్లు ఆదివా రం గ్రామస్తులు తెలిపారు. మల్లయ్య కొంతకాలంగా ఉపాధి నిమిత్తం సౌదీఅరేబియా వెళ్తూ వస్తున్నారు. చివరగా 2 నెలల క్రితం మల్లయ్య ఇంటికొచ్చి వెళ్లారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సౌదీఅరేబియాలోని ఆయిల్ ఏరియాలో తోట కాపరిగా పని చేసేవారు. ఈనెల 15న మల్లయ్య తన గదిలో ఉండగా.. బీపీ పెరగడంతో స్పృహ తప్పి పడిపోయారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు అక్కడివారు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడున్నారు. -
దుర్గామాతా.. నమోస్తుతే..
కరీంనగర్కల్చరల్/విద్యానగర్(కరీంనగర్)/సుల్తానాబాద్/రామగిరి: అమ్మల గన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ జగన్మాత. మూడు శక్తులకు ఆది దేవతైన అమ్మ.. త్రిశక్తి స్వరూపిణి. లోక రక్షణ కోసం పార్వతి, సరస్వతి, లక్ష్మి రూపాల్లో అవతరించి లోక కంటకులైన రాక్షసులను తన విశేషమైన శక్తియుక్తులతో సంహరించింది. సకల జగత్తుకు మూలం.. త్రిమూర్తులకు శక్తి ప్రదాత.. సకలాభీష్ట ప్రదాయిని అయిన దేవి నవరాత్రోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమౌతాయి. ● నవరాత్రులు.. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభమయ్యే నవరాత్రుల్లో తొలిరోజు అమ్మవారికి కలశ స్థాపనం చేసి ప్రతిష్ఠిస్తారు. అప్పటి నుంచి విజయదశమి వరకు దేవీ నవరాత్రులు నిర్వహిస్తారు. ● 9 అవతారాలు శక్తి స్వరూపిణి, ఆది పరాశక్తి అయిన దుర్గామాతను శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి అవతారాల్లో భక్తులు కొలుస్తారు. ● ప్రీతిపాత్రమైన రోజులు భద్రకాళిగా ఎనిమిదో రోజు జన్మించిన చాముండి తొమ్మిదో రోజు వీరవిహారం చేసి దైత్య సంహారం చేసిందని పురాణాలు ప్రవచిస్తున్నాయి. పదోరోజు విజయలక్ష్మిగా జనుల ఆనందోత్సవాలకు ప్రతీకగా పూజలందుకుంటుంది. నవరాత్రుల్లో చివరి 3 రోజులు అత్యంత ప్రీతిపాత్రమైనవి. వీటినే మనం దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పేరిట ఉత్సవాలు జరుపుకుంటాం. ● శైలపుత్రి.. చైతన్య శక్తి శైలపుత్రి. త్రిమూర్తి స్వరూపిణి ఆది పరాశక్తి సతీదేవిగా యోగాగ్నిలో తనువు చాలించింది. తిరిగి మీనా–హిమవంతులకు శైలపుత్రీదేవిగా జన్మించింది. ప్రాకృతిక శక్తితత్వం శైలపుత్రి అవతారంలో దాగి ఉంది. శైలపుత్రి నంది వాహనంపై త్రిశూలధారిణిగా సీ్త్రశక్తిని లోకానికి తెలియజేసింది. ● బ్రహ్మచారిణి.. సంకల్ప బలం బ్రహ్మచారిణి. బ్రహ్మచారిణిగా ని యమనిష్ఠలతో తపస్సు చేసి శివుడిని వరించింది. చేతిలో కమండలంతో మాలధారిణిగా నిత్య తపో ముద్రాంకితగా దర్శనమిస్తుంది. ఈ రూపంలోని దుర్గాను ఆరాధించిన వారికి ఏకాగ్రత దీక్ష అలవడుతుంది. ● చంద్రఘంట.. మనసుకు మార్గదర్శి చంద్రఘాంటాదేవి. చంద్రక్రాంతిని సుధాపానం చేయడం వల్ల ఛిన్నమస్తగా రూపొందిన అంశ చంద్రఘంటాదేవి. ఈ రూపంలో ఈమెను ఆరాధించే వారికి శాంతి, సౌభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి. ● కూష్మాండ.. సర్వదుఃఖహరిణి కుష్మాండ దుర్గ. శారీరక, మానసిక రుగ్మతలను పారదోలే రూపం కూష్మాండ దుర్గ. వర, అంకుశ, పాశ, అభయ ముద్రలతో కూడిన అష్ట భుజాలతో కోటి సూర్యప్రభలతో ప్రకాశించే జనని అభయ ప్రదాయిని. ● స్కందమాత.. మాతృదేవోభవ అనే సందేశాన్ని, అమ్మతత్వాన్ని మానవాళికి ప్రబోధంగా, మాతలకే మాత అయి శ్వేత వర్ణశోభితగా, ఆది మాతగా కుమారస్వామిని లాలించే రూపంలో వెలుగొందే దివ్యమూర్తి స్కందమాత. ● కాత్యాయని.. సృష్టి, స్థితి, లయలకు హేతువైన శక్తి. సకల సంసార బంధాలకు కారుకురాలు. భవసాగరాల నుంచి మానవుల్ని ఉద్ధరించే శక్తి. సింహ వాహనం అధిరోహించి కరవాలం చేబుని రాక్షసత్వాన్ని పారదోలే జగద్రక్షినిగా శోభిల్లుతోంది. ● కాళరాత్రి.. ప్రాణకోటి జీవితాల్లోని గ్రహ బాధలు తొలిగించి మృత్యువుకే భయం కలిగిస్తూ.. దుర్గుణాలు, దుష్ట శక్తులను పారదోలి సత్య కర్మల్ని ప్రేరేపిస్తూ మంచి బుద్ధిని పెంచుతుంది. ● మహాగౌరి.. మంగళ స్వరూపిణి మహాగౌరీ. ఆదిపరాశక్తి భయంకర కాళ స్వరూపాన్ని విసర్జించిన అమ్మవారు.. ధవళకాంతితో వెలిగిపోయే మంగళ స్వరూపిణిగా మహాగౌరీగా అవతరించింది. వృషభాన్ని అధిరోహించి.. తెల్లని వస్త్రాలు ధరించి.. త్రిశూలం చేబూని.. శతకోటి దివ్య కాంతుల్ని భక్తజన కోటికి అభయ ప్రదానం చేస్తూ శోభిల్లుతోంది. ● సిద్ధిధాత్రి.. మోక్షప్రదాత్రి సిద్ధిధాత్రి. భౌతిక జీవనంలో సర్వసిద్ధులూ అనుగ్రహించే సిద్ధిధాత్రి అద్వైత సిద్ధికి ప్రేరణనిస్తుంది. అష్ట సిద్ధులు, మోక్షం ప్రసాదిస్తుంది. ● అపరాజిత.. అపరాజిత శ్రీరాజేశ్వరీదేవి. సర్వశక్తికి కేంద్రస్ధానం జగజ్జననే. విజయదశమి రోజు దేవి శ్రీరాజరాజేశ్వరిగా దర్శనమిస్తుంది. నేటి నుంచి దేవి నవరాత్రోత్సవాలు 9 రోజులు భక్తిశ్రద్ధలతో పూజలందుకోనున్న అమ్మవారు -
పూల సాగు.. ఆదాయం బాగు..
● సెప్టెంబర్ నుంచి జనవరి వరకు గిరాకీ ● జిల్లాలో 100 ఎకరాల్లో బంతి, చామంతి, లిల్లీ ● ఆదర్శంగా నిలుస్తున్న యువ రైతులు జగిత్యాలఅగ్రికల్చర్: చాలా గ్రామాల్లో రైతులందరూ ఒకే పంట సాగు చేసి.. ఆ పంటకు మార్కెటింగ్ లేదంటూ.. ధర రాలేదని దిగులు చెందుతుంటారు. కానీ కొంతమంది రైతులు మారుతున్న వినియోగదారుల ధోరణిని అర్థం చేసుకొని ఆ మేరకు ఆయా పంటలు సాగు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. డిమాండ్ను బట్టి ఓపెన్ మార్కెట్లో తమ ఉత్పత్తులను అమ్ముకొని మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ కోవలోనే జిల్లాలోని యువ రైతులు పండుగల పూట దాదాపు 100 ఎకరాల్లో బంతి, చామంతి, లిల్లీ పూలు సాగు చేసి తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ● 20 గుంటల్లో.. సాధారణంగా ప్రతీ గ్రామంలో రైతులందరూ వరి, మొక్కజొన్న వంటి పంటలు సాగు చేస్తూ ఆదాయం రావడం లేదని మదనపడుతుంటారు. కానీ కొడిమ్యాల మండలం పూడూరు, సారంగాపూర్ మండలం పెంబట్ల, గొల్లపల్లి, మెట్పల్లి మండలం చింతలపేట, మల్యాల మండలం రాంపూర్, రాయికల్ గ్రామాల్లో యువ రైతులు మాత్రం సాధారణ పంటలను ఓవైపు సాగు చేస్తూనే.. మరోవైపు 10–20 గుంటల్లో పూలను సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. బంతి పూలకు పండుగల సీజనైన బతుకమ్మ, దసరా, నవరాత్రోత్సవాలు, దీపావళి పూజలు, సంక్రాంతి, అయ్యప్ప స్వాముల పూజల సందర్భంగా మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. ఈ మార్కెట్ను పసిగట్టిన వీరంతా రెండేళ్లుగా బంతి పూల సాగుకు ఉపక్రమిస్తున్నారు. నమ్మకమైన ప్రైవేట్ కంపెనీలకు చెందిన విత్తనాలను కొనుగోలు చేసి నారుగా పోశారు. తర్వాత 15–20 రోజుల మధ్యలో ప్రధాన భూమిలో నాటుతారు. ● ప్రోత్సాహం.. పూల సాగుకు ఆసక్తి చూపే రైతులకు ఉద్యాన శాఖ సైతం ప్రోత్సాహమందిస్తోంది. ఎకరా బంతి పూల సాగుకు రూ.8వేలు, లిల్లీ పూల సాగుకు రూ.40వేల సబ్సిడీ ఇస్తున్నారు. బంతి పూలు సాగు చేసే భూమిని ట్రాక్టర్తో బాగా దున్నించి, పశువుల ఎరువుతోపాటు కోళ్ల ఎరువు వేసి బెడ్లు తయారు చేస్తారు. మొక్కల వరుస వరుసకు మధ్య 3 ఫీట్లన్నర, చెట్టు చెట్టుకు మధ్య ఫీట్ ఉండేలా నారు మొక్కలను అప్పటికే సిద్ధం చేసిన బెడ్పై నాటుతారు. 2–3 రోజులకోసారి డ్రిప్ ద్వారా సాగు నీరందిస్తారు. చాలామంది రైతులు కలుపు మొక్కలు రాకుండా మల్చింగ్ షీట్ను ఉపయోగిస్తారు. ప్రతీ మొక్కకు కొమ్మలు విపరీతంగా వచ్చేందుకు 20–25 రోజుల సమయంలో నిటారుగా పెరిగే పెద్ద కొమ్మలను కట్ చేస్తారు. ● మార్కెట్లోకి పూలు.. బంతి పూల సాగుకు అవసరమైన అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటించడంతో.. వారం రోజుల నుంచి బంతి పూలు మార్కెట్లోకి రావడం ప్రారంభమైంది. పూచిన పూలను జగిత్యాల, కరీంనగర్, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి మార్కెట్లకు తరలిస్తున్నారు. మొక్కలు త్వరగా ఎదిగి కాపునిచ్చేందుకు వారం రోజులకోసారి డీఏపీ వేస్తున్నారు. మొక్క పెరిగినకొద్దీ పచ్చ దోమ, పచ్చ పురుగులు ఎక్కువ కావడంతో.. వాటి నివారణ కోసం రెండుసార్లు రసాయన మందులు పిచికారీ చేస్తారు. ప్రస్తుతం నాలుగైదు రోజుకోసారి క్వింటాళ్ల చొప్పున బంతి పూలు వస్తుండగా.. దీపావళి వరకు టన్నులకొద్ది బంతి పూలు మార్కెట్లోకి వచ్చె అవకాశముంది. ● పూల అమ్మకానికి సోషల్ మీడియా బంతి పూల అమ్మకానికి సోషల్ మీడియా వేదికగా చేసుకున్నారు. పూలు తెంపే రెండు, మూడు రోజుల ముందు విస్తృతంగా ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం పోస్టు చేస్తున్నారు. ప్రస్తుతానికి కిలో రూ.60 చొప్పున రైతుల తోటల వద్దకే వచ్చి వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు విక్రయించే పూలు ఇతర ప్రాంతాల నుంచి వస్తుండడం, రవాణాలో ఆ పూలు నలిగిపోతుండడంతో.. స్థానికంగా సాగు చేసే పూలు తాజాగా ఉండి వాటిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. పూలు అవసరముండే వినియోగదారులు బంతి తోటల వద్దకే పరుగులు తీస్తున్నారు. ఆర్డర్లు లేని సమయంలో ఉదయం పూట జగిత్యాల మార్కెట్కు తీసుకొచ్చి నేరుగా వినియోగదారులకు విక్రయించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఎక్కువ మొత్తంలో పూలు వస్తే హోల్సేల్గా వ్యాపారులకు విక్రయిస్తున్నారు. -
ఇబ్బంది లేకుండా చర్యలు
బతుకమ్మ, దసరాకు రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతున్నాం. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. దీనికి సంబంధించి అధికారులకు విధులు కేటాయించాం. డీఎంలు, ఇతర అధికారులు బస్టాండ్లో మకాం వేసి ప్రయాణికులకు అనుగుణంగా బస్సలు తిరిగేలా చూస్తారు. ముందస్తుగా రిజర్వేషన్ ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. – బి.రాజు, ఆర్టీసీ ఆర్ఎం 50 శాతం పెంచడం తగదు దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ అదనపు బస్సుల పేరిట టికెట్పై 50శాతం పెంచి వసూలు చేయడం సామాన్యుల నోట్లో మట్టికొట్టడమే. రెండు పండుగలకు ఎక్కడెక్కడో ఉన్న వారు సొంతూళ్లకు వస్తుంటారు. ఆర్టీసీ పెంచిన చార్జీలు సామాన్య ప్రజల జేబులను గుల్ల చేయడమే. అదనపు చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలి. – పంజాల శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి -
అంతర్జాతీయ క్రీడాపోటీలకు సిరిసిల్ల మహిళ
● అభినందించిన రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ● శ్రీలంకలో జరిగే పారాత్రో పోటీలకు అర్చన సిరిసిల్ల: జిల్లాకు చెందిన దివ్యాంగురాలు అంతర్జాతీయ క్రీడాపోటీలకు ఎంపికయ్యారు. సిరిసిల్ల శివారులోని చంద్రంపేటకు చెందిన మిట్టపల్లి అర్చన(34) దివ్యాంగురాలు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో 88 శాతం వైకల్యంతో ఉన్న అర్చన పారాత్రో పోటీల్లో తెలంగాణ స్థాయిలో చాంపియన్గా నిలిచారు. రాష్ట్రం తరఫున తమిళనాడులోని కోయంబత్తూర్లో జరిగిన జాతీయ పోటీల్లోనూ ప్రథమ స్థానంలో నిలిచింది. దేశం తరఫున సౌత్ ఏసియా గేమ్స్లో పాల్గొనేందుకు శ్రీలంక రాజధాని కొలంబోకు వెళ్తున్నారు. 2025 డిసెంబరులో జరిగే పారాత్రో గేమ్స్లో పాల్గొననున్నారు. క్రీడలపై ఆమెకున్న ఆసక్తి, పట్టుదలను గ్రహించిన జిల్లా బాలల సంక్షేమ అధికారి కవిత రాష్ట్ర క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని కలిశారు. సౌత్ ఏసియా గేమ్స్లో పాల్గొనేందుకు వెళ్తున్న అర్చనను మంత్రి అభినందించారు. ప్రభుత్వపరంగా అర్చనకు సహకారమందిస్తామని హామీ ఇచ్చారు. ఇద్దరు పిల్లల తల్లి అయినా.. పట్టుదలగా ఆమె ఆటల్లో ముందుకు సాగడాన్ని అభినందించారు. -
‘రామ్లీలా’కు తరలిరండి
కరీంనగర్: దసరా ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 2న చింతకుంట ఎస్సారెస్పీ కెనాల్ వద్ద నిర్వహించే రామ్లీలా ఉత్సవాలను విజయవంతం చేయాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. మంజునాథ యూత్ఫ్రెండ్స్ గుర్రాల జయప్రకాశ్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమ వాల్పోస్టర్లను ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. చింతకుంటలో మొదటిసారి రామ్లీలా నిర్వహించడం అభినందనీయం అన్నారు. నగరపాలక సంస్థ సహకారం అందించాలని కోరా రు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, భూక్య తిరుపతి నాయక్, బోనా ల శ్రీకాంత్, రాజు, కమల్, సంపత్, మణికంఠ, సాయి, మహేశ్, ప్రవీణ్, ఈశ్వర్ పాల్గొన్నారు. మార్క్ఫెడ్ మైదానంలో.. కరీంనగర్ కార్పొరేషన్: దసరా సందర్భంగా నగరంలోని మార్క్ఫెడ్ మైదానంలో రాంలీలా కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పా ట్లు చేస్తామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మార్క్ఫెడ్ మైదా నాన్ని వాకర్స్తో కలిసి పరిశీలించారు. గత పదిహేను సంవత్సరాల నుంచి మార్క్ఫెడ్ మైదానంలో రాంలీలా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సంవత్సరం కూడా అదే తరహాలో వైభవంగా నిర్వహిద్దామన్నా రు. మార్క్ఫెడ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కల్వకుంట్ల ప్రమోద్రావు, మా జీ కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్, బోనా ల శ్రీకాంత్, దిండిగాల మహేశ్ పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల ఉత్సవం కరీంనగర్టౌన్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రారంభమై వందేళ్లు పూర్తి చేసుకున్నామని తెలంగాణ ప్రాంత కార్యకారిణి సభ్యుడు బూర్ల దక్షిణామూర్తి అన్నారు. ఆదివారం కరీంనగర్లో విజయదశమి ఉత్సవం జరిగింది. దక్షిణామూర్తి మాట్లాడుతూ సంఘం ప్రారంభించి 100ఏళ్లు పూర్తయ్యిందన్నారు. డాక్టర్ హెగ్డేవార్ 16మందితో నాగపూర్కేంద్రంగా సంఘం ప్రారంభించగా ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని అన్నారు. అనంతరం అందరికి ‘శమీ బంగారం’ అందించి ప్రసాద వితరణ చేపట్టారు. మాననీయ జిల్లా సంఘచాలక్ సీఏ నిరంజనాచారి, 145 మంది స్వయం సేవకులు పాల్గొన్నారు. ‘కామారెడ్డి డిక్లరేషన్ హామీ నిలుపుకున్న కాంగ్రెస్’కరీంనగర్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండటం శుభపరిణామమని, కరీంనగర్ కాంగ్రెస్ నియోజకవర్గ బాధ్యతలు బీసీలకే అప్పగించాలని బీసీ జేఏసీ చైర్మన్ కేశిపెద్ది శ్రీధర్ రాజు, దొగ్గిలి శ్రీధర్ డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలో మాట్లాడుతూ నామినేటెడ్, పార్టీ పదవులు, ఇన్చార్జీ బాధ్యతల్లో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. కరీంనగర్ నియోజకవర్గంలో బీసీ ఓటు బ్యాంక్ అధికంగా ఉందని, గత 20 ఏళ్లుగా పార్లమెంట్, శాసనసభ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారని గుర్తు చేశా రు. అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన పురమల్ల శ్రీనివాస్ను తిరిగి పార్టీ ఇన్చార్జీ బాధ్యతలు అప్పగించాలని కోరారు. సమస్యలు పరిష్కరించండికరీంనగర్: దళితులకు సంక్షేమశాఖ నుంచి అమలవుతున్న పథకాలపై నిర్లక్ష్యం జరుగుతోందని, బడ్జెట్ కేటాయింపుల్లో కోతలు విధిస్తున్నారని, వాటిపై దృష్టిసారించాలని ఆదివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్కు తెలంగాణ ఎస్సీ,ఎస్టీ సంక్షేమ సంఘం బాధ్యులు తడగొండ సత్యరాజ్వర్మ, నాగెల్లి బాబు రావు వినతిపత్రం ఇచ్చారు. -
నో స్పెషల్!
కరీంనగర్ కార్పొరేషన్: ‘పాలకవర్గం ముగిసింది. ప్రత్యేక పాలన మొదలైంది. పైరవీలు, ఒత్తిళ్లు పనిచేయవు. ఇక పాలనంతా పారదర్శకమే. అక్రమార్కులకు వెన్నులో వణుకే. బల్దియా గాడినపడు డే. గతానికి మించి మెరుగైన సేవలు పొందుడే’అని భావించిన నగర ప్రజలకు మెల్లగా ఆ భ్రమలు తొలగిపోతున్నాయి. పాలనలో కొరవడిన పారదర్శకత, ఉద్యోగుల్లో కరువైన జవాబుదారితనం, ప్రతి పనికో రేటుతో తారాస్థాయిలో అవినీతి, అన్ని విభాగాల్లో అధికారులు, ఉద్యోగుల ఇష్టారాజ్యం.. వెరసి బల్దియాలో పాలన గతితప్పుతోంది. కలిసి కలెక్షన్ కార్యాలయంలో కీలక విభాగాలైన రెవెన్యూ, ఇంజినీరింగ్, టౌన్ప్లానింగ్, శానిటేషన్తో పాటు, ప్రజలకు సేవలందించే విభాగాల్లోనూ గతానికి మించి అవినీతి పెచ్చుమీరిందనే విమర్శలున్నాయి. ప్రధాన విభాగాల్లో అధికారులు, ఉద్యోగులు కలిసి వాటాలు పంచుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. రెవెన్యూ విభాగంలో ఇది కాస్తా అధికంగా ఉంది. ఇంటినంబర్లు, పన్నుల మదింపు, పన్నుల వసూళ్లలో చేతివాటాన్ని ప్రదర్శిస్తున్న ఉద్యోగులకు, అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుండడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ముకరాంపురలో ఓ భవనం అసెస్మెంట్ వ్యవహారమే తాజా ఉదాహరణ. మంకమ్మతోటలో ఓ ఇంటి స్థలంపై ఇరువురి నడుమ వివాదం కోర్టులో ఉన్నప్పటికి, అందులో ఒకరికి మ్యుటేషన్ చేయడం వెనుక ఉన్న మతలబు ఊహించడం కష్టం కాదు. కమర్షియల్ బిల్డింగ్స్కు సంబంధించి అసెస్మెంట్స్, ట్రేడ్లైసెన్స్ల జారీ, వసూళ్లలో రెవెన్యూ సిబ్బంది చేతివాటం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. పట్టణ ప్రణాళిక విభాగంలోనూ ఇదే పరిస్థితి. టౌన్ప్లానింగ్ కలెక్షన్లలో ఒకరిద్దరు చైన్మెన్లే కీలకమనే ఫిర్యాదులున్నాయి. వివాదాలను తమకు అనుకూలంగా మలుచుకొని, ఒకవైపు కుమ్మకై ్క, మరో వైపు వేధిస్తున్న సంఘటనలు ఎన్నో. పాలకవర్గం ఉన్న సమయంలో కొనసాగిన ‘సీ’ట్యాక్స్ ఇప్పుడు అధికారుల జేబుల్లోకి పోతోంది. ఇంజినీరింగ్ విభాగంలో అధికారుల ఆధిపత్యపోరు సమస్యగా మారింది. తాము చూస్తే కాని పనులు మొదలు పెట్టొద్దంటూ, ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఘటనలు చోటుచేసుకొంటున్నాయి. శానిటేషన్లో కిందిస్థాయి నుంచి ప్రక్షాళన చేసేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నించినా, వీలు పడని పరిస్థితి నెలకొంది. వివిధ సేవల కోసం వస్తున్న ప్రజలను నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుకొంటున్న వైనం రెట్టింపైంది. అంతా వాళ్ల ఇష్టమే.. నగరపాలకసంస్థలో గతంలో లేని విధంగా దాదా పు అధికారుల పోస్టులు భర్తీ అయ్యాయి. ఒక అదనపు కమిషనర్, ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు, ఒక సహాయ కమిషనర్, ఎస్ఈ, ఇద్దరు శానిటరీ సూపర్వైజర్లున్నారు. ఒక్క డీసీపీ పోస్టు తప్ప హెచ్ఓడీ పోస్టుల్లో రెగ్యులర్ అధికారులే ఉన్నారు. అయినా పాలన, సేవల్లో వేగం కనిపించడం లేదు. అధికా రుల నడుమ సమన్వయం లేకపోవడం సమస్యగా మారింది. పైగా అధికారులు, ఉద్యోగులు గ్రూప్ లుగా మారి, ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకొ నే దుస్థితికి వెళ్లింది. కొంతమంది అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం మరో అతిపెద్ద సమస్య. తాము చెప్పిందే వేదం...అన్న రీతిలో వారి పాలన సాగుతోంది. ఇందుకోసం కొంతమంది సున్నితాంశమైన కుల, మతాన్ని ప్రయోగిస్తున్నారు.కనిపించని దూకుడు పాలకవర్గంతో పోల్చితే అవినీతి, అక్రమాలు పె చ్చుమీరినా ప్రత్యేక పాలనలో చర్యలు మాత్రం కనిపించడం లేదు. పాలకవర్గ సమయంలో బి ల్లుకు మించి చేసిన చెల్లింపులను సైతం కాంట్రా క్టర్ నుంచి రికవరీ చేసిన చరిత్ర బల్దియాకుంది. ప్రస్తుతం ఆ దూకుడు కనిపించడం లేదు. అన్ని విభాగాల్లోనూ అవి నీతి రాజ్యమేలుతున్నా, ఆ దిశగా యాక్షన్ ఉండడం లేదు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికా రులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటేనే, ప్రత్యేక పాలనపై ప్ర జలకు విశ్వాసం కలగనుంది. ఆ దిశగా దూ కుడు కొనసాగిస్తేనే బల్దియా ప్రక్షాళన సాధ్యం. -
తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య
● నాలుగు రోజుల కిత్రమే అమ్మమ్మ మృతి పాలకుర్తి(రామగుండం): సెల్ఫోన్తో ఆడవద్దని తల్లి మందలించడంతో ఓ యువతి వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శనివారం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లిలో చోటుచేసుకుంది. బసంత్నగర్ ఎస్సై స్వామి కథనం ప్రకారం.. పెద్దపల్లి మండలం కనగర్తికి చెందిన రేగుల మొండయ్య 15 ఏళ్లుగా తన అత్తగారిల్లు కొత్తపల్లిలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయనకు ఒక కుమారుడు రమేశ్, ఒక కూతురు కవిత(23) ఉన్నారు. మొండయ్య అత్త పర్శ బుగ్గమ్మ నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో తన భార్య లక్ష్మితోపాటు కూతురు, కుమారుడితో కలిసి అత్తగారింటి వద్దే ఉంటున్నారు. కవిత శనివారం సెల్ఫోన్తో ఆడుతుండగా గమనించిన తల్లి.. ఇంట్లో పనిచేయకుండా ఫోన్తో ఆడుతున్నావా? ఒకవైపు అమ్మమ్మ చనిపోయిందనే బాధ కూడా లేదా? అని మందలించింది. కవిత కోపంతో ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాత ఎంతకీ కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు ఆరాతీశారు. స్థానికుల సమాచారంతో గ్రామశివారులోని పంట పొలాల్లో వెతకగా.. ఓ వ్యవసాయబావిలో కవిత శవమై కనిపించింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. నాలుగు రోజుల వ్యవధిలో అమ్మమ్మ, మనుమరాలు మృతిచెందడంతో ఆ కుటుంబాల్లో విషాదం అలముకుంది. వృద్ధురాలి..పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన పిడుగు లచ్చమ్మ(60) శనివారం ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలంగా మతిస్థిమితం లేక తిరుగుతోందని, శనివారం ఈ అఘాయిత్యానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై మల్లేశ్ తెలిపారు. యువ ఉద్యోగి..యైటింక్లయిన్కాలనీ(రామగుండం) : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి యైటింక్లయిన్కాలనీ ఎస్సీ టూ– 175 క్వార్టర్లో నివాసం ఉండే తపేట్ల పవన్కుమార్(28) శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్జీ–3 ఏరియా ఏఎల్పీ గనిలో సీనియర్ మైనింగ్ సర్ధార్గా ఆయన విధులు నిర్వర్తిస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. మహబూబాబాద్ జిల్లా మల్యాల గ్రామానికి చెందిన తపేట్ల వెంకన్నకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో పెద్దకుమారుడు పవన్కుమార్. సింగరేణిలో ఉద్యోగం వచ్చింది. ఆర్జీ–3 ఏరియా ఎల్పీ గనిలో సీనియర్ సర్ధార్గా విధులు నిర్వహిస్తున్నాడు. పదిరోజుల క్రితం ఓ యువతిని ప్రేమించినట్లు తనకు చెప్పాడని తండ్రి వెంకన్న పేర్కొన్నారు. తన కుమారుడి మృతికి ఆ అమ్మాయి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు సీఐ లింగమూర్తి కేసు నమోదు చేశారు. కాగా, పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులు.. పవన్కుమార్ నేత్రాలను హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్కు దానం చేశారు. ఉద్యోగం రాలేదని యువతి..గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజుపేటకు చెందిన యువతి అల్లె ప్రియాంక ఉద్యోగం రావడం లేదనే మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియాంక ఇటీవల బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగం రాకపోవడంతో మనస్థాపానికి గురై ఉరివేసుకుంది. మృతురాలి తండ్రి రమేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్కుమార్ తెలిపారు. -
మధ్యవర్తిత్వం ద్వారా కేసుల రాజీ
కరీంనగర్క్రైం: మధ్యవర్తిత్వం ద్వారా కేసులు తక్కువ ఖర్చుతో, అతి తక్కువ సమయంలో పరి ష్కరించవచ్చని, తద్వారా న్యాయస్థానాలపై భారం తగ్గడంతో పాటు కక్షిదారులకు సమయం ఆదా అవుతుందని హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీనివాసరావు అన్నారు. మధ్యవర్తిత్వంపై జిల్లావ్యాప్తంగా 90మంది న్యాయవాదులకు జిల్లాకోర్టు ఆవరణలో ఐదు రోజులపాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. ముఖ్య అతిథిగా హాజ రైన శ్రీనివాసరావు మాట్లాడుతూ శిక్షణ పొందిన న్యాయవాదులు మధ్యవర్తిత్వం ద్వారా కేసును విజయవంతంగా పరిష్కరించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ మెంబర్ సెక్రటరీ సీహెచ్.పంచాక్షరి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే.శివకుమార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.వెంకటేశ్ పాల్గొన్నారు. -
రాజన్న సేవలో జైళ్ల శాఖ డీజీ
వేములవాడ: రాజన్నను రాష్ట్ర జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు అర్చకులు, వేదపండితులు స్వా గతం పలికారు. శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం అందజేశారు. జైళ్లశాఖ డీఐజీ సంపత్, ఎస్పీ మహేశ్ బీ గీతే, వేములవాడ అడిషనల్ ఎస్పీ శేషాద్రినిరెడ్డి ఉన్నారు. ఇనుప సామగ్రి తీసుకెళ్తున్న ఉద్యోగి పట్టివేత జ్యోతినగర్(రామగుండం): పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాజెక్టు నుంచి అనుమతి లేకుండా సామాను తీసుకెళ్తున్న ఉద్యోగిని సీఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డబ్ల్యూ–02 ఉద్యోగి యూనిట్–7లో విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం ఉదయం స్క్రాప్ను తన బైక్లో పెట్టుకుని బయటకు తరలిస్తుండగా గేట్ నంబర్–1 వద్ద సీఐఎస్ఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. ఆ తర్వాత నిందితుడితోపాటు స్క్రాప్ను పోలీసులకు అప్పగించారు. స్క్రాప్ బరువు 27 కేజీలు ఉంటుందని సమాచారం. -
ప్లాట్ల వ్యాపారం ప్రాణం తీసింది
సిరిసిల్ల/వేములవాడ అర్బన్: భూ వివాదాల్లో రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్నగర్కు చెందిన మాజీ కౌన్సిలర్ సిరిగిరి రమేశ్(55) వేములవాడ కమాన్ వద్ద హత్యకు గురయ్యాడు. పాతికేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ప్లాట్ల వ్యాపారం చేసిన రమేశ్ను చివరికి ఆ వివాదాలే బలి తీసుకున్నాయి. వేములవాడ పట్టణానికి చెందిన ఎద్దండి వెంకటేశ్ శుక్రవారం ఉదయం 9 గంటలకు సిరిసిల్ల నుంచి రమేశ్ను కారులో తీసుకెళ్లాడు. రాత్రి వరకూ రమేశ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వేములవాడ–సిరిసిల్ల పట్టణాల మధ్య నందికమాన్ వద్ద గల నందీశ్వర వెంచర్లో తన కారులోనే హత్యకు గురై కనిపించాడు. ఎస్టీడీ బూత్ నుంచి కౌన్సిలర్ వరకు.. సిరిసిల్లలోని విమల్ టాకీస్ ప్రాంతంలో చాలా కాలం ఎస్టీడీ బూత్ను నిర్వహించిన రమేశ్ భాగస్వాములతో కలిసి వేములవాడ, సిరిసిల్ల ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. ఆర్థికంగా కలిసి రావడంతో సొంతంగా వెంచర్లు ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలోనే సిరిసిల్ల మున్సిపల్లో 2005లో ఇండిపెండెంట్గా పోటీచేసి కౌన్సిలర్గా గెలుపొందాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మరింత విస్తరించి వివాదాల్లో ఇరుకున్నాడు. ఏడాది కాలంగా రమేశ్పై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత భూవివాదాలు పరిష్కరించుకుంటుండగా హత్యకు గురయ్యాడు. ఉలిక్కిపడిన రియల్టర్లు రెండున్నర దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న సిరిగిరి రమేశ్ హత్యకు గురవడంతో రియల్ట ర్లు ఉలిక్కి పడ్డారు. వేములవాడలో రియల్ ఎస్టేట్ వివాదాలు ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే అనేక హత్యలు భూవివాదాల్లో జరిగాయి. రమేశ్ హత్య నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయని పోలీసు వర్గాలు రహస్యంగా ఆరా తీశారు. ప్రధాన నిందితుడు వెంకటేశ్ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. హత్యకేసులో అతనితోపాటు ఇంకా ఎవరు ఉన్నారు? కుట్రదారులు ఎవరైనా ఉన్నారా? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. కొడుకు, కూతురు వచ్చేంత వరకు... రమేశ్ భార్య సిరిగిరి అనీల అడ్వకేట్. అతని కొడుకు తేజస్విన్వర్మ చైన్నెలో, కూతురు చందనశ్రీ ఢిల్లీలో చదువుతున్నారు. ఇద్దరు పిల్లలు వచ్చే వరకు పోస్టుమార్టం వద్దని అనీల స్పష్టం చేయడంతో శనివారం సాయంత్రం వరకు కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దనే వేచి ఉన్నారు. పిల్లలు రావడంతో పోలీసు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం చేశారు. శవాన్ని సిరిసిల్లలోని అంబేడ్కర్నగర్కు తరలించారు. ఎనిమిది మందిపై కేసు రమేశ్ హత్య కేసులో ఎనిమిది మందిపై కేసు నమోదైనట్లు వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి తెలిపారు. మృతుని భార్య అనీల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వేములవాడకు చెందిన ఎద్దండి వెంకటేశ్ తన భర్తను ఇంటి నుంచి తీసుకెళ్లాడని, ఈ హత్య కేసులో ఎద్దండి వెంకటేశ్తోపాటు సిరిగిరి మురళి, రాధాకృష్ణ, శేషగిరిరావు, రాము, పాస్టర్ వేణు, కుంటయ్య, గంగయ్యతోపాటు మరికొంత మందిపై అనుమానం ఉందని మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి తెలిపారు. వేములవాడలో హత్య.. సిరిసిల్లలో కలకలం ఎనిమిది మందిపై కేసు -
గునుగు నవ్వింది
తంగేడు పూసింది– నేటి నుంచి పూల జాతర – బతుకమ్మ సంబరాలకు సిద్ధమవుతున్న ఆడపడుచులు – ఎంగిలిపూలతో వేడుకలు ప్రారంభం 30ఎస్ఆర్ఎల్301,302,303,304) బతుకమ్మ సంబరాల దృశ్యాలు (పాత చిత్రాలు) –––––––––––––––––––––––––––––––––––– చినుకుల చాటు నుంచి కురిసిన మంచు బిందువులు గుమ్మడి ఆకును అలంకరించగా.. సూర్యుడి కన్నా ముందే గుమ్మడి పువ్వు ప్రకాశించగా.. పచ్చపచ్చని తీగల మధ్య ముద్దగౌరమ్మ ముద్దుగా కనిపించగా.. నేలపై పాలు పారినట్లు గునుగు నవ్వంగా.. తంగేడు తన్మయం చెందగా.. పట్టుకుచ్చు పురివిప్పగా.. తొలిపొద్దున చేనులో నుంచి తెంపుకొచ్చి.. దేవుళ్ల ఎదుట ఉంచి.. అందంగా పేర్చి, గౌరమ్మను చేర్చి ఆడపడుచులు ఆడిపాడే బతుకమ్మ పండుగ వచ్చేసింది. నేటి ఎంగిలిపూలతో మొదలయ్యే వేడుక.. సద్దుల బతుకమ్మతో ముగియనుంది. – కరీంనగర్ కల్చరల్/విద్యానగర్/సిరిసిల్లకల్చరల్/కోరుట్ల –––––––––––––––––––––––––––––––––––– వీధులు.. పూల వనాలు రామరామరామ ఉయ్యాలో.. రామనే సీరామ ఉయ్యాలో.. సిరుల మాతల్లి ఉయ్యాలో.. సిరులతో రావమ్మా ఉయ్యాలో.. అని పాడుకుంటూ ఊరూవాడా తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు ఆడిపాడే పండుగ వచ్చేసింది. బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డలకు పెద్ద పండుగ. ఆశ్వయుజ పాఢ్యమి నుంచి ఎంగిలిపూలతో మొదలై తొమ్మిదో రోజు సద్దులతో ముగిసే బతుకమ్మ సంబరాలతో పల్లె, పట్టణాల్లోని వీధులన్నీ పూలవనాలుగా మారనున్నాయి. ఆశ్వయుజ మాసంలో విరివిగా పూసే గుమ్మడి, తంగేడు, గునుగు, పట్టుకుచ్చులు, చామంతి, కట్ల, గోరింటా వంటి పూలతో సిబ్బిలో కళాత్మకంగా బతుకమ్మను పేర్చి సాయంత్రం ఆడపడుచులందరూ ఒక్కచోట చేరి రామరామ అంటూ రమణీయంగా ఆడిపాడనున్నారు. గౌరమ్మకు మొక్కి చల్లంగా చూడమని వేడుకోనున్నారు. –––––––––––––––––––––––––––––––––––– ఆడపడుచుల వేడుక బతుకమ్మ అంటే బతుకునిచ్చే వేడుక. చిన్నాపెద్దా సంతోషంగా ఉండాలని ఆశీర్వదించే అమ్మవారి దీవెన. తల్లి కటాక్షాన్ని ఆకాంక్షిస్తూ ఆడపడుచులంతా ఒక చోట చేరి ఆటపాటలతో సందడి చేస్తారు. అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్లలు బతుకమ్మ పండుగకి పుట్టింటికి రావడంతో ఆ ఇల్లు కొత్తకళను సంతరించుకుంటుంది. బతుకమ్మ పండుగ మొదటిరోజు సందడి ఉంటుంది. కాబట్టి సమీపంలోని చేనూచెలకా నుంచి ఒకరోజు ముందే అవసరమైన పూల సేకరణ జరుగుతుంది. తడి వస్త్రంలో కప్పి ఉంచి వాడిపోకుండా జాగ్రత్త పడతారు. మరుసటి రోజు ఆ పూలతో బతుకమ్మను పేరుస్తారు. ముందురోజు పూలతో పేరుస్తారు కాబట్టి ఎంగిలిపూల బతుకమ్మగా పిలుస్తారు. –––––––––––––––––––––––––––––––––––– కనిపించని గునుగు గునుగుపువ్వు బతుకమ్మ కూర్పులో కీలకం. ఆ రోజుల్లో పట్నాలు.. పల్లెల పరిసరాల్లో ఎక్కడ చూసినా గునుగుపూలకు కొదువ ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది. గునుగు పువ్వు దొరకాలంటే కష్టమవుతోంది. ఎక్కడో మారుమూల పల్లెల్లో.. బీడుభూముల్లో అక్కడక్కడా కనబడుతున్నా.. అనుకున్న రీతిలో లేకపోవడం కలవరపెడుతోంది. ఫలితంగా మార్కెట్లో సరుకుగా మారిపోయింది. ఔషధ గుణాలతో అలరించే గునుగుపూలకు రంగులు పూస్తుండటం మరో సమస్యగా మారింది. ఇప్పుడు గునుగు చిన్నకట్ట రూ.50కి ఇస్తున్నారు. కొంచెం పెద్దకట్ట కావాలంటే రూ.వంద వరకు చెల్లించాల్సిందే. ఈ పది రోజుల పాటు గునుగుపూలకు ఎక్కడాలేని డిమాండ్ ఏర్పడనుంది. –––––––––––––––––––––––––––––––––––– రాజన్న పాట వినాల్సిందే 20ఎస్ఆర్ఎల్226: రేపాక గ్రామానికి చెందిన మీసాల రాజయ్య ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాకకు చెందిన మీసాల రాజయ్య బతుకమ్మ పాటల స్పెషలిస్ట్. తెలంగాణ సంప్రదాయాలు కనుమరుగవుతున్న నేటికాలంలో మహిళలు బతుకమ్మను వదిలిపెడుతున్నారు. ఇలాంటి తరుణంలో రాజయ్య గళంలో బతుకమ్మ పాటల తోట ఉంటోంది. మహిళలకన్నా మధురంగా బతుకమ్మ పాటలు పాడుతున్నాడు. రాజయ్య జానపద యక్షగాన కళాకారుడు. జానపద యక్షగానాలను తన 27వ ఏటే ప్రారంభించాడు. తన సొంత గ్రామంలో బతుకమ్మ పాట పాడుతూ.. బతుకమ్మ పాట రాజయ్యగా గుర్తింపు తెచ్చుకున్నాడు. –––––––––––––––––––––––––––––––––––– 60 ఏళ్లనుంచి ఆడుతున్న మల్యాల: నా పదేళ్ల వయసు నుంచి బతుకమ్మ ఆడుతున్న. పొద్దంతా పనికి పోయి వచ్చి పొద్దూకి ఇంటి వెనక ఉన్న గుమ్మడి పూలతో రోజు బతుకమ్మ పేర్చి ఆడేవాళ్లం. బతుకమ్మ పండుగ నాటికి పూలు పూసేలా పెరట్ల రంగు రంగుల బంతిపూల మొక్కలు, పట్టుకుచ్చుల మొక్కలు పెట్టేవాళ్లం. బతుకమ్మ పండుగకు పూలు కోసుకువచ్చే దాన్ని. తీరొక్కపూలతో పెద్దగా పేర్చేవాళ్లం. పనికి పోయి వచ్చిన తర్వాత వాడకట్టోళ్లందరం చప్పట్లు కొట్టుకుంటూ.. పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆడితే పనికిపోయిన అలసట పోయేది. – ఇట్టిరెడ్డి భూమవ్వ, గుడిపేట, మల్యాల(20సీపీడీ205) –––––––––––––––––––––––––––––––––––– సీ్త్ర అస్తిత్వానికి అద్దం ఫెర్టిలైజర్సిటీ: బతుకమ్మ పండుగ సీ్త్రల అస్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. బతుకమ్మ పాటలో సీ్త్రల జీవనశైలి, కుటుంబ అనుబంధాలను చాటుతుంది. బతుకమ్మ పాటలు గ్రామీణ ప్రాంతాల్లో ఉమ్మడి కుటుంబాల బంధాలను చూపుతుంది. మారుతున్న కాలంతో పాటు బతుకమ్మ పండుగ కొత్త రూపు సంతరించుకుంది. నేటి యువతరం దాండియా ఆటలు, కోలాటలు, డీజే పాటలతో బతుకమ్మ పండుగ ప్రసిద్ధిని మరుగున పడేలా చేస్తున్నారు. – తాళ్ల లక్ష్మి, గృహిణి, గోదావరిఖని(20జీడీకే151) –––––––––––––––––––––––––––––––––––– నుదుటి సిందూరం పండుగల్లో ముఖ్యమైది బతుకమ్మ. ఆడవాళ్లకు ఇష్టమైన వేడుక. పెళ్లయి అత్తారిళ్లకు వెళ్లినవారు పుట్టింటికి చేరుకుని, బంధుమిత్రులతో కలిసి జ్ఞాపకాలు నెమరేసుకునే పండుగ. మన సంప్రదాయాలు, సంస్కృతికి అద్దంగా నిలుస్తుంది. తెలంగాణ పర్వదినాల్లో పూల దేవత పూజదే ప్రాముఖ్యత. – వాసాల స్నేహ, సాయినగర్, కరీంనగర్ (20కెఎన్టి76) విభిన్నం బతుకమ్మఆడపడుచుల వేడుక బతుకమ్మ అంటే బతుకునిచ్చే వేడుక. చిన్నాపెద్దా సంతోషంగా ఉండాలని ఆశీర్వదించే అమ్మవారి దీవెన. తల్లి కటాక్షాన్ని ఆకాంక్షిస్తూ ఆడపడుచులంతా ఒక చోట చేరి ఆటపాటలతో సందడి చేస్తారు. అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్లలు బతుకమ్మ పండుగకి పుట్టింటికి రావడంతో ఆ ఇల్లు కొత్తకళను సంతరించుకుంటుంది. బతుకమ్మ పండుగ మొదటిరోజు సందడి ఉంటుంది. కాబట్టి సమీపంలోని చేనూచెలకా నుంచి ఒకరోజు ముందే అవసరమైన పూల సేకరణ జరుగుతుంది. తడి వస్త్రంలో కప్పి ఉంచి వాడిపోకుండా జాగ్రత్త పడతారు. మరుసటి రోజు ఆ పూలతో బతుకమ్మను పేరుస్తారు. ముందురోజు పూలతో పేరుస్తారు కాబట్టి ఎంగిలిపూల బతుకమ్మగా పిలుస్తారు. వీధులు.. పూల వనాలు రామరామరామ ఉయ్యాలో.. రామనే సీరామ ఉయ్యాలో.. సిరుల మాతల్లి ఉయ్యాలో.. సిరులతో రావమ్మా ఉయ్యాలో.. అని ఊరూవాడా తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు ఆడిపాడే పండుగ వచ్చేసింది. ఆశ్వయుజ పాఢ్యమి నుంచి ఎంగిలిపూలతో మొదలై తొమ్మిదో రోజు సద్దులతో ముగిసే బతుకమ్మ సంబరాలతో పల్లె, పట్టణాల్లోని వీధులన్నీ పూలవనాలు గా మారనున్నాయి. ఆశ్వయుజ మాసంలో విరి విగా పూసే పూలతో సిబ్బిలో పేర్చి సాయంత్రం ఆడపడుచులందరూ ఒక్కచోట చేరి రామరామ అంటూ రమణీయంగా ఆడిపాడనున్నారు. కనిపించని గునుగు గునుగుపువ్వు బతుకమ్మ కూర్పులో కీలకం. ఆ రోజుల్లో పట్నాలు.. పల్లెల పరిసరాల్లో ఎక్కడ చూసినా గునుగుపూలకు కొదువ ఉండేది కాదు. ఇప్పుడు గునుగు దొరకాలంటే కష్టమవుతోంది. ఎక్కడో మారుమూల పల్లెల్లో.. బీడుభూముల్లో కనబడుతున్నా.. అనుకున్న రీతిలో లేకపోవడం కలవరపెడుతోంది. ఫలితంగా మార్కెట్లో సరుకుగా మారిపోయింది. ఔషధ గుణాలతో అలరించే గునుగుపూలకు రంగులు పూస్తుండటం మరో సమస్యగా మారింది. గునుగు చిన్నకట్ట రూ.50కి ఇస్తున్నారు. కొంచెం పెద్దకట్ట కావాలంటే రూ.వంద వరకు చెల్లించాల్సిందే. ఈ పది రోజుల పాటు గునుగుపూలకు ఎక్కడాలేని డిమాండ్ ఏర్పడనుంది.రాజన్న పాట వినాల్సిందే ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం రేపాకకు చెందిన మీసాల రాజయ్య బతుక మ్మ పాటల స్పెషలిస్ట్. మ హిళలకన్నా మధురంగా పాడుతున్నాడు. రాజయ్య జానపద యక్షగాన కళాకారుడు. జానపద యక్షగానాలను తన 27వ ఏటే ప్రారంభించాడు. సొంత గ్రామంలో బతుక మ్మ పాటలు పాడుతూ.. గుర్తింపు తెచ్చుకున్నాడు. 60 ఏళ్లనుంచి ఆడుతున్న మల్యాల: పదేళ్ల వయసు నుంచి బతుకమ్మ ఆడుతున్న. పొద్దంతా పనికి పోయి వచ్చి పొద్దూకి ఇంటి వెనక ఉన్న గుమ్మడి పూలతో బతుకమ్మ పేర్చి ఆడేవాళ్లం. వాడకట్టోళ్లందరం చప్పట్లు కొట్టుకుంటూ.. పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆడితే పనికిపోయిన అలసట పోయేది. – ఇట్టిరెడ్డి భూమవ్వ, గుడిపేట, మల్యాల నుదుటి సిందూరం పండుగల్లో ముఖ్యమైంది బతుకమ్మ. ఆడవాళ్లకు ఇష్టమైన వేడుక. పెళ్లయి అత్తారిళ్లకు వెళ్లినవారు పుట్టింటికి చేరుకుని, బంధుమిత్రులతో కలిసి జ్ఞాపకాలు నెమరేసుకునే పండుగ. మన సంప్రదాయాలు, సంస్కృతికి అద్దంగా నిలుస్తుంది. తెలంగాణ పర్వదినాల్లో పూల దేవత పూజదే ప్రాముఖ్యత. – వాసాల స్నేహ, సాయినగర్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. అయితే జిల్లాలోని విభిన్న సాంస్కృతుల కారణంగా బతుకమ్మను కూడా విభిన్న తీరిలో జరుపుకుంటారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని వేములవాడ, మానకొండూర్ మండలం శ్రీని వాస్నగర్, రాఘవాపూర్, కరీంనగర్ పరిధిలోని బొమ్మకల్, ఇల్లంతకుంట మండలం పరిధిలోని కొన్ని గ్రామాల్లో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించుకుంటారు. మెజారిటీ ప్రాంతాల్లో తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఆడతారు. రుద్రంగి, చందుర్తి మండలాల్లోని కొన్ని గ్రామాల్లో దసరా మరునాడు బతుకమ్మ ఆడడం ఆనవా యితీ. అదే విధంగా జగిత్యాల జిల్లాలో బావి బతుకమ్మ ఆడతారు. ఎంగిలిపూల రోజున మధ్యలో బావి లాంటి గుంత తవ్వి చుట్టూ బతుకమ్మలు పెట్టి ఆడతారు. తొమ్మిదిరోజులు ఇదే విధంగా ఆడతారు. సద్దుల బతుమ్మ అనంతరం బావిని పూడ్చుతారు.1వ రోజు ఎంగిలి పూల బతుకమ్మ 2వ రోజు అటుకుల బతుకమ్మ 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ 4వ రోజు నానే బియ్యం 5వ రోజు అట్ల బతుకమ్మ 6వ రోజు అలిగిన బతుకమ్మ 7వ రోజు వేపకాయ బతుకమ్మ 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ 9వ రోజు సద్దుల బతుకమ్మచినుకుల చాటు నుంచి కురిసిన మంచు బిందువులు ముత్యం మాదిరిగా గుమ్మడి ఆకును అలంకరించగా.. సూర్యుడి కన్నా ముందే గుమ్మడి పువ్వు ప్రకాశించగా.. పచ్చపచ్చని తీగల మధ్య ముద్దగౌరమ్మ ముద్దుగా కనిపించగా.. నేలపై పాలు పారినట్లు గునుగు నవ్వంగా.. తంగేడు తన్మయం చెందగా.. పట్టుకుచ్చు పురివిప్పగా.. తొలిపొద్దున చేనులో నుంచి తెంపుకొచ్చి.. దేవుళ్ల ఎదుట ఉంచి.. అందంగా పేర్చి, గౌరమ్మను చేర్చి ఆడపడుచులు ఆడిపాడే బతుకమ్మ పండుగ వచ్చేసింది. నేటి ఎంగిలిపూలతో మొదలయ్యే వేడుక.. సద్దుల బతుకమ్మతో ముగియనుంది. – కరీంనగర్ కల్చరల్/విద్యానగర్/సిరిసిల్లకల్చరల్/కోరుట్ల -
వేములవాడకు రండి
వేములవాడ: దక్షిణకాశీగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్ర విస్తరణ, అభివృద్ధి పనులు చేపడుతున్నందునా శృంగేరీ జగద్గురు భారతీతీర్థ మహాస్వామిని రాజన్న సన్నిధికి రావాల్సిందిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆహ్వానించారు. శనివారం శృంగేరిలో భారతీతీర్థ మహాస్వామిని కలిసి ఈమేరకు ఆహ్వానపత్రిక అందించారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చే నెలలో రాజన్న క్షేత్రాన్ని సందర్శించనున్నట్లు తెలిపారన్నారు. గతంలో రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణపై నాలుగుసార్లు శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీస్వామిని కలిసి సూచనలు, సలహాలు తీసుకుని రూ.76కోట్ల పనులకు సీఎం రేవంత్రెడ్డి భూమిపూజ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆలయ ఈవో రమాదేవి, ఆలయ ఇన్చార్జి స్థానాచార్యులు నమిలికొండ ఉమేశ్శర్మ, చంద్రగిరి శరత్శర్మ, శృంగేరి తెలంగాణ రాష్ట్ర బాధ్యులు రాధాకృష్ణశర్మ ఉన్నారు. శృంగేరి పీఠాధిపతికి ఆహ్వానం -
నాలాకు మరమ్మతు
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని కాశ్మీర్గడ్డలో కూలిన నాలాకు నగరపాలకసంస్థ మరమ్మతులు చేపట్టింది. నాలా ఇటీవల కురిసిన వర్షాలకు ఈ నెల 17వ తేదీన కూలడం తెలిసిందే. దీనిపై ‘సాక్షి’లో వచ్చిన వరుస కథనాల నేపథ్యంలో, నగరపాలకసంస్థ అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. శనివారం జేసీబీతో నాలాలో కూలిన వ్యర్థాలను తొలగించారు. పనులు నాణ్యతతో చేయాలి కరీంనగర్ కార్పొరేషన్: జంక్షన్ పనులు నా ణ్యతతో చేపట్టాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి అన్నారు. శనివారం నగరంలోని శాతవాహన యూనివర్సిటీ ముందున్న జ్యోతి బాపూలే జంక్షన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. సుడా నిధులు రూ.15 లక్షలతో జ్యోతి బాపూలే జంక్షన్ ఆధునీకరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. పనుల్లో నాణ్యత పాటించాల ని, వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్ట్ ఏజెన్సీని ఆదేశించారు. రన్నరప్గా కరీంనగర్ కొత్తపల్లి(కరీంనగర్): వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియంలో మూడు రోజులపాటు నిర్వహించిన తెలంగాణ ట్రాన్స్కో, డిస్కం ఇంటర్ సర్కిల్ బ్యాడ్మింటన్, చెస్ టోర్నీలో కరీంనగర్ క్రీడాకారులు సత్తా చాటా రు. బాడ్మింటన్ టోర్నీలో రాష్ట్రవ్యాప్తంగా టీజీ ఎన్పీడీసీఎల్, టీజీఎస్పీడీసీఎల్, టీజీ ట్రాన్స్కో నుంచి 27 జట్లు పాల్గొనగా కరీంనగర్ జట్టు రెండోస్థానం కై వసం చేసుకుంది. చెస్ టోర్నీలో 15 జట్లు పాల్గొనగా కరీంనగర్ టీజీఎన్పీడీసీఎల్ జట్టు రెండోస్థానంలో నిలిచింది. శనివా రం సంస్థ డైరెక్టర్(గ్రిడ్ అండ్ మేనేజ్మెంట్) జి.సంపత్కుమార్ చేతుల మీదుగా కరీంనగర్ జట్ల క్రీడాకారులు బహుమతులను అందుకున్నారు. కరీంనగర్ స్పోర్ట్స్ కౌన్సిల్ తరఫున బ్యాడ్మింటన్ జట్టుకు పి.రామ్మోహన్రావు, సీహెచ్ సంపత్, జి.శ్రీనివాస్, షేక్ అమ్మద్, బి.శ్రీకాంత్, పి.రోహిత్రెడ్డి ప్రాతినిథ్యం వహించారు. చెస్ టోర్నీలో ఎం.నాగరాజు, ఎం.ఇంద్రకిరణ్, శ్రీకాంత్, ఎస్.రాజకుమార్, రాజు పాల్గొన్నారు. ఎస్ఈ మేక రమేశ్బాబు, డీఈ లు కె.ఉపేందర్, రాజం అభినందించారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం సప్తగిరికాలనీ(కరీంనగర్): బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలని బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్చంద్రబోస్ పిలుపునిచ్చారు. శనివారం కరీంనగర్లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థ రూపుమాపేందుకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలన్నారు. బాలలకు స్వే చ్ఛాయుత వాతావరణాన్ని కల్పించాలన్నారు. -
బలాన్నిచ్చే బతుకమ్మ ఫలహారం
కోల్సిటీ(రామగుండం): తెలంగాణ ఆడపడుచుల్లో ‘బతుకమ్మ’ పండుగ ఆరోగ్యకాంతులను వెలిగిస్తోంది. బతుకమ్మ ఆడిన తర్వాత ‘సద్ది’ పేరుతో ‘ఇచ్చిన్నమ్మ వాయినం.. పుచ్చుకుంటినమ్మ వాయినం’ అంటూ అతివలు ఫలహారాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటారు. వీటిలో అనేక పోషక విలువలు ఉన్నాయంటున్నారు వైద్యులు. ఆటపాటలు, మానసికోల్లాసమే కాదు.. శరీరానికి కావాల్సిన అనేక పోషకాలను ఫలహారాల రూపంలో బతుకమ్మ అందిస్తోంది. ● బతుకమ్మ సద్దిలో ‘ఐరన్’.. భారతీయ మహిళల్లో ఐరన్ లోపం కనిపిస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రభావం పిల్లల్లోనూ ఉంటుంది. బతుకమ్మ వేడుకల్లో తయారు చేసుకునే సద్దిలో ఐరన్ శాతం అధికంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. బతుకమ్మ మానవ సంబంధాలకే పరిమితం కాకుండా అతివలకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. తొమ్మిదిరోజులు తొమ్మిది రకాల ఫలాహారాలను తయారు చేస్తారు. ఇందులో సత్తుపిండి, సద్ద ముద్దలు, నువ్వులు, కొబ్బరి, పల్లిపొడి లేదా ముద్దలు తదితర ఫలహారాలు ఉంటాయి. ఇవన్నీ పండుగ సమయానికి చేతికి వచ్చే చిరుధాన్యాలు.. వీటిని తింటే ఆరోగ్యకరమని పెద్దలు చెబుతున్నారు. ఒక్కో రోజు ఒక్కో తీరు పిండి వంట తయారు చేస్తుంటారు. ● సద్దుల్లో పోషకాలు.. బతుకమ్మ ఉత్సవాలు వస్తే అందరికీ సద్ద ముద్దలు(సజ్జ ముద్దలు) గుర్తుకొస్తాయి. ఈ పేరుతోనే పెద్దబతుకమ్మకు సద్దుల బతుకమ్మ అని పేరు వచ్చిందని చెబుతారు. సందె వేళలో చేసే బతుకమ్మ కాబట్టి.. సద్దుల బతుకమ్మ అంటారని మరో చరిత్ర. సజ్జలను పిండిగా పట్టించి బెల్లం కలిపి ముద్దలు చేస్తారు. కొందరు వీటికి నెయ్యి కూడా కలుపుతారు. వీటిలో పీచు పదార్థాలు ఎక్కువ. కార్పోహైడ్రేట్స్ తక్కువ. ప్రొటీన్స్, కాల్షియం అధికంగా ఉంటాయి. త్వరగా జీర్ణం అవుతుంది. దీనికి బెల్లం కలపడంతో ఐరం శాతం పెరిగి మహిళల రుతుక్రమ సమస్యల నివారణ, గొంతు నొప్పి తగ్గిస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. ● నువ్వుల ముద్దలు.. బతుకమ్మ పండుగలో నువ్వులు ప్రాధాన్యం అంతాఇంతా కాదు. వీటితో పొడి చేస్తారు. నువ్వుల్లో ఎమినోయాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ముఖ్యమైనవి. జింక్, కాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. జింక్ మెదడును చురుకుగా ఉంచుతుంది. కాల్షియం ఎమకల దృఢత్వాన్ని పెంచుతుంది. ● పెసర ముద్దలు.. పెసళ్లను ఉడకబెట్టి బెల్లం కలిపి ముద్దలుగా తయారు చేస్తారు. ఇవి జీర్ణశక్తిని పెంచుతాయి. జీర్ణ సంబంధిత వ్యాధులనూ తగ్గిస్తాయి. ● కొబ్బరి పొడి... కొబ్బరిలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. మహిళల ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ● పెరుగన్నం, పులిహోర... పెరుగన్నం, పులిహోర ఇటీవల సద్దిగా ఇస్తున్నారు. పెరుగన్నంలో పల్లీలు, వివిధ రకాల ధాన్యాలు కలుపుతున్నారు. చింతపండు లేదా నిమ్మరసంతో చేసిన పులిహోర కూడా ప్రసాదంగా వాడుతున్నారు. దేశంలో దాదాపు 6 వేల ఏళ్లుగా పసుపును ఔషధంగా, సౌందర్య సాధనంగా.. పంటల్లో ముఖ్యమైన దినుసుగా వాడుతున్నారు. చిన్న గాయాల నుంచి క్యాన్సర్ వరకు పసుపు విరుగుడుగా పనిచేస్తుందని వైద్యులు అంటున్నారు. చింతపండు గుజ్జులో విటమిన్ ‘సి’ అత్యధికంగా ఉంటుంది. పెరుగులో పోషక విలువలు మెండు. అన్నం కలిపి కమ్మనైన నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇందులో ప్రొటీన్, కాల్షియం, రిబోప్లా విటమిన్, విటమిన్ బి –6, బి12, వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. కొవ్వు తక్కువగా ఉండే పెరుగులో లాక్తో బసిల్లె అధికంగా ఉంటుంది. అపెండిసైటీస్, డయేరియా, డిసెంట్రీ వంటి వ్యాధులకు కారణమయ్యే బాక్టీరియాను లాక్టిక్ యాసిడ్ నాశనం చేస్తుంది. పెరుగులో ఉండే విటమిన్ నిరోధక శక్తిని పెంచుతుంది. ● పల్లిపిండి.. పల్లిపిండి శరీర ఎదుగుదలలో అత్యంత ప్రధానమైనది. అధిక ప్రొటీన్లతోపాటు రుచికరంగా ఉంటాయి. చాలామంది ఇష్టంగా తింటారు. దీనికి బెల్లం జోడించడంతో పోషకాలూ లభిస్తాయి. సత్తు పిండిలో ఆరోగ్య పోషకాలుబతుకమ్మ పండుగకు తయారు చేసే సత్తుపిండిలో వ్యాధి నిరోధక శక్తి పెంచే పోషకాలు ఉంటాయి. రుచికరంగా ఉండే సత్తుపిండి పిల్లలకు ప్రొటీన్స్ అందిస్తాయి. కండరాల పటిష్టత, ఎముకల గట్టితనం, పిల్లల ఎదుగుదల.. ఇలా అనేక ఉపయోగాలున్నాయి. సంప్రదాయ పిండివంటలను ప్రతీఒక్కరు తినాలి. బతుకమ్మ ఆరోగ్యాన్ని పంచే ప్రత్యేకమైన పండుగ. – దండె రాజు, ఆర్ఎంవో, గోదావరిఖని జీజీహెచ్ -
విద్యుత్ షాక్తో రైతు మృతి
మేడిపల్లి: కోతుల బెడ ద నుంచి మొక్కజొన్న పంటను కాపడుకునేందుకు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి రైతు మృతి చెందిన ఘటన భీమారం మండలం పసునూర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మాలోతు సత్యనాయక్ కోతుల నుంచి పంటను కాపాడుకునేందుకు విద్యుత్ వైర్ అమర్చాడు. శనివారం ఉదయం ఎప్పటిలాగే చేనుకు వెళ్లిన సత్యనాయక్.. వైర్లకు తగిలి అక్కడిక్కకడే మృతి చెందాడు. సత్యనాయక్కు భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య భూమిక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్సె శ్రీధర్ రెడ్డి తెలిపారు. తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన పరకాల శ్రీనివాస్(45) బతుకుదెరువు కోసం మహారా ష్ట్రకు వలసవెళ్లాడు. అక్కడే ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. నిరుపేద కుటుంబం కావడంతో చందాలు వేసి అంత్యక్రియలు నిర్వహించారు. రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని రైల్వే వంతెన కింద ట్రాక్ పక్కన ఓ మృతదేహాన్ని గుర్తించినట్లు జీఆర్పీ ఔట్పోస్టు ఇన్చార్జి తిరుపతి శనివారం తెలిపారు. స్థానిక సుభాష్నగర్కు చెందిన తాళ్లపల్లి సమ్మయ్య(52) రైళ్లలో భిక్షాటన చేస్తున్నాడు. బుధవారం ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. అయితే, రైల్వేట్రాక్ పక్కన ముళ్లపొదల్లో లభ్యమైన మృతదేహాన్ని పరిశీలించగా.. అది సమ్మయ్యదిగా నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య దేవమ్మ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కేసు నమోదు చేసుకొన్నారు. గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరింటాలకు చెందిన సంగం ప్రశాంత్(28) కూలీ పనులు చేస్తూ బతుకుతున్నాడు. బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈక్రమంలో రెండు రోజుల క్రితం జగిత్యాలలో ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. తిరిగి వస్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. 108 వాహనంలో కరీంనగర్ తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాయకులు కొమిరిశెట్టి లక్ష్మణ్ తదితరులు కుటుంబ సభ్యులను పరామర్శించి తక్షణ సాయం కింద రూ.25వేలు అందించారు. -
బాలికలను ‘స్నేహ’తో చైతన్య పరచాలి
కరీంనగర్/కరీంనగర్ అర్బన్/కరీంనగర్ కార్పొరేషన్: స్నేహ కార్యక్రమం ద్వారా 15 నుంచి 18ఏళ్ల లోపు బాలికలను స్వయం సహాయక సంఘాల్లో చేర్చి వారికి రక్షణ, ఆరోగ్యం, విద్య, ఉపాధి తదితర విషయాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్నేహ కార్యక్రమంపై కలెక్టరేట్లో సమీక్షించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పాఠశాలల, కళాశాలల్లో చదివే కిశోర బాలికలతో పాటు గ్రామాల్లో బడి బయట ఉన్న బాలికలను గుర్తించాలని అన్నారు. వీరందరినీ గ్రూపులుగా తయారుచేసి స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సంఘాల్లోని బాలిక సభ్యులకు గ్రామస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేస్తూ అన్ని శాఖల అధికారులు తమ తమ పరిధిలో ఉన్న బాలికల రక్షణ, ఉపాధి, చదువు, ప్రభుత్వాలు పథకాలు, కార్యక్రమాలు తదితర రంగాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటికే ఉత్తమ ఫలితాలు సాధించిన మహిళా స్వయం సహాయక సంఘాలతో ఈ బాలిక సంఘాలను అనుసంధానించాలని పేర్కొన్నారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమం, మెప్మా, పోలీస్, విద్య, వైద్య తదితరశాఖలు వీరికి సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. అడిషనల్ డీఆర్డీవో రవికుమార్, మెప్మా పీడీ స్వరూపారాణి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డీపీవో జగదీశ్వర్, డీఎంహెచ్వో వెంకటరమణ, డీవైఎస్వో శ్రీనివాస్గౌడ్, నెహ్రు యువకేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు పాల్గొన్నారు. బధిరులకు శిక్షణ ఇవ్వాలి బధిరులకు మరిన్ని నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లా యంత్రాంగం, అక్షయ ఆకృతి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఇండియన్ సైన్ లాంగ్వేజ్పై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతర వర్గాలకు రెండోదశ శిక్షణ ముగిసింది. ఈ కోర్స్ పూర్తి చేసుకున్న వారికి శనివారం నగరపాలకసంస్థ కార్యాలయంలో సర్టిఫికెట్లు అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ బధిరుల్లో మంచి ప్రతిభ ఉందన్నారు. వారికి చేయూతనిచ్చి, వివిధ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఆర్ట్, క్రాఫ్ట్, బుక్ బైండింగ్, ఫోటో పెయింట్ వంటి వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తే భవిష్యత్తులో మరింత రాణించగలరని తెలిపారు. ఉన్నతాధికారులు సైన్ లాంగ్వేజీ నేర్చుకునేందుకు ఆన్లైన్ శిక్షణా తరగతులు ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలన్నారు. నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ప్రాంతీయ శిక్షణ కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ రాంబాబు, బధిరుల పాఠశాల ప్రిన్సిపాల్ కమల, అక్షయ ఆకృతి ఇన్స్ట్రక్టరు్ల్ శైలజ, ధరణి, పర్సిస్, మణి పాల్గొన్నారు. -
ముస్తాబైన మహాశక్తి ఆలయం
కరీంనగర్కల్చరల్: కరీంనగర్ చైతన్యపురిలోని మహాశక్తి ఆలయం దేవీ శరన్నవరాత్రోత్సవాలకు ముస్తాబైంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పూలు, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. ఆలయానికి వచ్చే దారులు వివిధ దేవతల రూపంలో ఏర్పాటు చేసిన కటౌట్లు విద్యుద్దీపాల వెలుగులతో విరాజిముతున్నాయి. ఏటా ఇక్కడే భవానీ దీక్షలు తీసుకుని నవరాత్రుల అనంతరం విరమిస్తారు. ఆలయంలో తొమ్మిదిరోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 22న శ్రీ బాలాత్రిపుర సుందరిదేవీ (శైలపుత్రి) అవతారంలో అ మ్మవారు దర్శనం ఇస్తారు. 23న శ్రీగాయత్రీ దేవి (బ్రహ్మచారిని) అవతారం, 24న బుధవారం శ్రీ అన్నపూర్ణ దేవి (చంద్ర ఘంట) అవతారం, 25న గురువారం ఉదయం 8 గంటలకు శ్రీ కాత్యాయని దేవి(కూష్మాండ ), 26న శ్రీ మహాలక్ష్మి దేవి (స్కందమాత), 27న శ్రీ లలితా దేవి (కాత్యాయని), 28న శ్రీ మహా చండీదేవి (కాళరాత్రి), 29న శ్రీ సరస్వతి దేవి (మహాగౌ రీ), 30న శ్రీ దుర్గాదేవి (సిద్ధిరాత్రి),, అక్టోబర్ 1న శ్రీ మహిషాసుర మర్ధిని, 2న శ్రీ రాజరాజేశ్వరి దేవీగా దర్శనం ఇవ్వగా.. విజయదశమి శమీ పూ జ నిర్వహిస్తారు. ప్రతీరోజు రాత్రి 9 గంటలకు దాండియా కార్యక్రమం నిర్వహించనున్నారు. -
సెలవులొచ్చాయ్.. చలోచలో
బస్టాండులో బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులుపాఠశాలలకు దసరా సెలవులొచ్చాయి. ఆదివారం నుంచి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు శనివారం సాయంత్రం నుంచే ఇంటిదారి పట్టారు. దీంతో కరీంనగర్ బస్ స్టేషన్ సందడిగా మారింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కిక్కిరిసిపోయింది. పలు ప్రాంతాలకు బస్సుల కొరత ఉండడంతో ప్రయాణికులు ఇబ్బంది పడడం కనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
ఖైదీలకు ఉపాధి అవకాశాలు
కరీంనగర్క్రైం: జైళ్లలో ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, కరీంనగర్లో ఖైదీలు తయారు చేసిన అగర్బత్తీలు రాష్ట్రవ్యాప్తంగా విక్రయం అవుతున్నాయని జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్యామిశ్రా అన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ జైలుకు ఓ ట్రక్కు, అగర్బత్తీల తయారీ మిషన్, జిరాక్స్ మిషన్, కంప్యూటర్లు బహకరించారు. వాటిని శనివారం జైళ్లశాఖ డీజీ సౌమ్య ఐజీ సంపత్, కరీంనగర్ జైలు సూపరింటెండెంట్ విజయ్దేని, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చీఫ్ మేనేజర్ స్వామినాథన్తో కలిపి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఇండియన్ ఆయిల్ ఆధ్వర్యంలో జైళ్లశాఖకు పెద్దఎత్తునసాయం అందించార ని తెలిపారు. జైలు, ఇండియన్ ఆయిల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న కరీంనగర్ పెట్రోల్ బంక్ సేవల్లో ప్రథమస్థానంలో కొనసాగుతోందన్నారు. జైలులో తయారవుతున్న అగర్బత్తీలు రాష్ట్రస్థాయిలో పెరుగాంచాయన్నారు. కంప్యూటర్ ల్యాబ్ ఏర్పా టు చేసి ఖైదీలకు డిజిటల్ టెక్నాలజీపై అవగాహన కల్పిస్తామన్నారు. అనంతరం జైలులో ఖైదీల యోగక్షేమాలు, సదుపాయాలను పరిశీ లించారు. జైలర్లు పి.శ్రీనివాస్, బి.రమేశ్, ఎ.శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ జైలర్లు ఎల్.రమేశ్, అజయ్చారి పాల్గొన్నారు. -
ఆదాయ వనరుల గుర్తింపు
కరీంనగర్రూరల్: కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక సదుపాయాల సర్వేను చేపట్టాలని నిర్ణయించింది. గ్రామపంచాయతీల వనరుల వివరాలను డీఆర్ఎస్ యాప్లో నమోదు చేయాలనే గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్శాఖ ఆదేశాలతో పంచాయతీ కార్యదర్శులు గురువారం నుంచి గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. శుక్రవారం డీపీవో జగదీశ్వర్ చామనపల్లిలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశమై సర్వేను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు పీఎం ఆవాస్ యోజన పథకం కింద ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వివరాలను నమోదు చేస్తుండగా కొత్తగా మౌలిక సదుపాయాల సర్వేతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. యాప్లో నమోదు చేసేవి పంచాయతీ కార్యదర్శులు గ్రామంలోని 22అంశాలకు సంబంధించిన వివరాలను యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. గ్రామపంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, హెల్త్సెంటర్లు, గ్రంథాలయం, రైతువేదిక, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, పాల సేకరణ కేంద్రం, పల్లె ప్రకృతి వనం, నర్సరీ, కంపోస్టుషెడ్, వైకుంఠధామం, క్రీడా ప్రాంగణం, స్వశక్తి మహిళా సంఘాలు, స్ట్రీట్లైట్లు, నల్లాలు, బోర్లు, మోటార్లు, డ్రైనేజీలు, రోడ్లు, ఇంకుడుగుంతలు, ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్ల వివరాలను నమోదు చేస్తున్నారు. సేకరించిన వివరాలను ఎంపీడీవో యాప్కు పంపిస్తున్నారు. సర్వే నిర్వహించడం ద్వారా గ్రామాల్లో ఉన్న వసతుల వివరాలు కేంద్ర ప్రభుత్వానికి తెలుస్తుంది. ఆయా గ్రామాల్లో ఏయే వసతులున్నాయి, ఇంకా ఏమేం అవసరమో తెలిసే అవకాశముంది. -
గంజాయి విక్రేత అరెస్ట్
జగిత్యాలక్రైం: గంజాయి సరఫరాలో నిందితుడిగా ఉన్న జగిత్యాలకు చెందిన ఇర్ఫాన్ను అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. ఏడాది క్రితం జగిత్యాల పట్టణపోలీస్స్టేషన్లో ఇర్ఫాన్పై గంజాయి కేసు నమోదు కాగా, పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. శుక్రవారం గొల్లపల్లి రోడ్లోని మినీ స్టేడియంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. యువతిని కాపాడిన లేక్ పోలీసులుకరీంనగర్ క్రైం: కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ వద్ద శుక్రవారం ఆత్మహత్యకు యత్నించిన యువతిని లేక్ పోలీసులు కాపాడారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లికి చెందిన యువతి కుటుంబసమస్యలతో ఆత్మహత్య చేసుకోవడానికి డ్యామ్ వద్దకు వచ్చింది. గమనించిన లేక్ ఔట్పోస్ట్ హోంగార్డు శ్రీనివాస్ అప్రమత్తమై ఆమెను కాపాడాడు. కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. హోంగార్డును సీపీ గౌస్ఆలం అభినందించారు. -
పెద్దపల్లి కోర్టుకు సీబీఐ
పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రధాన న్యాయస్థానానికి శుక్రవారం సీబీఐ అధికారులు చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గట్టు వామన్రావు దంపతుల హత్య కేసుకు సంబంధించి రెండోరోజు విచారణలో భాగంగా జిల్లా కోర్టుకు సీబీఐ అధికారులు చేరుకున్నారు. కేసుకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించినట్లు సమాచారం. వామన్రావు తండ్రి గట్టు రాంకిషన్రావు ఫిర్యాదు మేరకు 2021 ఫిబ్రవరి 17న జరిగిన న్యాయవాద దంపతుల హత్యకేసును సీబీఐకి ప్రభుత్వం అప్పగించిన విషయం తెలిసిందే. సీబీఐ అధికారుల వెంట గోదావరిఖని ఏసీపీ మడత రమేశ్తోపాటు పలువురు ఉన్నారు. -
సిరిసిల్లలో ఫుట్పాత్ ఆక్రమణ
సిరిసిల్ల పట్టణంలో పాదచారుల కోసం నిర్మించిన ఫుట్పాత్లు ఆక్రమణకు గురవుతున్నాయి. వ్యాపారులు యథేచ్ఛగా ఆక్రమిస్తూ తమ వ్యాపారాలు చేసుకుంటున్నారు. పాదచారులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. దీంతో పార్కింగ్ చేసే వాహనాలతోనే సగం రోడ్డు నిండిపోతోంది. గాంధీచౌక్, పెద్దబజార్, విమల్ టాకీస్ రోడ్, ఆటోనగర్ ప్రాంతాల్లో వ్యాపారులు ఫుట్పాత్లను ఆక్రమిస్తుండడంతో నడుచుకుంటే వివిధ పనులకు వెళ్లే వారు ఇబ్బంది పడుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్నసిరిసిల్ల -
షూటింగ్ హబ్గా మారనుంది
రాజన్న గుడితోపాటు పరిసర ప్రాంతాలు ప్రకృతి ప్రసాదించిన వనరులు. రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా చాలా ప్రదేశాలు అందంగా ఉన్నాయి. ప్రభుత్వం కళాకారులకు సహకరిస్తే వేములవాడ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా తెలిసిపోతుంది. నేను దాదాపు 150కి పైగా పాటలు ఈ ప్రాంతంలోని చిత్రీకరించాను. పదేళ్లుగా వెయ్యి పాటలకు తగ్గకుండా చిత్రీకరణ జరిగింది. బతుకమ్మ పాటలకు జిల్లాలోని గుట్టలప్రాంతాలు, పాతకట్టడాలు, చారిత్రాత్మక నిర్మాణాలు ఆకట్టుకుంటున్నాయి. – మారం ప్రవీణ్, పప్పి, యూట్యూబ్ కళాకారుడు, వేములవాడ రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే జానపద కళాకారులు ఎక్కువగా ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్లు, రచయితలు, యూట్యూబ్ చానల్ ఓనర్స్ సిరిసిల్ల, వేములవాడ ప్రాంతంలోనే ఉన్నారు. పచ్చదనంతో ఆకట్టుకునే లొకేషన్స్ ఎక్కువగా మన ప్రాంతంలోనే ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి షూటింగ్ జరిగిన ప్రేక్షకుల ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతంలో తీసిన పాటలు చాలా వరకు హిట్టయ్యాయి. – నాగలక్ష్మి, జానపద యూట్యూబ్ కళాకారిణి, సిరిసిల్ల -
ఎములాడ.. హిట్ పాట
వేములవాడ: ఆధ్యాత్మిక పట్టణంలో జానపదాల చిత్రీకరణకు కేరాఫ్గా నిలుస్తోంది. ఇక్కడి ఆడిపాడితే విజయం ఖాయమనే విశ్వాసం నిండుతోంది. అదే నమ్మకం.. అదే విశ్వాసంతో వేములవాడలో రోజురోజుకు జానపద గీతాల చిత్రీకరణ పెరిగిపోతోంది. రాజన్న సాక్షిగా షూటింగ్ చేసుకున్న ఎన్నో జానపద గీతాలు యూట్యూబ్లో దుమ్ము దులుపుతున్నాయి. మిలియన్లలో వ్యూస్తో దూసుకెళ్తున్నాయి. శివుడి సాక్షిగా ఇప్పటికే దాదాపు వెయ్యి పాటల వరకు చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి. వేములవాడలో ఓ వైపు ఆధ్యాత్మికత.. మరో వైపు జానపదాల నృత్యాలతో భక్తులకు సైతం నేత్రానందం కలిగిస్తున్నాయి. శివుడి సాక్షిగా షూటింగ్స్.. రాజన్న ఆలయ మెట్లపై ఎన్నో పాటలు చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి. మన సంస్కృతిని.. భక్తిని నింపుకుంటున్న ఎన్నో పాటలను ఇక్కడి షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. ఇదే సమయంలో రాజన్న దర్శనానికి వస్తున్న భక్తులకు ఇలా కళాకారుల ప్రదర్శన చూస్తూ ఆనందం పొందుతున్నారు. ప్రత్యేక ఆకర్షణ రాజన్న ఆలయం వద్ద ఫోక్సాంగ్స్ షూటింగ్స్ జరుపుతుండగా.. భక్తులు గుంపులుగా ఉంటూ నేత్రానందం పొందుతున్నారు. వేములవాడ ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా కళల ప్రదర్శనకు వేదికగా నిలుస్తుంది. వేములవాడలోని ఏదో ఒక వాడలో ప్రతీ రోజు షూటింగ్స్ జరుగుతుంటాయి. ఇక్కడ పాటలో చిన్న పార్ట్ అయినా షూటింగ్ చేస్తే విజయం ఖాయమనే నమ్మకంతో చాలా మంది కళాకారులు వేములవాడ బాట పడుతున్నారు. రానున్న కాలంలోనూ మరింత మంది కళాకారులు ఇక్కడి షూటింగ్స్ జరుపుకోవడం ద్వారా స్థానిక కళాకారులకు సైతం అవకాశాలు వస్తాయనే ఆశలు చిగురిస్తున్నాయి. స్థానిక కళాకారులు సైతం తమకు అవకాశం కల్పిస్తే మరింత ప్రోత్సహించిన వారవుతారని భావిస్తున్నారు.వేములవాడలో షూటింగ్స్ జరిగిన కొన్ని జానపదాలు.. ఈ పాటలన్నీ వేములవాడ పట్టణంలోని వివిధ ప్రాంతాలు, ఆలయ పరిసరాలలో షూటింగ్స్ జరుపుకున్నాయి. ఈ పాటలన్నీ యూట్యూబ్లో మిలియన్లలో వ్యూస్ సంపాదించుకున్నాయి. ఇక్కడ షూటింగ్ జరిపితే హిట్ టాక్ వస్తుందనే విశ్వాసంతో చాలా మంది పాటలో కొంచెం పార్ట్ అయినా ఇక్కడ షూటింగ్ చేస్తున్నారని పలువురు కళాకారులు తెలిపారు. -
నాలాపై పట్టింపేది?
‘నగరంలోని పరివార్బేకరీ నుంచి ఫండస్ స్కూల్ వైపు వెళ్లే ప్రధాన దారి అది. విద్యాసంస్థలు, హోటళ్లు, వివిధ దుకాణాలున్న ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ రోడ్డు కింది నుంచే నాలా వెళ్తుంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ నెల 17వ తేదీన అక్కడున్న కేఫ్ ముందే నాలా కూలిపోయింది. ఆ కేఫ్ ముందు చాలా మంది నాలాపై నిలుచొని ఉంటారు. ఆ సమయంలో ఎవరైనా అక్కడే నిలుచొని ఉంటే...పెద్ద ప్రమాదం వాటిల్లేది.’కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని నాలాల పరిస్థితి అధ్వానంగా మారింది. దశాబ్దాల క్రితం నిర్మించిన నాలాలు శిథిలావస్థకు చేరి, ప్రమాదకరంగా మారుతున్నాయి. నివాసాల మధ్య నుంచి వెళ్తున్న చోట ప్రమాదపుటంచునే ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారు. ఎప్పుడే ప్రమాదం చోటుచేసుకొంటుందనే ఆందోళనతో ఉంటున్నారు. శిథిలావస్థకు చేరిన నాలాలను పునర్నిర్మాణం చేయాలని స్థానికులు సంవత్సరాలుగా కోరుతున్నా, నగరపాలకసంస్థ ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. నగరంలో మూడు నాలాలు ఉన్నాయి. ఒకటి రాంనగర్ నుంచి మంకమ్మతోట, జ్యోతినగర్, ముకరాంపుర, గణేష్నగర్, లక్ష్మినగర్ మీదుగా వాగులో కలుస్తుంది. రెండోది వావిలాలపల్లి నుంచి కోర్టు ప్రాంతం, మంచిర్యాల చౌరస్తా, శర్మనగర్, హుస్సేనిపుర మీదుగా సాగుతుంది. మూడోది రాంపూర్ నుంచి అలకాపురికాలనీ, ఆటోనగర్ల మీదుగా పోతుంది. సంవత్సరాల క్రితం నిర్మించినవి కావడంతో చాలా చోట్ల నాలాలు శిథిలావస్థలో ఉన్నాయి. ముఖ్యంగా ముకరాంపుర, మంచిర్యాల చౌరస్తా తదితర ప్రాంతాల్లో అధ్వానంగా మారాయి. ముకరాంపురలో ఇటీవల కూలిన నాలాలో మనిషి పడితే కిలోమీటరు దూరం వరకు వెళ్లి తేలాల్సిన పరిస్థితి. ముకరాంపురలో నాలాలో పడితే కలెక్టరేట్లో తప్ప మరోచోట నాలా నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. నాలాను పునరుద్ధరించాలి – మాజీ మేయర్ సునీల్రావు పదిరోజుల్లో కూలిన నాలాను పునరుద్దరించాలని మాజీ మేయర్, బీజేపీ నాయకుడు యాదగిరి సునీల్రావు డిమాండ్ చేశారు. నాలా కూలిన ప్రాంతాన్ని శుక్రవారం సందర్శించారు. 2001లో నిర్మించిన ఈ పెద్ద మోరీ వర్షాలకు కూలిందన్నారు. టూటౌన్ పోలీసుస్టేషన్ నుంచి కలెక్టర్ కార్యాలయం, అంబేడ్కర్ స్టేడియం, కోతిరాంపూర్ వరకు నాలా ప్రమాదకరంగామారిందన్నారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేయాలన్నారు. -
కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య
ముస్తాబాద్(సిరిసిల్ల): కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంటకు చెందిన కదిరె హరీశ్(29) గురువారం పొలం పనుల కోసం వెళ్లాడు. రాత్రయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో శుక్రవారం ఉదయం వెళ్లి పరిశీలించగా మృతిచెంది ఉన్నాడు. అచేతన స్థితిలో ఉన్న హరీశ్ను చూసిన తల్లిదండ్రులు నర్సవ్వ, నర్సయ్య బోరున విలపించారు. వ్యవసాయం చేసుకునే హరీశ్ కుటుంబ సమస్యలతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి హరీశ్ మనోవేదనకు గురయ్యాడు. తీవ్ర మనస్థాపానికి గురైన హరీశ్ పొలం వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి ఇద్దరు కుమారులు. హరీశ్ సోదరుడు పదిహేనేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందగా, ఇప్పుడు హరీశ్ ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఆదుకుంటాడనుకున్న కొడుకు అర్ధంతరంగా తనువు చాలించాడని విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై గణేశ్ తెలిపారు. ఎలిగేడు(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామానికి చెందిన రేండ్ల రమేశ్(22) ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై మధుకర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రేండ్ల రమేశ్ వివిధ పోటీ పరీక్షలు రాసినా ఉద్యోగం రాలేదు. తీవ్రమనస్తాపం చెంది ఈనెల 16 గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సుల్తానాబాద్, ఆ తర్వాత కరీంనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి వెంకటేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. సారంగాపూర్(జగిత్యాల): కారు ఢీకొని వ్యక్తి ద్విచక్రవాహనం పై నుంచి కింద పడగా, అదే సమయంలో అతడిపై నుంచి ట్రాలీ ఆటో వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామ శివారులో శుక్రవారం జరిగింది. ఎస్సై రాజు కథనం ప్రకారం.. మండలంలోని నర్సింహులపల్లె గ్రామానికి చెందిన దూసమూడి రమేశ్ (46) ఇదే మండలంలోని రేకుపల్లి గ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్లి రాజేశ్ అనే బాలుడికి తీసుకుని ఇంటికి వస్తున్నాడు. జగిత్యాల పట్టణం విద్యానగర్కు చెందిన సముద్రాల తిరుపతి కారులో జగిత్యాలకు వెళ్తున్న క్రమంలో తుంగూర్ వద్ద రమేశ్ వాహనాన్ని ఢీకొట్టడంతో కింద పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో ఆదిలాబాద్ జిల్లా నన్నూరుకు చెందిన తరుణ్ ట్రాలీ ఆటో రమేశ్ పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మల్యాల(చొప్పదండి): మండలంలోని దిగువ కొండగట్టులో గుర్తుతెలియని మహిళ అనారోగ్యంతో మృతిచెందింది. ఎస్సై నరేశ్కుమార్ కథనం ప్రకారం..దిగువ కొండగట్టులోని జాతీయ రహదారి సమీపంలో సుమారు 55 ఏళ్ల వయసు గల మహిళ మృతిచెంది ఉంది. ముత్యంపేట కారోబార్ రాజేశ్వర్రావు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ధర్మారం(ధర్మపురి): పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని ఆలయాల్లో చోరీల పరంపర కొనసాగుతూనే ఉంది. గురువారం రాత్రి గోపాల్రావుపేట గ్రామంలోని శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో హుండీ చోరీకి గురైంది. ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు .. హుండీని ఆలయం వెనుకాలకు తీసుకెళ్లి పగులగొట్టారు. అందులోని నగదు, కట్నకానుకలు ఎత్తుకపోయారని ఆలయ కమిటీ చైర్మన్ అంజయ్య తెలిపారు. కొద్దిరోజులుగా వరుసగా చోటుచేసుకుంటున్న హుండీ చోరీలను పోలీసులు సవాల్గా తీసుకున్నారు. దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. ఇదేసమయంలో మల్లికార్జున స్వామి ఆలయంలో దొంగతనం చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ ఆలయంతోపాటు మేడారంలోని హనుమాన్ ఆలచయ హుండీల్లో నగదు, కట్నకానుకలు తక్కువ మొత్తంలోనే ఉంటాయి. అయినా, దొంగలు చోరీలు చేయడం చర్చనీయాంశంగా మారింది. రూ.4.90 లక్షలకు టోకరాకరీంనగర్క్రైం: టెలిగ్రాంలో వచ్చిన లింక్ క్లిక్చేసి అందులో పెట్టుబడి పెట్టిన వ్యక్తికి సైబర్ నేరగాళ్లు రూ.4.90 లక్షలకు టోకరా వేశారు. త్రీటౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. ఖాన్పురాకు చెందిన వ్యక్తి టెలిగ్రాంలో వచ్చిన లింక్ను క్లిక్ చేశాడు. అందులో సైబర్ నేరగాళ్లు సూచించిన ప్రకారం ముందుగా రూ.వెయ్యి నుంచి రూ.2వేలు, రూ.10వేలు ఇలా మొత్తంగా రూ.4.90లక్షలు పంపించాడు. తరువాత వారు స్పందించకపోవడంతో త్రీటౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.