ISRO scientists
-
ఎన్జీఎల్వీ తయారీకి సిద్ధమవుతున్న ఇస్రో
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భవిష్యత్తులో అతిపెద్ద ప్రయోగాలను దృష్టిలో వుంచుకుని ఒక భారీ రాకెట్ తయారు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఈ రాకెట్కు న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ (ఎన్జీఎల్వీ) అని నామకరణం కూడా చేశారు. ఇస్రో మొదటినాళ్లలో చేపట్టిన రోహిణి సౌండింగ్ రాకెట్ల ప్రయోగాల తరువాత 40 కిలోలు నుంచి 5,000 కిలోలు ఉపగ్రహాలను మోసుకెళ్లే ఎస్ఎల్వీ, ఏఏస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, ఎల్వీఎం03, ఎస్ఎస్ఎల్వీ అనే ఆరు రకాల రాకెట్లును అభివృద్ది చేసింది. భవిష్యత్తులో అంటే 2040 నాటికి మానవుడ్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లి తిరిగి తీసుకొచ్చే ప్రయోగంతో పాటు చంద్రుడిపై మానవుడ్ని తీసుకెళ్లి తిరిగి తీసుకొచ్చే ప్రయోగాన్ని కూడా చేపట్టాలని ఇస్రో భావిస్తోంది. వీటితో పాటు అత్యంత బరువు కలిగిన కమ్యూనికేషన్ ఉపగ్రహాలను జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి (జీటీఓ) పంపేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ 20 నుంచి 30 టన్నుల బరువు కలిగిన కమ్యూనికేషన్ ఉపగ్రహాలను భూమికి దగ్గరగా వున్న లియో అర్బిట్లోకి, 10 వేలు కిలోలు బరువు కలిగిన ఉపగ్రహాలను జీటీఓ ఆర్బిట్లోకి ప్రవేశపెట్ట గలిగిన సామర్థ్యాన్ని కలిగి వుంటుంది. అయితే దీనికి సంబంధించి 2008 డిసెంబర్ 22న రూ.1,798 కోట్లు అంచనాలతో ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ నిధులతో సెమీ క్రయోజనిక్ దశను అభివృద్ది చేయడంతో పాటు రాకెట్కు సంబంధించిన పరికరాలను సాంకేతికంగా రూపొందించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఎన్జీఎల్వీ రాకెట్ ప్రయోగానికి ఇప్పుడున్న ప్రయోగవేదికల సామర్థ్యం సరిపోదని మూడో ప్రయోగవేదిక నిర్మాణానికి కేంద్ర సైంటిఫిక్ విభాగం వారు మంత్రివర్గ సమావేశంలో రూ. 3,986 కోట్లు మంజూరు చేశారు. షార్ కేంద్రంలో మూడో ప్రయోగవేదిక నిర్మాణానికి స్థలం ఎంపిక కూడా జరిగింది. ప్రయోగవేదికతో పాటు ఎన్జీఎల్వీ రాకెట్ను కూడా రూపొందించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్దమవుతున్నారు. త్వరలోనే ప్రయోగవేదిక నిర్మాణానికి భూమిపూజ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ (ఎన్జీఎల్వీ) వివరాలు... → ఎన్జీఎల్వీ రాకెట్ ఎత్తు 75 మీటర్లు. → రాకెట్ వెడల్పు 5 మీటర్లు. → ప్రయోగ సమయంలో శాటిలైట్ లేకుండా రాకెట్ బరువు మాత్రమే 1,000 టన్నులు వుంటుంది. → మూడు దశలతోనే రాకెట్ను రూపొందిస్తున్నారు. → పీఎస్ఎల్వీ ఎక్స్ల్ తరహాలో ఎన్జీఎల్వీ రాకెట్కు ఆరు స్ట్రాపాన్ బూస్టర్లు కలిగి వుంటుంది. → కోర్ అలోన్ దశలో 160 టన్నుల సెమీ–క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగిస్తారు. → క్రయోజనిక్ దశలో 30 టన్నుల క్రయో ఇంధనాన్ని వినియోగిస్తారు. → ఈ రాకెట్ రూపాంతరం చెందితే నాసాకి చెందిన పాల్కన్ రాకెట్, అట్లాస్–వీ, ప్రోటాన్–ఎం, లాంగ్ మార్చ్ –58 రాకెట్ల స్థాయికి ఏమాత్రం తగ్గకుండా వుంటుంది. → ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్ 2023 డిసెంబర్లోనే దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. 2030 , 2035 నాటికి మాన వ అంతరిక్ష యానం, లోతైన అంతరిక్ష యాత్రలు, అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహాల ప్రయోగాలు చేసేందుకు వీలుగా ఈ రాకెట్ను రూపొందిస్తున్నట్టుగా పవర్పాయింట్ ప్రజెంటేషన్లో వివరించారు. ఎన్జీఎల్వీ రాకెట్ గురించి దశల వారీగా కూడా ఆయన వివరించి మరీ చెప్పారు. -
ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు
-
ఇస్రో శాస్త్రవేత్తలకు YS జగన్ అభినందనలు
-
ఇస్రో సైంటిస్టులకు అభినందనలు తెలిపిన వైఎస్ జగన్
-
ఇస్రో శాస్త్రవేత్తలకు వర్క్షాపు
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష పరిశోధనలు, వాటి ఫలితాలు, సాకేంతికత, మెటీరియల్స్ మొదలగు వాటిని భారత ఆటోమోటివ్ పరిశ్రమలో ఎలా వినియోగించుకోవచ్చు అనే అంశంపై ఈనెల 11న అంతరిక్ష ప్రధానకేంద్రమైన బెంగళూరులో నిర్వహించామని శనివారం ఇస్రో తన వెబ్సైట్లో పేర్కొన్నారు. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్, ఇన్స్పేస్ చైర్మన్ డాక్టర్ పవన్ గోయెంకాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించుకునే ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇస్రో, ఇన్స్పేస్ సంస్థలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే రాకెట్ పరికరాలు, ఉపగ్రహాలకు చెందిన పరికరాలను అందించే ప్రయివేట్ పార్టనర్స్ కూడా ఈ సెమినార్లో పాల్గొన్నాయి.రోజు రోజుకు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం అప్డేట్ అవుతోంది కాబట్టి మనం కూడా ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మారాల్సి అవసరం వుందని ఈ రెండు సంస్థల ఛైర్మన్లు అన్నారు. ఆటోమోటివ్ రంగంలోని కెమెరా ఇమేజింగ్ సెన్సార్లు, ఉష్ణోగ్రత, పీడన సెన్సార్లు, అకౌస్టిక్, వైబ్రేషన్ సెన్సార్లు, గైరోస్కోప్లు, యాక్సిలరోమీటర్లు, ప్రత్యేకమైన పూతలు, అడ్హెసివ్లు, యాంటీ వైబ్రేషన్, నాయిస్ సప్రెషన్ టెక్నాలజీలు, ఇన్సులేషన్ టెక్నాలజీలు, భద్రతా వ్యవస్థలు అనే వాటిపై కూలకషంగా సెమినార్లో చర్చించారు.ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ పారిశ్రామిక అనువర్తనాల కోసం భారత అంతరిక్ష కార్యక్రమం నుంచి జ్ఞానాన్ని బదిలీ చేయడం ప్రాముఖ్యత గురించి వివరించి మరీ చెప్పారు. స్పేస్–గ్రేడ్ టెక్నాలజీలు, వాహన భద్రత, పనితీరు స్థిరత్వాన్ని ఎలా మెరుగు పరుస్తాయో అన్వేషించమని ఆటోమోటివ్ పరిశ్రమలలోని వారికి సూచించారు. ఇన్స్పేస్ ఛైర్మన్ పవన్ గోయెంకా మాట్లాడుతూ ఇస్రో శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించారు. వర్క్షాప్ద్వారా ఉత్పన్నమయ్యే వేగాన్ని కొనసాగించాల్సిన అవసరం గురించి వివరించారు. రాకెట్ ప్రయోగాల్లో వాణిజ్యపరమైన విస్తరణ కోసం ఆటోమోటివ్ పరిశ్రమలో కన్సార్టియం విధానం నేతృత్వంలో రాకెట్ పరికరాలను అందించే ప్రయివేట్ పార్టనర్లు పని చేయాల్సి వుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్రో అన్ని సెంటర్లుకు శాస్త్రవేత్తలు, ప్రయివేట్ పార్టనర్లు పాల్గొన్నారు. -
ఇస్రో అమ్ములపొదిలోకి మరో రాకెట్
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అమ్ముల పొదిలోకి మరో రాకెట్ చేరింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) డి–3 ప్రయోగాన్ని శుక్రవారం ఉదయం విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రయోగం ద్వారా 175.5 కేజీల బరువు కలిగిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈవోఎస్–08), ఎస్ఆర్–0 డెమోశాట్ అనే రెండు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగానికి శుక్రవారం తెల్లవారుజామున 2.47 గంటలకు కౌంట్డౌన్ను ప్రారంభించారు. ఆరున్నర గంటలపాటు కౌంట్డౌన్ అనంతరం ఉదయం 9.17 గంటలకు ఎస్ఎస్ఎల్వీ డి–3 రాకెట్ నింగివైపునకు దూసుకెళ్లింది. రాకెట్లోని మొత్తం నాలుగు దశలు సక్రమంగా పనిచేయడంతో 16.56 నిమిషాల్లోనే ప్రయోగం విజయవంతంగా ముగిసింది. భూమికి 475 కిలోమీటర్లు ఎత్తులోని లియో ఆర్బిట్ (సూర్య సమకాలిక కక్ష్య)లో 37.2 డిగ్రీల వృత్తాకారపు కక్ష్యలోకి విజయవంతంగా ఉప గ్రహాలను ప్రవేశపెట్టారు. మొదట ఈవోఎస్–08ను కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఎస్ఆర్–0 డెమోశాట్ అనే చిన్న ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. కక్ష్యలోకి చేరిన ఉపగ్రహాల నుంచి సిగ్నల్స్ అందడంతో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఇస్రో చిన్న తరహా ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా ప్రయోగించి వాణిజ్యపరంగా గుర్తింపు పొందింది. ఇవీ ఉపయోగాలు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్–08లో ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం–రిప్లెక్టోమెట్రీ, ఎస్ఐసీ యూవీ డొసిమీటర్ అనే మూడు రకాల పేలోడ్స్ను అమర్చారు. వీటి ద్వారా ఈ ఉపగ్రహం భూమి మీద వాతావరణ పరిస్థితులు(¿ౌగోళిక–పర్యావరణం)పై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ సమాచారాన్ని చేరవేస్తుంది. ముఖ్యంగా అటవీ, వ్యవసాయం, భూమి స్వభావం, నీరు అధ్యయనాలకు సంబం«ధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉపగ్రహం ఒక్క ఏడాదే సేవలు అందిస్తుంది. వాణిజ్యపరంగా కూడా వినియోగిస్తాంఎస్ఎస్ఎల్వీ డి–3 ప్రయోగం అనంతరం ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి మాట్లాడుతూ ఇస్రోలో సరికొత్తగా ఎస్ఎస్ఎల్వీ రాకెట్ చేరిందని చెప్పారు. ఇప్పటిదాకా ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ మార్క్–3 వంటి ఐదు రకాల రాకెట్లు మాత్రమే ఉండేవని తెలిపారు. 2022 ఆగస్టు 7న ప్రయోగించిన ఎస్ఎస్ఎల్వీ డి–1 రాకెట్ విఫలం కావడంతో అందులో ఏర్పడిన లోపాలను సరిచేసి.. ముందస్తు పరీక్షలు నిర్వహించి ఎస్ఎస్ఎల్వీ డి–3 ప్రయోగానికి సిద్ధమయ్యామన్నారు. దీనికోసం అహరి్నశలు పనిచేసిన ఇస్రోలోని అన్ని విభాగాలకు అభినందనలు తెలిపారు. వాణిజ్యపరంగా కూడా ఈ రాకెట్ను వినియోగిస్తామని చెప్పారు. వెహికల్ డైరెక్టర్ ఎస్ఎస్ వినోద్, శాటిలైట్ డైరెక్టర్ ఎ.ఆవినాష్ మాట్లాడుతూ ఉపగ్రహం నుంచి నిర్దేశించిన విధంగా సిగ్నల్స్ అందాయని తెలిపారు.ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలుసాక్షి, అమరావతి: ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శుక్రవారం స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) డి–3ని విజయవంతంగా ప్రయోగించడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. ఈ ప్రయోగం ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈవోఎస్–08), ఎస్ఆర్–0 డెమోశాట్ను విజయవంతంగా కక్ష్యలోకి పంపిన శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. అంతరిక్ష పరిశోధన రంగంలో ఈ విజయం ఇస్రోను ప్రపంచ వేదికపై నిలిపిందని ఆయన పేర్కొన్నారు. -
ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, గుంటూరు: ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. EOS-08 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ని విజయవంతంగా ప్రయోగించటంపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్ష పరిశోధనలో ఈ విజయం ప్రపంచ వేదికపై నిలిపిందని ఆయన పేర్కొన్నారు.శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శుక్రవారం(ఆగస్టు16) స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ డీ3)ని ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు.ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–08)తో పాటు ఎస్ఆర్–0 డెమోశాట్ అనే చిన్న తరహా ఉపగ్రహాలను 475 కిలోమీటర్లు ఎత్తులోని సర్క్యులర్ ఆర్బిట్లో రాకెట్ విజయవంతంగా ప్రవేశపెట్టింది. రక్షణ రంగంతో పాటు విపత్తు నిర్వహణ, ఇతర రంగాలకు ఈ ఉపగ్రహాల సేవలు ఏడాదిపాటు అందనున్నాయి. -
ఎస్ఎస్ఎల్వీ డీ–3 ప్రయోగం నేడే
సూళ్లూరుపేట/తిరుమల: తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి శుక్రవారం ఉదయం 9.17 గంటలకు స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ డీ3) ప్రయోగించేందుకు సిద్ధమైంది. ప్రయోగాన్ని 16.56 నిమిషాల్లో పూర్తి చేయనున్నారు. ప్రయోగ వేదికపై సిద్ధంగా ఉన్న రాకెట్కు అన్ని పరీక్షలను పూర్తి చేసే పనిలో ఇస్రో శాస్త్రవేత్తలు నిమగ్న మయ్యారు.ఏదైనా వాతావరణ పరిస్థితులను బట్టి ప్రయోగ సమయం కొద్దిగా మార్పు చేసే అవకాశం లేకపోలేదు. ఈ ప్రయోగానికి సంబంధించి గురువారం లాంచ్ రిహార్సల్స్ నిర్వహించారు. మధ్యా హ్నం ఒంటి గంటకు మిషన్ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్ఆర్) నిర్వహించి ప్రయోగ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఎంఆర్ఆర్ సమావేశం అనంతరం ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) వారికి అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో రాకెట్కు తుది విడత తనిఖీలు నిర్వహించి ప్రయోగానికి ఏడు గంటల ముందు అంటే శుక్రవారం వేకువజామున 2.17 కౌంట్ డౌన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ ఏడు గంటల కౌంట్ డౌన్ ప్రక్రియలో నాలుగో దశలో 0.05 టన్నుల ద్రవ ఇం«ధనాన్ని నింపడంతో పాటు రాకెట్లోని అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేసి ప్రయోగానికి సిద్ధమవుతారన్నమాట. అయితే ఈ ప్రయోగంలో మూడు దశలూ ఘన ఇంధనం సాయంతో నిర్వహించనున్నారు. దీనికి కౌంట్డౌన్ సమయాన్ని అతికొద్ది గంటలు మాత్రమే తీసుకుంటున్నారు. ఈ ప్రయోగంలో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–08)తో పాటు ఎస్ఆర్–0 డెమోశాట్ అనే చిన్న తరహా ఉపగ్రహాలను 475 కిలోమీటర్లు ఎత్తులోని సర్క్యులర్ ఆర్బిట్లో ప్రవేశపెట్టనున్నారు. రాకెట్ వివరాలు.. ప్రయోగమిలా..ఎస్ఎస్ఎల్వీ డీ3 రాకెట్ 34 మీటర్లు పొడువు రెండు మీటర్లు వెడల్పు 119 టన్నుల బరువుతో నాలుగు దశల్లోనే ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగాన్ని 16 (994 సెకన్లు) నిమిషాల్లో పూర్తి చేయనున్నారు. ఈ రాకెట్ మొదటి దశను 87 టన్నుల ఘన ఇంధనాన్ని ఉపయోగించి 124 సెకన్లకు పూర్తి చేయనున్నారు. రెండో దశను 7.7 టన్నుల ఘన ఇంధనంతో 384.2 సెకన్లకు, మూడో దశను 4.5 టన్నుల ఘన ఇంధనంతో 674.9 సెకన్లకు పూర్తి చేయనున్నారు. నాలుగో దశలో మాత్రమే 0.05 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో 808 సెకన్లకు 175.5 కేజీల బరువు కలిగిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ) ఈఓఎస్–08) మొదటిగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఎస్ఆర్–0 డెమోశాట్ అనే ఉపగ్రహాన్ని 994 సెకన్లు భూమికి 475 కిలో మీటర్లు ఎత్తులోని లియో అర్బిట్ (సూర్య సమకాలిక కక్ష్య)లోకి ప్రవేశపెట్టడంతో ప్రయోగం పూర్తి చేసేవిధంగా ఇస్రో శాస్త్రవేత్తలు డిజైన్ చేశారు. కౌంట్డౌన్ వ్యవధి తక్కువ..ఎస్ఎస్ఎల్వీ డీ3 రాకెట్కు కౌంట్డౌన్ సమయాన్ని తక్కువగా అంటే ఏడు గంటల వ్యవ«ధి మాత్రమే తీసుకున్నారు. ఎందుకంటే ఈ రాకెట్ మొదటి మూడు దశలు ఘన ఇంధనాన్ని ఉపయోగించి చేయనున్నారు. అంటే ఘన ఇంధనాన్ని ముందుగానే నింపి రాకెట్ను అనుసంధానం చేశారు. ద్రవ ఇంధనాన్ని నింపేందుకు మాత్రమే కౌంట్డౌన్ సమయాన్ని తీసుకున్నారు. ఈ ప్రయోగంలో నాలుగోదశలో 0.05 టన్నులు మాత్రమే ద్రవ ఇంధనాన్ని వినియోగించనున్నారు. అందుకే ఏడు గంటల కౌంట్డౌన్ సమయం వ్యవధిలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియతో పాటు రాకెట్లోని అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేయడానికి ఈ తక్కువ సమయాన్ని తీసుకున్నారు. ఎస్ఎస్ఎల్వీ సిరీస్లో ఇది మూడో ప్రయోగమిది. షార్ కేంద్రం నుంచి 97వ ప్రయోగం కావడం విశేషం. శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలుతిరుమల శ్రీవారి సన్నిధిలో ఎస్ఎస్ఎల్వీ డీ–3, ఈఓఎస్–08 నమూనాలకు ఇస్రో అధికారులు గురువారం ప్రత్యేక పూజలు చేయించారు. ఇస్రో డైరెక్టర్ ఏకే పాత్ర, ప్రిన్సిపల్ సెక్రటరీ యశోదతో కలసి శాస్త్రవేత్తలు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి పాదాల చెంత ఎస్ఎస్ఎల్వీ డీ–3, ఈఓఎస్–08 నమూనాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
ఇస్రో టీమ్ కు సీఎం జగన్ అభినందనలు
-
సర్వం సిద్ధం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) శనివారం ఉదయం మొట్టమొదటగా ప్రయోగించనున్న గగన్యాన్ టెస్ట్ వెహికల్ (టీవీ–డీ1) ప్రయోగానికి శుక్రవారం సాయంత్రం 7.30 గంటలకు కౌంట్డౌన్ మొదలైంది. 12.30 గంటల కౌంట్డౌన్ అనంతరం శనివారం ఉదయం 8 గంటలకు ప్రయోగాన్ని చేపట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్దం చేశారు. షార్లోని మొదటి ప్రయోగవేదిక నుంచి సింగిల్ స్టేజీతో (ఒకే దశతో) ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. 531.8 సెకన్లకు ప్రయోగాన్ని పూర్తి చేయనున్నారు. టీవీ–డీ1ను 17 కిలోమీటర్లు ఎత్తుకు తీసుకెళ్లి రాకెట్ శిఖరభాగాన అమర్చిన క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టంను మళ్లీ కిందకు తీసుకొచ్చే ప్రక్రియను చేపట్టడం ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం. రాకెట్ శిఖరభాగంలో అమర్చిన క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టం భూమికి 17 కిలోమీటర్లు దూరంలో అంతరిక్షంలో వదిలిపెట్టిన తరువాత దానికి పైభాగంలో అమర్చిన 10 ప్యారాచూట్ల సాయంతో బంగాళాఖాతంలో దించి సురక్షితంగా తీసుకువచ్చే ప్రక్రియను చేపడుతున్నారు. శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కోస్టల్ నేవీ సిబ్బంది ఒక ప్రత్యేక బోట్లో వేచి ఉండి సముద్రంలో క్రూమాడ్యూల్ పడిన తరువాత దాన్ని సురక్షితంగా తీసుకొస్తారు. భవిష్యత్తులో వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి క్షేమంగా తీసుకువచ్చే ప్రక్రియను పరిశీలించే ప్రయోగం ఇదే కావడం విశేషం. -
ఇస్రోలో తీవ్ర విషాదం
చెన్నై: దేశంలో 140 కోట్ల జనాభా ఉన్నా..కొందరి గొంతు మాత్రమే ప్రజల మనస్సుల్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాంటి గుర్తుండిపోయే గొంతుక మేడమ్ వలార్మతిది. మన ఇస్రో ప్రయోగించిన పదుల సంఖ్యలో రాకెట్లకు కౌంట్డౌన్ చెప్పింది ఈమెనే. 1959లో తమిళనాడులోని అరియలూర్లో జని్మంచిన వలార్మతి 1984లో ఇస్రోలో సైంటిస్ట్గా చేరారు. ఇస్రో ప్రయోగించిన రాకెట్లకు లాంఛింగ్ కౌంట్డౌన్ ఆమే చెప్పేవారు. ఇలా ఈమె విలక్షణమైన కంఠం దేశప్రజలకు సుపరిచితం. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరిట ఏర్పాటు చేసిన పురస్కారాన్ని మొదటిసారిగా 2015లో ఈమె అందుకున్నారు. చివరిసారిగా చంద్రయాన్–3 మిషన్ రాకెట్కు వలార్మతినే కౌంట్డౌన్ చెప్పడం విశేషం. ఇస్రో నుంచి రిటైరైన ఈమె శనివారం సాయంత్రం గుండెపోటుకు గురై చెన్నైలోని ఆస్పత్రిలో కన్నుమూశారు. -
ఇస్రో శాస్త్రవేత్తల విశేష కృషి: సోమనాథ్
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): ఆదిత్య–ఎల్1 ప్రయోగం విజయవంతం కావడం వెనుక ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఎంతో ఉందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. ఆదిత్య–ఎల్1 ప్రయోగం సక్సెస్ అయిన వెంటనే ఆయన మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి మాట్లాడారు. ఈ ప్రయోగాన్ని ముందుగా అనుకున్న విధంగానే చేయగలిగామని చెప్పారు. జూలై 14న నిర్వహించి చంద్రయాన్–3 మిషన్ను ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండర్ను దించి సక్సెస్ను ఆస్వాదిస్తున్న సమయంలోనే సూర్యయాన్–1కి రెడీ అయిపోయామని చెప్పారు. రేపటి నుంచి 16 రోజుల పాటు ఆర్టిట్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. 125 రోజుల తర్వాత ఉపగ్రహాన్ని సూర్యుని దిశగా పయనింపజేసి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజియన్–1 బిందువు వద్ద ప్రవేశపెడతామన్నారు. భవిష్యత్తులో చంద్రయాన్–4 ప్రయోగం, ఆ తర్వాత శుక్రుడి మీదకు కూడా ప్రయోగానికి సిద్ధమవుతామని తెలిపారు. ఈ ఏడాది ఆక్టోబర్లో గగన్యాన్ ప్రయోగాత్మక ప్రయోగం, జీఎస్ఎల్వీ మార్క్–2 రాకెట్ ద్వారా త్రీడీఎస్ అనే సరికొత్త ఉపగ్రహాన్ని పంపించబోతున్నామని చెప్పారు. ఇస్రోకు ప్రధాని అభినందనలు న్యూఢిల్లీ: దేశం యొక్క మొదటి సోలార్ మిషన్ను విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. మానవాళి సంక్షేమం కోసం విశ్వాంతరాళాన్ని అర్థం చేసుకునే క్రమంలో మన శాస్త్రీయ పరిశోధనలు అవిశ్రాంతంగా కొనసాగుతాయని ఎక్స్లో ఆయన పేర్కొన్నారు. ఆదిత్య–ఎల్1 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో ఇంజినీర్లు, శాస్త్రవేత్తలకు అభినందనలు అని తెలిపారు. ఇస్రో బృందానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. పరిశోధనల క్రమంలో సోలార్ మిషన్ ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని నింగిలోకి విజయవంతంగా ప్రవేశపెట్టడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్రో బృందాన్ని అభినందించారు. భారతీయ అంతరిక్ష సాంకేతికతను మరింత ఎత్తుకు తీసుకెళ్లే మిషన్ను సాధించాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందనలు సాక్షి, హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం ‘ఆదిత్య ఎల్–1’ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో కీలక మైలురాయిని దాటిందని అన్నారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా దేశ శాస్త్రవేత్తలు సాధిస్తున్న ప్రగతి, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసిందన్నారు. ఇస్రో చైర్మన్, శాస్త్రవేత్తలు, సాంకేతిక సిబ్బందిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. -
చంద్రయాన్-3 సక్సెస్.. ఇస్రో ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా?
ISRO Employees Salary Structure: ఇస్రో పంపిన చంద్రయాన్-3 ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయి భారతదేశ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది. ఇప్పటికి కూడా చంద్రుని మీద ఉన్న పరిస్థితులను ఒక్కొక్కటిగా భూమిపైకి చేరవేస్తూనే ఉంది. ఇంత ఘన విజయం సాధించిన చంద్రయాన్-3 సక్సెస్ వెనుక ఎంతోమంది కృషి ఉందని అందరికి తెలిసిందే. చంద్రయాన్ 3 విజయం వెనుక ప్రధానంగా అంతరిక్ష శాఖ కార్యదర్శి అండ్ చైర్పర్సన్ ఎస్ సోమనాథ్, ప్రాజెక్ట్ డైరెక్టర్ పి వీరముత్తువేల్, డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కల్పన కాళహస్తి ఉన్నారు. కాగా ఈ కథనంలో ఇస్రో ఉద్యోగులు జీతాలు ఎంత? ఎక్కువ జీతం పొందేదెవరు అనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఇస్రో శాస్త్రవేత్తలు & ఇతర ఉద్యోగుల జీతాలు ఇలా.. టైమ్స్ నౌ న్యూస్ ప్రకారం.. ఇస్రోలోని ఇంజనీర్లు రూ. 37,400 నుంచి రూ. 67,000 వరకు & సీనియర్ సైంటిస్టులు రూ.75,000 నుంచి రూ.80,000 వరకు జీతం తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా ఇస్రోకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలకు నెలకు రూ.2 లక్షల జీతం లభించే అవకాశం ఉంది. ఈ జీతాలతో పాటు ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి. 👉: టెక్నీషియన్-B L-3 (రూ. 21700 - రూ. 69100) 👉: టెక్నికల్ అసిస్టెంట్ L-7 (రూ. 44900 - రూ.142400) 👉: సైంటిఫిక్ అసిస్టెంట్ L-7 (రూ. 44900 - రూ. 142400) 👉: లైబ్రరీ అసిస్టెంట్ 'A' L-7 (రూ. 44900 - రూ. 142400) 👉: టెక్నికల్ అసిస్టెంట్ (సౌండ్ రికార్డింగ్) డీఇసీయూ అహ్మదాబాద్ L-7 ( రూ. 44900 - రూ. 142400) 👉: టెక్నికల్ అసిస్టెంట్ (వీడియోగ్రఫీ) డీఇసీయూ అహ్మదాబాద్ L-7 (రూ. 44900 - రూ. 142400) 👉: ప్రోగ్రామ్ అసిస్టెంట్, డీఇసీయూ అహ్మదాబాద్ L-8 (రూ. 47600 - రూ. 151100) 👉: సోషల్ రీసెర్చ్ అసిస్టెంట్, డీఇసీయూ అహ్మదాబాద్ - ఎల్-8 (రూ. 47600 - రూ. 151100) 👉: మీడియా లైబ్రరీ అసిస్టెంట్-A, డీఇసీయూ అహ్మదాబాద్ - L-7 (రూ. 44900 - రూ. 142400) 👉: సైంటిఫిక్ అసిస్టెంట్- A (మల్టీమీడియా), డీఇసీయూ అహ్మదాబాద్ - L-7 (రూ. 44900 - రూ. 142400) 👉: జూనియర్ ప్రొడ్యూసర్ L-10 (రూ. 56100 - రూ. 177500) 👉: సామాజిక పరిశోధన అధికారి-C L-10 (రూ. 56100 - రూ. 177500) 👉: సైంటిస్ట్/ ఇంజనీర్-SC - L-10 (రూ. 56100 - రూ. 177500) 👉: సైంటిస్ట్/ ఇంజనీర్-SD - L-11 (రూ. 67700 - రూ. 208700) 👉: మెడికల్ ఆఫీసర్-SC - L-10 (రూ. 56100 - రూ. 177500) 👉: మెడికల్ ఆఫీసర్-SD - L-11 (రూ. 67700 - రూ. 208700) 👉: రేడియోగ్రాఫర్-A - L-4 (రూ. 25500 - రూ. 81100) 👉: ఫార్మసిస్ట్-A L-5 (రూ. 29200 - రూ. 92300) 👉: ల్యాబ్ టెక్నీషియన్-A L-4 (రూ. 25500 - రూ. 81100) 👉: నర్సు-B L-7 (రూ. 44900 - రూ. 142400) 👉: సిస్టర్-A L-8 (రూ. 47600 - రూ. 151100) 👉: క్యాటరింగ్ అటెండెంట్ 'A' L-1 (రూ. 18000 - రూ. 56900) 👉: క్యాటరింగ్ సూపర్వైజర్ - L-6 (రూ. 35400 - రూ. 112400) 👉: కుక్ - L-2 (రూ. 19900 - రూ. 63200) 👉: ఫైర్మ్యాన్-A - L-2 (రూ. 19900 - రూ. 63200) 👉: డ్రైవర్-కమ్-ఆపరేటర్-A - L-3 (రూ. 21700 - రూ. 69100) 👉: లైట్ వెహికల్ డ్రైవర్-A - L-2 (రూ. 19900 - రూ. 63200) 👉: హెవీ వెహికల్ డ్రైవర్-A - L-2 (రూ. 19900 - రూ. 63200) 👉: స్టాఫ్ కార్ డ్రైవర్ 'A' - L-2 (రూ. 19900 - రూ. 63200) 👉: అసిస్టెంట్ - L-4 (రూ. 25500 - రూ. 81100) 👉: అసిస్టెంట్ (రాజ్భాష) - L-4 (రూ. 25500 - రూ. 81100) 👉: అప్పర్ డివిజన్ క్లర్క్ - L-4 (రూ. 25500 - రూ. 81100) 👉: జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ - L-4 (రూ. 25500 - రూ. 81100) 👉: స్టెనోగ్రాఫర్ - L-4 (రూ. 25500 - రూ. 81100) 👉: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - L-10 (రూ. 56100 - రూ. 177500) 👉: అకౌంట్స్ ఆఫీసర్ - L-10 (రూ. 56100 - రూ. 177500) 👉: పర్చస్ & స్టోర్ ఆఫీసర్ - L-10 (రూ. 56100 - రూ. 177500) 👉: జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్- L-6 (రూ. 35400 - రూ. 112400) -
సూర్యుడి గుట్టు విప్పే ఆదిత్య–ఎల్1
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సౌరగోళంలో సౌరగాలులు, జ్వాలలు, రేణువుల తీరుతెన్నులపై పరిశో«ధనలే లక్ష్యంగా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహ ప్రయోగాన్ని సెప్టెంబర్ 2న ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. సీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. షార్ కేంద్రంలోని రెండో ప్రయోగవేదికకు చెందిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్లో రాకెట్ అనుసంధానం పనులు పూర్తి చేసి ప్రయోగవేదికపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆదిత్య–ఎల్1 ప్రయోగం ద్వారా సూర్యునిపై దాగి వున్న రహస్యాలను శోధించనున్నారు. సౌర తుపాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తల అంచనా. సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది? ► ఆదిత్య–ఎల్1లోని ఏడు పేలోడ్లలో 170 కేజీల బరువుండే విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ (వెల్సి) అనే పేలోడ్తో సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది? సూర్యుడిలో మార్పులు, అంతరిక్ష వాతావరణం, భూ వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాలపై ఇది పరిశోధనలు చేస్తుంది. ► సౌర అతినీలలోహిత ఇమేజింగ్ టెలిస్కోప్ (సూట్) అనే పేలోడ్ 35 కేజీల బరువు వుంటుంది. 200–400 ఎన్ఎం తరంగధైర్ఘ్యం పరిధి మధ్య సూర్యుడిని గమనిస్తుంది. ఇందులో 11 ఫిల్టర్లను ఉపయోగించ డం ద్వారా సౌర వాతావరణంలో వివిధ పొరల పూర్తి డిస్క్ చిత్రాలను అందిస్తుంది. ► ఆదిత్య సోలార్ విండ్ పారి్టకల్ ఎక్స్పెరిమెంట్ (యాస్పెక్స్) అనే పేలోడ్ సౌర గాలి వైవిధ్యం, లక్షణాలపై సమాచారాన్ని గ్రహించడంతోపాటు దాని వర్ణ పటం లక్షణాలను అధ్యయనం చేస్తుంది. ► ఆదిత్య ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ (పాపా) సౌరగాలి కూర్పు, దాని శక్తి పంపిణీని అర్థం చేసుకోవడానికి పరిశోధనలు చేస్తుంది. ► సోలార్ ఎనర్జీ ఎక్స్–రే స్పెక్ట్రోమీటరు (సోలెక్స్) సోలార్ కరోనా సమస్యాత్మకమైన కరోనల్ హీటింగ్ మెకానిజంను అ«ధ్యయనం చేయడానికి, ఎక్స్–రే మంటలను పర్యవేక్షించడానికి పరిశోదనలు చేస్తుంది. ► హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్–రే స్పెక్ట్రోమీటర్ (హెలియోస్) సౌర కరోనాలో డైనమిక్ ఈవెంట్లను గమనించడానికి, విస్ఫోటనం సంఘటనల సమయంలో సౌరశక్తి కణాలను వేగవంతం చేయడానికి ఉపయోగించే శక్తిని అంచనా వేస్తుంది. ► మ్యాగ్ అనే ఈ పేలోడ్ను ఉపగ్రహానికి ఆన్బోర్డు ఉపకరణంగా అమర్చి పంపుతున్నారు. ఉపగ్రహానికి సంబంధించి సమాచారాన్ని అందించనుంది. ఆదిత్య–ఎల్1లో పేలోడ్స్ ఇవే.. సుమారుగా 1,475 కేజీలు బరువున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహంలో ఏడు పేలోడ్స్ బరువు 244 కేజీలు. మిగతా 1,231 కేజీలు ద్రవ ఇంధనంతో నింపుతారు. ఉపగ్రహాన్ని భూ మధ్యంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తరువాత ఈ ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజియన్ బిందువు–1 (ఎల్–1)లోకి చేరవేయడానికి 177 రోజులు పడుతుంది. ఆదిత్య ఎల్–1 ఉపగ్రహంలో సూర్యుడిపై అధ్యయనం చేయడానికి యాస్పెక్స్, సూట్, వెల్సి, హెలియోస్, పాపా, సోలెక్స్, మాగ్ అనే ఏడు ఉపకరణాలు (పేలోడ్స్) ఉంటాయి. -
బెంగుళూరు పర్యటన.. సీఎం రాకపోవడంపై స్పందించిన మోదీ
బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం కర్ణాటక రాష్ట్రంలో పర్యటించారు. దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటనలను ముగించుకున్న ప్రధాని నేడు నేరుగా బెంగుళూరు చేరుకొని భారత్ ప్రయోగించిన ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రాజెక్టు విజయానికి కృషిచేసిన ఇస్రో శాస్త్రవేత్తలను కలిసి అభినందించారు. చంద్రుడిపై ల్యాండర్ దిగిన ప్రదేశానికి శివశక్తి పాయింట్గా నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 23ను జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారు. ఈ సందర్భంగా జాబిల్లిపై ల్యాండర్ తీసిన తొలి ఫోటోను ఇస్రో చైర్మన్ సోమనాథ్ మోదీకి బహుమతిగా అందించారు. అనంతరం ప్రధాని ఢిల్లీకి పయనమయ్యారు. తాజాగా ప్రధాని బెంగళూరు పర్యటనపై రాజకీయ దుమారం చెలరేగింది. అయితే బెంగళూరు ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధానికి స్వాగతం పలికేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ ఎవరూ హాజరుకాలేదు. ప్రధాని మోదీ సీఎంను ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉంచి, ప్రొటోకాల్ను ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. The Prime Minister is scheduled to directly land in Bengaluru tomorrow at 6 am after his latest foreign jaunt to congratulate ISRO. He is apparently so irritated with the CM and Deputy CM of Karnataka for felicitating the scientists of ISRO before him, that he has purportedly… pic.twitter.com/6EvN68A4oT — Jairam Ramesh (@Jairam_Ramesh) August 25, 2023 దీనిపై సీనియర్ కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ ట్విటర్లో స్పందిస్తూ.. ‘‘కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం తనకంటే ముందు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించడంతో ప్రధాని చాలా చిరాకుగా ఉన్నారు. అందుకే ప్రోటోకాల్కు విరుద్ధంగా వాళ్లను విమానాశ్రయంలో ఆహ్వానించకుండా దూరం పెట్టారు. ఇది చిల్లర రాజకీయం తప్ప మరొకటి కాదు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో చంద్రయాన్-1 ను విజయవంతంగా ప్రయోగించిన వేళ.. 2008 అక్టోబర్ 22న అహ్మదాబాద్లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ను నాడు గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ మోదీ సందర్శించారు. ఈ విషయం ఇప్పటి ప్రధాని మర్చిపోయారా?’’ అంటూ జైరామ్ రమేష్ ప్రశ్నించారు. చదవండి: చంద్రయాన్ 3 విజయోత్సవాలు.. ప్రధాని మోదీ భావోద్వేగం.. అయితే కాంగ్రెస్ ఆరోపణలపై ప్రధాని మోదీ స్పందించారు. బెంగళూరుకు తాను సరిగ్గా ఏ సమయానికి చేరుకుంటారో స్పష్టత లేని కారణంగా మంత్రులకు ఇబ్బంది కలిగించకూడదని భావించినట్లు తెలిపారు. బెంగుళూరు ఎయిర్నపోర్టుకు చేరుకున్న తర్వాత ప్రజలను ఉద్ధేశించి ప్రధాని మాట్లాడుతూ.. ‘‘నేను శాస్త్రవేత్తలతో సమావేశమైన తర్వాత ఢిల్లీ బయలుదేరి వెళతాను. బెంగళూరుకు ఎప్పుడు చేరుకుంటానన్నది నాకు తెలియదు. కాబట్టి వారు రావద్దని నేనే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, గవర్నర్కు చెప్పాను. నాకు స్వాగతం పలికేందుకు ముందుగా వచ్చి ఇబ్బంది పడొద్దని కోరాను. ప్రోటోకాల్ పాటించకుండా ఉండమని నేనే వారిని అడిగాను.’’ ప్రధాని పేర్కొన్నారు. #WATCH | Bengaluru: On PM Modi's visit, Karnataka Deputy CM DK Shivakumar says, "I fully agree with whatever the Prime Minister has said. We were supposed to go and receive him but since we had the information from the Prime Minister's Office officially, we wanted to respect… pic.twitter.com/jWYq5Ne6c0 — ANI (@ANI) August 26, 2023 ఈ వివాదంపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. ప్రధానిని స్వీకరించేందుకు తానును, సీఎం సిద్ధరామయ్య సిద్ధంగా ఉన్నానని, అయితే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి తనకు అధికారిక సమాచారం వచ్చిందని, దానిని గౌరవించాలని పేర్కొన్నారు. -
ఇస్రోలో మనోడు
నంద్యాల: చంద్రయాన్ –3 విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల ప్రతిభను అందరూ అభినందిస్తున్నారు. అలాంటి శాస్త్రవేత్తల్లో కూడా మన జిల్లాకు చెందిన వారు ఉండటం విశేషం. బేతంచెర్ల పట్టణానికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి ముళ్ల మీరం సాహెబ్, వాహిదా దంపతుల పెద్ద కుమారుడు డాక్టర్ సలీం బాషా ప్రస్తుతం ఇస్రోలో శాస్త్రవేత్తగా సేవలు అందిస్తున్నారు. ఈయన 5వ తరగతి వరకు పట్టణంలోని సర్వస్వతి విద్యామందిర్, ఆ తర్వాత శేషారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేశాడు. అనంతపురం జేఎన్టీయూ పాలిటెక్నిక్, జేఎన్టీయూ హైదరాబాద్ విశ్వ విద్యాలయంలో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. 2006లో ఇస్రోలో జాయిన్ అయ్యి ఉద్యోగం చేస్తూ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో పీహెచ్డీ డాక్టరేట్ 2021 పొందారు. ప్రస్తుతం లీడ్ సైంటిస్టుగా ఇస్రోలో కొనసాగుతున్నారు. ఎన్నో ఇస్రో మిషన్స్లో పాత్ర పోషించిన సలీం బాషా చంద్రయాన్ –2, చంద్రయాన్–3లో థర్మల్ డిజైనింగ్ లీడ్ సైంటిస్టుగా పాత్ర పోషించారు. దేశం కోసం కొత్త ఆవిష్కరణలు సృష్టిస్తున్న శాస్త్రవేత్తల్లో బేతంచెర్ల వాసి ఉండటంతో అతని కుటుంబ సభ్యులు మహబూబ్ బాషా, ఉసేన్ బాషా, రూహిద్ అక్రం, వాసిమ్ అక్రమ్తో పాటు పట్టణ ప్రజలు, పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
Chandrayaan -3: ప్రత్యక్ష ప్రసారం చేయండి.. పాక్ మాజీ మంత్రి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి చంద్రయాన్-3 ప్రయోగం చారిత్రాత్మకమని కొనియాడారు. ఈ సందర్బంగా ఆయన చంద్రయాన్-3 చంద్రుడిపై కాలుమోపే దృశ్యాలను పాకిస్తాన్లో ప్రత్యక్ష ప్రసారం చెయ్యాలని అక్కడి మీడియాను కోరారు. శభాష్ ఇండియా.. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మంత్రివర్గంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేసిన ఫవాద్ చౌదరి చంద్రయాన్-3 ప్రయోగం అద్భుతమని కొనియాడారు. ఈ సందర్బంగా ఆయన భారతీయ శాస్త్రవేత్తలను, అంతరిక్ష సంఘాన్ని అభినందించి చంద్రయాన్-3 మనుష్యజాతి చరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఫవాద్ చౌదరి తన ఎక్స్(ట్విట్టర్) అకౌంట్లో అరుదైన ఘనతను సాధించనున్న భారతదేశాన్ని, భారత శాస్త్రవేత్తలను అభినందిస్తూనే చంద్రయాన్-3 చంద్రుడిపై కాలుమోపే అద్భుత దృశ్యాలను పాకిస్తాన్ మీడియా ప్రత్యక్ష ప్రసారం చెయ్యాలని కోరారు. Pak media should show #Chandrayan moon landing live tomorrow at 6:15 PM… historic moment for Human kind specially for the people, scientists and Space community of India…. Many Congratulations — Ch Fawad Hussain (@fawadchaudhry) August 22, 2023 నాడు విమర్శించిన వారే.. చంద్రయాన్-2 విఫలమైన తర్వాత భారత దేశాన్ని, భారత శాస్త్రవేత్తలను ఎగతాళి చేసిన వారిలో ఫవాద్ చౌదరి కూడా ఉన్నారు. అనవసరంగా డబ్బులు ఎందుకు వృధా చేస్తున్నారు. ఆ డబ్బులను పేదరికాన్ని నిర్మూలించడానికి ఉపయోగించాలని హితవు కూడా పలికారు. కానీ నేడు ప్రపంచ అగ్ర దేశాలకు సైతం సాధ్యంకాని అరుదైన ఘనతను భారతదేశం సాధిస్తుండతమ్.. విమర్శకులకు కూడా కళ్ళు తెరిపించింది. విమర్శకుల ప్రశంస కంటే గొప్ప గెలుపు మరొకటుండదు అనడానికి ఇదే నిదర్శనం. Dear Endia; instead of wasting money on insane missions as of Chandrayyan or sending idiots like #abhinandan for tea to across LoC concentrate on poverty within, your approach on #Kashmir ll be another Chandrayyan just price tag ll be far bigger. — Ch Fawad Hussain (@fawadchaudhry) September 7, 2019 Surprised on Indian trolls reaction, they are abusing me as I was the one who failed their moon mission, bhai hum ne kaha tha 900 crore lagao in nalaiqoon per? Ab sabr kero aur sonah ki koshish kero #IndiaFailed — Ch Fawad Hussain (@fawadchaudhry) September 6, 2019 ప్రపంచ దేశాలు సైతం.. చంద్రుడిపై అడుగుపెట్టాలన్న భారత ఉక్కుసంకల్పానికి చంద్రయాన్-3 ఒక తార్కాణం. చంద్రయాన్-2 వైఫల్యం తర్వాత భారత దేశం పట్టువిడవకుండా వెనువెంటనే చంద్రయాన్-3కి శ్రీకారం చుట్టింది. మధ్యలో కోవిడ్ -19 కారణంగా కొంత కాలయాపన జరిగినా చివరకు ఈరోజు ఆ అపురూప ఘట్టాన్ని సాక్షాత్కరించనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.04 గంటలకు ఈ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు చంద్రయాన్-3 ఘనవిజయాన్ని చూడాలని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇది కూడా చదవండి: రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు.. ఎయిర్పోర్టులు మూసివేత -
త్వరలో ఆదిత్య–ఎల్1 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సూర్యుడిపై పరిశోధనల కోసం సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఈ నెలాఖరులో గానీ సెప్టెంబర్ మొదటివారంలో గానీ పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. షార్ కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదికకు సంబంధించి వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్లో రాకెట్ అనుసంధానం పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది చేసిన ఆరు ప్రయోగాలు వరుసగా విజయాలు సాధించడంతో.. రెట్టించిన ఉత్సాహంతో మరో రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. -
చంద్రయాన్-3 ప్రయోగం.. సీఎం వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ప్రతిష్టాత్మక చంద్రయాన్–3 మిషన్ను చంద్రుని దక్షిణ ధ్రువంపైకి పంపేందుకు సర్వం సిద్దమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగవేదిక నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు ఇస్రో బాహుబలి రాకెట్గా పేరొందిన ఎల్వీఎం3–ఎం4 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఈ ప్రయోగం జరగనుంది. ఈ సందర్భంగా చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. జాబిల్లిపై ఇప్పటిదాకా ఎవరూ అడుగు పెట్టని దక్షిణ దిశను ముద్దాడాలన్న చిరకాల లక్ష్యాన్ని సాధించేందుకు ఇస్రో మరోసారి సన్నద్ధమవుతోంది. చదవండి: ఆవలి దిక్కున... జాబిలి చిక్కేనా! చంద్రయాన్–3 మిషన్ను నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి మోసుకెళ్లేందుకు ఇస్రో గెలుపు గుర్రం, బాహుబలి రాకెట్ ఎల్వీఎం–3 సిద్ధమవుతోంది. ఈ మిషన్ను దిగ్విజయంగా పూర్తి చేసి నాలుగేళ్ల నాటి చంద్రయాన్–2 వైఫల్యం తాలూకు చేదు జ్ఞాపకాలను చెరిపేయాలని ఇస్రో పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో భారత్తో పాటు ప్రపంచ దేశాలన్నింటి కళ్లూ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రయోగంపైనే నిలిచాయి. చదవండి: కూకట్పల్లి: మామకు మనమూ చుట్టాలమే My best wishes to the entire team at @isro on the scheduled launch of Chandrayaan-3 from Sriharikota in our very own #AndhraPradesh today. — YS Jagan Mohan Reddy (@ysjagan) July 14, 2023 -
చంద్రయాన్-3: తిరుమల శ్రీవారి సన్నిధిలో ఇస్రో శాస్త్రవేత్తలు
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తల బృందం దర్శించుకుంది. గురువారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తల బృందం స్వామి వారి సేవలో పాల్గొన్నారు. చంద్రయాన్-3 యొక్క సూక్ష్మ నమూనాలను శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చంద్రయాన్–3 ప్రయోగానికి సమయం దగ్గరపడుతోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం 2.35 గంటలకు జియో సింక్రనస్ లాంచ్ వెహికల్ ఎంకే–3(ఎల్వీఎం–3) రాకెట్ శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. చదవండి: బాహుబలి రాకెట్ చంద్రయాన్ 3 ఇందుకోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సైంటిస్టులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రయోగం ఎట్టిపరిస్థితుల్లోనూ గురి తప్పకూడదన్న లక్ష్యంతో శ్రమిస్తున్నామని చెబుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఎల్వీఎం–3 రాకెట్పైనే కేంద్రీకృతమై ఉంది. చంద్రయాన్–3 మిషన్లో భాగంగా ఆర్బిటార్, ల్యాండర్, రోవర్ను చందమామ వద్దకు మోసుకెళ్లే ఈ రాకెట్కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. -
చంద్రయాన్–3.. త్రీ ఇన్ వన్
సూళ్లూరుపేట: చందమామ గురించి తెలుసుకోవడానికి గత 60 ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. అమెరికా 1958 నుంచి చంద్రుడిపై పరిశోధనలు సాగిస్తోంది. 1969లో అపోలో రాకెట్ ద్వారా ముగ్గురు వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించింది. రష్యా, జపాన్, చైనా, ఇజ్రాయెల్, జర్మనీ, భారత్ తదితర దేశాలు చంద్రుడి రహస్యాలను ఛేదించేందుకు కృషి చేస్తున్నాయి. భారత్ 2008లో చంద్రుడి మీదికి చంద్రయాన్–1 పేరుతో ఆర్బిటార్ను ప్రయోగించింది. అక్కడ నీటి జాడలున్నాయని గుర్తించింది. చంద్రుడిపై రెండు ప్రయోగాలు చేసిన భారత్ మూడో ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. సైంటిస్టులు ఏర్పాట్లను దాదాపు పూర్తిచేశారు. చంద్రయాన్–1, చంద్రయాన్–2 ప్రయోగాల వల్ల ఆర్బిటార్ ద్వారా ల్యాండర్ను, ల్యాండర్ ద్వారా రోవర్ను పంపించిన నాలుగో దేశంగా భారత్ గుర్తింపు పొందింది. చంద్రయాన్–3లో మూడింటినీ ఒకేసారి పంపిస్తున్నారు కనుక దీన్ని త్రీ ఇన్ వన్ ప్రయోగంగా ఇస్రో శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2008 అక్టోబర్ 22న చేపట్టిన చంద్రయాన్–1 ప్రయోగం విజయవంతమైంది. 2019 జూలై 15న చంద్రయాన్–2కు శ్రీకారం చుట్టింది. ఆర్బిటార్ ద్వారా ల్యాండర్, ల్యాండర్ ద్వారా రోవర్ను పంపించడమే కాకుండా 14 రకాల పేలోడ్స్ను పంపించారు. ప్రయోగమంతా సక్సెస్ అయిందనుకున్న తరుణంలో ఆఖరు రెండు నిమిషాల్లో ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టడంతో సంకేతాలు ఆగిపోయాయి. దాంతో ఆ ప్రయోగం పాక్షిక విజయం మాత్రమే సాధించింది. దాదాపు నాలుగు సంవత్సరాలు తరువాత చంద్రయాన్–3 పేరుతో మూడోసారి ప్రయోగానికి ఇస్రో ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 14వ తేదీన ఈ ప్రయోగం చేపట్టనుంది. చంద్రయాన్–3లో ప్రపొల్షన్ మాడ్యూల్లో రెండు పేలోడ్స్, ల్యాండర్లో 4 పేలోడ్స్, రోవర్లో రెండు పేలోడ్స్, అమెరికాకు చెందిన ఒక పేలోడ్ను అమర్చి పంపించనున్నారు. రూ.1,600 కోట్ల వ్యయం ► చంద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా మూడు ప్రయోగాలకు సుమారు రూ.1,600 కోట్లు వ్యయం చేస్తున్నారు. ► చంద్రయాన్–3 ద్వారా చంద్రుడి రహస్యాలు తెలుసుకోవడమే కాకుండా వ్యోమగాములను పంపించే ప్రయత్నాలు సైతం ప్రారంభమయ్యే అవకాశం వుంది. ► చంద్రయాన్–1 ప్రయోగానికి రూ.380 కోట్లు ఖర్చు చేశారు. ► చంద్రయాన్–2 ప్రాజెక్టును రూ.425 కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచి్చంది. ఈ ప్రయోగాన్ని నిర్వహించేందుకు పదేళ్లు సమయం పట్టడంతో ఖర్చు అదనంగా రూ.173 కోట్లు పెరిగింది. అంటే చంద్రయాన్–2కు రూ.598 కోట్లు వ్యయం చేశారు. ► చంద్రయాన్–3 ప్రయోగానికి దాదాపు రూ.615 కోట్లు వెచ్చిస్తున్నారు. -
ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్ అభినందనలు
-
ఎస్ఎస్ఎల్వీ–డీ2 ప్రయోగానికి సర్వం సిద్ధం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భాతర అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సూళ్లూరుపేట సమీపంలో ఉన్న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ–డీ2)ను శుక్రవారం ఉదయం 9.18 గంటలకు ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ ప్రయోగం ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, జానుస్–1, ఆజాదీ శాట్–2 అనే మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఈ ప్రయోగానికి గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత (తెల్లవారితే శుక్రవారం) 2.18 గంటలకు కౌంట్ డౌన్ను ప్రారంభిస్తారు. ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ పర్యవేక్షణలో ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ ఈఎస్ పద్మకుమార్ ఆధ్వర్యాన మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం గురువారం ఉదయం నిర్వహించారు. అనంతరం లాంచ్ ఆథరైజేషన్ బోర్డ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో మరో సమావేశాన్ని నిర్వహించి కౌంట్డౌన్, ప్రయోగ సమయాలను అధికారికంగా నిర్ణయించారు. ఎస్ఎస్ఎల్వీ–డీ1 పేరుతో గత ఏడాదిలో చేసిన మొదటి ప్రయోగం విఫలం కావడంతో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. రాకెట్ వివరాలు... ప్రయోగం ఇలా... ఎస్ఎస్ఎల్వీ–డీ2 రాకెట్ 34 మీటర్లు పొడవు, రెండు మీటర్లు వెడల్పు, 119 టన్నుల బరువు కలిగి ఉంది. దీనిని నాలుగు దశల్లో ప్రయోగించనున్నారు. ఈ రాకెట్ మొదటి దశను 87 టన్నుల ఘన ఇంధనాన్ని ఉపయోగించి 124 సెకన్లలో పూర్తిచేస్తారు. రెండో దశను 7.7 టన్నుల ఘన ఇంధనంతో 384.2 సెకన్లలో, మూడో దశను 4.5 టన్నుల ఘన ఇంధనంతో 674.9 సెకన్లలో పూర్తి చేయనున్నారు. నాలుగో దశలో మాత్రమే 0.05 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో 785.1 సెకన్లలో పూర్తి చేస్తారు. మొదటిగా 156.3 కేజీల బరువు కలిగిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్(ఈవోఎస్–07)ను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఆంటారిస్–యూఎస్ఏకు చెందిన 10.2 కేజీల బరువు కలిగిన జానుస్–1 అనే ఉపగ్రహాన్ని 880.1 సెకన్లలో, అనంతరం 8.7 కేజీల బరువు కలిగిన ఆజాదీ శాట్–2 అనే ఉపగ్రహాన్ని 900.1 సెకన్లలో అంటే 15 నిమిషాలకు భూమికి 450 కిలోమీటర్లు ఎత్తులోని లియో ఆర్బిట్ (సూర్యునికి సమకాలిక కక్ష్య)లోకి ప్రవేశపెట్టడంతో ప్రయోగం పూర్తిచేసే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు డిజైన్ చేశారు. ఇది షార్ నుంచి 84వ ప్రయోగం కాగా, ఎస్ఎస్ఎల్వీ–డి1 సిరీస్లో రెండోది కావడం విశేషం. ఎస్ఎస్ఎల్వీ–డీ2కు ప్రత్యేక పూజలు తిరుమల: ఎస్ఎస్ఎల్వీ–డి2కు తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం ఇస్రో శాస్త్రవేత్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇస్రో డైరెక్టర్ ఏకే పాత్ర, సభ్యులు తిరుమల శ్రీవారి పాదాల చెంత ఎస్ఎస్ఎల్వీ–డి2 నమూనాను ఉంచి పూజలు చేశారు. ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ గురువారం సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని రాకెట్ నమూనాకు పూజలు నిర్వహించారు. -
ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చిన ఎల్వీఎం3-ఎం2ను విజయవంతంగా ప్రయోగించటం పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇస్రో శాస్త్రవేత్తలు మరిన్ని విజయాలు సాధించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(ఎస్డీఎస్సీ) ప్రయోగవేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లిన నూతన లాంచ్వెహికల్ఎం3–ఎం2 రాకెట్ విజయవంతంగా 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రో ఒక చరిత్రాత్మక వాణిజ్య ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఈ రకం రాకెట్ను వాణిజ్యపరమైన ప్రయోగాలకు వాడటం ఇదే తొలిసారి. తొలి యత్నంలోనే ఇస్రో గ‘ఘన’ విజయం సొంతం చేసుకుంది. ఇదీ చదవండి: ఇస్రో దీపావళి ధమాకా -
ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: పీఎస్ఎల్వీ-సీ53ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఇస్రో బృందం మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. చదవండి: పీఎస్ఎల్వీ-సీ53 రాకెట్ ప్రయోగం విజయవంతం పీఎస్ఎల్వీ-సీ53 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సింగపూర్ ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ-సీ53.. కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్కు చెందిన డీఎస్–ఈఓ అనే 365 కేజీల ఉపగ్రహం, 155 కేజీల న్యూసార్, 2.8 కేజీల స్కూబ్–1 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. పీఎస్ఎల్వీ సిరీస్లో ఇది 55వ ప్రయోగం. -
నేడు జీశాట్–24 ఉపగ్రహ ప్రయోగం
సూళ్లూరుపేట: న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్సీఐఎల్), కేంద ప్రభుత్వం తరఫున డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ (డీవోఎస్) సంయుక్తంగా రూపాందించిన జీశాట్–24 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని బుధవారం తెల్లవారుజామున ప్రయోగించనున్నారు. ఫ్రాన్స్లోని ప్రెంచి గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్–వీ వీఏ257 రాకెట్ నుంచి దీన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. బెంగళూరులోని ప్రొఫెసర్ యూఆర్ రావు స్పేస్ సెంటర్ (యూఆర్ఎస్సీ)లో రూపొందించిన 4,180 కిలోల బరువు కలిగిన జీశాట్–24 ఉపగ్రహాన్ని గత నెల 18న ఫ్రాన్స్కు పంపించిన విషయం విదితమే. ఈ ఉపగ్రహంలో 24 కేయూ బ్యాండ్ ట్రాన్స్ఫాండర్లు అమర్చారు. డీటీహెచ్ అప్లికేషన్ అవసరాలను తీర్చేందుకు పాన్ ఇండియా కవరేజీతో ఈ ఉపగ్రహాన్ని రోదసీలో పంపుతున్నారు. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ జీశాట్–24 ఉపగ్రహాన్ని టాటాప్లే అనే సంస్థకు లీజుకిచ్చింది. ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు ఫ్రాన్స్కు చేరుకుని రాకెట్ ప్రయోగం పనులను పరిశీలిస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 4,000 కిలోలకుపైన బరువున్న భారీ ఉపగ్రహాలను కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగిస్తుండగా.. ఫ్రాన్స్కు చెందిన బుల్లి ఉపగ్రహాలను వారు మన దేశం అంటే ఇస్రో నుంచి ప్రయోగిస్తున్నారు. -
అంతరిక్ష కేంద్రానికి ఆహ్వానం.. ఇలా దరఖాస్తు చేసుకోండి!
రాజాం సిటీ: యువ శాస్త్రవేత్తలను తయారుచేయాలనే లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కృషిచేస్తోంది. ఇందులో భాగంగా యువికా–2022 (యువ విజ్ఞాన కార్యక్రమం) యువ శాస్త్రవేత్తలను తయారుచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ విద్యాసంవత్సరంలో దేశవ్యాప్తంగా 9వ తరగతి చదివే విద్యార్థుల నుంచి శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడం, నూతన ఆవిష్కరణల వైపు యువతను నడిపించడం, అంతరిక్షంపై మక్కువ పెంచుకోవడం కోసం రాబోయే తరాల్లో శాస్త్రవేత్తలను గుర్తించే దిశగా ఇస్రో దృష్టి సారించి దేశవ్యాప్తంగా దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తోంది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఎస్ఆర్ఓ.జీఓవీ.ఐఎన్లలో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 10వ తేదీ వరకు అవకాశం కల్పించింది. దరఖాస్తు చేయండిలా.. విద్యార్థులు నాలుగు దశల్లో దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రతిదశలో జాగ్రత్తగా వివరాలు నమోదుచేయాలి. అసంపూర్తి దరఖాస్తులు తిరస్కరిస్తారు.యువికా–2022 కోసం ఏర్పాటుచేసిన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఎస్ఆర్ఓ.జీఓవీ.ఐఎన్ వెబ్సైట్లో విద్యార్థులు సొంత ఈ–మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్విజ్ సూచనలు చదివి ఈ–మెయిల్ క్రియేట్ చేసిన 48 గంటల వ్యవధిలో ఇస్రో ఏర్పాటుచేసిన ఆన్లైన్ క్విజ్లో పాల్గొనాల్సి ఉంటుంది. క్విజ్ అప్లోడ్ చేసిన 60 నిమిషాల తరువాత యువికా పోర్టల్లోని ఆన్లైన్ దరఖాస్తులో పూర్తి వివరాలు నమోదుచేయాలి. అనంతరం డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తుతోపాటు విద్యార్థి సంతకం చేసిన ప్రతిని, విద్యార్థి మూడేళ్లలో వివిధ అంశాల్లో రూపొందించిన ప్రగతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలి. ఇందులో ఎంపికైన వారిని ఇస్రో వడబోసి తుదిజాబితా అదే నెల 20న వెబ్సైట్లో ఉంచుతుంది. రాష్ట్రానికి ముగ్గురు విద్యార్థులు చొప్పున అవకాశం కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ (తిరువనంతపురం), యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (బెంగళూరు), స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (అహ్మదాబాద్), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (హైదరాబాద్), నార్త్ ఈస్ట్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (షిల్లాంగ్)లలో మే 16 నుంచి 28 వరకు 13 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. అర్హులు వీరే.... ఈ ఏడాది మార్చి 1 నాటికి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. వారికి ఎనిమిదో తరగతిలో వచ్చిన మార్కులతోపాటు గత మూడు సంవత్సరాల్లో పాఠశాల, జిల్లా, రాష్ట్రస్థాయి సైన్స్ఫెయిర్లో పాల్గొని ఉండాలి. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్లలో సభ్యుడై ఉండాలి. -
ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: పీఎస్ఎల్వీ సీ-52 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఈ విజయంతో అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా భారత అంతరిక్ష సామర్థ్యాలను ఇస్రో మరింత ముందుకు తీసుకెళ్లిందని సీఎం జగన్ అన్నారు. భవిష్యత్లో ఇస్రో చేపట్టే అన్ని ప్రయోగాలు విజయం సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కాగా పీఎస్ఎల్వీ-52 రాకెట్ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. ఈఓఎస్–04, ఐఎన్ఎస్-2టీడీ, ఇన్స్పైర్ శాట్-1తో పాటు మరో రెండు చిన్న ఉపగ్రహాలను పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సీ52 కక్ష్యలోకి మోసుకెళ్లింది. సోమవారం ఉదయం 5.59కి ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్లోని ఫస్ట్ లాంచింగ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. 2022లో ఇస్రో తొలి ఉపగ్రహ ప్రయోగాన్ని ప్రయోగించింది. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచదేశాల సరసన శాస్త్రవేత్తలు భారత కీర్తిపతాకను సగర్వంగా ఎగరవేశారు. చదవండి: పీఎస్ఎల్వీ-52 రాకెట్ ప్రయోగం విజయవంతం -
రోదసిలోకి భూ పరిశీలన ఉపగ్రహం
సూళ్లూరుపేట: భూ పరిశీలన ఉపగ్రహం రాడర్ ఇమేజింగ్ శాటిలైట్ (ఈఓఎస్–4)ను ఇస్రో సోమవారం రోదసిలోకి ప్రవేశపెట్టనుంది. పీఎస్ఎల్వీ – సి 52 ద్వారా 1710 కిలోల బరువు కలిగిన ఈఓఎస్–4తో పాటు భారత దేశంలోని ఐఐటీ కళాశాల విద్యార్థులు తయారు చేసిన రెండు చిన్న ఉపగ్రహాల (ఇన్స్పైర్ శాట్–1, ఐఎన్ఎస్–2టీడీ)ను కూడా రోదసీలోకి పంపుతున్నారు. శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి సోమవారం ఉదయం 5.59 గంటలకు పీఎస్ఎల్వీ–సి 52ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. షార్లోని బ్రహ్మప్రకాష్ హాలులో శనివారం ఎంఆర్ఆర్ (మిషన్ రెడీనెస్ రెవ్యూ) సమావే శం నిర్వహించారు. రాకెట్కు అన్ని పరీక్షలు నిర్వహించి ప్రయోగాన్ని లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ రాజరాజన్కు అప్పగించారు. ఆయన ఇతర శాస్త్రవేత్తలతో లాంచ్ సమావేశం నిర్వహించి ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఆదివారం ఉదయం 4.29 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 25.35 గంటల కౌంట్డౌన్ అనంతరం సోమవారం ఉదయం 5.59 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్తుంది. ఉపగ్రహాలను 529 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రసన్ కక్ష్యలో ప్రవేశపెడుతుంది. ఈఓఎస్–4 ఉపగ్రహం వ్యవసాయం, అటవీ ప్లాంటేషన్, భూమిపై జరిగే మార్పులు, వరదలు, వాతావరణం వంటి అనువర్తనాల కోసం అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ అత్యంత నాణ్యమైన ఛాయా చిత్రాల ద్వారా సమాచారాన్ని అందిస్తుంది. శ్రీవారి వద్ద పీఎస్ఎల్వీ – సి52 నమూనాకు ప్రత్యేక పూజలు తిరుమల: పీఎస్ఎల్వీ – సి52 నమూనాకు శనివారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నమూనాను ఇస్రో శాస్త్రవేత్తల బృందం తిరుమలకు తీసుకువచ్చింది. వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. నమూనాను శ్రీవారి మూల విరాట్ పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. మరిన్ని ప్రయోగాలకు సిద్ధం: – ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండటంతో మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతున్నామని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. చంద్రయాన్–3, గగన్యాన్–1కు సంబంధించి పలు ప్రయోగాత్మక పరీక్షలు చేపడతామన్నారు. పీఎస్ఎల్వీ– సి 52 ప్రయోగం విజయవంతం కావాలని శనివారం సాయంత్రం సూళ్లూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఆయన విలేకరుతో మాట్లాడుతూ గత రెండేళ్లుగా కరోనా కారణంగా ప్రయోగాలకు అంతరాయం కలిగిందన్నారు. ఇస్రో చైర్మన్గా తనకు ఇది తొలి ప్రయోగం కావడంతో విజయవంతం కావాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ దేశంలో ఉన్న సామాన్యుడికి కూడా దీర్ఘకాలిక సేవలందిస్తుందని తెలిపారు. పీఎస్ఎల్వీ సీ–53 ప్రయోగానికి కూడా సిద్ధమవుతున్నామని తెలిపారు. ఆయన వెంట షార్ అధికారి గోపీకృష్ణ తదితరులు ఉన్నారు. -
గగన్యాన్ ప్రాజెక్ట్ సిద్ధం చేస్తున్నాం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గగన్యాన్ ప్రాజెక్ట్ పనులు ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు చేపడుతున్నారని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ తెలిపారు. బుధవారం షార్లోని స్పేస్ సెంట్రల్ స్కూల్లో గణతంత్ర వేడుకలను నిర్వహించారు. రాజరాజన్ జాతీయ జెండాను ఎగు రవేశారు. అనంతరం ఆ యన మాట్లాడుతూ షార్ లో కోవిడ్ కారణంగా రెం డేళ్లుగా ప్రయోగాల సంఖ్య భారీగా తగ్గిందన్నారు. షార్లోని ప్రయోగ వేదికలను గగన్యాన్ ప్రాజె క్ట్తో పాటు చంద్రయాన్–3 ప్రయోగానికి సంబం ధించి అనేక ప్రయోగాత్మక పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. ఈ రెండు ప్రాజెక్ట్లకు సంబంధించి మౌలిక సదుపాయాలను నిర్దేశించిన సమయంలో పూర్తిస్థాయిలో సంసిద్ధం చేసేందుకు పని చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ఘన ఇంధన మోటార్లు ఉత్పత్తి, ప్రయోగ పరీక్షలను చేస్తున్నామని తెలిపారు. కమ్యూనిటీ, కనెక్టివిటీ నినాదంతో ఇస్రో పని చేస్తోందని చెప్పారు. నేడు దేశంలో 850 చానల్స్ చూడగలుగుతున్నామంటే అది ఇస్రో చేస్తున్న ప్రయోగాల వల్లేనన్నారు. దేశ సరిహద్దుల్లో చొరబాట్లు, ఉగ్రవాదుల కదలికలు వంటి వాటిని టెక్నాలజీ ద్వారా కనిపెట్టగలుగుతున్నామన్నారు. -
‘వికాస్ ఇంజన్’ సామర్థ్య పరీక్ష విజయవంతం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భవిష్యత్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించనున్న గగన్యాన్–1కు సంబంధించి మూడోసారి నిర్వహించిన వికాస్ ఇంజన్ సామర్థ్య పరీక్ష విజయవంతమైంది. ఈ నెల 20న తమిళనాడు మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ సెంటర్ (ఐపీఆర్సీ)లో నిర్వహించిన సామర్థ్య పరీక్షను వివరాలను ఇస్రో అధికారులు శనివారం మీడియాకు వెల్లడించారు. మానవరహిత ఉపగ్రహాల ప్రయోగాన్ని నిర్వహించే ముందుగా ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని రకాలు పరీక్షలను ప్రయోగాత్మకంగా నిర్వహిస్తారు. ముందుగా క్రయోజనిక్, వికాస్ ఇంజన్ల పనితీరును, సామర్థ్యాన్ని పరీక్షించుకుంటారు. గగన్యాన్–1 ప్రాజెక్ట్ కోసం వికాస్ ఇంజన్ అర్హతను నిర్ధారించేందుకు దీర్ఘకాలిక పరీక్ష అవసరం ఉందని, వాటిని విజయవంతంగా పూర్తి చేసేందుకు ఇస్రో ప్రణాళికలు రూపొందించింది. ఆ మేరకు ముందుగా రాకెట్లోని ఇంధన దశలను శాస్త్రవేత్తలు పరీక్షించారు. గగన్యాన్–1 ప్రయోగాన్ని జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే రెండు సార్లు వికాస్ ఇంజన్లను పరీక్షించారు. వికాస్ ఇంజన్ను 25 సెకన్ల పాటు మండించి ఇంజన్ పనితీరును పరీక్షించినట్లు ఇస్రో అధికారులు తెలిపారు. -
వచ్చే నెల 5న జీఐ శాట్ ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నూతనంగా రూపొందించిన జియో ఇమేజింగ్ శాటిలైట్ (జీఐ శాట్–1)ను మార్చి 5వ తేదీన ప్రయోగించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. అదేవిధంగా మార్చి 10న రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ (రిశాట్)ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఒకే నెలలో రెండు ప్రయోగాలు చేయనుండటంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబంధిత పనుల్లో నిమగ్నమయ్యారు. ఇస్రో చరిత్రలో నూతన ఉపగ్రహం 2,100 కిలోల బరువైన జీఐ శాట్–1 ఇస్రో చరిత్రలో నూతన ఉపగ్రహం. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్–10 (జీఎస్ఎల్వీ మార్క్–2) రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపిస్తారు. బెంగళూరులోని యూఆర్ రావు స్పేస్ సెంటర్ నుంచి జీఐ శాట్–1 ఉపగ్రహం గత ఏడాది డిసెంబర్ 23న షార్కు చేరుకుంది. దీనిని ఈ ఏడాది జనవరి 15న ప్రయోగించాలని తొలుత భావించారు. సాంకేతిక కారణాల వల్ల ఈ నెల 10వ తేదీకి వాయిదా వేశారు. రాకెట్కు శిఖర భాగాన ఉపగ్రహాన్ని అమర్చి హీట్షీల్డ్ క్లోజ్ చేసే క్రమంలో తలెత్తిన చిన్నపాటి సాంకేతిక లోపంతో ఈనెల 25కు వాయిదా వేసుకున్నారు. సాంకేతికపరమైన లోపాన్ని సవరించే క్రమంలో కాస్త ఆలస్యం కావడంతో మార్చి 5న దీనిని ప్రయోగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జీఐ శాట్ ప్రత్యేకతలివీ.. నూతన ఉపగ్రహం జీఐ శాట్–1ను భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియో ఆర్బిట్ (భూ స్థిర కక్ష్య)లోకి ప్రవేశపెడతారు. భూమిని పరిశోధించేందుకు ఇప్పటి వరకు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ (దూర పరిశీలనా ఉపగ్రహాలు) భూమికి 506 నుంచి 830 కిలోమీటర్లు ఎత్తులో వున్న సన్ సింక్రనస్ ఆర్బిట్ (సూర్యానువర్తన ధ్రువ కక్ష్య)లోకి మాత్రమే పంపించేవారు. కమ్యూనికేషన్ శాటిలైట్స్ (సమాచార ఉపగ్రహాలు) భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియో ఆర్బిట్ (భూ స్థిర కక్ష్య)లోకి పంపేవారు. ఈసారి జియో ఇమేజింగ్ శాటిలైట్ పేరుతో రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ను మొట్ట మొదటిసారిగా భూస్థిర కక్ష్యలోకి పంపించి పనిచేసే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించడం విశేషం. ఈ తరహా ఉపగ్రహాల్లో జీఐ శాట్–1 ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ ప్రయోగం తరువాత జూలైలో జీఎస్ఎల్వీ ఎఫ్–12 రాకెట్ ద్వారా జీఐ శాట్–2 ఉపగ్రహాన్ని కూడా పంపేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. దేశ భద్రత, అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. అదేవిధంగా మార్చి 10న పీస్ఎల్వీ సీ–49 ద్వారా రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ (రిశాట్)ను ప్రయోగించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. -
స్వలింగ సంపర్కమే సైంటిస్ట్ హత్యకు దారితీసిందా?
అమీర్పేట: శాస్త్రవేత్త శ్రీధరన్ సురేష్ హత్య కేసులో మిస్టరీ వీడలేదు. స్వలింగ సంపర్కమే ఈ హత్యకు దారి తీసి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యకు గురైన సమయంలో సురేష్ ఒంటిపై దుస్తులు లేకపోవడం, ఘటనా స్థలంలో ఓ ఆయిల్ బాటిల్ లభించడంతో అనుమానాలు బలపడుతున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. అమీర్పేటలోని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసే శ్రీనివాస్ గత రెండు నెలలుగా తరుచూ సురేష్ ఉంటున్న ఫ్లాట్కు వచ్చి వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే శ్రీనివాసే హత్య చేశాడా లేక ఇతరుల పాత్ర ఉందా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. కాగా శ్రీనివాస్ పరారీలో ఉన్నట్లు ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు. అయితే సురేష్ ఫ్లాట్కు చివరిసారిగా వాషింగ్ మెషిన్ మెకానిక్ వచ్చినట్లు తేలడంతో అతడి పాత్రపై కూడాఆరా తీస్తున్నారు. భార్యకు మెసేజ్లు మాత్రమే... ఇండియన్ బ్యాంకులో పనిచేసే సురేష్ భార్య ఇందిర 2005లో బదిలీపై చెన్నై వెళ్లింది. అప్పటి నుంచి సురేష్ నగరంలో ఒంటరిగా ఉంటున్నాడు. కాగా భార్యా, భర్తల మధ్య గొడవలు ఉన్నాయని, భార్యతో అతను సరిగా మాట్లాడే వాడు కాదని, ఏదైనా అవసరముంటే సెల్కు మెసేజ్లు మాత్రమే చేసేవాడని తెలిసింది. భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవలు హత్యకు దారి తీశాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
శాస్త్రవేత్త హత్య కేసు: కీలక ఆధారాలు లభ్యం
సాక్షి, హైదరాబాద్ : నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో పనిచేస్తున్న శాస్త్రవేత్త శ్రీధరణ్ సురేష్ (56) అమీర్పేటలో మంగళవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని హత్య చేసి.. అనంతరం ఇంటికి తాళం వేసి పారిపోయారు. ప్రాధమిక విచారణలో హత్యగా తేల్చిన పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. సురేష్ కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. కేసును ఛేదించేందుకు మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలు లభించాయని తెలిపారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. (చదవండి : అమీర్పేట్లో శాస్త్రవేత్త దారుణహత్య) ఆ వ్యక్తితో సురేష్కు ఉన్న పర్సనల్ రిలేషన్షిప్ వల్ల హత్య జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని ఏసీపీ పేర్కొన్నారు. సురేష్ కాల్డేటా, హత్యకు ముందు వాసవినగర్ కాలనీలో లభించిన సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టామని తెలిపారు. సురేష్ తలకు గాయమైనట్లు ప్రైమరీ మెడికల్ హెల్త్ రిపోర్ట్లో తేలిందన్నారు. పూర్తిస్థాయి రిపోర్ట్ వస్తే నిజనిజాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించిన అసలు నిందితులను కచ్చితంగా పట్టుకొని తీరుతామని తెలిపారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం అన్ని వివరాలు తెలియజేస్తామని అన్నారు. -
ఇస్రో శాస్త్రవేత్త హత్య కేసు : ఆ వ్యక్తి ఎవరు...?
సాక్షి, హైదరాబాద్ : ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో పనిచేస్తున్న శాస్త్రవేత్త శ్రీధరణ్ సురేష్ (56) అమీర్పేటలో మంగళవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసు సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతుంది. 48 గంటలు గడిచినా.. కేసుకు సంబంధించి పోలీసులు ఎలాంటి ఆధారాలను సేకరించలేకపోయారు. సురేష్ కాల్డేటా ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు. సురేష్ వద్దకు తరచూ ఒక్క యువకుడు వచ్చేవాడని అపార్ట్మెంట్ వాచ్మెన్ తెలిపాడు. ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. ప్రాధమిక విచారణలో హత్యగా తేల్చిన పోలీసులు.. పోస్ట్మార్టం పూర్తి అయ్యాక సాయంత్రం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. భార్య, కుటుంబ సభ్యులు ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్నారు. (చదవండి : అమీర్పేట్లో శాస్త్రవేత్త దారుణహత్య) కేరళకు చెందిన శ్రీధరణ్ సురేష్ (56) అమీర్పేట్ ధరంకరం రోడ్డులోని అన్నపూర్ణ అపార్ట్మెంట్ ఫ్లాట్ నం ఎస్–2లో నివాసం ఉంటున్నాడు. బాలానగర్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ పరిశోధన సంస్థలో సురేష్ శాస్త్రవేత్తగా పనిచేస్తుండగా.. భార్య ఇందిర ఇండియన్ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా.. కుమార్తె రమ్యకు వివాహం జరిగింది. 2005లో భార్య బదిలీపై తమిళనాడుకు వెళ్లడంతో సురేష్ ఒక్కడే నగరంలో ఉండేవాడు. -
చంద్రయాన్–2: మూడో ఘట్టం విజయవంతం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన చంద్రయాన్–2 ప్రయోగంలో మూడో ఘట్టాన్ని కూడా శాస్త్రవేత్తలు విజయవంతం చేశారు. చంద్రయాన్–2 మిషన్లోని విక్రమ్ ల్యాండర్ను జాబిలమ్మకు మరింత దగ్గరగా చేర్చేందుకు బుధవారం తెల్లవారుజాము 3.42 గంటలకు ఇస్రో శాస్త్రవేత్తలు రెండోసారి కక్ష్య దూరాన్ని తగ్గించారు. దీనికోసం ల్యాండర్లో నింపిన ఇంధనాన్ని తొమ్మిది సెకన్లపాటు మండించారు. బెంగళూరు సమీపంలోని బైలాలు మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు.. ఈ ప్రక్రియను నిర్వహించారు. ప్రస్తుతం ల్యాండర్ చంద్రుడికి దగ్గరగా 35 కిలోమీటర్లు, చంద్రుడికి దూరంగా 101 కిలోమీటర్ల ఎత్తులో దీర్ఘ వృత్తాకారంలో పరిభ్రమిస్తోంది. ఈ నెల ఏడోతేదీ అర్ధరాత్రి 1.30 గంటల నుంచి రెండున్నర గంటల్లోపు ల్యాండర్ను చంద్రుని ఉపరితలంపై మృదువుగా దించనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ల్యాండర్ తలుపులు తెరుచుకుని రోవర్(ప్రగ్యాన్) చంద్రుడి మీదకు దిగి 14 రోజులపాటు తిరిగి వివిధ పరిశోధనలు చేసి సమాచారాన్ని సేకరించి భూ నియంత్రిత కేంద్రానికి పంపిస్తుంది. మరోవైపు.. ల్యాండర్ను వదిలిపెట్టిన ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలో చంద్రుడికి దగ్గరగా 96 కిలోమీటర్లు, చంద్రుడికి దూరంగా 125 కిలోమీటర్లు ఎత్తులో వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తూ ల్యాండర్ కదలికలను తెలియజేసే పనిలో నిమగ్నమై ఉంది. -
చంద్రుడికి మరింత చేరువగా
సూళ్లూరుపేట: చంద్రయాన్ –2ను చంద్రుడికి దగ్గరగా ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో శాస్త్రవేత్తలు విజయవంతమయ్యారు. బుధవారం ఉదయం 9:04 గంటలకు చేపట్టినఈ ప్రయోగంతో మూడోసారి కక్ష్యదూరాన్ని తగ్గించినట్లయింది. బెంగళూరు సమీపంలోని బైలాలు భూనియంత్రిత కేంద్రం (మిషన్ ఆపరేటర్ కంట్రోల్ సెంటర్) నుంచి ఇస్రో చైర్మన్ డాక్టర్ కే శివన్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు దీన్నిపూర్తి చేశారు. చంద్రుడికి దగ్గరగా 118 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఈ సారి చంద్రుడికి దగ్గరగా 179 కిలోమీటర్ల ఎత్తుకు పెంచుకుంటూ పోయి చంద్రుడికి దూరంగా 4,412 కిలోమీటర్లు ఎత్తును 1412 కిలోమీటర్లు ఎత్తుకు తగ్గిస్తూ ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లను చంద్రుడికి దగ్గరగా తీసుకొచ్చే ప్రక్రియ పూర్తయింది. చంద్రయాన్–2 మిషన్ భూమధ్యంతర కక్ష్యలో ఉన్నప్పుడు కక్ష్య దూరాన్ని పెంచుకుంటూ పోతే, లూనార్ ఆర్బిట్లోకి ప్రవేశించాక కక్ష్య దూరాన్ని తగ్గించుకుంటూ రావడం చంద్రయాన్–2 ప్రయోగంలో విశేషం. లూనార్ ఆర్బిట్లో చంద్రుడికి దగ్గరగా 179 కిలోమీటర్లు, చంద్రుడికి దూరంగా 1412 కిలోమీటర్ల ఎత్తులో దీర్ఘవృత్తాకారంలో ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తోంది. లూనార్ ఆర్బిట్లో కక్ష్య దూరాన్ని తగ్గించుకుంటూ వచ్చి చంద్రుడికి దగ్గరగా 30 కిలోమీటర్లు, దూరంగా 100 కిలోమీటర్లు చేరుకోవడం కోసం మరోమారు ఆపరేషన్ చేపట్టేందుకు ఇస్రోశాస్త్రవేత్తలు సంసిద్ధమవుతున్నారు. ఈ నెల 30న సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కక్ష్య దూరాన్ని మరోమారు తగ్గించే ప్రక్రియను చేపట్టనున్నట్టు ఇస్రో బుధవారం ప్రకటించింది. -
జాబిల్లి సిత్రాలు
సూళ్లూరుపేట: చంద్రయాన్– 2 మిషన్లో భాగంగా ఆర్బిటర్కు అమర్చిన టెరియన్ మ్యాపింగ్ కెమెరా (టీఎంసీ– 2) మరోమారు చంద్రుడిని ఫొటోలు తీసింది. సోమవారం వాటిని ఇస్రో విడుదల చేసింది. ఈ నెల 23న బెంగళూరు సమీపంలోని బైలాలు భూ నియంత్రణ కేంద్రం నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ఆపరేషన్ను చేపట్టారు. చంద్రుడికి దగ్గరగా 109 కిలోమీటర్లు, దూరంగా 4,375 కిలోమీటర్లు దీర్ఘ చతురస్త్రాకారంలో పరిభ్రమిస్తూ ఉత్తర వైపు ధ్రువంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ చిత్రాలను తీసింది. చంద్రయాన్ –2 మిషన్లో ల్యాండర్ను అమర్చిన ఉపకరణాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని ఇస్రో ప్రకటించింది. ఈ నెల 28న ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయే ప్రక్రియను చేపట్టేందుకు శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నారు. సెప్టెంబర్ 7న ల్యాండర్లో అమర్చిన రోవర్ను చంద్రుడి ఉపరితలంపై దించేందుకు సర్వసన్నద్ధంగా ఎదురుచూస్తున్నారు. -
చంద్రయాన్–2కు చంద్రుడి కక్ష్య దూరం తగ్గింపు
సూళ్లూరుపేట: చంద్రయాన్–2కు మంగళవారం అర్ధరాత్రి 12.50 గంటలకు చంద్రుడి కక్ష్య (లూనార్ ఆర్బిట్)లో రెండోసారి కక్ష్య దూరాన్ని తగ్గించారు. బెంగళూరు సమీపంలోని బైలాలులో ఉన్న మిషన్ ఆపరేటర్ కంట్రోల్ సెంటర్ నుంచి ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తలు విజయవంతంగా ఈ ప్రక్రియను నిర్వహించారు. చంద్రయాన్–2 మిషన్ను మంగళవారం చంద్రుడి కక్ష్యలో చంద్రుడికి దగ్గరగా 114 కి.మీ., దూరంగా 18,072 కి.మీ. ఎత్తులో మొదటి విడత ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మంగళవారం అర్ధరాత్రి 12.50 గంటలకు 1228 సెకన్లపాటు ఆర్బిటర్లో నింపిన ఇంధనాన్ని మండించి చంద్రుడి కక్ష్య దూరాన్ని తగ్గించే ప్రక్రియను శాస్త్రవేత్తలు చేపట్టారు. లూనార్ ఆర్బిట్ మొదటి విడతలో చంద్రుడికి దగ్గరగా ఉన్న 114 కి.మీ. దూరాన్ని 118 కి.మీ.కు స్వల్పంగా పెంచారు. చంద్రుడికి దూరంగా 18,072 కి.మీ. దూరాన్ని భారీగా తగ్గిస్తూ 4,412 కి.మీ. ఎత్తులోకి తీసుకొచ్చే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. చంద్రయాన్–2 మిషన్ భూమధ్యంతర కక్ష్యలో ఉన్నప్పుడు కక్ష్య దూరాన్ని పెంచుకుంటూ పోతే, లూనార్ ఆర్బిట్లో ప్రవేశించాక కక్ష్య దూరాన్ని తగ్గించుకుంటూ రావడం ఈ ప్రయోగంలో విశేషం. మిషన్ చంద్రుడికి దగ్గరగా 30 కి.మీ., దూరంగా 100 కి.మీ. చేరుకోవడం కోసం దూరాన్ని తగ్గించేందుకు మరో రెండుసార్లు ఆపరేషన్ చేపట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఈ నెల 28న ఉదయం 5.30 గంటల నుంచి 6.30 గంటల మధ్యలో చంద్రుడి కక్ష్య దూరాన్ని మూడోసారి తగ్గించే ప్రక్రియను చేపట్టనున్నట్టు ఇస్రో ప్రకటించింది. ఇప్పటివరకు ఇటు భూమధ్యంతర కక్ష్యలో, అటు చంద్రుడి కక్ష్య (లూనార్ ఆర్బిట్)లో చంద్రయాన్–2 మిషన్లోని అన్ని వ్యవస్థలు ఎలాంటి సాంకేతిక లోపం లేకుండా పనిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. -
చంద్రయాన్–2 కక్ష్య దూరం పెంపు
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్సెంటర్ షార్ కేంద్రం నుంచి గత నెల 22న ప్రయోగించిన చంద్రయాన్–2 మిషన్కు సంబంధించి శుక్ర వారం మధ్యాహ్నం 3.27 గంటలకు ఆర్బిట ర్లోని ఇంధనాన్ని 646 సెకండ్ల పాటు మండించి నాలుగోసారి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంచారు. చంద్రయాన్–2 మిషన్ రోదసీలో ఆరోగ్యకరంగా ప్రయాణి స్తోందని ఇస్రో శాస్త్ర వేత్తలు అధికారికంగా వెల్లడించారు. బెంగళూరు సమీపంలో బైలాలులో ఉన్న భూ నియంత్రిత కేంద్రం నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్–2 మిషన్లోని ఆర్బిటర్లో నింపిన ఇంధన సాయంతో కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియను నాలుగోసారి కూడా విజయవంతంగా నిర్వహించారు. జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 ఉపగ్రహ వాహకనౌక ద్వారా చంద్రయాన్–2 మిషన్ను భూమికి దగ్గరగా 170 కిలోమీటర్లు, భూమికి దూరంగా 45,475 కిలోమీటర్ల ఎత్తులో భూ మధ్యంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కక్ష్య దూరాన్ని పెంచడంలో భాగంగా గత నెల 24న మొదటి విడతలో భూమికి దగ్గరగా ఉన్న 170 కిలోమీటర్ల ఎత్తును 230 కిలోమీటర్లకు, 26న రెండోసారి భూమికి దూరంగా 45,475 కిలోమీటర్లుగా ఉన్న కక్ష్య దూరాన్ని 54,829 కిలోమీటర్లకు, 29న చేపట్టిన ఆపరేషన్లో మూడోసారి భూమికి దగ్గర్లో ఉన్న 230 కిలోమీటర్ల దూరాన్ని 270 కిలోమీటర్లకు, దూరంగా ఉన్న 54,829 కిలోమీటర్ల దూరాన్ని 71,792 కిలోమీటర్లకు ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పెంచిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం నాలుగోసారి భూమికి దగ్గరగా ఉన్న 270 కిలోమీటర్ల దూరాన్ని.. 277 కిలోమీటర్లకు, భూమికి దూరంగా ఉన్న 71,792 కిలోమీటర్ల దూరాన్ని 89,472 కిలోమీటర్ల దూరానికి విజయవంతంగా పెంచారు. మళ్లీ ఈ నెల 6న ఐదోసారి కక్ష్యదూరం పెంచే ఆపరేషన్ను చేపట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నారు. తర్వాత 14న చివరిగా చంద్రయాన్–2 మిషన్ను భూ మధ్యంతర కక్ష్య నుంచి ఒకేసారి చంద్రుడి కక్ష్యలోకి పంపే ప్రక్రియను కూడా చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
జాబిల్లిపై చంద్రయాన్–2 ఇలా..
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి జూలై 15వ తేదీన చంద్రయాన్– 2 ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు తలమునకలై ఉన్నారు. ఇప్పటికే షార్ కేంద్రంలోని రెండో ప్రయోగవేదికకు సంబంధించిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్లో రెండు దశల రాకెట్ అనుసం«ధానం పనులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో చంద్రయాన్– 2 చంద్రుడి మీద ఏ విధంగా దిగుతుందనే దానిపై ఇస్రో నాలుగు ఛాయా చిత్రాలను గురువారం విడుదల చేసింది. చంద్రుడిపై ఆర్బిటర్ ద్వారా మోసుకెళ్లిన ల్యాండర్, రోవర్లు చంద్రునికి 30 కిలో మీటర్ల ఎత్తులో నుంచి దిగుతున్న నాలుగు దశల ఊహా చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. -
జీశాట్–31 ప్రయోగం సక్సెస్
శ్రీహరికోట(సూళ్లూరుపేట)/బెంగళూరు: దేశ సమాచార వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రయోగించిన జీశాట్–31 సమాచార ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 2.31 గంటలకు ఫ్రాన్స్ దేశానికి చెందిన ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్–5 ఉపగ్రహ వాహక నౌక (రాకెట్ వీఏ 247) ద్వారా జీశాట్–31 కమ్యూనికేషన్ ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని యూఆర్ రావు ఉపగ్రహ పరిశోధన కేంద్ర డైరెక్టర్ కున్హికృష్ణన్ పర్యవేక్షణలో సుమారు రూ.400 కోట్ల వ్యయంతో తయారు చేశారు. జీశాట్–31తోపాటు సౌదీకి చెందిన 1/హెల్లాస్ శాట్–4 జియోస్టేషనరీ శాటిలైట్ను ఏరియన్ అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. ప్రయోగించిన 42 నిమిషాల్లోనే 2 ఉపగ్రహాలు అత్యంత సునాయాసంగా ముందుగా నిర్ణయించిన సమయానికే నిర్దేశిత కక్ష్యలో ప్రవేశించాయి. జీశాట్–31 ఉపగ్రహాన్ని పెరిజీ (భూమికి దగ్గరగా) 250 కిలోమీటర్లు, అపోజి (భూమికి దూరంగా) 35,850 కిలోమీటర్ల ఎత్తులోని దీర్ఘ వృత్తాకార భూ బదిలీ కక్ష్యలో 3.0 డిగ్రీల కోణంలో విజయవంతంగా ప్రవేశ పెట్టారు. ఉపగ్రహం కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత బెంగళూరు సమీపంలోని హసన్లో ఉన్న మిషన్ కంట్రోల్ సెంటర్ శాస్త్రవేత్తలు తమ అధీనంలోకి తీసుకున్నారు. భూ బదిలీ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహాన్ని రెండు మూడు విడతల్లో భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియను చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. కౌరునే ఎందుకు.. జూన్, జులైలో మరో జియోస్టేషనరీ శాటిలైట్ జీశాట్30ను ఇక్కడి నుంచే ప్రయోగిస్తామని కౌరు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఎస్.పాండియన్ చెప్పారు. ఫ్రెంచ్ గయానాతో భారత్కు 1981 నుంచి అంతరిక్ష సంబంధాలు కొనసాగుతున్నాయని, ఇవి క్రమంగా మరింత బలపడుతున్నాయన్నారు. ఈ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ మార్క్–2 ద్వారా ప్రయోగించే వీలున్నప్పటికీ ఇక్కడ చంద్రయాన్–2 ప్రయోగాన్ని దృష్టిలో ఉంచుకుని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించాల్సి వచ్చిందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. బహుళ ప్రయోజనకారి.. సుమారు 2,536 కిలోలు బరువున్న ఈ అధునాతన ఉపగ్రహాన్ని ఇస్రో తయారుచేసింది. ఇందులో అత్యంత సాంకేతిక పరిజ్ఞానం గల అత్యంత శక్తివంతమైన కేయూ బాండ్ ట్రాన్స్ఫాండర్ల వ్యవస్థను అమర్చారు. ఇది ఇన్శాట్, జీశాట్ ఉపగ్రహాలకు ఆధునిక రూపంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇస్రో గతంలో ప్రయోగించిన ఇన్శాట్–4సీఆర్, ఇన్శాట్–4ఏ సమాచార ఉపగ్రహాల కాలపరిమితి త్వరలో ముగియనుంది. ఈ రెండు ఉపగ్రహాల స్థానాన్ని కూడా జీశాట్–31 ఉపగ్రహం భర్తీ చేయనుంది. ఈ ఉపగ్రహం ముఖ్యంగా భారత భూభాగం, ద్వీపాలు, అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్ర పరిసరాలను పర్యవేక్షించి తగిన సమాచారాన్ని అందించనుంది. దీని ద్వారా వీశాట్నెట్వర్క్స్, టెలివిజన్ అప్లింక్స్, డిజిటల్ శాటిలైట్ న్యూస్ గ్యాదరింగ్, సెల్యులార్ బ్యాకప్, డీటీహెచ్ టెలివిజన్ సర్వీసులు, స్టాక్ ఎక్చ్సేంజీ, ఈ–గవర్నెన్స్, ఏటీఎం సేవలన్నీ మెరుగుపడే అవకాశం ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. నూతన టెలి కమ్యూనికేషన్ అప్లికేషన్లకు అవసరమైన సమాచారాన్ని పెద్దమొత్తంలో ట్రాన్స్ఫర్ ఇది చేయనుంది. -
14న జీఎస్ఎల్వీ మార్క్–3డీ 2 ప్రయోగం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో 2 ప్రయోగాలకు సిద్ధమైంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ఈ ప్రయోగాలకు వేదికకానుంది. షార్లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈ నెల 14న సాయంత్రం జీఎస్ఎల్వీ మార్క్–3డీ2 ద్వారా 3,700 కిలోలు బరువు గల కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఉపగ్రహంలో కేఏ ఎక్స్ కేయూ మల్టీభీమ్ అండ్ ఆప్టికల్ కమ్యూనికేషన్ పేలోడ్స్ను పంపిస్తున్నారు. ఇలాంటి ట్రాన్స్ఫాండర్లు పంపించడం ఇస్రో చరిత్రలో ఇదే మొదటిసారి. గ్రామాల్లోని వనరులు, సదుపాయాలు, కావాల్సిన ఏర్పాట్లను గుర్తించి ఇది సమాచారం అందిస్తుంటుంది. ఈ ఉపగ్రహం 12 ఏళ్లపాటు సేవలందించనుంది. నెలాఖరులో పీఎస్ఎల్వీ సీ43 ప్రయోగం షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ నెల చివరిలో పీఎస్ఎల్వీ సీ43 రాకెట్ను ప్రయోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని ద్వారా హైపర్ స్పెక్ట్రల్ సిస్టం ఇమేజ్ శాటిలైట్(హైసిస్) ఉపగ్రహంతో పాటు 30 విదేశీ ఉపగ్రహాలను పంపించనున్నారు. -
కొత్త జాబ్
‘రాకెట్రీ : ది నంబీ ఎఫెక్ట్’... మాధవన్ లేటెస్ట్ సినిమా. ఇస్రో శాస్త్రవేత్త నంబీ నారాయణ్ జీవితం ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో మాధవన్ టైటిల్ రోల్ చేస్తున్నారు. నటుడిగానే కాదు.. ఈ సినిమాకి దర్శకుడిగానూ బాధ్యతలు చేపట్టారు. ఇక నంబీ నారాయణ్ గురించి చెప్పాలంటే.. విదేశీ గూఢచారి అంటూ ఆయనపై 1994లో కేసులు నమోదయ్యాయి. చాలా ఏళ్లు పోరాడిన తర్వాత ఆయన ‘నిర్దోషి’ అనే తీర్పు వచ్చింది. ఆ విధంగా జీవితంలో పెద్ద సవాల్ని ఎదుర్కొన్న నారాయణ్ పాత్ర చేయడం మంచి సవాల్లా భావిస్తున్నారు మాధవన్. ఈ చిత్రం టీజర్ను బుధవారం రిలీజ్ చేశారు. అనంత మహదేవన్తో కలసి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు మాధవన్. తమిళ, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. -
దేశంలో తప్పుడు కేసులు కోకొల్లలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో గూఢ చర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై మాజీ ఇస్త్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్పై కొనసాగిన తప్పుడు కేసులో సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పు ఇవ్వడం తెల్సిందే. ఇంతకాలం ఆయనకు మనో వేదనను కలిగించినందుకుగాను నష్ట పరిహారంగా ఆయనకు 50 లక్షల రూపాయలను చెల్లించాల్సిందిగా ఆ తీర్పులో సుప్రీం కోర్టు ఆదేశించింది. క్రయోజనిక్ రాకెట్ల తయారీకి సంబంధించిన సమాచారాన్ని పాకిస్థాన్కు అమ్మారన్న అభియోగంపై నంబి నారాయణన్పై కేరళ పోలీసులు 1994లో కేసు దాఖలు చేశారు. ఆ తర్వాత ఇది తప్పుడు కేసుంటూ దిగువ కోర్టే కొట్టివేసింది. అయితే తగిన నష్టపరిహారం కోసం నంబి నారాయణన్ సుప్రీం కోర్టు వరకు వెళ్లారు. ఇదే కేసులో అరెస్టై 1998లో కేసు నుంచి విముక్తి పొందిన మిగతా ఆరుగురిలో ఒకరు మాజీ ఇస్రో శాస్త్రవేత్త కే. చంద్రశేఖర్. సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన శుక్రవారం నాడు చంద్రశేఖర్ తీర్పు ఎలా వస్తుందో చూడాలని తీవ్ర ఉద్వేగానికి గురై కోమాలోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయన భార్య కేజే విజయమ్మ స్వయంగా మీడియాకు తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు సుప్రీం కోర్టు తీర్పు ప్రారంభం కాగా, ఆ రోజు ఉదయం 7.30 గంటల ప్రాంతంలో చంద్రశేఖర్ కోమాలోకి వెళ్లారు. ఆయన ఆదివారం ఉదయం 8.40 గంటల ప్రాంతంలో కొలంబియా ఆస్పత్రిలో మరణించారు. ఈ నకిలీ కేసులో సుప్రీం కోర్టు భారీ నష్ట పరిహారాన్ని ఇప్పిస్తుందని ఆశించిన చంద్రశేఖర్, తీర్పు వినేవరకు ఆగి ఉంటే తృప్తిగా వెళ్లేవారని ఆయన భార్య విజయమ్మ వ్యాఖ్యానించారు. దేశంలో నకిలీ కేసులు ఇదొక్కటే కాదు. ఎన్నో ఉన్నాయి. వాటిలో చిక్కుకుని ఎంతో మంది ఎన్నో బాధలు అనుభవించారు. వాటిలో ఎక్కువ ముస్లింలపై దాఖలైన టెర్రరిస్టు కేసులే. నంబి నారాయణన్ కేసులో కూడా ఎవరో ఒక ముస్లిం పేరును వెల్లడించాల్సిందిగా ఐబీ అధికారులు తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చారట. అప్పటికే ఇస్రోలో పనిచేస్తున్న అబ్దుల్ కలాం లేదా తన చిన్ననాటి మిత్రుడు అబూబేకర్ పేర్లను వెల్లడించినా ఫర్వాలేదని సూచించారట. ఈ విషయాన్ని ‘రెడీ టూ ఫైర్: హౌ ఇండియా అండ్ ఐ సర్వైవ్డ్, ది ఇస్రో స్పై కేసు’ పుస్తకంలో నారాయణన్ వెల్లడించారు. ఈ పుస్తకం గత ఏప్రిల్ పదవ తేదీన మార్కెట్లోకి వచ్చింది. గుజరాత్ అక్షరధామ్ కేసు కూడా నకిలీదే! 2002లో గుజరాత్లోని అక్షరధామ్ ఆలయంపై దాడి చేశారన్న కేసును 2014లో సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో అరెస్టైన మొత్తం ఆరుగురు ముస్లింలు అమాయకులని కోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో బుద్ధి వక్రీకరించిందంటూ పోలీసులకు కోర్టు మొట్టికాయలు వేసింది. 2008లో ఇద్దరు ఢిల్లీ ముస్లిం యువకులపై పోలీసులు టెర్రరిస్టులని ముద్రవేయడమే కాకుండా తప్పుడు సాక్ష్యాలను సృష్టించినందుకు ఢిల్లీ పోలీసులను సీబీఐ తీవ్రంగా మందలించింది. ఈ కేసును ఢిల్లీ సెషన్స్ కోర్టు 2011లో కొట్టివేసింది. నలుగురు పోలీసు అధికారులు తమ వ్యక్తగత ప్రయోజనాల కోసం తప్పుడు కేసు బనాయించారని కోర్టు తీర్పు చెప్పింది. దేశంలో పలు సందర్భాల్లో మావోయిస్టులపై కూడా పోలీసులు తప్పుడు కేసులు బనాయించారు. వ్యక్తిగత కక్షల కోసం పోలీసులు నకిలీ కేసులు బనాయించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. 2010లో ఢిల్లీ పోలీసులు ఓ వ్యక్తిపై 18 తప్పుడు కేసులు బనాయించారు. పర్యవసానంగా ఆ వ్యక్తి 16 ఏళ్లపాటు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. 2014లో ఓ టాక్సీ డ్రైవర్పై పోలీసులు దాఖలు చేసిన తప్పుడు రేప్ కేసును ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. అదే ఏడాది ఓ వ్యక్తిని హత్యకేసులో ఇరికించేందుకు ఓ పోలీసు అధికారి అఫీషియల్ డెయిరీని మార్చి వేశారు. ఈ కేసును కూడా ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే దేశవ్యాప్తంగా పోలీసులు దాఖలు చేసిన తప్పుడు కేసులు కోకొల్లలుగా తేలుతాయి. బ్రిటీష్ కాలం నుంచి వచ్చిన పోలీసు చట్టాలను మార్చక పోవడం వల్లనే పోలీసులు తప్పుడు కేసులకు పాల్పడుతున్నారు. తప్పుడు కేసులను బనాయించిన పోలీసులకు కఠిన శిక్షలు విధించేలా చట్టాలను తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నంబి నారాయణన్పై తప్పుడు కేసును బనాయించినందుకు 50 లక్షల నష్టపరిహారాన్ని ఇప్పించిన సుప్రీం కోర్టు, తప్పుడు కేసుకు బాధ్యులైన పోలీసులకు శిక్షను ప్రకటించి కొత్త చట్టాలకు స్ఫూర్తినిచ్చి ఉండాల్సింది. -
నేడే నింగిలోకి పీఎస్ఎల్వీ సీ42
శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఆదివారం రాత్రి 10.08 గంటలకు పీఎస్ఎల్వీ సీ42 ఉపగ్రహ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. దీని ద్వారా 889 కిలోల బరువు కలిగిన నోవాసార్, ఎస్ 1–4 అనే రెండు విదేశీ(బ్రిటన్) ఉపగ్రహాలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) రోదసీలోకి పంపనుంది. దీనికి సంబంధించి శనివారం మధ్యాహ్నం 1.08 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. మొదటి ప్రయోగ వేదికపై నుంచి ఆదివారం రాత్రి 10.07 గంటలకు ప్రయోగాన్ని నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. అయితే వర్షం పడే అవకాశముండటం, రాకెట్ వెళ్లే గమనంలోని అంతరిక్ష వ్యర్థాలను తప్పించేందుకు ఒక నిమిషం పొడిగించి.. ప్రయోగ సమయాన్ని ఆదివారం రాత్రి 10.08 గంటలుగా నిర్ణయించారు. ఇక 33 గంటల కౌంట్డౌన్లో భాగంగా ఇస్రో శాస్త్రవేత్తలు శనివారం రాత్రి రాకెట్కు నాలుగో దశలో ద్రవ ఇంధనం నింపి.. అందులో లోపాలేమైనా ఉన్నాయా అని పరిశీలించారు. ఆదివారం తెల్లవారుజామున రెండో దశలో ద్రవ ఇంధనం నింపే ప్రక్రియను పూర్తి చేశారు. ఆదివారం తుది విడత తనిఖీలు తనిఖీలు నిర్వహించిన అనంతరం పీఎస్ఎల్వీ సీ42 ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించనున్నారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ ఆదివారం ఉదయం షార్కు చేరుకుని కౌంట్డౌన్ ప్రక్రియను పరిశీలించనున్నారు. పీఎస్ఎల్వీ ప్రస్థానం.. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) ఇస్రోకు నమ్మకమైన అస్త్రంగా మారింది. శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి ఇప్పటిదాకా పీఎస్ఎల్వీ ద్వారా 43 ప్రయోగాలు చేయగా.. రెండు మాత్రమే విఫలమయ్యాయి. చంద్రయాన్, మంగళ్యాన్ లాంటి ప్రయోగాలతో పాటు ఒకేసారి పది ఉపగ్రహాలు, 20 ఉపగ్రహాలు.. ఆ తర్వాత 104, మళ్లీ 38 ఉపగ్రహాలను మోసుకెళ్లిన ఘనత పీఎస్ఎల్వీకే సొంతం. ఇప్పటిదాకా 43 పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా 288 ఉపగ్రహాలను ప్రయోగించగా.. ఇందులో 241 విదేశీ ఉపగ్రహాలు, 47 స్వదేశీ ఉపగ్రహాలు కావడం విశేషం. అలాగే దేశంలోని పలు విశ్వవిద్యాలయాలకు చెందిన ఐదు చిన్నపాటి ఉపగ్రహాలను పంపించిన ఘనత కూడా పీఎస్ఎల్వీదే. ఇతర దేశాల మీద ఆధారపడి ప్రయోగాలు చేసే దశ నుంచి.. ఇతర దేశాల ఉపగ్రహాలు ప్రయోగించే స్థాయికి ఎదగడానికి పీఎస్ఎల్వీ రాకెట్టే కారణం. అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా.. పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా చిన్న తరహా ఉపగ్రహాలను పంపిస్తోంది. ఇస్రోకు వాణిజ్యపరంగా ఏడాదికి సుమారు రూ.1,100 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది కూడా పీఎస్ఎల్వీ రాకెట్లే కావడం విశేషం. -
భూస్థిర కక్ష్యలోకి ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ
శ్రీహరికోట (సూళ్లూరుపేట): ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా భూ స్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహాన్ని ఈ నెల 12న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ సీ41 ఉపగ్రహ వాహకనౌక ద్వారా రోదసిలోకి పంపిన విషయం తెలిసిందే. బెంగళూరులోని హసన్లో ఉన్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ శాస్త్రవేత్తలు ఉపగ్రహంలోని ఇంధనాన్ని నాలుగు దశలుగా మండించి ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో పెరిజీ (భూమికి దగ్గరగా) 35,462 కిలోమీటర్లు, అపోజి (భూమికి దూరంగా) 35,737 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ప్రయోగం జరిగిన రోజున ఉపగ్రహాన్ని పెరిజీ 284 కిలోమీటర్లు, అపోజి 20,650 కిలో మీటర్ల ఎత్తులోని భూస్థిర బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టిన విషయం విదితమే. అనంతరం మూడు విడతలుగా కక్ష్యదూరాన్ని పెంచిన శాస్త్రవేత్తలు.. ఆదివారం రాత్రి నాలుగో విడత కక్ష్య దూరాన్ని పెంచి ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. దీంతో ఈ ప్రయోగం పూర్తిగా విజయవంతమైందని ఇస్రో శాస్త్రవేత్తలు సోమవారం అధికారికంగా ప్రకటించారు. -
నేడు షార్లో పీఎస్ఎల్వీ సీ41 ప్రయోగం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ దవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ41 ఉపగ్రహ వాహకనౌకను గురువారం తెల్లవారుజామున 4.04 గంటలకు ప్రయోగించనున్నారు. 32 గంటల కౌంట్డౌన్ ప్రక్రియలో భాగంగా బుధవారం తెల్లవారుజాము నుంచి రాకెట్కు నాలుగో దశలో ద్రవ ఇంధనం నింపే కార్యక్రమాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. అనంతరం రాత్రికి రెండో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను కూడా పూర్తి చేశారు. రాకెట్కు తుది విడత పరీక్షలు నిర్వహించి హీలియం, నైట్రోజన్ గ్యాస్ నింపే పనులను పూర్తిచేసి రాకెట్కు అవసరమైన అన్ని వ్యవస్థలను శాస్త్రవేత్తలు అప్రమత్తం చేశారు. గురువారం తెల్లవారుజామున 4.04 గంటలకు 1,425 కిలోల బరువు కలిగిన ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ ఉపగ్రహాన్ని రోదసీలోకి మోసుకెళ్లేందుకు శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఈ ప్రయోగ పనులను పర్యవేక్షించేందుకు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ మంగళవారం రాత్రే షార్కు చేరుకుని కౌంట్డౌన్ ప్రక్రియను పరిశీలించారు. బుధవారం ఉదయం స్థానిక చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ఈ ప్రయోగం విజయవంతమవ్వాలని మొక్కుకున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత్కు పూర్తిగా సొంత నావిగేషన్ సిస్టం అందుబాటులోకి రానుంది. -
పీఎస్ఎల్వీ సీ41 ప్రయోగానికి కౌంట్డౌన్
శ్రీహరికోట (సూళ్లూరుపేట): సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) నుంచి ఈ నెల 12న వేకువజామున 4.04 గంటలకు ప్రయోగించనున్న పీఎస్ఎల్ వీ సీ41 ఉపగ్రహ వాహకనౌకకు మంగళవారం రాత్రి 8.04 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. పీఎస్ఎల్వీ సీ41 ద్వారా 1,425 కిలోల బరువు కలిగిన ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ (రీప్లేస్మెంట్) ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. పీఎస్ఎల్వీ సిరీస్లో ఇది 43వ ప్రయోగం కావడం విశేషం. ఈ ప్రయోగంతో దేశానికి సొంత నావిగేషన్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుంది. -
శ్రీవారి సేవలో ఇస్రో శాస్త్రవేత్తలు
తిరుమల: పీఎస్ఎల్వీ- సీ38 వాహక నౌకను అంతరిక్షంలోకి పంపనున్న నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇస్రో చెందిన శాస్త్రవేత్తలకు టీటీడీ అదికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. శుక్రవారం నింగిలోకి పంపనున్న పీఎస్ఎల్వీ - సీ 38 వాహకనౌక నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
రోదసీలో వినూత్న ప్రయోగాలు భారత్ సొంతం
- విక్రం సారాబాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ కె.శివన్ - 104 ఉపగ్రహాలను ఏకకాలంలో అంతరిక్షంలోకి పంపిన ఇస్రో శాస్త్రవేత్తలకు రవీంద్రభారతిలో ఘన సన్మానం సాక్షి, హైదరాబాద్: రోదసీ(అంతరిక్షం)లో వినూత్న ప్రయోగాలు చేయటంలో ప్రపంచంలోనే భారత్ ప్రత్యేక గుర్తింపు పొందిందని విక్రం సారా బాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం డైరెక్టర్ డాక్టర్ కె.శివన్ అన్నారు. రవీంద్రభారతిలో మంగళవారం ప్లాంజెరీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల అంతరిక్ష కక్ష్యలోకి 104 శాటిలైట్లను పీఎస్ఎల్వీ –సీ 37 ద్వారా ఏకకాలంలో ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ శివన్ మాట్లాడుతూ.. అంతరిక్షంలోకి ఒకేసారి 2, 3 శాటిలైట్లను పంపిన సందర్భాలు ఉన్నాయని, కానీ ఏకకాలంలో 104 శాటిలైట్లను రోదసీలోకి పంపి 500 సెకన్ల తక్కువ వ్యవధిలో వాతావరణ కాలుష్యం జరగకుండా అంతరిక్షంలో విడివడిన అపూర్వ ఘట్టం ఇటీవల జరి గిన ప్రయోగమని చెప్పారు. రూ.కోట్ల ఖర్చుతో కూడిన రోదసీ ప్రయోగాల అంతిమ లక్ష్యం సామాన్య మానవులకు ప్రయోజనం కలిగించేందుకేనని వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతి థిగా హాజరుకావాల్సిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అనివార్య కారణాల వల్ల హాజరుకాలే దు. ఆయన ఆడియో, వీడియో సందేశాన్ని పంపా రు. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని, అన్ని రంగాల్లోనూ ప్రత్యేకించి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో భారత్ ముందుకు దూసుకెళ్తోందని సందేశంలో వెంకయ్య పేర్కొన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలను సత్కరించడం అంటే.. వారిపట్ల ప్రజలకు ఉన్న గౌరవాన్ని తెలియజేయడమేనని అన్నారు. అనంతరం ఇస్రో శాస్త్రవేత్తలు డాక్టర్ శివన్, ఆర్.హుట్టన్, టి.సుందరమూర్తి, ఐ.సుధ, బేబీ అబ్రహం, బి.జయకుమార్, ఏజీ రాధాకృష్ణన్, కేపీ రాజ, దీపక్ నేజి, దీపా మురళీధర్లను మేడ్చెల్ గీతా ఆశ్రమ ఆధ్యాత్మిక గురువు సాయిబాబా చేతుల మీదుగా సత్కరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్య కుమార్తె దీపా వెంకట్, ప్లాంజెరీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నారాయణ, రాజ్యలక్ష్మి దంపతులు తదితరులు పాల్గొన్నారు. -
ఇస్రో ప్రయోగం అద్భుతం
-
ఇస్రో ప్రయోగం అద్భుతం
ఒకేసారి 104 ఉపగ్రహాల ప్రయోగంతో దేశానికి కీర్తి ప్రతిష్టలు ♦ దేశానికి మరింత మంది శాస్త్రవేత్తలు అవసరం ♦ రికార్డు స్థాయి వ్యవసాయ ఉత్పత్తిలో రైతుల కృషి అభినందనీయం ♦ అవినీతి వ్యతిరేక పోరులో ‘డిజిటల్’ది కీలక పాత్ర ♦ ‘మన్ కీ బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: సామాన్యులకు సాంకేతిక ప్రయోజన లబ్ధి చేరువయ్యేందుకు దేశంలో మరింతమంది శాస్త్రవేత్తల అవసరముందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ‘మన్ కీ బాత్’లో భాగంగా ఆదివారం రేడియోలో ప్రసంగిస్తూ... ఒకేసారి 104 ఉపగ్రహాల్ని ప్రయోగించి రికార్డు సృష్టించిన ఇస్రో శాస్త్రవేత్తల కృషి అభినందనీయమన్నారు. అంగా రక గ్రహంపైకి మంగళయాన్ గం తర్వాత అంతరిక్ష చరిత్రలో ఇస్రో ప్రపంచ రికార్డు లిఖించిందని కొనియాడారు. ‘పీఎస్ఎల్వీ రాకెట్ 38వ విజయవంత ప్రయోగంలో 104 ఉపగ్రహాల్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టడం అభినందనీయం. ఇస్రో శాస్త్రవేత్తలు దేశానికి ఎంతో కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టారు. ఇస్రో బృందంలో ఎంతో మంది యువ శాస్త్రవేత్తలతో పాటు మహిళలు కూడా ఉన్నారు. పీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాల్లో కార్టోశాట్ 2డీ ఒకటి... అది ఇప్పటికే పనిచేయడం మొదలుపెట్టింది. పట్టణాభివృద్ధి కోసం వనరులు, మౌలిక వసతుల్ని గుర్తించడం, ప్రణాళికలు రూపొందించేందుకు అది ఉపయోగపడుతుంది’ అని ప్రధాని పేర్కొన్నారు. యువతలో సైన్స్ పట్ల ఆసక్తి పెరగాలి బాలాసోర్ నుంచి బాలిస్టిక్ క్షిపణి నిరోధక పరీక్ష విజయవంతమవడాన్ని కూడా ప్రధాని ప్రశంసించారు. ‘ఆ క్షిపణికి భూతలం నుంచి 100 కి.మీ. ఎత్తులో శత్రువుల క్షిపణుల్ని నాశనం చేయగల సామర్థ్యముంది. ప్రపంచంలో కేవలం నాలుగైదు దేశాల వద్ద మాత్రమే అలాంటి సామర్థ్యం ఉంది’ అని పేర్కొన్నారు. యువతరంలో సైన్స్ పట్ల ఆసక్తి పెరగాలని మోదీ అభిలషించారు. సామాన్యుల అవసరాల మేరకు సైన్సు ఉపయోగపడితే అప్పుడది మానవజాతికి ఎంతో విలువైన సాధనం అవుతుందని చెప్పారు. ప్రజోపయోగ ఆవిష్కరణలు అవసరం ఇటీవల జరిగిన 14వ ప్రవాసీ భారతీయ దివస్ పోటీల్ని ప్రధాని గుర్తు చేశారు. ‘ప్రవాసీ భారతీయ దివస్లో ప్రజలకు ఉపయోగపడే ఆవిష్కరణల్ని ప్రదర్శించారు. మత్స్యకారులకు ఉపయోగపడేలా చేపలు ఎక్కడ ఎక్కువ ఉంటాయో తెలియచెప్పే పరికరం అందులో ఒకటి. వాతావరణ సమాచారంతో పాటు, సముద్రంలో మార్పుల సమాచారం కూడా అందిస్తుంది. పరిష్కారం కోసం సైన్సు ఎంత ముఖ్యమైందో... ఎన్నో సార్లు ఆ సమస్యలే చాటి చెప్పాయి. అందుకు 2005 ముంబై వరదలే ఉదాహరణ.. వరదల అనంతరం ప్రజల ప్రాణాలకు హాని జరగకుండా, వరద నీరు నిల్వ ఉండకుండా నివాస గృహాల నిర్మాణాల్ని చేపట్టార’ని మోదీ గుర్తుచేశారు. రికార్డు స్థాయిలో ఆహారోత్పత్తి: ఈ ఏడాది రికార్డు స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తి సాధించిన రైతుల కృషిని కొనియాడారు. ‘రైతులు మన ధాన్యాగారాల్ని నింపేందుకు ఎంతో కష్టపడ్డారు. వారి శ్రమ ఫలితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో రికార్డు సాధన సాధ్యపడింది. ఈ ఏడాది 2,700 లక్షల టన్నుల ఆహార ధాన్యాల్ని ఉత్పత్తి చేశారు. గతేడాది రైతులు సాధించిన రికార్డు కంటే ఇది 8 శాతం అదనం. పేదల అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని రైతులు వేర్వేరు రకాల పప్పు దినుసుల్ని సాగుచేశారు’ అంటూ ప్రశంసలు కురిపించారు. మహిళ ప్రాముఖ్యాన్ని వివరిస్తూ.. క్రీడలు, అంతరిక్ష విజ్ఞానం ఇలా రంగమేదైనా మహిళలు వెనకంజలో ఉండకూడదన్నారు. నగదు వాడకం తగ్గుముఖం పడుతోంది డిజిటల్ చెల్లింపుల విధానం నల్లధనానికి అడ్డుకట్ట వేస్తుందని, అవినీతి వ్యతిరేక పోరులో కీలక పాత్ర పోషిస్తుందని మోదీ పేర్కొన్నారు. ‘యువత అవినీతి వ్యతిరేక సభ్యులుగా మారాలి. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్ చెల్లింపుల పథకాలకు యువత ప్రచార కర్తలుగా మారాలి. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించాలి. నల్లధనం, అవినీతికి వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర పోషించే డిజిటల్ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలి. నగదుపై ఆధారపడే మనస్తత్వాన్ని ప్రజలు క్రమంగా వదులుకుంటున్నారు. డిజిటల్ కరెన్సీ వైపు అడుగులు వేస్తున్నారు. చెల్లింపుల కోసం యువత వారి మొబైల్ ఫోన్లను కొత్త సాధనంగా వినియోగిస్తూ ఈ విధానాన్ని ముందుకు నడిపిస్తున్నారు. గత రెండు నెలల్లో 10 లక్షల మంది ప్రజలకు ప్రోత్సాహకాలు ఇచ్చాం. 50 వేల మంది వర్తకులు బహుమతులు గెలుచుకున్నారు. డిజిటల్ చెల్లింపు పథకాలు వినియోగించే వారికి ప్రోత్సాహకాలు ఏప్రిల్ 14తో ముగుస్తాయి. ప్రతి ఒక్కరూ 125 మందికి భీమ్ యాప్ డౌన్ లోడ్ చేసుకునేలా సాయం చేయాలి’ అని మోదీ కోరారు. -
జీశాట్-18 ఉపగ్రహ కక్ష్య దూరం పెంపు..
శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఫ్రెంచి గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి గురువారం ఏరియన్-5 వీఏ231 రాకెట్ ద్వారా ప్రయోగించిన 3,404 కిలోలు బరువు కలిగిన జీశాట్ -18 ఉపగ్రహానికి శుక్రవారం వేకువజామున 3.46 గంటలకు కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంచారు. ఈ సమాచార ఉపగ్రహాన్ని 251.7 కిలోమీటర్ల, పెరిజీ(భూమికి దగ్గరగా), అపోజి(భూమికి దూరంగా) 35,888 కిలోమీటర్లు ఎత్తులోని భూ బదిలీ కక్ష్య(జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్)లో దిగ్విజయంగా ప్రవేశపెట్టిన విషయం విదితమే. కక్ష్యలోకి చేరిన ఉపగ్రహాన్ని బెంగళూరు సమీపంలోని హాసన్ ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం(ఎంసీఎఫ్) వారు అధీనంలోకి తీసుకుని ఉపగ్రహంలో నింపిన 2004 కిలోల ఇంధనంలో కొంతభాగాన్ని శుక్రవారం వేకువజామున 6,040 సెకెండ్లపాటు మండించి కక్ష్య దూరాన్ని పెంచారు. ప్రస్తుతం 251.7 కిలోమీటర్ల దూరంలోని పెరీజీని 14,843 కిలోమీటర్లుకు పెంచుతూ... అపోజీని మాత్రం 35,888 కిలోమీటర్ల నుంచి 35,802 కిలోమీటర్లకు తగ్గించారు. మరో రెండు దశల్లో ఇంధనాన్ని మండించి పెరీజీని పెంచుకుంటూ జియో ట్రాన్స్ఫర్ కక్ష్య నుంచి దశల వారీగా భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్య (జియో సింక్రనస్ ఆర్బిట్)లోకి సమస్థితిలో స్థిరపరచే ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టనున్నారు. -
సూర్య వలయంపై ఇస్రో గురి
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. సూర్య వలయంపై పరిశోధనల కోసం ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-ఎక్స్ఎల్ రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని పం పేం దుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రణాళికలు తయారు చేశారు. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో రాబోయే సంవత్సరంలో ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు కసరత్తు చేస్తున్నారు. బెంగళూరులో దీని తయారీకి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇస్రో ప్రయోగించనున్న ఉపగ్రహంలో ఆదిత్య సోలార్ విండ్ ఫర్టికల్ ఎక్స్పెరిమెంట్ (యాస్పెక్స్), సోలార్ ఆల్ట్రావయొలెట్స్ ఇమేజింగ్ టెలిస్కోప్(సట్జ్), విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్స్ (వెల్సి), హై ఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ (హెలియోస్), ప్లాస్మా అనలెజర్ ప్యాకేజి ఫర్ ఆదిత్య (పాపా), సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ (సోలెక్స్) అనే ఆరు ఉపకరణాలు (పేలోడ్స్) అమర్చనున్నారు. 2017 ఆఖరులోపే ఈ ప్రయోగానికి ప్రయత్నం చేస్తున్నామని ఇస్రో చైర్మన్ కిరణ్కుమార్ తెలిపారు. -
ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు
హైదరాబాద్: ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఏటీవీ రాకెట్ ప్రయోగం విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్త్లోనూ ఇలాంటి ప్రయోగాలు మరిన్నో విజయవంతం కావాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. కాగా, నెల్లూరు జిల్లాలోని ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఆదివారం ఉదయం 6 గంటలకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెహికిల్ (ఏటీవీ) ప్రయోగం ప్రారంభమైంది. ఇస్రో శాస్త్రవేత్తలు 60 సెకన్లలోపే ఈ ప్రయోగాన్ని పూర్తిచేయగా, ఏటీవీ తొలి 5 సెకెన్లలోపే 70 కిలోమీటర్ల లక్ష్యాన్ని పూర్తిచేసింది. ఆ తర్వాత కూస్టింగ్ దశలో సెకనుకు రెండు కిలోమీటర్ల వేగంతో ఏటీవీ రాకెట్ విజయవంతంగా నింగిలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. -
ఇస్రో 'ఏటీవీ' రాకెట్ విజయవంతం
నెల్లూరు: ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఏటీవీ రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెహికిల్ (ఏటీవీ) ప్రయోగాన్ని షార్ శాస్త్రవేత్తలు 60 సెకన్లలోపే పూర్తిచేయగా, ఏటీవీ తొలి 5 సెకెన్లలోపే 70 కిలోమీటర్ల లక్ష్యాన్ని పూర్తిచేసింది. ఆ తర్వాత కూస్టింగ్ దశలో సెకనుకు రెండు కిలోమీటర్ల వేగంతో నింగిలోకు దూసుకుపోయింది. ఈ ప్రయోగాన్ని ఇస్త్రో చేర్మన్ కిరణ్కుమార్, షార్ డైరెక్టర్ శివన్ ఉన్నికృష్ణన్ తదితర శాస్త్రవేత్తలు వీక్షించారు. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఏటీవీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. దాంతో ఏటీవీ రాకెట్ ప్రయోగం విజయవంతమైనట్టు ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు.నింగిలోకి ప్రవేశపెట్టానికి రాకెట్లో స్క్రాంజెట్ మోటార్ను అమర్చి ప్రయోగించారు. ఈ ప్రయోగంలో ఆక్సిజన్కు బదులుగా గాలి ఇంధనంగా ప్రయోగించినట్టు ఇస్రో పేర్కొంది. ఏటీవీ ప్రయోగంతో భవిష్యత్తులో ప్రయోగాల వ్యయం తగ్గనుంది. అలాగే భవిష్యుత్తులో బరువైన రాకెట్లను నింగిలోకి ప్రయోగించే అవకాశం ఉంది. -
ఒకేసారి 20 ఉపగ్రహాలు
పీఎస్ఎల్వీ రాకెట్తో కక్ష్యలోకి అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో సరికొత్త చరిత్ర - విజయవంతంగా20 ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన ఇస్రో - పీఎస్ఎల్వీ సీ-34 రాకెట్తో 26 నిమిషాల్లోనే ప్రయోగం పూర్తి - భారత్కు చెందిన మూడు, అమెరికాకు చెందిన 13 ఉపగ్రహాలు - కార్టోశాట్-2 శ్రేణి ఉపగ్రహంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, భూమి వినియోగం, నీటి పంపిణీ తదితర రంగాల్లో సేవలు - రాష్ట్రపతి, ప్రధాని, సోనియా తదితర ప్రముఖుల అభినందనలు శ్రీహరికోట(సూళ్లూరుపేట): అంతరిక్ష ప్రయోగాల్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో చరిత్ర సృష్టించింది. ఒకేసారి 20 ఉపగ్రహాలను బుధవారం విజయవంతంగా నింగిలోకి పంపించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో గల షార్ (సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం) ఇందుకు వేదికయింది. షార్లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి సరిగ్గా ఉదయం 9:26 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ-సీ34) ఉపగ్రహ వాహక నౌక ద్వారా.. 17 విదేశీ ఉపగ్రహాలతో సహా మొత్తం 20 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది. కేవలం 26 నిమిషాల వ్యవధిలోనే కొత్త తరం భూ పరిశీలన ఉపగ్రహం (కార్టోశాట్-2 శ్రేణి)తో పాటు మరో 19 ఉపగ్రహాలను నిర్దేశిత సూర్యానువర్తన కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వీటిలో ఒక కేజీ బరువున్న ఉపగ్రహాల నుంచి 700 కిలోలకు పైగా బరువున్న ఉపగ్రహాల వరకూ ఉన్నాయి. మొత్తం 20 ఉపగ్రహాల బరువు దాదాపు 1,288 కిలోలు. విజయవంతంగా ముగిసిన ఈ ప్రయోగంతో వేల కోట్ల అంతరిక్ష ప్రయోగాల మార్కెట్లో భారత్ కీలక దేశంగా అవతరించింది. ఇస్రో ప్రయోగించిన 20 ఉపగ్రహాల్లో 13 అమెరికాకు చెందినవి కావటం విశేషం. అందులోనూ 12 ఉపగ్రహాలు భూమిని చిత్రీకరించే డవ్ శాటిలైట్లు. ఒక్కొక్కటి 4.7 కిలోల బరువుండే ఈ ఉపగ్రహాలు ప్లానెట్ ల్యాబ్స్ అనే సంస్థకు చెందినవి. మరొకటి గూగుల్ యాజమాన్యంలోని ఒక సంస్థకు చెందిన స్కైశాట్ జెన్-2 ఉపగ్రహం. దాని బరువు 110 కిలోలు. ఇవిగాక.. కెనడాకు చెందిన రెండు ఉపగ్రహాలు, జర్మనీ, ఇండోనేసియా దేశాల నుంచి ఒక్కో ఉపగ్రహం ఉన్నాయి. కార్టోశాట్-2 శ్రేణి ఉపగ్రహం బరువు 727.5 కిలోలు. ఇది సాధారణ రిమోట్ సెన్సింగ్ సేవలు అందిస్తుంది. ఇందులో వ్యూహాత్మక అప్లికేషన్లు కూడా ఉన్నాయి. పట్టణ, గ్రామీణ అప్లికేషన్లు, తీర భూమి వినియోగం, నియంత్రణ, రోడ్ల వ్యవస్థ పర్యవేక్షణ, నీటి పంపిణీ వంటి వినియోగ నిర్వహణ తదితరాలకు కూడా దీనిని వినియోగిస్తారు. భూ వినియోగ మ్యాపుల రూపకల్పన, కచ్చితమైన అధ్యయనం, భౌగోళిక, మానవ కల్పిత లక్షణాల మార్పును గుర్తించటం, వివిధ ఇతర భూ సమాచార వ్యవస్థ, భౌగోళిక సమాచార వ్యవస్థ అప్లికేషన్లు కూడా ఉన్నాయి. దీనితో పాటు ప్రయోగించిన.. చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీకి చెందిన సత్యభామశాట్, పుణెలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కు చెందిన స్వయం ఉపగ్రహం భారతదేశానికి చెందినవి. కిలో కన్నా తక్కువ బరువున్న స్వయం ఉపగ్రహాన్ని ఈ కాలేజీ విద్యార్థులు 170 మంది కలిసి రూపొందించారు. మారుమూల ప్రదేశాల్లోనూ సమాచార సంబంధాల కోసం ఉద్దేశించినది. ఇంతకుముందు ఇస్రో 2008లో ఒకేసారి 10 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది. ఇప్పటివరకూ ఒకే ప్రయోగంలో అత్యధిక ఉపగ్రహాలను నింగిలోకి పంపిన రికార్డు రష్యాకు చెందుతుంది. 2014లో రష్యా ఒకేసారి 37 ఉపగ్రహాలను ప్రయోగించింది. అమెరికాకు చెందిన నాసా అత్యధికంగా ఒకేసారి 29 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది. కొత్త మైలురాళ్లు దాటుతోంది ఈ ప్రయోగం విజయవంతమవటం పట్ల ఇస్రోను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ తదితర ప్రముఖులు అభినందించారు. అంతరిక్ష పరిశోధనల్లో దేశ సామర్థ్యం పెరుగుతోందని ప్రణబ్ అన్నారు. మోదీ స్పందిస్తూ.. ‘ఒకేసారి 20 ఉపగ్రహాలు. కొత్త మైలురాళ్లను అధిగమించటాన్ని ఇస్రో కొనసాగిస్తోంది. మనం అంతరిక్ష కార్యక్రమాల్లో ఇతర దేశాలకు సహాయపడే నైపుణ్యతను, సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాం’ అని ట్వీట్ చేశారు. ఇస్రోను కేంద్ర కేబినెట్ కూడా అభినందించింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు కూడా శాస్త్రవేత్తలను ప్రశంసలతో ముంచెత్తారు. జగన్ అభినందనలు ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసిన ఇస్రో శాస్త్రవేత్తలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హృదయ పూర్వకంగా అభినందించారు. ప్రయోగం విజయవంతం కావడంతో భారత్ ప్రపంచంలోని బహుళ ఉపగ్రహాలను ప్రయోగించే అగ్ర దేశాల సరసన నిలిచిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయోగ క్రమం ఇలా.. ► ఉదయం 9.25కు ప్రయోగం ప్రారంభం ► ఆరు స్ట్రాపాన్ బూస్టర్లలో నింపిన 73.2 టన్నుల ఘన ఇంధనం, కోర్ అలోన్ దశలో నింపిన 138.2 టన్నుల ఘన ఇంధనంతో 108 సెకన్లకు మొదటిదశ పూర్తి ► 42 టన్నుల ద్రవ ఇంధనంతో 260 సెకన్లకు రెండో దశ పూర్తి ►7.6 టన్నుల ఘన ఇంధనంతో 491 సెకన్లకు మూడో దశ ► 2.5 టన్నుల ద్రవ ఇంధనంతో 987 సెకన్లకు నాలుగో దశ ► ముందుగా ఇస్రో కార్టోశాట్-2ను 17.07 నిమిషాలకు భూమికి 508 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి ప్రవేశం ►17.42 నిమిషాలకు చెన్నై, పుణేలోని వర్సిటీ విద్యార్థుల సత్యభామశాట్, స్వయంశాట్ ఉపగ్రహాలు కక్ష్యలోకి.. ►18.23 నిమిషాలకు ఇండోనేసియాకు చెందిన లపాన్-ఏ3, జర్మనీకి చెందిన బిరోస్ ఉపగ్రహాలు కక్ష్యలోకి ►19 నిమిషాలకు కెనడాకు చెందిన ఎం3 ఎంశాట్, యూఎస్ఏ గూగుల్ సంస్థకు చెందిన స్కైశాట్జెన్లు కక్ష్యలోకి.. ►19.22 నిమిషాలకు కెనడా జీహెచ్బీశాట్ ► 26.20 నిమిషాలకు యూఎస్ఏకు చెందిన 12 డవ్ శాటిలైట్స్.. ►మొత్తం 26.30 నిమిషాల్లో ప్రయోగం సక్సెస్ ►ప్రయోగం తర్వాత భవిష్యత్ పరీక్షల కోసం ప్రయోగాత్మకంగా 4వ దశలోని ఇంజిన్లను మండించి మరో ఆరు నిమిషాల పాటు పీఎస్-4ను పరీక్షించి విజయం సాధించారు. వ్యయం తగ్గిస్తాం: ఇస్రో చైర్మన్ ‘‘ఒకే పేలోడ్లో 20 ఉపగ్రహాలను ప్రయోగించటం.. పక్షులను గాలిలోకి ఎగురవేయటం వంటిది’’ అని ఇస్రో చైర్మన్ ఎ.ఎస్.కిరణ్కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో ఉపగ్రహ ప్రయోగాలను ఏడాదికి 12-18కి పెంచాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా పరిశ్రమలు - ఇస్రో భాగస్వామ్యంతో పనిచేయనున్నట్లు తెలిపారు. అంతరిక్ష ప్రయోగాల్లో వ్యయాన్ని తగ్గించే దిశగా తమ కృషి కొనసాగుతుందన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి లోగా సౌత్ ఈస్ట్ ఏసియన్ ఉపగ్రహాన్ని (గతంలో సార్క్ ఉపగ్రహం) ప్రయోగించేందుకు కృషి కొనసాగుతోందని తెలిపారు. తాజా ప్రయోగంలో సూర్యానువర్తన కక్ష్యలోకి వివిధ రకాల ఉపగ్రహాలను ప్రవేశపెట్టేందుకు నాలుగోదశ (పీఎస్-04)లో ఆరు నిమిషాల పాటు చేసిన ప్రయోగాత్మక పరీక్షలో సఫలమయ్యామన్నారు. కాగా, పీఎస్ఎల్వీ 35వ వరుస విజయవంతమైన కార్యక్రమాల్లో తాజా ప్రయోగం భారీ విజయమని షార్ డెరైక్టర్ పి.కున్నికృష్ణన్ పేర్కొన్నారు. ఇస్రోకు, భారత్కు పీఎస్ఎల్వీ ఒక చిహ్నంగా నిలిచిందని అభివర్ణించారు. ఈ విజయం ఒక ప్రధాన మైలురాయి అని మిషన్ డెరైక్టర్ డి. జయకుమార్ చెప్పారు. కార్టోశాట్ -2 శ్రేణి ఉపగ్రహం ద్వారా గ్రామీణ, పట్టణాభివృద్ధి, సమాచార వ్యవస్థ, కొత్త ప్రాంతాల్లో నిర్దిష్ట వ్యవసాయం వంటి పలు రంగాల్లో సామర్థ్యం పెరుగుతుందని ఆ ప్రాజెక్ట్ డెరైక్టర్ సత్యానంద్ రావు తెలిపారు. -
భారత జాతీయ జెండా విశ్వకేతనం ఘనత ఇస్రోదే
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత క్షేత్రీయ దిక్సూచి వ్యవస్థ (ఐఆర్ఎన్ఎస్ఎస్) సిరీస్లో ఏడో నావిగేషన్ ఉపగ్రహాన్ని గురువారం విజయవంతంగా ప్రయోగించి అంతరిక్ష విజయాల వినువీధిలో భారత జాతీయ త్రివర్ణ పతాకాన్ని విశ్వకేతనం చేసిన ఘనత ఇస్రో శాస్త్రవేత్తలకే దక్కిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీస్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు ప్రయోగించి పీఎస్ఎల్వీ సీ33 ప్రయోగాన్ని ఆయన న్యూఢిల్లీ నుంచి తిలకించారు. వాస్తవంగా ప్రయోగాన్ని స్వయంగా వీక్షించి, నావిగేషన్ సిస్టంను జాతికి అంకింతం చేయడానికి విచ్చేస్తారని ప్రచారం జరిగింది. ఆయన రాలేకపోవడంతో ప్రయోగం విజయవంతం కాగానే న్యూఢిల్లీ నుంచి ఇస్రో శాస్త్రవేత్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఇది ఇస్రో చేసిన ప్రయోగాల్లో చరిత్రాత్మకమై ఘట్టమని, దీన్ని యజ్ఞంలా తీసుకుని ఏడు నావిగేషన్ ఉపగ్రహాలను వరుసగా దిగ్విజయంగా ప్రయోగించినందుకు అందరికీ అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉపగ్రహ ప్రయోగాలతో సాంకేతిక విప్లవం వచ్చిందని, వాటి ఫలితాలు సామాన్యుడికి సైతం అందుతున్నాయన్నారు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఐదు దేశాలకు మాత్రం వివిధ రకాల పేర్లుతో నావిగేషన్ సిస్టం ఉందని, పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నావిగేషన్ సిస్టం అభివృద్ధి చేసుకున్న ఆరో దేశంగా నేడు భారత్ అవిర్భవించిందని చెప్పారు. నావిగేషన్ సిస్టం అంటే నేడు సామాన్య మానవుడికే కాకుండా సముద్రంలో చేపలు పట్టుకునే మత్స్యకారులు నుంచి విమానాలు, నౌకలు నడిపే పైలైట్లు, కెప్టెన్ వరకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటారన్నారు. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు అవి ఎక్కడ జరిగాయో గుర్తించి వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా ఇది దోహదపడుతుందని వివరించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎలాంటి ప్రమాదాలు జరిగినా, ఇతరత్రా ఉపద్రవాలు జరిగినా గుర్తించి సమాచారం అందిస్తుందన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా సముద్రంలో తిరిగే ఓడలకు దిశా నిర్దేశాన్ని అందజేస్తుందన్నారు. భూమిమీద తిరిగే వాహనాలు, రైళ్లు, ఆకాశంలో తిరిగే విమానాలకు, నీటిపై తిరిగే ఓడలకు దిక్సూచి వ్యవస్థను అందించడమే కాకుండా సామాన్య మానవుడు వాడుకునే ఆండ్రాయిడ్ ఫోన్లలో నావిగేషన్ సిస్టంను అందిస్తుందని చెప్పారు. మరో రెండు, మూడు నెలల్లో ప్రతి ఒక్కరి చేతిలో నావిగేషన్ సిస్టం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. సాంకేతిక ఫలితాలు పేదా గొప్ప తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అందజేయాలనే భారత ప్రభుత్వం లక్ష్యం నేరవేరుతోందని అన్నారు. అందుకే దీన్ని జాతికి అంకింతం చేస్తున్నామని మోదీ చెప్పారు. ఇస్రో శాస్త్రవేత్తలు పదేళ్లు శ్రమించి నావిగేషన్ సిస్టంను తయారు చేసినందుకు వారికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. -
షార్ను సందర్శించిన నాసా చీఫ్ చార్లెస్ బోల్డెన్
శ్రీహరికోట(సూళ్లూరుపేట): అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) చీఫ్ చార్లెస్ బోల్డెన్తో పాటు ఆరుగురు సీనియర్ శాస్త్రవేత్తల బృందం బుధవారం షార్ను సందర్శించింది. మంగళవారం రాత్రే చెన్నైకి చేరుకున్న ఈ బృందం బుధవారం ఉదయం 10 గంటలకు షార్కు చేరుకుంది. షార్ డెరైక్టర్ కున్హికృష్ణన్ వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం కల్పనా అతిథి గృహం కాన్ఫరెన్స్ హాలులో వారికి షార్లో చేపట్టిన, చేపట్టబోతున్న ప్రయోగాలు, రాకెట్ లాంచ్ ఫెసిలిటీస్ గురించి క్షుణ్నంగా వివరించారు. ఆ తర్వాత షార్లోని మిషన్ కంట్రోల్ సెంటర్, మల్టీ ఆబ్జెక్టివ్ ట్రాకింగ్ రాడార్ సెంటర్, మొదటి, రెండో ప్రయోగవేదికలు, రాకెట్ అసెంబ్లింగ్ బిల్డింగ్, నిర్మాణంలో ఉన్న రెండో అసెంబ్లింగ్ బిల్డింగ్ను వారు సందర్శించారు. కాలుష్యంతో భూమికి కూడా అంగారక పరిస్థితి: బోల్డెన్ భోజన సమయం అనంతరం బ్రహ్మప్రకాష్ హాల్లో ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లతో శాస్త్ర సాంకేతికరంగాల్లో ఆధునిక పరిజ్ఞానం గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. రాబోయే కాలంలో వచ్చే మార్పులపై చార్లెస్ బోల్డెన్ ప్రసంగించారు. పురాణాల ప్రకారం అంగారకుడిపై జనసంచారం ఉండేదని, కార్బన్ డైఆక్సైడ్ తగ్గిపోవడంతో ఆగ్రహం ఎడారిగా మారిందని చెప్పారు. అదే పరిస్థితి భవిష్యత్తులో భూమికి కూడా వచ్చే అవకాశం లేకపోలేదని అన్నారు. కాలుష్యం పెరిగి కార్బన్ డైఆక్సైడ్ తగ్గిపోయిన రోజున భూమికి కూడా అంగారక గ్రహం పరిస్థితి వచ్చే అవకాశం లేకపోలేదని చెప్పారు. చార్లెస్ బోల్డెన్తో వచ్చిన నాసా సీనియర్ శాస్త్రవేత్తలకు రాకెట్ నమూనా జ్ఞాపికలను అందజేశారు. బెంగళూరు సైంటిఫిక్ కార్యదర్శి వైవీఎన్ కృష్ణమూర్తి, షార్ అసోసియేట్ డెరైక్టర్ టీ సుబ్బారెడ్డి, కంట్రోలర్ జేవీ రాజారెడ్డి, శాస్త్రవేత్తలు రంగనాథన్, పొంగినన్, గ్రూప్ డెరైక్టర్ పీ విజయసారధి, విశ్వనాథశర్మ, షార్ ఇంజనీర్లు పాల్గొన్నారు. -
ఇస్రో మరో మైలురాయిని దాటింది: వైఎస్ జగన్
హైదరాబాద్: పీఎస్ఎల్వీ సీ-29 ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి నింగికి ఎగిరిన పీఎస్ఎల్వీ సీ-29 రాకెట్ సింగపూర్కు చెందిన ఆరు ఉపగ్రహాలను విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ఘనతను దిగ్విజయంగా పూర్తిచేసిన ఇస్రో శాస్త్రవేత్తల కృషిని వైఎస్ జగన్ కొనియాడారు. ఈ వాణిజ్య ప్రయోగం ద్వారా దేశానికి సంపదను అందివ్వడమే కాకుండా అంతరిక్ష సాంకేతిక పరిశోధనలో మరో మైలురాయిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అధిగమించిందని ఆయన ప్రశంసించారు. -
ఇస్రో సప్తపది
నిర్ణీత సమయంలో నిర్దేశిత కక్ష్యలోకి ‘ఆస్ట్రోశాట్’ శ్రీహరికోట(సూళ్లూరుపేట) : సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం... సోమవారం ఉదయం 10 గంటల సమయం. ఖగోళ పరిశోధనల కోసం ఇస్రో చేస్తున్న మొదటి ప్రయోగం... మిషన్ కంట్రోల్రూమ్లో అంతా నిశ్శబ్దం. కౌంట్డౌన్ పూర్తికాగానే క్షణాల్లో పీఎస్ఎల్వీ సీ30 రాకెట్ ఎరుపు, నారింజ రంగులతో నిప్పులు చిమ్ముకుంటూ నింగివైపునకు దూసుకెళ్లింది. దశలవారీగా విజయవంతంగా ప్రయాణిస్తూ ఉపగ్రహాలను నిర్ణీత సమయంలో కక్ష్యలో ప్రవేశపెట్టడంతో మిషన్ కంట్రోల్రూమ్లోని శాస్త్రవేత్తలందరిలో చిరునవ్వుతో కూడిన విజయగర్వం తొణికిసలాడింది. సత్తాచాటిన పీఎస్ఎల్వీ... పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) వరసగా 30వ సారి విజయఢంకా మోగించింది. 1,513 కిలోల బరువు కలిగిన ఆస్ట్రోశాట్ ఉపగ్రహంతో పాటు మరో ఆరు విదేశీ ఉపగ్రహాలను భూమికి 650 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధ్రువకక్ష్య (సన్ సింక్రోనస్ ఆర్బిట్)లో విజయవంతంగా ప్రవేశపెట్టి ఇస్రో ‘కదనాశ్వం’ అంతరిక్ష వినువీధిలో సత్తా చాటింది. విశ్వంలోని సుదూర పదార్థాల అధ్యయనం చేయడం కోసం సుమారు 11 ఏళ్లు కష్టపడి రూపకల్పన చేసిన ఆస్ట్రోశాట్ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. 44.5 మీటర్ల ఎత్తున్న పీఎస్ఎల్వీ సీ30 రాకెట్ నాలుగు దశల్లోనూ విజయవంతం అయ్యింది. విదేశీ ఉపగ్రహాలనూ నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. రూ.178 కోట్ల వ్యయం.. 1996లో అప్పటి ఇస్రో చైర్మన్ డాక్టర్ కస్తూరిరంగన్ విశ్వంలోని గ్రహాలు, వాటి నుంచి వెలువడే వ్యర్థాలు, నక్షత్రాల పుట్టుక, వాటికి అవతల వున్న స్థితిగతులు తెలుసుకోవడానికి ఒక ఉపగ్రహ ప్రయోగాన్ని చేయాలని ప్రతిపాదించారు. దీనికి 2004లో అనుమతి వచ్చింది. 2006 నుంచి ఈ ఉపగ్రహాన్ని రూపకల్పన చేశారు. ఈ పనిలో ఇస్రోతో పాటు వివిధ వర్సిటీల భాగస్వామ్యం కూడా ఉంది. ఈ ప్రయోగం ద్వారా ఇస్రోకు ఎలాంటి ఆదాయం ఉండదని, కేవలం విశ్వం గురించి రీసెర్చి చేసే పరిశోధకులకు మాత్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కె.సూర్యనారాయణశర్మ తెలిపారు. ఈ ఉపగ్రహం తయారీకి రూ.178 కోట్లు వ్యయం చేశారని తెలుస్తోంది. ఈ ఉపగ్రహం కక్ష్యలో ఐదేళ్లపాటు సేవలు అందిస్తుంది వాణిజ్యపరమైన ప్రయోగాల్లో అర్ధసెంచరీ! విదేశీ ఉపగ్రహాల ప్రయోగాల్లో ఇస్రో అర్ధసెంచరీ మార్కును దాటింది. 1999 మే 26న పీఎస్ఎల్వీ సీ2 ద్వారా జర్మనీకి చెందిన డీఎల్ఆర్-టబ్శాట్, రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు చెందిన కిట్శాట్-3లను పంపి వాణిజ్యపర ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. తాజాగా పీఎస్ఎల్వీ సీ30తో 20 దేశాలకు చెందిన 51 ఉపగ్రహాల ప్రయోగం పూర్తయ్యింది. అత్యధికంగా జర్మనీకి చెందిన పది ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. కెనడా, సింగపూర్, జపాన్, డెన్మార్క్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, అల్జీరియా, ఇటలీ, సౌత్కొరియా, అర్జెంటీనా, ఇజ్రాయెల్, లక్సెంబర్గ్, టర్కీ, బెల్జియం, ఇండోనేసియా, నెదర్లాండ్స్, యూకే, అమెరికా దేశాలకు చెందిన వివిధ ఉపగ్రహాలను వినువీధిలోకి పంపించింది. 2016 ఆఖరు నాటికి సార్క్ ఉపగ్రహం... ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచన మేరకు సార్క్ దేశాల అవసరాల కోసం 2016 ఆఖరు నాటికి ప్రత్యేక ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నామని ఇస్రో చైర్మన్ పేర్కొన్నారు. పీఎస్ఎల్వీ సీ30 సక్సెస్మీట్లో ఆయన మాట్లాడుతూ... ఆస్ట్రోశాట్ నిర్దేశిత కక్ష్యలో ఉన్నట్టు బెంగళూరులోని ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం తెలిపిందన్నారు. ఈ ఉపగ్రహంలోని స్కై మానిటర్ నక్షత్రాల పుట్టుక, వాటికి అవతల వైపు జరిగే స్థితిగతులను అధ్యయనం చేస్తుందని చెప్పారు. సమష్టి కృషితో విజయం: ఇస్రో చైర్మన్ ప్రయోగం విజయానంతరం ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్కుమార్ మాట్లాడుతూ ఈ ప్రయోగం సమష్టి విజయమన్నారు. ఆస్ట్రోశాట్ ప్రాజెక్ట్ డెరైక్టర్ కె.సూర్యనారాయణశర్మ మాట్లాడుతూ ఉపగ్రహాన్ని తయారుచేసిన విధానాన్ని వివరించారు. ప్రయోగానికి సారథ్యం వహించిన మిషన్ డెరైక్టర్ బి.జయకుమార్, వీఎస్ఎస్సీ డెరైక్టర్ డాక్టర్ కె.శివన్, ఎల్పీఎస్సీ డెరైక్టర్ ఎస్.సోమనాథ్, షార్ డెరైక్టర్ పి.కున్హికృష్ణన్, ఐసాక్ డెరైక్టర్ ఎం.అన్నాదురై, ఎన్ఆర్ఎస్సీ డెరైక్టర్ డాక్టర్ వీకే దడ్వాల్, శాక్ డెరైక్టర్ తపన్ మిశ్రా, మరో శాస్త్రవేత్త ఎస్.రాకేష్లు ప్రయోగంలో ఎదురైన ఇబ్బందులను, అధిగమించిన సవాళ్లను వివరించారు. ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్, సీనియర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ యశ్పాల్, కేంద్ర మంత్రి సుజనాచౌదరి మాట్లాడుతూ.. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రముఖుల ప్రశంసలు ఆస్ట్రోశాట్ ప్రయోగం విజయవంతం కావ డంపై ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు, గుజరాత్ సీఎం ఆనందీబెన్ పటేల్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ తదితరులు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. -
ఇస్రో శాస్త్రవేత్తలకి అభినందనలు తెలిపిన పార్లమెంట్
-
సైనాకు ముఖ్యమంత్రులు, వైఎస్ జగన్ అభినందనలు
హైదరాబాద్ : ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్లో ఫైనల్స్ లోకి వెళ్లడంతో పాటు ప్రపంచ నెంబర్ 1 ర్యాంకు సాధించిన హైదరాబాదీ ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్కు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కె. చంద్రశేఖర్ రావు, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన జగన్ భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహం (ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం-1డీ) ఉపగ్రహ నౌక పీఎస్ఎల్వీ సి-27 రాకెట్ను శనివారం విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించిన ఇస్రో శాస్త్రజ్ఞులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఒక సందేశంలో అభినందించారు. ఈ సంవత్సరపు తొలి ప్రయోగం ఫలప్రదం అయినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. సైనాకు అభినందనలు : ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్లో బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్కు చేరుకున్నందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో జరిగే అన్ని మ్యాచ్ల్లో సైనా విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. -
ఎన్నికల విధానంలో సంస్కరణలు తేవాలి
సాక్షి, విజయవాడ బ్యూరో : ఎన్నికల విధానంలో లోపాలను తొలగించి సమగ్రమైన ఎన్నికల సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం వుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా చెప్పారు. దామాషా పద్ధతిలో పార్టీలకు వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి ఆయా పార్టీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాల్సివుందన్నారు. సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి దేశవ్యాప్తంగా 31 శాతం మంది ఓట్లు వేస్తే 288 సీట్లు వచ్చాయని, నాలుగు శాతం ఓట్లు వచ్చిన బీఎస్పీకి ఒక్క పార్లమెంటు సీటు కూడా రాలేదని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుత ఎన్నికల విధానం లోపభూయిష్టంగా ఉందనడానికి ఇది ఒక ఉదాహరణ అని తెలిపారు. ఈ సమస్యను అధికమించాలంటే దామాషా పద్ధతిని అవలంభించాలని తమ పార్టీ కోరుతోందన్నారు. ఇది అమలైనప్పుడే ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యదేశంలోని ప్రజల అభిప్రాయానికి విలువ ఇచ్చినట్లవుతుందని తెలిపారు. ప్రపంచంలోని 40 పైగా దేశాలు ఈ విధానంలో ఎన్నికలు జరుపుకుంటున్నాయని చెప్పారు. ఈ మార్పుల గురించి ఇతర పార్టీలతో కలిసి విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. పీఎస్ఎల్వీ సీ 23 ఉపగ్రహాన్ని దిగ్విజయంగా అంతరిక్షంలోకి పంపిన ఇస్రో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులకు రాజా అభినందనలు తెలిపారు. సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యులు కె నారాయణ మాట్లాడుతూ ఆగస్టు 9 నుంచి 11వ తేదీ వరకూ సీపీఐ అగ్రనేత చండ్ర రాజేశ్వరరావు శత జయంతి ఉత్సవాలను హైదరాబాద్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 4న రుణమాఫీపై మండలకేంద్రాల్లో వద్ద సామూహిక రాయబారాలు తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు రైతుల రుణాలను మాఫీ చేయాలని కోరుతూ జులై 4వ తేదీన రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ఎమ్మార్వో కార్యాలయాలు, బ్యాంకుల వద్ద సామూహిక రాయబారాలు నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ చెప్పారు. సీజన్ మన కోసం ఆగదని, ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా రుణాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. రుణాలు ఇవ్వకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. జులై 11వ తేదీన నగరం గ్యాస్ ప్రమాదంపై చర్చించేందుకు అమలాపురంలో నిపుణులతో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘అల్లూరి’ పేరుతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలి దీనికిముందు సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చేసిన తీర్మానాలను రామకృష్ణ విడుదల చేశారు. మన్యం విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో ఒక జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతూ తీర్మానం చేశారు. ఆయన వర్థంతి, జయంతులను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని తీర్మానంలో కోరారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశలో ఇప్పుడున్న 13 జిల్లాలను 25 పెంచాలని, జనాభాను దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ డివిజన్లను పెంచాలని కోరుతూ మరో తీర్మానం చేశారు. -
అపూర్వం... అపురూపం!
‘నేను వైఫల్యాలను మూటగట్టుకుంటున్నానన్నది నిజం కాదు. ఎన్ని రకాలుగా పొరపాట్లు చేయడానికి ఆస్కారముందో తెలుసుకుంటున్నాన’ంటాడు సుప్రసిద్ధ శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్. రెండు దశాబ్దాలుగా వైఫల్యాలను ఎదుర్కొన్నా అకుంఠిత దీక్షతో, పట్టుదలతో కృషి చేసిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) శాస్త్రవేత్తలు చివరకు విజయపతాక ఎగరేశారు. ఆదివారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్)నుంచి నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-డీ5 మన అంతరిక్ష విజయ ప్రస్థానంలో ఒక అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించింది. ఇస్రో కీర్తికిరీటంలో అది మరో కలికితురాయి అయింది. ఇదంత సులభంగా చేజిక్కలేదు. అలవోకగా చేతికి రాలేదు. జీఎస్ఎల్వీ (జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్) రాకెట్లకు దేశీయంగా అభివృద్ధి చేసుకున్న క్రయోజెనిక్ ఇంజన్ను ఉపయోగించాలన్నది మన శాస్త్రవేత్తల సంకల్పం. ఆ సంకల్పాన్ని సాకారం చేసుకునేందుకు వారు పడిన శ్రమ అంతా ఇంతా కాదు. వైఫల్యాలను ఎదుర్కొన్నా అవి సరిదిద్దుకోలేనిగా వారు భావించలేదు. కుంగిపోలేదు. తాము సాధించాల్సిన విజయానికి వాటిని సోపానాలుగా మలుచుకున్నారు. గత ఏడాది ఆగస్టులో దీన్ని ప్రయోగించాల్సివున్నా చివరి నిమిషంలో ఇంధనం లీక్ కావడాన్ని గమనించి వాయిదా వేశారు. ప్రయోగ వేదికనుంచి రాకెట్ను వెనక్కు తెచ్చి లోపాలను చక్కదిద్దారు. డిజైన్లో అవసరమైన మార్పులు చేశారు. ఒకటికి పదిసార్లు పరీక్షించుకుని సూక్ష్మ లోపాలను కూడా పరిహరించగలిగారు. క్రయోజెనిక్ పరిజ్ఞానం విషయంలో మన శాస్త్రవేత్తలు అంత పట్టుదలగా ఉండటానికి కారణాలున్నాయి. ఎన్నడో 1992లో ఆ పరిజ్ఞానంతో కూడిన ఇంజిన్లను, సాంకేతికతను అందజేయడానికి రష్యాతో ఒప్పందం కుదిరింది. దానికి అనుగుణంగా అది కొన్ని ఇంజిన్లను అందజేసింది కూడా. కానీ ఈలోగా మన అణు పరీక్షల నేపథ్యంలో అమెరికా ఆగ్రహించి తాను ఆంక్షలు విధించడమే కాక...రష్యా కూడా సాయం చేయడానికి వీల్లేదని అడ్డుపుల్లలేసింది. ఫలితంగా రష్యానుంచి క్రయోజెనిక్ ఇంజిన్లు రావడం ఆగిపోయింది. ఇక స్వదేశీ పరిజ్ఞానంపైనే ఆధారపడాలని మన శాస్త్రవేత్తలు సంకల్పించారు. 2010 ఏప్రిల్లో జీఎస్ఎల్వీ- డీ3ని ప్రయోగించి విఫలమయ్యారు. దాంతో ఆ తర్వాత అదే సంవత్సరం డిసెంబర్లో ఎస్ఎల్వీ-ఎఫ్6ను రష్యా ఇంజిన్తో ప్రయోగించి చూశారు. కానీ, అప్పుడూ చేదు అనుభవమే ఎదురైంది. మొత్తానికి డుసార్లు జీఎస్ఎల్వీని ప్రయోగిస్తే కేవలం రెండుసార్లు మాత్రమే విజయం చేతికందింది. పర్యవసానంగా భారీ ఉపగ్రహాలను కొన్నిసార్లు ఫ్రెంచి గయానానుంచి ప్రయోగించాల్సివచ్చింది. శాస్త్రవేత్తలకు ఇన్ని పరీక్షలు పెట్టిన క్రయోజెనిక్ పరిజ్ఞానం ఎంతో కీలకమైనది. భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తున ఉండే భూ స్థిర కక్ష్యలోనికి అధిక బరువుతో ఉండే ఉపగ్రహాన్ని పంపాలంటే అది క్రయోజెనిక్ పరిజ్ఞానంతోనే సాధ్యం. అయితే, అది అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. రాకెట్లో మొదటి దశలో ఘన ఇంధనాన్ని, రెండో దశలో ద్రవ ఇంధనాన్ని, మూడో దశలో క్రయోజెనిక్ ఇంధనాన్ని ఉపయోగించాల్సివస్తుంది. మిగిలిన రెండు దశలూ సాధారణమైనవే. కానీ, క్రయోజెనిక్ దశ కొరకరాని కొయ్య. ఇందులో వాడే హైడ్రోజన్నూ, దాన్ని మండించడానికి వాడే ఆక్సిజన్ను ద్రవరూపంలోకి మార్చాలంటే వాటిని నిర్దిష్ట స్థాయికి శీతలీకరించ్సాల్సి ఉంటుంది. ఇందులో ఏ మాత్రం లోపం తలెత్తినా హైడ్రోజన్, ఆక్సిజన్లు వాయురూపంలోకి మారిపోతాయి. హైడ్రోజన్ ద్రవ రూపంలోకి మారాలంటే మైనస్ 253 డిగ్రీల సెల్సియస్ వద్దా, ఆక్సిజన్ ద్రవరూపంలోకి మారాలంటే మైనస్ 183 డిగ్రీలవద్దా ఉండాలి. ఆ ఉష్ణోగ్రతల్లో ఉండే ఇంధనాలను శూన్యంలో మండించడమంటే మాటలు కాదు. భారీ ట్యాంకుల్లో ఉండే ఈ రెండు వాయువులనూ శీతలీక రణ స్థితిలో ఉంచడానికి అనువుగా ఇంజిన్లోని పరికరాలనూ, పైపులనూ కూడా శీతల స్థితిలోనే ఉంచాలి. శాస్త్రవేత్తలకు ఇదంతా పెను సవాల్. మనపై ఆంక్షలు విధించిన అమెరికాకు దీటైన జవాబివ్వడంతోపాటు ఒకరిపై ఆధారపడే స్థితిని అధిగమించడానికీ, భారీ వ్యయాన్ని తగ్గించుకోవడానికీ ఈ సవాల్ను శాస్త్రవేత్తలు ఛేదించారు. రష్యా క్రయోజెనిక్ ఇంజన్ల వ్యయం దాదాపు రూ.100 కోట్లుకాగా, మన శాస్త్రవేత్తలు అదే ఇంజిన్ను స్వదేశీ పరిజ్ఞానంతో రూ.40 కోట్లకు రూపొందించగలిగారు. అంతరిక్ష పరిజ్ఞానంలో గుత్తాధిపత్యాన్ని నిలుపుకోవడానికి, వాణిజ్యపరంగా భారీ మొత్తాలను రాబట్టుకోవడానికి ఇన్నాళ్లూ అగ్ర రాజ్యాలు క్రయోజెనిక్ పరిజ్ఞానాన్ని ఎవరికీ అందనివ్వలేదు. ఉన్నతస్థాయి పరిశోధనలైనా, అందుకవసరమైన తెలివితేటలైనా తమకే సొంతమని అవి భావించాయి. కానీ, మన శాస్త్రవేత్తలు వారి భ్రమలను పటాపంచలు చేశారు. వారి గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టారు. ఇదేమంత సులభంగా సమకూరలేదు. జీఎస్ఎల్వీ వైఫల్యాలు ఎదురైనప్పుడు మన శాస్త్రవేత్తలు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఆఖరికి పీఎస్ఎల్వీ ప్రయోగాలు విజయవంతమైనప్పుడూ జీఎస్ఎల్వీ వైఫల్యాలను గుర్తుచేసినవారున్నారు. వాటి సంగతేమిటని ప్రశ్నించినవారున్నారు. కానీ, శాస్త్రవేత్తలు నిరాశచెందలేదు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నాకే క్రయోజెనిక్ సాంకేతికతను సొంతం చేసుకోగలిగాయన్న ఎరుకతో పట్టుదలగా పనిచేశారు. ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అదే ఈరోజు విజయాన్ని చేరువ చేసింది. మరో రెండేళ్లలో ప్రయోగించదలుచుకున్న చంద్రయాన్-2కు, అటు తర్వాత కాలంలో ప్రయోగించదలుచుకున్న మానవసహిత అంతరిక్ష వాహక నౌకకూ జీఎస్ఎల్వీ, అందులో వాడే క్రయోజెనిక్ పరిజ్ఞానం ముఖ్యమైనవి. ఆదివారంనాటి విజయం ఈ మార్గంలో మరిన్ని ముందడుగులు వేసేందుకు దోహదపడుతుంది. అందువల్లే ఈ విజయం ఎంతో అపురూపమైనది. అపూర్వమైనది. అందుకు మన శాస్త్రవేత్తలను అభినందించాలి. -
భూ ప్రభావాన్ని దాటిన ‘మామ్’
సూళ్లూరుపేట, న్యూస్లైన్: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) అంగారకునిపైకి ప్రయోగించిన ‘మార్స్ ఆర్బిటర్ మిషన్’ (మామ్)(మంగళ్యాన్) వ్యోమనౌక బుధవారం పూర్తిగా భూ ప్రభావాన్ని దాటింది. ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు నవంబర్ 5న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ‘మంగళయాన్’ ఇటీవల భూకక్ష్యను విజయవంతంగా అధిగమించి, అంగారకుని వైపు తన పది నెలల ప్రయాణాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. భూకక్ష్యను దాటిన తర్వాత కూడా భూమి నుంచి 9.25 లక్షల కిలోమీటర్ల దూరం వరకు భూ ప్రభావం ఉంటుంది. ‘మామ్’ ఈ పరిధిని కూడా బుధవారం వేకువ జామున 1.14 గంటలకు దాటినట్లు ‘ఇస్రో’ వెల్లడించింది. -
అసలు పరీక్ష మొదలైంది!
భూ కక్ష్య నుంచి మార్స్ కక్ష్య వరకూ సవాళ్లే గ్రహాంతర అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో విజయవంతంగా తొలి అడుగు వేసింది. మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహాన్ని భూమికి కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టగలిగింది. అయితే అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది. ఆర్బిటర్ అంగారక గ్రహం వరకూ సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది. దీనిని అంగారక కక్ష్యా మార్గంలోకి ప్రవేశపెట్టడం వరకూ జరిగేది ఒక ఎత్తై ఆ తరువాత అరుణగ్రహం చేరేవరకూ ఉపగ్రహం ఇతర గ్రహాల ప్రభావానికి లోనుకాకుండా చూసుకోవడం, చేరిన తరువాత దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టడం కూడా భారత శాస్త్రవేత్తలకు సవాలు విసిరే అంశాలే. మంగళవారం విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టిన మార్స్ ఆర్బిటర్ మరో 11 రోజుల తరువాత గానీ అంగారకుడి కక్ష్య మార్గంలోకి చేరదు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు బుధవారం నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టనున్నారు. మొత్తం ఐదు దశల్లో కక్ష్య ఎత్తును పెంచేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల ఏడో తేదీ తెల్లవారుజామున చేపట్టే తొలి దశలో ఉపగ్రహం ప్రయాణించే కక్ష్యను భూమి నుంచి 28,790 కిలోమీటర్ల దూరానికి పెంచుతారు. రెండు మూడు దశలు 8, 9 తేదీల్లో చేపడతారు. ఈ రెండు దశల్లో అపోగీ (భూమి నుంచి దూరంగా ఉండే దశ) 40 వేలు, 71,650 కిలోమీటర్లు చొప్పున ఉంటుంది. చివరి రెండు దశలను ఈ నెల 11, 16వ తేదీల్లో చేపడతారు. దీంతో ఉపగ్రహం అపోగీ ఏకంగా లక్ష నుంచి 1.92 లక్షల కిలోమీటర్లకు చేరుతుంది. ఆ తరువాత అన్నీ సవ్యంగా సాగితే డిసెంబర్ ఒకటో తేదీ అర్ధరాత్రి 0.42 గంటల సమయంలో ఆర్బిటర్ను మార్స్ కక్ష్య మార్గంలోకి ప్రవేశపెడతారు. దీనిని అత్యంత ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఇక్కడి నుంచి ఆర్బిటర్ సుదీర్ఘ ప్రయాణం తర్వాత 2014 సెప్టెంబర్ 24వ తేదీన అంగారక గ్రహపు నిర్దేశిత కక్ష్యలోకి ఖచ్చితంగా చేర్చదలచుకున్న స్థానానికి ఒక 50 కిలోమీ టర్లు అటూ ఇటూగా చేరాలి. ఆర్బిటర్ అంగారకుడి సమీపంలోకి వెళ్లేందుకు దాదాపు 300 రోజుల సమయంపడుతుంది. ఈ క్రమంలో ఏదైనా తేడా వచ్చి ఉపగ్రహం దారితప్పినా, లేదా అంగారక గ్రహ కక్ష్యను చేరిన తరువాత ఈ రకమైన సమస్య వచ్చినా.. దాని మార్గాన్ని సవరించి మళ్లీ దారిలో పెట్టేందుకు కొంత ఇంధనాన్ని కేటాయించారు. మార్గ సవరణ కోసం ఇంధనాన్ని ఉపయోగిస్తే దాని ప్రభావం ఆర్బిటర్ ఆయుష్షుపై పడుతుంది. ఏ విధమైన సవరణలు లేకున్నా ఈ ఉపగ్రహం గరిష్టంగా కొన్ని నెలలు మాత్రమే పనిచేస్తుంది. మార్గ సవరణ కోసం ఎంత ఇంధనం ఉపయోగిస్తే అంతమేరకు ఆర్బిటర్ జీవితకాలం తరిగిపోతుంది. మార్స్ ఆర్బిటర్ అంగారకుడి వైపు వెళుతున్నపుడు.. దానిని నియంత్రించేందుకు, ఇతరత్రా పంపించే సమాచార సంకేతాలు ఆర్బిటర్ను చేరటానికి 20 నిమిషాల సమయం పడుతుంది. అలాగే అది తిరిగి పంపించే సంకేతాలు భూమి మీది నియంత్రణ స్టేషన్లను చేరటానికి మరో 20 నిమిషాలు పడుతుంది. అంటే.. దాదాపు 40 నిమిషాల పాటు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి ఉంటుంది. ఆర్బిటర్ అంగారకుడిని సమీపిస్తుండగానే దాని వేగాన్ని తగ్గించాలి. అలాగైతేనే అంగారక గ్రహపు కక్ష్యలోకి ఈ ఆర్బిటర్ వెళ్లగలదు. అలాకాకుండా అదే వేగం తో ప్రయాణిస్తే ఆర్బిటర్ అరుణగ్రహాన్ని దాటి దూసుకెళ్లిపోతుంది. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తిన పక్షంలో మార్స్ ఆర్బిటర్ తనకు తానుగా సేఫ్ మోడ్ (సురక్షితమైన వ్యవస్థ)లోకి వెళ్లేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అమర్చారు. ఈ విధానంలో.. భూమి నుంచి సంకేతాలతో ఆజ్ఞలు అందే వరకూ మార్స్ ఆర్బిటర్ తనకు తానే సొంత నిర్ణయాలు తీసుకుంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఏంటెనాను భూమి వైపు తిప్పి, సోలార్ ప్యానళ్లను సూర్యుడి వైపు తిప్పి సాధ్యమైనంత ఎక్కువ సౌరశక్తిని సంగ్రహించుకుంటుంది. - సైన్స్ బ్యూరో, సాక్షి ప్రయోజనం లేదా? అంగారక యాత్ర ద్వారా దేశానికి ఇప్పటికిప్పుడు వచ్చే ప్రయోజనమేదీ ఉండదు. అయితే కేవలం రూ. 450 కోట్ల ఖర్చుతో గ్రహాంతరాలకు సైతం తాము ఉపగ్రహాలను ప్రవేశపెట్టగలమని ఇస్రో ఈ ప్రయోగంతో ప్రపంచానికి చాటింది. కేవలం 15 నెలల వ్యవధిలో ఇంతటి సంక్లిష్టమైన ప్రయోగానికి రూకల్పన చేయడం, రాకెట్, ఉపగ్రహాలను నిర్మించి ప్రయోగించడం ఇస్రో సత్తాకు నిదర్శనమనడంలో ఎటువంటి సందేహమూ లేదు. భవిష్యత్తులో మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపట్టేందుకు, అంగారకుడిపైకి ల్యాండర్ లేదా రోవర్ వంటి అత్యాధునిక పరికరాలను పంపించేందుకు ఈ ప్రయో గం పునాదిగా నిలుస్తుంది.