Rishab Shetty
-
ఛావా ప్రభంజనం.. శివాజీ సినిమా వస్తే ఏమైపోతారో?
మహారాజ్ ఛత్రపతి శివాజీ తనయుడు శంబాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఛావా సినిమా (Chhaava Movie) బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ చిత్రాన్ని అక్కున చేర్చుకుంటున్నారు. ఇది కదా మనం తెలుసుకోవాల్సిన చరిత్ర.. భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన ఘనత అంటూ ఉప్పొంగిపోతున్నారు. నేడు (ఫిబ్రవరి 19) శివాజీ మహారాజ్ 395వ జయంతి.శివాజీ బయోపిక్ఈ సందర్భంగా శివాజీ జీవిత కథపై తీస్తున్న బయోపిక్ పోస్టర్ రిలీజ్ చేశారు. 'కాంతార'తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి (Rishab Shetty) ఈ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. దీనికి ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్న టైటిల్ను ఖరారు చేశారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో భవానీ దేవి ముందు శివాజీ కత్తితో నిలబడి ఉన్నాడు. పోస్టర్ పవర్ఫుల్గా కనిపిస్తోంది. 2027లో రిలీజ్సందీప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2027 జనవరి 21న విడుదల కానుంది. రవి వర్మ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తుండగా రేసుల్ సంగీతం అందించనున్నాడు. ఛావా సినిమాతో విక్కీ కౌశల్ పేరు మార్మోగిపోతోంది. తన కెరీర్లోనే ఇదొక మాస్టర్పీస్గా మిగిలిపోనుంది. రిషబ్కు కూడా శివాజీ అతడి జీవితంలోనే బెస్ట్ సినిమాగా నిలవనుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by SANDEEP SINGH (@officialsandipssingh) చదవండి: సినిమా కోసం కాదు.. రూమ్కు రమ్మని పిలుస్తారు: సనం శెట్టి -
రిషబ్ శెట్టి, ప్రగతిల పెళ్లిరోజు.. ప్రత్యేకమైన ఫోటోలు షేర్ చేసిన జోడి
-
కాంతారగడ
యశవంతపుర: హిట్ మూవీ, జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన కాంతారకు, అలాగే నటుడు రిషభ్ శెట్టి, దర్శక నిర్మాతలకు చిక్కొచ్చిపడింది. నియమాలను ఉల్లంఘించి అటవీ ప్రాంతంలో కాంతార–2 (చాప్టర్ 1) సినిమా చిత్రీకరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. హాసన్ జిల్లా సకలేశపుర తాలూకా గవిగుడ్డలో కాంతార–2 యూనిట్ సినిమా షూటింగ్ చేస్తోంది. అటవీ ప్రాంతంలో పెద్ద మంటలు వేసి షూటింగ్ చేస్తున్నారని స్థానిక నాయకులు కొందరు యసలూరు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పేలుళ్లు కూడా జరుపుతున్నారని, దీని వల్ల ఏనుగులు బెదిరిపోయి గ్రామాల మీదకు వస్తున్నాయని ఆరోపించారు. ప్రశి్నస్తే షూటింగ్ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు చెప్పారు. కావాలంటే మరోచోటుకు వెళ్లి చిత్రీకరణ చేసుకోవాలని, ఇక్కడ మాత్రం వద్దని గ్రామస్తులు కూడా గళమెత్తారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే తాను కోర్టులకైనా వెళతామని చెప్పడం గమనార్హం. షూటింగ్ అనుమతులు ఇలా జిల్లా యసళూరు విభాగం శనివార సంత అనే చోట హేరూరు గ్రామంలో, చుట్టుపక్కల ప్రాంతాలలో జనవరి 3 నుంచి 15 వరకు తాత్కాలిక సెట్టింగ్ల నిర్మాణానికి, 15 నుంచి 25 వరకు షూటింగ్ చిత్రీకరణకు నియమాలతో అనుమతులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హాసన్ ఎసీఎఫ్ మధు, ఆర్ఎఫ్ఒ కృష్ణలు పరిశీలించా. గత 10 రోజుల నుంచి షూటింగ్ జరుగుతోంది. అటవీ ప్రాంతంలోకి వందలాది మంది వస్తూ పోతూ ఉన్నారు. అనుమతులు తీసుకున్న ప్రాంతాలలో కాకుండా ఇతర ప్రాంతాలలో షూటింగ్ జరుగుతోందని కూడా ఆరోపణలు రావడంతో అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. నిజమైతే రద్దు చేయాలి: మంత్రి ఖండ్రేఈ నేపథ్యంలో అక్కడ కాంతార సినిమా షూటింగ్ను రద్దు చేయాలని అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రె అధికారులను ఆదేశించారు. వన్యజీవులు, ప్రకృతికి హాని జరుగుతుంటే తక్షణం షూటింగ్ను బంద్ చేయాలని చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రకృతి పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శికి మంత్రి ఈశ్వరఖండ్రె లేఖ రాశారు. చిత్ర నిర్వాహకులు అడవిలో ఉవ్వెత్తున మంటలను వేసి షూటింగ్ చేయడం, పేలుళ్లు జరిపినట్లు తెలిసిందని మంత్రి ఖండ్రే లేఖలో పేర్కొన్నారు. దీని వల్ల అక్కడ వన్యజీవులు, చెట్లుచేమలకు ముప్పు వస్తుందని పత్రికలలో వార్తలు వచ్చాయని, ఇదే నిజమైతే తక్షణం షూటింగ్ను రద్దు చేయాలని సూచించారు. ఈ పరిణామాలతో షూటింగ్ కొనసాగడం అనుమానంగా ఉంది. -
యువకుడిపై దాడి.. చిక్కుల్లో కాంతార మూవీ టీమ్..!
కాంతార మూవీతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty). 2022లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడమే కాదు.. దేశవ్యాప్తంగా కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబట్టింది. దీంతో రిషబ్ శెట్టి ప్రీక్వెల్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. కాంతారకు ముందు ఏం జరిగిందనే కథాశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కర్ణాటకలోని అటవీ ప్రాంతాల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంతార మూవీ టీమ్ చిక్కుల్లో పడింది. ఈ సినిమా షూటింగ్ వల్ల అటవీ ప్రాంతం నాశనం అవుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కర్ణాటకలోని గవిగుడ్డ అటవీ ప్రాంతంలో కాంతారా చాప్టర్-1 చిత్రీకరణ జరుగుతోంది. దీంతో స్థానికులతో పాటు జిల్లా పంచాయతీ మాజీ సభ్యులు ఆందోళనకు దిగారు. అడవుల్లో పేలుడు పదార్థాల వినియోగిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. దీంతో గవిగుడ్డ, హేరురు గ్రామాల్లోని అటవీ ప్రాంతంలో రహస్యంగా చిత్రీకరణ చేయడంపై స్థానికులు ఆరోపిస్తున్నారు. దీని వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం గడ్డి మైదానంలో చిత్రీకరణకు అనుమతి తీసుకుని.. అటవీ ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి.స్థానిక నేతల సీరియస్సినిమా చిత్రీకరణ వల్ల జంతువులు, పక్షులకు హాని కలుగుతోందని జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు సన్న స్వామి ఆరోపించారు. ఇప్పటికే అడవి ఏనుగుల దాడితో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అడవులను రక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మరింత నష్టం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు.చిత్రబృందంతో వాగ్వాదం..అడవుల్లో పేలుడు పదార్ధాల వినియోగంపై స్థానికులు చిత్ర బృందం సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ గొడవలో స్థానికుడైన హరీష్ అనే యువకుడిపై సిబ్బంది దాడి చేయగా గాయాలైనట్లు సమాచారం. అతన్ని వెంటనే సమీపంలోని సకలేష్పూర్లోని క్రాఫోర్డ్ ఆసుపత్రిలో చేర్పించారు.ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కాంతార మూవీ చిత్రీకరణను వేరే ప్రదేశానికి మార్చాలని.. సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే స్థానికంగా యెసలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.కాగా.. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో కాంతారా: చాప్టర్ 1 తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని కేజీఎఫ్ మేకర్స్, హోంబలే ఫిల్మ్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ ఏడాది గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. కాగా.. 2022లో వచ్చిన కాంతార అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు రిషబ్ శెట్టి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. -
రిషబ్ శెట్టి పోస్ట్.. రష్మిక ఫ్యాన్స్ ఆగ్రహం!
శాండల్వుడ్ స్టార్ రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్తో బిజీగా ఉన్నారు. గతంలో వచ్చిన కాంతార బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. దీంతో ఈ మూవీకి ప్రీక్వెల్గా కాంతార చాప్టర్-2 పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో రిషబ్ శెట్టి చేతిలో త్రిశూలం పట్టి ఉగ్రరూపం దాల్చిన శివుడిలా కనిపించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం దాదాపు 7 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.అయితే రిషబ్ శెట్టి తాజాగా చేసిన ట్వీట్ సరికొత్త వివాదానికి దారితీసింది. ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన కిరిక్ పార్టీ సినిమాను ఉద్దేశించి రిషబ్ పోస్ట్ పెట్టారు. 8 ఏళ్ల కిందట మొదలైన ఈ ప్రయాణం హృదయాలను హత్తుకునే ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చిందన్నారు. కిరిక్ పార్టీని చాలా ప్రత్యేకంగా మార్చిన మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు అంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. ఈ చిత్రానికి రిషబ్ శెట్టి డైరెక్షన్లోనే తెరకెక్కించారు.అయితే ఈ సినిమాతో పుష్ప భామ రష్మిక మందన్నా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే తాజా పోస్ట్లో రిషబ్ ఆమె పేరును ప్రస్తావించలేదు. ఇది చూసిన నెటిజన్స్ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. ఈ సినిమాలో రష్మిక లేకపోతే చెత్త సినిమాగా మారేదని ఓ నెటిజన్ విమర్శించాడు. అంతేకాకుండా రిషబ్ షేర్ చేసిన ఫోటోలు రష్మిక లేకపోవడం ఫ్యాన్స్తో పాటు నెటిజన్స్కు విపరీతమైన కోపం తెప్పించింది. కావాలనే ఆమె పేరును, ఫోటోను పెట్టలేదని కొందరు అభిమానులు మండిపడ్డారు. రిషబ్ పోస్ట్లో తన సోదరుడు రక్షిత్ పేరును మాత్రమే ప్రస్తావించడంపై నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. కాగా.. 2016లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది.ಕಿರಿಕ್ ಪಾರ್ಟಿ ನಮ್ಮ ಜೀವನದ ಭಾಗವಾಗಿ 8 ವರ್ಷಗಳು ಕಳೆದಿವೆ, ಅನೇಕ ಸುಂದರ ನೆನಪುಗಳು ಮತ್ತು ನಿಮ್ಮ ಪ್ರೀತಿ ಈ ಪಯಣವನ್ನು ಅರ್ಥಪೂರ್ಣವನ್ನಾಗಿಸಿವೆ.ನಿಮ್ಮ ಬೆಂಬಲಕ್ಕೆ ಹೃತ್ಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು. 8 years ago, a journey began that touched hearts and created countless memories.Here’s to your love and support… pic.twitter.com/67ehO9dnOz— Rishab Shetty (@shetty_rishab) December 30, 2024 -
ఛత్రపతి శివాజీగా పాన్ ఇండియా హీరో.. పోస్టర్ విడుదల
కన్నడ హీరో రిషబ్ శెట్టి మరో భారీ ప్రాజెక్ట్ను ప్రకటించారు. కాంతార సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ఆయన ప్రస్తుతం అన్నీ పాన్ ఇండియా చిత్రాలనే ఎంపిక చేసుకుంటున్నారు. ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా రానున్న చిత్రం 'ఛత్రపతి శివాజీ మహారాజ్'. భారీ బడ్జెట్ తెరకెక్కను ఈ చిత్రాన్ని ఒక పోస్టర్తో తాజాగా రిషబ్ ప్రకటించారు. సందీప్ సింగ్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం 2027 జనవరి 21న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.శివాజీ మహారాజ్గా రిషబ్ శెట్టి నటించనున్న ఈ చిత్రం మొదటి పోస్టర్ను దర్శకుడు సందీప్ సింగ్ షేర్ చేశారు. 'ఇది కేవలం సినిమా మాత్రమే కాదు.. ఇది అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన ఒక యోధున్ని గౌరవించటానికి నిర్మిస్తున్నాం. యుద్ధ రంగంలో శక్తివంతమైన మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ప్రతిఘటన స్ఫూర్తిని, స్వపరిపాలన కోసం పోరాడిన మరాఠ యోధుడు శివాజీ. అతని జీవితం, వారసత్వం భారతీయ చరిత్రలో చెరగని ముద్రను మిగిల్చాయి' అని ఆయన గుర్తుచేసుకున్నారు. శివాజీ అన్టోల్డ్ స్టోరీతో ప్రేక్షకులకు తాము చూపించబోతున్నట్లు ఆయన అన్నారు.కాంతార సినిమా తర్వాత రిషబ్ శెట్టి మార్కెట్ పాన్ ఇండియా రేంజ్కు చేరుకుంది. ప్రస్తుతం ఆయన చేతిలో అన్నీ భారీ సినిమాలే ఉన్నాయి. కాంతార ప్రీక్వెల్తో పాటు జై హనుమాన్ సినిమా కూడా ఉంది. ఇప్పుడు 'ఛత్రపతి శివాజీ మహారాజ్' వంటి బిగ్ ప్రాజెక్ట్లో ఆయన భాగమైనందుకు ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. 2025,2026,2027 ఇలా వరుసగా రిషబ్ శెట్టి సినిమాలు విడుదల కానున్నాయి.Our Honour & Privilege, Presenting the Epic Saga of India’s Greatest Warrior King – The Pride of Bharat: #ChhatrapatiShivajiMaharaj. #ThePrideOfBharatChhatrapatiShivajiMaharajThis isn’t just a film – it’s a battle cry to honor a warrior who fought against all odds, challenged… pic.twitter.com/CeXO2K9H9Q— Rishab Shetty (@shetty_rishab) December 3, 2024 -
'కాంతార' యూనిట్ ప్రయాణిస్తున్న బస్సు బోల్తా
'కాంతార' సినిమా యూనిట్ సభ్యలకు ప్రమాదం జరిగింది. దీంతో తాత్కాలికంగా షూటింగ్ను మేకర్స్ ఆపేశారు. కన్నడ హీరో రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార1 భారీ విజయం సాధించడంతో ఇప్పుడు దానికి ప్రీక్వెల్ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కర్ణాటకలో జరుగుతుంది. అయితే, చిత్ర యూనిట్కు ప్రమాదం జరగడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.నవంబర్ 24న రాత్రి షూటింగ్ పూర్తి చేసుకుని సుమారు 20 మంది సభ్యులతో ప్రయాణిస్తున్న మినీ బస్సుకు ప్రమాదం జరిగింది. కర్ణాటకలోని జడ్కల్లో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సుమారు ఆరుగురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. జడ్క్ల్లోని మూడూరు నుంచి కొల్లూరుకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో తాత్కాలికంగా కాంతార షూటింగ్ను ఆపేశారు.డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఫోన్ చూస్తూ బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, బస్సులో ఉన్న ఒక ఆర్టిస్ట్ ఆరోపించాడు. ఘటన జరగగానే కొందరు డ్రైవర్పై చేయి చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు. సుమారు రెండేళ్ల క్రితం విడుదలైన 'కాంతార' సినిమాకు ప్రీక్వెల్గా రిషభ్ స్వీయ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్తో హోంబలే ఫిల్మ్స్ దీనిని నిర్మిస్తున్నారు. 2025 అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. -
రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్.. గ్లింప్స్ అదిరిపోయింది!
కన్నడ స్టార్ రిషబ్ శెట్టిని పాన్ ఇండియా రేంజ్లో నిలబెట్టిన చిత్రం కాంతార. కన్నడలో తెరకెక్కించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ను షేక్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీక్వెల్తో బిజీగా ఉన్నారు రిషబ్ శెట్టి. కాంతార: చాప్టర్-1 పేరుతో స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో భారీఎత్తున నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. దాదాపు కాంతార రిలీజైన రెండేళ్ల తర్వాత ప్రీక్వెల్ను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల కాంతార పార్ట్-1 రిలీజ్ డేట్ను కూడా రివీల్ చేశారు. వచ్చే ఏడాది గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా.. ఈ చిత్రానికి అజనీశ్ లోక్నాథ్ సంగీతమందిస్తున్నారు. Step into the sacred echoes of the past 🔥#KantaraChapter1 - Worldwide Grand Release on 𝐎𝐂𝐓𝐎𝐁𝐄𝐑 𝟐, 𝟐𝟎𝟐𝟓.Watch the First Look Teaser ▶️ https://t.co/8cGsjMKXA7#KantaraChapter1onOct2 #Kantara @shetty_rishab @VKiragandur @hombalefilms @HombaleGroup @ChaluveG… pic.twitter.com/vBctAk2Zgs— Hombale Films (@hombalefilms) November 18, 2024 -
'కాంతార 1' రిలీజ్ డేట్ వచ్చేసింది... ఇంత ఆలస్యంగానా?
కాంతార.. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన అద్భుతాలు అన్నీఇన్నీ కావు. కన్నడ స్టార్ రిషభ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేయడంతో పాటు ఏకంగా జాతీయ అవార్డు సైతం గెలిచింది. ఈ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ మూవీకి ప్రీక్వెల్ రెడీ అవుతోంది.రిషబ్ స్వీయ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ విడుదల తేదీ ప్రకటించారు. వచ్చే ఏడాది అక్టోబర్ 2న ‘కాంతార చాప్టర్ 1’ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్లో రిషబ్ ఓ చేతిలో త్రిశూలం, మరో చేతిలో గొడ్డలి పట్టుకుని కనిపించారు.ఇకపోతే ‘కాంతార చాప్టర్ 1’ కోసం నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ప్రత్యేకంగా సిద్ధమయ్యాడు. కేరళలో ఉద్భవించిన పురాతన యుద్ధ కళలలో ఒకటైన కలరిపయట్టులో కఠినమైన శిక్షణ పొందారు. వచ్చే ఏడాది దసరాకు కాంతార 1 ముందుగానే టికెట్ బుక్ చేసుకుంది. మరి ఈ మూవీ ఈసారి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!చదవండి: సమంత యాడ్ వీడియో వైరల్.. గుర్తుపట్టలేకున్న ఫ్యాన్స్ -
రాముడిగా మహేష్.. రావణుడిగా రానా ..!
-
ప్రశాంత్ వర్మ మరో సర్ప్రైజ్.. ఏకంగా బాహుబలి హీరోతో!
ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆయన తెరకెక్కించిన హనుమాన్ సంక్రాంతికి రిలీజై బాక్సాఫీస్ను షేక్ చేసింది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సక్సెస్తో సీక్వెల్ రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు ప్రశాంత్ వర్మ.జై హనుమాన్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో కన్నడ స్టార్, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టిని హనుమాన్గా పరిచయం చేశారు. ఇటీవల దీపావళి సందర్భంగా ఆయన లుక్ను రివీల్ చేశారు. దీంతో సీక్వెల్పై అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. ఇటీవల విడుదలైన జై హనుమాన్ థీమ్ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.అయితే తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ షేర్ చేసిన పిక్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. జై జై హనుమాన్ అని క్యాప్షన్ ఇస్తూ రిషబ్శెట్టి, రానా దగ్గుబాటి, ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ను ట్యాగ్ చేశాడు. ఈ ఫోటోలో టాలీవుడ్ హీరో రానా కూడా ఉన్నారు. ఇది చూసిన నెటిజన్స్.. రానా కూడా జై హనుమాన్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారా? అనే డౌటానుమానం మొదలైంది.ఇప్పటికే రిషబ్ శెట్టిని హనుమాన్గా పరిచయం చేసి సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ.. ఫ్యాన్స్కు మరో గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. రానాను కూడా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో భాగం చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. ఆయన రేంజ్కు తగినట్లు పవర్ఫుల్ రోల్ అయి ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో రానా నటిస్తున్నారా? లేదా? అన్న విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. JAI JAI HANUMAN !! 💪🏽✊🏽😊@shetty_rishab @RanaDaggubati @ThePVCU pic.twitter.com/wwxwOndnr2— Prasanth Varma (@PrasanthVarma) November 4, 2024 -
ఏకంగా 20 చిత్రాల్లో.. రిషబ్ శెట్టి కంటే ముందు హనుమాన్గా నటించిన నటులెవరో తెలుసా?
హనుమాన్ను కేవలం దైవంగానే కాదు.. పిల్లల దృష్టిలో సూపర్ హీరోగానూ వెండి తెర ఆవిష్కరించింది. ప్రశాంత్ వర్మ ‘హను-మాన్’ చిత్రానికి కొనసాగింపుగా రాబోతున్న జై హనుమాన్ చిత్రంలో కన్నడ నటుడు, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హనుమాన్గా కనిపించబోతున్నట్లు మేకర్స్ లుక్ రివీల్ చేశారు. అయితే..గతంలోనూ కొందరు నటులు వెండి తెరపై హనుమంతుడి అవతారంలో ఆడియొన్స్ను మెప్పించే ప్రయత్నమూ చేశారు. వాళ్లెవరంటే..దేవ్దత్తా నాగేఆదిపురుష్(2023).. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్.. రెబల్ స్టార్ ప్రభాస్ను రాముడి(రాఘవ)గా చూపించిన ప్రయత్నం. అయితే ఆకట్టుకోని విజువల్స్, పైగా కంటెంట్ విషయంలోనూ ఆ చిత్రం తీవ్ర విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంది. ఈ చిత్రంలో మరాఠీ నటుడు దేవ్దత్తా నాగే.. హనుమంతుడి(భజరంగ్) పాత్రలో నటించాడు. కానీ, ఆ క్యారెక్టర్ కూడా ఇంటర్నెట్లో నవ్వులపాలవ్వడంతో ఆయన కష్టం వృథా అయ్యింది.ఏ. జనార్ధన రావుతెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆంజనేయస్వామి పాత్రలకు రిఫరెన్స్గా ఈయన్ని చూపిస్తుంటారు. ఏకంగా 20 చిత్రాల్లో ఆ పాత్రలో నటించారాయన. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పుట్టిన జనార్ధన రావు.. 1955లో మిస్టర్ ఇండియా టైటిల్ దక్కించుకున్నారు. కమలాకర కామేశ్వర రావు తీసిన వీరాంజనేయ (1968)చిత్రంలో తొలిసారి ఆయన హనుమాన్ పాత్రలో నటించారు. అయితే తొలి చిత్రంతోనే ప్రేక్షకుల్ని మెప్పించారు. ఆ ప్రభావంతో దాదాపు రెండున్నర దశాబ్దాలపాటు హనుమంతుడి పాత్రల విషయంలో ఆయనకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు దర్శకనిర్మాతలు. అలా.. శ్రీ రామాంజనేయ యుద్ధం, సంపూర్ణ రామాయణం, శ్రీ కృష్ణ సత్య, ఎన్టీఆర్ సూపర్మేన్.. చిత్రాలు ఈనాటికి ఆయన హనుమంతుడి రూపాన్ని ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేశాయి. రాజనాలతెలుగు విలన్లలో అగ్రతాంబూలం అందుకున్న తొలి నటుడు.. బహుశా ఇంటి పేరునే స్క్రీన్ నేమ్గా మార్చుకున్న తొలి నటుడు కూడా ఈయనేనేమో!(రాజనాల కాళేశ్వర రావు). అయితే 1400కి పైగా అన్ని రకాల జానర్ చిత్రాల్లో నటించిన రాజనాల.. హనుమాన్గా కనిపించిన ఒకే ఒక్క చిత్రం ‘శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం’(1972). కానీ, ఆ పాత్రలో మరిచిపోలేని అభినయం కనబర్చారాయన.దారా సింగ్మల్లు యోధుడిగానే కాదు.. ఇటు నటుడిగా, దర్శకుడిగా.. అటు రాజకీయాల్లోనూ రాణించారీయన. ప్రొఫెషనల్ రెజ్లింగ్లో ఏళ్ల తరబడి రాణించిన దారా సింగ్.. ఆ తర్వాత సినీ రంగం వైపు అడుగులేశారు. భజరంగబలి(1976) చిత్రంలో తొలిసారి హనుమాన్గా అలరించి.. ఆ తర్వాత రామానంద సాగర్ ‘రామాయణ్’లో హనుమాన్ క్యారెక్టర్లో జీవించి.. భారతీయ బుల్లితెర చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారాయాన. చిరంజీవిఆంజనేయ స్వామికి కొణిదెల శివశంకర్ వరప్రసాద్కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అప్పటికే అగ్రతారగా వెలుగొందుతున్న టైంలో జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో ఓ ఫైట్ పోర్షన్లో హనుమాన్గా అలరించారాయన. అంతేకాదు.. హనుమాన్(2005) యానిమేటెడ్ చిత్రంలో ఆ పాత్రకు తెలుగు వెర్షన్లో వాయిస్ ఓవర్ కూడా అందించారు.నిర్భయ్ వాద్వాతెలుగులో జనార్ధన రావుకు ఎలాగైతే హనుమాన్ క్యారెక్టర్లు గుర్తింపు తెచ్చి పెట్టాయో.. హిందీ టీవీ సీరియల్స్లో ఈ యువ నటుడికి అదే విధంగా ఆ పాత్ర మంచి గుర్తింపు ఇచ్చింది. సంకట మోచన్ మహాబలి హనుమాన్(2015-17)లో తొలిసారి హనుమంతుడి పాత్రలో నటించిన నిర్భయ్కు.. ఆ తర్వాత మరో రెండు సీరియల్స్లోనూ ఆ రోల్ దక్కింది. ఈ ఏడాది ప్రారంభమైన శ్రీమద్ రామాయణ్లోనూ ఆయన హనుమాన్ రోల్లోనే నటిస్తున్నారు.ప్రశాంత్ శెట్టిప్రశాంత్ శెట్టి.. ఈ పేరు పెద్దగా ఎవరికీ పరిచయం లేకపోవచ్చు. రిషబ్ శెట్టిగా అప్పటిదాకా కన్నడ ఆడియొన్స్ను మాత్రమే అలరిస్తూ వచ్చిన ఈ మల్టీ టాలెంట్ పర్సన్(నటుడు, స్క్రీన్ రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్).. కాంతారతో ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకట్టుకున్నాడు. స్వీయ దర్శకత్వంలో కాంతారను తీసి.. జాతీయ అవార్డుతో పాటు ఫిల్మ్ఫేర్, కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డులనూ దక్కించుకున్నాడు. బహుశా ఆ గుర్తింపే ఆయనకు జై హనుమాన్లో హనుమాన్ క్యారెక్టర్ దక్కడానికి ఓ కారణం అయ్యి ఉండొచ్చు కూడా!.ಕನ್ನಡ ನೆಲದ ವರಸುತ ಆಂಜನೇಯನ ಆಶೀರ್ವಾದದೊಂದಿಗೆ ಭಾರತ ಇತಿಹಾಸದ ಸರ್ವಶ್ರೇಷ್ಠ ಭಾವವೊಂದನ್ನು ತೆರೆಯ ಮೇಲೆ ತರಲಿದ್ದೇವೆ.ನಿಮ್ಮೆಲ್ಲರ ಪ್ರೀತಿ ಬೆಂಬಲ ಆಶೀರ್ವಾದ ಎಂದಿನಂತೆ ಸದಾ ಇರಲಿ - ಜೈ ಹನುಮಾನ್A vow from the Tretayuga, bound to be fulfilled in the Kaliyuga🙏We bring forth an epic of loyalty, courage and… pic.twitter.com/Zvgnt1tGnl— Rishab Shetty (@shetty_rishab) October 30, 2024ఇంకా ఎవరైనా నటీనటులను మరిచిపోయి ఉంటే.. వాళ్లు ఏ భాషకు చెందిన వాళ్లైనా సరే కామెంట్ సెక్షన్లో వాళ్ల పేర్లను మీరు తెలియజేయొచ్చు. -
రిషబ్ శెట్టి 'జై హనుమాన్'.. దీపావళి అప్డేట్ వచ్చేసింది!
హనుమాన్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. ప్రస్తుతం సీక్వెల్పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే జై హనుమాన్లో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టిని పరిచయం చేశారు. హనుమంతుని పాత్రలో రిలీజ్ చేసిన రిషబ్ శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.తాజాగా ఇవాళ దీపావళి సందర్భంగా జై హనుమాన్ థీమ్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'యుగయుగముల యోగమిది దాశరథి' అంటూ సాగే భక్తి సాంగ్ అభిమానులను అలరిస్తోంది. ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా.. సింగర్ రేవంత్ ఆలపించారు. ఈ సాంగ్కు ఓజెస్ సంగీతమందించారు. కాగా.. జై హనుమాన్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. -
జై హనుమాన్ ఫస్ట్ లుక్.. సర్ప్రైజ్ అదిరిపోయిందిగా!
హనుమాన్తో సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి బాక్సాఫీస్ను షేక్ చేసింది. పెద్ద సినిమాలను వెనక్కి నెట్టిన ఈ సినిమా కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు యంగ్ డైరెక్టర్.ఇప్పటికే ప్రాజెక్ట్ను అనౌన్స్ చేయగా.. దీపావళికి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. జైహనుమాన్ పేరుతో తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో కన్నడ స్టార్, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుని పాత్రలో కనిపించనున్నారు. తాజాగా రిలీజైన పోస్టర్లో శ్రీరాముడి విగ్రహాన్ని చేతిలో పట్టుకుని కనిపించారు రిషబ్ శెట్టి.అందరూ ఊహించినట్లుగానే'కాంతార' ఫేమ్ రిషభ్ శెట్టి ఈ పోస్టర్లో హనుమంతుడిగా కనిపించారు. ఈ అద్భుతమైన పోస్టర్ రిషబ్ శెట్టిని హైలైట్ చేయడమే కాకుండా హనుమంతుని భక్తి, శక్తి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పాత్రలో లెజెండరీ యాక్టర్ అద్భుతంగా సెట్ అయినట్లుగా కనిపిస్తోంది. ఈ పాత్రలో రిషబ్ శెట్టిని తెరపై చూడడానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ సీక్వెల్లో ప్రశాంత్ వర్మ మరింత గొప్ప కథను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్లో అది స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సినిమాను ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా మైత్రి మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు In the spirit of Diwali and the guiding light of the divine ✨Honoured to be teaming up with the National Award-winning actor @shetty_rishab sir and the prestigious @MythriOfficial to bring our grand vision #JaiHanuman 🙏🏽Let’s begin this DIWALI with the holy chant JAI HANUMAN… pic.twitter.com/i2ExPsflt2— Prasanth Varma (@PrasanthVarma) October 30, 2024 -
హనుమాన్ సీక్వెల్ లో కాంతారా రిషబ్ శెట్టి
-
జై హనుమాన్లో ‘కాంతార’ హీరో!
‘జై హనుమాన్’ సినిమాలో రిషబ్ శెట్టి నటించే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘హనుమాన్’. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. అలాగే ఈ సినిమాకు సీక్వెల్గా ‘జై హనుమాన్’ రానున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ‘జై హనుమాన్’ సినిమాలో ఎవరు హీరోగా నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. (చదవండి: నటి గౌతమిని మోసం చేసిన సినీ ఫైనాన్సియర్)చిరంజీవి, రామ్చరణ్ వంటి స్టార్స్ను పరిశీలిస్తున్నట్లుగా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన చైతన్య చెప్పారు. అయితే తాజాగా ఈ సినిమాలో కన్నడ హీరో ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, చైతన్య ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ‘కాంతార’ సినిమా ప్రీక్వెల్తో బిజీగా ఉన్నారు రిషబ్ శెట్టి. మరి... ‘జై హనుమాన్’ సినిమాలో రిషబ్ శెట్టి నటించనున్నారనే వార్త నిజమేనా? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. -
ప్రేక్షకుల కళ్లు నా కలర్ మీద నుంచి కాళ్లవైపు మళ్లాయి: నటుడు మిథున్ చక్రవర్తి
‘‘నా చర్మపు రంగు నలుపుగా ఉండటం అనేది నా కెరీర్ ఆరంభంలో పెద్ద సవాల్లా అనిపించింది. నల్లగా ఉన్నవారు నటులుగా ఇండస్ట్రీలో నెగ్గుకురావడం కష్టమన్నట్లు కొందరు మాట్లాడారు. ఇండస్ట్రీ నుంచి వెనక్కి వెళ్లమని కూడా సలహా ఇచ్చారు. ఒకానొక దశలో నా చర్మపు రంగును మార్చమని ఆ దేవుణ్ణి ప్రార్థించాను. ఆ తర్వాత అసలు నేనేం చేయగలను? నా బలం ఏంటి? అని ఆలోచించాను. నేను బాగా డ్యాన్స్ చేయగలనని నా బలం తెలుసుకున్నాను.మంచి డ్యాన్సర్ కావాలనుకున్నాను. అప్పుడు ప్రేక్షకుల కళ్లు నా కలర్ మీద నుంచి కాళ్ల వైపు మళ్లుతాయని అనుకున్నాను. ప్రేక్షకులు నా డ్యాన్స్ను అభిమానించడం ప్రారంభించారు. ఈ క్రమంలో వారు నా కలర్ను మర్చిపోయారు. నేనో సెక్సీ డ్యాన్సర్గా, డస్కీ బెంగాలీ బాబుగా పేరు సంపాదించుకున్నాను’’ అని ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం స్వీకరించిన అనంతరం ఒకింత ఉద్వేగంగా మాట్లాడారు ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి. దేశ రాజధాని ఢిల్లీలో 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం జరిగింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేశారు. 2022 సంవత్సరానికిగాను ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉత్తమ చిత్రం ‘ఆట్టమ్’ (మలయాళం), ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి (కాంతార–కన్నడ), ఉత్తమ నటీమణులుగా నిత్యా మీనన్ (తిరుచిత్రంబలం–తమిళ్), మానసీ పరేఖ్ (కచ్ఎక్స్ప్రెస్–గుజరాతీ) అవార్డు అందుకున్నారు. తెలుగు నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు ‘కార్తికేయ 2’కు దక్కింది. నిర్మాత అభిషేక్ అగర్వాల్ అవార్డు స్వీకరించగా, చిత్రదర్శకుడు చందు మొండేటి, హీరో నిఖిల్ కూడా హాజరయ్యారు. ‘΄పొన్నియిన్ సెల్వన్– 1’కు గానూ ఉత్తమ సంగీతం (నేపథ్య సంగీతం) విభాగంలో ఏఆర్ రెహమాన్ అవార్డు అందుకున్నారు. ఈ వేడుకకు వివిధ భాషల నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఈ వేదికపై ఇంకా మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ – ‘‘ఇప్పటికి మూడు జాతీయ అవార్డులు అందుకున్నాను. తొలి అవార్డు (‘మృగయా’) అందుకున్నప్పుడే నేను చాలా సాధించాననుకున్నాను. ‘మృగయా’ సినిమా స్క్రీనింగ్కి వెళ్లినప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్... అతను ఈ లోకంలో లేడు కాబట్టి పేరు చెప్పను. అతను ‘ఈ సినిమా చాలా బాగుంది. నువ్వు అద్భుతమైన నటుడివి. కానీ ఇలాంటి బట్టలతో నువ్వు ఎలా కనిపిస్తున్నావో తెలుసా?’ అంటే నేను నిర్ఘాంతపోయాను.నేను ఆయన ముందు నగ్నంగా నిలబడ్డానా? అనిపించింది. వెంటనే ఆయన ‘మృగయా’లో నేను చేసిన ఆదివాసీ పాత్ర గురించి చెప్పినట్లు పేర్కొన్నారు. నేను నా తొలి జాతీయ అవార్డు అందుకున్న తర్వాత హాలీవుడ్ యాక్టర్ అల్ పచీనో అంతటి ప్రతిభ నాలోనూ ఉందనుకున్నాను. అకస్మాత్తుగా నా తీరు మారిపోయింది. కొందరు నిర్మాతలతో దురుసుగా ప్రవర్తించాను. నన్ను నేను అల్ పచీనో అనుకుం టున్నానని నిర్మాతలు గ్రహించలేకపోయారు. ఓ సందర్భంలో ఒక నిర్మాతకు కథను నా ఇంటికి పంపాలన్నాను. అతను వెంటనే లేచి నా చెంప చెళ్లుమనిపించాడు. అప్పట్నుంచి నన్ను నేను ఓ అల్ పచీనోలా ఊహించుకోవడం మానేశాను. నాదే తప్పని గ్రహించాను. నా తీరు మార్చుకున్నాను’’ అన్నారు.మంచి మార్పు తీసుకురావాలన్నదే...: రిషబ్ శెట్టిప్రతి సినిమా ప్రభావం ప్రేక్షకుల పై ఉంటుంది. అందుకే ప్రజల్లో, సమాజంలో మంచి మార్పును తీసుకువచ్చే సినిమాలు తీయాలన్నది నా ఉద్దేశం.కష్టానికి ప్రతిఫలం దక్కింది: నిత్యా మీనన్ చిత్రపరిశ్రమలో దాదాపు 15 ఏళ్ల కష్టం నాది. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ అవార్డు. చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతానికి దీన్ని బాధ్యతగా చూడకుండా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం ఇది. ‘తిరుచిత్రంబలం’ బృందానికి, నా సహ నటులకు ఈ అవార్డుని అంకితం ఇస్తున్నాను. ఇదే ఉత్సాహంతో మంచి దర్శకులు, రచయితలతో కలిసి పని చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాను. సినిమాకి సరిహద్దులు లేవు: ఏఆర్ రెహమాన్ సినిమాకి ప్రాంతం, భాష అంటూ ఎలాంటి సరిహద్దులు లేవు. నేను అందుకున్న ఏడో జాతీయ అవార్డు ఇది. సంతోషంగా ఉంది. ఈ అవార్డు నాకు వచ్చేందుకు కారకులైన ఫిల్మ్ మేకర్స్కి, ముఖ్యంగా డైరెక్టర్ మణిరత్నంగారికి ధన్యవాదాలు. -
70వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం.. తెలుగు నుంచి ఒక్కటే
భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 70వ నేషనల్ సినీ అవార్డ్స్ ప్రదానోత్సవం.. న్యూ ఢిల్లీలోని విజయ్ భవన్లో జరుగుతోంది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము.. విజేతలకు అవార్డులని ప్రకటించారు. ఈ వేడుకకు దాదాపు అన్ని సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, ప్రముఖులు హాజరయ్యారు.తెలుగు నుంచి 'కార్తికేయ 2'కి ఉత్తమ ప్రాంతీయ చిత్ర కేటగిరీలో పురస్కారం దక్కింది. దర్శకుడు చందు మొండేటి దీన్ని అందుకున్నారు. 'తిరు' చిత్రానికి ఉత్తమ నటిగా నిత్యా మీనన్, 'కాంతార' మూవీకి గానూ ఉత్తమ నటుడిగా రిషభ్ శెట్టి అవార్డులు అందుకున్నారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రదానం చేశారు. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి అవార్డ్ ఇవ్వాలి. కానీ లైంగిక ఆరోపణల కేసు కారణంగా దీన్ని రద్దు చేశారు.ఎవరెవరికి ఏ విభాగాల్లో అవార్డులు? ఉత్తమ చిత్రం: ఆట్టమ్ (మలయాళం) ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార) ఉత్తమ నటి: నిత్యా మేనన్ (తిరుచిత్రాంబళం - తమిళం, తెలుగులో తిరు), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్ప్రెస్ - గుజరాతి) ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ సినిమా: బ్రహ్మాస్త్ర - పార్ట్ 1ఉత్తమ దర్శకుడు: సూరజ్ బర్జాత్యా (ఉంచాయి - హిందీ) బెస్ట్ కొరియోగ్రాఫర్: జానీ మాస్టర్ (తిరుచిత్రాంబళం - తమిళం, తెలుగులో తిరు), సతీశ్ కృష్ణన్ ఉత్తమ సహాయ నటుడు: పవర్ రాజ్ మల్హోత్రా (ఫౌజా - హరియాన్వి) ఉత్తమ సహాయ నటి: నీనా గుప్తా (ఉంచాయి- హిందీ)ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ : అర్జిత్ సింగ్ (కేసరియా) - బ్రహ్మాస్త్ర ఉత్తమ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ : బొంబాయి జయశ్రీ (సౌది వెళ్లక్క సీసీ 225/2009- మలయాళం)ఉత్తమ సంగీతం (పాటలు): ప్రీతమ్ (బ్రహ్మస్త్ర -హిందీ)ఉత్తమ సంగీతం (నేపథ్యం): ఏఆర్ రెహమాన్ (పొన్నియిన్ సెల్వన్ - 1 తమిళం)ఉత్తమసినిమాటోగ్రఫీ: రవి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్ పార్ట్ - 1 తమిళం) ఉత్తమ సౌండ్ డిజైన్: ఆనంద్ కృష్ణమూర్తి (పొన్నియిన్ సెల్వన్ - 1) ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: శ్రీపాథ్ (మాలికాపురం - మలయాళం)ఉత్తమ స్క్రీన్ప్లే: ఆనంద్ ఏకార్షి (ఆట్టం- మలయాళం)ఉత్తమ ఎడిటింగ్: మహేష్ భువనేండ్ (ఆట్టం) ఉత్తమ యాక్షన్ డైరక్షన్: అన్బరివు (కేజీఎఫ్- 2)ఉత్తమ మేకప్: సోమనాథ్ కుందు (అపరాజితో- బెంగాళీ)ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: నిక్కి జోషి (కచ్ ఎక్స్ప్రెస్- గుజరాతీ) ఉత్తమ మాటల రచయిత: అర్పితా ముఖర్జీ, రాహుల్ వి చిట్టెల (గుల్మోహర్)ఉత్తమ ప్రాంతీయ సినిమాలుఉత్తమ ప్రాంతీయ చిత్రం: కార్తికేయ -2 (తెలుగు)ఉత్తమ ప్రాంతీయ చిత్రం: కేజీఎఫ్ 2 (కన్నడ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం: పొన్నియిన్ సెల్వన్ - 1 (తమిళం)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : గుల్మొహర్ (హిందీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : సౌది వెళ్లక్క సీసీ 225/2009 (మలయాళం)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : కబేరి అంతర్దాన్ (బెంగాళీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : వాల్వీ (మరాఠీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : దమన్ (ఒడియా)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : బాగీ డి దీ (పంజాబీ)జాతీయ ఉత్తమ నాన్ ఫీచర్ సినిమాలుఉత్తమ షార్ట్ ఫిల్మ్: ఉన్యుత (వాయిడ్) - అస్సామీఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్: అయేనా (అద్దం)- హిందీ/ ఉర్దూఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్: మర్మర్స్ ఆఫ్ ది జంగిల్ (మరాఠీ)ఉత్తమ యానిమేషన్ సినిమా: ఏ కోకోనట్ ట్రీ (సైలెంట్)ఉత్తమ దర్శకులు: మిరియం చాండీ మినాచెరీ (ఫ్రమ్ ది షాడో- బెంగాళీ/హిందీ/ ఇంగ్లిష్)ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ : బస్తి దినేశ్ షెనోయ్ (ఇంటర్మిషన్ - కన్నడ)ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్: విశాల్ భరద్వాజ్ (ఫుర్సత్- లీజర్/ హిందీ)ఉత్తమ క్రిటిక్: దీపక్ దుహా (హిందీ) ఉత్తమ బుక్ ఆన్ సినిమా: రచయితలు: అనిరుద్ధ భట్టాచార్జీ, పార్థివ్ ధార్ కిషోర్ కుమార్ (ది అల్టిమేట్ బయోగ్రఫీ - ఇంగ్లిష్) ఉత్తమ సినిమాటోగ్రీఫీ: సిద్ధార్థ్ దివాన్ -మోనో నో అవేర్ (హిందీ - ఇంగ్లీష్) -
రిషబ్ శెట్టి తండ్రిగా మోహన్ లాల్.. కాంతారా 2 నుంచి లేటెస్ట్ అప్డేట్..
-
కాంతార ప్రీక్వెల్లో మోహన్లాల్.. ఆ పాత్ర చేయనున్నాడా?
కాంతార మూవీతో పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ బ్లాక్బస్టర్ హిట్ కావడంతో పాటు జాతీయ అవార్డును సైతం తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రిషబ్ ఈ మూవీ ప్రీక్వెల్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్, టీజర్ కూడా విడుదల చేశారు. కన్నడ చిత్రసీమకు కొత్త ఇమేజ్ను కాంతారా ఒక్కసారిగా మార్చేసింది. దీంతో కాంతార ప్రీక్వెల్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే తాజాగా కాంతార చాప్టర్-1కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఈ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రిషబ్ శెట్టి తండ్రిగా ఆయన నటిస్తారని లేటేస్ట్ టాక్. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.అయితే ఈ ఏడాది ఏప్రిల్లో రిషబ్ శెట్టిని మోహన్లాల్ కలుసుకున్నారు. ఆయన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరలయ్యాయి. అదే సమయంలో వీరి మధ్య కాంతార గురించే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాంతారా: చాప్టర్-1 లో మోహన్లాల్ పాత్రపై గత రెండు రోజులుగా శాండల్వుడ్లో టాక్ నడుస్తోంది. ఇదే గనుక నిజమైతే ఇక అభిమానులకు పండగే.(ఇది చదవండి: 'కాంతార చాప్టర్ 1' ఫస్ట్ లుక్ వీడియో.. రిషబ్ శెట్టి ఉగ్రరూపం)కాగా.. రిషబ్ శెట్టి తెరకెక్కిస్తోన్న కాంతార చాప్టర్- 1 ప్రస్తుతం నాలుగో షూటింగ్ షెడ్యూల్ వచ్చే వారం ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ని చిత్రీకరించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో థియేటర్లలోకి సందడి చేయనుంది. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
కాంతార హీరోగా రిషబ్ శెట్టి కాదు.. ఫస్ట్ అనుకున్నది ఎవరంటే?
కాంతార మూవీతో పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ బ్లాక్బస్టర్ హిట్ కావడంతో పాటు జాతీయ అవార్డును సైతం తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రిషబ్ ఈ మూవీ ప్రీక్వెల్ రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే టీజర్ కూడా విడుదల చేశారు.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రిషబ్ శెట్టి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. కాంతార మూవీకి మొదట హీరోగా తాను చేయాలని అనుకోలేదని తెలిపారు. ఈ చిత్రంలో శివ పాత్రను పోషించడానికి శెట్టి మొదటి కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ను సంప్రదించినట్లు వెల్లడించారు. రాజ్కుమార్కు ఈ స్క్రిప్ట్ను వినిపించినప్పుడు ఎంతో ఉత్సాహంగా విన్నారని.. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ప్రాజెక్ట్ను చేయలేకపోయాడని రిషబ్ వివరించారు. ఓ రోజు నాకు ఫోన్ చేసి నా కోసం ఎదురు చూస్తే సినిమా ఏడాది ఆలస్యం కావొచ్చని నాతో అన్నారని తెలిపారు. అయితే కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ ఊహించని విధంగా అక్టోబర్ 29, 2021న బెంగళూరులో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణానికి రెండు రోజుల ముందు కలుసుకున్నానని రిషబ్ గుర్తు చేసుకున్నారు. తన సినిమా కాంతార గురించి ఆయన ఆరా తీశారని చెప్పుకొచ్చారు. సినిమా పట్ల రాజీ పడవద్దని నాకు సూచించారు. షూట్కు సంబంధించిన కొన్ని చిత్రాలను రాజ్కుమార్కు చూపించినట్లు వెల్లడించారు. ఫోటోలు చూసిన రాజ్కుమార్ చాలా సంతోషంగా వ్యక్తం చేశారని.. నీ సినిమా చూడటానికి ఎంతో ఆసక్తిగా ఉన్నానని చెప్పాడని రిషబ్ శెట్టి తెలిపారు. -
ప్రాచీన దేవాలయంలో ఎన్టీఆర్ ప్రత్యేక పూజలు
-
పురాతన ఆలయంలో ఎన్టీఆర్ దంపతుల పూజలు.. వీడియో వైరల్!
యంగ్ టైగర్ జూనియర ఎన్టీఆర్ ప్రస్తుతం కర్ణాటకలో బిజీగా ఉన్నారు. తన ఫ్యామిలీతో కలిసి ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు. ఇటీవల అమ్మతో కలిసి ప్రముఖ శ్రీకృష్ణుని ఆలయాన్ని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సైతం తన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ పర్యటనలో తన తల్లి షాలిని, భార్య లక్ష్మిప్రణతీ కూడా వెంట ఉన్నారు. ఈ ఆలయం దర్శనంతో తన తల్లి కల నెరవేరిందని జూనియర్ వెల్లడించారు.తాజాగా తన కుటుంబంతో కలిసి మరో ప్రముఖ ఆలయాన్ని దర్శించుకున్నారు. కాంతార రిషబ్ శెట్టి, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్నీల్ దంపతులతో కలిసి ఎన్టీఆర్, ప్రణతీ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అడవుల్లోని ఉన్న గుహల్లో ఉన్న మూడగల్లులోని కేశవనాథేశ్వర ఆలయాన్ని సందర్శించటారు. అక్కడే ఉన్న ఆలయ గుహల్లో ఎన్టీఆర్ నడుచుకుంటూ వెళ్తున్న వీడియోను రిషబ్ శెట్టి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.తండ్రి జయంతిని స్మరించుకుంటూ..ఇవాళ నందమూరి హరికృష్ణ 68వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన తండ్రిని స్మరించుకున్నారు. ఆయన ఫోటోను ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. మీ 68వ జయంతి న మిమ్మల్ని స్మరించుకుంటూ... pic.twitter.com/yIi5pgFMQI— Jr NTR (@tarak9999) September 2, 2024 ಮೂಡುಗಲ್ಲು ಕೇಶವನಾಥೇಶ್ವರನ ದರ್ಶನ ಪಡೆದಾಗ.. ✨🙏🏼A blessed journey to Keshavanatheshwara Temple Moodagallu ✨🙏🏼@tarak9999 #PrashanthNeel pic.twitter.com/SWfP2TAWrk— Rishab Shetty (@shetty_rishab) September 2, 2024 -
కర్ణాటక దేవాలయాల్లో ఎన్టీఆర్ ప్రత్యేక పూజలు
జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం కర్ణాటక పర్యటనలో ఉన్నాడు. కుటుంబంతో కలిసి మంగళూరు వెళ్లిన తారక్.. అక్కడ ఉన్న ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్నాడు. తారక్తో పాటు అతడి వెంట 'కాంతార' ఫేమ్ నటుడు రిషబ్ శెట్టి, 'సలార్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఉన్నాడు.(ఇదీ చదవండి: బిగ్ బాస్ 8 ఫైనల్ లిస్ట్ ఇదే.. వీళ్లు పక్కా!)శనివారం సాయంత్రం తన అమ్మ కోరిక మేరకు ఉడిపిలోని శ్రీకృష్ణ మఠంను దర్శించుకున్న తారక్.. ఆదివారం కొల్లురులోని మూకాంబిక అమ్మవారి ఆలయానికి వెళ్లాడు. ఉదయం పంచెకట్టులో ఆలయానికి వెళ్లిన తారక్.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తారక్తో పాటు రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ కూడా మూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.'దేవర' సినిమా చేసిన తారక్.. సెప్టెంబరు 27న థియేటర్లలో ఈ సినిమాతో పలకరించనున్నాడు. దీని తర్వాత ప్రశాంత్ నీల్తో కలిసి పనిచేస్తాడు. కొన్నిరోజుల క్రితం పూజా కార్యక్రమంతో ప్రాజెక్ట్ లాంచ్ అయింది. ఇక నవంబరులో షూటింగ్ ప్రారంభించనున్నారు. డిసెంబర్ నుంచి తారక్ షూట్లో పాల్గొంటాడు. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టితో కలిసి కర్ణాటకలోని దేవాలయాల్ని ఎన్టీఆర్ సందర్శించడం వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: అభిమానులను ఉద్దేశిస్తూ చిరంజీవి ట్వీట్) -
మా అమ్మ కల నెరవేరింది : ఎన్టీఆర్
‘‘మా అమ్మ (శాలినీ) స్వగ్రామం కుందాపురానికి నన్ను తీసుకొచ్చి ఉడుపి శ్రీకృష్ణ ఆలయంలో దర్శనం చేసుకోవాలనేది ఆమె చిరకాల కల.. అది ఎట్టకేలకు నెరవేరింది’’ అన్నారు హీరో ఎన్టీఆర్. కర్ణాటకలోని ప్రసిద్ధి చెందిన ఉడుపిలోని శ్రీకృష్ణ ఆలయాన్ని ఎన్టీఆర్ శ్రావణ శనివారం సందర్భంగా దర్శించుకున్నారు. ఆయన వెంట తల్లి శాలినీ, భార్య లక్ష్మీ ప్రణతి, కన్నడ హీరో రిషబ్ శెట్టి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఉన్నారు. ప్రముఖ వాగ్గేయకారుడు భక్త కనకదాసు దర్శించుకున్న కనక కిటికీ ద్వారా అందరూ నల్లనయ్య (శ్రీ కృష్ణుడు) విగ్రహాన్ని దర్శించారు.దర్శనం అనంతరం ఆలయం ఎదుట తన తల్లితో కలిసి దిగిన ఫొటోలను ఎన్టీఆర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి... ‘‘ఉడుపి శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించడంతో అమ్మ (శాలినీ) కల ఎట్టకేలకు నెరవేరింది. అమ్మ పుట్టినరోజు సెప్టెంబర్ 2. ఆమె బర్త్డేకి రెండు రోజుల ముందు ఈ ఆలయాన్ని దర్శించడం ఆమెకు నేనిచ్చిన అత్యుత్తమ బహుమతి.విజయ్ కిరగందూర్ సార్కి (హోంబలే ఫిలింస్ అధినేత) థ్యాంక్స్. నా ప్రియ మిత్రుడు ప్రశాంత్ నీల్తో కలిసి రావడం సంతోషంగా ఉంది. అలాగే నా ప్రియ మిత్రుడు రిషబ్ శెట్టి కూడా నాతో వచ్చి ఈ క్షణాలను మరింత ప్రత్యేకంగా మార్చారు’’ అంటూ తన ఆనందం వ్యక్తం చేశారు ఎన్టీఆర్. కాగా ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘దేవర’ మొదటి భాగం ఈ నెల 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. -
అమ్మ చిరకాల కోరిక తీర్చిన ఎన్టీఆర్
జూ.ఎన్టీఆర్ మళ్లీ చాలారోజుల తర్వాత కుటుంబం గురించి పోస్ట్ పెట్టాడు. ఎప్పటిలా భార్య గురించి కాకుండా తల్లి గురించి, ఆమెకు ఎప్పటినుంచో ఉన్న కోరిక గురించి చెప్పాడు. ఇదే పోస్టులో డైరెక్టర్ ప్రశాంత్ నీల్, 'కాంతార' హీరో రిషభ్ శెట్టి గురించి ప్రస్తావించాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎన్టీఆర్ తల్లి పేరు శాలిని. ఆమెది కర్ణాటకలోని కుందపుర అనే ఊరు. గతంలో పలు సందర్భాల్లో తారక్ ఈ విషయాన్ని చెప్పాడు. అయితే కొడుకుని తన సొంతూరికి తీసుకెళ్లాలని ఎప్పటినుంచో ఈమె అనుకుంటోందట. తాజాగా ఈ విషయాన్ని ఎన్టీఆర్ బయటపెట్టాడు. ఇన్ స్టాలో క్యూట్ పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: షాకింగ్ ఆరోపణలు.. నిజం కాదని తేల్చిన నటి రేవతి)'తన సొంతూరు కుందపురకి నన్ను తీసుకొచ్చి, ఉడుపిలోని శ్రీకృష్ణ మఠం దర్శనం చేయించాలనేది మా అమ్మకు చిరకాల కోరిక. అది ఇన్నాళ్లకు నెరవేరింది. ఆమె కల నిజమైంది. సెప్టెంబరు 2న అమ్మ పుట్టినరోజు. ఆమె కోరికని నిజం చేయడం ఆమెకి ఇచ్చే పెద్ద గిఫ్ట్. దీన్ని సాధ్యమయ్యేలా చేసిన మై డియర్ ఫ్రెండ్ ప్రశాంత్ నీల్, విజయ్ కిరగందూర్కి థ్యాంక్యూ. అలానే రిషభ్ శెట్టికి స్పెషల్ థ్యాంక్స్. అతడి మాతో పాటు వచ్చి దీన్ని మరింత ప్రత్యేకం చేశాడు' అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.ఎన్టీఆర్ కూడా శ్రీ కృష్ణుడి మఠం దర్శనం చేసుకున్న 'కాంతార' ఫేమ్ రిషభ్ శెట్టిది కూడా కుందపుర ఊరే. గతంలో ఇదే విషయాన్ని చెప్పాడు. అలానే తాను ఎన్టీఆర్కి పెద్ద ఫ్యాన్ అని కూడా అన్నాడు. ఇకపోతే తారక్ ప్రస్తుతం 'దేవర' చేస్తున్నాడు. ఇది సెప్టెంబరు 27న రిలీజ్ కానుంది. దీని తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా చేస్తాడు. ఈ డిసెంబరు నుంచి షూటింగ్ మొదలవుతుంది.(ఇదీ చదవండి: ఏఆర్ రెహమాన్ కూతురికి విచిత్రమైన కష్టాలు) View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) -
హిందీ సినిమాలు భారత్ను నెగెటివ్గా చూపిస్తున్నాయి: కాంతార హీరో
రెండేళ్ల క్రితం వచ్చిన కాంతార మూవీ బాక్సాఫీస్ను గడగడలాడించింది. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.400 కోట్లు రాబట్టింది. ఈ సినిమాలో అద్భుతంగా నటించిన రిషబ్ శెట్టికి ఇటీవలే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వరించింది. దీంతో ఇతడి పేరు నేషనల్ వైడ్ మార్మోగిపోతోంది. ఇలాంటి సమయంలో రిషబ్ శెట్టి బాలీవుడ్పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ మూడే నాకు గర్వకారణంఓ మీడియాతో మాట్లాడుతూ.. భారతీయ చిత్రాలు.. ముఖ్యంగా బాలీవుడ్ మూవీస్.. మన దేశాన్ని నెగెటివ్గా చూపిస్తున్నాయి. అలాంటి చిత్రాలు అంతర్జాతీయ వేదికల్లో చోటు దక్కించుకోవడం శోచనీయం. నా వరకైతే దేశం, నా రాష్ట్రం, నా భాష.. ఈ మూడింటినీ చూసి గర్వంగా ఫీల్ అవుతుంటాను. వీటిని ప్రపంచానికి పాజిటివ్గా చూపించాలని నమ్ముతాను. అందుకోసం నావంతు ప్రయత్నిస్తున్నాను అని పేర్కొన్నాడు.అది తప్పు కాదా?ఇది చూసిన జనాలు.. హీరో వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ గురించి కొత్తగా చెప్పేదేముంది? అదెప్పటినుంచో అలాంటి సినిమాలే ఎక్కువగా తీస్తుందని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం.. నీ సినిమాల్లో అశ్లీలత లేనట్లే మాట్లాడుతున్నావంటూ సెటైర్లు వేస్తున్నారు. అంతదాకా ఎందుకు? కాంతార సినిమాలో హీరోయిన్ నడుము గిల్లలేదా? అది తప్పు కాదా? అని ప్రశ్నిస్తున్నారు. ఆ సీన్స్ ఆపేయండి..ఈయన ఒక్క సినిమా హిట్ కొట్టి హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ స్టీవెన్ స్పిల్బర్గ్లా ఫీలవుతున్నాడు. కాంతారకు అనవసరంగా హైప్ ఇచ్చారు. దాన్ని ఒకసారి చూశాక మళ్లీ చూడాలన్న ఆసక్తే రాదు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరేమో.. సౌత్ సినిమాల్లో హీరోయిన్ల నడుము గిల్లే సన్నివేశాలు ఆపేయండి.. చూడటానికి చాలా అభ్యంతరకరంగా ఉంది. అవి ఆపేశాక నీతులు చెప్పండి అని మరో వ్యక్తి ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. ఇదిలా ఉంటే రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్ సినిమా చేస్తున్నాడు. -
ఆ అవార్డుకు రిషబ్ శెట్టి అర్హుడు: అల్లు అర్జున్
భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికైన రిషబ్ శెట్టి, ఉత్తమ నటి అవార్డుకు ఎంపికైన నిత్యామీనన్కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు‘నేషనల్ అవార్డు విన్నర్స్ అందరికి నా హృదయ పూర్వక అభినందనలు. రిషబ్ శెట్టి ఉత్తమ నటుడు అవార్డుకు అర్హుడు. అలాగే నా చిరకాల స్నేహితురాలు నిత్యా మేనన్ ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. జాతీయ అవార్డులు గెలుపొందిన అందరికీ నా శుభాకాంక్షలు. నిఖిల్, చందు మొండేటిలకు ప్రత్యేక అభినందనలు. ‘కార్తికేయ2’ విజయం సాధించినందుకు ఆ టీమ్ అందరికీ శుభాకాంక్షలు’ అని అల్లు అర్జున్ ఎక్స్లో రాసుకొచ్చాడు.అవార్డు బాధ్యత పెంచింది : చందూ మెండేటి‘‘మా సినిమాకి జాతీయ అవార్డు రావడం మా బాధ్యతని మరింత పెంచింది. ‘కార్తికేయ 2’ తర్వాత ‘కార్తికేయ 3’పై అంచనాలు ఎంతలా పెరిగాయో తెలుసు. ఆ అంచనాలకు తగ్గట్టుగా ‘కార్తికేయ 3’ ఉంటుంది’’ అని డైరెక్టర్ చందు మొండేటి అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా చందు మొండేటి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన చిత్రం ‘కార్తికేయ 2’. ప్రాంతీయ విభాగంలో ఉత్తమ చిత్రం అవార్డును సాధించిన సంగతి తెలిసిందే. -
జాతీయ అవార్డ్.. హీరో పునీత్ - వాళ్లకు అంకితం: రిషబ్ శెట్టి
కేంద్రం తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డుల్లో దక్షిణాది సినిమాలు అద్భుతాలు చేశాయి. కన్నడ సినిమా 'కాంతార'కి గానూ ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి పురస్కారం సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ అవార్డ్ రావడంపై రిషబ్ స్పందించాడు. దివంగత హీరో పునీత్పై తనకు ఎంత ప్రేమ ఉందనే విషయాన్ని బయటపెట్టాడు.(ఇదీ చదవండి: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?)తనకు వచ్చిన జాతీయ అవార్డుని రాష్ట్రంలోని దేవ నర్తకులకి, దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్, కన్నడ ప్రేక్షకులకు అంకితమిస్తున్నట్లు రిషబ్ శెట్టి పేర్కొన్నాడు. జాతీయ అవార్డ్ రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, తన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశాడు. ఈ మేరకు నోట్ రిలీజ్ చేశాడు.హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన 'కాంతార' సినిమాలో హీరోగా నటించి దర్శకత్వం వహించాడు. కేవలం రూ.15 కోట్లు పెడితే ఏకంగా రూ.400 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ అయితే సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది. ఇందుకు గానూ రిషబ్.. ఉత్తమ నటుడిగా నిలవడం కన్నడ సినిమా రేంజ్ని పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.(ఇదీ చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే) -
జాతీయ సినిమా అవార్డ్తో పాటు ఏమేం ఇస్తారు?
జాతీయ అవార్డులనీ ప్రకటించారు. తెలుగు నుంచి 'కార్తికేయ 2' ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. మరోవైపు తమిళ, మలయాళ సినిమాలు ఈసారి మంచి దూకుడు చూపించాయి. అయితే అవార్డ్ విజేతలు ఎవరనేది తెలిసిపోయింది. మరి వాళ్లకు పురస్కారంతో పాటు ఏమేం ఇస్తారో తెలుసా?(ఇదీ చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే)జాతీయ సినీ అవార్డు విజేతలకు స్వర్ణ కమలం, రజత కమలంతో పాటు నగదు బహుమతి ఇస్తారు. అలానే గుర్తింపుగా ప్రశంస పత్రాలను బహుకరిస్తారు. జ్యూరీ అభినందనల అందుకున్న సినిమాలకు మాత్రం సర్టిఫికేట్ మాత్రమే దక్కుతుంది. జ్యూరీ స్పెషల్ విజేతలకు ప్రశంస పత్రంతో పాటు నగదు బహుమతి లభిస్తుంది.తాజాగా ప్రకటించిన నేషనల్ అవార్డ్ విన్నర్స్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ పాపులర్ చిత్రం, ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ విభాగాలకు మాత్రం రూ.3 లక్షల డబ్బు.. మిగిలిన అందరూ విజేతలకు మాత్రం రూ.2 లక్షల నగదు లభిస్తుంది. (ఇదీ చదవండి: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?) -
అభిమానితో ప్రేమ.. రిషబ్ శెట్టి విజయంలో కీలక పాత్ర ఆమెదే
నేషనల్ అవార్డ్ విన్నర్ స్థాయికి చేరుకున్న కన్నడ హీరో విజయం వెనక ఎవరున్నారా..? అని అందరిలో మెదిలే ప్రశ్న. ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ ఉంటుందని చెబుతూ ఉంటారు కదా.. అలా రిషబ్ విజయంలో క్రెడిట్ అంతా తన భార్య ప్రగతికే దక్కుతుందని ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఈ విధంగా రిషబ్ ప్రేమను భార్యపై చాటారు. రిషబ్కు ప్రధాన బలం తన భార్య, ఇద్దరు పిల్లలే అంటూ ఉంటారు. వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరంగా కూడా రిషబ్కు ఆమె తోడుగా ఉంటుంది. వారిద్దరి ప్రేమ ఎక్కడ మొదలైందో తెలుసుకుందాం.అభిమానితో ప్రేమసాధారణంగా హీరోలు తమ ఇండస్ట్రీలోని పరిచయమున్న వారితో ప్రేమలో పడట సహజం. కానీ అభిమానితో ప్రేమలో పడటం అంటే చాలా అరుదు. కానీ రిషబ్ శెట్టి జీవితంలో అదే జరిగింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన అమ్మాయితో ఆయన ప్రేమలో పడ్డారు. రక్షిత్శెట్టి హీరోగా ‘రిక్కీ’ అనే సినిమాను రిషబ్ శెట్టి తెరకెక్కించారు. ఆ చిత్ర విజయోత్సవ కార్యక్రమంలో అందరూ హీరోతో సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. అయితే, ఆ సమయంలో ఆ అందమైన అమ్మాయి మాత్రం ఆ చిత్ర దర్శకుడు రిషబ్ శెట్టిని చూస్తూ అలానే ఉండిపోయింది. దానిని గమనించిన రిషబ్.. తనను ఎక్కడో చూశానే అనుకుంటూ పలకరించాడు. ఆ అమ్మాయి తన గ్రామం కెరాడికి చెందిన అమ్మాయేనని గుర్తించాడు. అప్పటికే వారిద్దరికీ ఫేస్బుక్లో పరిచయం ఉంది. అలా ప్రగతితో ప్రేమలో పడిపోయిన రిషబ్ 2017లో పెళ్లి చేసుకున్నాడు. ప్రగతి ఇంట్లో వీరి పెళ్లికి మొదదట ఒప్పుకోలేదు. రిషబ్ జీవితంలో ఇంకా స్థిరపడలేదని వద్దని చెప్పారు. కానీ ప్రగతి పట్టుబట్టి మరీ కుటుంబ సభ్యులను ఒప్పించింది. ఐటీ నేపథ్యమున్న ప్రగతి బెంగళూరులోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ’లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసింది. పెళ్లయ్యాక పూర్తిగా సినిమా రంగంపైనే తన దృష్టిపెట్టింది. చిత్ర పరిశ్రమలో కాస్ట్యూమ్ డిజైనర్గా కెరీర్ ప్రారంభించిన ఆమె ‘కాంతార’ సినిమాకు కూడా పనిచేసింది. ‘కాంతార’లో ప్రారంభ సన్నివేశంలో రాణి పాత్రలో ప్రగతి నటించింది. ప్రస్తుతం రిషబ్ పలు సినిమాలు నిర్మించడంతో పాటు డైరెక్షన్ చేసే స్థాయికి చేరుకున్నాడు. ప్రగతి కూడా కాస్ట్యూమ్ డిజైనర్గా చిత్రపరిశ్రమలో రాణిస్తుంది. తన భర్త విజయంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో రిషబ్కు అవార్డ్ దక్కడంలో ప్రగతి పాత్ర చాలా కీలకం అని చెప్పవచ్చు. -
క్లాప్ బాయ్ నుంచి నేషనల్ అవార్డ్ విన్నర్గా.. 'రిషబ్ శెట్టి' ప్రయాణం
కాంతార సినిమాతో రిషబ్ శెట్టి పేరు పాపులర్ అయింది. కాంతార మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాందించుకున్నారు రిషబ్ శెట్టి. కన్నడలో విడుదలైన ఈ చిత్రం కేవలం మౌత్ టాక్తో అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ను శాసించింది. కాంతార అద్భుతమైన విజయంలో రిషబ్ శెట్టి పాత్ర చాలా కీలకం. 2010లో సినీరంగంలోకి అడుగుపెట్టి సైడ్ క్యారెక్టర్లు చేస్తూ 2016లో రికి, కిరీక్ పార్టీ సినిమాలకు దర్శకతం వహించాడు. సాధారణ కుటుంబంలో జన్మించిన రిషబ్ శెట్టి తాజాగ విడుదలైన 70వ జాతీయ ఉత్తమ నటుడిగా (కాంతార) అవార్డు అందుకునే స్థాయికి చేరుకున్నారు. అసలు రిషబ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? సినిమాల్లోకి రాకముందు ఆయన ఏం చేశారు? అనే విషయాలు తెలుసుకుందాం.కర్ణాటకలోని కెరాడి అనే మారుమూల గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో రిషబ్ జన్మించారు. తన తండ్రి భాస్కర శెట్టి జ్యోతిష్కుడు కాగా అమ్మ రత్నావతి. కుటుంబంలో అందరికంటే చిన్నవాడు రిషబ్. ఆయనకు అక్క, అన్నయ్య ఉన్నారు. సినిమాల్లో అరంగేట్రానికి ముందు అనేక ఉద్యోగాలు రిషబ్ శెట్టి చేశారు. తన అవసరాల కోసం నాన్నను ఎప్పుడూ డబ్బు అడగలేదని గతంలో ఓ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.ఇండస్ట్రీలో మొదట క్లాప్ బాయ్గా తన జర్నీని ప్రారంభించిన రిషబ్ ఆపై అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు.ఇండస్ట్రీలో పరిచయాలు లేకుండానే..తన సినీ ప్రస్థానం గరించి రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. 'నేను నటుడిని కావాలనుకున్నా. కానీ పరిశ్రమలో నాకు ఎటువంటి పరిచయాలు లేవు. ఎలా అప్రోచ్ అవ్వాలనేది నా ఆలోచన. అందుకే నేను ఒక కన్నడ నటుడి కథను చదివా. అతను అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రారంభించి.. హీరోగా ఎలా మారాడనే దాని గురించి చదివాను. నా చదువు తర్వాత ఫిల్మ్ మేకింగ్పై షార్ట్టర్మ్ కోర్సు చేశా. ఆపై అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసి.. ఏడేళ్ల తర్వాత నటన వైపు మొగ్గు చూపా.' అని అన్నారు.(చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే)కూలీ పనులకు కూడా వెళ్లేవాడురిషబ్ శెట్టి నటుడిగా అరంగేట్రానికి ముందు చాలా పనులు చేశాడు. చిన్నతనంలో బాగా అల్లరి చేస్తున్న రిషబ్ పై చదువుల కోసం తన గ్రామం నుంచి బెంగుళూరుకు మకాం మార్చాడు. డిగ్రీ చదివేటప్పుడు సినిమా చూసేందుకు నాన్నను డబ్బులు అడగలేక.. కూలీ పనులకు వెళ్లేవాడు. 2004 నుంచి 2014 వరకు తన మొదటి డైరెక్షన్ చేసేవరకు 10 ఏళ్లపాటు వాటర్ క్యాన్లు అమ్మడం, రియల్ ఎస్టేట్, హోటల్స్లో పనిచేశారు. అలా తన గమ్యాన్ని చేరుకునేందుకు ఎంతో కష్టపడ్డారు.సినీ ఇండస్ట్రీలో రిషబ్ శెట్టి ప్రయాణంచదువుకునే సమయంలోనే రిషబ్కు సినిమాలు అంటే పిచ్చి. ఆ సమయంలోనే అవకాశాల కోసం ప్రయత్నించారు. కానీ అక్కడ పరిచయాలు లేకపోవడంతో సినీ పరిశ్రమలో క్లాప్ బాయ్, స్పాట్ బాయ్గా పనిలో చేరారు. ఆపై అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. తుగ్లక్ అనే చిత్రంలో తన మొదటి పాత్రను పోషించారు. 2016లో రక్షిత్ శెట్టి హీరోగా రిషబ్ తొలి దర్శకత్వం వహించిన చిత్రం రికీ విడుదలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ అందుకుంది. ఆపై అదే ఏడాది దర్శకత్వ వహించిన మరో చిత్రం కిరిక్ పార్టీ మూవీ హిట్గా నిలిచింది. ఈ సినిమాతో ఆయన పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది.‘కాంతార’ ప్రభంజనంచిన్న చిత్రంగా వచ్చి భారీ విజయం సాధించిన చిత్రం ‘కాంతార’. 2022 సెప్టెంబర్ 30న కేవలం కన్నడలో విడుదలైన ఈ చిత్రం ఆక్కడ ప్రభంజనం సృష్టించింది. అక్కడ కేజీయఫ్ రికార్డులను బద్దలు కొట్టింది. శాండిల్ వుడ్లో కేజీయఫ్2 తర్వాత ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన చిత్రం ‘కాంతారా’నే. కేవలం రూ. 30 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 400 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగులో సుమారు రూ. 75 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. కాంతార చిత్రంలో రిషబ్ ప్రధాన కథానాయకుడిగా నటించిడమే కాకుండా డైరెక్షన్ కూడా చేశారు. ఇప్పుడు 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో రిషబ్ శెట్టి సత్తా చాటారు. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ దక్కించుకున్నారు. 2018లో రిషబ్ దర్శకత్వం వహించిన సర్కారీ హిరియ ప్రాథమిక షాలే, కాసరగోడు (Sarkari Hi. Pra. Shaale, Kasaragodu) సినిమాకుగాను జాతీయ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. ఉత్తమ బాలల చిత్రంగా 66వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఎంపికైంది. -
'నేషనల్ అవార్డ్స్.. రేసులో స్టార్ హీరో
70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం నేడు సాయింత్రం ప్రకటించనుంది. 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాల నుంచి అందిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అవార్డులను ప్రకటించనుంది. అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ నేడు (ఆగష్టు 16) జాతీయ అవార్డు అందుకోనున్న వారి జాబితా మాత్రం విడుదల అవుతుందని సమాచారం ఉంది.ఎంపిక విధానం2022కు సంబంధించిన ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి జాతీయ అవార్డ్స్ను అందిస్తారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం వాస్తవానికి 3 మే 2023న నిర్వహించబడుతుందని అందరూ భావించారు. కరోనా తర్వాత ఈ అవార్డులకు సంబంధించిన షెడ్యూల్స్లో మార్పులు వచ్చాయి. దీంతో 2022కు సంబంధించిన సినిమాలకు నేడు విన్నర్స్ జాబితా విడుదల అవుతుంది. ఇదే ఏడాది అక్టోబర్లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డ్స్ను వారు అందుకుంటారు. 1 జనవరి 2022 నుంచి 31 డిసెంబర్ 2022 మధ్య సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా ధృవీకరించబడిన ఫీచర్, నాన్-ఫీచర్ ఫిల్మ్లు మాత్రమే ఈ అవార్డుల పోటీకి అర్హత పొందాయి.ఉత్తమ హీరో రేసులో ఎవరున్నారు..?70వ జాతీయ అవార్డు వేడుకలో ఉత్తమ హీరోగా ఎంపిక అయింది ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. అయితే, మమ్ముట్టి, రిషబ్ శెట్టి, విక్రాంత్ మాస్సే మధ్యే పోటీ ఎక్కువగా ఉంది. సైకలాజికల్ థ్రిల్లర్ రోషాక్, నాన్ పకల్ నేరత్తు మయక్కం అనే రెండు సినిమాలతో మమ్ముట్టి టాప్లో ఉన్నారు. కాంతార సినిమాతో రిషబ్ శెట్టి ఉంటే... 12th ఫెయిల్ సినిమా ద్వారా విక్రాంత్ మాస్సే తర్వాతి స్థానంలో ఉన్నారు. బాలీవుడ్ నుంచి పోటీలు ఉన్న ఏకైక హీరోగా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు. అయితే, ఈసారి కూడా సౌత్ ఇండియా హీరోకే అవార్డ్ దక్కుతుందని తెలుస్తోంది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో అల్లు అర్జున్ (పుష్ప) ఉత్తమ హీరోగా అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. -
'కాంతార' హీరో ఎమోషనల్ పోస్ట్.. ఆనందం పట్టలేక!
'కాంతార' ఫేమ్ హీరో రిషబ్ శెట్టి ఆనందాన్ని ఆపుకోలేకపోయాడు. దాదాపు 24 ఏళ్ల తర్వాత తన కల నిజమైందని చెబుతూ తెగ ఎగ్జైట్ అయిపోయాడు. తమిళ హీరో విక్రమ్ని కలుసుకున్న సందర్భంగా ఇదంతా చెప్పుకొచ్చాడు. ఇంతకీ అసలు వీళ్లు ఎక్కడ కలుసుకున్నారు? రిషబ్ ఇంకేమన్నాడు?(ఇదీ చదవండి: వయనాడ్ బాధితులకు ప్రభాస్ భారీ విరాళం.. ఎన్ని కోట్లంటే?)'నటుడిగా నేను కెరీర్ ప్రారంభించడానికి విక్రమ్ స్ఫూర్తి. ఆయన్న కలవడం నా 24 ఏళ్ల కల. ఈ రోజు నా దేవుడిని కలిశాను. ప్రస్తుతం ఈ భూమ్మీద అదృష్టవంతుడిని నేనే అనిపిస్తోంది. నాలాంటి ఎంతోమంది ఆర్టిస్టుల్లో ఆయన స్ఫూర్తి నింపుతున్నారు. ఈ విషయంలో ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. లవ్ యూ విక్రమ్ సర్' అని రిషబ్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టి భావోద్వేగానికి లోనయ్యాడు.విక్రమ్ నటించిన 'తంగలాన్' ఆగస్టు 15న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ జరగ్గా.. తాజాగా బెంగళూరు వెళ్లారు. ఈ క్రమంలోనే రిషబ్.. విక్రమ్ని కలిశాడు. తన సంతోషాన్ని ఫొటోలు, పోస్ట్ రూపంలో షేర్ చేసుకున్నాడు.(ఇదీ చదవండి: బంగ్లాదేశ్ అల్లర్లలో విషాదం.. యంగ్ హీరోని కొట్టి చంపారు!) View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
కాంతార 2 రిలీజ్ డేట్ లాక్..
-
శాండల్వుడ్ హీరో దర్శన్.. క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు!
ఇటీవల ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సినీ ఇండస్ట్రీ మోస్ట్ పాపులర్ తారల లిస్ట్ను ప్రకటిస్తోంది. టాలీవుడ్తో పాటు కన్నడ, మలయాళం, తమిళ స్టార్స్లో జూన్ నెలకు సంబంధించి ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోలు, హీరోయిన్ల జాబితాను వెల్లడించింది. ఇటీవల ప్రకటించిన తెలుగు హీరోల జాబితాలో ప్రభాస్ మొదటిస్థానంలో నిలిచారు.తాజాగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాను ప్రకటించింది. శాండల్వుడ్లో మొదటిస్థానంలో కేజీఎఫ్ స్టార్ యశ్ నిలిచారు. ఆ తర్వాత వరుసగా సుదీప్ కిచ్చా, రక్షిత్ శెట్టి, దర్శన్, రిషబ్ శెట్టి ఉన్నారు. హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి పుష్ప భామ రష్మిక మందన్నా టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఆమె తర్వాత రచిత రామ్, రాధిక పండిట్, రమ్య, ఆషిక రంగనాథ్ వరుస స్థానాలు ఆక్రమించారు.అయితే మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ లిస్ట్లో కన్నడ హీరో దర్శన్ కూడా నిలవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గత నెలలో జరిగిన ఓ అభిమాని హత్యకేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. అయినప్పటికీ ఆర్మాక్స్ మీడియా విడుదల చేసిన జాబితాలో నాలుగోస్థానంలో నిలిచారు. కాగా.. తన ప్రియురాలికి అసభ్య సందేశాలు పంపించాడంటూ దర్శన్ అతన్ని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. Ormax Stars India Loves: Most popular female Kannada film stars (Jun 2024) #OrmaxSIL pic.twitter.com/72De2ze5MK— Ormax Media (@OrmaxMedia) July 17, 2024Ormax Stars India Loves: Most popular male Kannada film stars (Jun 2024) #OrmaxSIL pic.twitter.com/NYPwHgPNUC— Ormax Media (@OrmaxMedia) July 17, 2024 -
రిషబ్ శెట్టి బర్త్డే స్పెషల్.. ఫ్యామిలీ ఫోటోలు చూశారా..?
-
కల్కి బుజ్జితో రిషబ్ శెట్టి ఫ్యామిలీ.. ఈ ఫోటోలు చూశారా? (ఫొటోలు)
-
పవర్ కపుల్ స్వీట్ మెమరీస్ : రిషబ్ శెట్టి చేతికి కల్కి ‘బుజ్జి’ (ఫొటోలు)
-
బుజ్జి కారును నడిపిన కాంతార హీరో.. వీడియో వైరల్
ప్రభాస్ -నాగ్ అశ్విన్ కాంబోలో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వినీదత్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ లాంటి సూపర్ స్టార్స్ నటించారు. దీంతో ఈ చిత్రంపై పాన్ ఇండియాతో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో బుజ్జి అనే కారు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా బుజ్జిని ప్రధాన నగరాల్లో తిప్పుతున్నారు.తాజాగా బుజ్జి కారును కాంతార హీరో రిషబ్ శెట్టి నడిపారు. బుజ్జి కారును డ్రైవ్ చేసి ప్రశంసల్లో ముంచెత్తారు. దీనికి సంబంధించిన వీడియోను కల్కి నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ట్విటర్లో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. బుజ్జి కారును ఇప్పటికే పలువురు సినీతారలు డ్రైవ్ చేశారు. ఈ సినిమా ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే కల్కి టికెట్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. KALKI X KANTARA 🔥@shetty_rishab gets his hands on #Bujji.#Kalki2898AD pic.twitter.com/IvIHuxGO6y— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 24, 2024 -
కాంతార హీరో ఇంట్లో శుభకార్యం.. ఫోటోలు షేర్ చేసిన నటుడు!
కాంతారా మూవీతో స్టార్డమ్ సొంతం చేసుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన కాంతార బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. దేశవ్యాప్తంగా సినీ ప్రియుల నుంచి విశేషమైన ఆదరణ దక్కించుకుంది. దీంతో రిషబ్ కాంతార ప్రీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇటీవలే ఆయన మలయాళ స్టార్ మోహన్లాల్ను కలిశారు. దీంతో ఆయన కాంతార-2 కోసమే మోహన్లాల్ను కలిశాడని వార్తలొచ్చాయి. కాంతార 2 విషయానికొస్తే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఇదిలా ఉండగా రిషబ్ శెట్టికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడీయాలో యాక్టివ్గా ఉండే రిషబ్ ఫ్యామిలీతో ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు. తాజాగా తన కూతురు రాధ్యకు అక్షర అభ్యాస కార్యక్రమం నిర్వహించారు రిషబ్ దంపతులు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో పంచుకున్నారు. ప్రముఖ శ్రీ శారదాంబ ఆలయంలో తమ ముద్దుల కూతురికి అక్షర అభ్యాసం పూర్తియిందంటూ రిషబ్ రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
కర్ణాటకలో తాజాగా పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. స్టేట్ టాపర్గా నిలిచిన విద్యార్ధి ఫోటోను పాన్ ఇండియా స్టార్హీరో రిషబ్ శెట్టి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఈ విజయం ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు.కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాకు చెందిన అంకిత కొసప్ప ఎస్ఎస్ఎల్సీ పరీక్షా ఫలితాల్లో దుమ్మురేపింది. అన్ని సబ్జెక్టుల్లోనూ నూటికి నూరుశాతం మార్కులతో అదరగొట్టింది. ఏకంగా 625/625 మార్కులు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆమె తండ్రి బసప్ప ఒక రైతు. తల్లి గృహిణి. ఆమె సాధించిన మార్కులతో వారి కుటుంబంలో పండుగ వాతావరణం ఉంది. అంకిత ముధోల్ తాలుకాలో ఉన్న మొరార్జీ దేశాయ్ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసింది. భవిష్యత్లో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఆపై ఐఏఎస్ కావాలనేది తన టార్గెట్ అని ఆమె తెలిపింది. అంకిత విజయం పట్ల కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి శుభాకాంక్షలు తెలిపాడు. ఆమె తల్లిదండ్రుల ఫోటోను ఆయన షేర్ చేశారు. ఈ ఏడాది ఫలితాల్లో ఏడుగురు విద్యార్థులు 624 మార్కులు సాధించారని అక్కడి ప్రభుత్వం వెళ్లడించింది. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చాడు. చాన్నాళ్లు కష్టపడి డైరెక్టర్ అయ్యాడు. హిట్ కొట్టాడు. అలా అటు నటుడిగా ఇటు దర్శకుడిగా అడపాదడపా మూవీస్ చేశాడు. కానీ రెండేళ్ల క్రితం ఓ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఎంతలా అంటే ప్రాంతీయ హీరో కాస్త పాన్ ఇండియా హీరో అయ్యేంతలా. కోట్లాదిమంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. మరి ఇంతలా చెప్పాం కదా.. ఇతడు ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా)పైన ఫొటోలో కనిపిస్తున్న కుర్రాడి పేరు రిషభ్ శెట్టి. హా అవును మీరు ఊహించింది కరెక్టే. 'కాంతార' సినిమాతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించాడు. రూ.15 కోట్ల బడ్జెట్తో ఈ మూవీ తీయగా.. ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. దీనిబట్టి ఈ మూవీ ఏ రేంజ్ హిట్ అయ్యిందో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. ప్రస్తుతం 'కాంతార' ప్రీక్వెల్ తీస్తూ బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది రిలీజ్ ఉండొచ్చు.రిషభ్ శెట్టి విషయానికొస్తే.. కర్ణాటకలోని కుందాపుర అనే ఊరిలో పుట్టాడు. జూ.ఎన్టీఆర్ అమ్మది కూడా ఈ ఊరే. అందుకేనేమో తారక్ అంటే రిషభ్ శెట్టి చాలా ఇష్టం. ఈ విషయాన్ని పలుమార్లు చెప్పాడు కూడా. 2012 నుంచి శాండల్ వుడ్లో ఉన్న రిషభ్ శెట్టి.. 'కాంతార' మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇక ఫ్యామిలీ విషయానికొస్తే.. ప్రగతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 'కాంతార'తో సంచలన హిట్ కొట్టిన ఇతడు.. ప్రీక్వెల్తో ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తాడో?(ఇదీ చదవండి: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ లేఖ!) -
ప్రశాంత్ నీల్ ఇంట్లో జూ ఎన్టీఆర్, రిషబ్ శెట్టి.. కారణం ఇదే
సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా కలిశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించిన తారక్.. దేవర షూట్ కోసం ఎక్కడికైనా వెళ్తున్నారా అని అనుకున్నారు అందరూ.. కానీ ప్రశాంత్ నీల్ ఇంట్లో మార్చి 1న ఏదో శుభకార్యం ఉండగా తన సతీమణితో కలిసి ఆయన అక్కడకు చేరుకున్నట్లు తెలుస్తోంది. వారితో పాటుగా మైత్రీ మూవీ మేకర్స్ అధినేత యలమంచిలి రవి శంకర్ కూడా ఉన్నారు. ప్రశాంత్ నీల్ ఇంట్లో సందడి చేసిన జూ ఎన్టీఆర్ ఫ్యామిలీ (ఫోటోలు) ప్రశాంత్ నీల్ ఇంట్లో జరుగుతున్న ఒక కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ ప్రణతితో పాటుగా వెళ్లారు. అదే కార్యక్రమానికి 'కాంతార' హీరో రిషబ్ శెట్టి కూడా తన సతీమణి ప్రగతితో రావడం జరిగింది. అక్కడ వారందరూ కలిసి దిగిన గ్రూప్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తారక్తో రిషబ్ శెట్టి ఫ్యామిలీ ఎంతో ఆప్యాయంగా మాట్లాడటం కనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పనులు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. 'కాంతారా', 'కేజీఎఫ్' సిరీస్లను హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. అలా ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇప్పుడు ఈ ముగ్గురిని ఒకే ఫ్రేమ్లో చూసి అభిమానులు థ్రిల్ అవుతున్నారు. ఫోటోపై అభిమానులు భారీగా లైకులతో క్లిక్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్- జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో రిషబ్ శెట్టి కూడా నటించనున్నారా అనే ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది. -
Jr NTR Photos: ప్రశాంత్ నీల్ ఇంట్లో సందడి చేసిన జూ ఎన్టీఆర్ ఫ్యామిలీ (ఫోటోలు)
-
గర్ల్ ఫ్రెండ్ అంటూ విష్ చేసిన కాంతార హీరో.. వీడియో వైరల్!
కాంతార మూవీతో పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రిషబ్ శెట్టి. ఆ ఒక్క సినిమాతో అతనిపేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. కన్నడలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. దేశవ్యాప్తంగా రిలీజైన కాంతారకు సినీ ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కన్నడలో స్థానిక భూత కోలా క్రీడ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాంతార సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం ప్రీక్వెల్ రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే 'కాంతారా చాప్టర్- 1' ఫస్ట్ గ్లింప్స్ మేకర్స్ విడుదల చేశారు. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం విడుదల కానుంది. అయితే తాజాగా రిషబ్ తన భార్య ప్రగతి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్గా విష్ చేశారు. తన ఫ్యామిలీతో కలిసి ఉన్న క్షణాలను వీడియో రూపంలో పోస్ట్ చేశారు. బర్త్ డే రోజు తన భార్య ప్రగతికి గుర్తుండిపోయేలా శుభాకాంక్షలు తెలిపారు. రిషబ్ తన ఇన్స్టాలో రాస్తూ..'నా బర్త్ డే గర్ల్ఫ్రెండ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఆనందం ఒక వరంలా ఉండనివ్వండి. ఈ బంధం చిరస్థాయిగా నిలిచిపోనివ్వండి. మీ ఆయురారోగ్యాలు, మా ఆప్యాయత ఎల్లప్పుడూ పెరుగుతూనే ఉంటాయి.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. వీరిద్దరి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
పాఠశాలను దత్తత తీసుకున్న నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి
-
పుట్టిన ఊరు రుణం తీర్చుకునేందుకు రిషబ్ శెట్టి అడుగులు
నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి 'కాంతార'తో యావత్తు సినీ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఆ సినిమా ఘనవిజయం తర్వాత ఆయన పేరు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. మొదటి భాగం హిట్ కొట్టడంతో 'కాంతార ఏ లెజెండ్: ఛాప్టర్ 1' ప్రీక్వెల్ కూడా త్వరలో రానుంది. 54వ 'ఇఫి' వేడుకలో 'కాంతార'కు సిల్వర్ పీకాక్ అవార్డు దక్కింది. ఈ పురస్కారం దక్కించుకున్న తొలి కన్నడ చిత్రం ఇదేనని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఈ సినిమా విజయంతో ఆయన ఒక పౌండేషన్ను ఏర్పాడు చేశాడు. ఇందులో భాగంగ తన సొంత గ్రామానికి తనకు చేతనైన సాయం చేయాలని ముందుకు వచ్చాడు. దక్షిణ కర్ణాటకలోని కెరటి గ్రామానికి చెందిన వ్యక్తి రిషబ్ శెట్టి. సినిమా వల్ల ప్రస్తుతం ఆయన ఉన్నత స్థాయిలో ఉన్నాడు. దీంతో తను పుట్టిన ఊరికి ఏదైనా చేయాలని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. శెట్టి ఫౌండేషన్ ద్వారా తన సొంత గ్రామంలో ఉండే పాఠశాలకు సహాయాన్ని అందించాడని సమాచారం. కర్ణాటకలోని ప్రభుత్వ పాఠశాలన్నింటిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడట. దీని ద్వారా కనీస అవసరాలే లేని కన్నడ పాఠశాలలను ఎలా అభివృద్ధి చేయాలి వంటి ప్రణాళికలు రూపొందించే పనిలో ఉన్నాడట. ఇందులో మరికొందరిని భాగస్వామ్యం చేసేందుకు ఆయన చూస్తున్నారట. ఇందులో భాగంగా తాను ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన పాఠశాలను తాజాగా రిషబ్ సందర్శించారు. పాఠశాలను దత్తత తీసుకోవడంపై ఆయన ప్రాథమిక చర్చ జరిపారు. అంతేకాకుండా ప్రస్తుత విద్యార్థులు, ఉపాధ్యాయులతో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం పాఠశాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారని సమాచారం. త్వరలో ఆయన ఈ విషయంపై క్లారటీ ఇస్తారని తెలుస్తోంది. -
'కాంతార' సినిమాలో ఛాన్స్ కోసం స్టార్ హీరోయిన్ తిప్పలు!
సాధారణంగా ఓ సినిమా తీస్తున్నారంటే చాలామంది యువనటీనటులు.. అందులో ఛాన్స్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తారు. కానీ అలాంటి ఓ పాన్ ఇండియా మూవీ కోసం ఏకంగా ప్రముఖ హీరోయినే ప్రయత్నిస్తే? అవును మీరు సరిగానే విన్నారు. ప్రస్తుతం 'కాంతార' మూవీకి ప్రీక్వెల్ తీసే పనిలో హీరో రిషభ్ శెట్టి బిజీగా ఉన్నాడు. ఇలాంటి టైంలో క్రేజీ హీరోయిన్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని బతిమాలాడుకుంది. ఏంటి విషయం? కన్నడ హీరో రిషభ్ శెట్టిని.. రాత్రికి రాత్రే పాన్ ఇండియా స్టార్ని చేసి మూవీ 'కాంతార'. విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా గతేడాది దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీక్వెల్ తీస్తున్నారు. మొన్నీమధ్యే పోస్టర్ రిలీజ్ చేయగా, తెగ వైరల్ అయిపోయింది. (ఇదీ చదవండి: లక్కీ హీరోయిన్ కోసం నిర్మాతగా మారిన 'జైలర్' డైరెక్టర్) ఛాన్స్ అడుక్కుంది అయితే 'కాంతార-1' సినిమాలో తనకు ఓ ఛాన్స్ ఇవ్వాలని.. ఎక్స్ (ట్విట్వర్) వేదికగా హీరోయిన్ పాయల్ రాజ్పుత్ పోస్ట్ పెట్టింది. 'రిషభ్ శెట్టి, హోంబలే ఫిల్మ్స్.. కాంతార చాప్టర్-1 కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని నాకు తెలిసింది. ఈ ప్రాజెక్టులో భాగం కావాలని నాకు ఆశగా ఉంది. ఈ మధ్య విడుదలైన 'మంగళవారం'లో నా యాక్టింగ్ని అందరూ ప్రశంసించారు. మీరు కాస్త టైం కేటాయించి నా సినిమా చూస్తే మీకు కృతజ్ఞతలు చెప్పుకొంటాను. ఈ ప్రాజెక్ట్ కోసం ఆడిషన్ ఇవ్వడానికి ఏం చేయాలో దయచేసి చెప్పండి. నా పేరు రీపోస్ట్ చేస్తూ సహకరించే అభిమానులు థ్యాంక్స్' అని పాయల్ రాసుకొచ్చింది. మరి పాయల్ కోరుకున్నట్లు.. 'కాంతార-1' హీరో గానీ మూవీ యూనిట్ గానీ ఈ ట్వీట్ చూసి, ఛాన్స్ ఇస్తే మాత్రం పాయల్ ని అదృష్టం వరించినట్లే. చూద్దాం మరి ఈ బ్యూటీ అనుకున్నది జరుగుతుందో లేదో? (ఇదీ చదవండి: హీరో చిరంజీవిపై కేసు.. ప్రముఖ నటుడి తిక్క కుదిర్చిన హైకోర్ట్!) @shetty_rishab @hombalefilms I've learned that auditions are being held for Kantara Chapter 1. I am eager to contribute to this esteemed project. My recent film, Magalavaaram, has garnered significant praise for my performance. I would appreciate if you could spare some time to… — paayal rajput (@starlingpayal) December 12, 2023 -
నెట్టింట్లో వైరల్ అవుతున్న 'కాంతార' హీరో రిషబ్ శెట్టి ఫ్యామిలీ ఫోటోలు
-
ఓటీటీలు అలా చేయడం మంచిది కాదు: రిషబ్ శెట్టి కామెంట్స్ వైరల్
కన్నడ హీరో, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆ ఒక్క సినిమాతో అతనిపేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ప్రస్తుతం కాంతార సీక్వెల్ను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే 'కాంతారా చాప్టర్ 1' ఫస్ట్ గ్లింప్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో రిషబ్ శెట్టి చేతిలో త్రిశూలం పట్టి ఉగ్రరూపం దాల్చిన శివుడిలా కనిపించాడు. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం విడుదల కానుంది. అయితే తాజాగా ఆయన గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫి) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటీటీలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎన్ఎఫ్డీసీ ఫిల్మ్ బజార్లాంటి వేడుకల్లో ప్రదర్శితమైతే కన్నడ చిత్రాలకు రెవెన్యూ వచ్చేదని.. కొవిడ్ సమయంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ వినియోగం పెరగడంతో ఆ పరిస్థితి లేదని అన్నారు. అలాగే కన్నడలో తెరకెక్కిన ఓ కమర్షియల్ సినిమా సక్సెస్ కాకపోతే ఓటీటీ సంస్థలు తిరస్కరించడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. తనకు కన్నడ చిత్ర పరిశ్రమను వీడే ఉద్దేశం లేదని తెలిపారు. రిషబ్ మాట్లాడుతూ..' కాంతార సూపర్ హిట్ తర్వాత నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. వాటిని నేను తిరస్కరించా. కన్నడ ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటా. కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారు. ప్రస్తుతం కాంతార ఏ లెజెండ్: చాప్టర్ 1 పైనే దృష్టి సారించాం. కాంతార తీసే సమయంలోనే ప్రీక్వెల్ ఆలోచన వచ్చింది. మూవీ హిట్ కావడంతో ప్రీక్వెల్ తీయాలని నిర్ణయించుకున్నా' అని అన్నారు. కాగా.. ఇఫి వేడుకల్లో కాంతారకు సిల్వర్ పీకాక్(స్పెషల్ జ్యూరీ అవార్డ్) దక్కింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ట్వీట్ చేసింది. Dedicating #IFFI54 'Special Jury Award' to ever inspiring Shankar Nag sir. ನಮ್ಮೆಲ್ಲರ ಸ್ಫೂರ್ತಿ ಶಂಕರ್ ನಾಗ್ ಅವರಿಗೆ ಈ ಪ್ರಶಸ್ತಿ ಅರ್ಪಣೆ. pic.twitter.com/ZLFlNIPE6u — Rishab Shetty (@shetty_rishab) November 28, 2023 Dedicating #IFFI54 'Special Jury Award' to ever inspiring Shankar Nag sir. ನಮ್ಮೆಲ್ಲರ ಸ್ಫೂರ್ತಿ ಶಂಕರ್ ನಾಗ್ ಅವರಿಗೆ ಈ ಪ್ರಶಸ್ತಿ ಅರ್ಪಣೆ. pic.twitter.com/ZLFlNIPE6u — Rishab Shetty (@shetty_rishab) November 28, 2023 -
పుష్ప 2 అంచనాలకు మించి కాంతారా చాప్టర్ - 1
-
'కాంతార చాప్టర్ 1' ఫస్ట్ లుక్ వీడియో.. రిషబ్ శెట్టి ఉగ్రరూపం
కన్నడ చిత్రసీమకు కొత్త ఇమేజ్ని అందించిన చిత్రం ‘కాంతారా’. ఈ సినిమా ద్వారా రిషబ్ శెట్టి నటుడిగా, దర్శకుడిగా పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమా ఇండియా అంతటా హిట్ అయ్యింది. విడుదలైన ఐదు భాషల్లో సినిమా కలెక్షన్లలో రికార్డులు సృష్టించింది.హోంబలే ఫిలింస్ నిర్మించిన 'కాంతారా' భారతదేశ వ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ విజయం కారణంగానే రిషబ్ శెట్టి కాంతారాను సీక్వెల్ చేయడానికి సిద్ధమయ్యాడు. తాజాగా 'కాంతారా చాప్టర్ 1' ఫస్ట్ గ్లింప్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో రిషబ్ శెట్టి చేతిలో త్రిశూలం పట్టి ఉగ్రరూపం దాల్చిన శివుడిలా కనిపిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్లో సుమారు 7 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. View this post on Instagram A post shared by Hombale Films (@hombalefilms) -
'కాంతారా' అభిమానులకు శుభవార్త ప్రకటించిన రిషబ్ శెట్టి
కన్నడ చిత్రసీమకు కొత్త ఇమేజ్ని అందించిన చిత్రం ‘కాంతారా’. ఈ సినిమా ద్వారా రిషబ్ శెట్టి నటుడిగా, దర్శకుడిగా పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమా ఇండియా అంతటా హిట్ అయ్యింది. విడుదలైన ఐదు భాషల్లో సినిమా కలెక్షన్లలో రికార్డులు సృష్టించింది.హోంబలే ఫిలింస్ నిర్మించిన 'కాంతారా' భారతదేశ వ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ విజయం కారణంగానే రిషబ్ శెట్టి కాంతారాను సీక్వెల్ చేయడానికి సిద్ధమయ్యాడు. సినిమా ప్రకటన అయితే ఇచ్చారు కానీ గత కొంత కాలంగా ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి సమాచారం లేదు. చిన్న హింట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు సినీ వర్గాలకు ఓ శుభవార్తను అందించారు. 'కాంతారా చాప్టర్ 1' ఫస్ట్లుక్ను విడుదల చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. నవంబర్ 27న 'కాంతారా చాప్టర్ 1' ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు రిషబ్ శెట్టి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. ఈ ఏడాది పెద్దగా సినిమాలు లేని సినీ పరిశ్రమకు రిషబ్ శెట్టి శుభవార్త అందించాడు. రెండు రోజుల్లో ఫస్ట్ లుక్ రివీల్ కానుంది. ప్రత్యేకించి ఈసారి 5 భాషల్లో కాకుండా 7 భాషల్లో సినిమా విడుదల కానుంది. మొత్తం ఐదు భాషల్లో 'కాంతారా' విడుదల అయ్యి ప్రశంసలు అందుకుంది. అంతర్జాతీయ స్థాయిలోనూ ఆదరణ పొందింది. కాబట్టి కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయనున్నారు. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
సినిమా రిలీజైన ఇన్నాళ్లకు ఆ పాట వీడియో రిలీజ్
తెలుగు సినిమాలో తెలుగులోనే కొన్ని కొన్ని సరిగా ఆడవు. అలాంటిది ఓ కన్నడ సినిమా.. ఏ మాత్రం అంచనాల్లేకుండా కర్ణాటకలో రిలీజై సెన్సేషన్ సృష్టించింది. తెలుగులోనూ అంతకు మించి అనేలా హిట్ సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీలో క్లైమాక్స్ సాంగ్ ఎంత హిట్టయిందో, అన్నే వివాదాలు కూడా వచ్చాయి. (ఇదీ చదవండి: దానికి నో చెప్పానని నాతో అలా ప్రవర్తించారు.. హాట్ బ్యూటీ కామెంట్స్!) అయితే 'కాంతార' మూవీకి ఎంతో పేరు తెచ్చిన 'వరహారూపం' పాట లిరికల్ సాంగ్ మాత్రమే ఇప్పటివరకు అందుబాటులో ఉంది. తాజాగా సినిమాకు ఏడాది పూర్తయిన సందర్భంగా పూర్తి వీడియోని రిలీజ్ చేశారు. నిర్మాణ సంస్థ తన యూట్యూబ్ ఛానెల్ లో ఆ పాటని పోస్ట్ చేసింది. ఇంకెందుకు లేటు మీరు దీనిపై ఓ లుక్కేసేయండి. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7' నుంచి హాట్ బ్యూటీ ఎలిమినేట్!) -
కాంతార ప్రీక్వెల్.. ఇప్పుడంతా దానిపైనే తెగ చర్చ!
రిషబ్ శెట్టి దర్శకుడిగా, హీరోగా తెరకెక్కించిన చిత్రం కాంతార. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ను షేక్ చేసింది. దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్లోనూ భారీ వసూళ్లు సాధించింది. ఈ మూవీ సక్సెస్తో రిషబ్ శెట్టి మరో సినిమాతో మన ముందుకొస్తున్నారు. ఈ మూవీకి ప్రీక్వెల్గా కాంతారం-2 తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై సైతం అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా 'కాంతార- 2' బడ్జెట్ పైనే చర్చ జరుగుతోంది. సాధారణంగా సూపర్ హిట్ అయినా సినిమాలకు సీక్వెల్ రూపొందించడం మనం చూసుంటాం. కానీ అందుకు భిన్నంగా రిషబ్ శెట్టి ప్రీక్వెల్ అంటూ ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. (ఇది చదవండి: టాలీవుడ్లో సూపర్ హిట్ జోడీ.. ఎంత చిలిపిగా ఉన్నారో చూడండి!!) ఈ నేపథ్యంలోనే కాంతార-2 ప్రీక్వెల్ను గ్రాండ్గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి దాదాపు రూ.125 కోట్లు కేటాయించినట్లు సమాచారం. అంతే కాకుండా ఈ సినిమాలో నటీనటుల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇతర భాషల నటీనటులను తీసుకోవడంతో పాటు.. అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీలో వీఎఫ్ఎక్స్ సైతం ఓ రేంజ్లో ఉంటుందని అంటున్నారు. అందుకే సినిమా బడ్జెట్ రేంజ్ కూడా పెరిగిపోయిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కాగా.. కాంతార పార్ట్-1 షూటింగ్ ఎక్కువ భాగం రిషబ్ స్వగ్రామమైన కుందాపూర్లోనే జరిగింది. అయితే రెండో భాగాన్ని మంగళూరులో చిత్రీకరించనున్నారు. సినిమాలో భూత కోల పూజను మరింత లోతుగా చూపించనున్నారు. వచ్చే ఏడాది 2024 చివర్లో సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. (ఇది చదవండి: నిత్యామేనన్ని వేధించిన ఆ హీరో.. అసలు నిజమేంటి? ) రిషబ్ శెట్టి గతంలో ఓ ఇంటర్వ్యూలో కాంతార- 2కి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నారు. ప్రకృతి నేపథ్యంలో తెరకెక్కిన తొలిభాగం కథ ఎక్కడ, ఎలా మొదలైందనేది ప్రీక్వెల్లో చూపిస్తామని తెలిపారు. పంజర్లీ దేవుడికి సంబంధించిన మరిన్ని సన్నివేశాలు ఉంటాయని అన్నారు. కాగా.. ఈ సినిమా కోసం రిషబ్ శెట్టి గుర్రపు స్వారీ శిక్షణ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
సైమా అవార్డ్స్: కాంతారా, కేజీఎఫ్ మధ్య పోటీ.. విజేతల జాబితా ఇదే
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) సెప్టెంబర్ 15న అట్టహాసంగా ప్రారంభమైంది. దుబాయ్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 11వ ఎడిషన్ సౌత్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక జరుగుతోంది. ఈ రోజు కూడా ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే తెలుగు,కన్నడ సినీ రంగంలోని ప్రముఖులు అవార్డులు కైవసం చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును నేడు తమిళ్,మలయాళం చిత్రాలకు అందించనున్నారు. (ఇదీ చదవండి: సైమా అవార్డ్స్- 2023 విజేతలు వీరే.. ఎన్టీఆర్, శ్రీలీల, మృణాల్ హవా!) కన్నడలో కాంతారా, చార్లీ 777, కేజీఎఫ్ చాప్టర్ 2 వంటి చిత్రాలకు భారీగా అవార్డులు వచ్చాయి. ‘కెజిఎఫ్ చాప్టర్ 2’లో అద్భుత నటనకుగానూ యష్ 'ఉత్తమ నటుడు' అవార్డును, శ్రీనిధి శెట్టి 'ఉత్తమ నటి' అవార్డును గెలుచుకున్నారు. కాంతారా చిత్రంలో అద్భుతమైన నటనకు రిషబ్ శెట్టి ఉత్తమ నటుడు (క్రిటిక్స్) అవార్డును గెలుచుకున్నాడు. రక్షిత్ శెట్టి నటించిన 777 చార్లీ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. అత్యధికంగా కాంతారా సినిమాకు 10 అవార్డులు వచ్చాయి. కన్నడ చిత్రసీమలో అవార్డు దక్కించుకున్న వారి జాబితా ఇదే. కన్నడ చిత్ర సీమలో సైమా విజేతలు.. వారి వివరాలు * ఉత్తమ చిత్రం (కన్నడ): ( 777 చార్లీ) * ఉత్తమ నటుడు (కన్నడ): యష్ (KGF చాప్టర్ 2) * ఉత్తమ నటి (కన్నడ): శ్రీనిధి శెట్టి (KGF చాప్టర్ 2) * ఉత్తమ దర్శకుడు: రిషబ్ శెట్టి -(కాంతారా) * ఉత్తమ సంగీత దర్శకుడు: బి. అజనీష్ లోక్నాథ్ (కాంతారా) * ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : రిషబ్ శెట్టి (కాంతారా) * ఉత్తమ నటి ( క్రిటిక్స్) : సప్తమి గౌడ (కాంతారా) * ఉత్తమ విలన్ : అచ్యుత్ కుమార్ (కాంతారా) * ఉత్తమ సహాయ నటుడు : దిగంత్ మంచలే (గాలిపాట 2) * ఉత్తమ సహాయ నటి : శుభ రక్ష (హోమ్ మినిస్టర్) * ఉత్తమ నటుడు: ప్రకాష్ తుమినాడ్ (కాంతారా) * ఉత్తమ గేయ రచయిత (కన్నడ) : ప్రమోద్ మరవంతే 'సౌందర్య రాశివే' పాట కోసం (కాంతర) * ఉత్తమ నేపథ్య గాయకుడు (కన్నడ) : విజయ్ ప్రకాష్, 'సౌందర్య రాశివే' పాట కోసం (కాంతర) * ఉత్తమ నేపథ్య గాయని (కన్నడ): సునిధి చౌహాన్, 'విక్రాంత్ రోనా'లోని 'రా రా రక్కమ్మ' పాట కోసం * ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : భువన్ గౌడ (KGF చాప్టర్ 2) * ఉత్తమ నూతన దర్శకుడు: సాగర్ పురాణిక్ (డొల్లు) * ఉత్తమ నూతన నిర్మాత : అపేక్ష పురోహిత్,పవన్ కుమార్ వాడెయార్ (డొల్లు) * ఉత్తమ నూతన నటుడు: పృథ్వీ షామనూర్ (పదవి పూర్వ) * ఉత్తమ నూతన నటి: నీతా అశోక్ (విక్రాంత్ రోనా) * స్పెషల్ అప్రిషియేషన్ అవార్డ్ : రిషబ్ శెట్టి (కాంతారా) * స్పెషల్ అప్రిషియేషన్ అవార్డ్ : ముఖేష్ లక్ష్మణ్ (కాంతారా) * ప్రత్యేక ప్రశంస అవార్డు ఉత్తమ నటుడు (కన్నడ): రక్షిత్ శెట్టి (చార్లీ 777) -
రక్షాబంధన్ వేడుకల్లో స్టార్ హీరో పిల్లలు.. ఎంత ముద్దుగా ఉన్నారో!
కాంతార సినిమాతో స్టార్గా గుర్తింపు దక్కించుకున్న నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ను ఒక్కసారిగా షేక్ చేసింది. కర్ణాటకలోని గ్రామీణ నేపథ్యంలో సాగే భూతకోల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు ముందు అసలు రిషబ్ శెట్టి అంటే చాలామందికి తెలియదు. కాంతార మూవీ తర్వాత ఇండియా వైడ్ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. గతేడాది సెప్టెంబర్ 30న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. (ఇది చదవండి: 'కాంతార' హీరో రిషబ్ శెట్టి ఎమోషనల్.. ఎందుకో తెలుసా?) ఇవాళ రక్షాబంధన్ సందర్భంగా ఆయన ఫ్యామిలీతో కలిసి వేడుకను జరుపుకున్నారు. తన ముద్దుల కూతురు రాధ్య, కుమారుడు రాన్వీ రాఖీలు కట్టుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు రిషబ్ శెట్టి. ఫోటోలు షేర్ చేస్తూ అన్నా, చెల్లెలికి హ్యాపీ రక్షాబంధన్.. మీ బంధం కలకాలం ఇలాగే ఉండాలని ఇన్స్టాలో రాసుకొచ్చారు. చిట్టి చిట్టి నవ్వులతో సంప్రదాయ దుస్తులతో ఉన్న రిషబ్ శెట్టి పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇది చూసిన ఫ్యాన్స్ సైతం రక్షాబంధన్ విషెస్ చెబుతున్నారు. కాగా.. ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఇటీవలే ప్రకటించారు. (ఇది చదవండి: ‘కాంతారా’ తరహాలో ‘కలివీరుడు’) View this post on Instagram A post shared by Pragathi Shetty (@pragathirishabshetty) View this post on Instagram A post shared by Pragathi Shetty (@pragathirishabshetty) -
ఇక్కడ 'బేబీ'.. కన్నడలో ఆ చిన్న సినిమా!
Hostel Hudugaru Bekagiddare Movie: ఏ సినిమా ఎప్పుడు ఎందుకు ఎలా హిట్ అవుతుందనేది ఎవరూ చెప్పలేరు. తెలుగులో అలా ఈ మధ్య ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి వచ్చి బ్లాక్బస్టర్ టాక్ అందుకున్న మూవీ 'బేబీ'. మూడు నాలుగు చిత్రాలు తీసిన డైరెక్టర్, పెద్దగా అనుభవం లేని హీరోహీరోయిన్స్.. అయితేనేం హిట్ కొట్టారు. ఇలా టాలీవుడ్లో 'బేబీ' హవా నడుస్తుంటే.. కన్నడలో ఓ చిన్న సినిమా సెన్సేషన్ సృష్టిస్తోంది. హాస్టల్ కుర్రాళ్లు కేక కాలేజీ, హాస్టల్ బ్యాక్డ్రాప్ స్టోరీతో అన్ని ఇండస్ట్రీల్లోనూ ఇప్పటికే బోలెడన్ని సినిమాలు వచ్చాయి. కానీ తాజాగా థియేటర్లలోకి వచ్చిన కన్నడ చిత్రం 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే'. కన్నడ ఇండస్ట్రీకి కాస్త ఊపు తీసుకొచ్చింది. ఎందుకంటే 'కేజీఎఫ్ 2', 'చార్లీ', 'కాంతార' తర్వాత శాండల్వుడ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆ తర్వాత సరైన హిట్ ఒక్కటంటే ఒక్కటీ ఆ ఇండస్ట్రీకి పడేలేదు. ఇప్పుడు దాన్ని 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే'.. కొంతలో కొంత కవర్ చేసింది అనుకోవచ్చు. (ఇదీ చదవండి: రోడ్డు పక్కన గొడుగులు అమ్ముతున్న స్టార్ కమెడియన్) స్టార్ హీరోలు సైలెంట్ ఈ ఏడాది కన్నడలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. జనవరిలో దర్శన్ 'క్రాంతి', మార్చిలో ఉపేంద్ర 'కబ్జ' భారీ అంచనాలతో విడుదలయ్యాయి. కానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో తడబడ్డాయి. ఐపీఎల్, శాసనసభ ఎన్నికల వల్ల శాండల్వుడ్ బాక్సాఫీస్ డల్ అయిపోయింది. స్టార్ హీరోలు ఎవరూ పెద్దగా సినిమాలు చేయలేదు. ఇప్పుడు ఆ అవకాశాన్ని 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే' కరెక్ట్గా క్యాచ్ చేసి, హిట్ అయింది. కథేంటి? గత శుక్రవారం రిలీజై మంచి వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రంలో అంతగా ఏముందా అంటే.. యూత్ని ఆకట్టుకునే క్రైమ్ కామెడీ. హాస్టల్ రూంలో ఉండే స్టూడెంట్స్లో ఒకడికి షార్ట్ ఫిల్మ్ తీయాలని ఉంటుంది. పరీక్షలు ఉన్నాయని ఫ్రెండ్స్ వద్దంటారు. ఓ రోజు హఠాత్తుగా వార్డెన్ శవం దొరుకుతుంది. తన చావుకి వీళ్లే కారణమని, సదరు వార్డెన్ ఈ ఐదుగురు అబ్బాయిల పేర్లు ఓ నోట్లో రాసి ఉంటాడు. ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడేందుకు ఈ కుర్రాళ్లు, ఓ సీనియర్ని హెల్ప్ అడుగుతారు. ఆ తర్వాత ఏమైందనేదే స్టోరీ. ఇంతకీ 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే' అంటే ఏంటో చెప్పలేదు కదూ.. దానర్థం 'హాస్టల్ పిల్లలు కోరుకుంటే'. ప్రస్తుతం కన్నడలో మాత్రమే ఉన్న త్వరలో తెలుగులో రిలీజైన ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. స్టార్స్ గెస్ట్ అప్పీయరెన్స్ హాస్టల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమాని హీరో రక్షిత్ శెట్టి సమర్పించారు. ఇందులో చిన్న గెస్ట్ రోల్ లో కనిపించాడు. అలానే సీనియర్ హీరోయిన్ దివ్య స్పందన, కాంతార హీరో రిషబ్ శెట్టి కూడా అతిథి పాత్రలో మెరిసి మెప్పించారు. 'కాంతార'కు సంగీతమందించిన అజనీష్ లోక్నాథ్.. ఈ చిన్న సినిమాని తన మ్యూజిక్ తో మరో లెవల్కి తీసుకెళ్లాడు. (ఇదీ చదవండి: కమెడియన్ యాదమ్మ రాజుకి యాక్సిడెంట్!) -
టాప్ హీరోతో ఒకే ప్లేట్లో భోజనం చేసిన ఈ స్నేహితులు ఎవరంటే..
కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రాణస్నేహితులు ఎవరంటే టక్కున గుర్తుకొచ్చేది.. ప్రముఖ నటులు విష్ణువర్ధన్, రెబల్ స్టార్ డా. అంబరీష్ మాత్రమే అని చెప్తారు. ఈ దిగ్గజాల తర్వాత సినీ ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. కానీ వారి బంధానికి మించి అయితే కాదు అనే టాక్ ఉంది. ఈ క్రమంలో 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టితో రక్షిత్ శెట్టి స్నేహ బంధం అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తుంది . ఒకరు కాంతార సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారితే.. రక్షిత్ శెట్టి 'చార్లీ 777' సినిమాతో బాక్సాఫీస్ బద్దలుకొట్టారు. ఇలా వీరద్దరూ కన్నడ పరిశ్రమలో పాపులర్ యాక్టర్స్ అయిపోయారు. (ఇదీ చదవండి: వైఎస్ రాజశేఖర రెడ్డి వాయిస్తో .. యాత్ర-2 పోస్టర్ వచ్చేసింది) జులై 7న రిషబ్ శెట్టి పుట్టినరోజు, ఈ నేపథ్యంలో.. వారిద్దరూ కలిసి ఒకే ప్లేట్లో భోజనం చేస్తున్న వీడియో రివీల్ అయింది. ఈ బ్యాచ్లో ప్రమోద్ శెట్టి కూడా ఉన్నారు. ఈ వీడియోను కన్నడ నటి శీతల్ శెట్టి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చాలా అందంగా ఉంది. కానీ ఇదీ పాతదని ఆమె తెలిపింది. ఈ వీడియో వారు సినిమా పరిశ్రమలో కష్టాలు ఎదుర్కొంటున్న నాటిదే అయినా.. వారి మధ్య ఉండే స్నేహం ఎంత బలమైనదో తెలుపుతుంది. కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి కంటే ముందే రక్షిత్ శెట్టి సినీ పరిశ్రమలో ఉన్నారు. అప్పటికే ఆర్థికంగా మంచి స్థానంలో రక్షిత్ ఉన్నారు. మొదట 'తుగ్లక్' సినిమాతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సినిమా జర్నీలో వీరు మంచి స్నేహితులుగా మారారు. 'తుగ్లక్' సినిమాతో హీరోగా రక్షిత్ శెట్టి ఎంట్రీ ఇచ్చారు. రిషబ్ కూడా ఒక చిన్న క్యారెక్టర్లో ఎంట్రీ ఇచ్చారు. హీరోగా రక్షిత్ శెట్టి చేసిన తొలి సినిమా ఇదే కావడం అది పరాజయం పాలవడం అతన్ని ఎంతగానో కుంగతీసింది. దానిపైన ఎన్నో ఆశలు పెట్టుకున్న అతడు డిప్రెషన్కు గురైయాడు. (ఇదీ చదవండి: Anna Lezhneva Facts: అన్నా లెజెనెవా ఎవరు? పవన్కు ఎలా పరిచయమయ్యారు?) దీంతో రిషబ్ వద్ద ఉన్న'కిరిక్ పార్టీ' కథను రక్షిత్కు చెప్పడంతో తనకు నచ్చింది. దానికి రిషబ్నే డైరెక్టర్గా తొలిసారి వ్యవహరించాడు. రక్షిత్ హీరోగా నటించడమే కాకుండా ఈ సినిమా కోసం రూ.4 కోట్లు పెట్టాడు. విడుదల తర్వాత ఈ చిత్రం పెద్ద హిట్టయింది. దాని వల్ల వారికి భారీగా డబ్బు వచ్చింది. దాంతో ‘సర్కారి హిరియ ప్రాథమిక శాలే, కాసరగోడు’ సినిమా తీశారు. దానికి మంచి గుర్తింపుతో పాటు జాతీయ అవార్డొచ్చింది. అలా వారిద్దరూ తిరిగి వెనకడుగు వేయలేదు. ప్రస్థుతం భారీ సినిమాల్లో నటించే స్థాయికి ఈ స్నేహితులు చేరుకున్నారు. View this post on Instagram A post shared by Sheetal Shetty (@isheetalshetty) -
'కాంతార' హీరో రిషబ్ శెట్టి ఎమోషనల్.. ఎందుకో తెలుసా?
రిషబ్ శెట్టి ఇప్పుడు బాలీవుడ్తో పాటు సౌత్ ఇండియాలో పరిచయం అక్కర్లేని పేరు. కాంతార సినిమాతో అంతలా ఫేమ్ సంపాదించాడు. చిన్న సినిమా అయినా బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ సినిమాకు ముందు అసలు రిషబ్ శెట్టి అంటే చాలామందికి తెలియదు. కాంతార మూవీ తర్వాత ఇండియా మొత్తం ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. గతేడాది సెప్టెంబర్ 30న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. (ఇది చదవండి: వాల్తేరు వీరయ్య భామకు అరుదైన అవార్డ్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్!) అయితే తాజాగా రిషబ్ ట్విటర్లో తన ఫ్యామిలీకి సంబంధించిన ఓ వీడియోను పంచుకున్నారు. ఇటీవల తన ముద్దుల కూతురు రాధ్యాకు చెవులు కుట్టే వేడుక నిర్వహించారు. ఈ వేడుకను కర్ణాటకలోని రిషబ్ చిన్ననాటి ఇంటిలో నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ ఎమోషనలయ్యారు రిషబ్. ఈ వేడుకలో తన భార్య, కుమారుడుతో కలిసి సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఈ కార్యక్రమానికి బంధువులు, సన్నిహితులు కూడా హాజరయ్యారు. ట్విటర్లో రిషబ్ రాస్తూ..'నేను పెరిగిన ఇప్పుడు ఇల్లు జ్ఞాపకాలతో నిండిపోయింది. నా కూతురు రాధ్యా చెవి కుట్టే వేడుకతో మా ఇల్లు మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.' అంటూ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన అభిమానులు క్యూట్ బేబీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో కాంతార-2 కోసం వెయిటింగ్ పోస్టులు పెడుతున్నారు. మీరు కూడా రిషబ్ గారాలపట్టి చెవులు కుట్టే వేడుక చూసేయండి. కాగా.. కాంతార-2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు గతంలో ఉగాది సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: నాపై చాలా దారుణంగా ట్రోల్స్.. అయినా బాధపడను: హీరోయిన్) ನಾ ಹುಟ್ಟಿ ಬೆಳೆದ ಮನೆ ನನ್ನ ಬಾಲ್ಯದ ನೆನಪುಗಳ ಖಜಾನೆ. ಅದಕ್ಕೀಗ ರಾಧ್ಯಾಳ ಕಿವಿ ಚುಚ್ಚಿಸಿದ ಸಂಭ್ರಮದ ನೆನಪೊಂದು ಹೊಸದಾಗಿ ಜೊತೆ ಸೇರಿದೆ. The home where I grew up is filled with memories, and now Radhya's ear piercing ceremony added another special moment to it. pic.twitter.com/PnJDtZG4vy — Rishab Shetty (@shetty_rishab) June 25, 2023 -
రిషబ్ శెట్టి ప్లానింగ్ కాంతారా 2
-
కాంతార టీంకు భారీ షాక్.. వరాహ రూపం సాంగ్పై నిషేధం!
కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం 'కాంతార'. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అయితే ఈ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ వరాహ రూపం పాటపై వివాదం వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సాంగ్ బాణీని కాపీ కొట్టారంటూ కేరళకు చెందిన 'తైకుడం బ్రిడ్జ్' అనే మ్యూజిక్ బ్యాండ్ ఆరోపించింది. అంతేకాకుండా న్యాయపోరాటానికి కూడా దిగింది. పిటిషన్పై విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు కాంతారా చిత్ర బృందానికి షాకిచ్చింది. పాటపై నిషేధం వరాహ రూపం సాంగ్ను థియేటర్స్, డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ల్లో ఉపయోగించడంపై నిషేధం విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాట విషయంలో చిత్రబృందం ప్రాథమిక కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని పేర్కొంది. తైకుడం బ్రిడ్జ్కు చెందిన నవరసం నుంచి కాపీ కొట్టారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు మే 4లోగా అందజేయాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. అయితే గతంలో సినిమా నుంచి పాటను తొలగించాలన్న కేరళ హైకోర్టు ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అసలేం జరిగిందంటే ? కాంతార సినిమాలో వరాహ రూపం ఓ రేంజ్లో హిట్ అయింది. అయితే ఆ సాంగ్ బాణీని తాము రూపొందించిన 'నవరసం' నుంచి కాపీ కొట్టారంటూ కేరళకు చెందిన 'తైకుడం బ్రిడ్జ్' అనే మ్యూజిక్ బ్యాండ్ కోర్టును ఆశ్రయించింది. పాట ప్రదర్శన నిలివేయాలని పిటిషన్ దాఖలు చేసింది. -
కాంతార: ప్రపంచం మెచ్చిన భూతకోల.. ఇది ఎలా పుట్టిందో తెలుసా?
లాక్డౌన్ అనంతరం పరిస్థితులు మారాయి. ముఖ్యంగా చలన చిత్ర రంగంలో అనూహ్య మార్పులు వచ్చాయనడంలో అతిశయోక్తి లేదు. కరోనా అనంతరం ప్రేక్షకుల్లో సినిమాను చూసే కోణం మారింది. భారీ బడ్జెట్, ఫైట్స్, పెద్ద హీరోలు ఉంటేనే సినిమా ఆడుతుందనేత పాత ముచ్చట.. ఇప్పుడు కథలో దమ్ముండాలే కాని చిన్న సినిమా అయితే ఏంటీ! కొత్త నటులు అయితే ఏంటీ? అంటున్నారు ఆడియన్స్. దానికి ఇటీవల వచ్చిన బలగం, కాంతార చిత్రాలే ఉదాహరణ. కాంతార స్ఫూర్తితోనే వచ్చింది బలగం మూవీ. అలా ప్రాంతీయ సినిమాలకు పుంతలు వేసిన కాంతార సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. ఓ రీజనల్ సినిమా ప్రపంచాన్ని మెప్పించిందటే అది సాధారణ విషయం కాదు. ఐక్యరాజ్య సమితీలో సైతం కాంతార చిత్రాన్ని ప్రదర్శించారంటే అది ఏ స్థాయిలో ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు... కర్ణాటకలోని తుళునాడు ఆదివాసిల సంస్కృతి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా ఈసినిమా క్లైమాక్స్లో రిషబ్ శెట్టి భూతకోల ఆచారంలో భాగంగా పంజుర్లిగా మారి ‘ఓఁ’ అంటూ నట విశ్వరూపం చూపించాడు. ఇందులో ఆయన నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. దీంతో అసలు భూతకోల అంటే ఏంటీ? దీని సంప్రదాయమేంటో తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తికని కనబరిచారు. అయితే కర్ణాటకలో ఈ భూతకోల ఆచారం పుట్టడానికి రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి. మరి అవేంటో ఓసారి చూద్దాం! భూతకోల... కర్ణాటకలోని తుళునాడు ఆదివాసిల ముఖ్యమైన సంస్కృతి, సంప్రదాయం ఇది. ముఖ్యంగా ప్రకృతి-మానవాళి మధ్య మంచి సత్సంబంధాల ఉంటేనే మనుగడ సాధ్యమని కాంతార ద్వారా చాటిచెప్పాడు రిషబ్ శెట్టి. కర్ణాటకలో ప్రతిఏటా నిర్వహించే ఈ ఉత్సవం ప్రకృతికి దగ్గరగా ఉండాలని చెబుతుంది. పూర్వం తుళునాడులో అడవి పందులు ఎక్కువడగా ఉండేవట. అవి రాత్రిళ్లు సంచరిస్తూ అలా స్థానికంగా ఉన్న పంటలను నాశనం చేస్తుండేవట. అలా ఓ పంది తన పంటను నాశనం చేసిందనే కోపంతో దాన్ని చంపేశాడట ఓ రైతు. కొంతకాలనికి పందిని చంపినందుకు ఆ రైతు తీవ్ర మనోవేదనకు గరయ్యాడట. దీంతో ఆ పంది ఆత్మను పూజించడం ప్రాంరభించాట. అలా తుళునాడు ఆదివాసిలంతా వరాహాన్ని దైవంగా కొలిచేవారట. దీనిలో భాగంగానే వరహాన్ని కొలిచేందుకు ఈ భూతకోలను ప్రతిఏటా నిర్వహించేవరట. అలా ఈ సంస్కృతి పుట్టిందని కొందరు చెబుతుంటారు. అలాగే మరోకంటి ఏంటంటే.. ఓ మగ, ఆడ పంది కలిసి సుబ్రహ్మణ్వేశ్వర ఆలయానికి వెళ్లి ప్రార్థంచగా.. వాటి భక్తికి ప్రత్యక్షమైన స్వామి ఓ వరం కోరుకోమన్నాడట. వాటి కోరికను సుబ్రమణ్య స్వామి నెరవేర్చాడని, ఆయన ఇచ్చిన వరం ప్రకారం వాటికి నాలుగు పిల్ల పందులు పుట్టాయట. ఆ పంది పిల్లల్లో ఒకటి ఈశ్వరుడి తోటలో ప్రవేశించి అక్కడ సంచరిస్తుండగా పార్వతి దేవి దానిని చూసింది. చూడగానే ఆ పంది పిల్ల పార్వతి దేవికి నచ్చిందట. దీంతో శివుడు దానికి దేవికి కానుకగా ఇచ్చాడట. ఆ తర్వాత కైలాసం ఆ పంది పిల్ల తోటలన్నింటిని నాశనం చేసిందట. దీంతో కోపోద్రిక్తుడైన శివుడు ఆ పందిని పిల్లని చంపేశాడట. ఆ ఘటనతో బాధపడ్డ పార్వతి దేవి ఆ పందిని తిరిగి తీసుకురావాలని కోరడంతో పరమేశ్వరుడు దానికి ప్రాణం పోసి, దైవిక శక్తిని ప్రసాదించి, పంజుర్లిగా భూమ్మీదకు పంపించాడని అక్కడ ప్రజలు అంటుంటారు. అప్పటి నుంచి మానవులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా ఆ దైవరూపాన్ని ప్రార్థిస్తే పరిష్కారం లభిస్తుందనేది తుళునాడు ప్రజల విశ్వాసం. ప్రాంతాన్ని బట్టి అన్నప్ప పంజుర్లి, కద్రి పంజుర్లి, కాంతవర పంజుర్లి.. ఇలా పేర్లు మారుతూ ఉంటాయి. ఆ దైవాన్ని పూజించే ప్రత్యేక సంగీత నాట్యకళే భూతకోల. దానికి దైవ కోల, నేమ అనే పేర్లూ ఉన్నాయి. పంజుర్లితోపాటు క్షేత్రపాలకుడిగా గుళిగను కూడా శివుడు పంపించాడని, తప్పు చేసిన వారిని పంజుర్లి వదిలిపెట్టినా గుళిగ వదలదు అని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. -
సీఎం వెంట కాంతార రిషబ్.. బీజేపీ తరపున ప్రచారం చేస్తారా?
యశవంతపుర: సీఎం బొమ్మై రాష్ట్రంలో దేవస్థానాల సందర్శన చేపట్టారు. గురువారం కొల్లూరు మూకాంబిక దేవస్థానాన్ని సతీసమేతంగా దర్శించారు. ఈ సమయంలో కాంతార నటుడు రిషబ్శెట్టి కూడా సీఎం వెంట ఉండడం విశేషం. తరువాత సీఎం విలేకరులతో మాట్లాడుతూ రిషబ్శెట్టి అనుకోకుండా కలిశారని చెప్పడం గమనార్హం. సీఎం వెంట మంత్రి కోట శ్రీనివాస పూజారి, ప్రమోద్ మధ్వరాజ్లున్నారు. జిల్లాకు చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు గైరాజరయ్యారు. కాగా, ఉడుపి జిల్లా శిరూరు వద్ద సీఎం హెలికాప్టర్ టేకాఫ్ అవుతుండగా అక్కడికి వంద మీటర్ల దూరంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. హెలికాప్టర్ యథావిధిగా టేకాఫ్ అయ్యింది. కాగా ఇటీవల సినీనటుడు కిచ్చా సుదీప్ బహిరంగంగానే సీఎం బసవరాజ్ బొమ్మై, బీజేపీకి మద్దతు ప్రకటించారు. దీని తర్వాత సీఎం బసవరాజ బొమ్మైతో కాంతారావు నటుడు రిషబ్ శెట్టి కనిపించడం ఆసక్తిని రేకెత్తించింది. కిచ్చా సుదీప్ లాగా కాంతారావు కూడా బీజేపీ తరపున ప్రచారం చేస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
మరో కాంతారా ?
-
రాజకీయాల్లోకి కాంతార హీరో రిషబ్ శెట్టి? ఆయన ఏమన్నారంటే..
కన్నడ సెన్సేషన్ కాంతార సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇప్పటికే ఎన్నో అవార్డులు, ప్రశంసలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ను సొంతం చేసుకున్నారు రిషబ్ శెట్టి. అయితే తాజాగా ఈ హీరోకు సంబంధించి ఓ వార్త కన్నడ నాట చర్చనీయాంశంగా మారింది. రిషబ్ శెట్టి రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడంటూ తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ జర్నలిస్ట్ ట్వీట్ చేయడంతో కాసేపటికే అది వైరల్గా మారింది. అయితే తాజాగా ఈ విషయంపై రిషబ్ శెట్టి స్పందించారు. నేను రాజకీయాల్లోకి రావడం లేదు. ఈ ప్రచారంలో నిజం లేదు. నా సినిమాలకు మద్దతివ్వండి చాలు అంటూ అభిమానులు, ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. గతంలోనూ తన పొలిటికల్ ఎంట్రీపై వార్తలు వచ్చాయని, అయితే ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలపై ఉందని చెప్పుకొచ్చారు. -
కాంతారకు అరుదైన గౌరవం, ఐక్యరాజ్య సమితిలో స్క్రీనింగ్
-
కాంతార మరో సంచలనం.. విదేశాల్లోనూ రిలీజ్!
భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘కాంతార’ చిత్రం ఇప్పుడు విదేశీ ఆడియన్స్ని అలరించేందుకు సిద్ధం అవుతోంది. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతార’. సప్తమి గౌడ హీరోయిన్. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది సెప్టెంబరు 30న కన్నడలో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ.. ఇలా ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేశారు. సుమారు 20కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం దాదాపు 450 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ విశ్లేషకుల లెక్కలు చెబుతున్నాయి. తాజాగా ఈ మూవీని విదేశాల్లో కూడా రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ నిర్ణయించుకుంది. స్పానిష్, ఇటాలియన్ భాషల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయని, థియేటర్స్లోనే విడుదల చేస్తామని చిత్రబృందం వెల్లడించింది. -
అంతర్జాతీయ స్థాయిలో కాంతారకు అరుదైన గౌరవం..
రిషబ్ శెట్టి హీరోగా నటించడమే కాకుండా స్వీయదర్శకత్వం వహించిన అద్భుత చిత్రం కాంతారకు అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం జెనీవాలో మార్చి 17న ఈ సినిమా ప్రదర్శించనున్నారు. స్క్రీనింగ్ పూర్తైన అనంతరం రిషబ్ శెట్టి ప్రసంగిస్తారు. ఇప్పటికే హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి స్విట్జర్లాండ్ చేరుకున్నారు. తన సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించనుడంతో సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాంతార సినిమా ప్రకృతి ప్రసాదించిన అడవుల రక్షణ గురించి ప్రస్తావించిన కాంతార చిత్రం ప్రపంచ స్థాయిలో ప్రదర్శితం కానుండటం నిజంగా గొప్ప విషయం అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ రాసుకొచ్చారు. దీనికి పలు ఫోటోలు జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా తక్కువ బడ్జెట్తో రూపొందిన కాంతార వందల కోట్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే! దీంతో కాంతార ప్రీక్వెల్ తీసే పనిలో పడింది చిత్రయూనిట్. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
క్రేజీ బజ్: రిషబ్ శెట్టి-విజయ్ దేవరకొండ కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీ?
‘కాంతార’ సినిమాతో నేషనల్ స్టార్గా గుర్తింపు పొందాడు కన్నడ దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి. ఈ చిత్రంలోని రిషబ్ శెట్టి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరింగింది. చిన్న సినిమాగా వచ్చిన కాంతార చిత్రం పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి సంచలన విజయం సాధించింది. దీంతో రిషబ్ శెట్టి నెక్ట్స్ ప్రాజెక్ట్పై భారీ అంచాలు నెలకొన్నాయి. ఇక లైగర్ మూవీతో పాన్ ఇండియా స్టార్గా మారాడు విజయ్ దేవరకొండ. ఈ మూవీ ప్లాప్ అయినప్పటికి విజయ్కి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. ‘కాంతార’ చిత్రంలో రిషబ్ శెట్టి, ‘లైగర్’తో విజయ్ దేవరకొండ దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ బేస్ను సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అ సినిమాను భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ న్యూస్ చూసి సౌత్ ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే రిషబ్, విజయ్ని డైరెక్ట్ చేయబోతున్నాడా? లేక వీరిద్దరు హీరోలుగా మల్టీస్టారర్ చిత్రం రూపొందనుందా? అనేది క్లారిటీ లేదు. ఈ ప్రస్తుతం ఈ వార్త ఫిలిం దూనియా హాట్టాపిక్గా నిలిచింది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. దీనిపై ఇదివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కాగా రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార సీక్వెల్ను తెరకెక్కించిన పనిలో ఉండగా. మరోవైపు విజయ్ ఖుషీ చిత్రం షూటింగ్తో బిజీగా ఉన్నాడు. -
రిషబ్ శెట్టి బ్యూటీఫుల్ ఫ్యామిలీ.. కూతురి బర్త్డేలో కన్నడతారల సందడి (ఫొటోలు)
-
క్రేజీ బజ్.. కాంతార-2లో సూపర్స్టార్ రజనీకాంత్?
కన్నడ సెన్సేషన్ కాంతార మూవీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. కేవలం రూ. 16కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 400కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సెన్సేషన్ క్రియేట్ చేసింది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించి తెరకెక్కించిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్గా నిలిచింది. దీంతో ఈ చిత్రానికి ఇప్పటికే సీక్వెల్ ప్రకటించారు మేకర్స్. అయితే తాజాగా కాంతార-2కు సంబంధించిన ఓ క్రేజీ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.ఈ మూవీలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించనున్నట్లు ఇండస్ట్రీలో జోరుగా టాక్ వినిపిస్తుంది. ఇదే విషయంపై తాజాగా ఓ కార్యక్రమంలో రిషబ్ శెట్టిని ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పకుండా మౌనం వహించారు. ఒకవేళ రజనీకాంత్ను సంప్రదించకపోతే ఇది కేవలం పుకారు అని బదులిచ్చేవారు. దీంతో కాంతార-2పై మరింత ఆసక్తి నెలకొంది. -
ఇది వారికే అంకితమిస్తున్నా: రిషబ్ శెట్టి ఎమోషనల్ పోస్ట్
ఎలాంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన చిత్రం కాంతార. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. కేవలం రూ. 16కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 400కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు రిషబ్శెట్టి. అదే సినిమాకుగాను ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ఆయన మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్గా అవార్డు అందుకున్నారు. తనకు అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ రిషబ్ సోషల్ మీడియాలో ఓ లేఖ పోస్ట్ చేశారు. ముంబయిలో సోమవారం ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. లేఖలో రిషబ్ శెట్టి రాస్తూ.. 'ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడంలేదు. ‘కాంతార’ అవకాశం ఇచ్చిన హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ, నిర్మాత విజయ్ కిరగందూర్ సర్కు ధన్యవాదాలు. హోంబలే సంస్థతో కలిసి మరిన్ని చిత్రాలకు కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నా. కాంతార భాగమైన చిత్రబృందం, నా జీవిత భాగస్వామి ప్రగతిశెట్టి లేనిదే ఈ అవార్డు లేదు. వారి సహకారంతోనే ఇది సాధ్యమైంది. ఈ అవార్డును కర్ణాటక ప్రజలు, దివంగత నటుడు పునీత్ రాజ్కుమార్, భగవాన్ (దివంగత దర్శకుడు)సర్కు అంకితమిస్తున్నా. నన్ను అభిమానించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.' అని రిషబ్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీక్వెల్ను తెరకెక్కించే పనిలో ఉన్నారు రిషబ్. తదుపరి చిత్రంలో హీరో తండ్రి పాత్రను ప్రధానంగా చూపిస్తారని తెలుస్తోంది. -
DPIFF Awards 2023: ఉత్తమ నటుడు రణ్బీర్, నటి అలియా.. ఆర్ఆర్ఆర్కు అవార్డు
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఖాతాలో మరో అరుదైన అవార్డు చేరింది. చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నెషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా అవార్డు సొంతం చేసుకుంది. పలువురు సినీ తారల సమక్షంలో సోమవారం రాత్రి ముంబైలో దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నెషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. ఈ సందర్భంగా విజేతలను ప్రకటించి అవార్డులు అందజేశారు. View this post on Instagram A post shared by Dadasaheb Phalke -DPIFF Awards (@dpiff_official) ‘కాంతార’సినిమాలో నటనకు గాను కన్నడ హీరో రిషబ్ శెట్టికి మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్గా అవార్డు దక్కించుకున్నారు. ఉత్తమ చిత్రంగా ‘ది కశ్మీర్ ఫైల్స్’.. ఉత్తమ నటుడిగా రణ్బీర్ కపూర్(బ్రహ్మాస్త్ర), ఉత్తమ నటిగా అలియా భట్(గంగూబాయి కాఠియావాడి) అవార్డులను పొందారు. ఇక 2023 సంవత్సరానికి గాను దాదా సాహెబ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును ప్రముఖ నటి రేఖ అందుకున్నారు. టెలివిజన్ రంగంలో ఉత్తమ నటుడిగా జైన్ ఇమాన్ ఉత్తమ నటిగా తేజస్వీ ప్రకాశ్ అవార్డులు అందుకోగా.. వెబ్ సిరీస్ విభాగంలో బెస్ట్ వెబ్సీరీస్గా రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్, ఉత్తమ నటుడు జిమ్ సార్బ్(రాకెట్ బాయ్స్) అవార్డుల పొందారు. దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నెషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ విజేతలు వీరే ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ : ఆర్ఆర్ఆర్ ఉత్తమ చిత్రం: ది కశ్మీర్ ఫైల్స్ ఉత్తమ దర్శకుడు: ఆర్. బాల్కి(చుప్: ది రివెంజ్ ఆఫ్ ఆర్టిస్ట్) ఉత్తమ నటుడు: రణ్బీర్ కపూర్(బ్రహ్మాస్త్ర-1) మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్: రిషబ్ శెట్టి(కాంతార) ఉత్తమ నటి: అలియా భట్(గంగూబాయి కాఠియావాడి) మోస్ట్ వర్సటైల్ యాక్టర్: అనుపమ్ ఖేర్ క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ : వరుణ్ ధావన్(బేడియా) క్రిటిక్స్ ఉత్తమ నటి: విద్యాబాలన్(జల్సా) బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్: సాచిత్ తాండన్) -
అభిమానితో ప్రేమ.. ఆ తర్వాత.. కాంతార హీరో ప్రేమకథలో ట్విస్టులు
కన్నడ హీరో రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కాంతార సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాడు రిషబ్ శెట్టి. ఇక కాంతార మూవీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఎలాంటి అంచనాలు లేకండా ప్రాంతీయ సినిమాగా వచ్చిన పాన్ ఇండియా స్థాయిలో కలేక్షన్స్ రాబట్టింది. కేవలం రూ. 15 కోట్లతో నిర్మించిన కాంతార ఏకంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ప్రపంచవ్యాప్తంగా బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. దీంతో రిషబ్ శెట్టి గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. ఆయన వ్యక్తిగత జీవితంపై పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. అయితేరి షబ్ శెట్టిది లవ్ మ్యారేజ్. ఆయన భార్య పేరు ప్రగతి. ఇవాళ వాలెంటైన్స్ డే సందర్భంగా ఆయన ప్రేమ పెళ్లిపై ప్రత్యేక కథనం. అభిమానితో ప్రేమ సాధారణంగా హీరోలు తమ ఇండస్ట్రీలోని పరిచయమున్న వారితో ప్రేమలో పడట సహజం. కానీ అభిమానితో ప్రేమలో పడటం అంటే చాలా అరుదు. కానీ రిషబ్ శెట్టి జీవితంలో అదే జరిగింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన అమ్మాయితో ఆయన ప్రేమలో పడ్డారు. ఓ ఈవెంట్లో ఆమెను చూసిన మనసు పారేసుకున్నారు. ఆ తర్వాత ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్నారట. ఓ ఈవెంట్లో 2016లో పరిచయమైన ప్రగతిని 2017లో వివాహం చేసుకున్నారు రిషబ్ శెట్టి. వీరి ప్రేమ ఎలా మొదలైందంటే.. కిరాక్ పార్టీ ఫేమ్ రక్షిత్ శెట్టితో ఓ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. రిషబ్కు వీరాభిమాని అయిన ఆ ఈవెంట్కు వెళ్లింది. అక్కడే ఆమెను చూశారు రిషబ్. ఇంటికెళ్లి ఫోన్లో ఫేస్ బుక్ చూస్తే ఆ అమ్మాయి రిక్వెస్ట్ పెట్టిందట. ఆమె రిక్వెస్ట్ ఏడాది తర్వాత చూసి యాక్సెప్ట్ చేశారట. ఇక అప్పటి నుంచి చాటింగ్, ఫోన్ కాల్స్ మొదలయ్యాయి. పట్టుబట్టి మరీ ఒప్పించిన ప్రగతి అయినా ప్రగతి ఇంట్లో వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. రిషబ్ జీవితంలో ఇంకా స్థిరపడలేదని వద్దని చెప్పారు. కానీ ప్రగతి పట్టుబట్టి మరీ కుటుంబ సభ్యులను ఒప్పించింది. ఆ తర్వాత 2017లో వీరి ప్రేమ పెళ్లి జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రిషబ్ సినీ కెరీర్ రిషబ్ కెరీర్ విషయానికొస్తే ఫిల్మ్ డైరెక్షన్లో డిప్లొమా చేశారు. కన్నడ స్టార్ డైరెక్టర్ ఏమ్మార్ రమేశ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన నిర్మాత, దర్శకుడిగా రెండు చిత్రాలు చేస్తున్నారు. -
కాంతార-2 హీరోయిన్గా ఊర్వశీ రౌతేలా? వైరల్ అవుతున్న ఫోటో
ఎలాంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన చిత్రం కాంతార. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. కేవలం రూ. 16కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 400కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా రానున్నట్లు ఇటీవలె మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాంతార-2 స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా కూడా నటించనుంది. ఈ మేరకు స్వయంగా ఆమె తన ఇన్స్టా స్టోరీలో డైరెక్టర్ రిషబ్ శెట్టితో కలిసి ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘కాంతారా2’లోడింగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఊర్వశీ హీరోయిన్గా నటిస్తుందా లేక కీలక పాత్రలో చేయనుందా అన్న సందేహం నెలకొంది. ప్రస్తుతం ఊర్వశీ షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
కాంతార వరాహ రూపం సాంగ్.. సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు
కన్నక హీరో రిషబ్ శెట్టి దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం 'కాంతార'. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర బృందానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. గతంలో వరాహ రూపం పాటను సినిమా నుంచి తొలగించాలన్న కేరళ హైకోర్టు ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కేసులో దర్శకుడు రిషబ్ శెట్టి, నిర్మాత విజయ్ కిరంగదూర్కు అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. ఈ పాటను సినిమా నుంచి తొలగించాల్సిన అవసరం లేదని మధ్యంతర ఉత్తర్వుల్లో సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ కేసులో చిత్ర నిర్మాత విజయ్ కిరంగదూర్, హీరో రిషబ్ శెట్టికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అంతే కాకుండా కేసు విచారణకు హాజరైనప్పుడు వారిని అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశించింది. అసలేం జరిగిందంటే ? కాంతార సినిమాలో వరాహ రూపం ఓ రేంజ్లో హిట్ అయింది. అయితే ఆ సాంగ్ బాణీని కాపీ కొట్టారంటూ కేరళకు చెందిన 'తైకుడం బ్రిడ్జ్' అనే మ్యూజిక్ బ్యాండ్ ఆరోపించింది. అనంతరం కోర్టును ఆశ్రయించి పాట ప్రదర్శన నిలివేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత థియేటర్లలతో పాటు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లలో పాటను ప్లే చేయడాన్నినిలిపివేయాలని స్థానిక న్యాయస్థానం మేకర్స్ను ఆదేశించింది. ఆ తర్వాత కేరళలోని కోజికోడ్ జిల్లా న్యాయస్థానం అధికార పరిధి లేకపోవడంతో 'వరాహ రూపం' పాటపై నిషేధాన్నిఎత్తివేసింది. -
కాంతార 2పై కీలక అప్డేట్ ఇచ్చిన రిషబ్ శెట్టి
గతేడాది రిలీజ్ అయిన కన్నడ చిత్రం కాంతార ఎంతటి విజయం సాధించిన ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించి తెరకెక్కించిన ఈ సినిమా సంచలనం సృష్టించింది. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళు చేసింది. చదవండి: వచ్చే వారం ప్రభాస్-కృతి సనన్ నిశ్చితార్థం? ట్వీట్ వైరల్ విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్గా నిలిచిన ఈ సినిమా ఆస్కార్కు నామినేషన్స్ ఎంట్రీలోనూ చోటు సంపాదించుకోవడం విశేషం. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు పార్ట్ 2 తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కానీ ఇది కాంతారకు సీక్వెల్ కాదని ఇప్పటికే చిత్ర బృందం స్పష్టం చేసింది. అయితే కాంతార 2 ప్రకటించిన నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా దీనిపై హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి కీలక అప్డేట్ ఇచ్చారు. చదవండి: ఆయన మరణం తర్వాత నన్ను ఏ సంఘటన కదిలించడం లేదు: సునీత తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన ఆయన కాంతార 2పై స్పందించారు. ‘వచ్చే ఏడాది కాంతార 2ను విడుదల చేస్తాం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రి ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశాం. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభిస్తాం. ఇది కాంతారకు సీక్వెల్ కాదు.. ప్రీక్వెల్. తొలి భాగం కథ ఎక్కడైతే ప్రారంభమైందో.. దానికి ముందు జరిగిన సంఘటనలను ఇందులో చూపించబోతున్నాం. అలాగే పంజుర్లికి సంబంధించిన సన్నివేశాలు పార్ట్ 2లో ఎక్కువగా ఉంటాయి’ అంటూ రిషబ్ చెప్పుకొచ్చారు. -
కన్నడ సెన్సేషన్ కాంతార-2 వచ్చేస్తోంది.. కానీ సీక్వెల్ కాదట
కన్నడ సెన్సేషన్ కాంతార సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంత పెద్ద హిట్ అయ్యింతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించి తెరకెక్కించిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. చిన్న సినిమాగా రూ. 16కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 400కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్గా నిలిచిందీ చిత్రం. అంతేకాకుండా ఆస్కార్కు నామినేషన్స్ ఎంట్రీలోనూ చోటు సంపాదించుకుంది కాంతార. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు పార్ట్-2 తెరకెక్కిస్తున్నట్లు హోంబలే అధినేత విజయ్ కిరంగదూర్ తెలిపారు. అయితే ఇది సీక్వెల్ కాదని, ప్రీక్వెల్గా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. జూన్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తుంది. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. -
'కాంతార క్లైమాక్స్.. రియల్ లైఫ్లోనూ ఎదురైన సీన్'
కాంతార సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కన్నడ సహా విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమా అయినా కేవలం దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీలోని ప్రధానంగా వరాహం సాంగ్, క్లైమాక్స్ సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్లాయి. కర్ణాటకలో ప్రాచీన సంప్రదాయమైన భూతకోల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఓ వీడియోను షేర్ చేసింది. రిషబ్శెట్టి, సప్తమి గౌడతోపాటు చిత్రబృందం సభ్యులు. హోంబలే నిర్మాతలు తులునాడులో పంజర్లీ ఉత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి భూతకోల ఆడటం.. పంజర్లీ అతడిని ఆవహించడం లాంటి సన్నివేశాలను చిత్రబృందం దగ్గరుండి చూశారు. పంజర్లీ ఆవహించిన వ్యక్తి రిషబ్శెట్టిని ఆత్మీయంగా పట్టుకోవడం వీడియోలో కనిపించింది. ఆ వీడియోలో భూతకోల ఆడే వ్యక్తిని పంజుర్లి ఆవహించడం.. ఆ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. తెరపై చూపించిన భూతకోల సన్నివేశాలను నిజ జీవితంలోనూ రిషబ్ శెట్టి బృందం కనులారా వీక్షించింది. స్పెషల్ వీడియో షేర్ చేసిన నిర్మాణ సంస్థ.. కాంతార టీమ్తో కలిసి తాము నిజ జీవితంలో దైవానుగ్రహం పొందామని పేర్కొంది. హోంబలే ఫిల్మ్స్ తన ట్విటర్ ఖాతాలో రాస్తూ..'ప్రకృతికి మనం లొంగిపోయి మనకు స్వేచ్ఛ, విజయాన్ని ప్రసాదించిన దైవాన్ని ఆరాధించండి. కాంతార బృందం నిజ జీవితంలో దేవానుగ్రహాన్ని పొందింది.' అని పేర్కొంది. అయితే ఈ వీడియోలోని దృశ్యాలు సినిమా తీయడానికి కంటే ముందే జరిగినట్లు తెలుస్తోంది. ಹರಕೆ ತೀರಿಸಿದ ಕ್ಷಣಗಳು. You surrender to the nature & worship the God, who has bestowed you with such success n freedom in life. #Kantara team witnessed the divine in real form & took the blessings of Daiva!@shetty_rishab #VijayKiragandur @gowda_sapthami @ChaluveG @Karthik1423 pic.twitter.com/vPn8mOoenR — Hombale Films (@hombalefilms) January 20, 2023 -
నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది వారే.. కాంతార హీరోపై రష్మిక షాకింగ్ కామెంట్స్
రష్మిక మందన్నా సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్లోనూ పలు చిత్రాల్లో నటించింది. పుష్ప సినిమా ఒక్కసారిగా నేషనల్ క్రష్గా మారిపోయింది ముద్దుగుమ్మ. ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బిజీగా ఉంది. అయితే గతంలో రిషబ్ శెట్టి కాంతార సినిమాపై కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. కన్నడలో ఘన విజయం సాధించిన కాంతార చిత్రం విషయంలో రష్మిక మాటలు తీవ్ర వివాదాస్పదం కావడమే ఇందుకు కారణం. ఒక దశలో కన్నడ చిత్ర పరిశ్రమ రష్మికను బ్యాన్ చేసిందనే ప్రచారం కూడా జరిగింది. ఈ విషయంలో రిషబ్ శెట్టి, రష్మిక ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రష్మిక రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టిలపై పాజిటివ్ కామెంట్స్ చేశారు. కిరాక్ పార్టీ అనే చిత్రం ద్వారా తనను ఇండస్ట్రీకి పరిచయం చేసింది వారేనని చెప్పుకొచ్చింది. తాను ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానంటే వారిద్దరే కారణమని తెలిపింది. అయితే ఆ మూవీలో నటించిన హీరో రక్షిత్తో ప్రేమాయణం నడిపినట్లు టాక్ వినిపించింది. అలాగే తనపై ఇటీవల సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయని తెలిపింది. ఇకపై అలాంటి వాటిని సహించబోనని చెబుతోంది నేషనల్ క్రష్. సడన్గా రిషబ్, రక్షిత్పై పాజిటివ్ కామెంట్స్ చేయడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. -
నేను అలా అనడం నచ్చలేదేమో: ఆ వివాదంపై రష్మిక స్పందన
రష్మిక మందన్నా కొద్ది రోజులుగా ట్రోల్స్ను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కన్నడీగులు ఆమెపై గుర్రుగా ఉన్నారు. ఇటీవల కాంతార నటుడు రిషబ్ శెట్టిపై ఆమె చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్టాపిక్గా నిలిచాయి. తనని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు, నిర్మాణ సంస్థ పేరు చెప్పకుండో సో కాల్డ్ అంటూ ప్రస్తావించింది. రీసెంట్గా తన బాలీవుడ్ చిత్రం మిషన్ మజ్ను ఈవెంట్లో సౌత్ ఇండస్ట్రీ పాటలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. సౌత్ సినిమాల్లో కేవలం మాస్ సాంగ్స్యే ఉంటాయని, రొమాంటిక్ సాంగ్స్ అంటూ నార్త్ మూవీస్ అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. చదవండి: త్రిషకు షాక్! తెరపైకి కాజల్ అగర్వాల్? దీంతో రష్మికకు దక్షిణాదిన తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఆమె సౌత్ నుంచి బ్యాన్ చేయాలంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తనపై వస్తున్న వ్యతిరేకతపై రష్మిక స్పందిందించింది. రీసెంట్గా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ‘నటి అయినంత మాత్రాన అందరు ఇష్టపడతారని చెప్పలేం. ఇక్కడ ద్వేషం ఉంటుంది. అలాగే ప్రేమ కూడా ఉంటుంది. నేను ఓ పబ్టిక్ సెలబ్రెటీని. మనం వారితోనే ఉంటాం, వారితోనే మాట్లాడుతుంటాం. ఈ క్రమంలో కొందరికి నా తీరు నచ్చకపోవచ్చు. నేను మాట్లాడే మాటలు, నా ఎక్స్ప్రెషన్స్, చేతులతో చేసే సంజ్ఞలు నచ్చి ఉండకపోవచ్చు. చదవండి: ఆ స్టార్ హీరో నాకు ఫోన్ రాత్రికి రమ్మన్నాడు: నటి ఎవరి కారణాలు వారికి ఉంటాయి. కానీ కొందరికి మాత్రం నేనంటే ప్రేమ ఉండి ఉంటుంది కదా. అలాంటి వారికి నేను కృతజ్ఞురాలిని’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా కాంతార మూవీ సమయంలో రష్మికను సినిమా చూశారా? అని రిపోర్టర్ అడగ్గా.. ఆ సినిమా చూడలేదు అని చెప్పింది. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనని పరిచయం చేసిన ప్రొడక్షన్ హౌస్ పేరు చెప్పకుండా చేతివేళ్లతో సైగ చేసి చూపించింది. అప్పటి నుంచి రష్మిక కన్నడ చిత్ర పరిశ్రమ ఉద్దేశిస్తూ తరచూ కాంట్రవర్సల్ కామెంట్స్ చేస్తూ వస్తోంది. ఇక ఆమె తీరుపై కన్నడ ప్రేక్షకులతో పాటు శాండల్వుడ్ సెలబ్రెటీలు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
రష్మికకు రిషబ్ శెట్టి గట్టి కౌంటర్, ట్వీట్ వైరల్
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా, కాంతార హీరో రిషబ్ శెట్టి మధ్య కొద్ది రోజులుగా కొల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఇద్దరు ఒకరిపై ఒకరు పరోక్షంగా కౌంటర్ వేసుకున్న వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. అయితే ఇద్దరి మధ్య ఎలాంటి మన్పర్థలు లేవని, సత్సంబంధాలే ఉన్నాయని రష్మిక ఇటివల చెప్పింది. కానీ, తాజాగా రిషబ్ శెట్టి రష్మికకు ఇన్డైరెక్ట్ కౌంటర్ ఇస్తూ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది. కాగా రష్మిక కన్నడ మూవీ కిరిక్ పార్టీ మూవీతో సినీరంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. 2016లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీతోనే రష్మిక హీరోయిన్గా పరిచయమైంది. తాజాగా శుక్రవారంతో (డిసెంబర్ 30) ఈ సినిమా విడుదలైన ఆరేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి ట్వీట్ చేస్తూ.. ‘మా సినిమా విడుదలై ఆరేళ్లు అయినప్పటికీ.. మా కోసం మీరు చేసిన సందడి, థియేటర్లో మీరు వేసిన విజిల్స్ అన్ని మా చెవుల్లో మారుమ్రోగుతూనే ఉన్నాయి. మమ్మల్ని మరోసారి ఆ రోజుల్లోకి తీసుకువెళ్లున్నాయి. ఈ సెలబ్రేషన్స్లో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని రాసుకొచ్చాడు. అలాగే తన ట్వీట్కి హీరో రక్షిత్ శెట్టి, నిర్మాణ సంస్థ పేరు, మ్యూజిక్ డైరెక్టర్ లోక్నాథ్ను ట్యాగ్ చేశాడు. అయితే ఇందులో హీరోయిన్గా లీడ్ రోల్ పోషించిన రష్మిక పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. అంతేకాదు ఆమె పేరు కూడా ట్యాగ్ చేయలేదు. దీంతో ఈ ట్వీట్ వైరల్గా మారింది. దీంతో ఇది కాస్తా ఇండస్ట్రీలో హాట్టాపిక్ నిలిచింది. అయితే ‘గతంలో రష్మిక తనకు ఆఫర్ ఇచ్చిన నిర్మాణ సంస్థ, డైరెక్టర్ పేరు చెప్పకుండ సోకాల్డ్ ప్రొడక్షన్ అని చెప్పి అవమానపరించింది.. ఇప్పుడు రిషబ్ శెట్టి మూవీలో భాగమైన రష్మిక పేరు ప్రస్తావించకుండా ఆమెకు గట్టి కౌంటర్ ఇచ్చాడు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 'ಕಿರಿಕ್ ಪಾರ್ಟಿ' ನೆಡೆದು ಆರು ವರ್ಷಗಳ ನಂತರವೂ ಪಾರ್ಟಿಗೆ ಕಳೆ ತಂದ ನಿಮ್ಮ ಸದ್ದು, ಗದ್ದಲ, ಸಿಳ್ಳೆಗಳು ಇನ್ನೂ ಕಿವಿಯಲ್ಲಿ ಪ್ರತಿಧ್ವನಿಸುತ್ತಿವೆ. ಮತ್ತೆ ಹಿಂತಿರುಗಿ ನೋಡುವಂತೆ ಮಾಡುತ್ತವೆ. ಈ ಸಂಭ್ರಮದ ಭಾಗವಾದ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು. @rakshitshetty @ParamvahStudios @AJANEESHB #KirikParty pic.twitter.com/Rgaq5Lywmq — Rishab Shetty (@shetty_rishab) December 30, 2022 చదవండి: మహేశ్-మహేశ్ మూవీ నుంచి బిగ్ అప్డేట్ బయటపెట్టిన రచయిత సినీ పరిశ్రమలో విషాదం.. నిద్రలోనే కన్నుమూసిన ప్రముఖ నటుడు -
'కాంతార' హీరోకి షాకింగ్ రెమ్యునరేషన్.. మరీ ఇంత తక్కువా?
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం కాంతార. కన్నడ సహా విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న కాంతార చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. కేవలం రూ. 16కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 400కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి కన్నడ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను సృష్టించింది. అయితే ఇంతటి ఘన విజయం సాధించిన కాంతార హీరోకు రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు ఇచ్చారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దర్శకుడిగానే కాకుండా హీరోగా చేసిన రిషబ్ శెట్టికి పారితోషికం కింద రూ. 4కోట్లు మాత్రమే చెల్లించారట. కనీసం సినిమా సూపర్ హిట్ అయ్యాక అయినా హోంబేల్ ప్రొడక్షన్స్ రిషబ్ శెట్టికి అదనంగా రెమ్యునరేషన్ ఇవ్వడం, లేదా కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వడం వంటివి కూడా జరగలేదనే టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందన్నది తేలాల్సి ఉంది. -
కాంతార చూసి చాలా నేర్చుకున్నా..రిషబ్పై హృతిక్ ప్రశంసల వర్షం
కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార’. ఓ ప్రాంతీయ సినిమాగా వచ్చి పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టింది. కేవలం రూ.16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది. కంటెంట్ ఉంటే అది చిన్న సినిమా అయిన ప్రేక్షకులు ఆదరిస్తారని కాంతార మరోసారి రుజువు చేసింది. తాజాగా ఈ చిత్రంపై బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రం నుంచి చాలా నేర్చుకున్నానని వెల్లడించారు. రిషబ్ నటన అసాధారణమైందని వర్ణించారు. (ఇది చదవండి: ‘కాంతార’ మూవీపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు) ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు కాంతార చిత్రాన్ని ప్రశంసించారు. ఇటీవల సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్లో హృతిక్ రోషన్ మాట్లాడారు. రిషబ్ నమ్మకం అసాధారణమైందని కొనియాడారు. హృతిక్ రోషన్ తన ట్వీట్లో రాస్తూ..'కాంతార చూడటం ద్వారా చాలా నేర్చుకున్నా. రిషబ్ నమ్మకం ఈ చిత్రాన్ని అసాధారణంగా మార్చింది. ఈ సినిమా క్లైమాక్స్ నాకు గూస్బంప్స్ తెప్పించింది.' అంటూ పోస్ట్ చేశారు. హృతిక్ రోషన్ ట్వీట్కు కాంతార హీరో రిషబ్ శెట్టి రిప్లై ఇచ్చారు. ధన్యవాదులు సార్ అంటూ పోస్ట్ చేశారు. ఈ చిత్రం కర్ణాటకలోని గ్రామీణ నేపథ్యంలో భూత కోలా అనే ప్రాంతీయ ఆచారం కథాంశంగా తెరకెక్కించారు. Learnt so much by watching #Kantara. The power of @shetty_rishab’s conviction makes the film extraordinary. Top notch storytelling, direction & acting. The peak climax transformation gave me goosebumps 🤯 Respect & kudos to the team 👏🏻 — Hrithik Roshan (@iHrithik) December 11, 2022 -
‘కాంతార’ మూవీపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార’ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ ప్రాంతీయ సినిమాగా వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 400కోట్ల కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. కంటెంట్ ఉంటే అది చిన్న సినిమా అయిన ప్రేక్షకులు ఆదరిస్తారని కాంతార మరోసారి రుజువు చేసింది. చదవండి: సరికొత్త హంగులతో ఏషియన్ తారకరామ థియేటర్, త్వరలో పున:ప్రారంభం తొలుత కన్నడ చిత్రం విడుదలైన ఈ మూవీ ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ అయి కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటనకు ప్రతి ప్రేక్షకులు ఫిదా అయ్యాడు. ఇదిలా ఉంటే తాజాగా కాంతార మూవీ బడ్జెట్ను ఉద్దేశిస్తూ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘చిన్న సినిమాలు కూడా భారీ కలెక్షన్స్ తెస్తాయని కాంతార సినిమా నిరూపించింది. భారీ బడ్జెట్ సినిమాలు ప్రత్యేకమే. చదవండి: అషు కాలును ముద్దాడటంపై ఆర్జీవీ క్లారిటీ, ట్రోలర్స్కు వర్మ గట్టి కౌంటర్ కానీ చిన్న బడ్జెట్ సినిమాగా వచ్చిన కాంతార మూవీ కలెక్షన్లతో మ్యాజిక్ చేసింది. దీంతో సినిమా మేకింగ్ భారీగా ఉండాలి అనుకునే నాలాంటి వాళ్ళని ఇరుకున పెట్టింది ఈ సినిమా. నా లాంటి భారీ బడ్జెట్ సినిమాలు తీసే దర్శకులని ఆలోచలనలో పడేసింది కాంతార. సినిమా నిర్మాణ వ్యయాన్ని మరోసారి సమీక్షించుకునేలా చేసింది. ఇక నుంచి మేం సినిమా మొదలుపెట్టేటప్పుడు బడ్జెట్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని కాంతార సినిమా తెలిపింది’ అని రాజమౌళి పేర్కొన్నారు. -
‘కాంతార’ హీరో రిషబ్ శెట్టిపై అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు
కన్నడ హీరో రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కాంతార సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాడు రిషబ్ శెట్టి. ఇక కాంతార మూవీ సృష్టించిన ప్రభంజనం అంతఇంత కాదు. ఎలాంటి అంచనాలు లేకండా ప్రాంతీయ సినిమాగా వచ్చిన పాన్ ఇండియా స్థాయిలో కలేక్షన్స్ రాబట్టింది. కేవలం రూ. 15 కోట్లతో నిర్మించిన కాంతార ఏకంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ప్రపంచవ్యాప్తంగా బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఇందులో రిషబ్ శెట్టి నటనకు ఫిదా కాని ప్రేక్షకుడు ఉండటంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇదిలా ఉంటే రిషబ్ శెట్టిపై టాలీవుడ్ నటి, ప్రముఖ యాంకర్ అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా అనసూయ తన ఇన్ స్టాలో ఫాలోవర్లతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఆమె ఫ్యాన్స్ ఒకరు ఓ మంచి సినిమాను రెకమండ్ చేయమని అడగ్గా.. కాంతార అని సమాధానం ఇచ్చింది. ఇక ఈ సనిమాపై, హీరో రిషబ్ శెట్టిపై ప్రశంసలు వర్షం కురిపించింది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి నమ్మశక్యం కానీ రీతిలో నటించారు. నేను ఇంకా ఆ సినిమా ప్రభావం నుంచి బయటకు రాలేకపోతున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం అనసూయ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న రంగమార్తండ చిత్రంలో నటిస్తోంది. చదవండి: తొలిసారి కాస్టింగ్ కౌచ్పై స్పందించిన కీర్తి సురేశ్ హీరోయిన్ అయితే అలాంటి పాత్రలు చేయొద్దా?: ట్రోలర్స్కు మృణాల్ ఘాటు రిప్లై -
రష్మిక బ్యాన్పై స్పందించిన డైరెక్టర్.. కామెంట్స్ వైరల్
సౌత్లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్నాపై కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ విధించనున్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఓ బాలీవుడ్ మీడియాతో తన ఫస్ట్ మూవీ గురించి రష్మిక చేసిన కామెంట్స్ ఈ వివాదానికి కారణమయ్యాయి. తాజాగా ఇదే అంశంపై డైరెక్టర్ నాగశేఖర్ స్పందించారు. ‘గుర్తుందా శీతాకాలం’ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన రష్మిక బ్యాన్ గురించి ప్రశ్నించగా.. ఒకరి నుంచి కృతజ్ఞత కోరుకోవడం మనదే తప్పు. నేను కూడా సంజు వెడ్స్ గీత సినిమా కోసం చాలామంది నటీనటులకు ఛాన్స్ ఇచ్చాను. వాళ్లు అది గుర్తుపెట్టుకుంటారా? లేదా అన్నది వాళ్ల వ్యక్తిగతొం. నేను అది పట్టించుకోను. ఎదుటివాళ్ల నుంచి కృతజ్ఞతాభావాన్ని కోరుకున్నప్పుడే మనం బాధపడతాం. రష్మికపై బ్యాన్ విషయానికి వస్తు.. దీని గుర్తించి నాకు పూర్తిగా క్లారిటీ లేదు. కానీ ఒకవేళ అలా చేస్తే అది ఆ పరిశ్రమకే నష్టం. ఇలాంటివి నేను సపోర్ట్ చేయను అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం డైరెక్టర్ నాగశేఖర్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. -
'కాంతార'కు భారీ ఊరట.. వారికి ఊహించని షాక్.!
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'కాంతార' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 400కోట్లతో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక సినీ ప్రేక్షకులు అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'కాంతార' ఎట్టకేలకు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. ఈనెల 24 నుంచి ఓటీటీ ఫ్లాట్ఫామ్ ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. (చదవండి: Kantara OTT : కాంతార ఓటీటీలో బిగ్ ట్విస్ట్.. బాలేదని ట్వీట్స్ చేస్తున్న నెటిజన్లు) తాజాగా కాంతార చిత్రబృందానికి భారీ ఊరట లభించింది. వరాహరూపం పాటపై మలయాళ బ్యాండ్ 'తెయ్యికుడుం బ్రిడ్జ్' ఈచిత్రంలోని పాటపై న్యాయపోరాటానికి దిగింది. దీనిపై విచారణ చేపట్టిన కేరళలోని కోజికోడ్ కోర్టు వారి పిటిషన్ కొట్టివేసింది. వరాహ రూపం పాట ప్రదర్శనపై మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. కాగా.. తమ అనుమతి లేకుండా మలయాళ పాటను తీసుకుని 'వరాహరూపం' తీశారని వాళ్లు ఆరోపిస్తున్నారు. అందువల్లనే ఓటీటీలోనూ ఆ పాటను ప్రదర్శించలేదు. ఈ పాట కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. అడ్డంకులు తొలగిపోవడంతో ఓటీటీ ప్రేక్షకులకు ఆ పాట అందుబాటులోకి రానుంది. కాంతార మూవీ క్లైమాక్స్లో ‘వరాహరూపం’ పాట, రిషబ్శెట్టి నటన ప్రేక్షకులు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ పాట లేకుండా సినిమాను ఊహించలేని పరిస్థితి. కానీ ఇటీవలే మలయాళ బ్యాండ్ 'తెయ్యికుడుం బ్రిడ్జ్' ఈచిత్రంలోని పాటపై న్యాయపోరాటానికి దిగింది. ఇవాళ కోర్టు తీర్పుతో ఈ వివాదానికి తెరపడింది. -
మరో భాషలో వస్తున్న ‘కాంతార’.. రిలీజ్ ఎప్పుడంటే?
కేవలం మౌత్టాక్తో దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన సినిమా 'కాంతార'. ప్రస్తుతం ఈ చిత్రం ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సినిమాలో హైలెట్గా నిలిచిన వరాహరూపం పాటను తొలగించడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అయితే దాదాపు భాషతో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్గా నిలిచిన ఈ చిత్రం తాజాగా మరో భాషలో రిలీజ్ కానుంది. (చదవండి: Kantara OTT : కాంతార ఓటీటీలో బిగ్ ట్విస్ట్.. బాలేదని ట్వీట్స్ చేస్తున్న నెటిజన్లు) కర్ణాటకలోని తులునాడు సంస్కృతి, సంప్రదాయల నేపథ్యంలో రిషబ్శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలైన తులు భాషలో అలరించేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 2 నుంచి ఈ సినిమా తులు భాషలో ఫ్యాన్స్ను ఎంటర్టైన్ చేయనుంది. ఈ చిత్రంలో సప్తమి గౌడ హీరోయిన్గా నటించారు. ప్రమోద్ శెట్టి, అచ్యుత్ కుమార్, కిశోర్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో మరో పాత్రలో కనిపించిన షానిల్ గురు తులు వర్షన్ డబ్బింగ్ పనులను పర్యవేక్షిస్తున్నట్లు ఇటీవల చిత్రబృందం వెల్లడించింది. -
Kantara OTT : కాంతార ఓటీటీలో బిగ్ ట్విస్ట్.. బాలేదని ట్వీట్స్ చేస్తున్న నెటిజన్లు
కన్నడ సెన్సేషన్ 'కాంతర' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టింది. కేజీఎఫ్ను బీట్ చేసేలా కలెక్షన్ల సునామీ సృష్టించింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 400కోట్లని రాబట్టి ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక సినీ ప్రేక్షకులు అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంతార సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే కాంతార ఓటీటో రిలీజ్లో అభిమానులకు మేకర్స్ షాక్ ఇచ్చారు. ఈ సినిమాకి సోల్ అయినటువంటి వరహారూపం సాంగ్ని మార్చేయడం ఫ్యాన్స్కు నిరాశ కలిగిస్తుంది. ‘వరాహరూపం’ పాట సినిమాకే హైలైట్గా నిలుస్తుంది. అలాంటిది ఓటీటీకి వచ్చేసిరికి ట్యూన్ మార్చి కొత్త మ్యూజిక్తో విడుదల చేశారు. ఒరిజినల్ సాంగ్తో పోలిస్తే ఇది బాలేదని, వరహారూపం ఒరిజినల్ వెర్షన్ని అప్డేట్ చేయండి అంటూ రిషబ్ శెట్టి సహా మూవీ టీంకు నెటిజన్లు రిక్వెస్టులు పెడుతున్నారు. కాగా తమ అనుమతి లేకుండా మలయాళ పాటను తీసుకుని 'వరాహరూపం' తీశారని మలయాళ బ్యాండ్ 'తెయ్యికుడుం బ్రిడ్జ్'ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వివాదం న్యాయస్థానంలో ఉంది. అందువల్లో యూట్యూబ్లోనూ ఆ పాటను హోంబాలే ఫిల్మ్స్ తొలగించింది. మరి ఈ విషయంలో కాంతార మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. -
అఫీషియల్: ఎట్టకేలకు ఓటీటీలో కాంతార
కంటెంట్ ఉంటే కలెక్షన్లు వాటంతటవే వస్తాయనడానికి ప్రత్యక్ష ఉదాహరణ కాంతార. చిన్న చిత్రంగా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఆల్రెడీ సినిమా చూసిన ప్రేక్షకులు సైతం వన్స్మోర్ చూసేద్దామని రెడీ అవుతున్నారు. కానీ ఓటీటీ రిలీజ్పై ఎంతో సస్పెన్స్ నెలకొంది. చివరికి ఈ ఎదురుచూపులకు తాళం వేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో. రేపటి(నవంబర్ 24) నుంచి కాంతార చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రైమ్లో ప్రసారం కానున్నట్లు ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కాంతార. సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజైన ఈ మూవీ తెలుగులో అక్టోబర్ 15న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.400 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ నిర్మించింది. putting an end to all the wait!!! 🤯#KantaraOnPrime, out tomorrow@hombalefilms @shetty_rishab @VKiragandur @gowda_sapthami @AJANEESHB @actorkishore pic.twitter.com/HBsEAGNRbU — prime video IN (@PrimeVideoIN) November 23, 2022 చదవండి: పబ్లిక్లో ఇదేం పని, శ్రియపై ట్రోలింగ్ -
రష్మిక పరువు తీసేసిన రిషబ్ శెట్టి! మీడియా ముందే షాకింగ్ కామెంట్స్
కాంతార సినిమాతో దేశ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో రిషబ్ శెట్టి. ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నాపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లనలో ఒకరైన రష్మిక మందన్నా ప్రస్తుతం క్రేజీ హీరోయిన్గా ఛాన్సులు దక్కించుకుంటుంది. కన్నడ మూవీ కిరిక్ పార్టీ అనే సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టిన రష్మికకు మొదటగా ఛాన్స్ ఇచ్చింది రిషబ్ శెట్టినే అన్న విషయం చాలామందికి తెలియదు. ఈ సినిమాను డైరెక్ట్ చేసింది రిషబ్ శెట్టినే. కిరిక్ పార్టీ తర్వాతే రష్మికకు వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి. అయితే ఇటీవలె కాంతార మూవీ చూశారా అని అడగ్గా అంత టైం లేదని, సినిమా చూడలేదని రష్మిక చెప్పడంతో ఆమెపై విపరీతంగా ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి తోడు ఓ ఇంటర్వ్యూలో కూడా తనకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన రిషబ్ శెట్టి పేరు చెప్పకుండా, తన ఫోటో చూసి అవకాశం వచ్చిందని రష్మిక చెప్పడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషబ్ శెట్టి రష్మికకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. సమంత, సాయిపల్లవి, రష్మికలలో నెక్ట్స్ ఎవరితో సినిమా చేయాలనుకుంటున్నారు అన్న ప్రశ్నకు రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. 'కొంతమంది హీరోయిన్స్తో అస్సలు పనిచేయాలనుకోవడం లేదు. సమంత, సాయిపల్లవి పనితనం నాకు ఇష్టం. ఇంకా కొత్త హీరోయిన్స్తో వర్క్చేయాలనుకుంటున్నా' అంటూ రష్మిక పేరును వదిలేసి ఆమె సిగ్నేచర్ హ్యాండ్స్ను చూపిస్తూ కౌంటర్ ఇచ్చారు. దీంతో వీరిద్దరి మధ్య కోల్డ్వార్ జరుగుతుందని ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చినట్లయ్యింది. మొదటి నుంచి రష్మిక కు రిషబ్ శెట్టికి మధ్య విభేదాలు నెలకొన్నాయని వార్తలు గుప్పుమన్నసంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ అంశం హాట్టాపిక్గా మారింది. The Journey of two "✌️✌️" pic.twitter.com/rbGrdli6K9 — MNV Gowda (@MNVGowda) November 21, 2022 -
కాంతార ప్రభంజనం.. కేజీఎఫ్-2 రికార్డ్ బ్రేక్
బాక్సాఫీస్ సంచలనం సృష్టించిన మూవీ 'కాంతార'. భాషతో సంబంధం లేకుండా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విడుదలై 50 రోజులు అయినా థియేటర్లలో క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. తాజాగా వసూళ్ల పరంగా మరో రికార్డ్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల (గ్రాస్) వసూళ్లను రాబట్టింది. కర్ణాటకలో కేజీయఫ్-2 రికార్డును అధిగమించి రూ.168.50 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తోంది. (చదవండి: ఓటీటీకి 'కాంతార'.. ఆ వివాదం వల్లే ఆలస్యమవుతోందా ?) తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.60 కోట్లు, తమిళనాడులో రూ.12.70 కోట్లు, కేరళలో 19.20 కోట్లు, ఓవర్సీస్లో రూ.44.50 కోట్లు వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్లో అయితే ఇప్పటివరకూ రూ.96 కోట్లు వచ్చినట్లు ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సినీ ప్రేక్షకులు అందరూ ఓటీటీలో ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగులో డబ్ అయి, అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 చిత్రాల జాబితాలో నిలిచింది. మొదటి స్థానంలో ‘కేజీయఫ్2’ రూ.185 కోట్ల టాప్లో ఉండగా, ఆ తర్వాత 2.ఓ (రూ.100కోట్లు), రోబో (రూ.72కోట్లు), కాంతార (రూ.60) ఐ (రూ.57కోట్లు) ఉన్నాయి. ‘KANTARA’ CROSSES ₹ 400 CR WORLDWIDE… #Kantara territory-wise breakup… Note: GROSS BOC… ⭐️ #Karnataka: ₹ 168.50 cr ⭐️ #Andhra / #Telangana: ₹ 60 cr ⭐️ #TamilNadu: ₹ 12.70 cr ⭐️ #Kerala: ₹ 19.20 cr ⭐️ #Overseas: ₹ 44.50 cr ⭐️ #NorthIndia: ₹ 96 cr ⭐️ Total: ₹ 400.90 cr pic.twitter.com/CmBQbLrZvf — taran adarsh (@taran_adarsh) November 22, 2022 -
ఓటీటీకి 'కాంతార'.. ఆ వివాదం వల్లే ఆలస్యమవుతోందా ?
బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన మూవీ 'కాంతార'. భాషతో సంబంధం లేకుండా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విడుదలై 50 రోజులైనా థియేటర్లలో క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. అయితే ఈ చిత్రం ఓటీటీలోకి రావడంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇటీవలే నవంబరు 24న ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేస్తుందంటూ సోషల్మీడియాలో వార్తలొచ్చాయి. (చదవండి: అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేస్తోన్న కాంతార, అంతలోనే ట్విస్ట్!) కానీ ఈ విషయంపై అధికారిక ఒక్క ప్రకటన కూడా చిత్రబృందం ఎక్కడా ఇవ్వలేదు. మరోవైపు చిత్ర నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ కూడా దీనిపై ఎక్కడా మాట్లాడటం లేదు. దీంతో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న కాంతార మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ చిత్రం ఓటీటీ విడుదలపై హోంబాలే ఫిల్మ్స్ కార్తిక్ గౌడను నుంచి ఎలాంటి స్పందనా రావడం లేదని సమాచారం. దీనిపై క్లారిటీ రావాలంటే మరిన్ని రోజులు వేచి చూడాల్సిందే. కారణం అదేనా?: కాంతార మూవీ క్లైమాక్స్లో ‘వరాహరూపం’ పాట, రిషబ్శెట్టి నటన లేకుండా సినిమాను ఊహించలేని పరిస్థితి. కానీ ఇటీవలే మలయాళ బ్యాండ్ 'తెయ్యికుడుం బ్రిడ్జ్' ఈచిత్రంలోని పాటపై న్యాయపోరాటానికి దిగింది. తమ అనుమతి లేకుండా మలయాళ పాటను తీసుకుని 'వరాహరూపం' తీశారని వాళ్లు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం న్యాయస్థానంలో ఉంది. అందువల్లో యూట్యూబ్లోనూ ఆ పాటను హోంబాలే ఫిల్మ్స్ తొలగించింది. ఈ వివాదం ఓ కొలిక్కి రావాల్సి ఉంది. మరోవైపు ‘తెయ్యికుడుం బ్రిడ్జ్’ బృంద సభ్యులు గతవారం బెంగళూరులో ‘నవరసం’ అనే పాటను ప్రదర్శించారు. (చదవండి: కాంతార హీరోకు గోల్డెన్ గిఫ్ట్ ఇచ్చిన రజనీకాంత్!) కేజీఎఫ్ను దాటేసిన కలెక్షన్లు..: కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కాంతార.సెప్టెంబర్ 30న చిన్న సినిమాగా రిలీజై భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ టాలీవుడ్లో అక్టోబర్ 15న రిలీజ్ చేశారు. తెలుగులోనూ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కర్ణాటకలో ‘కేజీయఫ్2’ రికార్డు రూ.155 కోట్లను అధిగమించి రూ.160.50 కోట్ల వసూళ్లు రాబట్టింది. కర్ణాటకలో ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. -
అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేస్తోన్న కాంతార, అంతలోనే ట్విస్ట్!
కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కాంతార. చిన్న సినిమాగా రిలీజై భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు రూ.360 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారి ఆత్రుతకు ఆనందం జోడించే ప్రకటన వెలువడింది. అధికారికంగా కాంతార ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో ఈ నెల 24 నుంచి ప్రసారం కానుంది. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ట్వీట్ వేసింది. ఈ వార్త విని సినీప్రియులు పండగ చేసుకున్నారు. మొత్తానికి కాంతారను మరోసారి చూసే ఛాన్స్ రాబోతోందని ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ అంతలోనే ఆ ట్వీట్ను డిలీట్ చేసింది ప్రైమ్ వీడియో. స్ట్రీమింగ్ డేట్ మార్చడానికి ట్వీట్ డిలీట్ చేశారా? లేదంటే అఫీషియల్గా మరోసారి అనౌన్స్ చేస్తారా? చూడాలి! కాగా కాంతార సెప్టెంబర్ 30న రిలీజై బ్లాక్బస్టర్ హిట్ సాధించింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ దీన్ని తెలుగులో అక్టోబర్ 15న రిలీజ్ చేయగా ఇక్కడ కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక హిందీలో అయితే ఇప్పటికీ వసూళ్లు రాబడుతూ రికార్డులు సృష్టిస్తోంది. ఇక ఈ సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్గా నటించగా రిషబ్ శెట్టి దర్శకత్వం వహించాడు. అజనీష్ లోకనాధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. చదవండి: నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఫస్ట్ హీరో ఎవరంటే? కూతురి సినీఎంట్రీపై స్పందించిన రోజా -
కాంతార హీరోకు గోల్డెన్ గిఫ్ట్ ఇచ్చిన రజనీకాంత్!
కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది. కన్నడలోనే కాకుండా తెలుగు, హిందీలోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది. కాంతార సినిమా మాస్టర పీస్ అని మెచ్చుకోని సెలబ్రిటీ లేడంతే అతిశయోక్తి కాదు. అంతటి ఆదరణ పొందిందీ చిన్న చిత్రం. సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే రిషబ్ శెట్టిని ఇంటికి పిలిచి మరీ అతడిని ప్రశంసించారు. ఆ సమయంలో రిషబ్కు బంగారు చైన్తో పాటు బంగారు లాకెట్ను కూడా కానుకగా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా కాంతార మూవీ కన్నడలో సెప్టెంబర్ 30న, హిందీలో అక్టోబర్ 14న, తెలుగులో అక్టోబర్ 15న విడుదలవగా.. ఒక్క హిందీలోనే రూ.76 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ సినిమా రూ.350 కోట్లకు పైనే రాబట్టింది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతుండటంతో కాంతార ఓటీటీ విడుదలను ఆలస్యం చేస్తున్నారు మేకర్స్. చదవండి: ఇటీవలే ఆపరేషన్ సక్సెస్.. అంతలోనే నటి పరిస్థితి విషమం బస్సులో ఒకడు అసభ్యంగా ప్రవర్తించాడు: ఆండ్రియా -
ఓటీటీకి 'కాంతార ' మూవీ.. అప్పటిదాకా ఆగాల్సిందేనా?
కన్నడ చిత్రం ‘కాంతార’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. భాషతో సంబంధం లేకుండా థియేటర్లను ఊపేసింది. ఈ ఏడాది సెప్టెంబరు 30న కన్నడలో విడుదలైన ‘కాంతార’ అతి తక్కువ సమయంలోనే బ్లాక్బస్టర్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ‘గీతాఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. కేవలం మౌత్ టాక్తోనే పాన్ ఇండియా స్థాయిలో ‘కాంతార’ అదరగొట్టింది. (చదవండి: ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి నటించిన తెలుగు మూవీ తెలుసా?) రిషబ్శెట్టి హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. దీనిపై చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడమే అసలు కారణం. ఇప్పటికే ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్న విషయం తెలిసిందే. మొదట నవంబర్ 4న ఓటీటీకి వస్తోందని వార్తలొచ్చాయి. కానీ అభిమానులకు నిరాశ తప్పలేదు. దీంతో అందరి నోటా కాంతార ఓటీటీకి ఎప్పుడు వస్తోందని చర్చించుకుంటున్నారు. కనీసం ఇప్పటికైనా అధికారిక ప్రకటన చేస్తారా? అని ఆశిస్తున్నారు. (చదవండి: ‘కాంతార’కు కాసుల పంట.. ఒక్క తెలుగులోనే రూ.50 కోట్లు వసూళ్లు) అసలు కారణం ఇదే: అక్టోబరు 15న టాలీవుడ్లో ‘కాంతార’ విడుదలై దాదాపు నెల రోజులు కావొస్తున్న థియేటర్లు మంచి ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. హిందీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. క్లైమాక్స్, రిషబ్శెట్టి నటనను చూసేందుకు చాలా మంది రెండోసారి సినిమా చూసేందుకు వస్తున్నారు. కలెక్షన్ల పరంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగులో రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘కాంతార మూవీని ప్రస్తుతం ఓటీటీలో విడుదల చేసే ఆలోచన చిత్రబృందానికి లేనట్లు తెలుస్తోంది. పైగా రాబోయే రోజుల్లో ‘హోంబలే ఫిల్మ్స్’ నుంచి మరిన్నీ క్రేజీ ప్రాజెక్టులు రాబోతున్నాయి. దీంతో అమెజాన్ ప్రైమ్ కూడా కాంతారను ఓటీటీకి తెచ్చే విషయంలో తొందరపడటం లేదని సమాచారం. అన్నీ కుదిరితే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లు వసూలు చేసిన తర్వాతే ఓటీటీకి తీసుకొస్తారని టాక్ నడుస్తోంది. మరీ అప్పటి దాకా ఫ్యాన్స్ వేచి చూడాల్సిందే. -
ఎన్టీఆర్తో సినిమా చేయనున్న 'కాంతార' డైరెక్టర్?
కన్నడ హీరో రిషబ్శెట్టి దర్శకుడిగా, హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ 'కాంతారా'. ఈ చిత్రం అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. చిన్న సినిమాగా విడుదలై పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతోంది. విడుదలైన అన్ని భాషల్లో కాంతార కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషించిన రిషబ్ శెట్టి ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు.ఈ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ రిషబ్ శెట్టిని విమర్శకులు సహా సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఇటీవలె జూ.ఎన్టీఆర్ కూడా సినిమాపై ప్రశంసలు కురిపించాడు. ఈ క్రమంలో త్వరలోనే రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్నారనే ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని రిషబ్ శెట్టి తెలిపారు. ఎన్టీఆర్తో సినిమా చేయాలని ఎవరికి ఉండదు? నాకు కూడా చేయాలని ఉంది.. కానీ ఇప్పుడు కాదు. ఆయనకి తగిన స్క్రిప్ట్ దొరికితే కశ్చితంగా కలుస్తానంటూ రూమర్స్కి చెక్ పెట్టారు. -
నాన్నను డబ్బులు అడగలేక.. వాటర్ క్యాన్లు అమ్మేవాడిని: రిషబ్ శెట్టి
రిషబ్ శెట్టి ఇప్పుడు ఎక్కడ విన్నా అదే పేరు వినిపిస్తోంది. కాంతార మూవీలో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాందించుకున్నారు రిషబ్ శెట్టి. కన్నడలో విడుదలైన ఈ చిత్రం కేవలం మౌత్ టాక్తో అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ను శాసిస్తోంది. కాంతార అద్భుతమైన విజయంలో ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. కానీ.. రిషబ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అసలు సినిమాల్లోకి రాకముందు ఆయన ఏం చేశారు? అనే విషయాలపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను రిషబ్ వెల్లడించారు. (చదవండి: సౌత్ సినిమాలు చూసి నవ్వుకునేవారు.. యశ్ సంచలన కామెంట్స్) సినిమాల్లో అరంగేట్రానికి ముందు అనేక ఉద్యోగాలు చేసినట్లు రిషబ్ శెట్టి తెలిపారు. తన అవసరాల కోసం నాన్నను ఎప్పుడూ డబ్బు అడగలేదని వెల్లడించారు.రిషబ్ శెట్టి నటుడిగా తన ప్రారంభ దశను గుర్తుచేసుకున్నాడు. మొదట క్లాప్ బాయ్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశానని చెప్పారు. రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. 'నేను నటుడిని కావాలనుకున్నా. కానీ పరిశ్రమలో నాకు ఎటువంటి పరిచయాలు లేవు. ఎలా అప్రోచ్ అవ్వాలనేది నా ఆలోచన. అందుకే నేను ఒక కన్నడ నటుడి కథను చదివా. అతను అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రారంభించి.. హీరోగా ఎలా మారాడనే దాని గురించి చదివాను. నా చదువు తర్వాత ఫిల్మ్ మేకింగ్పై షార్ట్టర్మ్ కోర్సు చేశా. ఆపై అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసి.. ఏడేళ్ల తర్వాత నటన వైపు మొగ్గు చూపా.' అని అన్నారు. (చదవండి: విశ్వక్ సేన్- అర్జున్ వివాదం..యంగ్ హీరోపై చర్యలు తప్పవా?) కూలీ పనులకు వెళ్లేవాన్ని: రిషబ్ శెట్టి నటుడిగా అరంగేట్రానికి ముందు చాలా పనులు చేశానని వెల్లడించారు. డిగ్రీ చదివేటప్పుడు సినిమా చూసేందుకు నాన్నను డబ్బులు అడగలేక.. కూలీ పనులకు వెళ్లేవాడినని చెప్పారు. 2004 నుంచి 2014లో నా మొదటి డైరెక్షన్ చేసేవరకు 10 ఏళ్లపాటు వాటర్ క్యాన్లు అమ్మడం, రియల్ ఎస్టేట్, హోటల్స్లో పనిచేసినట్లు వెల్లడించారు. సినీ ఇండస్ట్రీలో రిషబ్ శెట్టి ప్రయాణం: చదువుకునే సమయంలో సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించినట్లు వెల్లడించారు. సినీ పరిశ్రమలో క్లాప్ బాయ్, స్పాట్ బాయ్, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. తుగ్లక్ అనే చిత్రంలో తన మొదటి పాత్రను పోషించారు. 2016లో రక్షిత్ శెట్టి హీరోగా రిషబ్ తొలి దర్శకత్వం వహించిన చిత్రం రికీ విడుదలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ అందుకుంది. ఆపై అదే ఏడాది దర్శకత్వ వహించిన మరో చిత్రం కిరిక్ పార్టీ మూవీ హిట్గా నిలిచింది. -
'కాంతార' హీరో రిషబ్ శెట్టి ఫ్యామిలీ ఫోటోలు చూశారా?
కన్నడ హీరో రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కాంతార సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన ఒక్క సినిమాతో స్టార్ హీరో క్రేజ్ను దక్కించుకున్నారు. కన్నడలో కాకుండా టాలీవుడ్, బాలీవుడ్లోనూ రిషబ్ శెట్టి నటనకు ఫిదా కాని ప్రేక్షకుడు ఉండటంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. దర్శకత్వంతో పాటు స్వయంగా నటించి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన రిషబ్ శెట్టి గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. తాజాగా తన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలను స్వయంగా రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో కాసేపట్లోనే అవి నెట్టింట వైరల్గా మారాయి. రిషబ్ శెట్టి-ప్రగతిలది ప్రేమ వివాహం. కామన్ ఫ్రెండ్ ద్వారా ఫేస్బుక్తో మొదలైన సాన్నిహిత్యం పెళ్లి వరకు వెళ్లింది. వీరికి కొడుకు రన్విత్, కూతురు రాధ్య ఉన్నారు. తాజాగా ట్రెడిషనల్ దుస్తుల్లో రిషబ్ శెట్టి ఫ్యామిలీ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
రిషబ్ శెట్టిని కలిసిన లెజెండరీ క్రికెటర్.. సోషల్ మీడియాలో వైరల్
రిషబ్శెట్టి దర్శకుడిగా, హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ 'కాంతారా'. ఈ చిత్రం అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ మూవీ సక్సెస్తో రిషబ్ ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. తాజాగా రిషబ్ శెట్టిని దక్షిణాఫ్రికా లెజెండ్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ బెంగళూరులో కలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరలవుతోంది. (చదవండి: కాంతార మరో రికార్డ్.. కార్తికేయ-2ను అధిగమించి..!) రిషబ్ శెట్టి తన ఇన్స్టాలో ఓ వీడియోను పంచుకున్నారు. అందులో దక్షిణాఫ్రికా లెజెండ్ డివిలియర్స్, రిషబ్ కలిసి కాంతార అంటూ గట్టి అరుస్తూ కనిపించారు. రిషబ్ ఇన్స్టాలో రాస్తూ..' ఇది ఒక మ్యాచ్! ఈ రోజు నిజమైన 360ని కలుసుకున్నాను. మా బెంగళూరికి మళ్లీ తిరిగి వచ్చాడు..' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. వీరిద్దరి సమావేశంపై అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఓ అభిమాని స్పందిస్తూ 'టూ స్టార్స్' అంటూ వ్యాఖ్యానించారు. మరో అభిమాని 'ఇద్దరు లెజెండ్స్ వావ్' అని రాసుకొచ్చారు. కాంతార చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, హీరోగా నటించారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్, చలువే గౌడ నిర్మించిన ఈ చిత్రంలో సప్తమి గౌడ, కిషోర్ కుమార్ జి కూడా కీలక పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
కాంతార మరో రికార్డ్.. కార్తికేయ-2ను అధిగమించి..!
రిషబ్శెట్టి దర్శకుడిగా, హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ 'కాంతారా'. ఈ చిత్రం అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. తాజాగా బాలీవుడ్లోనూ రిలీజైన ఈ సినిమా మరో రికార్డును సాధించింది. హిందీలో డబ్బింగ్ అయిన సినిమాల్లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన ఏడో చిత్రంగా నిలిచింది. బాలీవుడ్లో ఇప్పటి దాకా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ప్రముఖ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. మొదటి రెండు వారాల కంటే.. మూడో వారం అత్యధిక కలెక్షన్లు సాధించినట్లు వెల్లడించారు. ఈ ఏడాది విడుదలైన డబ్బింగ్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా 'కాంతార' నిలిచింది. టాలీవుడ్ హీరో నిఖిల్ చిత్రం 'కార్తికేయ2' కలెక్షన్ల రికార్డును అధిగమించింది. ఇతర భాషల్లో తెరకెక్కిన చిత్రాలు బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో ‘బాహుబలి2’ ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతోంది. ఆ తర్వాత ‘కేజీయఫ్2’, ‘ఆర్ఆర్ఆర్’, ‘2.ఓ’, ‘బాహుబలి’, ‘పుష్ప’ సినిమాలు ఉన్నాయి. అన్ని భాషల్లో కలిపి ‘కాంతార’ రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. #Kantara *#Hindi version*… ⭐️ #Baahubali2, #KGF2, #RRR, #2Point0, #Baahubali, #Pushpa… #Kantara is now the 7th highest grossing *dubbed* #Hindi film ⭐️ Crosses ₹ 50 cr mark [Day 21] ⭐️ Week 3 is higher than Week 1 and Week 2 pic.twitter.com/82lZR0H30j — taran adarsh (@taran_adarsh) November 4, 2022 -
‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి నటించిన తెలుగు మూవీ తెలుసా?
చిన్న సినిమాగా వచ్చి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన లేటెస్ట్ మూవీ కాంతార. తొలుత కన్నడ ప్రాంతీయ సినిమాగా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు తెలుగు, హిందీ, తమిళంలో సంచలన విజయం సాధించింది. అన్ని భాషల్లో ఈ సినిమాకు బ్రహ్మర్థం పడుతున్నారు. దీంతో ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక చిత్రంలో లీడ్ రోల్ పోషించిన రిషబ్ శెట్టి ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఈ మూవీ ముందు వరకు అసలు రిషబ్ శెట్టి అంటే ఎవరో తెలియదు. చదవండి: అరుదైన వ్యాధితో బాధపడుతున్న ‘జాతిరత్నాలు’ డైరెక్టర్ కానీ ఇప్పుడు ఈ పేరు వినగానే వెంటనే కాంతార హీరో, దర్శకుడని చెప్పేంతగా గుర్తింపు పొందాడు. ఇదిలా ఉంటే కాంతారకు ముందు రిషబ్ తెలుగులో నేరుగా ఓ సినిమా చేసిన విషయం మీకు తెలుసా? అది కూడా ఎలాంటి పారితోషికం లేకుండా? ఏంటి షాక్ అవుతున్నారా? అవును ఈ మూవీకి ముందు గతేడాది రిషబ్ శెట్టి తెలుగులో ఓ సినిమా చేశాడు. కానీ అందులో కనిపించింది ఓ రెండు, మూడు నిమిషాలు మాత్రమే. ఇంతకి ఈ సినిమా ఎంటంటే ఈ ఏడాది వచ్చిన ‘మిషన్ ఇంపాజిబుల్’. ఈ ఏడాది ఏప్రిల్లో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ను సొంతం చేసుకుంది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ ఫేం స్వరూప్ దర్శకత్వంలో తాప్సీ కీలక పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన అతిథి పాత్రలో కనిపించాడు. చదవండి: హన్సిక కాబోయే భర్త ఎవరు, ఏం చేస్తుంటాడో తెలుసా? మూవీలో కీలక మలుపు తెచ్చే ఖలీల్ అనే దొంగ పాత్రలో కనిపించారు. అయితే అప్పటికి ఆయనకు ఈ స్థాయిలో గుర్తింపు లేకపోవడంతో రిషబ్ శెట్టిన ఎవరు గుర్తించలేదు. ఈ మూవీ డైరెక్టర్ స్వరూప్, రిషబ్కు మంచి స్నేహితుడట. ఆ స్నేహంతోనే ఇందులో ఖలీల్ పాత్ర చేయమని అడగ్గా రిషబ్ వెంటనే ఒకే చెప్పాడట. అంతేకాదు ఈ సినిమాకు ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని సమాచారం. ఇక సినిమాలో ముగ్గురు పిల్లలు ముంబై వెళ్తున్నాము అనుకుని పొరపాటున బెంగళూరు వెళ్తారు. ఇక అక్కడ వాళ్లు ఎదుర్కొన్న సమస్యలు, వాటిని ఎలా అధికమించారు అనేదే ‘మిషన్ ఇంపాజిబుల్’ కథ. -
‘కాంతార’కి ఫస్ట్ చాయిస్ నేను కాదు, ఆ హీరో: అసలు విషయం చెప్పిన రిషబ్ శెట్టి
రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన కన్నడ చిత్రం ‘కాంతార’. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. మొదట సెప్టెంబర్ 30న కన్నడ వెర్షన్లో రిలీజైన ఈ సినిమా అక్టోబర్ 15న తెలుగులో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఆ తర్వాత హిందీలోనూ రిలీజై నార్త్ ఆడిన్స్ను కూడా బాగా ఆకట్టుకుంది. భాషతో సంబంధం లేకుండా కథకి, కల్చర్ కీ కనెక్ట్ అయ్యారు ఆడియన్స్. దీంతో మూవీ బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకుంది. చదవండి: హన్సిక కాబోయే భర్త ఎవరు, ఏం చేస్తుంటాడో తెలుసా? విడుదలైన అన్ని భాషల్లో కాంతార వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లో సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తిర విషయాన్ని బయటపెట్టాడు ‘కాంతార’ డైరెక్టర్ రిషబ్ శెట్టి. ఈ సినిమాకు ఆయనే స్వీయ దర్శకత్వం వహించి నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో హీరోగా ముందు అనుకుంది తనని కాదని, ఓ కన్నడ స్టార్ హీరోనంటూ తాజాగా ఓ ఇంటర్య్వూలో తెలిపాడు రిషబ్ శెట్టి. ఇటీవల బాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన రిషబ్ ఈ మూవీ విశేషాలను పంచుకున్నాడు. చదవండి: తమన్నాకు చెస్ ఆట నేర్పిస్తున్న ప్రభాస్, వైరల్గా త్రోబ్యాక్ వీడియో ఈ సందర్భంగా కాంతార స్క్రిప్ట్ మొదట కన్నడ సూపర్ స్టార్, దివంగత నటులు పునీత్ రాజ్కుమార్ కోసం రాశానని చెప్పాడు. ‘పునీత్ రాజ్కుమార్ సార్ కోసమే కాంతార కథ రాశాను. స్క్రిప్ట్ అంత పూర్తయ్యాక వెళ్లి ఆయనను కలిసి స్క్రిప్ట్ చెప్పాను. అయితే ఆయన అప్పటికే పలు ప్రాజెక్ట్స్తో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా చేయలేనని చెప్పారు. అయితే ఈ కథ రియాలిటీగా రావాలంటే మీరు నటిస్తేనే బాగుంటుందని, ఇందులో మీరే చేయాలంటూ పునీత్ రాజ్కుమార్ సారు సలహా ఇచ్చారు. నన్నే హీరోగా చేయమన్నారు. ఇక ఆయన ఈ సినిమా చేయనన్నారు కాబట్టి. ఇక నేను చేశాను’ అంటూ రిషబ్ శెట్టి అసలు విషయం చెప్పుకొచ్చాడు. -
‘కాంతార’కు కాసుల పంట.. ఒక్క తెలుగులోనే రూ.50 కోట్లు వసూళ్లు
చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయం సాధించిన తాజా కన్నడ చిత్రం ‘కాంతార’. ఈ చిత్రం కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. దీంతో ఈ సినిమాను అన్ని భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్చేశారు. టాలీవుడ్లో అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రం.. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. కాంతార చిత్రం విడుదలైన 2 వారాల్లోనే 45 కోట్లు వసూళ్లు సాధించి రికార్డు సాధించింది. తాజాగా ఈ చిత్రం రూ.50 కోట్ల క్లబ్లో చేరింది. ఒక డబ్బింగ్ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడం రికార్డు అని సినీ వర్గాలు చెబుతున్నాయి. కాంతార కేవలం తెలుగులోనే కాకుండా ఇండియా వైడ్ కూడా ఈ సినిమా చాలా బాగా ఆడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరాంగదుర్ నిర్మించారు. తెలుగులో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ‘గీతాఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా విడుదల చేశారు. (క్లిక్ చేయండి: యాంకర్ విష్ణుప్రియ ఫేస్బుక్లో అశ్లీల వీడియోలు కలకలం!) -
300 కోట్లతో దూసుకుపోతున్న 'కాంతార'
-
వాటిని నేను పట్టించుకోను.. కాంతార హీరో రిషబ్ శెట్టి
రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన కన్నడ బ్లాక్ బస్టర్ చిత్రం ‘కాంతార’. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజైన ఈ చిత్రాన్ని తెలుగులో అక్టోబర్ 15న విడుదల చేశారు. తాజాగా చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ ప్రారంభించింది. ఇందులో భాగంగా ముంబయి చేరుకున్న రిషబ్ శెట్టి సినిమాకు సంబంధించిన పలు విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. అలాగే కాంతారపై వస్తున్న పలు విమర్శలకు ఆయన సమాధానమిచ్చారు. (చదవండి: ఇది అసలు ఊహించలేదు.. కాంతార హీరో రిషబ్ శెట్టి) రిషబ్ శెట్టి మాట్లాడుతూ..'వాటిపై ఎలాంటి కామెంట్స్ చేయాలనుకోవడం లేదు. అందరికీ సొంత అభిప్రాయాలు ఉంటాయి. వంద శాతం మా సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమా ఎంతలా ప్రజాదరణ సొంతం చేసుకుందన్నది మీ అందరికీ తెలుసు. కాబట్టి నెగెటివ్ కామెంట్స్కు ప్రేక్షకులే సమాధానమిస్తారు.'అని అన్నారు. హిందీలో కాంతార రీమేక్..: కాంతార మూవీని హిందీలో రీమేక్ చేస్తే ఎవరు హీరోగా నటిస్తే బాగుంటుందని ఓ అభిమాని ప్రశ్నించారు. దీనికి రిషబ్ బదులిస్తూ..'కాంతార’ సంస్కృతి, సంప్రదాయానికి సంబంధించిన సినిమా. ఈ చిత్రంలో పాత్రను పోషించాలంటే అక్కడి ప్రజల సంస్కృతిని అర్థం చేసుకోవాలి. బాలీవుడ్లో చాలామంది స్టార్ హీరోలంటే నాకు ఇష్టం. రీమేక్లపై నాకు పెద్దగా ఆసక్తి లేదు' అని సమాధానమిచ్చారు. బాలీవుడ్లోనూ రిలీజైన ఈ చిత్రం వసూళ్లతో దూసుకెళ్తోంది. -
ఆ సీన్స్లో 50 నుంచి 60 కేజీల బరువు క్యారీ చేశా: ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి
ఎలాంటి అంచనాలు లేకుండ విడుదలైన కన్నడ చిత్రం కాంతార సంచలన విజయం సాధించింది. మొదట కన్నడ నాట చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. కన్నడతో పాటు తెలుగ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదలై బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. పాన్ ఇండియా స్థాయిలో రికార్ట్ కలెక్షన్స్ రాబడుతోంది. ఇక ఈ సినిమాతో ఒక్కసారిగా నేషనల్ స్టార్గా గుర్తింపు పొందాడు హీరో రిషబ్ శెట్టి. ఈ మూవీకి ఆయనే దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. చదవండి: సిద్దార్థ్, అదితిల సీక్రెట్ డేటింగ్? వైరల్గా హీరో పోస్ట్ ఈ చిత్రంతో రాత్రికి రాత్రే ఆయన స్టార్డమ్ తెచ్చుకున్నాడు. దీంతో రిషబ్ శెట్టి గుగూల్ ట్రెండింగ్లో నిలిచాడు. ఇదిలా ఉంటే కాంతార మూవీతో కన్నడ కల్చర్ను దేశవ్యాప్తంగా పరిచయం చేశాడు రిషబ్ శెట్టి. భూతకోల సంస్కృతిని తెలియజేస్తూ ఈ కథను తెరకెక్కించాడు ఆయన. అయితే తాజాగా బాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన రిషబ్ శెట్టి మూవీ విశేషాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఈ సినిమా చివరిలో ఆయన వేసిన భూతకోల గురించి పలు ఆసక్తిర విషయాల గురించి చర్చించాడు. ఈ సినిమా చివరిలో ఆయన కోల వేసిన సంగతి తెలిసిందే. చదవండి: ఆసక్తిగా ఊర్వశివో రాక్షసివో ట్రైలర్, వెన్నెల కిషోర్ కామెడీ మామూలుగా లేదుగా ఈ సన్నివేశం చేసేటప్పుడు ఆయన దాదాపు 50 నుంచి 60 కిలోల బరువు క్యారీ చేసినట్లు చెప్పాడు. ‘భూతకోల సీక్వెన్స్ కోసం షూటింగ్ మొదలు 20 నుంచి 30 రోజుల ముందు నుంచి నాన్ వేజ్ తినడం మానేశా. దైవ కోల వేసినప్పుడు దాదాపు 50 నుంచి 60 కిలోల బరువును క్యారీ చేశాను. కన్నడ ప్రజలు అత్యంత పవిత్రంగా చూసే ఈ దైవ కోల అలంకారణ వేసిన అనంతరం కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకున్నాను. అయితే ఈ కోల సీక్వెన్స్ వేయడానికి ముందు ఆ తర్వాత ప్రసాదం ఇచ్చేవారు’ అని రిషబ్ చెప్పుకొచ్చాడు. -
కాంతార హీరోను అభినందించిన సూపర్ స్టార్.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్ (ఫొటోలు)
-
ఇది అసలు ఊహించలేదు.. కాంతార హీరో రిషబ్ శెట్టి
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ , రిషబ్ శెట్టి కాంబినేషన్లో వచ్చిన కన్నడ చిత్రం ‘కాంతార’. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమాను తెలుగులో అక్టోబర్ 15న విడుదల చేశారు. టాలీవుడ్లో మెగా నిర్మాత అల్లు అరవింద్ గీతా ఫిల్మ్స్ ద్వారా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ ప్రారంభించింది. నేడు తిరుపతి, విశాఖపట్నంలో ఉన్న థియేటర్లను కాంతారా చిత్రబృందం సందర్శించింది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి అభిమానులతో పంచుకున్నారు. (చదవండి: ‘కాంతార’కి బిగ్ షాకిచ్చిన కోర్టు.. ఇకపై దాన్ని ప్రదర్శించకూడదు!) హీరో రిషబ్ శెట్టి మాట్లాడుతూ... 'ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఇంతగా ఆదరిస్తారని ఊహించలేదు. కేవలం రెండు వారాల్లో ఈ సినిమా రూ.50 కోట్ల వసూళ్లు సాధించడం ఆనందంగా ఉంది. ఇంతలా ఆదరించినందుకు టాలీవుడ్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ ఆదరాభిమానాలు ఎప్పటికి ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ...' సినిమాకు భాష ముఖ్యం కాదు.. కేవలం ఎమోషన్ ఒకటే ఉంటుంది అని కాంతార నిరూపించింది. ఈ సినిమాను కన్నడలో చూసి బన్ని వాసు నాతో చెప్పాడు. ఆ తర్వాత సినిమా చూసినప్పుడు నాకు ఎమోషన్ అర్ధమైంది. ఈ ఎమోషన్కు కనెక్ట్ అయి తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుందనిపించింది. అందుకే టాలీవుడ్లోనూ రిలీజ్ చేశాం'. అని చెప్పారు. -
‘కాంతార’కి బిగ్ షాకిచ్చిన కోర్టు.. ఇకపై దాన్ని ప్రదర్శించకూడదు!
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ , రిషబ్ శెట్టి కాంబినేషన్లో వచ్చిన కన్నడ చిత్రం ‘కాంతార’కు అన్ని ప్రాంతాల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్లో కోలం చెప్పే వ్యక్తిగా రిషబ్ శెట్టి నటన అదిరిపోయింది. బ్యాగ్రౌండ్లో ‘వరాహ రూపం’అనే పాట.. దానికి తగ్గట్టుగా రిషబ్ శెట్టి నృత్యం.. ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి.. తాజాగా భారీ ఎదురుదెబ్బ తగిలింది. (చదవండి: రజనీకాంత్కి ‘కాంతార’ హీరో పాదాభివందనం.. ఇంట్రెస్టింగ్ ట్వీట్) సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన ‘వరాహ రూపం’పాటని ప్రదర్శించకూడదని కేరళలోని కోజ్కోడ్ జిల్లా సేషన్స్ కోర్టు ఆదేశించింది. ‘వరాహ రూపం’ అనే పాటను తమ నుంచి కాపీ కొట్టారిన తాయిక్కుడమ్ బ్రిడ్జ్ అనే మ్యూజిక్ బ్యాండ్ ఆరోపణలు చేసింది. అనుమతి తీసుకోకుండా పాటను తీసుకోవటం వారు కోర్టు కెక్కారు. కేసుని పరిశీలించిన కోజికోడ్ సెషన్స్ కోర్టు ‘కాంతార’ మేకర్స్కి ‘వరాహ రూపం’ అనే పాటను నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేసింది. వారి అనుమతి లేకుండా థియేటర్స్లోనే కాకుండా యూట్యూబ్తో పాటు ఇతర ఏ మ్యూజిక్ యాప్స్లో కూడా ఈ పాటను ప్రదర్శించకూడదని కోర్టు పేర్కొంది. కోర్టు ఆర్డర్స్తో మెయిన్ ఫ్లాట్ ఫామ్స్లో వరాహ రూపం పాటను నిలిపి వేయబోతున్నారు. -
రజనీకాంత్కి ‘కాంతార’ హీరో పాదాభివందనం.. ఇంట్రెస్టింగ్ ట్వీట్
‘కేజీయఫ్’ తర్వాత ఆ స్థాయిలో విజయం సాధించిన కన్నడ చిత్రం ‘కాంతార’. ఈ చిత్రం గురించి ఇప్పటీకీ దేశ వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైన ఈ చిత్రం.. అక్కడ భారీ విజయం సాధించింది. దీంతో ఈ సినిమాలు ఇతర భాషల్లో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. టాలీవుడ్లో అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రం.. రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రంపై టాలీవుడ్ టు బాలీవుడ్..అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే స్వయంగా రిషబ్ ని కలిసి అభినందించడం ఆసక్తిగా మారింది. అంతేకాదు ‘ తెలిసినది గోరంత తెలియనిది కొండంత.. ఈ విషయాన్ని సినిమాల్లో మీకంటే బాగా ఎవరూ చెప్పలేరు' అని నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ను కొనియాడారు. రజనీకాంత్ తన సినిమా చూసి అభినందించడం పట్ల రిషబ్ స్పందించారు. తాజాగా ట్వీటర్ ఆయన ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ‘మీరు ఒక్కసారి మెచ్చుకుంటే 100 సార్లు మెచ్చుకున్నట్లే. ధన్యవాదాలు రజినీ సార్. మా ‘కాంతార’ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది’అని ట్వీట్ చేస్తూ రజనీకాంత్కి పాదాభివందనం చేస్తూ ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటోలను షేర్ చేశాడు. -
తెలుగు రాష్ట్రాల్లో ‘కాంతార’ సక్సెస్ టూర్, ప్రేక్షకులను కలవనున్న రిషబ్ శెట్టి
కన్నడ మూవీ కాంతార బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను కొల్లగొడుతోంది. దేశవ్యాప్తంగా కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది. కన్నడలో సెప్టెంబర్ 30న రిలీజ్ అయిన ఈ చిత్రం తెలుగులో అక్టోబర్ 15న రిలీజ్ అయ్యి ఇక్కడ కూడా బ్లాక్బస్టర్ అందుకుంది. మెగా నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమాను తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేశారు. తెలుగులో మూవీ విజయవంతంగా ఆడుతున్న నేపథ్యంలో ప్రేక్షకులను నేరుగా కలిసేందుకు కాంతార మూవీ టీం సక్సెస్ టూర్ను నిర్వహించనుంది. అక్టోబర్ 29న(శనివారం) తిరుపతి, వైజాగ్లో ప్రదర్శించబుడుతున్న థియేటర్స్ను సందర్శించనున్నారు. ఈ సక్సెస్ టూర్లో చిత్ర దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి పాల్గొననున్నారు. -
కాంతార మూవీ హీరో రిషబ్ శెట్టి ఫ్యామిలీ (ఫొటోస్)
-
అలా చూసి..ఇలా చాటింగ్.. పెళ్లికి ట్విస్ట్..‘కాంతార’ఫేమ్ రిషబ్ శెట్టి లవ్స్టోరీ
‘కాంతార’... చిన్న చిత్రంగా విడుదలైన ఈ కన్నడ మూవీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కన్నడలో ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా వసూళ్ల రాబట్టిన ఈ చిత్రం.. ప్రపంచ వాప్తంగా రూ.200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి కంటెంట్ ఈజ్ కింగ్ అనే విషయాన్ని మరోసారి నిరూపించింది. ఈ మూవీ భారీ విజయం సాధించడంతో ఈ సినిమా హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగుతుంది. ప్రతి ఒక్కరు రిషబ్ శెట్టి గురించి ఆరా తీస్తున్నారు. ఆయన బ్యాగ్రౌండ్, పర్సనల్ లైఫ్ గురించి గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రిషబ్ శెట్టి లవ్స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫేస్బుక్లో ప్రేమాయణం రిషబ్ శెట్టిది ప్రేమ వివాహం. 2016లో రిషబ్ శెట్టి కిరాక్ పార్టీ ఫేమ్ రక్షిత్ శెట్టితో ఓ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ని గ్రాండ్గా నిర్వహించారట. ఆ కార్యక్రమానికి రక్షిత్ శెట్టి వీరాభిమాని ప్రగతి కూడా వెళ్లిందట. అక్కడే ప్రగతిని చూశాడట రిషబ్. ఆమెను ఎక్కడో చూసినట్టు ఉందే అనుకుంటూ ఇంటికి వెళ్లిపోయాడట. ఆమె గురించే ఆలోచిస్తూ.. ఫేస్బుక్ ఓపెన్ చేశాడట. అందులో ఆమె ఫ్రెండ్ రిక్వెస్ట్ కనిపించిందట. దాదాపు ఏడాది క్రితమే రిషబ్కి ప్రగతి ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిందట. కానీ ఆయన పెద్దగా పట్టించుకోలేదట. ఈవెంట్లో చూశాక.. ఫ్రెండ్రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాడట.అప్పటి నుంచి వీరిద్దరి మధ్య చాటింగ్, ఫోన్కాల్స్ మొదలయ్యాయి. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడం..పెళ్లివరకు వెళ్లడం జరిగిపోయింది. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఇచ్చారు ప్రగతి కుటుంబ సభ్యులు. ఈ పెళ్లికి మొదట్లో వాళ్లు ఒప్పుకోలేదు. రిషబ్ది సినిమా బ్యాగ్రౌండ్ కావడం, పెద్దగా సెటిల్డ్ కాలేదనే ఉద్దేశంలో పెళ్లికి నిరాకరించారట. కానీ ప్రగతి పట్టుబట్టి ఇంట్లో వాళ్లని ఒప్పించిందట. 2017లో రిషబ్, ప్రగతి పెళ్లి జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రిషబ్ కెరీర్ విషయానికొస్తే ఫిలిం డైరెక్షన్లో డిప్లొమా చేసిన ఆయన కన్నడ దర్శకుడు ఏ.ఎం.ఆర్ రమేష్ వద్ద అసిస్టెంట్గా చేరారు. అతను తెరకెక్కించిన ‘సైనైడ్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారు. అలా ఆయన సినీ జీవితం ప్రారంభమైంది. ప్రస్తుతం నిర్మాతగా ఒక చిత్రం, దర్శకుడిగా మరో మూవీ చేస్తున్నారు -
విషాదం.. ‘కాంతార’ చూస్తూ కన్నుమూసిన ప్రేక్షకుడు!
కాంతార.. కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి నటించి తెరకెక్కించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కన్నడలో ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్ల వైపు పరుగులు తీస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాలను ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు రిషబ్ శెట్టి. ముఖ్యంగా భూత కోలా సాంప్రదాయం గురించి కాంతార సినిమాలో రిషబ్ చూపించిన విధానానికి అందరూ ఫిదా అయిపోతున్నారు. (చదవండి: చిక్కుల్లో కాంతార టీమ్.. లీగల్ నోటీసులు) తాజాగా ఈసినిమా చూసి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటకకు చెందిన రాజశేఖర్(45) అనే వ్యక్తి థియేటర్లో ఈ సినిమా చూస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో థియేటర్ యాజమాన్య వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలిపారు. గుండెపోటు కారణంగా అతను మరణించినట్లు తెలుస్తోంది. ఇక ఈ కన్నడ చిత్రాన్ని తెలుగులో గీత ఆర్ట్ సంస్థ బ్యానర్ మీద అల్లు అరవింద్ అక్టోబర్ 15న విడుదల చేశాడు. రిషబ్ శెట్టి టేకింగ్, యాక్టింగ్కి టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. -
కాంతార తగ్గేదేలే.. ఆ విషయంలో కేజీఎఫ్ -2 రికార్డ్ బ్రేక్
కన్నడ మూవీ కాంతార బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను కొల్లగొడుతోంది. దేశవ్యాప్తంగా కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది. రిషబ్ శెట్టి హీరోగా దర్శకత్వం వహించిన ఈ మూవీని హోంబలే సంస్థ నిర్మించింది. అయితే తాజాగా ఈ చిత్రం కర్ణాటకలో హోంబలే సంస్థ నిర్మించిన సినిమాల్లో అత్యధికంగా వీక్షించిన మూవీగా నిలిచింది. (చదవండి: ‘కాంతార’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?) ఈ విషయంలో యశ్ మూవీ కేజీఎఫ్-2 రికార్డును అధిగమించింది. అతి తక్కువ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం మున్ముందు మరెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో వేచి చూడాల్సిందే. ఈ సినిమాకు అంజనీష్ లోక్నాథ్ సంగీతం అందించారు. ఈ బ్లాక్బస్టర్ చిత్రంలో సప్తమి గౌడ, కిషోర్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. తెలుగులో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ‘గీతాఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా ఈ నెల 15న విడుదల చేశారు. టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ‘కాంతార’కు బ్రహ్మరథం పడుతున్నారు. ఫలితంగా మంచి వసూళ్లను రాబడుతోంది. మౌత్ టాక్ ద్వారా ఈ సినిమా గురించి తెలుసుకొని ప్రేక్షకులు థియేటర్స్కి వెళ్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ‘కాంతార’ హవా నడుస్తోంది. -
ఆ చివరి 20 నిమిషాలు గూస్ బంప్స్.. కాంతారపై పూజా హెగ్డే
కన్నడ మూవీ కాంతార ప్రభంజనం ఇంకా కొనసాగుతోంది. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. సినీ ప్రముఖులు సైతం ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని వీక్షించిన నటులు రిషబ్ శెట్టిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆ జాబితాలో హీరోయిన్ పూజా హెగ్డే కూడా చేరిపోయింది. కాంతార సినిమాను వీక్షించిన భామ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దర్శకుడు, హీరో రిషబ్ శెట్టితో పాటు చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు. ఓ ప్రాంతీయ సంస్కృతిని అందరికీ అర్థమయ్యేలా అందంగా తీర్చిదిద్దారని తెలిపారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టా వేదికగా ఈ చిత్రంపై సమీక్షను వెల్లడించారు. పూజా తన ఇన్ స్టాలో స్టోరీలో రాస్తూ..'మీకేం తెలుసో దాన్నే కథగా రాయండి. మీ మనసులో నుంచి వచ్చిన స్టోరీనే చెప్పండి. ఈ సినిమాలోని చివరి 20 నిమిషాలు నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. విజువల్స్, నటీనటుల ప్రదర్శనకు ఫిదా అయ్యా. ఈ చిత్రం ద్వారా రిషబ్ శెట్టి ఆదరణ పొందుతున్నందుకు గర్వంగా ఉంది. నా చిన్నతనంలో చూసిన భూతకోలని ఎంతో అద్భుతంగా చూపించి సూపర్ హిట్ అందుకున్నావు. రాబోయే రోజుల్లో మీరు మరిన్నీ ప్రశంసలు అందుకోవాలి' అంటూ పూజా రాసుకొచ్చింది. కాగా.. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, హీరోగా ఈ సినిమాను తెరకెక్కించారు. కర్ణాటకలోని తుళునాడు ఆచారాలను ఆధారంగా చేసుకొని ఈ చిత్రం రూపొందించారు. స్థానికంగా ఉండే ప్రజలు గ్రామదేవతలను పూజించే భూతకోల సంస్కృతిని మూవీలో చక్కగా చూపించారు. ఎలాంటి అంచనాలు లేకుండా.. విడుదలైన ‘కాంతార’ ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈసినిమా ఇప్పటివరకూ రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు అంచనా వేస్తున్నారు. -
చిక్కుల్లో 'కాంతార' టీం.. లీగల్ నోటీసులు! ఎందుకంటే..
కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన తాజా చిత్రం కాంతార. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుని సృష్టిస్తోంది.హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరాంగదుర్ నిర్మించిన కాంతార మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది. దేశవ్యాప్తంగా ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. కథ పరంగానే కాదు పాటలకు కూడా మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా ‘వరాహరూపం.. దైవ వరిష్ఠం..’ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ పాట బాణీని కాపీ కొట్టారంటూ ‘తైక్కుడం బ్రిడ్జ్’ అనే మ్యూజిక్ బ్యాండ్ ఆరోపణలు చేస్తుంది. అంతేకాకుండా తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా నెటిజన్లను విజ్ఞప్తి చేసింది. కాంతారలోని వరాహ రూపం పాట మా సాంగ్ నవసరను కాపీ కొట్టారు. ఈ కాపీకి కారణమైన వాళ్లపై మేం చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నాం అంటూ ఇన్స్టాలో పోస్టును షేర్ చేశారు. దీనికి ర్మాత విజయ్ కిరగందూర్, సినిమా హీరో & దర్శకుడు రిషబ్ శెట్టికి కూడా ట్యాగ్ చేశారు. అయితే ఈ ఆరోపణలపై కాంతార టీం ఇంకా స్పందిచలేదు. View this post on Instagram A post shared by Thaikkudam Bridge (@thaikkudambridge) -
కాంతార మూవీ.. అమ్మ పాత్రలో నటించిన ఆమె ఎవరో తెలుసా?
ప్రస్తుతం చిత్రసీమలో నడుస్తున్న ఒకటే టాక్ కాంతార. ఎక్కడా చూసినా కాంతార ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ చిత్రంపై భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ఒక్క సినిమాలో ఎవరికీ పరిచయం లేని రిషబ్ శెట్టి ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. ఆయనే దర్శకుడిగా, హీరోగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ను ఓ రేంజ్లో షేక్ చేస్తోంది. కర్ణాటకలోని ఆదివాసీ సంప్రదాయాన్ని తెరపై ఆకట్టుకునేలా చూపించిన తీరు అద్భుతంగా ఉందంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో అమ్మ పాత్రలో నటించిన ఆమె ఎవరన్న విషయంపై అందరి ఫోకస్ పడింది . తన కుమారుని సంతోషాన్ని ఆశించే మహిళగా కమల పాత్రలో ఆమె కనిపించింది. ఈ సినిమా ఫేమస్ కావడంతో ఒక్కసారిగా నటీనటులపై అందరి దృష్టి సారించారు. అమ్మ పాత్రలో నటించిన ఆమె ఎవరు? ఇంతకు ముందు ఆమె ఏ సినిమాల్లోనైనా నటించిందా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ వివరాలేంటో ఓ సారి చూద్దాం. ఆమె పేరు మానసి సుధీర్. కరోనా లాక్ డౌన్ సమయంలో పిల్లల ప్రదర్శన పాటలు పాడి సోషల్ మీడియాలో గుర్తింపు పొందింది. ఇటీవల సినిమాల్లో తల్లి పాత్రలలో ఎక్కువగా ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ చిత్రంలో మానసి అమ్మ పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలైన మానసి సుధీర్ లాక్ డౌన్ సమయంలో తన యూట్యూబ్ ఛానల్ పిల్లలకు పాఠాలు భోదించేవారు. తాజాగా ఆమె నటించిన కాంతార బాక్సాఫీస్ వద్ద హిట్ కావడంతో రానున్న కాలంలో ఆమెకు మరిన్నీ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. -
అల్లు అరవింద్ భారీ స్కెచ్.. ‘కాంతార’ దర్శకుడితో రామ్ చరణ్ మూవీ!
టాలీవుడ్లో కాంతర హవా ఇంకా కొనసాగుతుంది. ఈ కన్నడ చిత్రాన్ని తెలుగులో గీత ఆర్ట్ సంస్థ బ్యానర్ మీద అల్లు అరవింద్ అక్టోబర్ 15న విడుదల చేశాడు. తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను రీసీవ్ చేసుకుంటారో లేదో అనే అనుమానంతో పెద్దగా ప్రమోషన్స్ లేకుండా సినిమాను విడుదల చేశారు. కానీ మౌత్ టాక్తో ఈ సినిమా భారీ విజయం సాధించింది. రిషబ్ శెట్టి టేకింగ్, యాక్టింగ్కి టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. రిషబ్ శెట్టితో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నానని ప్రకటించారు. అయితే అందరూ ఆయనను హీరోగా పెట్టి సినిమా తీస్తున్నారేమో అనుకున్నారు. కానీ తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. రిషబ్ శెట్టి తో మెగా పవర్స్టార్ రామ్ చరణ్ సినిమా చేయనున్నాడని తెలుస్తుంది. రిషబ్ శెట్టి వద్ద ఒక ఆసక్తికరమైన లైన్ ఉందట. దానిని తెరకెక్కించాలంటే అల్లు అరవింద్ లాంటి బడా ప్రొడ్యూసర్లకే సాధ్యమవుతుందని, ఆయనను సంప్రదించాడట. ఈ స్టోరీకి రామ్ చరణ్ అయితే బాగుంటుందని రిషబ్ భావిస్తున్నాడట. చరణ్కి స్టోరీ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఈ క్రేజీయెస్ట్ కాంబో రావడం గ్యారెంటీ. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్కి కొంచెం గ్యాప్ రావడంతో జపాన్ పర్యటనకు వెళ్లాడు. అక్కడ ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్లో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. -
కాంతారపై కిరణ్ అబ్బవరం ట్వీట్.. మండిపడుతున్న నెటిజన్స్
దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్న మూవీ కాంతార. రిషబ్ శెట్టి దర్శకుడిగా, హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటికే వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీ రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ సినిమా భారీ విజయం సాధించడం పట్ల పలువురు సినీ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. టాలీవుడ్ ప్రముఖులతో పాటు బాలీవుడ్ నటులు సైతం రిషబ్ శెట్టిని పొగుడుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ యంగ్ నటుడు కిరణ్ అబ్బవరం ఓ ట్వీట్ చేశారు. అది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ ఆయనపై మండిపడుతున్నారు. అసలు కిరణ్ ట్వీట్లో ఏముంది? నెటిజన్స్ ఎందుకు ఫైరవుతున్నారు ఓ లుక్కేద్దాం. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ‘కాంతార’ సినిమాపై తన అభిప్రాయాన్ని ట్వీట్ రూపంలో షేర్ చేశాడు. 'నువ్వు సినిమాలు చెయ్యడం మానేయ్ బ్రో' అంటూ నెగెటివ్ కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. కిరణ్ ట్వీట్ చేస్తూ.. 'నేను చిన్నప్పటి నుంచి మా ఊరిలో చూసిన కల్చర్ ని స్క్రీన్ పైన చూడడం చాలా బాగా అనిపించింది' అంటూ రాసుకొచ్చాడు. ఆ పోస్ట్లో తప్పేం లేనప్పటికీ.. నెటిజన్లు మాత్రం కావాలనే కిరణ్ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. 'కిరణ్ బ్రో నువ్వు కూడా ప్రస్తుతం చేసే మూవీస్ ఆపేసి కొత్తగా ట్రై చెయ్ బ్రో.. అప్పుడే మంచి గుర్తింపు వస్తుంది నీకు’’ అని సలహాలు ఇస్తున్నారు. 'గ్రేట్ అన్నా.. నువ్వు సినిమాలు ఎప్పుడు ఆపేస్తావన్నా?' 'నీది రాయచోటి కదా బ్రో.. ‘కోలం’ కర్ణాటక బోర్డర్లో కదా జరిగేదంటూ' మరో నెటిజన్ కామెంట్ చేశారు. కాంతార సినిమాపై కిరణ్ పాజిటిన్గానే ట్వీట్ చేసినా.. నెటిజన్స్ అతన్ని టార్గెట్ చేయడం గమనార్హం. -
దయచేసి ‘ఓ..’ శబ్దాన్ని అనుకరించొద్దు: రిషబ్ శెట్టి విజ్ఞప్తి
చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం సాధించిన కన్నడ చిత్రం ‘కాంతార’. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. ఎలాంటి అంచానాలు లేకుండా సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైంది. అక్కడ భారీ విజయం సాధించడంతో తెలుగుతో పాటు అన్ని భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. టాలీవుడ్ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. (చదవండి: జపాన్ వీధుల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ సందడి..వీడియో వైరల్) భూతకోల సంస్కృతిని తెలియజేస్తూ ఈ కథను తెరకెక్కించాడు రిషబ్ శెట్టి. కోలం ఆడే వ్యక్తి ‘ఓ..’అంటూ అరుస్తూ డ్యాన్స్ చేస్తాడని ఈ సినిమాలో చూపించారు. ఆ శబ్దం వచ్చిన ప్రతిసారి థియేటర్స్ దద్దరిల్లిపోతాయి. ప్రేక్షకులు కూడా ఆ అరుపులను అంత ఈజీగా మర్చిపోవడం లేదు. సినిమా చూసి బయటకు వచ్చాక ‘ఓ..’ అంటూ గట్టిగా శబ్దం చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తాజాగా ఈ విషయంపై రిషబ్ శెట్టి స్పందించారు. ‘ఓ..’అని శబ్దం చేయడం తమ సెంటిమెంట్ అని, ఇదొక నమ్మకమని అన్నారు. ‘కాంతార’ వీక్షించిన ప్రేక్షకులు ఈ శబ్దాలను అనుకరించొద్దని విజ్ఞప్తి చేశాడు. అది చాలా సున్నితమైన అంశమని, బయట ఇలా శబ్ధం చేయడం వల్ల తమ ఆచారం దెబ్బ తినొచ్చని అని అన్నారు. -
నటన మానేసి ఉద్యోగం చూసుకో.. రిషబ్ శెట్టి గురించి సంచలన విషయాలు..!
ప్రస్తుతం అందరి నోటా మార్మోగుతున్న సినిమా పేరు 'కాంతార'. కన్నడలో చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ఈ చిత్ర దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. అయితే ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూసి ఆ హీరో ఎవరు? ఆయన గత చరిత్ర ఏంటి? అని సినీ ప్రేక్షకులు నెట్టింట్లో వెతుకుతున్నారు. అతని గురించి ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు ఒక్కసారి తెలుసుకుందాం. రిషబ్ శెట్టి నేపథ్యం: కాంతార హీరో రిషబ్ శెట్టి అసలు పేరు ప్రశాంత్ శెట్టి. కర్ణాటకలోని కుందాపూర్లో 1983 జులై 7న ఆయన జన్మించారు. హిందూ కుటుంబంలో పుట్టిన అతని తండ్రి పేరు భాస్కర్ శెట్టి. తల్లి పేరు లక్ష్మి శెట్టి. రిషబ్ ప్రవీణ్ శెట్టి అనే సోదరుడు ఉన్నాడు. రిషబ్ కెరీర్ విషయానికొస్తే ఫిలిం డైరెక్షన్లో డిప్లొమా చేసిన ఆయన కన్నడ దర్శకుడు ఏ.ఎం.ఆర్ రమేష్ వద్ద అసిస్టెంట్గా చేరారు. అతను తెరకెక్కించిన ‘సైనైడ్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారు. అలా ఆయన సినీ జీవితం ప్రారంభమైంది. (చదవండి: ‘కాంతార’ మూవీపై కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు) సినిమా అంటే ఫ్యాషన్: రిషబ్ శెట్టి పలు టీవీ సిరీస్ల్లోనూ పనిచేశారు. ఆ సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంట్లో వాళ్లు ఈ పని మానేసి ఏదైనా మంచి ఉద్యోగం చేసుకోమని సలహాలు ఇచ్చినా పట్టించుకోలేదు. ఆయనకున్న ఫ్యాషన్తో సినిమా రంగంలోనే కొనసాగారు. రిషబ్ 2010లో నటుడిగా కెరీర్ ప్రారంభించారు. 'నామ్ ఓరీలి ఒండినా' అనే చిత్రంలో పెద్దగా ప్రాధాన్యత లేని రోల్లో నటించారు. ఆ తర్వాత రక్షిత్ శెట్టి నటించిన 'తుగ్లక్'లోనూ కనిపించారు. ఇలా చిన్న చిన్న పాత్రలు చేసే అవకాశాలు నామమాత్రంగానే వచ్చినా ఎక్కడా వెనకడుగు వేయలేదు. నటన కంటే దర్శకత్వంపైనే ఆసక్తి : కానీ అదే సమయంలో రిషబ్కు దర్శకత్వంపై ఆసక్తి ఏర్పడింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు డైరెక్షన్ చేసే ప్రయత్నాలు మొదలెట్టారు. అలా 2017లో రక్షిత్ శెట్టి ఆయనకు ఓ అవకాశం ఇచ్చారు. రిషబ్ డైరెక్షన్లో వచ్చిన మొదటి సినిమా 'రిక్కీ' 2016లో విడుదలైంది. ఈ మూవీలో హరిప్రియ హీరోయిన్గా నటించగా.. బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. (చదవండి: త్వరలో 'కాంతార' హీరో రిషబ్ శెట్టితో సినిమా: అల్లు అరవింద్) ఆ తర్వాత చేసిన ‘కిరిక్ పార్టీ’ మూవీ రిషబ్ కెరీర్లో బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇక రిషబ్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఈ చిత్రంలో కూడా రక్షిత్ శెట్టి హీరోగా నటించగా.. రష్మిక మందన్నా ఈ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నేషనల్ క్రష్గా పాపులర్ అయింది. ఆయనకు నటుడిగా ‘బెల్ బాటమ్’ మూవీ మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రూపొందిస్తున్నారు. ఆ సినిమాకు జాతీయ అవార్డు: రిషబ్ శెట్టి తెరకెక్కించిన మూడో చిత్రం 'సర్కారీ హిరియా ప్రాథమిక షాలే కాసరగడ్'. 2018లో వచ్చిన ఈ సినిమా ఉత్తమ బాలల చిత్రం కేటగిరీలో రిషబ్కు నేషనల్ అవార్డు వరించింది. ఈ మూవీకి నిర్మాత కూడా అతనే. అంతే కాకుండా ఫిలిం ఫేర్ అవార్డు, ఐఫా అవార్డు, సైమా అవార్డులు కూడా కైవసం చేసుకుంది. అయితే కాంతార హీరో ఓ టాలీవుడ్ సినిమాలో కూడా నటించారన్న సంగతి ఎక్కువ మందికి తెలియదు. ఈ ఏడాది తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మిషన్ ఇంపాజిబుల్' చిత్రంలో ఖలీల్ పాత్రలో నటించారు. రిషబ్కు 2017లో ప్రగతి శెట్టిని వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అతను ప్రస్తుతం నిర్మాతగా ఒక చిత్రం, దర్శకుడిగా మరో మూవీ చేస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాజెక్టులను అధికారికంగా ప్రకటించారు కూడా. -
‘కాంతార’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
త్వరలో 'కాంతార' హీరో రిషబ్ శెట్టితో సినిమా: అల్లు అరవింద్
ఓటీటీల వల్ల జనాలు థియేటర్లకు రావడం లేదు అనేదాంట్లో ఏమాత్రం నిజం లేదని నిరూపించాయి పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, కార్తికేయ 2 సినిమాలు. కంటెంట్ ఉంటే చాలు కేవలం మౌత్ టాక్తోనే జనాలను థియేటర్స్కు రప్పించవచ్చని నిరూపించింది కాంతార. సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తెలుగులో అక్టోబర్ 15 న రిలీజై ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. మెగా నిర్మాత అల్లు అరవింద్ "గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్" ద్వారా తెలుగులో దీన్ని రిలీజ్ చేసారు. ఈ చిత్రం విజయవంతంగా ఆడుతున్న తరుణంలో బుధవారం ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో అల్లు అరవింద్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'సినిమాకు భాషా సరిహద్దులు లేవు, ఎమోషన్ బారియర్ ఒకటే ఉంటుంది అని కాంతార చిత్రం రుజువు చేసింది. ఇది మట్టిలోంచి పుట్టిన కథ. ఇది ఎక్కడో కొరియన్, హాలీవుడ్ సినిమాలను నుంచి కాపీ కొట్టింది కాదు. ఈ సినిమాలో విష్ణు తత్వం, రౌద్ర రూపం చూశాక ఇది సింహాచలంకి దగ్గరగా ఉన్న కథ అనిపించింది. ఇందులో హీరో ఎంత గొప్పగా చేశాడో మీరు చూశారు. అతను ఫీల్ అయ్యి చేయడం వల్ల ఈ సినిమా అంతలా కనెక్ట్ అయింది. ఈ చిత్రానికి అజనీష్ లోకనాధ్ అద్భుతమైన బాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. జాతరలో జరిగే అరుపులను, కొన్ని సౌండ్స్ను రికార్డ్ చేసి మ్యూజిక్తో పాటు వదిలారు. ఈ సినిమాను కన్నడలో చూసిన బన్నీ వాసు నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి అర్జెంటుగా మీరొక సినిమా చూడండి అన్నాడు. ఏంటి, బన్నీ వాసు ఇంత ఎగ్జైట్మెంట్గా చెబుతున్నాడు అనుకున్నాను. సినిమా చూసినప్పుడు నాకు ఎమోషన్ అర్ధమైంది. ఈ ఎమోషన్కు కనెక్ట్ అయ్యి దీన్ని తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుందనిపించి తెలుగులో రిలీజ్ చేశాం. ఇక్కడ చెప్పాల్సిన ఇంకో విషయం ఏమిటంటే గీత ఆర్ట్స్ లో సినిమా చేయమని రిషబ్ శెట్టిని అడిగాను, ఆయన కూడా ఒప్పుకున్నాడు' అని చెప్పాడు అల్లు అరవింద్. చదవండి: సర్దార్లో అన్ని గెటప్సా? సూర్యను దాటేస్తాడా? బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న కాంతా.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే? -
‘కాంతార’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?
కన్నడ చిత్రం ‘కాంతార’ గురించి ఇప్పుడు దేశం మొత్తం చర్చించుకుంటుంది. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం.. భారీ విజయం సాధించింది. దీంతో ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు మేకర్స్. తెలుగులో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ‘గీతాఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా ఈ నెల 15న విడుదల చేశారు. టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ‘కాంతార’కు బ్రహ్మరథం పడుతున్నారు. ఫలితంగా మంచి వసూళ్లను రాబడుతోంది. మౌత్ టాక్ ద్వారా ఈ సినిమా గురించి తెలుసుకొని ప్రేక్షకులు థియేటర్స్కి వెళ్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ‘కాంతార’ హవా నడుస్తోంది. (చదవండి: ఇంకా అరువేనా..‘కాంతార’ కథలు లేవా?) దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా సమాచారం ప్రకారం.. ఈ మూవీ ఓటీటీ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని తెలుస్తోంది. నవంబర్ 4న ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొదటగా కన్నడ వెర్షన్ని విడుదల చేసి.. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళంతో పాటు హిందీ వెర్షన్ కూడా అందుబాటులోకి తీసుకొస్తారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరాంగదుర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. -
ఇంకా అరువేనా.. ‘కాంతార’ కథలు లేవా?
‘కాంతార’.. ఇప్పుడు ఈ కన్నడ చిత్రం గురించి యావత్ సీనీ ప్రపంచం చర్చిస్తోంది. ఇందులో స్టార్ హీరోలు లేరు. పాన్ ఇండియా కంటెంట్ కాదు. కానీ ప్రతి ఒక్కరు ఈ సినిమా కథ గురించే మాట్లాడుకుంటున్నారు. ‘అబ్బా.. ఏం తీశాడురా’ అని రిషబ్ శెట్టిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే రిషబ్ శెట్టి మాత్రం పాన్ ఇండియాని దృష్టిలో పెట్టుకొని ఈ కథను రాసుకోలేదు. కేవలం కన్నడ ఆడియన్స్ మెప్పు పొందడానికే ఈ సినిమాను తెరకెక్కించాడు. కానీ అది పాన్ ఇండియా ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది. ఇదే కాదు కన్నడకు చెందిన చాలా సినిమాలు.. ఈ మధ్య పాన్ ఇండియా స్థాయిలో దుమ్మురేపుతున్నాయి. చిన్న చిత్రంగా విడుదలై.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. పరభాష అభిమానుల మనసును దోచుకుంటున్నాయి. ఆ మధ్య విడుదలైన ఛార్లీ 777 మూవీ ప్రతి ఒక్క ప్రేక్షకుడి హృదయాలను గెలుచుకుంది. ఓ కుక్కకి, మనిషికి ఉన్న బంధం నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో రక్షిత్ శెట్టి హీరోగా నటించారు. ఆయన కన్నడలో ఫేమస్ కానీ.. పాన్ ఇండియా ప్రేక్షకులను పెద్దగా తెలియదు. అయినా ఆయన చిత్రాన్ని అందరూ ఆదరించారు. కారణం కథే. రాజ్ బీ శెట్టి డైరెక్ట్ చేసి నటించిన కన్నడ మూవీ ‘గరుడ గమన వృషభ వాహన’ గతేడాది విడుదలై దాదాపు అన్ని భాషల ఇండస్ట్రీలను షేక్ చేసింది. దీనికి కారణం కథే. ఇవేకాదు.. గతంలోనూ యూటర్న్, నాతిచరామి, కావలుదారి, లవ్ మాక్ టెయిల్, దియా లాంటి కన్నడ చిత్రాలు అన్ని భాషల ఆడియెన్స్ని ఎంటర్టైన్ చేశాయి. (చదవండి: కాంతార మూవీ రివ్యూ) ఇక ఒక్కసారి మన టాలీవుడ్ని పరిశీలిస్తే.. ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటి బడా చిత్రాలతో పాటు కార్తికేయ-2 లాంటి చిన్న సినిమా కూడా ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేశాయి. యావత్ సినీ ప్రపంచాన్ని మనవైపు చూసేలా చేశాయి. కానీ ఇది మా తెలుగు చిత్రం అని తెలుగువారు గొప్పగా చెప్పుకునే చిత్రాలు మాత్రం రావడం లేదు. మన ప్రాంత ప్రజల సంస్కృతి, సంప్రాదాలయను దేశానికి చూపించే ప్రయత్నం టాలీవుడ్ దర్శకనిర్మాతలు, హీరోలు చేయడం లేదనిపిస్తోంది మన సినిమా గురించి అందరూ మాట్లాడుకోవాలంటే పాన్ ఇండియా ప్రాజెక్టే అయ్యుండాలా? తెలుగులో కొత్త కథలు లేవా? ఇప్పటికీ పరభాష చిత్రాలనే అరువు తెచ్చుకోవాలా? మీడియం బడ్జెట్లో ‘కాంతార’లాంటి సినిమాను మనం తెరకెక్కించలేమా? దర్శకనిర్మాతలు అటువైపు ఎందుకు ఆలోచించడం లేదు? పోనీ బడా హీరోలు అయినా ఒక్క అడుగు ముందుకేసి ప్రయోగాలు చేస్తున్నారా? అంటే అదీ లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పటికీ రీమేకులనే నమ్ముకుంటున్నారు. మరోవైపు.. ఇతర భాషల్లో సంచనాలు సృష్టిస్తున్న సినిమాల్ని ఇక్కడ డబ్ చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు నిర్మాతలు. దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ కన్నడ, మలయాళ, తమిళ మాదిరి టాలీవుడ్లో కూడా ప్రయోగాత్మక చిత్రాలు రావాలి. భారీ బడ్జెట్తో గ్రాండియర్ గా, విజువల్ ఎఫెక్ట్స్ తో తీస్తేనే భారీ వసూళ్లు వస్తాయన్న అపనమ్మకాల్ని పోగొట్టాలి. కొత్త కథలను ఎంకరేజ్ చేస్తే టాలీవుడ్ రేంజ్ మరోస్థాయికి పెరగడం ఖాయం. -
ఇన్స్టాగ్రామ్ లో చూసి హీరోయిన్ గా సెలెక్ట్ చేశాం.. 'కాంతార' హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే...!
-
Kantara Movie: బిలో యావరేజ్ అయిన నేను.. ఇలాంటి సినిమాలు ఎలా తీస్తున్నా అంటే..?
-
Kantara Movie: KGF, కాంతార మధ్య పోలిక...
-
Kantara Movie: 'కాంతార' సినిమా కథ ఎలా పుట్టిందంటే..?
-
Kantara Movie: నటిస్తూ డైరక్షన్ చెయ్యడం ఎలా ఉంటుందంటే..?
-
Kantara Movie: అలా అనుకునే 'కాంతార' సినిమా స్టార్ట్ చేశా
-
కేవలం అవి మాత్రమే థియేటర్లకు రప్పించలేవ్.. కాంతారపై ఆర్జీవీ ట్వీట్ వైరల్
ఇప్పుడు ఎవరి నోటా విన్నా వినిపిస్తున్న ఒకే ఒక్క సినిమా 'కాంతార'. ఇటీవలే విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం కన్నడలోనూ రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయడంతో కలెక్షన్లతో పలు పెద్ద చిత్రాల రికార్డులు బద్దలు కొడుతోంది. (చదవండి: కాసుల వర్షం కురిపిస్తున్న కాంతార.. మౌత్టాక్తోనే హిట్టాక్) అయితే ఈ సినిమా సక్సెస్ పట్ల దర్శకుడు రామ్గోపాల్ వర్మ సైతం స్పందించారు. కేవలం సూపర్ స్టార్స్, మాసివ్ ప్రొడక్షన్ వాల్యూస్, స్పెక్టాక్యులర్ వీఎఫ్ఎక్స్ మాత్రమే జనాలను థియేటర్లకు రప్పించగలవని ఫిల్మ్ మేకర్స్ అనుకుంటున్న తరుణంలో పేరు లేని చిన్న సినిమా పెద్ద సినిమాల రికార్డులను బద్దలు కొడుతోందని ట్వీట్ చేశారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ "గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్" ద్వారా తెలుగులో రిలీజ్ చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Just when all Filmwallas came to the conclusion that only SUPER STARS, MASSIVE PRODUCTION VALUES and SPECTACULAR VFX can bring people to theatres , a small tiny film with no names #Kantara is breaking all the records of the BIGGIES — Ram Gopal Varma (@RGVzoomin) October 17, 2022 -
కాసుల వర్షం కురిపిస్తున్న 'కాంతార'.. మౌత్టాక్తోనే సూపర్ హిట్
రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం 'కాంతార'. కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం తెలుగులోనూ అదిరిపోయే కలెక్షన్లతో దుమ్మురేపుతుంది. రిలీజైన తొలిరోజు నుంచే హిట్ టాక్ను సొంతం చేసుకుంది. కాంతార రైట్స్ కేవలం రూ. 2 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. మొదటిరోజు 1.95 కోట్ల గ్రాస్ ను సాధించిన ఈ చిత్రం రెండవ రోజు ఏకంగా రూ. 11.5 కోట్ల గ్రాస్ను సొంతం చేసుకుంది. కేవలం మౌత్టాక్తోనే ఇంత పెద్ద విజయం సాధించడం అరుదైన విషయం. కన్నడలో భారీ విజయం సాధించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో రిలీజ్ చేశారు. రిషబ్ శెట్టి అద్భుతమైన నటన, విజువల్స్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోడై కాంతార థియేటర్స్లో మాస్ జాతర చేస్తోంది. కన్నడలో 17 రోజుల కలెక్షన్స్ ను తెలుగులో కేవలం రెండు రోజుల్లోనే కొల్లగొట్టిందీ చిత్రం. డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది కాంతార. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్తో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఈ ‘కాంతార’ క్లైమాక్స్ సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషించింది. చివరి 20 నిమిషాలు అరాచకానికి అర్థం చూపించాడు రిషబ్ శెట్టి. అప్పటివరకు మాములుగా సాగుతున్న సినిమాను క్లైమాక్స్ లో వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు. ఇప్పటికే కన్నడలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం, తెలుగులో కూడా అంతకు మించిన విజయఢంకా మోగిస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Tremendous response from the audience for #KantaraTelugu 🔥 95% rating on @bookmyshow 💥 Watch #Kantara in theaters near you now! 💥 🎟️: https://t.co/WNkTI6j3BF #Kantara @shetty_rishab @VKiragandur @hombalefilms @GeethaArts @gowda_sapthami @AJANEESHB @actorkishore pic.twitter.com/p5YnWJiCe9 — Geetha Arts (@GeethaArts) October 16, 2022 -
టాలీవుడ్లో దూసుకెళ్తున్న ‘కాంతార’.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే..
‘కేజీయఫ్’తర్వాత కన్నడ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో అలరిస్తున్నాయి. శాండిల్ వుడ్ చిత్రాలపై యావత్ భారత్ సీనీ ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. అందుకే కన్నడ మేకర్స్ పాన్ ఇండియా స్థాయి సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే కొన్ని చిత్రాలు మాత్రం కన్నడ ప్రేక్షకుల కోసమే రూపొందిస్తుంటే.. అవి కూడా మిగతా భాషల ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ఫలితంగా చిన్న చిత్రాలు కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయం సాధించిన తాజా కన్నడ చిత్రం ‘కాంతార’.ఈ చిత్రం కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. (చదవండి: బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ‘కాంతర’ బడ్జెట్ ఎంతో తెలుసా..?) తాజాగా ఈ చిత్రం తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ మాదిరిగానే ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం సంచలనం సృష్టిస్తోంది. శనివారం(అక్టోబర్ 15)టాలీవుడ్లో రిలీజైన ఈ చిత్రం.. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఫలితంగా తొలి రోజు భారీ వసూళ్లను రాబట్టింది. ఒక్క రోజే రూ.5 కోట్ల గ్రాస్ వసూళ్లని రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి తెలుగులో రూ.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే రూ.114 కోట్ల షేర్ వసూళ్లని రాబట్టి రికార్డుని సృష్టించింది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరాంగదుర్ నిర్మించారు. -
బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ‘కాంతార’ బడ్జెట్ ఎంతో తెలుసా?
చిన్న చిత్రంగా వచ్చి భారీ విజయం సాధించిన చిత్రం ‘కాంతార’. సెప్టెంబర్ 30న కేవలం కన్నడలో విడుదలైన ఈ చిత్రం ఆక్కడ ప్రభంజనం సృష్టించింది. కేవలం 15 రోజుల్లోనే ఒక్క కన్నడలోనే రూ.92 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి కేజీయఫ్ రికార్డులను బద్దలు కొట్టింది. శాండిల్ వుడ్లో కేజీయఫ్2 తర్వాత ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన చిత్రం ‘కాంతారా’నే. ఓవర్సీస్లోనూ మంచి వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 15 రోజుల్లో రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. (చదవండి: కాంతార మూవీ రివ్యూ) అంతటి సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తాజాగా తెలుగులో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ‘గీతాఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారావిడుదల చేశారు. శనివారం(అక్టోబర్ 15)టాలీవుడ్లో రిలీజైన ఈ చిత్రం.. మంచి ఓపెనింగ్స్ని సాధించింది. ఈ సినిమా తెలుగు హక్కులు కేవలం రూ.2 కోట్లకు అమ్ముడు పోయాయి. అయితే తొలిరోజే హిట్ టాక్ రావడంతో రూ. కోటీ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా హీరో,హీరోయిన్లు ఎవరో కూడా తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదు. కానీ కేవలం కథ మాత్రమే ఆడియన్స్ని థియేటర్స్కి రప్పిస్తుంది. అయితే ఈ సినిమాను థియేటర్స్లో చూస్తే భారీ బడ్జెట్తో నిర్మించినట్లు కనిపిస్తుంది. కానీ ఈ సినిమా మేకింగ్కి అయిన ఖర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. వందల కోట్లు కొల్లగొడుతున్న ఈ చిత్రాన్ని రిషబ్ శెట్టి కేవలం రూ.16 కోట్ల బడ్జెట్తోనే తెరకెక్కించారట. ఈ లెక్కన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రానికి వచ్చిన హిట్ టాక్ చూస్తే.. కేవలం తెలుగులోనే బడ్జెట్కి పెట్టిన రూ.16 కోట్లు ఈజీగా వసూళ్లు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరాంగదుర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. -
కాంతారా.. ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు : హీరో
తమిళసినిమా: కన్నడంలో కేజీఎఫ్, విక్రాంత్ రోనా తరువాత సంచలన విజయాన్ని సాధించిన చిత్రం కాంతారా. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్కి చేరుకుంది. కేజీఎఫ్ 1, 2 చిత్రాలను నిర్మించిన హోమ్ బలి ఫిలిం సంస్థ నిర్మించింది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం తమిళంలోకి అనువాదమై శనివారం విడుదలైంది. దీనిని తమిళంలో డ్రీమ్ వారియర్ సంస్థ విడుదల చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శక నటుడు రిషబ్ శెట్టి శనివారం చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. కాంతారా దర్శకుడిగా తనకు నాలుగవ చిత్రం అని, కథానాయకుడిగా రెండవదని చెప్పారు. తాను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చానని దీంతో తన ఆలోచనలన్నీ ప్రకృతి, ప్రజలు, దైవం చుట్టునే తిరుగుతాయని చెప్పారు. ఈ మూడు అంశాలను కనెక్ట్ అయ్యేలా కథలు సిద్ధం చేసుకుని రూపొందించిన చిత్రం కాంతారా అని తెలిపారు. చిత్రం హిట్ అవుతుందని భావించాను గానీ.. ఇంత ఘన విజయం సాధిస్తుందని, పాన్ ఇండియా చిత్రంగా మారుతుందని ఊహించలేదన్నారు. అయితే కన్నడంలో ఇంతకుముందే పలు పాన్ ఇండియా చిత్రాలు రూపొందాయి. అయితే అప్పట్లో ఆప్షన్స్ లేకపోవడంతో ఇతర భాషల్లో ఎక్కువ చిత్రాలు విడుదల కాలేకపోయాయని చెప్పారు. రాజ్కుమార్, విష్ణువర్ధన్ లాంటి నటులు, పలువురు లెజెండ్రీ దర్శకులు చేసిన చిత్రాలు అద్భుతమైన విజయాలు సాధించాయన్నారు. రాజ్కుమార్ నటించిన మహిషాసుర మర్ధన తొలి పాన్ ఇండియా చిత్రమని రిషబ్శెట్టి పేర్కొన్నారు. ఆ చిత్రం అన్ని భాషల్లోనూ విడుదలై విజయం సాధించిందని గుర్తు చేశారు. -
రెండు సార్లు చూశా.. థ్రిల్లింగ్ క్లైమాక్స్..కాంతారాపై ప్రభాస్ రివ్యూ
కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన తాజా చిత్రం ‘కాంతారా’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుని సృష్టిస్తోంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరాంగదుర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైన ఈ చిత్రం.. అక్కడ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఈ సినిమాను అన్ని భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. తెలుగు థియేట్రికల్ రైట్స్ని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకుని ‘గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా నేడు(అక్టోబర్ 15) విడుదల చేశారు. (చదవండి: ‘కాంతారా’ మూవీ రివ్యూ) ఈ సినిమాపై స్టార్ హీరోలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే హీరో ధనుష్, రానా సోషల్ మీడియా వేదికగా ‘కాంతారా’పై ప్రశంసలు కురిపించారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఆ జాబితాలో చేరాడు. తాజాగా ‘కాంతారా’ మూవీని వీక్షించిన ప్రభాస్ తన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నాడు. “కాంతారా ఒక అద్భుతమైన మూవీ. ఇప్పటికి నేను ఈ మూవీని రెండుసార్లు చూశాను. మంచి కాన్సెప్ట్ తో, అదిరిపోయే క్లైమాక్స్ తో తెరకెక్కిన ఈ సినిమాను థియేటర్స్లో తప్పక చూడాలి’అంటూ సినిమా పోస్టర్ ను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. View this post on Instagram A post shared by Prabhas (@actorprabhas) -
Kantara Movie Review: ‘కాంతార’ మూవీ రివ్యూ
టైటిల్: 'కాంతార : లెజెండ్ నటీనటులు: రిషబ్ శెట్టి, కిషోర్ కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమినాడు, మానసి సుధీర్, శనిల్ గురు, దీపక్ రాయ్ పనాజే, తదితరులు నిర్మాణ సంస్థ: హోంబలే ఫిల్మ్స్ నిర్మాత: విజయ్ కిరగందూర్ తెలుగు పంపిణీ - గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ దర్శకత్వం: రిషబ్ శెట్టి సంగీతం - అజనీష్ లోకనాథ్ సినిమాటోగ్రాఫర్ - అరవింద్ ఎస్ కశ్యప్ ఎడిటర్ - ప్రతీక్ శెట్టి, కె ఎం ప్రకాష్ విడుదల తేది: అక్టోబర్ 15,2022(తెలుగులో) ‘కాంతారా’ కథేంటంటే ఈ కథ 1847లో ప్రారంభం అవుతుంది. వేల కోట్ల సంపద, మంచి కుటుంబం ఉన్నా ఓ రాజుకు ప్రశాంతత మాత్రం లభించదు. కావాల్సినవన్నీ ముందున్నా.. ఏదో లోటు ఉందని మదన పడుతుంటాడు. ఓ స్వామిజీ సూచన మేరకు ప్రశాంతత కోసం ఒంటరిగా వెళ్తాడు. ఏ ప్రదేశానికి వెళ్లినా ఆయన మనసుకు ప్రశాంతత లభించదు. చివరిలో ఓ అడవిలోకి వెళ్తుండగా.. అక్కడ ఓ దేవుడి శిల ముందు ఆగిపోతాడు. అది చూడగానే మనసు తేలికైపోతుంది. ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. దీంతో ఆ దేవుడి శిల తనకు కావాలని అక్కడి ప్రజలను కోరతాడు. దానికి బదులుగా ఏం కావాలన్న ఇస్తానంటాడు. అయితే అక్కడ కోలం ఆడే వ్యక్తి ( ఓ వ్యక్తికి దేవుడు పూనడాన్ని కోలం అంటారు).. ఆ శిలకు బదులుగా ఆ అడవినంతా అక్కడ ప్రజలకు ఇవ్వాలని చెబుతాడు. దీంతో ఆ రాజు ఆ అడవి భూమిని అక్కడి ప్రజలకు దానం చేసి దేవుడి శిలను తీసుకెళ్తాడు. కట్ చేస్తే.. 1990లో ఆ అటవీ భూమి రిజర్వ్ ఫారెస్ట్లో భాగమని, దానిని ప్రజలు ఆక్రమించుకున్నారని సర్వే చేయిస్తుంటాడు ఫారెస్ట్ ఆఫీసర్ మురళి(కిశోర్ కుమార్). ఈ నేపథ్యంలో ఆ ఊరి యువకుడు శివ(రిషబ్ శెట్టి)కి , మురళికి గొడవలు జరుగుతాయి. తమకు అండగా రాజ వంశీకులు దేవేంద్ర దొర(అచ్యుత్ కుమార్) ఉంటాడని శివతో పాటు ఆ ఊరంతా నమ్ముతుంది. మరి దేవేంద్ర దొర ఏం చేశాడు? ఆ ఊరిలో కోలం ఆడే దేవ నర్తకుడు గురవను హత్య చేసిందెవరు? శివ కలలో కనిపించే ఆ రూపం ఎవరిది? అటవి భూమిని, దానిని నమ్ముకొని బతుకుతున్న ప్రజలను కాపాడడం కోసం దేవుడు ఏం చేశాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ‘కాంతార’ కథ వింటే చాలా సింపుల్గా అనిపిస్తుంది. పూర్వీకులు ప్రజలకు ఇచ్చిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు వారసులు ప్రయత్నించడం.. దానిని అక్కడి ప్రజలు అడ్డుకోవడం.. చివరకు దేవుడు వచ్చి దుండగులను సంహరించడం ఇదే ‘కాంతారా’ కథ. వినడానికి ఇది పాత కథలా ఉన్నా.. కథనం మాత్రం చాలా కొత్తగా, ఆసక్తికరంగా సాగేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు రిషబ్ శెట్టి. హీరోలను, టెక్నీషియన్స్ కాకుండా కేవలం కథ, కథనాన్ని నమ్ముకొని తెరకెక్కించిన సినిమా ‘కాంతారా’. సినిమా ప్రారంభంలోనే ప్రేక్షకులు ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. కథంతా కన్నడ ఫ్లేవర్లో సాగుతుంది. అయినప్పటికీ అన్ని ప్రాంతాల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే కథ ఇది. అడవి ప్రాంతంలో ప్రజలు ఎలా ఉంటారు? వారి అలవాట్లు ఎలా ఉంటాయి? వేటాడే విధానం ఎలా ఉంటుంది? ఇలా ప్రతి అంశం కళ్లకు కట్టినట్లు చూపించారు. మొరటు ప్రేమ, కామెడీ బాగా వర్కౌట్ అయింది. అయితే వీటి కోసం ప్రత్యేకంగా ఎలాంటి సీన్స్ ఉండవు.. కథలో భాగంగా సాగుతాయి. దేవ నర్తకుడు కోలం ఆడే ప్రతి సీన్ ఆకట్టుకుంటుంది. ప్రతి సన్నీవేశం చాలా నేచురల్గా ఉంటుంది. ఫస్టాఫ్ వరకు ఇది సాధారణ సినిమానే. సెకండాఫ్ స్టార్టింగ్లో కొంత నెమ్మదిగా సాగుతుంది. కానీ క్లైమాక్స్ మాత్రం సినిమా స్థాయిని పెంచేస్తుంది. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు రిషబ్ శెట్టి తన విశ్వరూపాన్ని చూపించాడు. థియేటర్స్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడికి రిషబ్ శెట్టి ఒక్కడే అలా గుర్తిండిపోతాడు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం రిషబ్ శెట్టి. దర్శకుడిగా, నటుడిగా వందశాతం న్యాయం చేశాడు. ఊరిలో అవారాగా తిరిగే యువకుడు శివ పాత్రలో రిషబ్ పరకాయప్రవేశం చేశాడు. ఆయన నటన సినిమా మొత్తం ఒకెత్తు అయితే.. క్లైమాక్స్ మరో ఎత్తు. ఆ సీన్లో రిషబ్ తప్ప మరొకరు అంతలా నటించలేరనేలా అతని నటన ఉంటుంది. కోలం అడుతున్నప్పుడు రిషబ్ అరిచే అరుపులు థియేటర్స్ నుంచి బయటకు వచ్చాక కూడా మన చెవుల్లో మారుమ్రోగుతాయి. ఇక ఫారెస్ట్ గార్డ్గా ఉద్యోగం సంపాదించిన గ్రామీణ యువతి లీలగా సప్తమి గౌడ తనదైన సహన నటనతో ఆకట్టుకుంది. రిషబ్, సప్తమిల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. రాజ వంశీకుడు దేవేంద్ర దొరగా అచ్చుత్ కుమార్ మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించాడు. ఫారెస్ట్ ఆఫీసర్ మురళిగా కిషోర్ కుమార్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర అద్భుతంగా నటించారు. సాంకేతిక విషయానికొస్తే...ఈ సినిమాకు మరో ప్రధాన బలం అజనీష్ లోకనాథ్ నేపథ్య సంగీతం. కోలం ఆడే సమయంలో వచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుంది. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. అరవింద్ ఎస్.కశ్యప్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని ప్రెజంట్ చేశాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్డెస్క్ -
కాంతార సెన్సేషన్.. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2లను దాటేసిందిగా!
కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన సినిమా కాంతార. సప్తమి గౌడ, కిశోర్ కుమార్, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమినాడు, అచ్యుత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ నిర్మించారు. సెప్టెంబర్ 30న విడుదలైన ఈ సినిమా కన్నడ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తూ రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ మూవీ కేజీఎఫ్ 2 రికార్డును బద్ధలు కొట్టింది. ఐఎమ్డీబీలో కేజీఎఫ్ 2 మూవీకి 8.4, ఆర్ఆర్ఆర్ సినిమాకు 8 రేటింగ్ ఉండగా కాంతార.. వీటిని వెనక్కు నెట్టి అత్యధికంగా 9.6 రేటింగ్ను సొంతం చేసుకుంది. దీంతో అత్యధిక రేటింగ్ పొందిన ఇండియన్ చిత్రంగా కాంతార నిలిచింది. కాగా అఖండ ప్రేక్షకాదరణ అందుకుంటున్న కాంతార నేడు హిందీలో రిలీజైంది. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా శనివారం (అక్టోబర్ 15న) ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. చదవండి: ఎందుకింత ద్వేషం, అతడిని బతకనివ్వండి: నటి -
‘కాంతారా’ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది: రిషబ్ శెట్టి
‘‘హోంబలే ఫిల్మ్స్ సంస్థ మంచి కథలను ఎంచుకుంటూ సినిమాలు తీస్తోంది. ‘కాంతారా’ సినిమా చూసిన తర్వాత ఇన్ని సినిమాలు తీసిన నేను కూడా వారి దగ్గర నుంచి కొంత నేర్చుకోవాలని అనిపించింది. విభిన్నమైన సినిమాలు కావాలనుకునేవారికి ‘కాంతారా’ కచ్చితంగా నచ్చుతుంది’’ అని అన్నారు నిర్మాత అల్లు అరవింద్. కన్నడ నటుడు, రచయిత, దర్శకుడు రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కాంతారా’. ఈ చిత్రంలో సప్తమి గౌడ, కిశోర్ కుమార్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమినాడు కీలక పాత్రలు పోషించారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 30న విడుదలైంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ను గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 15న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ – ‘‘అడవి నేపథ్యంలో వచ్చిన ‘పుష్ప’ చూసి ప్రేక్షకులు ఎంతగా ఇష్టపడ్డారో.. అదే నేపథ్యంలో వస్తున్న ‘కాంతారా’ను కూడా అంతే ఇష్టపడతారు. ‘కాంతారా’లో ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ మాత్రమే కాదు.. విష్ణు తత్వాన్ని కూడా చెప్పడం జరిగింది. రీసెంట్గా వచ్చిన ఈ తరహా సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. ‘కాంతారా’ను రిషబ్ శెట్టి ఎంత అద్భుతంగా డైరెక్ట్ చేశారో అంతే బాగా యాక్ట్ చేశారు. సుమారు 40 నిమిషాల వరకు చూపు తిప్పుకోకుండా ఈ సినిమాను చూశాను. హీరోయిన్ సప్తమి డీ గ్లామరస్ రోల్ను బాగా చేసింది’’ అని అన్నారు. రిషబ్ శెట్టి మాట్లాడుతూ– ‘‘భారతీయ చిత్ర పరిశ్రమలోనే తెలుగు చలన చిత్ర పరిశ్రమ అగ్రస్థానంలో ఉంది. ఫారెస్ట్ మిస్టరీతో పాటు అగ్రికల్చర్ ల్యాండ్, ఎమోషన్స్ చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. యూనివర్సల్ కథతో వస్తున్న ‘కాంతారా’ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని చెప్పగలను. అగ్ర నిర్మాత అల్లు అరవింద్గారి గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ‘కాంతారా’ రిలీజ్ అవుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘రిషబ్ శెట్టితో నేను చేసిన మూడో సినిమా ఇది. ‘కాంతారా’లో ఆరు పాటలు రాసే అవకాశాన్ని ఇచ్చిన హనుమాన్గారికి ధన్యవాదాలు’’ అన్నారు రచయిత రాంబాబు గోశాల. -
తెలుగులోకి కన్నడ బ్లాక్బస్టర్ ‘కాంతారా’ మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
కన్నడ సెన్సేషన్ ‘కాంతారా’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ , రిషబ్ శెట్టి కాంబినేషన్లో వచ్చిన కన్నడ చిత్రం ‘కాంతారా’. సెప్టెంబర్ 30న విడుదలైన ఈ చిత్రానికి అక్కడ భారీ విజయం సాధించింది.. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు మేకర్స్. తెలుగు థియేట్రికల్ రైట్స్ని అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ‘కాంతారా’ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. (చదవండి: ఆదిపురుష్ టీజర్పై తమ్మారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు) కాంతారా అనేది సంస్కృత పదం. తెలుగులో దీనికి అడవి అని అర్థం వస్తుంది. ప్రేమ చూపిస్తే అంతకు మించిన ప్రేమను.. విధ్వంసం సృష్టిస్తే.. అంతకంటే ఎక్కువ విధ్వంసాన్ని రిటర్న్ గిఫ్టుగా ఇవ్వడం అడవి తల్లి నైజం. ప్రేమ భావోద్వేగాలు, గ్రామీణ వాతావారాన్ని ఆహ్లదకరంగా చూపించిన ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ను అధికారికంగా రిలీజ్ చేశారు . అక్టోబర్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రిషబ్ శెట్టి ఈ చిత్రానికి నటనే కాకుండా స్వయంగా దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించారు.హోంబలే ఫిలింస్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ నిర్మించారు.