Women's Day 2025
-
#WomenPower : హంపీ టెంపుల్లోని ఈ సారథుల గురించి తెలుసా?
విజయనగర సామ్రాజ్య వైభవానికి నిలువెత్తు సాక్ష్యం కర్ణాటక రాష్ట్రంలోని హంపి క్షేత్రం. హంపిలోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటి విట్టల దేవాలయం. 15వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం వారసత్వ సంపద, సంస్కృతీ విశేషాలతో నిండి ఉంటుంది. ఈ ఆలయాన్ని విట్టలకు అంకితం చేశారు కనుక దీన్ని జయ విట్టల ఆలయం అని కూడా పిలుస్తారు. విట్టలను విష్ణువు అవతారం అని అంటారు. ఆర్కిటెక్చర్, డిజైన్ విజయనగర ఆలయ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తాయి. సైన్స్కు కూడా అంతుచిక్కని అద్భుతాలకు నిలయం. ద్రావిడ నిర్మాణ శైలితో, విస్తృతమైన అలనాటి కళాకారుల ప్రతిభతో అపురూపంగా చెక్కిన శిల్పాలను చూసినపుడు తనువు రోమాంచిత మవుతుంది. ఇక్కడున్న మహా మండపం, దేవి మందిరం, కళ్యాణ మండపం, రంగ మండపం, ఉత్సవ మండపం, రాతి రధం వంటి వాటిల్లో కళావైభవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా చేతితో (గంధపు చెక్కలతో) మీటగానే సప్త స్వరాలను పలికించే సంగీత స్తంభాలు ఇలా ఒకదానికొకటి సందర్శకులు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అయితే దీన్ని ప్రత్యేకతను రక్షించే చర్యల్లో భాగంగా టూరిస్టులు ఈ స్థంభాలను తాకడానికి వీల్లేదు. దీనికి బదులుగా ఇక్కడ స్వరాలను వినాలనుకుంటే, దానికి వీలుగా ఆయా స్థంభాల వద్ద క్యూఆర్ కోడ్లుంటాయి. వాటిని మన మొబైల్ ద్వారా స్కాన్ చేసి సంబంధింత సంగీత స్వరాలను వినే వెసులుబాటు ఉంది. అయితే ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది. అదేంటో తెలుసుకుందా రండి. అంతటి విశిష్టమైన ఆలయ ప్రతిష్టను కాపాడేందుకు అక్కడి అధికారులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. విట్టల ఆలయానికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంనుంచే ప్రైవేటు వాహనాలకు అనుమతి ఉండదు. దీనికి పర్యాటకుల కోసం కాలుష్యరహిత వాహనాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో మాత్రమే పర్యాటలకు విట్టల దేవాలయ సమీపానికి వెళ్లే అవకాశం ఉంటుంది. తద్వారా పొల్యూషన్ ఎక్కువ కాకుండా జాగ్రత్త పడ్డారు. సారథులంతా మహిళలేఅయితే ఈ వాహనాలకు అందరూ మహిళా డ్రైవర్లే ఉండటం మరో ప్రత్యేకత. టూరిస్టులను విట్టల ఆలయానికి వద్దకు తీసుకెళ్లి, మళ్లీ తీసుకు వచ్చే బాధ్యత ఈ మహిళా డ్రైవర్లదే. సందర్శకులను తీసుకెళ్లి దింప, మళ్లీ వచ్చేటపుడు తిరుగు ప్రయాణంలో ఉన్నవారిని బయటికి తీసుకు వస్తారు. అలా సందర్శకుల రద్దీని నివారించే ఏర్పాటు కూడా అని చెప్పవచ్చు.ఈ సందర్భంగా మహిళా డ్రైవర్లను సాక్షి. కామ్ పలకరించింది. వారి అనుభవాల గురించి ముచ్చటించింది. గతరెండేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నామని వెల్లడించారు. తమకు ముందుగా శిక్షణ ఇచ్చి మరీ ఈ ఉద్యోగంలోకి తీసుకున్నారని తెలిపారు. ఎనిమిది గంటల డ్యూటీ ఎంతో సరదాగా గడిచిపోతుందని చెప్పారు. నిత్యం ఎంతోమంది సందర్శకులను, చాలామంది విదేశీ పర్యాటకులను చేరవేస్తూ ఉంటామని, వారి ఆనందం చూస్తే తమకు చాలా సంతోషంగా ఉంటుందని, నిజానికి చాలా గర్వంగా కూడా ఉంటుందని చెప్పారు. అలాగే టూరిస్టులతో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాట్లాడతామన్నారు. -
Women's Day మహిళా ఆర్టిస్టుల ‘సిరి శక్తి’ మెగా ఆర్ట్ ఎగ్జిబిషన్
సిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగా ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది. ‘సిరి శక్తి’ పేరుతో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చిత్రకళలో ప్రతిభను చాటుకుంటున్న మహిళల నైపుణ్యాన్ని గుర్తిస్తూ హైదరాబాద్లోని మసాబ్ ట్యాంక్లో ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. మార్చి 8 నుంచి 15వ తేదీవరకు జరుగుతున్న ఈ ప్రదర్శనలో ఎనిమిదేళ్లనుంచి 88 ఏళ్ల వయస్సున్న 118 మంది మహిళా ఆర్టిస్ట్లు తమ పెయింటింగ్స్ను ప్రదర్శిస్తున్నారు. అంతేకాదు ఈ ఎనిమిది రోజుల వేడుకలో ఒక్కో రోజును ఒక్కో ప్రత్యేకతగా ఈ ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్నారు. కళారంగంలో నిష్ణాతులైన విశిష్ట అతిధులను ఆహ్వానిస్తున్నామని సిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్ సారధులు, డైరెక్టర్ స్వామి, శివ కుమారి దంపతులు వెల్లడించారు. ఇప్పటివరకు వరకు సందర్శకుల నుంచి మంచి ఆదరణ లభించిందని, రానున్న మూడు రోజుల ప్రదర్శనను కూడా విజయవంతం చేయాలని శివ కుమారి విజ్ఞప్తి చేశారు. వీరిలో ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డి, ప్రొ. పద్మావతి, నటి గీతా భాస్కర్, ప్రముఖ ఆర్టిస్ట్ శిల్పి డా. స్నేహలతా ప్రసాద్, డా. హిప్నో పద్మా కమలాకర్ తదితరులున్నారని తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమం సృజనాత్మకత, ప్రతిభా, నైతిక విలువలను ప్రతిబింబించేలా, విశేషమైన ప్రాముఖ్యతను సంతరించుకునేలా కృషి చేశామని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ‘8’ అనే ప్రత్యేక సంఖ్యను ప్రాతిపదికగా రూపకల్పన చేయడం మరో విశేషమని పేర్కొన్నారు.గత 30 ఏళ్లుగా హిమాయత్నగర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో సిరి ఇన్స్టిట్యూట్ ద్వారా అనేకమందికి శిక్షణనిస్తున్నామని, ఇందులో మహిళలు, ఉద్యోగాలు చేసుకుంటున్నవారు, పదవీ విరమణ చేసినవారు, విద్యార్థులు ఇలా అన్ని వయసుల వారికి చిత్రకళను బోధిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు వేలాది మంది విద్యార్థులకు ఆయిల్, అక్రిలిక్, సాండ్ పెయింటింగ్, తంజావూర్ పెయింటింగ్, 3డీ క్లే ఆర్ట్, స్కెచింగ్ తదితర వివిధ మాధ్యమాల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు, అనేక చిత్ర ప్రదర్శనలను విజయవంతంగా నిర్వహించామని వెల్లడించారు. వేదిక : JNAF ALU కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మసాబ్ ట్యాంక్, హైదరాబాద్ వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు.ఫోన్: 3643419662, 9948887211 -
నారీ శక్తికి సలాం
నవాసరీ (గుజరాత్): ఏ సమాజంలోనైనా, దేశంలోనైనా మహిళలను గౌరవించడమే ప్రగతి దిశగా తొలి అడుగని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. మహిళల సారథ్యంలో సమాజ ప్రగతి దిశగా భారత్ కొన్నేళ్లుగా ముందుకు సాగుతోందన్నారు. ‘‘నారీ శక్తికి నా నమస్సులు. మహిళల ఆత్మగౌరవానికి, భద్రతకు, సాధికారతకు మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. వారిపై నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు నూతన చట్టాల్లో మరిన్ని కఠినమైన నిబంధనలు పొందుపరిచాం. వలస పాలన నాటి కాలం చెల్లిన చట్టాల స్థానంలో తెచి్చన పూర్తి దేశీయ చట్టాల్లో అత్యాచారం వంటి దారుణ నేరాలకు మరణశిక్షకు వీలు కల్పించాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తదితరాల ద్వారా మహిళలకు సత్వర న్యాయం అందిస్తున్నాం. వారిపై తీవ్ర నేరాల్లో 45 నుంచి 60 రోజుల్లోపే తీర్పులు వచ్చేలా చర్యలు చేపట్టాం. విచారణ క్రమంలో బాధిత మహిళలకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురవకుండా నిబంధనలు పొందుపరిచాం’’అని వివరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం గుజరాత్లో నవాసరీ జిల్లా వన్శ్రీ బోర్సీ గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం లక్షన్నర మందికి పైగా మహిళలు హాజరైన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ఆడపిల్ల ఆలస్యంగా ఇంటికొస్తే పెద్దవాళ్లు లక్ష ప్రశ్నలడుగుతారు. అదే మగపిల్లాడు ఆలస్యమైతే పట్టించుకోరు. కానీ అతన్ని కూడా కచ్చితంగా నిలదీయాలి’’అని తల్లిదండ్రులకు సూచించారు. ప్రపంచంలోకెల్లా సంపన్నుడిని నేనే తాను ప్రపంచంలోకెల్లా సంపన్నుడిని అంటూ ఈ సందర్భంగా మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది విని కొందరికి ఆశ్చర్యంతో కనుబొమ్మలు ముడిపడవచ్చు. కానీ ఇది నిజం. కాకపోతే సంపదపరంగా కాదు. కోట్లాది మంది తల్లులు, సోదరీమణులు, కూతుళ్ల ఆశీస్సులు నాకున్నాయి. ఆ రకంగా నేను అందరి కంటే సంపన్నుడిని. వారి ఆశీస్సులే నాకు అతి పెద్ద బలం, నా పెట్టుబడి. అవే నాకు తి రుగులేని రక్షణ కవచం కూడా’’అని వివరించారు. ప్రధాని సోషల్ ఖాతాల్లో... మహిళల విజయగాథలు పలు రంగాల్లో తమదైన ముద్ర వేసిన పలువురు మహిళా ప్రముఖులు శనివారం ప్రధాని మోదీ సోషల్ మీడియా హాండిళ్లను ఒక రోజు పాటు తామే నిర్వహించారు. తమ విజయగాథలను పంచుకున్నారు. కలలను నిజం చేసుకునేందుకు అమ్మాయిలు ధైర్యంగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. చెస్ గ్రాండ్మాస్టర్ ఆర్ వైశాలి, పారిశ్రామికవేత్తగా మారిన రైతు అనితా దేవి, అణు శాస్త్రవేత్త ఎలినా మిశ్రా, అంతరిక్ష శాస్త్రవేత్త శిల్పీ సోనీ తదితరులు వీరిలో ఉన్నారు. గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞా్ఞనంద సోదరి అయిన వైశాలి ఆరేళ్ల వయసు నుంచే చెస్ ఆడుతున్నారు. రైతు ఉత్పత్తుల కంపెనీ ద్వారా తన గ్రామానికి చెందిన వందలాది మంది మహిళలకు ఉపాధి కల్పించినట్టు అనితాదేవి వివరించారు. ఇది వారికి సంపాదనతో పాటు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కూడా కల్పించిందన్నారు. మహిళలకు ఆర్థిక సాధికారత అవసరాన్ని ఫ్రాంటియర్ మార్కెట్స్ సీఈఓ అజితా షా వివరించారు. అనంతరం వారి విజయగాథలను ప్రస్తుతిస్తూ మోదీ పలు పోస్టులు చేశారు. వికసిత భారత్ లక్ష్యసాధనలో మహిళలదే కీలక పాత్ర అని అభిప్రాయపడ్డారు. మహిళా పోలీసుల రక్షణ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నవాసరీ సభలో ప్రధాని మోదీకి పూర్తిగా మహిళలతో కూడిన అంగరక్షక దళం భద్రత కల్పించడం విశేషం. బహిరంగ సభతో పాటు ఆయన రక్షణ బాధ్యతలను కూడా 2,500 మందికి పైగా మహిళా పోలీసు సిబ్బందే చూసుకున్నారు. వీరిలో 2,145 మంది కానిస్టేబుళ్లు, 187 మంది ఎస్సైలు, 61 మంది ఇన్స్పెక్టర్లు, 19 మంది డీఎస్పీలు, ఐదుగురు ఎస్పీలు, ఒక డీఐజీ తదితరులున్నారు. హెలిప్యాడ్ వద్ద మోదీ రాక మొదలుకుని సభనుద్దేశించి ప్రసంగం, లఖ్పతీ దీదీ లబి్ధదారులకు సన్మానం, అనంతరం ఆయన వెనుదిరిగేదాకా సర్వం వారి కనుసన్నల్లోనే సాగింది. మొత్తం ఏర్పాట్లను అదనపు డీజీపీ నిపుణా తోర్వానే పర్యవేక్షించారు. పురుష సిబ్బంది పార్కింగ్, ట్రాఫిక్ విధులకే పరిమితమయ్యారు. ఇంతటి భారీ కార్యక్రమ భద్రత ఏర్పాట్లను పూర్తిగా మహిళా పోలీసు సిబ్బందే చూసుకోవడం దేశంలో ఇదే తొలిసారి. -
ఎన్ని కాన్పులైనా ప్రసూతి సెలవులిస్తాం
మార్కాపురం/తర్లుపాడు: ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ఇకపై ఎన్ని కాన్పులైనా ప్రసూతి సెలవులు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. గతంలో తానే జనాభా నియంత్రణ పాటించాలని చెప్పానని, అయితే భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రంలో జనాభా పెరగాల్సిన అవసరం ఉందని.. ఈ నేపథ్యంలో ఎంతమంది పిల్లలను కన్నా మహిళా ఉద్యోగుల ప్రయోజనాలకు ఇబ్బంది కలగకుండా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు బదులిచ్చారు. ఆయన ఏమన్నారంటే.. మహిళలను లక్షాధికారులుగా మారుస్తా. ఈ ఏడాదిలో లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను.రాష్ట్రంలో వంద మంది మహిళా పారిశ్రామికవేత్తలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలి. పాతికేళ్ల క్రితం నేను డ్వాక్రా గ్రూపులను తయారుచేస్తే అందరూ విమర్శించారు. కానీ, ఇప్పుడు వారు రాజకీయ, ఆర్థిక శక్తిగా మారడం ఎంతో సంతోషంగా ఉంది. మహిళా దినోత్సవం రోజున రాష్ట్ర ప్రభుత్వం 21 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. డ్వాక్రా మహిళలు తయారుచేసిన ఉత్పత్తులకు ప్రపంచస్థాయి గుర్తింపు, మార్కెటింగ్ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. పరిశ్రమలు స్థాపించే మహిళలకు 45 శాతం రాయితీ కల్పించి ప్రోత్సహిస్తాం.ఈరోజున రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలు రూ.లక్ష కోట్ల అప్పు తీసుకునే స్థాయికి వచ్చాయి. మహిళల కోసమే ర్యాపిడో, అరకు కాఫీ, ఫ్లిప్కార్ట్ వంటిసంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. ప్రతి మేజర్ పంచాయతీలో అరకు కాఫీ కేంద్రాన్ని మహిళలు ఏర్పాటుచేయాలి. టెక్నాలజీని ఉపయోగించుకుని వర్క్ ఫ్రం హోం ద్వారా మహిళలు రాణించాలి. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఈ ఏడాది నుంచి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం వర్తింపజేస్తాం. మే నుంచి అన్నదాత సుఖీభవ పథకాలను అమలుచేస్తాం. ప్రపంచంలో ఉండే ప్రముఖ కంపెనీలు, వ్యక్తులను మన రాష్ట్రానికి తీసుకొస్తా. ఈ రోజున డ్వాక్రా మహిళలకు రూ.1,826.43 కోట్ల రుణాలు అందిస్తున్నాం. డ్వాక్రా మహిళలు సొంత ఊరిలోనే ఉండి వ్యాపారాలు చేయాలి. టీవీల్లో, బయట, సోషల్ మీడియాల్లో మహిళల గురించి ఎవరైనా అసభ్యంగా మాట్లాడితే క్షమించేది లేదు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిరోధానికి ఈగల్ వ్యవస్థను ఏర్పాటుచేశాం. దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు అందిస్తున్నాం. వెలిగొండకు గోదావరి, కృష్ణా నీళ్లు పారిస్తా.. ఈ సమావేశంలో ఒక మహిళ, విద్యారి్థని అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు బదులిస్తూ.. తానే వెలిగొండకు శంకుస్థాపన చేశానని, తానే పూర్తిచేసి గోదావరి, కృష్ణా జలాలను వెలుగొండ ద్వారా ఈ ప్రాంతానికి పారిస్తానని చెప్పారు. అలాగే, బనకచర్ల–గోదావరి ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని తరలిస్తామన్నారు. త్వరలో మార్కాపురం జిల్లాను ఏర్పాటుచేస్తానని, అప్పుడు ఈ ప్రాంత సమస్యలు తీరతాయని ఆయన చెప్పారు. మహిళా లబ్ధిదారులకు చంద్రబాబు ఈ–ఆటోలు, బైక్లు అందించారు. మహిళలు, పిల్లల రక్షణకు సంబంధించిన శక్తియాప్ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఐజీపీ రాజకుమారి, ఎస్పీ దామోదర్ల సమక్షంలో సీఎం ప్రారంభించారు. ఎమ్మెల్యే పనితీరు ఆశాజనకంగా లేదు.. అనంతరం టీడీపీ కార్యకర్తలతో జరిగిన ముఖాముఖిలో చంద్రబాబు మాట్లాడుతూ ఇక్కడి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పనితీరు ఆశాజనకంగాలేదన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి అండగా ఉంటానన్నారు. ఇక మహిళా దినోత్సవం రోజున జరుగుతున్న ఈ సమావేశంలో 50 శాతం మహిళలు ఉండాల్సి ఉండగా, కేవలం ఒక్క శాతమే ఉన్నారంటే పరిస్థితిని ఏవిధంగా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. సామాజికంగా, రాజకీయంగా ఓటు బ్యాంకు పెంచే బాధ్యత తనదని తెలిపారు. ఇదిలా ఉంటే.. సీఎం బందోబస్తుకు వచ్చిన పోలీసులు ఎండ వేడికి తట్టుకోలేకపోయారు. ఒంగోలు ఏఆర్ కానిస్టేబుల్ రమణయ్య స్పృహతప్పి పడిపోయారు. -
ఉమెన్స్ డే స్పెషల్.. సమంత అలా నమ్రత ఇలా
వదిన-మరదలుతో మహేశ్ భార్య నమ్రతచీరలో చూడచక్కగా మెరిసిపోతున్న ఆషికా రంగనాథ్క్యూట్ అండ్ స్వీట్ వీడియోతో సామ్ పోజులుమొరాకోలో చిల్ అవుతున్న దృశ్యం పాప ఎస్తర్నీలం పట్టు చీరలో మెరిసిపోతున్న యాంకర్ విష్ణుప్రియఛార్టెడ్ ఫ్లైట్ లో పోజులతో చితక్కొట్టేసిన కరీనా కపూర్హరిద్వార్ లో భక్తిలో మునిగిపోయిన సుప్రీత View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) View this post on Instagram A post shared by Shruti Sodhi (@aslishrutisodhi) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) View this post on Instagram A post shared by Vani Bhojan (@vanibhojan_) View this post on Instagram A post shared by Manjima Mohan Gautham (@manjimamohan) View this post on Instagram A post shared by Aathmika 🦁 (@iamaathmika) View this post on Instagram A post shared by Sanya Malhotra (@sanyamalhotra_) View this post on Instagram A post shared by Esther (@_estheranil) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Amyra Dastur (@amyradastur) View this post on Instagram A post shared by Jacqueliene Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Meenakshi Dixit (@meenakshidixit) -
లేడీస్ బ్యాంక్ ఎక్కడుందో తెలుసా?
సనత్నగర్: ఇంటిని అందంగా తీర్చిదిద్దడమే కాదు.. కుటుంబాన్ని నడిపించడంలోనూ మహిళల పాత్ర ఎనలేనిది. ఓ వైపు ఇంటి బాధ్యతలను నెరవేరుస్తూ.. మరోవైపు ఉద్యోగ విధులను బాధ్యతాయుతంగా చేపడుతున్న మహిళలు కోకొల్లలు. అయితే అందరి ఆర్థిక అవసరాలు తీర్చే బ్యాంకింగ్ రంగంలోనూ మహిళలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే నగరంలోని సుందర్నగర్ బ్రాంచ్లో మాత్రం నూటికి నూరు శాతం మహిళా ఉద్యోగులే ఖాతాదారులకు సేవలందిస్తున్నారు. క్యాషియర్ దగ్గర నుంచి మేనేజర్ వరకూ అందరూ మహిళామణులే విధులు నిర్వహిస్తుండడంతో దీనికి లేడీస్ బ్యాంక్గా ముద్ర పడింది. చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!2023 డిసెంబర్లో మేనేజర్గా సునీత బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్ని పోస్టుల్లోనూ మహిళలే భర్తీ అయ్యారు. ప్రస్తుతం ఈ బ్యాంకులో రమ్య, శృతి, సృజన, లక్ష్మీ, జ్యోతిర్మయి, ధీరజ తదితర మహిళా ఉద్యోగులు వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తూ.. ఖాతాదారులకు ఎంతో ఓపిగ్గా సేవలందిస్తున్నారు. -
‘మూల సంత’ సూర్యకళ : మహిమాన్వితం
మనం జీవించి ఉన్నాం, జీవిస్తున్నాం.. అంటే అనుక్షణం ప్రకృతి నుంచి తీసుకుంటూనే ఉన్నామని అర్థం. మనం తీసుకున్నంత తిరిగి ఇవ్వాలని ప్రకృతి కోరుకోదు. విధ్వంసం చేయకపోతే చాలనుకుంటుంది. ప్రకృతి తనను తాను స్వస్థత పరుచుకుంటుంది. కానీ ఆ సమయం కూడా ఇవ్వనంత వేగంగా కాలుష్యభరితం చేస్తున్నాం. ప్రకృతిని పరిరక్షిస్తూ సాగిన మన భారతీయ జీవనశైలిని మర్చిపోయాం. మనం మరిచిపోయిన ఆరోగ్యకరమైన జీవనశైలిని గుర్తు చేయాలి, ఆచరణలోకి తెచ్చే వరకూ చైతన్యవంతం చేస్తూనే ఉండాలనే ఉద్దేశంతో పదిహేనేళ్లుగా గ్రీన్ వారియర్గా మారారు సూర్యకళ మోటూరి. జీవనశైలి మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలని, అది మహిళ నుంచే ప్రారంభం కావాలని, అందుకోసం ఆమె మహిళలను చైతన్యవంతం చేయడానికి పూనుకున్నారు. గ్రామభారతి అధ్యక్షబాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏకైక మహిళ సూర్యకళ మహిళాదినోత్సవం సందర్భంగా సాక్షితో పంచుకున్న వివరాలివి. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్లో పుట్టి పెరిగిన సూర్యకళ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో పీజీ చేసి నగరంలోని ఓ ఎమ్ఎన్సీలో ఉద్యోగం చేస్తున్నారు. జాతీయోధ్యమ నాయకుల జీవితగాథలను చదివినప్పుడు ఆ కాలంలో పుట్టనందుకు ఆవేదన చెందేవారామె. రాజీవ్ దీక్షిత్ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు.. ‘దేశం కోసం పని చేయడానికి ఎప్పుడూ ఏదో ఒక సామాజిక అవసరం ఉండనే ఉంటుంది. దానిని తెలుసుకుని పని చేయాలి’ అనే ఆలోచన రేకెత్తింది. సుభాష్ పాలేకర్ శిక్షణలో వాలంటీర్గా పని చేసినప్పుడు జరిగిన సంఘటన ఆమెను ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మళ్లించింది. అక్కడికి వచ్చిన ఒక మహిళారైతు ఇచ్చిన కందిపప్పును ఇంటికి తెచ్చుకుని వండుకున్నారు. ఆ రుచి అమృతంలా అనిపించిందన్నారు సూర్యకళ. ప్రతి ఒక్కరూ అలాంటి ఆహారాన్ని తినాలని కోరుకున్నారు. సేంద్రియ వ్యవసాయం, నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ విభాగాల్లో పని చేయసాగారు. ‘శిక్షణా తరగతులు నిర్వహించి సేంద్రియ వ్యవసాయంపై ‘మా గ్రామభారతి స్వచ్ఛంద సంస్థ’ విజయవంతమైంది. కానీ ఆ ఉత్పత్తులకు మార్కెట్ లేకపోతే ఆ రైతు నిలదొక్కుకునేదెలా అనే ప్రశ్నకు సమాధానంగా ఒక వేదికను రూపొందించాను. ఆర్గానిక్ ఫుడ్ విషయంలో అవగాహన కల్పించడంలో మీడియా చాలా బాగా పని చేస్తోంది. చైతన్యం వచ్చింది కానీ ఉత్పత్తులు అందుబాటులో లేవు. దాంతో ‘మూలసంత’ పేరుతో వాటిని నగరానికి తీసుకొచ్చే బాధ్యత చేపట్టాను. కార్పొరేట్ కంపెనీల్లో మూలసంతలు పెడుతున్నాం. ఇటీవల ఇన్ఫోసిస్లో 30 స్టాళ్లతో సంత పెట్టాం. మహిళలను సంఘటిత పరిచి ఆర్గానిక్ ఉత్పత్తులను వారి వంటింటి వరకూ తీసుకెళ్లేలా చేయగలిగాం. నీటి వృథాను అరికట్టడం వంటి విషయాల్లో ఆలోచన రేకెత్తించడం నుంచి పెళ్లి, ఇతర వేడుకల్లో పర్యావరణ హితమైన వేదికల ఏర్పాటు వరకూ కృషి చేశాం. పదిహేనేళ్ల నా ప్రస్థానంలో ఏమి సాధించానని చూసుకుంటే మన వేడుకలు కనిపిస్తాయి. ఆహ్వాన పత్రికల, రిటర్న్ గిఫ్ట్లు, భోజనం వడ్డించే ప్లేట్ల వరకూ ప్రతిదీ బయో డీగ్రేడబుల్ థీమ్ని అనుసరిస్తున్నారు. మా ప్రయత్నం ఏ మాత్రం వృథా కాలేదు. ఒక మంచి బాట వేయగలిగాం’ అన్నారు సూర్యకళ. చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!చోదకశక్తి మనమే! ఇంటిని నడిపేది మహిళే. ఇంట్లోకి వచ్చే ఏ వస్తువూ ప్రకృతికి హానికలిగించేదిగా ఉండకూడదు.. అనే నియమాన్ని మహిళలు పాటిస్తే చాలు. ప్రకృతిని కాపాడుకోడం కోసం మేము వేదికల మీద మాట్లాడితే ఆ ప్రయత్నం చైతన్యవంతం వరకే పరిమితం. ఆచరణ ఇంటి నుంచే మొదలు కావాలి, అది మహిళతోనే మొదలు కావాలి. అందుకే సమాజహితమైన ఏ పని అయినా మహిళల నుంచి మొదలైతే అది విజయవంతమవుతుంది. మన పిల్లల భవిష్యత్తు కోసం నిధులు, పొలాలు సమకూరుస్తుంటాం. అంతకంటే ముఖ్యమైన పని పిల్లలకు ఆరోగ్యకరమైన భూమిని అందించడం. మహిని రక్షించే మహిమాని్వతమైన శక్తి మహిళకే ఉంది. మహిళలుగా మనం చేయాల్సిన సమాజసేవ, దేశసేవ ఇది. – సూర్యకళ మోటూరి, గ్రీన్ వారియర్, అధ్యక్షురాలు, గ్రామభారతి -
Trekker Sindhu: తనయ నడిచే.. తండ్రిని గెలిపించే!
ఆధునిక మహిళల విజయాలు వ్యక్తిగతానికి మాత్రమే పరిమితం కావడం లేదు. తమ పిల్లల నుంచి పేరెంట్స్ వరకూ సక్సెస్ ఫుల్ అనిపించుకునేలా కూడా చేస్తున్నాయి. అలాంటి ఓ యువతి.. కృష్ణా రామా అనుకుంటూ కూర్చోవాలి అని సమాజం నిర్దేశించిన వయసులో ఉన్న తండ్రిని యువకులతో సమానంగా ట్రెక్కింగ్లో రాణించేలా తీర్చిదిద్దింది. సాక్షి, సిటీబ్యూరో రిటైర్మెంట్ తర్వాత శ్రమ పడకూడదని తల్లిదండ్రులను ఇంటి దగ్గరే ఉంచి ఇల్లు, నౌకర్లు, కారు వగైరా సౌకర్యాలన్నీ అమర్చి జాగ్రత్తగా చూసుకునే కూతుళ్లు, కొడుకులను చూసి ఉంటాం. కానీ 60 ఏళ్ల వయసులో తండ్రిని కొండలు, గుట్టలు ఎక్కించి వేల కిలోమీటర్లు తనతోపాటు నడిపించిన కూతుర్ని చూశామా? అంటే.. ‘మా అమ్మాయే నా చేత తొలి అడుగులు వేయించింది..’ అంటూ సంతోషంగా చెబుతారు ఆమె తండ్రి ఏబీఆర్పీ రెడ్డి. కొండాపూర్లో నివసించే సింధు రెగ్యులర్గా కొండలు, గుట్టలు ఎక్కేసే సిటీ ట్రెక్కింగ్ లవర్స్లో ఒకరు. వ్యాపార వ్యవహారాల నుంచి విశ్రాంతికి షిఫ్ట్ అయిన వెంటనే తన ట్రెక్కింగ్ హాబీని తండ్రికి వారసత్వంగా అందించారు. తద్వారా ఓ మంచి ట్రెక్కర్గా మారేందుకు మాత్రమే కాదు 73 ఏళ్ల వయసులో రికార్డ్స్ సృష్టించేందుకు కూడా దోహదపడ్డారు. మార్కెటింగ్ రంగంలో ఉన్న సింధు ఇప్పటి వరకూ ఎనిమిది చెప్పుకోదగ్గ సాహసవంతమైన ట్రెక్స్ని పూర్తి చేశారు. సింధు ఇటు ఆటలు, అటు సాహసాలతో ఆత్మ సంతృప్తికే ప్రాధాన్యత ఇస్తూ.. విలాసాల వెనుక పరుగులు తీసేవారికి ఓ గుణపాఠంలా నిలుస్తున్నారు. ‘వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే అంతా మైండ్సెట్లోనే ఉంది అని నేను నమ్ముతాను’ అంటారు సింధు. అందుకే అరవైలో ఉన్న తండ్రిని సైతం తనతో పాటు సాహస యాత్రలవైపు నడిపించారు. చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!‘నాన్న మొదటి నుంచీ చాలా ఫిట్గా ఉంటారు. బిజినెస్ నుంచి ఫ్రీ కాగానే జిమ్లో చేరడమే కాకుండా నాతో పాటు ట్రెక్కి రమ్మని ప్రోత్సహించాను’ అంటూ గుర్తు చేసుకున్నారు.. తాను 23 ఏళ్ల వయసులో ట్రెక్కింగ్ ప్రారంభించిన సింధు.. రన్నింగ్, సైక్లింగ్ ఇలా ప్రతి హాబీనీ తండ్రితో కలిసి పంచుకున్నారు. ‘నాన్నకు చిన్నప్పుడు సాహస యాత్రలు చేసే అలవాటు ఉండేది, అయితే వర్క్లో పడిపోయాక దాన్ని మరచిపోయారు. నేను దానిని మళ్లీ గుర్తు చేశా అంతే’ అంటూ చెప్పారామె. గత డిసెంబర్లో తన తండ్రితో కలిసి చేసిన ట్రెక్.. ఎప్పటికీ మరచిపోలేనిదని అంటారామె. అప్పటి వరకూ ఒక్కసారి కూడా ట్రెక్కింగ్ అనుభవం లేని తండ్రి తొలిసారే ఉత్తరాఖండ్లో 12వేల కిమీ అధిరోహించి రికార్డ్ సృష్టించారు. అయితే నాన్న ఫిట్నెస్ గురించి నాకు తెలుసు. అలాగే ఎప్పుడైతే మా అడ్వెంచర్ గ్రూప్లో జాయిన్ చేశానో.. దాని నుంచి నాన్న కూడా బాగా ఇన్స్పైర్ అయ్యారు.’ అంటూ వివరించారామె.మైండ్సెట్లోనే అంతా ఉంది.‘వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే అంతా మైండ్సెట్లోనే ఉంది అని నేను నమ్ముతాను’ అంటారు సింధు. అందుకే అరవైలో ఉన్న తండ్రిని సైతం తనతో పాటు సాహస యాత్రలవైపు నడిపించారు. ‘నాన్న మొదటి నుంచీ చాలా ఫిట్గా ఉంటారు. బిజినెస్ నుంచి ఫ్రీ కాగానే జిమ్లో చేరడమే కాకుండా నాతో పాటు ట్రెక్కి రమ్మని ప్రోత్సహించాను’ అంటూ గుర్తు చేసుకున్నారు.. తాను 23 ఏళ్ల వయసులో ట్రెక్కింగ్ ప్రారంభించిన సింధు.. రన్నింగ్, సైక్లింగ్ ఇలా ప్రతి హాబీనీ తండ్రితో కలిసి పంచుకున్నారు. ‘నాన్నకు చిన్నప్పుడు సాహస యాత్రలు చేసే అలవాటు ఉండేది, అయితే వర్క్లో పడిపోయాక దాన్ని మరచిపోయారు. నేను దానిని మళ్లీ గుర్తు చేశా అంతే’ అంటూ చెప్పారామె. గత డిసెంబర్లో తన తండ్రితో కలిసి చేసిన ట్రెక్.. ఎప్పటికీ మరచిపోలేనిదని అంటారామె. అప్పటి వరకూ ఒక్కసారి కూడా ట్రెక్కింగ్ అనుభవం లేని తండ్రి తొలిసారే ఉత్తరాఖండ్లో 12వేల కిమీ అధిరోహించి రికార్డ్ సృష్టించారు. అయితే నాన్న ఫిట్నెస్ గురించి నాకు తెలుసు. అలాగే ఎప్పుడైతే మా అడ్వెంచర్ గ్రూప్లో జాయిన్ చేశానో.. దాని నుంచి నాన్న కూడా బాగా ఇన్స్పైర్ అయ్యారు.’ అంటూ వివరించారామె. -
సమానత్వం,సాధికారతకోసం కలిసి పనిచేద్దాం : అపోలో సునీతా రెడ్డి
అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునీతా రెడ్డి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్బంగా అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునీతా రెడ్డి మహిళలకు శుభాకాంక్షలు అందించారు. 1995 బీజింగ్ డిక్లరేషన్ , ప్లాట్ఫామ్ ఫర్ యాక్షన్ నుండి ప్రపంచవ్యాప్తంగా మహిళా హక్కులను ముందుకు తీసుకెళ్లడంలో సాధించిన పురోగతిని గుర్తించాలన్నా ఈ సందర్బంగా పేర్కొన్నారు. అయితే, ఎక్కువ మంది బాలికలు పాఠశాలలో చదువుతున్నప్పటికీ మరియు కీలకమైన సేవలను పొందుతున్నప్పటికీ, పురోగతి సమానంగా లేదనీ, గణనీయమైన సవాళ్లు ఇంకా కొనసాగుతు న్నాయని గుర్తు చేశారు. ముఖ్యంగా అట్టడుగు వర్గాలలోని బాలికలకు, కొన్ని సంఘర్షణ ప్రాంతాలకు , వాతావరణ సంక్షోభం,మహమ్మారి ద్వారా ప్రభావితమైన బాలికలకు చేరడం లేదన్నారు.‘మన సమిష్టి బలాన్ని పెంపొందించుకుంటూ, మహిళలు, బాలికలు తమ పూర్తి సామర్థ్యాన్ని సాధించకుండా అడ్డుకునేవ్యవస్థాగత అడ్డంకులను తొలగించుకునేందుకు, నిజంగాసమానమైన, సమ్మిళిత వాతావరణాలను సృష్టించడానికి మనం కలిసి పనిచేయాలి. తరువాతి తరానికి సాధికారత కల్పించడం చాలా ముఖ్యం. శాశ్వత మార్పుకు ఉత్ప్రేరకాలు , భవిష్యత్తును నడిపించడానికి రూపొందించడానికి హక్కులు, వనరులు మరియు అవకాశాలతో వారి సన్నద్ధం కావాలి’’ అన్నారామె.మహిళల హక్కులు మరియు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే చొరవలలో వ్యూహాత్మక పెట్టుబడులు ఏ బాలికను వదిలి వెళ్ళకుండా చూసుకోవడంలో సహాయపడతాయి.తమ స్వాభావిక ప్రభావ మూలధనాన్ని ఉపయోగించుకోని, రాబోయే తరాలకు సాధికారత , సమానత్వం యొక్క వారసత్వాన్నిఅందించాలని ఆమె మహిళా నాయకులను కోరారు.. అందరికీ న్యాయమైన సమానమైన ప్రపంచాన్ని నిర్మించేక్రమంలో మహిళలు, బాలికలందరికీ 'హక్కులు, సమానత్వం, సాధికారత'ను స్పష్టమైన వాస్తవికతగా మార్చేలా కలిసి పనిచేద్దామని ఆమె పిలుపునిచ్చారు. చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా! -
మహిళలూ ఒక్క అరగంట మీ కోసం : నీతా అంబానీ సందేశం వైరల్ వీడియో
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) మహిళల కోసం ఓ ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి నీతా ఫిట్నెస్ గురించి, ఆమె ష్యాషన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆరు పదుల నిండిన వయసులో కూడా అనేక కార్యక్రమాలతో చాలా చురుగ్గా నిర్మాణాత్మకంగా ఉంటారు ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ మార్చి 8న నీతా అంబానీ మహిళల కోసం ఒక వీడియోను షర్ చేశారు. ఫిట్నెస్ రొటీన్లో క్రమశిక్షణ, అభిరుచిరెండింటినీ మిళితం చేయాలని సూచించారు. అన్ని వయసుల మహిళలు తమ ఆరోగ్యం , శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వ్యాయామం మనలో సానుకూల ధోరణిని పెంచుతుంది,మనసుకు ప్రశాతంనిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సందడిగా మారింది. తాను ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు, ఎలాంటి వ్యాయామం చేస్తారో, తన జీవన శైలి వివరాలను పంచుకున్నారు. అలాగే మహిళలు తమ ఆరోగ్యం, శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలని నీతా అంబానీ సూచించారు. ప్రస్తుతం తన వయసు 61 ఏళ్లని.. ఆరేళ్ల వయస్సునుంచి డ్యాన్స్ ప్రాక్టీస్, వ్యాయాం చేస్తూ ఇప్పటికీ ఎంతో ఫిట్గా, ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన ఫిట్నెస్ దినచర్య గురించి కూడా వివరించారు. రోజూ 30 నిమిషాల పాటూ ఫిట్నెస్ కోసం కేటాయిస్తానని, వాకింగ్, జిమ్, స్విమ్మింగ్ చేస్తానని తెలిపారు. చురుగ్గా ఉండటం చక్కెర, చక్కెర ప్రత్యామ్నాయ పదార్థాలను కూడా తీసుకోనని వెల్లడించారు. రోజుకి 5-7వేల అడుగులు నడవడంతోపాటు శాఖాహారంమాత్రమే తీసుకుంటూ, సరైన మోతాదులో ప్రోటీన్, పోషకాలు ఉండేలా జాగ్రత్తపడతానని చెప్పారు.ముఖ్యంగా అంతేకాదు మహిళలు తమను తాము జాగ్రత్తగా చూసుకోవడానికి, దీనికి సంబంధించిన చర్యను ప్రారంభించడానికి సమయం మించిపోలేదని గుర్తు చేశారు. ముఖ్యంగా 30 ఏళ్ల తర్వాత మహిళలు తమను తాము జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరమన్నారు. కండరాలు బలహీనపడతాయి. ఎముకల బలం తగ్గుతుంది. అందుకే మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒక్క అరగంట : నీతా అంబానీ ఫిట్నెస్ మంత్రా వైరల్ వీడియో ‘‘61 ఏళ్లలో నేనుచేయగిలిగనపుడు.. మీరెందు చేయలేరు.. కదలండి! ఒక్క అరగంట మీకోసం కేటాయించుకోండి!!’’ అంటూ నీతా అంబానీ మహిళలకు పిలుపునిచ్చారు. -
‘స్త్రీ’రాస్తి రంగంలో.. మహిళలు అంతంతే..
సాక్షి, సిటీబ్యూరో: అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతున్న మహిళలు.. స్థిరాస్తి రంగంలో మాత్రం కాస్త వెనకబడే ఉన్నారు. దేశీయ రియల్ ఎస్టేట్ పరిశ్రమలో మహిళా కార్మికులు పరిమితంగానే ఉన్నారు. ప్రస్తుతం రియల్టీలో 7.1 కోట్ల మంది కార్మికులు పని చేస్తుండగా.. మహిళా కార్మికుల సంఖ్య కేవలం 70 లక్షలే. మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు (ఎల్ఎఫ్పీఆర్) కేవలం 25.1 శాతంగా మాత్రమే ఉందని రియల్టీ సంస్థ మ్యాక్స్ ఎస్టేట్స్, గ్లోబల్ కన్సల్టింగ్ ఇన్ టెన్డమ్ అధ్యయనం వెల్లడించింది. మహిళా జనాభాలో 1.2 శాతమే.. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సృష్టించే రంగం రియల్ ఎస్టేటే. కానీ, స్థిరాస్తి రంగ శ్రామిక శక్తిలో మహిళ భాగస్వామ్యం అంతంత మాత్రంగానే ఉంది. దేశీయ స్థిరాస్తి రంగం క్రాస్ రోడ్స్లో ఉంది. అద్భుతమైన వృద్ధికి సిద్ధంగా ఉంది. అదే సమయంలో తారాస్థాయిలో వృద్ధి చెందకుండా నిరోధించేందుకూ సవాళ్లు ముందున్నాయి. దేశ జనాభాలో మహిళలు 48.5 శాతం మంది ఉన్నారు. ఇందులో దాదాపు 1.2 శాతం మంది మహిళలు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్నారు.సవాళ్లు ఇవీ.. స్థిరాస్తి రంగంలోని శ్రామిక శక్తిలో అన్ని స్థాయిలలోనూ మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం, అసమాన వేతనం.. ఇవే ఈ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సవాళ్లు. లింగ సమానతలు పరిష్కరించడం వల్ల గణనీయమైన ఆర్థిక క ప్రయోజనాలు చేకూరతాయి. ఉత్పాదకత, ఆవిష్కరణలు, లాభదాయకత పెరుగుతాయి. అలాగే ఈ రంగంలో బ్లూ, వైట్ కాలర్ మహిళా కార్మికులను శక్తివంతం చేయడానికి నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాల అవసరం ఉంది. సరైన నాయకత్వం, సాంకేతికత వినియోగంతోనే దీన్ని సాధించగలమని నివేదిక సూచించింది. -
నవ మాసాల్లో కూటమి నవ మోసాలను తెచ్చింది
గుంటూరు, సాక్షి: మహిళ అంటే కూటమి ప్రభుత్వానికి గౌరవమే లేదని.. అందుకే ఈ పాలనలో రక్షణ కరువైందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం(మార్చి 8న) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న రోజా.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘వైఎస్సార్సీపీ హయాంలో మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చాం. కానీ, కూటమి ప్రభుత్వం ఈ నవ మాసాల్లో నవ మోసాలు తీసుకొచ్చింది’’ అని అన్నారామె.‘‘ఏపీలో మహిళలు.. చంద్రబాబు మోసాలపై ఆగ్రహంతో ఉన్నారు. సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేశారు. ఏపీలో చంద్రన్న దగ, చంద్రన్న పగ, చంద్రన్న పంగనామం, చంద్రన్న వెన్నుపోటు మాత్రమే అమలవుతున్నాయి. సూపర్ సిక్స్ పేరుతో మహిళలను మోసం చేసి నట్టేట ముంచారు. మహిళా దినోత్సవాన్ని జరుపుకునే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. రోజుకు 70 మంది మహిళలు, వృద్దుల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. జగన్ హయాంలో దిశా పీఎస్లు, యాప్ తెచ్చి రక్షణ కల్పించారు. చంద్రబాబు మళ్లీ యాభై వేలకు పైగా బెల్టుషాపులు పెట్టారు’’ అని ఆర్కే రోజా మండిపడ్డారు.‘‘తల్లికివందనం పేరుతో మహిళలకు పంగనామం పెట్టారు. ఇదేనా మహిళలకు మీరిచ్చే గౌరవం?. నిరుద్యోగ మహిళలు, యువతులను చంద్రబాబు మోసం చేశారు. మహిళలు తిరగబడతారని చంద్రబాబుకు అర్థమయ్యింది. అందుకే శక్తియాప్ పేరుతో యాప్ని తెస్తున్నారు. జగన్ తెచ్చిన దిశా యాప్ని చంద్రబాబు కాపీ కొట్టారు. మహిళా భద్రత గురించి కేబినెట్లో ఏనాడూ చర్చించలేదు. కానీ గంజాయి, మద్యం వ్యాపారుల ప్రయోజనాల గురించి చర్చించారు. చంద్రబాబు, అనిత సొంత నియోజకవర్గాల్లో గంజాయి విపరీతంగా అమ్ముతున్నారు. 30 వేలమంది మహిళలు అక్రమ రవాణా అయ్యారని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు?. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటం పవన్ కే చెల్లింది..సుగాలి ప్రీతి కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేక పోతున్నారు?. కేంద్రంలో కూడా మీ కూటమి ప్రభుత్వమే ఉన్నప్పుడు ఎందుకు సీబీఐ విచారణ చేయించలేకపోయారు?. కనీసం సుగాలి ప్రీతి తల్లికి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు?. జనసేన నేతల చేతిలో మోసపోయిన మహిళలకి ఏం న్యాయం చేశారు?. మహిళా దినోత్సవం జరుపుకునే హక్కు పవన్ కళ్యాణ్కి లేదు. మహిళల కన్నీటి శాపనార్థాలకు కూటమి ప్రభుత్వం పతనం అవుతుంది. ఉచిత బస్సు పేరుతో అన్యాయం చేశారు. తగిన సమయంలో మహిళలే చంద్రబాబుకు బుద్ధి చెప్తారు’’ అని రోజా చెప్పారు. -
International Women's Day 2025 : స్వీయ ప్రేమ ముఖ్యం
విత్తనంలో మహావృక్షం దాగి ఉంటుందనేది అనుభవజ్ఞులు చెప్పిన మాట. ఆ మాటలను ఆచరణలో పెట్టి ఫలాలను పంచేవారు ఎప్పుడూ సమాజంలో స్ఫూర్తిమంతంగా నిలుస్తారు. మహిళగా ఏడుపదుల అనుభవాన్ని, తన ఆలోచనలను పంచుకున్నారు సికింద్రాబాద్ బోయినపల్లిలో ఉంటున్న కావేరీ సీడ్స్ డైరెక్టర్ జి.వి.వనజాదేవి. ‘కుటుంబం, సమాజం పట్ల బాధ్యతలు నిర్వర్తించాలంటే మహిళలు అన్నింటికన్నా ముందు స్వీయ ప్రేమ కలిగి ఉండటం అవసరం’ అంటున్నారామె. విమెన్స్ డే 2025 థీమ్మరింత వేగంగా... మరింత నిర్మాణాత్మకంగా ఈ సంవత్సరం విమెన్స్ డే క్యాంపెయిన్ థీమ్... యాక్సిలరేట్ యాక్షన్.లింగ సమానత్వాన్ని సాధించడానికి ఉత్తమమైన మార్గాలను ఎంచుకోవడంతో పాటు ఆ పనిని మరింత వేగంగా, నిర్మాణాత్మకంగా చేయాలి. ‘యాక్సిలరేట్ యాక్షన్’లో మహిళల పురోగతికి ఉపయోగపడే వ్యూహాలు, ఆలోచనలు ఉంటాయి. ‘లింగ సమానత్వానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి’ అని నిరాశపడిపోవడం కంటే ఆశావహ దృక్పథంతో తగిన కార్యాచరణతో ముందుకు వెళ్లడం అవసరం. ‘యాక్సిలరేట్ యాక్షన్’కు సంబంధించిన ఒక నినాదం... సపోర్ట్ ది సపోర్టర్స్. మనకు ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వారికి మద్దతు ఇవ్వడం ద్వారా లింగ సమానత్వం కోసం వేసే అడుగులను వేగవంతం చేయవచ్చు. మహిళలకు సహాయపడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి. వాటికి సంఘీభావం తెలియజేయాలి.మనం ఏ రకంగా యాక్సిలరేట్ యాక్షన్లో భాగం కావచ్చు?వివక్షను సవాలు చేయడం, మహిళల విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం, మనకు తెలిసిన విషయాలను ఇతర మహిళలతో కలిసి పంచుకోవడం, మహిళల నాణ్యమైన విద్య, ఆరోగ్యం గురించి పనిచేయడం, మహిళల సృజనాత్మకతను ప్రోత్సహించడం లాంటివి ఎన్నో ఉన్నాయి. గత కాలం, ప్రస్తుతం కాలం అంటూ మహిళ విషయంలో ప్రత్యేకించి చెప్పలేం. ఏ రోజుల్లోనైనా మహిళ సంఘర్షణలతోనే దోస్తీ చేస్తుంది. ఆమె ఆలోచనలన్నీ కుటుంబం చుట్టూతానే కేంద్రీకృతమై ఉంటాయి. తల్లిదండ్రులు, తోబుట్టువులు, పెళ్లయ్యాక భర్త, అత్తింటివాళ్లు, పిల్లలు .. ఒత్తిడితో కూడిన జీవనంలోనే తనని తాను నిరూపించుకోవడానికి, నిలబడటానికిపోరాటం చేస్తూనే ఉంటుంది. అయితే, ఈ క్రమంలో తనని తాను మర్చిపోతుంది. పెళ్లి తర్వాత కుటుంబపోషణలో లీనమైపోతూ తన ఆరోగ్యం గురించి పట్టించుకోదు, చక్కగా ముస్తాబు అవడాన్ని పట్టించుకోదు. నిజానికి తనని తాను ప్రేమించుకోవడం మర్చిపోతుందనిపిస్తుంది. చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!ఆత్మస్థైర్యమే బలంమాది కరీంనగర్ జిల్లాలోని గట్ల నరసింగాపూర్ గ్రామం. పెద్ద కుటుంబం. ఎప్పుడూ నలుగురికి పెట్టగలిగే స్థితిలోనే ఉన్నాం. ఉమ్మడి కుటుంబంలో అందరినీ కలుపుకుని ΄ోతూ, బాధ్యతలను నెరవేరుస్తూ, నా ఉనికిని కోల్పోకుండా కాపాడుకున్నాను. పెళ్లినాటికి డిగ్రీ చదువు పూర్తయ్యింది. మా వారు జి.వి.భాస్కరరావుకి వ్యవసాయ రంగం అంటే ప్రేమ. అగ్రికల్చర్ బీఎస్సీ చేశారు. పుట్టిన గడ్డపైన తనని తాను నిరూపించుకోవాలని తపన. అందుకు నేను మద్దతుగా నిలిచాను. కావేరీ సీడ్స్ మొదలుపెట్టినప్పుడు ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం. సమస్య వచ్చింది కదా అని అక్కడే వదిలేస్తే ఈ రోజు కావేరీ సీడ్స్ ఉండేది కాదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 50కి పైగా మా సీడ్ యూనిట్స్ ఉన్నాయి. ఈ ఏడాది వ్యవసాయ రంగంలో విద్యార్థులను తీర్చిదిద్దడానికి కావేరీ యూనివర్శిటీ కూడా ప్రారంభించాం.దిద్దుబాటుకుటుంబం, పిల్లల బాగోగులు, కంపెనీలో చేదోడుగా ఉండటం .. ఒక దశ తర్వాత బాధ్యతలు తీరి కాస్త తీరిక దొరకడంతో చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు చిన్నజీయర్ స్వామి వారి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆకర్షించాయి. అప్పుడే జైలుశిక్ష అనుభవిస్తున్న మహిళల గురించి తెలిసింది. ఖైదీలుగా ఉన్నవారి సమస్యలను అర్థం చేసుకోవడానికి చంచల్గూడ, చర్లపల్లి జైలుకు ‘వికాస తరంగిణి’సభ్యులతో కలిసి వెళ్లాను. క్రమం తప్పకుండా మహిళా ఖైదీలను కలవడం, కౌన్సెలింగ్ ఇవ్వడం, వారి పిల్లలను తిరిగి స్కూళ్లలో చేర్పించడం వంటి కార్యక్రమాలు చేశాం. మంచి ఫలితాలు రావడంతో కరీంనగర్, రాజమండ్రి, వరంగల్, విజయవాడ, వైజాగ్లలోని జైళ్లలోనూ కౌన్సెలింగ్ కార్యక్రమాలకు ఆహ్వానం అందింది. మహిళాఖైదీలు జైలు నుంచి విడుదలయ్యాక వారి జీవనం సానుకూలంగా గడిచే ఏర్పాట్లు చేయడం ఎంతో తృప్తిని కలిగించింది. క్యాన్సర్ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం, కాన్సర్ రోగులకు చికిత్స అందేలా చూడటం, మా ఊరితోపాటు చుట్టుపక్కల గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయడం, మహిళారైతుల సమస్యలను తీర్చడం, చదువుకునే విద్యార్థులకు క్యాంపులు, మహిళలకు శిక్షణాతరగతులు నిర్వహించడం.. ఇలా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు లభించాయి. వ్యవసాయ రంగంలో మహిళలు రావడం అంటే గత కాలం కూలీలుగానే చూసేవాళ్లం. కానీ, ఇప్పుడలా కాదు. ఉన్నతవిద్యతో వ్యవసాయం రంగంలో మార్పులు తీసుకురావడానికి యువతరం ముందుకు వస్తుంది. మా యూనివర్శిటీలో చేరిన విద్యార్థుల సంఖ్యే అందుకు నిదర్శనం. ముందుగా మహిళలు తమని తాము ప్రేమించుకోవాలి. ఆరోగ్యం, సంరక్షణ, చదువుతో తనకు తానుగా ఎదుగుతూనే కుటుంబ బాధ్యతలను నిర్వర్తించాలి. ఒక్కో విజయాన్ని అందుకుంటూ సమాజంలో వెనకబడినవారిని తనతో కలుపుకుంటూ ముందుకు వెళ్లాలి. దైనందిన జీవనం ప్రశాంతంగా, సంతోషంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటే ఒత్తిడులను కూడా సులువుగా అధిగమించవచ్చు.’’ తన అనుభవసారాన్ని కళ్లకు కట్టారు వనజాదేవి. -నిర్మలా రెడ్డి సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి -
ఇంటి కొనుగోలు.. ‘ఆమె’కు నచ్చితేనే..
సాధారణంగా మహిళలు వంట గది విశాలంగా ఉండాలని కోరుకుంటారు. కానీ, నేటి అవసరాలు, అభిరుచులు మారుతుండటంతో ఆధునిక వసతులనూ కోరుకుంటున్నారు. జిమ్, మెడిటేషన్ వంటి సౌకర్యాలతో పాటు వాకింగ్, జాగింగ్ ట్రాక్స్, గ్రీనరీ స్పేస్, పిల్లల కోసం పార్క్, స్పోర్ట్స్ వంటి వసతులను ఎంచుకుంటున్నారని ఆర్క్ గ్రూప్ సీఈఓ మేఘన గుమ్మి తెలిపారు. గృహిణి, ఉద్యోగిని ఎవరైనా సరే ఇంటిని, కుటుంబ సభ్యుల బాగోగులను చూసుకునేది మహిళే. దీంతో ఇంట్లో ఏ గదికి ఎంత స్పేస్ అవసరమో నిర్ణయించగలదు. వాస్తవానికి పురుషుల కంటే మహిళలకే దృశ్యీకరణ (విజువలైజేషన్) శక్తి ఎక్కువగా ఉంటుంది. తాను ఉండబోయే కిచెన్, బెడ్ రూమ్, బాల్కనీ ఇంట్లోని ప్రతీది ఏ విధంగా ఉండబోతుందో ఊహించగలదు. –సాక్షి, సిటీబ్యూరోఐదారేళ్ల క్రితం వరకూ రియల్ ఎస్టేట్ రంగంలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండేది. అయితే స్థిరాస్తి రంగంలో వృత్తి నైపుణ్యం, ఆదాయ వనరులు పెరగడం, వర్క్ కల్చర్ మారడంతో క్రమంగా ఈ విభాగంలో మహిళలు ప్రవేశిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్, మార్కెటింగ్, సేల్స్ విభాగంలోనే కాదు సైట్ల మీద కూడా మహిళలు పనిచేసే స్థాయికి ఎదిగారు. దీంతో రియల్టీ సెక్టార్ అసంఘటిత రంగం నుంచి సంఘటిత రంగంగా అభివృద్ధి చెందుతుంది. ఐటీ, ఫార్మా వంటి రంగాల్లో మాదిరిగా రియల్టీ సెగ్మెంట్లోనూ వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.ఆమెకు నచ్చితేనే.. ఇల్లు కొందామని నిర్ణయించుకున్నాక.. ప్రాంతం, ధర, ప్రాజెక్ట్, వసతులు ఏవైనా సరే భర్తకు నచ్చినా సరే అంతిమంగా నిర్ణయించాల్సింది, ఓకే చేయాల్సిందీ ఇల్లాలే. ఆమెకు నచ్చకుండే ఇంటి కొనుగోలు చేయరు. సొంతింటి ఎంపికలో మహిళల పవర్ అదీ. అపార్ట్మెంట్లతో పోలిస్తే విల్లాలలో ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండటంతో నేటి యంగ్ ఉమెన్స్ విల్లాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు నిర్ణయాధికారం, కొనుగోలు శక్తి పెరగడంతోనూ ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడింది.ఇన్ఫ్రాకు నీడ రియల్టీ.. మనల్ని అంటిపెట్టుకొని నీడ ఎలాగైతే ఫాలో అవుతుందో.. ఇన్ఫ్రాకు రియల్ ఎస్టేట్ కూడా అంతే. మౌలిక వసతులు అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలోనే రియల్ పరుగులు పెడుతుంది. భూముల ధరలు పెరగడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం సౌత్ హైదరాబాద్ వైపు ఫోకస్ పెట్టింది. కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం వంటి పశ్చిమ ప్రాంతాలు ఇప్పటికే కిక్కిరిసిపోయాయి. ఇక్కడ సామాన్యులు కొనే పరిస్థితి లేదు. సౌత్లో ఇన్ఫ్రా డెవలప్మెంట్తో కొత్తూరు, షాద్నగర్, ఆదిభట్ల, ముచ్చర్ల వంటి దక్షిణ ప్రాంతాలు బాగా డెవలప్ అవుతాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాలలో ధరలు తక్కువగా ఉన్నాయి కాబట్టి సామాన్య, మధ్యతరగతి ఈ టైమ్లో కొనుగోలు చేయడం ఉత్తమం. ఏ నగరమైనా సమాంతరంగా అభివృద్ధి చెందాలి. కానీ, మౌలిక వసతుల కల్పనలో హెచ్చు తగ్గులు కారణంగా అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. దీంతో హైదరాబాద్లో వెస్ట్, సౌత్ జోన్లో భూముల ధరలు బాగా పెరిగాయి. మూసీ సుందరీకరణ, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ.. హైదరాబాద్ స్థిరాస్తి రంగాన్ని నెక్ట్స్ లెవల్కు తీసుకెళ్లడం ఖాయం. ఈ బృహత్తర ప్రాజెక్ట్లతో రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ పుంజుకోవడం ఖాయం. -
International women's day 2025: 115 ఏళ్లు గడిచాయి? ఎక్కడుందీ సమానత్వం?
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించి 115 సంవత్సరాలైంది. అమానవీయమైన అణచివేతను, వివక్షను ఎదుర్కొన్న మహిళా కార్మికులు నెత్తురు ధారబోసి హక్కులకోసం తెగించి పోరాడారు. ఫలితంగా 8 గంటల పని దినాన్ని, వేతన పెంపుదలను, మరికొన్ని హక్కులను సాధించుకున్నారు. అయినప్పటికీ మహిళలు నేటికీ అనేక సవాళ్లను ఎదుర్కొంటూ కనిపిస్తున్నారు. మన సమాజంలో, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలో మహిళా లోకం పురుషుల కంటే తక్కువగానే ఉంటూ వస్తోంది. ఇంట్లోనూ, బయట ఉద్యోగాల్లోనూ – మహిళలు పూర్తి బాధ్యతను మోస్తున్నప్పటికీ – ఈ అసమానత కొనసాగుతుంది. మహిళలు బలమైన పోరాటాలు చేస్తున్నప్పటికీ, వారి మీద లైంగిక హింస పెరుగుతూనే వుంది. దళిత, మైనారిటీ మహిళలు ఎక్కువగా దాడులకు గురి అవుతున్నారు. ప్రొఫెసర్లు, సైంటిస్టులు, డాక్టర్ల దగ్గర నుండి పారిశుధ్య కార్మికుల వరకు – అందరికీ కాంట్రాక్టు, తాత్కాలిక పనులే తప్ప ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. ఈ పనుల్లో కూడా మహిళలకు సమాన పనికి సమాన వేతనాలు రావడం లేదు. ఉద్యోగ బీమా పథకాన్ని కోల్పోవడం అంటే మహిళలను ప్రసూతి ప్రయోజనాలకుదూరంగా పెట్టినట్లే. చదవండి! International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!1970లో పురుడు పోసుకున్న ‘ప్రగతిశీల మహిళా సంఘం’ ఎన్నో సమరశీల పోరాటాలు నిర్వహించింది. నిర్బంధానికి అణచివేతకు గురయ్యింది. అనేక మంది వీరవనితలు అమరులయ్యారు. 12 రాష్ట్రాల్లో గుర్తింపు కలిగిన మహిళా పోరాటాలు నిర్వహించింది. భూమికోసం, ఇళ్ళస్థలాలకోసం, స్త్రీ పురుష సమానత్వంకోసం లైంగిక హింసకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలను నిర్మించాం. ఈ క్రమంలో 2013లో సంస్థ చీలికకు గురయ్యింది. ఫలితంగా మహిళా ఉద్యమాలు తీవ్రంగా నష్టాన్ని చవిచూసాయి. వీటిని సమీక్షించుకొన్న తర్వాతరెండు సంస్థలు కలిసి భవిష్యత్లో ఒకే సంస్థగా పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. మార్చి 8వ తేదిన అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా విలీనం కావాలని రెండు సంస్థలు భావించాయి. ఈ విలీనానికి ఒంగోలు వేదిక కాబోతుంది. – బి.పద్మ, ప్రధాన కార్యదర్శి,ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ), ఏపీ -
International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!
అంతర్జాతీయమహిళాదినోత్సవం అంటే మహిళాహక్కుల గురించి చర్చించుకోవడం. వారి హక్కులరక్షణ, మహిళా సాధికారతను సాధించడం ఎలా దానిపై అవగాహన కలిగిఉండటం. ఈ ఏడాది థీమ్ ‘యాక్సలరేట్ యాక్షన్’ అంటే...లింగ సమానత్వానికి సంబంధించిన చర్యల్ని వేగవంతం చేయడం. అంటే మహిళా విద్యా అవకాశాలను మెరుగుపర్చడం, ఉద్యోగ అవకాశాలను మరిన్ని కల్పించడం. సమిష్టిగా, లింగ సమానత్వం కోసం చర్యలను వేగవంతం చేయడం. ప్రపంచ ఆర్థిక వేదిక డేటా ప్రస్తుత పురోగతి రేటు ప్రకారం, పూర్తి లింగ సమానత్వాన్ని చేరుకోవడానికి 2158 వరకు పడుతుంది. అంటే ఇప్పటి నుండి దాదాపు ఐదు తరాలు పడుతుంది దీనికి సంబంధించి అసలు యాక్సలరేట్ యాక్షన్ అనేది ఎలా ఉండాలి అనే అంశంపై పాపులేషన్ ఫస్ట్ డైరెక్టర్ డాక్టర్ ఎ.ఎల్. శారదతో సాక్షి. కామ్ సంభాషించింది. ఆ వివరాలు మీకోసం...యాక్సలరేట్ యాక్షన్ అంటే మహిళలకు విలువైన సేవలను, వనరులను మరింత వేగంగా, నిర్మాణాత్మకంగా అధికంగా అందుబాటులోకి తీసుకు రావడం. సపోర్ట్ ది సపోర్టర్స్ అనే నినాదానికి కనుగుణంగా ఉమ్మడిగా సాగిపోవడం అన్నారామె. అది మాత్రమే కాకుండా, నాణ్యమైన సేవలను అందించడం అనే లక్ష్యంగా ఈ కార్యాచరణ సాగాలి. వారికి మరిన్ని అవకాశాలను కల్పించడం అనేది ప్రధానంగా ఉండాలి. ఇది సామూహికంగా సాగాలి. నామమాత్రపు చర్యలుగా గాకుండా చిత్తశుద్ధిగా సాగాలి. కేవలం మాటలు, వాగ్దానాలకు పరిమితం గాకుండా, చేతలు, చర్యలుగా ఉండాలి.గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు కూడా ఉపయోగపడేలా చర్యల్ని వేగవంతం చేయాలంటే వివిధ సంస్థలు, వ్యక్తులతో కలిసి జమిలిగా పనిచేయాలి. అపుడు మాత్రమే ఆశించిన ఫలితాలు సాధించగలం. కానీ మహిళలకు సేవలను అందుబాటులోకి తీసుకు రావడం అంటే.. మహిళల అభివృద్ధి అంటే ఆడబిడ్డల పెళ్లికి ఎంతో కొంత డబ్బులు ఇవ్వడం, లేదా ఇతర ఉచిత పథకాలు అనుకుంటాయి ప్రభుత్వాలు. కానీ ఇలాంటి పథకాల వల్ల ఆయా పార్టీలకు ఓట్లు వస్తాయోమోగానీ, మహిళలకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. మహిళల నాణ్యమైన విద్య, ఆరోగ్యం, క్రియేటివిటీ, నైపుణ్య శిక్షణ, వనరులను అందుబాటులోకి తీసుకు రావడం లాంటివి జరగాలి. ప్రాక్టికల్గా లింగ వివక్షను రూపు మాపేందుకు, అందుకు తగిన మెరుగైన అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలి. సాధికారత సాధించేలా వారికి తోడ్పాటు అందించాలి. వారి జీవన పరిస్థితుల మెరుగుదలకు కావాల్సిన వనరులు కల్పించాలి. దీంతోపాటు వనరుల రక్షణలో మహిళలకు శిక్షణ ఇవ్వాలి. ఉదాహరణకు నీటి వసతి కల్పించాలి అంటే తాతాల్కిక పరిష్కారాలతోపాటు నీటి నిల్వలను ఎలా కాపాడాలి, బావులను తవ్వడం లాంటి అంశాలపై దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. దీనిపై మహిళలకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. సమస్య ఏదైనా పరిష్కారం మూలాల్లోకి వెళ్లాలి. సమాజంలో వివిధ కమ్యూనిటీలు, వ్యక్తులను ఇందులో భాగస్వామ్యులను చేయాలి. బాలికల అక్షరాస్యత శాతం ఎందుకు పడిపోతోంది అనే పరిశోధన జరగాలి. ప్రాంతీయ భాషల్లో అర్థమయ్యేలా విద్యాబోధన జరగాలి. ఇది శాస్త్రీయపరంగా, ఆధునిక బోధనా పద్దతులు ద్వారా జరగాలి. అపుడు మాత్రమే పిల్లలకు చదువుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది.చర్యలు ఏమైనా ప్లాన్ ఓరియెంటెడ్గా గాకుండా, పీపుల్ ఓరియెంటెడ్గా ఉండాలి. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టాలి. వాటిపై అవగాహన కల్పించాలి. జంగా చర్యల్ని వేగవంతం చేయడం అంటే పేపర్మీద లెక్కలుగా గాకుండా ఫలితాలు, వాస్తవంగా ప్రయోజనకరంగా ఉండాలి. అపుడు మాత్రమే ఈ థీమ్కు సాఫల్యత చేకూరుతుంది. ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలి. మహిళా హక్కుల కోసం పనిచేస్తున్న వ్యక్తులు, సంస్థలు,నెట్వర్క్తో గ్రూపులతో చర్చించి చర్యలు తీసుకోవాలి అన్నారు. పాపులేషన్ ఫస్ట్ ఆధ్వర్యంలో తాము ఇలాంటి సేవలనే అందిస్తున్నామని, అనేక మంది సంస్థలు, వ్యక్తులతో జమిలిగా పనిచేసి, ఫలితాలు సాధిస్తున్నామని శారద చెప్పారు. అలాగే లింగ వివక్ష నిర్మూలన సమాన అవకాశాల్లో ఎంత సాధించాం అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే.. చాలామార్పును సాధించాం అనడంలో ఎలాంటి సందేహం లేదు. పురుషాధిక్య భావజాలం, ఆధిపత్యం ఇంకా కొనసాగుతున్నప్పటికీ, జరుగుతున్న అన్యాయాలపై, హక్కులపై అవగాహన పెరిగింది. ఎందుకిలా అని ప్రశ్నించే తత్వం, పోరాట స్ఫూర్తి పెరిగింది. నిజం చెప్పాలంటే మహిళలు చాలా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా చాలా ముందుకు పోతున్నారు. కానీ గుణాత్మకమైన మార్పు సాధించాలంటే ఇది సరిపోదు. 90 శాతం మహిళలు ఇంకా వెనుకబడే ఉన్నారన్నారు. వీరి పురోగతి రేటును వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను, చిత్తశుద్ధిగా, నిబద్ధతతో మరింత వేగవంతం చేయాల్సింది ఉందన్నారు శారద. పాపులేషన్ ఫస్ట్పాపులేషన్ ఫస్ట్ అనేది మహిళా సాధికారత, లింగ సమానత్వం ,సమాజ సమీకరణ కోసం అంకిత భావంతో పనిచేస్తున్న సంస్థ. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుండి సోషియాలజీలో డాక్టరేట్ చేసిన డా. శారద పాపులేషన్ ఫస్ట్ ఫౌండర్ డైరెక్టర్గా ఉన్నారు. శారద నేతృత్వంలోని పాపులేషన్ ఫస్ట్ జెండర్ సెన్సిటైజేషన్ను గుర్తించి, దాని కోసం పనిచేసే అనేకమంది (ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా) జర్నలిస్టులకు ‘లాడ్లీ’ మీడియా పేరుతో అవార్డులు అందించి ప్రోత్సహిస్తుంది. ఇంకా అవగాహనా వర్క్షాప్లు నిర్వహిస్తుంది. ఫెలోషిప్లు అందిస్తుంది. డా.శారద సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సభ్యురాలిగా కూడా ఉన్నారు. గత మూడు దశాబ్దాలుగా బాలికా విద్యా , మహిళా హక్కులు, సమానత్వం కోసం కృషి చేస్తున్నారు. మహిళామూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు -
International Women's Day 2025: మహిళా విముక్తిలో ఓ అంకం
‘కన్యాశుల్కం’ నాటకం గుర జాడను అత్యుత్తమ నాటక రచ యి తగా తెలుగు సాహిత్యంలో నిలిపింది. ఈ నాటకాన్ని ‘జగన్నాథ విలాసినీ సభ’ 1892 ఆగస్టులో మొదట ప్రదర్శించింది. కన్యాశు ల్కంలో ప్రధానమైన సమస్య సుబ్బి పెళ్లి తప్పించటం! ఆడవాళ్లకి ఏ ఆలోచనాశక్తి లేదని, చులకనగా వారిని చూసే నాటి సమాజంలో మహిళలను ధైర్యవంతులుగా చిత్రించి మహిళల చరిత్రను పునర్లిఖించారు గురజాడ. సుబ్బమ్మ లేక సుబ్బి ఈ కథకి మూలం. నాటకంలో ఎక్కడా కనిపించదు. వెంకమ్మ – కృష్ణరాయపురం అగ్రహారీ కుడు అగ్నిహోత్రావధాన్ల భార్య. బుచ్చమ్మ-అగ్ని హోత్రావ ధాన్ల పెద్ద కూతురు, వితంతువు. మీనాక్షి - రామచంద్రా పురం అగ్రహారీకుడు లుబ్ధావధాన్ల కుమార్తె, వితంతువు. మధురవాణి–విజయనగరానికి చెందిన వేశ్య. పూట కూళ్ళమ్మ విజయనగరంలో పూట కూళ్ళిల్లు నడిపే వితంతువు. వెంకమ్మ అన్నగారు కరటక శాస్త్రి. ఇతడు కృష్ణరాయ పురం అగ్రహారంలో ఉన్న చెల్లెలి ఇంటికి వచ్చినపుడు సుబ్బి పెళ్ళి విషయం తెలుస్తుంది. ఈ సంబంధం ఇష్టంలేనివెంకమ్మ అన్న కరటకశాస్త్రిని ఈ సంబంధం తప్పించమని వేడుకుంటుంది. ఎలాగైనా మేనకోడలు పెళ్లి తప్పించాలని పథకాన్ని రూపొందిస్తాడు అతడు.మధురవాణిది నాటకంలో కీలకమైన పాత్ర. ఆమె వేశ్య. విజయనగరంలో ఉండే మధురవాణి కారణాంతరాల చేత రామచంద్రపురం అగ్రహార నివాసి, ఊరి కరణం రామప్ప పంతులి ఇంటికి చేరుతుంది. సుబ్బితో పెళ్లి ఖాయం చేసు కున్న లుబ్ధావధాన్లు రామచంద్రపుర వాసి. రామప్పపంతులు నయవంచకుడని ఆమె తొంద ర్లోనే కనిపెట్టేసింది. స్వతహాగా ఎదుటివారికి సాయం చెయ్యాలనే సద్బుద్ధి కలి గిన మధురవాణి... లుబ్ధావధాన్ల పెళ్లి రామప్ప పంతులు కుదిర్చాడని తెలిసిన వెంటనే ‘ఈ పెళ్లి మాన్పించకపోతే నేను మీతో మాట్లాడను’ అంటుంది. ఆ తరువాత అసలు కథ మొదలైంది.కరటకశాస్త్రి తన ప్రణాళిక అమలు చెయ్యటానికి రామప్ప పంతులు ఇంటికి వస్తాడు. అక్కడ మధుర వాణిని చూసి తన మేనకోడలి పెళ్లి తప్పించమని కోరతాడు. ఆమె అంగీకరించి కొన్ని సలహాలు ఇస్తుంది. తన ‘కంటె’ని పెళ్లిలో పెళ్లికూతురికి పెట్టటానికి కూడా ఒప్పుకుంటుంది. ఆడవేషంలో ఉన్న కరటకశాస్త్రుల శిష్యుడు మహేష్ని ఇచ్చి పెళ్ళి జరిపించి, తద్వారా సుబ్బి పెళ్లి ఆపటంలో మధురవాణి చాకచక్యాన్ని ప్రదర్శించింది. తర్వాత లుబ్ధావధా న్లను పెళ్లి చేసుకున్న మహేష్...మధురవాణి దగ్గరకు వచ్చి ఆమె ‘కంటె’ ఆమెకి ఇచ్చేస్తాడు. మధురవాణి ఆడపిల్ల వేషంలో ఉన్న మహేష్కు దాసరి వేషం వేసి ఊరు దాటిస్తుంది.‘కంటె’ కోసం రామప్ప పంతుల్ని ఇబ్బంది పెట్టడంతో అతడే హెడ్ కానిస్టేబుల్తో లుబ్ధావధాన్ల మీద ఖూనీ కేసు పెట్టిస్తాడు. ఈ వ్యవహారంలో లుబ్ధావధాన్లను కేసునుంచి బయట పడెయ్యడానికి మధురవాణి, సౌజన్యా రావు పంతులు ఇంటికి వెళుతుంది. అదే సమయంలో గిరీశం కూడా ఆ ఇంటికి వస్తాడు. బుచ్చమ్మని లేవదీసుకు పోయిన గిరీశం అంతటితో తృప్తిపడక లుబ్ధావధాన్ల ఆస్తి చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ అక్కడికి వచ్చాడు. గిరీశం నిజస్వరూపం తెలుసుకున్న సౌజన్యా రావు పంతులు బుచ్చమ్మను పూనాలో విడోస్ హోవ్ుకు పంపే ఏర్పాట్లు చేస్తాడు. నాటకంలో మీనాక్షి పాత్ర కూడా ముఖ్యమైనదే. ముసలి తండ్రి పెళ్లి కరటకశాస్త్రి శిష్యుడు మహేశంతో జరి పించటంలో సిద్ధాంతికి సంపూర్ణ సహకారం అందిస్తుంది. ఒక రాత్రివేళ రామప్ప పంతులితో తమ ఇంట్లో తండ్రికి దొరికిపోతుంది. తండ్రి బయటికి గెంటేస్తాడు. ఈ చర్యకి మీనాక్షి ఏమీ జంకకుండా ‘‘... ఈ జన్మలో ఈ ఇంట్లో అడు గుపెట్టను’’ అంటూ రామప్ప పంతు లుతో వెళ్లిపోతుంది.ఇక గంపెడు చాకిరీ చేస్తూ నెత్తిన ముసుగేసుకుని జీవి తాన్ని గడుపుతున్న బుచ్చమ్మ ఆలోచనాశక్తి, తెంపరితనం ఉన్న మహిళ. బుచ్చమ్మకి గిరీశం తన కళ్లముందు నిలిపిన రంగుల లోకం... అందరి ముత్తయిదువలలాగ జీవించాలనే ఆశని కల్గించింది. ఇంకో పక్క గిరీశం తన ఈ నిర్ణయం వల్ల ముసలాడితో చెల్లెలి పెళ్లి ఆగిపోతుందని నచ్చ చెప్పాడు. ధైర్యంగా ఆమె గిరీశంతో అగ్ని హోత్రావధాన్ల కళ్లుగప్పి వెళ్లి పోయింది. విజయనగరంలో పూటకూళ్ల ఇల్లు నడుపుకునే పూటకూళ్లమ్మ ఇంట్లో పనీపాటూ చేసు కుంటూ, ఆకతాయిగా తిరిగే మాయలాడు గిరీశం... ఆమెని మోసగించినందుకు అతడిని చీపురు తీసుకుని వెంటబడు తుంది. దానితో కృష్ణరాయ పురం అగ్రహారం వెంకటేశంతో చేరతాడు గిరీశం. లుబ్ధా వధాన్లకి వరసకి తమ్ముడైన గిరీశం: సుబ్బిని పెళ్లి చేసు కోవద్దంటూ లుబ్ధావధాన్లకి అర్థం అయ్యేటట్లు, భయ పెడుతూ ఉత్తరం రాస్తాడు. కాబట్టి సుబ్బి పెళ్లి ఆపటంలో పూటకూళ్లమ్మ కూడా తెలీకుండానే పెద్దసాయం చేసింది. గిరీశం కృష్ణరాయపురం చేరేటట్టు చేసింది.కన్యాశుల్కం నాటకం సుబ్బి కొరకే, సుబ్బికోసమే నడి చింది. చెప్పాలంటే అదృశ్యంగా కథ నడిపింది సుబ్బే. తలా ఒక చెయ్యివేసి దుర్మార్గాన్ని అడ్డుకున్నది మహిళా శక్తి! అదే గురజాడ మహిళలకు చూపిన వెలుగుదారి. డా. తుర్లపాటి రాజేశ్వరి వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార విజేత -
ఇంటి ఓనర్ మహిళ అయితే ఎన్ని ప్రయోజనాలో..
ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలంటారు పెద్దలు. కానీ, ఇల్లే ఇల్లాలి పేరు మీద ఉండాలంటారు నిపుణులు! రెండూ నిజమే. మొదటి దాని గురించి చర్చ అవసరం లేకపోయినా.. రెండో దాని గురించి మాత్రం అవసరమే. ఎందుకంటే ఇంటి ఓనర్ లేదా కో–ఓనర్ మహిళ అయితే ఎన్నో ప్రయోజనాలున్నాయి గనక! గృహ రుణం నుంచి మొదలు పెడితే వడ్డీ రాయితీ, ఆదాయ పన్ను మినహాయింపు, స్టాంప్ డ్యూటీ తగ్గింపు.. ఇలా ఎనెన్నో ప్రయోజనాలున్నాయి. అందుకే తెలివైన గృహ కొనుగోలుదారుడు ఇంటిని భార్య, తల్లి లేకపోతే అక్క, చెల్లి మొత్తమ్మీద మహిళ పేరు మీద కొనుగోలు చేస్తారని నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరోస్టాంప్ డ్యూటీలో తగ్గింపు.. పలు రాష్ట్రాలు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ల సమయంలో మహిళలకు స్టాంప్ డ్యూటీ రాయితీని అందిస్తున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహిళలకు 1 శాతం రాయితీ ఉండేది. ప్రస్తుతం లేదు. ఢిల్లీలో ప్రాపర్టీ కొనుగోలుదారులకు మగవారికైతే ప్రాపర్టీ విలువలో 6 శాతం స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తుండగా.. మహిళ ఓనరైతే 4 శాతం చెల్లించాల్సి ఉంటుంది. జమ్మూ అండ్ కశ్మీర్లో అయితే మహిళ ప్రాపర్టీ కొనుగోలుదారులకు స్టాంప్ డ్యూటీనే లేదు. ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ మహిళా ఓనర్లకు స్టాంప్ డ్యూటీ మినహాయింపులు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే పట్టణ, గ్రామీణ ప్రాంతాల వర్గీకరణ ఆధారంగా కూడా స్టాంప్ డ్యూటీలో మినహాయింపు ఉంది.ఐటీప్రయోజనాలు..గృహ యజమాని లేదా సహ–యజమాని మహిళ అయితే ఆదాయ పన్ను మినహాయింపులు కూడా ఉన్నాయి. భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఇద్దరు వేర్వేరుగా అసలు, వడ్డీలపై ఐటీ తగ్గింపులను క్లయిమ్ చేసుకునే వీలుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ప్రకారం సహ దరఖాస్తుదారు ప్రిన్సిపల్ అమౌంట్పై ఏడాదికి రూ.1.5 లక్షల వరకు, చెల్లించిన వడ్డీపై రూ.2 లక్షల వరకు ప్రయోజనాన్ని పొందవచ్చు. అలాగే సెక్షన్ 80ఈఈ కింద ఇతర క్లెయిమ్లతో పాటు తొలిసారి గృహ యజమానురాలు మహిళ అయితే ప్రిన్సిపల్ అమౌంట్ మీద రూ.50 వేలు తగ్గింపు కూడా అందుతుంది. అద్దె ఆదాయంపై కూడా.. మహిళలు ఆస్తిని విక్రయించేటప్పుడు క్యాపిటల్ గెయిన్ మినహాయింపులను కూడా పొందవచ్చు. అంతేకాకుండా ప్రాపర్టీని మహిళలు అద్దెకు ఇస్తే.. ఆమె రెండు రకాల తగ్గింపులకు క్లయిమ్ చేసుకోవచ్చు. అద్దెకు ఇచ్చిన ప్రాపర్టీపై ఏదైనా లోన్పై చెల్లించే వడ్డీపై పన్ను తగ్గింపుతో పాటు రెంటల్ ఆదాయంపై 30 శాతం స్టాండర్డ్ డిడెక్షన్ లభిస్తుంది. అయితే పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయాలంటే మహిళలకు ఆదాయ వనరులు ఉండాల్సిందే. గృహ రుణ వడ్డీ రేట్ల తగ్గింపు..బ్యాంక్లు, ఆర్థిక సంస్థలు మహిళలను విశ్వసనీయ రుణ గ్రహీతలుగా పరిగణిస్తుంటాయి. అందుకే స్థిరాస్తి రంగంలో మహిళా పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక రుణ కార్యక్రమాలను, స్కీమ్లను అందుబాటులోకి తీసుకొస్తుంటాయి. తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తున్నాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ వంటి బ్యాంకులలో పురుష రుణ గ్రహీతలతో పోలిస్తే మహిళలకు హోమ్ లోన్ వడ్డీ రేట్లు 0.5 నుంచి 1 శాతం తక్కువగా ఉంటాయి.ఈ శాతం తక్కువగా కనిపిస్తున్నప్పటికీ దీర్ఘకాలంలో డబ్బు, ఈఐఎంను ఆదా చేస్తుంది. ప్రధాన్మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద లో ఇన్కం గ్రూప్(ఎల్ఐజీ) కేటగిరీ కింద మహిళలకు రూ.6 లక్షల రుణానికి 6.5 శాతం వడ్డీ రాయితీతో.. రూ.2.67 లక్షల వరకు సబ్సిడీని పొందవచ్చు. ఇన్కం సోర్స్ లేని మహిళలకు బ్యాంక్లు రుణాలను అందించవు.వారసులకు బదిలీ సులువు..మహిళ పేరిట ప్రాపర్టీ ఉంటే అది ఆమె ఎస్టేట్లో భాగమవుతుంది. ఎటువంటి చట్టపరమైన చిక్కులు లేకుండా ఆమె వారసులకు సులభంగా బదిలీ అవుతుంది. అయితే విడాకుల సమయంలో సేల్డీడ్ ఆధారంగా ఆస్తి కేటాయింపులు ఉంటాయి. ఏదైనా చట్టపరమైన వివాదాలు తలెత్తితే ఆస్తి మహిళ పేరు మీద ఉన్నప్పటికీ భర్త ఉమ్మడిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. -
వణక్కం.. ఇక అంతా వీళ్ల చేతుల్లోనే!
న్యూఢిల్లీ, సాక్షి: దేశ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) మహిళా దినోత్సవం సందర్భంగా.. నారీశక్తికి వందనం అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. మరోసారి అత్యంత అరుదైన నిర్ణయం తీసుకున్నారాయన. తన సోషల్ మీడియా అకౌంట్ల బాధ్యతలను ఎంపిక చేసిన మహిళలకు అప్పజెప్పారు. ఈ క్రమంలోనే వణక్కం.. అంటూ ఆయన ఖాతా నుంచి ఓ పోస్ట్ అయ్యింది.ఇవాళ తన సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ బాధ్యతను ఇండియన్ గ్రాండ్ చెస్ మాస్టర్ వైశాలి రమేష్బాబు(Vaishali Rameshbabu)కి అప్పగించారు. ఇదే విషయాన్ని మోదీ ఎక్స్ ఖాతా నుంచి వైశాలి తెలియజేశారు. తాను చెస్ ప్లేయర్నని, దేశం తరఫు ప్రాతినిధ్యం వహించడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని పోస్ట్ చేశారామె. ప్రధాని ఖాతాను నిర్వహించడం తనకు దక్కిన గౌరవమని అన్నారు. ఈరోజంతా ఆమే ఆయన ఖాతా బాధ్యతలను చూసుకోనున్నారు. ఆరో ఏట నుంచి నేను చెస్ ఆడుతున్నాను. అది నాకొక ఉత్తేజకరమైన ప్రయాణం. మీరు ఎంచుకున్న మార్గంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా మీ కలలు సాకారం చేసుకోవడానికి ముందుకుసాగండి. ఆడపిల్లలకు అండగా నిలవాలని తల్లిదండ్రులు, తోబుట్టువులను ఈసందర్భంగా కోరుతున్నాను. వారి సామర్థ్యంపై నమ్మకం ఉంచండి. వారు అద్భుతాలు చేయగలరు అని వైశాలి సందేశం ఉంచారు. మరోవైపు.. వైశాలితో పాటు న్యూక్లియర్, స్పేస్ సైంటిస్ట్లు అయిన ఎలినా మిశ్రా, శిల్పి సోనీ.. మోదీ ఖాతా నుంచి పోస్టులు పెట్టారు. భారతదేశం సైన్స్ పరిశోధనలకు అత్యంత అనుకూలమైన ప్రదేశమన్నారు. మరింత ఎక్కుమంది మహిళలు ఈ రంగాన్ని ఎంచుకోవాలని కోరారు.నేను అనితా దేవిని.. నలందా జిల్లాకు చెందిన అనితాదేవి ప్రధాని ఖాతా నుంచి తన విజయాలు వెల్లడించారు. ‘‘నేను జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. నా కాళ్ల మీద నిలబడి, సొంతంగా ఏదైనా సాధించాలనే తపన ఉండేది. 2016లో ఆ దిశగా అడుగేశాను. అప్పుడే స్టార్టప్లపై క్రేజ్ పెరుగుతోంది. నేను కూడా మాదోపుర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ను ప్రారంభించాను. నాతో కలిసి పనిచేసిన మహిళలు స్వయంసమృద్ధి సాధించడం నాకు అత్యంత సంతోషాన్ని ఇచ్చింది. వారి కుటుంబాలు బాగుపడటం ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఆర్థిక స్వాతంత్య్రం మహిళలకు గౌరవాన్ని ఇస్తుందని నా నమ్మకం. మీరు అంకిత భావం, కృషితో ముందుకుసాగాలని బలంగా అనుకుంటే ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు’’ అంటూ తన స్టోరీ వెల్లడించారు.ప్రధాని మోదీ గతంలోనూ ఇలానే తన సోషల్ మీడియా అకౌంట్లను స్ఫూర్తిదాయకమైన మహిళలకు అప్పగించారు కూడా. ఇక.. మహిళా దినోత్సవం(Women's Day 2025) పురస్కరించుకొని ఇవాళ ప్రధాని భద్రతను కూడా పూర్తిగా మహిళా పోలీసులే పర్యవేక్షించనుండడం గమనార్హం. ప్రస్తుతం ఆయన గుజరాత్ పర్యటనలో ఉన్నారు. అంతకు ముందు తన మహిళా దినోత్సవ సందేశంలో.. ‘‘వివిధ అభివృద్ధి పథకాల ద్వారా ఎన్డీయే ప్రభుత్వం మహిళా సాధికారికతకు కృషి చేస్తోంది’’ అని అన్నారాయన. -
మహిళలకు ఎస్బీఐ ప్రత్యేక పథకం.. డెబిట్ కార్డు
మహిళా ఎంట్రప్రెన్యూర్లకు పూచీకత్తు లేకుండా, తక్కువ వడ్డీ రేటుపై రుణాలు అందించేలా ’అస్మిత’ పథకాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ప్రవేశపెట్టింది. మహిళల సారథ్యంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా యూనిట్లకు డిజిటల్ మాధ్యమం ద్వారా వేగవంతంగా, సులభతరంగా రుణ సదుపాయం లభించేందుకు ఇది ఉపయోగపడుతుందని బ్యాంక్ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు.వినియోగ ప్రయోజనాల కోసం రుణాలు తీసుకోవడానికి ఇష్టపడే మహిళలు వ్యాపార రుణాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ట్రాన్స్ యూనియన్ సిబిల్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఈ ఆవిష్కరణ జరగడం గమనార్హం. ప్రముఖ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ప్రకారం.. మహిళలు తీసుకున్న రుణాలలో కేవలం 3 శాతం మాత్రమే వ్యాపార ప్రయోజనాల కోసం, 42 శాతం వ్యక్తిగత రుణాలు, కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్స్, హోమ్ ఓనర్షిప్ వంటి పర్సనల్ ఫైనాన్స్ ఉత్పత్తుల కోసం, 38 శాతం బంగారంపై ఉన్నాయి.మరోవైపు, మహిళల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన రూపే ఆధారిత ’నారీ శక్తి’ ప్లాటినం డెబిట్ కార్డును కూడా బ్యాంకు ఆవిష్కరించింది. ఇక మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ప్రవాస భారతీయులలో మహిళల కోసం 'బీవోబీ గ్లోబల్ ఉమెన్ ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్ఓ సేవింగ్స్ అకౌంట్' పేరిట ప్రత్యేక ఖాతాను ప్రారంభించింది. -
మహిళలకు ఫ్రెష్బస్ ఫ్రీ కార్డులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న తమ బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు రూ. 500 వరకు పొదుపు చేసే ఫ్రెష్ కార్డులను ఉచితంగా ఇస్తున్నట్లు ఫ్రెష్బస్ తెలిపింది. వీటిని తదుపరి 10 రైడ్స్ కోసం ఉపయోగించుకోవచ్చని, ఒక్కో రైడ్పై రూ. 50 ఆదా చేసుకోవచ్చని వివరించింది.తమ వెబ్సైట్ లేదా యాప్లో బుక్ చేసుకున్న వారికి ఇది వర్తిస్తుందని పేర్కొంది. హైదరాబాద్, తిరుపతి, గుంటూరు, విజయవాడ, బెంగళూరు తదితర రూట్లలో సర్వీసులు నడిపిస్తున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు సుధాకర్ రెడ్డి చిర్రా తెలిపారు. సంస్థను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకూ తమ బస్సుల్లో 6.5 లక్షల మంది ప్రయాణించగా ఇందులో 30 శాతం అంటే 1.94 లక్షల మంది మహిళలు ప్రయాణించారని ఆయన తెలిపారు. మహిళలకు తమ సంస్థపై పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. -
బీవోబీ గ్లోబల్ ఉమెన్ ఎన్ఆర్ఈ, ఎన్ఆర్వో ఖాతా
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) మహిళల కోసం ప్రత్యేకంగా.. ‘బీవోబీ గ్లోబల్ ఉమెన్ ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్వో సేవింగ్స్ ఖాతాను’ ప్రారంభించింది. ఆటో స్వీప్ సదుపాయంతో ఇది ఉంటుంది. తద్వారా ఖాతాలో పరిమితికి మించి ఉన్న బ్యాలెన్స్ డిపాజిట్గా మారిపోయి, అధిక వడ్డీ రాబడి లభిస్తుంది. అలాగే, ఈ ఖాతాదారులకు గృహ రుణాలు, ఆటో రుణాలపై రాయితీ రేట్లు, తక్కువ ప్రాసెసింగ్ చార్జీలు ఉంటాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. 17 దేశాల్లో 60,000 టచ్ పాయింట్ల ద్వారా 16.5 కోట్ల అంతర్జాతీయ కస్టమర్లకు బీవోబీ సేవలు అందిస్తోంది. బీవోబీ ప్రీమియం ఎన్ఆర్ఈ, ఎన్ఆర్వో సేవింగ్స్ ఖాతా విషయంలోనూ మార్పులు చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయంగా ఉన్న భారతీయ మహిళలకు ప్రీమియం బ్యాంకింగ్ సేవలను అందించే లక్ష్యంతో బీవోబీ ఉమెన్ ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్వో ఖాతాను రూపొందించినట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీ మీనా వహీద్ ప్రకటించారు. -
మహిళలు.. ‘ఫండ్’ రాణులు!
అన్ని రంగాల్లోనూ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న మగువలు... స్టాక్ మార్కెట్లోనూ తగ్గేదేలే అంటూ ‘బుల్’ రైడ్ చేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయల విలువైన మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో ఇన్వెస్టర్ల నిధులను పక్కాగా నిర్వహిస్తూ ఫండ్ మేనేజర్లుగా సత్తా చాటుతున్నారు. తాము ఇంటినే కాదు.. అవకాశమిస్తే, ఫండ్ హౌస్లను కూడా మగాళ్లకు దీటుగా చక్కబెట్టగలమని నిరూపించుకుంటున్నారు. మహిళల నిర్వహణలో ఉన్న ఫండ్ ఆస్తులు ‘ఇంతింతై.. అన్నట్లుగా ఏడాది వ్యవధిలో రెట్టింపై రూ.13.45 లక్షల కోట్లకు ఎగబాకడం విశేషం!! అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంఎఫ్ రంగంలో రాణిస్తున్న అతివలపై స్పెషల్ ఫోకస్... దేశంలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ దూకుడు లాగే.. మహిళా ఫండ్ మేనేజర్లు కూడా జోరు పెంచారు. ఈ ఏడాది జనవరి నాటికి వారి సంఖ్య 49కి పెరిగింది. ఏడాది క్రితం ఉన్న 42 మందితో పోలిస్తే కొత్తగా ఏడుగురు జతయ్యారు. ఇదే కాలంలో మగ ఫండ్ మేనేజర్లు ఇద్దరు మాత్రమే పెరగడం గమనార్హం. ఇక మగువల నిర్వహణలో ఉన్న ఫండ్ ఆస్తులు కూడా రూ.13,45 లక్షల కోట్లకు ఎగిశాయి. గతేడాది జనవరితో పోలిస్తే రెట్టింపైంది. దేశంలో ఎంఎఫ్ సంస్థల నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు (ఏయూఎం) రూ.67.25 లక్షల కోట్లు కాగా, ఇందులో మహిళా ఫండ్ మేనేజర్లు/కో–ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తున్న అసెట్స్ విలువ 20 శాతానికి జంప్ చేసింది. అయితే, మొత్తం ఎంఎఫ్ ఫండ్ మేనేజర్లు 482 మందిలో మహిళల వాటా ఇంకా తక్కువగానే ఉన్నప్పటికీ, గత ఏడాది కాలంలో మగాళ్లతో పోలిస్తే మగువల సంఖ్య ఎక్కువగా పెరగడం ఈ రంగంలో వారి భవిష్యత్తుపై మరింత ఆశలు రేకెత్తిస్తోంది.25 ఎంఎఫ్లు... 339 స్కీమ్లు దేశవ్యాప్తంగా 25 మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో అతి వలు ఫండ్ మేనేజర్లుగా రాణిస్తున్నారు. మొత్తం 339 ఫండ్ స్కీమ్లను మేనేజ్ చేస్తున్నారు. కాగా, 6 ఫండ్ సంస్థల్లో ముగ్గురు కంటే ఎక్కువ మహిళా ఫండ్ మేనేజర్లు ఉండగా, 6 ఫండ్ హౌస్లలో ఇద్దరు చొప్పున, 13 సంస్థల్లో కనీసం ఒకరు ఉన్నారు. అన్నింటికంటే ఎక్కువగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్లో ఏడుగురు మహిళా ఫండ్ మేనేజర్లు రూ.2.27 లక్షల కోట్ల విలువైన 66 స్కీమ్లను నిర్వహిస్తున్నారు. భారత్లో అతిపెద్ద ఫండ్ హౌస్గా నిలుస్తున్న ఎస్బీఐ ఎంఎఫ్లోలో ఐదుగురు మగువలు రూ.1.88 లక్షల కోట్ల ఆస్తులను (14 స్కీమ్లు) మేనేజ్ చేస్తున్నారు. ఇక నిప్పన్ ఇండియా ఎంఎఫ్లో ఇద్దరు అతివలు రూ.1.53 లక్షల కోట్ల అసెట్లను (26 స్కీమ్లు) నిర్వహిస్తున్నారు.రూ.6.13 లక్షల కోట్లు ...తాజా గణాంకాల ప్రకారం దేశంలోని 49 మహిళా ఫండ్ మేనేజర్లలో టాప్–5 మగువలు మేనేజ్ చేస్తున్న ఫండ్ అసెట్స్ రూ.6.13 లక్షల కోట్లు (45.55 శాతం)గా ఉంది. ఇందులో ఎస్బీఐ ఎంఎఫ్కు చెందిన మాన్సి సజేజా రూ.1.41 లక్షల కోట్ల అసెట్లను నిర్వహిస్తూ.. భారత్లో నంబర్ వన్ మహిళా ఫండ్ మేనేజర్గా నిలిచారు. నిప్పన్ ఇండియా ఎంఎఫ్ కింజల్ దేశాయ్ (రూ.1.37 లక్షల కోట్ల అసెట్స్), యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కృష్ణా ఎన్ (రూ.1.34 లక్షల కోట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఫ్ అశ్విని షిండే 47 స్కీమ్లతో అత్యధిక స్కీమ్లను మేనేజ్ చేస్తున్న వారిలో టాప్లో ఉన్నారు. తర్వాత స్థానాల్లో మిరే అసెట్ ఇండియా ఎంఎఫ్ ఏక్తా గాలా (30 స్కీమ్లు), నిప్పన్ ఇండియా ఎంఎఫ్ కింజల్ దేశాయ్ (24 స్కీమ్లు) నిలిచారు. పురుషుల విషయానికొస్తే.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్కు చెందిన మనీష్ బాంతియా రూ.3.49 లక్షల కోట్ల అసెట్లను మేనేజ్ చేస్తూ.. దేశంలో టాప్ ఫండ్ మేనేజర్గా కొనసాగుతున్నారు.ఇన్వెస్టర్లుగానూ... ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు ట్రేడింగ్ చేస్తున్న అతివల సంఖ్య కూడా భారీగా పెరుగుతూ వస్తోంది. 2021 నుంచి చూస్తే ఏటా కొత్తగా 3 కోట్ల డీమ్యాట్ ఖాతాలు జతవగా.. ప్రతి నలుగురు ఇన్వెస్టర్లలో ఇప్పుడు 1 మహిళా ఇన్వెస్టర్ ఉండటం వారి జోరుకు నిదర్శనం. జనవరి నాటికి దేశంలో మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 18.8 కోట్లకు చేరుకుంది. ఇందులో దాదాపు 23.9 శాతం మహిళలవే కావడం గమనార్హం. కాగా, మ్యూచువల్ ఫండ్స్ ఫోలియోల (ఖాతాల) సంఖ్య 22.92 కోట్లకు చేరింది. 2021 మే నెలలో తొలిసారి 10 కోట్ల మైలురాయిని చేరగా.. నాలుగేళ్లలోనే దాదాపు 13 కోట్ల ఫోలియోలు కొత్తగా జతవ్వడం ఫండ్స్లోకి పెట్టుబడులు ఏ రేంజ్లో వచ్చి పడుతున్నాయనేందుకు నిదర్శనం. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
కష్టాన్నే నమ్ముకోవాలి
హాస్యచతురత.. సమయస్ఫూర్తి అని గూగుల్ చేస్తే సుమ కనకాల అని వస్తుందేమో! అందుకే ఇన్నేళ్లయినా ఆమె యాంకరింగ్కి ఆదరణ తగ్గలేదు.. తన పేరుతోనే షోలకు ఫాలోయింగ్ని పెంచే స్థాయికి చేరుకుంది.. ఆ తరం నుంచి ఈ తరం దాకా అందరికీ అభిమాన హోస్ట్గా మారిపోయింది..ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఉత్సవాన ఆమె గురించి ఆమె మాటల్లోనే..‘నేను పుట్టింది కేరళలోని పాలక్కాడ్లో. పెరిగింది మాత్రం హైదరాబాద్లోనే. అందుకే చిన్నప్పటి నుంచీ తెలుగు తెలుసు. మెట్టుగూడ రైల్వేక్వార్టర్స్లో ఉండేవాళ్ళం. తార్నాకలోని సెయింట్ ఆన్స్ హైస్కూల్లో చదివాను. రైల్వే డిగ్రీ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ చేశాను. తెలుగులో ఫ్లుయెన్సీ ఉండాలని మా అమ్మగారు పట్టుబట్టడం వల్ల స్కూల్లో తెలుగును సెకండ్ లాంగ్వేజ్గా తీసుకున్నాను. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రైటర్స్, డైరెక్టర్స్ ద్వారా కొంత తెలుగు నేర్చుకున్నాను. తెలుగుమీద నాకు పూర్తి పట్టు రావడంలో నా భర్త రాజీవ్ హెల్ప్ కూడా ఉంది. పుట్టింట్లో ఉన్నప్పుడు మాత్రమే మలయాళం .. మిగతా అంతా తెలుగే!దూరదర్శన్ మాత్రమే.. ఈ ఫీల్డ్లోకి చిత్రంగా వచ్చాను. నేను చేసిన ఓ డాన్స్ప్రోగ్రామ్ నచ్చి, దూరదర్శన్ సీరియల్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు గారు ఫోన్ చేశారు.. ‘ప్రదీప్ గారి డైరెక్షన్లోని ఓ సీరియల్లో మమ్మల్ని కాస్ట్ చేయాలనుకుంటున్నాం.. మీకు ఇంట్రెస్ట్ ఉందా?’ అంటూ! నాకు లేదు కానీ మా పేరెంట్స్ సరదాపడ్డారు. దాంతో ఓకే అన్నాను. అలా తెలుగు టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టాను. అప్పుడు దూరదర్శన్ చానల్ మాత్రమే ఉండేది. అందులో ఎక్కువగా సింగిల్ ఎపిసోడ్సే ఉండేవి. అందుకనే నేను సింగిల్ ఎపిసోడ్స్లోనే ఎక్కువగా చేశాను. కొన్ని సినిమా బేస్డ్ప్రోగ్రామ్స్కి యాంకరింగ్ కూడా చేశాను. శాటిలైట్ చానల్స్ స్టార్ట్ అవగానే పూర్తిగా యాంకరింగ్కి షిఫ్ట్ అయిపోయాను. ‘అంత్యాక్షరి’, ‘వన్స్ మోర్’ నుంచి ‘అవాక్కయ్యారా’,‘స్టార్ మహిళ’ లాంటి ఎన్నో షోస్ని హోస్ట్ చేశాను. ‘స్టార్ మహిళ’ నేను మరచిపోలేని షో. దాదాపు 12 సంవత్సరాలపాటు అయిదు వేల షోస్ చేసి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించాను. ఆ షోతో ఎంతో మంది మహిళలు తమ వ్యక్తిత్వాలతో నన్ను ఇన్స్పైర్ చేశారు. సొంత మనిషిలా ఆదరించారు. అవకాశముంటే మళ్లీ ఆ షో చేయాలనుకుంటున్నాను. తెలుగువారితో ఆ అనుబంధం రోజురోజుకీ బలపడుతోంది. జీన్స్, క్యాష్.. ఇప్పుడు ‘సుమ అడ్డా’ప్రోగ్రామ్స్కి దొరుకుతున్న ఆదరణే అందుకు సాక్ష్యం. ఇప్పుడు.. నా యూట్యూబ్ చానల్లో ‘చాట్ షో’ని స్టార్ట్ చేశాను. అలాగే ‘షెఫ్ మంత్ర’ అనే కొత్త షో కూడా మొదలైంది. ‘ప్రేమంటే’ అనే ఒక సినిమాలో కీ రోల్ చేస్తున్నాను. దేవాలయాల మీద ‘అవర్ టెంపుల్స్’ అనే సిరీస్ చేయాలి అనుకుంటున్నాను. టాలెంట్కి ఆకాశమే హద్దు. ఒక రీల్ షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చాలు.. వైరల్ అయిపోవచ్చు. ఫోన్లలో రీల్స్తో ఎంటర్టైన్ అవుతున్న కాలం ఇది. కాబట్టి అందులో కూడా నా ఎంటర్టైన్మెంట్ పోర్షన్ను అందిస్తున్నాను. లీజర్టైమ్ దొరికితే.. వెబ్ సిరీస్, మూవీస్ చూస్తాను.నాకు అత్యంత మెమరబుల్ మూమెంట్ నా పిల్లలే! ప్రొఫెషన్కి సంబంధించి అయితే .. నంది అవార్డ్ తీసుకోవడం! సామాజిక బాధ్యతనూ పంచుకునేందుకు మహిళల ఆరోగ్యం, సాధికారత, అలాగే ట్రాఫికింగ్ నుంచి బయటపడ్డ అమ్మాయిల స్వావలంబన, పిల్లల ఆరోగ్యం గురించి పనిచేసే ‘ఫెస్టివల్స్ ఫర్ జాయ్’ అనే ఎన్జీవోను మూడేళ్ల కిందట స్టార్ట్ చేశాను. భవిష్యత్లో మరికొన్నిప్రాజెక్ట్స్ చేపట్టాలని ప్లాన్ చేస్తున్నాం. నేను నమ్మేదొక్కటే.. కష్టాన్ని నమ్ముకుంటే అవకాశాల తలుపులు తెరుచుకుంటాయి. అప్పుడు అందరూ అందరికీ ఇన్స్పిరేషన్గా నిలుస్తారు’ అంటూ ముగించారు సుమ కనకాల. బహుభాషలతో ప్రయోజనంయాంకరింగ్ పర్సనల్ క్యారెక్టర్కి ప్రతిబింబం లాంటిది. ఈ విషయంలో నాకున్న జోవియల్ నేచర్, సమయస్ఫూర్తి చాలా హెల్ప్ అయ్యాయి. దాంతోపాటు నాకు బహుభాషలు తెలిసుండటమూ ప్లస్ పాయింట్ అయింది. మాతృభాష మలయాళం అవడం, తమిళ్, హిందీ కూడా వచ్చి ఉండటం, ఇంగ్లిష్ లో ఫ్లుయెన్సీ వల్ల.. ఏవైనా అవార్డ్ ఫంక్షన్స్కి రెండు, మూడు భాషల వాళ్ళు వచ్చినప్పుడు కమ్యూనికేట్ చేయడం, వాళ్ల సినిమాల గురించి మాట్లాడటం చాలా ఈజీ అయిపోతోంది.ప్రొఫెషన్లో ఎదురయ్యే సవాళ్ళను సమయస్ఫూర్తితోనే నెగ్గుకొస్తాను. నావి ఎక్కువగా లైవ్ షోసే కాబట్టి ఎడిటింగ్కి స్కోప్ ఉండదు. నాకు నేనే ఎడిటర్గా వ్యవహరించుకోవాలి. ఆచితూచి మాట్లాడాలి. నేను నటించిన సీరియల్స్, సినిమాలు నాకు చాలా నేర్పించాయి. ఈప్రొఫెషన్కు చక్కటి బాట వేశాయి. మా అత్తగారివైపు అందరూ ఇదే ఫీల్డ్కు చెందిన వాళ్లవడం నాకు కలిసొచ్చింది. వర్క్, లైఫ్ బ్యాలెన్స్ సాధ్యమైంది. మా ఇంట్లో నా షోస్కు బిగ్గెస్ట్ ఫ్యాన్స్.. మా అత్తగారు, మా అమ్మగారు. – శిరీష చల్లపల్లి -
లీడర్షిప్ కావాలి
నేను ఐపీఎస్ జాయిన్ అయినప్పుడు అంటే 1995లో పోలీస్ డిపార్ట్మెంట్లో రెండు లేదా మూడు శాతం మాత్రమే మహిళలు ఉండేవారు. ఐపీఎస్ క్యాడర్లో ఇంకా తక్కువ.. ఎంతంటే నేను ఏ పోస్ట్కి వెళ్లినా ఆ పోస్ట్లో ఫస్ట్ ఉమన్ని నేనే అయ్యేంత! కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మా బ్యాచ్లో పదమూడు మంది మహిళలం ఉంటే ఇప్పుడు 60 మంది వరకూ ఉంటున్నారు. ఇంతకుముందు పోలీసులు అంటే కేవలం పురుషులే అన్న ఇమేజ్ ఉండేది. ఇప్పుడది మారిపోయింది. డిపార్ట్మెంట్లోని అన్ని స్థాయుల్లోకి మహిళలు వస్తున్నారు. తెలంగాణలో 33 శాతం రిజర్వేషన్ కల్పించింది ప్రభుత్వం. దాంతో మహిళల సంఖ్య పెరుగుతోంది. అందుకే ఇప్పుడు పోలీస్ అంటే మహిళలు కూడా అనే ఇమేజ్ స్థిరపడిపోయింది. పోలీస్ స్టేషన్స్లో సౌకర్యాలూ విమెన్ ఫ్రెండ్లీగా మారుతున్నాయి. తెలంగాణనే తీసుకుంటే.. ప్రతి స్టేషన్లో మహిళల కోసం సపరేట్ వాష్ రూమ్స్ని కట్టించాం. కొన్ని జిల్లాల్లో అయితే బేబీ కేర్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేశాం. ఈ మధ్య సైబరాబాద్ కమిషనరేట్లో కూడా బేబీ కేర్ సెంటర్ను పెట్టారు. ఇదివరకు బందోబస్త్లు, గణేశ్ నిమజ్జనానికి మహిళా పోలీస్లు డ్యూటీకి వెళితే వాష్రూమ్స్ ఉండక చాలా అవస్థపడాల్సి వచ్చేది. ఇప్పుడు మొబైల్ వాష్రూమ్స్ సౌకర్యం వచ్చింది. ఎక్కడ బందోబస్త్ ఉంటే అక్కడికి ఈ మొబైల్ వాష్రూమ్ని పంపిస్తున్నారు. ఇలా మహిళలు చక్కగా పనిచేసుకోవడానికి అనుగుణమైన వసతులు ఏర్పాటవుతున్నాయంటే మహిళల పనికి గుర్తింపు, డిమాండ్ వచ్చినట్టే కదా!దృష్టి పెడతారు.. ఏ రంగంలో అయినా ఎంతమంది మహిళలు వస్తే అంత వేగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. మొత్తం వ్యవస్థలోనే విమెన్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఏర్పడుతుంది. అంతేకాదు లీడర్షిప్ రోల్స్ని పొందే అవకాశం వస్తుంది. లీడర్షిప్ రోల్స్లో మహిళలు ఉంటే స్త్రీల అవసరాల మీద దృష్టిపెడతారు. సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి.చెప్పుకోదగ్గదే కానీ.. మహిళా సాధికారత సాధించాలంటే ముందు స్త్రీల హక్కుల గురించి స్త్రీలతోపాటు సమాజమూ తెలుసుకోవాలి. స్త్రీ సెకండ్ సిటిజన్ కాదు.. తోటి ΄ûరురాలే అన్న స్పృహ రావాలి. అది ఇంటినుంచే మొదలవ్వాలి. నన్ను మా బ్రదర్తో సమానంగా చదివిస్తేనే కదా నా ఐపీఎస్ కల సాధ్యమైంది. అలా కొడుకైనా కూతురైనా ఇద్దరూ సమానమే.. హక్కులు, అవకాశాలు ఇద్దరికీ సమానమే అనే భావన పేరెంటింగ్లో కనిపించాలి. తర్వాత స్కూల్లో టీచింగ్లోనూ భాగం కావాలి. అప్పుడే అది సమాజంలో రిఫ్లెక్ట్ అవుతుంది. స్త్రీల పట్ల గౌరవం పెరుగుతుంది. ఆడపిల్లలు చదువును నిర్లక్ష్యం చేయకూడదు. ఆర్థికస్వాతంత్య్రానికి అదే మెట్టు! కాబట్టి అమ్మాయిలు అందరూ చదువు మీద దృష్టిపెట్టాలి. ఎలాంటి టాస్క్లకైనా సిద్ధమే! ఏ రంగంలో అయినా మహిళలు శారీరక శ్రమలో కానీ.. బుద్ధికుశలతలో కానీ పురుషులతో సమంగా ఉంటున్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా! మహిళలు కదా అని తేలికపాటి టాస్క్లు ఇవ్వడం ఉండదు. కీలకమైన బాధ్యతలనూ అప్పగిస్తారు. నన్నే తీసుకుంటే నేను మావోయిస్ట్ ఏరియాల్లో కూడా పని చేశాను. కాబట్టి మహిళలకు సమాన అవకాశాలే ఉన్నాయి.. ఉంటాయి.. ఉండాలి కూడా!– సరస్వతి రమ -
శ్రమతోనే సక్సెస్
పూసర్ల వెంకట సింధు... ఒలింపిక్స్లో పతకాలు సాధించింది.కామన్వెల్త్... వరల్డ్ చాంపియన్షిప్లలో స్వర్ణాలు సొంతం చేసుకుంది.ప్రపంచవేదికల మీద దేశ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసింది.భారత మాత మెడలో పతకాల హారం వేసి బంగారు సింధు అయింది.ఈ ఏడాది మహిళాదినోత్సవాన్ని శ్రీమతి సింధుగా వేడుక చేసుకుంటోంది.సాధికారత దిశగా పయనిస్తున్న మహిళలకు అభినందనలు చెప్పింది.ఈ తరంలో మహిళలు బిజినెస్, స్పోర్ట్స్తోపాటు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. కేవలం తమకు తాము నిలదొక్కుకోవడంతో సరిపెట్టడం లేదు, ఆ రంగంలో నంబర్ వన్గా నిలవడానికి శ్రమిస్తున్నారు. నంబర్ వన్ లక్ష్యాన్ని సాధిస్తున్నారు కూడా. ఈ స్ఫూర్తిని, ఇదే పంథాను కొనసాగించాలని అభిలషిస్తున్నాను. సక్సెస్కు దారి! ప్రతి ఒక్కరూ తమ కోసం తాము కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. వాటిని చేరుకోవడానికి తగినంత శ్రమించాలి. సక్సెస్ అనే లక్ష్యాన్ని చేరడానికి ఉన్న ఏకైక దారి హార్డ్వర్క్. హార్డ్వర్క్తో మాత్రమే విజయానికి చేరువ కాగలుగుతాం. అది కూడా ఒక నెల శ్రమతోనో ఏడాది శ్రమతోనో శిఖరాన్ని చేరాలని ఆశించకూడదు. కొన్నేళ్ల కఠోరశ్రమ, అంకితభావంతో శ్రమించినప్పుడే సక్సెస్ మనదవుతుంది. అయితే కొందరికి సక్సెస్ కొంత త్వరగా రావచ్చు, మరికొందరికి ఆలస్యం కావచ్చు. మన మీద మనం నమ్మకాన్ని కోల్పోకూడదు. ఆశను వదులుకోకూడదు, నిరాశపడకూడదు. మనం మనవంతుగా శ్రమిస్తూ ఉండాలి. సక్సెస్ వచ్చినప్పటి నుంచి మరింత బాధ్యతగా పని చేయాలి. సక్సెస్ అనే శిఖరాన్ని చేరాం అని రిలాక్స్ కాకూడదు. నంబర్ వన్కి చేరడానికి నేనలాగే కష్టపడ్డాను, కష్టపడుతూనే ఉంటాను కూడా. అమ్మానాన్న... భర్త! ఇప్పటి వరకు నన్ను, నా ఆర్థిక వ్యవహారాలను అమ్మానాన్న చూసుకునేవారు. టోర్నమెంట్కి తోడుగా నాన్న వచ్చేవారు. ఇప్పుడు మా వారు వస్తున్నారు. నా గురించి అన్నీ వాళ్లే చూసుకుంటారు. నా ఫోకస్ అంతా ఆట మీదనే కేంద్రీకరించడానికి తగిన వెసులుబాటునిస్తున్నారు. పేరెంట్స్ నడిపించాలి! దేశానికి కొత్తతరం క్రీడాకారులు తయారు కావాలి. క్రీడాకారులను తయారు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలకు స్పోర్ట్స్ మీద ఆసక్తి ఉన్నప్పటికీ తల్లిదండ్రుల సహకారం లేకపోతే క్రీడాకారులు తయారుకారు. పిల్లలను క్రీడల దిశగా నడిపించడం పేరెంట్స్ చేతిలోనే ఉంటుంది. ఆటలు, చదువు రెండూ కీలకమే. రెండింటినీ ఎలా బాలెన్స్ చేసుకోవాలో నేర్పించగలిగింది కూడా పేరెంట్సేనని నా అభి్రపాయం. పేరెంట్స్కి కోరిక ఉన్నప్పటికీ పిల్లలకు ఆడాలనే ఆసక్తి లేకపోతే ఆ పిల్లలు దీర్ఘకాలం కొనసాగడం కష్టం. అలాగే ఆటల పట్ల ఆసక్తి ఉన్న పిల్లలకు పేరెంట్స్ సహకారం లేకపోతే తొలి అడుగు కూడా పడదు. అందుకే తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యం.సింధుగానే గుర్తించాలి! సమాజం నన్ను సింధుగానే గుర్తించాలి. ‘పీవీ సింధు’ అనగానే చేతిలో రాకెట్తో నా రూపం కళ్ల ముందు మెదులుతుంది. అలా నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాను. దేశం కోసం ఆడగలిగే స్థాయికి చేరాను. దేశం కోసం ఆడాను. దేశానికి ఎన్నో పతకాలను సాధించాను. దేశానికి గౌరవాన్ని పెంచడంలో నా శ్రమ కూడా ఉందని సంతోషపడుతున్నాను. ఈ గుర్తింపు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
సమతుల్యత సాధించాలి
‘‘ఏ రంగంలోనైనా నాయకత్వం వహించడానికి దూరదృష్టి, కొత్త ఆవిష్కరణలపై అవిశ్రాంత కృషి అవసరం. సాంకేతికతంగా వస్తున్న మార్పులను అమలు చేయడంలో, టీమ్ వర్క్ను బలోపేతం చేయడంలో ముందుండాలి. బలమైన నాయకులుగా ఉండాలంటే పనిలో నైపుణ్యాలతో పాటు వైవిధ్యాన్నీ పెంపొందించాలి. సక్సెస్ ఉద్దేశం ఒక్కరమే ఎదగడం కాదు, అర్థవంతమైన మార్పుతో మనతోపాటు ఉన్నవారితో కలిసి నడవడం.సమతుల్యం చేయడంలోనే సవాళ్లువైద్య రంగంలో మహిళలు అతిపెద్ద కీలక పాత్ర పోషిస్తున్నారు. అయినప్పటికీ నిత్యం సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. వృత్తిపరంగా ఎదగడంలోనూ, వ్యక్తిగత బాధ్యతలతో బాలెన్స్ చేయడం అనేది అతిపెద్ద అడ్డంకిగా మారింది. కెరీర్– ఇల్లు రెండింటినీ సమర్థంగా నిర్వహించడానికి సమాజం ఇప్పటికీ మహిళలపై చెప్పలేనన్ని అంచనాలను ఉంచుతోంది. రెండుచోట్లా మహిళలు అభివృద్ధి చెందడానికి వీలు కల్పించే వాతావరణం ఉండాలి. అలా లేకపోవడంతో ‘ఆమె సమర్ధత’కు ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. మన సమాజంలో మరొక సవాల్ లోతుగా పాతుకుపోయిన లింగ వివక్ష. నాయకత్వ అవకాశాలను పరిమితం చేసేది ఇదే.నాయకత్వం జెండర్తో కాదు సామర్థ్యం వల్లే సాధ్యం అని నిరూపించడానికి మహిళ మరింత కష్టపడి పనిచేయాలి. మహిళల అభివృద్ధి నుండి మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి మరింత చురుగ్గా వ్యవహరించాలి. డెసిషన్ మేకర్స్ జాబితాలో ఎక్కువ మంది మహిళలకు స్థానం ఉండేలా చూసుకోవాలి. మిగతావాటికన్నా వైద్యరంగం భిన్నమైనది, లోతైనది కూడా. ఎందుకంటే ఇక్కడప్రాణాలను కాపాడటం, ఆరోగ్య ఫలితాలలో మంచి మార్పులు తీసుకురావడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, సరిహద్దులను దాటి ఆలోచించడం, యథాతథ స్థితి కొనసాగేలా టీమ్స్ను ప్రోత్సహించడం... వంటివి వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలో మనల్ని ముందు ఉంచుతుంది.నెట్వర్క్ను నిర్మించుకోవాలిసాధారణంగా మహిళలు రిస్క్ తీసుకొని, తమ స్థానాన్ని సాధించేందుకు వెనకాడతారు. మీ ముందు చూపును, అంతర్దృష్టిని నమ్మండి. బలమైన మద్దతునిచ్చే నెట్వర్క్ను నిర్మించుకోండి. విజయం ఎప్పుడూ ఒంటరి ప్రయాణం కాదు. మిమ్మల్ని సవాలు చేసేవారు, మార్గదర్శకులు, సహచరులు, టీమ్స్తో ముందుకు కదలాలి. నేర్చుకోవడాన్ని ఎప్పుడూ ఆపవద్దు. సవాళ్లను సోపానక్రమాలుగా స్వీకరించాలి. ప్రతి అడ్డంకిని నూతనంగా ఆవిష్కరించడానికి, అభివృద్ధి చెందడానికి ఒక అవకాశం అనుకోవాలి. మహిళా వ్యవస్థాపకులు పరిశ్రమలను రూపొందిస్తున్నారు, ఇది మన సమయం అని గుర్తించండి’’ అంటూ మహిళాభ్యున్నతికి మార్గదర్శకం చేస్తున్నారు డాక్టర్ సంగీతారెడ్డి. మార్పులు తప్పనిసరిరోల్ మోడల్స్ మార్గదర్శకత్వంతో పాటు అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్లాలి. వ్యవస్థాగత అడ్డంకులను పరిష్కరించాలి. పనిప్రదేశంలో సమాన వేతనం, నిష్పాక్షికమైన కెరీర్ పురోగతికి మద్దతు ఇవ్వాలి. ముఖ్యంగా, మహిళల అభివృద్ధి నుండి మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి మారాలి. మహిళలు ఆరోగ్య సంరక్షణలో పాల్గొనేవారు మాత్రమే కాదు, భవిష్యత్తుకు చురుకైన రూపశిల్పులుగా మారాలి.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
వారిని సోషల్ మీడియాకు ఎడిక్ట్ చేయాలని..
అనాదిగా స్త్రీ ఒక ప్రకృతి శక్తిగా, ఉత్పత్తి పరికరాల సృష్టికర్తగా, చరిత్ర నిర్దేశకురాలుగా ఉంది. పితృస్వామ్య ఆధిపత్యం వచ్చేవరకూ ఆమెది విజయ గమనమే. మానవజాతి శైశవ దశలో తన సంతానాన్ని కాపాడుకోవటానికి కాయలు, దుంపలు, పళ్ల లాంటి ఆహార సేకరణలో తల్లే ప్రధాన పాత్ర వహించింది. ఇప్పటికీ ఆహార సేకరణ దశలో ఉన్న జాతుల్లో మాతృస్వామ్యం అమలులో ఉంది. నిప్పు ఉపయోగాన్ని తెలుసుకున్న కాలంలో, జలచరాలైన చేపలు, పీతలు, నత్తలు (Snails) తినే కాలంలో, నదీ తీర నాగరికతలను రూపొందించే కాలంలో స్త్రీ శ్రమయే కీలకం. వేటాడి తెచ్చిన మాంసాన్ని వండవలసిన అవసరాన్ని కూడా స్త్రీయే ముందుగా గమనించి ఉంటుంది. శరీరాన్ని కప్పుకోవాలనే ఆలోచన, కట్టుకోవటానికి చెట్టు బెరడును ఉపయోగించాలనే ఆలోచన స్త్రీకే వచ్చి ఉంటుంది. కుండను చేయడం ద్వారా నీటిని, ధాన్యాన్ని నిలవచేయడం, నేలలో విత్తునాటడం ద్వారా ఆహార సృష్టి... ఇలా నూత్న జీవన వ్యవస్థలను ఆమె సృష్టిస్తూ వెళ్ళింది.సింధు నాగరికతలో స్నాన వాటికలు ప్రసిద్ధంగా విలసిల్లాయి. వీటి ప్రభావం తరువాత ఆర్యుల సంస్కృతి మీదా కనిపిస్తుంది. ఆ తరువాత దేవాలయాలకు అనుబంధంగా ఉమ్మడి స్నానఘట్టాలు రూపొందాయి. వీటి వద్ద అప్సరసలు లేదా జల దేవతలు ఉంటారని ఆనాడు నమ్మేవారు. ఈ స్నానఘట్టాల నిర్మాణంలో స్త్రీ ప్రాధాన్యత, స్త్రీ ఉమ్మడి తత్వానికి సంబంధించిన సంస్కృతి దృగ్గోచరమవుతుంది. మాతృభావన వీరి మతపరిణామ క్రమంలో ఆనాటికే రూపుదిద్దుకొని వున్నదని చెప్పటానికి మొహంజెదారో, హరప్పా లలో దొరికిన ఫలకాలు బలమైన ఋజువు అని పురావస్తు శాస్త్రజ్ఞుడు సర్ జాన్ మార్షల్ పేర్కొన్నారు. ప్రాచీన భారతీయులు స్త్రీ మూర్తిని (ప్రకృతి మాతగా) ఆరాధించినట్టు సింధూ లోయలో దొరికిన విగ్రహాలను బట్టి తెలుస్తుంది. ఇటువంటి ప్రతిమలే మెసపటోమియా, పశ్చిమాసియా, ఆసియా మైనర్లోనూ లభించాయి. స్త్రీమూర్తి ఆరాధన సింధూ లోయ (Indus Valley) నుంచి నైలునది వరకు వ్యాపించి వున్నట్లు భావించవచ్చు.కానీ ఆ తరువాత అనేక పరిణామాలు భారతదేశంలో చోటు చేసుకుంటూ వచ్చాయి. ముఖ్యంగా మనుస్మృతి భావజాలం వల్ల స్త్రీ అణచివేత బహుముఖంగా ప్రారంభమైంది. ధర్మ సూత్రాలు స్త్రీ వ్యక్తిత్వానికి సంకెళ్ళు వేశాయి. స్త్రీ విద్య నిరోధానికి గురైంది. మనుస్మృతి (Manusmriti) క్రీ.పూ. రెండవ శతాబ్దిలో రాయబడి ఉంటుందని అంబేడ్కర్ అన్నారు. బౌద్ధయుగం అంతరించి హిందూ రాజ్యాలు ఆవిర్భవించే క్రమంలో పుష్యమిత్ర దీన్ని బ్రాహ్మణ రాజ్య నిర్మాణానికి సాధనంగా వాడుకున్నారు. వర్ణవ్యవస్థ పునరుద్ధరణ, స్త్రీ అణచివేత ఇందులో ప్రధానమైన అంశాలుగా ముందుకు వచ్చాయి.కొనసాగాల్సిన పోరాటం వీటన్నింటిని ఎదుర్కొంటూ స్త్రీ యుగ యుగాల ప్రస్థానం కొనసాగిస్తూ వచ్చింది. అనేక అవాంతరాలను అధిగమించి జీవన గమనంలో కొత్త పుంతలు తొక్కింది. ఆమెను అణగదొక్కడం పురుషుని వల్ల కాదు అని తెలుసుకోవడానికి చాలాకాలం పట్టింది. ఎందుకంటే ఆమె విద్యుల్లత. ఆమె ప్రకాశానికి తట్టుకోలేక పురుషుడు ఆమెకు సంకెళ్ళు బిగించాడు. ఆమె ఆ సంకెళ్ళను పటాపంచలు చేసి ముందుకు వెళుతోంది. స్త్రీకి శరీర సౌందర్యమే కాదు, మనో సౌందర్యమూ ఉంది. ఆమె మనస్సు వెన్నకంటే మెత్తనిది. ఆమె హృదయ వాది. ఆమె హృదయము లోతైనది. సూర్యగోళాలను, చంద్ర గోళాలను మనము పరిశీలించవచ్చు కాని స్త్రీ అంతరంగాన్ని అందుకోగలిగిన శక్తి ఇంకా పురుషుడికి రాలేదు. ఆ విషయంలో పురుషుడు అబలుడు. ఆమె అమ్మే కాదు, గొప్ప నాయకురాలు. భారత రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము త్రివిద దళాల సైనిక వందనాన్ని స్వీకరించారు. భారతదేశ కళాత్మక దృష్టి ఎంత గొప్పదో ద్రౌపదీ ముర్ము ఒక గిరిజన స్త్రీగా అత్యున్నత సింహాసనాన్ని అధిష్ఠించి నిరూపించారు.‘ఆడపిల్ల గడప దాటకూడదు’ అనే భావాలు పాతవైనాయి. ఆడపిల్లలు దేశాంతరాలకు వెళ్ళి చదువుకొంటున్నారు. పిల్లల్ని పెంచే విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఈనాడు స్త్రీలలో వస్తున్న గుణాత్మకమైన మార్పు ‘నేను సంపాదిస్తూ బతకా’లనే అంశం. కేవలం గృహిణిగా ఇంట్లోనే ఉండటానికి స్త్రీ ఈనాడు ఇష్టపడటం లేదు. ఈ మార్పులన్నీ రావడానికి ఎన్నో ఉద్యమాలు జరిగాయి. మహారాష్ట్రలో సావిత్రిబాయి ఫూలే, జ్యోతిరావు ఫూలే, అంబేడ్కర్ ఉద్యమాలు; బ్రహ్మసమాజం, ఆర్య సమాజాలు చేసిన పోరాటాలు, తమిళనాడులో పెరియార్ రామస్వామి నాయకర్ చేసిన పోరాటం, కేరళలో నారాయణ గురు చేసిన విద్యా పోరాటం... ఇవన్నీ స్త్రీల అభ్యున్నతికి మార్గం వేశాయి. చదవండి: ఆకాశంలో సగమైనా.. వివక్షేనా?అయినప్పటికీ స్త్రీలు పితృస్వామ్య ఆధిపత్యానికి ఎదురీదుతూనే ఉన్నారు. వారిని వస్తు వ్యామోహితులుగా మార్చాలనీ, సోషల్ మీడియాకు ఎడిక్ట్ చేయాలనీ ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. గృహహింస పెరుగుతోంది. బాల్య వివాహాలు ఆగడం లేదు. కొడుకుతో సమానంగా కూతురికి ఆస్తి ఇవ్వడం ఆచరణలో అమలు కావడం లేదు. రాజకీయాల్లో స్త్రీలను అవమానించే ధోరణులు పెరుగు తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో పాలకవర్గాలు, పితృస్వామ్య ఆధిపత్యాలను కొనసాగిస్తున్నాయి. వీటన్నింటిని స్త్రీలు ఎదుర్కొనే క్రమంలో ఇంకా పోరాటాన్ని చేయాల్సి ఉంది. ఇది మహిళా సాధికారతా యుగం. ఈ యుగ స్ఫూర్తిలో భాగంగా మనమూ నడుద్దాం. తల్లిని, చెల్లిని, సహచరిణిని, తోటి స్త్రీని గౌరవిద్దాం. వారి చైతన్యానికి తోడు నిలబడదాం. అదే నిజమైన రాజ్యాంగ స్ఫూర్తి.- డాక్టర్ కత్తి పద్మారావు దళితోద్యమ నాయకులు -
Womens Day 2025: సృష్టికి మూలం ఆమె..! కనీసం ఈ రోజున..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం మూలాలు 20వ శతాబ్దం ప్రారంభంలో గుర్తించారు. 1900 సంవత్సరం ప్రారంభ కాలంలో కార్మిక ఉద్యమాలు, సోషలిస్ట్ క్రియాశీలత ముఖ్యమైన పాత్ర పోషించాయి . అమెరికాలో సోషలిస్ట్ పార్టీ ఫిబ్రవరి 28, 1909న జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది. 1910లో కాపెన్హాగన్లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ మహిళల సమావేశంలో " క్లారా జెట్కిన్ " అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆలోచనను ప్రతిపాదించారు. 1911లో తొలి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 19న అనేక యూరోపియన్ దేశాలలో నిర్వహించారు. 1917 సంవత్సరం ఫిబ్రవరి 23 న, రష్యా లో మహిళలు " ఆహారం, శాంతి" ( బ్రెడ్ అండ్ పీస్ ) కోసం సమ్మెకు వెళ్ళారు. రష్యన్ విప్లవానికి దోహదపడిన ఈ సంఘటన అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మారింది. అలా ఏటా మార్చి8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు.భారతదేశంలో మహిళా సామాజిక సంస్కర్తలు సావిత్రిబాయి ఫూలే , దుర్గాబాయి దేశ్ ముఖ్ లు సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా చురుకుగా ప్రచారం చేసారు. మహిళల విద్య , బాల్య వివాహలు నిరోధించడం, వితంతువులకు ఆశ్రయం, అట్టడుగు వర్గాలను శక్తిమంతం చేయడానికి పనిచేసారు.ఐక్యరాజ్యసమితి 1975 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించింది. దీన్ని ప్రపంచ దేశాలన్నీ గుర్తించేలా ప్రోత్సహించింది. ఈ దినోత్సవం మహిళలు తమ లక్ష్యాలను సాధించడానికి, వారి హక్కుల కోసం పోరాడటానికి సమాజంలో నాయకత్వ పాత్రలను చేపట్టడానికి ప్రేరణ, ప్రోత్సాహాన్ని అందించింది.దేశాల వారిగా మహిళల శాతం..ఇవాళ ప్రపంచ జనాభా 810 కోట్లు . ప్రపంచ జనాభా లో 50.30% పురుషులు , 49. 70% మహిళలు. హాంకాంగ్ లో 54. 92 % , లాట్వియా లో 54% , రష్యా లో 54.3%, ఉక్రెయిన్ లో 54% , లిథువేనియా లో 54% మంది చొప్పున ఆయా దేశ జనాభాలో మహిళలు ఉన్నారు.ఖతార్ లో 28.48% , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో 30.9% , ఒమన్ లో 35.8% , బహ్రెయిన్ లో 38% , సౌదీ అరేబియా లో 43.2% మంది మహిళా జనాభా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నప్పటికీ, ఐస్లాండ్, నార్వే, స్వీడన్ వంటి దేశాలు లింగ సమానత్వానికి ప్రసిద్ధి చెందాయి. ఈ దేశాలలో మహిళకు సమాన అవకాశాలు..ఇక్కడ మహిళలకు ఉద్యోగ అవకాశాలు, వేతన సమానత్వం ఎక్కువగా ఉంటాయి. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలు కూడా మహిళలకు అనుకూలమైన కార్యాలయ వాతావరణాన్ని, ప్రభుత్వ మద్దతును అందిస్తున్నాయి. భారతదేశంలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నప్పటికీ, లింగ వివక్ష , వేతన అసమానతలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, స్వయం ఉపాధి వంటి రంగాలలో మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ దినోత్సవం ప్రాముఖ్యత..భారతదేశంలో "అంతర్జాతీయ మహిళా దినోత్సవం" అనేక ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నది. అవేంటంటే..మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి, వారి హక్కులు సమానత్వం గురించి అవగాహన పెంచడానికి ఒక వేదికగా పనిచేస్తుంది. సైన్స్, రాజకీయాలు, వ్యాపారం, క్రీడలు, కళలు వంటి వివిధ రంగాలలో మహిళల విజయాలను గుర్తించడానికి ఉపయోగపడుతోంది.లింగ సమానత్వం , మహిళలపై హింసను అంతం చేయడం, సమాజంలో వారి సమాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వంటి సమస్యలపై దృష్టి సారించడానికి ఇది ఒక అవకాశం. నాయకత్వ పాత్ర పై , విద్య, వాణిజ్య , ఉద్యోగ , ఆరోగ్య, ఉపాధి , ఆర్థిక స్థిరత్వంలో మహిళలను ప్రేరేపించడం, మహిళా సాధికారతను ప్రోత్సహించడం మహిళలు ఎదుర్కొంటున్న గృహ హింస, లైంగిక వేధింపులు మహిళలకు సరిపోని ఆరోగ్య సంరక్షణ , మెరుగైన పని వాతావరణం వంటి సవాళ్ల గురించి ప్రభుత్వం, దృష్టికి తీసుకురావడం ఈ మహిళా దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం.బీజింగ్ డిక్లరేషన్ ప్రకారం ఐక్యరాజ్య సమితి ఈ మహిళా దినోత్సవం 2025ను మహిళలు-బాలికలకు అందరికీ హక్కులు, సమానత్వం, సాధికారత వంటి అంశాల మార్పుకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శక్తిమంతమైన వేదికగా నిలవాలి ఆకాంక్షిస్తుంది. ఇక ఈ ఏడాది మహిళా దినోత్సవాన్ని .. 'Accelerate Action' అనే థీమ్తో నిర్వహిస్తున్నారు. మహిళల పురోగతికి ఉపయోగపడే వ్యూహాలు, వనరులు, చొరవలను గుర్తించి.. వాటిని విస్తృతంగా, వేగంగా అమలు చేయాలనే ఉద్దేశాన్ని ఇది చెబుతోంది. .చివరగా ఈ దినోత్సవం రోజున ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వం ఆర్థిక స్వావలంబన కోసం వివిధ పథకాలను అందిస్తోంది. ఇక కార్పొరేట్లు, స్వచ్ఛంద సంస్థలు, యాజమాన్యాలు మహిళా దినోత్సవం సందర్భంగా అనేక చర్చలు , గోస్టులు, ఆటలు, పాటలు, ఆరోగ్య శిబిరాలు, ప్రతిభ చూపిన మహిళలుకు సన్మాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాయి. సృష్టికి మూలం అయిన స్త్రీమూర్తులందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. వారికి జేజేలు. వెంకట సూర్య వేణుగోపాల్ నాగుమళ్ల, విశ్రాంత ఆర్ టీసి డిపో మేనేజర్, (చదవండి: మేము సైతం..! ఆటల్లో సత్తా చాటుతున్న నారీమమణులు) -
రూ.260 కోట్లు.. ఆర్జనలోనూ అతివలే..
మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఇప్పుడిప్పుడే ఆధిపత్యాన్ని చాటుతున్నారు. ప్రస్తుతం ప్రపంచం మహిళా దినోత్సవాన్ని జరుపుకొంటున్న వేళ ప్రముఖ అంతర్జాతీయ ఆతిథ్య సంస్థ ఎయిర్బీఎన్బీ.. మహిళల వ్యాపార పురోభివృద్ధిపై ఆసక్తికర విశేషాల్ని వెల్లడించింది.ఎయిర్బీఎన్బీలో భారతీయ మహిళా హోస్ట్లకు (హోటల్స్, పీజీలు అద్దెకిచ్చే వారు) 2024 సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచింది. వారు ఆ ఏడాదిలో రూ.260 కోట్లు ఆర్జించారు. ఇది ఆ ప్లాట్ఫామ్ ఆతిథ్య ల్యాండ్ స్కేప్కు గణనీయంగా దోహదం చేసింది. దేశంలోని ఎయిర్బీఎన్బీ హోస్ట్ లలో దాదాపు 30% ఉన్న మహిళలు సమ్మిళితతను పెంపొందించడం, ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా సాంప్రదాయ ఆతిథ్య పరిశ్రమను పునర్నిర్మించారు. దేశవ్యాప్తంగా ట్రావెల్ అనుభవాలను పునర్నిర్వచించడంలో మహిళల ప్రాముఖ్యత పెరుగుతోందనడానికి వారి సాధనలే నిదర్శనం.పెరుగుతున్న మహిళా హోస్ట్లుదేశంలో మహిళా హోస్ట్లు గణనీయమైన విజయాన్ని సాధించారు. భారత్లో ఎయిర్బీఎన్బీ గెస్ట్ ఫేవరెట్ లిస్టింగ్స్లో దాదాపు 35% మహిళా హోస్ట్లే నిర్వహిస్తుంటం విశేషం. చిరస్మరణీయమైన, సౌకర్యవంతమైన బసలను అందించడంలో వారి అసాధారణ సామర్థ్యాన్ని ఇది హైలైట్ చేస్తుంది. సుందరమైన ప్రదేశాలలో సౌకర్యవంతమైన హోమ్ స్టేల నుండి ఆధునిక పట్టణ అపార్ట్ మెంట్ల వరకు, మహిళలు సృజనాత్మకత, శ్రద్ధ, అతిథి అంచనాలపై లోతైన అవగాహనను ప్రదర్శించారు.భారతీయ మహిళల్లో ట్రావెల్ ట్రెండ్స్దేశీయ, అంతర్జాతీయ పర్యటనలకు ఎయిర్బీఎన్బీని భారత మహిళా ప్రయాణికులు వేదికగా ఎంచుకున్నారు. 2024లో భారతీయ మహిళా ప్రయాణికులకు అత్యంత డిమాండ్ ఉన్న దేశీయ గమ్యస్థానాలలో గోవా, ఢిల్లీ, బెంగళూరు, పూణే, జైపూర్ ఉన్నాయి. అంతర్జాతీయంగా లండన్, దుబాయ్, బ్యాంకాక్, పారిస్, రోమ్ వంటి నగరాలు వారి ట్రావెల్ విష్ లిస్ట్లో అగ్రస్థానంలో నిలిచాయి.మిలీనియల్ మహిళలు (1981-1996 మధ్య పుట్టినవారు) తమ ప్రయాణ ప్రణాళికల కోసం ఎయిర్బీఎన్బీని ఉపయోగించడంలో ముందంజలో ఉన్నారు. వారి తరువాత వరుసలో జెన్జెడ్ మహిళలు (1996-2012 మధ్య పుట్టినవారు) ఉన్నారు. సౌలభ్యం, ప్రత్యేకమైన అనుభవాలు, స్థోమత కోసం వారి ప్రాధాన్యత ఎయిర్బీఎన్బీ ప్రజాదరణను పెంచింది. డుయో ట్రావెల్ అత్యంత ఇష్టమైన ట్రిప్ టైప్ గా అవతరించింది. తరువాత సమూహ ప్రయాణాలు, మహిళల్లో భాగస్వామ్య ప్రయాణ అనుభవాల పెరుగుతున్న ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. -
International Women's Day 2025: హోమ్ మేకర్కు వేతనమేదీ?
ప్రతీ ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International women's day) జరుపుకుంటాం. వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను గుర్తించి సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. అలాగ ప్రపంచంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షతను, సవాళ్లపై విస్తృతంగా చర్చించడం వాటి పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై సమాలోచన చేయడం. మహిళా సాధికారత, హక్కులు, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రాజకీయ సహకారాలపై అవగాహన కల్పించడమే దీని లక్ష్యం. ప్రతి ఏడాదీ లాగానే ఈ ఏడాది యాక్సలరేట్ యాక్షన్(Accelerate Action) అనేథీమ్తో మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. మహిళా సాధికారతకు, అభివృద్ధికి తోడ్పడూ వ్యూహాలు, వనరులు, చొరవలను గుర్తించి వేగంగా అమలు చేయాలనేది దీని ఉద్దేశం. ఈ సందర్బంగా ఎమ్.డి. మునీర్, సీనియర్ జర్నలిస్ట్ ప్రత్యేక వ్యాసం.ప్రపంచంలో కోట్లాది మంది గృహిణులకు వేతనం ఎందుకు ఉండ కూడదు అనే విషయం ప్రస్తుతం చర్చానీయాంశం అయింది. చైనాలోని బీజింగ్లో ఒక విడాకుల కేసులో కోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పు ఈ చర్చకు దారితీసింది. అయితే ఇంటిపనులు, పిల్లల పెంపకం – సంరక్షణ లాంటివి చూసే గృహిణులకు జీతాలు ఎవరు ఇవ్వాలి అనేదే సమస్య! పురుషుల కన్నా 3 నుంచి 4 గంటలు ఎక్కువ పనిచేస్తారు గృహిణులు. వంట చేయడం, ఇంటిని, వంట సామగ్రిని శుభ్రం చేయడం, పిల్లలు, భర్త, ఇతర కుటుంబ సభ్యుల బట్టలు ఉతకడం వంటి పనులే కాక... తల్లి, భార్య, సోదరి పాత్రల్లో ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తుంది. అందుకే ఆమెకు జీతం ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.తమిళనాడులో గృహిణికి వేతనం అంశం సినీనటుడు కమల హాసన్ తన పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు. ఇది కూడా గత ఏడాది పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. బీజింగ్ కోర్టు తన తీర్పులో 5 సంవత్సరాలు భర్తతో ఉండి ఇంటి పనులు చూసుకున్నది కాబట్టి, తన కెరీర్ను కోల్పోయింది కాబట్టి, రూ. 5 లక్షల పైచిలుకు పరిహారం జీతం కింద ఇవ్వాలని పేర్కొంది. ఈ తీర్పును ప్రపంచం మొత్తంలో 60 కోట్లకు పైగా జనం సోషల్ మీడియాలో చూశారు. గ్రామీణ మహిళ ప్రతి రోజు 14 గంటలు పనిలో ఉంటుంది. గ్రామీణ పురుషులతో పోలిస్తే 2.5 గంటలు ఇది ఎక్కువ అని పరిశోధకులు అంటున్నారు. ఉద్యోగం చేసే పురుషుల కన్నా మహిళల పని నాలుగింతలు ఎక్కువ. ఇంత చేస్తున్నా గుర్తింపు, ఆదాయం లేకపోగా వేధింపులు, అత్యాచారాలు, హత్యా చారాలు. క్రిమినల్ జస్టిస్ వైఫల్యం వల్ల దేశంలో ఆడబిడ్డలపై గృహహింస పెరుగుతోంది. హోమ్ మేకర్లకు జీతం వస్తే... పురుషుల ఆలోచనా విధానంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. గృహిణికి కుటుంబంపై ఆధారపడకుండా ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. రక్షణకు... ఒక గ్యారంటీ, నమ్మకం ఏర్పడుతుంది. కుటుంబంలో గౌరవం దక్కుతుంది. -
మేము సైతం..! ఆటల్లో సత్తా చాటుతున్న నారీమమణులు
ఒకప్పుడు క్రీడల్లో మహిళల ప్రాతినిధ్యం నామమాత్రం. ఇప్పుడు సీన్ మారింది. ప్రాతినిధ్యం స్థాయి నుంచి ఎదిగి ఏకంగా దేశానికి పతకాలు అందించే స్థాయికి మన మహిళా క్రీడాకారిణులు చేరుకున్నారు. వయసుతో సంబంధం లేకుండా... ఒకవైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే... మరోవైపు ప్రతికూలతలనూ అధిగమిస్తూ అత్యున్నత శిఖరానికి చేరుకుంటున్నారు. నిరంతర శ్రమ, సడలని విశ్వాసం, సాధించాలనే సంకల్పం ఉంటే తమకు తిరుగులేదని నిరూపిస్తున్నారు. తమ ప్రతిభాపాటవాల ద్వారా భావితరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు... వారిలో కొందరి గురించి....నూషిన్ అల్ ఖదీర్... మంచి ప్లేయర్ మంచి కోచ్ కూడా కాగలరని నిరూపించారు నూషిన్ అల్ ఖదీర్. 44 ఏళ్ల నూషిన్ గత నెలలో మలేసియాలో జరిగిన అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరించారు. 2023లోనూ తొలిసారి జరిగిన అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్లో నూషిన్ శిక్షణలోనే టీమిండియా జగజ్జేతగా అవతరించింది.కర్ణాటకలోని గుల్బర్గాలో జన్మించి, ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడిన నూషిన్ 2002 నుంచి 2012 వరకు భారత సీనియర్ మహిళల క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 5 టెస్టులు, 78 వన్డేలు, రెండు టి20 మ్యాచ్ల్లో భారత్ తరఫున బరిలోకి దిగింది. 2005లో ఆటకు వీడ్కోలు చె΄్పాక నూషిన్ కోచింగ్ వైపు వచ్చింది. నూషిన్ శిక్షణలో భారత టీనేజ్ క్రికెటర్లు వరుసగా రెండు టి20 ప్రపంచకప్లలో విజేతగా నిలిచి ఔరా అనిపించారు.కోనేరు హంపి... రెండున్నర దశాబ్దాలుగా భారత మహిళల చెస్కు ముఖచిత్రంగా వెలుగుతూ ఎన్నో గొప్ప విజయాలు సాధించింది విజయవాడకు చెందిన 37 ఏళ్ల హంపి. రెండుసార్లు ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్గా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. 2019లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించింది. మహిళల గ్రాండ్ప్రి సిరీస్లలో పతకాలు గెలవడం అలవాటు చేసుకున్న హంపి 2024 డిసెంబర్లో కజకిస్తాన్లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్షిప్లో రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఓఎన్జీసీలో చీఫ్ మేనేజర్ అయిన హంపి క్లాసిక్ ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్షిప్ టైటిల్ సాధించడమే లక్ష్యం అంటోంది.జ్యోతి సురేఖభారత మహిళల ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో తిరుగులేని ప్లేయర్ వెన్నం జ్యోతి సురేఖ. విజయవాడకు చెందిన 28 ఏళ్ల జ్యోతి సురేఖ ప్రపంచ ర్యాంకింగ్స్లో రెండో ర్యాంక్లో ఉంది. 14 ఏళ్లుగా అంతర్జాతీయస్థాయిలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న జ్యోతి సురేఖ 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో మూడు స్వర్ణ పతకాలు సాధించింది. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న జ్యోతి సురేఖ ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్షిప్, ప్రపంచకప్ టోర్నీలలో కలిపి 50 పతకాలు సాధించింది. జ్యోతి యర్రాజీపాఠశాలలో వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు ఇచ్చిన సలహాతో అథ్లెటిక్స్ లో అడుగు పెట్టి.. అచిరకాలంలోనే అంతర్జాతీయ అథ్లెటిక్స్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది వైజాగ్కు చెందిన జ్యోతి యర్రాజీ. 100 మీటర్లు, 60 మీటర్ల హర్డిల్స్లో జాతీయ రికార్డులు లిఖించుకున్న జ్యోతి యర్రాజీ 2024 పారిస్ ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించింది. ఒలింపిక్స్లో 100 మీటర్ల హర్డిల్స్లో భారత్ తరఫున పోటీపడ్డ తొలి మహిళా అథ్లెట్గా జ్యోతి గుర్తింపు పొందింది. అదే ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో ఆమెకు కాంస్య పతకం లభించింది. దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్ క్లర్క్గా విధులు నిర్వహిస్తున్న జ్యోతి వరుసగా మూడుసార్లు జాతీయ క్రీడల్లో 100 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణ పతకాలు సాధించింది. 2024 సంవత్సరానికి కేంద్రం నుంచి జ్యోతికి ‘అర్జున అవార్డు’ లభించింది. గుగులోత్ సౌమ్య... జట్టు క్రీడ ఫుట్బాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలంటే విశేష ప్రతిభ ఉండాల్సిందే. ఆ నైపుణ్యాన్ని సొంతం చేసుకొని భారత సీనియర్ మహిళల ఫుట్బాల్ జట్టులో ఫార్వర్డ్గా రాణిస్తోంది గుగులోత్ సౌమ్య. నిజామాబాద్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల సౌమ్య అండర్–14, అండర్–16, అండర్–19 విభాగాల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ప్రస్తుతం దేశవాళీ మహిళల ఫుట్బాల్ లీగ్లో విఖ్యాత ఈస్ట్ బెంగాల్ క్లబ్ జట్టుకు ఆడుతున్న సౌమ్య ఇటీవలే షార్జాలో జరిగిన పింక్ లేడీస్ కప్ నాలుగు దేశాల అంతర్జాతీయ టోర్నీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఆకుల శ్రీజటేబుల్ టెన్నిస్లో భారత నంబర్వన్ ర్యాంకర్ ఆకుల శ్రీజ 2024 పారిస్ ఒలింపిక్స్ లో భారత్కు ప్రాతినిధ్యం వహించింది. గత ఏడాది కజకిస్తాన్లో జరిగిన ఆసియా చాంపియన్షిప్లో టీమ్ విభాగంలో కాంస్య పతకం నెగ్గిన 26 ఏళ్ల శ్రీజ... వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) సర్క్యూట్లో కంటెండర్ స్థాయి టోర్నీలో టైటిల్ నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్గా గుర్తింపు పొందింది. గత ఏడాది జూన్లో నైజీరియాలో జరిగిన లాగోస్ ఓపెన్ కంటెండర్ టోర్నీలో ఆమె విజేతగా నిలిచింది. గతేడాది జరిగిన ప్రపంచ టీమ్ చాంపియన్షిప్ లీగ్ మ్యాచ్లో చైనాకు చెందిన ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ యిడిపై సంచలన విజయం సాధించింది. 2022లో కేంద్ర ప్రభుత్వం నుంచి ‘అర్జున అవార్డు’ అందుకుంది. కరణం నారాయణ, సాక్షి స్పోర్ట్స్ డెస్క్ (చదవండి: -
మహిళా దినోత్సవం– పుష్ప విలాసం
అనేక దేశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలకు ఇచ్చే పువ్వులుప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. ఈ పువ్వులలో ఎక్కువప్రాచుర్యం పొందింది... యెల్లో మిమోసా. మహిళలకు యెల్లో మిమోసా పువ్వులను బహుమతిగా ఇచ్చే సంప్రదాయం ఇటలీలో ఉంది. సున్నితత్వాన్ని, బలాన్ని సూచించే యెల్లో మిమోసాను ఇటాలియన్ ఫెమినిస్ట్లు మహిళా హక్కుల ఉద్యమానికి చిహ్నంగా ఎంచుకున్నారు. మార్చి ప్రారంభంలో మిమోసా వికసిస్తుంది కాబట్టి వారు ఈ పువ్వును ఎంచుకున్నారు. -
సక్సెస్ 'కీ' పవర్ డ్రెస్సింగ్
పవర్ డ్రెస్సింగ్ అనేది ఫ్యాషన్ ఎంపికలను అధిగమిస్తుంది. ఇది స్వీయ అవగాహన, వృత్తిపరంగా తమను తాము చూపాలనుకునే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. సరైన దుస్తులు మానసిక కవచంగా పనిచేస్తాయి. మహిళలు కార్పొరేట్ రంగంలోకి ప్రవేశించడం, వృత్తినైపుణ్యాలను ప్రదర్శించడం, గౌరవాన్ని పొందడం లక్ష్యంగా పవర్ డ్రెస్సింగ్ ఉద్భవించింది.1920లలో జాకెట్, స్కర్ట్తో మహిళల పవర్ డ్రెస్సింగ్ వెలుగులోకి వచ్చింది. ఇది మహిళల దుస్తులు ధరించే విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. సౌకర్యం విషయంలో రాజీపడకుండా ఆధునికంగా కనిపించడానికి వీలు కల్పించింది. పనిలో లింగసమానత్వాన్ని ప్రోత్సహించడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు. ‘విజయం కోసం డ్రెస్సింగ్’ అనడానికి నిదర్శనంగా ఇంటర్నేషనల్ ఉమెన్ డ్రెస్సింగ్ బ్రాండ్ ‘క్వా’ ఒక ఆన్లైన్ పోల్ నిర్వహించింది. ఇందులో 100 మంది మహిళల్లో 99 మంది పవర్ డ్రెస్సింగ్ వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు.వృత్తికి తగిన డ్రెస్సింగ్ఉపాధ్యాయులు, వైద్యులు, రాజకీయ నాయకులు, ఐఎఎస్ అధికారులు, ఆర్కిటెక్ట్లు, కార్పొరేట్ లీడర్లు, వ్యాపార మహిళలు, ఆర్థిక నిపుణులు వంటి విభిన్న స్థాయిలలో పనిచేసే మహిళలకు పనిజీవితంలో సౌకర్యాన్ని, నమ్మకాన్ని ఇచ్చే వర్క్వేర్ అవసరం. ఒక కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ శక్తిని వెలికితీసేందుకు ప్యాంటుతో పాటు డిజైనర్ బ్లేజర్ను ధరిస్తారు. ఒక రాజకీయ వ్యక్తి పరిపూర్ణతకు అనుగుణంగా చీర లేదా కుర్తాను ధరించవచ్చు. టీచర్ లేదా డాక్టర్ తమ వృత్తినైపుణ్యానికి రాజీ పడకుండా తమ పనిని నిర్వహించడానికి సౌకర్యవంతమైన కుర్తా లేదా ఇండో–వెస్ట్రన్ను ఎంచుకోవచ్చు. విధి నిర్వహణలోని మహిళలు భారతీయ ప్రింట్లను ఆధునిక కట్లతో కలిపే దుస్తులను ధరించడానికి ఇష్టపడతారు. ఈ కాంబినేషన్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది.పవర్ డ్రెస్సింగ్కి ప్రేరణ కోసం...→ వృత్తికి అనుగుణమైన దుస్తులు ధరించాలి. అప్పుడు పనితీరులో కూడా మెరుగుదల ఉంటుంది → పర్యావరణ స్పృహతో కూడిన ఫ్యాషన్ని అనుసరించడం మేలు. కాలర్ బ్లౌజ్లు, ఫంక్షనల్ పాకెట్స్, తక్కువ జ్యువెలరీ... వీటిలో ప్రధానమైనవి → డ్రెస్ నాణ్యత, ఫిటింగ్ మీరు హుందాగా, శక్తిమంతంగా ఉన్నారని తెలియజేస్తుంది → ఎవరికి వారు ఓన్ స్టైల్ను అభివృద్ధి చేసుకోవాలి. తమ డ్రెస్సింగ్ ద్వారా తమని తాము వ్యక్తీకరించుకోవడమూ అవసరమే. రంగులతో ప్రయోగాలు, ఫిట్గా ఉండే దుస్తుల ద్వారా మీరేమిటనేది చాటవచ్చు → ప్యాంట్ సూట్స్, కో–ఆర్డ్ సెట్స్, మిడీస్, జాకెట్స్.. ఇలా ఏ డ్రెస్ ఎంపిక అయినా ఇస్త్రీ చేసిన దుస్తులను ధరించండి. లేత రంగులు, తక్కువ ఆభరణాలతో సింపుల్గా ఉండేలా చూసుకోండి.సందర్భానికి తగిన ఎంపికలుభారతీయ వనిత హుందాతనానికి, మనదైన సంస్కృతికి, చక్కదనానికీ బహుముఖాల డ్రెస్సింగ్ శైలులను ఎంచుకుంటోంది. సందర్భానికి తగిన ఎంపిక ఇప్పుడు సాధారణంగా ఉంటోంది..డ్రేపింగ్ శైలులతో ఎవర్గ్రీన్గా నిలుస్తూ మహిళను పవర్ ఫుల్గా చూపుతోంది చీర. మన దేశీయ చేనేతలైన కంచి, బనారసి, చందేరీ, పోచంపల్లి, నారాయణపేట్, ధర్మవరం, ... ఇలా మనదేశంలో ఒక్కో ప్రాంత ప్రత్యేకతను, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి ఘనంగా చూపుతున్నాయి. ఈ చేనేతల కట్టుతో మన మహిళలు తమ హుందాతనాన్ని ప్రపంచానికి చాటుతున్నారు.సల్వార్ కమీజ్భారతీయ మహిళల ఫార్మల్ దుస్తులలో మరొక ప్రధానమైనది సల్వార్ కమీజ్. సౌకర్యం, శైలి రెండింటినీ ఈ డ్రెస్ అందిస్తుంది. అధికారిక కార్యక్రమాలు, పార్టీలకు అనుకూలంగా ఉంటుంది. క్లిష్టమైన ఎంబ్రాయిడరీ అలంకరణతో వెలిగే అనార్కలీ సూట్లు గొప్పగా వెలుగుతుంటే, మరోవైపు స్ట్రెయిట్కట్ సూట్స్ ్ర΄÷ఫెషనల్ లుక్ని అందిస్తున్నాయి. ఆఫీస్వేర్గానూ, సంప్రదాయం, అధునిక మినిమలిజం మధ్య సమతుల్యతను అందిస్తున్నాయి.ఇండో– వెస్ట్రన్ ఫ్యూజన్భారతీయ దుస్తులలో అంశాలను పాశ్చాత్య సిల్హౌట్లతో మిళితం చేయడం దీని ప్రత్యేకత. ఆధునిక అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకమైన, స్టైలిష్ దుస్తులను సృష్టిస్తాయి. కుర్తా, పలాజో సెట్ అందుకు ఒక ఉదాహరణ. సాంస్కృతిక కార్యక్రమాలకు ఉల్లాసభరితంగానూ, అనువైనదిగానూ నిలిచింది ధోతీ ప్యాంట్ను కుర్తాతో జత చేయడం.వెస్ట్రన్ గౌన్లు పాశ్చాత్య శైలి దుస్తులలో ప్రధానంగా చెప్పుకునేవి గౌన్లు. అధికారిక కార్యక్రమాలలో గణనీయమైన ప్రజాదరణ పొందాయి. ఎ–లైన్ గౌన్లు, ఫ్యూజన్ టచ్ కోసం భారతీయ మోటిఫ్స్, ఎంబ్రాయిడరీతో ఇవి పార్టీలు, అధికారక విందులు, సమావేశాలలో ఈవెనింగ్ గౌన్లు అద్భుతమైన ఎంపికను అందిస్తున్నాయి. సిల్క్, శాటిన్ లేదా వెల్వెట్ ఫ్యాబ్రిక్తో డిజైన్ చేసిన గౌన్లపై బీడ్వర్క్, స్వీక్వెన్లు కలిగి మహిళ చక్కదనానికి, ఆధునికతకు అద్దం పడుతూ రిచ్ లుక్ను ఇస్తున్నాయి. ఫార్మల్ వేర్మన దేశం ఉష్ణమండలం అవడం వల్ల సౌకర్యం కోసం ఖాదీ, కోటా డోరియా వంటి కాటన్స్ను ఎంచుకుంటున్నారు. వీటిమీద ఎంబ్రాయిడరీలు, టై అండ్ డైలు, పెయింటింగ్లా ఉన్నవాటితో తమని తాము కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు.ఇతర అలంకారాలకూ...మ్యాచింగ్, ఎంబ్రాయిడరీ, సందర్భానికి తగిన విధంగా దుస్తుల ఎంపిక ఎలా ఉంటుందో, అలాగే ఫుట్వేర్ ఎంపిక కూడా ముఖ్యమైన జాబితాలో ఉంది. బంగారు, వజ్రాలు, కుందన్, పోల్కీ.. ఆభరణాలు సంప్రదాయ దుస్తులకు, ఆక్సిడైజ్డ్ ఆధునిక దుస్తులకు ఎంపికగా మారాయి. ఇండో–వెస్ట్రన్ శైలులు ఆభరణాల జాబితాలోనూ ప్రథమంగా ఉంటోంది. రీసైక్లింగ్ బెస్ట్ ఛాయిస్టెక్స్టైల్ ఇండస్ట్రీలో సస్టెయినబుల్, ఇండియన్ ఆర్ట్, ఇండియన్ టెక్స్టైల్, కెమికల్ ఫ్రీగా ఉండే హ్యాండ్లూమ్స్ని మహిళలు ఇష్టపడుతున్నారు. పవర్లూమ్స్, సింథటిక్స్ని దూరం పెడుతున్నారు. అంతర్జాతీయంగానూ ఎక్స్పరిమెంటల్ ప్యాషన్లోనూ రీ సైక్లింగ్ మీద దృష్టి ఎక్కువ ఉంటుంది. పాత కాలం నాటి బామ్మల పట్టుచీరలను కూడా తిరిగి ఉపయోగిస్తున్నారు. కట్ సిల్టౌట్స్, ఎంబ్రాయిడరీలో థ్రెడ్ వర్క్.. వంటి పాత కాలం స్టైల్స్ ఎంచుకుంటున్నారు. ఉదాహరణకు.. పాత బనారసి, పాత కంచి శారీస్ను తీసుకొని ప్యాచ్వర్క్తో మరో కొత్త డిజైనర్ శారీని తయారుచేస్తున్నారు. ఇండో–వెస్ట్రన్స్ విషయంలో చూస్తే రీ సైక్లింగ్కి బాగా డిమాండ్ ఉంది. ఉన్న వాటినే రీ క్రియేట్ చేస్తున్నారు. అమ్మమ్మ, అమ్మల చీరలను ఇన్నోవేషన్గా రీ సైక్లింగ్ చేయించుకొని తమ పెళ్లిళ్లకు ధరిస్తున్నారు. ఒక డ్రెస్ను పది మోడల్ డ్రెస్సులుగా ధరిస్తున్నారు. ప్రకృతి పట్ల బాధ్యతగా ఉండేది మహిళలే కాబట్టి. ఈ అవగాహన మహిళల నుండి వచ్చిందే. నార్త్ ఇండియన్స్ కూడా పాత చీరలు, వస్త్రాలతో ప్యాచ్వర్క్ చేసి బ్యాగ్స్, ఫుట్వేర్, క్విల్ట్లను సృష్టిస్తున్నారు. ఇది ఇంకా విస్తృతం అవుతుంది. మా దగ్గర పాతికమంది మహిళలు మేం ఉపయోగించగా మిగిలిన వేస్ట్ ఫ్యాబ్రిక్స్తో టాజిల్స్, రిబ్బన్స్, పౌచ్లు, జ్యువెలరీ, బ్యాంగిల్స్ తయారు చేసి అమ్ముతున్నారు. ఇవి ఇండోవెస్ట్రన్ ఔట్ఫిట్స్కు స్టైలిష్ లుక్నిస్తాయి. యువతరం, మహిళల ఆలోచనలకు తగినట్టుగా కెమికల్ ఫ్రీగా ఫ్యాషన్ ఇండస్ట్రీ తయారు కావడం ముదావహం. ‘పవర్ డ్రెస్’నుచూపినవారిలో...∙భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫొటోజర్నలిస్ట్ హోమై వ్యారవల్లా. బ్రిటిష్ కాలం నుండి కొత్తగా స్వతంత్రదేశంగా మారడాన్ని డాక్యుమెంట్ చేయడంలో ప్రసిద్ధి చెందారు. గుజరాత్ రాష్ట్రంలో పుట్టిన ఆమె పార్సీ సమాజానికి చెందింది. తన వృత్తికి తగినట్టుగా హై రౌండ్ నెక్ బ్లౌజ్, లేతరంగు కాటన్ చీరలను ధరించేవారు. గౌన్లు, పలాజో ప్యాంట్లు ధరించి ఆమె తనదైన స్టైల్ స్టేట్మెంట్ను సృష్టించారు → నేతలలో తలమానికమైన ఇందిరాగాంధీ నేత చీరల కట్టు ఇప్పటికీ ఆమె ఆహార్యాన్ని కళ్లకు కడుతుంది. పాలిటిక్స్లో తన చీరకట్టు, హెయిర్ స్టైల్తో పవర్ఫుల్ ఐకాన్గా నిలిచారు. ఒక నిర్దిష్ట సందేశాన్ని ఇవ్వడానికి డ్రెస్సింగ్ని ఒక శక్తిమంతమైన మాధ్యమంగా ఉపయోగించారు. ఆమె చూపిన మార్గంలో చాలామంది మహిళా రాజకీయ వేత్తలు నేత చీరలను ధరించడం చూస్తున్నాం → సినీతారలు సందడి చేసే ఈవెంట్లను చూస్తే తమదైన స్టైలింగ్ డ్రెస్సులతో ఆకట్టుకునే తారలు ఎందరో. వారిలో ఎవర్గ్రీన్గా నిలిచే బాలీవుడ్ నటి రేఖతోపాటు దీపికా పదుకొనే, ప్రియాంకా చోప్రా, కరీనా, సోనమ్ .. వంటి తారలు ఏ ఈవెంట్లోనైనా తమ స్టైల్స్టేట్మెంట్ను చూపుతుంటారు. ఇటీవల నీతాఅంబానీప్రాచీన కళకు, రిచ్లుక్కి ఐకాన్గా మారడం గమనిస్తున్నాం. -
కొడుకు అనారోగ్యం ఆ అమ్మను వ్యాపారవేత్తగా మార్చింది..! ఏడాదికి రూ. 9 లక్షలు..
కొన్ని బాధకరమైన ఘటనలు మన అంతర్గత శక్తిని ప్రేరేపించి గొప్ప వ్యక్తులుగా మారుస్తుంది. అయితే సమస్య వచ్చినప్పుడు తల్లడిల్లిపోతాం. అలా కాకుండా ఆ పరిస్థితికి కలత చెందకుండా..ఎలా ఫేస్ చేద్దామనే ఆలోచనే మనల్ని కార్యోన్ముఖులుగా మార్చి అద్భుతాలు చేయిస్తుంది. ఆ విధంగానే ఈ తల్లి స్టార్టప్ని పెట్టేందుకు దారితీసి ఓ గొప్ప వ్యాపారవేత్తగా దూసుకుపోతోంది. ఏడాదికి రూ. 9 లక్షలకు పైగా ఆర్జిస్తోంది. ఒక సాధారణ గృహిణి అయిన ఆ తల్లి ఆ స్థాయికి ఎలా చేరుకోగలిగిందో చూద్దామా..!.కర్ణాటకకు చెందిన లక్ష్మీ ప్రియ విజయగాథ ఎందరికో ఆదర్శం. ఆమె కొడుకు అనారోగ్యమే ఆమెలో దాగున్న అసాధారణ వ్యాపారవేత్తను బయటకు తీసుకొచ్చింది. లక్ష్మికి నెలలు నిండకుండానే పుట్టిన కొడుకు ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలే ఆమెను స్టార్టప్ పెట్టుందుకు దారితీశాయి. ఆమెకు పుట్టిన నవజాత శిశువు నెలల నిండకుండా జన్మించడంతో సుమారు 21 రోజులు ఇంక్యుబేటర్లో పెట్టారు వైద్యులు. ఆ తర్వాత కూడా ఆ శిశువులో పెద్దగా మెరుగుదల కనిపించపోగా పలు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. బతుకుతాడనేది చెప్పలేమని వైద్యులు చెప్పేశారు. చివరి ప్రయత్నంగా ఆ చిన్నారికి తల్లి ఒడిలోవెచ్చదనం అందించి ప్రయత్నిద్దామని చెప్పడంతో..అలా చేసిన కొద్దిసేపట్లోనే ఏదో అద్భుతం జరిగినట్లుగా కోలుకోవడం జరిగింది ఆ శిశువు. పల్స్ రేట్ పెరిగి బతికి బట్టకట్టాడు. కానీ ఆ తర్వాత కూడా లక్ష్మీ కొడుకు బలహీనమైన రోగనిరోధకశక్తితో ఇబ్బంది పడేవాడు. శరీరంలో తగినంత స్థాయిలో రక్తం కూడా లేకపోవడం వంటి రుగ్మతనలు ఎదర్కొన్నాడు. దీనికి పోషకాహార లోపమని వైద్యులు చెప్పడంతో ఆమె ఆ దిశగా వంటగదిలో ప్రయోగాలు చేసేది. తన కొడుకు పోషకాహార లోపంతో బాధపడకూదన్న ఆమె సంకల్పం పాలకూర వంటి ఆకుకూరలపై దృష్టిసారించేలా చేసింది. తనలాంటి తల్లలకు సహాయం అందించేలా చేయాలనే తపన, తన కొడుకు ఆరోగ్యం మెరుగ్గా ఉండాలనే బలమైన కోరిక వెరసీ ఆమెను పాలకూర స్టార్టప్ పెట్టేందుకు దారితీసింది. పాలకూరలో ఉండే విటమిన్లు పోషకాహార లోపాన్ని భర్తీ చేస్తాయని న్యూట్రిషన్ల ద్వారా తెలుసుకుంది. ఆకుకూరల గొప్పతనం, వాటి వల్ల కలిగే ప్రయోజనాలే ఆమెను పాలకూరతో రకరకాల వంటకాలు చేసేందుకు పురిగొలిపింది. కానీ ఈ పాలకూర త్వరగా పాడైపోతుంది. అలా కాకుండా దాన్ని ఎండలో బెట్టి పౌడరు చేసుకుని రకరకాల వంటకాలు ఎలా చేయొచ్చని ప్రయోగాల చేసింది. అలా ఆమె తానే స్వయంగా పాలకూర పొడులకు సంబంధించిన తినాసరి కీరై స్టార్టప్ పెట్టి విక్రయించడం ప్రారంభించింది. ఈ స్టార్టప్లో పాలకూరకు సంబంధించిన 40 రకాలు పొడుల మిక్స్లు ఉంటాయి. పాలకూరని కన్నడలో కీరై అని పిలుస్తారు. అందులోని వెరైటీలు ప్రధానంగా మనథక్కలి, కాసిని, ముదకథన్ , అగతి కరిసలంగన్నితో దాదాపు 15 రకాల వంటకాలను రూపొందించింది. ఈ లోగా కొడుకు కూడా ఆరోగ్యవంతుడయ్యాడు. క్రీడల్లో ఛాంపియన్గా కూడా రాణించే స్థాయికి చేరుకున్నాడు తన సొంత జ్ఞానంతో పెట్టిన ఈ స్టార్టప్తో ప్రారంభంలో పలు సమస్యలు ఎదుర్కొంది. ఈ పొడులతో దోసెలు, సూప్లు, బియ్యం మిశ్రమాలు వంటి వాటిని కూడా చేర్చింది. వీటి గురించి తన కొడుకు స్నేహితుల తల్లిదండ్రులకు పేరెంట్ మీటింగ్ సమావేశాల్లో తన స్టార్టప్లో విక్రయించే ఈ పాలకూర పొడుల ప్రాముఖ్యత గురించి వివరించేది. పైగా పాలకూర కొని చేయడం కంటే ఈ మిక్స్లతో సులభంగా వండటమేగాక మంచి పోషకాహారాన్ని అందిస్తామన్న ఆమె వివరణ ఎందరో తల్లిదండ్రులను ఆకర్షించింది. సులభంగా వండగలమన్న విధానం ప్రజలను ప్రభావితం చేసి.. కొనేందుకు ముందుకు వచ్చారు. అందులోనూ పిల్లలకు ఆకుకూరల తినడానికి అస్సలు ఇష్టపడరు. ఇలాంటివి అయితే సులభంగా తింటారు, పైగా పోషకాలు అందుతాయన్న ఆశతో కొనేందుకు ముందుకు రావడంతో పెద్ద మొత్తంలో కస్టమర్ల పెరగడం తోపాటు ఆర్డర్లు కూడా వచ్చేవి. అందుకు తగ్గట్టుగానే ఐఎస్ఓ(ISO)-సర్టిఫైడ్ పద్ధతులను అవలంబించడం, తన బ్రాండ్ నాణ్యతలో రాజీపడకుండా అందించి ప్రజల నమ్మకాన్ని చూరగొంది. అలా అనాతి కాలంలోనే వార్షిక అమ్మకాలు రూ. 9 లక్షలకు చేరుకోవడంతో చిన్న వంటగది ప్రయోగాలు కాస్త ఓ పెద్ద బిజినెస్గా మారి దూసుకుపోయేందుకు కారణమైంది. అంతేగాదు లక్ష్మీ స్టార్టప్ ఈ స్టార్టప్ ఇప్పుడు భారతదేశం దాటి విస్తరించింది, కాలిఫోర్నియా, సింగపూర్ వంటి సుదూర ప్రాంతాలలో ప్రపంచవ్యాప్తంగా జీవితాలను ప్రభావితం చేస్తుంది.నిపుణులు ఏమంటున్నారంటే..చివరగా పోషకాహార నిపుణురాలు పద్మజ గుత్తికొండ, పాలకూర అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పునరుద్ఘాటించారు. పాలకూరలో కెరోటినాయిడ్లు, విటమిన్లు సీ, కే, ఫోలిక్ ఆమ్లం , కాల్షియంలకు మూలం అని ఆమె అన్నారు. ఇది కంటి ఆరోగ్యం, ప్రేగు ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. దీనిని ప్రతిరోజూ పిల్లల ఆహారంలో లేదా వారానికి కనీసం 4 నుంచి 5 సార్లు చేర్చడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడమే గాక కంటి చూపుకి ఢోకా ఉండదని చెబుతున్నారు.(చదవండి: టైప్ 2 డయాబెటిస్కి మొక్కల ఆధారిత ఔషధం..! ట్రయల్స్లో షాకింగ్ ఫలితాలు) -
గృహ సామ్రాజ్యానికి మహారాణి..!
ఒక ఉత్తమ సమాజ స్థాపనకు వెన్నెముక కుటుంబం కనుక పురుషుడు బయటి సామ్రాజ్యానికి అధిపతి అయితే స్త్రీని ఆ గృహ సామ్రాజ్యానికి మహారాణిగా చేసింది ఇస్లాం. పిల్లల ఆలన భర్త పాలన చేస్తూ, ఎలాంటి ఆర్థిక బాధ్యతలు లేకుండా స్త్రీని మినహాయించింది. ఏ విషయంలోనూ ఆడపిల్లను తక్కువగా చూడరాదని, మగపిల్ల వాడిని అధికుడిగా చూడరాదనీ, ఇద్దరిపట్ల సమానమైన ప్రేమను చూపించాలనీ, భ్రూణ హత్యలను నిషేధిస్తూ ఆడపిల్లను అన్యాయంగా హతమార్చితే కఠిన శిక్షకు గురవుతారని హెచ్చరించింది. తల్లి పాదాల చెంత స్వర్గం ఉందని ప్రకటించి స్త్రీ జాతి ఔన్నత్యాన్ని పతాక స్థాయికి చేర్చిన ఘనత ఇస్లాం ధర్మానికే దక్కుతుంది.1400 సంవత్సరాలకు పూర్వమే స్త్రీలకు ఓటు హక్కును కల్పించి, తన తండ్రి, భర్త, పిల్లల ఆస్తిలో వాటాను కల్పిస్తూ, ఆమెకు ఆస్తిహక్కును ప్రకటించింది. వివాహ విషయంలో తనకిష్టమైన వరుడిని ఎంపిక చేసుకునే విషయమై ఆమె సమ్మతి తీసుకోవాలనీ, దుర్మార్గుడైన భర్త నుండి ‘ఖులా‘ అనే ప్రక్రియ ద్వారా విడిపోయి తనకు తానుగా జీవించే హక్కును కలిగి ఉండడమే కాక పునర్వివాహం చేసుకునే హక్కునూ ప్రసాదించింది. కనుకనే తనకన్నా వయసులో 15 ఏళ్ల పెద్దదైన హజరత్ ఖదీజా అనే వితంతువును పాతికేళ్ల నిండు యవ్వనంలో వివాహమాడి స్త్రీ జాతి కీర్తిని సమున్నత స్థాయికి చేర్చారు ప్రవక్త ముహమ్మద్ (సం). స్త్రీ సహ ధర్మచారిణి అంటూ మీరు తిన్నదే ఆమెకు తినిపించండని సమాజానికి హితవు పలికారు. విద్యనభ్యసించడం స్త్రీ పురుషుల విధి అని విద్యనభ్యసించడాన్ని ప్రోత్సహించడమే కాక, సమాజానికి స్ఫూర్తిదాయకమైన స్త్రీ మూర్తులను అందించింది ఇస్లాం. ఇస్లామీయ చరిత్ర లో హజరత్ ఆయిషా (ర) ప్రముఖ విద్వాంసురాలిగా, హజరత్ షిఫా(ర) ప్రముఖ గైనకాలజిస్టు గా, హజరత్ ఖదీజా(ర )అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారవేత్తగా సమాజానికి అమూల్యమైన సేవలందించారు. ప్రముఖ మేధావి ఫాతిమా అల్ ఫహ్రీ మురాకోలో స్థాపించిన ‘అల్ ఖరావీన్’ యూనివర్సిటీ ప్రపంచంలోనే అతి పురాతన విశ్వవిద్యాలయంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో నమోదయ్యింది. హదీసు విద్యావేత్తలలో మహిళా ఉపాధ్యాయులుగా పేరుగాంచి ఇస్లామీయ చరిత్రకు వన్నెతెచ్చిన వనితలు కోకొల్లలు. మహిళలు తమ కార్య పరిధిలో ఉంటూనే మౌలికమైన బాధ్యతలతో పాటు సమాజంతో చక్కటి బాంధవ్యాన్ని ఏర్పరచుకోగలరనే స్ఫూర్తినిచ్చింది ఇస్లాం ధర్మం..– బతూల్ హుమైర్వీ(చదవండి: -
ఒక ఆలోచన...విజేతను చేసింది
నళిని ఓ ఫుడ్ప్రెన్యూర్. జంషెడ్పూర్, టాటానగర్లో పుట్టారు. ప్లస్ టూ వరకు అక్కడే చదివారు. ఆ తర్వాత ఒడిశా, భువనేశ్వర్లో డిగ్రీ, ఎంబీఏ చేశారు. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేశారు. ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద కలిగిన ఆసక్తి ఆమెను మార్కెటింగ్ వైపు అడుగులు వేయించింది. పాలు, పాల ఉత్పత్తుల మార్కెటింగ్లో సక్సెస్ అయ్యారు. కరోనా పాండమిక్ ఆమె కెరీర్ని మలుపు తిప్పింది. సొంతంగా ఏదైనా చేయాలనే ఆసక్తి ఆమెతో మిల్లెట్ మిరకిల్ చేయించింది. బ్రెడ్ తయారీలో ఉన్న ఆసక్తి కొద్దీ ఆ ఫార్ములాని మిల్లెట్స్ మీద ప్రయోగం చేశారు. అగ్రికల్చర్, ఫుడ్ సైంటిస్టుల పరీక్షలను నెగ్గిన నళిని విజయవంతమైన తన ప్రయోగానికి పేటెంట్ ఫైల్ చేశారు. మహిళాదినోత్సవం సందర్భంగా ఆమె ‘సాక్షి’తో పంచుకున్న వివరాలివి.ఇది నా పేటెంట్ ప్రోడక్ట్! చపాతీ అంటే ప్రకటనలో చూపించినట్లు మూడువేళ్లతో తుంచేటంత మృదువుగా ఉండాలి. మిల్లెట్స్ ఆరోగ్యానికి మంచివని చపాతీ చేస్తే తినడం కష్టంగా ఉంటోంది. పరిష్కారం ఏమిటి? దీనిని ఛేదించగలిగితే సక్సెస్ చేతికందినట్లే. ఇందుకోసం నళిని తన ఆలోచనకు పదును పెట్టారు. తన సాధన ఫలించి ఆమె సాధన ఫలించి, ఇంట్లో వాళ్లు సంతృప్తిగా తిన్నారూ.. తిన్నారు. దీనినే తన ఎంటర్ప్రెన్యూర్షిప్కి మార్గం చేసుకోవచ్చు కదా! అనుకోవడంతోనే సంబంధిత అనుమతుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆమె చేసిన రెడీ టూ కుక్, రెడీ టూ ఈట్ మిల్లెట్ చపాతీలు ఆ పరీక్షల్లో నెగ్గాయి. నిల్వ ఉండడానికి ఆర్టిఫీషియల్ ప్రిజర్వేటివ్స్ ఏమీ వాడడం లేదని, పోషకాల లభ్యత బాగుందని హైదరాబాద్, రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఫుడ్æ సైంటిస్టులు నిర్ధారించారు. పరీక్షలలో నెగ్గిన తర్వాత తన ఫార్ములాను పరిరక్షించుకోవడం కోసం పేటెంట్ ఫైల్ చేశారు నళిని. అగ్రికల్చరల్ యూనివర్సిటీ... ఫుడ్ డెవలప్మెంట్ విభాగంలోని ఇన్క్యుబేటర్లో ప్రయోగదశలను నిర్వహించడానికి అవకాశం ఇవ్వడంతోపాటు అగ్–హబ్, నిధి ప్రయాస్ గ్రాంట్లు ఇచ్చి ప్రోత్సహించింది. తన ఆలోచన, ప్రభుత్వం నుంచి అందినప్రోత్సాహంతో పరిశ్రమ స్థాపించగలిగానని చెప్పారు నళిని. ‘‘రెండు–మూడు సంవత్సరాల గ్రౌండ్ వర్క్ తర్వాత తెరమీదకు వచ్చాను. ప్రస్తుతం పరిమితంగానే ఉత్పత్తి చేస్తూ నగరంలోని క్యూ మార్ట్, స్టార్ హోటళ్లకు అందిస్తున్నాను. పేటెంట్ వచ్చిన తర్వాత మార్కెటింగ్ మీద దృష్టి పెడతాను. ఒక కొత్త ఉత్పత్తిని ఊహించుకుని, నా జ్ఞానాన్ని మేళవించి, నిరంతరాయంగా శ్రమించి సాధించుకున్న విజయం ఇది. నా ఆలోచన, ప్రయోగానికి పేటెంట్ సాధించుకోవడం అనే ఊహే ఆనందంగా ఉంది’’ అన్నారు నళిని. మల్టీ టాస్కింగ్ మహిళలకు కొత్త కాదు! మల్టీ టాస్కింగ్లో మహిళలు సిద్ధహస్తులు. ఇంటి బాధ్యతలను నిర్వహించడమే అందుకు నిదర్శనం. గృహిణి బాధ్యతలకే పరిమితం కాకుండా ఇంకా ఏదైనా చేయాలనే ఆసక్తి ఉన్న వాళ్లు చాలామంది ఉన్నారు. కానీ వాళ్లలో ఎక్కువ మంది అలా అనుకుంటూనే రోజులు గడిపేస్తుంటారు. ధైర్యం చేసి తొలి అడుగు వేస్తే నడక దానంతట అదే కొనసాగుతుంది. అయితే ఎంటర్ప్రెన్యూర్షిప్లో అడుగుపెట్టేముందు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... మరుసటి రోజు నుంచే లాభాల కోసం చూడరాదు. రాబడి పెరిగి ఆదాయం వచ్చే వరకు శ్రమించగలిగిన సహనం ఉండాలి. లాభాల బాట పట్టిన తర్వాత కూడా అలాగే శ్రమను కొనసాగించాలి. – నళిని, ఫౌండర్, కిబేస్, హైదరాబాద్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
నిర్వహణలోనూ రాణిస్తాం
ఒకరు వైద్యశాస్త్రం చదివాక... తన సేవలకు ఆ పరిధి సరిపోదేమోనని సివిల్ సర్వీసెస్ రాసి... ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి హెల్త్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. మరొకరు ఓ పెద్ద హాస్పిటల్కు వైస్ ప్రసిడెంట్... ఇంకొకరు మరో పేరుమోసిన హాస్పిటల్కు సీవోవో... మరికొందరు హాస్పిటల్ డైరెక్టర్లు. వైద్యశాస్త్రం చదివి మహిళా వైద్యులుగా పేరు పొందినవాళ్లు చాలామందే ఉన్నారు. కానీ హాస్పిటల్ రంగంలో ఎంటర్ప్రెన్యూర్లుగా, ఆరోగ్యరంగ సారథులుగా ఉంటూ సారథ్యం వహిస్తున్న వారు కాస్త తక్కువే గానీ ఇప్పుడు వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలా వైస్ ప్రెసిడెంట్లుగా, సీవోవోలుగా, కీలకమైన స్థానాల్లో ఉండి రాష్ట్రానికీ, హాస్పిటళ్లకూ దిశానిర్దేశం చేస్తూ... వాటిని ముందుండి నడిపిస్తూ ప్రధాన బాధ్యతలు తీసుకొని పనిచేస్తున్న మహిళా వైద్యుల స్ఫూర్తిమంతమైన మాటలివి.పల్లెనాడి పట్టడానికి ఐఏఎస్గా...నా మీద చిన్నప్పట్నుంచీ మా నాన్నగారి ప్రభావం ఎంతో ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్, మిజోరా రాష్ట్రాల్లో అనేక శాఖల్లో పనిచేస్తూ సమాజానికి అంకితభావంతో సేవలందించిన మంచి ఉద్యోగి ఆయన. పల్లె ప్రాంతల్లో పనిచేసే సమయంలో మా నాన్న ఎదుర్కొన్న సవాళ్లూ, వాటిని ఆయన పరిష్కరించిన తీరు... ఇవన్నీ చూస్తూ పెరిగాను నేను. ఆయన అనుభవాలన్నీ అటు తర్వాత నాకెంతో ఉపకరించాయి. గ్రామీణప్రాంతాల్లో నాన్న ఎదుర్కొన్న సవాళ్లకు ఆరోగ్యసేవల ద్వారానే ఉత్తమమైన పరిష్కారం అందించవచ్చని అనిపించడంతో నేను ఎంబీబీఎస్ చేశా. నా ఇంటర్న్షిప్ సమయంలో మారుమూల పల్లెల్లో పనిచేస్తున్నప్పుడు నేను కనుగొన్న కొన్ని లోపాలను మంచి పాలనతోనే అధిగమించవచ్చని నాకు అనిపించింది. దాంతో సివిల్ సర్వీసెస్ రాశా. అలా నేను డాక్టర్ నుంచి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్గా మారాను. ఎంత పెద్ద ప్రయాణమైనా... మొట్టమొదటి అడుగుతో మొదలవుతుందనే సూక్తిని నమ్మిన నేను ఈశాన్య రాష్ట్రాలకు సేవలందించాక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో అందునా వైద్యశాఖ ద్వారానే నా సేవలందిస్తున్నా. మన సమాజమే పితృస్వామ్య సమాజమైనప్పటికీ మహిళలు తమ సామర్థ్యాలు చూపుతూ చాలా రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. ఒక్కోసారి తమ పురుష ప్రత్యర్థుల కంటే మహిళల సామర్థ్యాలే మెరుగ్గా ఉంటున్నాయని చెప్పవచ్చు. ఒక్కోసారి మా నాన్నవాళ్ల తరం కంటే మా తరం బాగానే పురోగమిస్తోందనిపిస్తోంది. నిజానికి మా వైద్యశాఖలో పనిచేసే సిబ్బందిలో చాలామంది మహిళలే ఉన్నారు. సమాజంలో ఈ వివక్ష ఉన్నప్పటికీ నా మట్టుకు నేను మంచి సామర్థ్యంతో,ప్రొఫెషనలిజమ్తో కష్టపడి పనిచేస్తే ఈ వివక్షనూ అధిమించవచ్చనే ఉద్దేశంతో పనిచేస్తున్నాను. గత 24 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రానికంతటికీ నా సేవలందించేలా మనస్ఫుర్తిగా పనిచేయడం నాకు గుండెల నిండా ఆనందాన్ని, తృప్తిని ఇస్తోంది. హెల్త్ సెక్రటరీగా రాష్ట్రంలోని అట్టడుగు, బడుగువర్గాల వారందరికీ మా ప్రభుత్వ సేవలందాలనేదే నా మొట్టమొదటి లక్ష్యం. మేము అమలు చేసిన కార్యక్రమాలతో మెరుగైన స్క్రీనింగ్ పరీక్షలూ, వైద్యపరీక్షలతో ఎన్నో మాతృమరణాలూ, శిశుమరణాలూ... వీటన్నింటినీ గణనీయంగా తగ్గించగలిగాం. మారుమూల గిరిజన్ప్రాంతాల్లో వ్యాధినిర్ధారణ కేంద్రాలూ, ఐటీడీఏలకు అంబులెన్స్ సర్వీసులపై దృష్టి నిలిపాం. చిన్న పల్లెల్లో చదివే ప్రతిభావంతులైన పిల్లలకూ వైద్యవిద్య అందాలనే సదుద్దేశంతో ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలూ, 16 నర్సింగ్ కాలేజీలూ, 28 పారామెడికల్ కాలేజీలతోపాటు మహిళా శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో... ఎంతో వివక్షకు లోనవుతున్న ట్రాన్స్జెండర్ వాళ్ల ఆరోగ్యం కోసం ఓ తొలి ప్రయత్నంగా 33 క్లినిక్లు ఏర్పాటు చేసే దిశగా పనిచేశాం. ఓ ప్రభుత్వ ఉద్యోగిగా సివిల్ సర్వీసెస్లో ఉంటూ నా పనుల ద్వారా సమాజంలో ఎంతో మార్పు తెచ్చామన్న తృప్తి ప్రతిరోజూ ప్రతిక్షణం ఉండటమే ఈ వృత్తిలో ఉన్నందుకు నాకు దక్కే సంతృప్తి. – డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్తూ, సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సంకల్ప బలంతోనే సాధన సులభంఒక హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్గా, మా టీమ్లోని ఉద్యోగులకు స్ఫూర్తిని అందించే మెంటార్గా, మా హెచ్ఆర్ టీమ్లకూ, పారామెడికల్ స్టాఫ్కూ మార్గనిర్దేశనం చేస్తూ, వారికి నేతృత్వం వహించే పనిచేయడాని కంటే ముందు నేను మా తల్లిదండ్రులకు ఏకైక సంతానాన్ని. దాంతో నా తల్లిదండ్రుల బాధ్యతలూ నేనే నిర్వహించాలి. దాంతోపాటు నా భర్తకు అవసరమైన నైతిక స్థైర్యాన్ని, నా అత్తమామలకు అవసరమైన సేవలందిస్తూ ఇలా ఇంటిబాధ్యతలు చూస్తూనే... కెరియర్ పరంగా ఓ ఎంట్రప్రెన్యూర్గా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు చేపట్టా. ఓవైపు ఇంటిబాధ్యతలూ, మరోవైపు కెరియర్ బాధ్యతలు... ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ మా సంస్థ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నా. సంకల్పబలం ఉంటే కష్టసాధ్యమైన లక్ష్యాలనూ ఛేదించగలం అనేది నేను నమ్మే తారకమంత్రం. ఈ మాట ఎందుకు చె΄్పాల్సి వస్తోందంటే... నేను రెండోసారి గర్భవతిగా ఉన్నప్పుడు నా రేడియాలజీ పీజీ పూర్తి చేశా. అటు తర్వాత ప్రతిష్ఠాత్మమైన ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’లో ఏఎమ్పీహెచ్ ప్రోగ్రామ్ పూర్తికావడంతోనే ప్రీతీ హాస్పిటల్స్ గ్రూపునకు ఆపరేషన్స్ అధినేతగా బాధ్యతలు తీసుకున్నా. ప్రస్తుతం నేను మా సంస్థలో వందల సంఖ్యలో పనిచేస్తున్న ఉద్యోగులకు నేతృత్వం వహిస్తున్నా. ఈ క్రమంలో మా సంస్థలో జెండర్ వివక్ష ఉండకూడదనే ఉద్దేశంతో వీలైనంత మేరకు మహిళా ఉద్యోగులనే నియమిస్తున్నాం. రోజు డ్యూటీ ముగిసి ఇంటికెళ్లే సమయానికి... మేం మా పేషెంట్ల పట్ల మాత్రమే కాకుండా... సమాజంలోని నిరుపేదల విషయంలోనూ సహానుభూతితో వ్యవహరిస్తున్నామన్న తృప్తే మమ్మల్ని ముందుకు నడిపించే మరో స్ఫూర్తిమంత్రమంటూ వినమ్రంగా చెబుతున్నాను. – డాక్టర్ రూప పుట్టా, సీనియర్ రేడియాలజిస్ట్, డైరెక్టర్ అండ్ కో ఫౌండర్ ఆఫ్ ప్రీతీ యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్స్, హైదరాబాద్ సారథ్యం అంత కష్టమేమీ కాదు!ప్రస్తుతం నా వయసు 37 ఏళ్లైతే... మా హాస్పిటల్ వయసు 32 ఏళ్లు. అంటే నా ఊహ తెలిసినప్పటినుంచి మా అమ్మతో పాటు హాస్పిటల్, క్లినిక్... ఇలా నిత్యం వైద్యుల మధ్యనే మెలగుతున్నా. నా ఇంటర్మీడియట్ టైమ్లో బైపీసీ తీసుకుని వైద్యరంగం వైపునకు వెళ్లడం అనివార్యంగా జరిగిపోయింది. మాకు ఓ సొంత హాస్పిటల్ ఉండటం... అలాగే మేము నడుపుతున్న మెడికల్ కాలేజీలూ ఉండటం వల్ల అక్కడ హాస్పిటల్ సారథిగా కీలకమైన అడ్మినిస్ట్రేషన్ స్థానంలోకి నేను వెళ్లడం చాలా సులువు అని కొంతమందికి అనిపించవచ్చు. అయితే ఈ పురుషులప్రాధాన్య ప్రపంచంలో ప్రతి సవాలునూ, ప్రతి సమస్యనూ పరిష్కరించుకుంటూ రావడం, ఓ మహిళగా ప్రతి నిమిషం, ప్రతిక్షణం తనను తాను నిరూపించుకుంటూ ఉండటం, ఆ స్థానాన్ని పదిలంగా నిలబెట్టుకోవడం, అందులో పదికాలాలు నిలదొక్కుకోవడం చాలా కష్టమైన పని. ఇక్కడ మనం చేయాల్సిందొక్కటే... మన హద్దులను మనమే మరింతగా విస్తృత పరచుకుంటూ, మన పరిధిని మనమే మరింత విశాలం చేసుకుంటూ మన తోటివారినీ మనతోపాటు ముందుకు తీసుకెళ్తూ ఉండటమే. ఓ మహిళగా నా టీమ్ను ఈ దిశగా నడిపిస్తూ నా డాక్టర్లూ, నా సిబ్బందీ వీళ్లందరూ మంచి కౌన్సెలర్లుగా సహానుభూతితో పనిచేసేలా చేయగలగడం, మంచి ఆరోగ్యాన్ని అందించడం ప్రస్తుతం నేను చేస్తున్న పని. చాలాకాలం పాటు హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతూ ఉండాల్సిన నిరుపేద పేషెంట్లకూ, గ్రామీణప్రాంతపు రోగులకూ ఈ సౌకర్యాలన్నీ ఇవ్వగలుగుతూ వస్తున్నామన్న ఓ అద్భుతమైన భావనే నాకు సంతృప్తినిస్తుంది. – డాక్టర్ గాయత్రి కామినేని, ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో), కామినేని హాస్పిటల్స్, హైదరాబాద్మేనేజ్మెంట్లో మేమే బెస్ట్!మొదట నేను ఓ డాక్టర్గానే సేవలందిస్తా అనుకున్నా. కానీ ఓ ఎంట్రప్రెన్యూర్గా, ఓ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేయడం వల్ల చాలా విస్తృతస్థాయిలో సేవలందించడానికి మనకు సాధ్యమవుతుందని గ్రహించాను. సరిగ్గా ఇదే సమయంలో విజయవాడలో డాక్టర్ భాస్కర్రావుగారు కిమ్స్ తమ హాస్పిటల్ శాఖనుప్రారంభించారు. ఆ టైమ్లో అసిస్టెంట్ మెడికల్ డైరెక్టర్గా కిమ్స్లో పనిచేయడం మొదలుపెట్టా. హాస్పిటల్ నడిపించడమెలాగో నేర్చుకోవడం కోసం ప్రతిరోజూ నేను గుంటూరు నుంచి విజయవాడకు వెళ్లి... అక్కడ ప్రతి విభాగంలో ఉండే కష్టనష్టాలూ, సాధకబాధకాలు బాధకాలూ తెలుసుకుంటుండేదాన్ని. ఆ రంగంలో నాకున్న ఆసక్తి కారణంగా ప్రతిరోజూ గుంటూరు నుంచి విజయవాడకు వస్తూ పోతూ ఉండటాన్ని కంటిన్యువస్గా నాలుగేళ్లపాటు కొనసాగించా. అటు తర్వాత హైదరాబాద్లోని కొండాపూర్ కిమ్స్ విభాగానికి మెడికల్ డైరెక్టర్గా, ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్స్ తాలూకు వైస్ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. పేదలూ, బడుగువర్గాల నుంచి ప్రతిభావంతులైన మహిళలను ఎంచుకుని వారు సమర్థంగా పనిచేయగల స్థానాల్లో వారి నియామకాలు జరిగేలా చూసినప్పుడు... సమాజానికి అవసరమైన పని చేశామన్న సంతృప్తి ఉంటుంది. రేపు ఇంతకంటే మెరుగ్గా చేయాలన్న సంకల్పమూ ఉంటుంది. – డాక్టర్ హరిణి చేబ్రోలు, వైస్ ప్రెసిడెంట్ (రెవిన్యూ సైకిల్ మేనేజ్మెంట్), కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ కెరియర్ మెట్లపై‘ఫెమ్’నిస్టులం!అందరూ మహిళా డాక్టర్లే ఉంటూ, మహిళలతోనే నడిచే ఓ పూర్తిస్థాయి మహిళల హెల్త్కేర్ సెంటర్ను మేము ఏర్పాటు చేయడానికి వెనక ఓ చిన్న కథ ఉంది. చిన్నపిల్లల వైద్యుడూ, రోజుల పిల్లల స్పెషలిస్తూ (నియోనేటాలజిస్ట్) అయిన నా భర్త దగ్గరికి తమ పిల్లలను తీసుకొచ్చే తల్లులు తనను నిత్యం ఓ ప్రశ్న అడుగుతుండేవారు. ‘ఏమండీ... ఎవరైనా మహిళా రేడియాలజిస్టు ఉన్నారా?... ఎక్కడైనా ఓ లేడీ బ్రెస్ట్ సర్జన్ దొరుకుతారా?’’ అన్నదే చాలామంది ప్రశ్న. దీంతో ఆ రంగాల్లో మహిళా వైద్యుల అవసరముందనే విషయం మా దృష్టికి వచ్చింది. దాంతోపాటు మరో అంశమేమిటంటే... మా అమ్మ గారు క్యాన్సర్ విజేత. ఆమెకు క్యాన్సర్ చికిత్స జరుగుతున్న సమయంలో నేను ఆమె వెంట వెళ్తూ ఉండేదాన్ని. ఎవరైనా మహిళా వైద్యురాలి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆమె చాలా సౌకర్యంగా ఫీలవుతుండటాన్ని గ్రహించా. అలాంటి అనుభవాల నుంచి పుట్టిందే మా ఫెమ్సిటీ హాస్పిటల్. ఓ ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలనుకునే మహిళకు జస్ట్ 9 టు 5 జాబ్ చేయడం కుదరని పని. మనం ఎంచుకునే కెరియర్ అంతకంటే ఎక్కువే డిమాండ్ చేస్తుంటుంది. ఉదాహరణకు... నా చిన్నారి బేబీకి జన్మనివ్వడానికి కేవలం నాలుగు గంటల ముందు కూడా నేను నా టీమ్తో పనిలో నిమగ్నమయ్యే ఉన్నాను. అంతేకాదు... నా టీమ్తో ఏదో చర్చిస్తూ, వాళ్లకు మార్గనిర్దేశనం చేసిన మరో నాలుగ్గంటల తర్వాతే నా బేబీని నా చేతుల్లోకి తీసుకున్నా. నిజానికి మహిళలు తమ చుట్టూ ఉండేవాళ్ల ఆరోగ్యాన్నీ, సంక్షేమాన్ని, భద్రతనూ ఎల్లప్పుడూ కోరుకుంటూ, వాళ్లకేప్రాధాన్యమిస్తుంటారు. అందుకే ఈ సమాజానికి మరో తరాన్ని ఇస్తూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ముందుండే మహిళలతో సాటి మహిళగా కనెక్ట్ అవుతూ, ఆమెకు మానసిక, శారీరక ఆరోగ్యానందాలను ఇవ్వడం చాలా కీలకమైన అంశంగా ఫీలవుతుంటాను. ఫెమ్సిటీ కేర్స్ అనే ఫౌండేషన్ సహాయంతో ఖర్చులు భరించలేని, అఫర్డ్ చేయలేని అనేక మందికి శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ, నెలల పిల్లలకూ, చిన్న చిన్నపిల్లల వైద్యం, అనేక మందికి సర్జరీలూ ఉచితంగా అందిస్తున్నాం. ఇలాంటి సేవలెన్నో మా మహిళా, చిన్నపిల్లల హాస్పిటల్ ద్వారా నిరంతరం అందించగలుగుతున్నామన్నదే నాకు సంతృప్తినిచ్చే అంశం. – ఎల్మిరా సిద్దీఖీ, కౌ–ఫౌండర్ అండ్ డైరెక్టర్ (పబ్లిక్ రిలేషన్స్), ఫెమ్సిటీ హాస్పిటల్స్, హైదరాబాద్రంగుల కళఇంటర్నేషనల్ విమెన్స్ డే సింబల్, పోస్టర్ డిజైన్లలో సాధారణంగా పింక్ కలర్లో కనిపిస్తుంటుంది. నిజానికి ఎన్నో ఏళ్లుగా ఇంటర్నేషనల్ విమెన్స్ డేఅంటే ఊదా, ఆకుపచ్చ, తెలుపు రంగులు మాత్రమేప్రాచుర్యం పొందాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వెబ్సైట్ ప్రకారం... ఊదా రంగు గౌరవానికి, న్యాయానికి, ఆకుపచ్చ ఆశకు, తెలుపు స్వచ్ఛతకు ప్రతీక. యూకేలోని ఉమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్ (డబ్ల్యూ ఎస్పీయూ–1908) ద్వారా ఈ రంగులుప్రాచుర్యంలోకి వచ్చాయి. -
లాలస: స్త్రీలందరికీ ఆమె ఆదర్శమా? అనుసరణీయమా?
గాఢంగా చీకట్లు కమ్మిన ఒక రాత్రి– ఆకాశాన్ని చీలుస్తూ ఒక మెరుపు మెరుస్తుంది... మనల్ని, మన పరిసరాలనీ మన కళ్ళకే చూపించి మాయమై పోతుంది. ఆ మెరుపును మన ఇంటి దీపంలాగా గోడకు వేలాడదీసుకుందామంటే కుదరదు. కుదిరి నా భరించటానికి ఆ ఇంటికి శక్తి చాలదు. ఆ క్షణకాలపు వెలుగులో ఏం చూడగలరో, పరిసరాలను ఎంత చక్కదిద్దుకోగలరో ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిందే. సరిగ్గా ఆ మెరుపులాంటిదే లాలస! చలం రాసిన ‘జీవితాదర్శం’లో నాయిక. లాలస నాకు నచ్చింది అని చెప్పిన వాళ్ళకు కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి– స్త్రీలందరికీ ఆమె ఆదర్శమా? అనుసరణీయమా? ఆ దారిలో నడవటం ఆడవాళ్ళకు క్షేమమా? అంటూ. అన్నిటికీ జవాబు ఒకటే– కాదు. మరెందుకు మాట్లాడుకోవాలి లాలస గురించి? స్త్రీ పురుష సంబంధాలు– అధికారం వల్లనో, అవసరాల కోసమో సాగేవిగా ఉండరాదని, అవి హృదయగతమైన సంబంధాలుగా ఉండాలని చెప్పినందుకు, వాటిలో కపటమూ మోసమూ చోటు చేసుకున్నప్పుడు ఎంత బలమైన నిర్మాణమైనా లోలోపల గుల్లబారి కూలిపోక తప్పదని చెప్పటానికి తనను తానొక ప్రయోగశాలగా మార్చుకున్నందుకు లాలస గురించి మాట్లాడుకోవాలి.లాలస నమ్మి, ఆచరించిన ‘హృదయవాదం’ అతి ప్రమాదకరమైనది. ఉనికిలో వున్న ఏ ఆదర్శ నమూనాలోనూ అది ఇమడదు. ‘నీతిమంతమైన’ ఏ నిర్మాణమూ దాన్ని భరించదు. నిజానికి లాలస పేచీ పడింది నీతితోనూ, ఆదర్శాలతోనూ కానేకాదు. ‘నీతి చాలా గొప్ప విషయమూ, అవసరమైన విషయమూ’ అని గౌరవించే లాలస ఆ నీతులూ, ఆదర్శాలూ హృదయం లోంచి పుట్టే సహజ ప్రేరణలుగా కాకుండా ఉత్తి రిచువల్స్గా తయారవటాన్ని అసహ్యించుకుంటుంది. స్త్రీలను సమానులుగా మనస్ఫూర్తిగా గుర్తించకుండా, అలా ఉన్నట్టుగా కనబడే వ్యక్తులకు సామాజిక గౌరవం ఉన్నందుకే ఆలా నడుచుకునే హి΄ోక్రటిక్ ఆదర్శ జీవులను ఆమె నిలదీస్తుంది. అయితే ఇలా విమర్శించినంత మాత్రాన తానొక ఆదర్శ వ్యక్తిననే భ్రమలు ఆమెకేమీ లేవు. ‘నువ్వు నాకు ఆదర్శమైన పురుషుడివి కావు... ఆదర్శమైన స్త్రీ కూడా లేదు. కానీ, నేనొకతె ను ఉన్నానని నమ్ముతున్నావు, దురదృష్టవంతుడివి కనుక’ అని తను పెళ్ళాడబోతున్న వ్యక్తితో నిస్సంకోచంగా చెప్పగలదు లాలస. ఆదర్శవంతమైన మనుషులు, అత్యంత కఠినమైన స్వీయ ప్రయత్నంతో రూపొందగలరే తప్ప, సామాజిక నిర్బంధంతో కాదని ఆమె నమ్మకం. ఆ ప్రయత్నంలో ఎగుడు దిగుళ్ళూ, తప్పటడుగులూ ఉండి తీరుతాయి. ఏ విలువల ప్రాతిపదికన బయల్దేరుతామో వాటిని కోల్పోయే స్థితికి దిగజారే ప్రమాదమూ ఎదురు కావచ్చు. వీటన్నిటికీ సిద్ధపడి, ఒక విలువను ప్రతిపాదించగల స్థాయికి చేరిన వ్యక్తి లాలస. జనసామాన్యాన్ని కూడగట్టి నడిపించటానికీ, ఆచరణాత్మకమైన నిర్మాణాలను రూపొందించటానికీ పనికొచ్చే నాయకులు కాదు లాలస వంటి వ్యక్తులు. చదవండి: కనపడని నాలుగో సింహం..!ఆ పనుల కోసం రూపొందాయని చెప్పే మార్గాలు మూఢనమ్మకాలుగా మారిపోకుండానూ, ఆ నిర్మాణాలు గిడసబారి పోకుండానూ హెచ్చరించే అనుభవాల ప్రయోగశాలలు వీళ్ళు. మార్పు కొరకు జరిగే ప్రతి ఉద్యమమూ మానవీయమైన సహజ చర్యగా సాగాలని, ఆదర్శాలన్నవి మనుషుల వ్యక్తిత్వాల్లో అసంకల్పితంగా భాగమై పోయేంత సహజ స్పందనలుగా మారాలనీ కలలుగనే మానవులు. అలాంటి కలలు గన్న పాత్రగా లాలస పాఠకులకు నచ్చుతుంది.- కాత్యాయని -
కనపడని నాలుగో సింహం..!
సినిమాల్లో ‘శుభం’ కార్డు పడే సమయంలో ‘యూ ఆర్ అండర్ అరెస్ట్’ అంటూ ఇన్స్పెక్టర్ పరుగెత్తుకు వచ్చి నేరస్థుడికి అలవోకగా సంకెళ్లు వేస్తాడు. అయితే నిజజీవితంలో అలా కాదు. నేరస్థుడిని పట్టుకోవడానికి లక్ష సవాళ్లు ఎదురవుతాయి. అలా అని నేరస్థుడిని పట్టుకోవడంలో ఆలస్యం జరగకూడదు. ‘నేరస్థుడిని త్వరగా పట్టుకోవాలి’ అనే తొందరపాటు కూడా ఉండకూడదు. ‘99 మంది దోషులు చట్టం నుంచి తప్పించుకున్నా... ఒక్క అమాయకుడు శిక్షకు గురి కాకూడదు’ అనే మాట ఉండనే ఉంది! క్రైమ్ సీన్ సవాలు విసురుతుంది. ఎవరైతే ఆ సవాలును స్వీకరించి, తమ తెలివితేటలు, శక్తిసామర్థ్యాలకు పదును పెట్టి, ఏ పుట్టలో ఏ పాము ఉందో కనిపెట్టి నిందితుడిని కటకటాల వెనక్కి తీసుకువెళతారో... వారే క్రైమ్సీన్ ఆఫీసర్లు. క్లూస్టీమ్లో భాగంగా పనిచేసే క్రైమ్సీన్ ఆఫీసర్లు (సీఎస్ఓ) నేరం జరిగిన వెంటనే ఘటనాస్థలికి వెళ్లి అణువణువూ అధ్యయనం చేసి, దర్యాప్తు అధికారులుగా ఉండే పోలీసులు నిందితులను పట్టుకోవడానికి అవసరమైన ఆధారాలు అందిస్తారు. హైదరాబాద్ క్లూస్టీమ్లో మొత్తం 43 మంది సీఎస్ఓలు ఉండగా వీరిలో ఆరుగురే మహిళలు. పోలీసులు మనకు కనిపించే మూడు సింహాలైతే... ఈ ‘సీఎస్ఓ’లు కంటికి కనిపించని నాలుగో సింహం. ‘క్లూ’లు అందించడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గుడిబోయిన ఇందిర, దానం ఎలిజబెత్లు ఎన్నో ముఖ్యమైన కేసుల దర్యాప్తులో కీలక పాత్ర పోషించారు... హైదరాబాద్లోని నేరేడ్మెట్ (Neredmet) ప్రాంతానికి చెందిన గుడిబోయిన ఇందిర 2015 నుంచి హైదరాబాద్ (Hyderabad) క్లూస్ టీమ్లో సీఎస్ఓగా పని చేస్తోంది. తన పదేళ్ల సర్వీసులో ఎన్నో నేరస్థలాలకు వెళ్లి కీలక ఆధారాలు సేకరించి కేసు చిక్కు ముడి వీడడంలో కీలక పాత్ర పోషించింది. ఆ కేసులలో కొన్ని...నిందితుడు... ఇదిగో... ఈ ఇంట్లోనే!హైదరాబాద్లోని మెట్టుగూడ (Mettuguda) నల్లపోచమ్మ ఆలయం దగ్గర నివసించే రేణుక పెద్ద కుమారుడు యశ్వంత్ మౌలాలీలోని రైల్వే కాంట్రాక్టర్ దగ్గర పని చేసి మానేశాడు. ఫిబ్రవరి ఆరోతేదీన కొంతమంది దుండగులు తమ ఇంట్లోకి చొరబడ్డారని, తల్లితోపాటు తనపై కత్తితో దాడి చేశారని యశ్వంత్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇద్దరికీ తీవ్రగాయాలు కావడంతో ఈ హత్యాయత్నం కేసు సంచలనం సృష్టించింది. విధి నిర్వహణలో భాగంగా సీఎస్ఓ ఇందిర యశ్వంత్ ఇంటికి వెళ్లింది. ఘటనాస్థలిలో ఉన్న పరిస్థితులతోపాటు ఆ ఇంటి పరిసరాలను అధ్యయనం చేసింది. రేణుక ఒంటిపై ఉన్న కత్తిపోట్లు ఎదుటివాళ్లే పొడిచినట్లు ఉన్నప్పటికీ యశ్వంత్ గాయాలపై అనుమానం వచ్చింది. దీనికితోడు వారి ఇంటికి బయటనుంచి గడియపెట్టి ఉందనే విషయం తెలుసుకున్న ఇందిర మరింత లోతుగా ఆరా తీసింది. ఈ నేరంలో మూడో వారి ప్రమేయం లేదంటూ పోలీసులకు నివేదించింది. దీంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా యశ్వంతే నిందితుడని తేలింది. కుటుంబ కలహాలు, పెళ్లి కావట్లేదనే బాధతో డిప్రెషన్ కు గురైన యశ్వంత్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన తల్లికి కత్తిపోట్లు పడ్డాయి. దీంతో భయాందోళనలకు గురైన యశ్వంత్ తనపై కేసు కాకుండా ఉండటానికి ‘ఎవరో మాపై హత్యాయత్నం చేశారు’ అంటూ నాటకం ఆడాడు. కుమారుడిని జైలుకు పంపడం ఇష్టంలేక పోలీసులను తప్పుదోవ పట్టించింది రేణుక. చివరకు ఇందిర చొరవతో కేసు కొలిక్కివచ్చి యశ్వంత్పై హత్యాయత్నం కేసు నమోదైంది.స్క్రూ డ్రైవర్ ముక్కే... పక్కాగా పట్టించింది!నాలుగేళ్ల క్రితం బేగంపేటలో ఒక ఇంట్లో చోరీ జరిగింది. నేరస్థలిని సందర్శించిన ఇందిర అక్కడ విరిగిన స్క్రూడ్రైవర్ ముక్కను గుర్తించింది. బాధితులు పక్కింటివారిపై అనుమానం వ్యక్తం చేయడంతో వారింట్లో సోదాలు చేశారు. అక్కడ మిగిలిన స్క్రూ డ్రైవర్ దొరకడంతో వారే నిందితులుగా తేలి కేసు కొలిక్కివచ్చింది.సూసైడ్ నోట్ కనిపెట్టి... అతడి ఆట కట్టించిందికుటుంబ కలహాల నేపథ్యంలో గత వారం వారాసిగూడ ప్రాంతంలో ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో ఆమె భర్త కూడా ఇంట్లోనే ఉండటంతో ఇది హత్యగా అనుమానించారు. ఘటనాస్థలికి వెళ్లిన ఇందిర మృతురాలి శరీరంతోపాటు ఆమె వస్త్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి సూసైడ్ నోట్ వెలికి తీసింది. ఆత్మహత్యకు ప్రేరేపించడం, వేధింపుల కేసు భర్తపై నమోదైంది. తట్టిఅన్నారంలోని జీవీఆర్ కాలనీకి చెందిన దానం ఎలిజబెత్ 2015 నుంచి హైదరాబాద్ క్లూస్ టీమ్లో సీఎస్ఓగా పని చేస్తోంది. ఇప్పటి వరకు అనేక కేసుల దర్యాప్తులో కీలకంగా మారిన ఆధారాలను సేకరించి అందించింది. గత ఏడాది చివరలో హబీబ్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చిన ‘గుండెపోటు మరణం’ ఎలిజెబెత్ అందించిన ఆధారాలతోనే హత్యగా తేలింది.డస్ట్బిన్లో దాగిన రహస్యంకురుమబస్తీకి చెందిన రేణుక ఇంటి అరుగుపై ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా గుండెపోటు వచ్చి ఉంటుందని, తమ అరుగుపై పడుకుని ప్రాణాలు విడిచి ఉంటాడని రేణుక పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న హబీబ్నగర్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో మృతుడు ఏ బ్యాట్రీలేన్కు చెందిన ఖాలేద్గా గుర్తించారు. రేణుక ఇంట్లోనూ సోదాలు చేయాలని పోలీసులు క్లూస్ టీమ్ను కోరారు. ఎలిజబెత్ అక్కడకు వెళ్లి రేణుక ఇంటిలో అణువణువూ పరిశీలించింది. రేణుక మంచం పైన కనిపించిన కొన్ని వెంట్రుకలు ఖాలేద్ వెంట్రుకలతో సరిపోలాయి. రేణుక వంటగదిలో ఉన్న డస్ట్బిన్లో ఓ కొత్త కాటన్ టవల్ పడి ఉండటం ఎలిజబెత్ దృష్టిలో పడింది. కొత్త టవల్ డస్ట్బిన్లో ఉండటం, అదీ కిచెన్లోది కావడంతో అనుమానించింది. ఆ టవల్ తడిగా ఉండటంతోపాటు కొన్ని రకాలైన మరకలు ఉన్నట్లు కనిపెట్టింది. వీటి ఆధారంగా రేణుక హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం అందించింది ఎలిజబెత్. దీంతో అధికారులు రేణుకను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అనుకోకుండా హత్య చేశానని, తన సోదరుడు వెంకటేష్ సాయంతో మృతదేహాన్ని ఇంట్లోంచి బయటకు తీసుకువచ్చి అరుగుపై పడుకోబెట్టానని రేణుక ఒప్పుకుంది. చదవండి: 'ఇ-నాలుక' రుచిని కోల్పోయిన వాళ్లకు వరం..!రేణుక–ఖాలేద్ల మధ్య కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఆరోజు రేణుక ఇంటికి వెళ్లిన ఖాలేద్ తన కోరిక తీర్చమని కోరగా ఆమె అంగీకరించలేదు. ఆ సమయంలో జరిగిన గొడవలో బెడ్పై పడిన ఖాలేద్ నోరు, ముక్కు టవల్తో మూసేసి హత్య చేసింది. రేణుకతోపాటు ఆమె సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
వయసుతో ముసిరే సమస్యలు..!
చాలా సమస్యలు స్త్రీ, పురుషులిద్దరిలోనూ కామన్గానే ఉన్నా... కొన్ని సమస్యలు మాత్రం మహిళల్లో చాలా ప్రత్యేకం. వాళ్లలో స్రవించే హార్మోన్లూ, సంక్లిష్టమైన సైకిళ్ల వల్ల వాళ్లకు కొన్ని సమస్యలిలా ప్రత్యేకంగా వస్తుంటాయి. ఈ నెల 8న ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలూ, పరిష్కారాలను సూచించే ఈ ప్రత్యేక కథనమిది...రుతుస్రావం మొదలుకాగానే ఓ బాలిక బాలుర నుంచి వేరుగా కనిపించడం మొదలువుతుంది.రుతుస్రావం నుంచే అమ్మాయిల్లో కొన్ని సమస్యలు కనిపించడం మొదలువుతుంది. చాలామంది అమ్మాయిలు ఇంకా ఈ విషయమై మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంటారు. ఇందులో బిడియపడాల్సిందేమీ లేదు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ను సంప్రదించి తగిన సూచనలతోపాటు అవసరమైతే తగిన వైద్య చికిత్స కూడా తీసుకోవాలి.తొలుత యువతల్లో కనిపించే రుతుసంబంధమైన సమస్యలను తెలుసుకుందాం.రుతుసంబంధిత సమస్యలను ఇంగ్లిష్లో మెన్స్ట్రువల్ డిజార్డర్స్గా చెబుతారు. వీటిల్లో కొన్ని ప్రధాన సమస్యలిలా ఉంటాయి. ప్రైమరీ అమెనోరియా : సాధారణంగా అమ్మాయిల్లో 12 నుంచి 16 ఏళ్ల మధ్య రుతుస్రావం మొదలువుతుంది. కానీ కొందరు యువతుల్లో 16 ఏళ్లు దాటినా రుతుక్రమం మొదలుకాదు. ఈ కండిషన్ను ‘ప్రైమరీ అమెనోరియా’ అంటారు. ఇందుకు చాలా కారణాలుంటాయి. వీళ్లు డాక్టర్ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించి, కారణాలు తెలుసుకోవాలి. ఆ కారణాన్ని బట్టి చికిత్స అందించాల్సి ఉంటుంది. డిస్మెనూరియా: రుతుసంబంధిత సమస్యల్లో ప్రధానమైనదీ, దాదాపు 80 శాతం మంది అమ్మాయిల్లో కనిపించేది రుతు సమయాల్లో నొప్పి. దీన్నే ‘డిస్మెనూరియా’ అంటారు. వీళ్లు ఒకసారి డాక్టర్ను సంప్రదించాక, వారి సలహాతో రుతుసమయంలో నొప్పి వచ్చినప్పుడల్లా వారు సూచించిన మోతాదులో నొప్పి నివారణ మందులు వాడుకోవచ్చు. అయితే వీటిని ఎక్కువగా వాడటం వల్ల మరికొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి డాక్టర్ సూచించిన మోతాదుకు మించకుండా వాడాలి. పరిష్కారం : రుతు సమయంలో వచ్చే ఈ నొప్పి ఒక వయసుకు వచ్చాక చాలామందిలో దానంతట అదే తగ్గిపోతుంది. ఇలాంటివారికి డాక్టర్లు కొన్ని న్యూట్రిషనల్ సప్లిమెంట్లు కూడా సూచిస్తారు. సంతానం కలిగిన తర్వాత చాలామందిలో ఈ నొప్పి రావడం ఆగిపోతుంది. కొందరిలో నొప్పి రావడం ఆగకపోవచ్చు. వాళ్లు డాక్టర్ను సంప్రదించి, తగిన మందులు వాడాలి. మెనొరేజియా: కొంతమంది యువతుల్లో రుతు సమయంలో రక్తస్రావం చాలా ఎక్కువగా అవుతుంటుంది. ప్రధానంగా చిన్న వయసు (తరుణ వయస్కులైన అడాలసెంట్) బాలికల్లో అలాగే పాతిక ముఫ్ఫై ఏళ్లు వరకు యువతుల్లోనూ ఈ సమస్య కాస్త ఎక్కువే. ఇలా ఎక్కువ మోతాదులో రక్తం పోతుండటం వల్ల రక్తహీనతతో పాటు మరెన్నో ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. పరీక్షలూ, పరిష్కారం: ఈ సమస్య ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు కొన్ని హార్మోనుల పరీక్షలు చేయించుకొని, అవసరాన్ని బట్టి మందులు వాడాల్సి ఉంటుంది. కొన్ని సార్లు ఈ రక్తస్రావం ఫైబ్రాయిడ్స్ వల్ల కావచ్చు. వైద్యపరీక్షల ఫలితాలను బట్టి చికిత్స ఉంటుంది. ప్రి మెనుస్ట్రువల్ సిండ్రోమ్ : కొంతమంది మహిళల్లో రుతుస్రావం మొదలు కావడానికి కొద్ది రోజులు ముందర నుంచే కొన్ని శారీరక సమస్యలు కనిపిస్తుంటాయి. ఉదాహరణకు... ఆ సమయంలో వాళ్లకు రొమ్ముల్లో సలపరం, బాధ /నొప్పి, భావోద్వేగాలు వెంటవెంటనే మారి΄ోవడం (మూడ్స్ స్వింగ్స్) వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమస్యను ప్రీ–మెనుస్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. పరిష్కారం : ఈ సమయంలో కలిగే బాధల నివారణ కోసం తగినన్ని నీళ్లు తాగుతుండాలి. అలాగే ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరలు, కాయగూరలతో కూడిన పౌష్టికాహారం ఎక్కువగా తీసుకోవాలి. ఒత్తిడికి లోనుకాకూడదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఎండార్ఫిన్ అనే హార్మోన్లు విడుదలై, మంచి ఉపశమనం కలగజేస్తాయి. ఈ సమస్య ఉన్నవారు పొగతాగడం, కెఫిన్ డ్రింక్స్ (కాఫీ, కూల్డ్రింక్స్లో కోలా డ్రింక్స్ వంటివి), ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఆహారంలో ఉప్పు బాగా తగ్గించాలి. ఉప్పు ఎక్కువగా ఉండే బేకరీ ఐటమ్స్కు దూరంగా ఉండాలి. కొవ్వులు, చక్కెరలు ఎక్కువగా ఉండే ఆహారాలను చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. అప్పటికీ ప్రయోజనం కనిపించక΄ోతే డాక్టర్ను సంప్రదించి, కొన్ని హార్మోన్ పరీక్షలు చేయించుకుని, ఆ వైద్య పరీక్షల ఫలితాలను బట్టి అవసరమైన చికిత్స తీసుకోవాలి. మూత్ర సంబంధ సమస్యలుమహిళల శరీర నిర్మాణం కారణంగా పురుషులతో ΄ోలిస్తే... మహిళల్లో మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్లు చాలా ఎక్కువ. మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్స్తో తరచూ వస్తుండేవారు నీళ్లూ, ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండటం, ప్రతి మూడు గంటలకోసారి మూత్రవిసర్జనకు వెళ్లి, మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ అయ్యేలా జాగ్రత్త తీసుకోవడం, భార్యాభర్త కలయిక తర్వాత మూత్ర విసర్జనకు వెళ్లడం (ఈ సమయంలో కాస్త వేగంగా మూత్రవిసర్జన చేయాలి), ప్రైవేటు పార్ట్స్ శుభ్రంగా కడుక్కోవడం, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఎప్పుడూ పొడిగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలతో ఈ సమస్యను నివారించవచ్చు. యూరినరీ ఇన్కాంటినెన్స్: కొందరు మహిళల్లో మూత్రంపై నియంత్రణ అంతగా ఉండదు. ఈ సమస్య ఉన్నవారు దగ్గినా, తుమ్మినా, ఏదైనా వస్తువును అకస్మాత్తుగా ఎత్తినా, కొందరిలో నవ్వినా వారి పొట్టపై కండరాలు మూత్రాశయంపై ఒత్తిడి కలిగించి... మూత్రం చుక్కలు, చుక్కలుగా పడేలా చేస్తాయి. సాధారణంగా ప్రసవం తర్వాత ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ప్రసవమైన తర్వాత మహిళల పొట్ట కండరాలు బలహీనం కావడంతో మూత్ర విసర్జన స్ఫింక్టర్పై వారు నియంత్రణ కోల్పోయేందుకు అవకాశమెక్కువ. దాంతో ఈ సమస్య కనిపిస్తుంది. పరిష్కారాలు: డాక్టర్ను సంప్రదించి, వారు సూచించిన విధంగా కొన్ని ప్రసవానంతర వ్యాయామాలూ, కెగెల్స్ ఎక్సర్సైజ్ల ద్వారా మూత్రవిసర్జనపై నియంత్రణ సాధించవచ్చు లేదా వారు సూచించిన విధంగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది కొందరిలో శస్త్రచికిత్స కూడా అవసరమవుతుంది. మహిళల్లో కనిపించే కొన్ని సాధారణ గైనిక్ సమస్యలు..పీసీఓఎస్ / పీసీఓడీ : అండాశయంలో అనేక నీటితిత్తులు పెరిగే ఈ సమస్యను వైద్యపరిభాషలో పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ లేదా డిజార్డర్ అంటారు. చాలావరకు అవి హానికరం కాకపోవచ్చు. అలాగే గర్భధారణకూ పెద్దగా అంతరాయం కలిగించకపోవచ్చు. పీసీఓఎస్ / పీసీఓడీకి కారణాలు : మహిళల అండాశయం నుంచి ప్రతి నెలా ఒక ఫాలికిల్ (అండం పెరిగే నీటి తిత్తి) కనిపిస్తుంది. దీని పరిమాణం 18 నుంచి 20 మిల్లీమీటర్లకు చేరాక ఇది పగిలి దాని నుంచి అండం విడుదల అవుతుంది. అయితే కొంతమందిలో ఫాలికిల్స్ 5–10 మిల్లీమీటర్లకు చేరగానే అంతకు మించి అది పెరగకుండా చిన్న చిన్న నీటి బుడగలాగా పెరుగుతాయి. అవి పది, పన్నెండు కంటే ఎక్కువగా ఉన్న కండిషన్ను పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు. ఇవి ఏర్పడానికి స్పష్టమైన కారణం తెలియదుగానీ... మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు, కొన్ని మానసిక, శారీరక సమస్యలతో పాటు హార్లోన్లలో అసమతౌల్యత, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వంటి సమస్యలు ఉన్నప్పుడు ఇవి వస్తుండటం పరిశోధకులు గమనించారు. ఈ సమస్య ఉన్న మహిళల్లో బరువు పెరగడం, అవాంఛిత రోమాలు, పీరియడ్స్ సక్రమంగా లేకపోవడంతో పాటు కొంతమందిలో సంతానలేమి, గర్భధారణ సమస్యలు కనిపించవచ్చు. పరీక్షలు/పరిష్కారాలు : కొన్ని రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలతో సమస్యను నిర్ధారణ చేస్తారు. ఈ సమస్య ఉన్న మహిళలందరికీ ఒకేలాంటి చికిత్స ఉండదు. వారిలో కనిపించే లక్షణాలు, రక్తపరీక్షలు తేలిన అంశాలను బట్టి చికిత్స మారుతుంది. బరువు తగ్గించుకోవడం, అవసరాన్ని బట్టి మెట్ఫార్మిన్ వంటి మందులు, హార్మోన్లు వాడాల్సి ఉంటుంది. సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే అవసరాన్ని బట్టి ల్యాపరోస్కోపిక్ శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. ఎండోమెట్రియాసిస్ : గర్భాశయం లోపలి పొరను ఎండోమెట్రియమ్ అంటారు. రుతుస్రావం తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ గర్భాశయం లోపలి గోడలపై ప్రభావం చూపడంతో అక్కడ ఎండోమెట్రియమ్ అనే పొర మొదటి 14 రోజులపాటు వృద్ధి చెంది, 15వ రోజున విడుదల అయ్యే ప్రోజెస్టెరాన్ అనే హార్మోన్ వల్ల ఆ పొర మరింత మందమవుతుంది. అక్కడ సన్నటి రక్తనాళాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అప్పుడు ఓవరీస్లో విడుదలైన అండం శుక్రకణంతో కలవకపోతే 14 రోజుల తర్వాత ప్రొజెస్టెరాన్ ఉత్పత్తి ఆగిపోతుంది. దాంతో ఎండోమెట్రియమ్లో అభివృద్ధి చెందిన రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఫలితంగా ఎండోమెట్రియమ్ పొర... గర్భాశయం గోడ నుంచి ఊడిపోయి సన్నటి ముక్కలుగా రక్తంలో కలిసి బ్లీడింగ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. మహిళల్లో ప్రతినెలా అయ్యే రుతుస్రావం ఇదే. అయితే కొందరిలో ఎండోమెట్రియమ్ కణాలు గర్భాశయంలోపలి వైపునకు కాకుండా, కొన్ని కారణాల వల్ల కడుపులోకి వివిధ అవయవాలపైన అంటే... అండాశయాలపైనా, ట్యూబ్స్పై, గర్భాశయం పై పొరపై, కత్తికడుపులోని గోడలపై, పేగులపై, మూత్రాశయంపై, ఇంకా చాలా అరుదుగా ఊపిరితిత్తుల్లో, మెదడులోకి పెరుగుతాయి. హార్మోన్ల ప్రభావం వల్ల అవి రుతుచక్రంలో ఎలాంటి మార్పులు చెందుతాయో... బయట పెరిగిన ఆ కణాల్లోనూ అలాంటి మార్పులే జరుగుతూ అవి పెరిగిన చోట కూడా వృద్ధి చెందుతుంటాయి. వాటినే ఎండోమెట్రియల్ ఇంప్లాంట్స్ అంటారు. రుతుస్రావం సమయంలో ఆ అవయవాల్లో కూడా కొద్దిగా బ్లీడింగ్ అవుతుంటుంది. ఈ సమస్యనే ఎండోమెట్రియాసిస్ అంటారు. వివిధ అవయవాలపై ఉన్న ఎండోమెట్రియమ్ ఇంప్లాంట్స్లో రక్తస్రావం జరిగాక... అది బయటకు వెళ్లడానికి దారి లేక రక్తం అక్కడిక్కడే ఇంకిపోతుంది. అయితే కొందరిలో రక్తం ఇంకకుండా అది గూడు కట్టడం జరగవచ్చు. కొందరిలో ఒక అవయవానికి, మరో అవయవానికి మధ్య ఈ రక్తపు కణాలు గూడుకట్టడం వల్ల కండ పెరగడమూ జరగవచ్చు. ఇలా జరగడం వల్ల పెరిగిన కండను అడ్హెషన్స్ లేదా ఫైబ్రోసిస్ బ్యాండ్స్ అంటారు. అలా పెరిగిన కణజాలం నుంచి విడుదల అయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ హార్మోన్స్తోపాటు ఇతర రసాయన పదార్థాల వల్ల ఒక్కొక్కరిలో ఒక్కోలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో నడుం, పొత్తికడుపులో నొప్పి, సంతానం కలగకపోవడం, పేగులు అతుక్కు΄ోవడం, మూత్రనాళాలు, పేగుల్లో అడ్డంకులు ఏర్పడటం వంటి సమస్యలు రావచ్చు. పరిష్కారం : ఈ సమస్యకు ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ వంటి హార్మోన్ మాత్రలతో చికిత్స అందిస్తారు. కొందరిలో శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం రావచ్చు.చర్మ సమస్యలు..మహిళల్లో బిగుతైన వస్త్రధారణ కారణంగా వారిలో చర్మానికి సంబంధించిన కొన్ని సమస్యలు కనిపించేందుకు అవకాశాలెక్కువ. అందులో ముఖ్యమైనవి... క్యాండిడియాసిస్ / ఫంగల్ ఇన్ఫెక్షన్స్: ఇది మహిళల్లో కనిపించే చాలా సాధారణ సమస్య. వాళ్లకు చెమట విపరీతంగా పట్టే ప్రదేశాల్లోనూ, అలాగే చర్మంలోని ముడతలుండే ప్రాంతాల్లో తగినంత గాలి, వెలుతురు సోకే అవకాశాలు తక్కువ. దాంతో అక్కడ ఉక్క΄ోతలతో చెమట తాలూకు చెమ్మ పెరగడంతో క్యాండిడియాసిస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశమెక్కువ. ఇక కొందరిలో వాళ్లు గర్భం దాల్చినప్పుడూ ఈ సమస్యలు కనిపించడం మామూలే. అలాగే డయాబెటిస్ ఉన్నవారిలోనూ, రోగనిరోధక శక్తి తగ్గిన వారిలో, యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడే వారిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తరచూ కనిపిస్తుంటాయి. పరీక్షలు / పరిష్కారాలు: సాధారణ ఫిజికల్ ఎగ్జామినేషన్తోనే ఈ సమస్యను తెలుసుకోవచ్చు. చర్మంపై వచ్చిన ఫంగస్ తాలూకు రకాన్ని బట్టి కొన్ని చర్మంపై పూసేందుకు కొన్ని పూతమందులూ (టాపికల్ మెడిసిన్స్), నోటి ద్వారా తీసుకోవాల్సిన యాంటీఫంగల్ మందులు వాడాల్సి ఉంటుంది. ఎండోక్రైన్ సమస్యలు : ఇది హార్మోన్ల స్రావాల్లో వచ్చే తేడాల వల్ల వచ్చే సమస్యలు. ఇందులో ప్రధానంగా రెండు రకాలు కనిపించేందుకు అవకాశాలెక్కువ. మొదటిది థైరాయిడ్ గ్రంథి చాలా తక్కువగా లేదా అస్సలు పనిచేయకపోవడం వల్ల వచ్చే సమస్య అయిన హైపోథైరాయిడిజమ్.ఈ సమస్య స్త్రీ, పురుషులిద్దరిలోనూ కనిపించినా సాధారణంగా మహిళల్లోనే కాస్త ఎక్కువ. రోగనిరోధక వ్యవస్థలో వచ్చే లోపాల వల్ల హై΄ోథైరాయిడిజమ్ రావచ్చు. తీవ్రమైన అలసట / మందకొడిగా ఉండటం, డిప్రెషన్, బరువు పెరగడం, చర్మం పొడిగా మారడం, మలబద్దకం, రుతుక్రమం సక్రమంగా రాకపోవడం వంటి లక్షణాలతో ఇది కనిపిస్తుంది. కొందరిలో ఈ కండిషన్ వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదులు పెరిగి అవి హృద్రోగాలకు దారితీయవచ్చు. ఒక్కోసారి మైక్సిడిమా కోమా అన్న కండిషన్కు దారితీసి ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉంది. గర్భిణుల విషయంలో థైరాక్సిన్ మోతాదులు తగ్గుతున్నాయేమో జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ పరీక్షలు చాలా అవసరం. గర్భిణుల్లో హై΄ోథైరాయిడిజం అన్నది బిడ్డ మానసిక వికాసానికి కొద్దిగా అంతరాయం కలిగించవచ్చు. అందుకే గర్భిణుల విషయంలో హైపోథైరాయిడిజమ్ లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. లెవో థైరాక్సిన్ సోడియమ్ వంటి మందుల ద్వారా దీనికి చికిత్స చేస్తారు. హైపర్ థైరాయిడిజమ్ : రక్తంలో థైరాయిడ్ హార్మోన్లు (టీ3, టీ4) పెరగడం వల్ల వచ్చే సమస్యను హైపర్ థైరాయిడిజమ్ లేదా థైరోటాక్సికోసిస్ అంటారు. దీని లక్షణాలన్నీ హైపోథైరాయిడిజమ్ లక్షణాలకు పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి. గుండెదడ చేతులు వణకడం బరువు తగ్గిపోవడం ∙నీరసం ∙విరేచనాలు ∙ రుతుక్రమానికి సంబంధించిన సమస్యలు థైరాయిడ్ గ్రంథి వాపు (గాయిటర్) వంటి లక్షణాలు కనిపిస్తాయి. హైపర్థైరాయిడిజమ్ను రక్త పరీక్ష ద్వారా గుర్తిస్తారు. ఈ పరీక్షలో రక్తంలో టీ3, టీ4 మోతాదు ఎక్కు కావడం, టీఎస్హెచ్ మోతాదు బాగా తగ్గి΄ోవడం కనిపిస్తుంది. దీనికి చికిత్సగా యాంటీ థైరాయిడ్ మందులు ఉపయోగిస్తారు. ఈ మందులను డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి. కొన్ని నెలల వ్యవధిలోనే ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. చాలామందిలో ఈ యాంటీథైరాయిడ్ మందులు ఆపిన తర్వాత మళ్లీ థైరాయిడ్ హార్మోన్ మోతాదులు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా యాంటీ థైరాయిడ్ మందుల ద్వారా హార్మోన్ని తగ్గించి, ఆ తర్వాత ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం రెండు పద్థతులు అనుసరిస్తారు. మొదటి దానిలో రేడియో ఆక్టివ్ అయోడిన్ మందును ఎక్కువ మోతాదులో ఇవ్వడం ద్వారా థైరాయిడ్ గ్రంథిలో హార్మోన్ తయారు చేసే కణాలను నాశనం చేయడం ద్వారా హార్మోన్ స్రావాన్ని తగ్గిస్తారు. ఇక రెండో పద్ధతిలో ఆపరేషన్ ద్వారా థైరాయిడ్ గ్రంథిని తొలగించడం ద్వారా హార్మోన్ స్రావాన్ని తగ్గిస్తారు. ఈ రెండు పద్ధతుల్లోనూ హార్మోన్ స్రావం బాగా తగ్గిపోయి, చివరకు హార్మోన్ లోపానికి దారితీస్తుంది. అప్పుడుహైపోథైరాయిడిజమ్లో మాదిరిగానే జీవితాంతం థైరాక్సిన్ మాత్రలు వాడాల్సి ఉంటుంది. మధ్య వయసులో వచ్చేవి..మధ్యవయసు నాటికి మహిళల్లో కనిపించే సమస్యల్లో ముఖ్యమైనవి ఇవి... మెనోపాజ్ సమస్యలు : రుతుక్రమం రావడంతో సమస్యలు మొదలవుతాయంటే... తమకు 45 ఏళ్లు వచ్చాక అదే రుతుక్రమం ఆగి΄ోవడం కూడా మహిళల్లో ఒక సమస్యాత్మక అంశంగానే ఉంటుంది. రుతుక్రమం ఆగే సమయంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గినందున వారికి ఒంట్లోంచి వెచ్చటి ఆవిర్లు రావడం, భావోద్వేగాల్లో వేగంగా మార్పులు (మూడ్స్ స్వింగ్స్), ఆస్టియో΄ోరోసిస్తో ఎముకలు బలహీనం కావడం, ఈస్ట్రోజెన్ వల్ల గుండెకు కలిగే సహజ రక్షణ తొలగిపోవడం వల్ల గుండెజబ్బులకు తేలిగ్గా గురికావడం, యోని పొడిగా మారడం, గర్భసంచి కిందికి జారడం వంటి అనేక సమస్యలు కనిపిస్తాయి. పరిష్కారం : రుతుక్రమం ఆగిన (మెనోపాజ్) మహిళల్లో సంబంధిత లక్షణాలేవైనా కనిపిస్తే తక్షణం డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. లక్షణాలను బట్టి డాక్టర్లు హెచ్ఆర్టీ వంటి చికిత్సలను సూచిస్తారు. క్యాల్షియమ్, విటమిన్ ’డి’ ఇవ్వడం వల్ల మెనోపాజ్ వచ్చిన మహిళల్లో ఎముకల ఆరోగ్యం పటిష్టంగా ఉండటమే కాకుండా ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను నివారించవచ్చు. అలాగే ఆహారంలో క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే పాల వంటివి తీసుకోవడంతోపాటు దేహానికి తగినంత వ్యాయామం కూడా అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్టియోపోరోసిస్... మహిళల్లో ఈ ఎముకలకు గుల్లబారి΄ోయే ఈ వ్యాధి చాలా ఎక్కువ. పైగా మన దేశ మహిళలు (ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి యువతుల వరకు) క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే పాలు క్రమం తప్పకుండా తాగడం చాలా తక్కువ. ఇటీవల చాలామంది సూర్యకాంతికి ఎక్స్పోజ్ కాకపోవడంతో ఎముకలకు బలం చేకూర్చే విటమిన్ డీ3 పాళ్లూ తగ్గుతాయి. పైగా మహిళలకు వ్యాయామ అలవాట్లూ తక్కువే. వీటిన్నింటి ఫలితంగా మహిళల్లో ఎముక సాంద్రతా, బలం క్రమంగా తగ్గుతూ పోతుంది. ఇక తమ వ్యాధినిరోధక శక్తి తమపైనే ప్రతికూల ప్రభావం చూపే ఎముక సంబంధితమైన రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ వంటి వ్యాధులు మహిళ్లోనే ఎక్కువ. అందుకే మహిళల్లో ఎముకల బలాన్ని పెంచడానికి పొట్టుతో ఉంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇచ్చే ధాన్యాలైన (గోధువు, జొన్న, మెుక్కజొన్న, రాగులు, ఓట్స్)తో చేసిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పొట్టుతీసిన కార్బోహైడ్రేట్స్ నివారించాలి. తాజా పండ్లు, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే రాగులు, తాజా ఆకుపచ్చ కూరలు (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్) తీసుకోవడం చాలా మంచిది. ఇటీవలి ఆధునిక మహిళలు ఇంటిపనులతోపాటు బయట ఉద్యోగాలూ చేస్తున్నారు. అందుకే వారిపై పనిఒత్తిడి తోపాటు మానసిక ఒత్తిడీ ఎక్కువే. ఫలితంగా ఆరోగ్య సమస్యలూ ఎక్కువే. అందుకే ఆమెకు కుటుంబం నుంచీ, అందునా మరీ ముఖ్యంగా భర్త నుంచి తగిన సహాయ సహకారాలు అవసరమని అందరూ తెలుసుకోవాలి.డాక్టర్ చల్మేడ నివేదిత, సీనియర్ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్ (చదవండి: అరుదైన శసస్త్ర చికిత్స: దంతంతో కంటి చూపు..!) -
నాకు నచ్చిన పాత్ర విమల
నచ్చటం అనేది నిరపేక్ష అంశం కాదు. ప్రత్యేకించి సాహిత్య పాత్రలు నచ్చటం– అవి చదివిన కాలం నాటి మన వయసు, ఆలోచనా స్థాయి, భావుకత్వ శక్తి వీటన్నిటిని బట్టి ఉంటుంది. అందువల్ల ఒకసారి నచ్చింది అలాగే ఉండిపోతుంది అనుకొనటానికి లేదు. ఒకొకసారి యూటర్న్ కూడా తీసుకోవచ్చు. లేదా గుణాత్మకంగా పరిణామామూ చెందవచ్చు. నా సాహిత్య సహవాసం ఆరోతరగతి నుండి వారపత్రికలలో సీరియల్గా వచ్చే స్త్రీల నవలలు చదవటంతో మొదలైంది (1966 –67). ఆ వరుసలో రంగనాయకమ్మ స్వీట్ హోమ్ (Sweet Home) నవలలోని విమల పాత్ర నాకు చాలా నచ్చింది. పన్నెండు పదమూడేళ్ల వయసులో విమల నాకెందుకు నచ్చింది? ఇళ్లల్లో కనబడే దాంపత్య సంబంధాల్లోని గంభీర ముద్రను, ఒద్దికను చెరిపేస్తూ భర్తతో అల్లరిగా, చిలిపిగా, చనువుగా ప్రవర్తించే ఆ పాత్ర విశిష్ట వ్యక్తిత్వం నన్ను ఆకర్షించిందా? అప్పటికి నేను చదివిన నవలల్లోని స్త్రీ పాత్రలకు భిన్నంగా తాను లోపల ఏమి అనుకొంటున్నదో దానిని ఎవరేమనుకొంటారో అని లోలోపల అణిచేసుకోకుండా బయటకు అనగల ధీరత్వం వలన విమల నాకు అపురూపంగా అనిపించిందా? ఆ క్రమంలో తాను స్త్రీ, భార్యే అయినా ప్రత్యేకవ్యక్తిని అన్న నిరంతర చైతన్యంతో జీవించటం వల్ల నాకు నచ్చిందా? ఏమో !? నాకవన్నీ ఆ రోజుకు ఇంత స్పష్టంగా తెలుసునని చెప్పలేను. కానీ ఆ నవల చదువుతూ సమ న్యాయానికి, సహజీవన సౌందర్యానికి సంబంధించిన అవ్యక్త అనురాగం ఏదో నా లోలోపల ఊపిరి పోసుకొంటుంటే విమల ప్రేమలో పడిపోయానన్నది వాస్తవం. ఆ తరువాత ఎన్నిసార్లు ఆ నవల (Novel) చదివానో లెక్కలేదు. విమల ఎందుకు నచ్చిందో ఆ కారణాలు రోజురోజుకీ మరింత విశదం అవుతూ వస్తున్నాయి. స్త్రీకి సహజ లక్షణాలుగా సమాజం నిర్దేశిస్తున్న విలువలను తిరస్కరించటం విమలను ప్రత్యేకంగా నిలబెడుతుంది. శాంతం, సహనం స్త్రీ«ధర్మాలు అనే బోధలు ఆమె సహించలేదు. పతివ్రతలుగా జీవించటం, మరణించటం స్త్రీకి ఆదర్శం చేసిన వ్యవస్థపై ఆమెకు కోపం. స్త్రీకి భర్త పట్ల అనురాగం స్వచ్ఛందంగా సహజ మానవీయ సంబంధాల నుండి కలగవలసినదే కానీ పై నుండి నిర్బంధం వల్ల కాదు అన్నది ఆమె నిశ్చితాభిప్రాయం. భర్త కోసం తాను ఇష్టంగా ఇంటి పని ఎంతైనా చేయవచ్చు కానీ, ఇంటి పని స్త్రీలదే అంటే మాత్రం విమల ఒప్పుకోదు. వంటిల్లు మగవాడిది కూడా అని చెప్పగలిగిన సమాన హక్కుల చైతన్యం ఆమెది. ఆమె సంస్కరణ కుటుంబానికి పరిమితమైనదే. కానీ కుటుంబంలో భార్యాభర్తల సంబంధాలలో ప్రజాస్వామీకీకరణను కలగనగలిగిన ఆధునిక మధ్యతరగతి యువతిగా విమల నాకు నచ్చిందనుకొంటాను. కుటుంబానికి అవతల నాకు అంతగా నచ్చిన మరొక స్త్రీ పాత్ర మధురవాణి. -
International Women's Day: సినీ మేడమ్స్
కథానాయికలు(Actress) కనిపిస్తేనే వెండితెరకు నిండుదనం. సినిమాల ఘనవిజయాల్లో వారి పాత్ర గణనీయం దర్శకత్వం, రచన, నిర్మాణ నిర్వహణ, సినిమాటోగ్రఫీ.. వంటి తెరవెనుక పాత్రల్లోనూ కొందరు మహిళలు రాణిస్తున్నారు. తెరపైనా, తెరవెనుకా రాణించే సినీ మేడమ్స్ ముచ్చట్లు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day) సందర్భంగా...దీపిక కొండిమన సమాజంలో పురుషాధిక్యత, లింగ వివక్ష, అసమానతలు వంటి రకరకాల అవరోధాలు మహిళల అభివృద్ధికి సవాలుగా నిలుస్తున్నాయి. ఈ సమస్యలు అన్ని రంగాల్లోనూ ఉన్నాయి. వెండితెరపై కథానాయికలుగా మహిళలు వెలుగొందే సినీరంగం కూడా ఈ సామాజిక రుగ్మతలకు అతీతం కాదు. ఎన్ని సమస్యలు ఉన్నా, ఏటికి ఎదురీదుతూ ఎప్పటికప్పుడు తమ సత్తా చాటుకుంటున్న మహిళలు కూడా సినీరంగంలో ఉన్నారు. వారే నేటితరాలకు స్ఫూర్తి ప్రదాతలు. తాజాగా ఆర్మాక్స్ మీడియా భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని మహిళా ప్రాతినిధ్యంపై ఓ వుమానియా! 2024 నివేదిక విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, సినిమాలను ప్రేమించి, సినిమాల కోసం పనిచేసే సినీ మేడమ్స్ గురించిన ప్రత్యేక కథనం..‘ఓ వుమానియా!’... భారతీయ చలన చిత్రపరిశ్రమలోని మహిళా ప్రాతినిధ్యంపై వెలువడిన నివేదిక. గత నాలుగేళ్లుగా ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ‘ఆర్మాక్స్ మీడియా’ ఏటా ఈ నివేదికను విడుదల చేస్తూ వస్తోంది. ఈ నివేదికను ఫిల్మ్ కంపానియన్ స్టూడియోస్ వీడియో రూపంలో నిర్మించగా, ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్’ విడుదల చేసింది. తాజాగా ‘ఓ ఉమానియా–2024’ నివేదిక ప్రస్తుత ధోరణులపై మరింత లోతైన వివరాలను అందించింది. సినిమా నిర్మాణం, సినీ నిర్మాణ సంస్థల్లోని కార్పొరేట్ నాయకత్వం, మార్కెటింగ్ వంటి కీలక రంగాలలో మహిళా ప్రాతినిధ్యంలోని అసమానతలను గుర్తించింది.2023లో మొత్తం తొమ్మిది (తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ, గుజరాతీ) భారతీయ భాషలలో విడుదల చేసిన 169 సినిమాలు, సిరీస్లను విశ్లేషించింది. వీటిని మళ్లీ థియేట్రికల్ సినిమాలు (70), డిజిటల్ స్ట్రీమింగ్ సినిమాలు (30), సిరీస్(69)లుగా విభజించింది.ఇందులో మన దక్షిణాది నుంచి లియో, జవాన్, ఆదిపురుష్, వాల్తేరు వీరయ్య, పొన్నియిన్ సెల్వన్ 2, భగవంత్ కేసరి, 2018, దసరా, విరూపాక్ష, సార్, హాయ్ నాన్న, భోళాశంకర్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, ఇంటింటి రామాయణం సహా పలు సినిమాలు ఎంపికయ్యాయి. బాలీవుడ్ నుంచి జైలర్, ఓ మై డాడ్ 2, మిషన్ మజ్ను, ది ఆర్చీస్, లస్ట్ స్టోరీస్ 2 వంటి పలు చిత్రాలున్నాయి. స్వీట్ కారం కాఫీ, మోడర్న్ లవ్ చెన్నై, షైతాన్, దూత, సేవ్ ది టైగర్స్, కుమారి శ్రీమతి సిరీస్లు సిరీస్ విభాగంలో సెలెక్ట్ అయి, మంచి మార్కులు సాధించాయి. ట్రైలర్ టాక్టైమ్‘ఓ వుమానియా’ నివేదిక ప్రకారం, మహిళలు ట్రైలర్లలో 29 శాతం టాక్టైమ్కు పరిమితమయ్యారు. గత రెండేళ్లలో ఇది నామమాత్రంగా పెరిగినప్పటికీ, ఓటీటీ స్ట్రీమింగ్ (OTT Streaming) సినిమాలు ప్రమోషనల్ ట్రైలర్లలో మహిళలకు ఎక్కువ టాక్టైమ్ కేటాయించే ధోరణిని చూపిస్తున్నాయి. వీటిల్లో కొన్ని 55 శాతం ట్రైలర్ టాక్టైమ్తో అగ్రస్థానంలో ఉన్నాయి.తెలుగు: బూ, హాయ్ నాన్న; హిందీ: మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2, వెడ్డింగ్.కాన్, సాస్ బహు ఔర్ ఫ్లెమింగో, జానే జాన్, రెయిన్బో రిష్ట, తాలీ; మరాఠీ: జిమ్మ; తమిళం: స్వీట్ కారమ్ కాఫీపాత బెచ్డెల్ పరీక్షసినిమాల్లో స్త్రీలను ఎలా ప్రదర్శిస్తున్నారో కొలిచే కొలమానం ‘బెచ్డెల్’ పరీక్ష. దీనిని 1985లో కార్టూనిస్ట్ అలిసన్ బెచ్డెల్ రూపొందించారు. అప్పటి నుంచి దశాబ్దాలుగా ఈ పరీక్షను చిత్రపరిశ్రమలో లింగవివక్షపై అంతర్జాతీయ కొలమానంగా పరిగణించారు. ఒక సినిమాలో కనీసం ప్రతి రెండు సన్నివేశాల్లో ఇద్దరు పేరున్న మహిళలు మాట్లాడుతుంటే, ఆ సినిమా బెచ్డెల్ టెస్ట్లో నెగ్గినట్లు పరిగణిస్తారు. అయితే, సినిమాల కంటే సిరీస్లకు ఎక్కువ రన్టైమ్ ఉంటుంది. కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకొని, ఆ ప్రమాణాన్ని ప్రస్తుతం సిరీస్లకు రెండు నుంచి మూడు సన్నివేశాలుగా మార్చారు.నవరత్నాలుచలనచిత్ర పరిశ్రమలోని మొత్తం తొమ్మిది విభాగాల్లో పనిచేసే మహిళల స్థితిగతులను ఈ నివేదిక విశ్లేషించింది. దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, రైటింగ్, ప్రొడక్షన్, డిజైనింగ్, సంగీతం వంటి కీలక విభాగాలలో 15 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. దీన్ని ఓటీటీ, థియేట్రికల్గా విభజిస్తే థియేట్రికల్కు 6 శాతం మాత్రమే! దక్షిణాదిలో ఈ సంఖ్య చాలా తక్కువ. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య ఒక శాతం తగ్గింది. ఓటీటీలో మాత్రం పరిస్థితి మెరుగ్గా ఉంది. స్ట్రీమింగ్ సినిమాలు, సిరీస్ రెండింటిలోనూ 20 శాతం కంటే ఎక్కువ స్థానాల్లో మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. 18 శాతం కంటే ఎక్కువగా మహిళా నాయకత్వం ఉన్న విభాగాలలో ఎడిటింగ్ ముందంజలో ఉంది. డైరెక్టర్ స్థానాల్లో 8 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు, గత సంవత్సరంతో పోలిస్తే ఇది కొంచెం తగ్గింది.టూల్కిట్ టెస్ట్నాలుగు భిన్నమైన ప్రశ్నలతో తయారుచేసిన ఒక టూల్కిట్ను కూడా ఈ నివేదిక విడుదల చేసింది. ఈ టూల్కిట్ ఆధారంగా విశ్లేషించిన స్ట్రీమింగ్ సినిమాల్లో కేవలం 31శాతం మాత్రమే లింగ సమానత్వ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాయి. వీటిలో సిరీస్లు ముందంజలో ఉన్నాయి, వాటిలో 45 శాతం పరీక్షలో ఉత్తీర్ణత సాధించాయి. సినిమాలు, సిరీస్లు తదితరమైన వాటి నిర్మాణంలో వివిధ విభాగాలకు మహిళలు నాయకత్వం వహించినప్పుడు వాటిలో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం లభించిందని, అవి బాగా విజయవంతమయ్యాయని ఈ నివేదిక వెల్లడించింది. థియేట్రికల్ సినిమాల్లో 18 శాతం మాత్రమే మహిళల నాయకత్వంలో రూపొందాయి.మహిళల ప్రాతినిధ్యంపై ప్రశ్నావళిపురుషులు లేని సంభాషణ, డైలాగ్ కనీసం ఒకటైనా ఉందా? కథానాయకుడితో ప్రేమ లేదా కుటుంబ సంబంధం లేని పాత్రను పోషించిన ఒక మహిళా పాత్ర ఉందా?2. షో/సినిమా కథకు కీలకమైన ఆర్థిక, గృహసంబంధ, సామాజిక నిర్ణయాలను తీసుకోవడంలో, కనీసం ఒక్కరైనా చురుకైన మహిళ పాత్రను పోషిస్తున్నారా? కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు, సిరీస్లలో పురుష పాత్రలపై వ్యతిరేక దృక్పథాన్ని వ్యక్తపరచే అంశం ఉందా?షో/సినిమా స్త్రీలను లైంగికంగా చిత్రీకరించడం లేదా మహిళలపై హింసను సాధారణంగా లేదా ఆమోదయోగ్యంగా చిత్రీకరిస్తుందా?మొదటి మూడు ప్రశ్నలకు సానుకూల సమాధానం ‘అవును’, అయితే నాల్గవ ప్రశ్నకు అది ‘లేదు’ అని సమాధానాలు వచ్చినట్లయితేనే, తమ సినిమాలో లేదా సిరీస్లో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం దక్కుతున్నట్లు నిర్మాతలు ఎవరికి వారే తేల్చుకోవచ్చు. అందుకు ఈ ప్రశ్నావళి ఉపయోగపడుతుంది.మహిళా జట్టు సినిమాల హిట్టుపూర్తి మహిళా బృందంతో చిత్రీకరించిన తొలిచిత్రం ‘ది మైడెన్’. 2018లో అలెక్స్ హూమ్స్ రచించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాను విక్టోరియా గ్రెగరీ ‘న్యూ బ్లాక్ ఫిల్మ్స్’ నిర్మించింది. ఇందులో ఒక అమ్మాయి సెకండ్ హ్యాండ్ నౌకను కొని, నౌకాయానం నేర్చుకొని, రేసులో ఎలా గెలుస్తుందో చూపించారు. ఇదేవిధంగా మహిళలు ప్రధానంగా, ఎక్కువ సంఖ్యలో ఉండి ఎన్నో సినిమాలు తీశారు. వాటిల్లో ముఖ్యమైనవి, చెప్పుకోదగినవి ‘ది వుమెన్’. 1939లో విడుదలైన ఈ సినిమాలో ఒక్క పురుషుడు కూడా కనిపించడు. మొత్తం 130 మంది మహిళలు ఇందులో నటించారు.అలాగే ‘స్టీల్ మాగ్నోలియాస్’ సినిమాలో లూసియానా పట్టణంలోని ఒక స్త్రీల బృందం జీవితం, ప్రేమను చూపిస్తుంది. ‘ఎ లీగ్ ఆఫ్ దేర్ ఓన్’ ఇదొక బేస్బాల్ బృందం కథ. తక్కువ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఎంతోమంది చేత కంటతడి పెట్టిస్తుంది. 1993లో విడుదలైన ‘ది జాయ్ లక్ క్లబ్’ సినిమా చైనీస్ మహిళల వలసలు, తల్లుల మధ్య సంబంధాలను అద్భుతంగా చిత్రీకరించింది. 2018లో విడుదలైన ‘ఓసెన్స్ 8’ చిత్రం, మహిళలు దోపిడీలు చేస్తే ఎలా ఉంటుందో కాస్త నవ్విస్తూనే అందరినీ ఆశ్చర్యపరచేలా చూపించింది.తెలుగు తెర మెరుపులు..మహానటి సావిత్రిమహానటి సావిత్రి గొప్ప నటిగానే కాకుండా, దర్శకురాలిగానూ పేరు సంపాదించుకున్నారు. హీరోయిన్గా కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే ఆమె దర్శకత్వంలో ప్రయోగం చేశారు. సావిత్రి దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘చిన్నారి పాపలు’. 1968లో ‘శ్రీమాతా పిక్చర్స్’ నిర్మాణ సంస్థ విడుదల చేసిన ఈ చిత్రానికి సావిత్రి స్వయంగా కథారచన చేశారు. వాణిజ్యపరంగా ఇది విఫలమైనప్పటికీ, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘మాతృదేవత’, ‘వింత సంసారం’ వంటి సినిమాలకు కూడా ఆమె దర్శకత్వం వహించారు. బహుముఖ ప్రజ్ఞశాలి భానుమతి తెరపై కథానాయికగానే కాదు, తెర వెనుక అనేక విభాగాల్లోనూ పనిచేసిన నటి భానుమతి రామకృష్ణ. ‘చండీరాణి’ సినిమాతో డైరెక్టర్గా మారిన ఆమె, ‘నాలో నేను’ అనే పుస్తకంతో పాటు, మరెన్నో పాటలకు రచన, గాత్రం అందించారు. భర్త రామకృష్ణతో కలసి చిత్ర నిర్మాణంలోనూ పాలు పంచుకున్నారు. కళారంగంలో ఆమె చేసిన కృషికి జాతీయ చలనచిత్ర అవార్డుతోపాటు, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. రికార్డు నెలకొల్పిన విజయనిర్మల సినీ ప్రపంచంలోకి ఒంటరిగా అడుగుపెట్టి, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహిళ విజయనిర్మల. కేవలం నటిగానే కాదు, నిర్మాతగా, దర్శకురాలిగా వెండితెరపై తన పేరుకు తగ్గట్లుగానే ఎన్నో విజయాలు సాధించారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్లో స్థానం సంపాదించుకున్నారు. సినీ సీతమ్మ అంజలీదేవిసీతాదేవి అనగానే ఠక్కుమని గుర్తొచ్చే నటి అంజలీదేవి. అభినయ సీతమ్మగా పాపులర్ అయిన ఆమె నటిగా, డ్యాన్సర్గానే కాదు, నిర్మాతగానూ చేశారు. తన భర్త ఆదినారాయణరావుతో కలసి నెలకొల్పిన ‘అంజలీ పిక్చర్స్’ నిర్మాణ సంస్థ ద్వారా ‘భక్త తుకారం’, ‘చండీప్రియ’ సహా మొత్తం 27 సినిమాలను నిర్మించారు. కృష్ణవేణి ఎన్టీఆర్లాంటి మహానటుడిని చిత్రసీమకు పరిచయం చేసిన, ప్రముఖ నిర్మాత చిత్తజల్లు కృష్ణవేణి బాలనటిగా రంగప్రవేశం చేశారు. ఇటీవల మరణించిన ఆమె, మీర్జాపురం రాజావారితో వివాహం అనంతరం ‘జయా పిక్చర్స్’ బాధ్యతలనూ తీసుకున్నారు. తర్వాత ‘శోభనాచల స్టూడియోస్’గా పేరు మార్చి ఎన్నో చిత్రాలను నిర్మించారు. ఆమె కుమార్తె అనురాధ కూడా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 17 సినిమాలు నిర్మించి, అత్యధిక చిత్రాలను నిర్మించిన మహిళా నిర్మాతగా లిమ్కా బుక్ రికార్డ్స్ సాధించారు. కృష్ణవేణి తన 98 ఏళ్ల వయసులో 2022లో ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డుల్లో భాగంగా ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకున్నారు. మరెందరో!నటి జీవితా రాజశేఖర్ ‘శేషు’ సినిమాతో దర్శకురాలిగా మారి, ‘సత్యమేవజయతే’, ‘మహంకాళి’ వంటి సినిమాలను రూపొందించారు. సూపర్స్టార్ కృష్ణ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంజుల ఘట్టమనేని ‘మనసుకు నచ్చింది’ సినిమాకు దర్శకత్వం వహించారు. మరెన్నో సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. తొలి చిత్రం ‘ఆంధ్రా అందగాడు’ సినిమాతో విమర్శలు అందుకున్న సుధ కొంగర, తాజాగా ఆకాశమే హద్దు అనిపించారు.‘ద్రోహి’, ‘గురు’ చిత్రాలతో పాటు, ‘ఆకాశమే నీ హద్దు రా’ సినిమాతో వరుస విజయాలు అందుకున్నారు. ‘అలా మొదలైంది’ చిత్రంతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చిన నందినిరెడ్డి, ‘కళ్యాణ వైభోగమే’, ‘ఓ బేబీ’ మరెన్నో విజయవంతమైన చిత్రాలను చిత్రీకరించారు. దశాబ్దంపాటు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచే సి, తొలిచిత్రం ‘పెళ్లి సందడి’తో విజయం సాధించారు డైరెక్టర్ గౌరీ రోణంకి. నిర్మాణ రారాణులుసినీ ప్రపంచంలో నిర్మాతలుగా రాణిస్తున్న రాణులు కూడా లేకపోలేదు. దిల్రాజు కుమార్తె హన్షితా రెడ్డి, తండ్రి బాటలోనే సుమారు 50కి పైగా సినిమాలు నిర్మించారు. మెగా కుటుంబం నుంచి వచ్చిన నిహారిక కొణిదెల కూడా ఇటు ప్రొడక్షన్ రంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు. పలు వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్స్ నిర్మించారు. చిన్న సినిమాలే కాదు, భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించారు, నిర్మాత అశ్వనీ దత్ కూతుర్లు అయిన స్వప్న దత్, ప్రియాంక దత్. అన్నపూర్ణ స్టూడియోస్ సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుప్రియ యార్లగడ్డ కూడా ఎన్నో చిత్రాలను నిర్మించింది. వీరితో పాటు నటి సమంత ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ , నయనతార ‘రౌడీ పిక్చర్స్’, జ్యోతికలు వివిధ ప్రొడక్షన్ హౌస్లు స్థాపించి, తమదైన రీతిలో రాణిస్తున్నారు. చిత్రపరిశ్రమలో వైవిధ్యం, స్త్రీ పురుష సమానత్వం ఉన్నట్లయితే, సమాజంలో సానుకూల మార్పులకు అవి దోహదపడతాయి. వినోదరంగంలో మహిళలకు మరిన్ని అవకాశాలను సృష్టిస్తూ, వైవిధ్యభరితమైన, సమ్మిళితమైన, సమానమైన పరిస్థితులను కల్పించాలి. ప్రతి ఒక్కరూ స్త్రీలను చూసేలా, వినగలిగేలా, సానుకూలంగా చెప్పుకునేలా చేయాలి. అప్పుడే సినిమా బతుకుతూ, మరెందరినో బతికిస్తుంది. -
Kanyasulkam నాకు నచ్చిన పాత్ర మధురవాణి-ఓల్గా
ఎవరు సృష్టించిన పాత్ర వారికి నచ్చడం గురించి కాదు... కఠినమైన నిష్కర్షయిన విమర్శకుడిగా మారి చూసిన రచయితకు ముచ్చట గొలిపిన పాత్ర మధురవాణి. కన్యాశుల్కం కథానాయిక, నాయకుడు కూడా మధురవాణే. వేశ్యాకులంలో పుట్టింది. సంగీత, సాహిత్యాలలో సుశిక్షితురాలు. మంచివారి ఎడల మంచిగానూ చెడ్డవారి ఎడల చెడ్డగానూ ప్రవర్తించమన్న తల్లి మాటల విలువ తెలుసుకున్నది. అయితే చాలాసార్లు ముఖ్యంగా తోటి స్త్రీలకు సహాయపడే సందర్భాలలో ఆమె తన పట్ల చెడ్డగా ఉన్నవారి పట్ల కూడా మంచిగనే ఉంది. మానవ సంబంధాలలో ఎంత సున్నితంగా, ఆత్మగౌరవంతో ఉండవచ్చో మధురవాణి నుంచి మనం నేర్చుకోవచ్చు. మనస్తత్వం, చతురత, హాస్య ప్రియత్వం, కార్యసాధనా సామర్థ్యం, కత్తుల వంటి విమర్శలను పువ్వుల వలే విసరగల దక్షత, ఎదుటివారు తనను అవమానిస్తున్నారని తోస్తే గొంతు నులమకుండానే వారికి ఊపిరాడనీయకుండా చేయగల నేర్పు, తనను తాను కాచుకోగల ఒడుపు. ఇంత అందంగా గొప్పగా మధురవాణిని ఎలా రూపుదిద్దగలిగాడో గురజాడ!స్నేహం, ప్రేమలకు మాటలాడటం నేర్పి మన తెలుగు వారికి మంచిచెడ్డలు తెలియచెప్పేందుకు సృష్టించిన పాత్ర మధురవాణి. భారతీయ సాహిత్యంలో కూడా మధురవాణికి సాటి వచ్చే పాత్రలు ఒకటి రెండు కంటే ఉండవు. కన్యాశుల్కం ఆచారానికి బానిసవబోతున్న సుబ్బిని బలైపోతున్న బుచ్చమ్మను మధురవాణి రక్షించడమే కన్యాశుల్కం నాటక సారాంశం. అణిచివేతకు గురైన స్త్రీలు ఒకరికొకరు తోడైతే విముక్తి చెందగలరనే ఆశను కల్పించింది మధురవాణి. తనకు పేర్లు కూడా తెలియని ఎన్నడూ చూడని సుబ్బికి, వెంకమ్మకి, బుచ్చమ్మకి, మీనాక్షికి సహాయం చేయాలనే ఆలోచన ఆమెలోని మానవత్వానికి నిదర్శనం. అనివార్యంగా తనలో కలిగిన ఆలోచనలకు ఆచరణాత్మక రూపమే మధురవాణి. నీతి కలిగిన మనిషి. దయగలిగిన మనిషి. ఆమె దయకు పాత్రం కాని మనిషి కన్యాశుల్కంలో ఎవరున్నారు?మధురవాణి కాకుండా మరోపాత్ర పేరు చెప్పమంటే క్షణం ఆలోచించకుండా నేను చెప్పే మరో స్త్రీ పాత్ర ‘శాంతం’. ఉప్పల లక్ష్మణరావు గారి ‘అతడు ఆమె’ నవలలో కథానాయిక. ఇక కొడవటిగంటి కుటుంబరావు ‘కస్తూరి’, ‘స్వరాజ్యం’ చలం నవలా నాయికలు ... ఇలా ఎన్ని పేర్లయినా ఉంటాయి. కాని మధురవాణి మధురవాణే. -
ఆ ‘సగమే’ అసలు బలం
శరీరంలో ఐరన్ లేమి స్త్రీలను బాధిస్తూ ఉంటుంది. గర్భధారణ, ప్రసవ సమయాలలో ఎంతో కీలకమైన ఐరన్ కోసం స్త్రీలు ఆహారం, మందుల మీద ఆధారపడుతుంటారు. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ అంచనా ప్రకారం నేడు ప్రపంచ వ్యాప్తంగా 15 నుంచి 49 ఏళ్ల మధ్య ఉన్న స్త్రీలు 50 కోట్ల మంది ఐరన్ డెఫిషియెన్సీతో బాధ పడుతున్నారు.కాని వీరు తమ స్వభావంలో ఉక్కుగుణాన్ని మాత్రం ఎన్నడూ వదులుకోరు. వీరు మాత్రమే కాదు ప్రతి స్త్రీ తన జీవనంలో, పరిస్థితులను ఎదుర్కొనడంలో ఉక్కు మహిళే. ఆ మహిళ తెలుగు నాట మారుమూల పల్లెలో ఉండొచ్చు. ప్రపంచంలో వేరే మూలన మరో గూడెంలో ఉండొచ్చు. మహిళా దినోత్సవం ‘స్థానికం’గా నిర్వహించే తంతు కాదు.ఇది అంతర్జాతీయ వేడుక. ప్రపంచ మహిళలను ఏకం కావాలని కోరే సందేశ సందర్భం. 1910లో కోపెన్హెగెన్లో 17 దేశాల నుంచి వచ్చిన 99 మంది మహిళలు ‘శ్రామిక మహిళల హక్కుల దినోత్సవం’ కోసం పిలుపు ఇచ్చినప్పుడు అది అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావాలనే కోరుకున్నారు. కారణం భూమ్మీద ఏ మూలన ఉన్న స్త్రీ అయినా స్థూలంగా ఎదుర్కొనే సమస్యలు ఒకటేనని భావించడం. అందరూ కలిసి సమస్యల పై పోరాడాలని కోరుకోవడం.ఇన్నేళ్లు గడిచినా రూపంలో, సారంలో స్త్రీలు అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. యుద్ధాలు వస్తే వారు తమ ఇంటిని, భర్తను, సంతానాన్ని కోల్పోతున్నారు. ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో చేసే తవ్వకాలు, కట్టే పెను కట్టడాలు, ప్రకటించే సుందరీకరణాలు మొదటగా స్త్రీలు శ్రమపడి అల్లిన గూళ్లనే ధ్వంసం చేస్తున్నాయి. చట్టపరమైన అనుమతి కలిగిన వ్యసనాలు... మద్యపానం, ధూమపానం పురుషుల ఆరోగ్యాన్ని దెబ్బ తీసి స్త్రీల మీద పెను ఒత్తిడి పెడుతున్నాయి. తాజాగా ఆన్లైన్ ట్రేడింగ్ అడిక్షన్ లక్షల కొద్ది అప్పును కుటుంబం మీద కుమ్మరించేలా చేస్తోంది. కడుపున పుట్టిన సంతానం పాలిట డ్రగ్స్, గంజాయి పెను పడగలు విప్పి ఉన్నాయి. స్త్రీ తన చేతులతో ఒండి పెట్టాల్సిన ఆహారం కలుషితాలను కలిగి బతుక్కు ఏమాత్రం గ్యారంటీ ఇవ్వలేకపోతోంది. నిత్యావసర ఖర్చులను స్త్రీయే అజమాయిషీ చేసి ఎంత పొదుపు చేయాలనుకున్నా అనారోగ్య ఖర్చు, చదువు ఖర్చు స్త్రీల ప్రధాన కార్యక్షేత్రమైన ‘ఇంటిని’ పూర్తిగా సంక్షోభంలో పడేస్తున్నాయి.దేశం సరిహద్దులోని సైన్యం, కేంద్ర, రాష్ట్రాలలో ప్రభుత్వ యంత్రాంగం వల్ల మాత్రమే నడుస్తోంది అనుకుంటే పొరపాటు. వీటన్నింటి మధ్య ఉక్కుగుణాన్ని వదుల్చుకోని స్త్రీలే దేశాన్ని నడుపుతున్నారు. అయినప్పటికీ వీరి స్థయిర్యాన్ని దెబ్బ తీయడానికి తగిన పీడనలను ఈ సమాజం వదులుతూనే ఉంది. లైంగిక వేధింపులు, సామూహిక అత్యాచారాలు, యాసిడ్ దాడులు, ప్రేమకు ‘నో’ చెప్తే హత్యలు, ఉద్యోగ ఉపాధి రంగాల్లో జీతభత్యాల వివక్ష, చట్ట సభల్లో ఇంకా దొరకని వాటా, గృహ హింస, వరకట్నం, తీరికే ఇవ్వని ఇంటి చాకిరి, పిల్లల పెంపకం, ఆడపిల్ల జననానికి అననుకూలత... ఇవన్నీ ప్రపంచవ్యాప్త స్త్రీలతో పాటు భారతీయ మహిళలకు మూగదెబ్బలుగా మారుతున్నాయి.నిజానికి ఇప్పుడు వారి బాధ్యత ఇంకా పెరిగింది. స్త్రీలు ముందుకు వస్తే తప్ప సరికాని సమస్యలు పెరుగుతున్నాయి. పురుషులు తెస్తున్న దేశాల మధ్య యుద్ధం, పర్యావరణ విధ్వంసం, ΄పౌర హక్కుల విఘాతం, న్యాయ వివక్ష, మత విద్వేషం, తప్పుడు వాట్సప్ సమాచారాల పంపిణి, బలహీనులపై బెదిరింపు... ఇవన్నీ మొదట ఎవరో మనకు తెలియని స్త్రీ ఇంటికే హాని కలిగించవచ్చుగాని కాలక్రమంలో అవి ప్రతి ఇంటికీ చేరుతాయి.స్త్రీలు తాము నివసించే ఇంటి లోపలి, బయటి ఆవరణాలను ప్రజాస్వామ్య స్వభావంతో ఉంచడానికి... సుహృద్భావన పెంచడానికి... పిల్లలకు అందరూ కలిసి ఆడే ఆటస్థలాలు ఇవ్వడానికి... సంపద కాస్తయినా దిగువ వర్గాలకు అందేలా చూడటానికి... విద్య, వైద్యంలో అతి డబ్బు ప్రమేయాన్ని నిరోధించడానికి.... ఆచార వ్యవహారాలు గుదిబండలుగా మారకుండా, రాజ్యాంగస్ఫూర్తిని రక్షించుకోవడానికి మరింత ఆలోచన, చైతన్యం కలిగించుకోవాలి. మరింత ఉక్కుగుణం సముపార్జించుకోవాలి.ప్రతి స్త్రీకి తను, తన కుటుంబం, తన సమాజం, తన దేశం, తన ప్రపంచం... ఇవన్నీ ముఖ్యం. దుర్మార్గం అనేది కేవలం ఇతరుల పాలిట జరిగితే ఊరుకోగలిగేది కాదు. దుర్మార్గం అందరూ ఖండించదగ్గది. పురుష సమాజం తన దుర్మార్గాలకు అడ్డెవరు నిలుస్తారులే అనుకుంటే జవాబు స్త్రీల నుంచే వస్తుంది. స్త్రీలకు ఇంటిని చక్కదిద్దుకోవడమే కాదు... పరిస్థితులను చక్కదిద్దడం కూడా తెలుసు. ఉక్కు మహిళలకు స్వాగతం.అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నేటి నుంచి సాక్షి ఫ్యామిలీలో వారం రోజుల పాటు విశిష్ట కథనాలను అందించనున్నాం. -
మా అమ్మ మాకు ఇన్స్పిరేషన్
-
International Women's Day 2025 : మీకు స్ఫూర్తినిచ్చిన వనితను గుర్తు చేసుకోండి!
ప్రతీ ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాం. మహిళల హక్కులను గుర్తించడం, వారి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విజయాలను,గౌరవించడమే దీని లక్ష్యం. ఈ సందర్భంగా లింగ సమానత్వం, పునరుత్పత్తి హక్కులు, మహిళలపై హింసపై పోరాటం, సమాన హక్కులు అంశాలపై విస్తృతంగా చర్చించుకోవడం అవసరం. తల్లిగా, సోదరిగా, భార్యగా, కుమార్తెగా మహిళ పాత్ర మన జీవితాల్లో చాలా కీలకమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మీ జీవితంలో ప్రభావం చూపిన, లేదా మీరు మెచ్చిన నచ్చిన మహిళ గురించి ఒక నిమిషం వీడియో చేయండి. ఆమెతో మీ అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకోండి. దీనికి #VanithaVandanam యాడ్ చేయడం మర్చిపోద్దు!