Alluri Sitarama Raju District News
-
దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయండి
డాబాగార్డెన్స్: అఖిల పక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన ఈనెల 20వ తేదీ దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం జగదాంబ జంక్షన్ సమీపాన గల సిటు కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు. విశాఖ పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అఖిల పక్ష కార్మిక సంఘాల నాయకులు మాట్లాడారు. లేబర్కోడ్లు వస్తే సంఘం పెట్టుకునే హక్కు పోతుందన్నారు. చైన్నెలోని సామ్సంగ్ కంపెనీలో కార్మికులంతా కలిసి ఏర్పాటు చేసుకున్న యూనియన్ను రిజిస్టర్ చేయకుండా యాజమాన్యం, ప్రభుత్వం అడ్డుకున్నాయన్నారు. లేబర్కోడ్ అమల్లోకి వస్తే కార్మికులు ఏ కష్టం వచ్చినా సమస్య పరిష్కారానికి సమ్మె చేయలేరని, అలా చేస్తే ఒక రోజు సమ్మెకు 8 రోజుల వేతనం కోల్పోతారన్నారు. నాయకులను జైల్లో పెట్టి నిర్భందించవచ్చని, యూనియన్ రిజిస్ట్రేషన్, గుర్తింపు రద్దు చేయవచ్చని, లక్షలాది రూపాయల జరిమానా విధించవచ్చన్నారు. మరోవైపు ఇప్పటి వరకు కార్మికుల పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ చెల్లించని యజమానులకు జైలు శిక్ష పడేదని, దానికి భయపడి కట్టేవారన్నారు. యజమానులు జైలుకెళ్తే బెయిల్ రావాలంటే 50 శాతం చెల్లించాల్సి ఉండేదన్నారు. కానీ లేబర్ కోడ్లో యజమానుకు ఈ శిక్షలు ఎత్తివేశారన్నారు. కార్మికుల పాలిట శాపంగా మారే లేబర్కోడ్ల రద్దుకు పోరుబాట పట్టాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు రమణబాబు, సురేష్, హెచ్ఎంఎస్ నాయకుడు మంగయ్య నాయుడు, సిటు గౌరవ అధ్యక్షుడు వీఎస్ పద్మనాభరాజు, త్రినాథరావు, వీడీఎల్బీ అండ్ డాక్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బి. లక్ష్మణరావు, సీఎఫ్టీయూ జాతీయ అధ్యక్షుడు కనకారావు, ఐఎన్టీయూసీ నాయకుడు బి. వెంకట్రావు, సిటు కార్యదర్శి బి. జగన్ తదితరులు పాల్గొన్నారు. -
కోనాం భోగొండమ్మనుదర్శించుకున్న రేగం
చీడికాడ : మండలంలోని కోనాం భోగొండమ్మను అరుకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆదివారం సాయంత్రం దర్శించుకున్నారు. భోగొండమ్మ పండగ మహోత్సవంలో భాగంగా ఆయన కోనాంలో గల బంధువుల ఇంటికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే అనకాపల్లి వైఎస్సార్సీపీ పార్లమెంట్ ఇన్చార్జి కరణం ధర్మశ్రీ, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్ల భాగ్యలక్ష్మిలతో పాటు, వైఎస్స్రా్సీపీ జిల్లా అధికార ప్రతినిధి, సీడీసీ చైర్మన్ సుంకర శ్రీనివాసరావు, మాజీ జెడ్పీటీసీ సలుగు సత్యనారాయణ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. -
‘నీట్’గా.. ప్రశాంతంగా..
సాక్షి, విశాఖపట్నం/మురళీనగర్: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి గాను నీట్ యూజీ–2025 పరీక్ష జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 16 కేంద్రాల్లో 7 వేల మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాశారు. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ పరీక్ష కేంద్రానికి 480 మందిని కేటాయించగా 474 మంది పరీక్ష రాసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కె.నారాయణరావు చెప్పారు. గైస్లోని పరీక్ష కేంద్రానికి 480 మందిని కేటాయించగా 471 మంది పరీక్షకు హాజరైనట్లు చీఫ్ సూపరింటెండెంట్, కాలేజీ ప్రిన్సిపాల్ కె.వెంకటరమణ తెలిపారు. రెండు సెషన్స్లో జరిగిన ఈ పరీక్షను ఎన్టీఏ అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు ఈసారి సమగ్ర విధానాన్ని అనుసరించింది. కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక కేంద్రీకృత కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి.. జిల్లాలో క్షేత్రస్థాయిలో పరీక్షల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించారు. అయితే చెవిదిద్దులు, కాలి మెట్టెలు, చైనులు వంటివి తొలగించిన తర్వా తే పరీక్ష కేంద్రంలోకి అడుగు పెట్టేలా కఠినంగా వ్యవహరించడంతో అమ్మాయిలు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిబంధనల మాదిరే పరీక్ష పత్రం కూడా కఠినంగా ఉన్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఫిజిక్స్ చాలా కష్టతరంగా.. కెమిస్ట్రీ మధ్యస్థంగా.. బయాలజీ చాలా సులభంగా ఉందని విద్యార్థులు పేర్కొన్నారు. ● జిల్లాలో 16 కేంద్రాల్లో నీట్ పరీక్ష -
ఇంకెన్నాళ్లీ నిరీక్షణ?
● జనవరిలో దక్షిణ కోస్తా రైల్వేజోన్కు ప్రధాన మోదీ శంకుస్థాపన ● ఇంతవరకూ భూమి చదునుకు మాత్రమే పరిమితమైన పనులు ● భవన నిర్మాణాలకు మరో రెండేళ్లు పట్టే అవకాశం ● తాత్కాలిక కార్యకలాపాలకు భవనాలున్నా స్పందించని రైల్వే శాఖ ● ఇప్పట్లో జోన్ కార్యకలాపాలు ఉండవంటున్న వాల్తేరు అధికారులురాజకీయాలకు రైల్వే జోన్ బలి! కూటమి నేతల నిర్లక్ష్యం, ఒడిశా రాజకీయాలకు ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నమైన రైల్వే జోన్ పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. కనీసం తాత్కాలిక భవనాల్లో కార్యకలాపాలు ప్రారంభించాలంటూ కూటమి ఎంపీలు గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ రైల్వే మంత్రికి, బోర్డును కానీ కోరడం లేదు. శంకుస్థాపన చేసి నాలుగు నెలలు గడిచినా దీనిపై ఏ ఒక్క కూటమి ఎంపీ నోరు మెదపకపోవడం జోన్ పాలిట శాపంగా మారింది. దీన్ని ఆసరాగా తీసుకొని ఒడిశా పావులు కదుపుతోంది. అత్యధిక ఆదాయం వచ్చే వాల్తేరు డివిజన్ను వదులుకోవడం ఇష్టం లేని ఒడిశాలోని ఈస్ట్కోస్ట్ రైల్వే జోన్ అధికారులు తెర వెనుక రాజకీయాలు నడుపుతున్నారు. అక్కడ రాజకీయ నేతలు కూడా వీరికి సహకరించడంతో.. రైల్వే బోర్డు ఒడిశా ఏం చెబితే అదే చేస్తోంది. ఫలితంగా విశాఖ జోన్ బలవుతూ వస్తోంది. సాక్షి, విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్కు శంకుస్థాపన జరిగి నాలుగు నెలలు.. టెండర్లు ఖరారు చేసి ఐదు నెలలు పూర్తయినా.. ఇంకా భూమి చదును చేసే పనులకే పరిమితమైంది. భవనాలు నిర్మించేందుకు మరో రెండేళ్ల సమయం పట్టేలా కనిపిస్తోంది. తాత్కాలిక కార్యకలాపాలకు భవనాలు సిద్ధంగా ఉన్నా రైల్వే శాఖ మాత్రం ముందుకు రావడంలేదు. గతంలోనే ఇక్కడ ఉన్న భవనాల జాబితాను వాల్తేరు అధికారులు పంపించినా.. స్పందించకపోవడం చూస్తుంటే మరో రెండేళ్ల పాటు జోన్ కార్యకలాపాలు మొదలవ్వవేమోనన్న అనుమానాలు బలపడుతున్నాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు 2019లో కేంద్రం పచ్చజెండా ఊపింది. జోన్కు సంబంధించిన డీపీఆర్ని అదే ఏడాది చివర్లో ఇచ్చేసినా రాజకీయ కక్షతో ముందడుగు వేయలేదు. 2024 ఎన్నికల అనంతరం నవంబర్లో టెండర్లు ఆహ్వానించారు. జనవరిలో ప్రధాని చేతుల మీదుగా జోన్ భవనాలకు శంకుస్థాపన చేశారు. అయినా ముడసర్లోవలో భూమి చదును చేసే పనుల్లోనే ఇంకా రైల్వే శాఖ నడిపిస్తోంది. ఈ భూములను తాము సాగుచేసుకుంటున్నామని స్థానికులు ఆందోళన చేయగా.. కూటమి నేతలు రంగంలోకి దిగి జోన్ భవనం వచ్చిన తర్వాత.. అందులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి వారిని శాంతింపజేశారు. అయినా.. ఇంకా చదును పనులే సా..గుతున్నాయి. తాత్కాలికానికి భవనాలు సిద్ధంగా ఉన్నా..! బిల్డింగ్ నిర్మాణంతో పనిలేకుండా జోన్ కార్యకలాపాలు ప్రారంభించాలని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. తాత్కాలిక కార్యాలయంగా ప్రస్తుతం ఉన్న వాల్తేరు డీఆర్ఎం కార్యాలయాన్ని వినియోగించుకోవచ్చు. ఈ విషయాన్ని ఇప్పటికే సౌత్ కోస్ట్ జోన్ ఓఎస్డీ.. తాను సమర్పించిన జోన్ డీపీఆర్లోనూ పొందుపరిచారు. రైల్వేస్టేషన్ పునర్నిర్మాణంలో భాగంగా స్టేషన్ బయట ‘గతిశక్తి’ పథకంలో భాగంగా 4 అంతస్తుల భవనాలు రెండు నిర్మించారు. ఒక్కో అంతస్తులో 4,500 చదనపు అడుగుల స్థలం అందుబాటులో ఉంది. కింద గ్రౌండ్ ఫ్లోర్తో కూడా కలుపుకొంటే దాదాపు 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన కొత్త భవనాలు ఉన్నాయి. తాత్కాలిక కార్యకలాపాలు చేపట్టేందుకు గెజిట్ విడుదల చేయాల్సి ఉన్నా బోర్డు నుంచి ఎలాంటి సూచనలు కనిపించడం లేదని వాల్తేరు అధికారులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితమే తాత్కాలిక భవనాల జాబితా పంపించామని, ఇప్పటికీ అతీగతి లేకపోవడం చూస్తే ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు. కూటమి ఎంపీలు, ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని విశాఖవాసులు కోరుతున్నారు. జీఎం నియామకం ఎప్పుడో..? రైల్వే జోన్ కార్యకలాపాలను ప్రారంభించడానికి రైల్వేశాఖ మీనమేషాలు లెక్కిస్తోంది. రెండేళ్లలో జోనల్ కార్యాలయ నిర్మాణం పూర్తి చేసి, ఆ తరువాత ఆపరేషన్లు ప్రారంభిస్తామని సాకులు చెబుతోంది. ఇప్పటివరకు ప్రకటించిన రైల్వే జోన్లలో ఎక్కడా.. ఈ తరహా పరిస్థితులు కనిపించలేదు. జోన్ ప్రకటించిన తరువాత కార్యకలాపాల్ని తాత్కాలిక భవనాల్లో ప్రారంభించి.. కొత్త భవనాల నిర్మాణం అనంతరం అక్కడికి మార్చేవారు. కానీ విశాఖ జోన్ విషయంలో మాత్రం ఆది నుంచీ పూర్తి విరుద్ధంగా సాగుతోంది. కొత్త భవన నిర్మాణాలు చేపట్టిన తర్వాతే ఆపరేషన్లు ప్రారంభిస్తామంటూ రైల్వేశాఖ చెబుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే నుంచి విడదీసిన గుంటూరు, గుంతకల్, విజయవాడ డివిజన్లను, విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్ను కలిపి ‘దక్షిణ కోస్తా’ జోన్గా ప్రకటించారు. దాదాపు ఏపీ మొత్తం ఈ జోన్లోనే ఉండటంతో రాష్ట్రమంతటికీ సేవలందనున్నాయి. కొత్త రైళ్లు కావాలన్నా, రైల్వే లైన్లు కావాలన్నా జోనల్ అధికారులే ప్రతిపాదనలు పెట్టాలి. ఇది జరగాలంటే జోన్కు తొలుత జనరల్ మేనేజర్(జీఎం) నియామకం చేపట్టాలి. ఈ విషయంలోనూ బోర్డు స్పందించడం లేదు. -
బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు వేళాయె
● నేటి నుంచి ఉత్సవాలకు అంకురార్పణ ● ముస్తాబైన పెందుర్తి వెంకటాద్రిపెందుర్తి: బ్రహ్మాండ నాయకుడు కొలువుదీరిన పెందుర్తి వెంకటాద్రి బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. వైశాఖ శుద్ధ దశమి ఎంతో పవిత్రమైన రోజు. శ్రీనివాసుడు పద్మావ తి అమ్మవారిని వివాహమాడేందుకు భూమిపై అడుగుపెట్టిన ఈ శుభ ముహూర్తాన, వెంకటా ద్రి నిర్మాణానికి తొలి అంకురార్పణ జరిగింది. ఈ నేపథ్యంలో, ఏటా వైశాఖ శుద్ధ దశమి నాడు బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ. సోమవారం నుంచి వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరగనున్నాయి. ఉత్సవాల తొలి రోజు విష్వక్సేన పూజ, అంకురార్పణతో వేడుకలు ప్రారంభమవుతాయి. మంగళవారం ఉదయం ధ్వజారోహణ, ప్రత్యేక హోమాలు నిర్వహిస్తారు. సాయంత్రం లక్ష తులసి, మల్లికా పుష్పాలతో స్వామివారికి విశేష అర్చనలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం, వైశాఖ శుద్ధ దశమి అయిన బుధవారం సాయంత్రం శ్రీ వేంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరగనుంది. గురువారం సాయంత్రం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగుతుంది. వెంకటాద్రి నుంచి పెందుర్తి పురవీధుల్లో రథంపై ఊరేగు తూ, చినముషిడివాడ సప్తగిరినగర్లోని అలివేలు మంగమ్మ సన్నిధి వరకు స్వామివా రు భక్తులకు దర్శనమిచ్చి ఆశీర్వదిస్తారు. శుక్రవారం ఉదయం చక్రస్నానం, చక్రత్తాళ్వా రులతో కలిసి స్వామివారు దివ్య స్నానమాచరిస్తారు. సాయంత్రం పుష్పయాగం, మహా పూర్ణాహుతి, ద్వాదశారాధన, ప్రత్యేక అర్చనలు, ఊంజల్ సేవతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి అని ఆలయ ప్రతినిధులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఉత్సవాల కోసం ఆలయ ప్రాంగణమంతా ప్రత్యేకం గా అలంకరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
ఆ.. 2,865 టికెట్లు ఎవరికిచ్చారు?
● చందనోత్సవం టికెట్ల లెక్కల్లో భారీ తేడా ● అధికారిక లెక్కలకు, వాస్తవానికి వ్యత్యాసం ● అంతరాలయ దర్శనంపైనా విమర్శలు సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి చందనోత్సవం టికెట్ల విక్రయాలు, దర్శనాల నిర్వహణకు సంబంధించి దేవస్థానం విడుదల చేసిన జాబితాలో పలు వ్యత్యాసాలు, అస్పష్టతలు ఉన్నాయి. ముఖ్యంగా టికెట్ల సంఖ్య, తెల్లవారుజామున కల్పించిన అంతరాలయ దర్శనాల విషయంలో అధికారుల లెక్కలపై భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సింహాచలం దేవస్థానం ఈవో కె. సుబ్బారావు పేరిట ఆదివారం విడుదలైన జాబితా ప్రకారం.. ఈ ఏడాది చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్లు ఆఫ్లైన్లో 15,495, ఆన్లైన్లో 7,591 కలిపి మొత్తం 23,086 విక్రయించారు. అలాగే రూ.1000 టికెట్లు ఆఫ్లైన్లో 13,803, ఆన్లైన్లో 3,999 కలిపి మొత్తం 17,802 జారీ చేశారు. రూ.1500 టికెట్లు కేవలం ఆఫ్లైన్లో 3,000 విక్రయించినట్లు పేర్కొన్నారు. వీటికి అదనంగా 496 అంతరాలయ టికెట్లుగా చూపించారు. ఈ లెక్కల ప్రకారం మొత్తంగా 44,384 టికెట్లు విక్రయించినట్లు జాబితాలో ఉంది. అయితే గత నెల 24 నుంచి 29 వరకు రోజువారీగా టిక్కెట్ల విక్రయాల జాబితాను పరిశీలిస్తే.. మొత్తం 41,519 టికెట్లు మాత్రమే అమ్ముడైనట్లు పేర్కొన్నారు. దీంతో దేవస్థానం విడుదల చేసిన మొత్తం లెక్కకు, రోజువారీ లెక్కలకు మధ్య 2,865 టికెట్ల వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా.. తెల్లవారుజామున అంతరాలయ దర్శనం కేవలం 496 మందికి మాత్రమే కల్పించినట్లు అధికారులు చూపించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చందనోత్సవం రోజు ఉదయం చాలా మందిని అంతరాలయ దర్శనానికి అనుమతించినట్లు భక్తులు, స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. వారి అంచనా ప్రకారం అంతరాలయ దర్శనం పొందిన వారి సంఖ్య వెయ్యికి పైగానే ఉంటుందని అంటున్నారు. దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త, టీటీడీ నుంచి పట్టు వస్త్రాలు సమర్పించేవారు, మంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు మాత్రమే ఉచితంగా అంతరాలయ దర్శనం కల్పిస్తామని దేవస్థానం ఈవో కె.సుబ్బారావు ప్రకటించారు. తీరా ఈవో ప్రకటనకు, క్షేత్రస్థాయిలో పరిస్థితికి పొంతనే లేకుండా పోయింది. గత ఏడాదితో పోలిస్తే టిక్కెట్ల విక్రయాలు పెరిగినట్లు దేవస్థానం పేర్కొంది. 2024లో మొత్తం 32,461 టికెట్లు విక్రయించగా, ఈ సంవత్సరం 44,384 టికెట్లు అమ్ముడైనట్లు తెలిపింది. రూ.300, రూ.1000 టికెట్లలో గత ఏడాది కంటే ఈ ఏడాది అదనంగా 12,889 టికెట్లు విక్రయించామని పేర్కొంది. గత ఏడాది ఆన్లైన్లో రూ.300, రూ.1000 టికెట్లు కలిపి 8,216 విక్రయించగా, ఈ ఏడాది 11,590 అమ్ముడైనట్లు నివేదించారు. అంటే ఆన్లైన్లో 3,374 టికెట్లు అదనంగా విక్రయించామని చెబుతున్నారు. అయితే రూ.1000 టికెట్లు తొలిరోజు మాత్రమే ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని, మిగతా ఏ రోజుల్లోనూ ఆ టికెట్లు లభించలేదని భక్తులు వాపోతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పారదర్శకత కొరవడిందని విమర్శిస్తున్నారు. -
బాలికలకు నృత్య శిక్షణ ప్రారంభం
సాక్షి,పాడేరు: పట్టణంలోని గిరి కై లాస క్షేత్రం ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో బాలికలకు భరత నాట్యం, కూచిపూడి నృత్యంశిక్షణ తరగతులను ఆదివారం ప్రారంభించారు. హైదరాబాద్కు చెందిన శ్రీనృత్యాంజలి అకాడమి భరతనాట్య శిక్షకులు చైతన్య ప్రభు ఆధ్వర్యంలో తొలిరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల సీతారామశాస్త్రి, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఉప్పల వెంకటరత్నం, ఆధ్యాత్మిక మహిళా సేవాబృందం సభ్యులు మయూరి, సత్యవతి, నిర్మల, జ్యోతి పాల్గొన్నారు. -
నూకాంబిక ఆలయానికి పోటెత్తిన భక్తులు
అనకాపల్లి: నూకాంబిక అమ్మవారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే జిల్లా నలుమూలల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో వంటలు వండి అమ్మవారికి నైవేద్యం సమర్పించి, సహపంక్తి భోజనం చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు ఉచితంగా తాగునీరు, మజ్జిగ, అమ్మవారి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఆలయ ఈవో వెంపలి రాంబాబు, ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను(గొల్లబాబు) ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బాలింతలకు, చిన్నారులకు ఉచితంగా పాలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, ధర్మకర్తలు మజ్జి శ్రీనివాసరావు, కాండ్రేగుల రాజారావు, మారిశెట్టి శంకరరావు, పోలిమేర ఆనంద్, దాడి రవికుమార్, సూరే సతీష్, ఎర్రవరపు లక్ష్మి, వడ్డాది మంగ, కోనేటి సూర్యలక్ష్మి, భక్తులు పాల్గొన్నారు. -
అప్పన్నకు విశేషంగా ఆర్జిత సేవలు
సింహాచలం (విశాఖ): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఆదివారం ఆర్జిత సేవలు విశేషంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణ పుష్పార్చన కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణ మండపంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై కొలువుదీర్చారు. అర్చకులు విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహించారు. అనంతరం, 108 స్వర్ణ సంపెంగ పుష్పాలతో స్వామివారికి అష్టోత్తర శతనామా వళి పూజ భక్తిశ్రద్ధలతో చేశారు. ఈ ఆర్జిత సేవలో పాల్గొన్న ఉభయదాతలకు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదం అందజేశారు. అంతేకాకుండా ఆదివారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి నిత్య కల్యాణోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం 9:30 గంటల నుంచి ఆలయ కల్యాణ మండపంలో ఈ వేడుకను నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేదికపై వేంచేపచేశారు. వేద పండితులు విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు వంటి ఘట్టాలతో శాస్త్రోక్తంగా కల్యాణాన్ని జరిపించారు. -
గురుకుల ఉపాధ్యాయులకు ఆంగ్ల బోధనపై శిక్షణ
సీతంపేట (విశాఖ): ఆంగ్ల ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యం పెంపొందించే దిశగా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం శంకరమఠం రోడ్డులోని ఒక హోటల్లో ప్రారంభించింది. ఈ సందర్భంగా సొసైటీ డీసీవో డాక్టర్ సి.ప్రభావతమ్మ మాట్లాడుతూ గురుకుల ఉపాధ్యాయుల్లో ఇంగ్లిష్ బోధనా సామర్థ్యం మెరుగుపర్చడానికి ముంబైకి చెందిన కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్తో ఎంవోయూ చేసుకున్నట్టు తెలిపా రు. కమ్యూనికేటివ్ ఇంగ్లిష్, ఫ్యూచర్ రెడీనెస్ అంశంపై మూడు రోజుల శిక్షణ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. గురుకుల ఉపాధ్యాయులకు ప్రిన్సిపాల్ ఎన్.రామకృష్ణ, కోటక్ ఫౌండేషన్ ప్రతినిధులు నూథన్, ఫర్జిత్ పంతక్, జ్యోతి శిక్షణ ఇచ్చారు. -
ఈదురుగాలులతో భారీ వర్షం
పెదబయలు: మండలంలో శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆదివారం కూడా ఉదయం 6 గంటల నుంచి 10.30 గంటల వరకు ఎడతెరిపి లేకుండా కురిసింది. ఈదురుగాలులకు పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇటీవల కాలంలో ఏమాత్రం వర్షం కురిసినా విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. విద్యుత్ సిబ్బందికి ఫోన్ చేసినా స్పందించడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ రాజవొమ్మంగి: మండలంలోని రేవటిపాలెం సమీపంలో ఈదురుగాలులు, భారీ వర్షానికి పడిపోయిన విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించే పనుల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు. శనివారం వీచిన ఈదురుగాలులకు ఈ ప్రాంతంలో మూడు స్తంభాలు ఒరిగిపోవడంతో వైర్లు తెగిపోవడం తెలిసిందే. ఆదివారం వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా యంత్రాల సాయంతో విద్యుత్ స్తంభాల పునరుద్ధణ పనులను సిబ్బంది చేపట్టారు. విద్యుత్శాఖ ఏఈ దొర పర్యవేక్షించారు. కొయ్యూరు: భారీ వర్షానికి మండలంలోని లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తూనే ఉంది. మండల కేంద్రంలో వారపు సంతకు తక్కువ మంది వ్యాపారులు వచ్చారు. ఈదురుగాలుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్డుకు అడ్డంగా కూలిన భారీ వృక్షం పాడేరు రూరల్: మండలంలో ఆదివారం ఈదురుగాలులతో కురిసిన వర్షానికి దేవాపురం – తర్గం మార్గంలో భారీ మామిడి చెట్టు రోడ్డుకు అడ్డంగా విరిగిపడింది. దీంతో ఆ రెండు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. అధికారులు చెట్టు తొలగింపు పనులు చేపట్టకపోవడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించేవారు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కూలిన చెట్టును తొలగించాలని వారు కోరుతున్నారు. -
మత్స్యమాడుగులమ్మ జాతర ఉత్సవాలు ప్రారంభం
జి.మాడుగుల: మండల కేంద్రంలో గంత కొండపై కొలువైన శ్రీమత్స్య మాడుగులమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక మాజీ ఎంపీ దివంగత మత్స్యరాస మత్స్యరాజు స్వగృహం నుంచి మాజీ మంత్రులు మత్స్యరాస బాలరాజు, ఎం.మణికుమారి, భక్తులు కలసి డప్పు వాయిద్యాల నడుమ ఘటాలను, పూర్వీకులు వినియోగించిన నాటుతుపాకీ, ఖడ్గాన్ని ఊరేగింపుగా సతకంపట్టు వద్దకు తీసుకువెళ్లి ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మత్స్యరాస రామరాజు, ప్రధాన కార్యదర్శి గసాడి రెడ్డిబాబు, మాజీ ఎంపీపీ, ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షుడు మత్స్యరాస వెంకటగంగరాజు (బుజ్జి), మాజీ ఎంపీపీ వరహాలమ్మ, ఎంపీటీసీ మత్స్యరాస విజయకుమారి, పాడేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ ఎం.గాయత్రి, సొలభం సర్పంచ్ హనుమంతరావు,హెల్త్ అసిస్టెంట్ ఎం లక్ష్మీపతిరాజు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు నాగరాజు, అర్జునరావు, గిరిజన పూజారి కిముడు శివందొర తదితరులు పాల్గొన్నారు. ఘనంగా రేణుకా ఎల్లమ్మ అమ్మవారి జాతర అడ్డతీగల: మండలంలోని వేటమామిడిలో వేంచేసిన శ్రీ చిన్నమస్తా రేణుకా ఎల్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి.ఆలయ ప్రధాన అర్చకుడు ముర్ల రాజారెడ్డి ఆధ్వర్యంలో వేకువజామునే శ్రీ చిన్నమస్తా రేణుకా ఎల్లమ్మ, దక్షిణ కాశీ అమ్మవార్లకు, కదంబ ఈశ్వరుడికి అభిషేకాలు నిర్వహించారు. క్షేత్ర ఆవరణలో దేవతలు, క్షేత్ర శక్తులకు శిఖర పూజ జరిపించారు. అనంతరం ఆలయం ఎదురుగా వేదమంత్రోచ్ఛరణల మధ్య మహా గణపతి హోమం జరిగింది. మధ్యాహ్నం నుంచి 21 మంది నూతన జంటలకు అమ్మవారి సన్నిధిలో కల్యాణాలు జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఘనంగా మోదకొండమ్మ జాతర ప్రారంభం హుకుంపేట: గిరిజనుల ఆరాధ్య దైవం మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఆదివారం హుకుంపేటలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఘటాలను ఊరేగింపుగా సతకంపట్టు వరకు మోసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మూడు రోజులపాటు నిర్వహించే జాతర మహోత్సవాలను భక్తులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ సన్యాసి నాయుడు, సర్పంచ్ సమిడ వెంకటపూర్ణిమ, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పాంగి అనిల్ పాల్గొన్నారు. -
తప్పుడు వ్యాఖ్యలు మానుకోవాలి
పాడేరు రూరల్: బందులు, దీక్షలు చేస్తున్న వారిపై టీడీపీకి చెందిన సర్పంచ్ పాంగి పాండురంగస్వామి హేళన చేస్తు తప్పుడు వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కూడ సురేష్కుమార్ హెచ్చరించారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక డీఎస్సీతో గిరిజన నిరుద్యోగ అభ్యర్థులకు మేలు కలుగుతుందని ఉద్దేశంతో మద్దతు ఇస్తూ ఆదివాసీ ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాలు ధర్నాలు చేస్తుంటే.. తిన్నది అరగక దీక్షలు, బంద్లు చేస్తున్నారని టీడీపీకి చెందిన సర్పంచ్ పాంగి పాండురంగస్వామి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. పాండురంగ నీవు కూడా ఓ గిరిజనుడు అని మర్చిపోయి పనికిమాలిన ప్రకటనలు చేయడం భావ్యం కాదని.. మీ నాయకుడు చంద్రబాబు జీవో నెంబరు–3 పునరుద్ధరణ, ఆదివాసీలకు ప్రత్యేక డీఎస్సీపై ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. నైతిక హక్కు ఉంటే బంద్కు మద్దతు ఇవ్వాలన్నారు. కూటమి ప్రభుత్వం దొంగ హమీలు ఇచ్చి ప్రజలకు మోసం చేసిందన్నారు. గిరిజన చట్టాలు, హక్కులను నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు.సర్పంచ్ పాండురంగస్వామి వ్యాఖ్యలపై ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ నేతలు -
గైనకాలజిస్ట్ నియామకం
చింతపల్లి: స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఎట్టకేలకు గైనకాలజిస్ట్ను నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆస్పత్రిలో ముగ్గురు గైనకాలజిస్ట్ పోస్టులు ఉండగా ఒక్కరే ఉన్నారు. ఆమె కూడా ప్రసూతి సెలవులో ఉన్నందున గిరిజన మహిళలు వైద్యసేవలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మైదాన ప్రాంతానికి చెందిన ౖవైద్యులను డిప్యూటేషన్పై నియమిస్తూ వైద్యసేవలు అందిస్తున్నారు. తాజా నియామకాల్లో భాగంగా ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఒకదానిని భర్తీ చేశారు. ఈ మేరకు నియమితులైన గైనకాలజిస్ట్ వాసవి శనివారం విధుల్లో చేరారు. గాయత్రి వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసినట్టు ఆమె తెలిపారు. -
‘లేటరైట్’ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా
గూడెంకొత్తవీధి: ప్రత్యేక డీఎస్సీ ఏర్పాటు కోరుతూ గిరిజనులు చేపట్టిన నిరవధిక బంద్ ప్రభావం డొకులూరు జరగాల్సిన లేటరైట్ ప్రజాభిప్రాయ సేకరణ శిబిరంపై చూపింది. బంద్ కారణంగా అధికారులు హాజరుకాలేకపోవడంతో వాయిదా పడింది. డొకులూరులో లేటరైట్ కోసం పలువురు దరఖాస్తు చేసుకోవడంతో దీనిపై అదే ప్రాంతంలో శనివారం ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేశారు. నిరవధిక బంద్ కారణంగా అధికారులు రాలేకపోయారని తహసీల్దార్ టి.రామకృష్ణ తెలిపారు. అందువల్ల వాయిదా పడిందని త్వరలో మరో తేదీని ప్రకటించి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామని ఆయన వివరించారు. అధికారులు రాలేకపోవడంతో గిరిజన సంఘాల నేతలు, రైతులు వెనుదిరిగారు.నిరవధిక బంద్ వల్ల రాలేకపోయిన అధికారులు -
1,500లకు పైగా ప్రదర్శనలిచ్చాం
బీఎస్ఎన్ఎల్ ఉద్యోగిగా పనిచేస్తూ 2000లో విశాఖ హ్యూమర్ క్లబ్ను స్థాపించాను. హాస్యవల్లరి పేరుతో ప్రతి నెలా రెండో ఆదివారం ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో క్రమం తప్పకుండా మూడు గంటల పాటు కార్యక్రమం నిర్వహిస్తూ.. నవ్వులు పూయిస్తున్నాం. ఇప్పటి వరకు దాదాపు 1,500కు పైగా ప్రదర్శనలు ఇచ్చాం. క్లబ్ సభ్యులే కాకుండా, ప్రేక్షకులను కూడా భాగస్వాములను చేస్తూ.. వారితో జోకులు చెప్పించి ప్రోత్సహిస్తున్నాం. నా సహోద్యోగులనే క్లబ్ సభ్యులుగా ఎంచుకున్నాను. మా కార్యదర్శి, నా సహోద్యోగి ఎస్.ఎస్.రామానుజం, సభ్యులు ఆర్.ఎస్.ఎన్.మూర్తి (విశ్రాంత తహసీల్దార్), ఇ.భానుప్రకాష్ (మెడికల్ రిప్రజెంటేటివ్), టీవీ కళాకారిణి ఎం.శివజ్యోతి, కె.నాగగణేష్, సూర్యం క్లబ్లో కీలక సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. తీరిక సమయాల్లో స్కిట్స్ రూపకల్పన చేసి.. ప్రాక్టీస్ చేసి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నాం. – రావి గోపీకృష్ణ, విశాఖ హ్యూమర్ క్లబ్ అధ్యక్షుడు -
వీడిన గిరిజనుడి అదృశ్యం కేసు మిస్టరీ
డుంబ్రిగుడ: గిరిజనుడి అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ పాపినాయుడు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గసభ పంచాయతీ లోగిలి గ్రామానికి చెందిన కొర్రా నాగేశ్వరరావు (38) అనే గిరిజనుడు ఈనెల ఒకటో తేదీన పంతలచింతలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆ తరువాత అతని ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఈనెల 2న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిలో భాగంగా నాగేశ్వరరావు సెల్ఫోన్ ఆధారంగా లొకేషన్ కురిడిలోని రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్నట్టుగా గుర్తించారు. ఈ మేరకు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా దుర్వాసనతో నాగేశ్వరరావు మృతదేహం వెలుగుచూసిందని, అదే ప్రాంతంలోని తుప్పల్లో అతని బైక్ను గుర్తించామని ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అరకు ఏరియా ఆస్పత్రికి తరలించామని ఆయన చెప్పారు. చెట్టును బైక్తో ఢీకొని ప్రమాదానికి గురై మృతి చెందినట్టు ప్రాథమికంగా గుర్తించామని ఎస్ఐ వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. బంధువుల ఇంటికి వెళ్లిన వ్యక్తి కనిపించకపోవడంతో కేసు నమోదు చేసిన పోలీసులు అతని సెల్ఫోన్ ఆధారంగా లొకేషన్ గుర్తింపు కురిడి రైల్వే ట్రాక్ సమీపంలో మృతదేహం, బైక్ లభ్యం బైక్తో చెట్టును ఢీకొని మృతి చెందినట్టుగా పోలీసులు వెల్లడి -
నవ్వు గురూ..
నవ్వులు పూయిస్తున్న హాస్య క్లబ్లు ఆధునిక జీవితంలో ఒత్తిడి పెరిగిపోయి.. మనిషి నవ్వుకు దూరమవుతున్నాడు. టీవీ, మొబైల్ ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత కుటుంబ సభ్యులు, పిల్లలు, స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ నవ్వడమే మరిచిపోయాం. కానీ నవ్వు మన ఆరోగ్యానికి అత్యవసరం. ఇది ఒక టానిక్లా పనిచేస్తుంది. వైద్యుల ప్రకారం నవ్వడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కేవలం 10 నిమిషాలు నవ్వితే రెండు గంటల నడకతో సమానమైన శక్తి లభిస్తుంది. నవ్వినప్పుడు మూడు వేల నాడులు పనిచేస్తాయి. నవ్వు మెదడులో ‘గామా ఇంటర్ఫెరాన్’ అనే హార్మోన్ను విడుదల చేసి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మనిషి శిశువుగా ఉన్నప్పుడు రోజుకి 325 సార్లు నవ్వితే.. ఊహ తెలిసిన తర్వాత 200 సార్లు, యుక్త వయసులో 50 సార్లు నవ్వుతాడని.. పెద్దయ్యాక రోజుకు కనీసం మూడు సార్లు నవ్వడం కష్టమని సర్వేలు చెబుతున్నాయి. దీనిని బట్టి మనిషి నవ్వుకు ఎంతగా దూరమయ్యాడో అర్థమవుతుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకుని, ఆరోగ్యంగా ఉండటానికి నవ్వండి, నవ్వించండి, నవ్వుతూనే ఉండండి.. సీతంపేట: నవ్వితే హ్యాపీ.. నవ్వకపోతే బీపీ! ఇది నేటి ఆరోగ్య మంత్రం. నవ్వు ఒకప్పుడు నాలుగు విధాల చేటు అనుకునేవారు కానీ, ఆధునిక వైద్యులు నవ్వు నలభై విధాల గ్రేటు అంటున్నారు. నవ్వు కేవలం పెదవులపై పుట్టే భావం కాదు. అది ఒక శక్తివంతమైన ఔషధం. సానుకూల దృక్పథం. నవ్వు ఆరోగ్యానికి మూలం. చిరునవ్వుతో ఏదైనా సాధించవచ్చని పెద్దలు చెప్పే మాట అక్షర సత్యం. నవ్వు ప్రాముఖ్యతను గుర్తుచేయడానికి నగరంలోని విశాఖ హ్యూమర్ క్లబ్, లాఫ్టర్స్ ఫన్ క్లబ్, ఫ్రెండ్స్ కామెడీ క్లబ్, క్రియేటివ్ కామెడీ క్లబ్, హాస్యప్రియ కామెడీ క్లబ్లు కృషి చేస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూనే కొంత మంది స్నేహితులు క్లబ్లుగా ఏర్పడి నెలలో నాలుగు ఆదివారాలు నవ్వులు పూయిస్తున్నారు. ఏటా మే మొదటి ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ ఆదివారం ‘నవ్వు ఒక భాష’ అనే థీమ్తో ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఫ్రెండ్స్ కామెడీ క్లబ్ ఆధ్వర్యంలో, అల్లూరి విజ్ఞాన కేంద్రంలో లాఫ్టర్స్ ఫన్ క్లబ్ ఆధ్వర్యంలో నాన్స్టాప్ కామెడీ కార్యక్రమాలు జరగనున్నాయి. నవ్వు.. ఎందుకంటే.. -
ఒత్తిడి దూరం చేసే గొప్ప మందు నవ్వు
నవ్వుల్లో గిన్నిస్ రికార్డ్ రకరకాల ఒత్తిళ్లతో మనిషి నవ్వుకు దూరమయ్యాడు. మానసిక ఒత్తిడిని దూరం చేసి.. రెండు మూడు గంటల పాటు నవ్వించే లక్ష్యంతో 2008లో ఐదుగురు స్నేహితులతో కలిసి ‘లాఫ్టర్స్ ఫన్ క్లబ్’ను స్థాపించాను. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించి, ఉల్లాసం అందించేందుకు మా కామెడీ క్లబ్ కృషి చేస్తోంది. స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం చేస్తూనే.. నవ్వించడాన్ని ఒక ప్రవృత్తిగా మార్చుకున్నాను. ఇప్పటి వరకు రెండు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాం. ఒక గంట వ్యవధిలో 654 జోకులు చెప్పి 2013లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించాను. 2011లో 35 గంటల పాటు నిర్విరామంగా జోకులు చెప్పి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం పొందాను. 2015లో ఒక్క నిమిషంలో 37 జోకులు చెప్పి మరో లిమ్కా బుక్ రికార్డును సైతం సాధించాను. ఇలా చాలా అవార్డులు, సత్కారాలు అందుకున్నాను. విశాఖలో ప్రత్యేకంగా ఐదారు కామెడీ క్లబ్లు ప్రజలను నవ్వించడం కోసం స్వచ్ఛందంగా కృషి చేస్తున్నాయి. మా క్లబ్ ప్రదర్శించే నాన్స్టాప్ కామెడీ కోసం ఆదివారం సాయంత్రం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసే ప్రేక్షకులు ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. నేను, క్లబ్ అధ్యక్షుడు జి.వి.త్రినాథ్, పి.కె.దుర్గాప్రసాద్, ఎన్.ఎస్.ఆర్. కృష్ణారావు, మల్లిక, రమ జోషిత కలిసి స్కిట్స్ ప్రదర్శిస్తుంటాం. –కోరుకొండ రంగారావు, లాఫ్టర్స్ ఫన్ క్లబ్ వ్యవస్థాపక కార్యదర్శి నేడు ప్రపంచ నవ్వుల దినోత్సవం -
గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం
తగరపువలస/మధురవాడ: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) నిర్వహిస్తున్న గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు శనివారం జిల్లాలో ప్రారంభమయ్యాయి. జిల్లాలోని పరీక్ష కేంద్రాల్లో మొదటి రోజు పరీక్ష సజావుగా జరిగింది. ఆనందపురం మండలం పాలవలస పంచాయతీ గుడిలోవలోని ఏక్యూజే స్టడీస్ సెంటర్ను 600 మంది అభ్యర్థులకు కేటాయించగా తొలి పేపర్కు 370 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించారు, అదనంగా 15 నిమిషాల గ్రేస్ సమయం కూడా ఇచ్చారు. కొందరు అభ్యర్థులు హాల్ టికెట్లు, ఐడీ కార్డులు మరచిపోగా.. నిర్వాహకులు వారికి డౌన్లోడ్ చేయించి అనుమతించారు. అయితే పరీక్ష కేంద్రం చిరునామా పాలవలసకు బదులుగా గండిగుండంగా పేర్కొనడంతో కొద్దిమంది అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. కేంద్రం వద్ద ఆనందపురం లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అలాగే పీఎంపాలెంలోని సాంకేతిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో కూడా గ్రూప్–1 మెయిన్స్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఇక్కడ 590 మంది అభ్యర్థులకు కేటాయించగా.. 389 మంది హాజరయ్యారు. రూమ్ నంబర్లను సూచించే బోర్డులు చిన్నవిగా ఉండటంతో అభ్యర్థులు గదులను వెతుక్కోవడానికి కొంత ఇబ్బంది పడ్డారు. అలాగే మెయిన్ గేట్ నుంచి పరీక్ష గదులు సుమారు 200 మీటర్ల దూరం ఉండటంతో.. దివ్యాంగులు, గర్భిణులు నడవటానికి ఇబ్బంది పడ్డారు. సెల్ ఫోన్లు, వాచీలు వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. -
ప్రేక్షకులకు ఉచితంగా వినోదం
విశాఖ ప్రజలకు ఉచితంగా వినోదం అందించాలన్న లక్ష్యంతో నేవల్ డాక్యార్డులో ఉద్యోగం చేస్తూ.. 2012 నవంబర్లో హాస్యప్రియ కామెడీక్లబ్ స్థాపించాను. క్లబ్ కార్యదర్శిగా కొనసాగుతున్నాను. ఇప్పటి వరకు రెండు వేలకు పైగా కామెడీ షోలు ప్రదర్శించాం. ఏయూలో థియేటర్ ఆర్ట్స్లో యాక్టింగ్, డైరక్టర్ కోర్సు పూర్తి చేసి.. నగర శివార్లలో ఎక్కువగా కామెడీ షోలు నిర్వహిస్తుంటాను. రెండేళ్లుగా నగరంలో ప్రతి నెలా నాలుగో ఆ దివారం ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో కా మెడీ స్కిట్స్ ప్రదర్శించి.. ప్రేక్షకులను నవ్విస్తున్నాం. – ఇమంది ఈశ్వరరావు, హాస్యప్రియ కామెడీ క్లబ్ వ్యవస్థాపకుడు -
ప్రతి నెలా హైదరాబాద్ నుంచి వస్తా..
వృత్తిపరంగా ఆంధ్రా బ్యాంకులో సీనియర్ మేనేజర్గా ఉద్యోగం చేస్తూ.. ఒత్తిడి నుంచి రిలాక్స్ అవ్వడానికి అప్పట్లో విశాఖ హ్యూమర్ క్లబ్ నిర్వహించే కామెడీ షోకు హాజరయ్యేవాడిని. వారి ప్రదర్శనకు ఆకర్షితుడినై చాలా సార్లు సాయం అందించాను. స్నేహితుల సలహాతో 2012లో స్వయంగా ఫ్రెండ్స్ కామెడీ క్లబ్ స్థాపించాను. వినోదవల్లరి పేరుతో ప్రతి నెలా మొదటి ఆదివారం విశాఖ పౌరగ్రంథాలయంలో రెండు గంటల సేపు కామెడీ స్కిట్స్ ప్రదర్శిస్తున్నాం. ఐదేళ్లుగా హైదరాబాద్, గోదావరిఖనిలో కూడా ప్రదర్శనలిస్తున్నాం. దాదాపు రెండు వేలకు పైగా ప్రదర్శనలు పూర్తి చేశాం. బ్యాంకు సీనియర్ మేనేజర్గా పదవీ విరమణ చేశాక హైదరాబాద్లో స్థిరపడ్డాను. అయినా హాస్యంపై మక్కువతో ప్రతి నెలా మొదటి ఆదివారం విశాఖ వచ్చి.. క్లబ్ ద్వారా కామెడీ స్కిట్స్ ప్రదర్శించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నాను. క్లబ్ కార్యదర్శి ఎస్.వి.రాజేశ్వరి, జబర్దస్త్ ప్రకాష్, డేవిడ్ రాజు, కుమారి, పోర్టు శేషు, పుష్యమి, నాయుడు, వెంకటేశ్వరరావులతో కలిసి కామెడీ స్కిట్స్ ప్రదర్శిస్తున్నాను. –ఎం. వి.సుబ్రహ్మణ్యం, ప్రెండ్స్ కామెడీ క్లబ్ అధ్యక్షుడు -
ముమ్మరంగా పోలీసుల తనిఖీలు
వై.రామవరం: మండలంలోని చీడిమానువీధి సమీపంలోని ప్రధాన రహదారిలో సీఐ బి.నరసింహమూర్తి అదేశాల మేరకు ఎస్ఐ బి.రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. మండల సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్టు సమాచారం మేరకు ఆ ప్రధాన రహదారిలో తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగా వాహన రికార్డు లను పరిశీలించారు. వాహన రికార్డులు, డ్రైవింగు లైసెన్స్లు సక్రమంగా లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. ప్రయాణికుల లగేజీలను తనిఖీ చేశారు. అనుమానితుల నుంచి వివరాలు సేకరించారు. ఇదిలా ఉండగా మండల సరిహద్దు ప్రాంతమైన ఏవోబీలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమా చారం మేరకు వివిధ పోలీసు బలగాలతో నలుమూలల నుంచి భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. -
ఆస్పత్రి ఆవరణలో హిజ్రా మృతి
కొయ్యూరు: మండలంలోని డౌనూరు ఆస్పత్రిలో హిజ్రా పులి కుమారస్వామి అలియాస్ ఆకాంక్ష(23) మృతిపై పోలీసులు శనివారం విచారణ చేపట్టారు. గొలుగొండ మండలం జోగంపేటకు చెందిన ఆకాంక్ష కొద్ది రోజుల నుంచి డౌనూరులో ఉంటోంది. ఆమె ఇక్కడ ఆస్పత్రి ఆవరణలో శుక్రవారం అర్ధరాత్రి అనుమానాస్పద రీతిలో మరణించారు. శనివారం తెల్లవారుజామున మృతదేహాన్ని చూసిన వైద్యురాలు లలిత వెంటనే కొయ్యూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ వెంకటరమణ, ఎస్ఐ కిశోర్వర్మ మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె మరణానికి డీహైడ్రేషన్ కారణం కావచ్చని అంచనాకు వచ్చారు. కారణం తెలియని మృతిగా కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. శుక్రవారం ఆకాంక్ష కడుపుమంటగా ఉందని డౌనూరు ఆస్పత్రికి వచ్చి గ్యాస్ట్రిక్కు సంబంధించిన రెంటాడిన్ ఇంజక్షన్ చేయించుకున్నారని తెలిపారు. తర్వాత సంతలోకి వెళ్లిపోయారన్నారు. దీని తర్వాత ఆమె అదే రోజు రాత్రి ఆస్పత్రి ఆవరణలో రోగులు కూర్చునే బల్లపై ఉండిపోయారన్నారు. శరీరం డీహైడ్రేషన్కు గురై అర్ధరాత్రి సమయంలో మరణించి ఉంటారని భావిస్తున్నామన్నారు. మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామని చెప్పారు. పాడేరు నుంచి క్లూస్ టీమ్ వచ్చి విచారించింది. విచారణ చేపట్టిన పోలీసులు -
పందికుంట బయలు భూములు ఇచ్చేది లేదు
● అధికారులకు గిరిజనుల స్పష్టీకరణ రంపచోడవరం: ఎన్నో ఏళ్లుగా గిరిజనుల సాగులో ఉన్న పందికుంట బయలు భూములను ఎవరికి ఇచ్చేది లేదని అఖిల భారత రైతు కూలీ సంఘం డివిజన్ కార్యదర్శి పల్లాల లచ్చిరెడ్డి, పీవోడబ్ల్యూ జిల్లా నాయకుడు పి అనసూయ తెలిపారు. తహసీల్దార్ రామకృష్ణ తన కార్యాలయంలో శనివారం గిరిజనులతో సమావేశమయ్యారు. చింతూరు, ఎటపాక, వీఆర్ పురం, కూనవరం, మండలాల పోలవరం నిర్వాసితులకు పందికుంట బయలు భూములు ఇవ్వాలని రంపచోడవరం రెవెన్యూ అధికారులు, చింతూరు ఎస్డీసీ అడిగారు. ఇందుకు వారు నిరాకరించారు. ఐదు గ్రా మాలకు చెందిన సుమారు 138 మంది 600 ఎకరాలను 26 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నట్లు గిరిజనులు తెలిపారు. వీటికి సంబంధించి పూర్తి హక్కు లు తమకు కల్పించాలని వారు విన్నవించారు. -
గ్రామ సభలు నిర్వహించాలి
సీలేరు: గ్రామస్థాయి లో ఉన్న సమస్యలు పరిష్కరించుకునేందుకు పూర్తిస్థాయి అధికారులతో గ్రామ సభ లు నిర్వహించాలని సమస్యలు పరిష్కరించే విధంగా అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని జిల్లా కాంగ్రెస్ డీసీసీ కార్యదర్శి శ్రీనివాసు అన్నారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ గతంలో అధికారులతో గ్రామసభలు జరిగేవని, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు. తూతూ మంత్రంగా సభల నిర్వహణతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. దీనిపై కలెక్టరు దినేష్కుమార్ వెంటనే స్పందించారన్నారు. గ్రామస్థాయి అధికారులకు సమస్యలు పరిష్కరించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్యం, తాగునీరు ,రహదారుల సమస్యల వంటివి వెంటనే పరిష్కరించాలని కోరారు. -
ఈదురు గాలుల బీభత్సం
కొయ్యూరు: మండలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. శనివారం సాయంత్రం వీచిన గాలులకు సింగవరం ఐటీడీఏ కాలనీ సమీపంలో నాలుగు విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. కొమ్మిక పంచాయతీ కొత్త బొర్రంపేటలో మర్రి అప్పారావు, బాబూరావు, శంకర్రావుకు చెందిన ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. దీంతో వారికి నిలువ నీడ కరువైంది. ఇంట్లో వస్తువులన్నీ తడిచిపోయాయి. ఆర్థిక స్థోమత లేనందున అధికారులు ఇంటి పైకప్పు రేకులు అందజేసి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. చింతపల్లి: మండల కేంద్రమైన చింతపల్లిలో శనివారం మధ్యాహ్నం నుంచి కురిసిన వర్షానికి రహదారులు, వీధులు జలమయం అయ్యాయి. వాతావరణం చల్లబడటంతో వేసవి తాపం నుంచి స్థానికులు ఉపశమనం పొందారు. రాజవొమ్మంగి: మండలంలో శనివారం సాయంత్రం దాదాపు రెండు గంటల పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలులకు అక్కడక్కడ చెట్టకొమ్మలు విరిగి పడ్డాయి. జడ్డంగి పంచాయతీ రేవటిపాలెం సమీపంలో 33/11 కేవీ విద్యుత్ ప్రధాన లైన్కు చెందిన రెండు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మరో స్తంభం వంగిపోయింది. దీనితో సరఫరా నిలిపివేసినట్లు ఏఈ అబ్బాయిదొర తెలిపారు. పరిస్థితిని చక్కదిద్దుతున్నామన్నారు. మరోవైపు గాలులకు తాటాకిళ్లు పైకప్పులు దెబ్బతిన్నాయి. పల్లపు ప్రాంతాల్లో, రోడ్లపై నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. వాతావరణం చల్లబడటంతో వేసవి తాపం నుంచి మండల ప్రజలు ఉపశమనం పొందారు. కూలిన విద్యుత్ స్తంభాలు కొత్తబొర్రంపేటలో ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పు రేకులు -
కొంతిలిలో పశువుల వ్యాపారి ఆత్మహత్య
హుకుంపేట : చెట్టుకు ఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ సురేష్కుమార్ తెలిపిన వివరాలివి. కొంతిలి గ్రామం సమీపంలో శుక్ర వారం ఉదయం ఓ చెట్టు వద్ద ఉరితాడుతో మృతదేహం వేలాడి ఉండగా స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడిని కొంతిలి గ్రామానికి చెందిన కొర్ర ప్రవీణ్ (30)గా గుర్తించారు. ప్రవీణ్ మూడు రోజుల నుంచి ఇంటికి రాలేదని, ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం లేకపోగా, శుక్రవారం చెట్టుకు ఉరిపోసుకుని కనిపించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రవీణ్ గతంలో పశువుల వ్యాపారం చేసేవాడని, ఇటీవల కాలంలో అప్పులు పెరగడంతో అప్పుల వాళ్ల ఒత్తిడి పెరిగిందని, దీంతో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపారని ఎస్ఐ పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
హడావుడి
అతిథి గృహంలో● సర్క్యూట్ హౌస్లో రెండోరోజు విచారణ ● సింహాచలం విషాద ఘటనపై త్రిసభ్య కమిషన్ ● అర్చకుల నుంచి రెవెన్యూ సిబ్బంది వరకూ ప్రతి ఒక్కరినీ విచారించిన కమిషన్ ● మృతదేహాలు వెలికి తీసిన వారంతా సంప్రోక్షణ చేసుకోకుండానే విధుల్లోకి రావడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన అర్చకులు ● నేడు ప్రభుత్వానికి నివేదిక అందజేత సాక్షి, విశాఖపట్నం : ఊహకందని దారుణం.. సింహగిరి చరిత్రలో విషాద పేజీగా నిలిచిపోయిన చందనోత్సవం దుర్ఘటనపై ప్రాథమిక విచారణ పూర్తయింది. తొలిరోజున సింహాచలంపై సాగగా.. మలిరోజున ప్రభుత్వ అతిథి గృహం వద్ద హడావుడి కనిపించింది. అర్చకులు, వేదపండితులతో పాటు రెవెన్యూ, దేవదయ ధర్మాదాయ.. విభిన్న శాఖల అధికారులు, సిబ్బంది విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సుదీర్ఘ విచారణ సాగింది. దుర్ఘటనపై అన్ని విభాగాల నుంచి సమాచారం సేకరించిన త్రిసభ్య కమిషన్ ప్రభుత్వానికి శనివారం నివేదిక సమర్పించనుంది. సింహాచలంలో ఏటా ఒక రోజు జరిగే పవిత్ర పర్వదినం అప్పన్న నిజరూపదర్శనం.. చందనోత్సవం విషాదోత్సవంగా మారిపోయిన ఘటన నుంచి విశాఖవాసులు ఇంకా తేరుకోలేకపోతున్నారు. దేవాలయ చరిత్రలో ఇలాంటి దురదృష్టకరమైన ఘటన జరగడం ఇదే తొలిసారి కావడంతో.. భక్తులు ఆందోళన చెందుతున్నారు. మంత్రుల నిర్లక్ష్యంతో ఏడుగురు ప్రాణాలు బలిగొన్న తర్వాత ఉలిక్కి పడిన ప్రభుత్వం.. హడావుడిగా నియమించిన త్రిసభ్య కమిషన్ రెండు రోజుల విచారణ పూర్తి చేసింది. 72 గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడంతో.. గురువారం, శుక్రవారం రెండు రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ చేపట్టి సమగ్ర వివరాలు సేకరించింది. ఆది నుంచీ గోడ కట్టకూడదని చెప్పినా వినిపించుకోకుండా.. కట్టడం వల్లనే విషాదం చోటు చేసుకుందని అర్చకులు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో.. త్రిసభ్య కమిషన్ దేవస్థాన అర్చకులను కూడా విచారించింది. మాడవీధిని ఆనుకొని రక్షణ గోడ ఉన్నప్పుడు దాని పక్కన కొత్తగా మరో గోడ కట్టడం సరికాదంటూ వైదికులు చెప్పినా పట్టించుకోలేదని కమిషన్కు చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వం ఈ మహాపచారం చెయ్యడం వల్లే పెను విషాదం సంభవించిందని కూడా కమిషన్ ముందు తమ స్పందన వెలిబుచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మృతదేహాల వెలికితీత, శిథిలాల తొలగింపులో పాల్గొన్న సిబ్బందిని పుణ్యస్నానాలు ఆచరింపజేయకుండా, సంప్రోక్షణ చేసుకోనివ్వకుండా.. విధుల్లోకి తిరిగి చేర్చడంపైనా అర్చకులు కమిషన్ ముందు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలా ప్రతి విషయంలోనూ ఆగమశాస్త్ర ఉల్లంఘనలు జరిగాయని కమిషన్కు అర్చకులు వెల్లడించారు. వరదనీటి వ్యవస్థ లేదా..? సింహాచలంలో వరద నీటిని నియంత్రించేందుకు సరైన వ్యవస్థ లేకపోవడంపై కమిషన్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 2018లో రూపొందించిన దేవస్థానం మాస్టర్ప్లాన్లోనూ ఈ అంశాన్ని పొందుపరచకపోవడంపై దేవస్థానం అధికారులు, వీఎంఆర్డీఏ అధికారులపైనా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రెండు మూడు దశాబ్దాలుగా సింహగిరిపై పడుతున్న సగటు వర్షపాతాన్ని పరిగణనలోకి తీసుకొని.. దానికనుగుణంగా నియంత్రించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోకపోవడం సరికాదని సూచించింది. కనీసం వరద నీటి నియంత్రణకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై అధికారులు దృష్టి సారించకపోవడంపైనా విస్మయం చెందారు. మాస్టర్ప్లాన్లో ఉల్లంఘనలు ఉన్నట్లు కూడా ఉన్నాయని గుర్తించిన త్రిసభ్య కమిషన్... ఈ విషయంపై ఎందుకు దృష్టిసారించలేదని ఆయా శాఖల అధికారుల్ని ప్రశ్నించింది. రెండు రోజుల పాటు జరిగిన విచారణలో అన్ని శాఖల నుంచి సమగ్ర వివరాల్ని సేకరించిన కమిషన్.. శనివారం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదికను అనుసరించి.. ప్రభుత్వం ఎవరిపై చర్యలు తీసుకోవాలన్నదానిపై నిర్ణయం తీసుకోనుంది. అయితే కేవలం చిన్న స్థాయి అధికారులపైనే ప్రతాపం చూపించి.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంత్రులపై కనీస చర్యలు ఉండవనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వమే అసలు దోషి.! ఈ ప్రమాదం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యమే తప్ప.. ఇంకోటి లేదన్నది ప్రతి ఒక్కరి నుంచి వినపడుతోంది. భారీస్థాయిలో భక్తులు వస్తారని, ప్రతి చందనోత్సవానికి వర్షం పడుతుందని తెలిసినా.. ఏర్పాట్లు విషయంలో కనీస జాగ్రత్తలు పాటించకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిర్వహణ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు మంత్రుల కమిటీ బాధ్యతారాహిత్యం ఏడుగుర్ని పొట్టనపెట్టుకుందనీ.. వారిపైనా చర్యలు తీసుకోవాలంటూ సీపీఎం డిమాండ్ చేస్తోంది. కేవలం.. అధికారులు, ప్రభుత్వ సిబ్బందిని బలి చెయ్యకుండా.. ఈ ప్రమాదం వెనుక ఉన్న మంత్రులపైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలంటూ ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు. తప్పు మాది కాదంటే.. మాది కాదు శాఖల వారీగా విచారణ కొనసాగింది. దేవస్థాన అధికారులు, ఇంజినీర్లను తొలుత విచారించారు. గోడ నిర్మాణం, ప్రసాద్ పనుల ఆలస్యం.. మొదలైన విషయాలపై ఆరా తీశారు. అదే సమయంలో టూరిజం ఇంజినీరింగ్ అధికారులను కూడా విచారణకు హాజరవ్వమని ఆదేశించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఇరు విభాగాల్ని ఒకేసారి విచారించిన కమిటీ ముందు.. గోడ నిర్మాణం, పనుల ఆలస్యం మొదలైన అంశాల్లో తప్పు మా శాఖది కాదు.. టూరిజం వాళ్లదేనని దేవస్థానం అధికారులు.. తమది కాదు.. వాళ్లదేనని టూరిజం ఇంజినీర్లు వాదించుకొని.. ఒకరిపై ఒకరు తప్పు నెట్టేసుకునేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. దేవస్థాన ఇంజినీర్లతో పాటు టూరిజం ఇంజినీర్లది కూడా బాధ్యత ఉందని, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ జిల్లా అధికారులు కమిషన్కు నివేదించినట్లు సమాచారం. -
కిశోర బాలికలకు అవగాహన
కొయ్యూరు/గూడెం కొత్తవీధి/చింతపల్లి/చింతూరు/గంగవరం: జిల్లా వ్యాప్తంగా కిశోర వికాసం వేసవి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమైయ్యాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ఐసీడీఎస్ సీడీపీవోలు, వివిధ శాఖాధికారులు మాట్లాడుతూ బాలికా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కిశోరి వికాసం పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో విద్య ప్రాముఖ్యత, సంపూర్ణ ఆరోగ్యం, రుతు పరిశుభ్రత, పోషకాహారం, పోక్సో, బాల్య వివాహాల నిరోధ చట్టం, ఆత్మరక్షణ, సైబర్ క్రైమ్, జీవనోపాధి, స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ నెల 2 నుంచి జూన్ 10 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీడీపీవోలు విజయకుమారి, లక్ష్మీదేవి, రమణి, విజయగౌరి, సూపర్వైజర్లు సునీత, మహాలక్ష్మి, కొండమ్మ, శేఖర్, ప్రవీన్, మోహిని, శాంతి, విజయకుమారి, సత్యవతి, ఏసీడీపీవో రామలక్ష్మి, గంగాభవాని, ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు మోహన్రావు, ఐటీడీఏ ఏపీవో జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
మోతుగూడెం: మేడే సందర్భంగా లోయర్ సీలేరు ఏపీ జెన్కో ఉద్యోగులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలకు లెమన్ అండ్ స్పూన్ చైర్స్, బొట్టు ఆట నిర్వహించారు. పోటీల్లో విజేతలకు సీలేరు కాంప్లేక్స్ సీఈ వాసుదేవరావు, ఎస్ఈ చిన్న కామేశ్వరరావు, ప్లాంట్ మేనేజర్ బాలకృష్ణ తదితరులు బహుమతులు అందజేశారు. బాలబాలికలు భరతనాట్యం ప్రదర్శించారు. లోయర్ సీలేరు జెన్కో ఉద్యోగులు ప్రదర్శించిన నాటికలు ఆకట్టుకున్నాయి. జెన్కో ఉద్యోగులు సతీష్ రాఘవన్ పిల్లే, పూర్ణిమ, రత్నాకర్, కిరణ్, దారబాబు వాసు, ప్రసాద్ పాల్గొన్నారు. -
దివ్యాంగ ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
మధురవాడ(విశాఖ): దివ్యాంగులకు ఉచిత వసతి, విద్యను అందించి, వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో బక్కన్నపాలెంలోని ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ, శిక్షణ, ఉత్పత్తి కేంద్రం పనిచేస్తోంది. 2025–26 విద్యా సంవత్సరానికి ఇక్కడ ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రాజెక్ట్ అధికారి జె.మాధవి తెలిపారు. రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన అర్హులైన, ఆసక్తి గల దివ్యాంగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. దరఖాస్తు విధానం విద్యార్థి https://iti.ap.gov.in/ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు విద్యార్హత సర్టిఫికెట్లు, నివాస ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, సదరం మెడికల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫొటోలు, ఫోన్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ తదితర వివరాలు సమర్పించాలి. ముఖ్యమైన తేదీలు ● రిజిస్ట్రేషన్కు చివరి తేదీ ఈ నెల 24, సాయంత్రం 5 గంటలు ● దరఖాస్తుల పరిశీలన ఈ నెల 24 నుంచి 26 కౌన్సెలింగ్ జూన్ 2 నుంచి జూన్ 10వ తేదీ వరకు కల్పించే వసతులు : ఇక్కడ ప్రవేశం పొందే విద్యార్థికి ఉచిత వసతి, భోజనం, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు అందిస్తారు.అనుభవజ్ఞులైన ఇన్స్ట్రక్టర్లచే నాణ్యమైన శిక్షణ ఇస్తారు. ఏటా జాబ్మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తారు. రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన అర్హులైన దివ్యాంగులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు జె.మాధవి, ప్రాజెక్ట్ ఆఫీసర్(90000 13610), సిహెచ్ భాస్కరరావు, ప్రిన్సిపాల్(73964 24319, 95021 23060)లను సంప్రదించవచ్చు.సీట్ల భర్తీ ఇలా.. ట్రేడు సీట్లు విద్యార్హత శిక్షణ కాలం కార్పెంటర్ 24 10వ తరగతి పాస్/ఫెయిల్ సంవత్సరం షీట్ మెటల్ వర్క్ 20 10వ తరగతి పాస్ సంవత్సరం వెల్డర్ 20 10వ తరగతి పాస్/ఫెయిల్ సంవత్సరం -
మెరిసిన గిరిజన విద్యార్థినులు
● గురుకులాల పరిధి ఇంటర్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు వై.రామవరం: మండలంలోని పి.యర్రగొండ గిరిజన సంక్షేమ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన ఇద్దరు ఇంటర్ విద్యార్థినులు గిరిజన సంక్షేమ గురుకులాల పరిధిలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించినట్టు ప్రిన్సిపాల్ శ్రీపాద రామకృష్ణ తెలిపారు. అదే కళాశాలకు చెందిన కడాల హరిచందన సాయిప్రియ ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 1000కు 981, డి. సర్వాణిశ్రీ సునంద మొదటి సంవత్సరంలో 470కు 464 మార్కులు సాధించారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారిని ఆయన అభినందించారు. -
రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం
సాక్షి,పాడేరు: రహదారి ప్రమాదాలు నియంత్రణే లక్ష్యంగా అన్ని భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ ఆదేశించారు.శుక్రవారం తన కార్యాలయం నుంచి రహదారి భద్రత కమిటీ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరకు, పాడేరు ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలన్నారు. ఆటోలు, జీపులు,బైక్లు రహదారి మార్జిన్ల్లో నిలిపివేయడం, వ్యాపారులు చెత్తను రోడ్లపై వేయడం వంటి కారణాలతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందన్నారు.బైక్ చోదకులంతా హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలని, లేని పక్షంలో జరిమానా విధించాలన్నారు. ప్రతినెలా మొదటి శనివారం పబ్లిక్ కన్వీనయన్స్డే నిర్వహించి, రహదారి ఆక్రమణలు, పార్కింగ్ ప్రదేశాలు, హెల్మెట్ల వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఘాట్ రోడ్లలో అవసరమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అరకు, రంపచోడవరం ఏరియా ఆస్పత్రుల్లో సీటీ స్కాన్ కొనుగోలుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ డాక్టర్ అభిషేక్గౌడ, ఎస్పీ అమిత్బర్దర్, సబ్కలెక్టర్ సౌర్యమన్ పటేల్, జిల్లా రవాణా అధికారి లీలాప్రసాద్, ఆర్అండ్బీ ఈఈ బాల సుందరబాబు పాల్గొన్నారు. కలెక్టర్ దినేష్కుమార్ -
అప్పన్న ఆలయంలో ఘనంగా తిరునక్షత్రం పూజలు
సింహాచలం: శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో విశిష్టాద్వైత స్థాపకులు భగవత్ రామానుజాచార్యుల 1008వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఏటా ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ తిరునక్షత్రం పూజలు గత నెల 28న ప్రారంభమయ్యాయి. చివరి రోజైన శుక్రవారం జయంతి సందర్భంగా ఆలయ బేడామండపంలోని హంసమూలన గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవి, భగవత్ రామానుజాచార్యుల ఉత్సవమూర్తులతో పాటు ఆళ్వారులను వేంజింపజేశారు. అనంతరం షోడశోపచార పూజలు, విశేష హారతులు, పారాయణం నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు, పారాయణదారులు ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం రామానుజాచార్యుల తిరువీధి ఉత్సవం వైభవంగా జరిగింది. -
గర్జించిన గిరిజనం
ప్రభుత్వం న్యాయం చేస్తుంది..బంద్ విరమించండి ప్రత్యామ్నాయ జీవో తేవాల్సిందే:అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అరకులోయ టౌన్: జీవో నంబరు 3కు ప్రత్యామ్నాయంగా జీవోను తీసుకువచ్చి ప్రత్యేక డీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేయాలని ఆరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. అరకు లోయలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలోని ఖనిజ సంపదను తరలించుకుపోతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన ప్రాంత ఉద్యోగాలను గిరిజనేతరులకు కట్టబెడుతున్నాయని ధ్వజమెత్తారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రత్యామ్నాయ జీవోను తీసుకువచ్చి గిరిజన నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నారు. ఎన్నికల్లో అరకులోయ వచ్చిన చంద్రబాబు జీవో నంబరు 3ను పునరుద్ధరించి గిరిజనులకు సంపూర్ణ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. సాక్షి,పాడేరు: గిరిజనులకు నూరుశాతం ఉద్యోగాల కల్పనకు జీవో నంబరు 3 పునరుద్ధరించాలని, గిరిజన ప్రత్యేక డీఎస్సీ తక్షణమే ప్రకటించాలని గిరిజన డీఎస్సీ సాధన కమిటీ, ఆదివాసీ ప్రజా, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. వీటిపై ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని లేకుంటే గిరిజన నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర గిరిజన ప్రాంతాల నిరవధిక బంద్లో హెచ్చరించాయి. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు, ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, పాడేరు, అరకు నియోజకవర్గాల్లోని వైఎస్సార్సీపీ శ్రేణులు బంద్కు సంపూర్ణ మద్దతు ఇచ్చాయి. పాడేరులో ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తెల్లవారు ఐదు గంటలకే బంద్లో పాల్గొన్నారు. పాడేరు డిపో నుంచి బస్సులు నడపకుండా అడ్డుకున్నారు. పాడేరు ఘాట్రోడ్డు, జి.మాడుగుల రోడ్డుపై బైఠాయించారు.అరకు ఎంపీ గుమ్మా తనూజరాణి, జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డులో బైఠాయించారు. గిరిజన ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. స్తంభించిన రవాణా గిరిజన ప్రాంతాల్లో నిరవధిక బంద్తో ఏజెన్సీ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించింది. గిరిజన డీఎస్సీ సాధన కమిటీ, వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ నేతలు ఏజెన్సీ వ్యాప్తంగా ఎక్కడికక్కడ బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పాడేరు డివిజన్ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. గమ్యస్థానాలకు చేరుకునేందుకు పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్లో సాయంత్రం వరకు నిరీక్షించారు. జిల్లా కేంద్రం పాడేరులోని అన్ని దుకాణాలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. పాడేరు, అరకులో వారపు సంతలు జరగలేదు. అలాగే పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు,ఆదివాసీ ప్రజా సంఘాల నేతలంతా ఐటీడీఏ ఎదుట రోడ్డుపైనే మధ్యాహ్నం భోజనం చేసి నిరసన తెలిపారు. హామీలను చంద్రబాబు నెరవేర్చాల్సిందే: వైఎస్సార్సీపీ డిమాండ్ సీఎం చంద్రబాబు ఇచ్చిన హమీ మేరకు నూరుశాతం ఉపాధ్యాయ ఉద్యోగాలు ఆదివాసీలకు కల్పించే విధంగా గిరిజన ప్రత్యేక డీఎస్సీని వెంటనే ప్రకటించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. నిరవధిక బంద్లో పాల్గొన్న వారు మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గిరిజనులకు నూరుశాతం ఉద్యోగాలు కల్పించే గిరిజన సలహా మండలి తీర్మానాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని వెంటనే గిరిజన డీఎస్సీకి ఆర్డినెన్స్ జారీ చేయాలన్నారు. గిరిజనులకు అన్యాయం చేసే చర్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్పడితే ఉపేక్షించేది లేదని, గిరిజనుల పక్షాన పోరాటం ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు జర్సింగి సూర్యనారాయణ, కురుసా పార్వతమ్మ, కూడా సురేష్కుమార్, సీదరి రాంబాబు, కూడా సుబ్రహ్మణ్యం, తెడబారికి సురేష్కుమార్, కాతరి సురేష్, డి.పి.రాంబాబు, బోనంగి వెంకటరమణ, శరభ సూర్యనారాయణ, పాంగి నాగరాజు, లకే రత్నాబాయి, లకే రామ సత్యవతి సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అరకులోయ టౌన్: గిరిజన సంఘం, ఉద్యోగ, ఉపాధ్యాయ తదితర సంఘాల పిలుపు మేరకు చేపట్టిన బంద్ అరకులోయలో విజయవంతం అయింది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసి వేసి మద్దతు ప్రకటించారు. గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, పెట్రోల్ బంక్లు, పర్యాటకశాఖ హోటళ్లు మూతబడ్డాయి. మైదాన ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు బంద్లో పాల్గొని మద్దతు ప్రకటించారు. మెగా డీఎస్సీలో తీవ్ర అన్యాయం: గిరిజన సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ గిరిజన సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మెగా డీఎస్సీలో గిరిజన నిరుద్యోగులు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, జిల్లా ప్రధానకార్యదర్శి శెట్టి అప్పాలు, ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, ఎంపీటీసీ దురియా ఆనంద్, సర్పంచ్ బీబీ బొజ్జ, మండల పార్టీ అధ్యక్షుడు స్వాహి రామ్మూర్తి, గిరిజన సంఘం నాయకులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రంపచోడవరం: ఏజెన్సీ ప్రాంతానికి ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ఏజెన్సీ బంద్ విజయవంతమైంది. రంపచోడవరంలో హోటళ్లు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ప్రైవేట్ వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని సర్వీసులను మాత్రం ఆర్టీసీ నడిపింది. బంద్ నేపథ్యంలో ఉదయం నుంచి గిరిజన సంఘాల నాయకులు స్థానిక అంబేడ్కర్ సెంటర్కు చేరుకున్నారు. బంద్లో గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు, సీపీఎం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు మట్ల వాణిశ్రీ, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఈతపల్లి సిరిమల్లి రెడ్డి, ఆదివాసీ చైతన్య సంఘం జిల్లా అధ్యక్షుడు వెదుళ్ల లచ్చిరెడ్డి, ఆదివాసీ సంక్షేమ, సాంస్కృతిక సంఘ రాష్ట్ర నాయకులు కంగల శ్రీనివాసరావు, సీపీఐ నాయకుడు జుత్తుక కుమార్ ఆధ్వర్యంలో బంద్ జరిగింది. చింతూరు: ఆదివాసీ సంఘాల నాయకులు ఉదయం నుంచి స్థానిక మెయిన్రోడ్ సెంటర్లోని ప్రధాన రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడి పలు వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెగా డీఎస్సీ నుంచి ఏజన్సీ ప్రాంత టీచర్ పోస్టులను మినహాయించాలని, ఆదివాసీలకు వంద శాతం ఉద్యోగాలు, ఉపాధ్యాయ రిజర్వేషన్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు జీవో నంబరు3పై ఇచ్చిన హామీని సీఎం నిలబెట్టుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సీసం సురేష్, పల్లపు వెంకట్, లక్ష్మణ్, సుబ్బారావు, రాంబాబు, పుల్లయ్య పాల్గొన్నారు. గిరిజన ప్రత్యేక డీఎస్సీపై చర్యలేవీ:ఎమ్మెల్సీ కుంభా రవిబాబు గిరిజన ప్రాంతంలో గిరిజనులకే సంపూర్ణంగా ఉద్యోగాలివ్వాలన్నదే జగన్మోహన్ రెడ్డి ఆలోచన అని ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు అన్నారు. అరకులో జరిగిన ఆందోళనలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. జీవో నంబరు 3ను సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్రెడ్డి అడ్వకేట్ జనరల్, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సుదీర్గంగా చర్చించారన్నారు. ఈ జీవోకు ప్రత్యామ్నాయంపై న్యాయ నిపుణులతో చర్చించి, సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ ప్రయోజనం లేకపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు ఏడాది కావస్తున్నా గిరిజన ప్రత్యేక డీఎస్సీపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణం అన్నారు. దీనివల్ల సుమారు 500 మంది గిరిజన విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. సాక్షి,పాడేరు: జీవో నంబరు 3 అమలుచేయడంలో న్యాయపరమైన చిక్కులు లేకుండా గిరిజన ప్రాంతాల్లోని గిరిజనులకు ప్రభుత్వం తగిన న్యాయ చేస్తుందని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రెండు వేల సంవత్సరంలో జీవో నంబరు 3 జారీ అయ్యిందని, ఉపాధ్యాయ పోస్టుల్లో నూరుశాతం ఉద్యోగాల్లో 100 శాతం ఎస్టీ అభ్యర్థులకు రిజర్వేషన్, 33శాతం స్థానిక మహిళలకు ఉప రిజర్వేషన్ కల్పించడం జరిగిందన్నారు. అప్పటినుంచి జరిగిన 11 జనరల్ డీఎస్సీ, స్పెషల్ డీఎస్సీ ల్లో జరిగిన నియమకాల్లో 100శాతం ఉద్యోగాలన్నీ స్థానిక ఎస్టీ అభ్యర్థులతోనే భర్తీ జరిగిందన్నారు. 2020 ఏప్రిల్ 22వతేదీన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏపీస్టేట్, ఇతరుల కేసులో జీవో నంబరు 3 రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిస్తూ తీర్పు వెలువరించిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తరువాత ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల్లోని నియామక విధానాలను పునఃపరిశీలించి సవరించాల్సి వచ్చిందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తరువాత ఏపీ ప్రభుత్వం మొదటిగా మెగా డీఎస్సీ 2025 ప్రకటన చేసి,ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ మెగా డీఎస్సీలో జీవో నంబరు 3ను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల జనరల్ రోస్టర్ ప్రకారం రిజర్వేషన్ల మేరకు పోస్టులను ప్రకటించడం జరిగిందన్నారు. జీవో నంబరు 3కు ప్రత్యామ్నాయంగా గిరిజనులకు న్యా యం చేసేందుకు సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. గిరిజనులు సంయమనం పాటిస్తూ సహకరించి బంద్ను విరమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.కలెక్టర్ దినేష్కుమార్ విజ్ఞప్తినేడు బంద్ కొనసాగింపు గిరిజన ప్రత్యేక డీఎస్సీ డిమాండ్తో చేపట్టిన రాష్ట్ర వ్యాప్త గిరిజన ప్రాంతాల నిరవధిక బంద్ను శనివారం కూడా కొనసాగిస్తున్నామని డీఎస్సీ సాధన కమిటీ ప్రతినిధులు పి.అప్పలనర్స, వంతాల నాగేశ్వరరావు, ఎస్.మాణిక్యం, కిల్లో సురేంద్ర, కూడా రాధాకృష్ణ, కె.చిన్ని, కెజియారాణి తదితరులు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు బంద్కు మద్దతు తెలిపి సహకరించాలని వారు కోరారు.ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలుచేయాలికూటమి ప్రభుత్వం స్పందించకపోవడంపై నిరసన -
తేనెటీగల దాడిలో గిరిజనుడికి తీవ్ర గాయాలు
జిల్లా ఆస్పత్రికి తరలింపుజి.మాడుగుల: తేనెటీగల దాడిలో గిరిజనుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గడుతూరు పంచాయతీ ఏనుగుగొంది గ్రామానికి చెందిన బురిటి కొండబాబు పండగ నిమిత్తం శుక్రవారం సాయంత్రం నుర్మతి పంచాయతీ చెరువువీధి గ్రామంలోని బంధువుల ఇంటికి కాలినడకన బయలుదేరాడు. మార్గం మధ్యలో అతనిపై తేనెటీగలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. వెంటనే స్థానికులు ఫీడర్ అంబులెన్సుకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది ధనుంజయ్, పోతురాజు కొండబాబుకు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం అతనిని ఫీడర్ అంబులెన్సులో స్థానిక పీహెచ్సీకి తీసుకువచ్చారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం పాడేరు జిల్లా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. -
పునరావాస కాలనీల నిర్మాణానికి భూ పరిశీలన
రంపచోడవరం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ముంపునకు గురవుతున్న చింతూరు డివిజన్లోని 41.15 కాంటూరు ఫేజ్ 1బీలోని 32 గ్రామాలకు పునరావాస కాలనీల నిర్మాణానికి భూమిని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేశామని పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అభిషేక్ తెలిపారు. విలీన మండలాల నిర్వాసితులకు భూమికి భూమి, ఆర్అండ్ఆర్ కాలనీల నిర్మాణానికి భూసేకరణ కోసం ధవళేశ్వరం ప్రాజెక్టు ఆడ్మినిస్ట్రేటర్, పీఐపీ, చింతూరు పీవో, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ గత రెండు రోజులుగా రంపచోడవరం డివిజన్లో రెండురోజులుగా విస్తృతంగా పర్యటించారు. దీనిలో భాగంగా రంపచోడవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి, గంగవరం మండలాల్లో భూ రికార్డులను పరిశీలించారు. ఇప్పటి వరకు దాదాపు 4,049 ఎకరాలను గుర్తించారు. రాజవొమ్మంగి మండలంలోని రెండు వేల ఎకరాల్లో 1400 ఎకరాలు రెండు సీజన్ల వ్యవసాయానికి, మిగతా 600 ఎకరాలు ఆర్అండ్ఆర్ నిర్మాణానికి అనుకూలంగా ఉన్నట్టు గుర్తించారు. అలాగే గంగవరం మండలంలో 800 ఎకరాలు, అడ్డతీగలలో 1049 ఎకరాలు గుర్తించారు. ఈ నాలుగు మండలాల్లో సర్వే నంబర్లు ప్రకారం తహసీల్దార్ల సహకారంతో భూములను పరిశీలించారు. స్పెషల్ సబ్ కలెక్టర్లు బాలకృష్ణారెడ్డి, నజరియా, అంజనేయులు తదితరులు ఉన్నారు. -
రేపటి నుంచిశ్రీ మత్స్యమాడుగులమ్మ తల్లి జాతర
జి.మాడుగుల: మత్స్యరాస కుటుంబీకుల ఇలవేల్పు శ్రీ మత్స్యమాడుగులమ్మ తల్లి జాతర మహోత్సవాలు జి.మాడుగులలో ఈ నెల 4 నుంచి 6 వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మత్స్యరాస రామరాజు, ప్రధాన కార్యదర్శి గసాడి రెడ్డిబాబు, ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీపీ మత్స్యరాస వెంకటగంగరాజు తెలిపారు. ఉత్సవాల మొదటి రోజు గిరిజన సంప్రదాయ ప్రకారం స్థానిక మాజీ ఎంపీ దివంగత మత్స్యరాస మత్స్యరాజు స్వగృహం నుంచి మత్స్యరాస వంశీయులు, భక్తులు, గ్రామపెద్దలు కలసి డప్పు వాయిద్యాల నడుమ ఘటాలను, పూర్వీకులు వినియోగించిన ఆయుధాలు ఖడ్గం, నాటు తుపాకీని ఊరేగింపుగా తీసుకొచ్చి రామాలయం ఆవరణలోని సతకంపట్టు వద్ద ప్రతిష్టిస్తామని వారు పేర్కొన్నారు. ఉత్సవాలు చివరి రోజు సతకంపట్టు నుంచి డప్పు వాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, బాణాసంచా కాల్పుల నడుమ భారీ ఊరేగింపుతో అమ్మవారి అను పు ఉత్సవం నిర్వహిస్తామన్నారు. ఉత్సవాల సందర్భంగా మండల స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామ న్నారు. ఉత్సవాల మూడు రోజులు సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటుచేశామన్నారు. -
ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని వినతి
రంపచోడవరం: ఏజెన్సీ ప్రాంతానికి ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో గురువారం రంపచోడవరంలో గిరిజన సంక్షేమ ముఖ్య కార్యదర్శి ఎం.ఎం.నాయక్ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. గిరిజన సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న అన్ని క్యాడర్ ఉపాధ్యాయ పోస్టులను స్పెషల్ డీఎస్సీ నిర్వహించి, గిరిజన అభ్యర్థులచే నియామకాలు చేపట్టాలని కోరారు. 2001లో నియమితులైన ఆన్ట్రైన్డ్ ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయాలన్నారు. ప్రతి ఆశ్రమ పాఠశాలలో ఏఎన్ఎం, కంప్యూటర్ ఆపరేటర్, రికార్డు అసిస్టెంట్ , ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు మంజూరు చేయాలని, గిరిజన విద్యాలయాల్లో విద్యుత్, నీటి సమస్యల దృష్యా ఒక ప్లంబర్, ఎలక్ట్రిషియన్ను నియమించాలని వినతిలో కోరారు. ఎంపీఆర్సీలో ఉన్న ఇతర శాఖ కార్యాలయాలను ఖాళీ చేయించి ఉపాధ్యాయ శిక్షణ, విద్యా విషయాల మానటరింగ్కు వినియోగించాలన్నారు. నేతలు ఆదిరెడ్డి, సూరిబాబు, సనాతనబాబు, వెంగళరావు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఒకటో తేదీనే లబ్ధిదారులకు పింఛన్లు చేరాలి
● గిరిజన సంక్షేమ ముఖ్య కార్యదర్శి నాయక్ రంపచోడవరం: ఏజెన్సీలో వివి ధ రకాలైన సామా జిక పింఛన్లను ఒకటో తేదీనే లబ్ధిదారులకు నేరుగా ఇంటి వద్ద పంపిణీ చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మారేడుమిల్లి గ్రామంలో శ్యామల దివ్యజ్యోతి, మడకం శైలకు గురువారం వికలాంగ పింఛన్లు పంపిణీ చేశారు. మారేడుమిల్లి మండలంలో వివిధ గ్రామాలకు రోడ్లు నిర్మించాలని ఎంపీపీ సార్ల లలితకుమారి, సర్పంచ్ కొండ జాకబ్ ముఖ్య కార్యదర్శిని కోరారు. పీవో కట్టా సింహాచలం, ఎంపీడీవో తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, ఈఈ ఐ.శ్రీనివాసరావు, సుండం శ్రీనివాసుదొర, తదితరులు పాల్గొన్నారు. -
కొంపముంచింది
కూటమి నేతల కక్కుర్తేకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పుణ్యక్షేత్రాల్లో ఎన్నడూలేని ఘోరాలు, విషాదాలు సంభవిస్తున్నాయి. భక్తుల సౌకర్యాల కంటే.. ఉత్సవ సమయంలో ఎంత ఎక్కువగా సొమ్ము చేసుకోవచ్చనే దానిపై కూటమి నేతల ఆత్రమే వీటికి కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హోం మంత్రి దగ్గర నుంచి.. భీమిలి ఎమ్మెల్యే వరకూ ప్రతి ఒక్కరూ తమ అనుచరులకు కాంట్రాక్టులు, అనుయాయులకు వీఐపీ టికెట్లు ఇప్పించుకోవడంలోనే నిమగ్నమయ్యారు. ఎంత మంది భక్తులు వస్తారు, ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న దానిపై దృష్టిసారించలేదు. కూటమి నేతల కాసుల కక్కుర్తి ఈ దుర్ఘటనతో మరోసారి స్పష్టమైంది. సాక్షి, విశాఖపట్నం: ఊహకందని విషాదం యావత్ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఏడుగురి ప్రాణాల్ని బలిగొన్న దుర్ఘటనలో కూటమి ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు.. భారీ వర్షం కారణంగానే ప్రమాదం జరిగిందంటూ ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి నాయకుల వరకూ వంత పాడుతున్నారు. కానీ.. కూటమి నేతల కక్కుర్తి కారణంగానే విషాదం నెలకొందని తెలుస్తోంది. కేవలం తమకు చందనోత్సవం వల్ల ఏం లాభం ఒనగూరుతుందనే దానిపైనే ఎక్కువ దృష్టి సారించారు తప్ప... సామాన్య భక్తులకు అప్పన్న దర్శనం సజావుగా జరిగేలా చూసేందుకు ఎలాంటి ఏర్పాట్లు చెయ్యాలి.. ఎక్కడా ఇబ్బందులు లేకుండా చందనోత్సవాన్ని ఎలా నిర్వహించాలనేదానికి ప్రాధాన్యమివ్వలేదు. ఏర్పాట్లు చేసేందుకు వివిధ రకాల పనుల్ని కాంట్రాక్టు సంస్థలకు అప్పగించారు. ఈ పనులన్నింటినీ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, హోంమంత్రి అనిత స్వయంగా పర్యవేక్షిస్తూ... తమకు నచ్చిన వారికే కాంట్రాక్టులు అప్పగించారు. ఏర్పాట్లన్నీ గంటా అనుచరులకే.. అదే విధంగా.. ఏర్పాట్ల టెండర్ల వ్యవహారమంతా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నడిపించినట్లు సమాచారం. టెంట్లు, లైటింగ్, ఇతర పనులకు సంబంధించిన మొత్తం టెండర్లన్నీ గంటా దగ్గరుండి మరీ అనుచరులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇలా కాంట్రాక్టుల ద్వారా అనుచరులకు లబ్ధి కలిగించేందుకు ప్రయత్నించారే తప్ప.. భక్తుల గురించి కనీసం పట్టించుకోలేదు. పోనీ ఆ పనులైనా సక్రమంగా చేపట్టారా అంటే.. దానికి కూడా అతీగతీ లేకుండా పోయింది. ఘటన జరిగిన తర్వాత.. బస్సులు కొండపైన నిలిపేయడంతో భక్తులు దిగువనే ఉండిపోయారు. అక్కడ కనీస సౌకర్యాలు అందక నరక యాతన అనుభవించారు. ఇలా.. సింహాచలంలో జరిగిన దారుణానికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే అయినా.. వరుణుడిపై నెట్టేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వాటర్ బాటిళ్ల మాయాజాలం! ప్రతి చందనోత్సవానికి జీవీఎంసీ నీటిని పూర్తిస్థాయిలో సరఫరా చేస్తుంది. దీనికి తోడుగా.. సింహాచలం దేవస్థానానికి మంచినీటి బాటిళ్లని అందించే రెగ్యులర్ కాంట్రాక్టర్ కూడా ఉన్నారు. ప్రతి ఉత్సవానికి వీఐపీలకు 500 మిలీ బాటిల్స్ సరఫరా చేస్తుంటారు. ఈ చందనోత్సవానికి కూడా సదరు కాంట్రాక్టర్ 500 మిలీ బాటిల్స్ని లక్ష సరఫరా చేసే టెండరు అప్పగించారు. జీవీఎంసీ 20 లీటర్ల క్యాన్లు, పేపర్ గ్లాసుల్ని భారీ స్థాయిలో భక్తుల కోసం క్యూలైన్లలో, బస్ పాయింట్స్ దగ్గర, తొలి పావంచా దగ్గర ఏర్పాటు చేసింది. అయినా.. నీటి బాటిళ్లలో హోంమంత్రి మాయాజాలం ప్రదర్శించారు. అవసరం లేకపోయినా.. 250 మిలీ నీటి బాటిల్స్ కచ్చితంగా ఉండాలంటూ హుకుం జారీ చేశారు. భక్తులు లక్షన్నర వరకూ వస్తారని అంచనా వేశారు. అయినా.. 3 లక్షల బాటిల్స్ అవసరమంటూ హోంమంత్రి చెప్పడంతో దీనికి టెండర్లు పిలిచారు. ఈ టెండర్ని హోంమంత్రి ముఖ్య అనుచరుడికి అప్పగించారు. వాస్తవానికి ఈ బాటిల్స్ని 3 లక్షల వరకూ సరఫరా చేస్తామని చెప్పి టెండరు దక్కించుకున్న హోం మంత్రి అనుచరుడు.. కేవలం లక్షన్నర బాటిల్స్ మాత్రమే ఇచ్చి.. లెక్క మాత్రం 3 లక్షలుగా చూపించినట్లు తెలుస్తోంది. -
ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్
పాడేరు రూరల్: ఆయుష్మాన్ భారత్ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నయ్యపడాల్ తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆయుష్మాన్ భారత్ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు స్థానిక ఐటీడీఏ ఎదుట రిలే దీక్ష చేపట్టారు. శిబిరాన్ని గురువారం సీటూ నాయకులు సందర్శించి మద్దుతు తెలిపారు. ఈ సందర్భంగా సీటూ నేత చిన్నయ్యపడాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ వివిధ శాఖల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉద్యోగుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం మానుకోవాలన్నారు. ఆయుష్మాన్ భారత్ ఉద్యోగ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమనంగా 23 శాతం వేతన సవరణ జరపాలని, నిర్ధిష్టమైన జాబ్ చాప్టర్ అందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తక్షణమే ప్రభుత్వం, కలెక్టర్ స్పందించి సమస్యలు పరిష్కరించాలన్నారు. నాయకుడు బొజ్జన్న తదితరులు పాల్గొన్నారు. ఆయుష్మాన్ భారత్ వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల రిలే దీక్షలు -
రోడ్డు ప్రమాదంలో ల్యాబ్ టెక్నీషియన్ మృతి
గంగవరం : మండలంలోని వాడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న మిరియాల బాపన్నదొర (40) గంగవరం శివారులో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ సంఘటనపై ఎస్ఐ వెంకటేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వాడపల్లి పీహెచ్సీలో విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా గంగవరం సమీపంలో బైక్ నుంచి పడిపోవడంతో తలకు తీవ్ర గాయమై తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు ఎస్ఐ తెలిపారు. స్థానికులు హుటాహుటిన 108 సమాచారం అందజేయగా, మృతదేహాన్ని అడ్డతీగల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు గురువారం ఉదయం బాపన్నదొర మృతదేహాన్ని అడ్డతీగల ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్టు ఎస్ఐ చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. బాపన్నదొరకు ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. ఆయన అంత్యక్రియులు గంగవరంలో నిర్వహించారు.బాపన్నదొర మృతికి ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ గంగాదేవి, మాజీ ఎంపీపీ తీగల ప్రభ, సర్పంచ్లు అక్క మ్మ, రాజమ్మ, వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్లు వెంకటేశ్వరరావుదొర, వెంకటేశ్వర్లు దొర, చిన్నాలరావు, బుల్లియమ్మ, వాడపల్లి, గంగవరం పీహెచ్సీ వైద్యాధికారులు నిరంజన్, కృష్ణ పవన్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.రోడ్డు ప్రమాదం దృశ్యం (ఇన్సెట్)బాపన్నదొర (ఫైల్) -
ముత్యాలమ్మా.. దండాలమ్మా
చింతపల్లి: మండల కేంద్రంలోని ముత్యాలమ్మతల్లి ఆలయ వార్షికోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు దంపతుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని పలు వీధుల మీదుగా అమ్మవారి సారెను ఊరేగించారు. అనంతరం అమ్మవారికి సారే, చీరలను నైవేధ్యంగా సమర్పించారు. ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం భారీ అన్నసమారాధన జరిగింది. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు వినాయకరావు, భేతాళుడు, నాగేశ్వరరావు,రమేష్, రమణ.హరీష్ తదితరలు కార్యక్రమాలను పర్యవేక్షించారు. వైభవంగా ఆలయ వార్షికోత్సవం తరలివచ్చిన భక్తులు -
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
సీలేరు: గూడెం కొత్తవీధి మండలం సీలేరుకు 5కి.మి.దూరంలో గల ఐస్గెడ్డ జలపాతం వద్ద దిచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. చిత్రకొండకు చెందిన వంతల సుకదేవ్, బుడితీలు గు రువారం సాయంత్రం సీలేరు పనిమీద వస్తుండగా ఐస్గెడ్డకు వచ్చేసరికి భధ్రాచలం నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ సంఘటనలో బుడితికి కాలువిరిగి చేతికి గాయమైంది.సుకదేవ్కు స్వల్పగాయాలయ్యాయి. బస్సులోని ప్రయాణికులు సీఎస్ఆర్ ఆంబులెన్సుకు సమాచారం ఇవ్వగా, బాధితుల్లో ఒకరు చిత్రకొండ అంబులెన్సుకు సమాచారం ఇచ్చారు. రెండు అంబులెన్సులు ఒకేసారి రావడంతో బాధితులు చిత్రకొండ వెళ్లేందుకు అంగీకరించడంతో చిత్రకొండ అంబులెన్సులో బాధితులను తరలించారు.ఇద్దరికి తీవ్రగాయాలు -
ప్రాణాలను బలిగొందా...
మెట్ల నిర్మాణ ప్రణాళిక మార్పే ● పాత పద్ధతిలోనే మెట్లమార్గం నిర్మిస్తే ప్రమాదం జరిగేది కాదు ● అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యంసింహాచలం: సింహాచలం కొండపై షాపింగ్ కాంప్లెక్స్ వద్ద నుంచి జోడు భద్రాల ప్రాంగణానికి వెళ్లేందుకు నిర్మించిన కొత్త మెట్లమార్గం రూపకల్పనలో చేసిన మార్పులే ఏడుగురు భక్తుల ప్రాణాలను బలిగొన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో అనేక చందనోత్సవాల సమయంలో అదే స్థలంలో ఉన్న పాత మెట్లమార్గంలో తీవ్రమైన తోపులాటలు, అధిక రద్దీ నెలకొన్నప్పటికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, దురదృష్టవశాత్తు చరిత్రలో మొదటిసారిగా అదే ప్రదేశంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. వివరాల్లోకి వెళితే, సింహగిరిపై ఉన్న బస్టాండ్ నుంచి ఆలయానికి చేరుకోవడానికి ఉన్న మెట్లమార్గం ఇరువైపులా రెండు బ్లాక్లలో వ్యాపారుల షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. గతంలో ఈ మెట్లమార్గం నేరుగా జోడు భద్రాల ప్రాంగణానికి చేరుకునేది. చందనోత్సవం రోజుల్లో భక్తులను ఈ మార్గంలోనే వరుస క్రమంలో పంపి నేరుగా జోడు భద్రాల ప్రాంగణానికి వెళ్లేలా ఏర్పాట్లు చేసేవారు. ప్రసాద్ స్కీమ్ కింద పాత షాపింగ్ కాంప్లెక్స్ను తొలగించి, కొత్త దుకాణాలను రెండు బ్లాక్లుగా పాత పద్ధతిలోనే నిర్మించారు.అయితే, ఈ రెండు బ్లాక్ల మధ్య నిర్మించిన కొత్త మెట్లమార్గం విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహించారు. పాత ప్రణాళికలను అనుసరించకుండా, జోడు భద్రాల వద్దకు చేరుకునే మెట్లను కుడి, ఎడమ వైపులకు మళ్లించారు. మధ్యలో దాదాపు తొమ్మిది అడుగుల ఎత్తులో నాసిరకమైన గోడను నిర్మించడంతో, ఎడమ వైపు నుంచి రూ.300 క్యూలో వెళ్తున్న భక్తులపై అది ఒక్కసారిగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వైదిక వర్గాలు చెబుతున్నా లెక్కచేయకుండా... ఏటా శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి కొండ దిగువన నాలుగు పర్యాయాలు ఉత్సవాలు జరుగుతాయి. ఆ సందర్భాలలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను కొండపై నుంచి పల్లకిలో దిగువకు తీసుకువస్తారు. గతంలో జోడు భద్రాల నుంచి నేరుగా ఉన్న మెట్లమార్గం ద్వారానే ఊరేగింపు జరిగేది. కొత్త షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం తర్వాత కూడా అదే విధంగా నిర్మించాలని పలువురు వైదిక పండితులు సూచించినప్పటికీ, అధికారులు వారి మాటలను పట్టించుకోలేదని తెలుస్తోంది. వారి నిర్లక్ష్య వైఖరి ఇప్పుడు ఏడుగురు భక్తుల ప్రాణాలను బలిగొన్న విషాదానికి దారితీసింది. నేడు కూడా విచారణ సింహాచలంలో గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం నియమించిన త్రీ మెన్ కమిటీ శుక్రవారం కూడా విచారణ చేయనుంది. దేవస్థానం అధికారులను కూడా విచారించనుంది. గురువారం సంబంధిత ప్రాంతాన్ని బృందం సభ్యులు పరిశీలించి వివరాలు సేకరించారు. -
పైడిమాంబ ఆలయంలో భారీ చోరీ
దేవరాపల్లి: మండలంలోని కొత్తపెంట శివారు కొత్తూరు లోని పైడిమాంబ అమ్మవారి ఆభరణాలు చోరీకి గుర య్యాయి. దొంగత నానికి సంబంధించి స్థానిక సర్పంచ్ వెంకటరావు, ఆలయ కమిటీ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామ దేవత పైడిమాంబ అమ్మవారి మెడలో ముప్పావు తులం బంగారు మంగళ సూత్రాలు, మూడున్నర కేజీల వెండితో తయారీ చేసిన కిరీటం తదితర ఆభరణాలు అమ్మవారికి అలంకరణ చేశామన్నారు. బుధవారం రాత్రి దొంగలు ఆలయ తలుపు గడియ ధ్వంసం చేసి ఆలయంలోకి చొరబడి అమ్మవారికి అలంకరించిన అభరణాలన్నింటిని దోచుకుపోయారన్నారు. వాటి విలువ సుమారు రూ. 4 లక్షలకు పైబడి ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు అంచనా వేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని స్థానిక సర్పంచ్ రొంగలి వెంకటరావు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పేర్కొన్నారు. గురువారం ఉదయం ఆలయం తలుపులు తెరిచి ఉండటాన్ని స్థానికులు గమనించడంతో ఈ దొంగతనం విషయం వెలుగులోకి వచ్చిందని వారు తెలిపారు. చోరీ జరిగినట్టు పోలీసులకు ఆలయ కమిటీ సభ్యులు గురువారం ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు కె.కోటపాడు సీఐ పైడపునాయుడు చోరీ జరిగిన ఆలయాన్ని పరిశీలించారు. అనకాపల్లికి చెందిన క్లూస్ టీమ్ను రప్పించి దొంగతనం జరిగిన ప్రాంతంలో ఆధారాలతో పాటు వేలిముద్రలను సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. -
గ్రహణం
అరకు అందాలకు అర్ధంతరంగా నిలిపి వేసిన మాడగడ వ్యూ పాయింట్ రహదారి పనులు.. రోడ్డు పక్కనవృథాగా ఉన్న మెటీరియల్ పర్యాటకుల స్వర్గధామం మాడగడ సన్రైజ్ వ్యూపాయింట్ అరకులోయ టౌన్: అందాల అరకులోయ ఎన్నో ప్రకృతి దృశ్యాలకు ఆలవాలం. మాడగడ సన్రైజ్ వ్యూపాయింట్, రణజిల్లెడ వాటర్ ఫాల్స్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ ప్రాంతాలకు వెళ్లే రహదారుల నిర్మాణానికి, మిగతా అభివృద్ధి పనులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసింది. పనులు కొంత వరకు పూర్తయ్యాయి. ప్రస్తుత కూటమి సర్కారు వాటిని నిర్లక్ష్యం చేయడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. మాడగడ సన్రైజ్ వ్యూపాయింట్కు వెళ్లే 3.75 కిలోమీటర్ల రహదారి, మురుగు కాలువలు, రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి మంజూరైన రూ.11 కోట్లతో పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ శరవేగంగా పనులు చేసుకొచ్చారు. అయితే చేసిన పనులకు సంబంధించి రూ.1.8 కోట్ల బిల్లును కూటమి ప్రభుత్వం చెల్లించకపోవడంతో ప్రస్తుతం పనులు నిలిపివేశారు. అటవీ అనుమతులు లేక 600 మీటర్ల రహదారి నిలిపివేత విశాఖ–అరకు రూట్లో బోసుబెడ గ్రామం నుంచి మాడగడ సన్రైజ్ వ్యూపాయింట్ వరకు రహదారి నిర్మాణం తలపెట్టారు. సన్రైజ్ వ్యూపాయింట్ వద్ద వేస్తున్న రహదారిలో 600 మీటర్ల మేర ఫారెస్టు పరిధిలో ఉందని అటవీ శాఖ అభ్యంతరం తెలిపింది. దీంతో రహదారి నిర్మాణానికి ఆటంకం ఏర్పడింది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే అరకులోయ మండలంలోని మాడగడ, బస్కీ పంచాయతీలతోపాటు, హుకుంపేట మండలం భూర్జ, అనంతగిరి మండలం పైనంపాడు ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుంది. మిషన్ కనెక్ట్లో భాగంగా పాడేరుకు చాలా సులువుగా అతి తక్కువ సమయంలో చేరుకోవచ్చు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే దేశ విదేశాలతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి ఈ ప్రాంత అందాలు తిలకించేందుకు వచ్చే పర్యాటకుల కష్టాలు తీరుతాయి. కూటమి ప్రభుత్వం స్పందించి సకాలంలో బిల్లులు చెల్లించి రహదారి నిర్మాణం పూర్తి చేయాలని గిరిజనులతోపాటు పర్యాటకులు కోరుతున్నారు. ● అరకులోయ మండలం పద్మాపురం పంచాయతీ రణజిల్లెడ వాటర్ ఫాల్స్ రహదారి పనులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది. అప్పట్లోనే రూ.1.8 కోట్ల బిల్లులు చెల్లించారు. ఆ తరువాత చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం 10 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం మిగిలిపోయింది. బస్కీ రోడ్డు పనులు పూర్తి చేయరూ.. అరకులోయ మండలం మాడగడ పంచాయతీ నందివలస జంక్షన్ నుంచి బస్కీ గ్రామం వరకు 11 కిలోమీటర్ల రహదారి మరమ్మతు, సీసీ రోడ్లు నిర్మాణానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.3 కోట్లు నిధులు మంజూరు చేసింది. రహదారి మెటల్ పరిచి విడిచిపెట్టారు. దీంతో వాహన చోదకులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. చేసిన పనులకు కేవలం రూ.60 లక్షలు మాత్రమే బిల్లులు చెల్లించారు. మిగతా బిల్లు చెల్లించాల్సి ఉంది. రహదారి త్వరితగతిన పూర్తి చేయాలని గిరిజనులు కోరుతున్నారు. ● ప్రముఖ సందర్శిత ప్రాంతాల అభివృద్ధికి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా పెద్ద పీట వేశారు. మాడగడ సన్రైజ్ వ్యూ పాయింట్కు, రణజిల్లెడ వాటర్ ఫాల్స్ వరకు రహదారి నిర్మాణానికి రూ.16 కోట్లు నిధులు మంజూరు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం పనులు పూర్తి చేసేందుకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. బిల్లులు చెల్లిస్తే పనులు ప్రారంభిస్తాం మాడగడ సన్రైజ్ వ్యూపాయింట్ రహదారి నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్కు రూ.1.80 కోట్ల బిల్లులు బకాయి ఉంది. దీంతో పనులు నిలిపివేశారు. సన్రైజ్ వ్యూపాయింట్ వద్ద సుమారు 600 మీటర్ల మేర అనుమతులు లేక అటవీ అధికారులు పనులు నిలిపి వేశారు. ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తే పనులు మళ్లీ ప్రారంభిస్తాం. – రామమ్, డీఈఈ, పీఆర్ ఇంజినీరింగ్ శాఖ, అరకులోయఅసంపూర్తిగా డ్రైనేజీల నిర్మాణం బోసుబెడ గ్రామం నుంచి మాడగడ సన్రైజ్ వ్యూ పాయింట్ వరకు రహదారితోపాటు బోసుబెడ గ్రామంలో డ్రైనేజీ అసంపూర్తిగా వదిలేశారు. కాలువలకు పైకప్పు వేయలేదు. దీంతో ప్రతి రోజు ఈ కాలువల్లో పశువులతోపాటు మనుషులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇంజినీరింగ్ అధికారులు స్పందించి మురుగు కాలువలు వెంటనే పూర్తి చేసి పై కప్పులు వేయాలి. – శెట్టి కొండప్ప, గిరిజనుడు, బోసుబెడ, మాడగడ పంచాయతీ రోడ్డుపై మెటల్తో.. ప్రమాదం నందివలస–బస్కీ రహదారి నిర్మాణ పనులు చేపట్టి అర్ధంతరంగా నిలిపివేశారు. రోడ్డుపై మెటల్ వేసి విడిచిపెట్టడంతో వాహన చోదకులు ప్రమాదాల బారినపడుతున్నారు. నందివలస జంక్షన్ నుంచి బస్కీ పంచాయతీ కేంద్రం వరకు రహదారి మరమ్మతు పనులు, ఇతర పనులు చేపట్టిన కాంట్రాక్టర్ త్వరితగతిన పనులు పూర్తిచేయాలి. ఇందుకు అధికారులు, ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – కిల్లో రామన్న, వైస్ ఎంపీపీ, అరకులోయ -
గిరిజన డీఎస్సీ సాధన కోసం..
అరకులోయ టౌన్: జీవో నెం.3 పునరుద్ధరిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, గిరిజన ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని గిరిజనులు శుక్రవారం నుంచి నిరవధిక బంద్కు దిగుతున్నారు. ఆదివాసీ ప్రజాసంఘాలు, గిరిజన డీఎస్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో అడవి బిడ్డల ఆందోళన ఉధృతమవుతోంది. బంద్ పాటించాలని గిరిజన ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేశారు. అధికారులకు కూడా ముందుగానే బంద్ సమాచారం అందించారు. గిరిజనుల ఉద్యమానికి వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మన్యం బంద్ విజయవంతం చేద్దాం బంద్లో పాల్గొనాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జీవో నంబర్ 3 పునరుద్ధరించి, గిరిజన నిరుద్యోగ యువకులకు న్యాయం చేయాలన్నారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ జీవోకు ప్రత్యామ్నాయంగా నూతన జీవో తీసుకురావాలన్నారు. పార్టీలకు అతీతంగా గిరిజనులంతా ఏకతాటిపైకి వచ్చి పోరాడాలన్నారు. ఆదివాసీ స్పెషల్ డీఎస్పీ నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగం అరకులోయ సభలో జీవో నంబర్ 3ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారని, మాట నిలబెట్టుకోవాలన్నారు. దానిని పట్టించుకోకుండా దగా డీఎస్పీ ప్రకటించడం దారుణమన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్ రాంప్రసాద్, సోషల్ మీడియా ఇన్చార్జి రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగుల పొట్ట కొట్టొద్దు జీవో నంబర్ 3 పునరుద్ధరించకపోతే 600 మంది గిరిజన నిరుద్యోగులు తీవ్ర అన్యాయానికి గురవుతారని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంటు పరిశీలకుడు డాక్టర్ కుంభా రవిబాబు ఆన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీలో ఐటీడీఏ పరిధిలోరి 766 పోస్టుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేసి 6 శాతం గిరిజనులకు, ఇతరులకు 94 శాతం ఇవ్వడం వలన కేవలం 42 పోస్టులు మాత్రమే ఆదివాసీలకు దక్కుతాయన్నారు. ఇది గిరిజనులను నిలువునా వంచించడమేనన్నారు. మన్యం బంద్లో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్న డాక్టర్ తెడబారికి సురేష్ కుమార్కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. నేటి నుంచి గిరిజన ప్రాంతాల్లో నిరవధిక బంద్ జీవో నెం.3 పునరుద్ధరించాలని డిమాండ్ -
సప్లిమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
అరకులోయ టౌన్: ఎస్ఎస్సీ సప్లిమెంటరీ కోచింగ్ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పాడేరు గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎల్.రజని కోరారు. గురువారం మండలంలోని అరకులోయ కంఠబౌంషుగుడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో జరుగుతున్న ఎస్ఎస్సీ సప్లిమెంటరీ స్పెషల్ కోచింగ్ క్యాంప్ను డీడీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కంఠబౌంషుగుడ బాలుర పాఠశాలలో 187 మంది, బాలికల పాఠశాలలో 140 మంది కోచింగ్ తీసుకుంటున్నారని, ఈనెల 18వ తేదీ వరకు శిక్షణ కొనసాగుతుందని కోచింగ్ సెంటర్ల ఇన్చార్జి ఎల్.బి.దయానిధి తెలిపారు. కోర్సు డైరెక్టర్లు హెచ్.పి.కెందు, శెట్టి నారాయణరావు, పద్మావతి, రాజ్యలక్ష్మి, జానకమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు. -
నూరుశాతం ఉద్యోగాలు ఇవ్వాల్సిందే..
సాక్షి, పాడేరు: ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజనులకు నూరుశాతం ఉద్యోగ, ఉపాధ్యాయ పోస్టులను ఇవ్వాల్సిందేనని వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. పాడేరు ఐటీడీఏ ఎదుట వైఎస్సార్సీపీ నేత తెడబారికి సురేష్కుమార్ చేపట్టిన ఆమరణ దీక్ష శిబిరాన్ని గురువారం ఆమె సందర్శించారు. గిరిజనులకు నూరుశాతం ఉద్యోగాల జీవో 3 పునరుద్ధరణ, ప్రత్యేక డీఎస్సీ డిమాండ్తో సురేష్కుమార్ చేపట్టిన దీక్షకు ఆమె సంఘీభావం తెలిపారు. దీక్ష శిబిరంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీలకు ప్రత్యేక డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాల్సిన కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీతో అన్యాయం చేస్తోందన్నారు. నూరుశాతం ఉద్యోగాలు కల్పించాల్సిన కూటమి ప్రభుత్వం 6 శాతం ఉద్యోగాలకే పరిమితం చేయడం దుర్మార్గమన్నారు. గిరిజనులకు అన్యాయం చేస్తే వైఎస్సార్సీపీ ఉపేక్షించదని, గిరిజనుల పక్షాన పోరాడతామని హెచ్చరించారు. పాడేరు వైస్ ఎంపీపీ కుంతూరు కనకాలమ్మ, వైఎస్సార్సీపీ నాయకులు లకే రామసత్యవతి, కోడా సుశీల, కొట్టగుళ్లి నాగేంద్ర, పీసా కమిటీ సుండ్రుపుట్టు, గుడివాడ ఉపాధ్యక్షులు డి.పి.రాంబాబు, బోనంగి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్రాష్ట్ర అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి -
నిర్లక్ష్యానికి నిదర్శనం
ముంచంగిపుట్టు: ఆస్పత్రుల్లో ప్రసవం అయిన తల్లీ బిడ్డలను సురక్షితంగా ఇంటికి తరలించే తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్కు సుస్తీ చేసింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా సేవలు అందించిన తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్ల నిర్వహణను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేయడంతో ఈ జబ్బు పట్టుకుంది. ముంచంగిపుట్టు కమ్యూనిటీ ఏరియా ఆసుపత్రి ఆవరణంలో గురువారం ఈ వాహనం స్టార్ట్ అవ్వకపోవడంతో.. బాలింత బంధువులు సాయం పట్టారు. వారు తోయడంతో అంబులెన్స్ స్టార్ట్ అయింది. ప్రతి రోజు తల్లీ బిడ్డ అంబులెన్స్ స్టార్ట్ చేసేందుకు ఇదే రకమైన ఇబ్బంది ఎదురవుతోంది. తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్కు అనారోగ్యం -
రబ్బరు రైతులకు ఆర్థిక ఆసరా
రంపచోడవరం: ఏజెన్సీలో రబ్బరు సాగు చేస్తున్న రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్ అన్నారు. మారేడుమిల్లి మండలం పూజరిపాకల గ్రామంలో రబ్బరు రైతుల తో గురువారం ఆయన సమావేశమయ్యారు. మూ డు సంవత్సరాల్లో 2500 ఎకరాల్లో రబ్బరు ప్లాంటేష న్ వేసే విధంగా ప్రణాళికలు తయారు చేశామన్నారు. మారేడుమిల్లి నుంచి నేషనల్ రబ్బరు ప్రాజెక్టు ఏర్పా టు చేసేందుకు రూ.5 కోట్లు మంజూరు చేయాలని రబ్బరు రైతులు కోరారు. ఎంత రబ్బరు దిగుబడి వ స్తుంది, ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు వంటి విషయాలను తెలుసుకున్నారు. రబ్బరు మొక్కలు ఇచ్చేందుకు నర్సరీ ఏర్పాటు చేయాలని, ప్రాసెసింగ్ యూనిట్లు మంజూరు చేయాలని రైతులు జానకిరామారెడ్డి, కమలాకర్లు కోరారు. ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామాల్లో 800 ఎకరాల్లో రబ్బరు ప్లాంటేషన్ వేసేందుకు ఒక ప్రత్యేక అధికారిని, ఇద్దరు హార్టికల్చర్ అఽసిస్టెంట్లను నియమించాలని నాయక్ ఆదేశించారు. ఉపాధి పథకం జాబ్ కార్డు ఆధారంగా ఒక్కో రైతు ఎకరన్నర రబ్బరు ప్లాంటేషన్ వేసుకోవాలన్నారు. పీవో కట్టా సింహాచలం, అధికారులు పాల్గొన్నారు. ప్రాసెసింగ్ పరికరాల కొనుగోలుకు ఆదేశం ఏజెన్సీలో వందన్ వికాస కేంద్రాల ద్వారా జీడిపిక్కలు ప్రాసెసింగ్ చేసేందుకు కావాల్సిన పరికరా లు కొనుగోలు చేయాలని ముఖ్య కార్యదర్శి నాయ క్ అధికారులను ఆదేశించారు. కేవీకేలో ఉన్న జీడిపిక్కల యూనిట్ను పరిశీలించారు. ఏజెన్సీలో వంద న్ వికాస కేంద్రాలు అభివృద్ధి చేసేందుకు బ్యాంకు ద్వారా రుణాలు అందజేయాలన్నారు. టెన్త్లో నూరుశాతం ఫలితాలు సాధించాలి ఏజెన్సీలో వచ్చే విద్యా సంవత్సరంలో పదో తరగతిలో నూరుశాతం ఫలితాలు సాధించాలని ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్ అన్నారు. ఐటీడీఏలో పీవోలు కట్టా సింహాచలం, అపూర్వ భరత్, డీఎఫ్ఓ రవీంద్రదామలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప దో తరగతి ఉత్తీర్ణతపై ఆరా తీశారు. గిరిజన సంక్షే మ ఇంజినీరింగ్ పనులు ఎన్ని మంజూరయ్యాయి, ఎన్ని పూర్తి చేశారు అనే విషయాన్ని సమీక్షించారు. 2500 ఎకరాల్లో ప్లాంటేషన్ వేసేందుకు ప్రణాళికలు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి నాయక్ -
నాణ్యత లోపిస్తే సహించేది లేదు
పెదబయలు: జిల్లాలో జలజీవన్ మిషన్ పథకం ద్వారా జరుగుతున్న గ్రావిటీ పథకాల నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపాలు ఉంటే సహించేది లేదని కలెక్టర్ ఎఎస్.దినేష్కుమార్ హెచ్చరించారు. గురువారం పెదబయలు మండలం వనభంగి పంచాయతీ జడిగుడ గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో వృద్ధాప్య పింఛన్లు 20 మందికి, వికలాంగ పింఛన్ ఒకరికి, వితంతు పింఛన్లు ఇద్దరికి పంపిణీ చేశారు. అనంతరం జరిగిన గ్రామ సభలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి జల్జీవన్ మిషన్ పథకం ద్వారా రూ.8 లక్షలు మంజూరయ్యిందని, సకాలంలో పని ప్రారంభించి తాగునీరు అందించాలని సంబంధిత ఇంజినీర్లను ఆదేశించారు. తాగునీటి పథకానికి నీరు అందించే ఊట గెడ్డను కిలోమీటరు దూరం నడిచి వెళ్లి పరిశీలించారు. అనంతరం పాఠశాల భవనం, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. వనభంగిలో అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనం పూర్తి చేయాలని, దిగువ పేడాపల్లి, దమ్ముగుడ, పనసపుట్టు, తోటలగొంది, డుంబగుడ గ్రామాలకు సీసీ రోడ్లు మంజూరు చేయాలని, నిమ్మగుండ లబ్జిరి మీదుగా తారురోడ్డు మంజూరు చేయాలని స్థానిక వైస్ ఎంపీపీ కొర్రా రాజుబాబు, సర్పంచ్ కొర్రా కాసులమ్మ కోరారు. ఈ పనులకు అంచనాలు తయారు చేసి నివేదించాలని కలెక్టర్ ఇంజినీర్లను ఆదేశించారు. ఎగువ పేడాపల్లి గ్రామంలో జల్జీవన్ మిషన్ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. సదరం సర్టిఫికెట్ ఉన్నా ఫించన్ మంజూరు కావడం లేదని జడిగుడ గ్రామానికి చెందిన కొర్ర హరి అనే వికలాంగుడు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. జడిగుడలో పింఛన్ పంపిణీ కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ గురువారం పెదబయలు వనభంగి పంచాయతీ మారుమూల పీవీటీజీ గ్రామమైన జడిగుడలో స్వయంగా పింఛన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1,22,403 మందికి రూ.51,48,66,500ల లబ్ధి చేకూరుతుందన్నారు. మొదటి రోజు గురువారం సాయంత్రం 6 గంటల సమయానికి 94.93 శాతం మందికి పింఛన్లు పంపిణీ చేశామన్నారు. అనంతరం పీవీటీజీ మహిళలతో మాట్లాడారు. డీఆర్డీఏ పీడీ మురళి, ఎంపీడీవో ఎల్.పూర్ణయ్య, తహసీల్దార్ రంగారావు, ఏపీఎం దేవమంగా, ఏపీవో సూరిబాబు, వైస్ ఎంపీపీ రాజుబాబు, వనభంగి సర్పంచ్ కొర్ర కాసులమ్మ, ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అవసరమైన పనులకు అంచనాలు తయారు చేయండి : కలెక్టర్ పెదబయలు మండలంలో పలు అభివృద్ధి పనుల పరిశీలన -
ఆర్ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
చింతపల్లి: స్థానిక గురుకుల సాంకేతిక పారిశ్రామిక శిక్షణ (ఆర్ఐటీఐ)కేంద్రంలో మొదటి విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ శ్రీనివాసచారి తెలిపారు. 25–26 విద్యాసంవత్సరానికి గాను ఈ శిక్షణ కేంద్రంలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో 40, మోటారు వెహికల్ మెకానిక్ 24, ఫిట్టర్ 20, వెల్డర్ 40, ప్లంబర్ 24, వుడ్ వర్క్టెక్నీషియన్ 24,స్టెనో గ్రాఫర్ ట్రేడ్లో 24 సీట్లు ఉన్నాయన్నారు. ఆసక్తిగలవారు మే 24వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 26న ఒరిజనల్ ధ్రువీకరణ పత్రాలను పరిశీలించనున్నట్టు చెప్పారు. -
ముమ్మరంగా పోలీసు తనిఖీలు
ముంచంగిపుట్టు: ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతమైన ముంచంగిపుట్టులో బుధవారం స్థానిక ఎస్ఐ జె.రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో కాకులమామిడి,కాంటవరం అటవీ ప్రాంతంలో రెండు స్లారు మావోయిస్టులకు,పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరగడంతో సరిహద్దులో పోలీసులు అప్రమత్తమయ్యారు.ఆంధ్ర,ఒడిశా సరిహద్దులో ఉన్న గిరిజన గ్రామాల నుంచి మండల కేంద్రాలకు వచ్చే వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.ప్రయాణికుల బ్యాగులు,లగేజీలను క్షణ్ణంగా పరిశీలించారు. మండల కేంద్రంలో సీఆర్పీఎఫ్ పోలీసులు బలగాలు గస్తీ నిర్వహించాయి.ఒడిశా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన మాచ్ఖండ్,ఒనకఢిల్లీ గ్రామాల్లో బీఎస్ఎఫ్ బలగాలు సైతం సరిహద్దు రాకపోకలపై నిఘాను పెంచాయి. -
సాగర గర్భంలో భయో వ్యర్థాలు!
● ప్లాస్టిక్ వేస్ట్తో సమానంగా మెడికల్ వ్యర్థాలు లభ్యం ● బయో వేస్ట్ వెలికితీస్తున్న స్కూబా డైవర్లు ● జాలరిపేట, రుషికొండ తీరాల్లో ఎక్కువగా లభ్యం ● జలచరాలకు హానికరమంటున్న పర్యావరణవేత్తలు సాక్షి, విశాఖపట్నం: సాగర తీరాన్ని బయో వ్యర్థాలు భయపెడుతున్నాయి. ప్రాణాంతకమైన మెడికల్ వేస్ట్ను అత్యంత భద్రంగా నిర్వహించాల్సి ఉండగా.. కొన్ని ఆస్పత్రులు సముద్రాన్నే డస్ట్బిన్గా మార్చేసుకున్నాయి. దీంతో ప్రమాదకరమైన వైద్య వ్యర్థాలు సముద్రాన్ని ముంచెత్తుతున్నాయి. పర్యావరణ నిపుణుల అంచనా ప్రకారం ఏటా విశాఖ సాగర తీరంలో 350 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు, సుమారు 10 టన్నుల వరకూ మెడికల్ వ్యర్థాలు సముద్రగర్భంలో కలుస్తున్నాయి. సాగర గర్భంలోకి చొచ్చుకుపోతున్న ఈ వ్యర్థాలు.. జీవ వైవిధ్యానికి చేటు తెస్తున్నాయి.. ఫలితంగా జలచరాలు నిర్జీవంగా మారిపోతున్నాయి. ఇటీవల ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించేందుకు స్వచ్ఛందంగా నడుంబిగించిన కొంతమంది స్కూబా డైవర్లు.. సముద్రం నుంచి బయో వ్యర్థాలు బయటపడుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెడీవేస్ట్ ‘సీ’గా మార్చేస్తున్నారు అందాల సముద్ర తీరాన్ని ఆస్వాదించేందుకు వస్తున్న పర్యాటకులకు మెడీ వేస్ట్ దర్శనమిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఇలా బయో వ్యర్థాలను సముద్రంలో పారబోస్తున్నారు. ఈ వ్యర్థాలను నిర్వహణ సంస్థలకు ఇవ్వాలంటే కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే బీచ్కు సమీపంలోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ఈ తరహా ఇంజిక్షన్లు, సిరంజీలు, కాలం చెల్లిన మందులు, ఇంజక్షన్ సీసాలు, సైలెన్ బాటిల్స్ సాగరంలో కలిపేస్తున్నాయి. కేవలం రూ.1000 నుంచి రూ.2 వేలకు కక్కుర్తి పడుతున్న చిన్న చిన్న ఆస్పత్రుల నిర్వాహకులు.. సముద్రాన్ని మెడీవేస్ట్ సీగా మార్చేస్తూ పర్యావరణానికి హానితలపెడుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వైఎస్సార్సీపీ నాయకులు మృతి
వి.ఆర్.పురం: మండలంలోని రామవరం సబరిరాయిగూడెం వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వైఎస్సార్సీపీ నాయకులు మృతి చెందారు. దీంతో బాధిత కుటుంబాలకు వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రగాఢ సానుభూతి తెలిపి, సంతాపం ప్రకటించారు. ఈ మేరకు గ్రామస్తులు తెలిపిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రామవరం పంచాయతీకి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు కారం చంద్రయ్య(30), మడకం నరేష్(33) వి.ఆర్.పురంలో క్రికెటమ్యాచ్ ఆడిన అనంతరం బైక్పై శబరిగూడెం వెళ్తుండగా సబరిరాయిగూడెం వద్ద ఎదురుగా వస్తున్న ఆటో వీరి వాహనాన్ని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు, తలకు బాగా బలమైన గాయాలయ్యాయి. ఇందులో మడకం నరేష్నుం చింతూరు ఆస్పత్రికి, కారం చంద్రయ్యను భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం బాధిత కుటుంబాలకు మృతదేహాలను అందజేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సంతోష్కుమార్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కార్యకర్తలు మృతి చెందడం పార్టీకి తీరని లోటు అనిఅన్నారు. ఆయా కార్యకర్తల పార్ధీవదేహాలను సందర్శించి పూలమాలలు సమర్పించి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. నాయకులు బోడ్డు సత్యనారాయణ, చిక్కల బాలు, సర్పంచ్ పిట్టా రామారావు, పీసా కమిటీ ఉపాధ్యక్షుడు జయరాజు, గ్రామస్తులు తదితరులున్నారు.మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన పార్టీ శ్రేణులు -
మూడు రోజుల వ్యవధిలో టన్ను వరకు..
ప్లాస్టిక్ వ్యర్థాలతో సముద్రం కలుషితమవుతున్న నేపథ్యంలో సామాజిక బాధ్యతలో భాగంగా స్కూబా డైవర్లు.. సముద్ర పరిరక్షణకు పాటుపడుతున్నారు. వీరికి బయో వ్యర్థాలు కనిపిస్తుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్ర లోతుల్లో పోగుపడ్డ ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే బాధ్యతను ఇటీవల కాలంలో ప్లాటిపస్ వంటి స్కూబాడైవింగ్ సంస్థలు స్వచ్ఛందంగా చేపడుతున్నాయి. సముద్ర గర్భంలో వ్యర్థాల ఏరివేత కోసం ఈ బృందాలు 3 కిలో మీటర్ల దూరం వరకూ వెళ్తున్నాయి. ఒడ్డు నుంచి ప్రారంభించి.. మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న వ్యర్థాల్ని తొలగిస్తున్నారు. ప్రతి రోజూ కనీసం 100 నుంచి 200 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రం నుంచి వెలికితీస్తున్నారు. ఇందులో కనీసం 10 నుంచి 20 కిలోల వరకూ బయో వ్యర్థాలు ఉంటున్నాయని వారు చెబుతున్నారు. మూడు రోజుల వ్యవధిలో టన్ను వరకూ స్కూబా డైవర్లు మెడివేస్ట్ ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యర్థాలు సముద్ర జీవరాశులతో పాటు.. పర్యాటకులకు ప్రాణహానిని కలిగిస్తుందని, అధికారులు తక్షణమే బయో వ్యర్థాలు సముద్రంలో కలవకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఆయుష్మాన్ భారత్ వైద్య ఉద్యోగుల రిలే దీక్షలు
సాక్షి,పాడేరు: తమకు ఉద్యోగ భద్రత కల్పించి,హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలనే డిమాండ్తో జిల్లాలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేస్తున్న వైద్య ఉద్యోగులు పాడేరు ఐటీడీఏ ఎదుట రిలే దీక్షలు చేపట్టారు. మోకాళ్లపై నిలబడి తమ నిరసన వ్యక్తం చేశారు.ఆయుష్మాన్ భారత్ నిబంధనల మేరకు ఉద్యోగ భద్రత కల్పించాలని, జాతీయ హెల్త్ మిషన్ వైద్య ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ చేయాలని, పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని, ఈపీఎఫ్ పునరుద్ధరించాలని, క్లినిక్ అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలని, నిర్ధిష్టమైన జాబ్చార్టుతో పాటు ఎఫ్ఆర్ఎస్ నుంచి సీహెచ్వోలను మినహాయించాలని, హెచ్ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్, బదిలీలు, పితృత్వ సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేంత వరకు రిలే దీక్షలను కొనసాగిస్తామని వారు తెలిపారు. -
రంగురాళ్ల తవ్వకాల నిరోధానికి చర్యలు
చింతపల్లి: చింతపల్లి రేంజ్ పరిధిలో గల రంగురాళ్ల క్వారీల్లో తవ్వకాల నిరోధానికి అన్ని చర్యలు చేపడుతున్నట్టు రేంజ్ అధికారి అప్పారావు తెలిపారు. చింతపల్లి డివిజన్ అటవీశాఖ అధికారి వై.వి. నరసింహారావు ఆదేశాల మేరకు జీకే వీధి మండలం దామనాపల్లి పంచాయతీ పరిధిలోని దొడ్డికొండ గ్రామ సమీపంలో గల రంగురాళ్ల క్వారీని కాంక్రీట్తో బుధవారం మూసివేశారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ ఈప్రాంతంలో అపరిచితులు సంచరిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. రంగురాళ్ల తవ్వకాలతో పాటు కలప అక్రమ రవాణా,వన్యప్రాణల వేట వంటి కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ప్రత్యేక డీఎస్సీ కోసంఆమరణ నిరాహార దీక్ష
సాక్షి,పాడేరు: ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన నూరుశాతం ఉద్యోగాల జీవో నంబర్ 3 పునరుద్ధరణ, ప్రత్యేక డీఎస్సీ సాధన కోసం వైఎస్సార్సీపీ నాయకుడు తెడబారికి సురేష్కుమార్ పాడేరు ఐటీడీఏ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ ఆర్డినెన్స్ను జారీ చేసేంతవరకు దీక్షను కొనసాగిస్తానని సురేష్కుమార్ తెలిపారు. సీఎం చంద్రబాబు ఎన్నికల హామీలను వెంటనే అమలుజేసి, గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక డీఎస్సీ సాధనకు సురేష్కుమార్ చేపట్టిన ఆమరణదీక్షకు పలువురు గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నేతలు సంఘీభావం తెలిపి, దీక్ష శిబిరంలో కూర్చున్నారు. -
ఘనంగా బసవేశ్వరుడి జయంతి
సాక్షి,పాడేరు: 12వ శతాబ్దపు కవి,సంఘ సంస్కర్త బసవేశ్వరుడి జయంతిని కలెక్టరేట్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. బసవేశ్వరుడి చిత్రపటానికి కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్, పలువురు అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఏడాది ఏప్రిల్ 30న బసవ జయంతిని ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. లింగాయత్ ఉద్యమ స్థాపకుడైన బసవన్న శక్తివంతమైన బోధనల ద్వారా సమానత్వం, న్యాయం, శివభక్తి ప్రచారం కోసం కృషి చేశారన్నారు. ఆయన అడుగు జాడల్లో నడుస్తూ కుల వివక్ష రహిత సమాజం కోసం అందరం కృషి చేయాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చిరంజీవి నాగ వెంకట సాహిత్,డీఆర్వో పద్మలత, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధకశాఖ అధికారులు నందు, రమేష్కుమార్రావు, నరసింహులు, కలెక్టరేట్ ఏవో తిరుమలరావు, డీటీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ప్రత్యేక డీఎస్సీ కోసం ముట్టడి
గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. కొద్ది సేపటి తర్వాత పీవో కట్టా సింహాచలం బయటకు రావడంతో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ చైతన్య వేదిక అధ్యక్షుడు వెదుళ్లు లచ్చిరెడ్డి, ఆదివాసీ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు తీగల బాబురావు, సీపీఎం నాయకులు మట్ల వాణిశ్రీ, సిరిమల్లిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చింతూరు: స్పెషల్ డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాల నాయకులు, నిరుద్యోగ యువత, డీఎస్సీ అభ్యర్థులు స్థానిక ఐటీడీఏ ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జీవో నంబర్ 3 పై ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఆదివాసీ నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల ప్రత్యేక చట్టాలను ప్రభుత్వం నీరుగారుస్తోందని, ఉన్నత చదువుల్లో అడుగుపెడుతున్న ఆదివాసీ యువత జీవోల రద్దు కారణంగా తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల ముందు ఓట్లకోసం జీవోను పునరుద్ధరిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక దానిని విస్మరించడం తగదని, ప్రత్యేక డీఎస్సీ ప్రకటించి ఆదివాసీ యువతకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ కోసం ఈనెల రెండున నిర్వహిస్తున్న మన్యం బంద్ను జయప్రదం చేయాలని వారు కోరారు. అనంతరం వారు ఐటీడీఏ పీవో అపూర్వభరత్కు వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పులి సంతోష్కుమార్, సున్నం రాజులు, సీసం సురేష్, పల్లపు వెంకట్, మడివి రవితేజ, అగరం సుబ్బలక్ష్మి, రాఘవయ్య, నాగేశ్వరరావు, లావణ్య, లక్ష్మణ్ పాల్గొన్నారు.7వ పేజీ తరువాయి -
పరిశ్రమ పార్కులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
కలెక్టర్ దినేష్కుమార్సాక్షి,పాడేరు: జిల్లాలో రూ.500 కోట్లతో పరిశ్రమల పార్కుల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా పరిశ్రమలు, వ్యవసాయ, ఉద్యానవన, విద్యుత్శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొలుగొండ మండలంలో పరిశ్రమల పార్కు ఏర్పాటుకు అనకాపల్లి కలెక్టర్ 250 ఎకరాలు గుర్తించారని చెప్పారు. డుంబ్రిగుడ మండలం అరకులో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి మే 1న శంకుస్థాపన చేయనున్నామని, అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లో అరకు బ్రాండ్ పేరున కాఫీ, మిరియాలు, పసుపు, చిరుధాన్యాలు, ఇతర గిరిజన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తామని చెప్పారు. పీఎం విశ్వకర్మ, ఎంఎస్ఎంఈ సర్వే, పీఎంఈజీఏ దరఖాస్తుల స్వీకరణపై సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి రవిశంకర్, ఏడీ రమణారావు, వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులు ఎస్.బి.ఎస్.నందు, రమేష్కుమార్రావు పాల్గొన్నారు. 15 శాతం వృద్ధి లక్ష్యం : వ్యవసాయానుబంధ రంగాల్లో 15 శాతం వృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. స్వర్ణాంధ్రా ప్రణాళికలపై కలెక్టరేట్లో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయానుబంధ రంగాల్లో గణనీయమైన వృద్ధి సాధించాలని, పంటల సాగును విస్తరించాలన్నారు. మండల, ఐటీడీఏ, జిల్లా స్థాయిలో వర్కుషాప్లు ఏర్పాటు చేయాలన్నారు. కోల్డ్ స్టోరేజీలతో ప్రయోజనాన్ని పరిశీలించి, ఎక్కడ పెట్టాలో అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సమావేశంలో వర్చువల్గా రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం, అసిస్టెంట్ కలెక్టర్ చిరంజీవి నాగ వెంకట సాహిత్, ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, పలుశాఖల అఽధికారులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష
సాక్షి,పాడేరు: జిల్లాలో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష బుధవారం ప్రశాంతంగా జరిగింది. 11 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష రాసేందుకు 2,441 మంది విద్యార్థులు హాల్టికెట్లు పొందారు. వీరిలో 1,791మంది హాజరుకాగా, 650 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రం పాడేరులోని ఆరు పరీక్ష కేంద్రాల్లో 1,317 మందికి గాను 923 మంది, రంపచోడవరంలోని రెండు పరీక్ష కేంద్రాల్లో 386 మందికిగాను 252 మంది, చింతూరులో 115 మందికి గాను 94 మంది, ఎటపాకలో 295 మందికి గాను 267 మంది, చింతపల్లి పరీక్ష కేంద్రంలో 328 మందికిగాను 255 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అన్ని కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు పలుశాఖల అధికారులు పర్యవేక్షించారు. పాడేరులోని ఆరు పరీక్ష కేంద్రాల్లో పాడేరు జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సుజాత, ఇతర సాంకేతిక విద్యాశాఖ అధికారులు తనిఖీలు జరిపారు.73.37శాతం హాజరు -
రోడ్డు నిర్మించకపోతే గోడ కట్టేస్తాం
అడ్డతీగల: గోతులమయంగా మారిన అడ్డతీగల–ఏలేశ్వరం రోడ్డును జూన్ 1వ తేదీ నాటికి నిర్మించకపోతే అడ్డంగా గోడ కట్టేస్తామని సీపీఐ ఎంఎల్ వినోద్మిశ్రా బృందం సభ్యులు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కొసిరెడ్డి గణేశ్వరరావు అన్నారు. పాలకులు,అధికారుల వైఖరిని నిరసస్తూ పలు ప్రజాసంఘాల నేతలు, ప్రజలతో కలిసి బుధవారం గొంటువానిపాలెం వద్ద రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. గణేశ్వరరావు మాట్లాడుతూ ఆరు నెలల కిందట రోడ్డు దుస్థితిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్,విద్యాశాఖ మంత్రి లోకేష్లకు లిఖితపూర్వకంగా తెలియజేశామన్నారు.కానీ నెలలు గడు స్తున్నా రోడ్డు నిర్మించలేదన్నారు.చిన్న చిన్న పనులు చేస్తూ ప్రజలను వంచిస్తున్నారని ఆరోపించారు.ఏలేశ్వరం మండలం రమణయ్యపేట నుంచి అడ్డతీగల మండలం గొంటువానిపాలెం వరకూ 15 కిలోమీటర్ల రోడ్డు అధ్వానంగా తయారైందన్నారు.యుద్ధప్రాతిపదికన రోడ్డు నిర్మించకపోతే జూన్ 1వ తేదీన రోడ్డుకు అడ్డంగా గోడ కట్టి తీరుతామన్నారు.అడ్డతీగల–ఏలేశ్వరం రహదారిపై నిరసన -
మన్యం బంద్ విజయవంతానికి పిలుపు
రాజవొమ్మంగి: జీవో నంబర్–3ను పునరుద్ధరించాలని, ఏజెన్సీకు స్పెషల్ డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్లతో వచ్చేనెల 2న తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్ను విజయవంతం చేయాలని ఆదివాసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు మండలంలోని ముంజవరప్పాడు గ్రామంలో ఆదివాసీ నాయకుల నేతృత్వంలో మంగళవారం సమావేశం జరిగింది. నాయకులు తాము సూరిబాబు, బాలకృష్ణ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలోని ఉద్యోగాలు అన్ని ఆదివాసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఆదివాసీ నిరుద్యోగ యువతకు నూరు శాతం ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి, మాట తప్పిందన్నారు. ఈ నెల 30 వరకు ఇచ్చి హామీల అమలుకు గడువు ఇచ్చామన్నారు. బంద్ను ఆదివాసీ యువత జయప్రదం చేయాలని కోరారు. నాయకులు నాగరాజు, భీమరాజు, లక్ష్మి, రామలక్ష్మి, వరలక్ష్మి, అప్పలకొండ, పాపాయమ్మ, చిన్న, తదితరులు పాల్గొన్నారు. -
నిజరూప దర్శనానికి వేళాయె
నిత్యచందన తేజోమూర్తి.. ● నేడు స్వామివారి చందనోత్సవం ● ఉదయం 3.30 గంటల నుంచి సర్వదర్శనాలు ● రాత్రి 7 గంటలకు క్యూల ప్రవేశం మూసివేత విద్యుదీపకాంతులతో సింహగిరి సింహాచలం: సింహగిరిపై కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవానికి వేళయింది. ఏడాది పొడవునా చందనం పూతతో దర్శనమిచ్చే స్వామిని, నిజరూపంలో దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. బుధవారం వేకువజామున ఒంటి గంట నుంచి ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా వైదిక కార్యక్రమాలు నిర్వహించి, స్వామివారిపై ఉన్న చందనాన్ని ఒలిచి, నిజరూప భరితుడిని చేస్తారు. దేవస్థానం అనువంశిక ధర్మకర్త కుటుంబ సభ్యులకు తొలిదర్శనం కల్పించి, వేకువజాము 3.30 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు. రాత్రి 9 గంటల నుంచి స్వామికి సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. విశేషపూజల అనంతరం స్వామికి తొలివిడతగా మూడు మణుగుల(సుమారు 125 కిలోలు) చందనాన్ని సమర్పిస్తారు. పటిష్ట ఏర్పాట్లు : చందనోత్సవానికి ఈ సారి రెండు లక్షల మంది భక్తులు వస్తారని జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. సర్వదర్శనంతో పాటు రూ.300, రూ.1,000ఽ, రూ.1500ల దర్శనం టికెట్ల క్యూలు ఏర్పాటు చేశారు. వారికి కేటాయించిన స్లాట్ల ప్రకారం దర్శనాలకు అనుమతిస్తారు. రాత్రి 7 గంటలలోపు మాత్రమే సింహగిరిపై దర్శనాల క్యూల్లోకి భక్తులను అనుమతిస్తారు. అనంతరం క్యూల ప్రవేశ ద్వారాలు మూసివేసి, అప్పటి వరకు క్యూల్లో ఉన్న భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 గంటల వరకు సింహగిరిపైకి బస్సుల్లో భక్తులను అనుమతిస్తారు. చందనోత్సవం సందర్భంగా అన్ని శాఖల సమన్వయంతో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. చందనంలో సుగంధ ద్రవ్యాల మేళవింపు చందనోత్సవం అనంతరం బుధవారం రాత్రి స్వామికి సమర్పించే మూడు మణుగుల పచ్చి చందనంలో దేవస్థానం అర్చకులు మంగళవారం పలురకాల సుగంధ ద్రవ్యాలను కలిపారు. సహస్ర ఘటాభిషేకానికి వెండి, మట్టి కలశాలను సిద్ధంచేశారు. చందనోత్సవానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు డాబాగార్డెన్స్: అప్పన్న చందనోత్సవానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుందని జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు తెలిపారు. గోశాల నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్, పాతపోస్టాఫీస్, ఆర్కే బీచ్, కొత్తవలస, చోడవరానికి 60 బస్సులు, అడవివరం నుంచి హనుమంతువాక మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్, ఆర్కేబీచ్కు 20 బస్సులు, అడవివరం నుంచి విజయనగరానికి సుమారుగా 20 బస్సులు నడపనున్నట్టు చెప్పారు. అలాగే గోశాల నుంచి సింహాచలం కొండపైకి 35 బస్సులు, అడవివరం నుంచి సింహాచలం కొండపైకి 13 బస్సులు, అడవివరం నుంచి గోశాలకు 3 బస్సులు ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. 15 వైద్య శిబిరాల ఏర్పాటు సీతంపేట : చందనోత్సవానికి వచ్చే భక్తుల కోసం కొండపైన 8, కొండ దిగువన 7 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్టు డీఎంహెచ్వో డాక్టర్ పి.జగదీశ్వరరావు తెలిపారు. వైద్య శిబిరాలకు అనుబంధంగా 16 ఏఎల్ఎస్ అంబులెన్స్లు సిద్ధంగా ఉంచినట్టు పేర్కొన్నారు. సింహాచలం గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో 24 గంటలు వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. మెడికవర్, అపోలో, విమ్స్, కేజీహెచ్ ఆసుపత్రులను రిఫరల్ కేంద్రాలుగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కొండపైన పబ్లిక్ అమినిటీస్ సెంటర్లో 6 పడకలతో తాత్కాలిక వైద్య సదుపాయం కల్పించామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 99492 85370 నంబరుకు సంప్రదించవచ్చని తెలిపారు. -
అధికార పార్టీ నేతలకే అంతరాలయ దర్శనం!
సామాన్య భక్తులకు అల్లంతదూరం● రూ.1,000 టికెట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితీ అంతే.. ● రూ.1,500 టికెట్లన్నీ కూటమి పార్టీల నేతలకే.. ● టికెట్ల జారీలో దేవాలయ ఈవోకి దక్కని స్థానం ● కలెక్టరేట్, అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకే వ్యవహారం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం సాధారణ భక్తులకే అప్పన్న చందనోత్సవంలో పెద్ద పీట వేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన జిల్లా యంత్రాంగం.. కేవలం వీఐపీ భక్తుల సేవలోనే తరిస్తోంది. అధికార పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు వారి అనుచరులకు మాత్రమే అంతరాలయ దర్శనం కల్పించేందుకు సిద్ధమైంది. సాధారణ భక్తులు, ఆన్లైన్లో రూ.1,000 టికెట్లను కొనుగోలు చేసిన వారికి మాత్రం అంతరాలయ దర్శనం లభించడం లేదు. కేవలం సిఫార్సులకే పెద్ద పీట వేయడం, సాధారణ భక్తులకు అంతరాలయ దర్శనం లేకపోవడం వంటి వ్యవహారాలన్నీ.. దేవాలయ ఇన్చార్జి ఈవోని డమ్మీని చేసి కలెక్టరేట్ నుంచి నడిచాయని విమర్శలు వినిపిస్తున్నాయి. టికెట్ల జారీలో కానీ, ఏర్పాట్లలో కానీ ఈవోతో సంబంధం లేకుండా వ్యవహారాలు సాగాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. మొత్తంగా ఎన్నడూ లేని విధంగా వీఐపీ భక్తులకే అంతరాలయం ద్వారా నిజరూప అప్పన్న దర్శనం లభించనుండగా.. సాధారణ భక్తులు మాత్రం దూరం నుంచే హడావుడిగా దర్శనం చేసుకుని ముందుకు సాగాల్సిన పరిస్థితులు ఉన్నాయనే అభిప్రాయం భక్తుల్లో వ్యక్తమవుతోంది. సిఫార్సులకే పెద్ద పీట ఏడాదిలో ఒక్కరోజే లభించే అప్పన్న నిజరూప దర్శనం కోసం ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఈసారి 2 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అంచనా వేశారు. అయితే టికెట్లు మాత్రం సాధారణ భక్తులకు అందుబాటులో లేకుండా పోయాయనే విమర్శలున్నాయి. ఆన్లైన్ టికెట్లను కూడా ముందుగానే అధికార పార్టీ నేతలకు అప్పగించారనే ఆరోపణలున్నాయి. ఇక వీఐపీ టికెట్లతో పాటు రూ.2,500, రూ.1,500, రూ.1000 టికెట్ల జారీలోనూ కేవలం అధికార పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలకే పెద్ద పీట వేశారనే ఆరోపణలున్నాయి. అధికార పార్టీ నేతలు కోరినన్ని టికెట్లు జారీ చేసిన జిల్లా యంత్రాంగం.. దేవాలయంలో నిరంతరంగా సేవలందించే వ్యక్తులు, సంస్థలు పది టికెట్లు అడిగితే కేవలం ఒకటి మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించారు. తీరా ఈ టికెట్లను తీసుకునేందుకు సదరు బ్యాంకు వద్దకు వెళితే.. తమకు ఇంకా దేవస్థానం నుంచి లేఖ రాలేదనే సమాధానం వస్తోంది. ఈ నేపథ్యంలో దేవస్థాన అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించిన వ్యక్తులు, సంస్థలకు కూడా కనీస గౌరవ లేకుండా చేశారని వాపోతున్నారు. మొత్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారుల వ్యవహారం ఉందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. -
మారెమ్మతల్లికి కాసుల పేరు బహూకరణ
సీలేరు: గూడెం కొత్తవీధి మండలం సీలేరు గ్రామ దేవత శ్రీమారెమ్మతల్లి అమ్మవారికి ఒడిశాకు చెందిన భక్తు డు బంగారం, వెండి కాసుల పేరును బ హూకరించారు. ఒడిశా రాష్ట్రం చిత్రకొండ గ్రామానికి చెందిన రేకుల వ్యాపారి మునికోటి శ్రీనివాసు, లోవ శ్రావణి దంపతులు అమ్మవారికి ఎన్నో ఏళ్లుగా భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. ప్రతి ఏటా అమ్మవారి అగ్నిగుండం తొక్కి మొక్కు తీర్చుకుంటారు. ఈ నేపథ్యంలో పండగ అనంతరం వారు మంగళవారం అమ్మవారికి పసుపు, కుంకుమ పూజలు నిర్వహించి రూ.2 లక్షల విలువైన బంగారం, వెండితో తయారు చేసిన కాసుల పేరును సమర్పించారు. దాతలకు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
డమ్మీగా మారిన ఈవో..!
ప్రస్తుత సింహాచలం దేవస్థానం ఈవో సెలవులో ఉండడంతో ఇన్చార్జిగా ఈవోగా కె.సుబ్బారావును ప్రభుత్వం నియమించింది. అయితే, సదరు దేవాలయ ఈవోను చందనోత్సవ వ్యవహరాల్లో నామమాత్రం చేశారనే విమర్శలున్నాయి. పాసుల జారీలో కానీ.. నిర్ణయాల్లో కానీ దేవాలయ ఈవోను డమ్మీ చేశారనే ఆరోపణలున్నాయి. పెత్తనమంతా రెవెన్యూ యంత్రాంగానిదే ఉంటోందని దేవదాయ అధికారులు, సిబ్బంది వాపోతున్నారు. దేవాలయంలో నిరంతరంగా సేవలందించే వ్యక్తులు, సంస్థలతో పాటు ఎన్జీవోలకు కూడా టికెట్లను మంజూరు చేయాలంటే కలెక్టరేట్ నుంచి ఆదేశాలు రావాల్సిందేనని దేవాలయ అధికారులు చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. కనీసం వీరికి కూడా పాసులు ఇచ్చేందుకు తమ చేతుల్లో ఏమీ లేదని దేవాలయ అధికారులు పేర్కొంటున్నట్టు సమాచారం. కలెక్టరేట్కు వెళితే కనీసం ఎవరూ తమను పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఇన్చార్జిగా ఉన్న ఈవో మరో వారం, పది రోజుల్లో వెళ్లిపోయే భావనలో ఉండటంతో.. ఆయన్ని పూర్తిగా విస్మరించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా దేవాలయ అధికారులను, సిబ్బందిని నామమాత్రం చేసి అంతా కలెక్టరేట్ నుంచి, అధికార పార్టీ నేతల నుంచి వచ్చే ఆదేశాలే అమలవుతున్నాయనే విమర్శలు సింహాచలం కొండల చుట్టూ ప్రతిధ్వనిస్తుండటం గమనార్హం. -
పోలవరం నిర్వాసితులను ఆదుకుంటాం..
వీఆర్పురం: పోలవరం నిర్వాసితులను ఆదుకుంటామని ఐటీడీవో పీవో అపూర్వ భరత్ అన్నారు. చింతరేగిపల్లి, రాజుపేట కాలనీ గ్రామాల్లో పోలవరం నిర్వాసితుల ఆర్అండ్ఆర్ గ్రామసభలను మంగళవారం నిర్వహించారు. గ్రామసభలో అర్హులు, అనర్హుల జాబితాను అధికారులు చదివి వినిపించారు. అభ్యంతరాలు ఉన్నవారు, జాబితాలో పేర్లు లేనివారు 15 రోజుల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలని పీవో సూచించారు. ఈ గ్రామ సభలో అనర్హులుగా ఉన్నవారి నుంచి దరఖాస్తు స్వీకరించి, రెండో గ్రామ సభలో పరిశీలిస్తామన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, ఎంపీడీవో, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ -
ఈదురు గాలులు, భారీ వర్షం
రాజవొమ్మంగి/కొయ్యూరు: జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఈదుగాలులతో భారీ వర్షం పడింది. రాజవొమ్మంగి మండలంలోని చెరకుంపాలెం, జడ్డంగి పరిసర ప్రాంతాల్లో పెద్ద పెట్టున గాలులు వీయడంతో తాటాకు ఇళ్ల పైకప్పులు దెబ్బతిన్నాయి. చెరకుంపాలెంలోని అంగన్వాడీ కేంద్రంపై చెట్టు కూలిపోయింది. ఇదే ప్రాంగణంలోని అంగన్వాడీ వంట షెడ్డు రేకులు గాలికి ఎగిరి దూరంగా పడ్డాయి. కేంద్రం భవనం చుట్టూ నీరు చేరింది. ఆ సమయంలో పిల్లలు ఎవరూ కేంద్రంలో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. జడ్డంగి పరిసర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలచిపోయింది. రాజవొమ్మంగిలో గంటన్నరకు పైగా వర్షం కురిసింది. పలు చోట్ల రోడ్లపైకి నీరు చేరి రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ● మండల కేంద్రం కొయ్యూరు, పరిసర గ్రామాల్లో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రంగా కాయగా, సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. స్తంభించిన జన జీవనం రంపచోడవరం: మారేడుమిల్లిలో మంగళవారం మధ్యాహ్నం ఎడతెరిపిలేని వర్షంతో జనజీవనం స్తంభించింది. ఉరుములు,మెరుపులతో భారీ వర్షం కురవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మారేడుమిల్లి నుంచి రంపచోడవరం వైపు వెళ్లే వాహనాలు, మారేడుమిల్లి నుంచి ఘాట్ గుండా చింతూరు వైపు వెళ్లే వాహనాలను వర్షం తగ్గే వరకు నిలిపివేశారు. -
ఎయిర్టెల్ సిగ్నల్స్ లేక ఇబ్బందులు
సీలేరు: జి.కె.వీధి మండలం గుమ్మిరేవుల పంచాయతీ మారుమూల మాదిమల్లు, గుమ్మిరేవుల గ్రామాల్లో మూడు నెలలుగా ఎయిర్టెల్ సిగ్నల్స్ అందుబాటులో లేకపోవడంతో వినియోగదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ మేరకు మంగళవారం ఆయా గ్రామాల గిరిజనులు సెల్ టవర్ల వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. మూడు నెలల నుంచి నెట్వర్క్ సేవలు అందుబాటులో లేకపోయినా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై మండిపడ్టారు. ఇప్పటికై నా ఎయిర్టెల్ అధికారులు తక్షణమే స్పందించి నెట్వర్క్ సేవలు అందుబాటులో తేవాలని ఆయా గ్రామస్తులు కోరారు. -
ప్రపంచ తెలుగు సాహితీసంబరాల పోస్టర్ ఆవిష్కరణ
సీలేరు: అంతర్జాతీయ సాహితీ సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఏలూరులో జరగనున్న ప్రపంచ తెలుగు సాహితీ సంబరాలు పోస్టర్ను జి.కె.వీధి మండలం సీలేరు గ్రామ సర్పంచ్ పాంగి దుర్జో, కళావేదిక అధ్యక్షుడు నూనె రమేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పాంగి దుర్జో మాట్లాడుతూ కళావేదిక నిర్వహిస్తున్న సాహితీ, సామజిక సేవలను కొనియాడారు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించి, కవులను ప్రోత్సహించి తెలుగు భాష పరిరక్షణకు తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో డిజిటల్ అసిస్టెంట్ బత్తుల విజయకుమారి, లింగేటి లోవకుమారి, మహిళా పోలీసు సోమెళ్ల రేవతి, సబార్డినేట్ దేవు ప్రకాశరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
విహారయాత్రలో విషాదం
రంపచోడవరం: విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. మారేడుమిల్లికి సమీపంలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా పంగిడి గ్రామానికి చెందిన ఆరు కుటుంబాల సభ్యులు మూడు కార్లలో మారేడుమిల్లికి విహారయాత్రకు వచ్చారు. మారేడుమిల్లికి సమీపంలో వీరు ప్రమాణిస్తున్న కార్లలో ఒకటి వేగంగా వెళ్తూ చెట్టును ఢీకొట్టడంతో ముందు సీటులో కూర్చుని ప్రయాణిస్తున్న అడపా శ్రీనివాస్ (49) తలపై తీవ్ర గామైంది. హుటాహుటిన మారేడుమిల్లి పీహెచ్సీకి తరలించారు. అప్పటికే అపస్మాకర స్థితిలో ఉన్న శ్రీనివాస్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ కారులో ప్రయాణిస్తున్న చిన్నారులు అడపా వెంకటసాయి, పవన్, తోట విజయవర్ధన్ తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు రాజేష్, తోట విఘ్నేష్, బాలసేని, తేజ గాయపడ్డారు. వీరిని మారేడుమిల్లి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు.మారేడుమిల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెట్టును కారు ఢీకొనడంతో ఒకరి మృతి మారేడుమిల్లి సమీపంలో ప్రమాదం దేవరపల్లి వద్ద చెట్టును ఢీకొట్టిన కారు -
ప్రత్యేక శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
రంపచోడవరం: పదో తరగతి పరీక్షలుఫెయిల్ అయిన విద్యార్థులకు అందిస్తున్న ప్రత్యేక శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం తెలిపారు. పదో తరగతి పరీక్షలు ఫెయిలైన విద్యార్థులకు మండలంలోని ముసురుమిల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ భోజన వసతితో శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైతే విద్యా సంవత్సరం వృథా కాకుండా ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరే అవకాశం ఉంటుందని చెప్పారు. అనంతరం పీవో తన క్యాంపు కార్యాలయం నుంచి బ్యాంకు మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తొలకరి నాటికి రైతులకు బ్యాంకు రుణాలు అందజేయాలని తెలిపారు. రైతులు రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించాలన్నారు. -
నేడు పాలిటెక్నిక్ ప్రవేశపరీక్ష
సాక్షి,పాడేరు: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి బుధవారం నిర్వహించే పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పాడేరులోని ఆరు, రంపచోడవరంలో రెండు, ఎటపాకలో ఒకటి, చింతూరులోని ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో బెంబీలు, మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు.పాడేరులోని ఏపీఆర్ కళాశాలతో పాటు మిగిలిన ఐదుసెంటర్లలో సౌకర్యాలను స్థానిక జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సుజాత మంగళవారం పరిశీలించారు. జిల్లాలోని 10 కేంద్రాల్లో 2,141మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయనున్నారు. -
మ్యుటేషన్ ప్రక్రియలో జాప్యం ఉపేక్షించను
కలెక్టర్ దినేష్కుమార్సాక్షి,పాడేరు: మ్యుటేషన్ ప్రక్రియలో జాప్యం చేస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ హెచ్చరించారు. కలెక్టరేట్ నుంచి 22 మండలాల రెవెన్యూ అధికారులు,సర్వేయర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భూముల రీసర్వేలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.వ్యవసాయ భూములకు నీటి వినియో గం చేసే ప్రాంతాల్లో నీటి పన్ను వసూలు చేయా లని ఆదేశించారు. 26వేల మంది పీవీటీజీలకు ఆధార్ కార్డులు,35వేల మందికి జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు.ప్రభుత్వ భూములు అ న్యా క్రాంతమవుతున్నాయని హైకోర్టు సీరియస్గా ఉందని, జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూముల రక్షణకు చర్యలు చేపట్టాలన్నారు.జిల్లాలో జలపాతాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాలని, మధ్యా హ్నం ఒంటిగంట నుంచి పర్యాటకులను జలపాతాల వద్దకు అనుమతించవద్దని ఆదేశించారు. పింఛన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కేసులు సామాజిక పింఛన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు.ఉపాఽధి హామీ,విద్యా,ఐసీడీఎస్,డీఆర్డీఏ,వైద్య,మలేరియాశాఖల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీ్త్రనిధి రుణాలను సక్రమంగా రికవరీ చేయాలని సూచించారు. ఉపాధి హామీ పనుల లక్ష్యాలను అధిగమించాలన్నారు. ఐసీడీఎస్ కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించాలని, బాలల హక్కులు,విద్యా కార్యక్రమాలు,సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.సికిల్సెల్ ఎనిమియా పరీక్షలతో పాటు దోమల నివారణ మందు పిచికారీ పనులు విజయవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. దోమల మందు పిచికారీకి పంచాయతీ అధికారులు,సిబ్బంది సహకరించని పక్షంలో షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జెడ్పీ సీఈవోను ఆదేశించారు. పీజీఆర్ఎస్ కోసం టోల్ఫ్రీ నంబర్ ప్రతి శుక్రవారం పాడేరు ఐటీడీఏ, ప్రతి సోమవారం రంపచోడవరం ఐటీడీఏ, ప్రతి బుధవారం చింతూరు ఐటీడీఏలో నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదిక సమగ్ర సమాచారం తెలుసుకునేందుకు 1100 టోల్ఫ్రీ నంబర్ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.జిల్లా వ్యాప్తంగా ప్రతి సోమవారం మండల పరిషత్,తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించాలని ఆదే శించారు. జేసీ డాక్టర్ అభిషేక్గౌడ,పాడేరు,రంపచోడవరం సబ్కలెక్టర్లు సౌర్యమన్ పటేల్,కల్పశ్రీ,అసిస్టెంట్ కలెక్టర్ చిరంజీవి నాగ వెంకట సాహిత్,డీఆర్వో పద్మలత,అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి
అరకులోయటౌన్: ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, షెడ్యూల్ ఏరియాలో గిరిజనులకే వందశాతం ఉద్యోగాలు కల్పించాలని పలువురు డిమాండ్ చేశారు. మే 2 నుంచి నిర్వహించే రాష్ట్ర మన్యం బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ గిరిజన సంఘం, ఉద్యోగ సంఘాలు, పీఆర్టీయూ, యూటీఎఫ్,ఆదివాసీ పరిరక్షణ సమితి, మాతృ బహుభాషా ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘం, పీసా కమిటీ ప్రతినిధులతో స్థానిక గిరిజన సంఘం కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు మాట్లాడారు. డీఎస్సీలో జిల్లాలో ఎస్టీలకు కేవలం 24 పోస్టులు మాత్రమే కేటాయించారని, ఆదివాసీలకు 6 శాతం, గిరిజనేతరులకు 94 శాతం పోస్టులు కేటాయించడం వల్ల ఎస్టీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ విడుదల చేసి ప్రత్యేక డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్, వివిధ సంఘాల నాయకులు వంతాల అరుణ్, ప్రకాష్, పుడిగి దేముడు, చట్టూ మోహన్, రమేష్, నాగేంద్ర, జగన్నాథం, రామారావు, పోతురాజు, సురేష్, సతీష్, కుమార్, రాజ పాల్గొన్నారు.రౌండ్టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్ -
యుద్ధవాతావరణం
ఏవోబీలో ఏవోబీలో మావోయిస్టులు(ఫైల్) ఒడిశాలోని కటాఫ్ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న ప్రత్యేక పోలీసు బలగాలుభయం గుప్పిట్లో సరిహద్దు కొయ్యూరు: ఏవోబీలోని మారుమూల గ్రామాలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నాయి. ఎం.భీమవరం పంచాయతీ కాకులమామిడి, యూ.చీడిపాలెం పంచాయతీ రేవులకోట కాంటవరంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య సోమవారం ఎదురు కాల్పులు జరిగాయి. రెండు ప్రాంతాల్లో ఎదురుకాల్పులు జరగడంతో ఆయా ప్రాంతాల గిరిజనులు భయాందోళనలు చెందుతున్నారు. ● కాకులమామిడి మారుమూల గ్రామం.దీనిని ఆనుకుని జ్యోతులమామిడి గ్రామం ఉంది.ఇక్కడ నుంచి పుట్టకోట,పీఎల్ కొత్తూరు మీదుగా దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లే అవకాశం ఉంది. గతంలో వేసవిలో మావోయిస్టు అగ్రనేతలు ఇక్క డ శిక్షణ ఇచ్చేవారు. ఈ సమాచారం పోలీసు ల కు తెలియడంతో శిక్షణ ఇవ్వడం నిలిపివేశారు. 2016, 2022లలో ఎన్కౌంటర్లు... మర్రిపాకల సమీపంలో దట్టమైన అటవీప్రాంతం ఉండడంతో మావోయిస్టులు ఎక్కువగా ఇక్కడికి వచ్చేవారు. ఇలావచ్చిన మావోయిస్టులను 2016లో మర్రిపాకలు–పాలసముద్రం మధ్య పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఆజాద్, ఆనంద్,కమలలాంటి సీనియర్ నేతలతో సహా మొ త్తం ఐదుగురు మరణించారు.2022లో అదే ప్రాంతంలో తీగలమెట్ట సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు.సాక్షి,పాడేరు: ఏవోబీలో యుద్ధ వాతావరణం నెలకొంది. మళ్లీ తుపాకుల మోత మోగింది. కాకులమామిడి, కాంటవరం అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య సోమవారం రెండు సార్లు ఎదురుకాల్పులు జరిగాయి. దీంతో వాతారణం ఒక్క సారిగా వేడిడెక్కింది. మన్యం నివురుగప్పిన నిప్పులా ఉంది. మారుమూల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. ఒకే రోజు రెండు సార్లు రెండు చోట్ల ఎదురుకాల్పులు జరగడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర పోలీసుబలగాలు జల్లెడపడుతున్నాయి. మావోయిస్టు పార్టీ కార్యకలపాల నిరోధమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్లో ఏడాది వ్యవధిలోనే మావోయిస్టు పార్టీ భారీగా నష్టపోయింది. వరుస ఎన్కౌంటర్లలో 70 మంది వరకు మావోయిస్టులు,పార్టీ సభ్యులు ప్రాణాలు విడిచారు. దండకారణ్యమంతా పోలీసుల ఆధీనంలోకి వెళ్లింది. ఒకప్పుడు సురక్షిత ప్రాంతమైన ఛత్తీసగఢ్ రాష్ట్రంలో ఇప్పుడు మావోయిస్టు పార్టీ తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటోంది. ఉన్న కొద్దిపాటి క్యాడర్ను కాపాడుకునే ప్రయత్నంలో ఆంధ్రా,ఒడిశా రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తున్నారు. ఒడిశాతో పాటు అల్లూరి జిల్లాలోని సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకునే ప్రయత్నాల్లో మావోయిస్టు కీలక నేతలు,పలు దళాల సభ్యులు నిమగ్నమయ్యారు. గుర్తెడు, వై.రామవరం, కొయ్యూరు, జీకే వీధి మండలాల్లోని మారుమూల అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల సంచారంపై అప్రమత్తమైన పోలీసులు కొద్ది నెలల నుంచి కూంబింగ్ను విస్తృతం చేశారు. చింతూరు, ఎటపాక, చింతపల్లి, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల సరిహద్దుల్లో పోలీసు పార్టీలు నిరంతరం గాలిస్తున్నాయి. అడవులు జల్లెడ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి మావోయిస్టులు ఏవోబీలోకి ప్రవేశిస్తున్నారనే సమాచారంతో ఒడిశాలోని మల్కన్గిరి,కోరాపుట్ జిల్లాలతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.అవుట్ పోస్టుల పోలీసు బలగాలతో పాటు ప్రత్యేక పోలీసు బలగాలు అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. భారీగా పోలీసు పార్టీలు ఏవోబీ వ్యాప్తంగా మకాం వేయడంతో యుద్ధ వాతావరణం నెలకొంది.ఒడిశాలోని మల్కన్గిరి కటాఫ్ ఏరియాలో ఇప్పటికే ఒడిశా పోలీసు బలగాలు దూకుడుతో ఉన్నాయి. మావోయిస్టుల డంప్లను గుర్తించి, కీలక సామగ్రిని స్వాధీ నం చేసుకుంటున్నాయి.సరిహద్దులో ఉన్న ముంచంగిపుట్టు,పెదబయలు పోలీసులు కూడా ఒడిశా పోలీసులకు అన్ని విధాల సహకరిస్తున్నారు. మావోయిస్టు పార్టీకి చెందిన గాజర్ల రవి,అరుణక్క,జగన్ వంటి కీలకనేతలతో పాటు ఛత్తీస్గడ్,ఒడిశా రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు క్యాడర్ సంచరిస్తుందనే పక్కా సమాచారంతోనే జిల్లా పోలీసు యంత్రాంగం వ్యూహత్మకంగా వ్యవహరిస్తోంది. కొయ్యూరు,వై.రామవరం సరిహద్దు అటవీ ప్రాంతంలోని ఎదురుకాల్పుల ఘటన నుంచి మావోయిస్టులు తప్పించుకున్నప్పటికీ పోలీసు బలగాలు మాత్రం వెనక్కితగ్గలేదు.మరిన్ని పోలీసు బలగాలు రంగంలోకి దిగడంతో ఈ అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. నలువైపులా పోలీసులు చుట్టుముట్టడంతో మావోయిస్టులు తీవ్ర నిర్భంధం ఎదుర్కొంటున్నారు. ఎస్పీ అమిత్బర్దర్, చింతూరు ఓఎస్డీ, రంపచోడవరం,చింతపల్లి ఏఎస్పీలు,పాడేరు డీఎస్పీతో పాటు సీఆర్పీఎఫ్,ఇతర ప్రత్యేక బలగాల అధికారులు ఏవోబీలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరోవైపు మారుమూల ప్రాంతాల రహదారుల్లో తనిఖీలు విస్తృతం చేశారు. -
వైఎస్సార్ సీపీ అరకు పార్లమెంట్ పరిశీలకుడిగా బొడ్డేడ ప్రసాద్
సాక్షి,పాడేరు: వైఎస్సార్ సీపీ అరకు పార్లమెంట్ ని యోజకవర్గ పరిశీలకుడిగా గవర కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ నియమి తులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలిగా మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకుడిగా ఎమ్మెల్సీ కుంభా రవిబాబు నియమితులయ్యారు. వీరు పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లకు అనుసంధానంగా పనిచేస్తారు. -
తేనెటీగల దాడి.. 23 మందికి గాయాలు
జీలుగుపుట్టులో రచ్చబండ వద్ద భోజనాలు చేస్తుండగా ఘటన పెదబయలు: మండలంలోని రూడకోట పంచాయతీ జీలుగులపుట్టులో తేనెటీగలు దాడి చేసి, 23 మందిని గాయపరిచాయి. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రూడకోట పంచాయతీ కేంద్రంలో గంగమ్మతల్లి ఉత్సవాలు రెండు రోజుల నుంచి జరుగుతున్నాయి. మంగళవారం జీలుగులపుట్టు, సరియాపల్లి గ్రామాలకు చెందిన 30 మంది ఆలయానికి వెళ్లి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం జీలుగులపుట్టు గ్రామానికి తిరిగి వచ్చి రచ్చబండ వద్ద వంట చేసుకుని, మధ్యాహ్నం భోజనం చేస్తుండగా అక్కడ చెట్టుపై ఉన్న తేనెపట్టు నుంచి ఒక్కసారిగా వందల సంఖ్యలో తేనెటీగలు వారిపై దాడి చేశా యి. ఆహార పదార్థాలు వదిలి వారు పరుగులు తీశారు. ఈ ఘటనలో జీలుగులపుట్టు, సరియాపల్లి గ్రామాలకు చెందిన 23 మంది గాయపడ్డారు. లకే తౌడుబాబు, లకే అనురాధ, పార్వతమ్మ,నాగమ్మ,చిన్నయ్య, ఝాన్సీరాణి, పుష్పవేణి, రవణమ్మ, సుందర్రావు, బుల్లమ్మ, కామమ్మ, ముత్యాలమ్మ, పాతూని పెద్దపులి, పాతూని అప్పారావు, లక్ష్మి, బుల్లమ్మలతో పాటు మరో ఏడుగురు గాయపడినవారిలో ఉన్నారు. వీరిలో లకే తౌడుబాబు, లకే సుందరి, ముత్యాలమ్మ, కామమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను అంబులెన్స్లో రూడకోట పీహెచ్సీకి తరలించారు. పీహెచ్సీలో వైద్యాధికారులు సత్యారావు,కిశోర్, వైద్య సిబ్బంది వారికి చికిత్స చేశారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. -
నేడు చలో పాడేరు ఐటీడీఏ
సాక్షి,పాడేరు: జీవో నంబర్ 3 పునరుద్ధరణ,ప్రత్యామ్నాయ జీవో,ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ సాధన డిమాండ్లతో బుధవారం చలో పాడేరు ఐటీడీఏ ఆందోళన నిర్వహించాలని ఆదివాసీ ప్రజా సంఘాలు నిర్ణయించాయి. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన జీవో నంబర్ 3 పునరుద్ధరణ హామీని వెంటనే అమలు చేయాలన్న డిమాండ్తో ఆదివాసీ ప్రజాసంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో ఆందోళనకు శ్రీకారం చుట్టాయి. ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీగా ఏర్పడిన ఆదివాసీ సంఘాల నేతలు రెండు రోజులుగా ‘చలో పాడేరు ఐటీడీఏ’పై మండల కేంద్రాలు,గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.కమిటీ సభ్యుడు కూడా రాధాకృష్ణ మంగళవారం పాడేరులోని జూనియర్ కళాశాల హాస్టల్ విద్యార్థులతో సమావేశమై చలో ఐటీడీఏ ఆందోళనకు తరలిరావాలని కోరారు. ఏజెన్సీలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు, గిరిజన విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యావంతులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని చలో ఐటీడీఏ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎస్సీ సాధన కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. -
ప్రాణాపాయం నుంచి కాపాడిన వైద్యులు
కూనవరం: స్థానిక సీహెచ్సీ వైద్యులు సకాలంలో స్పందించడంతో గుండెపోటుతో వచ్చిన వ్యక్తిని ప్రాణాపాయం నుంచి కాపాడిన సంఘటన మండల పరిధిలోని కోతులగుట్ట సీహెచ్లో సోమవారం చోటుచేసుకుంది. ఆస్పతి సూపరింటెండెంట్ డాక్టర్ మహేష్బాబు తెలిపిన వివరాల ప్రకారం వి.ఆర్.పురం మండలం శ్రీరామగిరి గ్రామానికి చెందిన నిరుపేద ముత్యాల వెంకటరమణ శనివారం అస్వస్థతకు గురికావడంతో కూనవరం మండల పరిధిలోని కోతులగుట్ట కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు వచ్చారు. ఆస్పత్రికి వచ్చిన ఆయనకు చాతినొప్పి, ఒల్లంతా చెమటలు రావడంతో వైద్యాధికారులు, సిబ్బంది వెంటనే ఆయనకు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. ఈసీజీ పరీక్షతో అతనికి గుండె నొప్పి వచ్చినట్టు గుర్తించారు. వైద్యులు మహేష్బాబు, తేజలు తక్షణమే స్పందించి, రోగికి ఆస్పత్రిలో అందుబాటులో రూ.40 వేలు విలువైన టెనెక్టోప్లస్ ఇంజక్షన్ అందజేశారు. దీంతో ఆ వ్యక్తికి ప్రాణాపాయం తప్పిందని డాక్టర్ మహేష్ బాబు తెలిపారు. ప్రస్తుతం ముత్యాల వెంకటనారాయణను ఆయన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాజమండ్రి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఎవరికై నా గుండె సంబంధిత సమస్యలు ఉంటే కోతులగుట్ట ఆస్పత్రికి రావొచ్చని, మెరుగైన వైద్యం అందిస్తామని సూపరింటెండెంట్ డాక్టర్ మహేష్ బాబు చెప్పారు.గుండెపోటు రోగికి టెనెక్టోప్లస్ ఇంజక్షన్ -
గిరిజనులకు తప్పని డోలీ మోత కష్టాలు
ముంచంగిపుట్టు: జిల్లాలో మారుమూల గ్రామాల గిరిజనులకు డోలీమోత కష్టాలు తప్పడం లేదు. ముంచంగిపుట్టు మండలం గొబ్బరపాడలో అనారోగ్యంతో బాధపడుతున్న గిరిజనులను, జి.మాడుగుల మండలం జాములవీధిలో ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని ఆయా గ్రామస్తులు, కుటుంబ సభ్యులు డోలీమోతతో ఆస్పత్రులకు తరలించారు. ముంచంగిపుట్టు మండలం రంగబయలు పంచాయతీ గొబ్బరపాడ గ్రామంలో ఐదుగురు గిరిజనులు అనారోగ్యం బారిన పడి మంచం పట్టారు. గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక కుటుంబ సభ్యులు డోలీ మోతతో, రహదారి ఉన్న రంగబయలు గ్రామం వరకు మూడు కిలో మీటర్లు మోసుకు వచ్చారు.అనంతరం ప్రైవేట్ వాహనంలో లబ్బూరు పీహెచ్సీ తరలించారు.గొబ్బరపాడ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామ గిరిజనులు కోరారు. అనారోగ్య సమస్యతో ఆత్మహత్యాయత్నం జి.మాడుగుల: మండలంలో బొయితిలి పంచాయతీ జాములవీధి గ్రామానికి చెందిన లొంబోరి రవన్నబాబు కొన్నాళ్లుగా జ్వరం, కడునొప్పి వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సోమవారం విషం తీసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హుటాహుటిన డోలీమోతతో మూడు కిలోమీటర్ల దూరంలోగల సూరిమెట్ట గ్రామానికి తీసుకొచ్చి, అక్కడి నుంచి అంబులెన్స్లో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో అందరూ పండగ సందడిలో ఉండగా రవన్నబాబు ఆత్మహత్మకు యత్నించినట్టు గ్రామస్తులు చెప్పారు. రవన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు వారు తెలిపారు. -
పార్టీ కోసం పనిచేసే వారికి తగిన గుర్తింపు
అనంతగిరి(అరకులోయటౌన్): వైఎస్సార్సీపీ లో పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. అనంతగిరిలో పార్టీ నాయకులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడారు. గ్రామ స్ధాయి నుం,ఇ నియోజకవర్గ స్థాయి వరకు ప్రతీ ఒక్కరూ ప్రతీ అంశంపై అవగాహన కలిగి ఉండాలని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొవాలని పిలుపు నిచ్చారు. పార్టీ కోసం కష్టపడిన వారికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు. మండలంలోని రాజకీయ స్థితి గతులను అడిగి తెలుసుకున్నా రు. ఎంపీపీ శెట్టి నీలవేణి, మండల పార్టీ అధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు శెట్టి ఆనంద్, ఎస్టీ సెల్ నియోజకవర్గం అధ్యక్షుడు స్వామి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అప్పారావు, సర్పంచ్లు రాములమ్మ, పెంటమ్మ, ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి, ఎంపీటీసీ సభ్యులు తవిటి నాయుడు, అశోక్, నాయకులు చిన్నయ్య, మధుసుధాన్, తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదు
రంపచోడవరం: పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న జీఎం వలస పంచాయతీ కార్యదర్శి కృష్ణప్రసాద్ తీరుపై మారేడుమిల్లి తహసీల్దార్ బాలాజీ ఫిర్యాదుతో నోటీసులు జారీ చేసినట్టు ఎంపీడీవో తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు. ఏప్రిల్ 24న పంచాయతీ రాజ్ దివాస్ గ్రామసభ నిర్వహించలేదన్నారు. సర్పంచ్గా తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పంచాయతీ కార్యదర్శి ఏకపక్ష నిర్ణయాలతో పంచాయతీ అభివృద్ధి కుంటుపడుతుందని జీఎం వలస పంచాయతీ సర్పంచ్ కారం లక్ష్మి ఫిర్యాదు చేశారన్నారు.గతంలో బొడ్డగండి పంచాయతీ కార్యదర్శిగా నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్టు తెలిపారు. దీనిపై శాఖ పరంగా చర్యలు తీసుకున్నా కార్యదర్శి ప్రవర్తనలో మార్పు లేదన్నారు. కార్యదర్శి పనితీరుపై పూర్తిస్థాయిలో నివేదికను కలెక్టర్ , పీవో, డీపీవోకు అందజేస్తామన్నారు. -
ఘాట్రోడ్డులో వ్యాన్ బోల్తా
ముంచంగిపుట్టు: మండలంలోని దొడిపుట్టు పంచాయతీ రాంపుట్టు గ్రామ సమీపంలో సోమవారం పనసకాయల లోడుతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడింది.ఈ సంఘటనకు సంబంధించి స్థానికుల అందించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.ఒడిశా రాష్ట్రం నందపూరు ప్రాంతానికి చెందిన పనసకాయల కొనుగోలుదారులు ఆంఽధ్రాలోని రాంపుట్టు వచ్చి పనసకాయలు కొనుగోలు చేసి ఒడిశాకు వెళ్తుండగా రాంపుట్టు సమీపంలో ఘాట్రోడ్డులో వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఆ సమయంలో వాహనంలో ఏడుగురు కూలీలు ఉన్న ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
చిరుధాన్యాలతో రవివర్మకు కళాంజలి ఏయూక్యాంపస్: నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు మెకా విజయ్కుమార్ భారతీయ చిత్రకళా దిగ్గజం రాజా రవివర్మ జయంతిని పురస్కరించుకుని అద్భుతమైన కళాఖండాన్ని ఆవిష్కరించారు. విజయ్కుమార్ చిరుధాన్యాలను ఉపయోగించి ఆయన చిత్రపటాన్ని రూపొందించారు. ఇందుకోసం దాదాపు వారం రోజుల పాటు శ్రమించారు. సహజత్వం ఉట్టిపడేలా చిరుధాన్యాలతో చిత్రపటం రూపొందించిన.. రాజా రవివర్మకు ఘనమైన నివాళి అర్పించారు. తాటిచెట్లపాలెం: సికింద్రాబాద్ డివిజన్ పరిధి మహబూబాబాద్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న 3వ లైన్ నిర్మాణం, పలు ఆధునికీకరణ పనుల నిమిత్తం ఆయా తేదీల్లో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు, మరికొన్ని దారి మళ్లిస్తున్నట్లు, మరికొన్ని రీ షెడ్యూల్ చేసినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. రద్దయిన రైళ్లు ● విశాఖపట్నం–న్యూఢిల్లీ–విశాఖపట్నం(20805/06) ఏపీ ఎక్స్ప్రెస్ మే 27, 28, జూన్ 18, 19వ తేదీల్లోను, విశాఖపట్నం–హజరత్ నిజాముద్దీన్(12803) స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ మే 23, 26, జూన్ 16వ తేదీల్లోను, హజరత్ నిజాముద్దీన్–విశాఖపట్నం(12804) స్వర్ణజయంతి ఎక్స్ప్రెస్ మే 25, 28, జూన్ 18వ తేదీల్లో రద్దు చేశారు. దారి మళ్లించిన రైళ్లు ● మే 22 నుంచి 28వ తేదీ వరకు విశాఖపట్నం–లోకమాన్యతిలక్ టెర్మినస్–విశాఖపట్నం (18519/20) ఎల్టీటీ ఎక్స్ప్రెస్లు, మే 27, 28వ తేదీల్లో షాలిమర్–హైదరాబాద్(18045)ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్, మే 28, 29వ తేదీల్లో హైదరాబాద్–షాలిమర్(18046)ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్, మే 27, 28వ తేదీల్లో చత్రపతి శివాజి టెర్మినస్ ముంబయి–భువనేశ్వర్–చత్రపతి శివాజి టెర్మినస్ ముంబయి (11019/20) కోణార్క్ ఎక్స్ప్రెస్లు, మే 28న షాలిమర్–సికింద్రాబాద్(22849) ఎక్స్ప్రెస్లు వయా విజయవాడ–గుంటూరు–నల్గొండ–పగిడిపల్లి మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ● మే 22, జూన్ 19వ తేదీల్లో విశాఖపట్నం–గాంధీదాం(20803) వీక్లీ ఎక్స్ప్రెస్, మే 25, జూన్ 22వ తేదీల్లో గాంధీదాం–విశాఖపట్నం(20804) వీక్లీ ఎక్స్ప్రెస్, మే 25, జూన్ 15వ తేదీల్లో పూరీ–ఓఖా(20819) ఎక్స్ప్రెస్, మే 28, జూన్ 18వ తేదీల్లో ఓఖా–పూరీ(20820) ఎక్స్ప్రెస్లు వయా లఖోలి–రాయ్పూర్–నాగ్పూర్–బద్నెరా మీదుగా రాకపోకలు సాగిస్తాయి మహబూబాబాద్లో తాత్కాలికంగా హాల్ట్ తొలగింపు : ఆధునీకీకరణ పనుల నిమిత్తం మహబూబాబాద్ స్టేషన్లో కింది రైళ్లకు ఆయా తేదీల్లో తాత్కాలికంగా హాల్ట్ను రద్దు చేశారు. ● మే 24 నుంచి 28వ తేదీ వరకు విశాఖపట్నం–హైదరాబాద్ (12727) గోదావరి ఎక్స్ప్రెస్, మే 24 నుంచి 28వ తేదీ వరకు విశాఖపట్నం–మహబూబ్నగర్(12861) ఎక్స్ప్రెస్, మే 24, 25, 26వ తేదీల్లో భువనేశ్వర్–చత్రపతి శివాజి టెర్మినస్ ముంబయి (11020) కోణార్క్ ఎక్స్ప్రెస్, మే 24, 25, 26వ తేదీల్లో షాలిమర్–హైదరాబాద్(18045) ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లు ఆయా తేదీల్లో మహబూబాబాద్లో ఆగవు.ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులుకంచరపాలెం : జిల్లాలోని వివిధ ప్రభుత్వ/ప్రైవేటు పారిశ్రామిక శిక్షణ కేంద్రాల్లో(ఐటీఐ) ప్రవేశాలకు మే 24లోగా iti.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ జె.శ్రీకాంత్ తెలిపారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలకు ఒక దరఖాస్తు సరిపోతుందన్నారు. స్టీల్ప్లాంట్ ఆర్ కార్డుకు సంబంధించిన అభ్యర్థులు ప్రత్యేక కేటగిరిలో దరఖాస్తు చేసుకుని వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. ప్రభుత్వ ఐటీఐ(ఓల్డ్) కంచరపాలెం, ప్రభుత్వ ఐటీఐ(బాలికలు) ఇండస్ట్రీయల్ ఎస్టేట్, ప్రభుత్వ ఐటీఐ(కొత్తది) గాజువాక, ప్రభుత్వ ఐటీఐ నరవలో వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలిపారు. 37.5 కిలోల గంజాయి స్వాధీనం తాటిచెట్లపాలెం: గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని సోమవారం రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 37.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ రైల్వే పోలీసులు తెలిపిన వివరాలివి.. జీఆర్పీ, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్లు సీహెచ్ ధనుంజయనాయుడు, దినేష్కుమార్ దాస్ తమ సిబ్బందితో కలిసి సోమవారం విశాఖపట్నం రైల్వేస్టేషన్లో తనిఖీలు చేపట్టారు. తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లాకు చెందిన పి.బాబు, స్నేగా హేచ్ వద్ద గంజాయి ఉన్నట్లు గుర్తించారు. వారు విశాఖపట్నం మీదుగా తమిళనాడుకు గంజాయిని రవాణా చేస్తుండగా పట్టుబడ్డారు. వారి నుంచి రూ.1,87,500 విలువ గల 37.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచారు. పలు రైళ్లకు అదనపు కోచ్లుతాటిచెట్లపాలెం: ప్రయాణికుల సౌక ర్యార్థం పలు రైళ్లకు అదనంగా జనరల్, స్లీపర్ క్లాస్ కోచ్లను తాత్కాలికంగా జతచేస్తున్నారు. విశాఖపట్నం–బ్రహ్మపూర్–విశాఖపట్నం (18526/18525) ఎక్స్ప్రెస్కు మే ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు రెండు జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్లను, విశాఖపట్నం–రాయ్పూర్–విశాఖపట్నం (58528/ 58527) పాసింజర్కు మే ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు ఒక జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్ను జతచేస్తున్నారు. అలాగే విశాఖపట్నం–కోరాపుట్–విశాఖపట్నం (58538/58537)పాసింజర్కు మే ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు ఒక జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్ను, విశాఖపట్నం–బ్రహ్మపూర్–విశాఖపట్నం (58532/58531)పాసింజర్కు మే ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు ఒక జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్ను జతచేస్తున్నారు. విశాఖపట్నం–భువనేశ్వర్–విశాఖపట్నం (22820/ 22819) ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కు మే ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు రెండు జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్లను, విశాఖపట్నం–కోరాపుట్–విశాఖపట్నం(18512/18511) ఎక్స్ప్రెస్కు ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు రెండు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లను జతచేస్తున్నారు. -
కేజీహెచ్లో విజయవంతంగా కిడ్నీ మార్పిడి
డాబాగార్డెన్స్: కేజీహెచ్లో 16 ఏళ్ల బాలుడికి విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులను సోమవారం కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. నగరంలోని ఏవీఎన్ కళాశాల డౌన్ రోడ్డులో నివాసముంటున్న యశ్వంత్ రెండేళ్లుగా దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో అతని తల్లి సంతోషి కేజీహెచ్ వైద్యులను ఆశ్రయించారు. అతని ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు జీవన్దాన్ ద్వారా కిడ్నీ మార్పిడికి సిఫార్సు చేశారు. ఈ మేరకు కేజీహెచ్లో ఆ బాలుడికి ఈ నెల 7న కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం ఆ బాలుడు పూర్తిగా కోలుకోవడంతో సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ శస్త్రచికిత్సకు ప్రైవేటు ఆసుపత్రుల్లో దాదాపు రూ.15 లక్షల వరకు ఖర్చవుతుందని, కేజీహెచ్లో దీన్ని ఉచితంగా నిర్వహించినట్లు డాక్టర్ శివానంద్ తెలిపారు. అలాగే రోగికి రెండేళ్ల కాలానికి రూ.2 లక్షల విలువైన మందులు కూడా ఉచితంగా అందజేస్తామన్నారు. నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ జి.ప్రసాద్, యురాలజీ విభాగాధిపతి డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ రాంబాబు, అనస్థీసియా డాక్టర్లు శ్రీలక్ష్మి, డాక్టర్ ప్రీతి, డాక్టర్ రమేష్, నర్సింగ్ సిబ్బంది సూర్యప్రభ, చంద్రకళ, ఇతర సహాయక సిబ్బంది ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించినట్లు సూపరింటెండెంట్ వివరించారు. -
రోడ్డు ప్రమాదంలో విశాఖవాసి మృతి
మరొకరికి తీవ్ర గాయాలు గజపతినగరం: విజయనగరం జిల్లా గజపతినగరం మండల కేంద్రంలోని నాలుగు రోడ్ల జంక్షన్ (మెంటాడ జంక్షన్) వద్ద లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. గజపతినగరం ఎస్సై కె.కిరణ్కుమార్ నాయుడు తెలియజేసిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా మధురవాడకు చెందిన మెరుగు బాలాజీ (25), అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ మూలవలస గ్రామానికి చెందిన కోటపర్తి లక్ష్మణరావు ద్విచక్ర వాహనంపై మధురవాడ నుంచి అనంతగిరి మండలం మూలవలసకు బయలుదేరారు. గజపతినగరం మండల కేంద్రంలోని నాలుగురోడ్ల జంక్షన్ వద్దకు వచ్చేసరికి విశాఖపట్నం నుంచి రాయ్పూర్ వెళ్తున్న బొగ్గు లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న కోటపర్తి లక్ష్మణరావు అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న బాలాజీ లారీ చక్రం కింద ఇరుక్కుపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే క్షతగాత్రుడ్ని స్థానికులు గజపతినగరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ చోటేలాల్ (మధ్యప్రదేశ్)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు, క్షతగాత్రుడు మధురవాడలో ప్లంబింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. క్షతగాత్రుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
గంజాయి, సారా నిర్మూలనపై దృష్టి పెట్టాలి
హుకుంపేట: మండలంలో గంజాయి, సారాను నిర్మూలించేందుకు దృష్టి పెట్టాలని డీఎస్పీ షెహ్బాజ్ అహ్మద్ ఆదేశించా రు. స్థానిక పోలీస్ స్టేషన్ను సోమవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి, మండలంలో జరుగుతున్న నేరాలు,మత్తు పదార్థాల రవాణా వివరాలు అడిగి తెలుసుకున్నారు. గంజాయి, సారా రవాణా కేసుల్లో పట్టుబడిన వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన రహదారుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సురేష్కుమార్ పాల్గొన్నారు.డీఎస్పీ సహబాజ్ అహ్మద్ -
రేపే అప్పన్న చందనోత్సవం
సింహాచలం : వరాహ, నారసింహ రూపాలను ఒక్కటిగా చేసుకుని సంవత్సరమంతా చందనం మణుగుల్లో నిత్యరూపంలో దర్శనమిచ్చే సింహాద్రినాథుడి నిజరూప దర్శనం లభించే సమయం ఆసన్నమైంది. సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం బుధవారం జరగనుంది. ఏడాదిలో కేవలం ఒక్క రోజులోని కొన్ని గంటలు మాత్రమే లభించే ఈ అరుదైన దర్శనాన్ని చేసుకునేందుకు భక్తులు తరలిరానున్నారు. ఈసారి 2 లక్షల మంది భక్తులు స్వామి నిజరూప దర్శనం చేసుకుంటారని అంచనా వేశారు. సాధారణ భక్తులకు పెద్ద పీట వేస్తూ.. వారికి దర్శనాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర మంత్రుల కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్, సింహాచలం దేవస్థానం ఈవో కె.సుబ్బారావు నేతృత్వంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. వెండిబొరుగులతో చందనం ఒలుపు చందనోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచి పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ అర్చకులు వైదిక కార్యక్రమా లు ప్రారంభిస్తారు. సుప్రభాతసేవ, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, కలశారాధన చేస్తా రు. అనంతరం వెండిబొరుగులతో స్వామిపై ఉన్న చందనాన్ని తీసి నిజరూపభరితుడిని చేస్తారు. తెల్లవారుజామున 3 గంటలకు దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజుకి తొలిదర్శనం కల్పిస్తా రు. 3.30గంటల నుంచి రాష్ట్రప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించే రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించేవారికి, ప్రముఖులకు దర్శనం కల్పిస్తారు. ఉదయం 6 గంటలతో అంతరాలయ దర్శనాలు పూర్తిచేస్తారు. ఉదయం 3.30 గంటల నుంచి సర్వదర్శనం ఉదయం 3.30 గంటల నుంచి సర్వదర్శనాలు ప్రారంభిస్తారు. ఉచిత దర్శనం, రూ.300, రూ.1000 టికెట్లు క్యూల్లో ఉన్న వారందరికీ దర్శనాలు ప్రారంభిస్తారు. సాయంత్రం 6 గంటలలోపే సింహగిరిపై దర్శనాల క్యూల్లోకి భక్తులను అనుమతిస్తారు. రాత్రి 7 గంటలకు క్యూల ప్రవేశ ద్వారాలు మూసివేసి అప్పటి వరకు క్యూల్లో ఉన్న భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే సింహగిరిపైకి బస్సుల్లో భక్తులను అనుమతిస్తారు. ఆ తర్వాత ఖాళీ బస్సులను కొండపైకి పంపించి కొండపై ఉనన భక్తులను కొండదిగువకి చేరుస్తారు. 29వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటల తర్వాత కూడా భక్తులను కొండపైకి అనుమతించరు. తెల్లవారుజామున 3.30 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభం సాయంత్రం 6 గంటల తర్వాత సింహగిరిపైకి అనుమతి లేదు రాత్రి 7 గంటలకు సింహగిరిపై క్యూల ప్రవేశ గేట్లు మూసివేత ప్రొటోకాల్ వీఐపీలకు ఉదయం 6 గంటలతో అంతరాలయ దర్శనాలు పూర్తి ఆ తర్వాత అందరికీ నీలాద్రిగుమ్మం నుంచే లఘు దర్శనం 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా సామాన్య భక్తులకే పెద్దపీట బీచ్రోడ్డు(విశాఖ): చందనోత్సవంలో సాధారణ భక్తుల దర్శనానికి తొలి ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. చందనోత్సవ ఏర్పాట్లపై కలెక్టరేట్లో ఆయన జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొండపైన, కింద నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, పూర్తి ఫిట్నెస్తో ఉన్న ఆర్టీసీ బస్సులను మాత్రమే నడపాలని ఆదేశించారు. ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా విక్రయించే టికెట్లపై సీరియల్ నంబర్, స్కానింగ్, క్యూలను సూచించే బోర్డులను స్పష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. సింహాచలం ప్రాంతంలోని మద్యం షాపులను మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు ముసివేయాలని అధికారులకు ఆదేశించారు. -
‘మన మిత్ర’ యాప్ ద్వారా 250 రకాల సేవలు
రంపచోడవరం: మన మిత్ర వాట్సాప్ యాప్ ద్వారా 250 రకాల సేవలు పొందవచ్చని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం తెలిపారు. ఐటీడీఏ సమావేశపు హాలులో ప్రజల చేతిలో మన ప్రభుత్వం, మనమిత్రయాప్ కరపత్రాలను సబ్కలెక్టర్ కల్ప శ్రీతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏపీవో డి.ఎన్.వి.రమణ, ఈఈ శ్రీనివాసరావు, డీఎల్డీవో కోటేశ్వరరావు, తహసీల్దార్ పి.రామకృష్ణ, ఎంపీడీవో ఎస్. శ్రీనివాసరావు, డీడీ షరీఫ్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలపై సమగ్ర సర్వే
సాక్షి,పాడేరు: ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలపై వారం రోజుల్లో సర్వే పూర్తి చేసి, యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల తొలగింపునకు ఏర్పాటు చేసిన హైలెవెల్ అధికారుల కమిటీ సమావేశాన్ని సోమవారం కలెక్టరేట్లో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గ్రామ సర్వేయర్, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులు సంయుక్తంగా బంజరు భూములు, గ్రామకంఠం భూముల ఆక్రమణలపై సర్వే చేసి నివేదించాలన్నారు. సర్వేలో రెవెన్యూ,సర్వే అధికారులు కీలకపాత్ర వహించాలని చెప్పారు. ఆక్రమణలకు పాల్పడిన వ్యక్తులకు నోటీసులు జారీ చేసి,వారం రోజుల తరువాత రెవెన్యూ,పోలీసు,పంచాయతీ అధికారులు సంయుక్తంగా యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని ఆదేశించారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, నీటి పారుదలశాఖల భూముల ఆక్రమణలను గుర్తించి, తొలగింపునకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్అండ్బీ భూములను గుర్తించి డి–మార్కు చేయాలని కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అఽధికారి లవరాజు,డీఎస్పీ ఎస్.కె.షహబాజ్ అహ్మద్,డీఎల్పీవో కుమార్,సర్వే ఏడీ కె.దేవేంద్రుడు, ఆర్అండ్బీ ఈఈ బాలసుందరబాబు,ఎస్ఎంఐ ఈఈ రాజేశ్వరరావు,డీఈఈ నాగేశ్వరరావు పాల్గొన్నారు.కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశాలు -
గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలి
అనంతగిరి(అరకులోయటౌన్): రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కోరారు. మండలంలోని భీంపోల్ పంచాయతీ సరియాపల్లి గ్రామంలో ఎటిరో వెంచర్ నిర్వాహకుడైన గిరిజనేతరుడు ఆక్రమించిన గిరిజనుల భూములను ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని నాన్ షెడ్యూల్ ఏరియాలోని ఎన్.ఆర్.పురం, భీంపోల్, గుమ్మకోట, గురుగుబిల్లి, రొంపిల్లి పంచాయతీల్లోని గిరిజనుల భూములపై సమగ్ర విచారణ జరిపి, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి రక్షణ కల్పించాలన్నారు. మామిడి రాధమ్మ, అప్పలకొండకు చెందిన భూమిలో ఫెన్సింగ్, అరటి తోటలను జేసీబీలతో ధ్వంసం చేశారని, రెవెన్యూ, పోలీసు అధికారులకు బాధితులు చేసిన ఫిర్యాదు మేరకు ఈ ప్రాంతాన్ని పరిశీలించినట్టు చెప్పారు. సర్వేపల్లి రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ, సీలింగ్, గెడ్డ పోరంబోకు, ఢీ ఫారం భూములను గిరిజనేతరుడు తన ఆధీనంలో తీసుకొని, ఇష్టానుసారం రహదారులు, వంతెనలు నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఢీ పారం భూములను చదును చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. గిరిజనుల భూములు ఆక్రమిస్తున్న వారిపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రాంతంలో ఇటువంటి సంఘటనలు పెరిగాయన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు అచ్చెం నాయుడు, అనిత తదితరుల పేర్లు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారులు బెదిరిస్తున్నట్టు గిరిరైతులు ఆవేదన చెందుతున్నారని చెప్పారు. ఆక్రమణదారులకు రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. కూటమి నేతలకు గిరిజనులు ముఖ్యమా, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ముఖ్యమా బహిరంగంగా ప్రకటించాలన్నారు. గిరిజనుల భాములు అన్యాక్రాంతమవుతున్నాయని పలుమార్లు జిల్లా పరిషత్, పాడేరు ఐటీడీఏ సమావేశాల్లో అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోతోందన్నారు. దీర్ఘకాలంగా ఈ మండలంలో పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బందిని బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై న నాన్ షెడ్యూల్ ఏరియాలోని ఐదు పంచాయతీల్లో సమగ్ర విచారణ జరిపి అన్యాక్రాంతమైన భూములను గిరిజనులకు అప్పగించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఈ భూముల వ్యవహారంపై కలెక్టర్ ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ శెట్టి నీలవేణి, జెడ్పీటీసీ దీసారి గంగరాజు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పాగి అప్పారావు, ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఆర్.స్వామి, ఎంపీటీసీ శిరగాం అఽశోక్, నాయకులు తవిటి నాయుడు, కృష్ణమూర్తి, మహేష్, అప్పలకొండ, కన్నయ్య, అశ్వర్, రమణ తదితరులున్నారు. మంత్రులు రామ్మోహన్, అనిత, అచ్చెం నాయుడు అండతో ఆక్రమణలు నాన్ షెడ్యూల్ ఏరియా భూములపై సమగ్ర విచారణ జరపాలి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాస్తున్న రెవెన్యూ అధికారులు అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం -
సమర యోధుల మ్యూజియాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి
● రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకర్రావు చింతపల్లి: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ప్రాజెక్టుగా తాజంగిలో చేపట్టిన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్చైర్మన్ శంక ర్రావు అధికారులకు సూచించారు. చింతపల్లి మండలంలో సోమవారం ఆయన పర్యటించా రు.అసంపూర్తిగా నిలిచిపోయిన మ్యూజియం పనులను పరిశీలించారు. నిర్మాణా ల్లో జాప్యానికిగల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని, ఈవిషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలు చొరవ తీసుకోవాలని కమిషన్ తరఫున కోరతామన్నారు.జేసీ అభిషేక్గౌడ, సబ్కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ డీఈఈ రఘు,ఏఈఈ కిషోర్,ఏటీడ బ్ల్యూజయలక్ష్మి,తహసీల్దారురవికుమార్పాల్గొన్నారు. లంబసింగిలో విత్తన ప్రదర్శన సిఫా, వాసన్, ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు ఉమ్మడిగా లంబసింగిలో ఆదివాసీ విత్తన పండగను నిర్వహించారు. ఈసందర్భంగా పలు రకాల విత్తనాలను ప్రదర్శనలో ఉంచారు. ఈకార్యక్రమానికి హాజరైన చైర్మన్ శంకర్రావు విత్తనాలను పరిశీలించారు. అంతరించిపోతున్న సంపదను కాపాడుకోవాలని ఆయన తెలిపారు. -
బెల్ట్ దుకాణాలను నియంత్రించాలి
ప్రధాన జంక్షన్లు, గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను ప్రోత్సహించడం ప్రభుత్వానికి తగదు. గ్రామాల్లో నిరంతరం లభ్యమవుతుండడంతో పేద గిరిజనులు మద్యానికి బానిసలవుతున్నారు. మండల కేంద్రాల్లో రోడ్డు పక్కనే ఉన్న మద్యం దుకాణాల వద్దే మందు తాగిస్తుండడంతో రోడ్డుపై నడిచి వెళ్లే మహిళలకు ఇబ్బందిగా మారుతోంది. సాయంత్రం మందు బాబుల బెడద మరింత ఎక్కువగా ఉంటోంది. బెల్ట్షాపులను ప్రభుత్వం నియంత్రించాలి – వి.వి.జయ, ఐద్వా రాష్ట్ర కమిటీ, సభ్యురాలు అరకులోయ -
బీఎస్ఎన్ఎల్ సేవలకు తరచూ అంతరాయం
ముంచంగిపుట్టు: బీఎస్ఎన్ఎల్ సేవలకు తరచూ అంతరాయం ఏర్పడుతుండడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండల కేంద్రం ముంచంగిపుట్టులో మూడు నెలలుగా సక్రమంగా సిగ్నల్స్ ఉండడం లేదు. అధిక శాతం మంది వినియోగదారులు గతం నుంచి బీఎస్ఎన్ఎల్ నంబర్నే బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేశారు. సిగ్నల్స్ లేకపోవడంతో బ్యాంకుల సేవల్లో, ఓటీపీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం ఇంటర్నెట్ పనిచేయక ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. స్థానికంగా ఉన్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. అధికారులెవరూ ఇక్కడ అందుబాటులో ఉండడం లేదు. దీంతో సమస్యను ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక స్థానికులు అవస్థలు పడుతున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా, చిన్నపాటి వర్షం పడినా సిగ్నిల్స్ పోతున్నాయి. బీఎస్ఎన్ఎల్ అధికారులు ముంచంగిపుట్టు మండల కేంద్రంలో అందుబాటులో ఉంటూ సిగ్నల్స్ అంతరాయం లేకుండా చూ డాలని మండల వినియోగదారులు కోరుతున్నారు.మూడు నెలలుగా వినియోగదారులకు ఇబ్బందులు -
28 ఏళ్ల నుంచి చందనం అరగదీత
నేను 28 ఏళ్ల నుంచి చందనం అరగదీతలో పాల్గొంటున్నాను. చందనం అరగదీత చేపట్టే రోజుల్లో ఆలయం అంతా ఒక కొత్త వాతావరణాన్ని సంతరించుకుంటుంది. ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా చందనాన్ని అరగదీస్తాం. స్వామిపై ఉండే చందనం మా చేతుల మీదుగా అరగదీయడం నిజంగా ఆ స్వామి మాకు కల్పించిన మహా భాగ్యమే. – శిడగం అప్పలరాజు, నాల్గవ తరగతి ఉద్యోగి ఇదంతా అప్పన్న స్వామి అనుగ్రహం ఉద్యోగంలో చేరినప్పటి నుంచి స్వామివారి చందనం అరగదీతలో పాల్గొంటున్నా. ఇప్పటికి సుమారు 30 ఏళ్లకు పైగానే చందనం అరగదీశాననుకుంటా. ఏటా నాలుగు విడతల్లో జరిగే అరగదీతలో క్రమంతప్పకుండా పాల్గొంటున్నా. స్వామిపట్ల భక్తితోపాటు, గంటల తరబడి చందనం అరగదీయడం మాకు మంచి వ్యాయామంగా కూడా ఉంటుంది. – భీమవరపు అప్పారావు, నాల్గవ తరగతి ఉద్యోగి ● -
సీలేరు, చింతపల్లిలలో అమ్మవారి సంబరాలు అంబరాన్ని అంటాయి. సీలేరులో మారెమ్మ, చింతపల్లిలో ముత్యాలమ్మ తల్లి ఉత్సవ విగ్రహాలను అంగరంగవైభవంగా ఊరేగించారు. వేలాదిగా భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
చింతపల్లి: మండల కేంద్రం చింతపల్లిలో నిర్వహించిన ముత్యాలమ్మ తల్లి సంబరం అంబరాన్ని తాకింది. ఈ నెల 24న ప్రారంభమైన ఉత్సవాలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి. ముగింపు సందర్భంగా శక్తివేషాలు, కోటాలం, థింసా నృత్యాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఇసుక వేస్తే రాలనంతగా దాదాపుగా రెండు కిలోమీటర్ల మేర వేలాది మందితో రహదారి కిక్కిరిసిపోయింది. ఆలయం వద్ద అమ్మవారిని దర్మించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అమ్మవారి గరగలను వైభవంగా ఊరేగించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చింతపల్లి సీఐ వినోద్ బాబు ఆధ్వర్యంలో ఎస్ఐ వెంకటేశ్వరరావు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అందరిపై ముత్యాలమ్మ ఆశీస్సులు ఉండాలి ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని అరకు ఎంపీ తనుజారాణి అన్నారు. చింతపల్లిలో ముత్యాలమ్మ తల్లిని ఆదివారం ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమెను ఉత్సవ కమి టీ ప్రతినిధులు సన్మానించి, ముత్యాలమ్మ తల్లి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉత్సవానికి వేలాదిగా భక్తులు తరలిరావడం ఆనందంగా ఉందన్నారు. -
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కాపీలు దహనం
పాడేరు: ఇటీవల రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కాపీలను స్పెషల్ డీఎస్సీ సాధన సమితి ఆధ్వర్యంలో పాడేరు రేకుల కాలనీ పీఎంఆర్సీ వద్ద ఆదివారం దహనం చేశారు. ఈ సందర్భంగా స్పెషల్ డీఎస్సీ సాధన సమితి నాయకులు కూడారాధాకృష్ణ, నాగేశ్వరరావు మాట్లాడు తూ ఆదివాసీ ప్రాంతంలో నిరుద్యోగుల కోసం తక్షణమే స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయా లని డిమాండ్ చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటీఫికేషన్లో ఆదివాసీలకు అన్యాయం జరిగిందని తెలిపారు. ఈనెల 30వతేదీలోగా ప్రభుత్వం ఆదివాసీ డీఎస్సీపై ప్రకటన చేయాలనిడిమాండ్ చేశారు. స్పెషల్ డీఎస్సీ సాధన సమితి నాయకులు భాను,ప్రతాప్, కుమారస్వామి,మహేష్,చిరంజీవి, మోహన్ పాల్గొన్నారు. హుకుంపేట: మెగా డీఎస్సీతో ఆదివాసీలకు అన్యా యం జరుగుతోందని నాయకుడు కోటిబాబు, పీసా కమిటీ మండల ఉపాధ్యక్షుడు అప్పలకొండ అన్నారు. మండలంలోని గూడ గ్రామంలో డీఎస్సీ నోటిపికేషన్ పత్రాలను దహనం చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. జి.మాడుగుల: ఆదివాసీ ప్రాంతంలో శత శాతం ఉద్యోగాలు ఆదివాసీ నిరుద్యోగ యువతకే కల్పించాలని లయ స్వచ్ఛంద సంస్థ మండల కో–ఆర్డినేటర్ పాంగి మత్స్యరాజు, గిరిజన నిరుద్యోగులు డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్కు వ్యతిరేకంగా ఆదివారం కోరాపల్లిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు శతశాతం ఉద్యో గ అవకాశాలు కల్పించాలన్నారు. డీఈడీ, బీఈడీ అభ్యర్థులు చిరంజీవి, బాలకృష్ణ, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. డుంబ్రిగుడ: జీవో నంబరు–3ను పునరుద్ధరించా లని, ఆదివాసీలకు ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కించుమండలో యువకులు ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ఏజెన్సీలో పోస్టులను గిరిజనులతోనే భర్తీ చేయాలన్నారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
రాజవొమ్మంగి: మండలంలోని పాకవెలితి గ్రామంలో కరెంట్ షాక్కు గురైన పప్పుల శివప్రసాద్ (18)ను చికిత్స కోసం తీసుకొని వెళ్తుండగా శనివారం రాత్రి మార్గమధ్యలోనే మృతి చెందినట్టు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో విద్యుత్ వైర్లు కలుపుతు షాక్ గురై 90 శాతం కాలిన గాయాలతో అపస్మారక స్థితి చేరుకొన్న సంగతి తెలిసిందే. కాగా అతనిని మెరుగైన చికిత్స కోసం ఏలేశ్వరం సీహెచ్సీకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు ఈ విధంగా మృతి చెందడంతో తల్లిదండ్రులు చిన్నయ్య, సావిత్రిల దుఃఖానికి అంతులేకుండా పోయింది. ఈ సంఘటనలో పాకవెలితిలో విషాదం అలముకొంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చిన్నబాబు చెప్పారు. ప్రత్తిపాడు ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్టు తెలిపారు. -
కేజీబీవీల్లో రూ.8.55 కోట్లతో అదనపు భవనాలు
దేవరాపల్లి : జిల్లాలో 19 కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) రూ.8.55 కోట్లతో మనబడి మన భవిష్యత్ పథకంలో అదనపు భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయని సమగ్ర శిక్ష డీఈ కె.గణేష్ తెలిపారు. మండలంలోని బేతపూడి కేజీబీవీలో రూ.51.93 లక్షలతో నిర్మిస్తున్న అదనపు భవన నిర్మాణ పనులను స్థానిక ఏఈ పి.సంతోష్కుమార్తో కలిసి ఆదివారం పర్యవేక్షించారు. కాగా భవన నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో నాడు–నేడు పథకంలో రూ.51.93 లక్షలు మంజూరు చేయగా, అప్పట్లో రూ.28 లక్షలకు సంబంధించి పనులు పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనబడి– మన భవిష్యత్గా పేరు మార్చి పనులను కొనసాగిస్తున్నారు. జిల్లాలోని 12 కేజీబీవీల్లో జూనియర్ కళాశాల భవనాల నిర్మాణానికి రూ.1.60 కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయిని డీఈ గణేష్ తెలిపారు. బేతపూడి కేజీబీవీకి కూడా జూనియర్ కళాశాల భవనాల నిర్మాణానికి రూ.1.60 కోట్లు నిధులు మంజూరయ్యాయని, టెండర్ సైతం పూర్తయిందని ఆయన తెలిపారు. ఈ భవనాలలో ఆరు డార్మెటరి గదులు, రెండు టాయిలెట్లు ఉంటాయన్నారు. మనబడి– మన భవిష్యత్ పథకంలో అదనపు భవనాల నిర్మాణ పనులను వేసవి సెలవులు అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం నాటికి పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు డీఈ తెలిపారు. నాణ్యత ప్రమాణాలు సైతం పక్కాగా పాటిస్తూ పనులు చేపడుతున్నట్టు వివరించారు. 12 కేజీబీవీల్లో జూనియర్ కళాశాల భవనాలకు నిధులు మంజూరు సమగ్ర శిక్ష డీఈ గణేష్ వెల్లడి -
అంబరాన్నంటిన సంబరాలు
● చింతపల్లిలో వేలాదిగా తరలివచ్చిన భక్తులు ● ప్రత్యేక ఆకర్షణగా సాంస్క ృతిక కార్యక్రమాలు సీలేరు: నిన్నే నమ్ముకుని కొలిచాం... చల్లగా చూడమ్మా మారెమ్మ తల్లీ అంటూ అమ్మవారిని భక్తులు శరణు కోరారు. వేలాదిగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. సీలేరులో మారెమ్మ తల్లి ఆలయం వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారి ప్రధాన పండగ ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రం నలుమూలలతో పాటు సమీప ఒడిశా నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ఉదయం 6 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. మండుటెండలో సైతం క్యూలో గంటల తరబడి వేచి ఉన్నారు. పసుపు,కుంకుమలు సమర్పించి, పూజలు నిర్వహించారు. మాలలు ధరించిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శక్తి వేషాలు, థింసా నృత్యాలు పండగలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ● సీలేరు గ్రామ నివాసి అయిన కోటేశ్వరమ్మ కుమారుడు జి.వి.వి. సత్యనారాయణ దంపతులు 2,500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీరం గోవిందు అమ్మవారికి నైవేద్యాలను సమర్పించారు. ఖమ్మంకు చెందిన నాగరాజు దేవర అనే భక్తుడు అమ్మవారి చిత్రపటాలను అందజేశారు. ● మారెమ్మ తల్లి పండగకు వచ్చే భక్తులకు ముస్లింలు మజ్జిగ పంపిణీ చేశారు.ఆలయానికి వెళ్లే దారిలో రెగ్యులేటర్ డ్యాం వద్ద ఐదు డ్రమ్ముల మజ్జిగను పంపిణీ చేశారు. మైలపల్లి సత్తిబాబు ఆటో డ్రైవర్ మజ్జిగ పంపిణీ చేశారు. ● జెన్కో చీఫ్ ఇంజినీరు వాసుదేవరావు, సూపరింటెండింగ్ఽ ఇంజినీరు చంద్రశేఖర్ రెడ్డితో పాటు డొంకరాయి, మోతుగూడెంలకు చెందిన ఈఈ, ఏడీఈ,ఏఈలతో పాటు పూర్వ జెన్కో ఉద్యోగులు, పూర్వ విద్యార్థులు అమ్మవారిని దర్శించుకున్నారు. ● ఆర్టీసీ అధికారులు విజయనగరం, విశాఖపట్నం,శ్రీకాకుళం, నర్సీపట్నం నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడిపారు. ● మంగళవారం అమ్మవారికి చల్లనీటి ఉత్సవ విగ్రహాన్ని గ్రామంలో ఊరేగించి పసుపు నీటితో గ్రామాన్ని శుద్ధి చేసి గరగను గంగలో నిమఽజ్జనం చేసి, ఉత్సవాలు ముగిస్తారు. ● బుధవారం మరుపూజ చేసి యథావిధిగా మళ్లీ పూజలను ప్రారంభిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.ప్రధాన పండగ రోజు ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ రవీంద్రనాఽథ్ బందోబస్తు నిర్వహించారు. ఘనంగా మారెమ్మ ప్రధాన పండగ భారీగా తరలివచ్చిన భక్తులు -
తన బాల్యమిత్రుడైన కుచేలుడు పిడికెడు అటుకులిస్తేనే మురిసిపోయి అంతులేని సిరిసంపదలిచ్చాడట శ్రీకృష్ణుడు. సింహాద్రి అప్పన్న కొలువులో నాల్గవ తరగతి సిబ్బంది విషయంలో సీన్ కాస్త రివర్స్. అయినప్పటికీ.. ఆనందం మాత్రం దాదాపు అంతే స్థాయి. కిలో చందనం అరగదీస్తే దేవస్థా
చందనాన్ని అరగదీస్తున్న నాల్గవ తరగతి సిబ్బంది ఒక్కో ఉద్యోగి తీసిన చందనాన్ని తూకం వేస్తున్న వైదికులు(ఫైల్)నాలుగు విడతలుగా చందన సమర్పణ సింహగిరిపై కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందన స్వరూపుడు. ఏటా నాలుగు విడతల్లో స్వామికి పచ్చి చందనాన్ని సమర్పిస్తారు. వైశాఖ శుద్ధ తదియ(అక్షయ తృతీయ)ను పురస్కరించుకుని జరిగే చందనోత్సవంరోజు స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది. నిజరూప దర్శనం పూర్తికాగానే అదే రోజు రాత్రి స్వామికి తొలివిడతగా మూడు మణుగు(సుమారు 125 కిలో)ల పచ్చి చందనాన్ని సమర్పి స్తారు. ఆ తర్వాత వైశాఖ పౌర్ణమి, జ్యేష్ట పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి పర్వదినాల్లో మరో మూడేసి మణుగులు చొప్పున పచ్చి చందనాన్ని పూస్తారు. ఆయా సమర్పణల పర్వదినాలకు ముందు మూడు నుంచి ఐదు రోజుల పాటు ఆలయ బేడా మండపంలో అరగదీత కార్యక్రమం శాస్త్రోక్తంగా జరుగుతుంది. ఇందుకు ఉపయోగించే గంధపు చెక్కలను తమిళనాడు నుంచి తెప్పిస్తారు. జాజిపోకల అనే మేలు రకం గంధాన్ని స్వామివారి కోసం వినియోగిస్తారు. కిలో చందనం.. మూడు కిలోల బియ్యం ఒక కేజీ చందనం అరగదీస్తే మూడు కిలోల బియ్యాన్ని దేవస్థానం ఈ నాల్గవ తరగతి సిబ్బందికి అందిస్తుంది. అరగదీసిన చందనాన్ని కిలోల లెక్కన వైదికులు తూకం వేసి, వారి ఖాతాలో రాస్తారు. ఇలా ఒక్కో ఉద్యోగి వ్యక్తిగతంగా ఎన్ని కిలోల చందనం అరగదీస్తే అన్ని మూడేసి కిలోల చొప్పున బియ్యాన్ని దేవస్థానం నుంచి తీసుకుంటారు. ఈ బియ్యాన్ని స్వామివారి మహా ప్రసాదంగా వీరంతా స్వీకరిస్తారు. తరతరాలుగా ఎంతో మంది నాల్గవ తరగతి ఉద్యోగులు చందనం అరగదీతలో పాల్గొని తరిస్తున్నారు. చందనం అరగదీసే రోజుల్లో ఆలయమంతా చందన పరిమళాలను వెదజల్లడం ఒక మంచి అనుభూతిని అందిస్తుందని, అనందంగా చెప్తారు. నాల్గవ తరగతి ఉద్యోగులే కీలకం ఆలయంలో విధులు నిర్వర్తించే నాల్గవ తరగతి ఉద్యోగులే చందనం అరగదీతను చేపడతారు. దేవస్థానం అందించే నూతన పంచెలను ధరించి, నోటికి వస్త్రాన్ని కట్టుకుని, ఎంతో భక్తి శ్రద్ధలు, నియమనిష్టలతో చందనాన్ని అరగదీస్తారు. ఒక్కో విడతలో కావాల్సిన సుమారు 125 కిలోల చందనాన్ని వీరే సిద్ధం చేస్తారు. ఇలా అరగదీసిన చందనంలో సుగంధ ద్రవ్యాలను కలిపి ఆయా పర్వదినాల్లో వైదికులు స్వామికి సమర్పిస్తారు. స్వామిపై ఉన్న చందనం తమ చేతుల మీదుగా అరగదీయడాన్ని ఈ ఉద్యోగులు ఎంతో అదృష్టంగా భావిస్తారు. తమకు మాత్రమే దక్కిన ఈ మహా భాగ్యానికి ఆనందంతో పరవ శిస్తారు. -
నెలాఖరు వచ్చినా అందని రేషన్ బియ్యం
పెదబయలు: పేదలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం, ఇతర నిత్యావసర సరకులు ప్రతి నెల 1 తేదీ నుంచి 17 తేదీలోపు పంపిణీ చేయాలి. అయితే మండలంలోని ఐదు డిపోల పరిధిలో ఇప్పటికీ రేషన్ బియ్యం పంపిణీ చేయకపోవడంతో కార్డుదారులు అవస్థలకు గురవుతున్నారు. తమకు వెంటనే బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం తామరవీధి గ్రామ కార్డుదారులు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని జీసీసీ, సివిల్ సప్లై అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని వాపోయారు. మండల గోదాం నుంచి బొండాపల్లి, పోయిపల్లి, బొంగరం, పెదబయలు, బొంగరం డీఆర్ డిపోలకు ఏప్రిల్ నెలకు సంబంధించిన రేషన్ బియ్యం పూర్తి స్థాయిలో సరఫరాకాలేదు. బొండాపల్లి డిపోలో 590 కార్డులకు గాను 11,150 కిలోల బియ్యం పంపిణీ చేయవలసి ఉండగా 6,800 కిలోల బియ్యం వచ్చాయి. మార్చిలో నిల్వ 615 కిలోలు ఉండగా వచ్చిన బియ్యం,నిల్వ పోగా 3,735 కిలోల బియ్యం రావాల్సి ఉంది. అలాగే పోయిపల్లి 240 కార్డులకుగాను 4,605 కిలోలు రావాల్సి ఉండగా 2,550 కిలోలు వచ్చాయి. బొంగరం డిపోలో 334 కార్డులకు 6,100 కిలోల బియ్యం రావాల్సి ఉండగా 5,100 కిలోలు వచ్చాయి. ఇంకా 1000 కిలోలు రావాల్సి ఉంది. సీకరి డిపోలో 586 కార్డులకు 12,040 కిలోల బియ్యం రావాల్సి ఉండగా 11,100 కిలోలు వచ్చాయి. 940 కిలోల బియ్యం రావాల్సి ఉంది. మండలం కేంద్రం పెదబయలులో 845 కార్డులకు 14,295 కిలోల రావాల్సి ఉండగా 13,300 కిలోలు వచ్చాయి. 995 కిలోల బియ్యం రావాల్సి ఉంది. దీంతో బొండాపల్లి డిపో పరిధిలో తామరవీధి, ఎగువ బొండాపల్లి, తాడేవీధి, కుయిభ గ్రామాలకు, పోయిపల్లి డిపో పరిధిలో అర్లాబు, సైలంకోట, గడ్డిజిలుగులు గ్రామాలతోపాటు మిగిలిన మూడు డిపోల పరిధి లోని గ్రామాల కార్డుదారులకు ఏప్రిల్ నెల బియ్యం అందలేదు. రేషన్ బియ్యం అందక అవస్థలు పడుతున్నామని కార్డుదారులు వాపోయారు. ఈ విషయంపై పెదబయలు జీసీసీ బ్రాంచ్ మేనేజర్ ఒలేసి గాసీని వివరణ కోరగా మండలంలో 10 డిపోలకు పూర్తి స్థాయిలో స్టాక్ రాలేదన్న విషయం తన దృష్టికి వచ్చిందని, తహసీల్దార్కు నివేదించానని చెప్పారు. ఈ నెల 16,17 తేదీల్లో ఐదు డిపోలకు స్టాక్ వచ్చిందని మరో ఐదు డిపోలకు ఇంకా రావాల్సి ఉందన్నారు. జీసీసీ,సివిల్ సప్లై అధికారులకు తెలిపినా స్పందన శూన్యం నిరసన వ్యక్తం చేసిన కార్డుదారులు -
● గుర్రపు డెక్క.. పూసెను ఎంచక్కా
● చాపరాయిలో కోలాహలం● మంచు అందాలు.. మనసు దోచే చాపరాయి జలవిహారిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. గత మూడు వారాలుగా చాపరాయిని అంతంత మాత్రంగానే పర్యాటకులు సందర్శించారు. ఈ వారం పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఇక్కడ వ్యాపారం చేసుకునే గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. అరకు పైనరీని కూడా పర్యాటకులు సందర్శించారు. – డుంబ్రిగుడ మంచు అందాలు పర్యాటకులను మైమరిపిస్తున్నాయి. అరకు రైల్వేట్రాక్, అరకు గ్రామం, జయపూర్ జంక్షన్, డుంబ్రిగుడ తదితర ప్రాంతాల్లో ఆదివారం దట్టంగా మంచుకురిసింది. తెల్లవారు జాము నుంచి భారీగా కురుస్తున్న పొగమంచులో పర్యాటకులు ఫొటోలు, వీడియోలు తీస్తూ సందడి చేశారు. – డుంబ్రిగుడముంచంగిపుట్టు అంబేడ్కర్ పార్కు సమీపంలో ఉన్న చెరువులో గుర్రపు డెక్క పూలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. చెరువు మొత్తం పూలతో నిండిపోయింది. పచ్చని ఆకుల మధ్య తెలుపు,నీలం రంగులతో పూసిన పూలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ప్రకృతి ప్రేమికులు సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. – ముంచంగిపుట్టు -
పుట్టగొడుగుల పెంపకంతో గిరిజన యువతకు ఉపాధి
రంపచోడవరం: పుట్టగొడుగుల పెంపకంతో గిరిజన యువత, మహిళలు ఉపాధి పొంది, ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని హిఫర్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సునీతా తెలిపారు. మండలంలో ఉసిరిజొన్నల గ్రామంలో కుటీర పరిశ్రమగా పది సంవత్సరాలుగా పుట్టగొడుగుల పెంపకం నిర్వహిస్తున్న సత్యనారాయణ ఆధ్వర్యంలో నవజీవన్ ఆర్గనైజేషన్, హిఫర్ ఆర్గనైజేష్న్ సహకారంతో 25 మంది రైతులకు మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సునీతా మాట్లాడుతూ పుట్టగొడుగుల పెంపకంలో విత్తనం ప్రధానమని చెప్పారు. ఈ ప్రాంతానికి అనుకూలమైన రకాల ఎంపిక, డార్క్ రూమ్లో ఎన్ని రోజులు ఉంచాలి తదితర విషయాలను వివరించారు. శిక్షణ పొందిన యువతకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో నవజీవన్ ఆర్గనైజేషన్ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎస్.శ్రీనివాస్, బీడీవో ఎం.నాగేశ్వరరావు, డీఈవో రాంలాల్, సీఎఫ్లు చిన్నలుదొర, సాయివెంకట్, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.ఏఎంసీ ప్రిన్సిపాల్గా సంధ్యా దేవి బీచ్రోడ్డు(విశాఖ): ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్గా డాక్టర్ కె.వి.ఎస్.ఎం.సంధ్యా దేవిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏఎంసీ ప్రిన్సిపాల్గా డాక్టర్ బుచ్చిరాజు ఉద్యోగ విరమణ పొందిన తరువాత ఆమె తాత్కాలిక ప్రిన్సిపాల్గా ఉన్నారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రిన్సిపాల్గా కొసాగనున్నారు. అలాగే ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ముగ్గురు ప్రొఫెసర్లను వివిధ ప్రభుత్వ ఆస్పత్రులకు సూపరింటెండెంట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఎండోక్రినాలజీ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ కె.ఎ.వి.సుబ్రహ్మణ్యంను ఒంగోలు జీజీహెచ్ సూపరింటెండెంట్గా.. గైనాకాలజీ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ సి.అమూల్యను శ్రీకాకుళం జీజీహెచ్ సూపరింటెండెంట్గా.. జనరల్ సర్జరీ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ వి.మన్మధరావుకు మచిలిపట్నం జీజీహెచ్ సూపరింటెండెంట్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
ముక్కలు
రెక్కలు..గణనీయంగా పడిపోయిన వైజాగ్ ఎయిర్పోర్ట్ వృద్ధి రేటువిశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం భవిష్యత్తును కూటమి ప్రభుత్వం కాలరాస్తోంది. గత ప్రభుత్వం చూపించిన శ్రద్ధతో ఎయిర్పోర్టు కొత్త రెక్కలు తొడుక్కుంది. నవ్య రూపం సంతరించుకుని అంతర్జాతీయ సర్వీసులను ఆకర్షించింది. కూటమి ప్రభుత్వం దీనికి రివర్స్లో విమానం రెక్కలు విరిచేసింది. దీంతో ఎయిర్పోర్టు వృద్ధి రేటులో తిరోగమనం దిశగా పయనిస్తోంది. సాక్షి, విశాఖపట్నం : ఏడాది క్రితంతో పోలిస్తే విశాఖ విమానాశ్రయంలో విమాన సర్వీసులు, ప్రయాణికుల వృద్ధి క్రమంగా క్షీణిస్తోంది. కోవిడ్ తర్వాత మొదటిసారిగా ప్రయాణికుల రాకపోకల వృద్ధి రేటు 20 శాతం దిగువకు పడిపోవడమే దీనికి నిదర్శనం. గతంలో కనీసం 50 నుంచి 100 శాతానికి పైగా వృద్ధి నమోదయ్యేది. కానీ ఈ ఏడాది మార్చిలో కేవలం 17 శాతానికే పరిమితమైంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు చేతకానితనం వల్ల ప్రయాణికుల రాకపోకల వృద్ధి రికార్డు స్థాయిలో తగ్గిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు ఉత్తరాంధ్రకు చెందిన వారైనా.. విమాన సర్వీసులు రద్దవుతున్నా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొన్ని సర్వీసులు ఇతర ప్రాంతాలకు తరలించేయడం.. కొత్త సర్వీసులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. మార్చిలో 17 శాతం వృద్ధి మాత్రమే.! ప్రతి నెలా దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో విశాఖ ఎయిర్పోర్టు నుంచి ప్రయాణిస్తున్న ప్రయాణికుల సంఖ్యను గణిస్తుంటారు. గతేడాది అదే నెలలో జరిగిన రాకపోకలతో పోల్చి వృద్ధి రేటు నమోదు చేస్తారు. ఈ వృద్ధి రేటు ఆధారంగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు కనిపిస్తే ఎయిర్లైన్స్ సంస్థలు.. కొత్త సర్వీసులు నడిపేందుకు పోటీ పడుతుంటాయి. 2024 నవంబర్ వరకూ వైజాగ్ ఎయిర్పోర్టు గణనీయంగా వృద్ధి నమోదు చేసింది. దేశీయ విమాన సర్వీసుల్లో 80 నుంచి 100 శాతం వరకూ, అంతర్జాతీయ సర్వీసుల్లో 90 నుంచి 150 శాతం వరకూ వృద్ధి కనిపించింది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం విశాఖను విస్మరించిందో అప్పటి నుంచి సర్వీసులు తగ్గిపోయాయి. ఫలితంగా ప్రయాణికుల వృద్ధి కూడా దారుణంగా పడిపోయింది. ఈ ఏడాది మార్చిలో 2,55,835 మంది ప్రయాణికులు డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సర్వీసుల్లో ప్రయాణించారు. 2024 మార్చిలో 2,17,243 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ప్రయాణికుల సంఖ్య అంతగా పెరగకపోవడంతో వృద్ధి కేవలం 17.8 శాతం మాత్రమే నమోదైంది. గత ఐదేళ్ల కాలంలో కోవిడ్ మినహాయిస్తే.. ఇదే అత్యల్పం కావడం దురదృష్టకరం. ఈ ఏడాది మార్చిలో 2,55,835 మంది రాకపోకలు గతేడాది మార్చిలో 2,17,243 మంది ప్రయాణం గత మార్చితో పోలిస్తే కేవలం 17.8 శాతం మాత్రమే వృద్ధి కూటమి సర్కారు నిర్వాకంతో పలు విమాన సర్వీసుల రద్దు పట్టించుకోని కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు ఏప్రిల్ నెలలో మరింత దిగజారనున్న వృద్ధి రేటు వచ్చిన విమానాలు వచ్చినట్లే మాయం మార్చిలో 20 శాతం దిగువన నమోదైతే.. ఏప్రిల్లో మరింత దిగువకు పడిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏప్రిల్లో విజయవాడ సర్వీసులతో పాటు మరికొన్ని సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణించే వారి సంఖ్య కూడా తగ్గిపోతోంది. ఇటీవల దుబాయ్ విమానం వైజాగ్ రాకుండా కూటమి సర్కారు అడ్డుకొని విజయవాడకు తరలించేసింది. అదే నిర్లక్ష్యంతో వియత్నాం విమాన సర్వీసు హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయింది. ఇటీవలే బ్యాంకాక్, కౌలాలంపూర్ విమాన సర్వీసులు కూడా నిలిపేస్తున్నామని ప్రకటించాయి. విజయవాడ సర్వీసు ఆగిపోయింది. మిగిలిన డొమెస్టిక్ సర్వీసుల విషయంలోనూ అదే నిర్లిప్తంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీంతో వైజాగ్ వచ్చేందుకు ఎయిర్లైన్స్ ఆసక్తి చూపిస్తున్నా కూటమి ప్రభుత్వం మాత్రం రాకుండా మోకాలడ్డుతోంది. ఇలాగే కొనసాగితే వైజాగ్ ఎయిర్పోర్టు నుంచి కొత్త సర్వీసులు వచ్చేందుకు అవకాశాలు దాదాపు సన్నగిల్లిపోతాయని ప్రజలు, అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
సింహగిరికి పోటెత్తిన భక్తజనం
సింహాచలం: గంధం అమావాస్య పురస్కరించుకుని సింహగిరికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఇలవేల్పుగా పూజించే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మత్స్యకారులు, గ్రామీణ ప్రాంత భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. శనివారం రాత్రికే సింహాచలం చేరుకున్న వీరంతా ఆదివారం తెల్లవారుజాము మూడు గంటల నుంచే కొండదిగువ వరాహ పుష్కరిణిలో స్నానాలు ఆచరించారు. స్వామి ప్రతిరూపాలుగా వెంట తీసుకొచ్చిన కోలలను పుష్కరిణి గట్టుపై ఉంచి పూజలు నిర్వహించారు. వంటలు వండి, కోలలకు ఆరగింపు చేశారు. అమృత కలశాలను, పళ్లను సమర్పించారు. కుటుంబ సమేతంగా సహపంక్తి భోజనాలు చేశారు. మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. కోలలతో నృత్యాలు చేస్తూ స్వామిని కీర్తించారు. స్నానమాచరించేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో వరాహ పుష్కరిణి ప్రాంగణం అంతా కిటకిలాడింది. పుష్కరిణి నుంచి అడవివరం మార్కెట్ కూడలి వరకు ఉన్న మార్గం భక్తజన సంద్రంగా మారింది. సింహగిరిపై దర్శనక్యూలు, కేశఖండనశాల, ప్రసాద విక్రయశాల, గంగధార మార్గం భక్తులతో కిటకిటలాడాయి. సింహగిరికి చేరుకున్న భక్తులు సింహగిరిపై కూడా కోలలకు పూజలు నిర్వహించారు. గరిడి నృత్యాలు చేశారు. దేవస్థానం ఇన్చార్జి ఈవో కె.సుబ్బారావు ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. పుష్కరిణి వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గోపాలపట్నం పోలీసులు, దేవస్థానం గార్డులు బందోబస్తు నిర్వహించారు. గంధం అమవాస్య భక్తులతో కిక్కిరిసిన వరాహ పుష్కరిణి -
భూ కబ్జాపై బాధితుల ఫిర్యాదు
అనంతగిరి(అరకులోయటౌన్): మండలంలోని భీంపోల్ పంచాయతీ సరియాపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 69/5లో సుమారు 1.50 ఎకరాలకు చెందిన తమ భూమిని గిరిజనేతరుడైన బి.నగేష్ కబ్జా చేసి చదును చేస్తున్నట్టు బాధితురాలు మామిడి రాధమ్మ, ఆమె కుమారుడు అప్పలకొండ అనంతగిరి ఇన్చార్జి తహసీల్దార్ మాణిక్యం, ఎస్ఐ శ్రీనివాస్కు ఫిర్యాదు చేసినట్టు ఒక ప్రకటనలో వారు తెలిపారు. తాము గ్రామంలో లేని సమయంలో గిరిజనేతరుడు బి.నగేష్తోపాటు అతని అనుచరులు తమ స్థలంలో జేసీబీలతో ఇనుప కంచెలు తొలగించి, అరటి తోటలు ధ్వంసం చేసి, భూమి చదును చేసినట్టు ఫిర్యాదులో తెలిపారు. తమకు వంశపారపర్యంగా సంక్రమించిన భూమిని దౌర్జన్యంగా ఆక్రమించేదుకు పూనుకున్నారన్నారు. తమ భూమిని కబ్జా చేసిన గిరిజనేతరుడు నగేష్తోపాటు అతని అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోని, తమ భూమికి రక్షణ కల్పించాలని ఇన్చార్జి తహసీల్దార్, ఎస్ఐలకు కోరామన్నారు. సదరు గిరిజనేతరుడు నగేష్ అనే వ్యక్తి టీడీపీ సానుభూతి పరుడిగా చెబుతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ మాణిక్యంకు వివరణ కోరగా మామిడి రాధమ్మ, ఆమె కుమారుడు అప్పలకొండ తమ భూమి కబ్జాపై ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. స్థానిక ఎస్ఐ శ్రీనివాస్తో కలిసి సోమవారం సరియాపల్లి గ్రామానికి వెళ్లి విచారణ జరుపుతామని మాణిక్యం తెలిపారు.ఆక్రమణకు పాల్పడిన గిరిజనేతరుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ -
ఘనంగా అమ్మవారి విగ్రహ ఊరేగింపు
సీలేరు: జీకే వీధి మండలం సీలేరు గ్రామ దేవత మారెమ్మ అమ్మవారి ఆలయ 53వ వార్షికోత్సవాల సందర్భంగా శనివారం అమ్మవారి ఊరేగింపు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారి గరగను, ఉత్సవ విగ్రహాలను సీలేరు వీధుల్లో అంగరంగా వైభవంగా ఊరేగించారు. భక్తులు అమ్మవారికి పసుపు,కుంకుమ సమర్పించి, హారతులిచ్చారు. తాడేపల్లిగూడేంకు చెందిన అమ్మవారి శక్తి వేషాలు, తీన్మార్ డప్పులు, థింసా నృత్యాలు, డీజే సౌండ్స్తో ఊరేగింపు కోలాహలంగా సాగింది. ఈ కార్యక్రమంలో సీలేరు పూర్వ విద్యార్థులు, పూర్వ జెన్కో ఉద్యోగులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జీకే వీధి సీఐ వరప్రసాద్ ఆదేశాల మేరకు స్థానిక ఎస్ఐ రవీంద్ర భారీ బందోబస్తు నిర్వహించారు. -
జిల్లా జడ్జి దృష్టికి న్యాయవాదుల సమస్యలు
రంపచోడవరం: తూర్పుగోదావరి జిల్లా 8వ అడిషనల్ జిల్లా జడ్జి చెన్నయ్య నాయుడు శనివారం రంపచోడవరంలోని ఫస్ట్క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టును సందర్శించారు. జిల్లా జడ్జితో పాటు స్థానిక న్యాయమూర్తి పి.బాబు ఉన్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.రవిరామ్ భగవాన్ , ఉపాధ్యక్షురాలు కె.శివరంజని, సీనియర్ న్యాయవాదులు కె.ఎన్.వి.రమణ, డి.శ్రీధర్, తదితర న్యాయవాదులు జిల్లా జడ్జిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు స్థానిక న్యాయవాదుల సమస్యలను జిల్లా జడ్జి దృష్టికి తీసుకువెళ్లారు. కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఏయూ వారసత్వాన్ని నిలబెడదాం
విశాఖ విద్య: ఘనమైన వారసత్వం కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం అభ్యున్నతికి అందరూ సమష్టిగా కృషి చేయాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె.మధుమూర్తి పిలుపునిచ్చారు. ఏయూ శతాబ్ది వేడుకల ప్రారంభోత్సవం సందర్భంగా బీచ్రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడారు. శతాబ్ద కాలంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం అనేకమంది జీవితాలను ప్రభావితం చేసిందన్నారు. అదే విధంగా యువ మస్తిష్కాలను తీర్చిదిద్దిన ఘనత ఏయూ సొంతమని చెప్పారు. ఇది దేశ ప్రగతికి, ప్రపంచ ప్రగతికి దోహదపడిందన్నారు. తనకు ఇక్కడ చెప్పలేనన్ని అపురూప జ్ఞాపకాలు ఉన్నాయని, విద్యార్థిగా తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. విద్యార్థులకు జ్ఞానంతో పాటు విలువలు ఎంతో అవసరమని చెప్పారు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చేదిగా ఈ ప్రయాణం నిలుస్తుందని మధుమూర్తి అన్నారు. జ్ఞాన ఆధారిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. త్వరలో రాష్ట్రంలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు అవుతుందని చెబుతూ.. దాని ప్రాముఖ్యాన్ని వివరించారు. భారతదేశానికి యువ జనాభా ఎంతో లాభదాయకంగా నిలుస్తుందన్నారు. భవిష్యత్లో బోధన విధానాన్ని ఏఐ సాంకేతికత సవాలు చేసే దిశగా మారుతుందన్నారు. విద్య, పరిశోధన, ప్రజాసేవ రంగాల్లో ఏయూ తనదైన శైలిలో ముందుకు వెళ్లాలని సూచించారు. విశ్వవిద్యాలయాన్ని మరింత అభివృద్ధి చేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. విశిష్ట అతిథి ఐఐటీ పాలక్కాడ్ డైరెక్టర్ ఎ.శేషాద్రి శేఖర్ మాట్లాడుతూ సమగ్ర విద్యను అందించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు. ప్రాథమిక సూత్రాలు, శాస్త్ర సంబంధ అంశాలపై బలమైన పట్టు సాధించడం ఎంతో అవసరమని, అదే విధంగా సాఫ్ట్ స్కిల్స్ను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిగా తాను ఈ స్థానంలో నిలవడానికి గల కారణం, సందర్భాలను గుర్తు చేసుకున్నారు. ప్రతి విద్యార్థి జాతీయ విద్యా విధానం డాక్యుమెంట్ను చదవాలని సూచించారు. ఏయూ ప్రగతికి తా ను సంపూర్ణ సహకారం అందిస్తానని ప్రకటించారు. ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ, దార్శనికుల వారసత్వం, నాయకత్వం ఏయూను నడిపిస్తోందన్నారు. అకడమిక్, మౌలికసదుపాయాలు, ఔట్రీచ్ రంగాల్లో ఏయూ మరింత పటిష్టంగా పనిచేస్తుందన్నారు. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ విభాగాలను మరింత బలోపేతం చేస్తామని వివరించారు. సహ పాఠ్య కార్యక్రమాల ప్రాధాన్యత గుర్తించి వాటిని విద్యలో భాగం చేస్తామని తెలిపారు. ఏడాది పొడుగునా నిర్వహించే శతాబ్ది వేడుకల్లో నోబెల్ గ్రహీతలను ఆహ్వానిస్తామని వీసీ చెప్పారు. విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ మాట్లాడుతూ దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పరచుకుంటూ వాటిని సాధించే దిశగా పని చేయాలని సూచించారు. పూర్వ విద్యార్థుల సంఘం చైర్మన్ కె.వి.వి.రావు మాట్లాడుతూ ప్రజల జీవితాన్ని మార్చిన వ్యవస్థగా ఏయూను చెప్పవచ్చన్నారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య ఎన్.కిశోర్ బాబు, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనుంజయరావు తదితరులు ప్రసంగించారు. సాక్షి,పాడేరు: పట్టణంలోని ఉమానీలకంఠేశ్వరస్వామి సమేత రాజరాజేశ్వరిదేవి ఆలయ వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించా రు. ఆలయ ధర్మ కర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ ప్రతినిధులంతా అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే అర్చకుడు రామం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు. సాయంత్రం మహిళలు కుంకుమార్చన చేశారు. భక్తులకు ఉచిత ప్రసాదాలను పంపిణీ చేశారు. నవగ్రహాలకు పూజలు: శనిత్రయోదశిని పురష్కరించుకుని శివాలయం ప్రాంగణంలోని నవగ్రహాలకు ప్రత్యేక పూజలు జరిపారు. అర్చకుడు రామం భక్తులతో నవగ్రహాలకు అభిషేకాలు జరిపించి, పూజలు చేయించారు. ప్రత్యేకాలంకరణలో అమ్మవారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె.మధుమూర్తి పిలుపు ఏయూ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం విజన్ డాక్యుమెంట్, లోగోలు ఆవిష్కరించిన అతిథులు ఉత్సవాల్లో భాగంగా బీచ్రోడ్డులో వాకథాన్ విశ్రాంత ఆచార్యులకు సన్మానం ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు సి.హెచ్ శాంతమ్మ, ఆచార్య బి.ప్రసాద్ రావులను ఈ సందర్భంగా సత్కరించారు. అనంతరం ఆచార్య ప్రసాదరావు చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగం విద్యార్థుల మనసులను హత్తుకుంది. తాము చదువుకున్న ఆంధ్ర విశ్వవిద్యాలయ రుణం తీర్చుకోవాలని, విలువలతో కూడిన విద్యను అందించాలని ఉద్దేశంతో తాను స్థాపించిన పాఠశాల అభివృద్ధిని వివరించారు. కార్యక్రమంలో భాగంగా ఏయూ విజన్ డాక్యుమెంట్, లోగోలను అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమం ఆరంభంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పలువురు పూర్వ ఉపకులపతులు, విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఆచార్యులు పాల్గొన్నారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహూకరించారు. -
నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం
ఐటీడీఏ పీవో అపూర్వభరత్ కూనవరం: పోలవరం నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ అన్నారు. మండల కేంద్రం కూనవరంలో నిర్వహించిన ఆర్అండ్ఆర్ గ్రామ సభను శనివారం ఆయన పర్యవేక్షించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్క నిర్వాసితుడికి న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. కూనవరంలో మొత్తం 1,362 మంది పీడీఎఫ్లు ఉన్నారని వారిలో 1,183 మంది పీడీఎఫ్లను అర్హులుగా గుర్తించామని తెలిపారు. 179 మందిని అనర్హులుగా గుర్తించినట్టు చెప్పారు. అనర్హులు ఆధారాలతో దరఖాస్తులు చేసుకుంటే, వాటిని పరిశీలించి రెండవ గ్రామ సభనాటికి అర్హులుగా గుర్తించి వారికి న్యాయం చేస్తామని తెలిపారు. నిర్వాసితులు ఎవరూ మధ్యవర్తులను నమ్మి పోవద్దని సూచించారు. అభ్యంతరాలపై 15 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈసభలో 151 మంది దరఖాస్తు చేసుకున్నట్టు తహసీల్దార్ తెలిపారు. ఈకార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వై.వెంకటేశ్వర్లు, ఎంపీపీ పాయం రంగమ్మ, జెడ్పీటీసీ గుజ్జా విజయ, సర్పంచ్ హేమంత్ గాంధీ, ఎంపీటీసీ కొమ్మాని అనంతలక్ష్మి, తహసీల్దారు కె.శ్రీనివాసరావు, ఎంపీడీవో రామాంజనేయ ప్రసాద్, కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు. వి.ఆర్.పురం: వడ్డుగూడెం చోప్పల్లి గ్రామంలో పోలవరం నిర్వాసితుల ఆర్అండ్ఆర్ గ్రామసభను శనివారం నిర్వహించారు. గ్రామ సభలో అర్హులు అనర్హులు జాబితాను అధికారులు చదివి వినిపించారు. అభ్యంతారాలు ఉన్న వారు జాబితాలో పేర్లు లేనివారు 15 రోజుల్లో పరిధిలో ఎస్డీసీ వారికి దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ మాట్లాడుతూ ప్రతి ఒక్క నిర్వాసితునికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకొంటామన్నారు. ఈ గ్రామసభలో అనర్హులుగా ఉన్న వారి నుంచి దరఖాస్తులు తీసుకొని రెండో గ్రామ సభలో వాటిని పరిశీలిస్తామన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, రెవెన్యూ, పంచాయతీ రాజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ముమ్మరంగా పోలీసు తనిఖీలు
పాడేరు : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎస్పీ అమిత్బర్దర్ ఆదేశాల మేరకు శనివారం జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో సీఐ దీనబంధు ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. పోలీసు జాగిలాలతో పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, పాత బస్టాండ్, సినిమాహాల్ సెంటర్, మోదకొండమ్మ ఆలయం, ఐటీడీఏ కార్యాలయం, ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి తదితర ముఖ్య కూడళ్ల వద్ద తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్ సాయంతో ప్రయాణికుల బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాలను కూడా తనిఖీచేశారు. సీఐ దీనబంధు మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనుమానిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దని తెలిపారు. అరకులోయ టౌన్: అరకులోయని పర్యాట ప్రాంతాల్లో శనివారం అరకు సీఐ హిమగిరి,ఎస్ఐ గోపాలరావు ఆధ్వర్యంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. పద్మాపురం గార్డెన్, ట్రైబల్ మ్యూజియం, కాఫీ మ్యూజియం, అరకు రైల్వే స్టేషన్,బస్ స్టేషన్లను బాంబు డిస్పోజల్,డాగ్ స్క్వాడ్తో సీఆర్పీఎఫ్,స్పెషల్ పార్టీ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.ప్రయాణికుల వివరాలు సేకరించి, బ్యాగులు, లగేజీలు పరిశీలించారు. అనుమానాస్పదంగా ఎవరు తిరిగినా, బ్యాగులు,లగేజీలు ఉన్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ హిమగిరి స్థానికులను కోరారు. చింతూరు: కేంద్ర హోం మంత్రిత్వశాఖ హెచ్చరికల నేపథ్యంలో చింతూరు సీఐ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం చింతూరులో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఉగ్రదాడి జరగడంతో ఈ ప్రాంతంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నట్టు సీఐ తెలిపారు. ఈ సందర్భంగా చింతూరు బస్టాండ్తో పాటు పలు అనుమానాస్పద ప్రాంతాల్లో మెటల్ డిటెక్టర్లు, డాగ్స్క్వాడ్ సాయంతో తనిఖీలు చేపట్టారు. -
ఏవోబీలో విస్తృతంగా తనిఖీలు
ముంచంగిపుట్టు: ఆంధ్ర,ఒడిశా సరిహద్దు ప్రాంతంలో శనివారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వారపు సంతతో పాటు జోలాపుట్టు,డుడుమ మార్గాల్లో ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కర్రెగుట్టలో జరిగిన ఎన్కౌంటర్లో అధిక సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందడంతో పాటు పెద్ద సంఖ్యలో మావోయిస్టులు తప్పించుకున్నట్టు వచ్చిన వార్తలతో సరిహద్దులో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులోని ప్రధాన జంక్షన్లు వద్ద తనిఖీలు చేస్తున్నారు.ప్రయాణికుల లగేజీలు పరిశీలించి,అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను ప్రశ్నిస్తూ వాహన రికార్డులతో పాటు గుర్తింపు కార్డులు పరిశీలించి, విడిచి పెట్టారు. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలు బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు. -
ఉపాధి కూలీగా మారిన ఎస్ఐ
ముంచంగిపుట్టు: స్థానిక ఎస్ఐ జె.రామకృష్ణ ఉపాధి కూలీగా మారి గంటపాటు పనిచేశారు. సుజనకోట పంచాయతీ కొత్తసుజనకోట గ్రామ గిరిజనులు ఉపాధిహామీ పనులుచేస్తుండగా శని వారం ఉదయం పనిప్రదేశానికి వెళ్లిన ఎస్ఐ వారి సమస్యలు తెలుసుకుంటూ, పారతో మట్టిని తవ్వారు. మట్టిని తట్టలో వేసి మోసుకుంటూ గంట పాటు ఉపాధి పనిచేశారు. ఉపాధి కూలీలతో కలిసి కాసేపు ముచ్చటించారు.పోలీసుశాఖ ద్వా రా చేస్తున్న సేవలు వారికి వివరించి,గంజాయి జోలికి పోకుండా మంచి జీవితం గడపాలని కూలీలకు సూచించారు. ఎస్ఐ వారితో కలిసి పని చేయడంతో కొత్తసుజనకోట గ్రామ గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. -
గిరిజనుల భవిష్యత్తుతో ఆటలొద్దు
సాక్షి,పాడేరు/పాడేరు రూరల్: గిరిజనులకు నూరుశాతం ఉద్యోగాలు కల్పించే జీవో నంబర్ 3 పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ జీవో సాధన,ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ డిమాండ్తో ఆదివాసీ ప్రజా సంఘాలు రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. పలు ఆదివాసీ ప్రజాసంఘాలు శనివారం జిల్లా కేంద్రం పాడేరులోని కాఫీ అతిథి గృహంలో సమావేశమయ్యాయి.స్పెషల్ డీఎస్సీ సాధన డిమాండ్తో రాష్ట్ర వ్యాప్త చర్చా వేదికను నిర్వహించాయి. ప్రతి సంఘం నుంచి ఆదివాసీ నాయకులు గిరిజన సమాజం అభివృద్ధి అజెండాగా మాట్లాడారు. గిరిజనుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం ఆటలాడుకుంటోందని ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా ఓ గిరిజన బిడ్డగా అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి కూడా ఈచర్చవేదికకు హాజరై ఆదివాసీల పక్షాన తన గళం వినిపించారు. జీవో నంబర్ 3 పునరుద్ధరణకు పార్లమెంట్లో పోరాడుతున్నానని, గిరిజనులకు నూరుశాతం ఉద్యోగాల కల్పన,ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ సాధన పోరాటానికి తాను అన్ని విధాల సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని ఎంపీ ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు జీవో నంబర్ 3 పునరుద్ధరణ,లేని పక్షంలో ప్రత్యామ్నాయ జీవో తెచ్చే బాధ్యత సీఎం చంద్రబాబుదేనని, నూరుశాతం ఉద్యోగ,ఉపాధ్యాయ పోస్టుల భర్తీని వెంటనే అమలుజేయాలని ఈ చర్చా వేదికలో ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. సమష్టిగా పోరాడి హక్కులు సాధించుకోవాలని తెలిపారు. మెగా డీఎస్సీని రద్దు చేసి ఆదివాసీలకు ప్రత్యేక డీఎస్సీని ప్రకటించాలని కోరారు. వచ్చేనెల 2 నుంచి నిరవధిక బంద్ జీవో నంబర్ 3 పునరుద్ధరణ,ఆదివాసీల స్పెషల్ డీఎస్సీ సాధన డిమాండ్తో ఆదివాసీ ప్రజా సంఘాలు దశలవారీ ఆందోళనకు కార్యాచరణ రూపొందించాయి. ఈనెల 28న మండల కేంద్రాల్లో అన్ని సంఘాలతో సమావేశాలు, 29న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పత్రాలు దహనం, 30న రాష్ట్ర గిరిజన మంత్రి, గవర్నర్లకు వినతిపత్రాలు అందజేత కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాయి. మే 2వతేదీ నుంచి నిరవధిక మన్యం బంద్కు పిలుపునిచ్చాయి. జీవో నంబర్ 3కి ప్రత్యామ్నాయ జీవో బాధ్యత సీఎం చంద్రబాబుదే ఆదివాసీ స్పెషల్ డీఎస్సీని వెంటనే ప్రకటించాలి ఆదివాసీ ప్రజాసంఘాల డిమాండ్ 28 నుంచి దశలవారీగా ఉద్యమం మే 2 నుంచి నిరవధిక మన్యం బంద్కు కార్యాచరణ ఉద్యమానికి అరకు ఎంపీ తనూజరాణి మద్దతు -
తస్మాత్ జాగ్రత్త !
ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ 15 వరకు నమోదైన మలేరియా కేసులు పీహెచ్సీల వారీగా.. చింతూరు మండలం తులసిపాక 38, మోతుగూడెం 44,ఏడుగురాళ్లపల్లి 13ఎటపాక మండలం లక్ష్మీపురం 2, నెల్లిపాక 1, గౌరిదేవిపేట 3 కూనవరం మండలం కూటూరు 31, కూనవరం 13 వీఆర్పురం మండలం రేఖపల్లి 14, జీడుగుప్ప 11 ఎటపాక: గ్రామాల్లో వ్యాధుల ముప్పు పొంచి ఉంది. పారిశుధ్య లోపం, వర్షాలు కురుస్తుండడంతో దోమలు, చిన్నచిన్న క్రిములు పెరిగి స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో విషజ్వరాలు విజృంభించే అవకాశం ఉంది. వ్యాధుల కట్టడికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. కలుషిత నీరు వల్ల కలరా, టైఫాయిడ్ తదితర వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు వందలాదిమంది మలేరియా, వేలాది మంది విషజ్వరాల బారిన పడ్డారు. అయినా నియంత్రణ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. గ్రామాల్లో దోమల మందు పిచికారీ కూడా నామ మాత్రంగానే ఉంది. దోమతెరలను ఇప్పటికీ పంపిణీ చేయలేదు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడకుంటే రానున్న వర్షాకాలంలో వ్యాధుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యధికారులు సూచిస్తున్నారు. మూడు పీహెచ్సీల పరిధిలో అధిక మలేరియా కేసులు : చింతూరు ఐటీడీఏ పరిధిలో గల పది ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, రెండు సామాజిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 391 గ్రామాలు ఉన్నాయి. ఈ 12 ఆస్పత్రుల పరిధిలో 1,45,516 మంది వైద్య సేవలు పొందుతున్నారు. ఈ ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 35 వలస ఆదివాసీ గ్రామాలు ఉండగా, వీటిలో రహదారి, విద్యుత్, తాగునీటి సౌకర్యం లేని గ్రామాలే అధికం. వైద్యశాఖలో పెద్ద ఎత్తున యంత్రాంగం ఉన్నప్పటికీ ప్రతి ఏటా వర్షాకాలం మొదలుకొని శీతాకాలం వెళ్లేంత వరకూ సీజనల్ వ్యాధులు ఏజెన్సీని అతలాకుతలం చేస్తూనే ఉంటాయి. మలేరియా కేసుల నమోదులో చింతూరు మండలం తులసిపాక పీహెచ్సీ రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలుస్తోంది. ఏజెన్సీ ప్రాంతంలో మలేరియా కేసులు ఎక్కువగా తులసిపాక, ఏడుగురాళ్లపల్లి, మోతుగూడెం పీహెచ్సీల పరిధిలో నమోదవుతున్నాయి. గత ఏడాది జూన్ నుంచి ఈఏడాది ఏప్రిల్ 15 వరకు చింతూరు ఐటీడీఏ పరిధిలోని చింతూరు,ఎటపాక,వీఆర్ పురం,కూనవరం మండలాల్లో 503 మలేరియా కేసులు నమోదైనట్టు డిప్యూటీ డీఎంహెచ్వో పుల్లయ్య తెలిపారు. వేసవి,వర్షాకాలంలో వలస ఆదివాసీ గ్రామాల్లో విషజ్వరాలు విజృంభిస్తాయి. వేల సంఖ్యలో ఈ జ్వరాల బారిన పడుతుంటారు.సకాలంలో వైద్యం అందకపోవడంతో మృత్యువాత పడిన సంఘటనలు అనేకం. చింతూరు డివిజన్లో సుమారు 35 వలస ఆదివాసీ గ్రామాలున్నాయి. పలుగ్రామాల ప్రజలు వాగులు, వంకల్లోని చెలమనీటినే తాగుతున్నారు. ఆ నీరు కలుషితం కావడంతో విషజ్వరాలు,డయేరియా వంటి వ్యాధులకు గురవుతున్నారు. వీఆర్పురం,ఎటపాక, చింతూరు మండలాల్లోని పలు ఆది వాసీ గ్రామాల్లో ఈ దుస్థితి నెలకొంది. వ్యాధులు వస్తే సకాలంలో ప్రభుత్వఆస్పత్రులకు వచ్చి వైద్యం చేయించుకునేందుకు సరైన రహదారి సౌకర్యం కూడా లేకపోవడం గిరిజనులకు శాపంగా మారింది. 192 గ్రామాల్లో మలేరియా : చింతూరు ఐటీడీఏ పరిధిలోని 56,973 మంది జనాభా ఉన్న 192 గ్రామాలను మలేరియా తీవ్రంగా ప్రబలే గ్రామాలుగా గుర్తించారు. ఈ గ్రామాల్లో మొదటి విడతలో దోమల మందు పిచికారీ ప్రారంభించినట్టు డిప్యూటీ డీఎంహెచ్వో తెలిపారు. అదేవిధంగా ఈ గ్రామాల్లో 78,000 దోమతెరలు పంపిణీకి అవసరమని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ప్రభుత్వం స్పందించి వైద్యారోగ్యశాఖను అప్రమత్తం చేసి విషజ్వరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టకపోతే ప్రమాదం పొంచి ఉన్నట్లే.పొంచి ఉన్న వ్యాధుల ముప్పుదోమకాటుతో విషజ్వరాలుచింతూరు ఐటీడీఏ పరిధిలో 503 మలేరియా కేసులువ్యాధులకు కలుషిత నీరూ ఓ కారణం వ్యాధుల నియంత్రణకు చర్యలు చింతూరు డివిజన్లో మలేరియా, విషజ్వరాలు ఎక్కువగా ప్రబలుతాయి. వాటి నియంత్రణ కు ముందస్తు చర్యలు చేపడుతున్నాం. అన్ని ఆస్పత్రుల పరిధిలోని సిబ్బందిని అప్రమత్తంచేసి, గుర్తించిన గ్రామాల్లో ప్రణాళిక ప్రకారం దోమల నివారణ మందు పిచికారీ చేయిస్తున్నాం. దోమతెరల పంపిణీకి ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. – డాక్టర్ పి.పుల్లయ్య, డిప్యూటి డీఎంహెచ్వో -
గంజాయి కేసులో పాత నేరస్తుడు అరెస్ట్
గొలుగొండ: ఏటిగైరంపేట గ్రామంలో 2021లో గంజాయి తరలిస్తున్న సమయంలో బైక్ వదిలేసి పారిపోయిన నిందితుడిని గొలుగొండ ఎస్ఐ రామారావు ఆధ్వర్యంలో శుక్రవారం అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. ఎస్ఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 2021లో ఏటిగైరంపేట గ్రామంలో 36 కేజీల గంజాయి బైక్పై తరలిస్తుండగా.. అల్లూరి జిల్లా వాడలపాలెం గ్రామానికి చెందిన వంతల సుందర్రావు అప్పట్లో తప్పించుకుని పారిపోయాడు. వదిలేసిన బైక్ ఆధారంగా ఒడిశా రాష్ట్రం సరిహద్దుల్లో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని, రిమాండ్కు తరలించామని ఎస్ఐ తెలిపారు. నిందితుడిని పట్టుకున్న ఎస్ఐ, సిబ్బందిని సీఐ రేవతమ్మ, డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు. గంజాయి తరలిస్తున్న ఉత్తరప్రదేశ్ వాసి అరెస్ట్ -
వెల్లివిరిసిన ఆధ్యాత్మికత
సాక్షి, పాడేరు: పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలో రెండు రోజుల క్రితం ప్రాణప్రతిష్ట జరిగిన లక్ష్మిదేవికి తొలి శుక్రవారంతో ఉదయం అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. సాయంత్రం లక్ష్మిదేవిని మహిళలంతా దర్శించుకుని కుంకుమార్చన పూజలు చేశారు. భజన కార్యక్రమాలతో ఆధ్మాత్మిక వాతావరణం నెలకొంది. నేడు ఆలయ వార్షికోత్సవం పట్టణంలోని ఉమానీలకంఠేశ్వరస్వామి సమేత రాజరాజేశ్వరిదేవి ఆలయ తొలి వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహచలంనాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు జరుగుతాయన్నారు. శనిత్రయోదశి పురస్కరించుకుని నవగ్రహాలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తామన్నారు. వైభవ వెంకటేశ్వరస్వామి విగ్రహం వద్ద పూజలు జరుగుతాయన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొవాలని కోరారు. సీలేరు: సీలేరులో మారెమ్మ ఆలయ వార్షికోత్సవాల నేపథ్యంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరానికి చెందిన ఎం.కె.టి.ఎన్.వీ ప్రసాద్ , మిత్ర బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో సహస్రదీపాలంకరణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయకమిటీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఘనంగా అమ్మవారి గరగల ఊరేగింపు చింతపల్లి: చింతపల్లిలో ముత్యాలమ్మ తల్లి ఉత్సవం ఘనంగా జరుగుతోంది. వేడుకలో భాగంగా రెండోరోజు సుర్లవంశీయుల ఇంటి వద్ద కొలువుతీరిన అమ్మవారి గరగలు, పాదుకలు, ఘటాలకు శుక్రవారం సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భాజభజంత్రీలు, డప్పుల చప్పుళ్ల మధ్య అమ్మవారి గరగలను ఊరేగింపుగా ఽఽఽశతకంపట్టు వద్దకు తీసుకువచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం ఎంపీపీ కోరాబు అనూషాదేవి, ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు దురియా హేమంత్కుమార్, పసుపులేటి వినాయకరావు, సభ్యులు బేతాళుడులు గరగలను ఽశతకం పట్టువద్దకు తీసుకువచ్చారు. సుర్లవంశీయులు సుర్ల అప్పారావు. తిరుపతి పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో కుంకుమపూజలు అమ్మవార్ల దర్శనానికి పోటెత్తిన భక్తులు -
డ్రోన్లను తిప్పికొట్టేందుకు వ్యూహాత్మక అడుగులు
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో ఈఎన్సీ ఎయిర్ బేస్ ఐఎన్ఎస్ డేగాలో యుద్ధ విమానాల పైలట్లకు శిక్షణ తీవ్రతరం చేశారు. వాస్తవంగా ఏడాది పొడవునా ఇక్కడ పైలట్ల శిక్షణ కొనసాగుతుంటుంది. కానీ ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో దీన్ని మరింత చురుగ్గా కొనసాగించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని దాడులకు తెగబడుతున్న శత్రుదేశాల కుయుక్తుల్ని తిప్పికొట్టేందుకు భారత నౌకాదళం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన నేవల్ ఎయిర్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్ (ఎన్ఏఐఎస్ఎస్)ను సిద్ధం చేశారు. ఎయిర్ స్టేషన్లో స్మార్ట్ ఫెన్స్ను అమర్చి.. సీసీకెమెరాల సాయంతో పహారా కాస్తున్నారు. స్మార్ట్ ఫెన్స్లోపలికి ఏ ఎయిర్క్రాఫ్ట్, హెలికాఫ్టర్, మనిషి వచ్చినా.. వెంటనే కంట్రోల్ రూమ్కు అప్రమత్తం చేయడంతో పాటు సెకెన్ల వ్యవధిలో మొత్తం వ్యవస్థకు సమాచారం అందజేస్తుంది. ఎయిర్స్టేషన్ చుట్టూ ఇన్ఫ్రారెడ్ డివైజ్లు, మోషన్ డిటెక్టర్స్, ఏ చిన్న రంధ్రం చేసి లోపలికి ఎవరు ప్రవేశించాలని భావించినా వారిని మట్టుపెట్టేలా యాంటీ పెనిట్రేషన్, థర్మల్ సెన్సార్లతో పాటు డ్రోన్ల పర్యవేక్షణతో పహారా ముమ్మరం చేసినట్లు సమాచారం. ఎయిర్ స్టేషన్కు దాదాపు 2 కిలోమీటర్ల వరకూ ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్ వ్యాపింపజేసి.. శత్రువుల చొరబాట్లను సులువుగా పసిగట్టనున్నారు. అదేవిధంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన నేవల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ (ఎన్ఏడీఎస్)ని కూడా డేగాలో అప్రమత్తం చేశారు. భారీ డ్రోన్ల నుంచి తూనీగల పరిమాణంలో ఉన్న మైక్రో డ్రోన్ల వరకూ లేజర్ ఆథారిత కిల్ మెకానిజం సహాయంతో గుర్తించి.. వాటిని మట్టుపెట్టేలా రూపొందించిన ఈ వ్యవస్థ సాయంతో 360 డిగ్రీల కోణంలో.. 10 కిలోమీటర్ల పరిధిలో ఏ రకమైన డ్రోన్ ఉన్నా.. పసిగట్టి నాశనం చేయగలదు. -
రీ సర్వే వివరాలను వెంటనే అప్లోడ్ చేయండి
రంపచోడవరం: ఏజెన్సీ ఏడు మండలాల్లో భూహక్కు, భూ చట్టం ద్వారా రీ సర్వేకు సంబంధించిన వివరాలను వెంటనే అప్లోడ్ చేయాలని రంపచోడవరం సబ్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ సమావేశపు హాలులో శుక్రవారం తహసీల్దార్లు, సర్వేయర్లతో రీ సర్వే ప్రక్రియపై వర్క్ షాప్ నిర్వహించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ సర్వే చేసిన భూముల వివరాలను వీఆర్వోల లాగిన్ నుంచి తహసీల్దార్ లాగిన్కు అప్లోడ్ చేయాలని తెలిపారు. రీ సర్వేలో ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఒక ఇంట్లో యజమానుల పేర్లతో ఉన్న భూములు వారసులకు మ్యుటేషన్ చేయాలని తెలిపారు. ఆర్డీడీ కేజీయా కుమారి మాట్లాడుతూ ఏజెన్సీలో 133 గ్రామాల్లో రీ సర్వే చేసినట్టు చెప్పారు. ఇంకా 268 గ్రామాల్లో చేయాల్సి ఉందన్నారు. 133 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసిన వాటికి గెజిట్ నోటిఫికేషన్ కోసం ఈ వర్క్షాప్ నిర్వహించినట్టు తెలిపారు -
మాచ్ఖండ్ ప్రాజెక్టుకు చెందిన గృహం స్వాధీనం
ముంచంగిపుట్టు: ఆంధ్ర ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో పని చేస్తున్న అధికారుల కోసం నిర్మించిన నివాస గృహం ఆక్రమణకు గురైంది.ప్రాజెక్టులో గతంలో పనిచేసిన ఆనందో నందో కుమారుడు అనిల్కుమార్ నందో ప్రాజెక్టు నివాస గృహాన్ని ఆక్రమించి,ఆధునిక హంగులతో పనులు చేయిస్తున్నాడు.ప్రాజెక్టు అధికారులు పలుమార్లు ఇంటిని ఖాళీ చేయమని,పనులు ఆపాలని చెప్పినా వినిపించుకోలేదు.దీంతో అధికారులు పోలీసులకు తెలియజేశారు.పోలీసులు సైతం చెప్పినా పనులు చేస్తూ ఉన్నాడు. దీంతో ప్రాజెక్టు అధికారులు ప్రాజెక్టు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.ఉన్నత అధికారులు కొరాపుట్ సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాల మేరకు అదనపు తహసీల్దార్ ఉదవ్ సబర్,ప్రాజెక్టు ఎస్ఈ సుబ్రహ్మణ్యేశ్వరరావులు రెవెన్యూ అధికారులు గురువారం రాత్రి తాళాలు పగలగొట్టి గృహాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
ఉగ్రదాడుల్లో మృతులకు నివాళి
రంపచోడవరం/మోతుగూడెం/వై.రామవరం/గంగవరం/కూనవరం: జమ్మూకాశ్మీర్ రాష్ట్రం పహల్గాంలో ఉగ్రవాదుల దాడుల్లో మృతులకు ఘన నివాళులర్పించారు. రంపచోడవరం, మోతుగూడెం, వై.రామవరం, గంగవరం, కూనవరం ప్రాంతాల్లో శుక్రవారం కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు మాట్లాడుతూ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదాన్ని అంత మొందించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వెంకట్, కిరణ్, వాణిశ్రీ,, నిర్మల, రాణి, ప్రేమ్స్వరూప్, రామచంద్రనాయుడు, రామ్ప్రసాద్, వల్లీఖాన్ నూకరాజు, కనకరాజు, సుబ్బలక్ష్మి, శారదదేవి, సోమాలమ్మ, నాగమణి, సిద్దు, రమణ,నాగూర్, మణి, సాయి, విఠల్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడల్లో గెలుపోటములు సహజం
● ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అనంతగిరి(అరకులోయటౌన్): క్రీడల్లో గెలుపోటములు సహజమని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. అనంతగిరి మండలం ఎగువశోభ పంచాయతీ దిగువశోభ గ్రామంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని చెప్పారు. అనంతరం ఎగువశోభ సచివాలయాన్ని సందర్శించి, రికార్డులు పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ దిసరి గంగరాజు, సర్పంచ్లు కొర్రా సింహాద్రి, మొష్యా, వార్డు సభ్యులు లక్ష్మణ్, ప్రసాద్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
‘వికసిత అల్లూరి జిల్లా’ లక్ష్యంతో పనిచేయాలి
సాక్షి, పాడేరు: వికసిత అల్లూరి సీతారామరాజు జిల్లా లక్ష్యంతో అధికారులు పనిచేయాలని 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం పాడేరు చేరుకుని కలెక్టరేట్లో పలుశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి, జేసీఅభిషే క్గౌడ సమక్షంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కాంపోనెంట్ నిధులు, జల్జీవన్ మిషన్, గ్రామీణ సడక్ యోజన, లాక్పతి దీదీ, గరీబ్ కల్యాణ్ యోజన, పీఎం సూర్యఘర్, పీఎం ఆవాస్ యోజన, పీఎం విశ్వకర్మ యోజన, పీఎం జన్మన్, పీఎం స్వనిధి తదితర కేంద్ర ప్రాయోజిత పథకాలను సమర్థంగా అమలుజేయాలన్నారు. ఉపాధిహామీ వేతనం సగటున రూ.263 ఉందని, రూ.300కు పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. 105 అమృత సరోవర్ పనులు సకాలంలో జరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ సడక్ యోజనలో రూ.180.86 కోట్ల అంచనా వ్యయంతో జిల్లాలో చేపడుతున్న పనులు త్వరితగతిన పూర్తిచేయాలని తెలిపారు. పీఎం ఆవాస్ యోజ నలో 17,111 గృహాలు, పీఎం జన్మన్లో 34,236 గృహాల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. స్వదేశి దర్శన్లో బొర్రాగుహలలో మౌలిక సదు పాయాల కల్పన, అభివృద్ధి పనులకు రూ.29.30 కోట్లు మంజూరయ్యాయని, అరకు–లంబసింగి టూరి జం అభివృద్ధికి రూ.50 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి మాట్లాడుతూ పెదబయలు మండలంలోని తారాబు జలపాతం అభివృద్ధికి రూ.4 కోట్ల ఎంపీలాడ్ నిధులు మంజూరైనట్టు తెలిపారు. ఈ సమావేశంలో అన్ని ప్రభుత్వశాఖల అధికారులు పాల్గొన్నారు. బొర్రా గుహల అభివృద్ధికి రూ.29.30 కోట్లు మంజూరు అరకు–లంబసింగి టూరిజం అభివృద్ధికి రూ.50 కోట్లతో ప్రతిపాదనలు 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ -
పీజీఆర్ఎస్కు 104 అర్జీలు
పాడేరు : ప్రజల సమస్యలను గడువులోగా పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ ఆదేశించారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో శుక్రవారం ప్రజాసమస్యల పరిష్కార వేది క కార్యక్రమం నిర్వహించారు. డీఆర్వో పద్మలతతో కలిసి సబ్ కలెక్టర్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 104 అర్జీలు స్వీకరించా రు. రహదారుల నిర్మాణ, తాగునీటి సమస్య, పింఛన్లు, అటవీ హక్కుల పత్రాలు మంజూరు చేయాలని, ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ అధిక వినతులు వచ్చాయి.డీఎంహెచ్వో డాక్టర్ జమల్బాషా, టీడబ్ల్యూ ఇన్చార్జి డీడీ కమల, డీఈవో బ్రహ్మాజీరావు, డీఎస్డీవో జగన్మోహన్రావు, జిల్లా రవాణా అధికారి లీలాప్రసాద్, కార్మిక శాఖ అధికారి సుజాత, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి రోహిణి పాల్గొన్నారు. -
మలేరియా రహితసమాజం కోసం కృషి
● ఐటీడీఏ పీవో అపూర్వభరత్ చింతూరు: మలేరియా రహిత సమాజం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో చింతూరులో శుక్రవారం నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ చింతూరు డివిజన్లో గత ఏడాది 382 మలేరియా కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 170 కేసులు నమోదైనట్టు తెలిపారు. ప్రజలు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు దో మతెరలు వినియోగించాలని, మురుగునీరు నిలువ లేకుండా చూడాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ పుల్లయ్య, ఎంపీడీవో రామకృష్ణ, డాక్టర్ నిఖిల్ పాల్గొన్నారు. -
ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్షలు
పాడేరు : గురుకుల విద్యాలయాల్లో ప్రవేశం కల్పించేందుకు జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో శుక్రవారం నిర్వహించిన ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. స్థానిక గిరిజన గురుకుల బాలికల పాఠశాల, శ్రీకృష్ణాపురం గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల, తలార్సింగి సీఏహెచ్ బాలుర పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 5,6,7,8 తరగతులకు సంబంధించి, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. 5,6,7,8 తరగతులకు సంబంధించి 312 మంది విద్యార్థులకు గాను 176 మంది హాజరు కాగా, 136 మంది గైర్హాజరయ్యారు. ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ ప్రవేశ పరీక్షకు 843 మందికి గాను 591 మంది హాజరు కాగా, 252 మంది హాజరు కాలేదు. ఈ పరీక్ష కేంద్రాలను డీఆర్వో పద్మలత, జిల్లా విద్యాశాఖా ధికారి బ్రహ్మాజీరావు, పరీక్షల అసిస్టెంట కమిషనర్ ఆర్. శశికుమార్ తనిఖీ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
రెండు కుటుంబాల్లో తీరని విషాదం
పెదబయలు/జి.మాడుగుల: పిల్లల సరదా రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. పుట్టిన రోజును సరదాగా స్నేహితులతో గడుపుదామని వెళ్లి, పిట్టలబొర్ర (తారాబు)జలపాతంలో ఈతకొడుతూ గల్లంతైన కిశోర్(22), గుర్రాయి గెడ్డలో ఈత కొడుతూ గల్లంతైన ఉల్లి మహి ప్రసాద్ వర్మ(14) అనే బాలుడు మరణించారు. తీవ్రంగా గాలించి వారి మృతదేహాలను పోలీసులు శుక్రవారం బయటకు తీశారు. తమ కలలు నెరవేరుస్తారనుకున్న పిల్లలు కళ్లెదుటే విగతజీవులుగా పడి ఉండడం చూసి భరించలేని తల్లిదండ్రులు, బంధువులు భోరున విలపించారు. వారి రోదనలు స్థానికులను కలచివేశాయి. విశాఖ జిల్లా పెందుర్తిలో గల వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఏలూరు జిల్లా భీమడోలు గ్రామానికి చెందిన గొన్నురు కిశోర్ తన స్నేహితులతో కలిసి ఈతకొట్టడానికి గురువారం తారాబు జలపాతంలో దిగి గల్లంతైన విషయం తెలిసిందే. శుక్రవారం ఐదుగంటల పాటు గాలించి, మృతదేహాన్ని వెలికి తీశారు. ముంచంగిపుట్టు ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించినట్టు స్థానిక ఎస్ఐ కె.రమణ తెలిపారు. తమకు ఒక్కడే కుమారుడని, గారాబంగా పెంచి, చదివిస్తున్నామని పుట్టిన రోజు నాడు ఇలా విగతజీవిగా మారుతాడనుకోలేదని తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. గాలింపు చర్యల్లో పెదబయలు ఆర్ఐ పూర్ణయ్య, జామిగుడ సర్పంచ్ తెరవాడ అన్నమ్మ, వైఎస్సార్ సీపీ నాయకులు తెరవాడ వెంకటరావు, వీఆర్ఏ కోటిబాబు తదితరులు పాల్గొన్నారు.● జి.మాడుగుల మండలంలో సింగర్భ పంచాయతీ చెరువువీధి గ్రామానికి చెందిన ఉల్లి మహి ప్రసాద్ వర్మ(14) ఐదుగురు స్నేహితులతో కలసి గురువారం గుర్రాయి గ్రామ సమీపంలో గల గెడ్డలో ఈతకొట్టడానికి వెళ్లి, ప్రవాహంలో గల్లంతైన విషయం తెలిసిందే. గెడ్డ ఊబిలో కూరుకుపోయి మరణించిన ప్రసాద్ వర్మ మృతదేహాన్ని శుక్రవారం బయటకుతీశారు. సంఘటన స్థలం వద్ద మృతదేహాన్ని స్థానిక సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ షణ్ముఖరావు పరిశీలించి పోస్టుమార్టానికి పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడు తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
కూటమి ప్రభుత్వం మోసం చేసింది
చంద్రబాబు రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించి, తీవ్ర అన్యాయం చేశారు. అన్నదాత సుఖీభవ హామీని అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం మోసం చేసింది. గత ఏడాది రైతులకు పెట్టుబడి సాయం అందజేయలేదు. ఈఏడాది కూడా పంపిణీ అనుమానంగానే ఉంది. గిరిజన రైతుల ఆర్థిక పరిస్థితిని గమనించి సాయం అందజేయాలి. – గబ్బాడ లక్ష్మయ్య,గిరిజన రైతు, కుజ్జెలి గ్రామం, పాడేరు మండలంసాక్షి.పాడేరు: జిల్లాలో ఎక్కువ మంది రైతులు పేదలే. రెక్కాడితే గాని డొక్కాడని వారికి వ్యవసాయమే ఆధారం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా ఉండేది. రైతుల సంక్షేమం లక్ష్యంగా అప్పటి సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పలు కార్యక్రమాలను అమలుచేశారు. 90 శాతం సబ్సిడీపై విత్తనాలతో పాటు ప్రతి ఏడాది రైతు భరోసా పథకంలో ఆర్థిక సాయం అందించడంతో ప్రతి గిరిజన రైతులు ఉత్సాహంగా వ్యవసాయం చేశారు. గత ప్రభు త్వం ఖరీఫ్ యాక్షన్ ప్లాన్కు ముందుగానే ఆమోదం తెలపడంతో గత ఖరీఫ్ సమయంలో వరి,ఇతర వాణిజ్య పంటల విత్తనాలు సమకూరాయి. రైతు భరోసా పథకంలో మూడు విడతలుగా ఏడాదికి రూ.13,500 చొప్పున 1,69,264 మంది రైతులు ఏటా రూ.104 కోట్లు ఆర్థిక సాయం పొందారు. ఉసూరుమంటున్న గిరిజన రైతులు జిల్లాలోని గిరిజన రైతులు వ్యవసాయానికి పెట్టుబడి సాయం లేక ఉసూరుమంటున్నారు. సూపర్ సిక్స్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20వేలు సాయం చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు గద్దెనెక్కిన తరువాత ఆ విషయం విస్మరించారు. గత ఖరీఫ్లో పీఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.2వేలు మాత్రమే దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సాయం చేయలేదు. దీంతో అప్పులు చేసి, పశువులను అమ్ముకుని వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఖరీఫ్ వ్యవసాయ పనులకు గిరిజన రైతులు శ్రీకారం చుట్టారు. వర్షాలు కురుస్తుండడంతో దుక్కిపనులతో పాటు మెట్ట పంటలకు విత్తనాలు జల్లుతున్నారు. అయితే ఇంతవరకు 90 శాతం సబ్సిడీపై విత్తనాలు పంపిణీని కూటమి ప్రభుత్వం ప్రారంభించలేదు.అన్నదాత సుఖీభవ ఆర్థిక సాయం కోసం కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఖరీఫ్లో ప్రతి గిరిజన రైతుకు పెట్టుబడికి కనీసం రూ.15వేలు అవసరం. ఆ సొమ్ములేక చాలా మంది రైతులు తమ పశువులను అమ్ముకుని వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్కు దుక్కిపనులు చేస్తున్న గిరిజన రైతుగత ఏడాదీ ఇబ్బందులు పడ్డా గత ఖరీఫ్ సీజన్లోను వ్యవసాయ పెట్టుబడికి ఇబ్బంది పడ్డాను.రైతు భరోసా ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిఏడాది రూ.13,500 సాయం అందించేది. వ్యవసాయ పెట్టుబడు లకు మంచి అదునులో ఈసొమ్ము ఉపయో గపడేది. పీఎం కిసాన్ యోజన రూ.2వేలు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి సాయం అందలేదు. – బంగురు వాసుదేవ, గిరిజన రైతు, గడి కించుమండ, హుకుంపేట మండలంపశువులను అమ్ముకుంటున్నారు పేద గిరిజన రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు.తిండి గింజలు,ఇతర వాణిజ్య పంటలు పండించుకుని జీవించే రైతులు వ్యవసాయ పెట్టుబడి అవసరాలకు పశువులను తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను కూడా రెండు దుక్కి పశువులను హుకుంపేట సంతలో అమ్ముకున్నాను. – రేంగ పండన్న, గిరిజన రైతు, బొడ్డాపుట్టు, హుకుంపేట మండలం ఆర్థిక ఇబ్బందుల్లో గిరి రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూపు గత ప్రభుత్వం హయాంలో 1,69,264 మందికి రైతు భరోసా ఏటా రూ.104 కోట్ల ఆర్థిక సాయం గత ఖరీఫ్ నుంచి కూటమి ప్రభుత్వ సాయం నిల్ ఈ ఏడాది కూడా సాయం ఊసేత్తని సర్కార్ -
సాయమేది బాబూ!
ఖరీఫ్కుపశువులను అమ్ముకుంటున్న గిరిజన రైతులుజిల్లాలో ఖరీఫ్ పంటల సాధారణ విస్తీర్ణం పంట హెక్టార్లు వరి 56,792 చోడి,ఇతర చిరుధాన్యాలు 23,642 పప్పుదినుసులు 1,948 నూనెగింజలు 1,740 పత్తి 3,467 పొగాకు 200 చెరకు 82 మొత్తం 87,871 -
గిరి రైతుల ఆర్గానిక్ఉత్పత్తులకు గిరాకీ
● ఐటీడీఏ ఇన్చార్జి పీవో, జేసీ అభిషేక్ గౌడ పాడేరు : గిరిజన రైతులు సాగు చేస్తున్న ఆర్గాని క్ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉందని ఐటీడీఏ ఇన్చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ తెలిపారు. ఐటీడీఏ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, పరిశ్రమల శాఖ అధికారులు, ఎంపీడీవోలతో గ్రామీణ పరిశ్రమల పార్క్ ఏర్పాటుపై గురువారం ఒకరోజు వర్క్షాప్ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జి.మాడుగుల మండలం సొలభంలో రూరల్ ఇండస్ట్రీయల్ పార్క్ఏర్పాటు చేసేందుకు యో చిస్తున్నట్టు చెప్పారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శౌర్యమన్పటేల్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి జి.రవిశంకర్, వెటర్నరీ ఏడీ నర్సింహు లు, ఎల్డీఎం మాతునాయుడు పాల్గొన్నారు. -
పీఎం జన్మన్నుసద్వినియోగం చేసుకోవాలి
● 20 సూత్రాల పథకం చైర్మన్ దినకర్ అరకులోయటౌన్: పీఎం జన్మన్ను సద్వినియోగం చేసుకోవాలని 20 సూత్రాల పథకం చైర్మన్ లంక దినకర్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం అనంతగిరి మండలంలోని పైనంపాడు, కాకరపాడు గ్రామాల్లో పర్యటించిన ఆయన సాయంత్రం అరకులోయ మండలంలోని శిమిలిగుడలో పర్యటించి, పీఎం జన్మన్ గృహాల లబ్ధిదారులతో ముఖాముఖి నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన గిరిజనుల స్థితిగతులు, సమస్యలను గుర్తించేందుకే పీవీటీజీ గ్రామాల్లో పర్యటిస్తున్నట్టు చెప్పారు. జన్మన్ గృహ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. పీఎం జన్మన్ పథకంలో తాగునీరు, రోడ్లు, విద్యుత్, వ్యక్తిగత మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. పీఎం విశ్వకర్మ పథకం ద్వారా 18 రకాల చేతివృత్తుల వారికి శిక్షణ ఇచ్చి, పనిముట్లు, రుణాలు అందిస్తున్నామన్నారు. క్షేత్ర స్థాయిలో గుర్తించిన అంశాలను శుక్రవారం పాడేరులో కలెక్టర్తో జరిగే సమావేశంలో చర్చించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ తేజ, అరకులోయ తహసీల్దార్ ఎం.వి.వి.ప్రసాద్, ఎంపీడీవో అడపా లవరాజు, ఎంపీటీసీ లక్ష్మి, హౌసింగ్ ఏఈ కాంతి, ఆర్ఐ బలరామ్, వీఆర్వో ఝాన్సీలక్ష్మి పాల్గొన్నారు. -
తొలి విడత చందనం అరగదీత ప్రారంభం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో తొలివిడత చందనం అరగదీత గురువారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఈ నెల 30న వైశాఖ శుద్ధ తదియనాడు జరిగే స్వామివారి చందనోత్సవం(నిజరూప దర్శనం) అనంతరం ఆ రోజు రాత్రి తొలివిడతగా సమర్పించాల్సిన మూడు మణుగుల(సుమారు 125 కిలోలు) పచ్చి చందనాన్ని సమకూర్చేందుకు ఏకాదశిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టారు. తొలుత ఆలయ బేడా మండపంలోని భాండాగారం వద్ద తొలి చందనం చెక్కను ఉంచి విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, షోడషోపచారపూజలు జరిపారు. అనంతరం ఆ చందనం చెక్కతో ఆలయ ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు మంగళవాయిద్యాలు, వేద మంత్రోశ్చరణల మధ్య బేడామండపంలో ప్రదక్షిణ చేశారు. అనంతరం నోటికి వస్త్రం చుట్టుకుని తొలిచందనాన్ని అరగదీశారు. అనంతరం ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, దేవస్థానం ఇన్చార్జి ఈవో కె.సుబ్బారావు, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు చందనాన్ని అరగదీశారు. అరగదీసిన చందనాన్ని స్వామివారి మూలవిరాట్కి సమర్పించారు. అనంతరం 20 మంది నాల్గవ తరగతి సిబ్బంది చందనం అరగదీతలో పాల్గొన్నారు. ఆలయ ఏఈవో ఆనంద్కుమార్, సూపరింటెండెంట్ త్రిమూర్తులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
ఇటుకల కోటలు
ఇటుకల పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిర్మాణ వ్యయం అంచనాలకు మించి పెరగడం, గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల బట్టీల యజమానులు సతమతమవుతున్నారు. ఇటుక బలంగా తయారు కావడానికి బంకమట్టి, వరిపొట్టు మిశ్రమం అవసరం. వీటి ధరలు విపరీతంగా పెరిగాయి. మరో పక్క కొనుగోలుదారులు లేక నిల్వలు భారీగా పేరుకుపోయాయి. తయారైన ఇటుకలు.. భారీ వర్షాల వల్ల పాడైపోవడంతో నష్టం ఏర్పడింది. దీంతో బట్టీలు మూతపడుతున్నాయి. కూలుతున్నముంచంగిపుట్టు: ఇటుకల వ్యాపారులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గత కొన్ని నెలలుగా అమ్మకాలు లేక నష్టాలను చవిచూస్తున్నారు.రోజు రోజుకు ఊక,కర్రలు వంటి ముడి సరకుల ధరలు పెరుగుతూ ఉండడంతో పాటు కూలీల వ్యయం అధికం కావడంతో బట్టీలు మూతపడుతున్నాయి. ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, హుకుంపేట మండలాలల్లో సుమారు 50 బట్టీలున్నాయి. వీటిలో అత్యధిక బట్టీల్లో రెండు నెలలుగా ఇటుకల తయారీ నిలిపివేశారు. సరిహద్దులో సుమారు 150 కుటుంబాలు ఇటుకల బట్టీల ద్వారా జీవనోపాధి పొందుతున్నాయి. ఒడిశా రాష్ట్రం జయపురం, కోరాపుట్, సిమిలిగూడ, మల్కన్గిరి,రాయపూరు వంటి పట్టణాల నుంచి ఇటుకల తయారీకి కోసం ప్రతి ఏడాది 150 కుటుంబాల వారు వస్తారు. డిసెంబర్ నుంచి మే వరకు ఆరు నెలల పాటు ఇటుకలను తయారు చేస్తూ ఉంటారు. ఒక్కో బట్టీలో వారానికి 50 వేల ఇటుకలు తయారవుతాయి. ఈ లెక్కన ఆరు నెలల్లో సుమారు 12 లక్షల ఇటుకలు తయారు చేస్తారు. ఒక్కో ఇటుక రూ.5.50 నుంచి రూ.6 చొప్పున విక్రయిస్తారు. గత ఏడాది వరకు విక్రయాలు బాగున్నాయి. సిమెంట్ ఇటుకల కారణంగా ఈ ఏడాది విక్రయాలు బాగా తగ్గిపోయాయి. సుమారు ఐదు లక్షల ఇటుకలు తయారీదారుల వద్ద ఉండిపోయాయి. సిమెంట్ ఇటుక ధర రూ.20 ఉన్నా... పని త్వరగా పూర్తవుతుండడంతో ఆ ఇటుకల వినియోగంపై ఎక్కువ మంది మొగ్గు చూపుతుండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 580 గ్రామాలకు సరఫరా సరిహద్దులోని 580 గ్రామాలకు చెందిన వారు ముంచంగిపుట్టు,పెదబయలు మండలాల నుంచే ఇటుకలను కొనుగోలు చేస్తారు. ఇక్కడ తయారైన ఇటుకలకు నాణ్యత,సైజ్ పరంగా మంచి గుర్తింపు ఉంది. అయితే గత మూడు నెలలుగా ఇటుకల అమ్మకాలు లేకపోవడంతో నిల్వలు అధికంగా పేరుకుపోయాయి. దీనికి తోడు గత రెండు నెలలుగా సరిహద్దులో ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడుతున్నాయి.తయారు చేసిన ఇటుకలు తడిసిపోయి పాడైపోతున్నాయి. దీంతో చాలా మంది ఇటుకల వ్యాపారులు నష్టాలను భరించలేక బట్టీలను తాత్కాలికంగా మూసివేశారు. పెరిగిన ముడిసరకుల ధరలు ఇటుకల తయారీకి ఉపయోగించే ముడిసరకుల ధరలు గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఊక ధర గత ఏడాది కిలో రూ.3 ఉంటే ప్రస్తుతం రూ.6 ఉంది.కట్టెలు ట్రాక్టర్ లోడు గత ఏడాది రూ.4వేలు ఉంటే ప్రస్తుతం రూ.6వేలకు చేరింది. బొందు ఇసుక వ్యాన్ లోడు గత ఏడాది రూ.6,500 ఉంటే ప్రస్తుతం రూ.10వేలు ఉంది. దీనికి తోడు రోజుకు వెయ్యి ఇటుకలు తయారీ చేస్తే రూ.1,300 కూలి చెల్లించాలి. వర్షం, ఇతర కారణాల వల్ల ఇటుకలు పాడైతే ఆ నష్టాన్ని బట్టీ నిర్వాహకుడే భరించాలి. రూ.4,500 ఖర్చు చేసి వెయ్యి ఇటుకలు అమ్మకానికి సిద్ధం చేస్తే మార్కెట్లో రూ.5వేలు నుంచి రూ.5,500 ధర మాత్రమే లభిస్తోంది. దుర్భర పరిస్థితుల్లో వలస కూలీలు ఈ ఏడాది మూడు నెలలకే ఇటుకల తయారీని బట్టీల నిర్వాహకులు నిలిపివేసి, కూలీలను తిరిగి ఇంటికి పంపించేశారు.దీంతో ఒడిశా రాష్ట్రం నుంచి ఆంధ్ర సరిహద్దు ప్రాంతానికి వచ్చిన వందలాది మంది ఇటుకల తయారీ వలస కూలీల పరిస్థితి దుర్భరంగా మారింది. గత 10 సంవత్సరాలుగా ఏటా సరిహద్దులో ఇటుకల తయారీకి వచ్చి ఆరు నెలల పాటు ఉపాధి పొందే కూలీలు నేడు అవస్థలు పడుతున్నారు. ఇటుకల తయారీ పనినే నమ్ముకుని జీవించే వారి పరిస్థితి దుర్భరంగా మారింది.రానున్న రోజుల్లో ఇటుకల తయారీ పనిని వదులుకుని మరేదైనా పని చేసుకుంటే తప్ప కుటుంబాలను పోషించుకోలేమని వలస కూలీలు వాపోతున్నారు.పనిలేకఇబ్బందులు పడుతున్న వలసకూలీలుమూతపడుతున్న బట్టీలునష్టాల్లో తయారీదారులు భారీగా పెరిగిన ముడిసరకుల ధరలుకొనుగోలు దారులు లేక పేరుకుపోతున్న నిల్వలు మండలం మొత్తం మూతపడినవి బట్టీలు ముంచంగిపుట్టు 20 06 పెదబయలు 14 06 జి.మాడుగుల 10 04 హుకుంపేట 07 06వర్షాలతో పాడైపోతున్న ఇటుకలు ఈ పనే మాకు ఆధారం ఇటుకలు తయారు చేసేందుకు ఒడిశాలోని జయపురం నుంచి వచ్చాను. గత ఏడాది ఆరు నెలల పాటు పని చేశాను. రూ.లక్ష వరకు ఇంటికి తీసుకు వెళ్లాను.ఈ ఏడాది మూడు నెలలు పని చేసి, రూ.20 వేలు కూడా సంపాదించలేకపోయాను.ఇటుకలకు డిమాండ్ లేక నిర్వాహకులు ఇంటికి వెళ్లి పోవాలని చెప్పారు. ఈ పని లేకపోతే కుటుంబ పోషణ చాలా కష్టంగా మారుతుంది. – హరిజన్, వలస కూలీ,జయపురం,ఒడిశా రాష్ట్రంరూ.3 లక్షల నష్టం వచ్చింది ఇటుకల బట్టీల నిర్వహణ చాలా కష్టంగా ఉంది.ప్రస్తుతం సిమెంట్ ఇటుకలకు డిమాండ్ ఉంది. కొనుగోలు దారులు లేక మట్టి ఇటుకల నిల్వలు పెరిగిపోయాయి. ఊక,కర్రలు తదితర ముడిసరుకుల ధరలు పెరిగిపోయాయి. వర్షాలకు ఇటుకలు పాడైపోయాయి. ఈ ఏడాది రూ.3లక్షల వరకు నష్టం వచ్చింది. – బొరగం శ్రీనివాసరావు, ఇటుకల బట్టీ నిర్వాహకుడు, పెద్దపుట్టు గ్రామం -
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు గల్లంతు
పెదబయలు/జి.మాడుగుల: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ఇద్దరు గల్లంతయ్యారు. పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయతీ పిట్టలబొర్ర జలపాతంలో బీటెక్ విద్యార్థి గొ న్నురు కిశోర్, జి.మాడుగుల మండలం గుర్రాయి గ్రామ సమీపంలో గల గుర్రాయిగెడ్డలో మహి వరప్రసాద్ అనే బాలుడు గల్లంతయ్యారు. వివరాలు...విశాఖ జిల్లా పెందుర్తిలో గల వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు గ్రామానికి చెందిన గొన్నురు కిశోర్ తన పుట్టిన రోజు వేడుకలను అరకులోయలో శుక్రవారం జరుపుకోవాలని భావించాడు. ఇందుకోసం తన ముగ్గురు స్నేహితులతో కలిసి బుధవారం రాత్రి పెందుర్తి నుంచి రెండు బైక్లపై బయలుదేరాడు. రాత్రి రెండు గంటలకు గొన్నురు కిశోర్, స్నేహితులు లోకవరపు చంద్రశేఖర్, పాడి శ్యామ్యూల్,కమ్మనైని సంతోష్ అరకువేలి చేరుకుని, బసచేశారు. గురువారం ఉదయం 7.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి పెదబయలు మీదుగా పిట్టలబొర్ర వెళ్లారు. నలుగురు జలపాతం వద్ద సెల్ఫోన్లలో సెల్ఫీలు తీసుకుని ఆనందంగా గడిపారు. అనంతరం ఈత కొట్టేందుకు జలపాతంలోకి దిగారు. కిశోర్(22) జలపాతంలోని సొరంగ ప్రాంతంలోకి వెళ్లి మునిగిపోయాడు. గమనించిన మిగిలిన ముగ్గురు స్నేహితులు వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చారు. ఆ ప్రాంతం లోతుగా ఉండడం వల్ల అందులోకి దిగేందుకు ఎవరూ సాహసించలేదు. ఇక్కడ లోతైన సొరంగం ఉందని చెప్పినా వారు వినిపించుకోలేదని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ కె.రమణ తెలిపారు. చీకటి పడడంతో శుక్రవారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టనున్నట్టు ఆయన చెప్పారు. కిశోర్ తల్లి,అక్క, బంధువులకు సమాచారం పంపినట్టు ఎస్ఐ తెలిపారు. కిశోర్ శుక్రవారం అరకులోయలో తన పుట్టిరోజు వేడుకలను జరుపుకోవల్సి ఉండగా...ఇంతలో ప్రమాదానికి గురయ్యాడు. గత ఏడాది మే 25తేదీన అరకులోయ మండలం మాడగడ పంచాయతీ దొరగుడ గ్రామానికి చెందిన సమరెడ్డి అరుణ్కుమార్(24) అనే యువకుడు ఈ జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుంటూ కాలుజారిపడి సుడిగుండలో మునిగి గల్లంతయ్యాడు. ఈత కోసం వెళ్లి... జి.మాడుగుల మండలం సింగర్భ పంచాయతీ చెరువువీధి గ్రామానికి చెందిన ఉల్లి మహి వరప్రసాద్(14) అనే బాలుడు, తన ఐదుగురు స్నేహితులు బొర్రమామిడి గ్రామానికి చెందిన పాంగిబాబు, తీగలమెట్ట గ్రామానికి చెందిన కొర్ర చలపతి, పాంగి వంశీ, పాంగి నాగేశ్వరరావు, గుప్పవీధికి చెందిన కొర్రా కిరణ్ సాయికుమార్తో కలసి గుర్రాయి గెడ్డలో ఈతకొట్టడానికి గురువారం సాయంత్రం ఓ ఆటో వెళ్లాడు. ఇద్దరు బయట ఉండగా, నలుగురు గెడ్డలో దిగి ఈతకొడుతూ పెద్ద పనుకుపై నుంచి జాలువారే నీటి ప్రవాహంలో జారుతూ సరదాగా గడిపారు. ఆ సమయంలో వరప్రసాద్ గెడ్డ ప్రవాహంలో కొట్టుకుపోయి అక్కడున్న ఊబిలో కూరుకుపోయాడు. వరప్రసాద్ కోసం గెడ్డలో చాలా సమయం గాలించినా కనిపించలేదని స్నేహితులు తెలిపారు. సమాచారం తెలిసిన తండ్రి సత్తిబాబు, కుటుంబ సభ్యులు గెడ్డ వద్దకు వెళ్లి గాలించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందాల్సి ఉంది. పుట్టిన రోజు వేడుకలు జరుపుకొనేందుకు వెళ్లి ప్రమాదానికి గురైన బీటెక్ విద్యార్థి ఈతకోసం వెళ్లి గెడ్డ ప్రవాహంలో కొట్టుకుపోయిన బాలుడు పెదబయలు, జి.మాడుగుల మండలాల్లో ఘటనలు -
పంచాయతీ రాజ్ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే గ్రామాల అభివృద్ధి
పాడేరు : గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని, పంచాయతీ రాజ్ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కలెక్టర్ ఎ.ఎస్. దినేష్కుమార్ అన్నారు. మండలంలోని డి.గొందూరులో సర్పంచ్ సీదరి రాంబాబు అధ్యక్షతన గురువారం పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. డి.గొందూరు వికసిత్ పంచాయతీ కింద ఎంపిక కావడం పంచాయతీ ప్రజల అదృష్టమన్నారు. వికసిత్ పంచాయతీలకు అన్ని రకాల మౌలిక వసతులు సమకూరుతాయని చెప్పారు. పంచాయతీ పరిధిలోని పాలమానుశంక గ్రామానికి సీసీ రోడ్డు నిర్మించాలని, మర్రిపాలెం, వాకపల్లి గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలని ఈ సందర్భంగా సర్పంచ్ సీదరి రాంబాబు కలెక్టర్ను కోరారు. అనంతరం జన్మన్ హౌసింగ్ లబ్ధిదారులకు నిర్మాణ మంజూరు పత్రాలు, యువతకు వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఈఈ బాబు, డీఎల్పీవో కుమార్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ దినేష్కుమార్ -
మోదకొండమ్మ తల్లి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
పాడేరు : గిరిజనుల ఇలవేల్పు, ఉత్తరాంధ్ర ప్రజల ఆర్యాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలను మే 11,12,13 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పాడేరు ఎమ్మెల్యే, ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీ చైర్మన్ మత్య్సరాస విశ్వేశ్వరరాజు స్పష్టం చేశారు. స్థానిక మోదకొండమ్మ తల్లి ఆలయంలో ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీప్రతినిధులు, గ్రామ పెద్దల సమక్షంలో ఉత్సవాల పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ గతంలో కన్నా ఎంతో భిన్నంగా అన్ని వర్గాల ప్రజలు, భక్తులను కలుపుకొని ఉత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తామన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షుడు కొట్టగుళ్లి సుబ్బారావు, చింతపల్లి ఎంపీపీ కోరాబు అనూషదేవి, జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య పడాల్, ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలం నాయుడు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబు నాయుడు, ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి కూడా సురేష్కుమార్, ఉత్సవ కమిటీ ప్రతినిధులు రామకృష్ణ, సుబ్రహ్మణ్యం, సూర్యనారాయణ, కేజీయారాణి, రత్నబాయ్, ప్రశాంత్, మాజీ మంత్రి మత్య్సరాస మణికుమారి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ వంజంగి కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.14 ఏళ్లుగా పరారీలో ఉన్న గంజాయి నిందితుడు అరెస్ట్ నాతవరం: కోర్టు వాయిదాలకు రాకుండా 14 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న గంజాయి నిందితుడిని ఎట్టకేలకు అరెస్ట్ చేశామని నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ తెలిపారు. గురువారం నాతవరం ఎస్ఐ సిహెచ్.భీమరాజుతో కలిసి ఆమె మాట్లాడారు. తమిళనాడు రాష్ట్రం మదురై జిల్లా మీనంబలంపురం గ్రామానికి చెందిన పంగలి దేవన్ గంజాయి రవాణా చేస్తుండగా నాతవరం పోలీసులకు 2011లో పట్టుబడ్డాడన్నారు. ఆయన నుంచి 450 కేజీలు గంజాయి స్వాధీనం చేసుకుని అప్పట్లో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన ఆయన అప్పటి నుంచి వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడన్నారు. నిందితుడి ఆచూకీ కోసం జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రత్యేక దృిష్టి సారించారన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్టాల సరిహద్దులో సంచరిస్తున్న నిందితుడిని కేడీ పేట ఏఎస్ఐ వై.వెంకటరావు, నాతవరం పోలీసు కానిస్టేబుల్ కె.లోవరాజు ఈ నెల 23న చాకచాక్యంగా పట్టుకున్నారన్నారు. గురువారం అరెస్ట్ చేసి కోర్డుకు తరలించామన్నారు. ఎళ్ల తరబడి తప్పించుకుని తిరుగుతున్న దేవన్ను పట్టుకున్న వెంకటరావు, లోవరాజులను ఎస్పీ తుహిన్ సిన్హా, నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించారని సీఐ తెలిపారు. -
ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం
డుంబ్రిగుడ/చింతపల్లి/ జీకే వీధి/రంపచోడవరం/గంగవరం : జిల్లాలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు మాట్లాడుతూ పంచాయతీల ప్రక్షాళనతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా పీవీటీజీలకు అందజేస్తున్న గృహల నిర్మాణాలకు మండలంలోని అధికారులతో పాటు పంచాయతీ కార్యదర్శిలు సహకారించాలన్నారు. పంచాయతీ రాజ్ చట్టం ద్వారానే గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, దాని ద్వారానే నేడు పల్లెలో వెలుగులు చూడగలుగుతున్నామన్నారు. అరకులో జరిగి కార్యక్రమంలో సర్పంచ్ గగ్గుడు శారద ఆధ్వర్యంలో గృహ లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. డుంబ్రిగుడలో జెడ్పీటీసీ చటారి జానకమ్మ, ఎంపీపీ బాకా ఈశ్వరి, ఎంపీడీవో ప్రేమ్సాగర్, వైఎస్ ఎంపీపీ శెట్టి ఆనంద్రావు తదితరులు పాల్గొన్నారు. చింతపల్లిలో ఎంపీపీ కోరాబు అనూషదేవి, జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు, వైస్ ఎంపీపీ శారద, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంఈవో ప్రసాద్, పిఆర్ జెఇ బాలకిషోర్, గూడెంకొత్తవీధిలో దామనాపల్లి సర్పంచ్ కుందరి రామకృష్ణ, ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, ఈవోపీఆర్డీ పాపారావు పాల్గొన్నారు. గంగవరంలోని ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, ఎంపీడీవో వై.లక్ష్మిణరావు , సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, పాల్గొన్నారు. రంపచోవరంలో సమీర్, చందు, రామకృష్ణ, సన్నీ, రవి, తేజ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. -
అందరికీ నచ్చేలా ‘సారంగపాణి జాతకం’
డాబాగార్డెన్స్: ‘సారంగపాణి జాతకం’లో తాను చేసిన పాత్ర, ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని హీరో ప్రియదర్శి తెలిపారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి, రూపా కొడువాయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆ చిత్ర యూనిట్ గురువారం నగరంలో సందడి చేసింది. ఈ సందర్భంగా జగదాంబ సమీపంలోని ఓ హోటల్లో నిర్వహించిన సమావేశంలో హీరో ప్రియదర్శి మాట్లాడారు. తాను నటించిన మల్లేశం, బలగం, కోర్ట్ సినిమా తరహా భావోద్వేగాలతో సాగే ఓ సాధారణ వ్యక్తి కథే సారంగపాణి జాతకం అన్నారు. ఇంద్రగంటితో ఒక ఫొటో దిగితే చాలనుకునే వాడినని.. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రం కోసం ఇంద్రగంటే ఎక్కువ కష్టపడ్డారన్నారు. ఈ సినిమాలో ఆంధ్ర యాసలో డైలాగ్లు చెప్పినట్లు వివరించారు. హీరోయిన్ మాట్లాడుతూ అందర్నీ ఈ సినిమా ఆకట్టుకుంటుందన్నారు. ఆద్యంతం హాస్యంతో పాటు ప్రతీ సన్నివేశం ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. దర్శకుడు ఇంద్రగంటి మాట్లాడుతూ విశాఖ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. అష్టాచమ్మా చిత్రం విశాఖలో షూటింగ్ చేసి.. నానీని హీరోగా పరిచయం చేిసినట్లు చెప్పారు. మంచి కథతో అందరూ ఇష్టపడే హాస్యంతో రూపొందించిన ఈ సినిమాను ఆదరించాలని ప్రేక్షకులను కోరారు. హీరో ప్రియదర్శి -
తోటలో తమిళనాడు వాసి మృతి
రోలుగుంట: తమిళనాడు రాష్ట్రం నుంచి కనగరాజ్ రమేష్(42) వడ్డిప నుంచి అర్ల వెళ్లే అడవి మార్గంలోని ఓ ఊప్లిస్ తోటలో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ రామకృష్ణ సంఘటన స్థలానికి గురువారం వెళ్లి పరిశీలించారు. ఎస్ఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మృతుడు మేనల్లుడు దయానిధి మండలంలో బొప్పన గ్లోబల్ అండ్ సివిల్ కన్స్ట్రక్షన్ కంపెనీలో డ్రైవర్గా పని చేస్తున్నాడు. దీంతో తనకు కూడా డ్రైవర్ జాబ్ చూడమని చెప్పి దయానిధి వద్దకు రమేష్ వచ్చాడు. ఆరోగ్యం సరిగా ఉండడం లేదని, వెనక్కి వెళ్లిపోవాలని చెప్పి మృతుడికి దయానిధి కొంత డబ్బు ఇచ్చాడని ఎస్ఐ తెలిపారు. ఆ డబ్బులతో కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలోనే పూటుగా మద్యం తాగుతూ తిరిగాడని, దీనికి తోడు సరైన ఆహారం అందకపోవడంతో తోటలో చనిపోయినట్టు భావిస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నామన్నారు. అనకాపల్లి నుంచి క్లూస్ టీంను రప్పించి సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. -
విద్యార్థులు లక్ష్యాలను సాధించాలి
పాడేరు : గిరిజన విద్యార్థులు తమ ప్రాథమిక విద్య దశ నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకొని వాటి సాధన కోసం నిరంతరం కృషి చేయాలని ఐటీడీఏ ఇన్చార్జి పీఓ, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ అన్నారు. పది ఫలితాల్లో సూపర్ ఫిప్టీ ద్వారా ప్రత్యేక శిక్షణ పొందిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచారని ఆయన ప్రశంసించారు. గురువారం ఐటీడీఏ సమావేశ మందిరంలో సూపర్ ఫిప్టీ ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్ధులతో విజయోత్సవ సభ నిర్వహించారు. సూపర్ ఫిప్టీ ద్వారా గిరిజన విద్యార్థుల ప్రగతికి గత ఐటీడీఏ పీవో అభిషేక్ బాటలు వేశారని, దాన్ని తాము కూడా కొనసాగిస్తామన్నారు. సూపర్ ఫిప్టీ విద్యార్థులకు ఐటీడీఏ అండగా ఉంటుందన్నారు. కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్లో ప్రవేశ పరీక్షలు రాసి సీట్లు సంపాదించుకోవాలన్నారు. బాలికలు తమ చదువులను పూర్తి చేసుకొని స్థిరపడేంత వరకు వివాహాలు చేసుకోవద్దని సూచించారు. సూపర్ పిప్టీ బ్యాచ్ విజయవంతం కావటానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, సూపర్ పిప్టీ ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్ధులు, వారి కుటుంబ సభ్యులను ఆయన శాలువలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ వెంకటేశ్వరరావు, రజనీ, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
జాతరలో ముమ్మర ఏర్పాట్లు
చింతపల్లి: చింతపల్లిలో ముత్యాలమ్మతల్లి జాతర సందర్భంగా ముమ్మర ఏర్పాట్లు చేశారు. గురువారం నుంచి అమ్మవారి వేడుకలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఈ సందర్బంగా స్థానిక ఆర్అండ్బీ కార్యాలయం ప్రాంగణంలో వైద్యశాఖ, ఐసిడిఎస్,గిరిజన సహకార సంస్థ,వ్యవసాయ,ఉద్యాన శాఖలు,పశుసంవర్ధక, ఉపాధి హామీ పథకం, వెలుగు, మరియు పంచాయితీ అద్వర్యంలో విద్యుత్ వ్యర్థాల సేకరణ స్టాల్స్ను ఆయా శాఖలు అధికారులు ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలో ముత్యాలమ్మ జాతర సందర్భంగా నీటి సమస్య తలెత్తకుండా పలుచోట్ల తాగునీటి ట్యాంకర్లను ఏర్పాటు చేస్తున్నారు. పారిశుధ్య సమస్య తలెత్తకుండా 50 మంది అదనపు కార్మికులను ఏర్పాటు చేసినట్టు ఎంపీడీవో శ్రీనివాసరావు తెలిపారు. వాహనాల దారి మళ్లింపు ముత్యాలమ్మతల్లి జాతర సందర్భంగా మండల కేంద్రానికి చేరుకునే వాహనాలను దారి మళ్లించే విధంగా పోలీసు చర్యలు చేపట్టారు. చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా ఆదేశాల మేరకు సీఐ వినోద్బాబు ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నారు. మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి తెల్లవారుజాము వరకు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. చింతపల్లికి నర్సీపట్నం నుంచి వచ్చే వాహనాలను స్థానిక ఏపీఆర్ కళాశాల నుంచి జీకే వీధి, కేడి పేట నుంచి వచ్చే వాహనాలను జిల్లా పరిషత్ అతిథి గృహం వద్ద, పాడేరు జెర్రెల నుంచి వచ్చే వాహనాలను డిగ్రీ కళాశాల నుంచి దారి మళ్లింపు చర్యలు చేపట్టారు. ఈ నాలుగు రోజుల పాటు చింతపల్లి ప్రాంతమంతా పోలీసు బృందాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు సీఐ వినోద్బాబు తెలిపారు.