shoot
-
Maternity Photoshoot: నిండు నెలల జ్ఞాపకం
ప్రీ వెడ్డింగ్ షూట్ వెడ్డింగ్ షూట్ తెలిసిందే. కాని ఇప్పుడు మెటర్నిటీ షూట్ ట్రెండ్లో ఉంది. స్త్రీలు తమ నిండు గర్భం సమయంలో భర్తతో కలిసి ఫొటో షూట్లో పాల్గొనడం ఒక ముఖ్య ఉత్సవంగా మారింది. తాజాగా దీపికా పడుకోన్ విడుదల చేసిన మెటర్నిటీ షూట్ ఫొటోలు ఈ ట్రెండ్ గురించి ప్రొత్సాహంగా మాట్లాడుతున్నాయి.తొలి చూలుతో పుట్టింటికి వచ్చిన కూతురు రేపో మాపో కాన్పు అవుతుందనగా ‘నొప్పులొస్తే నన్ను లేపమ్మా’ అందట నిద్రపోతూ. అప్పుడు తల్లి నవ్వుతూ ‘పిచ్చిపిల్లా... నొప్పులొస్తుంటే నేను నిన్ను లేపడం కాదే. నువ్వే గోల చేసి ఊరంతా లేపుతావు’ అందట. మాతృత్వపు మధురిమ స్త్రీ జీవితంలో అత్యంత ముఖ్యమైనది. గర్భం దాల్చడంతో మొదలు నెలలు నిండుతూ వెళ్లడం, శరీరంలో మార్పు ఉదర భాగం బిడ్డకు గూడుగా మారుతూ ఎదుగుతూ ఉండటం, ఆ మార్పులన్నీ చూసుకోవడం, చివరకు కాన్పు జరిగి అంతవరకూ గర్భంలో ఉన్న బిడ్డ ఒడికి చేరడం... స్త్రీకి ఇదంతా అద్భుత ఘట్టం. మానసిక శాస్త్ర అధ్యయనం ప్రకారం చాలామంది స్త్రీలకు గర్భం దాల్చినప్పుడు ఆ నిండుదనాన్ని నలుగురికీ చెప్పుకోవాలని ఉంటుందట. నిండు గర్భంతో అప్పుడప్పుడు నలుగురిలోకి రావడాన్ని ఇష్టపడతారట. కాలక్రమంలో ఈ ఇష్టం ఆ క్షణాలను ఫొటోలుగా దాచుకునే వరకూ వచ్చింది.1991లో మొదలైన ట్రెండ్హాలీవుడ్ ప్రసిద్ధ నటి డెమి మూర్ 1991లో తన ఏడు నెలల గర్భాన్ని ప్రదర్శిస్తూ ఒక మేగజీన్ కవర్ పేజీ మీద కనపడినప్పుడు అది ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం అయ్యింది. ప్రఖ్యాత మహిళా ఫొటోగ్రాఫర్ ఆనీ లీబోవిజ్ ఈ ఫొటో తీసింది. చాలామంది దీనిని స్త్రీ శరీర ధర్మానికి సంబంధించిన ఒక గౌరవ ప్రకటనగా భావిస్తే మరికొందరు ఇందులో అశ్లీలత ఉందని విమర్శలు చేశారు. అయితే కాలక్రమంలో సెలబ్రిటీలు చాలా మంది మెటర్నిటీ ఫొటోస్ను జనం ముందుకు తీసుకురాసాగారు.2012 నుంచి ఇండియాలోమన దేశంలో బాలీవుడ్ నుంచి సెలబ్రిటీలు మెటర్నిటీ షూట్ను 2010 నుంచి పరిచయం చేయసాగారు. కొంకణా సేన్, సోహా అలీ ఖాన్, నేహా ధూపియా, బిపాషా బసు, అనుష్కా శర్మ, కరీనా కపూర్, సోనమ్ కపూర్, ఇటీవల ఆలియా భట్... వీళ్ల ఫొటోషూట్లు సామాన్యజనానికి కుతూహలం రేకెత్తించాయి. మనం కూడా ఎందుకు ఇలాంటి జ్ఞాపకాలు నిక్షిప్తం చేసుకోకూడదు అనిపించేలా చేశాయి. ఇప్పుడు దీపికా పడుకోన్ తన భర్త రణ్వీర్ సింగ్తో కలిసి బ్లాక్ అండ్ వైట్లో చేసిన మెటర్నిటీ షూట్ అందరి చేత ప్రశంసలు పొందుతోంది. రెండు ఫ్యాషన్ బ్రాండ్ల నుంచి ప్రత్యేకంగా ఎంచుకున్న దుస్తులతో దీపిక ఈ షూట్ చేసింది. రణ్వీర్ సింగ్ ఈ షూట్లో సంబరంగా పాల్గొన్నాడు.మధ్యతరగతికి దూరం కాదుమెటర్నిటీ షూట్లకు సెలబ్రిటీలు లక్షలు ఖర్చు పెడుతుంటే మధ్యతరగతి స్త్రీలకు అదేమీ అందని కల కాదు. ్ర΄÷ఫెషనల్ ఫొటోగ్రాఫర్లతో మొదలు హాబీగా ఫొటోలు తీసేవారి వరకూ ఇలాంటి ఫొటోలు తీసి పెట్టేవారు ఉన్నారు. నాలుగు గంటల వ్యవధిలో మూడు రకాల డ్రస్సులతో ఫొటోలు తీసి పెట్టే ΄్యాకేజీలు కూడా ఉన్నాయి. ‘ఒకప్పుడు గర్భిణులు కెమెరా ముందుకు రావడానికి సిగ్గు పడేవారు. కాని తమ మాతృత్వ దశలను పదిలం చేసుకునేందుకు ఇప్పుడు సంతోషంగా ముందుకొస్తున్నారు’ అని ఇలాంటి ఫొటోలు తీసే ఒక ఫొటోగ్రాఫర్ అన్నారు.థీమ్ ఫొటోలుప్రెగ్నెన్సీ షూట్లో కూడా థీమ్స్ ఉన్నాయి. పల్లెటూరి జంటలుగా, నగర శ్రీమంతులుగా, గుడి ్రపాంగణంలో, తెలుగుదనంతో ఇలా చాలా రకాలున్నాయి. ఎనిమిదవ నెలలో ఈ ఫొటోషూట్ చేయించుకుంటే ఫొటోలు బాగావస్తాయంటున్నారు నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం. మీ మనసులో ఈ ముచ్చట ఉంటే వెంటనే అందుకు సిద్ధం కండి. -
పొరపాటు తీసిన ప్రాణం.. ఇంటర్ విద్యార్ధి మృతి
హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్లో విషాదం చోటు చేసుకుంది. మూగజీవాల్ని కబేళాలకు తరలిస్తున్నారనే నెపంతో గోసంరక్షకులు ఇంటర్ విద్యార్థి అర్యన్ మిశ్రాను కాల్చి చంపారు. ఈ ఘటనలో విద్యార్ధి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులు అనిల్ కౌశిక్, వరుణ్, కృష్ణ, ఆదేశ్, సౌరబ్లను అదుపులోకి తీసుకున్నారు.మూగజీవాల్ని కళేబరాలకు తరలిస్తున్న స్మగ్లర్లు రెనాల్ట్ డస్టర్, టయోటా ఫార్చూనర్ కార్లలో తిరుగుతున్నారంటూ నిందితులకు సమాచారరం అందింది. దీంతో వెంటనే అనిల్ కౌశిక్, అతని స్నేహితులు స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.సరిగ్గా అదే సమయంలో బాధితుడు ఆర్యన్ మిశ్రా,అతని స్నేహితులు శాంకీ,హర్షిత్లు ప్రయాణిస్తున్న డస్టర్ కారు పటేల్ చౌక్ వద్ద కనిపించింది. ఆ కారును 30కిలోమీటర్లు వెంబడించిన నిందితులు విద్యార్థిని కారు ఆపాలని బెదిరించారు. కారు ఆపకపోవడంతో నిందితులు కాల్పులు జరపగా బాధితుడు మృతి చెందాడు. అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
ట్రంప్పై దాడి.. కొనసాగుతున్న సస్పెన్స్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం ఘటన ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టించింది. గత శనివారం ఎన్నికల ప్రచారంలో ఉన్న ట్రంప్పై కాల్పులు జరిపిన వ్యక్తిని 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్గా ఎఫ్బీఐ తేల్చి చెప్పింది. అయితే.. పెన్సిల్వేనియాలోని బెతెల్ పార్క్కు చెందిన ఈ యువకుడు.. ఎందుకు ట్రంప్పై కాల్పులు జరిపాడనేది మాత్రం ఇంకా సస్పెన్స్గానే ఉంది. ఇంతటి చర్యకు పాల్పడటానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటనపై దేశీయ ఉగ్రవాద చర్యగా తాము విచారణ చేపట్టినట్లు ఎఫ్బీఐ వెల్లడించింది. నిందితుడు ఒంటరిగానే ఈ కాల్పులు జరిపినట్లు పేర్కొంది. అయితే యువకుడి కాల్పుల వెనక స్పష్టమైన కారణాలు తెలియకపోవడం వల్ల కుట్ర కోణం దాగి ఉండవచ్చని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంతేగాక ఘటనకు ముందు అతని సోషల్ మీడియా అకౌంట్లలలో ఎలాంటి బెదిరింపు సమాచారాన్ని తాము కనుగొనలేదని చెప్పారు. కొన్ని నెలలుగా సోషల్ మీడియా ఉపయోగించడం లేదని తెలిపారు. గతంలోనూ రాజకీయాలతో సంబంధాలు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. అయితే క్రూక్స్ కుటుంబ సభ్యులు తమ విచారణకు సహకరిస్తున్నారని ఎఫ్బీఐ అధికారులు పేర్కొన్నారు.కాగా క్రూక్స్ రిపబ్లికన్ పార్టీ మద్దతుదారుగా రిజిస్టర్ చేసుకున్నాడు. నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడానికి తొలిసారి ఓటర్నగా నమోదు చేసుకున్నాడు. అయితే, క్రూక్స్2021లో డెమోక్రటిక్ పార్టీకి 15 డాలర్ల విరాళం ఇచ్చినట్టుగా కూడా గుర్తించారు. కాగా, పిట్స్ బర్గ్ శివార్లలోని బెథెల్ పార్క్ ఏరియాకు చెందిన క్రూక్స్ 2022లో హైస్కూల్ విద్య పూర్తి చేశాడు. నేషనల్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇనీషియేటివ్ నుంచి అతడు 500 డాలర్ల ‘స్టార్ అవార్డు’ కూడా అందుకున్నట్లు తెలిసింది. స్కూల్లో ఉండగా.. గణితంలో అతడు చురుగ్గా ఉండేవాడని సమాచారం. ఈ ఘటనపై పూర్తి విచారణ జరుపుతామని ఎఫ్బీఐ ప్రకటించింది. దీనికి కొంత సమయం పట్టొచ్చని తెలిపింది. ఏదైనా సమాచారం ఉంటే తమతో పంచుకోవాలని ర్యాలీకి హాజరైన వారిని కోరింది.ఈ ఏడాది నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున మరోసారి అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు ట్రంప్. ఈ ఈక్రమంలో జూలై 13న నిర్వహించిన ఓ ఎన్నికల ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతుండగా ఆయనపై అనుకోకుండా దాడి జరిగింది. ట్రంప్ స్టేజ్ నుంచి 140 మీటర్ల దూరంలోఉన్న ఓ భవనంపై నుంచి దుండగుడు ఒక్కసారిగా కాల్పులు జరిపాడు.పెన్సిల్వేనియాలోని బట్లర్లో జరిగిన ఈ ఘటనలో ట్రంప్ చెవికి గాయమై రక్తం కారింది. మరో ఇద్దరికి గాయాలవ్వగా.. మాజీ అగ్నిమాపక అధికారి ప్రాణాలు కోల్పోయాడు వెంటనే అప్రమత్తమైన ట్రంప్ భద్రతా సిబ్బంది (సిక్రెట్ సర్వీస్ స్నైపర్లు) అంగతకుడిపై కాల్పులు జరిపి అంతమొందించారు. ట్రంప్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. 13 ఏళ్ల బాలుడి దుర్మరణం
న్యూయార్క్: అమెరికాలో 13 ఏళ్ల పిల్లాడు పోలీసు తూటాకు బలయ్యాడు. తుపాకీ చూపించి డబ్బులు దోచుకుంటున్న ఒక ముఠా గురించి గాలిస్తున్న పోలీసు బృందం అనూహ్యంగా పిల్లాడిని పొట్టనబెట్టుకుంది. స్థానిక మీడియా, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యుటికాలో శుక్రవారం రాత్రి సైకిల్పై వెళ్తున్న ఇద్దరు టీనేజర్లను పోలీసులు ఆపి ‘మీ దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు కదా?’ అని అడిగారు. వారిలో 13 ఏళ్ల న్యాహ్ ఎంవా ఒక్కసారిగా పరుగెత్తడంతో పోలీసులు వెంటపడ్డారు. దాంతో పిల్లాడు తన దగ్గరున్న బొమ్మ పెల్లెట్ గన్తో బెదిరించాడు. దాన్ని నిజమైన గన్గా భావించి ప్యాట్రిక్ హష్నే అనే పోలీసు పిల్లాడిని కిందపడేసి పట్టుకోబోయాడు. మరో ఇద్దరు పోలీసులు పిడిగుద్దులు కురిపించారు. పెనుగులాటలో పిల్లాడిని ప్యాట్రిక్ షూట్ చేశాడు. ఛాతిలో తూటా దిగడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పిల్లాడు చనిపోయాడు. మొత్తం ఉదంతం పోలీసు అధికారి బాడీ కెమెరాలో రికార్డయింది. వారి అతి జాగ్రత్తలు అమాయక పౌరులను బలితీసుకుంటున్నాయని పిల్లాడి సంతాప సభలో స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై నిష్పాక్షిక దర్యాప్తు జరుపుతామని సిటీ మేయర్ హామీ ఇచ్చారు. అంతర్గత కలహాలతో రగిలిపోతున్న మయన్మార్ నుంచి పిల్లాడి కుటుంబం ఎనిమిదేళ్ల క్రితం అమెరికాకు వలసవచ్చింది. -
సిక్కోలులో తండేల్ టీమ్.. చైతూకు మాస్ వెల్కమ్!
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమావలో చైతూ సరసన హీరోయిన్గా సాయిపల్లవి కనిపించనుంది. గతంలో వీరిద్దరు జంటగా లవ్ స్టోరీ చిత్రంలో నటించారు. మరోసారి ఈ జోడీ వెండితెరపై సందడి చేయనున్నారు. సముద్ర జాలర్ల బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను తెరెకెక్కిస్తున్నారు.అయితే ప్రస్తుతం తండేల్ మూవీ షూటింగ్ శ్రీకాకుళంలో జరుగుతోంది. ఈ సందర్భంగా శ్రీకాకుళం విచ్చేసి యువసామ్రాట్ నాగ చైతన్యకు అదిరిపోయే స్వాగతం లభించింది. రోడ్ల వెంట బ్యానర్లు ప్రదర్శిస్తూ.. టపాసులతో అభిమానులు వెల్కమ్ చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వైరలవుతున్నాయి. ఇది చూసిన ఫ్యాన్స్ మాస్ వెల్కమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అనంతరం తండేల్ టీమ్ అంతా అరసవెల్లి సత్యనారాయణ స్వామివారిని ఆమె దర్శించుకున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ సాయిపల్లవిని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు అభిమానులతో నిండిపోయాయి. పక్కనే నాగచైతన్య కూడా ఉండడంతో ఫ్యాన్స్ హడావుడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా.. తండేల్ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నారు.Fans Celebrating Visuals Before Chay Arrival !! #ChayMass 💥 Dhullakotti Dhupameseyyala .. #Thandel ♥️⚓ Guri Thappedheles #NagaChaitanya @chay_akkineni Nuvvante Abhimanam Gundela Ninda Kani Thanks Custody Lu Antene Badha🙇Jai Chaithu Jai Jai Chaithu 💥🥳 https://t.co/SCGOeQ58el pic.twitter.com/KPv62UssGT— Chay (@PurnaMaaya_) June 19, 2024Srikakulam resonated with "Jai chaithu" slogans 🔥❤🔥🤙Yuva Samrat @chay_akkineni arrived to srikakulam for #Thandel Shoot ⚓#Nagachaitanya @ThandelTheMovie @GeethaArts pic.twitter.com/6TiK9owOGC— AKKINENI TO AKKINENI FANS ASSOCIATION FANS (@chayfanschitvel) June 19, 2024తండేల్ చిత్రీకరణ కోసం శ్రీకాకుళం వెళ్లిన నాగచైతన్య ,సాయి పల్లవి కి అభిమానులు ఘనస్వాగతం పలికారు. అరసవల్లి టెంపుల్ దర్శనం కు వెళ్లిన సాయిపల్లవి చూసెందుకు ఫ్యాన్స్ ఉత్సాహాం చూపారు..#nagachaitanya #Saipallavi#Thandel #ramayan pic.twitter.com/5WgINPftRN— suzen (@Suzenbabu) June 19, 2024 -
పాయింట్ బ్లాంక్లో డీజేపై కాల్పులు
రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీలో సోమవారం(మే27) తెల్లవారుజామున షాకింగ్ ఘటన జరిగింది. నగరంలోని ఓ బార్లో పనిచేస్తున్న డీజే సందీప్ను దుండగులు పాయింట్బ్లాక్ రేంజ్లో కాల్చి చంపారు. తొలుత ఆదివారం రాత్రి నలుగురు దుండగుల బ్యాచ్ బార్లోకి ప్రవేశించింది. బార్లో డీజే మ్యూజిక్ ప్లే చేస్తుండటంపై వారు అభ్యంతరం తెలిపారు. ఈ విషయమై డీజే సందీప్తో పాటు బార్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం వారు వెళ్లిపోయారు. గొడవ సద్దుమణిగిందనుకునేలోపు మళ్లీ సోమవారం తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో వచ్చి పాయింట్ బ్లాంక్ రేంజ్లో డీజే సందీప్ను తుపాకీతో ఛాతిపై కాల్చారు. వెంటనే సందీప్ను ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. సందీప్ను ఛాతిపై తుపాకీతో కాల్చే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు!
భారత్కు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ హత్యపై ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అతను బతికే ఉన్నాడని అమెరికా పోలీసులు వెల్లడించారు. అమెరికాలోని హోల్ట్అవెన్యూలో మంగళవారం సాయంత్రం కొందరు దుండగులు ఇద్దరిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కెనడా కేంద్రంగా పనిచేసే గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్గా స్థానిక మీడియా పేర్కొంది. వాస్తవానికి ఆ ఘటనలో చనిపోయిన వ్యక్తి వివరాలను గుర్తించిన తర్వాత ఈ పోలీసులు ఈ ప్రకటన చేశారు.కాల్పుల ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. మృతుడు గోల్డీబ్రార్ కాదని లెఫ్టినెంట్ విలియం జే డూలే అని పోలీసులు వెల్లడించారు. మీరు మృతుడు గోల్డీబ్రార్ అనుకుంటే కచ్చితంగా తప్పే. అది పూర్తి అవాస్తవం. మా డిపార్ట్మెంట్కు ప్రపంచం నలుమూలల నుంచి ఎంక్వైరీలు వస్తున్నాయి. అసలు ఇలాంటి వదంతులు ఎలా వచ్చాయో తెలియదు. ఈ కాల్పుల ఘటనలో మరణించింది 37 ఏళ్ల జేవియర్ గాల్డ్ అని తెలిపారు.కాగా.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపైకి కాల్పులు జరిపిన ఘటనలో కూడా గోల్డీబ్రార్ పేరు తెరపైకొచ్చింది. ఈ కేసులో అరెస్టైన నిందితుల్లో పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. గోల్డీ బ్రార్గా ప్రచారంలో ఉన్న సతీందర్ సింగ్ భారత్లో మోస్ట్వాంటెడ్ క్రిమినల్. అతడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్లో అత్యంత కీలకమైన సభ్యుడు. 2022లో జరిగిన పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవా హత్య కేసుతో అతని పేరు వెలుగులోకి వచ్చింది. -
కన్నప్పలో అక్షయ్ కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ‘కన్నప్ప’ చిత్రం షూటింగ్లో జాయిన్ అయ్యారు. విష్ణు మంచు టైటిల్ రోల్లో రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ షూటింగ్లో జాయిన్ అయ్యారు అక్షయ్ కుమార్. ఈ సందర్భంగా మోహన్బాబు, విష్ణు మంచు కలిసి అక్షయ్కి స్వాగతం పలికారు. ‘‘శివ భక్తుడైన కన్నప్ప కథను ‘కన్నప్ప’గా తెరపైకి తీసుకొస్తున్నాం. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ మూవీ రూపొందుతోంది. హైదరాబాద్లో మూడో షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. అక్షయ్తో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు మేకర్స్. -
Bengaluru: బెదిరింపులకు భయపడం: డీకే శివకుమార్
బెంగళూరు: తన తమ్ముడు డీకే సురేష్ను కాల్చి చంపాలని బీఏపీ నేత ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. డీకే సురేష్ ఇలాంటి బెదిరింపులకు భయపడే వ్యక్తి కాదని, ఇలాంటివి తాము గతంలో చాలా చూశామన్నారు. వాటన్నింటని సెటిల్ చేశామని చెప్పారు. కేంద్ర బడ్జెట్లో దక్షిణాదికి నిధులు సరిగా దక్కకపోవడంపై డీకే సురేష్ మాట్లాడుతూ దేశాన్ని ఉత్తర, దక్షిణ భారత దేశాలుగా విభజించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు దుమారాన్ని రేపాలయి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఈశ్వరప్ప.. డీకే సురేష్, ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి లాంటి వాళ్లను కాల్చి చంపేందుకు చట్టం చేయాల్సిందిగా ప్రధాని మోదీకి చెబుతానన్నారు. అయితే, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే డీకే సురేష్ వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యాఖ్యలను సమర్థించదని తేల్చి చెప్పారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ ఈశ్వరప్పకు కొట్టడం, తిట్టడం, కాల్చడం తప్ప ఏమీ తెలియదన్నారు. ఈశ్వరప్పపై చట్టపరమైన చర్యలుంటాయని చెప్పారు. కాగా, డీకే సురేష్ను కాల్చి చంపాలన్నందుకు ఈశ్వరప్పపై బెంగళూరులో ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై ఈశ్వరప్ప స్పందిస్తూ జాతీయవాదం, హిందుత్వ అంశాల్లో తనపై వందల ఎఫ్ఐఆర్లు నమోదైనా భయపడనని స్పష్టం చేశారు. ఇదీ చదవండి.. ముగిసిన 17వ లోక్సభ.. పార్లమెంట్ నిరవధిక వాయిదా -
నెతన్యాహును ఆ మోడల్లో చంపాలి : కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
కొచ్చి: ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహుపై కేరళకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహూపై న్యూరెంబర్గ్ మోడల్ వాడాలని కాసర్గడ్ ఎంపీ రాజమోహన్ ఉన్నితన్ వ్యాఖ్యానించారు. పాలస్తీనాలోని గాజాపై యుద్ద నేరానికి పాల్పడినందుకుగాను నెతన్యాహును ఎలాంటి విచారణ లేకుండా కాల్చి చంపాలని రాజ్మోహన్ అన్నారు. కేరళలోని కాసర్గఢ్లో పాలస్తీనాకు మద్దతుగా జరిగిన ఓ ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారానికి తెరలేపింది. జెనీవా కన్వెన్షన్ కింద అన్ని ఒప్పందాలను ఉల్లంఘించిన వారిని ఇంతకంటే ఏం చేయాలని ఎంపీ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ప్రస్తుతం ప్రపంచం ముందు యుద్ధ నేరస్తుడిగా నెతన్యాహు నిల్చున్నారని తెలిపారు. పాలస్తీనీయన్లపై పాల్పడ్డ అకృత్యాలకు అతడిని వెంటనే న్యూరెంబర్గ్ మోడల్లో అంతమొందించాల్సిందేనన్నారు. కాగా, న్యూరెంబర్గ్ మోడల్లో శిక్షలను హిట్లర్ ఆధ్వర్యంలోని నాజీలు ఎక్కువగా అమలు చేసేవారు. ఈ పద్ధతిలో యుద్ధ ఖైదీలను ఎలాంటి విచారణ లేకుండా కాల్చి చంపేశేవారు. ఇదీచదవండి..కాంగ్రెస్ నేతలపై దాడి.. జ్యోతి పటేల్ సంచలన ఆరోపణలు -
హాంబర్గ్ విమానాశ్రయంలో కాల్పుల కలకలం..
జర్మనీలోని హాంబర్గ్ విమానాశ్రయంలోకి చొరబడిన ఓ ఆగంతకుడు కాల్పుల కలకలం సృష్టించాడు. శనివారం రాత్రి విమానాశ్రయంలోకి కారుతో సహా దూసుకువచ్చిన ఆగంతకుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో విమానాశ్రయంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటన దరిమిలా హాంబర్గ్ విమానాశ్రయంలో ట్రాఫిక్ను నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు. ‘కస్టడీ వివాదం’ ఈ ఘటనకు కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. శనివారం రాత్రి సుమారు 8 గంటలకు ఒక అగంతకుడు కారులో భద్రతా ప్రాంతం గుండా ఎయిర్స్ట్రిప్కి ఆనుకొని ఉన్న రహదారి పైకి కారుతో సహా దూసుకువచ్చాడు. అనంతరం తుపాకీతో రెండుసార్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. కాగా ప్రస్తుతానికి విమానాల టేకాఫ్లు, ల్యాండింగ్లను నిలిపివేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 27 విమానాలు దెబ్బతిన్నాయని సమాచారం. కాల్పులు జరిపిన ఆ వ్యక్తి కారులో నుండి రెండు మండుతున్న బాటిళ్లను బయటకు విసిరినట్లు పోలీసులు తెలిపారు.దీంతో మంటలు చెలరేగాయన్నారు. ఇది కూడా చదవండి: నేపాల్లో మళ్లీ భూప్రకంపనలు.. తీవ్రత ఎంతంటే.. -
భార్యపై కోపంతో బార్లో కాల్పులు.. ఆరుగురి మృతి
కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. దక్షిణ కాలిఫోర్నియా ఆరెంజ్ కౌంటీలోని ప్రముఖ బైకర్స్ బార్లో బుధవారం రాత్రి రిటైర్డ్ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారి కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో అయిదుగురు అక్కడికక్కడే మరణించగా. మరో ఆరుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే నిందితుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు హతమయ్యాడు. గాయపడిన ఆరుగురిని పోలీసులు చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా కుటుంబ వివాదాల కారణంతో నిందితుడి భార్య కొంతకాలంగా అతన్ని దూరం పెట్టినట్లు ఆరెంజ్ కౌంటీ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి భార్యను లక్ష్యంగా చేసుకుని ట్రబుకో కాన్యన్లోని కార్నర్ బార్లో కాల్పులకు తెగబడినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో మొత్తం 11 మందిపై కాల్పులు జరగగా.. నిందితుడు సహా ఐదుగురు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: రష్యా: యెవ్గెనీ ప్రిగోజిన్ మృతిపై బైడెన్ షాకింగ్ కామెంట్స్ Mass shooting at a bikers bar in Orange County. A retired sheriff deputy was involved shoot his wife and nine other victims . He was killed in the shoot out, pic.twitter.com/Bh7PjYsWFW — Don Salmon (@dijoni) August 24, 2023 -
వర్షం మధ్య దాహార్తి తీర్చుకుంటున్న పులి.. అలరిస్తున్న అరుదైన వీడియో!
జూపార్కులో సఫారీ చేసే సమయంలో పులి కనిపించడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. అయితే ఊహించని రీతిలో సఫారీలో ఉన్న పర్యాటకులకు పులి ఎదురైతే ఇక వారి ఆనందానికి హద్దులుండవు. ఇలాంటి సందర్భాల్లో తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఐఎఫ్ఎస్ అధికారి రమేష్ పాండే తన ట్విట్టర్ అకౌంట్లో ఇటువంటి క్లిప్నే షేర్ చేశారు. కర్నాటకలోని నేషనల్ పార్కులో కనిపించిన పులికి సంబంధించిన క్లిప్ అది. ఈ వీడియో బందీపూర్ నేషనల్పార్కులో షూట్ చేశారు. వీడియోలో ఒక పులి భారీగా వర్షం కురుస్తున్న సమయంలో నీరు తాగుతూ కనిపిస్తుంది. అది ఎంత సావధానంగా నీరు తాగుతున్నదో ఈ వీడియోను చూస్తే తెలుస్తుంది. ఈ వీడియోకు ఇప్పటివరకూ 2 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఈ అరుదైన వీడియో వీక్షకులను ఇట్టే ఆకట్టుకుంటోంది. వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: తల్లీకొడుకులను కలిపిన భారీ వరదలు.. 35 ఏళ్ల క్రితం వేరయి.. Tiger sighting in Monsoons. This comes from Bandipur. VC: FD Bandipur pic.twitter.com/OIgak01xV9 — Ramesh Pandey (@rameshpandeyifs) July 26, 2023 -
గన్తో ఆటలాడుతూ గర్భంతో ఉన్న అమ్మ కడుపులోకి బుల్లెట్ దించేసి..!
అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది. గన్తో ఆటలాడుతూ ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మ(31) కడుపులోకి బుల్లెట్ దించేశాడు ఓ రెండేళ్ల చిన్నారి. దీంతో ఎనిమిది నెలల గర్బంతో ఉన్న తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఇంట్లో ఆటలాడుతూ తండ్రి బెడ్ రూమ్లోకి వెళ్లాడు రెండేళ్ల చిన్నారి. లాకర్లో ఉన్న గన్ను ఆటబొమ్మ అనుకుని తీసుకున్నాడు. సినిమాల్లో చూసిన మాదిరే ఆటలాడసాగాడు. ఇతర గదిలో పనిలో ఉన్న అమ్మ(లారా ఐగా) వద్దకు వచ్చి పిస్టల్ను పేల్చేశాడు. తల్లి అరుపులతో తల్లిడిల్లిపోగా పిల్లాడు కూడా ఏడవడం ప్రారంభించాడు. కొనప్రాణాలతో ఉన్న బాధితురాలు భర్తకు ఫోన్ చేసింది. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ బాధితురాలు మృతి చెందింది. తన పిల్లాడే ఆటబొమ్మ అనుకుని గన్తో కాల్చాడని ఆస్పత్రికి వెళ్లే క్రమంలో పోలీసులకు బాధితురాలు వెల్లడించింది. గన్లో 12 రౌండ్స్ బుల్లెట్లు లోడ్ చేసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గన్ను పిల్లలకు అందకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: అందం కోసం కొత్త దంతాలు.. ‘షార్క్’లా మారిన యువకుడు! -
యోగక్షేమాలు అడుగుతూనే.. టీచర్పై విద్యార్థుల ఘాతుకం..
భోపాల్: చదువులు నేర్పించిన టీచర్పైనే విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు. యోగక్షేమాలను కనుక్కుంటూనే దాడి చేశారు. కేవలం ట్యూషన్ ఫీజు అడిగారనే పిస్టల్తో హత్యాయత్నం చేశారు. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్లోని మొరెనా జిల్లా జౌరా రోడ్ ప్రాంతంలో జరిగింది. ఇదీ జరిగింది.. గిర్వార్ సింగ్ను విద్యార్థులు ఇంటి బయట నుంచి పిలిచారు. ఉపాధ్యాయుడు బయటికి రాగానే ఎలా ఉన్నారంటూ చర్చను ప్రారంభించారు. ఇంతలోనే ఓ కుర్రాడు జేబులోంచి పిస్టల్ తీసి సార్ను కాల్చేశాడు. తీవ్ర గాయాలపాలైన బాధితున్ని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే.. విద్యార్థులు గత మూడేళ్ల క్రితం వరకు గిర్వార్ సింగ్ కోచింగ్ సెంటర్లో విద్యను నేర్చుకున్నారు. అందుకు సంబంధించిన ఫీజులు మాత్రం చెల్లించలేదు. పలు సందర్భాలలో ఆ డబ్బులపై విద్యార్థులను ప్రశ్నించారు గిర్వార్ సింగ్. దీంతో కక్ష పెంచుకున్న నిందితులు సార్పై దాడికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఇదీ చదవండి: రైల్లో మహిళతో అసభ్యకర ప్రవర్తన.. అడ్డుకుందని బయటకు తోసేశారు -
వెనుక నుంచి ఫాలో అవుతూ.. బ్యూటీ పార్లర్లో వధువుపై కాల్పులు జరిపిన పోలీస్!
పాట్నా: మేకప్ కోసం బ్యూటీ పార్లర్కు వెళ్లిన ఓ వధువుపై కానిస్టేబుల్ తుపాకీతో కాల్పులు జరిపాడు. పార్లర్ సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ దారుణ ఘటన బీహార్లోని ముంగేర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తారాపూర్ డయారాలోని మహేశ్పూర్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల అపూర్వ కుమారికి ఇటీవల ఓ వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. పెళ్లి రోజు దగ్గర పడడంతో ఆమె మేకప్ కోసం బ్యూటీ పార్లర్కు వెళ్లింది. అయితే ఓ వ్యక్తి రహస్యంగా ఆమెను ఫాలో అవుతూ బ్యూటీ పార్లర్కు చేరుకున్నాడు. యువతి మేకప్ వేసుకుంటూ ఉండగా అకస్మాత్తుగా వెనుక నుంచి ఓ వ్యక్తి పిస్టల్తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక బుల్లెట్ కుమారి భుజం నుంచి దూసుకెళ్లి ఛాతీ నుంచి బయటకు వచ్చింది. కుమారిపై కాల్పులు అనంతరం.. కానిస్టేబుల్ ఆ తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, భయంతో పిస్టల్ అతని చేతిలో నుంచి జారిపోవడంతో అతను అలా చేయలేకపోయాడు.పార్లర్ సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఇదంతా బ్యూటీపార్లర్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. గాయపడిన యువతిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమెదు చేసుకుని ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలించారు. ‘నిందితుడు పాట్నాలో పోలీస్ కానిస్టేబుల్గా పని చేస్తున్నట్లు గుర్తించాం. అతను మహేశ్పూర్ గ్రామానికి చెందినవాడు, అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ప్రారంభించాం. త్వరలో అరెస్టు చేస్తామని’ డీఎస్పీ తెలిపారు. వధువుకి, అతనికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు కాల్పులు జరిపాడు? అన్న ప్రశ్నలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని చెప్పారు. చదవండి: ప్రేమ పెళ్లి.. భర్తకు షాకిచ్చిన స్కూల్ టీచర్ భార్య, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్తో కలిసి... -
Anasuya Bharadwaj : కొత్త లుక్ ఫోటోలు షేర్ చేసిన యాంకర్ అనసూయ..ఫోటోలు వైరల్
-
మెట్రోస్టేషన్లో కాల్పుల కలకలం.. వీడియో వైరల్
టెహ్రాన్: ఇరాన్లో మహ్సా అమినీ లాకప్ డెత్ కారణంగా హిజాబ్ వ్యతిరేక అందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అదీగాక మరోవైపు ఇదే నవంబర్లో 2019లో పెట్రోల్ ధరల పెంపు విషయమై బ్లడీ అబాన్ (బ్లడీ నవంబర్) పేరిట పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ఆ నిరసనల అణచి వేత వార్షికోత్సవం సందర్భంగా అప్పటి నిరసనలో చనిపోయిన సుమారు వంద మందిని స్మరించుకుంటూ నిరసనకారులు ఇరాన్ వీధుల్లో మూడు రోజుల పాటు నిరసనలకు పిలుపునిచ్చారు. ఇప్పుడూ ఈ నిరసనలు హిజాబ్ వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలకు తోడవ్వడంతో వాటిని అణిచివేసే భాగంలో ఇరాన్ భద్రతా బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. అందులో భాగంగానే టెహ్రాన్లోని ఓ మెట్రోస్టేషన్లోని ప్రయాణికులపై భద్రతా బలగాలు కాల్పలు జరిపాయి. కాల్పులతో బెదిరిపోయిన ప్రయాణికులు.. అక్కడి నుంచి పారిపోయేయత్నం చేయడం, కింద పడిపోవడం చూడొచ్చు. ఇక మరో వీడియోలో అండర్ గ్రౌండ్ రైలులో.. హిజాబ్ ధరించని మహిళలను సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు చెదరగొట్టే దృశ్యాలు కనిపిస్తున్నాయి. మా పోరాటం కొనసాగుతుంది. ఇరాన్కు మళ్లీ మంచిరోజులు వస్తాయి అంటూ నినాదాలు చేయడం వీడియోలో గమనించొచ్చు. Security officials cause a stampede in a Tehran metro station when they open fire on protestors. pic.twitter.com/e55HAfKcpS — Mike (@Doranimated) November 15, 2022 హిజాబ్ ధరించనందుకే మహ్సాను అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీసుల కస్టడీలోనే సెప్టెంబర్ 16వ తేదీన మృతి చెందింది. దీంతో ఇరాన్ అంతటా పెద్ద ఎత్తున హిజాబ్ వ్యతిరేక నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అదీగాక అమిన్ మరణ తదనంతరం గత మూడు నెలలుగా జరుగుతున్న నిరసనల్లో ఒక పోలీసు, సెక్యూరిటీ అధికారి, ట్రాఫిక్ పోలీసుని నిరసకారులు హతమార్చడంతో కోర్టు వారికి మరణశిక్షలు విధించమని ఆదేశాలు జారీ చేసింది. దీంతో సాయుధ బలగాలు బహిరంగంగా కాల్పులకు తెగబడ్డాయి. అతేగాక పశ్చిమ నగరంలోని సనందాజ్లోని కుర్దిస్తాన్ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులపై కూడా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ మేరకు ఇరాన్ మానవ హక్కుల సంఘం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు అమినో మరణంతో చెలరేగిన హింసాకాండలో భద్రతా దళాలు 43 మంది పిల్లలు, 26 మంది మహిళలతో సహా సుమారు 342 మందిని చంపినట్లు పేర్కొంది. అంతేగాక కనీసం 1500 మంది నిరసకారులను అరెస్టు చేసినట్లు వెల్లడించింది. ఐతే ఇరాన్ అధికారులు ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఈ క్రమంలో ఇరాన్ మానవ హక్కుల డైరెక్టర్ మహమూద్ అమిరీ మొగద్దమ్ ఇరాన్ ఈ మరణశిక్షలను ఖండించడమే గాక వారిని నేరాలను అంగీకరించేలా చేసేందుకు ఈ హింసకు పాల్పడిందని అన్నారు. ఇరాన్ చెరలో ఉన్నవారందరికీ సాముహిక మరణ శిక్షలు విధించే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం టెహ్రాన్ మెట్రోస్టేషన్లో ప్రయాణికులపై బలగాలు జరిపిన కాల్పులకు సంబంధించిన వీడియో నెట్లింట వైరల్ అవుతోంది. Security officials cause a stampede in a Tehran metro station when they open fire on protestors. pic.twitter.com/e55HAfKcpS — Mike (@Doranimated) November 15, 2022 (చదవండి: చెట్లకు సెలైన్లో విషం పెట్టి.. లక్షకు కిలో లెక్కన అమ్మి.. ) -
ఏం జరిగిందని ప్రశ్నించారని..పోలీసులపైకి గన్ గురిపెట్టి...
సాక్షి, పంజాగుట్ట: పోలీసులపైకి గన్ చూపించిన వ్యక్తిని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి లైసెన్స్డ్ గన్, ఆరు రౌండ్ల బుల్లెట్లు స్వా«దీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...చిత్తూరు జిల్లాకు చెందిన వెంకట నాగేంద్ర రెడ్డి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. ప్రస్తుతం జీడిమెట్లలో ఉంటూ ఓ ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ ఇన్చార్జిగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం తెల్లవారు జామున 3:30 ప్రాంతంలో అమీర్పేట బిగ్బజార్ వీధిలో ట్రాన్స్జెండర్స్తో గొడవ పడుతున్నాడు. గమనించిన పెట్రోలింగ్లో ఉన్న కానిస్టేబుల్ సాయికుమార్, హోంగార్డు రవీంద్రబాబులు వెళ్లి సమస్య ఏమిటని ప్రశ్నించారు. దీంతో వెంకట నాగేంద్ర రెడ్డి తనవద్ద ఉన్న గన్ను పోలీసులకు గురిపెట్టాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంగా అతడ్ని పట్టుకుని స్టేషన్కు తరలించారు. అతని వద్ద ఉన్న గన్, ఆరు రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. గన్ లైసెన్స్ ఉన్నప్పటికీ దాని గడువు అయిపోయినట్లు తెలుస్తుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గన్ గురిచూపినా బెదరకుండా చాకచక్యంగా పట్టుకున్న కానిస్టేబుల్ సాయికుమార్, హోం గార్డు రవీంద్రబాబులను నగర పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ అభినందించారు. వారికి ఒక్కొక్కరికీ 2500 క్యాష్ రివార్డు, జ్ఞాపికను అందించారు. (చదవండి: ‘డర్టీ పిక్చర్’లో కొత్త కోణం! మహిళ ప్రమేయం లేకుండానే ఫొటో వైరల్ ) -
సినిమా రేంజ్లో దోపిడి...డబ్బు, బంగారంతో పరార్
లక్నో: సినిమాలో విలన్ మాదిరి దోపిడికి చేసి డబ్బు నగలతో పరార్ అయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో బులందష్హర్లో చోటు చేసుకుంది. ఇద్దరు దుండగులు ఒక దుకాణంలోకి చొరబడి యజమానిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. అక్కడ ఉన్న వారందర్నీ తుపాకితో బెదిరిస్తూ దర్జాగా కౌంటర్ దగ్గరికి వెళ్లి బ్యాగ్ నిండా డబ్బు, నగలు పెట్టుకుని పరారయ్యారు. వెళ్తు వెళ్తూ అక్కడే ఉన్న ఒక మహిళా కస్టమర్ బ్యాగ్ని కూడా లాక్కుని పారిపోయారు. ఈ ఘటన మొత్తం సీసీఫఫుటేజ్లో రికార్డు అవ్వడంతో వెలుగు చూసింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అంతేగాదు పోలీసులు ఏడు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు సీనియర్ అధికారి తెలిపారు. (చదవండి: మహిళలపై లాఠీ ఝళిపించిన పోలీసులు..ఉద్రిక్తంగా యూపీ) -
దోపిడి చేసేందుకు వచ్చి కాల్పుల వీరంగం
న్యూఢిల్లీ: ఒక దుండగుడు దుకాణం వద్దకు వచ్చి కాల్పుల కలకలం సృష్టించాడు. ఈ ఘటన ఢిల్లీలోని దరీపూర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...ఢిల్లీలోని ఒక గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మోటార్ బైక్ పై దుకాణం వద్దకు వచ్చి గాల్లో కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఆ ఇద్దరు దుండగులు షాపులోకి వెళ్లి యజమానిని భయబ్రాంతులకు గురిచేసి దాదాపు రూ. 50 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినట్ల తెలిపారు. షాపు యజమానిని భయపట్టేందుకు ఆ దుండగులు ఇలా గాల్లో కాల్పులు జరిపి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఐతే ఈ ఘటన మొత్తం దుకాణం వద్ద ఉన్న సీసీఫుటేజ్లో రికార్డు అయ్యింది. దీంతో పోలీసులు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: నకిలీ వెబ్సైట్లతో చీటింగ్... 12 మంది అరెస్టు) -
పుతిన్ ప్రకటన సృష్టిస్తున్న ప్రకంపనం... గాయపడ్డ కమాండర్: వీడియో వైరల్
Man Decide Jail Is Better Than Deat In Ukraine War: రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్ యుద్ధం కోసం పెద్ద ఎత్తున మిలటరీ మొబైలైజేషన్(సైనిక సమీకరణ) కోసం పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. అంటే యుద్ధంలో పాల్గొనే వయస్కులందరికి నిర్బంధ సైనిక శిక్షణతో యుద్ధానికి సన్నద్ధం అయ్యేలా చేసి కదన రంగంలోకి దింపుతారు. దీంతో రష్యన్ యువతలో తీవ్ర అలజడి మొదలైంది. ఎలా తప్పించుకోవాలంటూ ఆందోళన చెందుతున్నారు. కొంతమంది వేరే దేశాలకు పారిపోయే యత్నాలు కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే ఒక రష్యాన్ యువకుడు డ్రాఫ్ట్ కార్యాలయం(సైనిక శిక్షణ కార్యాలయం)పై దాడులు జరిపాడు. అంతేకాదు ఆ కార్యాలయంలో నిర్బంధ సైనిక శిక్షణకు వచ్చిన వారిని పారిపోమంటూ పిలుపునిస్తూ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో డ్రాఫ్టింగ్ కార్యాలయ కమాండర్ తీవ్రంగా గాయపడ్డాడు. దుండగుడు అధికారిని పాయింట్ బ్లాక్ రేంజ్కి సమీపంలో కాల్పులు జరిపాడు. ఈ ఘటన రష్యాలోని సైబీరియన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘటనతో పోలీసులు వెంటనే అప్రమత్తమై దుండగడుని రుస్లాన్ జినిన్గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో ఉక్రెయిన్ యుద్ధం కోసం మొబైలైజేషన్ చేయడంతో ఈ కాల్పులకు తెగబడ్డానని చెప్పాడు. అంతేగాదు ఉక్రెయిన్ యుద్ధంలో చనిపోయే కంటే జైల్లో ఉండటమే మంచిదని ఇలా చేసినట్లు చెప్పాడు. అధికారులు సదరు కమాండర్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐతే అతడి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. Mobilized man killed a drafting office commander in Ust-Ilimsk, Irkutsk region, Russia. Alexandr Yeliseev, the commander, was shot four times almost point blank. The murderer is Ruslan Zinin, born in 1997, "partially mobilized". He decided jail is better than death in Ukraine. pic.twitter.com/s0IvHJZJBO — Anton Gerashchenko (@Gerashchenko_en) September 26, 2022 (చదవండి: పుతిన్ ప్రకటనతో రష్యాలో అల్లకల్లోలం..భయాందోళనతో దేశం బయటకు!) -
దారుణం.. ఉపాధ్యాయుడిపై పదో తరగతి విద్యార్థి కాల్పులు
లక్నో: ఉత్తర్ప్రదేశ్ సీతాపుర్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. 10వ తరగతి విద్యార్థి తనకు పాఠాలు బోధించే ఉపాధ్యాయుడిపైనే కాల్పులకు తెగబడ్డాడు. నాటు తుపాకీతో స్కూల్కి వెళ్లి టీచర్పై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. అయితే అదృష్టవశాత్తు బుల్లెట్ కీలకమైన అవయవాలకు తగలకపోవడం వల్ల ఉపాధ్యాయుడు ప్రాణాలతో బయటపడ్డాడు. తనపై కాల్పులు జరిపిన విదార్థిని టీచర్ ధైర్యంగా ప్రతిఘటించిన దృశ్యాల సీసీటీవీలో నమోదయ్యాయి. ఈ ఘటన చూసి పాఠశాలలోని కొందరు విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. మరికొంత మంది విద్యార్థులు మాత్రం ఉపాధ్యాయుడి వద్దకు చేరుకున్నారు. కాల్పులు జరిపిన విద్యార్థిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. తన తోటి విద్యార్థితో గొడవపడినందుకు ఈ విద్యార్థిని టీచర్ మందలించినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహం చెందిన అతడు పగ పెంచుకుని ఉపాధ్యాయుడిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు అదనపు ఎస్పీ రాజీవ్ దీక్షిత్ చెప్పారు. వైద్యుల సూచన మేరకు ఉపాధ్యాయుడ్ని లక్నో ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. చదవండి: 21 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు ఇంకా టచ్లోనే ఉన్నారు -
మూడేళ్ల చిన్నారి చేతిలో తల్లి మృతి
అమెరికాలో మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు తన తల్లిని కాల్చి చంపింది. ఈ ఘటన సౌత కరోలినాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...మూడేళ్ల పసిపాపకి అనుకోకుండా తుపాకీ లభించింది. అంతే ఆ చిన్నారి ఆ తుపాకీని పట్టుకుని ఆడుకోవడం ప్రారంభించింది. దీన్నీ చూసిన చిన్నారి తల్లి వెంటనే అప్రమత్తమై ఆమె వద్ద నుంచి లాక్కునేందుకు యత్నించింది. ఐతే చిన్నారి నుంచి లాక్కునే క్రమంలో తల్లిపై ప్రమాదవశాత్తు కాల్పులు జరిపింది ఆ చిన్నారి. ఆ ప్రమాదంలో చిన్నారి తల్లి తీవ్రంగా గాయపడింది. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని ఆ చిన్నారి అమ్మమ్మ వెల్లడించారు. బాధితురాలు స్పార్టన్బర్గ్లో నివశించే కోరా లిన్ బుష్ అనే మహిళగా గుర్తించారు అధికారులు. ఇలా యూఎస్లోని చిన్నారుల్లో దాదాపు 194 మంది ప్రమాదవశాత్తు కాల్పులు జరిపారని, అందువల్ల సుమారు 82 మంది మరణించగా, 123 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. (చదవండి: అణుయుద్ధం జరిగినప్పుడూ... జుట్టుకి కండీషనర్ వద్దు..హెచ్చరించిన పుతిన్) -
వీడియో తీయొద్దు అన్నందుకు.... డ్యూటీలో ఉన్న పోలీస్ని గట్టిగా కరిచి పరార్..
ముంబై: మహారాష్ట్రలో ఒక వ్యక్తి డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ని గట్టిగా కరిచి గాయపరిచాడు. తమను వీడియో తీస్తున్నాడని ఒక పోలీసు జోక్యం చేసుకుని అడ్డుకున్నందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలో నాగ్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...మకర్ధోక్డా గ్రామానికి చెందిన రాకేష్ పురుషోత్తం గజ్భియే అనే 30 ఏళ్ల వ్యక్తి తనతో వివాదం పెట్టుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేయమంటూ పోలిస్టేషన్కి వెళ్లాడు. ఐతే పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో ఆగ్రహం చెందిన వ్యక్తి ఆ పోలిస్టేష్న్ ఆవరణలో ఉన్న పోలీసులందర్నీ ఫోన్లో వీడియో తీయడం ప్రారంభించాడు. దీన్ని గమనించిన ఒక పోలీసు జోక్యం చేసుకుని అడ్డుకున్నందుకు అతన్ని గట్టిగా కరిచి ద్విచక్ర వాహనం పై పారిపోయాడని పోలీసులు తెలిపారు. డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని తన విధులు నిర్వర్తించకుండా అడ్డుకుని గాయపరిచినందుకు సదరు వ్యక్తి గజ్భియేపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: మద్యం బాటిళ్లతో గాజుల తయారీ... జీవనోపాధి ఇస్తూ...వ్యర్థాలకు చెక్) -
వాషింగ్టన్లో కాల్పుల కలకలం... ఇద్దరికి గాయాలు
న్యూయార్క్: వాషింగ్టన్ లీస్ట్రీట్ వీధిలోని ఐడియా పబ్లిక్ చార్టర్ స్కూల్ బ్లాక్ వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. బుధవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతలో ఘటన జరిగినట్టు వాషింగ్టన్ పోలీస్ రాబర్ట్ కాంటె తెలిపారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. 15 ఏళ్ల యువకుడు ఆ స్కూల్లోని ఇద్దరు విద్యార్థులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సదరు నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. అంతేకాదు ఆ స్కూల్లో ఉన్న దాదాపు 350 మంది విద్యార్థులను, స్కూల్ సిబ్బందిని ఈ విషయమై విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు వాషింగ్టన్ డీసీ మెట్రోపాలిటన్ పోలీస్ చీఫ్ అధికారులు మాట్లాడుతూ...ఈ ఏడాది సుమారు రెండు వేల అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గతేడాదితో పోల్చితే అదనంగా 800 అక్రమ ఆయుధాలు ఎక్కు ఉన్నాయన్నారు. అదే బుధవారం వేరొక ఘటనలో ఒక భవనం వద్ద మరో బాలుడు తుపాకీ కాల్పుల్లో మృతి చెందినట్లు తెలిపారు. (చదవండి: 20 ఏళ్ల యుద్ధానికి తెరపడిన రోజు... అఫ్గాన్లో మిన్నంటుతున్న సంబరాలు) -
ఆ పుకార్లు నిజమే.. తేల్చి చెప్పేసిన రష్మిక మందన్నా..
Rashmika Mandanna Shoot With Tiger Shroff: అతికొద్ది సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది రష్మిక మందన్నా. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ నేషనల్ క్రష్. తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఆమె సిద్ధార్థ్ మల్హోత్రా తో కలిసిన నటించిన‘మిషన్ మజ్ను’ విడుదలకు సిద్దంగా ఉంది. త్వరలోనే మరో చిత్రం ‘గుడ్బై’ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇటీవల రష్మిక మందన్నాపై అనేక రూమర్లు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అందులో ఒక రూమర్ నిజమే అని తేల్చి చెప్పింది ఈ బ్యూటీ. రష్మిక మందన్నా, బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కలిసి ఒక యాడ్లో కలిసి నటించారు. దీనికి సంబంధించిన బూమరాంగ్ వీడియోను ఇన్స్టా వేదికగా పంచుకుంది రష్మిక. ఈ వీడియో పోస్ట్ చేస్తూ 'ఆ రూమర్లు నిజమే.. చాలా నవ్వోస్తోంది. నేను, టైగర్ ష్రాఫ్ ఒక యాడ్ కోసం కలిసి నటించాం. టైగర్ ష్రాఫ్తో కలిసి పనిచేయడం అద్భుతంగా ఉంది. ఈ యాడ్ కోసం ఎదురుచూస్తున్నాను' అని రాసుకొచ్చింది. ఈ స్టోరీని టైగర్ ష్రాఫ్ షేర్ చేస్తూ 'షూట్ చేయడం సరదాగా ఉంది. నువ్ ఎప్పటిలాగే అదరగొట్టావ్' అని క్యాప్షన్ ఇచ్చాడు. సో.. రష్మిక నిజమని చెప్పిన రూమర్ ఇదన్నమాట. చదవండి: అలా మరిచిపోతే విలువ ఉండదు: నాగ చైతన్య ప్రేమ భాష మాత్రమే తెలుసు: హీరోయిన్ 'ఆర్ఆర్ఆర్'పై పోర్న్ స్టార్ ట్వీట్.. నెట్టింట జోరుగా చర్చ View this post on Instagram A post shared by 🆃🅸🅶🅴🆁🆂🅷🆁🅾🅵🅵 (@tigershroff_fp__) -
కసాయి కొడుకు... మద్యం మత్తులో కన్నతల్లిపైనే..
మద్యపానం ఎన్నో కుటుంబాలను కార్చిచ్చులా కాల్చేస్తోంది. ఎన్నో జీవితాలు ఈ మద్యపానం కారణంగా నాశనమైయ్యాయి. ఆఖరికి ఎడిక్షన్ సెంటర్లు సైతం ఇలా మద్యపానానికి బానిసైన వాళ్లను మార్చేందుకు ముందుకు వచ్చినప్పటికీ... ఇంకా చాలాచోట్ల యువత పెడదోవపట్టి ఈ తాగుడు మహమ్మారికి బానిసై భావి జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి మద్యానికి బానిసై దారుణమైన అఘాయిత్యానికి ఒడిగట్టాడు. వివరాల్లోకెళ్తే...ఉత్తరప్రదేశ్లోని ఒక వ్యక్తి మద్యం మత్తులో కన్నతల్లినే హతమార్చాడు. ఈ ఘటన చౌవియా ప్రాంతంలోని నాగ్లా మర్దాన్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...మద్యం మత్తులో ఉన్న శివ ప్రతాప్ అనే వ్యక్తి దేశీయ తుపాకీతో గాల్లో కాల్పులు జరిపాడు. ఐతే ప్రమాదవశాత్తు ఒక బుల్లెట్టు అతని కన్నతల్లి శరీరంలోకి దూసుకపోయింది. దీంతో అక్కడికక్కడే అతని తల్లి ఊర్మిళా దేవి కుప్పకూలి చనిపోయింది. ఈ ఘటన అనంతరం నిందుతుడు శివప్రతాప్ పరారయ్యినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. నిందితుడి ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు. -
అమెరికాలో ఉన్మాది కాల్పులు..:19 చిన్నారులు బలి
అమెరికా మళ్లీ నెత్తురోడింది. తరాలుగా వెర్రితలలు వేస్తున్న తుపాకుల సంస్కృతి మరోసారి వికటాట్టహాసం చేసింది. ముక్కుపచ్చలారని 19 మంది పసి పిల్లలను బలి తీసుకుంది. హూస్టన్: అమెరికాలో ఓ 18 ఏళ్ల యువకుడు మారణహోమానికి తెగబడ్డాడు. ఓ ఎలిమెంటరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులకు దిగాడు. 19 మంది స్టూడెంట్లతో పాటు ఇద్దరు టీచర్లను పొట్టన పెట్టుకున్నాడు. టెక్సాస్ రాష్ట్రంలో శాన్ ఆంటోనియోకు 134 కిలోమీటర్ల దూరంలోని ఉవాల్డే టౌన్లో మంగళవారం ఈ ఘోరం జరిగింది. హంతకున్ని సాల్వడార్ రామోస్ అనే స్థానికునిగా గుర్తించారు. అతను బులెట్ప్రూఫ్ జాకెట్ ధరించి ఏఆర్–15 సెమీ ఆటోమాటిక్ రైఫిల్, మరో హాండ్ గన్, భారీ సంఖ్యలో బులెట్ మ్యాగజైన్లతో ఉదయం 11.30కు స్థానిక రాబ్ ఎలిమెంటరీ స్కూల్లోకి చొరబడ్డాడు. ఓ క్లాస్రూమ్లో దూరి విచక్షణారహితంగా కాల్పుల వర్షం కురిపించాడు. దాంతో 14 మంది పిల్లలు, ఇద్దరు టీచర్లు అక్కడికక్కడే నేలకొరిగారు. మరో ఐదుగురు పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పోలీసులు రంగప్రవేశం చేసి హంతకున్ని కాల్చేశారు. చనిపోయిన బాలలంతా 5 నుంచి 10 ఏళ్ల లోపు వాళ్లేనని వెల్లడిస్తూ నగర పోలీస్ చీఫ్ కన్నీటిపర్యంతమయ్యారు. క్లాస్రూమ్లో 30 మంది దాకా పిల్లలున్నట్టు సమాచారం. వారిలో చాలామంది గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అంటున్నారు. ఆస్పత్రుల విజ్ఞప్తికి స్పందించి వారికి రక్తం అందించడానికి చాలామంది ముం దుకొచ్చారు. ఇంతటి ఘోరానికి కారణాలు ఇంకా తెలియకపోయినా, హంతకుడు చిన్నప్పుడు స్కూల్లో తోటి పిల్లల చేతిలో నిత్యం హేళనలకు గురై స్కూలు మానేశాడని అతని స్నేహితుడు చెబుతున్నాడు. ఆ గాయాలే ఈ దారుణానికి పురిగొల్పి ఉంటాయని భావిస్తున్నారు. స్కూల్లో నరమేధానికి ముందు ఇంట్లో నాయనమ్మను కూడా అతడు కాల్చి తీవ్రంగా గాయపరిచాడని తెలుస్తోంది. కాల్పులపై దేశమంతటా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో తుపాకీ సంస్కృతిపై మరోసారి సర్వత్రా చర్చ మొదలైంది. దానికి ఇకనైనా చరమగీతం పాడాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. 10 రోజుల క్రితమే న్యూయార్క్లో ఓ జాత్యహంకారి కాల్పుల్లో 10 మంది నల్లజాతీయులు మరణించడం తెలిసిందే. తీవ్రంగా కలచివేసింది: కమల కాల్పుల ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. ‘‘ఇలాం టివి జరిగినప్పుడు ‘మా గుండెలు బద్దలయ్యా’ యని అనడం సహజం. కానీ నిత్యం జరుగుతున్న కాల్పులతో అమెరికన్ల గుండెలు పదేపదే బద్దలవుతూనే ఉన్నాయి. ఇకనైనా మనం ధైర్యం కూడదీసుకోవాలి. వీటికి శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు రంగంలోకి దిగాలి’’ అన్నారు. ఈ ఏడాది 212 మాస్ షూటౌట్లు అమెరికాలో ఈ ఏడాది ఇప్పటికే ఏకంగా 212 సామూహిక కాల్పుల ఘటనలు జరిగినట్టు గన్ వయోలెన్స్ ఆర్కైవ్ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. నలుగురు, అంతకంటే ఎక్కువ మంది చనిపోతే సామూహిక కాల్పుల ఘటనగా చెబుతారు. ఇలాంటివి సగటున రోజుకు ఒకటి కంటే ఎక్కవగా జరుగుతుండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలని సీఎన్ఎన్ వార్తా సంస్థ వాపోయింది. అమెరికాలో స్కూళ్లలో కాల్పులు జరగడం ఈ ఏడాది ఇది 27వ సారి! తాజా హత్యాకాండ అమెరికాలో జరిగిన అతి పెద్ద స్కూలు దారుణాల్లో రెండోది. 2012లో కనెక్టికట్లో శాండీ హాక్ ఎలిమెంటరీ స్కూల్లో జరిగిన కాల్పుల్లో 26 మంది మరణించారు. ఆయుధ లాబీలకు ముకుతాడు: బైడెన్ తుపాకుల వాడకాన్ని నియంత్రిద్దాం ఆ దిశగా చట్టాన్ని కఠినతరం చేద్దాం చట్టసభల సభ్యులకు అధ్యక్షుని పిలుపు కాల్పులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. జపాన్లో క్వాడ్ సదస్సులో పాల్గొని అధ్యక్ష విమానం ఎయిర్ఫోర్స్వన్లో తిరిగొస్తుండగా ఆయనకు విషయం తెలిసింది. దాంతో, ఇది మాటలకందని దారుణమంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సంతాప సూచకంగా దేశవ్యాప్తంగా జాతీయ పతాకాన్ని శనివారం సాయంత్రం దాకా సగం మేర అవనతం చేయాలని ఆదేశించారు. విమానంలో నుంచే జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘‘అభంశుభం తెలియని చిన్నారులు తమ కళ్లముందు జరిగిన ఈ బీభత్సానికి ఎంతగా హడలిపోయి ఉంటారో! స్నేహితులు కళ్ల ముందే కాల్పులకు బలవుతుంటే ఎంతగా తల్లడిల్లి ఉంటారో!! పిల్లలను కోల్పోవడమంటే ఆత్మలో ఓ భాగాన్ని పోగొట్టుకోవడమే. ఆ ఆలోచనే హృదయంలో అంతులేని శూన్యం నింపుతుంది’’ అంటూ ఆక్రోశించారు. వాషింగ్టన్ చేరుతూనే భార్య జిల్తో కలిసి మరోసారి జాతినుద్దేశించి మాట్లాడారు. తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలంటూ వెల్లువెత్తుతున్న డిమాండ్లను ప్రస్తావించారు. ఆ దిశగా కార్యాచరణకు దిగేందుకు తాజా ఘటనే నాంది కావాలని చట్టసభ సభ్యులకు పిలుపునిచ్చారు. ‘‘నేను జపాన్ బయల్దేరే కొద్ది రోజుల ముందే న్యూయార్క్లోని బఫెలోలో జాతి విద్వేష కాల్పలకు 10 మంది నల్లజాతీయులు బలయ్యారు. వారి కుటుంబాలను ఓదార్చిన క్షణాలు నా మనసులో ఇంకా తాజాగానే ఉన్నాయి. ఈలోపే దాన్ని తలదన్నే మరో ఘోరం!’’ అంటూ ఆక్రోశించారు. ‘‘ఇతర దేశాల్లో అత్యంత అరుదుగా జరిగే ఇలాంటి దారుణాలు అమెరికాలో మాత్రం పదేపదే జరిగేందుకు మనమెందుకు అవకాశమిస్తున్నాం? మన చేతుల్లో ఏమీ లేదని చెప్పొద్దు. ఇలాంటివి వినీ వినీ విసిగిపోయాను. ఆయుధ లాబీలను అడ్డుకునేందుకు, వాటికి ముకుతాడు వేసేందుకు సత్తా మనలో కరువైందా?’’ అంటూ ప్రశ్నించారు. ‘‘ఇంకా ఉపేక్షించేది లేదు. చేతలకు దిగాల్సిన సమయం ఆసన్నమైంది’’ అన్నారు. ‘‘తుపాకుల సంస్కృతికి అడ్డుకట్టే వేసేలా చట్టాన్ని కఠినతరం చేయాల్సిందే. ఇందుకు చట్టసభ సభ్యులను ఒప్పించేందుకు ఏం చేయాలో ఆలోచిస్తాం’’ అని ప్రకటించారు. -
ట్రంప్ నిర్వాకాలను బయటపెట్టే పుస్తకం
'Can't you just shoot them?': అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఎన్నో వివాదాలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కూడా విచిత్రమైన నిర్ణయాలతో వివాదస్పదమైన నాయకుడిగా ముద్ర వేయించుకున్నాడు. ఇప్పుడు తాజాగా ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దూకుడుగా వ్యవహరించిన మరో అంశం వెలుగులోకి వచ్చింది. ఈ నేపధ్యంలో మే 2020లో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడుని మిన్నియా పాలిస్ పోలీసు సిబ్బంది చేతుల్లో హత్యకు గురైన నాటి సంగతి తెరపైకి వచ్చింది. నాటి నల్లజాతీయుడి హత్యనంతరం నిరసనలు వెల్లువెత్తడంతో ట్రంప్ నిరసనకారులను అణిచివేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపాడు. పైగా వారిపై కాల్పులు జరపమని మిలటరికీ ఆదేశాలు జారీ చేశాడని అమెరికా మాజీ రక్షణ కార్యదర్శి మార్క్ ఎస్సర్ తాను రాసిన పుస్తకంలో తెలిపాడు. నాటి ఘటనలో సైన్యానికి అన్ని పవర్లు ఇచ్చేలా అత్యంత అరుదుగా ఉపయోగించే 200 ఏళ్ల నాటి తిరుగుబాటు చట్టాన్ని అమలు చేయడానికి యత్నించాడని కూడా రాశారు. అంతేగాక తాను వ్యతిరేకించినందుకుగానూ ట్రంప్ తనని పదవి నుంచి తొలగించినట్లు కూడా వెల్లడించారు. ఈ మేరకు నాటి రక్షణ కార్యదర్శి మార్క్ ఎస్సర్ తాను రాసిన ‘ఎ సేక్రేడ్ ఓత్’ అనే పుస్తకంలో ట్రంప్తో నాటి జ్ఞాపకాలను వివరించాడు. జనరల్ క్యాబినెట్ సభ్యులచే సమీక్షించబడిన ఈ పుస్తకం మే 10న విడుదల కానుంది. (చదవండి: దాదాపు 2 లక్షల మంది ఉక్రెయిన్ పిల్లలను రష్యాకి తరలింపు) -
వెంకటేష్-సల్మాన్ ఖాన్ సినిమా షురూ.. విలన్గా ?
Salman Khan Venkatesh Starrer Kabhi Eid Kabhi Diwali Shoot Started: కొత్త సినిమా షూటింగ్ షురూ అంటున్నారు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, వెంకటేష్, పూజా హెగ్డే ప్రధాన తారాగణంగా ‘కబీ ఈద్ కబీ దీవాలి’ (‘బాయిజాన్’ అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది) అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు వచ్చే నెలలో ప్రారంభం కానుంది. మే 11న ఈ సినిమా షూటింగ్ను ముంబైలో ఆరంభించనున్నారు. ఇందు కోసం ఓ భారీ సెట్ వేశారు. ఈ షెడ్యూల్లో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొంటారు. ఇక ఇటీవల ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ కోసం ముంబైలో ఉంటున్న వెంకటేశ్ కూడా ఈ షెడ్యూల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. విలన్గా.. దక్షిణాదిన తిరుగు లేని విలన్గా దూసుకెళుతోన్న జగపతిబాబు ‘కబీ ఈద్ కబీ దీవాలి’లో విలన్గా నటిస్తారనేది బీ టౌన్ టాక్. ఒకవేళ ఈ వార్త నిజమైతే హిందీలో జగపతిబాబుకి ఇదే తొలి చిత్రం అవుతుంది. ఈ సినిమాను తొలుత వచ్చే ఏడాది రంజాన్కు రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ ఏడాది డిసెంబరు 30నే సినిమాను రిలీజ్ చేస్తామని ఇటీవల చిత్రయూనిట్ తెలిపింది. చదవండి: ఇంతవరకు నేను సౌత్ సినిమాలే చూడలేదు: బాలీవుడ్ నటుడు అడల్ట్ సైట్లో ఫోటో లీక్, 15ఏళ్లకు చేదు అనుభవం: నటి -
తమ్ముడి నిర్వాకం... సొంత అక్కపైనే అఘాయిత్యం
18-year-old youth shoots sister: చెడు అలవాట్లకు బానిసైన వాళ్లను దారిలో పెట్టెందుకు కుటుంబ సభ్యులు చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఒక్కసారి కౌన్సిలింగ్లకు పంపించి మరీ సరైన మార్గంలో పెట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తారు. అయితే వాళ్లు సహకరిస్తేనే ఏదైన చేయగలం. మరికొంత మందికి అవి చెవికి ఎక్కవు, పైగా కక్ష పెంచుకుని ఎంతటి దుర్మార్గానికైన ఒడికట్టేందుకు ప్రయత్నిస్తారు. అచ్చం అలాంటి ఘటనే గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో హర్ధోయి ప్రాంతంలోని 32 ఏళ్ల వివాహిత సోదరుడు తాగుడికి బానిసై అందర్నీ దూషించడం వంటి పనులు చేస్తుంటాడు. దీంతో విసిగిపోయిన ఆమె తన తమ్ముడుని తాగడం మానేయమని హితవు చెప్పింది. ఇలా అందర్నీ దూషించడం సరికాదని చెప్పేందుకు ప్రయత్నించింది. ఆ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అసలే తాగి ఉన్నాడమే ఆ మైకంలో ముందు వెనుక చూడకుండా పిస్టల్ తీసుకుని తన అక్కనే అతి దారుణంగా కాల్చి చంపి అక్కడ నుంచి పారిపోయాడు. దీంతో బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులకు సంఘటన స్థలికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు్నారు. ఈ మేరకు నిందుతుడిని షహబెరి ప్రాంతంలో అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ యోగేంద్ర సింగ్ పేర్కొన్నారు. -
రియల్ హత్యలే..దృశ్యం సినిమా తరహాలో తప్పించుకునేందుకు యత్నం
సాక్షి,హైదరాబాద్: సంచలనం సృష్టించిన రియల్టర్ల జంట హత్యల కేసును రాచకొండ పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. ఇబ్రహీంపట్నం చెర్లపటేల్గూడలో నెలకొన్న భూ వివాదాలే హత్యలకు కారణమని విచారణలో బయటపడింది. హత్యలో ప్రధాన సూత్రధారి చైతన్యపురి కమలానగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మేరెడ్డి మట్టారెడ్డి అలియాస్ మేరెడ్డి అశోక్రెడ్డి/సత్తిరెడ్డి/ భద్రి/ఏవీ రమణ, కృష్ణా జిల్లా జగన్నాథపురానికి చెందిన ఖాజా మోహియుద్దిన్, మెదక్ కొండపాక మేదిరిపూర్కు చెందిన బుర్రి భిక్షపతి, సరూర్నగర్ హుడా కాంప్లెక్స్కు చెందిన సయ్యద్ రహీమ్, బిహార్ రాష్ట్రం సివాన్ జిల్లా టెటారియా గ్రామానికి చెందిన సమీర్ అలీ, రాజు ఖాన్లను అరెస్ట్ చేశారు. హత్యలో వినియోగించిన రెండు తుపాకులను తయారు చేసిన చందన్ సిబాన్, సోనూలు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 19 లైవ్ రౌండ్లున్న రెండు 7.65 ఎంఎం తుపాకులు, రెండు ఖాళీ కాట్రిడ్జ్లు, బుల్లెట్ వెహికిల్, కారు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు పూర్తి వివరాలను రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ గురువారం మీడియాకు వెల్లడించారు. ఇదీ వివాదం.. చర్లపటేల్గూడ గ్రామంలో 1369, 1370, 1371, 1372 సర్వే నంబర్లలోని భూమిని 20 ఏళ్ల క్రితం లేఅవుట్ చేశారు. వీటిలో చాలా మంది ఉద్యోగులు, ప్రవాసులు వాయిదా పద్ధతిలో కొనుగోలు చేశారు. ఈ లేవుట్ శివారు ప్రాంతంలో ఉండటంతో కొనుగోలుదారులు వారి ప్లాట్లను తనిఖీ చేయడం, చూసుకోవటం వంటివి చేయలేదు. 2014లో మట్టారెడ్డి ఈ వెంచర్లో 1111 గజాల చొప్పున నాలుగు ప్లాట్లను కొనుగోలు చేశాడు. ఇందులో ఫామ్ హౌస్ కట్టుకోవటంతో పాటు జామ తోటను పెంచాడు. ఆ తర్వాత 2018లో మరో నాలుగు ప్లాట్ల కొనుగోలు చేశాడు. ఈ సర్వే నంబర్ల పక్కనే ఉన్న 14 ఎకరాల 10 గుంటల భూమిని మృతుడు నవారి శ్రీనివాస్ రెడ్డి తన డ్రైవర్ దూడల కృష్ణ పేరు మీద కొనుగోలు చేశాడు. భూ యజమానులైన శాంతాకుమారి, ఎం పురుషోత్తం రెడ్డిలతో అగ్రికల్చర్ ల్యాండ్ లీజు ఒప్పందం చేసుకున్నాడు. అప్పట్నుంచి తన పార్ట్నర్ రాఘవేందర్ రెడ్డితో కలిసి రోజూ వ్యవసాయ భూమికి వచ్చేవాడు. ఈ క్రమంలో లేక్ విల్లా ఆర్చిడ్స్లో ప్లాట్ ఓనర్లు స్థానికంగా ఉండకపోవటాన్ని అవకాశంగా మలుచుకున్న శ్రీనివాస్రెడ్డి.. ఆ ప్లాట్ల లావాదేవీలలో తలదూర్చడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో మట్టారెడ్డికి శ్రీనివాస్రెడ్డి మధ్య వైరం మొదలైంది. ప్లాట్ ఓనర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ తక్కువ ధరకు ప్లాట్లను కొనుగోలు చేస్తున్న మట్టారెడ్డికి శ్రీనివాస్ రెడ్డి వెంచర్లోకి ఎంటర్ కావటం నచ్చలేదు. వెంచర్లో అభివృద్ధి పనులకు తరుచూ అడ్డుతగులుతుండటంతో ఎలాగైనా శ్రీనివాస్ రెడ్డిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. బుల్లెట్పై ఒకరు, బస్సులో మరొకరు.. ఈ నెల 1న ఉదయం 6 గంటలకు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలు ఏపీ09 ఏడబ్ల్యూ 0047 కారులో తమ వ్యవసాయ భూమికి వెళ్లారు. ఆ సమయంలో శ్రీనివాస్ రెడ్డి కారు నడుపుతున్నాడు. అప్పటికే అక్కడ కాపు కాస్తున్న ఖాజా మోహియుద్దీన్, భిక్షపతిలు లిఫ్ట్ కావాలని అడిగారు. దీంతో శ్రీనివాస్రెడ్డి కారు ఆపగా.. ఆయన తలపై ఖాజా మోహియుద్దీన్ తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. దీంతో తనని తాను రక్షించుకునేందుకు శ్రీనివాస్రెడ్డి కారు దిగి పారిపోతుండగా.. ఖాజా అతన్ని వెంబడించి కాల్పులు జరిపాడు. శ్రీనివాస్రెడ్డి అక్కడిక్కడే కుప్పకూలాడు. శ్రీనివాస్రెడ్డి పారిపోతున్న సమయంలో పక్క సీటు నుంచి డ్రైవర్ సీటులోకి వచ్చిన రాఘవేందర్ రెడ్డిపై భిక్షపతి కాల్పులు జరిపాడు. ఛాతీలోకి బుల్లెట్ దిగిన రాఘవేందర్ రెడ్డి అపస్మారక స్థితిలో కారును నడిపే ప్రయత్నం చేయగా.. వాహనం ఆగిపోయింది. కాల్పుల తర్వాత నిందితులు ఇద్దరూ మట్టారెడ్డి ఫామ్ హౌస్కు వెళ్లి ‘పని పూర్తయిందని’ తెలిపి, తుపాకులను అక్కడే పెట్టేసి వెళ్లిపోయారు. ఖాజా తన బుల్లెట్ వాహనంలో పారిపోగా.. భిక్షపతి నడుచుకుంటూ వెంచర్ నుంచి బయటికి వచ్చి బస్సు ఎక్కి ఇంటికి వెళ్లిపోయాడు. మట్టారెడ్డి నేరచరితుడే.. ఈ హత్య కేసులో సూత్రధారి అయిన మేరెడ్డి మట్టారెడ్డి కూడా నేరచరితుడే. ఇతని మీద నారాయణగూడ, మలక్పేట, సరూర్నగర్ పీఎస్లలో మూడు చీటింగ్ కేసులున్నాయి. కర్మన్ఘాట్లో సొంత అపార్ట్మెంట్తో పాటూ ఇతర ప్రాంతాల్లో మొత్తం 78 ఎకరాల భూములు ఉన్నట్లు పోలీసులు విచారణలో తేలింది. నాలుగు లగ్జరీ కార్లున్నాయి. యూట్యూబ్లో చూసి.. హత్యకు 20 రోజుల ముందే బిహార్ నుంచి రెండు తుపాకులను కొనుగోలు చేశారు. గతంలో ఖాజా మోహియుద్దీన్, భిక్షపతిలకు తుపాకీ పట్టుకున్న అనుభవం లేకపోవటంతో ఇద్దరూ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నారని, ఫిబ్రవరి 28నే హత్యకు ప్రయత్నించగా విఫలమైందని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. లేక్విల్లా ఆర్చిడ్స్లో చాలా వరకు ప్లాట్లు 2–3 రిజిస్ట్రేషన్లు జరిగాయని, అసోసియేషన్ ప్రతినిధులను విచారించి, ఈ హత్య కేసులో ఇంకా ఎవరి ప్రమేయం ఉందని ఆరా తీసి వారిని కూడా అరెస్ట్ చేస్తామని సీపీ పేర్కొన్నారు. పోలీసులకు దృశ్యం సినిమా చూపించిన మట్టారెడ్డి హత్య జరిగిన రోజు ఘటన స్థలంలో ఉన్న మట్టారెడ్డిపై మృతుల కుటుంబ సభ్యులు ఆరోపణలు చేయడంతో వెంటనే ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణకు ఏమ్రాతం సహకరించలేదని సీపీ తెలిపారు. తమ మధ్య చంపుకొనేంత విభేదాలు లేవని పదే పదే వ్యాఖ్యానించినట్లు చెప్పారు. విచారణలో మట్టారెడ్డికి ఫామ్ హౌస్ ఉందని విషయం పోలీసులకు తెలిసింది. దాన్ని పరిశీలించేందుకు వెళ్లిన పోలీసులకు.. ఫామ్హౌస్లో సీసీ కెమెరా కనిపించింది. ఫుటేజ్ను పరిశీలించగా.. హత్య జరిగిన అనంతరం పచ్చ చొక్కా వేసుకున్న వ్యక్తి ఫామ్ హౌస్లోకి హడావుడిగా రావటం కనిపించింది. ఆ వ్యక్తిని ఆరా తీయగా.. శ్రీనివాస్ రెడ్డిపై కాల్పులు జరిపిన ఖాజా మోహియుద్దీన్ అని తేలింది. బిహార్లో తుపాకుల కొనుగోలు.. లేక్విల్లా ఆర్చిడ్స్ వాచ్మన్ ఖాజా మోహియుద్దీన్తో కలిసి మట్టారెడ్డి శ్రీనివాస్, రాఘవేందర్ రెడ్డిల హత్యకు పథకం రచించాడు. ఇందుకోసం ఖాజా.. తన స్నేహితుడైన బుర్రి భిక్షపతి సహాయం తీసుకున్నాడు. హత్య చేసేందుకు వీరిరువురికీ తలా 1,111 గజాల ప్లాట్ను ఇస్తానని మట్టారెడ్డి హామీ ఇచ్చాడు. తుపాకుల కోసం ఆరా తీయగా.. తన మామ సయ్యద్ రహీంకు బిహార్ గ్యాంగ్లతో పరిచయం ఉందని, తుపాకులు సమకూరుస్తాడని తెలపడంతో మట్టారెడ్డి రూ.1.20 లక్షల నగదు ఇచ్చాడు. కారులో బిహార్కు వెళ్లి సమీర్ అలీ నుంచి రెండు తుపాకులను కొనుగోలు చేశారు. వీటిని బిహార్కు చెందిన చందన్ సిబాన్, సోనులు తయారు చేశారు. (చదవండి: ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో వీడిన మిస్టరీ) -
పసిపాపను కాల్చిచంపారు
Ukraine War: ఉక్రెయిన్ పౌరులపై దాడి చేయమన్న రష్యా ప్రకటనలకు విరుద్ధంగా సామాన్యులపై దాడులు చేస్తోంది. కీవ్లోకి చొచ్చుకువస్తున్న రష్యా బలగాలు జరిపిన కాల్పుల్లో పదేళ్ల పోలినా అనే బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులు సైతం అక్కడికక్కడే మరణించారు. తీవ్రగాయాలపాలైన ఆమె సోదరుడు, సోదరి ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. మరోవైపు రష్యా ప్రయోగించిన మిస్సైల్ ఒక్త్రికా నగరంలో కిండర్ గార్డెన్ స్కూలుపై పడడంతో ఏడేళ్ల అలీసా అనే పాప పాటు ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. శనివారం కీవ్కు చెందిన ఆంటాన్ కుడ్రిన్, ఆయన భార్య స్వెత్లెనా, కుమార్తె పోలినాలు బుల్లెట్ల దెబ్బకు మరణించారు. అంటాన్ పెద్ద కుమారుడు సైమన్, పెద్ద కూతురు సోఫియా గాయాలతో బయటపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. గురువారం నుంచి ప్రారంభమైన యుద్ధంలో ఇప్పటివరకు అధికారికంగా 16 మంది పిల్లలు మరణించారని, 45 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. యుద్ధం పూర్తయ్యేసరికి వీరి సంఖ్య మరింత పెరగవచ్చని మానవ, బాలల హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: రష్యా దాడిలో భారతీయ విద్యార్థి మృతి) -
ఆస్తి కోసం కన్నతండ్రినే కడతేర్చేందుకు యత్నం!...ఎయిర్గన్తో కాల్పులు జరిపి పరారైన కొడుకు
మైసూరు: ఆస్తి కోసం తండ్రిని కన్నకొడుకు ఎయిర్గన్తో షూట్ చేసి పరారైన సంఘటన మైసూరు విజయనగర పరిధిలో చోటు చేసుకుంది. రేణుకా కళాశాలకు చెందిన ఆస్తి విషయంలో నెల రోజులుగా శివకుమార్, కొడుకు మధ్య రగడ జరుగుతోంది. ఆస్తిని తన పేరుమీద రాయాలని తండ్రితో గొడవ పడ్డాడు. స్నేహితులతో కలిసి ఎయిర్గన్తో కాల్పులు జరిపి పరారయ్యాడు. ఆ శబ్దాలకు చుట్టుపక్కల వారు వచ్చి గాయపడిన శివకుమార్ను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కొడుకు, మిత్రులు పరారీలో ఉన్నారు -
సినిమాలను తలదన్నేలా ప్రీ వెడ్డింగ్ షూట్లు
సాక్షి, ఎదులాపురం(ఆదిలాబాద్): వివాహ వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ సమయంలో మర్చిపోలేని రీతిలో.. మధుర జ్ఞాపకంలా యువతీ యువకులు పెళ్లికి సిద్ధమవుతున్నారు. సినిమాలను తలదన్నేలా ప్రీ వెడ్డింగ్ షోలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మొదట ఖర్చుకు వెనుకాడినా.. క్రేజీ పెరుగుతుండడంతో ఇప్పుడు డబ్బులకూ వెనుకాడకుండా పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసుకుంటున్నారు. సినిమా తరహా మాదిరిగా సినీ, జానపద గీతాలపై కాబోయే జంటలు వీడియో షూట్లో చేసి వాటిని పెళ్లి జరిగే రోజు ఎల్ఈడీ స్క్రీన్పై ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేకమైన లొకేషన్స్.. ప్రీవెడ్డింగ్ షూట్ కోసం ఫొటో, వీడియో గ్రాఫర్లు ప్రత్యేక లొకేషన్లు ఎంపిక చేస్తున్నారు. జిల్లాలో కొర్టికల్, కుంటాల, పొచ్చెర జలపాతం, సాత్నాల ప్రాజెక్టు, ఖండాల, ఆదిలాబాద్ గాంధీ పార్కు, మత్తాడి వాగులు, ఆలయాలు, ప్రకృతివనాల్లో షూటింగ్ చేస్తున్నారు. ఒక్కో ఫ్రీ వెడ్డింగ్షో చిత్రీకరణకు రెండు నుంచి మూడు రోజుల సమయం తీసుకుంటున్నారు. రూ.20 వేల వరకు చార్జి ఒక్కో ప్రీవెడ్డింగ్ షోకు ఫొటో, వీడియో గ్రాఫర్లు రూ. 15 వేల నుంచి రూ.20 వేల వరకు చార్జి చేస్తున్నారు. వాహన, డ్రెస్సు, కాస్టూమ్స్, ఇతర ఖర్చులన్నీ వెడ్డింగ్ షో చేయించుకునేవారు భరిస్తారు. పెళ్లి ఫొటో, వీడియోలు, ఫ్రీ వెడ్డింగ్కు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు తీసుకుంటున్నారు. ఫ్రీ వెడ్డింగ్ షో ద్వారా జిల్లాలోని యువత ఫొటోగ్రఫీ ద్వారా ఉపాధి పొందుతున్నారు. మధుర జ్ఞాపకం ప్రీ వెడ్డింగ్ ఒక మంచి అనుభూతి. పెళ్లికి ముందు ఒకరి భావాలు మరొకరికి అంతగా తెలియదు. ప్రీ వెడ్డింగ్తో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వేదికగా నిలుస్తోంది. ఒక మధుర జ్ఞాపకం. అంతే కాకుండా ప్రస్తుతం ఒక ట్రెండ్గా సాగుతుండడంతో ప్రీ వెడ్డింగ్ తీయించుకున్నాం. – సౌరబ్, శ్రీజ, ఆదిలాబాద్ సినిమా తరహాలో వెడ్డింగ్ షో సినిమా తరహాలో పాటలు చిత్రీకరించేలా వెడ్డింగ్ షో చేస్తున్నాం. ఒక పాటకు రూ.20 వేలు తీసుకుంటుంన్నాం. స్వయం ఉపాధి పొందడంతోపాటు నలుగురికి ఉపాధి చూపుతున్నాం. చిత్రీకరించిన పాటను పెళ్లిరోజు ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ప్రదర్శిస్తున్నాం. – నవీన్, ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ చదవండి: మీసాల వెంట్రుకలతో సూటు.. ఎంత అందంగా ఉందో చూడండి! -
శ్రీరాముని అవతారంలో సంపూర్ణేష్ బాబు
‘హృదయకాలే యం’, ‘కొబ్బరిమట్ట’ చిత్రాల ఫేమ్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘క్యాలీఫ్లవర్’కి గుమ్మడికాయ కొట్టారు. ఆర్కే మలినేని దర్శకత్వంలో సంపూర్ణేష్, వాసంతి జంటగా నటించిన చిత్రం ‘క్యాలీఫ్లవర్’. గుడూరు శ్రీధర్ సమర్పణలో ఆశాజ్యోతి గోగినేని నిర్మించారు. చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా సినిమాలో శ్రీరాముడు వేషధారణలో ఉన్న సంపూర్ణేష్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ‘‘ఇంగ్లాండ్ నుంచి ఇండియా వచ్చిన ఓ ఇంగ్లిష్ వ్యక్తిగా సంపూ కనిపిస్తారు. గోపీ కిరణ్ చక్కని కథ అందించారు’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: కోల నాగేశ్వరరావు, హరిబాబు జెట్టి. -
బ్యాలెట్పై నెత్తుటి మరక
మహోద్రిక్త ప్రచార ఆర్భాటంతో సాగుతున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో నాలుగో దశ రక్తసిక్త మయింది. కూచ్బెహార్ జిల్లా సీతాల్కుచీ నియోజకవర్గం జోర్పట్కిలో శనివారం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) జవాన్లు జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అదే నియోజకవర్గంలో మరోచోట గుర్తుతెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఒకరు చనిపోయారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందే ఆ రాష్ట్రం తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీల వాగ్యుద్ధాలతో వేడెక్కింది. అటు తర్వాత అది మరింత ముదిరింది. అసెంబ్లీ ఎన్నికల కోసం అసా ధారణ రీతిలో 77,000 మంది కేంద్ర భద్రతా సిబ్బందిని, 35,000 మంది రాష్ట్ర పోలీసులను నియమించారు. ఎనిమిది దశల పోలింగ్ షెడ్యూల్ను ప్రకటించారు. బలగాలు తమంత తాము శాంతిని నెలకొల్పలేవు. ఆయుధాలతో సర్వసన్నద్ధంగా వున్న బలగాల ఉనికిని చూసి హింసకు పాల్ప డదల్చుకున్న, అరాచకాన్ని సృష్టించదల్చుకున్న శక్తులు వెనకడుగేస్తాయని, ఫలితంగా ప్రశాంతత నెలకొంటుందని అందరూ అనుకుంటారు. కానీ నాయకులు తమ పరిమితులేమిటో, తమ బాధ్యత లేమిటో గుర్తించనప్పుడు అరాచక శక్తులు సహజంగానే చెలరేగుతాయి. భద్రతా బలగాలను సైతం బేఖాతరు చేస్తాయి. ఆ రాష్ట్రంలో జరిగింది అదే. పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి భయోత్పాతం సృష్టించటం, ప్రత్యర్థి పక్షాల నాయకులపై దాడులు వగైరాలు షరా మామూలుగా సాగాయి. తాను పోటీ చేసే నందిగ్రామ్లో స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే రంగంలోకి దిగి రెండు గంటలు కూర్చున్నారు. ఈమధ్యే బీజేపీకి చెందిన మహిళా ఎమ్మెల్యే కారుపై రాళ్ల దాడి జరిగింది. వీటన్నిటికీ పరాకాష్టగా ఇప్పుడు పోలీసు కాల్పులు కూడా జరిగాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో హింస కొత్తగాదు. టీఎన్ శేషన్ ఎన్నికల ప్రధాన కమిషనర్గా తీసుకున్న చర్యలు మంచి ఫలితాన్నివ్వటంతో అనంతరకాలంలో వచ్చిన ఎన్నికల చీఫ్లు ఆయన్ను ఆదర్శంగా తీసుకోవటం మొదలుపెట్టారు. దాంతో చాలాచోట్ల హింసాయుత వాతావరణం క్రమేపీ తగ్గుముఖం పట్టింది. బెంగాల్లో కూడా గతంతో పోలిస్తే ఎంతో కొంత నయం. అయితే అది ఆశిం చిన స్థాయిలో లేదు. కనుక భారీయెత్తున కేంద్ర బలగాలను మోహరించటం మంచిదేనన్న అభిప్రాయం చాలామందిలో ఏర్పడింది. కానీ సీతాల్కుచీలో కాల్పులు జరపక తప్పనంత స్థాయిలో అల్లర్లు ఏం జరిగాయో సీఐఎస్ఎఫ్ ఇస్తున్న వివరణ ద్వారా తెలియడం లేదు. స్థానికులు కొందరు తమపై రాళ్లు, కర్రలతో దాడిచేశారని, తమ వాహనాన్ని ధ్వంసం చేశారని సీఐఎస్ఎఫ్ ప్రతినిధి చెబుతున్నారు. అందుకే కాల్పులు జరపాల్సివచ్చిందంటున్నారు. దాడిలో జవాన్లు ఎవరూ గాయ పడిన దాఖలా లేదు. నిబంధనల ప్రకారం హింసకు దిగిన మూకను అదుపు చేసేందుకు లాఠీచార్జి, బాష్పవాయు గోళాల ప్రయోగం వగైరా చర్యలన్నీ నిష్ఫలం అయ్యాకే కాల్పులు జరుపుతారు. అవి సక్రమంగానే అమలయ్యాయా? ఎందుకంటే సీఐఎస్ఎఫ్ బలగాలకు అల్లరి మూకలను నియంత్రిం చటంలో పెద్దగా అనుభవం లేదు. దేశంలో ఎక్కడ ఎలాంటి సమస్యలెదురైనా సీఆర్పీఎఫ్ బలగాలనే వినియోగిస్తారు. శాంతిభద్రతల పరిరక్షణలో, అల్లరి మూకలను నియంత్రించటంలో ఆ దళానికి అపారమైన అనుభవముంది. ఇందుకు భిన్నంగా సీఐఎస్ఎఫ్ను పరిశ్రమల పరిరక్షణకూ, విమానాశ్రయాల భద్రతకూ అధికంగా వినియోగిస్తారు. సాధారణ ఓటర్లు నిర్భయంగా ఓటేసేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలూ తీసుకోవాల్సిందే. కానీ ఆ పేరున అతిగా స్పందించే ధోరణి ప్రమాదకరం. కాల్పులకు దారితీసిన ఉదంతంలో సీఐఎస్ఎఫ్ ఇస్తున్న సంజాయిషీకీ, స్థానికుల కథనానికీ పొంతన లేదు. పోలింగ్ కేంద్రానికి సమీపాన ఒక బాలుడు అస్వస్థతలో వుండటాన్ని గమనించి ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుండగా స్థానికులు పొరబడి దాడికి దిగారని సీఐఎస్ఎఫ్ జవాన్లు చెబుతున్నారు. కానీ వారు తనను తీవ్రంగా కొట్టడం వల్ల రోదిస్తుండగా స్థానికులు అక్కడ గుమిగూడారని బాలుడు అంటున్నాడు. ఈ ఉదంతంలో భాషాపరమైన సమస్య కూడా వున్నట్టుంది. వారు హిందీలో అడిగే ప్రశ్నలకు అతను తడబడటం, దాంతో జవాన్లకు అనుమానం వచ్చి కొట్టడం పర్యవసానంగా ఉద్రిక్తతలు ఏర్పడి కాల్పుల ఘటనకు దారితీసిందని మీడియా కథనాల ద్వారా అర్థమవుతోంది. కనీసం ఈ ఉదంతం తర్వాతైనా పార్టీలు బాధ్యతగా మెలగలేదు. సంయమనాన్ని ప్రదర్శించ లేదు. ‘ఇదివరకు మాదిరి ఇష్టానుసారం రెచ్చిపోతే కేంద్ర బలగాలు చూస్తూ వూరు కోవు... ప్రతి చోటా సీతాల్కుచీలు పునరావృతమవుతాయి’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ హెచ్చ రించారు. ఇటు టీఎంసీ సైతం అదే స్థాయిలో ప్రతి దాడికి దిగుతోంది. సీతాల్కుచీ కాల్పులకు ఎన్ని కల సంఘం నిర్వాకమే కారణమంటోంది. బెంగాలీలకు ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలో తెలుసునని హెచ్చరిస్తోంది. పార్టీలు వివిధ అంశాలపై తమ వైఖరేమిటో, అవతలి పక్షం అవగాహనలోని లోపాలే మిటో చెప్పడం ఒకప్పుడు ఎన్నికల సమయాల్లో కనబడేది. ప్రజలు అన్నివిధాలా ఆలోచించి ఓటేసే అవకాశం వుండేది. కానీ ఇప్పుడు ఎన్నికలు ధనశక్తికి, కండబలానికి ప్రతీకగా మారుతున్నాయి. సమ స్యల ప్రస్తావన బదులు దుర్భాషలూ, దౌర్జన్యాలూ నిత్యకృత్యమవుతున్నాయి. ఇవి అవాంఛనీయ పరిణామాలకు దారితీస్తున్నాయి. ఇలాంటి వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కత్తిమీద సాము అన డంలో సందేహం లేదు. కనుక ఎన్నికల సంఘం మరింత జాగురూకతతో మెలగాల్సి వుంటుంది. -
రియల్ హీరోకు గ్రాండ్ వెల్కమ్
సాక్షి, హైదరాబాద్ : కరోనా, లాక్డౌన్ అనంతరం టాలీవుడ్ లో తెలుగు సినిమాల షూటింగ్ సందడి మొదలైంది. ఈ క్రమంలో యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజా మూవీ 'అల్లుడు అదుర్స్' మళ్లీ సెట్స్ పైకి వచ్చింది. సోమవారం హైదరాబాద్ లో ఈ చిత్ర షూటింగ్ కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో అడుగుపెట్టిన లాక్డౌన్ హీరో సోనూసూద్ కు ఘన స్వాగతం లభించింది. ముఖ్యంగా రియల్ హీరో సోనూసూద్ లోకేషన్ లోకి ఎంటర్ కాగానే యూనిట్ సిబ్బంది అంతా చప్పట్లతో, ఉత్సాహంగా సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ప్రకాశ్ రాజ్ సోనూకు శాలువా కప్పి సత్కరించారు. ఆయనకు ఓ జ్ఞాపికను కూడా బహూకరించారు. ఈ క్రమంలో అల్లుడు అదుర్స్ సెట్ లో సందడి వాతావరణం నెలకొంది. కష్టకాలంలో వలసకార్మికులకు అండగా నిలిచిన సోనూను మనస్ఫూర్తిగా అభినందించారు.(ఏసర్ బ్రాండ్ అంబాసిడర్గా సోనూ సూద్..) బెల్లకొండ శ్రీనివాస్ సరసన అనూ ఇమ్మానుయేల్, నభా నటేష్ హీరోయిన్లుగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. 8 ప్యాక్స్తో సరికొత్త లుక్లో కనిపించనున్నడు హీరో. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్పై జి.సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కాగా సినిమాల్లో విలన్ పాత్రల్లో కనిపించిన విలక్షణ నటుడు సోనూసూద్ కరోనా కాలంలో వలస కార్మికులతోపాటు, వేలాదిమందికి సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్న సంగతి తెలిసిందే. కలియుగ దాన కర్ణుడుగా అడిగినవారికి కాదనకుండా తనవంతుగా సాయం చేయడమే కాదు, నిర్మాణాత్మకంగా, ఒక పథకం ప్రకారం తన కార్యక్రమాలను కొనసాగించడం విశేషంగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. -
రియల్ హీరో సోనూ సూద్
-
కెనడాలో కాల్పులు..
-
భార్యను తుపాకీతో కాల్చి పరారైన భర్త
-
షాకింగ్ : గన్తో పేల్చుకున్న రెండేళ్ల చిన్నారి
టెక్సాస్ : చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వారు తెలిసీ తెలియకుండా చేసే పనులు ఒక్కోసారి ప్రాణాలు మీదకు తెస్తాయి. పిల్లల విషయంలో తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా హోస్టన్లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఓ రెండేళ్ల చిన్నారి ఇంట్లో ఆడుకుంటూ వెళ్లి.. అక్కడే బుల్లెట్లు లోడ్ చేసి ఉన్న గన్తో తనకు తానుగా కాల్చుకున్నాడు. ఆ సమయంలో తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్నప్పటికీ వారేమీ చేయలేకపోయారు. చిన్నారిని టెక్సాస్లోని పిల్లల ఆసుపత్రిలో చేర్చినప్పటికీ ఏ ప్రయోజనం లేకపోయింది. ఆసుపత్రిలో చేర్చిన ఒక రోజు అనంతరం చికిత్స పొందుతూ ఆ చిన్నారి ప్రాణాలు విడిచాడని తెలిసింది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం హోస్టన్లో జరిగింది. ప్రాథమిక విచారణ ప్రకారం, సురక్షితం కాని లోడెడ్ గన్తో తనకు తానుగా పేల్చుకోవడం వల్లే చిన్నారి మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. లోడ్ చేసిన 9 ఎంఎం పిస్టల్ను ఈ చిన్నారి ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో పట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. చిన్నారి ఆ గన్తో ఆడుకుంటూ తలకు గురిపెట్టుకుని ట్రిగర్ నొక్కుకున్నాడని.. ఆ సమయంలో తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్నప్పటికీ ఏం చేయలేకపోయారని చెప్పారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. చిన్నారి గన్తో పేల్చుకుంటున్న సమయంలో తల్లిదండ్రులు ఉన్నప్పటికీ, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చిన్నారిని కాపాడుకోలేకపోయారు. వారికి ఏమైనా శిక్ష విధించాలా? అనే విషయంపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి ఓ పాఠంలా ఉందని పలువురు అంటున్నారు. -
పైప్ గురిపెట్టాడు..గన్తో కాల్చి చంపారు
న్యూయార్క్ : అమెరికా పోలీసుల అనుమానం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. చేతిలో తుపాకి ఉందనే అనుమానంతో న్యూయార్క్ సిటీ పోలీసులు ఓ వ్యక్తిని దారుణంగా కాల్చి చంపారు. వివరాలలోకి వెళితే.. ఓ నల్ల జాతీయుడు తమ వైపు గన్ గురిపెట్టాడని, ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉందనే సమాచారం న్యూయార్క్ పోలీసులకు అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడి చేతిలో మారుణాయుధం ఉన్నట్లుగా అనుమానించారు. వెంటనే నలుగురు పోలీసులు అతనిపై పదిరౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో అతడు కుప్పకూలిపోయాడు. అయితే వారు అనుమానించిన విధంగా అతని వద్ద ఎలాంటి తుపాకి లభించకపోగా చేతిలో ఉన్నది ఇనుప పైప్ అని తెలియడంతో పోలీసులు ఖంగుతిన్నారు. కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తిని బ్రూక్లీన్కు చెందిన సహీద్ వెస్సెల్గా గుర్తించారు. అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేక పోయింది. ఆస్పత్రికి తీసుకురావటానికి ముందే అతను మరణించాడని వైద్యులు తెలిపారు. గత వారం కూడా ఇలాంటి ఘటనే నగరంలో చోటు చేసుకుంది. మైకల్ క్లార్క్ అనే వ్యక్తిని కారు అద్దాలు పగులగొడుతున్నాడనే అనుమానంతో పోలీసులు కాల్చి చంపారు. ఈ కాల్పులకు పాల్పడ్డ పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కాలిఫోర్నియా నగరంలో నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. -
'వైట్ హౌస్'పై కాల్పులు జరిపి.. ఆపై!
వాషింగ్టన్: ఓ గుర్తుతెలియని వ్యక్తి అమెరికా అధ్యక్ష భవనం 'వైట్ హౌస్' భద్రతా సిబ్బందికి, ఉన్నతాధికారులకు ముచ్చెమటలు పట్టించాడు. ఏకంగా వైట్ హౌస్ పై కాల్పులు జరిపిన ఆ దుండగుడు తనకు తానే కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వైట్ హౌస్ సిబ్బంది కథనం ప్రకారం.. ఓ సాయుధుడు శనివారం మధ్యాహ్నం అధ్యక్ష భవనం వద్దకు చేరుకున్నాడు. తన వెంట తెచ్చుకున్న తుపాకీతో పెన్సిల్వేనియా అవెన్యూ వద్ద కొన్ని రౌండ్లు కాల్పులు జరిపాడు. కాల్పుల ఘటనలో ఒక్కసారిగా అప్రమత్తమైన సిబ్బంది సాయుధుడిని పట్టుకునేందుకు చూడగా.. తుపాకీతో కాల్పుకుని బలవన్మరణం పొందాడు. కాల్పుల నేపథ్యంలో వైట్ హౌస్ వద్ద చోటుచేసుకున్న భయానక పరిస్థితులకు సంబంధించిన వీడియో ట్వీటర్లో వైరల్గా మారింది. కాగా, శనివారం ఫ్లోరిడా పర్యటనలో ఉన్న ట్రంప్ దంపతులు సాయంత్రానికి వైట్హౌస్కు రావాల్సి ఉంది. వారు మరికాసేపట్లో వైట్హౌస్కు వస్తారని అనుకున్న సమయంలో అక్కడ కాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే, కాల్పులు జరిగిన సమయంలో వైట్హౌస్లో ట్రంప్ దంపతులు లేకపోవడం, వారు ఇంకా ఫ్లోరిడా పర్యటనలోనే ఉండటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. గత నెల 23న ఓ మహిళ తన కారుతో అధ్యక్ష భవనం వద్ద బీభత్సం సృష్టించగా, వైట్ హౌస్ సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. -
ఫ్లోరిడాలో నరమేధం... 17 మంది మృతి
-
రేణు దేశాయ్...ఓ విషాద అనుభవం
ముంబై: తరచూ తన మనసులోని భావాలను, ఉద్వేగాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసే నటి రేణు దేశాయ్ తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని ట్విట్టర్ లో పంచుకున్నారు. పవన్కళ్యాణ్తో తాను కలిసి నటించిన బద్రి సినిమాకు సంబంధించి ఓ విషయాన్ని పంచుకున్నారు. అయితే ఈ సారి రేణు దేశాయ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆ నాడు జరిగిన ఓ చేదు జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకొని భావోద్వేగానికి గురైంది. సినిమా విడుదలై నేటికి సరిగ్గా 17 ఏళ్లు పూర్తయని గుర్తు చేసుకున్న రేణు, ఆ సినిమాలోని కొన్ని సన్నివేశ షూటింగ్ విషయాలను గుర్తు చేసుకున్నారు. అమితమైన దుంఖాన్ని దిగమింగి ఓఫన్నీ సన్నివేశంలో తాను నటించిన తీరుగురించి చెప్పుకొచ్చారు. దీనికి తార్కాణంగా ఓ ఫోను కూడా ఇన్స్టాగ్రామ్ లోపోస్ట్ చేశారు. ఆ సమయంలో తీసిన ఓ ఫొటోను చూస్తే తన కళ్లలో నీళ్లు తిరగడాన్ని గమనించొచ్చని పేర్కొన్నారు. ప్రేక్షకులకు ఈ ఫోటోలో గ్లామర్ మాత్రమే కనిపిస్తుందని.. కానీ, దీని వెనుక ఎవరికీ తెలియని ఓ విషాద సంఘటన ఉందన్నారు. పుణేలో తన స్నేహితురాలు ఓ బైక్ యాక్సిడెంట్లో చనిపోయినవార్త ఆసమయంలో తనకు అందిందని, అది విని తట్టుకోలేకపోయాననీ, అయినా దుంఖాన్ని దిగమింగి షూటింగ్ పూర్తి చేశానన్నారు. అయితే జాగ్రత్తగా గమనిస్తే... తన కళ్లలో నీటి తడిని చూడొచ్చని తన పోస్ట్లో చెప్పారు. ఆ సమయంలో బాధను దాచుకొన్నప్పటికీ తన కళ్లలో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయని, అందుకు సాక్ష్యం ఈ ఫోటోనే అని రేణుదేశాయ్ ఆ ఫోటోను ట్వీట్ చేశారు. An extremely strong memory from the shoot of the movie...If you notice closely, I have tears in… https://t.co/cPuf9VNVwm — renu (@renuudesai) April 20, 2017 -
ఎనిమిదేళ్ల బాలుడు చెల్లిని షూట్ చేశాడు!
న్యూయార్క్: ఇద్దరు పిల్లలను ఇంట్లో ఉంచి బయటకు వెళ్లి వచ్చిన మహిళకు ఊహించని విషాదం ఎదురైంది. ఇద్దరిలో ఒకరు నిర్జీవంగా పడి ఉండటాన్ని గమనించి ఆ తల్లికి గుండె ఆగినంత పనైంది. ఎనిమిదేళ్ల బాలుడు.. తన సోదరిని కాల్చిన ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. జాక్స్విల్లే విచారణ అధికారి క్రిస్ బట్లర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సెరినిటి అలెన్(5) అనే చిన్నారికి బుల్లెట్ తగలడంతో మృతి చెందింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారులకు గన్ దొరకడంతో.. ఈ ప్రమాదం జరిగింది. బాలుడు పొరపాటున షూట్ చేయడంతో.. ఓ బుల్లెట్ చెల్లికి తగిలి మృతి చెందిందని వెల్లడించారు. తాను స్టోర్కు వెళ్లి వచ్చేలోగా ఈ దుర్ఘటన జరిగిందని తల్లి వాపోయింది. కాగా తుపాకిని పిల్లలకు దొరికేలా అలా నిర్లక్ష్యంగా ఉంచిన ఆమె బాయ్ప్రెండ్ మోరీస్ మొబ్లీని పోలీసులు అరెస్ట్ చేశారు. -
పురాణాల్లో ధర్మరాజు...చరిత్రలో శాతకర్ణి
నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం బాలకృష్ణ, హేమమాలిని, శ్రీయాలపై రాజసూయ యాగం సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభించారు. దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ - ‘‘అఖండ భారతావనిని ఏకతాటిపైకి తీసుకు రావడానికి పురాణాల్లో ధర్మరాజు, చరిత్రలో శాతకర్ణి మాత్రమే ఈ యాగాన్ని నిర్వహించారు. ఈ రాజసూయ యాగ సమయంలోనే శాతకర్ణి తన పేరును గౌతమిపుత్ర శాతకర్ణిగా మార్చుకున్నారు. ఆ రోజున కొత్త యుగానికి ఆది ఉగాది అని, అప్పట్నుంచీ ఉగాది పండుగను నిర్వహిస్తున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున రాజసూయ యాగం సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభమవడం దైవ సంకల్పం. బాలకృష్ణ తనయుడు మోక్షజ ్ఞపుట్టినరోజు కూడా అదే రోజే (సెప్టెంబర్ 6) కావడం సంతోషం’’ అన్నారు. ఈ నెల 20 వరకూ మధ్యప్రదేశ్లో షెడ్యూల్ జరుగుతుందని నిర్మాతలు తెలిపారు. -
మోదీని వందసార్లు షూట్ చేయాలి : సీపీఐ నేత నారాయణ
రెండేళ్లలో దళితులపై లెక్కలేనన్ని దాడులు: సీపీఐ నేత నారాయణ సాక్షి, హైదరాబాద్: దేశంలో గత రెండేళ్ల కాలంలో దళితులపై లెక్కలేనన్ని దాడులు జరిగాయని.. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీని వందసార్లు షూట్ చేసినా పాపం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శివర ్గసభ్యుడు కె.నారాయణ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మోదీకి జ్ఞానోదయమై, హైదరాబాద్కు వచ్చాక దళితులపై దాడులు చేయడానికి ముందు తనను కాల్చాలని ఆవేదనను వెలిబుచ్చారన్నారు. దళితులపై దాడులకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఐక్య కార్యాచరణను చేపట్టనున్నట్లు తెలిపారు. అధిక ధరలకు వ్యతిరేకంగా ఈ నెల 17న సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఆందోళనలు చేపడుతున్నట్లు తెలిపారు. మంగళవారం మఖ్దూం భవన్లో విలేకరులతో మాట్లాడుతూ నయీం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నయీం ద్వారా అధికారులు, ఇతరులు ఎవరెవరు లబ్ధి పొందారు, ఎవరెవరికి ఎంత డబ్బు అందింది, తదితర వివరాలను వెలుగులోకి తీసుకురావాలన్నారు. ప్రభుత్వమే పెంచి పోషించిన వ్యక్తి నయీం అని వ్యాఖ్యానించారు. -
ఇద్దరు కూతుళ్లను కాల్చి..
అమెరికా లోని హోస్టన్ లో దారుణం జరిగింది. కన్నతల్లి తన ఇద్దరు టీనేజ్ కూతుళ్లను రివాల్వర్ తో కాల్చిచంపింది. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఓ ఇంటి నుంచి తుపాకీ మోత వినిపించడంతో దగ్గరలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ప్రాణాలు విడిచిన కూతుళ్లలో ఒకరిని తిరిగి కాల్చబోతుండగా పోలీసులు ఆమెపై కాల్పులు జరిపారు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. కుటుంబ సభ్యులతో గొడవ కారణంగానే ఆమె తన పిల్లలను కాల్చేసి ఉంటారని భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. -
ఏకే 47 తో కాల్చి చంపేస్తాం..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలో ఉన్న బ్రిటిష్ స్కూలులో అందరినీ చంపేస్తానంటూ ఓ ఆగంతకుడు హెచ్చరించడం కలకలం రేపింది. దీంతో యాజమాన్యం, విద్యార్థులు గజగజ వణికిపోయారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో దుండగుడు ఫోన్ చేశాడు. ఏకే 47 తుపాకితో అందర్నీ కాల్చి చంపేస్తానంటూ ఫోన్ లో బెదిరించాడు. కంగారుపడిన స్కూలు యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. అయితే అది ఫేక్ కాల్ అని పోలీసులు తర్వాత తేల్చారు. అయితే ఆ కాల్ ఎక్కడనుంచి వచ్చిందీ, ఎవరు చేశారు అనే వ ఇషయాలను ఆరా తీస్తున్నారు. -
ఐఫోన్తో పెళ్లి వీడియో షూటింగ్!
పెళ్లి వీడియో తీయాలంటే ఎంత తతంగం ఉంటుంది.. రెండు మూడు కెమెరాలు, అందులోనూ కాస్త ఖరీదైన వెడ్డింగ్ అయితే క్రేన్ కెమెరాలు, భారీ లైట్లు ఒకటే హడావుడి. ఇదేమీ లేకుండా కేవలం సెల్ఫోన్తోనే పెళ్లి వీడియో తీస్తే ఎలా ఉంటుంది? ఏకంగా పెళ్లి వీడియో.. సెల్ఫోన్లోనా! అసలు ఇలాంటి ఆలోచన రావడమే కష్టం అనుకుంటే, దానికి అంగీకరించే వధూవరులు దొరకడం ఇంకా కష్టం. దీన్నంతటినీ సాధ్యం చేసిన ఘనత బెర్గర్సన్ సెఫీకి దక్కింది. షూటింగ్ మాత్రమే కాదు.. ఎడిటింగ్ కూడా తన ఐఫోన్లోనే చేసి తన సత్తా చాటాడు. ఏడేళ్లుగా పెళ్లి వీడియోలు తీస్తూ సెఫి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐఫోన్తో పూర్తి భారతీయ పెళ్లిని చిత్రీకరించాలని ఉందన్న తన కోరికను ప్రొఫెషనల్ కెమెరామెన్ బెర్గర్ సన్ సెఫి కొన్నాళ్ల క్రితం తన ఫొటోగ్రఫీ బ్లాగ్లో పోస్ట్ చేశాడు. ఇటీవల రాజస్థాన్లోని ఉదయపూర్కు చెందిన ఆయన మిత్రులు ఆయుషి, అభిషేక్... సెఫి కోరికను తీర్చేందుకు ముందుకొచ్చారు. తమ పెళ్లిని ఐ ఫోన్ 6ఎస్ ద్వారా చిత్రీకరించేందుకు అనుమతినిచ్చారు. మూడు రోజులపాటు అట్టహాసంగా జరిగిన పెళ్లి మొత్తాన్ని సెఫి తన ఐ ఫోన్లో చిత్రీకరించి, అదులోనే ఎడిటింగ్ కూడా చేశాడు. డీఎస్ఎల్ఆర్ కెమెరా క్వాలిటీకి ఏమాత్రం తీసిపోకుండా వీడియో వచ్చింది. అయితే ఐఫోన్ ప్రయోగంతో పగటిపూట దృశ్యాలు అద్భుతంగానే ఉన్నా... రాత్రి షూటింగ్ మాత్రం ఇబ్బందిగానే ఉందని చెప్పాడు సెఫీ. ఈ వీడియోకు ఎన్నో ఫిల్టర్లను, ఎడిటింగ్ ఆప్షన్లను వాడిన తర్వాత తుది రూపాన్నిచ్చామని, ఈ ప్రస్తుత ప్రయోగం 70ల నాటి పోలరాయిడ్ కెమెరాలతో తీసిన తృప్తినిచ్చిందని అంటున్నాడు. తన కోర్కెను మన్నించి ఆయుషీ, అభిషేక్ తనకీ అవకాశం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందంటున్నాడు. డీఎస్ఎల్ఆర్ కెమెరాను ఐఫోన్ భర్తీ చేయలేకపోయినా, ఫొటోగ్రఫీలోనే ఓ కొత్త మీడియాన్ని పరిచయం చేసినట్లవుతుందని అంటున్నాడు. ఐఫోన్తో తక్కువ కాంతి ఉన్నప్పుడు చిత్రించడం కొంత కష్టమని, ఈ సందర్భంలో ఎల్ఈడీ లైట్లను వినియోగించి సమస్యను అధిగమించానని సెఫీ తెలిపాడు. డాక్యుమెంటరీలకు, ఫొటో జర్నలిజానికి అందుబాటులో ఉండే ఈ చిత్రాలు ఫైన్ ఆర్ట్ను తలపిస్తాయని, ఓ అద్భుత పెయింటింగ్ చూసిన అనుభూతి ఇస్తాయని చెబుతున్నాడు. -
’నేను ఏషార్ట్ ఫిలిం తీయలేదు’
-
పొరపాటున ట్రిగ్గర్ లాగిన చిన్నారి..
వాషింగ్టన్ : అమెరికాలో తల్లిదండ్రుల నిర్లక్ష్యం.. ఓ చిన్నారి ప్రాణాన్ని బలిగొంది. బొమ్మ అనుకొని చేతి తుపాకీతో ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ అది పేలడంతో రెండేళ్ల బాలుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వర్జీనియాలో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులతో పాటు సౌత్ వర్జీనియాలోని సొంత ఇంటికి చూడ్డానికి వెళ్లిన బాలుడు దురదృష్టవశాత్తూ తన ప్రాణాలు తానే తీసుకున్నాడు. బెడ్ రూంలో ఒంటరిగా ఉన్న బాలుని దృష్టి అక్కడే లోడ్ చేసి వున్న హ్యాండ్ గన్ పై పడింది. దాంతో ఆడుకుంటూ తలపై పెట్టుకున్నాడు. పొరపాటున ట్రిగ్గర్ లాగడంతో అది పేలి తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే ఆ బాలుడిని రిచమండ్లోని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బాలుడు చనిపోయాడు. ఈ సంఘటనపై అమెరికాలో పెరుగుతున్న గన్ గల్చర్కి వ్యతిరేకంగా పోరాడుతున్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ప్రమాదాల్లో సగటున ప్రతి ఏడాదికి 17 ఏళ్ల లోపు వయసుగల పిల్లలు దాదాపు 100 మంది చనిపోతున్నారని తెలిపారు. దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
దబాంగ్ 3కి రంగం సిద్దం
-
పశ్చిమ గోదావరి జిల్లాలో గ్యాంగ్వార్
తుపాకీతో కాల్చి చంపిన స్నేహితుడు! ద్వారకా తిరుమల : ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడి మద్యం అమ్మకాలకు తోడు అరాచక శక్తులు పేట్రోగిపోతున్న సంఘటన మరొకటి జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పత్స మధు (45) అనే రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. స్నేహితుడే అతడిని చంపి ఉంటాడని అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేటకు చెందిన పత్స మధు, అతని తమ్ముడు దుర్గాప్రసాద్, బావమరిది సందక జగన్మోహన్, స్నేహితుడు కాళీకృష్ణ శనివారం ఏలూరుకు కారులో బయల్దేరారు. మార్గమధ్యంలో ఓ మద్యం షాపు వద్ద ఆగారు. నలుగురూ మద్యం సేవించేందుకు సిట్టింగ్ రూమ్లో కూర్చున్నారు. తినడానికి ఏమైనా తెమ్మని మధు తన తమ్ముడు దుర్గాప్రసాద్ను బయటకు పంపాడు. ఆ సమయంలో మధుతో కాళీకృష్ణ, బావమరిది జగన్మోహన్ కూర్చున్నారు. కొంతసేపటికి తుపాకీ పేలిన శబ్దం వినపడటంతో దుర్గాప్రసాద్ పరుగెట్టుకుని లోపలికి వచ్చాడు. అప్పటికే మధు మరణించాడు. కాల్పులు జరిగిన వెంటనే కాళీకృష్ణ కారులో పరారయ్యాడు. నల్లజర్ల సెంటర్లో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండటంతో భయపడిన కాళీకృష్ణ కారును అక్కడే వదిలి పారిపోయాడు. దుర్గాప్రసాద్, జగన్మోహన్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాళీకృష్ణే ఈ హత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. మధుపై తాడేపల్లిగూడెంలో 4 హత్య కేసులు, ఒక హత్యాయత్నం కేసు, ఏలూరులో ఒక హత్య కేసు ఉన్నాయి. -
గబ్బర్సింగ్ 2కు రంగం సిద్ధం
-
ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే కాల్పులు
విజయవాడ : ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే శ్రీశైల వాసుపై కాల్పులు జరిగినట్లు కృష్ణాజిల్లా ఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ మృతుడు శ్రీశైల వాసు మేనల్లుడు గున్నం హనుమంతరావు తన స్నేహితుడు పాషా సాయంతో ఈ కాల్పులకు పాల్పడినట్లు వెల్లడించారు. శ్రీశైల వాసు తన మేనల్లుడికి రూ.కోటి బాకీ ఉన్నట్లు, ఈ నేపథ్యంలోనే వారి మధ్య గతంలో గొడవ జరిగినట్లు తమ వద్ద సమాచారం ఉందని ఎస్పీ తెలిపారు. నిందితులు పోలీసులకు లొంగిపోయారన్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన చెప్పారు. నిందితుల ఆచూకీ కోసం నల్గొండ జిల్లాతో పాటు కృష్ణా జిల్లా పోలీసులను కూడా అప్రమత్తం చేసినట్లు తెలిపారు. నందిగామలో ఈరోజు ఉదయం జరిగిన కాల్పుల్లో శ్రీశైల వాసు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. -
తాతను కాల్చేసిన 11 ఏళ్ల బాలుడు
చికాగో: అమెరికాలో విచ్చలవిడి తుపాకీ సంస్కృతికి మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇంట్లో గొడవల కారణంగా ఓ 11 ఏళ్ల బాలుడు తన తండ్రి, తాతను తుపాకీతో కాల్చాడు. తాత అక్కడికక్కడే మరణించగా, తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉత్తర కరోలినాలో సోమవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. లాయిడ్ వుడ్లీఫ్ (84) తన కొడుకు లాయిడ్ పీటన్ వుడ్లీఫ్ (49) ఇంట్లో ఉంటున్నాడు. ఇంట్లో ఘర్షణ జరగడంతో కాల్పులు జరిగినట్టు అధికారులు చెప్పారు. ఫోన్ కాల్ రావడంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. పీటన్ తీవ్రంగా గాయపడగా, లాయిడ్ అప్పటికే మరణించాడు. 11 ఏళ్ల పిల్లాడే తుపాకీతో కాల్చినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదు. -
తన పార్టీకి ఓటేయని భార్యను కాల్చేసిన భర్త
తనకు నచ్చిన పార్టీకి ఓటేయలేదని ఓ ప్రబుద్ధుడు భార్యను కాల్చిపారేశాడు. ఈ సంఘటనలో భార్య తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులంటున్నారు. ఈ సంఘటన బీహార్ లోని ఉజియార్ పూర్ నియోజకవర్గం లోని మొయినుద్దీన్ నగర్ లో జరిగింది. ఉజియార్ పూర్ లో బుధవారం ఎన్నికలు జరిగాయి. వినోద్ పాశ్వాన్ అనే వ్యక్తి భార్య తన మాట వినకుండా వేరే పార్టీకి ఓటేయడంతో మండిపడ్డాడు. పట్టలేని కోపంతో తుపాకీతో ఆమెను కాల్చేశాడు. ఈ సంఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేయడంతో ఇప్పుడు పాశ్వాన్ పారిపోయాడు. -
రెండేళ్ల తమ్ముడిని కాల్పి చంపిన మూడేళ్ల సోదరి!
లాస్ ఎంజెలెస్: ప్రమాదవశాత్తు రెండు సంవత్సరాల తమ్ముడిని రైఫిల్ తో మూడేళ్ల అమ్మాయి కాల్చిన సంఘటన యూఎస్ లో సంచలనం రేపింది. ఇలాంటి హత్య ఘటనలో పిల్లలు కారణం కావడం ఈ నెలలో నాలుగవ ఘటన. ఈ ఘటన శుక్రవారం ఉటాలోని క్యాచే కౌంటీలో చోటు చేసుకుంది. రెండేళ్ల తమ్ముడిని పొట్టలో .22 కాలిబర్ రైఫిల్ తో కాల్చి చంపినట్టు తెలిసింది. కాల్పుల శబ్దం విన్న తల్లి సహాయం కోసం కేకలేయడంతో బాలుడ్ని లోగన్ రిజినల్ ఆస్పత్రికి తరలించారు. ఆతర్వాత సర్జరీ సాల్ట్ లేక్ సిటీలోని ప్రైమరీ చిల్డ్రన్ ఆస్పత్రికి తరలించారు. ఆ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. మరణాయుధాలు పిల్లలకు అందుబాటులో ఉంచకూడదని క్యాచే కౌంటీ షెరీఫ్ లెఫ్టినెంట్ మైక్ పీటర్సన్ స్థానిక మీడియాకిచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇది చాలా దారుణ సంఘటన. తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి దుర్ఘటనలను అరికట్టవచ్చని మైక్ తెలిపారు. ఇటీవల సౌత్ కారోలినాలో ఆరేళ్ల బాలుడు ఓ మహిళను కాల్చి చంపిన సంఘటన విషాదాన్ని నింపింది. తన తండ్రితో కారులో ప్రయాణిస్తున్న బాలుడు కాల్పులు జరపడంతో ఓ మహిళకు తగిలి అక్కడికక్కడే మరణించారు. -
పాక్లో టీవీ జర్నలిస్టుపై కాల్పులు
కరాచీ: పాకిస్థాన్లో ఓ టీవీ సీనియర్ జర్నలిస్టుపై దుండగులు కాల్పులు జరిపారు. జియో టీవీలో పనిచేస్తున్న హమీద్ మిర్పై కరాచీ ఎయిర్పోర్టులో నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. శనివారం హమీద్ ఎయిర్పోర్టు నుంచి స్టూడియోకు వెళ్తుండగా దుండగులు ఆయన కారును వెంబండించారు. ఎయిర్పోర్టులోనే అతనిపై కాల్పులు జరిపారు. ఆయన శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లాయి. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తాలిబన్తో ఇతర ఉగ్రవాద సంస్థల నుంచి హమీద్కు ప్రాణహాని ఉన్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. -
బాలికను కాల్చిచంపిన ఐదేళ్ల బాలుడు
న్యూయార్క్: అమెరికాలో విచ్చలవిడిగా తుపాకుల వాడుక సంస్కృతికి మరొకరు బలయ్యారు. ఓ ఐదేళ్ల బాలుడు ఏడేళ్ల బాలికను కాల్చిచంపాడు. ఈ విషాదకర సంఘటన బర్త్ డే పార్టీలో ప్రమాదవ శాత్తూ జరిగింది. వివరాలిలా ఉన్నాయి. సౌత్ కరోలినాలోని గాస్టన్లో ఓ ఇంటిలో అందరూ బర్త్ డే సంబరాల్లో మునిగితేలుతున్నారు. బాలుడు ఆడుకునేందుకు బొమ్మ తుపాకీ కోసం కారులో వెతికాడు. అయితే ఆ పిల్లాడికి తల్లి బాయ్ఫ్రెండ్కు చెందిన నిజమైన తుపాకీ దొరికింది. అందులో బుల్లెట్లు లోడ్ చేసి ఉన్నాయి. పాపం ఇవేమీ తెలియని ఆ పిల్లాడు తుపాకీ తీసుకుని సరదాగా కాల్చాడు. కారులోంచి బుల్లెట్లు దూసుకొచ్చి ఏడేళ్ల బాలికతో పాటు మరో ఐదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించగా బాలుణ్ని మాత్రం బతికించగలిగారు. అమ్మాయి ఛాతీలో బుల్లెట్ దూసుకెళ్లడంతో చనిపోయింది. ఇదే నెలలో అమెరికాలో రెండేళ్ల బాలుడు తుపాకీతో ఆడుకుంటూ ఐదేళ్ల సోదరిని కాల్చిచంపాడు.