press meet
-
కారులో తిరగ్గలనా అనుకున్నాను: సంపూర్ణేష్ బాబు
‘‘నేను నటించిన ‘హృదయ కాలేయం’ విడుదలై పదకొండేళ్లయింది. ఇన్నేళ్లలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించాను. ఈ నెల 25న ‘సోదరా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. మరో రెండు సినిమాలు కూడా రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి’’ అని సంపూర్ణేష్ బాబు(Sampoornesh Babu) తెలిపారు. సాయి రాజేశ్ నీలం స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘హృదయ కాలేయం’. ఈ మూవీ ద్వారా సంపూర్ణేష్ బాబు హీరోగా పరిచయమయ్యారు. 2014 ఏప్రిల్ 4న ఈ చిత్రం విడుదలై, హిట్గా నిలిచింది. ఈ మూవీ 11వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం సంపూర్ణేష్ బాబు విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నరసింహాచారిగా చిన్న పల్లెటూరి నుంచి వచ్చిన నన్ను ‘హృదయ కాలేయం’తో సంపూర్ణేష్ బాబుగా మార్చిన సాయి రాజేశ్ అన్నకు రుణపడి ఉంటాను. ఈ మూవీ టైమ్లో డైరెక్టర్ రాజమౌళిగారు చేసిన ట్వీట్ వల్ల నాకెంతో గుర్తింపు దక్కింది. ‘హృదయ కాలేయం’ టైమ్లో సందీప్ కిషన్ అన్న, మారుతి, తమ్మారెడ్డి భరద్వాజగార్లు ఎంతో సపోర్ట్ చేశారు. నా జీవన విధానానికి, ‘బిగ్ బాస్’ పరిస్థితికి సరిపోక ఆ షోలో ఉండలేకపోయాను. నా సంపాదనలో కొంత విరాళంగా ఇవ్వడం ఎంతో సంతృప్తిని కలిగిస్తోంది. కనీసం కారులో తిరగ్గలనా? అనుకున్న నన్ను విమానంలో తిరిగేలా చేశారు సాయి రాజేశ్ అన్న’’ అని తెలిపారు. -
పాముతో సీన్స్ చేయడానికి భయపడ్డాను
హీరోయిన్ కేథరిన్ ట్రెసా ప్రధాన పాత్రలో, మహేశ్ శ్రీరామ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఫణి’. ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్, ఏయూ అండ్ ఐ స్టూడియోల సమర్పణలో డా. మీనాక్షి అనిపిండి ఈ సినిమాను నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు ఇతర ప్రపంచ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది. బుధవారం జరిగిన ఈ చిత్రం ప్రెస్మీట్కు దర్శక–నిర్మాత కె. రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై, ‘ఫణి’ సినిమా మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘వీఎన్ ఆదిత్య కొత్త వాళ్లతోనూ సినిమా చేయగలడు, స్టార్స్తోనూ సినిమా చేయగలడు. ‘ఫణి’ విజయం సాధించాలి’’ అని అన్నారు. ‘‘నాకు పాములంటే భయం. దీంతో పాముతో నేను చేయాల్సిన సీన్స్ అన్నీ సీజీలో చేయాలని ఆదిత్యగారిని రిక్వెస్ట్ చేస్తే, సరే అన్నారు. అయితే షూటింగ్ చివర్లో పాము కాంబినేషన్లో నాతో సీన్స్ చేయించారు. ఒకసారి సీన్ పూర్తయ్యేసరికి పాము నా ముఖానికి దగ్గరగా ఉంది. అప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోండి. మేలో మా ‘ఫణి’ మూవీని రిలీజ్ చేస్తున్నాం’’ అని తెలిపారు కేథరిన్. ‘‘యూఎస్ వెళ్లినప్పుడు నా సోదరి మీనాక్షి–బావ శాస్త్రిగారి ఇంట్లో ఉంటాను. వారు తమ ఓ.ఎం.జీ సంస్థలో నాతో సినిమా చేస్తామన్నప్పుడు నాకు భయం వేసింది. ‘ఫణి’ చిత్రాన్ని చిన్నగా మొదలు పెట్టాం. ఆ తర్వాత కేథరిన్గారు ఒప్పుకోవడంతో మరో స్థాయికి వెళ్లింది’’ అన్నారు వీఎన్ ఆదిత్య. ‘‘ఫణి’ మూవీతో కేథరిన్గారికి జాతీయ అవార్డు వస్తుంది’’ అని తెలిపారు నిర్మాత, సంగీత దర్శకురాలు డా. మీనాక్షి అనిపిండి. ‘‘హాలీవుడ్లో మోడలింగ్, మూవీస్ చేస్తున్నాను. ఈ సినిమాలో నటించడంతో సొంత ఇంటికి వచ్చినట్లుంది’’ అన్నారు మహేశ్ శ్రీరామ్. ఈ చిత్రసమర్పకుడు పద్మనాభరెడ్డి, సహ–నిర్మాత శాస్త్రి అనిపిండి, రైటర్ పద్మ, నటుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడారు. -
LIVE: ఆర్కే రోజా ప్రెస్ మీట్
-
బాలకృష్ణ 'ఆదిత్య 369' రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు.. చేతులు, ముఖంపై గాయాలు: డీఐజీ
సాక్షి, తూర్పుగోదావరి: ఈ నెల 24న అనుమానాస్పద స్థితిలో కొంతమూరు సమీపంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి చెందినట్టు గుర్తించామని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. శనివారం.. ఎస్పీ కార్యాలయంలో కేసు వివరాలను మీడియాకు ఆయన వెల్లడించారు. ప్రవీణ్ బంధువులు వచ్చిన తర్వాత కేసు నమోదు చేశామని తెలిపారు. మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామని.. తూర్పుగోదావరి ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.ఈ నెల 24న ఉదయం 11 గంటలకు పాస్టర్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మధ్యాహ్నం 1.29 గంటలకు చౌటుప్పల్ టోల్గేట్ దాటారు. విజయవాడలో మూడు గంటల పాటు ఆయన ఎక్కడున్నారనే విషయంపై ట్రాక్ చేస్తున్నాం. కొంతమూరు పెట్రోల్ బంక్ వద్దకు రాత్రి 11:40 గంటలకు చేరుకున్నారు. 11:42కు ఘటన జరిగింది. పోస్టుమార్టం రిపోర్టులో కొన్ని అంశాలకు సంబంధించి సమాచారం వచ్చింది. చేతులు, ముఖంపై కొన్ని గాయాలు ఉన్నాయని తేలింది. పూర్తి వివరాలు ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత ప్రవీణ్ ఎలా మృతి చెందారనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కారు ఢీ కొడితే మోటార్ సైకిల్ కింద పడిందా లేదా.. అన్న విషయాన్ని కూడా ట్రాన్స్పోర్టు అధికారులు పరిశీలిస్తున్నారు.’’ అని ఐజీ చెప్పారు.జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్ మాట్లాడుతూ.. హైదరాబాద్, విజయవాడలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా డేటా పరిశీలిస్తామని తెలిపారు. ‘‘అన్ని టోల్ గేట్ల వద్ద సీసీ ఫుటేజ్ తీసుకున్నాం. రాజమహేంద్రవరం ఎందుకు వచ్చారో పరిశీలించాం. లాలా చెరువు సమీపంలో కుమార్తె పేరిట ప్రవీణ్ కొంత స్థలం కొనుగోలు చేశారు. అక్కడ ఒక భవనం నిర్మించాలనుకున్నారు. దీని కోసం ఒక ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నారు. ఆయన రాజమండ్రి వస్తున్నట్టు భార్య, స్థానికంగా ఉంటున్న ఆకాష్, జాన్కు మాత్రమే తెలుసు. కుటుంబ సభ్యులందరినీ విచారించాం. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ కూడా పరిశీలిస్తాం’’ అని ఎస్పీ తెలిపారు. -
కూటమి నేతల డైరెక్షన్ లోనే నాపై ACB కేసు నమోదు చేసింది
-
మోహన్ లాల్ ‘లూసిఫర్ 2’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
సప్తగిరి ‘పెళ్ళి కాని ప్రసాద్’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
నితిన్ ‘రాబిన్హుడ్’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
Live: పేర్ని నాని PRESS MEET
-
బాబు బడ్జెట్.. అంకెల గారడీ.. ఏకిపారేసిన జగన్ (చిత్రాలు)
-
మోసాల బడ్జెట్.. బాహుబలి అంటూ బిల్డప్లు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం పేరుతో ప్రతీ వర్గాన్ని చంద్రబాబు మోసం చేశారని, బడ్జెట్ గారడీతో అది బయటపడిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన చంద్రబాబు చేస్తున్న దగాను వివరించారు.ప్రెస్మీట్లో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 👉అసెంబ్లీలో ప్రతిపక్షం చెబుతున్న మాటలు వినడం లేదు. అందుకే మీడియా ముందుకు వచ్చాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టింది. సూపర్ సిక్స్, 143 హామీల కోసం అరకోర కేటాయింపులు చేశారు. అన్నిరకాలుగా మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తోంది.👉బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ కాస్త బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ అయ్యింది. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సెవెన్ అంటూ ఊదరగొట్టారు. చంద్రబాబు దత్తపుత్రుడు కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ప్రతీ ఇంటికి బాండ్లు పంచారు. 20 లక్షల ఉద్యోగాలు,. రూ.3 వేల నిరుద్యోగ భృతి సాయం అన్నారు. 👉ఇప్పుడు హామీలపై అడిగితే సమాధానం లేదు. రెండు బడ్జెట్లలోనూ నిధులు కేటాయించలేదు. ప్రజలను మోసం చేసిన తీరు స్పష్టంగా కనిపిస్తోంది. తొమ్మిది నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని చెప్పారు . గవర్నర్తో అబద్ధాలు చెప్పించారు. 👉ఆత్మస్తుతి పరనింద అన్నట్లుగా చంద్రబాబు బడ్జెట్ ప్రసంగం ఉంది. తొలిబడ్జెట్లో కేటాయిచింది బోడి సున్నా. ఈ ఏడాది కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ప్రతి నిరుద్యోగి భృతి రూ.72 వేలు ఎగనామం పెట్టారు. 2024-25 సోషియో ఎకనమిక్ సర్వేలో ఎంఎస్ఎంఈ సెక్టార్లో 27 లక్షల ఉద్యోగాలిచ్చామని చెప్పారు. బడ్జెట్లో ప్రతిపాదించకుండా లక్షల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు?👉జగన్ చెప్పినదానికంటే ఎక్కువ ఇస్తున్నామని ఫోజులు కొడుతున్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారు. పారిశ్రామిక వేత్తలను బెదిరిస్తున్నారు. ఏపీ రావాలంటే కంపెనీలు భయపడుతున్నాయి👉చంద్రబాబు ఏది చెప్పినా అబద్ధం.. మోసం. చంద్రబాబు చేసేది.. దగా .. వంచన👉వైఎస్సార్సీపీ హయాంలో వివిధ సెక్టార్లో ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 6 లక్షలు. మొత్తం మా పాలనలో అన్నీ రంగాలకు కలిపి 40 లక్షల పైచిలుకు ఉద్యోగాలిచ్చాం. ఆధార్ కార్డులతో సహా ఆ వివరాలు చెప్పగలం. ఇది ఎవరూ కాదనలేని సత్యాలివి👉18 నుంచి 60 ఏళ్ల మహిళకు సంవత్సరానికి రూ.18 వేలు ఆడబిడ్డ నిధి అన్నారు. దానికి ఎగనామం పెట్టారు. ఉచిత బస్సు కోసం మహిళలంతా ఎదురు చూస్తున్నారు. ఉచిత ప్రయాణాలు ఎప్పుడెప్పుడు చేస్తామా? అని ఆశగా చూస్తున్నారు. మహిళల సంక్షేమం పేరిట ఈ హామీతో రూ.7 వేల కోట్లు ఎగ్గొట్టారు. 👉స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేల సాయం అన్నారు. ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తామని అన్నారు. తల్లికి వందనం కోసం మొదటి బడ్జెట్లో రూ. 5, 386 కోట్లు కేటాయింపులు చేశారు. ఈసారి నెంబర్ మోసంతో ప్రజలను మభ్య పెడుతున్నారు. ఎలాగూ మోసం చేసేది కదా అని ఇలా చేస్తున్నారు. చివరికి చిన్న పిల్లాడికి కూడా బకాయిలు పెడుతూ.. ఎగనామం పెడుతున్నారు. 👉అఫ్కోర్స్.. చంద్రబాబుకి రైతులను మోసం చేయడం కొత్తేం కాదు రైతు భరోసా పేరిట రైతన్నలను గతంలోనే కాదు.. ఇప్పుడూ మోసం చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేల సాయం అందిస్తామన్నారు. కిందటి ఏడాది ఎగ్గొట్టారు. ఈసారి కూడా ఆ పని చేస్తే.. రెండు బడ్జెట్లకు కలిపి రూ.40 వేలు ఎగనామం పెట్టినట్లు అవుతుంది. 👉 దీపం పథకం కింద మరో మోసానికి దిగారు. ఎలాగూ ఎగనామం పెట్టేదే కదా.. మోసమే కదా అని కేటాయింపులు చేసుకుంటూ పోయారు.👉 చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం.. 50 ఏళ్లు నిండిన వాళ్లకు పెన్షన్ల విషయంలో మరో 20 లక్షల మంది జత కావాల్సి ఉంది. రెండేళ్లలో రూ.96 వేల చొప్పున మోసం చేశారు. 👉 సూపర్ సిక్స్.. సెవెన్ కింద అన్ని పథకాలకు కలిపి మొత్తం.. దాదాపు రూ.80 వేల కోట్లు(రూ.79,867 కోట్లు) కావాలి. కిందటి ఏడాది రూ.7 వేల కోట్లు పెడితే.. రూ.800 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఈసారి బడ్జెట్ కేటాయింపులే రూ.17, 179 కోట్లు మాత్రమే. బాబు షూరిటీ.. మోగ్యారెంటీకి ఇదే నిదర్శనం. 👉వైఎస్సార్సీపీ వాళ్లకు పథకాలు ఇవ్వకూడదని, ఎలాంటి సాయం చేయకూడదని చంద్రబాబు అన్నారు. ఇవ్వకపోవడానికి అదేమైనా మీ బాబుగారి సొమ్మా?. అది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం నడుస్తోంది. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తానని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి ఇలా.. బహిరంగంగా మాట్లాడతారా?. ఇలాంటి వ్యక్తి సీఎంగా అర్హుడేనా?.. ఇలాంటి సీఎం ఏ రాష్ట్రానికైనా శ్రేయస్కరమా?. ఇలాంటిక్తిని సీఎం స్థానంలో కొనసాగించడం ధర్మమేనా?. చంద్రబాబు చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అందరూ చూడాలిఎన్నికల టైంలో చంద్రబాబు: జగన్ ఇప్పించిన సంక్షేమం ఆగదు. 143 హామీలు కాకుండా.. మరింత సంక్షేమం ఇస్తాంఅసెంబ్లీలో సీఎంగా చంద్రబాబు: మనం హామీలు ఇచ్చాం. సూపర్ సిక్స్ ఇచ్చాం. చూస్తే భయం వేస్తోంది. ముందుకు కదల్లేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలి.👉సంక్షేమానికి కేరాఫ్గా నిలిచాం. మా హయాంలో 4 పోర్టులకు శ్రీకారం చుట్టాం. రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. 10 పిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టాం. విద్యారంగంలో కీలక సంస్కరణలు తెచ్చాం. CBSE నుంచి IB వరకు బాటలు వేశాం. నాడు-నేడు కింద స్కూళ్ల రూపురేఖలు మార్చేశాం. చంద్రబాబు హయాంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అయ్యింది👉మా హయాంలో 66 లక్షల మందికి పెన్షన్లు అందించాం. బాబు పాలనలో 62 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నారు. కొత్తగా ఎవరిని చేర్చకపోగా.. ఉన్నవాళ్లలో 4 లక్షల మంది లబ్ధిదారులను తొలగించారు. బడ్జెట్ కేటాయింపుల్లోనూ పెన్షన్ నిధులు తగ్గించేశారు👉రూ.15 వేలు ఇస్తామని వాహనమిత్రకు ఎగనామం పెట్టారు. ముస్లింలకు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షలు ఇస్తామని మోసం చేశారు. 👉దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ క్యాలెండర్ అమలు చేశాం. మా హయాంలో అక్కాచెల్లెళ్లకు భరోసా ఉండేది. తమ కాళ్లపై నిలబడేలా అడుగులు ముందుకు వేశాం. 👉ఇప్పుడు అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి పథకాలు లేవు. విద్యాదీవెన పథకానికి నిధులు ఇవ్వలేదు. ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు వదిలేసే పరిస్థితికి వచ్చారు. ఈ పరిస్థితిపై వైఎస్సార్సీపీ పోరాటం చేయనుంది. మార్చి 12న విద్యార్థులు, తల్లిదండ్రుల సమన్వయంతో వైఎస్సార్సీపీ ఫీజు పోరు ఉంటుంది👉కూటమి ప్రభుత్వంలో.. వ్యవసాయం, వైద్యం, ఆరోగ్యం, విద్య ఇలా అన్ని రంగాలను నాశనం చేశారు. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారు. మేం తెచ్చిన విప్లవాత్మక మార్పులను.. నిర్వీర్యం చేశారు. మిర్చి రైతులను దారుణంగా మోసం చేశారు. సమస్య పరిష్కరించామని అసెంబ్లీలో అబద్ధాలు చెబున్నారను. కేజీ మిర్చి కూడా కొనలేదు.👉ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారు. కోవిడ్లాంటి మహమ్మారి టైంలోనూ మెరుగైన జీతాలు.. అదీ సకాలంలో మేం చెల్లించాం. ఇవాళ జీతాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఏటా ఇచ్చే ఇంక్రిమెంట్లను ఎగ్గొట్టారు. ఐఆర్, పీఆర్సీ, పెండింగ్బకాయిలు ఇవన్నీ ఇవ్వబోమని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది.👉అయ్యా.. పయ్యావులగారూ.. కరోనా టైంలోనూ సాకులు చెప్పకుండా మేం అన్నీ సక్రమంగా నడిపించాం. ఇప్పుడు మీరు ఎగ్గొటడానికి సాకులు వెతుకుతున్నారు.అప్పులపై.. తప్పులు👉2014-19కి రూ.4 లక్షల కోట్ల అప్పులు ఉంటే.. 2024 నాటికిరూ.6 లక్షల కోట్ల అప్పు ఉంది. కాగ్ లెక్కలు కూడా ఇదే స్పష్టం చేశాయి. కానీ, రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉందని ప్రచారం చేశారు. గవర్నర్ ప్రసంగంలోనూ అబద్ధాలు చెప్పించారు. 👉సాధారణంగా.. బడ్జెట్ గ్లాన్స్లో పదేళ్ల కిందట అప్పుల లెక్కలు ఉంటాయి. కానీ, లెక్కలు చూపిస్తే ఎక్కడ దొరికిపోతామోనని మొన్నటి బడ్జెట్లో అది చూపించలేదు. అంత దుర్మార్గంగా వ్యవహరించారు చంద్రబాబు.👉ఎందుకింత అబద్ధాలు.. ఎందుకింత మోసాలు?. చంద్రబాబు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి పేరు మీద అప్పులు చేస్తున్నారు. 👉రాష్ట్రానికి ఆదాయం రావట్లేదు. చంద్రబాబు, ఆయన మనుషుల జేబుళ్లోకి డబ్బులు వెళ్తున్నాయి. ఆర్థికవేత్తల అంచనాకి కూడా అందకుండా చంద్రబాబు ప్రజలపై బాదుడు బాదబోతున్నారు. అయ్యా స్వామీ.. ఏంది ఈ మోసాలు?.. బడ్జెట్ అంతా అంకెల గారడీ.. దీనిని పట్టుకుని బాహుబలి బడ్జెట్ అనడం వాళ్లకు మాత్రమే చెల్లుతుంది👉ఇదీ వాస్తవం. ఇబ్బడిముబ్బిడిగా అప్పు. గత మా ప్రభుత్వంలో కన్నా, ఇప్పుడు ఇబ్బడిముబ్బిడిగా చంద్రబాబు అప్పులు చేస్తున్నారు. మా హయాంలో 2023–24లో మేము రూ.62,207 కోట్లు చేస్తే, చంద్రబాబు 2024–25లో చేసిన అప్పు రూ,73,362 కోట్లు. నిజానికి అది ఇంకా ఎక్కువే ఉంది. ఇంకా అమరావతి కోసం చేసిన, చేస్తున్న అప్పులు వేరుగా ఉన్నాయి.ఇబ్బడిముబ్బిడిగా అప్పులు చేస్తున్నారు. మాట్లాడితే, అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అంటాడు. కానీ, బడ్జెట్లోని డిమాండ్, గ్రాంట్స్ చూస్తే.. రూ.6 వేల కోట్లు అమరావతి నిర్మాణం కోసమని చూపారు. మరి అలాంటప్పుడు అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని ఎందుకు చెప్పాలి?👉రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం (ఎస్ఓఆర్): 2023–24తో 2024–25ను పోలిస్తే రాష్ట్ర సొంత ఆదాయం ఏకంగా 9.5 శాతం పెరిగిందని చంద్రబాబు చెబుతున్నారు. ఎస్ఓఆర్ 2023–24లో రూ.93,084 కోట్ల నుంచి రూ.1,01,985 కోట్లకు పెరిగిందని చంద్రబాబు చెబుతున్నారు. కానీ, కాగ్ నివేదిక చూస్తే.. ఎస్ఓఆర్ తగ్గింది. 2025–26లో 37 శాతం పెరుగుదలతో రూ.1,27 లక్షల కోట్లకు ఎస్ఓఆర్ చేరుతాయంటున్నారు. ఇది మరో పచ్చి అబద్ధం. నిజానికి రాష్ట్ర ఆదాయం పెరగడం లేదు. కేవలం చంద్రబాబు, ఆయన మనుషులకే ఆదాయం వస్తోంది. ఖజానాకు సున్నా.👉నాన్ టాక్స్ రెవెన్యూ: 2024–25లో మిస్లీనియస్ జనరల్ సర్వీసెస్ కింద రూ.7,916 కోట్లు ఆదాయం చూపుతున్నారు. ల్యాండ్ రెవెన్యూ కింద రివైజ్డ్ అంచనా మేరకు రూ.1341 కోట్లు అని చూపుతున్నారు. కానీ, నిజానికి ఈ 10 నెలల్లో వచ్చింది కేవలం రూ.196 కోట్లు మాత్రమే. మరి ఏ రకంగా ఆ ఆదాయం పొందబోతున్నారు?👉మూల ధన వ్యయం: 2023–24లో 10 నెలల్లో మూలధన వ్యయం కింద మేము రూ.20,942 కోట్లు ఖర్చు చేస్తే, అదే చంద్రబాబు హయాంలో 2024–25లో తొలి 10 నెలల్లో చేసిన వ్యయం కేవలం రూ.10,854 కోట్లు అంటే మైనస్ 48 శాతం. ఇది వాస్తవం. కానీ రివైజ్డ్ అంచనాలో మరో రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చూపారు.👉ఈ బడ్జెట్ అంకెల గారడీ కాదా?: చంద్రబాబు వచ్చాక ఆదాయం తగ్గింది. రాష్ట్ర సొంత ఆదాయం ఎస్ఓఆర్ పెరగలేదు. అది పెరగకపోగా, చాలా తగ్గింది. మూల ధన వ్యయం కూడా దారుణంగా తగ్గింది. ఇలాంటి పరిస్థితులున్నా, చంద్రబాబు ఏమంటున్నాడు. జీఎస్డీపీ 12.94 శాతం నమోదు అవుతుందని చెబుతున్నాడు. ఎలా సాధ్యం?. వాస్తవాలు ఇలా ఉంటే, ఈ ఏడాది బడ్జెట్ రూ.3,22,359 కోట్లు ఎలా సాధ్యం? ఇది అంకెల గారడీ కాదా?. పైగా దీన్ని బాహుభళీ బడ్జెట్ అనడం మీకే చెల్లింది. 👉ప్రతిపక్షం ఈ మేర చెప్పలేకపోతే.. ఎలా?. ప్రతిపక్షంలో ఉన్న వారిని అధికారంలో ఉన్నవారు గుర్తించకపోతే.. ఏం సాధించడం కోసం అసెంబ్లీ నడపడం👉ఇంత ప్రసంగంలోనూ నేను ఎవరినీ తిట్టలేదు. లెక్కలతో సహా చూపించాం. మరి సమాధానాలు చెబుతారా? చూద్దాం👉ఎమ్మెల్సీ ఫలితాలపై..ఎమ్మెల్సీ విజయంతో ప్రజల్లో తమకు సానుకూలత ఉందన్న కూటమి ప్రభుత్వ వాదనపై జగన్ స్పందించారు. ప్రపంచ చరిత్రలో ఎమ్మెల్సీ ఫలితాల్లో రిగ్గింగ్ చేసేవాళ్లను ఎక్కడా చూడలేదు. ఫస్ట్ టైం ఇక్కడే చూశా. అయినా ఉత్తరాంధ్ర స్థానంలో టీచర్లు కూటమికి బాగా బుద్ధి చెప్పారు. అక్కడ రిగ్గింగ్ కుదరదు కాబట్టి ఓడిపోయారు👉అసెంబ్లీలో రెండే పక్షాలు ఉన్నాయి.. ఒకటి అధికారం.. మరొకటి ప్రతిపక్షం . ప్రధాన ప్రతిపక్ష హోదా మాకు కాకుంటే ఇంకెవరికి ఇస్తారు? . రెండు వైపులా మీరే కొడతామంటే.. ఇదేమైనా డబుల్ యాక్షన్ సినిమానా?👉గతంలో టీడీపీ నుంచి ఐదుగురు మా వైపు వచ్చారు. మరో పది మందిని లాగుదామంటే నేనే వద్దన్నా.. ఏం మాట్లాడతావో మాట్లాడు.. నేను వింటా అని చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా ఇచ్చా. ఇదే ఆయనకు నాకు తేడా👉మైక్ ఇస్తేనే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. అది ఇవట్లేదు కాబట్టే ఇలా మీడియా ముందుకు రావాల్సి వస్తోందిపవన్పై సెటైర్లు..👉టీడీపీ తర్వాత జనసేన అతిపెద్ద పార్టీ అని.. కాబట్టి తాము ఉండగా ఈ ఐదేళ్లు వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారని మీడియా ప్రతినిధులు జగన్ వద్ద ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ. జీవిత కాలంలో ఒక్కసారి ఆయన ఎమ్మెల్యే అయ్యారు అని జగన్ సెటైర్ వేశారు. -
వైఎస్ఆర్ సీపీ నేతల ప్రెస్ మీట్
-
రాష్ట్రంలో దిగజారిన లా అండ్ ఆర్డర్కు వంశీ అరెస్టు ఒక నిదర్శనం
-
జనసేన కిరణ్ రాయల్ బాధితురాలు సంచలన ప్రెస్ మీట్
-
దావోస్లో ఒక్క MOU జరగలేదు: వైఎస్ జగన్
-
Watch Live: ఏపీ రాజకీయాలపై వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్
-
‘జగన్ రాజకీయాన్ని టీడీపీవాళ్లే మెచ్చుకున్నారు’
గుంటూరు, సాక్షి: తొమ్మిది నెలల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో చేసిన విధ్వంసాలు అన్నీ ఇన్నీ కావని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఏపీలో కూటమి అరాచక పాలనపై, సంక్షేమ పథకాలు ఆగిపోవడంపై, అలాగే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ప్రచారాలపైనా తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బాబు మోసాలపై.. వైఎస్ జగన్ నిలదీతచంద్రబాబు అబద్ధాలు, మోసాలను ప్రజలకు వివరిస్తాంఎన్నికల టైంలో బాబు షూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ అని ప్రచారం చేశారుఎన్నికల ముందు బటన్ నొక్కడం పెద్ద గొప్పా?.. ముసలావిడ కూడా నొక్కుతుంది అని అన్నారుసూపర్ సిక్స్తో పాటు 143 హామీలు ఇచ్చారుఔహామీలు గ్యారంటీ అని ఇంటింటికి బాండ్లు కూడా పంచారుఅమలు చేయకపోతే చొక్కా పట్టుకోండి అన్నారు9 నెలల తర్వాత.. బాబు ష్యూరిటీ.. మోసానికి గ్యారెంటీ అని రుజువైందిఆ మేనిఫెస్టోలు, బాండ్లు ఏమయ్యాయి?.. ఇప్పుడు ఎవరి చొక్కా పట్టుకోవాలి?అప్పుల్లో రికార్డు బద్ధలు9 నెలల్లో చేసిన అప్పులు రికార్డు బద్ధలు కొట్టాయి బడ్జెటరీ అకౌఐంట్ అప్పులే రూ.80 వేల కోట్లుఅమరావతి పేరు చెప్పి చేసిన రూ.52 వేల కోట్లు అప్పు చేశారుమార్క్ఫెడ్, సివిల్ సప్లయి ద్వారా మరో రూ.8 వేల కోట్ల అప్పుఏపీఎండీసీ ద్వారా మరో 5 వేల కోట్ల రూపాయల అప్పుమొత్తంగా 1 లక్ష 45 వేల కోట్ల రూపాయల అప్పులు చేశారుఅన్ని అప్పులు చేసినా.. బటన్లు నొక్కారా? పేదలకు ఏమైనా ఇచ్చారా?1,40,000 వేల కోట్లు ఎవరి జేబులోకి వెళ్లాయిపథకాలన్నీ ఆగిపోయి.. గతప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలేమైనా అమలు చేస్తున్నారా?రైతు భరోసా, వసతి దీవెన పథకాలు నిలిచిపోయాయిమత్స్యకార భరోసా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, జగనన్న చేదోడు, లా నేస్తం.. ఇలా పథకాలన్నీ పోయాయిపిల్లలకు ట్యాబులు ఇచ్చే పథకం ఆగిపోయిందిఉద్యోగాల్లేవ్ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఉద్యోగాలేవీ లేవువలంటీర్లను ఎలా మోసం చేశామో చూశాం.వలంటీర్లకు రూ10 వేలు ఇస్తామని.. చేతులెత్తేశారు2.60 లక్షల మంది వలంటీర్లను ఉద్యోగాల్లోంచి తీసేశారుబేవరేజెస్లో మరో 18 వేల ఉద్యోగాలు తీసేశారుపీఆర్సీ చైర్మన్తో బలవంతంగా రాజీనామా చేయించారుఐఆర్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశారు?ఉద్యోగులకు మూడు డీఏలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయిఎన్నికలకు ముందు ఇచ్చిన ఉద్యోగ హామీలు ఏమయ్యాయి?ఏ నెల ఒకటో తారీఖు జీతాలిస్తున్నారో చెప్పాలిఆర్థిక విధ్వంసం అంటే ఇదే.. ఏపీ అభివృద్ధికోసం మా హయాంలో నాలుగు పోర్టులు నిర్మించాంరామాయపట్నం పోరర్టును 75 శాతం పూర్తి చేశాంపది పిషింగ్ హార్బర్ల నిర్మాణం కూడా చేపట్టాంరెండు హార్బర్లను మా హయాంలోనే ప్రారంభించాం. మరో హార్బర్ను ఈ మధ్యే ప్రధాని వర్చువల్గా ప్రారంభించాం కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాంబాబు అధికారంలోకి వచ్చాక ఆస్తులన్నింటిని అమ్మేస్తున్నారుమెడికల్ కాలేజీకి సీట్లు వద్దంటూ కేంద్రానికి లేఖలు రాస్తున్నారు ఇవన్నీ రాబోయే తరాలకు రాబడి పెంచేందుకు ఏర్పరిచిన ఆస్తులువీటన్నింటిని ప్రవేట్ పరం చేయాలని చూస్తున్నారు.. ఇది పెద్ద స్కాంజీఎల్ఐ, జీపీఎఫ్కూడా చంద్రబాబే వాడేసుకుంటున్నారుఆర్థిక విధ్వంసం అంటే ఇదేచంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే.. తన ఆస్తులు, తన వాళ్ల ఆస్తులు పెంచుకోవడమేఇందుకోసం స్కామ్లు చేస్తున్నారుసంపద సృష్టి చంద్రబాబు జేబులో జరుగుతోందిఇసుక స్కాంలు జరుగుతున్నాయిమా హయాంలో కంటే డబుల్ రేట్లకు ఇసుక అమ్ముతున్నారుప్రభుత్వ రంగంలో ఉన్న మద్యం షాపులు ప్రైవేయిటైజ్ చేశారుఆ వ్యవహారం ఎలా సాగిందో రాష్ట్రం మొత్తం చూసిందిపైగా లిక్కర్ స్కాంలో ఢిల్లీకి వెళ్లి కేజ్రీవాల్ను చంద్రబాబు తిడతారు ఇసుక, మద్యం, ఫ్లై యాష్.. ఇలా అన్ని మాఫియాలేప్రతీ నియోజకవర్గంలో.. మండలంలో, గ్రామంలో పేకాట క్లబ్లు నడిపిస్తున్నారుపెద్ద బాబు, చిన్నబాబు ఆధ్వర్యంలోనే ఇవన్నీ నడుస్తున్నాయిపెద్దబాబుకి ఇంత, చిన్నబాబుకి ఇంత, దత్త పుత్రుడికి ఇంత అని నడుస్తోంది వ్యవహారంఅలా అయితేనే వ్యాపారాలే నడిచేదిరివర్స్ టెండరింగ్ రద్దు చేశారుకాంట్రాక్టర్లకు పనులు ఇచ్చే కార్యక్రమంలో.. మొబైల్ అడ్వాన్స్ల పేరుతో అన్యాయాలకు తెర తీశారుప్రభుత్వ ఆదాయం తగ్గుతుంటే.. చంద్రబాబు ఆదాయం పెరుగుతోందిఇంక ఆదాయం ఎందుకొస్తది?ఇవన్నీ జరుగుతున్నాయి గనుకే సంపద సృష్టి జరగడం లేదురాష్ట్ర ఆదాయం ఆవిరి అవుతోందిఇన్ని జరుగుతున్నా.. చంద్రబాబును ఎవరూ ప్రశ్నించడం లేదుకారణం.. రెడ్బుక్ రాజ్యాంగంప్రశ్నించేవారిని వేధిస్తున్నారుసంపాదించే మార్గం ఉంటే నా చెవిలో చెప్పమని చంద్రబాబు అంటున్నారుఅన్నీ తెలిసి ప్రజలకు మాటిచ్చిన చంద్రబాబు.. ప్రశ్నించే వారితో వెటకారంగా మాట్లాడుతున్నారుమోసాల్లో పీహెచ్డీ చేసిన చంద్రబాబు.. నటనలోనూ మేటినటనలో బాబుకి అవార్డు ఇవ్వాల్సిందే!తాను ఇచ్చిన హామీలు ఎగొట్టి.. ఆవేదన వ్యక్తం చేశారుపరిస్థితి తలుచుకుంటే భయం వేస్తుందని అంటాడురాష్ట్రం ధ్వంసం అయిపోయిందని అంటాడునటనలో చంద్రబాబుకే అవార్డు ఇస్తే బాగుంటుంది.. ఆ స్థాయిలో నటిస్తారాయనచంద్రబాబును నమ్మడం అంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే అని ఎన్నికల టైంలో చెప్పాపులి నోట్లో తలపెట్టడమే అని మొత్తుకున్నాఅయినా ప్రజలు పొరపాటు పడ్డారు.. చంద్రబాబు మోసాలను, చంద్రముఖిని నిద్రలేపి ప్రజలు బాధపడుతున్నారుస్లో పాయిజన్ లాగా.. చంద్రబాబు అబద్ధాలను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారుఅందుకు వాళ్ల అనుకూల మీడియా పని చేస్తుంటుందిఎవరి హయాంలో ఏం జరిగిందంటే.. 2014-19, 2019-2024 మధ్య ఉన్న రెండు ప్రభుత్వాల ఆర్థిక పురోగతిని పోల్చి చూస్తే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థపై చంద్రబాబు వక్రీకరణ చేస్తున్నారురాష్ట్రం ధ్వంసం అయిపోయిందంటూ నటిస్తున్నారువైఎస్సార్సీపీ, గత టీడీపీ ప్రభుత్వాల మధ్య తేడాలు పోల్చి చూద్దాంకాగ్ నివేదికలే ఇందుకు ఉదాహరణమా హయాంలోనే కోవిడ్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చాయి.. రెండేళ్లు కొనసాగాయిచంద్రబాబు హయాంలో 2014-19 మధ్య మూల ధన రూ.13, 860 కోట్లుమా హయాంలో మూల ధన వ్యయం రూ. 15,632 కోట్లుసోషల్ సర్వీసెస్ మూల ధన వ్యయం కింద రూ. 2 వేలు కోట్లు చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు పెట్టిందిమా హయాంలో సోషల్ సర్వీసెస్ మూల ధన వ్యయం కింద రూ.5 వేల కోట్లు ఖర్చు చేశాం తలసరి ఆధాయంలో చంద్రబాబు ప్రభుత్వంలో 18వ స్థానంలో ఉంటే.. మా హయాంలో 15వ స్థానానికి పెరిగాంబాబు హయాంలో దేశంలో ఏపీ జీడీపీ వాటా 4. 47 శాతం ఉంది. వైఎస్సార్సీపీ హయాంలో దేశంలో ఏపీ జీడీపీ వాటా రాష్ట్ర వాటా 4.80కి పెరిగింది.2018-19 మధ్య పారిశ్రామిక రంగంలో ఏపీ 11 స్థానంలో ఉందిమా హయాంలో 2023-2024 నాటికి.. పారిశ్రామిక రంగంలో 9వ స్థానానికి ఎదిగాంచంద్రబాబు దిగిపోయేనాటికి.. జీడీపీ కంటే కట్టాల్సిన వడ్డీల వృద్ధి రేటు ఎక్కువగా ఉందిమా హయాంలో దేశ జీడీపీతో పోటీ పడి మెరుగైన ఫలితాలు సాధించాంఈ డాటా ఆధారంగా.. ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగాయో చంద్రబాబు చెప్పాలిరాష్ట్రం ఎవరి హయాంలో ఏపీ ఆర్థిక పురోగతి సాధించిందో, ప్రజలు బాగుపడ్డారో గుర్తించాలిఎప్పుడూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిందే తప్పా.. ఏనాడూ ఆయన హయాంలో జరిగింది చంద్రబాబు ఏనాడూ చెప్పరుచంద్రబాబు హయాంలోనే ఆర్థిక విధ్వంసం జరిగింది.. జగన్ హయాంలో చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించే ప్రయత్నం జరిగింది అప్పుల గురించి పరిశీలిస్తే.. చంద్రబాబువన్నీ అబద్ధాలు, మోసాలేఎన్నికలకు ముందు రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం చేశారుమా హయాంలో అడ్డగోలు అప్పులు చేశారంటూ చంద్రబాబు ఆరోపణలకు చేశారురూ.14 లక్షల కోట్ల అప్పులున్నాయంటూ ఊదరగొట్టారుఎన్నికల ముందు.. ఏపీ శ్రీలంక అయిపోతుందని బండలు వేశారుగవర్నర్ ప్రసంగం వచ్చేసరికి ఆ అప్పుల లెక్క తగ్గిపోయింది(రూ.10 లక్షల కోట్లు)శ్వేత పత్రాల సమయంలో మళ్లీ లెక్కలు మారాయి(రూ.12 లక్షల కోట్లు)చివరాఖరికి తప్పని పరిస్థితుల్లో.. దేశంలో ఎక్కడాల లేని విధంగా నవంబర్లో ప్రవేశపెట్టారుబడ్జెట్ పెడితే.. అందులోనూ ఆ లెక్కలు మరింత తగ్గాయి14 లక్షల కోట్ల నుంచి మొదలై.. చివరకు 6 లక్షల కోట్ల రూపాయల దగ్గర ఆగిపోయారుచివరకు.. బడ్జెట్లో అప్పుల లెక్కలతో తాను అబద్ధం చెప్పానని చంద్రబాబు ఒప్పుకున్నారుఅలాంటప్పుడు ఆదాయం ఎందుకు తగ్గింది?చంద్రబాబు హయాంలో రూ.31 వేల కోట్ల అదనపు అప్పులు చేశారుమా హయాంలో రూ.17 వేల కోట్ల అప్పుల భారం తగ్గించాంజూన్ డిసెంబర్ మధ్య ఆదాయం రూ.50 వేల కోట్లుఈ నెలల్లో 0.51 నెగెటివ్ గ్రోత్ వచ్చిందిచంద్రబాబు మాత్రం 13 శాతం జీఎస్డీపీ పెరిగిందని అంటున్నారుజీఎస్డీపీ పెరిగితే ఆదాయం ఎందుకు తగ్గుతుంది?బాబు బిల్డప్కు ఈనాడు బాకాఇలాంటి తప్పుడు ప్రచారాలు ఆయనకేం కొత్త కాదుతప్పుడు ప్రచారం చేయడం ఆయనకు అలవాటే దావోస్ పర్యటనలకు వెళ్లి.. ఎన్నో అబద్ధాలు చెప్పారుఏవోవో కంపెనీలు వస్తున్నాయంటూ ప్రకటనలు ఇచ్చారుఆయన బిల్డప్లకు.. ఈనాడు మామూలు ఎలివేషన్లు ఇవ్వదుఏ తల్లిదండ్రులు తమ పిల్లలకు అబద్ధాలు ఆడమని చెప్పరునిజాయితీగా బతకమని చెప్తారుచంద్రబాబు తన కొడుకు దగ్గరి నుంచి మొదలుపెడితే పార్టీలో ఉన్న అందరికీ.. అందరికీ అబద్ధాలు ఆడమని, వెన్నుపోటు పొడవమని చెబుతుంటారు దావోస్లో ఒక్క ఎంవోయూ కుదర్చుకోలేదుపరిశ్రమలు ఇక్కడికి వద్దామనుకుంటే .. పెట్టుబడిదారులను భయపెట్టి, కేసులు పెట్టి.. బెదరగొట్టి.. వెళ్లిపోయేలా చేశారుపక్క రాష్ట్రాలు వాళ్లతో ఎంవోయూలు చేసుకున్నారుపరిశ్రమలను ఆకర్షించేందుకు చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు?జిందాల్ లాంటి వ్యక్తులను భయపడితే.. వాళ్లు మరో 10 మందికి చెప్పరా?పైగా మా హయాంలో చేసిన ఒప్పందాలను.. ఇప్పుడు తాను చేసినట్లు చంద్రబాబు ప్రచారం చేయించుకుంటున్నారు12 మంది ఎంపీలున్న బీహార్.. బడ్జెట్లో ఎన్నో సాధించుకుందిబడ్జెట్లో ఏపీకి ఏం సాధించారు?కేంద్ర బడ్జెట్లో చంద్రబాబు సాధించింది ఏదీ లేదుకేంద్ర బడ్జెట్లో చంద్రబాబు ఏం సాధించుకోకపోగా.. ఉన్న పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారుచంద్రబాబు పలుకుబడి ఏపాటిదో ఇక్కడే అర్థమవుతోందిఇది విధ్వంసం కాదా?చంద్రబాబు విధ్వంసాలు అన్నీ విన్నీ కావుఇది విధ్వంసం కాదా?పిల్లలను బడులకు పంపేలా తీసుకొచ్చిన అమ్మ ఒడి ఆపేశారుస్కూళ్లలో నాడు నేడు పనులు ఆపేశారుఇంగ్లీష్ మీడియంకు పిల్లలను దూరం చేస్తున్నారుట్యాబ్ల పంపిణీ కార్యక్రమం ఆపేశారువసతి దీవెనను ఆపేసి, విద్యా దీవెన అరకోరగా అమలు చేయడం.. పిల్లల భవిష్యత్తును నాశనం చేయడం విధ్వంసం కాదా?ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు ఆరోగ్య ఆసరా కనపడకుండా చేశారు.. ఇది విధ్వంసం కాదా?చేయుత, ఆసరా పథకాలను ఆపేయడం.. విధ్వంసం కాదా?అన్ని వర్గాలకు ఆర్థిక తోడ్పాడు అందించిన సంక్షేమ పథకాలు ఆపేయడం.. విధ్వంసం కాదా?ఉద్యోగాలివ్వకుండా.. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టడం .. విధ్వంసం కాదా?ప్రభుత్వ ఉద్యోగులతో ఆడుకోవడంరాష్ట్ర ఆదాయం కాకుండా.. తన జేబును పెంచుకునే స్కాంలు చేయడం విధ్వంసం కాదా?రెడ్బుక్ రాజ్యాంగంతో గవర్నరెన్స్.. విధ్వంసం కాదా?ప్రశ్నిస్తే దాడులు చేయడం.. విధ్వంసం కాదా?ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు తిరుపతిలో.. ఉప ఎన్నికల టైంలో ఏం జరిగిందో రాష్ట్రం మొత్తం చూసిందిఒక్క స్థానం ఉన్న టీడీపీకి డిప్యూటీ మేయర్ పదవి ఎలా వచ్చింది?వైఎస్సార్సీపీ వాళ్లను బెదిరించి.. పోలీసుల సమక్షంలోనే కిడ్నాప్ చేశారుఓటు హక్కు ఉన్న ఎమ్మెల్సీని సైతం కిడ్నాప్ చేశారుచివరకు.. వాళ్లకు వాళ్లే గెలిచినట్లు ప్రకటించారుఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేమా హయాంలో తాడిపత్రిలో ఎన్నికల పారదర్శకంగా జరిపాంటీడీపీ 2 స్థానాల్లో ఎక్కువగా ఉన్న జగన్ ఏం రాజకీయం చేశారో చూడాలిహ్యాట్సాఫ్ జగన్ అని అక్కడి టీడీపీ ఇంఛార్జి చెప్పారుఅధికార బలం ఉందని దోచేయడం దుర్మార్గంహిందూపురంలో జరిగింది చూశాం చంద్రబాబు బావమరిది(బాలకృష్ణను ఉద్దేశించి..) కన్నుసన్నల్లోనే ఎన్నికల జరిగిందిఏదో గొప్పగా సాధించామని ఆయన చెప్పుకుంటున్నారు.. అందుకు సిగ్గుపడాలినందిగామలో ఓ మంత్రి కార్పొరేట్ల ఇంటికి వెళ్లి బెదిరించారుఅలాంటప్పుడు ఎన్నికలు ఎందుకు? నేరుగా డిక్లేర్ చేసుకోవచ్చు కదా ఆరోజులు త్వరలోనే..జమిలి ఎన్నికలు వస్తున్నాయంటున్నారుఅవి ఎంత త్వరగా వస్తే.. చంద్రబాబును అంత త్వరగా పంపించేయాలని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారుఏపీలో ప్రశ్నించే స్వరాలు పెరిగాయిచొక్కాలు పట్టుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయిప్రజలను వీళ్లను తరిమికొట్టే రోజులు వచ్చే అవకాశం ఉందిలిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి ఏం సంబంధం?రాష్ట్రంలో లేని పరిస్థితులు.. ఉన్నట్లు చంద్రబాబు ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నారుప్రజా సమస్యలు చెప్పేందుకు చట్ట సభల్లో సమయం ఇవ్వడం లేదు.. అందుకే మీడియా ముందుకు రావాల్సి వస్తోందివైఎస్సార్సీపీ 2.0 పాలన.. కార్యకర్తలకు భరోసా ఇస్తుందని మళ్లీ చెబుతున్నా‘పెద్ద’రెడ్డి.. అంటూ ఈనాడు కథనాలు ఇచ్చింది. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి ఏం సంబంధం?మిథున్ రెడ్డి పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్.. ఆయన తండ్రిది ఏ శాఖ?.. లిక్కర్కేసుతో వాళ్లకేం సంబంధం?ఎవరైనా ఎందుకు డబ్బులు ఇస్తారు? మద్యం రేట్లు మేం పెంచామా?మద్యం బేసిక్ రేట్లు పెంచి.. సరఫరా తగ్గించిన నాకు లంచాలు ఇస్తారా?రేట్లుఉ పెంచి సరఫరా పెంచిన చంద్రబాబుకి మాముళ్లు ఇస్తారా?నాలాగా చంద్రబాబు ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నారు?నాకు డబ్బుపై వ్యామోహం లేదు.. అందుకే డీబీటీతో రెండున్నర లక్షల కోట్ల రూపాయాలు సంక్షేమానికి ఖర్చు చేశాకమీషన్లు ఉండవు కాబట్టే చంద్రబాబు బటన్ నొక్కరు ఎవరో ఒకర్ని ఇరికించడం.. కేసు పెట్టడం వాళ్లు చేస్తోంది ఇప్పుడువిశ్వసనీయత ఉండాలి.. అది ఎవరికైనా!రాజకీయాల్లో క్రెడిబిలిటీ ఉండాలిఫలానా వాళ్లు మా నాయకులని కాలర్ ఎగరేసుకునేలా ఉండాలిబయటకు వెళ్లే ప్రతీ రాజ్యసభ సభ్యుడికి విశ్వసనీయత ఉండాలిభయపడో, ప్రలోభాలకు లొంగోలేకుంటే రాజీపడి అటు పోతే విశ్వసనీయత సంగతి ఏంటి?రాజకీయాల్లో కష్టాలు ఉంటాయి. ఐదేళ్లు కష్టపడితే మన టైం వస్తుందివిశ్వసనీయత ముఖ్యం.. అది ఎవరికైనా వర్తిస్తుందిలంచాలు లేకుండా ప్రజలకు సంక్షమ పథకాలు అందించాందేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో వైఎస్సార్సీపీ నిలబడిందిస్పీకర్ కోర్టుకు స్పందించడం లేదుఅసెంబ్లీ సమావేశాలను మేం బహిష్కరించలేదుకోర్టుకు వెళ్లాంస్పీకర్ ఎందుకనో కోర్టుకు స్పందించడం లేదుఅన్ని ప్రశ్నలకు వాళ్లే సమాధానం చెప్పాలిఅసెంబ్లీకి వైఎస్సార్సీపీ ఎందుకు వెళ్లడం లేదో.. ఇక స్పీకరే చెప్పాలిజిల్లా పర్యటనల గురించి.. కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలే అవుతోంది జిల్లాల పర్యటనలకు ఇంకా టైం ఉంది ఇదీ చదవండి: జగన్ 2.0.. ఎలా పని చేస్తానో చూపిస్తా! -
నటుడిగా సంతృప్తినిచ్చింది – అక్కినేని నాగచైతన్య
‘‘తండేల్’ అందమైన ప్రేమకథా చిత్రం. ఈ కథలో ఆ ప్రేమ వెనుకే మిగతా లేయర్స్ ఉంటాయి. నా కెరీర్లో కథ, నా పాత్ర పరంగానే కాదు... బడ్జెట్ పరంగా పెద్ద సినిమా ఇది. ఇప్పటికే మా యూనిట్ అంతా సినిమా చూశాం... విజయంపై చాలా నమ్మకంగా ఉన్నాం. ప్రత్యేకించి సెకండ్ హాఫ్, చివరి 30 నిమిషాలు, భావోద్వేగా లతో కూడిన క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. నటుడిగా నాకు బాగా సంతృప్తి ఇచ్చిన చిత్రం ‘తండేల్’’ అని అక్కినేని నాగచైతన్య అన్నారు. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ‘తండేల్’ రేపు (శుక్రవారం) తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం నాగచైతన్య విలేకరులతో చెప్పిన విశేషాలు ఈ విధంగా... → ‘ధూత’ వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు ‘తండేల్’ మూవీ లైన్ని విక్రమ్ కె. కుమార్గారు చెప్పారు. ఈ కథని వాసుగారు గీతా ఆర్ట్స్లో హోల్డ్ చేశారని తెలిసింది. ఈ కథని డెవలప్ చేసి, ఫైనల్ స్టోరీని చెప్పమని వాసుగారికి చెప్పాను. సినిమాటిక్ లాంగ్వేజ్లోకి మార్చిన ‘తండేల్’ కథ విన్నాక అద్భుతంగా అనిపించింది. నాకు ఎప్పటి నుంచో వాస్తవ ఘటనల ఆధారంగా సినిమా చేయాలని ఉండేది. పైగా ఇది మన తెలుగోళ్ల కథ కావడంతో రాజు పాత్ర చేయాలనే స్ఫూర్తి కలిగింది. → ‘తండేల్’ అంటే లీడర్. ఇది గుజరాతీ పదం. ఈ సినిమాని దాదాపు సముద్రంలోనే చిత్రీకరించాం. రియల్ లొకేషన్స్లో షూట్ చేయడం నటనకి కూడా ప్లస్ అవుతుంది. జైలు సెట్లో చిత్రీకరించిన ఎపిసోడ్స్ చాలా భావోద్వేగంగా ఉంటాయి. రాజు పాత్రకి తగ్గట్టు నేను మారాలంటే మత్స్యకారుల జీవన శైలి తెలుసుకోవాలి. అందుకే శ్రీకాకుళం వెళ్లి వాళ్లతో కొద్ది రోజులు ఉండి... హోం వర్క్ చేశాక ఈ పాత్ర చేయగలననే నమ్మకం వచ్చాకే ‘తండేల్’ జర్నీ మొదలైంది. నటుడిగా తర్వాతి స్థాయికి వెళ్లే చాన్స్ ఈ సినిమాలో కనిపించింది. దాదాపు ఎనిమిది నెలలు స్క్రిప్ట్, నా ట్రాన్స్ఫర్మేషన్ మీదే ఉన్నాను. శ్రీకాకుళం యాసలో మాట్లాడటం సవాల్గా అనిపించింది. → చందు, నా కాంబోలో ‘తండేల్’ మూడో సినిమా. నన్ను కొత్తగా చూపడానికి ప్రయత్నిస్తాడు. ‘‘100 పర్సెంట్ లవ్’ మూవీ తర్వాత గీతా ఆర్ట్స్లో మళ్లీ సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటుంటే.. ‘తండేల్’తో కుదిరింది. అరవింద్గారు, వాసుగారు సినిమాలు, ఎంచుకునే కథలు చాలా బాగుంటాయి. → ‘తండేల్’ షూటింగ్ కోసం కేరళ వెళ్లినప్పుడు అక్కడి కోస్ట్ గార్డ్స్ కెమేరామేన్, కొందరు యూనిట్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇలా కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. ఈ సినిమా చేస్తున్నప్పుడు అవార్డులు, రికార్డులు, వసూళ్ల గురించి ఆలోచించలేదు. ప్రేక్షకులను అలరించడమే నాకు ముఖ్యం. అయితే అరవింద్గారు మాత్రం ‘తండేల్’ రిలీజ్ తర్వాత నేషనల్ అవార్డ్స్కి పంపిస్తానని అన్నారు. సినిమా కోసం నా కాస్ట్యూమ్స్ని డిజైనర్స్ సెలక్ట్ చేస్తుంటారు. వ్యక్తిగత విషయానికొస్తే... ట్రిప్లకు వెళ్లినప్పుడు షాపింగ్ చేసి, నాకు నచ్చినవి కొనుక్కుంటాను. అలాగే ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటాను. అయితే ప్రస్తుతం నా డ్రెస్లను నా భార్య శోభిత సెలెక్ట్ చేసి, నాకు సర్ప్రైజ్ ఇస్తోంది. -
నేడు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు (గురువారం) పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన మీడియా సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రంలో తాజా పరిణామాలు, పరిస్థితులతో పాటు, ప్రజా సంబంధ అంశాలపై మీడియాతో ఆయన మాట్లాడనున్నారు.రాష్ట్రంలో కూటమి పాలనలో అంతా అరాచకం సాగుతోంది. 9 నెలల్లోనే అన్ని వ్యవస్థలను నాశనం చేసేశారు. సూపర్ సిక్స్ సహా హామీల అమల్లోనూ చంద్రబాబు సర్కార్ విఫలమైంది. కూటమి నేతల ఆగడాలు నానాటికీ శ్రుతి మించిపోతున్నాయి. పట్టపగలే.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కిడ్నాప్లు, దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. ఏపీలో రాజ్యాంగం బదులుగా రెడ్ బుక్ పాలన జరుగుతోంది.విజయవాడ నగర పాలక సంస్థ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లతో వైఎస్ జగన్ ఇవాళ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్పై ఆయన మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మళ్లీ గెలుస్తుందని.. రాష్ట్రాన్ని 30 ఏళ్ల పాటు పరిపాలిస్తామన్నారు. ‘‘ఒక్కటే గుర్తు పెట్టుకొండి. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పని చేస్తుందో చూపిస్తాం.’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.‘‘జగనన్న1.0లో కార్యకర్తలకు అంత గొప్పగా చేయలేకపోయి ఉండొచ్చు. ప్రతి పథకం, ప్రతి విషయంలో మొట్టమొదటగా ప్రజలే గుర్తుకు వచ్చి వారి కోసమే తాపత్రయపడ్డాను. వారి కోసమే నా టైం కేటాయించాను. ప్రజల కోసమే అడుగులు వేశాను. కానీ ఇప్పుడు చంద్రబాబు మన కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులు చూశాను. కార్యకర్తల బాధలను గమనించాను. వారి అవస్థలను చూశాను. అందుకే ఆ కార్యకర్తల కోసం మీ జగన్ అండగా ఉంటాడు’’ అని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘ఛీ.. ఎన్టీఆర్ మాటకు తూట్లు పొడిచి మరీ! -
ఎన్కౌంటర్లో ట్విస్ట్.. కంగుతిన్న పోలీసులు
కోట: రాజస్థాన్లోని కోటలో జరిగిన ఎన్కౌంటర్ ఊహించని మలుపుతిరిగింది. ఎన్కౌంటర్లో మృతిచెందాడని భావిస్తున్న 24 ఏళ్ల నేరస్తుడు బతికే ఉన్నాడని, ఇప్పటికీ పరారీలో ఉన్నాడని తేలిడంతో పోలీసులు కంగుతిన్నారు. ఆదివారం నాడు పోలీసులు అతని ఇంటిని చుట్టుముట్టినప్పుడు అతను కాల్చుకుని చనిపోయాడని పోలీసులు భావించారు. అయితే ఈ ఉదంతంలో చోటుచేసుకున్న మలుపును పోలీసులు మీడియాకు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నేరస్తుడు రుద్రేష్ అలియాస్ ఆర్డీఎక్స్ ఆదివారం నాడు కోట పరిధిలోని నయా నోహ్రాలోని ఒక ఇంట్లో దాక్కున్నప్పుడు పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఆ సమయంలో రుద్రేష్ తనను తాను కాల్పుకుని ఆత్మహత్య చేసుకున్నడని పోలీసులు భావించారు. కాగా ఆ సమయంలో రుద్రేష్ సహచరుడు కూడా అదే ఇంట్లో ఉన్నాడు.ఈ ఘటన అనంతరం పోలీసులు అతని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అయితే సోమవారం రుద్రేష్ కుటుంబ సభ్యులు మృతుడిని ప్రీతమ్ గోస్వామి అలియాస్ టీటీగా గుర్తించారు. అతను కూడా పేరుమోసిన నేరస్తుడేనని డిఎస్పీ లోకేంద్ర పలివాల్ తెలిపారు. ఇంతలో రుద్రేష్ తన స్నేహితుల్లో ఒకరికి పోన్ చేసి, తాను బతికే ఉన్నానని తెలియజేశాడు. ఈ విషయాన్ని ఆ మిత్రుడు రుద్రేష్ కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారు ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు.సీసీటీవీ ఫుటేజ్లోని ఫీడ్ ప్రకారం పోలీసు బృందం రాకముందే రుద్రేష్ అక్కడి నుంచి పారిపోయాడని డీఎస్పీ తెలిపారు. అతని ముఖం ఛిద్రమై ఉండటం, గదిలో అతని వస్తువులు కొన్ని కనిపించడంతో, ఆ మృతదేహాన్ని పోలీసులు రుద్రేష్గా గుర్తించారు. పోలీసులు రుద్రేష్ ఇంటి నుంచి మూడు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న రుద్రేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: Delhi Assembly Election: అణువణువునా గస్తీ.. 35 వేల పోలీసులు మోహరింపు -
గుక్కపెట్టి ఏడ్చిన ఎంపీ.. రాజీనామా చేస్తానంటూ..
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో దళిత బాలిక హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై అయోధ్యకు చెందిన సమాజ్వాదీ పార్టీ ఎంపీ అవధేష్ ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో ఆయన గుక్కపెట్టి ఏడవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పక్కనే కూర్చున్న మాజీ ఎంపీ పవన్ పాండే.. అవధేష్ను ఊరడిస్తూ కనిపించారు.హత్యకు గురైన బాధిత దళిత బాలిక కుటుంబ సభ్యులను శనివారం అవధేష్ ప్రసాద్(Avadhesh Prasad) కలిశారు. వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. విలేకరుల సమావేశంలో అవధేష్ మాట్లాడుతూ ‘లోక్సభలో ప్రధాని మోదీ ముందు ఈ అంశాన్ని లేవనెత్తుతాను. ఈ విషయంలో న్యాయం జరగకపోతే రాజీనామా చేస్తాను. మన బిడ్డ గౌరవాన్ని కాపాడుకోవడంలో మనం విఫలమవుతున్నాం. ఇది దేశంలో అత్యంత బాధాకరమైన ఘటన. यह जघन्य अपराध बेहद दुःखद हैं।अयोध्या के ग्रामसभा सहनवां, सरदार पटेल वार्ड में 3 दिन से गायब दलित परिवार की बेटी का शव निर्वस्त्र अवस्था में मिला है, उसकी दोनों आँखें फोड़ दी गई हैं उसके साथ अमानवीय व्यवहार हुआ है।यह सरकार इंसाफ नही कर सकती। pic.twitter.com/aSvI3N74Kl— Awadhesh Prasad (@Awadheshprasad_) February 2, 2025అయోధ్యలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒక దళిత బాలికపై అత్యాచారం జరిపి, ఆపై దారుణంగా హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని నగ్న స్థితిలో కాలువలోకి విసిరేశారు. ఈ సంఘటన అందరినీ కలచివేసింది’ అని చెబుతూ అవధేష్ మీడియా ముందు గుక్కపెట్టి ఏడ్చారు. కాగా అయోధ్య జిల్లాలోని మిల్కిపూర్ అసెంబ్లీ స్థానా(Milkipur Assembly constituency)నికి ఫిబ్రవరి 5న ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో అవధేష్ ప్రసాద్ కుమారుడు బరిలో ఉన్నారు. అటువంటి స్థితిలో అవధేష్ రోదిస్తున్న వీడియో వైరల్(Video goes viral) అయ్యింది. దీంతో అతని తీరుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఫిబ్రవరి 5న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మిల్కిపూర్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నిక ఫలితాలు ఫిబ్రవరి 8న వెల్టికానున్నాయి. మిల్కిపూర్ సీటును గెలుచుకునేందుకు అటు సమాజ్వాదీ పార్టీ, ఇటు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇది కూడా చదవండి: రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు.. సోనియా గాంధీపై కేసు నమోదు -
అదిరిపోయే ట్విస్టులతో ఆకట్టుకుంటుంది: ఫరియా అబ్దుల్లా
డ్యాన్స్ లవర్స్ను మెప్పించిన ‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1’(Dance Ikon) కు కొనసాగింపుగా ‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2(Dance Ikon 2) వైల్డ్ఫైర్’ రానుంది. ఫిబ్రవరి 14 నుంచి ఈ షో ఆహా ఓటీటీలో ప్రీమియర్కు రెడీ అవుతోంది. ఈ షోకు ఓంకార్(Ohmkar), హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్లుగా వ్యవహరించనున్నారు. ‘డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ఫైర్’ షోలో దేశవ్యాప్తంగా కంటెస్టెంట్స్ పాల్గొంటారని, హిప్ హాప్, క్లాసికల్, కాంటెంపరరీ స్టైల్స్తో ఈ డ్యాన్స్ షో వీక్షకులను అలరిస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ‘డ్యాన్స్ ఐకాన్ 2’ షో ప్రెస్మీట్లో హోస్ట్స్లో ఒకరైన ఓంకార్ మాట్లాడుతూ– ‘‘డ్యాన్స్ ఐకాన్ 2–వైల్డ్ఫైర్’లో ఐదుగురు కంటెస్టెంట్స్ సర్ప్రైజ్ చేస్తారు. ముఖ్యంగా ఇద్దరు పిల్లల పెర్ఫార్మెన్స్లు చర్చనీయాంశమవుతాయి. ముగ్గురు హోస్ట్లతో పాటు సింగర్ జాను లైరి, ప్రకృతి, మానస్, దీపిక ఈ నలుగురు మెంటార్స్ ఉంటారు. ‘డ్యాన్స్ ఐకాన్ 2: వైల్డ్ ఫైర్’ వీక్షకులకు హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కంప్లీట్ డ్యాన్స్ షో’’ అని అన్నారు.ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ–‘‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1’కు కూడా నన్ను హోస్ట్గా అడిగారు. కానీ, ఆ సమయంలో చేయలేకపోయాను. ఇప్పుడు ఓంకార్, శేఖర్ మాస్టర్లతో కలిసి హోస్ట్ చేస్తుండటం సంతోషంగా ఉంది. ప్రతి ఎపిసోడ్ అదిరిపోయే ట్విస్టులతో ఆకట్టుకుంటుంది. ఈ షో వీక్షకులకు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని గ్యారంటీగా చెప్పగలను’’ అని తెలిపారు. ‘‘ఈ షోలో వీక్షకులను సర్ప్రైజ్ చేసే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లు ఉంటాయి’’ అని చె΄్పారు శేఖర్ మాస్టర్. ఈ కార్యక్రమంలో మెంటార్ యశ్, మెంటార్ మానస్, సింగర్ జాను లైరి, మెంటార్ ప్రకృతి మాట్లాడారు. -
‘ప్రేమిస్తావా’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
ఈ పెట్టుబడుల వల్ల వేలాది ఉద్యోగాలు రాబోతున్నాయి: Revanth Reddy
-
'మదగజరాజా'మూవీ ప్రెస్మీట్లో హీరోయిన్ అంజలి,వరలక్ష్మి (ఫొటోలు)
-
సందు దొరికితే చాలు వైఎస్ జగన్ పై బురద చల్లాలనే ప్రయత్నమే
-
స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనలకు YSRCP మద్దతుగా నిలిచింది
-
కూతురి ఫస్ట్ మూవీ.. ఏడ్చేసిన సుకుమార్ భార్య (ఫోటోలు)
-
కార్చిచ్చుపై ప్రెస్మీట్లో ముత్తాతనయ్యానని జో బైడెన్ ప్రకటన
లాస్ ఏంజెలెస్: అమెరికా అధ్యక్షుడు బైడెన్కు ఇబ్బందికర అనుభవం ఎదురైంది. లాస్ ఏంజెలెస్తో పాటు దక్షిణ కాలిఫోర్నియా మొత్తాన్ని భీకర కార్చిచ్చు చుట్టుముట్టి పెను నష్టం చేస్తున్న విషయం తెలిసిందే. దాని ధాటికి ఇప్పటికే లక్షన్నర మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఇళ్లతో పాటు సర్వం బుగ్గి పాలై భారీగా ఆస్తి నష్టం జరిగింది. ముఖ్యంగా లాస్ ఏంజెలెస్లో హాలీవుడ్ తారలతో పాటు ప్రముఖులుండే అతి సంపన్న ఆవాసాలు పెద్ద సంఖ్యలో అగ్నికి ఆహుతిగా మారాయి. ఈ విపత్తుపై స్థానిక శాంటా మోనికాలో బైడెన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఉన్నట్టుంది వ్యక్తిగత ప్రకటన చేశారు. తనకు ముని మనవడు పుట్టాడని చెప్పుకొచ్చారు. ‘ఈ ప్రతికూల వార్తల నడుమ ఒక శుభవార్త. ఈ రోజే నేను ముత్తాత అయ్యాను. చాలా కారణాలతో నాకీ రోజు గుర్తుండిపోతుంది‘ అని అన్నారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ‘పేరుకేమో అగ్ర రాజ్య అధ్యక్షుడు. కనీసం ఎక్కడేం మాట్లాడా లో తెలియదా?‘ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాస్ ఏంజెలెస్ మంటల్లో బైడెన్ కుమారుని ఇల్లు కూడా బుగ్గిగా మారినట్టు వార్తలొచ్చాయి. ‘అది పూర్తిగా కాలిపోయిందని తొలుత చెప్పారు. బానే ఉందని ఇప్పుడంటున్నారు‘ అంటూ ఈ వార్త లపై బైడెన్ స్పందించారు.ప్రెస్ మీట్కు ముందే...మీడియా సమావేశానికి ముందే బైడెన్ స్థాని క ఆస్పత్రిలో ముని మనవడిని చూసి వచ్చారు. ఆ ఫొటోలు విపరీతంగా షేర్ అవుతున్నాయి. పదవిలో ఉండగా ముత్తాత అయిన తొలి అమెరికా అధ్యక్షునిగా కూడా 82 ఏళ్ల బైడెన్ రికార్డు సృష్టించడం విశేషం. పెద్ద వయసులో అధ్యక్షుడు అయిన రికార్డు ఆయన పేరిటే ఉండటం తెలిసిందే. 77 ఏళ్ల వయసులో అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 78 ఏళ్ల ట్రంప్ ఇప్పుడా రికార్డును తిరగరా యనున్నారు. ఈ నెల 20న ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయనుండటం తెలిసిందే. -
LIVE: తిరుపతి ఘటనపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్
-
‘డాకు మహారాజ్’ మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
ఫిబ్రవరి 15తో ముగియనున్న ఢిల్లీ అసెంబ్లీ
-
టాలీవుడ్ పెద్దల ప్రెస్ మీట్
-
మోహన్ లాల్ 'బరోజ్' మూవీ ప్రెస్మీట్ (ఫోటోలు)
-
విజయ్ సేతుపతి ‘విడుదల-2’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
మా నాన్నను విష్ణు ట్రాప్ చేసాడు
-
నాన్న తరఫున మీడియా మిత్రులకు క్షమాపణలు కోరుతున్నా: మంచు మనోజ్
-
ఏపీ సచివాలయంలో రగడ.. వెంకట్రామిరెడ్డి ప్రెస్మీట్ అడ్డగింత
సాక్షి, గుంటూరు: తమను వేధించడమే చంద్రబాబు సర్కార్ పనిగా పెట్టుకుందని సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగుల సంఘం కార్యాలయంలో పోలీసుల హడావుడితో రగడ చోటుచేసుకుంది. ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మీడియా సమావేశాన్ని అడ్డుకోవడానికి పోలీసులు రావడంతో వారికి, ఉద్యోగుల సంఘం నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. నిన్న(గురువారం) ఉద్యోగుల డిన్నర్ సమావేశంపై కూడా పోలీసులు దాడులు చేశారు. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర దుమారం రేగింది. నేడు వెంకట్రామిరెడ్డి ప్రెస్ మీట్ జరగకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నిన్న ఏం జరిగిందంటే..రాష్ట్ర సచివాలయ ఉద్యోగులపై పోలీసులు కర్కశంగా ప్రవర్తించారు. ఉద్యోగుల డిన్నర్ సమావేశంపై పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేశారు. వారిని ఇబ్బందులకు గురిచేశారు. డిన్నర్ చేస్తున్న సమయంలో 50 మంది వరకు పోలీసులు.. ఉద్యోగులను చుట్టుముట్టారు. ప్లాన్ ప్రకారం డిన్నర్ పార్టీపై ఏడు పోలీసు స్టేషన్ల సిబ్బంది దాడులు చేశారు. అంతటితో ఆగకుండా అక్కడ మద్యం బాటిళ్లు ఉన్నాయంటూ ఉద్యోగులపై కేసులు పెట్టారు.అనంతరం ఉద్యోగులను పోలీసు స్టేషన్కు తరలించారు. గురువారం అర్ధరాత్రి వరకు వారిని పీఎస్లోనే ఉంచారు. 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులను వేధిస్తున్నారని వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బొంకుల బాబు పవర్ బాగోతం.. బయటపెట్టిన వైఎస్ జగన్.. భజన మీడియాకూ సీరియస్ వార్నింగ్ (ఫొటోలు)
-
నితిన్ 'రాబిన్హుడ్' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
వైఎస్ఆర్ సీపీ MLCల ప్రెస్ మీట్
-
విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ' మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
Vidadala Rajini: కూటమి ప్రభుత్వం మాత్రం ఆరోగ్య శ్రీని పట్టించుకోవడం లేదు
-
లగచర్ల బాధితులతో NHRCని కలిసిన బీఆర్ఎస్ నేతలు
-
LIVE : వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్
-
LIVE : వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్
-
మీడియా ముందుకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మీడియా ముందుకు రానున్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ఏపీ వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం.. సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టులు చేయిస్తూ వేధింపులకు సంగతి తెలిసిందే. అలాగే శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయి. ఈ నేపథ్యంలో.. ఈ పరిణామాలపై వైఎస్ జగన్ తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడనున్నారు. 🚨 #Breaking Former Chief Minister, YSRCP Chief Sri @ysjagan Garu will address an important press conference today.📍Central Office, Tadepalli 🕒3:00 PM#StayTuned ❗https://t.co/RSawyrTK0MLive Link👆🏻#WeStandWithYSRCPSM#YSJagan pic.twitter.com/TDXHh2XQTa— YSR Congress Party (@YSRCParty) November 7, 2024 -
తండేల్ రిలీజ్ డేట్ ప్రెస్మీట్లో మెరిసిన చైతూ, సాయి పల్లవి (ఫోటోలు)
-
షర్మిలను తెలంగాణ ప్రజలు నమ్మలేదు.. ఏపీ ప్రజలు నమ్మలేదు
-
జగన్ ప్రెస్ మీట్ లో ఫ్యాన్స్ హంగామా..
-
సూర్య ‘కంగువ’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
LIVE : టీడీపీ అరాచకాలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
-
కూటమి అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో ఎన్నో దారుణాలు జరిగాయి
-
ఖడ్గంలో నన్ను తీసుకోవద్దన్నారు: శ్రీకాంత్
‘‘ఖడ్గం’ సినిమాలో నన్ను తీసుకోవద్దని నిర్మాత మధు మురళిగారు అన్నారు. కానీ కృష్ణవంశీ ధైర్యం చేసి, ఆయన్ని ఒప్పించి నన్ను తీసుకున్నారు. నా జీవితంలో ఈ సినిమాని మర్చిపోలేను. తరాలు మారినా దేశభక్తి చిత్రాలన్నింటిలో ‘ఖడ్గం’ గొప్ప చిత్రం. ఈ మూవీ మళ్లీ విడుదలవుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని శ్రీకాంత్ అన్నారు. రవితేజ, శ్రీకాంత్, ప్రకాశ్రాజ్, శివాజీ రాజా, షఫీ, సోనాలీ బింద్రే, సంగీత తదితరులు ప్రధానపాత్రల్లో నటించిన సినిమా ‘ఖడ్గం’. కృష్ణవంశీ దర్శకత్వంలో సుంకర మధు మురళి నిర్మించిన ఈ సినిమా 2002 నవంబర్ 29న విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచింది.కాగా ఈ నెల18న ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కృష్ణవంశీ మాట్లాడుతూ – ‘‘భారతీయ జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశంతో ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టాను’’ అని చెప్పారు. ‘‘ఖడ్గం’లో నేను చేయనని చెప్పాను. కానీ, ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నిటిలో నాకు మంచి పేరు వచ్చింది మాత్రం ఈ సినిమాతోనే’’ అన్నారు శివాజీ రాజా. ‘‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చదివి ఏడేళ్లుగా అవకాశం కోసం వేచి చూస్తున్న సమయంలో నాకు దొరికిన అవకాశం ‘ఖడ్గం’. ఈ సినిమాలో చాన్స్ ఇచ్చి నా వనవాసం ముగింపునకు కారణమైన కృష్ణవంశీగారికి కృతజ్ఞతలు’’ అని నటుడు షఫీ తెలిపారు. -
చంద్రబాబు పాపం బయటకు రావాలి: వైఎస్ జగన్ (ఫొటోలు)
-
LIVE: తిరుమల పర్యటన పై జగన్ కీలక ప్రెస్ మీట్
-
నా మతం మానవత్వం.. డిక్లరేషన్లో రాసుకోండి: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందంటూ చంద్రబాబు క్షుద్ర రాజకీయాలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేవుడి దర్శనానికి వెళ్తామంటే అడ్డుకునేందుకు చూస్తున్నారని.. నోటీసులు ఇచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు.ప్రెస్మీట్ ముఖ్యాంశాలు..రాష్ట్రంలో రాక్షస రాజ్యంరాష్ట్రంలో గతంలో ఎన్నడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోంది. దేవుడి దగ్గరకు వెళ్లే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం నా రాజకీయ జీవితంలో ఏనాడూ చూడలేదు. దేవుడి దర్శనానికి వెళ్తుంటే కూడా అడ్డుకుంటున్నారు. అందుకే ఇది రాక్షస రాజ్యం.ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే.. వైయస్సార్సీపీకి చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులకు నోటీసులు ఇచ్చారు.ఇక ఆ నోటీసులో ఏం రాశారంటే అంటూ.. చదివి వినిపించారు.‘మాజీ సీఎం వైయస్ జగన్ తిరుమల తిరుపతి సందర్శనకు, సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున, మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో, మరియు మీ సొంత వాహనాల్లో బయలుదేరి తిరుపతి చేరుకుని, వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమంలో పాల్గొనడం, చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తున్న నోటీస్’.అంటే, జగన్ అనే వ్యకి మాజీ ముఖ్యమంత్రి. ఆయన తిరుమల తిరుపతి దేవుడిని దర్శించుకునేందుకు వెళ్తుంటే, అందుకు మీకు పర్మిషన్ లేదు. మీరు వెళ్తే అరెస్టు చేస్తామని నోటీసులు ఇస్తున్నారు. ఒక్కసారి ఆలోచనే చేయండి.ఏ ప్రపంచంలో ఉన్నాం. ఇది రాక్షస రాజ్యం కాదా? ఒకవైపున ఏమో, నన్ను వెళ్లనీయకుండా, వైయస్సార్సీపీ శ్రేణులు వెళ్లకుండా నోటీసులు ఇస్తున్నారు. మరోవైపున టీవీల్లో చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి బీజేపీ శ్రేణులను రప్పిస్తున్నారు. ఇది పార్టీ నాయకత్వానికి తెలుసో? లేదో?వేల మంది పోలీసులను మొహరించారు. ఎందుకంతగా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు? టాపిక్ డైవర్షన్ కోసం ఎందుకు ఆరాటపడుతున్నారు?.చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్దాలు అని ఒక్కొక్కటిగా రుజువు అవుతూ కనిపిస్తున్నాయి. ఆ కనిపించే నేపథ్యంలో, 100 రోజుల పాలన మీద డైవర్ట్ చేస్తూ, లడ్డూల టాపిక్ తీసుకొచ్చారు. అడ్డగోలుగా తప్పు చేసి, గుడి పవిత్రత దెబ్బతీస్తూ అడ్డంగా దొరికిపోయే సరికి, లడ్డూల టాపిక్ను డైవర్ట్ చేసేందుకు కొత్తగా డిక్లరేషన్ టాపిక్ తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారు.ఒకసారి గమనించినట్లయితే, తిరుమల పవిత్రత, స్వామివారి ప్రసాదం విశిష్టతను, తిరుమల తిరుపతి దేవస్థానం పేరు ప్రఖ్యాతలను రాజకీయ దుర్భుద్ధితో, జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారైనట్టుగా, ఒక జరగని విషయాన్ని జరిగినట్లుగా.. ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్లుగా.. నిజంగా సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి తెలిసి తెలిసి అబద్దాలు ఆడుతూ, అసత్యాలు పలుకుతూ.. స్వామి వారి పేరు ప్రఖ్యాతలను, తిరుపతి లడ్డూ విశిష్టతను దగ్గరుండి అపవిత్రం చేసే కార్యక్రమం, సాక్షాత్తూ ఒక ముఖ్యమంత్రి చేస్తుంటే.. ఇంత కంటే దారుణం, అధర్మం ఎక్కడైనా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి వాటికి సంబం«ధించిన అన్ని విషయాలు చెబుతాను. చంద్రబాబు అనే వ్యక్తి ఏ రకంగా అబద్దాలు చెప్పి, రెక్కలు కట్టాడనేది ఆధారాలతో చూపిస్తా. దీన్ని రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలంతా చూడమని విజ్ఞప్తి చేస్తున్నాను.అది రొటీన్ ప్రాసెస్తిరుమలలో లడ్డూల కోసం నెయ్యి కొనుగోల చేసే కార్యక్రమం ప్రతి ఆరు నెలలకోసారి రొటీన్గా, దశాబ్ధాలుగా జరుగుతోంది. ఆరు నెలలకు ఒకసారి ఈ–టెండర్ పిలుస్తారు. అర్హులు బిడ్ వేస్తారు. ఇప్పుడు కొత్తగా నియమాలు పెట్టలేదు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తిరుపతి లడ్డూకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ టేస్ట్ మరెక్కడా ఉండదు. ఆరు నెలలకోసారి ఈ–టెండర్. బిడ్లు వేస్తే, ఎల్–1 గా వచ్చిన వారికి టెండర్ ఖరారు చేస్తారు. ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఉండదు.టీటీడీ బోర్డు ఒక ప్రసిద్ధి గాంచిన బోర్డు. అందులో సభ్యుల కోసం కేంద్ర మంత్రులు, చుట్టుపక్కల రాష్ట్రాల సీఎంలు కూడా రికమెండ్ చేస్తారు. వారి వారి రాష్ట్రాల్లో ప్రముఖులను సిఫార్సు చేస్తారు. అంత మంచి లక్షణాలు ఉన్న వారితో బోర్డు ఏర్పాటవుతుంది. వారంతా ప్రసిద్ధి పొందిన వారు. దేవుడికి ఇంకా సేవ చేయాలని, భక్తులకు మంచి చేయాలని నిర్ణయాలు తీసుకుంటారు. చెడు చేయాలన్నా చేయబోరు. అక్కడ నెయ్యి సరఫరా కోసం ఆరు నెలలకోసారి ఈ–టెండర్లు పిలుస్తారు. ఎల్–1గా వచ్చిన వారికి కూడా పూర్తి టెండర్ ఖరారు చేయరు. 65 శాతం వారికిచ్చి, మిగతా వారిని కూడా రేటు తగ్గించమని చెప్పి, వారికి టెండర్ ఇస్తారు.సరఫరాలో రొబస్ట్ పద్ధతితిరుమలకు సరఫరా చేసే నెయ్యిలో కూడా రొబస్ట్ (ధృఢమైన) విధానం ఉంటుంది. నెయ్యి సరఫరా చేసేవారు, ప్రతి ట్యాంకర్తో ఎన్ఏబీఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబరేటరీస్) సర్టిఫై చేసిన ల్యాబ్ నుంచి క్వాలిటీ సర్టిఫికెట్ తీసుకొస్తారు. అలా వచ్చిన నెయ్యిని కూడా ప్రతి ట్యాంకర్ నుంచి శాంపిల్ తీసి, మూడు టెస్టులు చేస్తారు. అవన్నీ పాస్ అయితేనే, ట్యాంకర్ను ముందుకు పంపుతారు. ఒక్క టెస్టు ఫెయిల్ అయినా ట్యాంకర్ను వెనక్కు పంపిస్తారు.చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య 14 నుంచి 15 ట్యాంకర్లు అలా వెనక్కు పోయారు. అంటే ఎవరూ తప్పు చేయని విధంగా అక్కడ రొబస్ట్ విధానం ఉంది. మా ప్రభుత్వ హయాంలో కూడా 18 ట్యాంకర్లు వెనక్కు పంపారు. ఏ సరుకైనా సరే, క్వాలిటీ టెస్టులో ఫెయిల్ అయితే వెనక్కు పంపిస్తారు.ఇప్పుడు ఏం జరిగింది?ఇప్పుడు కూడా అదే జరిగింది. టీటీడీ ట్రస్ట్ బోర్డు అనుమతించిన బిడ్డర్లు జూన్ 12 నుంచి సరఫరా మొదలుపెట్టారు. అంటే, అప్పటికే చంద్రబాబుగారి ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాతే నెయ్యి సరఫరా మొదలైంది. అలా జూన్ 12, జూన్ 21, జూన్ 25, జూలై 4న వచ్చిన ట్యాంకర్లన్నీ టెస్టుల్లో పాస్ అయి, ముందుకు కదిలాయి. వాటిని లడ్డూల తయారీలో వాడారు.ఆ తర్వాత జూలై 6న రెండు ట్యాంకర్లు, జూలై 12న మరో రెండు ట్యాంకర్లలో వచ్చిన నెయ్యి, టీటీడీ టెస్టుల్లో ఫెయిల్ కావడంతో, వెనక్కు పంపడానికి సిద్ధం చేశారు. మరోసారి ఆ శాంపిల్స్ పరీక్ష కోసం మామూలుగా మైసూర్లోని సీఎఫ్టీఆర్ఐ (సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)కు పంపిస్తారు. కానీ ఇక్కడ మాత్రం గుజరాత్లోని ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్)కి పంపారు. ఇది టీటీడీ చరిత్రలో తొలిసారి. టీటీడీ పంపించిన శాంపిల్స్పై ఎన్డీడీబీ వారు జూలై 23న రిపోర్ట్ పంపారు. నెయ్యిలో కల్తీ ఉందన్న విషయం చెప్పారు. దాంతో ఆ ట్యాంకర్లను వెనక్కు పంపించారు. అలా 4 ట్యాంకర్లను వెనక్కు పంపడంతో పాటు, ఆ కంపెనీకి షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చారు.ఇప్పుడు నేను అడుగుతున్నానుఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి వాడకపోయినా, రెండు నెలల తర్వాత సెప్టెంబరు 18న, చంద్రబాబుగారు ఆ నెయ్యిని వాడారని ఉద్దేశపూర్వకంగా ఎందుకు అన్నారు?. ఇప్పుడు ఒకసారి, చంద్రబాబు నియమించిన టీటీడీ ఈఓ, ఆ నెయ్యి నాణ్యత గురించి జూలై 23న ఏమన్నారో చూద్దాం అంటూ.. ఆ వీడియో చూపారు.ఆ రెండు ట్యాంకర్లను రిజెక్ట్ చేశాం. షోకాజ్ నోటీస్ ఇచ్చామని, వాటిలో వనస్పతి ఆయిల్ కలిపినట్లు తేలిందని చాలా క్రిస్టల్ క్లియర్గా ఈఓ చెప్పినా.. రెండు నెలల తర్వాత చంద్రబాబుగారు సెప్టెంబరు 18న ఏ రకంగా అబద్ధాలు మాట్లాడారో చూడండి.. అంటూ ఆ వీడియో కూడా ప్రదర్శించి చూపారు.ఘీకి బదులు జంతువుల కొవ్వు వాడారని, లడ్డూలు తయారు చేశారని, వాటిని భక్తులు తిన్నారని అన్నీ తెలిసినా, చంద్రబాబు అబద్దాలు చెప్పారు.టీడీపీ ఆఫీస్లో కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్చంద్రబాబుగారు సెప్టెంబరు 18న ఆ ఆరోపణలు చేస్తే, ఆ మర్నాడే.. అంటే సెప్టెంబరు 19న తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఎన్డీడీబీ రిపోర్ట్ను రిలీజ్ చేశారు. నిజానికి అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్. అయినా దాన్ని టీడీపీ ఆఫీస్లో రిలీజ్ చేశారు.ఆ వెంటనే, మర్నాడు, అంటే సెప్టెంబరు 20 టీటీడీ ఈఓ మళ్లీ ఏం మాట్లాడాడో చూద్దాం.. అంటూ వీడియో ప్రదర్శించారు.ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిలో నాణ్యత లేదని తేలినందువల్ల, ఆ నెయ్యిని వెనక్కి పంపామని, వాడలేదని చెప్పారు. అంతే కాకుండా, సెప్టెంబరు 22న ఈఓ, తాను స్వయంగా సంతకం చేసి, ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చారని చెబుతూ.. అందులోని అంశాలు చదివి వినిపించారు.కల్తీ నెయ్యితో వచ్చిన ట్యాంకర్లను వెనక్కు పంపాం. ఆ కంపెనీకి షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చామని.. తమకు ఎన్డీడీబీ రిపోర్టు చాలా గోప్యమని అందులో ప్రస్తావించారు. అయినా దాన్ని, అంతకు ముందే తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో రిలీజ్ చేశారు.అది అపవిత్రత కాదా?మళ్లీ సెప్టెంబరు 22న మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, అవే పచ్చి అబద్ధాలు మాట్లాడారు. కల్తీ నెయ్యి వాడారని చెప్పారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఈ మాదిరిగా స్వామివారి ప్రసాదం విశిష్టతను, తిరుమల తిరుపతి ప్రతిష్టను, శ్రీ వెంకటేశ్వరస్వామివారి ప్రసాద పేరు ప్రఖ్యాతలను, ఈ మాదిరిగా అబద్దాలతో తగ్గించడం, కుట్ర పూరితంగా వ్యవహరించడం.. అపవిత్రత కాదా?.ఎన్డీడీబీ రిపోర్ట్ డిస్క్లెయిమర్పోనీ.. ఆ ఎన్డీడీబీ రిపోర్టు అయినా కచ్చితమైందా? అని చూస్తే, ఆ రిపోర్టులో వాళ్లే డిస్క్లెయిమర్ రాశారు.‘నెయ్యిలో ఉండాల్సిన స్టాండర్డ్ వాల్యూ కన్నా.. శాంపిల్స్లోని స్టాండర్డ్ వాల్యూస్లో డీవియేషన్స్ ఉన్నాయి. అయినా, ఈ పరిస్థితుల్లో ఒక ఫాల్స్ పాజిటివ్ ఫలితం కూడా రావొచ్చు. ఆ పరిస్థితులు ఏమిటంటే.. అంటూ.. పాల సేకరణ, ఆవులు, వాటి దాణ గురించి ప్రస్తావించారు. అలాగే ఆవులకు సరైన ఆహారం లేనప్పుడు, అవి సరిగ్గా తినకుండా బలహీనంగా ఉన్నప్పుడు తీసిన పాల నుంచి కూడా ఇలాంటి ఫలితాలు వస్తాయని రాశారు’.పచ్చి అబద్ధాలు. అపవిత్రం కాదా?ఇవన్నీ తెలిసినా చంద్రబాబు కావాలని అబద్దాలు ఆడుతూ, తిరుమల వెంకటేశ్వరస్వామివారి విశిష్టతను, ప్రసాదాల పవిత్రతను దగ్గరుండి, కావాలని అబద్దాలు చెప్పి, అనుమానపు బీజాలు ప్రసాదం స్వీకరించే ప్రతి ఒక్కరిలో లేపడం దుర్మార్గం కాదా? అపవిత్రం కాదా?నీ రాజకీయ స్వార్థం కోసం వెంకటేశ్వరస్వామి ప్రతిష్టను దిగజారుస్తున్నావు. స్వామి ప్రసాదానికి సంబంధించిన విశిష్టతను దిగజారుస్తున్నావు. జరగనిది జరిగినట్లుగా, జంతువుల కొవ్వుతో ప్రసాదం తయారు చేసినట్లుగా ఒక అబద్దాన్ని ప్రచారం చేస్తున్నావు. ధర్మమేనా?.మీ హయాంలో ఎందుకు వాడలేదు?నందిని బ్రాండ్ ఎందుకు వాడడం లేదని అంటున్నారు. మరి చంద్రబాబు పాలన సమయంలో 2015 నుంచి 2018 అక్టోబరు వరకు కెఎంఎఫ్కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యి ఎందుకు లేదు? అప్పుడు కూడా టెండర్లు పిల్చారు కదా? నందిని వాళ్లు ఇష్టం వచ్చినప్పుడే టెండర్లలో పాల్గొంటారు.అప్పుడు ఇంత కంటే తక్కువ ధరఇంకొకరు అంటారు. రూ.320కి కిలో నెయ్యి ఎలా వస్తుందని అంటారు. మరి చంద్రబాబుగారి కూడా 2014–19 మధ్య నెయ్యిని ఏ ధరకు సేకరించారు? ఇప్పుడు కూడా అదే క్వాలిటీ నెయ్యి కదా? దశాబ్దాలుగా అదే క్వాలిటీ. అదే నెయ్యి. మరి చంద్రబాబు హయాంలో 2015లో కిలో నెయ్యిని రూ.276కి కొన్నారు. అదే 2019 జనవరిలో కిలో ఆవు నెయ్యిని రూ.324కు కొన్నారు. మరి ఇక్కడ రూ.320కి కొంటే తప్పేం జరిగింది?.అదే చంద్రబాబు కుట్రమీ హయాం అంతా అవే రేట్లకు కొన్నారు. మరి ఇప్పుడు కూడా అవే ధరలు. చంద్రబాబు తన హెరిటేజ్ డెయిరీ కోసం, పాలు కార్టల్ ఫామ్ చేసి, నెయ్యి రేట్లు పెంచేసి, ఆ కార్టల్లో చంద్రబాబునాయుడు, హెరిటేజ్ కంపెనీ లాభపడాలనే ఉద్దేశంతో, కొత్తగా రేట్లు పెంచడం కోసం మాట్లాడుతున్నాడు. అదే క్వాలిటీ నెయ్యి. అవే స్పెఫికేషన్స్. అప్పుడు ఇప్పుడూ ఒకటే. తిరుపతి లడ్డూ చాలా టేస్టు ఉంటుందని గొప్పగా చెప్పుకుంటాం. ఆ లడ్డూ అప్పుడూ, ఇప్పుడూ ఒకటే.చంద్రబాబుగారి పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో, ప్రజలంతా కూడా ఆయనను వేలెత్తి చూపే కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో.. లడ్డూ టాపిక్లో చంద్రబాబు చేసిన తప్పును ప్రశ్నించడం మొదలు పెట్టారో.. వారికి వాస్తవాలు తెలియడం మొదలైందో.. ఆ పెద్దమనిషి ఏం చేస్తున్నారు.నా డిక్లరేషన్ కోరడం ఏమిటి?టాపిక్ డైవర్షన్ కోసం డిక్లరేషన్ అంటున్నాడు. జగన్ ఏమైనా కొత్తనా? రాజశేఖర్రెడ్డిగారు కొత్తనా? ఆయన ఏమిటో తెలియదా?నా మతం ఏమిటో రాష్ట్రంలో కానీ, దేశంలో తెలియదా? నా కులం ఏమిటో తెలియదా? రాజశేఖర్రెడ్డిగారు సీఎంగా 5 ఏళ్లు వరసగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆయన కొడుకునే కదా?నేను గతంలో చాలాసార్లు వెళ్లాను కదా? సీఎం కాక ముందు కూడా వెళ్లాను కదా?అంతెందుకు నా పాదయాత్ర మొదలుపెట్టే ముందు కూడా స్వామివారిని దర్శించుకున్నాను. 3648 కిలోమీటర్ల పాదయాత్ర ముగిసిన తర్వాత కూడా, తిరుపతి నుంచి కొండ ఎక్కాను. స్వామివారిని దర్శించుకున్న తర్వాతే ఇంటికి వెళ్లాను. అప్పుడు ఉన్నది చంద్రబాబుగారి ప్రభుత్వం. నేను ప్రతిపక్ష నాయకుడిని. రెండుసార్లు స్వామివారిని దర్శించుకున్నాను కదా?ఆ తర్వాత సీఎంగా వరసగా 5 ఏళ్లు, స్వామివారికి భక్తి శ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాను కదా?తొలిసారి ఎవరైనా వెళ్తుంటే, ఇలా అడగొచ్చు. కానీ 10, 11 సార్లు పోయిన తర్వాత, ఈరోజు నేను తిరుపతి వెళ్తానంటే. అడ్డుకుంటూ నోటీసులు ఇవ్వడం ఏమిటి?. డిక్లరేషన్ అడగడం ఏమిటి? మా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు నోటీసులు పంపడం ఏమిటి?రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశాను. 5 ఏళ్లు బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాను. ఎన్నోసార్లు స్వామి వారిని దర్శించుకున్నాను.నా మతం మానవత్వం. అదే నా డిక్లరేషన్ఈరోజు నేను వెళ్లకూడదట. కారణం నా మతం అంటున్నారు.అసలు నా మతం ఏమిటని అడుగుతున్నాను. నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. తప్పేముంది? బయటకు పోతే హిందూ సంప్రదాయాలను అనుసరిస్తాను. గౌరవిస్తాను. ఇస్లాంను అనుసరిస్తాను. గౌరవిస్తాను. సిక్కిజమ్ను అనుసరిస్తాను. గౌరవిస్తాను.నా మతం ఏమిటి అంటున్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటారేమో రాసుకొండి.దేశ రాజ్యాంగంలో ఏం చెప్పారు. నేను చదువుతాను వినండి.‘ఇండియా ఈజ్ ఎ సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమొక్రటిక్ రిపబ్లిక్’.సెక్యులర్ అంటే అర్ధం తెలుసా?. నీ మతం చెప్పకపోతే గుడిలోకి రావొద్దు అంటున్నావు. ఇది సెక్యులర్ దేశం అంటున్నాం.సీఎంగా పని చేసిన వ్యక్తి పరిస్థితి ఇలా ఉంటే, దళితుల పరిస్థితి ఏమిటి? దళితులను గుడిలోకి పోనిస్తారా? రానిస్తారా? ఏం చేస్తాం?చంద్రబాబును ఎందుకు సమర్థిస్తున్నారు?మతం పేరుతో రాజకీయం చేయడం ఎంత దౌర్భాగ్యం? బీజేపీని అడుగుతున్నాను. తామే హిందుత్వానికి ప్రతినిధులం అంటారు. మిమ్మల్నే అడుగుతున్నాను.మీ కళ్ల ఎదుటే, మీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న వ్యక్తే, శ్రీ వెంకటేశ్వరస్వామి విశిష్టతను, తిరుపతి లడ్డూ పేరు ప్రఖ్యాతలను, స్వామి వారి వైభవాన్ని, దగ్గరుండి అబద్ధాలు చెబతూ, జంతువుల కొవ్వు వాడకపోయినా, వాడి లడ్డూలు తయారు చేసినట్లుగా.. ఇన్ని ఆధారాలతో సహా, రుజువు అవుతున్నా.. అబద్ధాలతో దుష్ప్రచారం చేసి, వెంకటేశ్వరస్వామివారిని అపవిత్రం చేసిన ఈ వ్యక్తిని ఎందుకు మందలించడం లేదు? ఎందుకు వెనకేసుకొస్తున్నారు?.అంటే మీ వాళ్లు ఏం చేసినా ఫరవాలేదు. మిగిలిన వారు ఏం చేసినా తప్పే? ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇదెక్కడి హిందుత్వం?. హిందుత్వానికి మీకు టార్చ్ బేరర్స్ అంటారు. అందరూ ఆలోచించండి. నిజంగా హిందుత్వం ఏమిటంటే, మానవత్వం చూపడమే. అలా మానవత్వాన్ని చూపలేని వారు మంచి హిందువును అని చెప్పుకోలేరు.తానే దోషి. తానే జడ్జీ. ఇదెక్కడి ధర్మం?చంద్రబాబునాయుడే తప్పు చేస్తాడు. ఆయనే సిట్ వేస్తాడు. ఆయన చెప్పుచేతుల్లో ఉన్న అధికారులతో సిట్ అంటాడు. ఇదెక్కడి ధర్మం? ఇదెక్కడి పద్ధతి?. చంద్రబాబు ఈ మాదిరిగా హిందూ ధర్మం మీద దుష్ప్రచారం చేస్తూ, రాజకీయం చేయడం ధర్మమేనా? ఆలోచించండి.ఇదే అందరికీ నా విజ్ఞప్తినేను గుడికి వెళ్లకపోయినా ఫరవాలేదు. కానీ, చంద్రబాబు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా మన పార్టీ తరపున మీమీ ఊళ్లలో పూజలు చేయండి. తప్పు చేసింది మేం కాదు. చంద్రబాబు అని వేడుకొండి. అందుకే ఆ కోపాన్ని ప్రజలపై కాకుండా, చంద్రబాబుపై చూపమని వేడుకొమ్మని కోరుతున్నాను.ఒకవైపున మా నాయకులు, ప్రజాప్రతినిధులకు నోటీస్లు ఇస్తూ, హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు. మరోవైపు పక్క రాష్ట్రాల నుంచి బీజేపీ కార్యకర్తలను రప్పించి, గొడవలు చేయించే ప్రయత్నం చేస్తున్నారు.అలా టాపిక్ను డైవర్ట్ చేసేందుకు, చంద్రబాబునాయుడు తాను చేసిన తప్పు కప్పిపుచ్చుకునేందుకు ఇన్ని కుట్రలు చేస్తున్నారు.అందుకే నా పర్యటన వాయిదాఈ పరిస్థితుల్లో నేను అక్కడికి వెళ్లి, టాపిక్ డైవర్ట్ చేయడం ఇష్టం లేక, వెంకటేశ్వరస్వామిని ప్రేమించే వ్యక్తిగా, గౌరవించే వ్యక్తిగా, టాపిక్ డైవర్ట్ కాకూడదనే ఉద్దేశంతో.. తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామిని అబద్దాలతో, అవమానించి, అగౌరవపర్చాడో.. లడ్డూపై దుష్ప్రచారం చేశాడో.. చేసిన తప్పు ఆధారాలతోసహా కనిపిస్తున్న ఈ సత్యం బయటకు రావాలి.చంద్రబాబునాయుడు చేసిన ఈ పాపం కడగబడాలి. అది రాష్ట్ర ప్రజల మీదకు రావొద్దు. పాపం చేసిన చంద్రబాబు మీదే కట్టడి కావాలి.దాని కోసం, టాపిక్ డైవర్ట్ కాకూడదన్న ఉద్దేశంతో నా పర్యటనను వాయిదా వేసుకున్నాను.పూజలు చేయమని కోరుతున్నానురాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్సీపీ అభిమానులే కాదు, ప్రజలందరిని కోరుతున్నాను. చంద్రబాబు చేసిన పాపం వల్ల, వెంకటేశ్వరస్వామికి కోపం వచ్చి రాష్ట్రం మీద చూపకుండా, కోపం కేవలం చంద్రబాబుమీదే చూపించే విధంగా పూజలు చేయండి.ఎందుకంటే, జరిగింది ఘోర అపచారం. వెంకటేశ్వరస్వామిని పలచన చేస్తూ, ఆయన ప్రసాదాన్ని లోకువ చేస్తూ.. జరగనిది జరిగినట్లుగా.. జంతువుల కొవ్వు వాడనిది వాడినట్లుగా, ఆ లడ్డూలు పంపిణీ చేసినట్లుగా.. పచ్చి అబద్దాలు ఆడుతూ, ఇంత ఘోరం చేసిన వ్యక్తి. ఆ పాపం కడగబడాలి. అందుకే అందరినీ కోరుతున్నాను. పూజలు చేయమని వేడుకుంటున్నాను.ఏ మెస్సేజ్ ఇస్తున్నారు?బీజేపీవారిలో సిన్సియారిటీ ఉంటే, ఇంత ఘోరం చేసిన చంద్రబాబును రిప్రిమాండ్ చేయకుండా, టీటీడీ పేరు ప్రఖ్యాతలు మంట కలిపిన ఈ వ్యక్తిని ఎలా ఉపేక్షిస్తున్నారు? ఎందుకు బుద్ధి చెప్పడం లేదు? ఎందుకు మందలించడం లేదు?. చేసింది మన వాడే అనుకుని వదిలేస్తే.. ఏ మెసేజ్ ఇస్తున్నట్లు?మళ్లీ ఘోరమైన తప్పులు జరగొద్దు. అందుకు చంద్రబాబుకు తిట్లు పడాలి. మతాన్ని, దేవుణ్ని రాజకీయాల్లోకి తీసుకురాకుండా, ఆయనను మందలించాలి. సుప్రీంకోర్టు నుంచి ప్రధాని నుంచి పడాలి. అప్పుడైనా ఈ మనిషికి జ్ఞానం కలుగుతుందని శ్రీ వైయస్ జగన్ స్పష్టం చేశారు. -
#Devara : ఎన్టీఆర్ 'దేవర'మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
మా కెరీర్ కు ఈ సినిమా చాలా ఇంపార్టెంట్
-
‘జనక అయితే గనక’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
హీరో నాని ‘సరిపోదా శనివారం’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
రాజ్ తరుణ్ ‘తిరగబడరసామీ’ సినిమా ప్రమోషన్ (ఫొటోలు)
-
చంద్రబాబు ఆటవిక పాలనను ఎండగడుతూ జగన్ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
అప్పులపై తప్పుడు ప్రచారం.. అంత అధ్వానస్థితిలో చంద్రబాబు సర్కార్: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎటు వైపు వెళ్తుందో ఆలోచించాలని, పురోగతి వైపు వెళ్తుందా?.. తిరోగమనంలో వెళ్తోందా? గమనించాలని ఏపీ ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచకాలు, చంద్రబాబు విడుదల చేస్తున్న అబద్ధపు శ్వేత పత్రాలు, వైఎస్సార్సీపీ హయాంపై చేస్తున్న తప్పుడు ప్రచారాలపై తాడేపల్లిలోని తన కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో గత 52 రోజులుగా దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం కొనసాగుతోంది. ప్రశ్నించే వాళ్లను అణచివేసే ధోరణితో పాలన ముందుకు సాగుతోంది. విధ్వంస పాలన కొనసాగుతుంటే.. పోలీసులు పూర్తిగా ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏడు నెలల ఓటాన్ బడ్జెట్ పెడుతోంది. పూర్థిస్థాయి బడ్జెట్ పెట్టే ధైర్యం లేంటే ఎంతటి దారుణమైన, అధ్వానమైన పాలనో అర్థం చేసుకోవాలి. ఫుల్ బడ్జెట్ పెడితే చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలు ఏమైతే ఇచ్చారో.. వాటికి కేటాయింపులు చూపించాల్సిన అవసరం వస్తుంది. అందుకే ఆ పని చేయడం లేదు. .. చంద్రబాబు అంటేనే వంచన, గోబెల్స్ ప్రచారం. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడవడం దగ్గరి నుంచి ప్రజల్నిమోసం చేయడం దాకా అన్నింటా ఇదే జరుగుతోంది. ఇప్పుడు రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉందని చంద్రబాబు గ్యాంగ్ ప్రచారం చేస్తోంది. రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయ్యింది. అందుకే పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టడం లేదని చంద్రబాబు అంటున్నారు. నిజంగా అయిపోతుందా? అయ్యిందా? గమనిస్తే.. .. ఎన్నికల సమయంలో రూ. 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెబుతూ.. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు. ఇప్పుడు అధికారం వచ్చాక అది చూపించడానికి పడరాని పాట్లు పడుతున్నారు. గవర్నర్ ప్రసంగం వరకు వచ్చే సరికి రూ.10 లక్షల కోట్ల అప్పు అయ్యిందని చూపించారు. శ్వేత పత్రాలతో మభ్య పెట్టే యత్నం చేస్తున్నారు. నిజంగా అది ఒకసారి గమనిద్దాం. ఆర్బీఐ, కాగ్, స్టేట్ బడ్జెట్ ప్రకారం గమనిస్తే.. వాస్తవానికి ఈ ఏడాది జూన్ దాకా, అదీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చేంత దాకా చూస్తే అప్పు రూ.5 లక్షల 18 వేల కోట్ల రూపాయలు మాత్రమే. చంద్రబాబు 2019లో దిగిపోయే నాటికి రూ.2 లక్షల 72 వేల కోట్ల అప్పు ఉంది. వైఎస్సార్సీపీ హయాంలో ఆ అప్పు రూ.5 లక్షల 18 వేల కోట్లకు చేరింది. గ్యారెంటీలు, విద్యుత్ ఒప్పందాలు కలిపినా రూ. 7లక్షల 48 వేల కోట్లు మాత్రమే. అయినా గవర్నర్ ప్రసంగంలో అబద్ధం చెప్పించారు. ఇలా రూ. 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పడం ధర్మమా?. వాస్తవాలపై గవర్నర్కు లేఖ రాస్తాం. ఆయనతోనూ అబద్ధాలు చెప్పించిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తాం. చంద్రబాబు అధికారం చేపట్టేనాటికి రూ.7 వేల కోట్లకు పైగా ఖజానా సొమ్ము ఉంది. కానీ, మేం అధికారం చేపట్టేనాటికి రూ.100 కోట్లే ఉంది. ఆ విషయాన్ని ఈనాడు కూడా రాసింది. మేం అధికారంలో ఉండగా మేనిఫెస్టోలో ప్రతీ హామీని అమలు చేశాం. డీబీటీ ద్వారా బటన్ నొక్కి రూ.2.71 లక్షల కోట్లు లబ్ధిదారులకు జమ చేశాం. పార్టీ, ప్రాంతాలు కూడా చూడకుండా అందరికీ సంక్షేమం అందించాం. చంద్రబాబు హయాంలో 21.63 శాతం దాకా అప్పు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో 12.9 శాతం అప్పు చేశాం. కేంద్ర ఎకనామిక్ సర్వే మా ప్రభుత్వ పని తీరును మెచ్చుకుంది. అయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆగమైనట్లు చిత్రీకరించడం ఎంత వరకు సమంజసం?. బడ్జెట్లోనూ ఈ లెక్కలన్నీ చెప్పాల్సి వస్తుందనే పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టడం లేదు. అసలు లేని రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పడం ధర్మమా?.చంద్రబాబు హయాంలో 21.63 శాతం దాకా అప్పు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో 12.9 శాతం అప్పు చేశాం. కేంద్రం ఇచ్చిన అనుమతుల కన్నా తక్కువ అప్పే చేశాం. కోవిడ్ టైంలోనూ పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాం. ఆ టైంలో కేంద్రం నుంచి పన్నుల వాటా తగ్గింది. అయినా సంక్షేమం ఆపలేదు. ఈ లెక్కన ఎవరు ఆర్థికంగా ధ్వంసం చేసినట్లు? కేంద్ర ఎకనామిక్ సర్వే మా ప్రభుత్వ పని తీరును మెచ్చుకుంది. కేవలం.. బడ్జెట్లోనూ ఈ లెక్కలన్నీ చెప్పాల్సి వస్తుందనే చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టడం లేదు. ఇదీ చదవండి: సామాన్యులపై కక్ష సాధింపు ఎందుకు?.. జగన్ సూటి ప్రశ్న -
ఐఫా-2024 ప్రెస్మీట్లో మెరిసిన శ్రీలీల (ఫొటోలు)
-
Sudheer Babu: కథలో నుంచి హీరో పుట్టాలి
‘‘నాకు కమర్షియల్ సినిమాలు చేయడం ఇష్టమే. కానీ హీరో కోసం కథలో ప్రత్యేకమైన కమర్షియల్ అంశాలు ఉండకూడదు. కథలో నుంచి హీరో పుట్టాలి. అలాంటి కథలను ఎంచుకోవడానికి ఇష్టపడతాను . ‘హరోం హర’ ఈ తరహా చిత్రమే. తెలుగు సినిమాలోని మొదటి పది యాక్షన్ సినిమాల్లో ఎప్పటికీ ‘హరోం హర’ ఉంటుందని నమ్ముతున్నాను. సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం’’ అని సుధీర్బాబు అన్నారు. సుధీర్బాబు హీరోగా జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుమంత్ జి. నాయుడు నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో సుధీర్బాబు పంచుకున్న విశేషాలు. ⇒ ఈ చిత్రంలో నా ΄ాత్ర పేరు సుబ్రహ్మణ్యం. కుప్పంలోని ఓ మెకానికల్ ల్యాబ్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం. అక్కడో సమస్య ఉంటుంది. ఆ సమస్య ఏంటి? సుబ్రహ్మణ్యం ఎందుకు గన్స్ మేకింగ్లోకి రావాల్సి వచ్చింది? అన్నదే ఈ చిత్రకథ. కథలో కొన్ని లేయర్స్ ఉన్నాయి. అందులో మైథాలజీ అంశాలు కూడా ఉన్నాయి. నాకు తెలుగు భాష వచ్చు కాబట్టి కుప్పం యాసలో డైలాగ్స్ చెప్పడం పెద్దగా కష్టం అనిపించలేదు. ⇒ జ్ఞానసాగర్ కథ చెప్పినప్పుడు షాక్ అయ్యాను. ఇంత పెద్ద కథను చేయగలడా? అనిపించింది. కానీ నాకు చెప్పిన కథను చెప్పినట్లుగా విజువల్గా తెరపై చూపించాడు. ఈ విషయంలో అతనికి నూటికి నూరు మార్కులు వేస్తాను. అదే విధంగా ఇటీవలి కాలంలో తెలుగులో ‘హరోం హర’లాంటి సినిమా రాలేదని నా నమ్మకం. ఈ సినిమాలో ఓ సస్పెండెడ్ ΄ోలీస్ కానిస్టేబుల్ పళని ΄ాత్రను సునీల్గారు చేశారు. సుబ్రహ్మణ్యంకు స΄ోర్టివ్గా ఉండే ΄ాత్ర ఇది. ఈ సినిమా కథ డిమాండ్ చేసిన మేరకు ఖర్చు పెట్టారు నిర్మాత సుమంత్. ‘హరోం హర’కు సీక్వెల్ తీసే స్కోప్ ఉంది. స్టోరీ లైన్ ఉంది. అయితే ఈ సినిమా రిజల్ట్పై స్వీకెల్ ఆధారపడి ఉంటుంది. ⇒ జేమ్స్ బాండ్ లాంటి క్యారెక్టర్కి చాలా హెవీ వెపన్స్, గాడ్జెట్స్ తయారు చేస్తుంటారు. అలాంటి క్యారెక్టర్ మన ఊర్లో ఉంటే, మన పక్కింటి కుర్రాడు గన్స్ తయారు చేయాల్సి వస్తే కొంచెం నాటుగా ఉంటుంది. అందుకే ‘హరోం హర’ సినిమాను జేమ్స్ బాండ్ బ్యాక్డ్రాప్ ఇన్ కుప్పం అనొచ్చు. ⇒ సూపర్స్టార్ కృష్ణగారు నన్ను మాస్ యాక్షన్ మూవీలు చేయమని చెప్పేవారు. ఆయన మంచి మాస్ హీరో. గతంలో నేను చేసినవి చాలావరకు క్లాస్ చిత్రాలు. ఇప్పుడు ఆయన ఉండి ఉంటే ‘హరోంహర’ నేను చేసిన మంచి యాక్షన్ మూవీ అని నమ్మకంగా చూపించేవాడిని. ⇒ నా గత చిత్రాల్లో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు. అవి ‘హరోం హర’ సినిమాలో పునరావృతం కాకుండా చూసుకున్నానని అనుకుంటున్నాను. నా ప్రతి సినిమాకు వంద శాతం కష్టపడతాను. అయితే కొన్నిసార్లు మనం ఊహించిన ఫలితాలు రాక΄ోవచ్చు. కానీ ఏదో ఒక మోటి వేషన్ను తీసుకుని ముందుకు వెళ్తుంటాను. -
సంపదను సృష్టించడం ముఖ్యం: ఏపీ సీఎం చంద్రబాబు
తిరుపతి, సాక్షి: మన దేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శమని, అలాంటి వ్యవస్థ కలకాలం ఉండాలని దేవుడ్ని ప్రార్థించానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు, పార్టీ పరివారంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ ఎన్నికల్లో ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. 93 శాతం స్ట్రైక్రేట్తో ఇలాంటి విజయాన్ని ఎన్నడూ చూడలేదు. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతోనే ఈ విజయం సాధించాం. 2003లో వెంకటేశ్వరస్వామి నన్ను రక్షించారు. దేవాన్ష్ పుట్టినప్పటి నుంచి అన్నదానం పథకానికి విరాళం ఇస్తున్నాం. ఇప్పుడు వెంకటేశ్వరస్వామి ముందు సంకల్పం చేసుకుని ముందుకు వెళ్తాను... సంపదను సృష్టించడం ముఖ్యం. ఆ సంపద పేదలకు అందాలి. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తొలగిపోవాలి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. పేదరికం లేని సమాజం కోసం నిత్యం పని చేస్తాను. నేను అందరివాడిని.. ఐదు కోట్ల మందికి ప్రజాప్రతినిధిని. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. .. నేటి నుంచి ప్రజా పాలన మొదలైంది. రాజకీయం ముసుగులో నేరాలు చేస్తామంటే కుదరదు. మంచివారిని కాపాడుకోవాలి.. చెడ్డవారిని శిక్షించాలి. పరిపాలనలో ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభిస్తా. తిరుమల మొత్తం ప్రక్షాళన చేస్తాం. ఏపీని దేశంలోనే నెంబర్ వన్గా నిలబెడతా. మా కుటుంబానికి నేనీమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. 2047 నాటికి తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్గా నిలవాలి’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నంత కాలం తిరుమల కొండపై రాజకీయాలు వద్దంటూ గగ్గోలు పెట్టిన టీడీపీ అండ్ కో.. ఇప్పుడు సీఎం హోదాలో చంద్రబాబు తొలి ప్రెస్ మీట్పై ఏం సమాధానం చెబుతాయో చూడాలి. -
ఇటీవలే విడాకులు తీసుకున్న స్టార్ జంట.. మళ్లీ కలవడమేంటి?
ఏ జంట అయినా విడాకులు తీసుకుంటే దాదాపు కలవడానికి కూడా ఇష్టపడరు. ఎక్కడైనా పొరపాటున బయట ఎదురుపడినా పలకరించడం లాంటివి కూడా జరగవు. చాలా జంటలు విడాకుల తర్వాత కలిసి మాట్లాడుకోవడం జరిగే అవకాశం చాలా తక్కువ. మరీ విడాకుల తర్వాత ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుంది. అంతే కాదు ఏకంగా ప్రెస్ మీట్ పెడితే ఎలా ఉంటుంది. అలాంటిదే తాజాగా జరిగింది. ఓ స్టార్ జంట తీసుకున్న నిర్ణయంపై ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.శాండల్వుడ్ జంట నివేద గౌడ, చందన్ శెట్టి ఇటీవలే విడాకులు తీసుకున్నారు. ఏడాది క్రితమే వీరిద్దరూ విడాకులకు పిటిషన్ వేయగా.. ఇటీవలే కోర్టు విడాకులు మంజూరు చేసింది. శాండల్వుడ్లో క్యూటెస్ట్ కపుల్గా పేరున్న ఈ జంట విడిపోవడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. దీంతో ఫ్యాన్స్ డివోర్స్ గల కారణాలపై తెగ ఆరా తీస్తున్నారు. చందన్ శెట్టి, నివేద గౌడ ఎందుకు విడిపోయారు? విడాకులకు కారణం ఏమిటి? ఇలాంటి విషయాలపై ప్రతిరోజూ అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి.తాజాగా విడిపోయిన తర్వాత కూడా నివేద గౌడ, చందన్ శెట్టి సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ బెంగళూరులోని ఓ మాల్లో నిర్వహించే ప్రెస్మీట్లో తాము విడిపోవడానికి గల కారణాలను వివరించనున్నారు. ఈ సమావేశంలో చందన్ శెట్టి, నివేద గౌడ పాల్గొని విడాకులపై మాట్లాడనున్నారు. ఫ్యాన్స్కు క్లారిటీ ఇవ్వనున్నారు.కాగా.. టిక్టాక్ స్టార్ నివేదా గౌడ బిగ్ బాస్ సీజన్- 5తో గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత రాపర్గా రాణిస్తున్న చందన్ శెట్టి.. నివేదా గౌడపై బొంబే బొంబే అనే పాట రాసి అందరినీ అలరించాడు. మైసూర్లోని జరిగిన దసరా వేడుకల్లో నివేద గౌడకు ప్రపోజ్ చేశాడు. అప్పట్లోనే అతని తీరు వివాదానికి దారితీసింది. అయితే ఆ తర్వాత పెళ్లి చేసుకున్న వీరిద్దరు నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. -
విజయ్ సేతుపతి మహారాజా మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
సీత కళ్యాణ వైభోగమే మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
వరదరాజు గోవిందం మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
మంచి చేశాం.. ఊహించని ఫలితమిది.!: వైఎస్ జగన్
-
దేశవ్యాప్తంగా కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశాం
-
Watch Live: ఏపీ ఎన్నికల ఫలితాలపై సీఈఓ ముకేశ్ కుమార్ కీలక ప్రెస్ మీట్
-
ఏపీ ఎన్నికలపై సీఈఓ ముకేశ్ కుమార్ కీలక ప్రెస్ మీట్
-
బీఆర్ఎస్ అద్భుత విజయం సాధించబోతోంది: కేసీఆర్
సాక్షి,హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుత విజయం సాధించబోతోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో శనివారం(మే11) తెలంగాణభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.‘ప్రజాగ్రహం కాంగ్రెస్ను ముంచేయబోతోంది. కరెంటు విషయంలో ప్రజలకు ఏం సమాధానం చెబుతారు. రెండు జాతీయ పార్టీలను మించి సీట్లు గెలవబోతున్నాం. చిల్లర రాజకీయాల కోసం టైమ్ వేస్ట్ చేశారు. కరెంట్ను ఎందుకు దెబ్బతీశారో అర్థం కావడం లేదు. నేనుండే చోట 7-8సార్లు కరెంటు పోయింది.పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాం గ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వస్తారా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళతారా చూద్దాం. పైన తథాస్తు దేవతలు ఉంటారు. ఏదైనా జరగొచ్చు. కేసులు అటు ఇటైతే రేవంత్రెడ్డి బీజేపీలోకి వెళతాడు. 26 నుంచి 32 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా వాళ్లతో టచ్లో ఉన్నారు. ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఫాం చేద్దామంటున్నరు.వైఎస్ రాజశేఖర్రెడ్డి కొన్ని అద్భుత పథకాలు తీసుకొచ్చారు. మహానుభావుడు చనిపోయి ఏ లోకంలో ఉన్నాడో తెలియదు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, సీఎం రిలీఫ్ ఫండ్ పథకాలను ప్రవేశ పెట్టారు’ అని కొనియాడారు. -
తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్
-
పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు
-
మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం
-
హత్యలకు కుట్రలు ఆధారాలతో పోసాని
-
Watch Live: మీడియాతో ఎంపీ అవినాష్రెడ్డి
-
సోలో బాయ్ మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
కథ వినగానే మా నాన్న గుర్తొచ్చారు
‘‘మనకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ధైర్యం చెప్పే వ్యక్తి కుటుంబంలో ఒకరు ఉంటారు. ఆ ఒక్కరే ఫ్యామిలీ స్టార్. మా కుటుంబంలో ఫ్యామిలీ స్టార్ మా నాన్న గోవర్ధన్. ‘ఫ్యామిలీ స్టార్’ కథ వింటున్నప్పుడు నాకు మా నాన్న గుర్తొచ్చారు. అందుకే ఈ సినిమాలో హీరో పాత్రకి గోవర్ధన్ అనే పేరు పెట్టమని పరశురామ్కి చెప్పాను. ఈ నెల 8న మా నాన్న పుట్టినరోజు. ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం విషయంలో ఆయన గర్వపడతారని ఆశిస్తున్నాను’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించారు. వాసు వర్మ క్రియేటివ్ ప్రోడ్యూసర్గా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘రాజుగారి బ్యానర్లో నేను ‘కేరింత’ సినిమా ఆడిషన్కు వెళ్లి, సెలెక్ట్ కాలేదు. ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్’ చేశాను. లాక్ డౌన్లో నా స్టాఫ్ జీతాలు, మెయింటెనెన్స్కి ఇబ్బంది కలిగింది. అప్పుడు రాజుగారే పంపించారు.. ఆయనకు సినిమా చేయాలని అప్పుడే అనుకున్నా. ఈ సినిమాకి నాకు పేరొస్తే ఆ క్రెడిట్ పరశురామ్కి ఇస్తాను’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘విజయ్, పరశురామ్ కలిసి ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ చేశారు. ‘ఫ్యామిలీ స్టార్’ కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఏర్పడింది. విజయ్ ఈ సినిమాలో 360 డిగ్రీస్ క్యారెక్టర్ చేశాడు. నిర్మాతల గురించి ఆలోచించే హీరో విజయ్. అందుకే అతనితో మరో రెండు సినిమాలు చేయబోతున్నా’’ అన్నారు. ‘‘ఫ్యామిలీ స్టార్’లో ఇందు పాత్రను పోషించగలనా? లేదా అని భయపడ్డాను. కానీ, విజయ్, ‘దిల్’ రాజు, డైరెక్టర్గార్లు సపోర్ట్ ఇచ్చారు’’ అన్నారు మృణాల్ ఠాకూర్. -
Family Star Press Meet: ‘ఫామిలీ స్టార్’ మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు
-
‘డీజే టిల్లు-2’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
సాయి ధరమ్ తేజ్ 'సత్య' ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
నందిగం సురేష్ బాబు ప్రెస్ మీట్
-
మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ లైవ్
-
Amar : మూడు దారులు : రాజకీయ రణరంగంలో భిన్న ధృవాలు
-
నరేన్ రామాంజుల రెడ్డి ప్రెస్ మీట్
-
ఏపీలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తాం: CEC రాజీవ్ కుమార్
-
ఎమోషనల్ రాఘవ రెడ్డి
శివ కంఠమనేని హీరోగా, రాశీ, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాఘవ రెడ్డి’. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో సంజీవ్ మేగోటి దర్శకత్వంలో కేఎస్ శంకర్ రావ్, జి. రాంబాబు యాదవ్, ఆర్. వెంకటేశ్వర్ రావు నిర్మించిన ఈ చిత్రం జనవరి 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాత మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాల వల్లే ఇండస్ట్రీ బతుకుతుంది. ఇండస్ట్రీని బతికించుకునేందుకు ‘రాఘవరెడ్డి’లాంటి సినిమాలను ప్రేక్షకులు విజయవంతం చేయాలి. ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ కనిపిస్తున్నాయి’’ అన్నారు. ‘‘ఇంట్రవెల్ అందరికీ నచ్చుతుంది. క్లైమాక్స్ సీన్స్ ఎమోషనల్గా టచ్ అవుతాయి. ఆడియన్స్ కంటతడి పెడతారు’’ అన్నారు శివ కంఠమనేని. ‘‘తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత దర్శకుడిగా ‘రాఘవ రెడ్డి’ అనే ఓ మంచి సినిమా తీశాను’’ అన్నారు సంజీవ్. ‘‘ఈ సినిమాలో కూతురే ప్రపంచంగా బతికే దేవకి పాత్ర చేశాను’’ అన్నారు రాశీ. ‘‘ఈ సినిమాలో క్రిమినాలజీ ఫ్రొఫెసర్ రాఘవ రెడ్డిగా శివగారు నటించారు. యూత్కి కావల్సిన ఎలిమెంట్స్తో పాటు యాక్షన్, సోషల్ మెసేజ్ కూడా ఉన్నాయి’’ అన్నారు నిర్మాతలు. -
ఈ ఏడాది ముగింపులో మా సినిమా ఓ స్వీట్
‘‘హాయ్ నాన్న’ చిత్రంలో వినోదం, అన్ని రకాల భావోద్వేగాలున్నాయి. ఈ చిత్రకథపై ఉన్న కాన్ఫిడెన్స్తో కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని హీరో నాని అన్నారు. శౌర్యువ్ దర్శకత్వంలో నాని, మృణాల్ ఠాకూర్ జంటగా, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రలో నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’. మోహన్ చెరుకూరి, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాని విలేకరులతో పంచుకున్న విశేషాలు. ► ‘హాయ్ నాన్న’ కథని శౌర్యువ్ చెప్పినప్పుడే చాలా హై ఇచ్చింది. యాక్షన్ సినిమాల్లో ఒక రకమైన ఎనర్జీ ఉంటుంది. ‘యానిమల్’తో సహా ఈ ఏడాది వచ్చిన చాలా యాక్షన్ సినిమాలు కావాల్సిన దానికంటే ఎక్కువగానే స్పైస్ని పంచాయి. అయితే స్పైసీ తర్వాత ఉండే ఆ స్వీట్ని మా సినిమా ఇస్తుంది. ఈ ఏడాది అన్ని ఐటమ్స్ పెట్టారు కానీ, ముగించే ఐటమ్ నేను పెడతాను (నవ్వుతూ). ‘జెర్సీ’ చూసి బయటికి వచ్చినప్పుడు ప్రేక్షకుల్లో ఒక రకమైన భావోద్వేగం ఉంటుంది. కానీ, ‘హాయ్ నాన్న’ చూసి, ప్రేక్షకులు హ్యాపీగా నవ్వుతూ బయటికి వస్తారు. ఈ ఆనందంలోనే మనసుని హత్తుకునే భావోద్వేగాలు ఉంటాయి. ►నాకు కంఫర్ట్ జోన్ అనేది ఏదీ లేదు. కామెడీ సినిమాలు చేసినప్పుడు అది నా కంఫర్ట్ జోన్ అన్నారు. తర్వాత ‘జెర్సీ’ చేసినప్పుడు ఎమోషన్ నా కంఫర్ట్ జోన్ అన్నారు. ఆ తర్వాత ‘దసరా’ లాంటి రా మూవీ చేశాను. నాకు కంఫర్ట్ జోన్ అనేది లేకుండా సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అలాగే నేను ఇమేజ్ కోణంలో చూడను. కథ నచ్చిందనే ‘దసరా’ చేశాను.. ఇప్పుడు ‘హాయ్ నాన్న’ చేశాను. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే సినిమాగా నిలుస్తుంది. ►ఇలాంటి ఓ మంచి సినిమాని ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లాలనే ప్రమోషన్స్ ఎక్కువగా చేశాం. అందులో భాగంగానే వెంకటేశ్గారిని ఇంటర్వ్యూ చేశా. ప్రమోషన్స్లో భాగంగానే హీరో శివరాజ్ కుమార్గారిని కలిశా. వెంకటేశ్గారు ‘నా తర్వాత ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులు నిన్ను చూస్తారు’ అన్నారు. మనల్ని ఎవరైనా ఫ్యామిలీ హీరో అన్నప్పుడు హ్యాపీగా ఉంటుంది. ►వైర ఎంటర్టైన్మెంట్కి ‘హాయ్ నాన్న’ తొలి చిత్రం. మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డిగార్లు ΄్యాషనేట్ ్ర΄÷డ్యూసర్లు. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ ఓ పాటలో మాత్రమే కనిపిస్తారు. ►నా ‘దసరా’ సినిమా దాదాపు రూ. 120 కోట్లు వసూలు చేసింది. నా తర్వాతి చిత్రాలు కూడా అదే స్థాయిలో కలెక్షన్స్ రాబట్టాలని ఆలోచిస్తూ కూర్చుంటే ఎక్కువ సినిమాలు చేయలేను. ►‘యానిమల్’ లాంటి కథ వస్తే చేస్తాను. ‘దసరా’ చిత్రంలో నేను చేసిన పాత్రని ఎవరైనా ముందుగా ఊహించారా? చేశాకే బాగుందన్నారు. సవాల్తో కూడుకున్న పాత్రలు, కథలు వచ్చినప్పుడు చేయడానికే ఇష్టపడతాను. నాతో పని చేయాలని ‘బలగం’ వేణు అనుకుంటున్నారని ‘దిల్’ రాజుగారు చె΄్పారు. వేణు వచ్చి నాకు కథ చెబితే తప్పకుండా చేస్తాను. ప్రస్తుతం ‘సరి΄ోదా శనివారం’ సినిమా చేస్తున్నాను. ‘హిట్ 3’ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. పూర్తయిన వెంటనే షూటింగ్ మొదలుపెట్టేస్తాం. -
శ్రీకాంతాచారికి ఈ విజయం అంకితం: రేవంత్
-
కౌంటింగ్ ప్రక్రియపై ఈసీ ప్రెస్ మీట్
-
తండ్రిని తలుచుకుని ఎమోషనలైన స్టార్ హీరో
‘‘కొన్నేళ్ల క్రితం మా నాన్నను(రిషీ కపూర్) కోల్పోయా. నా చిన్నప్పుడు నాన్న షూటింగ్స్తో బిజీగా ఉండటంతో సరైన సమయాన్ని గడపలేకపోయాను. నాన్నపై నాకు ప్రేమ, గౌరవం ఉంది. కానీ, మా మధ్య స్నేహబంధం లేదు. ఆయనతో ఫ్రెండ్లీగా ఉండి మరెన్నో విషయాలు పంచుకుని ఉంటే బాగుండేదనే బాధ నాకు ఉంది. నా జీవితాంతం ఆ బాధ ఉంటుంది’’ అని హీరో రణ్బీర్ కపూర్ అన్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్బీర్ కపూర్, రష్మికా మందన్న జంటగా నటించిన చిత్రం ‘యానిమల్’. తండ్రీకొడుకుల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రీ కీలక పాత్రల్లో నటించారు. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 1న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై నిర్మాత ‘దిల్’ రాజు రిలీజ్ చేస్తున్నారు. సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో రణ్బీర్ కపూర్ మాట్లాడుతూ–‘‘తెలుగు ప్రేక్షకులంటే నాకెంతో అభిమానం. ఇక్కడ వాళ్లు చూపించే ప్రేమాభిమానం మరో స్థాయిలో ఉంటాయి. సినిమాలు మానేసి నా కుమార్తె రాహ కోసం నా సమయాన్ని కేటాయించాలని ఉంది. కాకపోతే నేనూ నా కలలను సాకారం చేసుకోవాలి కాబట్టి అలా చేయలేను (నవ్వుతూ)’’ అన్నారు. సందీప్ రెడ్డి మాట్లాడుతూ–‘‘మహేశ్బాబుకు ‘యానిమల్’ కథ చెప్పలేదు. ‘డెవిల్’ కథ చెప్పాను. కానీ మా కాంబో కుదరలేదు’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘అన్ని చిత్రాలకు మన దగ్గర టికెట్ రేట్స్ ఎలా ఉంటాయో ‘యానిమల్’కి అలానే ఉంటాయి. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేశాం. అద్భుతమైన స్పందన లభించింది. ‘అర్జున్ రెడ్డి’ని మిస్ అయ్యాను. అప్పటి నుంచి సందీప్ సినిమా కోసం ప్రయత్నిస్తున్నాను. భూషణ్గారు నన్ను నమ్మి ఈ సినిమా మా చేతిలో పెట్టారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నేను రణ్బీర్ తండ్రి పాత్ర చేశాను’’ అన్నారు అనిల్ కపూర్. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ‘డీప్ ఫేక్ వీడియో’ గురించి రష్మిక మాట్లాడుతూ – ‘‘ఆ వీడియో చూసినప్పుడు ఇలాంటివాటికి రియాక్ట్ అయితే ఏమనుకుంటారో అనిపించింది. అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయడంతో.. తప్పకుండా స్పందించాలని నిర్ణయించుకున్నాను’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత భూషణ్ కుమార్, నటుడు బాబీ డియోల్ మాట్లాడారు. -
కాంగ్రెస్కు ఓటేస్తే..కేసీఆర్కు వేసినట్టే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది కేసీఆర్కు వేసినట్టేనని, బీఆర్ఎస్కు అధికారం అప్పగించినట్టేనని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే వెళ్లి బీఆర్ఎస్లో చేరారని, గత పదేళ్లలో అంతా కలసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ అవినీతిపై విచారణ జరిపిస్తామని, దోచుకున్న సొమ్మును వసూలు చేస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలకు ఎలాంటి ప్రజాస్వామ్య విలువలు లేవని, వాటికి కుటుంబ పాలనే సర్వస్వమని విమర్శించారు. బీఆర్ఎస్–బీజేపీ మధ్య పొత్తు ఏర్పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలతో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే తెలంగాణ అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. శనివారం కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జీ ప్రకాశ్ జవదేకర్, ఇతర నేతలతో కలసి అమిత్ షా మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు మినహా చేసిందేమీ లేదు. మిషన్ భగీరథ, పాస్పోర్ట్ స్కాం, మియాపూర్ భూముల అక్రమాల్లో వందల కోట్ల కుంభకోణం, ఔటర్రింగ్రోడ్డు టెండర్ల స్కాం, కాళేశ్వరం ప్రాజెక్టు, ఢిల్లీ మద్యం స్కాం, గ్రానైట్ కుంభకోణం.. ఇలా ఎన్నో రూపాల్లో అవినీతి జరిగింది. కాగ్ నివేదిక ప్రకారం మిషన్ కాకతీయలో రూ.22వేల కోట్లు ఖర్చు చేసినా 65 శాతమే పనులు పూర్తయ్యాయి. దళితబంధు, డబుల్ బెడ్రూం స్కీంలలో దళితుల నుంచి కమీషన్లు దండుకున్న చరిత్ర బీఆర్ఎస్ నేతలది. విచారణ చేసి జైలుకు పంపుతాం బీఆర్ఎస్ సర్కార్ అవినీతిపై కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలపై ప్రస్తుతం విచారణ సాగుతోంది. తెలంగాణలో బీజేపీ సర్కార్ ఏర్పడగానే ఒక్కొక్కఅవినీతి ఆరోపణపై విచారణ జరిపి, దోషులుగా తేలిన ప్రతీ ఒక్కరిని కటకటాల వెనక్కి పంపిస్తాం. హైదరాబాద్లో రోహింగ్యాల చొరబాటు, ఇక్కడ ఆశ్రయం పొంది ఓటర్ కార్డులు పొందడంపై ఎన్ఐఏ విచారణ సాగుతోంది. దీనిపై కుట్రను ఎన్ఐఏ భగ్నం చేసింది. పదిరోజుల క్రితమే కేంద్రానికి నివేదిక ఇచ్చింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ అవినీతి సొమ్ముతో ఎన్నికల వాతావరణాన్ని కలుషితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రలోభాల కోసం కర్ణాటక నుంచి, ఇతర రూపాల్లో వస్తున్న అక్రమ డబ్బు విషయంలో ఏజెన్సీలు, ఈసీ తగిన చర్యలు తీసుకుంటున్నాయి. కేసీఆర్ను మార్చాలంటూ కాంగ్రెస్కు ఓటేస్తే.. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ తెలంగాణ విరోధిగా నిలిచింది. సుదీర్ఘ పాలనలో తెలంగాణను అణచివేసింది. ఉమ్మడి ఏపీలో నాటి సీఎం టి.అంజయ్యను తీవ్రంగా అవమానించింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావును అవమానించిన తీరు తెలంగాణ ప్రజల మనస్సులో నాటుకుపోయింది. 2009లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి వెనక్కితగ్గి దాదాపు 1,500 మంది ఆత్మబలిదానాలకు కాంగ్రెస్ కారణమైంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కానీ కాంగ్రెస్కు ఓటు వేసినా, ఒవైసీలకు ఓటు వేసినా బీఆర్ఎస్కు, కేసీఆర్కు పడ్డట్టే. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే వెళ్లి బీఆర్ఎస్లో చేరిపోయారు. బీఆర్ఎస్ను గెలిపిస్తే అవినీతి తప్ప మరేమీ చేయలేదు. గత పదేళ్లలో అంతా కలసి అవినీతికి పాల్పడ్డారు. తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు తీరాలంటే బీజేపీని గెలిపించాలి. ప్రస్తుత పథకాలేవీ ఆపబోం.. తెలంగాణతోపాటు దేశ భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికల్లో చైతన్యవంతమైన ఇక్కడి ఓటర్లు ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీకి అండగా నిలుస్తారని, డబుల్ ఇంజిన్ సర్కార్ను తీసుకొస్తారని మాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై బీసీ నేతను సీఎంను ఎన్నుకుంటారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాలేవీ మేం ఆపబోం. రాష్ట్రంలో బీజేపీ గెలిస్తే తొలి కేబినెట్ భేటీలోనే పెట్రోల్, డీజిల్లపై వ్యాట్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటాం. బీఆర్ఎస్ సర్కార్ ముస్లింలకు ఇస్తున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వాటిని సర్దుబాటు చేస్తాం. ఎస్సీ వర్గీకరణకు చర్యలు తీసుకుంటాం. ప్రజలు రాష్ట్రంలో ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి..’’అని అమిత్ షా విజ్ఞప్తి చేశారు. -
'సినిమా బాగుంటే అడుతది. లేదంటే పీకుతది'.. నాని ఆసక్తికర కామెంట్స్!
దసరాతో హిట్ కొట్టిన నేచురల్ స్టార్ నాని మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. దసరాలో మాస్ యాక్షన్లో అలరించిన.. ఈసారి మాత్రం హాయ్ నాన్న అంటూ తండ్రి, కూతుళ్ల ఎమోషనల్ స్టోరీతో రానున్నారు. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్గా కనిపించనుంది. అయితే మూవీ ప్రమోషన్స్తో నాని బిజీ అయిపోయారు. తెలంగాణలో ఎన్నికల హడావుడి ఉండడంతో విభిన్నమైన రీతిలో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ మేనిఫెస్టో ప్రకటించిన నాని.. తాజాగా ప్రెస్మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్లో రాహుల్ మాట్లాడుతూ.. 'మన రాహుల్ వచ్చిండా. నువ్వు చాలా గమ్మత్తుగా ఉన్నావయ్యా. ఇక్కడ నార్త్, సౌత్ సినిమా అని ఉండదు. లవ్ స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ కాదని నేను అనలే. మన సినిమాను పోస్ట్ పోన్ కానివ్వం. ఏమయ్యా రాహుల్ ప్రీ పోన్కు, పోస్ట్ పోన్కు ఆ మాత్రం తేడా తెల్వదా నీకు. సినిమా బాగుండే అడుతది. లేకుంటే పీకుతది. డిసెంబర్ 7న థియేటర్లో దావత్ చేసుకోవాలే. తమ్ముడు నువ్వు ఏదో కిరి కిరి పెట్టాలని చూస్తున్నావ్. అదే జరగదు. అనుకున్న టైంకే సినిమా రిలీజ్ అయితది.' నవ్వులు పూయించారు. హాయ్ నాన్న పార్టీ ప్రెస్ మీట్ అంటూ తెలంగాణం సీఎం కేసీఆర్ స్టైల్లో స్పీచ్ అదరగొట్టేశారు నాని. కాగా.. ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఊరికే Press meet పెట్టా 😬#HiNanna #HiNannaOnDec7th pic.twitter.com/bZIQroHN5P — Nani (@NameisNani) November 20, 2023 -
‘సప్తసాగరాలుదాటి సైడ్ బి’ మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
షూటింగ్కే రెండేళ్లు పట్టింది
‘‘నరకాసుర’ చిత్రం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లోని ఓ కాఫీ ఎస్టేట్ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాలో శివ అనే లారీ డ్రైవర్ పాత్ర చేశాను. నా గత సినిమా ‘పలాస 1978’లో దళితుల సమస్యలు చూపించినట్లే ‘నరకాసుర’లో హిజ్రాలకు సంబంధించిన పాయింట్ ఒకటి తీసుకున్నాం. కథలో ఇదొక అంశం మాత్రమే. మా సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం’’ అని హీరో రక్షిత్ అట్లూరి అన్నారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వంలో రక్షిత్ అట్లూరి హీరోగా, అపర్ణా జనార్ధన్, సంకీర్తనా విపిన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘నరకాసుర’. డా. అజ్జా శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ– ‘‘2020లో ‘నరకాసుర’ ్రపారంభించి, ఏడాదిలో పూర్తి చేయాలనుకున్నాం. అయితే రెండు సార్లు కరోనా లాక్డౌన్ రావడం, కథపరంగా ఛత్తీస్గడ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో షూటింగ్ చేయడం, ఆర్టిస్టుల డేట్స్, మా డైరెక్టర్ ప్రమాదంలో చేయి కోల్పోవడం... ఇలా పలు కారణాలతో షూటింగ్కే రెండున్నరేళ్లు పట్టింది. అయితే కథపై నమ్మకంతో నిర్మాతలు స΄ోర్ట్ చేశారు. ఇక నేను నటించిన ‘శశివదనే’, ‘ఆపరేషన్ రావణ్’ సినిమాలు ΄ోస్ట్ ్ర΄÷డక్షన్ దశలో ఉన్నాయి. మరికొన్ని కథలు వింటున్నాను’’ అన్నారు. -
Pindam Movie Teaser Launch Event: పిండం మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
మేడమ్ అని కాకుండా సార్ అని పిలిచారు
సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో వీకే నరేశ్, శరణ్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. పూజా కొల్లూరు దర్శకత్వంలో వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకర్ల సమావేశంలో పూజా కొల్లూరు మాట్లాడుతూ– ‘‘సైంటిస్ట్ లేదా ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నప్పటికీ సినిమాతో సమాజాన్ని ప్రభావితం చేయవచ్చని సినిమా రంగాన్ని కెరీర్గా ఎంచుకున్నాను. తెలుగులో ‘మార్టిన్ లూథర్ కింగ్’ నా తొలి సినిమా. కానీ ఈ చిత్రం కంటే ముందు కొన్ని హాలీవుడ్ ్రపాజెక్ట్స్తో అసోసియేషన్ ఉంది. కొన్ని డాక్యుమెంటరీలు తీశాను. ఇక ‘మార్టిన్ లూథర్ కింగ్’ విషయానికి వస్తే.. వై నాట్ స్టూడియోస్ సంస్థ తమిళ చిత్రం ‘మండేలా’ కథను తెలుగులో చె΄్పాలనుకుని, వెంకటేశ్ మహాగారిని సంప్రదించారు. అయితే నిర్మాణంలో భాగమౌతానని, దర్శకత్వం వహించలేనని ఆయన చె΄్పారు. దీంతో నేను దర్శకత్వం వహిస్తానని వెంకటేశ్ మహాగారికి చెప్పడంతో ఆయన వారికి చె΄్పారు. ఓటర్లు వారి ఓటు హక్కును ఎందుకు వినియోగించుకోవాలన్నది ఈ సినిమా థీమ్. ఓ సామాన్యుడు నటిస్తే ఎలా ఉంటుందో అలా ఉండాలని సంపూర్ణేష్ని హీరోగా తీసుకోవడం జరిగింది. వెంకటేశ్ మహా ఈ చిత్రానికి స్క్రీన్ప్లే, డైలాగ్స్ ఇచ్చారు. నేను ఎడిటింగ్ కూడా చేశాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘ఏ భాషలోనైనా మహిళలకు అవకాశాలు తక్కువగానే ఉంటున్నాయి. నేను లేడీ డైరెక్టర్ని అయినా సెట్స్లో చాలాసార్లు ఓకే సార్ అన్నారు కానీ మేడమ్ అనలేదు. అంటే లింగ వివక్ష ఎంతలా నాటుకు΄ోయిందో అర్థం చేసుకోవచ్చు. సమస్యలున్నప్పటికీ మన పట్టుదలే మనల్ని ముందుకు నడిపిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. -
Bhagavanth Kesari: 'భగవంత్ కేసరి' సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
Bhagavanth Kesari Press Meet: బాలయ్య ‘భగవంత్ కేసరి’ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
పచ్చి అబద్ధాలు కొంచమైనా సిగ్గుండాలి ?..అంబటి ఫైర్
-
Renu Desai: గుండె సంబంధిత సమస్యలున్నాయి..
‘‘నటనకు కావాలని విరామం ఇవ్వలేదు. నాకు నటించాలనే ఉంది. అయితే ఓ సినిమా ఒప్పుకునే ముందు కథ, అందులోని నా పాత్ర, ఆ చిత్ర దర్శక–నిర్మాతలు... ఈ మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటాను. ఇలా ఈ మూడు అంశాలతో నేను ఏకీభవించి నటించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’’ అన్నారు నటి, దర్శక–నిర్మాత రేణూ దేశాయ్. రవితేజ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహనిర్మాతగా అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో రేణూ దేశాయ్ చెప్పిన విశేషాలు. ► ‘టైగర్ నాగేశ్వర రావు’లో హేమలత లవణంగారి పాత్ర చేశాను. లవణంగారి మేనకోడలు కీర్తిగారిని కలిసి ఆవిడ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. 1970 కాలంలోనే జోగిని వ్యవస్థ, అంటరానితనంపై పోరాటాలు చేశారామె. దొంగలు, బందిపోట్లలో మంచి మార్పు కోసం కృషి చేశారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలతో స్ఫూర్తిగా నిలిచిన హేమలతగారి పాత్ర చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఆమె బాడీ లాంగ్వేజ్ను వెండితెరపై ప్రతిబింబించడం సవాల్గా అనిపించింది. నా కెరీర్లో ఇప్పటివరకూ నాకు ఏ పశ్చాత్తాపం లేదు. అయితే హేమలత లవణంగారి గురించి తెలుసుకుని, ఆమె పాత్రలో నటించిన తర్వాత ఆమెను కలవలేకపోయానని పశ్చాత్తాపపడుతున్నాను. హేమలతగారి స్ఫూర్తితో చిన్నారుల ఆకలి తీరేలా నా వంతుగా ఓ స్వచ్ఛంద సేవా సంస్థను మొదలు పెట్టాలనుకుంటున్నాను. ‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమా ట్రైలర్ చూసి, నా వయసుకి తగ్గ పాత్రలో నటించినందుకు మా అమ్మాయి ఆద్య తనకు గర్వంగా ఉన్నట్లు చెప్పింది. నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అది. నా గురించి నా పిల్లలు ఏమనుకుంటున్నారన్నదే నాకు ముఖ్యం. భవిష్యత్లో నా వయసుకు తగ్గ పాత్రలే చేయాలనుకుంటున్నాను. ∙మా నాన్నమ్మ 47 ఏళ్లకే హార్ట్ ఎటాక్తో చనిపోయారు. మా నాన్నా హార్ట్ ఎటాక్తోనే చనిపోయారు. ఇలా జన్యుపరంగా నాకు గుండె సంబంధిత సమస్యలున్నాయి. అయితే ప్రమాదం లేదు. అలాగని అజాగ్రత్త వహించకూడదు. చికిత్స తీసుకుంటున్నాను. -
Lingoccha Movie Press Meet: లింగోచ్చా మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఈసీ ప్రెస్మీట్..
సాక్షి, ఢిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల సంఘం మీడియా సమావేశం కానుంది. వివరాల ప్రకారం.. నేడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం నేడు విడుదల చేయనుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ఘడ్, మిజోరాంలో ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించనుంది. ఇక, తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల హడావుడి మొదలైన విషయం తెలిసిందే. #Election2023 Election dates for Mizoram, Chhattisgarh,Madhya Pradesh, Rajasthan & Telangana to be announced today at 12 noon by Election Commission of India. pic.twitter.com/YTOrIPlLo4 — Aishwarya Paliwal (@AishPaliwal) October 9, 2023 ఇక, డిసెంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మధ్యప్రదేశ్లో 230 స్థానాలు, తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు, రాజస్థాన్లో 200 స్థానాలు, ఛత్తీస్గఢ్లో 90 స్థానాలు, మిజోరాం 40 స్థానాలకు ఎన్నికలు షెడ్యూల్ విడుదల కానుంది. కాగా, ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండటంతో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది. -
కృష్ణా జలాలపై న్యాయ పోరాటం చేస్తాం
-
యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి?
‘‘విద్యార్థులు జాతి సంపద. వాళ్లను రక్షించుకోవాల్సిన బాధ్యత సమాజంపై, ప్రభుత్వాలపై, మన అందరి పైనా ఉంది అని చెప్పే చిత్రమే ‘యూనివర్సిటీ’’ అని ఆర్. నారాయణ మూర్తి అన్నారు. ఆయన లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’. స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై రూ΄÷ందిన ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం అయితే మొత్తం వ్యవస్థే దెబ్బతింటుంది. యూనివర్సిటీల్లో పేపరు లీకేజీలు, గ్రూపు 1, 2 ప్రశ్నా పత్రాల లీకేజీలు... ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి? నిరుద్యోగుల జీవితాలు ఏమై΄ోవాలి? సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీగారు దయచేసి ఇవ్వాలి. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేసుకుంటూ΄ోతే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? వంటి విషయాలను మా సినిమాలో ప్రస్తావించాం’’ అన్నారు. -
జగనన్న సురక్ష ద్వారా ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాం
-
ప్రభాస్ రియాక్షన్ కోరుకుంటున్న 'పెదకాపు' హీరో
విరాట్ కర్ణ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘పెదకాపు’. ఈ చిత్రం తొలి భాగం ‘పెదకాపు 1’ ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకర్ల సమావేశంలో విరాట్ కర్ణ చెప్పిన విశేషాలు. ► చిన్నతనంలో క్రికెటర్ కావాలనుకున్నాను. కానీ కాలేజ్ పూర్తయ్యాక ‘జయ జానకి నాయక’ సినిమా ప్రొడక్షన్లోకి వచ్చాను. నాలో నటించే ప్రతిభ కూడా ఉందని నిరూపించేందుకు ఓ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ను తీసుకువచ్చి మా బావ (మిర్యాల రవీందర్ రెడ్డి)గారికి చూపించాను. అది దర్శకులు శ్రీకాంత్గారికి కూడా నచ్చడం, ‘పెదకాపు’ సినిమాకు ఓ కొత్త కుర్రాడిగా నేను నప్పుతానని ఆయన అనడంతో ఈ సినిమా మొదలైంది. ► ఈ సినిమాలో పెదకాపుగా నటించాను. 1980 బ్యాక్డ్రాప్లో ఈ సినిమా కథ జరుగుతుంది. అనేక సవాళ్లను ఎదుర్కొంటూ బలవంతుడితో పోరాడి ఓ సామాన్యుడు ఎలా ఎదిగాడు? అన్నదే ‘పెదకాపు’ కథ. ► ఈ సినిమాకు నిర్మాత రవీందర్రెడ్డిగారు కాకపోయినట్లయితే ఇంత కాన్వాస్ దొరికేది కాదేమో. ఈ సినిమాలోని ఓ యాక్షన్ ఎమోషనల్ సీన్ని నేను బాగా చేశానని, నన్ను గ్రేడ్ ఏ యాక్టర్గా సర్టిఫై చేస్తున్నట్లుగా పీటర్ హెయిన్స్గారు అన్నారు. అక్కడే ఉన్న రెడ్డిగారి కళ్లలో నీళ్లు తిరిగాయి. ► నేను ప్రభాస్గారికి ఫ్యాన్ని. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఈ చిత్రంపై ప్రభాస్గారు స్పందిస్తే నా ఫీల్ వేరే లెవల్లో ఉంటుంది. త్వరలో ‘పెదకాపు 2’ స్టార్ట్ షూటింగ్ ఆరంభమవుతుంది. -
Chandramukhi 2: ‘చంద్రముఖి-2’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
నమ్మకం నిజమైంది
‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో వాళ్లే మా సినిమాను ప్రమోట్ చేశారు. ప్రమోషన్ టూర్ కోసం గత 25 రోజుల్లో 75 సిటీస్కి వెళ్లాను. అమెరికాలో ప్రమోషన్కి వెళ్లినప్పుడు హోటల్లో నిద్రపోయే టైమ్ ఉండేది కాదు. ఈస్ట్ నుంచి వెస్ట్కు ప్రయాణం చేసే విమానంలోనే నిద్రపోయేవాణ్ణి. ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వెళ్లా కాబట్టి నాకు కష్టం అనిపించలేదు’’ అని హీరో నవీన్ పోలిశెట్టి అన్నారు. పి. మహేశ్బాబు దర్శకత్వంలో అనుష్కా శెట్టి, నవీన్ లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలైంది. ఈ సందర్భంగా నవీన్ పొలిశెట్టి విలేకరులతో చెప్పిన విశేషాలు. ► మంచి సినిమా చేశాం.. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉండేది. అది నిజమైంది. తెలుగులో వసూళ్లు నెమ్మదిగా మొదలైనా ఆ తర్వాత పుంజుకున్నాయి.. మూడో వారంలోనూ మంచి వసూళ్లు ఉన్నాయి. అమెరికాలోనూ మూడో వారంలో మంచి వసూళ్లు ఉండటంతో మరిన్ని స్క్రీన్స్ పెంచుతున్నారు. యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్లోనూ షోలు పెంచుతున్నారు. మా మంచి ప్రయత్నాన్ని ఆదరించినందుకు ప్రేక్షకులకు హ్యాట్సాఫ్. ► నా తొలి చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ నేను బాగా నటించగలనని నిరూపించింది. నా సినిమా మంచి వసూళ్లు సాధిస్తుందనే నమ్మకం ‘జాతి రత్నాలు’ చిత్రంతో ప్రొడ్యూసర్స్, బయ్యర్స్లో వచ్చింది. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో నేను కేవలం కామెడీ మాత్రమే కాదు.. భావోద్వేగాలు కూడా పండించగలను అని నిరూపించుకున్నా. ► తెలుగులో చిరంజీవి, ప్రభాస్గార్లు, హిందీలో ఆమిర్ ఖాన్గారు ఇష్టం. అలాగే అన్ని జానర్స్ సినిమాలను ఇష్టపడతాను. హిందీలో రాజ్కుమార్ హిరాణీగారి చిత్రాలంటే ఇష్టం. తెలుగులో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి, భైరవ ద్వీపం, ఆదిత్య 369’ వంటి సినిమాలు చేయాలనుంది. ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. -
చంద్రబాబు, పవన్కళ్యాణ్ తోడుదొంగలు
స్కిల్డ్ దొంగను కాపాడేందుకు లోకేశ్, పవన్ ఆరాటపడుతున్నారని, అందులో భాగంగానే ఢిల్లీ మీడియాతో లోకేశ్ సొల్లు కబుర్లు చెబుతున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. మీ తండ్రి అవినీతిపై దర్యాప్తు సంస్థలు పిలుస్తుంటే.. చర్చంటూ సవాళ్లేమిటి లోకేశ్?.. ఏ తప్పూ చేయకపోతే అసెంబ్లీకొచ్చి చర్చించే దమ్ముందా? అని సవాల్ విసిరారు. ఇక పవన్కళ్యాణ్ నకిలీ కాపు అని, ఆయన ఏనాడూ కాపు ఉద్యమాలకు సహకరించలేదని మండిపడ్డారు. వంగవీటి హత్య, ముద్రగడపై వేధింపుల్లో చంద్రబాబు కుట్రను ప్రశ్నించలేదని, జనసేన కేడర్ను జెండాకూలీలుగా మార్చాడని, టీడీపీలో జనసేన విలీనమే ములాఖత్ ప్రకటన రహస్యమని స్పష్టీకరించారు. విశాఖపట్నం: నగరంలోని సర్యూట్హౌస్లో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే.. ఈడీ, ఐటీ, సీఐడీలతో చర్చించు ఢిల్లీలో నిన్న నారా లోకేశ్ జాతీయమీడియాతో మాట్లాడాడు. తన తండ్రి చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి వివరిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి గురించి ప్రస్తావించాడు. చంద్రబాబు ఏ తప్పూ చేయకుండానే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారని.. జగన్ గారితో తాను చర్చించేందుకు సిద్ధమంటూ లోకేశ్ ఛాలెంజ్ విసిరాడు. అయితే, ఆయనతో చర్చకు ఏ స్థాయి వ్యక్తి ముందుకొస్తారనేది పక్కనబెడితే.. చంద్రబాబు చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించి ముందు వారిని ఈడీ అరెస్టులతో పిలిచింది. ఒకపక్కేమో ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ షోకాజ్ నోటీసులు ఇచ్చి పిలుస్తుంటే.. మరోపక్క సీఐడీ సాక్ష్యాధారాలతో సహా జైలుకు పంపింది. తండ్రీకొడులు కుంటిసాకులతో.. ఒకపక్కన కేంద్ర దర్యాప్తు సంస్థలతో పాటు సీఐడీ చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ను అవినీతిపై నోరు విప్పాలని నోటీసులిస్తుంటే.. మరి, వాటి సంగతి తేల్చాలి కదా..?. సీఐడీ పిలుస్తుంటేనేమో.. నేను సమాధానం చెప్పను. నాకు సంబంధం లేదు. నాకు నోటీసులివ్వలేదు. గవర్నర్ గారికి చెప్పి నన్ను అరెస్టు చేస్తున్నారా..లేదా..? స్పీకర్ చెప్పి నన్ను అరెస్టు చే స్తున్నారా..? అంటూ చంద్రబాబు వితండవాదం చేశాడు. అదేవిధంగా ఐటీశాఖ కూడా బాబూ.. నువ్వు ఆదాయపన్ను లెక్కల్లోకి రాని రూ.118 కోట్లు బొక్కేశావు. రాష్ట్ర ఖజానా నుంచి కాంట్రాక్టర్లకు చెల్లింపుల్లో లంచాలకు సంబంధించి కొట్టేసిన మొత్తానికి సరైన లెక్కలతో సమాధానం చెప్పాలంటూ నోటీసులిస్తే.. దానికి సమాధానం చెప్పడు. లోకేశ్ కూడా నోరుమెదపడు. 2020 నుంచి కేంద్ర ఐటీశాఖ నుంచి నోటీసులు వస్తూనే ఉన్నాయి. వాటికి సంబంధించి ఏవేవో కుంటి సాకులు చెబుతూ రిప్లైలు ఇచ్చినా.. వాటినన్నింటినీ ఐటీశాఖ తోసిపుచ్చింది తెలిసిందే. మరోవైపు ఏపీలో జరిగిన స్కిల్డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే అనేమందిని విచారించింది. అరెస్టులు కూడా చేసింది. రేపోమాపో చంద్రబాబు, లోకేశ్ను కూడా విచారణకు పిలుస్తుంది. అయితే, సమాధానం చెప్పుకోవాల్సిన చోట నోరువిప్పకుండా.. తండ్రీకొడుకులు పనికిమాలిన కబుర్లు మాట్లాడుతున్నారు. నువ్వెంత..నీ బతుకెంత..? రాష్ట్రంలో ప్రజలను అడ్డంగా దోచుకుని తిని అవినీతి ఆధారాలతో నీ తండ్రి జైలుకెళ్తే.. నువ్వేమో నాతో చర్చకు ఫలానా వాళ్లు రావాలంటూ జాతీయమీడియాతో మాట్లాడతావా లోకేశ్..? అసలు, అక్కడిదాకా వెళ్లి నీ తండ్రికి పట్టిన గతి గురించి మాట్లాడుకోవడానికి సిగ్గనిపించడం లేదా..? ఒకటీ రెండు కాదు. అక్షరాలా రూ.371 కోట్ల ప్రజాధనాన్ని దోచుకు తిన్న పందికొక్కులు నువ్వు, నీతండ్రి. అందుకే, ఇన్నాళ్లకు మీ పాపం పండి ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు మీ భరతం పట్టేందుకు సిద్ధమయ్యాయి. నువ్వేమో ముఖ్యమంత్రితో చర్చించాలంటున్నావు. లోకేశ్.. నీ బతుకేంటి.? నీ స్థాయేంటి..? అని హెచ్చరిస్తున్నాను. నీ తండ్రి అవినీతిని ఒప్పుకున్నావా..? రిపబ్లిక్ టీవీలో నిన్న లోకేశ్ మాట్లాడుతూ.. ఒక అద్భుతమైన పోలిక చెప్పాడు. ఏదైనా బ్యాంకు బ్రాంచిలో తప్పు జరిగితే బ్యాంకు ఛైర్మన్ను అరెస్టు చేస్తారా..? అంటూ లోకేశ్ ప్రశ్నించాడు. అంటే, సిల్క్డెవలప్మెంట్ కార్పొరేషన్కు సంబంధించి రూ.371 కోట్లు కుంభకోణం జరిగిందని లోకేశ్ ఒప్పుకున్నట్టే కదా..? ఈ దోపిడీకి గురైన ప్రజాధనం మొత్తం అటూఇటూ తిరిగి చంద్రబాబు ఖాతాకు చేరాయని ఆధారాలు చెబుతున్నాయి. అంటే, నీ తండ్రి అవినీతికి పాల్పడ్డాడంటూ ఒప్పుకున్నట్టే కదా..? అని లోకేశ్ను ప్రశ్నిస్తున్నాను. ఈ స్కామ్కు సంబంధించి ప్రభుత్వ అధికారులపై ఐదు పర్యాయాలు చంద్రబాబు వత్తిళ్లకు గురిచేసినట్లు నోట్ఫైల్స్ చెబుతున్నాయి. అయితే, ఈ తండ్రీకొడుకులు మాత్రం తమకేమీ తెలియదని రూ.371 కోట్ల ప్రజల సొమ్మును కొట్టేసి సుద్ధపూసల్లా మాట్లాడుతున్నారు. దొంగలెప్పుడూ తామెలాంటి తప్పు చేయలేదనే మాటే అంటారు. కానీ, చట్టం ముందు అందరూ సమానమేనని గుర్తించాలి. చట్టం దొంగల్ని సమాజం ముందుకు తెస్తుందని తెలుసుకోవాలి. చంద్రబాబు దేశంలోనే రిచ్ ఎమ్మెల్యే దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలందరిలోకెల్లా నాల్గో ధనవంతుడైన ఎమ్మెల్యేగా చంద్రబాబు రికార్డుల్లోకి ఎక్కాడు. ఇది నా సొంతంగా చెబుతున్న మాట కాదు. తన ఎన్నికల అఫిడవిట్లోనే రూ.683 కోట్ల విలువైన ఆస్థి తనపేరిట ఉన్నట్లు చంద్రబాబు స్వయంగా చెప్పుకున్నాడు. మరి, ఇదే వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు కేవలం 2 ఎకరాల పొలం మాత్రమే ఉండేది. ఆ రెండెకరాల రాజకీయ ప్రస్థానం రూ.683 కోట్లకు ఎలా పెరిగిందని మేం అడుగుతున్నాం. అధికారాన్ని అడ్డంపెట్టుకుని మీరు దోచేసిన రూ.లక్షల కోట్లు గురించి కాకుండా.. మీరు అధికారికంగా చెప్పిన రూ.కోట్లపైనే ప్రశ్నిస్తున్నాను. దీనికి చంద్రబాబు గానీ.. ఆయన సుపుత్రుడు లోకేశ్ గానీ సమాధానం చెప్పాలి. ఆధారాలతో అడ్డంగా దొరికిన దొంగ బాబు ఎక్కడో ఉన్న ఒక కంపెనీని తెరమీదికి తెచ్చి.. ఏపీలో స్కిల్డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో యువతకు శిక్షణతో పాటు ఉద్యోగాల కల్పనకు సంబంధించి 90 శాతం పెట్టుబడి పెడుతుందని చెప్పారు. ప్రభుత్వం మాత్రం 10 శాతం వాటా పెట్టాలన్నారు. తీరా 90 శాతం పెట్టుబడి పెట్టాల్సిన కంపెనీ నుంచి ఒక్క పైసా రాకుండానే ప్రభుత్వ ఖజానా నుంచి 10 శాతం చెల్లింపులు చేసుకున్నారు. అంటే, రూ.371 కోట్లు ప్రజాధనాన్ని స్వాహా చేశారు. సీమెన్స్ కంపెనీ పేరిట అబద్ధాలు చెప్పి.. ప్రభుత్వ సొమ్మును అప్పన్నంగా కాజేయడానికి పన్నిన చంద్రబాబు పన్నాగమిది. ఇంతా దోచుకుని మేం కొట్టేసినట్టు ఆధారాలేంటి..? అని తండ్రీకొడుకుల బుకాయింపులు. ఇదేమన్నా హెరిటేజ్ ఫ్రెష్లో టమాటాల్ని కొంటే ఇచ్చే రసీదులా..? లంచాలకు రసీదులెక్కడుంటా యి..? దర్యాప్తు సంస్థల విచారణలో ఆధారాలన్నీ బయటపడతాయని లోకేశ్ తెలుసుకోవాలి. ఏపీలో స్కిల్డెవలప్మెంట్ గురించి తామెలాంటి ఒప్పందం చేసుకోలేదని.. ఎదురుపెట్టుబడి పెట్టి తామెలాంటి ప్రాజెక్టులు చేపట్టిన దాఖల్లాలేవంటూ సీమెన్స్ సంస్థ అధికారికంగా చెప్పింది. మరి, చంద్రబాబు తెరమీదికి తెచ్చిన సీమెన్స్ బోగస్ ఒప్పందాన్ని ఏమంటారు..? అది అవినీతి కార్యక్రమం కాదా..? అని అడుగుతున్నాను. కనుక, చంద్రబాబు స్కిల్స్కామ్లో ఆధారాలతో దొరికన దొంగ అని స్పష్టమైంది. 13చోట్ల సంతకాలతో అడ్డంగా దొరికాడు చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయనతో పాటు న్యాయవాదులు, లోకేశ్, టీడీపీ నాయకులు ఎక్కడా.. తాము అవినీతికి పాల్పడలేదని చెప్పలేదు. కుంభకోణం జరిగిన మాట వాస్తవమే గానీ.. ఈ కేసులో మమ్మల్ని అరెస్టు చేయడానికి పరిమితులు, పరిధులు వర్తిస్తాయంటూ అడ్డదిడ్డంగా ‘లా’ పాయింట్లు పీకుతున్నారు. లోకేశ్ నిన్న జాతీయమీడియాతో మాట్లాడుతూ.. మా నాన్న ఎక్కడా సంతకం చేయలేదని చెబుతున్నాడు. స్కిల్డెవలప్మెంట్ కార్పొరేషన్తో బోగస్ కంపెనీల ఒప్పందాలు గానీ.. రాష్ట్ర ఖజానా నుంచి రూ.371 కోట్ల నిధుల విడుదలకు సంబంధించిన ఫైళ్లల్లో మొత్తం 13 చోట్ల చంద్రబాబు సంతకాలున్నట్లు సీఐడీ ఆధారాల్ని కోర్టుకు సైతం సమర్పించింది. మరి, ఆయనకెలాంటి సంబంధం అంటదని లోకేశ్తో పాటు పచ్చమీడియా కూడా ఎలా వాదిస్తుంది..? అని అడుగుతున్నాను. ఆ సంతకాలు కూడా బాబువి కాదు.. ఫోర్జరీ చేశారని దీనిపై కూడా రేపోమాపో మరో అబద్ధాన్ని కూడా వీళ్లంతా ప్రచారం చేస్తారేమో.. అంతటి అసాధ్యులే వీళ్లు. అసెంబ్లీకొచ్చి చర్చించే దమ్ముందా..? ఏదిఏమైనా చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి అక్రమాల్లో ఈ స్కిల్డెవలప్మెంట్ స్కామ్ అనేది కేవలం ఒక తీగమాత్రమే.. ఇంకా కదలాల్సిన డొంక చాలా ఉందని మరోమారు గుర్తుచేస్తున్నాను. రూ.371 కోట్ల ప్రజాధనాన్ని కొట్టేసేందుకే చంద్రబాబు సూత్రధారిగా, పాత్రధారిగా వ్యవహరించినట్లు సీఐడీ అన్నీ ఆధారాలతోనే అరెస్టు చేసింది. ఏసీబీ కోర్టు కూడా సీఐడీ వాదనలతో ఏకీభవించింది కనుకే చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకెళ్లాల్సి వచ్చింది. దీనిపై ఇప్పటికైనా తండ్రీకొడుకులతో పాటు తెలుగుదేశం పార్టీ స్పష్టమైన సమాధానం చెప్పాలి. ప్రజాధనం కొట్టేసినందుకు రాష్ట్రప్రజలకు క్షమాపణలు చెప్పి.. చట్టపరంగా శిక్ష అనుభవిస్తామని నేరాన్ని అంగీకరించాలని మేం డిమాండ్ చేస్తున్నాం. తామేమీ అవినీతికి పాల్పడలేదని నిరూపించుకోవాలంటే రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ స్కామ్పై చర్చించే దమ్మూధైర్యం ఉందా..? అని ఆ పార్టీ నేతలకు సవాల్ విసురుతున్నాను. నకిలీ కాపు పవన్కళ్యాణ్ కాపు ఉద్యమాలకు ఏనాడు సహకరించని నకిలీ కాపు పవన్కళ్యాణ్. ఇదే చంద్రబాబు కుట్రలతో వంగవీటి మోహనరంగా హత్యకు గురైనప్పుడు గానీ.. ముద్రగడ పద్మనాభం గారిలాంటి వాళ్లు తీవ్రమైన వేధింపులకు గురైనప్పుడూ ఏరోజూ పవన్కళ్యాణ్ స్పందించలేదు. ఆయా సందర్భాలపై ఆయన మాట్లాడింది కూడా లేదు. అలాంటి వ్యక్తి ఈరోజు కాపు నాయకుడిగా చెలామణి అవుతూ టీడీపీకి సపోర్టు చేయాలని పిలుపునిస్తే కాపుసోదరులెవరూ పట్టించుకోరు. అసలు, ఇప్పటికే పవన్కళ్యాణ్ను పూర్తిగా కాపులు పక్కనబెట్టారు. జెండా కూలీలుగా జనసైనికులు వెనకటికెవరో ఎప్పుడో జరిగిన పెళ్లికి ఇప్పుడు భజంత్రీలన్నాడంట.. జనసేన అధినేత పవన్కళ్యాణ్ ప్రకటనలు అలా ఉన్నాయి. అవినీతి కేసులో జైలుకెళ్లిన చంద్రబాబుతో ఆయన ములాఖత్ అయ్యాడు. జైలు బయటకొచ్చి తామిద్దరం మిలాఖత్ అయ్యామంటున్నాడు. ఆ రెండు పార్టీల పొత్తు గురించి ఇప్పుడు కొత్తగా చెప్పేదేముంది..?ఒక తండ్రికి ఉత్తపుత్రడితో పాటు దత్తపుత్రుడి ఆట గురించి మా నాయకుడు జగన్ గారు ఎప్పట్నుంచో చెబుతూనే ఉన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడైన పవన్కళ్యాణ్ లేటెస్టుగా టీడీపీతో పొత్తు అన్నంతమాత్రానా ఏమీ ఊడిపడేదిలేదు. పైగా, జనసేన నాయకులు, కేడర్కు ఇన్నాళ్లకు కళ్లు తెరుచుకున్నాయి. పవన్కళ్యాణ్పై అభిమానంతో ఆ పార్టీ కార్యకర్తలు పనిచేస్తుంటే.. ఆయన మాత్రం చంద్రబాబుకు బానిసత్వం చేస్తున్నారనే చర్చ మొదలైంది. తాము టీడీపీని భుజానికెత్తుకునే జెండాకూలీలుగా ఉండబోమని జనసేన సైనికులంటున్నారు. విలీనం చేయడానికి సరికొత్త ఎత్తుగడ.. జనసేనను టీడీపీలో విలీనం చేయడానికి ఇది సరికొత్త ఎత్తుగడగా చంద్రబాబు, పవన్లు పథక రచన చేశారంటూ ఇరుపార్టీల కేడర్ భావిస్తుంది యధార్థమే..అయితే, బాబును భుజానికెత్తుకుంటే పవన్కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే మారబోతుందనడంలో సందేహం లేదు. -
ఎన్ఎస్జీ ప్రొటెక్షన్ కంటే కూడా ఎక్కువ సెక్యూరిటీ కల్పించాం: పొన్నవోలు
-
నిజాన్ని నిజాయితీగా చెప్పాం
‘‘మంత్ ఆఫ్ మధు’లో మాకు తెలిసిన నిజాన్ని నిజాయితీగా చెప్పాం. శ్రీకాంత్గారు అద్భుతంగా తీశారు. ఇది ఫీమేల్ సెంట్రిక్ సినిమా కాదు’’ అని స్వాతి రెడ్డి అన్నారు. నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి జంటగా శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. యశ్వంత్ ములుకుట్ల నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 6న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రెస్మీట్లో శ్రీకాంత్ నాగోతి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రాన్ని మేమెంత ΄్యాషనేట్గా తీశామో.. ప్రేక్షకులకు కూడా అంతే చక్కగా చేరువవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ‘‘ఈ చిత్రం 90 శాతం షూటింగ్ని వైజాగ్లో చేశాం’’ అన్నారు యశ్వంత్ ములుకుట్ల. -
ఇవాళ బిగ్ బాస్ లో జరగబోయే సీన్స్ గురించి ముందే చెప్పిన నవీన్
-
జనాలు వస్తారా లేదా అని టెన్షన్ పడ్డా..
-
యాక్షన్.. కామెడీ.. ఎక్కడా తగ్గవు
‘‘తిరగబడర సామీ’ చిత్రం మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. రవికుమార్గారి గత సినిమాల్లానే ఈ మూవీలోనూ యాక్షన్, కామెడీ, రొమాన్స్ ఎక్కడా తగ్గకుండా ఉంటాయి. మా సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి’’ అని రాజ్ తరుణ్ అన్నారు. ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా, మాల్వీ మల్హోత్రా, మన్నారా చో్ప్రాహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘తిరగ బడర సామీ’. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా బ్యానర్పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ లొకేషన్లో చిత్ర యూనిట్ మీడియాతో సమావేశం అయ్యింది. ఏఎస్ రవికుమార్ చౌదరి మాట్లాడుతూ– ‘‘ఎలాగైనా మళ్లీ హిట్టు కొట్టాలని కొంత విరామం తీసుకొని కసితో చేసిన సినిమా ‘తిరగబడర సామీ’. ఒక బంధాన్ని నిలుపుకోవడం కోసం ప్రేమికులు, భార్యా భర్తలు ఎంతవరకూ వెళ్తారు? అనేది వినోదాత్మకంగా చూపించాం’’ అన్నారు. ‘‘ఈ నెలాఖరులో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు మల్కాపురం శివకుమార్. -
బీఆర్ఎస్పై యుద్ధం మొదలైంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీఆర్ఎస్పై యుద్ధం మొదలైందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మొదలు పెట్టిన యుద్ధానికి తాము సిద్ధమని ప్రకటించారు. ‘డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పనుల గురించి తెలుసు కోవడానికి వెళ్లే హక్కు కూడా కేంద్ర మంత్రిగా నాకు లేదా?’ అని ప్రశ్నించారు. ఒక నేరస్థుడు, ఉగ్ర వాదితో వ్యవహరించిన విధంగా తనతో పోలీస్ కమిషనర్, డీసీపీలు అమానుషంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను ప్రగతిభ వన్లో కూర్చొని అణచివేస్తారా? అని దుయ్య బట్టారు. కిషన్రెడ్డి గురువారం ఉదయం శంషా బాద్ ఎయిర్పోర్టు వద్ద, ఓఆర్ఆర్పై, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ను గద్దె దించేవరకు పోరాటం బాటసింగారంలో రెండు పడక గదుల ఇళ్ల పరిశీ లనకు బయలుదేరిన తనను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిప్పిన తీరును కేంద్రమంత్రి తప్పు బట్టారు. ‘తెలంగాణలో పేద ప్రజలకు న్యాయం జరగడం లేదు. డబుల్ బెడ్రూం ఇళ్లూ ఇవ్వడం లేదు. బాటసింగారంలో మధ్యలోనే వదిలేశారు. వాటిని చూద్దామని బయలుదేరాం. ధర్నా, ఆందోళన కార్యక్రమాల వంటివి కాదని చెప్పినా.. పోలీసులు నియంతత్వ ధోరణితో వ్యవహరించారు. 75 ఏళ్ల భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఓ కేంద్ర కేబినెట్ మంత్రిని ప్రజాసమస్యలను పరిశీలించేందుకు వెళ్తుండగా అక్రమంగా అరెస్టు చేశారు. దీనిపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తా. పోలీసులు కేసీఆర్ తొత్తుల్లాగా కాకుండా ప్రజాసేవకుల్లా వ్యవహరించాలి. కేంద్రమంత్రి కాన్వాయ్కి డీసీఎంను అడ్డంపెట్టి ఆపేంత అవసరం ఏమొచ్చింది? నేనేమైనా క్రిమినల్ నా? రాష్ట్రంలో దౌర్జన్య పాలన నడుస్తోంది. నిజాం కన్నా అధ్వానమైన పాలన ఇక్కడ ఉంది. ఈరోజు యుద్ధం మొదలైంది. కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్తో యుద్ధానికి మేం సిద్ధం. ప్రజల సమస్యల తరఫున బీఆర్ఎస్ను గద్దెదించే వరకు పోరాటం కొనసా గిస్తాం. ఆ పార్టీ పాపాలు పండాయి. కల్వకుంట్ల కుటుంబం జైలు గదులు రెడీ చేసుకోవాలి..’ అంటూ కిషన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే 50 లక్షల ఇళ్లు కట్టండి... ‘సీఎం కేసీఆర్కు దమ్ముంటే తెలంగాణలో 50 లక్షల ఇళ్లు కట్టాలి. 50 లక్షల ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం వాటా తెచ్చే బాధ్యత నాదే. ఖరీదైన ఇళ్లు కట్టుకోవడానికి, విమానాలు కొనడానికి కేసీఆర్కు డబ్బులుంటాయి కానీ పేద ప్రజలకు ఇళ్లు కట్టడానికి డబ్బులుండవా? అరకొరగా కట్టిన ఇళ్లు కూడా తొమ్మిదేళ్లుగా ఎవరికీ ఇవ్వలేదు. ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం..’ అంటూ ధ్వజమెత్తారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల కంటే తానే ఎక్కువ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తానని కిషన్రెడ్డి అన్నారు. ‘అరెస్టులు మాకు కొత్త కాదు. జైళ్లను సిద్ధం చేసుకోండి. ఎంతమందిని అరెస్టు చేస్తారో చేయండి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టే ఉద్య మంలో చావుకు కూడా భయపడం. పేదల పక్షాన పోరాడుతూనే ఉంటాం..’ అని స్పష్టం చేశారు. ధర్నాకు అనుమతి ఇవ్వండి హిమాయత్నగర్: బీజేపీ చేపట్టే ధర్నాకు పోలీసు శాఖ నుంచి అనుమతి ఇవ్వాలంటూ ఆ పార్టీ నేతలు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ను కోరారు. ఈ మేరకు పార్టీ నాయకులు కొండా విశ్వేశ్వరరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీవీఎస్ ప్రభాకర్, ఏవీఎన్ రెడ్డి, రామచందర్లు గురువారం సీపీని కలసి వినతిపత్రం అందచేశారు. -
ఆ సినిమాతో బాగా నష్టపోయాం.. ఇప్పట్లో నో రీమేక్: నిర్మాత
శ్రీ సింహా కోడూరి, నేహా సోలంకి జంటగా నటించిన క్రైమ్ కామెడీ ఫిల్మ్ ‘భాగ్ సాలే’. ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ– 'కష్టపడకుండా తక్కువ టైమ్లో జీవితంలో ఎదగాలనుకునే అర్జున్ అనే ఓ కుర్రాడి లైఫ్ ఫైనల్గా ఏమైంది? అన్నదే కాన్సెప్ట్. అర్జున్ పాత్రలో శ్రీ సింహానటించారు. దర్శకుడు ప్రణీత్ కథ చెప్పినదాని కంటే పదిరెట్లు బాగా తీశాడు. ‘కార్తికేయ 2’లోలా ఈ చిత్రంలోనూ కృష్ణుడి కాన్సెప్ట్ ఉంటుంది. ఆ సినిమాకి ఇచ్చినట్లే ఈ సినిమాకి కూడా కాలభైరవ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇక నేను నిర్మించిన ‘డియర్ మేఘ’ చిత్రం కన్నడ ‘దియా’కు రీమేక్. కారణాలు తెలియదు కానీ ‘డియర్ మేఘ’ విడుదలైన రోజే ‘దియా’ యూ ట్యూబ్లో విడుదలైంది. మాకు బాగా నష్టం కలిగింది. సో.. ఇప్పట్లో రీమేక్ మూవీ చేయకూడదనుకుంటున్నాను. అలాగే కొందరు నిర్మాతల అసోసియేషన్తోనే డైరెక్షన్ చేద్దామని అనుకుంటున్నాను. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా తీస్తున్నాం. హిందీలో రెండు ప్రాజెక్ట్లు చేస్తున్నాం' అన్నారు. -
అల్లు అర్జున్తో డ్యాన్స్ చేయాలని ఉంది: హీరోయిన్
'నా మాతృ భాష హిందీ. ‘రంగబలి’ కోసం తెలుగులో పెద్ద పేరా గ్రాఫ్ డైలాగులు నేర్చుకొని చెప్పడం సవాల్గా అనిపించింది. ఈ విషయంలో డైరెక్షన్ టీమ్కి థ్యాంక్స్. అలాగే దర్శకుడు పవన్గారు స్క్రిప్ట్ని ముందే నాకు ఇవ్వడంతో కొంచెం సులభం అయింది' అని హీరోయిన్ యుక్తి తరేజ అన్నారు. నాగశౌర్య హీరోగా పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘రంగబలి’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ యుక్తి తరేజ మాట్లాడుతూ–'మాది హరియాణ. ఢిల్లీ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చేశాను. ఆ తర్వాత మోడలింగ్ మొదలుపెట్టాను. అనంతరం యాక్టింగ్ ఆడిషన్స్ ఇచ్చాను. ‘లుట్ గయ్..’ అనే పాట మంచి పేరు తీసుకొచ్చింది. పవన్గారు ఆడిషన్ చేసి ‘రంగబలి’ కి ఎంపిక చేశారు. ఇందులో మెడికల్ స్టూడెంట్ సహజగా కనిపిస్తా. నా మొదటి సినిమాకే నాగశౌర్యగారితో పాటు మంచి నిర్మాణ సంస్థలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగులో నాకు ఇష్టమైన హీరో అల్లు అర్జున్. ఆయనతో కలిసి డ్యాన్స్ చేయాలని ఉంది. హీరోయిన్స్లో అనుష్క శెట్టిగారు అంటే ఇష్టం. ప్రస్తుతం తెలుగులో కొన్ని కథలు వింటున్నాను' అన్నారు. -
సినిమా సక్సెస్ అని రాజమౌళి అన్నారు
శ్రీ సింహా కోడూరి, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా నటించిన క్రైమ్ కామెడీ ఫిల్మ్ ‘భాగ్ సాలే’. ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ప్రణీత్ బ్రహ్మాండపల్లి మాట్లాడుతూ – ‘‘భాగ్ సాలే’ కల్పిత కథ. నిజాంకు ఉంగరాలపై ఆసక్తి ఉండేదంటారు. ఈ సినిమా కథ కూడా ఓ ఉంగరం చుట్టూ తిరుగుతుంది. అందుకే హైదరాబాద్ నేపథ్యం ఎంచుకున్నాం. ఇందులో శ్రీ సింహా ΄ాత్ర కాస్త స్వార్థంతో కూడి ఉంటుంది. సినిమా అంతా పరిగెత్తడమే. అందుకే ‘దౌడ్’, ‘పరుగు’ వంటి టైటిల్స్ అనుకున్నాం. కానీ సౌండింగ్ బాగుందని ‘భాగ్ సాలే’ ఫిక్స్ చేశాం. ట్రైలర్ చూసి, శ్రీ సింహాతో రాజమౌళిగారు ఈ సినిమా సక్సెస్ అవుతుందని చె΄్పారట. దీన్ని నేను పెద్ద కాంప్లిమెంట్గా భావిస్తున్నాను. ఇక దర్శకుడు హరీష్ శంకర్గారి అసోసియేషన్తో ఓ స్పోర్ట్స్ ఫిల్మ్ చేయాలనే ఆలోచనలో ఉంది’’ అన్నారు. -
డిసెంబరులో ఘంటసాల ది గ్రేట్
ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్’. గాయకుడు కృష్ణ చైతన్య టైటిల్ రోల్ చేయగా, ఘంటసాల భార్య సావిత్రి ఘంత్రను మృదుల చేశారు. ‘ఘంటసాల ఘంటశాల’ సంకలనకర్త సీహెచ్ రామారావు దర్శకత్వంలో గాయకుడు జీవీ భాస్కర్ నిర్మాణ సారథ్యంలో ఫణి నిర్మించారు. ఈ సినిమాను డిసెంబరులో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో సీహెచ్ రామారావు మాట్లాడుతూ– ‘‘ఘంటసాలగారి గురించి తెలియని చాలా విషయాలను ఈ సినిమాలో చూపించనున్నాం. ఘంటసాలగా కృష్ణచైతన్య సరి΄ోయారని గతంలో ఎస్పీ బాలుగారు అన్నారు. అదే మా తొలి సక్సెస్గా భావిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఘంటసాలగారి ఘంత్ర చేయడం నా అదృష్టం’’ అన్నారు కృష్ణచైతన్య. ‘‘2018లోనే ఈ సినిమా టీజర్ను ఎస్పీ బాలుగారితో రిలీజ్ చేయించాం. అయితే ఘంటసాలగారి కుటుంబంతో కొన్ని లీగల్ సమస్యలొచ్చాయి. ఇప్పుడు వాళ్లే ఈ సినిమాకు స΄ోర్ట్ ఇస్తున్నారు’’ అన్నారు జీవీ భాస్కర్. చిత్ర సమర్పకులు లక్ష్మీ ప్రసాద్ ఘంల్గొన్నారు. -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న ప్రేమించుకుందాం రా చైల్డ్ ఆర్టిస్ట్
‘ప్రేమించుకుందాం..రా’ , ‘సూర్యవంశం’, ‘మనసంతా నువ్వే’ వంటి సినిమాల్లో బాలనటుడిగా కనిపించిన ఆనంద్ వర్ధన్ హీరోగా నటించిన తొలి చిత్రానికి ‘నిదురించు జహాపన’ అనే టైటిల్ను ఖరారు చేశారు. రోష్ని సాహోత, నవమి గయాక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకత్వంలో జి. వంశీకృష్ణ వర్మ, సామ్ జీ నిర్మించిన ఈ సినిమా మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆనంద్ వర్ధన్ మాట్లాడుతూ– ‘‘సినిమా నాప్రాణం. మిమ్మల్ని (ప్రేక్షకులు) ఎంటర్టైన్ చేయడానికి జీవితాంతం సినిమాల్లోనే ఉంటాను’’ అన్నారు. ‘‘ఈ సినిమా కథలో హీరో ఆరు నెలలు కంటిన్యూస్గా నిద్రపోతూనే ఉంటాడు. అందుకే ఆ టైటిల్ పెట్టాం. సముద్రం నేపథ్యంలో సాగే కథ ఇది’’ అన్నారు ప్రసన్న కుమార్. నటీమణులు రోష్ని సాహోత, నవమి గయాక్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడారు. -
Live: రామ్ చరణ్, ఉపాసన ప్రెస్ మీట్
-
పల్లెటూరి ప్రేమకథ
చైతన్య రావ్, లావణ్య జంటగా చెందు ముద్దు దర్శకత్వం వహించిన చిత్రం ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించిన ఈ చిత్రాన్ని జూలై 21న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ సోమవారం ప్రకటించింది. ఈ సందర్భంగా యష్ రంగినేని మాట్లాడుతూ– ‘‘పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రమిది. చెందు ముద్దు ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా రూపొందించారు. 80 దశకం నేపథ్యంతో పీరియాడిక్ సినిమాగా సాగుతుంది. మా సంస్థకు మంచి పేరు తెచ్చే చిత్రమవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: ప్రి¯Œ ్స హెన్రీ, కెమెరా: పంకజ్ తొట్టాడ. -
ఫోక్సో చట్టంపై అవగాహన ఉండాలి
మనోజ్ బాజ్పాయ్ నటించిన తాజా హిందీ చిత్రం ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’. అపూర్వ్ సింగ్ కర్కీ దర్శకత్వంలో జీ స్టూడియోస్, వినోద్ భన్సాలి, కమలేష్ భన్సాలి, విశాల్ గుర్నాని, ఆసిఫ్ షేక్ నిర్మించారు. ఈ చిత్రం ఇటీవల ఓటీటీ ప్లాట్ఫామ్లో, ప్రస్తుతం థియేటర్స్లో కూడా ప్రదర్శితమవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా జూన్ 7 నుంచి వీక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో మనోజ్ బాజ్పాయ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నేను చేసిన లాయర్ సోలంకి పాత్ర సామాన్య ప్రజలకు దగ్గరగా ఉంటుంది. అందుకే బాగా కనెక్ట్ అవుతున్నారు. కథపరంగా విలన్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టకుండా ఓ పదహారేళ్ల అమ్మాయి అనుభవిస్తున్న బాధ, ఆమె తరఫున న్యాయ పోరాటం చేస్తున్న సోలంకిల కోణంలోనే చూపించే ప్రయత్నం చేశాం. న్యాయవ్యవస్థకు అద్దం పట్టేలా ఈ సినిమాను తెరకెక్కించాం. ఫోక్సో చట్టంపై తల్లిదండ్రులకు అవగాహన ఉండాలి. మంచి స్క్రిప్ట్ దొరికితే మళ్లీ తెలుగులో సినిమా చేస్తాను’’ అన్నారు. -
హారర్.. థ్రిల్లర్
రవిబాబు, సత్యప్రకాష్, ‘చిత్రం’ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘టెర్రర్ ద వే ఆఫ్ డెవిల్’. ఈ చిత్రం ద్వారా సీవీఎస్ఎమ్ వెంకట్ రవీంద్రనాథ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ కృష్ణార్జున మూవీ మేకర్స్పై పెదారికట్ల చెన్నెబోయిన నరసమ్మ, వెంకటేశ్వర్లు యాదవ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో పెదారికట్ల చెన్నెబోయిన నరసమ్మ, వెంకటేశ్వర్లు యాదవ్ మాట్లాడుతూ–‘‘గతంలో గ్రామాల్లో మాతంగులు జీవించేవారు. వారి జీవితాల ఆధారంగా అల్లుకున్న కథకి హారర్, థ్రిల్లర్ అంశాలు జోడించి ఈ చిత్రం నిర్మిస్తున్నాం. ఈ మూవీ ద్వారా ముగ్గురు కొత్త అమ్మాయిలను హీరోయి¯Œ ్సగా పరిచయం చేస్తున్నాం. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్న ఈ సినిమా రెండవ షెడ్యూల్ నేటి నుంచి ప్రారంభం అవుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పీకే స్టిల్ రాజ్ కమల్. -
ప్లాన్ రెడీ.. ఆగస్టులో రేవ్ పార్టీ
క్రిష్ సిద్దిపల్లి, రితికా చక్రవర్తి, ఐశ్వర్యా గౌడ, సుచంద్ర ప్రసాద్, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రేవ్ పార్టీ’. రాజు బొనగాని స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా రాజు బొనగాని మాట్లాడుతూ– ‘‘రేవ్ పార్టీల వల్ల యువతకు ఎలాంటి నష్టం జరుగుతుందో ఈ సినిమాలో చూపిస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం’’ అని అన్నారు. ఈ చిత్రానికి సహ–నిర్మాతలు: లక్ష్మీకాంత్ ఎన్ఆర్, జయరామ్ డీఆర్, జీఎస్ సీతారామరాజు, ఎస్. నారాయణస్వామి. -
ఈ సినిమా కోసం మా అబ్బాయి చాలా కష్టపడ్డాడు
-
Ahimsa: ‘అహింస’ మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
తేజ ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమవుతున్నా
‘‘ఫలానా జానర్కు పరిమితం కాకుండా ఓ నటిగా డిఫరెంట్ సినిమాలు, పాత్రలు చేయాలని ఉంది’’ అన్నారు హీరోయిన్ గీతికా తివారి. దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘అహింస’. ఈ చిత్రంలో గీతికా తివారి హీరోయిన్గా నటించారు. తేజ దర్శకత్వంలో పి. కిరణ్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో గీతికా తివారి మాట్లాడుతూ– ‘‘మాది మధ్యప్రదేశ్లోని జబల్పూర్. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక యాక్టర్గా కొన్ని కమర్షియల్ యాడ్స్ చేశాను. ఆ తర్వాత సినిమాల్లోకి రావాలనుకున్నాను. తేజగారితో సినిమాలు చేసిన చాలామంది కొత్త నటీనటులు ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు. ఇలా కొత్తవారిని పరిచయం చేయడంలో తేజగారిది లక్కీ హ్యాండ్. ఆయన సినిమా ద్వారా ఇప్పుడు నేను హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అవుతుండటం చాలా సంతోషంగా ఉంది. ‘అహింస’లో చేసిన అహల్య పాత్ర నాకు పెద్ద సవాల్ అనిపించింది. కొన్ని సన్నివేశాలకు ఎక్కువ టేక్స్ తీసుకున్నాను. కానీ సింగిల్ టేక్లో పూర్తి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి’’ అని అన్నారు. -
Spy Teaser Press Meet : ‘స్పై’టీజర్ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
కస్టడీ మూవీ సక్సెస్ ప్రెస్ మీట్లో కృతి శెట్టి..
-
35 మంది కొత్తవారితో ‘మేమ్ ఫేమస్’
సుమంత్ ప్రభాస్, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి, నరేంద్ర రవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. సుమంత్ ప్రభాస్ దర్శకత్వంలో ఛాయ్ బిస్కెట్, లహరి ఫిలింస్ పతాకాలపై శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఈ సినిమా టీజర్, ‘అయ్యయయ్యో..’ పాటను ప్రదర్శించారు. అనంతరం ఈ చిత్ర హీరో, దర్శకుడు సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా ప్రమోషన్స్కు ప్రముఖ హీరోలంతా హెల్ప్ చేస్తుండటంతో నాకు మంచి పేరు వచ్చింది. అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘18 ఏళ్ళకే టిక్ టాక్లు చేసిన సుమంత్ 23 ఏళ్ళకే డెరైక్టర్ అయ్యాడు. అంతా యూత్ చేసిన సినిమా ఇది. ఆడియన్స్కు నచ్చుతుంది’’ అన్నారు అనురాగ్ రెడ్డి. ‘‘ఈ సినిమాతో 30 మందికిపైగా నటీనటులను పరిచయం చేయడం గర్వంగా వుంది’’ అన్నారు ‘లహరి ఫిలింస్’ చంద్రు మనోహర్. ‘‘వైజాగ్లో అన్నపూర్ణ స్టూడియోస్, రెండు రాష్ట్రాల్లో మిగిలిన ప్రాంతాల్లో గీతా ఆర్ట్స్, ఓవర్సీస్లో సరిగమల ద్వారా మా సినిమా విడుదలవుతుంది’’ అన్నారు శరత్ చంద్ర. -
సీనియర్ నటుల నుంచి చాలా చేర్చుకున్నా: నాగచైతన్య
‘‘ఓ నటుడుగా నన్ను నేనెప్పుడూ విమర్శించుకుంటూనే ఉంటాను... అభినందించుకోను. ఎప్పటికప్పుడు తప్పులు వెతుకుతూనే ఉంటాను.. నటుడిగా నన్ను నేను మెరుగుపరచుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నాను’’ అని అన్నారు నాగచైతన్య. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘కస్టడీ’. పవన్కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో నాగచైతన్య చెప్పిన విశేషాలు. ► తమిళ చిత్రం ‘మానాడు’ విడుదల కాకముందే వెంకట్ ప్రభుగారు నాకు ‘కస్టడీ’ స్టోరీ చెప్పారు. అయితే ‘మానాడు’ విడుదలై, హిట్ సాధించిన తర్వాత, ఈ సినిమానే మేం తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందన్నట్లుగా కొందరు నిర్మాతలు అభిప్రాయపడ్డారు. కానీ ‘కస్టడీ’ స్టోరీ నన్ను ఎగ్జయిట్ చేసింది. పైగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కొంతవరకు పూర్తయింది. దీంతో ‘కస్టడీ’ని సెట్స్పైకి తీసుకెళ్లాం. ఈ సినిమాలో భాగంగా కొందరు పోలీసులను కలిశాను. వారి కథలు నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి. ► ఈ సినిమాలో నేను పోలీస్ కానిస్టేబుల్ శివ పాత్ర చేశాను. నా కెరీర్లో ఎప్పుడూ చేయనటువంటి కొన్ని కొత్త యాక్షన్ సీక్వెన్స్లను ఈ సినిమా కోసం చేశాం. కథ రీత్యా ఈ తరహా యాక్షన్ సీక్వెన్స్లు అవసరం అయ్యాయి. అయితే కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం కొంత రిహార్సల్స్ చేశాం. ఈ సినిమాలోని వాటర్ సీక్వెన్స్ కోసం మూడు రోజులు రిహార్సల్స్ చేసి, దాదాపు 15 రోజులు షూట్ చేశాం. ఈ ఎపిసోడ్ ఓ హైలైట్గా ఉంటుంది. ► సినిమా మొదలైన తొలి ఇరవై నిమిషాలు కూల్గా ఉంటుంది. ఎప్పుడైతే స్క్రీన్పైకి అరవింద్ స్వామిగారు వస్తారో అప్పట్నుంచి స్టోరీ మలుపు తీసుకుని ఆడియన్స్ను స్క్రీన్పై నుంచి చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. ఈ చిత్రంలో శరత్ కుమార్, అరవింద్ స్వామి, ప్రియమణి వంటి సీనియర్స్ నటించారు. వారి నుంచి నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. ఇచ్చిన డైలాగ్స్ను తనదైన స్టైల్లో ఇంప్రూవ్ చేసి చెబుతుంటారు అరవింద్ స్వామిగారు. ఇది నాకు చాలా కొత్తగా అనిపించింది. వెంకట్గారు ఏ స్క్రిప్ట్ అయితే నాకు చెప్పారో అదే తీశారు. ఆయన స్క్రీన్ప్లే స్టయిల్ తెలుగు ప్రేక్షకులకు కొత్తగా ఉంటుంది. ఈ చిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్ స్టోరీకి తగ్గట్లుగానే ఉంటాయి. ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అవుట్పుట్ పట్ల చాలా నమ్మకంతో ఉన్నాను. పోలీస్ బ్యాక్డ్రాప్ సినిమాల్లో నాకు ‘ఘర్షణ’, నాన్నగారి ‘శివమణి’, ‘జేమ్స్ బాండ్’ యాక్షన్ ఫ్రాంచైజీ చిత్రాలు ఇష్టం. ► నిర్మాత శ్రీనివాసా చిట్టూరిగారు సెట్స్లో కూల్గా ఉంటారు. ‘కస్టడీ’ నా కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో నిర్మించబడింది. ఈ సినిమా 1990 బ్యాక్డ్రాప్లో ఉంటుంది. ఇళయరాజాగారు, యువన్ శంకర్రాజాగార్లు ఇచ్చిన మ్యూజిక్ ‘కస్టడీ’కి ప్లస్. ‘కస్టడీ’ని వేరే సినిమాతో పోల్చవద్దు. ‘కస్టడీ’ చిత్రం ‘కస్టడీ’యే. ► నేను తెలుగు డబ్బింగ్ కోసం దాదాపు పది రోజులు తీసుకుంటాను. కానీ తమిళ ‘కస్టడీ’ సినిమాకు డబ్బింగ్ పూర్తి చేయడానికి నెలరోజుల టైమ్ పట్టింది. నా సొంత వాయిస్ అయితే ఆడియన్స్కు యాక్టర్గా చేరువకావొచ్చు. మన పెర్ఫార్మెన్స్ కూడా మెరుగ్గా కనిపిస్తుంది. అందుకే తమిళంలో డబ్బింగ్ చెప్పాను. ► నేను ఫలానా రకమైన సినిమాలు చేస్తేనే ఆడియన్స్కు నచ్చుతాయని అదే ట్రాక్లోకి వెళితే ఓ యాక్టర్గా అది నా బలహీనత అవుతుంది. ఈ విషయంలో నన్ను నేను కన్విన్స్ చేసుకోలేను. గతంలో నేను చేసిన కొన్ని లవ్స్టోరీలు వర్కౌట్ అయ్యాయి. అలా అని అవే సినిమాలు చేస్తుంటే ఓ యాక్టర్గా ఎదగలేను. చైతన్య ఎలాంటి సబ్జెక్ట్ అయినా బాగా చేస్తాడని ఆడియన్స్తో అనిపించుకోవాలి. ► ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులకు ఏ రకమైన సినిమాలు నచ్చుతున్నాయో తెలుసుకోవడం చాలెంజ్లా మారింది. కానీ ఆడియన్స్కు నచ్చే సినిమా ఇస్తే వారి ఆదరణ ఓ రేంజ్లో ఉంటుంది. ► నా తర్వాతి ప్రాజెక్ట్ గురించి త్వరలో అధికారికంగా చెబుతాను. ‘ధూత’ వెబ్ సిరీస్ రిలీజ్ అమెజాన్ చేతిలో ఉంది. ఈ ఏడాదే స్ట్రీమింగ్ స్టార్ట్ కావొచ్చు. మా తాతగారు, నాన్నగారు గొప్ప గొప్ప సినిమాలు చేశారు. కొన్ని స్టాండర్ట్స్ క్రియేట్ చేశారు. కొందరు వారితో మాకు పోలికలు పెడుతుంటారు. అయితే ఈ విషయాన్ని నేను ఓ ప్రెజర్లా తీసుకోను. చాలెంజ్లా స్వీకరించి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. ఆ స్థాయికి నేను రీచ్ అవుతానా? లేదా అనేది నాకు తెలియదు. కానీ నా శక్తివంచన లేకుండా కష్టపడుతూనే ఉంటాను. నా గురించిన కొన్ని వార్తలు వస్తూనే ఉన్నాయి (విడాకుల అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ..). డిఫరెంట్ వార్తలు రాస్తున్నారు. కానీ ఆడియన్స్ ఫూల్స్ కాదు. తెలివైనవారు. ఏది జెన్యూన్ న్యూస్.. ఏది కాదనేది వారికి తెలుసని అనుకుంటున్నాను. నేను అయితే నవ్వుకుని వదిలేస్తున్నాను. -
అది మా అదృష్టం
‘‘ఏ సినిమానీ చిన్న సినిమా, పెద్ద సినిమా అనలేం. ఆ తేడాలు మాకు లేవు. మంచి కథ చేయడం ముఖ్యం. ప్రాజెక్ట్ కె’ (ఇందులో ప్రభాస్ హీరో) చాలా పెద్ద ప్రాజెక్ట్. కానీ మేము ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో మొదలయ్యాం. మా జీవితం ఓ మలుపు తీసుకుంది ఆ చిత్రంతోనే. సో.. మా వరకు అది బిగ్ ఫిల్మ్. ఓ మంచి కథ చెప్పాలనే ఉద్దేశంతో ‘అన్నీ మంచి శకునములే’ సినిమా తీశాం’’ అన్నారు నిర్మాత స్వప్నాదత్. సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్తో కలిసి ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో నిర్మాతలు స్వప్నా దత్, ప్రియాంకా దత్ చెప్పిన విశేషాలు. ► ‘అన్నీ మంచి శకునములే’ రెండు కుటుంబాల మధ్య జరిగే కథ. మంచి ఎమోషనల్ మూవీ. ఆడియన్స్ కంటతడి పెడతారు. దర్శకురాలు నందిని ఈ కథ చెప్పినప్పుడు అది కున్నూర్ బ్యాక్డ్రాప్లో లేదు. కథ రీత్యా ఆ లొకేషన్స్ అవసరం కాబట్టి అక్కడ తీశాం. హిల్స్టేషన్ బ్యాక్డ్రాప్లో ఓ ఫ్యామిలీ కథ తీయాలనే ఆశ ‘అన్నీ మంచి శకునములే..’తో నెరవేరింది. ఈ సినిమా కోసం నందినీ విక్టోరియా అనే చిన్న ప్రదేశాన్ని సెట్ చేశారు. ఆడియన్స్ని మరో లోకంలోకి తీసుకెళ్లే సినిమా ఇది. ఇక ఈ సినిమాతో సంతోష్ శోభన్కు కొత్త ఇమేజ్ వస్తుందని నమ్ముతున్నాం. తన కెరీర్ మారుతుంది. నందినీ రెడ్డిగారి ‘అలా.. మొదలైంది’ చిత్రం యూత్ఫుల్ ట్రెండ్ సెట్టర్. ‘కళ్యాణ వైభోగమే’ కొత్తగా పెళ్లి చేసుకున్న జంట కథ. ‘ఓ బేబీ’ డిఫరెంట్ స్టోరీ. ఈ కోవలో ‘అన్నీ మంచి శకునములే’ చిత్రం ఓ డిఫరెంట్ ఫ్యామిలీ స్టోరీ. ఆడియన్స్కు ఈ సినిమా నచ్చుతుంది. ► దుల్కర్ పరభాష హీరో, ఖరీదైన లొకేషన్స్, మార్కెట్ ఎదురీత .. ‘సీతారామం’ సినిమా విషయంలో ఇలా ప్రతి అడుగూ ఓ సవాలే. కానీ నమ్మి చేశాం. విజయం సాధించింది. మనం నమ్మింది జరిగిందనే తృప్తి కలిగింది. ► ప్రతి సినిమాపై మాకు ఒత్తిడి ఉంటుంది. మా మనసుకు నచ్చిన కథలనే సినిమాలుగా తీస్తున్నాం. అయితే మేం ఇష్టపడి చేసిన చిత్రాలు ప్రేక్షకుల అభిరుచికి దాదాపుగా మ్యాచ్ కావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ► సినిమా ఇండస్ట్రీలో నాన్నగారు (నిర్మాత అశ్వినీదత్) 50 ఏళ్ళుగా నిలబడ్డారు. ఇప్పుడు ఆయన పిల్లలు సినిమాలు తీస్తున్నారు. ఆయన ఏ రోజూ లెక్కలు వేసుకుని సినిమాలు తీయలేదు. ఈ దారిలో మేం కూడా వెళ్తున్నాం. సినిమాల్లోకి వచ్చామంటే ప్యాషన్తోనే. లెక్కలు వేసుకుంటే సినిమాలు తీయలేం. ► అందరం చర్చించుకునే ఓ జడ్జ్మెంట్కు వస్తాం. ‘జాతిరత్నాలు’ సినిమాను నేను (స్వప్న) ఓటీటీకి అమ్మేద్దాం అన్నాను. కానీ నాగీ (‘మహానటి’ ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్), ప్రియాంక ఆ సినిమాను నమ్మారు. ‘ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది. పోతే మొత్తం పోతుంది. థియేటర్స్లో రిలీజ్ చేద్దాం’ అన్నాడు నాగీ. సినిమా మంచి హిట్ అయింది. ‘మహానటి’ని నేనెక్కువగా నమ్మాను. చాలా బాధ్యతతో ఆ సినిమా చేశాం. నాగీ నిర్ణయాలు మా బ్యానర్కు బలం. ► నిర్మాతలుగా మీరు కష్టపడుతున్నారు. నేను కూడా ఎందుకని మా చెల్లి (స్రవంతి) అన్నారు. ఇంట్లో పిల్లలు సేఫ్గా ఉన్నారు, అమ్మా, చెల్లి చూసుకుంటున్నారనే ధైర్యం ఉండబట్టే మేం సినిమాలు తీస్తున్నాం. -
నాగచైతన్యతో నటించడం మంచి ఎక్స్పీరియన్స్: కృతిశెట్టి
నాగచైతన్య, కృతిశెట్టి జంటగా నటించిన తాజా చిత్రం కస్టడీ. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా పొట్లూరి నిర్మించిన ఈ ద్విభాషా (తమిళం, తెలుగు) చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి సంగీతాన్ని అందించిన ఇందులో అరవింద్స్వామి, శరత్కుమార్, ప్రియమణి ముఖ్యపాత్రలు పోషించారు. చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 12న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం చైన్నెలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. దర్శకుడు వెంకట్ ప్రభు మాట్లాడుతూ కస్టడీ చిత్రం బాగా వచ్చిందని చెప్పారు. ఇది యూనిక్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని చేయడం మంచి అనుభవం అన్నారు. కృతిశెట్టి మాట్లాడుతూ ఇది తాను నటించిన రెండవ తమిళ చిత్రం అని, అదేవిధంగా నాగచైతన్యతో నటించిన రెండవ చిత్రం కూడా ఇదని చెప్పారు. ఆయనతో నటించడం మంచి ఎక్స్పీరియన్స్ అని, ఆ కంఫర్ట్ ఉందని పేర్కొన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ ఈ మూమెంట్ గుర్తుండిపోతుందన్నారు. వెంకట్ ప్రభు కథ చెప్పి వినగానే చాలా ఎగ్జైట్ అయ్యానని, చిత్రం పూర్తి అయిన తరువాత కూడా అంతే అనుభూతి కలిగిందన్నారు. యాక్షన్ సన్నివేశాలను బాగా తీశారన్నారు. ఇది సీరియస్ నేపథ్యంలో సాగే కథా చిత్రం అయినా దర్శకుడు వెంకట్ ప్రభు కామెడీ టచ్ మిస్ కాదన్నారు. ఇందులో బ్లాక్ బస్టర్ అంశం సంగీత దర్శకుడు ఇళయరాజా అని పేర్కొన్నారు. -
బిచ్చగాడు 2 ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
తరాలు మారినా ఎమోషన్స్ మారలేదు: హీరో గోపీచంద్
‘‘వందేళ్ల క్రితం అమ్మను ‘అమ్మ’ అనే పిలిచాం. ఇప్పుడూ అమ్మా అనే పిలుస్తాం. తరాలు మారినా ఎమోషన్స్ మారలేదు. అలాగే సినిమాల విషయంలో ఆడియన్స్ మారలేదు. సరైన కంటెంట్ ఇస్తే ఆడియన్స్ సినిమాలు చూస్తున్నారు. అయితే కథలో ఆడియన్స్ను మనం ఎంతవరకు ఇన్వాల్వ్ చేయగలుగుతున్నాం అన్నదే ముఖ్యం. వారు కనెక్ట్ అయ్యే ఏ జానర్ సినిమా తీసినా వాటిని ఆదరిస్తారు’’ అన్నారు హీరో గోపీచంద్. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘రామబాణం’. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో గోపీచంద్ చెప్పిన విశేషాలు.... ► ఈ మధ్య నేను ఎక్కువగా యాక్షన్ చిత్రాలే చేశాను. ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్న సినిమా చేయాలని అనుకుంటున్నప్పుడు భూపతిరాజాగారు చెప్పిన కథ, అందులోని బ్రదర్ ఎమోషన్స్ నచ్చడంతో ‘రామబాణం’ సినిమా చేశాం. హిట్ చిత్రాలు ‘లక్ష్యం’, ‘లౌక్యం’ల తర్వాత శ్రీవాస్, నేను మరో సినిమా చేయాలని ‘రామబాణం’ చేయలేదు. కథ కుదిరింది కాబట్టి చేశాం. ► ‘రామబాణం’ అన్నదమ్ముల కథ. ఇద్దరి స్వభావం ఒకటే. కానీ ఎంచుకున్న దారులు వేరు. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్కు కమర్షియల్ హంగులు జోడించి ఈ సినిమా చేశాం. అలాగే అంతర్లీనంగా ఓ సందేశం కూడా ఉంది. ఓ సమస్యను మనం కొన్నేళ్లు పట్టించుకోకుండా ఉంటే దాని దుష్ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. అప్పుడు బాధ పడతాం. ఈ విషయాన్నే ‘రామబాణం’లో చూపించాం. ► ‘లక్ష్యం’ సినిమాలో జగపతిబాబుగారితో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. ఆ సినిమాలో అన్నదమ్ముల్లా నటించిన మేం ‘రామబాణం’లోనూ అన్నదమ్ముల్లా నటించాం. ఈ సినిమాలో జగపతిబాబుగారిది కీలకపాత్ర. హీరోగా నా క్యారెక్టర్ పెంచేసి, ఆయన క్యారెక్టర్ను తగ్గించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే సినిమాకు కథే హీరో. కథే సినిమాను నడిపించాలి. ► టీజీ విశ్వప్రసాద్గారు మంచి నిర్మాత. ఇండస్ట్రీలో అతి మంచితనం మంచిది కాదని నేను ఆయనకు చె΄్పాను. ఎందుకంటే ఆయన చాలా సినిమాలు చేస్తున్నారు. అలాంటి వారు ఇండస్ట్రీలో ఉంటే చాలా మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ► ప్రస్తుతం కన్నడ దర్శకుడు హర్షతో ఓ సినిమా చేస్తున్నాను. ఆ తర్వాత దర్శకలు శ్రీను వైట్ల, తేజగార్లతో సినిమాలు ఉంటాయి. ► గతంలో నేను ‘ఒక్కడున్నాడు’, ‘సాహసం’ వంటి విభిన్నమైన సినిమాలు చేశాను. ఆ సినిమాలు ఇప్పుడు వచ్చి ఉంటే హిట్ అయ్యేవి. అయితే ఆ తరహా సినిమాల్లో నాకు నటించాలని ఉన్నా సరైన కథలు దొరకడం లేదు. ► హిట్ సినిమాలు అందించాలనే ఒత్తిడి నాకే కాదు... ప్రతి హీరోకూ ఉంటుంది. ఎందుకంటే ఓ సినిమా ఫలితంపై ఎన్నో కుటుంబాలు (ముఖ్యంగా బయ్యర్లు, డిస్ట్రిబూటర్స్ని ఉద్దేశిస్తూ..) ఆధారపడి ఉంటాయి. అయితే కొన్నిసార్లు హిట్ అవుతాయని మేం భావించిన సినిమాలు సరైన ఫలితాలను ఇవ్వక΄ోవచ్చు. తప్పులను విశ్లేషించుకుని అవి రిపీట్ కాకుండా చూసుకోవాలి. నాకు వచ్చిన ప్రతి రోల్ని డ్రీమ్ రోల్లా భావిస్తాను. ► నా కెరీర్ స్టార్టింగ్లో ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’ చిత్రాల్లో విలన్ రోల్స్ చేశాను. ఇండస్ట్రీలో ముందు నన్ను నిలబెట్టింది విలన్ రోల్సే. ప్రభాస్ సినిమాలో విలన్పాత్ర చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. అయితే కథ, అందులోని విలన్పాత్ర పవర్ఫుల్గా ఉండాలి. -
ఉగ్రం నా కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్ ఫిల్మ్ అవుతుంది
‘‘నేను పోలీసాఫీసర్గా చేసిన ‘కత్తి కాంతారావు’, ‘బ్లేడ్ బాజ్జీ’ చిత్రాలు విజయాలు సాధించాయి. అయితే ఇవి కామెడీ చిత్రాలు. కాగా నేను సీరియస్ పోలీస్ పాత్ర చేసిన ‘ఉగ్రం’ సినిమా కూడా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. ‘ఉగ్రం’ నా కెరీర్లో హయ్యస్ట్ గ్రాసర్ ఫిల్మ్గా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. ‘నాంది’ తర్వాత హీరో ‘అల్లరి’ నరేశ్, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘ఉగ్రం’. హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘‘గతంలో నేను చేసిన ఫైట్స్ నవ్వించడం కోసం... ఈ సినిమాలో ఎమోషన్ కోసం యాక్షన్ సీన్స్ చేశాను’’ అన్నారు. ‘‘నాంది’ సినిమాకు మూడురెట్ల వసూళ్లు ‘ఉగ్రం’ సినిమా రాబడుతుందనే నమ్మకం ఉంది’’ ఉన్నారు విజయ్ కనకమేడల. ‘‘భారతదేశ వ్యాప్తంగా మిస్సింగ్ కేసులు నమోదు అవుతున్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మనకన్నా ఎక్కువ మిస్సింగ్స్ ఉన్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. పక్కా ఆధారాలతో వాస్తవ ఘటనలను బేస్ చేసుకుని ‘ఉగ్రం’ కథ రెడీ చేశాం’’ అన్నారు రచయిత వెంకట్. కామెడీ సినిమాలు చేయడానికి నేను సిద్ధమే. నా తర్వాతి సినిమా కామెడీ జానర్లోనే ఉంటుంది. అయితే కొందరు నాకు కామెడీ కథలు చెప్పేటప్పుడు వాళ్లకు వాళ్లే ఎగ్జయిట్ అయ్యి, నవ్వేసుకుంటున్నారు. నాకు నవ్వు రావడం లేదు. ఆడియన్స్ ఆర్గానిక్ కామెడీని ఇష్టపడుతున్నారు. ఇప్పుడు నేను ‘కితకితలు’ సినిమా చేస్తే బాడీ షేమింగ్ అని తిడతారు. కుటుంబసమేతంగా చూసే కామెడీ సినిమాలు తీయాలన్నప్పుడు అందులో అసభ్య పదజాలం, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండకూడదు. చెప్పాలంటే కామెడీ సినిమాల రైటర్స్ తగ్గిపోయారు. – ‘అల్లరి’ నరేశ్ -
నాగచైతన్య ‘కస్టడీ’ సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
కస్టడీ నాకు స్పెషల్ ఫిల్మ్
‘‘ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతోంది. మూసధోరణి సినిమాలను ప్రేక్షకులు రిజెక్ట్ చేస్తున్నారు. అందుకే నా ప్రతి సినిమాకు కొత్త వేరియేషన్ చూపించాలనుకుంటున్నా. ఇందులో భాగంగానే ‘కస్టడీ’ సినిమా చేశాను. గతంలో నేను తమిళ దర్శకులతో చేసిన సినిమాలను తెలుగులో మాత్రమే తీశాం. కానీ ‘కస్టడీ’ సినిమాలోని ప్రతి సీన్ని తెలుగు, తమిళ భాషల్లో తీశాం. నా తొలి తమిళ చిత్రం ‘కస్టడీ’. అందుకే ఇది నాకు స్పెషల్ ఫిల్మ్. ఈ సినిమా నాకో టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు నాగచైతన్య. వెంకట్ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య, కృతీశెట్టి జంటగా నటించిన చిత్రం ‘కస్టడీ’. పవన్కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం నిర్వహించిన ‘కస్టడీ’ సినిమా ప్రెస్మీట్లో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఓ సింపుల్ కానిస్టేబుల్ చేతిలో ఉన్న ఓ పవర్ఫుల్ నిజం కోసం అతను ఎంత దూరమైనా వెళ్తాడు.. అంటూ వెంకట్ప్రభుగారు చెప్పిన స్టోరీ లైన్ నాకు బాగా నచ్చి ‘కస్టడీ’ ఒప్పుకున్నాను. వెంకట్ప్రభుగారి ట్రేడ్ మార్క్ స్క్రీన్ ప్లే తెలుగు ప్రేక్షకులకు కొత్తగా ఉంటుందని నమ్ముతున్నాను. అలాగే ఆయన ‘కస్టడీ’స్టోరీ సింపుల్గా ఉంటుందని చెబుతున్నారు కానీ మా సినిమాలో చాలా లేయర్స్ ఉన్నాయి. అలాగే నా సినిమాకు ఇళయరాజా, యువన్శంకర్గార్లు మ్యూజిక్ ఇవ్వడం అనేది నా కల నిజమైనట్లు ఉంది’’ అని అన్నారు. ‘‘సాధారణంగా సినిమాల్లో విలన్ని హీరో, హీరోని విలన్ చంపాలనుకుంటారు. కానీ విలన్ చనిపోకుండా హీరో కాపాడడమే ‘కస్టడీ’ స్టోరీ లైన్. తెలుగులో నా తొలి చిత్రం ‘కస్టడీ’. నా కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ ఇది. కథను, నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన చైతూ, నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు వెంకట్ ప్రభు. ‘‘ఈ సినిమా కథ విన్నప్పుడు చాలా ఎగై్జట్ అయ్యాను. ఆడియన్స్ కూడా ఇదే ఫీలవుతారని ఆశిస్తున్నాను’’ అన్నారు కృతీశెట్టి. ‘‘కస్టడీ’ బిజినెస్ పట్ల హ్యాపీగా ఉన్నాం. ప్రేక్షకుల స్పందనను బట్టి కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల చేస్తాం’’ అన్నారు శ్రీనివాసా చిట్టూరి. అభిమానులకు మంచి సక్సెస్ ఇవ్వాలనే అనుకుంటాం. వారి అభిమానం, ప్రేమలకు మేం తిరిగి ఇచ్చేది ఒక మంచి సినిమాయే. రీసెంట్గా మా నుంచి వచ్చిన కొన్ని సినిమాలకు మంచి రిజల్ట్ రాలేదు. యాక్టర్స్ కెరీర్లో ఎత్తుపల్లాలు సహజం. ఈ టైమ్ (బ్యాడ్ ఫేస్ అని పరోక్షంగా చెబుతూ..) వెళ్లిపోతుంది. తప్పకుండా మేం తిరిగి పుంజుకుంటాం. ఫ్యాన్స్ ఆశించే ఫలితం ‘కస్టడీ’ నుంచి రాబోతుందని నమ్ముతున్నాను. నాన్నగారి ‘శివ’ సినిమా అంటే అందరి ఆడియన్స్లానే నాకు చాలా గౌరవం. ‘కస్టడీ’లో నా క్యారెక్టర్ పేరు శివ అయినప్పటికీ ‘శివ’ సినిమా మీద ఉన్న గౌరవంతో మా సినిమాకు ఆ టైటిల్ పెట్టలేదు. – నాగచైతన్య -
మహర్షితో ఆ ధైర్యం వచ్చింది
‘‘అల్లరి’తో మొదలైన నా కెరీర్లో ‘ఉగ్రం’ 60వ చిత్రం. ఈ ప్రయాణంలో ఎత్తుపల్లాలు ఉన్నాయి. గెలుపు, ఓటములను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో నేర్చుకున్నాను. 60 సినిమాలు చేయడం అంత సులభం కాదు.. ప్రేక్షకుల ఆదరణ వల్లే ఇది సాధ్యపడింది. ఈ ప్రయాణంలో బాపుగారు, కె. విశ్వనాథ్గారు వంటి లెజెండరీ దర్శకులతో పాటు, వంశీగారు, కృష్ణవంశీగార్లతో పని చేసే చాన్స్ రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని ‘అల్లరి’ నరేశ్ అన్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్, మిర్నా మీనన్ జంటగా సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన చిత్రం ‘ఉగ్రం’. ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘అల్లరి’ నరేశ్ పంచుకున్న విశేషాలు. ► మహేశ్బాబుగారి ‘మహర్షి’ సినిమాకి ముందు నేను చేసిన పాత్రలు వినోదాత్మకంగా ఉంటాయి. ‘మహర్షి’లో నా పాత్ర సీరియస్గా, సింపతీగా ఉన్నా ప్రేక్షకులకు బాగా నచ్చింది. దాంతో ఇలాంటి పాత్రల్లోనూ ఆడియన్స్ ఆదరిస్తారనే ధైర్యం నాకు కలిగింది. రచయితలకు కూడా నమ్మకం కలగడంతో నా కోసం కామెడీ కాకుండా సీరియస్గా ఉండే కొత్త కథలు రాయడం మొదలు పెట్టారు. అలా వచ్చిన ‘నాంది’ హిట్ అయింది. ఇప్పుడు ‘ఉగ్రం’ తర్వాత మరిన్ని కొత్త కథలు నా కోసం రాస్తారనే నమ్మకం ఉంది. ► కామెడీ పాత్రలు చేయడం సులభం అనుకుంటారందరూ. కానీ చాలా కష్టం. కామెడీ చేసేవారు ఏ పాత్రయినా చేయగలరు. ‘రంగమార్తాండ’లో బ్రహ్మనందంగారు, ‘విడుదల’ చిత్రంలో సూరి అద్భుతంగా చేశారు. ‘ఉగ్రం విషయానికి వస్తే దర్శకుడు విజయ్ నా ప్లస్సుల కంటే మైనస్సులు ముందుగా నాకు చెప్పడంతో జాగ్రత్తలు తీసుకొని ‘ఉగ్రం’ చేశాను. మనల్ని దర్శకుడు నమ్మితే దాని ఫలితం వేరేలా ఉంటుంది. నన్ను క్రిష్గారు నమ్మడంతో ‘గమ్యం’, సముద్రఖనిగారు నమ్మడంతో ‘శంభో శివ శంభో’ వచ్చాయి. ఇప్పుడు విజయ్కి నాపై ఉన్న నమ్మకంతో ‘నాంది, ఉగ్రం’ వచ్చాయి. ► ‘ఉగ్రం’ ఐదేళ్ల టైమ్ లిమిట్లో జరుగుతుంది. ఎస్ఐ శిక్షణలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించడం, ఆ తర్వాత పెళ్లి, ఒక కూతురు.. ఇలా మూడు వేరియేషన్స్లో ఉండే శివకుమార్ పాత్రలో కనిపిస్తాను. యాక్షన్ సీన్స్ని డూప్ లేకుండా చేశాను. ► మనకి సమస్య వస్తే పోలీస్ దగ్గరికి వెళ్తాం. అదే పోలీస్కి సమస్య వస్తే ఏం చేస్తాడు? ఎలా ట్రీట్ చేస్తాడనేది ‘ఉగ్రం’లో ఉంటుంది. సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రంలో స్క్రీన్ ప్లే చాలా ఆసక్తిగా ఉంటుంది. ► కామెడీ, సీరియస్.. ఏదీ సేఫ్ జోనర్ కాదు. ‘సుడిగాడు, బెండు అప్పారావు, కితకితలు’ వంటి హిట్ సినిమాలు చూసినప్పుడు ‘నరేశ్ సినిమా బావుంది అన్నారు కానీ నరేశ్ కామెడీ బాగా చేశాడనలేదు’. కానీ ‘గమ్యం, శంభో శివ శంభో, మహర్షి’ చూశాక ‘నరేశ్ బాగా నటించాడు’ అన్నారు. కామెడీ చేసేవాళ్లంటే ఇండస్ట్రీలో, ఆడియన్స్లో ఎక్కడో చిన్న చూపు ఉంది. ఈ విషయంలో నాకెక్కడో చిన్న గిల్ట్ ఫీలింగ్ ఉంది. ► ‘వివాదాల జోలికి వెళ్లొద్దు, ఎవరి గురించి చెడుగా మాట్లాడొద్దు’ అని మా నాన్న ఈవీవీ సత్యనారాయణగారు చెప్పారు. నాన్నగారు చెప్పినట్లు నాకు పని తప్ప మరో ఆలోచన లేదు. ఈవీవీగారి బ్యానర్లో నాన్నగారి మార్క్ సినిమాలు చేయాలి. సరైన కథ కుదిరితే నిర్మిస్తాను. నా సోదరుడు ఆర్యన్ రాజేశ్ తనని తాను నిరూపించుకునేందుకు సరైన కథ కోసం ఎదురు చూస్తున్నాడు. నాకు దర్శకత్వం ఆలోచన ఉంది కానీ అందుకు టైమ్ పడుతుంది.. అయితే నేను దర్శకత్వం వహించే మూవీలో నేను నటించను. ► నా సినిమాల్లో ‘సుడిగాడు’కి సీక్వెల్ తీయొచ్చు. ఆ మూవీకి పని చేసిన అనిల్ రావిపూడి మొన్న కలసినప్పుడు ‘సుడిగాడు 2’ చేద్దామా? అన్నాడు. ‘నేను రూటు మార్చితే మళ్లీ కామెడీవైపు తీసుకెళ్తారా?’ అని సరదాగా అన్నాను. నాన్నగారి చివరి రోజుల్లో ‘అలీబాబా అరడజను దొంగలు’ మూవీకి సీక్వెల్గా ‘అలీబాబా డజను దొంగలు’ సినిమా చేద్దామనుకున్నాం.. కానీ, కుదరలేదు. ప్రస్తుతం నేను, ఫరియా అబ్దుల్లా ఒక సినిమా చేస్తున్నాం. సుబ్బుగారి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాను. ‘జెండా’ అనే కథని కొన్నాను.. నేనే నిర్మిస్తా. అలాగే విజయ్తో మరో సినిమా ఉంటుంది. -
సూపర్ స్టార్ కృష్ణ 'మోసగాళ్లకు మోసగాడు' రీరిలీజ్
వెండితెరపై సూపర్ స్టార్ కృష్ణ చేసిన ప్రయోగాల గురించి చెప్పనక్కర్లేదు. తెలుగు తెరకు ఎన్నో సాంకేతిక హంగులను పరిచయం చేసిన కృష్ణ నటించిన తొలి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు. 52 ఏళ్ల కిందట రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.పద్మాలయా స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మాత ఘట్టమనేని ఆది శేషగిరిరావు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆ సినిమా కల్ట్ క్లాసిక్గా నిలిచిపోయింది. చదవండి: ట్యాక్సీ డ్రైవర్గా చిరంజీవి.. అదిరిపోయిన 'భోళా శంకర్' పోస్టర్ ఇప్పుడీ చిత్రం రీరిలీజ్కు సిద్ధమైంది. మే31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే సందర్భంగా 4k టెక్నాలజీతో సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఆది శేషగిరిరావు ప్రెస్మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..''పద్మాలయ సంస్థకు ఫౌండేషన్ మోసగాళ్లకు మోసగాడు. మా బ్యానర్లో ఎన్ని సినిమాలు వవచ్చినా ఈ సినిమా చాలా ప్రత్యేకం. కృష్ణ గారి బర్త్డేకి నివాళిగా, అభిమానుల కోరిక మేరకు సినిమాను రీరిలీజ్ చేస్తున్నాం. బర్త్డే రోజున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు(సోమవారం)అల్లూరి సీతారామరాజు రిలీజ్ అయ్యి 48 సంవత్సరాలు కావడంతో ఈరోజున ప్రెస్మీట్ పెట్టాము. కృష్ణ గారి మెమోరియల్గా మ్యూజియం కట్టడానికి ఇక్కడ ప్రభుత్వం స్థలం కేటాయిస్తామన్నారు. అయితే ఇక్కడే ఉన్న మా సొంత స్థలంలో పనులు చేయిస్తున్నాము'' అని ఆది శేషగిరిరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ్, బి గోపాల్, అశ్వినిదత్, నిర్మాత రామలింగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: కానిస్టేబుల్ పరీక్షలో బలగం ప్రశ్న, దిల్ ఖుష్ అయిన డైరెక్టర్ -
ఆ సినిమా విలువ నాకు తర్వాత తెలిసొచ్చింది: హీరోయిన్
‘‘ఓ నటిగా నేను ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటుంటాను. రొటీన్ రోల్స్ అయితే కొత్తగా నేను నిరూపించుకోవడానికి ఏమీ ఉండదు. అందుకే క్యారెక్టర్స్ ఎంపిక విషయంలో జాగ్రత్తపడుతుంటాను’’ అని అన్నారు హీరోయిన్ మాళవికా నాయర్. సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్తో కలిసి ప్రియాంక దత్ నిర్మించిన ఈ చిత్రం మే 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో మాళవికా నాయర్ మాట్లాడుతూ– ‘‘నా గత సినిమాలతో పోల్చితే ‘అన్నీ మంచి..’ చిత్రంలో నా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇప్పటివరకు నేను సున్నితమైన పాత్రలు చేశాను. కానీ ఈ చిత్రంలో కాస్త కోపంగా, ధైర్యంగా ఉండే అమ్మాయి పాత్ర చేశాను. అన్నీ తన కంట్రోల్లోనే ఉండాలనుకునే వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి పాత్ర చేశాను. కాస్త హ్యూమర్ కూడా ఉంటుంది. నందినీ రెడ్డిగారు నాకు చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. నటీనటుల నుంచి ఆమెకు కావాల్సింది రాబట్టుకుంటారు. ‘కల్యాణ వైభోగమే’ తర్వాత నందినీ గారితో మళ్ళీ సినిమా చేయాలని వుండేది. అది వైజయంతీ ఫిల్మ్స్తో నిజం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం రాజేంద్ర ప్రసాద్, గౌతమి, వీకే నరేశ్, వాసుకీగార్ల వంటి అనుభవజ్ఞులైన వారితో నటించడం కొత్త ఎక్స్పీరియన్స్. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా చేస్తున్నప్పుడు నాకు అన్నీ మంచి శకునములే అనిపించాయి. ఈ పాత్ బ్రేకింగ్ సినిమా విలువ ఏంటో నాకు తర్వాత తెలిసొచ్చింది. ప్రియాంక, స్వప్నగార్లు నాకు పరిచయం అయ్యింది కూడా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ నుంచే. ఇండస్ట్రీలో వారు నాకు మెంటర్స్లా ఉంటున్నారు. ఓ నటిగా నాకు యాక్షన్ రోల్ చేయాలని ఉంది. ప్రస్తుతం డెవిల్ సినిమాలో ఓ కీ రోల్ చేస్తున్నాను’’ అన్నారు.