T20 World Cup 2024: టీమిండియాతో మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌.. తుది జట్లు ఇవే..! | T20 World Cup 2024: Pakistan Won The Toss And Choose To Bowl Against Team India, Here Are The Playing XI | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: టీమిండియాతో మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌.. తుది జట్లు ఇవే..!

Published Sun, Jun 9 2024 8:11 PM | Last Updated on Sun, Jun 9 2024 8:17 PM

T20 World Cup 2024: Pakistan Won The Toss And Choose To Bowl Against Team India, Here Are The Playing XI

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా న్యూయార్క్‌ వేదికగా టీమిండియాతో ఇవాళ (జూన్‌ 9) జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. తేలికపాటి జల్లులు, ఔట్‌ ఫీల్డ్‌ తడిగా ఉన్న కారణంగా టాస్‌ అరగంట ఆలస్యమైంది. 

ఈ మ్యాచ్‌లో భారత్‌ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా బరిలోకి దించగా.. పాక్‌ గత మ్యాచ్‌లో ఆడిన జట్టులో ఓ మార్పు చేసింది. పాక్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ ఆజం ఖాన్‌కు పక్కన పెట్టి ఇమాద్‌ వసీంను తుది జట్టులోకి తీసుకుంది. 

తుది జట్లు..

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్‌కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్

పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్‌), బాబర్ ఆజం (కెప్టెన్‌), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ అమీర్
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement