తనిఖీలు చేస్తున్నా.. మారని తీరు | - | Sakshi
Sakshi News home page

తనిఖీలు చేస్తున్నా.. మారని తీరు

Apr 11 2025 1:04 AM | Updated on Apr 11 2025 1:04 AM

తనిఖీలు చేస్తున్నా.. మారని తీరు

తనిఖీలు చేస్తున్నా.. మారని తీరు

కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరంలోని కొన్ని హోటళ్లు, బేకరీలు, స్వీట్‌హౌస్‌లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల నిర్వాహకులు నాణ్యతను గాలికి వదిలేస్తున్నారు. బల్దియా అధికారులు ఆకస్మికంగా చేపట్టే తనిఖీల్లో విస్తుపోయే బాగోతాలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల ఓ బేకరీలో నాణ్యతలేని ఆహార పదార్థాలు, గడువు పూర్తయిన రసాయనాలు, ముడిసరుకులతో తయారు చేసిన తినుబండరాలను విక్రయిస్తున్నట్లు బహిర్గతమయ్యింది. దీంతో ఆ వ్యాపారికి రూ.20వేలు జరిమానా విధించారు. దీనినుంచి తేరుకోకముందే మరో నిర్లక్ష్యం వెలుగు చూసింది. గోదావరిఖని మార్కండేయకాలనీలోని తాజ్‌ ఫ్యామిలీ రెస్టారెంట్‌, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ను హెల్త్‌ అసిస్టెంట్‌ కిరణ్‌, ఎన్విరాన్మెంటల్‌ ఇంజినీర్‌ మధుకర్‌, ఎంఐఎస్‌ ఆపరేటర్‌ శ్రీకాంత్‌ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నాణ్యతలేని సరుకులతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వాహకునికి రూ.8వేలు జరిమానా విధించారు.

నాణ్యతలేని సరుకులతో ఫాస్ట్‌ఫుడ్‌

మరో రెస్టారెంట్‌కు రూ.8వేలు జరిమానా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement