Adam Gilchrist
-
చరిత్ర సృష్టించిన స్మిత్, ఖావాజా.. తొలి ఆసీస్ జోడీగా
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తొలి రోజు ఆటలో లంక బౌలర్ల భరతం పట్టిన ఆసీస్ బ్యాటర్లు.. రెండో రోజు ఆటలో సైతం అదే తీరును కనబరుస్తున్నారు. మొదటి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ దిశగా కంగారూ జట్టు సాగుతోంది. 117 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో కేవలం 3 వికెట్లు కోల్పోయి 486 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖావాజా డబుల్ సెంచరీతో మెరిశాడు. . 290 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్సర్తో ఖావాజా తన తొలి డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. మరోవైపు ఆసీస్ సూపర్ స్టార్ స్మివ్ స్మిత్ కూడా సూపర్ సెంచరీతో సత్తాచాటాడు. 251 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్లతో స్మిత్ 141 పరుగులు చేశాడు. రెండో రోజు ఆటలో స్పిన్నర్ వాండర్సే బౌలింగ్లో ఎల్బీగా స్మిత్ వెనుదిరిగాడు.అరుదైన రికార్డు..కాగా మూడో వికెట్కు ఉస్మాన్ ఖావాజా, స్టీవ్ స్మిత్ మూడో వికెట్కు 266 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని వీరిద్దరూ నెలకొల్పారు. తద్వారా ఓ అరుదైన రికార్డును ఈ వెటరన్ ద్వయం తమ ఖాతాలో వేసుకుంది. శ్రీలంక గడ్డపై టెస్టుల్లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన ఆస్ట్రేలియన్ జోడీగా వీరిద్దరూ రికార్డులకెక్కారు. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ దిగ్గజాలు ఆడమ్ గిల్క్రిస్ట్, డామియన్ మార్టిన్ పేరిట ఉండేది. 2004లో కాండే వేదికగా జరిగిన లంకతో జరిగిన టెస్టులో గిల్లీ, మార్టిన్ 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తాజా మ్యాచ్తో గిల్లీ-డామియన్ ఆల్టైమ్ రికార్డును ఖావాజా-స్మిత్ బ్రేక్ చేశారు.కాగా ఇప్పటికే వరల్డ్ టెస్టు ఛాంపియన్ ఫైనల్ బెర్త్ను ఆస్ట్రేలియా ఖారారు చేసుకున్న సంగతి తెలిసిందే. టీమిండియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా.. వరుసగా రెండో సారి డబ్ల్యూటీసీ ఫైనల్కు ఆర్హత సాధించింది. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో ఆస్ట్రేలియాకు ఇదే ఆఖరి సిరీస్. ఈ సిరీస్కు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. స్టీవ్ స్మిత్ సారథ్యంలో ఆస్ట్రేలియా ఆడుతోంది.చదవండి: RT 2025: హ్యాట్రిక్తో చెలరేగిన శార్ధూల్.. టీమిండియాలోకి రీ ఎంట్రీకి సిద్దం -
'గిల్క్రిస్ట్లా అతడు బ్యాటింగ్ చేస్తున్నాడు.. కానీ ఇప్పుడే వద్దు'
టీమిండియాకు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ పెద్ద తలనొప్పిగా మారాడు. భారత్ అంటే చాలు ఫార్మాట్తో సంబంధం లేకుండా చెలరేగిపోతున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో హెడ్ విధ్వంసకర సెంచరీతో మెరిశాడు.ఈ మ్యాచ్లో 140 పరుగులు చేసిన హెడ్.. ఆసీస్ సిరీస్ను సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో శనివారం నుంచి గబ్బా వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్టులో ఈ డేంజరస్ ఆసీస్ బ్యాటర్ను అడ్డుకునేందుకు భారత్ ప్రత్యేక వ్యూహాలను రచిస్తోంది.అతడిని ఎలాగైనా ఆదిలోనే పెవిలియన్కు పంపాలని రోహిత్ అండ్ కో భావిస్తోంది. ఈ నేపథ్యంలో హెడ్పై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆసీస్ దిగ్గజం ఆడమ్ గిల్క్రిస్ట్తో హెడ్ను రికీ పోల్చాడు. అయితే ఇప్పటి నుంచే అతడిని 'గ్రేట్' అని పిలువద్దని అతడు అభిప్రాయపడ్డాడు."ట్రవిస్ హెడ్ గొప్ప క్రికెటర్లలో ఒకడిగా ఎదుగుతున్నాడు. అయితే, ఏదో ఒక ఇన్నింగ్స్ చూపి అతడిని గ్రేట్ క్రికెటర్ అని చెప్పలేము. కానీ అతడేం చేసినా అత్యద్భుతంగా చేస్తున్నాడు. జట్టు కోసం తాను చేయగలిగినంతా చేస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ ప్రశంసలకు తాను అర్హుడిని కానన్నట్లుగా హుందాగా ఉంటాడు.హెడ్ బ్యాటింగ్ చేసే విధానం గిల్క్రిస్ట్ అప్రోచ్కు దగ్గరగా ఉంటుంది. బ్యాటింగ్ ఆర్డర్లో రెండు స్థానాలు ఎక్కువగా ఉన్నప్పటికీ గిల్లీ, హెడ్ ఒకేలా బ్యాటింగ్ చేస్తున్నారు. గిల్లీ ఆరు లేదా ఏడో స్ధానంలో బ్యాటింగ్ వచ్చి అద్బుత ఇన్నింగ్స్లు ఆడగా.. ఇప్పుడు హెడ్ ఐదో డౌన్ వచ్చి అదే పనిచేస్తున్నాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే పాజిటివ్ యాటిట్యూడ్తో బ్యాటింగ్ చేస్తాడు. అతడిలో ఔటవ్వతానన్న భయం కూడా కన్పించడం లేదు. ప్రతికూల ఫలితంతో అతడికి అస్సలు పనిలేదు. తనకు తెలిసిందల్లా ఒకటే. క్రీజులో ఉన్నంతసేపు పరుగులు రాబట్టడమే అతడి పని అని ఐసీసీ రివ్యూలో అతడు పేర్కొన్నాడు.చదవండి: IND vs AUS: మూడో టెస్టుకు ఆసీస్ తుది జట్టు ప్రకటన.. వికెట్ల వీరుడు వచ్చేశాడు -
వీవీఎస్ లక్ష్మణ్ క్యాచ్ డ్రాప్ చేశా.. నా కెరీర్ అంతటితో ఖతం!
ఆడమ్ గిల్క్రిస్ట్.. ప్రపంచ క్రికెట్ను ఏలిన గొప్ప వికెట్ కీపర్ బ్యాటర్లలో ఒకడు. ఆస్ట్రేలియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తన ఆటతో, వికెట్ కీపింగ్ స్కిల్స్తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆస్ట్రేలియాకు ఓంటి చేత్తో ఎన్నో విజయాలను అందించిన ఘనత అతడిది.ఆసీస్ తరపున మూడు వన్డే వరల్డ్కప్ టైటిల్స్ అతడి ఖాతాలో ఉన్నాయి. 2007 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో శ్రీలంకపై గిల్లీ ఆడిన ఇన్నింగ్స్ ఇప్పటికి సగటు క్రికెట్ అభిమానికి గుర్తుండే ఉంటుంది. అయితే ఈ ఆసీస్ లెజెండ్ ఆ మరుసటి ఏడాదే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి అందరిని షాక్కు గురిచేశాడు. 2008లో భారత్తో జరిగిన అడిలైడ్ టెస్టు మధ్యలో తన రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించాడు. తన కెరీర్లో 100 టెస్టుల మైలు రాయిని అందుకోవడానికి కేవలం 4 మ్యాచ్ల దూరంలో ఉన్న సమయంలో గిల్లీ రిటైర్మెంట్ ప్రకటించడం అప్పటిలో తీవ్ర చర్చనీయాంశమైంది.అయితే తాజాగా గిల్క్రిస్ట్ తన సడన్ రిటైర్మెంట్కు గల కారణాన్ని వెల్లడించాడు. భారత దిగ్గజ బ్యాటర్ వీవీయస్ లక్ష్మణ్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను విడిచిపెట్టిన కారణంగానే తను రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు గిల్లీ తెలిపాడు. వెంటనే తన నిర్ణయాన్ని మరో ఆసీస్ లెజెండ్ మాథ్యూ హేడెన్కి చెప్పినట్లు ఓ ఇంటర్వ్యూలో గిల్క్రిస్ట్ అన్నాడు."నేను చివరగా నా కెరీర్లో భారత్పై ఆడాను. ఆడిలైడ్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో ఓ ఫన్నీ సంఘటన జరిగింది. బ్రెట్ లీ బౌలింగ్లో క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించాను. కానీ బంతిని సరిగ్గా అందుకోలేకపోయాను. ఆ రోజు రాత్రి నా భార్యకు ఫోన్ చేసి మాట్లాడాను. మేము భారత్తో సిరీస్ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్నాం. అందుకు సంబంధించిన విషయాలను ఆమెతో చర్చించాను.విండీస్ పర్యటనలో మొత్తం మూడు మ్యాచ్లతో కలిపి నా 99వ టెస్టు మ్యాచ్ మార్క్ను అందుకోనున్నాను. ఆ తర్వాత మేము ఇండియా టూర్కు వెళ్లనున్నాం. భారత్లో నా 100వ టెస్టు ఆడతాను అని ఆమెతో చెప్పాను. 100 టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా ప్లేయర్ల లిస్టులో చేరుతానని భావించాను. ఆ అరుదైన గౌరవం దక్కుతుందని నేను అనుకున్నాను. కానీ ఆ మరుసటి రోజు నా కథ మొత్తం మారిపోయింది.ఆ తర్వాతి రోజు ఆటలో భారత బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఇచ్చిన సునయాస క్యాచ్ను నేను జారవిడిచాను. లక్ష్మణ్ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న వచ్చిన బంతి నా గ్లవ్స్లో పడి నేలకు తాకింది. దీంతో ఈజీ క్యాచ్ను అందుకోలేకపోయాను. ఎలా మిస్స్ అయ్యిందో అని బిగ్ స్క్రీన్ మీద రిప్లే చూశాను. పదే పదే అదే చూపించారు. ఏకంగా 32 సార్లు దాన్ని ప్లే చేస్తూనే వచ్చారు. ఇక చాలు, విడ్కోలు పలకాల్సిన సమయం వచ్చిందని నేను అప్పుడే నిర్ణయించుకున్నాను. వెంటనే స్లిప్లో ఉన్న మాథ్యూ హేడెన్ వైపు చూస్తూ నా పని అయిపోయింది, నేను రిటైర్మెంట్ అవ్వాల్సిన సమయం అసన్నమైంది చెప్పాను. వెస్టిండీస్ పర్యటను గురించి ఆలోచించకండి, భారత్లో 100వ టెస్టు గురించి కూడా ఆలోచించవద్దు చెప్పా. బంతి, నా గ్లవ్స్ని తాకి పిచ్పైన పడ్డప్పుడే రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను అని హెడన్తో అన్నాను. కానీ హెడన్ మాత్రం నేను అటువంటి సంచలన నిర్ణయం తీసుకోకుండా ఒప్పించే ప్రయత్నం చేశాడని క్లబ్ ప్రైరీ ఫైర్ పోడ్కాస్ట్లో పేర్కొన్నాడు. కాగ గిల్లీ ఆసీస్ తరపున 96 టెస్టుల్లో 47.6 సగటుతో 5570 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు ఉన్నాయి.చదవండి: 'టాటా, బై బై.. నీ పని అయిపోయింది'.. పాక్ హెడ్ కోచ్పై సంచలన వ్యాఖ్యలు -
‘ధోని, రోహిత్లకే చోటు.. కోహ్లిని అమ్మేస్తాను’
ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ20 క్రికెట్ టోర్నీ. ఐపీఎల్లో ఒక్కసారి ప్రతిభ నిరూపించుకుంటే కాసుల వర్షం కురవడం ఖాయం. ఇంతటి ఖ్యాతి ఉన్న పొట్టి లీగ్లో.. కెప్టెన్లుగా ఇప్పటికే తమ జట్లను ఐదుసార్లు చాంపియన్లుగా నిలిపిన ఘనత టీమిండియా దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని(చెన్నై సూపర్ కింగ్స్), రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్)ల సొంతం.ముగ్గురు లెజెండ్స్ ఐపీఎల్లో ఒకే జట్టుకు ఆడితే కానీ.. మరో స్టార్, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి మాత్రం ఐపీఎల్ ట్రోఫీ ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇక ఈ ముగ్గురు మేటి క్రికెటర్లలో ధోని 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్తోనే ఉండగా.. కోహ్లి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ప్రయాణం కొనసాగిస్తున్నాడు. రోహిత్ మాత్రం ఆరంభంలో దక్కన్ చార్జర్స్కు ఆడినా.. తర్వాత ముంబై ఇండియన్స్లో చేరాడు.ఇదిలా ఉంటే... ఈ ముగ్గురు లెజెండ్స్ ఐపీఎల్లో ఒకే జట్టుకు ఆడితే ఎలా ఉంటుంది? ముగ్గురిలో ఒకరిని మాత్రమే తుదిజట్టులోకి తీసుకోవాలనే నిబంధన ఉంటే?.. ఇలాంటి క్రేజీ ప్రశ్నే ఎదురైంది ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్, ఆస్ట్రేలియా లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడం గిల్క్రిస్ట్లకు ఎదురైంది. ఇందుకు మైకేల్ వాన్ ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది.ధోనిని ఆడిస్తాను.. కెప్టెన్గా‘‘నేనైతే ఎంఎస్ ధోనిని ఆడిస్తాను. అతడి కంటే మెరుగైన ఆటగాడు మరొకరు ఉండరు. అంతేకాదు నా జట్టుకు ధోనినే కెప్టెన్. విరాట్కు నా జట్టులో స్థానం ఉండదు. అతడిని వేరే జట్టుకు అమ్మేస్తాను. ఎందుకంటే అతడు ఒక్కసారి ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. రోహిత్ ఓవరాల్గా ఆరుసార్లు గెలిచాడు. ధోనికి ఐదు ట్రోఫీలు ఉన్నాయి. కాబట్టి ధోనిని ఆడించి.. రోహిత్ను అతడికి సబ్స్టిట్యూట్గా పెడతా. విరాట్కు మాత్రం చోటివ్వను’’ అని మైకేల్ వాన్ ఓ పాడ్కాస్ట్లో పేర్కొన్నాడు. చదవండి: టీమిండియాకు అతడే కీలకం.. ఆ ఒక్కడిని కట్టడి చేస్తే: కమిన్స్ View this post on Instagram A post shared by cricket.com (@cricket.com_official) -
గిల్క్రిస్ట్ టాప్-3 వికెట్ కీపర్లు వీరే.. ధోనికి ఛాన్స్
ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నాడు. తన బ్యాటింగ్, కీపింగ్ స్కిల్స్తో ప్రత్యర్ధిలకు చుక్కలు చూపించిన చరిత్ర గిల్ క్రిస్ట్ది. ఈ ఆసీస్ క్రికెట్ దిగ్గజం తనకు ఇష్టమైన ముగ్గురు వికెట్ కీపర్లను తాజాగా ఎంచుకున్నాడు. అందులో భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంస్ ధోనికి చోటు దక్కింది. అయితే ఈ జాబితాలో మొదటి స్థానం తన రోల్ మోడల్ అయిన ఆసీస్ మాజీ వికెట్ కీపర్ రాడ్నీ మార్ష్కు గిల్క్రిస్ట్ ఇచ్చాడు."రోడ్నీ మార్ష్ నా రోల్మోడల్. అతడిని ఆదర్శంగా తీసుకుని వికెట్ కీపర్గా ఎదిగాను. ఆ తర్వాత నాకు ఇష్టమైన వికెట్ కీపర్ ఎంఎస్ ధోని. ఫీల్డ్లో ధోని ఎల్లప్పుడూ చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అతడి కూల్నెస్ అంటే నాకెంతో ఇష్టం. ఇక చివరగా నా మూడో ఫేవరేట్ వికెట్ కీపర్ కుమార్ సంగక్కర. అతడొక క్లాస్. వికెట్ కీపింగ్ స్కిల్స్తో పాటు టాప్ ఆర్డర్లో విజయవంతమైన బ్యాటర్" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిల్క్రిస్ట్ పేర్కొన్నాడు. -
T20 World Cup 2024: గిల్క్రిస్ట్ను అధిగమించిన డికాక్
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా యూఎస్ఏతో నిన్న (జూన్ 19) జరిగిన సూపర్-8 మ్యాచ్లో సౌతాఫ్రికా వికెట్కీపర్ కమ్ బ్యాటర్ క్వింటన్ డికాక్ మెరుపు అర్దశతకంతో (40 బంతుల్లో 74; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ హాఫ్ సెంచరీతో డికాక్ ఐసీసీ టోర్నీల్లో అత్యధిక పరుగులు సాధించిన వికెట్కీపర్ కమ్ బ్యాటర్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో అతను దిగ్గజ వికెట్కీపర్, బ్యాటర్ ఆడమ్ గిల్క్రిస్ట్ను అధిగమించాడు. ఐసీసీ టోర్నీల్లో అత్యధిక పరుగులు సాధించిన వికెట్కీపర్ కమ్ బ్యాటర్ల జాబితాలో శ్రీలంక ఆల్టైమ్ గ్రేట్ కుమార సంగక్కర అగ్రస్థానంలో ఉన్నాడు.ఐసీసీ టోర్నీల్లో అత్యధిక పరుగులు సాధించిన వికెట్కీపర్ కమ్ బ్యాటర్లు వీరే..కుమార సంగక్కర (84 ఇన్నింగ్స్ల్లో 2855 పరుగులు)క్వింటన్ డికాక్ (53 ఇన్నింగ్స్ల్లో 1685 పరుగులు)ఆడమ్ గిల్క్రిస్ట్ (50 ఇన్నింగ్స్ల్లో 1636 పరుగులు)జోస్ బట్లర్ (56 ఇన్నింగ్స్ల్లో 1550 పరుగులు)ముష్ఫికర్ రహీం (61 ఇన్నింగ్స్ల్లో 1500 పరుగులు)కాగా, యూఎస్ఏతో నిన్న జరిగిన తొలి సూపర్-8 మ్యాచ్లో సౌతాఫ్రికా 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. డికాక్ (74), మార్క్రమ్ (46), క్లాసెన్ (36 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (20 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.అనంతరం 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూఎస్ఏ.. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ ఆండ్రియస్ గౌస్ (80 నాటౌట్), హర్మీత్ సింగ్ (38) యూఎస్ఏను గెలిపించేందుకు విపలయత్నం చేశారు. సౌతాప్రికా బౌలర్లలో కగిసో రబాడ (4-0-18-3) అద్భుతంగా బౌలింగ్ చేసి యూఎస్ఏను కట్టడి చేశాడు. -
నువ్వేమీ హెడెన్ కాదు.. జస్ట్ బంగ్లాదేశ్ ప్లేయర్వి: సెహ్వాగ్
‘‘అనుభవమే ప్రాతిపదికగా అతడిని జట్టులోకి తీసుకుని ఉంటే మాత్రం.. అతడు అందుకు ఏమాత్రం న్యాయం చేయడం లేదు. కనీసం కొంతసేపైనా క్రీజులో నిలబడాలి కదా.షార్ట్ బాల్ను కూడా పుల్ షాట్ ఆడటానికి నువ్వేమీ మాథ్యూ హెడెన్వో లేదంటే ఆడం గిల్క్రిస్ట్వో కాదు. కేవలం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఆటగాడివి అంతే. నీ స్థాయి, ప్రమాణాలకు తగ్గట్లు ఆడాలి.హుక్ లేదంటే పుల్ షాట్ ఆడే నైపుణ్యం నీకు లేనట్లయితే.. నీకు తెలిసిన షాట్లు మాత్రమే ఆడవచ్చు కదా!’’ అంటూ బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు.టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్లో షకీబ్ పూర్తిగా విఫలం కావడంతో ఈ మేరకు ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా గ్రూప్-డిలో భాగమైన బంగ్లాదేశ్ సోమవారం నాటి మ్యాచ్లో ప్రొటిస్ జట్టు చేతిలో ఓటమిపాలైంది.ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో గెలుపునకు దూరమైంది. న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసి 113 పరుగులు చేసింది.స్వల్ప లక్ష్య ఛేదనలో బంగ్లా ఆది నుంచే తడబడింది. టాపార్డర్ చేతులెత్తేయగా.. నాలుగో స్థానంలో వచ్చిన షకీబ్ అల్ హసన్ కేవలం మూడు పరుగులే చేశాడు. అనవసరపు షాట్కు యత్నించి అన్రిచ్ నోర్జే బౌలింగ్లో ఐడెన్ మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.జట్టులో సీనియర్ ఆటగాడైన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ ఇలా పూర్తిగా నిరాశపరచడంతో సెహ్వాగ్ పైవిధంగా స్పందించాడు. ఆస్ట్రేలియా దిగ్గజాలు మాథ్యూ హెడెన్, ఆడం గిల్క్రిస్ట్ల పేర్లు ప్రస్తావిస్తూ విమర్శించాడు. తెలిసిన షాట్లు మాత్రమే ఆడుతూ తెలివిగా వ్యవహరించే బాగుండి ఉండేదని క్రిక్బజ్ షోలో షకీబ్ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.కాగా ఈ మ్యాచ్లో షకీబ్ అల్ హసన్ ఒక ఓవర్ బౌలింగ్ చేసి ఆరు పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టీ20 ప్రపంచకప్ మొదటి ఎడిషన్(2007) నుంచి ఇప్పటిదాకా ఈ మెగా టోర్నీలో ఆడుతున్న ప్లేయర్ షకీబ్ అల్ హసన్ మాత్రమే! ఇదిలా ఉంటే.. వరల్డ్కప్-2024 గ్రూప్-డిలో ఉన్న బంగ్లాదేశ్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ఆడి.. ఒకటి మాత్రమే గెలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు.. బంగ్లాపై విజయంతో మూడో గెలుపు నమోదు చేసిన సౌతాఫ్రికా సూపర్-8లో అడుగుపెట్టింది.చదవండి: SA vs Ban: నరాలు తెగే ఉత్కంఠ: ఆ క్యాచ్ గనుక వదిలేసి ఉంటే.. -
CSK Vs MI: 'హార్దిక్ ఒంటరిగా ఫీలవుతున్నాడు.. ముంబై జట్టులో ఏదో జరుగుతోంది'
ఐపీఎల్-2024లో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది. ఈ ఏడాది సీజన్తో వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచి తిరిగి గాడిలో పడినట్లు కన్పించిన ముంబై.. మళ్లీ పాత ఆట తీరునే కనబరిచించింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 20 పరుగుల తేడాతో ముంబై ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ అనంతం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్లో హార్దిక్ మాట్లాడుతూ.. సీఎస్కేకు వికెట్ల వెనక ధోని లాంటి మాస్టర్ మైండ్ ఉన్న ఆటగాడు ఉన్నాడు. ఏం చేస్తే వర్కౌట్ అవుతుందో ధోనికి బాగా తెలుసు. అందుకు తగ్గట్టు మిగతా ఆటగాళ్లకు సూచనలు ఇస్తుంటాడని హార్దిక్ చెప్పుకోచ్చాడు. దీంతో ముంబై జట్టులో రోహిత్, బుమ్రా వంటి సీనియర్ల ఆటగాళ్ల నుంచి మద్దతు హార్దిక్కు లేదని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. కాగా రోహిత్ స్ధానంలో హార్దిక్ను కెప్టెన్గా ఎంపికచేసినప్పటి నుంచి ముంబై డ్రెస్సింగ్ రూమ్ రెండు గ్రూపులుగా విడిపోయిందని తెగ వార్తలు వినిపిస్తున్నాయి. కొంతమంది రోహిత్కు సపోర్ట్గా ఉంటే మరి కొంతమంది హార్దిక్ వైపు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు హార్ధిక్ చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఇక ఇదే విషయంపై ఆస్ట్రేలియా లెజెండ్ ఆడమ్ గిల్క్రిస్ట్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కి క్రెడిట్ ఇవ్వడానికి బదులుగా హార్దిక్.. ధోని పేరును ప్రస్తావించడం తనను ఆశ్చర్యపరిచందని గిల్క్రిస్ట్ చెప్పుకొచ్చాడు. "పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో ధోని గురించి హార్దిక్ చేసిన కామెంట్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. హార్దిక్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే జట్టులో తనకు సహాచరుల నుంచి సపోర్ట్ లేనిట్లు అన్పిస్తోంది. అతడు తన నిర్ణయాలతో ముందుకు వెళ్లుతున్నట్లు నేను భావిస్తున్నాను. ఈ మ్యాచ్లో అద్బుతంగా ఆడిన సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గురించి హార్దిక్ కనీసం మాట్లాడలేదు. అతడు కెప్టెన్సీకి కూడా క్రెడిట్ ఇవ్వలేదు. అతడి వెనుక ధోని ఉన్నాడని అందుకే సీఎస్కే గెలుస్తుందని పాండ్యా చెబుతున్నాడు. దీని బట్టి హార్దిక్ ఆలోచనా విధానం ఎలా ఉందో నాకు ఆర్ధమవుతోంది. హార్దిక్ ఒంటరిగా ఫీలవుతున్నాడు. ముంబై ఇండియన్స్ క్యాంపులో ఆనిశ్చితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇదే కొనసాగితే ఈ టోర్నీలో ముందుకు సాగడం కష్టమని" క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిల్లీ పేర్కొన్నాడు. -
అంపైర్తో గొడవపడ్డ పంత్.. తప్పెవరిది?.. మండిపడ్డ దిగ్గజం
ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అంపైర్తో దురుసుగా ప్రవర్తించాడు. రివ్యూ విషయంలో ఫీల్డ్ అంపైర్తో చాలాసేపు వాగ్వాదానికి దిగాడు. ఆఖరికి తప్పు తనదే అని తేలడంతో మిన్నకుండిపోయాడు. లక్నో ఇన్నింగ్స్లో నాలుగో ఓవర్లో ఈ ఘటన జరగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడం గిల్క్రిస్ట్ రిషభ్ పంత్ తీరుపై మండిపడ్డాడు. అంపైర్తో దురుసుగా ప్రవర్తించిన పంత్ లాంటి ఆటగాళ్లను కచ్చితంగా పనిష్ చేయాలని విజ్ఞప్తి చేశాడు. కాగా లక్నోలో ఢిల్లీతో జరిగిన శుక్రవారం నాటి మ్యాచ్లో సూపర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రీప్లేలో పంత్ రివ్యూ కోరినట్లుగానే ఈ క్రమంలో మూడో ఓవర్లో బంతిని కెప్టెన్ పంత్ ఇషాంత్ శర్మకు ఇచ్చాడు. నాలుగో బాల్ను అంపైర్ వైడ్గా ప్రకటించగా.. పంత్ రివ్యూకు అప్పీలు చేసినట్లుగా కనిపించింది. దీంతో ఫీల్డ్ అంపైర్ అడిగి అతడితో కన్ఫామ్ చేసుకునీ మరీ డీఆర్ఎస్ కాల్ ఇచ్చాడు. రివ్యూలో అది వైడ్ బాల్గానే తేలడంతో పంత్ అసహనానికి గురయ్యాడు. ఈ క్రమంలో అసలు తాను డీఆర్ఎస్ కోరనేలేదని అంపైర్తో వాదించాడు. అయితే, రీప్లేలో పంత్ రివ్యూ సిగ్నల్ ఇచ్చినట్లుగా తేలింది. అయితే, అతడు ఫీల్డర్లతో సంప్రదించేందుకు అలా చేశాడా? లేదంటే నిజంగానే అంపైర్కే సిగ్నల్ ఇచ్చాడా అన్న విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఈ గొడవ జరిగింది. పంత్ తీరుపై ఆసీస్ దిగ్గజం ఆగ్రహం ఈ నేపథ్యంలో ఆడం గిల్ క్రిస్ట్ మాట్లాడుతూ.. ‘‘అంపైర్లకు మ్యాచ్ను నియంత్రించేందుకు మరింత వెసలుబాటు కల్పించాలి. ఏ ఫార్మాట్లోనైనా ఇలాంటి విషయాల్లో తమ పని తాము చేసుకునే వీలు ఉండాలి. రిషభ్ పంత్ రివ్యూకు వెళ్లాడా లేదా అన్నది ఇక్కడ వాగ్వాదానికి దారితీసింది. సమన్వయలోపం జరిగిందనే అనుకుందాం. కానీ అందుకోసం సుమారు 3- 4 నిమిషాలు వృథా అయ్యాయి. రిషభ్ పంత్ ఒక్కడే కాదు.. ఇంతకు ముందు ఇలాగే చాలా మంది అంపైర్లతో గొడవకు దిగడం చూశాను. కావాలని వాదనను పొడిగిస్తే పంత్ అయినా.. ఇంకెవరైనా కచ్చితంగా వారి తప్పునకు తగిన శిక్ష పడాల్సిందే’’ అని పేర్కొన్నాడు. కాగా లక్నోతో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది ఈ సీజన్లో రెండో గెలుపు అందుకుంది. Rishabh Pant and on-field umpire Rohan Pandit had a word on review.#LSGvsDC #IPL2024 #RishabhPant pic.twitter.com/NjIVgsAR5p — 𝗖𝗿𝗶𝗰 𝗶𝗻𝘀𝗶𝗱𝗲𝗿 (@cric_insiderr) April 12, 2024 చదవండి: Rishabh Pant: పంత్ అరుదైన ఘనతలు.. ఐపీఎల్లో తొలి కెప్టెన్గా #KL Rahul: అతడొక సర్ప్రైజ్.. వాళ్లిద్దరి వల్లే మా ఓటమి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Victory in Lucknow for the @DelhiCapitals 🙌 A successful chase power them to their second win of the season as they win by 6⃣ wickets! Scorecard ▶️ https://t.co/0W0hHHG2sq#TATAIPL | #LSGvDC pic.twitter.com/6R7an9Cy8g — IndianPremierLeague (@IPL) April 12, 2024 -
అందుకే ధోని అలా చేస్తున్నాడు: ఆసీస్ దిగ్గజ క్రికెటర్
టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి మైదానంలో మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్-2024లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగేందుకు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు ఈ మిస్టర్ కూల్. ఇందులో భాగంగా 42 ఏళ్ల మహి.. నెట్ సెషన్స్లో పాల్గొంటూ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ సమయంలో ధోని ఉపయోగించిన బ్యాట్పై అభిమానుల దృష్టి పడింది. ముఖ్యంగా.. ఆ బ్యాట్ మీద ప్రైమ్ స్పోర్ట్స్ పేరిట ఉన్న స్టిక్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ధోని స్వస్థలం రాంచికి చెందిన పరమ్జిత్ సింగ్ అనే వ్యక్తికి చెందిన షాపు పేరు అది. క్రికెటర్గా ఎదుగుతున్న సమయంలో తనకు సాయం అందించిన పరమ్జిత్ షాపును ప్రమోట్ చేస్తూ ధోని తీసుకున్న ఈ నిర్ణయం అభిమానుల మనసు దోచుకుంది. ఈ విషయంపై స్పందించిన ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ ఆడం గిల్క్రిస్ట్ ధోనిపై ప్రశంసలు కురిపించాడు. ‘‘ఎంఎస్ ధోని నెట్స్లో బ్యాటింగ్ చేయడం చూశాను. అతడి బ్యాట్పై కొత్త స్టిక్కర్ కనిపించింది. MS Dhoni with the 'Prime Sports' sticker bat. It is owned by his friend. MS thanking him for all his help during the early stage of his career. pic.twitter.com/sYtcGE6Qal — Mufaddal Vohra (@mufaddal_vohra) February 7, 2024 తన స్కూల్మేట్కు చెందిన స్థానిక స్పోర్ట్స్ స్టోర్ పేరు అది. తన స్నేహితుడి షాపులో అమ్మకాలు పెంచడం కోసం ధోని ఇలా తన బ్యాట్పై ఆ స్టిక్కర్ వేయించుకున్నాడు’’ అని గిల్క్రిస్ట్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా- వెస్టిండీస్ మధ్య రెండో టీ20 సందర్భంగా కామెంట్రీ చేస్తున్న సందర్భంలో గిల్క్రిస్ట్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ను ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన ఘనత ధోని సొంతం. అయితే, వయసు పైబడుతున్న దృష్ట్యా తాజా సీజన్కు అతడు అందుబాటులో ఉంటాడా లేదా అన్న సందిగ్దాల నడుమ.. తలా బ్యాట్ పట్టి ప్రాక్టీస్ చేయడం అభిమనుల్లో జోష్ నింపింది. ధోని ఈసారి కూడా కెప్టెన్గా బరిలోకి దిగడం ఖాయమంటూ నెట్టింట సందడి చేస్తున్నారు ఫ్యాన్స్. Michael Hussey, Adam Gilchrist and Mark Howard talking about MS Dhoni - Unreal Influence 🐐🔥pic.twitter.com/S8q3xSmfQ5 — MN 👾 (@CaptainnRogerrs) February 11, 2024 -
రిషబ్ పంత్ ఒక అద్భుతం.. ఎంతో మంది వికెట్ కీపర్లకు ఆదర్శం: గిల్క్రిస్ట్
గతేడాది డిసెంబర్లో కారు ప్రమాదంలో గాయపడిన టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. పంత్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావసం పొందుతున్నాడు. రిషబ్ తన బ్యాటింగ్ ప్రాక్టీస్ను కూడా మొదలు పెట్టేశాడు. అతడిని త్వరలోనే తిరిగి మైదానంలో చూసే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఇంగ్లండ్తో జరగనున్న టెస్టు సిరీస్తో పంత్ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఏదమైనప్పటికీ పంత్ వంటి విధ్వంసకర బ్యాటర్ వరల్డ్కప్కు దూరం కావడం భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ప్రపంచకప్లో వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఇక తన దూకుడుతో వరల్డ్ క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పంత్పై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్క్రిస్ట్ ప్రశంసల వర్షం కురిపించాడు. రిసబ్ తన విధ్వంసకర ఆట తీరుతో ఎంతో మంది యువ వికెట్కీపర్లకు ఆదర్శంగా నిలిచాడని గిల్క్రిస్ట్ కొనియాడాడు. "ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వికెట్ కీపర్ బ్యాటర్లను రిషబ్ పంత్ తను ఆడే విధంగా ప్రేరేపించాడు. యువ వికెట్ కీపర్లు పంత్ను ఫాలో అవుతున్నారు. ఇది నిజంగా చాలా గ్రేట్. ఇక భారత్కు వికెట్ కీపర్లు చాలా మంది అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం భారత్కు కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ రూపంలో రెండు ఎంపికలు ఉన్నాయి. కేఎల్ గాయంతో జట్టుకు దూరంగా ఉన్నప్పుడు ఇషాన్ కిషన్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అతడు తన బ్యాటింగ్ పవర్ను చూపించాడు. ఇది నిజంగా భారత క్రికెట్కు శుభసూచికం అంటూ" గిల్క్రిస్ట్ ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. చదవండి: #Mohammed Shami: వరల్డ్కప్కు ముందు మహ్మద్ షమీకి బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు -
'ధోని, రోహిత్, కోహ్లి కాదు.. అతడే ఐపీఎల్ సూపర్ కెప్టెన్'
ఐపీఎల్-2023 సీజన్ మరో నాలుగు రోజుల్లో షూరూ కానుంది. మార్చి 31 నుంచి ఈ ధానాధాన్ క్రికెట్ లీగ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఇక క్యాష్ రిచ్ లీగ్ ఎంతో మంది క్రికెటర్లు కెప్టెన్లగా తమ సత్తా చాటుకున్నారు. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎంస్ ధోని, రోహిత్ శర్మ, కోహ్లి, పాంటింగ్, వార్నర్ వంటి వారు సారథిలగా తమ జట్లకు ఎన్నోచిరస్మరణీయ విజయాలను అందించారు. ముఖ్యంగా రోహిత్ శర్మ ముంబై జట్టుకు ఐదు సార్లు టైటిల్ను అందించగా.. ధోని సారథ్యంలో సీఎస్కే నాలుగు సార్లు విజేతగా నిలిచింది. ఇక కోహ్లి సారథ్యంలో ఆర్సీబీ టైటిల్ సాధించకపోయనప్పటికీ.. ఒక్క సారి ఫైనల్, రెండు సార్లు ఫైనల్కు చేరింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్ ఫేవరేట్ కెప్టెన్ ఎవరన్న ప్రశ్న భారత మాజీ పేసర్ ఆర్పీసింగ్కు ఓ ఇంటర్వ్యూలో ఎదురైంది. అతడు చాలా మందిని ఆశ్చర్యపరిచే విధంగా తన ఫేవరేట్ కెప్టెన్గా సన్రైజర్స్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ను ఎంచుకున్నాడు. జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్పీసింగ్ మాట్లాడుతూ.. "ఐపీఎల్లో నాకు ఇష్టమైన కెప్టెన్ ఆడమ్ గిల్క్రిస్ట్. అతడు ఆస్ట్రేలియాతో పాటు డెక్కన్ ఛార్జర్స్కు మూడేళ్లపాటు నాయకుడిగా ఉన్నాడు. అతడు సారథిగా మేము తొలి సీజన్లోనే ఛాంపియన్స్గా నిలిచాం. అందుకే గిల్క్రిస్ట్ నా ఫేవరేట్ కెప్టెన్. అనంతరం 2010 సీజన్లో కూడా మేము అద్భుతంగా రాణించాము. దురదృష్టవశాత్తూ ఫైనల్కు చేరడంలో విఫలమయ్యాం" అని అతడు పేర్కొన్నాడు. కాగా 2009లో గిల్క్రిస్ట్ సారథ్యంలో డెక్కన్ ఛార్జర్స్(సన్రైర్స్ హైదరాబాద్) తొలి ఐపీఎల్ టైటిల్ను సొంతం చేసుకుంది. అనంతరం 2010 సీజన్లో కూడా డెక్కన్ ఛార్జర్స్ అదరగొట్టింది. ఫైనల్కు చేరడంలో విఫలమైనప్పటికీ.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఐపీఎల్-2023లో సన్రైజర్స్ సరికొత్తగా బరిలోకి దిగబోతుంది. ఈ ఏడాది సీజన్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ మార్క్రమ్ వ్యవహరించనున్నాడు. చదవండి: 'రోహిత్, కోహ్లి కాదు.. అతడే టీమిండియా అత్యుత్తమ ఆటగాడు' -
BGT 2023: ‘అతడికి ఘోర అవమానం.. అసలు ఎందుకు సెలక్ట్ చేశారు?’
India vs Australia, 2nd Test: భారత పర్యటనలో అష్టన్ అగర్ పట్ల మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్న తీరు అవమానకరంగా ఉందని ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్క్రిస్ట్ అన్నాడు. అందుకే అతడు స్వదేశానికి తిరిగి వచ్చే యోచనలో ఉన్నాడని అభిప్రాయపడ్డాడు. అగర్ను టీమిండియాతో మ్యాచ్లలో ఎందుకు ఆడించడం లేదో అర్థం కావడం లేదని.. అలాంటపుడు ఎంపిక చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు. కాగా ఇప్పటి వరకు ఐదు టెస్టు మ్యాచ్లు ఆడిన ఈ బౌలింగ్ ఆల్రౌండర్ 9 వికెట్లు తీశాడు. దాదాపు ఐదేళ్ల తర్వాత స్వదేశంలో సౌతాఫ్రికాతో మూడో మ్యాచ్ సందర్భంగా టెస్టు ఆడాడు లెఫ్టార్మ్ స్పిన్నర్ అష్టన్ అగర్. రెండుసార్లు మొండిచేయి ఈ క్రమంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్పిన్కు అనూలించే ఉపఖండ పిచ్లపై కీలక సిరీస్ నేపథ్యంలో నలుగురు స్పిన్నర్లకు స్థానం కల్పించింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఆష్టన్ అగర్(లెఫ్టార్మ్ స్పిన్నర్), నాథన్ లియాన్(రైట్ ఆర్మ్ ఆఫ్బ్రేక్ స్పిన్నర్), మిచెల్ స్వెప్సన్(రైట్ ఆర్మ్ లెగ్బ్రేక్ స్పిన్నర్)లతో పాటు 22 ఏళ్ల ఆఫ్బ్రేక్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ తొలిసారిగా ఎంపిక చేసింది. ఈ క్రమంలో నాగ్పూర్లోని తొలి టెస్టులో అరంగేట్రం చేసిన మర్ఫీ ఏడు వికెట్లతో సత్తా చాటాడు. రెండో మ్యాచ్లో 3 వికెట్లు పడగొట్టాడు. అష్టన్ అగర్ అరంగేట్రం చేసిన యువ ప్లేయర్లు ఇలా ఇక మిచెల్ స్వెప్సన్ తన బిడ్డను చూసుకునేందుకు స్వదేశానికి పయనం కాగా.. మాథ్యూ కుహ్నెమన్ను భారత్కు పంపించింది యాజమాన్యం. ఈ క్రమంలో స్వెప్సన్ స్థానంలో వచ్చిన కుహ్నెమన్ ఢిల్లీ టెస్టుతో అరంగేట్రం చేశాడు. అంతర్జాతీయ కెరీర్లో తొలి టెస్టులో 2 వికెట్లతో రాణించాడు. ఇలా వీరిద్దరు ప్రధాన స్పిన్నర్ నాథన్ లియోన్(మొత్తం 8 వికెట్లు )తో పాటు తమ వంతు పాత్ర పోషించారు. అయితే, అష్టన్ అగర్కు మాత్రం ఈ రెండు టెస్టుల్లోనూ ఆడే అవకాశం రాలేదు. ఈ క్రమంలో అతడు ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చేయాలని భావిస్తున్నట్లు కథనాలు వచ్చాయి. ఘోర అవమానం ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడం గిల్క్రిస్ట్.. అష్టన్ అగర్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘జట్టుకు ఎంపికకావడం, విదేశీ పర్యటనల్లో జట్టుతో పాటే ఉండటం.. అయినా ఒక్కసారి కూడా ఆడే అవకాశం రాకపోవడం.. నిజంగా పెద్ద అవమానమే! అందుకే అతడు వచ్చేయాలని నిర్ణయించుకున్నట్లున్నాడు’’ అని ఆస్ట్రేలియా రేడియో చానెల్లో గిల్క్రిస్ట్ చెప్పుకొచ్చాడు. అగర్ను మేనేజ్మెంట్ దారుణంగా అవమానిస్తోందని చెప్పుకొచ్చాడు. కాగా ఆస్ట్రేలియా ఇప్పటికే టీమిండియాతో తొలి రెండు టెస్టుల్లో ఓడి.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ ఛాన్స్ను మరింత సంక్లిష్టం చేసుకునే దిశగా పయనిస్తోంది. ఇండోర్ వేదికగా ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మార్చి 1 నుంచి ఆరంభం కానుంది. చదవండి: Ind Vs Aus: చెత్త బ్యాటింగ్.. వాళ్లు టీమిండియాను ఓడించలేరు: పాక్ మాజీ క్రికెటర్ BGT 2023: మూడో టెస్ట్కు ముందు ఆసీస్కు భారీ షాక్.. సిరీస్ నుంచి వైదొలిగిన స్టార్ బౌలర్ -
వరల్డ్కప్లో విధ్వంసం సృష్టించే బ్యాటర్లు వీళ్లే.. జాబితా విడుదల చేసిన ఐసీసీ
టీ20 వరల్డ్కప్లో విధ్వంసం సృష్టించబోయే బ్యాటర్ల జాబితాను ఐసీసీ ఇవాళ విడుదల చేసింది. బ్యాటర్ల ప్రస్తుత ఫామ్,స్ట్రయిక్ రేట్ ఆధారంగా ఈ ఎంపిక జరిగినట్లు ఐసీసీ పేర్కొంది. ప్రమాదకర బ్యాటర్లుగా పరిగణించబడే బ్యాటర్లు ఎవరంటే.. సూర్యకుమార్ యాదవ్ (ఇండియా) స్ట్రయిక్ రేట్: 176.81 జిమ్మీ నీషమ్ (న్యూజిలాండ్) స్ట్రయిక్ రేట్: 163.65 ఫిన్ అలెన్ (న్యూజిలాండ్) స్ట్రయిక్ రేట్: 161.72 టిమ్ డేవిడ్ (ఆస్ట్రేలియా) స్ట్రయిక్ రేట్: 160.08 గ్లెన్ మ్యాక్స్వెల్ (ఆస్ట్రేలియా) స్ట్రయిక్ రేట్: 150.40 ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్) స్ట్రయిక్ రేట్: 155.51 రిలీ రొస్సో (దక్షిణాఫ్రికా) స్ట్రయిక్ రేట్: 152.87 ఎయిడెన్ మార్క్రమ్ (దక్షిణాఫ్రికా) స్ట్రయిక్ రేట్: 151.16 ఆసీస్ దిగ్గజం ఆడమ్ గిల్క్రిస్ట్ ఎంపిక చేసిన టాప్-6 టీ20 బ్యాటర్లు వీరే.. హార్ధిక్ పాండ్యా దినేశ్ కార్తీక్ హెన్రిచ్ క్లాసెన్ డేవిడ్ మిల్లర్ మొయిన్ అలీ జోస్ బట్లర్ -
రోహిత్, కోహ్లి, సూర్య కాదు.. వరల్డ్ టాప్-5 టీ20 ఆటగాళ్లు వీరే!
Adam Gillchrist Picks One Indian In World T20I Top 5 List: ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్కు మరో రెండు వారాల్లో తెరలేవనుంది. ఈ ఐసీసీ మెగా ఈవెంట్ కోసం అన్ని జట్లు సిద్దమవుతున్నాయి. ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా అన్ని ప్రాధాన జట్లు ద్వైపాక్షిక సిరీస్లలో బీజీబీజీగా గడుపుతున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. ప్రపంచంలోనే టాప్ 5 టీ20 ఆటగాళ్లను ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్క్రిస్ట్ ఎంపిక చేశాడు. ఈ జాబితాలో భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు గిల్క్రిస్ట్ చోటిచ్చాడు. గిల్క్రిస్ట్ ఎంపిక చేసిన ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్కు ఆగ్ర స్థానంలో చోటు దక్కింది. అదే విధంగా రెండో స్థానంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం.. వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో హార్దిక్ పాండ్యా, ఆఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ను గిల్క్రిస్ట్ ఎంపిక చేశాడు. ఇక అఖరిగా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ను ఈ మాజీ ఆసీస్ ఓపెనర్ అవకాశమిచ్చాడు. చదవండి: IND vs SA: టీమిండియాలో చోటు.. ఎవరీ ముఖేష్ కుమార్? -
T20 WC: పంత్కు కచ్చితంగా తుది జట్టులో చోటు ఇవ్వాల్సిందే: ఆసీస్ దిగ్గజం
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్-2022 భారత తుది జట్టులో టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్కు కచ్చితంగా అవకాశం ఇవ్వాలని ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్క్రిస్ట్ అన్నాడు. పంత్తో పాటు దినేశ్ కార్తిక్ కూడా చోటు ఇవ్వాలని సూచించాడు. ఈ ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లు జట్టులో ఉంటే ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఇటీవలి కాలంలో టీ20 ఫార్మాట్లో రిషభ్ పంత్ గణాంకాల దృష్ట్యా అతడికి ప్రపంచకప్ తుదిజట్టులో చోటు ఇవ్వకూడదంటూ విమర్శలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వసీం జాఫర్ వంటి టీమిండియా మాజీలు సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. పంత్ను కాదని దినేశ్ కార్తిక్కు అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఇక ఐసీసీ మెగా టోర్నీ సన్నాహకాల్లో భాగంగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో మొదటి టీ20లో పంత్కు చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడం గిల్క్రిస్ట్.. పంత్కు ప్రపంచకప్ తుది జట్టులో స్థానం ఇవ్వాల్సిన ఆవశ్యకత గురించి చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా పిచ్లపై అతడు మెరుగ్గా రాణించగలడని పేర్కొన్నాడు. గిల్క్రిస్ట్ ఈ మేరకు ఐసీసీతో గిల్క్రిస్ట్ మాట్లాడుతూ.. ‘బౌలర్లపై విరుచుకుపడుతూ అద్భుత షాట్లు ఆడ గల సత్తా పంత్కు ఉంది. తను కచ్చితంగా తుది జట్టులో ఉండాల్సిందే’’ అని పేర్కొన్నాడు. ఇక అదే విధంగా దినేశ్ కార్తిక్ ఆట తీరు గురించి ప్రస్తావిస్తూ.. ‘‘పంత్తో పాటు డీకే కూడా జట్టులో ఉండాలి. అతడొక విలక్షణమైన బ్యాటర్. టాపార్డర్లో.. మిడిలార్డర్లోనూ ఆడగలడు. ఫినిషర్గా అద్భుత పాత్ర పోషించగలడు. అందుకే అతడికి కూడా జట్టులో చోటు దక్కాల్సిందే’’ అని ఆడం గిల్క్రిస్ట్ చెప్పుకొచ్చాడు. కాగా అక్టోబరు 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్కప్ టోర్నీ ఆరంభం కానుంది. చదవండి: Dewald Bravis: 'బేబీ ఏబీ' విధ్వంసం.. మరొక్క బంతి మిగిలి ఉంటేనా! -
ఇండియన్ ప్లేయర్లను ఫారిన్ లీగ్ల్లో ఆడనివ్వండి..!
భారత క్రికెటర్లు విదేశీ లీగ్ల్లో ఆడకపోవడం అనే అంశంపై లెజెండరీ వికెట్కీపర్, ఆసీస్ మాజీ ఆటగాడు ఆడమ్ గిల్క్రిస్ట్ స్పందించాడు. ఈ విషయంలో బీసీసీఐ కాస్త పట్టువీడాలని సూచించాడు. ప్రపంచవ్యాప్తంగా భారత ఆటగాళ్లకు ఉన్న క్రేజ్ దృష్ట్యా వారిని విదేశీ టీ20ల లీగ్ల్లో ఆడనివ్వాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. భారత క్రికెటర్లు బిగ్బాష్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్ వంటి ఫారిన్ లీగ్స్లో పాల్గొనడం వల్ల ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ పెరగడంతో పాటు బీసీసీఐకి విశ్వవ్యాప్త గుర్తింపు వస్తుందని అన్నాడు. భారత క్రికెటర్లు విదేశాల్లో (టీ20 లీగ్ల్లో) ఆడేందుకు బీసీసీఐ అనుమతిస్తే, అది క్రికెట్ వ్యాప్తికి తోడ్పడుతుందని అభిప్రాయపడ్డాడు. విదేశీ లీగ్ల్లో భారత క్రికెటర్లు ఆడితే అద్భుతంగా ఉంటుందని, ఐపీఎల్ ఆరు సీజన్లు ఆడిన అనుభవంతో ఈ విషయం చెబుతున్నానని తెలిపాడు. ఐపీఎల్ ప్రపంచంలోనే టాప్ టీ20 లీగ్ అని, దాన్ని నడిపిస్తున్న బీసీసీఐ ప్రపంచ క్రికెట్కు పెద్దన్నయ్య లాంటిదని ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ క్రికెట్పై ఐపీఎల్ ఫ్రాంచైజీల ఆధిపత్యం ఎక్కువైందని సంచలన వ్యాఖ్యలు చేసిన మరునాడే గిల్లీ బీసీసీఐకి ఈ రకమైన సూచన చేయడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చదవండి: బిగ్బాష్ లీగ్ లో ఆడనున్న భారత ఆల్ రౌండర్..! -
Ind Vs Sl: పంత్ ఖాతాలో అరుదైన రికార్డు.. ధోని, గిల్క్రిస్ట్లను ‘దాటేశాడు’!
Rishabh Pant Stats: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా రెండో రోజు ఆటలో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆడేది టెస్టు మ్యాచ్ అని నాకు తెలుసు కానీ నా బ్యాట్కు తెలియదన్నట్లుగా షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. బోర్ అనే మ్యాచ్కు బోలెడంత జోష్ తన మెరుపు ఇన్నింగ్స్తో అందివ్వగల సమర్థుడు పంత్. భారత బ్యాటర్ హనుమ విహారి అవుటైన 34 ఓవర్లో క్రీజులోకి వచ్చిన పంత్ ఐదో బంతిని డీప్మిడ్ వికెట్ మీదుగా సిక్సర్గా తరలించాడు. మరుసటి ఓవర్ వేసిన ధనంజయ డిసిల్వాకు వరుస 4, 6లతో తన ధాటిని చూపించాడు. తర్వాత ఓవర్లోనే విరాట్ కోహ్లి అవుటైనా పంత్ జోరు మాత్రం తగ్గలేదు. లంక స్పిన్ బౌలింగ్ కొనసాగించినంత సేపు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో మెరిపించాడు. పది ఓవర్లయినా క్రీజులో నిలువని రిషభ్ కేవలం 28 బంతుల్లోనే (7 ఫోర్లు, 2 సిక్స్లు) బౌండరీ కొట్టి మరీ ఫిఫ్టీ పూర్తి చేయడం విశేషం. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ మాత్రమే కాదు. ఇది కూడా! ఈ క్రమంలో పంత్ పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యంత వేగంగా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. కేవలం 28 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ఈ ఫీట్ నమోదు చేశాడు. తద్వారా టీమిండియా లెజెండ్ కపిల్ దేవ్ (1982లో పాక్పై 30 బంతుల్లో) రికార్డును బద్దలుకొట్టాడు. సిక్సర్ల వీరుడు! అంతేగాకుండా.. టెస్టుల్లో ఆడిన 50 ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు(42) బాదిన వికెట్ కీపర్ బ్యాటర్గా పంత్ రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు (51 ఇన్నింగ్స్)తో కలిపి మొత్తంగా 44 సిక్సర్లు బాదాడు. ఇక ఈ జాబితాలో పంత్ తర్వాతి స్థానంలో టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని(31 సిక్సర్లు), ఆసీస్ మాజీ ఆటగాడు బ్రాడ్ హాడిన్(31), ఆడం గిల్క్రిస్ట్(30), ఇంగ్లండ్ ప్లేయర్ జోస్ బట్లర్(21) ఉన్నారు. కాగా ధోని తన టెస్టు కెరీర్లో భాగంగా 90 టెస్టుల్లో 78 సిక్సర్లు కొట్టాడు. యువ సంచలనం పంత్ మాత్రం 30 మ్యాచ్లలోనే 44 సిక్స్లు బాదడం గమనార్హం. ఇక మొత్తంగా టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వికెట్ కీపర్ల జాబితాలో గిల్క్రిస్ట్ 100 మాక్సిమమ్స్తో టాప్లో ఉన్నాడు. ధోని 79, బ్రాడ్ హాడిన్ 54 సిక్స్లు కొట్టారు. ఇదిలా ఉండగా.. శ్రీలంకతో మ్యాచ్లో 42వ ఓవర్ ఆఖరి బంతికి జయవిక్రమ రిటర్న్ క్యాచ్తో పంత్ మెరుపు ఇన్నింగ్స్కు తెరపడింది. చదవండి: IPL 2022- Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ జెర్సీ ఆవిష్కరణ.. సర్ప్రైజ్కు సిద్ధంగా ఉండాలన్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా -
చనిపోవడానికి 8 గంటల ముందు మెసేజ్ చేశాడు.. అప్పుడు: గిల్క్రిస్ట్
హఠాన్మరణం చెందిన దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ను తలచుకుని ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడం గిల్క్రిస్ట్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. చనిపోవడానికి ఎనిమిది గంటల ముందు తనకు మెసేజ్ చేశాడంటూ సహచర ఆటగాడిని గుర్తు చేసుకున్నాడు. తన నుంచి వచ్చిన ఆ సందేశాన్ని ఎన్నడూ డెలిట్ చేయనంటూ ఉద్వేగానికి గురయ్యాడు. కాగా మార్చి 4న థాయ్లాండ్లోని విల్లాలో వార్న్ అకాల మరణం చెందిన విషయం విదితమే. అప్పటి వరకు సరాదాగా గడిపిన స్పిన్ మాంత్రికుడు హఠాన్మరణం చెందాడు. ఈ నేపథ్యంలో అతడి భౌతిక కాయాన్ని శుక్రవారం నాటికి ఆస్ట్రేలియాకు పంపించనున్నారు. ఈ క్రమంలో ఏబీసీ న్యూస్తో మాట్లాడిన గిల్క్రిస్ట్ వార్న్తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘‘తనతో మాట్లాడి వారం కావస్తోంది. బహుశా తను చనిపోవడానికి ఎనిమిది గంటల ముందు అనుకుంటా.. నాకో చక్కని సందేశం పంపాడు. నన్ను ముద్దుగా చర్చ్ అని పిలిచేవాడు. ఈ నిక్నేమ్ మా స్నేహితుల్లో అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. చనిపోవడానికి ముందు పంపిన మెసేజ్లో.. ‘‘చర్చ్, రాడ్ మార్ష్కు నువ్వు ఘన నివాళి అర్పించావు’’ అని కొనియాడాడు. అదే చివరిసారి తను నాకు పంపిన సందేశం. దానిని నా జీవితంలో డెలిట్ చేయను’’ అని గిల్క్రిస్ట్ ఎమోషనల్ అయ్యాడు. కాగా ఆసీస్ క్రికెట్ దిగ్గజం రాడ్ మార్ష్ మృతి చెందిన గంటల వ్యవధిలోనే వార్న్ సైతం తుదిశ్వాస విడవడం గమనార్హం. చదవండి: IPL 2022- Delhi Capitals: పాపం.. రూ. 6.5 కోట్లు.. అన్రిచ్ నోర్జే స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు వీరే! -
కప్పలా నోరు తెరిచాడు.. ఏమైంది గిల్లీ!
ఆస్ట్రేలియా మాజీ విధ్వంసకర ఆటగాడు ఆడమ్ గిల్క్రిస్ట్ కప్పలా నోరు తెరిచాడు. బీబీఎల్ 11వ సీజన్లో కామెంటేటర్గా వ్యవహరిస్తున్న గిల్లీ.. మ్యాచ్లో ఒక బ్యాటర్ కొట్టిన షాట్కు షాక్తో నోరు తెరిచాడు. ఈ సంఘటన పెర్త్ స్కార్చర్స్ ఇన్నింగ్స్లో చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఇవాన్స్ ఒక బంతిని భారీ సిక్స్ కొట్టాడు. లాంగాన్ దిశగా వెళ్లిన ఆ సిక్స్ స్టాండ్స్లోని లోవర్ కవర్కు తగిలి ప్రేక్షకుల మధ్యలో పడింది. ఇవాన్స్ షాట్ను కామెంటరీ బాక్స్ నుంచి చూసిన గిల్క్రిస్ట్.. గుడ్షాట్.. అంటూ కప్పలా కాసేపు నోరు తెరిచాడు. ఆ సమయంలో గిల్క్రిస్ట్ను కెమెరాలు క్లిక్మనిపించాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక బిగ్బాష్ లీగ్(బీబీఎల్ 11) సీజన్ విజేతగా పెర్త్ స్కార్చర్స్ నిలిచింది. సిడ్నీ సిక్సర్స్తో జరిగిన ఫైనల్లో పెర్త్ స్కార్చర్స్ 79 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. పెర్త్ స్కార్చర్స్ బీబీఎల్ టైటిల్ గెలవడం నాలుగోసారి కాగా.. సిడ్నీ సిక్సర్స్ను ఫైనల్లో ఓడించడం ఇది మూడోసారి.76 పరుగులు నాటౌట్తో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన పెర్త్ స్కార్చర్స్ బ్యాట్స్మన్ లారీ ఇవాన్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అయితే పెర్త్ స్కార్చర్స్ ఆరు ఓవర్లలో 25 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ ఆస్టన్ టర్నర్, లారీ ఇవాన్స్లు ఇన్నింగ్స్ను నిర్మించారు. ఈ ఇద్దరు కలిసి 59 బంతుల్లో 104 పరుగులు జతచేయడంతో పెర్త్ స్కార్చర్స్ భారీ స్కోరు చేయగలిగింది. The @foxcricket commentators reaction say it all 😯 Is this the shot of #BBL11? A BKT Golden Moment pic.twitter.com/c32higINi3 — cricket.com.au (@cricketcomau) January 28, 2022 -
Ind Vs Sa: కోహ్లికి భారీ జరిమానా విధించాలి.. నిషేధించాలి కూడా!
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై విమర్శల పర్వం కొనసాగుతోంది. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో మూడో రోజు ఆట సందర్భంగా కోహ్లి వ్యవహరించిన తీరుపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. కాగా ప్రొటిస్ కెప్టెన్ డీన్ ఎల్గర్ డీఆర్ఎస్ కాల్ విషయంపై టీమిండియా ఆటగాళ్లు.. ముఖ్యంగా కోహ్లి స్టంప్స్ మైకు దగ్గరకు వెళ్లి ప్రసారకర్తలను ఉద్దేశించి మాట్లాడిన తీరు వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే కోహ్లిది చెత్త ప్రవర్తన అంటూ విమర్శించాడు. ఇక ఈ విషయంపై స్పందించిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ మైకేల్ వాన్ కోహ్లికి భారీ జరిమానా వేయాలని.. లేదంటే నిషేధం విధించాలని ఐసీసీకి సూచించాడు. ప్రతి ఒక్కరు భావోద్వేగాలు ప్రదర్శించడం సహజమని.. అయితే నాయకుడు ఇలా చేయడం సరికాదన్నాడు. ఈ విషయంలో ఐసీసీ వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశాడు. దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ డారిల్.. భారత కెప్టెన్ చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడం గిల్క్రిస్ట్ సైతం టీమిండియా సారథి తీరుపై పెదవి విరిచాడు. ప్రతి విషయంలోనూ ఓ హద్దు ఉంటుందని... అది దాటితే తప్పును ఉపేక్షించాల్సిన అవసరం లేదని గిల్క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. షేన్ వార్న్ మాట్లాడుతూ... ‘‘అంతర్జాతీయ జట్టు కెప్టెన్ ఇలా వ్యవహరిస్తాడని నేను అనుకోను. ఒక్కోసారి అసహనం హద్దు దాటుతుంది. నిజమే.. అయితే పదే పదే ఇలా చేయడం సరికాదు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి. సహించాల్సిన అవసరం లేదు’’ అని చెప్పుకొచ్చాడు. ఇక దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో భాగంగా టీమిండియా ఆటలో వైఫల్యం కంటే కూడా ఇలాంటి వాగ్యుద్దాలు, గొడవలతోనే ఎక్కువ అప్రదిష్టను మూటగట్టుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చదవండి: View this post on Instagram A post shared by Fox Cricket (@foxcricket) pic.twitter.com/HtZwoo9Lm7 — Bleh (@rishabh2209420) January 13, 2022 -
గిల్క్రిస్ట్తో మహిళా కామెంటేటర్ మజాక్.. వీడియో వైరల్
క్రికెట్ మ్యాచ్ సందర్భంగా కామెంటేటర్స్ మధ్య జరిగే సంభాషణలు ఒక్కోసారి ఆసక్తి కలిగిస్తాయి. మ్యాచ్ గురించి ప్రస్తావన తెస్తూనే తమదైన శైలిలో జోక్లు.. పంచ్లు పేల్చుకుంటూ సరదాగా ఉంటారు. తాజాగా బిగ్బాష్ లీగ్ 2021లో భాగంగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. డిసెంబర్ 12న మెల్బోర్న్ స్టార్స్, సిడ్నీ థండర్స్ మధ్య సీరియస్గా మ్యాచ్ జరుగుతుంది. చదవండి: BBL 2021: కొలిన్ మున్రో విధ్వంసం..బిగ్బాష్ లీగ్ చరిత్రలో 27వ సెంచరీ ఈ మ్యాచ్కు ఆస్ట్రేలియా మాజీ విధ్వంసకర ఆటగాడు ఆడమ్ గిల్క్రిస్ట్తో పాటు మరో ఇద్దరు కామెంటేటర్స్గా వ్యవహరించారు. వీరిలో ఇసా గుహా అనే మహిళ కూడా ఉంది. మ్యాచ్ సందర్భంగా కామెంటరీ ప్యానెల్ మధ్య స్పిన్ బౌలింగ్లో ఉండే టెక్నిక్స్ అంశం చర్చకు వచ్చింది. క్యారమ్ బాల్ ప్రస్తావన రాగానే తోటి కామెంటేటర్.. '' క్యారమ్ బాల్ వేయాలంటే .. ఒక బౌలర్ మధ్య వేలును ఎక్కువగా ఉపయోగించడం చూస్తుంటాం'' అని చెప్పాడు. ఇది విన్న వెంటనే ఇసా గుహా.. ''మరి మీది ఎంత పెద్దదిగా ఉంది'' అని డబుల్ మీనింగ్ డైలాగ్ వచ్చేలా మాట్లాడడంతో గిల్క్రిస్ట్ ఒక్కసారిగా నవ్వేశాడు. ఇది చూసిన మిగతా టెక్నిషియన్స్ కూడా మొదట ఆశ్చర్యపోయినా నవ్వడం షురూ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. '' ఆడమ్ గిల్క్రిస్ట్తోనే మజాకా''.. ''డబుల్ మీనింగ్ మరీ ఎక్కువైంది'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: Ashes 2021: క్రేజీ బౌన్సర్.. తృటిలో తప్పించుకున్న రూట్ ఇక మ్యాచ్లో మెల్బోర్న్ స్టార్స్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ 17.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. A reasonable question from @isaguha 👀😂😂😂😂😂😂 pic.twitter.com/Tzu5F2emUg — Alexandra Hartley (@AlexHartley93) December 12, 2021 -
మ్యాక్స్వెల్ టీ20 ప్రపంచకప్ జట్టు.. అనూహ్యంగా ఆ ఇద్దరికి చోటు
Maxwell Lists His Top Five T20 Players Ahead Of T20 WC 2021: పొట్టి ప్రపంచకప్ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు, దిగ్గజ ఆటగాళ్లు, విశ్లేషకులు తమతమ ఛాయిస్ ఆటగాళ్లతో కూడిన జట్లను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆసీస్ డాషింగ్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ సైతం ప్రపంచ టీ20 జట్టుకు తన ఐదుగురు ఫేవరెట్ ఆటగాళ్ల లిస్ట్ను ప్రకటించాడు. ఈ జాబితాలో మ్యాక్సీ అనూహ్యంగా ఇద్దరు ఆసీస్ వెటరన్ ప్లేయర్స్కు చోటు కల్పించడం విశేషం. తన ఫస్ట్ ఛాయిస్ ఆటగాడిగా అఫ్గాన్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ను ఎంపిక చేసిన మ్యాక్స్వెల్.. ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్, విండీస్ విధ్వంసకర ప్లేయర్ ఆండ్రీ రసెల్లను తన జట్టులోకి ఎంపిక చేశాడు. అయితే వికెట్కీపర్ కోటాలో అతను అనూహ్యంగా దిగ్గజ ఆటగాడు ఆడమ్ గిల్క్రిస్ట్కు చోటు కల్పించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆఖరుగా ఆసీస్ ఫాస్ట్ బౌలర్ షాన్ టైట్ను మ్యాక్సీ తన జట్టులోని తీసుకున్నాడు. ఈ ఐదుగురు ఆటగాళ్లు ఎటువంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల సమర్ధులని, అందుకే వీరిని తన జట్టులోకి ఎంపిక చేశానని మ్యాక్సీ చెప్పుకొచ్చాడు. చదవండి: పేలవ డ్రాగా ముగిసిన పింక్ బాల్ టెస్ట్ Two all-rounders, a leg-spinning sensation and two Australians of the past 🏏 Glenn Maxwell’s top five T20 Players 🎥 pic.twitter.com/Yn2lUsCgE4 — T20 World Cup (@T20WorldCup) October 6, 2021 -
అదే టీమిండియా కొంపముంచింది..
అడిలైడ్: ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా ఇక్కడ జరిగిన పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఫర్వాలేదనిపించిన కోహ్లి గ్యాంగ్.. రెండో ఇన్నింగ్స్లో పూర్తిగా తేలిపోయింది. టీమిండియా తన రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులకే ఆలౌటై చెత్త రికార్డును లిఖించింది. కనీసం ఆసీస్కు పోటీ ఇవ్వకుండానే టీమిండియా లొంగిపోవడంతో విమర్శల వర్షం కురుస్తోంది. అసలు కేఎల్ రాహుల్ను తీసుకోలేకపోవడమే ఇంతటి ఘోర పరాభవానికి కారణమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, టీమిండియా తన టెస్టు చరిత్రలోనే తక్కువ స్కోరుకు ఇన్నింగ్స్ను ముగించడం చాలా దారుణమని ఆసీస్ దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్క్రిస్ట్ అంటున్నాడు. ఈ తరహా దారుణ ఓటమికి సరైన ఓపెనింగ్ భాగస్వామ్యం రాకపోవడమేనని తెలిపాడు. (చదవండి: స్మిత్, కోహ్లి ర్యాంక్లు యథాతథం) ప్రధానంగా పృథ్వీ షా ఘోర వైఫల్యమే టీమిండియాను వెనక్కునెట్టిందన్నాడు. ‘మిడ్ డే’ కు రాసిన కాలమ్లో పృథ్వీ షా ప్రదర్శన గురించి గిల్క్రిస్ట్ ఇలా చెప్పుకొచ్చాడు. ‘ తొలి టెస్టులో పృథ్వీ షా రెండు ఇన్నింగ్స్ల్లోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. ఓపెనర్గా పూర్తిగా విఫలమయ్యాడు. టీమిండియా గతంలో ఇక్కడ పర్యటించిన జట్టులో పృథ్వీషా ఒక సభ్యుడు. పృథ్వీ షాకు ఆస్ట్రేలియాలోని పరిస్థితులు తెలియంది కాదు. పృథ్వీ షాపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ వాటిని షా నిలబెట్టలేదు. అతని బ్యాటింగ్ టెక్నిక్ విమర్శలకు దారితీస్తోంది. బ్యాట్కు ప్యాడ్కు మధ్య దూరాన్ని అంచనా వేయడంలో షా విఫలం అయ్యాడు. ఓపెనర్గా షా తొందరగా విఫలం కావడమే టీమిండియా కొంపముంచింది. ఆస్ట్రేలియాలో పరిస్థితులు తెలిసినా షాట్ల ఎంపిక సరిగా లేదు. అతనొక టాలెంటెడ్ యువ క్రికెటర్. కానీ తొలి టెస్టులో అతని ఆట సెలక్టర్లను డైలమాలో పడేసింది. బాక్సింగ్ డే టెస్టుకు షాను పక్కకు పెట్టి శుబ్మన్ గిల్కు అవకాశం కల్పించాలి’ అని గిల్క్రిస్ట్ పేర్కొన్నాడు. (నీదే పిల్లాడి మనస్తత్వం అందుకే, ఇలా..) -
తప్పు నాదే.. క్షమించండి : గిల్క్రిస్ట్
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అడమ్ గిల్క్రిస్ట్ పెద్ద పొరపాటు చేశాడు. ఇటీవలే టీమిండియా ఆటగాడు మహ్మద్ సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిరాజ్ తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో సిరాజ్కు భారత జట్టు ఆటగాళ్లతో పాటు ఆసీస్ క్రికెటర్లు కూడా సానుభూతి ప్రకటించారు. (చదవండి : రాహుల్కు క్షమాపణ చెప్పా: మ్యాక్స్వెల్) శుక్రవారం ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో గిల్క్రిస్ట్ కామెంటేటర్గా వ్యవహరించాడు. కామెంటరీ సమయంలో సిరాజ్ తండ్రి చనిపోయిన విషయం గురించి మాట్లాడిన గిల్క్రిస్ట్ పొరపాటున సిరాజ్ బదులు నవదీప్ సైనీ పేరును ప్రస్తావించాడు. 'తండ్రి చనిపోయిన వెంటనే బీసీసీఐ సైనీకి ఇంటికి వెళ్లేందుకు అవకాశమిచ్చింది. కానీ జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అతను వెళ్లలేదు' అని పేర్కొన్నాడు. అయితే గిల్క్రిస్ట్ చేసిన వ్యాఖ్యలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. (చదవండి : హార్దిక్ బౌలింగ్ ఇప్పట్లో లేనట్లేనా?) గిల్లీ వ్యాఖ్యలను గుర్తించిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మెక్లీన్గన్తో పాటు కొంతమంది అభిమానులు ట్విటర్ ద్వారా అతని పొరపాటును ట్యాగ్ చేశారు. చనిపోయింది సిరాజ్ తండ్రి.. నవదీప్ సైనీ తండ్రి కాదంటూ తెలిపారు. విషయం గ్రహించిన గిల్లీ వెంటనే ట్విటర్లో స్పందించాడు.' నా పొరపాటును గ్రహించాను. సిరాజ్కు బదులు పొరపాటుగా సైనీ పేరు వాడాను. ఈ సందర్భంగా సిరాజ్, సైనీలకు ఇవే నా క్షమాపణలు. నేను పొరపాటుగా చేసిన వ్యాఖ్యలను గుర్తించిన మెక్లీన్గన్కు ధన్యవాదాలు తెలుపుతున్నా.. మరొకసారి మీ అందరిని క్షమాపణ కోరుతున్నా' అంటూ గిల్లీ ట్వీట్ చేశాడు. Yes, thanks @anshu2912 I realize I was mistaken in my mention. Huge apologies for my error, to both @navdeepsaini96 and Mohammed Siraj. 🙏😌 https://t.co/618EUIEyNU — Adam Gilchrist (@gilly381) November 27, 2020 Yep, thanks @Mitch_Savage My huge apologies again to all. https://t.co/F8rYsD6fxm — Adam Gilchrist (@gilly381) November 27, 2020 -
భజ్జీతో గొడవను గుర్తుచేసుకున్న గిల్క్రిస్ట్
ముంబై : 2019, ఆగస్టు నెలలో భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్తో ట్విటర్ వేదికగా చోటుచేసుకున్న వివాదాన్ని ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ గుర్తు చేసుకున్నాడు. శుక్రవారం ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. గతంలో ట్విటర్లో జరిగిన ఆ చిన్న వివాదం వల్ల తమ మధ్య దూరం పెరగలేదని అన్నాడు. ప్రస్తుతం హర్భజన్తో సఖ్యతగానే ఉంటున్నానని స్పష్టం చేశాడు. ఆ రోజు జరిగిన గొడవలో భజ్జీనే పై చేయి సాధించాడని, అతడి మాటలకు సమాధానం చెప్పలేకపోయానని పేర్కొన్నాడు. (రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బౌలర్) గతంలో హర్భజన్ బౌలింగ్ గురించి గిల్క్రిస్ట్ మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్లో నేను ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన బౌలర్ భజ్జీనే’’నని అన్నాడు. కాగా, 2001లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన రెండో టెస్టులో హర్భజన్ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. వీటిలో గిల్క్రిస్ట్ వికెట్ కూడా ఉంది. భజ్జీ తన వికెట్ తీయటంపై గిల్క్రిస్ట్ వ్యంగ్యంగా స్పందించటంతో వివాదం మొదలైంది. -
భారత ఫీల్డర్లు ఏదో అనేవారు.. కానీ
సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియాల మధ్య గతంలో జరిగిన సిరీస్ల గురించి ప్రస్తావిస్తే మనకు హర్భజన్ సింగ్ ‘మంకీగేట్’ వివాదమే మనకు గుర్తుకొస్తుంది. ఆస్ట్రేలియా ఆటగాడు సైమండ్స్ను ఉద్దేశిస్తూ భజ్జీ చేసిన కామెంట్ ఒకానొక సమయంలో పెద్ద దుమారం రేపింది. అయితే ఆ వివాదం పెద్దది కాకుండా చేయడంలో సచిన్ టెండూల్కర్ కీలక పాత్ర పోషించాడు. అయితే హర్భజన్ సింగ్ తనను ఔట్ చేసిన సందర్భంలో భారత ఫీల్డర్లు ఒకే పదాన్ని ఎక్కువ ఉపయోగించేవారని ఆసీస్ మాజీ ఓపెనర్ ఆడమ్ గిల్క్రిస్ట్ గుర్తు చేసుకున్నాడు. లైవ్ కనెక్ట్ షోలో భాగంగా టీవీ ప్రెజంటర్ మడోనా టిక్సెరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్తో క్రికెట్ మ్యాచ్ల విషయాలను ప్రత్యేకంగా ప్రస్తావించాడు గిల్క్రిస్ట్. (24 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ ఓపెనర్గా..) ఈ క్రమంలోనే ఒకనాడు భారత ఫీల్డర్ ఉపయోగించే ఆ పదానికి అర్థం ఏమిటో ఇప్పటికీ తెలీదన్నాడు. ఇప్పుడు ఆ పదాన్ని కూడా మరిచిపోయానని గిల్లీ చెప్పుకొచ్చాడు. ప్రధానంగా భజ్జీ బౌలింగ్లో తాను ఔటైన సందర్భంలోనే ఆ పదాన్ని వాడేవారన్నాడు. 2001 సిరీస్లో ఆసీస్కు చుక్కలు చూపించిన హర్భజన్.. మూడు టెస్టుల సిరీస్లో 32 వికెట్లు సాధించి భారత్కు సింగిల్ హ్యాండ్ విజయం అందించాడు. కాగా, భజ్జీ తన టెస్టు కెరీర్లో అత్యధికంగా ఔట్ చేసిన వారిలో పాంటింగ్(10సార్లు) తొలిస్థానంలో ఉండగా, రెండో స్థానంలో మాధ్యూ హేడెన్(9సార్లు), గిల్ క్రిస్ట్(7సార్లు) మూడో స్థానంలో ఉన్నారు. (ఐపీఎల్ కొత్త టైటిల్ స్పాన్సర్ ఎవరు?) ఇక భారత్లో ఎప్పుడూ తమకు గ్రాండ్ వెల్కమ్ ఉండేదని గిల్లీ గుర్తు చేసుకున్నాడు. అయితే ముంబైలో తనకు ఎదురైన ఫన్నీ ఘటనను గిల్లీ ప్రస్తావించాడు. ఒక మార్నింగ్ తాను ఒకచోట జాగింగ్ చేస్తుంటే క్రికెట్ ఫ్యాన్స్ పరుగులు పెట్టించారన్నాడు. తాను సన్గ్లాసెస్, ఇయర్ ఫోన్స్, తలపై హ్యాట్ పెట్టుకోవడమే కాకుండా తల కిందకు వంచి జాగింగ్ చేసుకుంటుంటే కొంతమంది తనను ఆపేశారన్నాడు. ఈ క్రమంలో తనను గుర్తించి ఒక ఫోటో కోసం వెంటపడ్డారన్నాడు. ఇది చాలా సరదాగా అనిపించిందని గిల్లీ పేర్కొన్నాడు. తాను మళ్లీ ఎప్పుడు భారత్కు వస్తానో తెలీదన్న గిల్లీ.. భారత్కు రావడమంటే ఎప్పుడూ కొత్తగా ఉంటుందన్నాడు. -
ధన్యవాదాలు వర్ఘీస్
తల్లి కువైట్లో ఉంది. తండ్రి ఇండియాలో ఉన్నాడు. షరాన్ వర్ఘీస్ ఆస్ట్రేలియాలో ఉంది. కరోనా అంతటా ఉంది. తల్లి నర్సు. కూతురు నర్సింగ్ డిగ్రీ పూర్తయింది. ‘‘అమ్మా.. ఏం చేయమంటావ్’’ అని అడిగింది. ‘‘నీ ఇష్టం.. నేనైతే వదిలి రాలేను’’ అంది. ఆమె వదిలి రాలేనన్నది కువైట్లోని కరోనా రోగులను. కూతురు కూడా ఆస్ట్రేలియాను వదల్లేదు. వృద్ధులకు సేవ చేస్తూ అక్కడే ఉండిపోయింది. ఈ యువ నర్సుకు గిల్క్రీస్ట్ ధన్యవాదాలు తెలిపాడు. షరాన్, ఆడమ్ గిల్క్రీస్ట్ షరాన్ వర్ఘీస్ బియస్సీ నర్సింగ్ పూర్తి చేసి యూనివర్సిటీ బయటికి అడుగు పెట్టే వేళకు కరోనా ఆస్ట్రేలియా వరకు వచ్చేసింది. వచ్చేసింది కానీ, మరికొంతకాలమైనా ఉండకుండా పోయేది కాదని అప్పటికెవరికీ తెలీదు. షరాన్ నర్సుగా అక్కడే తన పేరు నమోదు చేసుకుని ఉంది. తొలి ఉద్యోగాన్ని ఏదైనా పెద్ద ఆసుపత్రిలో వెతుక్కోవడమే మిగిలింది. ఆ సమయంలో ఆస్ట్రేలియా నుంచి విదేశీయుల తిరుగు ప్రయాణాలు మొదలయ్యాయి! కరోనా భయంతో అంతా విమానాశ్రయాలకు చేరుకుంటున్నారు. షరాన్ సందిగ్ధంలో పడింది. కేరళలో తనకు మంచి ఉద్యోగం దొరక్కపోదు. వెళ్లడమా? ఉండటమా? ‘‘అమ్మా... ఏం చేయమంటావ్?’ అని కువైట్లో ఉన్న తల్లికి ఫోన్ చేసింది. ఆమె కూడా నర్సే. కువైట్లో చేస్తున్నారు. ‘‘నేను ఇక్కడే ఉండిపోతాను. వీళ్లనిలా వదిలేసి రాలేదు’’ అన్నారు ఆవిడ! అది మనసులో పడిపోయింది షరాన్కు. తనూ ఆస్ట్రేలియాలోనే ఉండిపోదలచుకుంది. అయితే ఆసుపత్రిలో కాకుండా వృద్ధులకు మాత్రమే వైద్యసేవలు (జెరియాట్రిక్) అందించే ఆరోగ్య కేంద్రంలో చేరింది. ఆస్ట్రేలియాలో 60 ఏళ్లు పైబడిన వారి జనాభా ఎక్కువ. వారికి సేవలు అందించడానికి అందుబాటులో ఉండే నర్సుల సంఖ్య తక్కువ. అందుకే షరాన్ జెరియాట్రిక్ నర్స్ అయింది. అప్పటికి కరోనా కూడా ఆస్ట్రేలియా అంతటికీ విస్తరించింది. కరోనా నుంచి వృద్ధులను కాపాడటం అంటే ఒళ్లంతా హూనం చేసుకోవడం మాత్రమే కాదు. ఒళ్లంతా కళ్లు చేసుకోవడం కూడా. ∙∙ రోజుకు ఆరేడు గంటలు పని చేస్తోంది షారన్. కరోనా భయంతో దూర ప్రాంతాల్లో ఉండే నర్సులు రావడం మానేశారు. కొంతమంది రాగలిగి ఉన్నా ఇంట్లో పసిపిల్లలు ఉండటంతో జాగ్రత్తకోసం ఉద్యోగాన్ని వదిలేశారు. ఆ పని కూడా షరాన్ మీదే పడింది. కష్టమనుకోలేదు షరాన్. ‘‘వదిలేసి రాలేను’’ అని తల్లి అన్నమాట ఆమెకు శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తోంది. నాలుగు నెలలుగా అవిశ్రాంతంగా వృద్ధుల్ని కనిపెట్టుకుని ఉంటోంది షారన్. ఇటీవల ఓ రోజు.. షరాన్ చదివొచ్చిన ఉలాంగ్గాంగ్ యూనివర్సిటీ నుంచి ఆమెకు ఒక మెయిల్ వచ్చింది. యూనివర్సిటీలోని కోవిడ్ –19 హెల్ప్ గ్రూప్ పంపిన మెయిల్ అది. విదేశాల నుంచి వచ్చి ఆస్ట్రేలియాలో వైద్యసేవలు అందిస్తున్న నర్సులు తమ ఉద్యోగ వివరాలను తెలియజేయాలని హెల్ప్ గ్రూప్ కోరింది. షరాన్ వెంటనే తన వివరాలు మెయిల్ చేసింది. వీడియో తీసి పంపమని మళ్లీ ఒక మెయిల్ వచ్చింది. షరాన్ కాస్త తీరిక చేసుకుని అప్పటికప్పుడు కోటు వేసుకుని, కొంచెం లిప్స్టిక్ అద్దుకుని.. ‘హాయ్.. నేను షరాన్’ అంటూ తన వివరాలను రికార్డ్ చేసి పంపింది. ఆ తర్వాత ఆ సంగతే మర్చిపోయింది.. కొన్ని రోజుల తర్వాత తనకు ఫోన్లు, మెజేస్లు వరదలా వచ్చి పడేవరకు! అవి కేరళ నుంచి, కువైట్ నుంచి.. ఇంకా విదేశాల్లో ఉన్న స్నేహితుల నుంచి. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్క్రీస్ట్ ఆ అమ్మాయికి ధన్యవాదాలు తెలిపాడని! ఆస్ట్రేలియాలోనే ఉండి ఇక్కడి వారికి సేవ చేయాలనుకున్న షరాన్కు, మిగతా భారతీయ విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుతున్న గిల్క్ట్రీస్ వీడియో క్లిప్ అప్పటికే వైరల్ అవుతోంది. ‘‘మా నాన్న దేనినీ మెచ్చరు. ఆయన క్రికెట్ అభిమాని. గిల్క్రీస్ట్ నన్ను ప్రశంసించారు అనగానే ఫోన్ చేసి ‘వెల్ డన్’ అన్నారు అని సంతోషపడిపోయింది షరాన్. ఇక కేరళలో ఉన్న ఆమె తమ్ముడు, అతడి ఫ్రెండ్స్ అయితే సోషల్ మీడియాలో ఇంచుమించు ఒక ఉత్సవాన్నే జరుపుకుంటున్నారు. షరాన్కి ఇదంతా థ్రిల్లింగ్గా ఉంది. ∙∙ కొట్టాయంలోని కురుప్పుంత్ర షరాన్ వర్ఘీస్ స్వస్థలం. తల్లి ఎప్పట్నుంచో కువైట్లో నర్సు. షరాన్ తల్లి దగ్గరే ఉండి స్కూల్కి వెళ్లింది. ఆస్ట్రేలియాలో కాలేజ్ చదువు. సెలవుల్లో కేరళ వచ్చి వెళ్తుంటుంది. ఇక రెండేళ్ల వరకు ఉలాంగ్గాంగ్ ను వదిలి వెళ్లేది లేదని అంటోంది. ఆ ప్రాంతంలోనే ఒక ‘ఏజ్డ్ కేర్’ సెంటర్లో తనిప్పుడు పని చేస్తోంది. గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందించడం తనకు ఇష్టమని అంటోంది. -
వికెట్ కీపర్గా గిల్క్రిస్ట్.. ధోనికి నో చాన్స్!
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)పై కమ్ముకున్న ‘కరోనా నీడలు’ ఇంకా అలానే ఉన్నాయి. 13వ ఐపీఎల్ జరుగుతుందని కచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గితే ఈ లీగ్ను సెప్టెంబర్-అక్టోబర్లో జరిపే అవకాశాలు కూడా లేకపోలేదు. ఒకవేళ అలా జరగాలంటే టీ20 వరల్డ్కప్ వాయిదా పడాల్సి ఉంటుంది. దాంతో ఐపీఎల్ నిర్వహణ సాధ్యమా.. కాదా అనేది నిర్వహకులే తేల్చుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంచితే, లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న ప్రస్తుత క్రికెటర్లు, మాజీలు తమ అత్యుత్తమ జట్లను ప్రకటిస్తున్నారు. దీనిలో భాగంగా దక్షిణాఫ్రికా సీనియర్ క్రికెటర్ జేపీ డుమినీ తన ఆల్టైమ్ ఐపీఎల్ జట్టును ఎంపిక చేశాడు. ఇందులో ఇద్దరు భారత క్రికెటర్లకు చోటు కల్పించిన డుమినీ.. ఐపీఎల్ సక్సెస్ఫుల్ కెప్టెన్లలో ఒకడైన ఎంఎస్ ధోనికి చాన్స్ ఇవ్వలేదు. వికెట్ కీపర్గా ఆసీస్ మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్క్రిస్ట్కు అవకాశం ఇచ్చిన డుమినీ.. ధోనిని ఎంపిక చేయలేదు. కాగా, తన ఆల్టైమ్ ఐపీఎల్ జట్టుకు విరాట్ కోహ్లిని కెప్టెన్గా ఎంపిక చేశాడు. అదే సమయంలో భారత్ నుంచి రోహిత్ శర్మకు అవకాశం ఇచ్చాడు. డుమినీ ఆల్టైమ్ జట్టు ఇదే.. విరాట్ కోహ్లి(కెప్టెన్), క్రిస్ గేల్, ఆడమ్ గిల్క్రిస్ట్, రోహిత్శర్మ, ఏబీ డివిలియర్స్, కీరోన్ పొలార్డ్, రసెల్, బ్రెట్ లీ, ముత్తయ్య మురళీ ధరన్, లసిత్ మలింగా, ఇమ్రాన్ తాహీర్ -
గిల్క్రిస్ట్నే కలవరపెట్టిన భారత బౌలర్..!!
మెల్బోర్న్ : తన కెరీర్లో ఎదుర్కొన్న కష్టతరమైన బౌలర్లలో భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఒకరని ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ తెలిపారు. అదేవిధంగా శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్లో కూడా ఇబ్బంది పడినట్లు వెల్లడించాడు. క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్లో 2001లో జరిగిన బోర్డర్- గవాస్కర్ సిరీస్లో 32వికెట్లు పడగొట్టిన భజ్జీ ఆసీస్కు కొరకరాని కొయ్యలా మారాడని ఈ సందర్భంగా గిల్క్రిస్ట్ గుర్తు చేసుకున్నాడు. 2001లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన రెండో టెస్టులో హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ఈ టెస్టులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ముంబైలో జరిగిన తొలి టెస్టులో గిల్క్రిస్ట్ సెంచరీతో చెలరేగడంతో స్టీవ్ వా నాయకత్వంలోని ఆస్ట్రేలియా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ మ్యాచ్లో ఆసీస్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తర్వాతి మ్యాచ్లలో హర్భజన్ చెలరేగడంతో భారత్ తదుపరి రెండు మ్యాచ్ల్లోనూ విజయాలు సాధించి సిరీస్ను సొంతం చేసుకుంది. దీంతో గంగూలీ సారథ్యంలోని టీమిండియా 2-1 తేడాతో సిరీస్ను చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గిల్క్రిస్ట్ మాట్లాడుతూ.. 'ముంబైలో జరిగిన మొదటి మ్యాచ్లో మేము 99/5 స్థితిలో ఉన్న సమయంలో నేను క్రీజులోకి వెళ్లాను. 80 బంతుల్లో 100 పరుగులు చేశాను. అయితే ఆ టెస్టును మూడు రోజుల్లోనే గెలిచాం. ఇంత సులభంగా మ్యాచ్ గెలవగానే.. గత 30 సంవత్సరాలుగా మా జట్టు భారత్లో ఎందుకు సిరీస్ గెలవలేదు అని ప్రశ్నించుకునేవాడిని. కానీ.. తర్వాత భారత్లో టెస్టు సిరీస్ ఎంత కఠినమో త్వరగానే అర్థమైపోయింది. తర్వాతి టెస్టు మ్యాచ్ కోసం కోల్కతాకు వెళ్లాం. అక్కడ మమ్మల్ని భజ్జీ తన బౌలింగ్తో కలవర పెట్టాడు నా కెరీర్లో నేను ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన బౌలర్ భజ్జీనే. ఆ తర్వాత శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్. వీళ్లిద్దరూ నేను ఎదుర్కొన్న కష్టతరమైన బౌలర్లు. ఈ సిరీస్ ఓటమి తర్వాత టెస్ట్ క్రికెట్ విషయంలో మేము అనేక విషయాలను తెలుసుకున్నాం. ప్రతిసారి దాడి చేయడమే కాకుండా తమ వ్యూహాలను మార్చుకొని ఆడాల్సిన అవసరం ఉందని తెలుసుకున్నాం. 2001లో సిరీస్ చేజారి పోయాక మా వ్యూహాలను మార్చాం. ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడేందుకు దాడి చేయడం ఒకటే సరైన మార్గం కాదని తెలుసుకున్నాం. తర్వాత 2004లో భారత పర్యటనలో భాగంగా 35 సంవత్సరాల తర్వాత సిరీస్ను గెలవడం చాలాగొప్ప విషయం’అని గిల్క్రిస్ట్ పేర్కొన్నాడు. కాగా, ఈ సిరీస్లో చెన్నై టెస్టు రెండో ఇన్నింగ్స్లో క్లిష్ట సమయంలో 49 పరుగులు చేసిన ఆడమ్, అవి తనకెంతో ప్రత్యేకమన్నారు. ఈ పర్యటనలో ఆసీస్ 2-1 తేడాతో టీమిండియాపై విజయం సాధించిన విషయం తెలిసిందే. -
తొలి ఆసియా వికెట్ కీపర్గా..
న్యూఢిల్లీ: పాకిస్తాన్ వెటరన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో దుమ్ము రేపాడు. దేశవాళీ క్రికెట్లో భాగంగా సెంట్రల్ పంజాబ్ తరఫున ఆడుతున్న అక్మల్.. ఉత్తర పంజాబ్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ బాదేశాడు. దాంతో తన ఫస్ట్ కెరీర్లో 31వ సెంచరీ నమోదు చేశాడు. ఫలితంగా ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఈ మార్కును చేరిన తొలి ఆసియన్ వికెట్ కీపర్గా అక్మల్ రికార్డు సాధించాడు. అదే సమయంలో ఓవరాల్గా రెండో స్థానానికి ఎగబాకాడు. ఇక్కడ ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ కంటే ఎక్కువ ఫస్ట్క్లాస్ సెంచరీలు చేసిన ఘనతను నమోదు చేశాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ మాజీ వికెట్ కీపర్ లెస్ ఏమ్స్(56) అగ్రస్థానంలో ఉన్నాడు.తన సెంచరీతో సెంట్రల్ పంజాబ్ 5వికెట్లకు 369 పరుగులతో గౌరవప్రధానమైన స్కోర్ సాధించగలిగింది. అంతర్జాతీయ క్రికెట్లో ఫామ్లేమి కారణంగా సెలక్టర్లు అక్మల్కు మొండిచేయి చూపగా దేశవాళీ క్రికెట్లో రాణించడం విశేషం. అక్మల్ చివరిసారిగా 2010లో ఇంగ్లండ్తో టెస్టు ఆడగా, వన్డేల్లో 2017లో వెస్ట్ండీస్తో చివరి వన్డే ఆడాడు. -
అనంతపురంలో క్రికెటర్ గిల్క్రిస్ట్ సందడి
-
టోర్నీ ఏదైనా.. ఇండియానే ఫేవరేట్
‘‘ఇండియాలో క్రికెట్కున్న క్రేజ్ మరే దేశంలోనూ లేదు. ఇక్కడి వారు క్రికెట్ను అంతలా ఆరాధిస్తారు. ఇండియా టీం కూడా చాలా డేంజర్. ఏ టోర్నీలో బరిలో దిగినా...ఎవరితో ఆడినా... ఇండియానే ఫేవరేట్’’ అని ఆ్రస్టేలియా క్రికెటర్ ఆడం గిల్క్రిస్ట్ అన్నారు. గురువారం ఆయన అనంతపురంలోని అనంత క్రీడా మైదానాన్ని సందర్శించారు. స్థానిక క్రీడాకారులతో మాట్లాడారు. దిగ్గజ క్రికెటర్ రాకతో ఆర్డీటీ క్రీడామైదానం పులకించిపోయింది. ఇక్కడి క్రీడాకారులు ఆయనతో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్లు తీసుకుని మురిసిపోయారు. మాట కలిపి క్రీడా మెలకువలు తెలుసుకునేందుకు పోటీ పడ్డారు. అనంతపురం సప్తగిరి సర్కిల్: క్రికెట్ టోర్నీ ఏదైనా ఇండియానే ఫేవరేట్ అని ఆస్ట్రేలియన్ దిగ్గజ క్రికెటర్ ఆడం గిల్క్రిస్ట్ అన్నారు. అనంతపురంలోని అనంత క్రీడా మైదానాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక క్రికెట్, ఫుట్బాల్, హాకీ, టెన్నిస్, జూడో క్రీడాకారులతో ముచ్చటించారు. అనంతరం ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ప్ర: ఇండియా జట్టు గురించి మీ అభిప్రాయం? జ: ఇండియా జట్టు చాలా ప్రత్యేకమైనది. అత్యంత ప్రమాదకరమైన జట్టుగానే నేను భావిస్తున్నా. ఎలాంటి టోర్నీలోనైనా ఆ జట్టు ఫెవరెట్గానే బరిలోకి దిగుతుంది. ఇండియాలో క్రికెట్ను కోట్లాది మంది ప్రజలు ఆదరిస్తారు. ఇక్కడి ప్రజలకు క్రికెట్కు నిజంగానే ఆరాధ్య క్రీడ. ప్ర: ప్రస్తుత ఆ్రస్టేలియన్ జట్టు ఆటతీరుపై మీ అభిప్రాయం? జ: ఆస్ట్రేలియన్ జట్టు ప్రస్తుతం గడ్డు కాలంలో ఉంది. ప్లేయర్లు రాణించడం కొంచెం కష్టంగా ఉంది. రానున్న కాలంలో మరింతగా పుంజుకుంటుందని భావిస్తున్నా. యాషెస్ సీరిస్ ద్వారా తప్పక ఫామ్లోకి వస్తుంది. ప్ర: ఇండియాకి రావడం ఎలా అనిపిస్తుంది? జ: చాలా బాగుంది. ఇండియాలో చాలా అత్యుత్తమమైన క్రికెట్ ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారుడు తన జీవితాన్ని క్రికెట్ ద్వారానే ఆస్వాదిస్తాడు. ప్రతి చోట క్రికెట్ ఆడతారు. ప్ర: అనంత క్రీడా మైదానం గురించి మీ మాటల్లో.. జ: ఇక్కడి క్రీడాకారులకు ఇదో మంచి అవకాశం. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు అందించే సౌకర్యాలు, వసతులను కలి్పస్తున్నారు. ఇది క్రీడాకారుల పాలిట ఒక వరంగా భావించాలి. అనంత క్రీడాకారులు చాలా అదృష్టం చేసుకున్నారు. ప్ర: ఆర్డీటీ గురించి? జ: ఆర్డీటీ నిజంగా ఒక ఉత్తమమైన సంస్థ. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఇంతటి ఉన్నతమైన క్రీడా దిగ్గజాలను తయారు చేస్తుందంటే నిజంగా ఇది క్రీడాకారుల కర్మాగారంగా చెప్పవచ్చు. సాధారణంగా ఒక క్రీడకు అకాడమీని స్థాపించి అభివృద్ధి చేయడం చాలా గొప్ప విషయం. అలాంటిది ఇన్ని అకాడమీలను ఏర్పాటు చేసి వాటిలో వేల సంఖ్యలో క్రీడాకారులకు విద్య, వసతి కలి్పంచి చేరదీయడం చాలా గొప్ప విషయం. ప్ర: క్రీడాకారులకు భవిష్యత్తులో మీ వంతు సాయం చేస్తారా? జ: తప్పకుండా. నేను నా వంతు సహాయం చేస్తాను. అనంత క్రీడాకారులకు ప్రతి అంశంలోను తోడుగా ఉండేందుకు ప్రయతి్నస్తా. ప్ర: ఇక్కడి క్రీడాకారులకు మీ సలహా? జ: ఇది ఒక క్రీడా సంగ్రామం. అంతర్జాతీయ స్థాయి శిక్షణను ప్రతి క్రీడాకారుడు సద్వినియోగం చేసుకోవాలి. క్రీడాకారులు వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. అప్పుడే క్రీడాకారుడు తను కోరుకున్న ప్రధాన లక్ష్యానికి చేరుకుంటాడు. క్రీడలను ఆడడం కాదు.. వాటిని ఆస్వాదించండి. అప్పుడే అవి మిమ్మల్ని ఉన్నత క్రీడాకారులుగా ఎదిగేందుకు దోహదం చేస్తాయి. ప్ర: అనంతతో మీ అనుభూతి ఎలాంటిది జ: ఇది నా జీవితంలో మరిచిపోలేని చోటు. ఇది ఆరంభంగానే భావిస్తున్నా. అవకాశం ఉన్న ప్రతిసారీ ఇక్కడికి వచ్చేందుకు ప్రయత్నిస్తా. ప్రతి గ్రామంలో క్రీడలను ప్రోత్సహిస్తున్న ఆర్డీటీ సంస్థకు నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అనంతపురంలో ప్రత్యక్షమైన గిల్క్రిస్ట్
సాక్షి, అనంతపురం: భారత్తో క్రికెట్కు ప్రోత్సాహం బాగుందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్క్రిస్ట్ అన్నాడు. గురువారం కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామానికి వెళుతూ మార్గమధ్యలో అనంతపురంలోని ఆర్డీటీ క్రికెట్ స్టేడియంను అతడు సందర్శించాడు. క్రీడా వసతులను పరిశీలించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్డీటీ క్రికెట్ స్టేడియం అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. ఇండియాలో క్రికెట్ను బాగా ఆరాధిస్తున్నారని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో భారత జట్టు ప్రదర్శన చాలా బాగుందని, మిగిలిన జట్లకు టీమిండియా ప్రమాదకరంగా మారిందన్నారు. ఆసీస్ జట్టు ఆటతీరుపై స్పందిస్తూ.. సహజంగా ఒక్కోసారి కొన్ని మార్పులు జరుగుతుంటాయని, ఫీల్డింగ్లో కాస్త తడబాటు ఉందని గిల్క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. అతడి వెంట ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ తదితరులు ఉన్నారు. కాగా, కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామం సోలార్ విద్యుత్ సదుపాయం ఏర్పాటుకు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైంది. విలేజ్ ఎనర్జీ సంస్థ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు గిల్క్రిస్ట్ ఇక్కడికి వచ్చారు. -
గిల్క్రిస్ట్ నీ ఏడుపు ఆపు: భజ్జీ
న్యూఢిల్లీ : ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో డీఆర్ఎస్ విధానం ఎంత కీలకపాత్ర పోషింస్తుందో అందరికి తెలిసిందే. అంపైర్ పొరపాటుగా అవుట్ ఇచ్చినా బ్యాట్సమెన్ వెంటనే డీఆర్ఎస్ను కోరి సత్ఫలితాలు సాధిస్తున్నారు. అటు బౌలింగ్ చేసే జట్లు కూడా డీఆర్ఎస్ ద్వారా అనుకున్న ఫలితాలు సాధిస్తున్నాయి. తాజాగా విండీస్తో జరిగిన టెస్టు సిరీస్లో బుమ్రా హ్యాట్రిక్ సాధించిన విషయం తెలిసిందే. కాగా, రెండో టెస్టు మ్యాచ్లో 44వ ఓవర్లో బుమ్రా వేసిన బంతిని కోహ్లి డీఆర్ఎస్ కోరడంతో బుమ్రా హ్యాట్రిక్ ఘనతను నమోదు చేశాడు. తాజాగా ఆస్ట్రేలియన్ మాజీ వికెట్కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ ట్విటర్లో స్పందిస్తూ ' తానూ ఆడే రోజుల్లో డీఆర్ఎస్ లేకపోవడం వల్లే హర్భజన్ సింగ్ హ్యాట్రిక్ సాధించాడని' పేర్కొన్నాడు. దీనిపై భజ్జీ స్పందిస్తూ 'ఆరోజు నువ్వు మొదటి బంతికే ఔటవ్వకపోతే ఎక్కువసేపు ఆడేవాడివి అనుకుంటున్నావా ? గిల్లీ ! ఇప్పటికైనా నీ ఏడుపు ఆపు.. నువ్వు ఆడిన రోజుల గురించి మాట్లాడడం నీకు సరైనదిగానే కనిపిస్తుంది. కానీ అప్పటి నిర్ణయాలు అయితే మారవు, దానికి నువ్వే ఉదాహరణ, ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటావు అంటూ' భజ్జీ చురకలంటించాడు. ఈడెన్గార్డెన్ వేదికగా 2001లో ఆసీస్తో జరిగిన టెస్టులో హర్భజన్ సింగ్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. 72వ ఓవర్లో వరుసబంతుల్లో రికీ పాంటింగ్, గిల్క్రిస్ట్, షేన్వార్న్లను ఔట్ చేశాడు. No DRS 😩 https://t.co/3XsCqk9ZiR — Adam Gilchrist (@gilly381) August 31, 2019 -
వైరల్: ధోని షార్ట్ రన్.. కనిపెట్టని అంపైర్లు!
అడిలైడ్ : ఫీల్డ్ అంపైర్ల అలసత్వం మరోసారి చర్చనీయాంశమైంది. టెక్నాలజీ యుగంలో కూడా అంపైర్లు పదేపదే తప్పు చేస్తున్నారు. ఇటీవల ఈ తరహా ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగిన తొలి వన్డేలో టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని వికెట్ విషయంలో పప్పులో కాలేసిన అంపైర్లు.. మంగళవారం జరిగిన రెండో వన్డేలో మరో తప్పిదం చేశారు. తొలి వన్డేలో చేసిన తప్పిదం భారత్ విజయవకాశాలను దెబ్బతీయగా.. రెండో వన్డేలో మాత్రం కలిసొచ్చింది. ఈ మ్యాచ్లో కోహ్లి సెంచరీ, ధోని అద్భుత ఇన్నింగ్స్లు భారత విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే ఆసీస్ బౌలర్ నాథన్ లయన్ వేసిన 45వ ఓవర్లో ధోని షార్ట్ రన్ (పరుగు పూర్తి చేయకపోవడం) తీశాడు. దీన్ని అంపైర్లు గుర్తించలేదు. కనీసం ఆసీస్ ఆటగాళ్లు కూడా కనిపెట్టలేకపోయారు. ఈ విషయాన్ని ఆసీస్ మాజీ ఆటగాడు ఆడమ్ గిల్క్రిస్ట్ బయటపెట్టడంతో దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సిరీస్ అఫిషియల్ బ్రాడ్కాస్టర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న గిల్క్రిస్ట్ ఈ ఘటనపై మాట్లాడుతూ.. అంపైర్లు ధోని షార్ట్ రన్ను గుర్తిస్తే భారత్ గెలుపుపై ప్రభావం చూపేదని అభిప్రాయపడ్డాడు. ఇక బిగ్బాష్ లీగ్లో అంపైర్ తప్పిదంతో ఆసీస్ బ్యాట్స్మెన్ డీఆర్సీ షార్ట్ సెంచరీ చేజారడం, మైకేల్ క్లింగర్ అనే మరో బ్యాట్స్మెన్ ఏడో బంతికి ఔటవ్వడం తెలిసిందే. చదవండి : అంపైర్ తప్పిదమే కోహ్లిసేన కొంపముంచిందా? అంపైర్ తప్పిదం.. సెంచరీ మిస్ ఓవర్లో ఏడో బంతికి బ్యాట్స్మన్ ఔట్! -
గిల్క్రిస్ట్తో కోహ్లి ముచ్చట్లు
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో టీమిండియా బుధవారం జరిగే మొదటి టీ20లో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు సోమవారం నెట్స్లో తీవ్రంగా శ్రమించారు. ఆదివారమే గబ్బా స్టేడియం వేదికగా తొలి రోజు ట్రైనింగ్ సెషన్లో పాల్గొన్న టీమిండియా.. రెండో రోజు కూడా నెట్స్లో తీవ్రంగా శ్రమించింది. దీనిలో భాగంగా మాజీ ఆసీస్ వికెట్ కీపర్ గిల్క్రిస్ట్తో విరాట్ కోహ్లి కాసేపు సరదాగా ముచ్చటించాడు. ఆ ఫోటోలను బీసీసీఐ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. కోహ్లితో పాటు ధావన్, రాహుల్లు కూడా కొంత సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. బౌలర్ బుమ్రా కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం విశేషం. బుధవారం ఆరంభమయ్యే టీ20 సిరీస్లో తాము కేవలం కెప్టెన్ విరాట్ కోహ్లి మీద దృష్టిపెడితే సరిపోదని ఆస్ట్రేలియా ఫాస్ట్బౌలర్ నాథన్ కౌల్టర్నైల్ అన్నాడు. భారత ఓపెనర్ రోహిత్ శర్మ సైతం ప్రమాదకర ఆటగాడే అని చెప్పాడు. -
టీమిండియా విదేశీ సిరీస్లు గెలవాలంటే..
బెంగళూరు: నాణ్యమైన బ్యాట్స్మెన్లతో పాటు బలమైన బౌలింగ్ లైనప్ ప్రస్తుత టీమిండియా క్రికెట్ జట్టు సొంతమని ఆసీస్ మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. కానీ విదేశాల్లో మ్యాచ్లకు వచ్చేసరికి భారత క్రికెట్ జట్టు మానసిక స్థైర్యాన్ని కోల్పోతుందని పేర్కొన్నాడు. టీమిండియా విదేశీ సిరీస్లను గెలవాలంటే ముందుగా మానసికంగా మరింత ధృడంగా తయారు కావాలన్నాడు. ఈ క్రమంలోనే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై గిల్క్రిస్ట్ ప్రశంసలు కురిపించాడు. ‘ విదేశీ సిరీస్లు ఎవరికైనా సవాల్తో కూడుకున్నవే. భారత జట్టు బౌలింగ్ యూనిట్, బ్యాటింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉంది. విరాట్ కోహ్లి వంటి ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్మన్ భారత జట్టులో ఉన్నాడు. విదేశాల్లో సిరీస్లను గెలిచే సత్తా భారత జట్టుకు ఉంది. కాకపోతే ఇక్కడ తగినంత మానసిక ధృడత్వం కావాలి’ అని గిల్క్రిస్ట్ పేర్కొన్నాడు. మరొకవైపు ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్ను టీమిండియా కోల్పోవడంపై మాట్లాడటానికి గిల్క్రిస్ట్ నిరాకరించాడు. ఈ సిరీస్ లైవ్ను తాను చూడలేదని, కేవలం హైలెట్స్ మాత్రమే చూశానన్నాడు. దాంతో సిరీస్లో టీమిండియా ఓవరాల్ ప్రదర్శనపై కామెంట్ చేయడం సరైనది కాదన్నాడు. కాకపోతే భారత జట్టు చిరస్మరణీయమైన విజయాలు సాధించడంలో కెప్టెన్ కోహ్లి పాత్ర ప్రధానమన్నాడు. జట్టును సానుకూల ధోరణితో కోహ్లి నడిపించే తీరు అద్భుతంగా ఉందన్నాడు. తనకు కోహ్లిలో నచ్చేది అతని దూకుడేనని గిల్క్రిస్ట్ పేర్కొన్నాడు. -
'ధోని వెళ్లిపోతే శూన్యత తప్పదు'
న్యూఢిల్లీ:టీమిండియా క్రికెట్ ను ఉన్నత శిఖరాలకు చేర్చిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు ఆడమ్ గిల్ క్రిస్ట్ ప్రశంసలు కురిపించాడు. భారత్ జట్టుకు అతని విశేష అనుభవం ఎంతో అమూల్యమైదంటూ కొనియాడాడు. అతని సేవల్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదంటూ ఈ సందర్బంగా గిల్లీ స్పష్టం చేశాడు. భారత జట్టు నుంచి ధోని వీడ్కోలు తీసుకున్న మరుక్షణమే శూన్యత తప్పదని అభిప్రాయపడ్డాడు. 'ధోని జట్టులో భారత్ కు సానుకూలాంశం. భారత జట్టులో మూడు నుంచి ఏడో స్థానం వరకూ బ్యాటింగ్ చేసే సామర్థ్యం ధోనిలో ఉంది. అతడి అనుభవం ద్వారా భారత జట్టు అనుకున్న దాని కంటే ఎక్కువ ప్రయోజనమే పొందుతుంది. కాకపోతే కొంతమంది ధోనిని తక్కువ చేస్తున్నారేమో అనిపిస్తోంది. అలా చేస్తే కచ్చితంగా తప్పుచేసినట్లే. గత కొంతకాలంగా ధోని ఆడుతున్నాడో నేనైతే చూడలేదు. కానీ ధోనికి బాధ్యత అప్పచెబితే మాత్రం దానికి సార్ధకత చేకూర్చడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాడు. ప్రస్తుత విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టుకు ధోని అవసరం చాలా ఉంది. జట్టు నుంచి ధోని వెళ్లిపోతే అతని స్థానాన్ని ఎవ్వరూ పూడ్చలేరు'అని గిల్లీ పేర్కొన్నాడు. -
అతనిలా బ్యాటింగ్ చేయాలని ఉండేది:సెహ్వాగ్
న్యూఢిల్లీ:దాదాపు పదిహేడేళ్ల ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఇప్పటి జట్టుకు చాలా వ్యత్యాసం ఉందని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి స్పష్టం చేశాడు. ఇప్పటి ఆసీస్ జట్టు చాలా బలహీనంగా ఉందని గతంలోనే వ్యాఖ్యానించిన సెహ్వాగ్.. మరోమారు ఆ విషయాన్ని వీవీఎస్ లక్ష్మణ్తో కలిసి ‘బోల్ వీరూ బోల్’ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో పేర్కొన్నాడు. ఆ క్రమంలోనే తన పాత జ్ఞాపకాల్ని నెమరవేసుకున్న సెహ్వాగ్.. ఆసీస్ దిగ్గజ ఆటగాడు గిల్ క్రిస్ట్ పై ప్రశంసలు కురిపించాడు. 'అతనొక భయంకరమైన బ్యాట్స్ మన్. అతని బ్యాటింగ్ ను చూడటాన్ని ఎప్పుడూ ఇష్టపడేవాణ్ని. ఆ సమయంలో ఆసీస్ జట్టులో దూకుడుగా ఉన్న ఆటగాళ్లలో గిల్లీ ఒకడు. అప్పట్లో గిల్లీది ఆసీస్ జట్టులో ప్రధాన పాత్ర. అటు బ్యాట్స్ మన్ గా, కీపర్ గా గిల్ క్రిస్ట్ తన పాత్రను సమర్ధవంతంగా నిర్వర్తించేవాడు. అతనిలా బ్యాటింగ్ చేయాలని ఉండేది. గిల్లీ అవుటైనా మైదానం నుంచి వెళ్లేవాడు కాదు. ఒకసారి ఆసీస్-పాకిస్తాన్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఆ మ్యాచ్ లో పాక్ విజయం దాదాపు ఖాయం. లాంగర్ తో గిల్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఒక ఫాస్ట్ బౌలర్ వేసిన బంతికి గిల్లీ అవుటయ్యాడు. కానీ అతను మైదానాన్ని వీడి వెళ్లలేదు. అంపైర్ కూడా దాన్ని నాటౌట్ గా ప్రకటించాడు. మరో సందర్భంలో ప్రపంచకప్ సెమీ ఫైనల్లో పాకిస్తాన్ తో మ్యాచ్ జరుగుతుంటే ఇలాంటి సన్నివేశమే చోటు చోసుకుంది. అతనికి ఎప్పుడు వెళ్లాలో.. ఎప్పుడు వెళ్లకూడదో బాగా తెలుసు. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ప్రతీ విషయాన్ని చాలా జాగ్రత్తగా అంచనా వేసేవాడు. గిల్లీ ఒక అసాధారణ ఆటగాడు'అని సెహ్వాగ్ కొనియాడాడు. -
'నన్ను దాటిన ధోనికి అభినందనలు'
సిడ్నీ:తన రికార్డును అధిగమించిన భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు ఆడమ్ గిల్ క్రిస్ట్ అభినందనలు తెలియజేశాడు. గత రెండు రోజుల క్రితం వెస్టిండీస్ తో జరిగిన నాల్గో వన్డేలో ధోని (54) హాఫ్ సెంచరీ నమోదు చేసి ఈ ఫార్మాట్ లో 9,496 పరుగుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, అంతకుముందు జరిగిన మూడో వన్డేల్లో ధోని 78 పరుగులు చేసి ఆడమ్ గిల్ క్రిస్ట్(9,410 పరుగులు) రికార్డును బధ్దలు కొట్టాడు. అయితే నాల్గో వన్డే తరువాత ధోనికి ప్రత్యేక మెసేజ్ ద్వారా గిల్లీ అభినందలు తెలియజేశాడు. 'నన్ను దాటిన ధోనికి అభినందనలు. యువ ధోని ఎప్పుడూ ప్రత్యేకమే' అంటూ ఇన్స్టాగ్రామ్ లో పేర్కొన్నాడు. ఈ మేరకు ఇరువురు ఐపీఎల్లో కెప్టెన్లుగా ఉన్న నాటి ఫోటోను జత చేశాడు. ఇక్కడ శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరా(14,234) తొలిస్థానంలో ఉన్నాడు. -
ఆసీస్ అయితే ముందుగా బ్యాటింగ్కు దిగేది: గిల్క్రిస్ట్
టాస్ గెలిచి కూడా ఫ్లాట్ ట్రాక్పై ఫీల్డింగ్కు దిగడంపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే చాంపియన్స్ ట్రోఫీలాంటి పెద్ద ఈవెంట్ ఫైనల్లో ముందుగా బ్యాటింగ్కు దిగడమే ఉత్తమమని ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్క్రిస్ట్ అభిప్రాయపడ్డారు. ‘నేను పెర్త్ నుంచి ఢిల్లీకి వచ్చే ముందు టాస్ వేయడం చూశాను. అయితే ఆసీస్ జట్టు కచ్చితంగా ఇలాంటి మ్యాచ్ల్లో ముందుగా బ్యాటింగ్కు దిగి ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని విధించేలా చేస్తుంది. కానీ ఈ టోర్నీలో ఎక్కువగా చేజింగ్ జట్లే విజయం సాధించాయి. అందుకే కోహ్లి నిర్ణయాన్ని కూడా పూర్తిగా తప్పుపట్టడానికి లేదు’ అని భారత్లో ఆసీస్ విద్యా రాయబారిగా ఉన్న గిల్క్రిస్ట్ అన్నారు. -
హార్దిక్ బ్యాటింగ్ రికార్డు
లండన్:చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో భారత్ 180 పరుగుల తేడాతో దారుణమైన ఓటమిని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. భారత్ జట్టు సమష్టిగా విఫలమై ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే నిన్నటి భారత క్రికెట్ జట్టు ప్రదర్శనలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మెరుపులు తప్పితే పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. పాకిస్తాన్ విసిరిన 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హార్దిక్ చెలరేగి ఆడి భారత్ అభిమానుల్లో కాసేపు జోష్ ను తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆటగాడు ఆడమ్ గిల్ క్రిస్ నెలకొల్పిన రికార్డును హార్దిక్ బద్దలు కొట్టాడు. ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ల్లో వేగవంతంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 32 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేసి ఐసీసీ ఫైనల్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా గిల్ క్రిస్ 33 బంతుల్లో నెలకొల్పిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును సవరించాడు. ఆ రికార్డును 18 ఏళ్ల క్రితం గిల్లీ నెలకొల్పాడు. 1999 వరల్డ్ కప్ లో గిల్ క్రిస్ట్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును సాధించగా, దాన్ని ఇంతకాలానికి హార్దిక్ పాండ్యా అధిగమించాడు. -
కోహ్లి గొప్ప నాయకుడు
ఆసీస్ మాజీ ఆటగాళ్ల ప్రశంసలు మెల్బోర్న్: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లిపై కక్ష కట్టిన ఆస్ట్రేలియా మీడియా తమ అసత్య కథనాలతో విమర్శిస్తున్నా ఆ దేశ మాజీ క్రికెటర్లు మాత్రం అతడిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. మైకేల్ క్లార్క్ ఇప్పటికే తన మద్దతు ప్రకటించగా తాజాగా దిగ్గజ ఆటగాళ్లు స్టీవ్ వా, ఆడమ్ గిల్క్రిస్ట్ కూడా ఇదే బాటలో పయనించారు. ‘కోహ్లి అద్భుత నాయకుడు. తనతోపాటుగా జట్టును, దేశాన్ని నడిపిస్తున్నాడు. ధర్మశాలలో తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తాడేమోనని భయంగా ఉంది. ప్రస్తుత వివాదాన్ని ఇరు జట్లు సామరస్యంగా పరిష్కరించుకోవాలి. 2008 మంకీగేట్లా ఇది కాకూడదనే అనుకుంటున్నాను. 2001 అనంతరం జరుగుతున్న అద్భుత సిరీస్ ఇదేనని చాలామంది చెబుతున్నారు’ అని గిల్లీ తెలిపారు. మరోవైపు కోహ్లి కెప్టెన్సీలో తనతోపాటు రికీ పాంటింగ్ లక్షణాలు కనిపిస్తున్నాయని మాజీ కెప్టెన్ స్టీవ్ వా కొనియాడారు. ‘భారత క్రికెట్కు అతడు కొత్త ముఖచిత్రం. దూకుడైన కెప్టెన్గా చెప్పవచ్చు. జట్టు ఆటగాళ్లతో నిరంతం సంభాషిస్తూ ముందుకెళతాడు. సానుకూల దృక్పథంలో నన్ను గుర్తు చేస్తున్నాడు. పాంటింగ్లోనూ ఇలాంటి లక్షణాలే కనిపించేవి’ అని వా అన్నారు. -
కోహ్లీపై ఆసీస్ దిగ్గజం ప్రశంసల జల్లు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆసీస్ దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ గొప్ప నాయకుడని, ఇప్పటికైనా ఆస్ట్రేలియా.. భారత్ జట్లు డీఆర్ఎస్ వివాదాన్ని పక్కనపెట్టి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాలని గిల్ క్రిస్ట్ అన్నాడు. ఈ సిరీస్లో ఇంకా కోహ్లీ బ్యాట్ నుంచి తగినన్ని పరుగులు రావాల్సి ఉంది. ధర్మశాలలో శనివారం నుంచి జరిగే చివరి టెస్టులో కోహ్లీ తనదైన ఆట చూపిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. కోహ్లీ తన జట్టుతో పాటు మొత్తం దేశాన్ని తనతో తీసుకెళ్తాడని ప్రశంసించాడు. ధర్మశాల టెస్టులో కోహ్లీ వీరవిహారం చేస్తే ఎలా ఉంటోందనని తాను భయపడుతున్నట్లు గిల్క్రిస్ట్ తెలిపాడు. ఇది చాలా అరుదైన సిరీస్ అని, రెండు జట్లు జాగ్రత్తగా కూర్చుని.. ఇప్పటివరకు తాము చెప్పిన విషయాలను వేరేగా ఎలా చెప్పచ్చో ఆలోచించుకోవాలని సూచించాడు. 2008లో ఇలాంటి వివాదమే ఏర్పడి అది బాగా ఎక్కువకాలం సాగిందని, ఇప్పుడు అలా కాకుండా వీలైనంత త్వరగా ఆ వివాదాన్ని ముగించుకోవాలని అన్నాడు. భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ శత్రుత్వంలో వివాదాలు కూడా అంతర్భాగమేనని తన కాలం నాటి ప్రముఖ వికెట్ కీపర్, బ్యాట్స్మన్ అయిన గిల్క్రిస్ట్ సరదాగా చెప్పాడు. సిరీస్ అయిపోయే సమయానికి రెండు జట్ల మధ్య మంచి గౌరవభావం ఉంటుందని, రెండు జట్లు చాలా మంచి పోటీ ఇస్తాయని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత సిరీస్లో ఆసీస్ పెర్ఫామెన్స్ చూసి తాను చాలా ఆశ్చర్యపోతున్నట్లు తెలిపాడు. అసలు వాళ్లు ఇంత బాగా ఎలా ఆడగలిగారోనని అందరూ ఆశ్చర్యపోతున్నారన్నాడు. ఇది భలే అద్భుతమైన సిరీస్ అని, భారతదేశంలో తాము 2001 నుంచి చూసిన వాటిలో ఇదే బెస్ట్ సిరీస్ అని చాలామంది చెబుతున్నట్లు గిల్లీ చెప్పాడు. -
దక్షిణాఫ్రికాకు మరో విజయం
వెల్లింగ్టన్: ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన దక్షిణాఫ్రికా... న్యూజిలాండ్తో శనివారం జరిగిన మూడో వన్డేలో 159 పరుగులతో నెగ్గింది. మొదట దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్లకు 271 పరుగులు చేసింది. కెప్టెన్ ఏబీ డివిలియర్స్ (85; 7 ఫోర్లు, ఒక సిక్స్), డి కాక్ (68; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించారు. ఈ మ్యాచ్ ద్వారా డివిలియర్స్ వన్డేల్లో అత్యంత వేగంగా (205 ఇన్నింగ్స్లో), తక్కువ బంతుల్లో (9,005) 9 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్మన్గా రికార్డు సృష్టించాడు. సౌరభ్ గంగూలీ (228 ఇన్నింగ్స్లో), గిల్క్రిస్ట్ (9,328 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డులను డివిలియర్స్ తిరగరాశాడు. 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 32.2 ఓవర్లలో 112 పరుగులకు కుప్పకూలింది. ప్రిటోరియస్ 5 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... రబడ, పార్నెల్, ఫెలుక్వాయోలకు రెండేసి వికెట్లు లభించాయి. -
ఆ సిక్స్ ఎప్పటికీ నిలిచే ఉంటుంది:గిల్ క్రిస్ట్
-
ఆ సిక్స్ ఎప్పటికీ నిలిచే ఉంటుంది:గిల్ క్రిస్ట్
సిడ్నీ: మనకు ఆడమ్ గిల్ క్రిస్ట్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సిక్సర్లను అతి సునాయసంగా కొట్టగలిగే క్రికెటర్లలో గిల్ క్రిస్ట్ ఒకడు. ఈ ఆసీస్ దిగ్గజాన్ని భారత ట్వంటీ 20 మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కొట్టిన సిక్స్ ఎంతగానో ఆకట్టుకుందట. శనివారం ఆరంభమైన మహిళల బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా సిడ్నీ థండర్స్ తరపున బరిలోకి దిగిన హర్మన్ ప్రీత్(47 నాటౌట్;28 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించింది. బీబీఎల్ లో ఆడుతున్న తొలి మ్యాచ్లోనే హర్మన్ అలరించింది. అయితే ఇక్కడ హర్మన్ కొట్టిన మూడు సిక్సర్లలో ఒక సిక్సర్ను మాత్రం గిల్ క్రిస్ట్ ప్రత్యేకంగా అభినందించాడు. ఆ మ్యాచ్కు వ్యాఖ్యాతగా ఉన్న గిల్లీ.. అది కచ్చితమైన క్రికెట్ షాట్ అంటూ కొనియాడాడు. ఆ షాట్ క్రికెట్లో ఎప్పటికీ నిలిచే ఉంటుందంటూ ప్రశంసించాడు. ఇదిలా ఉండగా, ఈ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన సిడ్నీ థండర్స్ ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసి మెల్బోర్న్ స్టార్స్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 141 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిచింది మాత్రం హర్మన్ ప్రీత్ కౌరే కావడం విశేషం. హర్మన్ కొట్టిన సిక్సర్ను డబ్యూబీబీఎల్(మహిళల బిగ్ బాష్ లీగ్) యాజమాన్యం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. -
'ఆ ఇద్దరి బౌలర్లకు మాత్రమే భయపడేవాణ్ని'
న్యూఢిల్లీ: దూకుడైన బ్యాటింగ్తో ఎందరో బౌలర్లకు చుక్కలు చూపించిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం ఆడమ్ గిల్క్రిస్ట్.. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో స్పిన్ బౌలర్లు ముత్తయ్య మురళీధరన్, హర్భజన్ సింగ్ల మాత్రమే భయపడ్డానని చెప్పాడు. ఢిల్లీకి వచ్చిన గిల్క్రిస్ట్.. పాఠశాల విద్యార్థులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా కొంతమంది పిల్లలు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఎవరి బౌలింగ్కు భయపడేవారన్న ప్రశ్నకు ఆసీస్ మాజీ కీపర్ సమాధానమిస్తూ.. మురళీ, భజ్జీలకు అని చెప్పాడు. మురళీ వేసే స్పిన్ బంతులను అంచనా వేయలేకపోయేవాడినని, 10 ఏళ్ల పిల్లాడిలా తికమకపడేవాడినని నాటి సంగతులు వెల్లడించాడు. 'ఓ టెస్టు మ్యాచ్లో మురళీ వేసిన తొలి బంతిని ఫోర్ బాదాను. రెండో బంతిని షాట్ ఆడబోగా, గాల్లోకి లేచింది. అంతే క్యాచ్ అవుటయ్యాను. తర్వాతి మ్యాచ్లో మురళీ బౌలింగ్లో తొలి బంతికే అవుటయ్యాను' అని గిల్ క్రిస్ట్ చెప్పుకొచ్చాడు. తనతో పాటు సహచర క్రికెటర్ మైకేల్ హస్సీ కూడా మురళీ బౌలింగ్లో ఆడేందుకు ఇబ్బందిపడేవాడని చెప్పాడు. -
మెకల్లమ్ 'సిక్సర్ల' ఘనత
దునేదిన్:న్యూజిలాండ్ క్రికెట్ కెప్టెన్ మెకల్లమ్ టెస్టుల్లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో మెకల్లమ్ ఒక ఓవర్ లో రెండు సిక్సర్లు బాది వంద సిక్సర్ల క్లబ్ లో చేరిపోయాడు. ఆదివారం నాల్గో రోజు ఆటలో భాగంగా శ్రీలంక స్పిన్నర్ హెరాత్ ఓవర్ ను ఎదుర్కొన్న మెకల్లమ్(17 నాటౌట్; ఆరు బంతుల్లో 2 సిక్సర్లు) హిట్టింగ్ చేసి ఆ ఘనతను అందుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా లెజెండ్ ఆటగాడు ఆడమ్ గిల్ క్రిస్ట్ సరసన మెకల్లమ్ నిలిచాడు. కాగా గిల్ క్రిస్ట్ 96 మ్యాచ్ ల్లో 100 సిక్సర్లను పూర్తి చేసుకుంటే, మెకల్లమ్ 98 మ్యాచ్ ల్లో ఆ ఘనతను సాధించాడు. ఆ తర్వాత స్థానాల్లో క్రిస్ గేల్(98), కల్లిస్(97), వీరేంద్ర సెహ్వాగ్(91 సిక్సర్లు) లు ఉన్నారు. ఇదిలా ఉండగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ 405 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. 171/1 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం నాల్గో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 267/3 వద్ద డిక్లేర్ చేసి భారీ లక్ష్యాన్ని శ్రీలంక ముందుంచింది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో టామ్ లాథమ్(109నాటౌట్) విలియమ్సన్(71) రాణించి న్యూజిలాండ్ భారీ స్కోరుకు సహకరించారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 141 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక 50.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. కరుణరత్నే(29), కుశాల్ మెండిస్(46)ల, జయసుందర్(3) లు పెవిలియన్ కు చేరగా, చండీమాల్(31 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నాడు. ఇంకా శ్రీలంక విజయానికి 296 పరుగులు చేయాల్సి ఉండగా, ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. -
కోహ్లీపై ఆసీస్ దిగ్గజం ప్రశంసల వర్షం
న్యూఢిల్లీ: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ప్రశంసల జల్లులు కురిపించాడు. చాలా రోజుల తర్వాత టీమిండియా విదేశీ గడ్డపై విజయం సాధించిందని, కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకున్న కఠిన నిర్ణయాల వల్లనే గెలుపు సాధ్యమయిందని ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ వ్యాఖ్యానించాడు. కోహ్లీ సహజసిద్ధమై దూకుడుతోనే భారత జట్టుకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నాడు. నాయకత్వ లక్షణాలను కూడా కోహ్లీ మరిన్ని నేర్చుకోవాలని సూచించాడు. 9 టెస్టుల తర్వాత శ్రీలంకతో కొలంబోలో టెస్టు మ్యాచ్ లో టీమిండియాను కోహ్లీ విజయాన్ని అందించాడని ప్రశంసించాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాలలో ఆ జట్లపై సిరీస్ గెలవాల్సి ఉందన్నాడు. ఇంకా చెప్పాలంటే విరాట్, ఆస్ట్రేలియా ఆటగాడు మైకెల్ క్లార్క్ లాంటి వాడని కితాబిచ్చాడు. కోహ్లీ కూడా క్లార్క్ లాగానే సవాళ్లను సమర్థంగా ఎదర్కొంటాడన్నాడు. క్లార్క్ రిటైర్మెంట్ తర్వాత స్టీవ్ స్మిత్ ఆసీస్ టెస్ట్ కెప్టెన్ అయ్యాడు. అతడు జట్టును విజయపథంలో నడిపస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్ లో ఆసీస్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. -
హాల్ ఆఫ్ ఫేమ్ లో గిల్ క్రిస్ట్ కు చోటు
సిడ్నీ:ఆసీస్ మాజీ క్రికెటర్, కెప్టెన్ ఆడమ్ గిల్ క్రిస్ట్ కు ఆస్ట్రేలియన్ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ -2015లో చోటు లభించింది. గిల్ క్రిస్ట్ తో పాటు, ఆసీస్ మాజీ కెప్టెన్, సెలెక్టర్ జాక్ రైడర్ కూడా హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్నాడు. ఈ మేరకు జనవరి 27వ తేదీన సిడ్నీలో జరిగే అలెన్ బోర్డర్ హాల్ ఆఫ్ ఫేమ్ కార్యక్రమానికి గిల్ క్రిస్ట్, రైడర్ లు హాజరుకానున్నారు. ఇందులో భాగంగానే వారిద్దరూ అలెన్ బోర్డర్ మెడల్ ను అందుకోనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో తెలిపింది. సెలెక్షన్ కమిటీ ఛాయిస్ లో భాగంగా ఈ సంవత్సరం ఆ ఇద్దరు మాజీ ఆటగాళ్లకు హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు కల్పించినట్లు చైర్మన్ డేవిడ్ క్రో తెలిపారు. -
డివిలియర్స్ అరుదైన రికార్డు
పోర్ట్ ఎలిజబెత్: విండీస్తో జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ అరుదైన రికార్డు సృష్టించాడు. తన కెరీర్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా సఫారీ జట్టు ఆడిన ప్రతి మ్యాచ్లోనూ బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్ తనకు 97వది కావడం విశేషం. గతంలో ఇలా ఎలాంటి బ్రేక్ లేకుండా ఆడిన రికార్డు ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ (96) పేరిట ఉంది. ప్రస్తుతం ఆ రికార్డును డివిలియర్స్ బద్దలుకొట్టాడు. -
ఐసీసీ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా పుజారా
ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ మైఖేల్ క్లార్క్ను వరించింది. దీంతోపాటు ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా క్లార్క్కే దక్కింది. ఇక టీమిండియాలో సంచలనాలు సృష్టిస్తున్న ఛటేశ్వర్ పుజారాను ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా ఐసీసీ ప్రకటించింది. దాదాపు ఏడాది క్రితమే పూజా పాబ్రీతో పుజారాకు ఎంగేజ్మెంట్ అయ్యిన విషయం తెలిసిందే. మరోవైపు శ్రీలంకకు చెందిన కుమార సంగక్కరను ఐసీసీ ఓడీఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరించింది. ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ ఆడమ్ గిల్క్రిస్ట్ను ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి తీసుకున్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లకు మాత్రమే ఈ గౌరవం దక్కుతుంది. ఇది ఈసారి గిల్లీకి రావడం గమనార్హం. -
సచిన్ పరిమితికి మించి క్రికెట్ ఆడలేదు:గిల్క్రిస్ట్
న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పరిమితికి మించి క్రికెట్ ను ఆడలేదని ఆసీస్ మాజీ ఆటగాడు ఆడమ్ గిల్క్రిస్ట్ వ్యాఖ్యానించాడు. సచిన్ పరిమితికి మించి క్రికెట్ ను ఆడాడని, ఇప్పటికే రిటైర్ మెంట్ చాలా ఆలస్యమైందన్న పాకిస్తాన్ మాజీ ఆటగాడు జావెద్ మియాందాద్ వ్యాఖ్యలను గిల్లీ ఖండించాడు. సచిన్ టెండూల్కర్ పరిమితికి మించి క్రికెట్ ను ఆడలేదని తాను భావిస్తున్నట్లు తెలిపాడు. వెస్టిండీస్తో జరుగనున్న 200 వ టెస్టు అనంతరం రిటైర్ కానున్న సచిన్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. భారత క్రికెట్ లో సచిన్ ను తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను వేసుకున్నాడని, కెరీర్ మొదలైనప్పట్నుంచి ఇప్పటి వరకూ ఎంతో పరిణితి కనబరిచి ఉన్నత శిఖరాలను అందుకున్నాడని తెలిపాడు. వాలాన్ గాంగ్ యూనివర్శిటీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవరిస్తున్నగిల్క్రిస్ట్ ఆస్ట్రేలియా కమీషన్ ముందు హాజరైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. సచిన్ టెండూల్కర్ ఎప్పుడూ ఒక ప్రత్యేక శైలితో ఉంటూ భారత్ కు సేవలందించాడన్నాడు. అతనిలోని నిబద్ధతే ఇంతకాలం ఆటను కొనసాగించడానికి తోడ్పడిందన్నాడు. ప్రస్తుత టీం ఇండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, శిఖర్ థావన్, విరాట్ కోహ్లిలు స్థిరంగా ఆడుతున్నారన్నాడు.