Top Stories
ప్రధాన వార్తలు
ఏపీలో టీడీపీ తాలిబన్లు
అటు కౌంటింగ్ పూర్తి కాగానే.. ఇటు అటాకింగ్ మొదలుపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులు, ఆఖరికి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండాలు మోసిన వాళ్లను లక్ష్యంగా చేసుకుని టీడీపీ మూకుమ్మడి దాడులు చేస్తోంది. శ్రీకాకుళం టూ చిత్తూరు వరకు ఈ దమనకాండ కొనసాగుతోంది. రాజకీయ ప్రతీకారంతో.. రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మారుస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల వైఎస్సార్సీపీ లక్ష్యంగా టీడీపీ శ్రేణులు దాడులకు దిగుతున్నాయి. కత్తులతో, కర్రలతో పచ్చ మూక రెచ్చిపోతోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ దాడులను పోలీసులు చూసి చూడనట్లు వదిలేస్తుండడం మరింత విమర్శలకు తావిస్తోంది ఇప్పుడు.➡️ ఏలూరు జిల్లా నూజివీడులో వైఎస్సార్సీపీ మున్సిపల్ కౌన్సిలర్ నడుకుదుటి గిరీష్పై టీడీపీ కార్యకర్తలు కత్తులతో దాడికి దిగారు. స్థానికులు ఆయన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడి సమయంలో అక్కడే ఉన్న పోలీసులు కనీసం అడ్డుకునే యత్నం కూడా చేయలేదు.➡️అనంతపురం కళ్యాణదుర్గంలో వైఎస్సార్ సీపీ నేత ఉమామహేశ్వర నాయుడు ఇంటిపై టీడీపీ నేతల దాడికి దిగారు. ఈ దాడిలో రెండు కార్లు, ఎన్నికల ప్రచార వాహనం ధ్వంసం అయ్యాయి. ఇంటి కిటికి అద్దాలు పగలకొట్టారు. ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులపై టీడీపీ నేతల రౌడీయిజం ప్రదర్శించారు. ఏకంగా కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాస్ ను బెదిరించారు. దీంతో.. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు వర్గీయులపై పోలీసులకు ఉమామహేశ్వరనాయుడు ఫిర్యాదు చేశారు.➡️కర్నూలు జిల్లా ఆదోని మండలం అలసంద గుత్తిలో టీడీపీ శ్రేణులు వైఎస్సార్సీపీ శ్రేణులపై రాళ్లు విసిరాయి. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డవాళ్లలో స్థానిక ఎస్సై కూడా ఉన్నట్లు తెలుస్తోంది.➡️నంద్యాల బనగానపల్లె పట్టణం GM టాకీస్ వద్ద కొండపేట వైఎస్సార్సీపీ కార్యకర్త అబ్దుల్ సుకూర్ పై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. తలకు బలమైన గాయాలు కావడంతో ఆయన్ని బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.➡️కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో వైఎస్సార్సీపీ నేత కొమ్మా కోట్లు ఇంటిపై గత అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. అపార్ట్మెంట్ కింద ఉన్న ఆయన కారు అద్దాలు ధ్వంసం చేశారు. ➡️చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పై కొనసాగుతున్న టీడిపి నేతలు దాడులు. చిత్తూరు నగరంలోని బోడిగుట్ట చెందిన ఖాధర్ను సాయంత్రం 6 గంటలకు కిడ్నాప్ చేసిన టీడీపీ జనసేన కార్యకర్తలు. బీరు బాటిల్ - రాడ్ తో దాడి చేసిన వైనం.ప్రభుత్వ ఆస్తులపైనా..కేవలం వైఎస్సార్సీపీ శ్రేణుల్ని, వైఎస్సార్సీపీ జెండా.. దిమ్మెల్ని మాత్రమే కాదు.. జగన్ సంక్షేమ పాలనకు కేంద్రాలుగా నిలిచిన సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, స్కూల్స్.. ఇలా దేని వదలకుండా టీడీపీ శ్రేణులు దాడులకు తెగపడుతున్నాయి. ➡️గుంటూరు దుగ్గిరాల మండలం ఈమని గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రంపై టీడీపీ నేతలకు దాడికి దిగారు. బోర్డులు తొలగించి ఫర్నిచర్ ధ్వంసం చేశారు.➡️పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రంపై దాడి చేసిన టీడీపీ కార్యకర్తలు.. సచివాలయంలోని వైయస్ జగన్ చిత్రపటాన్ని ధ్వంసం చేశారు.➡️ నంద్యాల అవుకు మండలం సంఘపట్నం గ్రామంలో టీడీపీ కార్యకర్తలు హల్ చల్ చేశారు. ప్రభుత్వ గ్రామ సచివాలయం భవన ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచిన బీసీ జనార్దన్ రెడ్డి సమీప బంధువు I.V పక్కిరారెడ్డి సొంత గ్రామం ఇది.వలంటీర్లను వదలడం లేదుజగన్ ఆలోచనల నుంచి పుట్టి.. ప్రజల కోసం ఐదేళ్ల పాటు నిర్విరామంగా పని చేసిన వలంటీర్ వ్యవస్థను దెబ్బ తీసేందుకు టీడీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. వాళ్లపై ప్రతీకార చర్యలకు దిగుతోంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ నేతలు అరాచకాలకు దిగారు. శ్రీకాళహస్తి రూరల్ మండలం వాగివేడు హరిజన వాడ లో వలంటీర్లు పృథ్వీ , మహేశ్వరి ఇళ్లపై దాడులు చేస్తున్నారు. మూడు రోజులు నుంచి వాళ్లను ఇంటినుంచి బయటకు వెళ్ళకుండా అడ్డుకుంటున్నారు. వాళ్ల ఇంటి ముందు రోడ్డుపై కంచె వేశారు. ఇది తమ దృష్టికి వచ్చినా.. స్థానిక పోలీసులు కనీసం పట్టించుకోవడం లేదు.ఏం లేదు... ఉరికే ఆ కారు మీద YCP అని రాసి ఉంది అంట అంతే .. ఆ కారులో ఉన్నది ఎవరో కూడా వాళ్ళకి తేలియదు.. తెలుగుదేశం జనసేన చెప్పిన డెవలప్మెంట్ వచ్చేసింది .. #tdp_jsp_gundaraj pic.twitter.com/6681BZajph— Surya Bhagath (@SuryaBhagat7) June 6, 2024ఐదేళ్లు.. ప్రశాంతంగా ఉన్న ఏపీలో ఇప్పుడు అల్లకల్లోం రేగుతోంది. శాంతిభద్రతలు అదుపు తప్పే దిశగా పయనిస్తున్నాయి. రాష్ట్రంలో ఫలితాలు వెలువడ్డాక దాడులు జరగొచ్చని, కౌంటింగ్ జరిగాక కూడా అప్రమత్తంగా ఉండాలన్న నిఘా వర్గాలు పోలీసులను ఇది వరకే హెచ్చరించాయి. అయినా కూడా పోలీసులు ఆ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోకపోవడం.. టీడీపీ శ్రేణుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తుండడం .. ఏపీ అంతటా కనిపిస్తున్నాయి.
పార్టీ శ్రేణులకు అండగా నిలవండి: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ప్రజలకు మంచి చేశాం.. కచ్చితంగా పార్టీ ఫునర్వైభవం సాధించి తీరుతుందని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్ద నమ్మకం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ నేతలు. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు, పోటీచేసిన అభ్యర్థులు గురువారం సాయంత్రం తాడేపల్లికి వెళ్లి వైఎస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ దాడుల గురించి నేతలు ప్రస్తావించగా.. పార్టీ తరఫున న్యాయపరమైన చర్యలకు వెళ్తున్నామని, ఈ టైంలో పార్ట శ్రేణులకు అండగా నిలవాలంటూ నేతలకు వైఎస్ జగన్ సూచించారు.వైఎస్ జగన్తో పార్టీ నేతలు.. ‘‘ప్రజలకు మంచి చేశాం, కచ్చితంగా పార్టీ పునర్ వైభవం సాధిస్తుందనే నమ్మకం మాకుంది. రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో జీవన ప్రమాణాలు పెంచడానికి మీరు(జగన్ను ఉద్దేశించి) చేసిన విశేష కృషి కచ్చితంగా ప్రజల మనసుల్లో నిలిచిపోయింది. వ్యవసాయం, విద్య, వైద్యం తదితర రంగాల్లో తీసుకొచ్చిన గణనీయమైన మార్పులు ప్రజల జీవితాలను మార్చేదిశగా గొప్ప అడుగులుగా నిలిచిపోతాయి. .. ఈవీఎం మేనేజ్మెంట్ అనుమానాలు, ఈసీ–కొంతమంది పోలీసు అధికారుల కుట్రల నేపథ్యంలో కూడా సీట్లు గణనీయంగా తగ్గిపోయాయి. అయినా కూడా 40శాతం ఓటింగ్ వచ్చిందంటే సంక్షేమ పథకాలే కారణం. గడచిన ఐదేళ్లలో అమలు చేసిన పథకాలు, చేసిన అభివృద్ధి ప్రజల కళ్లముందే ఉన్నాయి.. ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్తాం. గడచిన ఐదేళ్లు సుపరిపాలనకు ఒక గీటురాయిలా నిలిచిపోతుంది. .. కొన్నిరోజుల్లో రానున్న కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అమలుపై కచ్చితంగా ప్రజల దృష్టిఉంటుంది. ఈ ఐదేళ్లపాలనతో కచ్చితంగా బేరీజు వేసుకుంటారు. మాటమీద నిలబడి, ఇచ్చిన హామీలను నెరవేర్చిన విశ్వసనీయ పార్టీగా వైఎస్సార్సీపీకి ప్రజల మనసులో చోటు ఉంది. పార్టీ పునర్వైభవానికి గట్టి పునాది కూడా ఇదే. .. ఎన్నికలు జరిగిన తీరుపై అనే సందేహాలున్నాయి. మన పార్టీ అనుకూల గ్రామాల్లో కూడా ఓట్లు రాకపోవడంపైనా అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంల వ్యవహారంపై ఒక పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. కూటమి ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో అక్రమాలకు తెర తీశారు. ఎన్నికల సంఘం కూటమి అనుకూల అధికారులు, పోలీసు అధికారుల మధ్య కుమ్మక్కు నడిచింది. వైఎస్సార్సీపీ నాయకుల్ని, కార్యకర్తలను ఉద్దేశ పూర్వకంగా భయభ్రాంతులకు గురిచేశారు. పోలింగ్ సమయంలో భయానక పరిస్థితులు సృష్టించారు’’ అని నేతలు పార్టీ అధినేత వద్ద ప్రస్తావించారు.రాష్ట్రవ్యాప్తంగా దాడులు:కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ దాడులపై పార్టీ నాయకులు, వైఎస్ జగన్ వద్ద తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్మాదంతో స్వైరవిహారం చేస్తున్నారని, ఎక్కడికక్కడ దాడులకు దిగుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ నాయకులు, కార్యకర్తల ప్రాణాలకు హాని తలపెట్టడమే కాకుండా ఆస్తుల విధ్వంసాలకు దిగుతున్నారు. పార్టీ నాయకులతో వైఎస్ జగన్.. పార్టీ శ్రేణులకు అండగా నిలవండి. వారికి తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి. న్యాయపరంగా తీసుకోవాల్సిన వాటిపై పార్టీపరంగా చర్యలు తీసుకుంటున్నాం. గవర్నర్కు కూడా పార్టీ తరఫున ఫిర్యాదు చేశాం.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
కాంగ్రెస్కు ఊపు... మోదీకి మేలుకొలుపు
భారత్ను ‘కాంగ్రెస్ ముక్త్’ చేస్తానన్న మోదీ తన విధానాల ద్వారా అదే కాంగ్రెస్ పునరుద్ధరణకు తన వంతు కృషి చేశారు. ఫలితంగా బీజేపీ మెజారిటీ తగ్గింది. కేంద్రంలో సంకీర్ణం అనివార్యమైంది. ఎన్డీయే ప్రభుత్వ సుస్థిరతకు బలహీనపడిన మోదీ ఏం చేస్తారు? సంకీర్ణాల కంటే ఒకే పార్టీ మెజారిటీ ప్రభుత్వాలే మంచివనే అభిప్రాయం ఉంది. వాస్తవాలు దీనికి భిన్నంగా ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి, పేదరికం తగ్గింపు, ఉపాధి పెరుగుదల వంటి అంశాల పరంగా దేశానికి అత్యుత్తమ కాలం 1991 నుండి 2014 వరకు గల పావు శతాబ్దం. పీవీ నరసింహరావు, వాజ్పేయి, మన్మోహన్సింగ్ లాంటి పెద్దమనుషులు అప్పటి సంకీర్ణ ప్రభుత్వాలకు నాయకత్వం వహించారు. మోదీ వారిలా వ్యవహరించగలరా?అమెరికా పౌరహక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్కు ఒక కల ఉండేది. చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్కు ఒక కల ఉంది. ఈ ఏడాది లోక్సభ ఎన్నికల ప్రచారానికి వెళుతున్నప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఒక కల ఉండింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 400కు పైగా సీట్లు వస్తాయని ఆయన ఊహించారు. ఈ వారం ఆ కల చెదిరిపోయింది. 2014లో బీజేపీని పునరుద్ధరించడం మోదీ చేసిన ప్రధాన రాజకీయ తోడ్పాటు. కాగా, 2024లో ఆయన చేసిన అతిపెద్ద రాజకీయ దోహదం భారత జాతీయ కాంగ్రెస్ పునరుద్ధరణ.నిజానికి, రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’తో తన సొంత గుర్తింపులోకి వచ్చారు. మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీకి పరిణతి చెందిన, వివేకవంతమైన నాయకత్వాన్ని అందించారు. అయితే మోదీ తన రెండవ పాలనా కాలంలో చేపట్టిన విధానాలు, విభజన రాజకీయాలు, అథమ స్థాయి ఎన్నికల ప్రచార సరళి అనేవి టోకున కాంగ్రెస్ అదృష్టాన్ని పునరుద్ధరించడంలో తమ పాత్రను పోషించాయి. భారత్ను ‘కాంగ్రెస్ ముక్త్’గా మారుస్తానని మోదీ 2014 ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 2024 ఎన్నికల ముగింపులో, అదే కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరణలో తన వంతు కృషి చేసినందుకు మోదీకి ఆ పార్టీ కృతజ్ఞతలు చెప్పాలి. ఒక దశాబ్ద కాలంగా వెనుకబడి పోయిన దశ నుండి యవ్వన, శక్తిమంతమైన కాంగ్రెస్ ఉద్భవించింది.మోదీ మూడోసారి ప్రధానిగా చరిత్ర సృష్టించబోతున్నారు. ప్రశ్న ఏమిటంటే, ఎన్డీయే ప్రభుత్వ సుస్థిరతకు బలహీనపడిన మోదీ ఏం చేస్తారు? మరీ ముఖ్యంగా, నారా చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ వంటి మిత్రపక్షాలపై ఆధారపడబోతున్న ఎన్డీయే ప్రభుత్వ విధానం ఎలా ఉండబోతోంది? మరోసారి ప్రభుత్వ స్థాపన కోసం మోదీ తన ‘హామీలు’ ఇచ్చారు. అధికారం కోసం మోదీ పక్షాన ఉన్నప్పటికీ చంద్రబాబు గానీ, నితీష్గానీ బీజేపీ ఎజెండా వైపు సైద్ధాంతికంగా మొగ్గు చూపడం లేదు. మరి ఈ కలయిక పనిచేస్తుందా?2024 జూన్ చాలావరకు 2004 మే లాగా అనిపిస్తుంది. ప్రతి రాజకీయ విశ్లేషకుడు, ఎన్నికల నిపుణుడు నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో ఎన్డీయే విజయం సాధిస్తుందని అంచనా వేశారు. కానీ ఫలితాలు రాగానే స్టాక్ మార్కెట్ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. కొన్ని గంటల్లోనే, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్(యూపీఏ) అనే కొత్త కూటమికి శంకుస్థాపన జరిగింది. లెఫ్ట్ ఫ్రంట్ బయటి మద్దతుతో మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అమిత్ షా... ప్రమోద్ మహాజన్ కావచ్చు గానీ మోదీ మాత్రం వాజ్పేయి కాదు. వాజ్పేయి వెనక్కి తగ్గారు. కానీ మోదీ, షా వెనక్కి తగ్గుతారా? మొత్తానికి ఎన్నికల ప్రచారం ‘మోదీ కి గ్యారంటీ’ గురించే. ఆయన హామీలను నిలబెట్టడానికి ఎన్డీయే ప్రభుత్వం సుముఖంగా ఉంటుందా?చంద్రబాబు, నితీష్లపై దేశం ఒక ముఖ్యమైన బాధ్యతను మోపింది. ఇద్దరూ చిత్తశుద్ధి లేదా దార్శనిక దృష్టి గల వ్యక్తులుగా నిరూపితం కాలేదు. ఇద్దరూ స్వప్రయోజనాలు, అధికారం కోసం తహతహలాడుతున్నారు. అయినప్పటికీ, సాధారణ వ్యక్తుల నుండి హీరోయిజాన్ని డిమాండ్ చేసే విచిత్రమైన మార్గం చరిత్రకు ఉంది. విధి, రాజకీయాలు పీవీ నరసింహారావుకు ఎలాంటి పాత్రను కేటాయించడం జరిగిందో గుర్తుంచుకోండి. రాజకీయ విరమణ అంచున, ఆధ్యాత్మిక మార్గం పట్టడానికి తన బ్యాగులను సర్దుకుంటూన్న పీవీ నరసింహారావును ప్రధానమంత్రిని చేయడమే కాకుండా, దేశ విధిని మార్చే నిర్ణయాలను తీసుకునే బాధ్యతను కూడా చేపట్టేలా చేశాయి. మోదీ, షాల ఆధిపత్యంలో, నియంత్రణలో ఉన్న ప్రభుత్వానికి జూనియర్ భాగస్వాములుగా ఉన్న నితీష్, చంద్రబాబు అలాంటి పాత్ర పోషించగలరా? కష్టమే మరి. ఎందుకంటే ప్రధానమంత్రి ఆదేశం మేరకు అన్ని సంస్థలు ప్రతిరోజూ వారిని అదుపులో ఉంచుతాయి. మోదీ తన జీవిత పర్యంతం కఠినమైన రాజకీయ బేరసారాలను సాగిస్తూ వచ్చారు. సుష్మా స్వరాజ్ను పక్కన పెట్టి, అరుణ్ జైట్లీని తన విశ్వాసంలోకి తీసుకుని, లాల్ కృష్ణ అద్వానీ నుంచి బీజేపీని ఆయన ఎలా లాక్కున్నారో గుర్తు చేసుకోండి. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే... చంద్రబాబు, నితీష్ అలాంటి బేరాలు చేసేంత గట్టిగా ఉండగలరా? సంకీర్ణ ప్రభుత్వాల కంటే ఒకే పార్టీ మెజారిటీ ప్రభుత్వాలే మంచివి అని ఒక సాధారణ అభిప్రాయం ఉంది. కానీ వాస్తవాలు దీనికి భిన్నంగా ఉన్నాయి. అనేక విధాలుగా, స్వాతంత్య్రానంతర మొదటి దశాబ్దం తర్వాత... ఆర్థికాభివృద్ధి, పేదరికం తగ్గింపు, ఉపాధి పెరుగుదల, ప్రపంచ ప్రొఫైల్ మరియు దేశీయ సామాజిక స్థిరత్వం వంటి అంశాల పరంగా దేశానికి అత్యుత్తమ కాలం 1991 నుండి 2014 వరకు గల పావు శతాబ్దం. ముగ్గురు మేధావులు, అందరినీ కలుపుకొనిపోయే వివేకవంతులైన పెద్దమనుషులు భారతదేశ ప్రధానులు అయ్యారు. పీవీ నరసింహా రావు, అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్ అప్పటి సంకీర్ణ ప్రభుత్వాలకు నాయకత్వం వహించారు. పీవీ విషయంలో కాంగ్రెస్ పార్టీయే స్వయంగా ఒక సంకీర్ణంలా పనిచేసింది. వాజ్పేయి, మన్మోహన్ స్పష్టమైన సంకీర్ణాలకు నాయకత్వం వహించారు. ఖర్గే వంటి మరో ప్రసన్నమైన పెద్దమనిషి నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే, అది సుస్థిరతతో పాటు వివేకవంతమైన విధానాలను అందించదని నమ్మడానికి ఎటువంటి కారణమూ లేదు.మోదీ వ్యక్తిత్వం, భావజాలం, ఆకాంక్షల దృష్ట్యా ఆయన మూడవసారి తన అధికార అన్వేషణలో అన్ని ప్రయత్నాలూ చేస్తారు. సంకీర్ణానికి ఆయన ఎలాంటి ప్రధానమంత్రి అవుతారో చూడాలి. తాను ఎలా ప్రవర్తిస్తారు, ఎలా పని చేస్తారు అనేది తన మిత్రపక్షాలు, తన సీనియర్ సహోద్యోగులు, బ్యూరోక్రసీ, జ్ఞానం, ధైర్యంపై ఆధారపడి ఉంటుంది. బ్యూరోక్రసీని వంగమని అడిగినప్పుడు తరచుగా అది పొర్లుదండాలు పెడుతుంది. మోదీ, షా పాలన భారత ప్రజాస్వామ్యంలోని ప్రతి వ్యవస్థనూ నిర్వీర్యం చేసింది. చంద్రబాబు, నితీష్ వారిని అదుపు చేయగలరా?కన్యాకుమారి నుంచి న్యూఢిల్లీకి వెళ్లే విమానంలో మోదీ మూడు కీలకాంశాలను పేర్కొంటూ ఒక వ్యాసం రాశారు. మొదటిది – ఇక మీదట ఇండియా... భారత్ మాత్రమే! అధికారికంగా ఈ మార్పు చేయాలంటే, దానికి రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. దీనిపై ఆయన ముందుకు సాగలేరు. రెండవది– ‘జీవితంలో ప్రతి అంశంలో’ దేశానికి సంస్కరణ అవసరమని సూచించడం ద్వారా మోదీ ‘సంస్కరణ’ అనే పదానికి కొత్త నిర్వచనాన్ని వివరించారు. తాజాగా బలహీనపడిన మోదీ అటువంటి సంస్కరణకు నాయకత్వం వహించగలనని భావిస్తున్నారా? మూడవది– దేశం ‘కొత్త కల’ కనవలసిన అవసరాన్ని ప్రస్తావిస్తూ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను మోదీ అనుకరించారు. ఒక దశాబ్దం క్రితం ‘అమెరికన్ డ్రీమ్’లోంచి జిన్పింగ్ ‘చైనా డ్రీమ్’ను ఎక్కువ భాగం అరువు తెచ్చుకున్నారు. కాకపోతే అమెరికన్ స్వప్నం, చైనా స్వప్నం రెండూ ‘మంచి జీవితాన్ని గడపడం’ గురించినవి. దేశ ప్రజలు ‘వికసిత్ భారత్’ కావాలని కల కనాలని మోదీ అంటున్నారు.తదుపరి కేంద్ర ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహిస్తారనే దానితో సంబంధం లేకుండా భారతదేశం ‘వికసిత్’గా ఉంటుంది. కాబట్టి, లోక్సభలో 400కు పైగా స్థానాల మోదీ కల సాకారం కానప్పటికీ, అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే దేశ స్వప్నం మాత్రం కాలక్రమేణా సాకారం అవుతుంది. బీజేపీ, ఇంకా మోదీ విషయానికొస్తే, ఓటర్ల మేల్కొలుపు పిలుపుతో వారి కలలు చెదిరిపోయాయి.సంజయ్ బారు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
ఎయిర్పోర్ట్లో కంగనాపై దాడి.. స్పందించిన నటి!
బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్పై సీఐఎస్ఎఫ్ మహిళ కానిస్టేబుల్ దాడికి పాల్పడింది. చండీఘర్ ఎయిర్పోర్ట్కు వస్తున్న ఆమెపై సెక్యూరిటీ చెకప్ సమయంలో కంగనాను చెంపదెబ్బ కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్గా మారింది. రైతుల ధర్నాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే కంగనాపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది.అయితే తాజాగా ఈ సంఘటనపై కంగనా స్పందించింది. తనపై దాడి నిజంగానే జరిగినట్లు వెల్లడించింది. దీనిపై మీడియాతో పాటు చాలామంది నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని పేర్కొంది. అయితే ప్రస్తుతం తాను సేఫ్గానే ఉన్నట్లు తెలిపింది. చండీఘర్ విమానాశ్రయంలో సెక్యూరిటీ స్టాఫ్ నాపై చేయి చేసుకున్నారు. నా లగేజీ చెకప్ తర్వాత లోపలికి వెళ్తుండగా.. అక్కడే ఉన్న ఇద్దరు మహిళా సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరు నా చెంపపై కొట్టడంతో పాటు అసభ్యంగా మాట్లాడారు. దీనిపై వారిని ప్రశ్నించగా.. రైతుల ధర్నాకు మద్దతుగానే తనపై దాడి చేసినట్లు చెప్పారని కంగనా తెలిపింది. అయితే ప్రస్తుతానికి తాను సురక్షితంగానే ఉన్నానని.. కానీ పంజాబ్లో ఉగ్రవాదం పెద్దఎత్తున పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది.కాగా.. కంగనాపై చెయ్యి చేసుకున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ను కుల్వీందర్ కౌర్గా గుర్తించారు. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ మండి స్థానం నుంచి కంగనా గెలుపొందిన సంగతి తెలిసిందే. తాజా దాడి ఘటనపై బీజేపీ నేతలు, సానుభూతి పరులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.Shocking rise in terror and violence in Punjab…. pic.twitter.com/7aefpp4blQ— Kangana Ranaut (Modi Ka Parivar) (@KanganaTeam) June 6, 2024
కేంద్ర మంత్రివర్గ కూర్పుపై కసరత్తు.. ఆ శాఖలన్నీ బీజేపీ వద్దనే!
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది బీజేపీ. ఎన్డీయే కూటమిలో భాగాస్వామ్యమైన, టీడీపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్), శివసేన(ఏక్నాథ్ షిండే) సహాకారంతో మూడోసారి ప్రధానిగా మోదీ జూన్ 9 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం కేంద్ర మంత్రి వర్గం కూడా కొలువుదీరనుంది.ప్రమాణ స్వీకారానికి తేదీ దగ్గరపడుతుండటంతో కేంద్ర మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపుపై కసరత్తు ప్రారంభమైంది. బీజేపీ నుంచి ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రణాళికలు రచిస్తున్నారు. కేంద్ర పదవుల కోసం ఎన్డీయే మిత్రపక్షాలు టీడీపీ, జేడీయూ బేరసారాలు ప్రారంభించాయి ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్లుగా అవతరించిన చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ కేంద్ర మంత్రి పదవుల్లో కీలక శాఖలను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.అయితే కీలక మంత్రిత్వ శాఖలు బీజేపీ వద్దనే ఉండే అవకాశం ఉంది. మిత్రపక్షమైన టీడీపీ లోక్సభ స్పీకర్ పదవిని కోరగా..దీనిని ఇచ్చే ప్రస్తకే లేదని కాషాయ పార్టీ తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పదవిని ఆఫర్ చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అటు జేడీయూకి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవులు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.ఇక హోంశాఖ, రక్షణ, విదేశాంగ ,ఆర్ధిక,రోడ్లు , రైల్వే.. వంటి నాలుగు కీలక మంత్రిత్వ శాఖలను బీజేపీ తమ వద్దనే ఉంచుకోనుంది. వీటిని మిత్ర పక్షాలకు ఇచ్చేందుకు కాషాయపార్టీ విముఖత వ్యక్తం చేస్తోంది. అంతేగాక రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, వ్యవసాయం, మౌలిక వసతులు, సంక్షేమ రంగాలపై పట్టు వదులుకోకూడదని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టణాభివృద్ధి శాఖ, పౌర విమానయాన శాఖ, ఉక్కు శాఖ టీడీపీకి దక్కే అవకాశం ఉంది.గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖలు జేడీయూకి ఇచ్చే అవకాశం ఉంది. భారీ పరిశ్రమల శాఖ శివసేనకు, వ్యవసాయ శాఖ జేడీఎస్కు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, జనసేన నుంచి బాలశౌరి, ఏపీ బీజేపీ నుంచి పురందేశ్వరికి మంత్రి పదవులు వరించనున్నట్లు సమాచారం. ఆహార ప్రాసెసింగ్, భారీ పరిశ్రమలు, టూరిజం, స్కిల్ డెవెలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ వంటి తక్కు ప్రాధాన్యత కలిగిన పోర్ట్ఫోలియోలను మిత్రపక్షాలకు అప్పగించేందుకు బీజేపీ యోచిస్తోంది. వీటితోపాటు ఆర్థిక, రక్షణ వంటి పెద్ద- మంత్రిత్వ శాఖలలో రాష్ట్ర మంత్రి పదవులు కట్టబెట్టాలని చూస్తోంది.
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
కొందరికీ షాపింగ్ అంటే మహా ఇష్టం. చూసిందల్లా కొంటుంటారు. పాపం బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని కొందామన్నా సాధ్యం కాదు కొందరికీ. ఎంతలా కంట్రోల్గా ఉందామన్న ఆ వస్తువు కొనేదాక నిద్రపట్టని వాళ్ల గురించిn కూడా విన్నాం. కానీ నిద్రలో షాపింగ్ చేసే వ్యాధి గురించి విన్నారా? ఔను..! ఈ వ్యక్తులు నిద్రలోనే తెలియకుండానే షాపింగ్ చేస్తుంటారు. మెలుకవ వచ్చాక గానీ అసలు విషయం తెలియదంట. వామ్మో.. ఇదేం వ్యాది!. ఇలాంటివి కూడా ఉంటాయా అనుకోకండి. అలాంటి అరుదైన వ్యాధితోనే బాధపడుతోంది ఓ మహిళ.యూకేకి చెందిన 42 ఏళ్ల కెల్లీ నైప్స్ పారాసోమ్నియా ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతోంది. దీన్ని అరుదైన పారాసోమ్నియా స్లీపింగ్ డిజార్డర్గా పిలుస్తారు. ఈ డిజార్డర్ కారణంగా ఆమె నిద్రలోనే ఆన్లైన్ షాపింగ్ చేసేస్తుందట. ఏకంగా పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు దగ్గర నుంచి ఫ్రిడ్జ్ వంటి పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా కొనుగోలు చేసేస్తుంది. వాటి బిల్లను కూడా క్రెడిట్ కార్డులతో చెల్లించేస్తుందట. మేలుకువ వచ్చాక మొబైల్ చూసుకుంటే గానీ తెలియదంట. తన అకౌంట్లో డబ్బు కట్ అయ్యాక గానీ అసలు విషయం తెలుసుకులేకతున్నాని చెబుతుంది. ఇలా నిద్రలో తనకు తెలియకుండానే షాపింగ్ చేసి లక్షల్లో డబ్బుల పోగొట్టుకున్నానని చెబుతోంది. దీంతో ఆమెకు ప్రతి రాత్రి భయానకంగా మారిపోయింది. "తన జీవితంలో ప్రతి రాత్రి ఓ పీడకల మాదిరిగా అయిపోతోందని బాధపడుతోంది. తన క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలన్నీఫోన్లోనే సేవ్ అయ్యి ఉంటాయట. ఐతే ఈ మాయదారి జబ్బు కారణంగా తన బ్యాంక్ వివరాన్ని సైబర్ నేరాగాళ్లకు చెప్పేయడం కూడా జరిగిందంట. దీంతో వాళ్లు ఆమె ఖాతా నుంచి సుమారు రూ. 20 వేలకు పైగా తస్కరించారట కూడా. అయితే ఈలోగా తాను తన బ్యాంక్ లావాదేవీలను లాక్ చేసేయడంతో కొద్ది మొత్తంలోనే డబ్బును కోల్పోయానని అంటోంది." కెల్లీ. ఇక సమస్య నుంచి బయటపడేందుకు ముక్కుకి శ్వాస సంబధ సమస్యల నిమిత్తం అమర్చుకునే పరికరాన్ని ధరించి పడుకుంటుంది. ఈ డివైజ్ ముక్కు నుంచి హెడ్ వరకు కదలకుండా అటాచ్ అయ్యేలా డివైజ్ ఉంటుంది. కాబట్టి నిద్రలోనే తనకు తెలయకుండా చేసే విచిత్రమైన పనుల నుంచి ఉపశమనం పొందొచ్చనేది కెల్లీ ఆశ. అయితే కెల్లీ సమస్య నుంచి బయటపడలేదు సరికదా..!ఈ పరికరాన్ని కూడా నిద్రలో తనకు తెలియకుండానే తీసేస్తుందంట. ఈ సమస్య కారణంగా తాను అప్పులు పాలవ్వుతున్నానని కెల్లీ ఆవేదనగా చెప్పుకొచ్చింది. అయితే దీనికి చికిత్స లేదు. తనకు తానుగా బయటపడాలని సంకల్పించుకుంటేనే సాధ్యమని చెబుతున్నారు వైద్య నిపుణులు.పారాసోమ్నియా స్లీపింగ్ డిజార్డర్ అంటే..ఈ సమస్యతో బాధపడుతున్న వ్యక్తి నిద్రలోనే నడవడం /మాట్లాడటం / తినడం/ ఏమైన ఇతర కార్యకలాపాల్లో పాల్గొనడం వంటివి ఏ మాత్రం పూర్తి అవగాహనతో చేయరు. ఆ టైంలో వారికి మెదడు పాక్షికంగా మేల్కొని ఉంటుంది. ఎవరైనా ఆ వ్యక్తులను గమనించి గట్టిగా అదిలిస్తే తిరిగి స్ప్రుహలోకి వస్తారు. ఇలాంటివన్నీ రాత్రి మొదటి జామునే జరుగుతాయట. చిన్నారుల్లోనూ, కొందరూ పెద్దల్లోనూ నిద్రలోనే నడవడం/మాట్లాడటం వంటి సాధారణ లక్షణాలు ఉంటాయి. అయితే ఈ డిజార్డర్ తీవ్రంగా ఉంటేనే ఇలా సమస్యలు ఫేస్ చేస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. (చదవండి: అనారోగ్యంలోనూ... నీట్ టాపర్గా!)
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితం.. కౌంటింగ్లో హైడ్రామా
నల్లగొండ, సాక్షి: నల్లగొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ అప్డేట్స్ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు18,565 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న నవీన్(మల్లన్న)మొదటి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న)122813 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించిన నవీన్( మల్లన్న)బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 104248 ఓట్లుబీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43313 ఓట్లుస్వతంత్ర అభ్యర్థి అశోక్ 29697 ఓట్లుగెలుపు కోటా 155095 గా నిర్ణయంమొత్తం చెల్లిన ఓట్లు 310189చెల్లని ఓట్లు 25824మొత్తం పోలైన ఓట్లు 336013చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) గెలుపుకు కావాల్సిన రెండో ప్రాధాన్యత ఓట్లు 32282బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపుకి కావాల్సిన రెండో ప్రాధాన్యత ఓట్లు 50847మరికాసేపట్లో ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం100 నుంచి 500 ఓట్ల ఎలిమినేషన్ చేయడానికి సుమారు 4 గంటల సమయం: అధికారులు నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ లో అవకతవకలపై సీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ లీగల్ టీంకౌంటింగ్ లో అవకతవకలు జరుగుతున్నాయని వెంటనే ఆర్వో ఆదేశాలు జారీ చేయాలని కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా చేయాలని ఫిర్యాదు చేసిన కౌశిక్ రెడ్డిముందు నుంచి రిటర్నింగ్ ఆఫీసర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపణతమకు వచ్చిన ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చూపిస్తున్నారని ఆగ్రహంనల్లగొండముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు18,565 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న నవిన్(మల్లన్న)మొదటి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న)122813 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించిన నవీన్( మల్లన్న)బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 104248 ఓట్లుబీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43313 ఓట్లుస్వతంత్ర అభ్యర్థి అశోక్ 29697 ఓట్లు కాసేపట్లో సీఈఓ వికాస్ రాజ్ ను కలవనున్న బీ ఆర్ ఎస్ నేతలు.నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ ఆపాలని, అక్కడ జరుగుతున్న కౌంటింగ్ లో అవకతవకలపై ఫిర్యాదు చేయనున్న నేతలు.కౌంటింగ్ అధికారులు కౌంటింగ్ సక్రమంగా చేయటం లేదని ఫిర్యాదు చేయనున్న ఎంఎల్ఏ కౌశిక్ రెడ్డి, ఇతర బీ ఆర్ ఎస్ నేతలు నల్లగొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో నిన్నటి నుండి గోల్ మాల్ జరిగిందిమూడో రౌండ్ లో కాంగ్రెస్ కు మూడు వేలు ఆధిక్యం వస్తే నాలుగు వేలకు పైగా ఆధిక్యం వచ్చినట్లు ప్రకటించారుమేం అభ్యంతరం చెప్పినా ఆర్వో పట్టించుకోవడం లేదుమూడో రౌండ్ నుంచి అనుమానం ఉందని చెప్పినా కనీస స్పందన లేదుఎన్నికల ఫలితాలు తారుమారు చేస్తే కౌంటింగ్ బైకాట్ చేస్తాంఎన్నికల సంఘం స్పందించాలిరిటర్నింగ్ అధికారిపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తాంఅధికారుల తీరు ఫలితాలను తారుమారు చేసేలా ఉందితమ అభ్యంతరాలకు వివరణ ఇచ్చాకే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కంపు జరపాలి నల్లగొండ జిల్లాఎమ్మెల్సీ ఉప ఎన్నికల నాలుగో రౌండ్ ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యంనాలుగో రౌండ్ తొలి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తై మూడు గంటలుఅయినా ఫలితాలు వెల్లడించని అధికారులు👉ముగిసిన నాలుగో రౌండ్ తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుఅధికారికంగా వెలువడాల్సిన ఫలితాలు 👉నాల్గో రౌండ్లో చెల్లని ఓట్లను తొలగించి గెలుపుకు కావాల్సిన కోటాను తేల్చనున్న అధికారులుఇప్పటి వరకు ఎవరికీ యాభై శాతం ఓట్లు రాకపోవడంతో కీలకంగా మారిన రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుసాయంత్రం ఆరు గంటల తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం👉మూడో రౌండ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తైంది. మూడో రౌండ్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) లీడ్లో ఉన్నారు. అయితే.. మూడో రౌండ్లో 4,207 ఓట్ల ఆధిక్యం రాగా, ఓవరాల్గా 18,878 ఓట్ల ఆధిక్యంలో మల్లన్న కొనసాగుతున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు 2 లక్షల 88 వేల ఓట్ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. మరో 48013 ఓట్ల లెక్కింపు చేస్తున్నారు అధికారులు. లీడ్ జాబితా.. ఎవరెవరికి ఎన్ని ఓట్లంటే..చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న కాంగ్రెస్) 1,06,234రాకేష్ రెడ్డి (బీఆర్ఎస్) 87,356ప్రేమేందర్ రెడ్డి( బీజేపీ) 34,516అశోక్ (స్వతంత్ర) 27,49318,878 ఓట్ల ఆధిక్యం లో తీన్మార్ మల్లన్నచెల్లిన ఓట్లు 2,64,216చెల్లని ఓట్లు: 23,784
ఐర్లాండ్పై అద్బుత ప్రదర్శన.. హార్దిక్పై గవాస్కర్ ప్రశంసలు
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఫామ్ను తిరిగి పొందాడు. ఈ ఏడాది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ సారథిగా దారుణ ప్రదర్శన కనబరిచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్.. ఇప్పుడు టీ20 వరల్డ్కప్-2024లో సత్తాచాటుతున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం న్యూయర్క్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో పాండ్యా అదరగొట్టాడు. బ్యాటింగ్ చేసే అవకాశం రానప్పటకి బౌలింగ్లో మాత్రం హార్దిక్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్లో తన నాలుగు ఓవర్ల కోటాలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. పాండ్యా అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చాడని గవాస్కర్ కొనియాడాడు."హార్దిక్ పాండ్యా తిరిగి తన రిథమ్ను పొందడం చాలా సంతోషంగా ఉంది. హార్దిక్ తన బౌలింగ్తో అందరిని ఆకట్టుకున్నాడు. హార్దిక్ గతంలో రెండు ఓవర్లు వేసి బ్రేక్ తీసుకునే వాడు.కానీ ఈ మ్యాచ్లో మాత్రం వరుసగా తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేసి ఔరా అనిపించుకున్నాడు. హార్దిక్కు ఐపీఎల్ తర్వాత వరల్డ్కప్ అనేది ఒక పరీక్ష వంటి. నా వరకు అయితే ఈ పరీక్షలో హార్దిక్ పాసైడని నేను భావిస్తున్నాని స్టార్స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు.
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
గెలుపోటములు సాధారణం.. కానీ కొన్ని విజయాలు చరిత్రలో నిలిచిపోతాయి.. చరిత్రనే తిరగరాస్తాయి. అలా తన సక్సెస్తో అందరి దృష్టినీ ఆకర్షించాడు నటుడు సురేశ్ గోపి. అవును మరి! 1952లో లోక్సభ ఎన్నికలు మొదలయ్యాయి. ఇప్పటివరకు 18 సార్లు ఎన్నికలు జరగ్గా ఒక్కసారి కూడా కేరళలో బీజేపీ గెలిచిందే లేదు. ఇంతకాలంగా అసాధ్యమనుకున్న కమలం విజయాన్ని తన గెలుపుతో సుసాధ్యం చేసి చూపించాడు.ప్రాణం కాపాడుఈ సక్సెస్తో సురేశ్ గోపీ గుండెలోని భారం కొంతైనా దిగుతుందేమో! కూతురిపై పెట్టుకున్న బెంగ కాస్తయినా తగ్గుతుందేమో! 1992 జూన్ 6న భార్యాబిడ్డతో ప్రయాణిస్తున్న అతడి కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. స్పృహలోకి వచ్చేసరికి ఆస్పత్రి బెడ్ మీద ఉన్నాడు. కళ్లు తెరుస్తూనే కంటతడి పెట్టుకున్నాడు. నా ప్రాణం కాపాడు స్వామీ అంటూ దేవుడికి మొక్కుకున్నాడు. ఇక్కడ తన ప్రాణం అంటే ఆయన కూతురు లక్ష్మి. గుండెలో గూడు కట్టుకున్న బాధగాయాలు బాధిస్తున్నా ఎలాగోలా సత్తువ కూడదీసుకుని ఏడాదిన్నర వయసున్న కూతురిని చూసేందుకు ఐసీయూలోకి వెళ్లాడు. కొనప్రాణంతో కూతుర్ని చూసి తల్లడిల్లిపోయాడు. అతడి కన్నీరు చూసి భగవంతుడు చలించలేదు. ఆమెను తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. అందుకే జూన్ మాసం అంటేనే ఆయనకు భయం, అయిష్టత! ఈ నెలలో వర్షాలు పడి వాతావరణం మారే సమయంలో తన గాయాలు సైతం నొప్పులు లేస్తాయట!జూన్ నెలలోనే..అయినా ఆ నొప్పి భరించడం తనకిష్టమేనంటాడు. అదే తన కూతురితో ఉన్న చివరి జ్ఞాపకాలని జీవం లేని నవ్వు విసురుతాడు. నలుగురు పిల్లలున్నా సరే లక్ష్మి లేని లోటును ఎవరూ పూడ్చలేడంటాడు. విధి ఎంత విచిత్రమో కదా! జూన్ నెలలో అతడి కూతుర్ని తీసుకెళ్లిపోయింది. సరిగ్గా 32 ఏళ్ల తర్వాత ఇదే నెలలో అతడికి ఊహించని విజయాన్ని అందించింది.రాజకీయ నేపథ్యం..సురేశ్ గోపి 2016లో రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు నామినేట్ అయ్యాడు. తర్వాత బీజేపీలో చేరాడు. 2019లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్థానానికే పరిమితమయ్యాడు. 2021 కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేసినా విజయం వరించలేదు. నిరాశతో వెనుదిరగలేదు. ముచ్చటగా మూడోసారి పోటీ చేసి త్రిసూర్ ఎంపీగా గెలిచాడు. నటుడిగా వందల సినిమాలు చేసిన సురేశ్ గోపి తెలుగులో అంతిమ తీర్పు, ఆ ఒక్కడు, ఐ వంటి చిత్రాలతో మెప్పించాడు.చదవండి: ఐదేళ్ల క్రితమే సీక్రెట్గా పెళ్లి- విడాకులు.. ఇన్నాళ్లకు నోరు విప్పిన బ్యూటీ
వైఎస్సార్సీపీ జెండా మోసిన వాళ్లపై టీడీపీ దాడులు: పేర్ని నాని
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులనే లక్ష్యంగా టీడీపీ దాడులు జరుపుతోందని అన్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అరాచక చేష్టలకు దిగింది. దీంతో వైఎస్సార్సీపీ నేతలు గురువారం సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి.. ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. గవర్నర్ నజీర్ను కలిసిన అనంతరం వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులే టార్గెట్గా టీడీపీ దాడులు జరిపిందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. బిహార్ తరహాలో ఏపీలో టీడీపీ దాడులకు తెగబడిందని మండిపడ్డారు. బిహార్ సంస్కృతిని టీడీపీ ఆచరిస్తోందన్నారు. టీడీపీ గూండాలు వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై కిరాతకంగా దాడులు చేశారని అన్నారు. టీడీపీ నేతలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ జెండా మోసిన వారిపై దాడులకు తెగబడుతున్నారు.నూజివీడులో పట్టపగలే కత్తులతో దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు పేర్ని నాని. ఇళ్లలోకి చొరబడి ఆస్తులను ధ్వసం చేస్తున్నారని మండ్డారు. టీడీపీ దాడులు చూసి గవర్నర్ కూడా ఆశ్చర్యపోయారని తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా? లేనట్టా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలను కాపాడుకోవడానికి కమిటీలు వేశామని, 26 జిల్లాల్లోనూ మా లీగల్ టీమ్లు యాక్టివేట్ అయ్యాయని తెలిపారు. బాధితులను పరామర్శించి, వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు. టీడీపీ గుండాల దాడులతోపాటు.. పోలీసుల తీరుపై కూడా గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.వైఎస్సార్సీపీ నేతల బృందానికి రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వం వహించారు. గవర్నర్ను కలిసిన వాళ్లలో తాజా ఎంపీలు గురుమూర్తి, తనుజా, ఎమ్మెల్యేలు శివప్రసాద్, మత్యలింగం, విశ్వేశ్వర రాజు, పర్చూర్ నేత బాలాజీ ఉన్నారు.
తప్పక చదవండి
- అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలపై ఆగ్రహం.. కారణం ఇదే..
- చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
- వీకెండ్లో సినిమాల జాతర.. ఒక్క రోజే ఏకంగా పది చిత్రాలు!
- హైదరాబాద్: ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
- ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో గోల్ మాల్.. రాకేష్ రెడ్డి సీరియస్
- కంగనా రనౌత్ చెంప చెల్లుమనిపించిన ఎయిర్పోర్ట్ సిబ్బంది!
- హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు: వైజాగ్ చేరుకున్న బాధితులు
- భర్త చనిపోయిన 15 నెలలకు బిడ్డకు జన్మనిచ్చిన మోడల్.. ఎలాగో తెలుసా?
- విజయానందంలో సీనియర్ హీరోయిన్.. కాలికి కట్టుతో భర్త!
- దాదాపు రూ. 100 కోట్లు.. లగ్జరీ అపార్ట్మెంట్ కొన్న వజ్రాల వ్యాపారి
సినిమా
ఎయిర్పోర్ట్లో కంగనాపై దాడి.. స్పందించిన నటి!
బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్పై సీఐఎస్ఎఫ్ మహిళ కానిస్టేబుల్ దాడికి పాల్పడింది. చండీఘర్ ఎయిర్పోర్ట్కు వస్తున్న ఆమెపై సెక్యూరిటీ చెకప్ సమయంలో కంగనాను చెంపదెబ్బ కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్గా మారింది. రైతుల ధర్నాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే కంగనాపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది.అయితే తాజాగా ఈ సంఘటనపై కంగనా స్పందించింది. తనపై దాడి నిజంగానే జరిగినట్లు వెల్లడించింది. దీనిపై మీడియాతో పాటు చాలామంది నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని పేర్కొంది. అయితే ప్రస్తుతం తాను సేఫ్గానే ఉన్నట్లు తెలిపింది. చండీఘర్ విమానాశ్రయంలో సెక్యూరిటీ స్టాఫ్ నాపై చేయి చేసుకున్నారు. నా లగేజీ చెకప్ తర్వాత లోపలికి వెళ్తుండగా.. అక్కడే ఉన్న ఇద్దరు మహిళా సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరు నా చెంపపై కొట్టడంతో పాటు అసభ్యంగా మాట్లాడారు. దీనిపై వారిని ప్రశ్నించగా.. రైతుల ధర్నాకు మద్దతుగానే తనపై దాడి చేసినట్లు చెప్పారని కంగనా తెలిపింది. అయితే ప్రస్తుతానికి తాను సురక్షితంగానే ఉన్నానని.. కానీ పంజాబ్లో ఉగ్రవాదం పెద్దఎత్తున పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది.కాగా.. కంగనాపై చెయ్యి చేసుకున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ను కుల్వీందర్ కౌర్గా గుర్తించారు. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ మండి స్థానం నుంచి కంగనా గెలుపొందిన సంగతి తెలిసిందే. తాజా దాడి ఘటనపై బీజేపీ నేతలు, సానుభూతి పరులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.Shocking rise in terror and violence in Punjab…. pic.twitter.com/7aefpp4blQ— Kangana Ranaut (Modi Ka Parivar) (@KanganaTeam) June 6, 2024
విజయానందంలో సీనియర్ హీరోయిన్.. కాలికి కట్టుతో భర్త!
సీనియర్ నటుడు ధర్మేంద్ర డియోల్ 88 ఏళ్ల వయసులోనూ ఎంతో హుషారుగా కనిపిస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలోనూ అప్పుడప్పుడు కబుర్లు చెప్తూ ఉంటాడు. తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఈ సీనియర్ హీరో ఓ వీడియో షేర్ చేశాడు. గాయపడ్డ సింహం.. మళ్లీ బిజీ అయిపోయానంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోలో ఆయన తన ఫామ్ హౌస్లో ప్రకృతి నడుమ సేద తీరుతున్నాడు. చెట్టు కింద కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. అందులో అతడి కుడి కాలికి పట్టీ వేసి ఉంది. ఇది చూసిన అభిమానులు ఆయనకు ఏమైందని కంగారుపడుతున్నారు. ఆ గాయం త్వరగా మానుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా ఈయన చివరగా రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని, తేరి బాటీ ఐసా ఉల్జా జియా అనే సినిమాల్లో కనిపించాడు. ఇకపోతే ధర్మేంద్ర రెండో భార్య హేమమాలిని సంతోషంలో మునిగి తేలుతోంది. మధుర నియోజకవర్గం నుంచి ఆమె మూడోసారి ఎంపీగా గెలుపొందింది. దీంతో ఫ్యాన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Dharmendra Deol (@aapkadharam) చదవండి: నేను వాడిపడేసిన టిష్యూ ఏరుకుంది: నటి
జవాన్ మూవీ అరుదైన రికార్డ్.. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్!
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ, బాలీవుడ్ బాద్షా కాంబోలో వచ్చిన చిత్రం జవాన్. 2023లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించింది. తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు.అయితే తాజాగా అట్లీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వెతికిన సినిమాల జాబితాలో జవాన్ చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని అట్లీ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. వరల్డ్ వైడ్గా గూగుల్లో అత్యధిక మంది వెతికిన చిత్రాల్లో జవాన్ మూడో స్థానంలో నిలిచింది. మొదటి, రెండు స్థానాల్లో హాలీవుడ్ చిత్రాలు బార్బీ, ఓపెన్ హైమర్ నిలిచాయి. అంతే కాకుండా బాలీవుడ్ చిత్రాలైన గదర్-2, పఠాన్ వరుసగా 8,10 స్థానాలు దక్కించుకున్నాయి. కాగా.. ఈ వివరాలను వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసింది. ❤️❤️❤️ https://t.co/NUiGjSORLJ— atlee (@Atlee_dir) June 6, 2024
‘సత్యభామ’లో కొత్త కాజల్ ను చూస్తారు: శశికిరణ్ తిక్క
కాజల్ అరవై సినిమాల్లో నటించింది. అయినా ఇప్పటికీ చాలా యాక్టివ్గా ఉంటుంది. షూటింగ్ టైమ్లో ఆమె ఎనర్జీ మా అందరికి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేంది.‘సత్యభామ’లో కాజల్ చేసిన యాక్షన్స్ ప్రేక్షలను అలరిస్తాయి. ముఖ్యంగా ఎమోషన్ ఈ మూవీలో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఎన్నో పోలీస్ స్టోరీస్ వచ్చినా ఎమోషనల్ గా “సత్యభామ” స్పెషల్ గా ఉంటుంది. తెరపై కొత్త కాజల్ని చూస్తారు’అని అన్నారు డైరెక్టర్ శశికిరణ్ తిక్క. ఆయన ప్రెజెంటర్, స్క్రీన్ ప్లే రైటర్ గా వర్క్ చేసిన మూవీ ‘సత్యభామ’. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా అవురమ్ ఆర్ట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. రేపు(జూన్ 7)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా శశికిరణ్ తిక్క మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ యూకేలో ఉండే నా స్నేహితులు చెప్పిన కథతో ‘సత్యభామ’ జర్నీ మొదలైంది. ఆ పాయింట్ నచ్చి నేను, దర్శకుడు సుమన్ డెవలప్ చేశాం. అప్పుడు మేజర్ సినిమా జరుగుతోంది. అది పూర్తయ్యాక సెట్స్ మీదకు తీసుకెళ్లాలని అనుకున్నాం. కాజల్ గారికి ‘సత్యభామ’ కథ చెప్తే ఆమెకు వెంటనే నచ్చింది. అలా ఈ సినిమా ప్రారంభం అయింది.⇢ నాకు దర్శకుడిగా చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నా స్క్రిప్ట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందుకే “సత్యభామ” సినిమాకు దర్శకత్వం వహించలేదు.అలాగే అవురమ్ ఆర్ట్స్ పై మరిన్ని మూవీస్ చేయాలనుకుంటున్నాం. నాకు ప్రొడ్యూసర్ గా అనుభవం కావాలి. డైరెక్షన్ ప్రొడక్షన్ తో పాటు ఎడిటింగ్ కూడా చేయాలని ఉంది.⇢ మూవీ ప్రెజెంటర్ గా సినిమా మేకింగ్ లో మరో కోణాన్ని చూశాను. దర్శకుడిగా నేను ప్రొడక్షన్ కాస్ట్ ను చెప్పినంతలో చేస్తాననే పేరుంది. ఇప్పుడు “సత్యభామ” నిర్మాత అనుభవాలు ఎలా ఉంటాయో తెలిసింది. ఓవరాల్ గా ప్రొడక్షన్ సైడ్ చాలా విషయాలు నేర్చుకున్నాను. సినిమా మేకింగ్ ను వైడ్ యాంగిల్ నుంచి తెలుసుకున్నా. దర్శకత్వం అమ్మలాంటి పని అయితే నిర్మాతగా ఉండటం నాన్న లాంటి బాధ్యత.⇢ దర్శకుడు సుమన్ చిక్కాల, నేను, శ్రీచరణ్ పాకాల(సంగీత దర్శకుడు) మేమంతా ఫ్రెండ్స్. కలిసే మూవీస్ చేస్తుంటాం. “సత్యభామ” సినిమాకు కూడా అలాగే టీమ్ వర్క్ చేశాం. దర్శకుడిగా సుమన్ వర్క్ ఆకట్టుకుంటుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా మా మూవీ ఉంటుంది. అయితే రెగ్యులర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ లా కేవలం కేసును క్లూలలతో పట్టుకోవడం కాకుండా కథలో ఎమోషన్ బాగా వర్కవుట్ అయ్యింది.⇢ ఈ చిత్రంలొ నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్థన్, రవి వర్మ ఇలా మంచి కాస్టింగ్ కీ రోల్స్ చేశారు. వీళ్లు కాకుండా కొందరు కొత్త వాళ్లు నటించారు. వాళ్లకు ఈ సినిమా రిలీజ్ అయ్యాక మంచి పేరొస్తుంది.⇢ ఈ సినిమా టీమ్ వర్క్ అని చెప్పాలి, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, డైరెక్టర్, నేను, ప్రొడ్యూసర్స్ మేమంతా కలిసే పనిచేస్తూ వచ్చాం. మా మూవీని నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు రిలీజ్ చేస్తున్నారు. ఏపీలో ధీరజ్ మొగిలినేని రిలీజ్ చేస్తున్నారు. ఓవర్సీస్ లో సారిగమ రిలీజ్ చేస్తోంది. ఓటీటీ సహా ఓవరాల్ గా మా సినిమాకు ట్రేడ్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.⇢ దర్శకుడిగా నా తదుపరి సినిమా త్వరలో అనౌన్స్ చేస్తాను. వరుసగా థ్రిల్లర్స్ చిత్రాలే కాకుండా మల్టీపుల్ జానర్ మూవీస్ చేస్తాను.
ఫొటోలు
జలసంద్రంగా మారిన హైదరాబాద్.. వాహనదారులకు చుక్కలు (ఫొటోలు)
వైఎస్సార్సీపీ నేతలతో వైఎస్ జగన్ భేటీ (ఫొటోలు)
టీడీపీ దాడులపై గవర్నర్ కు YSRCP నేతల ఫిర్యాదు
Hamida: నటి బర్త్డే పార్టీలో బిగ్బాస్ సెలబ్రిటీల హంగామా (ఫోటోలు)
ప్రీ వెడ్డింగ్ కోసం అంబానీ ఫ్యామిలీ బుక్ చేసుకున్న క్రూయిజ్ షిప్ (ఫోటోలు)
క్రీడలు
T20 WC 2024: అమెరికాతో పాకిస్తాన్ పోరు.. తుది జట్లు ఇవే
టీ20 వరల్డ్కప్-2024లో పాకిస్తాన్తో తొలి మ్యాచ్కు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా డల్లాస్ వేదికగా యూఎస్ఎతో పాకిస్తాన్ తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన యూఎస్ఎ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. యూఎస్ఎ తమ తొలి మ్యాచ్ ఆడిన జట్టుతోననే ఈ మ్యాచ్లో బరిలోకి దిగింది. మరోవైపు పాకిస్తాన్ ఏకంగా నలుగురు పేసర్లతో బరిలోకి దిగింది. ఇక పాకిస్తాన్కు ఇదే తొలి మ్యాచ్ కాగా.. యూఎస్ఎ జట్టు మాత్రం తమ మొదటి మ్యాచ్లో కెనడాపై అద్బుత విజయం సాధించింది.తుది జట్లుపాకిస్తాన్: బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, ఆజం ఖాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, మహ్మద్ అమీర్, హరీస్ రవూఫ్యునైటెడ్ స్టేట్స్ : స్టీవెన్ టేలర్, మోనాంక్ పటేల్ (కెప్టెన్/ వికెట్ కీపర్), ఆండ్రీస్ గౌస్, ఆరోన్ జోన్స్, నితీష్ కుమార్, కోరీ అండర్సన్, హర్మీత్ సింగ్, జస్దీప్ సింగ్, నోస్తుష్ కెంజిగే, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్
ఐర్లాండ్పై అద్బుత ప్రదర్శన.. హార్దిక్పై గవాస్కర్ ప్రశంసలు
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఫామ్ను తిరిగి పొందాడు. ఈ ఏడాది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ సారథిగా దారుణ ప్రదర్శన కనబరిచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్.. ఇప్పుడు టీ20 వరల్డ్కప్-2024లో సత్తాచాటుతున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం న్యూయర్క్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో పాండ్యా అదరగొట్టాడు. బ్యాటింగ్ చేసే అవకాశం రానప్పటకి బౌలింగ్లో మాత్రం హార్దిక్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్లో తన నాలుగు ఓవర్ల కోటాలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. పాండ్యా అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చాడని గవాస్కర్ కొనియాడాడు."హార్దిక్ పాండ్యా తిరిగి తన రిథమ్ను పొందడం చాలా సంతోషంగా ఉంది. హార్దిక్ తన బౌలింగ్తో అందరిని ఆకట్టుకున్నాడు. హార్దిక్ గతంలో రెండు ఓవర్లు వేసి బ్రేక్ తీసుకునే వాడు.కానీ ఈ మ్యాచ్లో మాత్రం వరుసగా తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేసి ఔరా అనిపించుకున్నాడు. హార్దిక్కు ఐపీఎల్ తర్వాత వరల్డ్కప్ అనేది ఒక పరీక్ష వంటి. నా వరకు అయితే ఈ పరీక్షలో హార్దిక్ పాసైడని నేను భావిస్తున్నాని స్టార్స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు.
భారత్ వర్సెస్ పాక్.. దాయాదుల పోరులో గెలిచేది ఎవరు?
వరల్డ్ క్రికెట్ భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు ఉన్న క్రేజే వేరు. ఏ దేశంలో ఆడుతున్నారనేది సంబంధం లేకుండా దాయాదుల పోరును చూసేందుకు ప్రేక్షకులు స్టేడియాలకు పోటెత్తుతారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు.ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా గత కొన్నేళ్లుగా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు జట్లు కేవలం ఐసీసీ టోర్నీ, ఆసియాకప్లలో మాత్రం తలపడుతోంది.దీంతో తమ ఆరాధ్య జట్లు ఎప్పుడెప్పుడు తలపడతాయా క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అభిమానుల నిరీక్షణకు తెరదించే సమయం అసన్నమైంది. టీ20 వరల్డ్కప్-2024లో భాగంగా జూన్ 9న న్యూయర్క్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలపై ఓ లుక్కేద్దం.పాక్ను మట్టికరిపిస్తుందా?ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్ను టీమిండియా విజయంతో ఆరంభించింది. ఐర్లాండ్పై గెలిచి మంచి జోష్లో ఉన్న భారత జట్టు.. అదే జోరును చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్పై కూడా కొనసాగించాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో భారత జట్టు పటిష్టంగా కన్పిస్తోంది. బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ వంటి అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. వీరిందరూ ఐపీఎల్లో సత్తాచాటి ఈ మెగా టోర్నీలో అడుగుపెట్టారు. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో విరాట్, సూర్యకుమార్ విఫలమైనప్పటకి.. రోహిత్, పంత్ మాత్రం తమ బ్యాట్కు పనిచెప్పారు. మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో నిరాశపరిచిన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. తన ఫామ్ను తిరిగి పొందడం టీమిండియాకు కలిసొచ్చే ఆంశం. ఐర్లాండ్తో మ్యాచ్లో హార్దిక్ 3 వికెట్ల తేడాతో సత్తాచాటాడు. అటు బౌలింగ్ పరంగా భారత జట్టు మెరుగ్గా ఉంది. టీమిండియా బౌలింగ్ ఎటాక్కు జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహిస్తుండగా.. సిరాజ్, అర్షదీప్ తమ బౌలింగ్తో ఆకట్టుకుంటున్నారు. ఐర్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్లోనూ ఈ పేస్త్రయం నిప్పులు చేరిగారు. మరోసారి భారత బ్యాటర్లు, బౌలర్లు చెలరేగితే పాకిస్తాన్కు తిప్పలు తప్పవు.పాక్ మ్యాజిక్ చేస్తుందా?ఇక పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం చెప్పుకొదగ్గ ఫామ్లో లేదు. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమి చవిచూసింది. తేకాకుండా ఐర్లాండ్ పర్యటనలో జరిగిన తొలి టీ20లో కూడా పాకిస్తాన్ పరాయం పాలైంది. వరుస ఓటములతో అమెరికా గడ్డపై అడుగుపెట్టిన బాబర్ సేన యఎస్ఏతో తొలి మ్యాచ్కు సిద్దమైంది. అయితే టీ20ల్లో భారత్పై పాకిస్తాన్కు మంచి రికార్డు లేనప్పటకి.. దాయాదిని మాత్రం తక్కువగా అంచనా వేయలేం. కెప్టెన్ బాబర్ ఆజంతో పాటు పేసర్ షహీన్ షా అఫ్రిది పాక్ జట్టుకు కొండంత బలం. వీరిద్దరితో పాటు మహ్మద్ రిజ్వాన్, ఫఖార్ జమాన్, ఇఫ్తికర్ ఆహ్మద్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. అదేవిధంగా సీనియర్ పేసర్ మహ్మద్ అమీర్ కూడా రీ ఎంట్రీ ఇవ్వడం పాక్ జట్టుకు కలిసిచ్చే ఆంశం. దాయాది జట్టు మాత్రం సమిష్టగా రాణిస్తే టీమిండియా గట్టి పోటీ ఎదురుకాక తప్పదు. అయితే పాకిస్తాన్ను మాత్రం కొన్ని బలహీనతలు వెంటాడుతున్నాయి. ఒత్తిడికి అస్సలు తట్టుకోలేదు. అదేవిధంగా పాకిస్తాన్ ఫీల్డింగ్ కూడా చాలా దారుణంగా ఉంటుంది. తమ లోపాలను పాకిస్తాన్ ఏ మెరకు అధిగమిస్తుందో వేచి చూడాలి.టీమిండియాదే పై చేయి..ఇక టీ20 వరల్డ్కప్ టోర్నీల్లో పాకిస్తాన్పై టీమిండియాదే పై చేయి. ఇప్పటివరకు ఇరు జట్లు పొట్టి ప్రపంచకప్లో ఏడు సార్లు ముఖాముఖి తలపడగా.. భారత్ ఆరింట విజయం సాధించగా, పాక్ కేవలం ఒకే మ్యాచ్లో గెలుపొంది. 2021 టీ20 వరల్డ్కప్లో భారత్పై 10 వికెట్ల తేడాతో పాక్ విజయం సాధించింది.
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
టీ20 వరల్డ్కప్-2024లో న్యూయర్క్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో అర్షదీప్ సింగ్ భారత బౌలింగ్ ఎటాక్ను ప్రారంభించగా.. మహమ్మద్ సిరాజ్ అతడితో పాటు బంతిని పంచుకున్నాడు. ఆ తర్వాత బుమ్రా బౌలింగ్ ఎటాక్కు వచ్చాడు. తన పేస్ బౌలింగ్తో ఐరీష్ బ్యాటర్లను బుమ్రా బెంబేలెత్తించాడు. బుమ్రా తన బౌలింగ్ ఎటాక్ను మెయిడిన్ ఓవర్తో ప్రారంభించాడు. ఇన్నింగ్స్ 6వ ఓవర్ వేసిన బుమ్రా.. ఐర్లాండ్ బ్యాటర్ హ్యారీ టెక్టార్కు చుక్కలు చూపించాడు. బుమ్రా బౌలింగ్ దాటికి ఆ ఓవర్లో టెక్టార్ కనీసం ఒక్క పరుగు కూడా సాధించలేకపోయాడు.ఈ క్రమంలో బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక మెయిడిన్లు (టెస్టు సభ్యత్వ దేశాలు) చేసిన ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. బుమ్రా ఇప్పటివరకు టీ20ల్లో 11 మెయిడిన్ ఓవర్లు వేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్(10) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో భువీని బుమ్రా అధిగమించాడు. ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచిన బుమ్రా.. 3 ఓవర్లలో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.ఇక ఓవరాల్గా ఈ జాబితాలో ఇద్దరు బౌలర్లు బుమ్రా కంటే ముందు ఉన్నారు. ఈ జాబితాలో ఉగాండా బౌలర్ ఎఫ్ నుసుబుగా 15 మెయిడిన్ ఓవర్లతో తొలి స్ధానంలో ఉండగా.. కెన్యా బౌలర్ షెబ్ ఎన్గోచె 14 రెండు స్దానంలో ఉన్నాడు.
బిజినెస్
రూ.1 పెట్టుబడిపై రూ.13 ప్రతిఫలం..ఎక్కడంటే..
వ్యవసాయ పరిశోధన అభివృద్ధి(ఆర్అండ్డీ)లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలుంటాయని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ (నాస్) ప్రెసిడెంట్ హిమాన్షు పాథక్ తెలిపారు. ప్రతి రూ.1 పెట్టుబడిపై రూ.13 ప్రతిఫలం లభిస్తుందన్నారు.నాస్ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..‘వ్యవసాయ పరిశోధన అభివృద్ధిలో పెట్టుబడులు లాభదాయకంగా మారనున్నాయి. ఆర్అండ్డీలో పెట్లే రూ.1 పెట్టుబడి సమీప భవిష్యత్తులో రూ.13 ప్రతిఫలం ఇస్తుంది. పశుసంవర్థక రంగంలో ఈ లాభాలు ఇంకా ఎక్కువగానే ఉంటాయి. వ్యవసాయ పరిశోధనా వ్యవస్థను మరింత మెరుగుపర్చాలి. పంటసాగు వ్యయాలు పెరగడం, తక్కువ ఉత్పాదకత, వాతావరణ మార్పు ప్రభావం రూపంలో ఈ రంగానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. సహజ వనరుల క్షీణత, తెగులు, వ్యాధుల సమస్యలు పెరుగుతున్నాయి. వీటి పరిష్కారానికి ఎన్నో పరిశోధనలు జరగాలి. అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునే రకాలను తయారుచేయాలి. అందుకోసం టెక్నాలజీను వినియోగించాలి’ అన్నారు.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐకార్) డైరెక్టర్ జనరల్గా కూడా హిమాన్షు పాథక్ పనిచేస్తున్నారు.ఇదీ చదవండి: సినీ, క్రికెట్ ప్రముఖులతో ‘వంతారా’ ప్రచారం
ఈపీఎఫ్ అకౌంట్లో తప్పులున్నాయా? ఇలా సులభంగా మార్చుకోండి..
సాధారణంగా ఉద్యోగం చేసేవారికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అకౌంట్ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ అకౌంట్ వివరాల్లో ఏవైనా తప్పులు ఉండే అవకాశం ఉంటుంది. గతంలో ఉద్యోగులు తమ జాయింట్ డిక్లరేషన్ ఫారంను నింపి, దానిని ఈపీఎఫ్ఓ కార్యాలయంలో ఇచ్చేవారు. ఇప్పుడు ఏవైనా మార్పులు చేసుకోవాలనుంటే.. ఫిజికల్ ఫారమ్తో పనిలేకుండా.. ఆన్లైన్లో మార్చుకోవచ్చు. ఈ కథనంలో ఈపీఎఫ్ చందాదారులు ఆన్లైన్లో తమకు చెందిన 11 వ్యక్తిగత వివరాలను ఎలా మార్చుకోవాలో వివరంగా తెలుసుకుందాం.ఆన్లైన్లో మార్చుకోగలిన 11 వ్యక్తిగత వివరాలుపేరుజెండర్పుట్టిన తేదీతండ్రి / తల్లి పేరురిలేషన్షిప్వైవాహిక స్థితిజాయినింగ్ డేట్రీజన్ ఫర్ క్విట్టింగ్ డేట్ ఆఫ్ క్విట్టింగ్నేషనాలిటీఆధార్ఆన్లైన్లో ఎలా మార్చుకోవాలంటే?👉ఉద్యోగి ముందుగా ఈపీఎఫ్ఓ అధికారికి వెబ్సైట్ ఓపెన్ చేయాలి👉హోమ్ పేజీలో మొదట కనిపించే 'సర్వీస్' ట్యాబ్ మీద క్లిక్ చేసిన తరువాత 'ఫర్ ఎంప్లాయిస్' అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.👉ఆ తరువాత సర్వీస్ సెక్షన్ కింద కనిపించే 'మెంబర్ యూఏఎన్ / ఆన్లైన్ సర్వీస్' ఆప్షన్స్ మీద క్లిక్ చేయాలి.👉ఆలా క్లిక్ చేయగానే మీకు ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.👉కొత్త పేజీలో కుడివైపు కనిపించే బాక్సులలో 'యూఏఎన్, పాస్వర్డ్, క్యాప్చా' వంటి వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. 👉ఇవన్నీ పూర్తి చేసిన తరువాత అసలైన ఈపీఎఫ్ఓ అకౌంట్ పేజీ ఓపెన్ అవుతుంది.👉ఈపీఎఫ్ఓ అకౌంట్ పేజీ ఓపెన్ అయినా తరువాత స్క్రీన్ మీద కనిపించే.. 'మేనేజ్' ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక్కడ జాయింట్ డిక్లరేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీ మెంబర్ ఐడీ ఎంటర్ చేసిన తరువాత.. ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నారో.. వాటిని ఎంటర్ చేసుకోవాలి.👉అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తరువాత సబ్మిట్ చేయాలి.👉అన్ని సరిగ్గా అప్లోడ్ చేసి సబ్మిట్ చేసిన తరువాత రిక్వెస్ట్ యాక్సెప్ట్ అవుతుంది. ఆ తరువాత వివరాలు మీకు అందుతాయి.ఎంప్లాయర్ చేయాల్సింది..👉ఎంప్లాయ్ వివరాలను అందుకున్న తరువాత ఎంప్లాయర్.. ఈపీఎఫ్ఓ అధికారికి వెబ్సైట్లో ఎంప్లాయర్ ఐడీతో ఎంటర్ అవ్వాలి. 👉మెంబర్ ట్యాబ్ మీద క్లిక్ చేసి.. జాయింట్ డిక్లరేషన్ చేంజ్ రిక్వెస్ట్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.👉ఉద్యోగి అభ్యర్థను చెక్ చేసిన తరువాత ఎంప్లాయర్ అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు.👉ఎంప్లాయర్ ఉద్యోగి రిక్వెస్ట్ అంగీకరిస్తే.. అది ఈపీఎఫ్ఓకు చేరుతుంది.
మళ్ళీ ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి: నేటి కొత్త ధరలు ఇవే..
జూన్ ప్రారంభం నుంచి స్వల్ప తగ్గుదలను నమోదు చేసిన పసిడి ధరలు మళ్ళీ పుంజుకుంటున్నాయి. ఈ రోజు (జూన్ 6) కూడా గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 820 వరకు పెరిగింది. కాబట్టి నేడు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా గుంటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.67300 (22 క్యారెట్స్), రూ.72110 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తగ్గాయి.చెన్నైలో కూడా బంగారం ధరలు రూ. 750 నుంచి రూ. 820 వరకు పెరిగాయి. కాబట్టి 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 68000 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 74180 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. నిన్నటి ధరల కంటే ఈ రోజు ధరలు పెరిగాయని అవగతమవుతోంది.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67450 (10 గ్రా), 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73570 (10 గ్రా) వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 700, రూ. 770 పెరిగింది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా పెరిగాయి. నిన్న (జూన్ 6) రూ. 2300 తగ్గిన వెండి ధర.. ఈ రోజు (జూన్ 7) రూ. 1800 పెరిగింది. దీంతో ఈ రోజు కేజీ వెండి ధర రూ. 93500లకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
భారత్లో భారీగా పెరిగిన జపనీస్ బ్రాండ్ కారు సేల్స్
2024 మే నెల ముగియడంతో వాహన తయారీ సంస్థలు తమ అమ్మకాల గణాంకాలను విడుదల చేస్తున్నాయి. ఈ తరుణంలో భారతదేశంలో అధిక ప్రజాదరణ పొందిన జపనీస్ ఆటోమొబైల్ తయారీదారు 'నిస్సాన్ ఇండియా' కూడా సేల్స్ డేటా రిలీజ్ చేసింది.కంపెనీ విడుదల చేసిన డేటా ప్రకారం.. నిస్సాన్ కంపెనీ మే 2024లో 6204 యూనిట్ల మాగ్నైట్ కార్లను విక్రయించినట్లు సమాచారం. ఈ సంఖ్య ఏప్రిల్ 2024లో 3043 యూనిట్లు మాత్రమే. దీన్నిబట్టి చూస్తే కంపెనీ సేల్స్ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. మొత్తం అమ్మకాల్లో కంపెనీ మునుపటి కంటే కూడా 34 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి.మే 2023లో నిస్సాన్ అమ్మకాలు 4631 యూనిట్లు మాత్రమే. అదే మే 2024లో కంపెనీ సేల్స్ 6204కు చేరాయి. ఇందులో దేశీయ విక్రయాలు 2211 కాగా.. ఎగుమతులు 3993గా నమోదయ్యాయి. క్రమంగా నిస్సాన్ మాగ్నైట్ సేల్స్ పెరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో ఇది మరింత మంది కస్టమర్లను ఆకర్షిస్తుందని.. నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ 'సౌరభ్ వత్సా' పేర్కొన్నారు.నిస్సాన్ కంపెనీ భారతీయ మార్కెట్లో ఇప్పడు కేవలం ఒకే కారును విక్రయిస్తోంది. రాబోయే రోజుల్లో కంపెనీ కొత్త కార్లను లాంచ్ చేస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అయితే కంపెనీ ఇండియాలో తన నెట్వర్క్ పెంచుతూనే ఉంది. ప్రస్తుతం నిస్సాన్ 272 టచ్పాయింట్లను కలిగి ఉంది. వీటి ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు సేల్స్ మాత్రమే కాకుండా సర్వీస్ కూడా అందిస్తోంది.కంపెనీ తన నిస్సాన్ మాగ్నైట్ SUVని ప్రపంచ వ్యాప్తంగా 15 దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. ఇందులో సీషెల్స్, బంగ్లాదేశ్, ఉగాండా, బ్రూనై వంటి దేశాలు మాత్రమే కాకుండా.. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్, కువైట్ వంటి మధ్యప్రాచ్య దేశాలు ఉన్నాయి.
వీడియోలు
కేంద్ర కేబినెట్ లో ఇద్దరికి ఛాన్స్ ?
దాడులతో ఏపీనీ మరో బీహార్ లా మారుస్తున్న టీడీపీ
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
టీడీపీ దాడులపై బాలరాజు సంచలన వ్యాఖ్యలు
పోలీసుల ముందే టీడీపీ దాడులు
కాంగ్రెస్ కు షర్మిల రాజీనామా.. ?
ప్రజా తీర్పును గౌరవిస్తాం ఓటమి పై బొత్స ఫస్ట్ రియాక్షన్
ఢిల్లీ వాటర్ కష్టాలు
Bangalore Rave Party: ‘మా’ నుంచి హేమ సస్పెండ్
ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
ఫ్యామిలీ
Asafoetida : ఇంగువతో ఆరోగ్య, ఔషధ ప్రయోజనాలు
ప్రతీ వంట ఇంట్లో ఇంగువ (ఆసఫోటిడా) ఘుమఘుమ లాడుతుంది. వాసన ఘాటుగా, చేదు రుచితో లభించే సుగంధ ద్రవ్యం . కొన్నిసార్లు "డెవిల్స్ డంగ్" అని పిలుస్తారు.దీని వాసన అంత ఇష్టంగా ఉండక పోయిన్పటికీ ఆహారాన్ని మంచిరుచిని ఇస్తుంది. అలాగే దీని వలన ఆరోగ్య, ఔషధ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దామా..!ఇంగువ ఆరోగ్యానికి మంచిది. పప్పు, సాంబారు, పులిహోర, రసం, పచ్చళ్లలో ఇంగువ లేని పోపును ఊహించలేం. ఇది మంచి ప్రిజర్వేటివ్గా కూడా పనిచేస్తుంది. ఇంగువను తీసుకోవటం వలన జీర్ణక్రియ మెరుగు పడుతుంది. కడుపులో ఉన్న గ్యాస్ , ఎసిడిటీలకు చెక్ పెడుతుంది. కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్స్తో సహా కొన్ని కొవ్వులనుంచి అధిక రక్త స్థాయిలను తగ్గిస్తుంది. శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. ఇంగువలో ఉండే కూమరిన్స్ అనే రసాయనాలు రక్తాన్ని పలుచగా చేస్తాయి.జలుబు, దగ్గు సమస్యలను తగ్గించటంలో కూడా ఎంతో మేలు చేస్తుంది…రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇందులోని యాంటీబయోటిక్, యాంటీ వైరల్,యాంటీ ఇన్ఫ్లోమెంటరీ లక్షణాలు శ్వాసకు సంబంధించిన ఇబ్బందులను కూడా తొలగిస్తాయి. అంతేకాదు స్వల్పపరిమాణంలో నెలసరి టైం లో వచ్చే పొత్తి కడుపు నొప్పి కూడా తగ్గిస్తుంది. కప్పు నీళ్లను బాగా మరగబెట్టి దీనిలో చిటికెడు ఇంగువ వేసి రెండు మూడు సార్లు తీసుకున్నట్లయితే తలనొప్పి కూడా మాయం అవుతుంది. ఇంగువను వాము బెల్లంతో కలిపి తీసుకోవటం వలన నులి పురుగుల సమస్య తగ్గుతుంది.సౌందర్య సాధనాలలో ఆహారాలు , పానీయాలలో సువాసన పదార్ధంగా ఉపయోగిస్తారు. కుక్కలు, పిల్లులు దూరంగా ఉంచే ఉత్పత్తులలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. అయితే ఇంగువను మితంగా తీసుకోవడం ఉత్తమం.
భర్త చనిపోయిన 15 నెలలకు బిడ్డకు జన్మనిచ్చిన మోడల్.. ఎలాగో తెలుసా?
భార్యభర్తల్లో ఒకరు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోతే ఈ విషాదాన్ని తట్టుకోవడం, దాన్నుంచి బయటపడటం రెండో వారికి చాలా కష్టం. తమ దాంపత్యానికి గుర్తుగా పుట్టిన పిల్లల్ని చూసుకుంటూ, వారికోసం జీవితాన్ని గడిపేసే వారు ఎక్కువగా ఉంటారు కదా. కానీ ఒక ఆస్ట్రేలియన్ మహిళ తన జీవిత భాగస్వామి చనిపోయిన 15 నెలలకు బిడ్డకు జన్మనిచ్చింది. ఏంటీ అర్థం కాలేదా? అయితే మీరీ స్టోరీ చదవాల్సిందే.ఆస్ట్రేలియన్ మోడల్ ఎల్లిడీ పుల్లిన్ స్పెర్మ్ రిట్రీవల్ ద్వారా బిడ్డను కన్నది. తన పోడ్కాస్ట్లో తన ప్రయాణాన్ని పంచుకుంది. మరణానంతరం భర్త వీర్యం ద్వారా గర్భం దాల్చడం, బిడ్డను కనడం గురించి పోడ్కాస్ట్లో వివరించింది. ఈ స్టోరీ ఇపుడు వైరల్గా మారింది. 2022లోనే ఇన్స్టాలో ఈ వివరాలను షేర్ చేసింది కూడా. View this post on Instagram A post shared by El Pullin (@ellidy_) 2020 జూలైలో ఎల్లిడీ పుల్లిన్ భర్త అలెక్స్ చుంప్ అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. స్పియర్ ఫిషింగ్లో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు విడిచిన తన భర్తకు గుర్తుగా బిడ్డను కనాలని ఆశపడింది. ఇందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ, పద్ధతుల గురించి స్డడీ చేసింది. భర్త నుంచి పోస్ట్మార్టం స్పెర్మ్ రిట్రీవల్ చేయాలని వైద్య నిపుణులను కోరింది. డాక్టర్లు మరణించిన భర్త నుంచి స్మెర్మ్ కలెక్ట్ చేశారు. తర్వాత ఐవీఎఫ్ విధానంలో ఎల్లిడీ గర్బం దాల్చింది.అలా భర్తను కోల్పోయిన 15 నెలలకు ఎల్లిడీ ఒక ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అక్టోబర్ 2021లో మిన్నీ అలెక్స్ పుల్లిన్కు జన్మనిచ్చింది. తన పాప అచ్చం తన భర్తలానే ఉంది అంటూ మురిసిపోయింది. ఎల్లిడీ షేర్ చేసుకున్న వివరాల ప్రకారం. 2020 ఉదయం మాజీ వింటర్ ఒలింపియన్ అలెక్స్ స్పియర్ ఫిషింగ్కు వెళ్లాడు. ఎల్లిడీ అప్పుడు తమ కుక్కను బయటకు వాకింగ్కి తీసుకెళ్లింది. కానీ ఆమె భర్తను చూడటం అదే చివరిసారి అవుతుందని అస్సలు ఊహించలేదు. చివరికి ఫేస్బుక్ పోస్ట్ ద్వారా తన భర్త చనిపోయినట్టు గుర్తించింది. ఇంతలోనే పోస్ట్మార్టం స్పెర్మ్ రిట్రీవల్ గురించి తన స్నేహితులు చర్చించు కోవడం ఆమెను ఆకర్షించింది. ఎందుకంటే వారు ఒక బిడ్డను కనేందుకు అప్పటికే చాలా ఆశపడడ్డారు. చివరికి ఆరు నెలల తర్వాత ఐవీఎఫ్ ద్వారా తన కలను సాకారం చేసుకుంది.
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
కొందరికీ షాపింగ్ అంటే మహా ఇష్టం. చూసిందల్లా కొంటుంటారు. పాపం బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని కొందామన్నా సాధ్యం కాదు కొందరికీ. ఎంతలా కంట్రోల్గా ఉందామన్న ఆ వస్తువు కొనేదాక నిద్రపట్టని వాళ్ల గురించిn కూడా విన్నాం. కానీ నిద్రలో షాపింగ్ చేసే వ్యాధి గురించి విన్నారా? ఔను..! ఈ వ్యక్తులు నిద్రలోనే తెలియకుండానే షాపింగ్ చేస్తుంటారు. మెలుకవ వచ్చాక గానీ అసలు విషయం తెలియదంట. వామ్మో.. ఇదేం వ్యాది!. ఇలాంటివి కూడా ఉంటాయా అనుకోకండి. అలాంటి అరుదైన వ్యాధితోనే బాధపడుతోంది ఓ మహిళ.యూకేకి చెందిన 42 ఏళ్ల కెల్లీ నైప్స్ పారాసోమ్నియా ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతోంది. దీన్ని అరుదైన పారాసోమ్నియా స్లీపింగ్ డిజార్డర్గా పిలుస్తారు. ఈ డిజార్డర్ కారణంగా ఆమె నిద్రలోనే ఆన్లైన్ షాపింగ్ చేసేస్తుందట. ఏకంగా పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు దగ్గర నుంచి ఫ్రిడ్జ్ వంటి పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా కొనుగోలు చేసేస్తుంది. వాటి బిల్లను కూడా క్రెడిట్ కార్డులతో చెల్లించేస్తుందట. మేలుకువ వచ్చాక మొబైల్ చూసుకుంటే గానీ తెలియదంట. తన అకౌంట్లో డబ్బు కట్ అయ్యాక గానీ అసలు విషయం తెలుసుకులేకతున్నాని చెబుతుంది. ఇలా నిద్రలో తనకు తెలియకుండానే షాపింగ్ చేసి లక్షల్లో డబ్బుల పోగొట్టుకున్నానని చెబుతోంది. దీంతో ఆమెకు ప్రతి రాత్రి భయానకంగా మారిపోయింది. "తన జీవితంలో ప్రతి రాత్రి ఓ పీడకల మాదిరిగా అయిపోతోందని బాధపడుతోంది. తన క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలన్నీఫోన్లోనే సేవ్ అయ్యి ఉంటాయట. ఐతే ఈ మాయదారి జబ్బు కారణంగా తన బ్యాంక్ వివరాన్ని సైబర్ నేరాగాళ్లకు చెప్పేయడం కూడా జరిగిందంట. దీంతో వాళ్లు ఆమె ఖాతా నుంచి సుమారు రూ. 20 వేలకు పైగా తస్కరించారట కూడా. అయితే ఈలోగా తాను తన బ్యాంక్ లావాదేవీలను లాక్ చేసేయడంతో కొద్ది మొత్తంలోనే డబ్బును కోల్పోయానని అంటోంది." కెల్లీ. ఇక సమస్య నుంచి బయటపడేందుకు ముక్కుకి శ్వాస సంబధ సమస్యల నిమిత్తం అమర్చుకునే పరికరాన్ని ధరించి పడుకుంటుంది. ఈ డివైజ్ ముక్కు నుంచి హెడ్ వరకు కదలకుండా అటాచ్ అయ్యేలా డివైజ్ ఉంటుంది. కాబట్టి నిద్రలోనే తనకు తెలయకుండా చేసే విచిత్రమైన పనుల నుంచి ఉపశమనం పొందొచ్చనేది కెల్లీ ఆశ. అయితే కెల్లీ సమస్య నుంచి బయటపడలేదు సరికదా..!ఈ పరికరాన్ని కూడా నిద్రలో తనకు తెలియకుండానే తీసేస్తుందంట. ఈ సమస్య కారణంగా తాను అప్పులు పాలవ్వుతున్నానని కెల్లీ ఆవేదనగా చెప్పుకొచ్చింది. అయితే దీనికి చికిత్స లేదు. తనకు తానుగా బయటపడాలని సంకల్పించుకుంటేనే సాధ్యమని చెబుతున్నారు వైద్య నిపుణులు.పారాసోమ్నియా స్లీపింగ్ డిజార్డర్ అంటే..ఈ సమస్యతో బాధపడుతున్న వ్యక్తి నిద్రలోనే నడవడం /మాట్లాడటం / తినడం/ ఏమైన ఇతర కార్యకలాపాల్లో పాల్గొనడం వంటివి ఏ మాత్రం పూర్తి అవగాహనతో చేయరు. ఆ టైంలో వారికి మెదడు పాక్షికంగా మేల్కొని ఉంటుంది. ఎవరైనా ఆ వ్యక్తులను గమనించి గట్టిగా అదిలిస్తే తిరిగి స్ప్రుహలోకి వస్తారు. ఇలాంటివన్నీ రాత్రి మొదటి జామునే జరుగుతాయట. చిన్నారుల్లోనూ, కొందరూ పెద్దల్లోనూ నిద్రలోనే నడవడం/మాట్లాడటం వంటి సాధారణ లక్షణాలు ఉంటాయి. అయితే ఈ డిజార్డర్ తీవ్రంగా ఉంటేనే ఇలా సమస్యలు ఫేస్ చేస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. (చదవండి: అనారోగ్యంలోనూ... నీట్ టాపర్గా!)
మహిళలూ.. క్రాన్బెర్రీ జ్యూస్ ఆరోగ్య ప్రయోజనాల గురించి విన్నారా?
కుటుంబ బాధ్యతల్లో పడి చాలామంది మహిళలు తమ ఆరోగ్యం గురించి అస్సలు పట్టించు కోరు. నిజానికి రుతుస్రావం, గర్భధారణ, పిల్లల పోషణ లాంటి గురుతర బాధ్యతలను నిర్వహించే మహిళలు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. ఈ నేపథ్యంలో మహిళల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి బలాన్నిచ్చే ఒక జ్యూస్ గురించి తెలుసుకుందాం.క్రాన్బెర్రీ జ్యూస్. క్రాన్బెర్రీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. రోగ నిరోధక వ్యవస్థను బలపరిచి.. ఇన్ఫెక్షన్లు వంటివి రాకుండా కాపాడతాయిఉత్తర , దక్షిణ అమెరికా, గ్రేట్ బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ , ఐరోపాలో ఎక్కుగా సాగు చేస్తారు. ఎరికేసి కుటుంబానికి చెందిన వీటిని శాస్త్రీయంగా వ్యాక్సినియం ఆక్సికోకోస్ లేదా వ్యాక్సినియం మాక్రోకార్పన్ అని పిలుస్తారు. ఇవి పుల్లగా, తీయగా, కొంచెం చేదు కలగలిసిన రుచితో గమ్మత్తుగా ఉంటాయి.క్రాన్బెర్రీ జ్యూస్ ప్రయోజనాలునారింజ లేదా యాపిల్ లాంటి ఇతర జ్యూస్ల వలె ప్రాచుర్యం పొందనప్పటికీ, క్రాన్బెర్రీ జ్యూస్లో అనేక ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. స్వచ్ఛమైన క్రాన్బెర్రీ జ్యూస్లో సీ, ఈ విటమిన్లు, ఫినోలిక్ సమ్మేళనాలు వంటి విలువైన ఫైటోకెమికల్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి వయస్సు-సంబంధిత సమస్యలు, జబ్బులకు చెక్ పెడతాయి. వయసు పెరిగే కొద్దీ శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనే రసాయనాలు పేరుకుపోతాయి. క్రాన్బెర్రీ జ్యూస్లోని కొన్ని రసాయనాలు యాంటీఆక్సిడెంట్లు వీటిని అడ్డుకుంటాయి. కేన్సర్, మధుమేహం, గుండె వ్యాధి, జీర్ణ ఆరోగ్యం, మూత్ర నాళం ఆరోగ్యానికి చాలా మంచిది. క్రాన్బెర్రీ జ్యూస్లోని వివిధ పదార్థాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. క్రాన్బెర్రీస్లో పాలీఫెనాల్స్ అనే రసాయనాలు ఇందుకు తోడ్పడతాయి. మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న ఆడవారిపై 2011లో జరిపిన అధ్యయనంలో క్రాన్బెర్రీ జ్యూస్ రక్త ప్లాస్మాలో యాంటీఆక్సిడెంట్లను పెంచుతుందని కనుగొన్నారు. క్రాన్బెర్రీ జ్యూస్ను తీసుకునేవారిలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. గుడ్ కొలెస్ట్రాల్లెవల్స్ పెరుగుతాయి. కరోనరీ ఆర్టరీ వ్యాధి ఉన్నవారికి క్రాన్బెర్రీ జ్యూస్ ఒకబెస్ట్ ఆప్షన్. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని మరో అధ్యయనంలో తేలింది.ముఖ్యంగా మహిళలు క్రాన్బెరీతో చేసే జ్యూస్ తాగడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ ఫెక్షన్స్ బారిన పడకుండా ఉంటారు. అదే విధంగా యూరిన్లో వచ్చే మంట, దురదకు ఉపశమనం లభిస్తుంది.శరీరంలో మంట, దురద, చికాకు వంటివి రాకుండా అడ్డుకుంటుంది. శరీరంలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఎంజైమ్స్ని పెంచుతాయి.రూమటాయిడ్ ఆర్ర్థరైటీస్, కాలిటీస్, ఎథెరోక్లోరోసిన్, అల్జీమర్స్ పెరడెంటైటీస్, డయాబెటీస్ వంటి బారిన పడకుండా కాపాడుతుంది.చర్మ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ల వల్ల చర్మానికి, ముఖంలో మంచి మెరుపు వస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల ఫినోలిక్ యాసిడ్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గిస్తాయి. అంతేకాదు బాడీకి మంచి డిటాక్స్ డ్రింక్లా పని చేస్తుంది.నోట్: కొన్ని పరిశోధనల ప్రకారం వార్ఫరిన్ లాంటి బ్లడ్ థిన్నర్స్ , కొన్ని రకాల యాంటి బయెటిక్స్ వాడేవారు క్రాన్బెర్రీకి దూరంగా మంచిది. వైద్యుల సలహా మేరకుతీసుకోవాల్సి ఉంటుంది.
న్యూస్ పాడ్కాస్ట్
ఎన్డీయే నేతగా నరేంద్ర మోదీ ఏకగ్రీవ ఎన్నిక.. శనివారం లేదా ఆదివారం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం.. ఇంకా ఇతర అప్డేట్స్
లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించిన ఎన్డీయే.. బీజేపీకి కూటమికి 292 స్థానాలు, ఇండియా కూటమికి 234 స్థానాలు.. 240 సీట్లకే పరిమితమైన బీజేపీ, మెజారిటీ కంటే 32 స్థానాలు తక్కువ.. 99కి పెరిగిన కాంగ్రెస్ బలం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఫలితాలు కూడా ఈరోజే వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి, రీప్లేస్మెంట్ మనమే.. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
కేంద్రంలో ఎన్డీఏ హ్యాట్రిక్, 350 నుంచి 400 స్థానాలు ఖాయం, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ, ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభంజనం... ఎగ్జిట్ పోల్స్ అంచనా.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో నేడే ఆఖరి విడత పోలింగ్.. చండీగఢ్ సహా ఏడు రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాల్లో జరుగనున్న పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
మళ్లీ విజయం మనదే, ప్రజలందరి దీవెనలతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం... ‘ఎక్స్’లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు కేరళకు నైరుతి రుతుపవనాల రాక.. రెండు రోజుల్లో రాయలసీమలో ప్రవేశించే అవకాశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రతిపక్ష నాయకులు చల్లే బురదలోనే కమలాలు విరగబూస్తాయి.. ప్రధాని మోదీ ధీమా.. ఇంకా ఇతర అప్డేట్స్
మోదీని ఈడీ అడిగినా దేవుడు పంపాడని చెప్తారేమో అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
వివాహిత ఆత్మహత్య
కొత్తూరు: మండలంలోని కర్లెమ్మ పంచాయతీ ఎన్ఎన్ కాలనీలో నివాసం ఉంటున్న వన్నాల రేవతి(27) బుధవారం ఇంటిలో ఉన్న ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రేవతి భర్త కృష్ణారావు స్థానిక ఫైర్ స్టేషన్లో ఫైర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. సారవకోట మండలం కుమ్మరిగుంటకు చెందిన కృష్ణారావుకు పాతపట్నం మండలం పాచిగంగుపేటకు చెందిన రేవతితో తొమ్మిదేళ్ల కిందట వివాహం జరిగింది. అయితే ఎప్పటి మాదిరిగానే కృష్ణారావు విధుల నుంచి మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వచ్చాడు. ఇంటిలోకి వెళ్లే సరికి రేవతి ఫ్యాన్కు ఉరి వేసుకొని కనిపించింది. దీంతో వెంటనే ఆమెకు కిందకు దించి స్థానికుల సహకారంతో స్థానిక సీహెచ్సీకి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పాతపట్నం ఏరియా ఆస్పత్రికి పోలీసులు తరలించారు. వీరికి ఆరేళ్ల వయసు గల కుమార్తె ఉంది. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఏంఏ ఆహ్మద్ తెలిపారు.
టీడీపీ వేధింపులకువైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బలి
పెదవేగి: టీడీపీ కార్యకర్తల వేధింపులు తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా మండల కన్వీనర్ యలమంచిలి ప్రవీణ్ (30) ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు పంచాయతీ సూర్యారావుపేటకి చెందిన ప్రవీణ్ ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దుర్ఘటన మండలంలో విషాదం నింపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి అహర్నిశలు శ్రమించాడన్న కక్షతో ఓట్ల లెక్కింపు రోజు (ఈనెల 4న) సాయంత్రం ప్రవీణ్ ఇంటి మీద తెలుగుదేశం కార్యకర్తలు దాడిచేశారు. రాళ్లు, బీరు సీసాలు విసిరి, దుర్భాషలాడుతూ చంపేస్తామని బెదిరించారు. పెదవేగి పెట్రోల్ బంక్ వైపు వస్తే కొడతామని, బైక్, కారు తగలబెట్టేస్తామని హెచ్చరించారు. బుధవారం ఉదయం ప్రవీణ్ విజయరాయి పెట్రోల్ బంక్కి వెళ్లగా.. బండిపై మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి ఫొటోతో ఉన్న వైఎస్సార్సీపీ స్టిక్కర్ తీసేవరకు బీభత్సం సృష్టించి దాడిచేశారు. టీడీపీ వారి బెదిరింపులకు భయపడి, వేధింపులు భరించలేక ప్రవీణ్.. తన ఇంటి సమీపంలోని తోటలో చెట్టుకు ఉరేçÜుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రవీణ్ తల్లిదండ్రులు యలమంచిలి ఝన్సీరాణి, ప్రకాశరావు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దాడుల సంస్కృతి కొనసాగితే ఉరుకోం టీడీపీ వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకున్న ప్రవీణ్ భౌతికకాయానికి దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి నివాళులర్పించారు. కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రవీణ్ను బలితీసుకున్న టీడీపీ కార్యకర్తల అరాచకాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారని, వారి ఇళ్ల మీదకు వెళ్లి భౌతికదాడులు చేస్తూ, వాహనాలు, ఇంట్లో వస్తువులు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడుల సంస్కృతి కొనసాగితే ఊరుకునేదిలేదని టీడీపీ శ్రేణులను హెచ్చరించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులంతా సంయమనం పాటించాలని కోరారు.
విషాదం మిగిల్చిన విహారయాత్ర
ఇబ్రహీంపట్నం రూరల్: కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి యాత్రకు వెళ్లారు. అనంతరం దైవ దర్శనానికి బయలు దేరారు. అంతలోనే అనుకోని ఉపద్రవం ఎదురైంది. ఆదిబట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్కు చెందిన ఓ కుటుంబం చేపట్టిన విహారయాత్ర విషాదాన్ని నింపింది. రోడ్డు ప్రమాదం రూపంలో బాలుడిని బలిగొన్న ఘటన స్థానికంగా కలచి వేస్తోంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తాళ్ల దర్శన్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం మూడు కార్లల్లో విహారయాత్రకు వెళ్లారు. యాత్రలో భాగంగా భద్రాచలం నుంచి ములుగు జిల్లా మీదుగా తాడ్వాయి గుండా సమ్మక్క సారక్క వైపు వెళ్తుండగా మంగళవారం తెల్లవారుజామున కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో తాళ్ల అరుణ్ కుమారుడు శబరీశ్(9) అక్కడిక్కడే మృతి చెందాడు. కారు నడుపుతున్న అరుణ్, అతడి తండ్రి దర్శన్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికంగా ప్రథమ చికిత్స అనంతరం ఇద్దరినీ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దర్శన్(60) పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తండ్రీతాతలు ఆస్పత్రిలో ఉండగా పిల్లాడి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు సిద్ధం చేశారు. దీంతో కొంగరకలాన్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సీనియర్ ఐఏఎస్ ఇంట్లో విషాదం : చందమామలాంటి కుమార్తె తిరిగి రాని లోకాలకు
భార్యభర్తలిద్దరూ ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. వీరికి అందమైన కుమార్తె. చదువులో కూడా బాగా రాణిస్తోంది. ఇంతలోనే అనూహ్య పరిణామం వారి జీవితాల్లో తీరని అగాథాన్ని నింపింది. ఉన్నత చదువులు చదువుకుని తమకు మంచి పేరు తెస్తుందనుకున్న కుమార్తె అర్థాంతరంగా తనువు చాలించిన ఘటన కలకలం రేపింది.పోలీసులు అందించిన సమాచారం మహారాష్ట్రలో ఉన్నత పదవుల్లో ఉన్నారు వికాస్రస్తోగి, ఆయన భార్య రాధికా రస్తోగి. వికాస్ రస్తోగి మహారాష్ట్ర విద్యా శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, రాధికా రస్తోగి రాష్ట్ర హోం శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. వీరికి లిపి రస్తోగి (27)అనే కుమార్తె ఉంది. ఈమె హర్యానాలోని సోనేపట్లో న్యాయశాస్త్రం చదువుతోంది అయితే పరీక్షలకు సంబంధించిన ఒత్తిడి నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. ముంబైలోని అపార్ట్మెంట్లోని 10వ అంతస్తు నుంచి దూకింది. లిపిని వెంటనే జిటి ఆసుపత్రికి తరలించి నప్పటికీ అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తన మరణానికి ఎవరూ బాధ్యులు కాదని మృతికి ఎవరినీ నిందించవద్దంటూ పేర్కొన్న సూసైడ్ నోట్ని అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నారు కాగా 2017లో ఇదే తరహాలో మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారులు మిలింద్, మనీషా మహీస్కర్ జంట 18 ఏళ్ల కుమారుడిని కోల్పోయారు.