ఇస్రో మరో మైలురాయిని దాటింది: వైఎస్ జగన్‌ | ys jaganmohanreddy congratulates isro scientists for successful launch of pslv c29 | Sakshi
Sakshi News home page

ఇస్రో మరో మైలురాయిని దాటింది: వైఎస్ జగన్‌

Published Wed, Dec 16 2015 8:21 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

ఇస్రో మరో మైలురాయిని దాటింది: వైఎస్ జగన్‌ - Sakshi

ఇస్రో మరో మైలురాయిని దాటింది: వైఎస్ జగన్‌

పీఎస్‌ఎల్వీ సీ-29 ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.

హైదరాబాద్: పీఎస్‌ఎల్వీ సీ-29 ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. శ్రీహరికోట షార్‌ కేంద్రం నుంచి నింగికి ఎగిరిన పీఎస్‌ఎల్వీ సీ-29 రాకెట్‌ సింగపూర్‌కు చెందిన ఆరు ఉపగ్రహాలను విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

ఈ ఘనతను దిగ్విజయంగా పూర్తిచేసిన ఇస్రో శాస్త్రవేత్తల కృషిని వైఎస్‌ జగన్‌ కొనియాడారు. ఈ వాణిజ్య ప్రయోగం ద్వారా దేశానికి సంపదను అందివ్వడమే కాకుండా అంతరిక్ష సాంకేతిక పరిశోధనలో మరో మైలురాయిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అధిగమించిందని ఆయన ప్రశంసించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement