breaking news
team india
-
బుమ్రాను భయపెడుతున్న పాకిస్తాన్ బౌలర్
టీమిండియా స్టార్ బౌలర్, పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాను (Jasprit Bumrah) పాకిస్తాన్ వెటరన్ స్పిన్నర్ నౌమన్ అలీ (Noman Ali) భయపెడుతున్నాడు. తాజాగా విడుదల చేసిన ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్లో నౌమన్ బుమ్రాకు అతి సమీపంగా వచ్చాడు. గత వారం అద్భుత ప్రదర్శన కారణంగా నౌమన్ ఈ వారం ర్యాంకింగ్స్లో ఏకంగా నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని, రెండో స్థానానికి ఎగబాకాడు. టాప్ ర్యాంక్లో ఉన్న బుమ్రాకు నౌమన్కు కేవలం 29 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది.గత వారం సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్లో నౌమన్ తొలి ఇన్నింగ్స్లో 6, రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లు సహా 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.39 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ అయిన నౌమన్ గత కొంతకాలంగా టెస్ట్ల్లో విశేషంగా రాణిస్తున్నాడు. చివరి 5 టెస్ట్ల్లో 5 ఐదు వికెట్ల ప్రదర్శనలు సహా 3 పది వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసి అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు. కెరీర్లో 21 టెస్ట్లు ఆడిన నౌమన్ 95 వికెట్లు తీశాడు.బుమ్రా విషయానికొస్తే.. ఇతను ఈ నెలలో వెస్టిండీస్తో ఆడిన రెండు టెస్ట్ల్లో పెద్దగా వికెట్లు తీయలేకపోయాడు. తొలి టెస్ట్లో 3, రెండో టెస్ట్లో 4 వికెట్లు మాత్రమే తీశాడు.ఈ వారం ర్యాంకింగ్స్లో నౌమన్తో పాటు మరో బౌలర్ భారీగా లబ్ది పొందాడు. సౌతాఫ్రికాకు చెందిన సెనూరన్ ముత్తుసామి పాక్తో జరిగిన తొలి టెస్ట్లో 11 వికెట్ల ప్రదర్శన నమోదు చేసి ఏకంగా 38 స్థానాలు ఎగబాకాడు. ప్రస్తుతం అతను 55 స్థానంలో ఉన్నాడు. ఈ రెండు భారీ మార్పులు మినహా ఈ వారం ర్యాంకింగ్స్లో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. భారత బౌలర్లు సిరాజ్, కుల్దీప్, జడేజా 12, 14, 18 స్థానాల్లో కొనసాగుతున్నారు.టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. రూట్, బ్రూక్, కేన్ టాప్-3లో కొనసాగుతుండగా.. టీమిండియా ఆటగాళ్లు జైస్వాల్, పంత్, గిల్ 5, 8, 12 స్థానాల్లో ఉన్నారు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో రవీంద్ర జడేజా ఎవరికీ అందనంత ఎత్తులో టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ స్పిన్నర్.. 92 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు -
ఆసీస్తో రెండో వన్డే.. భారీ రికార్డులపై కన్నేసిన కోహ్లి
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా (India Vs Australia) మధ్య రేపు (అక్టోబర్ 23) అడిలైడ్ వేదికగా రెండో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని (Virat Kohli) పలు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి.ఈ మ్యాచ్లో విరాట్ 54 పరుగులు చేస్తే వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కరను వెనక్కు నెట్టి రెండో స్థానానికి చేరతాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు.సచిన్ టెండూల్కర్-18426కుమార సంగక్కర-14234విరాట్ కోహ్లి-14181ఈ మ్యాచ్లో విరాట్ 68 పరుగులు చేస్తే పరిమిత ఓవర్ల క్రికెట్లో (వన్డేలు, టీ20లు కలిపి) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 463 వన్డేల్లో 18426 పరుగులు, ఒకే ఓక టీ20లో 10 పరుగులు సహా 18436 పరుగులు చేయగా.. విరాట్ 303 వన్డేల్లో 14181 పరుగులు, 125 టీ20ల్లో 4188 పరుగులు 18369 చేశాడు.ఈ మ్యాచ్లో విరాట్ సెంచరీ చేస్తే సచిన్ పేరిటే ఉన్న మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంటాడు. ఏదైనా సింగిల్ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు ప్రస్తుతం విరాట్, సచిన్ల పేరిట సంయుక్తంగా ఉంది. విరాట్ వన్డేల్లో 51 సెంచరీలు చేయగా.. టెస్ట్ల్లో సచిన్ పేరిట 51 శతకాలు ఉన్నాయి.కాగా, టెస్ట్లకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి, వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్.. ఆరు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ) ప్రస్తుత ఆసీస్ సిరీస్తోనే రీఎంట్రీ ఇచ్చాడు. తొలి వన్డేలో 8 బంతులు ఆడి డకౌటైన విరాట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాడు. రేపు జరుగబోయే రెండో వన్డేలో విరాట్ చెలరేగడం ఖాయమని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.ఈ మ్యాచ్కు వేదిక అయిన అడిలైడ్లో విరాట్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన 4 వన్డేల్లో 2 సెంచరీల సాయంతో 244 పరుగులు చేశాడు. ఈ మైదానంలో మిగతా రెండు ఫార్మాట్లలో కూడా విరాట్కు మంచి రికార్డు ఉంది. 5 టెస్ట్ల్లో 3 సెంచరీలు, ఓ అర్ద సెంచరీ సాయంతో 527 పరుగులు... 3 టీ20ల్లో 3 అర్ద సెంచరీల సాయంతో 204 పరుగులు చేశాడు.రేపటి మ్యాచ్లో విరాట్ 25 పరుగలు చేస్తే అడిలైడ్లో 1000 పరుగులు (మూడు ఫార్మాట్లలో) పూర్తి చేసుకుంటాడు. ఇదిలా ఉంటే, పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా మరో 29 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. చదవండి: ఓపెనర్గానూ రోహిత్ శర్మపై వేటు!?.. గంభీర్, అగార్కర్ చర్య వైరల్ -
పంత్ కారణంగానే సర్ఫరాజ్ ఖాన్పై వేటు.. అసలు విషయమేంటి?
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో గాయపడి ఆటకు దూరమైన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) తిరిగి మైదానంలోకి అడుగు పెడుతున్నాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో అక్టోబరు 30 నుంచి నవంబర్ 9 వరకు జరిగే రెండు నాలుగు రోజుల (ఫస్ట్క్లాస్) అనధికారిక టెస్టు మ్యాచ్లలో తలపడే భారత ‘ఎ’ జట్టుకు పంత్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు.బెంగళూరు వేదికగా జరిగే ఈ రెండు మ్యాచ్ల కోసం రెండు వేర్వేరు జట్లను మంగళవారం సెలక్టర్లు ప్రకటించారు. అయితే, ఇందులో ముంబై స్టార్ సర్ఫరాజ్ ఖాన్ (Sarfraz Khan)కు చోటు దక్కలేదు. కాగా స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్లలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ను ఆడిస్తామని సెలక్టర్లు నమ్మకంగానే అతడికి చెప్పినట్లు సమాచారం.పదిహేడు కిలోల మేర బరువు తగ్గి..ఈ నేపథ్యంలో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న వేళ సర్ఫరాజ్ ఖాన్ ఫిట్నెస్పై మరింతగా దృష్టి సారించాడు. ఏకంగా పదిహేడు కిలోల మేర బరువు తగ్గి స్లిమ్గా మారాడు. అయితే, సెలక్టర్లను మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.సొంతగడ్డపై సౌతాఫ్రికాతో టెస్టులకు ముందు జరిగే అనధికారిక టెస్టు సిరీస్కు సెలక్టర్లు సర్ఫరాజ్ను ఎంపిక చేయలేదు. ఇందుకు ప్రధాన కారణం అతడి బ్యాటింగ్ ఆర్డరే అని తెలుస్తోంది. సాధారణంగా ముంబై జట్టులో సర్ఫరాజ్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు.పంత్ రాకతోఅయితే, భారత- ‘ఎ’ జట్టు కెప్టెన్గా తిరిగి వచ్చిన పంత్ కూడా అదే స్థానంలో ఆడతాడన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ టాపార్డర్కు ప్రమోట్ అవుదామనుకున్నా.. ఓపెనర్లుగా ఆయుశ్ మాత్రే- నారాయణ్ జగదీశన్ వచ్చే అవకాశం ఉండగా.. వన్డౌన్లో వైస్ కెప్టెన్ సాయి సుదర్శన్ ఉండనే ఉన్నాడు.ఇక ఆ తర్వాతి స్థానం కోసం దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ పోటీపడుతున్నారు. ఇక మిడిలార్డర్లో ఐదో నంబర్లో పంత్ ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో సర్ఫరాజ్ బ్యాటింగ్ చేసే అవకాశం లేదు. ఇక టీమిండియాలోనూ ఆరో స్థానం నుంచి ఆల్రౌండర్లే ప్రధానంగా బ్యాటింగ్కు వస్తున్నారు.బ్యాటింగ్ ఆర్డర్ గురించి చర్చించాలిఇలాంటి సమీకరణల నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్కు ‘ఎ’ జట్టులోనూ చోటు కరువైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతడి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఒకరు పీటీఐతో మాట్లాడుతూ..‘‘ముంబై మేనేజ్మెంట్తో సర్ఫరాజ్ ఖాన్ తన బ్యాటింగ్ ఆర్డర్ గురించి చర్చించాలి. లేదంటే.. సీనియర్ ప్లేయర్ అజింక్య రహానేతో మాట్లాడాలి. మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి కొత్త బంతిని ఎదుర్కునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.చాలానే ఆప్షన్లు ఉన్నాయివన్డౌన్లో నిలదొక్కుకుంటే భవిష్యత్తులోనైనా అవకాశాలు వస్తాయి. అలా కాకుండా ఐదు లేదంటే ఆరో స్థానంలో ఆడతానంటే సర్ఫరాజ్ కెరీర్ ప్రశ్నార్థకమే అవుతుంది. ఎందుకంటే.. ఐదో స్థానంలో పంత్తో పాటు.. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, నితీశ్ రెడ్డి రూపంలో మేనేజ్మెంట్కు చాలానే ఆప్షన్లు ఉన్నాయి.ఈ ముగ్గురు ఫిట్గా ఉండి.. సెలక్షన్కు అందుబాటులో ఉంటే సర్ఫరాజ్ ఖాన్కు మొండిచేయి తప్పదు. ఒకవేళ పంత్ గాయపడినా ధ్రువ్ జురెల్ ఐదు లేదంటే ఆరో స్థానంలో ఆడతాడు. కాబట్టి సర్ఫరాజ్ మూడో స్థానంలో ఆడటంపై దృష్టి పెడితే బాగుంటుంది’’ అని సదరు సెలక్టర్ అభిప్రాయపడ్డాడు.కాగా ముంబై తరఫున రంజీల్లో పరుగుల వరద పారించిన 28 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్.. గతేడాది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఆరు టెస్టులు ఆడి 371 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు అర్ధ శతకాలు ఉన్నాయి.చదవండి: సౌతాఫ్రికాతో సిరీస్కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా రిషభ్ పంత్ -
దీపావళి సెలబ్రేషన్స్లో టీమిండియా క్రికెటర్లు (ఫోటోలు)
-
సిరాజ్ను వెనక్కు నెట్టిన జింబాబ్వే బౌలర్
టెస్ట్ క్రికెట్లో ఈ ఏడాది టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 26.91 సగటున 37 వికెట్లు తీసి, లీడింగ్ వికెట్ టేకర్గా ఉండేవాడు. తాజాగా జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ (Blessing Muzarabani) సిరాజ్ను వెనక్కు నెట్టి, అత్యధిక వికెట్ల వీరుడిగా అవతరించాడు. ఆఫ్ఘనిస్తాన్తో ఇవాళ (అక్టోబర్ 20) మొదలైన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీసిన ముజరబానీ తన వికెట్ల సంఖ్యను 39కి (10 మ్యాచ్ల్లో) పెంచుకున్నాడు. ముజరబానీ, సిరాజ్ తర్వాత ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మిచెల్ స్టార్క్ (7 మ్యాచ్ల్లో 29 వికెట్లు), నౌమన్ అలీ (26), నాథన్ లియోన్ (24) ఉన్నారు.ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో ముజరబానీతో పాటు (11-1-47-3), బ్రాడ్ ఈవాన్స్ (9.3-2-22-5), తనక చివంగ (6-0-29-1) చెలరేగడంతో జింబాబ్వే ఆఫ్ఘనిస్తాన్ను తొలి ఇన్నింగ్స్లో 127 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో 37 పరుగులు చేసిన రహ్మానుల్లా గుర్భాజ్ టాప్ స్కోరర్గా నిలిచాడు.ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో అబ్దుల్ మాలిక్ (30), ఇబ్రహీం జద్రాన్ (19), బషీర్ షా (12), అహ్మద్జాయ్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే.. మూడో సెషన్ సమయానికి వికెట్ నష్టానికి 85 పరుగులు చేసింది. బ్రియాన్ బెన్నెట్ (6) ఔట్ కాగా.. బెన్ కర్రన్ (34), నిక్ వెల్చ్ (40) క్రీజ్లో ఉన్నారు.కాగా, ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. టెస్ట్ మ్యాచ్ అనంతరం హరారే వేదికగా మూడు టీ20లు (అక్టోబర్ 29, 21, నవంబర్ 2) జరుగనున్నాయి.చదవండి: PAK VS SA 2nd Test: బాబర్ విఫలమైనా, ఆదుకున్న కెప్టెన్ -
ఆల్ ఫార్మాట్ రౌండర్
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మెరుపులు మెరిపించి జాతీయ సెలక్టర్ల దృష్టిలో పడ్డ నితీశ్ కుమార్ రెడ్డి... ఏడాది తిరిగేలోపు జాతీయ జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. గతేడాది అక్టోబర్లో టీమిండియా తరఫున తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడిన నితీశ్ రెడ్డి... ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టాడు. ‘బోర్డర్–గావస్కర్’ సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు ద్వారా సుదీర్ఘ ఫార్మాట్ బరిలోకి దిగిన ఈ ఆంధ్ర ఆల్రౌండర్... ఆ సిరీస్లో జరిగిన ఐదు మ్యాచ్ల్లోనూ ఆడాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు వచ్చి ధాటిగా షాట్లు ఆడగల సత్తా... ఉపయుక్తమైన మీడియం పేస్ బౌలింగ్ అతడికి వరుసగా అవకాశాలు కల్పించింది. హార్దిక్ పాండ్యా టెస్టు ఫార్మాట్కు దూరం కావడంతో... సుదీర్ఘ ఫార్మాట్లో భారత జట్టు చాలా కాలంగా పేస్ ఆల్రౌండర్ కోసం నిరీక్షిస్తోంది. అందివచ్చిన అవకాశాలను వినియోగించుకున్న నితీశ్ ఇప్పుడు తాజాగా వన్డే ఫార్మాట్లో సైతం అవకాశం దక్కించుకున్నాడు. పాండ్యా గైర్హాజరీలో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా ఆ్రస్టేలియాతో వన్డే సిరీస్కు ఎంపికయ్యాడు. పెర్త్ వేదికగా ఆదివారం జరిగిన పోరులో ఆఖర్లో బ్యాటింగ్కు వచి్చన ఈ ఆల్రౌండర్ 11 బంతులెదుర్కొని 2 సిక్సర్లతో 19 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా సాగకపోవడంతో అతడికి క్రీజులో ఎక్కువ సమయం గడిపే అవకాశం దక్కలేదు. బౌలింగ్లో మాత్రం 2.1 ఓవర్లు వేసిన నితీశ్ 16 పరుగులిచ్చాడు. వికెట్ తీయలేకపోయాడు. టెస్టు అరంగేట్రం చేసిన చోటే... ఆ్రస్టేలియా పర్యటనలో భాగంగా పెర్త్ టెస్టు ద్వారానే తొలి టెస్టు ఆడిన 23 ఏళ్ల నితీశ్ రెడ్డి... మళ్లీ ఇప్పుడు అక్కడే వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్లో టాపార్డర్ మొత్తం విఫలమైన చోట... ధనాధన్ బ్యాటింగ్తో 41 పరుగులు చేసిన నితీశ్... రెండో ఇన్నింగ్స్లో అయితే ఏకంగా టి20 మ్యాచ్ ఆడాడు. 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో అజేయంగా 38 పరుగులు చేసి భారత జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మిచెల్ స్టార్క్, జోష్ హాజల్వుడ్, ప్యాట్ కమిన్స్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొంటూ అతడు చూపిన తెగువ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. దీంతో టీమ్ మేనేజ్మెంట్ సైతం నితీశ్కు విరివిగా అవకాశాలు ఇచి్చంది. వాటిని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మక మెల్బోర్న్ మైదానంలో జరిగిన పోరులో నితీశ్ వీరవిహారం చేశాడు. ఎనిమిదో స్థానంలో క్రీజులోకి వచి్చన అతను ఆసీస్ బౌలింగ్ను ఓ ఆటాడుకొని సెంచరీతో అదరగొట్టాడు. దీంతో ఒక్కసారిగా అతడి పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత మరో నాలుగు టెస్టులు మాత్రమే ఆడిన అతడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో పాటు... గాయాల బారిన పడి కాస్త వెనుకబడ్డాడు. అయితే క్లిష్టమైన విదేశీ పర్యటనల్లో సత్తాచాటిన నితీశ్పై సెలెక్టర్లు నమ్మకముంచారు. గాయం నుంచి కోలుకొని... ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా మాంచెస్టర్లో ప్రాక్టీస్ చేస్తూ గాయపడిన నితీశ్ జట్టుకు దూరమయ్యాడు. గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఇంగ్లండ్ నుంచి తిరిగొచ్చాక అతడు పూర్తిగా మారిపోయాడు. సమయపాలన, క్రమశిక్షణ మొదటి నుంచే ఉన్న నితీశ్ రెడ్డి... వాటిని మరింత కఠినతరం చేశాడు. సరదాలు, షికార్లు పక్కనపెట్టి పూర్తిగా క్రికెట్పై దృష్టి పెట్టాడు. అదే సమయంలో తండ్రికి మోకాలి శస్త్రచికిత్స జరిగినా ఇంటికి వెళ్లకుండా పూర్తిగా సాధనకే పరిమితమయ్యాడు. విశాఖపట్నంలో ఉన్నన్ని రోజులు... జిమ్ లేదంటే మైదానంలోనే గడిపేవాడని అతడి తండ్రి ముత్యాల రెడ్డి పేర్కొన్నారు. అలా గంటల తరబడి శిక్షణ సాగిస్తూ మరింత రాటుదేలాడు. మోకాలి శస్త్రచికిత్స అనంతరం అతడి ఫిట్నెస్ మునుపటికంటే రెట్టింపు అయింది. అది ఇటీవల వెస్టిండీస్తో టెస్టు సిరీస్లో ప్రస్ఫుటమైంది. సూపర్ క్యాచ్ వెస్టిండీస్తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్లో నితీశ్ ఫర్వాలేదనిపించాడు. స్పిన్కు సహకరించే భారత పిచ్లపై పేస్ ఆల్రౌండర్గా ఎక్కువ ఓవర్లు వేసే అవకాశం దక్కని ఆంధ్ర ప్లేయర్... బ్యాటింగ్లో రాణించాడు. వెస్టిండీస్తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో నితీశ్ పట్టిన క్యాచ్ చూస్తే... అతడి ఫిట్నెస్ స్థాయి ఏంటో అర్థమవుతుంది. స్క్యేర్ లెగ్లో విండీస్ బ్యాటర్ ఇచ్చిన క్యాచ్ను చిరుతలా దూకుతూ అందుకున్న తీరు చూసి తీరాల్సిందే. ప్రస్తుతం జట్టులో ఉన్న ఫిటెస్ట్ ప్లేయర్లలో అతడు ఒకడు అనడంలో సందేహం లేదు. యో–యో టెస్టు, బ్రంకో టెస్టుల్లో టీమిండియాలో అందరికంటే మెరుగైన స్కోరు నితీశ్ రెడ్డిదే అని సమాచారం. విండీస్తో టెస్టు సిరీస్లో ఎక్కువ బౌలింగ్ చేసే అవకాశం రాకున్నా... హెడ్ కోచ్ గంభీర్ మాత్రం నితీశ్పై నమ్మకముందని అతడికి అండగా ఉంటామని స్పష్టంచేశాడు. ‘నితీశ్ ఎన్ని ఓవర్లు వేశాడనేది ముఖ్యం కాదు. జట్టుతో ఉండటమే ప్రధానం. అది ఎంతో నేర్చుకునే అవకాశం కల్పిస్తుంది. 23 ఏళ్ల కుర్రాడిని కేవలం విదేశీ పిచ్లపైనే పరీక్షించాలనే ఆలోచన మాకు లేదు. అవకాశం ఉన్నప్పుడల్లా స్వదేశంలో సైతం అతడికి చాన్స్లు ఇస్తాం. ప్రస్తుతం పేస్ ఆల్రౌండర్లు చాలా తక్కువ మంది అందుబాటులో ఉన్నారు. అందుకే నితీశ్కు అండగా ఉంటాం’ అని గంభీర్ అన్నాడు. వన్డే, టి20 ఫార్మాట్లలో హార్దిక్ పాండ్యా వంటి నిఖార్సైన పేస్ ఆల్రౌండర్ అందుబాటులో ఉండగా... టెస్టుల్లో ఆ స్థానాన్ని భర్తీ చేయడంతో పాటు... పరిమిత ఓవర్లలోనూ తనదైన ముద్ర వేయాలని నితీశ్ భావిస్తున్నాడు. -
ఆశలు రేపి... ఆఖర్లో కూల్చారు!
లక్ష్యఛేదనలో 253/4 స్కోరు వద్ద భారత్ 30 బంతుల్లో 36 పరుగుల సమీకరణమపుడు గెలుపే... భారత్వైపు తొంగిచూస్తోంది. కానీ తర్వాతి వరుస ఓవర్లలో హిట్టర్ రిచా ఘోష్, ఫిఫ్టీ చేసిన దీప్తిశర్మ అవుటవడంతోనే మహిళల జట్టు గెలుపునకు దూరమైంది. క్రీజులో ఉన్న అమన్జోత్, స్నేహ్రాణా సింగిల్స్కే పరిమితం కావడం... భారీ షాట్లు ఆడలేకపోవడంతో గెలుపు దారితప్పి ఓటమిబాట పట్టింది.ఇండోర్: ఇక గెలుపు ఖాయమేలే... విజయానికి చేరువయ్యామని అనుకుంటుండగా ఊహించని ఫలితం భారత శిబిరాన్ని ముంచేసింది. విజయం ఆశలు రేపిన మహిళలు ఆఖరికొచ్చేసరికి తమవల్ల కాదంటూ చేతులెత్తేశారు. దీంతో గెలుపుదాకా వచ్చిన భారత్ 4 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఇంగ్లండ్ అమ్మాయిల చేతిలో ఓడిపోయింది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో భారత జట్టు వరుసగా మూడో మ్యాచ్లోనూ పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హీథర్నైట్ (91 బంతుల్లో 109; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించింది. అమీ జోన్స్ (68 బంతుల్లో 56; 8 ఫోర్లు) అర్ధశతకం చేసింది. దీప్తిశర్మ (4/51) ప్రత్యర్థి బ్యాటింగ్కు దెబ్బతీయగా, శ్రీచరణి 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత మహిళల జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసి ఓడింది. స్మృతి మంధానా (94 బంతుల్లో 88; 8 ఫోర్లు), కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్ (70 బంతుల్లో 70; 10 ఫోర్లు), దీప్తిశర్మ (57 బంతుల్లో 50; 5 ఫోర్లు)ల అర్ధశతకాల మోత బూడిదలో పోసిన పన్నీరైంది. ప్రత్యర్థి బౌలర్లలో నాట్ సీవర్ బ్రంట్ 2 వికెట్లు తీసింది. కదంతొక్కిన హీథర్నైట్ ఓపెనర్ బ్యూమోంట్ (22) తక్కువ స్కోరుకే అవుటైనా... మరో ఓపెనర్ అమీ జోన్స్ ఫిఫ్టీతో, టాపార్డర్ బ్యాటర్ హీథర్నైట్ శతకంతో ఇంగ్లండ్ భారీ స్కోరుకు బాటలు వేశారు. కెపె్టన్ నాట్ సీవర్ బ్రంట్ (38; 4 ఫోర్లు), హీథర్నైట్ మూడో వికెట్కు 113 పరుగులు జోడించారు. దీప్తి శర్మ వరుస విరామాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థి స్కోరు మరింత పెరగకుండా చేసింది. 289 పరుగుల లక్ష్యఛేదనలో ప్రతీక (6) వికెట్ను కోల్పోయినప్పటికీ స్మృతి, హర్లీన్ (24), కెపె్టన్ హర్మన్, దీప్తిల రాణింపుతో విజయంవైపు అడుగులు వేసింది. అయితే 234 స్కోరు వద్ద మంధాన అవుటవడం మ్యాచ్ ఫలితాన్నే మార్చింది. రిచా, దీప్తిలు అవుటవడంతో పరాజయం ఖాయమైంది.స్కోరు వివరాలు ఇంగ్లండ్ మహిళల ఇన్నింగ్స్: బ్యూమోంట్ (బి) దీప్తి 22; అమీ జోన్స్ (సి) మంధాన (బి) దీప్తి 56; హీథర్నైట్ (రనౌట్) 109; నాట్ సీవర్ (సి) హర్మన్ప్రీత్ (బి) శ్రీచరణి 38; సోఫియా (సి) దీప్తి (బి) శ్రీచరణి 15; ఎమా లంబ్ (సి) మంధాన (బి) దీప్తి 11; అలైస్ క్యాప్సీ (సి) హర్లీన్ (బి) దీప్తి 2; చార్లీ (నాటౌట్) 19; సోఫీ ఎకిల్స్టోన్ రనౌట్ 3; లిన్సే స్మిత్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 288. వికెట్ల పతనం: 1–73, 2–98, 3–211, 4–249, 5–254, 6–257, 7–276, 8–280. బౌలింగ్: రేణుక 8–0–37–0, క్రాంతి 8–0–46–0, స్నేహ్ రాణా 10–0–56–0, శ్రీచరణి 10–0–68–2, దీప్తిశర్మ 10–0–51–4, అమన్జోత్ 4–0–26–0. భారత మహిళల ఇన్నింగ్స్: ప్రతీక (సి) అమీజోన్స్ (బి) లారెన్ బెల్ 6; స్మృతి (సి) క్యాప్సీ (బి) లిన్సే స్మిత్ 88; హర్లీన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చార్లీ 24; హర్మన్ప్రీత్ (సి) ఎమా లంబ్ (బి) నాట్ సీవర్ 70; దీప్తి (సి) సోఫియా (బి) ఎకిల్స్టోన్ 50; రిచా (సి) హీథర్నైట్ (బి) నాట్ సీవర్ 8; అమన్జోత్ (నాటౌట్) 18; స్నేహ్ రాణా (నాటౌట్) 10; ఎక్స్ట్రాలు 10; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 284. వికెట్ల పతనం: 1–13, 2–42, 3–167, 4–234, 5–256, 6–262. బౌలింగ్: లారెన్ బెల్ 9–0–52–1, లిన్సే స్మిత్ 10–0–40–1, నాట్ సీవర్ 8–0–47–2, చార్లీ డీన్ 10–0–67–1, సోఫీ ఎకిల్స్టోన్ 10–0–58–1, అలైస్ క్యాప్సీ 3–0–20–0. -
ఓడినా సంతృప్తిగా ఉన్నాం.. ఆసీస్ చేతిలో ఓటమి అనంతరం గిల్
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాకు తొలి మ్యాచ్లోనే ఓటమి ఎదురైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో (India vs Australia) భారత్ 7 వికెట్ల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం) పరాజయంపాలైంది. వర్షం అంతరాయాల నడుమ 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.కేఎల్ రాహుల్ (38), అక్షర్ పటేల్ (31), ఆఖర్లో అరంగేట్రం ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్; 2 సిక్సర్లు) ఓ మోస్తరుగా రాణించి టీమిండియా పరువు కాపాడారు.నాలుగు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత) రీఎంట్రీ ఇచ్చిన స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) ఈ మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యారు. ఫుల్టైమ్ వన్డే కెప్టెన్గా గిల్ తొలి మ్యాచ్లోనే (10) నిరాశపరిచాడు. ఓవర్ హైప్ మధ్య శ్రేయస్ అయ్యర్ (11) పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. మొత్తంగా భారత్ పవర్ప్లేలో మూడు కీలక వికెట్లు కోల్పోయి ఆదిలోనే మ్యాచ్పై పట్టు కోల్పోయింది.ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమన్ తలో 2 వికెట్లు.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ పడగొట్టడంతో భారత్ 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేయగలిగింది.అనంతరం డక్వర్త్ లూయిస్ పద్దతిన కుదించిన 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 21.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. మిచెల్ మార్ష్ (46 నాటౌట్), రెన్షా (21 నాటౌట్) ఆసీస్ను విజయతీరాలకు చేర్చారు. ఆసీస్ ఇన్నింగ్స్లో ట్రవిస్ హెడ్ (8), మాథ్యూ షార్ట్ (8) విఫలం కాగా.. జోష్ ఫిలిప్ (37) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో అర్షదీప్, అక్షర్, సుందర్ తలో వికెట్ తీశారు. ఈ సిరీస్లో రెండో వన్డే అడిలైడ్ వేదికగా అక్టోబర్ 23న జరుగనుంది.గిల్ ఆసక్తికర వ్యాఖ్యలుమ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "పవర్ప్లేలో మూడు వికెట్లు కోల్పోయినప్పుడు, ఆట మొత్తం క్యాచ్-అప్ గేమ్గా మారుతుంది. ఈ మ్యాచ్ నుంచి చాలా నేర్చుకున్నాం. కొన్ని పాజిటివ్లు కూడా ఉన్నాయి. 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంటూ మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లాం. దానికి సంతృప్తిగా ఉన్నాం" అని అన్నాడు.అభిమానుల మద్దతుపై కూడా గిల్ స్పందించాడు. "అభిమానులు భారీగా వచ్చారు. మేము అదృష్టవంతులం. అడిలైడ్లో కూడా మాకు ఇలాగే మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాం" అని అన్నాడు.కాగా, గిల్ తన వన్డే కెప్టెన్సీ కెరీర్ను ఓటమితో ప్రారంభించాడు. తద్వారా విరాట్ కోహ్లి తర్వాత మూడు ఫార్మాట్లలో తొలి మ్యాచ్లో ఓటమిని ఎదుర్కొన్న భారత కెప్టెన్గా నిలిచాడు. ఈ ఓటమితో టీమిండియా జైత్రయాత్రకు కూడా బ్రేక్ పడింది. ఈ ఏడాది ఎనిమిది వరుస విజయాల తర్వాత (వన్డేల్లో) భారత్కు ఇది తొలి పరాజయం. చదవండి: చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. తొలి భారత ప్లేయర్ -
CWC 2025: చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్
భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ (Deepthi Sharma) వన్డే క్రికెట్లో అరుదైన ఘనత సాధించింది. 2000 పరుగులతో పాటు 150 వికెట్లు తీసిన తొలి భారత ప్లేయర్గా చరిత్ర సృష్టించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ అరుదైన ఫీట్ను నమోదు చేసిన నాలుగో క్రికెటర్గా రికార్డు నెలకొల్పింది.వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) భాగంగా ఇండోర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో (India vs England) ఈ గ్రాండ్ డబుల్ను సాధించింది. ఈ మ్యాచ్లో దీప్తి మొత్తం 4 వికెట్లు తీసి తన వన్డే వికెట్ల సంఖ్యను 153కి పెంచుకుంది. బ్యాటింగ్లో దీప్తి 2607 పరుగులు చేసింది.దీప్తికి ముందు స్టెఫనీ టేలర్ (వెస్టిండీస్, 5873 పరుగులు, 155 వికెట్లు), ఎలిస్ పెర్రీ (ఆస్ట్రేలియా , 4414, 166), మారిజన్ కాప్ (దక్షిణాఫ్రికా, 3397, 172) మాత్రమే వన్డేల్లో 2500 పరుగులతో పాటు 150 వికెట్లు తీసిన ఆల్రౌండర్లుగా ఉన్నారు.దీప్తి ప్రభంజనంప్రస్తుత వన్డే ప్రపంచకప్లో దీప్తి ప్రభంజనం కొనసాగుతుంది. ఈ మెగా టోర్నీలో ఆమె ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 13 వికెట్లు తీసి లీడింగ్ వికెట్టేకర్గా కొనసాగుతోంది. టోర్నీ ఓపెనర్లో శ్రీలంకపై హాఫ్ సెంచరీ సహా 3 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచింది.మ్యాచ్ విషయానికొస్తే.. దీప్తి శర్మ (10-0-51-4) బంతితో రాణించినప్పటికీ ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. హీథర్ నైట్ (91 బంతుల్లో 109; 15 ఫోర్లు, సిక్స్) మెరుపు సెంచరీతో చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. నైట్తో పాటు ఓపెనర్ యామీ జోన్స్ (56) రాణించింది. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (38) పర్వాలేదనిపించింది.మరో ఓపెనర్ ట్యామీ బేమౌంట్ 22, సోఫీ డంక్లీ 11, అలైస్ క్యాప్సీ 2, సోఫీ ఎక్లెస్టోన్ 3 పరుగులు చేశారు. ఛార్లోట్ డీన్ (19), లిన్సే స్మిత్ (0) నాటౌట్గా నిలిచారు. భారత బౌలర్లలో దీప్తి శర్మతో పాటు శ్రీ చరణి (10-0-68-2) మాత్రమే వికెట్లు తీసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 42 పరుగులకే ప్రతిక రావల్ (6), హర్లీన్ డియోల్ (24) వికెట్లు కోల్పోవడంతో ఆచితూచి ఆడుతుంది. స్మృతి మంధన (34), కెప్టెన్ హర్మన్ (33) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. 19.1 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 100/2గా ఉంది. చదవండి: టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్.. కోహ్లి సరసన గిల్ -
టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్.. కోహ్లి సరసన గిల్
వన్డే క్రికెట్లో టీమిండియా (Team India) జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఈ ఏడాది రోహిత్ శర్మ సారథ్యంలో వరుసగా 8 మ్యాచ్ల్లో గెలిచిన భారత జట్టు.. శుభ్మన్ గిల్ (Shubman Gill) నేతృత్వంలో తొలి పరాజయాన్ని ఎదుర్కొంది.పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో (India vs Australia) భారత్ 7 వికెట్ల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్దతిలో) ఓటమిపాలైంది. వన్డేల్లో దాదాపుగా రెండేళ్ల తర్వాత భారత్కు ఇది తొలి పరాజయం. భారత్ చివరిగా 2023 డిసెంబర్ 19న సౌతాఫ్రికా చేతిలో ఓడింది.లేట్గా పలకరించిన పరాజయంఈ ఏడాది వన్డేల్లో భారత్ను పరాజయం చాలా లేట్గా పలకరించింది. 1991 తర్వాత ఓ ఏడాది అత్యంత లేట్గా పలకరించిన పరాజయం ఇది. నాడు భారత్కు తొలి వన్డే పరాజయం అక్టోబర్ 23న ఎదురైంది.టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ వేసిన గిల్వన్డేల్టో టీమిండియా జైత్రయాత్రకు శుభ్మన్ గిల్ బ్రేక్లు వేశాడు. భారత వన్డే జట్టుకు రెగ్యులర్ కెప్టెన్గా గిల్ తన ప్రయాణాన్ని ఓటమితో ప్రారంభించాడు.కోహ్లి సరసన గిల్ఈ ఓటమితో గిల్ మరో అప్రతిష్టను కూడా మూటగట్టుకున్నాడు. విరాట్ కోహ్లి తర్వాత మూడు ఫార్మాట్లలో తొలి మ్యాచ్లో ఓటమిపాలైన భారత కెప్టెన్గా చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. పెర్త్లో కొత్తగా నిర్మించిన ఓపస్ స్టేడియంలో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. వర్షం అంతరాయాల నడుమ 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 136 పరుగులకే పరిమితమైంది. అనంతరం ఆసీస్ 21.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్ మార్ష్ (46 నాటౌట్) ఆసీస్ను విజయతీరాలకు చేర్చాడు. భారత్ తరఫున కేఎల్ రాహుల్ (38) టాప్ స్కోరర్గా నిలువగా.. ఆఖర్లో అరంగేట్రం ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.నాలుగు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ) రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) ఈ మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యారు. ఫుల్టైమ్ వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్ (10) కూడా తొలి మ్యాచ్లో నిరాశపరిచాడు.ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమన్ తలో 2 వికెట్లు తీయగా.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్లో రెండో వన్డే అక్టోబర్ 23న అడిలైడ్ వేదికగా జరుగనుంది. కాగా, భారత జట్టు 3 మ్యాచ్ల వన్డే సిరీస్, 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.చదవండి: Test Twenty: క్రికెట్లో సరికొత్త ఫార్మాట్.. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం -
బ్యాటర్ల వైఫల్యం.. ఆసీస్ చేతిలో చిత్తైన టీమిండియా
ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా (Team India) ఓటమితో ప్రారంభించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో (India vs Australia) 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. వరుణుడి ఆటంకాల నడుమ సాగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా (Australia) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.వరుణుడి ఆటంకాలు.. 26 ఓవర్ల మ్యాచ్పలు అంతరాయాల తర్వాత మ్యాచ్ను 26 ఓవర్లకు కుదించారు. ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది.ఆదుకున్న రాహుల్, అక్షర్.. నితీశ్ మెరుపులువికెట్కీపర్ కేఎల్ (38), అక్షర్ పటేల్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖరి ఓవర్లో అరంగేట్రం ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) రెండు సిక్సర్లు బాది గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.దారుణంగా విఫలమైన రోహిత్, కోహ్లినాలుగు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ) రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) దారుణంగా విఫలమయ్యారు. ఫుల్టైమ్ వన్డే కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే శుభ్మన్ గిల్ (10) నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (11) పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. వాషింగ్టన్ సుందర్ 10, హర్షిత్ రాణా 1, అర్షదీప్ సింగ్ డకౌటయ్యారు. సత్తా చాటిన ఆసీస్ బౌలర్లుఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమన్ తలో 2 వికెట్లు తీయగా.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు.సునాయాసంగా ఛేదించిన ఆసీస్26 ఓవర్లలో భారత్ 136 పరుగులు చేసినప్పటికీ.. డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆసీస్ లక్ష్యాన్ని అన్నే ఓవర్లలో 131 పరుగులకు కుదించారు. ఆసీస్ 21.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్ మార్ష్ (46 నాటౌట్), రెన్షా (21 నాటౌట్) ఆసీస్ను విజయతీరాలకు చేర్చారు. ఆసీస్ ఇన్నింగ్స్లో ట్రవిస్ హెడ్ (8), మాథ్యూ షార్ట్ (8) విఫలం కాగా.. జోష్ ఫిలిప్ (37) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో అర్షదీప్, అక్షర్, సుందర్ తలో వికెట్ తీశారు.ఈ సిరీస్లో రెండో వన్డే అక్టోబర్ 23న అడిలైడ్ వేదికగా జరుగనుంది. కాగా, భారత జట్టు 3 మ్యాచ్ల వన్డే సిరీస్, 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: Test Twenty: క్రికెట్లో సరికొత్త ఫార్మాట్.. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం -
విరాట్ కోహ్లి డకౌట్.. చరిత్రలో తొలిసారి..!
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 19) జరుగుతున్న తొలి వన్డేలో (India Vs Australia) టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) డకౌటయ్యాడు. 8 బంతులు ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. తొలి బంతి నుంచే ఇబ్బంది పడిన కోహ్లి.. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో కూపర్ కొన్నోలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో కోహ్లికి ఇది తొలి డకౌట్.ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో 29 మ్యాచ్లు ఆడిన కోహ్లి ఐదు సెంచరీలు, 51కు పైగా సగటుతో పరుగులు చేశాడు. కానీ ఒక్కసారి కూడా డకౌట్ కాలేదు. చాలా విరామం తర్వాత భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన కోహ్లి డకౌట్ కావడంతో అతని అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.ఓవరాల్గా కోహ్లికి వన్డేల్లో ఇది 17వ డకౌట్. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక డకౌట్లైన రికార్డు సచిన్ టెండూల్కర్ (20) పేరిట ఉంది. ఓవరాల్గా ఈ రికార్డు సనత్ జయసూర్య (34) ఖాతాలో ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. వరుణుడి ఆటంకాల నడుమ 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. వికెట్కీపర్ కేఎల్ (38), అక్షర్ పటేల్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖరి ఓవర్లో నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) రెండు సిక్సర్లు బాది గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) దారుణంగా విఫలమయ్యారు. ఫుల్టైమ్ వన్డే కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే శుభ్మన్ గిల్ (10) నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (11) పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. వాషింగ్టన్ సుందర్ 10, హర్షిత్ రాణా 1, అర్షదీప్ సింగ్ డకౌటయ్యారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమన్ తలో 2 వికెట్లు తీయగా.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు.కాగా, భారత జట్టు 3 మ్యాచ్ల వన్డే సిరీస్, అనంతరం 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: IND vs AUS: రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. సచిన్, ధోని సరసన -
విధ్వంసకర వీరుడికే ప్రతిష్టాత్మక అవార్డు.. సహచరుడు పోటీ పడినా..!
టీమిండియా నయా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు (ICC Player Of The Month Award) గెలుచుకున్నాడు. సెప్టెంబర్ నెలకు గానూ అభిషేక్ ఈ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఈ అవార్డు కోసం అభిషేక్తో పాటు మరో టీమిండియా ఆటగాడు కుల్దీప్ యాదవ్, జింబాబ్వే బ్యాటర్ బ్రియాన్ బెన్నెట్ పోటీ పడ్డారు. ఓటింగ్ అనంతరం అభిషేక్ విజేతగా ఆవిర్భవించాడు.అభిషేక్ ఈ అవార్డు గెలుచుకోవడం ఇది మొదటిసారి. భారత్ తరఫున ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్న 10వ ఆటగాడు అభిషేక్. అభిషేక్కు ముందు శుభ్మన్ గిల్ (4 సార్లు), బుమ్రా (2), శ్రేయస్ అయ్యర్ (2), పంత్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్, సిరాజ్ ఈ అవార్డు గెలుచుకున్నారు.అభిషేక్ సెప్టెంబర్ నెలలో విశేషంగా రాణించినందుకు ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కింది. టీ20 ఆసియా కప్లో అతను 7 మ్యాచ్ల్లో 200 స్ట్రైక్ రేట్తో, 44.85 సగటున 314 పరుగులు చేశాడు. అభిషేక్ ప్రదర్శనల కారణంగా భారత్ ఆసియా కప్ను సునాయాసంగా గెలుచుకుంది.అభిషేక్ ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో నంబర్ వన్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు. ఆసియా కప్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచి, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలుచుకున్న అభిషేక్.. ఆ ప్రదర్శనల తర్వాత ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్ చరిత్రలో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.మహిళల విభాగంలో మంధనమహిళల విభాగంలో సెప్టెంబర్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు టీమిండియాకే చెందిన స్మృతి మంధనకు (Smriti Mandhana) దక్కింది. గత నెలలో ఆసీస్తో జరిగిన వన్డే సిరీస్లో (58, 117, 125) విశేషంగా రాణించినందుకు ఆమె ఈ అవార్డును కైవసం చేసుకుంది. ఈ అవార్డు కోసం మంధనతో పాకిస్తాన్కు చెందిన సిద్రా అమీన్, సౌతాఫ్రికాకు చెందిన తజ్మిన్ బ్రిట్స్ పోటీ పడ్డారు. తిరుగులేని ప్రదర్శన కారణంగా మంధననే ఈ అవార్డు వరించింది. చదవండి: Chiranjeevi: ఆసియా కప్ హీరోకు మెగా సన్మానం.. కేక్ కట్ చేయించిన చిరు -
చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ
టీమిండియా తాజా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) చరిత్ర సృష్టించనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో (వన్డేలు, టెస్ట్లు, టీ20లు) 500 మ్యాచ్ల మార్కును తాకనున్న పదో ఆటగాడిగా, నాలుగో భారతీయుడిగా రికార్డు నెలకొల్పనున్నాడు.అక్టోబర్ 19న ఆస్ట్రేలియాతో జరుగబోయే వన్డే మ్యాచ్ (India vs Australia) రోహిత్కు అంతర్జాతీయ కెరీర్లో 500వ మ్యాచ్ అవుతుంది. ఇప్పటివరకు 499 మ్యాచ్లు ఆడిన హిట్మ్యాన్ 42.18 సగటున, 49 సెంచరీల సాయంతో 19700 పరుగులు చేశాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన రికార్డు దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ మూడు ఫార్మాట్లలో 664 మ్యాచ్లు ఆడి 100 శతకాల సాయంతో 34357 పరుగులు చేశాడు.సచిన్ తర్వాత భారత్ తరఫున విరాట్ కోహ్లి (550), ఎంఎస్ ధోని (538), రాహుల్ ద్రవిడ్ (509) మాత్రమే 500 అంతర్జాతీయ మ్యాచ్ల అరుదైన మైలురాయిని తాకారు.కాగా, రోహిత్ శర్మ గతేడాది (2024) టీ20 ప్రపంచకప్ గెలిచాక పొట్టి ఫార్మాట్కు, ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించి, వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. రోహిత్ చివరిగా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్నాడు. ఆ టోర్నీలో కెప్టెన్గా వ్యవహించిన హిట్మ్యాన్ టీమిండియాను ఛాంపియన్గా నిలిపాడు.రోహిత్ 2027 వన్డే ప్రపంచకప్ వరకు వన్డేలు ఆడాలని ప్రణాళిక సిద్దం చేసుకున్నాడు. ఇందులో భాగంగా భారీగా బరువు తగ్గి, కెరీర్ తొలినాళ్లలో రోహిత్ను గుర్తు చేస్తున్నాడు. వన్డేల్లో రోహిత్ భవితవ్యం ఆసీస్ పర్యటనలో ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. ఈ పర్యటనలో రాణిస్తే హిట్మ్యాన్ను తిరుగుండదు.ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ మూడు వన్డేలు ఆడనుంది. ఆసీస్పై హిట్మ్యాన్ను అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఈ జట్టుపై అతను 46 ఇన్నింగ్స్ల్లో 57.3 సగటున 2407 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 9 అర్ద సెంచరీలు ఉన్నాయి.🚨 ROKO IN NETS AT PERTH 🚨- Virat Kohli & Rohit Sharma in the bathing practice together at Perth ahead of ODI series. 🐐 (RevSportz).pic.twitter.com/1IMvphZIvi— Tanuj (@ImTanujSingh) October 16, 2025అభిమానులు రోహిత్ నుంచి మరోసారి ఇదే ప్రదర్శనను ఆశిస్తున్నారు. ఫ్యాన్స్ కోరికల అనుగుణంగానే హిట్మ్యాన్ కూడా కఠోరంగా శ్రమిస్తున్నాడు. నిన్న పెర్త్లో ల్యాండ్ అయిన వెంటనే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. విరాట్ కోహ్లితో కలిసి గంటల కొద్ది నెట్స్లో చమటోడ్చాడు.చదవండి: హర్భజన్ సింగ్ రీఎంట్రీ -
హర్భజన్ సింగ్ రీఎంట్రీ
టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) కాంపిటేటివ్ క్రికెట్లోకి తిరిగి అడుగు పెట్టబోతున్నాడు. త్వరలో ప్రారంభం కాబోయే అబుదాబీ టీ10 లీగ్లో (Abu Dhabi T10 League) అస్పిన్ స్టాల్లియన్స్ (Aspin Stallions) అనే ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించన్నాడు.2021లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన హర్భజన్.. ఇటీవల వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో (World Championship of Legends) ఇండియా ఛాంపియన్స్ తరఫున బరిలోకి దిగాడు. పాకిస్తాన్తో రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఆ టోర్నీ సెమీ ఫైనల్లోనే భారత్ వాకౌట్ చేసింది.ఆ మధ్యలోనూ హర్భజన్ పలు ఫ్రాంచైజీ బేస్డ్ టోర్నీలు ఆడాడు. హర్భజన్కు అబుదాబీ లీగ్ కొత్తే అయినా, టి10 ఫార్మాట్ మాత్రం పరిచయమే. 2023లో అతను అమెరికాలో జరిగిన యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్లో (US Masters T10 League) ఆడాడు. ఆ టోర్నీలో అతను మోరిస్విల్లే యూనిటీ తరఫున బరిలోకి దిగాడు.అబుదాబీ టీ10 లీగ్లో హర్భజన్ ప్రాతినిథ్యం వహించబోయే ఫ్రాంచైజీ ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ మాజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ప్రస్తుతం యూఏఈ ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు అయిన అహ్మద్ ఖూరీకి (Ahmad Khoori) చెందింది.2017 పురుడు పోసుకున్న అబుదాబీ టీ10 లీగ్లో ఈసారి Aspin Stallionsతో పాటు మరికొన్ని కొత్త ఫ్రాంచైజీలు (Vista Riders, Ajman Titans, Royal Champs) పరిచయం కానున్నాయి. ఈ టోర్నీ నవంబర్ 18 నుంచి 30 వరకు అబుదాబిలో జరుగనుంది.Aspin Stallionsలో హర్భజన్తో పాటు మరికొంత మంది అంతర్జాతీయ ఆటగాళ్లు ఉన్నారు. ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ సామ్ బిల్లింగ్స్, ఇంగ్లండ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ టైమల్ మిల్స్, వెస్టిండీస్ పవర్ హిట్టర్ ఆండ్రే ఫ్లెచర్, శ్రీలంక ఆటగాళ్లు అవిష్క ఫెర్నాండో, బినురా ఫెర్నాండో, యూఏఈ ఆటగాడు జోహైర్ ఇక్బాల్ ఈ జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు.చదవండి: IND vs AUS: గ్లెన్ మ్యాక్స్వెల్ సంచలన నిర్ణయం -
చెలరేగిన షమీ.. భారత సెలెక్టర్లకు దిమ్మతిరిగే కౌంటర్
ఆస్ట్రేలియా పర్యటనకు తనను ఎంపిక చేయని భారత సెలెక్టర్లకు వెటరన్ పేసర్, బెంగాల్ ఆటగాడు మహ్మద్ షమీ (Mohammed Shami) దిమ్మతిరిగే కౌంటరిచ్చాడు. ఇవాళ (అక్టోబర్ 15) ప్రారంభమైన రంజీ ట్రోఫీలో (Ranji Trophy 2025-26) ఉత్తరాఖండ్పై 4 బంతుల్లో 3 వికెట్లు తీసి టీమిండియాకు అడేందుకు 100 శాతం అర్హుడినన్న సందేశం పంపాడు.షమీ తీసిన 3 వికెట్లలో రెండు క్లీన్ బౌల్డ్లు కాగా.. మరొకటి క్యాచ్ ఔట్. షమీతో పాటు ఇషాన్ పోరెల్ (15-3-40-3), సూరజ్ సింధు జైస్వాల్ (19-4-54-4) చెలరేగడంతో ఉత్తరాఖండ్ 72.5 ఓవర్లలో 213 పరుగులకే చాపచుట్టేసింది. ఉత్తరాఖండ్ ఇన్నింగ్స్లో భుపేన్ లాల్వాని (71) ఒక్కడే రాణించాడు. మిగతా ఆటగాళ్లలో కనీసం ఒక్కరూ 30 పరుగుల మార్కును తాకలేకపోయారు.ఇదిలా ఉంటే, గత కొంతకాలంగా షమీని భారత సెలెక్టర్లు ఉద్దేశపూర్వకంగా పక్కకు పెడుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. 2023 వన్డే ప్రపంచకప్లో ఊహలకందని రీతిలో రాణించిన షమీ.. గాయం కారణంగా ఏడాదికాలం పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఈ ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్తో రీఎంట్రీ ఇచ్చాడు. ఆతర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆడిన షమీ.. ఏడు నెలలుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. పూర్తి ఫిట్నెస్ సాధించి, దేశవాలీ క్రికెట్లో రాణిస్తున్నా సెలెక్టర్లు షమీని పట్టించుకోవడం లేదు. అతను చివరిగా 2023 జూన్లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు.ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనకు అతన్ని ఎంపిక చేస్తారని అంతా అనుకున్నారు. అయితే అలా జరగలేదు. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనకైనా ఎంపిక చేస్తారని షమీ పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. సెలెక్టర్లు ఈసారి కూడా పట్టించుకోలేదు. తాజాగా అతను ఆసీస్ పర్యటనకు ఎంపిక కాకపోవడంపై స్పందించాడు.ఫిట్నెస్ సాకుగా చూపిస్తూ నన్ను పక్కకు పెట్టారు. ఫిట్నెస్ లేకపోతే రంజీ ట్రోఫీలో ఎలా ఆడతానన్న అర్దం వచ్చేలా వ్యాఖ్యానించాడు. సెలెక్లరు, కోచ్, కెప్టెన్ అనుకుంటేనే తాను జట్టులో ఉంటానని అన్నాడు. ఈ వాఖ్యలు చేసిన తర్వాత షమీ బంతితోనే సెలెక్టర్లను సమాధానం చెప్పాలని అనుకున్నాడు. అలాగే చేశాడు. మున్ముందైనా సెలెక్టర్లు షమీని పరిగణలోకి తీసుకుంటారో లేదో చూడాలి.చదవండి: శతక్కొట్టిన ఇషాన్ కిషన్ -
టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's CWC 2025) భారత్కు (Team India) వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. టోర్నీ ప్రారంభంలో వరుసగా రెండు మ్యాచ్ల్లో (శ్రీలంక, పాకిస్తాన్) గెలిచిన టీమిండియా, ఆతర్వాత వరుసగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా చేతుల్లో పరాభవాలు ఎదుర్కొంది. ఈ రెండు మ్యాచ్ల్లో భారత్ గెలిచే స్థితిలో ఉండి కూడా అవకాశాలు చేజార్చుకుంది. ముఖ్యంగా ఆసీస్తో మ్యాచ్లో భారత్ 330 పరుగులు చేసి కూడా మ్యాచ్ను కాపాడుకోలేకపోయింది. సౌతాఫ్రికా మ్యాచ్లో ఇంత భారీ స్కోర్ చేయకపోయినా బౌలర్ల వైఫల్యం కారణంగా చేతిలోకి వచ్చిన మ్యాచ్ చేజారింది.తాజాగా ఆసీస్ కొట్టిన దెబ్బ నుంచి ఇంకా తేరుకోక ముందే టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ (Slow Over Rate) కారణంగా భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్ల్లో 5 శాతం కోత విధించారు. నిర్దేశిత సమయంలోగా భారత బౌలర్లు ఓ ఓవర్ వెనుకపడి ఉండటంతో ఐసీసీ ఈ జరిమానా విధించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఆర్టికల్ 2.22 నిబంధన ప్రకారం నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయని ప్రతి ఓవర్కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్లో 5 శాతం కొత విధిస్తారు.ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచ కప్లో భారత్ తమ తదుపరి మ్యాచ్లో ఇంగ్లండ్తో తలపడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 19న ఇండోర్లో జరుగనుంది. ఈ టోర్నీలో భారత్ నాలుగు మ్యాచ్ల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. చదవండి: ప్రపంచ ఛాంపియన్లకు షాకిచ్చిన పాకిస్తాన్ -
టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే..?
స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను భారత్ 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇవాళ (అక్టోబర్ 15) ముగిసిన రెండో టెస్ట్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు తొలి టెస్ట్లో ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలుపొందింది.ఈ సిరీస్ గెలుపుతో టీమిండియా వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ 2025-27కు (WTC) సంబంధించి పాయింట్ల శాతాన్ని భారీగా పెంచుకుంది. ఈ సిరీస్కు ముందు భారత డబ్ల్యూటీసీ పాయింట్ల శాతం 43.56 శాతంగా ఉండింది. ఈ సిరీస్ గెలుపుతో భారత్ ఖాతాలో 18.34 పాయింట్ల శాతం చేరి ఈ సంఖ్యను 61.90కి పెంచింది.విండీస్ను క్లీన్ స్వీప్ చేసిన తర్వాత భారత్ పాయింట్ల శాతాన్ని భారీగా పెంచుకున్నా, పట్టికలో మాత్రం మూడో స్థానంలోనే ఉంది. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో భారత్ 7 మ్యాచ్ల్లో 4 విజయాలు, 2 పరాజయాలు, ఓ డ్రాతో 52 పాయింట్లు సాధించింది.ఆస్ట్రేలియా, శ్రీలంక టాప్-2లో కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా 3 మ్యాచ్ల్లో 3 విజయాలతో 100 శాతం పాయింట్లు సాధించగా.. శ్రీలంక 2 మ్యాచ్ల్లో ఓ విజయం, ఓ డ్రాతో 66.67 పాయింట్ల శాతాన్ని కలిగి ఉంది.ఈ జాబితాలో ఆస్ట్రేలియా, శ్రీలంక, భారత్ తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్ (43.33), బంగ్లాదేశ్ (16.67), వెస్టిండీస్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా ఉన్నాయి.కాగా, ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో టీమిండియా తదుపరి టాస్క్ నవంబర్లో ఎదుర్కొంటుంది. నవంబర్ 14 నుంచి సౌతాఫ్రికా భారత్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతుంది. అనంతరం మూడు వన్డేలు, ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతుంది.చదవండి: సిగ్గుచేటు అంటూ గంభీర్ ఫైర్.. బీసీసీఐ స్పందన ఇదే -
రేపటి నుంచి దేశీయ క్రికెట్ మహా సంగ్రామం ప్రారంభం
రేపటి నుంచి (అక్టోబర్ 15) దేశీయ క్రికెట్ మహా సంగ్రామం రంజీ ట్రోఫీ 2025-26 (Ranji Trophy) ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి ఇది 91వ ఎడిషన్. ఇందులో మొత్తం 38 జట్లు పోటీపడనున్నాయి. 28 రాష్ట్రాలకు చెందిన జట్లు (కొన్ని రాష్ట్రాలకు సంబంధించి రెండుకు మించి జట్లు ఉన్నాయి), 4 కేంద్ర పాలిత ప్రాంతాల జట్లు, అలాగే సర్వీసెస్, రైల్వేస్ జట్లు పాల్గొంటున్నాయి.గత సీజన్లో విదర్భ విజేతగా, కేరళ రన్నరప్గా నిలిచాయి. తొలి మ్యాచ్లో ఉత్తర్ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ జట్లు తలపడనున్నాయి. రేపు మొత్తం 16 మ్యాచ్లు ప్రారంభమవుతాయి. ఈ టోర్నీ కోసం దాదాపుగా అన్ని జట్లు తమ ఆటగాళ్లను ప్రకటించాయి. ఈసారి టోర్నీకి చాలామంది టీమిండియా స్టార్లు అందుబాటులో ఉన్నారు.రంజీ ట్రోఫీ 2025-26లో ఆడనున్న కీలక ఆటగాళ్లు..ముంబై- శార్దూల్ ఠాకూర్, అజింక్య రహానే, ఆయుశ్ మాత్రే, శివమ్ దూబే, సర్ఫరాజ్ ఖాన్కేరళ- సంజూ శాంసన్కర్ణాటక- మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్జార్ఖండ్- ఇషాన్ కిషన్హైదరాబాద్- తిలక్ వర్మబీహార్- వైభవ్ సూర్యవంశీబెంగాల్- మహ్మద్ షమీఉత్తరప్రదేశ్- రింకూ సింగ్అస్సాం- రియాన్ పరాగ్కాగా, రంజీ ట్రోఫీలో అత్యధిక టైటిళ్లు ముంబై గెలుచుకుంది. ఆ జట్టు ఇప్పటివరకు 42 సార్లు ఛాంపియన్గా నిలిచింది. ముంబై తర్వాత కర్ణాటక/మైసూర్ అత్యధికంగా 8 టైటిళ్లు సాధించింది. ఆతర్వాతి స్థానాల్లో ఢిల్లీ (7), మధ్యప్రదేశ్/హోల్కర్ (5), బరోడా (5), సౌరాష్ట్ర (2), విదర్భ (2), బెంగాల్ (2), తమిళనాడు/మద్రాస్ (2), రాజస్తాన్ (2) జట్లు ఉన్నాయి.చదవండి: కింగ్ కోహ్లి వచ్చేశాడు..! -
కింగ్ కోహ్లి వచ్చేశాడు..!
భారత క్రికెట్ అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) భారత్లో (ఢిల్లీ) ల్యాండయ్యాడు. విరాట్ గత కొంతకాలంగా కుటుంబంతో కలిసి లండన్లో ఉంటున్నాడు. ఐపీఎల్ 2025 తర్వాత కోహ్లి భారత్కు రావడం ఇదే మొదటిసారి.THE AURA OF KING KOHLI..!!!! 🐐- The Arrival of Virat Kohli at home in Delhi. 👑pic.twitter.com/fevrsiSB7L— Tanuj (@ImTanujSingh) October 14, 2025ఇవాళ (అక్టోబర్ 14) ఉదయం కోహ్లి న్యూఢిల్లీ విమానాశ్రయం నుంచి బయటికి వస్తున్న దృశ్యాలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి.కోహ్లీని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. సెల్ఫీల కోసం స్వల్ప తోపులాట కూడా జరిగింది. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ చేసిన నినాదాలతో ఎయిర్పోర్ట్ ప్రాంగణg మార్మోగిపోయింది. ప్రస్తుతం ఎక్స్లో #ViratReturns అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.త్వరలో ఆస్ట్రేలియాలో జరుగబోయే సిరీస్ కోసం కోహ్లి ఢిల్లీ నుంచి బయల్దేరతాడు. విరాట్తో పాటు రోహిత్ శర్మ కూడా వెళ్తాడని సమాచారం. మిగతా సభ్యులు ప్రత్యేక విమానంలో వెళ్లే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాలో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. వన్డే మ్యాచ్లు అక్టోబర్ 19 (పెర్త్), 23 (అడిలైడ్), 25 (సిడ్నీ) తేదీల్లో జరుగనున్నాయి.విరాట్ టీ20, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆసీస్తో వన్డే సిరీస్ ద్వారా కోహ్లీ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కోహ్లికి ఇదే తొలి సిరీస్. ఈ సిరీస్ తర్వాత కోహ్లి భవిష్యత్పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొద్ది రోజులుగా కోహ్లి వన్డేలకు కూడా రిటైర్మెంట్ (ఆసీస్ సిరీస్ తర్వాత) ప్రకటిస్తాడని ప్రచారం జరుగుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.చదవండి: సిగ్గు చేటు: అశ్విన్, మాజీ చీఫ్ సెలక్టర్పై గంభీర్ ఫైర్ కోహ్లితో పాటు రోహిత్ కూడా టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. రోహిత్ కూడా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు ఎంపికయ్యాడు. కోహ్లి, రోహిత్ల ఆట చూసేందుకు అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకొని ఎదురుచూస్తున్నారు. ఆస్ట్రేలియాలో కోహ్లి, రోహిత్ల నుంచి భారీ ఇన్నింగ్స్లు ఆశిస్తున్నారు. -
IND VS WI: విండీస్ బ్యాటర్ల అనూహ్య ప్రతిఘటన.. ఫలితం చివరి రోజే..!
న్యూఢిల్లీ టెస్ట్లో భారత్ గెలుపు కోసం చివరి రోజు వరకు ఆగాల్సి వచ్చింది. చివరి సెషన్లో విండీస్ నిర్దేశించిన 121 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 63 పరుగులు (18 ఓవర్లు) చేసింది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే మరో 58 పరుగులు చేయాల్సి ఉంది.స్వల్ప లక్ష్య ఛేదనలో తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ (8) ఆదిలోనే ఔట్ కాగా.. కేఎల్ రాహుల్ (25 నాటౌట్), సాయి సుదర్శన్ (30 నాటౌట్) భారత్ను విజయం దిశగా తీసుకెళ్తున్నారు. జైస్వాల్ వికెట్ వారికన్కు దక్కింది. ఈ మ్యాచ్లో గెలిస్తే టీమిండియా 2 మ్యాచ్ల సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేస్తుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.విండీస్ బ్యాటర్ల అనూహ్య పోరాటంఅంతకుముందు విండీస్ ఫాలో ఆడుతూ అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శించింది. ఆ జట్టు బ్యాటర్లు ఊహించని రీతిలో ప్రతిఘటించి భారత్ ముందు మూడంకెల టార్గెట్ను ఉంచారు.క్యాంప్బెల్, హోప్ వీరోచిత శతకాలుతొలుత జాన్ క్యాంప్బెల్ (115), షాయ్ హోప్ (103) వీరోచిత శతకాలు బాది విండీస్కు ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించారు. ఆఖర్లో జస్టిన్ గ్రీవ్స్ (50 నాటౌట్), జేడన్ సీల్స్ (32) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించి టీమిండియా ముందు 121 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. గ్రీవ్స్, సీల్స్ చివరి వికెట్కు 79 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో కుల్దీప్, బుమ్రా తలో 3, సిరాజ్ 2, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు.దీనికి ముందు కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్లో 248 పరుగులకే కుప్పకూలింది. ఆ ఇన్నింగ్స్లో అలిక్ అథనాజ్ (41) టాప్ స్కోరర్గా నిలిచాడు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5 డిక్లేర్) చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు.చదవండి: కొడుకు 6 వారాల్లో 10 కిలోలు తగ్గితే.. తండ్రి ఆర్నెళ్లలో 38 కేజీలు ఉఫ్!.. వీరి సీక్రెట్ ఇదే -
స్వల్ప ఛేదన.. టీమిండియాకు ఆదిలోనే షాక్
121 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) (8) తొలి ఓవర్లోనే రెండు బౌండరీలు బాది జోరుమీదున్నట్లు కనిపించినప్పటికీ.. ఆతర్వాతి ఓవర్లోనే ఔటయ్యాడు. వార్రికన్ బౌలింగ్లో ఆండర్సన్ ఫిలిప్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. జైస్వాల్ ఔటయ్యాక కేఎల్ రాహుల్ (14), సాయి సుదర్శన్ (17) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ టీమిండియాను లక్ష్యం దిశగా తీసుకెళ్తున్నారు.12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ వికెట్ నష్టానికి 39 పరుగులుగా ఉంది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే మరో 82 పరుగులు చేయాల్సి ఉంది.విండీస్ బ్యాటర్ల అనూహ్య పోరాటంఅంతకుముందు విండీస్ ఫాలో ఆడుతూ అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శించింది. ఆ జట్టు బ్యాటర్లు ఊహించని రీతిలో ప్రతిఘటించి భారత్ ముందు మూడంకెల టార్గెట్ను ఉంచారు.తొలుత జాన్ క్యాంప్బెల్ (115), షాయ్ హోప్ (103) వీరోచిత శతకాలు బాది ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించగా.. ఆఖర్లో జస్టిన్ గ్రీవ్స్ (50 నాటౌట్), జేడన్ సీల్స్ (32) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించి టీమిండియా ముందు 121 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. గ్రీవ్స్, సీల్స్ చివరి వికెట్కు 79 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో కుల్దీప్, బుమ్రా తలో 3, సిరాజ్ 2, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్లో 248 పరుగులకే కుప్పకూలింది. ఆ ఇన్నింగ్స్లో అలిక్ అథనాజ్ (41) టాప్ స్కోరర్గా నిలిచాడు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5 డిక్లేర్) చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు.కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లోని తొలి టెస్ట్లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.చదవండి: World Cup 2025: వరుస ఓటములు.. భారత్ సెమీ ఫైనల్ చేరాలంటే... -
విండీస్ బ్యాటర్ల అనూహ్య పోరాటం.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
న్యూఢిల్లీ టెస్ట్లో విండీస్ బ్యాటర్లు అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శించారు. ఫాలో ఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్లో ఊహించని రీతిలో ప్రతిఘటించారు. తొలుత జాన్ క్యాంప్బెల్ (115), షాయ్ హోప్ (103) వీరోచిత శతకాలు బాది తమ జట్టుకు ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించగా.. ఆఖర్లో జస్టిన్ గ్రీవ్స్ (50 నాటౌట్), జేడన్ సీల్స్ (32) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించి టీమిండియా ముందు 121 పరుగుల టార్గెట్ను ఉంచారు. గ్రీవ్స్, సీల్స్ చివరి వికెట్కు 79 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో కుల్దీప్, బుమ్రా తలో 3, సిరాజ్ 2, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్లో 248 పరుగులకే కుప్పకూలింది. ఆ ఇన్నింగ్స్లో అలిక్ అథనాజ్ (41) టాప్ స్కోరర్గా నిలిచాడు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5 డిక్లేర్) చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు.కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లోని తొలి టెస్ట్లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.చదవండి: IND VS WI 2nd Test: చెలరేగిపోతున్న మియా భాయ్..! -
IND VS WI: చెలరేగిపోతున్న మియా భాయ్..!
టీమిండియా ఆటగాడు, హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) (మియా భాయ్) ఈ ఏడాది టెస్ట్ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. కొద్ది రోజుల కిందట ఇంగ్లండ్లో జరిగిన టెస్ట్ సిరీస్లో 5 మ్యాచ్ల్లో 23 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచిన సిరాజ్.. ప్రస్తుతం స్వదేశంలో విండీస్తో జరుగుతున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లోనూ అదే తరహా ప్రదర్శనలు కొనసాగిస్తున్నాడు.ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో 7 వికెట్లు తీసిన మియా.. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో మూడు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో తన మూడో వికెట్ (షాయ్ హోప్) తీసిన అనంతరం సిరాజ్ ఓ అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ వికెట్తో సిరాజ్ ఈ ఏడాది (2025) టెస్ట్ల్లో లీడింగ్ వికెట్ టేకర్గా అవతరించాడు. ప్రస్తుతం సిరాజ్ ఖాతాలో 37 వికెట్లు ఉన్నాయి. ఈ రికార్డు సాధించే క్రమంలో సిరాజ్ జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీని (26) అధిగమించాడు. సిరాజ్, ముజరబానీ తర్వాత ఈ ఏడాది టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా మిచెల్ స్టార్క్ (29), నాథన్ లియోన్ (24) ఉన్నారు.భారత్-విండీస్ రెండో టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో విండీస్ ఫాలో ఆన్ ఆడుతూ అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శించింది. తొలుత జాన్ క్యాంప్బెల్ (115), షాయ్ హోప్ (103) వీరోచిత శతకాలు బాది తమ జట్టుకు ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించగా.. ఆఖర్లో జస్టిన్ గ్రీవ్స్ (50 నాటౌట్), జేడన్ సీల్స్ (32) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించి టీమిండియా ముందు 121 పరుగుల టార్గెట్ను ఉంచారు. గ్రీవ్స్, సీల్స్ చివరి వికెట్కు 79 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో కుల్దీప్, బుమ్రా తలో 3, సిరాజ్ 2, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు. అంతకుముందు కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్లో 248 పరుగులకే కుప్పకూలింది. ఆ ఇన్నింగ్స్లో అలిక్ అథనాజ్ (41) టాప్ స్కోరర్గా నిలిచాడు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5 డిక్లేర్) చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు. కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లోని తొలి టెస్ట్లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.చదవండి: IND VS WI: వీరోచిత శతకాలు.. చరిత్ర తిరగరాసిన విండీస్ బ్యాటర్లు -
వైజాగ్లో టీమిండియా ఫ్యాన్స్ సందడి (ఫోటోలు)
-
IND VS AUS: టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's Cricket World Cup 2025) భాగంగా విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 12) జరిగిన మ్యాచ్లో (India vs Australia) భారత్పై ఆస్ట్రేలియా మహిళలు 3 వికెట్ల తేడాతో గెలిచారు. నిర్ణీత 49 ఓవర్లలో 331 పరుగులు చేసి టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం సాధించింది. మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్కు వరుసగా ఇది రెండవ ఓటమి.తొలుత టాస్ ఓడి ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు బ్యాటింగ్ చేసి 330 పరుగులు (48.5 ఓవర్లలో ఆలౌట్) చేసింది. ఓపెనర్లు స్మృతి మంధన (Smriti Mandhana), ప్రతిక రావల్ (Pratika Rawal) అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా మంధన తన సహజ శైలిలో చెలరేగిపోయింది. 66 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసింది. మంధనతో పోలిస్తే ప్రతిక రావల్ కాస్త నిదానంగా ఆడింది. 96 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో 75 పరుగులు చేసింది.ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో అలీస్సా హీలీ: 142 పరుగులు (107 బంతుల్లో) చేసి తన అద్భుత ఇన్నింగ్స్తో మ్యాచ్ను గెలిపించింది దాంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది.ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది, అయితే చివరి ఓవర్లలో ఆసీస్ విజయం సాధించింది. భారత్ మంచి స్కోరు చేసినా, హీలీ అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ను ఆసీస్ చేతుల్లోకి తీసుకెళ్లింది. -
IND VS AUS: అరుదైన మైలురాయిని తాకిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచ రికార్డు
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 12) జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతుంది.తొలుత మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఓ క్యాలెండర్ ఇయర్లో (2025) 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించిన ఆమె.. ఆతర్వాత కొద్ది నిమిషాలకే వన్డేల్లో 5000 పరుగుల అరుదైన మైలురాయిని అందుకుంది. 1000 పరుగుల మార్కును సిక్సర్తో తాకిన మంధన.. 5000 పరుగుల మైలురాయిని కూడా సిక్సర్తోనే అందుకుంది.బంతులు, ఇన్నింగ్స్ల పరంగా మంధన ప్రపంచంలోనే అత్యంత వేగంగా 5000 పరుగుల మైలురాయిని తాకిన బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ మైలురాయిని తాకేందుకు ఆమెకు కేవలం 112 ఇన్నింగ్స్లు, 5569 బంతులు అవసరమయ్యాయి. గతంలో ఈ రికార్డులు స్టెఫానీ టేలర్ (129 ఇన్నింగ్స్లు), సూజీ బేట్స్ (6182 బంతులు) పేరిట ఉండేవి.ఈ రికార్డును అత్యంత పిన్న వయసులో (29) సొంతం చేసుకున్న ప్లేయర్గానూ మంధన రికార్డు నెలకొల్పింది.వన్డే క్రికెట్లో మంధన సహా కేవలం 5 మంది మాత్రమే 5000 పరుగులు పూర్తి చేశారు. మిథాలీ రాజ్ (7805) తర్వాత భారత్ తరఫున ఈ మైలురాయిని చేరుకున్న రెండో ప్లేయర్ మంధన మాత్రమే.ఈ మ్యాచ్లో మంధన 66 బంతుల్లో 9 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి ఔటైంది. ప్రస్తుత ప్రపంచకప్లో మంధనకు ఇదే తొలి అర్ద సెంచరీ (4 మ్యాచ్ల్లో).వైజాగ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్ చేస్తుంది. 27 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 171/1గా ఉంది. మంధన ఔట్ కాగా.. ప్రతిక రావల్ (68), హర్లీన్ డియోల్ (12) క్రీజ్లో ఉన్నారు. మంధన వికెట్ సోఫీ మోలినెక్స్కు దక్కింది.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్ -
చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఓ క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. వన్డే వరల్డ్కప్ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 12) జరుగుతున్న మ్యాచ్లో ఈ ఘనత సాధించింది. ఎవరూ సాధించని ఈ ఘనతను మంధన భారీ సిక్సర్తో చేరుకోవడం మరో విశేషం.వన్డేల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు (2025లో 18 ఇన్నింగ్స్ల్లో 1000* పరుగులు) చేసిన బ్యాటర్ల జాబితాలో మంధన తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్ (1997లో 970 పరుగులు), లారా వోల్వార్డ్ట్ (2022లో 882 పరుగులు), న్యూజిలాండ్కు చెందిన డెబ్బీ హాక్లీ (1997లో 880), న్యూజిలాండ్కు చెందిన యామీ సాటర్థ్వైట్ (2016లో 853) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. వైజాగ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో భారత్ టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్ చేస్తుంది. 17 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 90/0గా ఉంది. ఓపెనర్లు మంధన 49, ప్రతిక రావల్ 40 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.మంధన@18మంధన ఈ ఏడాది వన్డేల్లో 1000 పరుగుల మార్కును 18 పరుగుల వద్ద చేరుకుంది. 1000 పరుగుల మార్కును ఆమె 18వ ఇన్నింగ్స్లో చేరుకుంది. మంధన జెర్సీ నంబర్ కూడా 18 కావడం విశేషం.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో భారత్ వరుసగా శ్రీలంక, పాకిస్తాన్పై విజయాలు సాధించి, మూడో మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో అనూహ్యంగా ఓడింది. వాస్తవానికి ఆ మ్యాచ్లోనూ భారత్కు గెలిచే అవకాశం ఉండినప్పటికీ.. నదినే డి క్లెర్క్ సంచలన ఇన్నింగ్స్తో భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకుంది. ప్రస్తుతం భారత్ 3 మ్యాచ్ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.ఆసీస్ విషయానికొస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఈ జట్టు తొలి మ్యాచ్లో న్యూజిలాండ్పై విజయం సాధించింది. ఆ తర్వాతి మ్యాచ్ (శ్రీలంక) వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది (ఓ పాయింట్ లభించింది). మూడో మ్యాచ్లో ఆసీస్ పాక్పై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఆసీస్ 3 మ్యాచ్ల్లో 2 విజయాలతో 5 పాయింట్లు ఖాతాలో కలిగి ఉండి పట్టికలో రెండో స్థానంలో ఉంది. 3 మ్యాచ్ల్లో మూడు విజయాలు సాధించిన ఇంగ్లండ్ టాప్ ప్లేస్లో ఉంది.చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి జట్టు -
CWC 2025: ఆస్ట్రేలియాతో సమరం.. టీమిండియా బ్యాటింగ్
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's Cricket World Cup 2025) ఇవాళ (అక్టోబర్ 12) ఆసక్తికర సమరం జరుగుతుంది. భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) జట్లు వైజాగ్ వేదికగా అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా (Australia) టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత మహిళల జట్టు (Team India) వన్డేల్లో టాస్ కోల్పోవడం ఇది వరుసగా ఆరోసారి. తుది జట్లు..ఆస్ట్రేలియా: అలిస్సా హీలీ (కెప్టెన్/వికెట్కీపర్), ఫోబ్ లిచ్ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డనర్, తహ్లియా మెక్గ్రాత్, సోఫీ మోలినెక్స్, కిమ్ గార్త్, అలానా కింగ్, మెగాన్ షుట్భారత్: ప్రతికా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్కీపర్), అమంజోత్ కౌర్, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణికాగా, ప్రస్తుత ప్రపంచకప్లో భారత్ వరుసగా శ్రీలంక, పాకిస్తాన్పై విజయాలు సాధించి, మూడో మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో అనూహ్యంగా ఓడింది. వాస్తవానికి ఆ మ్యాచ్లోనూ భారత్కు గెలిచే అవకాశం ఉండినప్పటికీ.. నదినే డి క్లెర్క్ సంచలన ఇన్నింగ్స్తో భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకుంది. ప్రస్తుతం భారత్ 3 మ్యాచ్ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.ఆసీస్ విషయానికొస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఈ జట్టు తొలి మ్యాచ్లో న్యూజిలాండ్పై విజయం సాధించింది. ఆ తర్వాతి మ్యాచ్ (శ్రీలంక) వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది (ఓ పాయింట్ లభించింది). మూడో మ్యాచ్లో ఆసీస్ పాక్పై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఆసీస్ 3 మ్యాచ్ల్లో 2 విజయాలతో 5 పాయింట్లు ఖాతాలో కలిగి ఉండి పట్టికలో రెండో స్థానంలో ఉంది. 3 మ్యాచ్ల్లో మూడు విజయాలు సాధించిన ఇంగ్లండ్ టాప్ ప్లేస్లో ఉంది. చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి జట్టు -
యంగ్(టె)స్ట్ సూపర్స్టార్ దొరికాడు!
జీవితంలో ఏదోటి సాధించాలని ప్రతి ఒక్కరు కల (Dream) కంటారు. కానీ కొంతమంది మాత్రమే స్వప్నాలను సాకారం చేసుకుంటారు. అహరహం శ్రమించే వారు.. కష్టాలు, నష్టాలను ఓర్చుకునే వారే మాత్రమే తాము అనుకున్నది సాధిస్తారు. పేదరికం బెదిరించినా, అవరోధాలు అడ్డుగా నిలిచినా అదరక బెదరక లక్ష్యసాధనకై ముందుకుసాగే వారు మాత్రమే విజేతలవుతారు. చరిత్రలో తమకంటూ ఓ పేజీని లిఖించుకుంటారు. మనం చెప్పుకోబోతున్న యువ క్రికెటర్ కూడా అలాంటి వాడే!క్రికెటర్ కావాలన్న తన కలను నిజం చేసుకోవడానికి 10 ఏళ్ల లేత ప్రాయంలో స్వంత ఊరిని వదిలిపెట్టాడు. ఉత్తరప్రదేశ్లోని తన స్వస్థలం సూర్యవాన్ను విడిచిపెట్టి బరువైన బ్యాగ్తో పాటు అంతకంటే బరువైన కలను తనతో మోసుకుంటూ ముంబై మహా నగరానికి చేరుకున్నాడు. మొదట ఒక పాల దుకాణం పైకప్పుపై నివసించాడు. అక్కడి నుంచి ఒక్కో అడుగు వేస్తూ తానెంతో ప్రేమించే ఆటకు దగ్గరయ్యాడు. దీని కోసం ఏం చేయాల్సి వచ్చినా వెనుకాడలేదు, వెనుదిరగలేదు. ఆజాద్ మైదాన్ (Azad Maidan) సమీపంలో పానీ పూరీ అమ్మాడు. గ్రౌండ్స్మెన్తో పరిచయం పెంచుకుని వారితో కలిసి ఒకే టెంట్ పంచుకున్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా క్రికెట్ ఆడేవాడు.సంకల్ప శుద్ధి, శ్రమకు సరైన సమయంలో గైడెన్స్ దొరికితే సక్సెస్ దానంతట అదే వస్తుంది. యశ్వసి జైస్వాల్ (Yashasvi Jaiswal) విషయంలో అదే జరిగింది. అవును ఇప్పటివరకు మనం చెప్పుకున్నది ఈ యువ స్టార్ క్రికెటర్ గురించే. కోచ్ జ్వాలా సింగ్ రూపంలో అతడికి సరైన సమయంలో చేయూత దొరికింది. యశస్విలో భవిష్యత్ క్రికెటర్ను చూసిన ఆయన.. జైస్వాల్కు అన్నివిధాలా అండగా నిలిచాడు. శిక్షణ ఇవ్వడమే కాకుండా ఆశ్రయం, ఆహారంతో పాటు నమ్మకాన్ని కల్పించాడు. ఆయన మార్గదర్శకత్వంలో జైస్వాల్ ఆట పదును తేలింది. అక్కడి నుంచి అతడి ఆటే సందేశం అయింది.బ్యాటింగ్ ఆపలేదుయశస్వి జైస్వాల్ను ప్రత్యేకంగా నిలబెట్టింది అతడు ఆడే షాట్లు లేదా టైమింగ్ మాత్రమే కాదు.. అనుకున్నది సాధించే వరకు పట్టు వదలని సంకల్పం. వైఫల్యానికి జైస్వాల్ భయపడేవాడని కోచ్ జ్వాలా సింగ్ తరచూ చెబుతుండేవారు. ఫెయిల్యూర్కు భయపడి అతడు ఎప్పుడూ బ్యాటింగ్ ఆపలేదు. మ్యాచ్ తర్వాత మ్యాచ్ ఆడుతూ ప్రతి బంతిని ఎదుర్కొన్నాడు. స్కూల్ క్రికెట్, ముంబై అండర్-16, అండర్-19, తర్వాత ఇండియా అండర్-19 తరపున పరుగులు చేస్తూనే ఉన్నాడు. 2018లో అండర్-19 ఆసియా కప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2020 నాటికి అండర్-19 ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఒకప్పుడు పానీ పూరీ (pani puri) అమ్మిన అదే బాలుడు ఇప్పుడు ప్రతి స్కౌట్ సంతకం చేయాలనుకునే పేరుగా మారిపోయాడు.అన్స్టాపబుల్ ప్లేయర్దేశీయ క్రికెట్లో ముంబై తరఫున జైస్వాల్.. అన్స్టాపబుల్ ప్లేయర్గా మారిపోయాడు. సెంచరీలు సంఖ్య పెరగడంతో అతడి ఫస్ట్ క్లాస్ సగటు 60 దాటింది. రన్స్ సాధించడమే చేయడమే కాదు.. బ్యాటింగ్ చేసిన ప్రతిసారీ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. 2020 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఈ యంగ్ ప్లేయర్ను ₹2.4 కోట్లకు దక్కించుకుంది. నమంత్రపు సిరి అతడిని ఏమాత్రం మార్చలేదు. ఆకర్షణ కంటే ఆటకే ఎక్కువ విలువనిచ్చాడు. తన స్వప్నం పూర్తిగా సాకారం కాలేదన్న సత్యాన్ని గమనించి టీమిండియా పిలుపు కోసం ఎదురు చూశాడు.తొలి మ్యాచ్లోనే భారీ సెంచరీ2023, జూలై 12.. యశస్వి జైస్వాల్ జీవితంలో మరపురాని రోజు. ఈ రోజున వెస్టిండీస్తో ప్రారంభమైన మ్యాచ్తో టీమిండియా తరపున టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. తొట్ట తొలి మ్యాచ్లోనే భారీ సెంచరీ (171)తో క్రీడా ప్రపంచాన్ని ఆకర్షించాడు. అప్పటి నుంచి టెస్ట్ క్రికెట్లో తనదైన ముద్ర వేసి ముందుకు సాగుతున్నాడు. తన తొలినాళ్లలో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) లాగానే, జైస్వాల్ ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లలో ఆడాడు. దక్షిణాఫ్రికా మినహా, అతడు అన్ని చోట్లా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు.జైసూ జైత్రయాత్ర2024లో ఇంగ్లాండ్తో జరిగిన స్వదేశీ సిరీస్లో జైసూ జైత్రయాత్ర చేశాడు. 40 సంవత్సరాల రికార్డును తిరగరాశాడు. ఒకే టెస్ట్ సిరీస్లో 700 పరుగులు పైగా సాధించిన తొలి ఆసియా ఓపెనర్గా రికార్డుకెక్కాడు. భారత టెస్ట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. తాజాగా భారత్లో వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో 175 పరుగులు చేసి శభాష్ అనిపించుకున్నాడు. చిన్న వయసులో ఎక్కువ టెస్ట్ సెంచరీలు సాధించిన రెండో భారత బ్యాటర్గా నిలిచాడు. గత రెండేళ్లుగా టెస్టుల్లో జైస్వాల్ హవా కొనసాగుతోంది. తన అరంగేట్రం తర్వాత జో రూట్ మినహా ఎవరూ అతడి కంటే ఎక్కువ టెస్ట్ పరుగులు చేయలేదు. జైసూ చేసిన ఏడు సెంచరీల్లో 4 ఆసియా వెలుపల వచ్చాయి. సచిన్ టెండూల్కర్ తర్వాత అతడే యంగెస్ట్ టెస్ట్ సూపర్స్టార్ అన్న కామెంట్లు విన్పిస్తున్నాయి. టీమిండియా ప్రస్తుత కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) కూడా ఫామ్లో ఉన్నప్పటికీ.. జైస్వాల్ కంటే వయసులో అతడు మూడేళ్లు పెద్డోడు. టెస్టుల్లో కంటే వన్డేల్లో గిల్ బ్యాటింగ్ యావరేజ్ మెరుగ్గా ఉంది.చదవండి: తలబాదుకున్న జైస్వాల్.. తప్పు నీదే!దిగ్గజాల సరసన చోటు!23 ఏళ్ల ఎడంచేతి బ్యాటర్ లాంగ్ ఫార్మాట్లో నిలకడగా రాణిస్తున్నాడు. పాతిక టెస్టులకే దాదాపు 50 శాతం బ్యాటింగ్ సగటుతో 7 సెంచరీలు, 12 అర్ధసెంచరీలు బాదాడు. ఇదే స్థిరత్వం కొనసాగిస్తే టెస్ట్ క్రికెట్లో దిగ్గజాల సరసన అతడికి చోటు దక్కడం ఖాయం. టీమిండియా టాప్-5 టెస్ట్ బ్యాటర్ల పేర్ల జాబితాలో ఎడమచేతి వాటం ఆటగాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు. అయితే జైస్వాల్ తన కెరీర్ను ముగించే సమయానికి ఈ లిస్ట్ కచ్చితంగా మారుతుందని స్పోర్ట్స్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఆజాద్ మైదాన్ కుర్రాడు ఇప్పటికే చాలా దూరం వచ్చాడు. ఇంకెంత దూరం ప్రయాణిస్తాడో, ఎన్ని మైలురాళ్లు (Milestones) అందుకుంటాడో చూడాలి!Another stellar performance ✨Yashasvi Jaiswal with yet another superb Test innings 😎Scorecard ▶ https://t.co/GYLslRzj4G#TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank | @ybj_19 pic.twitter.com/oDGP8iq6Le— BCCI (@BCCI) October 11, 2025 -
విండీస్తో రెండో టెస్ట్.. అరుదైన మైలురాయిని తాకిన జైస్వాల్
న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో వెస్టిండీస్తో ఇవాళ (అక్టోబర్ 10) మొదలైన రెండో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో అతను అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) 3000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 71 ఇన్నింగ్స్ల్లో ఈ అరుదైన మైలురాయిని తాకిన జైస్వాల్ భారత్ తరఫున ఈ ఘనత సాధించిన రెండో ఫాస్టెస్ట్ బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) (68 ఇన్నింగ్స్లు) జైస్వాల్ కంటే వేగంగా అంతర్జాతీయ క్రికెట్లో 3000 పరుగుల మైలురాయిని తాకాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 51 ఓవర్లలో తర్వాత వికెట్ నష్టానికి 198 పరుగులు చేసింది. జైస్వాల్ 145 బంతుల్లో 16 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి జతగా సాయి సుదర్శన్ (58) క్రీజ్లో ఉన్నాడు.అంతకుముందు కేఎల్ రాహుల్ 54 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 38 పరుగులు చేసి ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్ 40, సాయి సుదర్శన్ 16 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. రాహుల్ వికెట్ వార్రికన్కు దక్కింది. అతడి బౌలింగ్లో రాహుల్ స్టంపౌటయ్యాడు.కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్ను చిత్తు చేసింది. ఆ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు రాహుల్, జురెల్, జడేజా సెంచరీలు చేశారు. సిరాజ్, జడేజా బంతితో రాణించారు. చదవండి: విండీస్తో రెండో టెస్ట్.. చరిత్ర సృష్టించిన బుమ్రా -
విండీస్తో రెండో టెస్ట్.. చరిత్ర సృష్టించిన బుమ్రా
వెస్టిండీస్తో ఇవాళ (అక్టోబర్ 10) మొదలైన రెండో టెస్ట్లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) రంగంలోకి దిగకుండానే ఓ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్తో టెస్ట్ల్లో హాఫ్ సెంచరీ (50 మ్యాచ్లు) పూర్తి చేసిన అతను.. భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో 50 మ్యాచ్లు ఆడిన తొలి ఫాస్ట్ బౌలర్గా చరిత్ర సృష్టించాడు. భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఫాస్ట్ బౌలర్ మూడు ఫార్మాట్లలో 50 మ్యాచ్లు ఆడలేదు.31 ఏళ్ల బుమ్రా ఇప్పటివరకు భారత్ తరఫున 50 టెస్ట్లు, 89 వన్డేలు, 75 టీ20లు ఆడాడు. 2016 జనవరిలో అంతర్జాతీయ అరంగేట్రం చేసి మూడు ఫార్మాట్లలో 467 వికెట్లు తీశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. టీమిండియా టెస్ట్ జట్టు కెప్టెన్గా శుభ్మన్ గిల్ తొలిసారి టాస్ గెలిచాడు.లంచ్ సమయానికి భారత్ వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 54 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 38 పరుగులు చేసి ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్ 40, సాయి సుదర్శన్ 16 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. రాహుల్ వికెట్ వార్రికన్కు దక్కింది. అతడి బౌలింగ్లో రాహుల్ స్టంపౌటయ్యాడు.కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్ను చిత్తు చేసింది. ఆ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు రాహుల్, జురెల్, జడేజా సెంచరీలు చేశారు. సిరాజ్, జడేజా బంతితో రాణించారు. చదవండి: 'టీమిండియా'పై కేసు.. గట్టిగా అక్షింతలు వేసిన ఢిల్లీ హైకోర్టు -
'టీమిండియా'పై కేసు.. గట్టిగా అక్షింతలు వేసిన ఢిల్లీ హైకోర్టు
భారత క్రికెట్ జట్టును టీమిండియా (Team India) అని పిలవడంపై అభ్యంతరం వ్యక్తమైంది. ఓ ప్రైవేట్ సంస్థ (BCCI) ఎంపిక చేసే జట్టును భారత జట్టు లేదా టీమిండియా అని పిలవకూడదని రీపక్ కన్సాల్ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో ప్రజాహిత పిటిషన్ (PIL) దాఖలు చేశారు.బీసీసీఐ ఎంపిక చేసిన జట్టుకు ఇండియా లేదా భారత్ పేరును వాడుకోకూడదని పిటిషన్లో పేర్కొన్నారు. ఇలా చేసి జాతీయ గుర్తింపు పొందడం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు.సమాచార హక్కు చట్టం (RTI) ఆధారంగా బీసీసీఐకి ప్రభుత్వ గుర్తింపు లేదా నిధులు లేవని పేర్కొన్నారు. జాతీయ చిహ్నాలు, జెండా, పేరు వాడకం ద్వారా 1950 చట్టం, 2002 ఫ్లాగ్ కోడ్ ఉల్లంఘన జరుగుతోందని అభిప్రాయపడ్డారు. ప్రసార్ భారతి వంటి జాతీయ ప్రసార సంస్థలు బీసీసీఐ జట్టును ‘టీమిండియా’ పేరుతో ప్రసారం చేయడం సరికాదని పేర్కొన్నారు.ఈ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ తిప్పికొట్టింది. ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, న్యాయమూర్తి తుషార్ రావ్ గెడెలా ఈ పిటిషన్ను కోర్టు సమయాన్ని వృథా చేసే చర్యగా అభివర్ణించారు.ఈ జట్టు విశ్వ వేదికపై భారత్కు ప్రాతినిథ్యం వహిస్తుంది. అలాంటప్పుడు టీమిండియా లేదా భారత జట్టని ఎందుకు పిలవకూడదని న్యాయమూర్తి తుషార్ గెడెలా పిటిషనర్ను ప్రశ్నించారు.క్రీడా జట్లను ప్రభుత్వ అధికారులు ఎంపిక చేస్తారా..? కామన్వెల్త్, ఒలింపిక్స్లో పాల్గొనే జట్లను ప్రభుత్వమే ఎంపిక చేస్తుందా అని ప్రధాన న్యాయమూర్తి ఉపాధ్యాయ ప్రశ్నించారు. మీ ఇంట్లో జాతీయ జెండా ఎగురవేయడం నిషేధమా అని నిలదీశారు. దేశ పేరు, జాతీయ చిహ్నాల వాడకం ప్రభుత్వానికి మాత్రమే పరిమితం కాదని స్పష్టం చేశారు. క్రీడా వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం ప్రమాదకరమని హెచ్చరించారు. దేశానికి సంబంధించి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అలాంటి వాటిపై దృష్టి పెట్టాలని అక్షింతలు వేశారు. ఈ పిటిషన్ను విచారణకు అర్హం కాదని కొట్టి పారేశారు.ఈ తీర్పుతో టీమిండియా అనే పేరు చట్టబద్ధంగా కొనసాగించవచ్చని, బీసీసీఐ జట్టు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.చదవండి: టీమిండియాపై అనూహ్య విజయం.. దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు -
విండీస్తో రెండో టెస్ట్.. ఎట్టకేలకు టాస్ గెలిచిన శుభ్మన్ గిల్
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇవాల్టి నుంచి (అక్టోబర్ 10) భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్ట్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా కెప్టెన్గా శుభ్మన్కు ఇది తొలి టాస్ విజయం. అతను టెస్ట్ కెప్టెన్ అయ్యాక వరుసగా ఆరు మ్యాచ్ల్లో టాస్లు ఓడాడు.ఈ మ్యాచ్ కోసం భారత్ ఎలాంటి మార్పులు చేయలేదు. తొలి టెస్ట్లో ఆడిన జట్టునే యధాతథంగా బరిలోకి దించింది. విండీస్ మాత్రం రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. కింగ్, జోహన్ లేన్ స్థానాల్లో టెవిమ్ ఇమ్లాచ్, ఆండర్సన్ ఫిలిప్ జట్టులోకి వచ్చారు. కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తుది జట్లు..వెస్టిండీస్: జాన్ క్యాంప్బెల్, తేజ్నరైన్ చందర్పాల్, అలిక్ అథనాజ్, షాయ్ హోప్, రోస్టన్ చేజ్(కెప్టెన్), టెవిన్ ఇమ్లాచ్(వికెట్కీపర్), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖరీ పియర్, అండర్సన్ ఫిలిప్, జేడెన్ సీల్స్భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్(కెప్టెన్), ధ్రువ్ జురెల్(వికెట్కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్చదవండి: క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..! -
చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్.. 28 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) 28 ఏళ్ల కిందటి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి, చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్లో ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా సరికొత్త రికార్డు నెలకొల్పింది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించింది.ఈ మ్యాచ్లో 32 బంతుల్లో 23 పరుగులు చేసిన మంధన ఈ క్యాలెండర్ ఇయర్లో (2025) పరుగుల సంఖ్యను 982కు (17 ఇన్నింగ్స్ల్లో) పెంచుకుంది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్ (Belinda Clark) పేరిట ఉండేది. క్లార్క్ 1997 క్యాలెండర్ ఇయర్లో 970 పరుగులు చేసింది. ఈ విభాగంలో మంధన, క్లార్క్ తర్వాత సౌతాఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్ట్ (2022లో 882 పరుగులు), న్యూజిలాండ్కు చెందిన డెబ్బీ హాక్లీ (1997లో 880), న్యూజిలాండ్కు చెందిన యామీ సాటర్థ్వైట్ (2016లో 853) ఉన్నారు. మంధన వన్డేల్లో ఈ ఏడాది సూపర్ ఫామ్లో ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్లో వరుసగా మూడు మ్యాచ్ల్లో విఫలమైనా, అంతకుముందు అద్భుత ప్రతిభ కనబర్చింది. ఈ ఏడాది మంధన ఖాతాలో నాలుగు వన్డే శతకాలు కూడా ఉన్నాయి.మ్యాచ్ విషయానికొస్తే.. వన్డే ప్రపంచకప్లో భాగంగా నిన్న (అక్టోబర్ 9) వైజాగ్ వేదికగా భారత్, సౌతాఫ్రికా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్ 3 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. తప్పక గెలుస్తుందనుకున్న ఈ మ్యాచ్లో భారత్ అనూహ్యంగా ఓటమిపాలైంది. ఎనిమిదో నంబర్ ప్లేయర్ నదినే డి క్లెర్క్ (54 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్తో భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకుంది.భారత్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 81 పరుగులకే 5 కోల్పోయింది. ఈ దశలో క్లెర్క్, క్లో ట్రయాన్ (49) సహకారంతో మ్యాచ్ను గెలిపించింది. చివరి 5 ఓవర్లలో 52 పరుగులు చేయాల్సిన దశలో క్లెర్క్ పూనకం వచ్చినట్లు ఊగిపోయింది. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది మరో 7 బంతులు మిగిలుండగానే మ్యాచ్ను ముగించింది. అంతకుముందు కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (70) రాణించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రిచా ఘోష్ (77 బంతుల్లో 94; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) చారిత్రక ఇన్నింగ్స్ కారణంగా 251 పరుగులు చేసింది. 153 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న దశలో రిచా.. స్నేహ్ రాణా (33) సహకారంతో భారత్కు గౌరవప్రదమైన స్కోర్ అందించింది. క్లెర్క్ సంచలన ఇన్నింగ్స్ కారణంగా భారత్ ఈ మ్యాచ్ను చేజార్చుకుంది. చదవండి: చరిత్ర సృష్టించిన రిచా ఘోష్.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా -
'విజయం' చేజార్చుకున్నారు...
వన్డే వరల్డ్ కప్ వేటలో విశాఖ తీరాన భారత మహిళల బృందానికి అనూహ్య ఓటమి ఎదురైంది. గెలుపు ఖాయమనుకున్న దశలో దక్షిణాఫ్రికా బ్యాటర్ డి క్లెర్క్ చెలరేగి భారత్నుంచి మ్యాచ్ను లాక్కుంది. చివరి 5 ఓవర్లలో 52 పరుగులు చేయాల్సి ఉండగా 4 ఫోర్లు, 5 సిక్సర్లు బాదిన డి క్లెర్క్ 7 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ను ముగించింది. అంతకు ముందు భారత్ మళ్లీ బ్యాటింగ్లో తడబడింది. అయితే రిచా ఘోష్ అద్భుత ఇన్నింగ్స్తో మెరుగైన స్కోరును అందించింది. ఆదివారం ఇదే వైజాగ్ మైదానంలో ఆస్ట్రేలియాతో హర్మన్ సేన తలపడుతుంది. సాక్షి క్రీడా ప్రతినిధి, విశాఖపట్నం: మహిళల ప్రపంచకప్లో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది.రిచా ఘోష్ (77 బంతుల్లో 94; 11 ఫోర్లు, 4 సిక్స్లు) త్రుటిలో సెంచరీ అవకాశం చేజార్చుకుంది. ఒక దశలో భారత్ స్కోరు 153/7 కాగా...రిచా, స్నేహ్ రాణా (24 బంతుల్లో 33; 6 ఫోర్లు) ఎనిమిదో వికెట్కు 53 బంతుల్లో 88 పరుగులు జోడించి మెరుగైన స్థితికి చేర్చారు. అనంతరం దక్షిణాఫ్రికా 48.5 ఓవర్లలో 7 వికెట్లకు 252 పరుగులు చేసింది. కెప్టెన్ లారా వోల్వర్ట్ (111 బంతుల్లో 70; 8 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడింది. అయితే చివర్లో నాడిన్ డి క్లెర్క్ (54 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 5 సిక్స్లు) మెరుపు బ్యాటింగ్ దక్షిణాఫ్రికాను గెలిపించింది. వర్షం కారణంగా మ్యాచ్ గంట ఆలస్యంగా మొదలైంది. హర్మన్ మళ్లీ విఫలం...స్మృతి మంధాన (32 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్) కాస్త జాగ్రత్తగా బ్యాటింగ్ చేసింది. 21వ బంతికి గానీ ఆమె తొలి బౌండరీ కొట్టలేకపోయింది. మరో ఓపెనర్ ప్రతీక రావల్ (56 బంతుల్లో 37; 5 ఫోర్లు) చక్కటి ఆఫ్సైడ్ షాట్లతో ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత దక్షిణాఫ్రికా కట్టుదిట్టమైన బౌలింగ్తో భారత్ 47 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్లతో పాటు హర్లీన్ డియోల్ (13) కూడా వెనుదిరగ్గా... కెప్టెన్ హర్మన్ప్రీత్ (9) తన వైఫల్యాన్ని కొనసాగించింది. జెమీమా రోడ్రిగ్స్ (0) టోర్నీలో రెండో డకౌట్ను తన ఖాతాలో వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత దీప్తి (4) పెవిలియన్ చేరింది. ఈ దశలో అమన్జోత్ (13)తో రిచా జత కలిసింది. వీరిద్దరు కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. రిచా షో...40వ ఓవర్ చివరి బంతికి అమన్ అవుటైంది. ఆ సమయంలో 153/7 వద్ద స్కోరు 200 దాటడం కూడా కష్టమే అనిపించింది. ఈ స్థితిలో రిచా చెలరేగిపోయింది. క్లెర్క్ బౌలింగ్లో సిక్స్, ఫోర్ కొట్టిన ఆమె 53 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత ఖాకా వేసిన 47వ ఓవర్లో వరుసగా 4, 4, 6తో పండగ చేసుకుంది. ఇన్నింగ్స్ చివరి ఓవర్ ఆరంభానికి ముందు 84 పరుగుల వద్ద ఉన్న రిచా...వరుసగా 2, 4, 4తో 94కు చేరుకుంది. అయితే తర్వాతి బంతికి అవుటై శతకం కోల్పోయింది. ఆఖరి 10 ఓవర్లలో భారత్ 98 పరుగులు చేయడం విశేషం.టపటపా...ఛేదనలో దక్షిణాఫ్రికా ఆరంభంలో తేలిపోయింది. తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ లారా మినహా ప్రధాన బ్యాటర్లంతా కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోవడంతో సఫారీలకు ఓటమి తప్పదనిపించింది. అయితే డి క్లెర్క్, క్లో ట్రయాన్ (66 బంతుల్లో 49; 5 ఫోర్లు) అసాధారణ పోరాటం ఆ జట్టును గెలిపించింది.982స్మృతి మంధాన 2025లో వన్డేల్లో చేసిన పరుగులు. ఒకే క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా బెలిండా క్లార్క్ (970 – 1997) రికార్డును ఆమె అధిగమించింది.స్కోరు వివరాలుభారత్ ఇన్నింగ్స్: ప్రతీక (సి) బ్రిట్స్ (బి) సెఖుఖునే 37; స్మృతి (సి) లూస్ (బి) ఎంలాబా 23; హర్లీన్ (బి) ఎంలాబా 13; హర్మన్ప్రీత్ (సి) కాప్ (బి) ట్రయాన్ 9; జెమీమా (ఎల్బీ) (బి) ట్రయాన్ 0; దీప్తి (సి) జాఫ్తా (బి) కాప్ 4; అమన్జోత్ (సి) లూస్ (బి) ట్రయాన్ 13; రిచా (సి) ట్రయాన్ (బి) డి క్లెర్క్ 94; రాణా (సి) వోల్వార్ట్ (బి) కాప్ 33; క్రాంతి (నాటౌట్) 0; శ్రీచరణి (సి) వోల్వార్ట్ (బి) డి క్లెర్క్ 0; ఎక్స్ట్రాలు 25; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 251. వికెట్ల పతనం: 1–55, 2–83, 3–91, 4–92, 5–100, 6–102, 7–153, 8–241, 9–251, 10–251. బౌలింగ్: మరిజాన్ కాప్ 9–0–45–2, ఖాకా 7–0–47–0, డి క్లెర్క్ 6.5–0–52–2, ఎంలాబా 10–0–46–2, సెఖుఖునే 7–0–29–1, ట్రయాన్ 10–0–32–3. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: వోల్వార్ట్ (బి) క్రాంతి 70; బ్రిట్స్ (సి) అండ్ (బి) క్రాంతి 0; లూస్ (సి) రిచా (బి) అమన్జోత్ 5; మరిజాన్ కాప్ (బి) స్నేహ్ 20; బాష్ (సి) అండ్ (బి) దీప్తి 1; జాఫ్తా (ఎల్బీ) (బి) శ్రీచరణి 14; ట్రయాన్ (ఎల్బీ) (బి) రాణా 49; డి క్లెర్క్ (నాటౌట్) 84; ఖాకా (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 8; మొత్తం (48.5 ఓవర్లలో 7 వికెట్లకు) 252. వికెట్ల పతనం: 1–6, 2–18, 3–57, 4–58, 5–81, 6–142, 7–211. బౌలింగ్: క్రాంతి గౌడ్ 9–0–59–2, అమన్జోత్ 5.5–0–40–1, స్నేహ్ రాణా 10–0–47–2, శ్రీచరణి 10–1–37–1, దీప్తి 10–0–54–1, హర్మన్ప్రీత్ 4–0–15–0. -
టీమిండియా స్టార్ క్రికెటర్కు అండర్ వరల్డ్ బెదిరింపులు
టీమిండియా యువ క్రికెటర్, పొట్టి క్రికెట్లో మ్యాచ్ ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకూ సింగ్కు (Rinku Singh) అండర్ వరల్డ్ (Under World) నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు వెల్లడించినట్లు ఓ ప్రముఖ వార్త సంస్థ పేర్కొంది.వారి సమాచారం మేరకు.. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో రింకూకు దావూద్ గ్యాంగ్ (Dawood Gang) నుంచి మూడు బెదిరింపు కాల్స్ వచ్చాయి. గ్యాంగ్ సభ్యులు రింకూ ప్రమోషన్ టీమ్ను రూ. 5 కోట్లు డిమాండ్ చేశారు.ఈ కేసుకు సంబంధించి మొహమ్మద్ దిల్షద్, మొహమ్మద్ నవీద్ అనే ఇద్దరిని పోలీసుల అదుపులో ఉన్నారు. వీరిని ఓ కరీబియన్ దీవి పోలీసులు అరెస్ట్ చేసి, ఆగస్ట్ 1న ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో వారు రింకూ సింగ్ను బెదిరించినట్లు ఒప్పుకున్నారు.ఇక్కడ మరో విశేషమేమిటంటే.. రింకూ కేసుకు సంబంధించి పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు, ఇటీవల ముంబైలో హత్య చేయబడ్డ ఎన్సీపీ నేత బాబా సిద్దికీ కుమారుడు జీషన్ సిద్దికీని రూ. 10 కోట్ల రూపాయల కోసం బెదిరించిన కేసులో నిందితులు.మరోసారి మ్యాచ్ ఫినిషర్గా..!రింకూ సింగ్ మరోసారి మ్యాచ్ ఫినిషర్ పాత్రకు న్యాయం చేశాడు. తాజాగా పాకిస్తాన్తో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో బౌండరీ బాది మ్యాచ్ను ముగించాడు. ఈ టోర్నీలో రింకూ ఆడిన ఏకైక మ్యాచ్ ఇదే. రింకూ బౌండరీతో భారత్ ఆసియా కప్లో విజేతగా నిలిచింది. చదవండి: టీమిండియాకు షాక్ ఇవ్వనున్న మ్యాక్స్వెల్..! -
విండీస్తో రెండో టెస్ట్కు భారత తుది జట్టు ఇదే.. యువ ఆటగాడికి వార్నింగ్..!
రేపటి నుంచి (అక్టోబర్ 10) వెస్టిండీస్తో ప్రారంభమయ్యే రెండో టెస్ట్లో భారత తుది జట్టు ఇదే అంటూ అసిస్టెంట్ కోచ్ టెన్ డస్కటే హింట్ ఇచ్చాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్లో భారత్ తరఫున ఎలాంటి మార్పులు ఉండవని సంకేతాలిచ్చాడు. స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే ఉద్దేశం లేదని ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలిపాడు.సుదూర అవసరాల దృష్ట్యా నితీశ్ కుమార్ రెడ్డికి మరిన్ని అవకాశాలుంటాయని చెప్పకనే చెప్పాడు. నితీశ్ను నాణ్యమైన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపాడు. తొలి టెస్ట్లో విఫలమైనా సాయి సుదర్శన్తో ఎలాంటి ఇబ్బంది లేదని అన్నాడు. పరుగులు సాధించలేకపోతే జట్టులో ఎవరి స్థానం సుస్థిరం కాదని గుర్తు చేశాడు. ఈ సందర్భంగా కరుణ్ నాయర్ పేరును ప్రస్తావించాడు.తొలి టెస్ట్లో జురెల్ సెంచరీ సాధించడం వల్ల సాయిపై ఒత్తిడి ఉంటుందంటూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు. ఇదే సందర్భంగా జురెల్పై ప్రశంసల వర్షం కురిపించాడు. పంత్ గైర్హాజరీలో ఆ స్థానానికి న్యాయం చేశాడని అన్నాడు. జురెల్ మిడిలార్డర్లో సరిగ్గా ఫిట్ అవుతాడని ముందే ఊహించామని తెలిపాడు.డస్కటే ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన దాన్ని బట్టి చూస్తే.. రెండో టెస్ట్లో కూడా పడిక్కల్, అక్షర్ పటేల్, జగదీసన్, ప్రసిద్ద్ కృష్ణ బెంచ్కు పరిమితం కావల్సిందే.కాగా, అహ్మదాబాద్లో జరిగిన తొలి టెస్ట్లో భారత్ ఎలాంటి ప్రయోగాలకు పోకుండా పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగి సత్ఫలితం సాధించింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో పర్యాటక జట్టును చిత్తు చేసింది. బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణించి విండీస్ను మట్టికరిపించారు. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి సిరాజ్ 7 వికెట్లు తీయగా.. బుమ్రా 3, కుల్దీప్, జడేజా తలో 4, సుందర్ 2 వికెట్లు పడగొట్టారు. ఒకే ఇన్నింగ్స్లో భారత్ బ్యాటింగ్ చేయగా.. కేఎల్ రాహుల్, జురెల్, రవీంద్ర జడేజా శతకాలు బాదారు.విండీస్తో రెండో టెస్ట్కు భారత తుది జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), ధృవ్ జురెల్ (వికెట్కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్చదవండి: చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. తొలి బౌలర్ -
మహ్మద్ షమీ కీలక నిర్ణయం
టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami)కి గడ్డుకాలం నడుస్తోంది. భారత పేస్ దళంలో కీలక ఆటగాడిగా కొనసాగిన ఈ బెంగాల్ క్రికెటర్కు ఇప్పుడు జట్టులో చోటే కరువైంది. వన్డే వరల్డ్కప్-2023 టోర్నీలో గాయం తాలూకు బాధను దిగమింగి.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు షమీ.సొంతగడ్డపై జరిగిన ఈ మెగా టోర్నీలో కేవలం ఆరు మ్యాచ్లే ఆడిన షమీ ఏకంగా 23 వికెట్లు కూల్చాడు. తద్వారా ఈ ఐసీసీ ఈవెంట్లో లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. అయితే, ఆ తర్వాత నుంచి షమీ చీలమండ గాయం తీవ్రత ఎక్కువ కావడంతో సర్జరీ చేయించుకున్నాడు.చాంపియన్ జట్టులోకోలుకునే క్రమంలో దాదాపు ఏడాదిన్నర పాటు టీమిండియాకు దూరంగా ఉన్న షమీ.. స్వదేశంలో ఈ ఏడాది ఇంగ్లండ్తో సిరీస్ సందర్భంగా పునరాగమనం చేశాడు. ఈ క్రమంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచిన భారత జట్టులోనూ షమీ భాగమయ్యాడు. అయితే, ఈ వన్డే టోర్నీలో ఐదు మ్యాచ్లలో కలిపి తొమ్మిది వికెట్లు తీయగలిగాడు.రెండేళ్ల నుంచీ నిరాశే పరిమిత ఓవర్ల క్రికెట్లో పరిస్థితి ఇలా ఉంటే.. టెస్టుల్లో మాత్రం షమీకి రెండేళ్ల నుంచీ నిరాశే ఎదురవుతోంది. ఫిట్నెస్ సమస్యల దృష్ట్యా అతడిని పక్కనపెట్టినట్లు టీమిండియా మేనేజ్మెంట్ చెబుతోంది. మరోవైపు.. ఇటీవల దులిప్ ట్రోఫీలో బెంగాల్ తరఫున బరిలోకి దిగిన షమీ.. 34 ఓవర్ల బౌలింగ్లో కేవలం ఒకే ఒక్క వికెట్ తీయగలిగాడు.షమీ కీలక నిర్ణయంఈ నేపథ్యంలో వెస్టిండీస్తో స్వదేశంలో టెస్టులకు కూడా సెలక్టర్లు షమీని ఎంపిక చేయలేదు. అంతేకాదు ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడే జట్టులోనూ అతడికి చోటి వ్వలేదు. ఈ విషయం గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. షమీ గురించి అప్డేట్ లేదని చెప్పడం గమనార్హం. ఈ క్రమంలో షమీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.తనను తాను నిరూపించుకునేందుకు రంజీ ట్రోఫీ తాజా సీజన్లో ఆడేందుకు షమీ సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయం గురించి బెంగాల్ కోచ్ టెలిగ్రాఫ్తో మాట్లాడుతూ.. ‘‘ఆరేడు రోజుల క్రితం షమీతో మాట్లాడాను. అతడు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. రంజీ ట్రోఫీలో మా ఓపెనింగ్ మ్యాచ్ నుంచే అతడు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నాడు.తలుపులు శాశ్వతంగా మూసుకుపోయినట్లేఇదిలా ఉంటే.. బీసీసీఐ అధికారి ఒకరు షమీ గురించి ప్రస్తావన రాగా.. ‘‘టీమిండియాలోకి షమీ తిరిగి రావడం ప్రస్తుతం కష్టమే. ఇటీవల దులిప్ మ్యాచ్లోనూ అతడు రాణించలేకపోయాడు. రోజురోజుకీ వయసు మీద పడుతోంది. యువ ఆటగాళ్లతో అతడు పోటీ పడలేడు.అయితే, ఐపీఎల్లో అవకాశాలు దక్కించుకోవాలంటే.. అతడు ఆడక తప్పని పరిస్థితి’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. తద్వారా షమీకి టీమిండియా తలుపులు శాశ్వతంగా మూసుకుపోయినట్లేననే సంకేతాలు ఇచ్చారు సదరు అధికారి. కాగా ఐపీఎల్-2025లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించిన 35 ఏళ్ల షమీ కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీయగలిగాడు.చదవండి: IND vs AUS: 462 వికెట్లు.. స్వింగ్ సుల్తాన్.. కట్ చేస్తే! ఊహించని విధంగా కెరీర్కు ఎండ్ కార్డ్? -
వైభవ్ విఫలమైనా, బౌలర్లు గెలిపించారు.. ఆసీస్ గడ్డపై టీమిండియా గర్జన
ఆస్ట్రేలియా గడ్డపై భారత యువ సింహాలు (India U19 Team) గర్జించాయి. వరుసగా వన్డే, టెస్ట్ సిరీస్ల్లో ఆతిథ్య జట్టును (Australia U19 Team) క్లీన్ స్వీప్ చేశాయి. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ల కోసం ఆస్ట్రేలియాలో పర్యటించిన యువ భారత్.. వన్డే సిరీస్ను 3-0తో, టెస్ట్ సిరీస్ను 2-0తో ఊడ్చేసింది.మెక్కే వేదికగా ఇవాళ (అక్టోబర్ 8) ముగిసిన రెండో టెస్ట్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో ఆస్ట్రేలియా కుర్ర జట్టు బెంబేలెత్తిపోయింది. తొలి ఇన్నింగ్స్లో 135 పరుగులకే కుప్పకూలింది. భారత్ సైతం తొలి ఇన్నింగ్స్లో 171 పరుగులకే ఆలౌటైనా.. 36 పరుగుల కీలక ఆధిక్యం సాధించింది.అనంతరం భారత బౌలర్లు మరోసారి చెలరేగిపోయారు. ఈసారి ఆసీస్ను 116 పరుగులకే (రెండో ఇన్నింగ్స్లో) కుప్పకూల్చారు. తద్వారా భారత్ ముందు నామమాత్రపు 81 పరుగుల లక్ష్యం ఉండింది.స్వల్ప ఛేదనలో భారత్ సైతం ఆదిలో తడబడింది. 13 పరుగుల వద్దే కెప్టెన్ ఆయుశ్ మాత్రే (13) వికెట్ కోల్పోయింది. ఆతర్వాత బంతికే స్టార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ డకౌటయ్యాడు. ఈ దశలో వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా భారత ఇన్నింగ్స్ను నిర్మించే ప్రయత్నం చేశారు. అయితే 52 పరుగుల వద్ద విహాన్ (21) కూడా ఔటయ్యాడు. ఈసారి వేదాంత్ (33 నాటౌట్) మరో ఛాన్స్ తీసుకోకుండా రాహుల్ కుమార్ (13 నాటౌట్) సహకారంతో భారత్ను విజయతీరాలకు చేర్చాడు.రెండు ఇన్నింగ్స్ల్లో విఫలమైన వైభవ్ఈ మ్యాచ్లో టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ రెండు ఇన్నింగ్స్ల్లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో (14 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్) మంచి ఆరంభం లభించినా భారీ స్కోర్గా మలచలేకపోయిన ఈ కుర్ర డైనమైట్.. రెండో ఇన్నింగ్స్లో ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు.చెలరేగిన బౌలర్లుఈ మ్యాచ్లో భారత బౌలర్లు రెండు ఇన్నింగ్స్ల్లో చెలరేగిపోయారు. కలిసికట్టుగా బౌలింగ్ చేసి ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. వీరి ధాటికి ఆసీస్ బ్యాటర్లు కొద్ది సేపు కూడా క్రీజ్లో నిలబడలేకపోయారు. రెండు ఇన్నింగ్స్ల్లో ఆసీస్ తరఫున అలెక్స్ లీ యంగ్ (66, 38) ఒక్కడే పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్లో హెనిల్ పటేల్ 6, ఖిలన్ పటేల్, ఉధవ్ మోహన్ తలో 4, నమన్ పుష్పక్ 3, దీపేశ్ దేవేంద్రన్ 2 వికెట్లు తీశారు. చదవండి: CEAT అవార్డుల విజేతలు వీరే.. రోహిత్ శర్మకు ప్రత్యేక పురస్కారం -
రెండో ఇన్నింగ్స్లోనూ రెచ్చిపోయిన టీమిండియా బౌలర్లు
ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరుగుతున్న రెండో యూత్ టెస్ట్ మ్యాచ్లో భారత యువ బౌలర్లు రెండో ఇన్నింగ్స్లోనూ చెలరేగిపోయారు. హెనిల్ పటేల్ (8-3-23-3), నమన్ పుష్పక్ (7-1-19-3), ఉధవ్ మోహన్ (8-4-17-2), దీపేశ్ దేవేంద్రన్ (6-2-15-1), ఖిలన్ పటేల్ (11.1-2-36-1) ధాటికి ఆసీస్ 116 పరుగులకు చాపచుట్టేసింది. తద్వారా భారత్ ముందు 81 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.ఆసీస్ ఇన్నింగ్స్లో 38 పరుగులు చేసిన అలెక్స్ లీ యంగ్ టాప్ స్కోరర్ కాగా.. మరో ముగ్గురు (కేసీ బార్టోన్ (19), జేడన్ డ్రేపర్ (15), అలెక్స్ టర్నర్ (10)) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. సైమన్ బడ్జ్, జెడ్ హోల్లిక్ డకౌట్లు కాగా.. కెప్టెన్ విల్ మలాజ్చుక్, యశ్ దేశ్ముఖ్ తలో 5, ఛార్లెస్ లచ్మండ్ 9, విల్ బైరోమ్ 8 పరుగులు చేశారు.అంతకుముందు ఆసీస్ బౌలర్లు భారత్ను 171 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా 30 పరుగుల మార్కును చేరలేదు. 28 పరుగులు చేసిన తొమ్మిదో నంబర్ ఆటగాడు దీపేశ్ దీపేంద్రన్ టాప్ స్కోరర్గా నిలువగా.. ఖిలన్ పటేల్, వేదాంత్ త్రివేది, హెనిల్ పటేల్, వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా వరుసగా 26, 25, 22, 20, 11 పరుగులు స్కోర్ చేశారు. కెప్టెన్ ఆయుశ్ మాత్రే వైఫల్యాల పరంపరను కొనసాగిస్తూ 4 పరుగులకే ఔట్ కాగా.. రాహుల్ కుమార్ 9, హర్వంశ్ పంగాలియా 1, నమన్ పుష్పక్ డకౌటయ్యారు. ఈ ఇన్నింగ్స్లో ఆసీస్ బౌలర్లు సైతం మూకుమ్మడిగా సత్తా చాటారు. కేసీ బార్టన్ 4, ఛార్లెస్ లిచ్మండ్, విల్ బైరోమ్, జూలియన్ ఓస్బర్న్ తలో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 171 పరుగులకే ఆలౌటైనా 36 పరుగుల కీలక ఆధిక్యం లభించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. హెనిల్ పటేల్ (9-3-21-3), ఖిలన్ పటేల్ (12-5-23-3), ఉధవ్ మోహన్ (6-0-23-2), దీపేశ్ దేవేంద్రన్ (7.3-2-22-1) ధాటికి 135 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్లో వికెట్ కీపర్ లీ యంగ్ (66) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.కాగా, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ల కోసం భారత అండర్ 19 జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలుత జరిగిన వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. టెస్ట్ సిరీస్లోనూ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్ను కూడా గెలిస్తే భారత్ ఆసీస్ను వారి సొంత ఇలాకాలో పూర్తిగా క్వీన్ స్వీప్ చేసినట్లవుతుంది.చదవండి: ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్.. మళ్లీ కెప్టెన్గా స్టీవ్ స్మిత్..? -
స్వల్ప స్కోర్కే కుప్పకూలిన టీమిండియా.. సంతోషం ఎంతో సేపు మిగల్లేదు..!
ఆస్ట్రేలియా పర్యటనలో భారత అండర్-19 జట్టు (India U19 vs Australia U19) తొలిసారి బ్యాటింగ్లో తడబడింది. మెక్కే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 171 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా కనీసం 30 పరుగుల మార్కును చేరలేదు. 28 పరుగులు చేసిన తొమ్మిదో నంబర్ ఆటగాడు దీపేశ్ దీపేంద్రన్ టాప్ స్కోరర్గా నిలిచాడు. ఖిలన్ పటేల్, వేదాంత్ త్రివేది, హెనిల్ పటేల్, వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) వరుసగా 26, 25, 22, 20 పరుగులు స్కోర్ చేశారు. ఓపెనర్గా ప్రమోషన్ పొందిన విహాన్ మల్హోత్రా 11 పరుగులు చేశాడు.కెప్టెన్ ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) వైఫల్యాల పరంపరను కొనసాగిస్తూ 4 పరుగులకే ఔట్ కాగా.. రాహుల్ కుమార్ 9, హర్వంశ్ పంగాలియా 1, నమన్ పుష్పక్ డకౌటయ్యారు. ఈ ఇన్నింగ్స్లో ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటారు. కేసీ బార్టన్ 4, ఛార్లెస్ లిచ్మండ్, విల్ బైరోమ్, జూలియన్ ఓస్బర్న్ తలో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా స్వల్ప స్కోర్కే ఆలౌటైనా 36 పరుగుల కీలక ఆధిక్యం సాధించడం విశేషం.ఆసీస్కు సంతోషం ఎంతో సేపు మిగల్చలేదుదీనికి తోడు స్వల్ప లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాను భారత పేసర్ హెనిల్ పటేల్ రెండో ఓవర్లోనే కోలుకోలేని దెబ్బకొట్టాడు. హెనిల్ రెండో ఓవర్లో వరుసగా తొలి, రెండో బంతులకు సైమన్ బడ్జ్, జెడ్ హోల్లిక్లను పెవిలియన్కు పంపాడు. ఆసీస్ అప్పటికి ఖాతా కూడా తెరవలేదు. 2 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 0/2గా ఉంది.అంతకుముందు భారత బౌలర్లు తొలి ఇన్నింగ్స్లోనూ చెలరేగడంతో ఆసీస్ 135 పరుగులకే కుప్పకూలింది. హెనిల్ పటేల్ (9-3-21-3), ఖిలన్ పటేల్ (12-5-23-3), ఉధవ్ మోహన్ (6-0-23-2), దీపేశ్ దేవేంద్రన్ (7.3-2-22-1) కలిసికట్టుగా ఆసీస్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. ఆసీస్ ఇన్నింగ్స్లో వికెట్ కీపర్ లీ యంగ్ (66) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.కాగా, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ల కోసం భారత అండర్ 19 జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలుత జరిగిన వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. టెస్ట్ సిరీస్లోనూ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్ను కూడా గెలిస్తే భారత్ ఆసీస్ను వారి సొంత ఇలాకాలో పూర్తిగా క్వీన్ స్వీప్ చేసినట్లవుతుంది.చదవండి: సహనం కోల్పోయిన వైభవ్ సూర్యవంశీ.. కారణం ఇదే! -
వైభవ్ సూర్యవంశీ విఫలం.. టీమిండియా తడ'బ్యాటు'
ఆస్ట్రేలియా పర్యటనలో భారత అండర్-19 జట్టు (Team India) తొలిసారి బ్యాటింగ్లో తడబాటుకు లోనైంది. మెక్కే వేదికగా ఇవాళ (అక్టోబర్ 7) మొదలైన రెండో టెస్ట్లో టాపార్డర్ విఫలం కావడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత స్కోర్ 7 వికెట్ల నష్టానికి 144 పరుగులుగా ఉంది.వన్డౌన్లో వచ్చిన చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) (14 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్) తన సహజ శైలిలో ధాటిగా ఆడినప్పటికీ, ఎక్కువ సేపు క్రీజ్లో నిలబడలేకపోయాడు. ఈ మ్యాచ్లో ఓపెనర్గా ప్రమోషన్ పొందిన విహాన్ మల్హోత్రా (11) నిరాశపరిచాడు. మరో ఓపెనర్, కెప్టెన్ ఆయుశ్ మాత్రే (4) వైఫల్యాల పరంపర కొనసాగించాడు.వేదాంత్ త్రివేది (25) నిలదొక్కుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. రాహుల్ కుమార్ (9), వికెట్కీపర్ హర్వంశ్ పంగాలియా (1) సింగిల్ డిజిట్ స్కోర్కే టపా కట్టేశారు. ఖిలన్ పటేల్ (26) కాసేపు పోరాడినప్పటికీ, ఆట ముగిసే సమయానికి కొద్ది ముందుగా ఔటయ్యాడు. హెనిల్ పటేల్ (22 నాటౌట్), దీపేశ్ దేవేంద్రన్ (6 నాటౌట్) సహకారంతో భారత్కు గౌరవప్రదమైన స్కోర్ అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు.ఆసీస్ బౌలర్లలో కేసీ బార్టన్, విల్ బైరోమ్ టీమిండియా టాపార్డర్ను ఇబ్బంది పెట్టారు. కేసీ 2, బైరోమ్ 2 వికెట్లు పడగొట్టగా.. ఛార్లెస్ లచ్మండ్, జూలియన్కు తలో వికెట్ దక్కింది. టాపార్డర్ తడబడినా టీమిండియాకు ఇప్పటికే 9 పరుగుల ఆధిక్యం లభించింది. అంతకుముందు భారత బౌలర్లు చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 135 పరుగులకే కుప్పకూలింది. హెనిల్ పటేల్ (9-3-21-3), ఖిలన్ పటేల్ (12-5-23-3), ఉధవ్ మోహన్ (6-0-23-2), దీపేశ్ దేవేంద్రన్ (7.3-2-22-1) కలిసికట్టుగా ఆసీస్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. ఆసీస్ ఇన్నింగ్స్లో వికెట్ కీపర్ లీ యంగ్ (66) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.కాగా, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ల కోసం భారత అండర్ 19 జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలుత జరిగిన వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. టెస్ట్ సిరీస్లోనూ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్ను కూడా గెలిస్తే భారత్ ఆసీస్ను వారి సొంత ఇలాకాలో పూర్తిగా క్వీన్ స్వీప్ చేసినట్లవుతుంది.చదవండి: కర్ణాటక కెప్టెన్గా రాహుల్ ద్రవిడ్ కొడుకు.. కరుణ్ నాయర్ రీఎంట్రీ -
ఏదో ఒకరోజు ఇంట్లో పట్టనంత డబ్బు సంపాదిస్తా.. కట్చేస్తే..
మిగతా వాటితో పోలిస్తే క్రికెట్, సినిమాలను కెరీర్గా ఎంచుకుంటే ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకోవాల్సి ఉంటుంది. వీటిలో విజయశాతం తక్కువ. ముఖ్యంగా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇలాంటి రంగాల్లో నిలదొక్కుకోవడం కత్తిమీద సాము లాంటిదే.నూటికో కోటికో ఒక్కరే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో సఫలమవుతూ ఉంటారు. ఇక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వారు ఇలాంటి పెద్ద పెద్ద కలలు కంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.అయితే, ఆత్మవిశ్వాసం ఉంటే కఠిన సవాళ్లను సైతం సులువుగానే అధిగమించవచ్చని అంటున్నాడు టీమిండియా స్టార్ క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్. హైదరాబాద్ గల్లీల నుంచి.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ పేస్ బౌలర్లలలో ఒకడిగా ఎదిగాడు సిరాజ్ మియా.ఏదో ఒకరోజు ఇంట్లో పట్టనంత డబ్బు సంపాదిస్తాపట్టుదల ఉంటే ఆటో డ్రైవర్ కుమారుడైనా అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చని నిరూపించాడు. అయితే, చిన్ననాడు అందరిలాగే తానూ తల్లి చేత చివాట్లు తిన్నాడు సిరాజ్. గల్లీల్లో ఆడుతూ ఉంటే.. ‘ఈ ఆట అన్నం పెడుతుందా?’ అంటూ తల్లి ఆవేదన పడుతుంటే.. ఆమెను ఊరడించేందుకు.. ‘‘ఏదో ఒకరోజు ఇంట్లో పట్టనంత డబ్బు సంపాదిస్తా’’ అని చెప్పాడు.అయితే, తర్వాతి రోజుల్లో ఆ మాటనే నిజం చేశాడు సిరాజ్. ఈ విషయాల గురించి తాజాగా మాట్లాడుతూ.. ‘‘ఆరోజు నాకింకా గుర్తుంది. నేను క్రికెట్ ఆడేందుకు వెళ్లాను. మా అమ్మకు నేనలా వెళ్లడం అస్సలు ఇష్టం లేదు.భవిష్యత్తు గురించి నాకు బెంగలేదని తిట్టేది. ఆరోజు కూడా అలాగే తిట్టింది. అప్పుడు నేను.. ‘అమ్మ నన్ను కొట్టడం ఆపేయ్.. ఏదో ఒకరోజు నేను కచ్చితంగా ఈ ఇంట్లో పట్టనంత డబ్బు సంపాదిస్తాను. నువ్వేం బాధపడకు.. నేనది చేసి చూపిస్తా’ అని నమ్మకంగా చెప్పాను.ఆత్మవిశ్వాసం ఉంటేనే..ఆరోజు నేను అన్న మాటలు నిజమయ్యాయి. ఆ దేవుడే వాటిని నిజం చేశాడు. ఆత్మవిశ్వాసం ఉంటేనే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం. ఒకవేళ మీపై మీకు నమ్మకం లేకుంటే జీవితంలో ఏమీ సాధించలేరు. మనల్ని మనం నమ్ముకోవాలి.మనకంటూ లక్ష్యాన్ని నిర్దేశించుకుని.. దాని కోసమే నిరంతరమూ పరితపించాలి. అప్పుడే అంతా సవ్యంగా సాగుతుంది. నేను ఈరోజు యార్కర్ వేసి వికెట్ తీస్తానని అనుకుంటే.. కచ్చితంగా అది సాధించగలను. నా ఆత్మవిశ్వాసమే అందుకు కారణం. మన ప్రణాళికలను పక్కాగా అమలు చేసినప్పుడు ఏదీ అసాధ్యం కాదు. కఠినంగా శ్రమిస్తే దక్కనిది ఏదీ ఉండదు’’ అని సిరాజ్ ఇండియన్ ఎక్స్ప్రెస్తో పేర్కొన్నాడు.కాగా హైదరాబాద్ తరఫున దేశీ క్రికెట్లో రాణించిన సిరాజ్.. 2017లో ఐపీఎల్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత అతడు వెనుదిరిగి చూసుకోలేదు. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటిన సిరాజ్.. ఇప్పటి వరకు తన కెరీర్లో 42 టెస్టులు, 44 వన్డేలు, 16 టీ20లు ఆడాడు.విలాసవంతమైన జీవితంటెస్టుల్లో ఇప్పటికి 130, వన్డేల్లో 71, టీ20లలో 14 వికెట్లు తీసిన సిరాజ్.. ప్రస్తుతం సొంతగడ్డపై వెస్టిండీస్తో జరుగుతున్న టెస్టు సిరీస్తో బిజీగా ఉన్నాడు. అన్నట్లు పేద కుటుంబంలో జన్మించిన సిరాజ్ నికర ఆస్తుల విలువ ప్రస్తుతం దాదాపు రూ. 60 కోట్లు. చిన్నపుడు ఇరుకు ఇంట్లో నివసించిన సిరాజ్ తల్లిని ఇప్పుడు జూబ్లీహిల్స్లోని కోట్ల విలువ గల ఇంట్లో నివసిస్తున్నారు. అంతేకాదు.. చిన్నపుడు తండ్రితో కలిసి ఆటోలో తిరిగిన ఈ హైదరాబాదీ బౌలర్ గ్యారేజీలో ఇప్పుడు విలాసవంతమైన కార్లు ఎన్నో ఉన్నాయి. అయితే, తన సక్సెస్ను పూర్తిగా ఆస్వాదించకుండానే తండ్రి మరణించడం సిరాజ్కు ఎప్పటికీ తీరని లోటు!చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
చెలరేగిన భారత బౌలర్లు.. వైభవ్ సూర్యవంశీ స్కోర్ ఎంతంటే..?
ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో ఇవాళ (అక్టోబర్ 7) ప్రారంభమైన రెండో యూత్ టెస్ట్లో (IND U19 Vs AUS U19) యువ భారత్ బౌలర్లు చెలరేగిపోయారు. హెనిల్ పటేల్ (9-3-21-3), ఖిలన్ పటేల్ (12-5-23-3), ఉధవ్ మోహన్ (6-0-23-2), దీపేశ్ దేవేంద్రన్ (7.3-2-22-1) ధాటికి ఆస్ట్రేలియా 43.3 ఓవర్లలో 135 పరుగులకే కుప్పకూలింది.ఆసీస్ ఇన్నింగ్స్లో వికెట్ కీపర్ లీ యంగ్ (66) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. మరో ఇద్దరు (యశ్ దేశ్ముఖ్ (22), కెప్టెన్ విల్ మలాజ్చుక్ (10)) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. అలెక్స్ టర్నర్ (6), జెడ్ హోల్లిక్ (7), జేడన్ డ్రేపర్ (2), కేసీ బార్టన్ (9), ఛార్లెస్ లచ్మండ్ (1) అతి కష్టం మీద సింగిల్ డిజిట్ స్కోర్లు చేయగా.. సైమన్ బడ్జ్, విల్ బైరోమ్ డకౌట్లయ్యారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కూడా తడబడుతుంది. వైభవ్ సూర్యవంశీ స్థానంలో ఓపెనర్గా ప్రమోషన్ పొందిన విహాన్ మల్హోత్రా 11 పరుగులకే ఔట్ కాగా.. మరో ఓపెనర్, టీమిండియా కెప్టెన్ అయిన ఆయుశ్ మాత్రే (4) వైఫల్యాల పరంపరను కొనసాగించాడు.ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) వచ్చీ రాగానే ఎదురుదాడికి దిగినా ఎంతో సేపు క్రీజ్లో నిలబడలేకపోయాడు. వైభవ్ 14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 20 పరుగులు చేసి ఔటయ్యాడు.తొలి రోజు టీ విరామం సమయానికి భారత స్కోర్ 3 వికెట్ల నష్టానికి 59 పరుగులుగా ఉంది. వేదాంత్ త్రివేది (11), రాహుల్ కుమార్ (6) క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో విల్ బైరోమ్ (5-0-22-2), ఛార్లెస్ లచ్మండ్ (6-0-33-1) భారత బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 76 పరుగులు వెనుకపడి ఉంది.కాగా, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ల కోసం భారత అండర్ 19 జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలుత జరిగిన వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. టెస్ట్ సిరీస్లోనూ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్ను కూడా గెలిస్తే భారత్ ఆసీస్ను వారి సొంత ఇలాకాలో పూర్తిగా క్వీన్ స్వీప్ చేసినట్లవుతుంది.చదవండి: భారత్తో వన్డే సిరీస్కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. నిప్పులు చెరిగే బౌలర్ వచ్చేశాడు..! -
భారత్తో వన్డే సిరీస్కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. నిప్పులు చెరిగే బౌలర్ వచ్చేశాడు..!
అక్టోబర్ 19 నుంచి స్వదేశంలో భారత్తో జరుగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును (Australia) ఇవాళ (అక్టోబర్ 7) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా మిచెల్ మార్ష్ (Mitchell March) ఎంపిక కాగా.. పలువురు స్టార్ ఆటగాళ్లు ఈ సిరీస్తో రీఎంట్రీ ఇచ్చారు.ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్కు దూరంగా ఉన్న స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ఈ సిరీస్లో బరిలోకి దిగనుండగా.. గాయాల నుంచి కోలుకొని మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్ రీఎంట్రీ ఇచ్చారు. ఓపెనింగ్ బ్యాటర్ మ్యాట్ రెన్షా 2022 తర్వాత తొలిసారి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు.నవంబర్లో ప్రారంభమయ్యే యాషెస్ సిరీస్కు సన్నద్దమయ్యేందుకు పాట్ కమిన్స్ ఈ సిరీస్కు దూరంగా ఉండగా.. సౌతాఫ్రికాతో ఇటీవల ఆడిన సిరీస్లో భాగమైన లబూషేన్, కుహ్నేమన్, ఆరోన్ హార్డీ, సీన్ అబాట్పై వేటు పడింది. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ దేశవాలీ కమిట్మెంట్స్ కారణంగా తొలి వన్డేకు దూరంగా ఉండి, చివరి రెండు వన్డేలకు అందుబాటులోకి వస్తాడు.భారత్తో సిరీస్కు ఆస్ట్రేలియా వన్డే జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ క్యారీ, కూపర్ కన్నోల్లీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, అడమ్ జాంపావన్డే సిరీస్ షెడ్యూల్..తొలి వన్డే- అక్టోబర్ 19 (పెర్త్)రెండో వన్డే- అక్టోబర్ 23 (అడిలైడ్)మూడో వన్డే- అక్టోబర్ 25 (సిడ్నీ)వన్డే సిరీస్తో పాటు 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్తో జరిగే తొలి రెండు టీ20లకు కూడా ఆసీస్ జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు కూడా మిచెల్ మార్షే కెప్టెన్గా వ్యవహరిస్తుండగా.. గాయాల నుంచి కోలుకొని ఇంగ్లిస్, ఎల్లిస్ రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా న్యూజిలాండ్ పర్యటనలో గాయపడిన మ్యాక్స్వెల్ ఈ జట్టుకు ఎంపిక కాలేదు.న్యూజిలాండ్ సిరీస్లో ఆడిన జోష్ ఫిలిప్, అలెక్స్ క్యారీకి ఈ జట్టులో చోటు దక్కలేదు. మిగతా జట్టంతా యధాతథంగా కొనసాగింది.భారత్తో తొలి రెండు టీ20లకు ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నేమన్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, అడమ్ జాంపాటీ20 సిరీస్ షెడ్యూల్తొలి టీ20- అక్టోబర్ 29 (కాన్బెర్రా)రెండో టీ20- అక్టోబర్ 31 (మెల్బోర్న్)మూడో టీ20- నవంబర్ 2 (హోబర్ట్)నాలుగో టీ20- నవంబర్ 6 (గోల్డ్ కోస్ట్)ఐదో టీ20- నవంబర్ 8 (బ్రిస్బేన్)చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా బ్యాటర్.. ప్రపంచంలో తొలి ప్లేయర్ -
రిషబ్ పంత్ రీఎంట్రీ..!
ఇంగ్లండ్ పర్యటనలో గాయపడి, కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న టీమిండియా స్టార్ వికెట్కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) రీఎంట్రీకి సిద్దమైనట్లు తెలుస్తుంది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న అతను త్వరలో జరుగబోయే రంజీ ట్రోఫీలో (Ranji Trophy) తన సొంత జట్టు ఢిల్లీ (Delhi) తరఫున బరిలోకి దిగనున్నాడని సమాచారం.జట్టులోకి రావడమే కాకుండా రంజీ ట్రోఫీలో పంత్ ఢిల్లీ కెప్టెన్గానూ వ్యవహరిస్తాడని తెలుస్తుంది. అయితే ఇదంతా బీసీసీఐ మెడికల్ టీమ్ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ లభించిన తర్వాతే జరుగుతుందని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (DDCA) అధికారి ఒకరు తెలిపారు.అతని మాటల్లో.. పంత్ అక్టోబర్ 25 నుంచి ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్లు ఆడేందుకు అందుబాటులో ఉంటారు. అయితే అతను క్యాంప్లో చేరే ఖచ్చితమైన తేదీని ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే అతనికి బీసీసీఐ మెడికల్ టీమ్ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ రావాల్సి ఉంది. పంత్ అందుబాటులో వస్తే ఢిల్లీ జట్టుకు కెప్టెన్గానూ వ్యవహరించే అవకాశం ఉంది.కాగా, పంత్ ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనలో నాలుగో టెస్ట్ సందర్భంగా తీవ్రంగా గాయపడ్డాడు. ఆ గాయం కారణంగా ఆసియా కప్, వెస్టిండీస్ టెస్ట్ సిరీస్లకు దూరంగా ఉన్నాడు. గాయానికి చికిత్స పూర్తైనప్పటి నుంచి బీసీసీఐ సెంటల్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఉన్న పంత్ పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం.బీసీసీఐ నుంచి క్లియరెన్స్ వస్తే అతను త్వరలో జరుగబోయే రంజీ ట్రోఫీలో పాల్గొంటాడు. ఈ మధ్యలో భారత్ ఆస్ట్రేలియాలో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడేందుకు వెళ్లనుంది. ఇందులో రెండు ఫార్మాట్ల (వన్డే, టీ20) జట్లకు పంత్ ఎంపిక కాలేదు. కాబట్టి అతను నవంబర్ మధ్య వరకు ఖాళీగా ఉంటాడు.ఈ మధ్యలో రంజీ ట్రోఫీలో సత్తా చాటితే, ఆతర్వాత జరిగే సౌతాఫ్రికా సిరీస్కు అతను సన్నద్దమవుతాడు. సౌతాఫ్రికా నవంబర్ 14 నుంచి భారత్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో రెండు టెస్ట్లు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.ఇదిలా ఉంటే, రంజీ ట్రోఫీలో ఢిల్లీ ప్రయాణం అక్టోబర్ 15న హైదరాబాద్తో జరిగే మ్యాచ్తో మొదలవనున్నప్పటికీ.. పంత్ మాత్రం అక్టోబర్ 25 నుంచి హిమాచల్ ప్రదేశ్తో జరిగే మ్యాచ్ నుంచి అందుబాటులో ఉంటాడు.టీమిండియా షెడ్యూల్ విషయానికొస్తే.. భారత జట్టు ప్రస్తుతం స్వదేశంలో వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్లో ఇప్పటికే ఓ మ్యాచ్ అయిపోయగా.. మరో మ్యాచ్ మిగిలింది. ఆ మ్యాచ్ అక్టోబర్ 10 నుంచి ఢిల్లీ వేదికగా జరుగనుంది. అంతకుముందు అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది.ఈ సిరీస్ ముగిసిన వెంటనే భారత పరిమిత ఓవర్ల జట్లు అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటిస్తాయి. ఈ పర్యటనలో భారత్ 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఈ సిరీస్ల కోసం భారత జట్లను ఇదివరకే ప్రకటించారు. ఈ పర్యటనలోని వన్డే సిరీస్తో టీమిండియా వెటరన్ స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తిరిగి బరిలోకి దిగుతారు. వీరిద్దరు టీ20, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి, కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. రో-కో చివరిగా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్నారు. చదవండి: World Cup 2025: టీమిండియా చేతిలో ఓడినా చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ -
పాక్పై రికార్డు విజయం.. ఆసీస్ దిగ్గజాన్ని అధిగమించిన టీమిండియా కెప్టెన్
మహిళల వన్డే వరల్డ్కప్ 2025లో (Women's Cricket World Cup 2025) భాగంగా పాకిస్తాన్తో నిన్న (అక్టోబర్ 5) జరిగిన మ్యాచ్లో (India vs Pakistan) టీమిండియా 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి ఓ మోస్తరు స్కోర్కే (247) పరిమితమైనప్పటికీ.. ఆతర్వాత ఆ స్కోర్ను విజయవంతంగా కాపాడుకుంది. క్రాంతి గౌడ్ (10-3-20-3) అద్భుతమైన బౌలింగ్తో పాక్ పతనాన్ని శాశించింది. క్రాంతితో పాటు దీప్తి శర్మ (9-0-45-3), స్నేహ్ రాణా (8-0-38-2) కూడా సత్తా చాటడంతో పాక్ 43 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. పాక్ తరఫున సిద్రా అమీన్ (81) ఒంటరిపోరాటం చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అంతకుముందు భారత ఇన్నింగ్స్ డయానా బేగ్ (10-1-69-4) ధాటికి తడబడింది. టాపార్డర్ మొత్తానికి మంచి ఆరంభాలు లభించినా, ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. ఆఖర్లో రిచా ఘోష్ (20 బంతుల్లో 35 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించింది.ఈ గెలుపుతో భారత్ వన్డే ఫార్మాట్లో దాయాదిపై తమ రికార్డును (12-0) మరింత మెరుగుపర్చుకుంది. అలాగే వరల్డ్కప్ టోర్నీల్లోనూ పాక్పై ఆధిపత్యాన్ని (5-0) కొనసాగించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత క్రికెట్ జట్లు పాక్ను వరుసగా నాలుగు ఆదివారాల్లో ఓడించాయి. దీనికి ముందు భారత పురుషుల జట్టు ఆసియా కప్లో పాక్ను వరుసగా మూడు ఆదివారాల్లో ఓడించి ఆసియా ఛాంపియన్గా అవతరించింది.ఇదిలా ఉంటే, నిన్నటి గెలుపుతో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet kaur) ఓ అరుదైన ఘనత సాధించింది. వన్డేల్లో ఆమె ప్లేయర్గా 90వ విజయాన్ని నమోదు చేసి, మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్ల జాబితాలో ఏడో స్థానానికి ఎగబాకింది. ఈ క్రమంలో ఆసీస్ దిగ్గజ ప్లేయర్, ఆ జట్టు మాజీ కెప్టెన్, రెండు సార్లు వన్డే ప్రపంచకప్ విన్నర్ మెగ్ లాన్నింగ్ను (Meg Lanning) అధిగమించింది. లాన్నింగ్ తన కెరీర్లో ప్లేయర్గా 89 విజయాలు సాధించగా.. హర్మన్ నిన్నటి మ్యాచ్తో ఆమెను దాటేసింది. ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అగ్రస్థానంలో ఉంది. మిథాలీ తన వన్డే కెరీర్లో 129 విజయాలు సాధించింది.మహిళల వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్లుమిథాలీ రాజ్- 129ఎల్లిస్ పెర్రీ- 125అలైస్సా హీలీ- 103బెలిండ క్లార్క్- 94కేట్ సీవర్ బ్రంట్- 93కేట్ ఫిజ్ప్యాట్రిక్- 91హర్మన్ప్రీత్ కౌర్- 90మెగ్ లాన్నింగ్- 89 చదవండి: లంక ప్రీమియర్ లీగ్లో భారత ఆటగాళ్లు.. చరిత్రలో తొలిసారి..! -
టీమిండియా చేతిలో ఓడినా చరిత్ర సృష్టించిన పాకిస్తాన్
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్ 2025లో (Women's Cricket World Cup) భాగంగా నిన్న (అక్టోబర్ 5) భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ (Inida vs Pakistan) జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ 88 పరుగుల తేడాతో పాక్ను ఓడించి, వన్డే ఫార్మాట్లో దాయాదిపై తమ రికార్డును (12-0) మరింత మెరుగుపర్చుకుంది. అలాగే వరల్డ్కప్ టోర్నీల్లోనూ పాక్పై ఆధిపత్యాన్ని 5-0 తేడాతో కొనసాగించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత క్రికెట్ జట్లు పాక్ను వరుసగా నాలుగు ఆదివారాల్లో ఓడించారు.తాజాగా ముగిసిన పురుషుల ఆసియా కప్లో టీమిండియా గ్రూప్ (సెప్టెంబర్ 14), సూపర్-4 (సెప్టెంబర్ 21), ఫైనల్ (సెప్టెంబర్ 28) మ్యాచ్ల్లో వరుసగా మూడు ఆదివారాల్లో పాక్ను ఓడించగా.. ఇప్పుడు భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్లో భాగంగా పాక్ను వరుసగా నాలుగో ఆదివారం (అక్టోబర్ 5) చిత్తు చేసింది.తాజా మ్యాచ్లో భారత మహిళా జట్టు చేతిలో ఓడినా పాక్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వన్డేల్లో పాక్ తొలిసారి భారత్ను ఆలౌట్ చేసింది. ఇరు జట్ల మధ్య దీనికి ముందు 11 మ్యాచ్లు జరిగినా, అందులో పాక్ బౌలర్లు ఒక్కసారి కూడా భారత్ను ఆలౌట్ చేయలేదు.నిన్న జరిగిన వరల్డ్కప్ మ్యాచ్లో పాక్ పేసర్ డయానా బేగ్ (10-1-69-4) చెలరేగడంతో భారత్ సరిగ్గా 50 ఓవర్లు ఆడి 247 పరుగులకు ఆలౌటైంది. మహిళల వన్డేల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు కాకుండా టీమిండియా చేసిన అత్యధిక స్కోర్ ఇదే. ఈ మ్యాచ్లో భారత ప్లేయర్లు ఏకంగా 173 బంతులకు పరుగులు చేయలేదు.ప్రస్తుత ప్రపంచకప్ టోర్నీలో ఓ జట్టు ఇన్ని బంతులకు పరుగులు చేయలేకపోవడం ఇదే ప్రప్రధమం. గత 34 వన్డేల్లో భారత మహిళల జట్టు ఈ మార్కును (173 డాట్ బాల్స్) తాకడం ఇది రెండోసారి. 2023 జనవరిలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 181 బంతులను వృధా చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. భారత బ్యాటర్లను ఉన్న టాలెంట్ ప్రకారం ఈ స్కోర్ నిజంగానే చాలా చిన్నది. అయినా భారత బౌలర్లు దాన్ని విజయవంతంగా కాపాడుకొని పాక్ను మట్టికరిపించాడు. ఈ మ్యాచ్లో భారత్ తక్కువ స్కోర్కే (247 ఆలౌట్) పరిమితం కావడానికి ఇతరత్రా కారణాలు కూడా ఉన్నాయి.టీమిండియా బ్యాటింగ్ చేసే సమయంలో పురుగులు చాలా ఇబ్బంది పెట్టాయి. వీటి వల్ల భారత బ్యాటర్లు ఏకాగ్రత సాధించలేకపోయారు. ఓ దశలో పురుగులను పారద్రోలేందుకు స్ప్రేను కూడా ప్రయోగించారు. అయితే అప్పటికే సగం మ్యాచ్ ఆయిపోయింది. నిన్నటి మ్యాచ్లో భారత్ పాక్పై భారీ స్కోర్ చేయలేకపోవడానికి పిచ్ మరో కారణం. పిచ్ను మ్యాచ్కు 48 గంటల ముందు వరకు క్లోజ్ చేసి ఉంచారు. దీంతో తేమ ఎక్కువై బంతి నిదానంగా కదిలింది. దీని వల్ల కూడా భారత బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. ఆఖర్లో రిచా ఘోష్ (20 బంతుల్లో 35 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోయుంటే భారత్ ఇంకాస్త తక్కువ స్కోర్కే పరిమితమై ఉండేది. చదవండి: World Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. స్ప్రే ప్రయోగించిన పాక్ కెప్టెన్ -
ప్రభ్సిమ్రన్ విధ్వంసకర శతకం.. ఉత్కంఠ పోరులో ఆసీస్పై టీమిండియా గెలుపు
స్వదేశంలో ఆస్ట్రేలియా-ఏతో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను (India A vs Australia A) భారత-ఏ జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. కాన్పూర్ వేదికగా ఇవాళ (అక్టోబర్ 5) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆసీస్పై (Australia) భారత్ (Team India) 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్లోని తొలి వన్డేలో భారత్ గెలవగా.. రెండో వన్డేలో ఆసీస్ గెలిచింది. దీనికి ముందు ఆసీస్తో జరిగిన రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను కూడా భారత్ చేజిక్కించుకుంది (1-0).భారీ స్కోర్ చేసిన ఆస్ట్రేలియాటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.1 ఓవర్లలో 316 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. కూపర్ కన్నోలీ (64), లియామ్ స్కాట్ (73), కెప్టెన్ జాక్ ఎడ్వర్డ్స్ (89) అర్ద సెంచరీలతో సత్తా చాటి ఆసీస్ భారీ స్కోర్ చేసేందుకు దోహదపడ్డారు.44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో కన్నోలీ.. లిచ్లన్ షా (32) సాయంతో ఆసీస్ ఇన్నింగ్స్కు జీవం పోశాడు. ఆతర్వాత లియామ్ స్కాట్, ఎడ్వర్డ్స్ సంచలన ఇన్నింగ్స్లతో భారీ స్కోర్ అందించారు. స్కాట్, ఎడ్వర్డ్స్ ఏడో వికెట్కు 152 పరుగులు జోడించి, భారత్కు కఠిన సవాల్ విసిరారు.భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా చెరో 3 వికెట్లు తీయగా.. పార్ట్ టైమ్ బౌలర్ ఆయుశ్ బదోని 2, గుర్జప్నీత్ సింగ్, నిషాంత్ సంధు తలో వికెట్ దక్కించుకున్నారు.ప్రభ్సిమ్రన్ సింగ్ విధ్వంసకర శతకంఅనంతరం బరిలోకి దిగిన భారత్.. ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (Prabhsimran Singh) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 46 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్రభ్సిమ్రన్ కేవలం 68 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం బాదాడు. ప్రభ్సిమ్రన్ ఔటయ్యాక భారత ఇన్నింగ్స్ను కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (62), రియాన్ పరాగ్ (62) తీర్చిదిద్దారు.ఆఖర్లో ఉత్కంఠగా మారిన మ్యాచ్అయితే ఆఖర్లో భారత ఆటగాళ్లు వరుస పెట్టి పెవిలియన్కు చేరడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఒక్కో పరుగు చేసేందుకు భారత ఆటగాళ్లు నానా కష్టాలు పడ్డారు. అయితే చివర్లో విప్రాజ్ నిగమ్ (24 నాటౌట్), అర్షదీప్ (7 నాటౌట్) సహకారంతో మ్యాచ్ను గెలిపించాడు. ఆసీస్ బౌలర్లు టాడ్ మర్ఫీ, తన్వీర్ సంఘా తలో 4 వికెట్లు తీసి భారత్ను భయపెట్టారు.చదవండి: భారత్ నా మాతృభూమి, దేవాలయం లాంటిది: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు -
ఆసీస్ భారీ స్కోర్.. ఛేదనలో విశ్వరూపం ప్రదర్శించిన టీమిండియా బ్యాటర్
భారత్-ఏ, ఆస్ట్రేలియా-ఏ జట్ల (India A vs Australia A) మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 5) నిర్ణయాత్మక మూడో వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా (Australia) 49.1 ఓవర్లలో 316 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. కూపర్ కన్నోలీ (64), లియామ్ స్కాట్ (73), కెప్టెన్ జాక్ ఎడ్వర్డ్స్ (89) అర్ద సెంచరీలతో సత్తా చాటి ఆసీస్ భారీ స్కోర్ చేసేందుకు దోహదపడ్డారు.44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో కన్నోలీ.. లిచ్లన్ షా (32) సాయంతో ఆసీస్ ఇన్నింగ్స్కు జీవం పోశాడు. ఆతర్వాత లియామ్ స్కాట్, ఎడ్వర్డ్స్ సంచలన ఇన్నింగ్స్లతో భారీ స్కోర్ అందించారు. స్కాట్, ఎడ్వర్డ్స్ ఏడో వికెట్కు 152 పరుగులు జోడించి, భారత్కు కఠిన సవాల్ విసిరారు.భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా చెరో 3 వికెట్లు తీయగా.. పార్ట్ టైమ్ బౌలర్ ఆయుశ్ బదోని 2, గుర్జప్నీత్ సింగ్, నిషాంత్ సంధు తలో వికెట్ దక్కించుకున్నారు.ప్రభ్సిమ్రన్ విశ్వరూపంఅనంతరం 317 భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ (Team India).. ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (Prabhsimran Singh) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 24 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ప్రభ్సిమ్రన్ కేవలం 68 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం బాదాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ తన శైలికి విరుద్దంగా నిదానంగా ఆడి 25 బంతుల్లో కేవలం రెండే ఫోర్ల సాయంతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. గత వన్డేలో సత్తా చాటిన తిలక్ వర్మ (3) ఈ మ్యాచ్లో నిరాశపరిచాడు. ప్రస్తుతం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (17), రియాన్ పరాగ్ (22) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే 26 ఓవర్లలో మరో 145 పరుగులు చేయాలి. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి.కాగా, ఈ మ్యాచ్ మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరుగుతుంది. ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు సిరీస్ను కైవసం చేసుకుంటుంది.వన్డే సిరీస్కు ముందు ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్ల అనధికారిక టెస్ట్ సిరీస్ కూడా జరిగింది. ఆ సిరీస్కు భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ల కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్లో పర్యటిస్తుంది. చదవండి: పాకిస్తాన్తో మ్యాచ్.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన టీమిండియా -
పాకిస్తాన్తో మ్యాచ్.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన టీమిండియా
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (ICC Women's World Cup 2025) భాగంగా పాకిస్తాన్తో ఇవాళ (అక్టోబర్ 5) జరుగుతున్న మ్యాచ్లో (India vs Pakistan) టీమిండియా (Team India) సామర్థ్యం మేరకు రాణించలేకపోయింది. కొలొంబో వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి పాక్ (Pakistan) ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసి ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైంది. నిర్ణీత 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 247 పరుగులకు ఆలౌటైంది.46 పరుగులతో హర్లీన్ డియోల్ టాప్ స్కోరర్గా నిలువగా.. రిచా ఘోష్ 35 (నాటౌట్), జెమీమా రోడ్రిగెజ్ 32, ప్రతీక రావల్ 31, దీప్తి శర్మ 25, స్మృతి మంధన 23, స్నేహ్ రాణా 20, హర్మన్ప్రీత్ 19, శ్రీ చరణి 1, క్రాంతి గౌడ్ 8, రేణుకా సింగ్ డకౌటయ్యారు. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లకు మంచి ఆరంభాలు లభించినా పెద్దగా స్కోర్లుగా మలచలేకపోయారు.పాక్ బౌలర్లలో డయానా బేగ్ 4 వికెట్లతో సత్తా చాటగా.. సదియా ఇక్బాల్, కెప్టెన్ ఫాతిమా సనా తలో 2, రమీన్ షమీమ్, సష్రా సంధు చెరో వికెట్ పడగొట్టారు.స్ప్రే ఉపయోగించిన పాక్ కెప్టెన్భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చిన్నచిన్న పురుగులు పలు మార్లు మ్యాచ్కు అంతరాయం కలిగించాయి. ఓ దశలో పరుగుల సమస్య ఎక్కువ కావడంతో అంపైర్ అనుమతితో పాక్ కెప్టెన్ పరుగుల నివారణ స్ప్రేను ప్రయోగించింది. ఇన్నింగ్స్ 28వ ఓవర్లో ఇది జరిగింది. స్ప్రే ఉపయోగించిన తర్వాత పురుగుల ప్రభావం తగ్గడంతో భారత బ్యాటింగ్ సజావుగా సాగింది.టాస్ సమయంలో గందరగోళంటాస్ సమయంలో గందరగోళం నెలకొంది. పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా టాస్ గెలిచినట్లు రిఫరీ షాండ్రే ఫ్రిట్జ్, అనౌన్సర్ మెల్ జోన్స్ ప్రకటించారు. వాస్తవానికి పాక్ కెప్టెన్ టాస్ గెలవలేదు.భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ టాస్ వేయగానే ఫాతిమా "టెయిల్స్" అని చెప్పింది. కానీ రిఫరీ ఫ్రిట్జ్, అనౌన్సర్ మెల్ జోన్స్ "హెడ్స్"గా వినిపించుకున్నారు. తీరా నాణెం "హెడ్స్"గా పడడంతో టాస్ పాకిస్తాన్ గెలిచిందని ప్రకటించారు. టాస్ గెలిచిన ఫాతిమా ఫీల్డింగ్ ఎంచుకోగా, దీనిపై భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం ఆసక్తికరం.చదవండి: భారత్తో నిర్ణయాత్మక మూడో వన్డే.. ఆస్ట్రేలియా భారీ స్కోర్ -
భారత్తో నిర్ణయాత్మక మూడో వన్డే.. ఆస్ట్రేలియా భారీ స్కోర్
కాన్పూర్ వేదికగా భారత్-ఏతో (India-A) ఇవాళ (అక్టోబర్ 5) జరుగుతున్న నిర్ణయాత్మక వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియా-ఏ (Australia-A) భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి 49.1 ఓవర్లలో 316 పరుగులకు ఆలౌటైంది. కూపర్ కన్నోలీ (64), లియామ్ స్కాట్ (73), కెప్టెన్ జాక్ ఎడ్వర్డ్స్ (89) అర్ద సెంచరీలతో సత్తా చాటి ఆసీస్ భారీ స్కోర్ చేసేందుకు దోహదపడ్డారు.44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో కన్నోలీ.. లిచ్లన్ షా (32) సాయంతో ఇన్నింగ్స్కు జీవం పోశాడు. ఆతర్వాత లియామ్ స్కాట్, ఎడ్వర్డ్స్ సంచలన ఇన్నింగ్స్లతో భారీ స్కోర్ అందించారు. స్కాట్, ఎడ్వర్డ్స్ ఏడో వికెట్కు 152 పరుగులు జోడించి, భారత్కు కఠిన సవాల్ విసిరారు. ఆసీస్ ఇన్నింగ్స్లో స్టార్ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ (5) వరుసగా మూడో మ్యాచ్లో నిరాశపరిచాడు.ఈ మ్యాచ్లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఏకంగా ఎనిమిది మంది బౌలర్లను ప్రయోగించాడు. వీరిలో అర్షదీప్ సింగ్ (10-2-38-3) ఒక్కడే సామర్థ్యం మేరకు రాణించగా.. హర్షిత్ రాణా (9.1-0-61-3) వికెట్లు తీసినప్పటికీ ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. పార్ట్ టైమ్ బౌలర్ ఆయుశ్ బదోని 2 వికెట్లు తీయగా.. గుర్జప్నీత్ సింగ్, నిషాంత్ సంధు తలో వికెట్ దక్కించుకున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ విప్రాజ్ నిగమ్కు (6-0-60-0) ఆసీస్ ఆటగాళ్లు చుక్కలు చూపించారు. అభిషేక్ శర్మ (4-0-19-0) పర్వాలేదనిపించాడు.కాగా, ఈ మ్యాచ్ మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరుగుతుంది. ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. వన్డే సిరీస్కు ముందు ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్ల అనధికారిక టెస్ట్ సిరీస్ కూడా జరిగింది. ఆ సిరీస్కు భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ల కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్లో పర్యటిస్తుంది. చదవండి: World Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు ముందు టాస్ గందరగోళం -
వన్డే కెప్టెన్గా ఎంపిక.. శుబ్మన్ గిల్ రియాక్షన్ వైరల్
టీమిండియా వన్డే కెప్టెన్గా ఎంపిక కావడం పట్ల శుబ్మన్ గిల్ (Shubman Gill) హర్షం వ్యక్తం చేశాడు. వన్డేల్లోనూ జట్టుకు సారథ్యం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నాడు. వరల్డ్కప్ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఈ సందర్భంగా గిల్ పేర్కొన్నాడు.కాగా ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వన్డే, టీ20 జట్లను శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అనూహ్య రీతిలో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించిన బోర్డు.. అతడి స్థానంలో గిల్కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. వన్డే వరల్డ్కప్-2027 (ICC ODI World Cup 2027) టోర్నీని దృష్టిలో పెట్టుకుని ముందుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు.ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంఈ నేపథ్యంలో తాను వన్డే కెప్టెన్గా ఎంపిక కావడం పట్ల టెస్టు సారథి శుబ్మన్ గిల్ స్పందించాడు. ‘‘వన్డే క్రికెట్లో జాతీయ జట్టును ముందుకు నడిపించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. చాంపియన్ జట్టుకు సారథిగా ఎంపిక కావడం గర్వంగా ఉంది. నేను కూడా జట్టును గొప్పగా ముందుకు నడిపించాలనే ఆశిస్తున్నా.వరల్డ్కప్ కంటే ముందు మేము 20 వరకు వన్డేలు ఆడబోతున్నాము. ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం. ప్రతి ఒక్క ఆటగాడు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే కోరుకుంటాడు. నేను కూడా అంతే. సౌతాఫ్రికాలో జరిగే ఐసీసీ టోర్నీకి మేము పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతాము. వరల్డ్కప్ గెలుస్తాం’’ అని శుబ్మన్ గిల్ పేర్కొన్నాడు.రోహిత్ ఖాతాలో రెండుకాగా చివరగా 2011లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో వన్డే వరల్డ్కప్ గెలిచిన టీమిండియా.. 2023లో సొంతగడ్డపై రోహిత్ శర్మ కెప్టెన్సీలో రన్నరప్గా నిలిచింది. అయితే, ఈ ఏడాది ఐసీసీ వన్డే చాంపియన్స్ ట్రోఫీ-2025లో మాత్రం విజేతగా నిలిచింది. తద్వారా కెప్టెన్గా రోహిత్ శర్మ ఖాతాలో రెండు ఐసీసీ టైటిళ్లు చేరాయి. అంతకుముందు టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలోనూ కెప్టెన్ హోదాలో రోహిత్ భారత్ను చాంపియన్గా నిలిపిన సంగతి తెలిసిందే.అనూహ్య రీతిలోఆ తర్వాత అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. ఇటీవలే టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేల్లో కొనసాగుతానని స్పష్టం చేసిన రోహిత్ శర్మ పది కిలోల బరువు తగ్గి ఫిట్నెస్ను మరింత మెరుగుపరచుకున్నాడు. వన్డే వరల్డ్కప్-2027 ఆడటమే లక్ష్యంగా తనను తాను తీర్చిదిద్దుకుంటున్న తరుణంలో అనూహ్య రీతిలో కెప్టెన్సీ కోల్పోయాడు. కాగా 2027లో సౌతాఫ్రికా- జింబాబ్వే- నమీబియా ఉమ్మడిగా వన్డే వరల్డ్కప్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. చదవండి: 50 ఓవర్ల క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం -
రిషభ్ పంత్ నెట్వర్త్ ఎంతో తెలుసా?
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) పుట్టిన రోజు నేడు (అక్టోబరు 4). ఈ వికెట్ కీపర్ బ్యాటర్ శనివారం.. 28వ వసంతంలో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పంత్కు శుభాకాంక్షలు తెలుపగా.. అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా తమ ఆరాధ్య ఆటగాడికి విషెస్ చెబుతున్నారు.5507 పరుగులుఉత్తరాఖండ్లోని రూర్కీలో 1997, అక్టోబరు 4న రాజేంద్ర పంత్- సరోజ్ పంత్ దంపతులకు రిషభ్ పంత్ జన్మించాడు. 2016 ఇండియా అండర్-19 జట్టు తరఫున వరల్డ్కప్లో సత్తా చాటి వెలుగులోకి వచ్చిన పంత్.. 2017లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు.అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లలో కలిపి 154 మ్యాచ్లు ఆడిన పంత్.. 5507 పరుగులు సాధించాడు. అంతేకాదు.. వికెట్ కీపర్గానూ 250 డిస్మిసల్స్లోనూ భాగమయ్యాడు. పడిలేచిన కెరటందిగ్గజ కెప్టెన్, లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోని వారసుడిగా నీరాజనాలు అందుకున్న పంత్.. కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు ఉన్నాయి. అయితే, 2022లో జరిగిన ఘోర కారు ప్రమాదం అతడి కెరీర్నే ప్రశ్నార్థకం చేసింది.కొత్త సంవత్సరం వేడుకల కోసం ఢిల్లీ నుంచి స్వస్థలానికి వెళ్తున్న సమయంలో పంత్ ప్రయాణిస్తున్న కారు.. డివైడర్ను ఢీకొట్టి నుజ్జునుజ్జయింది. ఈ క్రమంలో మంటలు చెలరేగగా.. అదృష్టవశాత్తూ పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు.బీసీసీఐ చొరవ తీసుకుని పంత్ను ఉత్తరాఖండ్ నుంచి ముంబైకి ఎయిర్లిఫ్ట్ చేయించి.. మెరుగైన చికిత్స అందించింది. ఈ క్రమంలో దాదాపు ఏడాది ఆటకు దూరమైన పంత్.. 2024లో ఐపీఎల్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు.పునరాగమనంలో ఆకాశమే హద్దుగాఇక పునరాగమనంలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అంతేకాదు.. ఐపీఎల్-2025 మెగా వేలంలో ఏకంగా రూ. 27 కోట్ల (లక్నో సూపర్ జెయింట్స్)కు అమ్ముడుపోయి లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్గా నిలిచాడు. కాగా టీమిండియా తరఫున టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచిన జట్లలో పంత్.. సభ్యుడిగా తన వంతు పాత్ర పోషించాడు.నెట్వర్త్ ఎంతో తెలుసా?బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో పంత్ A గ్రేడ్లో ఉన్నాడు. కాబట్టి.. బోర్డు ద్వారా పంత్కు ఏడాదికి రూ. 5 కోట్ల వేతనం అందుతుంది. ఇక ఇందుకు అదనంగా.. ఆడే ఒక్కో టెస్టు మ్యాచ్కు రూ. 15 లక్షలు, వన్డే మ్యాచ్కు రూ. 6 లక్షలు, టీ20 మ్యాచ్కు రూ. 3 లక్షలు అతడికి దక్కుతాయి.ఇక ఐపీఎల్లో లక్నో సూపర్జెయింట్స్కు రూ. 27 కోట్లకు అమ్ముడుపోయిన పంత్.. ఐపీఎల్ సాలరీ అంతకు ముందు కూడా తక్కువేమీ కాదు. ఇటు టీమిండియా తరఫున.. అటు ఐపీఎల్లో భారీ వేతనాలు పొందతున్న పంత్.. అడిడాస్, జొమాటో, క్యాడ్బరీ వంటి పలు ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగానూ ఉన్నాడు.ఒక్కో ఎండార్స్మెంట్ డీల్కు పంత్ రూ. 3.5 నుంచి 4 కోట్ల వరకు వసూలు చేస్తాడని వన్క్రికెట్ గతంలో వెల్లడించింది. ప్రచారకర్తగా ఏడాదికి రూ. 20- 25 కోట్ల వరకూ సంపాదిస్తున్నాడని వెల్లడించింది.ఇక పంత్కు రూర్కీలో రూ. 1 కోటి విలువైన స్థిరాస్థి ఉన్నట్లు సమాచారం. అదే విధంగా ఢిల్లీలోని ఉత్తమ్నగర్లో రూ. 2 కోట్ల విలువైన ఇల్లు అతడి పేరు మీద ఉన్నట్లు తెలుస్తోంది.లగ్జరీ కార్లుపంత్ గ్యారేజ్లో ఆడిఏ8, ఫోర్డ్ ముస్తాంగ్ జీటీ, మెర్సిడెస్-బెంజ్ ఎస్యూవీ, మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఈ వంటి పలు విలాసవంతమైన కార్లు కూడా ఉన్నట్లు సమాచారం. వన్క్రికెట్ వివరాల ప్రకారం.. 2025 నాటికి పంత్ నికర ఆస్తుల విలువ వంద కోట్లు అని అంచనా. ఇక ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా గాయపడిన పంత్.. టీమిండియాకు దూరమైన విషయం తెలిసిందే. అక్టోబరులో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.చదవండి: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే ఏకైక ఆటగాడిగా.. -
47 ఏళ్ల కిందటి రికార్డును రిపీట్ చేసిన శుభ్మన్ గిల్
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో (India vs West Indies) భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) ఓ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ కెప్టెన్గా స్వదేశంలో తొలి ఇన్నింగ్స్లోనే హాఫ్ సెంచరీ బాది, 47 ఏళ్ల క్రితం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) నెలకొల్పిన రికార్డును పునరావృతం చేశాడు.1978లో గవాస్కర్ భారత కెప్టెన్గా స్వదేశంలో తన తొలి ఇన్నింగ్స్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ముంబై వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా డబుల్ సెంచరీనే (205) బాదాడు. తిరిగి 47 ఏళ్ల తర్వాత శుభ్మన్ గిల్ స్వదేశంలో భారత కెప్టెన్గా తన తొలి ఇన్నింగ్స్లోనే హాఫ్ సెంచరీ మార్కు తాకాడు.ఈ మ్యాచ్లో గిల్ సరిగ్గా 50 పరుగులు (100 బంతుల్లో 5 ఫోర్లు) చేసి రోస్టన్ ఛేజ్ బౌలింగ్లో జస్టిన్ గ్రీవ్స్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.మ్యాచ్ విషయానికొస్తే.. విండీస్ను 162 పరుగులకే ఆలౌట్ చేసి తొలి ఇన్నింగ్స్ కొనసాగిస్తున్న భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. రెండో రోజు మూడో సెషన్ సమయానికి జట్టు స్కోర్ 4 వికెట్ల నష్టానికి 338 పరుగులుగా ఉంది. ప్రస్తుతం 176 టీమిండియా 176 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ధృవ్ జురెల్ (75), రవీంద్ర జడేజా (56) అర్ద సెంచరీలు పూర్తి చేసుకొని ఇన్నింగ్స్లు కొనసాగిస్తున్నారు.అంతకుముందు కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో సత్తా చాటాడు. 190 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 100 పరుగులు చేసి ఔటయ్యాడు. వార్రికన్ బౌలింగ్లో గ్రీవ్స్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. దీనికి ముందే శుభ్మన్ గిల్ సరిగ్గా 50 పరుగుల వద్ద ఔటయ్యాడు. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 36, సాయి సుదర్శన్ 7 పరుగులు చేశారు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 162 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్ (6.1-0-25-2), వాషింగ్టన్ సుందర్ (3-0-9-1) ధాటికి విండీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.విండీస్ ఇన్నింగ్స్లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. ఈ ఇన్నింగ్స్లో భారత వికెట్కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. -
రాహుల్ సెంచరీ.. గిల్, డీజే హాఫ్ సెంచరీలు.. భారీ స్కోర్ దిశగా టీమిండియా
అహ్మదాబాద్ టెస్ట్లో (India vs West Indies) టీమిండియా (Team India) భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. రెండో రోజు రెండో సెషన్ సమయానికి 124 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 286 పరుగులుగా ఉంది. ధృవ్ జురెల్ (Dhruv Jurel) అర్ద సెంచరీ పూర్తి చేసుకోగా.. రవీంద్ర జడేజా 30 పరుగులతో ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు.డీజే హాఫ్ సెంచరీరిషబ్ పంత్ స్థానంలో జట్టులోకి వచ్చిన ధృవ్ జురెల్ తనకు లభించిన అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఐదో స్థానంలో బరిలోకి దిగి అర్ద సెంచరీ పూర్తి చేశాడు. 91 బంతుల్లో డీజే ఈ మార్కును తాకాడు. గ్రీవ్స్ బౌలింగ్లో బౌండరీ బాది హాఫ్ సెంచరీ మార్కును తాకాడు.రాహుల్ సూపర్ సెంచరీఓపెనర్ కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో సత్తా చాటాడు. 190 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 100 పరుగులు చేశాడు. సెంచరీ పూర్తైన వెంటనే రాహుల్ ఔటయ్యాడు. వార్రికన్ బౌలింగ్లో గ్రీవ్స్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. టెస్ట్ల్లో రాహుల్కు ఇది 11వ శతకం. సొంతగడ్డపై మాత్రం రెండోదే. రాహుల్ స్వదేశంలో తన చివరి శతకాన్ని 2016లొ చెన్నైలో ఇంగ్లండ్పై చేశాడు.గిల్ హాఫ్ సెంచరీశుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ (100 బంతుల్లో 5 ఫోర్లు) పూర్తి చేసిన వెంటనే ఔటయ్యాడు. రోస్టన్ ఛేజ్ బౌలింగ్లో జస్టిన్ గ్రీవ్స్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 36, సాయి సుదర్శన్ 7 పరుగులు చేశారు. జైస్వాల్ వికెట్ సీల్స్కు, సాయి సుదర్శన్ వికెట్ ఛేజ్కు దక్కాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 162 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్ (6.1-0-25-2), వాషింగ్టన్ సుందర్ (3-0-9-1) ధాటికి విండీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.విండీస్ ఇన్నింగ్స్లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. ఈ ఇన్నింగ్స్లో భారత వికెట్కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.చదవండి: నిప్పులు చెరిగిన పంజాబ్ కింగ్స్ బౌలర్ -
కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీ
వెస్టిండీస్తో జరుగుతున్న అహ్మదాబాద్ టెస్ట్లో (India vs West Indies) టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) సూపర్ సెంచరీ సాధించాడు. 190 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో మూడంకెల స్కోర్ను చేరుకున్నాడు. రాహుల్కు టెస్ట్ల్లో ఇది 11వ శతకం. సొంతగడ్డపై మాత్రం ఇది రెండోదే. రాహుల్ స్వదేశంలో తన చివరి శతకాన్ని 2016లొ చెన్నైలో ఇంగ్లండ్పై చేశాడు.CUTE CELEBRATION BY KL RAHUL 2.0 🥺 pic.twitter.com/TZ8hknrli8— Johns. (@CricCrazyJohns) October 3, 202566 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 214/3గా ఉంది. రాహుల్కు జతగా ధృవ్ జురెల్ (10) క్రీజ్లో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ 52 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇవాళ (అక్టోబర్ 2, రెండో రోజు) రాహుల్తో పాటు ఇన్నింగ్స్ ప్రారంభించిన శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే ఔటయ్యాడు. రోస్టన్ ఛేజ్ బౌలింగ్లో జస్టిన్ గ్రీవ్స్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 36, సాయి సుదర్శన్ 7 పరుగులు చేసి ఔటయ్యాడు. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ 2, జేడన్ సీల్స్ ఓ వికెట్ తీశారు.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 162 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్ (6.1-0-25-2), వాషింగ్టన్ సుందర్ (3-0-9-1) ధాటికి విండీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.విండీస్ ఇన్నింగ్స్లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. గ్రీవ్స్ కాకుండా అలిక్ అథనాజ్ (12), బ్రాండన్ కింగ్ (13), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయ్ హోప్ (26), ఖారీ పియెర్ (11) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు.మిగతా వారిలో జాన్ క్యాంప్బెల్ 8, తేజ్నరైన్ చంద్రపాల్ డకౌట్, జోమెల్ వార్రికన్ 8, జోహన్ లేన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు. ఈ ఇన్నింగ్స్లో భారత వికెట్కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.చదవండి: BAN Vs AFG: రషీద్ ఖాన్ తిప్పేసినా ఆఫ్ఘనిస్తాన్కు తప్పని ఓటమి -
చెలరేగిన బౌలర్లు.. రాణించిన కేఎల్ రాహుల్.. భారీ స్కోర్ దిశగా టీమిండియా
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో (West Indies) జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా (Team India) మంచి స్కోర్ దిశగా సాగుతుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (36; 7 ఫోర్లు), సాయి సుదర్శన్ (7) ఔట్ కాగా.. కేఎల్ రాహుల్ (Kl Rahul) (53), శుభ్మన్ గిల్ (18) క్రీజ్లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్, రోస్టన్ ఛేజ్ తలో వికెట్ తీశారు. విండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 41 పరుగులు వెనుకపడి ఉంది.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 162 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్ (6.1-0-25-2), వాషింగ్టన్ సుందర్ (3-0-9-1) ధాటికి విండీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.విండీస్ ఇన్నింగ్స్లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. గ్రీవ్స్ కాకుండా అలిక్ అథనాజ్ (12), బ్రాండన్ కింగ్ (13), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయ్ హోప్ (26), ఖారీ పియెర్ (11) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారిలో జాన్ క్యాంప్బెల్ 8, తేజ్నరైన్ చంద్రపాల్ డకౌట్, జోమెల్ వార్రికన్ 8, జోహన్ లేన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు. ఈ ఇన్నింగ్స్లో భారత వికెట్కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: రుతురాజ్, ఇషాన్ కిషన్ విఫలం.. పోరాడుతున్న రజత్ పాటిదార్ -
IND VS WI 1st Test: ఆల్టైమ్ రికార్డును సమం చేసిన బుమ్రా
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో ఇవాళ (అక్టోబర్ 2) మొదలైన తొలి టెస్ట్లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఓ ఆల్టైమ్ రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్లో 3 వికెట్లతో చెలరేగిన అతను.. స్వదేశంలో అత్యంత వేగంగా 50 టెస్ట్ వికెట్లు తీసిన భారత ఫాస్ట్ బౌలర్గా జవగల్ శ్రీనాథ్ (javagal Srinath) రికార్డును సమం చేశాడు. బుమ్రా, శ్రీనాథ్ తలో 24 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత సాధించారు. ఈ జాబితాలో కపిల్ దేవ్ (25), ఇషాంత్ శర్మ (27), మొహమ్మద్ షమీ (27) బుమ్రా, శ్రీనాథ్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. భారత బౌలర్లు చెలరేగడంతో 162 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్ (6.1-0-25-2), వాషింగ్టన్ సుందర్ (3-0-9-1) ధాటికి విండీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.విండీస్ ఇన్నింగ్స్లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. గ్రీవ్స్ కాకుండా అలిక్ అథనాజ్ (12), బ్రాండన్ కింగ్ (13), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయ్ హోప్ (26), ఖారీ పియెర్ (11) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారిలో జాన్ క్యాంప్బెల్ 8, తేజ్నరైన్ చంద్రపాల్ డకౌట్, జోమెల్ వార్రికన్ 8, జోహన్ లేన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు. ఈ ఇన్నింగ్స్లో భారత వికెట్కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: IND vs WI: వారెవ్వా బుమ్రా.. మిస్సైల్లా దూసుకొచ్చిన బంతి! ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది -
చెలరేగిన భారత బౌలర్లు.. 162 పరుగులకే కుప్పకూలిన వెస్టిండీస్
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న (India vs West Indies) తొలి టెస్టులో టీమిండియా (Team India) బౌలర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా పేసర్లు సిరాజ్ (Siraj), బుమ్రా (Bumrah) నిప్పులు చెరిగారు. వీరి ధాటికి వెస్టిండీస్ (West Indies) తొలి ఇన్నింగ్స్లో 162 పరుగులకే కుప్పకూలింది.సిరాజ్ 14 ఓవర్లలో 40 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా.. బుమ్రా 14 ఓవర్లలో 42 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. స్పిన్నర్లు కుల్దీప్ 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. గ్రీవ్స్ కాకుండా అలిక్ అథనాజ్ (12), బ్రాండన్ కింగ్ (13), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయ్ హోప్ (26), ఖారీ పియెర్ (11) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారిలో జాన్ క్యాంప్బెల్ 8, తేజ్నరైన్ చంద్రపాల్ డకౌట్, జోమెల్ వార్రికన్ 8, జోహన్ లేన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు. ఈ ఇన్నింగ్స్లో భారత వికెట్కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
విండీస్తో తొలి టెస్టుకు భారత్ సై..
సొంతగడ్డపై టెస్టుల్లో భారత్ దాదాపు 12 ఏళ్ల పాటు ఎదురులేని జట్టుగా ఒక్క సిరీస్ కూడా ఓడిపోకుండా ఆధిపత్యం ప్రదర్శించింది. పర్యటనకు వచ్చిన పెద్ద జట్లు కూడా టీమిండియా జోరును ఆపలేకపోయాయి. అయితే పుష్కర కాలం తర్వాత బలహీనం అనుకున్న న్యూజిలాండ్ పెద్ద దెబ్బ కొట్టింది. గత ఏడాది అనూహ్యంగా కివీస్ చేతిలో భారత్ క్లీన్స్వీప్నకు గురైంది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ మన టీమ్స్వదేశంలో టెస్టు మ్యాచ్ బరిలోకి దిగుతోంది. ఈసారి కూడా బలహీనమైన వెస్టిండీస్ ఎదురుగా ఉంది. ఇంగ్లండ్పై చక్కటి ప్రదర్శన తర్వాత ఎలాంటి ఉదాసీనతకు తావు ఇవ్వకుండా ఆడితే విండీస్పై పైచేయి ఖాయం. ఈ నేపథ్యంలో రెండు మ్యాచ్ల సిరీస్కు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్: శుబ్మన్ గిల్ నాయకత్వంలో భారత జట్టు సొంతగడ్డపై తొలి టెస్టు సిరీస్ ఆడనుంది. వెస్టిండీస్తో జరిగే రెండు టెస్టుల సిరీస్లో భాగంగా నేటి నుంచి మొదటి టెస్టు జరుగుతుంది. సీనియర్లు కోహ్లి, రోహిత్, అశ్విన్ల రిటైర్మెంట్ తర్వాత టీమిండియా స్వదేశంలో ఆడనున్న మొదటి టెస్టు ఇదే కానుంది. ఇంగ్లండ్ గడ్డపై అద్భుత ఆటతో సిరీస్ను సమం చేసుకున్న టీమిండియా పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఆసీస్తో ఆడిన గత టెస్టులో ‘27 ఆలౌట్’ తర్వాత విండీస్ ఇదే మ్యాచ్లో బరిలోకి దిగుతోంది. బలాబలాల్లో ఎంతో అంతరం కనిపిస్తుండగా, కరీబియన్ టీమ్ ఇక్కడ ఏమాత్రం పోటీనిస్తుందనేది సందేహమే. అదనపు పేసర్తో... సాధారణంగా స్వదేశంలో నల్లరేగడి మట్టితో సిద్ధం చేసే స్పిన్ అనుకూల పిచ్లపై భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి టీమ్ మేనేజ్మెంట్ ఉద్దేశపూర్వకంగా పేస్కు అనుకూలించే ‘ఎర్ర మట్టి’ పిచ్పై తమ సత్తాను పరీక్షించుకోవాలని భావిస్తోంది. దీని ప్రకారమే తుది జట్టు ఉండవచ్చు. ఇద్దరు ప్రధాన పేసర్లుగా బుమ్రా, సిరాజ్ ఖాయం. స్పిన్ ఆల్రౌండర్లుగా జడేజా, సుందర్ ఖాయం. అయితే మూడో స్పిన్నర్ అయిన కుల్దీప్, మరో పేసర్ మధ్య పోటీ ఉండవచ్చు. పిచ్ను బట్టి చూస్తే ప్రసిధ్ వైపే మొగ్గు కనిపిస్తోంది. అయితే ఆరో స్థానంలో ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ రెడ్డిని ఆడిస్తే అప్పుడు కుల్దీప్కు అవకాశం ఉంటుంది. నితీశ్ జట్టులోకి వస్తే బ్యాటర్ పడిక్కల్ను కూడా పక్కన పెట్టాల్సి రావచ్చు. ఇంగ్లండ్లో పెద్దగా ఆకట్టుకోకపోయినా నితీశ్పై సెలక్టర్లు నమ్మకం ఉంచారు. బ్యాటింగ్పరంగా యశస్వి, గిల్, రాహుల్ చక్కటి ఫామ్లో ఉండగా సుదర్శన్ కూడా ఇటీవల ఆ్రస్టేలియా ‘ఎ’పై సత్తా చాటాడు. అందరూ అంతంతే! ‘మా గెలుపుపై ఎవరికీ అంచనాలు లేకపోవడమే మా బలం. ఓటమి భయం లేకుండా స్వేచ్ఛగా ఆడతాం. కివీస్ను ఆదర్శంగా తీసుకుంటాం’ అని వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ ఛేజ్ చెబుతున్నాడు. కానీ భారత్లో టెస్టులు అంటే ఎంతో కష్టమో విండీస్కు బాగా తెలుసు. 1994లో భారత్ను ఓడించిన తర్వాత ఇక్కడ ఆడిన 10 టెస్టుల్లో విండీస్ 8 ఓడి, 2 ‘డ్రా’ చేసుకుంది. 2018లో ఆడిన సిరీస్లో 2 టెస్టులూ మూడు రోజులకే ముగిశాయి! పట్టుదలగా క్రీజ్లో నిలబడి జట్టును నడిపించగల బ్యాటర్ ఎవరూ కనిపించడం లేదు. హోప్, ఛేజ్, వారికన్లకు మాత్రమే ఇక్కడ ఆడిన అనుభవం ఉండగా, జేడెన్ సీల్స్ ఇటీవల ఆకట్టుకుంటున్నాడు. ప్రధాన పేసర్లు అల్జారీ జోసెఫ్, షామర్ జోసెఫ్ గాయంతో సిరీస్కు దూరం కావడం పెద్ద లోటు. విండీస్ కూడా ముగ్గురు పేసర్లతో ఆడనుంది. పిచ్, వాతావరణం పిచ్పై పచ్చికను ఎక్కువగా ఉంచారు. పేస్ బౌలింగ్కు అనుకూలం కాగా బ్యాటర్లు పట్టుదల కనబర్చాల్సి ఉంది. నగరంలో అనూహ్యంగా కురుస్తున్న వర్షాలు మ్యాచ్కు స్వల్పంగా అంతరాయం కలిగించవచ్చు.తుది జట్లు (అంచనా) భారత్: గిల్ (కెప్టెన్ ), జైస్వాల్, రాహుల్, సుదర్శన్, జురేల్, నితీశ్ రెడ్డి/పడిక్కల్, జడేజా, సుందర్, బుమ్రా, సిరాజ్, కుల్దీప్/ప్రసిధ్.వెస్టిండీస్: ఛేజ్ (కెప్టెన్ ), చందర్పాల్, కెవ్లాన్ అండర్సన్, అతనజె, బ్రెండన్ కింగ్, షై హోప్, గ్రీవ్స్, పైర్, వారికన్, ఫిలిప్ అండర్సన్, సీల్స్. -
ఆసీస్పై విధ్వంసకర శతకం బాదిన ప్రియాంశ్ ఆర్య.. తొలి మ్యాచ్లోనే..!
కాన్పూర్ వేదికగా ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక వన్డేలో (India A vs Australia A) భారత-ఏ జట్టు ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (Priyansh Arya) చెలరేగిపోయాడు. 82 బంతుల్లో మెరుపు శతకం బాదాడు. మొత్తంగా 84 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆర్య మరో ఓపెనర్, పంజాబ్ కింగ్స్ సహచరుడు ప్రభ్సిమ్రన్ సింగ్తో (53 బంతుల్లో 56; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) కలిసి తొలి వికెట్కు 123 బంతుల్లో 135 పరుగులు జోడించాడు.ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 31.4 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 214/2గా ఉంది. ఆర్య, ప్రభ్సిమ్రన్ ఔట్ కాగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36), రియాన్ పరాగ్ (13) క్రీజ్లో ఉన్నారు. వాస్తవానికి ఈ మ్యాచ్ నిన్న జరగాల్సి ఉండింది. అయితే వర్షం కారణంగా ఇవాల్టికి వాయిదా పడింది.టీమిండియా దిశగా అడుగులు..ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో మెరుపు శతకాలు బాది, ఐపీఎల్ ఛాన్స్ దక్కించుకున్న ప్రియాంశ్.. తన తొలి ఐపీఎల్ ఎడిషన్లోనే (2025) చెలరేగిపోయాడు. గత సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున అరంగేట్రం చేసి సంచలన ఇన్నింగ్స్లు ఆడాడు. ఈ సీజన్లో ప్రియాంశ్ సీఎస్కేపై 42 బంతుల్లోనే సెంచరీ చేసి ప్రకంపనలు సృష్టించాడు. గత సీజన్లో ప్రియాంశ్ మొత్తంగా 475 పరుగులు సాధించి, ఓ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. ఆసీస్-ఏపై సెంచరీతో ప్రియాంశ్ అడుగులు టీమిండియావైపు పడుతున్నాయనడంలో సందేహం లేదు.తొలి మ్యాచ్లోనే..!ప్రియాంశ్ భారత్-ఏ తరఫున ఆడటం ఇదే తొలిసారి. ఆసీస్-ఏతో సిరీస్కు అతను కేవలం తొలి మ్యాచ్కు మాత్రమే ఎంపికయ్యాడు. ఈ సిరీస్లో జరుగబోయే మిగతా రెండు వన్డేలకు ప్రియాంశ్ స్థానాన్ని అభిషేక్ శర్మ భర్తీ చేస్తాడు.కాగా, ఆస్ట్రేలియా-ఏ జట్టు రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్లు, మూడు అనధికారిక వన్డేల కోసం భారత్లో పర్యటిస్తుంది. టెస్ట్ సిరీస్ను భారత్ 1-0తో చేజిక్కించుకోగా.. ప్రస్తుతం వన్డే సిరీస్ నడుస్తుంది. మిగతా రెండు వన్డేలు అక్టోబర్ 3, 5 తేదీల్లో కాన్పూర్ వేదికగా జరుగనున్నాయి. చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. సరికొత్త ప్రపంచ రికార్డు -
అయ్యయ్యో! పుండు మీద కారం జల్లినట్లుగా..
ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించగా.. బీసీసీఐ(BCCI) వెంటనే రూ.21 కోట్లు బోనస్గా ప్రకటించి ఆటగాళ్లను ఘనంగా సత్కరించింది. ఇది మన క్రీడాకారుల శ్రమకు గౌరవం, ప్రోత్సాహం, దేశం తరఫున పోరాడినందుకు ఇచ్చే గుర్తింపు అని భారత క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. సాధారణంగా రన్నరప్గా నిలిచిన జట్ల ఆటగాళ్లకూ ఆ దేశాలు ఎంతో కొంత ప్రొత్సాహాకం అందిస్తుంటాయి. మరి రన్నరప్గా నిలిచిన పాక్ ఆటగాళ్ల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?..ఆసియా కప్లో రన్నరప్గా నిలిచిన పాకిస్తాన్ జట్టుకు ఆసియా క్రికెట్ కంట్రోల్ బోర్డు(75,000 డాలర్ల) తరఫున రూ.66.5 లక్షల ప్రైజ్మనీ లభించింది. అంతేగానీ పాక్ క్రికెట్ బోర్డు నుంచి ఇప్పటిదాకా ఎలాంటి నజరానా ప్రకటించలేదు. దీంతో ఏదైనా నజరానా ప్రకటిస్తారేమోనని ఆటగాళ్లు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో.. అలాంటి ఆశలేం వద్దంటూ ఓ వీడియో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అది 2009 టీ20 వరల్డ్ కప్ విజేతగా పాక్ నిలిచిన సమయం. ఆ సమయంలో పాక్ ఆటగాళ్లకు నజరానాను ప్రకటించింది అప్పటి యూసఫ్ రజా గిలానీ ప్రభుత్వం. అయితే ప్రధాని స్వయంగా జారీ చేసిన ఆ 25 లక్షల చెక్కు బౌన్స్ అయ్యిందట. దీంతో అప్పటి పీసీబీ చైర్మన్ను ఆటగాళ్లు ఆశ్రయిస్తే.. అది ప్రభుత్వం ఇస్తామన్న నజరానా అని, దాంతో మాకేం సంబంధం అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారట. చివరికి ICC ఇచ్చిన ప్రైజ్ మనీ తప్ప ఆటగాళ్లకు ఇంకేమీ అందలేదు... ప్రభుత్వం ఇచ్చే చెక్కు కూడా బౌన్స్ అవుతుందా? అని పాక్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్(Syeed Ajmal Comments Viral) చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు తెర మీదకు వచ్చాయి. రెండేళ్ల కిందట నదీర్ అలీ అనే యూట్యూబర్ పాడ్కాస్ట్లో అజ్మల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు.. పాక్ జట్టులో వ్యక్తిగత విజయాలకూ తగిన గుర్తింపు ఉండదని అన్నాడాయన. 2012, 2013లో ICC టీమ్ ఆఫ్ ది ఇయర్లో తనకి చోటు దక్కినా.. పీబీసీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రొత్సాహాకం అందలేని గుర్తు చేసుకుని వాపోయాడు. దీనితో పాక్ ఆటగాళ్ల దుస్థితి ఇలా ఉందంటూ.. సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది.అదే సమయంలో.. మరోవైపు ఏసీసీ అద్యక్షుడైన పీబీసీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ(Mohsin Naqvi) ఆటగాళ్ల నజరానా గురించి ఆలోచించే స్థితిలో ఏమాత్రం లేడు. ఆయన పరిస్థితి కూడా ‘చంద్రుడి కోసం ఎదురుచూసే చకోర పక్షి’ పరిస్థితిని తలపిస్తోంది. 2025 ఆసియా కప్ విజేతగా నిలిచిన టీమిండియా జట్టు.. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది. దీంతో ఆయన ట్రోఫీ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఆయన ట్రోఫీతో పారిపోయాడంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలాయి. ఈ తరుణంలో.. తాజాగా ఏసీసీ మీటింగ్లో ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగతంగానైనా వచ్చి ట్రోఫీ తీసుకెళ్లాలని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అయితే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే అది జరిగేలా కనిపించడం లేదు. ఎందుకంటే బీసీసీఐ ఇప్పటికే నఖ్వీ ట్రోఫీ తస్కరించిన వ్యవహారంపై అసంతృప్తితో ఉంది. ఈ క్రమంలో ఐసీసీకి ఫిర్యాదు చేయాలనుకుంటోంది కూడా. మరోవైపు.. మా టీమ్ మేట్స్, మా సపోర్ట్ స్టాఫ్.. వీళ్లే నా నిజమైన ట్రోఫీలు” అంటూ సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. ఏరకంగా చూసుకున్నా ట్రోఫీ కోసం నఖ్వీ ఎదురు చూస్తూ ఉండిపోవాల్సిందేనంటూ సెటైర్లు పేలుతున్నాయి. ఇదీ చదవండి: ఆ పాక్ ప్లేయర్కు థ్యాంక్స్.. అతని వల్లే గెలిచాం! -
IND VS AUS: విధ్వంసకర శతకం.. చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మరోసారి చెలరేగిపోయాడు. గత కొంతకాలంగా ఫార్మాట్లకతీతంగా పేట్రేగిపోగుతున్న ఈ కుర్ర డైనమైట్.. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరుగుతున్న తొలి యూత్ టెస్ట్లో (తొలి ఇన్నింగ్స్) మరోసారి రెచ్చిపోయాడు. కేవలం 78 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో విధ్వంసకర శతకం నమోదు చేశాడు.ఈ క్రమంలో ఓ ఆల్టైమ్ రికార్డు సెట్ చేశాడు. భారత్ తరఫున యూత్ టెస్ట్ల్లో అత్యధిక సిక్సర్లు (14) బాదిన ఆటగాడిగా తన కెప్టెన్ ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) (9) రికార్డు బ్రేక్ చేసి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా 86 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆసీస్ గడ్డపై ఫాస్టెస్ట్ సెంచరీ.. మెక్కల్లమ్ రికార్డు సమంఈ మ్యాచ్లో వైభవ్ చేసిన 78 బంతుల శతకం ఆస్ట్రేలియా గడ్డపై యూత్ టెస్ట్ల్లో అత్యంత వేగవంతమైంది. ఈ సెంచరీతో వైభవ్ మరో ఆల్టైమ్ రికార్డును కూడా సమం చేశాడు. న్యూజిలాండ్ దిగ్గజం బ్రెండన్ మెక్కల్లమ్ తర్వాత యూత్ టెస్ట్ల్లో రెండు శతకాలను 100లోపు బంతుల్లో సాధించిన ఆటగాడిగా నిలిచాడు. వైభవ్ 2024లో చెన్నైలో ఇదే ఆస్ట్రేలియా అండర్-19 జట్టుపై 58 బంతుల్లో శతక్కొట్టాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియా పర్యటనలో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన యువ భారత్ (అండర్ 19 జట్టు).. రెండు మ్యాచ్ల యూత్ టెస్ట్ సిరీస్లోనూ సత్తా చాటుతుంది. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్లో తొలుత భారత బౌలర్లు చెలరేగిపోయారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ను 243 పరుగులకే ఆలౌటై్ చేశారు.పేసర్ దీపేశ్ దేవేంద్రన్ (16.2-6-45-5) ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆసీస్ పతనాన్ని శాశించాడు. మరో పేసర్ కిషన్ కుమార్ (16-4-48-3) కూడా సత్తా చాటాడు. అన్మోల్జీత్ సింగ్, ఖిలన్ పటేల్ తలో వికెట్ తీశారు. ఆసీస్ ఇన్నింగ్స్లో వన్ డౌన్ బ్యాటర్ స్వీవెన్ హోగన్ (246 బంతుల్లో 92) ఒక్కడే రాణించాడు. ఆసీస్ ఇన్నింగ్స్ ముగియగానే తొలి ఆట ముగిసింది.రెండో రోజు తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన భారత్కు వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. కెప్టెన్ ఆయుశ్ మాత్రే (21) కలిసి తొలి బంతి నుంచే ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడి ప్రారంభించాడు. ఈ క్రమంలోనే సుడిగాలి శతకం బాదాడు. వైభవ్ ఔటయ్యాక వేదాంత్ త్రివేది ఆసీస్ బౌలర్ల భరతం పట్టడం ప్రారంభించాడు. ఈ క్రమంలో వేదాంత్ కూడా సెంచరీ పూర్తి చేశాడు.రెండో రోజు రెండో సెషన్ సమయానికి భారత్ 53 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. వేదాంత్తో (106) పాటు రాహుల్ కుమార్ (9) క్రీజ్లో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ను దాటేసి 55 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. భారత ఇన్నింగ్స్లో విహాన్ మల్హోత్రా 6, అభిగ్యాన్ కుందు 26 పరుగులు చేశారు.చదవండి: చెలరేగిన భారత బౌలర్లు.. స్వల్ప స్కోర్కే కుప్పకూలిన ఆస్ట్రేలియా -
చెలరేగిన భారత బౌలర్లు.. స్వల్ప స్కోర్కే కుప్పకూలిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా పర్యటనలో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన యువ భారత్ (అండర్ 19 జట్టు).. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇవాల్టి నుంచి (సెప్టెంబర్ 30) మొదలైన తొలి టెస్ట్లోనూ సత్తా చాటింది. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా యువ పేసర్ దీపేశ్ దేవేంద్రన్ (16.2-6-45-5) ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆసీస్ ఇన్నింగ్స్ పతనాన్ని శాశించాడు.మరో పేసర్ కిషన్ కుమార్ (16-4-48-3) కూడా సత్తా చాటాడు. అన్మోల్జీత్ సింగ్, ఖిలన్ పటేల్ తలో వికెట్ తీశారు. ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 91.2 ఓవర్లలో 243 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్లో వన్ డౌన్ బ్యాటర్ స్వీవెన్ హోగన్ (246 బంతుల్లో 92) ఒక్కడే రాణించాడు. మిగతా ఆటగాళ్లలో జెడ్ హోలిక్ (38) మాత్రమే 20కి పైగా స్కోర్ చేశాడు. అలెక్స్ లీ యంగ్ (18), కెప్టెన్ విల్ మలాజ్చుక్ (21), సైమన్ బడ్జ్ (15) జాన్ జేమ్స్ (13), హేడన్ షిల్లర్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ ఇన్నింగ్స్ ముగియగానే తొలి ఆట ముగిసింది.రేపు భారత ఇన్నింగ్స్ మొదలవుతుంది. ఆసీస్తో పోలిస్తే భారత బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా ఉంది. చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీతో అప్ కమింగ్ స్టార్ ఆయుశ్ మాత్రే ఇన్నింగ్స్ను ప్రారంభిస్తారు. ఆతర్వాత విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, రాహుల్ కుమార్, అభిగ్యాన్ కుందు లాంటి స్టార్ బ్యాటర్లు ఉన్నారు. కాగా, భారత అండర్-19 జట్టు ఈ సిరీస్కు ముందు ఇంగ్లండ్ను కూడా వారి సొంత ఇలాకాలో మట్టికరిపించింది. ఇటీవలికాలంలో యువ భారత్ విజయాల్లో వైభవ్ సూర్యవంశీ ప్రధానపాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఆసీస్తో జరిగిన వన్డే సిరీస్లోనై వైభవ్ పర్వాలేదనిపించాడు.చదవండి: హైదరాబాద్లో సందడి చేసిన ఆసియా కప్ ఫైనల్ హీరో -
హైదరాబాద్లో సందడి చేసిన ఆసియా కప్ ఫైనల్ హీరో
సెప్టెంబర్ 28న పాకిస్తాన్తో జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్లో (Asia Cup 2025) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి భారత్ను ఒంటిచేత్తో గెలిపించిన హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ (Tilak Varma).. ఇవాళ నగరంలో సందడి చేశాడు. తాను చిన్నతనంలో శిక్షణ పొందిన లేగాలా క్రికెట్ అకాడమీని (Legala Cricket Academy) సందర్శించాడు. తిలక్ను చూసేందుకు క్రికెట్ అభిమానులు ఎగబడ్డారు. తిలక్కు, అతని కోచ్ సలామ్ బయాష్కు అకాడమీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా తిలక్ మాట్లాడుతూ.. ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా గెలవడం చాలా సంతృప్తినిచ్చింది. ఆ మ్యాచ్లో టీమిండియాను గెలిపించడమే టార్గెట్గా పెట్టుకొని ఆడాను. ఆ సమయంలో మా కళ్ల ముందు దేశమే కనిపించింది. నేను ఆడిన ఇన్నింగ్స్లలో ఇదే అత్యుత్తమమైంది. ఫైనల్లో పాక్ ఆటగాళ్ల స్టెడ్జింగ్ మాపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. విరాట్ కోహ్లి నాకు ఎంతో స్పూర్తినిచ్చాడు. విరాట్ కోహ్లితో నన్ను పోల్చడం గర్వంగా ఉందని అన్నాడు.కాగా, 23 ఏళ్ల తిలక్కు లెగాలా క్రికెట్ అకాడమీనే పునాది. లింగంపల్లి ప్రాంతంలో ఉన్న ఈ అకాడమీ తిలక్కు క్రికెట్లో తొలి పాఠాలు నేర్పింది. కోచ్ సలాం బయాష్ మార్గదర్శకత్వంలో తిలక్ 11 ఏళ్ల వయసులోనే ప్రతిభను చాటాడు. తిలక్ ఇంటి నుంచి అకాడమీకి రోజూ 40 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వచ్చేది.కోచ్ సలాం బయాష్ తిలక్ను స్వయంగా తన వాహనంలో తీసుకొచ్చి, తిరిగి ఇంటికి చేర్చేవాడు. 2020లో తిలక్ అండర్-19 వరల్డ్కప్కు ఎంపిక కావడంలో అకాడమీ పాత్ర చాలా కీలకం. తిలక్ టీమిండియాకు ఎంపికయ్యే వరకు వారానికి నాలుగు రోజుల పాటు అకాడమీకి వెళ్లేవాడు. ఆసియా కప్ హీరోయిక్స్ తర్వాత తిలక్ హైదారాబాద్ యువతకు స్పూర్తిగా మారాడు. చదవండి: టీమిండియాకు బ్యాడ్ న్యూస్ -
టీమిండియాకు బ్యాడ్ న్యూస్
ఆసియా కప్ 2025 గెలుపు జోష్లో ఉన్న టీమిండియాకు ఓ చేదు వార్త అందింది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) త్వరలో ఆస్ట్రేలియాతో (India vs Australia) జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్కు దూరం కానున్నాడని తెలుస్తుంది. హార్దిక్ ఆసియా కప్ ఫైనల్కు ముందు గాయపడ్డాడు. దీంతో అతను పాక్తో జరిగిన ఫైనల్లోనూ ఆడలేదు. హార్దిక్కు ఎడమ తొడ భాగంలో గాయమైనట్లు సమాచారం. వైద్యులు అతనికి నాలుగు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తుంది.డాక్టర్లు చెప్పినట్లు హార్దిక్ నాలుగు వారాల్లో కోలుకుంటే ఆసీస్తో టీ20 సిరీస్కు ఎంపికయ్యే అవకాశం ఉంది. టీమిండియా 3 వన్డేలు, 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత వన్డేలు జరుగనున్నాయి. ఆతర్వాత టీ20 సిరీస్ జరుగుతుంది. హార్దిక్ వన్డేలకు మిస్ అయినా టీ20 సిరీస్కు అందుబాటులోకి రావచ్చు.కాగా, సెప్టెంబర్ 28న జరిగిన ఫైనల్లో టీమిండియా పాక్పై విజయం సాధించి, తొమ్మిదోసారి ఆసియా ఛాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీ తర్వాత కేవలం మూడో రోజుల గ్యాప్లో టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లోని తొలి టెస్ట్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా అక్టోబర్ 2 నుంచి ప్రారంభమవుతుంది. అనంతరం అక్టోబర్ 10 నుంచి 14 వరకు న్యూఢిల్లీలో రెండో టెస్ట్ జరుగుతుంది.ఈ సిరీస్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. జియో హాట్స్టార్ యాప్లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.విండీస్ సిరీస్కు భారత జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్. జగదీశన్ (వికెట్కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్వెస్టిండీస్: రోస్టన్ ఛేజ్ (కెప్టెన్), కెవ్లాన్ ఆండర్సన్, తేజ్నరైన్ చంద్రపాల్, జాన్ క్యాంప్బెల్, జోహన్ లేన్, అలిక్ అథానాజ్, బ్రాండన్ కింగ్, జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్, జోమెల్ వారికన్, ఆండర్సన్ ఫిలిప్, జెడియా బ్లేడ్స్, జేడన్ సీల్స్, ఖారీ పియెర్చదవండి: కొనసాగుతున్న ఆసియా కప్ హైడ్రామా.. ట్రోఫీ తిరిగి ఇచ్చేందుకు షరతులు పెట్టిన నఖ్వీ -
రేపటి నుంచి క్రికెట్ మహా సంగ్రామం ప్రారంభం
రేపటి నుంచి (సెప్టెంబర్ 30) మహిళల క్రికెట్ మహా సంగ్రామం (ICC Women's World Cup-2025) ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి భారత్ (India), శ్రీలంక (Sri Lanka) సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. నవంబర్ 2 వరకు జరిగే ఈ క్రికెట్ పండుగలో మొత్తం 8 జట్లు (భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక) పాల్గొంటున్నాయి. 5 వేదికలపై 34 రోజుల పాటు 31 మ్యాచ్లు జరుగనున్నాయి. మహిళల వన్డే వరల్డ్కప్లో ఇది 13వ ఎడిషన్.మ్యాచ్లు ఎక్కడ జరుగుతాయి..?భారత్లో: గౌహతి, ఇండోర్, విశాఖపట్నం, నవి ముంబై శ్రీలంకలో: కొలంబో కొలంబోలో మొత్తం 10 మ్యాచ్లు జరుగుతాయి. పాకిస్తాన్ జట్టు ఆడే అన్ని మ్యాచ్లు ఇక్కడే షెడ్యూల్ అయ్యాయి.మ్యాచ్ టైమింగ్స్..ఒక్క మ్యాచ్ మినహా అన్ని మ్యాచ్లు భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 26న న్యూజిలాండ్ vs ఇంగ్లండ్ మ్యాచ్ మాత్రం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.జట్ల కెప్టెన్లు.. భారత్- హర్మన్ప్రీత్ కౌర్ఆస్ట్రేలియా- అలిస్సా హీలీ ఇంగ్లాండ్- నాట్ స్కివర్-బ్రంట్న్యూజిలాండ్- సోఫీ డివైన్పాకిస్తాన్- ఫాతిమా సనాదక్షిణాఫ్రికా- లారా వోల్వార్డ్ట్బంగ్లాదేశ్- నిగార్ సుల్తానా జోటి శ్రీలంక- చమారి అటపత్తుభారత మ్యాచ్లు..సెప్టెంబర్ 30: భారత్ vs శ్రీలంక – గౌహతి అక్టోబర్ 5: భారత్ vs పాకిస్తాన్ – కొలంబో అక్టోబర్ 12: భారత్ vs ఆస్ట్రేలియా – విశాఖపట్నం అక్టోబర్ 19: భారత్ vs ఇంగ్లాండ్ – ఇండోర్ అక్టోబర్ 23: భారత్ vs న్యూజిలాండ్ – నవి ముంబై అక్టోబర్ 26: భారత్ vs బంగ్లాదేశ్ – నవి ముంబై అక్టోబర్ 29, 30: సెమీఫైనల్స్ నవంబర్ 2: ఫైనల్భారత జట్టు..హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధన (వైస్ కెప్టెన్), జెమిమా, రిచా ఘోష్, దీప్తి శర్మ, రేణుకా సింగ్, స్నేహ్ రాణా, హర్లీన్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, ఉమా చేత్రి, అమన్జోత్, కాంతి గౌడ్, శ్రీ చరణి, ప్రతికా రావల్ రిజర్వ్స్: తేజల్ హసాబ్నిస్, ప్రీమా రావత్, ప్రియా మిశ్రా, మిన్ను మణి, సయాలి సత్ఘారేప్రసార వివరాలు.. మహిళల వన్డే వరల్డ్కప్ 2025ను భారత్లో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. JioHotstar యాప్ మరియు వెబ్సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ కూడా అందుబాటులో ఉంటుంది.చదవండి: టీమిండియాకు కొత్త టాస్క్.. మరో మూడు రోజుల్లో ప్రారంభం -
టీమిండియాకు కొత్త టాస్క్.. మరో మూడు రోజుల్లో ప్రారంభం
ఆసియా కప్ 2025లో (Asia cup 2025) భారత్ (Team India) విజేతగా నిలిచింది. నిన్న (సెప్టెంబర్ 28) జరిగిన ఫైనల్లో పాక్ను ఓడించి 9వ సారి ఆసియా ఛాంపియన్గా అవతరించింది. టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ దాదాపు 20 రోజుల పాటు సాగింది. భారత్ ఈ టోర్నీలో ఓటమెరుగని జట్టుగా నిలిచింది.గ్రూప్ దశలో యూఏఈ, పాకిస్తాన్, ఒమన్పై విజయాలు సాధించిన టీమిండియా.. సూపర్-4లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకపై గెలుపొందింది. ఫైనల్లో మరోసారి పాక్పై గెలిచి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ టోర్నీలో భారత్కు శ్రీలంక ఒక్కటే కాస్త టఫ్ ఫైట్ ఇచ్చింది. పాక్తో తలపడిన మూడు సందర్భాల్లో టీమిండియాదే పైచేయిగా నిలిచింది.ఆసియా కప్ అనంతరం టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్తో (India vs West Indies) రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఆసియా కప్ తర్వాత కేవలం 3 రోజుల గ్యాప్లోనే భారత్, వెస్టిండీస్తో తలపడనుంది. అక్టోబర్ 2 నుంచి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి టెస్ట్ జరుగనుంది. అనంతరం అక్టోబర్ 10 నుంచి 14 వరకు న్యూఢిల్లీలో రెండో టెస్ట్ జరుగుతుంది.ఈ సిరీస్ కోసం ఇరు జట్లను ఇదివరకే ప్రకటించారు. భారత జట్టుకు శుభ్మన్ గిల్ కెప్టెన్గా కొనసాగనుండగా.. విండీస్కు రోస్టన్ ఛేజ్ సారథ్యం వహిస్తాడు. ఈ సిరీస్కు ఇంగ్లండ్లో గాయపడ్డ భారత రెగ్యులర్ వికెట్కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ దూరంగా ఉన్నాడు. అతని స్థానంలో ధృవ్ జురెల్, ఎన్ జగదీసన్ వికెట్ కీపర్ బ్యాటర్లుగా ఎంపికయ్యారు.కొత్తగా దేవ్దత్ పడిక్కల్ జట్టులోకి వచ్చాడు. కరుణ్ నాయర్ స్థానాన్ని అతను భర్తీ చేయనున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్ సందర్భంగా గాయపడిన నితీశ్ కుమార్ రెడ్డి ఈ సిరీస్తో రీఎంట్రీ ఇచ్చాడు. విండీస్ జట్టులో ఎక్కువ శాతం కొత్త ముఖాలు ఉన్నాయి. బ్యాటింగ్లో షాయ్ హోప్, బౌలింగ్లో అల్జరీ జోసఫ్ మాత్రమే కాస్త అనుభవజ్ఞులు.ఈ సిరీస్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. జియో హాట్స్టార్ యాప్లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.భారత జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్. జగదీశన్ (వికెట్కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్వెస్టిండీస్: రోస్టన్ ఛేజ్ (కెప్టెన్), కెవ్లాన్ ఆండర్సన్, తేజ్నరైన్ చంద్రపాల్, జాన్ క్యాంప్బెల్, జోహన్ లేన్, అలిక్ అథానాజ్, బ్రాండన్ కింగ్, జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్, జోమెల్ వారికన్, ఆండర్సన్ ఫిలిప్, అల్జరీ జోసఫ్, జేడన్ సీల్స్, ఖారీ పియెర్చదవండి: Asia Cup 2025: సూర్యకుమార్ యాదవ్ చేశాడని పాకిస్తాన్ కెప్టెన్ కూడా..! -
టీమిండియాకు వైఎస్ జగన్ అభినందనలు
-
శభాష్ తిలక్ వర్మ
-
తిలక్ ఆట అద్భుతం.. భారత్ విజయంపై వైఎస్ జగన్ ప్రశంసలు
సాక్షి, తాడేపల్లి: ఆసియా కప్ ఫైనల్ (Aisa Cup Final 2025)లో అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) అభినందనలు తెలిపారు. పాకిస్తాన్పై విజయం దేశం మొత్తాన్ని గర్వపడేలా చేసిందని ప్రశంసలు కురిపించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్పై అద్వితీయ విజయం సాధించిన మన క్రికెట్ జట్టుకు హృదయపూర్వక అభినందనలు. మీ అసాధారణ నైపుణ్యం, అంకితభావం.. జట్టు కృషి మొత్తం దేశాన్ని గర్వపడేలా చేశాయి. ఫైనల్లో కీలక ప్రదర్శన, సీరిస్లో అద్భుత ప్రతిభ కనబరించిన తెలుగు స్టార్ ప్లేయర్ తిలక్ వర్మకు(Tilak Varma) ప్రత్యేక అభినందనలు. వర్మ ప్రదర్శన నిజంగా ప్రశంసనీయం’ అని కొనియాడారు. Hearty congratulations to our cricket team on their outstanding victory in the Asia Cup 2025 final against Pakistan! Your exceptional skill, dedication, and teamwork have made the entire nation proud.A special shoutout to our very own Telugu star, @TilakV9, for his crucial… pic.twitter.com/GWexoLzkSt— YS Jagan Mohan Reddy (@ysjagan) September 29, 2025 -
పాకిస్తాన్పై భారత్ విజయం.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..
ఢిల్లీ: ఆసియా కప్ ఫైనల్ (Asia Cup Final 2025)లో దాయాది పాకిస్తాన్ను భారత్ (Team India) మరోసారి మట్టికరిపించింది. ఫైనల్ అద్భుతంగా ఆడి.. టైటిల్ను ఎగరేసుకుపోయింది. తొమ్మిదోసారి ఆసియా కప్ను సొంతం చేసుకుంది. భారత్ విజయంపై ప్రధాని మోదీ స్పందించారు. భారత క్రికెటర్లపై ప్రశంసలు కురిపించారు.ఆసియా కప్లో భారత్ విజయంపై ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. యుద్ధభూమిలోనూ, మైదానంలోనూ ఒక్కటే ఫలితం అని పేర్కొన్నారు. మైదానంలోనూ ‘ఆపరేషన్ సిందూర్’. ఎక్కడైనా ఫలితం ఒక్కటే. భారత్ మళ్లీ గెలిచింది. భారత క్రికెటర్లకు అభినందనలు అని పోస్టు చేశారు.#OperationSindoor on the games field. Outcome is the same - India wins!Congrats to our cricketers.— Narendra Modi (@narendramodi) September 28, 2025ఇక, పాకిస్తాన్తో జరిగిన ఆసియా కప్(India vs Pakistan) ఫైనల్ ఉత్కంఠ పోరులో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థిపై విజయం సాధించడంతో భారతీయులు సంబురాలు చేసుకున్నారు. భారత జట్టుపై ప్రశంసలు కురిపించారు. భారత క్రికెటర్ తిలక్ వర్మ.. ‘ఆపరేషన్ తిలక్’తో దాయాదిని చిత్తు చేశాడని కామెంట్స్ చేస్తున్నారు. After Operation Sindoor... it was Operation Tilak 🇮🇳Battlefield or cricket field - India’s victory over Pakistan comes every time... pic.twitter.com/zGu4vkZMcN— PoliticsSolitics (@IamPolSol) September 28, 2025 -
ఆపరేషన్ ‘తిలక్’.. ఫైనల్లో పాక్ను మట్టికరిపించిన భారత్ (ఫొటోలు)
-
ఫైనల్ లో పాక్ ను చీల్చి చెండాడిన భారత్
-
‘ఠాకూర్’ జితాదియా...
సాక్షి క్రీడా విభాగం : నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ... భారత క్రికెట్లో రాబోయే కొన్నేళ్లు ఈ పేరును ఎవరూ మర్చిపోలేరు. ఆసియా కప్ (Asia Cup 2025) ఫైనల్లో అతని ఇన్నింగ్స్పై అభిమానుల్లో సుదీర్ఘ కాలం చర్చ సాగటం ఖాయం. టోర్నీ ఆసాంతం అసాధారణ ప్రదర్శనతో జట్టుకు వరుస విజయాలు అందించిన అభిషేక్ శర్మ ఆరంభంలోనే వెనుదిరిగాడు. సూర్య, గిల్ విఫలమయ్యారు. స్కోరు 20/3. ఇలాంటప్పుడు జట్టును గెలిపించేదెవరు అని భారత అభిమానుల్లో ఒక రకమైన ఆందోళన. ఈ స్థితిలో నేనున్నానంటూ తిలక్ నిలబడ్డాడు. తీవ్రమైన ఒత్తిడి, మరో వికెట్ పడితే మ్యాచ్ చేజారిపోయే ప్రమాదం ఉంది. క్రీజ్లో నిలబడి జాగ్రత్తగా ఆడాలా, లేక భారీ షాట్లకు పోవాలా అనే సందేహాల నడుమ అతని ఇన్నింగ్స్ ప్రారంభమైంది. కానీ తిలక్ ఏమాత్రం తడబడలేదు. సామ్సన్ వెనుదిరిగినా, జాగ్రత్తగా ఆడుతూ అవకాశం లభించగానే చెలరేగిపోయాడు. ఫహీమ్ ఓవర్లోనే వరుసగా ఫోర్, సిక్స్తో తన ఉద్దేశాన్ని చాటిన అతను, అబ్రార్ ఓవర్లో సిక్స్తో అందరిలో గెలుపు నమ్మకాన్ని పెంచాడు. రవూఫ్ బౌలింగ్లో భారీ సిక్స్తో స్కోరును 100 దాటించడంతో మ్యాచ్ నియంత్రణలోకి వచ్చేసింది. మరోవైపు దూబే దూకుడుగా ఆడిన సమయంలో తాను కాస్త సంయమనం పాటించాడు. 8 పరుగులు చేయాల్సిన దశలో డీప్ స్క్వేర్ లెగ్ వైపు కొట్టిన భారీ సిక్సర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ తర్వాత గెలుపు సంబరాల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. దాదాపు పది నెలల క్రితం.. దక్షిణాఫ్రికా గడ్డపై తిలక్ వర్మ (Tilak Varma) వరుసగా రెండు టి20ల్లో సెంచరీలతో చెలరేగాడు. ఆ తర్వాత భారత్కు రాగానే ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా మరో శతకం బాది... టి20 క్రికెట్లో వరుసగా మూడు సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత చెన్నైలో ఇంగ్లండ్పై అజేయంగా చేసిన 72 పరుగులు అతని సత్తాను మరోసారి చూపించాయి. అయితే కొద్ది రోజులకే ఐపీఎల్లో అతనికి అవమానకర స్థితి ఎదురైంది. మూడు సీజన్ల పాటు ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్లో లక్నోతో జరిగిన మ్యాచ్లో టీమ్ మేనేజ్మెంట్ అనూహ్య నిర్ణయం తిలక్ను షాక్కు గురి చేసింది. 23 బంతుల్లో 25 పరుగులు చేయడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ‘రిటైర్డ్ అవుట్’తో తిలక్ను బయటకు పంపించారు. అదృష్టవశాత్తూ ఐపీఎల్లో ప్రదర్శన అతని అంతర్జాతీయ కెరీర్పై ప్రభావం చూపించలేదు. గాయాల నుంచి కోలుకున్న తర్వాత సహజంగానే ఈ సారి ఆసియా కప్ టీమ్లో అతనికి స్థానం లభించింది. వరుసగా చక్కటి ఇన్నింగ్స్లతో తన ముద్ర చూపించిన అతను లంకతో చివరి మ్యాచ్లో త్రుటిలో అర్ధ సెంచరీ కోల్పోయాడు. అయితే తన విశ్వరూపం చూపించాల్సింది ఇక్కడ కాదు అన్నట్లుగా అత్యుత్తమ ప్రదర్శనను ఫైనల్ కోసం దాచి ఉంచినట్లున్నాడు. అసాధారణ షాట్లతో జట్టుకు ఆసియా కప్ అందించే వరకు ఆగకుండా తానేంటో నిరూపించుకొని తిలక్ సగర్వంగా నిలిచాడు. ఫైనల్ మ్యాచ్కు ముందు తిలక్ కెరీర్లో 30 మ్యాచ్ల అంతర్జాతీయ టి20 కెరీర్లో 2 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో ఎన్నో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు కూడా ఉన్నాయి. కానీ ఈ మ్యాచ్లో ఆడిన ఆట అన్నింటికంటే శిఖరాన నిలుస్తుంది. ఇప్పటికే 49.61 సగటు, 150.84 సగటుతో దూసుకుపోతున్న తిలక్ ఈ ఫార్మాట్లో మున్ముందు మరిన్ని సంచలన ప్రదర్శనలు చూపించడం ఖాయం. -
ఆసియా కప్ విజేతగా టీమిండియా.. ఫైనల్లో పాకిస్తాన్పై గెలుపు
ఆసియా కప్ 2025 (Asia cup 2025) విజేతగా టీమిండియా (Team India) అవిర్భవించింది. ఇవాళ (సెప్టెంబర్ 28) జరిగిన ఫైనల్లో పాకిస్తాన్పై (India vs Pakistan) 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ లో స్కోరింగ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పాక్.. కుల్దీప్ యాదవ్ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (57), ఫకర్ జమాన్ (46) రాణించడంతో పాక్ తొలుత భారీ స్కోర్ చేసేలా కనిపించింది. 11.2 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి 100 పరుగుల మార్కును తాకిన ఆ జట్టు.. భారత బౌలర్లు ఒక్కసారిగా లైన్లోకి రావడంతో తట్టుకోలేకపోయింది.33 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 9 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో కుల్దీప్తో పాటు అక్షర్ పటేల్ (4-0-26-2), వరుణ్ చక్రవర్తి (4-0-30-2), బుమ్రా (3.1-0-25-2) కూడా సత్తా చాటారు. పాక్ ఇన్నింగ్స్లో ఓపెనర్లతో పాటు వన్ డౌన్ బ్యాటర్ సైమ్ అయూబ్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు.అనంతరం 147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ సైతం తడబడింది. అయితే తిలక్ వర్మ (53 బంతుల్లో 69; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ద శతకంతో టీమిండియాను గెలిపించాడు. సంజూ శాంసన్ (24), శివమ్ దూబే (33) తిలక్కు సహకరించారు. రింకూ సింగ్ బౌండరీ బాది మ్యాచ్ను ముగించాడు. అంతకుముందు భారత్ 20 పరుగులకే అభిషేక్ శర్మ (5), శుభ్మన్ గిల్ (12), సూర్యకుమార్ యాదవ్ (1) వికెట్లు కోల్పోయింది. పాక్ బౌలర్లలో ఫహీమ్ అఫ్రాఫ్ 3 వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్ తలో వికెట్ తీశారు. ఈ టోర్నీలో భారత్ పాక్పై గెలవడం ఇది మూడోసారి. అంతకుముందు గ్రూప్ దశలో, సూపర్-4లో కూడా టీమిండియానే విజయం సాధించింది. -
చరిత్ర సృష్టించిన రాహుల్ చాహర్.. 166 ఏళ్ల పురాతన రికార్డు బద్దలు
భారత ఔట్ డేటెడ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ (Rahul Chahar) ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో తన తొలి మ్యాచ్లోనే చరిత్ర సృష్టించాడు. కౌంటీ ఛాంపియన్షిప్ 2025లో (County Championship) సర్రే (Surrey) తరఫున అరంగేట్రంలోనే 10 వికెట్లు (హ్యాంప్షైర్పై) తీసి, 1859లో నమోదైన 166 ఏళ్ల పురాతన రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్ చాహర్ తొలి ఇన్నింగ్స్లో 2, రెండో ఇన్నింగ్స్లో 8 వికెట్లు తీశాడు.119 ఏళ్ల సర్రే కౌంటీ చరిత్రలో తొలి మ్యాచ్లోనే 8 వికెట్ల ఘనత సాధించిన తొలి ప్లేయర్గానూ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 1859లో విలియన్ ముడీ నార్త్పై తన తొలి మ్యాచ్లో 7 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. హ్యాంప్షైర్తో మ్యాచ్లో 118 పరుగులిచ్చి 10 వికెట్లు తీసిన చాహర్.. తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో తొలిసారి 10 వికెట్ల ఘనత సాధించడంతో పాటు అత్యుత్తమ గణాంకాలను కూడా నమోదు చేశాడు.చాహర్ అద్భుత ప్రదర్శనతో చెలరేగడంతో హ్యాంప్షైర్పై సర్రే 20 పరుగుల తేడాతో గెలుపొందింది. 181 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో చాహర్ (24-7-51-8) రెచ్చిపోయాడు. రెండు వికెట్లు మినహా హ్యాంప్షైర్ మొత్తాన్ని కూల్చేశాడు. ఈ మ్యాచ్లో చాహర్ రెండు ఇన్నింగ్స్ల్లో సహచర భారత ఆటగాడు వాషింగ్టన్ సుందర్ను ఔట్ చేయడం విశేషం. ఈ సీజన్లో సుందర్ హ్యాంప్షైర్కు ఆడుతున్నాడు.2021 టీ20 వరల్డ్ కప్లో చివరిసారి టీమిండియాకు ఆడిన చాహర్.. భారత్ తరఫున ఓ వన్డే, 6 టీ20లు ఆడాడు. గత కొన్నేళ్లుగా ఐపీఎల్లో రెగ్యులర్గా ఆడుతున్న చాహర్.. 2019, 2020 సీజన్లలో ముంబై ఇండియన్స్ టైటిల్ విన్నింగ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ సహా పంజాబ్ కింగ్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్కు ఆడిన చాహర్.. ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడుతున్నాడు. చదవండి: అనూహ్య నిర్ణయం.. కెప్టెన్గా ఇషాన్ కిషన్ -
Ind vs Pak: అప్పుడు బాయ్కాట్ అన్నారు.. ఇప్పుడేమో ఎగబడుతున్నారు..!
ఆసియా కప్-2025లో (Asia Cup 2025) ఇవాళ (సెప్టెంబర్ 28) భారత్-పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య మెగా ఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.ఈ టోర్నీలో భారత్, పాక్ తలపడటం ఇది మూడోసారి. అంతకుముందు గ్రూప్ దశ, సూపర్-4లో ఇరు జట్లు తలపడ్డాయి. ఈ రెండు పర్యాయాల్లో టీమిండియా పాక్ను చిత్తుగా ఓడించింది. నేడు జరుగబోయే ఫైనల్లోనూ అదే సీన్ రిపీట్ కాబోతుందని భారత అభిమానులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.కాగా, నేటి భారత్-పాక్ ఫైనల్ మ్యాచ్ను భారతవ్యాప్తంగా 100కు పైగా పీవీఆర్ ఐనాక్స్ (PVR INOX) స్క్రీన్లపై ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ అంశం ప్రస్తుతం సోషల్మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇదే టోర్నీలో భారత్, పాక్ గ్రూప్ దశ, సూపర్-4లో తలపడినప్పుడు బాయ్కాట్ అన్న జనాలు.. ఫైనల్ మ్యాచ్ వచ్చేసరికి టికెట్ల కోసం ఎగబడుతున్నారు.ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ కొందరు నెటిజన్లు వ్యంగ్యమైన కామెంట్లు చేస్తున్నారు. బాయ్కాట్ గ్యాంగ్ టికెట్ బుకింగ్ గ్యాంగ్గా మారిందని ఎద్దేవా చేస్తున్నారు. భారత్-పాక్ మ్యాచ్ను బాయ్కాట్ చేయాలని ఉద్యమాలు చేసిన వాళ్లే, ఇప్పుడు టికెట్ల కోసం క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. భారత్-పాక్ మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉండగా దేశంలోని ప్రధాన నగరాల్లో స్క్రీనింగ్ హంగామా నడుస్తుంది. PVR INOX స్క్రీన్లపై దాయాదుల తుది సమరాన్ని వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఎగబడుతున్నారు. PVR INOX స్క్రీన్లతో పాటు దేశవాప్తంగా చాలా చోట్ల ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసి మ్యాచ్ను లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన టికెట్లు దక్కించుకునేందుకు అభిమానులు చిన్నపాటి యుద్దాలే చేస్తున్నారు. చదవండి: ఇకపై అదే అర్హత.. వైభవ్ సూర్యవంశీ అలానే వచ్చాడు.. బీసీసీఐ కీలక నిర్ణయం -
BCCI: టీమిండియాకు కొత్త సెలక్టర్లు.. అగార్కర్తో కలిసి..
భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీలో రెండు మార్పులు జరిగాయి. ఎస్.శరత్, సుబ్రతో బెనర్జీ స్థానాల్లో ఇద్దరు టీమిండియా మాజీ క్రికెటర్లు సెలక్టర్లుగా నియమితులయ్యారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీలో ప్రజ్ఞాన్ ఓజా, రుద్ర ప్రతాప్ సింగ్ (RP Singh) చేరారు.ముంబైలో ఆదివారం జరిగిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సర్వసభ్య సమావేశంలో బోర్డు ప్రజ్ఞాన్ ఓజా, ఆర్పీ సింగ్ల నియామకాన్ని ఖరారు చేసింది. కాగా ఖాళీ అయిన సెలక్టర్ల పోస్టులకు ఈ నెల ఆరంభంలో బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే.అర్హతలు ఇవేబీసీసీఐ నిబంధనల ప్రకారం.. సెలక్టర్గా ఎంపిక కావాలంటే.. అంతర్జాతీయ స్థాయిలో కనీసం ఏడు టెస్టులు లేదంటే 30 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడి ఉండాలి. అంతేగాక ప్రొఫెషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి కనీసం ఐదు సంవత్సరాల వ్యవధి పూర్తై ఉండాలి. అంతేకాదు గత ఐదేళ్ల కాలంలో బీసీసీఐకి సంబంధించిన ఏ క్రికెట్ కమిటీలోనూ భాగమై ఉండరాదు.ఇద్దరూ టీమిండియా బౌలర్లేఇక ఒడిశాకు చెందిన 39 ఏళ్ల ప్రజ్ఞాన్ ఓజా టీమిండియా తరఫున 24 టెస్టులు, 18 వన్డేలు, ఆరు టీ20 మ్యాచ్లు ఆడాడు. ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్ టెస్టుల్లో 113, వన్డేల్లో 21, టీ20లలో పది వికెట్లు పడగొట్టాడు. 2008 నుంచి 2013 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఓజా.. 2015లో ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.మరోవైపు.. ఉత్తరప్రదేశ్ లెఫ్టార్మ్ పేసర్ ఆర్పీ సింగ్ అంతర్జాతీయ స్థాయిలో 14 టెస్టులు, 58 వన్డేలు, 10 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 40, 69, 15 వికెట్లు కూల్చాడు. 2005లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఆర్పీ సింగ్.. 2011లో భారత్ తరఫున చివరి మ్యాచ్ ఆడేశాడు. ఇక 2016లో ఐపీఎల్కు కూడా గుడ్బై చెప్పేశాడు.వారికి మొండిచేయిఈ నేపథ్యంలో అన్ని అర్హతలు కలిగి ఉన్నందున ప్రజ్ఞాన్ ఓజా, ఆర్పీ సింగ్ టీమిండియా జాతీయ సెలక్టర్లుగా ఎంపికయ్యారు. సౌత్ జోన్ నుంచి ఓజా దరఖాస్తు చేసుకోగా.. సెంట్రల్ జోన్ నుంచి ఆర్పీ సింగ్ సెలక్టర్ రేసులో నిలిచాడు. వీరితో పాటు ప్రవీణ్ కుమార్, అమేయ్ ఖురాసియా, ఆశిశ్ విన్స్టన్ జైదీ, శక్తి సింగ్ పోటీ పడగా.. ఓజా, ఆర్పీ సింగ్ మాత్రమే సఫలమయ్యారు.బీసీసీఐ సీనియర్ మెన్ సెలక్షన్ కమిటీ👉చైర్మన్: అజిత్ అగార్కర్ (వెస్ట్ జోన్)👉సభ్యుడు: శివ్ సుందర్ దాస్ (ఈస్ట్ జోన్)👉సభ్యుడు: ఆర్పీ సింగ్ (సెంట్రల్ జోన్)👉సభ్యుడు: అజయ్ రాత్రా (నార్త్ జోన్)👉సభ్యుడు: ప్రజ్ఞాన్ ఓజా (సౌత్ జోన్).చదవండి: ‘పాక్తో ఫైనల్... శివం దూబే అవుట్!.. భారత తుదిజట్టు ఇదే!’ -
Asia cup 2025: శ్రీలంకపై టీమిండియా గెలుపు
శ్రీలంకపై టీమిండియా గెలుపుశ్రీలంకతో జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో నిర్ణీత ఓవర్లలో ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక పేలవంగా 5 బంతుల్లో 2 పరుగులే చేసి 2 వికెట్లు కోల్పోయింది. అనంతరం భారత్ తొలి బంతికే 3 పరుగులు తీసి విజయం సాధించింది.స్కోర్లు సమం.. సూపర్ ఓవర్లో తేలనున్న ఫలితంభారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేయగా.. శ్రీలంక కూడా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అన్నే పరుగులు చేసింది.లక్ష్యం దిశగా దూసుకుపోతున్న శ్రీలంకశ్రీలంక టీమిండియాకు షాకిచ్చే దిశగా సాగుతోంది. 203 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆ జట్టు 15 ఓవర్ల తర్వాత 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 157 పరుగులు చేసింది. ఆ జట్టు 30 బంతుల్లో మరో 46 పరుగులు చేస్తే టీమిండియాపై సంచలన విజయం సాధిస్తుంది. నిస్సంక (93), అసలంక (5) క్రీజ్లో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక12.2వ ఓవర్-వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో కుసాల్ పెరీరా (58) స్టంపౌటయ్యాడు. దుమ్మురేపుతున్న నిస్సంక, పెరీరా.. లక్ష్యం దిశగా సాగుతున్న శ్రీలంక203 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో లంక బ్యాటర్లు పథుమ్ నిస్సంక, కుసాల్ పెరీరా దుమ్మురేపుతున్నారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకొని శ్రీలంకను లక్ష్యంగా తీసుకెళ్తున్నారు. పెరీరా 27 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 52.. నిస్సంక 32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 61 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. 10 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 114/1గా ఉంది. ఈ మ్యాచ్లో లంక గెలవాలంటే 60 బంతుల్లో 89 పరుగులు చేయాలి.భారీ లక్ష్య ఛేదన.. ధాటిగా ఆడుతున్న శ్రీలంక203 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక ధాటిగా ఆడుతుంది. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయినా (కుసాల్ మెండిస్ డకౌట్).. పథుమ్ నిస్సంక (17 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కుసాల్ పెరీరా (9 బంతుల్లో 14; 2 ఫోర్లు) వేగంగా పరుగులు రాబడుతున్నారు. ఫలితంగా శ్రీలంక 4.3 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును దాటింది. అభిషేక్ విధ్వంసం.. టీమిండియా భారీ స్కోర్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 ఫోర్లు) విధ్వంసం సృష్టించగా.. తిలక్ వర్మ (34 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్), సంజూ శాంసన్ (23 బంతుల్లో 39; ఫోర్, 3 సిక్సర్లు) రాణించాడు. ఆఖర్లో అక్షర్ పటేల్ (15 బంతుల్లో 21 నాటౌట్; ఫోర్, సిక్స్) కూడా ఉపయోగకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ (4), సూర్యకుమార్ యాదవ్ (12), హార్దిక్ పాండ్యా (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. శ్రీలంక బౌలర్లలో తీక్షణ, చమీరా, హసరంగ, షనక, అసలంక తలో వికెట్ తీశారు.భారీ స్కోర్ దిశగా టీమిండియాటీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 18 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 179/5గా ఉంది. తిలక్ వర్మ (42), అక్షర్ పటేల్ (9) క్రీజ్లో ఉన్నారు. నిరాశపరిచిన హార్దిక్16.1వ ఓవర్- హార్దిక్ పాండ్యా కేవలం 2 పరుగులు చేసి ఔటయ్యాడు. చమీరా బౌలింగ్లో కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు.నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా15.3వ ఓవర్- 39 పరుగులు చేసి సంజూ శాంసన్ ఔటయ్యాడు. షనక బౌలింగ్లో అసలంకకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.అభిషేక్ ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా8.4వ ఓవర్- 92 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. అసలంక బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి అభిషేక్ శర్మ (61) ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 94/3గా ఉంది. తిలక్ వర్మ (10), సంజూ శాంసన్ (1) క్రీజ్లో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా6.5వ ఓవర్- హసరంగ బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్ (12) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 7 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 75/2గా ఉంది. అభిషేక్తో పాటు తిలక్ వర్మ (1) క్రీజ్లో ఉన్నాడు.వరుసగా మూడో హాఫ్ సెంచరీ చేసిన అభిషేక్ప్రస్తుత ఆసియా కప్లో అభిషేక్ వరుసగా మూడో హాఫ్ సెంచరీ చేశాడు. శ్రీలంకతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో 22 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ఈ మైలురాయిని తాకాడు. 6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 71/1గా ఉంది. అభిషేక్తో పాటు సూర్యకుమార్ యాదవ్ (11) క్రీజ్లో ఉన్నాడు.దుమ్మురేపుతున్న అభిషేక్ శర్మఆసియా కప్లో అభిషేక్ శర్మ విధ్వంసకాండ కొనసాగుతోంది. శ్రీలంకతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లోనూ అతను దుమ్మురేపుతున్నాడు. 19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. 5 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 59/1గా ఉంది. అభిషేక్తో పాటు సూర్యకుమార్ యాదవ్ (11) క్రీజ్లో ఉన్నాడు.టీమిండియాకు ఆదిలోనే షాక్1.3వ ఓవర్- టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న టీమిండియాకు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. తీక్షణ బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి శుభ్మన్ గిల్ (4) ఔటయ్యాడు. ఆసియా కప్ 2025లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 26) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్లో భారత్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. బుమ్రా, శివమ్ దూబే స్థానాల్లో అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా తుది జట్టులోకి వచ్చారు. శ్రీలంక ఓ మార్పు చేసింది. చమిక కరుణరత్నే స్థానంలో లియనాగే జట్టులోకి వచ్చాడు. ఈ టోర్నీలో ఇదివరకే ఫైనల్ బెర్త్లు ఖరారైన నేపథ్యంలో ఈ మ్యాచ్ నామమాత్రంగా జరుగుతుంది. ఆదివారం జరుగబోయే ఫైనల్లో భారత్, పాకిస్తాన్ తలపడతాయి.తుది జట్లు..భారత్: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (c), తిలక్ వర్మ, సంజు శాంసన్ (wk), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తిశ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (wk), కుసల్ పెరెరా, చరిత్ అసలంక (c), దసున్ షనక, కమిందు మెండిస్, వనిందు హసరంగా, జనిత్ లియనాగే, దుష్మంత చమీర, మహీశ తీక్షణ, నువాన్ తుషార -
సెలెక్ట్ చేస్తారని అనుకున్నా.. కరుణ్ నాయర్ ఆవేదన
త్వరలో స్వదేశంలో వెస్టిండీస్తో జరుగబోయే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ (India vs West Indies) కోసం భారత జట్టును (Team India) నిన్న (సెప్టెంబర్ 25) ప్రకటించారు. ఈ జట్టులో అందరూ ఊహించిన విధంగానే ఇంగ్లండ్ పర్యటనలో నిరాశపరిచిన కరుణ్ నాయర్కు (karun Nair) చోటు దక్కలేదు. కరుణ్పై వేటు అంశం నిన్నటి నుంచి భారత క్రికెట్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా ఉంది.చాలామంది కరుణ్ను తప్పించడం సమంజసమే అని అంటుంటే.. కొందరు మాత్రం అతనికి మరికొన్ని అవకాశాలు ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై కరుణ్ స్వయంగా స్పందించాడు. ఓ ప్రముఖ వార్త సంస్థతో మాట్లాడుతూ.. "సెలెక్ట్ చేస్తారని అనుకున్నా. కానీ చేయలేదు. దీని గురించి ఎక్కువగా మాట్లాడాలని అనుకోవట్లేదు. చివరి టెస్ట్లో ఫిఫ్టీ చేశాను. ఆ ఇన్నింగ్స్లో మరెవ్వరూ ఈ మార్కును తాకలేకపోయారు. ఆ మ్యాచ్లో (ఓవల్ టెస్ట్) టీమిండియా గెలిచింది. అయినా ఇవన్నీ సెలెక్టర్లకు పట్టవంటూ" అవేదనకు లోనయ్యాడు.ఇదే అంశంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్ కూడా స్పందించాడు. అతని వాదన వేరేలా ఉంది. కరుణ్ నుంచి చాలా ఆశించినట్లు చెప్పుకొచ్చాడు. కరుణ్కు ప్రత్యామ్నాయంగా తీసుకున్న దేవ్దత్ పడిక్కల్ (Devdutt Padikkal) చాలా ఆప్షన్స్ ఇస్తాడని అన్నాడు.కరుణ్ మంచి ఆటగాడనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రస్తుతం టీమ్ ట్రాన్సిషన్లో ఉంది. ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుని పడిక్కల్ను ఎంపిక చేశాం. ప్రతి ఆటగాడికి 15-20 అవకాశాలు ఇవ్వాలనుకుంటాం. కానీ, అది ఎప్పుడూ సాధ్యపడదని పేర్కొన్నాడు.కాగా, ఇంగ్లండ్పై ట్రిపుల్ సెంచరీతో రాత్రికిరాత్రి హీరో అయిపోయి, అతి కొద్ది కాలంలోనే ఫామ్ కోల్పోయి కనుమరుగైన కరుణ్ నాయర్.. ఆతర్వాత ఏళ్ల తరబడి దేశవాలీ క్రికెట్లో సత్తా చాటి ఎనిమిదేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు కూడా అతను భారత జట్టులో ఎంతో కాలం నిలువలేకపోయాడు. కేవలం 8 ఇన్నింగ్స్ల్లోనే అతని ఖేల్ ఖతమైంది.ఇంగ్లండ్ పర్యటనలో కరుణ్ 8 ఇన్నింగ్స్ల్లో 25.62 సగటున కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ సాయంతో 205 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో కరుణ్కు మంచి ఆరంభాలు లభించినా, వాటిని పెద్ద స్కోర్లుగా మలచలేకపోయాడు. దీంతో సెలెక్టర్లు అతన్ని విండీస్ సిరీస్కు ఎంపిక చేయలేదు.చదవండి: వైభవ్ విఫలమైనా..! ఆసీస్ను వారి సొంతగడ్డపై ఊడ్చేసిన టీమిండియా -
వైభవ్ విఫలమైనా..! ఆసీస్ను వారి సొంత ఇలాకాలో చిత్తుగా ఓడించిన టీమిండియా
మూడు మ్యాచ్ల యూత్ వన్డే సిరీస్లో (Australia U19 vs India U19) యువ భారత్ జట్టు (Team India) ఆస్ట్రేలియాను (Australia) వారి సొంత ఇలాకాలో చిత్తుగా ఓడించింది. ఈ సిరీస్ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. బ్రిస్బేన్ వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 26) జరిగిన మూడో వన్డేలో టీమిండియా 167 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.ఈ సిరీస్ తొలి రెండు మ్యాచ్ల్లో (22 బంతుల్లో 38, 68 బంతుల్లో 70) సత్తా చాటిన చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మూడో మ్యాచ్లో (20 బంతుల్లో 16) విఫలమయ్యాడు. అయినా భారత్ ఘన విజయం సాధించగలిగింది. ఈ సిరీస్లో భారత్ తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో, రెండో వన్డేలో 51 పరుగుల తేడాతో గెలుపొందింది.ఇరు జట్ల మధ్య సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు తొలి యూత టెస్ట్ జరుగనుంది. అనంతరం అక్టోబర్ 7 నుంచి 10 వరకు రెండో టెస్ట్ జరుగుతుంది. దీంతో ఆస్ట్రేలియాలో యువ భారత జట్టు పర్యటన ముగుస్తుంది.మూడో వన్డే విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. వైభవ్ విఫలమైనా, వేదాంత్ త్రివేది (86), రాహుల్ కుమార్ (62) రాణించారు. విహాన్ మల్హోత్రా (40) పర్వాలేదనిపించాడు. కెప్టెన్ ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) వరుసగా మూడో మ్యాచ్లోనూ విఫలమయ్యాడు.అనంతరం 281 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. భారత బౌలర్లు ఖిలన్ పటేల్ (7.3-0-26-4), ఉధవ్ మోహన్ (5-1-26-3), కనిష్క్ చౌహాన్ (6-1-18-2) ధాటికి 28.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. అలెక్స్ టర్నర్ 32, టామ్ హోగన్ 28, విల్ మలాజ్చుక్ 15 పరుగులు చేశారు.చదవండి: IND vs AUS: కేఎల్ రాహుల్ భారీ సెంచరీ.. ఆసీస్ను చిత్తు చేసిన భారత్ -
శతక్కొట్టిన మయాంక్ అగర్వాల్.. సిక్సర్తో సెంచరీ పూర్తి
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో (County Championship) టీమిండియా వెటరన్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) తన తొలి సెంచరీ పూర్తి చేశాడు. స్వల్ప కాలిక ఒప్పందం మేరకు యార్క్షైర్ (Yorkshire) కౌంటీతో జతకట్టిన అతను.. డర్హమ్తో జరుగుతున్న మ్యాచ్లో ఈ ఫీట్ను సాధించాడు. ఈ ఇన్నింగ్స్లో మయాంక్ సిక్సర్తో సెంచరీని పూర్తి చేశాడు. ఓవరాల్గా ఫస్ట్ క్లాస్ కెరీర్లో మయాంక్కు ఇది 19వ శతకం. ఈ ఇన్నింగ్స్లో మయాంక్ 141 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 116 పరుగులు చేసిన అనంతరం ఔటయ్యాడు.MAYANK AGARWAL COMPLETED HIS MAIDEN HUNDRED IN COUNTY CRICKET WITH A SIX. 👑 pic.twitter.com/lGUjYXGV9N— Johns. (@CricCrazyJohns) September 25, 2025ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన డర్హమ్.. 346 పరుగులకు ఆలౌటైంది. ఎనిమిదో నంబర్ ఆటగాడు బెన్ రెయిన్ (101) సెంచరీతో కదంతొక్కగా.. బెడింగ్హమ్ (93) తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. విల్ రోడ్స్ (50) అర్ద సెంచరీతో రాణించాడు. యార్క్షైర్ బౌలర్లలో జాక్ వైట్ 5 వికెట్లతో సత్తా చాటగా.. జార్జ్ హిల్ 2, మిల్నెస్, జెఫ్ థామ్సన్, డామ్ బెస్ తలో వికెట్ తీశారు.అనంతరం తొలి ఇన్నింగ్స ప్రారంభించిన యార్క్షైర్ రెండో రోజు మూడో సెషన్ సమయానికి 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (116), ఆడమ్ లిత్ (69), ఫిన్లే బీన్ (1), జానీ బెయిర్స్టో (0) ఔట్ కాగా.. జేమ్స్ వాట్సన్ (19), మాథ్యూ రెవిస్ (2) క్రీజ్లో ఉన్నారు. డర్హమ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు యార్క్షైర్ ఇంకా 143 పరుగులు వెనుకపడి ఉంది. చదవండి: ఆల్రౌండ్ షోతో సత్తా చాటిన వాషింగ్టన్ సుందర్ -
ఆల్రౌండ్ షోతో సత్తా చాటిన వాషింగ్టన్ సుందర్
వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్కు ముందు (India vs West Indies) టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washinton Sunder) అదరగొట్టాడు. ఇంగ్లండ్లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్షిప్లో (County Championship) బంతితో, బ్యాట్తో సత్తా చాటాడు. ప్రస్తుత కౌంటీ సీజన్లో హ్యాంప్షైర్కు ఆడుతున్న సుందర్.. సర్రేతో జరుగుతున్న మ్యాచ్లో తొలుత బౌలింగ్లో 3 వికెట్లు తీసి, ఆతర్వాత బ్యాటింగ్లో అర్ద సెంచరీతో రాణించాడు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే.. సుందర్ (3.2-0-5-3), కైల్ అబాట్ (12-4-27=3), జేమ్స్ ఫుల్లర్ (10-2-46-3), లియామ్ డాసన్ (12-5-26-1) ధాటికి 147 పరుగులకే ఆలౌటైంది. సర్రే ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. 36 పరుగులు చేసిన డాన్ లారెన్స్ టాప్ స్కోరర్గా కాగా.. కెప్టెన్ రోరి బర్న్స్ (29) ఒక్కడే 20కి పైగా స్కోర్ చేశాడు.అనంతరం బరిలోకి దిగిన హ్యాంప్షైర్.. వాషింగ్టన్ సుందర్ (110 బంతుల్లో 56; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 248 పరుగులు చేసింది. హ్యాంప్షైర్ ఇన్నింగ్స్లో సుందర్ మినహా ఎవరూ హాఫ్ సెంచరీ చేయలేదు. ఏడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన సుందర్.. బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించి, చివరి వికెట్గా వెనుదిరిగాడు.101 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సర్రే.. రెండో రోజు రెండో సెషన్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. డొమినిక్ సిబ్లే (25), బెన్ ఫోక్స్ (17) క్రీజ్లో ఉన్నారు. హ్యాంప్షైర్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు సర్రే ఇంకా 40 పరుగులు వెనుకపడి ఉంది. ఈ ఇన్నింగ్స్లో సుందర్ ఇంకా బౌలింగ్కు దిగలేదు.విండీస్తో సిరీస్కు ముందు సుందర్ మంచి టచ్లో ఉండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం. సుందర్ ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ సిరీస్లోనూ సత్తా చాటాడు. 4 టెస్ట్ల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ సహా 7 వికెట్లు తీశాడు. అక్టోబర్ 2 నుంచి విండీస్తో ప్రారంభం కాబోయే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో సుందర్ కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది.చదవండి: ప్రపంచకప్కు ముందు టీమిండియాకు ఊహించని షాక్ -
ప్రపంచకప్కు ముందు టీమిండియాకు ఊహించని షాక్
మహిళల వన్డే ప్రపంచకప్కు (ICC Women's World Cup 2025) ముందు భారత జట్టుకు (Team India) ఊహించని షాక్ తగిలింది. వార్మప్ మ్యాచ్ల్లో భాగంగా ఇంగ్లండ్తో ఇవాళ (సెప్టెంబర్ 25) జరిగిన మ్యాచ్లో స్టార్ పేసర్ అరుంధతి రెడ్డి (Arundathi Reddy) గాయపడింది.ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో హీథర్ నైట్ ఆడిన బంతిని క్యాచ్ పట్టే ప్రయత్నంలో అరుంధతి, తన ఎడమ కాలుపై తేడాగా ల్యాండ్ అయ్యింది. దీంతో చాలా సేపు నొప్పితో విలవిలలాడుతూ నేలపై ఉండిపోయింది. ఫిజియో వచ్చి పరీక్షించిన తర్వాత, ఆమెను వీల్ చైర్లో తీసుకెళ్లారు.అరుంధతి గాయం తీవ్రతపై స్పష్టత లేదు. స్కాన్ల కోసం ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మరి కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే వరల్డ్కప్లో ఆమె పాల్గొనడం అనుమానంగా మారింది.27 ఏళ్ల అరుంధతి గత కొంతకాలంగా టీమిండియాలో కీలక బౌలర్గా వ్యవహరిస్తుంది. ఈ ఏడాది ఆమె 6 ఇన్నింగ్స్ల్లో 7 వికెట్లు తీసి మంచి ఫామ్లో ఉంది. ఒకవేళ మెగా టోర్నీ నుంచి అరుంధతి తప్పుకుంటే, బీసీసీఐ ఆమె ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. టీమిండియా సెప్టెంబర్ 30న శ్రీలంకతో జరిగే మ్యాచ్తో తమ వరల్డ్కప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది.వార్మప్ మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్.. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (120 నాటౌట్) సెంచరీతో కదంతొక్కడంతో భారీ స్కోర్ దిశగా సాగుతోంది. బ్రంట్కు జతగా ఎమ్మా లాంబ్ (74 నాటౌట్) క్రీజ్లో ఉంది. 42 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 277/3గా ఉంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో యామీ జోన్స్ 39, హీథర్ నైట్ 37 పరుగులు చేయగా.. ట్యామీ బేమౌంట్ డకౌటైంది. భారత బౌలర్లలో రేణుకా సింగ్, అరుంధతి రెడ్డి తలో వికెట్ తీశారు. చదవండి: న్యూజిలాండ్కు షాకిచ్చిన టీమిండియా -
IND VS AUS: కేఎల్ రాహుల్కు గాయం.. సెంచరీ దిశగా సాగుతుండగా..!
లక్నోలోని ఎకానా స్టేడియంలో ఆస్ట్రేలియా-ఏతో (India A vs Australia A) జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్లో భారత-ఏ జట్టుకు (Team India) ఊహించని షాక్ తగిలింది. ఈ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియా నిర్దేశించిన 412 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) గాయపడ్డాడు. 92 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 74 పరుగులు చేసి సెంచరీ దిశగా సాగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.బ్యాటింగ్ చేస్తుండగా అసౌకర్యానికి గురైన రాహుల్ ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. అతని స్థానంలో బ్యాటింగ్కు దిగిన దేవ్దత్ పడిక్కల్ (8 బంతుల్లో 5) ఇలా వచ్చి అలా ఔటయ్యాడు. సాయి సుదర్శన్ (44), మానవ్ సుతార్ (1) ఛేదనను కొనసాగిస్తున్నారు. అంతకుముందు ఓపెనర్ ఎన్ జగదీసన్ 36 పరుగులు చేసి ఔటయ్యాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత స్కోర్ 169/2గా ఉంది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే ఇంకా 243 పరుగులు చేయాలి. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. ఛేదనకు భారత్కు రేపు కూడా అవకాశం ఉంది.దీనికి ముందు ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 185 పరుగులకు ఆలౌటైంది. గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్ తలో 3.. సిరాజ్, యశ్ ఠాకూర్ తలో 2 వికెట్లు తీసి ఆసీస్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. ఆ జట్టు తరఫున కెప్టెన్ నాథన్ మెక్స్వీనీ (85 నాటౌట్), ఫిలిప్ (50) మాత్రమే అర్ద సెంచరీలతో రాణించారు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 194 పరుగులకే ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్లో సాయి సుదర్శన్ (75) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. రాహుల్ (11), జగదీసన్ (38), ఆయుశ్ బదోని (21), ప్రసిద్ద్ కృష్ణ (16 రిటైర్డ్ హర్ట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో థార్న్టన్ 4 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. మర్ఫీ 2, సదర్ల్యాండ్, రొచ్చిక్కియోలీ, కన్నోల్లీ తలో వికెట్ తీశారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. మెక్స్వీనీ (74), జాక్ ఎడ్వర్డ్స్ (88), మర్ఫీ (76) అర్ద సెంచరీలతో రాణించడంతో భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. గుర్నూర్ బ్రార్ 3, సిరాజ్, ప్రసిద్ద్ తలో వికెట్ తీశారు.కాగా, రెండు మ్యాచ్ల అనధికారిక టెస్ట్ సిరీస్, 3 మ్యాచ్ల అనధికారిక వన్డే సిరీస్ల కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో ఇదివరకే తొలి టెస్ట్ మ్యాచ్ పూర్తి కాగా.. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది.చదవండి: టీమిండియా కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ ప్రకటన -
Asia cup 2025: అభిషేక్ విధ్వంసం.. ఫైనల్లో టీమిండియా
ఆసియా కప్ 2025లో టీమిండియా ఫైనల్కు చేరింది. బంగ్లాదేశ్తో ఇవాళ (సెప్టెంబర్ 24) జరిగిన సూపర్-4 మ్యాచ్లో 41 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో భారత్ ఫైనల్కు చేరడమే కాకుండా శ్రీలంకను టోర్నీ నుంచి ఎలిమినేట్ చేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య రేపు జరుగబోయే మ్యాచ్లో విజేత ఫైనల్లో భారత్తో తలపడుతుంది.బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (19 బంతుల్లో 29; 2 ఫోర్లు, సిక్స్) మంచి ఆరంభాన్ని ఇచ్చినా టీమిండియా నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది.అభిషేక్ క్రీజ్లో ఉండగా భారత్ స్కోర్ 200 పరుగులు దాటుతుందని అంతా అనుకున్నారు. అయితే అతను ఔట్ కావడంతో పరిస్థితి తారుమారైంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బంతులు వృధా చేసి (11 బంతుల్లో 5) ఔటయ్యాడు. అంతకుముందే శివమ్ దూబే (2) నిరాశపరిచాడు.తిలక్ వర్మ (7 బంతుల్లో 5) కూడా స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోయాడు. హార్దిక్ పాండ్యా (29 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. వేగంగా పరుగులు రాబట్టలేకపోయాడు. అక్షర్ పటేల్ (15 బంతుల్లో 10 నాటౌట్) దారుణంగా ఆడాడు. చివరి ఓవర్లో బంతులు వృధా చేసి భారత్ ఓ మోస్తరు స్కోర్కే పరిమితమయ్యేలా చేశాడు.తొలి 11 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసిన భారత్.. చివరి 9 ఓవర్లలో కేవలం 56 పరుగులే చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది.అనంతరం 169 పరుగుల సాధారణ లక్ష్యాన్ని కాపాడుకునేందుకు బరిలోకి దిగిన భారత్.. ఆది నుంచే ప్రత్యర్ధిపై ఒత్తిడి తెచ్చింది. బుమ్రా (4-0-18-2), వరుణ్ చక్రవర్తి (4-0-29-2), కుల్దీప్ యాదవ్ (4-0-18-3), అక్షర్ పటేల్ (4-0-37-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. వీరి ధాటికి బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా ఇన్నింగ్స్లో ఓపెనర్ సైఫ్ హసన్ (69) ఒంటరిపోరాటం చేశాడు. అతనితో పాటు పర్వేజ్ హొస్సేన్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సెప్టెంబర్ 26న జరిగే నామమాత్రపు మ్యాచ్లో భారత్.. శ్రీలంకతో తలపడుతుంది. సెప్టెంబర్ 28న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. -
Asia cup 2025: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
ఆసియా కప్ 2025లో (Asia cup 2025) అభిషేక్ శర్మ (Abhishek Sharma) విధ్వంసాల పర్వం కొనసాగుతోంది. బంగ్లాదేశ్తో ఇవాళ (సెప్టెంబర్ 24) జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో (India vs Bangladesh) మరో మెరుపు అర్ద సెంచరీ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) సాధించాడు. ఈ మ్యాచ్కు ముందు పాకిస్తాన్తో మ్యాచ్లోనూ అభి'షేక్' (39 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) చేశాడు. వరుసగా రెండు హాఫ్ సెంచరీలు సాధించడంతో అభిషేక్ ఖాతాలో ఓ రికార్డు వచ్చి చేరింది.ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో విరాట్ కోహ్లి (Virat kohli) తర్వాత వరుసగా రెండు ఇన్నింగ్స్ల్లో హాఫ్ సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా అభిషేక్ చరిత్రకెక్కాడు. ప్రస్తుత ఎడిషన్లో భీకర ఫామ్లో ఉన్న అభిషేక్ ఇప్పటికే లీడింగ్ రన్స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఈ ఎడిషన్లో ఇప్పటిదాకా 5 మ్యాచ్లు ఆడిన అతను.. 206.67 స్ట్రయిక్రేట్తో 248 పరుగులు చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి 3 ఓవర్లలో నిదానంగా ఆడినప్పటికీ.. ఆతర్వాత అభిషేక్ గేర్ మార్చడంతో ఒక్కసారిగా పుంజుకుంది. అభిషేక్, గిల్ క్రీజ్లో ఉన్నంత వరకు పరుగులు పెట్టిన స్కోర్ బోర్డు.. ఈ ఇద్దరు ఔట్ కావడంతో ఒక్కసారిగా నెమ్మదించింది.వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 15 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా (11), అక్షర్ పటేల్ (2) క్రీజ్లో ఉన్నారు. భారత ఇన్నింగ్స్లో అభిషేక్ 75, గిల్ 29, శివమ్ దూబే 2, సూర్యకుమార్ యాదవ్ 5, తిలక్ వర్మ 5 పరుగులు చేసి ఔటయ్యారు. బంగ్లా బౌలరల్లో రిషద్ హొసేన్ 2, తంజిమ్ సాకిబ్, ముస్తాఫిజుర్ తలో వికెట్ తీశారు. అభిషేక్ శర్మ రనౌటయ్యాడు. చదవండి: సందిగ్దంలో సెలెక్టర్లు.. విండీస్ సిరీస్కు భారత జట్టు ప్రకటన వాయిదా -
సందిగ్దంలో సెలెక్టర్లు.. విండీస్ సిరీస్కు భారత జట్టు ప్రకటన వాయిదా
వెస్టిండీస్తో జరగబోయే టెస్టు సిరీస్కు (India vs West Indies) భారత జట్టు (Team India) ప్రకటన రేపటికి వాయిదా పడింది. బుమ్రా (Jasprit Bumrah) ఆసియా కప్లో పాల్గొంటున్న నేపథ్యంలో అతని అందుబాటుపై స్పష్టత లేకపోవడం.. ఆస్ట్రేలియా-ఏతో మ్యాచ్లో ప్రసిద్ధ్ కృష్ణ (Prasidh Krishna) గాయపడటం వంటి అంశాలు సెలక్టర్లను గందరగోళంలోకి నెట్టాయి.విండీస్తో సిరీస్కు బుమ్రా అందుబాటులో ఉన్నా అతని ఫిట్నెస్, వర్క్లోడ్ మేనేజ్మెంట్ అంశాలను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకున్నారు. ఆసీస్-ఏతో మ్యాచ్లో ఇవాళ ప్రసిద్ధ్ కృష్ణ తలకు తీవ్ర గాయం కావడం సెలెక్టర్లను మరింత ఇరకాటంలో పడేసింది.అతనికి ప్రత్యామ్నాయంగా యాశ్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, నవదీప్ సైనీ పేర్లను సెలెక్టర్లు పరిశీలిస్తున్నారు. పై రెండు కారణాల చేత జట్టు ప్రకటన రేపటికి వాయిదా పడింది. బీసీసీఐ వర్గాల సమాచారం మేరకు.. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో టీమిండియాను ప్రకటించే అవకాశం ఉంది.చదవండి: చెలరేగిన వైభవ్ సూర్యవంశీ.. రాణించిన మాత్రే.. ఆసీస్ను చిత్తు చేసిన టీమిండియా -
IND VS AUS: నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. బ్యాటింగ్లో తడబడినా..!
ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్లో (India A vs Australia A) భారత-ఏ బౌలర్లు చెలరేగిపోయారు. అంతకుముందు బ్యాటింగ్లో తడబడినా, బౌలింగ్లో మాత్రం చెలరేగిపోయారు. తొలి ఇన్నింగ్స్లో 194 పరుగులకే ఆలౌటై, ప్రత్యర్ధికి 226 పరుగుల భారీ ఆధిక్యాన్ని కట్టబెట్టినా.. రెండో ఇన్నింగ్స్లో ఆసీస్కు చుక్కలు చూపించారు.రెండో రోజు చివర్లో బౌలింగ్కు దిగి కేవలం 7.5 ఓవర్లలో ముగ్గురు ఆసీస్ బ్యాటర్లను పెవిలియన్కు పంపారు. 3 పరుగుల వద్దనే ఓపెనర్ల పని పట్టి, మరో 13 పరుగుల తర్వాత నాలుగో నంబర్ ఆటగాడిని ఔట్ చేశారు. ఫామ్లో ఉన్న సామ్ కొన్స్టాస్ను (3) గుర్నూర్ బ్రార్.. మరో ఓపెనర్ క్యాంప్బెల్ కెల్లావేను (0) సిరాజ్ (Mohammed Siraj).. ఒలివర్ పీక్ను (1) మానవ్ సుతార్ ఔట్ చేశారు.ఫలితంగా ఆసీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఆ జట్టు లీడ్ 242 పరుగులుగా ఉంది. కెప్టెన్ నాథన్ మెక్స్వీని (11) క్రీజ్లో ఉన్నాడు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో తడబడింది. ఆసీస్ సాధించిన 420 పరుగుల భారీ స్కోర్కు బదులిచ్చే క్రమంలో 194 పరుగులకే ఆలౌటైంది. సాయి సుదర్శన్ (Sai Sudharsan) (75) ఒక్కడే ఒంటరిపోరాటం చేశాడు. ఎన్ జగదీసన్ (38), ఆయుశ్ బదోని (21), ప్రసిద్ద్ కృష్ణ (16 రిటైర్డ్ హర్ట్), కేఎల్ రాహుల్(KL Rahul) (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో థార్న్టన్ 4 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. మర్ఫీ 2, సదర్ల్యాండ్, రొచ్చిక్కియోలీ, కన్నోల్లీ తలో వికెట్ తీశారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. మెక్స్వీనీ (74), జాక్ ఎడ్వర్డ్స్ (88), మర్ఫీ (76) అర్ద సెంచరీలతో రాణించడంతో భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. గుర్నూర్ బ్రార్ 3, సిరాజ్, ప్రసిద్ద్ తలో వికెట్ తీశారు.కాగా, రెండు మ్యాచ్ల అనధికారిక టెస్ట్ సిరీస్, 3 మ్యాచ్ల అనధికారిక వన్డే సిరీస్ల కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో ఇదివరకే తొలి టెస్ట్ మ్యాచ్ పూర్తి కాగా.. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది.చదవండి: IND vs AUS: దారుణంగా విఫలమైన భారత జట్టు.. ఆసీస్కు భారీ ఆధిక్యం -
చెలరేగిన వైభవ్ సూర్యవంశీ.. రాణించిన మాత్రే.. ఆసీస్ను చిత్తు చేసిన టీమిండియా
మల్టీ ఫార్మాట్ సిరీస్ (3 వన్డేలు, 2 టెస్ట్లు) కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత అండర్ 19 జట్టు (India U19 Tour of Australia) వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇదివరకే ఓ వన్డే గెలిచిన యువ భారత్ (India A vs Australia A).. తాజాగా రెండో మ్యాచ్ కూడా గెలిచి (51 పరుగుల తేడాతో), మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ను కైవసం చేసుకుంది.బ్రిస్బేన్ వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 24) జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.4 ఓవర్లలో 300 పరుగులకు ఆలౌటైంది. వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) (68 బంతుల్లో 70; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) యధావిధిగా విధ్వంసాన్ని కొనసాగించాడు. విహాన్ మల్హోత్రా (70), అభిగ్యాన్ కుందు (71) అర్ద సెంచరీలతో సత్తా చాటారు. కెప్టెన్ ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) డకౌటై నిరాశపరిచాడు.అనంతరం 301 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా యువ జట్టు.. భారత బౌలర్ల ధాటికి 47.2 ఓవర్లలో 249 పరుగులకే చాపచుట్టేసింది. జేడన్ డ్రేపర్ (72 బంతుల్లో 107; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకంతో చెలరేగినా ఆసీస్ను గెలిపించలేకపోయాడు. డ్రేపర్కు తోడుగా ఎవ్వరూ రాణించలేదు. అతనొక్కడే ఒంటరిపోరాటం చేశాడు.బ్యాట్తో విఫలమైన యువ భారత కెప్టెన్ ఆయుశ్ మాత్రే బంతితో రాణించాడు. 4 ఓవర్లలోనే 3 వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాశించాడు. కనిష్క్ చౌహాన్ 2, కిషన్ కుమార్, అంబ్రిష్, ఖిలన్ పటేల్, విహాన్ మల్హోత్రా తలో వికెట్ తీశారు.ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 225 పరుగులు చేయగా.. భారత్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. వేదాంత్ త్రివేది (61 నాటౌట్), అభిగ్యాన్ కుందు (87 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (22 బంతుల్లో 38; 7 ఫోర్లు, సిక్స్) ఆ మ్యాచ్లోనూ రాణించాడు.ఈ సిరీస్లో నామమాత్రపు మూడో వన్డే సెప్టెంబర్ 26న జరుగనుంది. అనంతరం సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 3 వరకు తొలి టెస్ట్.. అక్టోబర్ 7 నుంచి 10 వరకు రెండో టెస్ట్ జరుగనున్నాయి.చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ -
టీమిండియాకు ఊహించని షాక్.. స్టార్ బౌలర్ తలకు తీవ్ర గాయం
స్వదేశంలో త్వరలో వెస్టిండీస్తో (India vs West Indies) జరుగబోయే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు (Team India) ఊహించని షాక్ తగిలింది. ఈ సిరీస్ కోసం జట్టు ప్రకటనకు కొద్ది గంటల ముందు స్టార్ బౌలర్ ప్రసిద్ద్ కృష్ణ (Prasidh krishna) తీవ్రంగా గాయపడ్డాడు.ఆస్ట్రేలియా-ఏతో (india A vs Australia A) రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ 39వ ఓవర్లో హెన్రీ థార్న్టన్ సంధించిన రాకాసి బౌన్సర్ ప్రసిద్ధ్ హెల్మెట్ను బలంగా తాకింది.వెంటనే ఫిజియో వచ్చి కంకషన్ టెస్ట్ నిర్వహించగా, ప్రసిద్ధ్ టెస్ట్ను క్లియర్ చేసి బ్యాటింగ్ కొనసాగించాడు. కానీ మూడు ఓవర్ల తర్వాత అస్వస్థతకు లోనై 42వ ఓవర్లో రిటైర్డ్ హర్ట్గా ఫీల్డ్ను వీడాడు. ప్రసిద్ద్ మైదానాన్ని వీడే సమయానికి 25 బంతుల్లో 16 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు.కంకషన్ సబ్గా యశ్ ఠాకూర్ప్రసిద్ధ్ స్థానంలో యశ్ ఠాకూర్ కంకషన్ సబ్గా బ్యాటింగ్కు వచ్చాడు. ఇక ప్రసిద్ధ్ ఈ మ్యాచ్లో పాల్గొనడు. ఈ మ్యాచ్లో ప్రస్దిద్ తొలుత బౌలింగ్లో 17 ఓవర్లు వేసి ఓ వికెట్ తీశాడు.వెస్టిండీస్ సిరీస్ దూరం..?ప్రసిద్ద్ గాయం తీవ్రతపై అధికారిక సమాచారం లేనప్పటికీ.. విండీస్తో టెస్ట్ సిరీస్కు అతన్ని ఎంపిక చేయడం అనుమానమేనని తెలుస్తుంది. ఇంగ్లండ్ పర్యటనలో రాణించిన నేపథ్యంలో ఈ సిరీస్కు ప్రసిద్ద్ ఎంపిక దాదాపుగా ఖరారై ఉండింది. ఆఖరి నిమిషంలో గాయపడటంతో ప్రసిద్ద్ విండీస్ సిరీస్ ఆడే అవకాశాన్ని దాదాపుగా కోల్పోయినట్లే. వర్క్ లోడ్ కారణంగా ఈ సిరీస్కు బుమ్రాను విశ్రాంతినివ్వాలని మేనేజ్మెంట్ భావించింది. ప్రసిద్ద్ గాయపడిన నేపథ్యంలో బుమ్రాను విండీస్ సిరీస్లో ఆడించే అవకాశం ఉంది. బుమ్రా, ఆకాశ్దీప్, సిరాజ్తో పాటు మరో పేసర్ను విండీస్ సిరీస్కు ఎంపిక చేయవచ్చు.ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్లో భారత-ఏ జట్టు తడబడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 420 పరుగుల భారీ స్కోర్ చేయగా.. భారత్ 194 పరుగులకే ఆలౌటైంది. 226 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. చదవండి: IND vs AUS: దారుణంగా విఫలమైన భారత జట్టు.. ఆసీస్కు భారీ ఆధిక్యం -
ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్.. చెలరేగిన టీమిండియా యువ ప్లేయర్
భారత్-ఏ, ఆస్ట్రేలియా-ఏ (India A vs Australia A) జట్ల మధ్య లక్నోలోని ఎకానా స్టేడియంలో ఇవాళ (సెప్టెంబర్ 23) నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్కు కొన్ని గంటల ముందు భారత-ఏ కెప్టెన్సీ నుంచి శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తప్పుకున్నాడు. ఆటగాడిగానూ పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాడు. దీంతో భారత మేనేజ్మెంట్ వికెట్కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ను (Dhruv Jurel) కెప్టెన్గా నియమించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జురెల్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.రాణించిన మెక్స్వీనీ, జాక్ ఎడ్వర్డ్స్తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. కెప్టెన్ నాథన్ మెక్స్వీనీ (74), జాక్ ఎడ్వర్డ్స్ (88) అర్ద సెంచరీలతో రాణించారు. స్టార్ ఓపెనర్ సామ్ కొన్స్టాస్ (49) తృటిలో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. వికెట్కీపర్ జోష్ ఫిలిప్ (39) పర్వాలేదనిపించాడు. ఆట ముగిసే సమయానికి టాడ్ మర్ఫీ (29), హెన్రీ థార్న్టన్ (10) క్రీజ్లో ఉన్నారు.ఐదేసిన యువ స్పిన్నర్భారత బౌలర్లలో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ (Manav Suthar) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 28 ఓవర్లలో 93 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. సుతార్తో పాటు గుర్నూర్ బ్రార్ (13-0-71-2), ప్రసిద్ద్ కృష్ణ (13-3-63-1), మొహమ్మద్ సిరాజ్ (13-1-73-1) వికెట్లు తీశారు. నితీశ్ కుమార్ రెడ్డి, ఆయుశ్ బదోనికి వికెట్లు దక్కలేదు. ఈ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు కేఎల్ రాహుల్, మొహమ్మద్ సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి భారత్-ఏ తరఫున బరిలోకి దిగారు.చదవండి: దిగ్గజ క్రికెట్ అంపైర్ హెరాల్డ్ డికీ బర్డ్ కన్నుమూత -
టీమిండియాకు అక్షింతలు
తాజాగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన ఓ వన్డేలో (India vs Australia) భారత మహిళా క్రికెట్ జట్టు (Team India) ఓ ఐసీసీ నియమాన్ని ఉల్లఘించింది. న్యూఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత జట్టు స్లో ఓవర్రేట్తో (Slow over rate) బౌలింగ్ చేసింది. దీనికి గానూ టీమిండియాకు అక్షింతలు పడ్డాయి. నిర్దేశిత సమయంలోగా భారత్ రెండు ఓవర్లు వెనుక పడింది.ఇందుకు భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్ల్లో 10 శాతం కోత విధించారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్లోని ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్దేశిత సమయంలోగా కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోతే ఓవర్కు 5 శాతం చొప్పున ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్ల్లో కోత విధిస్తారు.ఈ మ్యాచ్లో భారత్ విషయంలో ఇదే జరిగింది. ఆ మ్యాచ్ రిఫరీ జీఎస్ లక్ష్మీ భారత ఆటగాళ్లపై జరిమానాను పురమాయించారు. భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ జరిమానాను స్వీకరించారు.కాగా, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా జరిగిన ఆ మ్యాచ్లో (మూడో వన్డే) భారత్పై ఆస్ట్రేలియా 43 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది.ఈ హై స్కోరింగ్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. బెత్ మూనీ (75 బంతుల్లో 138; 23 ఫోర్లు, సిక్స్) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 47.5 ఓవర్లలో 412 పరుగులు చేసి ఆలౌటైంది.అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ పోరాడి ఓడింది. స్మృతి మంధన (63 బంతుల్లో 125; 17 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరోచిత శతకంతో విజృంభించినా, లక్ష్యానికి 44 పరుగుల దూరంలో నిలిచిపోయింది.చదవండి: IND vs AUS: శ్రేయస్ అయ్యర్ అనూహ్య నిర్ణయం.. గుడ్బై చెప్పేసి.. -
టీమిండియాపై పాక్ ఇక మీదైనా గెలవాలంటే.. ఇమ్రాన్ ఖాన్ వ్యంగ్యాస్త్రాలు
ఆసియా కప్లో భాగంగా టీమిండియా చేతిలో పాకిస్థాన్ జట్టు రెండు మ్యాచ్ల్లోనూ ఓడి.. చావో రేవో అనే పరిస్థితికి చేరింది. ఈ ఓటములను పాక్ అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఆటగాళ్ల పెర్ఫార్మెన్స్ను తిట్టిపోస్తూ సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేస్తున్నారు. ఈ తరుణంలో పాక్ క్రికెట్ మాజీ దిగ్గజం, పాకిస్తాన్ తహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (Pakistan Tehreek-e-Insaf) అధినేత ఇమ్రాన్ ఖాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.భారత్తో క్రికెట్ మ్యాచ్లో ఇకనైనా గెలవాలంటే.. ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్, పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ నక్వీ ఓపెనర్లుగా బ్యాటింగ్ చేయాలని, అంపైర్లుగా మాజీ చీఫ్ జస్టిస్ ఫయాజ్ ఈసా, ఎలక్షన్ కమిషనర్ రాజా ఉంటే సరిపోతుందని ఎద్దేవా చేశారు. అలాగే.. థర్డ్ ఎంపైర్గా ఇస్లామాబాద్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ సర్ఫరాజ్ డోగర్ ఉండాలని సూచించారు. పీసీబీ రాజకీయాల వల్లే పాక్ జట్టుకు ఈ పరిస్థితి వచ్చిందంటూ వెటకారంగా పై వ్యాఖ్యలు చేశారాయన. ఆసియా కప్లో భారత్ చేతిలో పాక్ జట్టు ఓటమిపై(Pak Lost To India) ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఇలాగైతే భారత్ చేతిలో ఎప్పటికీ ఓడిపోతూనే ఉంటాం అంటూ వ్యాఖ్యానించారు. క్రికెట్లో ప్రణాళిక, నిబద్ధత లేకుండా గెలుపు ఊహించలేం అని అన్నారాయన. ఇష్టుల్ని సెలక్టర్లుగా పెట్టడం, గ్రూప్ల రాజకీయాలు, దేశవాళీ క్రికెట్ను నిర్లక్ష్యం చేయడం.. కీలక స్థానాల్లో అర్హతలేని వారిని పెట్టడం వల్లే పతనం అయ్యిందనన్నారు. నఖ్వీ అసమర్థత, బంధుప్రీతి(నెపోటిజం) వల్లే పీసీబీకి ఈ దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. పీసీబీ రాజకీయాలకు పుల్స్టాప్ పడాలని, ఆటగాళ్లు తమ తలపొగరు తగ్గించుకోవాలని.. టాలెంట్ ఉన్న క్రీడాకారులను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందని సూచించారు. పాక్ మాజీ ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్(Ex PM Imran Khan) పలు కేసుల్లో అరెస్టై రావల్పిండి అడియాలా జైలులో ఉన్నారు. దీంతో ఇమ్రాన్ తరఫున ఆయన సోదరి అలీమా ఖాన్ సోమవారం ఈ ప్రకటన చేశారు. పీసీబీతో పాటు పాక్లో ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు అన్యాయంగా, పక్షపాతంగా పనిచేస్తున్నాయని ఆరోపిస్తున్నారాయన. పాక్ ఎన్నికల్లో పీటీఐ ఓడిపోలేదని.. ఆర్మీ చీఫ్ మునీర్ రాజకీయ నేతలతో చేతులు కలిపి మోసం చేశారని నిందిస్తున్నారాయన. పాక్ క్రికెట్ను మలుపు తిప్పిన ఆటగాడిగా ఇమ్రాన్ ఖాన్కు ఓ పేరుంది. ఆల్ రౌండర్ అయిన ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలోనే 1992లో పాకిస్తాన్ ప్రపంచ కప్ నెగ్గింది. 88 టెస్ట్ మ్యాచ్లు, 175 వన్డేలు ఆడిన ఆయన ఎన్నో విజయాలను అందించారు. తన సారథ్యంలోనే పాక్ జట్టును అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే స్థాయికి తీసుకెళ్లారు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించి, కొత్త తరం క్రికెటర్లను పరిచయం చేశారు. ఈ సేవలకు గుర్తింపుగానే 2010లో ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవం ఆయనకు దక్కింది. 1996లో పాకిస్తాన్ తహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) పార్టీని స్థాపించి రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. 2018 సాధారణ ఎన్నికల్లో విజయంతో ప్రధానమంత్రి పదవి చేపట్టారు. అయితే.. 2022లో విశ్వాస తీర్మానం ద్వారా పదవి కోల్పోయి.. పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 2024 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో పీటీఐని పోటీ చేయకుండా అప్పటి కోర్టులు, ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. అయినప్పటికీ వాళ్లు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. అయితే కౌంటింగ్లో తొలి రౌండ్లలో వాళ్లు ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. ఆపై ఇంటర్నెట్, ఫోన్ సర్వీసులను ఆపేసి గందరగోళం సృష్టించి మరీ ఫలితాలు తారుమారు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంలో ఆ సమయంలో అంతర్జాతీయ సమాజం నుంచి కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.ఇదీ చదవండి: పాక్కు డెడ్చీప్గా అప్పులు ఇస్తున్న దేశం ఏదో తెలుసా? -
విధ్వంసం సృష్టించిన అభిషేక్.. పాక్ను మరోసారి చిత్తు చేసిన భారత్
ఆసియా కప్-2025లో టీమిండియా పాక్ను మరోసారి చిత్తు చేసింది. ఇవాళ (సెప్టెంబర్ 21) జరిగిన సూపర్-4 మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి భారత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.రాణించిన ఫర్హాన్ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (58) అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో ఫహీమ్ అష్రాఫ్ (20 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా ఆటగాళ్లలో ఫకర్ జమాన్ 15, సైమ్ అయూబ్ 21, హుస్సేన్ తలాత్ 10, మొహమ్మద్ నవాజ్ 21, సల్మాన్ అఘా 17 (నాటౌట్) పరుగులు చేశారు.ఫీల్డర్ల వైఫల్యం.. భారీగా పరుగులిచ్చిన బుమ్రా ఈ మ్యాచ్లో భారత బౌలర్లు పాక్కు ఊహించిన దానికంటే ఎక్కువ స్కోర్ ఇచ్చారు. ఫీల్డర్లు ఏకంగా నాలుగు క్యాచ్లు (అభిషేక్ 2, కుల్దీప్, గిల్ తలో ఒకటి) వదిలిపెట్టారు. బుమ్రా ఎన్నడూ లేనంత ధారాళంగా పరుగులు (4-0-45-0) సమర్పించుకోగా.. మిగతా బౌలర్లు కూడా ఓ మోస్తరు ప్రదర్శనలే చేశారు.వరుణ్ చక్రవర్తి చాలా మ్యాచ్ల తర్వాత వికెట్ లేకుండా మిగిలిపోయాడు. స్ట్రయిట్ బౌలర్లు పెద్దగా రాణించని వేళ, శివమ్ దూబే 2 వికెట్లతో పర్వాలేదనిపించాడు. కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు. అక్షర్ పటేల్తో కెప్టెన్ సూర్యకుమార్ ఒకే ఓవర్ వేయించాడు.విధ్వంసం సృష్టించిన అభిషేక్ 172 పరుగుల లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు శుభ్మన్ గిల్ (28 బంతుల్లో 47; 8 ఫోర్లు), అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగిపోయారు. తొలి వికెట్కు 9.5 ఓవర్లలో 105 పరుగులు జోడించారు. అనంతరం భారత్ పరుగు వ్యవధిలో గిల్, సూర్యకుమార్ యాదవ్ (0) వికెట్లు కోల్పోయింది. మరో 17 పరుగుల తర్వాత (123 పరుగుల వద్ద) అభిషేక్ శర్మ కూడా ఔటయ్యాడు.ఈ దశలో సంజూ శాంసన్, తిలక్ వర్మ నిదానంగా ఆడటంతో స్కోర్ నెమ్మదించింది. 148 పరుగుల వద్ద సంజూ (13) ఓ చెత్త షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. అనంతరం హార్దిక్ (7 నాటౌట్) సాయంతో తిలక్ వర్మ (30 నాటౌట్) టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 2, అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రాఫ్కు తలో వికెట్ దక్కాయి. -
Ind VS Pak Super 4 Match: పాక్ను చిత్తు చేసిన భారత్
పాక్ను మరోసారి చిత్తు చేసిన భారత్ఆసియా కప్-2025లో టీమిండియా పాక్ను మరోసారి చిత్తు చేసింది. ఇవాళ (సెప్టెంబర్ 21) జరిగిన సూపర్-4 మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి భారత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (58) అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో ఫహీమ్ అష్రాఫ్ (20 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.అనంతరం బరిలోకి దిగిన భారత్.. అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. భారత ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ (28 బంతుల్లో 47; 8 ఫోర్లు), తిలక్ వర్మ (30 నాటౌట్) కూడా రాణించారు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్16.4వ ఓవర్- 148 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. హరీస్ రౌఫ్ బౌలింగ్లో సంజూ శాంసన్ (13) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అభిషేక్ ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన భారత్12.2వ ఓవర్- 123 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. అబ్రార్ అహ్మద్ బౌలింగ్లో సిక్సర్ బాదిన మరుసటి బంతికే అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) ఔటయ్యాడు. అభిషేక్ మరో భారీ షాట్కు ప్రయత్నించే క్రమంలో హరీస్ రౌఫ్కు క్యాచ్ ఇచ్చాడు. తిలక్ వర్మకు (1) జతగా సంజూ శాంసన్ క్రీజ్లోకి వచ్చాడు. రెండో వికెట్ కోల్పోయిన భారత్10.3వ ఓవర్- హరీస్ రౌఫ్ బౌలింగ్లో అబ్రార్ అహ్మద్ క్యాచ్ తీసుకోవడంతో సూర్యకుమార్ యాదవ్ (0) ఔటయ్యాడు. బంతి లీడింగ్ ఎడ్జ్ తీసుకొని నేరుగా అబ్రార్ చేతుల్లోకి వెళ్లింది. భారత్ స్కోర్ ప్రస్తుతం 106/2గా ఉంది. అభిషేక్కు (58) జతగా తిలక్ వర్మ క్రీజ్లోకి వచ్చాడు.తొలి వికెట్ కోల్పోయిన భారత్9.5వ ఓవర్- 105 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఫహీమ్ అష్రాఫ్ బౌలింగ్లో శుభ్మన్ గిల్ (28 బంతుల్లో 47; 8 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అభిషేక్ శర్మకు (57) జతగా సూర్యకుమార్ యాదవ్ క్రీజ్లోకి వచ్చాడు.దూకుడుగా ఆడుతున్న భారత ఓపెనర్లు172 పరుగుల లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు విధ్వంసం సృష్టిస్తున్నారు. పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. గిల్ 35, అభిషేక్ 33 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో భారత్ గెలుపుకు ఇంకా 84 బంతుల్లో 103 పరుగులు మాత్రమే చేయాలి. విధ్వంసం సృష్టిస్తున్న భారత ఓపెనర్లు172 పరుగుల లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 4 ఓవర్లలో భారత్ వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. గిల్ 22, అభిషేక్ 21 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. తొలి బంతికే సిక్సర్ బాదిన అభిషేక్172 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ తొలి బంతికే సిక్సర్ బాదాడు. షాహీన్ అఫ్రిది బౌలింగ్లో ఈ ఘనత సాధించాడు. తొలి ఓవర్ తర్వాత భారత్ స్కోర్ 9/0గా ఉంది. అభిషేక్ 8, గిల్ 1 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్ పాక్కు ఊహించిన దానికంటే ఎక్కువ స్కోరే ఇచ్చింది. ఫీల్డర్లు ఏకంగా నాలుగు క్యాచ్లు (అభిషేక్ 2, కుల్దీప్, గిల్ తలో ఒకటి) వదిలిపెట్టడంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. బుమ్రా ఎన్నడూ లేనంత ధారాళంగా పరుగులు (4-0-45-0) సమర్పించుకోగా.. మిగతా బౌలర్లు కాస్త పర్వాలేదనిపించారు. వరుణ్ చక్రవర్తి చాలా మ్యాచ్ల తర్వాత వికెట్ లేకుండా మిగిలిపోయాడు. స్ట్రయిట్ బౌలర్లు పెద్దగా రాణించని వేళ, శివమ్ దూబే 2 వికెట్లతో పర్వాలేదనిపించాడు. కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు అక్షర్ పటేల్తో కెప్టెన్ సూర్యకుమార్ ఒకే ఓవర్ వేయించాడు. పాక్ ఇన్నింగ్స్లో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (58) టాప్ స్కోరర్గా నిలువగా.. ఆఖర్లో ఫహీమ్ అష్రాఫ్ (20 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా ఆటగాళ్లలో ఫకర్ జమాన్ 15, సైమ్ అయూబ్ 21, హుస్సేన్ తలాత్ 10, మొహమ్మద్ నవాజ్ 21, సల్మాన్ అఘా 17 (నాటౌట్) పరుగులు చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చుకున్న భారత బౌలర్లు11.2 ఓవర్లలోనే 100 పురుగులు పూర్తి చేసి భారీ స్కోర్ చేస్తుందనుకున్న పాక్కు భారత బౌలర్లు పగ్గాలు వేశారు. 19 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 159/5గా మాత్రమే ఉంది. నాలుగో వికెట్ కోల్పోయిన పాక్14.1వ ఓవర్- 115 పరుగుల వద్ద పాక్ నాలుగో వికెట్ కోల్పోయింది. శివమ్ దూబే బౌలింగ్లో సూర్యకుమార్ క్యాచ్ పట్టడంతో ఫర్హాన్ (58) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన పాక్13.1వ ఓవర్-110 పరుగుల వద్ద పాక్ మూడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ బౌలింగ్లో వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి హుస్సేన్ తలాత్ (10) ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన పాక్.. ఎట్టకేలకు క్యాచ్ పట్టిన అభిషేక్ఈ మ్యాచ్లో రెండు క్యాచ్లు వదిలేసిన అభిషేక్ శర్మ ఎట్టకేలకు ఓ క్యాచ్ పట్టుకున్నాడు. శివమ్ దూబే బౌలింగ్లో సైమ్ అయూబ్ (21) ఆడిన షాట్ను అభిషేక్ కష్టమైనా క్యాచ్గా మలిచాడు. 10.3 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 93/2గా ఉంది. ఫర్హాన్కు (53) జతగా హుస్సేన్ తలాత్ క్రీజ్లోకి వచ్చాడు. పాక్ ఓపెనర్ మెరుపు హాఫ్ సెంచరీపాక్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ మెరుపు అర్ద సెంచరీతో మెరిశాడు. కేవలం 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో ఈ మైలురాయిని తాకాడు. అక్షర్ పటేల్ బౌలింగ్లో సిక్సర్తో ఫర్హాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 10 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 91/1గా ఉంది. ఫర్హాన్తో (52) పాటు సైమ్ అయూబ్ (21) క్రీజ్లో కొనసాగుతున్నాడు. మరో క్యాచ్ జారవిడిచిన అభిషేక్తొలి ఓవర్లో ఈజీ క్యాచ్ వదిలేసిన అభిషేక్ శర్మ 8వ ఓవర్లో మరో క్యాచ్ జారవిడిచాడు. క్యాచ్ పట్టకపోగా బంతి బౌండరీ ఆవల పడింది (సిక్సర్). 8 ఓవర్ల తర్వాత పాకిస్తాన్ స్కోర్ 70/1గా ఉంది. ఫర్హాన్ 39, సైమ్ అయూబ్ 13 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. రెండు డ్రాప్ క్యాచ్లు.. పవర్ ప్లేలో భారీగా స్కోర్ చేసిన పాకిస్తాన్భారత ఫీల్డర్లు రెండు ఈజీ క్యాచ్లు డ్రా చేయగా, పాకిస్తాన్ పవర్ ప్లేలో భారీగా స్కోర్ చేసింది. 6 ఓవర్లలో ఆ జట్టు వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. ఈజీ క్యాచ్ జారవిడిచిన కుల్దీప్4.4వ ఓవర్- వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో సైమ్ అయూబ్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను కుల్దీప్ యాదవ్ జారవిడిచాడు. 5 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 42/1గా ఉంది. ఫర్హాన్ 20, సైమ్ 5 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అభిషేక్ శర్మ కూడా ఓ ఈజీ క్యాచ్ను డ్రాప్ చేశాడు. హార్దిక్ బౌలింగ్లో ఫకర్ ఔట్పాకిస్తాన్ ఓపెనర్ ఫకర్ జమాన్ (15) ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో కీపర్ సంజూ శాంసన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. హర్దిక్ వేసిన మూడో ఓవర్ మూడో బంతికి ఫకర్ ఆడదామా.. వ ద్దా అనే అనుమానంతో బ్యాట్ ను పెట్టాడు. ఆ బంతి ఫకర్ బ్యాట్ను ముద్దాడుతూ వెళ్లి కీపర్ సంజూ చేతుల్లో పడింది. అయితే దీనిపై కాస్త అనుమానం వచ్చింది. అది సంజూ శాంసన్ గ్లౌజ్లో పడే ముందు నేలను తాకినట్లు అనిపించింది. కానీ అది నేలను తాకకుండా సంజూ ఫింగర్స్ను తాకుతూగ్లౌజ్లో పడటంతో ఫకర్ పెవిలియన్కు చేరక తప్పలేదు. అయితే ఈ నిర్ణయంపై ఫకర్ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు.తొలి ఓవర్లోనే పాక్ ఓపెనర్కు లైఫ్పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్కు తొలి ఓవర్లోనే లైఫ్ లభించింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అభిషేక్ శర్మ చేతిలో పడిన క్యాచ్ను వదిలేశాడు. బుమ్రా వేసిన రెండో ఓవర్లో ఫకర్ జమాన్ రెండు బౌండరీలు బాది జోరును ప్రదర్శించాడు. 2 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 17/0గా ఉంది. ఫకర్ 11, ఫర్హాన్ 6 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ఆసియా కప్ 2025లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 21) జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో భారత్, పాకిస్తాన్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా స్థానాల్లో బుమ్రా, వరుణ్ చక్రవర్తి తుది జట్టులోకి వచ్చారు. పాకిస్తాన్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది. గత మ్యాచ్లో ఆడిన హసన్ నవాజ్, ఖుష్దిల్ షా ఈ మ్యాచ్లో ఆడటం లేదు.తుది జట్లు..భారత్: అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(సి), తిలక్ వర్మ, సంజు శాంసన్(w), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిపాకిస్తాన్: సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, మహ్మద్ హరీస్(w), ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(c), మహ్మద్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఫమీమ్ అష్రాఫ్, షాహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్ -
బీసీసీఐ కీలక ప్రకటన
ఆసియా కప్ 2025 రసవత్తరంగా సాగుతున్న వేళ బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక ప్రకటన చేశారు. వచ్చే నెల స్వదేశంలో వెస్టిండీస్తో జరుగబోయే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా ఎంపిక తేదీని ప్రకటించారు. ఈ సిరీస్ కోసం భారత జట్టును సెప్టెంబర్ 23 లేదా 24 తేదీల్లో ప్రకటిస్తామని వెల్లడించారు. జట్టు ఎంపిక ఆన్లైన్ మీటింగ్ ద్వారా జరుగుతుందని తెలిపారు.విండీస్తో సిరీస్ అక్టోబర్ 2 నుంచి ప్రారంభమవుతుంది. మొదటి టెస్ట్ అక్టోబర్ 2–6 మధ్యలో అహ్మదాబాద్లో.. రెండో టెస్ట్ అక్టోబర్ 10–14 మధ్యలో ఢిల్లీలో జరగాల్సి ఉంది. ఈ సిరీస్ కోసం విండీస్ జట్టును ఇదివరకే ప్రకటించారు.ఎవరెవరు ఎంపికవుతారు..?విండీస్తో సిరీస్కు ఎవరెవరు ఎంపికవుతారనే అంశంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ సిరీస్లో సత్తా చాటే భారత-ఏ ఆటగాళ్లను ఈ సిరీస్ కోసం పెద్ద పీఠ వేసే అవకాశం ఉంది. ఇప్పటికే ముగిసిన తొలి టెస్ట్ మ్యాచ్లో ధృవ్ జురెల్, దేవ్దత్ పడిక్కల్, ఎన్ జగదీసన్ సత్తా చాటారు.వీరితో పాటు ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీ, అంతకుముందు జరిగిన బుచ్చిబాటు టోర్నీల్లో సత్తా చాటిన ఆటగాళ్ల పేర్లను కూడా పరిశీలించే అవకాశం ఉంది. సీనియర్ బౌలర్ బుమ్రాను ఈ సిరీస్ కోసం పరిగణలోకి తీసుకోకపోవచ్చు. వర్క్ లోడ్ కారణంగా అతనికి విశ్రాంతి ఇస్తారని తెలుస్తుంది. ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన కరుణ్ నాయర్ను కూడా పక్కన పెడతారని సమాచారం. ఆసీస్-ఏతో సిరీస్కు భారత-ఏ జట్టుకు కెప్టెన్గా ఎంపికైన శ్రేయస్ అయ్యర్ పేరు కూడా పరిశీలనకు రావచ్చు. శ్రేయస్ ఇటీవల ఆడిన రెండు మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. కెప్టెన్గా శుభ్మన్ గిల్ కొనసాగుతాడు. సూర్యకుమార్ సేన దూకుడుఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు అన్ని విభాగాల్లో సత్తా చాటుతూ అజేయ జట్టుగా దూసుకుపోతుంది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్ల్లో జయకేతనం ఎగరవేసిన టీమిండియా.. ఇవాళ (సెప్టెంబర్ 21) గ్రూప్-4 దశలో పాకిస్తాన్తో తలపడనుంది. -
IND VS AUS: మంధన వీరోచిత శతకం వృధా.. పోరాడి ఓడిన టీమిండియా
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ 1-2 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో ఆసీస్ గెలువగా.. రెండో మ్యాచ్లో టీమిండియా గెలిచింది. ఇవాళ (సెప్టెంబర్ 20) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆసీస్ మరోసారి గెలిచి సిరీస్ను కైవసం చేసుకుంది.న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇవాళ జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ అతి భారీ స్కోర్ చేసింది. బెత్ మూనీ (75 బంతుల్లో 138; 23 ఫోర్లు, సిక్స్) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 47.5 ఓవర్లలో 412 పరుగులు చేసి ఆలౌటైంది. మూనీతో పాటు జార్జియా వాల్ (81), ఎల్లిస్ పెర్రీ (68) సత్తా చాటారు.అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ పోరాడి ఓడింది. స్మృతి మంధన (63 బంతుల్లో 125; 17 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరోచిత శతకంతో విజృంభించినా, లక్ష్యానికి 44 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మంధనతో పాటు హర్మన్ప్రీత్ కౌర్ (52), దీప్తి శర్మ (72) మెరుపు ఇన్నింగ్స్లు ఆడటంతో భారత్ 47 ఓవర్లలో 369 పరుగులు చేసి ఆలౌటైంది. మంధన, హర్మన్ క్రీజ్లో ఉన్నంత సేపు భారత్ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. వీరిద్దరూ ఔటైన తర్వాత కూడా దీప్తి శర్మ కాసేపు ఆశలు రేకెత్తించింది. అయితే భారత చివరి వరుస బ్యాటర్లు త్వరితగతిన ఔట్ కావడంతో భారత్కు ఓటమి తప్పలేదు. -
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. స్వల్ప కెరీర్లోనే..!
ఆసియా కప్ 2025లో భాగంగా ఒమన్తో నిన్న (సెప్టెంబర్ 19) జరిగిన మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ప్రయోగాలకు పోయి 188 పరుగులకే పరిమితమైంది. 56 పరుగులు చేసిన సంజూ శాంసన్ టాప్ స్కోరర్గా నిలిచాడు. వాస్తవానికి ఒమన్ లాంటి చిన్న జట్టుపై భారత్ భారీ స్కోర్ చేసుండాల్సింది. ఒమన్ బౌలర్లను తక్కువ అంచనా వేయడం, నిర్లక్ష్యంగా షాట్లు ఆడటం, అతి విశ్వాసంగా ఉండటం వల్ల భారత్ ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైంది.అనంతరం లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ఒమన్ బ్యాటర్లు కూడా భారత బౌలర్లకు దడ పుట్టించారు. ఆమిర్ కలీమ్ (64), హమ్మద్ మీర్జా (51) అనే అనామక బ్యాటర్లు అనుభవజ్ఞులైన భారత బౌలర్ల పాలిట కొరకరాని కొయ్యలయ్యారు. కాస్త అటో ఇటో అయ్యుంటే ఈ మ్యాచ్లో భారత్కు ఘోర పరాభవం ఎదురయ్యేది. నిర్దేశిత లక్ష్యానికి ఒమన్ అతి చేరువగా (167/4) వచ్చి భారత ఆటగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. అంతిమంగా భారత్ ఈ మ్యాచ్లో బయటపడి గ్రూప్ దశలో ఓటమెరుగని జట్టుగా సూపర్-4లోకి ప్రవేశించింది. భారత్ తరఫున టాప్ స్కోరర్గా నిలిచినందుకు గానూ సంజూ శాంసన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.ఈ అవార్డుతో సంజూ ఓ ఘనత సాధించాడు. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న వికెట్కీపర్ బ్యాటర్ అవతరించాడు. సంజూ 45 మ్యాచ్ల స్వల్ప కెరీర్లో 3 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచాడు. ఈ మ్యాచ్కు ముందు సంజూ దినేశ్ కార్తీక్తో (2) కలిసి సంయుక్తంగా ఈ అవార్డును పంచుకున్నాడు. భారత లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని 98 మ్యాచ్ల సుదీర్ఘ కెరీర్ కలిగి కూడా కేవలం ఒకే ఒకసారి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ధోని తర్వాత భారత్ తరఫున అత్యధిక టీ20లు ఆడిన రిషబ్ పంత్ కూడా తన 76 మ్యాచ్ల కెరీర్లో ఒకే ఒకసారి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మొత్తంగా చూస్తే.. దిగ్గజ వికెట్కీపర్ బ్యాటర్ అయిన ధోని 98 మ్యాచ్ల కెరీర్లో సాధించలేనిది, సంజూ స్వల్ప కెరీర్లోనే సాధించాడు. ఓవరాల్గా అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న వికెట్ కీపర్ బ్యాటర్ల జాబితాలో పాకిస్తాన్కు చెందిన మొహమ్మద్ రిజ్వాన్ (12) ముందున్నాడు. అతని తర్వాతి స్థానాల్లో జోస్ బట్లర్ (10), మొహమ్మద్ షెహజాద్ (9), సంజూ శాంసన్ (3) ఉన్నారు. -
IND VS AUS: చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్.. వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతున్న వన్డే మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన ఉగ్రరూపం దాల్చింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బెత్ మూనీ (75 బంతుల్లో 138) విధ్వంకర శతకంతో విరుచుకుపడటంతో 412 పరుగుల రికార్డు స్కోర్ చేయగా.. భారత్ కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మంధన 23 బంతుల్లో హాఫ్ సెంచరీ, 50 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుంది.🚨 THE HISTORIC MOMENT 🚨- Smriti Mandhana becomes the fastest Indian to score Hundred in ODI history, just 50 balls. 🥶 pic.twitter.com/xjTRsoQvgP— Johns. (@CricCrazyJohns) September 20, 2025భారత్ తరఫున పురుషుల విభాగంలో కాని, మహిళల విభాగంలో కాని మంధనదే ఫాస్టెస్ట్ సెంచరీ. పురుషుల విభాగంలో ఫాస్టెస్ట్ వన్డే సెంచరీ విరాట్ కోహ్లి పేరిట ఉంది. విరాట్ ఆస్ట్రేలియాపైనే 52 బంతుల్లో శతక్కొట్టాడు. మహిళల క్రికెట్లో ఓవరాల్గా చూస్తే మంధనది సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ. మహిళల ఫాస్టెస్ట్ వన్డే సెంచరీ రికార్డు ఆసీస్కు చెందిన మెగ్ లాన్నింగ్ (45) పేరిట ఉంది. పురుషుల వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ ఏబీ డివిలియర్స్ (31) పేరిట ఉంది.ఈ సెంచరీకి ముందు కూడా భారత్ తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు మంధన పేరిటే ఉండేది. ఆమె 70 బంతుల్లో ఒకసారి, 77 బంతుల్లో మరోసారి సెంచరీలు చేసింది. ఈ సెంచరీతో మంధన మహిళల వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ప్లేయర్గా ప్రమోట్ అయ్యింది. ఈ సెంచరీ మంధనకు వన్డేల్లో 13వది కాగా.. సుజీ బేట్స్ కూడా ఇన్నే సెంచరీలతో రెండో స్థానంలో ఉంది. మహిళల వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డు ఆసీస్కు చెందిన మెగ్ లాన్నింగ్ (15) పేరిట ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. 413 పరుగుల కష్ట సాధ్యమైన లక్ష్య ఛేదనలో భారత్ దూసుకుపోతుంది. పోరాడితే పోయేదేముందున్న చందంగా టీమిండియా ఎదురుదాడి చేస్తుంది. 20 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 204/2గా ఉంది. మంధన 120 (60 బంతుల్లో), హర్మన్ప్రీత్ (34 బంతుల్లో 52) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే 180 బంతుల్లో 209 పరుగులు చేయాలి. -
IND VS AUS: వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
స్వదేశంలో ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధన అరివీర భయంకరమైన ఫామ్లో ఉంది. ఈ సిరీస్లో తొలి వన్డేలో హాఫ్ సెంచరీ, రెండో వన్డేలో సెంచరీ చేసిన ఆమె.. ఇవాళ (సెప్టెంబర్ 20) జరుగుతున్న మూడో వన్డేలో మరో హాఫ్ సెంచరీ చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. బెత్ మూనీ (75 బంతుల్లో 138) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 412 పరుగుల రికార్డు స్కోర్ చేయగా.. భారత్ కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మంధన 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది.మహిళల వన్డే క్రికెట్లో భారత్ తరఫున ఇదే వేగవంతమైన హాఫ్ సెంచరీ. దీనికి ముందు రిచా ఘోష్ (26 బంతుల్లో) పేరిట ఈ రికార్డు ఉండేది. ఓవరాల్గా మహిళల వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో మంధన మెగ్ లాన్నింగ్, ఆష్లే గార్డ్నర్తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉంది. లాన్నింగ్, గార్డ్నర్ కూడా 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీలు చేశారు. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు విండీస్కు చెందిన డియాండ్ర డొట్టిన్ (20 బంతుల్లో) పేరిట ఉంది.413 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పోరాడితే పోయేది ఏముందన్న రీతిలో టీమిండియా ఎదురుదాడి చేస్తుంది. 16 ఓవర్ల తర్వాత భారత్ జట్టు స్కోర్ 164/2గా ఉంది. మంధన 92 పరుగుల (46 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు) వద్ద బ్యాటింగ్ కొనసాగిస్తుంది. ఆమెకు జతగా కెప్టెన్ హర్మన్ప్రీత్ (24 బంతుల్లో 40; 7 ఫోర్లు) క్రీజ్లో ఉంది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే ఇంకా 249 పరుగులు చేయాలి. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. పాకిస్తాన్ను దాటేసి సోలోగా ప్రపంచ రికార్డు
ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 19) జరిగిన మ్యాచ్లో భారత్ పసికూన ఒమన్పై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా ఓ చారిత్రక రికార్డును సొంతం చేసుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక దేశాలపై (19) విజయాలు సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్కు ముందు ఈ రికార్డు భారత్, పాకిస్తాన్ (18) పేరిట సంయుక్తంగా ఉండేది.అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక దేశాలపై విజయాలు సాధించిన జట్లుభారత్- 19 దేశాలు (166 విజయాలు)పాకిస్తాన్- 18 దేశాలు (156 విజయాలు)న్యూజిలాండ్- 17 దేశాలు (123 విజయాలు)ఆస్ట్రేలియా- 16 దేశాలు (119 విజయాలు)సౌతాఫ్రికా- 15 దేశాలు (112 విజయాలు)ఇంగ్లండ్- 15 దేశాలు (110 విజయాలు)అంతర్జాతీయ టీ20ల్లో భారత్ టెస్ట్ హోదా కలిగిన దేశాలతో పాటు చాలా అసోసియేట్ సభ్య దేశాలను మట్టికరిపించింది.టీ20ల్లో టీమిండియా విజయాలు నమోదు చేసిన దేశాలుఆస్ట్రేలియా- 32 మ్యాచ్ల్లో 20 విజయాలుశ్రీలంక- 32 మ్యాచ్ల్లో 21 విజయాలుసౌతాఫ్రికా- 31 మ్యాచ్ల్లో 18 విజయాలువెస్టిండీస్- 30 మ్యాచ్ల్లో 19 విజయాలుఇంగ్లండ్- 29 మ్యాచ్ల్లో 17 విజయాలున్యూజిలాండ్- 25 మ్యాచ్ల్లో 12 విజయాలుపాకిస్తాన్- 14 మ్యాచ్ల్లో 10 విజయాలుజింబాబ్వే- 13 మ్యాచ్ల్లో 10 విజయాలుబంగ్లాదేశ్- 17 మ్యాచ్ల్లో 16 విజయాలుఆఫ్ఘనిస్తాన్- 9 మ్యాచ్ల్లో 7 విజయాలుఐర్లాండ్- 8 మ్యాచ్ల్లో 8 విజయాలుహాంగ్కాంగ్- 1 మ్యాచ్లో 1 విజయంనమీబియా- 2 మ్యాచ్ల్లో 2 విజయాలుయూఏఈ- 2 మ్యాచ్ల్లో 2 విజయాలుస్కాట్లాండ్- 1 మ్యాచ్లో 1 విజయంనెదర్లాండ్స్- 2 మ్యాచ్ల్లో 2 విజయాలుఒమన్- 1 మ్యాచ్లో 1 విజయంనేపాల్- 1 మ్యాచ్లో 1 విజయంకెన్యా- 1 మ్యాచ్లో 1 విజయంమొత్తంగా 19 దేశాలపై 250 మ్యాచ్లు ఆడి 166 విజయాలు సాధించిన భారత్, పొట్టి ఫార్మాట్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా, అత్యధిక విజయాల శాతం (66) కలిగిన జట్టుగా చలామణి అవుతుంది.పొట్టి ఫార్మాట్లో రెండు ప్రపంచకప్లు (2007, 2024) గెలిచిన భారత్ ప్రస్తుతం ఈ ఫార్మాట్లో నంబర్ వన్ జట్టుగా (ర్యాంకింగ్స్లో) కొనసాగుతుంది. అలాగే ఈ ఫార్మాట్లో అన్ని విభాగాల్లో భారత ఆటగాళ్లే టాప్ ర్యాంక్ల్లో ఉన్నారు. బ్యాటింగ్లో అభిషేక్ శర్మ, బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి, ఆల్రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా నంబర్ వన్గా ఉన్నారు. -
Asia Cup 2025: రాణించిన సంజూ.. ఒమన్పై టీమిండియా విజయం
ఆసియా కప్-2025లో భాగంగా సెప్టెంబర్ 19న జరిగిన నామమాత్రపు మ్యాచ్లో పసికూన ఒమన్పై భారత్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.సంజూ శాంసన్ (56) అర్ద సెంచరీతో రాణించగా.. అభిషేక్ శర్మ (38), అక్షర్ పటేల్ (26), తిలక్ వర్మ (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్ (4-1-23-2), జితేన్ రామనంది (4-0-33-2), ఆమిర్ కలీమ్ (3-0-31-2) వికెట్లు తీశారు. అనంతరం 189 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగనప్పటికీ.. భారత బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొని శభాష్ అనిపించుకుంది. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది.ఓపెనర్ ఆమిర్ కలీమ్ (64), వన్ డౌన్లో వచ్చిన హమ్మద్ మీర్జా (51) అద్బుతమైన అర్ద సెంచరీలతో టీమిండియా బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. మరో ఓపెనర్, ఒమన్ కెప్టెన్ జతిందర్ సింగ్ (32) కూడా పర్వాలేదనిపించారు.ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా భారత్ సూపర్-4కు అర్హత సాధించగా.. ఒమన్ ఇదివరకే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది. సూపర్-4 దశలో భారత్ సెప్టెంబర్ 21న పాకిస్తాన్తో తలపడుతుంది. -
పంత్కు డేంజర్ బెల్స్.. జురెల్ స్ట్రాంగ్ వార్నింగ్
ధోని రిటైర్మెంట్ తర్వాత భారత టెస్ట్ జట్టు వికెట్కీపింగ్ బ్యాటర్ స్థానాన్ని రిషబ్ పంత్ సుస్థిరం చేసుకున్నాడు. మధ్యలో కేఎస్ భరత్, ఇషాన్ కిషన్కు అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. పంత్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ వికెట్కీపింగ్ బాధ్యతలు చేపట్టినా.. అది తాత్కాలికమే. భారత మేనేజ్మెంట్ రాహుల్ను టెస్ట్ల్లో స్పెషలిస్ట్ బ్యాటర్గా మాత్రమే పరిగణిస్తుంది.ప్రస్తుతానికి భారత టెస్ట్ జట్టులో పంత్ స్థానానికి ఎలాంటి ఢోకా లేదు. అయితే మధ్యమధ్యలో అతని గాయాలే మేనేజ్మెంట్ను కలవరపెడుతున్నాయి. తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో పంత్ అరివీర భయంకరమైన ఫామ్లో ఉండగా గాయపడ్డాడు. ఆ సిరీస్లో పంత్కు ప్రత్యామ్నాయ వికెట్కీపర్గా ధృవ్ జురెల్ ఉండటంతో టీమిండియాకు ఎలాంటి సమస్య తలెత్తలేదు. చివరి టెస్ట్లో జురెల్ ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించాడు.ఇంత వరకు అంతా బాగానే ఉంది. పంత్ అందుబాటులో లేనప్పుడే జురెల్కు అవకాశాలు వస్తున్నాయి. అయితే తాజాగా జురెల్ ఆస్ట్రేలియా-ఏపై చేసిన అద్భుత శతకం టీమిండియాలో పంత్ స్థానాన్ని ఛాలెంజ్ చేస్తుంది.ఆసీస్-ఏపై జురెల్ ఏదో గాలివాటంగా సెంచరీ చేయలేదు. పక్కా ప్రణాళిక ప్రకారం, భారత టెస్ట్ జట్టులో స్థానమే లక్ష్యంగా చేసిన సెంచరీలా ఉందది. గత కొంతకాలంగా జురెల్ ఆడిన ప్రతి మ్యాచ్లోనూ ఇలాంటి ప్రదర్శనలే చేస్తున్నాడు. అయితే పంత్ ఫామ్లో ఉండటంతో వాటికి పెద్దగా ప్రాధాన్యత లభించలేదు.జురెల్ తాజా సెంచరీ మాత్రం అలా కాదు. ఈ సెంచరీకి చాలా విలువ ఉంది. జురెల్ సరైన సమయంలో శతక్కొట్టి పంత్ స్థానానికి ఛాలెంజ్ విసిరాడు. త్వరలో (అక్టోబర్ 2) భారత్ స్వదేశంలో వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్కు గట్టిగా 10 రోజుల సమయం మాత్రమే ఉంది.పంత్ ఇప్పటికి గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఇలాంటి తరుణంలో సెలెక్టర్లకు జురెల్ తప్పక మొదటి ప్రాధాన్యత అవుతాడు. జురెల్ విండీస్ సిరీస్లో సాధారణ ప్రదర్శనలతో మమ అనిపిస్తే ఎలాంటి సమస్య లేదు. ఒకవేళ అతను ఆ సిరీస్లో ఎప్పటిలాగే చెలరేగితే మాత్రం పంత్కు డేంజర్ బెల్స్ మోగినట్లే.ఎందుకంటే ఇప్పటిదాకా సెలెక్టర్లకు పంత్ మాత్రమే ఛాయిస్గా ఉన్నాడు. విండీస్తో సిరీస్లో జురెల్ రాణిస్తే.. వారి ఛాయిస్ తప్పక మారుతుంది. ఎందుకంటే జురెల్ ఒకటి అరా మ్యాచ్ల్లో రాణించిన ఆటగాడు కాదు. అతను సుదీర్ఘ ఫార్మాట్లో ఎక్కడ ఆడినా అద్భుతాలే చేశాడు. ముఖ్యంగా భారత-ఏ జట్టు తరఫున అతని రికార్డు అత్యద్భుతంగా ఉంది.ఆసీస్-ఏపై సెంచరీకి ముందు జురెల్ ఇంగ్లండ్లో ఇంగ్లండ్ లయన్స్పై 94(120), 53*(53) & 52(87), ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా-ఏపై 80(186) & 68(122),భారత్లో ఇంగ్లండ్ లయన్స్పై 50(38),సౌతాఫ్రికాలో సౌతాఫ్రికా-ఏపై 69(166) స్కోర్లు చేశాడు. ఇంత ఘనమైన ట్రాక్ రికార్డుతో జురెల్ తప్పక పంత్కు ప్రత్యామ్నాయం అవుతాడు. కాబట్టి పంత్ ఇకపై జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అతని స్థానాన్ని జురెల్ ఎగరేసుకుపోవడం ఖాయం. -
మళ్లీ టీమిండియా తరఫున బరిలోకి దిగనున్న అశ్విన్
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. నవంబర్ 7 నుంచి 9 వరకు జరిగే హాంగ్కాంగ్ సిక్సస్ టోర్నీలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. అశ్విన్ టీమిండియా తరఫున బరిలోకి దిగనున్న విషయాన్ని క్రికెట్ హాంగ్కాంగ్ అధికారికంగా ప్రకటించింది. ఈ టోర్నీలో అశ్విన్తో పాటు పలువురు భారత మాజీ క్రికెటర్లు పాల్గొంటారు.ఏడేళ్ల తర్వాత పునఃప్రారంభంహాంగ్కాంగ్ సిక్సస్ టోర్నీ ఏడేళ్ల విరామం తర్వాత కిందటి ఏడాదే (2024) పునఃప్రారంభమైంది. ఈ ఎడిషన్ను మరింత రంజుగా మార్చే ఉద్దేశంతో నిర్వహకులు అశ్విన్ లాంటి స్టార్లను ఆహ్వానించారు. గతేడాది అంతర్జాతీయ రిటైర్మెంట్ తర్వాత, ఈ ఏడాది ఐపీఎల్కు కూడా గుడ్బై చెప్పిన అశ్విన్.. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఫార్మాట్ల లీగ్ల్లో పాల్గొంటానని ప్రకటించాడు. హాంగ్కాంగ్ సిక్సస్ టోర్నీతో అశ్విన్ కొత్త ప్రయాణం మొదలవుతుంది.నిబంధనలు ఎలా ఉంటాయంటే..?హాంగ్కాంగ్ సిక్సస్లో ప్రతి జట్టులో ఆరు మంది ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. ప్రతి ఆటగాడు ఒక్కో ఓవర్ బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. బ్యాటర్లు 50 పరుగుల తర్వాత రిటైర్ అయ్యేలా ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. ఈ టోర్నీకి గతంలో (టీ20లకు ముందు) చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అయితే టీ20ల రాకతో ఈ ఫార్మాట్ మరుగున పడిపోయింది. ఇప్పుడిప్పుడే ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తుంది.ఇదిలా ఉంటే, అశ్విన్ గతేడాది చివర్లో (డిసెంబర్ 18, 2024) అంతర్జాతీయ క్రికెట్కు.. ఈ ఏడాది అగస్ట్ 27న ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అశ్విన్ ఐపీఎల్ రిటైర్మెంట్ తర్వాత భారత క్రికెట్తో సంబంధాలన్నీ తెగిపోయాయి. ఇకపై అతను ప్రపంచంలో ఎక్కడైనా, ఎలాంటి టోర్నీలో అయినా పాల్గొనవచ్చు. ఈ విషయంలో అతనికి బీసీసీఐ నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. భారత క్రికెట్ సహా ఐపీఎల్తో పూర్తిగా బంధాన్ని తెంచుకున్న ఏ భారత క్రికెట్ అయినా ప్రపంచంలో తనకు ఇష్టమైన చోట క్రికెట్ ఆడుకోవచ్చు. -
IND VS AUS: శతక్కొట్టిన ధృవ్ జురెల్.. టీమిండియా భారీ స్కోర్
లక్నోలోని ఎకానా స్టేడియంలో ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్లో భారత-ఏ జట్టు భారీ స్కోర్ చేసింది. వికెట్కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ మెరుపు శతకంతో చెలరేగాడు. 115 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసిన జురెల్.. 113 పరుగుల వద్ద (132 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు) ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు.మరో ఎండ్లో జురెల్కు జోడీగా ఉన్న దేవ్దత్ పడిక్కల్ కూడా సెంచరీకి చేరువయ్యాడు. పడిక్కల్ 178 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 86 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. అంతకుముందు సాయి సుదర్శన్ (73), ఎన్ జగదీసన్ (64) అర్ద సెంచరీలతో రాణించగా.. అభిమన్యు ఈశ్వరన్ (44) పర్వాలేదనిపించాడు. భారత-ఏ ఇన్నింగ్స్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (8) ఒక్కడే విఫలమయ్యాడు.మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత-ఏ స్కోర్ 103 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 403 పరుగులుగా ఉంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 129 పరుగులు వెనుకపడి ఉంది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా-ఏ 532 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. సామ్ కొన్స్టాస్ (109), వికెట్ కీపర్ జోష్ ఫిలిప్ (123 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కగా.. క్యాంప్బెల్ కెల్లావే (88), కూపర్ కన్నోల్లీ (70), లియమ్ స్కాట్ (81) సెంచరీలకు చేరువై ఔటయ్యారు.కాగా, రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్లు, మూడు అనధికారిక వన్డేల కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్లో పర్యటిస్తుంది. -
మంధన విధ్వంసకర శతకం.. ఆసీస్ను చిత్తుగా ఓడించిన టీమిండియా
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో ఇవాళ (సెప్టెంబర్ 17) జరిగిన రెండో వన్డేలో టీమిండియా 102 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 49.5 ఓవర్లలో 292 పరుగులు చేసి ఆలౌటైంది.ఓపెనర్ స్మృతి మంధన (91 బంతుల్లో 117; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడింది. భారత ఇన్నింగ్స్లో మంధన మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. దీప్తి శర్మ (40), రిచా ఘోష్ (29), ప్రతిక రావల్ (25), స్నేహ్ రాణా (24) పర్వాలేదనిపించారు.హర్లీన్ డియోల్ (10), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (17), రాధా యాదవ్ (6), అరుంధతి రెడ్డి (4), క్రాంతి గౌడ్ (2) స్వల్ప స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో డార్సీ బ్రౌన్ 3, ఆష్లే గార్డ్నర్ 2, మెగాన్ షట్, అన్నాబెల్ సదర్ల్యాండ్, తహ్లియా మెక్గ్రాత్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో ఆసీస్ కెప్టెన్ హీలీ ఏకంగా ఎనిమిది బౌలర్లను ప్రయోగించింది.అనంతరం 293 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. క్రాంతి గౌడ్ (9.5-1-28-3), దీప్తి శర్మ (6-0-24-2), రేణుకా సింగ్ ఠాకూర్ (6.3-0-28-1), స్నేహ్ రాణా (6-0-35-1), అరుంధతి రెడ్డి (7.3-0-46-1), రాధా యాదవ్ (5-0-27-1) ధాటికి 40.5 ఓవర్లలో 190 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్లో సదర్ల్యాండ్ (45), ఎల్లిస్ పెర్రీ (44) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు.ఈ గెలుపుతో భారత్ సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. నిర్ణయాత్మక మూడో వన్డే న్యూఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 20న జరుగనుంది. -
IND VS AUS: మంధన మెరుపు శతకంతో చెలరేగినా..!
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో ఇవాళ (సెప్టెంబర్ 17) జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైంది. ఓపెనర్ స్మృతి మంధన (91 బంతుల్లో 117; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు శతకంతో చెలరేగినా భారత్ భారీ స్కోర్ చేయలేకపోయింది. చివరి వరుస బ్యాటర్లు విఫలం కావడంతో 49.5 ఓవర్లలో 292 పరుగులకే ఆలౌటైంది.ఓ దశలో భారత్ 350కి పైగా స్కోర్ చేస్తుందేమో అనిపించింది. అయితే మంధన ఔటైన తర్వాత పరిస్థితి తారుమారైంది. దీప్తి శర్మ (40), రిచా ఘోష్ (29) కాసేపు పోరాడారు. ఆతర్వాత వచ్చిన రాధా యాదవ్ (6), అరుంధతి రెడ్డి (4), క్రాంతి గౌడ్ (2) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో స్నేహ్ రాణా (24) బ్యాట్ ఝులిపించిడంతో భారత్ 290 పరుగుల మార్కునైనా తాకగలిగింది.అంతకుముందు టాపార్డర్ బ్యాటర్లు (మంధన మినహా) కూడా తడబడ్డారు. ఓపెనర్ ప్రతిక రావల్కు (25) మంచి ఆరంభం లభించినా భారీ స్కోర్గా మలచలేకపోయింది. వన్డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ (10), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (17) కూడా తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు.ఓ పక్క వికెట్లు పడుతున్నా మంధన ఏమాత్రం తగ్గకుండా ధాటిగా ఆడటం కొనసాగించింది. 32.2 ఓవర్లలో 192 పరుగుల వద్ద మంధన ఔట్ కావడంతో భారత్ స్కోర్ నెమ్మదించింది. మంధన ఔటయ్యాక భారత్ చివరి 6 వికెట్లు 53 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. మంధన దెబ్బకు తొలుత లయ కోల్పోయిన ఆసీస్ బౌలర్లు, ఆఖర్లో పుంజుకున్నారు. డార్సీ బ్రౌన్ 3, ఆష్లే గార్డ్నర్ 2, మెగాన్ షట్, అన్నాబెల్ సదర్ల్యాండ్, తహ్లియా మెక్గ్రాత్ తలో వికెట్ తీశారు. వీరిలో గార్డ్నర్ (10-1-39-2) పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లు తీయగలిగింది. ఈ మ్యాచ్లో ఆసీస్ కెప్టెన్ హీలీ ఏకంగా ఎనిమిది బౌలర్లను ప్రయోగించింది.అనంతరం 293 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్కు రెండో ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జార్జియా వాల్ను రేణుకా సింగ్ డకౌట్ చేసింది. రేణుకా బౌలింగ్కు ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడిన వాల్ 5 బంతులు ఎదుర్కొన్న తర్వాత క్లీన్ బౌల్డ్ అయ్యింది. భారత్కు ఐదో ఓవర్ ఐదో బంతికి మరో బ్రేక్ లభించింది. మరో ఓపెనర్ అలైస్సా హీలీని (9) క్రాంతి గౌడ్ బోల్తా కొట్టించింది. దీంతో ఆసీస్ 5 ఓవర్లలో 12 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్లో ఆసీస్ గెలవాలంటే 45 ఓవర్లలో మరో 281 పరుగులు చేయాలి. కాగా, ఈ సిరీస్లోని తొలి వన్డేలో గెలిచి ఆసీస్ 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
IND VS AUS: రికార్డు శతకం.. చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో ఇవాళ (సెప్టెంబర్ 17) జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధన చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగగా.. మంధన మెరుపు శతకంతో చెలరేగింది. కేవలం 77 బంతుల్లోనే శతక్కొట్టి, భారత్ తరఫున వన్డేల్లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేసింది. భారత్ తరఫున ఫాస్టెస్ట్ రికార్డు కూడా మంధన పేరిటే ఉంది. ఇదే ఏడాది ఐర్లాండ్పై ఆమె 70 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసింది.తాజా సెంచరీ మంధనకు వన్డేల్లో 12వది. ఈ శతకంతో ఆమె ప్రపంచ రికార్డును సమం చేసింది. మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఓపెనింగ్ బ్యాటర్గా సూజీ బేట్స్ (న్యూజిలాండ్), ట్యామీ బేమౌంట్ (ఇంగ్లండ్) సరసన చేరింది. మంధన, బేట్స్, బేమౌంట్ ఓపెనర్లుగా తలో 12 శతకాలు చేశారు. అయితే బేట్స్, బేమౌంట్ కంటే మంధననే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించింది. బేట్స్కు 130, బేమౌంట్కు 113 ఇన్నింగ్స్లు అవసరం కాగా.. మంధన తన 106వ ఇన్నింగ్స్లోనే 12 సెంచరీల మార్కును తాకింది.చరిత్ర సృష్టించిన మంధనతాజా సెంచరీ పూర్తి చేసిన తర్వాత మంధన ఓ విభాగంలో చరిత్ర సృష్టించింది. మహిళల క్రికెట్కు సంబంధించి, ఓ క్యాలెండర్ ఇయర్లో (వన్డేల్లో) అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా అవతరించింది. గతంలో ఈ రికార్డు దీప్తి శర్మ పేరిట ఉండేది. దీప్తి 2017లో 19 ఇన్నింగ్స్ల్లో సెంచరీ, 7 అర్ద సెంచరీల సాయంతో 787 పరుగులు చేయగా.. మంధన ఈ ఏడాది 13 ఇన్నింగ్స్ల్లనే 3 శతకాలు, 4 అర్ద శతకాల సాయంతో 803 పరుగులు చేసింది.చరిత్రలో తొలి క్రికెటర్తాజా సెంచరీతో మంధన మరో చారిత్రక రికార్డును కూడా సొంతం చేసుకుంది. మహిళల వన్డేల్లో రెండు వేర్వేరు క్యాలెండర్ ఇయర్స్లో 3కు పైగా సెంచరీలు చేసిన తొలి బ్యాటర్గా సరికొత్త చరిత్ర సృష్టించింది. 2024లో 4 సెంచరీలు చేసిన మంధన.. ఈ ఏడాది ఇప్పటికే 3 సెంచరీలు పూర్తి చేసింది.తాజా శతకంతో మంధన రెండు వేర్వేరు దేశాలపై (ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా) మూడు వన్డే సెంచరీలు చేసిన తొలి భారత ప్లేయర్గానూ చరిత్ర సృష్టించింది. ఈ సెంచరీతో మంధన మహిళల వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో ట్యామీ బేమౌంట్తో పాటు మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో మెగ్ లాన్నింగ్ (15) అగ్రస్థానంలో ఉండగా.. సూజీ బేట్స్ (13), బేమౌంట్ (12), మంధన (12) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు.ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లో మంధన 91 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 117 పరుగులు చేసి ఔటైంది. తొలి అర్ద సెంచరీకి 45 బంతులు తీసుకున్న మంధన, ఆతర్వాత అర్ద సెంచరీని కేవలం 32 బంతుల్లోనే పూర్తి చేసింది. హాఫ్ సెంచరీ మార్కును సిక్సర్తో, సెంచరీ మార్కును బౌండరీతో అందుకుంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 38 ఓవర్ల తర్వాత 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. మంధన (117), ప్రతిక రావల్ (25), హర్లీన్ డియోల్ (10), హర్మన్ప్రీత్ (17) ఔట్ కాగా.. రిచా ఘోష్ (19), దీప్తి శర్మ (20) క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్నర్ 2, తహ్లియా మెక్గ్రాత్ ఓ వికెట్ తీశారు. ఈ సిరీస్లోని తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించిన విషయం తెలిసిందే. -
మరోసారి అగ్రపీఠాన్ని అధిరోహించిన టీమిండియా స్టార్ ప్లేయర్
భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధన ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానానికి చేరింది. గత వారం ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉండిన మంధన.. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో రాణించి (58 బంతుల్లో 63; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) 7 అదనపు రేటింగ్ పాయింట్లను సాధించింది. తద్వారా తన పాయింట్ల సంఖ్యను 735కు పెంచుకుని టాప్ ర్యాంక్కు చేరింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ను కిందకు దించి, కెరీర్లో నాలుగో సారి అగ్రపీఠాన్ని అధిరోహించింది. 2019లో తొలిసారి టాప్ ర్యాంక్ను కైవసం చేసుకున్న మంధన.. ఈ ఏడాది జూన్, జులైల్లో కూడా స్వల్ప కాలం నంబర్ వన్ వన్డే బ్యాటర్గా కొనసాగింది. ప్రస్తుతం మంధనకు రెండో స్థానంలో ఉన్న బ్రంట్కు కేవలం నాలుగు రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. ఈ వారం ఆసీస్తో జరుగబోయే మరో రెండు వన్డేల్లో మంధన ఇదే ఫామ్ను కొనసాగిస్తే.. రేటింగ్ పాయింట్లను మరింత మెరుగుపర్చుకుని అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకునే అవకాశం ఉంది. మంధన కీలక సమయంలో నంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. ఈ నెలాఖరు నుంచి (సెప్టెంబర్ 30) భారత్, శ్రీలంకల్లో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఇలాంటి తరుణంలో నంబర్ వన్ స్థానానికి ఎగబాకడం ఆమెకు మానసిక స్తైర్యాన్ని ఇస్తుంది. తాజా ర్యాంకింగ్స్లో మంధనతో పాటు మరో ఇద్దరు భారత బ్యాటర్లు కూడా లబ్ది పొందారు. ప్రతీక రావల్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 42వ స్థానానికి.. హర్లీన్ డియోల్ 5 స్థానాలు మెరుగుపర్చుకుని 43వ స్థానానికి ఎగబాకారు. మిగతా భారత బ్యాటర్లలో హర్మన్ప్రీత్ 12వ స్ధానంలో.. జెమీమా రోడిగ్రెజ్ 15 స్థానంలో, దీప్తి శర్మ 24వ స్థానంలో, రిచా ఘోష్ 37 స్థానంలో ఉన్నారు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఇంగ్లండ్కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్ టాప్ ర్యాంక్లో కొనసాగుతుండగా.. భారత స్పిన్నర్ స్నేహ్ రాణా ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని 16వ స్థానానికి ఎగబాకింది. మరో భారత బౌలర్ దీప్తి శర్మ 3 స్థానాలు దిగజారి 7వ ర్యాంక్ను పడిపోయింది. మిగతా భారత బౌలర్లలో రేణక సింగ్ ఠాకూర్ 26, క్రాంతి గౌడ్ 62, అరుంధతి రెడ్డి 65, పూజా వస్త్రాకర్ 77, శ్రీ చరణి 83, ప్రియా మిశ్రా 85, టైటాస్ సాధు 91, సైమా ఠాకోర్ 96 స్థానాల్లో ఉన్నారు.ఆల్రౌండర్ల విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన యాష్ గార్డ్నర్ టాప్ ప్లేస్ను నిలబెట్టుకోగా.. హేలీ మాథ్యూస్, మారిజన్ కాప్ టాప్-3లో ఉన్నారు. భారత స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ 4వ స్థానంలో ఉంది. -
సూర్య బర్త్డే గిఫ్ట్ అదిరిపోయిందిగా.. దేవిషాతో కలిసి సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
Team India: హ్యాండ్ షాక్ గొడవేంటి గురూ!!
-
భారత్-పాక్ మ్యాచ్ లో హ్యాండ్ షేక్ వివాదం
-
Asia Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా..?
ఆసియా కప్ 2025లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 14) జరుగబోయే భారత్, పాకిస్తాన్ మ్యాచ్పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ మ్యాచ్ను బహిష్కరించాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు ఈ మ్యాచ్కు ససేమిరా అంటున్నాయి. మ్యాచ్ చూడకుండా టీవీలు ఆఫ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.దేశవాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఈ మ్యాచ్ రద్దుకు పిలుపునిచ్చాయి. మ్యాచ్ ప్రారంభానికి మరికొద్ది గంటల సమయమే ఉన్న నేపథ్యంలో మ్యాచ్ బహిష్కరణ పిలుపులు తారాస్థాయికి చేరాయి. సోషల్మీడియా #BoycottIndvsPak హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ప్రస్తుత సందిగ్ద పరిస్థితుల్లో మ్యాచ్ జరుగుతోందో లేదోనని యావత్ క్రీడా ప్రపంచం ఆసక్తిగా గమనిస్తుంది.ఈ మ్యాచ్లో దుబాయ్లోని దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. మ్యాచ్ ప్రారంభానికి మరో 8 గంటలు ఉన్న నేపథ్యంలో ఏమైనా జరగవచ్చని (రద్దు) నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మెజార్జీ శాతం భారతీయులకు ఈ మ్యాచ్ జరగడం అస్సలు ఇష్టం లేదు. కొందరు ఈ మ్యాచ్ రద్దు చేయాలని సుప్రీం కోర్టును సైతం ఆశ్రయించారు. అయితే క్రికెట్ను రాజకీయాలతో ముడిపెట్టలేమని పలువురు వేసిన పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది.కాగా, ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ ఆధారిత ఉగ్రమూకలు ఈ దాడులకు తెగబడ్డాయి. ఇందుకు భారత్ కూడా ధీటుగా బదులిచ్చింది. ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్లో తలదాచుకున్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. భారత్ కొట్టిన ఈ దెబ్బకు పాక్ విలవిలలాడిపోయింది.అపరేషన్ సిందూర్ తర్వాత భారత్ ఏ విషయంలోనూ పాక్తో సంబంధాలు పెట్టుకోకూడదని నిర్ణయించుకుంది. ఇందుకు అంతర్జాతీయ వేదికలపై జరిగే మేజర్ క్రీడా పోటీలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. ఈ క్రమంలోనే భారత్ బహుళ దేశాలు పాల్గొంటున్న ఆసియా కప్లో పాక్తో మ్యాచ్కు సిద్దమైంది. అయితే ఈ మ్యాచ్ రద్దుకు భారత్లో ఆందోళనలు ఉధృతమవడంతో సందిగ్దత నెలకొంది. -
Team India: వాళ్ళు లేక విల విల! అది రో-కో రేంజ్
-
ఆసియా కప్ టీ-20లో టీమిండియా బోణి
-
రోహిత్ శర్మకు సంబంధించి బిగ్ అప్డేట్
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరుగబోయే వన్డే సిరీస్లో హిట్మ్యాన్ పాల్గొనడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి రోహిత్ స్వయంగా క్లూ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ క్యాంప్లో ట్రైనింగ్ మొదలుపెట్టిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Rohit Sharma (@rohitsharma45)ఈ ఫోటోల్లో రోహిత్ ప్యాడింగ్ చేసుకుంటూ, స్ప్రింట్ చేస్తూ కనిపించాడు. రోహిత్ బరువు కూడా చాలా తగ్గినట్లు కనిపిస్తున్నాడు. పలు నివేదికల ప్రకారం హిట్మ్యాన్ ఇటీవలికాలంలో 8 కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తుంది. తాజాగా బీసీసీఐ నిర్వహించిన యో-యో టెస్ట్లో అతను 19.4 స్కోర్ సాధించాడని సమాచారం. రోహిత్ ఫిట్నెస్పై ఈ స్థాయిలో దృష్టి పెట్టడం ఖచ్చితంగా ఆస్ట్రేలియా పర్యటన కోసమేనన్న సంకేతాన్నిస్తుంది.టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించి, వన్డేల్లో కొనసాగుతానని స్పష్టంగా ప్రకటించినా.. రోహిత్ వన్డే భవితవ్యం అంత క్లారిటీగా లేదు. కొందరు రోహిత్ 2027 వన్డే వరల్డ్కప్ వరకు ఆడతాడని అంటుంటే, ఆస్ట్రేలియా పర్యటనే లాస్ట్ అని కొందరు, ఆస్ట్రేలియా సిరీస్ కూడా ఆడడని ఇంకొందరు అంటున్నారు.ఈ ప్రచారాల నేపథ్యంలో రోహిత్ ఫిట్గా కనిపిస్తూ ప్రాక్టీస్ మొదలుపెట్టడం, వన్డేల్లో కొనసాగాలనుకున్న అతని సంకల్పాన్ని సూచిస్తుంది. రోహిత్ రాక కోసం అతని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. హిట్మ్యాన్ చివరిగా ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా జెర్సీలో కనిపించాడు.టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన అక్టోబర్ 19న మొదలవుతుంది. ఈ పర్యటనలో భారత్ 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. తొలుత వన్డేలు, ఆతర్వాత టీ20 సిరీస్ జరుగనున్నాయి. అక్టోబర్ 19 (పెర్త్), 23 (అడిలైడ్), 25 (సిడ్నీ) తేదీల్లో వన్డేలు.. 29 (కాన్బెర్రా), 31 (మెల్బోర్న్), నవంబర్ 2 (హోబర్ట్), 6 (గోల్డ్ కోస్ట్), 8 (బ్రిస్బేన్) తేదీల్లో టీ20లు జరుగనున్నాయి. -
‘యువీ, సెహ్వాగ్ వంటి వారే లేరు.. బుమ్రాను తీర్చిదిద్దండి’
టీమిండియా లోయర్ ఆర్డర్ గురించి భారత మాజీ క్రికెటర్, యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ (Yograj Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బౌలర్లందరినీ ఆల్రౌండర్లుగా తీర్చిదిద్దాలని.. వారిని టెయిలెండర్లు అని పిలవద్దని మేనేజ్మెంట్కు సూచించాడు. కాగా భారత జట్టు చివరగా ఇంగ్లండ్లో పర్యటించిన విషయం తెలిసిందే.శుబ్మన్ గిల్ (Shubman Gill) టెస్టు జట్టు నయా సారథిగా పగ్గాలు చేపట్టగా.. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్తో ఐదు టెస్టులు ఆడింది. ఆఖరి టెస్టు ఆఖరి రోజు వరకు పోరాడి సిరీస్ను 2-2తో సమం చేసుకుని గట్టెక్కింది. ఇక ఇంగ్లండ్లో భారత లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది.యువీ, సెహ్వాగ్ వంటి వారే లేరుఓవైపు ఇంగ్లండ్ బౌలర్లు సైతం హాఫ్ సెంచరీలతో అలరిస్తే మనవాళ్లలో ఒకరిద్దరు మినహా మిగతా అంతా ఇలా వెళ్లి అలా వచ్చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో యోగ్రాజ్ సింగ్ మాట్లాడుతూ.. భారత జట్టుకు ప్రస్తుతం తన కుమారుడు యువరాజ్ సింగ్, వీరేందర్ సెహ్వాగ్ వంటి పూర్తిస్థాయి ఆల్రౌండర్ల అవసరం ఉందన్నాడు.‘‘భారత జట్టులో ప్రస్తుతం ఉన్న సమస్య లోయర్ ఆర్డర్. బౌలర్లను ఆల్రౌండర్లుగా తీర్చిదిద్దడానికి మనవాళ్లు ఆసక్తి చూపడం లేదు. కపిల్ దేవ్ నెట్స్లో ఎప్పుడూ బ్యాటింగ్ చేయలేదు. అప్పుడు నేను.. ‘కపిల్తో బ్యాటింగ్ చేయించండి’ అంటూ గొంతు చించుకునేవాడిని.బుమ్రాను తీర్చిదిద్దండిఆ రోజుల్లో కపిల్ పదకొండో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 70- 80 పరుగులు స్కోరు చేసేవాడు. ఈరోజుల్లోనూ బుమ్రా వంటి బౌలర్లను టెయిలెండర్లు అని పిలవవద్దు. వారిని మెరుగైన ఆల్రౌండర్లుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది.ప్రాక్టీస్ సెషన్లో కనీసం ఒకటి నుంచి రెండు గంటల పాటు వారితో బ్యాటింగ్ చేయించాలి. గతం తాలుకు చేదు అనుభవాల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే అత్యుత్తమ మార్గం.టెయిలెండర్ల తప్పేం లేదుఒకవేళ మన లోయర్ ఆర్డర్ బ్యాటర్లు బాగా ఆడి ఉంటే లార్డ్స్ టెస్టులో ఇరవై రెండు పరుగుల తేడాతో ఓడిపోయేవాళ్లమే కాదు. అయినా ఇందులో టెయిలెండర్ల తప్పేం లేదు. ఎందుకంటే వారికి బ్యాట్తో ప్రాక్టీస్ చేసేందుకు తగినంత సమయం ఇవ్వలేదు’’ అని యోగ్రాజ్ సింగ్ ఇన్సైగ్స్పోర్ట్తో చెప్పుకొచ్చాడు.యువీ ఇలా.. వీరూ అలా..ఇదిలా ఉంటే.. యువరాజ్ సింగ్ 2000- 2017 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్.. 40 టెస్టుల్లో 1900, 304 వన్డేల్లో 9924, 58 అంతర్జాతీయ టీ20లలో 1177 పరుగులు సాధించాడు.అదే విధంగా.. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన యువీ ఖాతాలో టెస్టుల్లో తొమ్మిది, వన్డేల్లో 111, టీ20లలో 28 వికెట్లు ఉన్నాయి. ఇక అంతర్జాతీయ స్థాయిలో వీరేందర్ సెహ్వాగ్ 1999 నుంచి 2013 వరకు టీమిండియాకు ఆడాడు.మొత్తంగా 104 టెస్టుల్లో 8586, 251 వన్డేల్లో 8273, 19 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లలో 394 పరుగులు సాధించాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్. అంతేకాదు.. కుడిచేతి వాటం స్పిన్నర్ అయిన వీరూ.. టెస్టుల్లో 40, వన్డేల్లో 96 వికెట్లు తీశాడు.చదవండి: పక్షవాతం.. నొప్పి భరించలేకపోయా: టీమిండియా స్టార్ క్రికెటర్ -
పక్షవాతం.. నొప్పి భరించలేకపోయా: టీమిండియా స్టార్ క్రికెటర్
గత కొన్నాళ్లుగా భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైన పేరు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer). పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మంచి ఫామ్లో ఉన్నా ఆసియా కప్-2025 ఆడే టీమిండియాలో అతడికి చోటు దక్కకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇదిలా ఉంటే.. 2022-23 మధ్య కాలంలో శ్రేయస్ ఇంతకంటే గడ్డు పరిస్థితులే ఎదుర్కొన్నాడు.క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డాడన్న కారణంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శ్రేయస్ సెంట్రల్ కాంట్రాక్టును రద్దు చేసింది. అదే సమయంలో ఫిట్నెస్ సమస్యలు కూడా అతడిని వెంటాడాయి. నాటి పరిస్థితి గురించి శ్రేయస్ అయ్యర్ తాజాగా మాట్లాడుతూ విస్మయకర విషయాలు వెల్లడించాడు.పక్షవాతం వచ్చింది‘‘ఆ సమయంలో నేను నొప్పితో ఎంతగా విలవిల్లాడానో ఎవరికీ తెలియదు. నా కాలుకు పక్షవాతం వచ్చింది. వెన్నెముకకు సర్జరీ జరిగిన తర్వాత.. నడుములో రాడ్డుతో ఎలా మేనేజ్ చేసుకున్నానో నాకే తెలియదు. ఆ ప్లేస్లో ఉన్న నరం కూడా దెబ్బతిన్నది.అదెంతో ప్రమాదకరమని వైద్యులు చెప్పారు. ఆ సమయంలో భరించలేని నొప్పి. నా కాలి చిటికిన వేలు వరకు నొప్పి పాకింది. నిజంగా అదొక భయంకర అనుభవం’’ అని జీక్యూ ఇండియాకు శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.కాగా గాయం నుంచి కోలుకున్న తర్వాత శ్రేయస్ అయ్యర్ ముంబై తరఫున దేశవాళీ క్రికెట్లో తనను తాను నిరూపించుకున్నాడు. అదే విధంగా ఐపీఎల్-2024లో కోల్కతా నైట్ రైడర్స్కు కెప్టెన్గా టైటిల్ అందించాడు. ఈ క్రమంలోనే టీమిండియాలో పునరాగమనం చేయగా.. బీసీసీఐ అతడి సెంట్రల్ కాంట్రాక్టును పునరుద్ధరించింది. వన్డే వరల్డ్కప్-2023లో ఆడిన శ్రేయస్ అయ్యర్ భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.వాటిని మాత్రమే నియంత్రించగలనుఅదే విధంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియాను విజేతగా నిలపడంలో ముఖ్య భూమిక అతడిదే. ఇక ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా, బ్యాటర్గా శ్రేయస్ అయ్యర్ గొప్పగా రాణించాడు. జట్టును ఫైనల్కు చేర్చాడు. అయినప్పటికీ ఆసియా టీ20 కప్ ఆడే భారత జట్టులో మాత్రం అతడికి చోటు దక్కకపోవడం గమనార్హం.ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘నా ఆధీనంలో ఉన్న వాటిని మాత్రమే నేను నియంత్రించగలను. నా నైపుణ్యాలు, బలాలను మరింత మెరుగుపరచుకోవడం మాత్రమే నాకు తెలిసిన పని. అవకాశం వచ్చినప్పుడు రెండు చేతులతో దానిని అందిపుచ్చుకునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను’’ అని శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేశాడు.చదవండి: ‘యువీకి అప్గ్రేడ్ వర్షన్ అతడు.. గిల్కు కూడా మంచి ఛాన్స్’ -
గిల్ కేసులో పృథ్వీ షాకు 100 రూపాయల జరిమానా
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సప్నా గిల్ దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసులో టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షాకు ముంబైలోని ఓ సెషన్స్ కోర్టు 100 రూపాయల జరిమానా విధించింది. ఈ కేసులో షా తన సమాధానాన్ని కోర్టులో దాఖలు చేయకపోవడంతో న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. నామమాత్రపు జరిమానాతో చివరి అవకాశం ఇస్తూ.. తదుపరి విచారణను డిసెంబర్ 16కి వాయిదా వేశారు.కేసు నేపథ్యం (సప్నా ఫిర్యాదు ప్రకారం)..2023 ఫిబ్రవరి 15న, అంధేరీలోని (ముంబై) ఓ పబ్ వద్ద పృథ్వీ షా, సప్నా గిల్ మధ్య ఘర్షణ జరిగింది. సప్నా స్నేహితుడు షాను సెల్ఫీలు కోరగా మొదట అంగీకరించాడు. ఆతర్వాత సదరు వ్యక్తి కాస్త అతిగా ప్రవర్తించడంతో షా సెల్పీ ఇచ్చేందుకు నిరాకరించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.పక్కనే ఉన్న సప్నా జోక్యం చేసుకుని సర్ది చెప్పబోగా, షా ఆమె స్నేహితుడి ఫోన్ను లాక్కొని విసిరికొట్టాడు. అంతటితో ఆగకుండా సప్నాను లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని సప్నా దగ్గర్లోని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా వారు పట్టించుకోలేదు. దీంతో ఆమె అంధేరి మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది. 2024 ఏప్రిల్లో మేజిస్ట్రేట్ కోర్టు ప్రాథమిక విచారణకు ఆదేశిస్తూ, సాంతాక్రూజ్ పోలీస్ స్టేషన్కు కేసు అప్పగించింది.సప్నా లాయర్ ఏమంటున్నాడంటే..షా ఇప్పటివరకు కోర్టు సమన్లను నిర్లక్ష్యం చేస్తూ విచారణను ఆలస్యం చేస్తున్నాడని సప్నా గిల్ తరఫు న్యాయవాది అలీ కాశిఫ్ ఖాన్ ఆరోపించారు. ఇది అతని స్థిరమైన ప్రవర్తన అని, కోర్టు ప్రక్రియను ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్నాడని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు.షా దేశవాలీ కెరీర్ విషయానికొస్తే.. ఇటీవలే ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన షా.. ఆ జట్టు తరఫున తొలి మ్యాచ్లోనే సెంచరీతో (బుచ్చిబాబు టోర్నీ) మెరిశాడు. ప్రస్తుతం అతను టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. -
‘ధోని రాకతో తీవ్రమైన ఒత్తిడి.. నేనో ఊసరవెళ్లిలా మారిపోయా’
టీమిండియాలోకి వచ్చిన మూడేళ్ల కాలంలోనే కెప్టెన్గా ఎదిగాడు మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni). 2004లో బంగ్లాదేశ్తో వన్డే సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ జార్ఖండ్ డైనమైట్.. 2007లో సారథిగా పగ్గాలు చేపట్టాడు. ఆ తర్వాత అతడు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.దశాబ్దకాలం భారత జట్టు కెప్టెన్గా కొనసాగిన ధోని.. ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడిగా, మేటి ఫినిషర్గా గుర్తింపు పొందాడు. అంతేకాదు భారత్కు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఏకైక సారథి కూడా అతడే!ఓ కొత్త ‘వేషం’.. ఊసరవెళ్లిలా మారిపోయాఅయితే, జాతీయ జట్టులోకి ధోని రాకతో టీమిండియాలో వికెట్ కీపర్గా చోటు కోల్పోయిన ఆటగాళ్లలో దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) ఒకడు. అప్పట్లో తనపై ఒత్తిడి తీవ్రంగా ఉండేదని.. ఎప్పటికప్పుడు తాను ఓ కొత్త ‘వేషం’తో.. ఊసరవెళ్లిలా మారిపోయానని డీకే తాజాగా గుర్తుచేసుకున్నాడు.‘‘అలాంటి వ్యక్తి ఓ జట్టులోకి వచ్చినపుడు మన మీద మనకే సందేహాలు వస్తాయి. నాలోని అత్యుత్తమ ఆటను వెలికితీయాలనే కసి పెరుగుతుంది. అప్పుడే నేను ఓ ఊసరవెళ్లిలా మారిపోయాను.తీవ్రమైన ఒత్తిడిఒకవేళ ఓపెనింగ్ స్థానం ఖాళీగా ఉందంటే.. తమిళనాడు జట్టులో ఓపెనర్గా అవకాశం ఇస్తారా సర్ అని మా వాళ్లను అడిగేవాడిని. ఓపెనర్గా వచ్చి పరుగులు సాధించేందుకు కృషి చేసేవాడిని. అదే విధంగా.. టీమిండియాలో మిడిలార్డర్లో స్థానం ఖాళీగా ఉందంటే.. అక్కడ బ్యాటింగ్ చేసేందుకు ప్రయత్నించేవాడిని. అసలు నాకపుడు ఏం కావాలో నాకే అర్థమయ్యేది కాదు. తీవ్రమైన ఒత్తిడి.ధోని జట్టులోకి రాకముందు అతడి ఆట తీరు గురించి నాకు తెలియదు. అయితే, కెన్యాతో ‘ఎ’ సిరీస్లో ఓ ఆటగాడు అదరగొట్టారని అంతా అతడి గురించే మాట్లాడుకుంటున్నారు. బంతిని బలంగా బాదడంలో అతడు దిట్ట అని చెప్పారు.గ్యారీ సోబర్స్తో పోలికకొంతమంది ఏకంగా భారీ సిక్సర్లు బాదే గ్యారీ సోబర్స్తో పోల్చారు. ఎంఎస్ ధోని బ్యాటింగ్ టెక్నిక్ విభిన్నంగా ఉంటుంది. అలాంటి ఫినిషర్ మరొకరు లేరంటూ అప్పట్లోనే చర్చ నడిచేది’’ అని 40 ఏళ్ల దినేశ్ కార్తిక్ ఇండియా టుడే ఎన్క్లేవ్ సౌత్-2025లో గత జ్ఞాపకాలు నెమరువేసుకున్నాడు.కోచ్గా మారిన డీకేకాగా 2004 నుంచి 2022 వరకు దినేశ్ కార్తిక్ టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. తన కెరీర్ మొత్తంగా ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 94 వన్డేలు, 60 అంతర్జాతీయ టీ20లు, 26 టెస్టు మ్యాచ్లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 1752, 686, 1025 పరుగులు సాధించాడు.ఇక ఐపీఎల్లో 257 మ్యాచ్లు ఆడిన డీకే 4842 పరుగులు చేశాడు. గతేడాది క్యాష్రిచ్ లీగ్కు కూడా గుడ్బై చెప్పిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ కోచ్గా ఉన్నాడు. ఈ ఏడాది ఆర్సీబీ తమ మొదటి ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన విషయం తెలిసిందే. మరోవైపు.. డీకే విదేశీ లీగ్ క్రికెట్లో ఆడుతుండటం విశేషం.చదవండి: Ro- Ko: ‘ఎవరూ తోపులు కారు.. నేనే దేవుడిని అనుకుంటే ఇలాగే ఉంటుంది’ -
ఆసుపత్రిలో రోహిత్ శర్మ.. ఆందోళనలో అభిమానులు
భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ నిన్న (సెప్టెంబర్ 8) రాత్రి ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. రోహిత్ ఆసుపత్రికి ఎందుకు వెళ్లాడోనని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ROHIT SHARMA AT THE KOKILABEN HOSPITAL IN MUMBAI. (Pallav Paliwal).pic.twitter.com/sT42YFD5Ak— Tanuj (@ImTanujSingh) September 8, 2025కొందరేమో రోహిత్కు బాగలేదని అంటుంటే, మరికొందరేమో ఆసుపత్రిలో ఉన్న సన్నిహితులను పరామర్శించేందుకు వెళ్లాడని అంటున్నారు. మొత్తంగా ఈ అంశంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సోషల్మీడియాలో నిరాధార ప్రచారం జరుగుతుంది.అయితే రోహిత్ ఆసుపత్రిలోకి ప్రవేశించే సమయంలో వ్యవహరించిన తీరు మాత్రం కాస్త ఆందోళనకరంగా ఉంది. ఎప్పుడూ సరదాగా కనిపించే హిట్మ్యాన్ ఎందుకో కాస్త భిన్నంగా కనిపించాడు. మీడియా ప్రశ్నలకు స్పందించకుండా హడావుడిగా ఆసుపత్రి లోపలికి వెళ్లిపోయాడు. రోహిత్వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన కొందరు జర్నలిస్ట్లకు ఆసుపత్రి సిబ్బంది అడ్డుకున్నారు.రోహిత్ అసౌకర్యంగా (శారీకంగా) కనిపించకపోయినా రాత్రి వేళ అసుపత్రికి వెళ్లడం ఊహాగానాలకు తావిస్తుంది. రోహిత్ ఇటీవలే బీసీసీఐ ఆథ్వర్యంలో నిర్వహించిన Yo-Yo టెస్ట్ను విజయవంతంగా పూర్తి చేశాడు. రోహిత్ ఆసుపత్రి సందర్శన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.38 ఏళ్ల రోహిత్ ఇటీవలే టెస్టులు, గతేడాది టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి, వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతను 2027 వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా ఫిట్నెస్ను మెరుగుపరచేందుకు ప్రయత్నిస్తున్నాడు. రోహిత్ త్వరలో ఆస్ట్రేలియాతో జరుగబోయే వన్డే సిరీస్లో ఆడే అవకాశం ఉంది. రోహిత్ లాగే టెస్ట్లకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లి కూడా ఆస్ట్రేలియా సిరీస్లో బరిలోకి దిగే అవకాశం ఉంది. వీరిద్దరి రాక కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
ఆసియా కప్లో సెహ్వాగ్
ఆసియా కప్ 2025 కోసం టోర్నీ బ్రాడ్కాస్టర్ సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ బహుభాషా కామెంటరీ ప్యానెల్ను ప్రకటించింది. ఈ ప్యానెల్లో వరల్డ్ ఫీడ్ (ఇంగ్లీష్) అందించడానికి సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, సంజయ్ మంజ్రేకర్, రాబిన్ ఉతప్ప, వకార్ యూనిస్, వసీం అక్రమ్, బాజిద్ ఖాన్, రస్సెల్ ఆర్నాల్డ్, సైమన్ డౌల్ ఎంపిక చేయబడ్డారు.హిందీ ప్యానెల్లో వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, అజయ్ జడేజా, అభిషేక్ నాయర్, సబా కరీమ్ సభ్యులుగా ఉన్నారు. తమిళ ప్యానెల్లో భరత్ అరుణ్, WV రామన్.. తెలుగు వ్యాఖ్యాతలుగా వెంకటపతి రాజు, వేణుగోపాల్ రావు తదితరులు వ్యవహరిస్తారు.ప్రత్యేక ఆకర్షణగా వీరూకామెంటరీ ప్యానెల్ మొత్తంలో భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడు. సెహ్వాగ్ తన స్పష్టమైన అభిప్రాయాలు, హాస్యంతో కూడిన వ్యాఖ్యానంతో అభిమానులను మంత్రముగ్దుల్ని చేస్తాడు. ఆటగాడిగా ఏరకంగా మెరుపులు మెరిపించాడో, వ్యాఖ్యానంతోనూ అలాగే కట్టిపడేస్తాడు.కాగా, ఇవాల్టి నుంచే (సెప్టెంబర్ 9)ప్రారంభం కాబోయే ఆసియా కప్లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ, ఆఫ్ఘానిస్తాన్, యూఏఈ, ఒమన్, హాంకాంగ్ జట్లు పోటీపడనున్నాయి. భారత్, పాకిస్తాన్, ఒమన్, యూఏఈ గ్రూప్-బిలో ఉండగా.. మిగతా జట్లు గ్రూప్-ఏలో ఉన్నాయి. ఇవాళ జరుగబోయే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్, హాంగ్కాంగ్ తలపడనున్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్ను సెప్టెంబర్ 10న UAEతో ఆడనుంది. ఈ టోర్నీ మొత్తంలో ప్రత్యేక మ్యాచైన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరుగనుంది.ఈ టోర్నీలో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నాడు. జట్టులో శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్, జస్ప్రీత్ బుమ్రా లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. -
పంత్కు సంబంధించి బిగ్ అప్డేట్
టీమిండియా వికెట్కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్కు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. ఇటీవల (జులై 23న) ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా గాయపడిన పంత్.. నెలకు పైగా ఇంగ్లండ్లోనే ట్రీట్మెంట్ తీసుకుని కొద్ది రోజుల కిందటే భారత్కు తిరిగి వచ్చాడు. ముంబైలో వైద్య నిపుణులను సంప్రదించిన అనంతరం, వారి సలహా మేరకు త్వరలోనే నేషనల్ క్రికెట్ అకాడమీ (CoE) పునరావాస శిబిరంలో చేరనున్నాడు.అక్టోబర్లో వెస్టిండీస్తో జరిగే సిరీస్ సమయానికి తిరిగి జట్టులోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్న పంత్.. ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం పంత్కు గాయం పూర్తిగా తగ్గలేదని తెలుస్తుంది. వైద్యులు అతనికి తిరిగి ఫిట్నెస్ సాధించేందుకు టైమ్లైన్ ఇచ్చినట్లు సమాచారం.టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ 2025లో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్లో పంత్ తొలి రోజు ఆటలో క్రిస్ వోక్స్ బౌలింగ్లో గాయపడ్డాడు. వోక్స్ సంబంధించిన బంతి పంత్ పాదానికి తీవ్ర గాయం చేసింది. నొప్పితో విలవిలలాడిన పంత్ అప్పుడు మైదానాన్ని వీడి, జట్టు అవసరాల దృష్ట్యా కుంటుతూనే రెండో రోజు బ్యాటింగ్కు దిగాడు.తొలి రోజు గాయపడిన సమయానికి 37 పరుగుల వద్ద ఉండిన పంత్.. రెండో రోజు తిరిగి బరిలోకి దిగి జట్టుకు చాలా ముఖ్యమైన 17 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ గాయం కారణంగా పంత్ ఓవల్లో జరిగిన ఐదో టెస్ట్ దూరమయ్యాడు. ఆ మ్యాచ్లో భారత్ విజయం సాధించి సిరీస్ను సమం చేసింది.పంత్ పాదం గాయం నుంచి పూర్తిగా కోలుకుని అక్టోబర్లో వెస్టిండీస్తో జరిగే హోమ్ టెస్ట్ సిరీస్ సమయానికంతా రెడీగా ఉండాలని అనుకుంటున్నాడు. ఇందులో భాగంగానే CoEలోని రీహ్యాబ్లో చేరనున్నాడు. ఒకవేళ విండీస్తో సిరీస్ సమయానికి పూర్తిగా కోలుకోకపోతే, తదుపరి ఆస్ట్రేలియాతో జరిగే వైట్-బాల్ సిరీస్ సమయానికైనా పునారగమనం చేయడం లక్ష్యంగా పెట్టుకుంటాడు.పంత్ భావోద్వేగ పోస్ట్తాజాగా పంత్ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్ చేశాడు. ఎంత బాధను గతంలో అనుభవించినా, మళ్లీ గాయపడితే అదే స్థాయిలో బాధ కలుగుతుంది. అయితే రెండో సారి మన సహనశక్తి పెరుగుతుంది. ఇదే మనల్ని బలంగా మారుస్తుందని తన ఇన్స్టా ఖాతాలో రాసుకొచ్చాడు. కాగా, 2022లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పంత్ తీవ్రగాయాలపాలై, అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఆ స్థాయి గాయాలు కాకపోయినా పంత్ మరోసారి గాయపడ్డాడు. ఫలితంగా మరోమారు జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం భారత టీ20 జట్టు ఆసియా కప్ కోసం యూఏఈలో పర్యటిస్తుంది. ఈ జట్టులో వికెట్కీపర్లుగా సంజూ శాంసన్, జితేశ్ శర్మ ఎంపికయ్యారు. -
ఆసియా కప్కు మందు సంజూ శాంసన్ ఆసక్తికర నిర్ణయం
ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందు టీమిండియా వికెట్కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల తన సొంత రాష్ట్రం కేరళలో జరిగిన టీ20 టోర్నీ (KCL 2025) ద్వారా అర్జించిన జీతాన్ని సహచరులు, సహాయక బృందానికి విరాళంగా ఇచ్చాడు. ఈ టోర్నీ ద్వారా సంజూ రూ. 26.8 లక్షల జీతాన్ని పొందాడు. ఈ మొత్తాన్ని కొచ్చి బ్లూ టైగర్స్ బృందానికి ఇచ్చేసి ఉదారతను చాటుకున్నాడు. వాస్తవానికి ఈ టోర్నీ వేలంలో సంజూ రూ. 50 లక్షలకు (ఈ సీజన్ వేలంలో ఇదే అత్యధికం) అమ్ముడుపోయాడు. అయితే అతనికి కొచ్చితో ఉన్న ప్రత్యేక అనుబంధం కారణంగా తన వేతనంలో సగం డబ్బుకే ఆడేందుకు ఒప్పుకున్నాడు.Sanju Samson's brother "Saly Samson" led Kochi Blue Tigers won the KCL 2025. 🏅- Sanju Samson played an important role in the Group Stage with 368 runs from 5 Innings. pic.twitter.com/w7ZFClxpGz— Johns. (@CricCrazyJohns) September 8, 2025KCL 2025లో సంజూ ప్రాతినిథ్యం వహించిన కొచ్చి బ్లూ టైగర్స్ ఛాంపియన్గా అవతరించింది. ఫైనల్లో ఏరిస్ కొల్లమ్ టైగర్స్ 75 పరుగుల భారీ తేడాతో గెలుపొంది టైటిల్ కైవసం చేసుకుంది. సంజూ ఫైనల్, సెమీఫైనల్లో ఆడకపోయినా, కొచ్చి టైటిల్ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు.లీగ్ దశలో ఆడిన 5 ఇన్నింగ్స్ల్లో 186.80 స్ట్రయిక్రేట్తో 73.60 సగటున 368 పరుగులు చేశాడు. ఇందులో ఓ విధ్వంసకర సెంచరీతో కలిపి నాలుగు 50 ప్లస్ స్కోర్లు ఉన్నాయి. ఈ టోర్నీలో కొచ్చిని ఛాంపియన్గా నిలిపింది (కెప్టెన్) సంజూ సోదరుడు శాలీ శాంసన్ కావడం మరో విశేషం. శాలీ కూడా ఈ టోర్నీలో బ్యాటర్గా, కెప్టెన్గా అద్భుతంగా రాణించాడు.సంజూకు కేరళ క్రికెట్పై అమితాసక్తి ఉంది. తన సొంత రాష్ట్రం నుంచి చాలా మంది టీమిండియాకు ఆడాలన్నది అతని కల. అతనికి తన KCL టీమ్ కొచ్చి బ్లూ టైగర్స్ అంటే కూడా చాలా ఇష్టం. ఈ ఇష్టంలో భాగంగానే అతను తన జీతం మొత్తాన్ని సహచరులకు విరాళంగా ఇచ్చాడు. సంజూకు ఇలాంటి దానాలు కొత్తేమీ కాదు. తన పేరిట ఓ ట్రస్ట్ను నడిపిస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాడు. ఇందుకుగానూ కేరళ ప్రభుత్వం నుంచి కూడా అభినందనలు పొందాడు. గత దశాబ్దకాలంలో కేరళ నుంచి టీమిండియాకు ఆడిన క్రికెటర్ సంజూ ఒక్కడే.ఇదిలా ఉంటే, సంజూ KCLలో అద్భుతంగా రాణించినప్పటికీ భారత తుది జట్టులో (ఆసియా కప్లో) స్థానం ప్రశ్నార్థకంగా ఉంది. సంజూ ఆడాల్సిన ఓపెనింగ్ స్థానం కోసం జట్టు వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ పోటీపడుతున్నాడు. గిల్ను ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా ప్రమోట్ చేయడంలో భాగంగా సంజూపై వేటు పడుతుందని టాక్ నడుస్తుంది. ఈ విషయంపై స్పష్టత రావాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. -
అతడే నా ఫేవరెట్ క్రికెటర్.. టీమిండియాకు ఎందుకు సెలక్ట్ చేయరు?
వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం క్రిస్ గేల్ (Chris Gayle) టీమిండియా సెలక్టర్ల తీరును విమర్శించాడు. టెస్టు జట్టులో ఉండేందుకు సర్ఫరాజ్ ఖాన్ (Sarfraz Khan) అర్హుడని.. అతడికి వరుస అవకాశాలు ఇవ్వాలని పేర్కొన్నాడు. బరువు అనేది పెద్ద సమస్య కాదని.. ఆటగాడు ఫిట్గా ఉంటే చాలంటూ సర్ఫరాజ్కు మద్దతుగా నిలిచాడు.న్యూజిలాండ్తో చివరగా..కాగా 2024లో ఇంగ్లండ్తో స్వదేశంలో టెస్టు సిరీస్ సందర్భంగా సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున ఆరు టెస్టులు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఓ శతకం, మూడు అర్ధ శతకాల సాయంతో 371 పరుగులు చేశాడు. చివరగా న్యూజిలాండ్తో గతేడాది నవంబరులో జరిగిన మ్యాచ్లో సర్ఫరాజ్ ఖాన్ ఆడాడు.ఆ తర్వాత ఇంగ్లండ్-‘ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్ ఆడిన భారత్-‘ఎ’ జట్టుకు ఎంపికైన సర్ఫరాజ్.. ప్రధాన జట్టు (టీమిండియా)లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. తదుపరి ఆస్ట్రేలియా- ‘ఎ’తో మ్యాచ్కు కూడా ఈ ముంబైకర్ దూరమయ్యాడు. గాయం వల్ల అతడు సెలక్షన్కు అందుబాటులో లేకుండా పోయినట్లు సమాచారం.అతడు బాగా బరువు తగ్గాడుఈ నేపథ్యంలో క్రిస్ గేల్ సర్ఫరాజ్ ఖాన్కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలంటూ టీమిండియా సెలక్టర్లకు విజ్ఞప్తి చేశాడు. ‘‘అతడు భారత టెస్టు తుదిజట్టులో ఉండాలి. లేదంటే కనీసం జట్టులోనైనా అతడికి చోటివ్వాలి. సొంతగడ్డపై ఇంగ్లండ్ మీద సెంచరీ చేసిన ఆటగాడిని పక్కనపెట్టారు.కొన్నాళ్ల క్రితం సోషల్ మీడియాలో ఓ పోస్టు చూశాను. అతడు బాగా బరువు తగ్గాడు. అసలు బరువు అనేది సమస్యే కాదు. అతడు ఫిట్గా ఉన్నాడు. పరుగులు చేస్తున్నాడు. అదే కదా అన్నింటికంటే ముఖ్యమైనది.టెస్టు జట్టులో ఉండాల్సిందేఫస్ట్క్లాస్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీలు బాదిన ఆటగాడు. కానీ బరువును సాకుగా చూపి అతడిని జట్టు నుంచి తప్పించినట్లయితే అది నిజంగా విచారించదగ్గ విషయం. వందకు వంద శాతం అతడు టెస్టు జట్టులో ఉండాల్సిందే.ఇండియాలో ప్రతిభకు కొదువలేదు. అయితే, ఇలాంటి ప్రత్యేకమైన ఆటగాడు మాత్రం అవకాశాలకు అర్హుడు’’ అంటూ గేల్ టీమిండియా సెలక్టర్ల తీరును విమర్శించాడు. శుభంకర్ మిశ్రా పాడ్కాస్ట్లో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.అతడే నా అభిమాన క్రికెటర్ఇక భారత క్రికెటర్లలో సర్ఫరాజ్ ఖాన్ తన అభిమాన క్రికెటర్ అని గేల్ ఈ సందర్భంగా తెలిపాడు. విరాట్ కోహ్లి వంటి దిగ్గజ క్రికెటర్ను కాదని.. గేల్ సర్ఫరాజ్ పేరు చెప్పడం విశేషం. కాగా ఐపీఎల్లో గేల్- సర్ఫరాజ్ ఖాన్ ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. టీమిండియా చివరగా ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడింది. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీని 2-2తో సమం చేసింది. తదుపరి టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్-2025 ఆడిన అనంతరం.. స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టులు ఆడనుంది.చదవండి: కుంబ్లేకి చెప్పి ఏడ్చాను.. అయినా పట్టించుకోలేదు.. కేఎల్ రాహుల్ కాల్ చేసి: క్రిస్ గేల్ -
Asia Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ న్యాయనిర్ణేతలు వీరే..!
ఆసియా కప్-2025లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య ఈనెల 14న జరుగనున్న గ్రూప్ స్టేజీ మ్యాచ్ కోసం న్యాయనిర్ణేతల (Match Officials) జాబితాను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్ 8) ప్రకటించింది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ హై వోల్టేజీ మ్యాచ్కు ఫీల్డ్ అంపైర్లుగా రుచిర పల్లియగురుగె (శ్రీలంక), మసుదుర్ రెహ్మాన్ (బంగ్లాదేశ్) ఎంపిక చేయబడ్డారు. వీరిద్దరికి అంతర్జాతీయ అంపైర్లుగా అపార అనుభవం ఉంది.రుచిరాకు 160కి పైగా అంతర్జాతీయ మ్యాచ్ల్లో న్యాయనిర్ణేతగా పని చేసిన అనుభవం ఉండగా.. మసుదూర్ 70కి పైగా మ్యాచ్ల్లో అంపైర్గా వ్యవహరించాడు. రుచిరా 2019 వన్డే వరల్డ్కప్, 2022 మహిళల వరల్డ్కప్ లాంటి మెగా టోర్నీల్లో పని చేయగా.. మసుదూర్ 2022 ఆసియా కప్ ఫైనల్లో అంపైర్గా వ్యవహరించాడు.భారత్, పాక్ మధ్య తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో, ఆసియా కప్ మ్యాచ్లో ఫీల్డ్ అంపైర్ల పాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే, మైదానంలో వారు తీసుకునే నిర్ణయాలు ఇరు దేశాల అభిమానుల భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయి. ఇరు జట్లకు సంబంధించి ఏ ఒక్క తప్పు నిర్ణయం తీసుకున్నా, దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.ఈ మ్యాచ్కు సంబంధించి ఐసీసీ టీవీ అంపైర్, ఫోర్త్ అంపైర్, మ్యాచ్ రిఫరీ పేర్లను కూడా ప్రకటించింది. టీవీ అంపైర్గా అహ్మద్ పక్తీన్ (ఆఫ్ఘానిస్తాన్), ఫోర్త్ అంపైర్గా ఇజతుల్లా సఫీ (ఆఫ్ఘానిస్తాన్) వ్యవహరించనున్నారు. మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ (జింబాబ్వే) ఉంటారు. -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. వన్డే క్రికెట్లో అతి భారీ విజయం
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్లో పరుగుల పరంగా అతి భారీ విజయం నమోదు చేసింది. సౌతాఫ్రికాతో నిన్న (సెప్టెంబర్ 7) జరిగిన మ్యాచ్లో 342 పరుగుల భారీ తేడాతో గెలుపొందడంతో ఈ ఘనత సాధించింది. 54 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇంతటి భారీ విజయాన్ని ఏ జట్టు సాధించలేదు.ఇంగ్లండ్కు ముందు ఈ రికార్డు భారత్ పేరిట ఉంది. టీమిండియా 2023 జనవరిలో శ్రీలంకపై 317 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విభాగంలో ఆస్ట్రేలియా, జింబాబ్వే.. ఇంగ్లండ్, భారత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2023 అక్టోబర్లో ఆస్ట్రేలియా నెదర్లాండ్స్పై 309 పరుగుల తేడాతో.. 2023 జూన్లో జింబాబ్వే యూఎస్ఏపై 304 పరుగుల తేడాతో గెలుపొందాయి.కాగా, స్వదేశంలో సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నిన్న జరిగిన (సౌతాంప్టన్) మూడో వన్డేలో ఇంగ్లండ్ఈ చారిత్రక విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్కు ఒరిగేదేమీ లేనప్పటికీ చరిత్ర సృష్టించగలిగింది. ఎందుకుంటే, ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్లను గెలిచిన సౌతాఫ్రికా అప్పటికే సిరీస్ను కైవసం చేసుకుంది.రూట్, బేతెల్ శతకాలుటాస్ ఓడి సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (100), జేకబ్ బేతెల్ (110) శతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 414 పరుగులు చేసింది. జేమీ స్మిత్ (62), జోస్ బట్లర్ (62 నాటౌట్) కూడా మెరుపు అర్ద సెంచరీలతో రాణించారు. బెన్ డకెట్ 31, కెప్టెన్ బ్రూక్ 3 పరుగులకు ఔట్ కాగా.. విల్ జాక్స్ 19 పరుగులతో అజేయంగా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లందరూ ధారాళంగా పరుగులు సమర్పించున్నారు. కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్ తలో 2 వికెట్లు తీశారు.నిప్పులు చెరిగిన ఆర్చర్.. బెంబేలెత్తిపోయిన సౌతాఫ్రికా బ్యాటర్లుఅనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా.. జోఫ్రా ఆర్చర్ (9-3-18-4), బ్రైడన్ కార్స్ (6-1-33-2), ఆదిల్ రషీద్ (3.5-0-13-3) ధాటికి కనీసం సగం ఓవర్లు కూడా ఆడలేక 20.5 ఓవర్లలో 72 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికాకు వన్డే క్రికెట్లో ఇది అతి భారీ పరాజయం. ఆ జట్టుకు వన్డేల్లో ఇది రెండో అత్యల్స స్కోర్ (72) కూడా. ఈ మ్యాచ్లో ఆర్చర్ దెబ్బకు సౌతాఫ్రికా బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో కార్బిన్ బాష్ చేసిన 20 పరుగులే అత్యధికం. అరంగేట్రం నుంచి వరుసగా 5 మ్యాచ్ల్లో 50 ప్లస్ స్కోర్లు చేసి చరిత్ర సృష్టించిన మాథ్యూ బ్రీట్జ్కీ (4) ఈ మ్యాచ్లో నిరాశపరిచాడు. మంచి ఫామ్లో ఉండిన మార్క్రమ్, ముల్దర్ డకౌట్లయ్యారు. రికెల్టన్ 1 పరుగుకే వెనుదిరిగాడు. విధ్వంసకర ఆటగాళ్లు స్టబ్స్ (10), బ్రెవిస్ (6) చేతులెత్తేశారు. -
రింకూ సింగ్ జట్టుకు నిరాశ.. యూపీ టీ20 లీగ్ విజేతగా కాశీ రుద్రాస్
ఉత్తర్ప్రదేశ్ టీ20 లీగ్ టైటిల్ను కాశీ రుద్రాస్ రెండో సారి గెలుచుకుంది. లీగ్ తొలి ఎడిషన్లో (2023) ఛాంపియన్గా నిలిచిన ఈ జట్టు.. ప్రస్తుత ఎడిషన్లో (2025) మరోసారి విజేతగా అవతరించింది. నిన్న (సెప్టెంబర్ 6) జరిగిన ఫైనల్లో రుద్రాస్ డిఫెండింగ్ ఛాంపియన్ (2024) మీరట్ మెవెరిక్స్ను చిత్తుగా ఓడించింది. శివమ్ మావి, అభిషేక్ గోస్వామి, కెప్టెన్ కరణ్ శర్మ రుద్రాస్ గెలుపులో కీలకంగా వ్యవహరించారు. ఫైనల్లో టీమిండియా స్టార్ రింకూ సింగ్ లేని లోటు మెవెరిక్స్లో స్పష్టంగా కనిపించింది. రింకూ ఆసియా కప్ ఆడేందుకు యూఏఈకి ఫైనల్, అంతకుముందు క్వాలిఫయర్ మ్యాచ్ ఆడలేదు. ఈ సీజన్ ఆధ్యాంతం రింకూ అద్బుత ప్రదర్శనలు చేయడంతో మెవెరిక్స్ ఫైనల్స్ దాకా చేరింది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన మెవెరిక్స్.. రుద్రాస్ బౌలర్లు శివమ్ మావి (4-0-24-2), కార్తీక్ యాదవ్ (3-0-23-2), సునీల్ కుమార్ (4-0-41-2), అటల్ బిహారి రాయ్ (4-0-28-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. మెవెరిక్స్ ఇన్నింగ్స్లో ప్రశాంత్ చౌదరీ (37) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్ చేశాడు. మిగతా వారిలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కును దాటలేదు. ఆర్సీబీ ఆటగాడు స్వస్తిక్ చికారా డకౌట్ కాగా.. కెప్టెన్ మాధవ్ కౌశిక్ 6 పరుగులు మాత్రమే చేశాడు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన రుద్రాస్.. ఓపెనర్లు అభిషేక్ గోస్వామి (61 నాటౌట్), కరణ్ శర్మ (65) సత్తా చాటడంతో 15.4 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా విజయతీరాలకు చేరింది. అభిషేక్, కరణ్ ఇద్దరు కలిసి మెవెరిక్స్ బౌలర్లను చీల్చిచెండాడారు. ముఖ్యంగా జీషన్ అన్సారీని (3.4-0-0-50) టార్గెట్ చేశారు. బ్యాట్తో పాటు బంతితోనూ రాణించిన (2-0-7-0) రుద్రాస్ కెప్టెన్ కరణ్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ సీజన్ను కరణ్ శర్మ లీడింగ్ రన్ స్కోరర్గా (12 మ్యాచ్ల్లో 519 పరుగులు) ముగించాడు. రుద్రాస్ బౌలర్ శివమ్ మావి (10 మ్యాచ్ల్లో 22 వికెట్లు) ఈ సీజన్లో లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. -
భారత్కు వచ్చేందుకు పాక్ క్రికెట్ టీమ్ నిరాకరణ..?
మహిళల వన్డే ప్రపంచ కప్ ఓపెనింగ్ సెర్మనీ కోసం పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత్లో అడుగుపెట్టేందుకు నిరాకరించినట్లు తెలుస్తుంది. ఈ టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్కు ముందు గౌహతిలోని బార్సపరా స్టేడియంలో ప్రారంభ వేడుకలు జరగాల్సి ఉన్నాయి. ఇందు కోసం టోర్నీలో పాల్గొనే జట్లన్నీ హాజరుకానున్నాయి. అయితే భారత్తో సత్సంబంధాలు లేని కారణంగా పాక్ ఈ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.ఓపెనింగ్ సెర్మనీలో ప్రముఖ బాలీవుడ్ గాయని శ్రేయా ఘోసల్తో లైవ్ పెర్ఫార్మెన్స్ ఏర్పాటు చేయబడింది. ఈ వేడుకను ఐసీసీ గ్రాండ్గా ప్లాన్ చేసింది. ఓపెనింగ్ సెర్మనీ అనంతరం కెప్టెన్ల ఫోటో షూట్, ప్రత్యేక మీడియా సమావేశం కూడా జరునున్నాయి. వీటికి కూడా పాక్ దూరం కానుందని సమాచారం.భారత్–పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు 2008 నుంచి నిలిచిపోయిన విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఈ సంబంధాలు మరింత క్షీణించాయి. బీసీసీఐ-పీసీబీ ఒప్పందం మేరకు ఇరు జట్లు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడనున్నాయి. అది కూడా తటస్ట్ వేదికల్లో మాత్రమే.త్వరలో ప్రారంభం కాబోయే వరల్డ్కప్లో పాకిస్తాన్ తమ మ్యాచ్లను శ్రీలంకలో ఆడనుంది. ఆ జట్టు అక్టోబర్ 2న తమ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడుతుంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 5న కొలొంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగనుంది. -
ఆస్ట్రేలియాతో సిరీస్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
ఆసియా కప్-2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు ఓ బంపరాఫర్ వచ్చేలా ఉంది. త్వరలో స్వదేశంలో ఆస్ట్రేలియా-ఏతో జరుగబోయే రెండు మ్యాచ్ల అనధికారిక టెస్ట్ సిరీస్ కోసం భారత-ఏ జట్టు కెప్టెన్గా ఎంపికవుతాడని సమాచారం. ఈ సిరీస్ కోసం శ్రేయస్తో పాటు నితీశ్ కుమార్ రెడ్డి, అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్, రజత్ పాటిదార్, ఎన్ జగదీసన్, కరుణ్ నాయర్ తదితర ఆటగాళ్లు కూడా ఎంపికవుతారని తెలుస్తుంది.శ్రేయస్ గతకొంతకాలంగా ఫార్మాట్లకతీతంగా రాణిస్తున్నప్పటికీ టీమిండియా ఆల్ ఫార్మాట్ ప్లేయర్ కాలేకపోతున్నాడు. భారత జట్టు తరఫున అతనికి వన్డే అవకాశాలు మాత్రమే వస్తున్నాయి. ఆటగాడిగానే కాకుండా కెప్టెన్గానూ సఫలుడైన శ్రేయస్ భారత టీ20, టెస్ట్ జట్లలో చోటు ఆశిస్తున్నాడు. గత ఐపీఎల్ సీజన్లో ఆటగాడిగా, కెప్టెన్గా సక్సెస్ సాధించి, పంజాబ్ కింగ్స్ను ఫైనల్స్కు చేర్చిన శ్రేయస్.. ఆ తర్వాత భారత్ ఛాంపియన్గా నిలిచిన ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో భాగంగా ఉన్నాడు.త్వరలో ప్రారంభమయ్యే ఆసియా కప్ కోసం శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేస్తారని అంతా అనుకున్నారు. అయితే పోటీ అధికంగా ఉండటం చేత అతని ఎంపిక జరగలేదు. ఆటగాడిగా నిరూపించుకునేందుకు శ్రేయస్కు త్వరలో మరో ఛాన్స్ ఆస్ట్రేలియా-ఏ సిరీస్లో రూపంలో వచ్చే అవకాశం ఉంది. ఈ సిరీస్లో భారత-ఏ జట్టు ఆస్ట్రేలియా-ఏ జట్టుతో రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్లు, ఆతర్వాత మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. టెస్ట్ మ్యాచ్లు లక్నోని ఎకానా స్టేడియంలో, వన్డేలు కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగనున్నాయి.ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు సెప్టెంబర్ 16 నుంచి భారత్లో పర్యటించనుంది. ఈ సిరీస్లో ఆస్ట్రేలియా-ఏ తరఫున కూడా చాలామంది స్టార్ ఆటగాళ్లు పాల్గొనే అవకాశం ఉంది. ఇదివరకే జాతీయ జట్టుకు ఆడి, ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఆటగాళ్లను ఆసీస్ సెలెక్టర్లు ఎంపిక చేయవచ్చు.నిరాశపరిచిన శ్రేయస్, జైస్వాల్శ్రేయస్తో పాటు ఆసియా కప్కు ఎంపిక కాని యశస్వి జైస్వాల్ ప్రస్తుతం దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ ఆడుతున్నారు. వెస్ట్ జోన్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఇద్దరు సెంట్రల్ జోన్తో జరుగుతున్న మ్యాచ్లో తక్కువ స్కోర్లకే (జైస్వాల్ 4, శ్రేయస్ 25) ఔటై నిరాశపరిచారు. శ్రేయస్, జైస్వాల్ నిరాశపరిచినా వారి జట్టు సహచరులు రుతురాజ్ గైక్వాడ్ (184), శార్దూల్ ఠాకూర్ (64), తనుశ్ కోటియన్ (76) సత్తా చాటారు. -
BCCI: ఒక్కో మ్యాచ్కు రూ. 3 కోట్ల 50 లక్షలు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ప్రధాన (జెర్సీ) స్పాన్సర్షిప్ విలువను బీసీసీఐ మరింత పెంచింది. ఇటీవలే ‘డ్రీమ్ 11’ను తప్పించడంతో కొత్త స్పాన్సర్షిప్ వేటలో ఉన్న బోర్డు ఈసారి మరింత పెద్ద మొత్తాన్ని ఆశిస్తోంది. కొత్త విలువ ప్రకారం భారత్ ఆడే ద్వైపాక్షిక సిరీస్లో ఒక్కో మ్యాచ్కు స్పాన్సరర్ రూ. 3 కోట్ల 50 లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.ఇక ఎక్కువ దేశాలు పాల్గొనే ఐసీసీ లేదా ఏసీసీ టోర్నీలో అయితే ఇది ఒక్కో మ్యాచ్కు రూ. 1 కోటీ 50 లక్షలుగా ఉంది. ‘డ్రీమ్ 11’ ఇప్పటి వరకు రూ. 3 కోట్ల 17 లక్షలు, రూ.1 కోటీ 12 లక్షలు చెల్లిస్తూ వచ్చింది. ఆసియా కప్ ముగిసిన తర్వాతే జెర్సీ స్పాన్సర్షిప్ ఒప్పందం ఖరారు కానుంది. ఇక బోర్డు ఆశించిన విధంగా జరిగితే ఏడాదికి సుమారు రూ. 400 కోట్లు బీసీసీఐ ఖాతాలో చేరతాయి.ఇదిలా ఉంటే.. స్పాన్సర్షిప్ కోసం బిడ్లను కోరుతూ మంగళవారం బోర్డు ప్రకటన ఇచ్చింది. దీనికి ఆఖరి తేదీ సెప్టెంబరు 16 కావడంతో జెర్సీ స్పాన్సర్ లేకుండానే టీమిండియా బరిలోకి దిగనుంది. ఇదీ చదవండి: 27 ఏళ్ల తర్వాత... లండన్: ఆఖరిదాకా ఉత్కంఠ రేపిన రెండో వన్డేలోనూ దక్షిణాఫ్రికానే విజయం సాధించింది. తద్వారా వరుస విజయాలతో మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో ఇంగ్లండ్పై సిరీస్ను కైవసం చేసుకుంది. 1998 తర్వాత ఇంగ్లండ్ గడ్డపై దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ను సొంతం చేసుకోవడం విశేషం. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో వన్డేలో సఫారీ జట్టు 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది.ముందుగా దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 330 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మాథ్యూ బ్రిట్జ్కీ (77 బంతుల్లో 85; 7 ఫోర్లు, 3 సిక్స్లు), ట్రిస్టన్ స్టబ్స్ (62 బంతుల్లో 58; 2 ఫోర్లు, 1 సిక్స్), మార్క్రమ్ (64 బంతుల్లో 49; 6 ఫోర్లు, 1 సిక్స్), బ్రెవిస్ (20 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్లు), కార్బిన్ బాష్ (32 నాటౌట్; 3 ఫోర్లు) సమష్టిగా రాణించారు.తన కెరీర్లో ఐదో వన్డే ఆడిన బ్రిట్జ్కీ వరుసగా నాలుగో అర్ధ సెంచరీ చేయడం విశేషం. న్యూజిలాండ్తో ఫిబ్రవరి 10న అరంగేట్రం వన్డేలో సెంచరీ (150) చేసిన బ్రిట్జ్కీ ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ల్లో 83, 57, 88, 85 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ 4, ఆదిల్ రషీద్ 2 వికెట్లు తీశారు. తర్వాత భారీ లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ దాదాపు గెలుపుతీరం దాకా కష్టపడింది. చివరకు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 325 పరుగులకు పరిమితమైంది.తద్వారా విజయానికి కేవలం 5 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఆర్చర్ (14 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ఆఖరిదాకా జట్టును గెలిపించేందుకు విఫల ప్రయత్నం చేశాడు. అంతకుముందు రూట్ (72 బంతుల్లో 61; 8 ఫోర్లు), బట్లర్ (51 బంతుల్లో 61; 3 ఫోర్లు, 3 సిక్స్లు), బెథెల్ (40 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధసెంచరీలు సాధించారు. బర్గర్ 3, కేశవ్ మహరాజ్ 2 వికెట్లు తీశారు. రేపు ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే జరుగుతుంది. చదవండి: చిన్ననాటి గురువుకు రూ. 80 లక్షల సాయం.. హార్దిక్, కృనాల్ మంచి మనసు -
ఇంగ్లండ్లో కెరీర్ మొదలుపెట్టనున్న మయాంక్ అగర్వాల్
ఆర్సీబీ ఆటగాడు, టీమిండియా వెటరన్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ త్వరలో ఇంగ్లండ్లో తన కెరీర్ను మొదలుపెట్టనున్నాడు. 3 మ్యాచ్ల స్వల్పకాలిక ఒప్పందంలో భాగంగా యార్క్షైర్కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్-2025లో భాగంగా సెప్టెంబర్ 8న సోమర్సెట్తో జరిగే మ్యాచ్తో మయాంక్ కౌంటీ అరంగేట్రం చేస్తాడు. 34 ఏళ్ల మయాంక్కు ఇదే తొలి కౌంటీ ఒప్పందం.యార్క్షైర్తో స్వల్పకాలిక డీల్ తర్వాత మయాంక్ భారత్కు తిరుగు ప్రయాణం అవుతాడు. అక్టోబర్ 15 నుంచి ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీలో పాల్గొంటాడు. మయాంక్ చివరిగా ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడాడు. ఆ సీజన్లో మయాంక్ ఛాంపియన్గా అవతరించింది.దేవ్దత్ పడిక్కల్కు ప్రత్యామ్నాయంగా సీజన్ మధ్యలో జాయిన్ అయిన మయాంక్.. ఆర్సీబీ టైటిల్ సాధించే క్రమంలో పలు కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. పంజాబ్ కింగ్స్పై ఫైనల్లో ఆడిన 24 పరుగుల ఇన్నింగ్స్ అందులో ఒకటి.మయాంక్ టీమిండియా తరఫున ఆడి దాదాపు నాలుగేళ్లవుతుంది. చివరిగా 2022 మార్చిలో శ్రీలంకతో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. మయాంక్ భారత్ తరఫున 21 టెస్ట్లు ఆడి 41.3 సగటున 4 సెంచరీలు, 6 అర్ద సెంచరీల సాయంతో 1488 పరుగులు చేశాడు. 5 వన్డేల్లో 86 పరుగులు చేశాడు. మాయంక్ ఐపీఎల్ కెరీర్ ఘనంగా ఉంది. 131 మ్యాచ్ల్లో సెంచరీ, 13 అర్ద సెంచరీల సాయంతో 2756 పరుగులు చేశాడు. -
కెప్టెన్లకు నచ్చితేనే అవకాశాలు!.. ధోని, కోహ్లిలే టార్గెట్?
టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను జాతీయ జట్టుకు ఆడే సమయంలో సెలక్షన్ విధానం వేరుగా ఉండేదని పేర్కొన్నాడు. కెప్టెన్లకు నచ్చితే అవకాశాలు వస్తూనే ఉంటాయని.. లేదంటే ఇలా వచ్చి అలా వెళ్లిపోవాల్సి ఉంటుందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు.కాగా భారత మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకొన్నట్లు గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. అన్ని స్థాయిల్లోనూ ఆట నుంచి రిటైర్ అవుతున్నట్లు అతడు తెలిపాడు. కాగా 43 ఏళ్ల మిశ్రా తొలిసారి 2003లో భారత జట్టుకు వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. 25 ఏళ్ల తర్వాత గుడ్బై చెబుతున్నామరో ఐదేళ్ల తర్వాత అతనికి టెస్టు ఆడే అవకాశం దక్కింది. భారత జట్టు తరఫున 2017లో మిశ్రా చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇక 2000–01 సీజన్లో తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడిన అమిత్ మిశ్రా 25 ఏళ్ల పాటు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించడం విశేషం.‘నా జీవితంలో అన్ని రకాలుగా భాగమైన క్రికెట్కు 25 ఏళ్ల తర్వాత గుడ్బై చెబుతున్నా. నా కెరీర్లో ఎన్నో విజయాలు, మలుపులు, భావోద్వేగాలు ఉన్నాయి. నా కెరీర్లో అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. మరో రూపంలో ఆటతో నా అనుబంధం కొనసాగుతుంది’ అని అమిత్ మిశ్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన అంతర్జాతీయ కెరీర్లో మిశ్రా 22 టెస్టుల్లో 35.72 సగటుతో మొత్తం 76 వికెట్లు పడగొట్టాడు. 36 వన్డేలు, 10 టీ20ల్లో కలిపి అమిత్ 80 వికెట్లు తీశాడు. 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు. తన కెరీర్లో ఎక్కువగా మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లిల సారథ్యంలోనే ఆడటం విశేషం.కెప్టెన్లకు నచ్చితేనేఇక రిటైర్మెంట్ అనంతరం అమిత్ మిశ్రా హిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడుతూ.. తనకు టీమిండియాలో అవకాశాలు తక్కువగా రావడం పట్ల స్పందించాడు. ‘‘నిజంగా ఓ ఆటగాడిని అన్నింటికంటే నిరాశపరిచే విషయం ఇదే. కొన్నిసార్లు జట్టులో ఉంటాము.. మరికొన్ని సార్లు మనల్ని ఎంపిక చేయరు.మరికొన్నిసార్లు జట్టులో ఉన్నా.. ప్లేయింగ్ ఎలెవన్లో చోటు ఉండదు. ఇలాంటివి తరచూ జరుగుతూ ఉంటే విసుగు వస్తుంది. నా విషయంలో చాలాసార్లు ఇలాగే జరిగింది. కొంత మంది ఆటగాళ్లంటే కెప్టెన్లకు ఇష్టం.కాబట్టి వారికి వరుస అవకాశాలు వస్తూ ఉంటాయి. అయినా.. అదో పెద్ద విషయం కాదు. ఏదేమైనా మనల్ని మనం నిరూపించుకుంటే అవకాశం అదే తలుపు తడుతుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే అంతా ఉంది.ఒకవేళ సెలక్టర్లు నన్ను పరిగణనలోకి తీసుకోలేదంటే.. ఫిట్నెస్, బ్యాటింగ్, బౌలింగ్.. ఇలా ఎందులో ఇంకా మెరుగవ్వాలని మాత్రమే ఆలోచించేవాడిని. టీమిండియాకు ఆడే ఛాన్స్ వచ్చినప్పుడల్లా నన్ను నేను నిరూపించుకున్నాడు. ఎల్లప్పుడూ కఠిన శ్రమ, అంకిత భావంతో పనిచేసే వాడిని’’ అని అమిత్ మిశ్రా చెప్పుకొచ్చాడు.ధోనిని అడిగాను కూడా!కాగా గతంలో ధోని జట్టులో తనకు స్థానం కరువు అవడం గురించి మిశ్రా స్పందించాడు. ‘‘జట్టు ఎంపిక సమయంలో చాలా అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. మనం మన ఆటపై దృష్టి పెడితే చాలు. తుదిజట్టును కెప్టెన్ నిర్ణయిస్తాడు. నాకు ఎంఎస్ ధోనితో మంచి అనుబంధం ఉంది.నన్ను ఎందుకు తీసుకోలేదని ఒకటి.. రెండు సందర్భాల్లో అతడిని అడిగాను. జట్టు కూర్పునకు అనుగుణంగానే నన్ను పక్కనపెట్టామని అతడు చెప్పాడు’’ అని అమిత్ మిశ్రా పేర్కొన్నాడు.ఐపీఎల్లో సుదీర్ఘ కాలం తనదైన ముద్రఇదిలా ఉంటే.. హరియాణా తరఫున రంజీ ట్రోఫీలో ఎన్నో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు నమోదు చేసిన మిశ్రా...బ్యాటింగ్లో కూడా కర్ణాటకపై డబుల్ సెంచరీ (202 నాటౌట్) సాధించడం విశేషం. ఇక ఐపీఎల్లో సుదీర్ఘ కాలం తనదైన ముద్ర వేసిన బౌలర్లలో అమిత్ మిశ్రా కూడా ఒకడు. 2008 నుంచి 2024 వరకు మధ్యలో ఒక సీజన్ మినహా ప్రతీసారి మిశ్రా ఐపీఎల్ బరిలోకి దిగాడు.అంతేకాదు.. హైదరాబాద్, ఢిల్లీ, లక్నో తరఫున ఆడిన అతను 162 మ్యాచ్లలో 7.37 ఎకానమీతో 174 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఎనిమిదో స్థానంతో ముగించాడు. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో 3 హ్యాట్రిక్లు (2008, 2011, 2013) సాధించిన ఏకైన బౌలర్గా మిశ్రా నిలిచాడు. చదవండి: కివీస్ క్రికెట్ దిగ్గజం సంచలన నిర్ణయం.. 41 ఏళ్ల వయసులో రీ ఎంట్రీ.. ఓ ట్విస్ట్ -
ప్చ్.. ఎంత గొప్పగా ఆడినా ప్రయోజనం లేదు.. అంతా సెలక్టర్ల ఇష్టం: భువీ
‘స్వింగ్ సుల్తాన్’ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) టీమిండియాకు ఆడి దాదాపు మూడేళ్లు అవుతోంది. న్యూజిలాండ్ గడ్డ మీద 2022లో భువీ భారత్ తరఫున చివరగా అంతర్జాతీయ క్రికెట్ బరిలో దిగాడు. ఆ తర్వాత అతడికి జట్టులో చోటు కరువైంది.పోటీలో వెనుకబడిన భువీటీ20 ప్రపంచకప్-2022తో పాటు న్యూజిలాండ్ పర్యటనలో విఫలం కావడమే ఇందుకు కారణం. ఓవైపు మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj).. మరోవైపు అర్ష్దీప్ సింగ్ (Arshdeep Singh) నుంచి గట్టి పోటీ ఎదురుకావడంతో భువీ పునరాగమనం చేయలేకపోయాడు. ఐపీఎల్తో పాటు ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్ వంటి టోర్నీల్లో రాణించినా ఈ రైటార్మ్ పేసర్ పేరును టీమిండియా సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోవడం లేదు.ఈ నేపథ్యంలో జాతీయ జట్టుకు దూరం కావడంపై భువనేశ్వర్ కుమార్ తాజాగా స్పందించాడు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినా ఒక్కోసారి భంగపాటు తప్పదని.. అంతా సెలక్టర్ల చేతుల్లోనే ఉంటుందని పేర్కొన్నాడు. కాగా భువీ ప్రస్తుతం యూపీ టీ20 లీగ్తో బిజీగా ఉన్నాడు. లక్నో ఫాల్కన్స్ జట్టుకు 35 ఏళ్ల ఈ బౌలర్ కెప్టెన్గా ఉన్నాడు.అదొక్కటే నా చేతుల్లో ఉందిఈ క్రమంలో లీగ్ సందర్భంగా దైనిక్ జాగరణ్తో మాట్లాడుతూ.. ‘‘మీ ప్రశ్నలకు సెలక్టర్లు మాత్రమే సమాధానం చెప్పగలరు. మైదానంలో వందకు వంద శాతం కష్టపడుతూ.. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం మాత్రమే నా చేతుల్లో ఉంటుంది.ప్రస్తుతం నేను అదే పనిచేస్తున్నాను. యూపీ లీగ్ తర్వాత ఉత్తరప్రదేశ్ తరఫున ముస్తాక్ అలీ ట్రోఫీ, వన్డే ఫార్మాట్లో ఆడే అవకాశం వస్తే.. అక్కడా అత్తుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను.అంతా సెలక్టర్ల ఇష్టంక్రమశిక్షణ బౌలర్గా నా దృష్టి మొత్తం ఫిట్నెస్, లైన్ అండ్ లెంగ్త్ మీదే ఉంటుంది. ఒక్కోసారి ఎంత గొప్పగా ఆడినా.. అదృష్టం కూడా కలిసి రావాలి. ఒకవేళ మన ప్రదర్శన గొప్పగా ఉండి.. నిలకడగా ఆడుతూ ఉంటే.. ఎవరూ మనల్ని ఎంతో కాలం పట్టించుకోకుండా ఉండలేరు కదా!అప్పుడు.. ఒకవేళ సెలక్ట్ చేయకపోయినా.. మరేం పర్లేదు.. ఆట మీదే మన దృష్టి ఉండాలి. ఇక ఆపై అంతా సెలక్టర్ల ఇష్టం’’ అని భువనేశ్వర్ కుమార్ పరోక్షంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు.కాగా 2012లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన భువీ.. ఇప్పటి వరకు 121 వన్డేల్లో 141... 21 టెస్టుల్లో 63... 87 అంతర్జాతీయ టీ20లలో 90 వికెట్లు కూల్చాడు. ఇక ఐపీఎల్లో 190 మ్యాచ్లు పూర్తి చేసుకున్న భువీ.. 198 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా క్యాష్ రిచ్ లీగ్ లీడింగ్ వికెట్ టేకర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు.చదవండి: సెన్స్ ఉందా?.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఏంటి?: రాజస్తాన్ రాయల్స్ స్టార్ -
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
టీమిండియా వెటరన్ క్రికెటర్ అమిత్ మిశ్రా (Amit Mishra) ప్రొఫెషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పాతికేళ్ల సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలుకుతున్నట్లు గురువారం వెల్లడించాడు. ఢిల్లీకి చెందిన అమిత్ మిశ్రా హర్యానా తరఫున దేశవాళీ క్రికెట్ ఆడాడు.అంతర్జాతీయ క్రికెట్లోఇక 2003లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన అమిత్ మిశ్రా.. 2017లో ఇంగ్లండ్తో టీ20 సందర్భంగా తన అంతర్జాతీయ స్థాయిలో తన చివరి మ్యాచ్ ఆడేశాడు. ఈ రైటార్మ్ లెగ్ స్పిన్నర్ 36 వన్డేలు, 22 టెస్టులు, పది టీ20 మ్యాచ్లలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.వన్డేల్లో 64, టెస్టుల్లో 76, అంతర్జాతీయ టీ20లలో అమిత్ మిశ్రా 16 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్లో 2008లో అరంగేట్రం చేసిన ఈ స్పిన్ బౌలర్.. గతేడాది చివరగా లక్నో సూపర్ జెయింట్స్కు ఆడాడు. క్యాష్ రిచ్ లీగ్లో మొత్తంగా 162 మ్యాచ్లు ఆడి 174 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.క్రికెట్ నాకెంతో ఇచ్చిందిగాయాల బెడద, యువ ఆటగాళ్లకు అవకాశాలు రావాలనే ఉద్దేశంతో 42 ఏళ్ల వయసులో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు అమిత్ మిశ్రా గురువారం ప్రకటించాడు. ఈ సందర్భంగా.. ‘‘నా జీవితంలో 25 సంవత్సరాలు క్రికెట్ ఆడాను. ఇంతకంటే నాకు గొప్ప విషయం మరొకటి ఉండదు.భారత క్రికెట్ నియంత్రణ మండలి, హర్యానా క్రికెట్ అసోసియేషన్, నా సహాయక సిబ్బంది, నా సహచర ఆటగాళ్లు.. నా కుటుంబ సభ్యులకు ఎంతో రుణపడి ఉన్నాను. అందరికంటే ముఖ్యంగా ఎల్లవేళలా నాకు అండగా నిలబడిన అభిమానులకు ధన్యవాదాలు. నా ప్రయాణాన్ని అందమైన జ్ఞాపకంగా మార్చింది మీరే. క్రికెట్ నాకెంతో ఇచ్చింది. ఎన్నో పాఠాలు నేర్పించింది. మైదానంలో నాకున్న జ్ఞాపకం పదిలమే. జీవితంలో నాకు లభించిన ఈ గొప్ప నిధిని కాపాడుకుంటాను’’ అని అమిత్ మిశ్రా ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు.ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక వికెట్ల వీరుడిగాకాగా 2008లో ఆస్ట్రేలియాతో మొహాలీ మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో అడుగుపెట్టిన అమిత్ మిశ్రా.. అరంగేట్రంలోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన భారత బౌలర్ల జాబితాలో చేరాడు. ఇక 2013లో జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల సిరీస్లో మొత్తంగా 18 వికెట్లు కూల్చిన ఈ స్పిన్నర్.. ఓ ద్వైపాక్షిక సిరీస్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన జవగళ్ శ్రీనాథ్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు.ఇక బంగ్లాదేశ్ వేదికగా టీ20 ప్రపంచకప్-2014 టోర్నీలో పది వికెట్లు తీసిన అమిత్ మిశ్రా.. టీమిండియా రన్నరప్గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. కాగా 2017 తర్వాత టీమిండియాలో చోటు కరువు కావడంతో మిశ్రా దేశీ క్రికెట్, ఐపీఎల్కు మాత్రమే పరిమితమయ్యాడు.ఐపీఎల్లో ఏకైక బౌలర్గా..ఇక ఐపీఎల్లో అత్యధికంగా మూడుసార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఏకైక బౌలర్గా అమిత్ మిశ్రా చిరస్మరణీయ రికార్డు సాధించాడు. 2008లో ఢిల్లీ డేర్డెవిల్స్(ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్), 2011లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్), 2013లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అమిత్ మిశ్రా హ్యాట్రిక్ సాధించాడు.చదవండి: చరిత్ర సృష్టించిన సికందర్ రజా.. వరల్డ్ నంబర్ వన్ -
శిఖర్ ధవన్కు ఈడీ నోటీసులు
ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) గురువారం (సెప్టెంబర్ 4, 2025) నోటీసులు జారీ చేసింది. ఈ కేసు నిమిత్తం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 1xBet అనే అక్రమ బెట్టింగ్ యాప్కు ధవన్ ప్రమోషనల్ ఎండార్స్మెంట్ ఇచ్చినట్లు ఈడీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఈడీ అధికారులు ధవన్ను Prevention of Money Laundering Act (PMLA) కింద విచారించనున్నారు. ఇదే కేసులో మరో టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఇదివరకే విచారణకు హాజరయ్యాడు. రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్ వంటి సినీ ప్రముఖులు కూడా ఈ కేసులో విచారణకు ఎదుర్కొన్నారు.ఇదే కేసులో గూగుల్, మెటా వంటి టెక్ దిగ్గజాలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. వీరి ప్లాట్ఫాంలలో బెట్టింగ్ యాప్స్కి ప్రాధాన్యత ఇచ్చారని ఈడీ అభిప్రాయడుతుంది.కాగా, ఆన్లైన్ గేమింగ్ యాప్లు కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతూ, పన్నుల ఎగ్గొడుతూ, యువతపై దుష్ప్రభావం చూపుతున్నాయనన్న కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రియల్ మనీ గేమింగ్పై నిషేధం విధించింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా నల్లధనం, హవాలా లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సెలబ్రిటీలు యాప్లను ప్రచారం చేయడం ద్వారా సామాన్య ప్రజలు ప్రభావితం అవుతున్నారని, కొందరు ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడ్డారని కేంద్ర భావిస్తుంది. -
అలా మిగిలిపోవడం ఇష్టం లేదు.. రింకూ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా యువ బ్యాటర్ రింకూ సింగ్ తన క్రికెట్ ప్రయాణాన్ని కొత్త దశకు తీసుకెళ్లే లక్ష్యంతో ముందుకెళ్తున్నాడు. నన్ను కేవలం టీ20 స్పెషలిస్ట్గా మాత్రమే చూడకండని టీమిండియా సెలెక్టర్లను పరోక్షంగా మొరపెట్టుకున్నాడు. ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా కొనసాగడం తనకు ఇష్టమని, టీమిండియా తరఫున టెస్ట్ మ్యాచ్లు ఆడటం తన జీవిత లక్ష్యమని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పుకొచ్చాడు.రింకూ మాటల్లో.. నాకు తెలుసు. నేను సిక్సర్లు కొట్టడాన్ని ఫ్యాన్స్ అమితంగా ఇష్టపడతారు. దీనికి నేనెంతో కృతజ్ఞుడిని. అలాగని నేను కేవలం టీ20లకు మాత్రమే పరిమితం కాదలచుకోలేదు. రంజీ ట్రోఫీలో నా యావరేజ్ చాలా బాగుంది. ఈ ఫార్మాట్లో 55కి పైగా సగటుతో పరుగులు చేశాను.నేను రెడ్ బాల్ క్రికెట్ ఆడటాన్ని చాలా ఇష్టపడతాను. నేను టీమిండియా తరఫున రెండు వన్డేలు ఆడిన విషయాన్ని కూడా గమనించాలి. అందులో ఓ మ్యాచ్లో నేను రాణించాను కూడా. కాబట్టి నేను కేవలం టీ20 ప్లేయర్ను మాత్రమే కాదు. అవకాశాలు వస్తే మిగతా ఫార్మాట్లలో కూడా సత్తా చాటగలనని నేను నమ్ముతాను.వన్ ఫార్మాట్ ప్లేయర్గా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు. నన్ను నేను ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అనుకుంటాను. భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ ఆడటం నా కల. ఆ అవకాశం వస్తే తప్పక సద్వినియోగం చేసుకుంటాను.టీమిండియా మాజీ సురేశ్ రైనా నాకు మార్గదర్శి. ప్రతి అవకాశానికి సిద్ధంగా ఉండాలి అని అతను చెప్పిన మాట నా మదిలో ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది. ఆ మాటను నేనెప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటాను. ఇప్పటి వరకు నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకున్నాను. టెస్ట్ జెర్సీ ధరించాలన్న కలను సాకారం చేసుకునేందుకు చాలా కృషి చేస్తున్నాను.రింకూ త్వరలో జరుగబోయే ఆసియా కప్కు ఎంపికైన విషయం తెలిసిందే. ఆసియా కప్ జట్టు ప్రకటనకు ముందు టీమిండియాలో అతని స్థానంపై సందేహాలు ఉండేవి. ఇటీవలికాలంలో అతను చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయకపోవడంతో ఆసియా కప్కు ఎంపిక చేస్తారో లేదో అని చాలామంది అనుకున్నారు. ఆసియా కప్కు ఎంపికైన తర్వాత అతను తనపై ఉన్న అపనమ్మకాన్ని చెరిపేశాడు. స్వరాష్ట్రంలో జరిగిన యూపీ టీ20 లీగ్లో ఓ విధ్వంసకర శతకం, పలు మెరుపు ఇన్నింగ్స్లు ఆడి భారత సెలెక్టర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కాకుండా కాపాడుకున్నాడు. ఈ టోర్నీలో రింకూ బౌలర్గానూ మెప్పించాడు. -
శరవేగంగా పావులు కదుపుతున్న అశ్విన్
ఐపీఎల్ రిటైర్మెంట్ తర్వాత భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన తదుపరి కెరీర్ విషయంలో శరవేగంగా పావులు కదుపుతున్నాడు. భారత క్రికెట్తో తెగదెంపులు జరిగిపోవడంతో ప్రపంచవాప్తంగా ఉన్న ప్రధాన లీగ్ల్లో పాల్గొనేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆయా లీగ్ల్లో తనకు నచ్చిన ఫ్రాంచైజీలతో మంతనాలు జరుపుతున్నాడు.ఇంటర్నేషనల్ టీ20 లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్, ద హండ్రెడ్ లీగ్, మేజర్ లీగ్ క్రికెట్ లీగ్ల్లో వేర్వేరు ఫ్రాంచైజీలతో డీల్స్ కూడా కుదిరినట్లు సమాచారం. తాజాగా ఆస్ట్రేలియాలో జరిగే బిగ్బాష్ లీగ్లో ఓ ప్రముఖ ఫ్రాంచైజీతో కూడా టాక్స్ నడుస్తున్నట్లు తెలుస్తుంది. విదేశీ లీగ్ల్లో ఏ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదిరినా అశ్విన్ ప్లేయర్ కమ్ కోచ్గా ద్విపాత్రాభినయం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఇలా చేస్తే తనకు కోచింగ్ అనుభవం కూడా వస్తుందని యాష్ భావిస్తున్నాడట. శరీరం సహకరించని రోజు ఆటగాడి పాత్రకు పుల్స్టాప్ పెట్టి కోచ్గా కొనసావచ్చన్నది అతడి మనోగతం కావచ్చు. క్రికెట్ జీనియస్గా పేరున్న అశ్విన్ ఇదివరకే తన పేరట యూట్యూబ్ ఛానల్ను నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అతను ప్రపంచ క్రికెట్పై తన విశ్లేషణలను అందిస్తుంటాడు.37 ఏళ్ల ఆశ్విన్ ఆగస్ట్ 27న ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదివరకే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన అతడు.. భారత క్రికెట్తో తన బంధాన్ని పూర్తిగా తెంచుకున్నాడు. బీసీసీఐ నియమాల ప్రకారం.. భారత ఆటగాళ్లు విదేశీ లీగ్ల్లో ఆడాలంటే అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాలి. విశ్వవ్యాప్తంగా లీగ్ల్లో ఆడేందుకే యాష్ ఐపీఎల్కు కాస్త త్వరగా రిటైర్మెంట్ ప్రకటించాడని వినికిడి. -
‘రోహిత్ శర్మ ఇంకో పదేళ్లు ఆడాలి’
కెప్టెన్గా టీమిండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనత రోహిత్ శర్మ (Rohit Sharma) సొంతం. 2024లో టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ను చాంపియన్గా నిలిపిన హిట్మ్యాన్.. 2025లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ రూపంలో మరో టైటిల్ సాధించాడు.అంతర్జాతీయ టీ20లకు, టెస్టులకు రిటైర్మెంట్తద్వారా మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni- 3) తర్వాత భారత్కు అత్యధిక ఐసీసీ టైటిళ్లు అందించిన సారథిగా రోహిత్ చరిత్రకెక్కాడు. ఇక 2024లో వరల్డ్కప్ ట్రోఫీ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. ఇటీవలే టెస్టులకు కూడా గుడ్బై చెప్పాడు.ప్రస్తుతం వన్డేల్లో కెప్టెన్ కొనసాగుతున్న 38 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా పదిహేనేళ్లకు పైగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న రోహిత్ శర్మ గురించి టీమిండియా యువ పేసర్ ఖలీల్ అహ్మద్ (Khaleel Ahmed) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.రోహిత్ శర్మ ఇంకో పదేళ్లు క్రికెట్ ఆడాలి‘‘భారత క్రికెట్ మంచి కోసం రోహిత్ శర్మ ఇంకో పదేళ్లు క్రికెట్ ఆడాలి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. 2019లో మేము రాజ్కోట్ వేదికగా బంగ్లాదేశ్తో మ్యాచ్ ఆడుతున్నపుడు.. నేను సరిగ్గా బౌల్ చేయలేకపోయాను. కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాను.అప్పుడు డ్రెసింగ్రూమ్లో రోహిత్ భయ్యా నాతో ప్రత్యేకంగా మాట్లాడాడు. జట్టులోని సభ్యులంతా వెళ్లిపోయిన తర్వాత.. నా దగ్గరికి వచ్చి.. నేనెలా ఆడాలో చెప్పాడు. నాలో ఉన్న నైపుణ్యాల గురించి నాకంటే ఎవరికీ ఎక్కువగా తెలియదని.. నా సామర్థ్యాలను నేనే బయపెట్టాలని చెప్పాడు.ఇలాంటి కెప్టెన్లు అరుదుమేము స్టేడియం వీడి వెళ్తున్నపుడు అభిమానులంతా రోహిత్ భయ్యాను చూసి సంతోషంతో కేకలు వేస్తుంటే.. ‘ఏదో ఒకరోజు నీకు కూడా ఇలాంటి ఆనందకర సమయం వస్తుంది’ అని నాతో అన్నాడు. ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండాలని చెప్పాడు.ఇలాంటి కెప్టెన్లు అరుదు. ప్రతి మ్యాచ్ తర్వాత భాయ్ నాతో మాట్లాడుతూ.. నా తప్పొప్పులను ఓపికగా వివరించాడు. ఇంత మంచి మనసు ఉన్నవాళ్లు కూడా ఇక్కడ ఉంటారా? అనిపించింది. రిషభ్ పంత్తో కూడా భయ్యా ఇలాగే ఉంటాడు.పూర్తి ఫిట్గావ్యక్తిగా, కెప్టెన్గా ఆయనకు ఆయనే సాటి. నిజంగా ఆరోజు రోహిత్ భయ్యా స్థానంలో వేరే వాళ్లుంటే అంత ఓపికగా నాతో మాట్లాడేవారే కాదు. ఈ మధ్య జాతీయ క్రికెట్ అకాడమీలో భయ్యాను కలిశాను. ఆయన పూర్తి ఫిట్గా ఉన్నాడు. నిజంగా ఇలాంటి కెప్టెన్లు టీమిండియాకు అవసరం. ఆయన ఇంకో పదేళ్లు ఆడితే బాగుంటుంది’’ అని ఖలీల్ అహ్మద్ రెవ్స్పోర్ట్స్తో పేర్కొన్నాడు.రోహిత్ కెప్టెన్సీలో అరంగేట్రంకాగా 2018లో మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు నాటి కెప్టెన్ విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకోగా.. అతడి స్థానంలో రోహిత్ శర్మ ఆసియా వన్డే కప్ టోర్నీలో టీమిండియా సారథిగా వ్యవహరించాడు. అప్పుడే ఖలీల్ అహ్మద్ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 11 వన్డేలు, 18 టీ20లు ఆడిన ఖలీల్ అహ్మద్.. ఆయా ఫార్మాట్లలో 15, 16 వికెట్లు తీశాడు. ఈ లెఫ్టార్మ్ పేసర్ గతేడాది చివరగా టీమిండియాకు ఆడాడు.చదవండి: అవకాశం రాకుంటే.. నేనూ యూఎస్కు వెళ్లిపోయేవాడిని: టీమిండియా స్టార్ -
తొలి మ్యాచ్లోనే ప్రపంచ రికార్డు.. చరిత్ర సృష్టించిన భారత యువ స్పిన్నర్
జార్ఘండ్కు చెందిన 21 ఏళ్ల మానిషి తన తొలి దులీప్ ట్రోఫీ మ్యాచ్లోనే ప్రపంచ రికార్డు సమం చేశాడు. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ అయిన అతడు.. తాజాగా జరిగిన మ్యాచ్లో (దులీప్ ట్రోఫీ మొదటి క్వార్టర్ ఫైనల్) ఈస్ట్ జోన్కు ప్రాతినిథ్యం వహిస్తూ.. నార్త్ జోన్పై 6 వికెట్లు (తొలి ఇన్నింగ్స్లో) తీశాడు.మానిషి తీసిన ఈ 6 వికెట్లు ఎల్బీడబ్ల్యూ రూపంలో రావడం విశేషం. ఈ కారణంగానే అతని పేరిట ప్రపంచ రికార్డు నమోదైంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో మానిషికి ముందు కేవలం ఐదుగురు మాత్రమే ఓ ఇన్నింగ్స్లో ఆరుగురిని ఎల్బీడబ్ల్యూ చేశారు. వీరిలో భారతీయులు ఒక్కరు కూడా లేరు.దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్గా మానిషి చరిత్ర సృష్టించాడు. అలాగే మార్క్ ఇలాట్ (1995), చమింద వాస్ (2005), తబిష్ ఖాన్ (2012), ఓలీ రాబిన్సన్ (2021), క్రిస్ రైట్తో (2021) కలిసి ప్రపంచ రికార్డును పంచుకున్నాడు. ఇలాట్, వాస్, తబిష్ ఖాన్, రాబిన్సన్, క్రిస్ రైట్ కూడా మానిషిలాగే ఒకే ఇన్నింగ్స్లో ఆరుగురిని ఎల్బీడబ్ల్యూ చేశారు.మానిషి ఈ మ్యాచ్లో శుభమ్ ఖజురియా, అంకిత్ కుమార్, యశ్ ధుల్, కన్హయ్య వధవాన్, ఆకిబ్ నబీ, హర్షిత్ రాణాను ఎల్బీడబ్ల్యూ చేశాడు. మానిషి తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్లతో (22.2-2-111-6) చెలరేగినా రెండో ఇన్నింగ్స్లో (34-3-166-0) తేలిపోయాడు. ఈ మ్యాచ్లో నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా సెమీస్కు అర్హత సాధించింది.జంషెడ్పూర్లో జన్మించిన మానిషికి ఇది తొలి దులీప్ ట్రోఫీ మ్యాచే అయినప్పటికీ.. ఇదివరకే 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. 2023-24 రంజీ సీజన్లో అతను అత్యుత్తమంగా (22 వికెట్లు) రాణించాడు. మానిషి 2019లో భారత అండర్-19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఓ మ్యాచ్లో అతను ఐదు వికెట్ల ప్రదర్శన సహా 7 వికెట్లు తీశాడు. తాజా ప్రదర్శన తర్వాత మానిషిపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు దృష్టి సారించవచ్చు. -
సంజూ శాంసన్ మహోగ్రరూపం.. ఇతన్ని ఆపడం కష్టమే..!
ఆసియా కప్-2025కు ముందు టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ అరివీర భయంకరమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. కేరళ టీ20 లీగ్లో పట్టపగ్గాల్లేకుండా చెలరేగుతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే విధ్వంసకర శతకం (51 బంతుల్లో 121), రెండు మెరుపు అర్ద శతకాలు (46 బంతుల్లో 89, 37 బంతుల్లో 62) బాదిన అతను.. తాజాగా మరో సుడిగాలి అర్ద శతకం బాదాడు.అలెప్పీ రిపిల్స్తో నిన్న (ఆగస్ట్ 31) జరిగిన మ్యాచ్లో 41 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో సంజూ సిక్సర్ల యంత్రాన్ని తలపిస్తున్నాడు. నాలుగు ఇన్నింగ్స్ల్లో నమ్మశక్యంకాని రీతిలో 30 సిక్సర్లు బాదాడు. NO LOOK SIX BY SANJU SAMSON..!!! 🥶 pic.twitter.com/kY0RKn0KlP— Johns. (@CricCrazyJohns) August 31, 2025ప్రస్తుతం సంజూ జోరు చేస్తుంటే ఆసియా కప్లో ప్రత్యర్థుల పరిస్థితేంటో అర్ద కావడం లేదు. ఇదే ఫామ్ను అతను అక్కడ కూడా కొనసాగిస్తే, కొంత మంది బౌలర్ల కెరీర్లు అర్దంతరంగా ముగిసిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతటి భీకర ఫామ్లో ప్రస్తుతం సంజూ ఉన్నాడు. ఆసియా కప్కు జట్టును ప్రకటించిన తొలినాళ్లలో సంజూ బ్యాటింగ్ స్థానంపై చాలా వాదనలు వినిపించాయి. శుభ్మన్ గిల్ ఎంట్రీతో అతనికి ఓపెనింగ్ స్థానం వదిలేసి సంజూను మిడిలార్డర్లో పంపాలని చాలామంది వాదించారు.ఈ వాదనలన్నిటికీ సంజూ బ్యాట్తో సమాధానం చెప్పాడు. కేరళ టీ20 లీగ్లో ఓపెనర్ స్థానంలో మహా విస్పోటనం సృష్టిస్తున్నాడు. ఈ టోర్నీలో సంజూ ఆడిన నాలుగు విధ్వంసకర ఇన్నింగ్స్లు ఓపెనర్గా వచ్చి ఆడినవే. ఓ మ్యాచ్లో సంజూ మిడిలార్డర్లో వచ్చి ప్రయోగం చేసినా అది మిస్ ఫైర్ అయ్యింది.తాజాగా జరిగిన మ్యాచ్లో ఓపెనర్గా సంజూ ఉగ్రరూపం పతాక స్థాయికి చేరింది. అలెప్పీ రిపిల్స్పై సంజూ ఏకంగా 9 సిక్సర్లు బాదాడు. 177 లక్ష్య ఛేదనలో సిక్సర్ల సునామీ సృష్టించి ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. సంజూ విధ్వంసం ధాటికి అతని జట్టు కొచ్చి బ్లూ టైగర్స్ మరో 10 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. -
బీభత్సం సృష్టించిన రింకూ సింగ్.. ఇక ఆ జట్లకు మూడినట్లే..!
ఉత్తర్ప్రదేశ్ టీ20 లీగ్ 2025లో టీమిండియా విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఎన్నో అనుమానాల నడుమ (బ్యాటింగ్ నైపుణ్యంపై) ఈ లీగ్ బరిలోకి దిగిన రింకూ.. తనలోని అత్యుత్తమ టాలెంట్ను వెలికి తీసి, తనెంత విలువైన ఆటగాడో మరోసారి జనాలకు రుచి చూపించాడు. ఫినిషర్ అన్న బిరుదుకు రింకూ మరోమారు సార్దకత చేకూర్చాడు.ఈ లీగ్లో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన రింకూ.. 170కి పైగా స్ట్రయిక్రేట్తో, 59 సగటున సెంచరీ, 2 హాఫ్ సెంచరీల సాయంతో 295 పరుగులు చేశాడు. ఇందులో 20కి పైగా ఫోర్లు, 20కి పైగా సిక్సర్లు ఉన్నాయంటే రింకూ విధ్వంసం ఏ రేంజ్లో సాగిందో ఇట్టే అర్దమవుతుంది. గోరఖ్పూర్ లయర్స్పై రింకూ చేసిన 45 బంతుల శతకం సీజన్ మొత్తానికే హైలైట్గా నిలిచింది.తాజాగా రింకూ సృష్టించిన బీభత్సకాండ చూసిన తర్వాత ఆసియా కప్లో పాల్గొనే జట్ల బౌలర్లు బెదిరిపోతుంటారు. కాశీ రుద్రాస్తో నిన్న జరిగిన మ్యాచ్లో రింకూ శివాలెత్తిపోయాడు. కేవలం 48 బంతుల్లో 6 సిక్సర్లు, 6 బౌండరీల సాయంతో అజేయమైన 78 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఈ ఇన్నింగ్స్లో రింకూ గేర్ మార్చిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. 26 పరుగులకే తన జట్టు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండగా రింకూ ఎంట్రీ ఇచ్చాడు. తొలుత అతి నిదానంగా ఆడిన రింకూ.. ఆతర్వాత ఒక్కసారిగా పేట్రేగిపోయాడు. తానెదుర్కొన్న 48 బంతుల్లో తొలి 20 బంతుల్లో కేవలం 7 పరుగులే చేసిన రింకూ.. ఆతర్వాత పెను విధ్వంసం సృష్టించాడు. తర్వాతి 28 బంతుల్లో ఏకంగా 71 పరుగులు రాబట్టాడు. తానెదుర్కొన్న చివరి 11 బంతుల్లో రింకూ 4 ఫోర్లు, 5 సిక్సర్లు బాది మరో 26 బంతులు మిగిలుండగానే మ్యాచ్ను ముగించాడు.రింకూ సృష్టించిన ఈ బీభత్సకాండ ఐపీఎల్లో యశ్ దయాల్ను చీల్చిచెండాడిన (5 బంతుల్లో 5 సిక్సర్లు) వైనాన్ని గుర్తు చేసింది. తర్వలో ఆసియా కప్ ప్రారంభం కానుండగా.. రింకూ ప్రత్యర్థులను ఇప్పటినుంచే భయపెడుతున్నాడు. వాస్తవానికి రింకూను ఆసియా కప్కు ఎంపిక చేయకూడదనే చర్చ నడిచింది. ఇటీవలి కాలంలో అతను చెప్పుకోదగ్గ ఒక్క ప్రదర్శన కూడా చేయకపోవడమే ఇందుకు కారణం. రింకూ స్థానంలో ఆల్రౌండర్నో లేక శ్రేయస్ అయ్యర్నో ఎంపిక చేయాల్సిందని చాలామంది అభిప్రాయపడ్డాడు.అయితే అలాంటి వారి అభిప్రాయాలు తప్పని రింకూ తాజా ప్రదర్శనలతో రుజువు చేశాడు. యూపీ లీగ్లో రింకూ బౌలర్గానూ తనలోని యాంగిల్ను పరిచయం చేశాడు. ఆల్రౌండర్ను తీసుకుంటే బాగుండేదని భావించే వారిని రింకూ ఈ రకంగానూ సమాధాన పరిచాడు.యూపీ లీగ్లో మీరట్ మెవెరిక్స్కు సారధిగానూ వహిస్తున్న రింకూ.. తన జట్టును అదిరిపోయే విజయాలతో ముందుండి నడిపిస్తున్నాడు. కాశీ రుద్రాస్పై విజయం తర్వాత మీరట్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం కాశీ రుద్రాస్ మాత్రమే మీరట్ కంటే ముందుంది. -
‘ఆ ఇద్దరిలో.. అతడే ముందుగా టీమిండియాలోకి వస్తాడు’
భారత క్రికెట్లో గత కొంతకాలంగా ఇద్దరు యువ ఆటగాళ్ల పేర్లు మారుమ్రోగిపోతున్నాయి. ఒకరు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi ).. మరొకరు ఆయుశ్ మాత్రే. ఐపీఎల్-2025 (IPL) సందర్భంగా అరంగేట్రం చేసిన పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీ.. రాజస్తాన్ రాయల్స్ తరఫున సత్తా చాటాడు.చిచ్చర పిడుగుకేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి.. అత్యంత పిన్న వయసులో క్యాష్ రిచ్లీగ్లో శతక్కొట్టిన క్రికెటర్గా చరిత్రకెక్కాడు వైభవ్. సంజూ శాంసన్ గైర్హాజరీలో రాయల్స్ ఓపెనర్గా రాణించాడు. మరోవైపు.. ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టి.. అద్భుత ప్రదర్శన కనబరిచాడు.ఆయుశ్ ధనాధన్ఓపెనర్గా బరిలోకి దిగిన ఆయుశ్ ఏడు ఇన్నింగ్స్ఆడి 240 పరుగులు సాధించాడు. ఇందులో ఓ భారీ హాఫ్ సెంచరీ (94) ఉంది. శతకం చేసే అవకాశం చేజారినా అద్భుత ప్రదర్శనతో ఆయుశ్ ఆకట్టుకున్నాడంటూ అతడిపై ప్రశంసలు కురిశాయి.ఇంగ్లండ్ పర్యటనలో ఇరగదీసిన వైభవ్ఇక ఐపీఎల్ తర్వాత ఈ ఇద్దరూ భారత్ అండర్-19 క్రికెట్ తరఫునా దుమ్ములేపారు. ఆయుశ్ మాత్రే కెప్టెన్సీలో ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా వైభవ్ యూత్ వన్డేల్లో విధ్వంసకర ఇన్నింగ్స్తో మెరిశాడు. ఇందులో ఓ ఫాస్టెస్ట్ సెంచరీ (52 బంతుల్లో) కూడా ఉండటం విశేషం.సెంచరీతో చెలరేగిన కెప్టెన్మరోవైపు.. ఇంగ్లండ్తో అనధికారిక టెస్టు సిరీస్లో ఆయుశ్ సెంచరీతో అలరించాడు. ఇలా ఈ ఇద్దరూ ఇంగ్లండ్ టూర్లోనూ సత్తా చాటి తమను తాము మరోసారి నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా వైభవ్, ఆయుశ్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అతడే ముందుగా టీమిండియాలోకి వస్తాడు!శుభంకర్ మిశ్రాతో మాట్లాడుతున్న క్రమంలో.. ‘వైభవ్- ఆయుశ్.. ఈ ఇద్దరిలో ఎవరు ముందుగా టీమిండియాలోకి వస్తారు?’ అనే ప్రశ్న రైనాకు ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘కచ్చితంగా వైభవ్ సూర్యవంశీనే. ఏమాత్రం భయం లేకుండా.. దూకుడుగా ఆడే అతడి శైలి భిన్నంగా ఉంటుంది.తొలుత ఐపీఎల్లో.. తర్వాత ఇంగ్లండ్లో యూత్ వన్డేలో అతడు శతకాలు బాదాడు. బిహారీలు ఇలాగే ఉంటారు. బిహార్ నుంచి వచ్చేవాళ్లు అందరికంటే ఓ అడుగు ముందే ఉంటారు. నిజానికి వైభవ్ రాకమునుపు సమస్తిపూర్ అనే గ్రామం ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఆ గ్రామం నుంచి వచ్చిన వైభవ్ సత్తా ఏమిటో ప్రపంచం చూస్తోంది.ఇలాంటి ప్లేయర్లు శతాబ్దానికి ఒక్కరే ఉంటారు. రిషభ్ పంత్, వైభవ్ సూర్యవంశీ, రింకూ సింగ్.. పదిహేడేళ్ల ఆయుశ్ మాత్రే.. ఇలా ఎవరికి వారే ప్రత్యేకం. ఆయుశ్ కూడా తొలి మ్యాచ్ నుంచే ఆకట్టుకున్నాడు’’ అని సురేశ్ రైనా పేర్కొన్నాడు. చదవండి: రాజస్తాన్ రాయల్స్కు ద్రవిడ్ గుడ్బై.. అధికారిక ప్రకటన విడుదల -
కొనసాగుతున్న సంజూ శాంసన్ విధ్వంసకాండ
టీమిండియా వికెట్కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కేరళ టీ20 లీగ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో వరుసగా ఓ సుడిగాలి శతకం (అరైస్ కొల్లాం సైలర్స్పై 51 బంతుల్లో 121; 14 ఫోర్లు, 7 సిక్సర్లు), ఓ మెరుపు అర్ద శతకం (త్రిస్సూర్ టైటాన్స్పై 46 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 89 పరుగులు) బాదిన సంజూ.. ఓ మ్యాచ్ గ్యాప్ ఇచ్చి మరో విధ్వంసకర అర్ద శతకం బాదాడు. ఈ టోర్నీలో కొచ్చి బ్లూ టైగర్స్కు ఆడుతున్న సంజూ.. అదానీ ట్రివేన్డ్రమ్ రాయల్స్తో ఇవాళ (ఆగస్ట్ 28) జరుగుతున్న మ్యాచ్లో 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేసి ఔటయ్యాడు.కేసీఎల్లో సంజూ బ్యాట్ నుంచి జాలువారిన మూడు విధ్వంసకర ఇన్నింగ్స్లు ఓపెనింగ్ స్థానంలో వచ్చినవే. ఈ మూడు మెరుపు ఇన్నింగ్స్ల్లో సంజూ ఏకంగా 21 సిక్సర్లు కొట్టాడు. సంజూ ఇదే భీకర ఫామ్ను ఆసియా కప్లో కూడా కొనసాగిస్తే టీమిండియాకు తిరుగుండదు.ఇక గిల్కు కష్టమే..!ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో సంజూ శాంసన్కు చోటు దక్కినప్పటికీ.. తుది జట్టులో అతని స్థానంపై క్లారిటీ లేదు. సంజూ గతకొంతకాలంగా టీమిండియా ఓపెనర్గా సెటిల్ అయ్యాడు. మరో ఓపెనర్గా అభిషేక్ శర్మ కూడా స్థిరంగా రాణిస్తున్నాడు. ఇలాంటి సమయంలో భారత సెలెక్టర్లు ఆసియా కప్ కోసం మరో ఓపెనర్ ఎంపిక చేసి సంజూ స్థానానికి ఎసరు పెట్టారు.ఈ టోర్నీ కోసం శుభ్మన్ గిల్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేయడంతో తుది జట్టులో అతని స్థానం పక్కా అయ్యింది. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఇటీవలికాలంలో అద్భుతంగా ఆడుతుండటంతో అతని స్థానానికి ఢోకా లేకుండా పోయింది. లెఫ్ట్ హ్యాండర్ కావడంతో అభిషేక్ సేఫ్ జోన్లో ఉంటాడు. ఈ పరిస్థితుల్లో మేనేజ్మెంట్ చూపు సంజూపై పడింది. అతన్ని మిడిలార్డర్లో పంపి, అభిషేక్కు జతగా గిల్ను ఓపెనింగ్ పంపాలని ప్రణాళికలు వేసుకుంది.ఈ ప్రచారం మొదలు కాగానే సంజూలోని బీస్ట్ బయటికి వచ్చాడు. తన ఓపెనింగ్ స్థానం కోసం గిల్ పోటీ వస్తున్నాడని గ్రహించి తనలోని విధ్వంకర కోణాన్ని బయటికి తీశాడు. కేరళ లీగ్లో విధ్వంసకాండ సృష్టిస్తూ ఆసియా కప్లో ఓపెనింగ్ స్థానం కోసం తానే అర్హుడినంటూ గర్జిస్తున్నాడు. సంజూ ప్రదర్శనలు చూసిన తర్వాత టీమిండియా మేనేజ్మెంట్ పునరాలోచించుకోవాలి. ఓపెనర్గా ఇంత భీకర ఫామ్లో ఉన్న సంజూను మిడిలార్డర్లో పంపిస్తే చాలా పెద్ద తప్పిదమే చేసినట్లవుతుందని గ్రహించాలి. వైస్ కెప్టెన్ అయినా గిల్ స్థానాన్నే కదిలించాలి. అభిషేక్కు జతగా సంజూనే ఓపెనర్గా కొనసాగించాలి. -
కరుణ్ నాయర్ గుడ్ బై.. జట్టులోకి మరో కర్ణాటక ఆటగాడు
డిఫెండింగ్ రంజీ ఛాంపియన్స్ విదర్భకు మరో కర్ణాటక ఆటగాడు వలస రావడం దాదాపుగా ఖరారైంది. గణేశ్ సతీశ్, కరుణ్ నాయర్ లాంటి ఆటగాళ్లు కర్ణాటక నుంచి వలస వచ్చి విదర్భ తరఫున సత్తా చాటారు. తాజాగా వీరి బాటలో రవికుమార్ సమర్థ్ కూడా నడువనున్నాడు. రానున్న దేశవాలీ సీజన్ కోసం సమర్థ్ విదర్భ క్రికెట్ అసోసియేషన్తో సంప్రదింపులు జరుపుతున్నాడు. డీల్ కూడా ఒకే అయినట్లు తెలుస్తుంది. సమర్థ్ కర్ణాటకకు చెందిన వాడే అయినప్పటికీ గత సీజన్లో ఉత్తరాఖండ్కు వలస వెళ్లాడు. అక్కడ సెట్ కాకపోవడంతో విదర్భవైపు మొగ్గు చూపుతున్నాడు.సమర్థ్ను ఇటీవలే విదర్భను వదిలిపెట్టిన కరుణ్ నాయర్కు ప్రత్యామ్నాయంగా భావించవచ్చు. 32 ఏళ్ల సమర్థ్ గతేడాది మినహా కెరీర్ మొత్తం కర్ణాటకకే ఆడాడు. కరుణ్ నాయర్ లాగే కుడి చేతి వాటం టాపార్డర్ బ్యాటర్ అయిన సమర్థ్.. 2013లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేసి 95 మ్యాచ్ల్లో 15 సెంచరీలు, 35 అర్ద సెంచరీల సాయంతో 6157 పరుగులు చేశాడు. 71 లిస్ట్-ఏ మ్యాచ్ల్లో 10 సెంచరీలు, 17 అర్ద సెంచరీల సాయంతో 3050 పరుగులు చేశాడు. 30 టీ20ల్లో ఓ హాఫ్ సెంచరీ సాయంతో 459 పరుగులు చేశాడు.సమర్థ్ గత సీజన్లో ఉత్తరాఖండ్ తరఫున కూడా సత్తా చాటాడు. ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో 649, లిస్ట్-ఏలో 385, టీ20ల్లో 184 పరుగులు చేశాడు. సమర్థ్ ఎలా చూసుకున్నా కరుణ్ నాయర్కు తగ్గ ఆటగాడిగా ఉంటాడు కాబట్టి, విదర్భ అతన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే సాహసం చేయకపోవచ్చు.కరుణ్ గత రంజీ సీజన్లో విదర్భను ఛాంపియన్గా నిలబెట్టడంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆతర్వాత అతను వ్యక్తిగత కారణాల చేత స్వరాష్ట్రమైన కర్ణాటకకు తిరిగి వెళ్లాడు. కరుణ్ గత రంజీ సీజన్లో విదర్భ తరఫున 9 మ్యాచ్ల్లో 863 పరుగులు చేశాడు. కరుణ్ స్థానాన్ని భర్తీ చేసుకోవడం విదర్భకు కష్టమే అయినప్పటికీ.. సమర్థ్ అతనికి ప్రత్యామ్నాయం కాగలడు.కరుణ్కు ముందు గణేశ్ సతీశ్ కూడా విదర్భ తరఫున అద్భుతంగా ఆడాడు. గణేశ్ ఏకంగా తొమ్మిది సీజన్ల పాటు (2014-23) విదర్భకు సేవలందించాడు. -
మరోసారి చెలరేగిన రింకూ సింగ్.. ఆసియా కప్కు ముందు ప్రత్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్
గత కొంతకాలంగా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయనప్పటికీ.. ఆసియా కప్ బెర్త్ దక్కించుకున్న టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ రింకూ సింగ్ను కొద్ది రోజుల ముందు వరకు విమర్శకులు టార్గెట్ చేశారు. అయితే ఉత్తర్ప్రదేశ్ టీ20 లీగ్ ప్రారంభం కాగానే వారి స్వరం మారిపోయింది. ఈ టోర్నీలో రింకూ బ్యాటర్గానే కాకుండా బౌలర్గానూ రాణిస్తున్నాడు. బ్యాటింగ్లో యాధాతథంగా మెరపులు మెరిపిస్తూనే.. స్పిన్ బౌలింగ్లోనూ మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇకపై తాను కేవలం ఫినిషర్ను మాత్రమే కాదు బ్యాటింగ్ ఆల్రౌండర్నంటూ సంకేతాలు పంపాడు.ఈ టోర్నీలో మీరట్ మెవెరిక్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న రింకూ.. గోరఖ్పూర్ లయన్స్తో జరిగిన మ్యాచ్లో 48 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో విధ్వంసకర శతకం (108) బాదాడు. ఈ ఇన్నింగ్స్లో అతడు చివరి 6 బంతుల్లో 5 సిక్సర్లతో మ్యాచ్ను ముగించి, తనలోని ఫినిషింగ్ సామర్థ్యాన్ని మరోసారి చాటుకున్నాడు.తాజాగా రింకూ మరో మెరుపు ప్రదర్శన చేసి ఆసియా కప్కు ముందు ప్రత్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇవాళ (ఆగస్ట్ 27) లక్నో ఫాల్కన్స్తో జరుగుతున్న మ్యాచ్లో 27 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 57 పరుగులు చేసి తన జట్టు భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత రింకూలో కాన్ఫిడెన్స్ మరింత పెరిగినట్లు కనిపించింది. ఇదే ఫామ్ను అతను ఆసియా కప్లోనూ కొనసాగిస్తే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం. ఆసియా కప్కు ముందు చాలామంది రింకూ జట్టులో అవసరమా అని ప్రశ్నించారు. అతడి బదులు శ్రేయస్ అయ్యర్నో లేక బ్యాటింగ్ ఆల్రౌండర్లో తీసుకోవాల్సిందని చర్చించుకున్నారు. అయితే తనపై చర్చలు అనవసరమని రింకూ తాజా ప్రదర్శనలతో నిరూపించాడు. కేవలం విధ్వంసకర బ్యాటర్గా, ఫినిషర్గా మాత్రమే కాకుండా బౌలింగ్లోనూ రాణించగలనని సంకేతాలు పంపాడు. ఈ టోర్నీలో రింకూ 10కి పైగా ఓవర్లు వేసి బౌలర్గానూ మంచి మార్కులే కొట్టాడు. ఓ మ్యాచ్లో అతడు తీసిన వికెట్ బాగా హైలైటైంది. మ్యాచ్ విషయానికొస్తే.. లక్నో ఫాల్కన్స్తో జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన మీరట్.. రింకూతో పాటు స్వస్తిక్ చికారా (55), రితురాజ్ శర్మ (74 నాటౌట్) మెరుపు అర్ద శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 233 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఫాల్కన్స్ 6.2 ఓవర్ల తర్వాత వికెట్ నష్టానికి 40 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది.