parties
-
పార్టీలు మారి.. పరాజితులయ్యారు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు కండువాలు మార్చుకుని బరిలోకి దిగిన వారిని ప్రజలు తిరస్కరించారు. పార్టీ మారి పోటీ చేసిన మొత్తం 25 మంది నాయకుల్లో కేవలం 8 మందిని మాత్రమే ఓటర్లు గెలిపించారు. మిగతా 15 మందికి పరాజయం తప్పలేదు. ఈ ఎన్నికల్లో దాదాపు ప్రతి పార్టీ బయటి పార్టీల నుంచి వచ్చిన వారిని రంగంలోకి దించాయి.ఇతర పార్టీల తిరుగుబాటుదార్లకు ఆమ్ ఆద్మీ పార్టీ అత్యధికంగా 11 మందికి, బీజేపీ ఏడుగురికి, కాంగ్రెస్ ఐదుగురికి టిక్కెట్లిచ్చాయి. అయితే, ఆప్ తరఫున పోటీ చేసిన 11 మందిలో నలుగురు మాత్రమే గెలవగా.. ఏడుగురు ఓడిపోయారు. బీజేపీ నుంచి పోటీ చేసిన ఏడుగురిలో నలుగురు విజయం సాధించగా, ముగ్గురు ఓటమి చెందారు. అదే సమయంలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరి పోటీకి దిగిన ఐదుగురిలో ఒక్కరు కూడా గెలవలేకపోయారు.మిల్కిపూర్లో బీజేపీ ఘన విజయంయూపీలోని అయోధ్య జిల్లాలో మిల్కి పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్ని కలో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో, ఈ జిల్లాలోని అన్ని స్థానాలూ బీజేపీ వశమైన ట్లయింది. సమాజ్వాదీ పార్టీకి చెందిన మిల్కిపూర్ (ఎస్సీ) ఎమ్మెల్యే అవధేశ్ ప్రసాద్ 2024 లోక్సభ ఎన్నికల్లో ఫైజాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ సీటును తిరిగి నిలబెట్టుకోవాలని అవధేశ్ ప్రసాద్ కుమారుడు అజిత్ ప్రసాద్ను బరిలోకి దించింది.అయితే, బీజేపీ అభ్యర్థి చంద్రభాను పాశ్వాన్ 61,710 ఓట్ల మెజారిటీతో అజిత్పై ఘన విజయం సాధించారు. అదేవిధంగా, తమిళనాడులోని ఈరోడ్(ఈస్ట్)స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార డీఎంకే విజయం సాధించింది. డీఎంకే అభ్యర్థి చందిర కుమార్, సమీప ప్రత్యర్థి నామ్ తమిళర్ కట్చి(ఎన్టీకే)కు చెందిన ఎంకే సీతాలక్ష్మిపై 91 వేల పైచిలుకు ఓట్లతో తిరుగులేని గెలుపు సాధించారు. ఈరోడ్(ఈస్ట్) నుంచి ఎన్నికైన కాంగ్రెస్కు చెందిన ఈవీకేఎస్ ఇళంగోవన్ మృతితో ఈ ఉప ఎన్నిక జరిగింది. -
కూటమి పార్టీల్లో ‘బెనిఫిట్ షో’ వివాదం
సాక్షి,విశాఖపట్నం : కూటమి నేతల మధ్య బెనిఫిట్ షో వివాదం తలెత్తింది. బడా సినిమాల బెనిఫిట్ షోలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సమర్థించారు. మరోపక్క ఎంఎల్ఏలు విష్ణు కుమార్ రాజు, బండారు సత్యనారాయణమూర్తి బెనిఫిట్ షోను వ్యతిరేకించారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్రాజు మాట్లాడుతూ‘బెనిఫిట్ షోలు రద్దు చెయ్యాలనేది నా అభిప్రాయం. బెనిఫిట్ షోల వల్ల ఎవరికి లాభం. ఒకవేళ షోలకు అనుమతిచ్చినప్పటికీ నియంత్రణ ఉండాలి.అల్లు అర్జున్పై పురందేశ్వరి, కిషన్రెడ్డి వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు’అని స్పష్టం చేశారు. మరోపక్క టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ‘బెనిఫిట్ షోలు ఎవరికోసం అనుమతినిస్తున్నారు.ఒక్కో హీరో వంద నుంచి 300 కోట్ల వరకు తీసుకుంటున్నారు. గతంలో బెనిఫిట్స్ అంటే చారిటీ కోసం వేసేవారు.ఇప్పుడు సినిమా నిర్మాతల కోసం బెనిఫిట్ షోలు వేస్తున్నారు.సినిమాలకు వేల కోట్ల ఆదాయం వస్తుంటే జీఎస్టీ,ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఏం చేస్తున్నారు.ఎవడబ్బ సొమ్మని బెనిఫిట్ షోలు వేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు’అని ప్రశ్నించారు. ఇదీ చదవండి: నేనే సీఎం.. డిప్యూటీ సీఎం -
ఎప్పుడూ పేరు వినని పార్టీలు సహా మహారాష్ట్ర ఎన్నికల బరిలో 4,136 మంది
దాదర్: హోరాహోరీగా సాగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. చెదురుమదురు సంఘటనలు మినహా ప్రచారం ప్రశాంతంగా సాగింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే దశలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 158 ప్రధాన, ప్రాంతీయ రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 4,136 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇందులో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 2,050 మంది బరిలో ఉండగా మిగతా 2,086 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. అలాగే బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న రాందాస్ అథవలే నేతృత్వంలోని ఆర్పీఐకి చెందిన 31 మంది అభ్యర్థులున్నారు.దీన్ని బట్టి వివిధ పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకంటే ఇండిపెండెంట్లే అధికంగా బరిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. పార్టీల వారీగా పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్యను బట్టి మొదటి స్థానంలో మాయావతికి చెందిన బీఎస్పీ, రెండో స్థానంలో ప్రకాశ్ అంబేడ్కర్ నేతృత్వం వహిస్తున్న వంచిత్ బహుజన్ అఘాడీ, మూడో స్థానంలో బీజేపీ ఉంది. ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (ఏపీ) తదితర ప్రాంతీయ పారీ్టలున్నాయి. మొత్తం 4,136 మంది అభ్యర్థుల్లో ఇండిపెండెంట్ల సంఖ్య అధికంగా ఉండటంతో ఓట్లు చీలిపోతాయే భయం ప్రధాన రాజకీయ పారీ్టల అభ్యర్థులకు పట్టుకుంది. ఈ సారి జనాలు ఎప్పుడు పేరు వినని పారీ్టలు కూడా తమ అభ్యర్థులను బరిలోకి దింపడం గమనార్హం. మొత్తం 288 స్థానాలకు ఈ నెల 20వ తేదీన ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఎవరిని అదృష్టం వరిస్తుంది? ఏ పారీ్టకి స్పష్టమైన మెజార్టీ వస్తుంది? ఏ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుంది? అనేది ఈనెల 23వ తేదీన వెలువడే ఫలితాల్లో స్పష్టం కానుంది. ఎప్పుడూ పేరు వినని పార్టీలు వికాస్ ఇండియా పార్టీ, ఎల్ఘార్ పార్టీ, వీర్ జనశక్తి పార్టీ, సన్మాన్ రాజకీయ పార్టీ, సర్దార్ వల్లభాయి పార్టీ, సంపూర్ణ భారత్ క్రాంతి పార్టీ, నేతాజీ కాంగ్రెస్ పార్టీ, నిర్భయ్ మహారాష్ట్ర పార్టీ, ఓపెన్ పీపుల్స్ పార్టీ, నేషనల్ వరల్డ్ లీడర్ పార్టీ, జయ్ హింద్ జయ్ భారత్ రా్రïÙ్టయ పార్టీ, ఇండియన్ పాలిటికల్ కాంగ్రెస్ పార్టీ, విందు«థలాయి చిరుతెంగల్ పార్టీ, ఎం పాలిటికల్ పార్టీ, భారత్ జోడో పార్టీ ఉన్నాయి. పది మంది కంటే ఎక్కువ అభ్యర్థుల పోటీ పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా (డెమోక్రటిక్)–44, మహారాష్ట్ర స్వరాజ్య పార్టీ–32, రైట్ టూ రీకాల్ పార్టీ–18, సంభాజీ బ్రిగేడ్ పార్టీ–19, ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇంక్విలాబ్ ఏ మిలాత్–16, జనహిత్ లోక్షాహీపార్టీ–18, బహుజన్ మహాపార్టీ–11, భారతీయ యువ జన్ఏక్తా పార్టీ–12, దేశ్ జనహిత్ పారీ్ట–11, జన్ జనవాదీ పార్టీ–13, రాష్ట్రీయ స్వరాజ్య సేనా–15, వికాస్ ఇండియా పార్టీ–11. అత్యధిక, అతి తక్కువ అభ్యర్థులు పోటీ చేస్తున్న జిల్లాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 4,136 మంది అభ్యర్థులు బరిలో ఉండగా అందులో ముంబై, ఉప నగర జిల్లాల్లో అత్యధికంగా అంటే 315 మంది, పుణేలో 303 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే అతి తక్కువ అంటే 17 మంది అభ్యర్థులు సింధుదుర్గ్ జిల్లాలో పోటీ చేస్తున్నారు. అలాగే మొత్తం మహిళా అభ్యర్థుల సంఖ్య 363 ఉండగా ఇందులో కూడా ఇండిపెండెంట్ల సంఖ్య అధికంగా ఉంది. కాగా, మొత్తం 363 మంది మహిళా అభ్యర్థులున్నప్పటికీ ఇందులో ముంబై, ఉప నగరజిల్లాల్లో అత్యధికంగా అంటే 39 మంది బరిలో ఉన్నారు. హింగోళీ, రత్నగిరి జిల్లాలో అతి తక్కువ అంటే ఇద్దరు చొప్పున బరిలో ఉన్నారు. జల్గావ్, నాందేడ్ జిల్లాల్లో ఒక్కరు చొప్పున హిజ్రా అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరికి ఎన్ని ఓట్లు పోలవుతాయనే దానిపై అందరి దృష్టి ఉంది. పార్టీల వారీగా అభ్యర్థుల సంఖ్య బీజేపీ–149, కాంగ్రెస్–101, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం)–86, శివసేన (శిందే వర్గం)–81, యూబీటీ (శివసేన)–95, ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం)–59, బహుజన్ సమాజ్ పార్టీ–259, వంచిత్ బహుజన్ అఘాడీ–200, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్)–125, రాష్ట్రీయ సమాజ్ పార్టీ–93, ఆర్పీఐ (అథవలే వర్గం)–31, ప్రహార్ జనశక్తి–38, ఆజాద్ సమాజ్ పార్టీ–28, రిపబ్లికన్ సేనా–21, బహుజన్ రిపబ్లికన్ స్పెషలిస్టు పార్టీ–22,స్వాభిమాన్ పార్టీ–19, పీడబ్ల్యూపీ–18, ఎంఐఎం–17, భీంసేనా–14, లోక్రాజ్య పార్టీ–10, జనసురాజ్య శక్తి–6, సమాజ్వాదీ పార్టీ–9, సమతా పార్టీ–9, రాష్ట్రీయ గోండ్వానా పార్టీ–4, జనతాదళ్ (సెక్యులర్)–4, మార్క్స్వాదీ కమ్యూనిస్టు పార్టీ–3. -
టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ బర్త్డే: ఆ ముగ్గురు హైలైట్ (ఫొటోలు)
-
Bangalore Rave Party: ‘మా’ నుంచి హేమ సస్పెండ్
-
కవర్ చేద్దాం అని వీడియో చేసి దొరికిపోయిన హేమ
-
ఇటు పక్కవి హామీలు.. అవి అమలు చేస్తామని చెప్పె ‘బాండ్ పేపర్లు’
ఇటు పక్కవి హామీలు.. అవి అమలు చేస్తామని చెప్పె ‘బాండ్ పేపర్లు’ -
రైతు చుట్టూ రాజకీయం
ఎన్నికల్లో రైతులను ఆకర్షించే పనిలో అన్ని పార్టీలూ నిమగ్నమయ్యాయి. రైతులను ప్రసన్నం చేసుకుంటేనే అధికారం దక్కుతుందని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. అందుకే రైతు కేంద్రంగా అనేక పథకాలకు శ్రీకారం చుడుతున్నాయి. ఈ మేరకు ఆయా పార్టీలు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలే నిదర్శనం. గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన రైతులు, వ్యవసాయ కూలీలను పార్టీలు టార్గెట్గా చేసుకొని ప్రచారం చేస్తున్నాయి. వ్యవసాయం : 2 కోట్ల మంది రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందుకుంటున్న రైతులు 66 లక్షల మంది ఉన్నారు. వీరే కాకుండా సెంటు భూమిలేని కౌలు రైతులు 6 లక్షల మందికి పైగా ఉంటారు. అంటే రైతులు, కౌలుదారులు కలిపి దాదాపు 72 లక్షల రైతు కుటుంబాలు ఉన్నట్లు ఓ లెక్క. కుటుంబంలో కనీసం ఇద్దరు చొప్పున ఓటు హక్కు కలిగి ఉన్నా, దాదాపు కోటిన్నర మంది వరకు ఉంటారు. ఉపాధి హామీ పథకం కింద నమోదు చేసుకున్న కూలీల సంఖ్య 52 లక్షలు. అంటే రాష్ట్రంలో వ్యవసాయం, దానిపై ఆధారపడిన వారే 2 కోట్ల మంది ఉంటారని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ రైతుబంధు రూ.16 వేలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ రైతులపై పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది. సాగునీటి ప్రాజెక్టులు మొదలు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రవేశపెట్టింది. రైతుబంధు కింద రైతులకు ఇప్పటివరకు రాష్ట్రంలో రూ. 72 వేల కోట్లు అందజేసింది. ప్రస్తుతం ఎకరానికి ఏడాదికి రూ. 10 వేలు ఇస్తుండగా, మరోసారి అధికారం అప్పగిస్తే విడతల వారీగా పెంచుతామని తెలిపింది. రైతుబంధు సాయాన్ని మొదటి సంవత్సరం ఎకరానికి ఏటా 12 వేల రూపాయలకు పెంచుతామని హామీనిచ్చింది. వచ్చే ఐదేళ్లలో రైతుబంధు సహాయాన్ని క్రమంగా పెంచుతూ... గరిష్టంగా ఎకరానికి ఏటా 16 వేల రూపాయలకు పెంచుతామని చెబుతోంది. రైతుబీమా ఎలాగూ ఉంది. అయితే గత రెండుసార్లు రైతులకు రూ. లక్ష రుణమాఫీ ప్రకటించి అమలు చేసిన బీఆర్ఎస్, ఈసారి మాత్రం తన ఎన్నికల మేనిఫెస్టోలో రుణమాఫీని ప్రకటించకపోవడం గమనార్హం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రూ.2 లక్షల రుణమాఫీ రైతులకు భరోసా దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. 24 గంటల ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్ అని ఆ పార్టీ చెబుతోంది. రైతుబంధుకు బదులుగా రైతు భరోసా పేరుతో ఏడాదికి ఎకరానికి ఒక్కో రైతుకు రూ. 15 వేలు ఇస్తామని వెల్లడించింది. కౌలు రైతులకు రైతు భరోసా రూ. 15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించింది. ఇక వ్యవసాయ కూలీలకు, ఉపాధి కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని చెబుతోంది. అన్ని పంటలకు మెరుగైన మద్దతు ధర, వరికి క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తామని పేర్కొంది. అలాగే రైతు డిక్లరేషన్లో భాగంగా ఒకేసారి రూ. 2 లక్షల రుణ మాఫీ చేస్తామని తెలిపింది. మద్దతు ధరకు అన్ని పంటలను కొనుగోలు చేస్తామని ప్రకటించింది. మూతపడిన చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని, పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని తెలిపింది. భూమి యాజమాన్య హక్కులను అందిస్తామని, పోడు భూముల రైతులకు, అసైన్డ్ భూముల లబ్దిదారులకు క్రయ విక్రయాలతో సహా అన్ని యాజమాన్య హక్కులు కల్పిస్తామని తెలిపింది. రైతు కమిషన్ ఏర్పాటుతో సహా సరికొత్త వ్యవసాయ విధానం తెస్తామని చెబుతోంది. వరికి మద్దతు ధర రూ. 3,100 ఇస్తామన్న బీజేపీ మరోవైపు తామూ అధికారంలోకి వస్తామని చెబుతోన్న బీజేపీ కూడా తన మేనిఫెస్టోలో చిన్న సన్నకారు రైతులకు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసుకునేందుకు రూ. 2,500 సాయం అందిస్తామని తెలిపింది. ఉచిత పంటల బీమాను ప్రకటించింది. వరికి రూ. 3,100 మద్దతు ధర ఇస్తామని తెలిపింది. పసుపు కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఆసక్తి కలిగిన రైతులకు దేశీ ఆవులను ఉచితంగా అందిస్తామని తెలిపింది. జాతీయ పసుపు బోర్డు నిర్ణయానికి అనుగుణంగా నిజామాబాద్ టర్మరిక్ సిటీని అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. ఏమాత్రం తగ్గని లెఫ్ట్ పార్టీల మేనిఫెస్టో... ఇక ఒంటరిగా బరిలో నిలిచి 19 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న సీపీఎం తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతుకు అనుకూలంగా అనేక హామీలు ఇచ్చింది. రైతులకు ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ కోసం కృషి చేస్తామని తెలిపింది. కేరళ తరహాలో రైతు రుణ విమోచన చట్టం రూపొందించాలని కోరుతామని, రైతుల పంటలపై 80 శాతం రుణాలు ఇచ్చి గోదాముల సౌకర్యం కల్పించాలని, ధరల నిర్ణాయక కమిషన్ ఏర్పాటు చేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, పంటలు సేకరించాలని కోరుతామని స్పష్టం చేసింది. కౌలు రైతుల గుర్తింపు, వ్యవసాయ రుణాలు, సబ్సి డీలు, పంట బీమా, కౌలు, పోడు తదితర రైతులందరికీ రూ. 5 లక్షల రైతు బీమా సౌకర్యం కల్పించా లని, ప్రకృతి వైపరీత్యాలు, అటవీ జంతువుల వల్ల పంట నష్టం జరిగితే సాగు చేసిన రైతులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తా మని సీపీఎం పేర్కొంది. మరోవైపు కాంగ్రెస్ మద్దతుతో ఒక స్థానంలో పోటీ చేస్తున్న సీపీఐ కూడా తన ఎన్నికల మేనిఫెస్టోలో కీలకమైన అంశాలను పొందుపర్చింది. రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ. 20 వేలు ఇవ్వాలని కోరింది. ఒకేసారి రైతులకు రూ. 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయాలని పేర్కొంది. -బొల్లోజు రవి -
మన పని ఈజీగా అయ్యేలా చేశారు!
మన పని ఈజీగా అయ్యేలా చేశారు! -
కాంగ్రెస్ Vs బీజేపీ: చిన్న పార్టీలతోనే పెద్ద చిక్కు!
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో డెబ్బై స్థానాలకు నేడు నిర్ణయాత్మక రెండో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇందులో కాంగ్రెస్, బీజేపీలతో పాటు అరవింద్ కేజ్రీవాల్కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ, మరికొన్ని చిన్న పార్టీలు పోటీలో ఉన్నాయి. గిరిజనులు, వెనకబడిన తరగతులనే ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్న చిన్నపార్టీలు ఈ సారి కీలకంగా మారనున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. బిలాస్పూర్ ప్రాంతంలో ఈ సారి పోరు హోరాహోరీగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో 25 నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలోని 90 అసెంబ్లీ సీట్లలో ఇవి దాదాపు మూడో వంతు. 2018 ఎన్నికలలో ఇక్కడ క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్ ఈ సారి ఆ స్థాయిలో ప్రభావం చూపలేకపోవచ్చు. ఇక్కడి ఓటర్లను ఆకర్షించడంలో బీజేపీ కూడా సరైన పనితీరు కనబర్చలేదని నిపుణులు భావిస్తున్నారు. 2018లో ఈ డివిజన్లో కాంగ్రెస్ 12, బీజేపీ ఏడు స్థానాల్లో విజయం సాధించాయి. మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ రెండు సీట్లు గెలుచుకోగా, అజిత్ జోగి నేతృత్వంలోని జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ (జోగి) మూడు సీట్లు గెలుచుకుంది. 2018 కంటే ఎక్కువగా దాదాపు 75 సీట్లను కాంగ్రెస్ ఈ సారి గెలుస్తుందని భఘేల్ ఇప్పటికే ప్రకటించారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రతి ఒక్కరినీ ఆదుకున్నామని తెలిపిన భఘేల్... అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలతో అందరికీ ప్రయోజనం చేకూరిందని, అవన్నీ ఓట్లుగా మారుతాయని ధీమాతో ఉన్నారు. కానీ సాంప్రదాయంగా కాంగ్రెస్కు వచ్చే గిరిజనులు, వెనకబడిన తరగతుల ఓట్లను ఈసారి చిన్న పార్టీలు చీల్చనున్నాయి. ఈ మార్పుతో ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్కు ఈ ఎన్నికలు పరీక్షగా మారనున్నాయని అంచనాలు చెబుతున్నాయి. 2018లో రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాల్లో 68 సీట్లతో కాంగ్రెస్ విజయాన్ని కైవసం చేసుకుంది. 2013 జిరామ్ ఘాటి మావోయిస్ట్ దాడి తర్వాత రాష్ట్రంలో పార్టీకి కొత్త ఉత్సాహం తెచ్చిన బఘేల్.. ప్రధాన నేతగా ఎదిగారు. సీఎం కుర్చీ కోసం మరో ముగ్గురు నేతలు పోటీలో ఉన్నా కేంద్ర అధిష్ఠానం ఆయనకే పగ్గాలు అప్పగించింది. ఈసారి, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. ప్రధాని మోదీనే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికలు జరగనున్న ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రెండింటిలోను వెనుకబడిన తరగతులు, గిరిజనులపై బీజేపీ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. గిరిజనుల ఓట్లు సంప్రదాయంగా కాంగ్రెస్కే పోయేవి. కానీ ఈసారి ఆ విధానం మారేలా కనిపిస్తోంది. చిన్న పార్టీల వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్-జోగి (JCC), హమర్ రాజ్ పార్టీ, మాజీ కాంగ్రెస్ నాయకుడు అరవింద్ నేతమ్ నేతృత్వంలోని సర్వ్ ఆదివాసీ సమాజ్, ఆప్, ఆయా స్థానాల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన అభ్యర్థులను నిలబెట్టాయి. వారు ఓట్లలో కొంత భాగాన్ని అయినా ప్రభావం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గిరిజనులు, వెనకబడిన వర్గాల ఓట్ల చీలిక ఒకింత బీజేపీకే కలిసి వచ్చేలా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదీ చదవండి: మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో పోలింగ్.. లైవ్ అప్డేట్స్ -
లీడర్కు కే‘డర్’
అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైన నాటి నుంచి రాజకీయ వలసలు అన్ని పార్టీల్లోనూ నిత్యకృత్యంగా మారాయి. దిగ్గజ నేతలు మొదలుకొని క్షేత్రస్థాయి కార్యకర్త వరకు పార్టీని వీడటం అన్ని పార్టీల్లోనూ రివాజుగా మారింది. టికెట్ల కేటాయింపుపర్వం అన్ని రాజకీయ పక్షాల్లోనూ ప్రకంపనలు సృష్టించగా, భంగపడిన ఆశావహులు సొంతపార్టీని వీడి ప్రత్యర్థి పార్టీలోకి చేరిపోయారు. తమ టికెట్ ఎగురేసుకు వెళ్లిన అభ్యర్థులను ఓడిస్తామంటూ శపథం చేస్తూ ఎదుటి పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఇక టికెట్ దక్కించుకున్న నేతలు ఎదుటి శిబిరాలపై కన్నేసి క్షేత్రస్థాయి కేడర్ను లాక్కునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా తాయిలాలు ఎర వేస్తూ తమవైపు లాక్కునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇక మరోవైపు ఉన్న సొంతకేడర్ను కాపాడుకునేందుకూ తంటాలు పడుతున్నారు. స్థానికంగా జనంలో కాస్త పలుకుబడి ఉన్న నేతలకు సైతం పార్టీ మారాల్సిందిగా వివిధ పక్షాల నుంచి ఒత్తిడి వస్తుండటంతో ఎటూ తేల్చుకోలేని కిందిస్థాయి నేతలు కొందరు ఫోన్లు బంద్ పెట్టుకొని అందుబాటులో లేకుండా పోతున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. స్థానిక సంస్థల ప్రతినిధులకు గిరాకీ... ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు క్షేత్రస్థాయి కేడర్ చేరికలపై అన్ని పార్టీలు దృష్టి కేంద్రీకరించాయి. వలసలను ప్రోత్సహించే క్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన వార్డు మెంబర్లు మొదలు ఉప సర్పంచ్లు, సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, చైర్మన్లు, స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులకు గిరాకీ ఏర్పడింది. పార్టీ నిర్ణయానికి కంకణబద్ధులైన స్థానిక సంస్థల ప్రతినిధులు కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులతో తమకు ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నారు. మరికొందరు స్థానిక సంస్థల ప్రతినిధులు మాత్రం సొంత పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతోనూ బేరసారాలు సాగిస్తున్నారు. వలసలను అరికట్టే క్రమంలో పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పటికే అడ్వాన్సు రూపంలో కొంత మేర చెల్లింపులు పూర్తి చేశారు. అయినా సంతృప్తి చెందని కొందరు క్షేత్ర స్థాయి నేతలు, కేడర్ ఎదుటి పార్టీ అభ్యర్థులతో మంతనాలు జరుపుతుండటం సొంత పార్టీ అభ్యర్థులకు తలనొప్పులు తెచ్చి పెడుతోంది. కొందరు కిందిస్థాయి నాయకులు అడ్వాన్సులు పుచ్చుకుని కూడా పార్టీలు మారుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కొత్త కేడర్ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ప్రచారం, పోల్ మేనేజ్మెంట్లో కింది స్థాయిలో వీరిదే ప్రధాన పాత్ర కావడంతో తమకు విధేయతతో పనిచేసే కేడర్ కోసం నేతలు వెతుకులాట ముమ్మరం చేస్తున్నారు. సొంత సైన్యం మోహరింపు క్షేత్రస్థాయిలో కేడర్ పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందు కు ఎమ్మెల్యే అభ్యర్థులు తమ సొంత సైన్యాన్ని మండలాల వారీగా మోహరింపజేశారు. ఓవైపు పార్టీ నేతలకు మండలాలు, కీలక గ్రామాల వారీగా బాధ్యతలు అప్పగిస్తూనే తమ కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులకు పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తున్నారు. బీఆర్ఎస్ లాంటి పార్టీలు కీలక నియోజకవర్గాల్లో ఇతర ప్రాంతాలకు చెందిన నాయకులను ఇన్చార్జ్లుగా నియమించాయి. వారు తమ అనుచరగణంతో కేటాయించిన మండలాల్లో మకాం వేసి కేడర్ సమన్వయం, ప్రచారం, పోల్ మేనేజ్మెంట్ తదితరాల్లో అభ్యర్థులకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. పోల్ మేనేజ్మెంట్లో అత్యంత కీలకమైన డబ్బు, మద్యం పంపిణీ బాధ్యతలను అభ్యర్థులు తమ సొంత సైన్యానికే అప్పగిస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో తమకు నమ్మకస్తులైన వారి ఇళ్లు, ఇతర ప్రదేశాల్లో మద్యం డంప్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నగదు తరలింపులో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే కీలక స్థావరాలకు చేర్చినట్లు సమాచారం. అయితే కొన్ని చోట్ల పార్టీ ఇన్చార్జ్లు, అభ్యర్థుల నడుమ కూడా సమన్వయ లోపం తలెత్తుతోంది. -కల్వల మల్లికార్జున్ రెడ్డి -
మీ దూకుడూ ...సాటెవ్వరు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీల నుంచి వలసలు ఊపందుకున్నాయి. టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలంతా రాత్రికి రాత్రే పార్టీలు మారిపోతున్నారు. నిన్నటిదాకా తిట్టిపోసిన పార్టీల్లోనే దర్జాగా చేరుతూ తమను అక్కున చేర్చుకున్న పార్టీలను ఆకాశానికెత్తేస్తున్నారు. అదే సమయంలో నిన్నటిదాకా తమకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీలను దుమ్మెత్తిపోస్తున్నారు. అధికార బీఆర్ఎస్తోపాటు విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. రేఖా నాయక్, మైనంపల్లితో మొదలు... బీఆర్ఎస్ దాదాపు రెండున్నర నెలల కిందటే అభ్యర్థుల జాబితాను ప్రకటించగా అప్పట్లో ఒకరిద్దరు నేతలు మినహా మరెవరూ ఆ పార్టీని వీడలేదు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్కు కేసీఆర్ టికెట్ నిరాకరించడంతో ఆమె అధికార పార్టీపై దుమ్మెత్తి పోశారు. ఎస్టీ మహిళనైన తనను పార్టీ బలిపశువు చేసిందని , మహిళలను గౌరవించని పార్టీలో కొనసాగలేనంటూ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ తాజా జాబితాలో రేఖానాయక్ భర్త శ్యాం నాయక్కు టికెట్ కేటాయించింది. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రెండు టికెట్లు ఆశించి భంగపడటంతో ఏకంగా మంత్రి హరీశ్రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతరం కాంగ్రెస్లో చేరడమే కాకుండా తనకు, తన కుమారునికి టికెట్లు ఖాయం చేసుకున్నారు. రాజగోపాల్రెడ్డి యూటర్న్...: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి 2022లో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ సందర్భంలో ఆయన టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఓడించే పార్టీ బీజేపీయేనని... అందుకే ఆ పార్టీలోకి చేరినట్లు ప్రకటించారు. మునుగోడు ఉపఎన్నిక తరుణంలో రేవంత్రెడ్డి కూడా రాజగోపాల్రెడ్డిని దూషించారు. అదే రాజగోపాల్రెడ్డి ఇప్పుడు తన అభిమానులు, కార్యకర్తలంతా కలసి బీఆర్ఎస్ను ఓడించడం ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్కే సాధ్యమవుతుందని పేర్కొంటూ బీజేపీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్లో చేరిన కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగి మునుగోడు టికెట్ తెచ్చుకున్నారు. ఆల్ పార్టీ నేత నాగం...: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత నాగం జనార్దన్రెడ్డి ఒక్కప్పుడు టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి ఆ తర్వాత వరుసగా పార్టీలు మారుతూ వస్తున్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2011లో టీడీపీకి రాజీనామా చేశాక సొంత పార్టీ పెట్టిన ఆయన 2013లో బీజేపీలో చేరిపోయారు. 2018లో ఆ పార్టీ నుంచి బయటకొచ్చి కాంగ్రెస్లో చేరారు. తాజాగా కాంగ్రెస్ ఆయనకు నాగర్కర్నూల్ టికెట్ నిరాకరించడంతో ఆ పార్టీని దుర్భాషలాడుతూ అధికార బీఆర్ఎస్లో చేరిపోయారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారంటూ గతంలో ఏకంగా కోర్టుకెక్కిన నాగం... తాజాగా అదే కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరిదీ అదే దారి... ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అధికార పార్టీని వీడి కాంగ్రెస్లో చేరిన వెంటనే టికెట్లు పొందారు. మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం తనకు టికెట్ లభించే అవకాశం ఉన్న బీజేపీలో జాయిన్ అయ్యారు. జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా నామినేట్ అయిన కార్పొరేటర్ జగదీశ్వర్గౌడ్, ఆయన సతీమణి బీఆర్ఎస్కు గుడ్బై చెప్పి కాంగ్రెస్లో చేరగా ఆ వెంటనే ఆయనకు శేరిలింగంపల్లి టికెట్ లభించింది. రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకునిగా ఉన్న మనోహర్రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరిన వెంటనే ఆయనకు తాండూరు టికెట్ లభించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లోకి జంప్ కాగానే ఆయనకు కల్వకుర్తి సీటు ఖరారైంది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వీరేశం కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరగానే ఆయనకు టికెట్ కేటాయించిందా పార్టీ. నేరేడుచర్ల మున్సిపల్ వైస్–చైర్పర్సన్ శ్రీలతారెడ్డి బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. ఆమెకు హుజూర్నగర్ టికెట్ దక్కే అవకాశం ఉంది. కొందరికి భవిష్యత్ పై హామీలు... కాంగ్రెస్, బీజేపీలో టికెట్ల రగడతో బీఆర్ఎస్లోకి సైతం భారీగానే మాజీ ఎమ్మెల్యేలు చేరుతున్నారు. అయితే వారికి ఇప్పటికిప్పుడు సీట్లు కేటాయించే అవకాశం లేకపోవడంతో భవిష్యత్తులో మంచి స్థానం కల్పిస్తామని అధికార పార్టీ హామీలు ఇస్తోంది. ఇలా చేరిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు/మంత్రులు విష్ణువర్ధన్రెడ్డి, ఎ.చంద్రశేఖర్, ఎర్ర శేఖర్, గద్వాల డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్రెడ్డి, మెదక్ డీసీసీ అధక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, రాగిడి లక్ష్మారెడ్డి, నిర్మల్ బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి, పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, కొత్తగూడెం బీజేపీ అధ్యక్షుడు కోనేరు చిన్ని తదితరులు ఉన్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి టీడీపీ అధినేత చంద్రబాబు నిరాకరించడంతో టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తాజాగా పదవికి రాజీనామా చేశారు. ఆయన బీఆర్ఎస్లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. -
రాజ్యాంగం చదివిన నాయకులెందరు?
ప్రజల కోసం కాకుండా, పవర్ కోసమే పథకాలు పుట్టుకొస్తున్నాయనేది రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్, ఆర్థిక శాఖ మాజీ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డి ఆవేదన. ఎన్నికల ప్రక్రియను ఐదేళ్ల కాంట్రాక్టుగానే పార్టీలు చూస్తున్నాయన్నది ఆయన మాటల్లోని అంతరార్థం. కార్పొరేట్ విధాన రాజకీయాలనే అన్ని పార్టీలూ అనుసరిస్తున్నాయన్నది ఆ పెద్దాయన నిశిత పరిశీలన. సీనియర్ ఐఏఎస్గా ఉమ్మడి రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేసిన నాగిరెడ్డి తెలంగాణలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా..రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తాజా ఎన్నికల నేపథ్యంలో పార్టీలూ, వారిచ్చే జనాకర్షణ పథకాల హామీలు..మారుతున్న రాజకీయ ముఖచిత్రంపై ‘సాక్షి’తో నిర్మొహమాటంగా తన భావాలను పంచుకున్నారు. ఆయన మాటల్లోనే. పునాదుల్లేని పథకాలు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పొలిటికల్ తప్ప... ప్రొసీజర్ కన్పించడం లేదు. బ్యూరోక్రాట్స్ వాస్తవ పరిస్థితిని వివరించే అవకాశం ఉండటం లేదు. సంక్షేమ పథకాలకు పురిట్లోనే పునాది వేయాలి. మనకుండే అవకాశాలు, ప్రజల డిమాండ్, వనరులు... ఇవన్నీ పరిశీలించాకే పథకాన్ని అమలు చేయాలి. కానీ తెలంగాణ లో అలాంటి కసరత్తు లేదు. పాలించే నేత కలలో వచ్చిందే పథకమైతే... దానికి పునాదులెక్కడుంటాయి. అందుకే రాష్ట్రంలో ఏ పథకమైనా పూర్తిస్థాయిలో ముందుకెళ్లడం లేదు. ఇది ప్రజలకు నిరాశ కల్గించే అంశమే కాదు... రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా ప్రభావం చూపుతుంది. స్థానిక సంస్థలకే బాధ్యతలిస్తే...? సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపికలో స్థానిక సంస్థలను భాగస్వాములను చేయాలి. అప్పుడే మంచి ఫలితాలొస్తాయి. జవాబుదారీతనం పెరుగుతుంది. అధికారులకు ఈ బాధ్యత ఇవ్వడం వల్ల రకరకాల ఒత్తిడులు ఉంటాయి. స్థానిక గ్రామ సర్పంచ్ నేతృత్వంలో లబ్దిదారుల ఎంపిక జరిగితే... ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక పథకాల రూపకల్పన, వాటి విధివిధానాలు పల్లె ప్రజల మనోభావాల్లోంచి పుట్టుకురావాలి. దురదృష్టమేంటంటే ... మన నాయకులు ప్రజలకు దగ్గరగా ఉండటం లేదు. వారి అభిరుచి ఏంటో తెలుసుకోవడం లేదు. రైతుకు ఇస్తున్నదేంటి? ఓట్ల రాజకీయంలో రైతు పాత్ర ముఖ్యమైంది. అందుకే రైతుకు పోటీపడి పథకాలు ఇస్తామంటున్నాయి పార్టీలు. నిజాన్ని ఒక్కసారి పరిశీలించండి. మనం రైతుకు ఇస్తున్నదెంత? ఇచ్చేవన్నీ ఉచితాలేనా? కానేకాదు. రైతు ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తు న్నాయి ప్రభుత్వాలు. కొన్నేళ్లు వెనక్కి వెళ్దాం. విత్తనం రైతే తన పంటలోది వాడేవాడు. పశు సంపద ద్వారా వచ్చే ఎరువే వాడుకునే వాడు. అరకతో దున్నేవాడు. పురుగుమందుల ముచ్చటే లేదు. ఇక రైతు ట్యాక్స్ చెల్లించాల్సిన పరిస్థితి ఎక్కడ? కానీ ఇప్పుడు విత్తనం. పురుగుమందు, ఎరువులు, ట్రాక్టర్లు అన్నీ మార్కెట్లో కొనాల్సిందే. ప్రతీ చోట రైతు ట్యాక్స్ కట్టాల్సిందే. అంటే ప్రభుత్వానికి చెల్లించే పన్నుల్లో రైతు వాటా సున్నా నుంచి ఎన్నో రెట్లు పెరిగింది? ఇంకా ఉచితాలు ఇచ్చామంటారేంటి? గిట్టుబాటు ధర ఇస్తే సరిపోతుంది. భూముల విలువలు పెరగడం అభివృద్ధా? గ్లోబలైజేషన్ తర్వాత భూమి కూడా ఓ పెట్టుబడి వస్తువైంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగాన్ని కార్పొరేట్ శక్తులు ఎంచుకున్నాయి. అందుకే వాటి విలువ పెరిగింది. ఎకరం రూ. కోటికి అమ్ముడైన రైతు రూ. 50 లక్షలతో వేరొక చోట కొంటున్నాడు. అక్కడి రైతు వేరే చోటుకు ఇలా భూముల అమ్మకాలు సాగుతున్నాయి. అంతే తప్ప అభివృద్ధి వల్లే భూములు పెరిగాయని చెప్పలేం. పల్లెలెందుకు ఖాళీ అవుతున్నాయి? ప్రతీ పల్లెకూ రోడ్లున్నాయి. నీళ్లున్నాయి. కరెంట్ ఉంది. నెట్... డిష్ అన్నీ ఉన్నాయి. పట్టణాలకు సరిసమానంగానే ఉన్నాయి. కానీ పల్లె జనం పట్నం బాట పడుతున్నారు. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ పట్టణంతో ముడిపడి ఉన్నాయి. అందుకే అన్నీ ఉన్నా... జనం లేని పల్లెలను మనం చూస్తున్నాం. ఇలా అయితే, మన గ్రామీణ వ్యవస్థ ఏమవుతుంది? దీన్ని పార్టీలూ ఆలోచించాలి. రాజకీయమే తప్ప.. రాజ్యాంగం గురించి తెలుసా? ప్రపంచీకరణ ప్రభావం కావొచ్చు. రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఎంతమంది నాయకులు రాజ్యాంగం చదివారు? ఎంతమందికి చట్టాల గురించి తెలుసు? వారు చెప్పిందే చట్టం అనుకుంటున్నారు. ప్రజలకు ఇష్టమొచ్చినట్టుగా వాగ్దానాలిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తమకెందుకు అంటున్నారు. ఏదైనా పథకం తేవాలంటే అధికారులు అన్ని కోణాల్లో పరిశీలించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఐదు గంటల్లో పథకం రూపురేఖలు వెల్లడించాలనే ఒత్తిడి తెస్తున్నారు. డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో మినహా... తెలంగాణలో ప్రభుత్వ పథకాలు ప్రకటించిన విధంగా అమలవ్వలేదు. ఉప ఎన్నికలొస్తే ఆ ప్రాంతానికి మాత్రమే హడావిడిగా లబ్దిదారులను ఎంపిక చేస్తారు. ఇంకేదైనా రాజకీయ అవసరం అనుకుంటే ముందుకెళ్తారు. ఇదెక్కడి గవర్నెన్స్. కార్పొరేట్ స్టైల్లో ఉందే! ఇదేం ఎన్నికల నిఘా! ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థ పనితీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. రోజు రూ. లక్షల్లో నగదు, నగలు పట్టుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇదంతా ఎన్నికలకు తరలిస్తున్నదా? ఓ వ్యాపారి నగదు తీసుకెళ్తుంటే పట్టుకోవడం, సాధారణ పౌరుడి వద్ద డబ్బు దొరికిందని చెప్పడం విడ్డూరంగా ఉంది. వీళ్లకు ఎన్నికల్లో డబ్బు పంపిణీకి ఏమైనా సంబంధం ఉందా? ఈ నిఘా వ్యవస్థ ప్రజలను పీడించేలా ఉంది. నేను ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు దీన్ని ఎంతమాత్రం ఒప్పుకోలేదు. అనుమానం ఉంటే పేరు రాసుకుని అతనికి రాజకీయాలకు సంబంధం ఉందా? అనేది విచారణ చేయమన్నాం. ఇంతమందిని పట్టుకున్నారు సరే. ఇందులో ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా ఉన్నాడా? అసలు పంచాల్సిన డబ్బు ఎప్పుడో పల్లెలకు చేరిందనేది నా అనుమానం. అక్కడ వెదకాల్సింది పోయి... అడుగడుగునా సాధారణ పౌరులకు ఇబ్బంది కలిగించడం మంచిది కాదు. - వనం దుర్గాప్రసాద్ -
ఆటా ఆధ్వర్యంలో జరిగిన రెట్రో నేపథ్య సంగీత పార్టీ
-
ప్రకృతి ప్రేమకు నిదర్శనం
నగర జీవనంలో ప్రతిదీ యూజ్ అండ్ త్రోగా మారుతోంది.‘ఈ కాంక్రీట్ వనంలో ప్రకృతి గురించి అర్థం చేసుకుంటున్నదెవరు’.అని ప్రశ్నిస్తారు. హైదరాబాద్ నల్లగండ్లలో ఉంటున్న నిదర్శన.అపార్ట్మెంట్ సంస్కృతిలో వ్యర్థాలను ఎలా వేరు చేయాలి,ప్లాస్టిక్ వాడకాన్ని ఎలా తగ్గించాలనే విషయాల మీద నెలకు ఒకసారి నాలుగేళ్లుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తోంది. కార్పోరేట్ కంపెనీలో మార్కెటింగ్ కమ్యూనికేషన్స్లో మేనేజర్గా వర్క్ చేసిన నిదర్శన సస్టెయినబుల్ లివింగ్ పట్ల ఆసక్తి పెరిగి, పర్యావరణ హిత వస్తువుల వాడకాన్ని ప్రోత్సహిస్తూ,హస్తకళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. పర్యావరణానికి మేలు చేసే పని ఏ కొంచెమైనా ఎంతో సంతృప్తినిస్తుందని చెబుతోంది. ‘‘ఈ రోజుల్లో మనం ఏ పని చేసినా అది ప్రకృతికి మేలు చేసేదై ఉండాలి. ఈ ఆలోచన నాకు నాలుగేళ్ల క్రితం కలిగింది. దీనికి కారణం మన దగ్గర చేస్తున్న పెళ్లిళ్లు, పార్టీలు. ఫంక్షన్లకు వెళ్లినప్పుడు అక్కడ యూజ్ అండ్ త్రో ఏరియా చూస్తే మనసు వికలమయ్యేది. దీంతో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి, సస్టైనబుల్ లివింగ్ మార్గం పట్టాను. ఈవెంట్స్కి స్టీల్ గిన్నెల రెంట్ మాటీ పేరతో ఫౌండేషన్ ఏర్పాటు చేశాను. నాలాగే ఆలోచించే మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఫంక్షన్లకు స్టీల్ పాత్రలు నామమాత్రపు రెంట్తో ఇచ్చే బ్యాంక్ ఏర్పాటు చేశాను. ఆ తర్వాత ఇదే థీమ్ను హైదరాబాద్లో ఏర్పాటు చేశాను. ఎవరింట్లో పెళ్లి, పండగ, పుట్టిన రోజులు జరిగినా మా దగ్గర నుంచి స్టీల్ పాత్రలు రెంట్కు తీసుకోవచ్చు. అలాగే, అపార్ట్మెంట్స్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాను. ఈ వర్క్షాప్స్లో కిచెన్ గార్డెనింగ్, కంప్రోస్ట్, ఎకో ఫ్రెండ్లీ గిఫ్ట్ థీమ్స్.. వంటివన్నీ అందుబాటులో ఉంటాయి. హస్తకళాకారుల నుంచి.. నెలకు ఒకసారి గేటెడ్ కమ్యూనిటీ ఏరియాలను చూసుకొని పర్యావరణ స్పృహ కలిగించడానికి ఎకో ఫెస్ట్ ఏర్పాటు చేయడం మొదలుపెట్టాను. ఇందుకు ఇతర స్వచ్ఛంద సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీ సభ్యులు, ఐటీ ఉద్యోగులు తమ మద్దతును తెలియజేస్తున్నారు. నా టీమ్లో స్వచ్ఛందంగా పనిచేసే పది మంది బృందంగా ఉన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలలోని నగరాలలోనూ ఈ ఎకో ఫెస్ట్ ఏర్పాటు చేస్తాను. ఇందులో హస్తకళాకారులు తయారుచేసిన రకరకాల కళాకృతులు, జ్యువెలరీ బాక్సులు, ఇత్తిడి, రాగి వస్తువులు, జ్యూట్ కాటన్ పర్సులు, ఇంటీరియర్ వస్తువులు .. వంటివన్నీ ఉంటాయి. హస్తకళాకారులే నేరుగా వచ్చి తమ వస్తువులు అమ్ముకోవచ్చు. ఒక్కొక్క కళాకారుడి నుంచి సేకరించిన వస్తువులను కూడా ప్రదర్శనలో ఉంచుతాను. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ కళాకారులకు అందజేస్తుంటాను. గ్రామీణ కళాకారులకు తమ హస్తకళలను ఎక్కడ అమ్మితే తగినంత ఆదాయం వస్తుందనే విషయంలో అంతగా అవగాహన ఉండదు. అందుకే, ఈ ఏర్పాట్లు చేస్తుంటాను. దీని ద్వారా కళకు, కొనుగోలుదారుకు ఇద్దరికీ తగిన న్యాయం చేయగలుగుతున్నాను అనే సంతృప్తి లభిస్తుంది. ‘ది బాంటిక్ కంపెనీ( పేరుతో ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా హస్తకళాకృతులను అందుబాటులో ఉంచుతున్నాను. ఎకో ఫ్రెండ్లీ గిఫ్టింగ్ కార్పోరేట్ కంపెనీలలో పండగల సందర్భాలలో ఇచ్చే కానుకలకు కన్స్టలెన్సీ వర్క్ కూడా చేస్తాను. ఇక్కడ కూడా ఎకో థీమ్తో కస్టమైజ్డ్ గిఫ్ట్ బాక్స్లు తయారుచేసి అందిస్తుంటాను. ఇక ఇళ్లలో జిరగే చిన్న చిన్న వేడుకలకూ ఎలాంటి కానుకలు కావాలో తెలుసుకొని, వాటిని తయారుచేయించి సప్లయ్ చేయిస్తుంటాను. కార్పోరేట్ కంపెనీలలో వర్క్షాప్స్ కార్పోరేట్ కంపెనీలలో సస్టెయినబులిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్లు ఏర్పాటు చేస్తాను. అక్కడ ఉద్యోగులు పర్యావరణ హిత వస్తువులతో తమ జీవన విధానాన్ని ఎలా అందంగా తీర్చిదిద్దుకోవచ్చో, ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చో కార్యక్రమాల ద్వారా తెలియజేస్తుంటాను. అంతేకాదు, కిచెన్ వ్యర్థాలను ఎలా వేరు చేయాలి, కిచెన్ గార్డెన్ను తమకు తాముగా ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనే విషయాల మీద వర్క్షాప్స్ ఉంటాయి. అంతేకాదు, రోజువారీ జీవన విధానంలో ప్రతీది పర్యావరణ హితంగా మార్చుకుంటే కలిగే లాభాలనే వివరిస్తుంటాను. ఇదేమంత కష్టమైన పని కాదని వారే స్వయంగా తెలుసుకోవడం, తాము ఆచరిస్తున్న పనులు గురించి ఆనందంగా తెలియజేస్తుంటారు. మంచి జీవనశైలిని నలుగురికి పంచడంలోనే కాదు ప్రకృతికి మేలు చేస్తున్నాన్న సంతృప్తి కలుగుతుంది. అదే విధంగా గ్రామీణ కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నానన్న ఆనందమూ కలుగుతుంది’ అని తెలియజేస్తారు నిదర్శన. – నిర్మలారెడ్డి ఫొటోలు: మోహనాచారి -
కక్షిదారులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి
కుషాయిగూడ: న్యాయం కోసం కోర్టుకు వచ్చే కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే అన్నారు. కుషాయిగూడ పారిశ్రామికవాడలోని ఆఫెల్ భవనంలో కొత్తగా ఏర్పాటు చేసిన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ప్రిన్సిపల్ డ్రాస్టిక్ కోర్టుతో పాటు ఇతర కోర్టుల సముదాయాన్ని శనివారం ఆయన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కోర్టు అడ్మిమినిస్టేటివ్ జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. వినోద్కుమార్తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జస్టిస్ అరాధే మాట్లాడుతూ, సత్వర న్యాయం అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో ఒకటన్నారు. ఈ క్రమంలో న్యాయస్థానాలను ఆశ్రయించే కక్షిదారులకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. న్యాయవ్యవస్థ పనితీరు ప్రభావవంతంగా, సమర్థవంతంగా ఉన్నప్పుడే న్యాయస్థానాలపై విశ్వాసం పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రతినిధులు కోర్టులో మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించాలని చీఫ్ జస్టిస్ను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెషన్స్ జడ్జి బి.ఆర్. మధుసూదన్రావు, జిల్లా కలెక్టర్ డి.అమోయ్కుమార్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, రాచకొండ సీపీ డి.ఎస్. చౌహాన్, రిజిస్ట్రార్ జనరల్ తిరుమలదేవి, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి రఘునాథ్రెడ్డి, మేడ్చల్– మల్కాజిగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. రామచంద్రారెడ్డి, సెక్రటరీ ఎం.రాజుయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ 3 పార్టీలూ ఒక్కటే
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటే. ఈ మూడు కుటుంబ పార్టీలే. వాటి డీఎన్ఏ కూడా ఒకటే. అందుకే ఆ మూడు పార్టీలు యూనిఫామ్ సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మృతి)ను వ్యతిరేకిస్తున్నాయి. ముస్లిం మహిళలకు హక్కులు వద్దంటున్నాయి..’అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి మండిపడ్డారు. ‘ఈ మూడు పార్టీలు ఒకే గూటి పక్షులు. గతంలో పొత్తు పెట్టుకున్నాయి. ఇందులో ఎవరికి ఓటేసినా బీఆర్ఎస్కు వేసినట్లే..’అని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో మహా ర్యాలీ నిర్వహించారు. అనంతరం క్లాక్టవర్ చౌరస్తాలో నిర్వహించిన బహిరంగసభలో, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో కిషన్రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కలిసి ఉద్దేశపూర్వకంగా బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు. బీజేపీ ఏ పార్టీతో కలవలేదని, భవిష్యత్తులో కూడా కలవబోదని చెప్పారు. ప్రజలను మోసం చేసిన చరిత్ర సీఎం కేసీఆర్దని, గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కా రని ధ్వజమెత్తారు. కుటుంబాల చేతుల్లో అధికారం ఉంటే దేశం బాగుపడదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయం ఖాయమని చెప్పారు. ఇప్పటికీ వైఎస్ హయాంలోని రేషన్ కార్డులే.. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్కార్డులే తప్ప.. తెలంగాణలో కొత్తవి రాలేదని కిషన్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పేదలకు రేషన్ కార్డులివ్వాలనే సోయి కేసీఆర్ సర్కారుకు లేదని విమర్శించారు. గత ఎన్నికలకు ముందు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక మోసం చేశారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్కు ఓటేస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి.. వెన్నుపోటు పొడిచారన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, రైతులకు ఎరువులు ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల జీవితాల్లో నిప్పులు పోశారని, టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని, దళితబంధు స్కీంను అమ్ముకుంటున్నారని, బీసీ బంధు పేరిట ఆ వర్గాలను మభ్యపెడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ఆట కట్టించాలి.. దేశంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో నాలుగు కోట్లకు పైగా ఇళ్లు కట్టించామని, తెలంగాణలోనూ ఇళ్లు కట్టించాలని కోరినా ఇక్కడి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని కిషన్రెడ్డి పేర్కొన్నారు. తొమ్మిదేళ్లుగా పేదలకు ఇళ్లు లేవు కానీ.. ప్రజాధనం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ముఖ్యమంత్రి రాజభవనాన్ని కట్టుకున్నారని ఆరోపించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీయించడమే కాకుండా లిక్కర్ తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణను దోచుకుంటున్న బీఆర్ఎస్ ఆట కట్టించాల్సిన అవసరముందని అన్నారు. నియంత పాలనను అంతమొందిస్తాం: డీకే అరుణ తెలంగాణలో నియంతపాలన అంతమయ్యే దాకా బీజేపీ నిద్రపోదని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షు రాలు డీకే అరుణ అన్నారు. ఈ ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్లు ఇచ్చే వరకూ వదలబోమని, కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వకుంటే బీజేపీ అధికారంలోకి వచ్చాక తామే ఇస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
'జాతీయ సంక్షేమమే అజెండా'.. ముగిసిన ప్రతిపక్ష పార్టీల భేటీ..
బెంగళూరు: బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్ష పార్టీల సమావేశం ముగిసింది. సాంఘీక న్యాయం, సమ్మిళిత వృద్ధి, జాతీయ సంక్షేమమే అజెండాగా పనిచేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఒకే భావాజాలం కలిగిన ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఒకే ధ్యేయం కోసం పోరాడతామని అన్నారు. డిన్నర్ మీటింగ్ అనంతరం ఈ మేరకు మీడియాకు తెలిపారు. "Like-minded opposition parties shall closely work together to foster an agenda of social justice, inclusive development and national welfare," says Congress President Mallikarjun Kharge after Opposition leaders' dinner meeting in Bengaluru. pic.twitter.com/H27D4nL1iU — ANI (@ANI) July 17, 2023 బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్ష కూటమి భేటీలో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు డిన్నర్ మీటింగ్ అనంతరం హోటల్ నుంచి బయటకు వస్తున్నారు. Opposition leaders' dinner meeting concludes in Karnataka's Bengaluru; Opposition leaders leave the meeting venue pic.twitter.com/FijRJO4ANl — ANI (@ANI) July 17, 2023 ప్రతిపక్ష పార్టీలు నేడు బెంగళూరులో సమావేశమయ్యాయి. దాదాపు 24 ప్రతిపక్ష పార్టీల నేతలు డిన్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. Opposition leaders' dinner meeting gets underway in Karnataka's Bengaluru pic.twitter.com/HENPkecg1g — ANI (@ANI) July 17, 2023 ప్రతిపక్ష కూటమికి హాజరవ్వడానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెంగళూరు వెళ్లారు. ఈ మేరకు కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఆయన్ను ఆహ్వానించారు. #WATCH | Delhi CM Arvind Kejriwal along with AAP MP Sanjay Singh arrives at the venue of the Opposition meeting in Bengaluru, received by Karnataka CM & Congress leader Siddaramaiah, deputy CM DK Shivakumar and party leader KC Venugopal, in Bengaluru pic.twitter.com/ResmhdV5rn — ANI (@ANI) July 17, 2023 బీజేపీని ఓడించే లక్ష్యంతో బెంగళూరు వేదికగా జరుగుతున్న ప్రతిపక్ష భేటీకి బిహార్ సీఎం నితీష్ కుమార్ హాజరయ్యారు. ఈ మేరకు బెంగళూరు చేరిన ఆయనకు సిద్దరామయ్య ఆహ్వానం పలికారు. #WATCH | JD(U) leader and Bihar CM Nitish Kumar arrives for Opposition dinner meeting in Bengaluru, Karnataka pic.twitter.com/Fag2a6OK8a — ANI (@ANI) July 17, 2023 ప్రతిపక్ష కూటమి సమావేశంలో హాజరవడానికి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బెంగళూరు వచ్చారు. ఈ మేరకు కర్ణాటక సీఎం సిద్దరామయ్య .. వారిని ఆహ్వానించారు. Sonia Gandhi, Mallikarjun Kharge, Rahul Gandhi arrive at Bengaluru ahead of joint Oppn meeting Read @ANI Story | https://t.co/Vb0wqrGsl0#SoniaGandhi #MallikarjunKharge #RahulGandhi #Bengaluru pic.twitter.com/8f3MaeRTvl — ANI Digital (@ani_digital) July 17, 2023 బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పోరాడతామని సమాజ్ వాదీ పార్టీ అధినేత అకిలేష్ యాదవ్ అన్నారు. మూడింటిలో రెండొంతుల మంది ప్రజలు బీజేపీని ఓడించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో ఈ సారి బీజేపీ కూటమిని చిత్తుగా ఓడిస్తామని అన్నారు. ఈ మేరకు ప్రతిపక్ష కూటమి భేటీకి బెంగళూరు వచ్చారు. #WATCH | Samajwadi Party (SP) chief Akhilesh Yadav, who arrived in Bengaluru today to participate in the joint Opposition meeting, was received by Karnataka Ministers MB Patil and Lakshmi Hebbalkar. (Video: MB Patil) pic.twitter.com/ohxBhot7m2 — ANI (@ANI) July 17, 2023 రెండు రోజులపాటు జరగనున్న ప్రతిపక్ష కూటమి భేటీకి హాజరవడానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బెంగళూరుకు వచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పోరాడతామని స్పష్టం చేశారు. West Bengal CM and TMC leader Mamata Banerjee and party MP Abhishek Banerjee arrived in Bengaluru for the two-day joint Opposition meeting. Karnataka Deputy CM DK Shivakumar received them. (Pics: Karnataka Pradesh Congress Committee) pic.twitter.com/3VXQG45kCc — ANI (@ANI) July 17, 2023 #WATCH | West Bengal CM and TMC leader Mamata Banerjee arrives in Bengaluru for the two-day joint Opposition meeting. pic.twitter.com/qXmrEtV7uw — ANI (@ANI) July 17, 2023 అర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్లు పాట్నా నుంచి బెంగళూరుకు బయలుదేరారు. #WATCH | RJD chief Lalu Prasad Yadav and party leader-Bihar Deputy CM Tejashwi Yadav leave from Patna. They will participate in the joint Opposition meeting in Bengaluru. pic.twitter.com/cmHOhJWMgR — ANI (@ANI) July 17, 2023 బెంగళూరు వేదికగా ప్రతిపక్ష పార్టీల భేటీ నేడు ప్రారంభం కానుంది. ఇప్పటేకే కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బెంగళూరుకు చేరారు. కాగా.. బెంగళూరులోని తాజ్ హోటల్లో వీరు సమావేశం కానున్నారు. #WATCH | Congress president Mallikarjun Kharge and Congress Parliamentary Party Chairperson Sonia Gandhi arrive in Bengaluru for the joint opposition meeting which will have the participation of 26 like-minded parties. pic.twitter.com/OogxvHsDnK — ANI (@ANI) July 17, 2023 2024 ఎన్నికల్లో బేజీపీని ఓడించడమే లక్ష్యంగా దాదాపు 26 ప్రతిపక్ష పార్టీల నేతలు ఏకమవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి రెండు రోజుల పాటు బెంగళూరులో భేటీ కానున్నారు. మంగళవారం అధికారికంగా సమావేశం జరగనుంది. కామన్ మనిమమ్ ప్రోగ్రామ్తో సహా పలు ప్రణాళికలను రచించనున్నారు. ప్రతిపక్ష కూటమి అజెండాను చర్చించడానికి ఈ సమావేశం వేదిక కానుంది. 2024 ఎన్నికల కోసం కూటమిని నడిపించడానికి ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కూటమికి కొత్త పేరును సూచించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతిపక్ష కూటమికి ఏం పేరు పెట్టనున్నారనే అంశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, నితీష్ కుమార్, తేజశ్వీ యాదవ్, స్టాలిన్ సహా పలువురు ముఖ్య నేతలు హజరుకానున్నారు. ఇదీ చదవండి: విపక్షాల సభకు పవార్ వస్తాడా? రాడా? ఇదీ క్లారిటీ.. -
ఐపీఏల్ లో అట్టర్ ఫ్లాప్.. పార్టీలకు మాత్రం ఫుల్ ఫామ్ నువ్వు మాములోడివి కాదు సామీ...
-
తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీల దూకుడు
-
ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారిన చిన్న పార్టీలు
ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారిన చిన్న పార్టీలు -
దావత్ కోసం వెళ్లి.. పిడుగుకు బలై..
జఫర్గఢ్/ఖమ్మం/గార్ల: దసరా పండుగ సందర్భంగా పార్టీ చేసుకునేందుకు గ్రామ శివార్లకు వెళ్లిన స్నేహితులపై పిడుగు పడింది. దీనితో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం సాగరం గ్రామ శివారులో బుధవారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండౌవుతాపురం గ్రామానికి చెందిన నేరెళ్లి శివకృష్ణ (22), మరుపట్ల సాంబరాజు (22), నేరెళ్లి వంశీకృష్ణ, వొజ్జల సందీప్, పాలకుర్తి మండలం బొమ్మెరకు జిట్టబోయిన సాయికుమార్ (23) స్నేహితులు. అంతా కలిసి దసరా పార్టీ కోసం బుధవారం సాయంత్రం సాగరం గ్రామ శివారుకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఉరుములు, మెరుపులతో వాన మొదలవడంతో అంతా కలిసి పక్కనే ఉన్న మర్రిచెట్టు కిందకు వెళ్లి నిల్చుకున్నారు. కాసేపటికే ఆ చెట్టుపై పెద్ద శబ్దంతో పిడుగుపడింది. దీనితో నేరెళ్ళి శివకృష్ణ, జిట్టబోయిన సాయికుమార్ అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు మిగతా ముగ్గురిని వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. మరుపట్ల సాంబరాజు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగతా ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. వీరిలో నేరెళ్లి వంశీకృష్ణ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. చెరువు మత్తడి చూడటానికని వెళ్లి.. మహబూబాబాద్ జిల్లా గార్లలో వానకు నిండి మత్తడి పోస్తున్న చెరువును చూసేందుకు అక్కడి వడ్డెర బజారుకు చెందిన వేముల సంపత్ (27), ఆలకుంట శేఖర్, రూపన్ రమేశ్, విజయ్ వెళ్లారు. కాõదÜపటికే జోరువాన మొదలవడంతో చెరువు కట్టపైనే ఉన్న చెట్టు కిందకు వెళ్లారు. చెట్టుపై పిడుగుపడటంతో వేముల సంపత్ అక్కడికక్కడే మృతి చెందగా.. శేఖర్, విజయ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కాస్త దూరంగా ఉన్న రూపన్ రమేశ్ పిడుగుపాటు నుంచి తప్పించుకున్నాడు. స్థానికులు శేఖర్, విజయ్లకు గార్ల ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతుడు సంపత్కు భార్య, ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. ►ఇక ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అజయ్తండాలో బుధవారం సాయంత్రం కోళ్లను కప్పేందుకు ఇంటి బయటికి వచ్చిన మూడు జమ్మ (68) అనే వృద్ధురాలు.. కొద్దిదూరంలో పిడుగుపడటంతో శబ్దానికి గుండె ఆగి కన్నుమూసింది. ►నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని పోలీసుస్టేషన్పై గురువారం వేకువజామున పిడుగు పడటంతో కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ►కడెం మండలంలోని లక్ష్మీసాగర్ గ్రామంలో ఇంటిపై పిడుగుపడటంతో భుక్యా రాజేశ్ అనే వ్యక్తి ఇంట్లోని టీవి, ఫ్రిజ్, విద్యుత్ వైరింగ్ కాలిపోయాయి. ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. రాజేశ్ భార్య స్వరూపకు గాయాలయ్యాయి. -
Mahbubnagar: పాగా వేసేందుకు ఎవరి వ్యూహం వారిదే.. వేడెక్కిన రాజకీయాలు
సాక్షి, మహబూబ్నగర్: ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పార్టీలన్నీ అప్పుడే హడావుడి ప్రారంభించాయి. హ్యాట్రిక్ కోసం గులాబీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. కమలం, హస్తం పార్టీలు కూడా పాలమూరులో పాగా వేసేందుకు కుస్తీలు పడుతున్నాయి. మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ, రెండు లోక్సభ నియోజకవర్గాలున్నాయి. జిల్లాల విభజనలో షాద్నగర్ సెగ్మెంట్ రంగారెడ్డి జిల్లాలోకి వెళ్ళింది. కొడంగల్ సెగ్మెంట్లోని మూడు మండలాలు వికారాబాద్ జిల్లాలో కలిసాయి. చదవండి: బీజేపీ క్లియర్కట్ మెసేజ్.. పట్టు దొరికిందా? తెలంగాణ ఏర్పాటుకు ముందు జిల్లాలో కాంగ్రెస్, టీడీపీల హవా నడిచింది. బీజేపీ అప్పుడప్పుడు ఒకటి లేదా రెండు సెగ్మెంట్లలో ఉనికి చాటుకునేది. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన తొలి ఎన్నికల్లో గులాబీ పార్టీ ఏడు, కాంగ్రెస్ ఐదు, టీడీపీ రెండు స్థానాల్లో విజయం సాధించాయి. మక్తల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన రామమోహన్రెడ్డి, నారాయణపేట నుంచి టీడీపీ టిక్కెట్ మీద గెలిచిన రాజేందర్రెడ్డి తర్వాత టీఆర్ఎస్లో చేరిపోయారు. దీంతో టీఆర్ఎస్ బలం తొమ్మిదికి చేరింది. రెండు ఎంపీ సీట్లలో ఒకటి టీఆర్ఎస్, మరొకటి కాంగ్రెస్ గెలుచుకున్నాయి. 2018 ఎన్నికల్లో 13 స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకుంది. కొల్లాపూర్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్దన్రెడ్డి విజయం సాధించారు. అయితే తర్వాత ఆయన కూడా కారు ఎక్కేశారు. దీంతో ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ప్రతిపక్షాలకు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. గత లోక్సభ ఎన్నికల్లో రెండు సీట్లను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది గులాబీ పార్టీ. మరో ఏడాదిన్నరలోగా అసెంబ్లీ ఎన్నికలు రానుండటంతో అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. మరోసారి జిల్లాలోని అన్ని స్థానాలను గెలుచుకుంటామని గులాబీ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ప్రశాంత్ కిషోర్ సర్వేలో సగం మంది గెలుపు కష్టమని తేల్చినట్లు సమాచారం. దీంతో ఎవరి సీటు పోతుందో అన్న టెన్షన్ ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. అనుమానం ఉన్నవారు సొంత సర్వేలు చేయించుకుని జాతకాలు పరీక్షించుకుంటున్నారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు వంటి పథకాలను ప్రచారం చేస్తూ ఎమ్మెల్యేలు జనాల్లోకి వెళుతున్నారు. అయితే డబుల్బెడ్ రూమ్ ఇళ్ళు, లక్ష రూపాయల రుణమాఫీ, కొత్త పెన్షన్లు, దళితబంధు పథకాల విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధానంగా నిరుద్యోగుల్లో ఉద్యోగాల విషయంలో అసంతృప్తి కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు పెరుగుతున్న ధరలతో సామాన్యులు ప్రభుత్వం మీద కొంత ఆగ్రహంతో ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీలో అంతర్గత కలహాలు, అసంతృప్తులతో నష్టం జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమను మళ్ళీ గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ ఇటీవలి కాలంలో పార్టీ పరిస్థితి రాను రాను దిగజారిపోతోంది. కాంగ్రెస్ను గెలిపిస్తే...తర్వాత పార్టీలో ఉంటారో లేరో అన్న అనుమానంతో ఓటు వేయడానికి ప్రజలు సంకోచిస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, వంశీచందర్రెడ్డి, సంపత్కుమార్, సీనియర్ నేతలు మల్లు రవి, నాగం జనార్థనరెడ్డి వంటి ఎందరో సీనియర్లు జిల్లా నుంచి ఎదిగినవారే. అయినా టీఆర్ఎస్ ధాటికి తట్టుకోలేకపోతున్నారు. పైగా పార్టీలో అంతర్గత కుమ్ములాటలను చక్కదిద్దడానికి కూడా పెద్దగా ప్రయత్నించడంలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కొన్ని సెగ్మెంట్లలో పోటీ చేయడానికి బలమైన నాయకులు కూడా లేనంత దుస్థితి కాంగ్రెస్కు ఏర్పడింది. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక...ఆయన సారథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిస్తున్న ఆందోళనలతో కేడర్లో కొంత ఉత్సాహం కనిపిస్తోంది. అయితే కార్యకర్తల ఉత్సాహాన్ని సక్రమ మార్గంలో నడిపించేవిధంగా పార్టీ అడుగులు పడటంలేదు. ఏళ్ళ తరబడి పాతుకుపోయిన అధ్యక్షుల స్థానంలో కొత్తవారిని నియమించే ప్రయత్నం కూడా చేయకపోవడం పార్టీకి మైనస్గా మారింది. ఇక కేంద్రంలో ఉన్న అధికారంతో దూకుడు మీదున్న కమలం పార్టీ జిల్లా మీద ప్రత్యేక ఫోకస్ పెట్టింది. డీకే అరుణ, జితేందర్రెడ్డి కాషాయ సేనలో చేరడంతో ఆ పార్టీ కేడర్లో జోష్ పెరిగింది. ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం కావడంతో నేతలు, కార్యకర్తల్లో నూతనోత్తేజం కనిపిస్తోంది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, మోదీ బహిరంగ సభ కూడా పార్టీకి మంచి ఊపు తెచ్చింది. అంతేగాకుండా జాతీయ సమావేశాలకు వచ్చిన ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించి, కేడర్కు దిశా నిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో కనీసం ఐదారు అసెంబ్లీ సీట్లు గెలవాలని లక్ష్యంగా కమలం పార్టీ ముందుకు సాగుతోంది. రాష్ట్ర స్థాయిలో వేడెక్కిన రాజకీయాలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఎవరికి వారు తమ పార్టీకే మెజారిటీ సీట్లు వస్తాయనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. వారి లక్ష్యాలకు అనుగుణంగా కార్యరంగంలోకి అడుగుపెడుతున్నారు. -
సముద్రంలోపల పార్టీ? ఒక్కసారి చార్జ్ చేస్తే 24గంటల ప్రయాణం.. ఇది ఒక సంచలనం!
సముద్రంపై నౌకలో పార్టీలు, పెళ్లిళ్లు మాత్రమే మనకు ఇప్పటివరకు తెలుసు. సముద్రంలోతుల్లోనూ పార్టీ చేసుకునే అద్భుత అవకాశాన్ని తీసుకొచ్చిందో డచ్ కంపెనీ. సముద్రం లోపల సబ్మెరైన్లో పార్టీ... ఊహించడానికే థ్రిల్లింగ్గా ఉంది కదా! సాధారణంగా జలాంతర్గాములను నేవీకోసమో, లేదంటే సముద్రపు లోతుల్లోని రహస్యాలను కనుగొనేందుకో ఉపయోగిస్తారు. కానీ వ్యక్తిగత, వాణిజ్య జలాంతర్గాముల తయారీలో దిగ్గజ సంస్థ అయిన నెదర్లాండ్స్కు చెందిన యూ–బోట్వర్క్స్ ఈ అండర్ వాటర్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ (యూడబ్ల్యూఈపీ)ను తయారు చేసింది. మినీ క్రూయిజ్ షిప్ తరహాలో రూపొందించిన ఈ సబ్మెరైన్ 200 మీటర్ల లోతువరకు డైవ్ చేయగలదు. 120మంది ప్రయాణించగలిగే సబ్మెరైన్లో 64 సీట్ల సామర్థ్యమున్న రెస్టారెంట్, జిమ్, కాసినో, వెడ్డింగ్ హాల్ కూడా ఉన్నాయి. సముద్రంలోపలి అద్భుతాలను వీక్షించేందుకు వీలుగా దీనికి 14 విశాలమైన కిటికీలను ఏర్పాటు చేశారు. వాటి బయట సముద్రం స్పష్టంగా కనిపించేందుకు ప్రకాశవంతమైన దీపాలను అమర్చారు. ఇది సముద్రతీరంలో ఉన్నప్పుడు, ఉపరితలంపై ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు తీరపు అందాలను ఆస్వాదించేలా యూడబ్ల్యూఈపీపై సన్డెక్ను, దాని చుట్టూ రెయిలింగ్ను కూడా ఏర్పాటు చేశారు. బ్యాటరీతో నడిచే ఈ సబ్మెరైన్ను ఒక్కసారి చార్జ్ చేస్తే 24గంటలపాటు ప్రయాణించొచ్చు. యూడబ్ల్యూఈపీ ఓ సంచలనమని, నీటి అడుగున వేడుకలకు ఇది దారి చూపుతుందని యూ–బోట్వర్క్స్ వ్యవస్థాపక సీఈవో బెర్ట్ హౌట్మాన్ తెలిపారు. ఇంకెందుకాలస్యం.. నెదర్లాండ్స్కు వెళదాం అనుకుంటున్నారా! ఆగండాగండి.. ఏదైనా టూరిజం కంపెనీ కొనుగోలు చేసి టూర్స్ ఆఫర్ చేసేవరకూ మనం ఎదురుచూడాల్సిందే. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
డబ్బులిచ్చి మరీ కోవిడ్ పేషెంట్లతో డిన్నర్లు, పార్టీలు.. ఎందుకంటే
రోమ్: కరోనా వైరస్ గురించి ప్రపంచమంతా భయపడుతోంది. ప్రతి ఒక్కరూ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు కఠిన నిబంధనలు పాటిస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ కూడా తీసుకుంటున్నారు. కాగా కోవిడ్ సోకిన వారు ఎవరిని కలవడానికి వీలుండదన్న విషయం తెలిసిందే. వారు తప్పకుండా వారం నుంచి పదిహేను రోజులు ఐసోలేషన్లో ఉండాల్సి ఉంటుంది. డాక్టర్ల సూచనతో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కోవిడ్ నుంచి కోలుకోవచ్చు. అయితే ఓ చోట మాత్రం కరోనా వచ్చిన వారితో ఎంచక్కా పార్టీలు చేసుకుంటున్నారు. వాళ్లతో కలిసి ఏకంగా డిన్నర్ చేస్తున్నారు. కలిసి వైన్ తాగుతున్నారు. ఇందుకు డబ్బులు కూడా చెల్లిస్తున్నారు. ఇదంతా ఇటలీలో జరుగుతోంది. ఎందుకు ఇలా చేస్తున్నారో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.. ఇటలీలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజూ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి 50 ఏళ్లు నిండిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ వేసుకోని వాళ్లు, భారీ జరిమానా లేదా వాళ్ల ఉద్యోగం వదిలేసుకోవాల్సి ఉంటుందని ఆదేశించింది. అయితే వ్యాక్సిన్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్లకు భయం పట్టుకుంది. దీంతో వ్యాక్సినేషన్ను తప్పించుకునేందుకు ఉన్న ఏకైక అవకాశం కోవిడ్ బారిన పడటం. కోవిడ్ సోకి కోలుకున్నవారు యాండీబాడీస్ వృద్ధి చెందే వరకు వ్యాక్సిన్ వేసుకోకుండా ఉండాలి. దీంతో కోవిడ్ వచ్చిన పేషెంట్లకు డబ్బులు ఇచ్చి మరీ వాళ్లతో డిన్నర్ చేస్తున్నారు. వాళ్లతో కూర్చొని వైన్ తాగుతున్నారు. దీని ద్వారా తమకు కూడా వైరస్ సోకితే వ్యాక్సినేషన్ నుంచి తప్పించుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారు. అయితే వ్యాక్సిన్ను తప్పించుకోవడం కోసం కోవిడ్ పార్టీల పేరుతో మహమ్మారిని తెప్పించుకుంటే వాళ్లపై కేసులు నమోదు చేస్తామని ఇటలీ ప్రభుత్వం హెచ్చరించింది. -
హుజూరాబాద్ షెడ్యూల్ ఇప్పట్లో లేనట్లే?
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ రేపో మాపో వెలువడుతుందనే ఉద్దేశంతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. కానీ జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఉద్దేశించి కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన లేఖ మాత్రం.. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలకు మరికొంత సమయం పట్టే అవకాశముందనే సంకేతాలు ఇస్తోంది. సీఈసీ ఈ నెల 9న లేఖ విడుదల చేసింది. ‘ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నిక జరపాల్సి ఉంది. కోవిడ్ పరిస్థితుల్లో గతంలో సాధారణ లేదా ఉప ఎన్నికలు జరిగే చోట అనుసరించాల్సిన మార్గదర్శకాలతో అనేక ఆదేశాలు, సూచనలు జారీ చేశాం. అయితే ఇప్పుడు నిర్వహించాల్సిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గతంలో జారీ చేసిన ఆయా మార్గదర్శకాలపై మీ పార్టీల అభిప్రాయాన్ని ఈ నెల 30వ తేదీలోగా వెల్లడించగలరు..’అని అందులో కోరింది. అభిప్రాయాలు పరిశీలించిన తర్వాతే.. గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు హరియాణా, రాజస్తాన్, కర్ణాటక, మేఘాలయ, ఏపీ, తమిళనాడులో పలు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. రాష్ట్రంలోనూ ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే సీఈసీ ఎన్నికల నిర్వహణపై పార్టీల అభిప్రాయాలను కోరడం, ఈ నెల 30లోగా సలహాలు, సూచనలు అందజేయాలని కోరిన నేపథ్యంలో ఇప్పట్లో ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడక పోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ పార్టీల నుంచి సూచనలు స్వీకరించిన తర్వాత వాటిని పరిశీలించడానికి సమయం పడుతుందని, ఆ తర్వాతే ఉప ఎన్నికలపై సీఈసీ నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. దీంతో పాటే శాసన మండలిలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికపైనా స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. తెలంగాణలో కోవిడ్ పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల సంఘానికి వివరాలు సమర్పించింది. -
‘బిల్గేట్స్ పచ్చి తాగుబోతు, యువతులతో నగ్నంగా స్విమ్మింగ్పూల్లో..’
న్యూయార్క్: విడాకుల ప్రకటన తర్వాత మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్పై సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆయన వ్యక్తిత్వంపై తీవ్ర ఆరోపణలు చేశాడు జేమ్స్ వాల్లేస్. జేమ్స్ వాల్లేస్.. గేట్స్ మీద రెండు బయోగ్రఫీలు రాశాడు.అందులో 80, 90 దశకాల్లో మైక్రోసాఫ్ట్ తొలినాళ్లలో గేట్స్.. విపరీతంగా పార్టీలు నిర్వహించేవాడని, ఆ టైంలో తన పదిహేడు గంటల పని తీరును పక్కనపెట్టాడని వాల్లేస్ పేర్కొన్నాడు. గేట్స్ లోకల్ నైట్ క్లబ్ల నుంచి అమ్మాయిల్ని పిలిపించుకునేవాడు. నగ్నంగా వాళ్లతో కలిసి ఈతలు కొట్టేవాడు. వాళ్ల చుట్టూ తిరిగేవాడు. తప్పతాగి జల్సాలు చేసేవాడని వాల్లేస్ ఆరోపించాడు. కొమ్డెక్స్, డెమో లాంటి సదస్సుల తర్వాత గేట్స్.. పార్టీల్లో పాల్గొనేవాడు. ఆ టైంలో బిల్గేట్స్ తప్పతాగే వాడని గతంలో రాబర్ట్ క్రింగ్లే అనే బ్లాగర్ రాసిన కథనాన్ని ప్రస్తావించాడు వాల్లేస్. ఇక ఈ ప్రకటనపై.. బిల్ గేట్స్ ప్రతినిధి ఒకరు మండిపడ్డారు. విడాకుల ప్రకటన తర్వాతే ఇలాంటి అసత్యమైన, అసంబద్ధమైన ప్రకటనలు వెలువడడం దారుణమని ఆక్షేపించారు. స్త్రీ లోలుడు : మాజీ ఉద్యోగి ఆరోపణ ఇక బిల్గేట్స్(65)పై మాజీ ఉన్నత ఉద్యోగి ఒకరు సంచలన ఆరోపణలకు దిగారు. ఇన్సైడర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఉద్యోగి.. 1988లో ఓరోజు ఉదయం ఓ మహిళపై వాలిపోయి కనిపించాడని, అప్పటికే మిలిండా గేట్స్తో ఆయన ప్రేమాయణం కొనసాగుతోందని ఆ ఉద్యోగి గుర్తు చేసుకున్నారు. ఇక మరో ఉద్యోగి బిల్గేట్స్ ఉద్యోగులందరితో సమానంగా ఉండేవాడు కాదని, తనకు నచ్చని వాళ్లపై అరిచేవాడని ఆరోపించారు. చదవండి: 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు ఎందుకు? -
కమలంలో లుకలుకలు!
బంజారాహిల్స్: కేబీఆర్ పార్కు వేదికగా బీజేపీలో నెలకొన్న లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు వద్ద శనివారం వాకర్లను ఓట్లు అభ్యర్థించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్రావు పాల్గొన్నారు. ఇదే కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ కూడా వచ్చారు. చింతల రావడంతోనే అప్పటికే అక్కడికి వచ్చిన పార్టీ నేత గోవర్ధన్ను పక్కకు జరగాలని సూచించారు. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన గోవర్ధన్ చింతలపై విరుచుకుపడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బాహాబాహికి దిగేందుకూ యత్నించారు. కాగా,పరిస్థితి చేయిదాటుతుండటంతో వెంట నే పక్కనే ఉన్న నేతలు కలగజేసుకొని ఇరు వర్గాల వారిని శాంతింపజేశారు. మొన్నటి కార్పొరేటర్ ఎన్నికల సమయంలో జూబ్లీహిల్స్ డివిజన్ బీజేపీ టిక్కెట్ ఇవ్వకుండా తనను మోసం చేశారని పల్లపు గోవర్ధన్ కోపంతో ఉన్నారు. దీంతో చింతలతో విభేదాలు తలెత్తాయి. -
ఏ రాష్ట్రంలో ఎవరు గెలిచేనో?
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత కీలక రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. వీటితో పాటు అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. వీటికి షెడ్యూల్ విడుదల కావడంతో ఆయా రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కెంది. పశ్చిమబెంగాల్ ఈ ఎన్నికలను జాతీయ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇప్పటికే నరేంద్ర మోదీకి పోటీగా ఎదగాలనుకుంటున్న మమతా బెనర్జీకి ఈ ఎన్నికలు సవాల్గా మారనున్నాయి. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టేందుకు శక్తియుక్తులు పెడుతోంది. మూడోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలనే పట్టుదలతో మమతా బెనర్జీ దూకుడుగా వెళ్తున్నారు. అయితే కొన్ని రోజులుగా పశ్చిమ బెంగాల్లో మమతాకు పరిణామాలు గడ్డుగా తయారయ్యాయి. ఈసారి ప్రధాన పోటీ బీజేపీతోనే ఉండనుంది. కమ్యూనిస్టులను అణగదొక్కిన మమతా కమలదళాన్ని రాష్ట్రంలో అణచివేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే బీజేపీకి అనూహ్యంగా బలం పెరిగింది. 2019 లోక్సభ ఎన్నికల్లో టీఎంసీకి పోటీగా బీజేపీ నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు తృణమూల్లోని ప్రధాన నాయకులందరూ కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే మమతకు పోరాటం కొత్తేం కాదు. ఎంతమంది వెళ్లినా ఆమె ఒంటిచేత్తో సత్తా చాటగల ధీరశాలి.. అపర కాళీగా పేరు ఉంది. దీంతో బీజేపీకి ధీటుగా ప్రచారం చేసి పదేళ్ల తన పాలనను వివరించడంతో పాటు మోదీ పాలనను ఎండగడుతూ ఎన్నికలకు మమత వెళ్తున్నారు. అయితే పదేళ్ల మమత పాలన వైఫల్యాలను ఎండగడుతూనే మోదీ చరిష్మాను ఈ ఎన్నికలకు వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే తృణమూల్లోని కీలక నాయకులను పార్టీలో చేర్చుకుని మమతకు పెద్ద దెబ్బ కొట్టారు. ఇక ఎన్నికల్లోనూ ఇలాంటి చావుదెబ్బ టీఎంసీకి తప్పదని కమల దళం భావిస్తోంది. తమిళనాడు తొలిసారిగా తమిళ రాజకీయాల్లో ఉద్ధండ నాయకులైన జయలలిత, కరుణానిధి లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళ రాజకీయాలను ఇప్పటివరకు జాతీయ పార్టీలు అంతగా ప్రభావితం చేయలేదు. కానీ ఈసారి ఆ పరిస్థితి మారేలా కనిపిస్తోంది. ముఖ్యంగా నాయకత్వ లేమి అనేది తమిళనాడులో స్పష్టంగా కనిపిస్తోంది. జయలలిత ఆకస్మిక మరణంతో అన్నాడీఎంకే, కరుణానిధి మృతితో డీఎంకేలు డీలా పడ్డాయి. శ్రేణులను నడిపించే నాయకత్వం లేదు. అన్నాడీఎంకేలో వర్గ విబేధాలు తారస్థాయిలో ఉన్నాయి. పైకి విబేధాలు లేవని చెబుతున్నా ముఖ్యంగా పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య తీవ్ర విబేధాలు ఉన్నాయి. పదేళ్లుగా అధికారానికి దూరమైన డీఎంకే శ్రేణులు నిరాశలో ఉన్నారు. స్టాలిన్ ఉన్నా అంతగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఇక ఇటీవల జైలు నుంచి వచ్చిన జయలలిత స్నేహితురాలు శశికళ ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అన్నాడీఎంకేను చీల్చే అవకాశం ఉంది. అన్నాడీఎంకే, డీఎంకే మధ్యలో శశికళ వర్గం లబ్ధి పొందేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. అయితే అన్నాడీఎంకేకు పరోక్షంగా బీజేపీ మద్దతు తెలుపుతోంది. జయలలిత మరణం తర్వాత జరిగిన పరిణామాల్లో బీజేపీ పాత్ర ఉందని అందరికీ తెలిసిన రహాస్యమే. ఇప్పుడు కూడా అన్నాడీఎంకే రహాస్య సంబంధాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాల అనంతరం అన్నాడీఎంకే, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ ప్రభావం అంతంతగానే ఉండవచ్చు. అయితే ఈ నడిమధ్యలో సినీ నటులు కమల్హాసన్ ఉన్నా అతడి ప్రభావం ఏం ఉండకపోవచ్చు. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం చేసి ఉంటే తమిళ రాజకీయాల్లో తీవ్ర ప్రభావం ఉండేది. అయితే ఈ ఎన్నికల్లో రజనీ ఎవరికి మద్దతు తెలుపుతారనే అంశం ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. కేరళ దక్షిణాదిలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ఆదర్శ రాష్ట్రంగా కేరళను చెబుతారు. ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉంది. సీపీఎంతో కూడిన కూటమి పాలన సాగిస్తోంది. ఇక్కడ మళ్లీ పినరయి విజయనే అధికారంలోకి వచ్చేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. రాహుల్గాంధీ విస్తృతంగా పర్యటిస్తూ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. సీపీఎం నేతృత్వంలో ఎల్డీఎఫ్ లేదా కాంగ్రెస్తో కలిసి ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే బీజేపీ ఈసారి ఎలాగైనా ప్రభావం చూపాలని తహతహలాడుతోంది. గత ఎన్నికల్లో ఒక స్థానంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. అస్సాం ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం కొనసాగుతోంది. గత ఎన్నికల్లో సత్తా చాటి అధికారం చేపట్టిన బీజేపీ ఈసారి కూడా అదే ఊపుతో కొనసాగే అవకాశం ఉంది. మోదీ చరిష్మా, ఐదేళ్ల పాలనను వివరిస్తూ బీజేపీ ఎన్నికలకు వెళ్తుండగా.. కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వ వైఫల్యాలతో పాటు మోదీ పాలనలో జరుగుతున్న పరిణామాలు, జాతీయ అంశాలను కీలకంగా చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఎన్నికల్లో సత్తా చాటితే భవిష్యత్లో ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో ఆ పార్టీ ప్రభావం చూపే అవకాశం ఉంది. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న పుదుచ్చేరిలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనకు లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసు చేశారు. అయితే ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా ఉన్నాయి. నువ్వానేనా అన్నట్టు రెండు జాతీయ పార్టీల మధ్య రాజకీయం నడిచే అవకాశం ఉంది. 2016 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పశ్చిమ బెంగాల్: 294 స్థానాలు ►టీఎంసీ- 211 ►వామపక్షాలు- 79 ►బీజేపీ-3 ►ఇతరులు-1 పుదుచ్చేరి: 30 స్థానాలు ►ఏఐఎన్ఆర్సీ-8 ►కాంగ్రెస్-17 ►ఏడీఎంకే-4 ►ఇతరులు-1 అసోం: 126 స్థానాలు ►కాంగ్రెస్- 26 ►బీజేపీ+: 86 ►ఏఐడీయూఎఫ్-13 ►ఇతరులు-1 తమిళనాడు: 234 ►ఏడీఎంకే- 136 ►డీఎంకే+: 98 కేరళ: 140 స్థానాలు ►ఎల్డీఎఫ్: 91 ►యూడీఎఫ్: 47 ►బీజేపీ:1 ►ఇతరులు: 1 -
సమరానికి సై
సాక్షి, పర్చూరు (ప్రకాశం): ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి 2019 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యాయి. ఈసారి పర్చూరు అసెంబ్లీ బరికి బహుముఖ పోటీ నెలకొననుంది. ఓటమి ఎరుగని రాజకీయ ఉద్దండుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రస్తుతం పోటీలో నిలిచి మరో మారు విజయకేతనం ఎగురవేయాలని ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీడీపీ తరపున ఏలూరి సాంబశివరావు, బీజేపీ తరపున చెరుకూరి రామయోగేశ్వరరావు, కాంగ్రెస్ తరపున పొన్నగంటి జానకీరామయ్య, జనసేన కూటమి తరపున బీఎస్పీ అభ్యర్థి పెదపూడి విజయ్కుమార్ పోటీ చేయనున్నట్లు ఆయా పార్టీలు ప్రకటించాయి. పలువురు స్వతంత్ర అభ్యర్థులు సైతం ఇప్పటికే తమ నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి: దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుట్టినతేదీ: 14–12–1953 విద్యార్హత: ఎం.బి.బి.ఎస్, పీజీ తల్లిదండ్రులు: రమాదేవి, చెంచురామయ్య సామాజిక వర్గం: ఓసీ కుటుంబం: భార్య పురందేశ్వరి కుమార్తె: నివేధిత కుమారుడు: హితేష్చెంచురామ్ స్వగ్రామం: కారంచేడు గ్రామం, కారంచేడు మండలం, ప్రకాశం జిల్లా టీడీపీ అభ్యర్థి: ఏలూరి సాంబశివరావు పుట్టినతేదీ: 26–01–1977 విద్యార్హత: ఎమ్మెస్సీ (హర్టీకల్చర్) తల్లిదండ్రులు: ఏలూరి నాగేశ్వరరావు, సుశీలమ్మ సామాజిక వర్గం: ఓసీ కుటుంబం: భార్య మాలతి కుమారులు: దివేశ్, మైనాంక్ తారక్ స్వస్థలం: కోనంకి గ్రామం, మార్టూరు మండలం బీజేపీ అభ్యర్థి: చెరుకూరి రామయోగేశ్వరరావు పుట్టినతేదీ: 30–07–1966 విద్యార్హత: 10వ తరగతి తల్లిదండ్రులు: వెంకట సుబ్బయ్య, అన్నపూర్ణమ్మ సామాజిక వర్గం: ఓసీ కుటుంబం: భార్య: రమాదేవి కుమారులు: వెంకటకృష్ణ, పవన్కుమార్ స్వస్థలం: గన్నవరం గ్రామం, యద్దనపూడి మండలం కాంగ్రెస్పార్టీ అభ్యర్థి: పొన్నగంటి జానకీరామారావు వయస్సు: 49 సం.లు విద్యార్హత: 7వ తరగతి తల్లిదండ్రులు: వెంకటేశ్వర్లు, శివనాగమల్లేశ్వరి సామాజిక వర్గం: ఓసీ కుటుంబం : భార్య: నాగరాజకుమారి కుమారులు: రామోజీరావు, లక్ష్మీనరేంద్రబాబు, తివిక్రమార్కుడు స్వస్థలం: ఇంకొల్లు గ్రామం, మండలం బీఎస్పీ అభ్యర్థి: పెదపూడి విజయ్కుమార్ పుట్టినతేదీ: 10–07–1989 విద్యార్హత: ఎం.ఏ., ఎం.ఫీల్ (పీహెచ్డీ) తల్లిదండ్రులు: పూర్ణ్ణచంద్రరావు, అక్కాయమ్మ సామాజిక వర్గం: ఎస్సీ కుటుంబం : భార్య: అనురాధాలక్ష్మీ కుమార్తె: సుజితావిజయ్ స్వస్థలం: ముప్పాళ్ల గ్రామం, నాగులుప్పలపాడు మండలం 25 న నామినేషన్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బీజేపీ అభ్యర్థి చెరుకూరి రామయోగేశ్వరరావు, బీఎస్పీ తరపున పెదపూడి విజయ్కుమార్ కూడా ఈనెల 25వ తేదీన నామినేషన్ వేయనున్నట్లు ఆయా పార్టీల అభ్యర్థులు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తరపున హరిబాబు, శ్రీకాంత్లు ఆర్ఓ సుధాకర్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. కాంగ్రెస్ అభ్యర్థి పి. జానకీరామారావు కూడా నామినేషన్ వేశారు. -
మనం అడిగితే సీటిస్తారంటావా..!
అప్పారావు: ఏందిరో సుబ్బారావు ఏదో ఆలోచనలో పడ్డావ్. సుబ్బారావు: ఏం లేదురా! ఏ పనీపాటా లేదని ఇంట్లో వాళ్లు రోజూ తిట్టరాని తిట్లు తిడుతున్నారు. ఏదైనా పనిలో చేరదామని ఆలోచిస్తున్నారా. ఏం చేయమంటావ్! అప్పారావు: ఓ పనిచేయరా. రాజకీయాల్లోకి వస్తావా! సుబ్బారావు: ఏం రా. ఎగతాళి చేస్తున్నావా. రాజకీయాల్లోకి మనలాంటోళ్లని ఎవర్రానిస్తారా..! అప్పారావు: ఒరేయ్ పిచ్చి సుబ్బిగా అది ఒకప్పుడ్రా. ఇప్పుడు సీట్లిస్తాం బాబూ...పోటీ చేయండంటూ బోలేడు పార్టీలొస్తున్నాయిరా. సుబ్బారావు: అవున్లేరా. చిన్నా చితకా పార్టీలు...ఊరూ పేరూ లేని పార్టీలు తరఫున నిలబడితే మన ఓట్లు మనకే పడవు కదరా. అప్పారావు: అరే వెర్రివెంగళప్పా. ఊరు...పేరు లేని పార్టీలు కాదురా. వందేళ్లపైగా చరిత్ర ఉన్న జాతీయ పార్టీ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తావా.! సుబ్బారావు: ఒరేయ్ మరీ వెర్రోడ్ని సేయమాకు. దేశాన్ని ఏకధాటిగా పాలించిన కాంగ్రెస్ మనలాంటోళ్లకి సీట్లిచ్చిద్దా...చెవిలో పూలు పెట్టమాకురా.! అప్పారావు: సుబ్బిగా నేను చెబుతుంది నిజంరా. రాష్ట్రాన్ని చీల్చిందని ఆపార్టీలో ఉన్న చిన్నా..పెద్దా.. తేడా లేకుండా అందరూ ఖాళీ చేసి వెళ్లారు. ఉన్న నాయకులను ఆపార్టీ తరఫున పోటీచేయమని అడిగితే ఇప్పుడే వస్తామని మళ్లీ కనిపించడం లేదంటా. సుబ్బారావు: ప్చ్..కాంగ్రెస్కు అంత పరిస్థితా..! అయితే మనం అడిగితే సీటిస్తారంటావా..! అప్పారావు: అడక్కుండా ఇస్తున్నారు. ఒకసారి ప్రయత్నిద్దామా..! ఏందీ. సుబ్బారావు: ఎన్నికల్లో నిలబడాలంటే డబ్బు కావాలి కదరా..! ఎలా కుదురుతుంది. అప్పారావు: ఒరేయ్ పిచ్చి మొఖమా...కాంగ్రెస్ పార్టీ జాతీయపార్టీ...పైగా డబ్బున్న పార్టీ. పార్టీ ఫండ్ కింద మూడు, నాలుగు కోట్లిస్తుంది. అందులో సగం ఖర్చు పెట్టినా మిగిలిన సగంతో ఎంచక్కా బతికిపోవచ్చు. సుబ్బారావు: అయితే నేను నిలబడతారా. అప్పారావు: ఒరేయ్ అప్పిగా నువ్వు కూడా నాకుమాదిరిగానే పనీపాట లేకుండా ఖాళీగా ఉన్నావ్గా. నువ్వు కూడా ఏదో నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యరా... అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సీట్లు ఖాళీగా ఉన్నాయంటున్నావుగా....అదే మాదిరిగా మన ఆవారా బ్యాచ్గాళ్లకు కూడా చెప్పు పోటీ చెయ్యమని! –సాక్షి, చీరాల -
గెలుపే లక్ష్యం
శాసనసభ ఎన్నికల్లో సంగారెడ్డి మినహా మిగతా నాలుగు అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందిన టీఆర్ఎస్.. పంచాయతీ ఎన్నికలపైనా దృష్టి సారించింది. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే లోక్సభ ఎన్నికలు జరగనుండడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన క్రియాశీల కార్యకర్తలు, నాయకులకు ప్రాధాన్యత ఇస్తూనే, గెలుపే లక్ష్యంగా సర్పంచ్, వార్డు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించేలా వ్యూహం సిద్ధం చేస్తోంది. రిజర్వేషన్ కోటాకు అనుగుణంగా సంబంధిత కేటగిరీలో బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతలను ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు. – సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికలను జనవరి నెలాఖరులోగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు వేగవంతం చేసింది. ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన రిజర్వేషన్ల ఖరారు అంశం కొలిక్కిరాగా, నేడో రేపో గ్రామ పంచాయతీల వారీగా వివరాలు విడుదల చేయనున్నారు. జిల్లాలోని 647 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలు, 5,778 వార్డు సభ్యుల ఎన్నిక జరగనుండడంతో గ్రామ స్థాయిలో రాజకీయం వేడెక్కింది. రాజకీయ పార్టీలు, వాటి గుర్తులతో సంబంధం లేకుండా ఎన్నికలు జరుగుతుండడంతో గ్రామాలపై పట్టు నిలపుకొనేందుకు అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ సాధించిన టీఆర్ఎస్.. ఐదేళ్ల పాటు గ్రామ స్థాయిలో పాలన సజావుగా సాగేందుకు తమ పార్టీ మద్దతుదారులు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల్లో తమ పార్టీ మద్దతుదారులు ఉండాలని కోరుకుంటోంది. దీంతో గ్రామ పంచాయతీ రాజకీయాలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా దృష్టి సారించారు. జిల్లాలో సంగారెడ్డి మినహా, మిగతా నాలుగు అసెంబ్లీ స్థానాల్లోనూ టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తమకు గ్రామ స్థాయిలో అండగా నిలబడిన వారితో పాటు, తమకు విధేయులుగా ఉండేవారిని బరిలోకి దించా లని టీఆర్ఎస్ శాసనసభ్యులు యోచిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేయడంతో పాటు, ప్రజాదరణ, ఆర్థిక వనరులు ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ అధిష్టానం నుంచి ఎమ్మెల్యేలకు ఆదేశాలు అందినట్లు సమాచారం. ఏదేని రిజర్వుడు కేటగిరీలో ప్రజాదరణ ఉండి, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కార్యకర్తలకు అవసరమైన ఆర్థిక భారం చేయాల్సిందిగా ఎమ్మెల్యేలకు సూచించి నట్లు సమాచారం. ఎంపీలు, ఎమ్మెల్సీలకూ బాధ్యత? ఈ ఏడాది ఏప్రిల్లో జరిగే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ఆర్థిక సాయం, ప్రచారం తదితర అంశాల్లో ఎంపీలు కూడా బాధ్యతలు తీసుకోవాలని టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. గ్రామ స్థాయిలో పదవుల కోసం పార్టీలోనే అంతర్గతంగా నేతలు, కార్యకర్తల నడుమ పోరు తీవ్రంగా ఉండే అవకాశం ఉండడంతో, పార్టీ తరఫున ఒకే వ్యక్తి పోటీలో ఉండేలా చూడాలని నిర్ణయించారు. అదే సమయంలో అవకాశం దక్కని కేడర్ పార్టీని వీడకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే వ్యూహంతో ఎమ్మెల్యేలు ఉన్నారు. గ్రామ పంచాయతీల వారీగా రిజర్వేషన్ల వివరాలు అధికారికంగా వెలువడిన వెంటనే, రిజర్వుడు కేటగిరీని అనుసరించి గ్రామాల వారీగా బలమైన అభ్యర్థుల జాబితాను తయారు చేసే పనిలో టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ కేడర్లో సమన్వయం లోపం తలెత్తితే లోక్సభ ఎన్నికల ఫలితాలపై ప్రభావం ఉంటుందనే కోణంలో పార్టీ ఎమ్మెల్యేలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు, ఎమ్మెల్సీలకు కూడా ప్రచారం, సమన్వయ బాధ్యతలు అప్పగిం చడం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టాలనే యోచనలో టీఆర్ఎస్ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీకి పట్టున్న గ్రామ పంచాయతీల్లో ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నించాలని, సాధ్యం కాని పక్షంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. -
పాత అభ్యర్థుల మధ్యే పోటీ
సాక్షి, ఇల్లెందు: నియోజకవర్గంలో మళ్లీ నలుగురు పాత అభ్యర్థుల మధ్యే పోటీ సాగుతోంది. ఐదు దఫాలు గెలిచి మూడు దఫాలు ఓడిపోయిన గుమ్మడి నర్సయ్య, మూడు దఫాలు గెలిచి నాలుగు దఫాలు ఓడిపోయిన ఊకె అబ్బయ్య, రెండు దఫాలు ఓడిపోయి ఒక దఫా గెలిచిన కనకయ్య, గడిచిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన హరిప్రియ మధ్య పోటీలో నిలిచారు. ఈ దఫా 16 మంది బరిలో ఉండగా ఈ నలుగురుతో పాటు బీజేపీ కూడా పోటీ పడుతోంది. నెల రోజుల క్రితం టీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కోరం కనకయ్య, ప్రజాకూటమి తరుపున కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రియ, బీజేపీ తరుపున మోకాళ్ల నాగస్రవంతి పోటీ చేస్తున్నారు. చివరి వరకు కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించిన రెబెల్ అభ్యర్థి ఊకె అబ్బయ్య స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ప్రధానంగా పోటీలో ఈ నలుగురు మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది. ప్రచారంలో ఎవరికివారు.. టీఆర్ఎస్ అభ్యర్థి కోరం కనకయ్య నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ప్రచారం చేయడంతోపాటు ఇంటింటి ప్రచారం చేశారు. నెల రోజుల నుంచి కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ జత కట్టడంతో బలమైన కూటమిగా మారనుంది. సహజంగానే కాంగ్రెస్కు అత్యధిక ఓటు బ్యాంకు ఉంది. టీడీపీ, సీపీఐ జత కావడంతో బలంగా మారే అవకాశం ఉంది. ఎన్డీ రాయల వర్గం గుమ్మడి నర్సయ్యను, చంద్రన్న వర్గం యదళ్లపల్లి సత్యంను మరోమారు తమ అభ్యర్థులుగా ప్రకటించుకుని ప్రచారం ముమ్మరం చేశారు. అగ్రనేతల రాక కోసం ఎదురు చూపు... టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం అగ్ర నేతలను రప్పించి ప్రచారం నిర్వహించుకునే ఏర్పాట్లు చేస్తున్నాయి. టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు, రాష్ట్ర నేతలను, కాంగ్రెస్ రేవంత్రెడ్డిని దించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. బీజేపీ మాత్రం అమిత్షా, మురళీధర్రావును దించి ప్రచారం చేయాలని భావిస్తోంది. ఎన్డీ బహిరంగ సభను నిర్వహించి తమ విధానాలను ప్రజలకు వివరించే యత్నంలో ఉంది. జిల్లాల విభజన తర్వాత.. జిల్లాల విభజన తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలోకి చేరింది. కామేపల్లి మండలం ఖమ్మంలో, గార్ల, బయ్యారం మహబూబాబాద్ జిల్లాలో ఇల్లెందు, టేకులపల్లి మండలాలు, ఇల్లెందు మున్సిపాల్టీ భద్రాద్రి జిల్లాలో ఉంది. ప్రస్తుతం ఇల్లెందు, గార్ల, బయ్యారం, కామేపల్లి, టేకులపల్లి, ఇల్లెందు మున్సిపాలిటీతో సాగుతున్న నియోజకవర్గంలో 1,96,798 మంది ఓటర్లు ఉండగా ఇందులో 97,552 మంది పురుషులు, 99,230 స్త్రీలు, 16 ఇతరులు మంది ఉన్నారు. నియోజకవర్గంలో 230 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పాత కాపుల మధ్య పోరు ఎవరి వైపునకు మొగ్గుతుందో వేచి చూడాల్సి ఉంది. మరిన్ని వార్తాలు... -
అన్నా..జర నీ దయనే..
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. వాటి పరిశీలన అనంతరం బరిలో నిలిచే అభ్యర్థులెవరో గురువారం తేలనుంది. ఇప్పటికే బీఫాంతో నామినేషన్ వేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు రెబెల్గా నిలిచిన వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. తీరొక్క విధంగా నచ్చజెబుతూ.. బతిమిలాడుతూ.. బరి నుంచి తప్పించేం దుకు నానా పాట్లు పడుతున్నారు. ‘అన్నా.. జర నీ దయనే’ గెలిస్తే మనకు మంచి భవిష్యత్ ఉంటుందని.. పోటీ నుంచి తప్పుకోవాలని సర్ది చెబుతున్నారు. కలిసికట్టుగా పనిచేసి.. పార్టీ ప్రతిష్టను నిలబెడుతూ విజయం వైపు పయనిద్దామంటూ సూచిస్తున్నారు. సాక్షి,ఖమ్మం: అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ పత్రాల ఉపసంహరణకు గురువారం చివరిరోజు కావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రధాన పార్టీల అభ్యర్థులు తిరుగుబాటు అభ్యర్థులు ఉపసంహరించుకునేలా ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్నికల్లో ప్రతి అంశం కీలకం కావడంతో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తే ఓట్లు చీలడంతోపాటు బలమైన ప్రత్యర్థి గెలుపునకు దోహదపడే అవకాశం ఉండడంతో ఆయా ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ పార్టీ నుంచి తిరుగుబాటు అభ్యర్థులుగా.. స్వతంత్రులుగా నామినేషన్ దాఖలు చేసిన వారిని బుజ్జగించేందుకు.. అనునయించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన వారిని ఒప్పించేందుకు.. మెప్పించేందుకు ప్రజాకూటమిలో భాగస్వామ్య పక్షమైన టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఫజల్ అహ్మద్తో కాంగ్రెస్ నేతలు, టీడీపీ నేతలు సమావేశమై.. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా పోటీ నుంచి విరమించుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. ఇక వైరా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన రాములునాయక్ కూటమి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయనను పోటీ నుంచి తప్పించేందుకు ప్రజాకూటమి భాగస్వామ్య పక్షాలు చేసిన ప్రయత్నాలు దాదాపు విఫలమయ్యాయి. టీఆర్ఎస్లోని అసంతృప్త వర్గం ఆయనకు తోడ్పాటు అందిస్తుండడంతో తాను రంగంలో ఉండి తీరుతానని రాములునాయక్ సొంత పార్టీ నేతలకు స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇల్లెందులో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన వారిలో అనేక మంది తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అధికారిక అభ్యర్థిగా బాణోత్ హరిప్రియ నామినేషన్ వేయగా.. తిరుగుబాటు అభ్యర్థులుగా మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య, దళ్సింగ్, చీమల వెంకటేశ్వర్లు, కిషన్నాయక్ తదితరులు నామినేషన్లు వేశారు. వీరిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇల్లెందులో గెలుపు అవకాశాలు కాంగ్రెస్కు మెండుగా ఉన్న సమయంలో తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలో ఉండడం పార్టీకి శ్రేయస్కరం కాదని, ప్రభుత్వం ఏర్పడితే అనేక అవకాశాలు వస్తాయని వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో మాట్లాడేందుకు అవసరమైతే టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డిని రంగంలోకి దించేందుకు కాంగ్రెస్ అభ్యర్థి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అశ్వారావుపేటలో ప్రజాకూటమి ఎన్నికల పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన సున్నం నాగమణి తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన వారిలో పలువురు ఇప్పటికే ప్రజాకూటమి అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుకు బహిరంగ మద్దతు ప్రకటించగా.. నాగమణి మాత్రం ఎన్నికల బరిలో దిగడంతో ఆమెను బరిలో నుంచి తప్పించడానికి ఇటు టీడీపీ.. అటు కాంగ్రెస్ నేతలు తమవంతు ప్రయత్నాలను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీలో ఓ ముఖ్య నేత ఆశీస్సులతో టికెట్ కోసం ప్రయత్నించిన సున్నం నాగమణి నామినేషన్ ఉపసంహరణకు సైతం ఆ ముఖ్య నేత ద్వారా నాగమణిని ఒప్పించేందుకు టీడీపీ నేతలు రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. వైరా నియోజకవర్గంలో సీపీఐ అభ్యర్థి బాణోతు విజయ నామినేషన్ దాఖలు చేయగా.. తిరుగుబాటు అభ్యర్థిగా లాల్సింగ్ నామినేషన్ వేశారు. ఆయన చేత నామినేషన్ ఉపసంహరింప జేయడానికి సీపీఐ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. పాలేరు వంటి స్థానాల్లో స్వతంత్రులు అత్యధికంగా నామినేషన్ దాఖలు చేయగా.. వారు ఎన్నికల బరి నుంచి తప్పుకునేలా చేసేందుకు ఆయా పార్టీలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. -
అసంతృప్తుల..రగడ!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : నామినేషన్ల ఘట్టం సోమవారంతో ముగిసింది. ఇక, ఎన్నికల బరిలో ఎందరు మిగులుతారో బుధవారం సాయంత్రం కల్లా తేటతెల్లం అవుతుంది. ఇప్పటికే రెబల్స్గా నామినేషన్లు వేసిన వారిని దారికి తెచ్చుకునేందుకు బుజ్జగింపులు మొదలయ్యాయి. కానీ.. ఇన్నాళ్లపాటు పార్టీని నమ్ముకుని పనిచేసిన వారు, టికెట్ తమకే వస్తుందన్న ధీమాతో ఉన్న నాయకులు పూర్తిగా నారాజ్గా ఉన్నారు. చివరి నిమిషంలో టికెట్లు గల్లంతయిన వారి పరిస్థితి గురించి చెప్పనలవి కాకుండా ఉంది. ఇక, చివరి నిమిషంలో పార్టీలు మారిన వారు, ఆయా పార్టీల్లో సీనియర్లను కాదని టికెట్లు దక్కించుకున్నవారు సంతోషంలో మునిగిపోగా, అవకాశం కోల్పోయిన వారు విచారంలో ఉన్నారు. తమ చేతికాడి అవకాశాన్ని లాక్కున్న వారిపై ఆగ్రహంగా ఉన్న నాయకులు రెబల్స్గా పోటీలో ఉంటామని భీష్మిచారు. దీంతో ఒకవైపు పార్టీ నాయకత్వాలు, టికెట్ దక్కించుకుని పోటీలో ఉన్న అభ్యర్థులు రెబల్స్ను బుజ్జగించే పనిలో పడ్డారు.చర్చనీయాంశంగా కోదాడ, మిర్యాలగూడ చివరి నిమిషంలో అన్యూహంగా టికెట్లు తారుమారైన కోదాడ, మిర్యాలగూడ నియోజకవర్గాలు చర్చనీయాంశంగా మారాయి. కేవలం రెండు మూడు రోజుల కిందట పార్టీలు మారిన వారికి టికెట్లు దక్కడం ఆయా పార్టీల్లోని సీనియర్లకు మింగుడు పడడం లేదు. కోదాడలో టీఆర్ఎస్ టికెట్ పోటీ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, నియోజకవర్గ ఇన్చార్జి శశిధర్రెడ్డి మధ్య కొనసాగింది. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిన చందంగా చివరకు ఆ టికెట్ టీడీపీనుంచి గులాబీ గూటికి చేరిన బొల్లం మల్లయ్య యాదవ్కు దక్కింది. దీంతో నిస్తేజంలో కూరుకుపోవడంతో ఆ ఇద్దరు నేతల వంతైంది. వేనేపల్లి చందర్రావు ఈ విషయంలో కొంత కుదురుకున్నట్లు కనిపిస్తోంది. కానీ, టికెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న శశిధర్ రెడ్డి మాత్రం రెబల్గా బరిలోకి దిగుతున్నారు. ఆయన ఇప్పటికే ఇండిపెండెట్గా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో శశిధర్ను బుజ్జగించే పనిలో ఆపద్ధర్మ మంత్రి జగదీశ్రెడ్డి ఉన్నారు. ఆయన నామినేషన్ను ఉప సంహరించుకుని అభ్యర్థి విజయానికి సహకరిస్తారా..? లేదా..? ఆయన వర్గం ఎటు వైపు వెళుతుంది..? ఈ పరిణామాలతో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి చేకూరే లాభం ఎంత..? అన్న ప్రశ్నలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇదే తరహాలో మిర్యాలగూడ టికెట్ వ్యవహారం సంచలనం రేపింది. టీడీపీనుంచి గత ఎన్నికల్లో ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా గెలిచిన బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య చివరి నిమిషంలో కాంగ్రెస్లో చేరి, మిర్యాలగూడ టికెట్ దక్కించుకున్నారు. దీంతో ఈ స్థానం నుంచి బరిలోకి దిగాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న నాయకులు షాకయ్యారు. ఈ స్థానాన్ని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్రెడ్డి ఆశించారు. ఆయనకు టికెట్ ఇవ్వని పక్షంలో తనకు ఇవ్వాలని ఇటీవలే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన అలుగుబెల్లి అమరేందర్రెడ్డి కోరారు. ఈ స్థానం నుంచి తమ అభ్యర్థి పోటీలో ఉంటారని మహా కూటమి భాగస్వామ్య పక్షం తెలంగాణ జనసమితి(టీజేఎస్) ప్రకటించి విద్యాధర్ రెడ్డికి బీఫారం కూడా అందించింది. మరో వైపు టీఆర్ఎస్లో టికెట్ దక్కక, కాంగ్రెస్కు చేరిన అలుగుబెల్లి అమరేందర్ రెడ్డికి అక్కడా చేదు అనుభవం ఎదురు కావడంతో ఆయన ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో మిర్యాలగూడ రాజకీయం ఆసక్తికరంగా మారింది. దేవరకొండ కాంగ్రెస్లోనూ ఇదే చిత్రం కనిపిస్తోంది. టికెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న బిల్యానాయక్కు మొండి చేయిచూపారు. జెడ్పీ చైర్మన్ బాలూనాయక్కు టికెట్ దక్కింది. దీంతో బిల్యానాయక్ పోటీలో ఉండడానికే నిర్ణయించుకుని నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం నామినేషన్ల ఉప సంహరణ తర్వాత కానీ అసంతృప్తులంతా బరిలో నిలుస్తారా..? వెనక్కి తగ్గుతారా..? ఏ స్థానంలో పోటీ ఎలా ఉండబోతోంది.? అన్న అంశాల్లో స్పష్టత రానుంది. -
ఎన్నికల అక్రమాలపై నిఘా
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో జరిగే అక్రమాలపై నిరంతరం నిఘా ఉంచటంతోపాటు ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహించేందుకు ఎన్నికల నిఘా కమిటీ ఏర్పాటైంది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీలో వివిధ రంగాల ప్రముఖులు ఉండనున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహించనుంది. ఓటరు జాబితాలో అవకతవకలు, పార్టీల మేనిఫెస్టోలు, ప్రచారం, డబ్బు, మద్యం పంపిణీ తదితర అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని పద్మనాభరెడ్డి తెలిపారు. అవసరమైతే ఎన్నికల కమిషన్, పోలీసు, ఇతర అధికారుల దృష్టికి ఈ అంశాలు తీసుకెళ్తామని చెప్పారు. అలాగే అభ్యర్థులతో ఉమ్మడి వేదికలు నిర్వహించడం, ఓటింగ్ శాతం పెంచడానికి ఓటర్లను చైతన్యం చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 20 స్వచ్ఛంద సంస్థలతో కలసి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. -
పార్టీ మీది.. ఏర్పాట్లు మావి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పుట్టిన రోజు, పెళ్లి రోజు వంటి ప్రత్యేక సందర్భాలు కావచ్చు... హాలిడే ట్రిప్స్, బ్యాచ్లర్, వీకెండ్ పార్టీలు కావచ్చు.. ఈవెంట్ ఏదైనా సరే అరేంజ్మెంట్స్ చేయడం పెద్ద పని. పోనీ, ఏ హోటల్లోనో కానిచ్చేద్దామంటే బడ్జెట్ భారమవుతుంది. పార్టీకయ్యే ఖర్చుకంటే ఏర్పాట్ల ఖర్చే తడిసిమోపెడవుతుంది. అలాకాకుండా కారు అద్దెకు తీసుకున్నట్టు పార్టీకి అవసరమైన ఉత్పత్తులనూ అద్దెకు తీసుకుంటే? ఇదే వ్యాపార సూత్రంగా మలచుకుంది బెంగళూరుకు చెందిన రెంట్షేర్. మన దేశంతో పాటూ దుబాయ్, షార్జా, అబుదాబిల్లోనూ తక్కువ ఖర్చుతో పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. మరిన్ని వివరాలు రెంట్షేర్ ఫౌండర్ అండ్ సీఈఓ హార్ష్ దండ్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘ఐఐటీ ఢిల్లీ నుంచి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ చేశాక.. ఐబీఎం రీసెర్చ్లో ఉద్యోగంలో చేరా. కొత్త కంపెనీ ప్రారంభించాలనే ఆలోచనతో 2008లో ఆక్స్వర్డ్ వర్సిటీ నుంచి ఎంబీఏ చేశా. అక్కడ చూసిన రెంటింగ్ ట్రెండ్ మన దేశంలోనూ ప్రారంభించాలని నిర్ణయించుకొని 2015 అక్టోబర్లో బెంగళూరు కేంద్రంగా రెంట్షేర్ స్టార్టప్ను ప్రారంభించా. ఆఫ్లైన్లో దొరికే ప్రతి వస్తువూ ఆన్లైన్లో అద్దెకివ్వాలన్నదే రెంట్షేర్ లక్ష్యం. 40 కేటగిరీలు.. 12 వేల ఉత్పత్తులు.. ప్రొజెక్టర్స్, ఎల్ఈడీ స్క్రీన్స్, స్పీకర్స్, బార్బిక్యూ గ్రిల్స్, హుక్కా సెట్స్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, మెడికల్ ఉత్పత్తులు ఇలా 40 కేటగిరీల్లో సుమారు 12 వేల ఉత్పత్తులున్నాయి. వీటిని గంటలు, రోజులు, వారం లెక్కన అద్దెకు తీసుకోవచ్చు. కనీస ఆర్డర్ విలువ రూ.వెయ్యి. ఉత్పత్తుల డెలివరీ, పికప్ బాధ్యత వెండర్దే. ఉత్పత్తుల అద్దె కోసం స్థానికంగా ఉండే వెండర్లతో ఒప్పందం చేసుకున్నాం. ప్రస్తుతం 600 మంది వెండర్లున్నారు. హైదరాబాద్ నుంచి 55 మంది ఉన్నారు. ఐపీఎల్, ఫీఫా వరల్డ్ కప్ సమయంలో ఎల్ఈడీ వాల్స్కు, స్పీకర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కర్ణాటక ఎలక్షన్ సమయంలో ఎల్ఈడీ వాల్స్ అద్దెకు తీసుకున్నారు. దీని ధర రోజుకు రూ.11 వేలు. హాబీస్, ట్రావెల్స్లోకి విస్తరణ.. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ నగరాలతో పాటూ దుబాయ్, అబుదాబి, షార్జాలల్లో సేవలందిస్తున్నాం. వీకెండ్స్, సమ్మర్ పార్టీలు, పెళ్లి, బర్త్డే పార్టీలు దుబాయ్లో ఎక్కువగా జరుగుతుంటాయి. అందుకే విదేశాల్లో మొదటగా దుబాయ్లో ప్రారంభించాం. వచ్చే నెలాఖరు నాటికి పుణే, కోచి, చండీగఢ్ నగరాలకు విస్తరించనున్నాం. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో వంద మంది వెండర్లతో ఒప్పందం చేసుకున్నాం. రెండు వారాల్లో హాబీస్, ట్రావెల్ విభాగంలోకి విస్తరించనున్నాం. అంటే డ్రోన్ కెమెరాలు, ఐస్ బాక్స్లు, డిస్కో లైట్లు, స్నో మిషన్స్, బీన్ బ్యాగ్స్ వంటి ఉత్పత్తులను అద్దెకిస్తాం. హైదరాబాద్ వాటా 20 శాతం... ప్రస్తుతం నెలకు 10 వేల ఉత్పత్తుల అద్దె ఆర్డర్లు వస్తున్నాయి. ఇందులో ఈవెంట్స్, పార్టీ ఉత్పత్తుల అద్దెలే 40% వరకుంటాయి. హైదరాబాద్ నుంచి నెలకు 1,200 ఉత్పత్తులు అద్దెకు తీసుకుంటున్నారు. గత రెండేళ్లలో 60 వేల మంది కస్టమర్లు మా సేవలను వినియోగించుకున్నారు. సుమారు 10 లక్షల ఉత్పత్తులను అద్దెకు అందించాం. మెడికల్ కేటగిరీలో వీల్ చెయిర్స్, ఆక్సిజన్ కిట్స్ వంటి వాటికి గిరాకీ పెరుగుతోంది. ప్రస్తుతం ఏటా రూ. 20 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాం. మా మొత్తం వ్యాపారంలో హైదరాబాద్ వాటా 20% వరకూ ఉంది. రూ.30 కోట్ల సమీకరణ.. ప్రస్తుతం కంపెనీలో 20 మంది ఉద్యోగులున్నారు. నెలాఖరు నాటికి టెక్నికల్ టీమ్లో మరో ఐదుగురిని తీసుకోనున్నాం. వచ్చే ఏడాది ముగింపు నాటికి 2 వేల మంది వెండర్లకు, రూ.60 కోట్ల ఆదాయానికి చేరుకోవాలని లకి‡్ష్యంచాం. ఇప్పటివరకు రూ.10 కోట్లు సమీకరించాం. ఐఐటీ–ఢిల్లీ, ఆక్స్వర్డ్ స్నేహితులతో పాటు దుబాయ్కు చెందిన ఇన్వెస్టర్లు ఈ పెట్టుబడి పెట్టారు. ఈ ఏడాది ముగింపులోగా మరో రూ.30 కోట్ల నిధులను సమీకరించనున్నాం. సౌదీకి చెందిన పలువురు ఇన్వెస్టర్లతో చర్చిస్తున్నాం. -
‘రేప్ చేయబోయాడని ఫిర్యాదు చేస్తా’
► రాజధానిలో అర్ధరాత్రి పార్టీలు ►పలుచోట్ల యువత మధ్య ఘర్షణలు ►మద్యం, డ్రగ్స్ మత్తులో అరాచకాలు తాడేపల్లి: రాజధాని ప్రాంతంలో యువకులు శృతి మించి వ్యవహరిస్తున్నారు. ఇద్దరూ గంజాయి మత్తులో ఉండడంతో సదరు కానిస్టేబుల్పై దురుసుగా ప్రవర్తించి, కానిస్టేబుల్ను కొట్టడానికి సిద్ధమయ్యారు. సదరు కానిస్టేబుల్ గట్టిగా ప్రశ్నించడంతో రేప్ చేయబోయాడని ఫిర్యాదు చేస్తానంటూ ఆ యువతి బెదిరింపులకు పాల్పడింది. దాంతో పోలీసులు స్థానిక రైతులను ఆశ్రయించడంతో రైతులు బుద్ధి చెప్పారు. 29 గ్రామాల్లో పంట పొలాలన్నీ ఖాళీగా ఉండడంతో చుట్టు పక్కల ప్రాంతాల నుంచి యువత ఇక్కడకు చేరి రాత్రి సమయంలో పార్టీలు చేసుకుంటూ మద్యం, గంజాయి, డ్రగ్స్ మత్తులో ఊగిసలాడుతున్నారు. అలా పార్టీలు జరిగే సమయంలో చిన్నపాటి ఘర్షణలైనా ఒకరినొకరు కొట్టుకోవడం, బ్యాచ్లుగా విడిపోయి ఐదారు రోజులు అదే గొడవలో నిమగ్నమవుతున్నారు. ఈ మధ్యకాలంలో మంగళగిరి శివార్లలో ఒక కాలేజీ యువకుడిని మరో కాలేజీకి చెందిన యువకులు దారుణంగా కొట్టి రోడ్డుపై పడవేసి వెళ్లిపోయారు. పోలీసుల దృష్టికి వచ్చినా తన్నులు తిన్న యువకుడు, అతని తల్లితండ్రులు పోలీసులకు సహకరించకపోవడంతో ఆ విషయం కాస్తా అటకెక్కింది. ముఖ్యంగా కృష్ణాయపాలెం, మంగళగిరి–కృష్ణాయపాలెం రోడ్డు, ఉండవల్లి–అమరావతి కరకట్ట నుంచి రాయపూడి వరకు వివిధ ప్రాంతాల్లో, తాడేపల్లి పట్టణ పరిధిలోని కుంచనపల్లి డొంకరోడ్లలోను, వడ్డేశ్వరం, గుండిమెడ, మెల్లెంపూడి, ఇప్పటం తదితర ప్రాంతాల్లో ఆడమగా తేడా లేకుండా పార్టీలు నిర్వహించుకుంటూ మత్తులో ఊగిసలాడుతున్నారు. ఈ మధ్య కాలంలో మెల్లెంపూడి–గుండిమెడ రోడ్డులో నలుగురు యువకులు ఓ యువతిని తీసుకొచ్చి గంజాయి సేవిస్తుండగా రైతు ప్రశ్నించి అక్కడ నుంచి వెళ్లిపొమ్మని సూచించాడు. దాంతో సదరు యువకులు ఆ యువతిని కార్లో పంపించి, రైతుపై దాడి చేసి అక్కడ నుంచి పరారయ్యారు. అలాగే ఉండవల్లి గుహల నుంచి సీఎం ఇంటికి వెళ్లే రహదారిలో యువతీ యువకులు మద్యం మత్తులో రోడ్డుపై బహిరంగ శృంగారం చేస్తుండడంతో సీఎం విధులు నిర్వహించడానికి వచ్చిన సిబ్బంది మందలించారు. ఇలా రాజధానిలో ఎక్కడ చూసినా యువత మద్యం, డ్రగ్స్ మత్తులో స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికైనా పోలీసులు స్పందించి గ్రామాలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. -
పార్టీ ఎన్నికల గుర్తుల ప్రాధాన్య కథ
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పార్టీపై పట్టుకోసమే కాకుండా సమాజ్వాది పార్టీ ఎన్నికల గుర్తయిన ‘సైకిల్’ కోసం కూడా తండ్రి ములాయం సింగ్ యాదవ్పై యుద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం ఎన్నికల కమిషన్ కోర్టులో ఉంది. మరోపక్క తండ్రీ, తనయుల మధ్య సయోధ్య కోసం ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటే హస్తం, భారతీయ జనతా పార్టీ అంటే కమలం, సమాజ్వాది పార్టీ అంటే సైకిల్, బహుజన సమాజ్వాది పార్టీ అంటే ఏనుగు గుర్తులు గుర్తొస్థాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా చదువురాని వారు తాము ఓటే వేయాలనుకున్న అభ్యర్థి పేరు వేళకు గుర్తురాకపోయినా, గుర్తునుబట్టి గుడ్డిగా ఓటు వేస్తారు. ఇలా పార్టీకి, ఎన్నికల గుర్తుకు విడదీయలేని బంధం పెనవేసుకుపోయింది. పార్టీలు చీలిపోయిన సందర్భాల్లో ఇంతటి ప్రాధాన్యం గల ఎన్నికల గుర్తులను కోల్పోయేందుకు ఏ వర్గమూ ఇష్టపడదు. అందుకనే ఎన్నికల కమిషన్ ముందు, అవసరమైన న్యాయస్థానాల ముందు ఈ వర్గాలు గుర్తుకోసం పోరాటం చేస్తాయి. సహజంగా మెజారిటీ వర్గం ఏ వర్గంవైపుందో ఆ వర్గానికే ఎన్నికల కమిషన్ ఎన్నికల గుర్తును కేటాయిస్తుంది. బలాబలాలను స్పష్టంగా తేల్చలేని సందిగ్ధ సమయాల్లో పార్టీ గుర్తును పక్కన పెట్టి జాబితాలో ఏ పార్టీకి కేటాయించని కొత్త గుర్తులను కేటాయిస్తుంది. అసలు ఈ గుర్తుల విధానం ఎలా వచ్చింది? అమెరికా లాంటి దేశంలో ఏనుగు, గాడిద గుర్తులు పార్టీ లోగోల నుంచి. కార్టూన్ల ప్రచారం నుంచి పుట్టుకురాగా మనకు నిరక్షరాస్యత కారణంగా పుట్టుకొచ్చాయి. స్వతంత్య్ర భారత దేశంలో 1951–52లో తొలి ఎన్నికలు జరిగిన నాటికి దేశంలో దాదాపు 80 శాతం మంది నిరక్షరాస్యులున్నారు. మనకంటే ఏడాది తర్వాత స్వాతంత్య్రాన్ని సాధించినప్పటికీ ఒకప్పటి సిలోన్, నేటి శ్రీలంకలో మనకన్నా ముందే ఎన్నికల గుర్తులతో ఎన్నికలు జరిగాయి. అలాంటి గుర్తులను మనం కూడా వాడితే నిరక్షరాస్యులకు సులభంగా ఉంటుందని అప్పటి భారత నాయకులు భావించారు. పెన్నులుగానీ, స్టాంపులుగానీ ఉపయోగించేవారు కాదు... నాడు శ్రీలంకలో ఎన్నికలకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించేవారు. కానీ ఆ గుర్తులకు ఓటేసినట్లు పెన్నుతో టిక్ కొట్టడంగానీ, ఎన్నికల స్టాంప్ కొట్టడంగానీ ఉండేది కాదు. ఓటర్లకు బ్యాలెట్ పత్రాలను ఇచ్చే వారు. పోలింగ్ బాక్సులకు పోటీ చేస్తున్న అభ్యర్థుల ఎన్నికల గుర్తులు ఉండేవి. ఓటర్లు తమ బ్యాలెట్ పత్రాలను తీసుకెళ్లి ఏ గుర్తుగల బాక్స్లో వేస్తే ఆ గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్థికి వేసినట్లుగా ఎన్నికల అధికారులు పరిగణించేవారు. తర్వాత లంకలోను, భారత్లోనూ రాజకీయ పార్టీలు పెరిగిపోవడం, స్వతంత్య్ర అభ్యర్థులు పెరిగిపోవడం వల్ల బ్యాలెట్ పత్రాలపైనే ఓటు వేసే విధానం పుట్టుకుచ్చింది. సాంకేతికాభివద్ధి కారణంగా నేడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వచ్చాయి. ఎన్నికల గుర్తులుగా వ్యవసాయ పరికరాలు... నాగలి, కాటెద్దులు, కోళ్లు, మేకలు, ఇతర జంతువులు ఎన్నికల గుర్తులుగా వచ్చాయి. నాగలి, కాటెద్దుల గుర్తుల కోసం పార్టీల మధ్య పోటీ పెరగడంతో వాటిని ఎన్నికల కమిషన్ అధికారులు ఆ తర్వాత పక్కన పెట్టారు. జంతువులను గుర్తులుగా పొందిన పార్టీలు వాటిని బోన్లో బంధించి ర్యాలీల్లో తిప్పేవారు. వన్యప్రాణి ప్రేమికులు జీవ హింసంటూ గొడవలు చేయడంతో అప్పటి నుంచి ఎన్నికల కమిషన్ జంతువుల గుర్తులను ఎవరికి కేటాయించడం లేదు. ప్రస్తుతానికి మానవ అంగమైన హస్తం కాంగ్రెస్కు, జంతువైన ఏనుగు ఒక్క బహుజన సమాజ్ పార్టీకే మిగిలాయి. టేబుల్ ఫ్యాన్, సీలింగ్ ప్యాన్, లేడీ పర్సు, నేల్ కట్టర్, క్యారమ్ బోర్డు, టీ కేటిల్, ప్రెషర్ కుక్కర్, జగ్గు, మగ్గు, అల్మారా, ఏర్ కండీషనర్, టార్చిలైట్, బ్యాట్, బాల్, పిల్లల గౌను ఇలా ఇళ్లలో కళ్లముందు కనిపించే వస్తువులన్నీ ఎన్నికల గుర్తులుగా మారిపోయాయి. ఎనవలప్ కవరు, వడబోత జాలి, గాలి బుడగ, ప్లేట్లు పెట్టుకునే ట్రే, క్యారెట్, కాలీఫ్లవర్, ఐస్క్రీమ్ లాంటి ఫన్నీ పేర్లు కూడా వచ్చాయి. తమ గుర్తులకు కాస్త పరమార్థం కూడా కనిపించాలని పార్టీలు కోరుకోవడం, ఆ దిశగా ఎన్నికల అధికారులు కూడా ఆలోచించడం వల్ల సైకిల్, రెండాకులు, గడ్డిపూల్ ఇలా కొత్త గుర్తులు వచ్చాయి. ఎన్నికల కమిషన్ ఏ ఉద్దేశం ఇచ్చినా తణమూల్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తన ఎన్నికల గుర్తు ‘గడ్డిపూలు (గ్రాస్ ఫ్లవర్స్)’ను గ్రాస్ రూట్స్లోకి చొచ్చుకుపోయిన పార్టీగా చెప్పుకుంటోంది. -
మళ్లీ తెరపైకి రామ్ మందిర్ పాలిటిక్స్
-
పేట్రేగుతున్న ఆకతాయిలు
– ఒంటరిగా తిరగాలంటే భయ పడుతున్న అమ్మాయిలు – మళ్లీ పెరుగుతున్న బ్యాచ్ల సంస్కృతి – అర్ధరాత్రి వేళలో బైకుల్లో సంచారం ప్రొద్దుటూరు క్రైం: చేతిలో బైక్.. జేబులో తల్లిదండ్రులు ఇచ్చిన ప్యాకెట్ మనీ.. పక్కన ఖర్చు చేయడానికి మిత్రులు.. ఇక మందు, బిరియానిలతో జల్సాలు చేయడం. అంత వరకూ అయితే ఇతరులకు వచ్చిన ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు. కానీ మద్యం మత్తులో వారు చేస్తున్న చేష్టలు వారి తల్లిదండ్రులతోపాటు అమ్మాయిలను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇదీ పట్టణంలో కొందరు ఆకతాయిలు చేస్తున్న పని. నడి రోడ్డులో తన్నుకోవడం, అమ్మాయి కోసం రెండు గ్రూపులు కొట్టుకోవడం లాంటి సంఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. ఈ తరహా కేసులు ఇటీవల కాలంలో అధికంగా పోలీస్స్టేషన్లకు వస్తున్నాయి. అయితే ఈ ఘటనల్లో విద్యార్థులుండటంతో వారి భవిష్యత్తు దృష్ట్యా పోలీసులు కౌన్సెలింగ్, వార్నింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. వారాంతపు రోజుల్లో అధికం: గతంలో గ్యాంగ్స్టర్ల గొడవతో భయానక వాతావరణం ఉండేది. తరచూ జరిగిన గొడవల్లో సుమారు 50 మంది విద్యార్థులపై పోలీసులు రౌడీషీట్ తెరిచారు. కొందరు తల్లిదండ్రులైతే గొడవలకు భయపడి తమ పిల్లలను హైదరాబాద్, తిరుపతి లాంటి ప్రాంతాలకు పంపించారు. తర్వాత పోలీసులు గట్టి చర్యలు తీసుకోవడంతో గొడవలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఇటీవల కాలంలో మళ్లీ యువకులు కలకలం సృష్టిస్తున్నారు. తల్లిదండ్రులు రూ.వేలకు వేలు ప్యాకెట్ మనీ ఇవ్వడమే గాక వారికి బైక్ కూడా కొనివ్వడంతో కొందరు యువకులు కాలేజీలకు డుమ్మా కొట్టి అల్లర్లకు పాల్పడుతున్నారు. వారాంతపు రోజుల్లో వీరి ఆగడాలు మరీ ఎక్కువ కనిపిస్తుంటాయి. సాయంత్రం వేళలో రింగ్రోడ్డు పరిసర ప్రాంతం, ఎర్రగుంట్ల రోడ్డులోని పార్కు, రైల్వేస్టేషన్ సమీపంలో సిట్టింగ్ వేసి మద్యం సేవిస్తుంటారు. మద్యం మత్తులో అమ్మాయిలను ఇబ్బందులకు గురి చేయడం, వాహనాలకు నష్టం కలిగించడం లాంటి పనులు చేస్తున్నారు. కొన్ని సంఘటనలు.. – రెండు నెలల క్రితం సాయిటీర్ కుటీర్ రోడ్డులో నలుగురు యువకులు మద్యం సేవించి అమ్మాయి విషయంలో ఘర్షణ పడ్డారు. ప్రధాన రహదారిలో ఈ సంఘటన జరగడంతో కొంత సేపు ట్రాఫిక్ స్తంభించి పోయింది. – కోనేటి కాల్వ వీధిలో, రామేశ్వరంరోడ్డులోని అనా బంకు సమీపంలో, ఆర్ట్స్ కాలేజీ రోడ్డులోని నాలుగు రోడ్ల సమీపంలో, గంగమ్మఆలయం వీధిలో, మార్కెట్ యార్డు ఆవరణలో వేర్వేరు బ్యాచ్లకు చెందిన వారు మద్యం మత్తులో తన్నుకున్నారు. ఇందులో గంగమ్మ ఆలయం వీధిలో జరిగిన గొడవకు సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేశారు. – నెహ్రూ రోడ్డులోని నాలుగు రోడ్ల కూడలిలో కొందరు గ్రూపులుగా ఏర్పడి ఆ ప్రాంతంలో వెళ్లే కళాశాల, పాఠశాల విద్యార్థినులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆ ప్రాంత వాసులు అంటున్నారు. – ఇటీవల కోనేటి కాలువ వీధి, భావనారుషి ఆలయం సమీపంలో, ప్రకాష్నగర్లో ఒకే రోజు మూడు బైక్లను కాల్చేశారు. – భగత్సింగ్ కాలనీ సమీపంలో ఒక యువతిని వేధిస్తున్నాడనే కారణంతో ఆ ప్రాంత వాసులు జులాయికి దేహశుద్ధి చేశారు. – పట్టణంలోని వూటుకూరు వీరయ్య పాఠశాలలో ఫ్యాన్లు, తలుపులు, కిటికీలను ధ్వంసం చేయడమేగాక మద్యం తాగి సీసాలను పగులగొట్టారు. – త్రిబుల్ రైడింగ్తో విద్యార్థులు ఓవర్ స్పీడ్తో వెళ్తున్నప్పటికీ ఎందుకో మరి ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. గాంధీరోడ్డు, నెహ్రూరోడ్డు, సూపర్బజార్రోడ్డులలో విద్యార్థినులను వేధిస్తున్నట్లు ఆ ప్రాంత వాసులు అంటున్నారు. విద్యార్థినుల రక్షణ కోసం ఏర్పాటైన షీ టీం ద్వారా వారికి రక్షణ లభించడం లేదు. రాత్రి వేళల్లో పొద్దుపోయే వరకు యువకులు పార్టీల పేరుతో పట్టణంలో నిత్యం బైకుల్లో సంచరిస్తున్నారు. పోలీసులు తగినంత నిఘా పెట్టకపోవడంతో మరింతగా రెచ్చిపోతున్నారు. – ఇవీ వెలుగులోకి వచ్చిన సంఘటనలు మాత్రమే. అనేకం బయటికి రావడం లేదు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుని వీటిని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం పట్టణంలో పోలీసు గస్తీ ముమ్మరం చేసి ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. కళాశాలల వద్ద కూడా షీ టీం సభ్యులతో నిఘా ఏర్పాటు చేస్తాం. – పూజిత నీలం, ప్రొద్దుటూరు డీఎస్పీ -
ప్రతిపక్షాలది డ్రామా
–అభివృద్ధి అంటే ఏమిటో కేసీఆర్ చేసి చూపిస్తుండ్రు –రిజిస్ట్రేషన్ల ద్వారా పెరిగిన ఆదాయం –భువనగిరి సభలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ భువనగిరి : రాష్ట్ర అభివృద్ధికి సహకరించకుండా ప్రతిపక్షాలు డ్రామాలు ఆడుతున్నాయని డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. భువనగిరిలో నూతనంగా నిర్మిస్తున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనం పనులకు సోమవారం విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ప్రభుత్వవిప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. అభివృద్ధి అంటే ఏమిలో సీఎం కేసీఆర్ చేసి చూపుతున్నారని తెలిపారు. గడచిచిన మూడేళ్లలో రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం పెరుగుతూ వచ్చిందన్నారు. ప్రతిపక్షాలు బుద్ధి తెచ్చుకోవాలి : మంత్రి జగదీశ్రెడ్డి ప్రాజెక్ట్లను అడ్డుకుంటున్న ప్రతిపక్షాలు బుద్ధి తెచ్చుకోవాలని మంత్రి జగదీశ్రెడ్డి హితవుపలికారు. ప్రాజెక్ట్ల నిర్మాణానికి అడ్డుపడుతున్న కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టులను గ్రామాల్లోకి రానీయెుద్దన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్ట్లు కట్టి తీరుతామని పేర్కొన్నారు. అంతకుముందు రిజిస్టార్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ అండ్ స్టాంప్ ఐజీ, కమిషనర్ ఆహ్మద్ నదీమ్, జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ సత్యనారాయణ, డిప్యూటీ ఇన్స్స్పెక్టర్ జనరల్ మధుసూదన్రెడ్డి, జిల్లా రిజిస్ట్రార్ వాసుదేవారావు, సబ్రిజస్ట్రార్ సామల సహదేవ్, మున్సిపల్ చైర్పర్సన్ సుర్విలావణ్య, కౌన్సెలర్ బోగ వెంకటేష్, టీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మారగోని రాముగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ దేశంలోనే నెంబర్ వన్ సీఎం యాదగిరిగుట్ట: దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ, ప్రజలకు వందశాతం సంక్షేమ పథకాలు అందజేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే నెంబర్ వన్.. డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. యాదగిరిగుట్టలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పనులకు సోమవారం మంత్రి జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే వంద సంవత్సరాలకు సరిపడా అభివృద్ధి చేసిందన్నారు. రాష్ట్రానికి కేసీఆర్ సీఎం కావడం మన అదృష్టమన్నారు. నూతన జిల్లాల ఏర్పాటుతో సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. అందులో భాగంగా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్తూ ప్రజల ప్రశంసలు పొందుతున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే అభివృద్ధి కోసం రూ.30వేల కోట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్కే దుక్కుతుందన్నారు. అంతే కాకుండా కరువుతో కొట్టుమిట్టాడుతున్న రైతాంగానికి 9 గంటల కరెంట్, విద్యారు«్థలకు మధ్యాహ్న బోజనం కల్పిస్తున్నారని పేర్కొన్నారు. పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్ట్ల ద్వారా జిల్లాకు నీళ్లు తీసుకువచ్చి ఫ్లోరైడ్ రక్కసిని పారదోలాలని సీఎం కృతనిశచ్చయంతో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ అండ్ స్టాంప్ ఐజీ, కమిషనర్ ఆహ్మద్ నదీమ్, డిప్యూటీ ఇన్స్స్పెక్టర్ జనరల్ మధుసూదన్రెడ్డి, జిల్లా రిజిస్ట్రార్ వాసుదేవారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కాలె సుమలత, ఎంపీపీ గడ్డమీది స్వప్న రవీందర్గౌడ్, జెడ్పీటీసీ కర్రె కమలమ్మ వెంకటయ్య, పీఏసీఎస్ చైర్మన్ ననబోలు శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్లు బూడిద స్వామి, కసావు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రేటర్లో ఊపందుకున్న ప్రచారం
-
ఓటు మీకు... ఆట మాకు..
ఆటలు తప్ప ఓటు అంటే తెలియని వయసు.. ఆకలి తప్ప పార్టీలు ఎరగని మనసు.. రంగులు మార్చడం రాదు.. ఏమార్చడం అంతకంటే రాదు.. పూటకో పార్టీ కండువా కప్పుకుని.. గంటకో జెండా పట్టుకునే కాలంలో.. రంగుల హంగులు తెలియని బాల్యం పార్టీ జెండాలతో స్వేచ్ఛగా ఆడుకుంటోంది. మారో పార్టీవారు అడ్డుకుంటారన్న భయం లేదు.. పదవులు పోతాయన్న బాధా లేదు.. ఆ చేతుల్లో ఉన్న జెండా ఏ పార్టీదైనా ఎజెండా ఒక్కటే. నెత్తిన పెట్టుకుంటారు.. కింద పడేస్తారు.. అడిగేదెవరు.. అంతా ఆటలో భాగమే. జూబ్లీహిల్స్ దుర్గాభవానీ నగర్లో ఆదివారం ఉదయం ఓ పార్టీ మీటింగ్ జరిగింది. అక్కడి బస్తీ ప్రజలు సమావేశానికి వెళ్లివచ్చారు. వారు తెచ్చిన పార్టీ జెండాలు, టోపీలను పిల్లలకు ఇవ్వడంతో వారు ఇలా ఆటవస్తువులుగా మార్చుకున్నారు. -
బ్యూటిప్స్
పార్టీలు కానీ పండుగలు కానీ వచ్చాయంటే అమ్మాయిలు వేసుకునే మేకప్లో తప్పకుండా లిప్స్టిక్ ఉండాల్సిందే. యువత స్మైల్ వెనుక ఉండే కొండంత కాన్ఫిడెన్స్ ఈ లిప్స్టిక్కే అంటున్నారు బ్యూటీషియన్లు. మరి అలాంటి వాటిలో జాగ్రత్తలు, చిట్కాలు పాటించకపోతే ఎలా? అందుకే ఇవి.. -
ఇసుక చుట్టూ తమ్ముళ్లు
బెల్లం చుట్టూ ఈగలు ముసురుతాయి. తెలుగు తమ్ముళ్లు ఇసుక చుట్టూ ముసురుతున్నారు. అడ్డదారుల్లో తరలించుకుపోతున్నారు. అడ్డొచ్చిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. నిబంధనలను లెక్కచేయకుండా సరిహద్దులనూ దాటించేస్తున్నారు. నదుల్లోని ఇసుకను సముద్ర ఇసుకతో కల్తీ చేసి మరీ అమ్మకాలు సాగిస్తున్నారు. కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దారు వనజాక్షిపై దాడి వ్యవహారంలో తమ అధినేత వైఖరి తేటతెల్లం కావడంతో ‘తమ్ముళ్లు’ తెగ రెచ్చిపోతున్నారు. కొన్నిచోట్ల రెవిన్యూ అధికారులకు, పోలీసులకు మామూళ్లు చెల్లిస్తూ తమ జోలికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. - అక్రమ తవ్వకాలు.. అడ్డొస్తే అఘాయిత్యాలు - సముద్ర ఇసుకతో భారీ కల్తీ - భారీగా మామూళ్లు.. పార్టీలు - చోద్యం చూస్తున్న పోలీసులు, అధికారులు జిల్లాలోని పద్మనాభం మండలం పాండ్రంగిలో అధికారులకు ఇసుక తరలింపు సమాచారం ఇస్తున్నాడన్న కక్షతో సారిక కన్నయ్య హత్య, విశాఖ జిల్లా సరిహద్దులోని పాయకరావుపేట తాండవ నదిలో అక్రమ ఇసుక తరలింపును అడ్డుకున్న తుని ఎమ్మెల్యే రాజా, అతని గన్మెన్పై టీడీపీ నేతల దాడి ఘటనలతో ఇసుకాసురుల ఆగడాలు చర్చనీయాంశమవుతున్నాయి. గోస్తనీ నది ఇసుక అక్రమార్కులకు వరం గా మారింది. ఈ నదికి ఉప్పునీటి తాకిడి ఉన్నందున ఇసుక కట్టడాలకు పనికిరాదని ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అప్పగించలేదు. కానీ ఇసుక అక్రమార్కులకు, ప్రభుత్వ కట్టడాలకూ మాత్రం ఇదే పనికొస్తోంది. గోస్తనీ నది పద్మనాభం, భీమిలి, ఆనందపురం మండలాల్లో సుమారు 20 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. పరివాహక ప్రాంతాలైన అనందపురం మండలం బోని, పద్మనాభం మండలం పద్మనాభం, మద్ది, పొట్నూరు, పాండ్రంగి, మునివానిపాలెం, సామియ్యవలస, భీమి లి మండలం మజ్జివలస, తాటితూరు, టి.నగరంపాలెం, తగరపువలస, మూలకుద్దు, టి.నాగమయ్యపాలేల్లో సింహభాగం తెలుగు దేశం వారి కనుసన్నల్లోనే అక్రమ తవ్వకాలు సాగుతున్నాయని చెబుతున్నారు. ఏం చేస్తున్నారు?: భీమిలి మండలం పెదనాగమయ్యపాలెంలో 500 ఎకరాల్లో 60-70 మీటర్ల ఎత్తున వందల ఏళ్ల క్రితం ఏర్పడ్డ సహజ సముద్ర ఇసుక దిబ్బలున్నాయి. అక్కడ ఇసుకను లారీలు/ట్రాక్టర్లలో గోస్తనీ తీరానికి తరలించి అక్కడ నది ఇసుక పోగుల పక్కన వేస్తారు. రోజుకు పద్మనాభం, భీమిలి మండలాల్లో వందకు పైగా లారీలు, ట్రాక్టర్లలో ఇసుకు వెళ్తూనే ఉంటుంది. ఇలా 50 ఎకరాల్లో ఇసుకను మాయం చేసేశారు. శ్రీకాకుళం నుంచి తీసుకొచ్చే నాణ్యమైన ఇసుక 8 యూనిట్లకు రూ.45 వేల ధర పలుకుతోంది. అదే గోస్తనీలో కల్తీ ఇసుక రూ.20-25 వేలకే లభిస్తోంది. ట్రాక్టరు (ఒకటిన్నర యూనిట్లు)కు రూ.3-5 వేలకే ఇస్తున్నారు. శ్రీకాకుళం ఇసుకతో పోలిస్తే చౌకగా దొరకడంతో కొంతమంది కాంట్రాక్టర్లు ప్రభుత్వ భవనాలకు దీనినే వాడేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కొన్నాళ్ల క్రితం వంద లారీల్లో సముద్ర ఇసుక తరలిస్తూ పట్టుబడగా కేవలం ఏడు లారీలపైనే కేసులు పెట్టారు. ఇసుక అక్రమ రవాణాదార్ల నుంచి రూ.10 లక్షలు జరిమానా వసూలు చేశామని, గట్టి నిఘా పెట్టామని, కొందరిపై బౌండోవర్ కేసులు పె ట్టామని భీమిలి రెవిన్యూ అధికారులు చెబుతున్నారు. ఇదీ సంగతి:ఇసుక అక్రమ రవాణా కాకుండా చూసే బాధ్యత రెవెన్యూ అధికారులది, ఆయా గ్రామాల వీఆర్వోలది. కానీ నిత్యం యధేచ్ఛగా లారీలు, ట్రాక్టర్లలో ఇసుకు తరలిపోతున్నా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీనివల్ల అటు ఇసుక అక్రమ రవాణాదార్లకే కాకుండా రెవిన్యూ అధికారులకూ పంట పండుతోంది. పద్మనాభం మండలంలోని ఓ వీఆర్వో ఏడాది కాలంలో ఏకంగా ఎనిమిది కార్లను కొనుగోలు చేయడం, మరికొందరు రిటైర్డు ఉద్యోగులు ఇసుక తరలింపునకు ఎడ్లబళ్లను కొనడం చూస్తే పరిస్థితి అర్థమవుతుంది. ఇసుక అక్రమ తరలింపుదార్లు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు మామూళ్లతో పాటు ప్రతి ఆదివారం పార్టీలు ఇస్తారన్న ప్రచారం ఉంది. పాయకరావుపేట మండలం తాండవ నదిలోనూ ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. తగినంత ఇసుక లభ్యత లేదంటూ అక్కడ రీచ్లను డ్వాక్రా మహిళలకు కేటాయించలేదు. కానీ పలుచోట్ల తెలుగు తమ్ముళ్లు నిర్భీతిగా ఇసుక తవ్వించి సరిహద్దులు దాటించేస్తున్నారు. చౌకగా ట్రాక్టర్ ఇసుక రూ.800లకే విక్రయిస్తున్నారు. అదేమిటని ప్రశ్నిస్తే ఇదిగో ఇలా సాక్షాత్తూ ఎమ్మెల్యేపైనే దాడులకు తెగబడుతున్నారు. -
ఉరవకొండ బంద్ ప్రశాంతం
ఉరవకొండ: యువరైతు ఆత్మహత్యకు నిరసనగా శుక్రవారం వివిధ పార్టీలు చేపట్టిన ఉరవకొండ బంద్ విజయవం తం అయింది. చంద్రబాబు ప్రకటిం చిన రుణవూఫీ రైతుల పాలిట యువుపాశంగా వూరిందని, బాబుకు రైతుల గోడు తప్పక తగులుతుందని బంద్ సందర్భంగా సీపీఐ, సీపీఎం నాయుకులు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సిండికేట్ బ్యాంకు మేనేజర్ శివశంకర్ వేధింపులు తాళలేక రాయుంపల్లి గ్రావూనికి చెందిన యుువరైతు కోదండరామిరెడ్డి గురువారం పురుగుల వుందు తాగి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విషాదం అన్నారు. బంద్ సందర్భంగా పట్టణంలో అన్ని వ్యాపార దుకాణాలు, విద్యాసంస్థలు, సినివూ థియేటర్లు బంద్ చేశారు. ఈసందర్భంగా బ్యాంకుల వద్ద జరిగిన ధర్నా కార్యక్రవుంలో సీపీఐ రైతుసంఘం జిల్లా సహాయు కార్యదర్శి శివన్న, సీపీఎం రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి వూట్లాడుతూ ప్రభుత్వ అసవుర్థత కారణంగా రైతులు నేడు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కరువు పీడిత అనంతపురం జిల్లాలో యేడాది కాలంలోనే 60 వుందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కణేకల్లు వుండల రైతుసంఘం అధ్యక్షులు జయుచంద్రారెడ్డి, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి వెంకటేశులు వూట్లాడుతూ జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టలేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన యుువరైతు కోదండరామిరెడ్డి ఆత్మహత్యపై టీడీపీ వుంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కరూ నోరు మెదపక పోవడం బాధాకరవున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో యుువరైతు ఆత్మహత్యకు నిరసనగా అనంతపురం-బళ్ళారి జాతీయు రహదారిపై చేపట్టిన వుూడు గంటల రాస్తారోకోలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అంకాల్రెడ్డి వూట్లాడుతూ అధికారులు వేధింపుల వల్లే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని, పోలీసులు కుడా యుువరైతును కొట్టడం వురీ దా రుణం అని తెలిపారు. కరువు పీ డిత అనంతపురం జిల్లాలో రైతు ల పరిస్థితి వురీ అధ్వానంగా ఉం దని, ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించాలని డివూండ్ చేశా రు. కార్యక్రవుంలో సీపీఐ వుండ ల కార్యదర్శి వన్నూర్సాబ్, బసవరాజు, ప్రసాద్, విడపనకల్లు కార్యదర్శి చండ్రాయుుడు, సీపీఎం వుండల కార్యదర్శి రంగారెడ్డి, రైతుసంఘం కార్యదర్శులు జ్ఞానవుూర్తి, వుధు, చేనేత విభాగం జిల్లా అధ్యక్షులు కారుపర్తి ఆంజినేయుులు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, వుజ్దూర్ యుూనియున్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, కిసాన్ మోర్చా రాష్ట్ర సహాయు కా ర్యదర్శి కరణం బద్రీనాధ్, మైనా ర్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖలందర్, జిల్లా కార్యదర్శి వెంకటప్ప, రఘరావుులు పాల్గొన్నారు. -
నేడు ఉరవకొండ బంద్
ఉరవకొండ, ఉరకొండ రూరల్: ఉరవకొండ సిండికేట్ బ్యాంకు లో ఆత్మహత్య చేసుకున్న యువరైతు కుటుంబానికి సంఘీభావంగా ప్రతి పక్ష పార్టీలు శుక్రవారం ఉరవకొండ బంద్కు పిలుపు ఇచ్చాయి. ప్రభుత్వం, బ్యాంకర్ల చర్యలతో రైతులు ప డుతున్న అగచాట్లకు ఈ సంఘటన నిదర్శనమని వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. రాత్రి వరకు కూడా అధికారులు సరైన తీరులో స్పందించక పోవడంతో శుక్రవారం బంద్కు పిలుపు ఇచ్చారు. ఎంబీఎ చదివి ఉద్యోగం రాక చివరకు వ్యవసాయుమే జీవనాధారంగా బతకాలని ఆశించిన ఒక యుువ రైతు బ్యాంకు అధికారుల వేధింపులతో విసిగిపోయి చివరుకు ఆత్మహత్య చేసుకోవడం పలువురిని కలిచివేసింది. రాయుంపల్లి గ్రావూనికి చెందిన యుువ రైతు కోదండరామిరెడ్డి(29) స్దానిక సిండికేట్ బ్యాంకు అధికారుల ఒత్తిళ్ళుకు పురుగుల వుందు తాగి బ్యాంకులోనే ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉరవకొండలో సంచలనం రేగిత్తించింది. (సంఘటన వివరాలు మెయిన్లో) ఈసంఘటనపై వైఎస్ఆర్సీపీతో పాటు సీపీఐ, సీపీఎం, రైతులు గురువారం బ్యాంకు వద్ద పెద్ద సంఖ్యలో రాస్తారోకో నిర్వహించారు. రైతులు వుృతుదేహాన్ని బ్యాంకు ఎదుట వుంచి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కవితా హోటల్ సమీపంలో వుృతుదేహాన్ని ఉంచి మేనేజర్ను అరెస్టు చేయూలంటూ ఆందోళన చేపట్టారు. స్దానిక ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, యుువనేత వై.భీమిరెడ్డి రైతుకుటుంబానికి ధైర్యం చెబుతూ ఆందోళనలో పాలుపంచుకున్నారు. అరుుతే రాత్రి 9గంటల వరుకు జిల్లా నుంచి ఒక్క అధికారి కుడా సంఘటన స్దలానికి చేరుకోకపోవడం రైతులకు ఆగ్రహం తెప్పించింది. స్దానిక తహసీల్దార్ బ్రహ్మయ్యు రైతు కుటుంబం సవూచారాన్ని సేకరించి ఉన్నతాధికారులకు పంపారు. జిల్లా కలెక్టర్ సంఘటన స్దలానికి రావాలని శవాన్ని అక్కడే ఉంచి ఆందోళనకు దిగారు. ఉరవకొండ పోలీసులు కుటుంబ సభ్యలకు నచ్చచెప్పడానికి ప్రయుత్నించినా మేనేజర్ను అరెస్టు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తావుని పెద్ద సంఖ్యలో రైతులు శిబిరం వేసి మృత దేహాన్ని అక్కడే ఉంచి ఆందోళన చేపట్టారు. అనంతరం ఎస్పీ ఆదేశాల మేరకు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ దుర్గాప్రసాద్ సంఘటన స్దలానికి వచ్చి ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, వుృతుని కుటుంబ సభ్యులతో చర్చించారు. శుక్రవారం బంద్కు అన్ని వర్గాల వారు కలిసి రావాలని, సహకరించాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు పిలుపు ఇచ్చారు. బ్యాంకు అధికారుల తీరు దారుణం బ్యాంకుల్లో రైతులను అధికారులు బిక్షగాళ్ళగా చుస్తున్నారు, కనీసం సవూధానం చెప్పకుండా నెలల తరబడి రుణాల కోసం బ్యాంకుల చుట్టు తిప్పుతున్నారు. ప్రభుత్వ విధానలే దీనంతటికి కారణంగా కన్పిస్తోంది. - జ్ఞానవుూర్తి, రైతుసంఘం నాయుకుడు రైతులను మోసం చేసిన రుణవూఫీ: రుణవూఫీ చేస్తావుని ప్రభుత్వం చెప్పడంతో రైతులు రుణాలు చెల్లించలేదు. ఇ ప్పడేమో బ్యాంకు అధికారులు ఒత్తిడి కారణంగా రైతులు అప్పులు చేసి రుణాలు చెల్లిస్తున్నారు. చెల్లించని రైతులను భూవుులను వేలం వేస్తావుని బెదిరిస్తున్నారు. - లింగన్న, రేణువూకుపల్లి, రైతు రైతుల వునోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు: రైతులను దొంగల్లా చుస్తు వారిని బ్యాం కు, రెవిన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వూ ట్లాడుతున్నారని, కార్యాలయూలకు వెళ్ళే రైతుల వునోభావాలు దెబ్బతినేలా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఈదుస్థితికి కారణం ప్రభుత్వ విధానలే. - అశోక్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, కిసాన్సెల్ -
కిడ్స్ డిజైన్
Show Masters పిల్లలుంటే పండుగ. పండుగ అంటేనే పిల్లలు. క్రిస్మస్, న్యూ ఇయర్ అయిపోయాయి. ఇక సంక్రాంతి.. ఈ పండుగకు ‘కళ’ తెచ్చే చిల్డ్రన్ కోసం డిఫరెంట్లీ డిజైన్డ్ డ్రెస్లు మార్కెట్లోకి దూసుకొస్తున్నాయి. వీటిని పరిచయం చేసేందుకు అందమైన చిన్నారి మోడల్స్ ఉండనే ఉన్నారు. దీంతో ఇప్పుడు చిన్నారుల ఫ్యాషన్ షోలు ఊపందుకున్నాయి. మరోవైపు తమ డిజైనర్ల సత్తా చూపడానికి కిడ్స్ డ్రెస్ల డిజైనింగ్ ఒక మార్గంగా ఎంచుకుంటున్నాయి ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్స్. ..:: ఎస్.సత్యబాబు అమ్మాయిల తర్వాత డ్రెస్సింగ్ స్టైల్స్లో బోలెడన్ని వెరైటీలు అందుబాటులో ఉన్నది పిల్లలకే. సింపుల్గా రెడీమేడ్తో సరిపెట్టేసే రోజులకు బైబై చెప్పేస్తున్న పేరెంట్స్ పిల్లల దుస్తులపై శ్రద్ధ పెడుతున్నారు. తమ అలంకరణ సంగతి ఎలా ఉన్నా పార్టీలు, ఫంక్షన్లు, ఈవెంట్లకు వెళుతున్నప్పుడు పిల్లలు గ్రాండ్గా కనపడాలని ఆరాట పడుతున్నారు. పిల్లల డ్రెస్సింగ్కు వచ్చే కాంప్లిమెంట్లు సహజంగానే దానికి కారణమైన పేరెంట్స్కు దక్కుతాయి కాబట్టి.. తమ క్యూట్ డార్లింగ్స్ ధరించే దుస్తుల్లో వెరైటీ కోసం డిజైనర్ల దగ్గర క్యూ కడుతున్నారు. చిన్నారులకు డిజైనింగ్ ఓ సవాల్... క్యూట్గా, హ్యాపీ లుక్స్తో ఉండే చిన్నారులకు స్టైల్స్ క్రియేట్ చేయడం ఛాలెంజ్లాంటిదని డిజైనర్ల అభిప్రాయం. ఎందుకంటే పిల్లలు ఏ దుస్తుల్లోనైనా అందంగా కనిపిస్తారు. ఇన్నోసెన్స్, స్పాంటేనియటీ, బ్రైట్ స్మైలింగ్.. చిల్డ్రన్కు నేచురల్గా వచ్చే అలంకారాలు. డ్రెస్ ద్వారా వాటిని మరింత మెరపించాల్సిన బాధ్యత డిజైనర్లపై ఉంటుంది. మరోవైపు పార్టీలకు పిల్లల్ని తీసుకెళ్లడం కూడా ఇటీవల బాగా పెరిగింది. అలాంటి చోట తమ పిల్లల డ్రెస్సింగ్ అద్భుతంగా ఉండాలని పేరెంట్స్ కోరుకుంటున్నారు. దీని కోసం పెద్దవాళ్ల కన్నా మిన్నగా తమ పిల్లల డ్రెస్ కోసం ఖర్చు పెడుతున్నారు. ఎన్నెన్నో వెరైటీలు... చిన్నారుల దుస్తుల డిజైన్లకు వెరైటీ థీమ్లను ఎంచుకుంటున్నారు డిజైనర్లు. మోడ్రన్ యుగపు ప్రతినిధులుగా కనిపించేలా చేసే ఇండోవెస్ట్రన్స్, ఫంకీగా అనిపిస్తూ అందర్నీ ఆకట్టుకునే డిస్కోవేర్, రెండు మూడు రకాల థీమ్లను కలిపి రూపొందించే కాక్టైల్ వేర్, నగర శివార్లలోని రిసార్ట్స్కు వెళ్లినప్పుడు ధరించేందుకు వీలుగా రిసార్ట్ వేర్, పెళ్లిళ్లు వంటి సందర్భాలకు నప్పే వెడ్డింగ్ వేర్... ఇలా పెద్దలకు ధీటుగా చిన్నారులకు ప్రత్యేకమైన థీమ్ డిజైన్లు వచ్చేశాయి. హిట్ ‘షో’.. కొన్ని రోజులుగా సిటీలో చిన్నారుల ఫ్యాషన్ షోలు పెరగడం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు రెగ్యులర్ షోలలో టీజింగ్ పార్ట్గానో, సరదా కోసం మాత్రమే పిల్లల డ్రెస్సింగ్ సీక్వెన్స్ పెట్టేవారు.. ఇప్పుడు అలా కాకుండా పూర్తి స్థాయిలో పిల్లల డ్రెస్సింగ్ కోసమే షోలు నిర్వహిస్తున్నారు. వీటికి పేరెంట్స్ పెద్దసంఖ్యలో హాజరవుతూ తమ పిల్లల కోసం ఎంతో శ్రద్ధగా డిజైన్లను ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో చైల్డ్ మోడల్స్ కూడా పెరిగారు. ఇది ప్యూర్లీ వెడ్డింగ్ వేర్. తలపాగా నుంచి షేర్వాని వరకూ... జార్జెట్, వెల్వెట్ కాంబినేషన్తో హైలీ డిజైన్డ్ వెస్ట్రన్వేర్. ఎంబ్రాయిడరీని సరైన రీతిలో జత చేయడంతో దీనికి మరింత లుక్ వచ్చింది. గ్రే శాటిన్ ఫ్యాబ్రిక్ మీదఎల్లో సిల్క్ డిజిటల్ ప్రింట్ కాంబినేషన్తో రూపొందిన ఈ డ్రెస్... రిసార్ట్ వేర్. ఆప్లిక్ వర్క్తో ఎల్లో, బ్లాక్ కాంబినేషన్ ఎంబ్రాయిడరీ కలగలిపి... దీనికి గ్రే బ్యాక్గ్రౌండ్ జత చేశారు. జార్జెట్, కాటన్ సిల్క్లు గార్మెంట్ డిజైన్కి అదనపు సొబగులు అద్దుతున్నాయి. లుక్ అదుర్స్ రా సిల్క్, క్రేప్, నెట్ క్లాత్తో చేసిన సాఫా వంటి ఫ్యాబ్రిక్స్ను యూజ్ చేశారు. పింక్ బాటమ్తో చక్కగా అమరిపోయిన హాఫ్ వైట్ టాప్కి.. స్టోన్స్కు ఫ్రెంచ్ నాట్స్ ఎంబ్రాయిడరీ జత చేయడంతో పార్టీవేర్ లుక్ మరింతగా డ్రెస్పై మెరిసింది. ఇది లేటెస్ట్ ట్రెండ్.. తమ పిల్లల కోసం కూడా డిజైనర్లను సంప్రదించడం అనేది సిటీలో లేటెస్ట్ ట్రెండ్ అనే చెప్పాలి. ఇది డిజైనర్లకు తమను తాము ఆల్రౌండర్లుగా నిరూపించుకునేందుకు వీలు కల్పిస్తోంది. ఇంకో విషయం ఏమిటంటే... చిల్డ్రన్ డ్రెస్సింగ్లో ప్రయోగాలకు బాగా వీలుంటుంది. అందుకే మా స్టూడెంట్స్కి తరచూ చిన్నారుల దుస్తుల శైలులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచిస్తుంటాం. పిల్లల ఫ్యాషన్ షోల ద్వారా డిజైనర్ల సత్తాను ప్రదర్శించవచ్చు. - క్రితిక, ఇన్స్టిట్యూటో డిజైన్ ఇన్నొవేషన్ -
మందు బాంబులు జాగ్రత్త
ఆదిలాబాద్ క్రైం : మరికొద్ది గంటల్లో 2014కు బైబై చెప్పబోతున్నాం.. కొత్త సంవత్సరాన్ని స్వాగతించనున్నాం.. అయితే.. ఈ నయా జోష్లో యువత కొద్దిపాట దుందుడుకు స్వభావాన్ని వీడాలి. లేకుంటే అసలుకే మోసం వచ్చే పరిస్థితి వచ్చింది. నయా సాల్ వేడుకలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. పార్టీలు చేసుకునేందుకు.. హంగామా సృష్టించేందుకు అందరూ సిద్ధమవుతున్నా వాటి పట్ల పలు నిబంధనలు పాటించాల్సిందే. పట్టణాలే కాకుండా.. పలె ్లల్లోనూ ఈ నిబంధనలు కొనసాగనున్నాయి. అర్ధరాత్రుల వరకూ తాగి ఊగకుండా తగిన సమయంలో ఇళ్లకు చేరుకుంటే ఎలాంటి ప్రమాదమూ ఉండదు. నిబంధనలు గానీ అతిక్రమిస్తే ఇక అంతే..! అవాంఛనీయ ఘటనలపై నిఘా.. జిల్లా కేంద్రంతో పాటు మంచిర్యాల, నిర్మల్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, భైంసా తదితర పట్టణాలే కాకుండా గ్రామాల్లోనూ న్యూ ఇయర్ వేడుకలు జోష్గా జరుపుకుంటుంటారు. జిల్లాలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయా ప్రాంతాల్లో పోలీసు లు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. నూతన సంవత్సరం వేడుకలు నిర్వహించే హోటళ్లు కూడా పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఆయా వేడుకల్లో పాల్గొనే వారి జాబితాను తెలియజేయాల్సి ఉంటుంది. వేడుకలు చేసుకోవాలే తప్ప అతిగా ప్రవర్తించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాత్రి ఒంటి గంట వరకు మాత్రమే వేడుకలకు అనుమతి విధించారు. ఆ తర్వాత బహిరంగా ప్రదేశాల్లో వేడుకలు జరుపుకోవడానికి వీల్లేదని పోలీసులు పేర్కొంటున్నారు. జిల్లాలోని ప్రముఖ హోటళ్లు, బార్లపై పోలీసులు ప్రత్యేక దృషి పెట్టారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని కోరుతున్నారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు తమకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే, మందుబాబుల ఆగడాలపై పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో స్పెషల్డ్రైవ్ నిర్వహించనున్నారు. పెట్రోలింగ్, గస్తీ కొనసాగించనున్నారు. రాత్రిళ్లో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నిబంధనలు ఏర్పాటు చేయనున్నారు. వేడుకలు ముగిసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవాలని, ఒకే చోట బహిరంగ ప్రాంతాల్లో గుంపులుగా ఉండకూడదని పేర్కొంటున్నారు. పోలీసులు ప్రధాన కూడళ్లలో రాత్రి 12 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించనున్నారు. వాహనాల్లో ఎక్కువ మొత్తంలో మద్యం తరలించకూడదు. పెట్రోలింగ్ ఏర్పాటు చేశాం.. - తరుణ్ జోషి, ఎస్పీ జిల్లాలో అన్ని పట్టణాల్లో రాత్రి పెట్రోలింగ్ ఏర్పాటు చేశాం. ప్రధాన కూడళ్లలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. వేడుకలు నిర్వహించేందుకు ఇప్పటి వరకు ఏ హోటళ్లు అనుమతి తీసుకోలేదు. రాత్రి 11 గంటల తర్వాత మద్యం దుకాణాలు, బార్లు తెరిచి ఉండకూడదు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నిబంధనలు ఇవీ.. నూతన సంవత్సరం వేడుకలు నిర్వహించే హోటళ్లు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఆయా వేడుకల్లో పాల్గొనే వారి జాబితాను తెలియజేయాలి. రాత్రి ఒంటి గంట వరకు మాత్రమే వేడుకలకు అనుమతి. ఆ తర్వాత బహిరంగా ప్రదేశాల్లో వేడుకలు జరుపుకోవద్దు. వేడుకలు ముగిసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవాలి. ఒకే చోట బహిరంగా ప్రాంతాల్లో గుంపులుగా ఉండకూడ దు. ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు. సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదు. మద్యం సేవించి వాహనాలు నడుపకూడదు. బహిరంగగా మద్యం సేవించరాదు. అతివేగంగా వాహనాలు నడుపకూడదు. వాహనాల్లో ఎక్కువ మొత్తంలో మద్యం తరలించకూడదు. రాత్రి 10 గంటలకు జిల్లాలోని అన్ని దుకాణాలు.. 11 గంటల వరకు బార్లు మూసివేయాలి. లేకుండా చర్యలు తప్పవు. వేడుకల సమయంలో డీజే, లౌడ్స్పీకర్లకు అనుమతి లేదు. ఎక్సైజ్ అనుమతి లేనిదే హోటళ్లలో, బహిరంగ ప్రదేశాల్లో మద్యం విక్రయించకూడదు. బాణాసంచా కాల్చడం నిషేధం. -
ముగ్గురూ.. ముగ్గురే
మెదక్లో త్రిముఖ పోటీ ►జగ్గారెడ్డి రాకతో వేడెక్కిన రాజకీయం ►‘ట్రబుల్ షూటర్’పైన మరింత భారం ►నర్సాపూర్పైనే సునీతమ్మ ఆశలు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ లోక్సభ ఉపపోరు ఊపందుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కీలకమైన అభ్యర్థులనే బరిలోకి దింపటంతో త్రిముఖ పోటీ ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.‘ట్రబుల్ షూటర్’ మంత్రి హరీష్రావు ఎత్తులు.. గ్రామీణ ప్రాంతంలో బలమైన క్యాడర్తో.. టీఆర్ఎస్ పార్టీ పతిష్టమైన స్థితిలో కనిపించినప్పటికీ తీవ్ర పోటీ మాత్రం తప్పదని వారు లెక్కలు కడుతున్నారు. బీజేపీ అభ్యర్థిగా ఫైర్బ్రాండ్ జగ్గారెడ్డి బరిలోకి దిగటం, తెలుగుదేశం శ్రేణులు బీజేపీతో కలిసి రావటం, ఇక నర్సాపూర్ నియోజకవర్గంలో పట్టున్న మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి బరిలో నిలబడటంతో మూడు స్తంబాలాట మొదలైంది. మెదక్ పార్ల మెంటు నియోజకవర్గం కింద మెదక్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, పటాన్చెరు, సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.ఈ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సిద్దిపేట, దుబ్బాక, నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు మంచి పట్టు ఉండగా, నర్సాపూర్ నియోజకవర్గం సునీతారెడ్డికి, సంగారెడ్డి నియోజకవర్గం జగ్గారెడ్డికి అనుకూలంగా ఉంది. పటాన్చెరు నియోజకవర్గంలో మూడు పార్టీలకు చెందిన ఓటర్లు ఉన్నారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజవర్గాల్లో భారీ మెజార్టీ తెచ్చుకోవాలని టీఆర్ఎస్ ఎత్తులు వేస్తుండగా... సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ మెజార్టీని నిరోధించగలిగితే గెలుపు బాట పట్టవచ్చని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు యోచిస్తున్నారు. ముఖ్యులంతా ఇన్చార్జులే... రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాల 100 రోజుల పాలనకు ఈ ఉప ఎన్నికలు రెఫరెండంగా మారాయి. ఇక కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు జీవగంజి లాంటివి. ఈ నేపథ్యంలో మూడు పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి. గులాబీ దళపతి కేసీఆర్కు గత ఎన్నికల్లో 3.97 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. కేసీఆర్కు 6,57,497 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రవణ్కుమార్రెడ్డికి 2,60,463 ఓట్లు వచ్చాయి. ఈ సారి కనీసం 4 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీ తీసుకరావాలని కేసీఆర్ జిల్లా నేతలకు ఆదేశాలు జారీ చే శారు. పార్లమెంటు నియోజవర్గంలో ప్రతి మండలానికి ఒక ఎమ్మెల్యేను, ఎమ్మెల్సీలను ఇన్చార్జిగా నియమించారు. పూర్తి పర్యవేక్షణ బాధ్యతలను హరీష్రావుకు అప్పగించారు. ఇక కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు కూడా మండలానికో ఎమ్మెల్యేను ఇన్చార్జులుగా నియమించింది. గులాబీ దళపతి మీదనే ఆశలు.. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గులాబీ దళపతి కేసీఆర్నే నమ్ముకోగా, కాంగ్రెస్ పార్టీ రాహుల్గాంధీ, సోనియాగాంధీలతో పాటు దిగ్విజయ్సింగ్, తదితరులను రంగంలోకి దించేందుకు పథకం రచిస్తోంది. రాష్ర్ట నాయకులు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి తదితరులు పర్యవేక్షిస్తారు. బీజేపీ కూడా భారీ ప్రణాళికే వేస్తోంది. మోడీని ప్రచారంలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఆయనతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులతో పాటు సినీనటుడు పవన్ కల్యాణ్ను కూడా ప్రచార రంగంలోకి దించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. -
ఆ కొందరికీ టీఆర్ఎస్ కండువా కప్పేద్దాం!
-
పరమావధి..!
మునిసిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడమే పరమావధిగా పలు రాజకీయ పార్టీలు కలిసొచ్చే సమీకరణాలపై దృష్టిసారించాయి. మిత్రపక్షమా.. వైరీపక్షమా?.. ఇదేమీ పట్టించుకోకుండా పట్టు నిలుపుకోవడమే లక్ష్యంగా వ్యూహం రచిస్తున్నాయి. ‘నాకు నీవు.. నీకు నేను!’ అనే ఫార్ములాను అనుసరిస్తూ మైత్రి కోసం సిద్ధమవుతున్నాయి. ఈ కోవలోనే జిల్లాలో హస్తం, కమలం దోస్తీ కట్టేందుకు తహతహలాడుతున్నాయి. సాధారణ ఎన్నికల్లో తన మిత్రపక్షం టీడీపీని కాదని కాంగ్రెస్ వెంట నడిచేందుకు బీజేపీ కౌన్సిలర్లు సిద్ధమవుతుండటంతో వింతరాజకీయం చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : మునిసిపల్ చైర్మన్ల ఎన్నికలో పరస్పరం సహకరించుకునే విధంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య అంతర్గతంగా ఒప్పందం కుదిరినట్లు విశ్వసనీయ సమాచారం. గద్వాల, షాద్నగర్లో కాంగ్రెస్, అయిజలో టీఆర్ఎస్కు చైర్మన్ పదవి దక్కించుకునేందుకు స్పష్టమైన సంఖ్యాబలం ఉంది. నారాయణపేటలో బీజేపీ సొంతబలం ఆధారంగానే చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. అయితే మహబూబ్నగర్, కల్వకుర్తి, నాగర్కర్నూల్, వనపర్తి మునిసిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన సంఖ్యాబలం లేకపోవడంతో ఇతర పార్టీలపైన ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు పార్టీలు పావులు కదుపుతున్నాయి. మహబూబ్నగర్లో ఎంఐఎంతో కలిసి చైర్మన్పీఠం దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నా సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. తమకే చైర్మన్ పదవి ఇవ్వాలని ఎంఐఎం పట్టుబడుతుండటంతో కాంగ్రెస్ ప్రత్యామ్నాయంపై దృష్టి సారించినట్లు తెలిసింది. ఆరుగురు కౌన్సిలర్ల బలం ఉన్న బీజేపీ మద్దతుతో కౌన్సిల్ చైర్మన్ను చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. మరోవైపు వనపర్తి మునిసిపాలిటీలో బీజేపీకి మద్దతు పలకాలని కాంగ్రెస్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య క్షేత్రస్థాయిలో చర్యలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. నాగర్కర్నూల్, కల్వకుర్తి నగర పంచాయతీల్లోనూ ఇదేరకమైన సహకారంతో ముందుకు సాగాలనే ప్రతిపాదన తెరమీదకు వస్తోంది. ఈ మేరకు ఇరుపార్టీల జిల్లా నాయకత్వం కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు. రెండుచోట్లా వైస్చైర్మన్ పదవితో సరిపెట్టుకోవాలని బీజేపీ నాయకత్వం ఆలోచిస్తోంది. ‘దేశం’తో అంగీకారం లేనట్లే! వనపర్తిలో బీజేపీ సహకారంతో చైర్మన్ పదవి దక్కించుకోవాలని భావిస్తున్న టీడీపీకి బీజేపీ నిర్ణయం ఆశనిపాతంగా మారింది. చైర్మన్ పదవి తమకే ఇవ్వాలని బీజేపీ పట్టుబట్టినా టీడీపీ నాయకత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వీలైనంత లబ్ధిపొందేందుకు కాంగ్రెస్తో వెళ్లడమే మేలని బీజేపీ భావించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ సహకరించుకుంటే వనపర్తి మునిసిపాలిటీ చైర్మన్గిరీతో పాటు మహబూబ్నగర్, నాగర్కర్నూల్, కల్వకుర్తిలో వైస్చైర్మన్ పదవిని దక్కించుకోవాలని బీజేపీ లెక్కలు వేస్తోంది. సాధారణ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ ఎన్నికల అవగాహన కుదుర్చుకుని అభ్యర్థులను బరిలోకి దించాయి. టీడీపీ ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగినా, బీజేపీ మాత్రం ఫలితం సాధించలేకపోయింది. సాధారణ ఎన్నికల సమయంలో ఇరు పార్టీల నడుమ పొత్తు కుదిరినా క్షేత్రస్థాయిలో శ్రేణుల నడుమ పూర్తిస్థాయిలో సమన్వయం కుదరలేదు. మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు లేనందున వనపర్తిలో టీడీపీకి మద్దతివ్వాల్సిన అవసరం లేదని బీజేపీ భావిస్తోంది. -
చైర్మన్ పీఠంపై ఉత్కంఠ
రంగారెడ్డి జెడ్పీపై కాంగ్రెస్, టీఆర్ఎస్ పోటాపోటీ సొంత సభ్యులను కాపాడుకునేందుకు తంటాలు విహారయాత్రల పేరిట సభ్యులను రాష్ట్రం దాటించిన పార్టీలు హస్తంతో చేతులు కలిపిన ‘దేశం’! వైస్ చైర్మన్ పదవి కోసమే స్నేహం సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకవపోవడంతో రంగారెడ్డి జిల్లా పరిషత్ రాజకీయం రసకందాయంలో పడింది. అధ్యక్ష పీఠం కోసం పార్టీలు నడుపుతున్న క్యాంపులు జోరందుకుంటున్నాయి. ఒకవైపు సొంత జెడ్పీ సభ్యులను కాపాడుకుంటూనే, మరోవైపు పొరుగు పార్టీల జెడ్పీటీసీలను తమ వైపు తిప్పుకునేందుకు ఆయా పార్టీలు పోటీపడుతున్నాయి. చైర్మన్ పీఠం కోసం కావాల్సిన మేజిక్ ఫిగర్ ‘17’ సభ్యులను సమకూర్చుకునేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు అష్టకష్టాలు పడుతున్నాయి. ప్రతిష్టాత్మక జిల్లా చైర్మన్ పదవిని తిరిగి నిలబెట్టుకోవాలని కాంగ్రెస్.. తొలిసారి జెడ్పీ పీఠం కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ తహతహలాడుతోంది. విందులు, విహార యాత్రలు జెడ్పీటీసీ సభ్యులు పక్క పార్టీల ప్రలోభాలకు లొంగకుండా కాపాడుకునేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్లు శిబిరాలు ఏర్పాటు చేసి ఎత్తు లు వేస్తున్నాయి. సభ్యులందరినీ విహారయాత్రల పేరిట జిల్లాలో లేకుండా సుదూర ప్రాంతాలకు తీసుకెళ్ళారు. అత్యధిక సంఖ్యలో 14 మంది జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ.. వారి సభ్యులను మేనేజ్ చేసే బాధ్యతను పార్టీలోని ఓ సీనియర్ నేతకు అప్పగించారు. దీంతో కార్యరంగంలో దిగిన ఆయన 14 మంది జెడ్పీటీసీ సభ్యులను తొలుత షిర్డీకి తరలివెళ్లారు. అటు నుంచి అటు వారందరూ గోవా వెళ్తున్నట్టు సమాచారం. హస్తంతో సైకిల్ మిలాఖత్ జెడ్పీలో హంగ్ కారణంగా మునుపెన్నడూ లేని సరికొత్త సమీకరణలు తెరమీదకొచ్చాయి. ఆగర్భ శత్రువులైన కాంగ్రెస్, టీడీపీ చైర్మన్ పదవి విషయంలో చేతులు కలిపాయి. ఏడుగురు జెడ్పీటీసీ సభ్యులున్న తెలుగుదేశం పార్టీకి డిప్యూటీ చైర్మన్ పదవి అప్పగిస్తామంటూ కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్కు టీడీపీ అంగీకరించినట్టు విశ్వసనీయ సమాచారం. దీనికి తోడు భారీగా తాయిలాలు కూడా ముట్టజెప్తామనడంతో వారు మరోమాట లేకుండా ఓకే చెప్పినట్లు తెలిసింది. ఇక ఇరు పార్టీలు వారు పరస్పర అంగీకారంతో క్యాంపులు నడుపుతున్నారని తెలిసింది. కాంగ్రెస్ జిల్లా పరిషత్ సభ్యులు చేజారకుండా విహారయాత్రలకు తరలించగా, టీడీపీ సభ్యులకు నగర శివారులోని ఫిలింసిటీలో విడిది ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఇక తెలంగాణలో అధికారం చేపట్టనున్న టీఆర్ఎస్ పార్టీ కూడా జెడ్పీ చైర్మన్ పదవిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చైర్మన్ పీఠం కైవసం చేసుకునేందుకు పక్క పార్టీల జెడ్పీలకు ఊహించని తాయిలాలు ప్రకటిస్తూ వారిని తమవైపు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు తమ సభ్యులు పక్క చూపులు చూడకుండా వారిని ఇప్పటికే చెన్నై షిఫ్ట్ చేశారు. ఓ ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ వారందరికీ విందు, వినోదాలు ఏర్పాటు చేశారు. మరోవైపు జెడ్పీటీసీల మద్దతు విషయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు మైండ్గేమ్కు కూడా తెరలేపాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదుగురు సభ్యులు తమ పార్టీలో చేరుతున్నారని టీఆర్ఎస్ ప్రచారం చేస్తుండగా...కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీ సభ్యులు పలువురు తమతో టచ్ ఉన్నారని, టీడీపీ వారూ మద్దతిస్తున్నారని అంటోంది. ఈనేపథ్యంలో జెడ్పీ పీఠం ఎవర్ని వరిస్తుందో వేచి చూడాలి. -
పార్టీల మధ్య పోరు కాస్తా.. అభ్యర్థుల మధ్య పోరుగా..
-
ఎన్నికలను బహిష్కరించండి
పార్టీలను తరిమికొట్టండి: మావోయిస్టుల పిలుపు చర్ల, న్యూస్లైన్: బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని, ఓట్ల పార్టీలను తరిమికొట్టాలని కోరుతూ ఖమ్మం జిల్లా చర్ల మండలం పెదమిడిసిలేరు మార్గంలో మావోయిస్టులు శనివారం అర్ధరాత్రి పోస్టర్లు వేసి బ్యానర్లు కట్టారు. కలివేరు నుంచి పెదమిడిసిలేరుకు వెళ్లే ప్రధాన రహదారి పక్కనే సీపీఐ మావోయిస్టు పార్టీ వెంకటాపురం ఏరియా కమిటీ పేరిట వెలసిన ఈ బ్యానర్లు, పోస్టర్లు కలకలం సృష్టించాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్ వంటి ఓట్ల పార్టీలను తరిమికొట్టాలని, గ్రీన్హంట్ ఆపరేషన్ను వ్యతిరేకించాలని, ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. -
పరిషత్’ను పట్టించుకోరేం?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గతంలో ప్రధాన పార్టీలు పరిషత్ ఎన్నికలను ప్రతి ష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఒకేసారి మున్సిపల్, పరిషత్, ఎంపీ, ఎమ్మె ల్యే ఎన్నికల షెడ్యూళ్లు విడుదలయ్యాయి. నెలన్నర వ్యవధిలోనే అన్నింటి పోలింగ్ పూర్తి కానుంది. మొదట మున్సిపల్, వెంటనే పరిషత్, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పరిణామాలు, సమీకరణాలపై దృష్టి సారించిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, సీనియర్ నాయకులు ‘స్థానిక’ ఎన్నికలను అంత గా పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ఘట్టం కూడా పూర్తయ్యింది. గురువారంతో పరిషత్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం పూర్తవుతుంది. అయినప్పటికీ ప్రధాన పార్టీల ముఖ్య నేతలు ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా జెడ్పీ పీఠంపై ఎవరిని నిలబెట్టాలన్న విషయమై ప్రాథమికంగా ఏ పార్టీ నిర్ణయానికి రాలేకపోయింది. ఈ విషయమే జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎంపీటీసీ ఎన్నికలపై అనాసక్తి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని 583 ఎంపీటీసి స్థానాలు, 36 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎంపీటీసీ ఎన్నికలను ప్రధాన రాజకీయ పా ర్టీల ప్రధాన నేతలు పట్టించుకోవడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి ఆశీస్సులకోసం అభ్యర్థులు ఆరాటపడుతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో జెండాలు మోసామని, ఇప్పుడు మాకు అవకాశం వస్తే బడా నేతలు ముఖం చాటేయడం ఎంతవరకు సమంజసమని ద్వితీయ శ్రేణి నాయకులు ప్రశ్నిస్తున్నారు. నిజామా బాద్ కార్పొరేషన్తోపాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ బల్దియాల ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులదీ ఇదే పరిస్థితి. ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. కానీ ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎం పీల అనుచరులు తప్ప బడా నేతలు ఎవరూ తమవైపు చూడడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు వచ్చేనెల 30వ తేదీన జరగనున్నాయి. అదే నెల 2వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల నియోజకవర్గాల ఇన్చార్జిలు ఆ ఎన్నికలపైనే దృష్టి సారించారు. దీంతో వారు మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను అంతగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ భాగ్యం ఎవరికో.. స్థానిక సంస్థల రిజర్వేషన్లలో భాగంగా జిల్లా పరిషత్ పీఠం బీసీలకు కేటాయించారు. జిల్లా పరిషత్లో 1995 నుంచి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఆ ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి బీసీలకు రిజర్వ్ అయ్యింది. 2001, 2006లలో వరుసగా జనరల్కు కేటాయించారు. ఈసారి మళ్లీ బీసీ జనరల్కు దక్కింది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయని భావించా రు. అయితే అందుకు భిన్నంగా పరి స్థితులున్నాయి. గురువారంతో నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగియనుండగా.. ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి వరకు తమ అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో జడ్పీ పీఠాన్ని అధిష్టించే ఆ బీసీ నేత ఎవరనే చర్చ జరుగుతోంది. -
మల్కాజ్గిరిపైనే అందరి కళ్లు!
-
కోడ్ కూసింది
మోగిన ఎన్నికల నగారా అమల్లోకి ఎన్నికల నియమావళి రాజకీయపార్టీల ఫ్లెక్సీల తొలగింపు తొలిసారిగా ప్రత్యేక కమిటీలు సర్వసన్నద్ధమవుతున్న యంత్రాంగం ఫ్లయింగ్, స్టాటిక్ స్వ్కాడ్లకు మెజిస్టీరియల్ అధికారాలు ఎన్నికల షెడ్యూలు ప్రకటనతో మహా సంగ్రామానికి తెర లేచింది. అభ్యర్థులు, పార్టీలు నిబంధనల లక్ష్మణ రేఖ దాటకుండా విధించిన ప్రవర్తన నియమావళి తక్షణం అమల్లోకి వచ్చింది. దాంతో రాజకీయ పక్షాలకు ముకుతాడు వేసినట్టయింది. మే 7న జిల్లాలో జరగనున్న ఎన్నికల పర్యవేక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం ప్రారంభించింది. ఎన్నికల కమిషన్ విస్పష్ట ఆదేశాల ప్రకారం, జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ప్రత్యేక కమిటీలను సిద్ధం చేస్తోంది. ఎన్నికల వ్యయంపై, ప్రచారం తీరుతెన్నులపై నిఘా పెడుతోంది. శాంతిభద్రతలు చేజారకుండా పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. కొత్తగా వచ్చిన ఈవీఎంలతో పోలింగ్ ఏర్పాట్ల అధ్యాయం ప్రారంభమైంది. విశాఖ రూరల్, న్యూస్లైన్ : సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చింది. ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమవుతోంది. మే 7న జరిగే ఎన్నికలకు మునుపెన్నడూ లేని విధంగా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్థుల ఖర్చు నుంచి ఎన్నికల నియమావళి అమలు వరకు అన్నింటిపైనా దృష్టి సారించింది. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీలను సిద్ధం చేస్తోంది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు పోలీసు శాఖ కూడాకట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతోంది. కోడ్ ఉల్లం‘ఘనుల’పై దృష్టి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడంతో బుధవారం నుంచి కోడ్ అమలులోకి వచ్చింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పర్యవేక్షించడానికి కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. మండల స్థాయిలో నియమావళి పర్యవేక్షణకు ఎంపీడీఓ, సబ్ఇన్స్పెక్టర్, ఒక వీడియోగ్రాఫర్, అర్బన్లో జోనల్ కమిషనర్ లేదా రిటర్నింగ్ అధికారి సిఫార్సు చేసే సిబ్బందిని నియమించనున్నారు. గ్రామీణ ప్రాంతంలో ప్రతీ 10 నుంచి 15 పోలింగ్ కేంద్రాలకు ఒక సెక్టర్ ఆఫీసర్ను, అలాగే అర్బన్లో ప్రతీ 20 పోలింగ్ కేంద్రాలకు ఒక సెక్టర్ ఆఫీసర్లను నియమించారు. వీళ్ల కింద గ్రామాల్లో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులు, అర్బన్లో వార్డుల్లో సబ్ఇన్స్పెక్టర్, శానిటరీ ఇన్స్పెక్టర్, బిల్కలెక్టర్లు నియమావళిని పర్యవేక్షిస్తారు. కోడ్ అమలుపై ఏఎస్పీ నుంచి సీఐల వరకు, ఆర్ఓ, ఏఆర్ఓలకు బుధవారం మధ్యాహ్నంతో శిక్షణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. జిల్లా స్థాయిలో కోడ్ పర్యవేక్షణకు నోడల్ అధికారిగా జిల్లా పరిషత్ సీఈఓ మహేశ్వరరెడ్డిని నియమించారు. బ్యానర్ల తొలగింపు: కోడ్ అమలులోకి భాగం గా జిల్లాలో రాజకీయ పార్టీలకు సంబంధించిన పోస్టర్లు,బ్యానర్లు, హోర్డింగ్లను తొలగించే పని లో అధికారులు నిమగ్నమయ్యారు. గోడలపైన కూడా పార్టీలకు సంబంధించిన రాతలను కూడా చెరిపేస్తున్నారు. జీవీఎంసీ పరిధిలో ఇప్పటికే హోర్డింగ్లను, బ్యానర్లను తొలగిస్తున్నారు. మరో రెండు రోజుల్లో జిల్లాలోఎక్కడా రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రచార పోస్టుర్లు లేకుం డా చూడాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. తనిఖీ బృందాలు ఎన్నికల కోసం ప్రత్యేక తనిఖీ బృందాలను సిద్ధం చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గానికి మూడు ఫ్లయింగ్ స్వ్కాడ్లను నియమిస్తున్నారు. ఇందులో ఒక అధికారి, సబ్ఇన్స్పెక్టర్, ఒక వీడియోగ్రాఫర్ ఉంటారు. ఓటర్లను ప్రభావితం చేయడం వంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ బృందాలు దాడులు చేసి చర్యలు తీసుకుంటాయి. అదే విధంగా ఒక్కో నియోజకవర్గానికి మూడు స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్లను పెడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి డబ్బులు, మద్యం, గిఫ్ట్లు, ఇతర వస్తువుల తరలింపులకు అవకాశం లేకుండా ఈ టీమ్లు ఎక్కడపడితే అక్కడ తనిఖీలు నిర్వహిస్తాయి. ఈ రెండు తనిఖీ బృందాలకు మెజిస్టీరియల్ అధికారాలు ఉంటాయి. వీటితో పాటు జిల్లాలో 30 వరకు చెక్పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయనున్నారు. -
ఎన్నికల వేళ...
-
చర్చకు అడ్డుపడితే.. విభజనకు అనుకూలమన్నట్లే!
సాక్షి, హైదరాబాద్: విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగకుండా అడ్డుకుంటున్న పార్టీలు, ప్రజాప్రతినిధులు విభజనకు అనుకూలంగా ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు చెప్పారు. బుధవారం ఏపీఎన్జీవో భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. బిల్లు వచ్చి ఇన్ని రోజు లైనా చర్చకు నోచుకోకపోవడం విచారకరమన్నారు. బిల్లుపై చర్చించకుండా వెనక్కు పంపితే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని, జరగబోయే నష్టానికి ఆయా పార్టీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. బిల్లుకు వ్యతిరేకంగా ప్రతి ఎమ్మెల్యే తన అభిప్రాయాన్ని చెప్పేలా ఆయా పార్టీలను కలసి కోరతామని తెలిపారు. చర్చను అడ్డుకుంటున్న ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద ఆందోళన చేస్తామన్నారు. ఉద్యోగులపరంగా తమ కార్యాచరణ రూపకల్పన కోసం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బిల్లుపై సమగ్రంగా చర్చించి అవసరమైతే ఓటింగ్ నిర్వహించాలని సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి అన్నారు. -
చంద్రబాబు రాజకీయ ప్రాభవం తగ్గుతోంది:విశ్లేషకులు
-
GOMకు రాష్ట్ర కాంగ్రెస్ నివేదిక పై ఉత్కంఠ
-
ఎటుదూకుదాం!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు కర్నూలు జిల్లా కాంగ్రెస్, టీడీపీ నేతలను కలవరపెడుతున్నాయి. రోజుకో మలుపు తిరుగుతున్న పరిణామాలతో ఇరు పక్షాలకు చెందిన కొందరు నేతలు పక్కచూపులు చూస్తున్నారు. రెండు పార్టీల భవిష్యత్ ప్రశ్నార్థకంగా ఉండటంతో వారు తీవ్ర గందరగోళానికి గురువుతున్నారు. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో వారు తమ రాజకీయ భవిష్యత్తును ఎలా కాపాడుకోవాలా అని మధన పడుతున్నారు. పార్టీ మారితే ఎలా ఉంటుంది.. లేకుంటే పరిస్థితి ఏమిటి అనే అంశంపై అనుభవజ్ఞులై రాజకీయ నేతల సలహాలు తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రత్యేక తెలంగాణాకు అధికార కాంగ్రెస్ ఓకే చెప్పటం జిల్లాకు చెందిన ముఖ్యనాయకులను సంకటస్థితిలోకి నెట్టింది. అదే విధంగా అధికార కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని ఖండించని ప్రతిపక్ష టీడీపీ నేతల పరిస్థితి కూడా ఇదే విధంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఇరు పార్టీ నేతలు ఎటువైపు అడుగులు వేయాలో అర్థంకాక జుట్టుపీక్కుంటున్నారు. దీంతో విభజనకు వ్యతిరేకంగా జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ అందులో పాల్గొనలేకపోయారు. ఉద్యమకారులకు కనీసం మద్దతు తెలియజేయటానిక్కూడా సాహసించలేదు. ఉద్యమంలో పాల్గొంటే తమ అధినేత చంద్రబాబు ఆగ్రహానికి గురవుతామని తెలుగు తమ్ముళ్లు దూరంగా ఉండిపోయిన విషయం తెలిసిందే. ఇది చాలదన్నట్టు అధినేత బీజేపీతో పొత్తుపెట్టుకోవాలని భావిస్తున్నారనే వార్తలు జిల్లా టీడీపీ నేతలను మరింత కలవరానికి గురిచేస్తున్నాయి. అదే జరిగితే ముస్లిం మైనర్టీలు అధికంగా ఉన్న కర్నూలు జిల్లాలో తమ పార్టీ దెబ్బతినే అవకాశం లేకపోలేదని వారి ఆవేదన. దీనితో టీడీపీకి చెందిన ముఖ్యనేతలు కొందరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ నేతల వింత ఆలోచన: పార్టీలో ఉంటే భవిష్యత్ లేదని టీడీపీ నేతలు భావిస్తుంటే.. అధికార కాంగ్రెస్కు చెందిన ముఖ్యనేతలు నలుగురు టీడీపీ వైపు చూస్తున్నారు. వారు నలుగురూ ఎమ్మెల్యేలే కాగా వారిలో ఇద్దరు కీలకవ్యక్తులు కావడం విశేషం. విభజనకు ప్రధాన కారణమైన కాంగ్రెస్లో ఉంటే తమకు భవిష్యత్ లేదని ఆ నాయకులు, కార్యకర్తలు బహిరంగంగానే ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ఓ ముఖ్యనేతైతే ‘కాంగ్రెస్ నాశనమైపోతుంది’ అని శపించారు కూడా. వారంతా టీడీపీ తీర్థం పుచ్చుకుని వచ్చే ఎన్నికల్లో పోటీచేసి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తున్నారు. దీనితో వీరు టీడీపీలోని ముఖ్యనాయకులతో మంతనాలు జరిపినట్లు సమాచారం. అయితే ఇన్నాళ్లూ తాము కష్టపడి పార్టీకోసం శ్రమిస్తుంటే మధ్యలో వీరొచ్చి తమ సీట్లు ఎక్కడ తన్నుకు పోతారోనని వీరి రాకను కొందరు టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. ఇన్నాళ్లు జెండాను మోసిన తమను పక్కనపెట్టి విభజన పాపానికి కారకులైన వారిని పార్టీలోకి తీసుకొస్తే డైలమాలో ఉన్న తామంతా పార్టీ మారక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. కార్యకర్తలైతే విభజన ద్రోహులైన కాంగ్రెస్ నేతలు పార్టీలోకి వస్తే అస్సలు క్షమించేది లేదని తేల్చిచెపుతున్నారు.ఇలా ఇరు పార్టీల పెద్దల ఎత్తుగడలను పరిశీలిస్తున్న కింది స్థాయి కేడర్ మాత్రం ఎవరు ఎటువైపు వెళ్లినా విభజన ప్రకటన చేసిన కాంగ్రెస్ను, అందుకు మద్దతు లేఖ ఇచ్చిన టీడీపీ ద్రోహులను క్షమించేది లేదని కుండబద్దలుగొడుతున్నారు. దీనితో జంపింగ్ బాబుల పరిస్థితి ముందుకు వెళ్తే గొయ్యి వెనక్కు వెళ్తే నుయ్యిలా మారింది. -
‘పుర’పోరుకు సై..
మున్సిపాలిటీ ఎన్నికల పోరుకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధమయ్యాయి. ఇప్పటికే వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ పూరతవడంతో మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల సందడి నెలకొంది. త్వరలో మున్సిపల్ ఎన్నికల నోటి ఫికేషన్ విడుదల చేస్తారని భావిస్తున్న ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపిక, గెలుపు అవకాశలపై కసరత్తు మొదలుపెట్టాయి. 2010 సెప్టెంబర్ 29వ తేదీతో గత పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత ప్రభుత్వం పురపాలక ఎన్నికలే నిర్వహించలేదు. ప్రత్యేకాధికారుల పాలనను ఆర్నెళ్లకొకసారి పొడిగిస్తూ వచ్చింది. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే ందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండడంతో ఆశావహుల్లో సందడి మొదలైంది. వార్డుల వారీగా రిజర్వేషన్లు కేటాయిస్తూ కలెక్టర్ ఇప్పటికే ప్రభుత్వనికి పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. జనాభా ప్రాతిపది కన ఆయా వార్డుల్లో కులాలవారీగా అభ్యర్థులు పోటీ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు రిజర్వేషన్లు ప్రకటించగానే బరిలోకి దిగేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. 8ఏళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు జిల్లాలోని నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో 40 వార్డులు, సూర్యాపేటలో 34, మిర్యాలగూడలో 36, భువనగిరిలో 30, నకిరేకల్లో 23, కోదాడలో 30 వార్డులకు, హుజుర్నగర్ నగర పంచాయతీలో 26 వార్డులు, దేవరకొండ నగర పంచాయతీకి ఎన్నికలు జరుగనున్నాయి. వీటికి సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఎట్టకేలకు ఎనిమిదేళ్ల తర్వత జరుగుతున్న పురపోరుకు ఆశావహులు రంగం సిద్ధ చేసుకుంటున్నారు. ఆయా మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా రిజర్వేషన్లను నిర్ణయించినప్పటికీ చైర్మన్ స్థానాలకు రిజర్వేషన్లు కేటాయించలేదు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల చైర్మన్ స్థానాల రిజర్వేషన్పై ఎటువంటి అభిప్రాయం వెలువడకపోవడంతో ఎంతోకాలంగా ఆ పదవిపై ఆశలు పెట్టుకున్నవారంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే త మ పార్టీల అధినేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మరికొద్దిరోజుల్లో ప్రభుత్వం నుంచి చైర్మన్ స్థానాల రిజరర్వేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.