breaking news
team india
-
ENG VS IND 4th Test Day 2: దంచికొట్టిన ఇంగ్లండ్ ఓపెనర్లు
మాంచెస్టర్: నాలుగో టెస్టులో ఇంగ్లండ్ మళ్లీ ‘బజ్బాల్’ ఆటకు దిగినట్లుంది. ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్లిద్దరూ వన్డేను తలపించే బ్యాటింగ్ దూకుడు కనిపించడంతో ఒక్క సెషన్లోనే 148 పరుగులు చేసింది. అంతకుముందు భారత ఇన్నింగ్స్ను గాయపడిన రిషభ్ పంత్ బ్యాటింగ్కు దిగి ఆదుకున్నాడు. టెస్టులో పోరాడేందుకు తనవంతు పరుగులు జతచేసే నిష్క్రమించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్లో భారత్ 114.1 ఓవర్లలో 358 పరుగుల వద్ద ఆలౌటైంది. రిషభ్ పంత్ (75 బంతుల్లో 54; 3 ఫోర్లు, 2 సిక్స్లు), శార్దుల్ ఠాకూర్ (88 బంతుల్లో 41; 5 ఫోర్లు) రాణించారు. లోయర్ ఆర్డర్పై ప్రతాపం చూపిన బెన్ స్టోక్స్ 5 వికెట్లు పడగొట్టగా, ఆర్చర్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 46 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఓపెనర్లు జాక్ క్రాలీ (113 బంతుల్లో 84; 13 ఫోర్లు, 1 సిక్స్), బెన్ డకెట్ (100 బంతుల్లో 94; 13 ఫోర్లు) అదరగొట్టారు. పోప్ (20 బ్యాటింగ్; 3 ఫోర్లు), రూట్ (11 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. జడేజా, అన్షుల్ కంబోజ్లకు ఒక్కో వికెట్ దక్కింది. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంగ్లండ్ ఇంకా 133 పరుగులు వెనుకబడి ఉంది. తడబడిన మిడిలార్డర్ రెండో రోజు ఓవర్నైట్ స్కోరు 264/4తో గురువారం ఆట ప్రారంభించిన భారత్ ఆదిలోనే కీలకమైన వికెట్ను కోల్పోయింది. క్రితం రోజు స్కోరుకు కేవలం ఒక పరుగే జతచేసిన జడేజా (20; 3 ఫోర్లు)ను ఆర్చర్ బోల్తా కొట్టించాడు. ఈ దశలో శార్దుల్కు వాషింగ్టన్ సుందర్ జతయ్యాడు. ఇద్దరు అడపాదడపా బౌండరీలు కొడుతూ జట్టు స్కోరును 300 దాటించారు. ఈ సెషన్ ముగిసే దశలో ఉండగా క్రీజులో పాతుకుపోయిన శార్దుల్ను స్టోక్స్ అవుట్ చేసి భారత్ను కష్టాల్లోకి నెట్టాడు. తొలిరోజు రిటైర్డ్హర్ట్గా వెనుదిరిగిన రిషభ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. ఈ దశలో 321/6 స్కోరు వద్ద వర్షం కాసేపు ఆటంకపరిచింది. అక్కడితోనే తొలి సెషన్ ముగిసింది. రెండో సెషన్లో పంత్, సుందర్ ఇన్నింగ్స్ను గాడినపెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఈ జోడీ బలపడుతుండగానే స్టోక్స్ మళ్లీ గట్టిదెబ్బే కొట్టాడు. నాలుగు బంతుల వ్యవధిలో సుందర్ (90 బంతుల్లో 27; 2 ఫోర్లు), అన్షుల్ కంబోజ్ (0)లను అవుట్ చేశాడు. ఆర్చర్ బౌలింగ్లో 6 కొట్టిన పంత్... స్టోక్స్ వేసిన మరుసటి ఓవర్లో బౌండరీతో 69 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తిచేసుకున్నాడు. తర్వాత కాసేపటికే ఆర్చర్... పంత్తో పాటు బుమ్రా (4) వికెట్ పడగొట్టడంతో భారత్ ఇన్నింగ్స్కు తెరపడింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) బ్రూక్ (బి) డాసన్ 58; రాహుల్ (సి) క్రాలీ (బి) వోక్స్ 46; సుదర్శన్ (సి) కార్స్ (బి) స్టోక్స్ 61; గిల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) స్టోక్స్ 12; పంత్ (బి) ఆర్చర్ 54; జడేజా (సి) బ్రూక్ (బి) ఆర్చర్ 20; శార్దుల్ (సి) డకెట్ (బి) సోŠట్క్స్ 41; సుందర్ (సి) వోక్స్ (బి) స్టోక్స్ 27; అన్షుల్ (సి) స్మిత్ (బి) స్టోక్స్ 0; బుమ్రా (సి) స్మిత్ (బి) ఆర్చర్ 4; సిరాజ్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 30; మొత్తం (114.1 ఓవర్లలో ఆలౌట్) 358. వికెట్ల పతనం: 1–94, 2–120, 3–140, 4–235, 5–266, 6–314, 7–337, 8–337, 9–349, 10–358. బౌలింగ్: వోక్స్ 23–5–66–1, ఆర్చర్ 26.1–3–73–3, కార్స్ 21–1–71–0, స్టోక్స్ 24–3–72–5, డాసన్ 15–1–45–1, జో రూట్ 5–0–19–0. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) రాహుల్ (బి) జడేజా 84; డకెట్ (సి) సబ్–జురేల్ (బి) అన్షుల్ 94, ఒలీ పోప్ (బ్యాటింగ్) 20; రూట్ (బ్యాటింగ్) 11; ఎక్స్ట్రాలు 16; మొత్తం (46 ఓవర్లలో 2 వికెట్లకు) 225. వికెట్ల పతనం: 1–166, 2–197. బౌలింగ్: బుమ్రా 13–4–37–0, అన్షుల్ కంబోజ్ 10–1–48–1, సిరాజ్ 10–0–58–0, శార్దుల్ 5–0–35–0, జడేజా 8–0–37–1. -
పంత్ వీరోచిత పోరాటం.. ముగిసిన భారత తొలి ఇన్నింగ్స్
మాంచెస్టర్ టెస్ట్లో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 358 పరుగులకు ఆలౌటైంది. 264/4 వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. ఓవర్నైట్ స్కోర్కు మరో 94 పరుగులు జోడించి మిగతా 6 వికెట్లు కోల్పోయింది.తొలి రోజు ఆటలో గాయపడిన వికెట్కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఇవాళ వీరోచితంగా పోరాడి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇవాళ శార్దూల్ ఠాకూర్ ఔటయ్యాక రీఎంట్రీ ఇచ్చిన పంత్.. వాషింగ్టన్ సుందర్, అన్షుల్ కంబోజ్ సాయంతో భారత ఇన్నింగ్స్ను తీర్చిదిద్దాడు. పంత్ తొమ్మిదో వికెట్గా వెనుదిరిగాక భారత ఇన్నింగ్స్ క్షణాల్లో ముగిసింది.భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.ఇవాల్టి ఆటలో ఇంగ్లండ్ బౌలర్ బెన్ స్టోక్స్ చెలరేగిపోయాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తంగా అతను 5 వికెట్లు తీశాడు. ఆర్చర్కు సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్, డాసన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
గాయాన్ని సైతం లెక్క చేయకుండా ఆడి చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్
మాంచెస్టర్ టెస్ట్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో గాయాన్ని సైతం లెక్క చేయకుండా బరిలోకి దిగిన పంత్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక పరుగులు (67 ఇన్నింగ్స్ల్లో 2719 పరుగులు) చేసిన భారత ఆటగాడిగా అవతరించాడు. ఈ రికార్డు ఇంతకుముందు రోహిత్ శర్మ (69 ఇన్నింగ్స్ల్లో 2716 పరుగులు) పేరిట ఉండేది. పంత్ తాజాగా హిట్మ్యాన్ రికార్డును బద్దలు కొట్టాడు.ఈ మ్యాచ్లో పంత్ 54 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. తొలి రోజు ఆటలో 37 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ అయిన పంత్.. మరో 17 పరుగులు జోడించి పెవిలియన్కు చేరాడు. బొటన వేలు గాయంతో బాధపడుతూనే పంత్ ఆడిన ఈ ఇన్నింగ్స్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. పంత్ వీరోచిత పోరాటానికి అందరూ సలాం కొడుతున్నారు. పంత్ హాఫ్ సెంచరీకి చేరువలో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో బాదిన ఓ సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. ఈ సిక్సర్తో పంత్ భారత్ తరఫున టెస్ట్ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును సమం చేశాడు. ప్రస్తుతం పంత్, సెహ్వాగ్ టెస్ట్ల్లో తలో 90 సిక్సర్లతో ఉన్నారు.హాఫ్ సెంచరీ పూర్తి కాగానే పంత్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పంత్ ఔటయ్యాక భారత్ ఇన్నింగ్స్ కొద్ది క్షణాల్లోనే ముగిసింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది.భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 5, ఆర్చర్ 3, వోక్స్ డాసన్ తలో వికెట్ తీశారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
మళ్లీ బ్యాటింగ్కు దిగిన పంత్.. లంచ్ సమయానికి టీమిండియా స్కోర్ ఎంతంటే..?
మాంచెస్టర్ టెస్ట్లో భారత్ ఓ మోస్తరు స్కోర్ దిశగా పయనిస్తుంది. రెండో రోజు లంచ్ విరామం సమయానికి టీమిండియా 6 వికెట్ల కోల్పోయి 321 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (20), రిషబ్ పంత్ (39) క్రీజ్లో ఉన్నారు.ఓవర్నైట్ స్కోర్ 264/4 వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రవీంద్ర జడేజా తన వ్యక్తిగత స్కోర్కు మరో పరుగు మాత్రమే జోడించి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.జడేజా ఆదిలోనే ఔటైనప్పటికీ శార్దూల్ ఠాకూర్ (41).. వాషింగ్టన్ సుందర్ సాయంతో ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. లంచ్ విరామానికి కొద్ది సమయం ముందు శార్దూల్ స్టోక్స్ బౌలింగ్లో బెన్ డకెట్కు క్యాచ్ ఇచ్చి ఆరో వికెట్గా వెనుదిరిగాడు.అనంతరం పంత్ గాయంతో బాధపడుతూనే బరిలోకి దిగాడు. తొలి రోజులో ఆటలో పంత్ 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గాయం బారిన పడి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. పంత్ గాయం తీవ్రమైందే అయినప్పటికీ జట్టు అవసరాల దృష్ట్యా బ్యాటింగ్కు దిగాడు. పంత్ సేవలు ఈ మ్యాచ్లో కేవలం బ్యాటింగ్కు మాత్రమే పరిమితమవుతాయని, అతను వికెట్కీపింగ్ చేయడని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది.ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన విషయం తెలిసిందే. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్మన్ గిల్ 12, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 3, వోక్స్, ఆర్చర్, డాసన్ తలో వికెట్ తీశారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
మరోసారి ఇంగ్లండ్లో పర్యటించనున్న టీమిండియా.. షెడ్యూల్ విడుదల
భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టు వచ్చే ఏడాది మరోసారి ఇంగ్లండ్లో పర్యటించనుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలోనే ఉన్న టీమిండియా.. 2026 జులైలో ఇంగ్లండ్తో 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఈ మేరకు ఇవాళ (జులై 24) షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది జులై 1 (డర్హమ్), 4 (మాంచెస్టర్), 7 (నాటింగ్హమ్), 9 (బ్రిస్టల్), 11 (సౌతాంప్టన్) తేదీల్లో ఐదు టీ20లు.. ఆతర్వాత 14 (బర్మంగ్హమ్), 16 (కార్డిఫ్), 19 (లార్డ్స్) తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. భారత్తో జరగాల్సిన మ్యాచ్లతో పాటు వచ్చే ఏడాది హెం సమ్మర్ షెడ్యూల్ మొత్తాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. పురుషులతో పాటు మహిళల క్రికెట్కు సంబంధించిన షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. వచ్చే ఏడాది హోం సమ్మర్లో భారత మహిళల జట్టు కూడా ఇంగ్లండ్తో మ్యాచ్లు ఆడనుంది. ఈ పర్యటనలో భారత్ 3 టీ20లు, ఓ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. వచ్చే ఏడాది ఇంగ్లండ్ పురుషుల హోం సమ్మర్ షెడ్యూల్..మొదటి టెస్ట్ న్యూజిలాండ్తో జూన్ 4-8 లార్డ్స్, లండన్రెండవ టెస్ట్ న్యూజిలాండ్తో జూన్ 17-21 ది కియా ఓవల్, లండన్మూడవ టెస్ట్ న్యూజిలాండ్తో జూన్ 25-29 ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్హామ్మొదటి T20I ఇండియాతో జూలై 1 బ్యాంక్స్ హోమ్స్ రివర్సైడ్, డర్హమ్రెండవ T20I ఇండియాతో జూలై 4 ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్3వ T20I ఇండియాతో జూలై 7 ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్హామ్4వ T20I ఇండియాతో జూలై 9 సీట్ యూనిక్ స్టేడియం, బ్రిస్టల్5వ T20I ఇండియాతో జూలై 11 యుటిలిటా బౌల్, సౌతాంప్టన్మొదటి వన్డే ఇండియాతో జూలై 14 ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్రెండవ వన్డే ఇండియా తోజూలై 16 సోఫియా గార్డెన్స్, కార్డిఫ్మూడవ వన్డే ఇండియాతో జూలై 19 లార్డ్స్, లండన్మొదటి టెస్ట్ పాకిస్తాన్తో ఆగస్టు 19-23 హెడింగ్లీ, లీడ్స్రెండవ టెస్ట్ పాకిస్తాన్తో ఆగస్టు 27-31 లార్డ్స్, లండన్మూడవ టెస్ట్ పాకిస్తాన్తో సెప్టెంబర్ 9-13 ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్మొదటి T20I శ్రీలంకతో సెప్టెంబర్ 15 యుటిలిటా బౌల్, సౌతాంప్టన్రెండవ T20I శ్రీలంకతో సెప్టెంబర్ 17 సోఫియా గార్డెన్స్, కార్డిఫ్3వ T20I శ్రీలంకతో సెప్టెంబర్ 19 ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్మొదటి ODI శ్రీలంకతో సెప్టెంబర్ 22 బ్యాంక్స్ హోమ్స్ రివర్సైడ్, డర్హామ్రెండవ ODI శ్రీలంకతో సెప్టెంబర్ 24 హెడింగ్లీ, లీడ్స్మడవ ODI శ్రీలంకతో సెప్టెంబర్ 27 ది కియా ఓవల్, లండన్వచ్చే ఏడాది ఇంగ్లండ్ మహిళల హోం సమ్మర్ షెడ్యూల్..మొదటి వన్డే న్యూజిలాండ్తో మే 10 బ్యాంక్స్ హోమ్స్ రివర్సైడ్, డర్హామ్రెండవ వన్డే న్యూజిలాండ్తో మే 13 ది కౌంటీ గ్రౌండ్, నార్తాంప్టన్మూడవ వన్డే న్యూజిలాండ్తో మే 16 సోఫియా గార్డెన్స్, కార్డిఫ్1వ T20I న్యూజిలాండ్తో మే 20 ది సెంట్రల్ కో-ఆప్ కౌంటీ గ్రౌండ్, డెర్బీ2వ T20I న్యూజిలాండ్తో మే 23 ది స్పిట్ఫైర్ గ్రౌండ్, కాంటర్బరీ3వ T20I న్యూజిలాండ్తో మే 25 ది 1వ సెంట్రల్ కౌంటీ గ్రౌండ్, హోవ్1వ T20I ఇండియాతో మే 28 అంబాసిడర్ క్రూయిజ్ లైన్ గ్రౌండ్, చెల్మ్స్ఫోర్డ్2వ T20I ఇండియాతో మే 30 సీట్ యూనిక్ స్టేడియం, బ్రిస్టల్3వ T20I ఇండియాతో జూన్ 2 ది కూపర్ అసోసియేట్స్ కౌంటీ గ్రౌండ్, టౌంటన్టెస్ట్ ఇండియాతో జూలై 10-14 లార్డ్స్, లండన్1వ వన్డే ఐర్లాండ్తో సెప్టెంబర్ 1 ది అప్టన్స్టీల్ కౌంటీ గ్రౌండ్, లీసెస్టర్2వ వన్డే ఐర్లాండ్తో సెప్టెంబర్ 3 ది సెంట్రల్ కో-ఆప్ కౌంటీ గ్రౌండ్, డెర్బీ3వ వన్డే ఐర్లాండ్తో సెప్టెంబర్ 6 వోర్సెస్టర్షైర్ న్యూ రోడ్, వోర్సెస్టర్ -
Anshul Kambo: జెర్సీ నంబర్ 'ఏకే-47'
దాదాపు ఆరు వారాల క్రితం... నార్తాంప్టన్లో ఇంగ్లండ్ లయన్స్తో భారత్ ‘ఎ’ తలపడిన అనధికారిక టెస్టులో అన్షుల్ కంబోజ్ సభ్యుడిగా ఉన్నాడు. ఈ మ్యాచ్లో 4 వికెట్లు తీయడంతో పాటు అతను అర్ధ సెంచరీ కూడా సాధించాడు. మరో 10 రోజుల్లో భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా జట్టులో ప్రధాన పేసర్ ఒకరు గాయంతో బాధపడుతుండటంతో ముందు జాగ్రత్తగా మరో పేసర్ను టీమ్తో చేర్చాలని మేనేజ్మెంట్ భావించింది. ‘ఎ’ తరఫున ప్రదర్శన చూసిన తర్వాత కంబోజ్కు అవకాశం దక్కవచ్చని అంతా అనుకున్నారు. అయితే హర్షిత్ రాణాను జట్టు ఎంచుకుంది. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాతి రోజు ఉదయమే తాను రోజూ సాధన చేసే అకాడమీకి కంబోజ్ చేరుకున్నాడు. ఇంగ్లండ్ నుంచి వస్తూ వస్తూ అతను కొన్ని డ్యూక్స్ బంతులను వెంట తెచ్చుకున్నాడు. సింగిల్ స్టంప్ను పెట్టుకొని వాటితో ప్రాక్టీస్ మొదలు పెట్టేశాడు. కోచ్ ఎలా ఉన్నావు అడిగితే ‘అంతా బాగుంది సర్. కానీ నాకు ఇంకా నమ్మకం ఉంది’ అంటూ జవాబిచ్చాడు. జట్టులో స్థానంపై ఆశలు కోల్పోని కంబోజ్కు కొద్ది రోజులకే తీపి కబురు వచ్చింది. డ్యూక్స్ బంతులతో సాధన ఇంగ్లండ్తో మ్యాచ్ కోసమేనా అన్నట్లుగా వచ్చీ రాగానే టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసే అవకాశం కూడా లభించింది. – సాక్షి క్రీడా విభాగంహరియాణాలో బాక్సర్లకు అడ్డా అయిన కర్నాల్ సమీపంలో ఫజీల్పూర్ అన్షుల్ స్వస్థలం. చాలా మందిలాగే అతనూ మట్టి మైదానాల్లో క్రికెట్ ఆడుతూ వచ్చాడు. 14 ఏళ్ల వయసు వచ్చాకే బౌలింగ్పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడు. తండ్రి ఉధమ్ సింగ్ అన్ని రకాలుగా అండగా నిలవగా... స్థానిక కోచ్ సతీశ్ రాణా అతడిని తీర్చి దిద్దాడు. అకాడమీలో చేర్పించిన అనంతరం అన్షుల్ ఆట పదునెక్కింది. ఆ్రస్టేలియా దిగ్గజం గ్లెన్ మెక్గ్రాత్ను విపరీతంగా అభిమానించే అతను... మెక్గ్రాత్ తరహాలోనే పేస్ కంటే కూడా కచ్చితత్వంపైనే ఎక్కువగా ఆధారపడతాడు. భారత్లో స్వింగ్ బౌలింగ్కు బాగా అనుకూలించే మైదానంగా గుర్తింపు పొందిన లాహ్లిలో ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం కలిసి రాగా, తీవ్ర సాధనతో అన్షుల్ సీమ్ బౌలింగ్లో రాటుదేలాడు. ఇప్పుడే అదే ప్రత్యేకత అతడిని తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికయ్యేలా చేసింది. నాన్నకు ఆనందం పంచుతూ... ఆరేళ్ల క్రితం భారత అండర్–19 జట్టుకు ఎంపిక కావడం అన్షుల్ కెరీర్లో కీలక మలుపు. నిజానికి అంతకు కొద్ది రోజుల ముందే అండర్–19 వరల్డ్ కప్లో ఆడే భారత జట్టులో చోటు లభించే అవకాశం రాగా, గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఆ సమయంలో తీవ్రంగా బాధపడిన అన్షుల్ ఆటను వదిలేద్దామనుకున్నాడు. కానీ అతనిలోని ప్రతిభ గురించి తెలిసిన తండ్రి కొనసాగమని గట్టిగా ప్రోత్సహించాడు. దాంతో పట్టుదలగా ఆడుతూ ముందుకు వెళ్లిన అన్షుల్ 2022లో తొలిసారి హరియాణా తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్ బరిలోకి దిగాడు. మూడేళ్లు గడిచేసరికి ఇప్పుడు భారత్ తరఫున టెస్టు క్రికెట్ ఆడటంతో తండ్రి ఆనందానికి అవధుల్లేవు. గత పదేళ్లుగా ఉధమ్ సింగ్ నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. కంబోజ్ ఎంపిక తండ్రి బాధలన్నీ ఒక్క క్షణంలో దూరం చేసిందని అతని సోదరుడు సంయమ్ చెప్పాడు. కంబోజ్ మ్యాచ్ ఆడే సమయంలోనే అతని తల్లికి కిడ్నీ సంబంధిత సర్జరీ కూడా ఉంది. ఆ సమయంలో కొడుకు లేకపోయినా... కోలుకున్న తర్వాత ఆ కుటుంబంలో కనిపించే సంతోషం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు 24 మ్యాచ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో 22.88 సగటుతో 79 వికెట్లు పడగొట్టిన అన్షుల్ తొలి టెస్టులో బౌలింగ్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడు.ఆ రెండు ప్రదర్శనలు...అన్షుల్ అనూహ్యంగా దూసుకు వచ్చిన తరహా ఆటగాడు కాదు. దేశవాళీ క్రికెట్లో నిలకడైన ప్రదర్శనతో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు. 2023–24 సీజన్ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీని హరియాణా గెలుచుకోవడంలో 17 వికెట్లతో అతను కీలక పాత్ర పోషించాడు. ఇది అతనికి రూ.20 లక్షలతో తొలి ఐపీఎల్ అవకాశం ఇప్పించింది. 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున 3 మ్యాచ్లు ఆడగలిగాడు. తొలి మ్యాచ్లో ట్రవిస్ హెడ్ను క్లీన్బౌల్డ్ చేయగా... అది నోబాల్గా తేలింది. ఈ స్థాయిలో ఆడటం అంత సులువు కాదని అది తనకు నేర్పించిందని అతను గుర్తు చేసుకున్నాడు. అన్షుల్ ప్రతిభకు ఐపీఎల్ 2025లో గుర్తింపు దక్కింది. వేలంలో రూ.3 కోట్ల 40 లక్షలకు అతడిని సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ 8 మ్యాచ్లలో అవకాశం ఇచ్చింది. ఈ హరియాణా ప్లేయర్ తన పేరును, జెర్సీ నంబర్ను ఒకే చోట చేర్చి (అన్షుల్ కంబోజ్–ఏకే 47) పేరుతో జెర్సీని ధరించి ఐపీఎల్ మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. గత సీజన్ దులీప్ ట్రోఫీ మ్యాచ్లో భారత్ ‘సి’ తరఫున ఇన్నింగ్స్లో 8 వికెట్లు తీసిన అన్షుల్, రంజీ మ్యాచ్లో కేరళపై ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసిన మూడో బౌలర్గా ఘనతను అందుకున్నాడు. అనంతపురంలో జరిగిన దులీప్ ట్రోఫీ మ్యాచ్లో బౌలింగ్కు ఏమాత్రం అనుకూలంగా లేని పిచ్పై భారత్ ‘సి’ 525 పరుగులు చేయగా... అన్షుల్ దెబ్బకు ‘బి’ 332 పరుగులకే ఆలౌటైంది. ‘ప్రతిభ మాత్రమే కాదు...జహీర్, బుమ్రా తరహాలో తనదైన వ్యూహంతో బౌలింగ్ చేయగల అరుదైన పేసర్ అన్షుల్’ అంటూ అతని సీఎస్కే సహచరుడు అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లండ్ గడ్డపై తనకు లభించిన అవకాశాలను అన్షుల్ సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లడం ఖాయం. -
ENG VS IND 4th Test: తొలి రోజు మెరుగైన స్థితిలో ముగిసిన ఆట
తొలి సెషన్లో ఒక్క వికెట్ కోల్పోకుండా ఓపెనర్ల పట్టుదల... ఆపై తక్కువ వ్యవధిలో మూడు వికెట్లు... కీలక సమయంలో రిషభ్ పంత్కు గాయం... చివరకు సంతృప్తిగా ముగింపు! మాంచెస్టర్ టెస్టులో భారత జట్టు పరిస్థితి ఇది. టాస్ ఓడినా సానుకూల ఆటతో భారత బ్యాటింగ్ కొనసాగింది. యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ అర్ధ సెంచరీలతో ఆకట్టుకోగా, ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ బంతితో రాణించాడు. ఇంకా లోతైన బ్యాటింగ్ ఉండటంతో రెండో రోజు టీమిండియా ఎంత భారీ స్కోరు నమోదు చేస్తుందనేది చూడాలి. మాంచెస్టర్: ఇంగ్లండ్తో నాలుగో టెస్టును భారత్ ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. బుధవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 83 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (151 బంతుల్లో 61; 7 ఫోర్లు), యశస్వి జైస్వాల్ (107 బంతుల్లో 58; 10 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. రిషభ్ పంత్ (48 బంతుల్లో 37 రిటైర్డ్హర్ట్; 2 ఫోర్లు, 1 సిక్స్) గాయంతో మైదానం వీడాడు. ప్రస్తుతం రవీంద్ర జడేజా (19 బ్యాటింగ్), శార్దుల్ ఠాకూర్ (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానం చరిత్రలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జట్టు ఒక్కసారి కూడా మ్యాచ్ గెలవలేదు. అయినా సరే, స్టోక్స్ మరోసారి టాస్ గెలిచి అలాంటి సాహసం చేశాడు. ఈ సిరీస్లో ఇంగ్లండ్ నాలుగు టాస్లూ గెలవగా... అంతర్జాతీయ క్రికెట్లో భారత్ వరుసగా 14 టాస్లు ఓడిపోయింది! ఓపెనర్ల శుభారంభం... భారత్కు మరోసారి ఓపెనర్లు జైస్వాల్, కేఎల్ రాహుల్ (98 బంతుల్లో 46; 4 ఫోర్లు) మెరుగైన ఆరంభాన్ని అందించారు. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వీరిద్దరు చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. లంచ్ సమయానికి జట్టు వికెట్ నష్టపోకుండా 78 పరుగులు చేసింది. అయితే రెండో సెషన్లో పరిస్థితి మారింది. తక్కువ వ్యవధిలో పదునైన బంతితో రాహుల్ను అవుట్ చేసి వోక్స్ జట్టుకు తొలి వికెట్ అందించాడు. 96 బంతుల్లో అర్ధ సెంచరీ మార్క్ను అందుకున్న తర్వాత డాసన్ బౌలింగ్లో జైస్వాల్ వెనుదిరగ్గా... గత టెస్టు వైఫల్యాన్ని శుబ్మన్ గిల్ (12) ఇక్కడా కొనసాగించాడు. స్టోక్స్ బంతిని ఆడకుండా వదిలేసిన గిల్ రివ్యూ కోరినా లాభం లేకపోయింది. అంతకుముందు భారత్ కొన్ని ఉత్కంఠ క్షణాలను ఎదుర్కొంది. స్టోక్స్ బౌలింగ్లో 20 పరుగుల వద్ద సుదర్శన్ ఇచ్చిన సునాయాస క్యాచ్ను కీపర్ స్మిత్ వదిలేయడం కాస్త కలిసొచ్చింది. కీలక భాగస్వామ్యం... టీ విరామం తర్వాత సుదర్శన్, పంత్ చక్కటి సమన్వయంతో ఇన్నింగ్స్ను నడిపించారు. సుదర్శన్ ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయగా, పంత్ కూడా సంయమనం ప్రదర్శిస్తూ పరుగులు రాబట్టాడు. వీరిద్దరు నాలుగో వికెట్కు 72 పరుగులు జోడించిన తర్వాత గాయంతో పంత్ తప్పుకోవాల్సి వచ్చింది. 134 బంతుల్లో కెరీర్లో తొలి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం సుదర్శన్ను స్టోక్స్ వెనక్కి పంపాడు. ఈ దశలో జడేజా, శార్దుల్ కలిసి జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరు 55 బంతుల్లో అభేద్యంగా 29 పరుగులు జత చేసి తొలి రోజును ముగించారు. చివర్లో వెలుతురు మందగించడంతో అంపైర్ల సూచనతో ఇంగ్లండ్ స్పిన్ బౌలింగ్కే పరిమితమైంది. దాంతో 80 ఓవర్ల తర్వాత కూడా జట్టు కొత్త బంతి తీసుకునే ప్రయత్నం చేయలేదు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) బ్రూక్ (బి) డాసన్ 58; రాహుల్ (సి) క్రాలీ (బి) వోక్స్ 46; సుదర్శన్ (సి) కార్స్ (బి) స్టోక్స్ 61; గిల్ (ఎల్బీ) (బి) స్టోక్స్ 12; పంత్ (రిటైర్డ్హర్ట్) 37; జడేజా (బ్యాటింగ్) 19; శార్దుల్ (బ్యాటింగ్) 19; ఎక్స్ట్రాలు 12; మొత్తం (83 ఓవర్లలో 4 వికెట్లకు) 264. వికెట్ల పతనం: 1–94, 2–120, 3–140, 3–212 (రిటైర్డ్ నాటౌట్), 4–235. బౌలింగ్: వోక్స్ 17–4–43–1, ఆర్చర్ 16–2–44–0, కార్స్ 16–1–60–0, స్టోక్స్ 14–2–47–2, డాసన్ 15–1–45–1, రూట్ 5–0–19–0.అన్షుల్ కంబోజ్ @ 318పేస్ బౌలర్ అన్షుల్ కంబోజ్ ఈ మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన 318వ ఆటగాడిగా అతను నిలిచాడు. హరియాణాకు చెందిన 24 ఏళ్ల అన్షుల్ 24 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 22.88 సగటుతో 79 వికెట్లు పడగొట్టాడు. లార్డ్స్ టెస్టులో ఆడిన జట్టు నుంచి మూడు మార్పులతో భారత్ బరిలోకి దిగింది. గాయాలతో దూరమైన నితీశ్, ఆకాశ్దీప్కు బదులుగా అన్షుల్, శార్దుల్లను ఎంపిక చేయగా...కరుణ్ నాయర్ను తప్పించి సాయి సుదర్శన్కు అవకాశం కల్పించారు. రిషభ్ పంత్కు గాయం!భారత్ను ఈ టెస్టులో ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉన్న ఘటన తొలి రోజే చోటు చేసుకుంది. వికెట్ కీపర్ రిషభ్ పంత్ బ్యాటింగ్ చేస్తూ గాయపడి రిటైర్డ్హర్ట్గా వెనుదిరిగాడు. వోక్స్ వేసిన బంతిని రివర్స్ స్వీప్ ఆడబోగా బంతి నేరుగా అతని కుడి పాదంపై పడింది. ఎల్బీడబ్ల్యూ అప్పీల్కు అంపైర్ స్పందించకపోవడంతో ఇంగ్లండ్ రివ్యూ కోరింది. బంతి కాలికి తగిలే ముందే బ్యాట్ను తాకుతూ వెళ్లడంతో అతను నాటౌట్గా తేలాడు. అయితే బంతి బలంగా తాకడంతో పంత్ తీవ్ర నొప్పితో విలవిల్లాడాడు. సహచరుల అండతో ఒంటికాలిపై అడుగు వేయాల్సి వచ్చింది. చివరకు కార్ట్లో అతడిని మైదానం బయటకు తీసుకెళ్లారు. గాయం తీవ్రత ఎలాంటిదనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఆ తర్వాత ఈ టెస్టులో అతని పరిస్థితి ఏమిటనేది తేలుతుంది. -
ENG VS IND 4th Test Day 1: కష్టాల్లో భారత్
మాంచెస్టర్ టెస్ట్లో టీమిండియా కష్టాల్లో పడింది. 140 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్ (46), యశస్వి జైస్వాల్ (58) శుభారంభాన్ని అందించి ఔట్ కాగా.. శుభ్మన్ గిల్ కేవలం 12 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. 46 పరుగుల వ్యవధిలో భారత్ 3 కీలకమైన వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. సాయి సుదర్శన్ (26), రిషబ్ పంత్ (3) భారత్ను పటిష్ట స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.భారత్ కోల్పోయిన వికెట్లలో రాహుల్ వికెట్ క్రిస్ వోక్స్కు.. జైస్వాల్ వికెట్ లియామ్ డాసన్కు.. శుభ్మన్ గిల్ వికెట్ బెన్ స్టోక్స్కు దక్కింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. మొదటి, మూడు టెస్ట్ల్లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. భారత్ రెండో మ్యాచ్లో గెలుపొందింది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ సిరీస్లో నిలబడుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ భారత్కు డు ఆర్ డైగా మారింది.తుది జట్లు..ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.భారత్: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (WK),రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. -
ENG VS IND 4th Test: సచిన్ రికార్డును సమం చేసిన జైస్వాల్
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్ట్లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఓ అరుదైన మైలురాయిని అధిగమించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 58 పరుగులు చేసి ఔటైన జైస్వాల్.. టెస్ట్ల్లో ఇంగ్లండ్పై 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన 20వ బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. అలాగే ఈ ఘనత సాధించిన రెండో వేగవంతమైన భారత బ్యాటర్గా సచిన్ టెండూల్కర్, మొహమ్మద్ అజహారుద్దీన్ రికార్డును సమం చేశాడు. సచిన్, అజహార్, జైస్వాల్ ఇంగ్లండ్పై తలో 16 ఇన్నింగ్స్ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నారు. ఇంగ్లండ్పై అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన రికార్డు రాహుల్ ద్రవిడ్ పేరిట ఉంది. ద్రవిడ్ కేవలం 15 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 47 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (46), యశస్వి జైస్వాల్ (58) ఔట్ కాగా.. సాయి సుదర్శన్ (20), కెప్టెన్ శుభ్మన్ గిల్ (11) క్రీజ్లో ఉన్నారు. భారత్ కోల్పోయిన వికెట్లలో రాహుల్ వికెట్ క్రిస్ వోక్స్కు.. జైస్వాల్ వికెట్ లియామ్ డాసన్కు దక్కింది. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. మొదటి, మూడు టెస్ట్ల్లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. భారత్ రెండో మ్యాచ్లో గెలుపొందింది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ సిరీస్లో నిలబడుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ భారత్కు డు ఆర్ డైగా మారింది.తుది జట్లు..ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.భారత్: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (WK),రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. -
ENG Vs IND: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. టీమిండియాలో మూడు మార్పులు
మాంచెస్టర్ వేదికగా భారత్తో ఇవాళ (జులై 23) మొదలైన నాలుగో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఏకంగా మూడు మార్పులు చేసింది. కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్దీప్ స్థానాల్లో సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్ తుది జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మ్యాచ్తో 24 హర్యానా యువ పేసర్ అన్షుల్ కంబోజ్ టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేస్తున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ ఈ మ్యాచ్ కోసం రెండు రోజుల కిందటే తుది జట్టును ప్రకటించింది. మూడో టెస్ట్ ఆడిన జట్టు నుంచి గాయపడిన షోయబ్ బషీర్ తప్పుకున్నాడు. అతడి స్థానంలో లియామ్ డాసన్ తుది జట్టులోకి వచ్చాడు. ఐదు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తొలి, మూడో టెస్ట్ల్లో ఇంగ్లండ్ గెలువగా.. భారత్ రెండో టెస్ట్లో విజయం సాధించింది. తుది జట్లు..ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.భారత్: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్),రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. -
విధ్వంసం సృష్టించిన టీమిండియా కెప్టెన్.. వన్డేల్లో రెండో వేగవంతమైన శతకం
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టుతో ఇవాళ (జులై 22) జరుగుతున్న నిర్ణయాత్మక చివరి వన్డేలో భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ చెలరేగిపోయింది. ఈ మ్యాచ్లో హర్మన్ కేవలం 82 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, భారత్ తరఫున వన్డేల్లో రెండో వేగవంతమైన సెంచరీని నమోదు చేసింది. ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 318 పరుగుల భారీ స్కోర్ చేసింది.ఈ మ్యాచ్లో మొత్తంగా 84 బంతులు ఎదుర్కొన్న హర్మన్ 14 ఫోర్ల సాయంతో 102 పరుగులు చేసి ఔటైంది. హర్మన్తో పాటు భారత ఇన్నింగ్స్లో జెమీమా రోడ్రిగెజ్ (50), స్మృతి మంధన (45), హర్లీన్ డియోల్ (45), రిచా ఘోష్ (38 నాటౌట్), ప్రతిక రావల్ (26) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. భారత బ్యాటర్ల ధాటికి ఈ మ్యాచ్లో ఇంగ్లీష్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. సోఫీ ఎక్లెస్టోన్ (10-2-28-1) మినహా మిగతా బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. లారెన్ బెల్ 10 ఓవర్లలో 82, లారెన్ ఫైలర్ 10 ఓవర్లలో 64, చార్లోట్ డీన్ 10 ఓవర్లలో 69, లిన్సే స్మిత్ 10 ఓవర్లలో 74 పరుగులు సమర్పించుకొని తలో వికెట్ తీశారు.భారత్ తరఫున అత్యంత వేగవంతమైన వన్డే సెంచరీలు..70 స్మృతి మంధన vs ఐర్లాండ్ రాజ్కోట్ 202582 హర్మన్ప్రీత్ కౌర్ vs ఇంగ్లాండ్ చెస్టర్-లీ-స్ట్రీట్ 202585 హర్మన్ప్రీత్ కౌర్ vs దక్షిణాఫ్రికా బెంగళూరు 202489 జెమిమా రోడ్రిగ్స్ vs దక్షిణాఫ్రికా కొలంబో RPS 2025ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుకే సిరీస్ సొంతమవుతుంది. దీనికి ముందు ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ జరగగా, భారత్ 3-2 తేడాతో ఆ సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. -
సెంచరీ మిస్ చేసుకున్న ఆయుశ్ మాత్రే
ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరుగుతున్న రెండో యూత్ టెస్ట్లో భారత అండర్-19 జట్టు కెప్టెన్ ఆయుశ్ మాత్రే తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో మాత్రే 90 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 80 పరుగులు చేసి ఔటయ్యాడు. మాత్రే సెంచరీ మిస్ అయినా మరో భారత యువ ఆటగాడు విహాన్ మల్హోత్రా శతక్కొట్టాడు. విహాన్ 123 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 120 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో భారత్ మూడో రోజు రెండో సెషన్ సమయానికి తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. భారత్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 49 పరుగులు వెనుకపడి ఉంది. కనిష్క్ చౌహాన్ (7), నమన్ పుష్పక్ (0) క్రీజ్లో ఉన్నారు.ఆయుశ్ మాత్రే వికెట్ కోల్పోయాక టీమిండియా 85 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది. మాత్రే, విహాన్ క్రీజ్లో ఉండగా టీమిండియా భారీ స్కోర్ చేస్తుందని అంతా అనుకున్నారు. అయితే రాల్ఫీ ఆల్బర్ట్ (15-2-53-6) టీమిండియా బ్యాటర్లను కుదురుకోనివ్వకుండా వరుస విరామాల్లో వికెట్లు తీశాడు. మాత్రే, విహాన్ ఔటయ్యాక నలుగురు బ్యాటర్లు (అభిగ్యాన్ కుందు, రాహుల్ కుమార్, అంబరీష్, హెనిల్ పటేల్) డకౌట్ అయ్యారు. మధ్యలో హర్వంశ్ పంగాలియా (28) భారత ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ ఇన్నింగ్స్లో భారత చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (20) తక్కువ స్కోర్కే ఔటయ్యాడు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 309 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ థామస్ ర్యూ అర్ధ శతకం (59)తో మెరవగా.. భారత సంతతికి చెందిన ఏకాన్ష్ సింగ్ (117) శతకంతో ఆకట్టుకున్నాడు. మిగతా వారిలో జేమ్స్ మింటో (46) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. భారత బౌలర్లలో నమన్ పుష్పక్ 4, ఆదిత్య రావత్, అంబరీష్ తలో 2, హెనిల్ పటేల్, విహాన్ మల్హోత్రా చెరో వికెట్ పడగొట్టారు.కాగా, భారత్-ఇంగ్లండ్ మధ్య రెండు మ్యాచ్ల ఈ సిరీస్లోని తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసింది. ఆ మ్యాచ్లో భారత కెప్టెన్ ఆయుశ్ మాత్రే తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో కదంతొక్కాడు. రెండో ఇన్నింగ్స్లో వైభవ్ మెరుపు అర్ద సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీనికి ముందు జరిగిన 5 మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ 3-2 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఓ సెంచరీ సహా పలు విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడాడు. -
టీమిండియాకు బిగ్ షాక్.. కన్ఫర్మ్ చేసిన శుభ్మన్ గిల్
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో రేపటి నుంచి ప్రారంభంకాబోయే నాలుగో టెస్ట్కు ముందు భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. సిరీస్లో నిలబడాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్కు ముందు ముగ్గురు కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. ఈ విషయాన్ని కెప్టెన్ శుభ్మన్ గిల్ అధికారికంగా ధృవీకరించినట్లు తెలుస్తుంది. నితీశ్ కుమార్ రెడ్డి సిరీస్లోని మిగతా రెండు మ్యాచ్లకు దూరం కాగా.. పేసర్లు అర్షదీప్ సింగ్, ఆకాశ్దీప్ నాలుగో టెస్ట్కు దూరమయ్యారని గిల్ పేర్కొన్నట్లు సమాచారం. పైన పేర్కొన్న విషయాల్లో నితీశ్, అర్షదీప్ అందుబాటులో ఉండరన్న విషయంపై క్లారిటీ ఉన్నప్పటికీ.. ఆకాశ్దీప్ విషయంలో మాత్రం గిల్ పూర్తి సమచారాన్ని అందించినట్లు తెలుస్తుంది. ఆకాశ్దీప్కు ప్రత్యామ్నాయంపై కూడా గిల్ మాట్లాడినట్లు సమాచారం. అన్షుల్ కంబోజ్, ప్రసిద్ద్ కృష్ణల్లో ఎవరిని ఆడిస్తారనే విషయంపై మ్యాచ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు నిర్ణయం తీసుకుంటామని గిల్ చెప్పినట్లు తెలుస్తుంది.అలాగే కరుణ్ నాయర్ భవితవ్యంపై కూడా గిల్ మాట్లాడినట్లు సమాచారం. కరుణ్కు మరో అవకాశం ఉంటుందని గిల్ పరోక్షంగా చెప్పినట్లు తెలుస్తుంది. కరుణ్ ఈ సిరీస్లో తన స్థాయి ప్రదర్శన చేయలేదన్న విషయాన్ని అంగీకరించిన గిల్.. అతనికి మరో అవకాశం ఉంటుందని చెప్పినట్లు సమాచారం. ఈ సిరీస్లో కరుణ్ ఫామ్ను అందిపుచ్చుకుంటాడని గిల్ ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.పంత్ విషయంలోనూ గిల్ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. నాలుగో టెస్ట్లో పంత్ వికెట్కీపింగ్ చేస్తాడని గిల్ ధృవీకరించినట్లు తెలుస్తుంది. ఈ విషయాలతో పాటు గిల్ మూడో టెస్ట్ సందర్భంగా జరిగిన ఓ విషయాన్ని కూడా ప్రస్తావించినట్లు సమాచారం. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 90 సెకెన్లు ఆలస్యంగా బరిలోకి దిగిందని, ఇలా చేయడం క్రీడాస్పూర్తికి విరుద్దమని గిల్ అసహనం వ్యక్తిం చేసినట్లు సమాచారం.నాలుగో టెస్ట్లో ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవెన్..జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.టీమిండియా (అంచనా)..యశస్వి జైస్వాల్, KL రాహుల్, కరుణ్ నాయర్, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (WK), ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. -
భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్.. అభిమానులకు చేదు వార్త
భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ మాంచెస్టర్ వేదికగా రేపటి నుంచి ప్రారంభం కానుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్కు వరుణుడి ఆటంకం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మ్యాచ్ జరిగే ఐదు రోజులూ వర్షం పడే అవకాశాలున్నాయని అంచనా.వెదర్ రిపోర్ట్ను నిజం చేస్తూ మాంచెస్టర్లో ఇవాల్టి నుంచే వర్షం మొదలైంది. స్టేడియం చుట్టూ దట్టమైన మబ్బులు కమ్ముకొని భారీ వర్షం కురుస్తుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మైదానం చిత్తడిగా మారి, రేపు ఆట ప్రారంభ సమయానికి ఇబ్బంది పెట్టవచ్చు. వాతావరణం ఇలాగే కొనసాగితే పిచ్ ప్రభావంలో కూడా మార్పు రావచ్చు. BAD NEWS FOR CRICKET FANS 📢- It's raining in Manchester ahead of the 4th Test. [Bharat Sharma from PTI] pic.twitter.com/OF0PgPhzxv— Johns. (@CricCrazyJohns) July 22, 2025ప్రస్తుతానికి పిచ్ బ్యాటర్లు, బౌలర్లకు సమాంతరంగా సహరించవచ్చు. తొలి మూడు రోజుల్లో ఉదయం పూట (తొలి సెషన్లో) బంతి బౌన్స్ అవుతుంది. దీన్ని బ్యాటర్లు అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు. ఆట గడిచే కొద్దీ స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుందని అంచనా. ఈ పిచ్పై తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు లబ్ది చేకూరే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.టీమిండియా విషయానికొస్తే.. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకపడి ఉంది. ఈ మ్యాచ్ భారత్కు డు ఆర్ డై అన్నట్లుగా మారింది. మాంచెస్టర్లో భారత్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోవడం ఆందోళన కలిగించే అంశం. ఈ పిచ్పై టీమిండియా ఇప్పటివరకు 9 టెస్ట్ మ్యాచ్లు ఆడగా.. నాలుగు సార్లు ఓటమిపాలై, ఐదు మ్యాచ్లను డ్రా చేసుకుంది. చివరిగా భారత్ ఈ పిచ్పై 2014లో మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్లో ఓటమిపాలైంది. 2014లో ఆడిన భారత్ జట్టు సభ్యుల్లో ప్రస్తుతం రవీంద్ర జడేజా ఒక్కడే ఉన్నాడు. ఇది ఓ రకంగా భారత్కు కలిసొచ్చే విషయం. ఈ మ్యాచ్లో భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. భారత్ ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేసుకుంటుందో, లేక ఓడి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను చేజార్చుకుంటుందో చూడాలి.నాలుగో టెస్ట్లో ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవెన్..జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.టీమిండియా (అంచనా)..యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్/కరుణ్ నాయర్, శుభమన్ గిల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ (WK), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అన్షుల్ కాంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. -
ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్.. చరిత్ర సృష్టించేందుకు సిద్దంగా ఉన్న పంత్
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించేందుకు అతి సమీపంలో ఉన్నాడు. జులై 23 నుంచి ఇంగ్లండ్తో ప్రారంభం కాబోయే నాలుగో టెస్ట్లో పంత్ మరో 182 పరుగులు చేస్తే.. ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన వికెట్కీపర్ బ్యాటర్గా సరికొత్త రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు సౌతాఫ్రికా దిగ్గజం డెనిస్ లిండ్సే పేరిట ఉంది. లిండ్సే 1966/67 ఆస్ట్రేలియా సిరీస్లో 5 మ్యాచ్ల్లో (7 ఇన్నింగ్స్ల్లో) 86.57 సగటున 3 సెంచరీలు, 2 అర్ద సెంచరీల సాయంతో 606 పరుగులు చేశాడు.ఈ రికార్డు బద్దలు కొట్టేందుకు పంత్ 182 పరుగుల దూరంలో ఉన్నాడు. ఆరు దశాబ్దాల తర్వాత పంత్కు ఈ రికార్డు బద్దలు కొట్టే అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో పంత్ ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడి 6 ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీల సాయంతో 425 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో శుభ్మన్ గిల్ (607) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. ఒక వేళ పంత్ నాలుగో టెస్ట్లో ఈ అవకాశం మిస్ అయినా ఐదో టెస్ట్లో సాధించే అవకాశం ఉంటుంది.మరో 101 పరుగులు చేస్తే..!ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్లో పంత్ 101 పరుగులు చేస్తే ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్గా రికార్డు సాధిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు బుద్ది కుందరన్ పేరిట ఉంది. కుందరన్ 1963/64లో ఇంగ్లండ్తో జరిగిన 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 10 ఇన్నింగ్స్లు ఆడి 525 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ ఉంది.ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్లు..డెనిస్ లిండ్సే-606ఆండీ ఫ్లవర్- 540కుందరన్- 525బ్రాడ్ హడిన్- 493గెర్రి అలెగ్జాండర్- 484ఆడమ్ గిల్క్రిస్ట్- 473అలెక్ స్టివార్ట్- 465వాల్కాట్- 452రిషబ్ పంత్- 425రికార్డుల మాట అటుంచితే, అసలు పంత్ ఆడతాడా..?రికార్డుల మాట అటుంచితే ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్లో పంత్ ఆడతాడా లేదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. మూడో టెస్ట్లో గాయపడిన పంత్.. నాలుగో మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొనడం లేదు.పంత్ గాయంపై భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డెష్కటే అప్డేట్ ఇచ్చాడు. పంత్ ఇంకా నొప్పితో బాధపడుతున్నాడని, నాలుగో టెస్ట్ సమయానికి ఫిట్నెస్ సాధిస్తాడని థీమా వ్యక్తం చేశాడు. ముందుస్తు జాగ్రత్తగా పంత్ను ప్రాక్టీస్కు దూరంగా ఉంచామని తెలిపాడు.కాగా, మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్కు ముందే పంత్ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడి స్ధానంలో ధ్రువ్ జురెల్ సబ్స్ట్యూట్ వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వర్తించాడు. వికెట్కీపింగ్కు దూరంగా ఉన్నా పంత్ రెండు ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ మాత్రం చేశాడు. -
వరుస వైఫల్యాలు.. కరుణ్ నాయర్పై వేటు..?
లండన్: ఇంగ్లండ్తో నాలుగో టెస్టు ఈ నెల 23 నుంచి జరగనుండగా అప్పుడే తుది జట్టుపై చర్చ మొదలైంది. సిరీస్లో జట్టు ఆడిన మూడు టెస్టులను చూస్తే బ్యాటర్ కరుణ్ నాయర్ మినహా ఇతర ఆటగాళ్లంతా రాణించారు. నాయర్ మాత్రం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. క్రీజ్లోకి వచ్చాక మెరుగ్గానే ఇన్నింగ్స్లను ఆరంభించినా...వాటిని అతను భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు.అతను వరుసగా 0, 20, 31, 26, 40, 14 (మొత్తం 131 పరుగులు) స్కోర్లు నమోదు చేశాడు. ఎనిమిదేళ్ల విరామం తర్వాత తనకు లభించిన ‘మరో చాన్స్’ను నాయర్ సది్వనియోగం చేసుకోలేదు. ముఖ్యంగా లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో అతను అవుటైన తీరు విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టులో నాయర్ స్థానం నిలబెట్టుకోవడం కష్టంగానే ఉంది.కీలకమైన మూడో స్థానంలో నాయర్కు బదులుగా యువ ఆటగాడు సాయి సుదర్శన్కు మరో అవకాశం ఇవ్వాలని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. లీడ్స్ టెస్టు మొదటి ఇన్నింగ్స్లో డకౌట్ అయినా... రెండో ఇన్నింగ్స్లో చక్కటి షాట్లతో చెప్పుకోదగ్గ ప్రదర్శన (30 పరుగులు) కనబర్చాడు. తుది జట్టుకు సంబంధించి ఈ ఒక్క మార్పు మాత్రం కచ్చితంగా ఉండవచ్చని తెలుస్తోంది. కాగా, 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లో ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్ల్లో ఇంగ్లండ్ 2, భారత్ ఓ టెస్ట్ మ్యాచ్లో గెలిచాయి. సిరీస్లో నిలబడాలంటే భారత్ నాలుగో టెస్ట్లో గెలవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో తుది జట్టులో పలు మార్పులకు ఆస్కారం ఉంది. విశ్లేషకుల అభిప్రాయం మేరకు కరుణ్ నాయర్ను తప్పించి సాయి సుదర్శన్కు అవకాశం ఇవ్వవచ్చు. -
గెలిపించగలనని నమ్మాను.. గతంలోనూ ఇలాంటి స్థితిలో ఆడాను: టీమిండియా స్టార్ క్రికెటర్
సౌతాంప్టన్: ఇంగ్లండ్తో బుధవారం జరిగిన తొలి వన్డేను భారత మహిళల జట్టు గెలుచుకోవడంలో దీప్తి శర్మ ప్రధాన పాత్ర పోషించింది. ఆఫ్స్పిన్నర్గా జట్టు బౌలింగ్ బృందంలో రెగ్యులర్ సభ్యురాలైన దీప్తి... బ్యాటర్గా లోయర్ ఆర్డర్లో అనేక మార్లు కీలక ఇన్నింగ్స్లు ఆడింది. ఇప్పుడు ఇంగ్లండ్తో మ్యాచ్లో ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన దీప్తి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ జట్టును విజయం వరకు తీసుకెళ్లింది.28వ ఓవర్లో 127/4 వద్ద క్రీజ్లోకి వచ్చిన ఆమె 62 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 64 పరుగులు సాధించి చివరి వరకు అజేయంగా నిలిచింది. లారెన్ బెల్ బౌలింగ్లో దీప్తి ఒంటి చేత్తో కొట్టిన సిక్సర్ హైలైట్గా నిలిచింది.‘ఇన్నేళ్ల నా కెరీర్లో చాలా సందర్భాల్లో ఇలాంటి స్థితిలోనే బరిలోకి దిగాను. నేను ఎంత ప్రశాంతంగా ఉండగలనో నాకు బాగా తెలుసు. కాబట్టి ఏమాత్రం ఒత్తిడికి గురి కాలేదు. ఈసారి కూడా అదే కీలకంగా మారింది. జెమీమాతో భాగస్వామ్యం నెలకొల్పడంపై ముందుగా దృష్టి పెట్టాను. మా పార్ట్నర్షిప్ జట్టు గెలుపు వరకు తీసుకెళుతుందని నేను నమ్మాను.నేను చివరి వరకు నిలిస్తే విజయం ఖాయమవుతుందని తెలుసు. జెమీమా తర్వాత రిచా, అమన్ కూడా బాగా సహకరించారు. ఒంటి చేత్తో సిక్సర్ కొట్టడం రిషభ్ పంత్ను చూసి నేర్చుకున్నాను’ అని మ్యాచ్ అనంతరం దీప్తి శర్మ వ్యాఖ్యానించింది.ఇంగ్లండ్ పేసర్ ఫైలర్ షార్ట్ పిచ్ బంతులతో పన్నిన వ్యూహానికి తాము సిద్ధంగా ఉండటం వల్లే ఎలాంటి సమస్యా రాలేదని దీప్తి పేర్కొంది. ఆమె కెరీర్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవడం 20వసారి కాగా... మొదటిసారి బౌలింగ్లో ఒక్క వికెట్ కూడా తీయకుండా కేవలం బ్యాటింగ్ ప్రదర్శనతోనే ఆమె ఈ అవార్డును గెలుచుకోవడం విశేషం.త్వరలో జరిగే వన్డే వరల్డ్ కప్లోనూ ఆల్రౌండర్గా ఆమె కీలకం కానుంది. ‘మా జట్టు ఇటీవల వరుసగా చెప్పుకోదగ్గ విజయాలు సాధిస్తోంది. శ్రీలంకతో ముక్కోణపు టోర్నీ గెలిచాక ఇక్కడ కూడా బాగా రాణిస్తున్నాం. వరల్డ్ కప్కు ఇంకా చాలా సమయం ఉంది. దాని గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు. ప్రస్తుతం ఒక్కో మ్యాచ్పైనే దృష్టి పెట్టాం’ అని దీప్తి పేర్కొంది. తొలి వన్డేలో 4 వికెట్లతో ఇంగ్లండ్ను ఓడించిన భారత్ సిరీస్లో 1–0తో ముందంజ వేయగా... రేపు లార్డ్స్ మైదానంలో రెండో వన్డే జరుగుతుంది. -
కెప్టెన్గా నితీశ్ కుమార్ రెడ్డి
టీమిండియా యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కెప్టెన్ అయ్యాడు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2025 ఎడిషన్లో "భీమవరం బుల్స్" ఫ్రాంచైజీ సారధిగా నియమించబడ్డాడు. ఈ మేరకు సదరు ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల ముగిసిన వేలంలో భీమవరం బుల్స్ నితీశ్ను రూ. 10 లక్షలకు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో బిజీగా ఉన్న నితీశ్.. పర్యటన ముగియంగానే బుల్స్తో జతకడతాడు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) నాలుగో ఎడిషన్ ఆగప్ట్ 8న మొదలుకానుంది. అదే నెల 24న జరిగే ఫైనల్తో ముగుస్తుంది. ఈ టోర్నీ విశాఖలోని Dr.YSR ACA-VDCA స్టేడియంలో జరుగనుంది. ఈ సీజన్లో ఏపీఎల్ ఏడు కొత్త జట్లతో బరిలోకి దిగుతుంది. గతంలో ఉన్న ఆరు ఫ్రాంచైజీలు తెరమరుగయ్యాయి.భీమవరం బుల్స్ ఫుల్ స్క్వాడ్నితీష్ కుమార్ రెడ్డి (కెప్టెన్), సత్యనారాయణ రాజు, హరి శంకర్ రెడ్డి, హేమంత్ రెడ్డి, పిన్నిటి తేజస్వి, మునీష్ వర్మ, సాయి శ్రవణ్, టి వంశీ కృష్ణ, ఎం యువన్, బి సాత్విక్, కె రేవంత్ రెడ్డి, సాయి సూర్య తేజ రెడ్డి, సిహెచ్ శివ, శశాంక్ శ్రీవత్స్, సి రవితేజ, ఎన్ హిమాకర్, కశ్యప్ ప్రకాశ్, భువనేశ్వర్ రావు, భస్వంత్ కృష్ణ, జె విష్ణు దత్తాహనుమ విహారీ, కేఎస్ భరత్ కూడా..!ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2025లో నితీశ్ కుమార్ రెడ్డితో పాటు మరో ఇద్దరు టీమిండియా ప్లేయర్లు కూడా వేర్వేరు ఫ్రాంచైజీలకు సారథ్యం వహిస్తారు. భారత టెస్ట్ క్రికెటర్లు హనుమ విహారీ అమరావతి రాయల్స్కు, కేఎస్ భరత్ కాకినాడ కింగ్స్ కు నాయకత్వం వహిస్తారు.మిగిలిన నాలుగు జట్లు రాయల్స్ ఆఫ్ రాయలసీమ, సింహాద్రి వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్, విజయవాడ సన్షైనర్స్కు వరుసగా షేక్ రషీద్, రికీ భుయ్, మహదీప్, అశ్విన్ హెబ్బర్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు.కాగా, జులై 14న జరిగిన APL 2025 వేలం మొత్తం 520 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. రాయల్స్ ఆఫ్ రాయలసీమ ఆల్ రౌండర్ పైలా అవినాష్ ఈ వేలంలో అత్యధికంగా రూ. 11.5 లక్షల బిడ్ను సంపాదించాడు.తదుపరి రెండు ఖరీదైన బిడ్లు రాయల్స్ ఆఫ్ రాయలసీమకు చెందిన పి. గిరినాథ్ రెడ్డి (రూ. 10.05 లక్షలు), భీమవరం బుల్స్ ఆల్ రౌండర్ సత్యనారాయణ రాజుకు (రూ. 9.8 లక్షలు) దక్కాయి. -
రిషబ్ పంత్లా మారిన 'లేడీ సెహ్వాగ్'
టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ దీప్తి శర్మను అభిమానులు "లేడీ సెహ్వాగ్" అని పిలుచుకుంటారు. దీప్తి సెహ్వాగ్లా భయం, బెరుకు లేకుండా డాషింగ్గా షాట్లు ఆడటమే ఇందుకు కారణం. లేడీ సెహ్వాగ్ బిరుదుకు దీప్తి శర్మ తాజాగా మరోసారి సార్దకత చేకూర్చింది. నిన్న (జులై 16) ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో దీప్తి మెరుపు ఇన్నింగ్స్ (64 బంతుల్లో 62; 3 ఫోర్లు, సిక్స్) ఆడి భారత విజయంలో ప్రధానపాత్ర పోషించింది.ఈ ఇన్నింగ్స్లో దీప్తి కొట్టిన ఏకైక సిక్సర్ ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది. ఈ షాట్ను దీప్తి రిషబ్ పంత్లా ఆడటం వల్ల అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. దీప్తి పంత్ ట్రేడ్ మార్క్ షాట్ అయిన "ఒంటి చేత్తో సిక్సర్" విజయవంతంగా పూర్తి చేయడంలో సఫలమైంది. DEEPTI SHARMA ON ONE-HANDED SIX:"I play these shots in practice - I picked that up from Rishabh Pant". pic.twitter.com/Y5u2eYdZ0i— Johns. (@CricCrazyJohns) July 17, 2025మ్యాచ్ అనంతరం ఈ షాట్ గురించి దీప్తి మాట్లాడుతూ.. నేను ఇలాంటి షాట్లను నిత్యం ప్రాక్టీస్ చేస్తుంటాను. రిషబ్ పంత్ను చూసినప్పటి నుంచే ఇలాంటి షాట్లను ఆడటం మొదలుపెట్టానని అంది.ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ పర్యటనలో భారత మహిళల క్రికెట్ జట్టు జోరు కొనసాగుతోంది. ఈ పర్యటనలో ఇదివరకే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-2 తేడాతో కైవసం చేసుకున్న భారత్.. తాజాగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో ఘనంగా బోణీ కొట్టింది. సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసి, సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. సోఫీ డంక్లీ (83), డేవిడ్సన్ రిచర్డ్స్ (53) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా తలో రెండు వికెట్లు తీయగా.. అమన్జోత్ కౌర్, శ్రీ చరణి చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. ఆది నుంచే నిలకడగా ఆడుతూ పెద్దగా కష్టపడకుండానే విజయం సాధించింది. టాపార్డర్ బ్యాటర్లలో ప్రతీక రావల్ (36), స్మృతి మంధన (28), హర్లీన్ డియోల్ (27), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (17), జెమీమా రోడ్రిగెజ్ (48) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. ఆల్రౌండర్ దీప్తి శర్మ (62 నాటౌట్) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో భారత్ను గెలిపించింది. -
టీమిండియా స్టార్ క్రికెటర్ మాజీ భార్య, కూతురిపై కేసు నమోదు
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ మాజీ భార్య హసీన్ జహా, ఆమె కుమార్తె (మొదటి భర్త ద్వారా కలిగిన సంతానం) అర్షి జహాపై హత్యాయత్నం కేసు నమోదైనట్లు తెలుస్తుంది. వివాదాస్పద స్థలం విషయంలో హసీన్, అర్షి తనపై దాడి చేశారని దలియా ఖాతూన్ అనే మహిళ పశ్చిమ బెంగాల్లోని బిర్భూమ్ జిల్లాలో గల సూరి పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో హసీన్, అర్షిపై BNSలోని 126(2), 115(2), 117(2), 109, 351(3), 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హసీన్, అర్షి దలియా ఖాతూన్పై దాడి చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి.పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్లోని సూరి పట్టణం వార్డ్ నంబర్ 5లో హసీన్ జహా, అమె కుమార్తె అర్షి జహా నివాసముంటున్నారు. ఆ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఇటీవల వారు ఇల్లు నిర్మించడం మొదలుపెట్టారు. ఈ స్థలం అర్షి పేరున రిజిస్టర్ అయ్యిందని వారంటున్నారు. An attempt to murder FIR under BNS sections 126(2), 115(2), 117(2), 109, 351(3) and 3(5) has lodged against Hasin Jahan, the estranged wife of Mohammed Shami and Arshi Jahan, her daughter from her first marriage by her neighbour Dalia Khatun in Suri town of Birbhum district in… pic.twitter.com/2dnqXUKMdK— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) July 16, 2025అయితే ఆ స్థలం తమదని అటు పక్క నివాసముంటున్న దలియా ఖాతూన్ ముందుకు వచ్చింది. హసీన్ మొదలుపెట్టిన కట్టడాన్ని ఆమె ఆపే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఖాతూన్పై హసీన్, అర్షి దాడికి దిగినట్లు తెలుస్తుంది.కాగా, షమీకి ఇటీవలే కలకత్తా హైకోర్టు విడాకులు మంజూరు చేసింది. హసీన్కు రూ. 4 లక్షల భరణం ఇవ్వాలంటూ షమీని ఆదేశించింది. షమీ ఆర్థిక స్థితిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈమేరకు తీర్పును వెలువరించింది. ఇందులో హసీన్కు రూ. 1.5 లక్షలు, షమీ ద్వారా కలిగిన కూతురు ఐరాకు రూ. 2.5 లక్షలు అని కోర్టు తెలిపింది. -
తొలి వన్డేలో ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్
ఇంగ్లండ్ పర్యటనలో భారత మహిళల క్రికెట్ జట్టు అదిరిపోయే విజయాలతో దూసుకుపోతుంది. ఈ పర్యటనలో ఇదివరకే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-2 తేడాతో కైవసం చేసుకున్న భారత్.. తాజాగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లోనూ బోణీ కొట్టింది. ఈ సిరీస్లో భాగంగా నిన్న (జులై 16) సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. తద్వారా ఈ సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.తొలి వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. సోఫీ డంక్లీ (83), డేవిడ్సన్ రిచర్డ్స్ (53) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఎమ్మా లాంబ్ (39), కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (41), సోఫీ ఎక్లెస్టోన్ (23 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ట్యామీ బేమౌంట్ (5), ఆమీ జోన్స్ (1) నిరాశపరిచారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా తలో రెండు వికెట్లు తీయగా.. అమన్జోత్ కౌర్, శ్రీ చరణి చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. ఆది నుంచే నిలకడగా ఆడుతూ పెద్దగా కష్టపడకుండానే విజయం సాధించింది. టాపార్డర్ బ్యాటర్లలో ప్రతీక రావల్ (36), స్మృతి మంధన (28), హర్లీన్ డియోల్ (27), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (17), జెమీమా రోడ్రిగెజ్ (48) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. ఆల్రౌండర్ దీప్తి శర్మ (62 నాటౌట్) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో భారత్ను గెలిపించింది. దీప్తి.. అమన్జోత్ (20 నాటౌట్) సహకారంతో టీమిండియాను విజయతీరాలకు (48.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి) చేర్చింది.చివర్లో జెమీమా, రిచా ఘోష్ (10) స్వల్ప వ్యవధిలో (15 పరుగులు) ఔటైనప్పుడు కాస్త ఒత్తిడికి గురైన భారత శిబిరం.. దీప్తి బాధ్యతాయుతమైన బ్యాటింగ్ చూసి గెలుపు ఖరారు చేసుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ (10-1-34-1) ఒక్కరే భారత బ్యాటర్లను కాస్త ఇబ్బంది పెట్టింది. మిగతా బౌలర్లనంతా భారత బ్యాటర్లు సమర్దవంతంగా ఎదుర్కొన్నారు. ఛార్లోట్ డీన్ 2, లారెన్ ఫైలర్, లారెన్ బెల్ తలో వికెట్ తీశారు. ఈ సిరీస్లో రెండో వన్డే ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జులై 19న జరుగనుంది. -
‘కీబోర్డ్ వారియర్స్’ను సైలెంట్ చేశా
లండన్: సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తన ప్రదర్శనతో విమర్శకుల నోళ్లు మూయించడం ఆనందంగా ఉందని అన్నాడు. ఈ క్రమంలో ఆర్చర్ విమర్శకులను ఉద్దేశించి ‘కీబోర్డ్ వారియర్స్’ అనే పదాన్ని ఉపయోగించాడు. 2021లో చివరిసారి ఇంగ్లండ్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన ఆర్చర్... టీమిండియాతో జరిగిన లార్డ్స్ టెస్టుతో పునరాగమనం చేశాడు. తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్లతో ఫర్వాలేదనిపించిన ఆర్చర్... రెండో ఇన్నింగ్స్లో మూడు కీలక వికెట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.‘ఇది సుదీర్ఘ ప్రయాణం. ఇన్నాళ్ల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చి విజయంలో భాగమవడం సంతోషంగా ఉంది. గత మూడు నాలుగేళ్లుగా ఎంతమంది ‘కీబోర్డ్ వారియర్స్’ నన్ను లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేశారో లెక్కచెప్పలేను. ఎన్నో గాయాలు, మరెన్నో పునరావాస శిబిరాల తర్వాత వచ్చిన ఈ గెలుపు చాలా ప్రత్యేకం’ అని ఆర్చర్ అన్నాడు. మోచేయి, వెన్నునొప్పి, కండరాలు ఇలా ఎన్నో గాయాల బారిన పడిన 30 ఏళ్ల ఆర్చర్... గత కొంత కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సంతరించుకోవడంతో సుదీర్ఘ ఫార్మాట్లో తిరిగి అడుగు పెట్టాడు. భారత రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్తో పాటు పంత్, వాషింగ్టన్ సుందర్ను ఆర్చర్ పెవిలియన్కు పంపాడు. పంత్ వికెట్తో జట్టులో నూతనోత్సాహం వచ్చిందని ఆర్చర్ వెల్లడించాడు. ‘ఇన్నాళ్ల తర్వాత ఆడిన తొలి టెస్టులో నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేశా. ఇది శుభసూచకం. పంత్ వికెట్తో జట్టులో కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ తర్వాత మరింత పట్టుబిగించగలిగాం’ అని ఆర్చర్ అన్నాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సోమవారం లార్డ్స్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 22 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఈ సిరీస్లో ఆతిథ్య జట్టు ప్రస్తుతం 2–1తో ఆధిక్యంలో ఉండగా... ఇరు జట్ల మధ్య ఈ నెల 23 నుంచి మాంచెస్టర్లో నాలుగో మ్యాచ్ ప్రారంభం కానుంది. -
టీమిండియా చెత్త రికార్డు.. ఆ విషయంలో పాకిస్తాన్, వెస్టిండీస్ కంటే దారుణం
లార్డ్స్ టెస్ట్లో (మూడవది) భారత్ ఇంగ్లండ్ చేతిలో 22 పరుగుల స్వల్ప తేడాతో పోరాడి ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టీమిండియా 193 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక బోల్తా పడింది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా.. టెయిలెండర్ల సహకారంతో వీరోచితంగా పోరాడినా టీమిండియాను గట్టెక్కించలేకపోయాడు. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది.లార్డ్స్ టెస్ట్లో టీమిండియా ఎంత పోరాడి ఓడినా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. 2013 నుంచి టీమిండియా 26 టెస్ట్ల్లో 150 ప్లస్ పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ కేవలం 2 సార్లు మాత్రమే విజయవంతమైంది. 17 మ్యాచ్ల్లో పరాజయంపాలవగా.. 7 మ్యాచ్లు డ్రా అయ్యాయి. భారత్ గెలిచిన రెండు సందర్భాల్లో ఒకటి 2021లో బ్రిస్బేన్లో ఆస్ట్రేలియాపై కాగా.. రెండోది 2024లో రాంచీలో ఇంగ్లండ్పై.ఛేజింగ్ కష్టాలు.. సచిన్ రిటైర్మెంట్ నుంచి ఇంతే..!భారత్కు ఛేజింగ్ కష్టాలు కొత్తేమీ కానప్పటికీ.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ నుంచి పరిస్థితి మరింత దిగజారింది. 2013 నవంబర్లో సచిన్ టెస్ట్లకు గుడ్బై చెప్పగా.. అదే ఏడాది డిసెంబర్ నుంచి భారత్ 26 టెస్ట్ల్లో కేవలం రెండు సార్లు మాత్రమే 150 ప్లస్ లక్ష్యాలను ఛేదించింది.గడిచిన 12 ఏళ్లలో టీమిండియా ప్రపంచంలోనే అగ్రశ్రేణి జట్టుగా చలామణి అయినప్పటికీ ఛేజింగ్ కష్టాలు ఎదుర్కొంది. స్వల్ప లక్ష్య ఛేదనల్లో పాకిస్తాన్, వెస్టిండీస్ లాంటి జట్లు కూడా భారత్ కంటే మెరుగ్గా ఉన్నాయి. ఈ జాబితాలో టీమిండియా ఎనిమిదో స్థానంలో ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్దమవుతుంది.గడిచిన 12 ఏళ్లలో భారత్ 250 పరుగులలోపు లక్ష్యాలను ఛేదిస్తూ ఓడిన సందర్భాలు..2018 బర్మింగ్హామ్లో ఇంగ్లండ్పై 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 162 పరుగులకే ఆలౌట్2018 సౌతాంప్టన్లో ఇంగ్లండ్పై 245 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 184 పరుగులకే ఆలౌట్.2015 గాలెలో శ్రీలంకపై 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 112 పరుగులకే ఆలౌట్.2018 కేప్టౌన్లో దక్షిణాఫ్రికాపై 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 135 పరుగులకే ఆలౌట్.2024 హైదరాబాద్లో ఇంగ్లండ్పై 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 202 పరుగులకే ఆలౌట్. -
సిరాజ్ ఔటైనప్పుడు ఎలా అనిపించింది.. గిల్కు బ్రిటన్ రాజు ప్రశ్న
లండన్: ఇంగ్లండ్తో మూడో టెస్టులో చివరి బ్యాటర్ ఔటైనపుడు ఎలా అనిపించిందని బ్రిటన్ రాజు చార్లెస్-3 టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ను ప్రశ్నించారు. మంగళవారం లండన్లోని క్లారెన్స్ హౌస్ గార్డెన్లో కింగ్ చార్లెస్... భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లతో ముచ్చటించారు.ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా లార్డ్స్ వేదికగా సోమవారం ముగిసిన మూడో మ్యాచ్లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైంది. టాపార్డర్ ఆకట్టుకోలేకపోయినా... ఆఖర్లో టెయిలెండర్లు అద్భుతంగా పోరాడటంతో ఒకదశలో భారత జట్టు విజయం సాధిస్తుందనిపించింది.కానీ హైదరాబాదీ సిరాజ్ చివరి వికెట్ రూపంలో వెనుదిరగడంతో టీమిండియా ఆశలు అడియాశలయ్యాయి. బషీర్ వేసిన బంతిని సిరాజ్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించగా... బంతి నెమ్మదిగా వెళ్లి వికెట్లను తాకింది. దీంతో భారత్కు పరాజయం తప్పలేదు.భారత జట్లకు ఆతిథ్యమిచ్చిన సందర్భంగా కింగ్ చార్లెస్ దీని గురించి భారత సారథితో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇంగ్లండ్లో భారత హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి, డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ ఘోష్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి దేవజిత్ సైకియా తదితరులు పాల్గొన్నారు.కింగ్ చార్లెస్తో భేటీ అనంతరం దానికి సంబంధించిన అంశాలను గిల్ పంచుకున్నాడు.‘కింగ్ చార్లెస్తో కలవడం చాలా బాగుంది. ఎన్నో విషయాల గురించి ఆయన మాట్లాడారు. మూడో టెస్టులో చివరి బ్యాట్స్మన్ ఔట్ అయిన విధానం చాలా దురదృష్టకరమని అన్నారు. అనుకోకుండా బంతి వికెట్ల మీదకు వెళ్లిందన్నారు. ఆ సమయంలో మీకు ఎలా అనిపించింది అని ప్రశ్నించారు. అది దురదృష్టకరమని... సిరీస్లో మిగిలిన రెండు మ్యాచ్ల్లో మంచి ప్రదర్శన చేస్తామని కింగ్ చార్లెస్కు చెప్పాం.ఇంగ్లండ్లో ఎక్కడ మ్యాచ్లు ఆడినా మాకు విశేష ఆదరణ దక్కుతుంది. అందుకు తగ్గట్లే జట్టు కూడా విజయం కోసం శాయశక్తులా కృషి చేస్తోంది. సిరీస్లో ఇప్పటి వరకు ఇరు జట్లు మెరుగైన ప్రదర్శన చేశాయి. మూడు మ్యాచ్లూ ప్రేక్షకులను అలరించాయి. టెస్టు మ్యాచ్ చివరి రోజు చివరి సెషన్లో ఒక జట్టు స్వల్ప తేడాతో మాత్రమే ఓడిందంటే... ఆ మ్యాచ్లో ‘క్రికెట్’ గెలిచినట్లే’ అని గిల్ అన్నాడు. ఇక భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్తో కింగ్ చార్లెస్ ప్రయాణానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కింగ్తో భేటీ అనంతరం నాలుగో టెస్టు కోసం పురుషుల జట్టు మాంచెస్టర్కు బయలుదేరగా... మహిళల జట్టు వన్డే సిరీస్ కోసం సౌతాంప్టన్కు తిరుగు పయనమైంది. -
సెకెండ్ ఇన్నింగ్స్లో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీ.. మళ్లీ అదే తరహా విధ్వంసం
ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరుగుతున్న తొలి యూత్ టెస్ట్లో భారత యువ జట్టు చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తొలి ఇన్నింగ్స్లో విఫలమైనా రెండో ఇన్నింగ్స్లో సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్లో 13 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 14 పరుగులు మాత్రమే చేసి ఔటైన వైభవ్.. రెండో ఇన్నింగ్స్లో తన సహజ శైలిలో విరుచుకుపడ్డాడు. ఈ ఇన్నింగ్స్లో 44 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫలితంగా భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన కెప్టెన్ ఆయుశ్ మాత్రే ఈ ఇన్నింగ్స్లో 32 పరుగులకే ఔటయ్యాడు. మరో స్టార్ ప్లేయర్ చవ్డా 3 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. విహాన్ మల్హోత్రా (34), అభిగ్యాన్ కుందు (0) క్రీజ్లో ఉన్నారు. భారత్ 229 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చీ వాన్ 3 వికెట్లు తీశాడు.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 439 పరుగులకు ఆలౌటైంది. రాకీ ఫ్లింటాఫ్ (93), కెప్టెన్ హమ్జా షేక్ (84) సత్తా చాటారు. లోయర్ మిడిలార్డర్ ఆటగాళ్లు ఎకాంశ్ సింగ్ (59), రాల్ఫీ ఆల్బర్ట్ (50) అర్ద సెంచరీలతో రాణించారు. జాక్ హోమ్ (44), థామస్ రూ (34), జేడన్ డెన్లీ (27), జేమ్స్ మింటో (20) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో హెనిల్ పటేల్ 3 వికెట్లతో సత్తా చాటగా.. అంబరీష్, వైభవ్ సూర్యవంశీ చెరో 2.. దీపేశ్ దేవేంద్రన్, మొహమ్మద్ ఎనాన్, విహాన్ మల్హోత్రా తలో వికెట్ తీశారు.దీనికి ముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 540 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఆయుశ్ మాత్రే (102) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. విహాన్ మల్హోత్రా (67), అభిగ్యాన్ కుందు (90), రాహుల్ కుమార్ (85), ఆర్ఎస్ అంబరీష్ (70) అర్ద సెంచరీలతో రాణించారు.కుర్ర చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఈ ఇన్నింగ్స్లో నిరాశపరిచాడు. వైభవ్ 13 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 14 పరుగులు చేసి అలెక్స్ గ్రీన్ బౌలింగ్లో రాల్ఫీ ఆల్బర్ట్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.మిగతా బ్యాటర్లలో చవ్డా 11, మొహమ్మద్ ఎనాన్ 23, హెనిల్ పటేల్ 38, దీపేశ్ దేవేంద్రన్ 4, అన్మోల్జీత్ సింగ్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో గ్రీన్, ఆల్బర్ట్ తలో 3 వికెట్లు తీయగా.. జాక్ హోమ్, ఆర్చీ వాన్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.కాగా, ఈ మ్యాచ్కు ముందు ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ 3-2 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. చివరి మ్యాచ్ మినహా తొలి నాలుగు మ్యాచ్ల్లో చెలరేగిపోయాడు.తొలి మ్యాచ్లో 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసిన వైభవ్.. రెండో వన్డేలో 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు.. మూడో వన్డేలో 31 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 86 పరుగులు.. నాలుగో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగి 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో ఏకంగా 143 పరుగులు చేశాడు.ఐదో వన్డేలో 42 బంతులు ఎదుర్కొన్న వైభవ్ 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో, 78.57 స్ట్రయిక్రేట్తో 33 పరుగులు చేశాడు. -
ENG Vs IND: పోరాడినా... పరాజయమే
లార్డ్స్ టెస్టులో భారత్ గుండె పగిలింది. విజయానికి ఎంతో చేరువగా వచ్చినా చివరకు ఓటమే పలకరించింది. ఐదో రోజు చేతిలో 6 వికెట్లతో 135 పరుగులు చేయాల్సిన టీమిండియా లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమైంది. ఆశలు పెట్టుకున్న పంత్, రాహుల్ విఫలం కాగా... 82/7 నుంచి జట్టును గెలిపించేందుకు రవీంద్ర జడేజా పోరాడినా లాభం లేకపోయింది. ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ జట్టును ముందుండి నడిపించగా... పట్టుదలగా బౌలింగ్ చేసిన ఆతిథ్య జట్టు మ్యాచ్ చేజారకుండా కాపాడుకోగలిగింది. ఈ టెస్టులో పలు సందర్భాల్లో శుబ్మన్ గిల్ బృందం ఆధిక్యం ప్రదర్శించినా... కీలక క్షణాలను ఇంగ్లండ్ సరిగ్గా ఒడిసి పట్టుకుంది. టీమ్ వెనుకబడిన ప్రతీసారి పోరాటయోధుడిలా నేనున్నానంటూ ముందుకొచ్చి సత్తా చాటిన స్టోక్స్దే ఈ గెలుపు అనడం అతిశయోక్తి కాదు. లండన్: ‘అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ’లో ఇంగ్లండ్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సోమవారం లార్డ్స్ మైదానంలో ముగిసిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 22 పరుగుల స్వల్ప తేడాతో భారత్పై విజయం సాధించింది. అనూహ్య మలుపులు, ఉత్కంఠతో సాగుతూ వచ్చిన మ్యాచ్లో బ్యాటింగ్ వైఫల్యం భారత్ను దెబ్బ తీసింది. 193 పరుగుల లక్ష్యంతో ఐదో రోజు బరిలోకి దిగిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 74.5 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా (181 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. ఇంగ్లండ్ పదునైన బౌలింగ్తో స్వల్ప స్కోరును కూడా కాపాడుకోవడంలో సఫలమైంది. రెండు ఇన్నింగ్స్లలో కలిపి 77 పరుగులు చేయడంతో పాటు 5 వికెట్లు తీసిన బెన్ స్టోక్స్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకున్నాడు. సిరీస్లో ఇంగ్లండ్ 2–1తో ముందంజలో ఉండగా... నాలుగో టెస్టు ఈ నెల 23 నుంచి మాంచెస్టర్లో జరుగుతుంది. ఆర్చర్ పదునైన బౌలింగ్... ఓవర్నైట్ స్కోరు 58/4తో ఆటను కొనసాగించిన భారత్కు చివరి రోజు సరైన ఆరంభం లభించలేదు. 11 పరుగుల వ్యవధిలో జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయింది. గాయంతో బాధపడుతున్న పంత్ తడబడుతూనే బ్యాటింగ్ చేశాడు. ఆర్చర్ అద్భుత బంతితో పంత్ (9)ను క్లీన్బౌల్డ్ చేయగా, స్టోక్స్ బౌలింగ్లో కేఎల్ రాహుల్ (58 బంతుల్లో 39; 6 ఫోర్లు) వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ అవుట్ ఇవ్వకపోవడంతో రివ్యూ కోరిన ఇంగ్లండ్ ఫలితం సాధించింది. తర్వాతి ఓవర్లోనే ఆర్చర్ తన బౌలింగ్లో అద్భుత రిటర్న్ క్యాచ్తో సుందర్ (0)ను పెవిలియన్ పంపించాడు. 82/7 వద్ద పరిస్థితి చూస్తే భారత్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టదనిపించింది. జడేజా పోరాటం... అప్పటి వరకు 15 బంతులు ఎదుర్కొని 8 పరుగులు చేసిన జడేజా... జట్టు భారాన్ని తనపై వేసుకున్నాడు. తాను ప్రధాన పాత్ర పోషిస్తూ తర్వాతి ముగ్గురు బ్యాటర్లతో అతను కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. భారీ షాట్లకు పోకుండా సింగిల్స్తోనే ఒక్కో పరుగు జోడించడంతో పాటు అవతలి బ్యాటర్లను కాపాడుకుంటూ అతని ఇన్నింగ్స్ సాగింది. ఈ క్రమంలో పరుగుల రాక కూడా బాగా తగ్గిపోయింది. పదునైన డిఫెన్స్ చూపించగలిగినా... నితీశ్ కుమార్ రెడ్డి (53 బంతుల్లో 13; 1 ఫోర్) లంచ్కు ముందు వోక్స్ చక్కటి బంతికి వెనుదిరిగాడు. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా (54 బంతుల్లో 5; 1 ఫోర్), జడేజా భాగస్వామ్యం ఏకంగా 22 ఓవర్ల పాటు సాగింది. సహనం కోల్పోయిన బుమ్రా భారీ షాట్ ఆడబోయి అవుట్ కాగా... మొహమ్మద్ సిరాజ్ (40 బంతుల్లో 4) అండతో జడేజా జట్టును గెలుపు దిశగా నడిపించాడు. అయితే చివర్లో పెరిగిన ఉత్కంఠ మధ్య స్పిన్నర్ బషీర్ బౌలింగ్లో సిరాజ్ వికెట్తో భారత్ ఓటమి ఖాయయైంది. అలా ముగిసింది... భారత్ విజయానికి మరో 46 పరుగులు కావాల్సిన సమయంలో జడేజాతో సిరాజ్ జత కలిశాడు. జడేజా జాగ్రత్తగా స్ట్రయికింగ్ నిలబెట్టుకుంటుండగా... సిరాజ్ కూడా పట్టుదలగా 29 బంతులు ఆడి సహకరించాడు. మెలమెల్లగా భాగస్వామ్యం 13.1 ఓవర్లలో 23 పరుగులు పూర్తి చేసుకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరి వికెట్ తీయలేక ఇంగ్లండ్ శిబిరంలో అసహనం పెరిగిపోతోంది. ఇలాగే సాగితే సింగిల్స్తో మరో 23 పరుగులు కావడం సాధ్యమే అనిపించింది. అయితే సిరాజ్ అనూహ్య వికెట్తో ఆట ముగిసింది. బషీర్ వేసిన బంతిని సిరాజ్ దానిని చక్కగా డిఫెన్స్ ఆడాడు. అయితే కింద పడిన బంతి నెమ్మదిగా అతని కాలి వెనక భాగం వైపు వెళ్లగా, దానిని సిరాజ్ గుర్తించలేకపోయాడు. తేరుకునేలోపే బంతి స్టంప్స్ను తాకి ఒక బెయిల్ కింద పడటంతో ఇంగ్లండ్ సంబరాలు చేసుకుంది.స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 387; భారత్ తొలి ఇన్నింగ్స్: 387; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 192; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) ఆర్చర్ 0; రాహుల్ (ఎల్బీ) (బి) స్టోక్స్ 39; కరుణ్ నాయర్ (ఎల్బీ) (బి) కార్స్ 14; గిల్ (సి) స్మిత్ (బి) కార్స్ 6; ఆకాశ్దీప్ (బి) స్టోక్స్ 1; పంత్ (బి) ఆర్చర్ 9; జడేజా (నాటౌట్) 61; సుందర్ (సి అండ్ బి) ఆర్చర్ 0; నితీశ్ రెడ్డి (సి) స్మిత్ (బి) వోక్స్ 13; బుమ్రా (సి) (సబ్) కుక్ (బి) స్టోక్స్ 5; సిరాజ్ (బి) బషీర్ 4; ఎక్స్ట్రాలు 18; మొత్తం (74.5 ఓవర్లలో ఆలౌట్) 170. వికెట్ల పతనం: 1–5, 2–41, 3–53, 4–58, 5–71, 6–81, 7–82, 8–112, 9–147, 10–170. బౌలింగ్: వోక్స్ 12–5–21–1, ఆర్చర్ 16–1–55–3, స్టోక్స్ 24–4–48–3, కార్స్ 16–2–30–2, రూట్ 1–0–1–0, బషీర్ 5.5–1–6–1. -
ENG VS IND 3rd Test: స్వల్ప లక్ష్య ఛేదన.. ఆదిలోనే టీమిండియాకు షాక్
లార్డ్స్ టెస్ట్లో టీమిండియా పైచేయి సాధించినట్లే సాధించి పట్టు చేజార్చుకునేలా ఉంది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ను 192 పరుగులకే కుప్పకూల్చిన భారత్.. ఆతర్వాత స్వల్ప లక్ష్య ఛేదనను తడబాటుతో మొదలుపెట్టింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ నిర్లక్ష్యమైన షాట్ ఆడి అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో జైస్వాల్ డకౌటయ్యాడు. తొలి ఇన్నింగ్స్లోనూ ఆర్చర్రే జైస్వాల్ను ఔట్ చేశాడు. 3 ఓవర్ల తర్వాత భారత్ వికెట్ నష్టానికి 5 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్కు (5) జతగా కరుణ్ నాయర్ క్రీజ్లోకి వచ్చాడు. క్రికెట్ మరో ఛాన్స్ ఇవ్వు అని ప్రాధేయపడి జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ ఇప్పటివరకు ఆడిన 5 ఇన్నింగ్స్ల్లో దారుణంగా విఫలమయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో అయినా కరుణ్ రాణిస్తాడేమో చూడాలి. ఒక వేళ ఈ ఇన్నింగ్స్లో కరుణ్ బాగా ఆడకపోతే అతని స్థానం గల్లంతైనట్లే. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే మరో 188 పరుగులు చేయాలి. ఇంగ్లండ్ గెలుపుకు 9 వికెట్లు కావాలి. ఇవాల్టి ఆటలో మరో గంట మిగిలి ఉంది. ఈ గంటలో భారత్ వికెట్ పడకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ వికెట్ పోగొట్టుకుంటే మాత్రం ఆతర్వాత వచ్చే ఆటగాళ్లపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఈ పిచ్పై 193 పరుగుల లక్ష్యం మరీ అంత చిన్నదేమీ కాదు. భారత బ్యాటర్లు ఎమరపాటుగా ఉంటే మాత్రం తగిన మూల్యం చెల్లింఉకోవాల్సి వస్తుంది.దీనికి ముందు భారత్ ఇంగ్లండ్ను 192 పరుగులకే కుప్పకూల్చింది. వాషింగ్టన్ సుందర్ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టాడు. కీలకమైన రూట్ (40), జేమీ స్మిత్ (8), బెన్ స్టోక్స్ (33) వికెట్లతో షోయబ్ బషీర్ (2) వికెట్ తీసి ఇంగ్లండ్ను చావుదెబ్బకొట్టాడు. మరో ఎండ్ నుంచి బుమ్రా కూడా ఇంగ్లండ్ ఆటగాళ్లపై అటాక్ చేశాడు. టీ విరామం తర్వాత బుమ్రా క్రిస్ వోక్స్ (10), బ్రైడన్ కార్స్లను (1) క్లీన్ బౌల్డ్ చేశాడు.అంతకుముందు తొలి సెషన్లో సిరాజ్, నితీశ్ కుమార్, ఆకాశ్దీప్ చెలరేగిపోయారు. డకెట్ (12), ఓలీ పోప్ను (4) సిరాజ్ పెవిలియన్కు పంపగా.. జాక్ క్రాలేను (22) నితీశ్, హ్యారీ బ్రూక్ను (23) ఆకాశ్దీప్ ఔట్ చేశారు.ఈ మ్యాచ్లో ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్ల్లో ఒకే స్కోర్ (387) చేసిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తరఫున రూట్ (104), జేమీ స్మిత్ (51), బ్రైడన్ కార్స్ (56) సత్తా చాటగా.. భారత్ తరఫున కేఎల్ రాహుల్ (100), పంత్ (74), జడేజా (72) రాణించారు. బుమ్రా ఐదు వికెట్లతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ పతనాన్ని శాశించగా.. సిరాజ్, నితీశ్ తలో 2, రవీంద్ర జడేజా ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో క్రాలే 18, డకెట్ 23, ఓలీ పోప్ 44, హ్యారీ బ్రూక్ 11, బెన్ స్టోక్స్ 44, క్రిస్ వోక్స్ 0, జోఫ్రా ఆర్చర్ 4 పరుగులకు ఔటయ్యారు. భారత తొలి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 13, కరుణ్ నాయర్ 40, శుభ్మన్ గిల్ 16, నితీశ్ రెడ్డి 30, వాషింగ్టన్ సుందర్ 23, ఆకాశ్దీప్ 7, బుమ్రా 0, సిరాజ్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 3, ఆర్చర్, స్టోక్స్ తలో 2, కార్స్, బషీర్ చెరో వికెట్ తీశారు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. -
దుమ్మురేపుతున్న టీమిండియా బౌలర్లు.. పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లండ్
లార్డ్స్ టెస్ట్లో టీమిండియా బౌలర్లు దుమ్మురేపుతున్నారు. నాలుగో రోజు ప్రారంభం నుంచే చెలరేగుతున్న మన వాళ్లు టీ విరామం సమయానికి ఇంగ్లండ్ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టారు. తొలి సెషన్లో సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్దీప్ విజృంభించగా.. రెండో సెషన్లో వాషింగ్టన్ సుందర్ సత్తా చాటాడు.టీ విరామం సమయానికి రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ స్కోర్ 6 వికెట్ల నష్టానికి 175 పరుగులుగా ఉంది. బెన్ స్టోక్స్ (27), క్రిస్ వోక్స్ (8) ఇంగ్లండ్ను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.తొలి సెషన్లో సిరాజ్ (7-2-11-2), నితీశ్ రెడ్డి (5-1-20-1), ఆకాశ్దీప్ (5-2-23-1) పదునైన బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తించగా.. రెండో సెషన్లో సుందర్ (7-2-13-2) తన మాయాజాలంతో ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు.భారత పేస్ అటాక్ ధాటికి ఇంగ్లండ్ 87 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి డకెట్ (12), ఓలీ పోప్ను (4) సిరాజ్ పెవిలియన్కు పంపగా.. జాక్ క్రాలేను (22) నితీశ్, హ్యారీ బ్రూక్ను (23) ఆకాశ్దీప్.. జేమీ స్మిత్ (8), జో రూట్ను (40) సుందర్ ఔట్ చేశాడు.ఈ మ్యాచ్లో ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్ల్లో ఒకే స్కోర్ (387) చేసిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తరఫున రూట్ (104), జేమీ స్మిత్ (51), బ్రైడన్ కార్స్ (56) సత్తా చాటగా.. భారత్ తరఫున కేఎల్ రాహుల్ (100), పంత్ (74), జడేజా (72) రాణించారు. బుమ్రా ఐదు వికెట్లతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ పతనాన్ని శాశించగా.. సిరాజ్, నితీశ్ తలో 2, రవీంద్ర జడేజా ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో క్రాలే 18, డకెట్ 23, ఓలీ పోప్ 44, హ్యారీ బ్రూక్ 11, బెన్ స్టోక్స్ 44, క్రిస్ వోక్స్ 0, జోఫ్రా ఆర్చర్ 4 పరుగులకు ఔటయ్యారు. భారత తొలి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 13, కరుణ్ నాయర్ 40, శుభ్మన్ గిల్ 16, నితీశ్ రెడ్డి 30, వాషింగ్టన్ సుందర్ 23, ఆకాశ్దీప్ 7, బుమ్రా 0, సిరాజ్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 3, ఆర్చర్, స్టోక్స్ తలో 2, కార్స్, బషీర్ చెరో వికెట్ తీశారు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. -
ENG VS IND 3rd Test, Day 4: చెలరేగిన భారత పేసర్లు.. కష్టాల్లో ఇంగ్లండ్
లార్డ్స్ టెస్ట్ నాలుగో రోజు ఆట తొలి సెషన్లో టీమిండియా పేసర్లు చెలరేగిపోయారు. సిరాజ్ (7-2-11-2), నితీశ్ రెడ్డి (5-1-20-1), ఆకాశ్దీప్ (5-2-23-1) పదునైన బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. భారత పేస్ అటాక్ ధాటికి ఇంగ్లండ్ 87 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. డకెట్ (12), ఓలీ పోప్ను (4) సిరాజ్ పెవిలియన్కు పంపగా.. జాక్ క్రాలేను (22) నితీశ్, హ్యారీ బ్రూక్ను (23) ఆకాశ్దీప్ ఔట్ చేశారు. లంచ్ విరామం సమయానికి ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. జో రూట్ (17), బెన్ స్టోక్స్ (2) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ 98 పరుగుల ఆధిక్యంలో ఉంది.ఈ మ్యాచ్లో ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్ల్లో ఒకే స్కోర్ (387) చేసిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తరఫున రూట్ (104), జేమీ స్మిత్ (51), బ్రైడన్ కార్స్ (56) సత్తా చాటగా.. భారత్ తరఫున కేఎల్ రాహుల్ (100, పంత్ (74), జడేజా (72) రాణించారు. బుమ్రా ఐదు వికెట్లతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ పతనాన్ని శాశించగా.. సిరాజ్, నితీశ్ తలో 2, రవీంద్ర జడేజా ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో క్రాలే 18, డకెట్ 23, ఓలీ పోప్ 44, హ్యారీ బ్రూక్ 11, బెన్ స్టోక్స్ 44, క్రిస్ వోక్స్ 0, జోఫ్రా ఆర్చర్ 4 పరుగులకు ఔటయ్యారు. భారత తొలి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 13, కరుణ్ నాయర్ 40, శుభ్మన్ గిల్ 16, నితీశ్ రెడ్డి 30, వాషింగ్టన్ సుందర్ 23, ఆకాశ్దీప్ 7, బుమ్రా 0, సిరాజ్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 3, ఆర్చర్, స్టోక్స్ తలో 2, కార్స్, బషీర్ చెరో వికెట్ తీశారు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. -
బాబూ చిట్టీ.. ఇలాగైతే కష్టమే..!
అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుందంటారు. కానీ అతడికి రెండుసార్లు లక్ తగిలింది. ఇంటర్నేషనల్ కెరీర్ ముగిసిందనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా పుంజుకుని సెకండ్ చాన్స్ దక్కించుకున్నాడు. అయితే ఈ అవకాశాన్ని కూడా జారవిచుకునే పరిస్థితిలో నిలిచాడు. అతడు ఎవరో కాదు టీమిండియా సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్. ఊహించని విధంగా టెస్ట్ జట్టులో చోటు సంపాదించిన ఈ విదర్భ క్రికెటర్.. వరుస వైఫల్యాలతో జట్టుకు భారంగా మారుతున్నాడు. ఇంగ్లండ్తో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్ల్లోనూ విఫలం కావడంతో అతడిని టీమ్ నుంచి తప్పించాలన్న డిమాండ్లు రోజురోజుకు అధికమవుతున్నాయి.బ్యాటింగ్ భారం మోస్తాడనుకుంటే..33 ఏళ్ల కరుణ్ నాయర్.. ఇంగ్లండ్ టెస్టు సిరీస్కు ఎంపికై తన పునరాగమాన్ని ఘనంగా చాటాడు. 3006 రోజుల విరామం తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కించుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించి సెలెక్టర్ల కంట్లో పడడడంతో ఇంగ్లండ్ టూర్కు ఎంపికయ్యాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి (Virat Kohli) రిటైర్మెంట్ నేపథ్యంలో బ్యాటింగ్ భారాన్ని మోస్తాడన్న భరోసాతో బీసీసీఐ అతడిని ఎంపిక చేసింది. అయితే గత 2 టెస్టుల్లో అతడి తీరు స్థాయికి తగ్గట్టు లేకపోవడంతో విమర్శలు ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం లార్డ్స్లో జరుగుతున్న మూడో టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 40 పరుగులు సాధించాడు. 5 ఇన్నింగ్స్లో కలిపి కేవలం 117 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే ఇన్నింగ్స్లో శుబమన్ గిల్ 601 పరుగులు సాధించి సత్తా చాటాడు. దీని బట్టే చూస్తే కరుణ్ ఎంతగా విఫలమయ్యాడన్నది అర్థమవుతుంది.ఇలాగైతే కష్టమే..మూడో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లోనూ కరుణ్ ఆటతీరు ఇలాగే కొనసాగితే జట్టులో అతడి స్థానం గల్లంతయ్యే అవకాశం ఉందని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. రెండో ఇన్నింగ్స్లో విఫలమయితే ముప్పు తప్పదని చతేశ్వర్ పూజారా (cheteshwar pujara) అభిప్రాయపడ్డాడు. భారీ స్కోరు చేయడంలో కరుణ్ విఫలమవుతున్నాడని, అనవసర తప్పిదాలతో వికెట్ పారేసుకుంటున్నారని పూజారా వ్యాఖ్యానించాడు. రెండంకెల స్కోరును భారీ స్కోరుగా మలచడానికి అతడు ప్రయత్నం చేయాలని సూచించాడు. క్రీజులోనే పాతుకుపోవడం ద్వారా తప్పిదాలకు ఆస్కారం కలుగుతోందని విశ్లేషించాడు. బ్యాక్ఫుట్ చురుగ్గా కదపడం ద్వారా పరుగులు సాధించొచ్చని సలహాయిచ్చాడు. సెకండ్ ఇన్నింగ్స్లో కరుణ్ ఎక్కువ స్కోరు చేస్తాడన్న ఆశాభావాన్ని పూజారా వ్యక్తం చేశాడు. కరుణ్ లాంటి బ్యాటర్కు సిరీస్లో తనదైన ముద్ర వేయడానికి ఆరు ఇన్నింగ్స్లు సరిపోతాయని వ్యాఖ్యానించాడు.చదవండి: అతడిని నాలుగో టెస్టులోనూ ఆడించాల్సిందేకరుణ్ ప్లేస్లో ఎవరు?తర్వాతి ఇన్నింగ్స్లో ఎన్ని పరుగులు చేస్తాడనే దానిపై కరుణ్ భవితవ్యం ఆధారపడి ఉంటుందని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. అతడి స్థానానికి పోటీ ఎక్కువగా ఉంది. మొదటి టెస్ట్లో బాగానే ఆడినప్పటికీ జట్టులో స్థానం కోల్పోయిన యువ ఆటగాడు సాయి సుదర్శన్ మళ్లీ చోటు దక్కించుకోవడానికి వేచిచూస్తున్నాడు. మరో టాలెంటెడ్ ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్ కూడా జట్టులో స్థానం సంపాదించి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇంగ్లాండ్ లయన్స్తో జరిగిన అనధికారిక టెస్టుల్లో మూడు అర్ధ సెంచరీలతో సహా 227 పరుగులు చేసిన ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) కూడా రేసులో ఉన్నాడు. కాబట్టి కరుణ్కు ఇది పరీక్షా సమయం. తనకు స్థాయికి తగినట్టు భారీ ఇన్నింగ్స్ ఆడితేనే జట్టులో అతడి చోటుకు భరోసా ఉంటుంది. లేకపోతే పునరాగమనం మూన్నాళ్ల ముచ్చటే అవుతుంది. చూద్దాం నాయర్ ఏం చేస్తాడో! -
బుమ్రా కూల్చాడు... ఇక బ్యాటర్లే నిలబెట్టాలి
మూడో టెస్టు రెండో రోజు రసవత్తర ఆటకు తెరలేచింది. తొలిరోజంతా కష్టపడినా బుమ్రా ఒక వికెట్ మాత్రమే తీస్తే... రెండో రోజు తొలి సెషన్లోనూ వైవిధ్యమైన బంతులతో ఇంగ్లండ్ ప్రధాన బ్యాటింగ్ బలగాన్ని కూల్చేశాడు. అయితే భారత బ్యాటింగ్ మాత్రం తడబడింది. ఆరంభంలోనే విలువైన వికెట్లను కోల్పోయింది. మొదటి రోజు 4 వికెట్లు పడితే... రెండో రోజు ఆటలో 9 వికెట్లు కూలాయి. ఇరుజట్లు బ్యాటింగ్ కంటే కూడా బౌలింగ్తోనే సత్తా చాటుకున్నాయి. లండన్: భారత ప్రీమియర్ బౌలర్ బుమ్రా తానెంత విలువైన ఆటగాడో మరోసారి చాటుకున్నాడు. తొలిరోజు శ్రమించినా దక్కని సాఫల్యం రెండో రోజు ఆరంభంలోనే సాధ్యమైంది. క్రీజులో పాతుకుపోయిన బ్యాటర్లను తొలి సెషన్ మొదలైన కొద్దిసేపటికే అవుట్ చేశాడు. భారత్ పట్టుబిగించేలా చేశాడు. నింపాదిగానే పరుగులు చేద్దామనుకున్న ఇంగ్లండ్ బ్యాటర్లపై నిప్పులు చెరిగాడు. ఇంగ్లండ్ భారీ స్కోరుకు బాట వేసినా... బుమ్రా బాధ్యతగా అడ్డుకట్ట వేశాడు. అయితే టీమిండియా ఇన్నింగ్సే సానుకూల దృక్పథంతో మొదలవలేదు.ఆతిథ్య బౌలర్లు కీలక వికెట్లను తీసి మ్యాచ్ను రసపట్టుగా మార్చేశారు. ముందుగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 112.3 ఓవర్లలో 387 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాటర్ జో రూట్ (199 బంతుల్లో 104; 10 ఫోర్లు) ‘శత’క్కొట్టగా... వికెట్ కీపర్ జేమీ స్మిత్ (56 బంతుల్లో 51; 6 ఫోర్లు), బౌలర్ బ్రైడన్ కార్స్ (83 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. భారత స్పీడ్స్టర్ బుమ్రా 5 వికెట్లు తీశాడు. సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 43 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (113 బంతుల్లో 53 బ్యాటింగ్; 5 ఫోర్లు), కరుణ్ నాయర్ (62 బంతుల్లో 40; 4 ఫోర్లు) రాణించారు. ఆర్చర్, వోక్స్, స్టోక్స్ తలా ఒక వికెట్ తీశారు. చేతిలో 7 వికెట్లున్న టీమిండియా ఇంగ్లండ్ స్కోరుకు ఇంకా 242 పరుగుల దూరంలో ఉంది. బుమ్రా పేస్... స్టోక్స్, రూట్ క్లీన్బౌల్డ్ రెండో రోజు ఆరంభాన్ని భారత పేస్ స్టార్ బుమ్రా దెబ్బతీశాడు. ఓవర్నైట్ స్కోరు 251/4తో శుక్రవారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్ కాసేపటికే కెప్టెన్ స్టోక్స్ (44) వికెట్ను కోల్పోయింది. సెంచరీ మురిపెం పూర్తవగానే రూట్ వికెట్ పడింది. ఈ ఇద్దరూ క్లీన్ బౌల్డయ్యారు. రూట్ అవుటైన మరుసటి బంతికే క్రిస్ వోక్స్ (0) డకౌట్ అయ్యాడు! ముగ్గుర్ని బుమ్రానే అవుట్ చేశాడు. బుమ్రా పేస్కు విలవిలలాడిన ఇంగ్లండ్కు స్మిత్ క్యాచ్ నేలపాలవడం వరమైంది. సిరాజ్ బౌలింగ్లో రాహుల్ క్యాచ్ చేజార్చినపుడు అతని స్కోరు 5 మాత్రమే.ఈ లైఫ్లైన్తో కార్స్తో కలిసి ఇంగ్లండ్ పోటీ స్కోరుకు స్మిత్ బాట వేశాడు. ముందుగా ఇద్దరు జట్టు స్కోరును 300 దాటించారు. తర్వాత క్రీజులో పాతుకుపోయి ఎనిమిదో వికెట్కు 84 పరుగులు జోడించారు. ఫిఫ్టీ పూర్తయ్యాక మళ్లీ సిరాజ్కే అతని వికెట్ దక్కింది. బుమ్రా... ఆర్చర్ (4)ను ఎక్కువసేపు నిలువనీయలేదు. అయితే కార్స్ అడపాదడపా బౌండరీలు, ఓ భారీ సిక్సర్తో అర్ధసెంచరీ చేసుకున్నాడు. 387 వద్ద సిరాజ్ అతన్ని అవుట్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది.యశస్వి, గిల్ విఫలం ఆరంభం నుంచే దూకుడుగా ఆడుదామనుకున్న యశస్వి జైస్వాల్ (13; 3 ఫోర్లు) జోరుకు ఆర్చర్ ఆదిలోనే అడ్డుకట్ట వేశాడు. తద్వారా నాలుగేళ్ల తర్వాత మళ్లీ భారత్తోనే అంతర్జాతీయ టెస్టుల్లో పునరాగమనం చేసిన ఆర్చర్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్తో సత్తా చాటుకున్నాడు. ఈ దశలో రాహుల్కు కరుణ్ నాయర్ జతయ్యాడు. ఇద్దరు ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్ని నింపాదిగా పరుగులు రాబట్టారు. ఈ జోడీ క్రీజులో పాగా వేస్తున్న సమయంలోనే నాయర్ వికెట్ తీసిన స్టోక్స్ రెండో వికెట్కు 61 పరుగులు భాగస్వామ్యానికి తెరదించాడు.తర్వాత ఈ సిరీస్లో భీకరమైన ఫామ్లో ఉన్న భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ (44 బంతుల్లో 16; 2 ఫోర్లు)ను వోక్స్ అవుట్ చేసి ఇంగ్లండ్ శిబిరంలో ఆనందాన్ని నింపాడు. ఇలా 107 పరుగులకే టీమిండియా కీలకమైన 3 వికెట్లు కోల్పోంది. దీంతో రాహుల్ బాధ్యతగా ఆడి అర్ధసెంచరీ పూర్తిచేసుకోగా... గాయంతో కీపింగ్ చేయలేకపోయినా రిషభ్ పంత్ (19 బ్యాటింగ్; 3 ఫోర్లు) బ్యాటింగ్లో కుదురుగా ఆడాడు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) పంత్ (బి) నితీశ్ 18; డకెట్ (సి) పంత్ (బి) నితీశ్ 23; పోప్ (సి) సబ్–జురేల్ (బి) జడేజా 44; జో రూట్ (బి) బుమ్రా 104; బ్రూక్ (బి) బుమ్రా 11; స్టోక్స్ (బి) బుమ్రా 44; స్మిత్ (సి) సబ్–జురేల్ (బి) సిరాజ్ 51; వోక్స్ (సి) సబ్–జురేల్ (బి) బుమ్రా 0; కార్స్ (బి) సిరాజ్ 56; ఆర్చర్ (బి) బుమ్రా 4; బషీర్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 31; మొత్తం (112.3 ఓవర్లలో ఆలౌట్) 387.వికెట్ల పతనం: 1–43, 2–44, 3–153, 4–172, 5–260, 6–271, 7–271, 8–355, 9–370, 10–387.బౌలింగ్: బుమ్రా 27–5–74–5, ఆకాశ్దీప్ 23–3–92–0, సిరాజ్ 23.3–6–85–2; నితీశ్ కుమార్ 17–0–62–2, జడేజా 12–1–29–1, సుందర్ 10–1–21–0. భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) బ్రూక్ (బి) ఆర్చర్ 13; రాహుల్ (బ్యాటింగ్) 53; కరుణ్ (సి) రూట్ (బి) స్టోక్స్ 40; గిల్ (సి) స్మిత్ (బి) వోక్స్ 16; పంత్ (బ్యాటింగ్) 19; ఎక్స్ట్రాలు 4; మొత్తం (43 ఓవర్లలో 3 వికెట్లకు) 145.వికెట్ల పతనం: 1–13, 2–74, 3–107.బౌలింగ్: వోక్స్ 13–1–56–1, ఆర్చర్ 10–3–22–1, కార్స్ 8–1–27–0, స్టోక్స్ 6–2–16–1, బషీర్ 6–1–22–0. ⇒ 37 టెస్టుల్లో జో రూట్ సెంచరీల సంఖ్య. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో రూట్ ఐదో స్థానానికి చేరుకున్నాడు. సచిన్ టెండూల్కర్ (51), జాక్వస్ కలిస్ (45), రికీ పాంటింగ్ (41), కుమార సంగక్కర (38) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.⇒ 211 టెస్టుల్లో అత్యధిక క్యాచ్లు తీసుకున్న ఫీల్డర్గా జో రూట్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 210 క్యాచ్లతో రాహుల్ ద్రవిడ్ (భారత్) పేరిట ఉన్న రికార్డును రూట్ సవరించాడు.⇒ 11 భారత్పై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్గా స్టీవ్ స్మిత్ (11) పేరిట ఉన్న రికార్డును జో రూట్ (11) సమం చేశాడు.⇒ 4 లార్డ్స్ మైదానంలో వరుసగా మూడు సెంచరీలు చేసిన నాలుగో క్రికెటర్గా రూట్ గుర్తింపు పొందాడు. గతంలో మైకేల్ వాన్, జాక్ హాబ్స్, దిలీప్ వెంగ్సర్కార్ ఈ ఘనత సాధించారు. -
రోహిత్ శర్మకు భారీ షాక్!?.. వన్డే కెప్టెన్గానూ గిల్?
గతేడాది నుంచి టీమిండియాలో భారీ మార్పులే జరుగుతున్నాయి. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ గెలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో పాటు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli), ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ టీ20 క్రికెట్కు వీడ్కోలు పలికారు.హార్దిక్ పాండ్యాకు ఊహించని షాకిస్తూఈ క్రమంలో మరో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఊహించని షాకిస్తూ పవర్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్తో రోహిత్ స్థానాన్ని భర్తీ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI). టీమిండియా టీ20 కొత్త కెప్టెన్గా సూర్యకు పగ్గాలు అప్పగించగా.. అతడు ద్వైపాక్షిక సిరీస్లలో వరుస విజయాలు అందిస్తూ దూసుకుపోతున్నాడు.ఇక టీ20ల నుంచి తప్పుకొన్న తర్వాత టెస్టు, వన్డే జట్టు కెప్టెన్గా కొనసాగిన రోహిత్ శర్మకు వన్డేల్లో మోదం, టెస్టుల్లో ఖేదం అన్నట్లుగా పరిస్థితి మారింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా టెస్టుల్లో 3-0తో క్లీన్స్వీప్ కావడంతో పాటు.. ఆస్ట్రేలియా పర్యటనలోనూ 3-1తో ఓడి పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది.టెస్టు రిటైర్మెంట్ ప్రకటనఈ రెండు సిరీస్లలో బ్యాటర్గా, కెప్టెన్గా పూర్తిగా విఫలమైన రోహిత్ శర్మ.. ఇంగ్లండ్ పర్యటనకు ముందు కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్లోనూ టెస్టులకు సారథిగా అతడే ఉంటాడని ముందుగా బీసీసీఐ లీకులిచ్చినా.. అనూహ్యంగా రోహిత్ నుంచి టెస్టు రిటైర్మెంట్ ప్రకటన వచ్చింది. అయితే, వన్డేల్లో మాత్రం తాను కొనసాగుతానని రోహిత్ శర్మ చెప్పగా.. బీసీసీఐ కూడా తమ వన్డే కెప్టెన్ అంటూ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.టీమిండియా టెస్టు సారథిగా గిల్ఇక రోహిత్ శర్మ తర్వాత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా టెస్టులకు గుడ్బై చెప్పాడు. వీరిద్దరి కంటే ముందే.. అంటే ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నపుడే స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ కూడా వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలో టెస్టుల్లో ప్రస్తుత టీమిండియాలో రవీంద్ర జడేజా సీనియర్గా ఉండగా.. జస్ప్రీత్ బుమ్రాకు పగ్గాలు అప్పగిస్తారని అంతా భావించారు.అయితే, పనిభారాన్ని తగ్గించే నిమిత్తం బుమ్రా నిర్ణయానుసారమే అతడి పేరును బోర్డు కెప్టెన్సీకి పరిగణనలోకి తీసుకోలేదు. ఈ క్రమంలో అనూహ్య రీతిలో యువ ఆటగాడు శుబ్మన్ గిల్ టీమిండియా టెస్టు సారథిగా ఎంపికయ్యాడు.చారిత్రాత్మక విజయంతో..ఇక కెప్టెన్గా తొలి టెస్టులోనే సెంచరీ బాది రికార్డులు సృష్టించిన గిల్.. తొలి ప్రయత్నంలో గెలుపును మాత్రం అందుకోలేకపోయాడు. అయితేనేం.. రెండో టెస్టులోనే చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఎడ్జ్బాస్టన్లో డబుల్ సెంచరీ (269), సెంచరీ (161)తో చెలరేగి.. ఈ వేదికపై తొలిసారి భారత్కు గెలుపు అందించాడు.తదుపరి వన్డే సిరీస్లో కెప్టెన్గా గిల్! ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. రెవ్స్పోర్ట్స్ జర్నలిస్టు ఒకరు.. ‘‘తదుపరి వన్డే సిరీస్లో గిల్ కెప్టెన్గా ఉండబోతున్నాడు’’ అని ట్వీట్ చేశారు. దీంతో రోహిత్ శర్మను తప్పించి గిల్కు వన్డే పగ్గాలు కూడా అప్పగిస్తారా? అనే చర్చ నడుస్తోంది. వన్డే వరల్డ్కప్-2027లో జరుగనున్న విషయం తెలిసిందే.అప్పటికి రోహిత్ శర్మకు 40 ఏళ్లు వస్తాయి గనుక.. అతడు ఆడకపోవచ్చని కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్తో పాటు.. కోహ్లి కూడా వరల్డ్కప్ టోర్నీ కంటే ముందే వన్డేలకూ గుడ్బై చెబుతాడంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరు ఇప్పటికే టీమిండియాకు ఎనలేని సేవ చేశారని.. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని పేర్కొంటున్నారు.ఇకపై ఐపీఎల్లో మాత్రమే రో-కో కొనసాగితే చాలని అంటున్నారు. కాగా టెస్టు రిటైర్మెంట్ తర్వాత బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ సందర్భంగా వీరిద్దరు రీఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. అయితే, బీసీసీఐ మాత్రం సెప్టెంబరులో జరగాల్సిన ఈ సిరీస్ను వాయిదా వేసింది. ఈ క్రమంలో నవంబరులో ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్ సందర్భంగా రోహిత్, కోహ్లి పునరాగమనం చేయనున్నారు. ఇంతలోనే రోహిత్ నుంచి పగ్గాలు గిల్ చేపట్టబోతున్నాడనే వదంతి సోషల్ మీడియాలో వ్యాపిస్తోంది.చదవండి: కావాలనే క్వాడ్రపుల్ సెంచరీ (400) మిస్.. లారా రియాక్షన్ ఇదే7th May ko kaha tha. Baar baar mat poocho bhai log. #RohitSharma #ShubmanGill https://t.co/PWcHEyJHbr— Rohit Juglan (@rohitjuglan) July 10, 2025Whenever India's next odi series will be - Gill will lead— Rohit Juglan (@rohitjuglan) July 10, 2025 -
IND vs ENG 3rd Test: ఇంగ్లండ్ ఆచితూచి...
ఇంగ్లండ్ ‘బజ్బాల్’ ఆటకు చెల్లుచీటో... లేదంటే భారత బౌలింగ్ దళమంటే వణుకో... తెలీదు కానీ లార్డ్స్ టెస్టుతో ఆతిథ్య జట్టు ఆట మొదటికొచ్చింది. కొన్నాళ్లుగా ఓడినా... గెలిచినా ఇలా ఫలితాలతో సంబంధం లేకుండా దూకుడు, దంచుడుతో గ్రేటెస్టు ఫార్మాట్ను లేటెస్ట్గా మార్చేసిన జట్టే... ఇప్పుడు ఆ పాత మధురమంటూ క్లాసిక్కు తిరిగొచ్చింది. గంటల తరబడి క్రీజులో నిలిచేందుకు... బంతుల్ని అదేపనిగా డిఫెన్స్ చేసేందుకు తెగ ప్రాధాన్యమిచ్చింది. మొత్తానికి భారత బౌలింగ్ అంటే ఆషామాషీ కాదని తెలుసుకొని స్టోక్స్ బృందం తెలివిగా మూడో టెస్టు మ్యాచ్ను ప్రారంభించింది. లండన్: భారత బౌలర్లు కొత్త బంతితో చెలరేగకపోయినా... ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తించకపోయినా... తొలిరోజు పట్టుబిగించకపోయినా... భారత్దే ఓ రకంగా పైచేయి అని చెప్పాలి. గత టెస్టు ఫలితంతో ఈ టెస్టులో ఇంగ్లండ్ను ఆచితూచి ఆడేలా చేసింది. ఓవరాల్గా బ్యాటింగ్నే మార్చేసింది. దీంతో గురువారం మొదలైన మూడో టెస్టులో రోజంతా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 83 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 251 పరుగులే చేసింది. జో రూట్ (191 బంతుల్లో 99 బ్యాటింగ్; 9 ఫోర్లు) సెంచరీ ముంగిట నిలిచాడు. ఓలీ పోప్ (44; 4 ఫోర్లు), బెన్ స్టోక్స్ (39 బ్యాటింగ్; 3 ఫోర్లు) రాణించారు. ఆంధ్రప్రదేశ్ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి 2 వికెట్లు తీయగా... బుమ్రా, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. ప్రసిధ్ కృష్ణ స్థానంలో బుమ్రా రావడం మినహా భారత జట్టులో మరో మార్పు చేయలేదు. బాగుందిరా... మామ! ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ (18; 4 ఫోర్లు), బెన్ డకెట్ (23; 3 ఫోర్లు) తమ స్వభావానికి విరుద్ధంగా లార్డ్స్ టెస్టును మొదలుపెట్టారు. బ్యాటింగ్లో దూకుడు, పరుగుల్లో వేగం ఈ రెండు లేనేలేవు. ఆఫ్స్టంప్కు ఆవల పడినా... బ్యాట్కు రవ్వంత దూరంగా వెళ్లినా... అలాంటి బంతుల్ని వికెట్ కీపర్కే వదిలేశారు. బుమ్రా బౌలింగ్లో మరింత జాగ్రత్త పడ్డారు. ఆకాశ్ దీప్, సిరాజ్లు బౌలింగ్కు వచ్చినా అనవసర షాట్ల జోలికి వెళ్లలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 14వ ఓవర్ వేసిన ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మూడో బంతికి డకెట్ను, ఆరో బంతికి క్రాలీని అవుట్ చేయడంతో భారత శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి. కెపె్టన్ శుబ్మన్ గిల్ తెలుగు ఆటగాడ్ని తెలుగు మాటలతోనే అభినందించాడు. గిల్ నోట ‘బాగుందిరా మామ’ మాట వికెట్లలో అమర్చిన మైక్లో రికార్డు కావడంతో ‘ఎక్స్’లో ఈ క్లిప్ బాగా వైరలైంది. తర్వాత వచ్చిన పోప్, రూట్లు మరింత ఆచితూచి ఆడటంతో ఈ సెషన్లో ఇంకో వికెట్కు ఆస్కారం లేకపోయింది. ‘నీరు’గార్చిన రెండో సెషన్ భారత బౌలర్లను రెండో సెషన్ పూర్తిగా నీరుగార్చింది. నితీశ్ ఇచ్చిన వికెట్ల ఊపుతో రెండో సెషన్లో వికెట్లను తీద్దామనుకున్న పేసర్లకు నిరాశే ఎదురైంది. రూట్, పోప్ కుదురుగా ఆడుతూ స్కోరుబోర్డు నింపాదిగా నడిపించారు. ఈ సెషన్లో 24 ఓవర్లపాటు క్రీజులో ఉన్న బ్యాటర్లు 70 పరుగులు చేయడం చూసిన ప్రేక్షకులకు ఆడుతోంది ఇంగ్లండేనా అనే అనుమానం కలుగకమానదు. ఇంత జిడ్డుగా ఆడుతుండటంతో భారత పేస్ తురుపుముక్క బుమ్రా ఏమీ చేయలేకపోయాడు. షాట్లు ఆడే ప్రయత్నం, పరుగులు తీసే క్రమం ఏమాత్రం పుంజుకోలేకపోవడంతో వికెట్లు తీసే అవకాశమే చిక్కలేదు. పైగా పిచ్ కూడా నిర్జీవంగా మారడంతో భారత బౌలర్లకు, ఫీల్డర్లకు చెమటలే తప్ప సాఫల్యం దక్కనేలేదు. 36వ ఓవర్లో ఇంగ్లండ్ స్కోరు వందకు చేరగా, డ్రింక్స్ విరామం తర్వాతే రూట్ అర్ధసెంచరీ పూర్తయ్యింది. రూట్తోపాటు పోప్ మొండిగా నిలబడటంతో ఇంగ్లండ్ వికెట్ నష్టపోలేదు. నింపాదిగా 150 స్కోరును దాటింది. రూట్ 99 బ్యాటింగ్ మూడో సెషన్ మొదలైన బంతికే పోప్ వికెట్ను చేజార్చుకున్న ఇంగ్లండ్కు కాసేపటికే బుమ్రా కూడా షాకిచ్చాడు. హ్యారీ బ్రూక్ (11)ను క్లీన్బౌల్డ్ చేశాడు. దీంతో స్వల్ప వ్యవధిలోనే 2 వికెట్లు కోల్పోవడంతో భారత శిబిరానికి ఈ సెషన్ టర్నింగ్ అవుతుందని అంతా భావించారు. కానీ ఈ పైచేయి అక్కడితే ఆగిపోయింది. రూట్ తన జిడ్డు ఆటతీరును కొనసాగించి బాగా విసిగించాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా దీటుగా ఎదుర్కోవడంతో పట్టుబిగించే అవకాశం లేకపోయింది. అబేధ్యమైన ఐదో వికెట్కు రూట్, స్టోక్స్ 79 పరుగులు జోడించారు. రూట్ సెంచరీకి పరుగు దూరంలో ఉన్నాడు.పంత్కు గాయం... జురేల్ కీపింగ్! భారత డాషింగ్ వికెట్కీపర్–బ్యాటర్ రిషభ్ పంత్ తొలిరోజు ఆటలో మైదానంలో గాయపడ్డాడు. దీంతో రెండో సెషన్ నుంచి ధ్రువ్ జురేల్ వికెట్ కీపింగ్ చేశాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 34వ ఓవర్లో బంతిని ఆపేందుకు డైవ్ చేయగా అతని ఎడమ చేతికి గాయమైంది. నొప్పితో బాధపడుతున్న పంత్కు కాసేపు ఫిజియో వచ్చి సపర్యలు చేశాడు. నొప్పినివారణ స్ప్రే చేసిన అతని నొప్పి తగ్గకపోవడంతో మైదానం వీడాల్సివచ్చింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) పంత్ (బి) నితీశ్ రెడ్డి 18; డకెట్ (సి) పంత్ (బి) నితీశ్ రెడ్డి 23; ఒలీ పోప్ (సి) (సబ్) జురేల్ (బి) జడేజా 44; జో రూట్ (బ్యాటింగ్) 99; బ్రూక్ (బి) బుమ్రా 11; స్టోక్స్ (బ్యాటింగ్) 39; ఎక్స్ట్రాలు 17; మొత్తం (83 ఓవర్లలో 4 వికెట్లకు) 251. వికెట్ల పతనం: 1–43, 2–44, 3–153, 4–172. బౌలింగ్: బుమ్రా 18–3–35–1, ఆకాశ్దీప్ 17–2–75–0, సిరాజ్ 14–5–33–0; నితీశ్ కుమార్ రెడ్డి 14–0–46–2, రవీంద్ర జడేజా 10–1–26–1, వాషింగ్టన్ సుందర్ 10–1–21–0. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఇంగ్లండ్ గడ్డపై తొలి సిరీస్ కైవసం
మహిళల క్రికెట్లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నిన్న (జులై 9) జరిగిన నాలుగో టీ20 భారత్ 6 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో సిరీస్ను చేజిక్కించకుంది. 2012 నుంచి ఇంగ్లండ్లో ద్వైపాక్షిక టీ20 సిరీస్లు ఆడుతున్న భారత్ తొలిసారి విజయఢంకా మోగించింది. భారత్కు ఇంగ్లండ్పై వారి దేశంలో కాని స్వదేశంలో కాని ఇదే తొలి టీ20 సిరీస్ గెలుపు. టీమిండియా ఇంగ్లండ్లో ఇప్పటివరకు నాలుగు టీ20 సిరీస్లు ఆడగా.. ఇంగ్లండ్ 3, భారత్ 1 గెలిచాయి. 2012, 2021, 2022 సిరీస్ల్లో ఇంగ్లండ్ గెలుపొందగా.. ప్రస్తుత సిరీస్లో (2025) భారత్ విజేతగా నిలిచింది. ఈ సిరీస్లో నామమాత్రపు చివరి మ్యాచ్ బర్మింగ్హమ్ వేదికగా జులై 12న జరుగనుంది. ఈ మ్యాచ్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగనుంది. జులై 16, 19, 22 తేదీల్లో సౌతాంప్టన్, లార్డ్స్, చెస్టర్ లీ స్ట్రీట్లో ఈ మ్యాచ్లు జరుగనున్నాయి.నాలుగో టీ20 విషయానికొస్తే.. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో స్పిన్నర్లు టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేయగా.. టీమిండియా స్పిన్నర్లు చెలరేగిపోయారు. రాధా యాదవ్ (4-0-15-2), శ్రీ చరణి (4-0-30-2), దీప్తి శర్మ (4-0-29-1) పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వరుస విరామాల్లో వికెట్లు తీసి ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. పేసర్లు అమన్జోత్ కౌర్ (4-0-20-1), అరుంధతి రెడ్డి (3-0-16-0) కూడా పర్వాలేదనిపించారు. ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 126 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్ సోఫీ డంక్లీ (22) టాప్ స్కోరర్గా నిలువగా.. కెప్టెన్ బేమౌంట్ (20), అలైస్ క్యాప్సీ (18), స్కోల్ఫీల్డ్ (16), ఎక్లెస్టోన్ (16 నాటౌట్), వాంగ్ (11 నాటౌట్) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ మరో 3 ఓవర్లు మిగిలుండగానే సునాయాసంగా ఛేదించింది. స్మృతి మంధన 32, షఫాలీ వర్మ 31, జెమీమా రోడ్రిగెజ్ 24 (నాటౌట్), హర్మన్ప్రీత్ కౌర్ 26 , రిచా ఘోష్ 7 (నాటౌట్) పరుగులు చేసి భారత్ను గెలపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో చార్లోట్ డీన్, ఎక్లెస్టోన్, వాంగ్ తలో వికెట్ తీశారు. -
ENG VS IND 3rd Test: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో రిషబ్ పంత్
టీమిండియా డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. రేపటి నుంచి ఇంగ్లండ్తో ప్రారంభమయ్యే మూడో టెస్ట్లో మరో 5 సిక్సర్లు బాదితే టెస్ట్ల్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా అవతరిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. వీరూ 103 టెస్ట్ల్లో 90 సిక్సర్లు బాదాడు. వీరూ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్మ్యాన్ 67 టెస్ట్ల్లో 88 సిక్సర్లు కొట్టాడు. పంత్ విషయానికొస్తే.. ఇతగాడు కేవలం 45 మ్యాచ్ల్లోనే 86 సిక్సర్లు బాది చరిత్ర సృష్టించేందుకు మరో 5 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. పంత్ ప్రస్తుత ఫామ్ను బట్టి చూస్తే రేపటి నుంచి ప్రారంభమయ్యే టెస్ట్లో ఈ రికార్డు సాధించడం ఖాయంగా కనినిస్తుంది.ఓవరాల్గా చూస్తే టెస్ట్ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో పంత్ 12వ స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్తో మూడో టెస్ట్లో పంత్ 5 సిక్సర్లు కొడితే భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డుతో పాటు టెస్ట్ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఏడో స్థానానికి ఎగబాకుతాడు. టెస్ట్ల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పేరిట ఉంది. స్టోక్స్ 113 మ్యాచ్ల్లో 133 సిక్సర్లు బాదాడు. స్టోక్స్ తర్వాతి స్థానాల్లో బ్రెండన్ మెక్కల్లమ్ (107), గిల్క్రిస్ట్ (100), టిమ్ సౌథీ (98), గేల్ (98), కల్లిస్ (97), సెహ్వాగ్ (91), ఏంజెలో మాథ్యూస్ (90), రోహిత్ శర్మ (88), లారా (88) ఉన్నారు (టాప్-10లో).కొద్ది రోజుల కిందట మరో భారీ సిక్సర్ల రికార్డు బద్దలు కొద్ది రోజుల కిందట జరిగిన ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో పంత్ మరో భారీ సిక్సర్ల రికార్డు సాధించాడు. విదేశీ గడ్డపై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్గా అవతరించాడు. ఈ క్రమంలో బెన్ స్టోక్స్ పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. పంత్ ఇంగ్లండ్లో (టెస్ట్ల్లో) 23 సిక్సర్లు బాదగా.. స్టోక్స్ సౌతాఫ్రికాలో 21 సిక్సర్లు కొట్టాడు. భీకర ఫామ్లో పంత్ఇంగ్లండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో పంత్ రెండు ఇన్నింగ్స్లో శతకాలతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్లో 178 బంతుల్లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో 140 బంతుల్లో 15 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 118 పరుగులు సాధించాడు.ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో పంత్ తొలి ఇన్నింగ్స్లో తక్కువ స్కోర్కే (25) ఔటైనా, రెండో ఇన్నింగ్స్లో తనదైన శైలిలో మెరుపు అర్ద సెంచరీ (65) చేశాడు. రేపటి నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభమయ్యే మూడో టెస్ట్లో భారీ అంచనాలు ఉన్నాయి. పంత్ మరోసారి చెలరేగాలని అంతా ఆశిస్తున్నారు. ఈ సిరీస్లో భారత్, ఇంగ్లండ్ తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. తొలి టెస్ట్లో ఇంగ్లండ్ గెలవగా.. రెండో టెస్ట్లో భారత్ భారీ విజయం సాధించింది. -
ఆర్సీబీ స్టార్ క్రికెటర్పై మహిళ ఫిర్యాదు.. కేసు నమోదు
ఆర్సీబీ స్టార్ క్రికెటర్ యశ్ దయాల్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఉత్తర్ప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన ఓ యువతి యశ్ దయాల్పై లైంగిక వేధింపులు సహా శారీరక హింస, మానసిక వేధింపులు మరియు తప్పుడు వాగ్దానాల వంటి ఆరోపణలు చేస్తూ సీఎం గ్రీవెన్స్ పోర్టల్లో ఫిర్యాదు చేసింది. Ghaziabad, UP: An FIR has been registered against cricketer Yash Dayal at PS Indirapuram, under BNS Section 69, on charges of sexual exploitation, physical violence, mental harassment and cheating by making false promises of marriage.— ANI (@ANI) July 7, 2025ఈ ఫిర్యాదు ఆధారంగా ఇందిరాపురం పోలిస్ స్టేషన్లో యశ్ దయాల్పై కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 69 కింద యశ్పై కేసు కట్టారు. పెళ్లి, ఉద్యోగం వంటి తప్పుడు వాగ్దానాలతో మోసం చేసిన ఘటనల్లో ఈ సెక్షన్ వాడతారు. ఈ కేసులో నేరం రుతువైతే పదేళ్ల వరకు శిక్ష పడుతుంది.ఫిర్యాదు ప్రకారం.. ఘజియాబాద్కు చెందిన యువతి దయాల్తో తనకు ఐదేళ్ల సంబంధం ఉందని తెలిపింది. దయాల్ తనను అతని కుటుంబానికి పరిచయం చేశాడని, వారు తనను కోడలుగా స్వాగతించారని ఆమె పేర్కొంది. సదరు యువతి గత 5 సంవత్సరాలుగా దయాల్తో సంబంధంలో ఉన్నట్లు చెప్పుకొచ్చింది.దయాల్ మోసాన్ని గ్రహించి నిరసన తెలిపినప్పుడు శారీరక, మానసిక వేధింపులకు గురయ్యానని ఫిర్యాదు చేసింది. దయాల్తో సంబంధంలో ఉన్నప్పుడు ఆర్దికంగానూ నష్టపోయానని ఆరోపించింది. దయాల్కు తనతో పాటు మరో ముగ్గురు మహిళలలో కూడా సంబంధాలు ఉన్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నట్లు పేర్కొంది. దయాల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా, 27 ఏళ్ల యశ్ దయాల్ను ఆర్సీబీ గత ఐపీఎల్ సీజన్కు ముందు రూ. 5 కోట్లకు రీటైన్ చేసుకుంది. తాజాగా ముగిసిన సీజన్లో దయాల్ 15 మ్యాచ్ల్లో 13 వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు. ఈ సీజన్లో దయాల్ మంచి ఎకానమీతో బౌలింగ్ చేసి ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. దయాల్ 2023 సీజన్లో రింకూ సింగ్కు బౌలింగ్ చేస్తూ చివరి ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు ఇచ్చి తొలిసారి వార్తల్లో నిలిచాడు. దయాల్ విరాట్ కోహ్లి మద్దతుతో ఆర్సీబీలో కొనసాగుతున్నాడు. -
వరుసగా మూడో మ్యాచ్లోనూ సెంచరీ చేసిన టీమిండియా యువ సంచలనం
టీమిండియా యువ సంచనలం ముషీర్ ఖాన్ ఇంగ్లండ్ పర్యటనలో పట్టపగ్గాల్లేకుండా చెలరేగిపోతున్నాడు. వరుస సెంచరీలు, ఐదు వికెట్ల ప్రదర్శనలతో దుమ్మురేపుతున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎమర్జింగ్ టీమ్ (MCA Colts) తరఫున ఇంగ్లండ్లో పర్యటిస్తున్న ముషీర్ ఆల్రౌండర్గా అదరగొడుతున్నాడు.ఈ పర్యటనలో Notts 2nd XIతో జరిగిన తొలి మ్యాచ్లో 127 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 123 పరుగులు చేసిన ముషీర్.. ఆ మ్యాచ్లో బౌలింగ్లోనూ ఇరగదీసి 6 వికెట్లు ప్రదర్శన నమోదు చేశాడు.అనంతరం జులై 3న ఛాలెంజర్స్తో (కంబైన్డ్ నేషనల్ కౌంటీస్) ప్రారంభమైన రెండో మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో సెంచరీ (127 బంతుల్లో 125; 11 ఫోర్లు, సిక్స్) చేసిన ముషీర్.. బౌలింగ్లోనూ చెలరేగి ఆ మ్యాచ్ మొత్తంలో పది వికెట్లు (తొలి ఇన్నింగ్స్లో 6, రెండో ఇన్నింగ్స్లో 4) తీశాడు.తాజాగా ముషీర్ లౌబరో UCCE జట్టుతో జరిగిన మ్యాచ్లో మరోసారి సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్లో ముషీర్ 146 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 154 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ముషీర్కు ఇంగ్లండ్ పర్యటనలో ఇది వరుసగా మూడో సెంచరీ.హ్యాట్రిక్ సెంచరీలు, అదిరిపోయే బౌలింగ్ ప్రదర్శనలతో ఇంగ్లండ్ పర్యటనలో దుమ్మురేపుతున్న ముషీర్పై ప్రశంసల వర్షం కురుస్తుంది. భారత క్రికెట్కు మరో భవిష్యత్ తార దొరికాడని టీమిండియా అభిమానులు సంబురపడిపోతున్నారు. 20 ఏళ్ల ముషీర్ గతేడాది సెప్టెంబర్లో కారు ప్రమాదానికి గురైన తర్వాత ఆడుతున్న తొలి రెడ్ బాల్ టోర్నీ ఇది.ఈ టోర్నీలో ముషీర్ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ భారత సీనియర్ టీమ్ సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. ఇప్పటికే భారత జట్టులో చోటు కోసం తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. ముషీర్ అన్న సర్ఫరాజ్ ఖాన్ సూపర్ ఫామ్లో ఉన్నా టీమిండియా బెర్త్ దక్కడం లేదు. మరోవైపు కౌంటీల్లో సత్తా చాటుతూ ఇషాన్ కిషన్, తిలక్ వర్మ కూడా భారత టెస్ట్ జట్టు బెర్త్ వైపు చూస్తున్నారు. ఇంత పోటీలో ముషీర్ టీమిండియా వైపు ఎలా వస్తాడో చూడాలి. ఇక్కడ ముషీర్కు ఓ అడ్వాంటేజ్ ఉంది. ముషీర్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ ఇరగదీస్తున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అయిన ముషీర్.. ఇంగ్లండ్ పర్యటనకు ముందు కూడా సత్తా చాటాడు.ముషీర్కు దేశవాలీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2022-23 రంజీ సీజన్లో ముంబై తరఫున అరంగేట్రం చేసిన ముషీర్.. ఆడిన 9 మ్యాచ్ల్లో 51.14 సగటున 3 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 716 పరుగులు చేశాడు. ఇందులో ఓ అజేయ డబుల్ సెంచరీ కూడా ఉంది.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ముషీర్ బౌలర్గానూ రాణించాడు. 9 మ్యాచ్ల్లో 8 వికెట్లు తీశాడు. ముషీర్ 2024 అండర్-19 వరల్డ్కప్లో భారత జట్టు సభ్యుడిగా ఉన్నాడు. టీమిండియా రన్నరప్గా నిలిచిన ఈ టోర్నీలో ముషీర్ రెండు సెంచరీలు చేశాడు. 2024 రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన ముషీర్.. ముంబై తరఫున రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి బ్రేక్.. ఇంగ్లండ్ చేతిలో ఓడిన టీమిండియా
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తొలిసారి శాంతించాడు. ఐదు వన్డేల సిరీస్లో తొలి నాలుగు మ్యాచ్ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన వైభవ్.. నిన్న (జులై 7) జరిగిన చివరి మ్యాచ్లో ఓ మోస్తరు ఇన్నింగ్స్తో (42 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో, 78.57 స్ట్రయిక్రేట్తో 33 పరుగులు) సరిపెట్టాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తక్కువ స్కోర్కే పరిమితమై.. ఆతర్వాత ఆ స్కోర్ను కాపాడుకోవడంలో విఫలమైంది. ఈ మ్యాచ్లో ఓడినా టీమిండియా 3-2 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. భారత్ 1,3,4 వన్డేలు గెలువగా.. ఇంగ్లండ్ 2, 5 వన్డేల్లో నెగ్గింది. భారత్ త్వరలో ఇంగ్లండ్తో రెండు మ్యాచ్ల యూత్ టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో తొలి టెస్ట్ జులై 12 నుంచి 15 వరకు బెకెన్హమ్లో జరుగనుంది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 210 పరుగులు మాత్రమే చేసింది. ఆర్ఎస్ అంబ్రిష్ (66) అజేయ అర్ద శతకంతో రాణించి టీమిండియాకు ఈ మాత్రం స్కోరైనా అందించాడు. జట్టులో నెక్స్ హైయ్యెస్ట్ స్కోర్ వైభవ్దే. రాహుల్ కుమార్ (21), హర్వంశ్ పంగాలియా (24), కనిశ్క్ చౌహాన్ (24), యుద్దజిత్ గుహా (10) రెండంకెల స్కోర్లు చేయగా.. ఆయుశ్ మాత్రే (1) వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. మరో స్టార్ బ్యాటర్ విహాన్ మల్హోత్రా (1) కూడా ఈ మ్యాచ్లో విఫలమయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రెంచ్, ఆల్బర్ట్ చెరో 2 వికెట్లు తీయగా.. ఫిర్బాంక్, మోర్గాన్, గ్రీన్, ఎకాంశ్ సింగ్ తలో వికెట్ తీశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 31.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయం సాధించింది. తొలుత బెన్ డాకిన్స్ (66), ఆతర్వాత బెన్ మేస్ (82 నాటౌట్), కెప్టెన్ థామస్ రూ (49 నాటౌట్) రాణించి ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చారు. భారత బౌలర్లలో నమన్ పుష్పక్ 2, దిపేశ్ దేవేంద్రన్ ఓ వికెట్ తీశాడు.శాంతించిన వైభవ్ఈ సిరీస్లో వైభవ్ 100 లోపు స్ట్రయిక్రేట్తో బ్యాటింగ్ చేయడం ఇదే మొదటిసారి. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో వైభవ్ తొలి నాలుగు మ్యాచ్ల్లో 130కి పైగా స్ట్రయిక్రేట్తో పరుగులు చేశాడు.తొలి మ్యాచ్లో 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసిన వైభవ్.. రెండో వన్డేలో 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు.. మూడో వన్డేలో 31 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 86 పరుగులు.. నాలుగో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగి 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో ఏకంగా 143 పరుగులు చేశాడు. ఈ సిరీస్ వైభవ్ విధ్వంసం ధాటికి ఇంగ్లండ్ యువ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. వైభవ్ ప్రతి మ్యాచ్ల కనీసం రెండైనా సిక్సర్లు కొట్టాడు. ఐదో వన్డేలో నిదానంగా ఆడినా 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. -
శాంతించిన వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసం డోసు కాస్త తగ్గింది..!
ఇంగ్లండ్ పర్యటనలో భారత యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తొలిసారి శాంతించాడు. ఇవాళ (జులై 7) జరుగుతున్న ఐదో యూత్ వన్డేలో 42 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో, 78.57 స్ట్రయిక్రేట్తో 33 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో వైభవ్ ఇంత తక్కువ స్ట్రయిక్రేట్తో బ్యాటింగ్ చేయడం ఇదే మొదటిసారి. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో వైభవ్ తొలి నాలుగు మ్యాచ్ల్లో 130కి పైగా స్ట్రయిక్రేట్తో పరుగులు చేశాడు.తొలి మ్యాచ్లో 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసిన వైభవ్.. రెండో వన్డేలో 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు.. మూడో వన్డేలో 31 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 86 పరుగులు.. నాలుగో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగి 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో ఏకంగా 143 పరుగులు చేశాడు. ఈ సిరీస్ వైభవ్ విధ్వంసం ధాటికి ఇంగ్లండ్ యువ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. వైభవ్ ప్రతి మ్యాచ్ల కనీసం రెండైనా సిక్సర్లు కొట్టాడు.ఇంగ్లండ్ పర్యటనలో వైభవ్ తొలిసారి శాంతించడంతో భారత్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఇవాళ జరుగుతున్న ఐదో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 210 పరుగులు మాత్రమే చేసింది. ఆర్ఎస్ అంబ్రిష్ (66) అజేయ అర్ద శతకంతో రాణించి టీమిండియాకు ఈ మాత్రం స్కోరైనా అందించాడు. జట్టులో నెక్స్ హైయ్యెస్ట్ స్కోర్ వైభవ్దే. మిగతా ఆటగాళ్లలో రాహుల్ కుమార్ (21), హర్వంశ్ పంగాలియా (24), కనిశ్క్ చౌహాన్ (24), యుద్దజిత్ గుహా (10) రెండంకెల స్కోర్లు చేయగా.. ఆయుశ్ మాత్రే (1) వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. మరో స్టార్ బ్యాటర్ విహాన్ మల్హోత్రా (1) కూడా ఈ మ్యాచ్లో విఫలమయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రెంచ్, ఆల్బర్ట్ చెరో 2 వికెట్లు తీయగా.. ఫిర్బాంక్, మోర్గాన్, గ్రీన్, ఎకాంశ్ సింగ్ తలో వికెట్ తీశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ విజయం దిశగా అడుగులు వేస్తుంది. 21 ఓవర్ల తర్వాత ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. బెన్ డాకిన్స్ (66) అర్ద సెంచరీతో రాణించగా.. బెన్ మేస్ (45) ఇంగ్లండ్ను గెలుపు దిశగా తీసుకెళ్తున్నాడు. మేస్కు జతగా కెప్టెన్ రూ (2) క్రీజ్లో ఉన్నాడు.కాగా, ఈ సిరీస్ను భారత్ ఇదివరకే కైవసం చేసుకుంది. తొలి నాలుగు మ్యాచ్ల్లో భారత్ మూడింట విజయాలు సాధించింది. చివరిదైన ఈ మ్యాచ్లో ఓడినా టీమిండియాకు ఒరిగేదేమీ ఉండదు. ఈ సిరీస్లో ఇంగ్లండ్ రెండో వన్డేలో మాత్రమే నెగ్గింది. వన్డే సిరీస్ అనంతరం భారత్ ఇంగ్లండ్తో రెండు మ్యాచ్ల యూత్ టెస్ట్ సిరీస్ ఆడనుంది. తొలి టెస్ట్ జులై 12 నుంచి 15 వరకు బెకెన్హమ్లో జరుగనుంది. -
అయ్యో.. ఇలా ఎందుకు చేశావు గిల్?.. చిక్కుల్లో కెప్టెన్?!
భారత టెస్టు క్రికెట్లో ఇంత వరకు ఏ కెప్టెన్కూ సాధ్యం కాని అరుదైన ఘనతను శుబ్మన్ గిల్ (Shubman Gill) సాధించాడు. ఇంగ్లండ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో తొలిసారి టీమిండియాకు టెస్టు విజయాన్ని అందించాడు. బ్యాటర్గానూ అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకుని.. సారథిగా రెండో ప్రయత్నంలోనే చిరస్మరణీయ గెలుపుతో సత్తా చాటాడు.చారిత్రాత్మక విజయంతోనే సమాధానంఈ నేపథ్యంలో 25 ఏళ్ల శుబ్మన్ గిల్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కెప్టెన్గా ఇతడేంటి? అన్న వాళ్లకు చారిత్రాత్మక విజయంతోనే సమాధానమిచ్చాడంటూ మాజీ క్రికెటర్లు ఈ కుర్రాడిని కొనియాడుతున్నారు. అయితే, అంతా బాగానే ఉన్నా టీమిండియా రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయంలో గిల్ వ్యవహరించిన తీరు అతడిని చిక్కుల్లో పడేసేలా ఉంది.చిక్కుల్లో పడేలా గిల్ చర్య?టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా భారత్ ఇంగ్లండ్తో ఎడ్జ్బాస్టన్ వేదికగా రెండో టెస్టు ఆడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ద్విశతకం (269)తో చెలరేగిన గిల్.. రెండో ఇన్నింగ్స్ (161)లోనూ శతక్కొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో తాను అవుటైన కాసేపటికే గిల్ ఇన్నింగ్స్ డిక్లేర్ ప్రకటన చేశాడు.డ్రెసింగ్రూమ్ బయటకు వచ్చి అప్పటికి క్రీజులో ఉన్న రవీంద్ర జడేజా (69*), వాషింగ్టన్ సుందర్ (12*)లను వెనక్కి రావాల్సిందిగా గిల్ రెండు చేతులతో సైగ చేశాడు. అయితే, ఈ సందర్భంగా అతడు తన జెర్సీ తీసేసి.. బ్లాక్ వెస్ట్ (లో దుస్తులు)తో దర్శనమిచ్చాడు. అది నైక్ బ్రాండ్కు చెందినది.ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు గిల్ తీరును విమర్శిస్తూ అతడితో పాటు బీసీసీఐ కూడా చిక్కుల్లో పడే అవకాశం ఉందంటూ హెచ్చరిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే..బీసీసీఐ అధికారిక కిట్ స్పాన్సర్ అడిడాస్ అన్న విషయం తెలిసిందే. ఇందుకు గానూ భారత పురుషుల జట్టు జెర్సీలు, కిట్లు రూపొందించేందుకు బీసీసీఐతో భారీ మొత్తానికి అడిడాస్ 2023లో ఐదేళ్లకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే, ఆ బ్రాండ్కు కాంపిటీటర్ అయిన మరో బ్రాండ్ వెస్ట్ ధరించి గిల్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం.. అది విశేషంగా వైరల్ కావడంతో చట్టపరంగా బోర్డుకు, అతడికి చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు. మరి కొందరేమో ఓ అడుగు ముందుకేసి.. ‘‘నువ్వు ఇప్పుడు కెప్టెన్వి. ఆచితూచి అడుగేయాలి. ఇలా చేయడం ఎంతమాత్రం సరికాదు’’ అంటూ గిల్పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్- ఇంగ్లండ్ మధ్య జూలై 10 -14 మధ్య లార్డ్స్లో మూడో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టు సంక్షిప్త స్కోర్లు🏏టీమిండియా- 587 & 427/6 d🏏ఇంగ్లండ్- 407 & 271🏏ఫలితం- ఇంగ్లండ్ను 336 పరుగుల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. 🏏తొలి టెస్టులో ఓటమికి బదులు తీర్చుకుని.. సిరీస్ 1-1తో సిరీస్ సమం🏏ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్- శుబ్మన్ గిల్.చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్మన్ గిల్pic.twitter.com/SkeKPaxH5S— Shubman Gill (@ShubmanGill) July 6, 2025While Siraj & Akash Deep tore through England, the umpire had other plans for DSP Siraj… and got the stare of the century. 😤🎥India made history — first Asian team to conquer Edgbaston! 🏰🇮🇳From serious records to serial reactions —Historic win. Hilarious moments. One… pic.twitter.com/jF3q64fpws— Star Sports (@StarSportsIndia) July 6, 2025 -
బర్మింగ్హామ్లో జైహింద్
బుమ్రాకు విశ్రాంతినివ్వడం... కుల్దీప్ను విస్మరించడం... ప్రసి«ద్ను కొనసాగించడం... టాపార్డర్ను కూల్చిన అనంతరం ప్రత్యర్థిని కోలుకోనివ్వడం... సరైన సమయంలో ఇన్నింగ్స్ ‘డిక్లేర్’ చేయకపోవడం... ఇన్ని ప్రతికూలతలకు తోడు చివరి రోజు వర్షం సైతం ఆతిథ్య జట్టును ఆదుకునేలా కనిపించడంతో.. ఒకదశలో భారత విజయంపై నీలినీడలు కమ్ముకోగా... ఆకాశ్దీప్ సింగ్ వాటిని పటాపంచలు చేస్తూ విజృంభించాడు. యువసారథి శుబ్మన్ గిల్ బ్యాటింగ్ మెరుపులకు... ఆకాశ్ నిప్పులు చెరిగే బౌలింగ్ తోడవడంతో ఇంగ్లండ్తో రెండో టెస్టులో టీమిండియా విజయఢంకా మోగించింది. నాలుగేళ్ల క్రితం ‘గబ్బా స్టేడియం’లో ఆ్రస్టేలియాపై తొలి విజయంలో కీలకపాత్ర పోషించిన గిల్, పంత్, సిరాజ్... ఇక్కడ కూడా సత్తా చాటడంతో బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో టీమిండియా తొలిసారి టెస్టుల్లో గెలిచింది. గతంలో ఎడ్జ్బాస్టన్ గ్రౌండ్లో ఇంగ్లండ్తో భారత్ 8 టెస్టులు ఆడగా ... ఏడింటిలో ఓడి... ఒకసారి ‘డ్రా’ చేసుకుంది. తొమ్మిదో ప్రయత్నంలో గెలుపు రుచి చూసింది. బర్మింగ్హామ్: ఇంగ్లండ్ పర్యటనలో భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఎడ్జ్బాస్టన్ మైదానంలో తొలిసారి టెస్టు ఫార్మాట్లో విజయం నమోదు చేసుకుంది. బ్యాటర్ల బీభత్సానికి బౌలర్ల సహకారం తోడవడంతో రెండో టెస్టులో టీమిండియా 336 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. విదేశాల్లో పరుగుల తేడా పరంగా భారత జట్టుకు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. 608 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్నైట్ స్కోరు 72/3తో ఆదివారం చివరిరోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు చివరకు 68.1 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటైంది. జేమీ స్మిత్ (99 బంతుల్లో 88; 9 ఫోర్లు, 4 సిక్స్లు) ఒంటరి పోరాటం చేశాడు. భారీ వర్షం కురవడంతో ... చివరిరోజు ఆట ఆలస్యంగా ప్రారంభం కాగా... ఒకదశలో వరుణుడి సాయంతో ఇంగ్లండ్ గట్టెక్కేలా కనిపించినా... వాన తెరిపినిచి్చన అనంతరం భారత బౌలర్లు విజృంభించి ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లారు. ఆకాశ్దీప్ 6 వికెట్లతో అదరగొట్టగా... సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, జడేజా, సుందర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. బర్మింగ్హామ్లో భారత్కు ఇదే మొదటి గెలుపు కాగా... ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను టీమిండియా 1–1తో సమం చేసింది. భారత కెప్టెన్ గిల్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. లార్డ్స్లో గురువారం నుంచి మూడో టెస్టు జరుగుతుంది. మళ్లీ అతడే... వర్షంతో దాదాపు రెండు గంటలు ఆలస్యంగా ఆట ప్రారంభం కావడంతో ఓవర్లను కుదించారు. దీంతో ఏ మూలో భారత విజయంపై అనుమానాలు రేకెత్తగా... వాటిని ఆకాశ్దీప్ పటాపంచలు చేశాడు. రెండో ఓవర్ తొలి బంతికే పోప్ (24)ను క్లీన్ బౌల్డ్ చేసిన ఆకాశ్... తదుపరి ఓవర్లో బ్రూక్ (23)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ ఆత్మరక్షణలో పడగా... లంచ్ విరామానికి ముందు కెప్టెన్ బెన్ స్టోక్స్ (73 బంతుల్లో 33; 6 ఫోర్లు)ను అవుట్ చేయడం ద్వారా సుందర్ జట్టును విజయానికి మరింత చేరువ చేశాడు. ఇక గెలుపు లాంఛనం మాత్రమే మిగలగా... తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో జేమీ స్మిత్ ఎదురుదాడికి దిగాడు. ధాటిగా ఆడుతూ ఓటమి అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. ఆకాశ్దీప్ బౌలింగ్లో రెండు భారీ సిక్స్లు కొట్టిన స్మిత్ మరో షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ అవుట్ కావడంతో ఇంగ్లండ్ ఓటమి ఖరారైంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 587; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 407; భారత్ రెండో ఇన్నింగ్స్: 427/6 డిక్లేర్డ్; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: డకెట్ (బి) ఆకాశ్దీప్ 25; క్రాలీ (సి) (సబ్) సుదర్శన్ (బి) సిరాజ్ 0; పోప్ (బి) ఆకాశ్దీప్ 24; రూట్ (బి) ఆకాశ్దీప్ 6; బ్రూక్ (ఎల్బీ) ఆకాశ్దీప్ 23; స్టోక్స్ (ఎల్బీ) (బి) సుందర్ 33; స్మిత్ (సి) సుందర్ (బి) ఆకాశ్దీప్ 88; వోక్స్ (సి) సిరాజ్ (బి) ప్రసిధ్ కృష్ణ 7; కార్స్ (సి) గిల్ (బి) ఆకాశ్దీప్ 38; టంగ్ (సి) సిరాజ్ (బి) జడేజా 2; బషీర్ (నాటౌట్) 12; ఎక్స్ట్రాలు 13; మొత్తం (68.1 ఓవర్లలో ఆలౌట్) 271. వికెట్ల పతనం: 1–11, 2–30, 3–50, 4–80, 5–83, 6–153, 7–199, 8–226, 9–246, 10–271. బౌలింగ్: ఆకాశ్దీప్ 21.1–2–99–6; సిరాజ్ 12–3–57–1; ప్రసిధ్ కృష్ణ 14–2–39–1; జడేజా 15–4–40–1; సుందర్ 6–2–28–1. -
పదేసిన ఆకాశ్దీప్.. ఇంగ్లండ్పై టీమిండియా చారిత్రక విజయం
ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో టీమిండియా చారిత్రక విజయం సాధించింది. చివరి రోజు వరకు సాగిన ఈ మ్యాచ్లో భారత్ 336 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. విదేశాల్లో భారత్కు ఇదే భారీ విజయం. ఎడ్జ్బాస్టన్లో భారత్కు ఇదే తొలి విజయం (58 ఏళ్ల తర్వాత). ఈ వేదికపై భారత్ ఈ మ్యాచ్కు ముందు వరకు ఒక్క విజయం కూడా సాధించలేదు. 8 మ్యాచ్ల్లో ఏడింట ఓడి, ఓ మ్యాచ్ డ్రా చేసుకుంది. ఈ గెలుపుతో గిల్ ఎడ్జ్బాస్టన్లో విజయం సాధించిన తొలి ఆసియా కెప్టెన్గా కూడా రికార్డు నెలకొల్పాడు. 608 పరుగల భారీ లక్ష్య ఛేదనలో 72/3 స్కోర్ వద్ద చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 271 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆకాశ్దీప్ (21.2-2-99-6) నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టాడు. ఆకాశ్దీప్కు కెరీర్లో ఇదే తొలి ఐదు వికెట్ల ఘనత. తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు పడగొట్టిన ఆకాశ్దీప్ మొత్తంగా 10 వికెట్ల ఘనత కూడా సాధించాడు.ఈ మ్యాచ్లో బుమ్రా స్థానంలో బరిలోకి దిగిన ఆకాశ్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా చారిత్రక విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. మిగతా భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు. సెకెండ్ ఇన్నింగ్స్లోనూ టాప్ స్కోరర్గా నిలిచిన జేమీ స్మిత్ (88) డ్రా కోసం విఫలయత్నం చేశాడు.అంతకుముందు టీమిండియా 427/6 వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. శుభ్మన్ గిల్ (162 బాల్స్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161) సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా (69 నాటౌట్), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) భారీ శతకాలతో చెలరేగారు. భారత బౌలర్లలో సిరాజ్ 6, ఆకాశ్దీప్ 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ (269) భారీ డబుల్ సెంచరీతో రికార్డులు తిరగరాశాడు. యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89) సెంచరీలకు చేరువలో ఔటయ్యారు.ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. తొలి టెస్ట్లో ఇంగ్లండ్ భారత్పై విజయం సాధించింది. ఈ సిరీస్లో మూడో టెస్ట్ జులై 10 నుంచి ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరుగనుంది. గిల్ కెప్టెన్సీలో భారత్కు ఇదే తొలి గెలుపు. -
చెలరేగిన ఆకాశ్దీప్.. చారిత్రక గెలుపునకు 2 వికెట్ల దూరంలో టీమిండియా
Update: లంచ్ తర్వాత మరో 2 వికెట్లు తీసిన టీమిండియా. క్రిస్ వోక్స్ను (7) ప్రసిద్ద్ కృష్ణ.. జేమీ స్మిత్ను ఆకాశ్దీప్ (88) ఔట్ చేశారు. 56 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 226/8గా ఉంది. భారత్ గెలుపుకు కేవలం 2 వికెట్లు మాత్రమే కావాలి. ఆకాశ్దీప్ ఈ ఇన్నింగ్స్లో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసి 10 వికెట్ల ప్రదర్శనపై కన్నేశాడు. ఆకాశ్దీప్ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీశాడు. ఎడ్జ్బాస్టన్లో చరిత్ర సృష్టించేందుకు టీమిండియా సిద్దమవుతోంది. ఈ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో చారిత్రక గెలుపుకు 4 వికెట్ల దూరంలో ఉంది. ఎడ్జ్బాస్టన్లో భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇక్కడ ఆడిన 8 మ్యాచ్ల్లో ఏడింట ఓడి, ఓ మ్యాచ్ డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్లో గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా ఆటగాళ్లు ఆరాటపడుతున్నారు. వారి ఆరాటం మరికొద్ది గంటల్లో తీరే అవకాశం ఉంది.608 పరుగల భారీ లక్ష్య ఛేదనలో 72/3 వద్ద చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. లంచ్ విరామం సమయానికి 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలవాలంటే మరో 455 పరుగులు కావాలి. అది అసాధ్యం. భారత్ గెలలాంటే మాత్రం కేవలం 4 వికెట్లు తీస్తే చాలు.వర్షం కారణంగా ఇవాల్టి ఆట గంట 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. వర్షం కారణంగా 10 ఓవర్లు కోతకు గురైంది. ఈ రోజు కేవలం 80 ఓవర్ల ఆట మాత్రమే జరుగుతుంది. ఆట ప్రారంభం కాగానే టీమిండియా పేసర్ ఆకాశ్దీప్ ఇంగ్లండ్ను భారీ దెబ్బేశాడు. అతని బౌలింగ్లో ఓలీ పోప్ (24) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆతర్వాత కొద్ది సేపటికే ఆకాశ్దీప్ మరోసారి రెచ్చిపోయాడు. ఈ సారి ఇన్ ఫామ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (23) ఎల్బీడబ్ల్యూ చేసి ఇంగ్లండ్ డ్రా ఆశలపై నీళ్లు చల్లాడు. అనంతరం స్టోక్స్, జేమీ స్మిత్ ఆరో వికెట్కు 70 పరుగులు జోడించి టీమిండియా బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఈసారి వాషింగ్టన్ సుందర్ అద్బుతమైన బంతితో బెన్ స్టోక్స్ను (33) పెవిలియన్కు సాగనంపాడు. స్టోక్స్ వికెట్ పడగానే అంపైర్లు లంచ్ విరామాన్ని ప్రకటించారు. 32 పరుగులతో జేమీ స్మిత్ క్రీజ్లో ఉన్నాడు. నాలుగో రోజు ఆటలో బెన్ డకెట్ (25), రూట్ను (60) ఔట్ చేసిన ఆకాశ్దీప్ ఈ ఇన్నింగ్స్లో మొత్తం 4 వికెట్లు తీయగా.. సిరాజ్, సుందర్ తలో వికెట్ దక్కించుకున్నారు. నాలుగో రోజు ఆటలో టీమిండియా 427/6 వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. శుభ్మన్ గిల్ (162 బాల్స్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161) సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా (69 నాటౌట్), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) భారీ శతకాలతో చెలరేగారు. భారత బౌలర్లలో సిరాజ్ 6, ఆకాశ్దీప్ 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ (269) భారీ డబుల్ సెంచరీతో రికార్డులు తిరగరాశాడు. యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89) సెంచరీలకు చేరువలో ఔటయ్యారు.స్కోర్ వివరాలు..భారత్ 587 & 427/6 డిక్లేర్ఇంగ్లండ్ 407 & 153/6 (40.3) -
ENG Vs IND 2nd Test Day 5: గుడ్ న్యూస్.. ఆట మొదలైంది.. అయితే..!
ఎడ్జ్బాస్టన్ నుంచి టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్ తెలుస్తుంది. చివరి రోజు ఆట ప్రారంభానికి ముందు ఆటంకం కలిగించిన వరుణుడు ప్రస్తుతం శాంతించాడు. వర్షం పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో మైదానంలో కప్పి ఉంచిన కవర్లను తొలగించారు. ఔట్ ఫీల్డ్ను వేగంగా డ్రై చేశారు. సూర్యుడు మేఘాలను ముసుగు నుంచి బయటికి వచ్చాడు.అయితే ఓవర్ల కోత మాత్రం తప్పలేదు. ఇవాల్టి ఆటలో 90 కాకుండా 80 ఓవర్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. వర్షం కారణంగా 10 ఓవర్ల కోత పడింది. భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్.. దాదాపు 2 గంటలు ఆలస్యంగా భారతకాలమానం ప్రకారం సాయంత్రం 5:10 గంటలకు ప్రారంభమయ్యింది.సవరించిన సెషన్ టైమింగ్స్ను కూడా అంపైర్లు ప్రకటించారు. తొలి సెషన్ 5:10 నుంచి 7 గంటల వరకు.. రెండో సెషన్ 7:40 నుంచి 9:40 వరకు.. మూడో సెషన్ రాత్రి 10 గంటల నుంచి 11:30 గంటల వరకు జరుగనుంది.కాగా, ఈ మ్యాచ్లో భారత్ చారిత్రక గెలుపుకు 7 వికెట్ల దూరంలో ఉంది. ఇంగ్లండ్.. భారత్ నిర్దేశించిన 608 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది.నాలుగో రోజు ఆటలో టీమిండియా 427/6 వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. శుభ్మన్ గిల్ (162 బాల్స్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161) సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా (69 నాటౌట్), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు.మరోవైపు టీమిండియా ఎడ్జ్బాస్టన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ మ్యాచ్లో గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా ఆటగాళ్లు ఆరాటపడుతున్నారు.స్కోర్ వివరాలు..భారత్ 587 & 427/6 డిక్లేర్ఇంగ్లండ్ 407 & 72/3 (16) ప్రస్తుత రన్రేట్: 4.5 -
ENG VS IND 2n Test Day 5: టీమిండియాకు చేదు వార్త
ఇంగ్లండ్పై చారిత్రక గెలుపు సాధించేందుకు 7 వికెట్ల దూరంలో టీమిండియాకు చేదు వార్త. రెండో టెస్ట్ చివరి రోజు ఆట ప్రారంభానికి ముందు ఎడ్జ్బాస్టన్లో భారీ వర్షం కురుస్తుంది. స్టేడియం మొత్తాన్ని కవర్లతో కప్పేశారు. అక్కడ వాతావరణం రాత్రిని తలపిస్తుంది. ఫ్లడ్ లైట్లు ఆన్ చేశారు. భారతకాలమానం ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితిలో ఇది సాధ్యపడేలా లేదు. మరో గంట పాటు వర్షం ఇలాగే కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ నివేదించింది. అయితే మధ్యాహ్నం సమయంలో వర్షం ఉండకపోవచ్చని తెలుస్తుంది. వర్షం కారణంగా తొలి సెషన్ రద్దైతే టీమిండియాకు భారీ నష్టం సంభవిస్తుంది. మిగతా రెండు సెషన్లలో భారత బౌలర్లు ఏడు వికెట్లు తీయాల్సి ఉంటుంది. ఇది అంత ఈజీ కాదు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.HEAVY RAIN AT EDGBASTON...!!!! [Amit Shah from RevSportz] pic.twitter.com/zdrYfwj3ri— Johns. (@CricCrazyJohns) July 6, 2025కాగా, ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ భారత్ నిర్దేశించిన 608 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. భారత్ విజయానికి ఇంకా 7 వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్ గెలుపునకు 536 పరుగులు కావాలి.నాలుగో రోజు ఆటలో టీమిండియా 427/6 వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. శుభ్మన్ గిల్ (162 బాల్స్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161) సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా (69 నాటౌట్), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు.గిల్పై విమర్శలుటీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ సెకెండ్ ఇన్నింగ్స్ను లేట్గా డిక్లేర్ చేయడాన్ని చాలా మంది క్రికెట్ నిపుణులు తప్పుబడుతున్నారు. కాస్త ముందుగానే ఇంగ్లండ్కు బ్యాటింగ్ చేసే అవకాశాన్ని ఇచ్చి ఉంటే మరిన్ని వికెట్లు పడివుండేవని అభిప్రాయపడుతున్నారు.మరోవైపు టీమిండియా ఎడ్జ్బాస్టన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ మ్యాచ్లో గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా ఆటగాళ్లు ఆరాటపడుతున్నారు.స్కోర్ వివరాలు..భారత్ 587 & 427/6 డిక్లేర్ఇంగ్లండ్ 407 & 72/3 (16) ప్రస్తుత రన్రేట్: 4.5 -
అయ్యో జడేజా.. టైం అయిపోయిందంటూ..!
ప్రస్తుత టీమిండియా టెస్ట్ టీమ్లో అందరికంటే సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజా. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్ కావడంతో జట్టులో సీనియర్గా కొనసాగుతున్నాడు జడ్డూ. ఇంగ్లండ్తో జరుగుతున్న తాజా టెస్ట్ సిరీస్లో శుబ్మన్ గిల్ నాయకత్వంలోని జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు. రెండో టెస్టులో కీలకమైన ఇన్నింగ్స్ ఆడి.. జట్టు భారీ స్కోరు చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఆట రెండో రోజు 89 పరుగులు చేసి జట్టుకు తన విలువను మరోసారి గుర్తు చేశాడీ సీనియర్ ఆల్రౌండర్. కెప్టెన్ గిల్తో కలిసి కీలకమైన 203 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆరో వికెట్ అంతకంటే దిగువ స్థానాల్లో 200 పరుగులు భాగస్వామ్యాల్లో పాలుపంచుకోవడం జడేజాకు ఇది మూడోసారి.కాగా, ఇంగ్లండ్తో సెకండ్ టెస్ట్ మ్యాచ్లో రెండో రోజు ఆట ముగిసిన తర్వాత జడేజాకు మీడియా నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. కెప్టెన్సీపై ఇంకా ఆశలు ఉన్నాయా అని మీడియా ప్రతినిధి అడగ్గా.. చిరునవ్వుతో లేదన్నట్టుగా సమాధానం ఇచ్చాడు. 'వో టైమ్ గయా' (ఆ సమయం దాటిపోయింది) అని వ్యాఖ్యానించాడు.చాన్స్ లేదా?నిజంగానే అతడికి సమయం మించిపోయిందని క్రీడావ్యాఖ్యతలు అభిప్రాయపడుతున్నారు. జడేజా వయసు ఇప్పుడు 35 ఏళ్లు. ఇంకో రెండుమూడేళ్లు క్రికెట్ ఆడినా కూడా అతడికి కెప్టెన్ చాన్స్ రాదు. ఎందుకంటే జట్టు ప్రయోజనాలను గమనంలోకి తీసుకుని గిల్కు టెస్ట్ టీమ్ సారథ్య బాధ్యతలు కట్టబెట్టింది బీసీసీఐ. నాయకత్వ బాధ్యతను భుజానికెత్తుకోవడానికి బుమ్రా నిరాకరించడంతో గిల్కు చాన్స్ దక్కింది. బహుశా రోహిత్ శర్మ తప్పుకున్న తర్వాత వన్డే జట్టు పగ్గాలు కూడా శుబ్మన్కే దక్కుతాయి. ఈ నేపథ్యంలోనే తనకు ఇక చాన్స్ లేదని జడేజా వ్యాఖ్యానించి ఉంటాడని క్రీడావ్యాఖ్యతలు పేర్కొంటున్నారు.కలిసిరాని కెప్టెన్సీఅయితే దేశం తరపున జాతీయ జట్టుకు నాయకత్వం వహించే చాన్స్ రాకపోయినా.. మరోవిధంగా అతడికి కెప్టెన్సీ దక్కింది. సారథిగా తనకు వచ్చిన అవకాశాన్ని జడేజా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు 2022లో కెప్టెన్గా చాన్స్ దక్కించకున్నాడు. వరుస పరాజయాలతోనే మధ్యలోనే నాయకత్వం నుంచి వైదొలగడంతో మళ్లీ ధోనికే పగ్గాలు అప్పగించాల్సి వచ్చింది. ఆ రకంగా చూస్తే కెప్టెన్సీ జడ్డూకు కలిసిరాలేదనే చెప్పాలి.నంబర్ 1 ఆల్రౌండర్ఆల్రౌండర్గా జడేజా ఆటకు పేరు పెట్టలేం. బ్యాట్తోనే కాకుండా బంతితో కూడా తానేంటో నిరూపించుకున్నాడు. మెరుపు ఫీల్డింగ్తో జట్టు విజయాల్లో ఎన్నోసార్లు కీలకపాత్ర పోషించాడు. ఇప్పటికీ యంగ్ ప్లేయర్స్తో పోటీ పడుతూ మైదానంలో విన్యాసాలు చేస్తుంటాడు. చాలా సందర్భాల్లో జట్టును కష్టాల నుంచి గట్టెక్కించిన ఘనత అతడికి ఉంది. అందుకే ఐసీసీ టెస్ట్ ఆల్రౌండర్ల ర్యాంకుల్లో టాప్లో కొనసాగుతున్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన జడేజా.. డబ్ల్యూటీసీలో తొలి ప్లేయర్ గిల్ గురించి జడేజా.. ఆటగాడి నుంచి టెస్ట్ కెప్టెన్ వరకు గిల్ ఎదుగుదల గురించి మీడియా ప్రతినిధులు జడేజాను అడగ్గా.. శుబ్మన్ గిల్ (shubhman gills) ఎంత ఎదిగాడో మీరు చూడలేదా? అంటూ ఎదురు ప్రశ్నించాడు. డబుల్ సెంచరీ చేసిన గిల్ను ప్రశంసించాడు. సుదీర్ఘ భాగస్వామ్యం నెలకొల్పాలని తామిద్దం మాట్లాడుకున్నామని వెల్లడించాడు. -
ENG VS IND 2nd Test: చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీతో (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో 587 పరుగులకు ఆలౌటైంది (తొలి ఇన్నింగ్స్లో).భారత ఇన్నింగ్స్లో గిల్తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్తో (42) ఏడో వికెట్కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్కు ఆదిలోనే వరుస షాక్లు తగిలాయి. బుమ్రా స్థానంలో ఈ మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్దీప్ వరుస బంతుల్లో తొలి టెస్ట్ సెంచరీ హీరోలు బెన్ డకెట్, ఓలీ పోప్లను డకౌట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 13 పరుగలకే 2 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 25 పరుగుల వద్ద ఇంగ్లండ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సిరాజ్ బౌలింగ్లో కరుణ్ నాయర్ క్యాచ్ పట్టడంతో జాక్ క్రాలే (19) ఔటయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. రూట్ (18), బ్రూక్ (30) క్రీజ్లో ఉన్నారు.చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజాఈ మ్యాచ్లో గిల్తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాకు జీవం పోసిన జడేజా ఓ భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. 79 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అప్పటికే బౌలర్గా 132 వికెట్లు తీసిన జడ్డూ.. డబ్ల్యూటీసీలో 2000 పరుగులు, 100 వికెట్లు సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. డబ్ల్యూటీసీలో మొత్తం 41 మ్యాచ్లు ఆడిన జడేజా తాజా ఇన్నింగ్స్తో కలుపుకొని 39 సగటుతో 2010 పరుగులు చేశాడు.బౌలింగ్లో 25.92 సగటున 132 వికెట్లు తీశాడు.ఎడ్జ్బాస్టన్ అంటే చాలు పూనకాలు వస్తాయి..!రవీంద్ర జడేజాకు ఇంగ్లండ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానం అంటే చాలు పూనకాలు వస్తాయి. జడ్డూ ఇక్కడ ఆడిన రెండు మ్యాచ్ల్లో మరపురాని ఇన్నింగ్స్లు ఆడాడు. 2022 పర్యటనలో సెంచరీ (194 బంతుల్లో 104; 13 ఫోర్లు) చేసిన జడ్డూ.. ఈసారి కూడా సెంచరీ చేసినంత పని చేశాడు. నాడు రిషబ్ పంత్తో కలిసి 222 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జడేజా.. తాజాగా గిల్తో కలిసి 203 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. -
ENG VS IND 2nd Test Day 2: పట్టుబిగిస్తున్న భారత్
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి భారత్కు భారీ స్కోర్ అందించాడు. భారత ఇన్నింగ్స్లో గిల్తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్తో (42) ఏడో వికెట్కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు.వరుస షాక్లుఅనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. బుమ్రా స్థానంలో ఈ మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్దీప్ నిప్పులు చెరిగాడు. వరుస బంతుల్లో తొలి టెస్ట్లో సెంచరీలు చేసిన బెన్ డకెట్, ఓలీ పోప్లను డకౌట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 13 పరుగలకే 2 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.మరో ఎదురుదెబ్బ13 పరుగుల వద్ద వరుస బంతుల్లో ఇన్ ఫామ్ బ్యాటర్లు డకెట్, పోప్ వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 25 పరుగుల వద్ద జాక్ క్రాలే (19) ఔటయ్యాడు. సిరాజ్ బౌలింగ్లో కరుణ్ నాయర్ క్యాచ్ పట్టడంతో క్రాలే పెవిలియన్కు చేరాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. 20 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 77/3గా ఉంది. రూట్ (18), బ్రూక్ (30) క్రీజ్లో ఉన్నారు. -
ENG VS IND 2nd Test: గిల్ రికార్డు డబుల్ సెంచరీ.. టీమిండియా భారీ స్కోర్
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. రెండో రోజు టీ విరామం తర్వాత భారత తొలి ఇన్నింగ్స్ 587 పరుగుల వద్ద ముగిసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి భారత్కు ఈ స్థాయి స్కోర్ అందించాడు. ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి రోజు 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసిన భారత్.. ఇవాళ (రెండో రోజు) మరో 264 పరుగులు జోడించి మిగతా 5 వికెట్లు కోల్పోయింది. తొలి రోజే సెంచరీ పూర్తి చేసిన గిల్.. ఇవాళ డబుల్ సెంచరీ సాధించాడు.భారత ఇన్నింగ్స్లో గిల్తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్తో (42) ఏడో వికెట్కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు.కాగా, ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. లీడ్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్లో భారత్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. ఆ మ్యాచ్లో భారత తరఫున ఐదు శతకాలు నమోదైనా ప్రయోజనం లేకుండా పోయింది. తొలి ఇన్నింగ్స్లో జైస్వాల్ (101), గిల్ (147), పంత్ (134).. రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ (137), పంత్ (118) శతకాలు చేశారు. -
ENG VS IND 2nd Test: భారీ డబుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ భారీ డబుల్ సెంచరీతో (266) చెలరేగి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. రెండో రోజు లంచ్ తర్వాత గిల్ ఈ అరుదైన ఘనత సాధించాడు. గిల్కు టెస్ట్ల్లో ఇది తొలి డబుల్ సెంచరీ. ఈ మైలురాయిని గిల్ 311 బంతుల్లో చేరుకున్నాడు. ఈ డబుల్తో గిల్ పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు.ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్గా.. సేనా దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆసియా కెప్టెన్గా..ఇంగ్లండ్లో డబుల్ సెంచరీ సాధించిన మూడో భారత ఆటగాడిగా.. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక స్కోర్ చేసిన భారత ఆటగాడిగా.. టెస్ట్ల్లో డబుల్ సెంచరీ సాధించిన ఆరో భారత కెప్టెన్గా.. విదేశాల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత కెప్టెన్గా.. సేనా దేశాల్లో 250 పరుగుల మార్కు తాకిన తొలి భారత ఆటగాడిగా.. టెస్ట్ల్లో అత్యధిక స్కోర్ చేసిన భారత కెప్టెన్గా పలు రికార్డులు సాధించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. గిల్ రికార్డు డబుల్ సెంచరీతో చెలరేగడంతో భారత్ ఇప్పటికే భారీ స్కోర్ చేసేసింది. డబుల్ సెంచరీ తర్వాత కూడా గిల్ జోరు కొనసాగుతుంది. 266 పరుగుల వద్ద గిల్ బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా ఆకాశ్దీప్ (0) క్రీజ్లో ఉన్నాడు. టీ విరామం సమయానికి భారత్ స్కోర్ 565/7గా ఉంది.310/5 స్కోర్ వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్.. లంచ్ విరామానికి ముందు రవీంద్ర జడేజా (137 బంతుల్లో 89; 10 ఫోర్లు, సిక్సర్) వికెట్ కోల్పోయింది. 41 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన జడేజా గిల్తో అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చాడు. గిల్-జడేజా ఆరో వికెట్కు 203 పరుగులు జోడించారు. అనంతరం గిల్, వాషింగ్టన్ సుందర్తో (42) కలిసి ఏడో వికెట్కు 144 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి రోజు ఆటలో యశస్వి జైస్వాల్ (87), కేఎల్ రాహుల్ (2), కరుణ్ నాయర్ (31), రిషబ్ పంత్ (25), నితీశ్ కుమార్ రెడ్డి (1) వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్, జోష్ టంగ్ తలో వికెట్ పడగొట్టారు. -
ENG VS IND, 2nd Test: టీమిండియాను ఆదుకున్న కెప్టెన్ 'గిల్' సెంచరీ
ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ ఇవాళ (జులై 2) ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేయగా.. ఇంగ్లండ్ తొలి టెస్ట్లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది.భారత్ తరఫున బుమ్రా స్థానంలో ఆకాశ్దీప్.. సాయి సుదర్శన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్.. శార్దూల్ ఠాకూర్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 2 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.రాహుల్ తర్వాత బరిలోకి దిగిన కరుణ్ నాయర్ కూడా తక్కువ స్కోర్కే (31) ఔటయ్యాడు. కరుణ్ వికెట్ బ్రైడన్ కార్స్కు దక్కింది. ఈ మధ్యలో యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్కు టెస్ట్ల్లో ఇది 11వ అర్ద సెంచరీ. జైస్వాల్ తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే.రాహుల్, కరుణ్ వికెట్లు కోల్పోయాక జాగ్రత్తగా ఆడిన జైస్వాల్, శుభ్మన్ గిల్ మూడో వికెట్కు 66 పరుగులు జోడించారు. ఈ దశలో జైస్వాల్ (107 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 87 పరుగులు) ఓ అనవసర షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్లో కట్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా బంతి బాటమ్ ఎడ్జ్ తీసుకొని వికెట్కీపర్ జేమీ స్మిత్ చేతుల్లోకి వెళ్లింది.జైస్వాల్ ఔటయ్యాక శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ కొద్ది సేపు జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 47 పరుగులు జోడించాక రిషబ్ పంత్ (25) షోయబ్ బషీర్ బౌలింగ్లో ఔటయ్యాడు. జాక్ క్రాలే అద్బుతమైన క్యాచ్ పట్టడంతో పంత్ పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం క్రీజ్లోకి వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి (1) ఇలా వచ్చి అలా వెళ్లాడు. ఇతని వికెట్ వోక్స్కు దక్కింది. వోక్స్ బౌలింగ్లో నితీశ్ క్లీన్ బౌల్ట్ అయ్యాడు.211 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను గిల్, రవీంద్ర జడేజా గట్టెక్కించే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ఆరో వికెట్కు 99 పరుగులు జోడించి ఇన్నింగ్స్లను కొనసాగిస్తున్నారు. గిల్ 114, రవీంద్ర జడేజా 41 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. 85 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 310/5గా ఉంది. -
ENG VS IND 2nd Test Day 1: జైస్వాల్ సెంచరీ మిస్.. పోరాడుతున్న గిల్
ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ ఇవాళ (జులై 2) ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేయగా.. ఇంగ్లండ్ తొలి టెస్ట్లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. భారత్ తరఫున బుమ్రా స్థానంలో ఆకాశ్దీప్.. సాయి సుదర్శన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్.. శార్దూల్ ఠాకూర్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 2 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.రాహుల్ తర్వాత బరిలోకి దిగిన కరుణ్ నాయర్ కూడా తక్కువ స్కోర్కే (31) ఔటయ్యాడు. కరుణ్ వికెట్ బ్రైడన్ కార్స్కు దక్కింది. ఈ మధ్యలో యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్కు టెస్ట్ల్లో ఇది 11వ అర్ద సెంచరీ. జైస్వాల్ తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే.రాహుల్, కరుణ్ వికెట్లు కోల్పోయాక జాగ్రత్తగా ఆడిన జైస్వాల్, శుభ్మన్ గిల్ మూడో వికెట్కు 66 పరుగులు జోడించారు. ఈ దశలో జైస్వాల్ (107 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 87 పరుగులు) ఓ అనవసర షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్లో కట్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా బంతి బాటమ్ ఎడ్జ్ తీసుకొని వికెట్కీపర్ జేమీ స్మిత్ చేతుల్లోకి వెళ్లింది.జైస్వాల్ ఔటయ్యాక శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ కొద్ది సేపు జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 47 పరుగులు జోడించాక రిషబ్ పంత్ (25) షోయబ్ బషీర్ బౌలింగ్లో ఔటయ్యాడు. జాక్ క్రాలే అద్బుతమైన క్యాచ్ పట్టడంతో పంత్ పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం క్రీజ్లోకి వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి (1) ఇలా వచ్చి అలా వెళ్లాడు. ఇతని వికెట్ వోక్స్కు దక్కింది. వోక్స్ బౌలింగ్లో నితీశ్ క్లీన్ బౌల్ట్ అయ్యాడు.211 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను గిల్, రవీంద్ర జడేజా గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరు ఆరో వికెట్కు 59 పరుగులు జోడించి ఇన్నింగ్స్లను కొనసాగిస్తున్నారు. గిల్ 86, రవీంద్ర జడేజా 30 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. 76 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 270/5గా ఉంది. -
ENG VS IND 2nd Test: పాపం జైస్వాల్..!
ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ ఇవాళ (జులై 2) ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేయగా.. ఇంగ్లండ్ తొలి టెస్ట్లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. భారత్ తరఫున బుమ్రా స్థానంలో ఆకాశ్దీప్.. సాయి సుదర్శన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్.. శార్దూల్ ఠాకూర్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 2 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రాహుల్ తర్వాత బరిలోకి దిగిన కరుణ్ నాయర్ కూడా తక్కువ స్కోర్కే (31) ఔటయ్యాడు. ఈ వికెట్ బ్రైడన్ కార్స్కు దక్కింది. 11వ హాఫ్ సెంచరీఈ మధ్యలో యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్కు టెస్ట్ల్లో ఇది 11వ అర్ద సెంచరీ. జైస్వాల్ తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. రాహుల్, కరుణ్ వికెట్లు కోల్పోయాక జాగ్రత్తగా ఆడిన జైస్వాల్, శుభ్మన్ గిల్ మూడో వికెట్కు 66 పరుగులు జోడించాడు.పాపం జైస్వాల్ఈ దశలో జైస్వాల్ ఓ అనవసర షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్లో కట్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా బంతి బాటమ్ ఎడ్జ్ తీసుకొని వికెట్కీపర్ జేమీ స్మిత్ చేతుల్లోకి వెళ్లింది. వికెట్ తీసిన ఆనందంలో స్టోక్స్ సంబరాలు చేసుకోగా.. జైస్వాల్ క్రీజ్లో అలాగే ఉండిపోయాడు. ఈ ఇన్నింగ్స్లో జైస్వాల్ చాలా సార్లు కట్ షాట్లు ఆడే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. చివరికి అదే షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. జైస్వాల్ 107 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. జైస్వాల్ సెంచరీకి ముందు ఔట్ కావడంతో టీమిండియా అభిమానులు నిరాశపడ్డారు. పాపం జైస్వాల్ అంటూ సోషల్మీడియా వేదికగా సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.50 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 170/3గా ఉంది. శుభ్మన్ గిల్ 38, రిషబ్ పంత్ 6 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.కాగా, ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్లో భారత్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. -
‘అతడి డబుల్ సెంచరీ.. నా కెరీర్కు ముగింపు’
టీమిండియా ఓపెనర్గా శిఖర్ ధావన్ (Shikhar Dhawan) తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. రోహిత్ శర్మ (Rohit Sharma)తో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించిన ఈ లెఫ్టాండర్.. ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా వన్డేల్లో అత్యుత్తమంగా రాణించాడు. తన కెరీర్లో మొత్తంగా 167 వన్డేలు ఆడిన గబ్బర్ 6793 పరుగులు సాధించాడు.అయితే, నయా స్టార్లు శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్ (Ishan Kishan)ల రాకతో టీమిండియాలో ధావన్ స్థానం ప్రశ్నార్థకమైంది. ఈ ఇద్దరు ఓపెనర్లుగా పాతుకుపోవడంతో పాటు.. వీరికి తోడు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ కూడా రేసులోకి వచ్చారు. ఫలితంగా ధావన్ను సెలక్టర్లు పట్టించుకోవడమే మానేశారు.ఈ క్రమంలో 2022లో టీమిండియా తరఫున చివరగా ఆడిన శిఖర్ ధావన్.. రెండేళ్ల పాటు పునరాగమనం కోసం ఎదురుచూశాడు. కానీ యువ ఆటగాళ్ల జోరు ముందు నిలవలేక గతేడాది ఆగష్టులో అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడ్కోలు పలికాడు.అతడి డబుల్ సెంచరీ.. నా కెరీర్కు ముగింపుతాజాగా ఈ విషయాల గురించి శిఖర్ ధావన్ స్పందించాడు. బంగ్లాదేశ్ మీద ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ బాదినపుడే తన కెరీర్ ముగింపు దశకు వచ్చిందని భావించినట్లు తెలిపాడు. ఈ మేరకు.. ‘‘నేను చాలాసార్లు ఫిఫ్టీలు బాదాను. ఎన్నోసార్లు డెబ్బైలలో అవుటయ్యాను.వాటిని సెంచరీలుగా మలచడంలో విఫలమయ్యాను. ఎప్పుడైతే ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్తో వన్డేలో 200 పరుగులు చేశాడో.. అప్పుడే నా కెరీర్ ముగింపునకు వచ్చేసిందని నా మనసు చెప్పింది. నా అంతరాత్మ చెప్పినట్లే జరిగింది.ఆ సమయంలో నా స్నేహితులు, శ్రేయోభిలాషులు నా గురించి చాలా ఫీలయ్యారు. నేనెక్కడ బాధపడిపోతానో అని నన్ను కనిపెట్టుకుని ఉన్నారు. కానీ నేను మాత్రం జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టాను’’ అని హిందుస్తాన్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. కాగా డబుల్ సెంచరీ వీరుడు ఇషాన్ కిషన్ కూడా అనతికాలంలోనే క్రమశిక్షణా రాహిత్యం వల్ల జట్టులో చోటుతో పాటు.. సెంట్రల్ కాంట్రాక్టు కూడా కోల్పోవడం గమనార్హం. మరోవైపు.. గిల్ మాత్రం నిలకడైన ఆటతో టీమిండియా టెస్టు కెప్టెన్గా ఎదిగాడు.ఒక్కరూ మాట్లాడలేదుఇక జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత ఒక్కరు కూడా తనను మళ్లీ కాంటాక్టు చేయలేదని ఈ సందర్భంగా ధావన్ చెప్పుకొచ్చాడు. ‘‘జట్టులో చోటు కోల్పోవడం సాధారణ విసయమే. పద్నాలుగేళ్ల వయసు నుంచే మాకు ఇది అలవాటు అవుతుంది.అంతేకాదు ఎవరి బిజీలో వాళ్లుంటారు. పర్యటనల్లో బిజీబిజీగా గడుపుతూ ఉంటారు. అయితే, ద్రవిడ్ భాయ్ మాత్రం ఆ సమయంలో నాతో మాట్లాడాడు. ఆయన నాకు మెసేజ్ చేశారు’’ అని ధావన్ తెలిపాడు. కాగా శిఖర్ ధావన్ ప్రస్తుతం లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు. నేపాల్ ప్రీమియర్ లీగ్లో, లెజెండ్స్ లీగ్ క్రికెట్లోనూ అతడు భాగమవుతున్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్.. తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు -
మళ్లీ వేలానికి రిషబ్ పంత్
గత ఐపీఎల్ సీజన్ మెగా వేలంలో రూ. 27 కోట్ల ధర దక్కించుకొని, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన లక్నో సూపర్ జెయింట్స్ సారధి రిషబ్ పంత్ మరోసారి వేలం బరిలోకి దిగనున్నాడు. ఈసారి పంత్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. జులై 6, 7 తేదీల్లో న్యూఢిల్లీలో జరుగబోయే డీపీఎల్ వేలంలో పంత్ పేరు నమోదు చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. పంత్ డీపీఎల్ ఆడేందుకు గతంలో తన ఇష్టాన్ని వ్యక్తం చేశాడు. పంత్ డీపీఎల్ ఎంట్రీ విషయాన్ని డీడీసీఏకు (ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్) చెందిన ఓ కీలక అధికారి బహిర్గతం చేశాడు. పంత్తో పాటు ఐపీఎల్ 2025 సంచలనాలు ప్రియాంశ్ ఆర్య (పంజాబ్ కింగ్స్), దిగ్వేశ్ రాఠీ (లక్నో సూపర్ జెయింట్స్) కూడా డీపీఎల్ వేలంలో పాల్గొననున్నారు. ఈ ముగ్గురితో పాటు మరో ఏడుగురు ఐపీఎల్ స్టార్లు (ఇషాంత్ శర్మ, ఆయుష్ బదోని, హర్షిత్ రాణా, హిమ్మత్ సింగ్, సుయాష్ శర్మ, మయాంక్ యాదవ్, అనూజ్ రావత్) కూడా డీపీఎల్ 2025 వేలం బరిలో ఉండనున్నారు. ప్రియాంశ్ ఆర్య, దిగ్వేశ్ రాఠీ గత డీపీఎల్ సీజన్లో సంచలనాలు సృష్టించి ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరూ ఐపీఎల్లోనూ ఇరగదీసి తమకు గుర్తింపునిచ్చిన డీపీఎల్ బరిలో మళ్లీ నిలువనున్నారు.కొత్తగా రెండు ఫ్రాంచైజీలుగతేడాదే పురుడుపోసుకున్న డీపీఎల్ రాబోయే ఎడిషన్లో మరో రెండు కొత్త జట్లను పరిచయం చేస్తుంది. తొలి ఎడిషన్లో (2024) ఆరు జట్లతో జరిగిన డీపీఎల్ ఈసారి ఎనిమిది జట్లతో సాగనుంది. కొత్త జట్ల వివరాలను డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ ఇవాళ వెల్లండించారు. ఇందులో ఓ జట్టు పేరు ఔటర్ ఢిల్లీ కాగా.. మరో జట్టు పేరు న్యూఢిల్లీ. ఔటర్ ఢిల్లీని సవిత పెయింట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు రూ.10.6 కోట్లకు కొనుగోలు చేయగా.. న్యూఢిల్లీ ఫ్రాంచైజీని భీమా టోలింగ్ అండ్ ట్రాఫిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు క్రేయాన్ అడ్వర్టైజ్మెంట్ సంస్థలు రూ.9.2 కోట్లకు దక్కించుకున్నాయి.డీపీఎల్ తొలి ఎడిషన్లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్, ఈస్ట్ ఢిల్లీ రైడర్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, పురానీ దిల్లీ 6, సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్, వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్లు పాల్గొన్నాయి. గత ఎడిషన్లో ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్ను ఓడించి విజేతగా అవతరించింది. గత సీజన్లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్ ఊహలకందని విధంగా 20 ఓవర్లలో 308 పరుగులు చేసి ఔరా అనిపించింది. ఆ సీజన్లో ఇలాంటి ప్రదర్శనలు ఎన్నో నమోదయ్యాయి. గత సీజన్లో ప్రియాంశ్ ఆర్య రెండు సెంచరీలు నమోదు చేశాడు. ఆయుశ్ బదోని ఓసారి శతక్కొట్టాడు. గత సీజన్ సూపర్ సక్సెస్ కావడంతో ఈ సీజన్పై భారీ అంచనాలు ఉన్నాయి. డీపీఎల్ మహిళల విభాగంలోనూ జరుగుతుంది. -
ఇంగ్లండ్ గడ్డపై సెంచరీ చేసిన మరో టీమిండియా యువ సంచలనం
ప్రస్తుతం భారత క్రికెట్ మొత్తం ఇంగ్లండ్ చుట్టూ తిరుగుతుంది. పురుషులు, మహిళలు, దివ్యాంగులు.. ఇలా విభాగంతో సంబంధం లేకుండా భారత క్రికెటర్లంతా ఇంగ్లండ్లో పర్యటిస్తున్నారు. భారత పురుషుల సీనియర్ జట్టు ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుండగా.. భారత పురుషుల అండర్-19 జట్టు ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో ఐదు మ్యాచ్ల యూత్ వన్డే సిరీస్ ఆడుతుంది. భారత సీనియర్ మహిళల జట్టు కూడా ఇంగ్లండ్లోనే ఉంది. ఈ పర్యటనలో భారత జట్టు ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. పురుషులు, మహిళల జట్లే కాక, భారత పురుషుల దివ్యాంగ జట్టు కూడా ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ జట్టు ఇంగ్లండ్ దివ్యాంగ టీమ్తో ఏడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఇదే కాక చాలామంది భారత పురుష క్రికెటర్లు ఇంగ్లండ్లో కౌంటీ క్రికెట్ ఆడుతున్నారు. టీమిండియా యువ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, ఖలీల్ అహ్మద్ వేర్వేరు జట్ల తరఫున కౌంటీ ఛాంపియన్షిప్ ఆడుతున్నారు. వీరిలో తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ తమ కౌంటీ అరంగేట్రంలోనే సెంచరీలు చేసి అదరగొట్టగా.. మిగతా ఇద్దరు తమ తొలి మ్యాచ్లు ఆడాల్సి ఉంది.పైన పేర్కొన్న జట్లు, ఆటగాళ్లే కాక ప్రస్తుతం మరో భారత స్థానిక జట్టు కూడా ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ముంబై క్రికెట్ అసోసియేషన్ తమ ఎమర్జింగ్ జట్టును ఇంగ్లండ్కు పంపింది. ఈ జట్టు ప్రస్తుతం నాట్స్ సెకెండ్ 11తో మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్లో టీమిండియా యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ సెంచరీతో అదరగొట్టాడు. ముషీర్ 127 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. ముషీర్ సెంచరీ చేసిన విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్కు చెందిన ఓ అధికారి సోషల్మీడియాలో పోస్ట్ చేశాడు.HUNDRED FOR MUSHEER KHAN 🇮🇳- Mumbai Cricket Association has sent the Emerging players to UK and they are currently playing against Notts 2nd 11, A great work by MCA for Developing the young stars. pic.twitter.com/lFkqecQ37n— Johns. (@CricCrazyJohns) June 30, 2025ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న అన్ని భారత క్రికెట్ జట్లలో ఒక్క భారత సీనియర్ పురుషుల జట్టు మినహా అన్ని జట్లు సక్సెస్ చూశాయి. భారత సీనియర్ పురుషుల జట్టు ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్ట్లో ఓటమిపాలు కాగా.. అండర్-19 జట్టు తొలి వన్డేలో ఇంగ్లండ్ను మట్టికరిపించింది. మరోవైపు భారత సీనియర్ మహిళల జట్టు తొలి టీ20లో ఇంగ్లండ్ను చిత్తు చేయగా.. భారత పురుషుల దివ్యాంగుల జట్టు ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ను ఓడించింది.ప్రస్తుతం ఇంగ్లండ్లో పర్యటిస్తున్న భారత ఆటగాళ్లలో చాలామంది శతకాలు చేశారు. సీనియర్ పురుషుల జట్టులో జైస్వాల్, గిల్, రాహుల్, పంత్ (2).. సీనియర్ మహిళల జట్టులో స్మృతి మంధన.. కౌంటీల్లో తిలక్ వర్మ, ఇషాన్ కిషన్.. తాజాగా ముషీర్ ఖాన్ శతకాలతో హోరెత్తించారు. ముషీర్ ఖాన్ ఇటీవల ముగిసిన ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఈ సీజన్లో అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. ముషీర్ దేశవాలీ సీజన్లో అన్న సర్ఫరాజ్ ఖాన్తో పోటీపడి పరుగులు సాధిస్తున్నాడు. అన్నదమ్ములిద్దరూ ముంబై జట్టుకే ఆడతారు. సర్ఫరాజ్ ఇటీవల ఇంగ్లండ్ లయన్స్పై తృటిలో సెంచరీ చేజార్చుకుప్పటికీ.. టీమిండియా ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో మెరుపు సెంచరీ చేశాడు. అయినా అతనికి భారత జట్టు నుంచి పిలుపు రాలేదు. -
టీమిండియాతో రెండో టెస్ట్.. తుది జట్టును ప్రకటించిన ఇంగ్లండ్.. స్టార్ ఆటగాడికి నో ఛాన్స్
జులై 2వ తేదీ నుంచి బర్మింగ్హమ్ వేదికగా టీమిండియాతో జరుగబోయే రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ (జూన్ 30) ప్రకటించారు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ తొలి టెస్ట్లో ఆడిన జట్టునే యథాతథంగా కొనసాగించింది. రెండో టెస్ట్ కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్కు తుది జట్టులో చోటు దక్కలేదు. తొలి టెస్ట్లో రాణించిక పోయినా ఇంగ్లండ్ మేనేజ్మెంట్ క్రిస్ వోక్స్పై నమ్మకం ఉంచింది. అతనితో పాటు జోష్ టంగ్, బ్రైడన్ కార్స్ను కొనసాగించింది. నాలుగో పేసర్గా కెప్టెన్ బెన్ స్టోక్స్ వ్యవహరించనున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా షోయబ్ బషీర్ కొనసాగనున్నాడు. బ్యాటింగ్ విభాగంలో జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్,జో రూట్, హ్యారీ బ్రూక్ తమ యధా స్థానాల్లో బరిలోకి దిగనున్నారు. వికెట్కీపర్గా జేమీ స్మిత్ వ్యవహరించనున్నాడు.రెండో టెస్ట్ జులై 2న భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేక పరాజయంపాలైంది.ఛేదనలో బెన్ డకెట్ (149) సూపర్ సెంచరీ చేసి ఇంగ్లండ్ను గెలిపించాడు. జాక్ క్రాలే (65), జో రూట్ (53 నాటౌట్), బెన్ స్టోక్స్ (33), జేమీ స్మిత్ (44 నాటౌట్) తలో చేయి వేశారు. భారత బౌలర్లు సెకెండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ బ్యాటర్లను ఏమాత్రం కట్టడి చేయలేకపోయారు. ఇంగ్లండ్ బ్యాటర్లు భారత బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొని పరుగులు చేశారు. ప్రసిద్ద్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ తలో 2 వికెట్లు తీసినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అనుభవజ్ఞుడైన స్పిన్నర్ రవీంద్ర జడేజాది కూడా అదే పరిస్థితి.ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు రెండు ఇన్నింగ్స్ల్లో అద్బుతంగా ఆడారు. అయినా సెకెండ్ ఇన్నింగ్స్లో బౌలర్లు ప్రభావం చూపలేకపోవడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్లో భారత్ తరఫున ఐదు శతకాలు నమోదైన ప్రయోజనం లేకుండా పోయింది. తొలి ఇన్నింగ్స్లో జైస్వాల్ (101), గిల్ (147), పంత్ (134) సెంచరీలు చేశారు. రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ (137), పంత్ (118) శతకాలు చేశారు. ఇంగ్లండ్ తరఫున తొలి ఇన్నింగ్స్లో ఓలీ పోప్ (106) సెంచరీ చేయగా.. హ్యారీ బ్రూక్ (99) తృటిలో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో బుమ్రా 5 వికెట్ల ప్రదర్శన చేసినప్పటికీ ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది.టీమిండియాతో రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్ -
నిరాశపరిచిన ఆయుశ్ మాత్రే.. మరోసారి విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
14 ఏళ్ల భారత యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ గడ్డపై మరోసారి రెచ్చిపోయాడు. ఇంగ్లండ్ అండర్ 19 జట్టుతో ఇవాళ (జూన్ 30) జరుగుతున్న మ్యాచ్లో మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తొలి వన్డేలో 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసిస వైభవ్.. రెండో వన్డేలో 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేసి ఔటయ్యాడు. వైభవ్ వరుసగా రెండు మ్యాచ్ల్లో అర్హమైన హాఫ్ సెంచరీలను మిస్ చేసుకున్నాడు. మరోవైపు వైభవ్తో పాటు ఇన్నింగ్స్ను ప్రారంభించిన మరో ఐపీఎల్ సంచలన ఆయుశ్ మాత్రే ఈ మ్యాచ్లో నిరాశపరిచాడు. మాత్రే తానెదుర్కొన్న తొలి బంతికే డకౌటయ్యాడు (గోల్డెన్ డక్). మాత్రే వైభవ్ తరహాలో కాకపోయినా తొలి వన్డేలో పర్వాలేదనిపించాడు. ఆ మ్యాచ్లో అతను 30 బంతులు ఎదుర్కొని 4 ఫోర్ల సాయంతో 21 పరుగులు చేశాడు.రెండో వన్డే విషయానికొస్తే.. ఇంగ్లండ్ టాస్ గెలిచి భారత్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. అధికారికంగా తొలి బంతికే ఆయుశ్ మాత్రే (0) వికెట్ కోల్పోయిన భారత్.. ఆతర్వాత కుదురుకుంది. వైభవ్ సూర్యవంశీ (45), విహాన్ మల్హోత్రా (49), చవ్డా (22), అభిగ్యాన్ కుందు (32), రాహుల్ కుమార్ (47), కనిష్క్ చౌహాన్ (45) రాణించడంతో ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ చేసింది. అయితే చివరి వరుస ఆటగాళ్లు వెంటవెంటనే ఔట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ 49 ఓవర్లలో 290 పరుగుల వద్ద ముగిసింది (ఆలౌట్). ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రెంచ్ 4 వికెట్లు పడగొట్టగా.. జాక్ హోమ్, అలెక్స్ గ్రీన్ తలో 3 వికెట్లు తీశారు. కాగా, భారత అండర్-19 జట్టు 5 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్ల కోసం ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. నాటింగ్హమ్ వేదికగా ప్రస్తుతం రెండో వన్డే జరుగుతుండగా.. హోవ్లో జరిగిన తొలి వన్డేలో భారత్ ఇంగ్లండ్పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 42.2 ఓవర్లలో 174 పరుగులకే కుప్పకూలగా.. భారత్ కేవలం 24 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ పర్యటనలో భారత జట్టుకు ఆయుశ్ మాత్రే సారథ్యం వహిస్తున్నాడు. -
టీమిండియా చేతిలో దారుణ ఓటమి.. ఇంగ్లండ్ జట్టుకు మరో షాక్
నాటింగ్హమ్ వేదికగా నిన్న (జూన్ 28) జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్పై భారత మహిళల క్రికెట్ జట్టు 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్లో స్మృతి మంధన విధ్వంసకర శతకం (62 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 112 పరుగులు) సాధించి టీమిండియాను గెలిపించింది. ఈ సెంచరీతో మంధన మూడు ఫార్మాట్లలో శతకాలు చేసిన తొలి భారత మహిళా ప్లేయర్గా చరిత్ర సృష్టించింది. మంధన కేవలం 51 బంతుల్లోనే సెంచరీ మార్క్ను అందుకుంది. తద్వారా మహిళల టీ20ల్లో ఐదో ఫాస్టెస్ట్ సెంచరీని, భారత్ తరఫున రెండో ఫాస్టెస్ట్ సెంచరీని (హర్మన్-49 బంతుల్లో) నమోదు చేసింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. మంధన శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. అనంతరం 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. భారత బౌలర్ల ధాటికి కేవలం 113 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కడప అమ్మాయి శ్రీచరణీ నాలుగు వికెట్లతో సత్తాచాటింది. ఆమెతో పాటు దీప్తీ శర్మ, రాధా యాదవ్ తలో రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ సీవర్ బ్రంట్(66) టాప్ స్కోరర్గా నిలిచింది.ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్కు మరో షాక్ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్కు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు మ్యాచ్ ఫీజ్లో 10 శాతం జరిమానాగా విధించబడింది. నిర్ణీత సమయంలోగా ఇంగ్లండ్ రెండు ఓవర్లు వెనుకపడింది. ఓవర్కు 5 శాతం చొప్పున ఐసీసీ 10 శాతం మ్యాచ్ ఫీజ్ను జరిమానాగా విధించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఇది ఆర్టికల్ 2.22 నిబంధన ఉల్లంఘన కిందికి వస్తుంది. ఐసీసీ జరిమానాను ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ స్వీకరించింది. ఇంగ్లండ్ జట్టులోకి సభ్యులందరికీ ఈ జరిమానా వర్తిస్తుంది.కాగా, ఇంగ్లండ్ మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే అతి పెద్ద ఓటమి. టీ20ల్లో ఇంగ్లండ్పై 200 ప్లస్ స్కోర్ చేసిన రెండో జట్టుగా భారత్ రికార్డుల్లోకెక్కింది. రెండో టీ20 బ్రిస్టల్ వేదికగా జులై 1న జరుగనుంది. -
చారిత్రక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్
భారత దివ్యాంగుల క్రికెట్ జట్టు (మిక్స్డ్) చారిత్రక లార్డ్స్ మైదానంలో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టును 2 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ చివరి ఓవర్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. అంగస్ బ్రౌన్ (47 బంతుల్లో 77; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద శతకంతో చెలరేగాడు. భారత బౌలర్లలో వివేక్ కుమార్, కెప్టెన్ రవీంద్ర సంటే తలో వికెట్లు తీశారు.అనంతరం బరిలోకి దిగిన భారత్.. ఓపెనర్ రాజేశ్ ఇరప్పా కున్నూర్ (29), సాయి ఆకాశ్ (34 బంతుల్లో 44) సత్తా చాటడంతో 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో భారత్ ఏడు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. దీనికి ముందు జరిగిన రెండు మ్యాచ్ల్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. క్రికెట్ మక్కాగా పిలువబడే లార్డ్స్ మైదానంలో ఇది తొలి దివ్యాంగుల అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్. ఈ గెలుపును భారత దివ్యాంగుల జట్టు 1983 వరల్డ్కప్ గెలిచిన భారత జట్టుకు అంకితమిచ్చింది.ఈ మ్యాచ్ జూన్ 25న జరిగింది. 42 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు లార్డ్స్ మైదానంలో కపిల్ డెవిల్స్ వెస్టిండీస్ను చిత్తు చేసి తొలిసారి జగజ్జేతగా అవతరించింది. జూన్ 25ను వరల్డ్ మిక్స్డ్ డిజేబులిటీ డేగా (World Mixed Disability Day) జరుపుకున్నారు. -
IND VS ENG: బుమ్రాపై వర్క్ లోడ్.. ఒక్కడు ఎంతని చేయగలడు..?
ఇటీవలికాలంలో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ప్రస్తావన వచ్చే సరికి వర్క్ లోడ్ అన్న పదం వినిపిస్తుంది. చాలామందికి ఈ పదం చాలా సాధారణంగా అనిపించవచ్చు. క్రికెట్పై పెద్దగా అవగాహన లేని వారు.. ఈ ఇంత దానికే వర్క్ లోడ్ అంటే ఎలా అని అంటుంటారు. గతంలో చాలామంది పేసర్లు బుమ్రా కంటే ఎక్కువ మ్యాచ్లు ఆడి, లెక్కలేనన్ని ఓవర్లు వేశారని గుర్తు చేస్తుంటారు.అయితే అప్పటి క్రికెట్కు, ఇప్పటి క్రికెట్కు పోల్చుకోలేని వ్యత్యాసం ఉందన్న విషయం వారికి అర్దం కాదు. అప్పట్లో పేసర్లు టెస్ట్ మ్యాచ్లు, అప్పుడప్పుడు వన్డేలు ఆడేవారు. అది కూడా ఏడాదిలో కొంతకాలం మాత్రమే. అయితే పొట్టి క్రికెట్ ఆగమనంతో పరిస్థితి చాలా మారింది. ఏడాది పొడవునా ఏదో ఒక ఫార్మాట్లో మ్యాచ్లు జరుగుతుంటాయి. మధ్యలో ప్రైవేట్ లీగ్లు, ఖాళీగా ఉంటే దేశవాలీ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది.ఇలాంటి పరిస్థితుల్లో పేస్ బౌలర్లపై సహజంగానే పని భారం ఉంటుంది. శరీరం పెద్దగా సహకరించదు. ఒకవేళ ధైర్యం చేసి బరిలోకి దిగినా గాయాలు తప్పవు. గాయాల బారిన పడితే కొన్ని సందర్భాల్లో అర్దంతరంగా కెరీర్లే ముగిసిపోతాయి. కెరీర్ ముగిస్తే సదరు బౌలర్ జీవితం కూడా ముగిసినట్లే. ఇవన్నీ చూసుకొనే పేసర్లు ఆచితూచి మ్యాచ్లు ఆడుతుంటారు. సంబంధిత క్రికెట్ బోర్డులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే వారిని ఎంపిక చేస్తుంటారు. బుమ్రా సహా ప్రపంచ క్రికెట్లో పేసర్లందరి విషయంలోనూ ఇదే జరుగుతుంది. అయితే, గత ఏడాదిన్నర కాలంగా మిగతా పేసర్లతో పోలిస్తే బుమ్రాపై అదనపు పని భారం పడుతుంది. టెస్ట్ల్లో ప్రపంచ ప్రఖ్యాత పేసర్లు మిచెల్ స్టార్క్ (362), కగిసో రబాడ (298) వంటి వారు 2024 నుంచి గరిష్టంగా 362 ఓవర్లు వేస్తే, బుమ్రా ఏకంగా 410 ఓవర్లు వేశాడు. ఈ గణాంకాలు చేస్తే చాలు బుమ్రాపై ఎంత పని భారం పడుతుందో చెప్పడానికి.టీమిండియా బుమ్రాపై అతిగా ఆధారపడుతూ, అతనిచే సామర్థ్యానికి మించి బౌలింగ్ చేయిస్తుంది. ఇదే కొనసాగితే బుమ్రా ఎక్కువ కాలం క్రికెట్ ఆడే అవకాశం ఉండదు. వర్క్ లోడ్ ఎక్కువై గాయాల బారిన పడి, బుమ్రా కెరీర్ అర్దంతరంగా ముగిసే ప్రమాదం ఉంది. ఇది దృష్టిలో పెట్టుకొనే భారత మేనేజ్మెంట్ బుమ్రాను పరిమితంగా వినియోగించుకుంటుంది. ఇంగ్లండ్ టూర్లో కేవలం మూడు మ్యాచ్లే ఆడించాలని నిర్ణయించుకుంది.బుమ్రా గురించి ఆలోచిస్తే ఇది ఓకే. మరి టీమిండియా ప్రదర్శన మాటేంటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. గత కొంతకాలంగా టెస్ట్ల్లో బుమ్రా లేకపోతే టీమిండియా సున్నా అన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇది తెలిసి కూడా బీసీసీఐ బుమ్రాకు ప్రత్యామ్నాయాన్ని తయారు చేసుకోలేకపోతుంది. బుమ్రా ఒక్కడు ఎంత వరకు చేయగలడని మాజీలు చాలాకాలంగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. బుమ్రా రాణించకపోతే టీమిండియా పరిస్థితి ఏంటన్నది తాజాగా ముగిసిన లీడ్స్ టెస్ట్ సూచిస్తుంది. ఆ మ్యాచ్లో బుమ్రా తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసినా, రెండో ఇన్నింగ్స్లో ప్రభావం చూపలేకపోవడంతో టీమిండియా ఓటమిపాలైంది. ఇకనైనా భారత్ బుమ్రాపై అతిగా ఆధారపడకుండా, ప్రత్యామ్నాయాలను చూసుకోవాలి. -
ఇంగ్లండ్తో రెండో టెస్ట్.. టీమిండియాకు షాకింగ్ న్యూస్..!
ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్లో పర్యటిస్తున్న టీమిండియా జులై 2 నుంచి బర్మింగ్హమ్ వేదికగా రెండో టెస్ట్ ఆడుతుంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలినట్లు తెలుస్తుంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ నుంచి వైదొలిగాడని వార్తలు వినిపిస్తున్నాయి. వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా జట్టు యాజమాన్యమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.బుమ్రా తాజాగా ముగిసిన లీడ్స్ టెస్ట్లో 44 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఇది అతనిపై అదనపు భారం పడేలా చేసిందని మేనేజ్మెంట్ భావిస్తుంది. దీంతో అతనికి రెండో టెస్ట్లో విశ్రాంతినిచ్చి, తిరిగి మూడో టెస్ట్లో బరిలోకి దించే అవకాశం ఉంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే బుమ్రా అన్ని మ్యాచ్లు ఆడడని బీసీసీఐ పరోక్షంగా చెప్పింది. వర్క్ లోడ్ కారణంగా స్టార్ పేసర్ కేవలం మూడు మ్యాచ్లే ఆడతాడని బోర్డులోని కీలక సభ్యులంతా చెప్పారు.తొలి టెస్ట్కు, రెండో టెస్ట్కు మధ్య 8 రోజుల గ్యాప్ ఉండటంతో బుమ్రా రెండో టెస్ట్లో ఆడతాడని అంతా అనుకున్నారు. ఒకవేళ విశ్రాంతినిచ్చినా, చివరి మూడు టెస్ట్ల్లో ఉంటుందని అంచనా వేశారు. అయితే తొలి టెస్ట్లో పడిన అదనపు భారం కారణంగా బుమ్రా విషయంలో ప్రణాళికలు మారాయని తెలుస్తుంది. బుమ్రా విషయంలో బీసీసీఐ ఎలాంటి సాహసాలు చేసేందుకు సిద్దంగా ఉండదు. జులై 10 నుంచి లార్డ్స్లో జరిగే మూడో టెస్ట్కు బుమ్రా సిద్దంగా ఉండే అవకాశం ఉంది. 16 రోజుల గ్యాప్లో బుమ్రా పూర్తి సన్నద్దత సాధించవచ్చు.రెండో టెస్ట్లో బుమ్రా ఆడకపోతే సిరాజ్ భారత పేస్ విభాగానికి నాయకత్వం వహిస్తాడు. ఇప్పటికే తొలి టెస్ట్ కోల్పోయి సిరీస్లో వెనుకపడిన టీమిండియాకు ఇది అంత శుభపరిణాయం కాదు. తొలి టెస్ట్లో బుమ్రా మినహా పేసర్లంతా తేలిపోయారు. తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసిన బుమ్రా కూడా రెండో ఇన్నింగ్స్లో ప్రభావం చూపించలేకపోయాడు. రెండో టెస్ట్లో బుమ్రా ఆడినా, ఆడకపోయిన భారత బౌలింగ్ విభాగంలో భారీ మార్పులకు ఆస్కారం ఉంది.ఒకవేళ బుమ్రా ఆడకపోతే ఆకాశ్దీప్, అర్షదీప్ సింగ్లలో ఎవరో ఒకరికి అవకాశం దక్కుతుంది. బుమ్రా ఆడకుండా, తొలి టెస్ట్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ప్రసిద్ద్ కృష్ణపై కూడా వేటు పడితే ఆకాశ్దీప్, అర్షదీప్ సింగ్ ఇద్దరికీ తుది జట్టులో చోటు దక్కుతుంది. తొలి టెస్ట్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయిన శార్దూల్ ఠాకూర్పై కూడా వేటు పడే అవకాశం ఉంది. అతని స్థానంలో రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. బ్యాటింగ్ విభాగంలో భారత్ ఎలాంటి సాహసాలు చేయకపోవచ్చు.పూర్తి లైనప్ను యధాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. తొలి టెస్ట్లో సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ విఫలమైన వారికి మరో ఛాన్స్ తప్పక ఉంటుంది. టీమిండియా విషయాన్ని పక్కన పెడితే ఇంగ్లండ్ రెండో టెస్ట్ కోసం జట్టును ప్రకటించింది. ప్రమాదకర పేసర్ జోఫ్రా ఆర్చర్ నాలుగేళ్ల తర్వాత టెస్ట్ ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. -
టీమిండియా చెత్త రికార్డు.. జింబాబ్వే సరసన చోటు
ఇంగ్లండ్ చేతిలో తొలి టెస్ట్లో (హెడింగ్లే) ఓడిన టీమిండియా పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది. ఇందులో ప్రధానమైనవి రెండున్నాయి. మొదటిది.. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు ఐదు సెంచరీలు చేసినా టీమిండియా ఓటమిపాలవ్వడం. రెండోది.. టీమిండియా హ్యాట్రిక్ పరాజయాలు (టెస్ట్ల్లో) సహా చివరి 9 మ్యాచ్ల్లో ఒకే ఒక మ్యాచ్ గెలవడం. టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియాకు ముందు జింబాబ్వే మాత్రమే ఈ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఐర్లాండ్ లాంటి చిన్న జట్లు కూడా వారాడిన చివరి 9 మ్యాచ్ల్లో కనీసం రెండైనా గెలిచాయి. సౌతాఫ్రికా అయితే టెంబా బవుమా సారథ్యంలో చివరి 9 మ్యాచ్ల్లో ఏకంగా ఎనిమిదింట గెలిచింది.మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. జింబాబ్వే చివరి 9 మ్యాచ్ల్లో ఒకటే గెలిచినా, రెండు మ్యాచ్లు డ్రా అయినా చేసుకుంది. ఆరింట మాత్రమే ఓడింది. టీమిండియా అయితే ఒకటి గెలిచి, మరో మ్యాచ్ మాత్రమే డ్రా చేసుకొని, ఏకంగా ఏడింట ఓటమిపాలైంది. ఈ లెక్కన భారత్ను జింబాబ్వే సరసన అనడానికి కూడా వీళ్లేదు.డ్రా అయినా చేసుకోవాల్సింది..!తాజాగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్ను భారత్ కనీసం డ్రా అయినా చేసుకొని ఉండాల్సింది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాల్సిన పరిస్థితి నుంచి ఓటమిని కొని తెచ్చుకుంది. ఆటగాళ్ల స్వయంకృతాపరాధాలే భారత్ ఓటమికి కారణం. బౌలర్ల వైఫల్యం, ఫీల్డర్లు క్యాచ్లు జారవిడచడం టీమిండియా కొంపముంచాయి.ఈ మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. తొలి ఇన్నింగ్స్లో 471, రెండో ఇన్నింగ్స్లో 364 పరుగులు చేసినా టీమిండియాకు పరాభవం తప్పలేదు. భారత బౌలర్లు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయారు.ఛేదనలో బుమ్రా సహా భారత బౌలర్లంతా తేలిపోయారు. మ్యాచ్ మొత్తంలో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్లు నేలపాలు చేసింది. జైస్వాల్ ఒక్కడే నాలుగు క్యాచ్లు జారవిడిచాడు. భారీ లక్ష్య ఛేదనలో బెన్ డకెట్ అద్భుతమైన సెంచరీ చేసి ఇంగ్లండ్ను గెలిపించాడు. రెండో టెస్ట్ జులై 2 నుంచి బర్మింగ్హమ్ వేదికగా జరుగనుంది.టీమిండియా చివరిగా ఆడిన 9 టెస్ట్ల వివరాలు..ఇంగ్లండ్తో- ఓటమి (టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ 2025)ఆస్ట్రేలియాతో-ఓటమి (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25)ఆస్ట్రేలియాతో-ఓటమి (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25)ఆస్ట్రేలియాతో-డ్రా (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25)ఆస్ట్రేలియాతో-ఓటమి (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25)ఆస్ట్రేలియాతో-విజయం (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25)న్యూజిలాండ్తో-ఓటమి (స్వదేశంలో 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ 2024)న్యూజిలాండ్తో-ఓటమి (స్వదేశంలో 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ 2024)న్యూజిలాండ్తో-ఓటమి (స్వదేశంలో 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ 2024) -
రింకూ సింగ్కు ప్రభుత్వ ఉద్యోగం.. పోస్ట్ ఏమిటంటే?!
టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ (Rinku Singh) కొత్త ప్రయాణం ఆరంభించబోతున్నాడు. ఉత్తరప్రదేశ్ విద్యా శాఖ విభాగంలో అతడు ఉద్యోగం చేరనున్నాడు. అలీగఢ్కు చెందిన రింకూ సింగ్ పేద కుటుంబంలో జన్మించాడు.పేద కుటుంబంతన తండ్రి ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు వేస్తూ కుటుంబాన్ని పోషించగా.. ఆయన బాధ్యతల్లో భాగం పంచుకునేందుకు రింకూ చిరు ఉద్యోగాలు చేశాడు. ఒకానొక సమయంలో స్వీపర్గానూ పనిచేసేందుకు వెనకాడలేదని వార్తలు వచ్చాయి. అయితే, కష్టాల సుడిగుండంలో చిక్కుకుపోయినా.. క్రికెటర్గా ఎదగాలన్న రింకూ తన కలను సాకారం చేసుకునేందుకు అహర్నిషలు శ్రమించాడు.పట్టుదలతో టీమిండియా స్టార్గాదేశవాళీ క్రికెట్లో యూపీ తరఫున సత్తా చాటిన రింకూ సింగ్ దశ.. ఐపీఎల్తో మారిపోయింది. కోల్కతా నైట్ రైడర్స్ అతడిని కొనుగోలు చేసి.. ఆరంభంలో పక్కకుపెట్టినా.. ఆ తర్వాత వరుస అవకాశాలు ఇచ్చింది. ఈ క్రమంలో 2018లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. అద్భుత ఆట తీరుతో అలరించాడు.ఈ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్లు రింకూపై నమ్మకం ఉంచి 2023లో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టులో చోటిచ్చారు. అలా రింకూ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. రింకూ ఇప్పటికి భారత్ తరఫున 33 టీ20 మ్యాచ్లు ఆడి 546 పరుగులు, రెండు వన్డేల్లో కలిపి 55 పరుగులు సాధించాడు.రూ. 13 కోట్లకు రిటైన్ఇక ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు కోల్కతా ఫ్రాంఛైజీ రింకూను తమ మొదటి ప్రాధాన్య ఆటగాడిగా.. ఏకంగా రూ. 13 కోట్లకు రిటైన్ చేసుకుంది. క్యాష్ రిచ్ లీగ్లో ఇప్పటికి 58 మ్యాచ్లు పూర్తి చేసుకున్న రింకూ 1099 పరుగులు చేశాడు.స్కూల్డ్రాపౌట్? ఇలా క్రికెట్ రంగంలో సేవలు అందిస్తూ.. రాష్ట్రానికి పేరు తీసుకువస్తున్న రింకూను ఉద్యోగంతో సత్కరించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ మెడల్ విన్నర్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్-2022 పథకం ప్రకారం అతడిని జిల్లా ప్రాథమిక విద్యా అధికారి (BSA) నియమించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. స్థానిక మీడియా ఇందుకు సంబంధించిన కథనాలు ఇచ్చింది. కాగా ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. రింకూ తొమ్మిదో తరగతిలో చేరకముందే డ్రాపౌట్ అయినట్లు తెలుస్తోంది.ఎంపీతో నిశ్చితార్థంఇక వ్యక్తిగత జీవితంలోనూ రింకూ సింగ్ కొత్త ప్రయాణానికి సిద్ధమయ్యాడు. లోక్సభ ఎంపీ ప్రియా సరోజ్తో మూడేళ్ల ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకువచ్చాడు. ఈ ఏడాది జూన్ 8న ప్రియసఖి వేలికి ఉంగరం తొడిగి నిశ్చితార్థం చేసుకున్న రింకూ.. ఈ ఏడాది నవంబరులో లేదంటే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు.చదవండి: తప్పుడు వ్యక్తులతో స్నేహం.. అప్పుడు అతడు తప్పు ఎవరూ మాట్లాడలేదు: పృథ్వీ షా -
గౌతమ్ గంభీర్పై విమర్శల వర్షం
టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ గతేడాది టీ20 వరల్డ్కప్ తర్వాత (2024, జూన్) బాధ్యతలు చేపట్టాడు. రాహుల్ ద్రవిడ్ నుంచి గంభీర్ బాధ్యతలు స్వీకరించాడు. ద్రవిడ్ ఆథ్వర్యంలో భారత్ టీ20 వరల్డ్ ఛాంపియన్గా అవతరించింది. ద్రవిడ్ వారసుడిగా అప్పటికే కేకేఆర్కు ఐపీఎల్ టైటిల్ (మెంటార్) అందించిన గంభీర్ రావడంతో టీమిండియాపై అంచనాలు భారీగా పెరిగాయి. మూడు ఫార్మాట్లలో భారత్కు తిరుగుండదని అందరూ భావించారు.అయితే అంచనాలు తారుమారయ్యాయి. గంభీర్ ఆథ్వర్యంలో టీమిండియా టెస్ట్ల్లో దారుణంగా విఫలమవుతూ వస్తుంది. టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్ రెండు వరుస విజయాలతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. తొలి రెండు విజయాలు బంగ్లాదేశ్పై సాధించినవి కావడంతో వాటికి అంత ప్రాముఖ్యత దక్కలేదు.అయితే గంభీర్కు అసలు పరీక్ష మూడో టెస్ట్ నుంచి మొదలైంది. భారత్ స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో వరుసగా మూడు టెస్ట్ల్లో ఓడింది. ఇక్కడి నుంచే గంభీర్పై విమర్శలు ప్రారంభమయ్యాయి. అయితే ఆ తర్వాతి మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాను ఓడించడంతో గంభీర్ విజయ ప్రస్తానం మొదలైందని అంతా అనుకున్నారు. అయితే గంభీర్ విజయ పరంపర కేవలం ఆ ఒక్క మ్యాచ్కే పరిమితమైంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన రెండో టెస్ట్లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో పరాజయంపాలైంది. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో మూడో టెస్ట్ డ్రా కాగా.. నాలుగు, ఐదు మ్యాచ్ల్లో టీమిండియా వరుసగా పరాజయాలు చవిచూసింది.తాజాగా ఇంగ్లండ్ చేతిలో ఓటమితో భారత్ గంభీర్ ఆథ్వర్యంలో హ్యాట్రిక్ పరాజయాలను మూటగట్టుకుంది. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా ఉండగా.. భారత్ 11 టెస్ట్ మ్యాచ్ల్లో కేవలం మూడే విజయాలు సాధించింది. ఒకటి డ్రా చేసుకొని, ఏకంగా ఏడింట పరాజయాలు ఎదుర్కొంది. వరుస వైఫల్యాల నేపథ్యంలో గంభీర్పై విమర్శలు ధాటి బాగా పెరిగింది. ద్రవిడ్ హయాంలో వరుస విజయాలతో దూసుకుపోయిన టీమిండియా.. గంభీర్ వచ్చాక అదఃపాతాళానికి పడిపోయిందని భారత క్రికెట్ అభిమానులే అంటున్నారు. గంభీర్ వచ్చాక టీమిండియాలో రాజకీయాలు ఎక్కువయ్యాయని, అందుకే ఈ పరాజయాలు పరంపర అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.గంభీర్ తన తీరును మార్చుకోకపోతే టీమిండియా ఇంగ్లండ్లో వైట్వాష్ తప్పదని జోస్యం చెబుతున్నారు. గంభీర్ రాజకీయాలు మాని జట్టును గెలుపు బాట పట్టించడంపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. గంభీర్ ఇదే ధోరణిని కొనసాగిస్తే.. భారత్కు టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి పెద్ద పరాజయాలు పరంపర తప్పదని హెచ్చరిస్తున్నారు. 1967-68లో భారత్ వరుసగా ఏడు మ్యాచ్ల్లో పరాజయాలు ఎదుర్కొంది. ఇప్పటికే హ్యాట్రిక్ పరాజయాలు ఎదుర్కొన్న భారత్.. ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయితే ఆ రికార్డును సమం చేస్తుంది. ప్రస్తుతం టీమిండియా గంభీర్ ఆథ్వర్యంలో గత 9 మ్యాచ్ల్లో ఒకే విజయం సాధించి, మరో అపవాదును మూటగట్టుకుంది. -
England Tour: యువ ఆటగాడిని వెనక్కి పిలిచిన బీసీసీఐ
ఇంగ్లండ్ పర్యటన కోసం టీమిండియా బ్యాకప్ పేసర్గా ఎంపికైన హర్షిత్ రాణాను బీసీసీఐ వెనక్కు పిలిచినట్లు తెలుస్తుంది. హర్షిత్ను వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని బీసీసీఐ ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు భారత మేనేజ్మెంట్ రెండో టెస్ట్ మ్యాచ్కు ముందు హర్షిత్ను రిలీజ్ చేసినట్లు తెలుస్తుంది. రెండో టెస్ట్ కోసం బర్మింగ్హమ్కు పయనమైన భారత జట్టుతో పాటు హర్షిత్ లేడని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. వాస్తవానికి హర్షిత్ ఇంగ్లండ్ పర్యటన కోసం తొలుత ప్రకటించిన భారత జట్టులో లేడు. సుదీర్ఘంగా సాగే పర్యటన కావడంతో పేస్ బౌలర్లు గాయపడే అవకాశం ఉందని హెడ్ కోచ్ గంభీర్ ముందు జాగ్రత్త చర్యగా హర్షిత్ పేరును సిఫార్సు చేశాడు. దీంతో తొలి టెస్ట్ ప్రారంభానికి ముందు హర్షిత్ హుటాహుటిన ఇంగ్లండ్కు పయనమయ్యాడు. అయితే తాజా పరిస్థితుల ప్రకారం బ్యాకప్ పేసర్ అవసరం లేదని భారత మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. జట్టులోని పేసర్లంతా ఫిట్గా ఉన్నారని సమాచారం. అందుకే మేనేజ్మెంట్ హర్షిత్ను బీసీసీఐకి సరెండర్ చేసినట్లు తెలుస్తుంది.గంభీర్పై విమర్శలుఇంగ్లండ్ పర్యటన కోసం హర్షిత్ను టీమిండియా బ్యాకప్ పేసర్ ఎంపిక చేసిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై విమర్శలు వచ్చాయి. హర్షిత్ విషయంలో గంభీర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడని విశ్లేషకులు బహిరంగ కామెంట్లు చేశారు. గంభీర్ కేకేఆర్ కోచ్గా ఉన్నప్పుడు హర్షిత్ను దగ్గరగా చూశాడు. అదే పరిచయంతో గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అయ్యాక హర్షిత్ పేరును సెలెక్టర్లకు కూడా సిఫార్సు చేసినట్లు టాక్ వినిపించింది. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అయ్యాకే హర్షిత్ మూడు ఫార్మాట్లలో భారత్ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. హర్షిత్లో గుర్తించదగ్గ ప్రత్యేకతలేమీ లేనప్పటికీ.. టీమిండియా తరఫున సులువుగా అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. తాజాగా ఇంగ్లండ్ పర్యటనకు హర్షిత్ను బ్యాకప్ పేసర్గా ఎంపిక చేయడంతో విమర్శల శృతి మించిందని గంభీరే స్వయంగా హర్షిత్ను బీసీసీఐ సరెండర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.కాగా, బ్యాకప్ పేసర్తో పాటు పేస్ బౌలింగ్ బలం సంపూర్ణంగా ఉన్నా భారత్ తొలి టెస్ట్లో ఇంగ్లండ్ చేతిలో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్లో భారత ఓటమికి బౌలింగ్ విభాగం కూడా ఒకానొక కారణం. తొలి ఇన్నింగ్స్లో బుమ్రా పుణ్యమా అని (5 వికెట్ల ప్రదర్శన) ఇంగ్లండ్ను ఆలౌట్ చేసిన భారత్.. రెండో ఇన్నింగ్స్లో దారుణంగా విఫలమైంది. బుమ్రా సహా బౌలింగ్ విభాగమంతా తేలిపోయింది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్కు పగ్గాలేయడం ఎవరి వల్ల కాలేదు. బుమ్రా సైతం చేతులెత్తేశాడు. ఫలితంగా భారత్ 371 పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేక పరాజయంపాలైంది. -
అన్ లక్కీ పంత్.. ప్రతిసారి ఇంతే..!
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ క్రికెట్ చరిత్రలో మోస్ట్ అన్ లక్కీ బ్యాటర్గా మారిపోతున్నాడు. ఫార్మాట్ ఏదైనా ఇతగాడు సెంచరీ చేశాడంటే అతని జట్టు గెలవడం లేదు. తాజాగా భారత్, ఇంగ్లండ్ మధ్య లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ ఇందుకు ఉదాహరణ. ఈ మ్యాచ్లో పంత్ రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసినా ఇండియా గెలవలేదు. దీనికి ముందు ఐపీఎల్-2025లోనూ ఇలాగే జరిగింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో పంత్ అద్బుత సెంచరీ చేసినా, ఆ మ్యాచ్లోనూ అతని జట్టు (లక్నో) గెలవలేదు.టెస్ట్ క్రికెట్లో, ప్రత్యేకించి విదేశాల్లో పంత్ సెంచరీల బ్యాడ్ లక్ ఇప్పుడు మొదలైంది కాదు. 2018 నుంచి పంత్ విదేశాల్లో 6 టెస్ట్ సెంచరీలు చేయగా.. ఇందులో టీమిండియా ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేదు. 2018లో పంత్ తన తొలి విదేశీ టెస్ట్ సెంచరీని (114) కెన్నింగ్స్టన్ ఓవల్ మైదానంలో ఇంగ్లండ్పై చేశాడు. ఆ మ్యాచ్లో టీమిండియా దారుణంగా ఓడింది. విదేశాల్లో పంత్ రెండో టెస్ట్ సెంచరీని (159 నాటౌట్) 2019లో సిడ్నీ గ్రౌండ్లో ఆస్ట్రేలియాపై చేశాడు. ఆ మ్యాచ్లో టీమిండియా అదృష్టవశాత్తు డ్రాతో గట్టెక్కింది.విదేశాల్లో పంత్ మూడో టెస్ట్ సెంచరీని (100 నాటౌట్) 2022లో న్యూలాండ్స్లో సౌతాఫ్రికాపై చేశాడు. ఆ మ్యాచ్లో కూడా టీమిండియాకు పరాజయమే ఎదురైంది. విదేశాల్లో పంత్ నాలుగో టెస్ట్ సెంచరీ (146) అదే ఏడాది ఇంగ్లండ్పై (ఎడ్జ్బాస్టన్) చేశాడు. ఆ మ్యాచ్లోనూ టీమిండియాకు పరాభవం తప్పలేదు. తాజాగా హెడింగ్లే టెస్ట్లో పంత్ ఇంగ్లండ్పై రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు (134 & 118) చేసినా టీమిండియా గెలవలేకపోయింది. ఈ మ్యాచ్లో భారత్ తరఫున ఐదు సెంచరీలు (పంత్-2, జైస్వాల్, గిల్, రాహుల్) నమోదైనా గెలుపు దక్కకపోవడం శోచనీయం.ఇదిలా ఉంటే, హెడింగ్లేలో నిన్న ముగిసిన తొలి టెస్ట్లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 471, రెండో ఇన్నింగ్స్లో 364 పరుగులు చేసినా టీమిండియాకు పరాభవం తప్పలేదు. భారత బౌలర్లు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయారు. ఛేదనలో బుమ్రా సహా భారత బౌలర్లంతా తేలిపోయారు. ఈ మ్యాచ్లో క్యాచ్లు కూడా టీమిండియా కొంపముంచాయి. భారత జట్టు మ్యాచ్ మొత్తంలో ఏడు క్యాచ్లు నేలపాలు చేసింది. ఒక్క జైస్వాల్ ఒక్కడే నాలుగు క్యాచ్లు జారవిడిచాడు. భారీ లక్ష్య ఛేదనలో బెన్ డకెట్ అద్భుతమైన సెంచరీ చేసి ఇంగ్లండ్ను గెలిపించాడు. రెండో టెస్ట్ జులై 2 నుంచి బర్మింగ్హమ్ వేదికగా జరుగనుంది. -
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. 'ఆ ఘనత' సాధించిన తొలి మొనగాడు
టీమిండియా వికెట్కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో 800 రేటింగ్ పాయింట్లు సాధించిన తొలి భారత వికెట్కీపర్ బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ వికెట్కీపర్ బ్యాటర్ 800 రేటింగ్ పాయింట్లు సాధించలేదు. టీమిండియా దిగ్గజ వికెట్కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనికి కూడా ఇది సాధ్యపడలేదు.ఐసీసీ తాజాగా (జూన్ 25) విడుదల చేసిన ర్యాంకింగ్స్లో పంత్ 800 రేటింగ్ పాయింట్ల మార్కును (801) తాకాడు. అలాగే ర్యాంకింగ్స్లో ఓ స్థానం మెరుగపర్చుకొని ఏడో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతమున్న వికెట్కీపర్లలో పంత్దే అత్యుత్తమ ర్యాంకింగ్. ఇంగ్లండ్తో నిన్న (జూన్ 24) ముగిసిన తొలి టెస్ట్లో రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేయడంతో పంత్ ఈ ఘనతలను సాధించాడు.తాజా ర్యాంకింగ్స్లో టాప్-10లో పంత్తో పాటు మరో భారత బ్యాటర్ కూడా ఉన్నాడు. ఇంగ్లండ్తో తొలి టెస్ట్లో (తొలి ఇన్నింగ్స్లో) సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో, టీమిండియా నయా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఐదు స్థానాలు మెరుగుపర్చుకొని 20వ స్థానానికి చేరాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో అద్బుతమైన సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ ఏకంగా 10 స్థానాలు మెరుగుపర్చుకొని 38వ స్థానానికి ఎగబాకాడు.ఈ వారం ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ గణనీయంగా లబ్ది పొందాడు. భారత్పై అద్భుతమైన సెంచరీ (149) చేసినందుకు గానూ ఐదు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లలో జో రూట్, హ్యారీ బ్రూక్ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. ఓలీ పోప్ 3 స్థానాలు మెరుగుపర్చుకొని 19వ స్థానానికి ఎగబాకాడు. కేన్ విలియమ్సన్ 3, స్టీవ్ స్మిత్ 5, టెంబా బవుమా 6, కమిందు మెండిస్ 9, సౌద్ షకీల్ 10 స్థానాల్లో ఉన్నారు.మిగతా బ్యాటర్ల విషయానికొస్తే.. ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్లో రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసిన బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ షాంటో ఏకంగా 21 స్థానాలు మెరుగుపర్చుకొని 29వ స్థానానికి చేరగా.. అదే మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన మరో బంగ్లాదేశీ ముష్ఫికర్ రహీం 11 స్థానాలు మెరుగుపర్చుకొని 28వ స్థానానికి ఎగబాకాడు. అదే మ్యాచ్లో భారీ సెంచరీ చేసిన శ్రీలంక ఆటగాడు పథుమ్ నిస్సంక కూడా 21 స్థానాలు మెరుగుపర్చుకొని 31వ స్థానానికి ఎగబాకాడు. ఈ వారం బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఇవే చెప్పుకోదగ్గ మార్పులు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టాప్-10 పెద్దగా మార్పులేమీ లేవు. బుమ్రా, రబాడ, కమిన్స్, నౌమన్ అలీ, హాజిల్వుడ్, నాథన్ లియోన్, జన్సెన్, మ్యాట్ హెన్రీ టాప్-8లో కొనసాగుతున్నారు. మిచెల్ స్టార్క్ ఓ స్థానం ఎగబాకి తొమ్మిదో స్థానానికి చేరాడు. భారత్తో తాజాగా జరిగిన టెస్ట్లో రాణించిన బ్రైడన్ కార్స్ 8 స్థానాలు, జోష్ టంగ్ 16 స్థానాలు మెరుగుపర్చుకొని 32, 64 స్థానాలకు ఎగబాకారు. ఇంగ్లండ్తో తొలి టెస్ట్లో పర్వాలేదనిపించిన భారత పేసర్ ప్రసిద్ద్ కృష్ణ 21 స్థానాలు మెరుగుపర్చుకొని 72వ ప్లేస్కు చేరాడు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో రవీంద్ర జడేజా, మెహిది హసన్ మిరాజ్, జన్సెన్ టాప్-3లో కొనసాగుతున్నారు. -
మా అన్నను ఆడించేందుకు.. నాపై వేటు వేశారు: భారత మాజీ క్రికెటర్
సీకే నాయుడు- సీఎస్ నాయుడు, క్రిపాల్ సింగ్- ఏజీ మిల్కా సింగ్, సుభాష్- బాలూ గుప్తే, అమర్ సింగ్- లధా రామ్జీ, మాధవ్- అరవింద్ ఆప్టే, మోహిందర్- సురీందర్ అమర్నాథ్, వజీర్ అలీ- నజీర్ అలీ, టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన అన్నదమ్ముల జోడీలు ఇవి.ప్రస్తుతం ఆక్టివ్గా ఉన్న హార్దిక్ పాండ్యా- కృనాల్ పాండ్యా (Hardik Pandya- Krunal Pandya)లతో పాటు మాజీ ఆటగాళ్లు పఠాన్ బ్రదర్స్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అన్న యూసఫ్ పఠాన్ (Yousuf Pathan) బ్యాటింగ్ ఆల్రౌండర్ అయితే.. తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) బౌలింగ్ ఆల్రౌండర్. అన్న కంటే ముందు తమ్ముడే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అయితే, ఎవరికి వారు తమదైన శైలిలో దూసుకుపోయి గుర్తింపు సాధించారు.ఇక వీరిద్దరు మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన, 2011 వన్డే వరల్డ్కప్ గెలిచిన భారత జట్టులో సభ్యులు కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే.. ఒకానొక సందర్భంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో అన్న యూసఫ్ సేవలు వినియోగించుకునే క్రమంలో టీమిండియా యాజమాన్యం తమ్ముడు ఇర్ఫాన్ను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టిందట.కోచ్ నాతో ఇదే అన్నాడుఈ విషయాన్ని ఇర్ఫాన్ పఠాన్ తాజాగా వెల్లడించాడు. శ్రీలంక పర్యటనలో భాగంగా తాను అద్భుత ప్రదర్శన కనబరిచినా.. తదుపరి న్యూజిలాండ్ టూర్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశాన్ని మేనేజ్మెంట్ ఇవ్వలేదని తెలిపాడు. యూసఫ్ కోసం తనను తప్పించామని నాటి కోచ్ గ్యారీ కిర్స్టన్ స్వయంగా తనతో అన్నట్లు తెలిపాడు.మా అన్నను ఆడించేందుకు.. నాపై వేటు వేశారుఈ మేరకు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ షోలో మాట్లాడుతూ.. ‘‘టీమిండియాలో నా స్థానాన్ని నా సోదరుడు తీసుకున్నాడు. 2009లో శ్రీలంకతో మ్యాచ్లో మేమిద్దరం కలిసి ఆడి.. గెలిచాం. రెండు మ్యాచ్లలో కలిపి నేను నాలుగు వికెట్లు తీశాను.జట్టులో నా చోటు పదిలమైందని అనుకున్నాను. కానీ న్యూజిలాండ్తో నాకు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత జట్టు నుంచి తప్పించారు.అప్పుడు గ్యారీ కిర్స్టన్.. ‘సారీ.. నీకు జట్టులో చోటు లేదు.. ఎందుకంటే.. ఏడో స్థానంలో ఆడేందుకు మేము మీ సోదరుడి పేరును పరగణనలోకి తీసుకున్నాం’ అని చెప్పాడు’’’ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. జట్టు కూర్పు కోసం ఎవరిపై ఎప్పుడు ఎందుకు వేటు వేస్తారో తెలియని పరిస్థితి ఉంటుందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్- టీమిండియా మధ్య టెస్టు సిరీస్ నేపథ్యంలో చర్చ సందర్భంగా ఇర్ఫాన్ ఈ విషయాన్ని వెల్లండించాడు.బ్రదర్స్ అదుర్స్కాగా గుజరాత్కు చెందిన 40 ఏళ్ల ఇర్ఫాన్ పఠాన్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్. 2003- 2012 వరకు టీమిండియాకు ఆడిన ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్.. 29 టెస్టుల్లో 100, 120 వన్డేల్లో 173, 24 టీ20 మ్యాచ్లలో 28 వికెట్లు కూల్చాడు.అదే విధంగా.. ఎడమచేతి వాటం గల ఇర్ఫాన్ పఠాన్ టెస్టుల్లో 1105, వన్డేల్లో 1544, టీ20లలో 127 పరుగులు సాధించాడు. మరోవైపు.. 42 ఏళ్ల యూసఫ్ పఠాన్ 2007- 2012 మధ్య కాలంలో 57 వన్డేల్లో 810, 22 టీ20లలో 236 పరుగులు చేశాడు. ఈ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ ఖాతాలో 33 వన్డే వికెట్లు, 13 టీ20 వికెట్లు ఉన్నాయి.చదవండి: ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్𝘒𝘢𝘩𝘢𝘯𝘪 𝘣𝘩𝘢𝘪𝘺𝘰 𝘬𝘪...𝘗𝘢𝘵𝘩𝘢𝘯 𝘬𝘪 𝘻𝘶𝘣𝘢𝘯𝘪! 😊#SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings | @IrfanPathan @rpsingh @Vimalwa pic.twitter.com/AkdeeMzz67— Sony Sports Network (@SonySportsNetwk) June 24, 2025 -
IND VS ENG 1st Test Day 5: రసవత్తరంగా సాగుతున్న మ్యాచ్
లీడ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. చివరి రోజు ఆటలో (371 పరుగుల లక్ష్య ఛేదనలో) తొలి రెండు సెషన్లలో (253/2) ఆధిపత్యం చలాయించిన ఇంగ్లండ్.. రెండో సెషన్ చివరి దశలో అనూహ్యంగా రెండు వికెట్లు కోల్పోయి డిఫెన్స్లో పడింది. లక్ష్యానికి 118 పరుగుల దూరంలో ఉన్న సమయంలో శార్దూల్ వరుస బంతుల్లో సెట్ బ్యాటర్ బెన్ డకెట్ (149), ఇన్ ఫామ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ను (0) ఔట్ చేసి ఇంగ్లండ్ను దెబ్బ కొట్టాడు.భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటల 52 నిమిషాల సమయంలో వర్షం మరోసారి మొదలుకావడంతో టీ బ్రేక్ను ముందుగానే ప్రకటించారు. టీ విరామం సమయానికి ఇంగ్లండ్ లక్ష్యానికి 102 పరుగుల దూరంలో ఉంది. రెండో ఇన్నింగ్స్లో ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. క్రీజ్లో జో రూట్ (14), బెన్ స్టోక్స్ (13) ఉన్నారు. ఒకవేళ టీ విరామం తర్వాత వర్షం తగ్గి మ్యాచ్ యధావిధిగా సాగితే ఇరు జట్లకు సమానమైన విజయావకాశాలు ఉన్నాయి. భారత్ గెలవాలంటే మరో 6 వికెట్లు తీయాలి.ఓవర్నైట్ స్కోర్ 21/0 వద్ద చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. డకెట్, జాక్ క్రాలే (65) మొండి పట్టుదలతో ఆడటంతో సునాయాసంగా విజయం సాధించేలా కనిపించింది. డకెట్, క్రాలే తొలి వికెట్కు 188 పరుగులు రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లండ్ గెలుపుకు బలమైన పునాది వేశారు. ఈ దశలో ప్రసిద్ద్ కృష్ణ క్రాలే, పోప్ను (8) స్వల్ప వ్యవధిలో ఔట్ చేసి భారత్ను తిరిగి మ్యాచ్లోకి తెచ్చాడు. అయితే సెంచరీ పూర్తి చేసిన తర్వాత మరింత రెచ్చిపోయిన డకెట్ వేగంగా పరుగులు సాధిస్తూ లక్ష్యాన్ని చిన్నదిగా చేశాడు. ఈ దశలో శార్దూల్ వరుస బంతుల్లో డకెట్, బ్రూక్ను ఔట్ చేసి భారత శిబిరంలో ఆశలు రేకెత్తించాడు.ఇవాల్టి ఆటలో తొలి సెషన్ వరకు ఎలాంటి ఆటంకం కలిగించని వర్షం.. రెండో సెషన్లో ఓ సారి, టీకి ముందు మరోసారి పలకరించింది.స్కోర్ వివరాలు.. భారత్: 471 (జైస్వాల్ 101, గిల్ 147, పంత్ 134) & 364 (రాహుల్ 137, పంత్ 118)ఇంగ్లండ్: 465 (పోప్ 106, బ్రూక్ 99) & 269/4 (డకెట్ 149, క్రాలే 65) -
రూ. 27 కోట్ల విలువ చేసే లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేసిన శివమ్ దూబే
టీమిండియా విధ్వంసకర ఆటగాడు శివమ్ దూబే ముంబైలోని అంధేరి వెస్ట్ ప్రాంతంలోని ఓషివరాలో రెండు లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేశాడు. స్క్వేర్యార్డ్స్ సమీక్షించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. ఈ అపార్ట్మెంట్ల ధర రూ. 27.50 కోట్లని తెలుస్తుంది. ఈ రెండు అపార్ట్మెంట్లు DLH ఎన్క్లేవ్ అనే నివాస ప్రాజెక్ట్లోని 17 మరియు 18వ అంతస్తులలో ఉన్నాయి. వీటి మొత్తం వైశాల్యం 9,603 చదరపు అడుగులు (నివాస ప్రాంతం 4,200, బాల్కనీ 3,800 చదరపు అడుగులు).అపార్ట్మెంట్లతో పాటు మూడు పార్కింగ్ స్థలాలను దూబే దేవ్ ల్యాండ్ అండ్ హౌసింగ్ లిమిటెడ్ నుండి కొనుగోలు చేశాడు. ఈ లావాదేవీ జూన్ 20, 2025న నమోదు చేయబడింది. దీనికి మొత్తం రూ. 1.65 కోట్ల స్టాంప్ డ్యూటీ మరియు రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించబడ్డాయి. DLH ఎన్క్లేవ్లో ఇదివరకే పలువురు సెలబ్రిటీలు ఉన్నారు. బాలీవుడ్ హాస్యనటుడు కపిల్ శర్మ, గాయకుడు మికా సింగ్, దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుటుంబం ఇక్కడే నివాసముంటుంది.31 ఏళ్ల శివం దూబే (లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్) భారత టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉండటంతో పాటు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తాడు. దేశీయ క్రికెట్లో అతను ముంబైకి ఆడతాడు. 2019 నవంబర్లో టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన దూబే.. 2024 టీ20 ప్రపంచ కప్ గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. దూబే ఇప్పటివరకు టీమిండియా తరఫున 4 వన్డేలు, 35 టీ20లు ఆడి 574 పరుగులు చేశాడు. అలాగే 14 వికెట్లు పడగొట్టాడు. దూబే ఐపీఎల్లో 79 మ్యాచ్లు ఆడి 10 హాఫ్ సెంచరీల సాయంతో 1859 పరుగులు చేయడంతో పాటు 5 వికెట్లు తీశాడు. -
IND VS ENG 1st Test Day 5: వరుణుడి ఆటంకం తర్వాత తిరిగి మొదలైన మ్యాచ్
వరుణుడి ఆటంకం తర్వాత తిరిగి మొదలైన మ్యాచ్వర్షం పాక్షిక అంతరాయం కలిగించిన తర్వాత మ్యాచ్ మళ్లీ మొదలైంది. రెండో ఓవర్లోనే ప్రసిద్ద్ కృష్ణ జాక్ క్రాలేను (65) ఔట్ చేశాడు. ఇంగ్లండ్ గెలుపుకు ఇంకా 183 పరుగులు చేయాలి. భారత్ గెలవాలంటే మరో 9 వికెట్లు తీయాలి. లీడ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. చివరి రోజు ఇంగ్లండ్ 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. రెండో సెషన్లో వర్షం మొదలైంది. వర్షం మొదలయ్యే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో వికెట్ కోల్పోకుండా 181 పరుగులు చేసింది. బెన్ డకెట్ (105) సెంచరీ పూర్తి చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా మరో ఓపెనర్ జాక్ క్రాలే (59) బాధ్యతాయుతంగా ఆడుతూ క్రీజ్లో ఉన్నాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ విజయం దిశగా సాగుతున్న వేల వరుణుడు అడ్డుపడ్డాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలవాలంటే మరో 190 పరుగులు చేయాల్సి ఉంది. భారత్ గెలవాలంటే 10 వికెట్లు తీయాలి.స్కోర్ వివరాలు.. భారత్: 471 (జైస్వాల్ 101, గిల్ 147, పంత్ 134) & 364 (రాహుల్ 137, పంత్ 118)ఇంగ్లండ్: 465 (పోప్ 106, బ్రూక్ 99) & 117/0 (డకెట్ 105 నాటౌట్, క్రాలే 59 నాటౌట్) -
ఆసియా కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. ? వైరలవుతున్న సోనీ స్పోర్ట్స్ పోస్టర్
ఈ ఏడాది చివర్లో భారత్లో జరగాల్సిన ఆసియా కప్-2025 కోసం టోర్నీ అధికారిక ప్రసారదారు సోనీ స్పోర్ట్స్ ఓ ప్రత్యేక పోస్టర్ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక టీ20 జట్లకు చెందిన కెప్టెన్లు సూర్యకుమార్ యాదవ్, నజ్ముల్ శాంటో, చరిత్ అసలంక మాత్రమే ఉన్నారు. ఈ పోస్టర్లో పాకిస్తాన్కు ప్రాతినిథ్యం లేకపోవడం సోషల్మీడియాలో చర్చలకు తావిచ్చింది. ఆసియా కప్ నుంచి పాక్ వైదొలిగిందని ప్రచారం మొదలైంది.పహల్గాం ఉదంతం, తదనంతర పరిణామాల్లో (ఆపరేషన్ సిందూర్) భారత్, పాక్ మధ్య అప్పటివరకు ఉన్న తేలికపాటి సంబంధాలు కూడా తెగిపోయిన విషయం తెలిసిందే. క్రీడలు సహా అన్ని అంశాల్లో భారత్ పాక్తో సంబంధాలు తెంచుకుంది. క్రికెట్కు సంబంధించి ఆసియా కప్, ఐసీసీ టోర్నీల్లో, అదీ తటస్థ వేదికల్లో మాత్రమే భారత్ పాక్తో మ్యాచ్లు ఆడే విషయం పరిశీలనలో ఉంది. వాస్తవానికి క్రికెట్లో కూడా భారత్ పాక్తో పూర్తి స్థాయి సంబంధాలు తెంచుకోవాలని భారతీయుల నుంచి ఒత్తిడి ఉంది.ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా పాకిస్తాన్కు చెందిన మంత్రి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహిసిన్ నఖ్వీ ఉండటంతో భారత్ ఆసియా కప్ నుంచి కూడా వైదొలుగుతుందని పలు నివేదికలు తెలిపాయి.మరికొన్ని నివేదికలేమో భారత్ తమ దేశ క్రికెట్ బోర్డు (బీసీసీఐ) పరపతిని ఉపయోగించి పాకిస్తాన్నే ఆసియా కప్ నుంచి వైదొలిగేలా చేస్తుందని చెప్పాయి. తాజాగా సోనీ స్పోర్ట్స్ పాక్ ప్రాతినిథ్యం లేని పోస్టర్ను విడుదల చేయడంతో ఇదే నిజమైదేంమోనని అనిపిస్తుంది. మొత్తానికి సోనీ స్పోర్ట్స్ విడుదల చేసిన ఆసియా కప్ పోస్టర్ భారత్, పాక్ల మధ్య మరోసారి అగ్గి రాజేసేలా ఉంది.కాగా, ఆసియా కప్ 2025పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ టోర్నీ యొక్క ఖచ్చితమైన వివరాలు, వేదికలు, షెడ్యూల్ గురించి ఏసీసీ ఎలాంటి సమాచారం ఇవ్వ లేదు. ఏసీసీ అధ్యక్షుడిగా పాక్కు చెందిన వ్యక్తి ఉన్నా, తమ దేశ భాగస్వామ్యంపై ఇప్పటివరకు స్పందించలేదు. కొద్ది రోజుల కిందట టోర్నీని భారత్లో కాకుండా యూఏఈలో నిర్వహిస్తారని కూడా ప్రచారం జరిగింది.2031 వరకు ఏసీసీ ఈవెంట్స్ హక్కులను దక్కించుకున్న సోనీ స్పోర్ట్స్సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (SPNI) 2024 నుండి 2031 వరకు అన్ని ఏసీసీ టోర్నమెంట్ల మీడియా హక్కులను $170 మిలియన్ల బేస్ ధరకు దక్కించుకుంది. ఇది మునుపటి సైకిల్ కంటే 70% ఎక్కువ. ఆశ్చర్యకరంగా మీడియా హక్కుల కోసం పోటీ బిడ్డింగ్ జరగలేదు. జియోస్టార్ మధ్యలో వైదొలిగింది. -
అక్రం, వార్న్ కాదు!.. నేను ఎదుర్కొన్న డేంజరస్ బౌలర్ అతడే: గంగూలీ
భారత క్రికెట్లో తమకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న ఆటగాళ్లలో సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) ఒకడు. కెప్టెన్గా భారత జట్టు దశ దిశను మార్చిన ఘనత అతడి సొంతం. అంతేకాదు.. సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్లతో కూడిన తన సమకాలీన అత్యుత్తమ బ్యాటర్ల జాబితాలో స్థానం సంపాదించాడు దాదా.విదేశీ గడ్డపై తాను ఎదుర్కొన్న ప్రతీ బౌలర్పై గంగూలీ ఒకానొక సందర్భంలో పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. 1992లో వెస్టిండీస్తో వన్డే మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన దాదా.. 1996లో టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు.పదహారేళ్ల తన సుదీర్ఘ కెరీర్లో టీమిండియా తరఫున 113 టెస్టులు ఆడిన గంగూలీ.. పదహారు శతకాల సాయంతో 7212 పరుగులు సాధించాడు. అదే విధంగా.. 311 వన్డేల్లో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ 11363 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 72 అర్ధ శతకాలు ఉన్నాయి.గంగూలీని భయపెట్టిన బౌలర్ ఎవరో తెలుసా?ఇంతటి అనుభవం, అసాధారణ నైపుణ్యాలు ఉన్న గంగూలీని భయపెట్టిన బౌలర్ ఎవరో తెలుసా?.. దాదానే స్వయంగా ఈ విషయం గురించి మాట్లాడాడు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఎదుర్కొన్న బౌలర్లలో తనను ఎక్కువగా భయపెట్టిందిఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ గ్లెన్ మెగ్రాత్ అని గంగూలీ తెలిపాడు. తన కెరీర్లో ఎదుర్కొన్న అత్యుత్తమ బౌలర్ల జాబితాలో భాగమైన పాక్ పేస్ లెజెండ్ వసీం అక్రం, ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ల పేర్లు కాకుండా దాదా మెగ్రాత్ పేరు చెప్పడం విశేషం. కాగా 1999-2011 మధ్య ఆస్ట్రేలియా అత్యంత పటిష్టమైన జట్టుగా కొనసాగింది.మూడుసార్లు వరుసగా కంగారూ జట్టు వన్డే వరల్డ్కప్ అందుకుంది. ఇక ఆసీస్ ప్రధాన బౌలర్లలో ఒకడైన మెగ్రాత్ది ఇందులో కీలక పాత్ర. ఈ రైటార్మ్ పేసర్ 1993- 2007 మధ్య ఆస్ట్రేలియా తరఫున 124 టెస్టుల్లో 563 వికెట్లు పడగొట్టాడు.అదే విధంగా.. 250 వన్డేల్లో మెగ్రాత్ 381 వికెట్లు కూల్చాడు. రెండు టీ20 మ్యాచ్లలో కలిపి ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఐపీఎల్లో ఒకప్పటి ఢిల్లీ డేర్డెవిల్స్ ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మెగ్రాత్ ఆడాడు. క్యాష్ రిచ్ లీగ్లో మొత్తంగా 14 మ్యాచ్లు ఆడి 12 వికెట్లు తీశాడు.చదవండి: IND vs ENG: రిషబ్ పంత్కు భారీ షాకిచ్చిన ఐసీసీ.. -
ఇంగ్లండ్ గడ్డపై అరంగేట్రంలోనే శతక్కొట్టిన తిలక్ వర్మ
తెలుగు తేజం, హైదరాబాదీ ఆటగాడు, టీమిండియా టీ20 స్పెషలిస్ట్ తిలక్ వర్మ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో అరంగేట్రం మ్యాచ్లోనే ఇరగదీశాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ వన్-2025లో ఆడేందుకు ఇటీవలే హ్యాంప్షైర్తో ఒప్పందం చేసుకున్న తిలక్.. ఇంగ్లండ్ గడ్డపై తన తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లోనే సెంచరీ చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఎసెక్స్తో రెండు రోజుల క్రితం ప్రారంభమైన మ్యాచ్లో తన జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (34/2) బరిలోకి దిగిన తిలక్.. ఎంతో సంయమనంతో బ్యాటింగ్ చేసి 239 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. అయితే దురదృష్టవశాత్తు సెంచరీ పూర్తి కాగానే హార్మర్ బౌలింగ్లో డీన్ ఎల్గర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎసెక్స్ తొలి ఇన్నింగ్స్లో 296 పరుగులకు ఆలౌట్ కాగా.. హ్యాంప్షైర్ 5 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది (మూడో రోజు తొలి సెషన్). తిలక్ ఔట్ కాగానే మరో హ్యాంప్షైర్ ఆటగాడు లియామ్ డాసన్ కూడా సెంచరీ పూర్తి చేశాడు. అంతకుముందు ఎసెక్స్ ఇన్నింగ్స్లో చార్లీ అల్లీసన్ (101) సెంచరీతో కదంతొక్కాడు.కాగా, తిలక్ ఇటీవలే హ్యాంప్షైర్తో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. జూన్ 18 నుండి ఆగస్టు 2 వరకు ఈ జట్టుకు అందుబాటులో ఉండనున్నట్లు ప్రకటించాడు. ఈ ఒప్పందంలో తిలక్ నాలుగు రోజుల మ్యాచ్లు ఆడనున్నాడు. వైట్బాల్ గేమ్స్ ఆడతాడో లేదో క్లారిటీ లేదు. ప్రస్తుతం ఇంగ్లండ్లో టీ20 బ్లాస్ట్ టోర్నీ జరుగుతోంది.22 ఏళ్ల తిలక్ ఈ మ్యాచ్కు ముందు వరకు 18 ఫస్ట్ క్లాస్లు మ్యాచ్లు ఆడి 50కి పైగా సగటుతో 1204 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, నాలుగు ఆర్ధ శతకాలు ఉన్నాయి. టీమిండియా తరఫున 4 వన్డేలు, 25 టీ20లు ఆడిన తిలక్.. టీ20ల్లో స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్నాడు. పొట్టి ఫార్మాట్లో అతను 24 ఇన్నింగ్స్లలో 49.93 సగటుతో 749 పరుగులు చేశాడు.తిలక్కు ముందు మరో ఇద్దరు టీమిండియా యువ ఆటగాళ్లు, టీ20 స్పెషలిస్ట్లు ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ నాటింగ్హమ్షైర్తో.. రుతురాజ్ గైక్వాడ్ యార్క్షైర్తో జతకట్టారు. ఇషాన్ కూడా తిలక్ తరహాలోనే తన కౌంటీ అరంగేట్రంలో ఇరగదీశాడు. యార్క్షైర్తో జరిగిన మ్యాచ్లో 98 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్ సాయంతో 87 పరుగులు చేసి ఔటయ్యాడు. -
IND VS ENG 1st Test Day 5: టీమిండియాను కలవరపెడుతున్న చెడు శకునాలు..!
భారత్-ఇంగ్లండ్ మధ్య లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఈ మ్యాచ్లో ఇరు జట్లకు సమానమైన విజయావకాశాలు ఉన్నాయి. ఇంగ్లండ్ గెలవాలంటే చివరి రోజు 350 పరుగులు (90 ఓవర్లలో) సాధించాలి. అదే భారత్ గెలవాలంటే 10 వికెట్లు తీయాలి. ఆధునిక టెస్ట్ క్రికెట్లో రెండూ అసాధ్యం కాదు. ఫలితం ఏ జట్టుకైనా అనుకూలంగా రావచ్చు.అయితే, గత రికార్డులను పరిశీలిస్తే మాత్రం ఎడ్జ్ ఇంగ్లండ్కే సూచిస్తున్నాయి. 2019లో ఇదే మైదానంలో ఆసీస్తో జరిగిన మ్యాచ్లో స్టోక్స్ నమ్మశక్యంకాని శతకాన్ని (135 నాటౌట్) బాది ఇంగ్లండ్కు చారిత్రక విజయాన్ని అందించాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 67 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్లో రికార్డు స్థాయిలో 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. లీడ్స్ మైదానానికి 350 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన ఘన చరిత్ర ఉండటం ఐదో రోజు ఆటకు ముందు భారత ఆటగాళ్లను డిఫెన్స్లో పడేస్తుంది. అప్పట్లో ఆ లక్ష్యాన్ని ఛేదించింది ఇంగ్లండే కావడం టీమిండియాను మరింత బయపెడుతుంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు సైతం చివరి రోజు 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో తగ్గేదేలేదంటున్నారు.చివరి రోజు ఆట ప్రారంభానికి ముందు టీమిండియాను మరో చెడు సూచకం కూడా బయపెడుతుంది. భారత్ తమ యావత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో 350 ప్లస్ లక్ష్యాన్ని కాపాడుకోలేక ఒకే ఒకసారి చతికిలపడింది. టీమిండియా 59 మ్యాచ్ల్లో 350 ప్లస్ లక్ష్యాలను కాపాడుకునేందుకు బరిలోకి దిగగా.. 42 సార్లు సఫలమైంది. ఒకే ఒక సందర్భంలో బోల్తా పడింది. ఆ ఒక్క ఓటమి ఇంగ్లండ్ చేతిలోనే కావడం టీమిండియాను కలవరపెడుతుంది. 2022లో బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో జరిగిన మ్యాచ్లో భారత్ 378 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. ఆ మ్యాచ్లో రూట్, బెయిర్స్టో అద్భుత శతకాలు సాధించి ఇంగ్లండ్ను గెలిపించారు.మరోవైపు చివరి రోజు ఆటకు ముందు వాతావరణం కూడా భారత్ విజయానికి అడ్డుకట్ట వేసేలా కనిపిస్తుంది. మ్యాచ్ మధ్య మధ్యలో వరుణుడు పలకరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇన్ని ప్రతికూలతల నడుమ భారత బౌలర్లు చివరి రోజు ఏం చేస్తారోనని టీమిండియా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.స్కోర్ వివరాలు..భారత్: 471 & 364ఇంగ్లండ్: 465 & 21/0చివరి రోజు భారత్ గెలుపుకు 10 వికెట్లు కావాలి. అదే ఇంగ్లండ్ గెలవాలంటే 90 ఓవర్లలో 350 పరుగులు చేయాలి. ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్ క్రీజ్లో ఉన్నారు. -
రింకూ సింగ్- ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి వాయిదా!.. కారణం?
భారత స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ (Rinku Singh)- లోక్సభ ఎంపీ ప్రియా సరోజ్ (Priya Saroj)ల పెళ్లి వాయిదా పడినట్లు సమాచారం. ఈ ఏడాది జరగాల్సిన వీరి వివాహం (Wedding Postoponed) వచ్చే సంవత్సరంలో జరుగనున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR)కు ప్రాతినిథ్యం వహిస్తూ వెలుగులోకి వచ్చాడు ఉత్తరప్రదేశ్కు చెందిన రింకూ సింగ్.గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదిన అతడు.. టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో 2023లో ఐర్లాండ్తో టీ20 సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. నయా ఫినిషర్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. అదే ఏడాది వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు.ఇప్పటి వరకు భారత్ తరఫున 33 టీ20లు, 2 వన్డే మ్యాచ్లు ఆడిన రింకూ సింగ్.. ఆయా ఫార్మాట్లలో 339, 41 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ ఇప్పటికి 58 మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఈ కేకేఆర్ స్టార్.. 1099 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి.ఎంపీతో ప్రేమలో రింకూనిరుపేద కుటుంబం నుంచి వచ్చి స్టార్ క్రికెటర్గా ఎదిగిన రింకూ.. కెరీర్ పరంగా నిలదొక్కుకున్నాడు. ఇటీవలే వివాహ బంధంలో అడుగుపెట్టేందుకు కూడా సిద్ధపడ్డాడు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారగా.. ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ ఏడాది జూన్ 8న వీరి నిశ్చితార్థం జరిగింది. మూడేళ్లుగా ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నామంటూ రింకూ- ప్రియా తమ ఎంగేజ్మెంట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.జూన్ 8న నిశ్చితార్థంఇక లక్నోలోని ఓ హోటల్లో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో రింకూ- ప్రియా ఉంగరాలు మార్చుకున్నారు. సమాజ్వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్తో పాటు జయా బచ్చన్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తదితరులు వీరి ఎంగేజ్మెంట్కు హాజరయ్యారు.ఈ క్రమంలో నవంబరు 18న తాజ్ హోటల్లో పెళ్లి వేడుకను జరిపేందుకు పెద్దలు ముహూర్తం ఖరారు చేశారు. అయితే, అమర్ ఉజాలా న్యూస్పేపర్ కథనం ప్రకారం.. రింకూ- ప్రియాల వివాహం వాయిదా పడినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరుగనుందని సమాచారం. కారణం ఇదే?టీమిండియా క్రికెటర్గా రింకూ బిజీ షెడ్యూల్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ ఏడాది నవంబరులో టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. నవంబరు 14- డిసెంబరు 19 వరకు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.చదవండి: పంత్ సెంచరీలపై అలా.. కేఎల్ రాహుల్ శతకంపై ఇలా! గోయెంకా పోస్ట్ వైరల్ -
IND VS ENG 1st Test: శతక్కొట్టిన రాహుల్, పంత్.. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం
తొలి టెస్ట్ లో టీమిండియా విధించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇంగ్లండ్ బరిలోకి దిగింది. సోమవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించాలంటే ఆఖరిదైన ఐదవ రోజు బౌలింగ్ లో సత్తా చాటి 10 వికెట్లు తీయాల్సి ఉంది. మరోవైపు విజయానికి ఇంగ్లండ్ కు 350 పరుగులు అవసరం.ఇంగ్లండ్ లక్ష్యం 371లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా పట్టు బిగించింది. నాలుగో రోజు భారత్ సెకెండ్ ఇన్నింగ్స్లో భారీ స్కోర్ (364) చేసి ఆలౌటైంది. ఫలితంగా ఇంగ్లండ్ ముందు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కేఎల్ రాహుల్ (137), రిషబ్ పంత్ (118) సెంచరీలతో కదంతొక్కారు. మిగతా భారత ఆటగాళ్లలో సాయి సుదర్శన్ 30, రవీంద్ర జడేజా 25 (నాటౌట్), యశస్వి జైస్వాల్ 4, శుభ్మన్ గిల్ 8, కరుణ్ నాయర్ 20, శార్దూల్ ఠాకూర్ 4, సిరాజ్ 0, బుమ్రా 0, ప్రసిద్ద్ కృష్ణ 0 పరుగులకు ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, జోష్ టంగ్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. బషీర్ 2, వోక్స్, స్టోక్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (101), శుభ్మన్ గిల్ (147), రిషబ్ పంత్ (134) సెంచరీలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓలీ పోప్ (106) సెంచరీతో కదంతొక్కగా.. హ్యారీ బ్రూక్ (99) పరుగు తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. మిగతా బ్యాటర్లలో బెన్ డకెట్ 62, జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 రాణించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 465 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. -
IND VS ENG 1st Test: ఇంగ్లండ్ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇంగ్లండ్ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లీష్ నేలపై అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఓపెనర్గా రికార్డు నెలకొల్పాడు. లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో సెంచరీ సాధించడంతో రాహుల్ ఈ ఘనత సాధించాడు. ఈ ఇన్నింగ్స్లో రాహుల్ ఎంతో బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేస్తూ ఈ రికార్డుతో పాటు మరిన్ని మైలురాళ్లను చేరుకున్నాడు.47 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన రాహుల్.. 202 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ విరామం అనంతరం రాహుల్ 137 పరుగులతో ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా కరుణ్ నాయర్ (20) క్రీజ్లో ఉన్నాడు. కడపటి వార్తలు అందేసరికి భారత్ స్కోర్ 332/4గా ఉంది. భారత్ 338 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.ఇదే ఇన్నింగ్స్లో మరో భారత ఆటగాడు రిషబ్ పంత్ (118) కూడా శతకొట్టాడు. పంత్ తొలి ఇన్నింగ్స్లో కూడా సెంచరీతో (134) మెరిశాడు. ఈ మ్యాచ్పై భారత్ పట్టు బిగించింది.తాజా సెంచరీతో రాహుల్ సాధించిన రికార్డులు..ఆసియా ఖండం బయట అత్యధిక సెంచరీలు సాధించిన ఓపెనర్ల జాబితాలో రాహుల్ రెండో స్థానంలో ఉన్నాడు. రాహుల్ తన కెరీర్లో 9 టెస్ట్ సెంచరీలు చేయగా.. అందులో ఆరు ఆసియా బయటే చేయడం విశేషం. భారత ఓపెనర్లలో సునీల్ గవాస్కర్ అత్యధికంగా ఆసియా బయట 15 సెంచరీలు చేశాడు. గవాస్కర్ తర్వాత రాహుల్ అత్యధికంగా 6, వీరేంద్ర సెహ్వాగ్ 4 సెంచరీలు చేశారు.ఇంగ్లండ్పై అత్యధిక సెంచరీలు చేసిన భారత్ ఓపెనర్లు..కేఎల్ రాహుల్-3విజయ్ మర్చంట్-2సునీల్ గవాస్కర్-2రవిశాస్త్రి-2రాహుల్ ద్రవిడ్-2లీడ్స్లో మూడో ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన రెండో పర్యాటక ఓపెనర్గా రికార్డు. రాహుల్కు ముందు (1955) సౌతాఫ్రికాకు చెందిన జాకీ మెక్గ్లూ లీడ్స్లో మూడో ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు.ఇంగ్లండ్ గడ్డపై ఆరో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడు. ఈ సెంచరీతో రాహుల్ ఇంగ్లండ్పై మూడు సెంచరీలు చేసినట్లైంది. భారత ఆటగాళ్లలో రాహుల్ ద్రవిడ్ (6), సచిన్ టెండూల్కర్ (4), దిలీప్ వెంగసర్కార్ (4), రిషబ్ పంత్ (4) మాత్రమే ఇంగ్లండ్ గడ్డపై రాహుల్ కంటే ఎక్కువ సెంచరీలు చేశారు. సౌరభ్ గంగూలీ రాహుల్తో సమానంగా 3 సెంచరీలు చేశాడు.SENA దేశాల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రాహుల్ ఐదో స్థానంలో ఉన్నాడు. రాహుల్ సేనా దేశాల్లో 6 సెంచరీలు చేశాడు. ఈ విభాగంలో సచిన్ టెండూల్కర్ (17), విరాట్ కోహ్లి (12), రాహుల్ ద్రవిడ్ (10), సునీల్ గవాస్కర్ (8) రాహుల్ కంటే ముందున్నారు. రాహుల్తో సమానంగా మహ్మద్ అజారుద్దీన్ సేనా దేశాల్లో 6 సెంచరీలు చేశాడు.కాగా, ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో భారత్ 471, ఇంగ్లండ్ 465 పరుగులు చేసిన విషయం తెలిసిందే. భారత తొలి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (101), శుభ్మన్ గిల్ (147), రిషబ్ పంత్ (134) సెంచరీలు చేయగా.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఓలీ పోప్ (106) సెంచరీతో కదంతొక్కాడు. హ్యారీ బ్రూక్ (99) పరుగు తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. భారత్కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. -
IND VS ENG 1st TEST: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్
టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ టెస్ట్ల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఓ టెస్ట్ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసిన తొలి ఆసియా వికెట్కీపర్ బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆసియా వికెట్కీపర్ బ్యాటర్ ఈ ఘనత సాధించలేదు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో పంత్ ఈ ఘనత సాధించాడు.ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 178 బంతుల్లో డజను ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో 140 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 118 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో పంత్కు ముందు కేఎల్ రాహుల్ కూడా సెంచరీతో కదంతొక్కడంతో భారత్ పటిష్ట స్థితికి చేరింది.నాలుగో రోజు టీ విరామం సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి 304 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కేఎల్ రాహుల్ 120, కరుణ్ నాయర్ 4 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్లో భారత ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ 4, సాయి సుదర్శన్ 30, శుభ్మన్ గిల్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 2 వికెట్లు పడగొట్టగా.. షోయబ్ బషీర్, బెన్ స్టోక్స్ తలో వికెట్ తీశారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (101), శుభ్మన్ గిల్ (147), రిషబ్ పంత్ (134) సెంచరీలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓలీ పోప్ (106) సెంచరీతో కదంతొక్కగా.. హ్యారీ బ్రూక్ (99) పరుగు తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. మిగతా బ్యాటర్లలో బెన్ డకెట్ 62, జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 రాణించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 465 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. -
IND VS ENG 1st Test: రెండో ఇన్నింగ్స్లోనూ శతక్కొట్టిన పంత్.. అయితే ఈసారి..!
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేశాడు. తొలి ఇన్నింగ్స్లో 178 బంతుల్లో డజను ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో 130 బంతుల్లో 13 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ సారి పంత్ సెంచరీ చేసిన తర్వాత పల్టీ సెలబ్రేషన్స్ చేసుకోలేదు. స్టాండ్స్ నుంచి గవాస్కర్ పల్టీ కొట్టాలని అడిగినా పంత్ పెద్దగా పట్టించుకోలేదు. డబుల్ సెంచరీ తర్వాత అన్నట్లు సైగలు చేశాడు. తాజా సెంచరీతో టెస్ట్ల్లో పంత్ సెంచరీల సంఖ్య 8కి చేరింది. మరో ఎండ్లో కేఎల్ రాహుల్ కూడా సెంచరీ పూర్తి చేశాడు. తొలి ఇన్నింగ్స్లో 42 పరుగులకు ఔటైన రాహుల్.. ఈసారి మరింత బాధ్యతాయుతంగా ఆడి కెరీర్లో తొమ్మిదో సెంచరీ పూర్తి చేశాడు. రాహుల్ 202 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో సెంచరీ మార్కును అందుకున్నాడు.నాలుగో రోజు ఆట ప్రారంభం కాగానే శుభ్మన్ గిల్ (8) వికెట్ కోల్పోయిన భారత్ను రాహుల్-పంత్ జోడీ ఆదుకుంది. ఈ ఇద్దరు ఎంతో సంయమనంతో బ్యాటింగ్ చేస్తూ.. భారత్ పైచేయి సాధించే దిశగా తీసుకెళ్తున్నారు. ఈ జోడీ ఇప్పటికే నాలుగో వికెట్కు 172 పరుగులు జోడించింది. పంత్ సెంచరీ పూర్తయ్యే సమయానికి రెండో ఇన్నింగ్స్లో భారత్ స్కోర్ 264/3గా ఉంది. రాహుల్ 112, పంత్ 100 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతానికి భారత్ ఆధిక్యం 270 పరుగులుగా ఉంది. భారత రెండో ఇన్నింగ్స్లో జైస్వాల్ 4, సాయి సుదర్శన్ 30, గిల్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 2, స్టోక్స్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు భారత్, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ల్లో నువ్వా నేనా అన్నట్లు బ్యాటింగ్ చేశాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్మన్ గిల్ (147), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) సెంచరీలతో చెలరేగడంతో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓపెనర్ బెన్ డకెట్ (62) అర్ధ శతకంతో రాణించగా.. ఓలీ పోప్ (106) శతక్కొట్టాడు. హ్యారీ బ్రూక్ 99 పరుగులతో తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. మిగతా ఆటగాళ్లలో జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 పరుగులతో పర్వాలేదనిపించారు. ఫలితంగా ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్లో 465 పరుగులు చేసింది. దీంతో భారత్కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. -
IND VS ENG 1st Test: సెహ్వాగ్ సరసన రాహుల్.. గవాస్కర్ ఒక్కడే మిగిలాడు..!
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. 47 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన రాహుల్.. 87 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. రాహుల్కు కెరీర్లో ఇది 18వ హాఫ్ సెంచరీ. SENA దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) ఓపెనర్గా అతనికిది తొమ్మిదో హాఫ్ సెంచరీ. ఈ హాఫ్ సెంచరీతో రాహుల్ భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, మరో మాజీ ఓపెనర్ మురళీ విజయ్ రికార్డును సమం చేశాడు. భారత ఓపెనర్లుగా సెహ్వాగ్, మురళీ కూడా సేనా దేశాల్లో తలో 9 హాఫ్ సెంచరీలు చేశారు. ఈ విభాగంలో సునీల్ గవాస్కర్ ఒక్కడే ప్రస్తుతం రాహుల్ కంటే ముందున్నాడు. భారత ఓపెనర్గా గవాస్కర్ సేనా దేశాల్లో 19 హాఫ్ సెంచరీలు చేశాడు.సేనా దేశాల్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన భారత ఓపెనర్లు:19 - సునీల్ గవాస్కర్ 57 ఇన్నింగ్స్లలో9* - కేఎల్ రాహుల్ 42 ఇన్నింగ్స్లలో9 - మురళీ విజయ్ 42 ఇన్నింగ్స్లలో9 - వీరేంద్ర సెహ్వాగ్ 49 ఇన్నింగ్స్లలోమ్యాచ్ విషయానికొస్తే.. ఓవర్నైట్ స్కోర్ 90/2 వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్కు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ చివరి బంతికే (24.6వ ఓవర్) బ్రైడన్ కార్స్ బౌలింగ్లో శుభ్మన్ గిల్ (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఓవర్నైట్ స్కోర్కు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి భారత్ మూడో వికెట్ కోల్పోయింది.ఈ దశలో రిషబ్ పంత్ రాహుల్కు జత కలిశాడు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్లు కొనసాగిస్తున్నారు. లంచ్ విరామం సమయానికి భారత్ స్కోర్ 153/3గా ఉంది. రాహుల్ 72, పంత్ 31 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతానికి భారత్ ఆధిక్యం 159 పరుగులుగా ఉంది. భారత రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (4) విఫలం కాగా.. వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (30) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 2, స్టోక్స్ ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు భారత్, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ల్లో నువ్వా నేనా అన్నట్లు బ్యాటింగ్ చేశాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్మన్ గిల్ (147), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) సెంచరీలతో చెలరేగడంతో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓపెనర్ బెన్ డకెట్ (62) అర్ధ శతకంతో రాణించగా.. ఓలీ పోప్ (106) శతక్కొట్టాడు. హ్యారీ బ్రూక్ 99 పరుగులతో తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. మిగతా ఆటగాళ్లలో జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 పరుగులతో పర్వాలేదనిపించారు. ఫలితంగా ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్లో 465 పరుగులు చేసింది. దీంతో భారత్కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. -
‘లక్ష్మణ్ను కాదని అతడిని తీసుకున్నాం.. నాతో మూడు నెలలు మాట్లాడలేదు’
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) 2003 వన్డే ప్రపంచకప్ నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. జట్టు ఎంపిక సమయంలో ఆచితూచి వ్యవహరించామని.. కూర్పు దృష్ట్యా నాడు ఓ దిగ్గజ బ్యాటర్కు మొండిచేయి చూపామని పేర్కొన్నాడు. ఈ కారణంగా అతడు తనతో మూడు నెలల పాటు ఒక్క మాట కూడా మాట్లాడలేదని తాజాగా వెల్లడించాడు.కాగా 2003లో సౌతాఫ్రికాలో జరిగిన వన్డే వరల్డ్కప్ (ODI World Cup 2003) జట్టులో యాజమాన్యం వీవీఎస్ లక్ష్మణ్కు చోటు ఇవ్వలేదు. అతడిని కాదని దినేశ్ మోంగియా (Dinesh Mongia)ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక నాటి ఈ ఐసీసీ టోర్నీలో టీమిండియా రన్నరప్తో సరిపెట్టుకుంది.నాతో మూడు నెలలు మాట్లాడలేదుతాజాగా నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న వరల్డ్కప్ జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. లక్ష్మణ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడం సహజమే. అలా చాలా మందిని చాలా సార్లు పక్కనపెట్టాల్సి వచ్చేది.అందుకు వారు అసంతృప్తికి లోనవడం కూడా మామూలే. వరల్డ్కప్ జట్టులో స్థానం దక్కనందుకు లక్ష్మణ్ నాతో మూడు నెలల పాటు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను చొరవ తీసుకుని అతడిని కదిలించాను.ఏ ఆటగాడి కెరీర్లోనైనా ఇలాంటి ఆటుపోట్లు తప్పవు. ముఖ్యంగా సమర్థవంతుడైన తనకు చోటు దక్కనందుకు లక్ష్మణ్ అసంతృప్తికి లోనుకావడం, బాధపడటం సహజమే.పాక్లో అదరగొట్టాడుఅయితే, ప్రపంచకప్ టోర్నీలో మా ప్రదర్శన పట్ల అతడు సంతోషం వ్యక్తం చేశాడు. ఈ ఈవెంట్ తర్వాత అతడు వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. పాకిస్తాన్, ఆస్ట్రేలియా పర్యటనల్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఏ ఆటగాడైనా జట్టులో చోటు దక్కనపుడు బాధపడినా... దానిని మరీ వ్యక్తిగతంగా తీసుకోరు. జట్టు ప్రయోజనాల కోసం తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు’’ అని గంగూలీ పేర్కొన్నాడు.కాగా టీమిండియా తరఫున గంగూలీ 1992 నుంచి 2008 వరకు 113 టెస్టులు, 311 వన్డే మ్యాచ్లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 7212, 11363 పరుగులు సాధించాడు. భారత క్రికెట్ జట్టు దశ దిశ మార్చిన కెప్టెన్గా పేరొందిన దాదా ఖాతాలో.. 16 టెస్టు, 22 వన్డే శతకాలు ఉన్నాయి.మరోవైపు.. హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ 1996- 2012 మధ్య భారత్కు ప్రాతినిథ్యం వహించాడు. తన కెరీర్లో 134 టెస్టుల్లో 8781 పరుగులు,86 వన్డేల్లో 2338 పరుగులు సాధించాడు. ఇక గతంలో గంగూలీ భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడిగా పనిచేయగా.. లక్ష్మణ్ జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్గా ఉన్నాడు. ప్రధాన కోచ్ల గైర్హాజరీలో టీమిండియా హెడ్కోచ్గా వ్యవహరిస్తున్నాడు.చదవండి: దంచికొట్టిన ఉన్ముక్త్ చాంద్.. క్లాసెన్ బృందానికి తప్పని ఓటమి -
అరంగేట్రంలోనే అదరగొట్టిన ఇషాన్ కిషన్
టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ కౌంటీ క్రికెట్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చాడు. అరంగేట్రం ఇన్నింగ్స్లోనే మెరుపు హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్లో ఇషాన్ కేవలం 57 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 94 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్ సాయంతో 83 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. కౌంటీల్లో ఇషాన్కు ఇదే తొలి అసైన్మెంట్. ఇటీవలే అతను నాటింగ్హమ్షైర్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ జట్టుతో ఇషాన్ ఒప్పందం కేవలం రెండు మ్యాచ్లకు మాత్రమే వర్తిస్తుంది. సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ కైల్ వెర్రెయిన్ జాతీయ విధులు హాజరయ్యేందుకు జింబాబ్వేకు వెళ్లడంతో (రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం) నాటింగ్హమ్షైర్ ఇషాన్తో స్వల్ప కాలిక ఒప్పందం చేసుకుంది. డివిజన్–1 కౌంటీ చాంపియన్షిప్లో భాగంగా నాటింగ్హమ్షైర్ యార్క్షైర్తో తలపడుతుంది. రెండో రోజు తొలి సెషన్లో నాటింగ్హమ్షైర్ 348/6గా ఉంది. ఇషాన్, లియామ్ పాటర్సన్ (22) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు నాటింగ్హమ్ ఇన్నింగ్స్లో హసబ్ హమీద్ 52, బెన్ స్లేటర్ 96, ఫ్రెడ్డీ 23, జో క్లార్క్ 31, జాక్ హేన్స్ 18, లిండన్ జేమ్స్ 12 పరుగులు చేసి ఔటయ్యారు. యార్క్షైర్ బౌలర్లలో జార్జ్ హిల్, డేనియల్ మోరియార్టీ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జాక్ వైట్, విలయమ్ ఓరూర్కీ చెరో వికెట్ దక్కించుకున్నారు.10 రోజుల్లో మూడో ఆటగాడు..10 రోజుల వ్యవధిలో కౌంటీ ఛాంపియన్షిప్లో ఆడేందుకు ఒప్పందం కుదర్చుకున్న మూడో భారత ఆటగాడిగా ఇషాన్ కిషన్ నిలిచాడు. కిషన్ కంటే ముందు రుతురాజ్ గైక్వాడ్ ,తిలక్ వర్మ యార్క్షైర్, హాంప్షైర్లతో జతకట్టారు.ఇషాన్ కిషన్ గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గతేడాది బీసీసీఐ నిబంధనలు ఉల్లఘించి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోయిన ఇషాన్.. తిరిగి ఈ ఏడాది తన కాంట్రాక్ట్ను దక్కించుకున్నాడు.టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు భారత జట్టు ఇంగ్లండ్లోనే ఉండనుంది. ఒకవేళ ఏ ఆటగాడు అయినా గాయపడితే ప్రత్యామ్నాయంగా ఇషాన్కు పిలుపు వచ్చే అవకాశముంది. -
IND VS ENG 1st Test Day 4: టీమిండియాకు షాక్
భారత్-ఇంగ్లండ్ మధ్య లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది. తొలి ఇన్నింగ్స్ల్లో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు బ్యాటింగ్ చేశాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్మన్ గిల్ (147), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) సెంచరీలతో చెలరేగడంతో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓపెనర్ బెన్ డకెట్ (62) అర్ధ శతకంతో రాణించగా.. ఓలీ పోప్ (106) శతక్కొట్టాడు. హ్యారీ బ్రూక్ 99 పరుగులతో తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. మిగతా ఆటగాళ్లలో జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 పరుగులతో పర్వాలేదనిపించారు. ఫలితంగా ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్లో 465 పరుగులు చేసింది. దీంతో భారత్కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4), వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (30) ఔట్ కాగా.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (47), కెప్టెన్ శుభ్మన్ గిల్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. 6 పరుగుల ఆధిక్యం కలుపుకొని భారత్ 96 పరుగుల ఆధిక్యంలో ఉంది.నాలుగో రోజు ఆట ప్రారంభం కాగానే టీమిండియాకు షాక్ఓవర్నైట్ స్కోర్ 90/2 వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్ చివరి బంతికే (24.6వ ఓవర్) బ్రైడన్ కార్స్ బౌలింగ్లో తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో శుభ్మన్ గిల్ (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఓవర్నైట్ స్కోర్కు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి భారత్ మూడో వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్కు జతగా రిషబ్ పంత్ క్రీజ్లోకి వచ్చాడు. గిల్ వికెట్ కోల్పోవడంతో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్పై ఒత్తిడి పడే అవకాశం ఉంది. ఇంగ్లండ్ ముందు టీమిండియా గౌరవప్రదమైన టార్గెట్ ఉంచాలంటే రాహుల్, పంత్ చాలా కీలకం కానున్నారు. వీరిద్దరు ఈ రోజంతా క్రీజ్లో ఉంటేనే భారత్ ఓ మోస్తరు స్కోర్ చేయగలుగుతుంది. -
విజయంతో ముగించిన భారత్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య 2024–2025 ప్రొ లీగ్ను భారత పురుషుల జట్టు విజయంతో ముగించింది. యూరోపియన్ చివరి అంచె లీగ్లో భాగంగా ఆదివారం ఆంట్వర్ప్లో ఆతిథ్య బెల్జియం జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 4–3 గోల్స్ తేడాతో గెలుపొందింది. యూరోపియన్ అంచెలో భారత్కు దక్కిన ఏకైక విజయం ఇదే కావడం గమనార్హం. యూరోపియన్ అంచెలో భారత్ వరుసగా ఏడు మ్యాచ్ల్లో ఓడిపోయి, చివరి మ్యాచ్లో నెగ్గి ఊపిరి పీల్చుకుంది.ఈ మ్యాచ్లో భారత్ తరఫున సుఖ్జీత్ సింగ్ (21వ, 35వ నిమిషంలో) రెండు గోల్స్ చేయగా... అమిత్ రోహిదాస్ (36వ నిమిషంలో), కెప్టేన్ హర్మన్ప్రీత్ సింగ్ (59వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. బెల్జియం జట్టు తరఫున స్లూవర్ (8వ నిమిషంలో), స్టాక్బ్రోయెక్స్ (34వ నిమిషంలో), హుగో (41వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు.మొత్తం తొమ్మిది జట్ల మధ్య జరుగుతున్న ప్రొ లీగ్లో భారత జట్టు తమ 16 మ్యాచ్లను పూర్తి చేసుకుంది. 6 మ్యాచ్ల్లో గెలిచి, 10 మ్యాచ్ల్లో ఓడిపోయిన భారత్ 18 పాయింట్లతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. మరోవైపు భారత మహిళల జట్టు వరుసగా ఆరో పరాజయాన్ని చవిచూసింది. బెల్జియంతో ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ 0–2తో ఓడిపోయింది. -
అటా...ఇటా!
ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో అదరగొట్టినా... మిగిలిన వాళ్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో... ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు భారీ స్కోరుకు అతి చేరువగా వచ్చింది. బ్రూక్ బాదుడుకు లోయర్ ఆర్డర్ సహకారం తోడవడంతో కేవలం 6 పరుగుల వెనుకబడిన ఇంగ్లండ్ పోటీలోకి రాగా... రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ రాణించడంతో టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. ప్రస్తుతానికి ఇరు జట్లు సమంగానే ఉన్నా... నాలుగో రోజు భారత బ్యాటర్లు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారన్నది కీలకంగా మారింది. సొంతగడ్డపై దంచికొట్టే అలవాటు ఉన్న ఇంగ్లండ్ ముందు ఎంత లక్ష్యం నిర్దేశించినా సురక్షితం కాదనే విశ్లేషణల మధ్య... టీమిండియా సోమవారం పూర్తిగా బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది! లీడ్స్: భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఆధిక్యం చేతులు మారుతూ సాగుతున్న పోరులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 23.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ (4) త్వరగానే అవుటైనా... కేఎల్ రాహుల్ (75 బంతుల్లో 47 బ్యాటింగ్; 7 ఫోర్లు), సాయి సుదర్శన్ (48 బంతుల్లో 30; 4 ఫోర్లు) ఆకట్టుకున్నారు. చేతిలో 8 వికెట్లు ఉన్న టీమిండియా... ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 6 పరుగులు కలుపుకొని ఓవరాల్గా 96 పరుగుల ముందంజలో ఉంది.రాహుల్తో పాటు కెపె్టన్ శుబ్మన్ గిల్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 209/3తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్... చివరకు 100.4 ఓవర్లలో 465 పరుగులకు ఆలౌటైంది. ఒలీ పోప్ (137 బంతుల్లో 106; 14 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోగా... హ్యారీ బ్రూక్ (112 బంతుల్లో 99; 11 ఫోర్లు, 2 సిక్స్లు) ఒక్క పరుగు తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. మిగతా బ్యాటర్లు తలా కొన్ని పరుగులు చేయడంతో ఇంగ్లండ్ జట్టు... టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 6 పరుగుల దూరంలో నిలిచింది. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లతో అదరగొట్టగా... ప్రసిధ్ కృష్ణ 3, మొహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశారు. జైస్వాల్ 4 పరుగులకే... తొలి ఇన్నింగ్స్లో చక్కటి సెంచరీ చేసిన జైస్వాల్... రెండో ఇన్నింగ్స్లో ఆకట్టుకోలేకపోయాడు. ఫీల్డింగ్లో మూడు క్యాచ్లు వదిలేయడంతో నెలకొన్న ఒత్తిడి అతడి ఆటతీరులో కనిపించింది. కార్స్ వేసిన నాలుగో ఓవర్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి భారంగా పెవిలియన్కు వెనుదిరిగాడు. ఈ దశలో అరంగేట్ర ఆటగాడు సాయి సుదర్శన్తో కలిసి రాహుల్ క్లాస్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లు భారీ షాట్లతో రెచ్చిపోయిన పిచ్పై రాహుల్ సంయమనం పాటించాడు. రాహుల్తో కలిసి రెండో వికెట్కు 66 పరుగులు జోడించిన అనంతరం సుదర్శన్ వెనుదిరగగా... కెపె్టన్ గిల్తో కలిసి రాహుల్ మరో వికెట్ పడకుండా రోజును ముగించాడు. వర్షం కారణంగా ఆట నిర్ణిత సమయం కంటే ముందే ముగిసింది. ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్, స్టోక్స్ చెరో వికెట్ పడగొట్టారు. బ్రూక్... పరుగు తేడాతో బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై మూడో రోజు ఇంగ్లండ్ సమష్టి ప్రదర్శనతో సత్తా చాటింది. ‘సెంచరీ హీరో’ ఓలీ పోప్ క్రితం రోజు స్కోరుకు మరో 6 పరుగులు మాత్రమే జత చేసి వెనుదిరగగా... కెపె్టన్ బెన్ స్టోక్స్ (52 బంతుల్లో 20; 3 ఫోర్లు)ను సిరాజ్ అవుట్ చేశాడు. ఇక ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టుదు అనుకుంటే... లోయర్ ఆర్డర్తో కలిసి హ్యారీ బ్రూక్ చెలరేగిపోయాడు. ధనాధన్ షాట్లతో చకచకా పరుగులు రాబట్టాడు. వికెట్ కీపర్ జేమీ స్మిత్ (52 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్), క్రిస్ వోక్స్ (55 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు.తొలి సెషన్లో 28 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేయగా... రెండో సెషన్లో 23.4 ఓవర్లలోనే 138 పరుగులు చేసి మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆటలో బుమ్రా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయినా... ఆ బంతి నోబాల్ కావడంతో బతికిపోయిన బ్రూక్కు... మూడో రోజు మరో రెండు అవకాశాలు లభించాయి. వాటిని వినియోగించుకున్న అతడు భారత్ ఆధిక్యాన్ని తగ్గించగలిగాడు. శతకానికి ఒక పరుగు దూరంలో ప్రసిధ్ కృష్ణ వేసిన షార్ట్ పిచ్ బంతికి బ్రూక్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కార్స్ (23 బంతుల్లో 22; 4 ఫోర్లు), వోక్స్, టంగ్ (18 బంతుల్లో 11; 2 ఫోర్లు) విలువైన పరుగులు చేసి టీమిండియా ఆధిక్యాన్ని 6 పరుగులకు పరిమితం చేశారు.అదే తంతు..ఈ మ్యాచ్లో భారత ఫీల్డింగ్ మరీ పేలవంగా సాగింది. రెండో రోజు బుమ్రా బౌలింగ్లోనే మన ఫీల్డర్లు మూడు క్యాచ్లు జారవిడవగా... మూడో రోజు మరో రెండు క్యాచ్లు నేల పాలయ్యాయి. 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌలింగ్లో బ్రూక్ ఇచ్చిన క్యాచ్ను పంత్ అందుకోలేకపోగా... 82 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్లో బ్రూక్ ఇచ్చిన సులువైన క్యాచ్ను జైస్వాల్ జారవిడిచాడు. ఒక ఎండ్లో బుమ్రా ఒత్తిడి పెంచుతున్నా... మరో ఎండ్ నుంచి అతడికి సరైన సహకారం దక్కలేదు.దీనిపై మాజీ ఆటగాళ్లు కూడా మండిపడగా... షార్ట్ బాల్స్తో వికెట్లు తీసిన ప్రసిధ్ కృష్ణ పరుగుల నియంత్రణలో పూర్తిగా విఫలమయ్యాడు. 20 ఓవర్లు వేసిన అతడు 128 పరుగులు సమరి్పంచుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ బ్యాటర్ల మీద ఒత్తిడి కొనసాగలేకపోయింది. దీనికి తోడు తొలి టెస్టులో కెపె్టన్సీ చేస్తున్న గిల్ కూడా కొన్ని తప్పుడు నిర్ణయాలతో ఇంగ్లండ్కు సాయపడ్డాడు.టెయిలెండర్లు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బుమ్రాను రంగంలోకి దింపి ఆధిక్యం పెంచుకోవాల్సింది పోయి... జడేజాకు బంతి అప్పగించి ఇంగ్లండ్ మరికొన్ని పరుగులు చేసే అవకాశం ఇచ్చాడు. ఎట్టకేలకు రెండో సెషన్ చివర్లో బంతి అందుకున్న బుమ్రా వరుస ఓవర్లలో వోక్స్, టంగ్ను క్లీన్ బౌల్డ్ చేసి ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్కు తెరదింపాడు. ఈ క్రమంలో అతడు టెస్టుల్లో 14వసారి 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసుకున్నాడు.స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 471; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) నాయర్ (బి) బుమ్రా 4; డకెట్ (బి) బుమ్రా 62; పోప్ (సి) పంత్ (బి) ప్రసిధ్ 106; రూట్ (సి) నాయర్ (బి) బుమ్రా 28; బ్రూక్ (సి) శార్దుల్ (బి) ప్రసిధ్ 99; స్టోక్స్ (సి) పంత్ (బి) సిరాజ్ 20; జేమీ స్మిత్ (సి) సుదర్శన్ (బి) ప్రసిధ్ 40; వోక్స్ (బి) బుమ్రా 38; కార్స్ (బి) సిరాజ్ 22; టంగ్ (బి) బుమ్రా 11; బషీర్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 34; మొత్తం (100.4 ఓవర్లలో ఆలౌట్) 465.వికెట్ల పతనం: 1–4, 2–126, 3–206, 4–225, 5–276, 6–349, 7–398, 8–453, 9–460, 10–465.బౌలింగ్: బుమ్రా 24.4–5–83–5; సిరాజ్ 27–0 –122–2; ప్రసిధ్ 20–0–128–3; జడేజా 23–4–68–0; శార్దుల్ 6–0–38–0. భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) కార్స్ 4; రాహుల్ (బ్యాటింగ్) 47; సుదర్శన్ (సి) క్రాలీ (బి) స్టోక్స్ 30; గిల్ (బ్యాటింగ్) 6; ఎక్స్ట్రాలు 3; మొత్తం (23.5 ఓవర్లలో 2 వికెట్లకు) 90.వికెట్ల పతనం: 1–16, 2–82.బౌలింగ్: వోక్స్ 6–2– 18–0; కార్స్ 5–0–27–1; టంగ్ 5–0–15–0; బషీర్ 2.5–1– 11–0; స్టోక్స్ 5–1–18–1. -
కరుణ్తో కలిసి సుదీర్ఘ కాలం టీమిండియాకు ఆడాలి.. కేఎల్ రాహుల్ ఆశాభావం
భారత టెస్టు జట్టు సభ్యులైన కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ మంచి స్నేహితులు. చిన్నప్పటి నుంచి వివిధ వయో విభాగాల్లో ఈ కర్ణాటక మిత్రులు కలిసి ఆడారు. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత రాహుల్, నాయర్లకు ఒకే టెస్టులో కలిసి ఆడే అవకాశం దక్కింది. టీమ్లో రాహుల్ రెగ్యులర్ మెంబర్ కాగా, ఎనిమిదేళ్ల తర్వాత నాయర్ పునరాగమనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తమ స్నేహం చిరకాలం కొనసాగడంతో పాటు టీమిండియా తరఫున ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశం రావాలని కోరుకుంటున్నట్లు రాహుల్ చెప్పాడు.‘11 ఏళ్ల వయసులో ఇద్దరం ఒకేసారి క్రికెట్ ఆడటం ప్రారంభించాం. ఈ ప్రయాణం ఇప్పటికీ సాగుతోంది. ఇద్దరి కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. గత 2–3 ఏళ్లలో అద్భుతంగా ఆడి ఎన్నో ప్రతికూలతలను దాటి నాయర్ పునరాగమనం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంగ్లండ్లో ఉండే పరిస్థితులు, సవాళ్ల గురించి మేము మాట్లాడుకున్నాం. మేమిద్దరం కలిసి భారత్ తరఫున సుదీర్ఘ కాలం ఆడాలని కోరుకుంటున్నా’ అని రాహుల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, భారత క్రికెట్ జట్టు ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో రాహుల్, కరుణ్ సభ్యులుగా ఉన్నారు. ఈ ఇద్దరు ఇవాల్టి నుంచి (జూన్ 20) లీడ్స్ వేదికగా ప్రారంభమయ్యే తొలి మ్యాచ్లో ఆడటం దాదాపుగా ఖరారైంది. ఈ మ్యాచ్లో రాహుల్ ఇన్నింగ్స్ను ప్రారంభించే అవకాశం ఉండగా.. కరుణ్ మిడిలార్డర్లో ఐదు లేదా ఆరు స్థానాల్లో బ్యాటింగ్కు రావచ్చు. విరాట్, రోహిత్ల టెస్ట్ రిటైర్మెంట్ తర్వాత భారత బ్యాటింగ్ విభాగంలో రాహులే సీనియర్ సభ్యుడు. పైగా రాహుల్కు గత ఇంగ్లండ్ పర్యటనలో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఓపెనర్గానే గత పర్యటనలో రాహుల్ సెంచరీ చేశాడు. ఇటీవలికాలంలో రాహుల్ పలు బ్యాటింగ్ స్థానాలు మారినా ఓపెనర్గా అయితే అతను పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు. రాహుల్ ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ పర్వాలేదనిపించాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్లో ఇరగదీశాడు.కరుణ్ విషయానికొస్తే.. గత రెండు దేశవాలీ సీజన్లలో పరుగుల వరద పారించిన ఇతగాడు.. తాజాగా ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించి మాంచి జోష్లో ఉన్నాడు. కరుణ్కు ఇంగ్లండ్ గడ్డపై ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. కౌంట్లీలో అతని పేరిట ఓ డబుల్ సెంచరీ, పలు సెంచరీలు ఉన్నాయి. కరుణ్ తనకు గుర్తింపు తెచ్చిన ట్రిపుల్ సెంచరీని ఇంగ్లండ్పైనే సాధించాడు. ఇంగ్లండ్ గడ్డపై, ఇంగ్లండ్పై ఘనమైన ట్రాక్ రికార్డు ఉండటంతో కరుణ్పై ఈ సిరీస్లో భారీ అంచనాలు ఉన్నాయి. కరుణ్ను భారత క్రికెట్ అభిమానులు విరాట్కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. దోస్తులు (రాహుల్, కరుణ్) నేటి నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ మ్యాచ్లో ఏమేరకు రాణిస్తారో చూడాలి. -
IND VS ENG 1st Test: టీమిండియా అంతా కలిసినా 'ఆ ఒక్కడితో' సమానం కాదు..!
ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య లీడ్స్ వేదికగా ఇవాల్టి నుంచి (జూన్ 20) తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ డబ్ల్యూటీసీ కొత్త సైకిల్లో (2025-27) ఇరు జట్లకు మొదటిది. భారతకాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి పోట్టి క్రికెట్కే అలవాటు పడిన ఫ్యాన్స్, ఈ మ్యాచ్ నుంచి సుదీర్ఘ ఫార్మాట్లోని అసలు సిసలైన మజాను ఎంజాయ్ చేస్తారు.ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు కూడా సంసిద్దంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు బరిలోకి దిగి సత్తా చాటుదామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. స్టార్ త్రయం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత శుభ్మన్ గిల్ నేతృత్వంలో టీమిండియా సరికొత్త శకంలోకి అడుగుపెట్టబోతుంది. మరోవైపు ఇంగ్లండ్ బెన్ స్టోక్స్ సారథ్యంలో యువకులు, అనుభవజ్ఞులతో ఉరకలేస్తుంది. ఇంగ్లీష్ జట్టు తమ బజ్బాల్ అటాకింగ్ గేమ్ను టీమిండియాపై ప్రయోగించాలని ఆరాట పడుతుంది.ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును ఇదివరకే ప్రకటించగా.. భారత్ తమ కసరత్తును దాదాపుగా పూర్తి చేసింది. మ్యాచ్కు చాలా సమయం ముందుగానే జట్టును ప్రకటించి తమ ప్రణాళికలను బహిర్గతం చేయకూడదనే భారత మేనేజ్మెంట్ ఉద్దేశం.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్కు ముందు ఓ ఆసక్తికర విషయం సోషల్మీడియాలో తెగ వైరలవుతోంది. అదేంటంటే.. టీమిండియా ఆటగాళ్ల మొత్తం టెస్ట్ సెంచరీల సంఖ్య కన్నా, ఒక్క ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ టెస్ట్ సెంచరీల సంఖ్యనే అధికంగా ఉండటం. రూట్ తన టెస్ట్ కెరీర్లో 36 సెంచరీలు బాదగా.. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు సభ్యులంతా కలిపి 29 సెంచరీలే చేశారు. వీరిలో కేఎల్ రాహుల్ అధికంగా 8 సెంచరీలు చేయగా.. వైస్ కెప్టెన్ పంత్ 6, కెప్టెన్ గిల్ 5, యశస్వి జైస్వాల్ 4, రవీంద్ర జడేజా 4, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి తలో సెంచరీ చేశారు. అంటే, రూట్ సెంచరీల కంటే టీమిండియా ఆటగాళ్లందరూ కలిపి చేసిన సెంచరీలు ఇంకా 7 తక్కువ అన్నమాట. రూట్ మరో 373 పరుగులు చేస్తే..భారత్తో జరిగే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో రూట్ మరో 373 పరుగులు చేస్తే, టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి దూసుకొస్తాడు. ప్రస్తుతం 13006 పరుగులు ఖాతాలో కలిగి ఉన్న రూట్.. మరో 373 పరుగులు చేస్తే, రాహుల్ ద్రవిడ్ (13288), జాక్ కల్లిస్ (13289), రికీ పాంటింగ్ను (13378) అధిగమిస్తాడు. అప్పుడు సచిన్ టెండూల్కర్ ఒక్కడే (15921) రూట్ కంటే ముందుంటాడు.ఇంగ్లండ్తో తొలి టెస్టుకు భారత తుది జట్టు (అంచనా).. యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి/శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్,ప్రసిద్ కృష్ణ/అర్షదీప్ సింగ్టీమిండియాతో తొలి టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్. -
ఇంగ్లండ్తో తొలి టెస్ట్కు ముందు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ..!
భారత క్రికెట్ జట్టు రేపటి నుంచి (జూన్ 20) వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సైకిల్ను (2025-27) ప్రారంభిస్తుంది. భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ రేపటి నుంచి మొదలవుతుంది. ఈ సిరీస్లోని తొలి టెస్ట్ హెడింగ్లేలోని లీడ్స్లో జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకున్నాయి. ఇంగ్లండ్ ఇదివరకే తుది జట్టును ప్రకటించింది. భారత్ కూడా తుది జట్టుపై క్లారిటీ ఇచ్చేసింది. రోహిత్, విరాట్, అశ్విన్ల రిటైర్మెంట్ తర్వాత యంగ్ ఇండియా ఎదుర్కోబోయే తొలి అగ్నిపరీక్ష ఇదే.ఈ సిరీస్తో శుభ్మన్ గిల్ టీమిండియా కెప్టెన్గా తన ప్రస్థానాన్ని మొదలుపెడతాడు. భారత తుది జట్టులో చాలా మార్పులకు అవకాశం ఉంది. యువ ఆటగాడు సాయి సుదర్శన్ అరంగేట్రం దాదాపుగా ఖరారైపోయింది. బ్యాటింగ్ స్థానాలపై కూడా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ నిన్నటి ప్రెస్ మీట్లో క్లారిటీ ఇచ్చాడు. నాలుగో స్థానంలో గిల్, ఐదో ప్లేస్తో తను బ్యాటింగ్కు దిగుతామని పంత్ వెల్లడించాడు.ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్.. వన్డౌన్లో సాయి సుదర్శన్ పేర్లు కూడా దాదాపుగా ఖరారైపోయాయి. ఆరో స్థానంపై కూడా టీమిండియా మేనేజ్మెంట్కు నిన్నటి వరకు ఎలాంటి అనుమానం లేకుండింది. 8 ఏళ్ల తర్వాత భారత టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ ఈ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని మేనేజ్మెంట్ సూచనప్రాయంగా వెల్లడించింది.The incident where Karun Nair got hit at the nets by a delivery from @prasidh43 @RohanDC98 #ENGvsIND #Headingley pic.twitter.com/xGMsiSF8PA— RevSportz Global (@RevSportzGlobal) June 18, 2025అయితే నిన్న జరిగిన ప్రాక్టీస్ సెషన్లో టీమిండియాకు ఓ ఊహించని ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తుంది. దేశవాలీ క్రికెట్లో పరుగుల వరద పారించి టీమిండియా తలుపులు తట్టిన కరుణ్ నాయర్ నెట్స్ గాయపడ్డాడని ప్రచారం జరుగుతుంది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్ను ఎదుర్కోబోయి కరుణ్ పక్కటెముకల్లో దెబ్బ తగిలించుకున్నాడని సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. ఒకవేళ నిజంగానే కరుణ్ గాయపడినట్లైతే టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలనట్లవుతుంది. కరుణ్ ఇటీవల ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించి జోరుమీదున్నాడు. అతని గాయం తీవ్రమైందైతే తుది జట్టులో అతని స్థానం గల్లంతైనట్లే. ఇది టీమిండియా బ్యాటింగ్ కూర్పును భారీగా ప్రభావితం చేస్తుంది. ఆరో స్థానం కోసం మేనేజ్మెంట్ మరో ఆప్షన్ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్థానం కోసం ప్రత్యామ్నాయ ఆటగాడిగా ధృవ్ జురెల్ అందుబాటులో ఉన్నప్పటికీ.. అతను మ్యాచ్ కోసం సిద్దంగా ఉండకపోవచ్చు. కరుణ్కు ప్రత్యామ్నాయంగా ఆల్రౌండర్తో ముందుకు వెళ్లాలనుకుంటే కూడా వాషింగ్టన్ సుందర్ అందుబాటులో ఉన్నాడు. కరుణ్ గాయం తీవ్రమైందైతేనే ఈ ఈక్వేషన్స్ అన్నిటికీ ఆస్కారం ఉంటుంది. సోషల్మీడియాలోని మరో వర్గం కరుణ్ గాయాన్ని కొట్టిపారేస్తుంది. అతని గాయం తీవ్రమైంది కాదని అంటుంది. తొలి టెస్ట్లో కరుణ్ తప్పక ఆడతాడని చెబుతుంది. ఈ విషయమై మరికొద్ది గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఇంగ్లండ్తో తొలి టెస్టుకు భారత తుది జట్టు (అంచనా).. యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి/శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్,ప్రసిద్ కృష్ణ/అర్షదీప్ సింగ్టీమిండియాతో తొలి టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్. -
ప్రపంచంలో ధనిక క్రికెట్ బోర్డులు ఇవే.. చివరి స్థానంలో ఊహించని పేరు
ప్రస్తుత జమానాలో క్రికెట్ కేవలం క్రీడ మాత్రమే కాదు. ఇదో పెద్ద వ్యాపారం. ఇందులో ఆయా దేశ క్రికెట్ బోర్డులు లెక్కలేనంతగా సంపాదిస్తున్నాయి. స్పాన్సర్లు, ప్రసార ఒప్పందాలు, ఇతరత్రా మార్గాల ద్వారా కోట్లకు పడగలెత్తుతున్నాయి. గత దశాబ్దకాలంలో ఈ ధోరణి మరింత పెరిగింది. ఐపీఎల్ లాంటి లీగ్ల వల్ల క్రికెట్ బోర్డుల రూపురేఖలే మారిపోయాయి. ఎంతలా అంటే, క్రికెట్ బోర్డులు దేశ అర్దిక వ్యవస్థలను శాశించేంతలా మారాయి. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇందుకు ప్రధాన ఉదాహరణ.బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు కావడమే కాక ప్రపంచ క్రికెట్ మొత్తాన్నే శాశిస్తుంది. ఐపీఎల్ బీసీసీఐ దశ దిశనే మార్చేసింది. 2008లో ఐపీఎల్ ప్రారంభమయ్యాక బీసీసీఐ రెవెన్యూ అమాంతం పెరిగింది. ధనార్జన విషయంలో ఇతర దేశ క్రికెట్ బోర్డులు బీసీసీఐ దరిదాపుల్లోకి కూడా రాలేపోతున్నాయి. తాజా లెక్కల ప్రకారం బీసీసీఐ నికర విలువ రూ. 19052 కోట్లని తెలుస్తుంది. ఈ సంఖ్యతో పోలిస్తే మిగతా క్రికెట్ బోర్డుల ఆదాయం కనీసం పది శాతం కూడా లేదు. తాజా నివేదికల ప్రకారం.. బీసీసీఐ అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా ఉంటే, టెస్ట్ హోదా కలిగిన దేశాల్లో న్యూజిలాండ్ అతి పేద క్రికెట్ బోర్డుగా ఉంది. న్యూజిలాండ్ 1926 నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నా ఆ దేశ క్రికెట్ బోర్డు క్రికెట్ను కేవలం క్రీడగానే చూస్తుంది. దీన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఏ నాడు ఆదాయ వనరుగా పరిగణించలేదు.కడు పేదరికాన్ని అనుభవిస్తున్న మన దాయాది దేశం పాకిస్తాన్ కూడా క్రికెట్ ద్వారా కోట్లు సంపాదిస్తుంటే న్యూజిలాండ్ మాత్రం క్రీడలో విలువలకు ప్రాధాన్యత ఇస్తూ చాలీచాలని ఆదాయంతో సరిపెట్టుకుంటుంది.బీసీసీఐ విషయానికొస్తే.. భారత్లో క్రికెట్ ప్రతి పౌరుడి జీవితంలో ఓ భాగం. ఇదే బీసీసీఐకి అతి పెద్ద పెట్టుబడి. బీసీసీఐ బలమంతా భారత క్రికెట్ మార్కెట్లోనే ఉంది. అంతర్జాతీయంగా ప్రముఖ కంపెనీలు భారత అభిమానుల ముందుకు రావడానికి వందల కోట్లు ఖర్చు పెడతాయి. ఐపీఎల్ పరిచమయ్యాక బీసీసీఐ తలరాతే మారిపోయింది. ఈ లీగ్ మీడియా హక్కులు చిన్న దేశ క్రికెట్ బోర్డుల ఆదాయం కంటే చాల ఎక్కువ. భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టు స్పాన్సర్షిప్లు బీసీసీఐకి మరో ప్రధాన ఆదాయ వనరు. భారత్లోనే జరిగే మ్యాచ్ల టిక్కెట్ల అమ్మకాలు మరియు ఆ మ్యాచ్ల ద్వారా జరిగే వ్యాపారం బీసీసీఐకి అదనపు ఆదాయం. డిజిటల్ ఒప్పందాలు, ఐసీసీ ఆదాయ వాటాలు బీసీసీఐకి మరో భారీ ఆదాయ వనరు. ఇలా బీసీసీఐ నాలుగు చేతులా సంపాదిస్తూ ప్రపంచంలో అత్యంత ధనిక బోర్డుగా చలామణి అవుతుంది.తాజా నివేదికల ప్రకారం ప్రపంచంలోని టాప్ 10 ధనిక క్రికెట్ బోర్డుల వివరాలు ఇలా ఉన్నాయి.భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు-రూ. 19052 కోట్లుక్రికెట్ ఆస్ట్రేలియా- రూ. 684 కోట్లుఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు- రూ. 510 కోట్లుపాకిస్తాన్ క్రికెట్ బోర్డు- రూ. 476 కోట్లుబంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు- రూ. 441 కోట్లుక్రికెట్ సౌతాఫ్రికా- రూ. 406 కోట్లుజింబాబ్వే క్రికెట్ బోర్డు- రూ. 329 కోట్లుశ్రీలంక క్రికెట్ బోరు- రూ. 173 కోట్లువెస్టిండీస్ క్రికెట్ బోర్డు- రూ. 129 కోట్లున్యూజిలాండ్ క్రికెట్ బోర్డు- రూ. 77 కోట్లు -
ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్.. భారత్లో క్రికెట్ అభిమానులకు శుభవార్త
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ మరో రెండు రోజుల్లో ప్రారంభమవుతుంది. జూన్ 20 నుంచి లీడ్స్ (హెడింగ్లే) వేదికగా తొలి టెస్ట్ జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలవుతుంది.ఈ మ్యాచ్ భారత్లో సోని స్పోర్ట్స్ నెటవర్క్లో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఆన్లైన్ స్ట్రీమింగ్ జియో హాట్స్టార్ యాప్తో పాటు వెబ్సైట్లో జరుగుతుంది. ఈ సిరీస్లో ఐదు మ్యాచ్లు ఇవే నెట్వర్క్లలో ప్రత్యక్ష ప్రసారమవుతాయి.ఈ సిరీస్కు ముందు భారత్లో ఉన్న క్రికెట్ అభిమానులకు శుభవార్త అందింది. ఈ సిరీస్లోని మ్యాచ్లన్నీ డిడి స్పోర్ట్స్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతాయి. ఈ ఛానెల్లో భారత్-ఇంగ్లండ్ సిరీస్ మొత్తాన్ని ఉచితంగా వీక్షించవచ్చు.ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్..జూన్ 20-24- తొలి టెస్ట్ (లీడ్స్)జులై 2-6- రెండో టెస్ట్ (బర్మింగ్హమ్)జులై 10-14- మూడో టెస్ట్ (లార్డ్స్)జులై 23-27- నాలుగో టెస్ట్ (మాంచెస్టర్)జులై 31-ఆగస్ట్ 4- ఐదో టెస్ట్ (కెన్నింగ్స్టన్ ఓవల్) ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు భారత జట్టు..శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్భారత్తో తొలి టెస్ట్కు ఇంగ్లండ్ జట్టు..బెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, ఓలీ పోప్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్ -
ఇంగ్లండ్తో తొలి టెస్ట్కు భారత బ్యాటింగ్ లైనప్ ఇదే.. రోహిత్, కోహ్లికి ప్రత్యామ్నాం వీళ్లే..!
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. హెడింగ్లే వేదికగా తొలి టెస్ట్ జరుగనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్ (టెస్ట్లకు) తర్వాత టీమిండియా ఎదుర్కోబోతున్న తొలి పరీక్ష ఇదే. ఈ నేపథ్యంలో రోహిత్, విరాట్ల ప్రత్యామ్నాయాలు ఎవరనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ విషయంలో ఇదివరకే చాలా మంది మాజీలు, విశ్లేషకులు తమతమ అభిప్రాయాలను వెల్లడించారు. తాజాగా టీమిండియా మాజీ ఆల్రౌండర్, ప్రముఖ వ్యాఖ్యాత రవిశాస్త్రి కూడా రోహిత్, కోహ్లి ప్రత్యామ్నాయాలపై గళం విప్పాడు. రోహిత్ ఓపెనింగ్ స్థానాన్ని కేఎల్ భర్తీ చేయాలని శాస్త్రి సూచించాడు. అలాగే కోహ్లి నంబర్-4లో ప్లేస్లో శుభ్మన్ గిల్ బ్యాటింగ్ రావాలని అన్నాడు. వన్డౌన్లో సాయి సుదర్శన్, ఐదో స్థానంలో కరుణ్ నాయర్ పేర్లను సూచించాడు. రాహుల్కు జతగా మరో ఓపెనర్గా యశస్వి జైస్వాల్, వికెట్కీపర్ బ్యాటర్గా రిషబ్ పంత్ను ఎంపిక చేశాడు. స్పిన్ ఆల్రౌండర్ కోటాలో రవీంద్ర జడేజాను ఎంపిక చేసిన శాస్త్రి.. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ను తేల్చడం కాస్త కష్టమని చెప్పాడు. ఈ స్థానం కోసం శార్దూల్ ఠాకూర్, నితీశ్ కుమార్ రెడ్డి మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని అభిప్రాయపడ్డాడు. అంతిమంగా ఎవరు ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయగలిగితే వారికే తుది జట్టులో చోటు ఉంటుందని తెలిపాడు. బ్యాటింగ్ పరంగా నితీశ్ పర్వాలేదని, అతను 15, 20 ఓవర్లు బౌలింగ్ చేయగలిగితే అతనికే తన ఓటని చెప్పాడు. ఈ మ్యాచ్లో భారత్ తప్పక ముగ్గురు ఫాస్ట్ బౌలర్లలో బరిలోకి దిగాలని శాస్త్రి సూచించాడు.తొలి రెండు స్థానాలకు బుమ్రా, సిరాజ్ పేర్లను కన్ఫర్మ్ చేసిన శాస్త్రి.. మూడో ఫాస్ట్ బౌలర్ స్థానం కోసం ప్రసిద్ద్ కృష్ణ, అర్షదీప్ సింగ్ మధ్య పోటీ ఉంటుందని చెప్పాడు. మ్యాచ్ సమయానికి వాతావరణం మబ్బులు కమ్ముకుని ఉంటే బంతిని ఇరు వైపుల స్వింగ్ చేయగల అర్షదీప్కే తన ఓటని చెప్పాడు. ఒకవేళ వాతావరణం పొడిగా ఉంటే మాత్రం ప్రసిద్ద్ కృష్ణనే తుది జట్టులోని తీసుకోవాలని సూచించాడు.ఐసీసీ రివ్యూ సందర్భంగా మాట్లాడుతూ శాస్త్రి ఈ అభిప్రాయాలను వ్యక్త పరిచాడు. ఈ సందర్భంగా శాస్త్రి కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, సాయి సుదర్శన్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. రాహుల్ ప్రస్తుతం భారత బ్యాటింగ్ సెటప్లో అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడని, గత ఇంగ్లండ్ పర్యటనలో అతను అద్భుతంగా రాణించాడని గుర్తు చేశాడు. చివరిసారి రాహుల్ ఇంగ్లండ్లో ఓపెనింగ్ చేసినప్పుడు సెంచరీ చేశాడని ప్రస్తావించాడు.సాయి సుదర్శన్ తాజాగా ముగిసిన ఐపీఎల్లో, అంతకుముందు దేశవాలీ క్రికెట్లో విశేషంగా రాణించాడని, ఈ 23 ఏళ్ల బ్యాటింగ్ సంచలనం తన నిలకడ ప్రదర్శనలతో అందరినీ మెప్పించాడని అన్నాడు. సాయి సుదర్శన్ మూడో స్థానంలో బరిలోకి దిగి ఈ ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతాలు చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.కరుణ్ నాయర్ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుత ఫామ్ ప్రకారం కరుణ్ ఐదో స్థానంలో బ్యాటింగ్కు రావాలి. అతను చాలా కష్టపడి ఎనిమిదేళ్ల తర్వాత భారత టెస్ట్ జట్టులోకి పునరాగమనం చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతను సాధించిన పరుగుల అద్వితీయం. ఎంత ఫామ్లో ఉన్నా అన్ని పరుగులు సాధించడం చాలా కష్టం. ఇందుకు కరుణ్ చాలా గ్రౌండ్ వర్క్ చేశాడని శాస్త్రి అన్నాడు.ఇంగ్లండ్తో తొలి టెస్టుకు రవిశాస్త్రి ఎంపిక చేసిన భారత ప్లేయింగ్ ఎలెవెన్.. యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి/శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్,ప్రసిద్ కృష్ణ/అర్షదీప్ సింగ్ -
సంచలనం.. 134 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ స్నేహితుడు
భారత క్రికెట్కు మరో చిచ్చరపిడుగు పరిచయమయ్యాడు. బీహార్లోని ముజఫర్పూర్కు చెందిన 13 ఏళ్ల అయన్ రాజ్ కేవలం 134 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ చేసి క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేశాడు. ఓ డిస్ట్రిక్ట్ లెవెల్ 30 ఓవర్ల మ్యాచ్లో సంస్కృతి క్రికెట్ అకాడమీకి ప్రాతినిథ్యం వహించిన అయన్.. 134 బంతుల్లో 22 సిక్సర్లు, 41 ఫోర్ల సాయంతో 327 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయన్ బౌండరీలు, సిక్సర్ల రూపంలోనే 220.89 స్ట్రయిర్రేట్తో 296 పరుగులు చేయడం మరో విశేషం.అయన్ రాజ్ భారత యువ సంచలనం, బ్యాటింగ్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి దగ్గరి మిత్రుడు. ఇద్దరు ఒకే రాష్ట్రానికి చెందిన వారు. ఇంకా చిన్న వయసులో ఇద్దరు కలిసి ఆడారు. అయన్ వైభవ్ను ఆదర్శంగా తీసుకొని మరిన్ని సంచలన ప్రదర్శనలు నమోదు చేయాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయన్ను దగ్గరగా చూసిన వారు అతన్ని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో పోలుస్తున్నారు.రికార్డు ట్రిపుల్ సెంచరీ తర్వాత ఎన్డీటీవీ స్పోర్ట్స్తో మాట్లాడిన అయన్ స్నేహితుడు వైభవ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ భవిష్యత్తులో మరిన్ని సంచలన ప్రదర్శనలు నమోదు చేస్తాడని అశాభావం వ్యక్తం చేశాడు. వైభవ్తో మాట్లాడిన ప్రతిసారి ప్రేరణతో కూడిన గొప్ప అనుభూతి కలుగుతుందని తెలిపాడు. వైభవ్ను చూసి ఫోకస్డ్గా ఎలా ఉండాలో నేర్చుకున్నానని అన్నాడు. వైభవ్ అడుగుజాడల్లో నడిచి తాను కూడా గొప్ప పేరు తెచ్చుకుంటానని తెలిపాడు.తండ్రి కలను లక్ష్యంగా చేసుకొని..!అయన్ తండ్రి ఓ మాజీ క్రికెటర్ (లోకల్). టీమిండియాకు ఆడాలని అతను కలలు కన్నాడు. అయితే అతని విషయంలో అది నెరవేరలేదు. కొడుకుతోనైనా తన కలను సాకారం చేసుకోవాలని అనుకున్నాడు. ఆ దిశగా అయన్ను రాటుదేలుస్తున్నాడు. అయన్ కూడా తండ్రి కలను లక్ష్యంగా చేసుకొని తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. తండ్రితో పాటు తల్లి మద్దతుతో కేవలం క్రికెట్పైనే దృష్టి కేంద్రీకరించాడు.వైభవ్ విషయానికొస్తే.. అయన్ కన్నా ఏడాది పెద్దవాడైన వైభవ్ 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లోని అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. వైభవ్ ఐపీఎల్లో తన మూడో మ్యాచ్లోనే రికార్డు బ్రేకింగ్ సెంచరీ చేసి హేమాహేమీల రికార్డులు బద్దలు కొట్టాడు. గుజరాత్ టైటాన్స్పై వైభవ్ చేసిన 35 బంతుల శతకం ఐపీఎల్ చరిత్రలోనే రెండో వేగవంతమైన శతకం. అలాగే ఐపీఎల్లో భారత ఆటగాడు చేసిన వేగవంతమైన శతకం. ఐపీఎల్ 2025కు ముందు వైభవ్ కేవలం 12 ఏళ్ల వయసులోనే రంజీ అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం అతని స్నేహితుడు అయన్ రాజ్ కూడా అతి చిన్నవయసులోనే పెద్దల క్రికెట్ ఆడే దిశగా అడుగులు వేస్తున్నాడు. అయన్ ఇలాంటి ఇన్నింగ్స్లు ఆడటం కొనసాగిస్తే.. భారత క్రికెట్లో వైభవ్ తర్వాత మరో సంచలనం అవుతాడు. -
కాబోయే భార్యతో ఫోటోలు పోస్ట్ చేసి, వెంటనే డిలీట్ చేసిన కుల్దీప్ యాదవ్.. ఏం జరిగింది..?
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇటీవలే (జూన్ 4న) తన చిన్ననాటి స్నేహితురాలు వన్షికతో నిశ్చితార్ధం చేసుకున్నాడు. లక్నోలోని ఓ హోటల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. కుల్దీప్-వన్షిక సంప్రదాయ బద్దంగా ఉంగరాలు మార్చుకున్నారు. కాన్పూర్లోని శ్యామ్ నగర్ ప్రాంతానికి చెందిన వన్షిక ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తుంది. కుల్దీప్-వన్షిక ఎంగేజ్మెంట్కు యూపీకి చెందిన పలువురు క్రికెటర్లు, టీమిండియా విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ హాజరయ్యారు. వివాహా తేదీని త్వరలో ప్రకటిస్తామని కుల్దీప్ చెప్పాడు.కాగా, కుల్దీప్-వన్షిక నిశ్చితార్ధం జరిగి రెండు వారాలు కూడా గడవకముందే వారిద్దరి మధ్య ఏదో జరుగుతుందని సోషల్మీడియాలో పుకార్లు వస్తున్నాయి. తాజాగా జరిగిన ఓ ఉదంతం ఈ పుకార్లకు బలం చేకూరుస్తుంది. కుల్దీప్ వన్షికతో కలిసి దిగిన ఫోటోలను నిన్న తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేసి వెంటనే డిలీట్ చేశాడు. కుల్దీప్ ఇలా చేయడంపై క్రికెట్ ఫాలోవర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారిద్దరి మధ్య ఏదో జరిగిందని గుసగుసలాడుకుంటున్నారు. కుల్దీప్-వన్షిక బంధం పెళ్లి వరకు కూడా సాగేలా లేదని కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉంటే, త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో కుల్దీప్ ఒక్కడే స్పెషలిస్ట్ స్పిన్నర్గా ఉన్నాడు. ఈ సిరీస్లో కుల్దీప్ టీమిండియాకు చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. కుల్దీప్ ఇంగ్లండ్ గడ్డపై ఇప్పటివరకు ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అందులోనూ అతను కేవలం తొమ్మిది ఓవర్లు మాత్రమే వేశాడు. ఇంగ్లిష్ కండీషన్స్పై పెద్ద అవగాహన లేని కుల్దీప్ ఏమేరకు రాణిస్తాడో అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ సిరీస్లో భారత స్పిన్ విభాగం బరువును కుల్దీప్తో పాటు రవీంద్ర జడేజా మోయనున్నాడు. అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత ఈ ఇద్దరు భారత్ స్పిన్ విభాగానికి పెద్ద దిక్కుగా మారారు. అక్షర్ పటేల్ రూపంలో భారత్కు మరో స్పిన్ ఆప్షన్ ఉన్నా ఈ సిరీస్కు అతన్ని ఎంపిక చేయలేదు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్ ఉన్నా అతనికి తుది జట్టులో అవకాశం దొరకడం అనుమానమే. జూన్ 20 నుంచి హెడింగ్లేలో తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. -
ఇంగ్లండ్తో తొలి టెస్ట్కు ముందు సంచలన విషయాన్ని బయటపెట్టిన కరుణ్ నాయర్
ఇంగ్లండ్తో తొలి టెస్ట్ ప్రారంభానికి ముందు (జూన్ 20) టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ కరుణ్ నాయర్ ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. మెయిల్ స్పోర్ట్ అనే ప్రముఖ మేగజైన్తో మాట్లాడుతూ.. ఓ బాంబు లాంటి వార్త చెప్పాడు.కరుణ్ మాటల్లో.. నాకు ఇప్పటికీ గుర్తుంది. రెండేళ్ల క్రితం టీమిండియాలో స్థానం కోసం పరితపిస్తున్న రోజులవి. ఆ సమయంలో ఓ అగ్రశ్రేణి భారత క్రికెటర్ నాకు ఫోన్ చేసి రిటైర్మెంట్ ప్రకటించమని సలహా ఇచ్చాడు. ప్రైవేట్ టీ20 లీగ్ల్లో చాలా డబ్బు వస్తుందని చెప్పడమే అతని ఉద్దేశం. అలా చేసి ఉండటం చాలా సులభం. కానీ నేను భారత క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చే ఏ విషయంలోనూ రాజీ పడదలచుకోలేదు. ఆ రోజు నేను డబ్బు గురించి ఆలోచించి ఉంటే ఈ రోజు ఇక్కడ (ఇంగ్లండ్లో) ఉండే వాడిని కాదు.టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలన్న ధృడమైన లక్ష్యంతో ఆ రోజు ఆ ప్రముఖ క్రికెటర్ సలహాను పెడచెవిన పెట్టిన కరుణ్.. రెండేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకు టీమిండియాలో చోటు సాధించాడు. 2023లో కర్ణాటక నుండి విదర్భకు మారడం (దేశవాలీ క్రికెట్లో) కరుణ్ అదృష్టాన్ని మార్చేసింది.గత రెండు దేశవాలీ సీజన్లలో 1500కు పైగా పరుగులు సాధించిన కరుణ్ (విదర్భ).. టీమిండియా తలుపులు తట్టాడు. గత రంజీ సీజన్లో అసాధారణ ప్రదర్శన (53.93 సగటున 863) కనబర్చి విదర్భ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మధ్యలో ఇంగ్లండ్ కౌంట్లీలోనూ ఆడిన కరుణ్ అక్కడ కూడా సత్తా చాటాడు. రెండు సీజన్లలో నార్తప్టంన్షైర్ తరఫున 56.61 సగటున 736 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది.నాయర్ తాజాగా ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్లో కూడా డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. విరాట్ కోహ్లి టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని స్థానానికి కరుణ్ సరైన అర్హుడని కొందరు భావిస్తున్నారు. 2018లో టీమిండియా తరఫున చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన కరుణ్.. దాదాపు ఏడేళ్ల తర్వాత 33 ఏళ్ల వయసులో రీఎంట్రీ ఇవ్వడం ఆసక్తికర పరిణామం. కరుణ్ తన చిన్నపాటి టెస్ట్ కెరీర్లోనే ట్రిపుల్ సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు. కరుణ్ చేసిన ఆ ట్రిపుల్ సెంచరీ ఇంగ్లండ్పైనే కావడం విశేషం.ఇంగ్లండ్తో టెస్టులకు భారత జట్టు..శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేడా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుదంర్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ -
ఇంగ్లండ్ గడ్డపై సునామీ శతకంతో విరుచుకుపడిన శార్దూల్ ఠాకూర్
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ సునామీ శతకంతో విరుచుకుపడ్డాడు. బెకింగ్హమ్ వేదికగా భారత సీనియర్ జట్టుతో జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో కేవలం 68 బంతుల్లోనే అజేయమైన 122 పరుగులు చేశాడు (భారత-ఏ జట్టుకు ఆడుతూ). ఈ మ్యాచ్లో శార్దూల్ తొలుత బంతితోనూ మెరిశాడు (4 వికెట్లు తీశాడు). కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, కరుణ్ నాయర్ వంటి స్టార్లతో నిండిన భారత సీనియర్ల బ్యాటింగ్ లైనప్ను ముప్పుతిప్పలు పెట్టాడు.తాజా ప్రదర్శనతో శార్దూల్ ఇంగ్లండ్తో తొలి టెస్ట్కు ముందు భారత సెలెక్టర్లకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాడు. ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీతో మెరిసిన మరో ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి పోటీగా మారాడు. శార్దూల్ తాజా ప్రదర్శన నేపథ్యంలో జూన్ 20 నుంచి ఇంగ్లండ్తో ప్రారంభం కాబోయే తొలి టెస్ట్లో ఎవరికి అవకాశం ఇవ్వాలో అర్దంకాక సెలెక్టర్లు తలలు పట్టుకున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు భారత్, భారత్-ఏ జట్ల మధ్య నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. తొలి టెస్ట్కు ముందు భారత ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మ్యాచ్ను మూడు రోజుల్లోనే ముగించారు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత సీనియర్ జట్టు 459 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్, కేఎల్ రాహల్ హాఫ్ సెంచరీలతో మెరిశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత-ఏ మూడో రోజు ఆటను రద్దు చేసే సమయానికి భారీ స్కోర్ చేసింది. 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన శార్దూల్.. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ వంటి హేమాహేమీ పేసర్లున్న భారత బౌలింగ్ లైనప్కు చుక్కలు చూపించాడు.అంతకుముందు రెండో రోజు ఆటలో మరో భారత-ఏ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ కూడా మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. సర్ఫరాజ్ ఖాన్ కూడా కేవలం 76 బంతుల్లో 101 పరుగులు చేసి భారత సెలెక్టర్లకు సవాలు విసిరాడు. ఈ మ్యాచ్లో సర్ఫరాజ్, శార్దూల్ అద్భుతమైన ప్రదర్శనలతో సత్తా చాటడంతో ఇదివరకే భారత సీనియర్ జట్టులో చోటు ఖాయమనున్న కరుణ్ నాయర్, నితీశ్ కుమార్లకు భయం పట్టుకుంది. ఇంగ్లండ్తో తొలి టెస్ట్లో సర్ఫరాజ్ స్థానంపై అనుమానం ఉన్నప్పటికీ.. తాజా ప్రదర్శనతో శార్దూల్కు తుది జట్టులో చోటు దక్కడం ఖాయమని తెలుస్తుంది. అంతకుముందు కరుణ్ నాయర్ ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీతో మెరిశాడు కాబట్టి అతని చోటుపై ఎలాంటి అనుమానం లేదు. ఇంగ్లండ్తో తొలి టెస్ట్ లీడ్స్లోని హెడింగ్లే మైదానంలో జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది.ఇంగ్లండ్తో టెస్టులకు భారత జట్టు..శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేడా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుదంర్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ -
శ్రేయస్ అయ్యర్ కోసం భారత సెలెక్టర్లపై ధ్వజమెత్తిన గంగూలీ
త్వరలో ఇంగ్లండ్తో జరుగబోయే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేయనందుకు భారత సెలెక్టర్లపై బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఇంగ్లండ్ పర్యటనలో శ్రేయస్ తప్పక జట్టులో ఉండాల్సిందని గంగూలీ అభిప్రాయపడ్డాడు.గత కొంతకాలంగా దేశవాలీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న శ్రేయస్ను ఎందుకు జట్టులోకి తీసుకోలేదని నిలదీశాడు. శ్రేయస్కు భారత టెస్ట్ జట్టులో ఉండే అన్ని అర్హతలు ఉన్నాయని అన్నాడు. శ్రేయస్ ఇటీవలి కాలంలో అద్భుతంగా ఆడుతూ ఒత్తిడిలోనూ పరుగులు చేస్తున్నాడని.. జట్టు అవసరాల దృష్ట్యా తగు రీతిలో ఆడుతూ బాధ్యతగా వ్యవహరిస్తున్నాడని తెలిపాడు.తనే భారత సెలెక్టర్ను అయితే ఈ పరిస్థితుల్లో శ్రేయస్కు తప్పక అవకాశం ఇచ్చే వాడినని అన్నాడు. జట్టులోకి తీసుకొని శ్రేయస్ ఏం చేశేవాడో చూసే వాడినని తెలిపాడు. దిగ్గజాలు విరాట్, రోహిత్, అశ్విన్ల రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్లో టీమిండియా విజయావకాశాలపై స్పందిస్తూ.. ఈ జట్టుతో భారత తప్పక గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. బాగా బ్యాటింగ్ చేసి, బుమ్రాను ఫిట్గా ఉంచుకోగలిగితే ఇంగ్లండ్లో భారత్కు తిరుగుండదని అభిప్రాయపడ్డాడు. 2020-21 ఆసీస్ పర్యటనలో విరాట్, రోహిత్ లేకుండానే యువ ఆటగాళ్లతో నిండిన టీమిండియా విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశాడు.ఇంగ్లండ్ పర్యటనకు శ్రేయస్ను ఎంపిక చేయకపోవడంపై చాలా మంది మాజీ క్రికెటర్లు భారత సెలెక్టర్లను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో సౌరవ్ గంగూలీ కూడా చేరాడు. గత ఏడాది కాలంగా విశేషంగా రాణిస్తున్న శ్రేయస్ను భారత టెస్ట్ జట్టుకు ఎంపిక చేయకపోవడం అన్యాయమని గంగూలీ అభిప్రాయపడ్డాడు. శ్రేయస్ లేని లోటు ఇంగ్లండ్ పర్యటనలో స్పష్టంగా కనిపించే అవకాశముందని తెలిపాడు.కాగా, ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు కొద్ది రోజుల కిందటే జట్టును ప్రకటించారు. ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్లో ల్యాండై సాధన మొదలుపెట్టింది. జూన్ 20 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్తో శుభ్మన్ గిల్ భారత కెప్టెన్గా పరిచయమవుతాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ సిరీస్కు ముందే గిల్ను కెప్టెన్గా ఎంపిక చేశారు. ఈ సిరీస్కు ముందే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు భారత జట్టు..శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్..జూన్ 20-24- తొలి టెస్ట్ (లీడ్స్)జులై 2-6- రెండో టెస్ట్ (బర్మింగ్హమ్)జులై 10-14- మూడో టెస్ట్ (లార్డ్స్)జులై 23-27- నాలుగో టెస్ట్ (మాంచెస్టర్)జులై 31-ఆగస్ట్ 4- ఐదో టెస్ట్ (కెన్నింగ్స్టన్ ఓవల్) -
ధోని అందుకున్న అత్యుత్తమ పురస్కారాలు ఇవే..!
క్రికెట్కు అందించిన విశేష సేవలకు గానూ టీమిండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనిని ఐసీసీ తాజాగా హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న 11వ భారత క్రికెటర్గా ధోని రికార్డుల్లోకెక్కాడు. ఆటగాడిగా, కెప్టెన్గా ధోని భారత క్రికెట్కు ఎంతో చేశాడు.బ్యాటర్గా 17000కు పైగా పరుగులు, వికెట్ కీపర్గా 824 మందిని ఔట్ చేయడంతో భాగం కావడంతో పాటు టీమిండియాను టీ20 వరల్డ్కప్ (2007), వన్డే వరల్డ్కప్ (2011), ఛాంపియన్స్ ట్రోఫీ (2013) విజేతగా నిలిపాడు. ప్రపంచ క్రికెట్లో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన కెప్టెన్ ధోని ఒక్కడే.క్రికెట్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ధోనికి తాజాగా లభించిన ఐసీసీ అత్యున్నత హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కారంతో పాటు ఎన్నో పురస్కారాలు లభించాయి. పురస్కారాల విషయంలో ధోని ప్రస్తానం ఎంటీవీ యూత్ ఐకాన్తో మొదలైంది. అప్పుడ్పుడే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ధోనిని 2006లో ఎంటీవీ యూత్ ఐకాన్ పురస్కారంతో సత్కరించింది. కెరీర్ తొలినాళ్లలో ధోని పొడవాటి జులపాలతో యూత్ను తెగ ఆకర్శించాడు. అప్పట్లో ధోని క్రేజ్ వేరే లెవెల్లో ఉండేది. ఇందుకే ఎంటీవీ ధోనిని యూత్ ఐకాన్గా నామినేట్ చేసింది.ధోనికి తొలి ప్రతిష్టాత్మక అవార్డు 2008లో లభించింది. అప్పటికే టీమిండియాను టీ20 ఛాంపియన్గా నిలిపిన ధోనికి ఆ ఏడాది మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న పురస్కారం లభించింది. భారత ప్రభుత్వం ధోనిని ఈ అవార్డును నామినేట్ చేసింది.అదే ఏడాది (2008) ధోని తొలిసారి ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. ఆ మరుసటి ఏడాది కూడా వన్డేల్లో పరుగుల వరద పారించినందుకు గానూ ధోనికి మరోసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. 2009లో భారత ప్రభుత్వం ధోనికి పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. 2011లో ధోనికి భారత సైన్యంలో లెఫ్ట్నెంట్ కల్నల్ హోదా లభించింది. అదే ఏడాది సీఎన్ఎన్-న్యూస్ 18 ఇండియన్ ఆఫ్ ద ఇయర్, క్యాస్ట్రాల్ ఇండియన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు లభించాయి. 2011-2020 దశాబ్దానికి గానూ ధోనికి ఐసీసీ స్పిరిట్ ఆఫ్ ద క్రికెట్ అవార్డు లభించింది.2018లో ధోని భారత దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ అవార్డు అందుకున్నాడు. తాజాగా ధోనిని ఐసీసీ తమ అత్యున్నత పురస్కారమైన హాల్ ఆఫ్ ఫేమ్తో సత్కరించింది. ఇవే కాకుండా ధోని కెరీర్లో ఎన్నో ప్రైవేట్ పురస్కారాలు అందుకున్నాడు. 43 ఏళ్ల ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి, ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. -
టీమిండియా జాక్పాట్.. పాపం పాకిస్థాన్!
ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) విజేత ఎవరో తేలిపోయే సమయం ఆసన్నమైంది. లండన్లోని లార్డ్స్ మైదానంలో బుధవారం నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టైటిల్ కోసం బరిలోకి దిగనున్నాయి. గత రెండు ఎడిషన్లతో పోలిస్తే ఈసారి విజేతకు రెండింతల ఎక్కువ ప్రైజ్మనీ దక్కుతుంది. టెస్ట్ క్రికెట్కు పూర్వవైభవం తెచ్చేందుకు ప్రైజ్మనీని భారీగా పెంచింది ఐసీసీ.డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచే జట్టుకు ఈసారి 3.6 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 30.8 కోట్లు) ప్రైజ్మనీ సొంతమవుతుంది. రన్నరప్కు 2.1 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 17.9 కోట్లు) నగదు బహుమతి అందుతుంది. హ్యాట్రిక్ ఫైనల్ మిస్సయి 3వ స్థానంలో నిలిచిన టీమిండియా కూడా భారీగానే ప్రైజ్మనీ అందుకోబోతోంది. మూడో స్థానంలో నిలిచినప్పటికీ గత రెండు ఎడిషన్ల విజేతల కంటే ఎక్కువ సొమ్మును భారత్ దక్కించుకోబోంది. 1.44 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 12.34 కోట్లు) నగదు బహుమతి పొందనుంది. పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచిన న్యూజిలాండ్కు 1.2 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 10.26 కోట్లు) ప్రైజ్మనీ వస్తుంది.పాపం పాకిస్థాన్!పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిస్థితి రానురాను మరింత దయనీయంగా తయారవుతోంది. డబ్ల్యూటీసీ సైకిల్ 2023-2025లో పాక్ టీమ్ చివరి స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో బంగ్లాదేశ్, వెస్టిండీస్ కన్నా తక్కువ మొత్తం ఆ జట్టుకు దక్కుతుంది. బంగ్లాదేశ్ 7.2 లక్షల డాలర్లు (దాదాపు రూ. 6.16 కోట్లు), వెస్టిండీస్ 6.1 లక్షల డాలర్లు (సుమారు రూ. 5.21 కోట్లు) నగదు బహుమతిగా అందుకోనున్నాయి. పాకిస్థాన్కు దాదాపు 4.1 కోట్ల రూపాయల (4.8 లక్షల డాలర్లు) నగదు మాత్రమే దక్కనుంది. పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ 7, వెస్టిండీస్ 8 స్థానాల్లో నిలవగా, పాకిస్థాన్ చివరిదైన 9వ స్థానంలో ఉంది.డబ్ల్యూటీసీ సైకిల్ 2023-2025 పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్, శ్రీలంక ఐదారు స్థానాల్లో నిలిచాయి. ఇంగ్లండ్ 9.6 లక్షల డాలర్లు (సుమారు రూ. 8.21 కోట్లు), శ్రీలంక 8.4 లక్షల డాలర్లు (దాదాపు రూ. 7.18 కోట్లు) నగదు బహుమతి అందుకుంటాయి. కాగా, 2019-21లో న్యూజిలాండ్, 2021-23లో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ రెండు జట్లు ఇండియాపైనే గెలవడం గమనార్హం.డబ్ల్యూటీసీ 2025 ప్రైజ్మనీ వివరాలు1. విజేత: రూ. 30.8 కోట్లు2. రన్నరప్: రూ. 17.9 కోట్లు3. ఇండియా: రూ. 12.34 కోట్లు4. న్యూజిలాండ్: రూ. 10.26 కోట్లు5. ఇంగ్లండ్: రూ. 8.21 కోట్లు6. శ్రీలంక: రూ. 7.18 కోట్లు7. బంగ్లాదేశ్: రూ. 6.16 కోట్లు8. వెస్టిండీస్: రూ. 5.21 కోట్లు9. పాకిస్థాన్: రూ.4.1 కోట్లుచదవండి: అమ్మకానికి ఆర్సీబీ..?, ఆందోళనలో ఫ్యాన్స్.. -
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు.. ధోని ఏమన్నాడో చూడండి..!
2025 సంవత్సరానికి గానూ ఐసీసీ ప్రకటించిన ఏడుగురు హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోనికి చోటు లభించింది. టీమిండియాను టీ20 వరల్డ్కప్ (2007), వన్ వరల్డ్కప్ (2011), ఛాంపియన్స్ ట్రోఫీ (2013) విజేతగా నిలిపిన ధోనిని ఐసీసీ సముచిత రీతిలో గౌరవించింది. ధోని అంతర్జాతీయ క్రికెట్లో 17000కు పైగా పరుగులు (90 టెస్టుల్లో 4876 పరుగులు, 350 వన్డేల్లో 10773 పరుగులు, 98 టి20ల్లో 1617 పరుగులు) సాధించి, టీమిండియా అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా చలామణి అయ్యాడు. వికెట్ కీపర్గా ధోని 824 మందిని ఔట్ చేయడంలో భాగస్వామిగా ఉన్నాడు.ఈ ఏడాదికి గానూ ధోనితో పాటు గ్రేమ్ స్మిత్ (సౌతాఫ్రికా), హాషిమ్ ఆమ్లా (సౌతాఫ్రికా), మాథ్యూ హేడెన్ (ఆస్ట్రేలియా), డేనియెల్ వెటోరి (న్యూజిలాండ్), సారా టేలర్ (మహిళా క్రికెటర్, ఇంగ్లండ్), సనా మీర్ (మహిళా క్రికెటర్, పాకిస్తాన్) హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. క్రికెట్కు విశేష సేవలందించిన ఆటగాళ్లకు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో చోటు కల్పిస్తుంది. ఈ ప్రోగ్రాంను తొలిసారి 2009లో ప్రారంభించారు. హాల్ ఆఫ్ ఫేమ్లో ఇప్పటివరకు 122 మంది క్రికెటర్లుకు చోటు లభించింది.హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్న 11వ భారత క్రికెటర్గా ధోని రికార్డుల్లోకెక్కాడు. అతనికి ముందు సునీల్ గవాస్కర్, బిషన్ సింగ్ బేడి, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వినూ మన్కడ్, డయాన్ ఎడుల్జీ, వీరేంద్ర సెహ్వాగ్, నీతు డేవిడ్ ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు.ప్రతిష్టాత్మక హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చోటు దక్కడంపై ధోని ఇలా స్పందించాడు. ప్రపంచ క్రికెట్లో ఆటగాళ్లు చేసిన సేవలకు గుర్తింపుగా భావించే ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కడం పెద్ద గౌరవంగా భావిస్తున్నా. దిగ్గజాల సరసన నా పేరు కూడా చేరడం గొప్ప అనుభూతి. ఇది చిరస్మరణీయమని అన్నాడు. -
స్టేడియం పైకప్పు బద్దలు కొట్టిన పంత్.. వైరల్ వీడియో
ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత సీనియర్ క్రికెట్ జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ జూన్ 20న లీడ్స్లోని హెడింగ్లేలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కు ముందు భారత్ జూన్ 13 నుంచి 16 వరకు కెంట్ కౌంటీ క్రికెట్ గ్రౌండ్లో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడనుంది. ప్రతిష్టాత్మకమైన ఈ సిరీస్ కోసం భారత్ రెండు వారాల ముందే ఇంగ్లండ్లో వాలిపోయింది. ప్రస్తుతం టీమిండియా లార్డ్స్ క్రికెట్ మైదానంలో కఠోరమైన సాధన చేస్తుంది.- PANT BROKE THE ROOF WITH A SIX...!!!🔥 [Espn Cricinfo]- RISHABH PANT IS GEARING UP FOR THE TEST SERIES AGAINST ENGLAND.- RISHABH PANT IS IN GREAT TOUCH WITH BAT, GUD TO SEE HIM.#Rishabhpant#ENGvsIND#rinkusingh#RohitSharma#INDvsAUS#WTCFinalpic.twitter.com/t3dRuyeMGg— Nitesh Prajapati (@itsmenitesh004) June 9, 2025ఇందులో భాగంగా తాజాగా జరిగిన ఓ ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఓ భారీ సిక్సర్ బాది వార్తల్లోకెక్కాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో పంత్ కొట్టిన ఓ సిక్సర్ స్టేడియం పైకప్పును బద్లలు కొట్టింది. దీనికి సంబంధిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను చూసి పంత్ అభిమానులు సంబరపడిపోతున్నారు. తమ ఫేవరెట్ ఆటగాడు తిరిగి లయను అందుకున్నాడని ముచ్చటపడిపోతున్నారు.పంత్ను ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్ కోసం టీమిండియా వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు. ఈ సిరీస్లో అతను తొలిసారి భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్గా ఎంపికైన శుభ్మన్ గిల్కు డిప్యూటీగా వ్యవహరిస్తాడు. పంత్కు ఇంగ్లండ్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇక్కడ అతను 17 మ్యాచ్ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 32.70 సగటున 556 పరుగులు చేశాడు. పంత్ ఇంగ్లండ్ గడ్డపై చివరి సారి ఆడిన టెస్ట్ మ్యాచ్లో సెంచరీ చేశాడు. 2022 పర్యటనలో అతను 111 బంతుల్లో 146 పరుగులు చేశాడు.పేలవ ఫామ్ కొనసాగినా..!పంత్ తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో పేలవ ప్రద్శనలు చేశాడు. 13 ఇన్నింగ్స్ల్లో కేవలం 269 పరుగులు మాత్రమే చేశాడు. సీజన్ ఆధ్యాంతం పేలవ ఫామ్లో కొనసాగిన పంత్.. తమ చివరి లీగ్ మ్యాచ్లో చెలరేగిపోయాడు. ఆర్సీబీతో జరిగిన ఆ మ్యాచ్లో పంత్ విధ్వంసకర శతకంతో (61 బంతుల్లో 118 నాటౌట్) విరుచుకుపడ్డాడు. అయినా ఆ మ్యాచ్లో పంత్ జట్టు ఎల్ఎస్జీ ఓటమిపాలైంది. జితేశ్ శర్మ ఊహకందని మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని గెలిపించాడు. ఈ సీజన్కు ముందు ఎల్ఎస్జీ పంత్ను రికార్డు ధర రూ. 27 కోట్లకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ చరిత్ర సృష్టించాడు. ఇంత డబ్బుపోసి కొనుక్కునా ఈ సీజన్లో పంత్ దారుణంగా నిరాశపరిచాడు. కెప్టెన్గా, ఆటగాడిగా తేలిపోయాడు. సీజన్ ఆరంభంలో టైటిల్ ఫేవరెట్గా కనిపించిన లక్నో చివరి వచ్చే సరికి ఏడో స్థానంతో సీజన్ను ముగించింది. ఇంగ్లండ్ పర్యటనలోనైనా పంత్ స్థాయికి తగ్గట్టు రాణించాలని కోరుకుందాం. -
టీమిండియా షెడ్యూల్.. బీసీసీఐ నుంచి కీలక అప్డేట్
ఈ ఏడాది చివర్లో ప్రారంభం కాబోయే టీమిండియా హోం సీజన్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. భారత సీనియర్ పురుషుల జట్టు.. వెస్టిండీస్, సౌతాఫ్రికాతో ఆడబోయే టెస్ట్ మ్యాచ్ల వేదికలు మారాయి. అలాగే భారత సీనియర్ మహిళల జట్టు ఆస్ట్రేలియాతో ఆడబోయే వన్డే సిరీస్ వేదికలు.. సౌతాఫ్రికా-ఏ జట్టు భారత-ఏ జట్టుతో ఆడబోయే వన్డే మ్యాచ్ల వేదికలు కూడా మారాయి. వేదికల మార్పు అంశాన్ని బీసీసీఐ ఇవాళ (జూన్ 9) అధికారికంగా ప్రకటించింది.🚨 NEWS 🚨BCCI announces updated venues for Team India (International home season) & South Africa A Tour of India.Details 🔽 #TeamIndia | @IDFCFIRSTBank https://t.co/vaXuFZQDRA— BCCI (@BCCI) June 9, 2025భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు ఈ ఏడాది అక్టోబర్ 10 నుంచి 14 తేదీ వరకు కోల్కతాలోని ఈడెన్ గార్డన్స్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ ఆడాల్సి ఉండింది. అయితే ఈ మ్యాచ్ వేదికను ఈడెన్ గార్డన్స్ నుంచి న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంకు మార్చడం జరిగింది. వేదిక మారినా మ్యాచ్ అదే తేదీల్లో యధాతథంగా జరుగుతుంది.నవంబర్ 14 నుంచి 18 వరకు టీమిండియా, సౌతాఫ్రికా మధ్య న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగాల్సిన తొలి టెస్ట్ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డన్స్కు మార్చడం జరిగింది. వేదిక మారినా ఈ మ్యాచ్ అదే తేదీల్లో యధాతథంగా జరుగనుంది. నవంబర్ నెలలో ఢిల్లీలో వాయు కాలుష్యం అధికంగా ఉండటంతో వేదిక మార్చినట్లు బీసీసీఐ చెప్పుకొచ్చింది.భారత సీనియర్ మహిళల జట్టు సెప్టెంబర్ 14, 17, 20 తేదీల్లో చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడాల్సి ఉండింది. అయితే చిదంబరం స్టేడియంలో ఔట్ ఫీల్డ్, పిచ్కు సంబంధించి మరమ్మత్తు పనులు జరుగుతుండటంతో తొలి రెండు వన్డేను న్యూ ఛండీఘడ్లోని పీసీఏ స్టేడియంకు, చివరి వన్డేను న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంకు మార్చడం జరిగింది.సౌతాఫ్రికా పురుషుల ఏ టీమ్ నవంబర్ 13, 16, 19 తేదీల్లో భారత ఏ జట్టుతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడాల్సి ఉండింది. అయితే ఈ సిరీస్ వేదికను చిన్నస్వామి స్టేడియం నుంచి రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంకు మార్చారు. -
అశ్విన్.. నీ స్థాయికి ఇది తగునా.. మహిళతో అలా ఎలా ప్రవర్తిస్తావు..?
తమిళనాడు ప్రీమియర్ లీగ్లో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తన స్థాయిని మరిచి ప్రవర్తించాడు. తనను ఎల్బీడబ్ల్యూగా ప్రకటించినందుకు ఓ మహిళా అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. అశ్విన్ దురుసు ప్రవర్తనకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియో చూసి అభిమానులు అశ్విన్పై మండిపడుతున్నారు. నీ స్థాయికిది తగునా అంటూ కామెంట్లు చేస్తున్నారు.వివరాల్లోకి వెళితే.. తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2025 ఎడిషన్లో అశ్విన్ దిండిగల్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. లీగ్లో భాగంగా నిన్న (జూన్ 8) దిండుగల్ డ్రాగన్స్, ఐడ్రీమ్ తిరుప్పుర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో అశ్విన్ ఓపెనర్గా బరిలోకి దిగాడు. సాయి కిషోర్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్ చివరి బంతికి అశ్విన్ స్వీప్ షాట్ ఆడబోయి మిస్ అయ్యాడు. బంతి వికెట్ల ముందు అశ్విన్ ప్యాడ్లకు తాకింది. Ash அண்ணா Not Happy அண்ணாச்சி! 😶🌫📺 தொடர்ந்து காணுங்கள் | TNPL 2025 | iDream Tiruppur Tamizhans vs Dindigul Dragons | Star Sports தமிழில் #TNPLOnJioStar #TNPL #TNPL2025 pic.twitter.com/Csc2ldnRS3— Star Sports Tamil (@StarSportsTamil) June 8, 2025దీంతో సాయి కిషోర్ ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేశాడు. అక్కడే ఉన్న మహిళా అంపైర్ మారు ఆలోచించకుండా అశ్విన్ను ఔట్గా ప్రకటించింది. దీంతో అశ్విన్ పట్టరాని కోపంతో ఊగిపోతూ అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. అంపైర్ పట్టించుకోకపోవడంతో అశ్విన్ అసహనంతో బ్యాట్ను తన ప్యాడ్కు కొట్టుకుంటూ పెవిలియన్ బాట పట్టాడు. ఈ మ్యాచ్లో అశ్విన్ 11 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 18 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో అశ్విన్ జట్టు దిండిగుల్ 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.తొలుత బ్యాటింగ్ చేసిన దిండిగుల్.. ఎసక్కిముత్తు (4-0-26-4), మతివణ్ణన్ (2.2-0-12-3), సాయి కిషోర్ (4-0-10-2) చెలరేగడంతో 16.2 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌటైంది. అనంతరం స్వల్ప ఛేదనకు దిగిన తిరుప్పుర్.. తుషార్ రహేజా (39 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ మెరుపు అర్ద సెంచరీతో చెలరేగడంతో 11.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
ఘనంగా రింకూ సింగ్ ఎంగేజ్మెంట్.. మాజీ సీఎం సహా ప్రముఖులు హాజరు
టీమిండియా విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ ఎంగేజ్మెంట్ ఇవాళ (జూన్ 8) లక్నోలోని ద సెంట్రమ్ ఫైవ్ స్టార్ హోటల్లో ఘనంగా జరిగింది. రింకూ సమాజ్వాది పార్టీ ఎంపీ (లోక్సభ) ప్రియా సరోజ్ను నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో రింకూ, సరోజ్ నిశ్చితార్థం రింగులు మార్చుకున్నారు. ఈ వేడుకకు రింకూ, సరోజ్ కుటుంబ సభ్యులతో పాటు క్రికెట్, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.Rinku Singh got engaged with Priya Saroj. 💍 ❤️- Congratulations to both of them. pic.twitter.com/hj8aAslurI— Johns. (@CricCrazyJohns) June 8, 2025తెలుపు, పింక్ కలర్ ఔట్ ఫిట్లలో రింకూ, సరోజ్ జోడీ చూడముచ్చటగా ఉంది. ఈ వేడుకకు యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, అతని భార్య డింపుల్ యాదవ్, బిగ్బీ సతీమణి, సమాజ్వాది పార్టీ ఎంపీ జయా బచ్చన్, సమాజ్వాది పార్టీ సీనియర్ లీడర్ ప్రొఫెసర్ రామ్గోపాల్ యాదవ్, ఇక్రా హసన్ (సరోజ్ క్లోజ్ ఫ్రెండ్), బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, ఉత్తర్ప్రదేశ్ మాజీ క్రికెటర్లు ప్రవీణ్ కుమార్, పియుశ్ చావ్లా, ఉత్తర్ప్రదేశ్ రంజీ జట్టు కెప్టెన్ ఆర్యన్ జుయల్ తదితరులు హాజరయ్యారు. వేడుక అనంతరం అతిథులకు దేశీయ విందుతో పాటు యురోపియన్ వంటాలను వడ్డించారు. ఎంగేజ్మెంట్ వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. 27 ఏళ్ల రింకూ ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ సీజన్లో అతను 29.42 సగటున, 153.73 స్ట్రయిక్రేట్తో 206 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్లో అతను ప్రాతినిథ్యం వహించిన కేకేఆర్ పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది. ఆ జట్టు 14 మ్యాచ్ల్లో కేవలం ఐదింట మాత్రమే గెలుపొందింది. రింకూ అంతర్జాతీయ కెరీర్ విషయానికొస్తే.. భారత్ తరఫున 33 టీ20లు, రెండు వన్డేలు ఆడాడు. ఇందులో 3 అర్ద సెంచరీల సాయంతో 601 పరుగులు చేశాడు.సరోజ్ విషయానికొస్తే.. 26 ఏళ్ల సరోజ్ ప్రస్తుతం ఉత్తర్ప్రదేశ్లోని మచ్లిషెహర్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. 2024 జనరల్ ఎలెక్షన్స్లో ప్రియా సిట్టింగ్ బీజేపీ ఎంపీ బీపీ సరోజ్పై 35000 ఓట్ల తేడాతో గెలుపొందింది. ప్రియాకు ఇవే తొలి ఎన్నికలు.వారణాసికి చెందిన సరోజ్ పాలిటిక్స్లోకి రాక ముందు 'లా'లో బ్యాచ్లర్ డిగ్రీ పొందారు. సరోజ్ తన ఉన్నత చదువులను ఢిల్లీలో పూర్తి చేశారు. సరోజ్ తండ్రి తూఫానీ సరోజ్ మూడు సార్లు ఎంపీగా పని చేశారు. ప్రస్తుతం అతను జౌన్పూర్ జిల్లాలోని కేరాకట్ అసెంబ్లీ స్థానం నుంచి సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. -
ఇంగ్లండ్ చేరుకున్న టీమిండియా
లండన్: భారత క్రికెట్ జట్టు శనివారం ఉదయం ఇంగ్లండ్ చేరుకుంది. పూర్తిస్థాయి పర్యటనలో భాగంగా ముందుగా ఐదు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్లో పాల్గొంటుంది. 2025–27 కొత్త ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో భారత్–ఇంగ్లండ్ సిరీస్ భాగమవుతుంది. భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు సంప్రదాయ ఫార్మాట్కు రిటైర్మెంట్ పలకడంతో కొత్త కెప్టెన్ శుబ్మన్ గిల్ సారథ్యంలో యువ జట్టు ఇంగ్లండ్ గడ్డపై సత్తా చాటుకునేందుకు తహతహలాడుతోంది. నిజానికి ఇదివరకే పలువురు భారత క్రికెటర్లు ఇంగ్లండ్లో ఆడుగు పెట్టారు. ఇంగ్లండ్ లయన్స్తో అనధికారిక టెస్టులు ఆడుతున్నారు. ఐపీఎల్ ఫైనల్ ముగియడంతో మిగతా ఆటగాళ్లతో కూడిన బృందం తాజాగా వచ్చింది. ‘భారత జట్టులో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా సంప్రదాయ టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్కు రావడం మంచి అనుభూతినిస్తోంది’ అని సాయిసుదర్శన్ చేసిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పోస్ట్ చేసింది.భారత్ ‘ఎ’ 348 ఆలౌట్ నార్తంప్టన్: ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ జట్టు తొలి ఇన్నింగ్స్లో 89.3 ఓవర్లలో 348 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 319/7తో రెండో రోజు శనివారం ఆట ప్రారంభించిన భారత్ ‘ఎ’ జట్టు 6.3 ఓవర్లే ఆడి 29 పరుగులు జోడించింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ లయన్స్ ఆట నిలిచే సమయానికి 46 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. -
శతక్కొట్టిన కేఎల్ రాహుల్.. రాణించిన కరుణ్ నాయర్, జురెల్
ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం సహచర టీమిండియా సభ్యుల కంటే ముందుగానే ఇంగ్లండ్లో ల్యాండైన కేఎల్ రాహుల్ వచ్చీ రాగానే పని మొదలుపెట్టాడు. ఇంగ్లండ్ లయన్స్తో ఇవాళ (జూన్ 6) ప్రారంభమైన రెండో అనధికారిక టెస్ట్లో అర్ద సెంచరీ పూర్తి చేసి సెంచరీ దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ మ్యాచ్లో భారత-ఏ జట్టు ఓపెనర్గా బరిలోకి దిగిన రాహుల్ 151 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. యశస్వి జైస్వాల్కు జతగా బరిలోకి దిగిన రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి చాలా సంయమనంతో బ్యాటింగ్ చేశాడు. ఎలాంటి దూకుడైన షాట్లు ఆడకుండా, చెత్త బంతులను మాత్రమే బౌండరీలకు తరలించి ఇన్నింగ్స్ను నిర్మించాడు.మరో ఎండ్లో జైస్వాల్ (17), కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (11) తక్కువ స్కోర్లకే ఔటైనా, తొలి అనధికారిక టెస్ట్లో డబుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ సహకారంతో ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. తొలి టెస్ట్ ఫామ్నే కొనసాగించిన కరుణ్ ఈ మ్యాచ్లో కూడా భారీ స్కోర్ దిశగా సాగుతున్న వేల క్రిస్ వోక్స్ అతనికి అడ్డుకట్ట వేశాడు. వోక్స్ ఓ అద్భుతమైన బంతితో కరుణ్ను 40 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఎల్బీడబ్ల్యూ చేశాడు. కరుణ్ ఔటయ్యాక రాహుల్ ధృవ్ జురెల్తో కలిసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. తొలి టెస్ట్లో రెండు అర్ద సెంచరీలతో సత్తా చాటిన జురెల్.. రాహుల్తో కలిసి 50 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. 55 ఓవర్ల అనంతరం భారత్-ఏ స్కోర్ 234/3గా ఉంది. భారత్-ఏ కోల్పోయిన మూడు వికెట్లు క్రిస్ వోక్స్ ఖాతాలనే పడ్డాయి. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ లయన్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.పాపం సర్ఫరాజ్ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్కు అవకాశం ఇచ్చేందుకు గత మ్యాచ్లో సత్తా చాటిన సర్ఫరాజ్ ఖాన్ను తప్పించారు. సర్ఫరాజ్ తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్లో 92 పరుగులు చేశాడు. రాహుల్ ఓపెనర్గా రావడంతో కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ మూడో స్థానానికి డిమోట్ అయ్యాడు. బౌలింగ్ డిపార్ట్మెంట్లోనూ ఓ కీలక మార్పు జరిగింది. తొలి మ్యాచ్లో 3 వికెట్లతో రాణించిన ముకేశ్ కుమార్ స్థానంలో ఖలీల్ అహ్మద్ను బరిలోకి దించారు. అలాగే హర్ష్ దూబే స్థానంలో తనుశ్ కోటియన్ తుది జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్ లయన్స్తో రెండో అనధికారిక టెస్ట్ కోసం భారత-ఏ జట్టు..యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), కరుణ్ నాయర్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, తనుశ్ కోటియన్, అన్షుల్ కంబోజ్, తుషార్ దేశ్పాండే, ఖలీల్ అహ్మద్ -
రిటైర్మెంట్ ప్రకటించిన ఐపీఎల్ దిగ్గజం
ఐపీఎల్ దిగ్గజ బౌలర్ పియూశ్ చావ్లా క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఇవాళ (జూన్ 6) వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్తో పాటు దేశవాలీ క్రికెట్కు కూడా ఇది వర్తిస్తుందని పేర్కొన్నాడు. 36 ఏళ్ల పియూశ్ చావ్లాకు ఐపీఎల్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. View this post on Instagram A post shared by Piyush Chawla (@piyushchawla_official_)ఆరంభ సీజన్ నుంచి (2008) క్యాష్ రిచ్ లీగ్ ఆడుతున్న అతను 192 మ్యాచ్ల్లో 192 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్లో చహల్ (221), భువనేశ్వర్ కుమార్ (198) మాత్రమే చావ్లా కంటే ఎక్కువ వికెట్లు తీశారు. సునీల్ నరైన్ చావ్లాతో సమానంగా 192 వికెట్లు తీశాడు.2008లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్తో కెరీర్ ప్రారంభించిన చావ్లా.. ఆతర్వాత కేకేఆర్, సీఎస్కే, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు. చివరిగా 2024 సీజన్లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహించిన చావ్లాను ఈ సీజన్ మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్ బౌలర్ అయిన చావ్లా 2006లో టీమిండియా తరఫున టెస్ట్ అరంగేట్రం చేసి, ఆ ఫార్మాట్లో 3 మ్యాచ్లు ఆడి 7 వికెట్లు తీశాడు. ఆ తర్వాత 2007లో వన్డే, 2010లో టీ20 అరంగేట్రం చేసిన చావ్లా 25 వన్డేల్లో 32 వికెట్లు, 7 టీ20ల్లో 4 వికెట్లు తీశాడు. చావ్లా అంతర్జాతీయ కెరీర్ అంత సుదీర్ఘంగా సాగనప్పటికీ.. భారత్ గెలిచిన రెండు వరల్డ్కప్ టోర్నీల్లో భాగంగా ఉన్నాడు. చావ్లా 2007 టీ20 వరల్డ్కప్, 2011 వన్డే వరల్డ్కప్ గెలిచిన భారత జట్లలో సభ్యుడిగా ఉన్నాడు.ఉత్తర్ప్రదేశ్లోని అలీఘడ్లో జన్మించిన చావ్లా.. సొంత రాష్ట్రం తరఫున 2008-2013 వరకు దేశవాలీ క్రికెట్ ఆడాడు. ప్రస్తుతం అతను గుజరాత్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చావ్లాకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇందులో 137 మ్యాచ్లు ఆడిన చావ్లా మూడు 10 వికెట్ల ప్రదర్శనలు, 23 ఐదు వికెట్ల ప్రదర్శనల సాయంతో 446 వికెట్లు తీశాడు. దేశవాలీ క్రికెట్లో చావ్లా బ్యాటర్గానూ రాణించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతని పేరు మీద 6 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
ఆల్ది బెస్ట్ టీమిండియా.. ఇంగ్లండ్కు పయనమైన గిల్ సేన (ఫోటోలు)
-
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియాకు సంబంధించి కీలక అప్డేట్
భారత టెస్ట్ జట్టు పూర్తి స్థాయి కెప్టెన్ హోదాలో శుభ్మన్ గిల్ తొలిసారి మీడియా ముందుకు రానున్నాడు. ఇవాళ (జూన్ 5) సాయంత్రం 7:30 గంటలకు ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్లో జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్ను హాజరు కానున్నాడు. ఈ సమావేశానికి గిల్తో పాటు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హాజరవుతాడు.భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగనుంది. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా త్వరలోనే లండన్కు బయల్దేరుతుంది. ఈ సమావేశంలో గిల్, గంభీర్ ఇంగ్లండ్లో అనుసరించబోయే వ్యూహాలు, తదుపరి డబ్ల్యూటీసీ సైకిల్లో ప్రణాళికల గురించి మీడియాకు వివరిస్తారు. దిగ్గజ ఆటగాళ్లు రోహిత్, విరాట్, అశ్విన్ టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించాక జరుగనున్న సిరీస్ కావడంతో ఇంగ్లండ్ టూర్కు ప్రాధాన్యత సంతరించుకుంది. గిల్ ఇటీవలే రోహిత్ శర్మ నుంచి భారత టెస్ట్ జట్టు పగ్గాలు చేపట్టాడు. బుమ్రా, పంత్ లాంటి సీనియర్లు ఉన్నా బీసీసీఐ గిల్కే టెస్ట్ కెప్టెన్సీ అప్పగించింది. గిల్ నేతృత్వంలో భారత టెస్ట్ క్రికెట్లో కొత్త శకం మొదలుకానుంది. ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో యువకులు, అనుభవజ్ఞులు ఉన్నారు. వీరిని సమన్వయపరుచుకుంటూ గిల్ ఏ మేరకు నెట్టుకు రాగలడో చూడాలి. ఇంగ్లండ్ పర్యటనలో గిల్కు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) రిషబ్ పంత్ను నియమించారు.ఇంగ్లండ్ పర్యటనలో భారత్ జూన్ 20న తొలి టెస్ట్ ఆడనుంది. లీడ్స్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. అనంతరం జులై 2, 10, 23, 31 తేదీల్లో రెండు, మూడు, నాలుగు, ఐదు టెస్ట్ మ్యాచ్లు బర్మింగ్హమ్, లార్డ్స్, మాంచెస్టర్, కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికలుగా జరుగనున్నాయి. ఈ సిరీస్కు ముందు భారత్ జూన్ 13-16 మధ్యలో ఓ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడనుంది.ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపికైన మెజార్టీ సభ్యులు ఇప్పటికే ఇంగ్లండ్లో పర్యటిస్తున్నారు. భారత-ఏ జట్టులో భాగమైన వారు ఇంగ్లండ్ లయన్స్తో రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నారు. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ ఇదివరకే ముగిసింది. రెండో మ్యాచ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది.ఇంగ్లండ్ పర్యటన కోసం భారత టెస్ట్ జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ , వాషింగ్టన్ సుందర్, శార్దూల ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ -
సంజూ శాంసన్ ఉదారత
టీమిండియా ఆటగాడు సంజూ శాంసన్ ఉదారత చాటుకున్నాడు. తన ఫౌండేషన్ (SSF) తరఫున రానున్న విద్యా సంవత్సరం కోసం 100 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్లు, బూట్లు డొనేట్ చేశాడు. తన తల్లి లిజి శాంసన్ ఆథ్వర్యంలో ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థులకు స్కూల్ సామాగ్రిని ప్రదానం చేయించాడు. పేద విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సంజూ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని క్రికెట్ అభిమానులు అభినందిస్తున్నారు. సంజూ గతంలో కూడా తన ఫౌండేషన్ తరఫున చాలా సేవా కార్యక్రమాలు చేపట్టాడు. 🚨 A LOVELY GESTURE BY SANJU SAMSON 🚨- Sanju Samson Foundation has donated school bags & shoes to 100 students as they start their new academic year. 🫡 pic.twitter.com/o7kMc2zCSM— Johns. (@CricCrazyJohns) June 5, 2025ఇదిలా ఉంటే, సంజూ శాంసన్ తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్కు కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ సీజన్లో రాయల్స్ పెద్దగా పెర్ఫార్మ్ చేయలేకపోయింది. ఆ జట్టు 14 మ్యాచ్ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో సంజూ వ్యక్తిగతంగానూ ఆకట్టుకోలేకపోయాడు. గాయం కారణంగా చాలా మ్యాచ్లకు దూరంగా ఉన్న అతను.. ఆడిన మ్యాచ్ల్లోనూ స్థాయికి తగ్గ ప్రదర్శనలు ఇవ్వలేకపోయాడు.ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత టెస్ట్ జట్టులో సంజూ చోటు దక్కించుకోలేకపోయాడు. యువ వికెట్కీపర్లు రిషబ్ పంత్, ధృవ్ జురెల్, కేఎల్ రాహుల్ ఈ టూర్ కోసం ఎంపిక చేసిన జట్టులో స్థానం సంపాదించారు. పంత్, రాహుల్ జట్టులో పాతుకుపోయిన నేపథ్యంలో సంజూ టెస్ట్ కెరీర్ దాదాపుగా ముగిసిందనే చెప్పుకోవాలి. ఈ కేరళ వికెట్కీపర్ బ్యాటర్ కేవలం పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు మాత్రమే పరిమితమయ్యాడు. -
నిశ్చితార్థం చేసుకున్న టీమిండియా స్టార్ క్రికెటర్
టీమిండియా స్టార్ క్రికెటర్ కుల్దీప్ యాదవ్ తన చిన్ననాటి స్నేహితురాలు వన్షికతో ఇవాళ (జూన్ 4) నిశ్చితార్థం చేసుకున్నాడు. లక్నోలోని ఓ హోటల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. కుల్దీప్-వన్షిక సంప్రదాయ బద్దంగా ఉంగరాలు మార్చుకున్నారు. కాన్పూర్లోని శ్యామ్ నగర్ ప్రాంతానికి చెందిన వన్షిక ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తుంది. కుల్దీప్-వన్షిక ఎంగేజ్మెంట్కు యూపీకి చెందిన పలువురు క్రికెటర్లు, టీమిండియా విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ హాజరయ్యారు. వివాహా తేదీని కుల్దీప్ త్వరలో ప్రకటించనున్నాడు.Kuldeep Yadav gets engaged to his childhood friend Vanshika. (Abhishek Tripathi).- Many congratulations to them. ❤️ pic.twitter.com/fdTncdtYa4— Mufaddal Vohra (@mufaddal_vohra) June 4, 2025కుల్దీప్ తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్లో ఢిల్లీ ఆరంభంలో అద్బుత విజయాలు సాధించినా, ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. 30 ఏళ్ల కుల్దీప్ ఈ ఐపీఎల్ సీజన్లో 14 మ్యాచ్లు ఆడి 7.07 సగటున 15 వికెట్లు తీశాడు. కుల్దీప్ తర్వలో ఇంగ్లండ్తో జరుగబోయే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ ఒక్కడే. అశ్విన్ టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించాక కుల్దీప్ భారత టెస్ట్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారే అవకాశం ఉంది. ఇంగ్లండ్ పర్యటనలో రాణిస్తే అతనికి తిరుగే ఉండదు. కుల్దీప్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇదివరకే తనను తాను నిరూపించుకున్నాడు. టీమిండియా ఛాంపియన్గా నిలిచిన 2024 టీ20 వరల్డ్కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో కుల్దీప్ కీలకంగా వ్యవహరించాడు. -
ఇంగ్లండ్కు బయల్దేరిన కేఎల్ రాహుల్
త్వరలో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టాడు. రాహుల్ నిన్ననే ముంబై నుంచి లండన్కు బయల్దేరాడు. రాహుల్ లండన్లోని హీథ్రూ విమానాశ్రయంలో ల్యాండైన దృశ్యాలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.రాహుల్ ఇంగ్లండ్తో సిరీస్కు ముందు ఇంగ్లండ్ లయన్స్తో నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్ ఆడతాడు. ఈ మ్యాచ్ కోసమే రాహుల్ చాలా ముందుగా లండన్లో ల్యాండయ్యాడు. ఈ మ్యాచ్ జూన్ 6న ప్రారంభం కానుంది. నార్తంప్టన్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం తనను ముందుగానే ఇంగ్లండ్కు పంపాలని రాహుల్ బీసీసీఐకి ప్రత్యేక విజ్ఞప్తి చేశాడు. భారత్లో వాతావరణం ప్రాక్టీస్కు అనువుగా లేదని, అందుకే తనకు లయన్స్తో మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వాలని రాహుల్ బీసీసీఐని కోరాడు. రాహుల్ కోరిక మేరకు బీసీసీఐ అతన్ని ముందుగానే లండన్కు పంపింది.ఇంగ్లండ్తో సిరీస్కు ముందు భారత్-ఏ జట్టు ఇంగ్లండ్ లయన్స్తో రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ నిన్ననే ముగిసింది. ఈ మ్యాచ్ డ్రా అయ్యింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లకు మంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించింది. ఇంగ్లండ్ సిరీస్కు ఎంపికైన కరుణ్ నాయర్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్లో సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ తృటిలో సెంచరీలు మిస్ అయ్యారు. రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్, ధృవ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి అర్ద సెంచరీలతో రాణించారు.లయన్స్తో రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ తర్వాత భారత జట్టు ఓ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ జూన్ 13 నుంచి 16 వరకు జరుగుతుంది. అనంతరం జూన్ 20 నుంచి ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ కోసం శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు జూన్ 5వ తేదీ తర్వాత లండన్కు బయల్దేరుతుంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ సిరీస్కు ముందే గిల్ను కెప్టెన్గా ఎంపిక చేశారు. ఈ సిరీస్కు ముందే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు భారత జట్టు..శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్..జూన్ 20-24- తొలి టెస్ట్ (లీడ్స్)జులై 2-6- రెండో టెస్ట్ (బర్మింగ్హమ్)జులై 10-14- మూడో టెస్ట్ (లార్డ్స్)జులై 23-27- నాలుగో టెస్ట్ (మాంచెస్టర్)జులై 31-ఆగస్ట్ 4- ఐదో టెస్ట్ (కెన్నింగ్స్టన్ ఓవల్) -
విరాట్ కోహ్లికి అవమానం.. 18 నంబర్ జెర్సీ మరొకరికి కేటాయింపు
భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరైన విరాట్ కోహ్లికి అవమానం జరిగింది. టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత విరాట్ జెర్సీ నంబర్ 18ని మరొకరి కేటాయించారు. ఇంగ్లండ్ లయన్స్తో జరుగుతున్న మ్యాచ్లో భారత-ఏ జట్టు ఆటగాడు ముకేశ్ కుమార్ 18 నంబర్ జెర్సీని ధరించి కనిపించాడు. బీసీసీఐ ఏ ఉద్దేశంతో ముకేశ్కు ఈ జెర్సీ నంబర్ కేటాయించిందోతెలీదు కానీ, విరాట్ అభిమానులు మాత్రం ఈ విషయమై మండిపడుతున్నారు. ఇది తమ ఆరాధ్య ఆటగాడిని అవమానించినట్లే అని బీసీసీఐని టార్గెట్ చేస్తున్నారు.క్రికెట్లో దిగ్గజ ఆటగాళ్లకు సంబంధించిన జెర్సీ నంబర్లను ఇతరులకు కేటాయించకపోవడం ఆనవాయితీ. అయితే ఈ ఆనవాయితీకి బీసీసీఐ తూట్లు పొడిచింది. విరాట్ విషయంలో మొదటి నుంచి పట్టీపట్టనట్లుండే బీసీసీఐ మరోసారి దిగ్గజ ఆటగాడిని అవమానింది. టెస్ట్ల్లో టీమిండియాను తిరుగులేని శక్తిగా నిలబెట్టడంతో విరాట్ కీలకపాత్ర పోషించాడు. అతను కెప్టెన్గా ఉన్న సమయంలో భారత్ చాలాకాలం పాటు నంబర్ వన్ జట్టుగా కొనసాగింది. విరాట్ నాయకత్వంలో టీమిండియా అపురూప విజయాలు సాధించింది. వ్యక్తిగతంగానూ విరాట్కు టెస్ట్ల్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది.అలాంటి విరాట్కు టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించాక బీసీసీఐ కనీసం వీడ్కోలు సభ కూడా ఏర్పాటు చేయలేదు. సాధారణంగా దిగ్గజ ప్లేయర్లు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించినా సంబంధిత క్రికెట్ బోర్డులు వారిని గౌరవించుకుంటాయి. అయితే బీసీసీఐ అలాంటి ప్లాన్లు ఏమీ చేయకపోగా.. దిగ్గజ ఆటగాడిని అవమానిస్తుంది. విరాట్ జెర్సీ నంబర్ను ఇతరులకు కేటాయించడంపై విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కూడా పెదవి విరుస్తున్నారు. భారత క్రికెట్కు విరాట్ ఎంతో చేశాడని, అతని జెర్సీని ఇతరులకు కేటాయించకపోవడం కనీస ధర్మమని అంటున్నారు.ఇదిలా ఉంటే, తొలుత టీ20లకు, ఆతర్వాత టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతను ఐపీఎల్ 2025తో బిజీగా ఉన్నాడు. విరాట్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్సీబీ ఈ సీజన్లో ఫైనల్కు చేరింది. ఈసారి టైటిల్ సాధించి ఐపీఎల్ కెరీర్కు ముగింపు పలకాలని విరాట్ భావిస్తున్నాడు. జూన్ 3న ఐపీఎల్ 2025 ఫైనల్ జరుగుతుంది. ఇవాళ (జూన్ 1) జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్లో (ముంబై వర్సెస్ పంజాబ్) విజేతతో ఆర్సీబీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది. -
England Tour: డబుల్ సెంచరీకి చేరువలో కరుణ్ నాయర్
ఇంగ్లండ్ లయన్స్తో ఇవాళ (మే 30) మొదలైన తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్లో భారత-ఏ జట్టు ఆటగాళ్లు కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ ఇరగదీశారు. వీరిలో కరుణ్ నాయర్ డబుల్ సెంచరీకి చేరువలో (186 నాటౌట్) ఉండగా.. సర్ఫరాజ్ ఖాన్ (119 బంతుల్లో 92; 13 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. సర్ఫరాజ్ ఔటయ్యాక క్రీజ్లోకి వచ్చిన ధృవ్ జురెల్ (82 నాటౌట్) అర్ద సెంచరీతో ఆకట్టుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్-ఏ 3 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది.కాంటర్బరీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత-ఏ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది. భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కమ్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 8 పరుగులకే ఔటయ్యాడు. ఆతర్వాత మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కరుణ్ నాయర్తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో జైస్వాల్ కూడా 24 పరుగుల వద్ద ఔటయ్యాడు.జైస్వాల్ ఔటయ్యాక ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను కరుణ్ నాయర్ తీసుకున్నాడు. కరుణ్.. సర్ఫరాజ్ సహకారంతో అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారత జట్టును గౌరవప్రదమైన స్కోర్ దిశగా తీసుకొచ్చాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్ కూడా ఔటయ్యాడు. సర్ఫరాజ్ ఔటయ్యే సమయానికే భారత్ పటిష్ట స్థితిలో ఉంది.సర్ఫారాజ్ ఔటయ్యాక క్రీజ్లోకి వచ్చిన ధృవ్ జురెల్ కూడా ఇరగదీశాడు. కరుణ్, జురెల్ ఇద్దరు పోటీపోటీగా ఆడుతూ భారత్ను అతి భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తున్నారు. -
మరోసారి తండ్రైన టీమిండియా క్రికెటర్
టీమిండియా క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్ మరోసారి తండ్రి అయ్యాడు. అతని భార్య రిన్నీ కంతారియా ఈ నెల 18న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఉనద్కత్ ఇవాళ (మే 28) సాయంత్రం సోషల్మీడియా వేదికగా వెల్లడించాడు. ఉనద్కత్, రిన్నీ 2021లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2023 డిసెంబర్లో జేడన్ (మగబిడ్డ) జన్మించాడు.👼🏻❤️ pic.twitter.com/Maoc5AbA3h— Jaydev Unadkat (@JUnadkat) May 28, 202533 ఏళ్ల ఉనద్కత్ ఐపీఎల్ 2025లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడాడు. ఈ సీజన్లో అతను 7 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీశాడు. ఈ సీజన్లో సన్రైజర్స్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఉనద్కత్ రంజీల్లో సౌరాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తాడు. ఆ జట్టుకు అతను కెప్టెన్గానూ వ్యవహరిస్తున్నాడు. అతని సారథ్యంలో సౌరాష్ట్ర 2020లో రంజీ ట్రోఫీ గెలిచింది. ఇది ఆ జట్టుకు తొలి టైటిల్. 2010లో టీమిండియా అరంగేట్రం చేసిన ఉనద్కత్.. మధ్యలో చాలాకాలం జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. 15 ఏళ్లలో అతను టీమిండియా తరఫున 4 టెస్ట్లు, 8 వన్డేలు, 10 టీ20లు మాత్రమే ఆడాడు. ఇందులో 26 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో ఉనద్కత్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. క్యాష్ రిచ్ లీగ్లోనూ 2010లోనే కెరీర్ ప్రారంభించిన ఉనద్కత్.. ఇప్పటివరకు వివిధ ఫ్రాంచైజీల తరఫున 112 మ్యాచ్లు ఆడి 110 వికెట్లు తీశాడు. -
సెంచరీలు మీద సెంచరీలు చేసినా..
టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు, టైమ్ కూడా కలసిరావాలంటారు పెద్దవాళ్లు. అవును నిజమే.. ఎంత ప్రతిభ ఉన్నా కూడా, లక్ లేకపోతే వెనుబడిపోయే చాన్స్ ఉంది. టాలెంట్ను నిరూపించే వేదిక దొరక్కపోతే తెర మరుగు కావడం ఖాయం. అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతే ఆ బాధ వర్ణణాతీతం. పోటీ ఎక్కువగా ఉండే క్రీడల్లో దేశం తరపున ఆడే అవకాశం దక్కినా బరిలోకి దిగే చాన్స్ రాక చాలా మంది వెలుగులోకి రాలేకపోయారు.క్రికెట్ కెరీర్గా ఎంచుకున్న ప్రతి ప్లేయర్ దేశం తరపున ఆడాలని కలలుగంటారు. జాతీయ జట్టులో స్థానమే లక్ష్యంగా కష్టపడుతుంటారు. బ్లూ క్యాప్, జెర్సీతో బరిలోకి దిగాలని వర్ధమాన భారత క్రికెటర్లు అహరహం శ్రమిస్తుంటారు. కానీ జాతీయ జట్టులో ఆడే అరుదైన అవకాశం కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. చాన్స్ దక్కించున్న వారిలో నిలదొక్కునే వారు అతి కొద్ది మంది మాత్రమే. ఇక జట్టులో చోటు దక్కినా మైదానంలో బరిలోకి దిగే అవకాశం రాని దురదృష్టవంతులూ ఉన్నారు. అలాంటి వారిలో ప్రియాంక్ పంచల్ (Priyank Panchal) ఒకరు.విషయం అర్థమైందిదేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించిన ప్రియాంక్ పంచల్ టీమిండియా (Team India) తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. దేశీయ క్రికెట్లో అత్యంత నిలకడగా రాణిస్తున్న బ్యాట్స్మెన్లో ఒకరైన 35 ఏళ్ల ఈ స్టార్ గుజరాతీ బ్యాటర్.. మూడు ఫార్మాట్లలో ఏ ఒక్కదానిలోనూ భారత జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేయలేకపోయాడు. దీంతో 17 ఏళ్ల క్రికెట్ కెరీర్కు తాజాగా వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు సోమవారం ప్రకటించాడు. 'టీమిండియాలో ఎప్పటికీ నాకు చోటు దక్కదనే విషయం అర్థమైంది' అంటూ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు.చాన్స్ రాలేదుడొమెస్టిక్ సూపర్స్టార్గా పేరొందిన ప్రియాంక్.. 127 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 45.18 సగటు, 23 సెంచరీలతో 8856 పరుగులు సాధించి సత్తా చాటాడు. దేశీయ క్రికెట్లో అత్యంత నిలకడగా రాణించిన బ్యాటర్లలో ఒకరైన ప్రియాంక్ పేరు పలుమార్లు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముందు వచ్చింది. 2021-22లో దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా తరపున అరంగేట్రం చేయడానికి దగ్గరగా వచ్చాడు కానీ బ్లూ క్యాప్ దక్కించులేకపోయాడు. టెస్ట్ సిరీస్కు రోహిత్ శర్మ స్థానంలో రిజర్వ్ ఓపెనర్గా ఎంపికయ్యాడు కానీ అతడికి ఆడే అవకాశం రాలేదు. 2022లోనూ శ్రీలంక టూర్కు సెలెక్ట్ అయినా అరంగ్రేటం చేసే చాన్స్ రాలేదు.టైమ్ ముఖ్యంతనకు జాతీయ జట్టులో ఆడేందుకు రాసిపెట్టి లేదని భావించిన ప్రియాంక్ ఇప్పటి వరకు దేశీయ క్రికెట్లోనే కొనసాగుతూ తానేంటో నిరూపించుకున్నాడు. సెంచరీలు మీద సెంచరీలు చేసినా, టైమ్ కలిసి రాకపోతే తనలాగే అవుతుందని సరిపెట్టుకున్నాడు. 'క్రికెట్లో నిలకడగా ఆడాలి. ఆటగాడిగా మంచి ప్రదర్శన ఇవ్వాలి. సరైన సమయంలో ప్రదర్శన ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. అంతర్జాతీయ క్రికెట్లో సమయం చాలా విలువైనది. నిలకడగా 100 తర్వాత 100 పరుగులు చేస్తూనే ఉన్నప్పటికీ.. మీ జట్టు గెలవకపోతే, అది సరైన సమయం కాదు. కానీ 30 పరుగులు చేసినప్పటికీ.. జట్టు గెలిస్తే మీ సహకారం చాలా విలువైనది. అంతర్జాతీయ క్రికెట్కు అది అవసరం. దాని నుండి నేను చాలా నేర్చుకున్నాన'ని ప్రియాంక్ పేర్కొన్నాడు.బాధగానే ఉంది.. కానీటీమిండియా తరపున ఆడలేకపోవడం బాధగానే ఉందని ప్రియాంక్ చెప్పాడు. అయితే క్రికెట్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూం షేర్ చేసుకునే అవకాశం రావడం మామూలు విషయం కాదన్నాడు. రిటైర్మెంట్ గురించి చాలా రోజులుగా ఆలోచన చేస్తున్నానని, ఇప్పుడే సరైన సమయం అని భావించి నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు. చదవండి: ఐపీఎల్ 2025 తర్వాత రిటైర్ కానున్న క్రికెటర్లు వీరేనా?'రిటైర్ అవ్వాలనే ఆలోచన నా మనసులో చాలా కాలంగా ఉంది. ఎందుకంటే, నేను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు.. టీమిండియాకు ఆడాలన్న ఆకాంక్ష నన్ను నడిపించేంది. క్రమశిక్షణ, అంకిత భావంతో ఆడి జాతీయ జట్టులో చోటు కోసం శాయశక్తులా ప్రయత్నించాను. కానీ అవకాశాలు చేజారాక నేను ఆచరణాత్మకంగా ఆలోచించడం మొదలుపెట్టాను. టీమిండియాలో నాకు ఇక చోటు దక్కదని గ్రహించాను. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాన'ని ప్రియాంక్ వివరించాడు. -
ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి ఎగబాకిన పాక్ ప్లేయర్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్లో పాకిస్తాన్ బౌలర్ సదియా ఇక్బాల్ అగ్రస్థానానికి ఎగబాకింది. సదియా.. ఇంగ్లండ్ బౌలర్ సోఫీ ఎక్లెస్టోన్ను కిందకు దించి టాప్ ప్లేస్కు చేరుకుంది. గత వారం ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉండిన సదియా ఓ స్థానం మెరుగుపర్చుకుంది.తాజాగా స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో ఎక్లెస్టోన్ పాల్గొనకపోవడంతో సదియా అగ్రపీఠాన్ని దక్కించుకుంది. సదియా ఖాతాలో 746 రేటింగ్ పాయింట్లు ఉండగా.. ఎక్లెస్టోన్ ఖాతాలో 734 పాయింట్లు ఉన్నాయి. ఎక్లెస్టోన్ మూడు స్థానాలు కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోయింది.భారత స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ (737 పాయింట్లు), ఆసీస్ బౌలర్ అన్నాబెల్ సదర్ల్యాండ్ తలో స్థానం మెరుగుపర్చుకుని రెండు, మూడు స్థానాలకు ఎగబాకారు. భారత పేసర్ రేణుక సింగ్ ఠాకూర్ ఐదో స్థానాన్ని నిలబెట్టుకుంది.ఇంగ్లండ్ బౌలర్ లారెన్ బెల్ ఏకంగా 13 స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరింది. మరో ఇంగ్లండ్ బౌలర్ చార్లీ డీన్, పాకిస్తాన్ బౌలర్ సష్రా సంధు, ఆస్ట్రేలియా బౌలర్ జార్జియా వేర్హమ్ ఏడు నుంచి తొమ్మిది స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్ సారా గ్లెన్ నాలుగు స్థానాలు కోల్పోయి పదో స్థానానికి పడిపోయింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ 16, శ్రేయాంక పాటిల్ 21, పూజా వస్త్రాకర్ 33 స్థానాల్లో ఉన్నారు.బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. బెత్ మూనీ టాప్ ప్లేస్ను నిలబెట్టుకుంది. విండీస్ స్టార్ బ్యాటర్ హేలీ మాథ్యూస్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగు నుండి రెండో స్థానానికి చేరింది. ఆసీస్ బ్యాటర్ తహిళ మెక్గ్రాత్, టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన తలో స్థానం కోల్పోయి మూడు, నాలుగు స్థానాలకు పడిపోయారు. ఇంగ్లండ్ బ్యాటర్ నాట్ సీవర్ బ్రంట్ ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానానికి ఎగబాకింది. ఆల్రౌండర్ల విషయానికొస్తే.. హేలీ మాథ్యూస్, అమేలియా కెర్, దీప్తి శర్మ టాప్-3లో కొనసాగుతున్నారు. -
మనమంతా టీమిండియా
న్యూఢిల్లీ: కేంద్రం, రాష్ట్రాలను ‘టీమిండియా’గా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. అవి కలసికట్టుగా పని చేస్తే ఏ అభివృద్ధి లక్ష్యమూ అసాధ్యం కాబోదని ధీమా వెలిబుచ్చారు. శనివారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి 10వ భేటీకి ఆయన సారథ్యం వహించారు. వికసిత భారత్–2047 థీమ్తో భేటీ సాగింది. 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులు భేటీలో పాల్గొన్నట్టు నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం వెల్లడించారు. పశ్చిమబెంగాల్, బిహార్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలు పాల్గొనలేదని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం ముఖ్యమంత్రులతో మోదీ సమావేశమవడం ఇదే తొలిసారి. ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రం ఏర్పాటయ్యేలా కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రధాని సూచించారు. పహల్గాం ఉగ్ర దాడి లక్ష్యాల్లో జమ్మూకశీ్మర్లో పర్యాటకాన్ని దెబ్బ తీయడం కూడా ఉన్న నేపథ్యంలో ఈ సూచన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘ప్రతి గ్రామం, ప్రతి మున్సిపాలిటీ, ప్రతి నగరం, ప్రతి రాష్ట్రమూ ప్రగతి సాధించడమే మన లక్ష్యం కావాలి. అప్పుడు దేశమంతా దానంతటదే వృద్ధి చెందుతుంది. గడువు లోపలే వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకుంటాం. ఆ దిశగా అభివృద్ధి పనుల వేగం మరింత పెంచుదాం. 140 కోట్ల పైచిలుకు భారతీయుల ఆకాంక్షలను నెరవేరుద్దాం’’ అని రాష్ట్రాలకు ప్రధాని పిలుపునిచ్చారు. భారత్లో పట్టణీకరణ శరవేగంగా సాగుతోందని గుర్తు చేశారు. కనుక నగరాలను సుస్థిరాభివృద్ధి, ఇన్నోవేషన్ల కలబోతగా, భవిష్యత్ అవసరాలకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండేలా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ‘‘మహిళా శక్తికి మరింత ప్రాధాన్యమివ్వాలి. అప్పుడే మనమంతా ఆశించిన విధంగా దేశప్రగతి సాధ్యపడుతుంది. శ్రామిక శక్తిలో మహిళలను మరింతగా భాగస్వాములను చేయాలి. అందుకు అనుగుణంగా చట్టాలు, విధానాలను రూపొందించుకోవాలి’’ అని మోదీ చెప్పారు.కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 50 శాతం: సీఎంలుకేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 50 శాతానికి పెంచాలని తమిళనాడు, పంజాబ్ ముఖ్యమంత్రులు ఎం.కె.స్టాలిన్, భగవంత్ మాన్ డిమాండ్ చేశారు. ‘‘రాష్ట్రాలకు 41 శాతం వాటా ఇస్తామని మాటిచ్చారు. కానీ 33.16 శాతమే ఇస్తున్నారు. తమిళనాడు దేశంలోకెల్లా అత్యంత పట్టణీకరణ చెందిన రాష్ట్రం. అమృత్ 2.0 పథకం కింద రాష్ట్రానికి ప్రత్యేక పట్టణీకరణ మిషన్ను మంజూరు చేయాలని ఎప్పటినుంచో కోరుతున్నాం. నమామి గంగ తరహాలో తమిళనాడులోని కావేరీ, వైగే తదితర నదుల ప్రక్షాళనకు ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేయాలి’’ అని స్టాలిన్ కోరారు. ఆ ప్రాజెక్టులకు పేర్లను ఇంగ్లిష్లోనే పెట్టాలన్నారు. పంజాబ్లో పాకిస్తాన్ను ఆనుకుని ఉండే ఆరు సరిహద్దు జిల్లాలకు ప్రత్యేక పారిశ్రామిక ప్యాకేజీ అందించాలని కేంద్రానికి మాన్ విజ్ఞప్తి చేశారు. సరిహద్దు ప్రాంతాల రైతులకు ఇస్తున్న ఎకరాకు రూ.10 వేల పరిహారాన్ని రూ.30 వేలకు పెంచాలన్నారు. సిక్కిం, పశ్చిమబెంగాల్లోని సిలిగురిలను కలుపుతూ ప్రపంచస్థాయి జాతీయ రహదారి నిర్మించాల్సిన అవసరం చాలా ఉందని సిక్కిం సీఎం ప్రేంసింగ్ తమాంగ్ అన్నారు.విధాన అడ్డంకులు తొలగించాలన్నారు: సీఈఓ భేటీ వివరాలను నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రమణ్యం మీడియాకు వెల్లడించారు. ‘‘వ్యవసాయం, విద్య, వైద్య రంగాలపై మరింతగా దృష్టి సారించాలని రాష్ట్రాలకు ప్రధాని సూచించారు. పెట్టుబడులను మరింతగా ఆకర్షించాలని, తద్వారా ఇతోధికంగా ఉపాధి అవకాశాలను సృష్టించాలని, అందుకోసం విధానపరమైన అడ్డంకులను తొలగించుకోవాలని హితవు పలికారు’’ అని చెప్పారు. భేటీలో పాల్గొన్న సీఎంలు, నేతలు ఆపరేషన్ సిందూర్ను ముక్తకంఠంతో సమరి్థంచారన్నారు. జైరాంతో కాంగ్రెస్కే చేటు: బీజేపీ నీతి ఆయోగ్ ఓ ‘అయోగ్య’ (అసమర్థ) సంస్థ అన్న కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్కే చేటు చేసే వివాదాలను సృష్టించడం ఆయన నైజమని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ను జైరాం భూస్థాపితం చేయడం ఖాయమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ జోస్యం చెప్పారు.నవ్వుల్ పువ్వుల్ ఆయోగ్ భేటీలో సరదా సన్నివేశాలు ప్రధాని, ముఖ్యమంత్రుల నడుమ పలు సరదా సన్నివేశాలకు నీతి ఆయోగ్ భేటీ వేదికైంది. సమావేశం ముగిశాక రేవంత్రెడ్డి, స్టాలిన్ తదితరులతో మోదీ సరదా సంభాషణలు జరిపారు. నవ్వుతూ, వారిని నవి్వస్తూ కని్పంచారు. భగవంత్ మాన్ (పంజాబ్), హేమంత్ సోరెన్ (జార్ఖండ్), కొన్రాడ్ సంగ్మా (నాగాలాండ్) తదితరులు మోదీతో చాలాసేపటిదాకా కరచాలనం చేస్తూ కన్పించారు. వారితో ప్రధాని సరదాగా మాట్లాడారు. ఈ సందర్భంగా నేతలంతా తేనీరు సేవిస్తూ ఉల్లాసంగా గడిపారు. -
భారత క్రికెట్లో ‘సుదర్శన’ మంత్రం
దాదాపు రెండున్నరేళ్ల క్రితం ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్, తమిళనాడు మధ్య రంజీ ట్రోఫీ మ్యాచ్... తొలి ఇన్నింగ్స్లో హైదరాబాద్ తరఫున రెండు, తమిళనాడు తరఫున మూడు సెంచరీలు నమోదయ్యాయి. మ్యాచ్ సాధారణ ‘డ్రా’ దిశగా సాగుతున్నట్లు అనిపించింది. అయితే రెండో ఇన్నింగ్స్లో హైదరాబాద్ కుప్పకూలింది. దాంతో చివరి రోజు తమిళనాడు విజయలక్ష్యం 11 ఓవర్లలో 144... సాధారణంగా ఇలాంటి స్థితిలో బ్యాటర్లు మైదానంలోకి దిగి లాంఛనంగా కొన్ని బంతులు ఆడి ‘షేక్ హ్యాండ్’కు సిద్ధమవుతారు. కానీ తమిళనాడు టి20 శైలిలో గెలుపుపై గురి పెట్టింది. ఒకవైపు సీనియర్ జగదీశన్ చెలరేగుతుండగా మరో ఓపెనర్ తన విధ్వంసకర బ్యాటింగ్తో 20 బంతుల్లోనే 5 సిక్సర్లతో 42 పరుగులు బాదాడు. 7 ఓవర్లలో స్కోరు 108/1. అనూహ్యంగా వెలుతురులేమితో మ్యాచ్ను అంపైర్లు నిలిపివేయడంతో హైదరాబాద్ బతికిపోయింది. అయితే 21 ఏళ్ల ఆ ఓపెనర్ ఆటపై అన్ని వైపుల నుంచి అసాధారణ ప్రశంసలు వెల్లువెత్తాయి. తొలి ఇన్నింగ్స్లోనూ సెంచరీ బాది ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన ఆ కుర్రాడే సాయి సుదర్శన్. అతనికిదే తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కావడం విశేషం. నాలుగు సీజన్ల పాటు దేశవాళీ క్రికెట్లో నిలకడైన ఆటతో ‘ఆల్ ఫార్మాట్’ ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకున్న సుదర్శన్ ఇప్పుడు ఇంగ్లండ్తో సిరీస్కు ఎంపిక చేయనున్న ఆటగాళ్లలో ముందు వరుసలో ఉన్నాడు. - సాక్షి క్రీడా విభాగం రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేయడానికి ముందే సాయి సుదర్శన్ ఐపీఎల్లో ఒక సీజన్ ఆడాడు. 2022లో ఐదు మ్యాచ్లలో కలిపి 114 బంతులు ఎదుర్కొని ఒక హాఫ్ సెంచరీ సహా 145 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. అయితే ఐపీఎల్లో ఒక ఏడాది బాగా ఆడి ఆ తర్వాత ఎంతో మంది కనుమరుగైన ఉదంతాలు ఉన్నాయి కాబట్టి అతని ప్రదర్శనను ఎవరూ అంత సీరియస్గా చూడలేదు. కానీ రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్లోనే అతని ఆటను చూశాక భవిష్యత్తులో చాలా తొందరగా భారత్కు ఆడగల సత్తా ఉన్న ప్లేయర్గా సుదర్శన్కు గుర్తింపు లభించింది.రంజీ ఆరంభానికి చాలా ముందే ‘ఈ అబ్బాయిలో ఎంతో ప్రత్యేకత ఉంది. సాధ్యమైనంత తొందరగా ఇతడిని తమిళనాడు జట్టులోకి తీసుకోండి’ అంటూ స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ చేసిన సూచనను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకుంటూ ‘ఫాస్ట్ ట్రాక్’తో ముందు టి20ల్లోకి, ఆ తర్వాత వన్డేల్లోకి, ఆపై రంజీ టీమ్లోకి ఎంపిక చేశారు. తనపై ఉంచిన ఆ నమ్మకాన్ని అతను నిలబెట్టుకున్నాడు. ఒక్కసారి తమిళనాడు జట్టులోకి వచ్చాక తనకు లభించిన ప్రతీ అవకాశాన్ని సుదర్శన్ సమర్థంగా ఉపయోగించుకున్నాడు. చూడచక్కటి ఆటతో... సుదర్శన్ బ్యాటింగ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘క్లాస్’ తరహా శైలి అతనిది. చక్కటి డ్రైవ్లతో అలవోకగా ఫోర్లు రాబట్టడం అతనికి బాగా తెలిసిన విద్య. అవసరమైన సమయంలో గేర్లు మార్చి సిక్స్లు కొట్టినా అందులోనూ ఒక కళ ఉంటుంది. అప్పుడప్పుడు పుల్, హుక్ షాట్లతో పాటు స్లాగ్ స్వీప్లు, స్కూప్ షాట్లను కూడా ఐపీఎల్లో సుదర్శన్ చూపించాడు. టి20లు అయినా సరే లెక్క లేనితనంతో గుడ్డిగా బ్యాట్ ఊపే తత్వం కాదు. తనకు ఏం కావాలనే దానిపై అతనికి మంచి అవగాహన ఉంది. ఐపీఎల్లో నాలుగు సీజన్ల కెరీర్ చూస్తే అతని బ్యాటింగ్లో ఎక్కడా తడబాటు కనిపించకపోవడమే కాదు... అనవసరపు చెత్త షాట్లతో అవుటైన సందర్భాలు చాలా అరుదు. ఇదే అతడిని ఇతర దేశవాళీ బ్యాటర్లతో పోలిస్తే భిన్నంగా నిలబెట్టింది. అందుకే ఐపీఎల్లో చెలరేగుతున్న సమయంలో అతడిని టెస్టు జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ అన్ని వైపుల నుంచి వినిపించడం సుదర్శన్ బ్యాటింగ్పై నమ్మకాన్ని చూపిస్తోంది. సరిగ్గా చెప్పాలంటే టి20 ఫార్మాట్లో ఇప్పుడు అందరినీ ఆకట్టుకున్నా... సుదర్శన్ వన్డేలూ బాగా ఆడగలడు కాబట్టే ముందుగా అదే ఫార్మాట్లో తొలి అవకాశం దక్కింది. ఇక టెస్టు క్రికెట్కు సరిపోగల బ్యాటింగ్ నైపుణ్యం, పట్టుదల, టెక్నిక్ అతనిలో పుష్కలంగా ఉన్నాయి. అమ్మా నాన్న అండతో... సాయి సుదర్శన్ ఇప్పటికే భారత సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 3 వన్డేలు ఆడితే వరుసగా 55 నాటౌట్, 62, 10 పరుగులు సాధించాడు. బరిలోకి దిగిన ఏకైక టి20లో బ్యాటింగ్ అవకాశం రాలేదు. వేర్వేరు కారణాలతో ఆ తర్వాత అతనికి అవకాశాలు లభించలేదు. సుదర్శన్ టి20 సామర్థ్యమేమిటో ఐపీఎల్ చూపించింది. నిజానికి ఈ ఫార్మాట్లో తమిళనాడు ప్రీమియర్ లీగ్లో అదరగొట్టడంతోనే అతను ముందుగా వెలుగులోకి వచ్చాడు. అయితే అనూహ్యంగా మెరిసి ఆపై మళ్లీ కనబడకుండా పోయే ఆటగాళ్ల జాబితాలో అతను చేరరాదని సుదర్శన్ తల్లిదండ్రులు భావించారు. అందుకే పక్కా ప్రణాళికతో, సరైన కోచింగ్తో అతడికి వారు మార్గనిర్దేశనం చేశారు. క్రీడాకారుల కుటుంబం నుంచి రావడం కూడా అతనికి ఎంతో మేలు చేసింది. అథ్లెట్ అయిన తండ్రి భరద్వాజ్ ‘శాఫ్’ క్రీడల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించగా...తల్లి ఉష తమిళనాడు రాష్ట్ర జట్టు తరఫున వాలీబాల్ ఆడింది. పదేళ్ల వయసులో క్రికెట్ మొదలు పెట్టిన సుదర్శన్ ఆ తర్వాత మెల్లగా ఒక్కో మెట్టే ఎక్కుతూ వివిధ వయో విభాగాల్లో రాణిస్తూ ముందంజ వేశాడు. అండర్–19 చాలెంజర్ ట్రోఫీ తర్వాత భారత్ ‘ఎ’కు ఆడిన తర్వాత రెగ్యులర్గా మారాడు. వరుసగా రెండు ఐపీఎల్లలో 500కు పైగా పరుగులు సాధించి తన విలువేమిటో అతను చూపించాడు. టెస్టులకు చేరువలో...దేశవాళీలో నిలకడైన ప్రదర్శన, ప్రస్తుత ఫామ్, రోహిత్, కోహ్లిల రిటైర్మెంట్తో ఖాళీలు... ఇప్పుడు అన్నీ సరిగ్గా సరిపోయే సందర్భం 24 ఏళ్ల సుదర్శన్ కోసం వచ్చింది. దాదాపు 40 పరుగుల ఫస్ట్ క్లాస్ సగటు అసాధారణం కాకపోయినా... 29 మ్యాచ్లలో 1957 పరుగుల అనుభవం టెస్టు టీమ్లో అవకాశం కల్పించడానికి సరిపోతుంది. ప్రస్తుత టీమ్లో రాహుల్ ఓపెనింగ్ స్థానానికి మారితే మిడిలార్డర్ సుదర్శన్కు సరైన స్థానం కాగలదు. పైగా రెండు సీజన్ల పాటు ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో ‘సర్రే’ టీమ్కు ప్రాతినిధ్యం వహించడం కూడా అతనికి మరో అదనపు అర్హతగా మారనుంది. భారత్ తరఫున టెస్టు ఆడే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు ఇటీవల వెల్లడించిన సుదర్శన్ కోరిక త్వరలోనే తీరవచ్చు. ఇదే జోరును అతను కొనసాగిస్తే స్థానం సుస్థిరం కూడా కావచ్చు. -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టీమిండియా యువ క్రికెటర్
టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. లావుగా ఉన్నాడని విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కఠినమైన వ్యాయామాలతో పాటు ఆహారపు నియమాలు పాటించి ఆరు వారాల్లో 10 కిలోలు తగ్గాడు. ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు ముందు ఫిట్నెస్ మెరుగుపర్చుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్న సర్ఫరాజ్.. కఠోరమైన నియమనిబంధనలు పాటించి స్లిమ్గా తయారయ్యాడు. ఇంకా ఫిట్గా, బెటర్ క్రికెటర్గా తయారయ్యేందుకు ఇంకాస్త బరువు తగ్గుతానని సర్ఫరాజ్ అంటున్నాడు.కొత్త లుక్లో సర్ఫరాజ్ ఖాన్ను ఎవరూ పోల్చుకోలేకపోతున్నారు. సర్ఫరాజ్ న్యూ లుక్కు సంబంధించిన ఫోటోలు సోషల్మీడియాలో వైరవలువుతున్నాయి. బరువు తగ్గకముందు, బరువు తగ్గాక సర్ఫరాజ్లో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. బరువు తగ్గాక సర్ఫరాజ్ ఎంతో ఉత్సాహంగా, స్మార్ట్గా కనిపిస్తున్నాడు.కాగా, 27 ఏళ్ల సర్ఫరాజ్ ఓవర్ వెయిట్ కారణంగా చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అపారమైన నైపుణ్యమున్నప్పటికీ.. ఆ ఒక్కటీ (ఓవర్ వెయిట్) సర్ఫరాజ్ను టార్గెట్ చేసేలా ఉండింది. దీంతో ఇంగ్లండ్ పర్యటనకు ముందు అతను స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా జిమ్లో జాయిన్ అయ్యాడు. న్యూట్రిషియన్ను పెట్టుకున్నాడు. ఉదయాన్నే గంట పాటు జాగింగ్, ఆతర్వాత అరగంట స్మిమ్మింగ్ను ప్రతి రోజు షెడ్యూల్ చేసుకున్నాడు.సర్ఫరాజ్తో పాటు అతని కుటుంబం మొత్తం వెయిట్ లాస్ ప్రక్రియకు పూనుకుంది. సర్ఫరాజ్ తండ్రి నౌషద్ ఖాన్, అతని చిన్న సోదరుడు మొయిన్ ఖాన్ కూడా ఓవర్ వెయిట్ ఉంటారు. సర్ఫరాజ్ రెండో సొదరుడు మునీర్ ఖాన్ ఫిట్గా ఉన్నప్పటికీ అతను కూడా ఈ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో వారితో పాటే నడిచాడు. మొత్తానికి సర్ఫరాజ్ వెయిట్ లాస్ జర్నీ స్పూర్తిదాయకంగా ఉంది.ఇదిలా ఉంటే, సర్ఫరాజ్ వచ్చే నెలలో షెడ్యూలైన ఇంగ్లండ్ పర్యటన కోసం భారత-ఏ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ పర్యటనలో భారత-ఏ జట్టు ఇంగ్లండ్ లయన్స్తో రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది. ఈ మ్యాచ్ల్లో ప్రదర్శన ఆధారంగా ఆతర్వాత ఇంగ్లండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు భారత జట్టును ఎంపిక చేస్తారు. ఈ సిరీస్ సత్తా చాటి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని సర్ఫరాజ్ పట్టుదలగా ఉన్నాడు.గతేడాది ఇంగ్లండ్తో జరిగిన హొం టెస్ట్ సిరీస్లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సర్ఫరాజ్.. తన డెబ్యూ మ్యాచ్లోనే రెండు అర్ద సెంచరీలు సాధించి (రెండు ఇన్నింగ్స్ల్లో) రికార్డుల్లోకెక్కాడు. అనంతరం గతేడాదే న్యూజిలాండ్పై 150 పరుగులు చేసిన సర్ఫరాజ్ తనలోని అత్యుత్తమ టాలెంట్ను వెలికి తీశాడు. అయితే తదనంతర పరిణామాల్లో (సీనియర్ల రాకతో) సర్ఫరాజ్కు టీమిండియాలో చోటు దక్కలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక కాలేదు. ఐపీఎల్ 2025 మెగా వేలంలోనూ అతనికి మొండిచెయ్యే ఎదురైంది. ఇంగ్లండ్ పర్యటనకు భారత్ ఏ జట్టు:అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధృవ్ జురెల్ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, తనుష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్పాండే, హర్ష్ దూబే -
టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్.. రోహిత్, కోహ్లి తదుపరి ఆడబోయే మ్యాచ్లు ఇవే..!
టీ20లకు, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా దిగ్గజ బ్యాటర్లు, కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇకపై వన్డేల్లో మాత్రమే కనిపిస్తారు. ఈ ఇద్దరు 2027 ప్రపంచకప్ వరకు ఆడి 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి కూడా తప్పుకుంటారని తెలుస్తుంది. అయితే ఈ మధ్యలో రోహిత్, కోహ్లి భారత్ తరఫున ఎన్ని వన్డేలు ఆడతారని క్రికెట్ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు.ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాం ప్రకారం భారత్ 2027 వన్డే వరల్డ్కప్ వరకు 9 సిరీస్ల్లో 8 మంది ప్రత్యర్థులపై 27 మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్న భారత ఆటగాళ్లు క్యాష్ రిచ్ లీగ్ ముగిసిన వెంటనే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరతారు. అక్కడ ఆగస్ట్ వరకు 4 వరకు గడపనున్న భారత్.. అదే నెల 17వ తేదీ నుండి బంగ్లాదేశ్లో పర్యటించనుంది. ఇక్కడి నుండి టీమిండియా వన్డే క్రికెట్ షెడ్యూల్ మొదలుకానుంది.బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు ఆడనుంది. రోహిత్, కోహ్లి ఈ సిరీస్లో చెలరేగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్లో స్పిన్ ఫ్రెండ్లీ పిచ్లు ఉండటంతో రోకోను ఆపడం బంగ్లా బౌలర్లకు పెద్ద సవాలే అవుతుంది.అనంతరం భారత్ అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు (5 టీ20లు కూడా ఆడుతుంది) ఆడనుంది.ఈ ఏడాది చివర్లో టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో ఆల్ ఫార్మాట్ సిరీస్లు ఆడనుంది. ఈ పర్యటనలో సౌతాఫ్రికా టీమిండియాతో రెండు టెస్ట్లు, 5 టీ20లు సహా మూడు వన్డేలు ఆడనుంది.వచ్చే ఏడాది (2026) జనవరిలో భారత్ స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు వన్డేల్లో తలపడనుంది. ఈ సిరీస్లో కూడా విరాట్, రోహిత్ తమదైన మార్కును చూపించే అవకాశం ఉంది.అనంతరం చాలా గ్యాప్ తర్వాత జూన్లో భారత్ స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది. ఈ పర్యటనలో ఆఫ్ఘన్లు టీమిండియాతో మూడు వన్డేలు ఆడనున్నారు. స్వదేశంలో ఆడబోయే సిరీస్ కావడంతో ఈ సిరీస్లో కూడా రోకో చెలరేగే అవకాశం ఉంది.జూలైలో భారత్ ఇంగ్లండ్లో పర్యటించి మూడు వన్డేలు ఆడనుంది. ఈ పర్యటనలో రోహిత్, కోహ్లి సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది.సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భారత్ స్వదేశంలో వెస్టిండీస్తో మూడు వన్డేలు ఆడనుంది.అక్టోబర్, నవంబర్ మాసాల్లో టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు వన్డేలు ఆడనుంది.డిసెంబర్లో భారత్ స్వదేశంలో శ్రీలంకతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతుంది.దీని తర్వాత భారత్ 2027లో సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే వన్డే వరల్డ్కప్లో పాల్గొంటుంది. ఈ మెగా టోర్నీ రోహిత్-కోహ్లిల జమానాకు చివరిదయ్యే అవకాశం ఉంది. ఈ మధ్యలో ఏవైనా వ్యక్తిగత ఇబ్బందులు ఎదురైతే తప్ప రోహిత్, కోహ్లి దాదాపుగా అన్ని మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది. దిగ్గజాలు వన్డే వరల్డ్కప్తో తమ క్రికెట్ ప్రస్తానాన్ని ముగిస్తారేమో చూడాలి. -
చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా.. దిగ్గజాలకు సైతం సాధ్యం కాని ఘనత సాధించాడు
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో అత్యధిక కాలం టాప్ ర్యాంక్లో కొనసాగిన ఆటగాడిగా అవతరించాడు. ఇవాళ (మే 14) విడుదల చేసిన ర్యాంకింగ్స్ల జడేజా టాప్ ప్లేస్ను నిలబెట్టుకున్నాడు. ప్రస్తుతం జడేజా ఖాతాలో 400 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. 2022, మార్చి 9న విండీస్ ఆటగాడు జేసన్ హెల్డర్ను గద్దె దించి అగ్రపీఠాన్ని అధిరోహించిన జడ్డూ.. 1152 రోజుల పాటు (38 నెలలకు పైగా) టాప్ ర్యాంక్డ్ టెస్ట్ ఆల్రౌండర్గా కొనసాగాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో దిగ్గజ ఆల్రౌండర్లైన జాక్ కల్లిస్, కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్కు కూడా ఇది (ఇంతకాలం) సాధ్యం కాలేదు.36 ఏళ్ల జడ్డూ 2022 మార్చి నుంచి 23 టెస్ట్లు ఆడి 36.71 సగటున 1175 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఐదు అర్ద సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్లో జడ్డూ 22.34 సగటున 91 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఆరు 5 వికెట్ల ప్రదర్శనలు, రెండు 10 వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. తాజా ర్యాంకింగ్స్లో జడేజా, తర్వాతి స్థానాల్లో మెహిది హసన్ మిరాజ్ (బంగ్లాదేశ్), మార్కో జన్సెన్ (సౌతాఫ్రికా), పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా), షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) ఉన్నారు. మెహిది హసన్ ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో సెంచరీ సహా 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసి జన్సెన్ను కిందికి దించి రెండో స్థానానికి ఎగబాకాడు. మెహిది హసన్కు జడేజాకు మధ్య 73 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం ఉంది.ప్రస్తుతం ఐపీఎల్తో బిజీగా ఉన్న జడేజా జూన్లో ఇంగ్లండ్తో జరుగబోయే టెస్ట్ సిరీస్లో బరిలోకి దిగే అవకాశం ఉంది. 2024 టీ20 వరల్డ్కప్ తర్వాత పొట్టి క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన అతను.. టెస్ట్, వన్డేల్లో కొనసాగుతున్నాడు. గత కొంతకాలంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న జడేజా 2024 ఐసీసీ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. -
రిటైర్మెంట్ ప్రచారంపై స్పందించిన టీమిండియా స్టార్ పేసర్
టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి బాటలోనే మహ్మద్ షమీ కూడా పయనిస్తున్నాడని గత కొన్ని గంటలుగా ప్రచారం జరుగుతుంది. రోహిత్, విరాట్ లాగే షమీ కూడా టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని పుకార్లు వినిపిస్తున్నాయి. దీనిపై షమీ తాజాగా స్పందించాడు. Mohammad Shami squashes retirement rumours. pic.twitter.com/PoKqLoS42l— Mufaddal Vohra (@mufaddal_vohra) May 13, 2025తన రిటైర్మెంట్పై ఓ ఇంగ్లిష్ వెబ్సైట్లో రాసిన వార్తను ఖండిస్తూ.. దాన్ని రాసిన వ్యక్తికి మొట్టికాయలు వేశాడు. ముందు నీ ఉద్యోగానికి వీడ్కోలు పలకడానికి రోజులు లెక్క పెట్టుకో. తర్వాత నా రిటైర్మెంట్ గురించి మాట్లాడవచ్చు. నీ లాంటి వాళ్లు మీడియాను సర్వనాశనం చేశారు. ఆటగాళ్ల భవితవ్యం గురించి ఒక్కసారైనా మంచిగా చెప్పండి. ఈ రోజుకు ఇది చాలా చెత్త వార్త. సారీ అంటూ తన సోషల్మీడియా ఖాతాలో రాసుకొచ్చాడు. తన రిటైర్మెంట్పై దుష్ప్రచారం చేసిన వ్యక్తికి గట్టిగా ఇస్తూనే షమీ సదరు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించాడు.కాగా, 34 ఏళ్ల షమీ గత కొంతకాలంగా ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటూ టీమిండియాలో స్థిరపడలేకపోతున్నాడు. ఇదే కారణంగా షమీని త్వరలో ఇంగ్లండ్తో జరిగే టెస్ట్ సిరీస్కు ఎంపిక చేయరని ప్రచారం సాగింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు గాయం నుంచి కోలుకుని టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన షమీ మునుపటి జోరును కొనసాగించలేకపోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అడపాదడపా ప్రదర్శనతో సరిపెట్టిన అతను ఐపీఎల్-2025లో దారుణంగా విఫలమయ్యాడు. సన్రైజర్స్ హైదరాబాద్ షమీని గంపెడాశలతో సొంత చేసుకుంటే అతను కనీస న్యాయం చేయలేకపోయాడు. ఐపీఎల్లో పేలవ ప్రదర్శన తర్వాత షమీ వ్యతిరేకుల స్వరం పెద్దదైంది. ఇంగ్లండ్ పర్యటనకు అతన్ని ఎంపిక చేయొద్దంటూ కొందరు సోషల్మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. షమీ స్థానంలో ఐపీఎల్లో ఇరగదీస్తున్న ప్రసిద్ద్ కృష్ణను ఎంపిక చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలనుకుంటే ప్రత్యామ్నాయ పేసర్లుగా అర్షదీప్ సింగ్, సిరాజ్, ఖలీల్ అహ్మద్ను ఎంపిక చేయాలని కోరుతున్నారు.ఇదిలా ఉంటే, 2023 వన్డే ప్రపంచకప్ వరకు అద్భుతంగా రాణించిన షమీ.. ఆతర్వాత గాయం తాలూకా సమస్యలతో ఢీలా పడిపోయాడు. భారత్లో జరిగిన 2023 వన్డే ప్రపంచకప్లో షమీ టీమిండియాను ఒంటిచేత్తో ఫైనల్కు చేర్చాడు. ఆ మెగా టోర్నీలో అతను 7 మ్యాచ్ల్లో ఏకంగా 24 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. తన కెరీర్లో 64 టెస్ట్లు, 108 వన్డేలు, 25 టీ20లు ఆడిన షమీ 462 వికెట్లు తీశాడు. -
రెండో స్థానానికి ఎగబాకిన టీమిండియా వైస్ కెప్టెన్
ఐసీసీ తాజాగా ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధన అదరగొట్టింది. ఇటీవల శ్రీలంకలో జరిగిన ట్రై నేషన్ సిరీస్లో సత్తా చాటిన మంధన.. తాజాగా ర్యాంకింగ్స్లో మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. ఈ టోర్నీలో సెంచరీ (ఫైనల్లో), అర్ద సెంచరీ సాయంతో 264 పరుగులు చేసిన మంధన.. తన రేటింగ్ పాయింట్లను 727కు పెంచుకుని ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ను మూడో స్థానానికి పడేసింది. తాజా ర్యాంకింగ్స్లో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. మంధనకు లారాకు మధ్య కేవలం 11 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. భారత్ తరఫున టాప్-10 బ్యాటర్ల ర్యాంకింగ్స్లో మంధన ఒక్కరే ఉన్నారు. హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్), ఎల్లిస్ పెర్రీ (ఆస్ట్రేలియా), అలైసా హీలీ (ఆస్ట్రేలియా), చమారీ ఆటపట్టు (శ్రీలంక), బెత్ మూనీ (ఆస్ట్రేలియా), ఆష్లే గార్డ్నర్ (ఆస్ట్రేలియా), ఆమీ జోన్స్ (ఇంగ్లండ్) వరుసగా నాలుగు నుంచి పది స్థానాల్లో ఉన్నారు. ట్రై నేషన్ సిరీస్లో రాణించిన చమారీ ఆటపట్టు రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి ఎగబాకింది. భారత ప్లేయర్లలో జెమీమా రోడ్రిగెజ్ 15, కెప్టెన్ హర్మన్ప్రీత్ 16, దీప్తి శర్మ 32, రిచా ఘోష్ 42, ప్రతిక రావల్ 45, హర్లీన్ డియోల్ 52, యస్తికా భాటియా 67, పూజా వస్త్రాకర్ 70, షఫాలీ వర్మ 86, స్థానాల్లో ఉన్నారు. ట్రై సిరీస్లో సౌతాఫ్రికాపై సెంచరీతో రాణించిన జెమీమా 5 స్థానాలు మెరుగుపర్చుకోగా.. ఇదే టోర్నీలో సత్తా చాటిన దీప్తి శర్మ 13 స్థానాలు మెరుగుపర్చుకుంది.బౌలింగ్ విభాగానికొస్తే.. భారత్ తరఫున దీప్తి శర్మ (4) ఒక్కరే టాప్-10లో ఉన్నారు. సోఫీ ఎక్లెస్టోన్ టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా.. ఆష్లే గార్డ్నర్, మెగాన్ షట్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ట్రై సిరీస్లో 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన స్నేహ్ రాణా నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని కెరీర్ బెస్ట్ 34వ స్థానానికి ఎగబాకింది. రాణా దాదాపు 16 నెల తర్వాత టీమిండియా తరఫున రీఎంట్రీ ఇచ్చింది.కాగా, భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా పాల్గొన్న ట్రై నేషన్ సిరీస్లో భారత్ విజేతగా నిలిచింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో మంధన సెంచరీతో కదంతొక్కడంతో భారత్ ఏకపక్ష విజయం సాధించింది. ఈ ప్రదర్శనకు గానూ మంధనకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. -
‘విరాట్’ పరుగుల పర్వాలు
‘నేను టెస్టు క్రికెట్ను రోజంతా ఒకే తరహా తీవ్రతతో ఆడాలని భావిస్తా. 88వ ఓవర్లో కూడా బ్యాటర్ షాట్ ఆడితే నేను సింగిల్ ఆపేందుకు అవసరమైతే డైవ్ కూడా చేస్తా. నా దృష్టిలో టెస్టు క్రికెట్ అంటే అదే’... ఇది విరాట్ కోహ్లికి టెస్టు ఫార్మాట్పై ఉన్న అభిమానాన్ని చూపిస్తోంది. ‘నేను నా మనసును, ఆత్మను కూడా టెస్టు క్రికెట్ కోసమే ఇచ్చా. ఈ ఫార్మాట్లో ఫిట్నెస్ కోసమే ఎన్నో త్యాగాలు చేశా’... 100 టెస్టులు పూర్తయిన సందర్భంగా అతను తన సంతృప్తిని ప్రదర్శించిన వ్యాఖ్య ఇది. ‘ఈ రోజంతా మనిద్దరమే బ్యాటింగ్ చేద్దాం.అవతలి జట్టులో ఒక్కొక్కడికి పగిలిపోవాలి’... ఇది మైదానంలో ప్రత్యర్థులపై అతను ప్రదర్శించిన దూకుడుకు ఒక చిన్న ట్రైలర్... టెస్టు క్రికెట్కు ఆదరణ తగ్గిపోతోందని అనిపించినప్పుడల్లా మైదానంలో కోహ్లిని చూస్తే అలాంటి భావనే కనిపించదు. అతను టెస్టుల్లో భారీగాపరుగులు మాత్రమే చేయలేదు. అతను ఎన్నో లెక్కలను కొత్తగా తిరగరాశాడు. సాంప్రదాయ ఫార్మాట్లో ఎన్నో సాంప్రదాయాలను బద్దలు కొట్టాడు. క్రమశిక్షణ, పట్టుదల, పోరాటపటిమ, ఫిట్నెస్, ఎక్కడా వెనక్కి తగ్గని తత్వం టెస్టుల్లోనే ఎక్కువగా బయట పడింది. కోహ్లిలాంటి టెస్టు క్రికెటర్ ఇకపై రాకపోవచ్చు. ఈ ఫార్మాట్లో అది ఎవరూ పూరించలేని లోటు. –సాక్షి క్రీడా విభాగం ‘భారత్ తరఫున ఆడుతున్న ఆ్రస్టేలియన్’... విరాట్ కోహ్లి దూకుడును ఆసీస్ గడ్డపై చూసిన తర్వాత విశ్లేషకులు ఇచ్చిన పేరు ఇది. మైదానంలో దూకుడు, ఢీ అంటే ఢీ అనే తత్వం, అటు బ్యాటర్గా, ఇటు కెపె్టన్గా అతని శైలి కోహ్లి ప్రత్యేకతను నిలబెట్టాయి. ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గను అన్నట్లుగా తెల్ల దుస్తుల్లో యుద్ధానికి సిద్ధమైన ఒక సైనికుడిలా అతను కనిపించేవాడు. 2014లో ఆస్ట్రేలియా గడ్డపై నాటి టాప్ పేసర్ మిచెల్ జాన్సన్తో అతను తలపడిన తీరును అభిమానులు ఎవరూ మర్చిపోలేరు.తన బౌలింగ్లో అద్భుతమైన కవర్ డ్రైవ్లు, పుల్ షాట్లతో కోహ్లి విరుచుకుపడుతుంటే జాన్సన్ మాటల యుద్ధానికి దిగగా, కోహ్లి ఎక్కడా తగ్గకుండా తాను అదే తరహాలో దీటుగా నిలబడ్డాడు. ఈ సిరీస్లో ఏకంగా 4 సెంచరీలతో 692 పరుగులు చేసిన అతను తన సత్తాను ప్రదర్శించాడు. అంతకుముందు దాదాపు మూడేళ్ల క్రితమే కోహ్లి దూకుడును ఆసీస్ చూసింది. 2011–12 టెస్టు సిరీస్లో భాగంగా జరిగిన పోరులో సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, గంభీర్వంటి స్టార్ బ్యాటర్లంతా విఫలం కాగా భారత్ నుంచి ఒకే ఒక సెంచరీ నమోదైంది. అది కోహ్లి బ్యాట్ నుంచి వచి్చంది. ఇది కోహ్లి కెరీర్లో ఎనిమిదో టెస్టు. రెండు టెస్టుల క్రితం సిడ్నీలో క్రమశిక్షణారాహిత్యంతో శిక్షకు గురైన కోహ్లి... ఈ మ్యాచ్లో తన దూకుడును పరుగులుగా మలచి కసి తీర్చుకున్నట్లుగా అనిపించింది. అలా మొదలై... వన్డేల్లో అరంగేట్రం చేసిన మూడేళ్ల తర్వాత గానీ కోహ్లి తొలి టెస్టు ఆడలేదు. సచిన్ గైర్హాజరులో అతనికి 2011లో వెస్టిండీస్ వెళ్లే అవకాశం లభించింది. అక్కడ పెద్దగా ఆకట్టుకోకపోయినా... ఆ తర్వాత ముంబైలో విండీస్తోనే రెండు ఇన్నింగ్స్లలో అర్ధ సెంచరీలు చేయడంతో కాస్త నిలదొక్కుకునే అవకాశం లభించింది. ఆ తర్వాత ఆ్రస్టేలియా సిరీస్ అవకాశం దక్కగా అడిలైడ్లో చేసిన సెంచరీతో కొత్త తరం ప్రతినిధిగా అతని ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత స్వదేశంలో నిలకడ కొనసాగగా... 2013 దక్షిణాఫ్రికా పర్యటనలో ప్రదర్శన కోహ్లి స్థాయిని పెంచింది. ఆపై కివీస్పై వెల్లింగ్టన్లో చేసిన శతకంతో అతని బ్యాటింగ్ విలువ అందరికీ కనిపించింది. ఇక్కడి వరకు కోహ్లి టెస్టు కెరీర్ సాఫీగా సాగిపోయింది. తొలి 24 టెస్టుల్లో 46.71 సగటుతో 1721 పరుగులు చేయగా అందులో 6 సెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాత వచి్చంది ఇంగ్లండ్ పర్యటన. ఆరేళ్లు అద్భుతంగా... విరాట్ టెస్టు కెరీర్ అక్టోబర్ 2014 నుంచి డిసెంబర్ 2019 వరకు అత్యద్భుతంగా సాగింది. ఈ సమయంలో అతని కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనలు వచ్చాయి. అటు ఆటగాడిగా, ఇటు కెపె్టన్గా కూడా ఈ సమయంలో ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందుకున్నాడు. భారత అభిమానుల కోణంలో చూస్తే ఈ సమయంలో కోహ్లి అసలైన టెస్టు మజాను చూపించాడు. జట్టును తన బ్యాటింగ్తో బలమైన స్థితిలో నిలపడమే కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు అసాధారణ బ్యాటింగ్తో టెస్టులను ఎలా ఆడాలో అతను చేసి చూపించాడు.ఈ ఆరేళ్ల కాలంలో 55 టెస్టులు ఆడిన కోహ్లి ఏకంగా 63.65 సగటుతో 5347 పరుగులు సాధించాడు. ఇందులో 21 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ సమయంలో గణాంకాలు అతడిని నంబర్వన్ టెస్టు బ్యాటర్గా నిలిపాయి. ముఖ్యంగా ఒక 18 నెలలు అతని బ్యాటింగ్ శిఖరానికి చేరింది. కేవలం 34 ఇన్నింగ్స్ల వ్యవధిలో కోహ్లి ఏకంగా 6 డబుల్ సెంచరీలు నమోదు చేయడం విశేషం. 34 ఇన్నింగ్స్ల వ్యవధిలో చూస్తే ఒక్క బ్రాడ్మన్ (8) మాత్రమే అతనికంటే మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. కాస్త పదును తగ్గి... అసాధారణ బ్యాటింగ్ తర్వాత 2020 ఆరంభం నుంచి అతని టెస్టు బ్యాటింగ్లో పదును కాస్త నెమ్మదించింది. కోవిడ్ కారణంగా మ్యాచ్ల సంఖ్య తగ్గడంతో పాటు ఒకే తరహా జోరును కొనసాగించడంలో కోహ్లి విఫలమయ్యాడు. సెంచరీ మొహం చూసేందుకు మూడేన్నరేళ్లు పట్టాయి. 2021 ఇంగ్లండ్ పర్యటన కేవలం 2 అర్ధసెంచరీలతో నిరాశగా ముగియగా, 2023–24 దక్షిణాఫ్రికా పర్యటనలో కూడా అతని ముద్ర కనిపించలేదు. ఇటీవల ముగిసిన ఆ్రస్టేలియా సిరీస్లోనైతే పెర్త్ మినహా అతని బ్యాటింగ్ చూస్తే కెరీర్ ముగింపునకు వచి్చనట్లే అనిపించింది. జనవరి 2020 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఆడిన 39 టెస్టుల్లో కోహ్లి కేవలం 30.72 సగటుతో 2028 పరుగులు సాధించాడు. 3 శతకాలు మాత్రమే నమోదు చేయగలిగాడు. గత రెండేళ్లుగా అతని బ్యాటింగ్ సగటు 32.56 మాత్రమే. ఎలా చూసుకున్నా ఇది ఒక ప్రధాన బ్యాటర్కు సంబంధించి పేలవ ప్రదర్శనే. టెస్టు బ్యాటర్గా తన అత్యుత్తమ దశను ఎప్పుడో దాటిన కోహ్లి ఇప్పుడు కెరీర్ను హడావిడి లేకుండా ముగించాడు. పడి... పైకి లేచి... కోహ్లి వైఫల్యం గురించి చెప్పాలంటే అందరికీ గుర్తుకొచ్చేది 2014లో ఇంగ్లండ్లో జరిగిన ఐదు టెస్టుల సిరీస్. స్వింగ్కు అనుకూలించిన అక్కడి పరిస్థితుల్లో సరైన ఫుట్వర్క్ లేక ఒకే తరహాలో పదే పదే అవుట్ అవుతూ కోహ్లి అభిమానులను తీవ్రంగా నిరాశపర్చాడు. భారత నంబర్వన్ బ్యాటర్గా అక్కడ అడుగు పెట్టి అద్భుతాలు చేస్తాడనుకుంటే పూర్తిగా చేతులెత్తేశాడు. 10 ఇన్నింగ్స్లలో కలిపి కేవలం 134 పరుగులతో ఘోరంగా విఫలం కావడమే కాదు... అప్పటి బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా రహస్యంగా గర్ల్ఫ్రెండ్ అనుష్క శర్మను టూర్కు తీసుకెళ్లి తీవ్ర విమర్శలపాలయ్యాడు.అయితే నాలుగేళ్లు తిరిగాయి... కోహ్లి ఆట మారింది. వ్యక్తిగా కూడా ఎంతో మారాడు. లోపాలను సరిదిద్దుకొని 2018లో మళ్లీ ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టాడు. ఏ బౌలర్నూ లెక్క చేయకుండా నాటి గాయాలూ మానేలా చెలరేగిపోయాడు. 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలతో ఏకంగా 593 పరుగులు సాధించి సిరీస్ టాపర్గా నిలిచాడు. ఇది కోహ్లిలోని పట్టుదలను, తాను విఫలమైన చోట మళ్లీ తానేంటో చూపించుకోవాలనే కసిని చూపించింది. ⇒ 4 భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో సచిన్ (15,921), ద్రవిడ్ (13,288), గావస్కర్ (10,122) తర్వాత నాలుగో స్థానంలో నిలిచిన కోహ్లి (9230)... అత్యధిక శతకాల జాబితాలో కూడా సచిన్ (51), ద్రవిడ్ (36), గావస్కర్ (34) తర్వాత 30 శతకాలతో నాలుగో స్థానంలోనే ఉన్నాడు. ⇒ 4 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన కెపె్టన్ల జాబితాలో గ్రేమ్ స్మిత్ (53), రికీ పాంటింగ్ (48), స్టీవ్ వా (41) తర్వాత కోహ్లి (40) నాలుగో స్థానంలో నిలిచాడు. ⇒ 7 కోహ్లి డబుల్ సెంచరీల సంఖ్య. ఓవరాల్ జాబితాలో బ్రాడ్మన్ (12; ఆస్ట్రేలియా), సంగక్కర (11; శ్రీలంక), లారా (9; వెస్టిండీస్) తర్వాత వాలీ హామండ్ (7; ఇంగ్లండ్), జయవర్ధనే (7; శ్రీలంక)లతో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. -
‘కష్టమే... కానీ సరైన నిర్ణయమే’
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లి తన మనసులో మాటకే కట్టుబడ్డాడు... టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవాలనుకున్న తన నిర్ణయంపై ఎలాంటి పునరాలోచన చేయలేదు... అతడిని ఒప్పించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. టెస్టుల నుంచి రిటైర్ అవుతున్నట్లు కోహ్లి సోమవారం అధికారికంగా ప్రకటించాడు. భారత టెస్టు క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా, సారథిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అతను 14 ఏళ్ల కెరీర్కు గుడ్బై చెప్పాడు. ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం త్వరలోనే టీమ్ను సెలక్టర్లు ప్రకటించనున్న నేపథ్యంలో తన రిటైర్మెంట్ సమాచారాన్ని ముందుగానే బీసీసీఐకి తెలియజేయడం సరైందని విరాట్ భావించాడు. ఈ నిర్ణయం తీసుకోవడం కష్టంగానే అనిపిస్తున్నా అది సరైందేనని అతను పేర్కొన్నాడు. 2011 జూలైలో కింగ్స్టన్ వేదికగా వెస్టిండీస్తో తన తొలి టెస్టు ఆడిన కోహ్లి... 2025 జనవరిలో సిడ్నీలో ఆ్రస్టేలియాతో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. గత ఏడాది వరల్డ్ కప్ విజయం తర్వాత టి20 ఫార్మాట్ నుంచి రిటైర్ అయిన కోహ్లి ఇకపై వన్డేల్లోనే కొనసాగనున్నాడు. గత మంగళవారం రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించగా, ఆ్రస్టేలియా సిరీస్ మధ్యలోనే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తప్పుకోవడంతో తక్కువ వ్యవధిలో ముగ్గురు భారత సీనియర్లు ఈ ఫార్మాట్ నుంచి ని్రష్కమించినట్లయింది. ఎందుకీ వెనకడుగు? రోహిత్ టెస్టులకు గుడ్బై చెబితే పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు గానీ ఇప్పుడు కోహ్లి అనూహ్యంగా రిటైర్మెంట్ అనేశాడు. నిజానికి సవాళ్లను ఎదుర్కొనేందుకు కోహ్లి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కీలకమైన ఇంగ్లండ్ పర్యటన కోసం అతను కూడా సన్నద్ధమైనట్లు కనిపించింది. ఆస్ట్రేలియా టూర్ ముగిసిన తర్వాత ఐపీఎల్ ఆరంభానికి ముందు తన టెస్టు బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకునేందుకు ఎర్ర బంతితో సంజయ్ బంగర్ పర్యవేక్షణలో అతను తీవ్రంగా సాధన చేయడాన్ని బట్టి చూస్తే ఇప్పటికిప్పుడు టెస్టుల నుంచి తప్పుకోడని అర్థమైంది. అతని అద్భుతమైన ఫిట్నెస్ ఒక కారణం కాగా, ఇంగ్లండ్లో తన అనుభవంతో జట్టుకు మార్గదర్శిగా నిలిచే సత్తా అతనిలో ఉంది. రిటైర్మెంట్పై సరైన కారణంగా బయటికీ ఎవరికీ తెలియకపోయినా... వేర్వేరు కారణాలు అతడిని రిటైర్మెంట్ వైపు నడిపించాయి. తాను ఆశించినప్పుడు టెస్టు కెప్టెన్సీ మళ్లీ ఇవ్వకపోవడంతో నిరాశకు గురయ్యాడనని చెబుతున్నా... నాయకత్వం లేకపోతే ఆడలేనని చెప్పే తక్కువ స్థాయి కాదు అతనిది. జట్టు కోసం వంద శాతం శ్రమించే అతనికి ఇది పెద్ద విషయం కాదు. అయితే ప్రస్తుత స్థితిలో కొన్ని అంశాలు అతను తప్పుకోవడానికి కారణంగా కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్ సిరీస్తో కొత్తగా 2025–27 వరల్డ్ టెస్టు చాంపియన్íÙప్ సైకిల్ మళ్లీ మొదలవుతోంది. వచ్చే రెండేళ్ల పాటు కోహ్లి కొనసాగడం కష్టం కావచ్చు. యువ ఆటగాళ్లతో ప్రణాళికలు రూపొందించుకునే విధంగా తాను తప్పుకోవడమే సరైందని అతను భావించాడు. ఆ్రస్టేలియాతో తొలి టెస్టు సెంచరీ తర్వాత మిగతా 7 ఇన్నింగ్స్లు కలిపి 85 పరుగులే చేశాడు. ఇదే వైఫల్యం ఇంగ్లండ్లో కొనసాగితే మరింత చెడ్డపేరు రావచ్చు. ప్రస్తుత స్థితిలో మళ్లీ ఫామ్ను అందుకొని చెలరేగిపోగలననే నమ్మకం అతనిలో తగ్గినట్లుంది. బీసీసీఐ సూచనల మేరకు రంజీ ట్రోఫీ ఆడినా అక్కడా హిమాన్షు సాంగ్వాన్లాంటి సాధారణ బౌలర్ బంతికి క్లీన్బౌల్డ్ అయిన తీరు కూడా తన ఆటపై సందేహాలు రేకెత్తించి ఉంటుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కోరినట్లు ఇంగ్లండ్తో సిరీస్ వరకు ఆడినా కొత్తగా అతను సాధించేదేమీ ఉండదు. పైగా తీవ్ర ఒత్తిడి, అంచనాలు కూడా. రోహిత్ శర్మలాంటి బ్యాటర్ కూడా తప్పుకోవడంతో అందరి కళ్లూ ఇప్పుడు తన బ్యాటింగ్పైనే ఉంటాయి. అంత ఒత్తిడి అనవసరం అని అతను భావించి ఉంటాడు.టెస్టు క్రికెట్లో తొలిసారి బ్యాగీ బ్లూ ధరించి 14 ఏళ్లయింది. ఈ ఫార్మాట్ నాపై ఇంతగా ప్రభావం చూపిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. టెస్టు క్రికెట్ నన్ను పరీక్షించింది. తీర్చిదిద్దింది. జీవితానికి కావాల్సిన పాఠాలు నేర్పించింది. టెస్టులు ఆడటంలో వ్యక్తిగతంగా ఎంతో తృప్తి ఉంది. అందులోని తీవ్రత, సుదీర్ఘ రోజులు, కొన్ని కీలక క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోవడం కష్టంగా అనిపిస్తోంది. కానీ సరైన నిర్ణయమే. టెస్టు క్రికెట్కు నేను ఎంతో ఇచ్చాను. నేను ఆశించిన దానికంటే ఇది ఎక్కువ నాకు తిరిగి ఇచ్చింది. ఈ ఆటకు, నాతో కలిసి ఆడిన వారికి, అండగా నిలిచిన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నా టెస్టు కెరీర్ పూర్తి సంతృప్తితో ముగిస్తున్నా. #269 వీడ్కోలు. –వీడ్కోలు ప్రకటనలో విరాట్ కోహ్లి‘కెప్టేన్ ఫైర్’టీమిండియాను విదేశీ గడ్డపై కూడా వెన్నెముక ఉన్న జట్టుగా సౌరవ్ గంగూలీ నిలబెడితే ఎమ్మెస్ ధోని ‘కూల్ కెప్టేన్’గా జట్టును నడిపించి చూపించాడు. కానీ విరాట్ కోహ్లి అలాంటివాడు కాదు. అతను నాయకుడిగా ఒక రగులుతున్న అగ్నిపర్వతంలాంటివాడు. అప్పటి వరకు ఉన్న స్క్రిప్ట్ను తగలబెట్టిన అతను కొత్త నాయకత్వ లక్షణాలను రచించాడు. తన బౌలర్లు, ఫీల్డర్లనుంచి అతను వంద శాతంకు మించి ప్రదర్శనను ఆశించాడు. అందరికంటే ముందు తానే అది చేసి చూపించాడు. తన బౌలింగ్, ఫీల్డింగ్ను నమ్ముకొని ‘60 ఓవర్లు వీరికి నరకం కనిపించాలి’ అని లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ను ఆడుకున్న తీరు మర్చిపోలేనిది.కోహ్లికి ముందు చూస్తే బ్యాటర్లయినా భారీ స్కోరుతో జట్టును గెలిపించాలి లేదా స్పిన్నర్లపై భారం ఉండేది. కానీ స్వదేశమైనా, విదేశీ పిచ్ అయినా పేసర్లను అద్భుతంగా వాడుకొని గెలిపించిన తీరు అసాధారణం. ఒక బ్యాటర్ను తగ్గించి అయినా అదనపు బౌలర్ను తీసుకొని ప్రత్యర్థిని ఆలౌట్ చేయడం, మ్యాచ్ గెలవడమే ముఖ్యంగా కోహ్లి వ్యూహరచన సాగింది. కోహ్లి కెప్టేన్సీలో పేస్ బౌలర్లు కేవలం 26 సగటుతో 591 వికెట్లు పడగొట్టారు. 80ల్లో వివ్ రిచర్డ్సన్ నాయకత్వంలో మాత్రమే పేసర్ల సగటు (22.89) ఇంతకంటే మెరుగ్గా ఉంది. 68 టెస్టుల్లో 40 మ్యాచ్లు గెలిపించి భారత అత్యుత్తమ కెప్టేన్గా అతను నిలిచాడు. ప్రతికూలతలను దాటి ఆ్రస్టేలియా గడ్డపై తొలి సారి టెస్టు సిరీస్ గెలిపించిన సారథిగా (2018–19) కోహ్లి చరిత్రలో నిలిచిపోయాడు. మరచిపోలేని కొన్ని ఇన్నింగ్స్ 115, 141 (అడిలైడ్, 2014): ధోని గైర్హాజరులో కెప్టెన్గా తొలి టెస్టు మ్యాచ్లో కోహ్లి అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో ఆసీస్కు భారీ ఆధిక్యం దక్కకుండా చేసిన అతను రెండో ఇన్నింగ్స్లో 364 పరుగుల లక్ష్య ఛేదనలో చివరి వరకు పోరాడాడు. 119, 96 (జొహన్నెస్బర్గ్, 2013): తొలి ఇన్నింగ్స్లో విరాట్ సెంచరీతో భారత్కు ఆధిక్యం దక్కగా, రెండో ఇన్నింగ్స్ స్కోరుతో జట్టుకు గెలుపు అవకాశం సృష్టించాడు. 153 (సెంచూరియన్ 2018): కఠినమైన పిచ్పై 379 నిమిషాల పాటు పట్టుదలగా నిలబడి సాధించిన సెంచరీ. జట్టులో తర్వాతి అత్యుత్తమ స్కోరు 46 అంటే ఈ ఇన్నింగ్స్ విలువ అర్థమవుతుంది. 123 (పెర్త్, 2018): చేతి వేళ్లకు గాయాలు, హెల్మెట్కు దెబ్బలు, బ్యాటర్లంతా కుప్పకూలుతున్నారు. ఇలాంటి స్థితిలో అత్యుత్తమ పేస్, సీమ్ బౌలింగ్ను అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్పై ఎదుర్కొని చేసిన శతకం. ఇరు జట్లలో కలిపి ఇతర బ్యాటర్ల అత్యధిక స్కోరు 70 మాత్రమే. 254 నాటౌట్ (పుణే, 2019): కెరీర్లో అత్యధిక స్కోరు. స్వదేశంలో సఫారీ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ చేసిన డబుల్ సెంచరీలతో జట్టుకు విజయం. సచిన్ ‘100’ పదిలం!అంతర్జాతీయ క్రికెట్లో దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డు ఇక ఎప్పటికీ చెరిగిపోకపోవచ్చు. ఈ ఘనతను అధిగమించగల సత్తా ఉన్న ఒకే ఒక బ్యాటర్గా విరాట్ కోహ్లి కనిపించాడు. ఒక దశలో వరుస శతకాలు బాదుతున్న సమయంలో అతను చేరువగా వచ్చినట్లే అనిపించింది. ఆపై ఫామ్ కోల్పోయి కొంత కాలం సెంచరీ లేక విరాట్ కాస్త వెనుకబడ్డాడు. అయితే 2023 వన్డే వరల్డ్ కప్లో మూడు సెంచరీలు కొట్టిన కోహ్లి...ముంబైలోనే 50వ సెంచరీతో వన్డేల్లో సచిన్ అత్యధిక సెంచరీల రికార్డును సమం చేశాడు.ఆపై పెర్త్ టెస్టులో వంద బాదిన అతను... చాంపియన్స్ ట్రోఫీలో పాక్పై సెంచరీతో సచిన్ రికార్డును కూడా దాటాడు. దీంతో ఓవరాల్గా కోహ్లి సెంచరీల సంఖ్య 82కు చేరింది. కనీసం మరో రెండేళ్లు అటు టెస్టులు, ఇటు వన్డేలు ఆడి నిలకడైన ప్రదర్శన కనబరిస్తే 100 కష్టం కాదనిపించింది. కానీ ఇప్పుడు టెస్టులను కోహ్లి తప్పుకున్నాడు. తన ఫిట్నెస్, ఇష్టమైన ఫార్మాట్ దృష్ట్యా 2027 వన్డే వరల్డ్ కప్ కొనసాగి ఆపై రిటైర్ అయ్యే ఆలోచనతో కోహ్లి ఉండవచ్చు. ఆ మెగా టోరీ్నలోగా భారత్ వేర్వేరు జట్లతో మొత్తం 27 వన్డేలు ఆడాల్సి ఉంది. కోహ్లి వీటిల్లో ఎంత బాగా ఆడగలడనేది చెప్పలేం. ఎంత అద్భుతమైన ఫామ్, చెలరేగి ఆడినా సరే 27 వన్డేల్లో 18 సెంచరీలు దాదాపు అసాధ్యం! అలా చూస్తే సెంచరీల సెంచరీ రికార్డులు ఢోకా లేదు. నీ క్రికెట్ ప్రస్థానం ఎంతో మంది చిన్నారులు ఆటను ఎంచుకు⇒ నేందుకు స్ఫూర్తిగా నిలిచింది. నీ టెస్టు కెరీర్ నిజంగా చాలా అద్భుతంగా సాగింది. నువ్వు భారత క్రికెట్కు పరుగులు మాత్రమే ఇవ్వలేదు. కొత్తతరం వీరాభిమానులను, క్రికెటర్లను అందించావు. అభినందనలు. –సచిన్ టెండూల్కర్⇒ నువ్వు రిటైర్ అయ్యావంటే నమ్మలేకపోతున్నా. ఆధునిక క్రికెట్ దిగ్గజంగా, ఆటకు అసలైన రాయబారిగా నిలిచావు. మనం కలిసి పని చేసినప్పుడు ఎప్పటికీ మర్చిపోలేని ఎన్నో జ్ఞాపకాలను అందించావు. –రవిశాస్త్రి⇒ ఆధునిక క్రికెట్ యుగంలో టెస్టు ఫార్మాట్ కోసం అన్నీ ఇచి్చన అతి పెద్ద బ్రాండ్ కోహ్లి. టెస్టు క్రికెట్ అతనికి ఎంతో రుణపడి ఉంది. –సంజయ్ మంజ్రేకర్ ⇒ సింహంలాంటి పోరాటతత్వం ఉన్నవాడు. ఇకపై నీ లోటు కనిపిస్తుంది. –గౌతమ్ గంభీర్⇒ ‘నేను ఈ నిర్ణయాన్ని ఊహించలేదు. మరికొంత కాలం టెస్టులు ఆడగల సత్తా కోహ్లిలో ఉంది. అతనికి ఘనంగా మైదానంలో వీడ్కోలు దక్కాల్సింది. –అనిల్ కుంబ్లే -
కోహ్లి రిటైర్మెంట్పై స్పందించిన వైఎస్ జగన్
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. విరాట్ భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకరని ప్రశంసించారు. విరాట్ ఆట చూడటం ఎల్లప్పుడూ ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు.క్రికెట్ పట్ల విరాట్కు ఉన్న అభిరుచి, ఆటలో అతని స్థిరత్వం, అత్యుత్తమ ప్రదర్శన కోసం అతని దాహం సాటిలేనివని కొనియాడారు. విరాట్ రికార్డులు మాటల కంటే బిగ్గరగా మాట్లాడతాయని అన్నారు. విరాట్ వారసత్వం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని తెలిపారు. విరాట్ తన భవిష్యత్ ప్రయత్నాల్లో విజయవంతకావాలని ఎక్స్ వేదికగా తన సందేశాన్ని పంపారు.One of the greatest Indian cricketer of all time, @imVKohli, bids adieu to Test cricket.It has always been fascinating to watch him play - his passion, consistency and hunger in pursuit of excellence have been unmatched. His records speak louder than words, and his legacy will… pic.twitter.com/wBHNVEwKgY— YS Jagan Mohan Reddy (@ysjagan) May 12, 2025కాగా, 36 ఏళ్ల విరాట్ కోహ్లి ఇవాళ (మే 12) ఉదయం టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. 2011లో టెస్ట్ అరంగేట్రం చేసిన విరాట్.. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 123 టెస్ట్లు (210 ఇన్నింగ్స్లు) ఆడి 46.9 సగటున 9230 పరుగులు చేశాడు. ఇందులో 7 డబుల్ సెంచరీలు, 23 సెంచరీలు, 31 అర్ద సెంచరీలు ఉన్నాయి.టీమిండియా టెస్ట్ కెప్టెన్గానూ కోహ్లికి ఘనమైన రికార్డు ఉంది. అతని సారథ్యంలో టీమిండియా 68 మ్యాచ్ల్లో 40 మ్యాచ్లు గెలిచింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంత విజయవంతమైన కెప్టెన్ ఎవరూ లేరు. -
ఆటగాడిగా, కెప్టెన్గా కోహ్లి సాధించిన ఘనతలు..!
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇవాళ (మే 12) ప్రకటించాడు. 2011లో టెస్ట్ అరంగేట్రం చేసిన విరాట్.. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో వ్యక్తిగత రికార్డులు సాధించాడు. కెప్టెన్గా చెరగని ముద్ర వేశాడు. విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ నేపథ్యంలో అతని రికార్డులపై ఓ లుక్కేద్దాం.2011 వెస్టిండీస్ (జూన్లో) పర్యటన సందర్భంగా టెస్ట్ అరంగేట్రం చేసిన కోహ్లి.. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 123 టెస్ట్లు (210 ఇన్నింగ్స్లు) ఆడి 46.9 సగటున 9230 పరుగులు చేశాడు. ఇందులో 7 డబుల్ సెంచరీలు, 23 సెంచరీలు, 31 అర్ద సెంచరీలు ఉన్నాయి.కోహ్లి టెస్ట్ల్లో 10000 పరుగులు పూర్తి చేయాలని కలలు కాన్నాడు. అయితే అనూహ్య రిటైర్మెంట్ ప్రకటన కారణంగా అతను అనుకున్న టార్గెట్ను రీచ్ కాలేకపోయాడు. కోహ్లి తన టార్గెట్కు 770 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.టీమిండియా టెస్ట్ల్లో కనీసం ఐదేళ్లు డామినేట్ చేయడం చూడాలని కోహ్లి కలలుగన్నాడు. దీన్ని అతను కెప్టెన్గా ఉన్న కాలంలో (2015-2022) నెరవేర్చుకున్నాడు. కోహ్లి కెప్టెన్గా ఉన్న కాలం టీమిండియాకు స్వర్ణ యుగం లాంటిది. కోహ్లి కెప్టెన్సీలో భారత్ 68 మ్యాచ్ల్లో ఏకంగా 40 మ్యాచ్లు గెలిచింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా కోహ్లి రికార్డుల్లో నిలిచిపోయాడు. కోహ్లి కెప్టెన్సీలో భారత్ తొలి డబ్ల్యూటీసీ ఫైనల్కు కూడా చేరింది.భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించే సమయంలో కోహ్లి వ్యక్తిగతంగానూ రాణించాడు. టీమిండియా కెప్టెన్గా కోహ్లి ఏ భారత ఆటగాడికి సాధ్యంకాని రీతిలో ఏకంగా ఏడు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు.2016-18 కోహ్లి ఆటగాడిగా, భారత కెప్టెన్గా చెలరేగిపోయాడు. ఈ మధ్యకాలంలో కోహ్లి 35 టెస్టుల్లో 66.59 సగటున 3,596 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, ఎనిమిది అర్ధ సెంచరీలు ఉన్నాయి. విరాట్ సాధించిన పలు ఘనతలు - కెప్టెన్గా అత్యధిక టెస్ట్ విజయాలు: 40 - విరాట్ కోహ్లీ (68 మ్యాచ్లు) (ఆసియా ఆటగాళ్లలో)- స్వదేశం వెలుపల అత్యధిక టెస్ట్ విజయాలు: 16 - విరాట్ కోహ్లీ (37 మ్యాచ్లు) (భారత కెప్టెన్లలో)- సేనా దేశాల్లో అత్యధిక టెస్ట్ విజయాలు: 7 - విరాట్ కోహ్లీ (24 మ్యాచ్లు)- సేనా దేశాల్లో అత్యధిక టెస్ట్ సెంచరీలు (భారత ఆటగాళ్లలో): 12 విరాట్ కోహ్లి (93 ఇన్నింగ్స్లు)- కెప్టెన్గా అత్యధిక టెస్ట్ పరుగులు: 5864 - విరాట్ కోహ్లీ (113 ఇన్నింగ్స్లు) (ఆసియా ఆటగాళ్లలో)- కెప్టెన్గా అత్యధిక టెస్ట్ సెంచరీలు: 20 - విరాట్ కోహ్లీ (113 ఇన్నింగ్స్లు)- ఆసియా ఖండం అవతల అత్యధిక సెంచరీలు: 14 విరాట్ కోహ్లి (108 ఇన్నింగ్స్లు)- అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానం- కోహ్లి సారథ్యంలో టీమిండియా 49 నెలలు నంబర్ వన్గా ఉండింది. -
దిగ్గజ నాయకుడు.. అసలైన టార్చ్ బేరర్! హ్యాట్సాఫ్.. కానీ ఎందుకిలా?
విరాట్ కోహ్లి (Virat Kohli)ని ఇకపై టీమిండియా టెస్టు జట్టులో చూడలేము.. సుదీర్ఘ ఫార్మాట్లో అతడి ఆటను, అల్లరిని మిస్సవుతాము.. అవును!.. పద్నాలుగేళ్లుగా తన అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యాలతో అలరించిన కోహ్లి సంప్రదాయ ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు.టెస్టుల్లో భారత కెప్టెన్గా అత్యంత విజయవంతమైన సారథుల్లో ఒకడైన 36 ఏళ్ల కోహ్లి.. తన కెరీర్ను ముగించాడు.బ్యాటర్గా సూపర్ హిట్తన పద్నాలుగేళ్ల కెరీర్లో కోహ్లి 123 టెస్టులు ఆడి 9230 పరుగులు సాధించాడు. సగటు 46.85. ఇందులో 30 శతకాలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఏడు డబుల్ సెంచరీలు కూడా కోహ్లి తన ఖాతాలో వేసుకున్నాడు. సంప్రదాయ ఫార్మాట్లో అతడి అత్యధిక స్కోరు 254. ఆసీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ తదితర విదేశీ గడ్డలపై సెంచరీలతో అలరించాడు.తన అద్బుత బ్యాటింగ్తో టెస్టుల్లో సచిన్ టెండుల్కర్ (15,921 పరుగులు), రాహుల్ ద్రవిడ్ (13,265), సునిల్ గావస్కర్ (10,122) తర్వాత అత్యధిక పరుగులు చేసిన నాలుగో భారత బ్యాటర్గా కోహ్లి రికార్డు సాధించాడు.టెస్టుల్లో భారత జట్టు దిశను మార్చిన యోధుడు2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన కోహ్లి.. 2014-15 ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా కెప్టెన్గా పగ్గాలు చేపట్టాడు. అప్పటికి భారత్ ర్యాంకింగ్స్లో ఎనిమిదో స్థానంలో ఉంది. అయితే, ఆ తర్వాత కోహ్లి సారథ్యంలో అగ్రస్థానానికి ఎగబాకింది.చిరస్మరణీయ విజయాలు2018-19లో తొలిసారి ఆసీస్ గడ్డపై కోహ్లి సేన టెస్టు సిరీస్ విజయం సాధించింది. అనంతరం 2021-22లో ఇంగ్లండ్లో 2-2తో డ్రా చేసుకుంది. సౌతాఫ్రికాలోనూ చిరస్మరణీయ విజయాలు సాధించింది. సొంతగడ్డపై కోహ్లి కెప్టెన్గా వరుసగా 11 టెస్టుల్లో టీమిండియాను గెలిపించాడు.సారథిగా మొత్తంగా 68 మ్యాచ్లలో నలభై విజయాలు సాధించిన కోహ్లి.. గ్రేమ్ స్మిత్ (53), రిక్కీ పాంటింగ్ (48), స్టీవ్ వా(41) తర్వాత టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్గా నిలిచాడు. అంతేకాదు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2021 ఫైనల్కు టీమిండియాను చేర్చాడు. అయితే, 2022లో సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా టెస్టు కెప్టెన్సీకి కోహ్లి వీడ్కోలు పలికాడు.ఆ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆటగాడిగా కొనసాగిన కోహ్లి.. తాజాగా రోహిత్ టెస్టులకు గుడ్బై చెప్పిన వారం లోపే తానూ అదే బాటలో నడిచాడు. సోషల్ మీడియా వేదికగా సోమవారం స్వయంగా కింగ్ రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించడంతో అభిమానుల హృదయాలు ముక్కలయ్యాయి. ‘‘ఇప్పుడే.. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు కోహ్లి?’ అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు.ఎందుకు? కోహ్లి రిటైర్ అయ్యావుభారత మాజీ క్రికెటర్లు కూడా సోషల్ మీడియా వేదికగా ఇదే తరహాలో స్పందిస్తున్నారు. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. ‘‘ఎందుకు? కోహ్లి రిటైర్ అయ్యావు’’ అని ప్రశ్నించాడు. ఇక భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. ‘‘టెస్టుల్లో అత్యద్భుతమైన కెరీర్ కలిగి ఉన్నందుకు శుభాకాంక్షలు విరాట్ కోహ్లి.అసలైన టార్చ్బేరర్ నువ్వేకెప్టెన్గా నువ్వు కేవలం మ్యాచ్లు మాత్రమే గెలవలేదు. ఆటగాళ్ల ఆలోచనా విధానాన్ని కూడా మార్చివేశావు. టెస్టుల్లో ఫిట్నెస్, దూకుడుతో పాటు ఒక రకమైన గర్వంతో ఎలా ఆడాలో చూపించావు. కొత్త ప్రమాణాలు రూపొందించావు. భారత టెస్టు క్రికెట్లో అసలైన టార్చ్బేరర్ నువ్వే. ధన్యవాదాలు’’ అంటూ ఉద్వేగపూరిత నోట్ పంచుకున్నాడు.చదవండి: కోహ్లి రిటైర్మెంట్పై బీసీసీఐ ట్వీట్.. మండిపడుతున్న అభిమానులు -
యూ టర్న్ తీసుకున్న యశస్వి జైస్వాల్
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మనసు మార్చుకున్నాడు. దేశవాలీ క్రికెట్లో గోవాకు ఆడాలనుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. జైస్వాల్ కొద్ది రోజుల కిందట ముంబై నుంచి గోవాకు వలస వెళ్లాలని (దేశవాలీ క్రికెట్) నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా అతను ముంబై క్రికెట్ అసోసియేషన్పై (MCA) ఒత్తిడి తెచ్చి మరీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) పొందాడు. తాజాగా ఈ విషయంలో జైస్వాల్ యూ టర్న్ తీసుకున్నాడు. తిరిగి తాను ముంబైకే ఆడాలని నిర్ణయించుకున్నట్లు ఎంసీఏకు ఈ-మెయిల్ ద్వారా సందేశాన్ని పంపాడు. వారు జారీ చేసిన ఎన్వోసీని వెనక్కు తీసుకోవాలని కోరాడు. గోవాకు వలస వెళ్లాలనుకున్న తన ప్రణాళికను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపాడు. ఈ దేశవాలీ సీజన్లో సెలెక్షన్కు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. ఎంసీఏ తిరిగి తనను ముంబైకి ఆడేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశాడు. ఎంసీఏ ఇచ్చిన ఎన్వోసీని బీసీసీఐకి కానీ గోవా క్రికెట్ అసోసియేషన్కు కాని సమర్పించలేదని తెలిపాడు.కాగా, ఉత్తర్ప్రదేశ్లో పుట్టిన జైస్వాల్.. ముంబై తరఫున దేశవాలీ క్రికెట్ ఆడి టీమిండియాలో, ఐపీఎల్లో చోటు దక్కించుకున్నాడు. వ్యక్తిగత కారణాల చేత తనకు జీవితాన్ని ఇచ్చిన ముంబై క్రికెట్ అసోసియేషన్నే వదిలి వెళ్లాలనుకున్న జైస్వాల్ ఎందుకో తిరిగి మనసు మార్చుకున్నాడు. వాస్తవానికి గోవా క్రికెట్ అసోసియేషన్ జైస్వాల్కు కెప్టెన్సీ ఆశ చూపి తమవైపు మళ్లేలా చేసుకుంది. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ, అతను తిరిగి పాత జట్టు ముంబైకే ఆడాలనుకుంటున్నాడు.జైస్వాల్కు ముంబై తరఫున ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఆ జట్టు తరఫున ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణించాడు. 2018-19 రంజీ సీజన్లో తొలిసారి ముంబైకు ప్రాతినిథ్యం వహించిన జైస్వాల్.. అతి తక్కువ వ్యవధిలో చాలా పాపులర్ అయ్యాడు. ముంబై తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 60కి పైగా సగటుతో 13 సెంచరీలు, 12 అర్ద సెంచరీల సాయంతో 3712 పరుగులు చేశాడు. ఇందులో డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి.2019-20 సీజన్లో ముంబై తరఫున లిస్ట్-ఏ క్రికెట్లోకి అడుగుపెట్టిన జైస్వాల్.. విజయ్ హజారే ట్రోఫీలో జరిగిన ఓ మ్యాచ్లో డబుల్ సెంచరీ చేశాడు. ఈ ప్రదర్శన కారణంగానే జైస్వాల్కు ఐపీఎల్ ఛాన్స్ దక్కింది. 2020 సీజన్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జైస్వాల్ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోని జైస్వాల్ ఫార్మాట్లకతీతంగా దేశవాలీ క్రికెట్లో, అంతర్జాతీయ క్రికెట్లో, ఐపీఎల్లో చెలరేగిపోతున్నాడు. -
ఆపరేషన్ సిందూర్ 2.0పై అంబటి రాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు
పహల్గామ్ ఉగ్రదాడుల నేపథ్యంలో పాక్ దుశ్చర్యలకు బదులుగా ఆపరేషన్ సిందూర్ 2.0 పేరిట భారత బలగాలు ఇస్తున్న ధీటైన సమాధానంపై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కంటికి కన్ను అనుకుంటూ పోతే ప్రపంచం గుడ్డిదవుతుందని ఎక్స్ వేదికగా అభిప్రాయపడ్డాడు. రాయుడు చేసిన ఈ ట్వీట్ సోషల్మీడియాలో దుమారం రేపుతుంది. రాయుడును నెటిజన్లు ఆడుకుంటున్నారు.“An eye for an eye makes the whole world blind.”Let’s remember — this isn’t a call for weakness, but a reminder of wisdom.Justice must stand firm, but never lose sight of humanity.We can love our nation fiercely and still hold compassion in our hearts.Patriotism and peace can…— ATR (@RayuduAmbati) May 8, 2025విషయం పూర్తిగా తెలిసే ఇలాంటి కామెంట్లు చేస్తున్నావా అని మండిపడుతున్నారు. ఎవరు మొదలుపెట్టారో తెలిసే వాగుతున్నావా అని ప్రశ్నిస్తున్నారు. ఉగ్రమూకలపై ప్రతి చర్యకు దిగికపోతే వారు మనల్ని మట్టుబెడతారని అంటున్నారు. పాక్ సానుభూతిపరుడిలా ఉన్నావంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. భారత దళాలు పాక్ దుశ్చర్యలను కేవలం తిప్పికొడుతున్నారన్న విషయాన్ని గమనించాలని కోరుతున్నారు. ఇలాంటి సమయంలో భారత దళాలకు మద్దతుగా నిలవాలి కాని, శాంతి అంటూ ఉపోద్ఘాతాలు ఇవ్వకూడదని చురకలంటిస్తున్నారు.Prayers for peace and safety in Jammu & Kashmir, Punjab and other parts of India along the border. Hoping for strength, security and swift resolution for everyone affected. Jai Hind!— ATR (@RayuduAmbati) May 8, 2025తన ట్వీట్కు నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో రాయుడు డిఫెన్స్లో పడ్డాడు. సదరు ట్వీట్ను తొలగించకపోయినా, జనాలను శాంతింప జేసేందుకు మరో రెండు ట్వీట్లు చేశాడు. వీటిలో మొదటి దాంట్లో ఇలా రాసుకొచ్చాడు. జమ్మూ కశ్మీర్, పంజాబ్ మరియు భారతదేశంలోని ఇతర సరిహద్దు ప్రాంతాల్లో శాంతి భద్రత కోసం ప్రార్ధిస్తున్నాను. ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ బలం, భద్రత మరియు త్వరిత పరిష్కారం కోసం ఆశిస్తున్నాను. జై హింద్ అంటూ రాసుకొచ్చాడు.In moments like these, we stand united not in fear, but in resolve. I feel immense gratitude to our Indian Army who are the real heroes who carry the weight of a nation with unmatched courage, discipline, and selflessness🙏🏻Your sacrifices don't go unnoticed. Your bravery is what…— ATR (@RayuduAmbati) May 8, 2025రెండో ట్వీట్లో ఇలా రాశాడు. ఇలాంటి క్షణాల్లో మేము భయంతో కాదు, దృఢ సంకల్పంతో ఐక్యంగా ఉన్నాము. అసమాన ధైర్యం, క్రమశిక్షణ మరియు నిస్వార్థతతో దేశ భద్రతను కాపాడుతున్న మన భారత సైన్యానికి అపారమైన కృతజ్ఞతలు. మీ త్యాగాలు గుర్తించబడకుండా ఉండవు. మీ ధైర్యమే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తుంది. మీ ధీరత్వమే మన సరిహద్దులను సురక్షితంగా ఉంచుతుంది. మీ బలం ఎల్లప్పుడూ మమ్మల్ని భద్రంగా ఉంచాలి. మీ సేవ మరింత శాంతియుత రేపటికి మార్గం సుగమం చేయాలి. జై హింద్ అంటూ రాసుకొచ్చాడు.రాయుడు ముందు చేసిన ట్వీట్కు డ్యామేజ్ కంట్రోల్గా ఈ ట్వీట్లు చేసినప్పటికీ జనాల ఆగ్రహం తగ్గలేదు. మొదటి ట్వీట్నే ఆసరగా చేసుకుని ఏకి పారేస్తున్నారు. టీమిండియా, ఐపీఎల్, రాజకీయాలతో ముడిపెట్టి తోచిన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. మొత్తాన్ని ఐపీఎల్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్న వేల రాయుడు క్రికెట్ అభిమానులకు మంచి స్టఫ్గా మారాడు. -
క్రికెట్ అభిమానులకు గుండె పగిలే వార్త.. రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ
టీమిండియా అభిమానులకు గుండె పగిలే వార్త. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని హిట్మ్యాన్ స్వయంగా తన ఇన్స్టా ఖాతా ద్వారా వెల్లడించాడు. తన రిటైర్మెంట్ తక్షణమే అమల్లోకి వస్తుందని రోహిత్ పేర్కొన్నాడు. రోహిత్ తన రిటైర్మెంట్ ప్రకటనలో ఇలా రాసుకొచ్చాడు. "అందరికీ నమస్కారం, నేను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్న విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. తెల్ల దుస్తుల్లో నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా గౌరవంగా ఉంది. సంవత్సరాలుగా మీ అందరి ప్రేమ మరియు మద్దతుకు ధన్యవాదాలు. వన్డే ఫార్మాట్లో కొనసాగుతాను"38 ఏళ్ల రోహిత్ భారత్ తరఫున 67 టెస్ట్లు ఆడి 40.6 సగటున 4301 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ, 11 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2022లో విరాట్ కోహ్లి నుంచి టెస్ట్ కెప్టెన్సీని చేపట్టిన రోహిత్.. 24 టెస్ట్ల్లో టీమిండియా సారథిగా వ్యవహరించాడు. ఇందులో 12 మ్యాచ్ల్లో భారత్ను విజేతగా నిలబెట్టాడు. 9 మ్యాచ్ల్లో భారత జట్టు ఓడగా.. మూడు మ్యాచ్లు డ్రా అయ్యాయి. రోహిత్ తర్వాత టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్ను ప్రకటించాల్సి ఉంది. రేసులో శుభ్మన్ గిల్ ముందున్నాడు. రోహిత్ గతేడాది పొట్టి ప్రపంచకప్ తర్వాత టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో రోహిత్ భారత్ను జగజ్జేతగా నిలిపాడు. ఇదిలా ఉంటే, ఇటీవలి కాలంలో టెస్ట్ల్లో రోహిత్ శర్మ ప్రదర్శన చాలా దారుణంగా ఉండింది. గత 10 టెస్ట్ మ్యాచ్ల్లో హిట్మ్యాన్ ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. తాజాగా ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. 5 ఇన్నింగ్స్ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. పేలవ ప్రదర్శన కారణంగా ఆ సిరీస్ ఆఖరి మ్యాచ్లో రోహిత్ స్వతాహాగా జట్టు నుంచి తప్పుకున్నాడు.అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లోనూ రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. ఆ సిరీస్లో మూడు మ్యాచ్ల్లో కేవలం 91 పరుగులు మాత్రమే చేశాడు. వ్యక్తిగతంగా విఫలం కావడమే కాకుండా ఈ రెండు సిరీస్ల్లో రోహిత్ కెప్టెన్గానూ విఫలమయ్యాడు. ఈ రెండు సిరీస్లను భారత్ కోల్పోయింది. -
టీమిండియా భారీ టార్గెట్.. వీరోచితంగా పోరాడిన సౌతాఫ్రికా
శ్రీలంకలో జరుగుతున్న మహిళల ట్రై నేషన్ సిరీస్లో ఇవాళ (మే 7) భారత్, సౌతాఫ్రికా జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. జెమీమా రోడ్రిగెజ్ (123) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్లో జెమీమాతో పాటు స్మృతి మంధన (51), దీప్తి శర్మ (93) కూడా సత్తా చాటారు. దీప్తి 7 పరుగులతో సెంచరీని కోల్పోయింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా చివరి వరకు వీరోచితంగా పోరాడినప్పటికీ గెలవలేకపోయింది. అన్నెరీ డెర్క్సన్ (81), కెప్టెన్ క్లో ట్రయాన్ (67) సౌతాఫ్రికాను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేయగలిగింది. భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆటగాళ్లు పోరాడిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. భారత బౌలర్లలో అమన్జోత్ కౌర్ 3, దీప్తి శర్మ 2, శ్రీ చరణి, ప్రతిక రావల్ తలో వికెట్ తీశారు. ఫైనల్ రేసులో నిలవాలంటే సౌతాఫ్రికా ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాల్సి ఉండింది. ఈ ఓటమితో సౌతాఫ్రికా టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్, శ్రీలంక ఫైనల్కు చేరుకున్నాయి. మే 11న కొలొంబో వేదికగా ఫైనల్ జరుగుతుంది. అంతకుముందు సౌతాఫ్రికా మే 9న శ్రీలంకతో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది.ఈ టోర్నీలో సౌతాఫ్రికా ఆడిన మూడు మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. భారత్ నాలుగింట మూడు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. శ్రీలంక మూడింట రెండు గెలిచి రెండో స్థానంలో ఉంది. -
వాళ్లకు డబ్బులు ఇచ్చానో లేదో మీకెందుకు?
సుదీర్ఘ కాలంగా తనపై విమర్శలు చేసే ఇద్దరు భారత మాజీ కెప్టెన్ల వ్యాఖ్యలపై టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) ఘాటుగా స్పందించాడు. ప్రస్తుతం కామెంటేటర్లుగా ఉన్న సునీల్ గావస్కర్ (Sunil Gavaskar), రవిశాస్త్రి (Ravi Shastri) తనపై పదే పదే విమర్శలు చేసిన విషయాన్ని పరోక్షంగా గంభీర్ గుర్తు చేశాడు. ఆ గాయం అంత పెద్దదేమీ కాదుకాగా 2011లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో గంభీర్ తలకు తగిలిన గాయం ‘అంత పెద్దదేమీ కాదు’ అని రవిశాస్త్రి అప్పట్లో విమర్శించాడు. మరోవైపు.. తాజాగా చాంపియన్స్ ట్రోఫీ గెలిచాక బీసీసీఐ ప్రకటించిన ప్రైజ్మనీలో సహచర కోచింగ్ సిబ్బందికంటే గంభీర్ ఎక్కువ మొత్తం తీసుకోవడాన్ని గావస్కర్ ప్రశ్నించాడు.ఇప్పుడు వీరిద్దరికి కలిపి గంభీర్ సమాధానమిచ్చాడు. ‘నేను కోచ్గా వచ్చి ఎనిమిది నెలలే అయింది. ఫలితాలు రాకపోతే విమర్శించే హక్కు అభిమానులకు ఉంది. కానీ 25 ఏళ్లుగా కామెంటరీ బాక్స్లో కూర్చున్నవారు భారత క్రికెట్ను తమ ఆస్తిగా భావిస్తున్నట్లున్నారు. డబ్బులు ఇచ్చానా లేదా అనేది మీకెందుకు?కానీ భారత్ క్రికెట్ వారిది కాదు.. 140 కోట్ల మంది భారతీయులది. వారు నా కోచింగ్ను, నా గాయాన్ని, చాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్మనీని కూడా ప్రశ్నించారు. నేను నిజానికి ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. వేరేవాళ్లకు డబ్బులు ఇచ్చానా లేదా అనేది వారికి అనవసరం. నేనెంత డబ్బు ఖర్చుపెట్టాను.. ఎంత పెట్టుబడి పెట్టాను అన్న వివరాలు వారికెందుకు? అయినా నేనేమీ ఇక్కడ సంపాదించి విదేశాలకు వలసవెళ్లిపోలేదే? 180 రోజులు విదేశాల్లోనే గడపడం లేదే? నేను భారతీయుడిని.. పన్ను తప్పించుకునేందుకు ఎన్నారైగా మారటం లేదు. గాజు గృహాల్లో ఉండేవారు వేరేవాళ్ల మీద రాళ్లు విసరవద్దు’ అని గంభీర్ కౌంటర్ ఇచ్చాడు.గంభీర్ మార్గదర్శనంలోకాగా టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తర్వాత రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెడ్కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోగా.. గంభీర్ ఆ పదవిని చేపట్టాడు. అతడి మార్గదర్శనంలో భారత జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్లో మెరుగ్గా రాణిస్తోంది.టీ20 ద్వైపాక్షిక సిరీస్లలో వరుస విజయాలు సాధిస్తున్న టీమిండియా... దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత శ్రీలంకతో వన్డే సిరీస్ను మాత్రం కోల్పోయింది. అయితే, ఇటీవలే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచి సత్తా చాటింది. ఈ క్రమంలో బీసీసీఐ రూ. 58 కోట్ల క్యాష్ రికార్డు ప్రకటించింది. ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ. 3 కోట్ల చొప్పున.. అదే విధంగా హెడ్కోచ్ గంభీర్కు రూ. 3 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే, గతంలో ద్రవిడ్ తాను ప్రత్యేకంగా ఎక్కువ ప్రైజ్మనీ తీసుకోకుండా.. సహాయక సిబ్బందికి సమానంగా పంచాడని గావస్కర్ గుర్తు చేశాడు.ఇదిలా ఉంటే.. టెస్టుల్లో టీమిండియా గంభీర్ మార్గదర్శనంలో దారుణంగా విఫలమవుతోంది. తొలుత సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్వాష్కు గురైంది. తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో ఓడి పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ట్రోఫీని చేజార్చుకుంది.చదవండి: టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్ మా బౌలర్లకే: ఓటమిపై హార్దిక్ -
టోర్నీ మధ్యలో వైదొలిగిన టీమిండియా ప్లేయర్
భారత మహిళా క్రికెట్ జట్టు ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న ట్రై నేషన్ సిరీస్లో ఆడుతుంది. ఈ టోర్నీలో భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. శ్రీలంక కూడా మూడింట రెండు విజయాలు సాధించి, రన్రేట్ విషయంలో భారత్ కంటే వెనుకపడి ఉండటంతో రెండో స్థానంలో ఉంది. సౌతాఫ్రికా జట్టు ఆడిన రెండు మ్యాచ్ల్లో పరాజయాలు ఎదుర్కొని చివరి స్థానంలో నిలిచింది. తాజాగా జరిగిన మ్యాచ్లో భారత్పై శ్రీలంక సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేయగా.. శ్రీలంక మరో 5 బంతులు మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ మే 7న జరిగే తమ తదుపరి మ్యాచ్లో సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. ఆతర్వాత మే 9న శ్రీలంక, సౌతాఫ్రికా తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉండే జట్లు మే 11న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.భారత్కు ఎదురుదెబ్బసౌతాఫ్రికాతో జరుగబోయే మ్యాచ్కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ టోర్నీలోనే అరంగేట్రం చేసిన 22 ఏళ్ల బ్యాటింగ్ ఆల్రౌండర్ కశ్వీ గౌతమ్ గాయం బారిన పడింది. ఈ కారణంగా ఆమె టోర్నీ నుంచి వైదొలిగింది. శ్రీలంకతో జరిగిన గత మ్యాచ్ సందర్భంగా కశ్వీ కాలికి గాయమైంది. కశ్వీ స్థానాన్ని అన్ క్యాప్డ్ పేసర్ క్రాంతి గౌడ్తో రీప్లేస్ చేశారు భారత సెలెక్టర్లు. కశ్వీ గత డబ్ల్యూపీఎల్ సీజన్లో విశేషంగా రాణించి టీమిండియాలో స్థానం సంపాదించింది. కశ్వీ డబ్ల్యూపీఎల్లో గుజరాత్ జెయింట్స్కు ప్రాతినథ్యం వహిస్తుంది. -
అందుకే టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్గా తప్పుకొన్నా: కోహ్లి
టీమిండియా బ్యాటర్గా, కెప్టెన్గా ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు విరాట్ కోహ్లి (Virat Kohli). అయితే, 2021 టీ20 ప్రపంచకప్లో భారత జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో పొట్టి ఫార్మాట్ పగ్గాలు వదిలేశాడు. అదే ఏడాది తన ఐపీఎల్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్గానూ కోహ్లి వైదొలిగాడు. ఆ మరుసటి సంవత్సరం టీమిండియా వన్డే, టెస్టు జట్టు సారథిగానూ తప్పుకొన్నాడు.ఆ తర్వాత కోహ్లి 2.0గా తిరిగొచ్చి ప్రస్తుతం ఇటు టీమిండియా వన్డే, టెస్టు జట్లలో.. అటు ఆర్సీబీలో స్టార్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్-2025 (IPL 2025)తో బిజీగా ఉన్న ఈ బెంగళూరు ఆటగాడు.. తాను కెప్టెన్సీ నుంచి వైదొలగడానికి కారణాల గురించి తాజాగా మాట్లాడాడు.అందుకే టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్గా తప్పుకొన్నాఆర్సీబీ బోల్డ్ డైరీస్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ‘‘ఒకానొక సమయంలో... పరిస్థితులన్నీ కఠినంగా మారిపోయాయి. నా కెరీర్లో చాలా మార్పులు జరిగిపోతున్నాయి. అప్పటికి ఏడు- ఎనిమిదేళ్ల నుంచి నేను టీమిండియా కెప్టెన్గా ఉన్నాను.ఆర్సీబీకి తొమ్మిదేళ్లుగా సారథిగా కొనసాగుతున్నాను. ఆ సమయంలో నా బ్యాటింగ్ మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతీ మ్యాచ్లోనూ నేను బాగా ఆడాలనే ఆకాంక్షలు ఉన్నాయి. కెప్టెన్గా ఉన్నా.. బ్యాటర్గా కొనసాగినా ఇలాంటివి తప్పదని అర్థమైంది. 24*7 నేను ఎక్స్పోజ్ అవుతూనే ఉంటా. ఇది నాకు కఠినంగా తోచింది.పరిస్థితులు నా ఆధీనంలో లేకుండా పోయాయి. అప్పుడే నేను సంతోషంగా ఉండాలని.. నా ఆనందం కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నా. అందుకే కెప్టెన్సీ నుంచి వైదొలిగాను. వ్యక్తిగత జీవితంలో నా కంటూ కొన్ని ప్రత్యేక పేజీలు ఉండాలి.ఆటగాడిగా వచ్చి నా పని పూర్తి చేసి వెళ్తాలి.. నా ఆటను విమర్శించే అవకాశం ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాను. ఈ సీజన్లో జరుగుతున్నది ఇదే’’ అని విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా అండర్-19 క్రికెట్లో కెప్టెన్గా భారత్కు టైటిల్ అందించాడు కోహ్లి. ఈ క్రమంలో జాతీయ జట్టులోకి దూసుకువచ్చిన ఈ ఢిల్లీ బ్యాటర్.. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో రాటుదేలాడు.కెప్టెన్గానూ తనదైన ముద్రబ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ.. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రికార్డులెన్నో సాధించాడు. కెప్టెన్గానూ తనదైన ముద్ర వేశాడు. ఆస్ట్రేలియాలో టెస్టుల్లో భారత్ను విజేతగా నిలపడం కోహ్లి కెరీర్లో చిరస్మరణీయంగా గుర్తుండిపోతుంది.ఇక భారత జట్టు సారథిగా మూడు ఫార్మాట్లలో కలిపి 213 మ్యాచ్లు ఆడిన కోహ్లి ఖాతాలో 135 విజయాలు ఉన్నాయి. అదే విధంగా ఆటగాడిగా.. 2008 నుంచి ఇప్పటి వరకు టీమిండియా తరఫున ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 123 టెస్టులు, 302 వన్డేలు, 125 టీ20లు పూర్తి చేసుకున్నాడు.రికార్డుల రారాజుటెస్టుల్లో 9230, వన్డేల్లో 14181, టీ20లలో 4188 పరుగులు సాధించాడు. కోహ్లి ఖాతాలో 30 టెస్టు సెంచరీలు, వన్డేల్లో 51 శతకాలు, అంతర్జాతీయ టీ20లలో ఒక సెంచరీ ఉంది. తద్వారా ఓవరాల్గా 82 సెంచరీలతో.. శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు కోహ్లి.ఇక వన్డేల్లో 51 సెంచరీలతో సచిన్ను కూడా దాటేసి అత్యధిక శతకాల వీరుడిగా చరిత్ర సృష్టించాడు కూడా!.. ఐపీఎల్ కెరీర్ విషయానికొస్తే.. 2008 నుంచీ ఆర్సీబీకే ఆడుతున్న కోహ్లి 263 మ్యాచ్లలో ఎనిమిది శతకాలతో కలిపి 8509 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్-2025లోనూ ఇప్పటికి పదకొండు మ్యాచ్లలో కలిపి 505 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు.చదవండి: SRH Vs DC: ‘హే.. వెళ్లు.. వెళ్లు.. నువ్వు అవుట్’!.. కావ్యా మారన్ రియాక్షన్ వైరల్ -
వార్షిక ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని దక్కించుకున్న టీమిండియా
ఐసీసీ వార్షిక పరిమిత ఓవర్ల ఫార్మాట్ల ర్యాంకింగ్స్ భారత పురుషుల క్రికెట్ జట్టు అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ ర్యాంకింగ్స్ గతేడాది మే నుండి జరిగిన అన్ని మ్యాచ్లను 100 శాతంగా, గత రెండు సంవత్సరాల్లో జరిగిన మ్యాచ్లను 50 శాతంగా పరిగణలోకి తీసుకుని నిర్ణయించబడ్డాయి. ప్రస్తుత వన్డే, టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా.. వార్షిక ర్యాంకింగ్స్లోనూ టాప్ ప్లేస్ దక్కించుకుంది. గడిచిన రెండేళ్లలో పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో విశేషంగా రాణిస్తున్న టీమిండియా.. గతేడాది టీ20 ప్రపంచకప్, ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా విడుదల చేసిన వార్షిక వన్డే ర్యాంకింగ్స్లో భారత్ రెండు పాయింట్లు మెరుగుపర్చుకుని పాయింట్ల సంఖ్యను 122 నుంచి 124కు పెంచుకుంది. భారత్ తర్వాత రెండో స్థానంలో ఛాంపియన్స్ ట్రోఫీ రన్నరప్ న్యూజిలాండ్ ఉంది. న్యూజిలాండ్.. వన్డేల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను వెనక్కు నెట్టి రెండో స్థానానికి చేరుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన కనబర్చిన ఆసీస్ మూడో స్థానానికి పడిపోయింది.ఇటీవల స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ల్లో భారత్, ఆసీస్కు ఓడించిన శ్రీలంక ఐదు రేటింగ్ పాయింట్లు మెరుగుపర్చుకుని తాజా ర్యాంకింగ్స్లో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. పాకిస్తాన్, సౌతాఫ్రికా ఐదు, ఆరు స్థానాల్లో నిలిచాయి. గత రెండేళ్లలో మెరుగైన ప్రదర్శనలు చేసిన ఆఫ్ఘనిస్తాన్ రేటింగ్ పాయింట్లు పెంచుకుని ఏడో స్థానానికి ఎగబాకగా.. మాజీ వరల్డ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ ఎనిమిదో స్థానానికి పడిపోయింది. వెస్టిండీస్, బంగ్లాదేశ్ వరుసగా తొమ్మిది, పది స్థానాల్లో ఉన్నాయి.మరోవైపు టీ20 ర్యాంకింగ్స్లోనూ భారత్ హవా కొనసాగింది. ప్రస్తుత టీ20 ఛాంపియన్స్ అయిన భారత్ టాప్ ప్లేస్లో ఉండగా.. ఆసీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వరుస స్థానాల్లో నిలిచాయి.టెస్ట్ల్లో ఆస్ట్రేలియాఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్లో ప్రస్తుత డబ్ల్యూటీసీ ఛాంపియన్ ఆస్ట్రేలియా టాప్ ప్లేస్ను దక్కించుకుంది. ఆసీస్ రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ కంటే 13 పాయింట్లు అధికంగా సాధించింది. ఈ దఫా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్ను ఎదుర్కోబోయే సౌతాఫ్రికా మూడో స్థానంలో నిలిచింది. ఇటీవల న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతుల్లో పరాజయాల నేపథ్యంలో భారత్ నాలుగో స్థానానికి దిగజారింది. న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఐర్లాండ్ టాప్-10లో ఉన్నాయి. -
ఇంటర్నేషనల్ బ్రాండ్కు గ్లోబల్ అంబాసిడర్గా కేఎల్ రాహుల్
ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్ పాల్ & షార్క్కు (Paul & Shark) గ్లోబల్ అంబాసిడర్గా టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని పాల్ & షార్క్ సంస్థ యాజమాన్యం ఇవాళ (మే 2) ప్రకటించింది. రాహుల్ లాంటి నిష్ణాతుడైన క్రికెటర్తో భాగస్వామ్యం పొందడం తమ సంస్థకు గర్వకారణమని పేర్కొంది. రాహుల్ పాల్ & షార్క్కు గ్లోబల్ అంబాసిడర్గా ఎంపికైన మొట్టమొదటి భారత అథ్లెట్.పాల్ & షార్క్ అనేది ఇటలీకి చెందిన లగ్జరీ దుస్తుల కంపెనీ. ఈ సంస్థను పాలో డిని అనే వ్యాపారవేత్త 1975లో స్థాపించాడు. దీని ప్రధాన కార్యాలయం వారెస్లో ఉంది. ఈ ఫ్యాషన్ బ్రాండ్ ప్రధానంగా లైఫ్స్టైల్ మరియు స్పోర్ట్వేర్ దుస్తులను తయారు చేస్తుంది. ఈ కంపెనీ లోగోపై షార్క్ గుర్తు ఉంటుంది. ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 280 స్టోర్లు ఉన్నాయి. పాల్ & షార్క్ భారత్లో 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ కంపెనీకి భారత్లో ప్రముఖ నగరాల్లో స్టోర్లు ఉన్నాయి.ఇదిలా ఉంటే, కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్ 2025తో బిజీగా ఉన్నాడు. ఈ సీజన్లో అతను ప్రాతినిథ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ బెర్త్కు ప్రధాన పోటీదారుగా ఉంటూ, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుంది. ఢిల్లీ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించింది. ఈ జట్టు విజయాల్లో కేఎల్ రాహుల్ది కీలకపాత్ర. రాహుల్ ఈ సీజన్లో 9 మ్యాచ్లు ఆడి 53 సగటున, 146.06 స్ట్రయిక్రేట్తో 371 పరుగులు చేసి లీడింగ్ రన్స్కోరర్ల జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ఈ మ్యాచ్ మే 5న హైదరాబాద్లో జరుగనుంది. -
Rohit Sharma: ఆ 'మూడు రికార్డులు' ఎవ్వరూ బద్దలు కొట్టలేరు..!
టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఇవాళ (ఏప్రిల్ 30) 38వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా హిట్మ్యాన్కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సహచర క్రికెటర్లతో పాటు అభిమానులు సోషల్మీడియా వేదికగా రోహిత్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.BIRTHDAY CELEBRATION OF INDIAN CAPTAIN ROHIT SHARMA ♥️ pic.twitter.com/cQQRzoRpCd— Johns. (@CricCrazyJohns) April 30, 2025ప్రస్తుతం ఐపీఎల్ 2025 ఆడుతున్న రోహిత్.. తన జట్టు సభ్యులు మరియు భార్య రితక సజ్దేతో కలిసి కేక్ కట్ చేశాడు. హిట్మ్యాన్ పుట్టిన రోజు సందర్భంగా అతను సాధించిన రికార్డులపై ఓ లుక్కేద్దాం.THE BIRTHDAY CELEBRATIONS OF HITMAN ROHIT SHARMA. 🥹- Moments of the Day. ❤️ pic.twitter.com/ZncZTNEVB6— Tanuj (@ImTanujSingh) April 30, 20252007లో టీమిండియా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ తన కెరీర్లో ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆటగాడిగా, కెప్టెన్గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. టీమిండియా తరఫున 67 టెస్ట్లు, 273 వన్డేలు, 159 టీ20లు ఆడిన హిట్మ్యాన్ మూడు ఫార్మాట్లలో కలిపి 19700 పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు, 108 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన రోహిత్ మొత్తం 266 మ్యాచ్లు ఆడి 2 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీల సాయంతో 6868 పరుగులు చేశాడు.రోహిత్ తన సుదీర్ఘ కెరీర్లో భారత జట్టు, తన ఐపీఎల్ జట్లైన డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఎన్నో రికార్డులు సాధించాడు. వీటిలో మూడు రికార్డులు మాత్రం ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. అవేంటంటే..వన్డేల్లో అత్యధిక స్కోర్ (264)2014, నవంబర్ 13న రోహిత్ శర్మ శ్రీలంకపై 264 పరుగులు (173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లు) చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటికీ ఇదే అత్యుత్తమ స్కోర్గా చలామణి అవుతుంది. బహుశా మున్ముందు కూడా ఈ రికార్డు పదిలంగానే ఉండే అవకాశం ఉంది. వన్డేల్లో ఇంత భారీ ఇన్నింగ్స్లు ఆడాలంటే చాలా సహనం కావాలి. నేటి తరం క్రికెటర్లలో ఇది కొరవడింది. కాబట్టి ఈ రికార్డు వన్డే క్రికెట్ చరిత్రలో చిరకాలం పదిలంగా ఉండే అవకాశం ఉంది.సింగిల్ వరల్డ్కప్లో అత్యధిక సెంచరీలు (5)2019 వన్డే వరల్డ్కప్లో రోహిత్ సెంచరీల సునామీ సృష్టించాడు. ఆ టోర్నీలో ఏకంగా ఐదు సెంచరీలు (సౌతాఫ్రికా, పాకిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంక) సాధించి చరిత్ర సృష్టించాడు. ఓ వరల్డ్కప్ ఎడిషన్లో ఓ ఆటగాడు చేసిన అత్యధిక సెంచరీలు ఇవే. ఈ టోర్నీలో హిట్మ్యాన్ ఉగ్రరూపం దాల్చి 9 మ్యాచ్ల్లో 648 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఈ రికార్డు బద్దలు కొట్టడం కూడా దాదాపుగా అసాధ్యమే.వన్డేల్లో అత్యధిక డబుల్ సెంచరీలు (3)వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ చేస్తేనే అత్యద్భుతం అనుకునే రోజుల్లో హిట్మ్యాన్ ఏకంగా మూడు డబుల్ సెంచరీలు బాది చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో ఇప్పటివరకు 10 డబుల్ సెంచరీలు నమోదు కాగా.. అందులో రోహిత్ ఒక్కడే మూడు సాధించడమంటే మామూలు విషయం కాదు. 2013లో ఆస్ట్రేలియాపై తన తొలి డబుల్ సెంచరీ (208 నాటౌట్) సాధించిన హిట్మ్యాన్ ఆతర్వాతి ఏడాదే (2014) శ్రీలంకపై వరల్డ్ రికార్డు డబుల్ సెంచరీ (264) సాధించాడు. 2017లో రోహిత్ మరోసారి శ్రీలంకపై డబుల్ సెంచరీ (208 నాటౌట్) చేశాడు.అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ చాలా రికార్డులు నమోదు చేసినప్పటికీ ఈ రికార్డులను మాత్రం ఎవరూ బద్దలు కొట్టలేదు.ప్లేయర్గా, కెప్టెన్గా రోహిత్ సాధించిన పలు ఘనతలు/రికార్డులు..వరల్డ్కప్ సెంచరీలు- 7 కెప్టెన్గా 2 ఐసీసీ టైటిళ్లు (2024 టీ20 వరల్డ్కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ)ఆటగాడిగా 4 ఐసీసీ టైటిళ్లువన్డేల్లో మూడు డబుల్ సెంచరీలుసింగిల్ వరల్డ్కప్లో అత్యధిక సెంచరీలువన్డేల్లో అత్యధిక స్కోర్కెప్టెన్గా అత్యధిక విన్నింగ్ పర్సంటేజీ (కనీసం 100 అంతర్జాతీయ మ్యాచ్లు)కెప్టెన్గా 5 ఐపీఎల్ టైటిళ్లుఆటగాడిగా 6 ఐపీఎల్ టైటిళ్లు -
ఇంగ్లండ్ టూర్కు ఆర్సీబీ కెప్టెన్.. కరుణ్, సాయి సుదర్శన్కు కూడా పిలుపు..?
ఐపీఎల్ 2025 ముగిశాక భారత క్రికెట్ జట్టు జూన్ మధ్యలో ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరుతుంది. ఈ పర్యటనలో టీమిండియా 5 టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ 35 మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తుంది.బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25, అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఘోరంగా విఫలమైన భారత కెప్టెన్ రోహిత్ శర్మకు సెలెక్టర్లు మరో అవకాశం ఇస్తారని తెలుస్తుంది. ఇన్ ఫామ్ బ్యాటర్ కరుణ్ నాయర్, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ జట్టులో చోటు దక్కించుకోనున్నారని సమాచారం. ఐపీఎల్ 2025లో లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్న గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ను ప్రత్యామ్నాయ ఓపెనర్గా ఎంపిక చేయనున్నారని తెలుస్తుంది. ప్రత్యామ్నాయ ఓపెనర్గా సీఎస్కే యువ సంచలనం ఆయుశ్ మాత్రే పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.అశ్విన్ రిటైర్ కావడంతో అతని స్థానాన్ని కుల్దీప్ యాదవ్తో భర్తీ చేయనున్నారని సమాచారం. ఈ సిరీస్ కోసం అక్షర్ పటేల్ పేరు పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తుంది. అలాగే మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ పేరును కూడా సెలెక్టర్లు పక్కన పెట్టారని తెలుస్తుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో సత్తా చాటుతున్న శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేయాలా వద్దా అన్న అంశంపై చర్చలు సాగుతున్నట్లు సమాచారం. ప్రధాన పేసర్లుగా బుమ్రా, షమీ ఎంపిక దాదాపుగా ఖరారైనప్పటికీ.. సేఫ్టీగా వీలైనంత ఎక్కువ మంది రిజర్వ్ పేసర్లను ఎంపిక చేయనున్నారని తెలుస్తుంది. ఇంగ్లండ్ పర్యటన కోసం భారత సీనియర్ జట్టుతో పాటు భారత-ఏ జట్టును కూడా మే రెండో వారంలో ప్రకటించే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, భారత ఆటగాళ్లంతా ప్రస్తుతం ఐపీఎల్ 2025లో బిజీగా ఉన్నారు. ఈ లీగ్లో ప్రదర్శనల ఆధారంగా ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికలు జరుగుతాయి. ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే ఆటగాళ్లను భారత సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోవచ్చు. ఫార్మాట్ వేరైనా ఆటగాళ్లలో కన్సిస్టెన్సీని గమనిస్తారు.ప్రస్తుతం ఐపీఎల్ 2025 రసవత్తరంగా సాగుతుంది. మొత్తం ఏడు జట్లు నాలుగు ప్లే ఆఫ్స్ బెర్త్ల కోసం ప్రధానంగా పోటీపడుతున్నాయి. ఏ జట్టుకు ఇప్పటివరకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు కాలేదు. సీఎస్కే మినహా అన్ని జట్లకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. ప్లే ఆఫ్స్ రేసులో ఆర్సీబీ ముందుంది. ఆ జట్టు 10 మ్యాచ్ల్లో 7 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఆతర్వాత ముంబై, గుజరాత్, ఢిల్లీ తలో 12 పాయింట్లతో వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి. పంజాబ్ (11), లక్నో (10), కేకేఆర్ (9) ఆతర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రాజస్థాన్ (6), సన్రైజర్స్ (6), సీఎస్కే (4) 8, 9, 10 స్థానాల్లో ఉన్నాయి. -
టీమిండియాను శిక్షించిన ఐసీసీ
శ్రీలంకలో జరుగుతున్న మహిళల ట్రై నేషన్ సిరీస్లో కోడ్ ఉల్లంఘించినందుకు గానూ ఐసీసీ టీమిండియాను శిక్షించింది. ఈ టోర్నీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత బౌలర్లు నిర్దేశిత సమయంలో తమ కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోయారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఆర్టికల్ 2.22 ఉల్లంఘన కిందికి ఇది వస్తుంది. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు నిర్దేశిత సమయం పూర్తయ్యే సరికి ఓ ఓవర్ వెనుక పడ్డారు. ఐసీసీ నియమాల ప్రకారం స్లో ఓవర్ రేట్లో ప్రతి ఓవర్కు ప్లేయర్ల మ్యాచ్ ఫీజ్లో 5 శాతం కోత విధిస్తారు. మ్యాచ్లో పాల్గొన్న సభ్యులందరికీ ఈ కోత వర్తిస్తుంది. ఐసీసీ విధించిన ఈ జరిమానాను టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఒప్పుకోవడంతో ఎలాంటి విచారణ జరగలేదు.వర్షం కారణంగా 39 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను భారత బౌలర్లు 147 పరుగులకే ఆలౌట్ (38.1 ఓవర్లలో) చేశారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 3, నల్లపురెడ్డి చరణి, దీప్తి శర్మ తలో 2, అరుంధతి రెడ్డి ఓ వికెట్ పడగొట్టారు. శ్రీలంక ఇన్నింగ్స్లో హాసిని పెరీరా (30) టాప్ స్కోరర్గా నిలిచింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. 29.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఆ మ్యాచ్లో కూడా ప్రతిక రావల్ (50 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించింది. స్మృతి మంధన 43, హర్లీన్ డియోల్ 48 (నాటౌట్) పరుగులతో సత్తా చాటారు.ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికాపై విజయంఈ టోర్నీలో భాగంగా నిన్న (ఏప్రిల్ 29) జరిగిన ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికాపై భారత్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది.ఓపెనర్ ప్రతిక రావల్ (78) అర్ద సెంచరీతో.. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (41), జెమీమా రోడ్రిగెజ్ (41), స్మృతి మంధన (36), హర్లీన్ డియోల్ (29), రిచా ఘోష్ (24) ఓ మోస్తరు స్కోర్లతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది.భారత ఇన్నింగ్స్లో దీప్తి శర్మ (9) ఒక్కరే సింగిల్ డిజిట్ స్కోర్కు ఔట్ కాగా.. కశ్వీ గౌతమ్ 5 పరుగులతో అజేయంగా నిలిచింది. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా 2, ఖాకాచ, క్లాస్, డి క్లెర్క్, డెర్క్సెన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 277 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 49. 2 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో సునాయాసంగా గెలిచేలా కనిపించిన సౌతాఫ్రికాను భారత స్పిన్నర్ స్నేహ్ రాణా దెబ్బతీసింది. 48వ ఓవర్లో మూడు కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.రాణా ఓవరాల్గా తన 10 ఓవర్ల కోటాలో 43 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించింది. దక్షిణాఫ్రికా 11 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోయింది. అద్భుతమైన ప్రదర్శన చేసినందుకు స్నేహ్ రాణాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో టాజ్మిన్ బ్రిట్స్ (107 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్లతో 109) విరోచిత శతకంతో చెలరేగింది. ఆమెతో పాటు లారా వోల్వార్డ్ట్(43), అన్నేరీ డెర్క్సెన్(30) రాణించినప్పటికి.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ప్రోటీస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.కాగా, ఈ ట్రై నేషన్ సిరీస్లో భారత్, సౌతాఫ్రికా, శ్రీలంకు జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో భారత్.. సౌతాఫ్రికా, శ్రీలంకతో మరో మ్యాచ్ ఆడుతుంది. అన్ని మ్యాచ్ల తర్వాత మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు మే 11న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ప్రస్తుతం భారత్ టేబుల్ టాపర్గా కొనసాగుతుంది. -
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
శ్రీలంకతో జరుగుతున్న మహిళల ముక్కోణపు వన్డే సిరీస్-2025లో భారత్ ఇవాళ (ఏప్రిల్ 29) సౌతాఫ్రికాతో తలపడుతుంది (కొలొంబో వేదికగా). ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ప్రతిక రావల్ (78) అర్ద సెంచరీతో.. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (41), జెమీమా రోడ్రిగెజ్ (41), స్మృతి మంధన (36), హర్లీన్ డియోల్ (29), రిచా ఘోష్ (24) ఓ మోస్తరు స్కోర్లతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో దీప్తి శర్మ (9) ఒక్కరే సింగిల్ డిజిట్ స్కోర్కు ఔట్ కాగా.. కశ్వీ గౌతమ్ 5 పరుగులతో అజేయంగా నిలిచింది. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా 2, ఖాకాచ, క్లాస్, డి క్లెర్క్, డెర్క్సెన్ తలో వికెట్ పడగొట్టారు.కాగా, ఈ ట్రై నేషన్ సిరీస్లో భారత్, సౌతాఫ్రికాతో పాటు శ్రీలంకు కూడా పాల్గొంటుంది. ఈ టోర్నీ ఏప్రిల్ 27న ప్రారంభం కాగా.. తొలి మ్యాచ్లో భారత్, శ్రీలంక తలపడ్డాయి. వర్షం కారణంగా 39 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను భారత బౌలర్లు 147 పరుగులకే ఆలౌట్ (38.1 ఓవర్లలో) చేశారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 3, నల్లపురెడ్డి చరణి, దీప్తి శర్మ తలో 2, అరుంధతి రెడ్డి ఓ వికెట్ పడగొట్టారు. శ్రీలంక ఇన్నింగ్స్లో హాసిని పెరీరా (30) టాప్ స్కోరర్గా నిలిచింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. 29.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఆ మ్యాచ్లో కూడా ప్రతిక రావల్ (50 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించింది. స్మృతి మంధన 43, హర్లీన్ డియోల్ 48 (నాటౌట్) పరుగులతో సత్తా చాటారు. ఈ టోర్నీలో భారత్ సౌతాఫ్రికా, శ్రీలంకతో మరో మ్యాచ్ ఆడుతుంది. అన్ని మ్యాచ్ల తర్వాత మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు మే 11న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. -
"గౌతమ్ గంభీర్ను చంపేస్తాం".. ఐసిస్ బెదిరింపులు
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్కు ఉగ్రవాద సంస్థ ఐసిస్ కశ్మీర్ నుంచి బెదిరింపులు వచ్చాయి. హతమారుస్తామంటూ (IKILLU) ఐసిస్ కశ్మీర్ రెండు ఈ-మెయిల్స్ చేసింది. ఈ విషయాన్ని గంభీర్ వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. ఢిల్లీలోని రాజీందర్నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించినందుకు గంభీర్కు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తుంది. తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని గంభీర్ ఢిల్లీ పోలీసులను కోరాడు.Praying for the families of the deceased. Those responsible for this will pay. India will strike. #Pahalgam— Gautam Gambhir (@GautamGambhir) April 22, 2025గంభీర్ పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చాడు. మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. దీనికి బాధ్యులు మూల్యం చెల్లించుకుంటారు. భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని పేర్కొన్నాడు.కాగా, ఐపీఎల్ కారణంగా గంభీర్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. గంభీర్ ఇటీవలే కుటుంబంతో కలిసి ఫ్రాన్స్లో హాలిడే ఎంజాయ్ చేసి వచ్చాడు. గంభీర్ గతేడాది జులైలో టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. భారత్ టీ20 వరల్డ్కప్ గెలిచాక రాహుల్ ద్రవిడ్ నుంచి బాధ్యతలు స్వీకరించాడు. టీమిండియా కోచ్గా గంభీర్కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. గంభీర్ నేతృత్వంలో భారత్.. శ్రీలంక చేతిలో వన్డే సిరీస్, న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియా చేతిలో బోర్డర్-గవాస్కర్ సిరీస్ల్లో ఓటమిపాలైంది. మధ్యలో కొన్ని చిన్నాచితక విజయాలతో పాటు భారత్ గంభీర్ నేతృత్వంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. -
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా విడుదల.. రీఎంట్రీ ఇచ్చిన శ్రేయస్, ఇషాన్.. కొత్తగా నితీశ్కు చోటు
2024-25 సంవత్సరానికి గానూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తమ వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను (34 మంది) విడుదల చేసింది. భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా తమ ఏ ప్లస్ కేటగిరీని రీటైన్ చేసుకోగా.. క్రమశిక్షణారాహిత్యం కారణంగా గతేడాది కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కాంట్రాక్ట్ జాబితాలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. శ్రేయస్ బి కేటగిరీలో, ఇషాన్ సి కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, యువ పేసర్ హర్షిత్ రాణా తొలిసారి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందారు.🚨 𝗡𝗘𝗪𝗦 🚨BCCI announces annual player retainership 2024-25 - Team India (Senior Men)#TeamIndiaDetails 🔽https://t.co/lMjl2Ici3P pic.twitter.com/CsJHaLSeho— BCCI (@BCCI) April 21, 2025సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా మొత్తం నాలుగు కేటగిరీలుగా విభజించడింది. ఇందులో ఏ ప్లస్ కింద విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరికి ఏడాది 7 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.గ్రేడ్-ఏలో సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా, షమీ, రిషబ్ పంత్ ఉన్నారు. వీరికి ఏడాదికి 5 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.గ్రేడ్-బిలో సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. వీరికి ఏడాదికి 3 కోట్ల రూపాయలు శాలరీగా లభించనుంది.గ్రేడ్-సిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, రజత్ పాటిదార్, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ఉన్నారు. వీరికి ఏడాదికి కోటి రూపాయలు శాలరీగా లభించనుంది.ఈ ఏడాది కొత్తగా కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్లు: ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చకరవర్తి, హర్షిత్ రాణా, శ్రేయస్ అయ్యర్ఈ ఏడాది కాంట్రాక్ట్ కోల్పోయిన ఆటగాళ్లు: శార్దూల్ ఠాకూర్, జితేష్ శర్మ, కేఎస్ భరత్, అవేష్ ఖాన్ఈ ఏడాది పదోన్నతి పొందిన ఆటగాడు: రిషబ్ పంత్ (బి కేటగిరి నుండి ఏ కేటగిరికి)రిటైర్డ్ అయిన ఆటగాడు: రవిచంద్రన్ అశ్విన్ (కేటగిర ఏ నుంచి ఔట్) -
IPL 2025: కేకేఆర్తో జతకట్టిన అభిషేక్ నాయర్
టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఐపీఎల్ 2025 సీజన్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్తో జతకట్టాడు. నాయర్ టీమిండియా అసిస్టెంట్ కోచ్గా ఎంపిక కాకముందు (గత సీజన్లో) కేకేఆర్ సపోర్టింగ్ స్టాఫ్లో సభ్యుడిగా ఉన్నాడు. టీమిండియా పదవి ఊడటం ఖాయమని తెలిసాక నాయర్ మళ్లీ కేకేఆర్లో చేరిపోయాడు. నాయర్ను తిరిగి తమ సహాయక బృందంలోకి ఆహ్వానిస్తున్నామని కేకేఆర్ యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది.నాయర్ గతేడాది జులైలో టీమిండియా అసిస్టెంట్ కోచ్గా ఎంపికయ్యాడు. అతని పదవీకాలం ఈ ఏడాది జులైతో ముగుస్తుంది. బీసీసీఐ నాయర్ కాంట్రాక్ట్ పునరుద్ధరించకూడదని నిర్ణయించింది. దీంతో నాయర్ తన పదవీకాలం మరో మూడు నెలలు ఉండగానే టీమిండియా పదవికి గుడ్బై చెప్పి తన పాత జట్టు కేకేఆర్లో చేరిపోయాడు. నాయర్తో పాటు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ కాంట్రాక్ట్లను కూడా పునరుద్ధరించకూడదని బీసీసీఐ నిర్ణయించింది.కాగా, గత ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ ఛాంపియన్గా నిలవడంలో అభిషేక్ నాయర్ కీలకపాత్ర పోషించాడు. అయితే కేకేఆర్ పరిస్థితి ఈ సీజన్లో భిన్నంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ జట్టు 7 మ్యాచ్ల్లో కేవలం మూడే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. నాయర్ చేరికతో కేకేఆర్ ఆటతీరులో మార్పు వస్తుందేమో చూడాలి. ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్ టేబుల్ టాపర్లుగా కొనసాగుతున్నాయి. -
బంగ్లాదేశ్లో టీమిండియా పర్యటన ఖరారు.. షెడ్యూల్ విడుదల
ఈ ఏడాది ఆగస్ట్లో భారత్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటించనుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ ఇవాళ (ఏప్రిల్ 15) ప్రకటించింది. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. రెండు వేదికల్లో ఈ మ్యాచ్లు జరుగనున్నాయి. ఆగస్ట్ 17న వన్డే సిరీస్.. 26న టీ20 సిరీస్ మొదలవుతాయి.వన్డే సిరీస్ షెడ్యూల్..తొలి వన్డే – ఆదివారం, ఆగస్టు 17, మిర్పూర్రెండో వన్డే – బుధవారం, ఆగస్టు 20, మిర్పూర్మూడో వన్డే – శనివారం, ఆగస్టు 23, చట్టోగ్రామ్టీ20 సిరీస్ షెడ్యూల్..తొలి T20I – మంగళవారం, ఆగస్టు 26, చట్టోగ్రామ్లరెండో T20I – శుక్రవారం, ఆగస్టు 29, మిర్పూర్లమూడు T20I – ఆదివారం, ఆగస్టు 31, మిర్పూర్కాగా, భారత క్రికెటర్లంతా ప్రస్తుతం ఐపీఎల్ 2025తో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ మే 25న ముగుస్తుంది. అనంతరం భారత్ జూన్లో ఇంగ్లండ్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ ఐదు టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది.ఇంగ్లండ్లో భారత పర్యటన షెడ్యూల్..తొలి టెస్ట్- జూన్ 20-24రెండో టెస్ట్- జులై 2-6మూడో టెస్ట్- జులై 10-14నాలుగో టెస్ట్- జులై 23-27ఐదో టెస్ట్- జులై 31-ఆగస్ట్ 3ఈ సిరీస్ తర్వాతే భారత్ బంగ్లాదేశ్ పర్యటనకు బయల్దేరుతుంది.అనంతరం భారత జట్టు సెప్టెంబర్ నెలంతా ఖాళీగా ఉండి అక్టోబర్ 2 నుంచి స్వదేశంలో వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది.వెస్టిండీస్ సిరీస్ షెడ్యూల్..తొలి టెస్ట్- అక్టోబర్ 2-6 (అహ్మదాబాద్)రెండో టెస్ట్- అక్టోబర్ 10-14 (కోల్కతా)ఈ సిరీస్ తర్వాత భారత్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తుంది. ఈ పర్యటనలో భారత్ 3 వన్డేలు, 5 టీ20లు జరుగనున్నాయి.ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన షెడ్యూల్..అక్టోబర్ 19- తొలి వన్డే (డే అండ్ నైట్)- పెర్త్అక్టోబర్ 23- రెండో వన్డే (డే అండ్ నైట్)- అడిలైడ్అక్టోబర్ 25- మూడో వన్డే (డే అండ్ నైట్)- సిడ్నీఅక్టోబర్ 29- తొలి టీ20- కాన్బెర్రాఅక్టోబర్ 31- రెండో టీ20- మెల్బోర్న్నవంబర్ 2- మూడో టీ20- హోబర్ట్నవంబర్ 6- నాలుగో టీ20- గోల్డ్ కోస్ట్నవంబర్ 8- ఐదో టీ20- బ్రిస్బేన్ఆస్ట్రేలియా పర్యటన తర్వాత భారత్ స్వదేశంలో సౌతాఫ్రికాతో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడుతుంది. ఈ పర్యటనలో సౌతాఫ్రికా రెండు టెస్ట్లు.. మూడు వన్డేలు.. ఐదు టీ20లు ఆడనుంది. భారత్లో సౌతాఫ్రికా పర్యటన షెడ్యూల్..తొలి టెస్ట్- నవంబర్ 14-18 (న్యూఢిల్లీ) రెండో టెస్ట్- నవంబర్ 22-26 (గౌహతి)తొలి వన్డే- నవంబర్ 30 (రాంచీ)రెండో వన్డే- డిసెంబర్ 3 (రాయ్పూర్)మూడో వన్డే- డిసెంబర్ 6 (వైజాగ్)తొలి టీ20- డిసెంబర్ 9 (కటక్)రెండో టీ20- డిసెంబర్ 11 (ఛండీఘడ్)మూడో టీ20- డిసెంబర్ 14 (ధర్మశాల)నాలుగో టీ20- డిసెంబర్ 17 (లక్నో)ఐదో టీ20- డిసెంబర్ 19 (అహ్మదాబాద్) -
రెండో సారి 'ఆ ఘనత' సాధించిన శ్రేయస్ అయ్యర్.. గిల్, బుమ్రా మాత్రమే..!
టీమిండియా స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 2025 మార్చి నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డు కోసం శ్రేయస్.. న్యూజిలాండ్కు చెందిన రచిన్ రవీంద్ర, జేకబ్ డఫీతో పోటీపడ్డాడు. ఐసీసీ ఓటింగ్ అకాడమీ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు తమ ఓట్ల ద్వారా శ్రేయస్ను ప్లేయర్ ఆఫ్ ద మంత్గా (మార్చి) నిర్ణయించారు.శ్రేయస్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకోవడం ఇది రెండో సారి (2022 ఫిబ్రవరి, 2025 మార్చి). భారత క్రికెటర్లలో శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా (2024 జూన్, 2024 డిసెంబర్) మాత్రమే ఈ అవార్డును రెండు అంతకంటే ఎక్కువ సార్లు గెలుచుకున్నారు. భారత్ తరఫున గిల్ అత్యధికంగా మూడు సార్లు (2023 జనవరి, 2023 సెప్టెంబర్, 2025 ఫిబ్రవరి) ప్లేయర్ ఆఫ్ ద మంత్గా నిలిచాడు.2021 జనవరిలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఐసీసీ ప్రవేశపెట్టగా.. ఇప్పటివరకు ఎనిమిది మంది టీమిండియా క్రికెటర్లు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డు అమల్లోకి వచ్చిన తొలి మూడు నెలల్లో భారత ఆటగాళ్లే (పంత్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్) ఈ అవార్డు గెలవడం విశేషం.ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులు గెలుచుకున్న టీమిండియా క్రికెటర్లు..శుభ్మన్ గిల్-3జస్ప్రీత్బుమ్రా-2శ్రేయస్ అయ్యర్-2రిషబ్ పంత్-1 (2021 జనవరి)రవిచంద్రన్ అశ్విన్-1 (2021 ఫిబ్రవరి)భువనేశ్వర్ కుమార్-1 (2021 మార్చి)విరాట్ కోహ్లి-1 (2022 అక్టోబర్)యశస్వి జైస్వాల్-1 (2024 ఫిబ్రవరి)మార్చి నెలలో శ్రేయస్ అయ్యర్శ్రేయస్ మార్చి నెలలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో విశేషంగా రాణించాడు. శ్రేయస్ ఈ నెలలో ఆడిన 3 మ్యాచ్ల్లో 57.33 సగటున 172 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో శ్రేయస్ భారత్ తరఫున లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలవడంలో శ్రేయస్ కీలకపాత్ర పోషించాడు. న్యూజిలాండ్తో జరిగిన గ్రూప్ మ్యాచ్లో 79 పరుగులు చేసిన శ్రేయస్.. సెమీస్లో ఆసీస్పై 45, ఫైనల్లో న్యూజిలాండ్పై 48 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో శ్రేయస్ మిడిలార్డర్లో ఇతర ఆటగాళ్లతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు.మహిళల విభాగంలో వాల్మహిళల విభాగంలో మార్చి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం చేతన ప్రసాద్ (యూఎస్ఏ), జార్జియా వాల్ (ఆస్ట్రేలియా), అన్నాబెల్ సదర్ల్యాండ్ (ఆస్ట్రేలియా) పోటీ పడగా.. జార్జియా వాల్ విజేతగా నిలిచింది. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కుమార్ (ఫోటోలు)
-
విశ్వక్రీడల్లోనూ క్రికెట్.. ఫార్మాట్, జట్లు తదితర వివరాలు
నూట ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి విశ్వక్రీడల్లో క్రికెట్ సమరానికి రంగం సిద్ధమైంది. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్-2028 సందర్భంగా టీ20 ఫార్మాట్లో ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఇందులో మహిళలు, పురుషుల విభాగం నుంచి ఆరు జట్లు భాగం కానున్నాయి. పదిహేను మంది సభ్యులతోఈ విషయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వర్గాలు ధ్రువీకరించాయి. అదే విధంగా.. 2032లో బ్రిస్బేన్లో జరిగే ఒలింపిక్స్లోనూ క్రికెట్ ఓ క్రీడాంశంగా ఉంటుందని స్పష్టం చేశాయి. ఇక 2028 ఒలింపిక్స్లో పాల్గొనబోయే క్రికెట్ జట్లకు గరిష్టంగా పదిహేను మంది సభ్యులతో కూడిన టీమ్ను ఎంపిక చేసుకోవచ్చు.ఇక ఆతిథ్య జట్టు హోదాలో అమెరికా నేరుగా ఈ మెగా ఈవెంట్కు అర్హత సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, మిగతా జట్లను మాత్రం ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారన్న అంశంపై మాత్రం స్పష్టత రాలేదు. అయితే, ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా ఒలింపిక్స్కు జట్లను ఎంపిక చేసే అవకాశం ఉంది.ర్యాంకింగ్స్ ఇలాప్రస్తుతం పొట్టి ఫార్మాట్లో టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ మెన్స్ ర్యాంకింగ్స్లో టాప్లో కొనసాగుతున్నాయి. అదే విధంగా.. మహిళల పొట్టి ఫార్మాట్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, టీమిండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి.ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో 12 పూర్తి స్థాయి జట్లు ఉండగా.. 90కి పైగా అసోసియేట్ దేశాల జట్లు టీ20 ఫార్మాట్లో ఆడుతున్నాయి. కాగా విశ్వక్రీడల్లో చివరగా 1900 సంవత్సరంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. కోహ్లి, రోహిత్ లేకుండానే..?!టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత.. భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వీరితో పాటు రవీంద్ర జడేజా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇక రోహిత్ వారసుడిగా టీ20 కెప్టెన్గా బీసీసీఐ సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేసింది. ఈ ముంబైకర్ సారథ్యంలో యువ జట్టు ద్వైపాక్షిక సిరీస్లలో అదరగొడుతోంది. వరుస విజయాలతో ఐసీసీ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో కొనసాగుతోంది. అయితే, ఒలింపిక్స్ 2028లో జరుగనున్నాయి. అప్పటికి కోహ్లి, రోహిత్ నలభైవ పడిలోకి వచ్చేస్తారు. కాబట్టి వారు రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా ఫిట్నెస్ దృష్ట్యా విశ్వక్రీడల్లో కనిపించడం సాధ్యంకాకపోవచ్చు.చదవండి: సంజూ శాంసన్కు భారీ షాక్!