breaking news
Karimnagar District News
-
అర్బన్లో త్రిముఖ పోరు
తొలి రోజు: 05, రెండో రోజు: 27 చివరి రోజు: 33కరీంనగర్ అర్బన్: అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. నిన్నటి వరకు రెండు వర్గాల మధ్యే పోటీ ఉండగా తాజాగా మూల వెంకటరవీందర్రెడ్డి వర్గంతెరపైకి రాగా ప్యానెల్తో సహా నామినేషన్ వేశారు. దీంతో కర్ర రాజశేఖర్, గడ్డం విలాస్రెడ్డి, వెంకటరవీందర్రెడ్డి వర్గాల మధ్య పోరు నెలకొంది. ఎవరికి వారుగా ప్యానెల్ను సిద్ధం చేసుకోగా నామినేషన్లు తిరస్కరణకు గురవకుండా రెండు, మూడు సెట్లతో వేశారు. గురువారం 33 నామినేషన్లు దాఖలవగా 12 డైరెక్టర్ పోస్టులకు 73 వచ్చాయని ఎన్నికల అధికారి సీహెచ్.మనోజ్కుమార్ వివరించారు. ఎక్కువగా కరీంనగర్ నుంచి రంగంలో ఉండగా జగిత్యాల నుంచి నలుగురు బరిలో ఉన్నారు. చివరి రోజున 33 నామినేషన్లు గురువారం 33 మంది నామినేషన్లు దాఖలు చేశా రు. జనరల్ స్థానాలకు 23, ఎస్సీ, ఎస్టీ స్థానానికి 6, మహిళా కేటగిరీకి 4 నామినేషన్లు వేశారు. అర్బన్ బ్యాంకు డైరెక్టర్లలో రెండు మహిళలకు రిజర్వ్ చేయగా ఒకటి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. మహిళలకు సంబంధించి ఏడుగురు బరిలో ఉండగా ఎస్సీ, ఎస్టీ స్థానానికి 11మంది పోటీపడుతున్నారు. శుక్రవారం నామినేషన్లను పరిశీలించనున్నారు. ఉదయం 11గంటల నుంచి 3గంటల వరకు ప్రక్రియ సాగనుండగా తదుపరి జాబితాను ప్రకటించనున్నారు. శనివారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు కాగా 26నుంచి అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమవనున్నారు. ప్యానెళ్లపై గురి రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా ఎన్నికలు జరుగుతుండగా ఎవరికి వారుగా ప్యానెళ్లను సిద్ధం చేసుకుంటున్నారు. బలమైన అభ్యర్థులను తమవైపు తిప్పుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తుండటంతో ప్యానెళ్లను ప్రకటించేందుకు విముఖత చూపుతున్నారు. కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్రావు మద్దతుతో బరిలో ఉన్నానని ప్రకటించిన వెంకటరవీందర్రెడ్డి మాత్రం తన ప్యానెల్ను ప్రకటించారు. తనతో పాటు ఈ.లక్ష్మణ్రాజు, అనురాస్ కుమార్, వజీర్ అహ్మద్, నార్ల శ్రీనివాస్, ఉయ్యాల ఆనందం, చిదం శ్రీనివాస్, గాదె కార్తీక్, కూసరి అనిల్, సరిళ్ల రతన్రాజు, మునిపల్లి ఫణిత, దామెర శ్రీలత బరిలో ఉంటారని వెల్లడించారు.కేటగిరీ డైరెక్టర్ల సంఖ్య నామినేషన్లు జనరల్ 09 55 మహిళ 02 07 ఎస్సీ,ఎస్టీ 01 11 మొత్తం 12 73నామినేషన్ల పరిశీలన: 24న ఉపసంహరణ: 25న పోలింగ్: నవంబర్ 1 పాలకవర్గం ఎన్నిక: నవంబర్ 4లోపు -
ఆడనా.. అయితే తీసేయ్!
జిల్లాలోని ఓ మండలానికి చెందిన దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు.. కొడుకు కావాలని మూడో సంతానం కోసం ప్రయత్నించారు. ఐదో నెల గర్భంలోనే ఎవరనేది చెబుతారని ఓ ఆర్ఎంపీ వారికి సలహా ఇచ్చాడు. దంపతులను తీసుకొని జిల్లాకేంద్రానికి వచ్చాడు. తెలిసిన స్కానింగ్ సెంటర్లో లింగనిర్ధారణ చేయించాడు. ఆడపిల్ల అని తేలడంతో అబార్షన్కు సిద్ధమయ్యారు. ఈ సమయంలో అబార్షన్ చేస్తే తల్లి ప్రాణాలకే ప్రమాదమనే వైద్యుల సూచనలతో ఆలోచనను విరమించుకున్నారు. ‘ఓ చిన్ని పిచ్చుక.. చిన్నారి పిచ్చుక’ అంటూ కలెక్టర్ పమేలా సత్పతి ఇటీవల స్వయంగా ఓ గీతాన్ని ఆలపించారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా కలెక్టర్ పాడారు. ఈ సృజనాత్మక ప్రయత్నం లింగహింస, అక్రమ లింగ నిర్ధారణ, ఆడ శిశు హత్య– శిశు హత్యలపై అవగాహన పెంపొందించడానికి రూపొందించబడిందని పేర్కొన్నారు. ఆడపిల్ల గొప్పతనం.. ఆడపిల్లను బతకనిద్దాం.. మంచి జీవితాన్నిద్దాం అంటూ సారాంశంగా వివరించారు. ప్రతీ ఒక్కరు ఆడపిల్లకు మంచి చదువునివ్వాలని సూచించారు.స్కానింగ్ సెంటర్లు: 195 మూసివేసినవి: 53 నిర్వహిస్తున్నవి: 142 ప్రైవేటు ఆస్పత్రులు: 286 మెడికల్ కళాశాలలు: 02 కరీంనగర్: సాంకేతిక పరిజ్ఞానంతో సమానంగా పరిగెడుతున్న కాలంలో ఆడపిల్లపై ఇంకా వివక్ష తగ్గడం లేదు. ఉన్నత చదువులు చదువుకున్నా.. ఆడపిల్ల అంటే అలుసుగానే చూస్తున్నారు. మగవారితో సమానంగా చదువు, ఉద్యోగం ఇలా అన్ని రంగాల్లో పోటీ పడుతున్నా.. తల్లి గర్భంలోనుంచి భూమిపై అడుగు పెట్టనివ్వడం లేదు. అమ్మ ఎదపై ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు. ‘ఆడబిడ్డను బతకనిద్దాం.. బతుకునిద్దాం’ అని ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నా.. కొందరిలో మార్పురావడం లేదు. జిల్లాలోని పలు స్కానింగ్ సెంటర్లలో గుట్టుగా లింగ నిర్ధారణ జరుగుతోంది. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. గర్భంలోనే చిదిమేస్తున్నారు. వరుసగా తనిఖీలు జిల్లా వైద్యారోగ్యశాఖ స్కానింగ్ సెంటర్లలో వరుస తనిఖీలు చేస్తోంది. పోలీసు, ఇతరశాఖల సమన్వయంతో అనుమతులు లేని స్కానింగ్ సెంటర్లకు నోటీసులు ఇస్తోంది. అయినప్పటికీ అబార్షన్ల దందా ఆగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పవిత్రమైన వైద్యవృత్తిలో ఉంటున్న కొందరు డబ్బు కు దాసోహమై కడుపులోని ఆడబిడ్డలను కడతేరుస్తున్నారు. లింగ నిర్ధారణ నేరమని చెప్పాల్సిన వైద్యులే అక్రమ దందాకు పాల్పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంతో గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలకు ఒడిగడుతున్నారు. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. కడుపులోనే చిదిమేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా పల్లెలు, పట్టణాల్లోని ఆర్ఎంపీలు, పీఎంపీల సహకారంతో జిల్లాలో లింగ నిర్ధారణ దందా సాగుతోందని సమాచారం. కొంతమంది ఆర్ఎంపీలు మగపిల్లాడి కోసం ఎదురుచూసే అమాయకులను మభ్యపెట్టి ధనార్జనే ధ్యేయంగా స్కానింగ్ సెంటర్లకు పంపిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే ముందస్తుగా ఒప్పందం కుదుర్చుకున్న ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్లకు పంపించి గర్భవిచ్ఛిత్తికి పాల్పడుతున్నారు. తెలంగాణ సామాజిక ఆర్ధిక నివేదిక ప్రకారం ప్రతి 1,000 మంది మగశిశువులకు జిల్లాలో 946 మంది ఆడశిశువుల జననాలు నమోదవుతుండటమే ఇందుకు నిదర్శనం. మగవారికి అధిక ప్రాధాన్యమివ్వడం, భ్రూణహత్యలు, లింగ నిర్ధారణ పరీక్షలతో ఈ అంతరం పెరుగుతోంది.గర్భస్థ శిశు లింగ నిర్ధారణ ప్రక్రియ నిషేధ చట్టాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలుచేస్తున్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసు, ఇతరశాఖల సమన్వయంతో స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేస్తున్నాం. నిబంధనలు పాటించని వారికి నోటీసులు జారీ చేస్తున్నాం. సమాధానాలు ఇవ్వకపోతే సీజ్ చేస్తున్నాం. లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్వో, కరీంనగర్ -
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
రామడుగు: ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని, రైతులు సద్విని యోగం చేసుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. రామడుగు మండలం వెదిర గ్రామంలో గురువా రం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ.. రైతులు దళారీలకు ధాన్యం అమ్ముకోవద్దని, ప్రభుత్వ కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధర అందిస్తోందన్నారు. అనంతరం కొక్కెరకుంట, రంగసాయిపల్లి, మోతె, దత్తోజీపల్లి, శ్రీరాములపల్లి, షానగర్ గ్రా మాల్లో కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సత్యం ప్రారంభించారు. గోపాల్రావుపేట మార్కెట్ కమి టీ చైర్మన్ బొమ్మరవేని తిరుపతి, కొక్కెరకుంట సింగిల్ విండో చైర్మన్ మురళీకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 24 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
మేం.. గురి పెడితే..పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం కమిషనరేట్ కేంద్రంలోని పరేడ్గ్రౌండ్లో ఓపెన్ హౌస్ నిర్వహించారు. కార్యక్రమాన్ని సీపీ గౌస్ఆలం ప్రారంభించారు. నగరంలోని పలు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు పాల్గొని, వివిధ రకాల తుపాకులు పరిశీలించారు. పోలీసులు పరికరాలపై అవగాహన కల్పించారు. డాగ్స్క్వాడ్, గన్స్, స్మోక్గన్స్, షెల్స్, బాంబు నిర్వీర్య విభాగం పనితీరు, ఫ్రెమ్ మెటల్ డిటెక్టర్లు, కమాండ్ కంట్రోల్ వాహనం, వజ్ర వాహనాన్ని ప్రదర్శనలో ఉంచారు. షీటీం, సైబర్క్రైం, యాంటీ నార్కోటిక్ సెల్, ట్రాఫిక్ విభాగానికి చెందిన స్టాళ్లను గురించి వివరించారు. ఒక్కో విభాగాన్ని విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. వివిధ విభాగాల పోలీసు అధికారులు పాల్గొన్నారు. – కరీంనగర్క్రైం -
నేటి నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు
కరీంనగర్ అర్బన్: ప్రభుత్వం పత్తి కొనుగోళ్లకు శ్రీకారం చుట్టింది. కపాస్ కిసాన్ యాప్ ద్వారానే విక్రయాలు జరిగేలా పక్కా చర్యలు చేపట్టింది. శుక్రవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమి టీ పరిధిలో రెండు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. వైభవ్ కాటన్ కార్పొరేషన్, ఆదిత్య కాటన్ ఆయిల్ ఆగ్రో టెక్ ఇండస్ట్రీస్, సరిత కాటన్ ఇండస్ట్రీస్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా మార్కెటింగ్ అధికారి షాబో ద్దీన్ ప్రారంభించనున్నారు. రైతులు తప్పనిసరిగా కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకుని పత్తి తేవాలని వ్యవసాయ మార్కెటింగ్శాఖ అధికారులు వివరించారు. స్లాట్ బుకింగ్ చేసుకోకపోతే కొనుగోలు చేయరని, స్లాట్ బుకింగ్ సమయంలో ఇబ్బందులున్నా, స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలో తెలియకపోయినా దగ్గరలోని ఏఈవో లేదా వ్యవసాయ మార్కెట్ కమిటీని సంప్రదించాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలో హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేయగా రైతులు కనీస మద్దతు ధర రూ.8110 పొందాలంటే పత్తిలో 8శాతం తేమ మించకుండా చూసుకోవాలని కోరారు. తేమ 12శాతం కన్నా ఎక్కువుంటే సీసీఐ కొనుగోలు చేయదని స్పష్టం చేశారు. రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రానికి వచ్చేటప్పుడు తప్పకుండా తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్కు అనుసంధానం కలిగిన సెల్ఫోన్ వెంట తేవాలని సూచించారు.జమ్మికుంటలో క్వింటాల్ పత్తి రూ.7,100 జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కె ట్లో క్వింటాల్ పత్తి ధర గరిష్టంగా రూ.7,100 పలికింది. గురువారం 124 వాహనాల్లో 1,040 క్వింటాళ్ల పత్తిని రైతులు తెచ్చారు. మోడల్ ధర రూ.6,700, కనిష్ట ధర రూ.6,000కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. -
ఈ నీరు తాగితే రోగాలే..
మానకొండూర్: మానకొండూర్ మండలం వన్నారం గ్రామంలో నెలరోజులుగా నల్లానీరు రంగుమారి, దుర్వాసన వస్తోంది. తాగేందుకు బోరు, బావినీరు లేకపోవడంతో నల్లానీరే దిక్కవుతోంది. కొద్దిరోజులుగా వ్యర్థాల వాసన వస్తుండగా.. ఆ నీరు తాగితే రోగాలపాలై ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతోంది. అధికారులకు చెప్పినా నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకుంటున్నారు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామం నుంచి గంగిపల్లికి వెళ్లే దారిలో పోచమ్మ వీధి(4వవార్డు)లో 30 నివాస గృహాలున్నాయి. 200మంది వరకు చిన్నా, పెద్దలుంటారు. ఈ వీధిలో తాగేందుకు నల్లానీరు తప్పా వేరే ఆధారం లేదు. నెలరోజులుగా నల్లానీటిలో మలం వాసన, ఆనవాళ్లతో పాటు, వ్యర్థాలు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. విషయాన్ని గ్రామ కార్యదర్శికి తెలపగా.. ఎక్కడైనా నల్లానీరు లీకేజీలు ఉన్నాయా..? అని పలుచోట్ల తవ్వకాలు చేపట్టారు. అయినా ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. నెలరోజులుగా నీరు తాగడం లేదని, కనీస అవసరాలకు కూడా ఉపయోగించే పరిస్థితి లేదని కాలనీ వాసులు చెబుతున్నారు. కొందరు వాటర్ ప్లాంట్ నుంచి నీరు తెచ్చుకుంటుండగా.. వృద్ధులు, మరికొందరు నల్లానీరే తాగుతున్నారు. దీంతో పలువురు జ్వరాల బారిన పడుతున్నారని చెబుతున్నారు. అధికారులు స్పందించి నూతన పైప్లైన్ ఏర్పాటు చేయాలని, లేకుంటే ఆందోళనకు దిగుతాయని కాలనీవాసులు హెచ్చరిస్తున్నారు. -
ప్రజలకు ఇబ్బంది లేకుండా చెత్త డంప్చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: స్థానిక ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా డంప్యార్డులో చెత్తను వేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం నగరంలోని డంప్యార్డ్ను సందర్శించారు. నగరవ్యాప్తంగా సేకరించిన చెత్తను డంప్యార్డ్ ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ పడవేస్తున్నారనే స్థానిక ప్రజల ఫిర్యాదు మేరకు తనిఖీలు చేపట్టారు. వాహనాల్లో తీసుకొచ్చిన చెత్తను డంప్యార్డ్కు వెళ్లే రోడ్డుపైనా, గేట్ ముందు పడేయొద్దన్నారు. క్రమపద్ధతిలో డంప్ చేయాలన్నారు. గుట్టలుగా పేరుకుపోయిన చెత్త, ఎత్తుపల్లాలను సరి చేయాలన్నారు. చెత్తను తీసుకువచ్చే వాహనాలు డంప్యార్డ్ లోపలికి సులువుగా వెళ్లేలా రోడ్డు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి రోజు చెత్త వాహనాలు డంప్ యార్డుకు వచ్చే సమయంలో ప్రత్యేకంగా ఒక వ్యక్తిని నియమించి, వాహనాలు లోపలికి వెళ్లి క్రమపద్ధతిలో చెత్తను డంప్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ వేణుమాధవ్, ఎస్ఈ రాజ్కుమార్, ఈఈ సంజీవ్ కుమార్, డీఈ లచ్చిరెడ్డి, ఎంహెచ్వో సుమన్ పాల్గొన్నారు.చట్టాలపై అవగాహన పెంచుకోవాలివిద్యానగర్(కరీంనగర్): మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయసేవ అధికారి, న్యాయమూర్తి వెంకటేశ్ సూచించా రు. నగరంలోని అశోక్నగర్లో ప్రకృతి పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శక్తిసదన్ను గురువారం సందర్శించారు. శక్తిసదన్లో ఆశ్రయం పొందుతున్న మహిళలకు చట్టా లపై అవగాహన కల్పించారు. శక్తిసదన్ సూపరింటెండెంట్ ఎ.రమదేవి. వసంత, రజిత, భాఽగ్యలక్ష్మి పాల్గొన్నారు. కరీంనగర్టౌన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గుండె సమస్యలతో బాధపడుతున్న 0–18 సంవత్సరాల పిల్లలకు జిల్లా మాత శిశు ఆరోగ్య కేంద్రంలో గురువారం హైదరాబాద్ అపోలో హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య నిర్ధారణ శిబిరం నిర్వహించారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల నుంచి ఆర్బీఎస్కే బృందాల ద్వారా 76మంది పిల్లలు హాజరయ్యారు. ఇందులో 29మందికి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు నిర్ధారించా రు. వీరికి అపోలో హాస్పిటల్లో శస్త్ర చికిత్స చేయనున్నారు. శిబిరం శుక్రవారం కూడా కొనసాగనుంది. డీఎంహెచ్వో వెంకటరమణ పిల్ల ల తల్లిదండ్రులతో మాట్లాడారు. వైద్య సేవలు అందుతున్న తీరును పరిశీలించారు. డీఐవో డాక్టర్ సాజిద, జిల్లా ఉప వైద్యాధికారి రాజ గోపాల్రావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్ఎంవో నవీనా, డీపీవో స్వామి, అపోలో హాస్పిటల్ పీడియాట్రిక్– కార్డియాలజిస్ట్ వైద్యులు అమూల్ గుప్త, సిటి సర్జన్ సునీల్ కుమార్ సేన్ పాల్గొన్నారు. సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీలో జరుగుతున్న ఎల్ఎల్బీ 4వ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. వీసీ ఉమేశ్ కుమార్ ఆర్ట్స్ కళాశాల పరీక్షకేంద్రాన్ని సందర్శించి, పరీక్షలు తీరును పరిశీలించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, మూల్యాంకనం కూడా త్వరగా పూర్తిచేసి ఫలితాలను సకాలంలో విడుదల చేస్తామని అన్నారు. రిజిస్ట్రార్ జాస్తి రవికుమార్, హరికాంత్ పాల్గొన్నారు. కాగా మాస్కాపీయింగ్కు పాల్పడిన నలుగురిని డిబార్ చేయాలని వీసీ ఆదేశించారు. -
నషా ముక్త్ రంగోళి
కరీంనగర్టౌన్: డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ప్రారంభించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా మహిళలు, పిల్లలు దివ్యాంగులు, వయోవృద్ధులశాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ క్లబ్ వద్ద రోడ్డుపై కళాశాల విద్యార్థులు, మహిళలకు రంగోళి పోటీలు నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై 27మంది వేసిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి. ముగ్గులను పరిశీలించిన కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. సీడీపీవో సబిత, నర్సింగరాణి, సుగుణ, శ్రీలత, కమ్యూనిటీ ఎడ్యుకేటర్ తిరుపతి పాల్గొన్నారు. -
ధర్మపురిలో రెండిళ్లలో చోరీ
ధర్మపురి: తాళం వేసి ఉన్న రెండిళ్లలో చోరీకి పాల్పడి నగదు, బంగారం ఎత్తుకెళ్లిన ఘటన ధర్మపురిలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన కొరిడె సత్తయ్య జర్మనీలో ఉంటున్న తన కూతురు వద్దకు ఇటీవల వెళ్లాడు. అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాందేవి దీపావళి సెలవుల కోసం సొంతూరుకు వెళ్లాడు. ఈ రెండిళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. నాందేవి బుధవారం ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. రూ.15వేలు, అర తులం బంగారం, సత్తయ్య ఇంట్లో తులంనర బంగారం, వెండి పత్ర మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్కుమార్ తెలిపారు. -
శతాధిక వృద్ధురాలు మృతి
రామడుగు: రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు చేని నర్సవ్వ(106) బుధవారం ఆనారోగ్యంతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. నర్సవ్వకు ముగ్గురు కొడుకులు, కుతురు ఉన్నారు. ప్రస్తుతం వారి మొత్తం కుటుంబ సభ్యులు 68మంది వరకు ఉంటారని గ్రామస్తులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి..జమ్మికుంట: పట్టణంలోని రైల్వేస్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గంగారపు తిరుపతి వివరాల ప్రకారం.. జమ్మికుంట రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంపై గుర్తు తెలియని 65ఏళ్ల వ్యక్తి చనిపోయి ఉన్నాడు. మృతుని వద్ద ఎలాంటి అధారాలు లేవు. లేత ఆకుపచ్చ కలర్ టీషర్ట్, తెలుపు ధోతి ధరించి, చేతి కర్రతో ఉన్నాడు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. ఎవరైనా తెలిసినవారుంటే 9949304574, 8712658604 నంబర్ను సంప్రదించాలని సూచించాడు. కోనరావుపేట(వేములవాడ): సెల్టవర్ పైనుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని మామిడిపల్లిలో విషాదం నింపింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లికి చెందిన గుమ్మడి దేవయ్య–సరవ్వ కుమారుడు బాబు(32) కొన్నాళ్ల క్రితం గల్ఫ్ వెళ్లి దసరా పండుగకు ముందు స్వగ్రామానికి వచ్చాడు. గ్రామంలోనే ఉంటున్న బాబు బుధవారం రాత్రి ఎన్గల్కు వెళ్లే దారిలోని టవర్ ఎక్కాడు. విషయం తెలుసుకున్న భార్య, గ్రామస్తులు టవర్ ఎక్కి కాపాడే ప్రయత్నం చేస్తుండగానే పై నుంచి దూకడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. కాగా గతంలో కూడా పలుమార్లు టవర్పైకి ఎక్కి ఆత్మహత్యాప్రయత్నం చేశాడు. మృతునికి భార్య ప్రవళిక, కుమారుడు, కూతురు ఉన్నారు. జర్మనీలో నర్సింగ్ కోర్సువిద్యానగర్(కరీంనగర్): జర్మనీలో ఆరోగ్య సంరక్షణ కార్మికులకు, నర్సులకు అధిక డిమాండ్ ఉన్నందున అక్కడ నర్సింగ్ మూడేళ్ల ఇంటర్నేషనల్ డిగ్రీ చదవడానికి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ అవకాశం కల్పిస్తోందని, జిల్లా ఉపాధి కల్పనాధికారి వై.తిరుపతి రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. చదువుకునే సమయంలో మూడేళ్లపాటు రూ.లక్ష స్టైఫండ్, నర్సుగా నెలకు రూ.3లక్షల వరకు వేతనం పొందే అవకాశం ఉందన్నారు. ఇంటర్లో 60శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది, 18 నుంచి 28 ఏళ్లోపు వయసువారు అర్హులని, ఎంపికై న అభ్యర్థులను జర్మనీకి పంపించే ముందు హైదరాబాద్లో జర్మన్ భాషలో తొమ్మిది నెలల పాటు రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలపారు. ఆసక్తి ఉన్నవారు 63022 92450, 94400 51763 నంబర్లలో సంప్రదించాలని, అభ్యర్ధులు తమ రెజ్యూమ్ను tomcom. recruitment manager@gmail.comకు ఈనెల 30లోగా పంపాలని సూచించారు. వీడియో వైరల్పై సీరియస్వేములవాడ: రాజన్న ప్రసాదాల ప్రధాన గోదాంలో నుంచి ఓ ఉద్యోగి సరుకులు తరలిస్తున్నట్లు ఉన్న వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారడాన్ని రాష్ట్ర దేవాదాయశాఖ సీరియస్గా పరిగణించింది. ఆలయ ఈవో రమాదేవి, ఏఈవోలు, ఇతర అధికారులు భీమేశ్వర సదన్లోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అందులో కనిపించిన ఉద్యోగులను వేర్వేరుగా విచారించగా.. ఆలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఉద్దేశ్యపూర్వకంగానే ఇద్దరు ఔట్సోర్సింగ్ సిబ్బందితో ఈ వీడియో రికార్డింగ్ చేయించినట్లు సీసీ కెమెరా ఫుటేజీల్లో స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి సదరు ఉద్యోగి తనని తాను రక్షించుకునేందుకు పైరవీలు మొదలుపెట్టినట్లు ప్రచారంలో ఉంది. గోదాంలోని అధికారి.. సిబ్బందిని విధులు సరిగ్గా నిర్వహించాలని ఆదేశించినందుకే ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు అధికారుల విచారణలో తేలినట్లు సమాచారం. వీడియో రికార్డింగ్ చేయించిన ఉద్యోగిపై త్వరలోనే శాఖాపరమైన చర్యలకు దిగనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గోదాంలోని సరుకులు పక్కదారి పట్టకుండా ఇక నుంచి ప్రతీ 15 రోజులకోసారి తూకం వేసి లెక్కలు చూడాలని ఈవో రమాదేవి ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
ఇరాక్లో పెగడపల్లి వాసి మృతి
పెగడపల్లి: స్వదేశానికి వచ్చేందుకు రెండు రోజులు క్రితం విమాన టికెట్టు బుకింగ్ చేసుకున్న వలస జీవి.. అంతలోనే గుండెపోటుతో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. పెగడపల్లి మండలకేంద్రానికి చెందిన లింగంపల్లి రమేశ్ (55) ఉపాధి నిమిత్తం రెండేళ్ల క్రితం ఇరాక్ వెళ్లాడు. స్వదేశానికి వచ్చేందుకు టికెట్ బుక్ చేసుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రమేశ్ గుండెలో నొప్పిగా ఉందంటూ చెప్పగా.. తోటిమిత్రులు ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారమందింది. క్షేమంగా ఇంటికొస్తాడని అనుకుంటున్న సమయంలో ఇలా గుండెపోటు రూపంలో మృత్యువు కబళించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రమేశ్కు భార్య, కుమారుడు, కూతురున్నారు. ఇంటికొచ్చేందుకు టికెట్ బుకింగ్.. అంతలోనే గుండెపోటు -
పొలానికి నిప్పు పెట్టిన రైతు
పాలకుర్తి(రామగుండం): ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటకు దోమపోటు సోకడంతో కాపాడుకునేందుకు ప్రయత్నించి విసుగుచెందిన రైతు.. చివరకు పంటకు నిప్పు పెట్టిన సంఘటన పాలకుర్తి మండలం బసంత్నగర్లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు పర్శవేన శ్రీనివాస్ తన రెండెకరాల్లో ఈసారి సన్నరకం వరి వేశాడు. దాదాపు రూ.60వేల వరకు పెట్టుబడి పెట్టాడు. మరికొద్దిరోజుల్లో పంట కోసేందుకు సిద్ధమయ్యాడరు. ఈక్రమంలో వరికి దోమపోటు సోకింది. ఇప్పటికే నాలుగుసార్లు పురుగులమందు పిచికారీ చేశాడు. అయినా.. దోమపోటు అదుపులోకి రాలేదు. విసుగుచెందిన రైతు.. బుధవారం పంటకు నిప్పుపెట్టాడు. ఆరుగాలం కష్టించి పండించిన పంట చివరిదశలో ఉండగా సోకిన తెగులుతో కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
అంత్యక్రియలకు వెళ్తూ.. అనంత లోకాలకు..
ఎల్లారెడ్డిపేట/కోనరావుపేట: బంధువుల అంత్యక్రియలకు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. ఎల్లారెడ్డిపేట మండలంలో జరిగిన ప్రమాదం కోనరావుపేట మండలం సుద్దాలలో విషాదాన్ని నింపింది. ఎల్లారెడ్డిపేట ఎస్సై రాహుల్రెడ్డి తెలిపిన వివరాలు. కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన దొబ్బల మరియమ్మ(58) అల్మాస్పూర్లో బంధువుల ఇంట్లో ఒకరు చనిపోగా బైక్పై తన చిన్నకుమారుడు ప్రభాకర్తో కలిసి వస్తుంది. ఈక్రమంలో అక్కపల్లి శివారులోని బుగ్గరాజేశ్వరస్వామి ఆలయం వద్ద గల మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పడంతో మరియమ్మ కిందపడింది. తలకు బలమైన గాయాలు కావడంతో ఎల్లారెడ్డిపేటలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్రెడ్డి తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న మరియమ్మ అంత్యక్రియలు సుద్దాలలో గురువారం నిర్వహించనున్నారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి -
పోస్టల్ బీమా.. జీవితానికి ధీమా
బోయినపల్లి(చొప్పదండి): పోస్టల్శాఖలోని బీమా పథకాలు.. పేదల్లో ధీమా పెంచుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని నేటి రోజుల్లో ఓ బీమా పథకంలో చేరితే కుటుంబానికి ధీమాగా ఉంటుందని పేద, మధ్యతరగతి ప్రజలు భావిస్తున్నారు. ఈక్రమంలోనే పోస్టల్శాఖపై ఉన్న నమ్మకంతో ఆ శాఖ అమలు చేస్తున్న పథకాలలో చేరుతున్నారు. తక్కువ ప్రీమియంతో అధిక బీమా వర్తిస్తుండడంతో ఆసక్తి చూపుతున్నారు. తక్కువ ప్రీమియంతో ప్రమాద బీమా రోడ్డు ప్రమాదాలు.. విద్యుత్షాక్, పాముకాట్లు ఇలా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఆర్థికంగా ఆసరాగా ఉంటుందని పోస్టల్ శాఖ ప్రమాద బీమాలో చేరుతున్నారు. ఆస్పత్రుల్లో పెద్ద మొత్తంలో బిల్లులు చెల్లించేందుకు పలువురు ఆస్తులు అమ్ముకోవడం చూస్తున్న ప్రజలు ప్రమాదమీమా చేయించుకుంటున్నారు. ఐపీపీబీ పథకంలో ప్రమాద బీమా ఐపీపీబీ(ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్) వారు ప్రమాద బీమా విషయంలో టాటా ఏఐజీ, నివాబుపా, ఆదిత్య బిర్లా క్యాపిటల్, స్టార్, బజాజ్ అలియంజ్, రాయల్ సుందరం, రిలయన్స్ తదితర సంస్థలతో కలిసి ప్రమాదబీమా ప్రవేశపెట్టినట్లు ఐపీపీబీ కరీంనగర్ మేనేజర్ మధుమోహన్ తెలిపారు. డివిజన్లో ఇప్పటి వరకు 34,500 వరకు ఈ పాలసీలు చేసినట్లు వివరించారు. పోస్టల్ శాఖ వారి ఐపీపీబీ ఖాతాదారునికి మాత్రమే సామూహిక ప్రమాదబీమా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పథకంలో చేరాలంటే మొదట రూ.200 చెల్లించి ఐపీపీబీలో ఖాతా తీయాలి. అనంతరం సామూహిక ప్రమాదబీమాకు వార్షిక ప్రీమియం చెల్లించాలి. కరీంనగర్ డివిజన్ పోస్టల్ సమాచారం హెడ్ పోస్టాఫీసులు : కరీంనగర్, జగిత్యాల సబ్ పోస్టాఫీసులు : 52 బ్రాంచ్ పోస్టాఫీసులు : 389 ఇప్పటి వరకు చేసిన బీమా పాలసీలు : 34,500 తక్కువ ప్రీమియం.. ఎక్కువ ప్రయోజనాలు పోస్టల్ శాఖ కొత్త పథకాలతో పేదలకు లబ్ధి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరు పెద్ద మొత్తంలో ప్రీమియం వెచ్చించి ప్రమాద బీమా చేసుకుంటున్నారు. అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలా ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు ఆధ్వర్యంలో టాటా ఏఐజీ, బజాజ్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, నివాబుపా, రాయల్ సుందరం తదితర సంస్థలతో కలిసి గ్రూప్ యాక్సిడెంట్ పాలసీని ప్రవేశపెట్టింది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పథకంలో చేరాలనుకునే వారు సమీప పోస్టాఫీసులో సంప్రదించాలి. – మధుమోహన్ కంది, ఐపీపీబీ, సీనియర్ మేనేజర్ కరీంనగర్ -
అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్లో ఈనెల 13న తాళం వేసిన ఇళ్లలో చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. జగిత్యాల రూరల్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం వివరాలు వెల్లడించారు. ధరూర్ గ్రామంలో ఈనెల 13న తాళం వేసిన నాలుగిళ్లలో గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. కేసు నమోదు చేసి నిందితులను సాంకేతిక పరిజ్ఞానంతో మహారాష్ట్ర అంతర్రాష్ట్ర దొంగలుగా గుర్తించారు. మూడు ప్రత్యేక పోలీసు బృందాలను మహారాష్ట్రకు పంపించి గాలింపు చర్యలు చేపట్టారు. ధరూర్ శివారులోని బైపాస్రోడ్లో నిందితులు కారులో వెళ్తుండగా 15ఏళ్ల బాలుడితోపాటు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూక దేవిగల్లికి చెందిన మ్యాకల్వార్ సాయినాథ్, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం యామయ్కుంటకు చెందిన శ్రీకాంత్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వారి నుంచి 24.05 గ్రాముల బంగారు నగలు, రూ.19 వేలు, కారు, రెండు సెల్ఫోన్లు, మూడు ఫేస్మాస్క్లు, హ్యాండ్ గ్లౌస్లు, ఓ ఐరన్ రాడ్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. మరో నిందితుడు మహారాష్ట్రలోని హింగోలి జిల్లా బాస్మత్ తాలూకా ఖార్ఖానారోడ్కు చెందిన మార్కులి అనిల్ పరారీలో ఉన్నాడని తెలిపారు. పట్టుబడిన దొంగలంతా గతంలో జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మహారాష్ట్రలోని నాందేడ్, హింగోలి జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడ్డారని, వారిపై కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. దొంగలను పట్టుకోవడంలో కృషి చేసిన జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్, రూరల్ ఎస్సై సదాకర్, మెట్పల్లి ఎస్సై కిరణ్కుమార్, బీర్పూర్ ఎస్సై రాజు, ఏఎస్సై సత్తయ్య, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, మోహన్, రమేశ్, శ్రీనివాస్, కిరణ్, విశాల్, ప్రణయ్, ఆంజనేయులు, సత్యనారాయణను డీఎస్పీ అభినందించారు. వారికి నగదు రివార్డులు అందించారు. 24.05 గ్రాముల బంగారం.. రూ.19 వేలు, కారు స్వాధీనం -
వైభవంగా కార్తీక దీపోత్సవం
వేములవాడ: రాజన్న అనుబంధ భీమేశ్వరస్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం బుధవారం రాత్రి ఘనంగా జరిగాయి. శ్రీలలితసేవా సమితి సభ్యులు వివిధ ఆకృతుల్లో పూలను పేర్చి అందులో దీపాలు వెలిగించారు. రాజన్న ఆలయంలో ఆకాశదీపం కార్తీకమాసం సందర్భంగా రాజన్న ఆలయంలోని గండాదీపంలో ఆకాశదీపాన్ని ఆలయ అర్చకులు వెలిగించారు.అభిషేక ప్రియుడికి కోటి దండాలు వేములవాడ: రాజన్నను బుధవారం భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. రాజన్న, భీమన్న ఆలయాల్లో దర్శనాలు, కోడెమొక్కులు కొనసాగాయి. రాజన్న ఆలయంలో అభిషేకాలు అత్యధికంగా జరిగాయి. ఆలయంలో పనులు జరుగుతుండడంతో గంటసేపు దర్శనాలు నిలిపివేశారు. ఏర్పాట్లను ఈవో రమాదేవి, ఏఈవో శ్రీనివాస్, పర్యవేక్షకులు నునుగొండ రాజేందర్ పరిశీలించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సతీమణి అపర్ణ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. రాజన్న ఆలయంలోని గండాదీపంలో ఆకాశదీపం వెలిగిస్తున్న అర్చకులు భీమన్న ఆలయంలో దీపాలు వెలిగిస్తున్న శ్రీలలితసేవా సమితి సభ్యులు -
రెండు ఆలయాల్లో దొంగతనం
కథలాపూర్: మండలంలోని భూషణరావుపేట శివారులోని రెండు ఆలయాల్లో దొంగతనం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. దుర్గామాత ఆలయంలో దొంగలు పడి అమ్మవారి మెడలో ఉన్న బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. హుండీని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. రేణుక ఎల్లమ్మ ఆలయంలో చొరబడి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. హుండీని ధ్వంసం చేసి డబ్బులు ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఎస్సై నవీన్కుమార్ పరిశీలించి వివరాలు సేకరించారు. ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని ఆలయ కమిటీ సభ్యులకు ఎస్సై సూచించారు. -
బాస్కెట్బాల్ పోటీలకు ఎంపిక
కరీంనగర్రూరల్: నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో ఇటీవల నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్– 14 బాస్కెట్బాల్ పోటీల్లో బొమ్మకల్లోని బిర్లా ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్ధులు విక్యాత్, నిత్య ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎంపికై నట్లు కోచ్ అనూప్ తెలిపారు. విద్యార్థులను బుధవారం ప్రిన్సిపాల్ బబిత విశ్వనాథన్, చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి, వ్యాయామ విభాగం అధిపతి మురళీధర్ అభినందించారు. నేడు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం పెద్దపల్లి: సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించనున్నారు. పట్టణ పరిధిలో సుమారు 112 రైస్ మిల్లులు ఉన్నాయి. ఫలితంగా జిల్లాలో కొనుగోలు చేసే ధాన్యాన్ని సుల్తానాబాద్లోని మిల్లులకే అధికంగా తరలిస్తామని, ఇందుకోసం రవాణా, హమాలీలు, కూలీలు తదితర ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. సన్న రకం ధాన్యం క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లిస్తోంది. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369గా మద్దతు ధర చెల్లిస్తారు. తప్ప, తాలు, మట్టి లేకుండా, నిర్దేశిత తేమశాతంతోనే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావాలని అధికారులు సూచించారు. -
ఐదు నిమిషాలైతే ఇల్లు చేరేదే..
ధర్మపురి: ఐదు నిమిషాలైతే ఆమె క్షేమంగా ఇంటికి చేరుకునేది. అంతలోనే విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనులకు వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా గేదెను ఢీకొని మహిళాకూలి మృతి చెందిన సంఘటన మండలంలోని నేరెల్ల శివారులో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై రవీందర్, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వేముల పుష్పలత (50) రోజులాగానే పత్తి ఏరేందుకు కూలీకి వెళ్లింది. సాయంత్రం పనులు ముగించుకున్న అనంతరం భూమి యజమానితోపాటు పుష్పలత, గౌరమ్మను బైక్పై ఇంటికి బయల్దేరారు. నేరెళ్ల సమీపంలోకి రాగానే ఎదురుగా గేదె అడ్డు వచ్చింది. దానిని ఢీకొట్టడంతో పుష్పలత, గౌరమ్మ కింద పడిపోయారు. పుష్పలతకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. గౌరమ్మకు స్వల్పగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోధించారు. ఐదు నిమిషాల్లో ఇంటికి చేరేదానివంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పుష్పలతకు భర్త చంద్రయ్య, ముగ్గురు కుమారులున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం -
హ్యాండ్బాల్ విజేత రాజన్నసిరిసిల్ల
గంభీరావుపేట(సిరిసిల్ల): ఉమ్మడి జిల్లా హ్యాండ్బాల్ పోటీల్లో విజేతగా రాజన్నసిరిసిల్ల జిల్లా జట్లు నిలిచాయి. గంభీరావుపేట మండలం కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బుధవారం ఉమ్మడి జిల్లాస్థాయి హ్యాండ్బాల్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్లకు చెందిన 8 జట్లు పాల్గొన్నాయి. బాలురు, బాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. బాలురు, బాలికల విభాగాల్లో రాజన్న సిరిసిల్ల జట్లు ప్రథమ, కరీంనగర్ జట్లు ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. విజేతలకు స్థానిక నాయకుడు దమ్మ శ్రీనివాస్రెడ్డి బహుమతులను అందించారు. షాదుల్, మల్లేశం భోజన వసతి కల్పించారు. పీడీ భార భాను, ఎంఈవో గంగారాం, హ్యాండ్బాల్ అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్, అశోక్, సుమన్, కృష్ణహరి పాల్గొన్నారు. ద్వితీయస్థానంలో కరీంనగర్ -
సిటిజన్ సర్వేలో భాగస్వాములు కావాలి
● కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్ అర్బన్: తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూపకల్పన ఉద్దేశించిన ‘తెలంగాణ రైజింగ్– 2047’ సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి స్పందన లభిస్తోందని కలెక్టర్ పమేలా సత్పతి చెప్పారు. ఇప్పటి వరకు తెలంగాణ నుంచి వివిధ ప్రాంతాల పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందజేశారని వివరించారు. భారత దేశ స్వాతంత్య్రానికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుంచి సలహాలు, సూచనల కోసమే సిటిజన్ సర్వే చేపట్టిందన్నారు. సర్వే ఈ నెల 25తో ముగుస్తుందని, www.telangana.gov.in, telangana rising అనే వెబ్సైట్ను సందర్శించి ప్రతీ ఒక్కరు తమ అమూల్యమైన సలహాలు, సూచనలను అందించాలని కోరారు. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తకరీంనగర్ క్రైం: సైబర్ నేరగాళ్లు, వాట్సప్ గ్రూప్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. నేరగాళ్లు వాట్సప్ గ్రూప్ల ద్వారా నకిలీ ఏపీకే ఫైళ్లను (ఆర్టీవో చలాన్ , టీఎస్ చలాన్ యాప్లు వంటివి) సర్యూలేట్ చేస్తున్నారని తెలిపారు. తెలియకుండా.. అనుమతిలేకుండానే ఖాతాల్లోంచి డబ్బులు మాయమవుతున్నాయని తెలిపారు. కొన్ని సందర్భాల్లో వాట్సాప్ అకౌంట్నూ హ్యాక్ చేస్తున్నారని చెప్పారు. నకిలీ చలాన్, పీఎం కిసాన్ ఏపీకే, వివిధ ఫేక్ యాప్లు మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవద్దన్నారు. అన్ని సందేశ ఫార్వార్డింగ్ ఎంపికలను నిలిపివేయడానికి ఫోన్ నుంచి ుు002ు డయల్ చేయాలని, ఏదైనా సమస్య తలెత్తితే 1930 సైబర్ హెల్ప్లైన్ నంబర్కు డయల్ చేయాలన్నారు. అయోడిన్తో రోగ నిరోధక శక్తి పెరుగుతుందికరీంనగర్: అయోడిన్ మెదడు అభివృద్ధి, శరీర ఎదుగుదలకు, రోగ నిరోధకశక్తిని పెంచేందుకు సహకరిస్తుందని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ అన్నారు. ప్రపంచ అయోడిన్ లోపం రుగ్మతల నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం డీఎంహెచ్వో కార్యాలయంలో ప్రొగ్రాం ఆఫీసర్లు, ఆఫీస్ స్టాఫ్తో ప్రతిజ్ఞ చేయించారు. అయోడిన్ కలిగిన ఉప్పునే వాడాలన్నారు. అయోడిన్ లోపంతో గొయిటర్ (మెడ ఉబ్బరం), మానసిక మందగమనం (బుద్ధి తగ్గిపోవడం), బలహీనత, అలసట, గర్భిణిలు, మృతశిశువు జననం లేదా పిల్లల్లో వైకల్యం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు విప్లవశ్రీ, రవీందర్ రెడ్డి, సాజిద, సనజవేరియా, రాజగోపాల్, స్వామి, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.జూబ్లీహిల్స్లో మేము సైతంకరీంనగర్ టౌన్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రిటైర్డు ఎంప్లాయీస్ నాయకులు పోటీచేస్తున్నారు. ఈమేరకు సోమవారం నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆ సంఘం నాయకులు మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వం రిటైర్డు ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ సకాలంలో ఇవ్వనందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘం నాయకులు ప్రకటించారు. మరోవైపు ఎస్సీ వర్గీకరణలో జరిగిన అన్యాయానికి నిరసనగా మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ నల్లల కనకరాజ్ ఆధ్వర్యంలో 12 మంది నామినేషన్లు దాఖాలు చేశారు. నామినేషన్లు దాఖాలు చేసిన వారిలో కరీంనగర్ జిల్లా మాల సంఘ నాయకులు మద్దెల రాజేందర్, రొడ్డ శ్రీనివాస్, తెగుట్ల రమేశ్ కుమార్ ఉన్నారు. దివ్యాంగ విద్యార్థులకు స్కాలర్షిప్లువిద్యానగర్(కరీంనగర్): ఉన్నత విద్య చదివే దివ్యాంగ విద్యార్థులకు జాతీయ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా స్కాలర్షిప్లు ఇస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారి ఎం.సరస్వతి మంగళవారం తెలిపారు. దివ్యాంగులైన తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు ప్రీ మెట్రిక్, ఇంటర్ నుంచి పీజీ వరకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, గాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లొమా కోసం టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 31 చివరి తేదీ అని తెలిపారు. -
అమరుల త్యాగాలు మరువలేనివి
కరీంనగర్క్రైం: పోలీసులు అమరవీరుల త్యాగాలు మరవలేనివని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా మంగళవారం సీపీ గౌస్ ఆలం ఆధ్వర్యంలో ఫ్లాగ్ డే ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ చీఫ్గెస్ట్గా హాజరయ్యారు. పండుగల సమయంలో కూడా పోలీసులు విధినిర్వహణలో ఉంటారని గుర్తుచేశారు. పోలీసు ఉద్యోగం సవాలుతో కూడుకున్నదన్నారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా ఉండేవని.. విధి నిర్వహణలో ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారన్నారు. దేశరక్షణ కోసం, సమాజంలో శాంతి భద్రతలు కాపాడే విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అమరవీరుల పోలీసుకుటుంబాలకు పోలీసుశాఖ అండగా ఉంటుందన్నారు. ఈ నెల 31 వరకు పదిరోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం అమరవీరుల విగ్రహానికి సాయుధ బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. కలెక్టర్తో పాటు సీపీ ఇతర అధికారులు అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళి అర్పించారు. కార్యక్రమంలో డీసీపీ వెంకటరమణ, భీంరావు తదితరులు పాల్గొన్నారు. -
తెరపైకి చల్లూరు సహకార సంఘం
వీణవంక: వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ప్రాథమిక సహకార పరపతి సంఘం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. వీణవంక సొసైటీలో ఎక్కువ మంది రైతులు చల్లూరు కేంద్రంగా ఉండడంతో సొసైటీ చేయాలనే డిమాండ్ పెరిగింది. ఈ విషయమై రెండు రోజుల్లో వ్యవసాయశాఖ మంత్రిని కలిసేందుకు వివిధ గ్రామాల రైతులు సిద్ధమవుతున్నారు. వాణిజ్య, వ్యాపారకేంద్రంగా ఉన్న చల్లూరులో కొత్త సొసైటీ ఏర్పాటు చేయాలని 2018లోనే పాలకవర్గం తీర్మాణం చేసింది. ఆ ప్రయత్నం ఫలించలేదు. 2023–24లో మళ్లీ తీర్మాణం పంపాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావడంతో అధికారులు నివేదిక ఇచ్చారు. వీణవంక సొసైటీ పాలకవర్గంలో ఉన్న ఓ వ్యక్తి చల్లూరును సొసైటీ చేయొద్దని ఒత్తిడి తేవడంతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. మంత్రిని కలవనున్న రైతులు వీణవంక ప్రాథమిక సహకార పరపతి సంఘం పరిధిలో 26 గ్రామాలు.. 54వేల జనాభా ఉంది. వీణవంక సొసైటీలో సుమారు 4,500 మంది సభ్యులున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు 11మంది డైరెక్టర్లు ఉంటారు. 1,085 మంది రైతులు రుణాలు తీసుకున్నారు. ఈ సొసైటీలో చల్లూరు, ఎల్బాక, గంగారం, మామిడాలపల్లి, మల్లారెడ్డిపల్లి గ్రామాల నుంచి ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు. చల్లూరు సొసైటీ ఏర్పడితే మామిడాలపల్లి, చల్లూరు, గంగారం, ఎల్బాక, కోర్కల్, మల్లారెడ్డిపల్లి, దేశాయిపల్లి, కిష్టంపేట, బొంతుపల్లి, ఘన్ముక్కుల, కోర్కల్ గ్రామాల రైతులకు అనుకూలంగా ఉంటుంది. వీణవంకకు వెళ్లేందుకు దూరభారం తగ్గుతుంది. ఈ విషయాన్ని కొందరు రైతులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో మంత్రిని కలిసేందుకు సిద్ధం అవుతున్నారు. వీణవంక సొసైటీ సీఈవో ప్రకాశ్రెడ్డిని ఈ విషయమై వివరణ కోరగా చల్లూరులో సొసైటీ కోసం ప్రతిపాదనలు పంపామని తెలిపారు. -
టార్గెట్.. అర్బన్ బ్యాంక్!
సాక్షిప్రతినిధి, కరీంనగర్ ●: కరీంనగర్ అర్బన్ బ్యాంక్పై ఏజెండా ఎగరనుంది. మళ్లీ హస్తగతమేనా? కమల వశమా? పద్మవ్యూహంలో అభిమన్యుడిలా బీఆర్ఎస్ పరమా? అన్నది మరో 13 రోజుల్లో తేలనుంది. రాజకీయ పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలతో సిద్ధమవుతుండగా ఓటర్లను ఆకట్టుకునేందుకు మాటలకు పదును పెడుతున్నాయి. గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవనుండగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఎంపిక చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ సదరు వ్యూహంలో ఉండగా బీఆర్ఎస్ వ్యూహాత్మక మౌనం పాటిస్తోందని స్పష్టమవుతోంది. అయిదేళ్ల పదవీ కాలానికి జరిగే ఎన్నికలు కావడంతో డైరెక్టర్లుగా గెలిచేందుకు ఎవరికివారుగా పావులు కదుపుతున్నాయి. కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు ఏర్పడిన నుంచి కాంగ్రెస్ అధిపత్యమే నడుస్తోంది. ఇతర పార్టీలు పెద్దగా ఆసక్తి చూపకపోగా కాంగ్రెస్ నేతలే పరిపాలిస్తున్నారన్నది సుస్పష్టం. కాంగ్రెస్లో కొత్త, పాత నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరగా కోర్టు వరకు చేరిన విషయం విదితమే. తాజా మాజీ చైర్మన్ గడ్డం విలాస్రెడ్డి మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్ అక్రమాలకు పాల్పడ్డారని, ఇబ్బడిముబ్బడిగా సభ్యత్వాలిచ్చారని విలేకరుల సమావేశాల్లో వెల్లడించారు. సర్వసభ్య సమావేశాలు ఏర్పాటు చేసి రాజశేఖర్తో పాటు పలువురి సభ్యత్వాలను రద్దు చేసినట్లు ప్రకటించారు. రాజశేఖర్ కాంగ్రెస్లో కొన్ని నెలల క్రితం చేరగా మొదటి నుంచి పార్టీలో క్రీయాశీలపాత్ర పోషిస్తున్న తనకే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని విలాస్రెడ్డి అంతర్గత సమావేశాల్లో స్పష్టం చేస్తుండగా తన ప్యానెలే కాంగ్రెస్ ప్యానలని చెబుతున్నారు. రాజశేఖర్ కూడా తన ప్యానల్ను పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నారు. కావాలని తనపై ఆరోపణలు చేస్తున్నారే తప్పా ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని గతంలోనే ప్రకటించారు. అయితే కరీంనగర్ కాంగ్రెస్లో అంతర్గత పోరు ఇతర పార్టీలకు లాభించే అవకాశాలున్నాయి. అభ్యర్థుల ఎంపికలో భాజపా ఇటీవల కేంద్రమంత్రి బండి సంజయ్తో సమావేఽశమైన నేతలు అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో సత్తా చాటుతామని స్పష్టంచేయగా ముఖ్య నేతలంతా వ్యూహాలకు పదును పెడుతున్నారు. కాంగ్రెస్లో వర్గపోరు పార్టీకి ప్రయోజనం చేకూర్చనుండగా భాజపా గెలుపు నల్లేరుపై నడకేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అర్బన్ బ్యాంకులో 9,287మంది ఓటర్లుండగా కరీంనగర్లో 7,272 సభ్యత్వాలుండగా జగిత్యాలలో 2,015 మంది ఓటర్లున్నారు. ఇందులో గరిష్టం భాజపా వైపే మొగ్గుచూపుతారన్నది భాజపా నేతల వాదన. మాజీ మేయర్ డి.శంకర్, కన్న కృష్ణ తదితర నేతలు బలమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ దూరమా? అయితే అర్బన్ బ్యాంకు ఎన్నికలను బీఆర్ఎస్ పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఎవరిని అభ్యర్థులుగా ప్రకటించేందుకు ఆసక్తి చూపడం లేదు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వేచిచూసే ధోరణిలో ఉన్నట్లు సమాచారం. ఎన్నికలకు దూరమా.. వ్యూహాత్మక మౌనమా అన్న చర్చ మొదలైంది. కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు ఎన్నికలు రాష్ట్రం ఏర్పడకముందు జరగగా రాష్ట్రం ఏర్పడిన నుంచి ఎన్నికలు జరగలేదు. అవే పాలకవర్గాలు కొనసాగుతూ రాగా పాలకవర్గం బీఆర్ఎస్ వైపు చేరడంతో ఎన్నికలు నిర్వహించలేదు. నామినేటేడ్ విధానంలో పాలకవర్గాలను ప్రకటించారు. తెలంగాణలో తొలిసారి అర్బన్ బ్యాంక్ ఎన్నికలు జరుగుతుండగా రాజకీయ వేడెక్కింది. ఈ నెల 15న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా 21 నుంచి 23 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నవంబర్ 1న పోలింగ్, 4లోపు పాలవకర్గ ఎన్నిక జరగనుండగా తదనుగుణ ఏర్పాట్లలో సహకార శాఖ తలమునకలైంది. పాలకవర్గంలో మొత్తం 12మంది డైరెక్టర్లను బ్యాంకు సభ్యులు ఎన్నుకోనున్నారు. ప్రతీ సభ్యుడు బ్యాలెట్ పేపర్ ద్వారా 12మందికి ఓటు వేయాల్సి ఉంటుంది. ఇందులో మహిళలకు రెండు డైరెక్టర్ పదవులు కాగా మరొక స్థానాన్ని ఎస్సీ, ఎస్టీ కేటగిరికి రిజర్వ్ చేశారు. మిగతా 9 స్థానాలకు ఓపెన్ కేటగిరిలో ఎన్నికలు జరగనున్నాయి. గతంలో ఒకే బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించగా ఈ సారి మాత్రం మూడు కేటగిరిలకు మూడు బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తున్నారు. ఓపెన్ కేటగిరికి తెల్ల బ్యాలెట్ పేపర్, మహిళా కేటగిరికి గులాబి రంగు బ్యాలెట్ పేపర్ను, ఎస్సీ, ఎస్టీ కేటగిరి కోసం నీలి రంగు బ్యాలెట్ పేపర్ను వినియోగించనున్నట్లు అధికారులు ప్రకటించారు. -
టీ20 జట్టుకు శ్రీవల్లి
కరీంనగర్స్పోర్ట్స్/ఇల్లంతకుంట: కరీంనగర్కు చెందిన శ్రీవల్లి హైదరాబాద్ మహిళల అండర్–19 టీ20 జట్టుకు ఎంపికై ంది. ఇటీవల మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరిగిన అండర్–20 జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ నెల 26 నుంచి ముంబయి వేదికగా బీసీసీఐ అండర్–19 టీ20 ఉమెన్ ట్రోఫీ జరగనుంది. చిన్న వయస్సులో బెస్ట్ బౌలర్గా పేరు సంపాదించిన శ్రీవల్లి భవిష్యత్లో భారత మహిళల జట్టులో చోటు దక్కాలని పలువురు ఆకాంక్షించారు. కూతురు ఎంపికపై తల్లిదండ్రులు కట్ట ఉమ, లక్ష్మారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. -
ధాన్యం మాయం.. పట్టని యంత్రాంగం
జూన్ 28, 2024: జమ్మికుంట మండలం కోరపల్లిలో శ్రీమహాశక్తి ఆగ్రో ఇండస్ట్రీస్, ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లిలో శ్రీసీతారామ ఆగ్రో ఇండస్ట్రీస్ మిల్లుల్లో వెలుగుచూసిన రూ.130 కోట్ల ధాన్యం కుంభకోణం వ్యాపార లోకాన్నే నివ్వెరపరిచింది. మిల్లరు బండారు శారద రెండు మిల్లులు నిర్వహిస్తుండగా ఽప్రభుత్వమిచ్చిన ధాన్యాన్ని మరాడించి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా బ్లాక్ మార్కెట్కు తరలింలించారు. ఇటీవల హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లిలో రవిచంద్ర ఇండస్ట్రీస్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చేయగా 32,207 క్వింటాళ్ల ధాన్యం కనిపించలేదు. వీటి విలువ రూ.6.68 కోట్లు. బోర్నపల్లిలోని విజయకృష్ణ మోడర్న్ రైస్మిల్లులో 238.04 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం కనిపించడంతో అధికారులే కంగుతిన్నారు. ఇవి కేవలం మచ్చుకు మాత్రమే. జిల్లాలో ప్రభుత్వమిచ్చే ధాన్యంతో అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడున్నారు.కరీంనగర్ అర్బన్: రైస్మిల్లు ఉంటే చాలు పెట్టుబడి లేని దందా ఇది. ప్రభుత్వమిచ్చిన ధాన్యాన్ని మరాడించి బియ్యంగా ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా మాయం చేస్తున్నారు. లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని అప్పనంగా అమ్ముకుని రూ.వందల కోట్ల ఆస్తులు కూడబెట్టుకోగా ప్రభుత్వానికి మొండిచేయి చూపుతున్నారు. ఏటా ఈ దందా జోరుగా సాగుతుండగా అధికార యంత్రాంగం మొద్దునిద్ర నటిస్తోంది. కేసులు నమోదు చేసినా.. నోటీసులిచ్చినా ఎలాంటి జంకు లేకపోవడం.. కఠినశిక్షలు లేకపోవడమే కారణం. రాజకీయంగా ఏమైనా చేయగలమనే మ్మకంతో పాటు పలువురు నేతల హస్తం దన్నుగా నిలుస్తుంది. గతంలో పౌర సరఫరాల సంస్థ అధికారులు జమ్మికుంట మిల్లర్లపైనా కేసులు పెట్టగా, శంకరపట్నం మండలంలో ఒక మిల్లరును రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జిల్లాలో తనిఖీలు చేస్తుండగా కళ్లు బైర్లు కమ్మే అక్రమాలు నిగ్గు తేలుతుండగా అధికార యంత్రాంగ డొల్లతనాన్ని చాటుతోంది. కరీంనగర్కు చెందిన బడా వ్యాపారి కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. సీఎంఆర్తో మిల్లర్ల వ్యాపారం మిల్లు కట్టుకుంటే చాలు వ్యాపారం ప్రభుత్వమే ఇస్తుండటంతో పక్కదారి పట్టిస్తున్నారు అక్రమార్కులు. ప్రభుత్వమిచ్చే ధాన్యాన్ని మరాడించి అక్రమార్గంలో అమ్ముకుని సదరు లోటును రేషన్ బియ్యాన్ని కొనుగోలుచేసి భర్తీ చేస్తున్నారు. ఆయా సీజన్లలో ఇచ్చిన సుమారు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు అందించారు. ఇందులో 40 శాతానికిపైగా మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వాల్సి ఉంది. గడువుల మీద గడువు పొడిగించడంతో వీరి వ్యాపారానికి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. వృద్ధులం, వ్యాధిగ్రస్తులం.. మాపై పీడీ యాక్ట్ పెట్టలేరు. పెట్టేది 6ఏ కేసు. దాంతో ఒరిగిదేం లేదని మిల్లర్లు బహిరంగంగా పేర్కొనడం వ్యవస్తలోని లోపాలకు తార్కాణం. విల్లాలు.. ఎకరాల కొద్ది భూములు అక్రమాలకు రుచిమరిగిన మిల్లర్లు భారీగా ఆస్తులు కూడబెట్టారు. హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం వంటి పట్టణాల్లో విల్లాలు కొనుగోలు చేయగా ఉమ్మడి జిల్లాలో ఎకరాల కొద్ది భూములు కొనుగోలు చేశారు. అంటే ప్రభుత్వ సొమ్ముతో మిల్లర్లు భారీ ఎత్తున స్థిరాస్తులు పెంచుకుంటుండగా పాలకులు.. యంత్రాంగం పట్టించుకోకపోవడం విడ్డూరం. ఓ వ్యాపారి ప్రభుత్వ ధాన్యం అమ్ముకుని రూ.200ల కోట్లకుపైగా ఆస్తులను కూడబెట్టారంటే ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయో ఇట్టే అర్థమవుతుంది. చప్పుడు చేయని రైస్ మిల్లర్ల సంఘం ధాన్యం కేటాయింపులో రైస్మిల్లర్ల సంఘం మధ్యవర్తిత్వం వహిస్తుండగా సదరు సంఘం ప్రేక్షకపాత్ర పోషిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. ఏటా అక్రమాలు తారాస్థాయికి చేరుతుండగా లక్షల క్వింటాళ్ల ధాన్యం అమ్ముకున్నారని తేలుతుండగా రైస్మిల్లర్ల సంఘం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణం. అక్రమార్కులను సంఘం నుంచి బహిష్కరిస్తామని చెప్పడమే తప్ప ఆచరణలో విఫలమవుతుంది. జమ్మికుంట, హుజూరాబాద్, మానకొండూర్, సదాశివపల్లి, తిమ్మాపూర్, కరీంనగర్ రూరల్ చుట్టూ రైస్మిల్లులు ఎక్కువగా ఉన్నాయి. ప్రతీ వానకాలం, యాసంగి సీజన్లలో ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొంటున్న ప్రభుత్వం, పైసా ఖర్చులేకుండా మిల్లులకు కస్టం మిల్లింగ్ రైస్(సీఎంఆర్) పేరిట సరఫరా చేసుంది. మిల్లర్లు బియ్యాన్ని తిరిగి ఇవ్వకుండా నేరుగా ధాన్యాన్నే అమ్ముకొని సొమ్ము చేసుకునే స్థాయికి ఎదిగారు. గతంలో జమ్మికుంట, హుజూరాబాద్ ప్రాంతంలోని 7 మిల్లుల్లో తనిఖీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్కడ జరుగుతున్న తతంగాన్ని చూసి అవాక్కయ్యారు. లక్షల క్వింటాళ్ల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. జమ్మికుంటకు చెందిన ఓ మిల్లరు అక్రమాలను చూసి ఆశ్చర్యపోయారు. ఈ ఒక్క మిల్లులోనే దాదాపు నాలుగు లక్షల క్వింటాళ్లకు పైగా ధాన్యం లోటును గుర్తించారు. -
అప్పు కింద రెండెకరాలు సేల్డీడ్
ఇబ్రహీంపట్నం: అవసరం కోసం అప్పు తీసుకున్నందుకు ఉన్న భూమిని సేల్డీడ్ చేసుకున్నాడో వడ్డీ వ్యాపారి. సదరు వ్యాపారి బాధలు భరించలేక బాధితుడు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్లో చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ ఎలేటి సుజాత భర్త జనార్దన్ నాలుగేళ్ల క్రితం మెట్పల్లికి చెందిన ఓ వడ్డీ వ్యాపారి వద్ద రూ.5లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఏడాది తర్వాత వడ్డీకి వడ్డీ కలిపి మొత్తం చెల్లించాలని వ్యాపారి డిమాండ్ చేశాడు. లేకుంటే భూమి రిజిస్ట్రేషన్ చేయాలని బెదిరించాడు. దీంతో గ్రామశివారులో తనకున్న రూ.60లక్షల విలువైన 82 గుంటల భూమిని సేల్డీడ్ చేసి ఇచ్చారు. ఆ సమయంలో రూ.11 లక్షల అప్పు ఇచ్చినట్లు లెక్క చెప్పగా.. జనార్దన్ మాత్రం నెలనెలా వడ్డీ ఇచ్చినట్లు చెబుతున్నాడు. తన భూమి తనకు రిజిస్ట్రేషన్ చేస్తే డబ్బులు చెల్లిస్తానని జనార్దన్ చెప్పగా.. సదరు వ్యాపారి రూ.10 వడ్డీ చొప్పున లెక్క చేసి రూ.25 లక్షలు కట్టాలని డిమాండ్ చేశాడు. దీంతో జనార్దన్ శనివారం రాత్రి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన భార్య, కుటుంబసభ్యులు వెంటనే మెట్పల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు. ఈ విషయమై ఎస్సై అనిల్ను వివరణ కోరగా.. ఇప్పటివరకు ఫిర్యాదు అందలేదని తెలిపారు. మాజీ ఉప సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు -
టపాసులతో భద్రం
విద్యానగర్(కరీంనగర్): దీపావళి అంటేనే భిన్నమైన పండుగ. వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ బాణాసంచా కాల్చడానికి ఉత్సాహం చూపుతారు. కాగా అతి ఉత్సాహంలో టపాసులు కాల్చేటప్పుడు అజాగ్రత్తతో ప్రమాదాలను కోరి తెచ్చుకుంటూ ఆస్పత్రుల పాలవుతుంటారు. ముఖ్యంగా పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు జాగ్రత్తలు పాటించాలి. భారీ శబ్దాల బాంబులు ప్రస్తుతం దీపావళి అంటే బాంబులు, టపాసుల పేలుళ్లతో వీధులన్నీ దద్దరిల్లిపోతున్నాయి. హైడ్రోజన్, సుత్తిలీ, లక్ష్మి, శివాజీ, డబుల్ సౌండ్స్, త్రిబుల్ సౌండ్స్ వంటి పేర్లతో భారీ శబ్దాలు పుట్టించే బాంబులు తయారవుతున్నాయి. ఢాం.. ఢాం అంటూ పేలే బాంబుల మోతలతో చెవులు దిమ్మెక్కెతున్నాయి. పరిమితికి మించిన శబ్దాలను విని, కాలిన గాయాలకు చికిత్స కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగినా జరిగిన నష్టాన్ని పూడ్చుకోలేక జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. ఈ పరిస్థితులు రాకుండా తగిన జాగ్రత్తలతో పండుగను జరుపుకోవడం ఉత్తమం. టపాసులు కాల్చడంలో జాగ్రత్తలు – నాణ్యమైన బ్రాండ్లకు చెందిన బాణాసంచా కొనుగోలు చేయాలి. రాకెట్లు, ఆకాశంలోకి దూసుకెళ్లే టపాసులను గుడిసెలు, గడ్డివాములు లేని ప్రదేశాల్లో కాల్చాలి. – కాకరకొవ్వొత్తులు, విష్ణు చక్రాలు, భూచక్రాల వంటివి శరీరానికి దూరంగా ఉంచి కాల్చడం మంచిది. రాకెట్లు కాల్చేటప్పుడు వాటిని సీసాలో పెట్టి నిటూరుగా ఉండేలా సరి చూసుకోవాలి. కాటన్ దుస్తులు ధరించాలి. చిన్నారులు కాల్చేటప్పుడు పెద్దలు పక్కనే ఉండాలి.అత్యవసర ఫోన్ నంబర్లు ఫైర్ స్టేషన్ 101 అంబులెన్స్ 108 పోలీస్ కంట్రోల్ రూం 100 -
వెలుగుల దీప్తి.. ఆలోచనల స్ఫూర్తి
విద్యానగర్(కరీంనగర్): కోటి వెలుగుల కాంతి.. కొత్త ఆలోచనలకు స్ఫూర్తి దీపావళి. నిశీధి నిశ్శబ్దాన్ని బాణసంచాతో బెదరగొట్టి చిమ్మ చీకట్లను చెల్లాచెదురు చేసే ఆ సంబరం దీపావళికే సొంతం. వెలుగుల పండుగ ‘తమసోమా జ్యోతిర్గమయా’ అనే ఉపనిషత్ వ్యాక్యానికి ఆచరణరూపం దీపావళి. దీపావళి పర్వదినానికి యుగాల చరిత్ర ఉంది. ఇల్లంతటినీ దీపాలతో అలంకరించేది ఈ పండుగ రోజు మాత్రమే. ఆధునికత ఎంతో పెరిగినా దీపావళి రోజు ప్రమిదలో వత్తి వేసి నూనె పోసి ఆ దీపాల్నే వెలిగిస్తాం. ఇతర దేశాల్లో దీపావళి జపాన్లో కోరా నాగోషి పేరుతో దీపాల పండుగను పితృదేవతల సంస్మరణార్థం జరుపుతారు. చైనాలో హయివో హోవా పండుగలో పెద్ద ఎత్తున బాణసంచా పేలుస్తారు. నేపాల్లో ఆహారం ఐదురోజుల పండుగ. మొదటిరోజు కాకుల పండుగ, రెండోరోజు కోతుల పండుగ, మూడోరోజు ఆవుల పండుగ, నాల్గోరోజు దీపాలు వెలిగించి బాణసంచా పేలుస్తారు. చివరిరోజు ఆడపడుచుల పండుగ. ఇజ్రాయిల్ వారి స్వాతంత్య్ర వీరుడు మెకాచ్చిన్ స్మృత్యర్థం హనుకా అనే దీపోత్సవం జరుపుతారు. ఈజిప్టులో ఓ సిరీస్ మరణానికి చిహ్నంగా ఇంటింటా దీపాలు వేలాడగడతారు. అమెరికాలో నవంబరు 1న హాల్వీన్ అనే పేర దీపావళి వంటి పండుగ జరుగుతోంది. క్రైస్తవులు జరుపుకునే క్యాండిల్ ఫెస్టివల్ దీపావళి లాంటిదే. ముస్లిం దేశాల్లోనూ దీపావళి పండుగ ఉన్నది. మహ్మద్ పైగంబరు నూతన సంప్రదాయాన్ని స్థాపించి మక్కాకు తిరిగి వెళ్లిన రాత్రికది సూచిక. దీనిని షబ్ ఎ బారత్ అంటారు. ఆ రోజు బాణసంచా పేల్చారట. వివిధ రాష్ట్రాల్లో.. రాష్ట్రాల వారీగా దీపావళి గురించి చెప్పుకుంటే గుజరాత్లో లక్ష్మీపూజ, గణపతిపూజ, కర్నాటకలో బలిపాఢ్య పండుగ, బెంగాల్, ఒడిశాలో కాళీపూజ, శక్తిపూజ, ఇతర రాష్ట్రాల్లో గోవర్ధనపూజ, యమద్వితీయ, భయ్యదూజ్ పండుగలు దీపావళితోనే ముడిపడి ఉన్నాయి. దీపావళి ముందు రోజును నరక చతుర్దశిగా దీన్ని పిలుస్తున్నారు. చిమ్మచీకట్లను పారదోలే పండుగ నేడు దీపావళి -
స్వగ్రామానికి మృతదేహాలు
రామడుగు/మేడిపల్లి: ఉపాధి కోసం ఒకరు.. ఉన్నత చదువుల కోసం మరొకరు విదేశాలకు వెళ్లి.. ఇటీవల గుండెపోటుతో మృతిచెందగా, వారి మృతదేహాలను ఆదివారం స్వగ్రామాలకు తీసుకొచ్చారు. వివరాలు.. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్రావుపేట గ్రామానికి చెందిన ఎలగుందుల ప్రకాశ్ (35) కొద్దిరోజులుగా దుబాయ్లో కంపెనీలో కాకుండా కలివెల్లిగా జీవనం సాగించాడు. ఇటీవల గుండెపోటుతో మృతిచెందాడు. అతడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడం కష్టంగా మారింది. దీంతో కుటుంబ సభ్యులతోపాటు, బీఆర్ఎస్ నాయకులు పూడురి మల్లేశం, దుబాయి ఎల్లాల శ్రీనన్న సేవా సమితి సభ్యులు చిలుముల రమేశ్కు తెలిపారు. ఈక్రమంలో రమేశ్ సేవా సమితి అధ్యక్షుడు రవిడేవిడ్కు తెలియజేయడంతో దుబాయ్లోని ఇండియన్ అసోసియేషన్ వారితో మాట్లాడారు. దీంతో ప్రకాశ్ మృతదేహాన్ని ఆదివారం స్వగ్రామానికి తీసుకురాగా, పలువురు శ్రద్ధాంజలి ఘటించారు. ఉన్నత చదువుల కోసం వెళ్లి.. లండన్లో ఈనెల 3న గుండెపోటుతో చనిపోయిన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన ఏనుగు మహేందర్రెడ్డి (26) మృతదేహాన్ని ఆదివారం స్వగ్రామానికి తీసుకొచ్చారు. ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన మహేందర్రెడ్డి విగతజీవిగా మారడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతడి తండ్రి రమేశ్రెడ్డి కాంగ్రెస్ మేడిపల్లి మండల అధ్యక్షుడు కావడంతో పెద్దసంఖ్యలో ప్రజలు, ప్రముఖులు మహేందర్రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్నారు. -
గుండెజబ్బులవారు జాగ్రత్తగా ఉండాలి
దీపావళి పండుగలో ఎంత సరదా ఉందో ప్రమాదం కూడా అంతే ఉంది. గుండె జబ్బులున్న వారు భారీ శబ్దాలకు దూరంగా ఉండాలి. హార్ట్ అటాక్ వచ్చి కోలుకున్నవారు, పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ శబ్దాల వల్ల గుండె ఎక్కువగా కొట్టుకోవడం, బీపీ పెరగడం వంటివి ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. – డాక్టర్ జి.వెంకట్రెడ్డి, జనరల్ మెడిసిన్, కరీంనగర్ టపాసులు కాల్చే సమయంలో గాయమైతే వెంటనే కాలిన గాయాలపై నీరు పోయాలి. ఎందుకంటే టపాసుల్లో ఉండే రసాయనాలు రక్తంలో కలిసి మరింత ప్రమాదానికి దోహ దం చేస్తాయి. వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. బర్నాల్, సిల్వర్ సల్ఫైడెటేన్, ఫౌండేర్, అయోడిన్ లాంటి క్రిమ్లను దగ్గర ఉంచుకోవడం మంచిది. – డాక్టర్ వి.సుమన్చందర్రావు, చర్మవ్యాధుల నిపుణుడు, కరీంనగర్ మనిషి వినికిడి శక్తి 20 నుంచి 60 డెసిబుల్స్ మాత్రమే. ప్రస్తుతం లభిస్తున్న బాంబులు 100 నుంచి 180 డెసిబుల్స్ శబ్దం చేసేవి. ఒక వేళ చెవి నొప్పి వచ్చినా, చెవి నుంచి రక్తం వచ్చినా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. చెవిలో నీళ్లు, నూనె, ఇతర చెట్ల ఆకుల రసం పోయడం వంటివి చేయకూడదు. – డాక్టర్ సీహెచ్.రమణాచారి, ఈఎన్టీ నిపుణుడు, కరీంనగర్ -
ఖిలా చూసేందుకు వచ్చి.. ప్రమాదం బారిన పడి
శంకరపట్నం: శంకరపట్నం మండలం మొలంగూర్ ఖిలా సందర్శనకు వచ్చిన మధ్యప్రదేశ్కు చెందిన పర్యాటకురాలు అదుపుతప్పి పడిపోవడంతో కాలు విరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్కు చెందిన దంపతులు ఆరుమాసాలుగా వివిధ పర్యాటన ప్రదేశాలు సందర్శిస్తున్నారు. ఆదివారం మొలంగూర్ ఖిలాకు వచ్చారు. ఖిలా కింద దూద్బావిని పరిశీలించారు. ఖిలా పైకి వెళ్లి అందాలు వీక్షిస్తున్న క్రమంలో అదుపుతప్పి పడిపోయింది. కాలు విరగడంతో గ్రామానికి చెందిన 10మంది యువకులు పైకి వెళ్లి సుమారు మూడు గంటలపాటు కష్టపడి మహిళను కిందకు మోసుకొచ్చారు. 108లో హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు. మొలంగూర్ ఖిలాపై విరిగిన పర్యాటకురాలి కాలు -
జీపీ ట్రాక్టర్ అదుపుతప్పి కార్మికుడు మృతి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): గ్రామపంచాయతీ ట్రాక్టర్ అదుపుతప్పి కరెంట్ స్తంభానికి ఢీకొని జీపీ కార్మికుడు మృతిచెందిన ఘటన తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామంలో జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. బస్వాపూర్లో శనివారం రాత్రి జీపీ ట్రాక్టర్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనగా, ట్రాక్టర్పైన ఉన్న మల్టీపర్పస్ వర్కర్ దాచారం భూమయ్య (55), గొడిసెల అనితకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను పంచాయతీ కార్యదర్శి వేణు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం భూమయ్యను కరీంనగర్ తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అనితకు సిరిసిల్లలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా మృతుడు భూమయ్యకు ఇద్దరు భార్యలు, కూతురు ఉన్నారు. నిరుపేద కుటుంబం కావడంతో గ్రామస్తులు చందాలు పోగుచేసి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ దొంగ టార్గెట్ వృద్ధులే!
ధర్మారం(ధర్మపురి): ఒంటరిగా కనిపించిన వృద్ధ మహిళలను టార్గెట్ చేస్తూ మాయమాటలు చెప్పి ఆభరణాలు అపహరిస్తున్న అంతర్జిల్లా దొంగను ఎస్సై ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన ఓల్లెపు కృష్ణను ధర్మారంలోని గణేశ్నగర్ మెడికల్ ఏజెన్సీ వద్ద అరెస్ట్ అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. స్థానిక పోలీస్స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దపల్లి సీఐ ప్రవీణ్కుమార్ వివరాలు వెల్లడించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడిన కృష్ణ ఈనెల 10న కూరగాయల కోసం ధర్మారంలోని అంబేడ్కర్ చౌరస్తా వైపు వస్తున్న బుధారపు శంకరమ్మను కలిశాడు. పింఛన్ డబ్బులు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. సమీపంలోని గాయత్రి బ్యాంకు ఎదురుగా ఉన్న గల్లీలోకి తీసుకెళ్లి మెడలోని రెండు తులాల బంగారు పుస్తెలతాడును ఎత్తుకెళ్లాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ధర్మారంలో నిదితుడు సంచరిస్తున్నాడనే సమాచారంతో వలపన్ని పట్టుకున్నారు. గతజూలై 31న ధర్మపురిలోని నందిచౌరస్తా వద్ద వృద్ధురాలికి తను పంచాయతీ కార్యదర్శిగా పరిచయం చేసుకుని పింఛన్ ఇప్పిస్తానని నమ్మించి ఆమె మెడలోని రెండు తులాల చైన్ దొంగలించాడు. ఈమేరకు కృష్ణ నుంచి రెండు తులాల బంగారు గొలుసు, మరోకేసులో 30వేల విలువైన సొ త్తు స్వాధీనం చేసుకున్నారు.కేసును ఛేదించిన ఎ స్సై ప్రవీణ్కుమార్ను ఏసీపీకృష్ణ అభినందించారు. నిందితుడిపై 96 కేసులు.. నిందితుడు ఓల్లెపు కృష్ణపై కరీంనగర్, సిద్దిపేట, పెద్దపల్లి, జగిత్యాల, ముస్తాబాద్, బెజ్జంకి, తంగళ్లపల్లి, ఆర్మూర్, కీసర, హసన్పర్తి, సుబేదారి, పరకాల, కామారెడ్డి, బాన్సువాడ ప్రాంతాల్లో సుమారు 96 కేసులు నమోదైనట్లు సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన కృష్ణ కరీంనగర్లోని మారుతీనగర్లో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. తన అవసరాల కోసం మళ్లీ దొంగతనాలకు పాల్పడతున్నాడు. ఒంటరిగా కనిపిస్తే చాలు మాయమాటలు ఆ తర్వాత నిలవుదోపిడీ చేస్తూ ఉడాయింపు అంతర్జిల్లా దొంగ అరెస్టు వారం రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులు -
సంతోషంగా ఉన్నాం
నేను 2008లో యూఎస్ ఏ వెళ్లాను. టెక్సాస్ స్టే ట్లోని డల్లాస్లో ఒక కంపెనీలో సీనియర్ సాఫ్ట్వేర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగాలేని సమయంలో అతి కష్టం మీద ఇక్కడికి వచ్చాను. ఇద్దరు అమ్మాయిలు. ఇప్పుడు ఆర్థికంగా స్థిరపడ్డాం. – కె.వంశీధర్రెడ్డి, యూఎస్ఏ 2018లో అమెరికాకు వెళ్లా ను. నా భార్య సరిత, నేను ఒకే కంపెనీలో పనిచేస్తున్నాం. మాకు ఒక కూ తురు. నార్త్ కరోలినా స్టే ట్లోని కెరీలో ఉంటున్నా ము. ఆర్థికంగా స్థిరపడ్డాం. సంతోషంగా ఉంది. – కాట్నపల్లి గోపాల్రెడ్డి నేను ఆస్ట్రేలియాకు 2017 లో వెళ్లాను. ఎన్ఐటీ పూర్తి చేసి సాఫ్ట్వేర్గా స్థిరపడ్డాను. మెల్బోర్న్లో ఉంటున్నాను. మా ది వ్యవసాయ కుటుంబం. – కొమ్ముల మహేందర్రెడ్డి నేను 2023లో లండన్ వెళ్లాను. ఇక్కడ ఎంబీఏ పూ ర్తి చేశాను. ప్రైవేట్ కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నాను. ఇక్కడ ఉద్యోగం చేయడం సంతోషంగా ఉంది. – గుర్రం అజయ్రెడ్డి -
ఉత్సవాలను ఏటా నిర్వహిస్తాం
పూర్వీకులు నుంచి దండారీ ఉత్సవాల నిర్వహణకు కృషి చేస్తున్నాం. ఈ ఉత్సవాలను దీపావళి సందర్భంగా ఏటా ఘనంగా నిర్వహిస్తాం. వారంపాటు ఉపవాస దీక్షలతో పూజలు చేస్తాం. వచ్చినవారికి సదుపాయాలు కల్పిస్తూ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్నాం. – భీంరాావ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, జగన్నాథ్పూర్ దండారి ఉత్సవాల సందర్భంగా గిరిజనుల్లో సమైక్యత పెంపొందుతుంది. మా గ్రామానికి నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల నుంచి దండారి ఉత్సవాల కోసం వారం రోజుల పాటు రావడంతో ఐక్యత పెరగడంతోపాటు వివాహ బంధాలకు వేదికగా మారుతుంది. – సిడెం భీం, మాజీ సర్పంచ్, జగన్నాథ్పూర్ దీపావళి అంటేనే గిరిజనుల్లో దండారీ గుర్తుకువస్తుంది. వారంపాటు పండగ వాతావరణం నెలకొంటుంది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుంచి గిరిజనులు మా గ్రామానికి రావడంతోపాటు మేం కూడా తిరిగి వారి ప్రాంతాలకు వెళ్లి దండారి ఉత్సవాల్లో పాల్గొంటాం. – ఆత్రం భీర్సాబ్, గ్రామ నాయకుడు -
ఉరేసుకుని ఐటీఐ విద్యార్థి ఆత్మహత్య
హుజూరాబాద్: హుజూరా బాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి ఇందిరానగర్ కాలనీలో నివాసం ఉంటున్న మోరె రిషి(20)శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రిషి జమ్మికుంటలోని ఓ ప్రైవేటు ఐటీఐ కళాశాలలో ఫైనలియర్ చదువుతున్నాడు. ఏదో విషయంలో మానస్తాపానికి గురై ఇంట్లోని ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికందిన కొడుకు మృతి చెందటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు విచారణ జరుపుతున్నారు. జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మధ్యాహ్నం చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. వ్యక్తి వయస్సు సుమారు 45 ఏళ్లు ఉంటుందని, పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తుపట్టినట్లయితే జగిత్యాల పోలీసులను సంప్రదించాలని సూచించారు. రామడుగు: తాగునీటి సమస్యను పరిష్కరించాలని రామడుగు మండలం వెలిచాల గ్రామ పంచాయతీ పరిధిలోని పదోవార్డు ప్రజలు శనివారం ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. పంచాయతీ కార్యాలయం గేటుకు తాళం వేసి ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నప్పటికీ, తమ కాలనీకి సరఫరా చేయడం లేదన్నారు. పంచాయతీ కార్యదర్శికి వ్యతిరేకంగా నినా దాలు చేశారు. విషయం తెలుసుకున్న గ్రామ ప్రత్యేకాధికారి, ఎంపీవో శ్రావణ్కుమార్ గ్రామస్తులతో మాట్లాడి, తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని చెప్పడంతో ఆందోళన విరమించారు. మల్యాల: తన తండ్రిని తిడుతున్నాడని ఓ మైనర్ ఒకరిపై కత్తితో దాడి చేసిన సంఘటన మల్యాల మండలం రాజారాం గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై నరేష్కుమార్ కథనం ప్రకారం.. గ్రామంలో శుక్రవారం రాత్రి అదే గ్రామానికి చెందిన బక్కశెట్టి రాకేశ్ ఇంటి నుంచి బయటకు వెళ్లి బక్కశెట్టి తిరుపతి ఇంటి ఎదుట కూర్చొని ఇరువురు మాట్లాడుకుంటున్నారు. ఆ చర్చ వాదనగా మారింది. రాకేశ్ తన తండ్రిని తిడుతున్నాడని తిరుపతి కుమారుడు ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకొచ్చి రాకేశ్పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాకేశ్ను 108లో ఆస్పత్రికి తరలించారు. బాధితుడి నానమ్మ బక్కశెట్టి బూదమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
సంజీవ్ కుటుంబానికి అండగా ఉంటాం
జూలపల్లి(పెద్దపల్లి): హైదరాబాద్లో గుండెపోటుతో హఠాన్మరణం చెందిన జూలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీ) చైర్మన్ గండు సంజీవ్(50) స్వగ్రామం కాచాపూర్లో శనివారం నిర్వహించారు. జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ సొంత పనుల కోసం హైదరాబాద్ వెళ్లారు. అక్కడే గుండెపోటుకు గురవడంతో వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పార్థివదేహాన్ని స్వగ్రామం కాచాపూర్ తీసుకొచ్చారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తదితరులు కాచాపూర్ చేరుకని పార్థివ దేహానికి నివాళి అర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. అంతిమయాత్ర సందర్భంగా మంత్రి లక్ష్మణ్కుమార్ పాడే మోశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్సింగ్, ధూళికట్ట పీఏసీఎస్ చైర్మన్ వేణుగోపాలరావు, సుల్తానాబాద్ మాజీ జెడ్పీటీసీ ప్రకాశ్రావు, మాజీ సర్పంచులు నర్సింహయాదవ్, ఆడప లక్ష్మణ్, బంటు ఎల్లయ్య, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు తదితరులు హాజరయ్యారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ కాచాపూర్లో ఏఎంసీ చైర్మన్ అంత్యక్రియలు పాడె మోసిన మంత్రి లక్ష్మణ్కుమార్ హాజరైన ఎమ్మెల్యే విజయరమణారావు -
‘సాక్షి’పై కక్ష సాధింపు తగదు
కరీంనగర్: సాక్షి మీడియాపై ఏపీ ప్రభుత్వ కక్ష సాధింపు తగదని, దాడులను తిప్పికొట్టే సమయం వచ్చిందని జర్నలిస్టులు స్పష్టం చేశారు. సాక్షి దినపత్రికపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రతీ పాత్రికేయుడు ధైర్యంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణచౌక్లో టీయూడబ్ల్యూజే(ఐజేయూ), సాక్షి మీడియా ప్రతినిధుల ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం చూపిస్తున్న దమనకాండను తీవ్రంగా ఖండిస్తూ నినాదాలతో హోరెత్తించారు. ఐజేయూ జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొయ్యడ చంద్రశేఖర్, సాక్షి బ్యూరో ఇన్చార్జి బి.అనిల్కుమార్ మాట్లాడుతూ నకిలీ మద్యం, అవినీతి, ప్రజాసమస్యలపై వాస్తవాలను వెలుగులోకి తెస్తూ సాక్షి ప్రజాస్వామ్య బాధ్యతను నిర్వర్తిస్తోందన్నారు. ఇలాంటి ధైర్యవంతమైన జర్నలిజాన్ని అణచివేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కుట్రపూర్వకంగా కేసులు నమోదు చేస్తోందని మండిపడ్డారు. ఇది మీడియా స్వేచ్ఛపై దాడి అన్నారు. సాక్షిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు ఏలేటి శైలేందర్రెడ్డి, రాజశేఖర్, సంపత్, రమణ, సతీశ్, గోపాలకృష్ణ, విజేందర్రెడ్డి, సతీశ్, కవికుమార్, వినయ్, సుధీర్, సుమంత్, నర్సింగ్, రాధాకృష్ణ, కిరణ్, మంద శ్రీనివాస్, ఆది రమణారావు, సిలివేరి మహేందర్, కొత్త సత్యం, పసుపులేటి శ్రీనివాస్, శ్రీనివాస్, మారుతి, బాలయ్య, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
వైద్యులు పనితీరు మార్చుకోవాలి
కరీంనగర్: ప్రభుత్వాసుపత్రులకు వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ పనితీరు మెరు గు పరుచుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడేతో కలిసి జిల్లా వైద్యశాఖ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీహెచ్సీల వారీగా ప్రసవాలు, ఎన్ఆర్సీ రిపోర్ట్, ఆరోగ్య మహిళ, ఎన్సీడీ రిపోర్ట్, డెంగీ కేసులు, శుక్రవారం సభ, టీబీ కేసులు, వ్యాక్సినేషన్, ఓపీ, ఐపీ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తిస్థాయిలో ఇమ్యునైజేషన్ పూర్తి కాకపోవడం, ప్రసవాల సంఖ్య తగ్గడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిక్షయ్ పోర్టల్లో టీబీ వ్యాధిగ్రస్తుల వివరాలను నమోదు చేయిస్తే ప్రభుత్వ సాయం అందుతుందని పేర్కొన్నారు. పీహెచ్సీల్లో జరిగిన ప్రసవాలు, వైద్యం పొందిన రోగుల సంఖ్యతో నోటీసు బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఆరేళ్ల లోపు చిన్నారులకు దగ్గు మందు రాయవద్దని సూచించారు. డీఎంహెచ్వో వెంకటరమణ, పీవో సనా పాల్గొన్నారు. -
అభిప్రాయం గోప్యం!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: సంస్థాగత ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభిప్రాయ సేకరణ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శనివారంతో ముగిసింది. అభిప్రాయ సేకరణ సందర్భంగా కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో చోటుచేసుకున్న రభసతో పరిశీలకులు రూటు మార్చారు. ఓ హోటల్లో రహస్యంగా అభిప్రాయాలను సేకరించారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల డీసీసీ అధ్యక్ష, కరీంనగర్, రామగుండం సిటీ అధ్యక్ష స్థానాల ఆశావహుల నుంచి చివరిరోజు అభిప్రాయాలు తీసుకున్నారు. అభిప్రాయ సేకరణ ప్రక్రియ ముగియడంతో, నివేదికను అధిష్టానానికి అందించనున్నారు. ఆరు రోజులుగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక మొదటిసారిగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ‘పార్టీశ్రేణుల అభిప్రాయాల మేరకే ఎంపిక’ విధానాన్ని తెలంగాణలోనూ ప్రవేశపెట్టింది. ఏఐసీసీ పరిశీలకుడిగా శ్రీనివాస్ మన్నె, పీసీసీ నుంచి ఆత్రం సుగుణ, చామల కిరణ్కుమార్రెడ్డి, ఖాజాఫకృద్దీన్ను నియమించింది. ఈ నెల 13వ తేదీ నుంచి ఉమ్మడి జిల్లాలో ఏఐసీసీ, పీసీసీ పరిశీలకులు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణుల అభిప్రాయాలను సేకరించారు. ఒక్కో నియోజకవర్గానికి వెళ్లి అక్కడ నాయకులను కలిసి ఎవరిని అధ్యక్షుడిని చేస్తే బాగుంటుందో తెలుసుకున్నారు. రూటు మార్చి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ అభిప్రాయ సేకరణ సందర్భంగా డీసీసీ కార్యాలయంలో ఆశావహు ల ఆధిపత్యపోరు రసాభాసకు దారితీయడం తెలి సిందే. నాయకుల నడుమ వాగ్వాదాలు, పాత, కొత్త నేతల పంచాయతీ, పోటాపోటీగా జనసమీకరణ, ఉద్రిక్తతల నేపథ్యంలో పూర్తిస్థాయిలో అభిప్రాయాలు చేపట్టకుండానే పరిశీలకుడు వెనుదిరగాల్సి వచ్చింది. కరీంనగర్ అనుభవంతో, పరిశీలకులు రూటు మార్చారు. శుక్ర, శనివారాల్లో రహస్యంగా అభిప్రాయాలు తీసుకున్నారు. అధ్యక్ష స్థానాలకు పోటీపడుతున్న నాయకులు, పార్టీ పదవులున్న నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా ప్రతినిధులను పిలిచి అభిప్రాయలు సేకరించారు. శనివారం ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి కూడా కరీంనగర్లోని అభిప్రాయ సేకరణలో పాల్గొన్నారు. ఎన్ని రోజులకో.. ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా పార్టీ శ్రేణుల అభిప్రాయాలు సేకరించిన పరిశీలకులు త్వరలో అధిష్టానానికి నివేదిక అందించనున్నారు. నాలుగు జిల్లాల అధ్యక్షులు, రెండు నగర అధ్యక్షుల ఎంపికకు అభిప్రాయ సేకరణ జరగగా, పరిశీలకులు ఇచ్చే నివేదికపైనే ఆశావహుల భవితవ్యం ఆధారపడి ఉంది. పార్టీ శ్రేణుల అభిప్రాయాలతో పాటు, మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యం ఉండే అవకాశముంది. పార్టీ పదవులు ఉన్న వారి నుంచి ఎక్కువగా అభిప్రాయాలు సేకరించడంతో, ఆ అభిప్రాయాలు పాత నాయకులకు అనుకూలమనే ప్రచారం ఉంది. నివేదికను అధిష్టానానికి ఎప్పుడు ఇస్తారు, డీసీసీలను ఎప్పుడు ప్రకటిస్తారో, ఈ మొత్తం ప్రక్రియ ఇంకెన్ని రోజులు పడుతుందో అనే చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. పార్టీ చేపట్టిన అభిప్రాయ సేకరణను పూర్తిస్థాయిలో పరిగణలోకి తీసుకొంటారా, సామాజిక, ఆర్థిక సమీకరణల కారణంగా నియామకాలు చేపడుతారో వేచి చూడాలి.కరీంనగర్ 38 జగిత్యాల 36 రాజన్న సిరిసిల్ల 16 పెద్దపల్లి 25 కరీంనగర్ సిటీ 24 రామగుండం సిటీ 05 -
బీసీ బంద్ సక్సెస్
కరీంనగర్/కరీంనగర్టౌన్: బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. కరీంనగర్లో బీసీ సంఘాలకు మద్దతుగా పలు కుల, సామాజిక సంఘాలు, పార్టీల నేతలు ఉదయం నుంచి ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఆర్టీసీ ముందస్తుగా బస్సులను నిలిపివేసింది. బస్టాండు ప్రయాణికులు లేక బోసిపోయింది. టవర్ సర్కిల్లో దుకాణాలు మూసివేశారు. నగరంలోని పలుచోట్ల కొన్ని దుకాణాలు, హోటళ్లు తెరువగా వాటిని మూయించారు. బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. పలుచోట్ల ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, పొనగంటి కేదారి, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, సురేందర్ రెడ్డి, ఏఐఎఫ్బీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్. ఆల్ ఇండియా యూత్ లీగ్ రాష్ట్ర కన్వీనర్ రావుల ఆదిత్య, అంబటి జోజిరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, ఆటో సంఘం అధ్యక్షుడు మద్దెల రాజేందర్, నాయీబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు నీలం మొండయ్య తదితరులు పాల్గొన్నారు.నిర్మానుష్యంగా బస్టాండ్ ప్రాంతంనగరంలో మూసిఉన్న దుకాణాలు -
లాస్ట్డే పోటెత్తిన లిక్కర్ దరఖాస్తులు
కరీంనగర్క్రైం: రాష్ట్ర ప్రభుత్వం 2025– 27 సంవత్సరానికి ప్రవేశపెట్టిన మద్యం టెండర్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. చివరిరోజు దరఖాస్తులు పోటెత్తగా.. జిల్లాలోని ఎకై ్సజ్ కార్యాలయాల్లో అర్ధరాత్రి దాటినా ప్రక్రియ కొనసాగింది. గతనెల 26న ఆబ్కారీశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇన్ని రోజులు ఆచితూచి వ్యవహరించిన మద్యం వ్యాపారులు చివరిరోజు గ్రూపులుగా మారి టెండర్లు వేశా రు. దీంతో మొత్తం దరఖాస్తుల్లో సగం చివరిరోజే పడ్డాయి. గతేడాది కన్నా తక్కువే టెండర్లు దాఖలు కాగా.. దరఖాస్తు ఫీజును రూ.3లక్షలకు పెంచడమే ప్రధాన కారణమని పలువురు చెబుతున్నారు. గతేడాది జిల్లావ్యాప్తంగా మొత్తం 4,040 టెండర్లు దాఖ లు కాగా.. ప్రభుత్వానికి రూ.80.80 కోట్ల ఆదా యం సమకూరింది. ఈసారి శనివారం అర్ధరాత్రి వరకు 2,519 దరఖాస్తులు వచ్చాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. టెండర్ల సంఖ్య తగ్గినా ఆదాయం సమకూరడంతో ఆబ్కారీవర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఈనెల 23న లక్కీ డ్రా తీయనున్నారు. కరీంనగర్లో టెండర్ల ప్రక్రియను స్పెషల్ ఆఫీసర్, ఎకై ్సజ్శాఖ జాయింట్ కమిషనర్ సురేశ్ రాథోడ్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు పరిశీలించారు. చివరిరోజు సిండికేట్? ఈ సారి దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలుగా నిర్ణయించడంతో, కొత్తవారు టెండర్ వేసేందుకు ధైర్యం చేయలేకపోయారు. టెండర్ ఫీజు పెంచడం లిక్కర్ కింగ్లకు కలిసొచ్చిందని పలువురు అనుకుంటున్నారు. ఇప్పటికే మద్యం వ్యాపారంలో కొనసా గుతున్నవారు ఫీజుకు భయపడకుండా, చివరిరోజు గ్రూపులుగా ఏర్పడి పెద్దఎత్తున దరఖాస్తులు సమర్పించినట్లు సమాచారం. టెండర్లో తాము కోరుకున్న వైన్స్లు దక్కితే లిక్కర్కింగ్లు సెలెంట్గా ఉంటారని, లేదంటే ఆయాస్థానాల్లో ఇతరులు దక్కించుకున్న వైన్స్లను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చర్చ జరుగుతోంది.సర్కిల్ వైన్స్లు దరఖాస్తులు కరీంనగర్ అర్బన్ 21 699 కరీంనగర్ రూరల్ 26 743 తిమ్మాపూర్ 14 443 హుజూరాబాద్ 17 337 జమ్మికుంట 16 297 మొత్తం 94 2,519 -
ఆపదలో గల్ఫ్ వలస జీవి
● స్వగ్రామంలో కుటుంబీకుల ఆందోళన ● కోమాలోకి వెళ్లిన బడుగుజీవిముస్తాబాద్(సిరిసిల్ల): కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను వదిలి ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన బడుగుజీవి కోమాలోకి వెళ్లిన సంఘటన స్వగ్రామంలోని భార్యపిల్లలను ఆవేదనకు గురిచేస్తోంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. ముస్తాబాద్ మండలం గూడెంకు చెందిన శివరాత్రి మధు ఏడాది క్రితం దుబాయ్ దేశానికి కూలీ పనులకు వెళ్లాడు. అక్కడ కొద్దిరోజులు పనిచేసిన మధు అనుకోకుండా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తెలుగువారు మధును ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతుండగానే మధు కోమాలోకి వెళ్లాడు. దీంతో స్వగ్రామంలో ఉన్న భార్య సువర్ణ భర్తను కాపాడుకునేందుకు అప్పు చేసి చికిత్సకు డబ్బులు పంపింది. మధు ఆరోగ్యం క్షీణించడంతో స్వగ్రామానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిని సంప్రదిస్తే మధుకు మెరుగైన చికిత్స అందించాలంటే రూ.6లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారని భార్య సువర్ణ తెలిపింది. అంత డబ్బు తమ వద్ద లేదని వాపోయింది. మధుకు ముగ్గురు కుమార్తెలు నవ్య, రాణి, ప్రియాంక. తమ కుటుంబానికి పెద్ద దిక్కును కాపాడాలని భార్య, పిల్లలు వేడుకుంటున్నారు. సనాతన ధర్మ రక్షణతోనే మానవాళికి మేలుమల్యాల: సనాతన ధర్మ పరిరక్షణతోనే విశ్వమానవాళికి మేలు చేకూరుతుందని, ఆలయాల రక్షణకు దత్తగిరి మహరాజ్ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు సాగుతోందని సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతులు తెలిపారు. అవదూతగిరి మహరాజ్, మహంత్ సిద్దేశ్వరానందగిరి మహరాజ్ ఆధ్వర్యంలో పీఠాధిపతులు కొండగట్టులోని శ్రీఆంజనేయస్వామి ఆలయాన్ని శనివారం సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు, అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పురాతన ఆలయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గురువులు, తల్లిదండ్రులను గౌరవించి, పూజించాలన్నారు. ఆలయ అర్చకులు పీఠాధిపతులను సన్మానించారు. ఆలయ ఈవో శ్రీకాంత్రావు, ప్రధాన అర్చకులు రామకృష్ణ, రఘు, స్థానాచార్యులు కపీందర్ స్వామి, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి, ఆలయ పర్యవేక్షకులు సునీల్కుమార్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. నృసింహుడి సన్నిధిలో.. ధర్మపురి: అనంతరం పీఠాధిపతులు ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. వారికి ఆలయం పక్షాన పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ చైర్మన్ రవీందర్ స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు. -
అందరి అభిప్రాయం ముఖ్యమే..
కరీంనగర్ కార్పొరేషన్: పార్టీ శ్రేణుల అభిప్రాయాల మేరకే డీసీసీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందని పీసీసీ పరిశీలకుడు, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. శనివారం నగరానికి వచ్చిన ఆయన, డీసీసీ కార్యాలయంలో ఏఐసీసీ పరిశీలకుడు శ్రీనివాస్తో కలిసి అభిప్రాయ సేకరణలో పాల్గొన్నారు. కిరణ్కుమార్రెడ్డికి డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారా యణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు సత్తు మల్లేశం, సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి స్వాగతం పలికారు. వాకింగ్ ట్రాకా.. హైవే రోడ్డా!కరీంనగర్ కార్పొరేషన్: అధికారులు కళ్లు మూ సుకుంటే, కాంట్రాక్టర్లు చెలరేగిపోతారనడానికి నగరంలోని స్మార్ట్సిటీ పార్క్లే నిదర్శనం. జ్యో తిబాపూలే పార్క్ నిర్వహణను ప్రైవేట్ కాంట్రాక్ట్ ఏజెన్సీకి నగరపాలకసంస్థ అప్పగించింది. సదరు ఏజెన్సీ నిబంధనలు ఉల్లంఘించి, ఇష్టారీతిన వ్యవహరిస్తుండడం గతంలోనూ వివాదాస్పదంగా మారింది. తాజాగా వాకింగ్ ట్రాక్పై ఏకంగా కార్లు నడుపుతున్నా, నగరపాలకసంస్థ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. జ్యోతి బా పూలే పార్క్లో టపాసుల దుకాణాలు ఏర్పా టు చేయడంతో, కొనుగోలుదారులు అధికసంఖ్యలో వస్తున్నారు. శనివారం పార్క్లోని వాకింగ్ ట్రాక్పై ఏకంగా కారు నడిపించడం కనిపించింది. ఓ వైపు వాకర్స్ నడుస్తుండగానే, కారు ట్రాక్పై పోనీయడం గమనార్హం. వాకర్స్ కోసమే మల్టీపర్పస్, జ్యోతిబా పూలే పార్క్ల్లో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేశారు. వాకింగ్ ట్రాక్పై వాహనలు నడిపించడంపై వాకర్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.నవోదయ గడువు పొడిగింపుచొప్పదండి: పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో తొమ్మిది, పదకొండో తరగతిలో 2026– 27 విద్యా సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్లభర్తీకి అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకొనేందుకు చివరి తేదీని ఈనెల 23 వరకు పొడిగించినట్లు ఇన్చార్జి ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు, తొమ్మిదోతరగతి కోసం, పదోతరగతి చదువుతున్న విద్యార్థులు పదకొండో తరగతిలో ప్రవేశానికి అర్హులని తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసినవారు, ఏవైనా సవరణలు చేయడానికి ఈ నెల 24 నుంచి 26వరకు కరెక్షన్ విండో తెరవబడి ఉంటుందని తెలిపారు. విద్యార్థులు నవోదయ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. బీసీలపై కాంగ్రెస్ది కపట ప్రేమకరీంనగర్: కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ నేడు బీసీలపై కపట ప్రేమను ప్రదర్శిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్రావు శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిరసనగా చేపట్టిన బీసీ బంద్కు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఓబీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా ఇచ్చి చరిత్ర సృష్టించిందన్నారు. కులగణనపై మోడీ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని, 75 ఏళ్ల తర్వాత దేశంలో 2027లో జరగబోయే దేశ జనగణన పూర్తిగా రాజ్యాంగబద్ధంగా, శాసీ్త్రయ పద్ధతిలో, డిజిటల్ ఆధారాలతో నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. పశువులకు ఆపదా.. టోల్ఫ్రీ నంబర్ 18004252244కరీంనగర్ అర్బన్: అత్యవసర పశువైద్యానికి జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి డా.నల్ల లింగారెడ్డి ప్రత్యేక నంబర్ను ఏర్పాటు చేశారు. పాడి సంపదను పరిరక్షించాలనే ఉద్దేశంతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పశువులకు అత్యవసర వైద్యం అందేలా టోల్ ఫ్రీ 18004252244 నంబర్ను ఏర్పాటు చేశారు. శనివారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. ఈ నంబర్ కేవలం అత్యవసర వైద్యానికేనని, సాధారణ వైద్యానికి వినియోగించవద్దని డాక్టర్ లింగారెడ్డి వివరించారు. -
కరీంనగర్
వాతావరణం ఆకాశం మేఘావృతమవుతుంది. వర్షం కురిసే అవకాశం తక్కువగా లేదు. చలి తీవ్రత పెరుగుతుంది. ఎండగా ఉంటుంది.9అంజన్న సన్నిధిలో సందడి మల్యాల: కొండగట్టు అంజన్న ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కోనేరులో స్నానమాచరించి, స్వామిని దర్శించుకున్నారు.పవర్ కట్ ప్రాంతాలుకొత్తపల్లి: చెట్ల కొమ్మల తొలగింపు నేపథ్యంలో ఆది వారం ఉదయం 9 నుంచి 1.30 గంటల వరకు 33/11 కె.వీ.కొత్తపల్లి సబ్స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి, రాణిపూర్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. -
అమెరికాకు నౌకలో వెళ్లాను
ముస్కానిపేట నుంచి మొదటిసారిగా 1961లో అమెరికాకు వెళ్లాను. చేతిలో కొంత డబ్బు ఉండడంతో విశాఖపట్నంలో నౌక ఎక్కి అమెరికాకు వెళ్లాను. అమెరికా యూనివర్సిటీలో స్కాలర్షిప్ వచ్చింది. ఉద్యోగంలో స్థిరపడ్డాను. తిరిగి ఐదేళ్లకు గ్రామానికి రాగా డప్పుచప్పుళ్లతో గ్రామస్తులు స్వాగతం పలికారు. ఇద్దరు తమ్ముళ్లు బాపురెడ్డి, మోహన్రెడ్డిలను అమెరికాకు తీసుకెళ్లాను. నాకు ఇద్దరు కూతుళ్లు. అమెరికాలో స్థిరపడ్డారు. మా కుటుంబంలో అందరికీ గ్రీన్కార్డ్స్ ఉన్నాయి. కనెక్టికట్ స్టేట్లో నివాసం ఉంటున్నాం. మా తమ్ముడు బాపురెడ్డిని ఇల్లంతకుంట మండలంలో అమెరికా బాపురెడ్డి అని పిలుచుకుంటారు. – కోమటిరెడ్డి నరసింహారెడ్డి -
ముస్కానిపేట డాలర్ల పంట
ఇల్లంతకుంట(మానకొండూర్): అది పేరుకే పల్లెటూరు. ఆ ఊరిలోని యువత దారి అమెరికా, యూరప్ దేశాలు. దాదాపు ప్రతీ ఇంటిలో ఉన్నత విద్యావంతుడు ఉంటారు. ఇప్పటికే 34 మంది విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా స్థిరపడగా.. గ్రామంలోనే ఉంటున్న 17 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకున్న నేటి యువత ఉన్నత చదువులు.. విదేశాల్లో కొలువులే లక్ష్యంగా హైదరాబాద్, బెంగళూర్ నగరాల్లో చదువుకుంటున్నారు. కుగ్రామం ముస్కానిపేట విజయగాథపై సండే స్పెషల్. ముస్కానిపేట గ్రామం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అమెరికాకు వెళ్లిన మొట్టమొదటి వ్యక్తిగా ఇల్లంతకుంట మండలంలోని ముస్కానిపేటకు చెందిన కోమటిరెడ్డి నరసింహారెడ్డి గుర్తుకొస్తారు. 1954లో గ్రామపంచాయతీగా ఏర్పడ్డ ముస్కానిపేటలో 3,625 మంది జనాభా నివసిస్తున్నారు. మండల కేంద్రం ఇల్లంతకుంటకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గ్రామంలో అతి పురాతనకాలం నాటి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆధ్యాత్మికతను పంచుతుండగా.. గ్రామం మొదట్లో దేవతామూర్తుల చిత్రాలతో ఆర్చి స్వాగతం పలుకుతుంటుంది. గ్రామం నుంచి అమెరికాకు వెళ్లిన వారు 11 మంది, లండన్లో ఇద్దరు, ఆస్ట్రేలియాలో ఒకరు, ఇండియాలో 21 మందితో కలిపి 34 మంది సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారు. కె.లక్ష్మారెడ్డి అనస్తీషియా డాక్టర్గా యశోద ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారు. బద్దం అనిల్, సారా నరేశ్గౌడ్, సింగిరెడ్డి రమణారెడ్డి వివిధ బ్యాంకుల్లో మేనేజర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. గ్రామంలో 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా ఇటీవల ఏడుగురు ఉద్యోగ విరమణ పొందారు. ముస్కానిపేటకు చెందిన కోమటిరెడ్డి నరసింహారెడ్డి వరంగల్లోని రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ(ఆర్ఈసీ)లో ఇంజినీరింగ్ చదివారు. గ్రామంలో నిధులు సమకూర్చుకొని అమెరికాకు వెళ్లారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మొట్టమొదటి వ్యక్తిగా 1961లో అమెరికాకు వెళ్లారు. నరసింహారెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని గ్రామంలోని చాలా మంది యువకులు అమెరికాకు వెళ్లి సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా స్థిరపడ్డారు. అమెరికా, యూరప్ దేశాల్లో యువత విదేశాల్లో పనిచేస్తున్న 34 మంది 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు ముగ్గురు బ్యాంక్ మేనేజర్లు ఒక డాక్టర్.. ఇదీ ఆ పల్లె విజయగాథ -
ఆత్మీయం.. గుస్సాడీ నృత్యం
రాయికల్: గుస్సాడీ.. గోండు ప్రజలకు అదో ఆత్మీయ వేడుక. గుస్సాడీ అలంకరణ చేసుకునే వారు అత్యంత నియమనిష్టలతో ఉంటారు. దండారీ సంబరాలు ముగిసేవరకు గుస్సాడీలు ఒకే దగ్గర ఉంటారు. స్నానాలు కూడా చేయరు. నృత్యం చేసేవారు శరీరం మొత్తం బూడిద పూసుకుంటారు. ముఖానికి మసి రాసుకుంటారు. ప్రత్యేకమైన పేర్లదండలు ధరిస్తారు. కుడి చేతిలో మంత్ర దండం పట్టుకుంటారు. వీరిని దేవతలు ఆవహిస్తారని.. మంత్రదండంతో శరీరాన్ని తాకితే ఎలాంటి వ్యాధులైనా నయమవుతాయని వారి నమ్మకం. సంతానం లేనివారు గుస్సాడీలను ఇంటికి ఆహ్వానించి అతిఽథి భోజనాలు వడ్డిస్తే సంతానం కలుగుతుందన్న భరోసా. మెడలో రుద్రాక్షలు, ఇతర గవ్వలతో కూర్చిన దండలు వేసుకుంటారు. తలపై నెమలి ఈకలతో తయారు చేసిన కుంటే (కిరీటం) ధరిస్తారు. ఇది చిన్నచిన్న అద్దాలతో అందంగా అలంకరించి ఉంటుంది. కాళ్లకు గజ్జెలు కడుతారు. డప్పులు, బాజాలు, తుడుం మొదలైన వాయిద్యాల శబ్దాలకు గజ్జెల సవ్వడి చేస్తూ.. అడుగులు వేస్తూ చేతిలో మంత్రదండాన్ని కదలాడిస్తూ నృత్యాలు చేస్తారు. గూడెంవాసులు తిలకిస్తూ ఆనందంలో మునిగితేలుతారు. ఈ ఏడాది నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల నుంచి సుమారు 500 మంది గిరిజనులు జగన్నాథ్పూర్కు దండారీ బృందంతో వచ్చారు. ఈ ఏడాది అతిథ్యం ఇచ్చిన గ్రామంలోని బృందం మరుసటి సంవత్సరం అతిథ్యం స్వీకరించిన గ్రామానికి తరలివెళ్తుంది. బృందంలోని కొంద రు విజయసూచికగా పుతికట్టు (పోత్తి) ధరిస్తారు. ఈవిధంగా ఒక్కోగోండు గ్రామం కనీసం నా లుగైదు గ్రామాలతో సంబంధాల కొనసాగిస్తుంది. ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం.. దూరంగా ఉండే గిరిజన గూడాల్లో పాడిపంటలు సమృద్ధిగా ఉండాలన్న ఆకాంక్ష, పెళ్లి సంబంధాలు కుదర్చడానికి ఈ వేడుకను వేదికగా చేసుకుంటున్నారు. దీపావళి ఉత్సవాల్లో ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం ఆసక్తికరంగా ఉంటుంది. సుమారు 50 మంది నుంచి 100 మంది పురుషులు గుస్సాడీ నృత్య వేషధారణ వేస్తారు. వీరిలో ఇద్దరు ఆడవేషంలో ఉంటారు. తమ దేవతైన ఏత్మాను తీసుకుని మరో గూడెంకు వస్తారు. గుస్సాడీ నృత్య ప్రదర్శన చేసే వారితోపాటు వచ్చిన వారు గూడెంలో తమ తెగలకు కుదిరే అమ్మాయిలు, అబ్బాయిల సంబంధాల విషయమై ఆరా తీస్తారు. రెండు గ్రామాల ఏత్మా దేవతలను ఒకచోట చేర్చి పూజలు నిర్వహిస్తారు. వాయిద్యాలే వారి దేవతలు గిరిజన గూడాల వారు డోలు వాయిద్యాలను ఆరాధ్యంగా పూజించే సంప్రదాయం కొనసాగుతోంది. గుస్సాడీ నృత్యాల్లో వాడే డోలు వాయిద్యాలన్నింటినీ ఒకచోట చేర్చి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. మొత్తంగా గిరిజన తెగలు ఇప్పటికీ సంప్రదాయాలు, ఆచారాలు పాటించడం గమనార్హం. గోండులను కలుపుతున్న దీపావళి జగన్నాథ్పూర్లో గుస్సాడి వేషధారణలు తరతరాల సంప్రదాయం మొదటిరోజు గ్రామదేవతలకు మొక్కి పూజలు నిర్వహించి వారం రోజుల పండగను ప్రారంభిస్తారు. రెండోరోజు గిరిజనులు ఒక గ్రామం నుంచి మరో గ్రామాలకు వెళ్తారు. మూడో రోజు గిరిజనులు వెళ్లిన గ్రామాల్లో గ్రామ దేవతలకు పూజలు నిర్వహించి గుస్సాడీ నృత్యాలు, గిరిజన మహిళలు కోలాటాలతో రోజంతా కోలాహలంగా గడుపుతారు. నాలుగో రోజు గ్రామంలోని ఇంటింటికీ మంగళహారతులతో వెళ్లి పూజలు చేస్తారు. ఐదోరోజు కుల పెద్ద ఇంటి వద్ద పూజలు చేసి విందు భోజనాలు ఆరగిస్తారు. ఆరో రోజు కుల పెద్దకు ఇంటి దేవతను అప్పగిస్తారు. ఏడో రోజు దీక్ష విరమణ. -
ముస్కానిపేట డాలర్ల పంట
ఇల్లంతకుంట(మానకొండూర్): మెట్టప్రాంతం.. వర్షం కొడితేనే పంటలు.. లేకుంటే భూములు బీళ్లు. మదినిండా కష్టాలు.. కంటినిండా కన్నీళ్లు.. ఇవన్నీ దూరం కావాలంటే చదువు ఒక్కటే మార్గమని భావించారు. ఉన్నత చదువులతో కష్టాలను అధిగమించారు. విదేశాలకు వెళ్లి డాలర్ల పంట పండిస్తున్నారు. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్లుగా ఉద్యోగం చేస్తూ ఊరిని కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేసుకుంటున్నారు. కుగ్రామం రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని ముస్కానిపేట యువత విద్యతోనే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. వివిధ దేశాల్లో 34 మంది సాఫ్ట్వేర్లుగా పనిచేస్తుండగా.. ఊరిలోనే 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఉన్నత విద్యతో ఊరి రాతనే మార్చుకున్న పల్లె యువత విజయగాథ ఈ వారం సండే స్పెషల్.నా కొడుకు రాకేశ్రెడ్డి 2011లో పూర్తిచేశాడు. చదువు పూర్తికాగానే కాలేజీ క్యాంపస్లో ఎంపికై టీసీఎస్లో ఉద్యోగం పొందాడు. 2021లో కంపెనీనే అమెరికాకు పంపింది. చిన్న కొడుకు హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది. – సామ సత్యనారాయణరెడ్డి ముస్కానిపేట గ్రామ కమాన్ -
ఐక్యరాజ్య సమితిలో భారత కీర్తి
రామగుండం: ప్రపంచ శాంతిపరిరక్షణలో భారతదేశం పోషిస్తున్న కీలకపాత్ర గురించి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించారు. సమితిలో భారత్ తమ కీర్తిని చాటుకోవడం, వ్యవస్థలో పారదర్శకత, బాధ్యత, సమర్థత వంటి అంశాలపై సమావేశంలో పలు సూచనలు, సలహాలిచ్చే అవకాశం తనకు దక్కడం సంతోషంగా ఉందన్నారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించిన పలు అంశాల గురించి ఆయన శ్రీసాక్షిశ్రీతో పంచుకున్నారు. అంతర్జాతీయ ఆర్థిక, పాలనా వ్యవహారాల్లో భారతదేశ స్వరాన్ని మరింత బలంగా వినిపించేందుకు అవకాశం లభించిందన్నారు. తనతో పాటు అడ్వయిజరీ కమిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ బడ్జెటరీ క్వశ్చన్స్ (ఏసీఏబీక్యూ) చైర్పర్సన్ జూలియానా గాస్పర్ రుయాస్, యునైటెడ్ నేషన్స్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్(ఫైనాన్స్ అండ్ బడ్జెట్ కంట్రోలర్) చంద్రమౌళి రామనాథన్తో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించానని ఎంపీ వివరించారు. -
వైన్స్ టెండర్లు తగ్గినయ్
కరీంనగర్క్రైం: జిల్లాలో మద్యం షాపులకు దరఖాస్తుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. శనివారంతో దరఖాస్తుల గడువు ముగుస్తుండగా.. శుక్రవారం సాయంత్రం వరకు 1,034 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇందులో శుక్రవారం 615 మంది టెండర్లు వేశారు. 2023లో గడువు కంటే ఒకరోజు ముందు వరకు 2,014 దరఖాస్తులు రాగా.. చివరిరోజు 2,026 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 4,040 దరఖాస్తుల ద్వారా రూ.80.80కోట్ల ఆదాయం సమకూరింది. శనివారం ఆఖరి రోజు ఉండడంతో దరఖాస్తుల సంఖ్య పెద్దఎత్తున పెరిగే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది. మద్యం టెండర్ల ప్రక్రియ ప్రారంభం నుంచి పెద్దగా దరఖాస్తులు ఎప్పుడూ రాలేదు. చివరి రెండు, మూడు రోజుల్లో పెరుగుతూ వస్తోంది. ఈసారి కూడా గతంలో లాగే గడువు సమీపిస్తున్నా కొద్దీ దరఖాస్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈసారి అదేవిధంగా పెరుగుతుందని ఎకై ్సజ్ వర్గాల నుంచి ఆశాభావం వ్యక్తమవుతోంది. ఆఖరి రోజే లిక్కర్ కింగ్ల ఎంట్రీ మద్యం వ్యాపారాన్ని ఏళ్ల తరబడి ఏలుతున్న లిక్కర్ కింగ్లు ఆఖరు రోజు ఎంట్రీ ఇవ్వనున్నట్లు చర్చ జరుగుతోంది. ఇన్ని రోజులు పలువురు గ్రూపులుగా ఏర్పడి ఎక్కడెక్కడ.. ఏ షాపులకు టెండర్లు వేయాలని నిర్ణయించుకొని పార్ట్నర్లను ఎంచుకొని ఆఖరు రోజు కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా పలువురు పాత వ్యాపారులు పెద్దఎత్తున దరఖాస్తులు చివరి రోజు చేసుకున్నారు. చివరి రోజైతేనే కలిసి వస్తుందని సెంటిమెంట్తో ఆఖరి రోజే వేయాలని నిర్ణయించుకుంటున్నారు. ఈసారి టెండర్ ఫీజు రూ.3లక్షలు చేయగా.. కొత్తగా రంగంలోకి దిగుతున్న వారు డబ్బు విషయంలో ఆలోచించి పార్ట్నర్లుగా వేస్తున్నారు. పలువురు సింగిల్గా కాకుండా ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువమంది కొంత మొత్తాన్ని పెట్టుకొని వివిధ షాపులకు అధిక సంఖ్యలో టెండర్లు వేసి చేజిక్కించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా శనివారంతో వైన్స్ టెండర్ల గడువు ముగియనుండడంతో చివరి రోజు పెద్దఎత్తున దరఖాస్తులు రానున్నట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చివరిరోజు రానున్నట్లు తెలుస్తుండగా.. టెండర్ల గడువు పెరుగుతుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం నేడు మధ్యాహ్నం వరకు చూసి దరఖాస్తుల సంఖ్యను బట్టి నిర్ణయం తీసుకుంటుందని జిల్లా ఎక్సైజ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.సర్కిల్ వైన్సులు దరఖాస్తులు కరీంనగర్ అర్బన్ 21 321 కరీంనగర్ రూరల్ 26 298 హుజూరాబాద్ 17 119 జమ్మికుంట 16 115 తిమ్మాపూర్ 14 181 -
చిన్నారుల ఆరోగ్యమే ముఖ్యం
గంగాధర: చిన్నారుల ఆరోగ్యమే ముఖ్యమని, పిల్లల్లో పోషణలోప నివారణకు ఐసీడీఎస్, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. గంగాధరలోని జిల్లా పరిషత్ పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో పోషణమాసం, శుక్రవారం సభ నిర్వహించారు. కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ శుక్రవారం ప్రభుత్వ పాఠశాల, ఆరోగ్యకేంద్రం, అంగన్వాడీసేవలను పర్యవేక్షించడంతో పాటు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. పాఠశాలలు, అంగన్వాడీకేంద్రాల్లో విటమిన్ గార్డెన్ల ద్వారా కూరగాయల సాగు చేసి మధ్యాహ్న భోజనంలో వినియోగిస్తున్నామన్నారు. గర్భిణులు, బాలింతలు ఐరన్ మాత్రలు తీసుకోవాలని, ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలన్నారు. అనంతరం వ్యాసరచన పోటీలు, గర్భిణులకు సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు. తహసీల్దార్ అంబటి రజిత, ఎంపీడీవో దమ్మని రాము, సీడీపీవో నర్సింగరాణి, ఎంఈవో ప్రభాకర్రావు పాల్గొన్నారు. -
రా అన్నా.. కలిసుందాం
అన్నను 27 ఏళ్లుగా చూడలేదు. ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా ఆందోళనగా ఉండేది. ప్రస్తుతం మావోయిస్టులు లొంగిపోతున్నారు. నువ్వు కూడా రా అన్న కలిసుందాం. 27 ఏళ్లుగా మన ఇల్లు ఎదురు చూస్తోంది. అమ్మానాన్నలు కాలం చేశారు. ఉద్యోగం చేస్తూ తలోదిక్కు వెళ్లాం. ఇప్పుడు మన ఇల్లు ఒంటరైంది. మీరు వస్తే కలిసి ఉందాం. – తుమ్మల మధుసూదన్, విశ్వనాథ్ సోదరుడు(టీచర్) తమ్మీ రారా.. నాకు పానం బాగా లేదు. అమ్మానాయిన్నలు, తమ్ముడు కాలం చేసిండ్రు. అడవిలో అన్నలు అందరూ తుపాకులు పోలీసులకు ఇచ్చి వస్తున్నారని తెలిసింది. నువ్వు కూడా ఎక్కడ ఉన్నా ఇంటికి రా.. తమ్మీ. ప్రజల కోసం నలభై ఏళ్లు అడవుల్లో పనిచేసినవ్ చాలు. ఇగ నువ్వు వస్తే కలోగంజో కలిసి తాగుదాం. నిన్ను చూసి సచ్చిపోవాలని ఉంది. నువ్వు వస్తావని ఆశతో చూస్తున్నా. ఏడున్నా రా తమ్మీ. – బండి నాంపల్లి, చంద్రయ్య సోదరుడు, ధర్మారం -
‘ఇందిరమ్మ’ గృహప్రవేశం
● ‘సుడా’ చైర్మన్ నరేందర్రెడ్డి కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం బహుదూర్ఖాన్పేటలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా శుక్రవారం ఇంటి నిర్మాణం పూర్తయిన ఆకుల రమ్య–రవీందర్ దంపతుల మొదటి గృహప్రవేశం కార్యక్రమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి చీఫ్గెస్ట్గా హాజరయ్యారు. లబ్ధిదారు దంపతులకు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా నరేందర్రెడ్డి మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో మొత్తం 3,500 ఇండ్లను నిర్మించి ఇస్తామన్నారు. పంచాయతీ కార్యదర్శి మహేందర్, నాయకులు కె.రాంరెడ్డి, ఎస్.తిరుపతి, జి.బాపురెడ్డి, బి.తిరుపతిగౌడ్, స్వామిగౌడ్, నారాయణగౌడ్, కె.నరేశ్రెడ్డి, బి.అంజనేయులు పాల్గొన్నారు. -
కలప పట్టివేత
చందుర్తి/రుద్రంగి(వేములవాడ): టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేసి రుద్రంగి మండల కేంద్రంలోని ఎస్సీకాలనీలో సుమారు రూ.లక్ష విలువైన టేకు కలపను శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. మండల కేంద్రంలోని గసికంటి గంగారెడ్డి ఇంట్లో టేకు కలప అక్రమంగా నిలువ ఉంచారన్న సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి 32 దుండలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని వేములవాడ అటవీశాఖ కార్యాలయం డిప్యూటీ రేంజ్ అధికారి రాఘవేంద్రరావుకు అప్పగించారు. పట్టుకున్న కలపను కొలతలు వేసి వాటి విలువను శనివారం వెల్లడిస్తామని అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి తెలిపారు. టాస్క్పోర్స్ పోలీసుల దాడులతో కలప స్మగ్లర్లు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. -
రోడ్డు ప్రమాదంలో పారిశుధ్య కార్మికురాలి మృతి
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలక సంస్థ పరిధిలోని 56వ డివిజన్లో పారిశుధ్య కార్మికురాలిగా పని చేస్తున్న బడుగు రేణుక శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. విద్యానగర్ రోడ్డులోని శివ థియేటర్ పెట్రోల్ బంక్ సమీపంలో రేణుకను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. వెంటనే స్థానికులు, తోటి పారిశుధ్య కార్మికులు హాస్పిటల్కు తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మరణించింది. విషయం తెలుసుకున్న నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మృతదేహం వద్దకు చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు. భౌతికకాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి తక్షణ సాయం కింద రూ.20 వేల నగదు అందించారు. మృతురాలి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఎంహెచ్వో సుమన్, శానిటేషన్ సూపర్వైజర్లు శ్యామ్రాజ్, అనిల్కుమార్ ఉన్నారు. -
అలరించిన ఫేరియా ఫియెస్టా
● ప్రారంభించిన వీసీ ఉమేశ్కుమార్ సప్తగిరికాలనీ(కరీంనగర్): కరీంనగర్లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఫేరియా ఫియెస్టా–2 పేరిట పర్యావరణహిత స్వదేశీ దీపావళి ప్రదర్శన క్యాంపస్ ఎకో బజా ర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శాతవాహన విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ఉమేశ్కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పర్యావరణ స్నేహి జీవ న విధానాన్ని ప్రతిబింబించేవిధంగా ఏర్పాటు చేసిన పలు స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచా యి.కార్యక్రమంలో ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ కె.రామకృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్ డి.వరలక్ష్మి, ఈవెంట్ సమన్వయకర్త నల్ల మనోజ్కుమార్, విద్య, అకాడమిక్ కోర్డినేటర్ శ్రీనివాస్రెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి రజనిదేవి పాల్గొన్నారు. పెండింగ్ చలాన్ల వసూళ్లకు ప్రత్యేక బృందాలుకరీంనగర్క్రైం: పెండింగ్ చలాన్ల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సీపీ గౌస్ ఆలం వెల్లడించారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే 301 మంది ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారని.. వారి వాహనాలపై రూ.64,39,715 పెండింగ్ చలాన్లు ఉన్నాయని వివరించారు. పెండింగ్ చలాన్లు లేకుండా చూడాలని ప్రత్యేక బృందాలను ఆదేశించినట్లు పేర్కొన్నారు. శాతవాహన పరిధిలో నేటి పరీక్షలు వాయిదాసప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో శనివారం జరగనున్న ఎంఏఎడ్ రెండో సెమిస్టర్, బీఫార్మసీ రెండో సెమిస్టర్, ఎల్ఎల్ఎం నాల్గో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాయిదా వేసిన ఎంఎడ్, బీఫార్మసీ పరీక్షలు 22న, ఎల్ఎల్ఎం పరీక్ష 29న నిర్వహించనున్నట్లు, మిగిలిన పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పులు లేవన్నారు. చట్టాలపై అవగాహన పెంచుకోవాలితిమ్మాపూర్: చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాదికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె. వెంకటేశ్ అన్నారు. శుక్రవారం నుస్తులాపూర్ ఉన్నత పాఠశాల, ఎల్ఎండీ కాలనీలోని డైట్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి కె.వెంకటేశ్ సైబర్ చట్టాలు, బాల్య వివాహాలు, ఇతర న్యాయ పరమైన అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. చిన్న వయసులోనే మంచి నడవడిక అలవర్చుకోవాలని, విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం ముఖ్యమన్నారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ బాధ్యులు తనకు మహేశ్, న్యాయ సేవాధికార సంస్థ సభ్యుడు ఎ. కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేడు పవర్కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ తీగలకడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందున శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీనగర్కాలనీ, అంజనాద్రి దేవాలయం, దోబీఘాట్, గోదాంగడ్డ, బీఎస్ఎఫ్ క్వార్టర్స్, జెడ్పీ క్వార్టర్స్, భగత్నగర్, మల్లమ్మ మార్కెట్, కొమ్ము రాజు, గోదాం వెనక భాగం, రఘుపతిరెడ్డి హాస్పిటల్, తహారా మజీవ్, సంతోష్మాత దేవాలయం, సప్తగిరికాలనీ, ఆటోస్టాండ్, జానకి వీధి, మల్లికార్జునకాలనీ, సప్తగిరి హిల్స్, జెడ్పీ క్వార్టర్స్ ప్రాంతాలు, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సర్కస్ మైదానం, పద్మనాయక కల్యాణ మండపం, ఐబీ చౌరస్తా, శ్రీలత అపార్ట్మెంట్, రామాలయం, రెనె ఆసుపత్రి, ఇందిరానగర్, ప్రశాంత్నగర్కాలనీ, హనుమాన్ దేవాలయం, కోర్టు వాటర్ ట్యాంక్ ప్రాంతాలు, ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు వ్యోక్స్వాగన్ లేన్, అల్కాపురి, పైపుల కంపెనీ ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1, 2 ఏడీఈలు పి.శ్రీనివాస్గౌడ్, ఎం.లావణ్య తెలిపారు. కొత్తపల్లి, చింతకుంటలో.. విద్యుత్ తీగలకడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందున శనివారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు 33/11 కేవీ కొత్తపల్లి, రేకుర్తి సబ్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలు, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చింతకుంటలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ జి.రఘు తెలిపారు. -
రాజీవ్ రహదారిపై కారు దగ్ధం
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ పోలీస్స్టేషన్ పరిధి రాజీవ్ రహదారిపై గురువారం అర్ధరాత్రి కారు దగ్ధమైంది. వివరాలు.. మంచిర్యాలకు చెందిన నాగరాజు తన కుటుంబసభ్యులతో కలిసి కరీంనగర్ నుంచి మంచిర్యాలకు వెళ్తున్నాడు. గురువారం అర్ధరాత్రి ఎన్టీపీసీ బీ–గేట్ ఎదుట రాజీవ్ రహదారిపై డివైడర్కు ఢీకొంది. ఈ క్రమంలో కారులో మంటలు లేచాయి. ఇంజిన్లో ఏర్పడిన మంటలు ఒక్కసారిగా ఎగిసి పడ్డాయి. కారులో ఉన్నవారు గమనించి వెంటనే కిందకు దిగి స్థానిక అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బందితోపాటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనలో కారులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
‘సాక్షి’పై కక్ష సాధింపు విడనాడాలి
కరీంనగర్కల్చరల్/కరీంనగర్: ‘సాక్షి’ దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిని విడానాడాలని పలువురు కవులు డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని సూర్య రెసిడెన్సీలో తెలంగాణ రచయితల వేదిక (తెరవే) జిల్లాశాఖ ఆధ్వర్యంలో పాత్రికేయుడు షోయబ్ ఉల్లా ఖాన్ జయంతి సభ నిర్వహించి, ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. పాత్రికేయ వృత్తి సవాళ్లు, విశిష్టతను గురించి చర్చించారు. తెరవే జిల్లా అధ్యక్షుడు సీవీ కుమార్, పీఎస్.రవీంద్ర, దామరకుంట శంకరయ్య, నసీరుద్దీన్, వాజీద్, మునీర్, నెరువట్ల చైతన్య, విలసాగరం రవీందర్, మెరుగు ప్రవీణ్, ఖాలీద్ పాల్గొన్నారు.సాక్షి కార్యాలయంలో ఏపీ పోలీసులు సోదాలు నిర్వహించడం తగదు. నోటీసు ఇచ్చేందుకని వచ్చి అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని భయపెట్టేలా వ్యవహరించడం మంచి పద్ధతి కాదు. ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే. పోలీసులు ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలి. భయపెట్టేలా ప్రవర్తించడం దారుణం. సాక్షి ఎడిటర్పై కక్ష సాధింపు చర్యలు విడనాడాలి. – కసిరెడ్డి మణికంఠ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడుప్రభుత్వాలు పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడం దారుణం. సాక్షి ఎడిటర్పై కక్షసాధింపు సరికాదు. విచారణ పేరుతో సాక్షి కార్యాలయంలో హల్చల్ చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. ఏపీ ప్రభుత్వం మీడియాపై చేస్తున్న దాడిని ఖండిస్తున్నాం. మీడియాను అణచివేయాలనుకోవడం హేయమైన చర్య. – ఎస్.రజనీకాంత్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు -
సీపీఆర్పై అవగాహన అవసరం
కరీంనగర్ కార్పొరేషన్: ప్రాణాపాయం నుంచి కాపాడే సీపీఆర్ విధానంపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ సూచించారు. శుక్రవారం కళాభారతిలో నగరపాలకసంస్థ అధికారులు, ఉద్యోగులకు సీపీఆర్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుండెపోటు వచ్చిన అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాపాయం నుంచి గట్టెక్కించవచ్చన్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకొని, శారీరక వ్యాయామం, యోగా లాంటివి అలవాటు చేసుకోవాలని సూచించారు. నగరపాలక సంస్థ అధికారులు, ఉద్యోగుల కోసం త్వరలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. డీఎంహెచ్వో వెంకటరమణ, నగరపాలకసంస్థ డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహియొద్దిన్, వేణు మాధవ్, సహాయ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బాస్కెట్ బాల్లో కరీంనగర్.. టేబుల్ టెన్నిస్లో వరంగల్
● ముగిసిన ట్రాన్స్కో, డిస్కం ఇంటర్ సర్కిల్ పోటీలు కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ విద్యుత్ భవన్లో నిర్వహించిన ట్రాన్స్కో, డిస్కం ఇంటర్సర్కిల్ బాస్కెట్ బాల్, టేబుల్ టెన్నిస్ పోటీలు శుక్రవారం రాత్రి ముగిశాయి. బాస్కెట్బాల్ ఓవరాల్ చాపియన్గా కరీంనగర్ టీజీఎన్పీడీసీఎల్ ఆపరేషన్స్, టేబుల్ టెన్నిస్ ట్రోఫీని వరంగల్ జట్లు నిలిచాయి. విజయం సాధించిన జట్లకు ట్రాన్స్కో కరీంనగర్ జోన్ చీఫ్ ఇంజినీర్లు జె.విజయ్కుమార్ పాపారావు ట్రోఫీ అందజేశారు. ట్రాన్స్కో ఎస్ఈ, స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాస్, స్పోర్ట్స్ ఆఫీసర్ ఎన్.జగన్నాథ్, స్పోర్ట్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు పి.రఘునందన్, ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాస్రెడ్డి, ఎస్ఈ మేక రమేశ్బాబు, వేణుబాబు, డీఈ ఉపేందర్, ఏవో అర్వింద్, పీవో చంద్రయ్య, శ్రీధర్రెడ్డి, ఈఎల్పీ రాజు, రాజ్కుమార్ పాల్గొన్నారు. -
కరీంనగర్
వాతావరణం ఆకాశం మేఘావృతమవుతుంది. వర్షం కురిసే అవకాశం తక్కువగా ఉంది. చలి తీవ్రత పెరుగుతుంది. ఎండగా ఉంటుంది.Iవేములవాడ: రాజన్నను శుక్రవారం 15 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. క్వింటాల్ పత్తి రూ.6,800జమ్మికుంట: స్థానిక మార్కెట్లో శుక్రవారం క్వింటాల్ పత్తి రూ. 6,800 పలికింది. క్రయ విక్రయాలను మార్కెట్ చైర్ పర్సన్ పూల్లూరి స్వప్న, కార్యదర్శులు మల్లేశం, రాజా పర్యవేక్షించారు. -
పీజీ మెడికల్ కాలేజీగా సిమ్స్
కోల్సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్–ప్రభుత్వ) కాలేజీకి పీజీ మెడికల్ కాలేజీగా గుర్తింపు లభించింది. సిమ్స్ కాలేజీకి నాలుగు విభాగాల్లో కొత్తగా పీజీ సీట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) నుంచి శుక్రవారం జీవో జారీ అయినట్లు ప్రిన్సిపాల్ హిమబింద్సింగ్ తెలిపారు. పీజీ సీట్ల కోసం తెలంగాణ రాష్ట్రంలో 2022–23 విద్యాసంవత్సంతో ప్రారంభమైన 23 కొత్త మెడికల్ కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయన్నారు. ఇందులో రామగుండం సిమ్స్కు మాత్రమే పీజీ సీట్లకు ఎన్ఎంసీ నుంచి అనుమతి లభించడం గమనార్హం. ఈ ఏడాది నుంచే పీజీ కాలేజీ ప్రారంభానికి ఎన్ఎంసీ పచ్చజెండా ఊపడంపై ప్రిన్సిపాల్తోపాటు వైస్ ప్రిన్సిపాల్ నరేందర్, హెచ్వోడీలు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెస ర్లు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు యూజీ వైద్య విద్య ఉన్న సిమ్స్లోనే ఈఏడాది నుంచి పీజీ తరగతుల అమలుకు జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంపీ) వెసులుబాటు కల్పించింది. అన్నింటికీ గ్రీన్సిగ్నల్.. సిమ్స్కు నాలుగు విభాగాల్లో నాలుగు పీజీ సీట్ల చొప్పున కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ, నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ)కి ఆరు నెలల క్రితమే దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న అన్ని సీట్లకు గ్రీన్సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. కేటాయించిన పీజీ సీట్లు ఇవే.. ఎండీ : ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో నాలుగు పీజీ సీట్లు ఎంఎస్ : ప్రసూతి, గైనకాలజీ విభాగంలో నాలుగు పీజీ సీట్లు ఎంఎస్ : ఆర్థోపెడిక్స్ విభాగంలో నాలుగు పీజీ సీట్లు ఎండీ : బయో : కెమెస్ట్రీ విభాగంలో కూడా నాలుగు పీజీ సీట్లు కేటాయించారు. -
అంతటా శివుడే
రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులతో తాత్కాలికంగా భక్తులకు ఇబ్బందులు కలిగినా భవిష్యత్లో మంచి సౌకర్యాలు వస్తాయి. రాజన్న, భీమన్న, నగరన్న ఆలయాల్లో శివలింగాలు దర్శనమిస్తాయి. వేములవాడకు వచ్చిన భక్తులు ఎక్కడ దర్శించుకున్నా శివుడిని దర్శించుకున్నట్లే. – నందిపేట సుదర్శన్యాదవ్, రాజన్న ఆలయ మాజీ ధర్మకర్తమరింత ప్రాచూర్యం ఎన్నో ఏండ్లుగా విస్తరణకు నోచుకోని వేములవాడ రాజన్న ఆలయం ఇప్పుడు అభివృద్ధికి భీజం పడింది. మొదటిదశగా రూ.150కోట్లతో పనులు చేస్తున్నారు. విస్తరణ పూర్తతే రాజన్న ఆలయ ప్రాశస్థ్యం మరింత పెరుగుతోంది. భక్తుల సంఖ్య పెరగడమే కాకుండా ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. – సగ్గు పద్మ, రాజన్న ఆలయ మాజీ ధర్మకర్త పీఠాధిపతుల సూచనలతో.. రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులన్నీ శృంగేరి పీఠాధిపతుల సూచనలు, సలహాల మేరకు చేపడుతున్నాం. భక్తుల మనోభావా లకు అనుగుణంగా, స్థానికులు, పురప్రముఖుల సూచనల మేరకు పనులు చేపడుతున్నాం. ఇంకా సలహాలు, సూచనలు ఎవరూ చేసినా స్వీకరిస్తాం. ఆలయ అభివృద్ధే మా ధ్యేయం. వేములవాడను టెంపుల్ సిటీగా మారుస్తాం. – ఆది శ్రీనివాస్, ప్రభుత్వవిప్ -
అర్చకులను అవమానిస్తే ఊరుకునేది లేదు
● అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ ఓదెల(పెద్దపల్లి): అర్చకులను అవమానిస్తే ఊరుకునేది లేదని అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ హెచ్చరించారు. ఓదెల మల్లికార్జునస్వామిని శుక్రవారం ఆయన దర్శించుకున్నారు. ఆలయ ఈవో సదయ్యకు వినతిపత్రం అందజేశారు. ఓదెల మల్లికార్జునస్వామి ప్రధాన అర్చకునితోపాటు మరో అర్చకుడిపై పాలకవర్గ చైర్మన్ దురుసుగా మాట్లాడడం, అగౌరవ పర్చడం శోచనీయమన్నారు. వారి తీరును ఎమ్మెల్యే విజయరమణారావు దృష్టికి తీసుకెళ్లగా పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఆలయంలో స్వామివారికి నిర్వహించే నిత్యకై ంకర్యాలపై పాలకవర్గం పెత్తనం మానుకోవాలని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో ఓదెల ఆలయ అర్చకులు, కరీంనగర్, జగిత్యాల జిల్లాల ధూపదీప, నైవేద్య అర్చక నాయకులు పాల్గొన్నారు. -
మద్యం మత్తులో యువకుల హల్చల్
తంగళ్లపల్లి(సిరిసిల్ల): డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులతో ఇద్దరు యువకులు మద్యం మత్తులో దురుసుగా ప్రవర్తించిన ఘటన తంగళ్లపల్లి మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు ప్రధాన రహదారిపై డ్రంకెన్డ్రైవ్ టెస్టులు చేస్తుండగా ఇద్దరు యువకులు మద్యం సేవించి బైక్పై వస్తున్నారు. వీరిని గుర్తించిన పోలీసులు డ్రంకెన్డ్రైవ్ టెస్ట్ నిర్వహించి బైక్ను సీజ్ చేశారు. దీంతో కోపోద్రిక్తులైన యువకులు ప్రధాన రహదారిపై బైఠాయించి వాహనాలు ఆపుతూ.. పోలీసులపైకి దూసుకెళ్తూ హంగామా చేశారు. మరింత మంది పోలీసులు అక్కడికి చేరుకొని సదరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. రామగుండం ఎన్టీపీసీలో తగ్గిన విద్యుత్ ఉత్పత్తిజ్యోతినగర్(రామగుండం): పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి తగ్గినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం 2,600 మెగావాట్లు. ఇందులోని 500 మెగావాట్ల సామర్థ్యం గల 4, 6, 7వ యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచినట్లు తెలుస్తోంది. 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల మూడో యూనిట్లోనూ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రస్తుతం 2,600 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులో 900 మెగావాట్లే ఉత్పత్తి అవుతున్నటున్ల సమాచారం. థర్మల్ ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి డిమాండ్ లేక ఉత్పత్తిని తగ్గించినట్లు తెలుస్తొంది. -
పార్కిన్సన్ బాధితులకు ‘డీబీఎస్’ కొత్త ఆశ
● మందులు పనిచేయని దశలోనూ అద్భుత ఫలితాలు ● యశోద హాస్పిటల్స్ న్యూరో సర్జన్ రాజేశ్ అలుగోలుకరీంనగర్: మందులకు స్పందించని రోగులకు డీబీఎస్ చికిత్స అద్భుత ఫలితాలనిస్తోందని, హైటెక్సిటీ యశోద హాస్పిటల్స్ సీనియర్ న్యూరో సర్జన్ రాజేశ్ అలుగోలు తెలిపారు. శుక్రవారం నగరంలోని యశోద మెడికల్ సెంటర్లో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని పార్కిన్సన్ వ్యాధి వేధిస్తోందన్నారు. గతంలో వృద్ధుల్లోనే కనిపించే ఈ సమస్య, ప్రస్తుతం యువతలోనూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. శరీర కదలికలను నియంత్రించే మెదడులోని భాగాలపై ఈ వ్యాధి ప్రభావం చూపుతోందని, ఫలితంగా చేతులు వణకడం, నడకలో ఇబ్బందులు, శరీరం బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వెల్లడించారు. వ్యాధి ప్రారంభదశలో మందులతో నియంత్రించినప్పటికీ, కాలక్రమేణా వాటి ప్రభావం తగ్గుతోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శస్త్రచికిత్స ఆధారిత ‘డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్’ (డీబీఎస్) కొత్త ఆశలు రేకెత్తిస్తోందని పేర్కొన్నారు. ఈ విధానంలో మెదడులోని నిర్దిష్ట భాగాల్లో ఎలక్ట్రోడ్లను అమర్చి, ఛాతీలో అమర్చిన చిన్న పరికరానికి అనుసంధానిస్తామన్నారు. ఈ పరికరం పంపే విద్యుత్ సంకేతాలు మెదడు కార్యకలాపాలను నియంత్రిస్తాయిని వివరించారు. సరైన మందులు, వ్యాయామం, ఆధునిక చికిత్సలను సమన్వయం చేసుకుంటే పార్కిన్సన్ బాధితులు సాధారణ జీవితం గడపవచ్చని సూచించారు. -
కాంగ్రెస్లో రచ్చరచ్చ
కరీంనగర్కార్పొరేషన్: ప్రణాళిక లేని అభిప్రాయ సేకరణ, ఆశావహుల ఆధిపత్యపోరు, కొత్త, పాతల వాగ్వాదాలు, తలుపులు బద్దలు గొట్టడం, పదే పదే ఉద్రిక్తత.. వెరసి డీసీసీ కార్యాలయం కదనరంగాన్ని తలపించింది. కాంగ్రెస్ సంస్థాగత ప్రక్రియలో నూతన ఒరవడి సృష్టించేందుకంటూ చేపట్టిన అభిప్రాయ సేకరణ కరీంనగర్లో రసాభాసగా మారింది. ఎవరి అభిప్రాయాలు సేకరిస్తున్నారో.. ఎవరివి తిరస్కరిస్తున్నారో తెలియని గందరగోళ పరిస్థితుల్లో, మూకుమ్మడిగా చొచ్చుకొచ్చి తలుపులు విరగ్గొట్టడంతో అభిప్రాయ సేకరణను అర్ధాంతరంగా వదిలేసి, ఏఐసీసీ పరిశీలకుడు వెనుదిరిగారు. ఆశావహుల బల ప్రదర్శన డీసీసీ, సిటీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా గురువారం డీసీసీ కార్యాలయంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అభిప్రాయ సేకరణ చేపట్టారు. పార్టీనాయకుల అభిప్రాయాల మేరకే అధ్యక్షుల ఎంపిక ఉంటుందని అధి ష్టానం చెప్పడంతో ఆశావహులు బలప్రదర్శనకు దిగారు. తమకు అనుకూలంగా ఉన్న నాయకులతో పాటు ఆటోలల్లో జనాలను తీసుకొచ్చారు. కాస్త ఆలస్యంగా చేరుకొన్న డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ , జనాలను చూసి, ఇంతమందిని తరలించడమేమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రసాభాస ఏఐసీసీ పరిశీలకుడు శ్రీనివాస్ మన్నె, పీసీసీ పరిశీలకులు ఆత్రం సుగుణ, సత్యనారాయణ మండల, బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ ప్రెసిడెంట్ల నుంచి అభిప్రాయాలు తీసుకొంటామని ప్రకటించారు. కార్యకర్తల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకోవాలని, పార్టీకి కార్యకర్తలు అవసరం లేదా అని నగరానికి చెందిన శంకర్, శ్యాం తదితరులు ప్రశ్నించారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు అరుణ్కుమార్ తదితరులు ‘పార్టీలోకి మీరెప్పుడొచ్చారు... నిన్నగాక మొన్నవచ్చి మాట్లాడుతున్నార’నడంతో, పాత, కొత్త నాయకులు నడుమ వాగ్వాదం చోటుచేసుకొంది. ఇరువర్గాలు వాగ్వాదం తీవ్ర రూపం దాల్చే సమయంలో పరిశీలకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. గేట్కు తాళం.. బయటే ‘వెలిచాల’ డీసీసీ కార్యాలయంలోని మొదటి అంతస్తులో పరిశీలకుడు అభిప్రాయాలు సేకరించారు. ఆశావహులంతా కార్యాలయంలో ఉండగా, పక్కనే ఉన్న ఇందిరాగార్డెన్లో వెలిచాల రాజేందర్రావు తన అనుచరులతో ఉన్నారు. ఎవరూ కార్యాలయానికి రాకుండా గేట్కు తాళం వేశారు. రాజేందర్రావు లోనికి వస్తాడని నాయకులు చెప్పినా, పోటీపడుతున్న అభ్యర్థులు రావద్దంటూ తాళం తీయలేదు. వెలిచాల అనుచరులు గేట్ వద్దకు చేరుకొని ‘లోన ఉన్న దొంగలు బయటకు రావాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, గేట్ను పగులగొట్టేందుకు ప్రయత్నించారు. పీసీసీ పరిశీలకురాలు ఆత్రం సుగుణ అక్కడికి చేరుకొని, వెలిచాలను లోనికి రావాలని అభ్యర్థించారు. ‘వాళ్లంతా ఎందుకు లోపల ఉన్నారు. నన్ను ఎందుకు బయట ఉంచారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రక్రియ జరిపించాలి. మా వాళ్లు పార్టీకి అవసరం లేదా..’ అంటూ వెలిచాల ఆగ్రహం వ్యక్తం చేశారు. డీసీసీ కార్యాలయ మొదటి అంతస్తులో ఏఐసీసీ పరిశీలకుడు శ్రీనివాస్ ఒక్కో నాయకుడి అభిప్రాయం సేకరిస్తుండగా, తీవ్ర జాప్యం జరిగింది. రాత్రి 7 గంటల తరువాత ఒక్కసారిగా నాయకులంతా గుంపుగా గదిలోకి చొరబడడంతో గది తలుపులు విరిగిపోయాయి. దీనితో అభిప్రాయ సేకరణను పూర్తి చేయకుండానే పరిశీలకుడు శ్రీనివాస్ వెనుదిరిగారు. ఇంతకీ ఎవరి అభిప్రాయాలు సంస్థాగత ప్రక్రియలో ఎవరి అభిప్రాయాలు తీసుకోవాలనే అంశంపై గందరగోళం నెలకొంది. బ్లాక్,మండల,నగర, డివిజన్ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధుల నుంచి సేకరిస్తామని ముందుగా ప్రకటించారు. నగరంలోని 66 డివిజన్లకు సంబంధించిన అధ్యక్షులమంటూ రావడంతో, వారిని ఎవరు నియమించారో తెలియని పరిస్థితి నెలకొంది. మాజీ కార్పొరేటర్లకు పిలవడం లేదంటూ వారిని వెనక్కి పంపించారు. కొన్ని గంటల తరువాత, మళ్లీ పిలిపించారు. వచ్చిన వాళ్లందరి అభిప్రాయాలు తీసుకొంటామంటూ తెల్ల కాగితాలు అందించారు. చాలా మంది అభిప్రాయాలు తీసుకోకుండానే వెనుదిరిగారు. తమకు మద్దతివ్వని నాయకుల అభిప్రాయాలు తీసుకోకుండా కొంతమంది ఆశావహులు ఎత్తులు వేసినట్లు ప్రత్యర్థులు ఆరోపించారు. మొత్తానికి పోలీసుల పహారా మధ్యన కాంగ్రెస్ అభిప్రాయ సేకరణ రచ్చరచ్చగా మారింది. -
ఎన్నాళ్లీ అణచివేత
సాక్షి కార్యాలయాల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు హల్చల్ చేయడం సరికాదని రాజకీయ, ప్రజా సంఘాల నేతలు, సామాన్యులు ధ్వజమెత్తారు. జర్నలిస్టుల స్వేచ్ఛపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని ఆరోపించారు. పత్రికా స్వేచ్ఛను హ రిస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని మండిపడ్డారు. ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు బనాయించడం సరికాదన్నారు.కక్షపూరిత చర్య ప్రజాస్వామ్య పద్ధతిలో పోలీసులు వ్యవహరించాలి. పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఇది ముమ్మాటికి కక్షపూరిత చర్యే. ప్రతీ అంశంపై ప్రజలను చైతన్యవంతం చేయడమే మీడియా ఉద్దేశం. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతున్నారనే అక్కసుతో కేసులు నమోదు చేయడం సరికాదు. – మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు కేంద్రం స్పందించాలి మూడు రోజులుగా ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై కేసులు నమోదు చేసి బెదిరింపులకు దిగడం సరికాదు. సోదాలు నిర్వహించడం, వార్త సోర్స్ను అడగడం రాజ్యాంగ విరుద్ధం. ఈవిషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. పత్రికాస్వేచ్ఛను కాపాడాలి. అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు నమోదు చేయడం సిగ్గు చేటు. – యాదగిరి సత్తయ్య, బీఎంఎస్ అధ్యక్షుడు కక్షసాధింపు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచే పత్రికలపై కక్షసాధింపు సరికాదు. వైఫల్యాలను ఎత్తిచూపే పత్రికలపై రాజకీయ కక్షలు తగవు. ప్రసార మాధ్యమాల గొంతు వినిపించే హక్కును కాలరాయవద్దు. జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం అప్రజాస్వామికం. – గంగుల కమలాకర్, కరీంనగర్ ఎమ్మెల్యేపత్రికా స్వేచ్ఛను హరించడమే పత్రికల్లో, ప్రసారమాద్యమాల్లో వార్తలు ప్రచురించినప్పుడు, వారి మనోభావాలు దెబ్బతిన్నాయని భా విస్తే న్యాయపోరాటం చేయాలి. ఇలా బెదిరింపు ధోరణితో పత్రికా స్వేచ్ఛను హరించివేయడం సరికాదు. – పంజాల శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి, కరీంనగర్ -
ట్రాన్స్కో, డిస్కం ఇంటర్ సర్కిల్ పోటీలు ప్రారంభం
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్లో రెండు రోజుల పాటు జరిగే తెలంగాణ ట్రాన్స్కో, డిస్కం ఇంటర్సర్కిల్ బాస్కెట్ బాల్, టేబుల్ టెన్నీస్ టోర్నమెంట్ను గురువారం ట్రాన్స్కో కరీంనగర్ జోన్ చీఫ్ ఇంజినీర్ జె.విజయ్కుమార్ పాపారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు ఎంతో ప్రాముఖ్యమైనవి, వీటితో మానసికోల్లాసంతో పాటు స్నేహభావం పెంపొందుతుందన్నారు. వృత్తిరీత్యా ఒత్తిడికి లోనయ్యే ఉద్యోగులకు ఈ ఆటలతో ప్రశాంతత లభిస్తుందన్నారు. ట్రాన్స్కో ఎస్ఈ, స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాస్, స్పోర్ట్స్ ఆఫీసర్ ఎన్.జగన్నాథ్, స్పోర్ట్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు పి.రఘునందన్, ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాస్రెడ్డి, కరీంనగర్ ఎస్ఈ మేక రమేశ్బాబు, ఎస్ఈలు టి.వి.రావు, ఎన్.శ్రీనివాసు, ఎం.వేంకటేశ్వర్లు, పి.త్రిపురాంతకం, పివీరావుతో పాటు కరీంనగర్, నల్గొం, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల క్రీడాకారులు, ఉద్యోగులు పాల్గొన్నా రు. టేబుల్ టెన్నీస్లో ఓఎంసీ సర్కిల్ కరీంనగర్, ఆపరేషన్ సర్కిల్ వరంగల్ ఫైనల్కు చేరకోగా టేబుల్ టెన్నీస్లో కరీంనగర్ ఆపరేషన్, నిజామాబాద్, నల్గొండ ఆపరేషన్, ఖమ్మం ఆపరేషన్ జట్లు ముందంజలో ఉన్నాయి.పత్తి మార్కెట్కు నాలుగు రోజుల సెలవుజమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్కు నాలుగు రోజుల సెలవులు ఉంటాయని మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్నసదానందం, ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా తెలిపారు. శుక్రవారం యథావిధిగా కొనుగోళ్లు ఉంటాయని, శని, ఆదివారం సాధారణ సెలవులు, సోమవారం దీపావళి, మంగళవారం అమావాస్య సెలవులు ఉంటాయని వివరించారు. గురువారం క్వింటాల్ పత్తి రూ. 6,700 పలికిందని పేర్కొన్నారు. బహుమతులు ప్రదానంవిద్యానగర్(కరీంనగర్): బతుకమ్మ, దసరా సందర్భంగా ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ పరిధిలో నిర్వహించిన లక్కీడ్రా విజేతలకు గురువారం కరీంనగర్ బస్స్టేషన్ ఆవరణలో ఆర్ఎం బి.రాజు బహుమతులు అందించి, సన్మానించారు. కరీంనగర్కు చెందిన ఇ.రమేశ్కు మొదటి బహుమతిగా రూ.25వేలు, గోదావరిఖనికి చెందిన సదానందంకు రెండో బహుమతిగా రూ.15వేలు చెక్కురూపంలో అందించారు. డిప్యూటీ రీజినల్ మేనేజర్లు ఎస్.భూపతిరెడ్డి, పి.మల్లేశం, రీజియన్ పరిధిలోని డిపోల మేనేజర్లు ఎం.నాగభూషణం, ఎన్.వెంకన్న, వి.రవీంద్రనాథ్, ఐ.విజయమాధురి, ఎం.శ్రీనివాస్, వి.శ్రవణ్కుమార్, కె.కల్పన, ఎస్.మనోహర్, టి.దేవరాజు, టి.ప్రకాశ్రావు, బి.శ్రీనివాస్ పాల్గొన్నారు. విద్మానగర్(కరీంనగర్): జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో డిసెంబర్లో నిర్వహించే రాష్ట్రస్ధాయి చెకుముకి సంబరాలు సైన్స్ టాలెంట్ టెస్ట్పై గురువారం కలెక్టర్ పమేలా సత్పతికి జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ బాధ్యులు వివరించారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడంలో జనవిజ్ఞాన వేదిక గత 35 ఏళ్లుగా చేస్తున్న కృషిని ఆమె అభినందించి సభ్యత్వాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ రాజేశ్వర్. కార్యదర్శి రాజా, ప్రొఫెసర్లు రామచంద్రయ్య, లక్ష్మారెడ్డి, బీఎన్ రెడ్డి, వరప్రసాద్, రామరాజు, సంపతి, రమేశ్తోపాటు జిల్లా అధ్యక్షుడు ఆర్ వెంకటేశ్వర్ రావు, కార్యదర్శి శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఈడీ చేతికి మెటా!?
సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●: మెటా క్రిప్టో కరెన్సీ పేరుతో కరీంనగర్లో వెలుగుచూసిన కుంభకోణం మలుపు తిరగనుంది. త్వరలోనే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగప్రవేశం అనివార్యంగా కనిపిస్తోంది. ఈ కేసులో డబ్బులను అనతికాలంలోనే రెట్టింపు చేస్తామని బాధితుల నుంచి వసూలు చేసి, దేశం దాటడం, అందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను కరీంనగర్ సీపీ గౌస్ ఆలం నేతృత్వంలో పోలీసులు గుర్తించారు. మరింత లోతుగా దర్యాప్తు జరిపి త్వరలోనే డీజీపీకి నివేదిక పంపనున్నారు. అనంతరం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి సమాచారం ఇవ్వనున్నారని సమాచారం. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది. కింగ్పిన్ లోకేశ్వర్రావు అరెస్టుతో కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసుపై సాక్షి కథనాలను తొలుత ఖండించిన పోలీసులు తాజాగా నిర్వహించిన ప్రెస్మీట్తో వాటిని అంగీకరించినట్లయింది. దుబాయ్ హవాలాపై దృష్టి ఈ కేసులోని నిందితులు మలేషియా, సింగపూర్, థాయ్లాండ్, దుబాయ్ తదితర దేశాలకు పెట్టుబడిదారులను తిప్పారు. దుబాయ్లో బినామీలను నియమించుకున్నారు. ఇక్కడ వసూలు చేసిన మొత్తం డబ్బును యూఎస్డీటీ, హవాలా మార్గాల ద్వారా దుబాయ్కి పంపారు. ఆ డబ్బుతో అక్కడ బంగారం కొన్నారు. అందులో 30 తులాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 450 మంది బాధితుల నుంచి రూ.30 కోట్ల వరకు వసూలు చేశారని పైకి చెబుతున్నా, దాని విలువ దాదాపుగా వీరు రూ.100 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. నిందితులు దుబాయ్ తదితర దేశాల్లో హవాలా ద్వారా పంపిన డబ్బులతో బంగారం, ఆస్తులు కూడబెట్టారని సమాచారం. దుబాయ్లో ఈ ముఠా రూ.40 కోట్ల విలువైన ఓ పబ్ను నడుపుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. అక్కడ పదేళ్ల గోల్డెన్ వీసా సంపాదించి అరెస్టును జాప్యం చేసేలా ఎత్తుగడలు వేసినట్లు గుర్తించారు. నిందితులు లీగల్ టీం ఏర్పాటు చేసుకుని ఏకంగా కరీంనగర్ సీపీకి నోటీసులు పంపడం, ఫిర్యాదుదారులపై ప్రైవేటు కేసులు ఫైల్ చేయడాన్ని పోలీసుశాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు త్వరలోనే మరిన్ని అరెస్టులు జరపనున్నారు. సరైన సమయం చూసి అరెస్టు చేసే ఆలోచనలో ఉన్నారు. గతంలో నిందితులు ముందస్తు బెయిల్ పొందిన నేపథ్యంలో ఈ మేరకు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.కరీంనగర్క్రైం: మెటాఫండ్ ప్రధాన నిందితుడు వరాల లోకేశ్వర్రావు(32)ను కరీంనగర్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సీపీ గౌస్ ఆలం కమిషనరేట్లో కేసు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్లోని పీవీఎన్కాలనీకి చెందిన వరాల లోకేశ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ల తయారీలో నిపుణుడు. గతంలో ఆన్లైన్ బిట్కాయిన్లో, డిజిటల్ కరెన్సీలో పెట్టుబడులు పెట్టాడు. అతని తండ్రి స్నేహితుడైన కరీంనగర్కు చెందిన తులసీ ప్రకాశ్ తమ ప్రాంతంలో యూబిట్ కాయిన్లో చాలా మంది పెట్టుబడులు పెడుతున్నారని ఒకసారి వస్తే కొంతమందిని పరిచయం చేస్తానని చెప్పి 2024లో నగరానికి చెందిన బూర శ్రీధర్, దాసరి రాజు, దాసరి రమేశ్, కట్ల సతీశ్ను పరిచయం చేయించాడు. ఒక నకిలీ కాయిన్‘మెటాఫండ్’ రూపొందించి గతేడాది ఏప్రిల్లో హైదరాబాద్లోని శామీర్పేటలో ఓ రిసార్ట్లో ఆవిష్కరించారు. యాప్ ప్రచారం కోసం కరీంనగర్, జగిత్యాల, హైదరాబాద్ ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించారు. అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి కరీంనగర్కు చెందిన భాస్కర్ నాయక్ వద్ద రూ.15లక్షలు, మరో 450 మంది ద్వారా రూ.30కోట్ల వరకు పెట్టుబడులు పెట్టించారు. డబ్బులు విత్డ్రా చేయలేని విధంగా యాప్ను డిజైన్ చేశారు. కొద్దిరోజులకు బాధితుల ఫిర్యాదుతో కరీంనగర్ రూరల్, టూటౌన్ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నగరానికి చెందిన తులసీ ప్రకాశ్, బూర శ్రీధర్, దాసరి రాజు, దాసరి రమేశ్, కట్ల సతీశ్ను గతంలోనే అరెస్టు చేశారు. లోకేశ్వర్రావును అలుగునూరులో అదుపులోకి తీసుకుని, గురువారం రిమాండ్ చేశారు. నిందితుల నుంచి ఆస్తి ప్రతాలు, 30తులాల బంగారం, మొబైల్ఫోన్లు, ట్యాబ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేసిన రూరల్ ఏసీపీ విజయ్కుమార్, సీసీఎస్ సీఐ ప్రకాశ్ను సీపీ అభినందించారు. -
పంటలకు సోలార్ ‘కంచె’
మంథనిరూరల్: ఆరుగాలం కష్టపడి పండించే పంటల రక్షణకు రైతులు అనేక విధాలుగా ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. అటవీ ప్రాంతాలు, గుట్టల సమీపంలోని పంటలను అడవిజంతువుల బారినుంచి రక్షించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. కొందరు చేనుల చుట్టూ కరెంట్ వైర్లు అమర్చి పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తుండగా.. వాటిద్వారా జంతువులే కాదు.. మనుషులు కూడా ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. అయితే మంథని మండలం లక్కేపూర్ గ్రామానికి చెందిన రైతు కొత్త శ్రీనివాస్ వినూత్న ఆలోచనతో పంటను కాపాడుకునేందుకు చేను చుట్టూ సోలార్ పవర్ కంచె ఏర్పాటు చేశాడు. ఎనిమిదేళ్ల క్రితం.. లక్కేపూర్ గ్రామ శివారు గాజులపల్లి ఎస్సారెస్సీ కాలువ సమీపంలో శ్రీనివాస్కు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఎనిమిదేళ్లక్రితం మంచిర్యాల జిల్లాలోని తన బంధువుల ఇంటికి వెళ్లిన శ్రీనివాస్.. పంట రక్షణకు సోలార్ కంచె గురించి తెలుసుకున్నాడు. వెంటనే తన చేను చుట్టూ ఏర్పాటు చేశాడు. అడవిజంతువుల బారి నుంచి పంటలు రక్షించుకుంటున్నాడు. మంథని మండలంలో ఇద్దరు, ముగ్గురు రైతులే ఇలా సోలార్ కంచెలు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వారికి వ్యవసాయాధికారులు అవగాహన కల్పిస్తే ప్రాణనష్టం నివారించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. షాక్ మాత్రమే వస్తుంది.. ప్రాణనష్టం ఉండదు.. చేను చుట్టూ ఏర్పాటు చేసే సోలార్ పవర్ కంచెతో షాక్ మాత్రమే వస్తుందని, దీంతో జంతువులు భయపడి దూరంగా వెళ్తాయని రైతులు చెబుతున్నారు. బ్యాటరీ సాయంతో విద్యుత్ ఉత్పత్తి అవుతున్నా అది కేవలం షాక్ తగిలేంత వరకే ఉంటుందంటున్నారు. తద్వారా జంతువులే కాదు.. మనుషులకూ ప్రాణనష్టం ఏమీ ఉండదంటున్నారు. లక్కేపూర్ గ్రామ రైతు వినూత్న ఆలోచన అడవిజంతువుల బారినుంచి పంటల రక్షణ అవగాహన పెంచుకుంటే మంచిఫలితాలు -
బస్టాండ్లో వ్యక్తిపై దాడి
కరీంనగర్ క్రైం: కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మూత్ర విసర్జన చేసిన వ్యక్తిపై బుధవారం రాత్రి దాడి జరిగింది. తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కరీంనగర్కు చెందిన పరశురాం(58) కూలీ పని చేసుకుంటూ రోడ్లపైన జీవనం సాగిస్తున్నాడు. మద్యం మత్తులో బస్టాండ్ ఆవరణలో మూత్ర విసర్జన చేశాడు. అక్కడే ఉన్న కొందరు అతనిపై దాడి చేయడంతో చేయి విరిగింది. బాధితుడు వన్టౌన్ పోలీసుస్టేషన్కు రావడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చెయ్యి విరిగిందని, సర్జరీ అవసరమని డాక్టర్లు తెలిపారు. అయితే పోలీసులే తనపై దాడి చేశారని, బాధితుడు తెలపడంతో వన్టౌన్ పోలీసులు బస్టాండ్ ఆవరణలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. -
ఒంటరితనం భరించలేక వ్యక్తి ఆత్మహత్య
జ్యోతినగర్(రామగుండం): ఒంటరితనం భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. రామగుండం కార్పొరేషన్ ఇందిరమ్మకాలనీలో నివాసముంటున్న కాసుల రాకేశ్(34) తల్లి కర్మ ఈనెల 12న జరిగింది. అంతకముందే తండ్రి చనిపోయాడు. ఇద్దరూ మృతి చెందడంలో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మూడురోజుల క్రితం చనిపోగా ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి బావ కొమురోజు సుమన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్టీపీసీ పోలీసులు తెలిపారు. గుండారంలో ఒకరు.. కమాన్పూర్(మంథని): మండలంలోని గుండారం గ్రామానికి చెందిన గుర్రాల రాజేశం(60) ఒంటరితనం భరించలేక గురువారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటరితనంతో పాటు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మృతుడి సోదరుడు చంద్రమౌళి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకుని యువకుడు.. వెల్గటూర్: ఉరేసుకుని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని శాఖాపూర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తనుగుల శివకుమార్ నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లాడు. అక్కడే అనారోగ్యంతో మతిస్థిమితం కోల్పోయాడు. అక్కడి వారి సహాయంతో సొంత గ్రామానికి చేరుకున్నాడు. అప్పటినుంచి చికిత్స తీసుకుంటున్నాడు. ఈక్రమంలో గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. శివకుమార్కు భార్య, ఆరేళ్ల లోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. శివకుమార్ తల్లి వీరమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. అనారోగ్యం భరించలేక మహిళ.. పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణ శివారు రంగంపల్లి కి చెందిన పూదరి అనసూయ (54) గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై నరేశ్ తెలిపిన వివరాలు.. కొద్దిరోజుల క్రితం అనసూయ జారి పడగా కాలువిరిగింది. వైద్యం చేయించినా నొప్పి తగ్గకపోవడంతో బాధ భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై పేర్కొన్నారు. గడ్డిమందు తాగి వ్యక్తి.. రామగిరి(మంథని): మండలంలోని కల్వచర్ల గ్రామపంచాయతీ పరిధి గోకుల్నగర్కు చెందిన జంగ రాజు(38) గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామపంచాయతీ ముల్కలపల్లి వద్ద గడ్డి మందు తాగి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. వెంటనే కుటుంబ సభ్యులు వరంగల్ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రాజుకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. అప్పుల బాధతో రైతు..రుద్రంగి(వేములవాడ): మండలకేంద్రానికి చెందిన రైతు పిట్టల నర్సయ్య (62) అప్పుల బాధతో పరుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. నర్సయ్య అప్పుల బాధతో మనస్తాపానికి గురై బుధవారం మధ్యాహ్నం తన పంట పొలం వద్ద పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు గమనించి కరీంనగర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్ల ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. -
మద్దికుంట సబ్సెంటర్కు స్టాండర్డ్ సర్టిఫికెట్
ముస్తాబాద్: అత్యుత్తమ వైద్య సేవలు అందించినందుకు మద్దికుంట ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్(సబ్సెంటర్) స్టాండర్డ్ సర్టిఫికేట్కు ఎంపికై ందని వైద్యాధికారి హఫీజా తెలిపారు. మద్దికుంట సబ్సెంటర్ను సెప్టెంబర్ 18న రాష్ట్ర బృందం పరిశీలించి ఇక్కడ అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారని అన్నారు. జిల్లాలోనే అత్యుత్తమ ఆరోగ్య ఉపకేంద్రంగా మద్దికుంట ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈమేరకు ఎంఎల్హెచ్పీ రమ్య, ఏఎన్ఎంలు మణేమ్మ, విజయనిర్మల, ఆశ వర్కర్లను జిల్లా వైద్యాధికారి రజిత అభినందించారు. -
విజయవంతంగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్
కరీంనగర్: అవయవ మార్పిడి శస్త్రచికిత్సల్లో అగ్రగామిగా నిలుస్తున్న గ్లెనిగల్స్ హాస్పిటల్స్ ఊపిరితిత్తుల మార్పిడి (లంగ్ ట్రాన్స్ప్లాంట్) రంగంలోనూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందని ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్టు తపస్వికృష్ణ, పల్మనాలజిస్టు వినయ్కుమార్ తెలిపారు. గురువారం కరీంనగర్లోని సూర్య చెస్ట్ హాస్పిటల్లో లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఊపిరితిత్తుల సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లంగ్ ట్రాన్స్ప్లాంట్ శస్త్రచికిత్సల ప్రాధాన్యం గురించి వివరించారు. దగ్గు, అలసట, దీర్ఘకాలికంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, చాతినొప్పి, రోజువారీ పనుల్లో నిస్సత్తువ వంటి లక్షణాలు గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. గ్లెనిగల్స్ హాస్పిటల్స్లో లంగ్ ట్రాన్స్ప్లాంట్లు విజయవంతం కావడం వెనుక సర్జన్లు, అనస్థీషియా నిపుణుల సమష్టి కృషి ఉందన్నారు. రామడుగు మండలం గుండిగోపాలరావుపేటకు చెందిన రాజిరెడ్డి దశాబ్ద కాలంగా సీపీవోడీతో బాధపడుతూ నిరంతరం ఆక్సిజన్పై ఆధారపడి జీవించేవారని, గ్లెనిగల్స్ వైద్య బృందం సలహా మేరకు ఆయనకు లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయగా ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారని తెలిపారు. లంగ్ ట్రాన్స్ప్లాంట్లపై ఉన్న అపోహలను తొలగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ తపస్వి కృష్ణ -
రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో చోరీ
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని హౌసింగ్బోర్డు కాలనీకి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో గుర్తుతెలియని దొంగలు తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి తాళం వేసి రెండు రోజులక్రితం ఊరికెళ్లాడు. బుధవారం సాయంత్రం ఇంటికొసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లో అద్దెకున్న వారు కూడా లేకపోవడంతో వారి ఇంటి తాళాలు కూడా పగులగొట్టారు. రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో నుంచి 15 తులాల వెండి, రూ.10వేలు, అద్దెకుంటున్న వారి ఇంట్లో బంగారం, రూ.6 వేలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకే కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనంమెట్పల్లి: మెట్పల్లిలోని హన్మాన్నగర్కు చెందిన మానస ఇంట్లో దొంగతనం జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. బుధవారం రాత్రి సమయంలో మానస ఇంటికి తాళం వేసి తల్లిగారింటికి వెళ్లింది. గురువారం ఉదయం ఇంటికి రాగా.. తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా.. బీరువాలో దాచి ఉంచిన 4తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదు కనిపించలేదు. పోలీసులకు సమాచారం అందిచంగా.. వారు సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. 15 తులాల వెండి.. రూ.16 వేలు చోరీ -
మద్యంలో నిద్రమాత్రలు కలిపి.. ఆపై ఉరేసి
కరీంనగర్క్రైం: నిత్యం డబ్బుల కోసం వేధిస్తున్నాడని భర్తను చంపాలనుకున్నదో భార్య. మొదటిసారి విఫలం కావడంతో రెండోసారి మద్యంలో బీపీ, నిద్రమాత్రలు పొడిచేసి కలిపి తాగించింది. అపస్మారస్థితిలోకి వెళ్లాక ఉరేసి చంపేసింది. ఈ ఘటనలో ప్రధాన నిందితురాలితో పాటు ఐగురుగురిని కరీంనగర్ టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. కమిషనరేట్లో గురువారం సీపీ గౌస్ఆలం కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. నగరంలోని సప్తగిరికాలనీలో నివాసముంటున్న కత్తి మౌనిక, సురేశ్ 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మౌనిక ఇటీవల సెక్స్వర్కర్గా మారింది. సురేశ్ నిత్యం డబ్బుల కోసం వేధించడంతో చంపాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం తన బంధువులైన అరిగె శ్రీజ, పోతు శివకృష్ణ, దొమ్మాటి అజయ్, నల్ల సంధ్య ఊరాఫ్ వేముల రాధ, నల్ల దేవదాస్ సాయం కోరింది. వారి సూచనల మేరకు ఒకరోజు వయాగ్రా మాత్రలు కూరలో కలిపి చంపాలని ప్రయత్నించగా, వాసన రావడంతో సురేశ్ తినలేదు. గతనెల 17న సురేశ్ మద్యం సేవిస్తుండగా బీపీ, నిద్ర మాత్రలు పొడిగాచేసి మద్యంలో కలపడంతో అది తాగిన సురేశ్ అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. సురేశ్ మెడకు చీరను బిగించి, కిటికి గ్రిల్కు వేలాడదీసి ఉరేసి చంపేసింది. తర్వాత లైంగిక చర్య సమయంలో స్పృహ కోల్పోయాడని తన అత్తమామలకు చెప్పింది. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే సురేశ్ మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మౌనిక ప్రవర్తనపై నిఘా పెట్టిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. ఆమెను విచారించగా తానే అరిగెశ్రీజ, పోతు శివకృష్ణ, దొమ్మాటి ఆజయ్, వేముల రాధ, నల్ల దేవదాస్ సాయంతో హత్య చేసినట్లు ఒప్పుకుంది. నిందితులను టూటౌన్ పోలీసులు అరెస్టు చేసి, గురువారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించిన ఏసీపీ వెంకటస్వామి, సీఐ సృజన్రెడ్డి, ఎస్సై చంద్రశేఖర్ను సీపీ అభినందించారు. డబ్బుల కోసం వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు వివరాలు వెల్లడించిన కరీంనగర్ సీపీ గౌస్ ఆలం -
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ
● 16మందికి గాయాలు ● కరీంనగర్ జిల్లా కేశవపట్నంలో ఘటన శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం బ స్టాండ్ ఎదుట గురువారం రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నా యి. ఈ ఘటనలో కండక్టర్తో పాటు 15మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. హుజూ రాబాద్ డిపోకు చెందిన అద్దె బస్సు కరీంనగర్ వెళ్తోంది. సిరిసిల్ల డిపోకు చెందిన డీలక్స్ వరంగల్ వెళ్తోంది. కేశవపట్నం బస్టాండ్లోకి వెళ్లేందుకు హుజురాబాద్ డిపో బస్సును డ్రైవర్ కుడివైపు తిప్పాడు. ఈ క్రమంలో వరంగల్ వైపు వెళ్తున్న డీలక్స్ బస్సు ఢీకొంది. రెండు బస్సుల ముందు భాగం దెబ్బతినగా, కండక్టర్తో పాటు 15మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. 108లో హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. హుజూరాబాద్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ దెబ్బతిన్న బస్సులను బస్టాండ్ ఆవరణలోకి తరలించారు. అద్దెబస్సు డ్రైవర్ షబ్బీర్ బేగ్ ఫిర్యాదుతో సిరిసిల్ల డ్రైవర్పై కేసు నమోదు చేశామని ఎస్సై శేఖర్రెడ్డి తెలిపారు. -
భవనం పై నుంచి పడి యువకుడి మృతి
మెట్పల్లి: పట్టణంలోని మినీ స్టేడియంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంపై నుంచి పడి నర్సింహులు(32) మృతి చెందాడు. స్థానికుల కథనం ప్ర కారం..స్థానిక చైతన్యనగర్కు చెందిన నర్సింహు లు స్డేడియానికి వచ్చి భవనంపైకి వెళ్లాడు. ప్ర మాదవశాత్తు జారి కింద పడ్డాడు. తీవ్రంగా గా యపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): మండలంలోని గర్రెపల్లి–సుల్తానాపూర్ రోడ్డులో గు రువారం రాత్రి సైకిలి స్టును ద్విచక్ర వాహనదారుడు ఢీకొన్న ఘటనలో ఎలిగేడు మండలం సుల్తానాపూర్కు చెందిన అడెపు కుమార్(40) మృతిచెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. సుల్తానాపూర్కు చెందిన కుమార్ హైదరాబాద్లో ఉన్న తన ద్విచక్ర వాహనాన్ని తీసుకొని ఇంటికి వస్తున్న క్రమంలో సుల్తానాపూర్లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం వద్ద సైకిలిస్ట్ను తప్పించబోయి కిందపడగా తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఐతరాజుపల్లికి చెందిన సైకిలిస్టుకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జగిత్యాలక్రైం: జగిత్యాలలోని బైపాస్రోడ్లో ఓ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ప్రభుత్వ వైద్యుడు తీవ్రంగా గాయపడ్డాడు. సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన వైద్యుడు శ్రీనివాస్ జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో హెచ్డీవోగా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం బైపాస్ రోడ్ నుంచి తన స్కూటీపై ఆస్పత్రికి వస్తుండగా లారీ ఢీకొట్టింది. శ్రీనివాస్ తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. జ్యోతినగర్(రామగుండం): రోడ్డుపై సొమ్మసిల్లి పడిపోయింది ఓ అమ్మ. తమ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారో..ఎందుకు వదిలేశారో కూడా చెప్పుకోలేక అనాథగా రోడ్డుపై పడిపోయింది. ఎన్టీపీసీ రామగుండం ఆటోనగర్ ప్రాంతంలో లక్ష్మమ్మ అనే వృద్ధురాలు కొద్దిరోజులుగా కాలనీలో సంచరిస్తూ గురువారం రాత్రి సమయంలో రోడ్డుపై పడిపోయింది. ఈ క్రమంలో ఆటోనగర్ ప్రజలు ఆమె పడిపోయిన విషయాన్ని కంది నాగరాజుకు తెలియజేయగా ఆయన ఆమె వివరాలను ఆరా తీశారు. కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామమని, తన పేరు లక్ష్మమ్మ అని తెలియజేసింది. వెంటనే 108లో గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పతికి తీసుకెళ్లారు. కరీంనగర్ క్రైం: మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను ఉద్దేశించి మాజీ ఎమ్మె ల్యే రసమయి బాలకిషన్ ఇటీవల వాట్సాప్లో ఒక వాయిస్ మెసేజ్ పంపినట్లు ఎమ్మెల్యే తిమ్మాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. -
కోలిండియా పోటీల్లో సింగరేణికి పతకాలు
గోదావరిఖని(రామగుండం): నాగ్పూర్లో ఈనెల 14 నుంచి 16 వరకు డబ్ల్యూసీఎల్ ఆధ్వర్యంలో జరిగిన కోలిండియా పోటీల్లో సింగరేణి క్రీడాకారులు సత్తాచాటారు. ● పవర్లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ పోటీల్లో ఐదు గోల్డ్, ఆరు సిల్వర్, మూడు బ్రాంజ్ మెడల్స్ సాధించారు. పవర్లిఫ్టింగ్ 59 కేజీల విభాగంలో భూపాల్పల్లికి చెందిన బానోతు రమేశ్(ట్రామర్), 120 కేజీల విభాగంలో మీర్జా యాసీన్బేగ్ (సీనియర్ అండర్మేనేజర్), 93 కిలోల విభాగంలో ఆర్జీవన్కు చెందిన పి.వంశీకృష్ణ(జనరల్ అసిస్టెంట్) వెండి, 69 కిలోల ఉమెన్స్ విభాగంలో భూపాల్పల్లికి చెందిన డి.అనూష (జనరల్ అసిస్టెంట్) సిల్వర్, 52కిలోల విభాగంలో ఆర్జీ–2 ఏరియాకు చెందిన ఎస్కే ఆషియాబేగంబ్రాంజ్ మెడల్ సాధించారు. ● వెయిట్ లిఫ్టింగ్ 71కిలోల విభాగంలో మణుగూరుకు చెందిన కె.అనిల్కుమార్(కన్వేయర్ ఆపరేటర్)సిల్వర్, 110 కిలోల విభాగంలో కొత్తగూడెంకు చెందిన పి.పవన్కుమార్(ఫిట్టర్) సిల్వర్ మెడల్ సాధించారు. ● బాడీ బిల్డింగ్ పోటీల్లో వంద కిలోల విభాగంలో కొత్తగూడెంకు చెందిన పి.పవన్కుమార్(ఫిట్టర్) గోల్డ్, 55 కిలోల విభాగంలో ఎం.అంజయ్(జనరల్ అసిస్టెంట్) సిల్వర్, 70కిలోల విభాగంలో ఆర్జీ–3 ఏరియాకు చెందిన ఆర్.అర్జున్(ఈపీఆపరేటర్) బ్రాంజ్, 75 కిలోల విభాగంలో బెల్లంపల్లికి చెందిన జె.మొగిలి(ఈపీఆపరేటర్) సిల్వర్, 80కిలోల విభాగంలో కొత్తగూడెంకు చెందిన ఎం.రామకృష్ణ(అసిస్టెంట్ చైన్మెన్) గోల్డ్, 85కిలో ల విభాగంలో భూపాల్పల్లికి చెందిన ఎస్.శ్రీనివాస్రెడ్డి(కోల్కట్టర్) గోల్డ్మె, వందకిలోల విభాగంలో మందమర్రికి చెందిన బి.వెంకటస్వామి(ఏఎస్ఎం) సిల్వర్ మెడల్ సాధించారు. వీరిని సింగరేణి సీఎండీ ఎన్.బలరాం, డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ అభినందించారు. ఐదు గోల్డ్, ఆరు సిల్వర్, మూడు బ్రాంజ్ పతకాలు -
దర్శనం కోసం వెళ్తే.. ప్రాణమే పోయింది
మల్యాల: కొండగట్టు అంజన్నను దర్శించుకునేందుకు వచ్చిన ఓ వృద్ధురాలు ఆలయ అధికారుల నిర్లక్ష్యానికి బలైంది. ఈ ఘటన కొండగట్టులో గురువారం చోటుచేసుకుంది. భక్తులు, ఎస్సై నరేశ్కుమార్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన వెనగంటి సత్యనారాయణ కుటుంబసభ్యులతో కలిసి కొండగట్టులోని అంజన్న దర్శనానికి వచ్చారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు సత్యనారాయణ తల్లి రాజేశ్వరి (84), భార్య సరి త కోనేరు పక్కనే ఉన్న టాయిలెట్స్ వద్దకు వెళ్లారు. టాయిలెట్స్ గోడకు ఆనుకుని ఉన్న ఇనుప జాలిని రాజేశ్వరి పట్టుకుంది. అప్పటికే ఆ జాలికి విద్యుత్ ప్రసారం అవుతోంది. షాక్తగిలి రాజేశ్వరి అక్కడికక్కడే మృతి చెందింది. అత్తను కాపాడే క్రమంలో సరిత తీవ్రంగా గాయపడింది. తన తల్లి మృతికి కొండగట్టు ఆలయ ఈవో, అధికారుల నిర్లక్ష్యమే కారణమని సత్యనారా యణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈవోతోపాటు సంబంధిత అధికారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. టాయిలెట్స్ గోడ ఇనుప జాలికి విద్యుత్ ప్రసారం కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి వృద్ధురాలు మృతి కాపాడే క్రమంలో వృద్ధురాలి కోడలికి తీవ్ర గాయాలు జగిత్యాల జిల్లా కొండగట్టులో ఘటన -
స్వగ్రామానికి యువకుడి మృతదేహం
గంభీరావుపేట(సిరిసిల్ల ): మండలంలోని నాగంపేటకు చెందిన బిట్ల తేజ(24) దుబాయిలో అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. నెల రోజుల తర్వాత మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరింది. జీవనోపాధి కోసం 8 నెలల క్రితం తేజ దుబాయి వెళ్లాడు. నెల రోజుల క్రితం ఇంటికొస్తానని షాపింగ్ చేయడానికి బయటకు వెళ్లి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. మృతికి కారణాలు తెలియలేదు. పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని కూనారం రోడ్డుకు చెందిన వేల్పుల రమేశ్ (55)అనే కిరాణా వ్యాపారి బుధవారం విద్యుత్ షాక్ గురై మరణించాడు. భవనం పైఅంతస్తుకు ఇనుప నిచ్చెన తీసుకెళ్తుండగా.. పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో ఆయన షాక్కుగురయ్యాడు. స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారని ఎస్సై లక్ష్మణ్రావు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య సుశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మేకల కాపరి ఆత్మహత్యఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లతిమ్మాపూర్కు చెందిన చాట్ల శంకరయ్య(47) అనే మేకల కాపరి అనారోగ్యం బాధ భరించలేక బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై రాహుల్రెడ్డి తెలిపిన వివరాలు. శంకరయ్య మేకలను కాస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఐదేళ్ల క్రితం కడుపునొప్పి, షుగర్, బీపీ వ్యాధుల బారిన పడ్డాడు. పలు ఆస్పత్రులు తిరిగి వైద్యం చేయించుకున్నాడు. ఆరోగ్యం కుదుట పడకపోవడంతో వైద్యం కోసం చేసిన అప్పులు మిగిలాయి. భార్య లక్ష్మి మేకలను కాసేందుకు బుధవారం ఉదయం వెళ్లగా.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్రెడ్డి వివరించారు. మల్లాపూర్: మండలంలోని కొత్తదాంరాజుపల్లి శివారు గోదావరిలో బుధవారం ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. స్థానికుల సమాచారంతో ఎస్సై రాజు, సిబ్బంది ఘటనస్థలికి చేరుకుని అన్ని పోలీస్స్టేషన్లకు సమాచారమిచ్చారు. నిర్మల్ జిల్లాకేంద్రం నుంచి జోరిగే మౌనిక కుటుంబ సభ్యులతో వచ్చి శవాన్ని గుర్తుపెట్టారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్కు చెందిన జోరిగే గంగాధర్(35) నిర్మల్ జిల్లాకేంద్రంలో ఫుట్వేర్ షాపు నిర్వహిస్తున్నాడు. షాపు సరిగా నడవక అప్పులు పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఇంట్లో చెప్పకుండా ఈనెల 8న బైక్పై వెళ్లిపోయాడు. 10న సోన్ బ్రిడ్జి వద్ద గోదావరిలో దూకినట్లు తెలుస్తోంది. వరద ఉధృతికి కొట్టుకొచ్చిన శవం కొత్తదాంరాజుపల్లి వద్ద ఒడ్డుకు చేరింది. మౌనిక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బాలికపై అత్యాచారయత్నం పెద్దపల్లిరూరల్: జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన బాలికపై అత్యాచారానికి యత్నించిన బూసెల్లి నగేశ్పై బుధవారం కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై మల్లేశ్ తెలిపారు. గ్రామానికి చెందిన బాలిక టెన్త్ క్లాస్ చదువుతోంది. ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో సమీప బంధువైన నగేశ్ ఇంట్లోకి చొరబడి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చైల్డ్లైన్ అధికారుల ద్వారా బాలిక పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసినట్టు ఎస్సై వివరించారు. -
వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోచీబజార్లోని వేదిక షాపింగ్మాల్లో షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగి సుమారు రూ.40 లక్షల మేరకు ఆస్తినష్టం వాటిల్లింది. షాపింగ్మాల్ నిర్వాహకులు మంగళవారం రాత్రి తాళం వేసి వెళ్లారు. మాల్ నుంచి పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు సకాలంలో చేరుకుని మంట లను ఆర్పివేశారు. ఇరువైపులా మంటలు వ్యాపించకుండా కట్టడి చేశారు. ప్రమాదంలో సుమారు రూ. 40 లక్షల విలువైన వస్త్రాలు కాలిపోయినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రమాదానికి షార్ట్సర్క్యూట్ కారణమని నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. మంటలను ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది సుమారు రూ.40 లక్షల నష్టం -
కుంగుబాటు.. లొంగుబాటు!
● నాడు జనశక్తి.. నేడు మావోయిస్టులు ● 2002లోనే 46 మంది సాయుధ జనశక్తి నక్సలైట్ల సరెండర్ ● అప్పటి సీఎంకు ఆయుధాలు అప్పగింత ● నేడు మహారాష్ట్రలో పునరావృతం.. 61 మంది అస్త్రసన్యాసం సిరిసిల్ల: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండున్నర దశాబ్దాల కిందట సీపీఐ(ఎంఎల్) మావోయిస్టు, జనశక్తి నక్సలైట్ల ఉద్యమాలు బలంగా ఉండేవి. కరీంనగర్ జిల్లాను తూర్పు, పశ్చిమ డివిజన్లుగా విభజించి నక్సలైట్ల కార్యకలాపాలు సాగేవి. ఇప్పటి పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలు తూర్పు డివిజన్ పరిధిలో ఉండగా.. రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాలు పశ్చిమ డివిజన్ పరిధిలో ఉన్నాయి. తూర్పు డివి జన్లో మావోయిస్టు(అప్పటి పీపుల్స్వార్)లకు పట్టుండగా.. పశ్చిమ డివిజన్లో మావోయిస్టులతోపాటు జనశక్తి నక్సలైట్లు సమాంతర ప్రభుత్వాన్ని నడిపారు. తాజాగా మావోయిస్టు పార్టీకి చెందిన పోలిట్బ్యూరో సభ్యుడు, మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోను అలియాస్ భూపతితో సహా 60 మంది సాయుధ నక్సలైట్లు, మహారాష్ట్ర సీఎం దేవేందర్ ఫడ్నవీస్ ఎదుట బుధవారం లొంగిపోయారు. మావోయి స్టు ఉద్యమ చరిత్రలో కేంద్ర కమిటీ సభ్యుడి స్థా యి నాయకుడితోపాటు ఇంత పెద్ద మొత్తంలో మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోవడం ఓ మైలురాయి. 23 ఏళ్ల కిందట జనశక్తి తాజా పరిణామాల నేపథ్యంలో 23 ఏళ్ల కిందటే సీపీఐ(ఎంఎల్) జనశక్తి సాయుధ నక్సలైట్లు 46 మంది లొంగుబాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పటి జనశక్తి పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ కార్యదర్శి రణధీర్ అలియాస్ సుంకెట సాయిలు ఆధ్వర్యంలో జనశక్తి జిల్లా కమిటీ సభ్యులు ముకేశ్, జగన్, గుట్టన్న, మహేశ్, రవీందర్రెడ్డిలతోపాటు మొత్తం 46 మంది సాయుధులు లొంగిపోయారు. ఇప్పుడు గడ్చిరోలీ జిల్లా తరహాలోనే అప్పట్లో రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట–రుద్రంగి మధ్య అటవీ ప్రాంతంలో ప్రైవేటు సర్వీసు బస్లో 46 మంది సాయుధ నక్సలైట్లు హైదరాబాద్ వెళ్లారు. మధ్యలో ఆ బస్లో పోలీసులు ఎక్కారు. రెండు రోజులపాటు హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్లో బసచేసిన నక్సలైట్లు అప్పటి సీఎం చంద్రబాబు సమక్షంలో లొంగిపోయారు. అప్పటి డీజీపీ పేర్వారం రాములు, అప్పటి ఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్(ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకుడు), ఓఎస్డీ మధుసూదన్రెడ్డిలు జనశక్తి నక్సలైట్ల లొంగుబాటులో కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే జనశక్తి పార్టీని వేములవాడ మూలవాగులో నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఆ టైంలో మిగిలి ఉన్న కొద్దిమంది యాక్టివ్ సభ్యులు కూడా లొంగిపోయారు. తర్వాతి క్రమంలో ఆ పార్టీ కనుమరుగైంది. లొంగుబాటుకు ముందు.. జనశక్తి నక్సలైట్ల లొంగుబాటుకు ముందు 2001 అక్టోబర్ 26న బోయినపల్లి మండలం కోరెంలో సొంతూరిలో దసరా వేడుకలకు వచ్చిన అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్రావు బావమరిది క్లాస్–1 కాంట్రాక్టర్ మార్తండరావును జనశక్తినేత రణధీర్ కిడ్నాప్ చేశారు. రాయభేరాల తరువాత వారం రోజులకు విడుదల చేశారు. ఈ క్రమంలో పోలీసు ఉన్నతాధికారులు జనశక్తిపై దృష్టిసారించారు. ఈ క్రమంలో రణధీర్తో అప్పటి జిల్లా ఎస్పీ ప్రవీణ్కుమార్, ఓఎస్డీ మధుసూదన్రెడ్డి మరో ఇద్దరు పోలీసు అధికారులు నేరుగా మేడిపల్లి మండలం మోత్కురావుపేట అడవుల్లోకి వెళ్లి రహస్యంగా చర్చలు జ రిపి సామూహిక లొంగుబాటుకు బాటలు వేశారు. మూలవాగులో జనశక్తి నిమజ్జనం అప్పటికే మూడు దశాబ్దాల ఉద్యమ చరిత్ర గల జనశక్తి సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట, కామారెడ్డి, భీంగల్ ప్రాంతాల్లో బలమైన ప్రజా ఉద్యమాన్ని నడిపించేది. 1989లో సిరిసిల్ల ఎమ్మెల్యేగా నెల్లూరు జిల్లాకు చెందిన ఎన్.వీ.కృష్ణయ్యను గెలిపించడంతో జనశక్తి కీలకంగా ఉంది. వేములవాడకు చెందిన కూర రాజన్న అలియాస్ రాజేందర్ నాయకత్వంలో ఉద్యమం బలపడింది. 46 మంది సాయుధ నక్సలైట్ల లొంగుబాటులో ఆ పార్టీ బలహీనపడింది. ఈ నేపథ్యంలో అప్పటి ఎస్పీ ప్రవీణ్కుమార్ వేములవాడ మూలవాగులో మాజీ నక్సలైట్లతో జనశక్తి పార్టీని నిమజ్జనం చేశారు. జనశక్తి మిలిటెంట్లపై కేసులు ఎత్తివేస్తున్నామని, ఇకపై అసాంఘిక కార్యక్రమాలు మానివేయాలని కోరుతూ మూలవాగులో పోలీస్ రికార్డుషీట్లను దహనం చేశారు. అంతకుముందు వేములవాడ ఆర్యవైశ్యభవన్లో జనశక్తి పార్టీ శ్రేణులతో ఎస్పీ సమావేశం నిర్వహించి నిమజ్జన లక్ష్యాలను వివరించారు. పునర్నిర్మాణంలో ఆటుపోట్లు పోలీసులు చేపట్టిన వేములవాడ నిమజ్జనాన్ని జనశక్తి నాయకత్వం సవాల్గా తీసుకుంది. ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేసింది. అప్పటికే 46 మందితో లొంగిపోయిన గుట్టన్న దళనేతగా మరో రెండు దళాలను ఏర్పాటు చేశారు. ఇందులో కిరణ్, సంజీవ్ దళాలు సిరిసిల్ల, జగిత్యాల ప్రాంతంలో పనిచేస్తూ కొత్తగా పార్టీ కేడర్ను రిక్రూట్మెంట్ చేసే ప్రయత్నం చేశారు. కోనరావుపేట మండలం వట్టిమల్ల వద్ద ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను గుట్టన్న దళం కాల్చిచంపగా.. ప్రతిగా మరుసటి రోజే పోలీసులు చందుర్తి మండలం సనుగుల వద్ద ఇద్దరిని ఎన్కౌంటర్ చేశారు. గుట్టన్న సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపం వద్ద ఎన్కౌంటర్ అయ్యాడు. 2004లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నక్సలైట్లతో చర్చలు జరపగా.. మావోయిస్టు నాయకులతోపాటు జనశక్తి పక్షాన అప్పటి రాష్ట్ర కార్యదర్శి అమర్ అలియాస్ కూర దేవేందర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు రియాజ్ అలియాస్ వెంకటేశ్ పాల్గొన్నారు. చర్చల అనంతరం 2005 జూన్ 30న ముస్తాబాద్ మండలం బదనకల్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో రియాజ్తోపాటు మరో నలుగురు మరణించారు. జనశక్తి అగ్రనేత కూర రాజన్నను ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ జిల్లాలో, మరో అగ్రనేత అమర్ అలియాస్ దేవేందర్ను మహారాష్ట్రలోని పుణేలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో లొంగుబాట్లు, పోలీసు నిర్బంధంతో జనశక్తి సాయుధ దళాలు కనుమరుగయ్యాయి. -
జ్వరం.. దగ్గు.. జలుబు!
కరీంనగర్: ఇటీవల కాలంలో వాతావరణ మార్పులు, వర్షాలు, దోమల విజృంభణ తదితర కారణాలతో వైరల్ జ్వరాలు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా డెంగీ, టైఫాయిడ్, చికెన్గున్యా, మలేరియా వంటి రోగాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈక్రమంలో సాధారణంగా జ్వరం వచ్చిందంటే చాలామంది చిన్న విషయంగా తీసుకుంటారు. కాగా, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో రోజూ వెయ్యికి పైగా ఓపీ నమోదవుతోంది. కానీ, ఇన్పేషెంట్లు చాలా తక్కువగా ఉంటున్నారు. అంటే జ్వరం వచ్చినవారంతా తమకు మందులు రాయండి ఇంటి వద్దే ఉండి వాడుకుంటామని అంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. తీవ్ర జ్వరం ఉన్నా నిర్లక్ష్యంగా మందులు రాయమనే చెబుతుండడంతో వైద్యులు కూడా రాసి పంపిస్తున్నారు. వైరల్ ఫీవర్ అంటే.. వైరల్ ఫీవర్ అనేది వైరస్ కారణంగా వచ్చేది. వైరస్ కారణంగా శరీర రక్షణ వ్యవస్థ (ఇమ్మ్యూన్ సిస్టమ్), శరీరంలో ఉష్ణోగ్రత పెంచుతుంది. వైరల్ ఫీవర్ వల్ల తలనొప్పి, కడుపునొప్పి, జలుబు, దగ్గు, కీళ్ల నొప్పులు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. నాలుగురోజులు మించి కొనసాగితే.. వైద్య నిపుణుల సూచన ప్రకారం జ్వరం మూడు నుంచి నాలుగు రోజులకు మించి తగ్గకుంటే వెంట నే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే ఇది సాధారణ వైరల్ కాకుండా డెంగీ, టై ఫాయిడ్, మలేరియా లేదా లివర్, కిడ్నీ సంబంధిత సమస్యల సంకేతంగా కూడా ఉండే ప్రమాదముంది.జ్వరంతో ఉంటే.. డెంగీ ఫీవర్ : ప్లేట్లెట్ల సంఖ్య లోపించి రక్తస్రావానికి కారణమవుతుంది టైఫాయిడ్ : జీర్ణ సంబంధిత అవయవాలపై ప్రభావం మలేరియా : కాలేయం (లివర్), కిడ్నీపై ప్రభావం వైరల్ హెపటైటిస్ : కాలేయంపై తీవ్రమైన ప్రభావం వైరల్ మెనింజైటిస్ : మెదడు రక్షణ కవచంపై ఇన్ఫెక్షన్ -
‘క్రిప్టో’ దందాపై పోలీసుల నిఘా
● జిల్లానుంచి పరారైన నిందితులు ● వారి కోసం గాలిస్తున్న పోలీసులు ● పెరుగుతున్న రాజకీయ ఒత్తిళ్లు జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లాలో రెండేళ్లుగా మెటాఫండ్ ప్రో, పలు కంపెనీల పేరుతో ఆన్లైన్లో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ వస్తుందని నమ్మించి మోసం చేసిన యాప్ నిర్వాహకులపై పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే జిల్లాకు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేయడంతో పాటు, మరికొంత మందిని విచారణ చేపడుతున్నారు. మెటా ఫండ్ పేరుతో మోసం చేసిన వ్యక్తులపై మొదట కొడిమ్యాల పోలీస్స్టేషన్లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ముగ్గురిని రిమాండ్కు తరలించారు. జగిత్యాల పట్టణానికి చెందిన మరో వ్యక్తి సుమారు రూ.80.50 లక్షలు మోసం చేశారని ఫిర్యాదు చేయడంతో జగిత్యాలకు చెందిన ఓ వ్యక్తి.. హైదరాబాద్కు చెందిన మరో వ్యక్తిని పోలీసులు రిమాండ్కు తరలించారు. విచారణలో వెల్లడవుతున్న పేర్లు అరెస్ట్ అయిన వారితో పోలీసులు లోతైన విచారణ చేయడంతో చైన్ సిస్టమ్ దందా చేపట్టిన వారి రహస్యాలు బయటపడుతున్నాయి. అరెస్టయిన వారిలో ఓ వ్యక్తి ఆన్లైన్ పెట్టుబడుల్లో ప్రధాన పాత్ర పోషించిన సుమారు 12 మంది పేర్లు వెల్లడించినట్లు సమాచారం. వీరంతా వందలాది మందితో సుమారు రూ.500 నుంచి రూ.800కోట్లు పెట్టుబడి పెట్టించారు. యాప్ మూసినప్పటి నుంచి తమ డబ్బులు చెల్లించాలని పెట్టుబడి పెట్టినవారు ఒత్తిడి పెంచడంతో వారికి బాండ్ పేపర్లు, చెక్కులు ఇచ్చారు. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకపోవడంతో కొంత మంది పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు చేపడుతున్నారు. ఫిర్యాదు చేసేందుకు జంకుతున్న బాధితులు జిల్లాకు చెందిన కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు తమ పేరిట, బినామీల పేరిట ఆన్లైన్ క్రిప్టో దందాలో కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం వారు మోసపోయామని తెలుసుకున్నా.. ఫిర్యాదు చేసేందుకు మాత్రం జంకుతున్నారు. ఫిర్యాదు చేస్తే డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని విచారణ చేపడతారని భయాందోళన చెందుతున్నారు. మోసపోయిన వారిలో ఒకరిద్దరు పోలీసు అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం. వారు కూడా ఫిర్యాదు చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. పెరుగుతున్న రాజకీయ ఒత్తిళ్లు జిల్లాలో వేలాది మంది బాధితులు ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టి మోసపోవడంతో అసలైన యాప్ నిర్వాహకులను గుర్తించి బాధితులను ఆదుకోవాలని రాజకీయ ఒత్తిళ్లు తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే మాజీమంత్రి జీవన్రెడ్డి ముఖ్యమంత్రికి లేఖ రాశారు. దీనిపై పూర్తివిచారణ చేపట్టాలని రాష్ట్ర పోలీసు అధికారులకు విన్నవించారు. అసలు నిందితులను గుర్తించి వారి ఆస్తులను జప్తు చేసి బాధితులకు డబ్బు అందేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. -
దమ్మారో దమ్!
కొత్తపల్లి(కరీంనగర్): ‘దమ్ మారో దమ్’ అంటూ పారిశ్రామిక ప్రాంతం మత్తులో జోగుతోంది. మాదకద్రవ్యాలకు అలవాటు పడి ఓ వైపు యువత జీవితాన్ని నిర్వీర్యం చేసుకుంటుండగా.. మరో వైపు చేసిన కష్టాన్ని మరచిపోయేందుకు కార్మికులు వ్యసనంగా మార్చుకుంటున్నారు. పోలీసుల ఆపరేషన్లో దొరికింది గోరంతా.. రవాణా అవుతోంది కొండంతా అని తేలుతోంది. పోలీసుల అప్రమత్తంగా ఉన్నా పరిమిత స్థాయిలోనే పట్టుకోగలుతున్నారు. అయినా రవాణా ఆగడం లేదు. బావుపేట కేంద్రంగా.. మండలంలోని బావుపేట, ఖాజీపూర్, ఎలగందుల, బద్ధిపల్లి, కమాన్పూర్, నాగులమల్యాల, పక్కనున్న ఒడ్యారం గ్రామాల్లో వందలాదిగా గ్రానైట్ క్వారీలు, కట్టింగ్ పరిశ్రమలు వెలిశాయి. వీటిలో పనిచేసే వారంతా రాజస్థాన్, మధ్యప్రదేశ్, బిహార్, ఝార్కండ్, మహారాష్ట్ర, ఒడిశా, అస్సాం సహా 12 రాష్ట్రాల నుంచి వలస వచ్చారు. అందుకే బావుపేట పారిశ్రామిక ప్రాంతాన్ని మినీ ఇండియా పిలుస్తుంటారు. ముఖ్యంగా బావుపేట కేంద్రంగా ఈ దందా విచ్చలవిడిగా సాగుతోంది. మాదకద్రవ్యాలు సేవించిన కార్మికులు విచక్షణ కోల్పోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా గొడవలు, హత్యలు, అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని నియంత్రించడంలో అబ్కారీ, పోలీసు శాఖలు విఫలమవుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి.. పర్యవేక్షణ లోపించి ఇతర రాష్ట్రాల నుంచి బావుపేటకు మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా సరఫరా అవుతున్నాయి. ఒడిశా, మధ్యప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి గంజాయి, రాజస్థాన్ నుంచి నల్లమందు (ఇదోరకం డ్రగ్) సరఫరా అవుతోంది. అయితే వీటిని రోడ్డు మార్గం ద్వారా రవాణా చేస్తుండగా, తనిఖీలు లేక మాదకద్రవ్యాల సరఫరా జోరందుకుంది. కాగా, కరోనాకు ముందు కార్మికులు కేవలం రైళ్లలో రాకపోకలు సాగించేవారు. ప్రస్తుతం బస్సుల ద్వారా ప్రయాణిస్తుండడంతో గంజాయి, నల్లమందు రవాణా అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అమావాస్య రోజు ఆగమాగం గ్రానైట్ కార్మికులకు అమావాస్య రోజు సెలవు దినం కావడంతో విచ్చలవిడిగా మద్యం, మాదక ద్రవ్యాలు సేవించి ఆగమాగం చేస్తుంటారు. ఆరోజు కార్మికులంతా ఒక చోట చేరి విందులో మునిగితేలుతారు. దీనిలో భాగంగానే గంజాయి, నల్లమందు సేవిస్తూ విచక్షణ కోల్పోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం జరుగుతోంది. ఈ దాడులు కాస్త శ్రుతిమించి హత్యల వరకు వెళ్లిన ఘటనలు సైతం ఉన్నాయి. అమావాస్య నాడు గ్రానైట్ పరిశ్రమల యజమానులు అటు వైపు వెళ్లరంటే కార్మికులు ఏ స్థాయిలో ఉంటారో అర్థం చేసుకోవచ్చు. అంతేగాకుండా బావుపేట మార్కెట్ రోడ్లో వెళ్లేందుకు స్థానికులు, మహిళలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్నా గ్రానైట్ అసోసియేషన్ మాత్రం పట్టించుకోవడం లేదు. గ్రానైట్ పరిశ్రమలపై నిఘా పెంచి గంజాయి, నల్లమందు అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి
కరీంనగర్టౌన్: బీసీల రిజర్వేషన్ 42 శాతం అమలు కోసం ఈ నెల 18న బీసీ సంఘాల నేతలు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చినట్లు ఆయా సంఘాల నాయకులు పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బీసీ, కుల సంఘాల రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు ఎన్నం ప్రకాశ్, ఆది మల్లేశం, నాగుల కనకయ్యగౌడ్, రాచమల్ల రాజు, రాకేశ్చారి, కోడూరి పరశురామ్గౌడ్, శ్రీనివాస్, సంపత్గౌడ్, అంజయ్య, అరుణ, సురేందర్, సురేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. జయప్రదం చేయాలి అగ్రకులాలు చేస్తున్న కుట్రలను బీసీలు తిప్పికొట్టాలని, 18న రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని బీసీ హక్కుల సాధ న సమితి జిల్లా అధ్యక్షుడు బుచ్చన్నయాదవ్ పిలుపునిచ్చారు. ప్రధానకార్యదర్శి పిట్టల సమ్మయ్య పాల్గొన్నారు. -
తెరవెనుక డాక్టర్ అనస్థీషియా
కోల్సిటీ(రామగుండం): పేషెంట్కు నొప్పి తెలియకుండా ఆపరేషన్ చేయడం వైద్యశాస్త్రంలో ఓ అద్భుతం. శరీరంలోని ప్రతీ అవయవానికి చేసే సర్జరీకి ముందుగా మత్తుమందు(అనస్థీషియా)ఇస్తారు. దీంతో నొప్పి బావన ఉండదు. క్లిష్టమైన, అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడేందుకు అనస్థీషియా నిపుణులు చేస్తున్న సేవలు అత్యంత ముఖ్యమైనవి. తెరవెనుక డాక్టర్ అనస్థీషియా. వీరికోసం ఏటా అక్టోబర్ 16న ప్రపంచ అనస్థీషియా దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1846 అక్టోబర్ 16న తొలిసారి విలియం టీజీ మోర్టన్ అనే వైద్యుడు ఈథర్ అనస్థీషియాను విజయవంతంగా ప్రదర్శించారు. మత్తుమందు లేని రోజుల్లో.. అనెస్తీషియా అమలులోకి రానిరోజుల్లో పేషెంట్కు శస్త్రచికిత్స చేయాలంటే, మత్తు రావడానికి తలపై గట్టిగా కొట్టడం, పాములతో కరిపించడం, వివిధ రకాల మత్తు పదార్థాలు తినిపించడం, గట్టిగా చేతులతో పట్టుకుని ఆపరేషన్లు చేసేవారని చెబుతున్నారు. అనస్థీషియాను కనిపెట్టాక చిన్న సూదితో శరీరంలో మత్తు ఎక్కించేసి పేషెంట్కు నొప్పి తెలియకుండా ఆపరేషన్ చేస్తున్నారు. జీజీహెచ్లో 13 మంది అనస్థీషియాలు.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అనస్థీషియాల సహకారంతో ప్రతీనెల వేలాది ఆపరేషన్లు జరుగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ సిమ్స్ అనుబంధ జీజీహెచ్లో అనెస్తీషియా విభాగం ప్రత్యేకంగా ఉంది. ఇందులోని ఇద్దరు ప్రొఫెసర్లు, 10 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఒక ఎస్ఆర్ సేవలు అందిస్తున్నారు. పేషెంట్ కోలుకునే వరకు.. పేషెంట్కు మత్తుమందు ఇచ్చేది అనస్థీషియాలే అయినా.. శస్త్రచికిత్స పూర్తయి, కోలుకునే వరకూ దగ్గరుండి పర్యవేక్షిస్తారు. పేషెంట్ త్వరగా కోలుకున్నాడంటే అందులో అనస్థీషియా పాత్రకీలకంగా ఉంటుంది. వైద్యరంగంలో వారిసేవలు అద్భుతం పేషెంట్కు నొప్పి తెలియకుండా సర్జరీలు ఉమ్మడి జిల్లాలో ప్రతీనెల వేలాది ఆపరేషన్లు నేడు ప్రపంచ అనస్థీషియా దినోత్సవం వైద్యరంగంలో అనస్థీషియా చాలా కీలకమైనది. ప్రస్తుత వైద్య విధానంలో మత్తుమందు లేకపోతే అనే ఊహనే కష్టంగా ఉంటుంది. మత్తుమందు అందుబాటులోకి రావడంతో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. – దండె రాజు, ఆర్ఎంవో, జీజీహెచ్ తెరవెనుక వైద్యుడు అనస్థీషియా. ఆపరేషన్ చేయడానికి సర్జన్తోపాటు అనస్థీషియా కూడా కీలకమే. పేషెంట్ కోలుకునే వరకు పర్యవేక్షిస్తుంటాడు. జీజీహెచ్లో చాలా హైరిస్క్ కేసులు కూడా అనెస్తీషియాల సహకారంతో విజయవంతంగా చేస్తున్నాం. – అరుణ, గైనిక్ హెచ్వోడీ, జీజీహెచ్ -
ఇంటర్వెన్షనల్ రేడియాలజీతో సర్జరీలకు స్వస్తి
కరీంనగర్: శస్త్రచికిత్స లేకుండా, నొప్పి తెలియకుండా, వేగవంతమైన రికవరీతో వైద్యం అందించే ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అందుబాటులోకి వచ్చాక శస్త్రచికిత్సలకు స్వస్తి పలికినట్టేనని సోమాజిగూడ యశోద హాస్పిటల్ ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజిస్ట్ డాక్టర్ హరీశ్ అన్నారు. బుధవారం కరీంనగర్లోని యశోద హెల్త్ సెంటర్లో మాట్లాడారు. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ సర్జరీలకు సరైన ప్రత్యామ్నాయమన్నారు. బ్రెయిన్ స్ట్రోక్, క్లోటింగ్, బ్లీడింగ్, క్యాన్సర్లు, యూటరైన్ బ్లీడింగ్ తదితర రోగాల చికిత్సకు ఇది ఎంతో ఉపయోగపడుతోందని వివరించారు. కొన్నిసార్లు డెలివరీ తర్వాత అధిక రక్తస్రావం వల్ల గర్భాశయాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, అయితే సాంకేతికత ద్వారా రక్తస్రావం జరుగుతున్న కచ్చితమైన స్థానాన్ని గుర్తించి, ఆ రక్తనాళాన్ని మూసేయడం సాధ్యమవుతుందన్నారు. బ్లాక్ అయిన నాళాలను తెరవడం, లీకై న నాళాలను మూసేయడం, మెదడులో రక్తపుగడ్డలను తొలగించడం వంటి సంక్లిష్ట చికిత్సను ఇంటర్వెన్షనల్ రేడియాలజీ సులభంగా చేస్తోందని తెలిపారు. -
ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల సమ్మె
కరీంనగర్: ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్లు మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తున్నారు. ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గిట్ల ముకుందరెడ్డి, ఎడ్ల రమేశ్ మాట్లాడుతూ, ఆర్టీసీనీ ప్రైవేట్పరం చేసేందుకు కేంద్రప్రభుత్వం మోటార్ వాహన సవరణ చట్టం తీసుకొచ్చి ందని, దీనిలో భాగంగానే ఆర్టీసీ జేబీఎంను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడంతో కార్మికులకు తీరని నష్టం జరుగుతుందన్నారు. ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్లను అనవసరంగా ఉద్యోగం నుంచి తొలగిస్తే ఆందోళన కార్యక్రమాలు చేయకూడదని ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు పుల్లెల మల్లయ్య, ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు సత్యపాల్, జిల్లా అధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
తల్లిదండ్రుల మృతి.. అనాథగా బాలుడు
చొప్పదండి: ఇటీవల గుండెపోటుతో తండ్రి మృతిచెందగా అనాథగా మారిన బాలుడి ఉదంతమిది. మూడేళ్ల క్రితమే ఊపిరితిత్తుల వ్యాధితో తల్లి మృతి చెందగా, దిక్కుతోచని స్థితిలో బంధువుల వద్ద కాలం వెల్లదీస్తున్నాడు. మండలంలోని రాగంపేట గ్రామానికి చెందిన దీకొండ అశోక్ గత ఆదివారం మృతిచెందాడు. అశోక్ భార్య కూడా మూడేళ్ల క్రితమే మృతి చెందింది. అంతేకాదు అతడి తల్లి కూడా ఏడాది క్రితం మూత్ర పిండాల వ్యాధితో చనిపోయింది. దీంతో అశోక్ కుమారుడు స్వాద్విన్ కుమార్ అనాథగా మారాడు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న స్వాద్విన్ ప్రస్తుతం మేనత్తల సంరక్షణలో ఉంటున్నాడు. ఎవరూ లేరని తెలిసి రోదిస్తున్నాడు. ప్రభుత్వం, అధికారులు, దాతలు స్పందించి విద్యార్థిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నృసింహుడి హుండీ ఆదాయం రూ.46.84 లక్షలుధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి వారికి హుండీల ద్వారా లభించిన ఆదాయాన్ని బుధవారం ఆలయ ప్రాంగణంలో లెక్కించారు. 112 రోజులకు గాను రూ.46,84,046 సమకూరినట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. 27 గ్రాముల మిశ్రమ బంగారం, 4.700 కిలోల వెండి, 26 విదేశీనోట్లు వచ్చినట్లు పేర్కొన్నారు. దేవాదాయ శాఖ జిల్లా పరిశీలకులు రాజమౌళి, ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, ధర్మకర్తలు, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు లక్ష్మీకటాక్షం
● ఉన్నత చదువులకు చేయూత ● కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘పీఎం విద్యాలక్ష్మి’ పథకం అమలు ● హామీ పత్రం లేకుండా రుణాలు ● అర్హులకు 15 రోజుల్లోనే మంజూరు ● ఇంటి నుంచి దరఖాస్తు చేసి రుణం పొందే అవకాశం ● కేంద్ర పభుత్వ పథకం పేద, మధ్యతరగతి వర్గాలకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం విద్యాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందుకోసం 2015–16 నిధులు కేటాయించింది. అప్పటినుంచి ఏటా కేటాయింపులు జరుగుతూనే ఉన్నాయి. చదువుకు సంబంధించిన వివరాలు వాస్తవికతతో కూడి ఉంటే చాలు.. ఇంటి వద్దకు రుణం వస్తుంది. చాలామందికి ఈ పథకంపై అవగాహన లేకపోవడంతో సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. విద్యారుణం పొందాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాలనే అపోహ విద్యార్థుల్లో ఉంది. ఆ అవసరం లేకుండా ఇంటి నుంచి దరఖాస్తు చేసి రుణం పొందే అవకాశం ఈ పథకం కల్పిస్తోంది. విద్యార్థులు బ్యాంకుల చుట్టూ తిరగకుండా దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే తక్కవ వడ్డీతో రుణం మంజూరయ్యేలా కేంద్రం పీఎం విద్యాలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. కేంద్ర ఆర్థిక శాఖ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్(ఏబీఏ) సంయుక్తంగా విద్యాలక్ష్మి పోర్టల్ను అందుబాటులోకి తెచ్చాయి. ఎన్ఎస్డీఎల్ ఈ–గవర్నెన్స్ వ్యవస్థ ద్వారా ఈ పథకాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ● నమోదు ఇలా.. విద్యాలక్ష్మి వెబ్సైట్లో పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, చిరునామా తదితర వివరాలను రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తరువాత కామన్ ఎడ్యుకేషన్లోన్ అప్లికేషన్ ఫాంను పూర్తి చేయాలి. అవసరమైన ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలి. ఒక విద్యార్థి ఒక దరఖాస్తు మాత్రమే పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు స్టేటస్ను విద్యాలక్ష్మి పోర్టల్లో బ్యాంకు అప్డేట్ చేయగా.. 15 రోజుల్లో రుణ మంజూరు వివరాలు తెలుస్తాయి. అవసరమైన ధ్రువపత్రాలు లేకపోతే రుణం మంజూరయ్యే అవకాశముండదు. పోర్టల్లోని డాష్బోర్డులో చూసి విద్యార్థి విషయం తెలుసుకోవచ్చు. వీటికి ఎలాంటి గడువు తేదీ ఏమి లేదు. పోర్టల్లో నమోదు చేసుకున్నాక వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. అందులో అడిగిన వివరాలు నమోదు చేయాలి. ఒక విద్యార్థి ఒకేసారి గరిష్టంగా 3 బ్యాంకులకు విద్యారుణం కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. ● జాతీయ ఉపకార వేతనాలకు సైతం.. విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా జాతీయ ఉపకార వేతనాలకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉన్నత చదువులు పూర్తి చేసిన వారిని పోర్టల్లో అనుసంధానం చేయడంలో భాగంగా ప్రతిభ ఉపకార వేతనాల వివరాలు పొందుపరుస్తున్నారు. రుణాలు, ఉపకార వేతనాలు అందుకొని స్థిరపడిన వారి స్ఫూర్తిదాయక గాథల్ని ప్రేరణగా పేజీల్లో ఉంచారు. ● బ్యాంకుల ద్వారా.. ఈ పోర్టల్లో 36 బ్యాంకులు నమోదై ఉన్నాయి. అవి విద్యారుణాలను అందిస్తున్నాయి. ఎస్బీఐ, కెనరా బ్యాంక్, విజయ, ఐవోబీ, యూనియన్, ఆంధ్రాబ్యాంక్, ఐడీబీఐ, యూబీఐ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, యూకో, దీనా, కరూర్వైశ్య, సిండికేట్, జీఏఏబీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, యాక్సిస్, ఫెడరల్, న్యూ ఇండియా, ఆర్బీఎల్, అలహాబాద్, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర బ్యాంకుల నుంచి రుణాలు పొందొచ్చు. ● ఏఏ కోర్సులకు.. విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.4లక్షల లోపు ఉండాలి. అలాగే ఇంజనీరింగ్, టెక్నికల్ కోర్సులు, వృత్తి సంబంధిత కోర్సులైన ఎంబీబీఎస్, ఆర్కిటెక్చర్, లా, చార్టర్డ్ అకౌంటెన్సీ, అండర్ గ్రాడ్యుయేట్, విమానయాన రంగానికి సంబంధించిన చదివే విద్యార్థులకు రుణాలు అందించనుంది. దీంతోపాటు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేవారికి రుణాలు మంజూరు చేస్తారు. యూజీసీ, ఏఐసీటీఈ ఇతర ప్రభుత్వ ఆధీకృత సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో చదువుకునే వారికి రుణాలందుతాయి. ● దరఖాస్తు విధానం విద్యార్థుల కోసం 3 పద్ధతుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటగా విద్యాలక్ష్మి పోర్టల్లో నమోదు కావాలి. తర్వాత వివరాలతో కూడిన దరఖాస్తు పూరించాలి. చివరగా వివిధ రకాల బ్యాంకులను ఎంపిక చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తయితే రుణానికి సంబంధించిన వివరాలు మొబైల్, ఈమెయిల్కు ఎప్పటికప్పుడు సమాచారమందుతుంది. ● జత చేయాల్సిన పత్రాలు విద్యాలక్ష్మి పథకంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద విద్యారుణాలు పొందేందుకు విద్యార్థులు పలు పత్రాలను దరఖాస్తుతోపాటు జత చేయాల్సి ఉంటుంది. చదివిన విద్యాసంస్థ నుంచి ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్(టీసీ), మార్కుల జాబితా, ఇంతవరకు పొందిన ఉపకార వేతన పత్రాలు, ఉన్నత విద్యకు సంబంధించిన ర్యాంకు కార్డు, ప్రవేశ అనుమతి పత్రాలు, చదవాల్సిన కోర్సుకు చెందిన ఫీజుల అంచనా వివరాలు, తల్లి, తండ్రి, సంరక్షకుడు, విద్యార్థికి సంబంధించిన పాస్ ఫొటోలు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులయితే వారి వేతన సర్టిఫికెట్లు, ఆస్తి వివరాలు, నివాస ధ్రువీకరణ కోసం ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టు లాంటివి జత చేయాలి. కరీంనగర్: ప్రతిభ ఉన్నా ఉన్నత విద్య పేద బిడ్డలకు అందని ద్రాక్షలా మారుతోంది. దీనికి ఆర్థిక పరిస్థితులే కారణమవుతున్నాయి. ఉన్నత విద్య, విదేశాల్లో చదువు కోసం గతంలో విద్యార్థులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. సిఫార్సులు, ఆస్తిపాస్తులు, ఉద్యోగ పూచీకత్తులు సమర్పించాల్సి వచ్చేది. అయినా రుణం మంజూరవుతుందో లేదో తెలియని పరిస్థితి. ప్రస్తుతం అవేమీ అక్కర్లేదు. ఉన్నత చదువులకు పీఎం విద్యాలక్ష్మి పథకం చేయూతనిస్తోంది.ఎంతవరకు రుణం? రుణం అవసరమైన విద్యార్థి నేరుగా దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. మంజూరు చేసే రుణంలో చదువుకయ్యే ఖర్చు మాత్రమే కాకుండా ట్యూషన్ ఫీజు, వసతి, రవాణా ఖర్చులన్నింటినీ కలుపుతారు. ఇందులో దరఖాస్తు ఫీజు, ప్రాసెసింగ్ చార్జీలు ఏమి ఉండవు. మొత్తం 3 రకాలుగా రుణాలిస్తారు. మొదటి దశ రూ.4లక్షల వరకు, రెండో దశ రూ.4లక్షల నుంచి రూ.7.5లక్షల వరకు, మూడో విడత రూ.10లక్షల వరకు తక్కువ వడ్డీతో రుణాలందిస్తారు. విద్యాలక్ష్మి పథకం ద్వారా రూ.10లక్షల వరకు రుణం పొందొచ్చు. ఇందులో రూ.4.5లక్షల వరకు రుణానికి కేంద్ర ప్రభుత్వమే వడ్డీ భరిస్తోంది. అమ్మాయిల చదువును ప్రోత్సహించడంలో భాగంగా విద్యార్థినులకు మరింత రాయితీ కల్పిస్తున్నారు. -
గెలుపే లక్ష్యంగా ఆటల్లో రాణించాలి
● శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ రమేశ్రెడ్డి తిమ్మాపూర్: ఎస్జీఎఫ్ఐ ఆధ్వర్యంలో అండర్–19 జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు శ్రీచైతన్య కళాశాలలో మంగళవారం ప్రారంభమయ్యాయి. కళాశాల చైర్మన్ ముద్దసాని రమేశ్రెడ్డి పోటీలను ప్రారంభించారు. ప్రతి క్రీడాకారుడు గెలుపే లక్ష్యంగా రాణించాలని సూచించారు. ఆటల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఎస్జీఎఫ్ఐ సెక్రటరీ వేణుగోపాల్, జూనియర్ కళాశాలల డీన్ జగన్మోహన్రెడ్డి, డిఫెన్స్ కళాశాల ప్రిన్సిపాల్ శ్యాంసుందర్రెడ్డి, ఏజీఎంలు శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మధూకర్ ఆత్మహత్య బాధ్యులపై చర్య తీసుకోవాలి
గోదావరిఖని: మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏట మధూకర్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు కోరారు. మంగళవారం గోదావరిఖనికి చేరుకున్న రాంచందర్రావు.. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝాను కలిశారు. ఆయనకు ఒక వినతిపత్రం అందజేశారు. మధూకర్ ఆత్మహత్య వెనుక కాంగ్రెస్ నాయకుల ప్రమేయం, పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా నీల్వాయి కొత్తగూడకాలనీలో కొందరు డీజేలతో దద్దరిల్లే సౌండ్స్ పెట్టి రాజకీయ నేతల పాటలతో స్థానికులకు ఇబ్బంది కలిగించారని, దీనిపై కాలనీవాసులు మధూకర్కు మొరపెట్టుకోగా ఆయన ఎస్సైకి పలుసార్లు ఫోన్చేశారని, ఆయినా ఎస్సై స్పందించలేదని ఆరోపించారు. డయల్ 100 నంబరుకు కాల్ చేయడంలో పోలీసులు వచ్చి డీజే సౌండ్స్ బంద్ చేయించారన్నారు. కక్షగట్టిన రుద్రపట్ల సంతోష్, ఆయన అనుచరులతో మధూకర్పై దాడి చేయించారని సీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓ మహిళతో తప్పుడు ఫిర్యాదు చేయించారని, బాధితుల పక్షాన నిలవాల్సిన పోలీసులు.. అందుకు భిన్నంగా మధూకర్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బెదిరింపులకు గురిచేశారని అన్నారు. కాంగ్రెస్ నాయకుల దాడి, పోలీసుల బెదిరింపు తట్టుకోలేక తీవ్రమనస్థాపానికి గురై మధూకర్ ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో వెల్లడించారు. రుద్రపట్ల సంతోష్, గాలి మధుతోపాటు 13మందిపై కేసు నమోదు చేసినా.. ఇంకా అరెస్ట్ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడి, నాయకులు సుభాష్, భరత్ప్రసాద్, వెంకటేశ్గౌడ్, గంగడి కృష్ణారెడ్డి, బోర్లాకుంట వెంకటేశ్నేత, గోమాస శ్రీనివాస్, కందుల సంధ్యారాణి, కోమల మహేశ్, సోమారపు లావణ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, ఎన్టీపీసీ జ్యోతిభవన్కు చేరుకున్న రామచంద్రరావును ఎన్టీపీసీ ఉద్యోగ గుర్తింపు సంఘం, కార్మిక సంఘం అధ్యక్షుడు భాస్కర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి సాగర్రాజు, అడిషనల్ జనరల్ సెక్రటరీ చల్లా సత్యనారాయణరెడ్డి ఘనంగా సన్మానించారు. రామగుండం రైల్వేస్టేషన్లో వీడ్కోలు రామగుండం: తిరుగు ప్రయాణానికి దానాపూర్ రైలులో హైదరాబాద్ వెళ్లేందుకు రామగుండం రైల్వేస్టేషన్ చేరుకున్న రామచంద్రరావుకు బీజేపీ నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు. కాంగ్రెస్ కనుసన్నల్లో పోలీసులు కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లోనే రాష్ట్ర పోలీసులు పనిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఆరోపించారు. తమ నాయకుడు మధూకర్ మరణానికి దారితీసిన పరిస్థితులపై పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసిన అనంతరం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి వత్తాసు పలుకుతోందన్నారు. కాంగ్రెస్ ఎంత అధికార దుర్వినియోగం చేస్తున్నా ఐక్యంగా ఎదుర్కొందామన్నారు. ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతుందని భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తోందని మండిపడ్డారు. బీజేపీతో పెట్టుకుంటే మూల్యం చెల్లించకతప్పదని, తమపై దాడులు చేస్తే ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. తమ నాయకుడు మధూకర్ ఆత్మహత్యపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పేర్లు ఉన్నవారందరినీ అరెస్ట్ చేయాలని, ఇందుకు కారణమైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు. లేనిపక్షంలో బీజేపీ ఉద్యమాలు ఉధృతం చేస్తుందని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు రామగుండం పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు -
ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడి మృతి
సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శాసీ్త్రనగర్ పెట్రోల్ బంక్ సమీపంలో రాజీవ్ రహదారిపై మంగళవారం ఆర్టీసీ బస్సు ఢీకొని ఆరెపల్లి గ్రామానికి చెందిన బావు కొమురయ్య(79) అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై శ్రావణ్కుమార్ కథనం ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని ఆరెపల్లికి చెందిన కొమురయ్య శాసీ్త్రనగర్లోని ఎస్బీఐలో పింఛన్ డబ్బులు తీసుకునేందుకు మంగళవారం వచ్చాడు. డబ్బులు తీసుకొని స్వగ్రామానికి వెళ్లేక్రమంలో రోడ్డు దాటుతుండగా కరీంనగర్ నుంచి మంచిర్యాలకు వెళ్లుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కొడుకు నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. బావిలో పడి యువకుడు..సైదాపూర్: సైదాపూర్ మండలం గొడిశాలలో వల్లెపు రాకేశ్(25) ప్రమాదవశాత్తు వ్యవసాయబావిలో పడి మృతి చెందినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వల్లెపు సంపతి– పద్మ కుమారుడు రాకేశ్ చదువు ఆపేసి వ్యవసాయం చేస్తున్నాడు. ఈ నెల 12న రాత్రి సినిమాకు వెళ్తున్నానని, ఇంట్లో చెప్పి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాలేదు. మరునాడు సంపత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం ఊరి పక్కన వ్యవసాయబావిలో శవమై తేలాడు. బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అనుమానాస్పదంగా ఒకరు.. మంథని: మంథని మున్సిపల్ పరిధిలోని గంగాపురి ఇటుకబట్టీ సమీపంలో నీటిగుంతలో పడి స్వర్ణపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల మహేశ్(35) అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానికంగా సెల్ఫ్మోటార్లు మరమ్మతు చేసే వ్యక్తి వద్ద అసిస్టింట్గా పనిచేస్తున్న మహేశ్.. సోమవారం ఇటుకబట్టీ వద్ద మరమ్మతు చేసేందుకు వెళ్లాడు. కడుపులో నొప్పిగా ఉందని చెప్పి బహిర్భూమికి వెళ్తానని తిరిగి రాలేదు. నీటిగుంతలో పడి చనిపోయి ఉన్నాడు. బయటకు తీసి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. కరీంనగర్ క్రైం: కరీంనగర్లోని ముకరంపురంలో వ్యభిచార గృహంపై మంగళవారం రాత్రి వన్టౌన్ పోలీసులు దాడి చేశారు. వారి వివరాల ప్రకారం.. ముకరంపురలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తితో పాటు ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. రూ.1,100 నగదు, సెల్ఫోన్లు సీజ్ చేశారు. నిర్వాహకుడు ఉప్పుల వెంకటరాజం పాటు ఇంటి యజమాని రిజ్వా న్పై కేసు నమోదు చేశారు. -
చిక్కుతున్నా ఆగని ‘చేతివాటం’
సిరిసిల్ల: అధికార యంత్రాంగంలో అవినీతి ఆగడం లేదు. సామాన్యులను లంచాల కోసం వేధిస్తున్నారు. వేధిస్తూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడుతున్నా కక్కుర్తి చర్యలు ఆగడం లేదు. లంచావతారులు అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ కాసులకు చేయిచాస్తూ కటకటాల పాలవుతున్నారు. భూమి కొలిచేందుకు ముందే లంచం ● సిరిసిల్ల శివారులో మూడెకరాల భూమి కొలిచేందుకు రూ.30వేల లంచం డిమాండ్ చేసిన వేణుగోపాల్ రూ.10 వేలు ముందుగా ఇస్తేనే సర్వేకు వెళ్లారు. సర్వే పంచనామా నివేదిక కోసం మరో రూ.20 వేలు డిమాండ్ చేసి సహాయకుడితో సహా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ● మే 31న సిరిసిల్ల శివారు చంద్రంపేటలో సర్వేయర్ మల్లోజీ నాగరాజు వెంకటాపూర్కు చెందిన మల్లేశం ఆరుగుంటల భూమిని సర్వే చేసేందుకు ముందే రూ.22వేల లంచం తీసుకున్నారు. సర్వే పంచనామా కాపీ కోసం మళ్లీ డబ్బు డిమాండ్ చేసి రూ.15వేలు తీసుకుంటూ దొరికాడు. ● గతంలో వీర్నపల్లి మండలం అడవి పదిరకు చెందిన భూక్యా సరిత టిప్పర్ కోసం దరఖాస్తు చేసింది. ప్రభుత్వం ద్వారా సబ్సిడీ వస్తుందనే ఆశతో జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా హైదరాబాద్లోని పరిశ్రమలశాఖ కమిషనర్ ఆఫీస్కు దరఖాస్తు పంపాలని సరిత కోరింది. ఇందుకు జిల్లా పరిశ్రమల శాఖ జీఎం ఉపేందర్రావు రూ.30వేలు లంచంగా అడిగాడు. రూ.17వేలు ఓసారి అందించగా, మరోసారి రూ.13వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ● జిల్లా పరిశ్రమల శాఖలో అవినీతి జరుగుతుందని ముస్తాబాద్ మండలం తుర్కపల్లెకు చెందిన చింతకింది సుధీర్ గతంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. టీ–ఫ్రైడ్లో సబ్సిడీ ట్రాక్టర్ కోసం దరఖాస్తు చేయగా, ఆన్లైన్ చేసేందుకు పరిశ్రమలశాఖ ఆఫీస్లో రూ.2,500 కృష్ణ, కిశోర్ అనే అధికారులు అడిగారని సుధీర్ ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఫిర్యాదులున్నా పరిశ్రమల శాఖ ఆఫీస్పై నియంత్రణ లేక పోవడంతో ఏకంగా ఆ శాఖ జిల్లా అధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు. ● సిరిసిల్ల భూసర్వే అధికారి ఇల్లంతకుంటలో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వేములవాడ పంచాయత్రాజ్ డీఈఈ మహేందర్ తడగొండకు చెందిన కట్ట లచ్చయ్య వద్ద రూ.60వేలు తీసుకుంటూ.. సిరిసిల్ల జిల్లా అటవీశాఖ అధికారి శ్రీనివాస్రావు, రేంజ్ అధికారి అనిత.. ఫారెస్టు సెక్షన్ అధికారి శ్రీనివాస్ వద్ద రూ.4లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ● వేములవాడ తహసీల్దార్ ఆఫీస్లో సర్వేయర్గా పనిచేస్తున్న సత్యనారాయణ నాలా మార్పిడి కోసం బాలరాజు వద్ద రూ.20వేలు లంచం తీసుకుంటూ దొరికాడు. ● వేములవాడ ఆలయ ప్రాంత అభివృద్ధి సంస్థ(వీటీడీఏ) ముఖ్య ప్రణాళిక అధికారి(సీపీవో) లక్ష్మణ్గౌడ్, అతడి కొడుకు రోహిత్ లేఅవుట్ అనుమతి కోసం రియల్టర్ల వద్ద రూ.6.50లక్షలు లంచం తీసుకుంటూ అధికారులకు చిక్కారు. కాసులకు కక్కుర్తి.. పెచ్చుమీరిన అవినీతి తాజాగా సిరిసిల్లలో ఏసీబీకి పట్టుబడిన సర్వేయర్ లంచం తీసుకోవడం అనేది క్రిప్టోమేనియా వ్యాధి. లంచం తీసుకోవడం ఎంత తప్పో.. ఇవ్వడం కూడా తప్పే. అన్నీ సమగ్రంగా ఉండేలా దరఖాస్తు చేయాలి. అయినా అధికారులు డబ్బులు అడిగితే ఏసీబీ టోల్ ప్రీ నంబరు 1064కు ఫిర్యాదు చేయాలి. నేరుగా మాకు వస్తుంది. ఫిర్యాదుదారు వివరాలను గోప్యంగా ఉంచి అవినీతి పరులను పట్టుకుంటాం. అవినీతిని నిరోధించడంలో పౌర సమాజం సహకరించాలి. – పి.విజయ్కుమార్, ఏసీబీ డీఎస్పీ, కరీంనగర్ -
ఉద్యమనేతలకు శిక్షణ ఇక్కడే
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ(పారిశ్రామిక శిక్షణ సంస్థ)కు 57ఏళ్లు పూర్తయ్యాయి. పారిశ్రామిక ప్రాంతంగా గుర్తింపు పొందిన పెద్దపల్లి డివిజన్లో ప్రభుత్వ ఐటీఐ ఏర్పాటుకోసం 1965లో 20 ఎకరాల స్థలం కేటాయించారు. 1968 సెప్టెంబర్ 20న అప్పటి కార్మికశాఖ మంత్రి కేవీ నారాయణరెడ్డి ప్రారంభించారు. 57ఏళ్ల కాలానికి ఈ ప్రభుత్వ ఐటీఐలో కొత్త ఏటీసీ(అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్)ను ఇటీవల ప్రారంభించారు. ఆధునిక సాంకేతికతతో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి.. పూర్తికాగానే ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. వేణు సహా ఉద్యమనేతలకు శిక్షణ పెద్దపల్లి పట్టణానికి చెందిన మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోఝుల కోటేశ్వర్రావు సోదరుడు మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు మల్లోఝుల వేణుగోపాల్తోపాటు సాయిని ప్రభాకర్, సత్యనారాయణ, టీఎన్జీవోల సంఘం రాష్ట్ర మాజీఅధ్యక్షుడు దేవీప్రసాద్ కూడా పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐలోనే శిక్షణ పొందారు. మల్లోఝుల వేణుగోపాల్ రేడియో, టెలివిజన్ కోర్సు శిక్షణ పొందారు. పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐకి 57 ఏళ్లు -
గంజాయి విక్రేత అరెస్ట్
మేడిపల్లి: మండల శివారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని తనిఖీ చేయగా అతని వద్ద 200 గ్రాముల గంజాయి దొరికినట్లు ఎస్త్సె శ్రీధర్రెడ్డి తెలిపారు. సదరు నిందితుడిని కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామానికి చెందిన బద్దం నాగరాజుగా గుర్తించామన్నారు. ఎవరైనా నిషేధిత మత్తు పదార్థాలు అమ్మినా.. సహకరించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి విక్రేతను పట్టుకున్న ఎస్త్సె, కానిస్టేబుల్ నాగరాజును ఎస్పీ అశోక్ కుమార్, మెట్పల్లి డీఎస్పీ రాములు, కోరుట్ల సీఐ సురేష్బాబు అభినందించారు. -
రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ పోటీలకు ఎంపిక
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో చేపట్టిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి ఎస్జీఎఫ్ అండర్–14 పోటీలు మంగళవారం ముగిశాయి. కబడ్డీలో ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఎంపికై న వారిని డీఈవో మాధవి అభినందించారు. కబడ్డీ బాలుర పోటీల్లో పెద్దపల్లి జట్టు ప్రథమ, జగిత్యాల ద్వితీయస్థానంలో నిలిచాయి. బాలికల విభాగంలో జగిత్యాల జట్టు ప్రథమ, కరీంనగర్ ద్వితీయ స్థానంలో నిలిచాయి. వారంతా ఈనెల 16 నుంచి 18 దాకా సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఎస్జీఎఫ్ కార్యదర్శి లక్ష్మణ్ తెలిపారు. పీఈటీలు సురేందర్, రమేశ్, శోభరాణి, శ్రీనివాస్, శైలజ, కబడ్డీ అసోసియేషన్ నాయకులు వైద కిష్టయ్య, తోట శంకర్, శ్రీధర్, షఫియొద్దీన్, భాస్కర్ తదితరులు ఉన్నారు. ముగిసిన ఉమ్మడిజిల్లాస్థాయి పోటీలు -
రేషన్బియ్యం పట్టివేత
● దుబ్బపల్లిలో 300క్వింటాళ్లు స్వాధీనం ● నిందితుడిపై కేసు నమోదు కరీంనగర్రూరల్: రేషన్ బియ్యం అక్రమ నిల్వలపై కరీంనగర్రూరల్ పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. 300 క్వింటాళ్ల రేషన్ సన్న బియ్యాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి కథనం మేరకు కరీంనగర్ మండలం దుబ్బపల్లిలోని బుడిగెజంగాల కాలనీలో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేశారనే సమాచారంతో పోలీసులు సోమవారం రాత్రి ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. కర్రె గంగారాం ఇంట్లో నిల్వ చేసిన 629 రేషన్ బియ్యం బస్తాలను గుర్తించారు. గంగారాం గత కొన్ని నెలల నుంచి సమీప గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి రేషన్ సన్నబియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి లారీల్లో మహారాష్ట్రకు తరలిస్తు సొమ్ము చేసుకుంటున్నాడు. గంగారాంపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. -
హౌసింగ్బోర్డులో కబ్జాలు తొలగింపు
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని 7వ డివిజన్ హౌసింగ్బోర్డుకాలనీలోని భూ ఆక్రమణలపై వేటు పడింది. హౌసింగ్బోర్డు స్థలాలను కొంతమంది తప్పుడు సర్వేనంబర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, ఆ స్థలాలు చుట్టూ ప్రహరీ నిర్మించుకొని కబ్జా చేయడంపై గత నెలలో ‘నయా భూదందా’ పేరిట ‘సాక్షి’లో కథనం రావడం తెలి సిందే. హౌసింగ్బోర్డు విభాగం కార్యాలయం వరంగల్లో ఉంటుండడం, ఇక్కడ పర్యవేక్షణ కాస్త తగ్గిన నేపథ్యంలో వేలం వేయాల్సిన ఖాళీ స్థలాలను కొంతమంది కబ్జా పెట్టారు. ఈ దందాను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో, వరంగల్ నుంచి హౌసింగ్ బోర్డు అధికారులు కరీంనగర్కు వచ్చి విచారణ చేపట్టారు. హౌసింగ్బోర్డు వరంగల్ డివిజన్ ఈఈ అంకమరావు ఆదేశాల మేరకు ఏఈ పృథ్వీరాజ్ హౌసింగ్బోర్డులోని కబ్జాలపై చర్యలు చేపట్టారు. కబ్జాలకు గురైన రెండు స్థలాల్లో చుట్టూ నిర్మించిన గోడను మంగళవారం జేసీబీతో తొలగించారు. రూ.కోట్ల విలువైన స్థలాలను కాపాడారు. హౌసింగ్బోర్డు స్థలాలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని ఏఈ తెలిపారు. -
మహిళా కాంగ్రెస్లో పోస్టుల లొల్లి
కరీంనగర్ కార్పొరేషన్: ఏఐసీసీ, పీసీసీ పరిశీలకులు కార్యాలయంలో ఉండగానే కాంగ్రెస్ నాయకులు బాహాబాహీకి దిగిన ఘటన మంగళవారం డీసీసీ కార్యాలయంలో చోటుచేసుకొంది. ఏఐసీసీ పరిశీలకుడి మీడియా సమావేశం తరువాత, నాయకులంతా కార్యాలయ మీడియా హాల్ నుంచి బయటకు వచ్చారు. కార్యాలయ ఆవరణలో ఉన్న మాజీ కార్పొరేటర్ గంట కల్యాణి భర్త గంట శ్రీనివాస్ వద్దకు వచ్చిన మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు ము ల్కల కవిత, షబానా వాగ్వాదానికి దిగారు. ‘23వ డివిజన్ అధ్యక్ష స్థానానికి పేర్లు ఎవరివి పంపించావ్, నువ్వెలా పంపిస్తావంటూ’ ఆయనపైకి దూసుకెళ్లారు. ఒక దశలో నెట్టుకొన్నారు. పార్టీలో సుదీర్ఘకాలంగా ఉన్న సీనియర్ల పేర్లనే పంపించా మంటూ శ్రీనివాస్ బదులిచ్చారు. కవిత, షబానా తదితరులు మాట్లాడుతూ తమలాంటి సీనియర్లను విస్మరించి పార్టీలో పదవులు ఇస్తున్నారన్నారు. తన ను పార్టీ సంప్రదిస్తే కాంగ్రెస్లో సంవత్సరాలుగా ఉన్న ఇద్దరి పేర్లను ఇచ్చానని శ్రీనివాస్ తెలిపారు. -
కరీంనగర్
బుధవారం శ్రీ 15 శ్రీ అక్టోబర్ శ్రీ 2025Iజమ్మికుంట: స్థానిక మార్కెట్లో క్వింటాల్ పత్తి రూ.6,400 పలికింది. మంగళవారం మార్కెట్కు 951 క్వింటాళ్ల పత్తిని తెచ్చారు. క్రయ విక్రయాలను మార్కెట్ చైర్పర్సన్ పూల్లూరి స్వప్న, కార్యదర్శులు మల్లేశం, రాజా పర్యవేక్షించారు.కొత్తపల్లి: కొత్తపల్లి సబ్స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి, తూర్పువాడలో బుధవారం ఉదయం 9 నుంచి మఽ ద్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. -
నిబంధనలు తూచ్
తనిఖీలు తుస్..కరీంనగర్ అర్బన్: టపాసుల విక్రయాల్లో కాసులు పేలుతున్నాయి. నిబంధనలు విస్మరించి కరీంనగర్తో పాటు మానకొండూరు, హూజూరాబాద్, జమ్మికుంట, గంగాధర, శంకరపట్నం, తిమ్మాపూర్, చొప్పదండి తదితర ప్రాంతాల్లో అనధికార గోదాంలలో ఇప్పటికే భారీస్థాయిలో నిల్వలు చేరాయి. నిషేధిత టపాసులు దుకాణాల్లో ఉండటం తనిఖీల డొల్లతనాన్ని చాటుతోంది. దీపావళి సమీపించడంతో టన్నుల కొద్ది టపాసులు దిగుమతి చేసుకుంటుండగా అడ్డుకట్ట వేసేవారే కరవయ్యారు. పలు ప్రాంతాలు అక్రమాల అడ్డా జిల్లాకేంద్రంలో కేవలం నాలుగింటికి శాశ్వత అనుమతి ఉండగా అనుమతిలేని దుకాణాలు పదుల సంఖ్యలో కొనసాగుతున్నాయి. ఎవరైనా అటువైపు వెళితే పాత కాగితాలను చూపించడం.. తమకున్న పరపతితో బెదిరింపులకు గురిచేయడం వారి నైజం. దుకాణాల వెనుకాలే పెద్ద ఎత్తున టపాసులను నిల్వచేయడంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం నెలకొంది. వాస్తవానికి విపరీతంగా జనం తచ్చాడే ప్రాంతంలో అనుమతి ఇవ్వరాదు. దుకా ణాన్ని బట్టి మూడేళ్లు, అయిదేళ్లకోసారి రెన్యువల్ చేసుకోవాల్సి ఉండగా సదరు సందర్బాల్లో అధి కారులు వ్యాపార కేంద్రాలను పరిశీలించకుండానే అనుమతులిచ్చేస్తున్నారు. నగరంలోని ప్రకాశంగంజ్, మంకమ్మతోట, రాంనగర్, కోతిరాంపూర్, బొమ్మకల్, గణేశ్నగర్, తీగలగుట్టపల్లి, గణేశ్నగర్ తదితర ప్రాంతాల్లో భారీగా నిల్వ చేస్తున్నారు. నిబంధనలు తూచ్ శాశ్వత ప్రతిపాదికన అనుమతి తీసుకున్న దుకాణాలు నిబంధనల ప్రకారం 1500 కిలోలు మాత్రమే నిల్వ చేసుకోవాలి. ఒకవేళ అదనంగా కావాలనుకుంటే చైన్నెలో గల పేలుడు పదార్థాల నియంత్రణ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. అదీ దీపావళికి వారం రోజుల ముందు వరకే అవకాశం. కానీ క్షేత్రస్థాయిలో విచ్చలవిడిగా నిల్వలు పెడుతున్నారు. ఒక్కో దుకాణంలో లక్షకిలోల నుంచి రెండు లక్షల కిలోల వరకు నిల్వలు పెడుతుండగా తనిఖీలు చేసే అధికారులే కరవయ్యారు. ధరలు ఇష్టారాజ్యం టపాసుల ధరల నియంత్రణలో అధికారులు విఫలమవుతున్నారు. రూ.4 విలువ చేసే వస్తువులను రూ.40కి విక్రయిస్తున్నారు. స్టాండర్డ్ కంపనీలు ఎంఆర్పీని సరిగా ముద్రిస్తుండగా చిన్న చిన్న కంపనీలు విక్రేతలకు అనుగుణంగా ధరలను ముద్రిస్తుండటంతో వ్యాపారులు వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక టపాసులను తమిళనాడు రాష్ట్రం నుంచి జిల్లాకు దిగుమతి చేసుకుంటుండగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.లక్షల పన్నులను అక్రమార్గంలో ఎగ్గొడుతున్నారు. ఒకే వేబిల్లుపై ఎక్కువ టపాసులను దిగుమతి చేసుకుంటున్నారు. డ్రాగన్ విక్రయాలకు వ్యూహం చైనా డ్రాగన్ టపాసులను ప్రభుత్వం నిషేధించగా అక్రమంగా నిల్వ చేసిన సదరు టపాసులను విక్రయించేందుకు వ్యాపారులు పావులు కదుపుతున్నారు. దేశీయంగా ఉత్పత్తి అయిన వాటికన్నా చైనా ఉత్పత్తులు తక్కువ ధరకు లభించడం.. గిరాకీ ఎక్కువగా ఉండటంతో వీటినే విక్రయించేందుకు మొగ్గుచూపుతున్నారు. స్థానికంగా తయారైన టపాసు రూ.100కు లభిస్తే చైనా డ్రాగన్ టపాసు రూ.30కి లభిస్తుంది. ఎక్కువ లాభముండటంతో విలువలకు తిలోదకాలిస్తూ ప్రభుత్వ నిబంధనలను గాలికొదులుతూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. టపాసుల దుకాణాల నిర్వహణ విషయంలో కలెక్టర్ కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.నగరంలోని ప్రముఖ వ్యాపార కూడలి సమీపంలోని టపాసుల దుకాణమిది. వరంగల్ జిల్లాకు చెందిన వ్యాపారి దందా చేస్తుండగా ఇక్కడ జన సంచారం ఎక్కువే. ప్రతిసారి జనసంచారం గల ప్రాంతంలో దుకాణం నిర్వహించవద్దని చెప్పడం మొక్కుబడిగా సాగుతుందే తప్పా ఏటా యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తున్నారు. -
అలసిన అరుణ కిరణం
భూమి.. భుక్తి.. పీడిత, తాడితుల విముక్తి కోసం ఆయుధం పట్టి సుమారు నాలుగు దశాబ్దాల పాటు పాలకులపై తిరగుబావుటా ఎగురవేసిన అరుణ కిరణం అలసిపోయింది.. వృద్ధాప్యం, మారుతున్న కాలం, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో నూనూగుమీసం బందూకును వీడింది.. బ్రాహ్మణ సామాజికవర్గంలో జన్మించినా దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించింది.. చరిత్రలోనే తనకంటూ ప్రత్యేకత సాధించుకున్న పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన అప్పటి పీపుల్స్వార్, ప్రస్తుత మావోయిస్ట్(సీపీఐ–ఎంఎల్) పార్టీ కేంద్రకమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్రావు ఉరఫ్ భూపతి, అభయ్, మాస్టర్, ఉరఫ్ సోను జనజీవన స్రవంతిలోకి రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. స్వాతంత్య్ర సమరయోధుడు, తండ్రి మల్లోజుల వెంకటయ్య, మావోయిస్ట్ పార్టీ అగ్రనేత, సోదరుడు మల్లోజు కోటేశ్వర్రావు ఆశయాలను పుణికి పుచ్చుకున్న అభయ్.. సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా శత్రువులను ముప్పుతిప్పలు పెట్టారు. అంచెలంచెలుగా ఎదిగారు. దండకారణ్యంలో ఒకానొకదశలో సంమాంత ప్రభుత్వం నడిపినట్లు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యమానికి విరామం ప్రకటిస్తున్నామంటూ కొంతకాలంగా లేఖలు విడుదల చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే సోనూ లొంగిపోయినట్లు సమాచారం. – సాక్షి, పెద్దపల్లి -
ఊహించని వారికి కూడా చాన్స్
కరీంనగర్ కార్పొరేషన్/తిమ్మాపూర్/గంగాధర: జిల్లా అధ్యక్షుడు అవుతామని ఊహించని వాళ్లను కూడా డీసీసీ అధ్యక్ష స్థానం వరించే అవకాశం సంస్థాగత నూతన ప్రక్రియలో ఉందని ఏఐసీసీ పరిశీలకుడు శ్రీనివాస్ మన్నె అన్నారు. మంగళవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో మాట్లాడుతూ.. గతంలో మాదిరిగా ఎవరినో తెచ్చి అధ్యక్షులుగా నియమించే కాలం పోయిందన్నారు. కిందిస్థాయిలో పార్టీ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని, పార్టీకి అంకితభావంతో ఉన్న వాళ్లకే పదవులు వస్తాయన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటారో, ప్రజా పాలనలో భాగస్వాములై సమన్వయకర్తగా పనిచేస్తారో వారిని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. అభిప్రాయసేకరణ అనంతరం అధిష్టానానికి నివేదిక అందిస్తామని తెలిపారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీలోని అరుంధతి కల్యాణ మండపంలో శ్రీనివాస్ మాట్లాడుతూ.. సమర్థులైన నాయకులను జిల్లా, బ్లాక్, మండలస్థాయిల్లో పార్టీ అధ్యక్షులుగా ఎంపిక చేస్తామన్నారు. వ్యక్తిగత విషయాలపై కాకుండా, పార్టీ కోసం కలిసి కట్టుగా పని చేయాలని సూచించారు. గంగాధరలో మాట్లాడుతూ.. కార్యకర్తల నుంచి సేకరించిన అభిప్రాయాలు అధిష్టానానికి పంపిస్తామన్నారు. పీసీసీ సమన్వయకర్తలు ఆత్రం సుగుణ, సత్యనారాయణ, మ్యాడం బాలకృష్ణ, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశం, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జీ వెలిచాల రాజేందర్రావు, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, పీసీసీ ప్రధాన కార్యదర్శి రహమత్ హుస్సేన్ పాల్గొన్నారు. -
పరీక్షలు చేసి.. మందులివ్వాలి
కరీంనగర్టౌన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్యకేంద్రాల్లో ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం ద్వారా వైద్యపరీక్షలు చేసి, అవసరం అయినవారికి మందులు అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. నగరంలోని సప్తగిరికాలనీ పీహెచ్సీలో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని పరిశీలించారు. వైద్య పరీక్షలు చేసుకుంటున్న మహిళలతో మాట్లాడారు. ఆరోగ్య మహిళ పరీక్షల రికార్డు పరిశీలించారు. రక్తపోటు, షుగర్ వ్యాధిగ్రస్తుల వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు. గర్భిణులకు సిజేరియన్తో కలిగే సమస్యలను వివరించాలన్నారు. హెచ్బీ తక్కువ ఉన్న మహిళలకు ఐరన్ మాత్రలు ఇవ్వాలన్నారు. ఆరోగ్యకేంద్రం ఆవరణలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ వాహనంలో 2డీఎకో, ఎక్స్రే, మమ్మోగ్రఫి పరీక్షల తీరును పరిశీలించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి కరీంనగర్: బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో మాట్లాడారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థుల ఫీజు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. -
కమిట్మెంట్తో పనిచేస్తున్నా
సాక్షి ప్రతినిధి,కరీంనగర్: కాంగ్రెస్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నానని పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు అన్నారు. మంగళవారం మాట్లాడుతూ 1981లో కాంగ్రెస్ పార్టీలో తన ప్రస్థానం మొదలైందని గుర్తు చేశారు. 1986లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, సంయుక్త కార్యదర్శిగా పనిచేశానని తెలిపారు. రాష్ట్రంలోనే మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టుకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఘనత తనదన్నారు. అనివార్య కారణాలవల్ల వేరే పార్టీలోకి వెళ్లాల్సి వచ్చిందన్నారు. 2017లో తిరిగి అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్లో చేరానని వెల్లడించారు. రాబోయే రోజుల్లోనూ పార్టీ అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్విర్తిస్తానని తెలిపారు. -
పనులు పూర్తి చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు స్మార్ట్సిటీ పెండింగ్ పనులు పూర్తిచేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. మంగళవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికా రులతో సమీక్ష నిర్వహించారు. స్మార్ట్సిటీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన డిజిటల్ లైబ్రరీ, బాలసదన్, ఐసీసీసీ భవన నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ నెలలోనే ఎస్వీపీ భవన ఆధునీకరణ పనులు పూర్తి చేసి, ప్రారంభించాలన్నారు. టవర్ సర్కిల్ పునర్నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకో వాలన్నారు. నగరంలో వీధి దీపాలు వెలిగేలా చూడాలన్నారు. నల్లాపన్ను వసూళ్లపై స్పెషల్డ్రైవ్ చేపట్టాలన్నారు. ఎస్ఈ రాజ్ కుమార్, ఈఈలు సంజీవ్ కుమార్, యాదగిరి, డీఈలు లచ్చిరెడ్డి, ఓం ప్రకాశ్, అయూబ్ఖాన్, దేవేందర్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ పాల్గొన్నారు. అహ్మదాబాద్ సదస్సుకు కమిషనర్స్మార్ట్సిటీ సదస్సులో పాల్గొనేందుకు కమిషన ర్ ప్రఫుల్ దేశాయ్ అహ్మదాబాద్కు వెళ్లారు. ఈ నెల 15, 16 తేదీల్లో ఈ సదస్సు జరగనుంది. 17వ తేదీన కరీంనగర్కు తిరిగి రానున్నారు. కొత్తపల్లి(కరీంనగర్)/కరీంనగర్టౌన్: అంగన్వాడీ కేంద్రాల్లో హాజరుశాతాన్ని పెంచాలని అడిషనల్ కలెక్టర్ తానాజీ వాకడే సూచించారు. కరీంనగర్ అర్బన్ పరిధిలోని మల్కాపూర్ 2వ అంగన్వాడీ కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. కేంద్రాల్లో పిల్లల గ్రోత్ క్రాస్చెక్ పరిశీలించారు. మోనూ, హాజరు నమోదు, గర్భిణీ, బాలింతల వివరాలు తెలుసుకున్నా రు. సీడీపీవో సబిత పాల్గొన్నారు. యూపీహెచ్సీ సందర్శన విద్యానగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సందర్శించారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను సమీక్షించారు. రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. విద్యానగర్(కరీంనగర్): విశ్రాంత ఉద్యోగులకు బకాయిలు చెల్లించే వరకు ఉద్యమం చేస్తామని రిట్రైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కోహెడ చంద్రమౌళి స్పష్టం చేశారు. 2024 మార్చి నుంచి ఇప్పటివరకు ఉద్యోగ విరమణ చేసిన వారికి ప్రభుత్వం బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు వినతిపత్రం ఇచ్చారు. ఏడాదిన్నర కిత్రం ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు రావలసిన జీపీఎఫ్, జీఐఎస్,, కమ్యూటేషన్, గ్రాట్యూటీ చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకిశాల ప్రభాకర్రావు, కోశాధికారి కనపర్తి దివాకర్, బూరుపల్లి రవీందర్, పాలోజు రవీందర్, జాలి మహేందర్రెడ్డి పాల్గొన్నారు. -
బంగారం కోసమే విష ప్రయోగం
కరీంనగర్క్రైం: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తిలో వృద్ధ దంపతులపై జరిగిన విషప్రయోగం మిస్టరీ వీడింది. ఈ ఘటనలో వృద్ధుడు చనిపోగా.. వృద్ధురాలు ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తెలిసిన వ్యక్తే బంగారం కోసం మత్తు మాత్రలు ఇవ్వగా.. నిందితుడిని గంగాధర పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సీపీ గౌస్ ఆలం సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో వెల్లడించారు. గర్శకుర్తి గ్రామానికి చెందిన గజ్జెల శంకరయ్య– లక్ష్మీ దంపతులు ఇంట్లో ఇద్దరే ఉంటారు. వారి ఇంటికి సమీపంలో ఉండే కత్తి శివ(37) వృద్దులకు చేదోడుగా ఉంటూ మందులు తేవడం, ఇతర పనులు చేస్తుండేవాడు. శివకు పేకాట, ఆన్లైన్ గేమ్స్ ఆడడంతో అప్పులయ్యాయి. అప్పు తీర్చేందుకు దంపతుల వద్ద బంగారం కాజేయాలని నిర్ణయించాడు. గతంలో ముంబైలో కల్లుడిపోలో పనిచేసిన సమయంలో అందులో వాడే మత్తు టాబ్లెట్లు వెంట తెచ్చుకున్నాడు. ఈ నెల 7వ తేదీన వృద్ధులకు అనారోగ్యం ఉండడంతో మత్తు టాబ్లెట్లు ఇచ్చాడు. అవి వేసుకుంటే జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు తగ్గుతాయని నమ్మించాడు. మాత్రలు వేసుకుని సొమ్మసిల్లిన రెండు గంటల తర్వాత ఇంట్లోకి వెళ్లి లక్ష్మి మెడలోని బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లాడు. అదే గ్రామంలోని కట్ల శ్రీనివాసాచారికి విక్రయించి, రూ.1.85 లక్షలు తీసుకున్నాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న గంగాధర పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శివపై ఆనుమానంతో అతని కదలికలపై నిఘా పెంచారు. సోమవారం గర్శకుర్తి శివారులో అదుపులోకి తీసుకున్నారు. తానే వృద్ధులకు మత్తుమాత్రలు ఇచ్చి, బంగారం చోరీ చేశానని ఒప్పుకున్నాడు. అతని నుంచి రూ.25వేల నగదు, 11మత్తు మాత్రలు, సెల్ఫోన్, కట్ల శ్రీనివాసాచారి నుంచి పుస్తెలతాడు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన రూరల్ ఏసీపీ విజయ్కుమార్, చొప్పదండి సీఐ ప్రదీప్కుమార్, గంగాధర ఎస్సై వంశీకృష్ణ, హెడ్కానిస్టేబుల్ చారి, కానిస్టేబుళ్లు జంపన్న, అరవింద్ను సీపీ అభినందించి రివార్డు అందించారు. వీడిన గర్శకుర్తి వృద్ధ దంపతుల మిస్టరీ మత్తు మాత్రలు ఇచ్చిన తెలిసిన వ్యక్తి ఆపై బంగారం అపహరణ కేసును ఛేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన సీపీ గౌస్ ఆలం -
అల్ఫోర్స్కు ‘సీబీఎస్ఈ’ అవార్డు
కొత్తపల్లి(కరీంనగర్): విద్య, క్రీడారంగాల్లో అవలంబిస్తున్న విధి విధానాలకు గాను అల్ఫోర్స్ హైస్కూల్కు అత్యుత్తమ సీబీఎస్ఈ పాఠశాల అవార్డు లభించింది. హైదరాబాద్లో గ్లోబల్ ట్రెండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా కంక్లేవ్ సమావేశంలో ఈ అవార్డును అల్ఫోర్స్ విద్యా సంస్థ ల చైర్మన్ డా.వి.నరేందర్ రెడ్డి అందుకున్నారు. వి ద్యారంగంలో అల్ఫోర్స్ విద్యా సంస్థలు చేస్తున్న కృషికి ఈ అవార్డు రావడం ఆనందంగా ఉందని వీఎన్ఆర్ తెలిపారు. నాణ్యమైన విద్య అందిస్తూ, విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దడమే కాకుండా ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ,, ఎయిమ్స్, మెడికల్ కళాశాలలు, సీఏ పరీక్షల ఫలితాల్లో సీట్లు సాధించేలా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. అవార్డు అందుకోవడంపై యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాల నేతలు, యువజన, క్రీడా సంఘం ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు హర్షం వ్యక్తంచేస్తూ నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. -
రైతు కష్టం.. వర్షంతో నష్టం
వీణవంక: వానాకాలం వరి కోతలు ప్రారంభమయ్యాయి. రైతులు కోతల్లో నిమగ్నమవగా.. రైతులను వర్షాలు వెంటాడుతున్నాయి. పంట చేతికొచ్చే సమయంలో వానలు కురుస్తుండడం రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొన్నిచోట్ల వరి కోతలు ఊపందుకోగా.. కళ్లాల వద్ద ధాన్యం ఆరబోశారు. సోమవారం జిల్లావ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం పడడంతో ఆరబోసిన ధాన్యం తడిసింది. ధాన్యం కాపాడుకోవడానికి రైతులు నానా తంటాలు పడ్డారు. కొన్ని మండలాల్లో వర్షానికి వరి అక్కడక్కడ నేలకొరిగింది. దీంతో పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు కలవరపడుతున్నారు. అల్పపీడన ప్రభావంతో మరో 3 రోజులు వానలుంటాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో.. రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దిగుబడిపై తీవ్ర ప్రభావం పడనుందని వాపోతున్నారు. వివిధ తెగుళ్లతో పరేషాన్ అవుతుండగా.. వాన మరింత భయాందోళనకు గురి చేస్తోంది. జిల్లావ్యాప్తంగా 2.76లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఇందులో 60వేల ఎకరాల్లో కోతలు పూర్తి కాగా.. కోత దశలో 1.20లక్షల ఎకరాలున్నాయి. మూడేళ్లుగా ఇదే పరిస్థితి ఉత్తర తెలంగాణలోనే వరి సాగులో కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడి నేలలు వరి పంటకు అనుకూలంగా ఉండడంతో.. రైతులు ఈ పంట వైపే మొగ్గు చూపుతున్నారు. కంపెనీలు సైతం పోటీ పడి విత్తనాలిస్తున్నాయి. మూడేళ్లుగా వరి చేతికొచ్చే సమయంలో వడగండ్లు, అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. దీంతో దిగుబడి తగ్గిపోవడంతోపాటు వరి కోత యంత్రాల ఖర్చు తడిసి మోపడువుతోంది. పెట్టిన పెట్టుబడి భారంగా మారిందని వీణవంక మండలం ఘన్ముక్కుల గ్రామానికి చెందిన రైతు మధుసూదన్రెడ్డి వాపోయాడు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కొన్ని మండలాల్లో పైరు నేలకొరిగింది. తడారని పొలాలు నేలకొరిగిన పొలంలో నీరు నిల్వ ఉండడంతో గింజలు మురిగిపోయే ప్రమాదముంది. నీరు నిల్వ ఉండకుండా కాల్వల ద్వారా తోడేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. దోమతోపాటు వివిధ రకాల తెగుళ్లు విజృంభించే అవకాశముంది. ఇప్పటికే పొలాలు తడారడం లేదు. ఎకరాకు రూ.25వేల పెట్టుబడి పెట్టారు. ఎకరాకు 40 బస్తాల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. భయం గుప్పిట్లో వరి రైతు కోతల సమయంలో రైతులను వెంటాడుతున్న వర్షాలు సోమవారం కురిసిన వానకు తడిసిన ధాన్యం అక్కడక్కడ నేలకొరిగిన పైరు ఈ సమయంలో వర్షాలు పడితే పంటకు తీవ్ర నష్టం మరో 3 రోజులు వానలుంటాయన్న వాతావరణ శాఖ జిల్లాలో 2.76లక్షల ఎకరాల్లో వరి సాగు 8 ఎకరాల్లో దొడ్డు రకం వరి పంట వేసిన. వారం క్రితం వరి కోయాల్సి ఉండగా.. పొలం తడారలేదు. ఇంతలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం కురిసిన వానకు 10 రోజుల వరకు తడారని పరిస్థితి. దిగుబడి వచ్చేట్టు లేదు. గింజలు నేలరాలిపోయే ప్రమాదముంది. ఇప్పటికే ఎకరాకు రూ.30వేల పెట్టుబడి పెట్టాం. – కలకొండ మధూకర్రెడ్డి, రైతు, మల్లన్నపల్లి, -
భీమన్న సన్నిధి.. భక్తుల సందడి
● బాలాలయంలో రాజన్న దర్శనాలు ● కోడెమొక్కుల చెల్లింపులు ● సౌకర్యాలపై భక్తుల సంతృప్తి ● రాజన్న ఆలయం అభివృద్ధిపై హర్షం వేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయ విస్తరణ పనుల నేపథ్యంలో భీమన్న ఆలయంలో దర్శనం, కోడెమొక్కులకు కల్పించిన సౌకర్యాలపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలాలయంలో దర్శనాలకు ఏర్పాట్లు బాగున్నాయని.. కోడెమొక్కులు సైతం ఇక్కడే చెల్లించుకోవడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 11న స్వామి వారి ఉత్సవమూర్తులను భీమన్నగుడిలోని బాలాలయంలో ప్రతిష్ఠించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇక్కడే దర్శనాలు, కోడెమొక్కులు చెల్లించుకుంటున్నారు. రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాన్ని అభివృద్ధి చేయడాన్ని స్వాగతిస్తున్నారు. భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. అదే సమయంలో భీమన్నగుడిలో చేసిన ఏర్పాట్లపై సంతృప్తిగా ఉందన్నారు. భీమన్నగుడిలో దర్శనాలు పూర్తి చేసుకున్న భక్తులు శ్రీసాక్షిశ్రీతో మాట్లాడారు. వారి మాటల్లోనే.. రాజన్న గుడిని విస్తరిస్తున్న క్రమంలో భీమన్నగుడిలో దర్శనాలు ఏర్పాటు చేయడం బాగుంది. ఇక్కడే దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నాం. భీమన్నగుడిలోనూ సౌకర్యాలు బాగా కల్పించారు. ఎన్నో ఏండ్లకు వేములవాడ రాజన్న గుడి అభివృద్ధి జరుగుతుందంటే సంతోషంగా ఉంది. – కాటం సత్యం–లక్ష్మి, సెంటినరీకాలనీ రాజన్న గుడి విస్తరణ పనుల్లో భాగంగా భీమన్నగుడిలో దర్శనాలకు మంచి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. అందరూ అధికారులకు సహకరిస్తే భవిష్యత్లో రాజన్న ఆలయం చరిత్రలో నిలిచిపోయేలా తయారవుతుంది. – మహిపాల్రెడ్డి, కొత్తగూడెం, జనగామ జిల్లా రాజన్న దర్శనానికి వస్తే భీమన్న గుడిలో దర్శనం చేసుకోవాలన్నారు. భీమన్నగుడికి వస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు సాగాయి. రాజన్న ఆలయ విస్తరణ పనులు చేపడుతున్న ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. – మహేశ్వర్, ముణ్యాల్, నిర్మల్ -
అంజన్న హుండీ ఆదాయం రూ.1.08కోట్లు
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయ హుండీలను సోమవారం లెక్కించారు. దేవాదాయ శాఖ పర్యవేక్షకులు రాజమౌళి సమక్షంలో ఆలయ ఈఓ శ్రీకాంత్రావు ఆధ్వర్యంలో శ్రీవేంకట అన్నమాచార్య సేవా ట్రస్టు సభ్యులు లెక్కింపులో పాల్గొన్నారు. 81రోజులకుగాను 12 హుండీలను లెక్కించగా.. రూ.1,08,72,591తోపాటు 55 విదేశీ కరెన్సీ సమకూరింది. మిశ్రమ వెండి, బంగారం తిరిగి బ్యాగుల్లో వేసి, సీల్ చేసి, హుండీలో భద్రపరిచారు. లెక్కింపులో దేశిని సునీల్కుమార్, నీల చంద్రశేఖర్, గుండి హరిహరనాథ్, ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ, రఘు, ఏఎస్సై రమణారెడ్డి పాల్గొన్నారు. -
తాళంవేసిన నాలుగిళ్లలో చోరీ
జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలో ఆదివారం అర్ధరాత్ర దాటాక దొంగలు తాళం వేసిన నాలుగు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఓ ఇంటి నుంచి ద్విచక్రవాహనాన్ని ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన వెన్నం శ్రీనివాస్ దుబాయ్లో ఉంటున్నాడు. ఆయన భార్య ఇంటికి తాళంవేసి ఊరు వెళ్లింది. ఆ ఇంట్లో నుంచి సుమారుడు మూడు తులాల బంగారం, 41 తులాల వెండి ఎత్తుకెళ్లారు. షేక్ షబానా ఇంట్లో నుంచి మూడున్నర తులాల బంగారం, 12 తులాల వెండి, రూ.50 వేలు, ద్యాగల నరేశ్ ఇంటి నుంచి రూ.1.70 లక్షలు, మూడు గారు గొలుసులు, మంథని కవిత ఇంట్లో చొరబడి బంగారం ఎత్తుకెళ్లారు. గుమ్ముల రాజేశం ఇంట్లో పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాన్ని ఎత్తుకెళ్లారు. బాధితుల ద్వారా విషయం తెలుసుకున్న రూరల్ సీఐ సుధాకర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీ పుటేజీలను పరిశీలించారు. సోమవారం ఉదయం 2.30 గంటల నుంచి 3 గంటల సమయంలో దొంగతనం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. బంగారం, నగదు, బైక్ ఎత్తుకెళ్లిన దొంగలు -
సర్వేల ఆధారంగానే రన్వే
రామగుండం: ఆరంచెల విధానంలో వచ్చే నివేదికల ఆధారంగానే అంతర్గాంలో విమానాశ్రయం ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ లభించే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో చేపట్టిన ప్రీఫిజిబిలిటీ నివేదిక కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.40.53 లక్షలు మంజూరు చేయడం ద్వారా ఎయిర్పోర్టు ఏర్పాటుకు తొలిఅడుగు పడినట్లు ఆశలు రేకెత్తుతున్నాయి. వివిధ విభాగాల అత్యున్నతస్థాయి నిపుణులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలతో ఆరుదశల్లో సర్వే చేపడతారని, తుది నివేదికను ఎయిర్ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కి అందజేస్తారని అధికారులు చెబుతున్నారు. రూపొందించనున్నారు. ఆరు దశల్లో.. విమానాశ్రయం ఏర్పాటు జాతీయ భద్రత, పర్యావరణం, రవాణా, ఆర్థిక, ప్రజావసరాలతో ముడిపడి ఉందని అంటున్నారు. తొలిదశలో ప్రయాణికుల డిమాండ్, వాణిజ్య అవసరాలు, రవాణా సౌకర్యాలపై ఆయా విభాగాల ఉన్నతాధికారులు అధ్యయనం చేస్తారు. మలిదశలో స్థలం ఎంపికపై భౌగోళిక పరిస్థితులు, నేల స్వభావం, ఎత్తు, ప్రధాన పట్టణాలకుదూరం, రోడ్లు, రైలు కనెక్టివిటీ పరిశీలిస్తారు. మూడోదశలో భూమి ఎత్తుపల్లాలు, పర్వతాలు, లోయలు, నదులు, రోడ్లు, సరస్సుపై పరిశోధన చేస్తారు. నాలుగో దశలో పర్యావరణ ప్రభావంపై అధ్యయం చేస్తారు. ఐదోదశలో నిర్వాసితులకు పునరావాసం, ఉపాధి కల్పన, వ్యాపార, ప్రాంతీయ అభివృద్ధి ప్రభావంపై సర్వే చేస్తారు. ఆరోదశలో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డైరెక్టర్ జనరల్ ఏవియేషన్ అథారిటీ, ఏఏఐ, కేంద్ర, రాష్ట్ర క్యాబినెట్ అత్యున్నత ప్రతినిధులతో డీపీఆర్ తయారీ, ఆర్థిక అంచనా, బడ్జెట్ ఆమోదం, నిర్మాణానికి తుది అనుమతులు, టెండర్ల విడుదల ద్వారా విమానాశ్రయానికి రన్వే సిద్ధమైనట్లు ప్రకటిస్తారు. అంతర్గాంలో విమానాశ్రయంపై నివేదిక అన్నీబాగుంటేనే అడుగుముందుకు ప్రారంభమైన వివిధ శాఖల సర్వే పక్కాగా ఆరంచెల విధానం అమలు -
ఎస్పీ పైలట్ వాహనంలో ఆస్పత్రికి..
● ప్రమాదాన్ని గమనించి ఆగిన ఎస్పీ ● తన వాహనంలో ఆస్పత్రికి తరలింపు సిరిసిల్లక్రైం: సిరిసిల్ల బైపాస్ రోడ్డులో ప్రమాదవశాత్తు గాయపడ్డ వ్యక్తిని ఎస్పీ మహేశ్ బీ గీతే తన పైలట్ వాహనంలో ఆస్పత్రికి పంపించారు. సోమవారం బైపాస్రోడ్డుపై వెళ్తున్న ఎస్పీకి ప్రమాదంలో గాయపడ్డ అశోక్నగర్కు చెందిన రఫీక్పాషా కనిపించారు. వెంటనే తన వాహనాన్ని నిలిపి క్షతగాత్రులను తన వాహనంలో సిరిసిల్లలోని ఆస్పత్రికి తరలింపజేశారు. భవనం పైనుంచి తోయడంతో ఒకరు మృతిచిగురుమామిడి: చిన్నముల్కనూర్ శివారులోని బ్రీ డింగ్ అండ్ హెచరీస్ ప్రైవేటు కంపెనీలో పేయింటింగ్ పనిచేస్తున్న దాసో సోరెన్ (32)ను తోటి పే యింటర్ భవనం పైనుంచి తోయడంతో కిందపడి చనిపోయాడు. ఇన్చార్జి ఎస్సై స్వాతి వివరాల ప్రకా రం.. సోరేన్ను 15 రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ నుంచి కాంట్రాక్టర్ ఎస్కే.అర్షద్ పేయింటింగ్ వే సేందుకు తీసుకొచ్చాడు. ఇతనితోపాటు ముస్లింఖా న్ కూడా వచ్చాడు. ఆదివారం రాత్రి ఇద్దరు డబ్బుల విషయంలో గొడవపడ్డారు. మాటమాట పెరిగి ము స్లింఖాన్ సోరెన్ను భవనం పైనుంచి తోసేశాడు. తీవ్రంగా గాయపడిన సోరెన్ను 108లో కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. సోమవారం శవపంచనామా చేశారు. -
రాజన్న మండపం!
కాంక్రీట్ పిల్లర్లసాక్షిప్రతినిధి, కరీంనగర్ ●: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ పునర్ నిర్మాణం, అభివృద్ధి విషయంలో ఇప్పటికే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ నిర్మాణం ఎలా సాగుతోందనే అంశం తెరపైకొచ్చింది. యాదాద్రి ఆలయాన్ని కృష్ణశిల రాయితో నిర్మించినట్టుగానే ఇక్కడ జరిగేనా లేక పిల్లర్లతో నిర్మిస్తారా? అనే చర్చ సాగుతోంది. సుమారు 70 పిల్లర్లతో స్లాబు వేసి రాజన్న ఆలయ మండపం నిర్మించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆలయ పునర్ని ర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.76కోట్లను మంజూరు చేసింది. యాదాద్రి ఆలయ నిర్మాణానికి రూ.300 కోట్లు గత ప్రభుత్వం ఖర్చు చేసింది. దీన్ని బట్టి చూస్తే యాదాద్రి తరహాలో రాజన్న ఆలయ నిర్మాణం పూర్తయ్యేనా అనే అపోహలు భక్తుల్లో నెలకొన్నాయి. దీనిపై ప్రభుత్వం, దేవాదాయశాఖ స్ప ష్టమైన వివరణ ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు. పీఠాధిపతి రాకతో అపోహలు తొలగేనా? ఈనెల 19న శృంగేరి పీఠాధిపతి జగద్గురు విధుశేకర భారతిస్వామి వేములవాడ ఆలయాన్ని సందర్శించి సలహాలు, సూచనలు అందించనున్నారు. ఈనేపథ్యంలో పీఠాధిపతి రాకతోనైనా ఆలయ నిర్మాణం విషయంలో స్పష్టత వచ్చేనా అని భక్తులు, స్థానికులు ఎదురుచూస్తున్నారు. స్వామీజీ సూచనల మేరకే దేవాదాయశాఖ ఆలయ పునర్ నిర్మాణ విషయంలో మాస్టర్ప్లాన్ బ్లూప్రింట్ సిద్ధం చేసింది. ఇందులో పిల్లర్లతో నిర్మాణం చేపడుతున్నట్లు భక్తులు చర్చించుకుంటున్నారు. ఇదే కొనసాగితే రాజన్న ఆలయ ఆధ్యాత్మికతకు భంగం కలిగే అవకాశం ఉందని భక్తులు పేర్కొంటున్నారు. అలాగే ప్రాచీనతకు అద్దం పట్టినట్లు ఉండే రాజన్న ఆలయ రూపురేఖలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. యాదాద్రి ఆలయాన్ని ఆధ్యాత్మికతకు అద్దం పట్టేలా నిర్మించారు. అంతకంటే పురాతన చరిత్ర గల రాజన్న ఆలయాన్ని అలాంటి శైలిలోనే నిర్మాణం చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. కాకతీయుల కాలం నాటి ప్రాచీన ఆలయానికి ఆధునిక పిల్లర్లు కట్టి, వాటికి రాతి పలకలు అద్దితే నాణ్యత ఎంతకాలం ఉంటుందనే విషయంపైనా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆలయ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ రాజేశ్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. కాంక్రీట్ పిల్లర్లతో మండప నిర్మాణం వాస్తవమేనని, ఆ పిల్లర్లకు రాతి పలకలు తొడుగుతామన్నారు. దీని నాణ్యత చాలాకాలం ఉంటుందని స్పష్టం చేశారు.రాజన్న ఆలయ పునర్నిర్మాణం జరిగే సమయంలో భక్తులకు దర్శన భాగ్యం కలిగేనా లేక నిలిపివేస్తారా? అని అనుమానాలు ఉన్నాయి. దేవాదాయశాఖ అధికారులు నిర్మాణ సమయంలో స్వామివారికి ఏకాంత సేవలు మాత్రమే కొనసాగిస్తామని స్పష్టం చేయడంతో భక్తులకు రాజన్న దర్శనం కలిగేనా అనే అపోహలు నెలకొన్నాయి. నిర్మాణ సమయంలో భక్తులకు భీమేశ్వరస్వామి ఆలయంలో దర్శనాలు ఉంటాయని, ఉత్సవ విగ్రహాలను మూడు రోజుల క్రితమే తరలించారు. కోడెమొక్కులు కూడా భీమేశ్వరాలయంలోనే ఏర్పాటు చేశారు. ఈ విషయంపై బీజేపీ నాయకులు భక్తులకు రాజన్న ఆలయం నిర్మాణ సమయంలో దర్శన అవకాశం కల్పించాలని ఆందోళన చేస్తున్నారు. దీనిపై ఆలయ ఈవో రమాదేవి ఆలయం మూసివేత ఉండదని, ఆలయంలో జరిగే ఏకాంత పూజలు యథావిధిగా కొనసాగుతాయని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ యాదాద్రి కానీ, కాణిపాకం ఆలయంలో గానీ పునర్నిర్మాణ విషయంలో భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. ఇక్కడ అందుకు విరుద్ధంగా దర్శనాలు నిలిపివేయడం సరికాదంటున్నారు. మేడారం సమ్మక్క జాతర సందర్భంగా ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ.. అని ఇలాంటి సమయంలో దర్శనం విషయంలో గందరగోళం కలిగించే ప్రకటనలు సరికాదని హితవు పలుకుతున్నారు. -
కదిలిన జవాన్ల పీఠాలు
కరీంనగర్ కార్పొరేషన్: ఎట్టకేలకు నగరంలోని పారిశుధ్య జవాన్ల పీఠాలు కాస్త కదిలాయి. నగరంలోని 66 డివిజన్లకు సంబంధించిన 61 మంది జవాన్లను అంతర్గతంగా బదిలీ చేస్తూ నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా డివిజన్లలో ఏళ్లుగా పాతుకుపోయిన జవాన్లు చెత్త పేరుతో దందా సాగిస్తుండడం, రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న తీరుపై గతంలో ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించడం తెలిసిందే. కొంతమంది నేతల అండదండలతో జవాన్ల అక్రమాలకు పాల్పడుతుండడం, ఒకే డివిజన్లో తిష్ట వేయడంపై కథనాల్లో పేర్కొనడంతో కమిషనర్ స్పందించారు. 10 మంది ప్రభుత్వ, 51 మంది ఔట్సోర్సింగ్ జవాన్లను బదిలీ చేశారు. కొద్దిమందికి రెండు డివిజన్ల బాధ్యతలు అప్పగించారు. ముగ్గురికి నైట్స్వీపింగ్, ఒకరికి కంట్రోల్ రూం శానిటేషన్ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పక్క డివిజన్లే సుదీర్ఘకాలం తరువాత శానిటేషన్ జవాన్లకు స్థానచలనం కలిగినా, పైరవీలు పనిచేశాయనే ప్రచారం జరుగుతోంది. ‘సాక్షి’ గతంలోనే చెప్పినట్లు పక్క డివిజన్లకే బదిలీ అయి, మళ్లీ అదే ప్రాంతంలో తమ ఆధిపత్యం చలాయించేందుకు జవాన్లు సిద్ధం అవుతున్నారు. సోమవారం జరిగిన బదిలీలను చూస్తే కొంతమందికి పక్క డివిజన్కే బదిలీ చేశారు. అంటే కేవలం బదిలీ అయినట్లుగానే ఉంటుంది తప్ప, అదే ప్రాంతంలో మళ్లీ దందాను యథేచ్ఛగా సాగించే అవకాశం ఏర్పడింది. పూర్తిస్థాయిలో పారిశుధ్య జవాన్ల ప్రక్షాళన జరగాలంటే, పక్క డివిజన్ల బదిలీలను కూడా మార్చాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. -
రాజన్న ఆలయ పరిసరాల్లోనే దర్శనం
సాక్షిప్రతినిధి, కరీంనగర్: భీమన్న గుడిలో కాదు.. రాజన్న ఆలయ పరిసరాల్లోనే భక్తులకు దర్శనం కల్పించనున్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్, దేవాదాయశాఖ అధికారులతో సోమవారం ఈ విషయంపై చర్చించారు. కోడెమొక్కుల చెల్లింపు అనాదిగా వస్తున్న ఆచారమని, భక్తుల మనోభావాలకు విరుద్ధంగా రాజన్న ఆలయానికి బదులు భీమన్న ఆలయాన్ని అంగీకరించేది లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే 30 వేల మంది బీజేపీ కార్యకర్తలతో 15 రోజులపాటు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. మేడారం జాతర దృష్ట్యా, రాజన్న భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. బండి సంజయ్ సూచనలను అధికారులు పరిగణనలోకి తీసుకున్నారని, అవసరమైతే ఎల్ఈడీ స్క్రీన్, తాత్కాలిక ఏర్పాట్లతో భక్తులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తామని సిరిసిల్ల డీపీఆర్వో కార్యాలయం ప్రకటన జారీ చేసింది. నా భూమి లాక్కుంటారా? కరీంనగర్ అర్బన్: దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూమిలో అధికారులు దౌర్జన్యంగా ఖనీళ్లు పాతారంటూ సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో రైతు ఆందోళన వ్యక్తం చేశాడు. కోర్టు స్టే ఉండగా ఎలా సర్వే చేస్తారని కలెక్టర్ పమేలా సత్పతి ఎదుట కంటతడి పెట్టా డు. చొప్పదండి మండలం కొలిమికుంట శివా రులోని సర్వే నంబర్ 307/ఎ/3/1లో ఏడు గుంటల భూమి గోస్కుల కొమురయ్య పేరున ఉంది. గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. కోర్టును ఆశ్రయించగా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిందని, అవేవీ పట్టించుకోకుండా పంటను ధ్వంసం చేశారని కొమురయ్య వాపోయాడు. తహసీల్దార్, సర్వేయర్లు అక్రమార్కులకు అండగా నిలుస్తుండగా, ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నించారు. ఈ క్రమంలో తహసీల్దార్ నవీన్, రైతు మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పార్క్ స్థలం పరిశీలనకరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని ముకరంపురలో వివాదాస్పద పార్క్ స్థలాన్ని సోమవారం నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పరిశీలించారు. ‘కబ్జాలపై కదలికేది!’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో వచ్చిన కథనంపై స్పందించారు. ముకరంపురలోని స్థలం వద్దకు వెళ్లి తనిఖీ చేశారు. స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు పరిశీలించారు. ఈ స్థలం తనదేనంటూ ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించగా, స్థలయజమాని పక్షాన ఆదేశాలు జారీ అయ్యాయని డీసీపీ బషీర్ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యాలయ న్యాయ విభాగం సలహాల మేరకు తగిన చర్యలు తీసుకొంటామని పేర్కొన్నారు. కరీంనగర్: కేబుల్ బ్రిడ్జి వద్ద రోడ్డు గుంతలు ఉండటంతో ఇప్పటి వరకు 15 రోడ్డు ప్రమదాలు జరిగాయని, ముగ్గురు చనిపోయారని, వెంటనే కేబుల్ బ్రిడ్జిపైన రోడ్డు వేయాలని ఏఐఎఫ్బీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రోడ్డు వేయాలని ధర్నా నిర్వహించారు. ఆవుల ఆది త్య, సాయిఅనురాగ్, ఆనంద్, శ్రవణ్, పవన్, రఽఘు, సాయికిరణ్రెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్స్పోర్ట్స్: ఆసిఫాబాద్ జిల్లా గోలేటి టౌన్షిప్లో ఈనెల 10నుంచి 12వరకు జరిగిన 11వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ సెపక్ తక్రా పోటీల్లో జిల్లా క్రీడాకారులు నాలుగు పతకాలు సాధించారని జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గన్ను విజయభాస్కర్రెడ్డి తెలిపారు. క్రీడాకారులను జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ అధ్యక్షుడు కన్న కృష్ణ, డీవైఎస్వో శ్రీనివాస్, ఒలింపిక్ అసోసియేషన్ బా ధ్యులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్ధన్ రెడ్డి, తుమ్మల రమేశ్రెడ్డి అభినందించారు. -
డీసీసీకి 32 సిటీ ప్రెసిడెంట్కు 22
కరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంలో భాగంగా చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. జిల్లా, నగర అధ్యక్ష స్థానాలు ఆశిస్తున్న వారి నుంచి డీసీసీ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించారు. అధ్యక్ష స్థానాలను ఎంపిక చేసేందుకు ఏఐసీసీ పరిశీలకుల ను నియమించగా, ఆ పరిశీలకులు స్వయంగా దరఖాస్తులు స్వీకరిస్తారని ముందుగా ప్రచారం జరిగింది. కాని పరిశీలకులు సోమవారం సాయంత్రానికి నగరానికి చేరుకోగా, అంతకుముందే డీసీసీ కార్యాలయ కార్యదర్శులు నాత శ్రీనివాస్, దొంతి గోపి ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 18వ తేదీ వరకు కొన సాగనుంది. కాగా డీసీసీ అధ్యక్ష స్థానానికి 32 మంది, సిటీ ప్రెసిడెంట్కు 22 మంది దరఖాస్తు చేసుకోవడం పార్టీ వర్గాలనే ఆశ్చర్యానికి గురిచేసింది. డీసీసీకి 32 దరఖాస్తులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష స్థానానికి మొదటి రోజు 32మంది దరఖాస్తు చేసుకున్నారు. వెలిచాల రాజేందర్రావు, వైద్యుల అంజన్ కుమార్, కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఆరెపల్లి మోహన్, పత్తి కృష్ణారెడ్డి, పులి ఆంజనేయులు గౌడ్, కర్ర సత్య ప్రసన్నా రెడ్డి, కాశిపాక రాజేష్, సత్తు మల్లేశం, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఆకారపు భాస్కర్ రెడ్డి, ఉట్కూరి నరేందర్ రెడ్డి, బత్తిని శ్రీనివాస్ గౌడ్, నెల్లి నరేశ్, మహమ్మద్ తాజుద్దీన్, మాచర్ల ప్రసాద్, దాసరి భూమయ్య, తిప్పారపు సంపత్, మహమ్మద్ ఖలీముద్దీన్, మ్యాకల రవీందర్, సయ్యద్ జమాలుద్దీన్, మూల జైపాల్, మహమ్మద్ అబ్దుల్ సలాం, ఎస్కే. సిరాజ్ హుస్సేన్, శ్రీపురం నాగప్రసాద్, పడాల రాహుల్, దీకొండ శే ఖర్, రుద్ర సంతోష్, ప్యాట రమేష్, సారంగపాణి, చర్ల పద్మ దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. సిటీకి 22 సిటీ కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి 22 మంది దరఖాస్తు చేసుకొన్నారు. బానోతు శ్రావణి నాయక్, ముల్కల ప్రవీణ్, షబానా మహమ్మద్, కొరివి అరుణ్ కుమార్, మహమ్మద్ తాజుద్దీన్, మాచర్ల ప్రసాద్, సయ్యద్ ముజీబ్ హుస్సేన్, కంకణాల అనిల్ కుమార్, సర్దార్ ధన సింగ్, మహమ్మద్ అబ్దుల్ సలాం, అస్తపురం రమేష్ ,ఎస్.కె సిరాజ్ హుస్సేన్, మహమ్మద్ జమాలుద్దీన్, అబ్దుల్ రెహమాన్, బోనాల శ్రీనివాస్, కొట్టె ప్రభాకర్, దీకొండ శేఖర్, గడ్డం శ్రీనివాస్, వీర దేవేందర్ పటేల్, వైద్యులు అంజన్ కుమార్, మహమ్మద్, ఇంతియాజ్ అలీ ఉన్నారు. నగరానికి వచ్చిన పరిశీలకులు ఏఐసీసీ పరిశీలకుడు శ్రీనివాస్ మానె, సమన్వయకర్తలు ఆత్రం సుగుణ, శెట్టి సత్యనారాయణలు సోమవారం నగరానికి చేరుకొన్నారు. 18వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాలోనే ఉండి ఈ ప్రక్రియ కొనసాగిస్తారు. పరిశీలకులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీని వాస్, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ స్వాగతం పలికారు. -
ప్రజావాణి.. వినరూ!
కరీంనగర్ అర్బన్: సమస్యలతో వేగలేకపోతున్నాం, క్షేత్రస్థాయిలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని కలెక్టరేట్లో ఫిర్యాదు చేస్తే మళ్లీ వారికే విచారణ బాధ్యతలు అప్పగిస్తున్నారని, తమకు పరిష్కారం ఎండమావేనని బాధితులు గగ్గోలు పెట్టారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో బాధితులు సమస్యల ఏకరవు పెట్టగా కలెక్టర్ పమేలా సత్పతి అర్జీలను స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీఆర్వో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అర్జీలను స్వీకరించారు. -
స్వయం ఉపాధితో సక్సెస్
● ఆర్థికాభివృద్ధి కోసం శ్రమిస్తున్న మహిళలు ● జూట్ బ్యాగుల తయారీతో ముందడుగు సారంగాపూర్(జగిత్యాల): కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవాలని స్వశక్తి సంఘాలు శ్రమించి, వారు ఏర్పాటు చేసుకున్న యూనిట్ల ద్వారా సక్సెస్ అవుతున్నారు. సెర్ప్ ద్వారా కొంత బ్యాంక్ రుణం అందిస్తే, మరికొంత వారు జమ చేసుకుని యూనిట్లను ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. సారంగాపూర్ సెర్ప్, జాగృతి మండల సమాక్య ఆధ్వర్యంలో పలువురు మహిళలు ఆర్థిక ప్రగతి సాధిస్తున్నారు. 548 సంఘాలు.. 6,120 మంది సభ్యులు సారంగాపూర్ మండలంలో మొత్తం 18 గ్రామాలు ఉన్నాయి. మండలవ్యాప్తంగా 548 మహిళ సంఘాలను ఏర్పాటు చేయగా, 6,120 సభ్యులు ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 432 మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.26.83 కోట్ల రుణాలు అందజేయాలని నిర్ణయించి, ఇప్పటి వరకు 104 సంఘాలకు రూ.13.98 కోట్ల రుణాలు అందజేశారు. మహిళా సంఘాల సభ్యులకు ఏ వ్యాపారం చేస్తే లాభదాయకంగా ఉంటుందో వారి చాయిస్కు అనుగుణంగా యూనిట్ల ఏర్పాటుకు మహిళా సంఘాల ద్వారా రుణసాయం అందిస్తున్నారు. ప్రత్యేక శిక్షణ జూట్ బ్యాగుల తయారీ, బ్యూటీషియన్, కుట్టు శిక్షణ, మగ్గం వర్క్, ఫాబ్రిక్ పెయింటింగ్, ఇమిటేషన్ జ్యూలరీ తయారీ వంటి వాటిపై నెల రోజుల నుంచి 3 నెలల పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆర్ఎస్ఈటీఐ ఆధ్వర్యంలో కరీంనగర్లోని తిమ్మాపూర్లో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందిన మహిళలు యూనిట్లను ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా ఎదగడానికి శ్రమించి విజయం సాధిస్తున్నారు. తాము ఏర్పాటు చేసుకున్న యూనిట్ల ద్వారా వచ్చే ఆదాయంతో బ్యాంక్ రుణం చెల్లిస్తూ, తమ కుటుంబానికి కొంత వాడుకుంటున్నారు. జూట్ బ్యాగ్లకు భలే గిరాకీ సారంగాపూర్ గ్రామానికి చెందిన రాస రమ జూట్ బ్యాగ్ల తయారీకి శిక్షణ పొందింది. లంచ్ బ్యాగులు, సమోస బ్యాగ్, లగేజీ బ్యాగ్, వెటిటేబుల్ బ్యాగ్, మార్కెట్ బ్యాగ్, వాటర్ బాటిళ్ల బ్యాగ్, గిఫ్ట్ బ్యాగు, తాంబూలం బ్యాగు, పౌచ్లను ఆకట్టుకునే డిజైన్లు, రంగులతో తయారు చేస్తున్నారు. కరీంనగర్రూరల్: స్వయం ఉపాధి కోసం ఈ యువకులు ఎంచుకున్న దందా చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సిద్ధిపేట జిల్లా హు స్నాబాద్కు చెందిన కొందరు యువకులు బూట్ పాలీష్ కలర్ తయారీ కోసం దురిసేనా చెట్ల బెరడును సేకరిస్తున్నారు. ఇటీవల కరీంనగర్ మండలం జూబ్లీనగర్లో మకాం వేసిన యువకులు దు రిసేనా చెట్ల కొమ్మలను సేకరించారు. కొమ్మలను చిన్న ముక్కలుగా కట్ చేస్తున్న సమయంలో కొ మ్మల నడుమ ఉన్న బెరడు నుంచి ఎర్రనిరంగు జిగటలాగా బయటకు వస్తోంది. బూట్ పాలీష్ కలర్తయారీ చేసే కంపెనీలు ఈ రంగును ఉపయోగిస్తాయని శ్రీకాంత్ అనే యువకుడు తెలి పాడు. ముక్కలను పూర్తిగా ఎండబెట్టిన అనంత రం కిలో రూ.150 చొప్పున హైదరాబాద్లో బ్రోకర్లకు విక్రయిస్తామని పేర్కొన్నాడు. ప్రధానంగా దురిసేనా చెట్ల కొమ్మలను కామారెడ్డి, బాన్సువాడ ప్రాంతాల నుంచి సేకరిస్తామని, వర్షాకాలంలో మాత్రమే ఈ వ్యాపారం చేస్తామని వివరించాడు. కొమ్మలను ముక్కలుగా కట్ చేస్తున్న యువకుడు సెర్ప్ ద్వారా రూ.1 లక్ష పెట్టుబడితో జూట్ బ్యాగ్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేశాను. జూట్ను హైదరాబాద్ నుంచి తెప్పించి తయారు చేస్తున్నా. ఈ ఏడాది పాఠశాలల ప్రారంభ సమయంలో సారంగాపూర్ మండల ప్రభుత్వ పాఠశాలల 300 మంది విద్యార్థులకు మరో మహిళా సంఘ సభ్యురాలితో కలిసి స్కూల్యూనిఫాంలు కుట్టినం. దీని ద్వారా మంచి ఉపాధి దొరుకుతుంది. – రాస రమ, సారంగాపూర్సారంగాపూర్ మండలంలోని 18 గ్రామాల్లో మహిళలు ఇప్పటికీ వ్యవసాయం అనుబంధంగా ఉన్న పలు యూనిట్లను ఏర్పాటు చేసుకుని సక్సెస్ అవుతున్నారు. రానున్న రోజుల్లో జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారుల సహకారంతో మరిన్ని యూనిట్ల ఏర్పాటుకు కృషి చేస్తాం. – చంద్రకళ, ఏపీఎం, సెర్ప్(ఐకేపీ) -
చెడు బ్యాక్టీరియాకు చికిత్స
పేగుల్లో ఉన్న మందులకు లొంగని బ్యాక్టీరియాను నాశనం చేసేందుకు మంచి బ్యాక్టీరియాతో చికిత్స అందుబాటులో ఉంది. పేగుల్లో బ్యాక్టీరియా సమస్యతో బాధపడే పేషెంట్కు ఆరోగ్యంగా ఉన్న పేషెంట్ నుంచి స్టూల్ తీసి కొలనోస్కోపి ద్వారా ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల పేషెంట్ మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి పెరిగి చెడు బ్యాక్టీరియా నశించిపోతుంది. ఇది ఫెకల్ మైక్రోబయాలాజికల్ ట్రాన్స్ప్లాంటేషన్ పద్ధతి. వేరే డిజార్డర్స్లో కూడా దీన్ని అప్లికేషన్ చేయొచ్చు. – డాక్టర్ రవిశంకర్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు ఊబకాయం వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. దీంతో డయాబెటిస్, కొలెస్ట్రాల్, గుండె సమస్యలు వస్తుంటాయి. ఊబకాయం తగ్గాలంటే ఇన్నాళ్లు ఆహార నియమాలు పాటించడం, వ్యాయామం చేయడం మాత్రమే పరిష్కారంగా ఉండేవి. గతేడాది క్రితం టిజెప్లయిడ్, సెమాగ్లుటైడ్ ఇంజక్షన్లు అనే 2 ఇంజక్షన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఏదైనా ఒకటి వారానికి ఒకటి చొప్పున సుమారు రెండేళ్లపాటు వాడితే ఊబకాయం నుంచి మధుమేహం నుంచి బయటపడొచ్చు. – డాక్టర్ రాకేశ్సహాయ్, ఎండోక్రైనాలజిస్టు -
వైద్యరంగానికి దిశానిర్దేశం
కరీంనగర్టౌన్: కరీంనగర్ వీ–కన్వెన్షన్ హాల్ వేదికగా 2 రోజులపాటు ఘనంగా జరిగిన ఫిజీషియన్స్ అసోసియేషన్ 9వ రాష్ట్ర సదస్సు ఆదివారం సాయంత్రం ముగిసింది. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది వైద్యులు, జూనియర్ డాక్టర్లు, పీజీ విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొన్నారు. అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, పరిశోధకులు పాల్గొన్న సదస్సులో వైద్య రంగంలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కార మార్గాలను సూచించడమే కాకుండా.. సాంకేతికతతో కలిపి మానవీయతకు ప్రాధాన్యమివ్వాల్సిన అవసరాన్ని సూచించారు. ఇటువంటి సదస్సులు వైద్యరంగ అభివృద్ధికి గల ప్రాధాన్యతను స్పష్టం చేస్తున్నాయని, ప్రస్తుత వైద్య సవాళ్లను ఎదుర్కొనే దిశగా ఇది ఒక ఆత్మ పరిశీలన వేదికగా నిలుస్తోందని నిర్వాహకులు తెలిపారు. వైద్యరంగానికి సవాళ్లు ఈ సదస్సులో క్లినికల్ డిసిషన్ మేకింగ్, డిజిటల్ హెల్త్ టూల్స్ వినియోగం, రిసెర్చ్ ఆధారిత చికిత్సలు వంటి ముఖ్య అంశాలపై సుదీర్ఘంగా చర్చలు సాగాయి. మారుతున్న జీవనశైలి, నూతన వ్యాధులు సంభవించడం, పాత వైద్య విధానాలకు సమర్థవంతమైన ప్రత్యామ్నాయాల అవసరం వంటి అంశాలపై నిపుణులు వివరించారు. వైద్య నిర్ణయాల్లో టెక్నాలజీ వాడకం ఎంతగా అవసరమైందో, అదే సమయంలో మానవీయతకు తావివ్వడం ఎందుకు అవసరమో స్పష్టంగా వివరించారు. వైద్యంలో ఏఐ నూతన విప్లవం ప్రస్తుతం డిజిటల్ హెల్త్ టూల్స్ వంటి ఏఐ ఆధారిత టెక్నాలజీలు వైద్య రంగంలో వేగంగా ప్రవేశిస్తున్నట్లు నిపుణులు వివరించారు. రోగ నిర్ధారణ, చికిత్స పద్ధతుల్లో వేగం, కచ్చితత్వం పెరగడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. అయితే టెక్నాలజీ అనేది మానవతావాదంతో కలిసి ప్రయోజనకరంగా ఉపయోగించాలన్నారు. కేవలం మెషీన్ ఆధారంగా వైద్య నిర్ణయాలు తీసుకోవడం సరైన దారి కాదని సూచించారు. అనుభవజ్ఞుల మార్గదర్శనం పీజీ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు ఈ సదస్సులో భాగస్వాములవడం సదస్సుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనుభవజ్ఞులైన సీనియర్ వైద్యులు తన అనుభవాలను పంచుకోవడంతో వారిలో కొత్త ఆలోచనలకు ఊతం లభించిందని, వారి వైద్య దృక్పథంలో మార్పు వస్తోందని నిర్వాహకులు తెలిపారు. వైద్యులు కేవలం రోగ నిర్ధారణ చేయడంలో కాదు.. సమాజంలో మార్గదర్శకులుగా మారే దిశగా దృక్పథాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని నిపుణులు ప్రస్తావించారు. అధునాతన సాంకేతిక వైద్యంపై పలువురు వక్తల ప్రజెంటేషన్ ముగిసిన ఫిజీషియన్స్ అసోసియేషన్ 9వ రాష్ట్ర సదస్సు -
ఎస్జీఎఫ్ వాలీబాల్ విజేతలు జగిత్యాల, సిరిసిల్ల
బోయినపల్లి(చొప్పదండి): కొదురుపాక హైస్కూల్ మైదానంలో ఎస్జీఎఫ్ అండర్–17 ఉమ్మడి జిల్లా వాలీబాల్ క్రీడాపోటీలు ఆదివారం నిర్వహించారు. బాలుర విభాగంలో జగిత్యాల జిల్లా మొదటి స్థానం సాధించగా.. రాజన్న సిరిసిల్ల జట్టు రన్నరప్గా నిలిచింది. బాలికల విభాగంలో రాజన్న సిరిసిల్ల ప్రథమ, జగిత్యాల జిల్లా ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. విజేతలకు పతకాలతోపాటు బహుమతులు అందించారు. ప్రతిభ చూపిన క్రీడాకారులను ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. -
కారు, ఆటో ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు
మెట్పల్లి రూరల్: మేడిపల్లి శివారులో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. వెంకట్రావుపేట వైపు నుంచి వస్తున్న ఓ ఆటో మేడిపల్లి శివారులోని క్రాసింగ్ నుంచి ఇబ్రహీంపట్నం వైపు వెళ్లోంది. ఇదే సమయంలో మేడిపల్లి వైపు నుంచి మెట్పల్లి వెళ్తున్న కారు ఆటోను ఢీకొట్టింది. ఈ వాహనాలు ధ్వంసమవగా.. ఆటో నడుపుతున్న వర్షకొండకు చెందిన సద్దాం హుస్సేన్కు తీవ్ర గాయాలయ్యాయి. సద్దాం హుస్సేన్ తండ్రి కాసీం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కారు డ్రైవర్ నిజామాబాద్కు చెందిన చైతన్యేశ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. కారు డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తతోనే ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. -
ఉత్సాహంగా హాఫ్ మారథాన్
కరీంనగర్స్పోర్ట్స్: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఆదివారం హాఫ్ మారథాన్ ఉత్సాహంగా సాగింది. 3,5,10,21 కిలోమీటర్ల పరుగులో పెద్ద ఎత్తున విద్యార్థులు, యువత, క్రీడాకారుల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు ఉత్సాహంగా పాల్గొన్నారు. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష 10,21 కిలోమీటర్ల పరుగును, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు 3,5 కిలోమీటర్ల మారథాన్ రన్ ప్రారంభించారు. మారథాన్లో పాల్గొన్నవారికి ప్రశంసాపత్రాలు, మెడల్స్ అందజేయగా విజేతలకు ట్రోఫీలు ప్రదానం చేశారు. మార్కెటింగ్ శాఖ ప్రాంతీయ ఉపసంచాలకులు వుడుతల పద్మావతి, డీవైఎస్వో శ్రీనివాస్గౌడ్, నిర్వాహకులు మహేశ్, దాసరి శ్రీపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సాహిత్య శిఖరం ‘సాంబకవి’
కరీంనగర్ కల్చరల్: అద్భుత శైలితో రచనలు చేసిన వేములవాడ మధుర కవి మామిడిపల్లి సాంబశివశర్మ (సాంబకవి) ఓ సాహిత్య శిఖరం అని పలువురు వక్తలు అభివర్ణించారు. ‘అజరామర అక్షరం’ పేరిట తెలంగాణ రచయితల వేదిక (తెరవే) ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని భగవతి పాఠశాలలో సాంబకవి రచన ‘లోబ సంహారం’ పుస్తక విశ్లేషణ సభలో వక్తలు మాట్లాడారు. ప్రధాన వక్తగా విష్ణు వందనాదేవి హాజరయ్యారు. సుప్రభాతాలు, నాటకాలు, హరికథలు, బుర్రకథలు, పాటలు, పద్యాలు రచనలలో సాంబ కవిది అందవేసిన చేయని విశ్లేషించారు. తెరవే జిల్లా అధ్యక్షుడు సీవీ.కుమార్, కవులు పీఎస్ రవీంద్ర, వాసాల వరప్రసాద్, తిరుక్కోవల వెంకటరమణ, అన్నవరం దేవేందర్, గాజోజు నాగభూషణం, బీవీఎన్ స్వామి, దామరకుంట శంకరయ్య, సంకేపల్లి నాగేంద్ర శర్మ పాల్గొన్నారు. ఈటలపై ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి వ్యాఖ్యలు సరికాదు జమ్మికుంట: మల్కాజిగిరి ఎంపీగా ఉంటూనే హుజూరాబాద్ ప్రజలకు అండగా ఉంటున్న ఈటల రాజేందర్పై ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి అసందర్భ వ్యాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్రావు, మాడ గౌతంరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ శీలం శ్రీనివాస్, బండి కళాధర్ అన్నారు. పట్ట ణంలో ఆదివారం మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాదరణ ఉన్న వ్యక్తులకు టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటామని ఈటల చెప్పడంతో కౌశిక్రెడ్డి వెన్నులో వణుకు పుట్టిందన్నారు. ఆరోపణలు చేస్తే గొప్ప నాయకుడు కాలేరని, ప్రజలకు సేవ చేయాలని హితవు పలికారు. జిల్లా కార్యదర్శి బింగికరుణాకర్, మాసాడి ముత్యంరావు, పల్లె వెంకట్రెడ్డి, పెద్ది మాల్లారెడ్డి, జీడీమల్లేశ్ పాల్గొన్నారు. పాఠశాలల పటిష్టతకు కృషి చేయాలి కరీంనగర్: ప్రాథమిక పాఠశాలల సమస్యల పరిష్కారానికి పీఆర్టీయూ రాష్ట్రశాఖ సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని సంఘం జిల్లా అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కేతిరి తిరుపతిరెడ్డి కోరారు. హైదరాబాద్లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జరుగుతున్న పీఆర్టీయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో శ్రీనివాస్, తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలు విద్యారంగానికి పునాది వంటివని, ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక పీఎస్ హెచ్ఎం పోస్టును మంజూరు చేయాలని కోరారు. పెండింగ్ డీఏలు విడుదల అయ్యేలా, నూతన పీఆర్సీ ని ప్రభుత్వం అమలు చేసే విధంగా ప్రాతినిథ్యం చేయాలని కోరారు. బంగారం చోరీపై కేంద్రం జోక్యం చేసుకోవాలికరీంనగర్కల్చరల్: శబరిమల శ్రీధర్మశాస్త్ర దేవస్థానంలో బంగారం చోరీ, ఆస్తుల దుర్విని యోగం విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కరీంనగర్ అయ్యప్ప సేవా సమితి సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్కు వినతిపత్రం ఇచ్చారు. అయ్యప్ప సేవా సమితి సభ్యులు కె.పరమేశ్వర్, పి.సత్యనారాయణ, జి.నాగరాజు, పి.సాయన్న తదితరులు ఆది వారం కేంద్రమంత్రిని కలిశారు. శబరిమల ఆలయంలో బంగారు ఆభరణాలు చోరీ కావడంతోపాటు తప్పుడు రికార్డులు నమోదు చేయడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని శబరిమల ఆలయ ఆస్తులపై సీబీఐ పర్యవేక్షణలో ఆడిట్, సెంట్రల్ హెరిటేజ్ ఆస్తులపై సమీక్ష జరపాలని డిమాండ్ చేశారు. దేవాలయ ఆస్తుల నిర్వహణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేయడంతోపాటు బాధ్యులైన ట్రావెన్కోర్ బోర్డుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మహా పాదయాత్ర ప్రారంభంకరీంనగర్ నుంచి శబరిమలకు గురుస్వామి గడప నాగరాజు ఆధ్వర్యంలో చేపట్టిన 25వ మహాపాదయాత్రను కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. -
ఆర్ఎస్ఎస్ కవాతులో బండి సంజయ్
కరీంనగర్టౌన్: కరీంనగర్లో రాష్ట్రీయ సేవక్ సంఘ్ శత జయంతి ఉత్సవాలు అట్టహాసంగా జరిగా యి. నగర స్వయం సేవకులు ఆదివారం భారీ కవాతు ప్రదర్శన చేపట్టారు. శాతవాహన యూనివర్సిటీ రోడ్డులోని వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల నుంచి పలు ప్రాంతాల మీదుగా రాంనగర్ వరకు పథ సంచాలన్ కొనసాగింది. అనంతరం శ్రీచైతన్య జూనియర్ కళాశాల మైదానంలో సంచాలన్ సమరోప్ జరిగింది. ముఖ్య వక్తగా విద్యా భారతి దక్షిణమధ్య క్షేత్ర కార్యదర్శి అయచితుల లక్ష్మణరావు హాజరయ్యారు. ఆర్ఎస్ఎస్ను అర్థం చేసుకోవాలంటే మత, రాజకీయ కోణాల్లో కాకుండా సంఘంలో చేరి పనిచేయాలన్నారు. ఎయిమ్స్ తరహా ఆయుర్వేద ఇనిస్టిట్యూట్కు కేంద్రం సానుకూలం తెలంగాణలో ఎయిమ్స్ తరహాలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎఐఐఎ) ఏర్పాటు కు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్కు తాను రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు. కరీంనగర్లో అత్యాధునిక ఆయుష్ ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రి ఏర్పాటుపై 2025 మే 27న రాష్ట్ర వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు లేఖ రాసినప్పటికీ ఇప్పటి వరకు స్పందన లేకపోవడం విచారకరమన్నారు. తెలంగాణలో ఆయుర్వేద విద్యా, వైద్య సేవలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ఇనిస్టిట్యూట్ ఏర్పాటును కేంద్రం పరిగణనలోకి తీసుకుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్న ప్రచారం అసత్యమని ఖండించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందని గుర్తుచేశారు. -
● ధాన్యం కేటాయింపులో నిబంధనలు కఠినతరం ● బకాయి చెల్లింపునకు నవంబర్ 12గడువు
కరీంనగర్ అర్బన్: మొండి మిల్లర్లను నియంత్రించేందుకు ప్రభుత్వం పక్కా చర్యలు చేపడుతోంది. నిబంధనల ప్రకారం వ్యవహరించేవారికే సీఎమ్మార్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ఇవ్వాలని నిర్ణయించగా అధికార యంత్రాంగానికి తదనుగుణ ఆదేశాలు జా రీ చేసింది. వానాకాలం సీజన్కు సంబంధించి కొనే ధాన్యాన్ని బ్యాంకు గ్యారంటీలు ఇచ్చిన మిల్లర్లకే కస్టమ్స్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) కింద కేటాయించనుండగా ఈ మేరకు కఠిన నిబంధనలు రూపొందించారు. కొందరు 2024– 25 యాసంగి సీజన్ నుంచి అధికారులు బ్యాంకు గ్యారంటీ తీసుకుంటున్నారు. మిల్లర్లు మాత్రం గ్యారంటీలు ఇవ్వలేదు. ప్రస్తుత వానాకాలం సీజన్లో మిల్లర్లు అధికారులతో ఒప్పందం చేసుకొని బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే ధాన్యం కేటాయించాలని ఉన్నతస్థాయిలో నిర్ణయించారు. ఇక ఇవి పక్కా మిల్లర్లకు కేటాయించిన ధాన్యాన్ని గోదాముల్లో మాత్రమే నిల్వ చేయాలి. ఆరుబయట ఉంచరాదు. గోదాముల్లో మాత్రమే ధాన్యం నిల్వ చేసినట్లు ధ్రువీకరణ పొందాలి. వానాకాలం సీజన్ ధాన్యాన్ని పొందేందుకు మిల్లర్లు పౌరసరఫరాలశాఖతో ఒప్పందం చేసుకోవాలి. గతంలో కేటాయించిన ధాన్యానికి సంబంధించి సీఎమ్మార్ సవ్యంగానే ఇచ్చినట్లు ధ్రువీకరణ ఉండాలి. తుది గడువు నవంబరు 12 2024–25 యాసంగి సీజన్లో జిల్లాలోని మిల్లులకు పౌరసరఫరాలశాఖ 2,71,665 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీఎమ్మార్ కింద తరలించింది. మిల్లర్లు ఇప్పటివరకు 1.62లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సరిపడా బియ్యాన్ని అందించారు. మిగిలిన లక్ష మెట్రిక్ టన్నుల సరిపడా బియ్యం ఇవ్వాల్సి ఉంది. వచ్చే నవంబరు 12లోగా అందించాలని ఇప్పటికే గడువు విధించింది. కాగా బకాయిల్లేని మిల్లులకే సీఎమ్మార్ కింద ధాన్యం కేటాయిస్తామని, నిర్ణీత గడువులోగా మిగిలిన బియ్యం ఇవ్వాలని మిల్లర్లకు స్పష్టం చేశామని పౌరసరఫరాలశాఖ అధికారులు వివరించారు. -
కబ్జాలపై కదలికేది!
కబ్జా చెర వీడేనా కరీంనగర్ కార్పొరేషన్: ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండే మైదానాలను పార్క్లుగా మార్చి గొప్పలు చెప్పుకొనే అధికారులు, ఉన్న పార్క్లు కనుమరుగువుతున్నా పట్టించుకోవడం లేదు. రక్షించాల్సిన బల్దియా అధికారుల నిర్లక్ష్యం.. రోజురోజుకు పెరుగుతున్న కబ్జాలు.. వెరసి నగరంలో పార్క్లు క్రమేపీ కనుమరుగవుతున్నాయి. దశాబ్దాల క్రితం నగరంలోని ప్రతి కాలనీలో చిన్నదో, పెద్దదో పార్క్ ఉండేది. కాలం గడిచే కొద్దీ నిర్వహణ లేకపోవడంతో పార్క్ల ఆనవాళ్లు కనిపించకుండా పోయాయి. ఇదే అదనుగా కొంతమంది ఆ పార్క్ స్థలాలను పూర్తిగా ఆక్రమించారు. ఆ స్థలాలు చేతులు మారి కోట్ల రూపాయల దందాకు కారణమవగా, ప్రస్తుతం అక్కడ ఎత్తైన భవనాలు తప్ప పార్క్ల ఉనికి కూడా లేదు. మంకమ్మతోట, రాంనగర్, భగత్నగర్, ముకరాంపుర తదితర ప్రాంతాల్లో పార్క్ స్థలాలు ఏళ్లకాలంగా కబ్జాలకు గురవుతూనే ఉన్నాయి. మార్కండేయకాలనీలో పార్క్ స్థలాన్ని ఆక్రమించి ఇండ్ల నిర్మాణం చేపట్టినా ఇప్పటివరకు చర్యలు శూన్యం. అంతులేని నిర్లక్ష్యం నగరంలోని పార్క్లను కాపాడాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. స్మార్ట్సిటీలో భాగంగా జ్యోతి బాపూలే మైదానం, మల్టీపర్పస్ స్కూల్ మైదానాలను రూ.కోట్లు వెచ్చించి పార్క్లుగా మార్చి, ఆదాయాన్ని పెంచుకొనేందుకు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించారు. వీటిపై ఉన్న శ్రద్ధలో కనీసం ఒక్కశాతం కాలనీల్లో ఉన్న పార్క్లపై చూపించడం లేదు. ఫలితంగా ఆ పార్క్ స్థలాలు యథేచ్ఛగా అన్యాక్రాంతమవుతున్నాయి. ఇందుకు కొంతమంది అధికారులు, రాజకీయ పెద్దలు కూడా సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో పార్క్ స్థలాల్లో వివిధ అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేసిన బల్దియానే, ఆ తరువాత అ స్థలాలు కబ్జాకు గురవుతుంటే అవి తమవి కావని చేతులు దులుపుకోవడం ఇక్కడ ఆశ్చర్యకరం. ఇంతకూ పార్క్లెన్ని నగరంలో ఎన్ని పార్క్లున్నాయో కూడా అధికారుల వద్ద సరైన లెక్కలు లేవంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ఊహించడం కష్టం కాదు. పార్క్ల సంఖ్య కావాలంటే ఒక్కోసారి ఒక్కో రకంగా లెక్క చెబుతుండడమే ఇందుకు కారణం. గతంలో నగరంలో (విలీన గ్రామాలను మినహాయించి) మొత్తం 120 పార్క్లు ఉన్నట్లు అధికారులే వెల్లడించారు. ఆ తరువాత ఆ సంఖ్య 58కి, 44కు చేరగా, ప్రస్తుతం 38 పార్క్లు ఉన్నట్లు చెబుతున్నారు. అవి కూడా ఎక్కడున్నాయో పట్టణ ప్రణాళిక అధికారులకు తెలియకపోవడం గమనార్హం.నగరంలోని పార్క్లను కాపాడేందుకు హైడ్రా తరహాలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ నగరవాసుల నుంచి బలంగా వినిపిస్తోంది. స్పెషల్ డ్రైవ్తోనే పార్క్లను కబ్జా కోరల నుంచి కాపాడే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం కలెక్టర్ నేతృత్వంలో నగరపాలకసంస్థలో ప్రత్యేక అధికారి పాలన నడుస్తోంది. ఇప్పుడైతేనే ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా ఉన్న పార్క్లను కాపాడడం, కబ్జాకు గురైన పార్క్లను పునరుద్ధరించడం లాంటి చర్యలు సాఫీగా సాగే అవకాశం ఉంది. కోట్లాది రూపాయల పార్క్ స్థలాలను కాపాడడంతో పాటు, కాంక్రీట్ జంగల్గా మారుతున్న నగరంలో పార్క్ల పునరుద్ధరణ అత్యవసరం. ఉన్నతాధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టాల్సి ఉంది.నగరంలోని ముకరంపుర పరిధిలో ఉన్న సాయికృష్ణ థియేటర్ సమీపంలోని పార్క్ స్థలం ఇది. సర్వే నంబర్ 1104/డీ,1093లో దాదాపు 8 గుంటల్లో విస్తరించి ఉంది. ప్రస్తుత మార్కెట్ విలువ కనీసం సుమారు రూ.4 కోట్లు. అత్యంత విలువైన ఈ స్థలంపై ఇటీవల కొంతమంది కబ్జాదారుల కన్ను పడింది. ఏవో పత్రాలు సష్టించి, ఆ స్థలంలో ఇప్పటికే షెడ్ నిర్మాణం చేపట్టారు. అయినప్పటికీ నగరపాలకసంస్థ అధికారుల్లో చలనం లేదు. ఇదే అదనుగా ఆ పార్క్స్థలం క్రమేపీ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్తోంది. -
చికిత్స పొందుతూ కార్మికుడు మృతి
ఎలిగేడు: లలితపల్లె గ్రామంలో ఓ ఇంటి నిర్మాణం పనులు చేస్తుండగా జాండ్రపేల్లి యోహన్ జార్జ్(43) అనే భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు మరణించాడని ఎస్సై మధుకర్ తెలి పారు. ప్రకాశం జిల్లాలోని సింగరపల్లె గ్రామానికి చెందినవాడిగా గుర్తించామన్నారు. ఆయన కథనం ప్రకారం.. పది సంవత్సరాలుగా ఎలిగేడు గ్రామ ంలో ఉంటూ దేవండ్ల శివ మేస్త్రి వద్ద సుతారి పని చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. రో జూలాగే ఈనెల 9న సుతారి పని చేసుకునేందుకు యోహన్ జార్జ్ ఉదయం ఇంటి నుంచి వెళ్లాడు. సాయంత్రం 5 గంటల సమయంలో ఫస్ట్ ఫ్లోర్లో సుతారి పని చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు పరంచ మీద నుంచి కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మరణించా డు. పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి కూతురు సంపూర్ణ ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కొత్తపల్లి(కరీంనగర్): బావుపేటలోని లక్ష్మీనరసింహా ఎక్స్పర్ట్ గ్రానైట్ ఫ్యాక్టరీలో ఆదివారం రాజస్థాన్కు చెందిన కూలీ మృతిచెందినట్లు ఇన్స్పెక్టర్ బిల్ల కోటేశ్వర్ తెలిపారు. సీఐ వివరాల ప్రకారం.. గ్రానైట్ కటింగ్ ఫ్యాక్టరీలో జోట్ గ్రామం కోకర్ తాలూకాకు చెందిన కూలీ సౌరబ్(20) బండ కటింగ్ చేసే సమయంలో బండ కింద సపోర్ట్ పెడుతున్నాడు. ట్రాలీపై నుంచి బండ ఒరిగి క్రేన్కు ఒత్తుకోగా.. మధ్యలో ఇరుక్కున్న సౌరబ్ను వెంటనే తీసి కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. మృతుడి సోదరుడు ముఖేశ్ సౌడ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. మల్యాల: పిల్లలు పుట్టడం లేదని ఓ వ్యక్తి మద్యానికి బానిసై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై నరేశ్కుమార్ కథనం ప్రకారం.. మద్దుట్ల గ్రామానికి చెందిన ఉప్పు శంకర్(43) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. వివాహమై ఆరేళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టడం లేదనే బాధతో మద్యానికి బానిసయ్యాడు. తన ఇంట్లోనే ఉరేసుకున్నాడు. మృతుడి భార్య శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. వేములవాడరూరల్: మల్లారం 132కేవీ సబ్ స్టేషన్ ప్రమాదవశాత్తు ఆదివారం పేలింది. భారీ శబ్దాలు రావడంతోపాటు గృహాలు బీటలు పడుతున్నాయని రాజనగర్ కాలనీవాసులు వాపోతున్నారు. గతంలో కూడా ఇలా జరిగినపుడు ఇంటి కప్పులు, గోడలు పగుళ్లు బారాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి గృహాల సమీపంలో ఉన్న ఈ సబ్ స్టేషన్కు వేరే ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు. -
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో తాళం వేసిన ఇంట్లో ఆదివారం చోరీ జరిగింది. బాధితుడు బాకం రామ్మూర్తి వివరాల ప్రకారం.. దసరా పండుగకు కల్వచర్ల గ్రామానికి వచ్చి పండుగ అనంతరం ఇంటికి తాళం వేసి తన తల్లిదండ్రులను తీసుకొని ఈనెల 7న పెద్దపల్లికి వెళ్లాడు. ఆదివారం ఉదయం తన తండ్రి రాజయ్య కల్వచర్లలోని తన ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా.. గుర్తుతెలియని వ్యక్తులు బీరువా పగలగొట్టి అందులో ఉన్న 4 తులాల బంగారు ఆభరణాలు, సుమారు రూ.96వేల విలువైనవి ఎత్తుకెళ్లారు. రామ్మూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టి.శ్రీనివాస్ తెలిపారు. మహిళ మెడలోంచి గొలుసు అపహరణకథలాపూర్: తక్కళపెల్లి శివారులో సినీ ఫక్కీ తరహాలో ఆదివారం చోరీ జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన నాగెల్లి గంగు–బుచ్చయ్య దంపతులు బొమ్మెన గ్రామంలోని ఓ ఫంక్షన్కు వెళ్లారు. తిరిగి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్నారు. ఈక్రమంలో తక్కళపెల్లి శివారులోని వరద కాల్వ వద్దకు చేరుకోగానే వెనక నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తులు గంగు మెడలోని 2 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్కుమార్ తెలిపారు. -
ధర్మమార్గం అలవర్చుకుంటే సుఖశాంతులు
ధర్మపురి: ధర్మమార్గం అలవర్చుకుంటే భక్తులు సుఖశాంతులతో వర్థిల్లుతారని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ సౌజన్యంతో జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలోని బ్రాహ్మణ సంఘం పక్కనున్న శ్రీమఠం స్థలంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం ఆదివారం సాయంత్రం ముగిసింది. అనంతరం శ్రీలక్ష్మినృసింహస్వామి దేవస్థానంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అడ్లూరి లక్ష్మణ్కుమార్ చాగంటి దంపతులకు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. ఘనంగా సన్మానించారు. ధర్మపురి లక్ష్మినృసింహస్వామిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. దేవస్థానం అభివృద్ధికి అడ్లూరి లక్ష్మణ్కుమార్ కృషి చేస్తున్నారని కీర్తించారు. మంత్రుల హాజరు ఈ కార్యక్రమానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్కుమార్, మాజీ మంత్రి జీవన్రెడ్డి, కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు హాజరయ్యారు. దేవస్థానం ఈవో శ్రీనివాస్, ట్రస్ట్ బోర్డు చైర్మన్ జక్కు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. నృసింహుడి సన్నిధిలో ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు -
దసరా సంబరం మరవకముందే..
ధర్మపురి: దసరా పండుగ కోసం యువ వైద్యుడు ధర్మపురికి వచ్చి తల్లిదండ్రులతో ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నాడు. దసరా ఆనందం మరవకముందే హైదరాబాద్లో రోడ్డు ప్రమాదానికి గురై దుర్మరణం చెందడం ధర్మపురిలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాలు.. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన కస్తూరి రాంకిషన్ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కస్తూరి జగదీశ్(32) అమెరికాలో విద్యాభ్యాసం చేసి హైదరాబాద్లోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో పిల్లల వైద్య నిపుణుడిగా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి అత్యవసర పనులపై ద్విచక్ర వాహనంపై బయటకెళ్లాడు. ఫ్లయోవర్ వద్ద వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో జగదీశ్కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వెనక కూర్చున్న మరో స్నేహితుడికి తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం ధర్మపురికి తీసుకొచ్చారు. చితికి నిప్పు పెట్టిన తండ్రి వృద్ధాప్యంలో తల్లిదండ్రుల ఆలనాపాలనా చూడాల్సిన కొడుకును రోడ్డు ప్రమాదం కబళించుకుపోయింది. తల్లిదండ్రులకు తలకొరివి పెట్టాల్సిన కొడుకుకు తండ్రే తలకొరివి పెట్టడం అందరినీ కలచివేసింది. గుమ్లాపూర్ వాసి..కోరుట్ల రూరల్: మోహన్రావుపేట గ్రామ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుమ్లాపూర్ గ్రామానికి చెందిన ఇల్లెందుల శ్రీనివాస్(49) అనే వ్యక్తి మృతిచెందాడు. శ్రీనివాస్ తన బంధువు సాయికృష్ణతో కలిసి మేడిపెల్లి వైపు నుంచి గుమ్లాపూర్ వస్తుండగా.. మోహన్రావుపేట శివారులో జాతీయ రహదారిపై కారు ఢీకొట్టగా శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడ్డ సాయికృష్ణను మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు స్వల్పంగా గాయాలయ్యాయి. శ్రీనివాస్కు ఇద్దరు కుమారులు, ఓ కూతురున్నారు. శ్రీనివాస్ భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పై చిరంజీవి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ప్రముఖ యువ వైద్యుడు దుర్మరణం -
పోలీసుల అదుపులో సైబర్ నేరస్తుడు
సిరిసిల్లక్రైం: సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర నేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సిరి సిల్లలో శనివారం విలేకరుల సమావేశంలో డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి వివరాలు వెల్లడించారు. హైదరా బాద్కు చెందిన మహమ్మద్ కలీంపాషా తనకు పరిచయం ఉన్న హైదరాబాద్కు చెందిన రషీద్తో కలిసి ఈజీ మనీకి అలవాటు పడ్డారు. ప్రజలను ఆన్లైన్లో మోసం చేసి సులభంగా డబ్బులు సంపాదించవచ్చని ప్రణాళిక వేశారు. కోల్కతలో రషీద్కు పరిచయం ఉన్న అంకిత్ వద్దకు గత ఫిబ్రవరిలో వెళ్లారు. ఆర్బీఎల్ క్రెడిట్కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు పంపేందుకు అంకిత్తో ఒప్పందం చేసుకున్నారు. ఇలా క్రెడిట్కార్డు దరఖాస్తుదారులతో కస్టమర్కేర్ అంటూ మాట్లాడి ఏపీకే లింక్స్ పంపి మోసాలకు పాల్పడేవారు. ఏపీకే లింక్స్ ఓపెన్ చేసిన వారి ఫోన్లను హ్యాక్ చేసి వారి కార్డుల ద్వారా ఈకామర్స్లో కొనుగోళ్లు చేసి డబ్బులు కాజేసేవారు. ఇలా కలీం, రషీద్లకు అంకిత్ ప్రతీ రూ.లక్షకు రూ.2500 చొప్పున గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా డబ్బులను పంపేవాడు. ఇలా ప్రతీ పది రోజులకోసారి గుర్తుతెలియని వ్యక్తుల ద్వారా ర్యాపిడో కొరియర్లో కొత్త సిమ్కార్డులు, ఫోన్లు పంపుతూ పాతవాటిని తీసుకెళ్లేవారు. అంతర్ రాష్ట్ర సైబర్ నేరస్తుడిని పట్టుకోవడంలో కృషిచేసిన పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. క్రెడిట్కార్డ్ యాక్టివేషన్ పేరుతో మోసాలు -
లారీ ఢీకొని వృద్ధురాలి మృతి
పెద్దపల్లిరూరల్: పట్టణంలోని కూనారం క్రాస్ రోడ్డు వద్ద శనివారం లారీ ఢీకొట్టడంతో గుర్తుతెలియని వృద్ధురాలి మృతి చెందింది. తీవ్రగాయాలైన వృద్ధురాలిని వెంటనే 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించినట్టు ఎస్సై లక్ష్మణ్రావు తెలిపారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించిందని వివరించారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. తంగళ్లపల్లి(సిరిసిల్ల): మానేరువాగులో వ్యక్తి గల్లంతై మృతిచెందిన ఘటన మండలంలోని కస్బెకట్కూరులో శనివారం విషాదం నింపింది. స్థానికులు తెలిపిన వివరాలు. కస్భెకట్కూరుకు చెందిన లాల రాజు(45) సిరిసిల్లలో ఉంటూ కూలి పని చేసుకునేవాడు. సెలవుల కోసం సొంతూరికి వచ్చి మానేరువాగు చెక్డ్యాం వరద నీటిలో ఈత కొట్టడానికి ప్రయత్నించాడు. నీటిలో ఉన్న బుడుగులో ఇరుక్కుపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా అక్కడకు చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది 4 గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య రజిత(40), కుమారులు వేణు(19), విష్ణు(13) ఉన్నారు. మల్యాల: మల్యాల మండలం బల్వంతాపూర్కు చెందిన తైదల సునీల్(23) తన పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై నరేశ్కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సునీల్ డీజే ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం పొలం వద్దకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తండ్రి లక్ష్మీరాజం మరో వ్యక్తితో కలిసి పొలం వద్దకు వెళ్లి చూడగా చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. సునీల్ మొబైల్ను పరిశీలించగా ఓ మహిళ ఫోన్ నంబర్ నుంచి పలుమార్లు కాల్స్ వచ్చినట్లు గుర్తించాడు. తన కుమారుడి చావుకు సదరు మహిళే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్ తుమ్మల రమేశ్(48) ప్రమాదవశాత్తు నీటమునిగి మృతిచెందాడు. స్థానిక వెంకటాద్రి చెరువులోని తాగునీటి బావిలో మోటార్ మరమ్మతు కోసం తెప్పపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. కరెంట్ షాక్ ఏమైనా తగిలి ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్కు చెందిన ఓ యువకుడు జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన తుమ్మ అజయ్కుమార్(34)కు భార్యతో విడాకులు కావడంతో మద్యానికి అలవాటుపడ్డాడు. జీవితంపై విరక్తి చెందిన అజయ్కుమార్ శుక్రవారం రాత్రి డోర్కర్టెన్తో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి వైకుంఠం ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
రియల్టర్ హత్య కేసులో మరొకరి అరెస్ట్
వేములవాడ: సిరిసిల్లకు చెందిన రియల్టర్ సిరిగిరి రమేశ్ హత్య కేసులో చిర్రం రవిని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. వేములవాడటౌన్ పోలీస్స్టేషన్లో శనివారం విలేకరుల సమావేశంలో ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి వివరాలు వెల్లడించారు. చందుర్తిలోని భూమిని ఎస్సీ కార్పొరేషన్ లోన్పై పెట్రోల్బంక్ కోసం చిర్రం రవి, సిరిగిరి రమేశ్కు రిజిస్ట్రేషన్ చేశారు. అయితే పెట్రోల్బంక్ ఇవ్వకుండా, భూమి ని తిరిగి రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. అంతేకాకుండా ఆ భూమి తనదేనంటూ విక్రయించేందుకు రమేశ్ ప్రయత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న చిర్రం రవి భూమి దక్కాలంటే సిరిగిరి రమేశ్ను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలోనే ఎద్దండి వెంకటేశ్, వంశీలతో కలిసి ప్రణాళిక వేసుకున్నారు. గత నెల 19వ తేదీ రాత్రి 8 గంటలకు సిరిసిల్ల ప్రాంతంలోని పెద్దూరు సబ్స్టేషన్ సమీపంలో కారులో నిద్రిస్తున్న సిరిగిరి రమేశ్ను కదలకుండా అలా వంశీ పట్టుకోగా, చిర్రం రవి వెనుక సీట్లో నుంచి కదలకుండా బలంగా పట్టుకున్నాడు. డ్రైవర్ సీట్లో కూర్చున్న ఎద్దండి వెంకటేశ్ కత్తితో రమేశ్ గొంతులో, చాతిపై పొడిచి హత్య చేశారు. ఈ కేసులో నిందితులైన ఎద్దండి వెంకటేశ్, అలా వంశీలను ఇప్పటికే రిమాండ్కు తరలించారు. నేరస్తులను పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్సై రాంమోహన్, సిబ్బంది తిరుపతి, సమీయుద్దీన్, రాజకుమార్, పాషా, గోపాల్కు రివార్డు అందించి అభినందించారు. -
అల్ఫోర్స్ ఈ–టెక్నో స్కూల్లో వరల్డ్ ఎక్స్పో 2025
కొత్తపల్లి: కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈటెక్నో స్కూ ల్లో ఏర్పాటు చేసిన వరల్డ్ ఎక్స్పో 2025ను శనివారం ఆ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులకు ప్రపంచంలోని దేశాల్లో అమలుపరుస్తున్న వివిధ విద్యా విధానాలు, రాజకీయ పద్ధతులు, బోధనా పద్ధతులు, ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు, ఆహారపు అలవాట్లు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అంశాల గురించి వర్ణించే ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థుల్లో సామాజిక అవగాహన పెంపొందించేందుకు, వివిధ పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు ఈ ప్రదర్శన దోహదపడుతుందన్నారు. పాఠ్యాంశ ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనల ద్వారా విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
మెటాఫండ్ ప్రో నిర్వాహకులపై కేసు నమోదు
జగిత్యాలక్రైం: జగిత్యాలకు చెందిన ఓ వ్యక్తిని మెటాఫండ్ ప్రో యాప్లో పెట్టుబడి పెడితే మూడింతల లాభం వస్తుందని నమ్మించి మోసం చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై రవికిరణ్ తెలిపారు. బాధితుడికి జగిత్యాలకు చెందిన కస్తూరి రాకేశ్ 2024లో పరిచయమయ్యాడు. రాకేశ్తో పాటు హైదరాబాద్కు చెందిన వారాల లోకేశ్ కలిసి క్రిప్టోలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. దశలవారీగా రూ.80.50 లక్షలు పెట్టుబడి పెట్టించారు. యాప్ మూతపడటంతో బాధితుడు రాకేశ్, లోకేశ్ను డబ్బులు చెల్లించాలని కోరగా దాటవేస్తూ వచ్చారు. ఇటీవల గట్టిగా నిలదీయడంతో రాకేశ్, లోకేశ్ బాధితుడినే చంపుతామంటూ బెదిరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రాకేశ్, లోకేశ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలుమేడిపల్లి: భీమారం మండలం గోవిందారం–మోత్కురావుపేట గ్రామాల మధ్య శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు కథనం ప్రకారం.. దేశాయిపేటకు చెందిన దొంతి మధు తన ద్విచక్ర వాహనంపై మోత్కురావుపేట వెళ్తున్నాడు. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి కిందపడ్డాడు. తల, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. మేడిపల్లి ఎస్త్సె శ్రీధర్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించి మూలమలుపు వద్ద ప్రమాదకరంగా ఉన్న చెట్లను స్థానిక పంచాయతీ కార్యదర్శి సహాయంతో తొలగించారు. -
ఈదుకుంటుపోయి..ఇన్సూలెటర్ అమర్చి..
జగిత్యాలరూరల్: రైతులకు విద్యుత్ సరఫరా అందించేందుకు ఆ శాఖ అధికారులు ఈదుకుంటూ వెళ్లి చెరువు మధ్యలో ఉన్న స్తంభానికి ఉన్న ఇన్సూలేటర్ మరమ్మతు చేసిన ఘటన జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో చోటుచేసుకుంది. గ్రామంలోని కుంట చెరువులో ఉన్న విద్యుత్ స్తంభం ఇన్సూలేటర్ చెడిపోయింది. దీంతో రైతులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రైతులు విద్యుత్ లైన్మెన్ రాజలింగం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన శనివారం అసిస్టెంట్ లైన్మన్ నారాయణ, విలేజ్ హెల్పర్ మునికి సూచించారు. నారాయణ, ముని చెరువులో ఈదుకుంటూ వెళ్లి ఇన్సూలేటర్ మరమ్మతు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. చెరువులో ఈదుకుంటూ ఇన్సూలేటర్ మరమ్మతు -
పేగు తెంచి.. కిడ్నీ పంచినా..
చొప్పదండి: పేగు తెంచిన బంధం కన్న బిడ్డకు కిడ్నీ దానం చేసినా ఫలితం దక్కలేదు. మూడు పదుల వయస్సు కూడా నిండని బిడ్డకు కొత్త జీవితం ప్రసాదించానని సంతోషించిన మాతృమూర్తికి ఆ ఆనందం ఎక్కువ సేపు నిలువలేదు. మండలంలోని గుమ్లాపూర్కు చెందిన పెరుమాండ్ల అంజయ్య, శా రద దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు మనోజ్గౌడ్ (27) జీవనోపాధికి దుబాబ్ వెళ్లి వచ్చాడు. రెండేళ్ల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తే కిడ్నీ సమస్య ఉందని వైద్యులు చెప్పారు. కిడ్నీ మార్పిడి చేయాలని సూచించడంతో తల్లి శారద తన కిడ్నీని కుమారుడికి మార్పిడి చేసింది. తర్వాత మనోజ్ ఆరోగ్యంగా ఉండడంతో మోతె గ్రామానికి చెందిన వసంతతో వివాహం జరిపించారు. ఆనందంగా సా గుతున్న జీవితం మరో మలుపు తిరిగింది. శుక్రవారం మళ్లీ అనారోగ్య సమస్య రావడంతో మనో జ్ను హైదరాబాద్ తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. కుమారుడి కోసం కిడ్నీ మార్పిడి చేసినా ఆ ఆనందం ఎంతో కాలం నిలవక పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. తల్లి కిడ్నీ దానం చేసినా దక్కని ఫలితం అనారోగ్యంతో యువకుడి మృతి -
వెంటపడి వేధించాడు..
రామగిరి(మంథని): సెంటినరీకాలనీలో శుక్రవారం జరిగిన హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసి రి మాండ్కు తరలించినట్లు గోదావరిఖని ఏసీపీ రమే శ్ శనివారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. న్యూమారేడ్పాకకు చెందిన కోట చిరంజీవి పోతన కాలనీలో మీసేవ కేంద్రం నిర్వహిస్తున్నాడు. 2019 లో భార్య మృతి చెందడంతో ఒంటరిగా ఉంటున్నా డు. కమాన్పూర్ మండలం పేంచికల్పేటకు చెంది న పోలవేన సంధ్యారాణి పనిమీద మీసేవ సెంటర్ లో చిరంజీవిని కలిసింది. ఆ తర్వాత ఆమెకు ఫోన్ కాల్స్ చేస్తూ, మేసేజీ పంపించడం ప్రారంభించా డు. ‘నువ్వంటే నాకిష్టమని, నీతోనే ఉంటానని, ఒ ప్పుకోపోతే చంపుతా’నని బెదిరించాడు. భయపడి న ఆమె చిరంజీవితో మాట్లాడుతూ ఉండేది. కొంత కాలం తర్వాత మాటలు బంద్చేసి చిరంజీవిని దూ రం పెట్టింది. ఆగ్రహించిన చిరంజీవి.. తనతో మా ట్లాడకుంటే ఆమెను, భర్తను, తల్లిదండ్రులను చంపుతానని బెదిరించాడు. భరించలేక రెండు నెలల క్రితం భర్త కుమార్కు విషయం చెప్పింది. ఆమె భ ర్తను కూడా చంపుతానని, పరువు తీస్తానని బెదిరించాడు. దీంతో నెలక్రితం పంచాయితీ జరిగింది. అ యినా చిరంజీవిలో మార్పురాలేదు. శుక్రవారం సెంటినరికాలనీలో సంధ్యారాణి పనిచేసే కార్యాలయానికి వెళ్లి గొడవపడ్డాడు. దీంతో ఆమె తన భర్త పోలవేన కుమార్, అన్నయ్య అనవేన నరేశ్కు ఫోన్ విషయం చెప్పింది. దీంతో భర్త, అన్నయ్య, తండ్రి అనవేన మల్లయ్య, బావమరిది పిడుగు చందు ఘ టనా స్థలానికి చేరుకున్నారు. చిరంజీవితో గొడవప డి చేతులతో కొట్టారు. మల్లయ్య వెంట తీసుకొచ్చి న ఇనుపరాడు, చాకుతో తీవ్రంగా గాయపర్చడంతోపాటు తలపై రాడ్తో కొట్టడంతో చిరంజీవి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించాడు. శనివారం ఉదయం పెంచికల్పేట ఎక్స్రోడ్డు వద్ద నిందితులు సంధ్యారాణి, కుమార్, నరేశ్, మల్లయ్య, చందును అదుపులోకి తీసుకున్నారు. మూడు బైక్లు, హత్య కు ఉపయోగించిన ఇనుపరాడ్, చాక్ స్వాధీనం చేసుకున్నారు. 24 గంటల్లో హత్య కేసును ఛేదించిన మంథని, గోదావరిఖని సీఐలు రాజు, ప్రసాద్రావు, ఎస్సైలు శ్రీనివాస్, పురుషోత్తం దివ్య, ప్రసాద్, రవి కుమార్ను ఏసీపీ అభినందించారు. మాట్లాడకుంటే అందరినీ చంపుతానని బెదిరించాడు భరించలేకనే మీసేవ నిర్వాహకుడి హత్య హత్య ఘటన వివరాలు వెల్లడించిన గోదావరిఖని ఏసీపీ రమేశ్ -
40 సార్లు పోటీల్లో పాల్గొన్న
● కోలిండియా స్థాయి పోటీల్లో 40సార్లకుపైగా పాల్గొన్న. ఆలిండియా పబ్లిక్ సెక్టార్ క్రికెట్ పోటీల్లో రెండుసార్లు ఆడిన. కబడ్డీ క్రికెట్, షెటిల్, అథ్లెటిక్ పోటీల్లో సత్తాచాటి సింగరేణి కీర్తిపతాకాన్ని కోలిండియాస్థాయిలో ఎగురవేశా. కబడ్డీలో రెండు గోల్డ్, రెండు సిల్వర్, ఐదు రజత సతకాలు సాధించా. క్రికెట్లో ఒకగోల్డ్ మెడల్ సాధించా. యువ క్రీడాకారులను పోత్సహించాలి. – కై లాసకోటి శ్రీనివాస్, ఈపీ ఆపరేటర్, జీడీకే–5 ఓసీపీ -
గనుల్లో పనులు.. ఆటల్లో ఘనులు!
● పరుగెడితే పతకమే.. ● ఆటాడితే విజయమే ● గురితప్పని నల్లసూరీళ్లు ● క్రీడల్లో రాణిస్తున్న సింగరేణి కార్మికులు కోలిండియా కబడ్డీ పోటీల్లో క్రీడాకారులు గోదావరిఖని: గురిపెడితే పతకాల పంటే.. సింగరే ణి బొగ్గు గనుల్లో పనిచేస్తూ కోలిండియా స్థాయి పో టీల్లో సత్తా చాటుతున్నారు కార్మికులు, ఉద్యోగులు. సింగరేణి కీర్తిపతాకాన్ని ఆకాశానికి ఎగురవేస్తున్నా రు. కోలిండియాస్థాయి క్రికెట్, ఫుట్బాల్, హాకీ, క బడ్డీ, క్యారెమ్స్, అథ్లెటిక్స్, బాడ్మింటన్, టేబుల్ టె న్నిస్, బ్రిడ్జి, లాన్ టెన్నిస్, చెస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్, కల్చరల్ విభాగాల్లో ఏటా కోలిండియాస్థాయిలో పోటీలు ని ర్వహిస్తున్నారు. తొలుత డిపార్ట్మెంట్, రీజియన్స్థా యిలో సత్తాచాటిన ఉద్యోగులను కోలిండియా స్థా యికి ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. దీంతో క్రీడాకారులు పోటీల్లో సత్తా చాటుతున్నారు. దేశవ్యాప్తంగా 10 బొగ్గు సంస్థలు.. కోలిండియా స్థాయి పోటీల షెడ్యూల్కు అనుగుణంగా డిపార్ట్మెంట్, రీజియన్, సింగరేణిస్థాయి పోటీలను ఏటా నిర్వహిస్తోంది. సింగరేణితో పాటు వెస్ట్రకోల్ఫీల్డ్స్, నార్తన్ కోల్ఫీల్డ్స్, సెంట్రల్ కోల్ఫీల్త్స్, ఈస్ట్రన్ కోల్ఫీల్డ్స్, మహానది కోల్డ్ఫీల్డ్స్, కుకింగ్ కోల్ లిమిటెడ్, కోలిండియా లిమిటెడ్, భారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్, నార్త్ఈస్ట్రన్ కోల్ఫీల్డ్స్, సీఎంపీడీ ఐ సంస్థలకు చెందిన క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారు. ఇందులో సింగరేణి క్రీడాకారులే అత్యధిక పతకాలు సాధిస్తూ అగ్రస్థానంలో నిలుస్తున్నారు. -
బాలాలయంలోకి రాజన్న
వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా భీమన్నగుడిలో భక్తులకు దర్శనాలు కొనసాగించేందుకు ఉత్సవమూర్తులను శనివారం తీసుకొచ్చారు. ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్, ఈవో రమాదేవి, రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఆలయంలో కోడెలను తిప్పి పూజలు చేసి కోడెమొక్కులు ప్రారంభించారు. భీమన్నగుడిలోని మండపంలో ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించారు. అన్నదాన సత్రం పై అంతస్తులో నిత్యకల్యాణాలు, సత్యనారాయణ వ్రతాల మొక్కులను ప్రారంభించారు. ఆర్డీవో రాధాభాయి, తహసీల్దార్ విజయ్రపకాశ్రావు, ఈఈ రాజేశ్, డీఈ రఘునందన్, ఏఈవోలు శ్రవణ్, శ్రీనివాస్, జయకుమారి, స్థానాచార్యులు ఉమేశ్శర్మ, అర్చకులు చంద్రగిరి శరత్శర్మ, సురేశ్, రాజేశ్వరశర్మ పాల్గొన్నారు. టెంపుల్ సిటీగా వేములవాడ – ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ వేములవాడ రాజన్న ఆలయంతోపాటు పట్టణాభివృద్ధిని సమాంతరంగా చేపడుతూ వేములవాడను టెంపుల్సిటీగా మార్చుతామని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. బాలాలయం భీమన్నగుడిలో శనివారం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆలయ అభివృద్ధిలో అందరి సహకారం తీసుకుంటామన్నారు. ఈనెల 19, 20న శృంగేరి పీఠాధిపతులు విధుశేఖర స్వామీజీ వేములవాడ వస్తున్నట్లు చెప్పారు. భీమన్న గుడిలో దర్శనాలు రాజన్న ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా బాలాలయంలోకి ఉత్సవమూర్తులు తరలించినప్పటికీ అటు రాజన్నగుడిలో నిత్యకైంకర్యాలు భీమన్నగుడిలో దర్శనాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. భీమన్న గుడిలో ప్రతిష్ఠ, కోడెమొక్కులు షురూ 19న శృంగేరి పీఠాధిపతి రాక


