Couple
-
మై విలేజ్ షో అనిల్ దంపతుల చండీ హోమం (ఫోటోలు)
-
64 ఏళ్ల ప్రేమ : ఇన్నాళ్లకు అంగరంగ వైభవంగా పెళ్లి
ప్రేమ, పెళ్లి అనేవి క్షణికమైన బంధాలుగా మారిపోతున్న వేళ పవిత్రమైన ప్రేమకు, వివాహ బంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందో జంట. 64 ఏళ్ల నుంచి కలగా మిగిలిపోయిన వేడుకను ఆనందంగా జరుపుకున్నారు. అదీ మనవరాళ్ల మధ్య. గుజరాత్కు చెందిన ఈ జంట వివాహ వేడుక నెట్టింట పలువుర్ని ఆకట్టు కుంటోంది. 80 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కిన అందమైన జంట లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం.1961 నాటి ప్రేమకథ1961 సంవత్సరం అది. అసలు ప్రేమ, అందులోనూ ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకోవడం లాంటి విషయాలను చాలా ఆశ్చర్యంగా చూసే సామాజిక కట్టుబాట్లు ఉన్న రోజులవి. కులాంతర వివాహాలన్న ఊసే లేదు. ఇవి ఆచరణాత్మకంగా నిషిద్ధం. ఆ రోజుల్లో హర్ష్, మృధు మధ్య ప్రేమ చిగురించింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న జైన యువకుడు హర్ష్, బ్రాహ్మణ యువతి మృదుతో ప్రేమలో పడ్డాడు. పాఠశాలలో చిగురించిన ప్రేమ, ప్రేమ లేఖలతో మరింత బలపడింది. View this post on Instagram A post shared by The Culture Gully™️ (@theculturegully) యథాప్రకారం వీరి ప్రేమ గురించి తెలిసి ఇరు కుటుంబాలు వ్యతిరేకించాయి. చర్చోపచర్చలు, తర్కాలు తరువాత కూడా తమ వాదన మీదే నిలబడ్డాయి ఇరుకుటుంబాలు. అటు కుటుంబం, ఇటు ప్రేమ వీటి రెండింటి మధ్యా ప్రేమనే ఎంచుకున్నారు. ఇద్దరూ సాహసమే చేశారు. ధైర్యంగా కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. కొత్త జీవితాన్ని వెదుక్కుంటూ ఇంటినుంచి పారిపోయారు.హర్ష్ -మృదు వివాహంకలిసిన ఈ రెండు హృదయాలకు..ఒకరికొకరే తోడు నీడు తప్ప మరెవ్వరూ అండగా నిలబడలేదు. పెళ్లి వేడుక లేదు, పెద్దల ఆశీర్వాదాలు అసలే లేవు. అయినా పూర్తి నిబద్ధత, పట్టుదలతో సాదాసీదాగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. సామాజిక సరిహద్దులను అధిగమించే ప్రేమ విలువను అర్థం చేసుకునేలా పిల్లలను పెంచారు. వారికి పెళ్లిళ్లు చేశారు. మనవరాళ్లతో కుటుంబం చాలా సంతోషంగా ఉంది. ఈ అద్భుతమైన కథను వింటూ పెరిగారు హర్ష్ మృదు పిల్లలు మనవరాళ్ళు. ఈ క్రమంలోనే ఇన్నేళ్లుగా వారి మదిలి మిగిలిపోయిన కోరిక గురించి తెలుసుకున్నారు. 64వ వార్షికోత్సవం సందర్భంగా, కనీవిని ఎరుగని విధంగా తామే దగ్గరుండి వారికి పెళ్లి జరిపించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుక అతిథులందరి చేత కంట తడిపెట్టించింది.సాధారణ 10 రూపాయల చీరలో భర్తచేత ఆనాడు తాళి కట్టించుకున్న మృదు ఇపుడు గుజరాతీ సాంప్రదాయంలో ఘర్చోలా చీర, గోరింటాకు, నగలతో అందంగా ముస్తాబైంది. ఆరు దశాబ్దాలకు పైగా తన భర్తగా ఉన్న వ్యక్తిని మరోసారి పెళ్లాడి భావోద్వేగానికి లోనైంది. పవిత్ర అగ్నిహోమం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు, తొలిసారి కలిసిన ఈ జంట చేతులు మరింత దృఢంగా పెనవేసుకున్నాయి. జీవితాంతం పంచుకున్న ఆనందాలు , కష్టాలు, కన్నీళ్లను చూసిన వారి కళ్ళలో ఆనంద బాష్పాలు నిండాయి.చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలునిజమైన ప్రేమ అంటే ప్రేమించడం మాత్రమే కాదు; జీవిత పయనంలో వచ్చే ప్రతీ సవాల్ను స్వీకరించడం, అంతే బలంగా దాన్నుంచి బయటపడటం. ఓరిమితో , ఒకరికొరు తోడు నీడగా సాగిపోవడం. ఏ సామాజిక కట్టుబాట్లను తాము తోసి రాజన్నారో, ఆ అవగాహనను, చైతన్యాన్ని తమబిడ్డల్లో కలిగించడం. ఇదే జీవిత సత్యం. వైవాహిక జీవితానికి పరిపూర్ణత అంటే ఇదే అని నిరూపించిన జంటను శతాయుష్షు అంటూ దీవించారు పెళ్లి కొచ్చిన అతిథులంతా.చదవండి: కొడుకుకోసం..చిరుతపైనే పంజా విసిరింది! -
ఒకే కాన్పులో ముగ్గురు జననం..! ఇలా ఎందుకు జరుగుతుందంటే..?
హైదరాబాద్కు చెందిన పద్మావతి(24)కి ఐదేళ్ల కిత్రం వివాహం జరిగింది. నాటి నుంచి పిల్లలు లేక అనేక ఆసుపత్రులకు తిరిగి ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో గుంటూరు సిటిజన్ హాస్పిటల్కు చికిత్స కోసం వచ్చారు. గైనకాలజిస్ట్ డాక్టర్ భాగ్యలక్ష్మి వైద్య పరీక్షలు చేసి సంతాన చికిత్స అందించారు. గర్భం దాల్చి ఆదివారం ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. ఇది చాలా అరుదుగా జరుగుతుందని డాక్టర్ భాగ్యలక్ష్మి తెలిపారు. ముగ్గురు ఆడశిశువులని, ఇరువురు 1.5 కేజీలు, ఒక శిశువు 1.4 కేజీలు ఉన్నట్లు చెప్పారు. వైద్య చికిత్సలో పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాజా సహకారం అంంచినట్లు పేర్కొన్నారు.'జన్యుపరమైన కారణాల వల్లే'మహిళ గర్భం దాల్చే సమయంలో బహుళ అండాలు ఏకకాలంలో ఫలదీకరణం చెందడం వల్ల ఇలా ఒకే కాన్పుల్లో ఎక్కువ మంది శిశువులు జన్మిస్తారని డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఇలా జరగవచ్చని చెప్పారు. ఒకే కాన్పుల్లో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు పుట్టడం సాధారణమని, అయితే ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లలు పుట్టడాన్ని వైద్య పరిభాషలో పాలీజైగోటిక్ అంటారని తెలిపారు వైద్యులు. (చదవండి: అత్యంత ధనవంతుడైన ఐఏఎస్ అధికారి! జీతం ఒక్క రూపాయే..!) -
30 ఏళ్ల తండ్లాట...అమ్మను చూడాలని !
తల్లిని కలిసేందుకు ఓ తనయ ఆరాటపడుతోంది. 30 ఏళ్లుగా ఆమెకు దూరమై తల్లడిల్లిపోయింది. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ ఠాణాలో మీ అమ్మ ఉందంటూ భవానికి తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో భవాని ఆదివారం కోరుట్లలో ఉంటున్న తన బంధువులతో కలిసి అక్కడకు బయలుదేరి వెళ్లింది. వివరాల్లోకి వెళితే..జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన పసుల రాంరెడ్డి 1979లో పీపుల్స్వార్లో చేరారు. అప్పుడే అరెస్ట్ అయ్యారు. జైలు నుంచి విడుదలయ్యాక ఏడాదిపాటు ఇంటి వద్దే ఉండగా, కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన వసంతతో వివాహం జరిగింది. ఏడాది వ్యవధిలోనే రాంరెడ్డి–వసంత దంపతులిద్దరూ పీపుల్స్వార్లోకి వెళ్లారు. అజ్ఞాతంలో ఉండగానే కూతురు జన్మించింది. ముంబైలో ఉండే తన అన్నసాయిబాబాకు కూతురు (భవాని)ని అప్పగించాడు రాంరెడ్డి. 2001లో ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కార్యదర్శి హోదాలో ఉన్న సమయంలో కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం మద్దిమల్ల సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో పసుల రాంరెడ్డి హతమయ్యాడు. అయినా అజ్ఞాతం వీడని వసంత శాంతక్క, మమతక్క పేర్లతో దండకారణ్యంలోని బస్తర్ డివిజన్ కమిటీ సభ్యురాలిగా కొనసాగారు. చదవండి: Amrutha Pranay Case Verdict : పీవోడబ్ల్యూ సంధ్య స్పందన ఇదే!మోకాళ్ల నొప్పులు, షుగర్ వంటి అనారోగ్య సమస్యలతో 2024 నవంబర్లో వసంత కాంకేర్ జిల్లా పోలీసులకు పట్టుబడ్డారు. ఆ తర్వాత కాంకేర్ పోలీసులు ఆమెతోపాటు మరో ఏడుగురు మావోయిస్టులు 2025 జనవరిలో లొంగిపోయినట్టు ప్రకటించారు. అప్పటి నుంచి కాంకేర్లోనే పోలీసుల అదీనంలో ఉంటోంది. ఛత్తీస్గఢ్ పోలీసులు ఆమె గురించి ఆరా తీస్తూ తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులకు విషయం చెప్పారు. రెండురోజుల క్రితం తెలంగాణ పోలీసులు భవాని ఆచూకీ తెలుసుకున్నారు. ఆమెకు తల్లి సమాచారం చెప్పడంతో ఛత్తీస్గఢ్కు బయలుదేరింది. ఒకట్రెండుసార్లు అమ్మను కలిశాను ఒకట్రెండు సార్లు అమ్మను కలిశా...చిన్నప్పుడు కోరుట్లలోనే ఓ చోట ఒకట్రెండు సార్లు అమ్మను కలిశా. అప్పుడు అమ్మానాన్న ఇద్దరూ అజ్ఞాతంలోనే ఉన్నారు. ఇప్పుడు నేను వెళితే నన్ను అమ్మ తప్పకుండా గుర్తుపడుతుంది. ఇన్నాళ్లు పెద్దనాన్న దగ్గర దత్త పుత్రికగానే పెరిగాను. కొన్నేళ్ల క్రితమే పెద్దనాన్న దంపతులు ఇద్దరూ చనిపోయారు. అమ్మ వస్తుందంటే బంధువులంతా సంతోషపడుతున్నారు. – భవాని -
కుప్పంలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై అమ్మాయి తండ్రి దాడి
సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పంలో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న జంటపై అమ్మాయి తండ్రి కత్తితో దాడి చేశారు. అడ్డుకున్న మరో ఇద్దరిపైనా కూడా దాడికి పాల్పడ్డాడు. పెద్దల సమక్షంలో రాజీ పంచాయితీ అంటూ పిలిచి నలుగురిపై విచక్షణరహితంగా కత్తితో దాడి చేశారు.ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కత్తి కడుపులో ఇరుక్కుపోయింది. బాధితులను గుడుపల్లి మండలం అగరం గ్రామానికి చెందిన చంద్రశేఖర్, రమేష్, కౌసల్య, సీతారామప్పగా గుర్తించారు. వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
అంత మాత్రానికే జీవితం ముగిసినట్లు కాదు
న్యూఢిల్లీ: వివాహ బంధం ముగిసినంత మాత్రాన జీవితమే అయిపోయినట్లు కాదని, ముందున్న భవిష్యత్తు గురించి ఆలోచించాలని విడాకుల జంటను ఉద్దేశించి దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఓ విడాకుల కేసు విచారణ సందర్భంగా జంటను ఉద్దేశించి జస్టిస్ పీబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ నేతృత్వంలోని బెంచ్(SC Bench) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.‘‘ఈ కేసులో విడాకులు తీసుకోవాలనుకుంటున్న జంటది(Divorce Couple) చిన్నవయసే. ఇలాంటి వాళ్లకు బోలెడంత భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్గు గురించి వాళ్లు ఆలోచించుకోవాలి. వివాహ బంధం ముగిసినంత మాత్రాన..వాళ్ల జీవితాలు అయిపోయినట్లు కాదు. వాళ్లు కొత్త జీవితాలను ప్రారంభిస్తూ ముందుకు సాగాలి’’అని న్యాయమూర్తులు సూచించారు .ఈ కేసులో వివాహం జరిగినా ఏడాదిలోపే ఆమె తిరిగి పుట్టింటికి పెళ్లడం దురదృష్టకరం. విడాకుల తర్వాతైనా ప్రశాతంగా జీవించండి అని ఆ జంటకు సూచించింది ధర్మాసనం.కేసు నేపథ్యం..2020 మే నెలలో మహారాష్ట్ర(Maharashtra)కు చెందిన యువకుడికి, మధ్యప్రదేశ్కు చెందిన యువతికి వివాహం జరిగింది. అయితే అత్తింటి వేధింపులతో కొన్ని నెలలకే తిరగకముందే ఆమె పుట్టింటికి చేరింది. భర్త, అతని కుటుంబ సభ్యులపై ఆమె ఫిర్యాదు చేసింది. బదులుగా ఆ భర్త కూడా ఆమెపై ఫిర్యాదు చేశాడు. అలా.. మొత్తం 17 కేసులు నమోదు అయ్యాయి.అలా చేస్తే సాగదీయడమే!వీళ్ల విడాకుల వ్యవహారం సుప్రీం కోర్టు(Supreme Court)కు చేరింది. అయితే ఇలా పోటాపోటీగా కేసులు వేయడం.. విడాకుల వ్యవహారాన్ని సాగదీయడమే అవుతుందని ఇరుపక్షాల లాయర్లతో ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో కేసులు ఉపసంహరించుకుంటామని వాళ్లు తెలిపారు. అదే సమయంలో ఆ జంట కలిసి జీవించే పరిస్థితులు లేవని.. ఆర్టికల్ 142 ప్రకారం విస్తృత అధికారాన్ని ఉపయోగించి విడాకులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో కోర్టు విడాకులు మంజూరు చేసింది.వివాహ బందం కోలుకోలేని విధంగా విచ్ఛినమైతే.. ఆరు నెలలు కూడా ఆగాల్సిన అవసరం లేదు. కొన్ని షరతులతో ఆ నిరీక్షణ గడువును ఎత్తేయొచ్చు. ఈ కారణం కింద వారి ఆ పెళ్లి రద్దు చేసి విడాకులు మంజూరు చేయడం సుప్రీం కోర్టుకు సాధ్యమే. ఇందుకు ఆర్టికల్ 142 కింద కోర్టుకు అధికారం ఉంటుంది::: జనవరి 06 2025 రాజ్యాంగ ధర్మాసనం తీర్పు -
మూడు నెలల తరువాత.... గ్రేహౌండ్స్ దొరికిందహో!
పెంచుకున్న కుక్క కనిపించకపోతే ఏం చేస్తాం? తిరగాల్సిన చోటుకల్లా తిరుగుతాం. పోలీస్ కంప్లాయింట్ ఇస్తాం. అయినా ఫలితం లేకపోతే ప్రియమైన శునకాన్ని తలచుకొని బాధ పడడం తప్ప ఏంచేయగలం? కాని గురుగ్రామ్కు చెందిన దీపయాన్ ఘోష్, కస్తూరి దంపతులు మాత్రం ఏమైనా సరే, ఎక్కడున్నా సరే... తప్పిపోయిన తమ పెంపుడు శునకాన్ని వెదికి పట్టుకోవాల్సిందేనని గట్టిగా డిసైడైపోయారు.శునకం కనిపించని రోజు నుంచి వారికి నిద్ర, తిండి లేవు. కుక్క జాడ చెప్పిన వారికి యాభై వేల రివార్డ్ ప్రకటించడంతో సహా ఇంటింటికీ వెళ్లి శునకం ఆనవాళ్ల గురించి చెప్పడం, సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషించడం, డ్రోన్ నిఘా...ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.‘ఇంత కష్టం అవసరమా?!’ అని ఎంతోమంది అన్నారు. అయినా సరే కుక్క కోసం వెదకడం ఆపలేదు. ఎట్టకేలకు వారి అలుపెరగని గాలింపుకు ఫలితం దక్కింది. తాజ్మహల్ సమీపంలోని అడవిలో సంచరిస్తున్న గ్రేహౌండ్స్ను కనుగొన్నారు. దీపయాన్, కస్తూరి దంపతులు సెలవు రోజుల్లో ఆగ్రాకు వెళ్లారు. వూఫ్, గ్రేహౌండ్స్ అనే పెంపుడు కుక్కలను కూడా వెంట తీసుకెళ్లారు. ఫతేపూర్ సిక్రీని సందర్శిస్తున్న సమయంలో....‘గ్రేహౌండ్స్ కనిపించడం లేదు’ అని తాము బస చేసిన హోటల్ నుంచి ఫోన్ వచ్చింది.ఎలాగైనా గ్రేహౌండ్స్ ఆచూకి కనుక్కోవాలని అనుకున్న దీపయాన్, కస్తూరి దంపతులు రెండు వారాలపాటు ఆగ్రాలోనే ఉండి పోస్టర్లు వేస్తూ, బ్యానర్లు కడుతూ ఎన్నో ప్రాంతాలు తిరిగారు. అయినా ఫలితం లేకుండాపోయింది. గురుగ్రామ్కు తిరిగి వచ్చిన తరువాత కూడా తరచు ఆగ్రాకు వెళ్లేవారు. ఆటోలపై, దుకాణాలు, మెట్రో స్టేషన్ల దగ్గర ‘కనిపించడం లేదు’ అనే ప్రకటనలు అంటించేవారు. వారి ప్రచారం సోషల్మీడియాకు కూడా చేరింది. దీంతో యానిమల్ రెస్క్యూ గ్రూప్లు, వాలెంటీర్లు కూడా రంగంలో దిగారు. ఒకానొక రోజు గ్రేహౌండ్ను చూసిన టూర్ గైడ్ ప్రశాంత్ జైన్ నుంచి దంపతులకు ఫోన్ వచ్చింది. అలా కథ సుఖాంతం అయింది. మూడు నెలల తరువాత గ్రేహౌండ్స్ తన పెంపుడు పేరెంట్స్ దగ్గరికి చేరుకుంది. (చదవండి: ట్రక్కులోనే పదేళ్లుగా జీవనం..కారణం తెలిస్తే విస్తుపోతారు..!) -
ఆ జంటకి వివాహమై 84 ఏళ్లు..!
వివాహమై 40 ఏళ్లు లేదా 60 ఏళ్లు అవ్వొచ్చు. మరీ ఎక్కువ కాలం ఇరువురు బతికుంటే దగ్గర దగ్గర 66 ఏళ్లు కూడా అవ్వొచ్చు. అంతేగానీ అన్నేళ్లు ఇరువురి జీవనయానం సాగించడం అంత ఈజీ కాదు. మధ్యలో ఎవరో ఒకరు కాలం చెందడం సర్వసాధారణం. అందులోనూ నేటి యువత పెళ్లై పట్టుమని రెండేళ్లు కూడా కలిసి ఉండటం లేదు. అలాంటి జంటల సంఖ్య వేళ్లతో లెక్కించలేనంత మంది ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో..దగ్గర దగ్గర సెంచరీకి సమీపం వరకు అన్నేళ్లు కలిసి సహచర్యం చేసిన జంటగా రికార్డు దక్కించుకుంది ఈ వృద్ధ జంట. వారిక ఏకంగా వందమంది పైగా మనవరాళ్లు, మనవళ్లు ఉన్నారు. ఇక ఆ వృద్ధ దంపతుల వయసు ఎంత ఉండొచ్చు, పెళ్లి ఎప్పుడైంది వంటి విశేషాల గురించి తెలుసుకుందామా..!.పెళ్లై 84 ఏళ్లు గడిచిన వృద్ధులుగా ఈ బ్రెజిలియన్ జంట నిలిచింది. సుదీర్ఘ కాలం అన్యోన్య దాంపత్య జీవితం గడిపిన జంటగా రికార్డు సృష్టించింది. ఆ దంపతుల పేర్లు మనోయల్ ఏంజెలిమ్ డినో, మరియా డి సౌసౌ డినో. వారి ప్రేమ కథ అత్యంత విచిత్రంగా జరిగింది. ఇద్దరు తమ కుటుంబాల పోషణ కోసం వ్యవసాయం చేస్తుండేవారు. ఇరువురు ఆ వ్యవసాయ వృత్తి ద్వారానే ఇరువురికి పరిచయం ఏర్పడింది. అయితే మళ్లీ విధి అనుకోకుండా మరోసారి ఎదురపడేలా చేసింది. ఇక అప్పుడే ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. ఇక మనోయల్ కూడా తన మనసులోని మాటను మరియాకి చెప్పేశాడు. అందుకు సుమఖత వ్యక్తం చేసింది. అలా ఇద్దరు 1940లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇద్దరూ పోగాకు చుట్టడాన్ని జీవనోపాధిగా చేసుకుని బతుకు సాగించేవారు. ఇప్పుడు మనోయల్ వయసు 105 ఏళ్ల, మరియాకి 101 ఏళ్లు. ప్రస్తుతం ఇరువురు విశ్రాంతి జీవితం గడుపుతున్నారు. ఇన్నాళ్లు తమ వైవాహిక జీవితంలో ఇంతలా కలిసి ఉండటానికి కారణం ఒక్కటే ప్రేమ. అది తమ ఇద్దరి మధ్య మరొకరు వచ్చి అగాథం సృష్టించ లేనంత నమ్మకం, ప్రేమ వంటివి స్ట్రాంగ్ ఉన్నాయని చెబుతోంది ఈ జంట. "ఇరువురం అనుకోకుండా భార్యభర్తలమయ్యాం. మంచో చెడో వివాహ బంధంతో ఒక్కటయ్యాం. కడదాక నిలుపుకోవాలనుకున్నాం. మా ఇరువరి మధ్య ఉన్న విడదీయరాని ప్రేమ కారణంగా సుదీర్ఘకాలం అన్యోన్యంగా ఉండగలగాం." అని అంటున్నారు ఈ దంపతులు. అంతేగాదు ఎలాంటి పొరపాటు, తప్పు జరిగినా దాన్ని లేవనెత్తడం, ఆరోపణలు చేసుకోవడం వంటి వాటికి తావివ్వకోపోడం వల్లే తమ బంధం దృఢంగా ఉందని అన్నారు. అదే తమ సుదీర్ఘకాల ఆరోగ్య రహస్యానికి కారణం కూడా అని చెబుతోంది ఈ వృద్ధ జంట. నిజమే కాదు వ్యక్తిగత జీవితం ఆహ్లాదంగా ఏంటేనే కదా..మానసిక, శారీరక ఆరోగ్యం బాగుండేది. -
Maha Kumbh 2025: ఈ జంట చేసిన పనికి నెటిజన్లు..!
జాతరలు, మేలాల సందర్భంగా కొంతమంది తప్పిపోవడం, కుటుంబం నుంచి విడిపోవడం లాంటి అనేక సంఘటనలు గతంలో చాలా చూశాం. ఇలాంటి ఉదంతాలపై అనేక సినిమాలు కూడా రూపొందాయి. లక్షల జనసమూహంతో ప్రజలు ఒకచోట చేరే మహాకుంభ్ మేళా ఉత్సవంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. కుంభమేళాలో తప్పిపోకుండా ఉండేందుకు ఒక జంట స్పెషల్ సొల్యూషన్ వెదుక్కున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా 2025కు ప్రపంచం నలుమూలల నుండి భక్తులు విచ్చేస్తున్నారు. 144 సంవత్సరాల తర్వాత, పవిత్రమైన గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద ఈ ధార్మిక కార్యక్రమం జరుగుతోంది. ఇక్కడ పవిత్ర స్నానం చేస్తేతమ పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.'లవ్ ఎట్ ఇట్స్ పీక్'కుంభమేళాకు వచ్చిన వీరు తాము తప్పిపోకుండా ఉండేందుకు ఒకరికొకరు తాడుతో కట్టేసుకున్నారు. భారీ జనసమూహం మధ్య, తాము కనెక్ట్ అయ్యేలా, విడిపోకుండా చూసుకోవడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ దృశ్యాలు పలువుర్ని విపరీతంగా ఆకర్షించాయి. మహిళ తన తలపై ఏదో బరువు మోస్తోంది. వెనక కాస్త పెద్దవాడిగా కనిపిస్తున్న పురుషుడు వెడుతున్నాడు. దీనికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ రీల్ వైరల్మారింది.ఇన్స్టాగ్రామ్ పేజీ- @log.kya.sochenge లో ఇది షేర్ అయింది.మహా కుంభ్కు హాజరైన ఒక జంట ఐక్యంగా ఉండేలా చూసుకోవడానికి తమను తాము తాడుతో కట్టుకున్నారు. ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రత్యేక శ్రద్ధ, భక్తి అందర్నీ ఆకర్షించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం మహా కుంభ్లో ఇటువంటి హృదయపూర్వక దృశ్యాలు ఐక్యతాసారాన్ని ప్రతిబింబిస్తాయంటూ ఈ పేజ్ పేర్కొంది. ఇప్పటికే ఇది 40.1 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. View this post on Instagram A post shared by LOG KYA SOCHENGE (@log.kya.sochenge) సోషల్ మీడియా వినియోగదారులు ఈ జంట క్రియేటివిటికీ, ప్రేమకు ముగ్ధులై పోయారు. ‘‘పొద్దున్నలేస్తే సెలబ్రిటీల విడాకుల వార్తలతో విసిపోతున్న మనకు ఈ రకమైన క్లిప్లు నిజంగా హృదయపూర్వకంగా ఉన్నాయి” అని ఒకరు, "ఆధునిక సమస్యలకు ఆధునిక పరిష్కారాలు’’ అని మరొకరు వ్యాఖ్యానించడం విశేషం. -
కొత్త జంటలకు ఏకాంతం.. ఆలుమగలకు ప్రశాంతం! ఈ రొమాంటిక్ ప్లేసెస్ గురించి ఎప్పుడైనా విన్నారా? (ఫొటోలు)
-
మీరట్లో దారుణం
మీరట్: ఉత్తరప్రదేశ్లోని మీరట్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. దంపతులు, వారి 8 ఏళ్లలోపు ముగ్గురు కుమార్తెలు దారుణ హత్యకు గురవడం సంచలనం రేపింది. పాత గొడవలే ఈ దారుణానికి కారణమని భావిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. లిసారి గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుహైల్ గార్డెన్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఇటీవలే మొయిన్ అలియాన్ మోయినుద్దీన్(52), అస్మా(45)దంపతులు అద్దెకు దిగారు. వీరికి ముగ్గురు కుమార్తెలు అఫ్సా(8), అజిజా(4), అడీబా(1)ఉన్నారు. మొయిన్ దంపతులు బుధవారం నుంచి కనిపించకపోవడంతో అస్మా సోదరుడు షమీమ్, మొయిన్ సోదరుడు సలీ వారుండే ఇంటికి వచ్చి చూడగా బయట తాళం వేసి ఉంది. శుక్రవారం అతికష్టమ్మీద ఇంటి పైకప్పును తొలగించి, లోపలికి వెళ్లి చూడగా భయానక దృశ్యాలు కనిపించాయి. పడుకునే మంచానికి ఉన్న అరలో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు కుక్కి ఉండగా దంపతులను బెడ్షీట్లో చుట్టి పడేశారు. వీరి కాళ్లు కట్టేసి ఉన్నాయి. షమీమ్, సలీమ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అస్మా చిన్న మరదలు, ఆమె ఇద్దరు సోదరులతోపాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో అనుమానితుడి కోసం గాలింపు చేపట్టారు. ఇది తెలిసిన వారి పనే కావొచ్చని పోలీసులు తెలిపారు. -
సాఫ్ట్వేర్ దంపతుల ఆత్మహత్య
పటాన్చెరు టౌన్: కుటుంబ కలహాలతో సాఫ్ట్వేర్ దంపతులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సంగారెడ్డి జిల్లా మియాపూర్కు చెందిన సందీప్ (36)కు ఆరేళ్ల కిందట మంచిర్యాలకు చెందిన కీర్తి (34)తో వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ మియాపూర్లో ఉండేవారు. 9 నెలల కిందట అమీన్పూర్ పరిధిలోని బంధంకొమ్ము శ్రీదామ్ హిల్స్లో సొంతిల్లు కొనుగోలు చేసి కూతురు గగనహిత(3), కుమారుడు సాకేత్రామ్ (ఏడాదిన్నర)తో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ చిన్న చిన్న గొడవలు జరుగుతుండేవి. సోమవారం పాప గగనహిత పుట్టినరోజు ఉంది.వేడుక జరిపే విషయంలో 5వ తేదీ (ఆదివారం) ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సందీప్ ఇద్దరు పిల్లల్ని తీసుకొని తల్లిగారింటికి మియాపూర్ వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న కీర్తి తాడుతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సాయంత్రం ఒక్కడే ఇంటికొచ్చిన సందీప్కు కీర్తి ఉరేసుకొని కనిపించింది. వెంటనే అతడి తండ్రికి ఫోన్లో కీర్తి ఉరేసుకుందని విషయం చెప్పాడు. సందీప్ తల్లిదండ్రులు అక్కడికి వచ్చేలోపు అతడు కూడా తాడుతో ఉరేసుకున్నాడు. కీర్తి తండ్రి ప్రభాకర్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమీన్పూర్ సీఐ నాగరాజుతోపాటు ఎస్ఐ సోమేశ్వరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నిజమైన ప్రేమ అంటే ఇది కదా..!
ఇటీవల రోజుల్లో దాంపత్యం అన్న మాట విలువలేనిదిగా అయిపోతోంది. ఎక్కడ చూసినా..విడాకులు కేసులే అధికమవుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ వృద్ధ జంటను చూస్తే భార్యభర్తల బంధం అంటే ఇది కదా అనిపిస్తుంది. ప్రేమ అనే ఒక్క పదం ఇరువురి మధ్య ఉంటే ఎలాంటి వైకల్యమైనా జయించొచ్చు అనిపిస్తుంది. ఈ ఏజ్లో తమ కాళ్లపై తాము నిలబడాలనే తపనతో ఆ జంట పడుతున్న పాట్లు చూస్తే..ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇంతకీ ఎవరంటే వారు..థానే రైల్వే స్టేషన్(Thane Station) వద్ద స్నాక్ అమ్ముకుని జీవించే వృద్ధ జంట(Elderly Couple). వారితో ఇన్స్టాగ్రామ్ వ్లాగర్(vlogger) సిద్ధేష్ లోకారే మాటలు కలిపి..ఆ సంభాషణను నెట్టింట వీడియో రూపంలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వృద్ధ జంట కథ నెట్టింట వైరల్గా మారింది. బీం రావు శోభ దంపతులతో వ్లాగర్ సిద్ధేష్ సంభాషిస్తూ..మీకు ఎప్పుడు పెళ్లి అయ్యిందని ప్రశ్నిస్తారు. వారు 1982లో పెళ్లై అయ్యిందని బదులిస్తారు. మూడు దశాబ్దాలకు పైగా కలిసే ఉన్నామని అంటారు. ఇక్కడకి ప్రతిరోజు వచ్చి స్నాక్స్ అమ్ముతామని, ఎవ్వరైన స్నాక్స్/స్వీట్లు కావాలని ఆర్డర్ చేస్తే ఇంటికి కూడా వెళ్లి డెలివరీ చేస్తామని చెప్పారు. బీంరావు తాను రెండేళ్ల వయసులో చూపుకోల్పోగా, భార్య శోభాకు ఒక చేయి సరిగా లేదు. అయినా ఇరువరు ఎంతో అన్యోన్యంగా ఉంటామని చెప్పారు. రోజువారీ పనులను ఎలా ఇరువురు చకచక చేసుకోగలరో కూడా వివరించారు. అంతేగాదు భీంరావు తనకు చూపులేకపోయినా తన భార్యకు వంట చేయడంలో సహకరిస్తారట. పైగా కూరగాయాలు కట్ చేయడంలో ఆయనకు ఎంతో నైపుణ్యం ఉందని భర్తపై ప్రశంసలు జల్లు కురిపిస్తోంది శోభా. ఆ జంటని వ్లాగర్ సిద్ధేష్ ప్రేమంటే ఏంటనీ అడగగా..వారు "ఒకరికొకరు" అని గొప్పగా సమాధానం ఇచ్చారు. యవతకు మీరిచ్చే సందేశం ఏంటని అడిగితే.." "కష్టపడితే దేన్నైనా పొందగలం". అలాగే నీ కోసం బతకడం కాదు ఇతరుల మేలు కోరితేనే జీవితానికి అసలైన అర్థం అని చెప్పారు". చివరిగా వ్లాగర్ మీకు ఏదైనా కావాలా అని అడగగా..ఒక స్టాల్ ఉంటే బాగుండునని, ఇంతలా నిలబడాల్సిన శ్రమ ఉండదని నవ్వుతూ చెబుతారు ఆ దంపతులు. ఈ వీడియో నెటిజన్లను కదలించింది. ప్రేమకు అసలైన నిర్వచనం ఆ దంపతులు అని ప్రశంసిస్తూ..పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Siddhesh Lokare🙋🏻♂️ (@sidiously_) (చదవండి: ఏజ్లో సెంచరీ కొట్టిన మరో బామ్మ..హెల్త్ సీక్రెట్ ఏంటంటే..) -
మృత్యువు కబళించింది
తుగ్గలి/పెద్దవడుగూరు: అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తుగ్గలి మండలం చెన్నంపల్లికి చెందిన దంపతులు మృతి చెందారు. గ్రామానికి చెందిన వలుకూరు రాజు(35), సుమలత (30) దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవ నం సాగిస్తున్నారు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. ఊర్లో ఈనెల 22న జరిగే దేవర ఉత్సవాలు ఉన్నందున నేత చీరల తెచ్చుకునేందుకు ద్విచక్ర వాహనంపై అనంతపు రం జిల్లా యాడికి వెళ్లారు. అక్కడ పట్టుచీరలు కొనుగోలు చేసిన అనంతరం తిరిగి మోటారు సైకిల్పై వ స్తుండగా పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు సమీపంలో 67వ జాతీయ రహదారిపై పెట్రోల్ బంక్ వద్ద గుత్తి వైపు నుంచి యాడికికి శరవేగంగా వెళుతున్న బొలెరో వాహనం ఢీకొంది. ఘటనలో దంపతులిద్దరూ మృతిచెందారు. బొలెరో వాహనంలో ఉన్న యాడికి గ్రామానికి చెందిన యువకుడు సాయి మణికంఠకూ తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న యాడికి ఎస్ఐ ఆంజనేయులు, సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న మృతుల కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మృతుడి తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. దంపతుల మృతితో చెన్నంపల్లి గ్రామంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. -
విశాఖ జిల్లాలో విషాదం.. దంపతుల ఆత్మహత్య
-
కలిసే దూరంగా ఉందాం!
పెళ్లయిన కొత్తలో ఆమె ఏం చెప్పినా, చేసినా అతనికి ఎంతో ఇష్టం. ఇద్దరికీ నచ్చిన ఫుడ్, నచ్చిన రంగు, నచ్చిన హాలిడే వెకేషన్. కొన్నాళ్లు గడిచాక సీన్ రివర్స్. ఏం చేసినా తప్పే. చేయకపోయినా తప్పే. టాయిలెట్ కమోడ్ మూత వేయకపోతే మాటల యుద్ధం. మంచంపై తడిసిన తువ్వాలు కనిపిస్తే పెద్ద వాగ్వాదం. ఏసీ నంబర్ పెంచినా, తగ్గించినా పట్టరానంత కోపాలు. పెద్దలు కుదిర్చిన పెళ్లికావొచ్చు మనసులు కలిపిన ప్రేమ వివాహం కావొచ్చు. కీచులాటలు కామన్. ఇలా కొట్టుకుంటూ కలిసుండే బదులు విడిపోతే బాగుండు అనే జంటలు కోకొల్లలు. శాశ్వతంగా విడిపోకుండా దూరం దూరంగా వేర్వేరు ఇళ్లలో ఉంటూ ఒకరికిపై మరొకరు గాఢమైన ప్రేమానుబంధాలను పెంచుకునే కొత్త ధోరణి ఇప్పుడు మొగ్గ తొడిగి వేగంగా విస్తరిస్తోంది. దీనికే ఇప్పుడు చాలా జంటలు ‘దూరంగా కలిసి బతకడం( లివింగ్ అపార్ట్ టుగెదర్ ) అనే కొత్త పేరు పెట్టి ఆచరిస్తున్నాయి. ఈ నయా ట్రెండ్లోని విశేషాలను తెల్సుకునేందుకు ఆయా జంటల జీవితాల్లోకి ఓసారి తొంగిచూద్దాం.. ఏమిటీ ఎల్ఏటీ? లివింగ్ అపార్ట్ టుగెదర్ (ఎల్ఏటీ) గురించి 19వ శతాబ్దానికి చెందిన లెబనాన్ మూలాలున్న అమెరికన్ రచయిత కహ్లిల్ గిబ్రాన్ తన ‘పెళ్లి’కవితలో తొలి సారిగా ప్రస్తావించారు. భా ర్యభర్తలు ఒకరిపై మరొకరికి ఎనలేని ప్రేమానురాగాలు ఉన్నప్పటికీ తమ అహం కిరీటం కిందపడొద్దనే కారణంగా తమ మాటే నెగ్గాలనే మొండిపట్టుదలతో చిన్నపాటి వాగ్వాదాలకు దిగుతారు. తర్వాత బాధపడతారు. మళ్లీ అంతా సర్దుకోవడానికి కాస్తంత సమ యం పడుతుంది.ఇప్పుడున్న ఆధునిక యుగంలో భార్యాభర్తలిద్దరూ సొంత కెరీర్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. వేర్వేరు చోట్ల ఉద్యోగాలు, వృత్తుల్లో నిమగ్నమవుతున్నారు. పని కోసం వేరే చోట ఉండాల్సి రావడం, వ్యక్తిగత అభిప్రాయాలకు గౌరవించాల్సి రావడం, అన్యోన్యంగా ఉన్నాసరే కొన్నిసార్లు వ్యక్తిగత ఏకాంతం(పర్సనల్ స్పేస్) కోరుకోవడం వంటివి జరుగుతున్నాయి. వీటికి పరిష్కార మార్గంగా జంటలే తమకు తాముగా ఎల్ఏటీకి జై కొడుతున్నాయి. చినికిచినికి గాలివాన దుమారంగా మారే ప్రమాదాలను దూరం దూరంగా ఉండటం వల్ల తప్పించుకోవచ్చని జంటలు భావిస్తున్నాయి.ఒకరి అభిప్రాయాలకు మరొకరు గౌరవం ఇస్తూనే ఇలా దూరంగా ఉంటూ మానసికంగా అత్యంత దగ్గరగా ఉంటున్నామని ఎల్ఏటీ జంటలు చెబుతున్నాయి. ‘‘సాన్నిహిత్యంలోనూ కా స్తంత ఎడం ఉంచుదాం. ఈ స్వల్ప దూరా ల్లోనే స్వర్గలోకపు మేఘాల స్పర్శను స్పశిద్దాం’’అంటూ జంటలు పాటలు పాడుకుంటున్నాయని కవి గిబ్రాన్ ఆనాడే అన్నారు. ఎవరికి బాగా నప్పుతుంది?వేర్వేరు చోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసే జంటలు ఈ సిద్ధాంతాన్ని ఆచరించి మంచి ఫలితాలు పొందొచ్చు. ముఖ్యమైన పనుల మీద దూరంగా, విదేశాల్లో గడపాల్సిన జంటలు ఈ మార్గంలో వెళ్లొచ్చు. వ్యక్తిగత ఏకాంతం కోరుకుంటూనే జీవిత భాగస్వామికి అత్యంత విలువ ఇచ్చే జంటలూ ఈ సిద్ధాంతం తమకు ఆమోదయోగ్యమేనని చెబుతున్నాయి. వేర్వేరు కార్యాలయాలు, భిన్న వృత్తుల్లో, విభిన్న సమయాల్లో పనిచేసే జంటలకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భాగస్వామికి అతిభారంగా మారకూడదని, ఆర్థికంగా సొంత కాళ్లపై నిలబడదామని భావించే జంటలూ ఈ ట్రెండ్ను ఫాలో కావొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ ఎలా సాధ్యం?కథలు, సినిమాల్లో, నవలల్లో ప్రస్తావించినట్లు దూరంగా ఉన్నప్పుడు ప్రేమికులను విరహవేదన కాల్చేస్తుంది. అదే వేదన ఈ జంటలకు ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. కలిసిమెలిసి ఉంటేనే బంధం బలపడుతుందన్న భావనకు భిన్నమైన సిద్ధాంతం ఇది. కాస్తంత కష్టపడితే ఈ బంధాన్నీ పటిష్టపరుచుకోవచ్చని మనోవిజ్ఞాన నిపుణులు చెప్పారు. ‘‘వారాంతాలు, సెలవు దినాల్లో ఒకరి నివాస స్థలానికి ఇంకొకరు వచ్చి ఆ కాస్త సమయం అత్యంత అన్యోన్యంగా గడిపివెళ్తే చాలు. తమ మధ్య దూరం ఉందనే భావన చటక్కున మటుమాయం అవుతుంది.కలిసి ఉన్నప్పటి సరదా సంగతులు, మధుర స్మృతులను మాత్రమే టెక్ట్స్ రూపంలో సందేశాలు పంపుతూ గుర్తుచేసుకుంటూ ప్రేమ వారధికి మరింత గట్టిదనం కల్పించొచ్చు. కలిసి ఉన్నప్పుడు జరిగిన గొడవలను భూతద్దంలోంచి చూడటం మానేయాలి. ఆధునిక జంటల్లో స్వతంత్ర భావాలు ఎక్కువ. గతంతో పోలిస్తే వ్యక్తిగత ఏకాంతం ఎక్కువ కోరుకుంటారు. జీవిత భాగస్వామి ఆలోచనలకు విలువ ఇవ్వాలి. పాత, చేదు విషయాలను తవ్వుకోవడం తగ్గించాలి’’అని ఢిల్లీలోని ఎల్ఏటీ నిపుణుడు రుచీ రూహ్, మానసిక నిపుణుడు, జంటల మధ్య మనస్పర్థలను తగ్గించే డాక్టర్ నిషా ఖన్నా సూచించారు. చివరగా చెప్పేదేమంటే? విడివిడిగా జీవించే సమయాల్లో ఇద్దరి మధ్యా నమ్మకం అనేది అత్యంత కీలకం. ఆర్థిక, శారీరక, మానసిక అంశాలను నిజాయతీగా, నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా మాట్లాడుకుని కష్టాల కడలిలోనూ జీవననావ సాఫీగా సాగేలా చూసుకోవాలి. ఎప్పుడు కలవాలి? ఎక్కడ కలవాలి? ఎంతసేపు కలవాలి? ఏమేం చేయాలి? అనేవి ముందే మాట్లాడుకుంటే వేచి చూడటం వంటి ఉండవు. అనవసర కోపాలు, అపార్థాలు రావు. భారత్లో బ్రతుకు దెరువు కోసం లక్షలాది కుటుంబాల్లో పురుషులు వేరే జిల్లాలు, రాష్ట్రాలకు వలసవెళ్తూ భార్యను గ్రామాల్లో ఒంటరిగా వదిలి వెళ్తున్నారు.విశాల దృక్పథం, మానసిక పరిణతి కోణంలో చూస్తే భారత్లో దశాబ్దాలుగా ఎల్ఏటీ సంస్కృతి ఉందనే చెప్పాలి. ప్రత్యేకంగా పేరు పెట్టకపోయినా నోయిడా, గుర్గావ్, ఢిల్లీ, ముంబైలలో ఇద్దరూ పనిచేసే చాలా జంటలు ఇదే సంస్కృతిని ఆచరిస్తున్నాయి. వేర్వేరు చోట్ల ఉద్యోగాలు, సొంతూర్లలో వృద్ధ తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యతల కారణంగా మెట్రో నగరాల్లో చాలా జంటలు దూరంగా ఉంటున్నాయి. పశ్చిమదేశాల్లో ఇప్పుడిప్పుడే ఈ సంస్కృతి బాగా విస్తరిస్తోంది. -
అయ్యో పాపం అని పని ఇస్తే
-
రాజ్యాంగమే సాక్షి.. ఛత్తీస్గఢ్లో ఆదర్శ వివాహం చేసుకున్న జంట
రాయ్పూర్:ఛత్తీస్గఢ్లో ఓ జంట ఆదర్శ వివాహం చేసుకుంది. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలు,ఆచారాలు పక్కనపెట్టి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్నారు. ఏడడుగులు నడవడం, తాళి కట్టడం, సింధూరం పెట్టడం లాంటి అన్ని ఆచారాలను దూరంగా పెట్టారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేయడమే కాకుండా దండలు మార్చుకుని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఇంతటితో ఆగకుండా పెళ్లికి అనవసర ఖర్చు కూడా చేయకుండా సింపుల్గా కానిచ్చేశారు. పెళ్లికయ్యే ఖర్చులతో కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయవచ్చనే ఆలోచనతోనే ఇలాచేసినట్లు పెళ్లికొడుకు ఇమాన్ లాహ్రె చెప్పారు. తమకు ఆచారాలు,సంప్రదాయాల మీద కన్నా రాజ్యాంగం మీదనే తమకు నమ్మకం ఉందన్నారు. ఛత్తీస్గఢ్లోని జాష్పూర్ జిల్లాలోని కాపు గ్రామంలో డిసెంబర్ 18న ఈ పెళ్లి జరిగింది. ఈ జంట చేసుకున్న ఆదర్శ వివాహంపై వారి బంధువులు, గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది మిగిలిన వారికి ఆదర్శంగా నిలవాలని వారు ఆకాంక్షించారు. -
సినిమాని తలపించే ప్రేమకథ..వింటే కన్నీళ్లు ఆగవు..!
ఎన్నో ప్రేమ కథలు చూశాం. వాటిలో కొన్ని మాత్రం విషాదంగా ముగిసిపోతే..మరికొన్ని కన్నీళ్లు తెప్పించేస్తాయి. అలాంటి భావోద్వేగపు గాథే ఈ ప్రేమ జంట కథ. సుఖాల్లో ఉన్నప్పుడు ఉండే ప్రేమ.. కష్టాల్లో కనుమరుగైపోతుందంటారు పెద్దలు. కానీ ఈ జంట మాత్రం కష్టాల్లో అంతకు మించి..ప్రేమ ఉందని ప్రూవ్ చేసింది. విధికే కన్నుకుట్టి వారి ప్రేమను పరీక్షించాలనుకుందో, కబళించాలనుకుందో గానీ కేన్సర్ మహమ్మారి వారి ప్రేమను దూరం చేయాలనుకుంది. కానీ ఈ నేపాలీ జంట తమ ప్రేమ అత్యంత గొప్పదని నిరూపించుకుని కష్టమే కుంగిపోయేలా చేశారు.సృజన, బిబేక్ సుబేదిలు తమ జీవితాన్ని డాక్యుమెంట్ రూపంలో ఇన్స్టాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఆ జంట ప్రేమకథ అందరి దృష్టిని ఆకర్షించింది. బిబేక్ కేన్సర్తో భాదపడుతున్నాడు. కేన్సర్ ఫస్ట్ స్టేజ్ నుంచి ఫోర్త్స్టేజ్ వరకు తామెలా కష్టాలు పడుతుంది తెలియజేసింది. చెప్పాలంటే నెటిజన్లంతా సృజన కోసమైనా.. అతడు మృత్యవుని జయిస్తే బావుండనని కోరుకున్నారు. కానీ అలా జరగలేదు. బిబేక్ ఆ మహమ్మారి కారణంగా తనకెంతో ఇష్టమైన భార్యను కూడా గుర్తించలేని స్థాయికి వచ్చేశాడు సృజన పోస్ట్ చేసిన చివరి రీల్లో. అంతేగాదు ఇన్స్టాలో బిబెక్ 32వ పుట్టిన రోజుని సెలబ్రెట్ చేసిన విధానం అందర్నీ కంటతడి పెట్టిస్తుంది. ఎందుకంటే అప్పటికే అతడి పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉంది. ఏ పరిస్థితిలోనూ అతడి చేతిని వీడక ఎంతో ప్రేమగా చూసుకున్న సృజన తీరు అందరి మనసులను తాకింది. సృజన అధికారికంగా అతడు చనిపోయాడని ప్రకటించనప్పటికీ..నిశబ్ద వాతావరణంతో పరోక్షంగా బిబేక్ ఇక లేరనే విషయం వెల్లడించింది. డిసెంబర్ 1 నుంచి సృజన నుంచి ఎలాంటి వీడియో పోస్ట్ కాకపోయినా.. నెటిజన్లంతా సృజనకు ధైర్యం చెప్పడమేగాక, బిబేక్ లేకపోయినా.. మీప్రేమ ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఇలాంటి కాలంలో ఇంత గొప్ప ప్రేమలు కూడా ఉన్నాయని చూపించారంటూ సృజనను ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Crzana Subedi (@crzana_subedi_) (చదవండి: చిట్టి రచయితలు.. అందమైన కథలతో అలరిస్తున్నారు..) -
వివాహబంధంతో ఒక్కటైన 37 జంటలు
సోలాపూర్: సోలాపూర్ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ శాసనసభ్యుడు సుభాష్ దేశ్ముఖ్ నేతృత్వంలో లోకమంగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామూహిక వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. బీజాపూర్ రోడ్డు వైపునున్న డీఈడీ కళాశాల మైదానంలో పట్టణంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో 37 జంటలు వివాహబంధంతో ఒక్కటయ్యాయి. ఈ సందర్భంగా సాంప్రదాయబద్ధంగా ముస్తాబైన వధూవరులను గుర్రపు బగ్గీల్లో, బ్యాండ్ బాజాలతో ఊరేగించారు. ఈ వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే సుభాష్ దేశముఖ్, మాజీ ఎంపీ జయసిద్ధేశ్వర మహాస్వామి, లోకమంగల్ ఫౌండేషన్ అధ్యక్షుడు రోహన్ దేశముఖ్, మనీష్ దేశముఖ్, పంచాక్షరి శివాచార్య మహాస్వామిజీ, శ్రీకాంత్ శివచార్య మహాస్వామి, సిద్ధ లింగ మహాస్వామి లతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇకపై ప్రతిగ్రామంలో నిర్వహిస్తాం: ఎమ్మెల్యే సుభాష్ దేశ్ముఖ్ భవిష్యత్తులో లోకమంగల్ ఫౌండేషన్ దక్షిణ సోలాపూర్ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ లోని ప్రతి గ్రామంలో సామూహిక వివాహాలను నిర్వహించాలని సంకల్పించినట్లు సుభాష్ దేశ్ముఖ్ వెల్లడించారు. వివాహం చేసుకోదలచిన జంటలు ముందస్తుగా తమ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామపంచాయితీ మెంబర్ల ద్వారా లోక్మంగల్ ఫౌండేషన్ను సంప్రదించాలని కోరారు. ఒక్కో గ్రామం నుంచి కనీసం ఐదు జంటలు లేదా అంతకుమంచి ఎందరు ముందుకు వచ్చినా వారిని వివాహబంధంతో ఒక్కటి చేస్తామని, వివాహ వేడుకల నాడు గ్రామప్రజలందరికీ విందును కూడా ఏర్పాటుచేయనున్నట్లు వివరించారు. -
పెళ్లి తర్వాత రిసెప్షన్లో మెరిసిన చైతూ - శోభిత.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరో నాగచైతన్య ఇటీవలే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మోడలో మూడు ముళ్లు వేశారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్కు మెగాస్టార్ చిరంజీవితో సహా పలువురు టాలీవుడ్ సినీతారలు హాజరయ్యారు.తాజాగా వీరిద్దరి పెళ్లి తర్వాత తొలిసారి జంటగా కనిపించారు చైతూ- శోభిత. ప్రముఖ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురి వివాహానికి హాజరయ్యారు. ముంబయిలో జరిగిన ఆలియా కశ్యప్ వెడ్డింగ్ రిసెప్షన్లో జంటగా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీలో నటిస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. మత్స్యకార బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. #SobhitaDhulipala and #NagaChaitanya, who recently tied the knot, attend #AaliyahKashyap and #ShaneGregoire’s reception as newlyweds. ✨#FilmfareLens pic.twitter.com/P5Dw8fmqA4— Filmfare (@filmfare) December 11, 2024 -
ఈ సైంటిస్ట్ జంట రూటే సెపరేటు! వెడ్డింగ్ కార్డు వేరేలెవెల్..!
శాస్త్రవేత్తలంటేనే అందరిలా కాకుండా విభిన్నంగా ఆలోచిస్తారు. అయితే వారి పరిశోధన వృత్తి వరకే పరిమితం కాకుండా అంతకు మించి ఉంటే.. ఈ సైంటిస్ట్ జంటలానే ఉంటుందేమో..!. ఇద్దరూ అగ్రికల్చర్ పరిశోధకులే..ఆ ఇష్టాన్నే తమ వివాహా ఆహ్వాన పత్రికలో కూడా చూపించి ఆశ్చర్యపరిచారు. అది పెళ్లి కార్డో, లేక రీసెర్చ్ పేపరో అర్థంకాకుండా భలే గందరగోళానికి గురి చేశారు. ఆలపాటి నిమిషా, ప్రేమ్ కుమార్ అనే వ్యవసాయ శాస్త్రవేత్తలిద్దరూ ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడ్డారు. వివాహబంధంతో ఒక్కటవ్వాలనుకున్నారు. అయితే వారిద్దరి అభిరుచి పరిశోధనే. ఐతే నిమిషా ఐసీఏఆర్-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IARI)లో రీసెర్చ్ స్కాలర్ కాగా, ప్రేమ్ కుమార్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్)లో అసిస్టెంట్ మేనేజర్. ఈ నేపథ్యంలోన వారిద్దరూ తమ రీసెర్చ్పై ఉన్న ప్రేమతో పరిశోధనా పత్రం స్టైల్లో వివాహ కార్డుని డిజైన్ చేశారు. చూసేవాళ్లకు ఇది ఆహ్వాన పత్రిక.. రీసెర్చ్పేపరో అర్థం కాదు. క్షుణ్ణంగా చదివితేనే తెలుస్తుంది. అందులో వివరాలు కూడా రీసెర్చ్ పేపర్ తరహాలో ఉన్నాయి. అయితే వారి వివాహ బంధాన్ని కూడా కెమిస్ట్రీలోని స్థిర సమయోజనీయ బంధంతో వివరించడం అదుర్స్. అవసరానికి ఉపయోగ పడని ఆస్తి, ఆపదల నుంచి గట్టేకించుకోలేని విజ్ఞానం రెండూ వ్యర్థమే అంటారు పెద్దలు. కానీ వీళ్లిద్దరూ తమ వ్యవసాయ పరిజ్ఞానాన్ని అన్ని విధాలుగా ఉపయోగిస్తూ ఆదర్శంగా నిలవడమే గాక తమకు వ్యవసాయ పరిశోధనా రంగం పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. సైంటిస్ట్ల రూటే సెపరేటు అన్నట్లుగా ఆహ్వానపత్రిక వేరేలెవెల్లో ఉంది. మరో విశేషమేమిటంటే ఆ శాస్తవేత్తల జంట తమ వివాహ తేదిని కూడా ప్రపంచ మృత్తికా దినోత్సవం రోజునే ఎంచుకోవడమే. (చదవండి: డిప్రెషన్తో పోరాడుతూనే.. ఐఏఎస్ సాధించిన అలంకృత!) -
మా చావులకు ఎవరూ కారణం కాదు..
ఉప్పల్: భార్యకు కేన్సర్ అని తేలడంతో భర్త తల్లడిల్లిపోయాడు. అనారోగ్యంతో భార్య రోజురోజుకూ కుంగిపోతోంది. ఈ పరిస్థితుల్లో మానసిక వ్యధకు గురైన దంపతులు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకానగర్ డివిజన్ ధర్మపురి కాలనీకి చెందిన దుర్వాసుల సూర్యనారాయణ శాస్త్రి (60), జగదీశ్వరి (56) భార్యాభర్తలు. సూర్యనారాయణ ఎన్టీపీసీలో జీఎంగా పని చేసి మూడేళ్ల క్రితం స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. వీరి కుమారుడు సుశాంత్ గచ్చిబౌలిలో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల జగదీశ్వరి కేన్సర్ వ్యాధికి గురయ్యారు. దీంతో భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా కలత చెందారు. ఈ క్రమంలో ఈ నెల 3న సూర్యనారాయణ శాస్త్రి తన కుమారుడికి ఫోన్ చేసి తాను ఓ సెమినార్ కోసం బయటకు వెళ్తున్నానని, అమ్మను కూడా తీసుకెళ్తున్నాను.. నాలుగు రోజుల వరకు రాను అని చెప్పారు. ఆ తర్వాత వారం రోజులుగా ఎలాంటి ఫోన్ రాకపోవడంతో బుధవారం కుమారుడు తండ్రికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. సెమినార్కూ వెళ్లలేదని తెలిసింది. దీంతో హుటాహుటిన బుధవారం ఉదయం ఉప్పల్లోని ఇంటికి వచ్చి చూడగా గేట్కు తాళం వేసి ఉంది. పని మనిషికి ఫోన్ చేసి పిలిపించి తాళం తీసి వెళ్లగా ఇంటి తలుపులు లోపలి నుంచి లాక్ చేసి ఉన్నాయి. కిటికీలోంచి చూడగా దుర్వాసన రావడంతో వెంటనే తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే కుళ్లిన స్థితిలో మృతదేహాలు పడి ఉన్నాయి. మృతదేహాల పక్కన, ఇంకా రెండు చోట్ల మూడు సూసైడ్ నోట్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ‘అనారోగ్య కారణాల చేత సూసైడ్ చేసుకుంటున్నాం. మా చావులకు ఎవరూ కారణం కాదు’ అంటూ రెండు లైన్లు తెలుగులో నోట్ రాసి ఉంది. దీంతో కుమారుడు సుశాంత్ ఉప్పల్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల్ని స్వాదీనం చేసుకున్నారు. సుశాంత్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. వారం రోజుల క్రితమే సూర్యనారాయణ శాస్త్రి, జగదీశ్వరి దంపతులు గుర్తు తెలియని మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.లోన్ యాప్ వేధింపులకు యువకుడి బలి -
భార్యాభర్తల డ్రగ్స్ దందా!
సాక్షి, సిటీబ్యూరో: ఈశాన్య రాష్ట్రమైన అసోం నుంచి మాదకద్రవ్యం ఏంఫెటమైన్తో నగరానికి వచ్చి, విక్రయానికి ప్రయత్నించినా భార్యా భర్తల్ని వెస్ట్జోన్ టాస్్కఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ.20 లక్షలు విలువైన 254 గ్రాముల డ్రగ్, ద్విచక్ర వాహనం, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వైవీఎస్ సుదీంద్ర శనివారం వెల్లడించారు. అసోంలోని లాల్పానీ గ్రామానికి చెందిన ఆతిఫ్ అస్లం ఖాన్ గతంలో నగరానికి వలసవచ్చి నిమ్స్ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డుగా పని చేశాడు. దాదాపు ఐదారేళ్లు ఇక్కడ ఉండటంతో ఇతడిలా వచి్చ, సిటీలో నివసిస్తున్న పలువురు అసోం వారితో పరిచయం ఏర్పడింది. అసోంలోని మొరాంగా గ్రామానికి చెందిన సుభానీ బేగంను వివాహం చేసుకున్న అస్లం ఖాన్ స్వస్థలానికి వలసవెళ్లాడు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం మార్గాలు అన్వేషించాడు. అసోంలో తయారయ్యే మాదకద్రవ్యం ఏంఫెటమైన్ను ఆ రాష్ట్రానికి చెందిన అనేక మంది వినియోగిస్తూ ఉంటారు. దీంతో ఆ డ్రగ్ దందా చేయాలని నిర్ణయించుకున్నాడు. డ్రగ్పెడ్లర్ ప్రణోయ్ దాస్కు రూ.2 లక్షలు చెల్లించిన అస్లం ఖాన్ 300 గ్రాముల ఏంఫెటమైన్ ఖరీదు చేశాడు. భార్య సుభానీ బేగంతో కలిసి మాదకద్రవ్యం తీసుకుని అస్లం ఖాన్ గత నెల్లో రైలు మార్గంలో నగరానికి చేరుకున్నాడు. బేగంపేటలోని ప్రకాష్నగర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఓ బైక్ ఖరీదు చేశాడు. దీనిపై సంచరిస్తూ నగరంలో ఉన్న అసోం వాసులకు ఏంఫెటమైన్ విక్రయించడం మొదలెట్టాడు. డిమాండ్ను బట్టి రేటు నిర్ధారిస్తూ తమ వద్ద ఉన్న 300 గ్రాములు అమ్మడం ద్వారా రూ.25 లక్షలు సంపాదించాలని, ఆ మొత్తంతో స్వస్థలానికి తిరిగి వెళ్లిపోవాలని పథకం వేశారు. ఇప్పటి వరకు 11 మంది అసోం వాసులకు 46 గ్రాములు విక్రయించారు. వీరి దందాపై సమాచారం అందుకున్న వెస్ట్జోన్ టాస్్కఫోర్స్ ఇన్స్పెక్టర్ ఇ.జంగయ్య నేతృత్వంలో ఎస్సై జి.నవీన్ తమ బృందంతో వలపన్నారు. శనివారం ఇద్దరితో పాటు 11 మంది వినియోగదారులను పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వీరిని బేగంపేట పోలీసులకు అప్పగించారు. -
తీవ్ర కాలుష్యం నడుమ..ఓ జంట అద్భుతాన్ని ఆవిష్కరించింది!
ఢిల్లీలో కాలుష్య స్థాయి 300కి చేరుకుందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పేర్కొంది. కాలుష్య స్థాయి పెరుగుతోందని, పొగమంచు సమస్య అంతకంతకు తీవ్రతరం అవుతోందంటూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది కూడా. అంతలా తీవ్ర వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశా రాజధాని నడిబొడ్డున పాశ్చాత్య దేశాల కంటే నాణ్యమైన గాలితో కూడిన పరిశుభ్రమైన ఇల్లు ఒకటి ఉంది. అదెలా సాధ్యం అనుకోకండి. ఎందుకంటే ఈ జంట సాధ్యం చేసి చూపించి ఆదర్శంగా నిలిచింది. ఇంతకీ ఆ జంట ఏం చేశారంటే..మన దేశ రాజధాని ఢిల్లీ తీవ్ర వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. ముఖ్యంగా శీతాకాలంలో పొగమంచు కారణంగా మరింత అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సీజన్లో కాలుష్యం, పొగమంచు కారణంగా ఢిల్లీలోని స్కూళ్లు, కాలేజ్లు కూడా మూతపడుతున్నాయి. అంతలా ఘోరంగా ఉందక్కడ పరిస్థితి. పీల్చుకునే గాలిలోనే నాణ్యతలేకపోవడంతో అక్కడ ప్రజలు అల్లాడిపోతున్నారు. వివిధ అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల పాలవ్వుతున్నారు. ఇలాంటి ఘోరమైన స్థితిలో ఓ జంట ఇల్లు వంద శాతం గాలి నాణ్యతో అందంగా ఉంది. అది ఇల్లు పర్యావరణానికి స్వర్గధామమా..! అన్నట్లుగా పచ్చదనంతో అలుముకుని ఉంది. ఢిల్లీకి చెందిన పీటర్ సింగ్, నీనో కౌర్ దంపుతులది ఆ ఇల్లు. ఢిల్లీలోనే ఇలాంటి ఇల్లు కూడా ఉందా అని విస్తుపోయాలా అత్యంత పరిశుభ్రంగా ఉంది. మండు వేసవిలో సైతం ఆ ఇంటిలో కేవలం 25 డిగ్రీల ఉష్ణోగ్రతే ఉంటుందట. ఈ విధమైన పర్యావరణానుకుల జీవనశైలిని నీనా కేన్సర్తో బాధపడుతున్నప్పటి నుంచి ప్రారంభించారట.ప్రస్తుతం నీనోకి 75 ఏళ్లు. ఆరోగ్యం మెరుగ్గా ఉంచుకునేందుకు సాగిన ప్రయాణం ఇలా పర్యావరణానికి పెద్దపీటవేసేలా దారితీసిందని చెబుతున్నారు పీటర్ సింగ్, నీనో దంపతులు. ఇంట్లోనే చేపల పెంపంక, కూరగాయల మొక్కల పెంపకం. ఈ రెండింటినీ ఏకీకృతం చేసేలా వ్యవసాయం చేస్తోంది ఆ జంట. వారికి నాలుగు పెద్దపెద్ద చేపల ట్యాంకులు ఉన్నాయి. ఆ చెరువుల్లోని చేపలు అమ్మోనియా అధికంగా ఉంటే నీటిని ఉత్పత్తి చేస్తాయి. వీటిని ఫిల్టర్ చేసి మొక్కలకు సరఫరా చేస్తారు. మళ్లీ మొక్కలు నీటిలోని పోషకాలను గ్రహించగా మిగిలిని నీటిని శుద్ధిచేసి తిరిగి చేపల ట్యాంకులోకి పంపిస్తారు. అంతేగాదు వర్మికంపోస్ట్, కోకో పీట్ ఉపయోగించి దాదాపు పదివేల నుంచి 15 వేల దాక వివిధ రకాల మొక్కలు పెంచుతున్నట్లు తెలిపారు. తాము దుకాణానికి వెళ్లాల్సిన పనిలేదంటున్నారు. ఇంట్లోకి అవసరమయ్యే అన్ని రకాల కూరగాయాలను తామే పండిస్తామని సగర్వంగా చెప్పారు. అలాగే తమ వంటగది వ్యర్థాలను సేంద్రీయ కంపోస్ట్గా రీసైకిల్ చేసేలా ఏర్పాట్ల తోపాటు రెయిన్ వాటర్ని శుద్ది చేసి ఉపయోగించుకునేలా ప్రత్యేకంగా రూపొందించారట. ఇలా పర్యావరణ హితంగా జీవించడానికి కార్యకర్తనో, సెలబ్రిటీనో కానవసరం లేదని చాటిచెప్పారు. బురదలో తామర పువ్వు వికసించినట్లుగా.. అత్యంత కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్న ఢిల్లీలో ఈ పచ్చదనంతో కూడిన ఇల్లు ఓ కొత్త ఆశను రేకెత్తించింది!. నిజానికి అందరూ ఇలా పర్యావరణానుకూలంగా జీవించడం ప్రారంభిస్తే కాలుష్యం క్లీన్ అయిపోతుంది ఆరోగ్యం సొంతమవుతుంది కదూ..!.(చదవండి: కేరళ సంప్రదాయ ‘కసావు చీర’తో ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం..!) -
విషాదం.. 5 నెలల చిన్నారిని చంపి.. దంపతుల ఆత్మహత్య
సాక్షి, అనంతపురం: శింగనమల నియోజకవర్గం నార్పలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఐదు నెలల చిన్నారిని చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐదు రోజుల కిందట తలుపులు వేసుకొని బలవన్మరణానికి దంపతులు పాల్పడ్డారు. దుర్వాసన రావటంతో స్థానికులతో తలుపులు బద్ధలు కొట్టించిన పోలీసులు.. మృతదేహాలను వెలికితీశారు.ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతులు.. కృష్ణ కిషోర్ (45) శిరీష (35), చిన్నారి (5నెలలు)గా పోలీసులు గుర్తించారు. ఘటనపై విచారణ చేపట్టారు. -
కన్నా.. నువ్వున్న చోటుకే వచ్చేస్తున్నాం!
సేలం: అనారోగ్యంతో ఏడేళ్ల కుమారుడి మృతి చెందడాన్ని తట్టుకోలేక ఆవేదనతో ఉన్న దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కోవైలో కలకలం రేపింది. వివరాలు.. విరుదునగర్ జిల్లా శివకాశి సమీపంలోని పూలావూరని గ్రామానికి చెందిన పళని స్వామి (39). ఈయన ఇంటిలో విద్యార్థులకు ట్యూషన్ నిర్వహిస్తూ వస్తున్నాడు. ఆయన భార్య వత్సలా (35). ఈమె అదే ప్రాంతంలో ఉన్న ప్రైవేటు బ్యాంకులో పని చేస్తున్నారు. వీరికి ఏడేళ్ల వయస్సులో కుమారుడు ఉండేవాడు. అయితే గత ఏప్రిల్ నెల మెదడు జ్వరం కారణంగా మృతి చెందాడు. కుమారుడు చనిపోయినప్పటి నుంచి పళనిస్వామి, వత్సలాలు అమిత వేదనతో ఉంటూ వచ్చారు. వారిని బంధువులు సముదాయిస్తూ వచ్చారు. అయినప్పటికీ తీవ్ర ఆవేదనతో ఉన్న దంపతులను కోవైలో ఉన్న బంధువుల ఇంటికి తీసుకువెళ్లారు. కొన్ని రోజులు బంధువుల ఇంటిలో ఉన్న వారు ఇటీవల వేట్టపట్టి వీకేవీ శ్రీనగర్ ప్రాంతంలో అద్దెకు ఇల్లు తీసుకుని నివసిస్తూ వచ్చారు. అయినా కొడుకు పోయాడనే ఆవేదనతో కనిపిస్తూ వచ్చారు.ఆత్మహత్య..ఈ క్రమంలో సోమవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరి గాంధీపురం కోట్టూర్ ప్రాంతంలో ఒక లాడ్జ్లో ఇద్దరు బస చేశారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి వరకూ ఇద్దరు గదిలో నుంచి బయటకు రాకపోవడంతో సందేహించిన లాడ్జ్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాట్టూర్ పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా గదిలో దంపతులు ఇద్దరు నోటిలో నురగలు కక్కున్న స్థితిలో మృతదేహాలుగా పడి కనిపించారు. దీంతో వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు శవపంచనామా నిమిత్తం కోవై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో పోలీసులు ఆ గదిని తనిఖీ చేయగా, అక్కడ రెండు కూల్ డ్రింక్స్ బాటిళ్లు ఉన్నాయి. ఒక లేఖ చిక్కింది. ఆ లేఖలో.. తమ మృతికి ఎవరూ కారణం కాదని, తమ కుమారుడి వద్దకే వెళుతున్నామని రాసి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. -
ఒకే రోజు ఐఏఎఫ్, ఆర్మీ దంపతుల ఆత్మహత్య..
న్యూఢిల్లీ: భారత సాయుధ దళాల్లో పనిచేస్తున్న ఓ జంట ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇండియన్ ఎయిర్ఫోర్స్, ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న వారిద్దరూ.. వేర్వేరు నగరాల్లో ఒకేరోజు ప్రాణాలు కోల్పోయారు. వివరాలు.. బీహార్కు చెందిన దీనదయాల్ దీప్ ఆగ్రాలోని ఎయిర్ఫోర్స్ స్టేషన్లో లెఫ్టెనెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. అతని భార్య రేణు తన్వర్ అదే నగరంలోని సైనిక ఆస్పత్రిలో కెప్టెన్గా పనిచేస్తున్నారు. ఈ జంట 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు.ఇటీవల తన్వర్ తన తల్లి, సోదరుడితో కలిసి వైద్య చికిత్స కోసం ఢిల్లీ వెళ్లారు. ఇంతలో ఏమైందో తెలియదు. రాత్రి భోజనం తర్వాత గదిలోకి వెళ్లిన దీప్ మరుసటి రోజు బయటకు రాకపోవడంతో సహోద్యోగులు తలుపు పగలగొట్టి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించారు. భర్త మరణించాడనే విషయాన్ని తట్టుకోలేక అతని ఆర్మీ అధికారి భార్య కూడా ఢిల్లీ కంటోన్మెంట్లోని గెస్ట్ హౌస్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. వీరిద్దరి చావుకి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే తన్వర్ వద్ద పోలీసులు సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. తన భర్త దీప్తోమృతదేహంతో కలిపి తనకూ దహన సంస్కారాలు నిర్వహించాలని లేఖలో ఆమె కోరారు. తన్వర్ ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఆమె తల్లి, సోదరుడు ఆస్పత్రిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. దీప్ వద్ద ఎలాంటి సూసైడ్ నోటు లభ్యం కాలేదు. దీంతో అతడి మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు -
ఈ జంట 150 ఏళ్లు జీవించాలని ఏం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఇటీవల కాలంలో సుదీర్ఘకాలం జీవించాలనే ధోరణి ఎక్కువయ్యింది. కొందరూ సాధారణ వయసు కంటే తక్కువ వయసు వారిలా యవ్వనంగా ఉండాలని చూస్తున్నారు. కొందరూ యవ్వనంగా ఉండటం తోపాటు ఆరోగ్యంగా ఉండాలని భావిస్తున్నారు. అందుకోసం కఠినమైన జీవనశైలిని పాటిస్తున్నారు. వారి జీవసంబంధ వయసు ఎవ్వరూ ఊహించనంత తక్కువగా ఉండేలా ముమ్మరమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అదే బాటలో పయనిస్తోంది యూఎస్కి చెందిన ఓ జంట. ఇటీవలే కొత్తగా పెళ్లి చేసుకున్న ఈ జంట ఏకంగా 150 ఏళ్లు పాటు జీవించాలనే సంకల్పంతో ఏం చేస్తున్నారో వింటే నోరెళ్లబెడతారు. అమెరికాలోని మిడ్వెస్ట్కు చెందిన 33 ఏళ్ల కైలా బర్న్స్ లెంట్జ్, ఆమె భర్త వారెన్ లెంట్జ్(36) వందేళ్లకు మించి జీవించి చూపాలనుకుంటున్నారు. అందుకోసమని ఈ ఇరువురు బయోహాకింగ్ రొటీన్ను స్వీకరించారు. ఇక్కడ బయోహాకింగ్ అంటే..సైబర్నెటిక్ పరికరాలు లేదా బయోకెమికల్స్ను వంటి సాంకేతిక మార్గాల ద్వారా శరీరం విధులను మెరుగుపరచడం లేదా మార్చడాన్ని బయోహాకింగ్ అని అంటారు. ఇక్కడ ఈ బయోహ్యికింగ్ను అనుసరిస్తున్న జంటలో కైలా క్లీవ్ల్యాండ్లోని దీర్ఘాయువు క్లినిక్ ఎల్వైవీ ది వెల్నెస్ స్పేస్ సహ యజమాని కాగా, ఆమె భర్త వారెన్ మార్కెటింగ్ ఏజెన్సీలో చీఫ్ రెవెన్యూ ఆఫీసర్. వీరిద్దరు ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకునేలా మంచి జీవనశైలిని అనుసరిస్తున్నారు.ఎలాంటి జీవన విధానం అంటే.. వారి రోజు దినచర్య ఆప్టిమైజింగ్ పద్ధుతులతో నిండి ఉంటుంది. ఆ జంట ప్రతి ఉదయం పల్సెడ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థెరపీతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వర్కౌట్లు, ఉదయపు సూర్యకాంతిని ఆస్వాదిస్తూ సాగే వాకింగ్ తదితరాలు ఉంటారు. ఆ తర్వాత క్లినిక్ గ్రేడ్ పరికరాలతో ఆరోగ్య మెరుగదలను పరీక్షించడం తదరితరాలన్నింటిని ఓ పద్ధతిలో అనుసరిస్తారు. చెప్పాలంటే అత్యంత మెరుగైన ఆర్యోగ్యకరమైన జీవిన విధానాన్ని అవలంభిస్తోంది ఈ జంట. దీంతోపాటు సెల్ రిపేర్కు సంబంధించి..రోజంతా హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్, నానోవి వంటి ఆరోగ్య సాంకేతికతను ఉపయోగిసస్తారు. అలాగే సాయంత్రం పూర్తి విశ్రాంతికి కేటాయిస్తారు. సేంద్రీయ భోజనమే తీసుకుంటారు. సూర్యాస్తమయ సమయానికల్లా ఆవిరి సెషన్లో పాల్గొంటారు. అలాగే అందుకు తగ్గట్లు ఇంటి వాతావరణాన్నికూడా సెట్ చేస్తారు. ఇంట్లో రెడ్లైట్లు వంటి సహజ సిర్కాడియన్ రిథమ్లతో ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తారు. రాత్రి తొమ్మిందింటి కల్లా నిద్రపోవడం వంటి మంచి నియమాలను పాటిస్తున్నారు. అంతేగాదు పిల్లలను కనాలనే ఆశతో కొన్నేళ్లుగా శరీరాన్ని ఆప్టిమైజ్(సాంకేతికతో పరిశీలించడం) చేస్తున్నట్లు తెలిపారు. పేరెంటింగ్ అనుభూతిని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఇరువురి ఆరోగ్యం మెరుగ్గా ఉండేలా కేర్ తీసుకుంటున్నారు. అంతేగాదు వారి జీవనశైలికి అనుగుణంగా పిల్లలను పెంచేలా ప్లాన్ చేసుకుంటున్నారు కూడా. ఈ జంట స్క్రీన్ సమయాన్ని తగ్గించి ఆరుబయట గడపడం, ప్రకృతితో సేద తీరడం వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సాధ్యమేనా..?వృద్ధాప్యాన్ని నెమ్మదించేలా లేదా రివర్స్ చేసేలా మంచి ఆరోగ్యకరమైన బయోహ్యాకింగ్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇంతకముందు ఇలాంటి వాటికి సంబంధించి..వెంచర్ క్యాపిటలిస్ట్ బ్రయాన్ జాన్సన్ వార్తల్లో నిలవగా ఇప్పుడూ ఈ జంట హాట్టాపిక్గా మారింది. ప్రకృతి ధర్మంగా వచ్చే మార్పులను అంగీకరించాలే గానీ అందుకు విరుద్ధంగా బతికే ప్రయత్నం చేస్తే కొన్ని రకాల పరిణామాలను ఎదుర్కొనక తప్పదనేది కఠిన సత్యం. మరీ వీరంతా ఆ కఠిన సత్యాన్ని తిరగరాసేలా అనుకున్నది సాధించి చూపగలుగుతారా..? లేదా అనేది తెలియాల్సి ఉంది.(చదవండి: ఎత్తుకు తగ్గా బరువు ఉంటున్నారా..? -
పట్టించుకోని బిడ్డలకు మా ఆస్తులెందుకు?
శాయంపేట: ఆస్తులు సంపాదించి ముగ్గురు కుమారులకు ఇచ్చాం. ఇళ్లు కట్టి ఇచ్చాం. వృద్ధాప్యంలో పట్టించుకోని బిడ్డలకు మా ఆస్తులు ఎందుకు? మా ఆస్తులు మాకు ఇప్పించండి.. అంటూ ఓ వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు. ఈ మేరకు సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. అనంతరం శాయంపేట ఎంపీడీవో కార్యాలయంలో విలేకర్ల ముందు గోడు వెళ్లబోసుకున్నారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామానికి చెందిన చెక్క చంద్రయ్య సారమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చంద్రయ్య హమాలీ పనిచేసి గ్రామంలో 10 ఎకరాల భూమి, పరకాల పట్టణంలో మూడు గుంటల స్థలాన్ని కొనుగోలు చేశాడు. ముగ్గురు కుమారులకు 2002లో మూడు ఎకరాల చొప్పున భూమిని పంచి ఇచ్చాడు. పరకాలలో మూడు గుంటల్లో కట్టిన ఇంటిని 2012లో సమానంగా పంచాడు. వృద్ధ దంపతులిద్దరు గ్రామంలో ఓ షెడ్డు వేసుకొని అందులో ఉంటున్నారు. వృద్ధాప్యం మీద పడడంతో తమ ఆరోగ్యాలు సరిగ్గా లేవని, ఏ కుమారుడు కూడా పట్టించుకోవడం లేదని చెక్క చంద్రయ్య, సారమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కుమారులు పట్టించుకోకపోవడంతో జూలై 7న పోలీస్స్టేషన్లో, 8న పరకాల ఏసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు చంద్రయ్య తెలిపారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో సోమవారం కలెక్టర్ ప్రావీణ్యకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. -
దంపతుల్ని చిదిమేసిన ఐషర్
అనంతపురం: రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం పాలైన ఘటన నగర శివారు నేషనల్ పార్కు సమీపంలో జరిగింది. వివరాలు.. గుత్తి మండలం అబ్బేదొడ్డికి చెందిన కమతం హనుమంత రెడ్డి (72), కమతం రంగమ్మ (68) దంపతులు. వీరికి ముగ్గురు కుమార్తెలు జయలక్ష్మి, కాంతమ్మ, కృష్ణకుమారి, ఒక కుమారుడు నాగేశ్వర రెడ్డి సంతానం. అందరికీ పెళ్లిళ్లు జరిగాయి. నాగేశ్వర రెడ్డి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. అనంతపురంలోని చిన్మయనగర్లో నివాసముండే కుమార్తెలను చూసేందుకు ప్రతి వారం హనుమంత రెడ్డి, రంగమ్మ వచ్చి వెళ్లేవారు. ఈ క్రమంలోనే సోమవారం వచ్చి తిరిగి స్వగ్రామం బయలుదేరారు. నేషనల్ పార్కు వద్ద వెళ్తున్న సమయంలో ఓ ఐషర్ వాహనం అదుపుతప్పి బైకుపై పడిపోయింది. తీవ్ర గాయాలైన దంపతులిద్దరూ ఘటనాస్థలిలోనే ప్రాణాలు విడిచారు. ప్రమాద ధాటికి హనుమంతు రెడ్డి తల తెగిపోయింది. కక్కలపల్లి మండీలో టమాట బాక్సులు లోడు చేసుకున్న ఐషర్ డ్రైవర్ ముంబైకు వెళ్తున్నట్లు తెలిసింది. నేషనల్ పార్కు సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద వేగం అదుపు కాకపోవడంతో బోల్తా కొట్టి పక్కనే హనుమంత రెడ్డి, రంగమ్మలు వెళ్తున్న బైకుపై పడినట్లు విచారణలో వెల్లడైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను సర్వజనాస్పత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న మృతుల కుటుంబీకులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. -
పులివెందులలో బీటెక్ రవి అనుచరుల దాష్టీకం
-
ట్యాక్స్ తక్కువ, నిరుద్యోగ నిధి.. చిన్న దేశంలో బెంగళూరు జంట
చాలా మంది ఉద్యోగం చేసి డబ్బు సంపాదించడానికి లేదా కొత్త పద్ధతులు, విధానాలకు ఆకర్షితులై ఇండియా వదిలి విదేశాల్లో నివాసముండిపోతున్నారు. అయితే ఇటీవల బెంగళూరుకు చెందిన 'ప్రతీక గుప్తా, నేహా మహేశ్వరి' దంపతులు జంట ట్యాక్స్ తగ్గుతుందని, ఎక్కువ పొదుపు చేయొచ్చని, ఇతరత్రా ప్రయోజనాల దృష్ట్యా యూరోపియన్ దేశమైన లక్సెంబర్గ్లో స్థిరపడ్డారు. అక్కడ స్థిరపడటం వల్ల లాభాలు ఏంటనే విషయాలను కూడా వారు వెల్లడించారు.ప్రతీక గుప్తా అమెజాన్ కంపెనీలో సీనియర్ అనలిస్ట్గా, నేహా శర్మ రియర్ ఎస్టేట్ కంపెనీలో ఫైనాన్స్ మేనేజర్ ఉద్యోగాలు చేశారు. ఇండియాలో పనిచేయడం వల్ల ఇంక్రిమెంట్స్ వచ్చేవి. అయితే దుబాయ్ లేదా అమెరికాలలో ఉద్యోగాలు చేసే చాలా డబ్బు సంపాదించవచ్చని పేర్కొన్నారు.దుబాయ్, అమెరికాల కంటే యూరప్ దేశాలలో జీవన నైపుణ్యం బాగుందని వారు వెల్లడించారు. డబ్బు సంపాదించాలనుకునే వారు యూరప్ దేశాలకు రావడం తక్కువే. అయితే ట్యాక్స్ విషయానికి వచ్చేసరికి ఇండియా కంటే కూడా యూరప్లో తక్కువ. ఇది మాత్రమే కాకుండా అక్కడ కొన్ని సర్వీసులు కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయని ప్రతీక, నేహా చెప్పుకొచ్చారు. ఇక్కడ మన సంపాదనలో మూడు శాతం తప్పనిసరిగా ఆరోగ్యభీమాకు అందించాలి.ఇదీ చదవండి: వేలకోట్ల సామ్రాజ్యం స్థాపించిన టీచర్లక్సెంబర్గ్లో ప్రతీక్, నేహలకు ఇష్టమైన మరో అంశం నిరుద్యోగ నిధి. దీనికి వారిరువురు.. తమ ఆదాయంలో రెండు శాతం విరాళంగా ఇవ్వాలి. ఈ విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుందని వారు పేర్కొన్నారు. ఎవరైనా ఉద్యోగం కోల్పోతే.. రెండు సంవత్సరాలు లేదా ఉద్యోగం దొరికే వరకు చివరగా తీసుకున్న జీతంలో 80 శాతం ప్రభుత్వమే అందిస్తుందని వారు వివరించారు.లక్సెంబర్గ్లో నివసించడం వల్ల లభించే మరో ప్రయోజనం ఏమిటంటే.. ఇక్క లగ్జరీ కార్ల ధరలు కూడా చాలా తక్కువ. నేహా, ప్రతీక్ దంపతులకు అక్కడ మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ కారు ఉంది. ఈ కారు ధర మన దేశంలో రూ. 50 లక్షల కంటే ఎక్కువ. కానీ లక్సెంబర్గ్లో దీని ధర కొంత తక్కువే. -
Wedding Outfits: లవ్బర్డ్స్ కోసం డ్రీమీ ఔట్ ఫిట్స్ (ఫోటోలు)
-
హైదరాబాద్: ఇద్దరు పిల్లలను చంపి.. దంపతుల ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్లలో విషాదం చోటుచేసుకుంది. గాజుల రామారంలోని ఓ అపార్ట్మెంట్లో ఇద్దరు పిల్లలను చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.మృతులను భార్యాభర్తలు వెంకటేష్, వర్షిణి, వారి పిల్లలు విహంత్, రిషికాంత్లుగా గుర్తించారు. వీరి స్వస్థలం మంచిర్యాల. ఆర్థిక ఇబ్బందులతోనే దంపతులు తమ పిల్లలను చంపి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు నిర్థారించారు. -
కొంపముంచిన వడాపావ్.. వీడియో వైరల్
పుణె: పూణెలో జరిగిన పట్టపగలు దోపిడీలో వృద్ధ దంపతులు రూ. 5 లక్షల విలువైన నగలను పోగొట్టుకున్నారు. భార్యాభర్తలు బ్యాంకు నుంచి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా ఓ దుకాణంలో వడాపావ్ తినేందుకు ఆగారు. ఆ దంపతులు స్కూటర్ను రోడ్డు పక్కన నిలిపారు. ఆ వ్యక్తి ఫాస్ట్ ఫుడ్ కోసం షాపులోకి వెళ్లగా, ఆ మహిళ స్కూటర్ దగ్గర వేచి ఉంది. కాసేపటి తర్వాత, బైక్పై ముఖానికి మాస్క్తో ఒక వ్యక్తి స్కూటర్ దగ్గర ఆపాడు, రోడ్డుపై ఏదో పడిపోయినట్లుగా ఆ మహిళ దృష్టి మళ్లించి అక్కడ నుంచి వెళ్లిపోయాడుదానికోసం వంగి వెతుకుతుండగా.. స్కూటర్ ముందు భాగంలో ఉన్న బ్యాగ్ను తీసుకొని మరో వ్యక్తి పరారయ్యాడు. దీన్ని గమనించిన ఆ మహిళ కేకలు వేస్తూ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి వెనకే పరుగులు తీసింది.ఈ ఘటన సమీపంలోని సీసీటీవీలో రికార్డయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ బ్యాగులో రూ. 5 లక్షల విలువైన ఆభరణాలు, సెల్ఫోన్లు కూడా అందులోనే ఉన్నట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.In Pune, a couple’s gold jewellery valued at ₹4.95 lakh was stolen while they paused to buy vada pav after retrieving it from a bank. The theft occurred on Thursday outside Rohit Vadewale's shop in ShewalewadiReported by: Laxman MoreVideo Editor: Dhiraj Powar#PuneTheft… pic.twitter.com/JfXj1uuiU7— Pune Mirror (@ThePuneMirror) August 30, 2024 -
సికింద్రాబాద్లో విషాదం.. భవనంపై నుంచి దంపతులు జారిపడి..
సాక్షి, సికింద్రాబాద్: రెజిమెంటల్ బజార్లో విషాద ఘటన చోటుచేసుకుంది. బిల్డింగ్ మీద నుంచి భార్యభర్తలు జారిపడ్డారు. నిర్మాణంలో ఉన్న భవనం రెండో అంతస్తు నుంచి దంపతులు గిరి, లచ్చమ్మ ప్రమాదవశాత్తు పడిపోయారు.ఆసుపత్రి కి తరలిస్తుండగా భర్త గిరి మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న భార్య లచ్చమ్మ గాంధీకి తరలించారు. గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇదేరా ప్రేమంటే...! వైరల్ వీడియో
సిరిసంపద, ఈడూజోడు అన్నీఉన్నా కలిసి కాపురం చేయలేని జంటలెన్నో. కలసి ఉన్నా, సఖ్యత, ప్రేమ లేని సంసారాలు మరెన్నో నిత్యం మన కళ్ల ముందు కనబడుతూనే ఉంటాయి. అలాగే ఒకరికొకరు తోడు నీడగా, ప్రేమకు, ఆప్యాయతకు ప్రతిరూపంగా నలుగురికీ ఆదర్శంగా నిలిచే జంటలు కూడా చాలా ఉన్నాయి. తాజాగా అన్యోన్య దాంపత్యానికి, భార్యభర్తల అనుబంధానికి నిదర్శనంగా నిలిచిన ఒక జంట వీడియో నెటిజనులను ఆకర్షిస్తోంది. వినోద్మెహతా అనే ఎక్స్ యూజర్ ‘ఇదీ జీవితం.. ఈ ప్రేమ ఇలాగే ఉండాలి’ అంటూ షేర్చేసిన వీడియో నెట్టింట సందడి చేస్తోంది. భార్య, భర్త, వారికొక బిడ్డ అందమైన ఫ్యామిలీ. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే భర్తకు రెండు చేతులూ (కుడి చేయి మోచేతి కిందనించి లేదు) లేవు. ఇద్దరూ కలిసి ఒక హోటల్కు వెళ్లారు. బిడ్డను ఒడిలో పెట్టుకుని కూచుని ఉన్న భార్య మరో చేతితో అతనికి చపాతీ తినిపించింది. మరో విశేషం ఏమిటంటే..సగం కుడిచేత్తోనే చపాతిని గుండ్రంగా ఒడుపుగా చుట్టి కూరలో ముంచి భార్యకు తినిపించాడు. ఇది చూసిన నెటిజన్లు లవ్లీ, బ్యూటిఫుల్ అంటూ కమెంట్ చేశారు. డబ్బుకు పేదలే గానీ, ప్రేమకు కాదు, ఇదే కదా ప్రేమంటే అంటూ ఈ జంటపై ప్రశంసలు కురిపించారు. -
‘డిజిటల్ డివైడ్’.. కాపురాలు కూలుతున్నాయి
రిషి, ప్రియ అందమైన జంట. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. రోజంతా పని చేయడం, సాయంత్రాలు కలిసి చాలా చాలా కబుర్లు చెప్పుకోవడం, వారాంతాల్లో సినిమాకో, షికారుకో వెళ్లడం, అక్కడే డిన్నర్ చేసి ఇంటికి రావడం.. ఎలాంటి సమస్యలూ లేకుండా పర్ఫెక్ట్ కపుల్ లా ఉండేవారు. అలాంటిది.. అనూహ్యంగా వాళ్ల కాపురంలో చిచ్చు రగిలింది. ఎలా అంటే..ప్రియ చురుకైన వ్యక్తి, ఫ్రెండ్స్ తో చాలా సరదాగా ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా వారితో నిత్యం కనెక్ట్ అవుతుంది. వాళ్ల జీవితంలో జరిగే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది. తన విషయాలన్నీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ డేట్ చేస్తుంటుంది. అప్పుడప్పుడూ వాళ్లతో చాట్ చేస్తుంది. రిషికి సోషల్ మీడియా అంటే కొంచెం చిరాకు. అన్ని విషయాలూ సోషల్ మీడియాలో అప్ డేట్ చేయాల్సిన అవసరం లేదంటాడు. ఈ విషయం తరచూ ప్రియకు చెప్తుంటాడు. ఆమె ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో, ఆమెపై చిరాకు పడుతుంటాడు.కాలంతో పాటు అప్ డేట్ కావాలని, ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటంలో తప్పేమీ లేదని ప్రియ వాదిస్తుంటుంది. ఈ విషయమై అప్పుడప్పుడూ ఇద్దరిమధ్యా వాగ్వాదాలు జరుగుతుంటాయి. ఈ విధంగా వారి మధ్య "డిజిటల్ డివైడ్" ఏర్పడింది. వారి ఆన్ లైన్ అలవాట్లు, ఆఫ్ లైన్ జీవితంపై ప్రభావం చూపించడం మొదలైంది.అందమైన సినిమా...సోషల్ మీడియా అందమైన సినిమాలాంటిది. అందరూ తమ జీవితంలోని అందమైన, ఆకర్షణీయమైన భాగాన్ని మాత్రమే అక్కడ ప్రదర్శిస్తుంటారు. ప్రియ కూడా అంతే. తమ మధ్య ఎన్ని గొడవలున్నా, తాము సంతోషంగా గడిపిన ఫొటోలను చక్కగా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తుంది. అప్పుడప్పుడూ రీల్స్ కూడా. అయితే విషయం అక్కడితో ఆగలేదు. సోషల్ మీడియాలో తన ఫ్రెండ్స్ పోస్టులు, ఫొటోలు చూసి, వారి జీవితంతో పోల్చుకుంటుంది. తాను వాళ్లంత ఆనందంగా లేనని బాధపడుతుంది. వారిపై అసూయ పడుతుంది. అది ఆమె జీవితంలో అసంతృప్తికి దారితీసింది. ఇవన్నీ అప్పుడప్పుడూ ఆన్ లైన్లో తన పాత స్నేహితుడితో పంచుకుంటోంది.విశ్వాస ఉల్లంఘనప్రియ తన స్నేహితుడితో సుదీర్ఘంగా చాట్ చేస్తున్న విషయం రిషికి తెలిసింది. ఇదేంటని అడిగాడు. సరదాగా చాట్ చేస్తున్నానే తప్ప మరేమీ లేదని ప్రియ చెప్పింది. ‘‘నీ జీవితం ఆనందంగా లేదని అతనితో చెప్తున్నావ్ కదా. నాతో జీవితం అంత బాధాకరంగా ఉందా?’’ అని నిలదీశాడు. అలాంటిదేం లేదని, అవన్నీ కాజువల్ కాన్వర్జేషన్స్ అని ప్రియ చెప్పినా సంతృప్తి చెందలేదు. అతనితో చాటింగ్ మానేయమన్నాడు. తమ మధ్య ఏమీ లేనప్పుడు మానేయాల్సిన అవసరమేముందని ప్రియ వాదించింది. ‘‘నన్ను అనుమానిస్తున్నావా?’’ అని ప్రశ్నించింది. అలాంటిదేం లేదని, అయినా సరే మానేయమని రిషి కోరాడు. అలా అలా ఆ గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. విడాకులు తీసుకోవాలని అనుకునేంతవరకూ వెళ్లారు. ఈ విషయం ఒక క్లోజ్ ఫ్రెండ్ దృష్టికి వచ్చింది. చిన్న విషయాన్ని పెద్దది చేసుకున్నారంటూ ఆమె వారిద్దరికీ చీవాట్లు పెట్టింది. ఆమె సలహా మేరకు వారిద్దరూ కౌన్సెలింగ్ కు వచ్చారు.రెండువైపులా పదునున్న కత్తిసోషల్ మీడియా అనేది రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. అందులో ప్లస్, మైనస్ రెండూ ఉంటాయి. సోషల్ మీడియా రాకతో మనం దేశ విదేశాల్లోని బంధువులతో, స్నేహితులతో కనెక్షన్ ను కొనసాగించడం సులువైంది. పాత స్నేహితులు, కొలీగ్స్ తో మళ్లీ కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. మనం సాధించిన విజయాలను, అనుభవాలను అందరితో పంచుకోవచ్చు. జంటలు తమ జ్ఞాపకాలను పదిలపరచుకోవడం ద్వారా వారి బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు.ఆన్లైన్ కమ్యూనిటీలు, సపోర్ట్ గ్రూప్ల ద్వారా మన జీవితంలో ఎదురైన ఛాలెంజ్ లను ఎదుర్కునేందుకు సహాయం, సలహాలు పొందవచ్చు. పార్టనర్ పట్ల ప్రేమ, ఆప్యాయత, ప్రశంలను వ్యక్తం చేయడం ద్వారా బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు.మరోవైపు సోషల్ మీడియా వల్ల రిషి, ప్రియ జీవితాల్లో ఏర్పడినట్లే సవాళ్లు కూడా ఏర్పడవచ్చు. సోషల్ మీడియాలో పర్ఫెక్ట్ జీవితాలను మాత్రమే తరచూ చూడటం వల్ల అసూయ ఏర్పడుతుంది. తమ బంధం పట్ల అభద్రత, అసమర్థ భావాలకు దారితీస్తుంది. వ్యక్తిగత సమాచారాన్ని అతిగా పోస్ట్ చేయడం వల్ల ప్రైవసీ దెబ్బతింటుంది. తరచూ ఇతరులతో పోల్చుకోవడం వల్ల అవాస్తవిక అంచనాలకు దారితీస్తుంది. సున్నితమైన విషయాలను చర్చించేటప్పుడు మనం పంపే మెజేజెస్ ను తప్పుగా అర్థం చేసుకుంటే అపార్థాలకు దారితీస్తుంది. ఒక వ్యక్తితో రోజూ చాట్ చేయడం వల్ల, మీకు తెలియకుండానే వారితో ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడుతుంది. అది ఆఫ్ లైన్ జీవితంలోని భాగస్వామితో ఎమోషనల్ కనెక్షన్ ను తగ్గించవచ్చు.ఆన్ లైన్ ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడిన వ్యక్తితో తరచూ మాట్లాడటం ఎక్కడికైనా దారితీసే ప్రమాదం ఉంది.సోషల్ మీడియా బ్యాలెన్స్...రిషి, ప్రియలకు సోషల్ మీడియా వల్ల వచ్చే లాభనష్టాలను వివరించాక, దాన్నెలా బ్యాలెన్ చేసుకోవాలో నేర్పించాను. సోషల్ మీడియా అలవాట్లు, బౌండరీస్, భయాల గురించి ఒకరితో ఒకరి ఓపెన్ గా, నిజాయితీగా మాట్లాడుకునేలా ప్రోత్సహించాను. ఇద్దరూ కలిసి మాట్లాడుకుని ఏది పోస్ట్ చేయాలి, ఏది చేయకూడదనే విషయంపై ఒక అంగీకారానికి వచ్చేలా ఫెసిలిటేట్ చేశాను. తన ప్రయాణాలు లేదా అనుభవాల గురించి పోస్ట్ చేసేటప్పుడు రిషి భావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, అదెందుకు అవసరమో ప్రియకు అర్థమయ్యేలా వివరించాను. ఆన్లైన్ లో కనపడేదంతా నిజం కాదని, అందువల్ల పోల్చుకోవడం మానేసి, తమ బంధాన్ని బలపరచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించాను. అందుకు కావాల్సిన ఎక్సర్ సైజ్ లు చేయించాను. అప్పడప్పుడూ సోషల్ మీడియానుంచి పూర్తిగా డిస్ కనెక్ట్ అయ్యి పార్టనర్ తో గడపడం అవసరమని ప్రియకు అర్థమయ్యేలా చెప్పాను. అలా ఐదు సెషన్లలో రిషి ప్రియల మధ్య ఉన్న డిజిటల్ డివైడ్ ను పూడ్చేసి, వారిద్దరూ తమ జీవితాలను సంతోషంగా సాగించేందుకు అవసరమైన స్ట్రాటజీలను అందించాను.-సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066psy.vishesh@gmail.com -
పెళ్లైన 3 నిమిషాలకే విడాకులు.. కారణం ఏంటో తెలుసా?
పెళ్లంటే నూరేళ్ల బంధం.. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి.. పెళ్లి కొత్త జీవితానికి నాంది.. పెళ్లి అనేక మధురానుభూతులకు, జ్ఞాపకాలకు వేదిక.. ఇలాంటి పదాలన్నీ తరుచూ వింటుంటాం.. ఒకప్పుడు పెళ్లంటే గౌరవం, నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దంపతుల మధ్య అపార్థాలు, చిన్న సమస్యలనే పెద్దదిగా చూడటం.. ఇలా అనేక కారణాలతో పెళ్లైన వెంటనే విడాకుల బాట పడుతున్నారు.తాజాగా ఓ జంట వివాహం జరిగిన మూడు అంటే మూడు నిమిషాలకే విడాకులు తీసుకుంది. న్యాయమూర్తి సైతం ఆ జంటకు విడాకులు మంజూరు చేశాడు. వినడానికి కాస్తా ఇబ్బందికరంగానే ఉన్నప్పటికీ ఈ ఘటన కువైట్ దేశంలో జరిగింది. అయితే ఈ సంఘటన 2019 జరగ్గా.. తాజాగా మరోసారి వైరల్గా మారింది. కువైట్లో వధూవరులు, తమ వివాహ రిజిస్ట్రేషన్ కోసం న్యాయమూర్తి ఎదుట సంతకాలు పెట్టేందుకు వెళ్లారు. ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం కోర్టు నుంచి బయటకు వస్తున్న వేళ, వధువు పొరపాటున కాలు జారి కింద పడిపోయింది. దీంతో వెంటనే పక్కనే ఉన్న వరుడు ఆమెను తెలివి తక్కువదానా అంటూ పరుష పదజాలానికి దిగాడు.తనకు సాయం చేయాల్సింది పోయి, పరువు తీశావంటూ అవమానించడంతో వధువు ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనితో తన జీవితం సాఫీగా ఉండదని భావించిన ఆమె, ఒక్కసారిగా జడ్జి దగ్గరకు వెళ్లి, విషయం చెప్పి, విడాకులు కావాలని అడిగింది. దీని న్యాయమూర్తి అంగీకరించి వెంటనే విడాకులు మంజూరు చేేశాడు.అయితే పెళ్లైన మూడు నిమిషాలకే ఆ జంట విడాకులు తీసుకోవడంతో.. దేశ చరిత్రలో అతి తక్కువ సమయం వివాహంగా రికార్డులకెక్కింది. ఇదిలా ఉండగా గతంలో దుబాయ్లో ఓ జంట పెళ్లయన 15 నిమిషాల వ్యవధిలో విడాకులకు దరఖాస్తు చేసి, మంజూరు చేయించుకుంది. -
పార్టనర్కి బీపీ ఉంటే..వచ్చే అవకాశం ఉందా..?
బీపీ, ఘుగర్ వంటి వ్యాధులు ఒకరి నుంచి మరొకరకి సంక్రమించే వ్యాధులు కాకపోయినప్పటికీ భార్యభర్తలో ఎవరో ఒకరికి ఉంటే మరొకరికి ఆటోమెటిక్గా వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. భాగస్వామికి గనుకు రక్తపోటు ఉంటే..సదరు వ్యక్తిని కూడా కచ్చితంగా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. నిపుణులు జరిపిన తాజా అధ్యయనాల్లో ఇది నిర్థారణ అయ్యింది కూడా. చైనా, ఇంగ్లండ్, భారత్, అమెరికా వంటి దేశాల్లోని జంటలపై చేసిన పరిశోధనలో అధిక బిపీ ఉన్న పురుషులను చేసుకున్న స్త్రీలు కూడా రక్తపోటుకి గురవ్వుతున్నట్లు గమనించారు. భాగస్వామి నుంచి రక్తపోటు నేరుగా సంక్రమించకపోయినా పరోక్షంగా ఇది వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. నిజానికి ఈ రక్తపోటు గుండె జబ్బులు, స్ట్రోక్తో సహా ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇది తీసుకునే ఆహారం, జీవనశైలి, ఒత్తిడి తదితర కారకాలచే ప్రభావితమవుతుందని వివరించారు నిపుణులు. భాగస్వామి ఎదుర్కొంటున్న రక్తపోటు, ఒత్తిడి అనేవి వారితో కలిసి జీవిస్తున్నవారిని కూడా ప్రభావితం చేస్తుంది. వారికేమవుతుందన్న ఆందోళన వారిని ఒత్తిడికి గురయ్యేలా చేస్తుంది. దీన్ని 'సంరక్షకుల ఒత్తిడిగా' పేర్కొనవచ్చని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఎంత సేపు తమ భాగస్వామికి ఏమవుతుందనే అప్రమత్తత వారిలో తెలియని ఒత్తిడిని కలుగ చేసి, ఆందోళనకు గురి అయ్యేలా చేస్తుంది. దీంతో క్రమేణ వారు కూడా ఈ బీపీ బారినపడతారని వివరించారు. అందుకు దారితీసే కారణాలు..జీవనశైలి..జంటలు తరుచుగా జీవనశైలి అలవాట్లను పంచుకుంటారు. ఇవి రక్తపోటులో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇద్దరిలో ఎవరో ఒకరు అనారోగ్యకరమైన జీవనశైలి ఫాలో అయితే అది మరొకరిని ఆటోమేటిగ్గా ప్రభావితం చేస్తుంది. భావోద్వేగ కోణం..తనకు ఇష్టమైన వ్యక్తి ఆరోగ్యం గురించి ఆందోళన చెందడం భావోద్వేగ నష్టాన్ని కలిగిస్తుంది. ఈ ఆందోళన ఒత్తడికి దారితీసి రక్తపోటు వచ్చేందుకు కారణమవుతుంది. అంతేగాదు భాగస్వామి ఆరోగ్యం పట్ల ఆందోళన కారణంగా చాలా మానసిక ఒత్తిడికి లోనవ్వుతారు. దీని వల్ల కలిగే అపార్థాలు లేదా సంఘర్షణలు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్కి అంతరాయం ఏర్పడి భావోద్వేగానికి గురవ్వడం జరుగుతుంది. ఒకరకంగా మానసికంగా కుంగిబాటుకు గురయ్యి వారు కూడా ఈ దీర్ఘకాలిక వ్యాధి బారిన పడతారని చెబుతున్నారు నిపుణులు.ఏం చేయాలంటే..ఆరోగ్యకరమైన రీతీలో రక్తపోటుని మెరుగ్గా నిర్వహించాలంటే జంటలు పాటించాల్సినవి ఇవే..రోజూవారిగా తీసుకోవాల్సిన పరిమాణంలో ఉప్పు తీసుకోవడం, సమతుల్య ఆహారాన్ని నిర్వహించడంశారీరక కార్యకలాపాల్లో కలిసి పనిచేయడంధూమపానం, మధ్యపానం మానుకోవడంఅనారోగ్యకరమైన ఆహారాన్ని తినకుండా ఉండటంయోగా, ధ్యానం కలిసి సాధన చేయడంపుస్తకాలు చదవడం లేదా కలిసి సంగీతం వినడంఆరోగ్యకరమైన జీవనశైలితో ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటే ఈ రక్తపోటు నుంచి సులభంగా బయటపడొచ్చు. ఆరోగ్యంగా నిండు నూరేళ్ల జీవితాన్ని ఆస్వాధించగలుగుతారు భార్యభర్తలు.(చదవండి: ఉల్లిపాయలు తీసుకోకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయంటే..!) -
పోలీస్స్టేషన్లో టీడీపీ గూండాగిరీ
ఆళ్లగడ్డ: అధికారం అండ చూసుకుని టీడీపీ శ్రేణులు పేట్రేగిపోతున్నాయి. పోలీసులు, పోలీస్స్టేషన్లన్నా లెక్కే లేకుండా పోయింది. పోలీస్స్టేషన్లో ఉన్న నవ దంపతులపై సాక్షాత్తు సీఐ ఎదురుగానే దాడికి దిగారు. ప్రేమికుడిని బయటకు లాక్కొచ్చి చితకబాదారు. పోలీసుల సమక్షంలోనే ఇష్టమొచ్చినట్లు కొట్టారు. ఈ ఘటన శనివారం రాత్రి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. మండల కేంద్రం చాగలమర్రికి చెందిన సాయి అనే యువతి, వైఎస్సార్ జిల్లా మైదుకూరు పట్టణానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.పెళ్లి చేసుకుంటామని కోరగా, యువతి కుటుంబ సభ్యులు అడ్డు చెప్పారు. ఈ క్రమంలో వారం క్రితం ఇద్దరూ ఇంట్లో చెప్పకుండా బయటకొచ్చి పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తమ కుటుంబ సభ్యుల నుంచి తనకు, తన భర్తకు ప్రాణహాని ఉందని రెండు రోజుల క్రితం యువతి చాగలమర్రి పోలీస్స్టేషన్ను ఆశ్రయించింది. అక్కడి ఎస్ఐ.. ఇరు కుటుంబాల వారిని పిలిపించి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో సీఐ వద్దకు వెళ్లి మాట్లాడుకోవాలని సూచించారు. దీంతో శనివారం మధ్యాహ్నం నవ దంపతులు స్థానిక సర్కిల్ కార్యాలయం వద్దకు వచ్చారు.యువతి కుటుంబ సభ్యులను పిలిపించి సీఐ మాట్లాడారు. కుటుంబ సభ్యుల వెంట వెళ్లనని, భర్త వెంటే ఉంటానని యువతి తెగేసి చెప్పింది. ఇద్దరూ మేజర్లు కావడంతో వారి ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకునే హక్కు ఉందని, వారికి ఎటువంటి హాని తల పెట్టవద్దని సీఐ చెప్పారు. దీంతో యువతి సోదరుడు పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకుని అక్కడున్న వారికి విషయం చెప్పాడు. రెండు కార్లలో మనుషులను వెంటబెట్టుకుని సర్కిల్ కార్యాలయం చేరుకున్నాడు.వచ్చీ రాగానే టీడీపీ కార్యకర్తలంతా పోలీసులు చూస్తుండగానే యువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దెబ్బలు తట్టుకోలేక యువకుడు సీఐ గదిలోకి వెళ్లి దాక్కున్నప్పటికీ, బయటకు ఈడ్చుకు వచ్చి కొట్టారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ లెక్క చేయలేదు. అక్కడి పరిస్థితి చూసి.. యువకుడికి తోడుగా వచ్చిన బంధువులు, స్నేహితులు రోడ్డుపైకి పరుగులు తీసి చీకట్లో దాక్కున్నారు. ఫైర్ ఓపెన్ చేసేందుకు యత్నించిన సీఐ ప్రేమికులపై దాడి చేస్తున్న టీడీపీ శ్రేణులను పోలీసులు, సీఐ అడ్డుకుంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు ఏమాత్రం లెక్క చేయలేదు. పోలీసులపై తిరగబడే పరిస్థితి రావడంతో సీఐ హనుమంత నాయక్ ఫైర్ ఓపెన్ చేస్తానని రివాల్వర్ గురిపెట్టి హెచ్చరించారు. దీంతో వెనక్కు తగ్గిన వారు అక్కడి నుంచి బయటకు వచ్చారు. వారు వచ్చిన కార్ల దగ్గర నిల్చొని ‘నువ్వు మా కార్యాలయం దగ్గరకు వస్తావు కదా.. అక్కడికి రా.. అప్పుడు నీ కథ ఉంటుంది’ అని బహిరంగంగా సీఐ వైపు వేలు చూపిస్తూ »ñబెదిరించినట్లు తెలిసింది.ఈ నేపథ్యంలో నవ దంపతులను పోలీస్ వాహనంలో అక్కడి నుంచి తరలించారు. మనస్తాపానికి గురైన సీఐ, ఇతర అధికారులు విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. సీసీ కెమెరాల్లోని పుటేజీ తెప్పించుకుని పరిశీలించిన ఎస్పీ.. విషయాన్ని రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై సీఐ మాట్లాడుతూ.. ఇరు కుటుంబాలను కూర్చోబెట్టి కౌన్సెలింగ్ ఇస్తుండగా, ఇరు వర్గాలు ఘర్షణ పడటంతో అందరినీ అరిచి అక్కడి నుంచి పంపించామన్నారు. -
విడాకుల డబ్బా లొల్లి
-
అమెజాన్లో ఆర్డర్.. పార్శిల్ నుంచి బుసలు కొడుతూ బయటకు వచ్చిన పాము
బెంగళూరు : ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. వినియోగదారులకు కావాల్సిన వస్తువుల్ని అందించే విషయంలో ఈకామర్స్ కంపెనీలు ట్రెండ్ను మార్చినట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు స్మార్ట్ఫోన్ బదులు సబ్బుబిళ్ల, ఇటుక బిళ్లలు పంపించడం రివాజు. కానీ ఇప్పుడు పాముల్ని డెలివరీ చేస్తున్నాయని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బెంగళూరులోని సర్జాపూర్కు చెందిన భార్యభర్తలు ఐటీ ఉద్యోగులు. కాలక్షేపం కోసం ఇంట్లో వీడియోగేమ్ ఆడుకునే ఎక్స్బాక్స్ను అమెజాన్ కంపెనీ యాప్లో ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ రానే వచ్చింది. ఎంతో ఉత్సాహంతో సదరు కంపెనీ నుంచి వచ్చిన పార్శిల్ ఓపెన్ చేసే ప్రయత్నించారు. కానీ దంపతుల్ని షాక్కి గురి చేస్తూ పార్శిల్లో నుంచి ఓ పాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. ఈ ఊహించని పరిణామంతో కంగుతిన్న టెక్కీలు తమకు ఎదురైన చేదు అనుభవాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో ‘రెండు రోజుల క్రితం ఎక్స్బాక్స్ కంట్రోలర్ను ఆర్డర్పెట్టాం. ఆ ఆర్డర్ వచ్చింది. కానీ దాన్ని ఓపెన్ చేస్తే ఓపాము బయటపడింది. అందుకు డెలివరీ బాయే సాక్ష్యం అని తెలిపారు. అదృష్టవశాత్తూ పాము ప్యాకేజింగ్ టేపుకు ఇరుక్కుపోయింది. ప్రమాదం అయినప్పటికీ తాము చెబుతున్నది నిజమా? కాదా? అని తెలుసుకునేందుకు అమెజాన్ ప్రతినిధులు మమ్మల్ని 2 గంటల పాటు హోల్డ్లో ఉంచారని వాపోయారు. ఆ తర్వాతే స్పందించారని అన్నారు. స్పందించిన అమెజాన్కస్టమర్ వీడియోపై స్పందిస్తూ, కంపెనీ ట్వీట్ చేసింది.మీకు కలిగిన అసౌకర్యానికి మేం చింతిస్తున్నాం. వివరాల్ని పూర్తిగా పరిశీలించిన తగిన న్యాయం చేస్తాం అని అమెజాన్ ప్రతినిధులు స్పందించారు. -
సూపర్ కపుల్: కనులు కనులను దోచాయంటే అంటున్న తుషార్- నభా.. ఫొటోలు