breaking news
team india
-
శ్రీలంకతో తొలి టెస్ట్.. భారత తుది జట్టు ఇదే..!
భారత్-శ్రీలంక మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ గాలే వేదికగా జరుగనుండగా.. రెండో టెస్ట్ ఆగస్ట్ 23 నుంచి కొలొంబోలో జరుగనుంది.దీనికి ముందు శ్రీలంక ఎలెవెన్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మాంచి జోరు ప్రదర్శించింది. ఈ మ్యాచ్తో భారత్కు మంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించింది. సాయి సుదర్శన్ గైర్హాజరీలో దేవదత్ పడిక్కల్ రూపంలో వన్ డౌన్లో మంచి ఆప్షన్ లభించింది. రెగ్యులర్ బ్యాటర్లు శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్. కేఎల్ రాహుల్ ఆకట్టుకున్నారు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా బ్యాట్తో సత్తా చాటాడు. ఈ మ్యాచ్లో పేసర్లు పెద్దగా ప్రభావం చూపకపోయినా, స్పిన్నర్లు పర్వాలేదనిపించారు. ఈ మ్యాచ్ ప్రదర్శనలను పరిగణలోకి తీసుకొని తొలి టెస్ట్లో టీమిండియా ఎలా ఉండబోతుందో ఓ అంచనా వేద్దాం.ఓపెనర్లు: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్తొలి టెస్ట్లో వీరిద్దరూ ఓపెనర్లుగా బరిలోకి దిగడం ఖాయం. ఇద్దరూ వార్మప్ మ్యాచ్లో పరుగులు సాధించడం సానుకూల అంశం. జైస్వాల్ దూకుడుగా ఆడితే.. రాహుల్ పరిస్థితులకు తగ్గట్టుగా ఇన్నింగ్స్ను నిర్మించగలడు. శ్రీలంక బౌలర్లను ఎదుర్కోవడంలో ఈ జోడీ కీలకంగా మారనుంది.నంబర్ 3లో దేవదత్ పడిక్కల్సాయి సుదర్శన్ అందుబాటులో లేకపోవడంతో నంబర్ 3 స్థానంలో దేవదత్ పడిక్కల్కు అవకాశం దక్కడం ఖాయమైపోయింది. వార్మప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో పడిక్కల్ అద్భుతమైన సెంచరీ సాధించి తన స్థానాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాడు.నాలుగో స్థానంలో గిల్నంబర్ 4లో కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆడనున్నాడు. వార్మప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో గాయం కారణంగా బ్యాటింగ్కు రాని గిల్.. రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగి మంచి టచ్లో కనిపించాడు.నంబర్ 5లో రిషభ్ పంత్కు చోటు దక్కే అవకాశం ఉంది. వార్మప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో అతడు విఫలమైనప్పటికీ.. టెస్టుల్లో భారత్కు ఉన్న అత్యుత్తమ వికెట్ కీపర్-బ్యాటర్లలో పంత్ ఒకడు. అందువల్ల అతడికి తుది జట్టులో చోటు దక్కడం దాదాపు ఖాయమే.నంబర్ 6లో ధ్రువ్ జురెల్కు అవకాశం లభించవచ్చు. వార్మప్ మ్యాచ్లో అతడూ పెద్దగా రాణించలేదు. అయినప్పటికీ టెస్టుల్లో బ్యాటింగ్ లైనప్ను మరింత లోతుగా ఉంచాలన్న భారత వ్యూహంలో భాగంగా జురెల్ను ఆడించే అవకాశం ఉంది.ఆల్రౌండర్లుగా జడేజా, సుతార్ఆల్రౌండర్ స్థానాల్లో రవీంద్ర జడేజాతో పాటు మానవ్ సుతార్కు చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. జడేజా టెస్టు క్రికెట్లో భారత్కు అత్యంత కీలకమైన ఆటగాళ్లలో ఒకడు. బ్యాటింగ్లో 38కు పైగా సగటుతో అతడు మిడిలార్డర్కు అదనపు బలం అందించగలడు.మరోవైపు సుతార్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో సుమారు 26 సగటు కలిగి ఉన్నాడు. నంబర్ 8 వరకు బ్యాటింగ్ను తీసుకెళ్లడంతో పాటు స్పిన్ బౌలింగ్లోనూ అతడు ఉపయోగపడనున్నాడు.స్పిన్ బాధ్యతలు కుల్దీప్వేగాలే పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో భారత్ ముగ్గురు ప్రధాన స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. జడేజా, సుతార్తో పాటు కుల్దీప్ యాదవ్ ప్రధాన స్పిన్నర్గా వ్యవహరించనున్నాడు. వార్మప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కుల్దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు. గాలేలో టర్నింగ్ పిచ్ లభిస్తే శ్రీలంక బ్యాటర్లకు అతడు పెద్ద సవాల్గా మారే అవకాశం ఉంది. శ్రీలంకలో ఇప్పటివరకు ఒకే ఒక్క టెస్టు ఆడిన కుల్దీప్.. ఆ మ్యాచ్లో ఐదు వికెట్లు పడగొట్టాడు.పేసర్లుగా సిరాజ్, గర్నూర్ బ్రార్తొలి టెస్ట్లో భారత్ ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగాలని భావిస్తే.. సిరాజ్తో పాటు గర్నూర్ బ్రార్కు అవకాశం లభించవచ్చు. బ్రార్ వార్మప్ మ్యాచ్లో ఆకట్టుకున్నాడు.శ్రీలంకతో తొలి టెస్ట్కు టీమిండియా (అంచనా)కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్ -
సిరాజ్ హ్యాట్రిక్ సిక్సర్స్.. టీమిండియా గెలుపు
శ్రీలంక క్రికెట్ ఎలెవెన్తో జరిగిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 207 పరుగుల లక్ష్యాన్ని భారత్ 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి ఇన్నింగ్స్లో డకౌటైన యశస్వి జైస్వాల్ (61 రిటైర్ట్ హర్ట్) మెరుపు అర్ద సెంచరీ చేసి భారత గెలుపుకు గట్టి పునాది వేశాడు. గాయం కారణంగా తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగని కెప్టెన్ శుభ్మన్ గిల్ కీలక ఇన్నింగ్స్ (44) ఆడాడు. ఆఖర్లో సిరాజ్ (32 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) హ్యాట్రిక్ సిక్సర్స్తో విరుచుకుపడి భారత్ను విజయతీరాలకు చేర్చాడు. టార్గెట్ 207లంక ఎలెవెన్ జట్టు రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి, టీమిండియా ముందు 207 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నిషాన్ మధుష్క (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. అంజల బండార (35), నిపున్ ధనంజయ (46) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీయగా.. సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ చెరో వికెట్ దక్కించుకున్నారు.పడిక్కల్ అజేయ శతకంభారత్ తొలి ఇన్నింగ్స్ను 357 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దేవదత్ పడిక్కల్ (142 నాటౌట్) అజేయ సెంచరీతో సత్తా చాటాడు. రవీంద్ర జడేజా (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్ (40), మానవ్ సుతార్ (41), గుర్నూర్ బ్రార్ (36 నాటౌట్), సరాన్ష్ జైన్ (22 రిటైర్డ్ హర్ట్) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో అసంక మనోజ్, రమేశ్ మెండిస్ తలో 2 వికెట్లు తీయగా.. విశ్వ ఫెర్నాండో, కేశర నువంత చెరో వికెట్ దక్కించుకున్నారు.దీనికి ముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. నిషాన్ మధుష్క (66), రవిందు రషాంత (71), సోనల్ దినుష (52) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ తలో 2 వికెట్లు తీయగా.. బ్రార్ చెరో వికెట్ దక్కించుకున్నారు.కాగా, ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టు శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లోని తొలి టెస్ట్ మ్యాచ్ గాలే వేదికగా ఆగస్ట్ 15 నుంచి మొదలుకానుంది. రెండో టెస్ట్ కొలంబో వేదికగా ఆగస్ట్ 23న ప్రారంభం కానుంది. -
టీమిండియా టార్గెట్ 207
శ్రీలంక క్రికెట్ ఎలెవెన్తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో భారత్ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. లంక ఎలెవెన్ జట్టు రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి, టీమిండియా ముందు 207 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఆట ఇవాళ (మూడో రోజు) చివరి రోజు కావడంతో ఫలితం తేలే అవకాశం లేదు. ఆటలో మరో సెషన్ మాత్రమే మిగిలి ఉంది.లంక ఎలెవెన్ రెండో ఇన్నింగ్స్లో నిషాన్ మధుష్క (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. అంజల బండార (35), నిపున్ ధనంజయ (46) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీయగా.. సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ చెరో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్ను 357 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దేవదత్ పడిక్కల్ (142 నాటౌట్) అజేయ సెంచరీతో సత్తా చాటాడు. రవీంద్ర జడేజా (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్ (40), మానవ్ సుతార్ (41), గుర్నూర్ బ్రార్ (36 నాటౌట్), సరాన్ష్ జైన్ (22 రిటైర్డ్ హర్ట్) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో అసంక మనోజ్, రమేశ్ మెండిస్ తలో 2 వికెట్లు తీయగా.. విశ్వ ఫెర్నాండో, కేశర నువంత చెరో వికెట్ దక్కించుకున్నారు.దీనికి ముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. నిషాన్ మధుష్క (66), రవిందు రషాంత (71), సోనల్ దినుష (52) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ తలో 2 వికెట్లు తీయగా.. బ్రార్ చెరో వికెట్ దక్కించుకున్నారు.కాగా, ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టు శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లోని తొలి టెస్ట్ మ్యాచ్ గాలే వేదికగా ఆగస్ట్ 15 నుంచి మొదలుకానుంది. రెండో టెస్ట్ కొలంబో వేదికగా ఆగస్ట్ 23న ప్రారంభం కానుంది. -
కీలక టోర్నీ నుంచి టీమిండియా స్టార్ ఔట్
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ కీలకమైన హండ్రెడ్ లీగ్ నుంచి మధ్యలోనే వైదొలిగింది. హ్యామ్స్ట్రింగ్ గాయం కారణంగా ఆమె భారత్కు తిరిగి రానుంది. త్వరలో జరుగబోయే ఆసియా కప్కు కూడా ఆమె అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.హండ్రెడ్ లీగ్లో జెమీ సదర్న్ బ్రేవ్కు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆమె కోసం ఫ్రాంచైజీ ఏకంగా 60,000 పౌండ్లు చెల్లించింది. అయితే గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్లకు ఆమె దూరం కానుంది.చార్లీ నాట్కు అవకాశంజెమీమా స్థానంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ చార్లీ నాట్ను సదర్న్ బ్రేవ్ ఎంపిక చేసింది. ఈ సీజన్లో జెమీమా 6 మ్యాచ్ల్లో 143 పరుగులు చేసింది. ఆమె సగటు 35.75గా ఉంది. ఒక్క అర్ధశతకం కూడా నమోదు చేయకపోయినా వరుసగా మూడు మ్యాచ్ల్లో 25కు పైగా పరుగులు సాధించింది.మరోవైపు చార్లీ నాట్ ఇటీవల ముగిసిన టీ20 బ్లాస్ట్లో అద్భుతంగా రాణించింది. 13 ఇన్నింగ్స్ల్లో 40.40 సగటున, 404 పరుగులు చేసి ఆకట్టుకుంది.సదర్న్ బ్రేవ్కు ఈ సీజన్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఆరు మ్యాచ్ల్లో 20 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.ఆసియా కప్ కూడా దూరమయ్యే ప్రమాదంగాయం కారణంగా హండ్రెడ్ లీగ్కు దూరమైన జెమీమా, ఆగస్టు 28 నుంచి జరుగబోయే ఆసియా కప్కు కూడా దూరమయ్యే ప్రమాదముందని తెలుస్తోంది. ఈ టోర్నీ కోసం ప్రకటించిన భారత జట్టులో జెమీమాకు ఇప్పటికే చోటు దక్కింది.ఆసియా కప్ 2026 కోసం భారత జట్టు..హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జీ. కమలిని (వికెట్ కీపర్), దీప్తి శర్మ, రాధా యాదవ్, ప్రేమా రావత్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్, ఎన్. శ్రీ చరణి, నందిని శర్మ.రిజర్వ్ ఆటగాళ్లు: ప్రతికా రావల్, ఉమా చెత్రీ, వైష్ణవి శర్మ, సయాలి సత్ఘరే, మిన్ను మణి.జెమీమా ఆడకపోతే ఎవరికి అవకాశం..?జెమీమా ఆసియా కప్కు దూరమైతే ఆమె స్థానాన్ని భర్తీ చేసే అవకాశాల్లో ప్రతికా రావల్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. భారత జట్టులో ప్రధాన బ్యాటర్లలో జెమీమా స్థానాన్ని భర్తీ చేయగల రిజర్వ్ ఆటగాళ్లలో ప్రతికా కీలకంగా కనిపిస్తోంది.అయితే ప్రతికా ఇప్పటివరకు భారత తరఫున టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. ఆసియా కప్లో అవకాశం వస్తే ఆమెకు అదే తొలి టీ20 అంతర్జాతీయ మ్యాచ్ కావొచ్చు. -
టీమిండియాకు మరో భారీ షాక్
శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్కు ముందు టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పటికే సిరీస్కు దూరం కాగా.. తాజాగా యువ బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా గాయం కారణంగా తప్పుకున్నాడు.తొలుత లంక సిరీస్కు బుమ్రాతో పాటు సాయి సుదర్శన్ను కూడా ఎంపిక చేశారు. వీరిద్దరూ గాయాల నుంచి పూర్తిగా కోలుకుంటారనుకుంటే, అది జరగలేదు. బుమ్రా ఎడమ మోకాలిలో గాయం.. సాయి సుదర్శన్ కాలి బొటనవేలికి గాయం నుంచి కోలుకునేందుకు గత కొంతకాలంగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రిహాబిలిటేషన్లో ఉన్నారు.అయితే గాయాలు ఎంతకీ మానకపోవడంతో తొలుత బుమ్రా, తాజాగా సాయి సుదర్శన్ లంక సిరీస్ నుంచి తప్పుకున్నారు. రోజుల వ్యవధిలో ఇద్దరు రెగ్యులర్ ఆటగాళ్లు వైదొలగడం టీమిండియాకు భారీ ఎదురుదెబ్బే అనుకోవాలి. ఇప్పుడు వీరిద్దరికి ప్రత్యామ్నాయాలుగా ఎవరికి ఎంపిక చేస్తారో చూడాలి. తొలి టెస్ట్ (ఆగస్ట్ 15, గాలే) ప్రారంభానికి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది.లంకలో పరిస్థితులకు అలవాటు పడేందుకు టీమిండియా ప్రస్తుతం ఆ దేశ క్రికెట్ ఎలెవెన్ జట్టుతో మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లంక ఎలెవెన్ జట్టు 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఈ ఇన్నింగ్స్లో భారత బౌలర్లు పెద్దగా ఆకట్టకోలేకపోయారు. రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్ తలో 2 వికెట్లు తీయగా.. గుర్నూర్ బ్రార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. సీనియర్ పేసర్లు సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. స్పిన్నర్ సరాన్ష్ జైన్ 11 ఓవర్లు వేసినా ఒక్క వికెట్ దక్కలేదు.అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ సెంచరీతో (103 రిటైర్డ్ హర్ట్) సత్తా చాటగా.. కేఎల్ రాహుల్ (40) రాణించాడు. యశస్వి జైస్వాల్ డకౌటై నిరాశపర్చగా.. పంత్ (2), జురెల్ (1) కూడా విఫలమయ్యారు. ప్రస్తుతం రెండో రోజు ఆట (టీ విరామం) కొనసాగుతోంది. -
రెండో పెళ్లికి హార్దిక్ గ్రీన్ సిగ్నల్.. ఎప్పుడంటే?
-
టీమిండియా ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్
శ్రీలంక పర్యటనలో ఉన్న టీమిండియాకు తొలి సవాలుకే వాతావరణం అడ్డంకిగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుండగా, రేపటి నుంచి (ఆగస్టు 7) కొలంబోలో శ్రీలంక ‘ఏ’తో భారత్ మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్కు వర్షం తీవ్ర అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.తొలి రోజు ఏకంగా 97 శాతం వర్షావకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. ఆకాశం 99 శాతం మేఘావృతమై ఉంటుందని అంచనా. ఉష్ణోగ్రత సుమారు 30 డిగ్రీలుగా ఉండనుంది.రెండో రోజు పరిస్థితి మరింత ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది. ఆగస్టు 8న వర్షం పడే అవకాశం 99 శాతంగా ఉండటంతో పాటు 89 శాతం మేఘావృత వాతావరణం ఉండొచ్చని అంచనాలు చెబుతున్నాయి.మూడో రోజు కూడా వర్షం ముప్పు తప్పేలా లేదు. ఆగస్టు 9న వర్షం పడే అవకాశం 91 శాతంగా, మేఘావృతం 95 శాతంగా ఉండొచ్చని అంచనా.టీమిండియా ప్రాక్టీస్కు కీలక మ్యాచ్శ్రీలంకలో టెస్టు సిరీస్కు ముందు భారత ఆటగాళ్లకు ఈ వార్మప్ మ్యాచ్ చాలా కీలకం. ముఖ్యంగా శ్రీలంకలోని నెమ్మదైన, స్పిన్కు అనుకూలించే పిచ్లపై బ్యాటర్లు, బౌలర్లు తమను తాము సిద్ధం చేసుకోవడానికి ఇది మంచి అవకాశం.కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా మినహా ప్రస్తుత భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లకు శ్రీలంక గడ్డపై టెస్టు అనుభవం తక్కువ. సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ వంటి ఆటగాళ్లకు స్థానిక పరిస్థితులపై కొంత అనుభవం ఉన్నప్పటికీ, పూర్తి స్థాయి టెస్టు సిరీస్ అనుభవం లేదు.వార్మప్ రద్దయితే ఇబ్బందే!మూడు రోజులూ వర్షం ముప్పు అధికంగా ఉండటంతో వార్మప్ మ్యాచ్ పూర్తిగా లేదా పాక్షికంగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్ పూర్తిగా రద్దయితే శ్రీలంక పరిస్థితులకు అలవాటు పడేందుకు భారత ఆటగాళ్లకు మరో అవకాశం ఉండదు.గతంలోనూ వర్షం కారణంగా ప్రాక్టీస్ మ్యాచ్లు రద్దై, విదేశీ పర్యటనల్లో టీమిండియా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కొలంబోలోనూ అదే పరిస్థితి ఎదురైతే, ఆగస్టు 15న గాలేలో ప్రారంభమయ్యే తొలి టెస్టుకు ముందు భారత్కు ఇది ఎదురుదెబ్బగా మారొచ్చు. -
‘ఒక్కసారి తలుపు మూతపడితే.. ఎవరినీ రానివ్వడు’
మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెప్టెన్గా టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఘనత అతడిది. ధోని సారథ్యంలో టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013లను భారత్ కైవసం చేసుకుంది.ఇక ఐపీఎల్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ను ఐదుసార్లు చాంపియన్గా నిలిపాడు ధోని. కాగా ధోనికి మిస్టర్ కూల్ అన్న ‘బిరుదు’ ఉన్న ఉన్న సంగతి తెలిసిందే. మైదానంలో ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సహనం కోల్పోకుండా వ్యూహాలు అమలు చేయడంలో దిట్ట.అదే విధంగా ఆటగాళ్లకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మార్గనిర్దేశనం చేస్తాడనే పేరు అతడికి ఉంది. టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్కు ఆడిన అజింక్య రహానే సైతం ఇదే మాట అంటున్నాడు. ఓవర్ల్యాప్ క్రికెట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఒకేసారి 10- 15 మంది ఆటగాళ్లు‘‘ధోని కామ్గా, కూల్గా ఉంటాడు. అందరిలాగే తానూ ఒకడినంటూ చాలా సాధారణంగా ఉంటాడు. ధోని గది ఎల్లప్పుడూ ఆటగాళ్లతో నిండి ఉంటుంది. ఒకేసారి 10- 15 మంది ఆటగాళ్లు అతడి రూమ్లోకి వచ్చి ఆట గురించి మాట్లాడుతూ ఉంటారు.ఒక్కోసారి జట్టు మొత్తం అక్కడే ఉంటుంది. అయితే, అంతా అయిపోయి ఒక్కసారి ధోని గది తలుపు మూతపడిందంటే మాత్రం.. మళ్లీ ఎవరికీ లోపలికి అనుమతి ఉండదు’’ అని రహానే చెప్పుకొచ్చాడు. రహానే గుడ్బైకాగా రహానే ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. టెస్టు క్రికెట్లో సారథిగా ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించిన ఘనత అతడికి ఉంది.టీమిండియా తరఫున 2011లో అరంగేట్రం చేసిన రహానే.. 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 మ్యాచ్లు ఆడాడు. టెస్టుల్లో 12 శతకాల సాయంతో 5077 పరుగులు సాధించాడు. వన్డేల్లో 2962, టీ20లలో 375 పరుగులు చేసిన రహానే.. ఐపీఎల్లో మొత్తంగా 5367 పరుగులు సాధించాడు. ధోని కెప్టెన్సీలో 2023లో చెన్నై టైటిల్ గెలవడంలో రహానే (326 రన్స్) తన వంతు పాత్ర పోషించాడు.చదవండి: ODI WC: ‘భారత జట్టులో ఆ ఇద్దరికి చోటు దక్కదు’ -
వాళ్ళకి దూరంగా ఉండు లేదంటే.. బుర్డోడికి ఉతప్ప వార్నింగ్
-
ODI WC: ‘భారత జట్టులో ఆ ఇద్దరికి చోటు దక్కదు’
వన్డే ప్రపంచకప్-2027 టోర్నీలో ఆడబోయే భారత ఓపెనింగ్ జోడీ ఎవరన్న అంశంపై చర్చ కొనసాగుతోంది. చాలా ఏళ్లుగా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ- శుబ్మన్ గిల్ వన్డే ఓపెనర్లుగా కొనసాగుతున్నారు. కెప్టెన్గా రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసిన తర్వాత గిల్.. ఇటీవల అఫ్గానిస్తాన్తో సిరీస్లో మాత్రం వన్డౌన్లో వచ్చాడు.గిల్కు బదులుగిల్కు బదులు యశస్వి జైస్వాల్ అఫ్గాన్తో మ్యాచ్లో రోహిత్తో పాటు ఓపెనింగ్ చేశాడు. రెగ్యులర్ వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరం కావడం వల్ల జైసూకు జట్టులో చోటు దక్కగా.. గిల్ అతడిని ఓపెనర్గా ప్రమోట్ చేసి.. తాను వన్డౌన్లో వచ్చాడు.మరోవైపు.. లార్డ్స్లో ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేనే రోహిత్ కెరీర్లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ అనే ప్రచారం జరిగింది. అయితే, బీసీసీఐతో పాటు రోహిత్ ఈ వదంతుల్ని కొట్టిపారేశాడు. లార్డ్స్లో సెంచరీతో కదం తొక్కి తన విలువేంటో చాటుకున్నాడు హిట్మ్యాన్. అయినప్పటికీ వన్డే వరల్డ్కప్లో ఆడించే విషయంలో యాజమాన్యం ఇప్పటికైతే స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది.ఈ పరిణామాల నేపథ్యంలో యశస్వి జైస్వాల్తో పాటు రుతురాజ్ గైక్వాడ్ పేరు తెరమీదకు వచ్చింది. వీరిద్దరిలో ఒకరు బ్యాకప్ ఓపెనర్గా వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాత్రం భిన్నంగా స్పందించాడు. ఆ ఇద్దరికి చోటు దక్కదు‘‘నిజానికి రుతురాజ్ గైక్వాడ్ రెండు పనులు చేయగలడు. ఓపెనర్గా, మిడిలార్డర్లోనూ రాణించగలడు. అతడు పక్కా ఓపెనింగ్ బ్యాటర్. కానీ టీమిండియాకు అవసరమైనపుడు మిడిలార్డర్లోనూ ఆడాడు.ఆ స్థానంలో ఫిఫ్టీ, సెంచరీ బాదాడు. మరోవైపు.. యశస్వి జైస్వాల్ ఇందుకు విరుద్ధం. అతడు కేవలం బ్యాకప్ ఓపెనర్గా మాత్రమే ఉండగలడు. ఏదేమైనా ప్రపంచకప్ జట్టులో వీరిద్దరికి స్థానం దక్కదని నేను నమ్ముతున్నాను’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.ఇక ప్రపంచకప్ జట్టులో ఇద్దరు సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్లతో పాటు.. ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లకు చోటు ఇవ్వాలని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘‘పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఉంటారు.ఇక ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లుగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ లేదంటే రిషభ్ పంత్ స్థానం దక్కించుకుంటారు. టాపార్డర్ ఎలాగో మారదు. కాబట్టి రుతురాజ్ గైక్వాడ్ లేదంటే యశస్వి జైస్వాల్కు జట్టులో చోటు దక్కే అవకాశాలు తక్కువ’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. అయితే, మిడిలార్డర్లో మాత్రం రుతుకు బ్యాకప్ బ్యాటర్గా చోటు దక్కే అవకాశం లేకపోలేదని పేర్కొన్నాడు.చదవండి: భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో మార్పు! -
టీమిండియాలో నో చాన్స్.. కౌంటీ బరిలో సీనియర్ క్రికెటర్!
భారత జట్టులో అవకాశాలు రాకపోవడంతో వెటరన్ క్రికెటర్ జైదేవ్ ఉనాద్కట్ కౌంటీ క్రికెట్లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. ససెక్స్ తరఫున కౌంటీ చాంపియన్షిప్లో పాల్గొనేందుకు జైదేవ్ ఉనాద్కట్ ఈ వారం చివర్లో ఇంగ్లండ్కు బయల్దేరి వెళ్లనున్నాడు. ప్రస్తుతం హండ్రెడ్ టోర్నీతో పాటు వన్డే కప్ జరుగుతుండడంతో కౌంటీ క్రికెట్కు చిన్న బ్రేక్ వచ్చింది. కౌంటీ క్రికెట్ ప్రారంభమవ్వగానే ఉనాద్కట్ జట్టుతో జాయిన్ అవనున్నాడు. ఓలీ రాబిన్సన్ నేతృత్వంలోని ససెక్స్ జట్టు ఈ సీజన్లో మంచి ప్రదర్శనే చేసింది. ఆడిన 8 మ్యాచ్ల్లో నాలుగు విజయాలు, రెండు ఓటములు, రెండు డ్రాలతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆగస్టు 20న తిరిగి ప్రారంభం కానున్న కౌంటీ చాంపియన్షిప్లో ఉనాద్కట్ ససెక్స్ తరఫున వార్విక్షైర్తో బర్మింగ్హమ్ వేదికగా మ్యాచ్లో ఆడనున్నాడు. కాగా ఉనాద్కట్ 2023 నుంచే కౌంటీల్లో ససెక్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నాడు. మొత్తం ఇప్పటివరకు ససెక్స్ తరఫున 13 మ్యాచ్లాడిన ఉనాద్కట్ 57 వికెట్లు పడగొట్టాడు. ఇక టీమిండియా తరఫున ఉనాద్కట్ నాలుగు టెస్టులు, ఎనిమిది వన్డేలు, 10 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఇక ఉనాద్కట్ చివరగా ఆగస్టు 2023లో వెస్టిండీస్తో వన్డే మ్యాచ్ ఆడాడు. అదే ఏడాది పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్తోనే చివరి టెస్టు ఆడాడు. ఇక ఉనాద్కట్ చివరి టీ20 మ్యాచ్ ఆడి 8 సంవత్సరాలు దాటింది. ఇక జైదేవ్ ఉనాద్కట్తో పాటు ప్రస్తుతం చాహల్ నాటింగ్హమ్షైర్కు, సర్రీ తరఫున రాహుల్ చాహర్ ఆడుతున్నారు. ఇక యార్క్షైర్ తరఫున కుల్దీప్ యాదవ్ వన్డే కప్ ఆడుతుండగా, స్నిన్నర్ మానవ్ సుతార్ వార్విక్షైర్ తరఫున రెండు కౌంటీ మ్యాచ్లు ఆడాడు.చదవండి: ‘వైభవ్ వాటికి దూరంగా ఉండు.. లేదంటే మరో పృథ్వీ షానే!’ -
‘వైభవ్ వాటికి దూరంగా ఉండు.. లేదంటే మరో పృథ్వీ షానే!’
టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో వైట్బాల్ ఫార్మాట్లో తనదైన ముద్ర వేయగల సామర్థ్యం వైభవ్ కలిగి ఉన్నాడని ఊతప్ప అభిప్రాయపడ్డాడు. గతంలో పృథ్వీ షా తక్కువ వయసులోనే జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత వేరే విషయాలపై దృష్టి పెట్టడంతో కెరీర్ దారి తప్పిందని, వైభవ్ అలా దారి తప్పకూడదని పరోక్షంగా హెచ్చరించాడు.ఒక మీడియా చానెల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఊతప్ప మాట్లాడాడు. ‘వైట్బాల్ క్రికెట్లో దిగ్గజం సచిన్ టెండూల్కర్ కంటే వైభవ్ ఎక్కువ ప్రభావం చూపగలడు. ఎందుకంటే సచిన్ లాగే చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. సచిన్ ఎంతటి పేరు ప్రతిష్టలు సాధించాడన్నది అందరికీ తెలిసింది. మరి వైభవ్ దానిని ఎలా నిలబెట్టుకుంటాడనేది ఆసక్తిగా మారింది. అంధఃపాతాళానికి పృథ్వీ షా..‘భారత క్రికెట్లో చిన్న వయసులో ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో పైకి వచ్చినవాళ్లను అరుదుగా చూశాం. ఉదాహరణకు వినోద్ కాంబ్లీ, పృథ్వీ షాలను తమ కెరీర్ను 17-18 ఏళ్ల వయసులోనే ప్రారంభించారు. ఈ ఇద్దరు భారత క్రికెట్లో ఎంతో ముద్ర వేస్తారని అంతా భావించారు. కాంబ్లీ సంగతి పక్కనబెడితే, పృథ్వీ షా కెరీర్ ట్రాక్ తప్పడానికి ప్రధాన కారణం అతడి వయస్సే. చిన్న వయసులోనే స్టార్డమ్ చూసిన పృథ్వీ షాకు కెరీర్ కంటే మిగతా విషయాలపై ఫోకస్ పెరిగింది. గర్ల్ఫ్రెండ్స్ మోజుతో పాటు ఎండార్స్మెంట్ రూపంలో యాడ్ చేయడంతో సంపాదనపై ఆసక్తి పెరిగింది. దీంతో ఎంతో భవిష్యత్తు ఉన్న పృథ్వీ షా కెరీర్ అంధఃపాతాళానికి పడిపోయింది. కాబట్టి వైభవ్ సూర్యవంశీకి అతడి వయస్సే పెద్ద సవాల్ కానుంది. ప్రస్తుతం 15 ఏళ్ల వయసున్న వైభవ్ రానున్న ఐదేళ్ల పాటు ఎలాంటి మచ్చ లేకుండా ఆటపై దృష్టి పెడతాడా అన్నది చూడాలి. వీలైనంత వరకు వయసు రీత్యా గర్ల్ఫ్రెండ్స్పై మోజు, ఎడాపెడా ఎండార్స్మెంట్లకు సంతకాలు చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలి. సరైన దారిలోనే..ఇప్పటికైతే వైభవ్ తనకు ఎలాంటి ఎండార్స్మెంట్ ఆఫర్ వచ్చినా ఆలోచించి అడుగు వేస్తున్నాడు. అంతేకాదు కేవలం ఆటపైనే దృష్టి పెట్టడం నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఇలాగే కంటిన్యూ చేస్తే వైట్బాల్లో సచిన్ను మించిన అద్భుతం అవుతాడు. అలా కాదని వ్యవహరిస్తే మాత్రం మరో పృథ్వీషాగా మిగిలిపోవడం ఖాయం. ఇప్పటికిప్పుడు సచిన్తో పోల్చడం సరైన చర్య కాకపోయినప్పటికీ, వైభవ్లో దాగున్న అపారమైన సామర్థ్యం అతడిని ప్రత్యేకంగా నిలుపుతుంది’ అని చెప్పుకొచ్చాడు.Read: సామ్ బిల్లింగ్స్ సిక్సర్ల వర్షం.. దూసుకెళ్తున్న ట్రెంట్ రాకెట్స్ -
యశ్ ధుల్ విధ్వంసకర శతకం
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ అదరగొట్టింది. పూరానీ ఢిల్లీ 6పై ఏకంగా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ విజయానికి యువ బ్యాటర్ యశ్ ధుల్ సంచలన సెంచరీ ప్రధాన కారణంగా నిలిచింది.141 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ధుల్ 47 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో అజేయ సెంచరీ బాదాడు. ధుల్ ఒంటిచేత్తో సెంట్రల్ ఢిల్లీని విజయతీరాలకు చేర్చాడు. అతడికి మరో ఎండ్లో యుగల్ సైనీ (27 నాటౌట్) నామమాత్రపు అండగా ఉన్నాడు. సైనీతో కలిసి ధుల్ అజేయమైన 81 పరుగులు జోడించి మ్యాచ్ను ఏకపక్షం చేశాడు. అంతకుముందు ధుల్ సహ ఓపెనర్ సిద్దార్థ్ జూన్ (8)తో తొలి వికెట్కు 60 పరుగులు జోడించాడు. ధుల్ ధాటికి సెంట్రల్ ఢిల్లీ 13.2 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో తొలుత పురానీ ఢిల్లీ 7 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఓపెనర్ సమర్థ్ సేథ్ (32) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. ఆఖర్లో అశ్విని చిల్లర్ (38), రోహన్ రాఠీ (46) బ్యాట్ ఝులిపించారు. సెంట్రల్ ఢిల్లీ బౌలర్లలో మోనీ గ్రేవాల్ 3, ఖురానా 2, బరోకా ఓ వికెట్ తీశారు.ధుల్ 2022 అండర్-19 ప్రపంచకప్లో భారత్కు కెప్టెన్గా వ్యవహరించి టైటిల్ గెలిపించాడు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అతడు 110 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ టోర్నీలో ధుల్ 4 మ్యాచ్ల్లో 229 పరుగులు చేశాడు. సగటు 76.33.అదే ఏడాది అండర్-19 ఆసియా కప్ గెలిచిన భారత్ జట్టులోనూ ధుల్ కీలక సభ్యుడు. అండర్-19 ప్రదర్శనల తర్వాత ధుల్ను భారత క్రికెట్లో భవిష్యత్ టాపార్డర్ బ్యాటర్గా పరిగణించారు. అయితే దురదృష్టవశాత్తు అతడు పెద్దగా రాణించలేకపోయాడు. తాజాగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో చేసిన సెంచరీ అతడి కెరీర్ను మలుపు తప్పుతుందేమో చూడాలి. -
క్రికెట్ వదిలి ఆఫీస్ కి ఇషాన్ కిషన్ శాలరీ ఎన్ని లక్షలో తెలుసా ?
-
ఆకిబ్ నబీ జీవితంలో ఆసక్తికర విశేషాలు
అది జమ్మూకశ్మీర్లోని బరాముల్లా పట్టణానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న షీరీ అనే గ్రామం. అక్కడ క్రికెట్ ఆడేందుకు పెద్దగా సౌకర్యాలు లేవు. నిత్యం రాజకీయ ఉద్రిక్తతలు ఉండే ఆ ప్రాంతంలో ఒక బాలుడు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాలని కలలు కన్నాడు. కలలు కనడమే కాకుండా పట్టుదల, కృషితో వాటిని సాకారం చేసుకున్నాడు.అతడి పేరే ఆకిబ్ నబీ. త్వరలో శ్రీలంకతో జరుగబోయే టెస్ట్ సిరీస్కు బుమ్రా ప్రత్యామ్నాయంగా ఎంపికైన ఆటగాడు. నిప్పులు చెరిగే బంతులతో బ్యాటర్ల పాలిట సింహస్వప్నమైన అతడిని క్రికెట్ సర్కిల్స్లో బారాముల్లా ఎక్స్ప్రెస్ అని పిలుస్తారు. లంకతో తొలి టెస్ట్తో టీమిండియా అరంగేట్రం చేసే అవకాశం ఉన్న నబీ జీవిత విశేషాలు ఈ కథనంలో చూద్దాం.29 ఏళ్ల నబీ చిన్నతనంలో ఫుట్బాల్పై ఆసక్తి చూపినప్పటికీ.. ఆ తర్వాత పేస్ బౌలింగ్పై మక్కువ పెంచుకున్నాడు. అదే ఆసక్తి అతడిని దేశవాళీ క్రికెట్లో తిరుగులేని పేసర్గా మార్చి, టీమిండియాలోకి తీసుకొచ్చింది. తద్వారా భారత టెస్ట్ జట్టుకు ఎంపికైన తొలి జమ్మూకశ్మీర్ క్రికెటర్గా చరిత్ర సృష్టించేలానూ చేసింది.డాక్టర్ కావాలని తండ్రి ఆశ..నబీకి క్రికెట్ కెరీర్ ఎంచుకోవడం అంత సులభంగా జరగలేదు. 12వ తరగతి చదువుతున్న సమయంలో అతడు బయోసైన్స్ విద్యార్థి. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడైన అతడి తండ్రి గులాం నబీ దార్ తన కొడుకు డాక్టర్ కావాలని కోరుకున్నారు.కానీ అదే సమయంలో నబీకు బీసీసీఐ నిర్వహించిన పేస్ బౌలింగ్ క్యాంప్లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఆ క్యాంప్కు ఆస్ట్రేలియా దిగ్గజం గ్లెన్ మెక్గ్రాత్ కోచ్గా వ్యవహరించాడు.కొడుకు చదువును పక్కన పెట్టి క్రికెట్ కోసం వెళ్లడం తండ్రికి అస్సలు నచ్చలేదు. క్రికెట్ను కెరీర్గా ఎంచుకోవడం ప్రమాదకరమైన నిర్ణయమని ఆయన భావించారు.అయితే ఈ విషయంలో నబీ తొలి కెప్టెన్ జుబైర్ దార్ జోక్యం చేసుకున్నారు. మెక్గ్రాత్ వంటి దిగ్గజం దగ్గర నేర్చుకునే అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుందని చెప్పి నబీను క్యాంప్కు పంపించేందుకు తండ్రిని ఒప్పించారు. అది నబీ క్రికెట్ జీవితాన్ని మార్చిన కీలక మలుపుల్లో ఒకటి.స్పైక్స్ కూడా తెలియని స్థాయి నుంచి ‘బరాముల్లా ఎక్స్ప్రెస్’గా..నబీ ప్రతిభను తొలిసారి గుర్తించింది కూడా జుబైర్ దారే. 14 ఏళ్ల వయసులో ప్రత్యర్థి జట్టు తరఫున ఆడుతున్న నబీను ఆయన చూశారు. ఓటమి ఎదురైనా బ్యాట్, బంతితో నబీ చూపిన తెగువ జుబైర్ను ఆకట్టుకుంది. నబీ ప్రతిభకు ముగ్ధుడైన జుబైర్.. బరాముల్లా క్లబ్లో చేరాలని ఆహ్వానించారు.అయితే అప్పట్లో నబీకు క్రికెట్లోని కనీస విషయాలు కూడా తెలీవు. శ్రీనగర్లోని షేర్-ఇ-కశ్మీర్ స్టేడియంలో తొలిసారి టర్ఫ్ వికెట్పై బౌలింగ్ చేసేందుకు దిగినప్పుడు అతడి కాళ్లు పాపింగ్ క్రీజ్ వద్ద జారిపోయాయి. పరుగెత్తుకుంటూ వచ్చి బంతి వేయాల్సిన బౌలర్.. పిచ్పై జారి పడిపోయాడు.అందుకు కారణం ఏంటంటే.. అతడు సాధారణ షూస్ వేసుకుని బౌలింగ్ చేయడానికి వచ్చాడు. ఫాస్ట్ బౌలింగ్కు స్పైక్స్ అవసరమని కూడా అతడికి తెలీదు.క్రికెట్ వ్యవస్థ గురించి అంతగా అవగాహన లేని నబీ మరోసారి తన అమాయకత్వంతో చిక్కుల్లో పడ్డాడు. జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ రెండు వర్గాలుగా విడిపోయిన సమయంలో రెండు వర్గాలు నిర్వహించిన క్యాంపులకు ఒకే రోజు వెళ్లాడు. ఉదయం ఒక క్యాంప్లో బౌలింగ్ చేసిన అతడు.. అక్కడి అధికారి చెప్పడంతో మధ్యాహ్నం మరో వర్గం నిర్వహించిన క్యాంప్కు కూడా వెళ్లి బౌలింగ్ చేశాడు. దీని వల్ల అతడు కొద్ది రోజుల పాటు క్రికెట్కు దూరంగా ఉండాల్సి వచ్చింది. అతడికి అక్కడి రాజకీయాలు తెలియదు. అతడికి తెలిసింది ఒక్కటే.. బంతిని వేగంగా, సరిగ్గా వేయడం.ఇర్ఫాన్ పఠాన్ మార్గదర్శకత్వంలో..నబీలో ఉన్న సహజమైన ప్రతిభకు సరైన మెరుగులు దిద్దింది మాజీ భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. ఇర్ఫాన్ పఠాన్ మార్గదర్శకత్వంలో నబీ బౌలింగ్లో అసలు మార్పు వచ్చింది. కేవలం వేగంతో బంతులు విసిరే పేసర్ నుంచి.. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల తెలివైన బౌలర్గా నబీ మారాడు. లైన్, లెంగ్త్పై పట్టు సాధించాడు.2018 సెప్టెంబర్లో విజయ్ హజారే ట్రోఫీతో లిస్ట్-ఏ అరంగేట్రం చేసిన నబీ.. 2020 జనవరిలో జార్ఖండ్పై ఫస్ట్క్లాస్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఒడిశాపై ఐదు వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటాడు. ఆ ప్రదర్శన జమ్మూకశ్మీర్ను క్వార్టర్ ఫైనల్స్కు చేర్చడంలో కీలకమైంది.44 వికెట్ల నుంచి డబుల్ హ్యాట్రిక్ వరకు..2024-25 రంజీ ట్రోఫీ నబీ కెరీర్లో కీలక మలుపు. ఆ సీజన్లో 44 వికెట్లతో దేశంలోనే అత్యధిక వికెట్లు తీసిన పేసర్గా నిలిచాడు. అతడి బౌలింగ్ సగటు కేవలం 13.93. అయితే అసలు సంచలనం 2025 ఆగస్టులో వచ్చింది.దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ తరఫున ఈస్ట్ జోన్పై ఆడుతున్నప్పుడు నబీ వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు. అంటే డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. అప్పటికే ‘బరాముల్లా ఎక్స్ప్రెస్’ అనే పేరు దేశవ్యాప్తంగా మార్మోగడం మొదలైంది.ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ 15 వికెట్లు తీసిన నబీ.. వైట్బాల్ క్రికెట్లోనూ తనకు తిరుగులేదని నిరూపించాడు.ఐపీఎల్లో జాక్పాట్దీంతో ఐపీఎల్ వేలంలో అతడి కోసం ఫ్రాంచైజీల మధ్య పోటీ నెలకొంది. చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ రూ.8.40 కోట్లకు నబీను సొంతం చేసుకుంది. ఒకప్పుడు కొడుకు విమాన టికెట్ కోసం రూ.10,000 సమకూర్చేందుకు ఇబ్బంది పడిన నబీ తండ్రి, ఐపీఎల్ జాక్పాట్ చూసి మురిసిపోయాడు.జమ్మూకశ్మీర్కు తొలి రంజీ టైటిల్.. నబీదే కీలక పాత్ర2025-26 రంజీ ట్రోఫీ సీజన్ నబీ కెరీర్లోనే అత్యంత గొప్ప అధ్యాయం.జమ్మూకశ్మీర్ తొలిసారి రంజీ ట్రోఫీ గెలవడంలో అతడి పేస్ బౌలింగే కీలకం. ఆ సీజన్లో అతడు కేవలం 17 ఇన్నింగ్స్ల్లో 60 వికెట్లు తీశాడు. 12.65 సగటున ఏకంగా ఎనిమిది సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచాడు.ఇండియా-ఏ నుంచి టీమిండియా వరకు..దేశవాళీ క్రికెట్లో వరుసగా అద్భుత ప్రదర్శనలు చేయడంతో భారత జట్టు తలుపులు తెరుచుకున్నాయి.2026 మధ్యలో శ్రీలంక పర్యటనకు వెళ్లిన ఇండియా-ఏ జట్టులో నబీ చోటు దక్కించుకున్నాడు. రెండు ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో ఆరు వికెట్లు తీశాడు.అంతేకాదు.. భారత సీనియర్ జట్టుకు నెట్ బౌలర్గా కూడా వ్యవహరించాడు. జాతీయ సెలెక్టర్ల ముందు తన సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశం అతడికి అక్కడే లభించింది. అయితే టీమిండియా టెస్ట్ జట్టులో చోటు దక్కుతుందని మాత్రం అతడు ఊహించి ఉండకపోవచ్చు.బుమ్రా గాయంతో తెరుచుకున్న తలుపుఆగస్టు 2026లో శ్రీలంకతో టెస్ట్ సిరీస్కు ముందు జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయం కారణంగా దూరమయ్యాడు. హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి కూడా అందుబాటులో లేకపోవడంతో భారత జట్టుకు మరో పేసర్ అవసరమైంది. అప్పుడు సెలెక్టర్ల దృష్టి నబీపై పడింది.రెండు రంజీ సీజన్లలో ఏకంగా 104 వికెట్లు. 2025-26 సీజన్లో 60 వికెట్లు. రెడ్బాల్లో రెండు వైపులా బంతిని స్వింగ్ చేయగల సామర్థ్యం. అద్భుతమైన ఫామ్. ఈ గణాంకాలన్నీ నబీకు అనుకూలంగా నిలిచాయి. దీంతో అతడికి భారత టెస్ట్ జట్టులో చోటు దక్కింది. -
మరోసారి వార్తల్లోకెక్కిన అర్షదీప్ సింగ్
టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ క్రికెటేతర విషయానికి సంబంధించి మరోసారి వార్తల్లో నిలిచాడు. అతడు పంజాబీ నటి, మోడల్ సమ్రీన్ కౌర్తో రిలేషన్లో ఉన్నాడని ఇటీవల సోషల్మీడియా కోడై కూసింది. ఆ ప్రచారం నిజమేనని తాజాగా జరిగిన ఓ ఉదంతంతో స్పష్టమైంది.సమ్రీన్ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో పోస్ట్ చేయగా అర్షదీప్ స్పందించాడు. ఎలుగుబంటి, రెడ్ హార్ట్ ఎమోజీలతో కామెంట్ చేశాడు. దీనికి సమ్రీన్ కూడా రెడ్ హార్ట్, లాక్ ఎమోజీలతో రిప్లై ఇచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం బహిర్గతమైంది.అర్ష్దీప్ కొద్ది రోజుల కిందట సమ్రీన్తో కలిసి ఉన్న రెండు ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి 'My Person' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్ట్ తర్వాతే అర్షదీప్-సమ్రీన్ రిలేషన్లో ఉన్నారని ప్రచారం మొదలైంది.ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగానూ వీరిద్దరు కలిసి తిరిగినప్పటికీ.. అప్పట్లో ఇంత ప్రచారం జరగలేదు. అర్షదీప్-సమ్రీన్ రిలేషన్కు నెటిజన్లు ఫిక్స్ అయిపోయినప్పటికీ.. వారి నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అర్షదీప్ క్రికెట్తో, సమ్రీన్ సోషల్మీడియాలో బిజీగా ఉన్నారు.అర్షదీప్ ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. అయితే వన్డేల్లో మాత్రం అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఒకే ఒక వన్డే ఆడి 0/72 గణాంకాలు నమోదు చేశాడు.ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ 2026 కోసం అర్ష్దీప్ సింగ్ నార్త్ జోన్ జట్టుకు ఎంపికయ్యాడు. జమ్మూ కశ్మీర్కు చెందిన కన్హయ్య వాధ్వాన్ ఈ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఢిల్లీ ఆటగాడు ఆయుష్ బదోనీ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. -
ఇక ఈ అధ్యాయం ముగిసిపోయింది
టీమిండియాతో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ భావోద్వేగానికి లోనయ్యాడు. భారత జట్టు సాధించిన తిరుగులేని విజయాల్లో తానూ భాగమైనందుకు సంతోషంగా ఉందన్నాడు. అయితే, ఈ అధ్యాయం ముగిసిపోయిందని.. ఏదేమైనా గత ఐదేళ్లు తన జీవితంలో మధుర జ్ఞాపకంగా మిగిలిపోతాయని పేర్కొన్నాడు.కాగా 2021, నవంబరులో టీమిండియా ఫీల్డింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన టి.దిలీప్ (T. Dilip).. తన హయాంలో మంచి మార్పులు తీసుకువచ్చాడు. మైదానంలో అత్యుత్తమంగా రాణించిన ఫీల్డర్లకు గుర్తింపుగా డ్రెసింగ్రూమ్లో ఫీల్డింగ్ మెడల్ ప్రదానం చేయడం మొదలుపెట్టాడు ఈ హైదరాబాదీ.అయితే, బీసీసీఐ మాత్రం అతడి కాంట్రాక్టును పొడిగించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ నేపథ్యంలో దిలీప్ స్థానంలో కొత్త ఫీల్డింగ్ కోచ్గా శుభదీప్ ఘోష్ను నియమించింది. ఈ నేపథ్యంలో దిలీప్ తాజాగా టీమిండియాతో తన అనుబంధం గురించి గుర్తుచేసుకుంటూ ఇన్స్టాలో పోస్టు పెట్టాడు.అదే లక్ష్యంతో పనిచేశాను‘‘ఈ ఐదేళ్ల ప్రయాణం గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు. సహాయక సిబ్బందిలో చేరే ముందే.. జట్టు కోసం నా సర్వస్వం ఇవ్వాలని భావించాను. మొదటి రోజు నుంచి అదే లక్ష్యంతో పనిచేశాను.ఫీల్డింగ్ కోచ్గా జట్టుతో ప్రయాణం చేయడం పట్ల నేను కృతజ్ఞుడినై ఉంటాను. ఫీల్డింగ్ మెడల్ అనేది మా మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ మెడల్ ప్రదానం ద్వారా డ్రెసింగ్రూమ్లో ఒక ఆహ్లాదకర వాతావరణం సృష్టించాము.చిరస్మరణీయ విజయాలుఈ జ్ఞాపకాలు నా మదిలో నిలిచిపోతాయి. రెండు టీ20 ప్రపంచకప్ (2024,2026), ఒక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (2025), రెండు ఆసియా కప్ (2023, 2025) ట్రోఫీలు గెలిచిన జట్టులో నేనూ భాగమే.ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్, వన్డే వరల్డ్కప్ (2023) ఫైనల్ చేరిన జట్టులోనూ నేను ఉన్నాను. ఈ ప్రయాణంలో నాకెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన బీసీసీఐకి సదా కృతజ్ఞుడినై ఉంటాను.మీరు కెప్టెన్లుగా ఉన్న సమయంలోనాపై నమ్మకం ఉంచినందుకు రాహుల్ ద్రవిడ్, గౌతం గంభీర్కు నా ధన్యవాదాలు. మీ ఇద్దరితో కలిసి పని చేయడం గొప్ప అనుభవం. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, శుబ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్.. మీరు కెప్టెన్లుగా ఉన్న సమయంలో భారత క్రికెట్కు నా వంతు సేవ చేయడాన్ని గొప్పగా భావిస్తున్నాను.ఈ ప్రయాణంలో నాతో ఉన్న ప్రతీ ఆటగాడు, కోచ్, సహాయక సిబ్బందిలోని ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఇప్పుడిక ఈ అధ్యాయం ముగిసిపోయింది. ఈ ఐదేళ్లు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు. అయితే, నా ప్రయాణం మాత్రం కొనసాగుతుంది’’ అని టి. దిలీప్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు.చదవండి: బుమ్రా అవుట్.. రీప్లేస్మెంట్ ప్రకటించిన బీసీసీఐ -
యువరాజ్ సింగ్ విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు!
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వ్యక్తిగత గోప్యత, హక్కులకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్ విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. యువరాజ్ సింగ్ వ్యక్తిగత హక్కులకు, గోప్యతకు భంగం కలిగించవద్దని స్పష్టంచేసింది. యువరాజ్ అనుమతి లేకుండా అతడి పేరు, ఫొటోలు, గొంతును వాణిజ్య లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని థర్డ్ పార్టీలను నియంత్రిస్తూ జస్టిస్ జ్యోతి సింగ్ తీర్పునిచ్చారు.తన వ్యక్తిత్వానికి భంగం కలిగించేలా అనుమతి లేకుండా తన పేరును ఉపయోగించి వస్తువులను అనధికారికంగా విక్రయించడమే కాకుండా, పలు సోషల్ మీడియా ఖాతాలు తనను కల్పిత, అవాస్తవ దృశ్యాలలో చూపిస్తున్నట్లుగా ఏఐ రూపొందించిన చిత్రాలు, వీడియోలను ప్రచురిస్తున్నారని, ఇవి తన ప్రతిష్టకు, సద్భావనకు నష్టం కలిగిస్తున్నాయని యువరాజ్ సింగ్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో ఇతర క్రీడాకారులపై దాడి చేస్తున్నట్లు, మతపరమైన భావాలను దెబ్బతీసేలా, అసభ్యకరమైన భాషతో కూడిన డీప్ఫేక్ కంటెంట్ను సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారని యువరాజ్ సింగ్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై జస్టిస్ జ్యోతిసింగ్ స్పందిస్తూ.. ‘17 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో దేశానికి యువరాజ్ ప్రాతినిధ్యం వహించాడు. దేశం తరఫున ఆడుతూ ఎన్నో ఘనతలు సొంతం చేసుకొని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రికెటర్లలో యువరాజ్ ఒకడు. అతడి వ్యక్తిత్వ, గోప్యతా హక్కులకు భంగం కలిగిస్తున్నవారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముంది. యువరాజ్ ఆమోదం లేకుండా రూపొందించిన అభ్యంతరకర పోస్టులు, వీడియోలు తక్షణమే తొలగించాలి’ అని తెలిపాడు.చదవండి: 'పతకాలు చూసి మురిసిపోవద్దు.. ముందుంది ముసళ్ల పండగ!’ -
‘అతడిని ఎంపిక చేయబోం.. రిటైరవ్వడమే మంచిది’
భారత జట్టు సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ టీమిండియాలో తిరిగి చోటు దక్కించుకోవడం కష్టమే అనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. తాజాగా భువనేశ్వర్ కుమార్తో పాటు మహమ్మద్ షమీ భవిష్యత్తుపై అజిత్ అగార్కర్ కీలక ప్రకటన చేయడం ఈ వార్తలకు బలం చేకూరుస్తుంది. 2027 వన్డే ప్రపంచకప్ కోసం 15 మంది ఫాస్ట్ బౌలర్లను సిద్ధం చేస్తున్నట్లు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. అయితే ఇందులో అందరూ యంగ్ బౌలర్లే ఉంటారని అగార్కర్ పేర్కొన్నాడు. 30 సంవత్సరాలు దాటిన బౌలర్లను తాము పరిగణలోకి తీసుకోవడం లేదని బాంబు పేల్చాడు.'షమీ టీమిండియా అత్యుత్తమ మ్యాచ్ విన్నర్లలో ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లలో షమీ ఛాంపియన్. కానీ భవిష్యత్తు కోసం మేము యువ పేస్ బౌలింగ్ దళానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. భారత క్రికెట్కు అతని సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి. మేము అతడిని గౌరవిస్తున్నాము.’ అని చెప్పుకొచ్చాడు. అగార్కర్ వ్యాఖ్యల ను బట్టి చూస్తే మాత్రం షమీ రిటైర్మెంట్కు సమయం ఆసన్నమైందంటూ పరోక్షంగా హింట్ ఇచ్చినట్లు అనిపిస్తోంది.ఒకప్పుడు భారత బౌలింగ్ దళానికి ప్రధాన బలంగా నిలిచిన షమీ.. ఇప్పుడు సెలెక్టర్ల దీర్ఘకాలిక ప్రణాళికల్లో చోటు దక్కించు కోలేకపోతున్నట్లు తెలుస్తోంది. 2023 వన్డే ప్రపంచకప్లో భారత జట్టు ఫైనల్ చేరడంలో షమీ కీలక పాత్ర పోషించాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకరిగా నిలిచి తన ప్రతిభను చాటుకున్నాడు. అనంతరం 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో చివరిసారిగా భారత జట్టు తరఫున వన్డే ఆడగా, అదే ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో చివరిసారి కనిపించాడు. షమీతో పాటు భువనేశ్వర్ కుమార్ కూడా 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలని ఎదురుచూస్తున్నారు. దీనికి తగినట్లుగానే గత రెండేళ్లుగా వీళ్లిద్దరి గణాంకాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. దేశవాళీ, రంజీలు అదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్స్లో అద్భుతంగా రాణిస్తున్నారు. అయినప్పటికీ బీసీసీఐ మాత్రం ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లను పట్టించుకోవడం లేదు. అవకాశాలు ఇవ్వడం లేదు. ముఖ్యంగా హెడ్కోచ్గా గంభీర్, సెలెక్టర్గా అజిత్ అగార్కర్ వచ్చిన తర్వాత వీళ్ల అడ్రస్ గల్లంతయ్యింది.🚨 Ajit Agarkar breaks silence on Mohammed Shami .🚨🔹We've picked our group of 15 fast bowlers for the future and want to give young players more opportunities ahead of the World Test Championship and the 2027 ODI World Cup.Shami has been one of India's finest match-winners… pic.twitter.com/p0mEPybruS— Indian cricket (@Cricketpaglu45) August 1, 2026చదవండి: హార్దిక్ మాజీ భార్యపై తీవ్ర విమర్శలు! -
ఆసియా కప్ 2026కు భారత జట్టు ప్రకటన
మహిళల ఆసియా కప్ 2026 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. కెప్టెన్సీపై ఇటీవల చర్చ జరిగినప్పటికీ హర్మన్ప్రీత్ కౌర్నే కెప్టెన్గా కొనసాగించింది. స్మృతి మంధానను వైస్ కెప్టెన్గా ఎంపిక చేసింది. జట్టులో స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ వంటి కీలక ప్లేయర్లకు చోటు దక్కింది.శ్రేయాంక పాటిల్కు చోటు లేదుటీ20 ప్రపంచకప్ జట్టులో ఉన్న శ్రేయాంక పాటిల్కు ఆసియా కప్ జట్టులో చోటు దక్కలేదు. నెదర్లాండ్స్తో మ్యాచ్లో ఆమె కుడి చీలమండకు గాయమయ్యింది. శ్రేయాంక స్థానంలో టీ20 ప్రపంచకప్ జట్టులోకి వచ్చిన ప్రేమా రావత్ ఆసియా కప్ జట్టులోనూ కొనసాగింది. ఇదే జట్టులో జరిగిన ప్రధాన మార్పు.భారత మహిళల ఆసియా కప్ 2026 జట్టుహర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి. కమిలిని, అరుంధతి రెడ్డి, ప్రేమా రావత్, రాధా యాదవ్, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, నందిని శర్మ, క్రాంతి గౌడ్.కాగా, ఆసియా కప్ 2026 సెప్టెంబర్ 17న మొదలై 22వ తేదీ వరకు జరుగనుంది. ఈ టోర్నీ ఫిక్చర్స్ ఇంకా ఖరారు కాలేదు. -
గుండుతో దర్శనం.. హార్దిక్ పాండ్యా కొత్త లుక్ వైరల్
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కొత్త లుక్తో దర్శనమిచ్చాడు. తన గర్ల్ఫ్రెండ్ మహికా శర్మతో కలిసి తిరుమల స్వామి వారిని దర్శించుకున్న పాండ్యా క్లీన్ హెడ్షేవ్ (గుండు)తో కనిపించాడు. దీంతో పాండ్యా కొత్త లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తిరుమల పర్యటనలో హార్దిక్ పాండ్యా శ్రీవారికి తలనీలాలు సమర్పించాడు. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన మొక్కుబడి తీర్చుకునే భాగంగానే తలనీలాలు సమర్పించారా.? లేక మరేదైనా వ్యక్తిగత కారణం ఉందా? అనేది తెలియాలి. ఇక ఐపీఎల్ 2026 సీజన్ చివర్లో గాయానికి గురైన పాండ్యా స్వదేశంలో అప్గానిస్తాన్తో సిరీస్తో పాటు ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లకు కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీవోఈ)లో పాండ్యా రీహాబిలిటేషన్లో గడుపుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ కోసం పాండ్యాను జాగ్రత్తగా కాపాడుకోవడంపై బీసీసీఐ ప్రత్యేక ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగానే పరిమితంగానే పాండ్యా సేవలు ఉపయోగించుకోవాలని చూస్తోంది. మరోవైపు పాండ్యా కూడా 2027 వన్డే ప్రపంచకప్ వరకు పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించే పనిలో పడ్డాడు.ఇక ఐపీఎల్ 2026 సీజన్లోనూ ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది. పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ 14 మ్యాచ్ల్లో కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. 2024 సీజన్కు ముందు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా నియమించినప్పటికీ.. అతని నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. పాండ్యా కెప్టెన్గా వచ్చిన తర్వాత కూడా ముంబై గత మూడు సీజన్లలో నిరాశాజనక ఫలితాలే అందుకుంది. దీంతో పాండ్యాను ముంబై ఇండియన్స్ వదులుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్కు పాండ్యా వేరే జట్టులో దర్శనమిచ్చే అవకాశముంది. ఇప్పటికే హార్దిక్ పాండ్యాను తమ జట్టులోకి తీసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ కూడా ఈ స్టార్ ఆల్రౌండర్ను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ట్రేడ్ లేదా ఒప్పందం ఖరారు కాలేదు. మొత్తంగా 2027 సీజన్లో హార్దిక్ ఏ జట్టు జెర్సీలో కనిపిస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.Indian cricketer Hardik Pandya visited the Sri Venkateswara Swamy Temple in Tirumala today with Mahika Sharma.Hardik offered his hair as part of a religious vow and was seen in a new bald look. The two also took part in the early morning Suprabhatha Seva. 🙏 pic.twitter.com/mdkQlecKLv— Amit Kumar Sindhi (@AMIT_GUJJU) August 2, 2026 Hardik Pandya with Mahieka at the Tirumala Temple. pic.twitter.com/3FjJ33ltw8— Mufaddal Vohra (@mufaddal_vohra) August 2, 2026Read: అభిషేక్ శర్మ ఊచకోత.. 91 బంతుల్లో 233 పరుగులు -
అభిషేక్ శర్మ ఊచకోత.. 91 బంతుల్లో 233 పరుగులు
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ స్థానికంగా జరిగిన ఓ వన్డే మ్యాచ్లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అమృత్సర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ తరన్ తారన్ మెన్స్ సీనియర్ జట్టుపై 91 బంతుల్లో 233 పరుగులతో చెలరేగాడు. ఈ ఇన్నింగ్స్లో 15 ఫోర్లు, 25 సిక్సర్లు ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.ఇదిలా ఉంటే, అభిషేక్ ఇటీవలికాలంలో టీమిండియా తరఫున వరుసగా విఫలమయ్యాడు. గత ఏడు టీ20 మ్యాచ్ల్లో అతడు ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. చివరిగా ఇంగ్లండ్ పర్యటనలో తొలి మ్యాచ్లో అర్ద సెంచరీ చేశాడు. దానికి ముందు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ చేయలేదు. అతడు చివరి సారిగా మూడంకెల స్కోర్ చేసింది ఐపీఎల్ 2026లో. డీసీతో జరిగిన మ్యాచ్లో అతడు 68 బంతుల్లో అజేయమైన 135 పరుగులు చేశాడు.తాజాగా జింబాబ్వేతో ముగిసిన 3 మ్యాచ్ల సిరీస్లో అభిషేక్ ఫామ్ ఘోరంగా పడిపోయింది. ఆ మూడు మ్యాచ్ల్లో అతడు వరుసగా 1, 8, 2 స్కోర్లు చేశాడు. ఈ సిరీస్లో అభిషేక్ కనీసం రెండంకెల స్కోర్ను కూడా చేయలేకపోయాడు. ప్రస్తుతం భారత జట్టు ఖాళీగా ఉండటంతో స్థానిక వన్డే మ్యాచ్ ఆడిన అభిషేక్ ఎట్టకేలకు ఫామ్ దొరకబుచ్చుకున్నాడు.త్వరలో టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుండగా, ఆ పర్యటన నిమిత్తం ఎంపిక చేసిన టెస్ట్ జట్టులో అభిషేక్కు చోటు దక్కలేదు. అభిషేక్కు గతకొంతకాలంగా టీ20ల్లో మాత్రమే అవకాశం వస్తుంది. తాజా ప్రదర్శనతో అతడు వన్డే జట్టులో స్థానంపై కూడా కన్నేయవచ్చు. టీమిండియా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ నిమిత్తం ఆగస్ట్ 4న శ్రీలంక పర్యటనకు బయల్దేరనుంది. ఈ సిరీస్లోని తొలి టెస్ట్ మ్యాచ్ గాలే వేదికగా ఆగస్ట్ 15న ప్రారంభం కానుంది. దీనికి ముందు భారత జట్టు ఓ వార్మప్ మ్యాచ్ ఆడనుంది. -
టీమిండియాకు భారీ షాక్
శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఎడమ మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్కు దూరమైనట్లు తెలుస్తోంది. తొలుత బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించాడని ప్రచారం జరిగినప్పటికీ.. అది నిజం కాదని సమాచారం.బుమ్రా ఇటీవల బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)కు చేరుకున్నాడు. అక్కడ నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో మోకాలిలో మరోసారి అసౌకర్యం ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.గాయం పూర్తిగా తగ్గకముందే బుమ్రాను బరిలోకి దింపితే సమస్య మళ్లీ తిరగబడే ప్రమాదం ఉందని బీసీసీఐ భావిస్తోంది. అందుకే అతడిని తొందరపెట్టకుండా విశ్రాంతి, పునరావాసానికి మరింత సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.ప్రత్యామ్నాయంపై ఇంకా స్పష్టత లేదుబుమ్రా స్థానంలో ఎవరిని జట్టులోకి తీసుకుంటారనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. బీసీసీఐ కూడా ఇప్పటివరకు బుమ్రా గైర్హాజరీపై అధికారికంగా స్పందించలేదు.శ్రీలంకతో తొలి టెస్టు ఆగస్టు 15న ప్రారంభం కానుండటంతో, బుమ్రా లేకపోవడం భారత పేస్ బౌలింగ్ విభాగానికి పెద్ద ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉంది. -
అసలెప్పుడు విడిపోయారు.. కలిసిపోవడానికి?
హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా.. టీమిండియా క్రికెటర్లయిన పాండ్యా బ్రదర్స్కు సెపరేట్ ఫ్యాన్బేస్ ఉంది. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ అన్నదమ్ముల్లో తమ్ముడైన హార్దిక్ టీమిండియాలో ఒక వెలుగు వెలుగుతున్నాడు. తమ్ముడంత కాకపోయినా కృనాల్ కూడా ఐపీఎల్ ద్వారా బాగానే గుర్తింపు పొందాడు. ముఖ్యంగా కృనాల్ పాండ్యా ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన జట్లలో సభ్యుడిగా ఉన్నాడు. అటు పాండ్యా కూడా ఈ రికార్డులో ముందువరుసలో ఉన్నాడు. మరి ఇప్పుడు వీరిద్దరి ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే.. తాజాగా హార్దిక్, కృనాల్లు కలిసిపోయారన్న వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ముంబై ఎయిర్పోర్టు నుంచి బయటకు వస్తూ ఈ ఇద్దరు అన్నదమ్ములు నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ బయటకి వస్తున్న ఫొటోలో సోషల్ మీడియాలో ప్రత్యక్ష్యమయ్యాయి. అయితే రియాల్టీలో ఇది పాత వీడియో అని, ఇప్పుడు కూడా హర్దిక్, కృనాల్ పాండ్యాలు మాట్లాడుకోవడం లేదని కొంతమంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వీడియోపై కొంతమంది ఫ్యాన్స్ మాత్రం 'అసలెప్పుడు విడిపోయారు.. ఇప్పుడు కలవడానికి’ అని కామెంట్ పెట్టారు.ఐపీఎల్ 2026 సీజన్ సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో హార్దిక్ ఔటైనప్పుడు కృనాల్ ఉత్సాహంగా సంబరాలు చేసుకున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి తోడు, ఆర్సీబీ టైటిల్ గెలిచిన తర్వాత హార్దిక్ తన సోదరుడిని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయనే ప్రచారం మొదలైంది.ఈ ఊహాగానాలపై కృనాల్ స్పందిస్తూ, "మేమిద్దరం కలిసే క్రికెట్ ఆడాం. ఆటలోని వ్యూహాలు, టెక్నిక్ గురించి ఎప్పుడూ చర్చించుకుంటాం. మా మధ్య ఆరోగ్యకరమైన చర్చే ఉంటుంది. ఒకే క్రీడలో ఇద్దరు సోదరులు ఉన్నప్పుడు ఒకరికొకరు అండగా నిలుస్తారు. దేవుడి దయవల్ల పాండ్య కుటుంబంలో 10 ఐపీఎల్ ట్రోఫీలు ఉండటం చిన్న విషయం కాదు" అని వివరించాడు. హార్దిక్ 5, తాను 5 ఐపీఎల్ టైటిళ్లు గెలిచామని తెలిపాడు.ఇక టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం తొడ కండరాల గాయం నుంచి కోలుకునే పనిలో ఉన్నాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెక్స్ (సీవోఈ)లో రీహాబిలిటేషన్లో ఉన్న పాండ్యా పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించే పనిలో ఉన్నాడు. 2027 వన్డే వరల్డ్కప్ దృష్టిలో పెట్టుకొని పాండ్యాను జాగ్రత్తగా కాపాడుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.It's hard to understand what changed between Hardik Pandya and Krunal Pandya. There was a time when the Pandya brothers were always seen together. But for the last two years, they haven't been seen together, and they don't talk to each other anymore. pic.twitter.com/Q71CCwo6HU— Sonu (@Cricket_live247) August 1, 2026Read: రేపే భారత్, పాక్ మ్యాచ్.. ఫెవరెట్గా గబ్బర్ సేన! -
అగార్కర్ అవుట్.. అశ్విన్ ఇన్ ఇక హిట్ మ్యాన్ ను ఆపేదెవరు
-
భారత్-శ్రీలంక సిరీస్కు సంబంధించి కీలక అప్డేట్స్
టీమిండియా శ్రీలంక పర్యటనకు సంబంధించి ఓ అప్డేట్ అందుతోంది. ఈ పర్యటనలో భారత్ ముందుగా ఓ నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్, ఆతర్వాత రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉండగా.. వార్మప్ మ్యాచ్ వ్యవధిని నాలుగు నుంచి మూడు రోజులకు తగ్గించారు. అప్డేట్ తర్వాత వార్మప్ మ్యాచ్ ఆగస్టు 7న ప్రారంభమై, ఆగస్టు 9న ముగియనుంది. ఈ మ్యాచ్ కొలంబోలోని NCC గ్రౌండ్లో జరుగనుంది. వార్మప్ మ్యాచ్ను ఒక రోజుకు కుదించడానికి గల ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. ఈ మ్యాచ్కు సంబంధించి మరో కీలక విషయం ఏంటంటే, ఈ మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది.కాగా, శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు ఆగస్టు 4న కొలంబోకు బయలుదేరనుంది. మూడు రోజుల వార్మప్ మ్యాచ్ అనంతరం గాలేకు వెళ్లనుంది.తొలి టెస్టు ఆగస్టు 15న గాలేలో ప్రారంభం కానుంది. రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి కొలంబోలోని SSC మైదానంలో జరగనుంది. ఈ సిరీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) సైకిల్లో భాగంగా జరుగనుంది.గుడ్ న్యూస్లంక సిరీస్కు ఫిట్నెస్ ఆధారంగా జట్టులోకి ఎంపికైన సాయి సుదర్శన్ కోలుకునే దిశగా ముందుకు సాగుతున్నట్లు సమాచారం. బొటనవేలికి స్వల్ప గాయం కారణంగా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసం పొందుతున్న అతను ఇప్పటికే బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.అదేవిధంగా మోకాలి సమస్య కారణంగా షరతులతో ఎంపికైన జస్ప్రీత్ బుమ్రా కూడా పూర్తి ఫిట్నెస్ సాధించే దిశగా ఉన్నట్లు సమాచారం. సిరీస్ ప్రారంభానికి ముందే ఇద్దరూ అందుబాటులోకి వస్తారని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. -
2027 వరల్డ్ కప్ కోసం రెడీ న్యూ లుక్ తో షేక్ చేస్తున్న రోహిత్..
-
కొత్త లుక్లో రోహిత్ శర్మ.. వయసులో పదేళ్లు వెనక్కి!
టీమిండియా సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ కొత్త లుక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. శుక్రవారం భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రితో కలిసి దిగిన ఫొటోలో రోహిత్ శర్మ క్లీన్ షేవ్తో కనిపించి ఆశ్చర్యపరిచాడు. దీంతో వయసులో రోహిత్ శర్మ ఒక పదేళ్లు వెనక్కి మళ్లినట్లుగా అనిపించింది. ఇక రవిశాస్త్రి కూడా రోహిత్ కొత్త లుక్పై ఆసక్తికర పోస్టును పెట్టాడు. రోహిత్ను ఇలా చూస్తుంటే చాలా రిలాక్స్గా అనిపిస్తోంది అని కామెంట్ చేశాడు.ఇటీవలే ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్తో జరిగిన చివరి వన్డేలో 39 ఏళ్ల రోహిత్ 110 బంతుల్లో 138 పరుగులతో రాణించాడు. అయితే ఇంగ్లండ్తో వన్డే సిరీస్ సమయంలోనే అతడి రిటైర్మెంట్పై ఊహాగానాలు వచ్చాయి. రోహిత్ శర్మ తనపై వచ్చిన వార్తలను కొట్టిపారేయగా, బీసీసీఐ కూడా 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్ టీమిండియా జట్టులో సభ్యుడిగా ఉంటాడని కుండబద్దలు కొట్టడంతో రిటైర్మెంట్ వార్తలన్నీ పుకార్లేనని తేలిపోయింది. ఇక కోహ్లితో పాటు రోహిత్ 2027 వన్డే ప్రపంచకప్ ఆడనున్నాడు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచకప్ వచ్చే ఏడాది అక్టోబర్-నవంబర్లో జరగనుంది. ఇక రోహిత్ శర్మ సెప్టెంబర్లో వెస్టిండీస్తో జరగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో దర్శనమివ్వనున్నాడు. Great bumping into a relaxed Shaaaarma on a stroll in London @ImRo45 pic.twitter.com/g3NSLef3n5— Ravi Shastri (@RaviShastriOfc) July 31, 2026His transformation is WOW. He is definitely aiming- The unfinished man is more dangerous than a new potential man.— Vinod Joshi (@Vinod_Joshii) July 31, 2026Rohit looks young, just like before pic.twitter.com/sqxZLQpwOv— GB (@GB80000) July 31, 2026చదవండి: ఇటలీ దిగ్గజ ఫుట్బాలర్ కన్నుమూత -
ఓ శకం ముగిసింది! క్రికెట్కు రహానే గుడ్బై.. అభిమానులు ఎమోషనల్
-
రహానే వీడ్కోలుపై లేటుగా స్పందించిన రోహిత్!
అజింక్య రహానే రిటైర్మెంట్పై భారత సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ ఆలస్యంగా స్పందించాడు. రోహిత్తో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా రహానేకు బెస్ట్ విషెస్ చెప్పాడు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ.. రహానేతో కలిసి గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగంతో స్పందించాడు. 'మేమిద్దరం చాలా ఏళ్ల పాటు డ్రెస్సింగ్ రూమ్ను పంచుకున్నాం. రహానే ఎంత కష్టపడతాడో నాకు బాగా తెలుసు. నువ్వు సాధించిన విజయాలు అద్భుతం. నీ నిబద్ధత, వృత్తిపట్ల అంకితభావం నిజంగా ప్రత్యేకమైనవి. అద్భుతమైన కెరీర్కు అభినందనలు. నీ భవిష్యత్తు మరింత విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్' అని రోహిత్ వెల్లడించాడు.ఇక టీమిండియా టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ కూడా రహానేకు భావోద్వేగ సందేశం పంపాడు. 'అజ్జూ భాయ్.. నీతో కలిసి మైదానంలోనూ, డ్రెస్సింగ్ రూమ్లోనూ గడపడం నాకు గౌరవంగా భావిస్తున్నా. నీ ప్రశాంత స్వభావం, ఆటపట్ల అంకితభావం అద్భుతం. నువ్వు ఎప్పుడూ మాకు స్ఫూర్తిగా నిలిచావు. నీ జీవితంలోని రెండో ఇన్నింగ్స్ కూడా అంతే విజయవంతంగా, సంతోషంగా సాగాలని నీకు, నీ కుటుంబ సభ్యులకు ఇదే నా ప్రత్యేక శుభాకాంక్షలు' అని సూర్య చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రహానే హండ్రెడ్ కాంపిటీషన్లో కామెంటేటర్గా వ్యవహరిస్తున్నాడు. అక్కడి నుంచే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా రిటైర్మెంట్ వార్తను పంచుకున్నాడు. జెర్సీ నెంబర్ 278కి వీడ్కోలు అంటే రహానే ఒక వీడియోను సోషల్మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఆ తర్వాత తన రిటైర్మెంట్పై భావోద్వేగ సందేశాన్ని వినిపించాడు. ఈ సందర్భంగా అతడి సహచరులు, దిగ్గజ క్రికెటర్లు రహానే కెరీర్ను కొనియాడుతూ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.ఫస్ట్ క్లాస్లో నిలకడగా రాణించిన రహానే 2013లో ఆస్ట్రేలియాపై మ్యాచ్తో టెస్టులో అరంగేట్రం చేశాడు. తన డిఫెన్స్, నిబద్ధతో రహానే అనతికాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో రహానే 85 టెస్టుల్లో 5,077 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 26 అర్ధసెంచరీలున్నాయి. ఇక 90 వన్డే మ్యాచ్ల్లో 2,962 పరుగులు సాధించిన రహానే ఖాతాలో మూడు సెంచరీలు, 24 అర్ధశతకాలు ఉన్నాయి. టీ20 క్రికెట్లో 20 మ్యాచ్లాడిన రహానే 375 పరుగులు సాధించాడు. ఇందులో ఒక ఫిఫ్టీ ఉంది. We've shared the dressing room for so many years and I know how much hard work has gone into everything you've achieved. Your commitment and professionalism have always set you apart. Congratulations on a wonderful career. Best wishes! @ajinkyarahane88 pic.twitter.com/r7eXb1yrUz— Rohit Sharma (@ImRo45) July 30, 2026Read: పక్కలో బల్లెంలా తయారయ్యాడు.. పంత్ కెరీర్కు ఎండ్కార్డ్! -
కొడితే సిక్స్ పడాల్సిందే.. వైభవ్ కీలక వ్యాఖ్యలు
-
పక్కలో బల్లెంలా తయారయ్యాడు.. పంత్ కెరీర్కు ఎండ్కార్డ్!
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ, శ్రీలంకతో జరగబోయే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించింది. ఊహించిన విధంగానే, దక్షిణాఫ్రికా టెస్ట్ పర్యటనలో నిరాశాజనక ప్రదర్శన, ఆఫ్ఘనిస్తాన్పై సాధారణ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ , ప్రధాన వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే మరోవైపు ధ్రువ్ జురెల్ రెండో వికెట్ కీపర్గా ఎంపికయ్యాడు. పంత్కు బ్యాకప్గా ప్రతీ సిరీస్కు ఎంపికవుతూ వస్తున్న ధ్రువ్ జురేల్ సిరీస్ సిరీస్కు రాటుదేలుతూ పంత్కు పక్కలో బల్లెంలా తయారయ్యాడనిపిస్తోంది. టెస్టు క్రికెట్లో ఇప్పటికైతే టీమిండియా వికెట్ కీపర్గా మొదటి ప్రాధాన్యత పంతకే ఉన్నప్పటికీ, జురేల్ రాకతో పోటీ తీవ్రమయింది. జురెల్ తనకు అవకాశాలు వచ్చినప్పుడల్లా బ్యాటింగ్తో పాటు వికెట్ల వెనుక కూడా నిలకడ ప్రదర్శిస్తూ జట్టులో తన స్థానాన్ని సుస్ధిరం చేసుకునే పనిలో పడ్డాడు.Photo Credit: BCCI Twitterఈ నేపథ్యంలోనే పంత్ స్థానాన్ని భర్తీ చేయడానికి జురెల్ నిజంగా అర్హుడేనా అని చూస్తే మాత్రం తొలి 10 టెస్టుల్లో పంత్ 727 పరుగులు చేస్తే, ధ్రువ్ జురెల్ 478 పరుగులు సాధించాడు. అయితే పంత్ టెస్టుల్లో ప్రధానంగా ఐదో స్థానంలో బ్యాటింగ్కు వస్తాడు. కానీ జురెల్ జట్టులో ఉంటే అతడి బ్యాటింగ్ స్థానం ఆరు లేదా ఏడు. దీనివల్ల జట్టులో స్పెషలిస్ట్ బ్యాటర్లంతా ఔటైన తర్వాత కానీ ధ్రువ్ జురెల్కు అవకాశం రావడం లేదు. దీంతో అతడు పెద్ద ఇన్నింగ్స్లు ఆడేందుకు అవకాశాలు పెద్దగా రావడం లేదు. అయితే ఒత్తిడి పరిస్థితులు ఉన్నప్పుడు సంయమనం పాటించడంలో పంత్తో పోలిస్తే జురెల్ ఒక మెట్టుపైనే ఉంటాడు. ఇక జురెల్తో పోలిస్తే పంత్ ప్రతీ 100 బంతులకు 18 పరుగులు వేగంగా సాధించడంలో దిట్ట. ఇంగ్లండ్లో జేమ్స్ అండర్సన్, ఆస్ట్రేలియాలో నాథన్ లయన్ ఇలా విదేశీ గడ్డపై ఎలాంటి బౌలర్లనైనా తన దూకుడైన బ్యాటింగ్తో పరుగులు సాధించడంలో ముందుంటాడు. అయితే పంత్తో పోలిస్తే ధ్రువ్ జురెల్ది పూర్తిగా భిన్నమైన బ్యాటింగ్. టెక్నికల్గా బ్యాటింగ్ ఆడడంలో నేర్పరి అయిన ధ్రువ్ జురెల్ వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాడు. తర్వాత ఓపికతో బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్లు నిర్మించడంలోనూ జురెల్ ముందు వరుసలో ఉంటాడు.బ్యాటింగ్ సంగతి పక్కనబెడితే, వికెట్కీపింగ్ నైపుణ్యంలో మాత్రం పంత్, జురెల్ సమానంగానే కనిపిస్తున్నారు. పది టెస్టుల తర్వాత పంత్ వికెట్ల వెనుక 47 డిస్మిసల్స్ చేస్తే, జురెల్ 15 నమోదు చేశాడు. ఇది పంత్కు అనుకూలంగా కనిపిస్తున్నప్పటికీ, పంత్ కీపర్గా లేని 10 ఇన్నింగ్స్ల్లో మాత్రమే కీపింగ్ చేశాడు. అదీగాక జురెల్ తుదిజట్టులో ఉన్నప్పటికీ, అనేక మ్యాచ్ల్లో కేఎల్ రాహుల్ లేదా పంత్లో ఒకరు గ్లోవ్స్ చేపట్టేవారు. అయితే 2026లో దేశీయంగా జురెల్ పేలవమైన ప్రదర్శన చేసినప్పటికీ, విదేశీ పర్యటనలన్నింటిలోనూ పంత్కు ప్రత్యామ్నాయంగా జురెల్ను ఎంపిక చేస్తూ ఉండడం, అతడి వికెట్కీపింగ్ సామర్థ్యాలపై యాజమాన్యానికి నమ్మకం పెరుగుతోందనిపిస్తోంది.Read: ‘కంగ్రాట్స్ జింక్స్.. నువ్వు నా ఫెవరెట్ బ్యాటింగ్ పార్టనర్’ -
‘కంగ్రాట్స్ జింక్స్.. నువ్వు నా ఫెవరెట్ బ్యాటింగ్ పార్టనర్’
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన అజింక్య రహానేకు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి అభినందనలు తెలిపాడు. సుదీర్ఘ కాలం దేశానికి ప్రాతినిధ్యం వహించిన అతడి కెరీర్ గొప్పగా సాగిందని పేర్కొన్న విరాట్.. ఇకపై కూడా అతడికి అంతా మంచే జరగాలని ఆకాంక్షించాడు. ఎన్నో ఏళ్లు తామిద్దరం కలిసి దేశానికి ఆడామని, జింక్స్ తన పార్టనర్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని కోహ్లి తెలిపాడు. ‘జింక్స్.. నీ క్రికెట్ కెరీర్ గొప్పగా సాగినందుకు అభినందనలు. భారత క్రికెటర్గా నువ్వు అద్భుతాలు చేశావు. నీ ఈ ప్రయాణం పట్ల నువ్వు చాలా గర్వపడాలి. స్లిప్లో నీ చేతులు చాలా సురక్షితమైనవి. టెస్టుల్లో నాకు ఇష్టమైన భాగస్వామివి నువ్వే. నువ్వు ఎల్లప్పుడూ బాగుండాలి. దేవుడి ఆశీర్వాదం నీకు ఉంటుంది’ అని కోహ్లీ తన పోస్ట్లో వెల్లడించాడు.కోహ్లి హయాంలోనే స్టార్ హోదా..ఇక కోహ్లీ కెప్టెన్సీలోనే రహానే కెరీర్ గొప్పగా సాగింది. కోహ్లి హయాంలోనే అతడు వైస్ కెప్టెన్గా, మిడిలార్డర్ బ్యాటర్గానూ స్థిరంగా రాణించాడు. కోహ్లి, రహానేలు కలిసి టీమిండియా తరఫున 67 టెస్టుల్లో ఆడారు. వీరిద్దరు కలిసి 3,661 పరుగులు జోడించారు. ఇందులో 10 శతక భాగస్వామ్యాలున్నాయి. ఈ ఇద్దరి మధ్య టెస్టుల్లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం 2016లో న్యూజిలాండ్తో టెస్టులో (365 పరుగులు) నమోదయ్యింది. ఇక ఇద్దరు కలిసి 33 వన్డేలు ఆడి 1717 పరుగులు జోడించారు. ఇందులో ఆరు శతక భాగస్వామ్యాలున్నాయి. అయితే మూడేళ్ల క్రితం వరకు కోహ్లి, పుజారా, రహానే, రోహిత్.. వీళ్లు లేని భారత టెస్టు జట్టును ఊహించలేం. ఎందుకంటే.. సుదీర్గ అనుభమున్న ఈ నలుగురికి కష్ట సమయంలో ఇన్నింగ్స్ నిర్మించడం, ప్రత్యర్ధి బౌలర్లను విసిగించడం ఎలాగో బాగా తెలుసు. టీమిండియా వరుసగా రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరడంలో ఈ నలుగురు కీలక పాత్ర పోషించారు. అంతేకాదు టెస్టుల్లో రోహిత్ సేన అగ్రస్థానంలో నిలవడంలో వీళ్ల పాత్ర మరువలేనిది.ఫస్ట్ క్లాస్లో నిలకడగా రాణించిన రహానే 2013లో ఆస్ట్రేలియాపై మ్యాచ్తో టెస్టులో అరంగేట్రం చేశాడు. తన డిఫెన్స్, నిబద్ధతో రహానే అనతికాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో రహానే 85 టెస్టుల్లో 5,077 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 26 అర్ధసెంచరీలున్నాయి. ఇక 90 వన్డే మ్యాచ్ల్లో 2,962 పరుగులు సాధించిన రహానే ఖాతాలో మూడు సెంచరీలు, 24 అర్ధశతకాలు ఉన్నాయి. టీ20 క్రికెట్లో 20 మ్యాచ్లాడిన రహానే 375 పరుగులు సాధించాడు. ఇందులో ఒక ఫిఫ్టీ ఉంది. Jinks, congratulations on a great career, buddy. You’ve done wonders for Indian cricket, and you can be very proud of your journey. The safest pair of hands in the slips and my favourite Test batting partner. Wishing you well always. God bless. 🤝🇮🇳@ajinkyarahane88 pic.twitter.com/bHGaas41gO— Virat Kohli (@imVkohli) July 30, 2026 -
BCCI నుంచి వైభవ్కు బిగ్ గిఫ్ట్.. వైస్ కెప్టెన్గా ప్రమోషన్!
-
రహానే స్థాయిని అమాంతం పెంచిన టాప్-5 ఇన్నింగ్స్లు!
టీమిండియా సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే గురువారం అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. 90వ దశకం నుంచి 2010 వరకు సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, గంగూలీ తరం భారత టెస్టు క్రికెట్ను నిలబెట్టారు. ఆ తర్వాత వీరి లెగసీని కోహ్లి, రోహిత్, రహానే, పుజారాలు విజయవంతంగా కొనసాగించారు. ద్రవిడ్ తర్వాత అజింక్య రహానే భారత్కు ఎన్నో ఇన్నింగ్స్లో ఆపద్భాందవుడి పాత్రను పోషించాడు. వన్డేలు, టెస్టుల్లో ఎన్నో మైలురాయి ఇన్నింగ్స్లు ఆడాడు. అయితే వాటిలో ఒక ఐదు ఇన్నింగ్స్లు మాత్రం రహానే స్థాయిని అమాంతం పెంచేశాయి. రహానే టాప్-5 బెస్ట్ ఇన్నింగ్స్లపై ఇప్పుడు ఒక లుక్కేద్దాం.👉112 పరుగులు(2020 మెల్బోర్న్ టెస్టులో, ఆసీస్పై)Photo Credit: BCCI Twitterఅజింక్య రహానే కెరీర్లోనే మైలురాయిగా నిలిచిపోయిన ఇన్నింగ్స్కు మెల్బోర్న్ వేదికగా నిలిచింది. అప్పటికే అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ (డే అండ్ నైట్) టెస్టులో 36 పరుగులకే ఆలౌటై టీమిండియా పరువు పోగొట్టుకుంది. ఈ మ్యాచ్ తర్వాత కోహ్లి కూడా తన కూతురు తొలి బర్త్డే కోసమని ఇండియాకు వెళ్లిపోయాడు. దీంతో రహానే కెప్టెన్సీ బాధ్యతను తీసుకున్నాడు. తొలి టెస్టులో ఘోర ఓటమితో పూర్తి ఒత్తిడిలో మునిగిపోయిన టీమిండియాను తన కెప్టెన్సీతో పూర్తిగా మార్చేశాడు. తొలి ఇన్నింగ్స్లో ఎంతో ఓపికగా ఆడిన రహానే 223 బంతుల్లో 112 పరుగుల వీరోచిత సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించడమే కాదు ఆ తర్వాత సిరీస్ను కూడా 2-1తో గెలుచుకొని రహానే సారథ్యంలో చారిత్రక విజయాన్ని అందుకుంది.👉103 పరుగులు (లార్డ్స్ టెస్ట్, 2014లో ఇంగ్లండ్పై)Photo Credit: BCCI Twitterమెల్బోర్న్ వేదికగా సాధించిన సెంచరీ కంటే ముందు, ఆరేళ్ల క్రితమే లార్డ్స్ గడ్డపై రహానే మరో వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. మెల్బోర్న్ లేకపోయుంటే లార్డ్స్దే రహానే కెరీర్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ అని బల్లగుద్ది చెప్పొచ్చు. మెల్బోర్న్ టెస్టుకు ఏమాత్రం తీసిపోని లార్డ్స్ టెస్టులో 154 బంతుల్లో 103 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. జేమ్స్ అండర్సన్ బంతితో నిప్పులు చెరుగుతున్న వేళ భారత టాప్ బ్యాటర్లంతా ఒక్కొక్కరుగా పెవిలియన్కు క్యూ కట్టారు. కానీ రహానే మాత్రం ఓపికను ప్రదర్శిస్తూ సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. ఇదే మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ (36) తన కెరీర్ అత్యధిక స్కోరు సాధించడం విశేషం.అయితే ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించడంతో రహానే ఇన్నింగ్స్ ఎవర్గ్రీన్గా నిలిచిపోయింది.👉ఢిల్లీ టెస్టులో రెండు సెంచరీలు (2015లో సౌతాఫ్రికాపై)Photo Credit: BCCI Twitter2015లో సౌతాఫ్రికా జట్టు భారత్లో పర్యటించింది. ఢిల్లీ వేదికగా ఇరుజట్లు నాలుగో టెస్టు మ్యాచ్ ఆడాయి. స్పిన్నర్లకు విపరీతంగా అనుకూలిస్తున్న పిచ్పై రహానే రెండు సెంచరీలతో చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్లో 127 పరుగులు సాధించిన రహానే.. రెండో ఇన్నింగ్స్లో కోహ్లితో కలిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం నెలకొల్పాడు. పనిలో పనిగా అజేయ సెంచరీ (100 నాటౌట్) సాధించిన రహానే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ను సొంతం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించిన రహానే సిరీస్ మొత్తంలో రెండు దేశాల తరఫున సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్గా రహానే నిలవడం విశేషం.👉79 పరుగులు (2015 వన్డే ప్రపంచకప్, సౌతాఫ్రికాపై)Photo Credit: BCCI Twitterకెరీర్ ఆరంభంలో వరుసగా వన్డే మ్యాచ్లు ఆడిన రహానే ఆ తర్వాత టెస్టులకే ఎక్కువగా పరిమితమయ్యాడు. అయితే 2015 వన్డే ప్రపంచకప్లో సౌతాఫ్రికాపై ఆడిన 79 పరుగుల ఇన్నింగ్స్ మాత్రం టాప్-5లో ఒకటిగా నిలుస్తోంది. ఆ మ్యాచ్లో రహానే 60 బంతుల్లోనే 79 పరుగులు సాధించడంతో టీమిండియా 300 పరుగుల మార్క్ను దాటింది. మ్యాచ్లో సౌతాఫ్రికా ఓటమికి పరోక్షంగా రహానే ఆడిన ఇన్నింగ్స్ కారణమైంది.👉39 బంతుల్లో 61 పరుగులు (2011లో ఇంగ్లండ్పై టీ20 మ్యాచ్లో)Photo Credit: BCCI Twitterరహానే అంటే క్లాస్ ఆటకు మారుపేరు అని ముద్ర పడిన రోజుల్లో తనలో మాస్ యాంగిల్ ఉందని నిరూపించిన ఇన్నింగ్స్ ఇది. ఇంగ్లండ్ గడ్డపై మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడేందుకు వెళ్లిన టీమిండియా, టీ20 సిరీస్లో భాగంగా ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన రహానే ఆరంభం నుంచే ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 39 బంతుల్లోనే 61 పరుగులు చేసిన రహానే ఇంగ్లండ్ గడ్డపై టీ20ల్లో హాఫ్ సెంచరీ సాధించిన తొలి బ్యాటర్గా రికార్డులకెక్కాడు. ఇవేగాక రహానే బ్యాట్ నుంచి జాలువారిన అమోఘమైన ఇన్నింగ్స్లు చాలానే ఉన్నప్పటికీ, మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ఇన్నింగ్స్లను చూసుకుంటే ఈ ఐదు కచ్చితంగా టాప్లోనే ఉంటాయి.చదవండి: పాకిస్తానీ కాదు.. ‘రియల్ పెద్ది’తోనే నీరజ్కు సవాల్! -
బీసీసీఐ కీలక నిర్ణయం
భారత క్రికెట్లో వయో మోసాన్ని (Age Fraud) అరికట్టేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కఠిన చర్యలు చేపట్టింది. వయో విభాగాల క్రికెట్లో పారదర్శకత పెంచేందుకు స్వతంత్ర సంస్థను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.అండర్-16, అండర్-19, అండర్-23 విభాగాల్లో ఆడే క్రికెటర్ల పత్రాలన్నింటినీ ఈ స్వతంత్ర సంస్థ పరిశీలించనుంది. ఆటగాళ్ల ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, పాఠశాల రికార్డులు వంటి వివరాలను సంబంధిత అధికారులు, విద్యాసంస్థలతో సరిపోల్చి వాటి ప్రామాణికతను నిర్ధారించనుంది.పత్రాల్లో ఏవైనా తేడాలు లేదా తారుమార్లు ఉన్నట్లు తేలితే, సంబంధిత ఆటగాడిని బీసీసీఐ వయో విభాగాల టోర్నీల్లో తన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించకుండా అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే చర్యలు తీసుకునే ముందు ఆటగాళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, తమ వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా కల్పించనుంది.ఇకపై అన్ని వయో విభాగాల క్రికెటర్లకు బయోమెట్రిక్ ధ్రువీకరణ కూడా తప్పనిసరి చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. గతంలో వయో మోసం ఆరోపణలతో రసిఖ్ సలామ్, ప్రిన్స్ యాదవ్, మంజోత్ కల్రా, నితీష్ రాణా వంటి పలువురు ఆటగాళ్లు బీసీసీఐ చర్యలను ఎదుర్కొన్నారు.ఆధార్లో చిరునామా మార్చాలిఅలాగే 2026-27 సీజన్కు రాష్ట్ర సంఘాన్ని మార్చుకోవాలనుకునే ఆటగాళ్లు సెప్టెంబర్ 1లోపు తమ ఆధార్ కార్డులో చిరునామాను నవీకరించి బీసీసీఐకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఒక సంవత్సరం నిరీక్షణ కాలం పూర్తయిన తర్వాతే వారు కొత్త రాష్ట్రం తరఫున ఆడేందుకు అర్హత పొందుతారు. -
టీమిండియా జెర్సీని కాషాయం రంగులోకి మార్చడంపై మాజీ కెప్టెన్ ఫైర్
భారత హాకీ జట్టు కొత్త జెర్సీ రంగుపై మాజీ కెప్టెన్, ఒలింపియన్ వీరెన్ రస్క్విన్హా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత హాకీ జట్టు గుర్తింపు, వారసత్వం ఎప్పుడూ నీలం (బ్లూ) రంగుతోనే ముడిపడి ఉందని, అలాంటప్పుడు ఆరెంజ్ జెర్సీని తీసుకురావడం వెనుక ఉన్న కారణమేంటని ప్రశ్నించారు.ఎఫ్ఐహెచ్ పురుషులు, మహిళల హాకీ ప్రపంచకప్లకు ముందు హాకీ ఇండియా భారత జట్ల కోసం కొత్త ఆరెంజ్ జెర్సీని ఆవిష్కరించింది. దీనిపై స్పందించిన రస్క్విన్హా, భారత హాకీ అభివృద్ధికి హాకీ ఇండియా ఎన్నో మంచి పనులు చేసినా, జాతీయ జట్టు తొలి జెర్సీ రంగును మార్చడం మాత్రం నిరాశ కలిగించిందన్నారు."భారత జట్టు గుర్తింపు, వారసత్వం ఎప్పుడూ బ్లూ జెర్సీతోనే ఉంటుంది. ఎన్నో సంవత్సరాలు ఆ నీలిరంగు జెర్సీ ధరించి గర్వపడ్డాను. అభిమానులు కూడా భారత జట్టును బ్లూ జెర్సీలోనే చూడాలని కోరుకుంటారు. మరి ఆరెంజ్ జెర్సీ వెనుక లాజిక్ ఏంటి..?"** అని ఆయన సోషల్ మీడియాలో ప్రశ్నించారు.తన వ్యాఖ్యలకు రాజకీయ రంగు పులుముతున్నారని పేర్కొన్న రస్క్విన్హా, తన ఉద్దేశం పూర్తిగా జట్టు సంప్రదాయం, గుర్తింపు గురించి మాత్రమేనని స్పష్టం చేశారు. "హాకీలో భారత్కు ఉన్న స్థానం, ఫుట్బాల్లో అర్జెంటీనాకు ఉన్న స్థానం లాంటిదే. అర్జెంటీనా తన సంప్రదాయ నీలం-తెలుపు చారల జెర్సీని వదిలి ఆరెంజ్ రంగు జెర్సీ ధరిస్తుందా..?" అని ఉదాహరణ ఇచ్చారు.మరోవైపు, కొత్త జెర్సీ రూపకల్పన వెనుక భావనను హాకీ ఇండియా వివరించింది. కాషాయ రంగు ధైర్యం, త్యాగం, విజయానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపింది. జెర్సీపై మండల నమూనాలు భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయని, అశోక చక్రం స్ఫూర్తితో రూపొందించిన నేవీ బ్లూ డిజైన్ శాంతి, పురోగతి, ఏకాగ్రతను సూచిస్తుందని పేర్కొంది. సుదర్శన చక్రం స్ఫూర్తితో రూపొందించిన ఛాతీ భాగంలోని డిజైన్ బలం, ఐక్యత, పురోగమనానికి చిహ్నమని వివరించింది.కాగా, ఆగస్టు 14 నుంచి బెల్జియం, నెదర్లాండ్స్లో జరిగే పురుషుల హాకీ ప్రపంచకప్లో భారత్ పూల్-డిలో ఇంగ్లండ్, వేల్స్, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది. మహిళల జట్టు ఆగస్టు 16న చైనాతో తమ ప్రపంచకప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. -
ఇంగ్లండ్ గడ్డపై కుల్దీప్ మెరుపులు
భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్ గడ్డపై మెరుపులు మెరిపిస్తున్నాడు. అక్కడి వన్డే కప్లో యార్క్షైర్ కౌంటీ తరఫున నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో ఆరు వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.టోర్నీ తొలి మ్యాచ్లో గ్లామోర్గన్పై 10 ఓవర్లు బౌలింగ్ చేసి 39 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇది కుల్దీప్కు వన్డే కౌంటీల్లో అరంగేట్రం మ్యాచ్.అనంతరం రెండో మ్యాచ్లో సస్సెక్స్పై 6.5 ఓవర్లలో 58 పరుగులు ఇచ్చి మరోసారి రెండు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఆతర్వాత వోర్సెస్టర్షైర్పై మూడోసారి రెండు వికెట్ల ప్రదర్శన (2-34) నమోదు చేసి టూ వికెట్స్ హ్యాట్రిక్ సాధించాడు.కుల్దీప్ వరుస సక్సెస్లతో దూసుకుపోవడంతో అతడి జట్టు యార్క్షైర్ కూడా మంచి విజయాలు సాధిస్తుంది. ఇంగ్లండ్ పరిస్థితులకు త్వరగా అలవాటు పడిన కుల్దీప్ యార్క్షైర్ బౌలింగ్ విభాగానికి కీలక బలంగా మారాడు.2027 వన్డే ప్రపంచకప్కు ఎంపిక దృష్ట్యా ఈ ప్రదర్శనలు కుల్దీప్ ఎంతో సానుకూలత కలగజేస్తాయి. కుల్దీప్కు ఇటీవలికాలంలో టీమిండియా తరఫున పెద్దగా అవకాశాలు రావడం లేదు.ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో అతడు జట్టులో ఉన్నా, ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. తాజాగా జింబాబ్వే టీ20 సిరీస్లోనూ అవకాశం దక్కలేదు.దీంతో కుల్దీప్ తనను తాను నిరూపించుకునేందుకు ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ బాట పట్టాడు. కుల్దీప్ టీమిండియాలో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, రవి బిష్ణోయ్ తదితర స్పిన్నర్ల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాడు. వైవిధ్యభరితమైన చైనామన్ శైలి కూడా అతడికి అవకాశాలు తెచ్చిపెట్టడం లేదు. -
30 ఏళ్లు దాటినా తగ్గేదేలే!.. టీమిండియాలో రీఎంట్రీకి సై!
ముప్పై మూడేళ్ల వయసులో తొలిసారి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు సారాంశ్ జైన్. దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించినప్పటికీ ఈ మధ్యప్రదేశ్ స్పిన్ ఆల్రౌండర్ సెలక్టర్ల పిలుపు కోసం సుమారు పన్నెండేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. జట్టు కూర్పు, పోటీ.. ఏదైతేనేమి ఎట్టకేలకు ఒక్కసారైనా జాతీయ జట్టుకు ఎంపిక కావాలన్న అతడి చిరకాల కోరిక తాజాగా నెరవేరింది.వాషింగ్టన్ సుందర్ గాయం సారాంశ్ జైన్ పాలిట వరంగా మారింది. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్కు వాషీ స్థానంలో సెలక్టర్లు ఈ ఆఫ్ స్పిన్నర్ను ఎంపికచేశారు. దీనిని బట్టి అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్టుకు అవసరమైన సమయంలో దేశవాళీ క్రికెట్లో మెరిసిన ఆటగాళ్ల నైపుణ్యాలకే పెద్దపీట వేస్తూ.. వారి వయసును పెద్దగా పట్టించుకోమనే సంకేతాలు ఇచ్చినట్లయింది.ఈ నేపథ్యంలో ముప్పై ఏళ్లు దాటినప్పటికీ తమను తాము నిరూపించుకుంటే.. ఆపై అదృష్టం కలిసివస్తే ఈ ఐదుగురు క్రికెటర్లకు కూడా టీమిండియా తలుపులు తెరిచే ఉంటాయనిపిస్తోంది. మరి వారెవరో చూసేద్దామా?!భువనేశ్వర్ కుమార్36 ఏళ్ల భువనేశ్వర్ కుమార్ ఒకప్పుడు టీమిండియా పేస్ దళంలో కీలక సభ్యుడు. అయితే, 2022 తర్వాత అతడికి టీమిండియాలో అవకాశాలు కనుమరుగయ్యాయి. ఈ క్రమంలో దేశీ క్రికెట్, ఐపీఎల్పై దృష్టి సారించిన భువీ.. ఆర్సీబీ వరుసగా రెండు టైటిళ్లు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.ఐపీఎల్ 2025, 2026 సీజన్లలో మొత్తంగా 45 వికెట్లు కూల్చి ఆర్సీబీ చాంపియన్గా నిలవడంలో భువీ సహకారం అందించాడు. నిలకడగా, పొదుపుగా బౌలింగ్ చేస్తున్న ఈ స్వింగ్ సుల్తాన్ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల వ్యాఖ్యానించాడు. ఐసీసీ టోర్నీల్లో భువీని ఆడిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.రజత్ పాటిదార్పదిహేడేళ్లుగా ఐపీఎల్ తొలి టైటిల్ కోసం ముఖం వాచిపోయిన ఆర్సీబీకి.. వరుసగా రెండు ట్రోఫీలు అందించి అభిమానులకు విందుభోజనం పెట్టిన కెప్టెన్ రజత్ పాటిదార్. 2024లో తొలిసారి టీమిండియాకు ఆడిన పాటిదార్కు ఇంత వరకు భారత టీ20 జట్టులో మాత్రం చోటు దక్కలేదు.అయితే, ఐపీఎల్లో బ్యాటర్గా, కెప్టెన్గా సత్తా చాటుతున్న 33 ఏళ్ల రజత్ పాటిదార్కు సెలక్టర్లు పిలుపునివ్వాలని భారత మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ ఏడాది ఐపీఎల్లో అతడు 15 మ్యాచ్లలో కలిపి 501 పరుగులు సాధించాడు.యజువేంద్ర చహల్టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ చివరగా 2023లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అయితే, గౌతం గంభీర్ హెడ్కోచ్గా వచ్చిన తర్వాత చహల్ తిరిగి రావడం మరింత కష్టమైపోయింది.వైవిధ్యమైన నైపుణ్యాలున్న కుల్దీప్ యాదవ్ వంటి స్పిన్నర్లకు పెద్దపీట వేసిన గంభీర్ బృందం.. యుజీ చహల్ను పూర్తిగా పక్కనపెట్టేసింది. అయితే, దేశీ క్రికెట్, కౌంటీ, ఐపీఎల్లో రాణిస్తున్న 36 ఏళ్ల చహల్.. తన బౌలింగ్లో పదును తగ్గలేదని సెలక్టర్లకు గుర్తుచేస్తూనే ఉన్నాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్ల వీరుడి (233)గా చహల్ ఇప్పటికీ కొనసాగుతుండటం అతడి ఆటలో నిలకడకు నిదర్శనం.కృనాల్ పాండ్యాస్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్గా, గన్ ఫీల్డర్గా కృనాల్ పాండ్యాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. చివరగా 2021లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన ఈ బరోడా ప్లేయర్.. ఐపీఎల్లో మాత్రం సత్తా చాటుతున్నాడు.ఆర్సీబీ వరుసగా రెండుసార్లు (2025,2026) టైటిల్ గెలవడంలో కృనాల్ తన వంతు పాత్ర పోషించాడు. 35 ఏళ్ల ఈ ఆల్రౌండర్ టీమిండియాలో పునరాగమనం చేయగలననే నమ్మకంతో ఉన్నాడు.సూర్యకుమార్ యాదవ్ఈ ఏడాది టీమిండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. అయితే, వ్యక్తిగత వైఫల్యాల కారణంగా ఈ ఐసీసీ టోర్నీ తర్వాత మేనేజ్మెంట్ అనూహ్య రీతిలో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా జట్టులోనే చోటు లేకుండా చేసింది.సూర్య వయసు 35 ఏళ్లు కావడం కూడా ఇందుకు ఓ కారణం. అయితే, దేశీ క్రికెట్లో గనుక సత్తా చాటితే సూర్య తిరిగి జాతీయ జట్టులోకి తప్పక వస్తాడని ఇటీవలే బీసీసీఐ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. సూర్య సైతం అందుకు తగ్గట్లుగానే తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. గంటల కొద్దీ నెట్స్లో శ్రమిస్తూ పునర్వైభవం పొందేదిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. -
వైస్ కెప్టెన్గా ఎంపికైన వైభవ్ సూర్యవంశీ
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. జింబాబ్వే పర్యటనలో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు అందుకున్న కొద్ది రోజులకే, భారత దేశవాళీ క్రికెట్లో ప్రతిష్ఠాత్మకమైన దులీప్ ట్రోఫీ 2026 కోసం ప్రకటించిన ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు.కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత జట్టులో చోటు సంపాదించిన వైభవ్ ఇప్పటివరకు ఎనిమిది ఫస్ట్క్లాస్ మ్యాచ్లు మాత్రమే ఆడినా, భారత క్రికెట్ భవిష్యత్తు స్టార్గా గుర్తింపు పొందుతున్నాడు.జూలై 29న ప్రకటించిన 15 మంది సభ్యుల ఈస్ట్ జోన్ జట్టుకు భారత వికెట్కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్గా ఎంపిక కాగా, వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు.ఈ జట్టులో భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్, షాబాజ్ అహ్మద్, అభిమన్యు ఈశ్వరన్, అనుకుల్ రాయ్, విరాట్ సింగ్ తదితరులు కూడా చోటు దక్కించుకున్నారు.దులీప్ ట్రోఫీ 2026 ఈస్ట్ జోన్ జట్టు: అభిమన్యు ఈశ్వరన్, సుదీప్ కుమార్ ఘరామి, షాబాజ్ అహ్మద్, సూరజ్ సింధు జైస్వాల్, మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), కుమార్ కుషాగ్ర, శిఖర్ మోహన్, అనుకుల్ రాయ్, విరాట్ సింగ్, సుభ్రాంశు సేనాపతి, వైభవ్ సూర్యవంశీ (వైస్ కెప్టెన్), దెనీష్ దాస్, అభిజిత్ సర్కార్.స్టాండ్బై ఆటగాళ్లు: ఆయుష్ లోహరుకా, శ్రీదామ్ పాల్, సాంబిత్ ఎస్. బరాల్, శరణ్దీప్ సింగ్, స్వస్తిక్ సమల్.కాగా, దులీప్ ట్రోఫీ ఆగస్ట్ 23 నుండి సెప్టెంబర్ 10 వరకు జరుగనుంది. 23నే ప్రారంభం కానున్న తొలి క్వార్టర్ ఫైనల్లో ఈస్ట్ జోన్ జట్టు నార్త్ ఈస్ట్ జోన్తో తలపడనుంది. ఆగస్ట్ 15 నుండి 27 మధ్యలో టీమిండియా శ్రీలంక పర్యటనలో రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడనున్నప్పటికీ.. టెస్ట్ జట్టులో ఇషాన్, వైభవ్కు చోటు దక్కని విషయం తెలిసిందే. -
టీమిండియాకు కొత్త కోచ్గా శుభదీప్ ఘోష్.. ఎవరీ ఈయన?
-
మంధాన ఒంటరి పోరాటం.. సూపర్ జెయింట్స్ ఉత్కంఠ విజయం
మహిళల హండ్రెడ్ టోర్నమెంట్లో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (88 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్తో తన జట్టు మాంచెస్టర్ సూపర్ జెయింట్స్కు ఉత్కంఠభరిత విజయాన్నందించింది. సన్రైజర్స్ లీడ్స్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వీరోచిత ఇన్నింగ్స్ ఆడింది. ఫలితంగా సూపర్ జెయింట్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.లక్ష్య ఛేదనలో మెగ్ లానింగ్ (24), మంధాన కలిసి తొలి వికెట్కు 41 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయిన జట్టు 61/1 నుంచి 71/5కు పడిపోవడంతో ఓటమి ముంగిట నిలిచింది.ఈ క్లిష్ట పరిస్థితుల్లో మంధాన ఒంటరి పోరాటం చేసింది. గ్రేస్ స్క్రివెన్స్తో 27 పరుగులు, కేథ్రిన్ బ్రైస్తో 48 పరుగుల కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టును విజయపథంలో నడిపించింది. రెండు సార్లు లభించిన క్యాచ్ అవకాశాలను ప్రత్యర్థి జట్టు చేజార్చుకోవడంతో మంధాన హండ్రెడ్ లీగ్లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసింది.చివరి 25 బంతుల్లో 44 పరుగులు అవసరమైన సమయంలో దూకుడు పెంచిన మంధాన వరుస సిక్సర్లతో మ్యాచ్ను మలుపు తిప్పింది. చివరి ఓవర్లో అవసరమైన ఎనిమిది పరుగులను రెండు భారీ సిక్సర్లతో పూర్తి చేసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది.అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ లీడ్స్ నిర్ణీత 100 బంతుల్లో నాలుగు వికెట్లకు 142 పరుగులు చేసింది. అన్నాబెల్ సదర్లాండ్ 35, లిచ్ఫీల్డ్ 31, బ్రయోనీ స్మిత్ 26 పరుగులతో రాణించగా, చివర్లో కెప్టెన్ డానియెల్ గిబ్సన్ ఆరు బంతుల్లోనే 18 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోర్ అందించింది.ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన మంధాన మాట్లాడుతూ, డ్రాప్ క్యాచ్ రూపంలో కొంత అదృష్టం కలిసి వచ్చినా మ్యాచ్ను విజయవంతంగా ముగించగలిగినందుకు సంతోషంగా ఉందని తెలిపింది. ఇలాంటి విజయాలు జట్టుకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయని పేర్కొంది. -
బుడ్డోడు దెబ్బకు అభిషేక్ పై వేటు.. వెళ్లి IPL ఆడుకో
-
టీమిండియాకు గుడ్బై చెప్పిన గంభీర్ స్నేహితుడు
భారత క్రికెట్ జట్టు సహాయక సిబ్బందిలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కటే, ఫీల్డింగ్ కోచ్ టీ. దిలీప్ల కాంట్రాక్టులను పొడిగించకూడదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది.ఇటీవల ముగిసిన ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల సమయంలోనే ఇద్దరి కాంట్రాక్టు గడువు పూర్తయిందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. వారి ఒప్పందాలను ఇకపై కొనసాగించడం లేదని తెలిపారు.గౌతమ్ గంభీర్ కోచింగ్ బృందంలో భాగంగా 2024లో భారత జట్టుతో చేరిన డష్కటే రెండేళ్ల పాటు సేవలందించారు. అయితే కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతో ఆయన ఎక్కువ కాలం జట్టుతో ప్రయాణించే బాధ్యతను కొనసాగించేందుకు ఆసక్తి చూపలేదని సమాచారం.భారత జట్టు నుంచి వైదొలిగిన అనంతరం డష్కటే తిరిగి ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్కతా నైట్ రైడర్స్ కోచింగ్ బృందంలో చేరే అవకాశం ఉంది. డష్కటే గంభీర్కు ఆప్త మిత్రుడు. వీరిద్దరికి ఐపీఎల్లో కేకేఆర్కు ఆడిన రోజుల్లో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరు స్నేహం కొనసాగించారు. డష్కటే టీమిండియా కోచ్ కావడానికి గంభీరే ప్రధాన కారకుడు.మరోవైపు, ఫీల్డింగ్ కోచ్ టీ. దిలీప్ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించే ప్రక్రియను బీసీసీఐ ప్రారంభించింది. శ్రీలంక పర్యటనకు ముందే కొత్త ఫీల్డింగ్ కోచ్ను ఖరారు చేయాలని బోర్డు భావిస్తోంది.ఫీల్డింగ్ కోచ్ పదవికి సుభదీప్ ఘోష్ పేరు ముందంజలో ఉన్నట్లు సమాచారం. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు చెందిన కొంతమంది కోచ్లు, మాజీ క్రికెటర్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
రియాలిటీ షోలో టీమిండియా కోచ్
టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ప్రముఖ హిందీ రియాలిటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ'లో ప్రత్యేక అతిథిగా కనిపించనున్నాడు. అయితే, ఆయన పోటీదారుగా కాకుండా షోలోని ప్రత్యేక స్టంట్లో భాగమవుతాడు. షో హోస్ట్ రోహిత్ శెట్టి పరిచయం చేయనున్న ఈ స్టంట్లో మోర్కెల్ తన వేగవంతమైన బౌలింగ్తో పోటీదారులకు సవాల్ విసరనున్నాడు.* గంటకు సుమారు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తాడు.* పోటీదారులు బ్యాట్తో కాకుండా భద్రతా పరికరాలు ధరించి తమ శరీరంతోనే బంతులను అడ్డుకోవాలి.* వారి వెనుక ఉన్న గోడను, వికెట్లను మోర్కెల్ బంతులు తాకకుండా కాపాడుకోవాల్సి ఉంటుంది.* విజయవంతంగా బంతులను అడ్డుకుంటే ఆ స్టంట్లో విజేతలుగా నిలుస్తారు.ఎప్పుడు ప్రసారం..?* షో ప్రారంభం: ఆగస్టు 1* ప్రసారం: ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు* టీవీ: కలర్స్ టీవీ* ఓటీటీ: జియోహాట్స్టార్కోచింగ్ బాధ్యతలకు ఆటంకం ఉండదు..!ఈ ఎపిసోడ్ ముందుగానే చిత్రీకరించబడినందున మోర్కెల్ భారత జట్టుతో కలిసి శ్రీలంక పర్యటనకు సమయానికి చేరుకోనున్నాడు. ఈ షో వల్ల ఆయన కోచింగ్ బాధ్యతలపై ఎలాంటి ప్రభావం ఉండదని సమాచారం.కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు వచ్చే నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్కు టీమిండియా బౌలింగ్ కోచ్గా కొనసాగనున్నాడు. ఈ సిరీస్ కోసం భారత జట్టును ఇవాళే ప్రకటించారు. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ ఆగస్ట్ 15న గాలే వేదికగా, రెండో టెస్ట్ మ్యాచ్ ఆగస్ట్ 23న కొలొంబో వేదికగా జరుగనున్నాయి. -
నా కల నెరవేరింది.. వైభవ్ ఎమోషనల్ కామెంట్స్
-
మృణాల్ ఠాకూర్ తో యశస్వి జైస్వాల్ డేటింగ్?
-
లక్ష్మణ్ నే కావాలి గంభీర్ పై ఆటగాళ్లు తిరుగుబాటు
-
శ్రీలంకతో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన
శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు బీసీసీఐ మంగళవారం భారత జట్టును ప్రకటించింది. అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మంగళవారం 15 మందితో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. లంకతో జరగనున్న టెస్టు సిరీస్కు శుబ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, కేఎల్ రాహుల్ అతడికి డిప్యుటీగా ఉండనున్నాడు. ఇక ఏడాది తర్వాత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వనుండగా, సారాన్ష్ జైన్ తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక బుమ్రా, సాయి సుదర్శన్లను ఎంపిక చేసినప్పటికీ సిరీస్ మొదలయ్యే సమయానికి ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 మధ్య గాలే వేదికగా, ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబో వేదికగా రెండో టెస్టు జరగనుంది. అయితే టెస్టు సిరీస్కు ముందు టీమిండియా ఆగస్టు 7 నుంచి కొలంబో వేదికగా నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.ఇంగ్లండ్తో సిరీస్ సందర్భంగా గాయానికి గురైన ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ లంకతో టెస్టు సిరీస్కు ఎంపికవుతాడని భావించినప్పటికీ, అతడి పేరును పరిగణలోకి తీసుకోలేదు. మరో ఆల్రౌండర్ నితీశ్ రానాతో పాటు పేసర్ హర్షిత్ రానాలు కూడా గాయాల నుంచి ఇంకా కోలుకోకపోవడంతో లంక టూర్కు దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది.టెస్టు మ్యాచ్ సిరీస్:ఆగస్టు 15-19 వరకు: తొలి టెస్టు, గాలేఆగస్టు 23-27 వరకు: రెండో టెస్టు, కొలంబోభారత జట్టు: శుభమన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్కీపర్), సాయి సుదర్శన్*, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా*, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాన్ష్ జైన్. 🚨 News 🚨#TeamIndia's squad for the 2⃣-match Test Series against Sri Lanka announced Note: Washington Sundar was not available for selection for the first Test. More Details ▶️ https://t.co/Vk0Xd8Axmq #SLvIND pic.twitter.com/NuCcKBohMj— BCCI (@BCCI) July 28, 2026చదవండి: టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి.. విండీస్ బౌలర్ ప్రపంచ రికార్డు -
రాజీనామా డిమాండ్ల మధ్య 'గంభీర'మైన పోస్ట్
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సోషల్ మీడియాలో చేసిన ఓ క్రిప్టిక్ పోస్ట్ చర్చనీయాంశమైంది. ఇటీవల భారత జట్టు వరుస సిరీస్ల్లో నిరాశపరిచిన తర్వాత కొందరు అభిమానులు గంభీర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఇటీవల కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో కొందరు నెటిజన్లు దానిని గంభీర్ పరిస్థితితో పోలుస్తూ మీమ్స్ను వైరల్ చేశారు.ఈ పరిస్థితి మధ్య గంభీర్ తన ఇన్స్టాగ్రామ్లో "Jab desh ka sabse Gambhir insaan muskura de…" అంటూ నవ్వుతున్న ఎమోజీలతో కూడిన పోస్ట్ను పంచుకున్నారు. ఈ పోస్ట్ను ఆయనపై వస్తున్న విమర్శలకు పరోక్ష సమాధానంగా పలువురు అభిమానులు భావిస్తున్నారు. అయితే గంభీర్ మాత్రం తన పోస్టులో ఎక్కడా రాజీనామా డిమాండ్లు లేదా విమర్శలను ప్రస్తావించలేదు.గంభీర్ మార్గదర్శకత్వంలోని భారత జట్టు ఇటీవల ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్ను 0-2తో, ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్ను 0-4తో, వన్డే సిరీస్ను 1-2తో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ వరుస పరాజయాల తర్వాత గంభీర్పై విమర్శలు తారాస్థాయికి చేరాయి.మరోవైపు, గంభీర్ విశ్రాంతిలో ఉండగా వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్గా జట్టుతో కలిసి జింబాబ్వే పర్యటనకు వెళ్లాడు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టు అక్కడ 3-0తో సిరీస్ను క్లీన్స్వీప్ చేయడంతో, లక్ష్మణ్ను శాశ్వత ప్రధాన కోచ్గా నియమించాలనే డిమాండ్లు తీవ్రమయ్యాయి.అయితే గంభీర్ కోచ్గా ఉన్న కాలంలో భారత్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్లను గెలుచుకున్న విషయాన్ని కూడా అభిమానులు గుర్తుంచుకోవాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఆయన పదవిపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. -
టీమిండియా ఓపెనర్తో మృణాల్ ఠాకూర్ డేటింగ్..?
బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్, భారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ డేటింగ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ముంబైలోని బాంద్రా వెస్ట్లో ఉన్న బూజీ కేఫే వద్ద వీరిద్దరూ కనిపించిన వీడియో వైరల్ కావడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి.Yashasvi Jaiswal dating Mrunal Thakur?😳 pic.twitter.com/dnr4FNSaEc— Wickets Hitting (@offpacedelivery) July 26, 2026ఆ వీడియోలో యశస్వి జైస్వాల్ కేఫే నుంచి బయటకు వస్తుండగా, మృణాల్ ఠాకూర్ లోపల ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే అందులో ఇద్దరూ కలిసి కనిపించలేదు. వారిద్దరి మధ్య ఎలాంటి సన్నిహిత సంబంధాన్ని సూచించే దృశ్యాలు కూడా వీడియోలో లేవు.ఇప్పటివ వరకు మృణాల్ గానీ, జైస్వాల్ గానీ ఈ ప్రచారంపై స్పందించలేదు. అలాగే వారు ప్రేమలో ఉన్నారని నిర్ధారించే ఆధారాలు కూడా లేవు. ఈ భేటీ వ్యక్తిగతమా, వృత్తిపరమైనదా లేదా ప్రకటన చిత్రీకరణకు సంబంధించినదా అన్నది స్పష్టంగా తెలియరాలేదు.మరోవైపు సోషల్ మీడియాలో వీరిద్దరి వయస్సు తేడాపైనా చర్చ జరుగుతోంది. మృణాల్కు ప్రస్తుతం 33 ఏళ్లు, జైస్వాల్కు 24. వీరి మధ్య సుమారు 9 ఏళ్లు తేడా ఉంది.ఇదిలా ఉంటే, గతంలో మృణాల్ ఠాకూర్ పేరు నటుడు ధనుష్తో ముడిపెడుతూ పలు కథనాలు వెలువడ్డాయి. అయితే ఆ వార్తలను ఆమె పూర్తిగా ఖండించింది. -
సీనియర్స్ కే ఆ అర్హత దక్కాలి వాళ్ళ తర్వాతే నేను
-
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్
జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్ల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఈ విజయంతో భారత టీ20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు.మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ల ద్వైపాక్షిక టీ20 సిరీస్లో జింబాబ్వేపై 3-0తో క్లీన్స్వీప్ చేసిన తొలి భారత కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన మూడో జట్టుగా భారత్ నిలిచింది. అంతకుముందు పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్ మాత్రమే జింబాబ్వేపై మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ల టీ20 సిరీస్ను క్లీన్స్వీప్ చేశాయి.జింబాబ్వేపై టీ20 సిరీస్ క్లీన్స్వీప్లు* పాకిస్తాన్ – 3-0 (2020)* ఆఫ్ఘనిస్తాన్– 3-0 (2021)* ఆఫ్ఘనిస్తాన్ – 3-0 (2022)* ఆఫ్ఘనిస్తాన్ – 3-0 (2025)* **భారత్** – 3-0 (2026)ధోనికి కూడా సాధ్యపడలేదు..!2010లో సురేశ్ రైనా నేతృత్వంలో భారత్ జింబాబ్వేపై 2-0తో సిరీస్ గెలిచినా, అది రెండు మ్యాచ్ల సిరీస్ మాత్రమే. 2015లో అజింక్య రహానే సిరీస్ను 1-1తో సమం చేయగా, 2016లో ఎంఎస్ ధోని నాయకత్వంలో భారత్ 2-1తో విజయం సాధించింది.2024లో శుభ్మన్ గిల్ సారథ్యంలో భారత్ 4-1తో సిరీస్ గెలిచింది. అయితే మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన తొలి భారత కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ చరిత్రలో నిలిచాడు.ఊరటనిచ్చిన విజయంటీ20 ప్రపంచకప్ విజేత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్కు కెప్టెన్సీ ఆరంభం నిరాశాజనకంగా సాగింది. ఐర్లాండ్తో 0-2, ఇంగ్లండ్తో 0-4 తేడాతో వరుస సిరీస్ల్లో భారత్ పరాజయం పాలైంది. తొలి ఏడు మ్యాచ్ల్లో (ఒకటి ఫలితం లేకుండా) ఆరు ఓటములు ఎదుర్కొన్న భారత కెప్టెన్గా అయ్యర్ అవాంఛిత రికార్డు నమోదు చేశాడు.అయితే జింబాబ్వేపై 3-0 సిరీస్ విజయం శ్రేయస్ అయ్యర్కు, అలాగే భారత జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఫలితంగా నిలిచింది. రానున్న కఠిన సిరీస్లలో ఇదే జోరును కొనసాగించాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. -
గర్ల్ఫ్రెండ్తో టీమిండియా క్రికెటర్ అర్ష్దీప్ సింగ్ (ఫొటోలు)
-
కసి మీదున్న సూర్యకుమార్.. 3 గంటల్లో వెయ్యి బంతులా!
టీమిండియా టీ20 స్పెషలిస్ట్, మాజీ కెప్టెన్ సూర్యకుమార్ కసిగా కనిపిస్తున్నాడు. పేలవ ఫామ్తో జట్టులో చోటు కోల్పోయిన సూర్యకుమార్ రీఎంట్రీ కోసం తెగ కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ముంబైలోని వాసూ పరన్జేప్ క్రికెట్ అకాడమీలో సూర్యకుమార్ మూడు గంటల పాటు నెట్స్లో సాధన చేశాడు. దాదాపు 3 గంటల పాటు వెయ్యి బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ వినూత్న షాట్లు ఆడి అలరించాడు. మళ్లీ టీమిండియాలో ఎప్పుడెప్పుడు అడుగుపెడదామా అన్నంతగా సూర్యలో కసి కనిపిస్తుంది. నెట్స్లో చెమటోడ్చిన వీడియోను ఎక్స్లో పంచుకున్న సూర్య.. ‘సండే ఫన్డే. క్విక్ రన్. 3 గంటల పాటు వెయ్యి బంతులు ఆడాను. మంచి ఫీల్ వచ్చింది’ అని క్యాప్షన్ జత చేశాడు. తాజాగా శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా 3-0తో జింబాబ్వేను క్లీన్స్వీప్ చేసింది. ఇక 35 ఏళ్ల సూర్యకుమార్ టీమిండియా కెప్టెన్గా 2026 టీ20 ప్రపంచకప్ను అందుకున్నాడు. అయితే బ్యాటర్గా విఫలమవుతూ వచ్చిన సూర్యకుమార్ ఐపీఎల్లోనూ పేలవ ప్రదర్శన కనబరిచాడు. దీంతో టీ20 కెప్టెన్సీ పదవిని కోల్పోయిన సూర్యకుమార్కు జట్టులోనూ చోటు ప్రశ్నార్థకంగా మారింది. అయితే సూర్య టీమిండియాలో చోటు కోల్పోయిన తర్వాత మహారాజ ట్రోఫీలో తన బ్యాటింగ్తో అదరగొట్టాడు. అప్పటినుంచి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్న సూర్యకుమార్ కఠోర సాధన కొనసాగిస్తున్నాడు. Sunday was fun. Quick run 🏃🏾 Batted around 1000 balls for 3 hours. Felt good 💪 pic.twitter.com/x6wH9Ebpmv— Surya Kumar Yadav (@surya_14kumar) July 26, 2026Read: మీరాబాయి స్వర్ణ పతకం వెనుక కన్నీటిగాథ! -
'గంభీర్ వద్దు; లక్ష్మణ్ ముద్దు'.. బీసీసీఐకి ఆటగాళ్ల విజ్ఞప్తి!
భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియా హెడ్కోచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న గంభీర్ కోచ్గా వరుస వైఫల్యాలు చవిచూస్తున్న వేళ.. తాత్కాలిక కోచ్గా లక్ష్మణ్ అదరగొట్టడంతో కోచ్ మార్పు చేయాలని కొందరు టీమిండియా ఆటగాళ్లు బీసీసీఐ వద్ద వాపోయినట్లు సమాచారం. టీమిండియా హెడ్కోచ్గా గౌతమ్ గంభీర్ను తొలగించి, అతడి స్థానంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్కు పూర్తి స్థాయి కోచ్ బాధ్యతలు అప్పగించాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. తాజాగా వరుస వైఫల్యాలతో జింబాబ్వే టూర్కు గంభీర్కు విశ్రాంతి ఇవ్వడంతో వీవీఎస్ లక్ష్మణ్ను తాత్కాలిక కోచ్గా జట్టుతో పంపించారు. గంభీర్ కోచ్గా ఉన్న సమయంలో ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్ల్లో వరుస ఓటములు చవిచూసిన కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జింబాబ్వే గడ్డపై తొలి విజయాన్ని అందుకున్నాడు. అంతేకాదు లక్ష్మణ్ రాకతోనే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా తొలి సిరీస్ విజయాన్ని అందుకున్నాడు. జింబాబ్వే చిన్న జట్టే అయినప్పటికీ, వారిపై సాధించిన ఏకపక్ష విజయాలు మాత్రం టీమిండియా దూకుడును చూపెట్టింది. దీంతో కెప్టెన్తో పాటు పలువురు ఆటగాళ్లు గంభీర్ను తొలగించి లక్ష్మణ్ను కోచ్గా ఎంపిక చేయాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఒకవేళ బీసీసీఐ గంభీర్ స్థానంలో లక్ష్మణ్కు హెడ్కోచ్ పదవి కట్టబెడితే, దానిని స్వీకరించడానికి లక్ష్మణ్ సిద్ధంగా ఉన్నాడా లేడా అనేది తెలియాల్సి ఉంది.ఇక టీమిండియా తాత్కాలిక కోచ్గా లక్ష్మణ్ ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉంది. అతడి కోచింగ్లో టీమిండియా 2022లో వరుసగా ఐర్లాండ్పై 2-0తో, జింబాబ్వేపై 3-0తో, న్యూజిలాండ్పై 1-0తో టీ20 సిరీస్లు గెలుచుకుంది. అయితే న్యూజిలాండ్తో వన్డే సిరీస్ను కోల్పోయినప్పటికీ, మళ్లీ 2024లో జింబాబ్వేపై 4-1 తేడాతో, సౌతాఫ్రికాపై 3-1 తేడాతో టీ20 సిరీస్లు గెలుచుకుంది. తాజాగా జింబాబ్వేతో టీ20 సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన టీమిండియాకు వీవీఎస్ లక్ష్మణ్ లక్కీ కోచ్గా మారిపోయాడు. మరి టీమిండియా కోచ్ మార్పు తధ్యమేనా! 🚨 BREAKING NEWS 🚨🚨 INDIA PLAYERS REPORTEDLY WANT VVS LAXMAN AS PERMANENT HEAD COACH 🚨According to reports, several Indian team players have reportedly requested the BCCI to consider appointing VVS Laxman as the permanent head coach. The reports claim some players believe… pic.twitter.com/uiwSTwNi38— Muffatball vikrant (@Vikrant_1589) July 26, 2026చదవండి: ‘అసాధారణమే కానీ మెరుగుపడాలి’.. వైభవ్కు చురకలు! -
సుందర్ సందేహమే!
న్యూఢిల్లీ: వచ్చే నెలలో శ్రీలంకలో పర్యటించనున్న భారత టెస్టు జట్టును మంగళవారం ఎంపిక చేయనున్నారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇందుకు కసరత్తులు చేస్తోంది. అయితే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయాలు సెలక్షన్ కమిటీని ఇబ్బంది పెడుతున్నాయి. గాయం కారణంగా ఇంగ్లండ్తో చివరి వన్డేకు దూరమైన బుమ్రా... సుదీర్ఘ ఫార్మాట్లో బరిలోకి దిగడంపై సందేహాలున్నాయి. అతడు పూర్తి ఫిట్నెస్ సాధించాడా లేదా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు వాషింగ్టన్ సుందర్ కూడా తొలి టెస్టు వరకు కోలుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు... శ్రీలంకతో రెండు టెస్టులు ఆడనుంది. ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలెలో తొలి టెస్టు జరగనుండగా... 23 నుంచి 27 వరకు కొలంబోలో రెండో టెస్టు నిర్వహించనున్నారు. పేస్ ఆల్రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా కండరాల గాయాలతో ఇబ్బంది పడుతుండగా... వీరిద్దరు లంక పర్యటనకు వరకు కోలుకునే అవకాశం లేదని బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీఓఈ) వెల్లడించింది. ‘సుందర్ రెండో టెస్టు వరకు ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది. దీంతో సెలక్టర్లు అతడిని కేవలం ఒక్క టెస్టుకే పరిగణించవచ్చు. అది కూడా ఫిట్నెస్ సాధిస్తేనే. రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్యాదవ్తో పాటు... నాలుగో స్పిన్నర్గా హర్‡్ష దూబేకు అవకాశం దక్కొచ్చు’ అని బీసీసీఐ అధికారి తెలిపారు. శ్రీలంక ‘ఎ’ జట్టుతో సిరీస్లో భారత్ ‘ఎ’ తరఫున ఆకట్టుకున్న ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. లోయర్ ఆర్డర్లో చక్కటి బ్యాటింగ్ చేయగల సామర్థ్యం సారాంశ్ సొంతం. జీషాన్ అన్సారీ, విప్రాజ్ నిగమ్ను కూడా పరిశీలించవచ్చు. బుమ్రా అందుబాటులో లేకుంటే... మొహమ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్, ప్రసిధ్ కృష్ణ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో ఆకట్టుకున్న ఆకాశ్దీప్ కోలుకునేందుకు మరింత సమయం పట్టనుంది. హార్దిక్ ఆగస్టు తర్వాతే... మరోవైపు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వచ్చే నెల తర్వాతే సెలక్టర్ల పరిధిలోకి వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం బెంగళూరుకు మకాం మార్చిన పాండ్యా పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. ‘వన్డే, టి20 ఫార్మాట్లు ఆడేందుకు హార్దిక్ సిద్ధమవుతున్నాడు. ఈ నెలాఖరులోగా అతడు ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది. వచ్చే నెలలో అతడు సెలక్షన్కు అందుబాటులో ఉండనున్నాడు. ప్రస్తుతం బెంగళూరు సీఓఈలో అతడి సాధన సాగుతోంది. అటు ఫిట్నెస్ మెరుగు పరుచుకోవడానికి కృషి చేస్తూనే... పూర్తి స్థాయిలో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు’ అని బీసీసీఐ అధికారి తెలిపారు. -
టీమిండియాలోకి కొత్తగా ఎనిమిది మంది
భారత క్రికెట్ జట్టు 2026లో యువ ప్రతిభను ప్రోత్సహించే దిశగా అన్ని ఫార్మాట్లలో కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. టెస్టుల్లో మానవ్ సుతార్ అరంగేట్రం చేయగా, వన్డేల్లో హర్ష్ దుబే, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్ భారత జెర్సీ ధరించారు. టీ20ల్లో ప్రిన్స్ యాదవ్, సూర్యాంశ్ షెడ్గే, వైభవ్ సూర్యవంశీ, అశోక్ శర్మ, యశ్ ఠాకూర్ అంతర్జాతీయ క్రికెట్లో తొలి అడుగు వేశారు. కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం ద్వారా రాబోయే ఐసీసీ టోర్నీలు, 2028 ఒలింపిక్స్ వంటి ప్రధాన ఈవెంట్ల కోసం బలమైన బెంచ్ స్ట్రెంగ్త్ను సిద్ధం చేయాలని భారత జట్టు యాజమాన్యం భావిస్తోంది.2026లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన ఆటగాళ్లు:టెస్టులు: * మానవ్ సుతార్ – ఆఫ్ఘనిస్తాన్తో, ముల్లాన్పూర్వన్డేలు:* హర్ష్ దుబే – ఆఫ్ఘనిస్తాన్తో, ధర్మశాల* గుర్నూర్ బ్రార్ – ఆఫ్ఘనిస్తాన్తో, ధర్మశాల* ప్రిన్స్ యాదవ్ – ఆఫ్ఘనిస్తాన్తో, లక్నోటీ20లు:* ప్రిన్స్ యాదవ్ – ఐర్లాండ్తో, బెల్ఫాస్ట్* సూర్యాంశ్ షెడ్గే – ఐర్లాండ్తో, బెల్ఫాస్ట్* వైభవ్ సూర్యవంశీ – ఇంగ్లండ్తో, మాంచెస్టర్* అశోక్ శర్మ – జింబాబ్వేతో, హరారే* యశ్ ఠాకూర్ – జింబాబ్వేతో, హరారేఈ ఏడాది అరంగేట్రం చేసిన ఈ ఎనిమిది మందిలో వైభవ్ సూర్యవంశీపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా అతను సత్తా చాటకపోయినా, ఓ మోస్తరు ప్రదర్శనతో పర్వాలేదనిపించాడు. తాజాగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో అతను 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. బౌలర్ల విషయానికొస్తే..ప్రిన్స్ యాదవ్ (6 టీ20ల్లో 9 వికెట్లు), గుర్నూర్ బ్రార్ (6 మ్యాచ్ల్లో 11 వికెట్లు) సత్తా చాటారు. వచ్చే ఏడాది వన్డే వరల్డ్కప్ దృష్ట్యా ఈ ఏడాది మరికొంత మంది ఆటగాళ్లు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. -
నితీశ్ కుమార్ రెడ్డికి సంబంధించి బిగ్ న్యూస్..!
టీమిండియా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఓ బిగ్ న్యూస్ అందుతుంది. త్వరలో శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు అతను దూరమయ్యే అవకాశమున్నట్లు నివేదికలు వెల్లడించాయి.నితీశ్ ప్రస్తుతం ఎడమ క్వాడ్రిసెప్స్ (తొడ కండరాల) గాయం నుంచి కోలుకుంటున్నాడు. పునరావాసంలో మంచి పురోగతి సాధిస్తున్నప్పటికీ, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్ట్యా బీసీసీఐ అతడిని టెస్టు క్రికెట్లో తొందరగా బరిలోకి దించకూడదని భావిస్తున్నట్లు సమాచారం.ఇటీవల ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన తొలి వన్డే సందర్భంగా బౌలింగ్ చేస్తూ నితీశ్ అసౌకర్యానికి గురయ్యాడు. దీంతో రెండో వన్డేకు విశ్రాంతి ఇచ్చిన జట్టు యాజమాన్యం, మూడో వన్డేలో మళ్లీ ఆడించగా గాయం మరింత తీవ్రతరమైంది.క్రిక్బజ్ కథనం ప్రకారం, నితీశ్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసం పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీలంక టెస్టు సిరీస్కు అతడిని ఎంపిక చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నివేదిక పేర్కొంది.అయితే, నితీశ్ కుమార్ రెడ్డి గైర్హాజరుపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఇది మీడియా కథనాల ఆధారంగా వచ్చిన సమాచారం మాత్రమే.కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు శ్రీలంకలో పర్యటింనుంది. తొలి టెస్ట్ గాలే వేదికగా ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం కానుండగా.. రెండో టెస్ట్ ఆగస్ట్ 23 నుంచి కొలొంబో వేదికగా జరుగనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. -
చెలరేగిన తిలక్, ఇషాన్.. చేతులెత్తిసిన బుడ్జోడు, అభిషేక్..
-
హార్దిక్ పాండ్యా విషయంలో బీసీసీఐ మాస్టర్ప్లాన్!
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా విషయంలో బీసీసీఐ మాస్టర్ ప్లాన్ వేసింది. 2027 వన్డే వరల్డ్కప్ వరకు పాండ్యా పూర్తి ఫిట్నెస్ సాధించాలనే ఉద్దేశంతో అప్పటివరకు జరగనున్న ద్వైపాక్షిక సిరీస్లకు అతడిని ఎంపిక చేయబోమని బీసీసీఐ పేర్కొనడం ఆసక్తి కలిగించింది. ఐపీఎల్ 2026 సీజన్ చివర్లో గాయం బారిన పడ్డ పాండ్యా కోలుకొని ఫిట్నెస్ సాధించిన పాండ్యాను మొదట అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు ఎంపిక చేశారు. కానీ ఇదే సమయంలో పాండ్యాకు తొడ కండరాల్లో గాయం తిరగబెట్టడంతో ఆఫ్గన్తో పాటు ఇంగ్లండ్ సిరీస్కు కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శిబిరంలోనే చికిత్స తీసుకుంటున్న పాండ్యా పూర్తిగా కోలుకునే పనిలో ఉన్నాడు. రేవ్ స్పోర్ట్స్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం పాండ్యా తన ఫిట్నెస్పైనే పూర్తి దృష్టి సారించాడని తెలుస్తోంది. అందుకే పూర్తిగా కోలుకున్నా ఇప్పుడే టీమిండియాలోకి రాకూడదనే ఉద్దేశంతో పాండ్యా 'పర్ఫార్మెన్స్ బ్లాక్' పేరిట దీర్ఘకాలిక ఫిట్నెస్ టార్గెట్ చేసుకొని దానిని అనుసరిస్తున్నట్లు సమాచారం. 32 ఏళ్ల వయసున్న పాండ్యా ఇప్పటికే తన ప్రోగ్రామ్లో గరిష్ట ఫిట్నెస్ను సాధించేందుకు దగ్గర్లో ఉన్నాడని, అత్యుత్తమ ప్రదర్శనను కనబరచడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు సమాచారం. బీసీసీఐ కూడా పాండ్యాను 2027 వన్డే వరల్డ్కప్ వరకు జాగ్రత్తగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆచితూచి వ్యవహరిస్తునట్లు తెలుస్తోంది. అందుకే వన్డే ప్రపంచకప్లోపు జరిగే ద్వైపాక్షిక సిరీస్ల్లో పాండ్యాను ఎక్కువగా ఆడించే అవకాశం లేదనిపిస్తోంది. ఒకవేళ సెలెక్ట్ చేసినా అది 50 ఓవర్ల ఫార్మాట్ మాత్రమే అతడికి ప్రాధాన్యమివ్వనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027 వన్డే ప్రపంచకప్లో ఆల్రౌండర్గా పాండ్యా కీలకం కానున్నాడని బీసీసీఐ బలంగా నమ్ముతోంది. అందుకే ప్రపంచకప్ సమీపిస్తుందనగా, అప్పుడు జరిగే వన్డే సిరీస్లకు పాండ్యాను ఎంపిక చేయాలని చూస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శనతో హార్దిక్ పాండ్యాను ఆ ఫ్రాంచైజీ విడుదల చేయనుంది. దీంతో ట్రేడింగ్లో పాండ్యా కేకేఆర్ లేదా చెన్నై జట్లకు వెళ్లే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.Read: ‘వైభవ్ నా తమ్ముడు.. నేనిచ్చే సలహా అదొక్కటే’ -
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో ఓ అరుదైన రికార్డు సాధించాడు. బ్యాట్తో మరోసారి నిరాశపరిచినప్పటికీ, బంతితో అద్భుత ప్రదర్శన (3-17) చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో అతను అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారత ఓపెనింగ్ బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. మూడు ఫార్మాట్లలో భారత ఓపెనర్ల అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు:* టెస్టులు: వినూ మాంకడ్ – 8/52 (పాకిస్థాన్పై, 1952)* వన్డేలు: రవి శాస్త్రి – 5/15 (ఆస్ట్రేలియాపై, 1991)* టీ20లు: అభిషేక్ శర్మ – 3/17 (జింబాబ్వేపై, 2026)అభిషేక్కు తోడుగా యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయడంతో జింబాబ్వే 220 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం 129 పరుగులకే ఆలౌటై, 90 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. ఫలితంగా భారత్ మూడు మ్యాచ్ల ఈ సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ టీమిండియానే గెలిచింది. నామమాత్రపు మూడో టీ20 ఇవాళే (జులై 26) జరుగనుంది. భారత టీ20 జట్టు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు ఇది తొలి సిరీస్ విజయం.బ్యాట్తో తడబడుతున్న అభిషేక్అభిషేక్ ఈ మ్యాచ్లో బంతితో రాణించినా, గత కొన్ని ఇన్నింగ్స్లుగా బ్యాట్తో తడబడుతున్నాడు. చివరిగా ఇంగ్లండ్తో తొలి టీ20లో అర్ద సెంచరీ చేసిన అతడు.. ఆతర్వాత వరుసగా 43, 10, 16, 3, 1 పరుగుకు ఔటయ్యాడు.నిన్నటి రెండో టీ20లో ఓ మోస్తరు స్టార్ట్ లభించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేక వికెట్ పారేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్లో అతడు 8 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 8 పరుగులు చేసి బ్లెస్సింగ్ ముజరబానీ బౌలింగ్లో ర్యాన్ బర్ల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. -
‘వైభవ్ నా తమ్ముడు.. నేనిచ్చే సలహా అదొక్కటే’
జింబాబ్వే పర్యటనలో తొలి టీ20లో మెరుపు అర్ధసెంచరీతో ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ రెండో టీ20లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 9 బంతుల్లో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 81), తిలక్ వర్మ (29 బంతుల్లో 60 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్లతో టీమిండియా రెండో టీ20లో 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇషాన్ కిషన్ వైభవ్ సూర్యవంశీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మేనేజ్మెంట్తో పాటు సీనియర్ ప్లేయర్లు వైభవ్కు ఎలాంటి సలహాలు ఇస్తుందని ఇషాన్ కిషన్ను అడిగారు. దీనిపై ఇషాన్ స్పందిస్తూ.. సోషల్ మీడియా, ఇతర విషయాలను పట్టించుకోకుండా కేవలం తన ఆటపై దృష్టి పెట్టాలని మాత్రమే వైభవ్కు ఒక అన్నలా సలహా ఇస్తుంటానని పేర్కొన్నాడు. వైభవ్కు ఎంతో భవిష్యత్తు ఉన్న కారణంగా అతడిని కాపాడుకునేందుకు భారత జట్టు ఒక స్పష్టమైన వ్యూహాన్ని, ప్రణాళికలను రచించిందని ఇషాన్ కిషన్ తెలిపాడు.ఇషాన్ మాట్లాడుతూ.. ‘వైభవ్ నిజానికి చాలా తెలివైనవాడు. తాను ఏం చేస్తున్నాడో, ఎలా బ్యాటింగ్ చేయాలో, మైదానం బయట ఎలా ప్రవర్తించాలో, మైదానంలో ఎలా ఉండాలో అతనికి బాగా తెలుసు. అదే సమయంలో, అతను వచ్చిన నేపథ్యం వల్ల కావొచ్చు కొంత పరధ్యానం ఉండొచ్చు. మన స్నేహితుల వల్ల కూడా కొంత డిస్టర్బెన్స్ ఉండొచ్చు. నేను కూడా అదే నేపథ్యం నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. క్రికెట్ ఆడుతూ దేశానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు దేనిపై దృష్టి పెట్టాలన్న దానిపై క్లియర్గా ఉన్నాను. నేను మాత్రమే కాదు, వైభవ్తో పాటు అభిషేక్, అక్షర్ భాయ్, ఇంకా అతనితో మాట్లాడే చాలా మంది ఆటగాళ్లు ఇదే దృష్టితో వ్యవహరిస్తారు. ప్రస్తుతం వైభవ్ సోషల్ మీడియాలో ఏం జరుగుతోందన్నది, బయటి గోల ఏంటనేది, పరుగులు చేయడంలో విఫలమైనప్పుడు తనపై వచ్చే విమర్శలను పక్కనబెట్టి కేవలం క్రికెట్ గురించే ఆలోచించేలా చూసుకుంటాము. వైభవ్ది చిన్న వయసు కాబట్టి తప్పుడు కారణల వల్ల పరధ్యానంలోకి వెళ్లకూడదని కోరుకుంటాం. సహచరులుగా మేమంతా వైభవ్ను ఒక తమ్ముడిలానే చూసుకుంటాం. వైభవ్ గనుక క్రీజులో నిలదొక్కుకుంటే పవర్ ప్లేలోనే 80-90 పరుగులు రాబట్టగలడు, అతనొక్కడే ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు’ అని ఇషాన్ చెప్పుకొచ్చాడు. 🚨 ISHAN KISHAN ON VAIBHAV SOORYAVANSHI 🇮🇳"We're all trying to guide Vaibhav like an elder brother so he avoids the mistakes we made early in our careers. Axar, Abhishek and the whole group are doing their best to help him."#IshanKishan #VaibhavSooryavanshi #TeamIndia…— KUMAR (@MyCric101) July 25, 2026Read: హండ్రెడ్లో జేమిమా విధ్వంసం.. ఒంటిచేత్తో జట్టుకు విజయం -
సిరీస్ విజయం.. టీ20ల్లో నంబర్వన్గా టీమిండియా
ఇంగ్లండ్, ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్లు కోల్పోయిన టీమిండియా నెంబర్వన్ ర్యాంకును కూడా కోల్పోయింది. తాజాగా జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. పనిలో పనిగా మరోసారి పొట్టి ఫార్మాట్లో అగ్రపీఠాన్ని అందుకుంది. 60 మ్యాచ్లాడిన టీమిండియా 268 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ఇంగ్లండ్ (268 పాయింట్లు) ఉండగా, 260 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్, భారత్ మధ్య పాయింట్ల మధ్య వ్యత్యాసం లేకున్నప్పటికీ భారత్ ఎక్కువ మ్యాచ్లు ఆడడంతో నంబర్వన్ స్థానాన్నితిరిగి హస్తగతం చేసుకుంది. మూడో టీ20లోనూ గెలిచి సిరీస్ను క్లీన్స్వీప్ చేస్తే మాత్రం టీమిండియా నంబర్వన్ ర్యాంకు మరింత పటిష్టం కానుంది.శనివారం జరిగిన రెండో మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా 90 పరుగుల తేడాతో ఆతిథ్య జింబాబ్వేను చిత్తు చేసింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో సిరీస్ పట్టేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 81; 9 ఫోర్లు, 2 సిక్స్లు), హైదరాబాదీ తిలక్ వర్మ (29 బంతుల్లో 60 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధశతకాలతో మెరిశారు.అనంతరం భారీ లక్ష్యఛేదనలో జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (19 బంతుల్లో 32; 3 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అభిషేక్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా... అరంగేట్ర పేసర్ యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో టి20 నేడు ఇక్కడే జరగనుంది. చదవండి: ఫైనల్కు దూసుకెళ్లిన అనాహత్.. 21 ఏళ్ల రికార్డు బద్దలు -
టీమిండియా మాజీ క్రికెటర్పై చీటింగ్ కేసు
టీమిండియా మాజీ క్రికెటర్ రాజేశ్ చౌహాన్పై చీటింగ్ కేసు నమోదైంది. ఓ వ్యక్తిని రూ. 15 లక్షలకు పైగా మోసం చేసినట్టు ఆరోపణలు రావడంతో ఒడిశా పోలీసులు కేసు నమోదు చేశారు. ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లా స్థానిక కోర్టు ఆదేశాల మేరకు జులై 24న మోహన్ నగర్ పోలీస్ స్టేషన్లో బీఎన్ఎస్ సెక్షన్ 316(2) (నమ్మకద్రోహం) కింద కేసు నమోదైంది.ఆరోపణ ఏంటంటే..?మాజీ భారత, మధ్యప్రదేశ్ ఆఫ్ స్పిన్నర్ రాజేష్ చౌహాన్, జిందాల్ స్టీల్ కంపెనీతో ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టు కుదిర్చిస్తానని దింకర్ విశ్వమిత్ర అనే వ్యక్తికి హామీ ఇచ్చి రూ. 15.1 లక్షలు వసూలు చేసినట్టు ఆరోపణ. ఈ మేరకు ఫిర్యాదుదారు కోర్టును ఆశ్రయించగా, పోలీస్ దర్యాప్తునకు ఆదేశాలు జారీ అయ్యాయి.ఫిర్యాదుదారు తెలిపిన వివరాల ప్రకారం, ట్రాన్స్పోర్ట్ వ్యాపారంలో భాగస్వామిగా పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని చౌహాన్ హామీ ఇచ్చారు. దీంతో 2021 జులైలో చౌహాన్ సంస్థ 'గోవింద్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ'తో విశ్వమిత్ర ఒప్పందం కుదుర్చుకున్నారు. మొదట చెక్కు రూపంలో రూ. 2.51 లక్షలు, అనంతరం మిగిలిన రూ. 12 లక్షలను సంస్థ బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేశారు.అయితే పెట్టుబడి అనంతరం చౌహాన్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఫిర్యాదుదారు నేరుగా జిందాల్ స్టీల్ లిమిటెడ్ను సంప్రదించగా, చౌహాన్కు కానీ, గోవింద్ ట్రాన్స్పోర్ట్ కంపెనీకి కానీ ఎలాంటి కాంట్రాక్టు ఇవ్వలేదని తేలింది. దీంతో తాను మోసపోయినట్లు ఫిర్యాదుదారు కోర్టును ఆశ్రయించారు.చౌహాన్ స్పందనఈ వ్యవహారంపై గతంలో పీటీఐతో మాట్లాడిన చౌహాన్, ఇది వ్యాపార వివాదం మాత్రమేనని పేర్కొన్నారు. "ఫిర్యాదుదారుకు చెందిన కొంత మొత్తాన్ని ఇప్పటికే తిరిగి చెల్లించాం. వ్యక్తిగత కారణాల వల్ల మిగిలిన మొత్తం చెల్లింపులో ఆలస్యం జరిగింది" అని ఆయన వివరణ ఇచ్చారు.క్రికెట్ కెరీర్బిహార్లో జన్మించిన రాజేష్ చౌహాన్ 1988/89 నుంచి 2000/01 వరకు మధ్యప్రదేశ్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడారు. 1993లో ఈడెన్ గార్డెన్స్లో శ్రీలంకపై అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఐదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో 21 టెస్టులు, 35 వన్డేలు ఆడి 76 వికెట్లు పడగొట్టారు. దేశవాళీ క్రికెట్లో దాదాపు 100 ఫస్ట్-క్లాస్, అంతే సంఖ్యలో లిస్ట్-ఏ మ్యాచ్లు ఆడి 400కు పైగా వికెట్లు తీశారు. 2000/01లో క్రికెట్ కెరీర్కు వీడ్కోలు పలికిన తర్వాత, 59 ఏళ్ల చౌహాన్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. -
మళ్లీ తస్సుమన్న అభిషేక్.. వైభవ్ ధాటిగా ఆడినా..!
టీమిండియా డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచ్లో అతడు నిరాశపరిచాడు. చివరిగా ఇంగ్లండ్తో తొలి టీ20లో అర్ద సెంచరీ చేసిన అతడు.. ఆతర్వాత వరుసగా 43, 10, 16, 3, 1 పరుగుకు ఔటయ్యాడు.ఇవాళ (జులై 25) జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో ఓ మోస్తరు స్టార్ట్ లభించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేక వికెట్ పారేసుకున్నాడు. 8 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 8 పరుగులు చేసి బ్లెస్సింగ్ ముజరబానీ బౌలింగ్లో ర్యాన్ బర్ల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.అభిషేక్ త్వరగా ఔట్ కావడంతో రెండో టీ20లో భారత్ ఆదిలోనే ఒత్తిడిలో పడినట్లైంది. అతడు ఔటైన వెంటనే మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కూడా ఔటయ్యాడు. తొలి మ్యాచ్ ఫామ్ను కొనసాగించిన వైభవ్ భారీ ఇన్నింగ్స్ ఆడతాడని భావిస్తే.. 9 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 20 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ 29 పరుగులకే ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది. ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ క్రీజ్లో ఉన్నారు.కాగా, ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. అశోక్ కుమార్ స్థానంలో యశ్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చాడు. యశ్ ఠాకూర్కు ఇది తొలి టీ20 మ్యాచ్. కెప్టెన్ అయ్యాక వరుసగా ఏడు టాస్లు గెలిచిన శ్రేయస్ ఎట్టకేలకు ఎనిమిదో మ్యాచ్లో టాస్ ఓడాడు. 3 మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి మ్యాచ్ గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ సంచలన ప్రణాళిక
టీమిండియా బ్యాటింగ్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ సంచలన ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. వైభవ్ను భవిష్యత్తులో ఆల్రౌండర్గా తీర్చిదిద్దాలని భారత క్రికెట్ బోర్డు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు భారత స్టాండ్-ఇన్ బౌలింగ్ కోచ్ సునీల్ జోషి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.15 ఏళ్ల వైభవ్ ఐపీఎల్ 2026లో రికార్డు స్థాయి ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అనంతరం ఇంగ్లండ్తో సిరీస్లో సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసినప్పటికీ, ఆశించిన ప్రభావం చూపలేకపోయాడు. అయితే జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో కేవలం 18 బంతుల్లోనే అర్ధసెంచరీ నమోదు చేసి, తన సత్తా మరోసారి రుజువు చేసుకున్నాడు.బ్యాటింగ్తో పాటు బౌలింగ్పైనా దృష్టివైభవ్లో బౌలింగ్ సామర్థ్యం కూడా ఉందని, సమయం లభించిన ప్రతిసారీ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అతనితో ప్రత్యేకంగా పని చేస్తామని జోషి తెలిపారు. బౌలింగ్లో మెరుగుదల కనిపించిన వెంటనే దానిపై పూర్తి దృష్టి సారిస్తామని ఆయన స్పష్టం చేశారు.అయితే ప్రస్తుతానికి బ్యాటింగ్పైనే ప్రధానంగా దృష్టి పెట్టాలని, హరారే మైదానం వైభవ్కు కలిసొచ్చే ప్రాంతమని, గతంలో అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లోనూ ఇక్కడ మెరుగైన ప్రదర్శన కనబరిచారని జోషి గుర్తుచేశారు.కాగా, జోషి చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. వైభవ్ను తొందరపడి అంతర్జాతీయ స్థాయిలో బౌలర్గా వినియోగించే ఆలోచనలో లేదని, దశలవారీగా పార్ట్టైమ్ ఆల్రౌండర్గా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.బౌలింగ్ అనుభవంవైభవ్ ఎడమచేతి ఆఫ్ స్పిన్నర్గా పార్ట్టైమ్ బౌలింగ్ చేస్తాడు. డొమెస్టిక్ క్రికెట్లో అతని బౌలింగ్ అనుభవం పరిమితం. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అతని ఖాతాలో కేవలం రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. లిస్ట్-ఏ క్రికెట్లో మూడు ఇన్నింగ్స్లు బౌలింగ్ చేసి 56 పరుగులు ఇచ్చాడు. టీ20ల్లో రెండు మ్యాచ్ల్లో బౌలింగ్ చేసినప్పటికీ ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఐపీఎల్లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా బౌలింగ్ చేసిన దాఖలాలు లేవు.మొత్తంగా బౌలింగ్లో దాదాపు అనుభవం లేని వైభవ్ను సరైన శిక్షణతో తీర్చిదిద్దగలిగితే, భారత జట్టు కూర్పుకు మరింత వైవిధ్యం చేకూరే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో ఆల్రౌండర్లకు పెరుగుతున్న ప్రాధాన్యం దృష్ట్యా ఈ నిర్ణయం ఆశ్చర్యకరం కాదని కథనాలు పేర్కొంటున్నాయి.నేడే రెండో టీ20భారత్-జింబాబ్వే మధ్య జరుగుతున్న సిరీస్లో రెండో టీ20 నేడు (జులై 25, శనివారం) హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరగనుంది.ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి టీ20 గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. -
జింబాబ్వేతో రెండో టీ20.. అభిషేక్పై వేటు పడనుందా!
హరారే వేదికగా ఇవాళ జింబాబ్వేతో రెండో టీ20 మ్యాచ్కు సిద్ధమైన టీమిండియా సిరీస్ విజయంపై కన్నేసింది. తొలి టీ20 మ్యాచ్లో బౌలర్ల సమిష్టి ప్రదర్శనకు తోడు వైభవ్ సూర్యవంశీ విధ్వంసం తోడవ్వడంతో టీమిండియా సునాయాస విజయాన్ని అందుకొని మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మరోసారి అదే వేదికలో మ్యాచ్ ఆడుతుండడంతో, రెండో టీ20లోనూ దాదాపు అదే జట్టుతో బరిలోకి దిగే అవకాశముంది. అయితే ఓపెనింగ్లో లెఫ్ట్, రైట్ కాంబినేషన్ అనుకుంటే మాత్రం తొలి టీ20లో ఒక్క పరుగు మాత్రమే చేసిన అభిషేక్ శర్మను తప్పించి అతడి స్థానంలో ప్రబ్సిమ్రన్ను ఆడించే అవకాశముంది.ఇది మినహా జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. మూడో స్థానంలో హార్డ్ హిట్టర్ ఇషాన్ కిషన్ రానుండగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్కు రానున్నాడు. ఆ తర్వాత మిడిలార్డర్లో తిలక్ వర్మ, రింకూ సింగ్ బాధ్యతలు తీసుకోనున్నారు. ఫినిషర్గా శివమ్ దూబే తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు.ఇక బౌలింగ్ విషయానికొస్తే రెండేళ్ల తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన మయాంక్ తాను ఆడిన తొలి మ్యాచ్లోనే ప్రభావం చూపించాడు. మయాంక్ యాదవ్తో పాటు ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మలతో పేస్ బౌలింగ్ లైనప్ బలంగా ఉంది. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్గా రవి బిష్ణోయి మరోసారి కీలకంగా మారనున్నాడు. టీమిండియా ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, నలుగురు బౌలర్లు, ఒక ఆల్రౌండర్ కాంబినేషన్తో రెండో టీ20లో బరిలోకి దిగనుంది.భారత తుదిజట్టు అంచనా: వైభవ్ సూర్యవంశీ, ప్రబ్సిమ్రాన్ సింగ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్. -
టీంని ఎలా సెలెక్ట్ చేయాలో లక్ష్మణ్ ని చూసి నేర్చుకో గంభీర్
-
అతడికి 2 నెలలే డెడ్లైన్.. రోహిత్, కోహ్లికి మంచి రోజులు!
టీమిండియా చీఫ్ సెలెక్టర్ పదవిలో కొనసాగుతున్న మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ఈ సెప్టెంబర్తో ముగియనున్నట్లు తెలుస్తోంది. కాగా వన్డే ప్రపంచకప్ వరకు తనను సెలెక్టర్గా కొనసాగేందుకు అవకాశమివ్వాలని అగార్కర్ చేసిన అభ్యర్థనను బీసీసీఐ పట్టించుకోనట్లుగా అనిపిస్తోంది. సెలెక్టర్గా ఎంపికైన తర్వాత టీమిండియా ఐసీసీ టైటిల్స్ సాధించినప్పటికీ అగార్కర్ విషయంలో మాత్రం విమర్శలే వ్యక్తమయ్యాయి. అందుకే అగార్కర్ను సెలెక్టర్గా కొనసాగించేందుకు బీసీసీఐ ఇష్టపడడం లేదని తెలుస్తోంది. దీంతో అతడి స్థానంలో కొత్త సెలెక్టర్ కోసం వెతుకులాటను ప్రారంభించినట్లు సమాచారం. ఇక అగార్కర్ సెలెక్టర్ పదవి నుంచి దిగిపోతే మాత్రం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు వన్డే వరల్డ్కప్ 2027 ఆడేందుకు మార్గం సుగమం అవుతుందని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మాత్రం సెప్టెంబర్ తర్వాత టీమిండియాకు కొత్త సెలెక్టర్ను చూసే అవకాశాలున్నాయి. సెప్టెంబర్ తర్వాత నుంచి జరగనున్న సిరీస్లకు కొత్త సెలెక్టర్ నేతృత్వంలోనే జట్టు ఎంపిక జరగనుంది. ఇక అజిత్ అగార్కర్ 2023లో టీమిండియా చీఫ్ సెలక్టర్గా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జట్టులో పలు కీలక మార్పులు చేస్తూ వస్తున్నాడు. Photo Credit: BCCI Twitterఅగార్కర్ పదవీకాలంలో టీమిండియా నాలుగు ఐసీసీ టోర్నీలు ఆడింది. 2023 వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్ 2024, చాంపియన్స్ ట్రోఫీ 2025, టీ20 ప్రపంచ కప్ 2026.. వీటిల్లో మూడు టైటిళ్లు భారత జట్టు సొంతం చేసుకోవడం విశేషం. అయినప్పటికీ సెలెక్టర్గా అగార్కర్పై మాత్రం విమర్శలే రావడం గమనార్హం. జట్టు సెలక్షన్ విషయంలో అగార్కర్ తీసుకున్న పలు నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ను టీ20 జట్టుకు కెప్టెన్ చేయడం, హార్దిక్ పాండ్యకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివి అప్పట్లో తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించడంపై అభిమానులు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని మాటలు అన్నా.. తన నిర్ణయాలను మాత్రం అగార్కర్ బహిరంగంగానే సమర్థించుకుంటూ వచ్చాడు. సెలక్షన్ అనేది కేవలం ప్లేయర్ల గణాంకాలపై ఆధారపడదని, జట్టుకు సరిపోయే కాంబినేషన్, ఆటగాళ్ల పాత్రలు, వ్యూహాలు కీలకమని అగార్కర్ ప్యానెల్ నిరూపించింది. టీ20 ప్రపంచకప్తో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన కారణంగా 2025లోనే అగార్కర్ సెలెక్టర్ పదవీకాలన్ని మరో ఏడాది పొడిగించిన బీసీసీఐ మరోసారి అతడి పదవీకాలాన్న పొడిగించేందుకు సముఖత వ్యక్తం చేయడం లేదు.చదవండి: Asian Games: క్రికెట్ ‘డ్రా’ విడుదల.. భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే? -
Asian Games: క్రికెట్ ‘డ్రా’ విడుదల.. భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
ప్రతిష్టాత్మక 2026 ఆసియా గేమ్స్కు సంబంధించి క్రికెట్ షెడ్యూల్ విడుదలైంది. ఏకకాలంలో పురుషుల, మహిళల క్రికెట్మ్యాచ్ల షెడ్యూల్ను ప్రకటించారు. రెండు విభాగాల్లో టెస్టు సభ్యత్వం కలిగిన నాలుగు దేశాలు (భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్) నేరుగా క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించాయి. కాగా ఆసియా గేమ్స్ జపాన్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి.అయితే క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అటు పురుషుల.. ఇటు మహిళల క్రికెట్లో ఫైనల్ లేదా సెమీస్లోనే తలపడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మహిళల విభాగంలో క్వార్టర్ ఫైనల్లో భారత్ తమ మ్యాచ్ను జపాన్తో ఆడనుంది. ఇక పురుషుల క్రికెట్లో మాత్రం టీమిండియా పాక్తో నేరుగా సెమీస్ లేదా ఫైనల్ పోరులో తలపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.పురుషుల క్రికెట్లో ఇలా..పురుషుల టోర్నీ విషయానికొస్తే టెస్టు సభ్యత్వం కలిగిన భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్ ఆడనున్నాయి. క్వార్టర్స్లో మిగిలిన నాలుగు స్థానాల కోసం ఆరుజట్ల మధ్య లీగ్ దశ మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఈ లీగ్ దశలో గ్రూప్-ఏ నుంచి అఫ్గానిస్తాన్, జపాన్, నేపాల్ ఉండగా; గ్రూప్-బి నుంచి చైనా, మలేషియా, ఓమన్ ఉన్నాయి. లీగ్ దశలో రెండు గ్రూప్ల్లో నుంచి టాప్-2లో నిలిచిన జట్లు క్వార్టర్స్ చేరుకోనున్నాయి. క్వార్టర్స్లో గెలిచిన నాలుగు జట్లు సెమీస్లో తలపడనున్నాయి. సెమీస్లో గెలిచిన జట్లు స్వర్ణం కోసం ఫైనల్ మ్యాచ్ ఆడనుండగా, ఓడిన జట్లు కాంస్య పతక పోరు కోసం తలపడనున్నాయి. టెస్టు సభ్యత్వం కలిగినప్పటికీ అఫ్గానిస్తాన్ ప్రిలిమినరీ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది.గ్రూప్-ఏ: అఫ్గానిస్తాన్, జపాన్, నేపాల్గ్రూప్-బి నుంచి చైనా, మలేషియా, ఒమన్జపాన్తో హర్మన్ సేన అమీతుమీ..మహిళల విభాగంలోనూ ఇవే జట్లు పోటీలో ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం నేరుగా క్వార్టర్ ఫైనల్మ్యాచ్లే నిర్వహించనున్నారు. క్వార్టర్ ఫైనల్లో భారత్తో జపాన్, థాయ్లాండ్తో పాకిస్తాన్, చైనాతో బంగ్లాదేవ్, శ్రీలంకతో మలేషియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. క్వార్టర్స్లో గెలిచిన జట్లు సెమీస్లో అడుగుపెట్టనున్నాయి. సెమీస్లో గెలిచిన జట్ల మధ్య స్వర్ణ పతక పోరు జరగనుంది.మహిళల క్రికెట్లో క్వార్టర్స్ షెడ్యూల్భారత్ vs జపాన్బంగ్లాదేశ్ vs చైనాశ్రీలంక vs మలేషియాపాకిస్తాన్ vs థాయిలాండ్సెమీ-ఫైనల్స్భారత్/జపాన్ vs బంగ్లాదేశ్/చైనాశ్రీలంక/మలేషియా vs పాకిస్తాన్/థాయిలాండ్2022లో డబుల్ స్వర్ణాలు..2022 హాంగ్జౌ ఆసియా గేమ్స్లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాయి. ఆనాడు టీమిండియా పురుషుల కెప్టెన్గా రుతురాజ్ వ్యవహరించాడు. వర్షంతో ఫలితం రాకపోవడంతో అత్యధిక విజయాలు సాధించిన భారత్కు గోల్డ్ మెడల్ ఇవ్వగా, అఫ్గానిస్తాన్ వెండిని గెలుచుకుంది. ఇక హర్మన్ప్రీత్ సారథ్యంలోని మహిళల జట్టు ఫైనల్లో శ్రీలంకను ఓడించి బంగారు పతకాన్ని అందుకుంది. ఈ గేమ్స్లో పాకిస్తాన్ రెండు విభాగాల్లోనూ నాలుగో స్థానానికే పరిమితం కావడం గమనార్హం.Read: గోళీలాట మాదిరే లాన్ బౌల్స్.. కాని చిన్న ట్విస్ట్! -
వన్డే ర్యాంకింగ్స్ లో కోహ్లి-రోహిత్ జోరు!
-
టీమిండియాకు మరిచిపోలేని షాక్
భారత్-జింబాబ్వే మధ్య టీ20 సిరీస్కు రంగం సిద్ధమైన వేళ, రెండు సంవత్సరాల క్రితం జరిగిన సంచలన మ్యాచ్ చర్చనీయాంశంగా మారింది. ఆ మ్యాచ్లో జింబాబ్వే కేవలం 116 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకొని చారిత్రక విజయం సాధించింది. పసికూన నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కూడా టీమిండియా ఛేదించలేపోవడం అభిమానులకు నేటికీ గుర్తుంది.బిష్ణోయ్ మ్యాజిక్.. 115కే జింబాబ్వే ఆలౌట్టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన అనంతరం శుభ్మన్ గిల్ నాయకత్వంలోని యువ భారత జట్టు ఇప్పటిలాగే జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. తొలి టీ20లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.ముకేశ్ కుమార్ తొలి వికెట్ అందించగా, రవి బిష్ణోయ్ ( 4/13) తన అద్భుత స్పిన్తో జింబాబ్వే ఇన్నింగ్స్ను అతలాకుతలం చేశాడు. అతడికి వాషింగ్టన్ సుందర్ (2/11) కూడా తోడవ్వడంతో జింబాబ్వే 20 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది.కుప్పకూలిన టీమిండియాస్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభం నుంచే తడబడింది. తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ డకౌట్ కాగా, ఆ వెంటనే రుతురాజ్ గైక్వాడ్ కూడా పెవిలియన్ చేరాడు.సికందర్ రజా, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా కట్టుదిట్టమైన బౌలింగ్తో భారత బ్యాటింగ్ను పూర్తిగా కుదిపేశారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ (31), వాషింగ్టన్ సుందర్ (27) పోరాడే ప్రయత్నం చేసినా, మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. చివరకు భారత్ 102 పరుగులకే ఆలౌటై 13 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.టీమిండియాకు సవాల్ఆ ఓటమి షాక్ నుంచి కోలుకోకముందే టీమిండియా మరోసారి జింబాబ్వేలో పర్యటిస్తుంది. 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో జింబాబ్వేలో అడుగుపెట్టింది. ఈ సిరీస్లో భాగంగా ఇవాళ (జులై 23) తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమవుతుంది.శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత జట్టు వరుసగా ఐర్లాండ్, ఇంగ్లండ్లపై టీ20 సిరీస్లు కోల్పోయి ఒత్తిడిలో ఉంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో జరిగే సిరీస్లో తప్పక విజయం సాధించి మళ్లీ గెలుపు బాట పట్టాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, గత విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరో సంచలనం సృష్టించాలని జింబాబ్వే భావిస్తోంది. -
కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం
భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్లోని యార్క్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని యార్క్షైర్ క్లబ్ అధికారికంగా ప్రకటించింది.31 ఏళ్ల ఎడమచేతి చైనామన్ స్పిన్నర్ కుల్దీప్, మెట్రో బ్యాంక్ వన్డే కప్లో ఐదు మ్యాచ్లు ఆడనున్నాడు. అనంతరం సెప్టెంబర్లో జరిగే రోతెసే కౌంటీ ఛాంపియన్షిప్ చివరి నాలుగు మ్యాచ్ల్లో మూడు మ్యాచ్లకు అందుబాటులో ఉండనున్నాడు. కుల్దీప్ శుక్రవారం గ్లామోర్గన్తో జరిగే వన్డే మ్యాచ్ ద్వారా యార్క్షైర్ తరఫున బరిలోకి దిగనున్నాడు.యార్క్షైర్తో ఒప్పందంపై స్పందించిన కుల్దీప్, "యార్క్షైర్ వంటి గొప్ప చరిత్ర కలిగిన క్లబ్కు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. ఇంగ్లండ్ పరిస్థితుల్లో ఆడటం నాకు ఎప్పుడూ ఇష్టం. జట్టు యాజమాన్యంతో మాట్లాడిన తర్వాత ఇక్కడ ఆడాలనే ఆసక్తి మరింత పెరిగింది. జట్టు విజయాల్లో నా వంతు పాత్ర పోషించాలని ఎదురుచూస్తున్నాను" అని తెలిపాడు.కాగా, కుల్దీప్కు ఇటీవలికాలంలో టీమిండియా తరఫున సరైన అవకాశాలు రావడం లేదు. తాజాగా ఇంగ్లండ్ సిరీస్లో అతడు జట్టులో ఉన్నా, ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. రేపటి నుంచి జరుగబోయే జింబాబ్వే టీ20 సిరీస్లోనూ అవకాశం దక్కలేదు. దీంతో అతడు ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ బాట పట్టాడు.కుల్దీప్.. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, రవి బిష్ణోయ్ తదితర స్పిన్నర్ల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాడు. అతడి వైవిధ్యభరితమైన చైనామన్ శైలి కూడా అవకాశాలు తెచ్చిపెట్టడం లేదు. -
బుడోడు రీఎంట్రీ.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే
-
జైస్వాల్ కు అవకాశం ఇవ్వాలి.. రోహిత్ రిటైర్మెంట్ పై యూవీ కీలక వ్యాఖ్యలు
-
లంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి ఆ ఇద్దరు!
ఐపీఎల్ తర్వాత వరుసగా వన్డే, టీ20 సిరీస్లతో బిజీగా గడిపిన టీమిండియా వచ్చే నెలలో శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఈ వారంలో టెస్టు సిరీస్కు సంబంధించి భారత జట్టును ప్రకటించే అవకాశముంది. కాగా సీనియర్లు జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు టెస్టు జట్టులోకి తిరిగి రానున్నారు. వీరితో పాటు మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ క్రిష్ణ, కుల్దీప్ యాదవ్ పేర్లు కూడా పరిగణలో ఉన్నాయి. గాయంతో ఇంగ్లండ్ సిరీస్ నుంచి వైదొలిగిన వాషింగ్టన్ సుందర్ శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడడం అనుమాంగానే ఉంది. అయితే గాయం నుంచి కోలుకున్న నితీశ్ కుమార్ రెడ్డి లేదా సారాన్ష్ జైన్లో ఒకరు ఈ సిరీస్కు ఎంపికయ్యే అవకాశముంది. ఇక బుమ్రా, జడేజాలు తమ చివరి టెస్టు మ్యాచ్ను 2025 నవంబర్లో సౌతాఫ్రికాతో ఆడారు.గిల్ సారథ్యంలోని టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికాలకు టెస్టు సిరీస్లను కోల్పోయింది. ఆఫ్గన్తో జరిగిన ఏకైక టెస్టులో మాత్రం భారీ విజయం సాధించడం ఊరట కలిగించింది. అయితే సొంతగడ్డపై ఎదురైన పరాభవాలను మరిచిపోయేందుకు లంకతో టెస్టు సిరీస్లో రాణించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. ఇక టెస్టు సిరీస్కు ముందు భారత జట్టు శ్రీలంక-ఏ జట్టుతో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనున్నట్లు తెలుస్తోంది. ఇక భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే వేదికగ2ఆ, ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబో వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత డిసెంబర్లో ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరగనుంది. 🚨 GOOD NEWS FOR TEAM INDIA 🇮🇳Jasprit Bumrah & Ravindra Jadeja set to play in the Test series vs Sri Lanka. [Sahil Malhotra from TOI]Test squad will be announced this week. pic.twitter.com/kAJ3m0tBqj— Johns. (@CricCrazyJohns) July 21, 2026Read: కోహ్లి సలహా నా ఆటను మార్చేసింది: పీవీ సింధు -
‘రోహిత్, కోహ్లిలను టచ్ చేయడం అసాధ్యం’
టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భవితవ్యంపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్, కోహ్లిలను జట్టులో నుంచి తొలగించడం చాలా కష్టతరమని, బలవంతంగా పంపించాలని చూస్తే మాత్రం అభిమానులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించాడు. ఇటీవలే రోహిత్ రిటైర్మెంట్పై ఊహాగానాలు వచ్చిన వేళ అశ్విన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.తన యూట్యూబ్ షో 'ఆష్ కి బాత్’లో అశ్విన్ మాట్లాడుతూ... 'రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆడాలని అనుకుంటే వారిని జట్టు నుంచి తప్పించడం చాలా చాలా కష్టం. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది.. వారి అద్భుతమైన కెరీర్ రికార్డులు. రోహిత్ ఇప్పటికే 12 వేల అంతర్జాతీయ పరుగులు చేశాడు. అలాంటి ఆటగాడిని సులభంగా పక్కన పెట్టడం సాధ్యం కాదు. కోహ్లి గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు. తన ఆటతో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. Photo Credit: BCCI Twitterఇక రెండో కారణం ఏంటంటే.. అది రోహిత్, కోహ్లికి భారీ అభిమాన బలం ఉంది. వీరిద్దరు మ్యాచ్లు ఆడుతున్నారంటే.. వారిని చూసేందుకే లక్షలాది మంది అభిమానులు స్టేడియాలకు తరలివస్తారు. అలాంటి స్టార్ ఆటగాళ్లను జట్టు నుంచి తప్పిస్తే భారీ స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. వారిని తప్పించాలని చూస్తే అభిమానులు ఊరుకుంటారా? ఒకవేళ తొలగిస్తే మాత్రం స్టేడియం పైకప్పు లేచిపోవడం గ్యారంటీ' అంటూ తనదైన శైలిలో అశ్విన్ చమక్కులు పంచాడు.Photo Credit: BCCI Twitterఇంగ్లండ్తో వన్డే సిరీస్లో తొలి రెండు వన్డేల్లో రోహిత్ విపలం కావడంతో మూడో వన్డే అతడికి చివరిది కానుందని, ఇంగ్లండ్తో సిరీస్ తర్వాత రోహిత్ అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలకనున్నాడని వార్తలు వచ్చాయి. అవన్నీ తప్పుడు వార్తలంటూ బీసీసీఐ కొట్టిపారేయడంతో ఊహాగానాలకు తెరపడింది. ఇక రోహిత్ కూడా తన రిటైర్మెంట్పై వస్తున్న వార్తలకు బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. ఇంగ్లండ్తో మూడోవన్డేలో రోహిత్ శర్మ సెంచరీతో మెరిశాడు. 110 బంతుల్లో 138 పరుగులు సాధించాడు. మరోవైపు కోహ్లి కూడా అర్ధసెంచరీతో రాణించి తమకు తిరుగులేదని చాటిచెప్పాడు. ఇక బౌలర్ల పరిస్థితి గురించి అశ్విన్ కాస్త భిన్నంగా స్పందించాడు. 'మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ లేదా భువనేశ్వర్ కుమార్ వంటి బౌలర్లు జట్టులో లేకపోతే కొంతమంది మాత్రమే ప్రశ్నిస్తారు. కానీ స్టార్ బ్యాటర్ల జరిగినంత స్థాయిలో చర్చ జరగదు. భవిష్యత్తులో బౌలర్ల కోసం కూడా అభిమానులు అదే స్థాయిలో గళమెత్తితే వారిని కూడా జట్టు నుంచి తప్పించడం కష్టమవుతుంది. ఇది జరగాలని నేను కోరుకుంటున్నా' అని అశ్విన్ తెలిపాడు. Read: స్పెయిన్ నంబర్వన్.. ర్యాంకింగ్స్లో మొరాకో, నార్వే సంచలనం -
రోహిత్ వివాదం.. టీమిండియాకు బీసీసీఐ కీలక ఆదేశాలు!
రోహిత్ శర్మ రిటైర్మెంట్పై సోషల్ మీడియాలో ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మ్యాచ్లు ఉన్న సమయంలో వీలైనంత మేర సోషల్ మీడియాకు దూరంగా ఉండడం మంచిదని ఆటగాళ్లకు బీసీసీఐ సూచించింది. శనివారం లండన్లోని భారత హైకమిషన్ నిర్వహించిన ప్రవాస భారతీయుల సన్మాన కార్యక్రమంలో భాగంగా టీమిండియాతో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్లో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్, హెడ్ కోచ్ గంభీర్ సహా ఆటగాళ్లంతా హాజరయ్యారు.99 శాతం అదే ధోరణిలో: రాజీవ్ శుక్లారాజీవ్ శుక్లా మాట్లాడుతూ..'భారతదేశంలో 99 శాతం మంది ప్రజలు తమను తాము క్రికెట్ నిపుణులుగా భావిస్తుంటారని, అందుకే మ్యాచ్లకు ముందు ఆటగాళ్లు సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉండడం మంచిదని నా అభిప్రాయం. మన జట్టులో ప్రతిభకు కొదవలేదని, కేవలం ఆటపై దృష్టి పెట్టడమే ఆటగాళ్లు ముందున్న కర్తవ్యం. అనవసర విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం ఆటగాళ్లకు లేదు.' అని చెప్పుకొచ్చారు.బయటి విషయాలు పట్టించుకోను: గిల్టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ మాట్లాడుతూ.. తన చేతిలో లేని బయటి అంశాల గురించి ఆలోచించకుండా, కేవలం తన ఆటపైనే దృష్టి పెట్టడం వల్ల ఎలాంటి ఒత్తిడినైనా సులభంగా అధిగమించగలనని ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటికే టీమిండియాలో క్యాంప్లో రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి పుకార్లు షికార్లు చేస్తున్న వేళ గిల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఇక గాయాల నుంచి కోలుకొని టీ20 కెప్టెన్గా ప్రమోషన్ పొందిన శ్రేయస్ అయ్యర్ తన పునరాగమన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నాడు. తాను ఆసుపత్రిలో ఉన్నప్పుడు సహచర ఆటగాళ్లు చేసిన ఫోన్ కాల్స్, వారు ఇచ్చిన మద్దతు తనలో ఎంతో స్ఫూర్తిని నింపాయని, అందుకే మరింత బలంగా జట్టులోకి తిరిగి రాగలిగానని అయ్యర్ భావోద్వేగంతో పేర్కొన్నాడు. చారిత్రక బంధం: గంభీర్ఇక టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ భారత్-బ్రిటన్ మధ్య ఉన్న చారిత్రక సంబంధాల వల్ల యూకే ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ప్రదేశమేనని అన్నారు. భారత క్రికెట్ అనేది కేవలం డ్రెస్సింగ్ రూమ్కే పరిమితం కాదని, జట్టును బేషరతుగా ప్రేమించే ప్రతి ఒక్క నిజాయితీ గల అభిమానికి చెందుతుందని గంభీర్ స్పష్టం చేశాడు. ఇక ఈ వేడుకకు ఆతిథ్యమిచ్చిన యూకేలోని భారత హైకమిషనర్ పి. కుమారన్, డిప్యూటీ హైకమిషనర్ కార్తీక్ పాండేలు టీమిండియాకు ఘన స్వాగతం పలికారు. ఇదే వారంలో అమల్లోకి వచ్చిన భారత్-యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం (CETA) వ్యాపారంతో పాటు క్రీడారంగానికి కూడా ఎన్నో కొత్త అవకాశాలను తెరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ టీమిండియా సాధించిన విజయాలు దేశానికి ఎంతో గర్వకారణమని వారు కొనియాడారు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా లార్డ్స్ వేదికగా ఇవాళ చివరి వన్డే జరగనుంది. మూడు వన్డేల సిరీస్లో 1-1తో సమంగా ఉన్న ఇరుజట్లు ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. -
రంగంలోకి జైషా..ఒక్క ఫోన్ కాల్ తో వణికిపోయిన గంభీర్, అగార్కర్
-
రోహిత్పైనే అందరి దృష్టి
లండన్: భారత ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే కెరీర్పై గత మూడు రోజులుగా సాగుతున్న చర్చకు నేడు తెరపడనుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్తో టీమిండియా మూడో వన్డే ఆడనుంది. ఈ మ్యాచ్తోనే రోహిత్ అంతర్జాతీయ కెరీర్ ముగియనుందనే వార్తలు వెలువడటంతో... అభిమానులందరి దృష్టి ‘హిట్ మ్యాన్’పైనే ఉండనుంది. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగాలని రోహిత్ భావిస్తున్నా... సెలక్టర్లు అందుకు సుముఖంగా లేరని రోహిత్ సన్నిహిత వర్గాలు అంటుండగా... లార్డ్స్ మ్యాచ్ రోహిత్ శర్మకు చివరిది కాదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. రోహిత్ కుటుంబ సభ్యులు లండన్ చేరుకోవడంతో అతని అంతర్జాతీయ కెరీర్ ముగియనుందనే వాదనకు బలం చేకూరుతోంది. అదే జరిగితే వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్ను భారత జెర్సీలో చూడటం ఇదే చివరిసారి కానుంది. తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా... రెండో మ్యాచ్లో గెలిచి ఇంగ్లండ్ లెక్క సరిచేసింది. దీంతో ఈ పోరులో గెలిచిన జట్టు సిరీస్ చేజిక్కించుకోనుంది. రో‘హిట్’ కొట్టేనా! గత రెండు మ్యాచ్ల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన రోహిత్ బ్యాట్ నుంచి మెరుపు ఆరంభం ఆశిస్తుండగా... కెపె్టన్ శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ నిలకడ కొనసాగించాల్సిన అవసరముంది. అస్వస్థతతో గత మ్యాచ్కు దూరమైన కేఎల్ రాహుల్ తిరిగి రావడం ఖాయం కావడంతో ఇషాన్ కిషన్ బెంచ్కే పరిమితం కానున్నాడు. గాయం కారణంగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టుకు దూరం కాగా... అతడి స్థానంలో ఎంపికైన లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్ష్ దూబేకు తుది జట్టులో చోటు దక్కుతుందా చూడాలి. బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా మునపటి వాడి ప్రదర్శిస్తుండగా... ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ అతడికి అండగా నిలుస్తున్నారు. మరోవైపు గత మ్యాచ్లో టాపార్డర్ నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించకపోయినా... ఒంటరి పోరాటంతో జట్టును గెలిపించిన రూట్పై ఇంగ్లండ్ భారీ ఆశలు పెట్టుకుంది. గత మూడు వన్డేల్లోనూ నాటౌట్గా నిలచిన రూట్... భారత్పై తొలి వన్డేలో 76, రెండో వన్డేలో 99 పరుగులు చేశాడు. రూట్ నిలకడకు ఇతర బ్యాటర్ల దూకుడు తోడైతే ఇంగ్లండ్ను ఆపడం కష్టతరమే! బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్పైనే ఆ జట్టు ప్రధానంగా ఆధారపడుతోంది. పిచ్ ఎలా ఉందంటే... లార్డ్స్లో టీమిండియాకు గొప్ప రికార్డేమీ లేదు. ఈ మైదానంలో భారత జట్టు వన్డే మ్యాచ్ గెలిచి రెండు దశాబ్దాలు దాటింది. చివరగా 2004లో దినేశ్ కార్తీక్ అరంగేట్రం చేసిన మ్యాచ్లో భారత్ గెలిచింది. ఓవరాల్గా ఈ మైదానంలో తొమ్మిది వన్డేలు ఆడిన టీమిండియా నాలుగు మ్యాచ్ల్లో నెగ్గింది. అందులో 1983 వన్డే ప్రపంచకప్ ఫైనల్ కూడా ఉంది. పిచ్ బౌలింగ్కు అనుకూలం. ఇటీవల న్యూజిలాండ్తో టెస్టు సందర్భంగా పిచ్ అనూహ్యంగా స్పందించింది. గత రికార్డు చూసుకుంటే లక్ష్యఛేదన కన్నా... మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయావకాశాలు ఎక్కువ. మ్యాచ్కు వర్ష సూచన లేదు. తుది జట్లు (అంచనా) భారత్: గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, అక్షర్, శివమ్ దూబే, కుల్దీప్/హర్ష్ దూబే, బుమ్రా, గుర్నూర్, ప్రసిధ్. ఇంగ్లండ్: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), డకెట్, బెథెల్, రూట్, బట్లర్, సామ్ కరన్, విల్ జాక్స్, అట్కిన్సన్, ఆర్చర్, సాఖిబ్/టంగ్, ఆదిల్ రషీద్. -
రిటైర్మెంట్ ఊహాగానాలపై రోహిత్ తొలి స్పందన!
టీమిండియా సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ తన రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలపై తొలిసారి స్పందించాడు. రోహిత్ రిటైర్మెంట్కు సంబంధించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పేర్కొన్నారు. టీమిండియా భవిష్యత్తు ప్రణాళికల్లో జట్టులో రోహిత్ శర్మ ఉంటాడని సైకియా అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో లార్డ్స్ వేదికగా రేపు జరగనున్న చివరి వన్డే కోసం భారత ఆటగాళ్లు ప్రాక్టీస్కు వచ్చారు. ఈ సమయంలో రోహిత్ శర్మ భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్తో సుదీర్ఘంగా చర్చించిన ఫొటోలు బయటికి వచ్చాయి. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణను ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియోలో సితాన్షు కోటక్తో రోహిత్ మాట్లాడుతూ..'బయట జరుగుతున్న విషయాలతో మనకు సంబంధం లేదు. అవన్నీ పట్టించుకోవద్దు' అని పేర్కొనడం వినిపించింది. దీంతో అసలు టీమిండియాలో రోహిత్ శర్మ రిటైర్మెంట్కు సంబంధించి ఇంటర్నల్ చర్చలు కూడా జరగలేదని దీన్నిబట్టి స్పష్టంగా తెలుస్తోంది.ఇక శుక్రవారం రోహిత్ వన్డే కెరీర్పై సైకియా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘రోహిత్ కెరీర్కు సంబంధించి ఏవేవో వార్తలు వస్తున్నాయి. ఆదివారం లార్డ్స్లో రోహిత్ చివరి వన్డే మ్యాచ్ ఆడబోతున్నాడనే విషయంపై ఎలాంటి చర్చ జరగలేదు. భారత వన్డే జట్టులో రోహిత్ కీలక సభ్యుడు. జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లో అతడు భాగం. లార్డ్స్ వన్డే అతడికి చివరి మ్యాచ్ కాదు’ అని సైకియా వెల్లడించాడు. సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తీరుపై బీసీసీఐ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో రోహిత్ వన్డే కెరీర్కు రిటైర్మెంట్ వార్తలకు ఫుల్స్టాప్ పడ్డట్లు అయింది. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో రోహిత్ ఆడిన రెండు వన్డేలు కలిపి కేవలం 37 పరుగులు మాత్రమే చేశాడు. అంతకముందు అఫ్గానిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్లో రోహిత్ వరుసగా 16, 48, 79 పరుగులు చేశాడు. తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో వరుస వైఫల్యాలతో రోహిత్ రిటైర్మెంట్ వార్తలు తెరమీదకు వచ్చాయి. Rohit Sharma 🗣️ Dekho yeh sb yhha khada hai "bahar kya chal raha hai ussya hamara kya lena dena" 🔥ROHIT FOR 2027 WC 🙌🏻#RohitSharma #odiworldcup2027 pic.twitter.com/cR4p52AS3Q— THE LLORD (@BlueBloodcric) July 18, 2026చదవండి: సిరీస్ విజయంపై గురి.. లార్డ్స్లో టీమిండియాకు ఘన చరిత్ర! -
వైభవ్పై ఫార్ములా-1 స్టార్ రేసర్ ప్రశంసలు
భారత క్రికెట్ యువ కెరటం వైభవ్ సూర్యవంశీపై ఫార్ములా-1 సంచలనం, రేసింగ్ బుల్స్ డ్రైవర్ అర్విడ్ లిండ్బ్లాడ్ (Arvid Lindblad) ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ క్రీడల్లో చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ కనబరుస్తున్న ఆటగాళ్లలో వైభవ్ కూడా ఒకడని కొనియాడాడు.ఇటీవల ఇంగ్లండ్-భారత్ తొలి వన్డే సందర్భంగా స్కై స్పోర్ట్స్తో మాట్లాడిన లిండ్బ్లాడ్.. సాంకేతికత అభివృద్ధి, చిన్న వయసులోనే మెరుగైన సమాచారం అందుబాటులోకి రావడం వల్ల యువ ఆటగాళ్లు అత్యున్నత స్థాయిలో రాణిస్తున్నారని చెప్పాడు."ఇది అన్ని క్రీడల్లో కనిపిస్తోంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. చిన్న వయసులోనే సరైన సమాచారం, శిక్షణ లభిస్తోంది. అందుకే చాలా చిన్న వయసులోనే ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ, ఫుట్బాల్లో లమీన్ యమాల్ అందుకు మంచి ఉదాహరణలు. వైభవ్ చాలా చిన్న వయసులోనే అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇదే ఇప్పుడు ప్రపంచ క్రీడల స్వభావంగా మారింది" అని లిండ్బ్లాడ్ వ్యాఖ్యానించాడు.ఇదే సందర్భంగా తన భారతీయ మూలాల గురించి కూడా అతడు మాట్లాడాడు. తన అమ్మమ్మ, తాతయ్య పంజాబ్కు చెందిన వారని, భారతీయ సంస్కృతితో తనకు బలమైన అనుబంధం ఉందని తెలిపాడు. గతేడాది ముంబైలోని ఆజాద్ మైదాన్లో చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడిన అనుభవం ఎంతో ప్రత్యేకమని గుర్తు చేసుకున్నాడు. అలాగే తన అమ్మమ్మ వండే భారతీయ వంటకాలు తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు.ఫార్ములా-1లో అడుగుపెట్టడం తన చిన్ననాటి కల అని, ఈ ఏడాది ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రిక్స్లో అరంగేట్రం చేసిన సమయంలో భావోద్వేగానికి గురయ్యానని లిండ్బ్లాడ్ వెల్లడించాడు. చిన్నప్పుడు తండ్రితో కలిసి తొలిసారి వెళ్లిన సిల్వర్స్టోన్ ట్రాక్లోనే ఎఫ్1 డ్రైవర్గా రేస్ చేయడం జీవితంలో మరపురాని క్షణమని పేర్కొన్నాడు.అలాగే బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ సందర్భంగా భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ను కలవడం ఆనందంగా అనిపించిందని చెప్పిన లిండ్బ్లాడ్, ఫార్ములా-1 కార్లు నడిపినా ఇప్పటికీ రోడ్డు డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం తీసుకోలేదని సరదాగా వ్యాఖ్యానించాడు. -
బద్దలు కొట్టలేని రోహిత్ శర్మ రికార్డులు ఇవే..!
భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ ముగింపు దశకు చేరుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంగ్లండ్తో లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డే అతని చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే, భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ వన్డే బ్యాటర్ శకం ముగిసినట్లే. ఈ సందర్భంగా చాలా కాలం పాటు చెక్కుచెదరకుండా నిలిచే అతని అరుదైన రికార్డులపై ఓ లుక్కేద్దాం.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లురోహిత్ శర్మ టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి 513 మ్యాచ్ల్లో 657 సిక్సర్లు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో మరే బ్యాటర్ ఇప్పటివరకు ఇన్ని సిక్సర్లు కొట్టలేదు. వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 553 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలువన్డేల్లో ఒక డబుల్ సెంచరీ చేయడమే గొప్ప ఘనతగా భావిస్తారు. అలాంటిది రోహిత్ ఏకంగా మూడు డబుల్ సెంచరీలు నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. 2013లో ఆస్ట్రేలియాపై 209, 2014లో శ్రీలంకపై 264, 2017లో శ్రీలంకపైనే అజేయంగా 208 పరుగులు చేశాడు. ఇప్పటివరకు మరే బ్యాటర్ రెండు డబుల్ సెంచరీలు కూడా నమోదు చేయలేదు.వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు2014లో కోల్కతాలో శ్రీలంకపై రోహిత్ ఆడిన 264 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఇప్పటికీ వన్డే చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా కొనసాగుతోంది. 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లతో ఈ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు.ఒకే ప్రపంచకప్లో అత్యధిక సెంచరీలు2019 ప్రపంచకప్లో రోహిత్ శర్మ ఏకంగా ఐదు సెంచరీలు బాదాడు. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంకపై శతకాలు నమోదు చేసి ఒకే ప్రపంచకప్ ఎడిషన్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆ టోర్నీలో మొత్తం 648 పరుగులతో టాప్ స్కోరర్గా కూడా నిలిచాడు.ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సెంచరీలుప్రపంచకప్ల్లో రోహిత్ ఇప్పటివరకు ఏడు సెంచరీలు సాధించాడు. డేవిడ్ వార్నర్, సచిన్ టెండూల్కర్ తలో ఆరు సెంచరీలతో అతని తర్వాతి స్థానాల్లో ఉన్నారు.వన్డేల్లో అత్యధిక 150+ స్కోర్లువన్డేల్లో 150కు పైగా ఎనిమిది ఇన్నింగ్స్లు ఆడిన ఏకైక బ్యాటర్ రోహిత్ శర్మ. వీటిలో మూడు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. డేవిడ్ వార్నర్ ఏడు 150+ స్కోర్లతో రెండో స్థానంలో ఉండగా.. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ తలో ఐదు సార్లు ఈ ఘనత సాధించారు.ఈ గణాంకాలు చూస్తే రోహిత్ శర్మ పేరు మీద ఉన్న కొన్ని రికార్డులను సమీప భవిష్యత్తులో బద్దలు కొట్టడం అత్యంత కష్టమనే విషయం స్పష్టమవుతోంది. రోహిత్ పేరిట లిఖించిబడిన ఈ రికార్డులు భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. -
రోహిత్ ఫ్యాన్స్ కు హార్ట్ బ్రేక్..LORDS లో రిటైర్మెంట్!
-
రోహిత్ భవితవ్యంపై టీమిండియా కోచ్ స్పందన!
టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్పై ఊహాగానాలు వ్యక్తమవుతున్న వేళ అతడి భవితవ్యంపై టీమిండియా మేనేజ్మెంట్ తొలిసారి స్పందించింది. 2027 వన్డే ప్రపంచకప్కు సంబంధించి ప్రణాళికల్లో భాగంగా జట్టు నుంచి రోహిత్ను తప్పించినట్లు బీసీసీఐ ఇప్పటికే హిట్మ్యాన్కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. లార్డ్స్ వన్డే రోహిత్ కెరీర్లో చివరిదని ప్రచారం నడుస్తోన్న వేళ టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ రిటైర్మెంట్పై సమాధానాన్ని దాటవేసిన సితాన్షు అతడి పేలవ బ్యాటింగ్ ప్రదర్శనపై మాత్రం స్పందించాడు. రోహిత్ శర్మపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు.అతడు పెద్ద ప్లేయర్ అని... అలాంటోడు భారత జట్టుకు అవసరమని పేర్కొన్నారు. రోహిత్ శర్మ స్థానంలో ఇషాన్ కిషన్, యశస్వి జైష్వాల్ లకు ఓపెనర్ గా అవకాశాలు ఇస్తారా ? అని మీడియా అడిగిన ప్రశ్నలకు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ సమాధానం ఇచ్చారు. వరుసగా రెండు వన్డేల్లో విఫలమైనంత మాత్రానా రోహిత్ ఆటను జడ్జ్ చేయలేమని కుండబద్దలు కొట్టారు. నిజానికి రోహిత్ శర్మ ఒక టాప్ క్లాస్ ఆటగాడని కితాబిచ్చాడు. హిట్మ్యాన్ ఒకసారి టచ్ లోకి వచ్చాడంటే అతడిని ఆపడం ఎవరి తరం కాదన్నాడు. ఇది ఇలా ఉండగా లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డే రోహిత్ శర్మకు చివరిది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. 2027 వరల్డ్ కప్ ప్లాన్స్ భాగంగా జట్టులో కూడా రోహిత్ శర్మ లేడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రోహిత్ రిటైర్మెంట్పై ప్రశ్న వేయగా.. దీనికి మాత్రం సితాన్షు కోటక్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం ఆసక్తి కలిగించింది.పేలవ ప్రదర్శన39 ఏళ్ల రోహిత్ శర్మ వన్డే ప్రపంచకప్ 2027 ఆడాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం తాను ఫిట్గా ఉండేదుకు 10 కిలోల బరువు కూడా తగ్గాడు. ఫిట్నెస్ నిరూపించుకున్నప్పటికీ బ్యాటింగ్లో మాత్రం వరుసగా విఫలమవుతూనే వస్తున్నాడు. స్వదేశంలో అఫ్గానిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్లో మూడు వన్డేలు కలిపి 143 పరుగులు సాధించాడు. ఇందులో ఒక అర్ధసెంచరీ ఉంది. తొలి వన్డేలో 69 బంతుల్లో 79 పరుగులు చేసిన రోహిత్ రెండు, మూడు వన్డేల్లో వరుసగా 48, 16 పరుగులు సాధించాడు. ఇక ఇంగ్లండ్తో సిరీస్లో వరుసగా రెండు వన్డేల్లో 11, 26 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.Batting coach Sitanshu Kotak has thrown his weight behind Rohit Sharma despite a slow start to the series for the former skipper 🗣️#ENGvIND pic.twitter.com/VuNEOojFDP— Cricbuzz (@cricbuzz) July 17, 2026Read: ‘రోహిత్ రిటైర్మెంట్ వార్తలపై కోహ్లి రియాక్షన్!’ -
‘రోహిత్ రిటైర్మెంట్ వార్తలపై కోహ్లి రియాక్షన్!’
టీమిండియా సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్పై ఊహాగానాలు వ్యక్తమవుతున్న వేళ మరో సీనియర్ విరాట్ కోహ్లి రియాక్షన్ ఆసక్తిగా మారింది. లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డే రోహిత్కు ఆఖరిదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా జట్టు నుంచి రోహిత్ను తొలగిస్తున్నట్లు బీసీసీఐ ముందే హిట్మాన్కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి రోహిత్ నిజంగానే అంతర్జాతీయ క్రికెట్కు ఈడ్కోలు పలుకుతాడా? లేదా అన్నది ఇంగ్లండ్తో జరిగే మూడో వన్డే ద్వారా తేలిపోనుంది. ఇదిలా ఉంటే రోహిత్ శర్మ రిటైర్ అవ్వనున్నాడనే వార్తలు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రోల్స్తో ఊగిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్తో రెండో వన్డే సందర్భంగా రోహిత్, కోహ్లి, బుమ్రాలు పక్కపక్కనే కూర్చొని మ్యాచ్ను సీరియస్గా వీక్షించిన వీడియో ఒకటి బయటికొచ్చింది. అయితే కోహ్లి, రోహిత్ పక్కపక్కనే కూర్చోవడం చాలా అరుదు. దీంతో వీడియోను లింక్ చేస్తూ ఒక అభిమాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'డ్రెసింగ్ రూమ్లో కోహ్లి, రోహిత్లు ఇలా పక్కపక్కన కూర్చోవడం ఎప్పుడూ చూడలేదు. రోహిత్ రిటైర్ అవ్వబోతున్నాడనే వార్త తెలిసినప్పటి నుంచి కోహ్లి దిగాలుగా కనిపిస్తున్నాడని, అతడి పక్కనే కూర్చొని ధైర్యం చెబుతున్నట్లుగా అనిపిస్తోందని, నిజమైన స్నేహం అంటే ఇదేనంటూ' కామెంట్ చేశాడు.ఇక రోహిత్ శర్మ రిటైర్మెంట్పై అటు హిట్మ్యాచ్ కానీ, ఇటు బీసీసీఐ ఇప్పటివరకు స్పందించలేదు. బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కొటక్ కూడా రోహిత్ ఫామ్పై స్పందించాడే తప్ప అతడి రిటైర్మెంట్పై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో కొంతమంది అభిమానులు వచ్చే వన్డే ప్రపంచకప్ వరకు రోహిత్ ఆడుతాడని, తన ఫిట్నెస్ను మెరుగుపరుచుకునేందుకు రోహిత్ 10 కిలోల బరువు కూడా తగ్గాడని, మూడో వన్డేలో భారీ ఇన్నింగ్స్తో మెరుస్తాడని జోస్యం చెబుతున్నారు. ఇక శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ 44 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (66 బంతుల్లో 65; 8 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (71 బంతుల్లో 66; 5 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 44.1 ఓవర్లలో 6 వికెట్లకు 235 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ జో రూట్ (133 బంతుల్లో 99 నాటౌట్; 9 ఫోర్లు) సెంచరీకి ఒక్క పరుగు దూరంలో అజేయంగా నిలిచాడు. Never seen Kohli and Rohit sit together in the dressing room like this. Kohli's looking concerned seems like that Rohit retirement news is actually true and he knows. pic.twitter.com/7vcOZejDMq— Dhillon (@sehajdhillon_) July 16, 2026Read: అపశకునం ముద్ర.. ఫైనల్కు దూరంగా అర్జెంటీనా అధ్యక్షుడు! -
కోహ్లి, శ్రేయస్ రాణించినా.. స్వల్ప స్కోర్కే టీమిండియా ఆలౌట్
కార్డిఫ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 44 ఓవర్లలో 233 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లి (65), శ్రేయస్ అయ్యర్ (66) రాణించడంతో భారత్ ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది. ఓ దశలో (178-3) భారీ స్కోర్ చేసేలా కనిపించిన భారత్.. విరాట్ కోహ్లి ఔటయ్యాక వరుసగా వికెట్లు కోల్పోయింది. శ్రేయస్ క్రీజ్లో పాతుకుపోయినప్పటికీ.. అతడికి ఎవరు పెద్దగా సహకరించలేదు. ఆఖర్లో బుమ్రా (20 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో భారత్ 230 పరుగుల మార్కును తాకగలిగింది. అట్కిన్సన్ వేసిన ఇన్నింగ్స్ 43వ ఓవర్లో బుమ్రా 3 ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు.అంతకుముందు భారత ఇన్నింగ్స్ను రోహిత్ శర్మ (26), శుభ్మన్ గిల్ (31) ఓ మోస్తరు ఆరంభాన్ని అందించారు. ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ స్థానంలో ఆడుతున్న ఇషాన్ కిషన్ ఒక్క పరుగుకే ఔటై నిరాశపరిచారు. గత మ్యాచ్లో అద్భుత అర్ద శతకాలతో సత్తా చాటిన వాషింగ్టన్ సుందర్ (2), అక్షర్ పటేల్ (1) ఈ మ్యాచ్లో చేతెల్తేశారు. విధ్వంసకర ఆటగాడు శివమ్ దూబే ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యారు. జోఫ్రా ఆర్చర్ వరుస బంతుల్లో అక్షర్, దూబేలను ఔట్ చేశాడు. ఆతర్వాత కొద్ది సేపటికే గుర్నూర్ బ్రార్ 7 పరుగుల వద్ద ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ తొమ్మిదో వికెట్గా వెనుదిరిగాడు. ప్రసిద్ద్ కృష్ణ (0) ఆఖరి వికెట్గా వెనుదిరిగాడు.ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, అట్కిన్సన్ తలో 3 వికెట్లతో సత్తా చాటగా.. సాకిబ్ మహమూద్ 2, సామ్ కర్రన్, విల్ జాక్స్ చెరో వికెట్ తీశారు. కాగా, 3 మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి వన్డే గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
ఇంగ్లండ్తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేను భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సతీసమేతంగా వీక్షించాడు. ఈ సందర్భంగా ధోని చెవిలో కనిపించిన ఓ పరికరం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ పరికరం ఏంటని అభిమానులు ఆరా తీయడం మొదలు పెట్టారు.పరిశోధనల అనంతరం దాని రేడియో ఇయర్విగ్ (Radio Earwig) అని తెలిసింది. ఇది ఒక చిన్న వైర్లెస్ రేడియో రిసీవర్. దీని ద్వారా స్టేడియంలో కూర్చొని మ్యాచ్ జరుగుతుండగానే ప్రత్యక్ష రేడియో కామెంటరీని వినొచ్చు.రేడియో ఇయర్విగ్ ప్రత్యేకతలు* ప్రత్యక్ష రేడియో కామెంటరీ వినేందుకు ఉపయోగించే చిన్న పరికరం.* సుమారు 20 గంటల బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది.* ఇంగ్లండ్లో దీని ధర సుమారు 20 పౌండ్లు.* లార్డ్స్ సహా ఇంగ్లండ్లోని పలు ప్రముఖ స్టేడియాల్లో అభిమానులకు విక్రయిస్తారు.* క్రికెట్తో పాటు ఫార్ములా-1, గుర్రపు పందేలు, రగ్బీ వంటి క్రీడల్లో కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు.ధోనీ ఒక్కరే కాదుగతంలో భారత పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ కూడా ఇంగ్లండ్ పర్యటనలో డ్రెస్సింగ్రూమ్లో కూర్చొని ఈ రేడియో ఇయర్విగ్ ద్వారా ప్రత్యక్ష కామెంటరీ విన్నారు. అలాగే రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, కేఎల్ రాహుల్ కూడా ఈ పరికరాన్ని ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి.భారత్లో ఎందుకు కనిపించదు..?భారత్లో క్రికెట్కు సంబంధించిన రేడియో ప్రసారాలు ప్రస్తుతం పెద్దగా ప్రాచుర్యంలో లేకపోవడంతో స్టేడియాల్లో ఈ పరికరాలు అందుబాటులో ఉండవు. అయితే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో రేడియో కామెంటరీ ఇప్పటికీ ప్రజాదరణ పొందినందున అక్కడి స్టేడియాల్లో రేడియో ఇయర్విగ్ వినియోగం కొనసాగుతోంది.ఇదిలా ఉంటే, తొలి వన్డేలో ఇంగ్లండ్పై భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 45.2 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. భారత గెలుపులో అక్షర్ పటేల్ (4 వికెట్లు, 57 నాటౌట్), శుభ్మన్ గిల్ (80 రిటైర్డ్ హర్ట్), వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్) కీలకపాత్ర పోషించారు. రెండో వన్డే కార్డిఫ్ వేదికగా జులై 15న జరుగనుంది. -
టీమిండియా అసిస్టెంట్ కోచ్ రాజీనామా..!
టీమిండియా సహాయ కోచ్ ర్యాన్ టెన్ డష్కటే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐతో పాటు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అంగీకారం లభిస్తే, ఇంగ్లండ్తో మూడో వన్డే అనంతరం ఆయన భారత జట్టుకు వీడ్కోలు చెప్పే అవకాశం ఉంది.క్రిక్బజ్ అందించిన సమాచారం ప్రకారం, డష్కటే ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐకి తెలియజేశాడు. వ్యక్తిగత కారణాల చేత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. లండన్లో నివసిస్తున్న తన కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు.నెదర్లాండ్స్ మాజీ ఆల్రౌండర్ అయిన డష్కటే రెండేళ్ల క్రితం భారత జట్టు సహాయ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. ఆయన ఒప్పందం ఈ నెలతో ముస్తుంది. అందుకే ఇంగ్లండ్ పర్యటన పూర్తయ్యాక విధుల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.గంభీర్ అంగీకరిస్తాడా..?డష్కటేను భారత జట్టు కోచింగ్ సిబ్బందిలోకి తీసుకురావడంలో గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించాడు. ఇద్దరి మధ్య మంచి వ్యక్తిగత, వృత్తిపరమైన అనుబంధం ఉంది. దీంతో ఆయన రాజీనామాను గంభీర్ అంగీకరిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.ప్రస్తుతం భారత జట్టు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్న నేపథ్యంలో, డష్కటే కొనసాగాలని గంభీర్ కోరే అవకాశం కూడా ఉంది.మరోపక్క ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ కూడా జట్టును వీడుతున్నారన్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. రాహుల్ ద్రవిడ్ హయాంలో నియమితులైన దిలీప్ భారత జట్టుతోనే కొనసాగనున్నారని సమాచారం. -
అరుదైన మైలురాయిని తాకిన బుమ్రా
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన మైలురాయిని తాకాడు. హ్యారీ బ్రూక్ వికెట్ తీయడంతో వన్డేల్లో 150 వికెట్ల ఘనత సాధించాడు. ఈ మైలురాయిని అతడు కేవలం 90 వన్డే మ్యాచ్ల్లోనే అందుకున్నాడు. తద్వారా భారత తరఫున అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.గాయాల కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న బుమ్రా.. రీఎంట్రీలోనే ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో ఇప్పటివరకు 5 ఓవర్లు వేసిన అతడు కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి బ్రూక్ వికెట్ పడగొట్టాడు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. బెన్ డకెట్ (43), జేకబ్ బేతెల్ (14), బ్రూక్ (1) ఔట్ కాగా.. రూట్ (1), బట్లర్ (40 క్రీజ్లో ఉన్నారు. బ్రూక్ వికెట్ బుమ్రాకు దక్కగా.. డకెట్, బేతెల్ వికెట్లు యువ పేసర్ గుర్నూర్ బ్రార్ పడగొట్టాడు. భారత్ తరపున అత్యంత వేగంగా (బంతుల పరంగా) 150 వన్డే వికెట్లు సాధించిన బౌలర్లు4,070 – మహమ్మద్ షమీ4,513 – కుల్దీప్ యాదవ్4,605 – జస్ప్రీత్ బుమ్రా* -
వారిని చూసి నేర్చుకోండి.. టీమిండియాపై భారీ ట్రోలింగ్
చారిత్రక లార్డ్స్ మైదానంలో భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత్, ఇంగ్లండ్తో జరిగిన ఏకైక టెస్టులో 270 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా లార్డ్స్లో నిర్వహించిన తొలి మహిళల టెస్టులో విజేతగా నిలిచిన తొలి జట్టుగా భారత్ చరిత్ర పుటల్లోకెక్కింది.ఈ విజయానంతరం సోషల్ మీడియాలో భారత మహిళల జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. జట్టు సమిష్టి ప్రదర్శనను అభిమానులు కొనియాడుతున్నారు. ముఖ్యంగా హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వాన్ని, యస్తిక భాటియా, క్రాంతి గౌడ్, స్మృతి మంధాన, స్నేహ్ రాణా ప్రదర్శనలను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు.కొందరు అభిమానులు ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్ను 0-4తో కోల్పోయిన భారత పురుషుల జట్టును ప్రస్తావిస్తూ, "మహిళల జట్టును చూసి నేర్చుకోండి" అంటూ చురకలంటిస్తున్నారు.కాగా, ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో క్రాంతి గౌడ్ 5 వికెట్లతో.. రెండో ఇన్నింగ్స్లో యస్తిక భాటియా సూపర్ శతకంతో.. స్మృతి మంధాన రెండు ఇన్నింగ్స్ల్లో రెండు అర్ధశతకాలతో.. రెండో ఇన్నింగ్స్లో స్నేహ్ రాణా నాలుగు వికెట్ల ప్రదర్శనలతో అదరగొట్టి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసింది. స్మృతి మంధాన 83 పరుగులతో రాణించగా, హర్మన్ప్రీత్ కౌర్, దీప్తి శర్మ అర్ధశతకాలతో జట్టును బలమైన స్థితిలో నిలబెట్టారు.తర్వాత బౌలింగ్లో యువ పేసర్ క్రాంతి గౌడ్ అద్భుత ప్రదర్శనతో 5 వికెట్లు తీసి ఇంగ్లండ్ను 170 పరుగులకే ఆలౌట్ చేసింది. మహిళల టెస్టుల్లో లార్డ్స్లో తొలి ఐదు వికెట్ల ఘనత సాధించిన బౌలర్గా ఆమె రికార్డు సృష్టించింది.రెండో ఇన్నింగ్స్లో భారత్ 341/7 వద్ద డిక్లేర్ చేసింది. యస్తిక భాటియా 113 పరుగుల శతకం సాధించి లార్డ్స్లో మహిళల టెస్టులో సెంచరీ చేసిన తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టించగా, స్మృతి మంధాన మరో అర్ధశతకంతో ఆకట్టుకుంది. దీంతో భారత్ ఇంగ్లండ్ ముందు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.చివరి ఇన్నింగ్స్లో భారత బౌలర్లు మరోసారి చెలరేగారు. స్నేహ్ రాణా నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ బ్యాటింగ్ను ఘోరంగా దెబ్బకొట్టింది. దీంతో ఆతిథ్య జట్టు 186 పరుగులకే ఆలౌటై, 270 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది.ఈ విజయంతో భారత మహిళల జట్టు ఇంగ్లండ్ గడ్డపై 12 సంవత్సరాల తర్వాత టెస్టు విజయం సాధించింది. -
ఇంగ్లాండ్ తో ఓటమికి వైభవే కారణం
-
చారిత్రక విజయానికి అడుగు దూరంలో టీమిండియా
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు చారిత్రక విజయానికి చేరువైంది. రెండో ఇన్నింగ్స్ను 341/7 వద్ద డిక్లేర్ చేసిన భారత్, ఇంగ్లండ్కు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తీవ్ర ఒత్తిడికి లోనై 130 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది (మూడో రోజు ఆట ముగిసే సమయానికి). దీంతో భారత్ విజయానికి మరో నాలుగు వికెట్లు దూరంలో మాత్రమే ఉంది. చివరి రోజు ఆట మిగిలి ఉంది. ఇంగ్లండ్ ఇంకా 327 పరుగులు వెనుకపడి ఉంది. ఏమి జరిగినా ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలవడం అసాధ్యం. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ను సయాలీ సత్ఘరే, క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా కలిసి దెబ్బ కొట్టారు. వీరు ముగ్గురు తలో 2 వికెట్లు తీశారు. ఆట ముగిసే సమయానికి యామీ జోన్స్ (52), సోఫీ ఎక్లెస్టోన్ (1) క్రీజ్లో ఉన్నారు.అంతకుముందు యస్తిక భాటియా (113) సూపర్ సెంచరీతో, ఆఖర్లో రిచా ఘోష్ (50 నాటౌట్) మెరుపు అర్ద శతకంతో చెలరేగడంతో భారత్ రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసింది. స్మృతి మంధాన (70) అర్ద సెంచరీతో సత్తా చాటింది. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ 5 వికెట్లతో రాణించింది.దీనికి ముందు క్రాంతి గౌడ్ (17-7-37-5) ధాటికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకే ఆలౌటైంది. క్రాంతికి జతగా సయాలి సత్ఘరే (2-40), స్నేహ్ రాణా (2-41), దీప్తి శర్మ (1-10) కూడా రాణించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో యామీ జోన్స్ (52) ఒక్కరే అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (44) ఓ మోస్తరు స్కోర్ చేసింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసింది. స్మృతి మంధాన (83), హర్మన్ప్రీత్ కౌర్ (58), దీప్తి శర్మ (57) అర్ద సెంచరీలతో రాణించారు.కాగా, భారత్-ఇంగ్లండ్ మధ్య లార్డ్స్లో జరుగతున్న తొలి మహిళల టెస్ట్ మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్లో ఐదు వికెట్ల ఘనత, సెంచరీ చేసి క్రాంతి గౌడ్, యస్తిక భాటియా ప్రతిష్ఠాత్మక లార్డ్స్ ఆనర్స్ బోర్డులో తమ పేర్లను చిరస్థాయిగా లిఖించుకున్నారు. లార్డ్స్లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బౌలర్గా క్రాంతి.. తొలి సెంచరీ చేసిన బ్యాటర్ యస్తిక రికార్డు సృష్టించారు. -
టీ20 సిరీస్ ఓటమి.. నంబర్వన్ ర్యాంక్ గోవిందా
నాలుగు నెలల కిందట జరిగిన టీ20 ప్రపంచకప్ను మూడోసారి కైవసం చేసుకొని నంబర్వన్ స్థానాన్ని అధిరోహించిన టీమిండియా తాజాగా ఇంగ్లండ్తో టీ20 సిరీస్ ఓటమితో ఆ స్థానాన్ని కోల్పోయింది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 0-4తో ఇంగ్లండ్కు అప్పగించి దారుణ పరాజయం మూటగట్టుకున్న భారత జట్టు సిరీస్తో పాటు నంబర్వన్ స్థానాన్ని కూడా ఇంగ్లండ్కు అప్పగించేసింది. 1605 రోజుల తర్వాత టీమిండియా టీ20 ర్యాంకింగ్స్లో నంబర్వన్ స్థానాన్ని కోల్పోవడం గమనార్హం.పాయింట్ల పరంగా మార్పు లేనప్పటికీ మ్యాచ్ల పరంగా తేడా ఉండడంతో ఇంగ్లండ్ తొలి స్థానాన్ని ఆక్రమించింది. రెండో స్థానంలో భారత్ (268 పాయింట్లు), మూడో స్థానంలో ఆస్ట్రేలియా (260 పాయింట్లు) కొనసాగుతున్నాయి. గత నాలుగేళ్లలో నంబర్వన్ ర్యాంకు కోల్పోవడంతో పాటు రెండు వరుస టీ20 సిరీస్లు ఓడడం కూడా టీమిండియాకు ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్తో టీ20 సిరీస్ ఓటమి ద్వారా పలు చెత్త రికార్డులను కూడా భారత్ తన పేరిట లిఖించుకుంది.👉టీమిండియాకు పరుగుల పరంగా (56 పరుగులు) ఇది నాలుగో అతిపెద్ద ఓటమి. గతంలో 2026లో ఇంగ్లండ్ చేతిలోనే 125 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 2091లో న్యూజిలాండ్ చేతిలో 80 పరుగులు, 2026లో సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.👉ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో టీమిండియా నాలుగు మ్యాచ్లు ఓడడం ద్వారా ఒక సిరీస్లో అత్యధిక ఓటములు చవిచూసినట్లయింది. గతంలో 2009 మహిళల ప్రపంచకప్లో మూడు ఓటములు, 2010 మహిళల ప్రపంచకప్లో మూడు ఓటములు, 2023 వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్లో మూడు ఓటములు చవిచూసింది.👉కెప్టెన్గా తొలి ఏడు టీ20 మ్యాచ్ల్లో గెలుపు లేని ఆటగాళ్ల జాబితాలో శ్రేయస్ అయ్యర్ చోటు సంపాదించాడు. గతంలో బ్రెండన్ టేలర్ (జింబాబ్వే), ఎల్టన్ చిగుంబరా (జింబాబ్వే), తిసారా పెరీరా (శ్రీలంక) ఈ ఫీట్ సాధించారు. ఇక భారత కెప్టెన్లలో రెండు వరుస టీ20 సిరీస్లతో పాటు ఏడు మ్యాచ్ల్లో గెలుపు రుచి చూడని తొలి కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు నమోదు చేశాడు.👉 భారత క్రికెటర్ ప్రిన్స్ యాదవ్ ఒక చెత్త రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. అంబటి రాయుడు తర్వాత తాను ఆడిన మొదటి నాలుగు మ్యాచ్ల్లోనూ ప్రిన్స్ యాదవ్ ఓటమి చవిచూడడం గమనార్హం. 🚨 INDIA’S REIGN AS THE NO.1 RANKED T20I TEAM IS OVER AFTER 1,605 DAYS. 🚨 pic.twitter.com/LOr51llcdt— Mufaddal Vohra (@mufaddal_vohra) July 11, 2026చదవండి: 'ఇది మాకు గుణపాఠం.. ఓటమికి కారణం అదే' -
మంధాన మరోసారి.. భారీ ఆధిక్యం దిశగా టీమిండియా
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత మహిళల క్రికెట్ జట్టు భారీ ఆధిక్యం దిశగా వెళ్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 154 పరుగులు చేసి, మొత్తంగా 269 పరుగుల ఆధిక్యంలో (117 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది) కొనసాగుతోంది. షఫాలీ వర్మ (33) ఔట్ కాగా.. స్మృతి మంధాన (69), యస్తికా భాటియా (39) క్రీజ్లో ఉన్నారు.అంతకుముందు క్రాంతి గౌడ్ (17-7-37-5) ధాటికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకే ఆలౌటైంది. క్రాంతికి జతగా సయాలి సత్ఘరే (2-40), స్నేహ్ రాణా (2-41), దీప్తి శర్మ (1-10) కూడా రాణించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో యామీ జోన్స్ (52) ఒక్కరే అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (44) ఓ మోస్తరు స్కోర్ చేసింది.వీరితో పాటు మయా బౌచియర్ (23), మ్యాడీ విల్లియర్స్ (10), సోఫీ ఎక్లెస్టోన్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసింది. స్మృతి మంధాన (83), హర్మన్ప్రీత్ కౌర్ (58), దీప్తి శర్మ (57) అర్ద సెంచరీలతో రాణించారు.దీనికి ముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 285 పరుగులకు ఆలౌటైంది.స్మృతి మంధాన (83), హర్మన్ప్రీత్ కౌర్ (58), దీప్తి శర్మ (57) అర్ద సెంచరీలతో రాణించారు. లార్డ్స్ మైదానంలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి మహిళల టెస్ట్ మ్యాచ్ ఇదే. -
బట్లర్ సుడిగాలి శతకం.. ఐదో మ్యాచ్లోనూ టీమిండియా ఓటమి
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ గెలుపు లేకుండానే ముగించింది. సౌతాంప్టన్ వేదికగా ఇవాళ (జులై 11) జరిగిన నామమాత్రపు ఐదో మ్యాచ్లోనూ టీమిండియా ఓటమిపాలైంది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. ఆతర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఇంగ్లండే గెలుపొందింది. తద్వారా 4-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది.నేటి మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (45 బంతుల్లో 95 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ (4-0-60-0), అక్షర్ పటేల్ (4-0-63-0), సూర్యాంశ్ షేడ్గే (3-0-39-0) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. శివమ్ దూబే ఒకే ఓవర్లో ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే అదే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లలో అర్షదీప్ సింగ్ (4-0-33-0), ప్రసిద్ద్ కృష్ణ (4-0-38-1) పొదుపుగా బౌలింగ్ చేశారు.అనంతరం కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనకు దిగిన భారత్ చేయాల్సిన ప్రయత్నమంతా చేసినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. లక్ష్యం మరీ పెద్దది కావడంతో టీమిండియా చేతులెత్తేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమైంది. తద్వారా 56 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. భారత ఇన్నింగ్స్లో ఇషాన్ కిషన్ (56), తిలక్ వర్మ (53) అర్ద సెంచరీలతో రాణించారు. మిగతా ఆటగాళ్లలో సంజూ శాంసన్ (27), శ్రేయస్ అయ్యర్ (28), శివమ్ దూబే (14) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కర్రన్ 3, ఆదిల్ రషీద్ 2, ఆర్చర్, టంగ్, డాసన్ తలో వికెట్ తీశారు. -
టీమిండియా ఓటమి
ఐదో మ్యాచ్లోనూ టీమిండియా ఓటమిఐదో టీ20లోనూ టీమిండియా ఓటమిపాలైంది. తద్వారా సిరీస్ను 0-4తో కోల్పోయింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది.జోస్ బట్లర్ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (45 బంతుల్లో 95 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.అనంతరం కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనకు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమై, 56 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.ఇషాన్ కిషన్ (56) ఔట్12.4వ ఓవర్- ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్సర్లు). స్కోర్ 131-4. మూడో వికెట్ కోల్పోయిన భారత్10.1వ ఓవర్- శ్రేయస్ అయ్యర్ (28) ఔట్సంజూ శాంసన్ ఔట్5.1వ ఓవర్- 55 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. సామ్ కర్రన్ బౌలింగ్లో జేకబ్ బేతెల్కు క్యాచ్ ఇచ్చి సంజూ శాంసన్ (27) ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన భారత్2.3వ ఓవర్- 25 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో బట్లర్కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ (3) ఔటయ్యాడు. బట్లర్ సెంచరీ.. ఇంగ్లండ్ భారీ స్కోర్సౌతాంప్టన్ వేదికగా భారత్తో జరుగుతున్న ఐదో టీ20లో ఇంగ్లండ్ అతి భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (45 బంతుల్లో 95 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ (4-0-60-0), అక్షర్ పటేల్ (4-0-63-0) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. శివమ్ దూబే ఒకే ఓవర్లో ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే అదే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. భారత బౌలర్లను చీల్చిచెండాతున్న బ్రూక్బ్రూక్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 78 నాటౌట్బట్లర్ 44 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 72 నాటౌట్14 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 168-1అర్ద సెంచరీలు పూర్తి చేసుకున్న బ్రూక్, బట్లర్హ్యారీ బ్రూక్ (56), జోస్ బట్లర్ (72) ధాటిగా ఆడుతున్నారు. 13 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 146-1గా ఉంది.ధాటిగా ఆడుతున్న బ్రూక్వన్డౌన్లో వచ్చిన హ్యారీ బ్రూక్ ధాటిగా ఆడుతున్నాడు. 11 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 25 పరుగులు చేశాడు. జోస్ బట్లర్ 28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు సాయంతో 40 పరుగులతో అజేయంగా ఉన్నాడు. 8 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 73-1గా ఉంది. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్1.4వ ఓవర్- ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో సూర్యాంశ్ షేడ్గేకు క్యాచ్ ఇచ్చి ఫిల్ సాల్ట్ (6) ఔటయ్యాడు.మళ్లీ టాస్ గెలిచిన శ్రేయస్.. ఈసారైనా మ్యాచ్ గెలిచేనా..?శ్రేయస్ అయ్యర్ వరుసగా ఏడో మ్యాచ్లో టాస్ గెలిచాడు. ఈసారైనా మ్యాచ్ గెలవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. టాస్ గెలిచిన శ్రేయస్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. వైభవ్ సూర్యవంశీ స్థానంలో సంజూ శాంసన్.. వాషింగ్టన్ సుందర్ స్థానంలో సూర్యాంశ్ షేడ్గే జట్టులోకి వచ్చారు.భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), శ్రేయాస్ అయ్యర్(c), తిలక్ వర్మ, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(w), హ్యారీ బ్రూక్(c), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్7:15 గంటలకు టాస్భారత జట్టు ట్రాఫిక్లో ఇరుక్కుపోవడంతో టాస్ 45 నిమిషాలు ఆలస్యమైంది. భారతకాలమానం ప్రకారం 7:15 గంటలకు టాస్ పడుతుంది. టాస్ ఆలస్యం.. కారణమిదే..!భారత్, ఇంగ్లండ్ మధ్య సౌతాంప్టన్ వేదికగా ఇవాళ (జులై 11) ఐదో టీ20 జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ టాస్ ఆలస్యమైంది. భారత జట్టు ట్రాఫిక్లో ఇరుక్కోవడం చేత ఆలస్యమైనట్లు తెలుస్తోంది. అయితే కొద్ది క్షణాల క్రితం టీమిండియా స్టేడియంకు చేరుకున్నట్లు అప్డేట్. మరికొద్ది నిమిషాల్లో టాస్ పడే అవకాశం ఉంది.కాగా, ఐదు మ్యాచ్ల ఈ టీ20 సిరీస్ను భారత్ ఇప్పటికే 0-3 తేడాతో కోల్పోయింది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. తర్వాత మూడు మ్యాచ్ల్లో ఇంగ్లండ్ గెలుపొందింది. ఇవాళ నామమాత్రపు చివరి మ్యాచ్ జరుగనుంది. -
టీమిండియాను అవమానించిన పోర్చుగల్ క్రికెట్
టీమిండియా వరుస వైఫల్యాల నేపథ్యంలో ఓ భారత అభిమానికి పోర్చుగల్ క్రికెట్ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇటీవల టీమిండియా ఐర్లాండ్ చేతిలో ఓడిన విషయాన్ని ప్రస్తావిస్తూ పోర్చుగల్ క్రికెట్ చేసిన కామెంట్ క్రికెట్ అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది.పోర్చుగల్ క్రికెట్ జట్టు తమ చివరి 18 టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో కేవలం రెండు పరాజయాలు మాత్రమే చవిచూసిందంటూ క్రికెట్ పోర్చుగల్ సోషల్మీడియాలో ఓ పోస్టు షేర్ చేసింది. దీనిపై స్పందించిన ఓ భారత అభిమాని, "ఈ పోర్చుగల్ అకౌంట్ ఐర్లాండ్ నుంచి నడుస్తున్నట్టుంది" అంటూ కామెంట్ చేశాడు.దీనిపై పోర్చుగల్ క్రికెట్ స్పందిస్తూ, "ఐర్లాండ్ గురించి నిజంగానే మాట్లాడాలనుకుంటున్నావా..?" అంటూ ఒక్క వాక్యంతోనే కౌంటర్ ఇచ్చాడు. ఈ వ్యాఖ్య భారత జట్టు ఇటీవల ఐర్లాండ్ చేతిలో ఎదుర్కొన్న టీ20 సిరీస్ పరాజయాన్ని ఉద్దేశించిందని అభిమానులు భావిస్తున్నారు. ఆ సమాధానం సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతుంది.టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత యూరప్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు, డబ్లిన్లో జరిగిన రెండు టీ20ల్లో ఐర్లాండ్ చేతిలో ఓడి చరిత్రలో తొలిసారి ఆ జట్టు చేతిలో టీ20 సిరీస్ కోల్పోయింది. అనంతరం ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, ఆతర్వాతి మూడు మ్యాచ్ల్లో భారత్ వరుసగా పరాజయాలు చవిచూసి, ఇప్పటికే 0-3తో సిరీస్ కోల్పోయింది. ఈ సిరీస్లో నామమాత్రను చివరి టీ20 ఇవాళ జరుగునుంది.శ్రేయస్ అయ్యర్ టీ20 జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాక టీమిండియా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ గెలవలేదు. ఈ నేపథ్యంలో శ్రేయస్ భారీ ప్రెషర్ను ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి తరుణంలో క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న పోర్చుగల్ లాంటి దేశం టీమిండియాకు కౌంటరివ్వడం గమనార్హం. -
వీళ్ల కోసమా వరల్డ్ కప్ హీరోను తీసేసింది.. సోషల్ మీడియాలో రగులుతున్న చర్చ
-
ఇంగ్లండ్తో సిరీస్ ఓటమి.. తొలి వేటు అతడి మీదేనా?
టీమిండియా ప్రస్తుతం గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటుంది. నాలుగు నెలల క్రితం పొట్టి ఫార్మాట్లో మూడోసారి చాంపియన్గా నిలిచిన టీమిండియా ఇప్పుడు మాత్రం వరుస ఓటములు చవిచూస్తోంది. ఐర్లాండ్తో సిరీస్ ఓడిపోయి పరువు పోగొట్టుకున్న భారత జట్టు ఇప్పుడు ఇంగ్లండ్ గడ్డపై కూడా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 0-3తో సిరీస్ను కోల్పోయింది. ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమితో బీసీసీఐ కోచింగ్ స్టాఫ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ విషయంలో ఇప్పటికే తీవ్ర అసంతృత్తితో ఉన్న బీసీసీఐ అతడిని తొలగించడానికి ముందు కోచింగ్ జట్టును ప్రక్షాళన చేయాలని చూస్తోంది. ఈ మేరకు గంభీర్ టీంలో కీలకంగా ఉన్న వ్యక్తులను తప్పించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం.ఇప్పటికే సపోర్ట్ స్టాఫ్లో ఒక వ్యక్తిని పదని నుంచి తొలగించాలని చూస్తున్న బీసీసీఐకి ఒక వార్త అందింది. గంభీర్ కోచింగ్ స్టాఫ్లో ఒక కీలక వ్యక్తి తనంతట తానుగా బయటికి వెళ్లినట్లు సమాచారం. అయితే ఆ వ్యక్తి ఎవరనే వివరాలు మాత్రం ఇంకా బయటికి రాలేదు. మరి సదరు వ్యక్తి నిష్క్రమణ వ్యక్తిగత కారణాలతోనా లేక తన పాత్రకు న్యాయం చేయకపోవడంతో తప్పుకున్నాడా అనేది స్పష్టంగా తెలియదు. మొత్తానికి రెండు వరుస సిరీస్ ఓటములు టీమిండియాను కోలుకోలేని దెబ్బ తీశాయి. ఇక నేడు సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్తో టీమిండియా చివరి టీ20 ఆడనుంది. ఈ మ్యాచ్లోనైనా గెలిచి వైట్వాష్ గండం నుంచి బయటపడాలని శ్రేయస్ అయ్యర్ సేన భావిస్తోంది.ఇప్పటికే ఆసియా గేమ్స్తో పాటు జింబాబ్వేతో టీ20 సిరీస్కు గంభీర్కు విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలోని కోచింగ్ స్టాఫ్ను పంపించేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. దీంతో గంభీర్తో పాటు అతడి సపోర్ట్ స్టాఫ్పై కూడా త్వరలో వేటు పడే అవకాశముంది. చదవండి: వింబుల్డన్లో ఓటమి.. రిటైర్మెంట్పై జకోవిచ్ కీలక వ్యాఖ్యలు -
సంజూను తప్పించలేదు.. వైభవ్ కోసం తప్పుకున్నాడు.. సెలక్షన్ వెనుక అసలు కథ
-
టీమిండియా హెడ్ కోచ్గా లక్ష్మణ్
న్యూఢిల్లీ: మణికట్టు మాంత్రికుడు వీవీఎస్ లక్ష్మణ్ మరోసారి భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ అవతారమెత్తనున్నాడు. ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుండగా... ఇంగ్లండ్తో టి20, వన్డే సిరీస్లు ముగిసిన వెంటనే జింబాబ్వేకు వెళ్లనుంది. ఈ నెల 23 నుంచి 27 మధ్య జింబాబ్వేతో టీమిండియా మూడు టి20 మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీఓఈ) హెడ్ లక్ష్మణ్... టీమిండియా ప్రధాన కోచ్గా వ్యవహరించనున్నాడు. బ్యాటింగ్ కోచ్ కనిత్కర్, బౌలింగ్ కోచ్ సునీల్ జోషీతో కలిసి అతడు బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అలాగే ఆసియా క్రీడలకు కూడా అతడే కొనసాగనున్నాడు. జపాన్ వేదికగా జరగనున్న ఏషియన్ గేమ్స్ సమయంలో భారత జట్టు స్వదేశంలో వెస్టిండీస్తో వన్డే సిరీస్ ఆడనుండగా ఆ జట్టుతో గంభీర్ ఉంటాడు. భారత ద్వితీయ శ్రేణి జట్టుకు కోచ్గా వ్యవహరించడం లక్ష్మణ్కు కొత్తేమీ కాదు. 2023 హాంగ్జూ ఆసియా క్రీడలతో పాటు... 2024 జింబాబ్వే పర్యటన సమయంలోనూ అతడే టీమిండియా కోచ్గా వ్యవహరించాడు. -
ఒకే ఒక్క ఓటమితో చెత్త రికార్డు లిస్టులో టీమిండియా
-
'అక్తర్ రికార్డు బద్దలు కొడుతా'.. భారత రైజింగ్ స్టార్ శపథం
గుజరాత్ టైటాన్స్ పేసర్ అశోక్ శర్మ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ప్రపంచ రికార్డును బద్దలు కొడుతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 161.3 కిమీవేగంతో అక్తర్ విసిరిన బంతి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. తాజాగా అక్తర్ రికార్డును తాను బద్దలు కొడుతానంటూ అశోక్ శర్మ శపథం చేయడం గమనార్హం. ఏదోఒక రోజు అక్తర్ రికార్డును బద్దలు కొట్టే సత్తా తనకు ఉందని ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన అశోక్ శర్మ ఒక మ్యాచ్లో 154.2 కిలోమీటర్ వేగంతో (గంటకు 95.8 మైళ్ల వేగం) బంతి విసిరి ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ డెలివరీతో రికార్డు సృష్టించాడు. అంతకముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025 సీజన్లో 22 వికెట్లు తీయడమే గాక ప్రతీ మ్యాచ్లో దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో స్థిరంగా బంతులు వేయడం విశేషం. ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశోక్ శర్మ మాట్లాడుతూ.. ‘ఏదో ఒకరోజు అక్తర్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాలనే సంకల్పంతోనే ఉన్నా. బౌలింగ్ వేగం విషయంలో మాత్రం ఎన్నటికీ రాజీపడను. నా దృష్టి ఎప్పుడు బౌలింగ్ను మెరుగుపరుచుకోవడంపైనే ఉంటుంది. అంతా సవ్యంగా సాగితే, బహుశా ఒకరోజు అక్తర్ నెలకొల్పిన 161 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలుగుతానేమో. ఈ క్రమంలో నన్ను నేను మెరుగుపరచుకునేందుకు మరింత కష్టపడుతాను. అయితే నా బౌలింగ్ను మెరుగుపరచుకునే క్రమంలో ఆరోగ్యకరమైన పోటీ ఉండడాన్ని ఇష్టపడుతాను.’ అని చెప్పుకొచ్చాడు.ఇక జింబాబ్వేతో టీ20 సిరీస్కు ఎంపికైన అశోక్ శర్మకు తుది జట్టులో అవకాశం లభిస్తుందా? లేదా? అనేది పక్కనబెడితే ఐపీఎల్ ప్రదర్శనతో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని ఎంపిక చేశారు. అయితే ఇండియా-ఏ జట్టు తరఫున అరంగేట్రం చేసినప్పటికీ పెద్దగా రాణించలేదు. ఒక వన్డే మ్యాచ్లో 75 పరుగులిచ్చి ఒక వికెట్ మాత్రమే తీశాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆరు మ్యాచ్లాడిన అశోక్ శర్మ ఆరు వికెట్లు మాత్రమే తీశాడు. అయితే ప్రతీ జట్టుకు పేస్ బౌలర్లు ఆస్తిలాంటి వారు. జమ్మూ కశ్మీర్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్ 2022లో సంచలన ప్రదర్శనతో జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. 2023లో వన్డేలు, టీ20ల్లో ఆడినప్పటికీ ఎక్కువకాలం జట్టులో కొనసాగలేకపోయాడు. తన వేగం బలమైనప్పటికీ దానిని నిలకడగా కొనసాగించడంలో విఫలమయ్యాడు. దీనికి తోడు తరచూ గాయాల బారీన పడడం కూడా అతడిని జట్టుకు దూరం చేసింది. మరి అశోక్ శర్మ ఏ మేరకు రాణిస్తాడనేది చూడాలి. ఒకవేళ టీమిండియాలో అవకాశం ఇవ్వాలనుకుంటే అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రానా, బుమ్రా వంటి స్టార్ పేస్లరకు పని భారాన్ని తగ్గించే క్రమంలో అశోక్ శర్మ ఉపయోగపడగలడు. బుమ్రా ఒక్కడే టీమిండియా పేస్ బారాన్ని మోస్తున్న తరుణంలో అశోక్ శర్మ లాంటి యువ బౌలర్ల అవసరం టీమిండియాకు ఎంతో ఉంది.చెక్కుచెదరని అక్తర్ రికార్డు2003 వన్డే ప్రపంచకప్లో రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ అత్యంత ఫాస్టెస్ట్ బంతిని విసిరాడు. ఇంగ్లండ్తో మ్యాచ్లో నిక్ నైట్కు (గంటకు 161.3 కిలోమీటర్ వేగంతో) బంతిని విసిరాడు. గంటకు 100 మైళ్ల వేగంతో విసిరడంతో అక్తర్ పేరు క్రికెట్ పుస్తకాల్లో నిలిచిపోయింది. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది. ఆసీస్ స్పీడస్టర్లు బ్రెట్ లీ, షాన్ టైట్లు అక్తర్ రికార్డుకు సమీప దూరంలో నిలిచిపోయారు. బ్రెట్ లీ ఒక మ్యాచ్లో గంటకు 161.1 కిలోమీటర్ల వేగం నమోదు చేయగా, షాన్ టైట్ రెండుసార్లు (2005, 2010) అక్తర్ రికార్డుకు దగ్గరగా వచ్చాడు. 2005లో గంటకు 160.7 కిలోమీటర్ల వేగంతో విసరగా, 2010లో గంటకు 161.1 కిలోమీటర్ వేగంతో విసిరాడు. Read: ఎనిమిది జట్ల సయ్యాట.. ఫిఫా క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదే -
మేం చెప్పాల్సిన పని లేదు ఎలా ఆడాలో వైభవ్ కు తెలుసు
-
టీమిండియాలో తీవ్ర కలకలం గంభీర్ తో సంజూ గొడవ..
-
విదేశాల్లో మరోసారి బయటపడ్డ టీమిండియా బలహీనతలు
ఇంగ్లండ్తో మూడో టీ20లో భారత్ ఎదుర్కొన్న 125 పరుగుల భారీ ఓటమి కేవలం ఒక్కరోజు పేలవ ప్రదర్శన మాత్రమే కాదు. విదేశీ పర్యటనల్లో భారత బ్యాటింగ్లో పదేపదే కనిపిస్తున్న సాంకేతిక లోపాన్ని మరోసారి స్పష్టంగా బయటపెట్టింది. ముఖ్యంగా పేసర్లు గుడ్ లెంగ్త్, బ్యాక్ ఆఫ్ లెంగ్త్ (6 నుంచి 10 మీటర్ల మధ్య) ప్రాంతంలో సంధించే బంతులను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టు ప్రదర్శనను "అత్యంత దారుణం"గా అభివర్ణించాడు. భారత్ కేవలం 76 పరుగులకే ఆలౌటవడం నిజంగానే చాలా దారుణం. ప్రపంచ ఛాంపియన్ అయిన జట్టు ఏకంగా 125 పరుగుల తేడాతో ఓడిపోవడం మరీ దారుణం.ఈ సమస్య ఒక్క మ్యాచ్కే పరిమితం కాలేదు. 2025 ఆసియా కప్, 2026 ఐర్లాండ్ పర్యటన, ప్రస్తుతం ఇంగ్లండ్ సిరీస్లలో హార్డ్ లెంగ్త్ బంతులపై భారత బ్యాటర్ల సగటు వరుసగా 18.42, 17.17, 14.29 మాత్రమే ఉంది. అదే సమయంలో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్లో ఇదే తరహా బంతులపై భారత బ్యాటర్లు 47.70 సగటుతో, 165.63 స్ట్రైక్రేట్తో పరుగులు చేశారు. ఈ గణాంకాలు స్వదేశం, విదేశాల్లో భారత బ్యాటింగ్ మధ్య ఉన్న స్పష్టమైన తేడాను చూపిస్తున్నాయి.వ్యక్తిగత ప్రదర్శనలను పరిశీలిస్తే తిలక్ వర్మ మాత్రమే హార్డ్ లెంగ్త్ బంతులను సమర్థంగా ఎదుర్కొన్నాడు. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ కొంత మేర పర్వాలేదనిపించినా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా వంటి బ్యాటర్లు వరుసగా విఫలమయ్యారు. ముఖ్యంగా సంజూ శాంసన్ ఐదు సార్లు ఔటై కేవలం 20 పరుగులే చేయడం ఆందోళన కలిగించే అంశం.విశేషమేమిటంటే, ఇదే పిచ్పై భారత పేసర్లు తొలుత హార్డ్ లెంగ్త్ బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలిగారు. ఆరంభంలో స్వింగ్, ఆ తర్వాత గుడ్ లెంగ్త్ బంతులతో పరుగులను నియంత్రించారు. అయితే ఆ వ్యూహాన్ని ఇంగ్లండ్ బౌలర్లు మరింత సమర్థంగా అమలు చేశారు.జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ గంటకు 140 కిలోమీటర్లకు పైగా వేగంతో వరుసగా హార్డ్ లెంగ్త్ బంతులు సంధించారు. ఆర్చర్ మొదట వైభవ్ సూర్యవంశీకి వైడ్గా బంతి వేసి సిక్సర్ ఇచ్చినా, వెంటనే లైన్ మార్చి బౌన్సర్తో అతడిని ఔట్ చేశాడు.టంగ్ కూడా పూర్తి లెంగ్త్తో ప్రారంభించి వెంటనే హార్డ్ లెంగ్త్కు మారి అభిషేక్ శర్మ వికెట్ తీశాడు. అనంతరం ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, శివమ్ దూబే కూడా ఈ లెంగ్త్కు ఇబ్బంది పడ్డారు. ఆర్చర్, టంగ్ కలిసి 6 నుంచి 10 మీటర్ల లెంగ్త్లో వేసిన 26 బంతుల్లో ఐదు వికెట్లు తీసి కేవలం 24 పరుగులే ఇచ్చారు.ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కూడా మ్యాచ్ అనంతరం ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. "ఈ పిచ్పై గుడ్ లెంగ్త్లో బంతులు వేస్తే షాట్లు ఆడటం చాలా కష్టమని మేం ముందే గుర్తించాం. అందుకే అదే వ్యూహాన్ని అమలు చేశాం" అని వెల్లడించాడు.ట్రెంట్ బ్రిడ్జ్ ఓటమిని ఒక్క మ్యాచ్ ఫలితంగా మాత్రమే చూడలేం. గత కొంతకాలంగా విదేశాల్లో హార్డ్ లెంగ్త్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో భారత్ ఎదుర్కొంటున్న సమస్యకు ఇది మరో ఉదాహరణ. ఈ బలహీనతను సరిదిద్దుకోకపోతే, రానున్న విదేశీ పర్యటనల్లో ప్రత్యర్థి జట్లు ఇదే వ్యూహాన్ని మరింత దూకుడుగా అమలు చేసి టీమిండియాను ఘోరంగా దెబ్బతీసే అవకాశం ఉంది. -
టీమిండియా ఆటతీరుపై శ్రేయస్ ఆగ్రహం
నాటింగ్హమ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో టీ20లో భారత్ 125 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమి అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టు ప్రదర్శనను "అత్యంత దారుణం"గా అభివర్ణించాడు. ఇలాంటి ఓటమిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేమని స్పష్టం చేశాడు.అతడి మాటల్లో.. "ఈ ప్రదర్శనను వర్ణించడానికి 'అత్యంత దారుణం' అనే పదం తప్ప మరోటి కనిపించడం లేదు. ఇంత పెద్ద తేడాతో ఓడిపోవడం అసలు అంగీకారయోగ్యం కాదు. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని మళ్లీ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఇది 200 పరుగులు చేసే పిచ్ కాదని నా అభిప్రాయం. పవర్ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోవడం మాకు భారీ ఎదురుదెబ్బగా మారింది.బౌలింగ్లో కూడా జట్టు ప్రణాళికను సరిగా అమలు చేయలేకపోయింంది. జట్టు సమావేశాల్లో ఎంత ప్రణాళిక రూపొందించినా, మైదానంలో పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ చేయాలి. ఈ వికెట్పై హార్డ్ లెంగ్త్ బంతులు ప్రభావవంతంగా ఉన్నాయి. కానీ మేము వాటిని తగినంతగా వేయలేదు.అలాగే 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో బ్యాటర్లు ప్రణాళికాబద్ధంగా ఆడాలి. మొత్తంగా మా అమలు చాలా పేలవంగా సాగింది" అని అన్నాడు.అయితే మిగిలిన రెండు మ్యాచ్ల్లో బలంగా పుంజుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు. "గతాన్ని తలచుకుంటూ కూర్చోవడం వల్ల ప్రయోజనం లేదు. మేం చాలా పేలవమైన క్రికెట్ ఆడాం. అయినా ఈ ఓటమి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మళ్లీ జట్టుకు ఊపు తీసుకొచ్చేందుకు ప్రతి ఆటగాడు తన వంతు బాధ్యత ఎలా నిర్వర్తించాలనే దానిపై ఆలోచించాలి" అని తెలిపాడు.కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 44 బంతుల్లో 70 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, జోస్ బట్లర్ 36, సామ్ కరన్ 24 బంతుల్లో అజేయంగా 41 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్ తలో రెండు వికెట్లు తీశారు.202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 11.4 ఓవర్లలో 76 పరుగులకే ఆలౌటైంది. ఇది టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భారత్కు రెండో అత్యల్ప స్కోరు కాగా, 125 పరుగుల తేడాతో ఓడిపోవడం భారత జట్టు చరిత్రలోనే అత్యంత భారీ పరాజయంగా నిలిచింది. ఇప్పుడు సిరీస్లో నిలవాలంటే జూలై 9న బ్రిస్టల్లో జరిగే నాలుగో టీ20లో భారత్ తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.కొత్తగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన అయ్యర్ నాయకత్వంలో భారత్కు ఇది వరుసగా నాలుగో ఓటమి. అంతకుముందు ఐర్లాండ్తో జరిగిన రెండు టీ20ల్లోనూ భారత్ పరాజయం పాలైంది. -
టీమిండియాపై ఇంగ్లండ్ భారీ విజయం
నేడు ఇంగ్లండ్కు భారత్కు మధ్య జరిగిన మూడో టి20లో టీమిండియాపై 125 పరుగుల తేడాతో ఇంగ్లండ్ భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (44 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ ఇన్నింగ్స్తో మెరిశాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ (21 బంతుల్లో 36) పర్వాలేదనిపించాడు. ఈ ఇద్దరు తొలి వికెట్కు 43 పరుగులో జోడించారు. ఆ తర్వాత భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఇంగ్లండ్ స్కోరు మందగించింది. ఒక దశలో 160 నుంచి 170 పరుగులకు పరిమితమవుతుందనుకున్న ఇంగ్లండ్.. చివర్లో సామ్ కరన్ (24 బంతుల్లో 41 నాటౌట్), విల్ జాక్స్ (7 బంతుల్లో 14) మెరుపులతో 200 పరుగుల మార్క్ను దాటింది. భారత బౌలర్లలో హర్షిత్ రానా, ప్రిన్స్ యాదవ్ చెరో 2 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు.అనంతరం 202 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా వరుస వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్ల దాటికి భారత భ్యాట్స్మెన్స్ వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. జోష్ టంగ్ నాలుగు వికెట్లు, జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు తీయగా, ఆదిల్ రషీద్ రెండు, విల్ జాక్స్ ఒక వికెట్టు తీశారు. కేవలం 11.4 ఓవర్లలో 76 పరుగులకే టీమిండియా ఆలౌటైంది. భారత భ్యాట్స్మెన్స్లో వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ ఇద్దరూ చెరో 13 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. -
గౌరవం దక్కలేదన్నాడు!.. సూర్యకుమార్ పోస్ట్ వైరల్
తన గురించి జరుగుతున్న ప్రచారంపై టీమిండియా మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. అవన్నీ కేవలం కల్పితాలేనని.. అసత్య వార్తలను నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. అదే విధంగా.. టీమిండియా గొప్ప విజయాలు సాధించాలని.. జట్టుకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశాడు.ఏకంగా జట్టు నుంచే తప్పించారుకాగా ఈ ఏడాది భారత్కు టీ20 ప్రపంచకప్ అందించిన సూర్యకుమార్పై యాజమాన్యం అనూహ్య రీతిలో వేటు వేసిన సంగతి తెలిసిందే. కెప్టెన్గా వరల్డ్కప్ ట్రోఫీ గెలిచినా.. ఆటగాడిగా విఫలమయ్యాడనే కారణంతో అతడిని ఏకంగా జట్టు నుంచే తప్పించారు సెలక్టర్లు.సూర్య స్థానంలో శ్రేయస్ అయ్యర్ను కొత్త కెప్టెన్గా నియమించింది బీసీసీఐ. అయితే, శ్రేయస్ సారథ్యంలో.. హెడ్కోచ్ గౌతం గంభీర్ మార్గదర్శనంలో టీమిండియాకు ఇటీవల ఘెర పరాభవం ఎదురైంది. ఐర్లాండ్ పర్యటనలో ఆతిథ్య జట్టు చేతిలో టీమిండియా ఊహించని విధంగా 2-0తో క్లీన్స్వీప్ అయింది.అనంతరం ఇంగ్లండ్ పర్యటనను కూడా ఓటమితోనే మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యంపై విమర్శలు వస్తున్నాయి. సూర్యను తప్పించి పొరపాటు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ సైతం ఇలాగే స్పందించాడనే వార్త వైరల్ అయింది.గౌరవం దక్కలేదన్నాడు!తనను కెప్టెన్సీ నుంచి ఎందుకు తొలగించారో స్పష్టంగా తెలియదని.. సమాచారం కూడా ఇవ్వలేదని.. అసలు తనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని సూర్య అన్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ విషయంపై సూర్య తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.సూర్యకుమార్ పోస్ట్ వైరల్‘‘భారత జట్టు కూర్పు పట్ల నేను సంతోషంగా ఉన్నాను. టీమిండియాకు మంచి జరగాలనే ఎల్లప్పుడూ కోరుకుంటాను. కుర్రాళ్లు ఎంతో గొప్పగా రాణిస్తున్నారు. వారికి నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది.ముఖ్యంగా వైభవ్.. నీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇది ఇంకాస్త ఆసక్తిగా సాగాలని నేను కోరుకుంటున్నా. ఆడుతున్న ప్రతీ క్షణాన్ని ఆస్వాదించు. దేశాన్ని గర్వపడేలా చేయాలి. ఇక సోషల్ మీడియాలో నేను అన్నట్లుగా ఓ వార్త ప్రచారం కావడం నా దృష్టికి వచ్చింది.అవన్నీ తప్పుడు కథనాలు. నకిలీ వార్తలను నాకు ఆపాదిస్తున్నారు. నేను ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఇప్పుడు మీకు స్పష్టంగా తెలియజేస్తున్నా. ఇలాంటి అసత్య ప్రచారాలను దయచేసి నమ్మవద్దు.భారత క్రికెట్, నా సహచర ఆటగాళ్లకు ఎల్లప్పుడూ నా మద్దతు ఉంటుంది. ఇలాంటి నకిలీ వార్తల కంటే ఆట గురించిన చర్చే ఎక్కువగా ఉంటుంది. ఉండాలి కూడా’’ అని సూర్యకుమార్ యాదవ్ ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు.చదవండి: మూడో టీ20కి ముందు వైభవ్కు గాయం! -
సంజూ శాంసన్కు మరో షాక్..?
టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్కు మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జింబాబ్వే టూర్కు దూరమైన అతను.. ఏషియన్ గేమ్స్ జట్టులోనూ స్థానంలో కోల్పోనున్నట్లు క్రీడా వర్గాలు అంటున్నాయి. గత నెలలో భారత సెలెక్టర్లు 15 మంది సభ్యుల ఏషియన్ గేమ్స్ జట్టును ప్రకటించారు. ఈ జట్టులో సంజూ శాంసన్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈ జట్టు నుంచి కూడా సంజూను తప్పించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం.యువ ఆటగాళ్లకు అవకాశాల పేరుతో సంజూ టీ20 కెరీర్కు ఫుల్స్టాప్ పెట్టాలని కొందరు బీసీసీఐ పెద్దలు యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ విషయంలో బీసీసీఐపై భారీ ఒత్తిడి ఉందని, అతడికి అవకాశాలు ఇవ్వడం కోసమే సంజూను శాశ్వతంగా తప్పించే ప్లాన్ జరుగుతుందని అతని అభిమానులు అనుకుంటున్నారు.కాగా, ఐర్లాండ్ సిరీస్, ఆతర్వాత ఇంగ్లండ్తో జరిగిన తొలి రెండు టీ20ల్లో దారుణంగా విఫలమైన సంజూ శాంసన్ను జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయని విషయం తెలిసిందే. విశ్రాంతి పేరుతో సెలెక్టర్లు అతన్ని తప్పించారన్న ప్రచారం జరుగుతుంది. ఈ సిరీస్కు సంజూ స్థానంలో యువ వికెట్కీపర్ బ్యాటర్ ప్రభ్సిమ్రన్ సింగ్కు అవకాశం కల్పించారు. ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటన తర్వాత భారత జట్టు మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఏషియన్ గేమ్స్ విషయానికొస్తే.. ఈ ఖండాంతరం క్రీడలు సెప్టెంబర్ 19- అక్టోబర్ 4 మధ్యలో జరుగనున్నాయి.జింబాబ్వే పర్యటనకు భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (సి), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (విసి), ఇషాన్ కిషన్ (డబ్ల్యుకె), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రభ్సిమ్రన్ సింగ్ (విసి)ఏషియన్ గేమ్స్కు భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (సి), తిలక్ వర్మ, రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, శివం దూబే, వరుణ్ చక్రవర్తి, వైభవ్ సూర్యవంశీ -
న్యూజిలాండ్ పర్యటనకు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం
త్వరలో (అక్టోబర్ 22 నుండి డిసెంబర్ 1) న్యూజిలాండ్లో జరుగబోయే మల్టీ ఫార్మాట్ సిరీస్కు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రణాళికను సిద్ధం చేసింది. సీనియర్ జట్టు పర్యటనకు ముందే 'ఏ' జట్టును న్యూజిలాండ్కు పంపించాలని నిర్ణయించింది. 'ఏ' జట్టులో కొందరు కీలక టెస్టు జట్టు సభ్యులను ఎంపిక చేస్తారని తెలుస్తోంది. వారికి న్యూజిలాండ్ పరిస్థితుల్లో వీలైనంత మ్యాచ్ ప్రాక్టీస్ అందించాలన్నదే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం భారత టెస్టు బ్యాటర్లలో రిషభ్ పంత్ మినహా శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ తదితరులు న్యూజిలాండ్లో టెస్టు అనుభవం చాలా తక్కువగా లేదా అసలు లేదు. అక్కడ స్వింగ్, సీమ్కు అనుకూలించే పిచ్లపై ముందుగానే ఆడడం ద్వారా వారు పరిస్థితులను అర్థం చేసుకుని మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉంటుంది.న్యూజిలాండ్ పిచ్లపై బంతి ఎక్కువగా స్వింగ్ అవుతుండటంతో విదేశీ బ్యాటర్లకు పరుగులు చేయడం ఎప్పుడూ సవాలుగానే ఉంటుంది. అందుకే సీనియర్ ఆటగాళ్లను కూడా ఇండియా-ఏ జట్టులో చేర్చి ముందుగానే అక్కడికి పంపాలని బీసీసీఐ యోచిస్తోంది. ఈ పర్యటనలో ఇండియా-ఏ జట్టు మూడు లిస్ట్-ఏ మ్యాచ్లు, రెండు ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడనున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే, భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులతో కూడిన మల్టీ ఫార్మాట్ సిరీస్ జరగనుంది. ఇందులో వన్డే సిరీస్ 2027 ప్రపంచకప్కు జట్టు కూర్పును ఖరారు చేయడంలో ఉపయోగపడనుండగా, రెండు టెస్టులు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) 2025-27 ఫైనల్ అవకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. -
మూడో టీ20కు ముందు వైభవ్కు గాయం
ఇంగ్లండ్తో మూడో టీ20కి ముందు భారత్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ స్వల్పంగా గాయపడ్డాడు. అయితే ఈ విషయమై ఎలాంటి ఆందోళన అవసరం లేదని మేనేజ్మెంట్ వర్గాలు వివరణ ఇచ్చాయి. నిన్న జరిగిన ప్రాక్టీస్ సెషన్లో వైభవ్ నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, త్రో-డౌన్ స్పెషలిస్ట్ విసిరిన బంతి అతడి ఛాతిపై బలంగా తాకింది. దీంతో అతడు వెంటనే నెట్స్ నుంచి బయటకు వచ్చాడు. జట్టు వైద్యుడు పరీక్షించిన అనంతరం కొద్దిసేపటికే మళ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. దీంతో అతడికి ఎలాంటి తీవ్రమైన గాయం లేదని స్పష్టమైంది. ఈ ఘటన తర్వాత భారత శిబిరంలో ఆందోళన నెలకొన్నప్పటికీ, వైభవ్ మళ్లీ నెట్స్లోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.కాగా, నాటింగ్హమ్ వేదికగా ఇవాళ రాత్రి 10 గంటలకు (భారతకాలమానం ప్రకారం) ప్రారంభమయ్యే మూడో టీ20లో వైభవ్ ఓపెనర్గా బరిలోకి దిగడం ఖాయమే. జులై 4న జరిగిన రెండో టీ20తో టీమిండియా అరంగేట్రం చేసిన ఈ చిచ్చరపిడుగు, ఆ మ్యాచ్లో మంచి షాట్లు (10 బంతుల్లో 14; 2 సిక్సర్లు) ఆడినప్పటికీ భారీ స్కోర్ చేయలేకపోయాడు.దీంతో నేటి మ్యాచ్లో వైభవ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పై ఈ సిరీస్లో భారత్ 0-1తో వెనుకపడి ఉంది. ఈ పరిస్థితుల్లో వైభవ్ ఓ మెరుపు ఇన్నింగ్స్ ఆడితే టీమిండియా సిరీస్లో కుదురుకోవచ్చు.ఈ సిరీస్లో తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో గెలుపొంది 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. వాస్తవానికి రెండో టీ20లో టీమిండియానే గెలవాల్సి ఉండింది. అయితే కీలక దశలో రవి భిష్ణోయ్ ఓ ఖరీదైన ఓవర్ వేసి టీమిండియా కొంపముంచాడు. ఈ మ్యాచ్లో ఓటమి తర్వాత అభిమానులు భిష్ణోయ్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ చెత్త ప్రదర్శన తర్వాత భిష్ణోయ్ నేటి మ్యాచ్లో ఆడటం దాదాపుగా అసాధ్యమే. -
పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్స్టాప్
భారత క్రికెటర్ పృథ్వీ షా, అతని కాబోయే భార్య అకృతి అగర్వాల్ వీడిపోయారంటూ సోషల్మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల అకృతి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో "నన్ను చాలా సార్లు మోసం చేశారు" అని అర్థం వచ్చేలా ఒక క్రిప్టిక్ సందేశాన్ని పోస్ట్ చేసింది. ఆమె ఎక్కడా పృథ్వీ షా పేరు ప్రస్తావించకపోయినా, సోషల్ మీడియాలో చాలా మంది అది పృథ్వీని ఉద్దేశించిందేనని భావించారు.అంతేకాకుండా ఆమె కొంతసేపు పృథ్వీని ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసి మళ్లీ ఫాలో చేయడం.. మోసం, నమ్మకద్రోహం గురించి మరికొన్ని పోస్టులు పంచుకోవడంతో ఈ పుకార్లు మరింత పెరిగాయి.అయితే ఈ వార్తలపై అకృతి తాజాగా స్పందిస్తూ.. "నేను ఎక్కడా నా కాబోయే భర్త పేరు చెప్పలేదు. మా నిశ్చితార్థం రద్దయిందని లేదా మేము విడిపోయామని కూడా ఎప్పుడూ చెప్పలేదు. దురదృష్టవశాత్తు చాలామంది ఆ పోస్టు అతనిని ఉద్దేశించిందేనని భావించారు. కానీ మేమిద్దరం ఇప్పటికీ కలిసి ఉన్నాం. మా ఎంగేజ్మెంట్ కొనసాగుతోంది. మా మధ్య ఎలాంటి సమస్య లేదు" అని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వివరణ ఇచ్చింది.అలాగే, "ఒక పబ్లిక్ ఫిగర్ ప్రతిష్ఠను కేవలం ఊహాగానాల ఆధారంగా ఎంత సులభంగా దెబ్బతీయవచ్చో ఈ ఘటనతో నాకు అర్థమైంది. ఎలాంటి పేర్లు లేకుండా చేసిన ఒక పోస్టు కూడా అసత్య ప్రచారానికి కారణమవుతుంది. నా భాగస్వామి గౌరవం దెబ్బతింటుండటాన్ని చూసి నేను ఈ వివరణ ఇవ్వాల్సి వచ్చింది" అని వెల్లడించింది. దీంతో షా-అకృతి విడిపోయారనే ప్రచారానికి ఫుల్స్టాప్ పడింది.కాగా, పృథ్వీ షా-అకృతి అగర్వాల్ మార్చి 8, 2026న తమ నిశ్చితార్థాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. అదే సమయంలో షా ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే ఈ సీజన్లో అతడికి ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు.అకృతి అగర్వాల్ సోషల్ మీడియాలో ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్. ఇన్స్టాగ్రామ్లో ఆమెకు సుమారు 31 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫ్యాషన్, లైఫ్స్టైల్, డ్యాన్స్కు సంబంధించిన కంటెంట్తో ఆమెకు మంచి గుర్తింపు ఉంది.మరోవైపు పృథ్వీ షా గతంలో మైదానం వెలుపల కొన్ని వివాదాల్లో చిక్కుకున్నాడు. 2023లో ముంబైలో సెల్ఫీ విషయంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సప్నా గిల్తో జరిగిన ఘర్షణ వార్తల్లో నిలిచింది. అలాగే ఫిట్నెస్, క్రమశిక్షణ అంశాలపై విమర్శలు ఎదుర్కొన్నాడు. టెర్బుటాలిన్ పాజిటివ్గా తేలడంతో ఎనిమిది నెలల నిషేధాన్ని కూడా ఎదుర్కొన్నాడు. ఆ పదార్థం దగ్గు సిరప్ వల్ల తన శరీరంలోకి వెళ్లిందని అప్పట్లో పృథ్వీ వివరణ ఇచ్చాడు. ప్రస్తుతం పృథ్వీ షా కెరీర్ ఆశాజనకంగా సాగడం లేదు. -
చరిత్ర సృష్టించిన అక్షర్ పటేల్
టీమిండియా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత స్నిన్నర్గా (ఓవరాల్గా నాలుగో భారత బౌలర్గా) రికార్డుల్లోకెక్కాడు. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో భారత్ ఓడినా అక్షర్ బంతితో రాణించాడు. 4 ఓవర్లలో కేవలం 20 పరుగులిచ్చి కీలకమైన హ్యారీ బ్రూక్ వికెట్ తీశాడు.బ్రూక్ వికెట్ అక్షర్కు టీ20ల్లో 100వ వికెట్. పొట్టి ఫార్మాట్లో ఇప్పటివరకు 98 మ్యాచ్లు ఆడిన అతడు.. ఓ హాఫ్ సెంచరీ సాయంతో 736 పరుగులు కూడా చేశాడు. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అర్ష్దీప్ సింగ్ 134 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, జస్ప్రీత్ బుమ్రా 121 వికెట్లు, హార్దిక్ పాండ్యా 114 వికెట్లు, అక్షర్ పటేల్ 100 వికెట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. ఇంగ్లండ్ చేతిలో భారత్ 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ మరో ఓవర్ మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో టీ20 నాటింగ్హమ్ వేదికగా జులై 7న జరుగనుంది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే.టీమిండియా కొంపముంచిన బిష్ణోయ్191 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 16 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 49 పరుగుల దూరంలో ఉండింది. ఈ దశలో బౌలింగ్కు వచ్చిన రవి బిష్ణోయ్ వరుసగా రెండు నోబాల్స్ వేయగా, ఫ్రీ హిట్లను జేకబ్ బేతెల్ రెండు భారీ సిక్సర్లుగా మలిచాడు. అదే ఓవర్లో మరో సిక్స్, ఒక ఫోర్తో కలిపి మొత్తం 29 పరుగులు రావడంతో మ్యాచ్ పూర్తిగా ఇంగ్లండ్ ఆధీనంలోకి వెళ్లింది. చివరకు ఆతిథ్య జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. -
టీమిండియా కొంపముంచిన బిష్ణోయ్
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నిన్న (జులై 4) జరిగిన రెండో మ్యాచ్లో భారత్ 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ మరో ఓవర్ మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో టీ20 నాటింగ్హమ్ వేదికగా జులై 7న జరుగనుంది.కాగా, రెండో టీ20లో స్పిన్నర్ రవి బిష్ణోయ్ టీమిండియా కొంపముంచాడు. ఇంగ్లండ్ గెలుపుపై ఆశలు వదులుకున్న దశలో ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఏకంగా 29 పరుగులిచ్చి మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేశాడు. ఆ ఓవర్కు ముందు ఇంగ్లండ్ గెలవాలంటే 4 ఓవర్లలో 49 పరుగులు చేయాల్సి ఉండింది. చేతిలో 5 వికెట్లు మాత్రమే ఉన్నాయి. పైగా అప్పటికి క్రీజ్లో ఉన్న జేకబ్ బేతెల్ కూడా పరుగులు చేసుందుకు ఇబ్బంది పడుతున్నాడు. అతడికి జతగా ఉన్న సామ్ కర్రన్ అప్పుడే క్రీజ్లోకి వచ్చాడు.ఈ దశలో బంతినందుకున్న బిష్ణోయ్ నో బాల్తో ఓవర్ ప్రారంభించి వరుసగా 6, మరో నో బాల్, 6, 2, 4, 6, 2 పరుగులిచ్చాడు. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. సమీకరణలు 3 ఓవర్లలో 20 పరుగులకు మారిపోయాయి. దీంతో మరింత ఫ్రీగా ఆడిన బేతెల్ (76 నాటౌట్).. జోఫ్రా ఆర్చర్ (10 నాటౌట్) సహకారంతో మ్యాచ్ను సునాయాసంగా ముగించాడు.ఈ ఓటమి తర్వాత బిష్ణోయ్పై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. టీమిండియా ఓటమికి కారకుడంటూ సోషల్మీడియా వేదికగా దుర్భాషలాడుతున్నారు. ఈ చెత్త స్పెల్ కారణంగా బిష్ణోయ్ వ్యక్తిగతంగానూ ఓ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. భారత టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఓవర్ (29) వేసిన స్పెషలిస్ట్ బౌలర్గా అపఖ్యాతి పాలయ్యాడు.అంతేకాకుండా, 2020లో న్యూజిలాండ్పై శివమ్ దూబే ఇచ్చిన 34 పరుగులు, 2016లో వెస్టిండీస్పై స్టువర్ట్ బిన్నీ ఇచ్చిన 32 పరుగుల తర్వాత మూడో అత్యంత ఖరీదైన ఓవర్గా వేసిన భారత బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. -
ఓటమి తప్పలేదు
మాంచెస్టర్: ఐర్లాండ్–ఇంగ్లండ్ పర్యటనలో భారత్కు ఇంకా గెలుపు బోణీ దక్కలేదు. తొలి విజయం కోసం జట్టు ఇంకా ఎదురు చూడాల్సిన పరిస్థితిలోనే నిలిచింది. అయితే మ్యాచ్ ఫలితంకంటే ఎక్కువగా ఆసక్తి రేపిన, టీమిండియా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసిన క్షణం ఈ మ్యాచ్లో వచ్చింది. సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ భారత 122వ టి20 ఆటగాడిగా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. శనివారం జరిగిన రెండో టి20లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 49; 6 ఫోర్లు), అభిషేక్ శర్మ (24 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (22 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా...చివర్లో తిలక్ వర్మ (11 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు) ధాటిగా ఆడాడు. వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 2 సిక్స్లతో 14 పరుగులు చేశాడు. అనంతరం ఇంగ్లండ్ 19 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జాకబ్ బెతెల్ (46 బంతుల్లో 76 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్లు) అర్ధ సెంచరీ చేయగా...కెప్టెన్ హ్యారీ బ్రూక్ (15 బంతుల్లో 39; 4 ఫోర్లు, 3 సిక్స్లు), టామ్ బాంటన్ (32 బంతుల్లో 39; 6 ఫోర్లు) రాణించారు. చివర్లో విజయం కోసం ఇంగ్లండ్ 24 బంతుల్లో 49 పరుగులు చేయాల్సి ఉండటంతో భారత్దే పైచేయిగా కనిపించగా... 17వ ఓవర్ వేసిన రవి బిష్ణోయ్ ఏకంగా 29 పరుగులు ఇవ్వడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) బాంటన్ (బి) కరన్ 43; వైభవ్ (స్టంప్డ్) బట్లర్ (బి) జాక్స్ 14; ఇషాన్ కిషన్ (సి) డాసన్ (బి) కరన్ 49; అయ్యర్ (సి) బాంటన్ (బి) డాసన్ 37; దూబే (సి) బాంటన్ (బి) కరన్ 5; తిలక్ (నాటౌట్) 24; అక్షర్ (రనౌట్) 2; రాణా (సి) బట్లర్ (బి) ఆర్చర్ 6; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–50, 2–65, 3–130, 4–146, 5–157, 6–165, 7–190. బౌలింగ్: ఆర్చర్ 4–0–40–1, టంగ్ 4–0–46–0, జాక్స్ 3–0–22–1, స్యామ్ కరన్ 4–0–33–3, డాసన్ 3–0–27–1, రషీద్ 2–0–21–0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) ఇషాన్ కిషన్ (బి) అర్ష్ దీప్ 0; బట్లర్ (సి) వరుణ్ (బి) అర్ష్ దీప్ 0; బ్రూక్ (సి) ఇషాన్ కిషన్ (బి) అక్షర్ 39; బెతెల్ (నాటౌట్) 76; బాంటన్ (సి) తిలక్ (బి) అర్ష్ దీప్ 39; జాక్స్ (ఎల్బీ) (బి) వరుణ్ 9; కరన్ (సి) వైభవ్ (బి) రాణా 7; ఆర్చర్ (నాటౌట్) 10; ఎక్స్ట్రాలు 11; మొత్తం (19 ఓవర్లలో 6 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1–0, 2–1, 3–51, 4–118, 5–133, 6–179. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–40–3, హర్షిత్ రాణా 3–0–30–1, బిష్ణోయ్ 4–0–60–0, అక్షర్ 4–0–20–1, వరుణ్ 4–0–37–1.1 అతి పిన్న వయసులో భారత్ తరఫున అంతర్జాతీయ (పురుషుల) క్రికెట్లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ (16 ఏళ్ల 205 రోజులు) పేరిట ఉన్న రికార్డును అతను బద్దలుకొట్టాడు. -
టీం ఇండియా ఊపిరి పీల్చుకో.. బుడ్డాడు వస్తున్నాడు
-
సాయి సుదర్శన్ మరో భారీ ఇన్నింగ్స్
శ్రీలంక-ఏతో జరుగుతున్న రెండు మ్యాచ్ల అనధికారిక టెస్ట్ సిరీస్లో భారత-ఏ జట్టు ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ సిరీస్ తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 132 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడిన అతడు.. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో అంతకంటే భారీ ఇన్నింగ్స్ ఆడాడు. గాలే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో సాయి 267 బంతుల్లో 22 ఫోర్ల సాయంతో 168 పరుగులు చేసి ఔటయ్యాడు.ఈ సుదర్ఘీ ఇన్నింగ్స్ సాయిలోని స్టామినాను మరోసారి చూపింది. సాయి భారత టెస్ట్ జట్టులో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాడు. ఇలాంటి తరుణంలో అతడి నుండి విదేశీ గడ్డపై రెండు భారీ ఇన్నింగ్స్లు రావడం శుభపరిణామం. సాయి టీమిండియా తరఫున వన్డౌన్లో ఆడతాడు. ఆఫ్ఘనిస్తాన్తో తాజాగా జరిగిన ఏకైక టెస్ట్లో అతడు 81 పరుగులు చేశాడు. ఓవరాల్గా టెస్ట్ కెరీర్లో 12 ఇన్నింగ్స్లు ఆడిన సాయి 3 అర్ద సెంచరీల సాయంతో 383 పరుగులు చేశాడు. శ్రీలంక-ఏపై తాజా సెంచరీలు సాయికి తదుపరి టెస్ట్ మ్యాచ్ల్లో మంచి బూస్టప్ ఇస్తాయి.భారత జట్టు ఆగస్ట్లో శ్రీలంక పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో రెండు మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ సిరీస్లో సాయి తాజా అనుభవం టీమిండియాకు బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత-ఏ జట్టులో ఉన్న సభ్యుల్లో సాయి ఒక్కడే భారత టెస్ట్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్నాడు.వర్షం అంతరాయంరెండో టెస్ట్ మూడో రోజు లంచ్ విరామం తర్వాత ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. భారత్ స్కోర్ 406-4 వద్ద ఉండగా వర్షం మొదలైంది. ఆ సమయానికి టీమిండియా 40 పరుగుల ఆధిక్యంలో ఉంది. సాయి సుదర్శన్ (168) డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని, దేవ్దత్ పడిక్కల్ (94) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నారు. కెప్టెన్ ధృవ్ జురెల్ (53) అర్ద సెంచరీతో రాణించగా.. మరో ఓపెనర్ అమన్ మోఖడే 38 పరుగులకు ఔటయ్యాడు. షేక్ రషీద్ (16), సరాన్ష్ జైన్ (2) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు లంక ఇన్నింగ్స్లో కెప్టెన్ సహాన్ అరచ్చ్చిగే (127) సెంచరీతో కదంతొక్కాడు. భారత బౌలర్లలో బ్రార్, సరాన్ష్ తలో 4 వికెట్లతో రాణించారు. ఈ సిరీస్లో తొలి టెస్ట్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. -
అరంగేట్రంపై హింట్ ఇచ్చిన వైభవ్ సూర్యవంశీ
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రానికి ఎట్టకేలకు సమయం ఆసన్నమైనట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్తో శనివారం (జులై 4) జరగనున్న రెండో టీ20లో వైభవ్కు తుది జట్టులో అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తుంది.వైభవ్ తన అంతర్జాతీయ అరంగేట్రం విషయాన్ని సోషల్మీడియా వేదికగా పరోక్షంగా వెల్లడించాడు. రెండో టీ20కి ముందు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో "New Chapter" అంటూ పోస్ట్ చేసి అరంగేట్రంపై పరోక్ష సంకేతాన్నిచ్చాడు. ఈ పోస్ట్ సోషల్మీడియాలో వైరలవుతోంది. వాస్తవానికి వైభవ్ టీమిండియా అరంగేట్రం కోసం అభిమానులు గత కొద్ది రోజులుగా వేచి చూస్తున్నారు. ఐర్లాండ్తో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి మ్యాచ్లో వైభవ్ అరంగేట్రం ఖాయమని అంతా అనుకున్నారు. తీరా చూస్తే రెండో మ్యాచ్లోనూ అతడికి తుది జట్టులో అవకాశం దక్కలేదు. ఆతర్వాత ఇంగ్లండ్ సిరీస్ తొలి మ్యాచ్లోనూ వైభవ్ ఎంట్రీ కోసం భారత క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ మ్యాచ్లోనూ అతడిని అవకాశం దక్కలేదు. తాజాగా వైభవ్ స్వయంగా తన అరంగేట్రంపై హింట్ ఇవ్వడంతో అభిమానులంతా ఈ రోజు మ్యాచ్లో అతడి మెరుపుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉంటే, వైభవ్ అరంగేట్రంపై భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యువ ఆటగాడిని తొందరపడి జట్టులోకి తీసుకురావడంపై జాగ్రత్తగా వ్యవహరించాలని అభిప్రాయపడ్డాడు. ప్రపంచ టీ20 ర్యాంకింగ్స్లో నంబర్-2 బ్యాటర్గా ఉన్న అభిషేక్ శర్మ, టీ20 ప్రపంచకప్లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లను పక్కనపెట్టి వైభవ్కు వెంటనే అవకాశం ఇవ్వడం సరైన నిర్ణయం కాదని పేర్కొన్నాడు.వైభవ్పై కూడా ఎంతో నమ్మకం ఉందని.. అవకాశం వచ్చినప్పుడు అతడు తప్పకుండా సిద్ధంగా ఉంటాడని అన్నాడు.మరోవైపు సంజూ శాంసన్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. యూకే పర్యటనలో అతని చివరి మూడు ఇన్నింగ్స్ల్లో వరుసగా 5, 0, 1 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలోనే రెండో టీ20లో సంజూకు విశ్రాంతి ఇచ్చి, వైభవ్ సూర్యవంశీకి తొలి అవకాశం ఇవ్వాలని చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. -
పుంజుకున్న టీమిండియా బౌలర్లు.. లంక బ్యాటర్లు కట్టడి
శ్రీలంక-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్లో భారత బౌలర్లు పుంజుకున్నారు. తొలి రోజు పెద్ద ప్రభావం చూపని వీరు, రెండో రోజు లంక బ్యాటర్లను కట్టడి చేశారు. ఫలితంగా ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 366 పరుగుల నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది.తొలి రోజు ఆట ముగిసే సమయానికి లంక స్కోర్ 288-5గా ఉండింది. రెండో రోజు ఆట తొలి సెషన్లోనే గుర్నూర్ బ్రార్ (22-277-4), సరాన్ష్ జైన్ (30-2-92-4) చెలరేగడంతో ఆ జట్టు 61 పరుగుల వ్యవధిలో మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. 83 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రెండో రోజు బరిలోకి దిగిన లంక కెప్టెన్ సహన్ అరచ్చిగే (127) సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఓవర్నైట్ బ్యాటర్ అంజల బండార (42) అదే స్కోర్ వద్ద ఔటయ్యాడు. లంక ఇన్నింగ్స్లో పవంత వీరసింఘే 39, సోహన్ డి లివెరా 28, నువనిదు ఫెర్నాండో 44, అషేన్ బండార 34, చమిక గుణశేఖర 13, కేశర నువంత 1, దిలుమ్ సుదీర 20, అసంక మనోజ్ 4, దులజ్ సముదిత 2 (నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో బ్రార్, సరాన్ష్ కాకుండా యశ్ ఠాకూర్ 2 వికెట్లు తీశాడు. కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. -
వీళ్ళ కోసమారా! సింహం లాంటి బుద్దోడిని పక్కన పెట్టారు
-
ఇంగ్లండ్... రెండో ఇల్లులాంటిది
న్యూఢిల్లీ: ఆ్రస్టేలియా పిచ్లపై అసమాన ప్రదర్శన కనబర్చినప్పటికీ... తనకు ఇంగ్లండ్లో ఆడుతున్నప్పుడు రెండో ఇంట్లో ఉన్న భావన కలుగుతుందని టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా అన్నాడు. టీమిండియా తరఫున 103 మ్యాచ్లాడిన పుజారా... మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)లో శాశ్వత సభ్యత్వం దక్కించుకున్నాడు. భారత జట్టు తరఫున మూడు పర్యాయాలు ఇంగ్లండ్లో పర్యటించిన పుజారా... కౌంటీ క్రికెట్లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. టీమిండియా టెస్టు సిరీస్లు ఆడని సమయంలో ఎక్కువ శాతం కౌంటీల్లోనే ఆడిన చతేశ్వర్... ఇంగ్లండ్పై తనకు ప్రత్యేక అభిమానం ఉందని అన్నాడు. ‘బ్రిటన్లో చాలాకాలం పాటు కౌంటీ క్రికెట్ ఆడాను. ఎక్కువ రోజులు ఆడినప్పుడు మన ఇంట్లో ఉన్నట్లే అనిపిస్తుంది. ఎంసీసీలో భాగం కావడం నాకు దక్కిన గౌరవంగా భావవిస్తున్నా. ఈ సభ్యత్వం లభించడం చాలా గొప్ప విషయం. ఒక ప్లేయర్గా కెరీర్ మొత్తం కష్టపడి పనిచేసినప్పుడు దానికి తగిన గుర్తింపు లభించినప్పుడు కలిగే అనుభూతి ప్రత్యేకమైనది’ అని పుజారా పేర్కొన్నాడు. లార్డ్స్ ఎంతో ప్రత్యేకం... ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియంలో మూడు టెస్టు మ్యాచ్లు ఆడిన పుజారా... టీమిండియా తరఫున ఇక్కడ శతకం నమోదు చేయలేకపోయాడు. అయితే కౌంటీ చాంపియన్షిప్లో ససెక్స్ తరఫున ఈ మైదానంలో పుజారా డబుల్ సెంచరీ బాదాడు. ‘కెరీర్ ఆరంభంలో లార్డ్స్లో మ్యాచ్ చూస్తే చాలు అనుకునేవాడిని. అలాంటిది 2011లో ఒకసారి శస్త్రచికిత్స కోసం లండన్కు వచ్చా. అప్పుడు తొలిసారి లార్డ్స్లో అడుగుపెట్టా. ఇదో ప్రత్యేక ప్రదేశంగా అనిపించింది. అలాంటి చోట ఎంసీసీ శాశ్వత సభ్యత్వం దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలో ఎన్నో మైదానాల్లో మ్యాచ్లు ఆడాను. కానీ లార్డ్స్ మాత్రం వేరు. ఇక్కడ ఏదో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా లార్డ్స్ బాల్కానీకి సుదీర్ఘ చరిత్రే ఉంది. ఎన్నో ఏళ్లుగా అది అలాగే ఉంది. లార్డ్స్ మైదానంలో లాంగ్ రూమ్ నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు కలిగే భావన మాటల్లో చెప్పలేను. మీరు ఏ జట్టు ప్లేయర్ అనేదానితో సంబంధం లేకుండా మీ ప్రదర్శనకు ఇక్కడ ప్రశంసలు దక్కుతాయి. లార్డ్స్ పిచ్ టెస్టు క్రికెటర్లకు అసలైన పరీక్ష పెడుతుంది. ముందు నిలదొక్కుకునేందుకు ప్రయత్నించాలి... ఒక్కసారి పిచ్ను అర్థం చేసుకొని ముందుకు సాగితే... ఇక్కడ బ్యాటింగ్ను ఎంతగానో ఆస్వాదించవచ్చు. లార్డ్స్ బోర్డుపై తమ పేరు చూసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. దీంతో అదనపు ఒత్తిడి సహజం. నా కెరీర్లో ఏదైనా వెలితి ఉండిపోయిందంటే అది లార్డ్స్ బోర్డులో సెంచరీ చేసిన ప్లేయర్ల జాబితాలో నా పేరు లేకపోవడమే’ అని పుజారా చెప్పుకొచ్చాడు. ఆ్రస్టేలియాలో బ్యాటింగ్ సులువే... ఆ్రస్టేలియా పిచ్లపై పరుగులు వరద పారించి రికార్డులు సృష్టించిన పుజారా... ఇంగ్లండ్లోని సౌతాంప్టన్ మైదానంలో మాత్రమే సెంచరీ చేశాడు. ‘అంతర్జాతీయ క్రికెట్ విషయానికి వస్తే ఆస్ట్రేలియాలో నా గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి. అక్కడ బ్యాటింగ్ చేయడాన్ని కూడా ఆస్వాదిస్తా. ఎందుకటే ఒక్కసారి కుదురుకుంటే ఆసీస్ పిచ్లపై బ్యాటింగ్ చేయడం సులువే. అదే ఇంగ్లండ్లో ఎప్పటికప్పుడు పరిస్థితులు పరీక్షిస్తుంటాయి. ఇంగ్లండ్ పిచ్లు కాస్త భిన్నమైనవి. వాటిని ముందు అర్థం చేసుకోగలగాలి’ అని పుజారా వివరించాడు. ఇంగ్లండ్లో తాను ఎదుర్కొన్న బౌలర్లలో జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ ప్రత్యేకమైన వాళ్లని పుజారా అన్నాడు. -
నాకు సూర్య అవన్నీ చెప్పాడు: శ్రేయస్ అయ్యర్
టీమిండియా టీ20 కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత జట్టు పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్వాష్ అయింది. దీంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో పాటు.. హెడ్కోచ్ గౌతం గంభీర్పైనా విమర్శల వర్షం కురుస్తోంది.ఇక ఐర్లాండ్ పర్యటన ముగించుకున్న టీమిండియా ఇంగ్లండ్లో అడుగుపెట్టింది. ఇరుజట్ల మధ్య బుధవారం నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన శ్రేయస్ అయ్యర్కు.. మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గురించి ప్రశ్న ఎదురైంది.సూర్య నాతో మాట్లాడాడుఇందుకు బదులిస్తూ.. ‘‘సూర్యకుమార్ యాదవ్, నేనూ దాదాపుగా ఒకేలా ఆలోచిస్తాము. దేశవాళీ క్రికెట్లో అతడితో కలిసి చాలా ఏళ్లు ఆడాను. ఇక్కడికి వచ్చేముందు కూడా సూర్య నాతో మాట్లాడాడు.యాజమాన్యం ఎలా పనిచేస్తుంది.. వివిధ సందర్భాల్లో ఆటగాళ్లు ఎలా స్పందిస్తారు.. వారి ఆలోచనలు ఏవిధంగా ఉంటాయన్న అంశాలపై నాకు ఇన్పుట్స్ ఇచ్చాడు. మా మధ్య సంభాషణ అర్థవంతంగా సాగింది. అతడి నుంచి నేర్చుకోవాల్సి చాలానే ఉంది’’ అని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు.అనూహ్య రీతిలో వేటు కాగా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ను చాంపియన్గా నిలిపిన సూర్యకుమార్ యాదవ్పై యాజమాన్యం అనూహ్య రీతిలో వేటు వేసింది. కెప్టెన్గా రాణించినా బ్యాటర్గా విఫలం కావడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే, సూర్యకు ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా మరొక్క అవకాశం ఇస్తారని భావించినా.. యాజమాన్యం మాత్రం అతడిని సారథ్య బాధ్యతల నుంచే కాకుండా.. జట్టు నుంచీ తొలగిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది.చదవండి: IND vs ENG: షెడ్యూల్, జట్లు.. టైమింగ్స్.. పూర్తి వివరాలు -
నీళ్లు అందిస్తే తప్పేంటి? వైభవ్ పై అశ్విన్ షాకింగ్ కామెంట్స్
-
నేటి నుంచే భారత్-ఇంగ్లండ్ వైట్బాల్ సిరీస్
ఐర్లాండ్తో టీ20 సిరీస్ను 0-2తో చేజార్చుకున్న టీమిండియా.. ఇవాల్టి నుంచి ఇంగ్లండ్ పర్యటనలో వైట్బాల్ సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలో భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి. ఈ సిరీస్కు సంబంధించిన పూర్తి షెడ్యూల్, జట్లు, ప్రత్యక్ష ప్రసారల వివరాలను ఇక్కడ చూద్దాం.ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్ జరుగనుంది. చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 10 గంటలకు తొలి టీ20 ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ సోనీ టీవీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. సోనీ లివ్, జియో హాట్స్టార్లో స్ట్రిమింగ్ జరుగనుంది.పూర్తి షెడ్యూల్జులై 1: తొలి టీ20- రివర్సైడ్ గ్రౌండ్, చెస్టర్ లీ స్ట్రీట్ రా. 10:00 గంటలకు)జులై 4: రెండో టీ20 – ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్ (సా. 7:00 గంటలకు)జులై 7: మూడో టీ20 – ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్హామ్ (రా. 10:00 గంటలకు)జులై 9: నాలుగో టీ20 – బ్రిస్టల్ (రా. 10:00 గంటలకు)జులై 11: ఐదో టీ20 – సౌతాంప్టన్ (సా. 7:00 గంటలకు)వన్డే సిరీస్జులై 14: తొలి వన్డే – ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్ (సా. 5:30 గంటలకు)జులై 16: రెండో వన్డే – కార్డిఫ్ (సా. 5:30 గంటలకు)జులై 19: మూడో వన్డే – లార్డ్స్, లండన్ (మ. 3:30 గంటలకు)జట్లు..భారత టీ20 జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీఇంగ్లండ్ టీ20 జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, టామ్ బాంటన్, జోర్డాన్ కాక్స్, జాకబ్ బెతెల్, జేమ్స్ కోల్స్, సామ్ కరన్, లియామ్ డాసన్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, సోన్నీ బేకర్, సాకిబ్ మహ్మూద్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్భారత వన్డే జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), ష్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ఇంగ్లండ్ వన్డే జట్టును ప్రకటించాల్సి ఉందిప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..?భారత్-ఇంగ్లండ్ టీ20, వన్డే సిరీస్ల ప్రత్యక్ష ప్రసారం సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానళ్లలో అందుబాటులో ఉంటుంది. లైవ్ స్ట్రీమింగ్ను సోనీ లివ్, జియో హాట్స్టార్ యాప్లలో వీక్షించవచ్చు. -
వైభవ్ విషయంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలను తిప్పికొట్టిన శ్రేయస్
ఐర్లాండ్ సిరీస్లో వైభవ్ సూర్యవంశీకి టీమిండియా అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వకపోవడంపై పెద్ద వివాదం నడుస్తోంది. ఆ సిరీస్లో వైభవ్ తప్పక అరంగేట్రం చేస్తాడని అందరూ అనుకున్నా, చివరికి అతనికి ప్లేయింగ్ XIలో చోటు దక్కలేదు. దీంతో టీమిండియా మేనేజ్మెంట్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ గౌతమ్ గంభీర్పై విమర్శలు వెల్లువెత్తాయి.ఈ వివాదంలోకి రాజకీయ నాయకులు కూడా ఎంటయ్యారు. బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వైభవ్ను ఐర్లాండ్ సిరీస్లో ఆడించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రేయస్ అయ్యర్, గౌతమ్ గంభీర్ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు సూచించినా వైభవ్ను తుది జట్టులోకి తీసుకోలేదంటూ టీమిండియా మేనేజ్మెంట్పై ధ్వజమెత్తారు. ఓ ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ పేపర్ స్టేట్మెంట్ను సోషల్మీడియాలో ట్యాగ్ చేస్తూ టీమిండియా సిస్టమ్పై అసహనం వ్యక్తం చేశారు.గిరిరాజ్ సింగ్ చేసిన రచ్చపై టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తాజాగా స్పందించాడు. ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు ముందు మీడియాతో మాట్లాడుతూ..తాను సోషల్ మీడియా లేదా న్యూస్ ఛానల్స్లో వచ్చే ఒత్తిడిని పట్టించుకోనని, జట్టు అవసరాలు మరియు ప్రదర్శన ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నాడు. దీంతో వైభవ్ అరంగేట్రంపై వస్తున్న రాజకీయ ఒత్తిడిని నేరుగా తిప్పికొట్టాడు.ఇదిలా ఉంటే, ఇవాళ ఇంగ్లండ్తో జరుగబోయే తొలి టీ20లోనూ వైభవ్ అరంగేట్రం అనుమానమేనని తెలుస్తోంది. భారత మేనేజ్మెంట్, కోచ్, కెప్టెన్ అందరూ ముక్తకంఠంతో ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్కు వత్తాసు పలుకుతున్నారు. దీన్ని బట్టి నేటి మ్యాచ్లోనూ వైభవ్ అరంగేట్రం లేనట్లే అన్న విషయం స్పష్టమవుతుంది. ఈ లెక్కన వైభవ్ అరంగేట్రం కోసం మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు. -
రిషబ్ పంత్ కీలక నిర్ణయం
భారత స్టార్ వికెట్కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇవాళ జరుగబోయే ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) 2026 వేలంలో పాల్గొనేందుకు రెడీ అయ్యాడు. ఈ వేలంలో పంత్ సహా పలువురు ఐపీఎల్ స్టార్లు పాల్గొననున్నారు. పంత్ వేలంలో మార్కీ జాబితాలో ఉంటాడు.మార్కీ జాబితాలో స్టార్ ఆటగాళ్లురిషబ్ పంత్, ఇషాంత్ శర్మ, మయాంక్ యాదవ్, నవదీప్ సైనీ, సిమర్జీత్ సింగ్, సుయాష్ శర్మ, దిగ్వేష్ రాఠీ, హిమ్మత్ సింగ్, అనుజ్ రావత్, వంశ్ బేడి, కుల్దీప్ యాదవ్, సార్థక్ రంజన్, తేజస్విమహిళల విభాగంలో ప్రతికా రావల్, ప్రియా పునియా, ప్రియా మిశ్రా, పరునికా సిసోడియా, సిమ్రన్ దిల్ బహదూర్ మార్కీ కేటగిరీలో చోటు దక్కించుకున్నారు.నాలుగు కేటగిరీలుగా ఆటగాళ్లువేలంలో పాల్గొనే ఆటగాళ్లను అనుభవం ఆధారంగా నాలుగు విభాగాలుగా విభజించారు.* మార్కీ కేటగిరీ: భారత జట్టు, ఇండియా-ఏ లేదా గత మూడు సీజన్లలో ఐపీఎల్/డబ్ల్యూపీఎల్ ఆడిన ప్లేయర్లు.* కేటగిరీ-A: గత మూడు దేశవాళీ సీజన్లలో ఢిల్లీ సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వారు.* కేటగిరీ-B: ఢిల్లీ అండర్-23, అండర్-19, జూనియర్ ఆటగాళ్లు.* కేటగిరీ-C:** డీడీసీఏ లీగ్లో రాణించిన, రిజిస్టర్ అయిన క్రికెటర్లు.బేస్ ప్రైస్ ఎంతంటే..?పురుషుల వేలంలో మార్కీ ఆటగాళ్ల బేస్ ప్రైస్ రూ.10 లక్షలు, కేటగిరీ-Aకు రూ.5 లక్షలు, కేటగిరీ-Bకు రూ.3 లక్షలు, కేటగిరీ-Cకు రూ.1 లక్షగా నిర్ణయించారు.మహిళల విభాగంలో వరుసగా రూ.5 లక్షలు, రూ.3 లక్షలు, రూ.1.5 లక్షలు, రూ.75 వేల బేస్ ప్రైస్లు నిర్ణయించారు.600 మంది పోటీఈసారి వేలంలో మొత్తం 600 మంది ఆటగాళ్లు పేర్లు నమోదయ్యాయి. అందులో 400 మంది పురుషులు, 200 మంది మహిళా క్రికెటర్లు ఉన్నారు. ఎనిమిది పురుషుల ఫ్రాంచైజీలు, నాలుగు మహిళా జట్లు వేలంలో పాల్గొంటాయి. ఇప్పటికే ఫ్రాంచైజీలు 65 మంది పురుషులు, 28 మంది మహిళా ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి.రూ.1.5 కోట్ల పర్స్తో పురుషుల జట్లుపురుషుల జట్లకు రూ.1.5 కోట్ల పర్స్ కేటాయించగా, మహిళల జట్లకు రూ.75 లక్షల బడ్జెట్ ఇచ్చారు. రిటైన్ చేసిన ఆటగాళ్ల ఖర్చును మినహాయించిన తర్వాత మిగిలిన మొత్తంతోనే ఫ్రాంచైజీలు వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.ఆర్టీఎం కార్డ్తో వ్యూహాత్మక అవకాశంఈసారి ప్రతి ఫ్రాంచైజీకి ఒక రైట్ టు మ్యాచ్ (RTM) కార్డ్ వినియోగించే అవకాశం కల్పించారు. ప్రత్యర్థి జట్టు అత్యధిక బిడ్ వేసిన ఆటగాడిని అదే ధరకు తిరిగి తమ జట్టులోకి తీసుకునే అవకాశం ఈ కార్డ్ ద్వారా లభిస్తుంది. దీంతో వేలం మరింత రసవత్తరంగా మారనుంది. -
భారత జట్టు ప్రకటన.. యువ సంచలనానికి చోటు
జపాన్ వేదికగా సెప్టెంబర్లో జరిగే ఆసియా క్రీడలు 2026 కోసం 15 మంది సభ్యుల భారత మహిళల క్రికెట్ జట్టును ఇవాళ (జూన్ 30) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్గా స్మృతి మంధాన కొనసాగనున్నారు.స్టార్ ప్లేయర్లు జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, రిచా ఘోష్, రేణుకా సింగ్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఆల్రౌండర్ శ్రేయాంక పాటిల్ ఫిట్నెస్ క్లియరెన్స్కు లోబడి ఎంపికైంది. ఈ జట్టులో 17 ఏళ్ల వికెట్కీపర్ బ్యాటర్ జి కమిలిని ప్రత్యేక ఆకర్షనగా నిలిచింది. యస్తికా భాటియా స్థానంలో కమిలిని జట్టులోకి వచ్చింది. తాజాగా టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలిగిన భారత జట్టులో ఇదొక్కటే మార్పు.కమిలిని ఇటీవల సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకుంటుంది. ఇంగ్లండ్ పర్యటనలో ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ఆమెకు ఆసియా క్రీడల బెర్త్ దక్కేలా చేసింది. దీనికి ముందు అండర్-19 ప్రపంచకప్లోనూ కమిలిని రాణించింది. ఈ ప్రదర్శనల కారణంగా డబ్ల్యూపీఎల్ బెర్త్ కూడా దక్కించుకుంది. 2025 వేలంలో కమిలినిని ముంబై ఇండియన్స్ రూ. 1.6 కోట్లకు దక్కించుకుంది. ఈ సీజన్ వేలానికి ముందు మరోసారి కొనసాగించింది.కాగా, ఆసియా క్రీడల్లో భారత్ మరోసారి టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. హాంగ్ఝౌ వేదికగా జరిగిన గత క్రీడల్లో టీమిండియా స్వర్ణం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. పురుషుల విభాగంలోనూ టీమిండియానే గోల్డ్ గెలుచుకుంది.ఆసియా క్రీడలు 2026 కోసం భారత జట్టు..హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్కీపర్), జి కమలిని (వికెట్కీపర్), భారతీ ఫుల్మాలి, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్ (ఫిట్నెస్ క్లియరెన్స్కు లోబడి), రాధా యాదవ్, నందిని శర్మ -
ఎన్ని మ్యాచ్లు ఓడినా.. వైభవ్కు అవకాశం లేదా? కోచ్ కామెంట్స్తో హాట్ టాపిక్
-
LA 2028: టీమిండియా అభిమానులకు శుభవార్త!
‘బ్లాక్ సండే’ ఎఫెక్ట్తో విచారంలో ఉన్న భారత క్రికెట్ అభిమానులకు ఓ శుభవార్త. లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్-2028లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు పాల్గొనేందుకు మార్గం సుగమమైనట్లే కనిపిస్తోంది. కాగా దాదాపు శతాబ్దకాలం తర్వాత విశ్వక్రీడల్లో క్రికెట్ను చేరుస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించిన సంగతి తెలిసిందే.ఆరు జట్ల చొప్పునఈ క్రమంలో 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ సందర్భంగా క్రికెట్ రీఎంట్రీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో జట్ల ఎంపిక, అర్హతకు సంబంధించి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (IOC) తాజాగా విధివిధానాలు రూపొందించినట్లు సమాచారం. టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈవెంట్లో పురుషుల, మహిళల క్రికెట్ నుంచి ఆరేసి జట్లు పాల్గొంటాయి.అర్హత ఏమిటి?ఇందులో డిసెంబరు 31, 2026 నాటికి ఉన్న అత్యుత్తమ ర్యాంకింగ్ కలిగిన నాలుగు జట్లను (ఖండాల వారీగా) ఎంపిక చేస్తారు. ప్రస్తుతం పురుషుల క్రికెట్లో ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా అత్యుత్తమంగా మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. కాబట్టి ఈ జట్ల అర్హత లాంఛనమే.ఇక ఆతిథ్య అమెరికా మాత్రం ర్యాంకింగ్స్లో కనీసం టాప్-15లో ఉంటేనే అర్హత సాధిస్తుంది. మిగిలిన ఒక స్థానం కోసం.. టాప్-8లో ఉన్న జట్లు ఫైనల్ ఒలింపిక్ గ్లోబల్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్లో తలపడతాయి.పురుషుల క్రికెట్ సంగతి ఇలా ఉంటే.. మహిళల క్రికెట్లో మాత్రం టీ20 ప్రపంచకప్-2026లో ప్రదర్శన ఆధారంగా అర్హ త సాధిస్తాయని తెలుస్తోంది. హయ్యస్ట్ ర్యాంకింగ్ ఉన్న జాతీయ ఒలింపిక్ కమిటీల నుంచి నాలుగు జట్లు అర్హత పొందుతాయి. ఆతిథ్య అమెరికా టాప్-15 ర్యాంకింగ్స్లో ఉంటేనే క్వాలిఫై అవుతుంది. ఇక మరొక్క స్థానం కోసం టాప్-8లో ఉన్న జట్లు ఫైనల్ ఒలింపిక్ గ్లోబల్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్లో తలపడతాయి.బ్లాక్ సండేభారత క్రికెట్ చరిత్రలో ఆదివారం (జూన్ 28, 2026) చేదు జ్ఞాపకంగా మిగిలిపోనుంది. పసికూన ఐర్లాండ్ చేతిలో టీ20 ప్రపంచకప్-2026 చాంపియన్ టీమిండియా ఘోర పరాభవం పాలైంది. రెండో టీ20లో ఒక్క పరుగు తేడాతో ఓడి.. సిరీస్లో 0-2తో క్లీన్స్వీప్ అయింది. తొలిసారి ఐరిష్ జట్టు చేతిలో ఇంతటి ఘోర అవమానం చవిచూసింది.మరోవైపు.. భారత మహిళల జట్టు ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో.. ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా గత పర్యాయంలోనూ భారత్ సెమీ ఫైనల్ చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఈసారి కూడా అదే ఫలితం పునరావృతమైంది. -
టీమిండియాను గడగడలాడించిన మూంద్రా.. ఐపీఎల్లో బిగ్ డీల్..!
ఐర్లాండ్ తరఫున సంచలన అరంగేట్రం చేసిన భారత సంతతి యువ పేసర్ జై మూంద్రా ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. భారత్పై టీ20 సిరీస్లో అద్భుత ప్రదర్శనతో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు గెలుచుకున్న ఈ ఎడమచేతి ఫాస్ట్ బౌలర్.. 2027 ఐపీఎల్ మినీ వేలంలో హాట్ ప్రాపర్టీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.రాజస్థాన్లోని టోంక్లో క్రికెట్ ఆడటం ప్రారంభించిన మూంద్రా.. ఉన్నత విద్య కోసం ఐర్లాండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అనంతరం ఐర్లాండ్ దేశవాళీ క్రికెట్లో రాణించి జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. భారత్తో సిరీస్లో తొలి బంతికే వికెట్ తీసి ఆకట్టుకున్న అతడు.. మొత్తం సిరీస్లో భారత బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు.తొలి మ్యాచ్లో 25 పరుగులకు 2 వికెట్లు.. రెండో మ్యాచ్లో 32 పరుగులకు 3 వికెట్లు తీసి టీమిండియా ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. ఈ రెండు మ్యాచ్ల్లో మూంద్రాను ఎదుర్కొనేందుకు భారత బ్యాటర్లు చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ వద్ద మూంద్రా సంధించిన బంతులు సమాధానం లేదు. రెండో మ్యాచ్లో మూంద్రా అభిషేక్, సంజూను వారెదుర్కొన్న తొలి బంతులకు ఔట్ చేసి హైలైటయ్యాడు. అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను మరో అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేసి ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు.ఈ సంచలన ప్రదర్శనల తర్వాత మూంద్రాకు ఐపీఎల్లో భారీ గిరాకీ ఏర్పడింది. అతడి కోసం మూడు టాప్ ఫ్రాంచైజీలు ఎగబడే అవకాశం ఉంది. ఆ ఫ్రాంచైజీ ఏవి.. మూంద్రాకు మినీ వేలంలో ఎంత ధర లభించవచ్చు తదితర అంశాలను పరిశీలిద్దాం. మూంద్రా కోసం ముందుగా ఎగబడే అవకాశాలు ఉన్న ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్.ఈ ఫ్రాంచైజీ 2026 సీజన్లో బౌలింగ్ విభాగంలో ఆశించిన స్థాయి ప్రదర్శనలు చేయలేకపోయింది. దీంతో జట్టులోని విదేశీ పేసర్లలో మార్పులు చేసే అవకాశముంది. మార్కో యాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, బెన్ డ్వార్షుయిస్, లోకీ ఫెర్గూసన్లలో ఎవరో ఒకరిని తప్పించి మూంద్రను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. శ్రేయస్ మూంద్రా ప్రతిభను ప్రత్యక్షంగా చూసిన నేపథ్యంలో యాజమాన్యం ఆసక్తి చూపవచ్చు. పంజాబ్ మూంద్రా కోసం రూ. 5 కోట్లైనా వచ్చించే అవకాశం ఉంది.కేకేఆర్ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో స్థిరత్వం లేక ఇబ్బందులు పడుతున్న కేకేఆర్కు జై మూంద్రా మంచి ఎంపికగా మారవచ్చు. మతీశ పతిరణ అందుబాటులో లేకపోవడం, బ్లెస్సింగ్ ముజరబానీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటే మూంద్రా కోసం కేకేఆర్ ఎగబడే ఛాన్స్ ఉంది. కేకేఆర్ కూడా మూంద్రా కోసం ఇంచుమించు రూ. 5 కోట్లు ఖర్చు చేయవచ్చు.Mumbai Indians2026 సీజన్లో ముంబై ఇండియన్స్ పేస్ బౌలింగ్ విభాగం ఘోరంగా విఫలమైంది. బుమ్రా, దీపక్ చాహర్, బౌల్ట్, శార్దూల్ ఠాకూర్ ఆశించిన ప్రభావం చూపలేకపోవడంతో, జట్టు పునర్నిర్మాణంలో భాగంగా మూంద్రాపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించడంలో పేరుగాంచిన ముంబై స్కౌటింగ్ వ్యవస్థకు జై మూంద్ర ఆకర్షణీయమైన ఎంపిక కావచ్చు. ఈ ఫ్రాంచైజీ మూంద్రా కోసం ఎంత ఖర్చు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. -
ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు
ఐర్లాండ్తో నిన్న జరిగిన రెండో టీ20లో అరంగేట్రం చేసిన యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. తన టీ20 అంతర్జాతీయ కెరీర్లో ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచి ఈ ఘనత సాధించిన మూడో భారత బ్యాటర్గా నిలిచాడు.155 పరుగుల లక్ష్య ఛేదనలో నంబర్-11లో బ్యాటింగ్కు వచ్చిన ప్రిన్స్, భారత ఇన్నింగ్స్ చివరి బంతిని ఎదుర్కొన్నాడు. హ్యారీ టెక్టార్ వేసిన ఆ బంతిని భారీ సిక్సర్గా మలిచి అంతర్జాతీయ కెరీర్ను ఘనంగా ప్రారంభించాడు.అంతర్జాతీయ టీ20ల్లో తొలి బంతినే సిక్సర్లుగా మలిచిన భారత బ్యాటర్లు..- సూర్యకుమార్ యాదవ్ – ఇంగ్లండ్పై (2021), తొలి బంతికే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో సిక్సర్- రమన్దీప్ సింగ్ – దక్షిణాఫ్రికాపై (2024), తొలి బంతికే అండైల్ సైమ్లేన్ బౌలింగ్లో సిక్సర్- ప్రిన్స్ యాదవ్ – ఐర్లాండ్పై (2026), తొలి బంతికే హ్యారీ టెక్టర్ బౌలింగ్లో సిక్సర్అరంగేట్రం మ్యాచ్లో ప్రిన్స్ తొలుత బంతితోనూ ఆకట్టుకున్నాడు. తన కోటా నాలుగు ఓవర్లలో 22 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టాడు.అయితే ప్రిన్స్ ఆల్రౌండ్ ప్రదర్శన భారత్కు విజయాన్ని అందించలేకపోయింది. ఆఖరి బంతికి అతడు సిక్సర్ కొట్టినా గెలుపుకు 2 పరుగులు తక్కువయ్యాయి. ఈ ఓటమితో భారత్ సిరీస్ను సైతం కోల్పోయింది. -
అదే జరిగితే హర్మన్ సేన ఇంటికే!
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో ఆదివారంతో లీగ్ దశ మ్యాచ్లకు ఎండ్కార్డ్ పడనుంది. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ జట్టు మాత్రమే ఇప్పటివరకు నాకౌట్ దశకు చేరుకోగా, మిగిలిన మూడు బెర్తులు ఏ జట్లు ఖరారు చేసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. గ్రూప్-బి నుంచి వెస్టిండీస్, న్యూజిలాండ్ మధ్య పోటీ నెలకొని ఉంది. ఈ రెండు జట్లలో ఎవరు సెమీస్లో అడుగుపెట్టనున్నారనేది ఇవాళ తేలిపోనుంది. మరోవైపు గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా జట్టు అనధికారికంగా నాకౌట్కు చేరుకున్నప్పటికీ అధికారికంగా మాత్రం ఇంకా ఆ జట్టు సెమీస్ బెర్తును ఖరారు చేసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం డబుల్ హెడర్ పోరులో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్, సౌతాఫ్రికాతో బంగ్లాదేశ్ తలపడనున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా 8 పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. టీమిండియా, సౌతాఫ్రికాలు చెరో 6 పాయింట్లతో సంయుక్తంగా ఉన్నాయి. అయితే రన్రేట్ విషయంలో సౌతాఫ్రికాతో (0.734) పోలిస్తే భారత్ (2.268) మెరుగైన స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో హర్మన్ సేన సెమీస్ బెర్తు ఖరారు చేసుకోవాలంటే ఆస్ట్రేలియాపై తప్పనిసరి గెలవాల్సిందే. భారత్ సెమీస్ చేరే క్రమంలో సమీకరణాలు ఒకసారి పరిశీలిద్దాం.ఆసీస్ చేతిలో ఓడిపోతే..రేపు ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లో హర్మన్ సేన ఓడిపోతే మన ఖాతాలో ఆరు పాయింట్లు ఉంటాయి. అప్పుడు బంగ్లాదేశ్, సౌతాఫ్రికా మ్యాచ్ ఫలితం మనకు కీలకంగా మారనుంది. బంగ్లాదేశ్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోవాలని కోరుకోవాలి. అప్పుడు ఆ జట్టు కూడా 6 పాయింట్లతోనే ఉంటుంది. ఇక్కడ నెట్రన్రేట్ కీలకం కానుంది. రన్రేట్ విషయంలో సౌతాఫ్రికా కంటే మనం మెరుగ్గా ఉండడంతో ఆసీస్తో కలిసి సెమీస్లో అడుగుపెడతాం. ఒకవేళ బంగ్లాపై సౌతాఫ్రికా గెలిస్తే మాత్రం టీమిండియా ఇంటిబాట పట్టనుంది.👉ఒకవేళ ఆస్ట్రేలియాతో టీమిండియా గెలిచి, బంగ్లాపై సౌతాఫ్రికా గెలిచినా మెరుగైన రన్రేట్ కారణంగా హర్మన్ సేన సెమీస్లో అడుగుపెట్టనుంది. సౌతాఫ్రికా ఓడితే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా భారత్ నేరుగా సెమీస్లో అడుగుపెట్టనుంది.వర్షం పడి రద్దయితే..ఒకవేళ ఆస్ట్రేలియా, టీమిండియా మ్యాచ్ వర్షంతో రద్దయితే, అప్పుడు కూడా టీమిండియాకు అవకాశం ఉంటుంది. వర్షంతో మ్యాచ్ రద్దయితే హర్మన్ సేన ఖాతాలో 7 పాయింట్లు ఉంటాయి. అదే సమయంలో బంగ్లాదేశ్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడు భారత్ ఏడు పాయింట్లతో నేరుగా సెమీస్లో అడుగుపెట్టనుంది. ఒకవేళ సౌతాఫ్రికా గెలిస్తే మాత్రం సమీకరణాలతో సంబంధం లేకుండా ఆసీస్తో పాటు సఫారీలు నాకౌట్లో అడుగుపెట్టనుంది.చదవండి: అరువు తెచ్చుకున్న పోల్తో జాతీయ రికార్డు! -
నిప్పులు చెరిగిన నబీ.. టీమిండియాదే పైచేయి
గాలే వేదికగా శ్రీలంక-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్లో భారత-ఏ జట్టు పైచేయి సాధించింది. 122 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ కలుపుకొని, 170 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 48 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (7) రిటైర్డ్ హర్ట్ కాగా.. ఆయుశ్ పాండే, దేవ్దత్ పడిక్కల్ తలో 20 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.నిప్పులు చెరిగిన నబీశ్రీలంక జట్టు భారత బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్లో 330 పరుగులకు ఆలౌటైంది. పేసర్ అకిబ్ నబీ (4-58) నిప్పులు చెరిగే బంతులతో లంక బ్యాటర్ల భరతం పట్టాడు. మిగతా పేసర్లు యశ్ ఠాకూర్ (2-51), అన్షుల్ కంబోజ్ (1-43) కూడా సత్తా చాటారు. స్పిన్నర్లు హర్ష్ దూబే (2-84), సరాన్ష్ జైన్ (1-83) కూడా తమ పాత్రకు న్యాయం చేశారు. లంక ఇన్నింగ్స్లో నువనిదు ఫెర్నాండో (84), అషేన్ బండార (70), కెప్టెన్ సహాన్ అరాచ్చిగే (72) అర్ద సెంచరీలతో రాణించారు.సాయి సుదర్శన్, జురెల్ శతకాలుతొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సాయి సుదర్శన్ (132), కెప్టెన్ ధృవ్ జురెల్ (141 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కడంతో 6 వికెట్ల నష్టానికి 452 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. మిగతా బ్యాటర్లలో షేక్ రషీద్ (63) అర్ద సెంచరీతో రాణించగా.. ఆయుశ్ పాండే 25, పడిక్కల్ 12, రుతురాజ్ 22, హర్ష్ దూబే 30, సరాన్ష్ 3 (నాటౌట్) పరుగులు చేశారు. లంక బౌలర్లలో గుణశేఖర 3, సుధీర 2, రవిందు ఓ వికెట్ తీశారు. -
విరాట్ కోహ్లికి సంబంధించి బిగ్ న్యూస్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి సంబంధించి ఓ బిగ్ న్యూస్ అందింది. త్వరలో అతడు వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్కు వెళ్లాల్సి ఉన్నా, ఇంకా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లోనే ఉన్నాడు. విరాట్ ఐపీఎల్ 2026 ఫైనల్లో గాయపడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడు పునరావాస కార్యక్రమంలోనే ఉన్నట్లు తెలుస్తోంది.గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో విరాట్ హ్యామ్స్ట్రింగ్కు గాయమైంది. గాయం ఉన్నప్పటికీ అతడు మొత్తం ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్కు దూరమయ్యాడు.ఫిట్నెస్ క్లియరెన్స్ వచ్చినట్టే.. కానీ..?ఇంగ్లండ్ సిరీస్కు ముందు విరాట్ CoEలో ఫిట్నెస్ టెస్ట్ పూర్తి చేశాడని, అతడికి క్లియరెన్స్ కూడా లభించిందని పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అందుకే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అతడిని జట్టులోకి ఎంపిక చేసినట్లు సమాచారం.అయితే తాజాగా భారత అండర్-19 కెప్టెన్ ఆయుశ్ మాత్రేతో కలిసి విరాట్ CoEలో కనిపించాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అతడు ఇంకా రిహాబిలిటేషన్లోనే ఉన్నాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లండ్తో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జులై 14 నుంచి ప్రారంభమవుతుంది. దీనికి ముందు భారత జట్టు ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతుంది. విరాట్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా ఐర్లాండ్తో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్లో భాగంగా నిన్న జరిగిన తొలి టీ20లో భారత్ చిత్తుగా ఓడింది.అసలు గాయం ఏంటి..?విరాట్కు డిస్టల్ సెమిమెంబ్రానోసస్ టెండన్ టియర్ అనే అరుదైన హ్యామ్స్ట్రింగ్ గాయం అయినట్లు సమాచారం. ఇది మోకాలి వెనుక భాగంలో ఉండే హ్యామ్స్ట్రింగ్ కండరానికి సంబంధించిన గాయం. దీని నుంచి పూర్తిగా కోలుకోవడానికి సాధారణంగా 6 నుంచి 12 వారాలు పట్టే అవకాశం ఉంటుంది. గాయం తీవ్రతను బట్టి కొన్నిసార్లు శస్త్రచికిత్స కూడా అవసరమవుతుంది. -
తప్పు చేశారు.. వైభవ్కు అవకాశమివ్వాల్సింది!
ఐర్లాండ్తో తొలి టీ20లో టీమిండియా దారుణ పరాజయం చవిచూసింది. ఐర్లాండ్ విధించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 148 పరుగులకే కుప్పకూలింది. అభిషేక్ మినహా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అయితే పసికూన చేతిలో ప్రపంచ నంబర్వన్, చాంపియన్ అయిన భారత్ ఓటమిని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తన తొలి మ్యాచ్లోనే ఓటమి చవిచూసి చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఐర్లాండ్తో తొలి టీ20లో అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓటమి సంగతి పక్కనబెడితే.. ఇవాళ వైభవ్ జట్టులో ఉండుంటే అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ వచ్చేవాడు. ట్రై సిరీస్ ఫైనల్లో వైభవ్ విధ్వంసంర చూశాకా ఐర్లాండ్తో మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేయకపోయినా వేగంగా పరుగులు చేసేవాడు. ఆరంభంలోనే ఐర్లాండ్ బౌలర్లపై విరుచుకుపడుతూ ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించేవాడేమో. అవసరమయితే 12 లేదా 13 ఓవర్లలోనే మ్యాచ్ను ముగించేసేవాడేమో. అతడి విధ్వంసంతో తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి తగ్గుండేదేమో. అభిషేక్ శర్మ తన స్టైల్ ఆటను ఆడినప్పటికీ, ప్రపంచకప్ హీరో సంజూ శాంసన్తో పాటు ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్ కూడా తక్కువ స్కోర్లకే వెనుదిరగడం టీమిండియా కొంపముంచింది. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా తక్కువ స్కోరుకే వెనుదిరగడం టీమిండియాను మరింత కష్టాల్లోకి నెట్టేసింది. ఆదుకుంటాడునుకున్న తిలక్ వర్మ చేతులెత్తేయడం, ఆల్రౌండర్ ట్యాగ్లు తగిలించుకొని బరిలోకి దిగిన శివమ్ దూబే, అక్షర్పటేల్, వాషింగ్టన్ సుందర్లు బాధ్యతగా ఆడాల్సింది పోయి నిర్లక్ష్యంగా వికెట్లు పారేసుకోవడం కనిపించింది. ఇదంతా జరగకుండా ఉండాలని అనుకొని ఉంటే వైభవ్కు ఒక ఛాన్స్ ఇచ్చి ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు చేతులు కాలాకా ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంటుంది అన్నట్లుగా.. వైభవ్ను ఆడించకుండా తప్పు చేశారు అని చాలా మంది అభిమానులు సోషల్మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. 🚨 🚨 Shreyas Iyer creates history in his first match as captain 🚨 🚨 INDIA LOST FOR THE FIRST TIME TO IRELAND 💥 Imagine having Vaibhav Sooryavanshi ( who could have finished the game in 12th over) & not making him play. And instead going with Test players like washington… pic.twitter.com/3fgLG08qV7— TheFakeFakeer (@TheFakeFakeer) June 26, 2026 -
షఫాలీ విధ్వంసం.. బంగ్లాదేశ్ను చిత్తు చేసిన టీమిండియా
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (జూన్ 25) జరిగిన కీలక సమరంలో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది, సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్, టీమిండియా బౌలర్ల ధాటికి స్వల్ప స్కోర్కే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది.లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు రాధా యాదవ్ (4-0-28-3), శ్రీ చరణి (4-0-21-2) బంగ్లా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. రేణుకా సింగ్ (3-0-21-1), నందిని శర్మ (3-0-21-1) కూడా ఓ మోస్తరు ప్రదర్శన చేశారు. దీప్తి శర్మ (4-0-23-0) వికెట్లు తీయలేకపోయినా పొదుపుగా బౌలింగ్ చేసింది. బౌలింగ్ అటాక్ను ప్రారంభించిన షఫాలీ వర్మ 2 ఓవర్లలో వికెట్ లేకుండా 11 పరుగులిచ్చింది.బంగ్లా ఇన్నింగ్స్లో జుయారియా ఫెర్దోస్ (33), కెప్టెన్ నిగార్ సుల్తానా (32) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. శోభన మోస్తరి (22), షర్మిన్ అక్తర్ (10 రిటైర్డ్ ఔట్), షోర్నా అక్తర్ (13) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. దిల్హర అక్తర్ (4), రీతూ మోనీ (8) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితం కాగా.. నహిద అక్తర్ డకౌటైంది. రబేయా ఖాన్, మరుఫా అక్తర్ తలో 2 పరుగులతో అజేయంగా నిలిచాడు.షఫాలీ విధ్వంసం137 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా.. షఫాలీ వర్మ (53) విధ్వంసకర అర్ద శతకంతో చెలరేగడంతో 16.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. షఫాలీతో పాటు యస్తికా భాటియా (23), జెమీమా రోడ్రిగ్స్ (26) బ్యాట్ ఝులిపించారు. మిగతా భారత బ్యాటర్లలో మంధాన 8, రిచా ఘోష్ 10, కెప్టెన్ హర్మన్ 13 (నాటౌట్), దీప్తి శర్మ 5 (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో రితూ మోనీ 2 వికెట్లు తీయగా.. మరుఫా, రబేయా ఖాన్, నహిద తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో భారత్ సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. తమ చివరి గ్రూప్ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ జూన్ 28 లార్డ్స్లో జరుగనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ దర్జాగా సెమీస్కు చేరుకుంటుంది. గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది (అనధికారికంగా). రెండో బెర్త్ కోసం భారత్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ పోటీలో ఉన్నాయి. ఈ గ్రూప్ నుంచి పాక్, నెదర్లాండ్స్ ఇదివరకే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించాయి. మరోవైపు గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ సెమీస్ బెర్త్ అధికారికంగా ఖరారు చేసుకుంది. రెండో బెర్త్ కోసం వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంక పోటీపడుతున్నాయి. ఈ గ్రూప్లో స్కాట్లాండ్, ఐర్లాండ్ ఇదివరకే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించాయి. -
చెలరేగిన భారత బౌలర్లు.. స్వల్ప స్కోర్కే పరిమితమైన బంగ్లాదేశ్
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (జూన్ 25) కీలక మ్యాచ్ జరుగుతుంది. మాంచెస్టర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. గ్రూప్-ఏ నుంచి సెమీస్కు చేరాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ టీమిండియా బౌలర్ల ధాటికి స్వల్ప స్కోర్కే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు రాధా యాదవ్ (4-0-28-3), శ్రీ చరణి (4-0-21-2) బంగ్లా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. రేణుకా సింగ్ (3-0-21-1), నందిని శర్మ (3-0-21-1) కూడా ఓ మోస్తరు ప్రదర్శన చేశారు. దీప్తి శర్మ (4-0-23-0) వికెట్లు తీయలేకపోయినా పొదుపుగా బౌలింగ్ చేసింది. బౌలింగ్ అటాక్ను ప్రారంభించిన షఫాలీ వర్మ 2 ఓవర్లలో వికెట్ లేకుండా 11 పరుగులిచ్చింది.బంగ్లా ఇన్నింగ్స్లో జుయారియా ఫెర్దోస్ (33), కెప్టెన్ నిగార్ సుల్తానా (32) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. శోభన మోస్తరి (22), షర్మిన్ అక్తర్ (10 రిటైర్డ్ ఔట్), షోర్నా అక్తర్ (13) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. దిల్హర అక్తర్ (4), రీతూ మోనీ (8) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితం కాగా.. నహిద అక్తర్ డకౌటైంది. రబేయా ఖాన్, మరుఫా అక్తర్ తలో 2 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఓ దశలో (తొలి వికెట్ తర్వాత) బంగ్లాదేశ్ భారీ స్కోర్ చేసేలా కనిపించిన బంగ్లా జట్టు.. భారత స్పిన్నర్లు అనూహ్యంగా పుంజుకోవడంతో స్వల్ప స్కోర్కే పరిమితమైంది. -
బంగ్లాదేశ్పై టీమిండియా గెలుపు
బంగ్లాదేశ్పై టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపు137 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా.. షఫాలీ వర్మ (53) విధ్వంసకర అర్ద శతకంతో చెలరేగడంతో 16.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. షఫాలీతో పాటు యస్తికా భాటియా (23), జెమీమా రోడ్రిగ్స్ (26) బ్యాట్ ఝులిపించారు. మిగతా భారత బ్యాటర్లలో మంధాన 8, రిచా ఘోష్ 10, కెప్టెన్ హర్మన్ 13 (నాటౌట్), దీప్తి శర్మ 5 (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో రితూ మోనీ 2 వికెట్లు తీయగా.. మరుఫా, రబేయా ఖాన్, నహిద తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో భారత్ సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. తమ చివరి గ్రూప్ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ జూన్ 28 లార్డ్స్లో జరుగనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ దర్జాగా సెమీస్కు చేరుకుంటుంది. గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది (అనధికారికంగా). రెండో బెర్త్ కోసం భారత్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ పోటీలో ఉన్నాయి. ఈ గ్రూప్ నుంచి పాక్, నెదర్లాండ్స్ ఇదివరకే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించాయి. మరోవైపు గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ సెమీస్ బెర్త్ అధికారికంగా ఖరారు చేసుకుంది. రెండో బెర్త్ కోసం వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంక పోటీపడుతున్నాయి. ఈ గ్రూప్లో స్కాట్లాండ్, ఐర్లాండ్ ఇదివరకే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించాయి. షఫాలీ ఔట్8.4వ ఓవర్- 76 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. నహిద అక్తర్ బౌలింగ్లో నిగార్ సుల్తానా స్టంపింగ్ చేయడంతో షఫాలీ వర్మ (53) ఔటైంది.టీమిండియా స్టార్ బ్యాటర్ ఔట్2.6వ ఓవర్- 137 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (8) మూడో ఓవర్లోనేచ ఔటైంది. మరుఫా అక్తర్ బౌలింగ్లో రబేయా ఖాన్కు క్యాచ్ ఇచ్చి మంధాన పెవిలియన్ బాట పట్టింది. 3 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 31-1గా ఉంది. మంధాన ఔటైనా మరో ఓపెనర్ షఫాలీ వర్మ (22) ధాటిగా ఆడుతుంది. స్వల్ప స్కోర్కే పరిమితమైన బంగ్లాదేశ్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ టీమిండియా బౌలర్ల ధాటికి స్వల్ప స్కోర్కే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. మూడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్12.5వ ఓవర్- 79 పరుగుల వద్ద బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది. రాధా యాదవ్ బౌలింగ్లో దీప్తి శర్మకు క్యాచ్ ఇచ్చి శోభన మోస్తరి (22) ఔటైంది. రెండో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్8.5వ ఓవర్- 59 పరుగుల వద్ద బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది. జుయారియా ఫెర్దోస్ (33) నందిని శర్మ బౌలింగ్లో క్యాచ్ అండ్ బౌల్డ్ అయ్యింది. తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. రేణుకా సింగ్ బౌలింగ్లో శ్రీ చరణికి క్యాచ్ ఇచ్చి దిల్హర అక్తర్ (4) ఔటైంది. 3 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 12-1గా ఉంది. బంగ్లాదేశ్తో కీలక సమరం.. టాస్ ఓడిన టీమిండియాఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (జూన్ 25) కీలక మ్యాచ్ జరుగనుంది. మాంచెస్టర్ వేదికగా భారత్,బంగ్లాదేశ్ తలపడనున్నాయి. గ్రూప్-ఏ నుంచి సెమీస్కు చేరాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.తుది జట్లు..భారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (సి), రిచా ఘోష్ (w), దీప్తి శర్మ, రాధా యాదవ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్, నందిని శర్మబంగ్లాదేశ్: దిల్హర అక్తర్, జువైరియా ఫిర్దౌస్, షర్మిన్ అక్తర్, నిగర్ సుల్తానా(w/c), శోభనా మోస్తరీ, రీతు మోని, షోర్నా అక్తర్, రబెయా ఖాన్, నహిదా అక్తర్, శంజిదా అక్తర్ మేఘలా, మరుఫా అక్తర్ -
భారీ స్కోర్ దిశగా టీమిండియా
భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య రెండు మ్యాచ్ల అనధికారిక టెస్ట్ సిరీస్ ఇవాల్టి నుంచి (జూన్ 25) ప్రారంభమైంది. గాలే వేదికగా మొదలైన తొలి మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఓపెనర్ సాయి సుదర్శన్ (132) సెంచరీతో.. మిడిలార్డర్ బ్యాటర్లు ధృవ్ జురెల్ (68 నాటౌట్), షేక్ రషీద్ (53 నాటౌట్) అర్ద శతకాలతో సత్తా చాటడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 333 పరుగులు (86 ఓవర్లు) చేసింది.స్టార్ బ్యాటర్లు రుతురాజ్ గైక్వాడ్ (22), దేవ్దత్ పడిక్కల్ (12) నిరాశపరిచినా భారత్ భారీ స్కోర్ దిశగా సాగడం విశేషం. ఇవాళ ఔటైన మరో భారత బ్యాటర్ ఆయుశ్ పాండే. అతడు 25 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు.లంక బౌలర్లలో దిలుమ్ సుదీర 2 వికెట్లు తీయగా.. చమిక గుణశేఖర, రవిందు ఫెర్నాంతో తలో వికెట్ దక్కించుకున్నారు.కాగా, ఈ మ్యాచ్కు ముందు భారత-ఏ జట్టు లంకలోనే ట్రై నేషన్ (ఆఫ్ఘనిస్తాన్ సహా) వన్డే సిరీస్ ఆడింది. ఈ టోర్నీలో భారత్ విజేతగా అవతరించింది. ఫైనల్లో ఆతిథ్య లంక జట్టును చిత్తు చేసి ఛాంపియన్గా నిలిచింది. ఈ మ్యాచ్లో టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగి (29 బంతుల్లో 94 పరుగులు) భారత్కు టైటిల్ అందించాడు. -
చివరి నిమిషంలో భారత టీ20 సిరీస్ రద్దు..?
భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆగస్ట్లో జరగాల్సి ఉన్న టీ20 సిరీస్పై అనిశ్చితి నెలకొంది. టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సిరీస్ చివరి నిమిషంలో రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆటగాళ్ల పనిభారం, భవిష్యత్ టోర్నీల దృష్ట్యా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.వాస్తవానికి భారత ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్లో ఈ సిరీస్ లేదు. అయితే లంక బోర్డు అభ్యర్థన మేరకు బీసీసీఐ ఈ సిరీస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై ఇంకా అధికారిక షెడ్యూల్ కూడా విడుదల కాలేదు. ఈ లోపే బిజీ షెడ్యూల్ దృష్ట్యా బీసీసీఐ ఈ సిరీస్ను డిస్మిస్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ సిరీస్కు ఓ ప్రత్యేకత ఉంది. గతేడాది నవంబర్లో శ్రీలంకను తీవ్రంగా ప్రభావితం చేసిన ‘సైక్లోన్ డిట్వా’ బాధితుల సహాయార్థం ఈ సిరీస్ను నిర్వహించాలని అనుకున్నారు. ఈ సిరీస్కు కేవలం క్రికెట్ పరమైన ప్రాధాన్యమే కాకుండా మానవతా కోణం కూడా ఉండేది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ లక్ష్యం నెరవేరేలా లేదు.టీ20 సిరీస్పై అనిశ్చితి నెలకొన్నప్పటికీ, ఆగస్ట్లోనే ఇరు జట్ల మధ్య జరుగనున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ మాత్రం యథావిధిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 15 నుంచి 27 వరకు జరగనున్న ఈ టెస్టులు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC 2025-27)లో భాగంగా జరుగనున్నాయి. -
పెళ్లి చేసుకున్న టీమిండియా స్టార్.. కోహ్లి, ధోనికి ఆహ్వానం లేదు!
టీమిండియా పేసర్ ఆకాశ్ దీప్ ఓ ఇంటివాడయ్యాడు. అక్షిత రాజ్తో కలిసి మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టాడు. వారణాసిలో బుధవారం వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఆకాశ్ దీప్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.శాశ్వత ఇన్నింగ్స్ఇందుకు.. ‘‘ఈ అందమైన పెళ్లి వేడుక.. ఇద్దరు దిగ్గజాలు తమ శాశ్వత ఇన్నింగ్స్ మొదలుపెట్టే ఘట్టాన్ని అందంగా చిత్రీకరిస్తున్నట్లుగా ఉంది. రీటేక్లు ఏమీ లేవు. నమ్మకం, టీమ్ స్పిరిట్తో మేము ముందుకు సాగుతున్నాం’’ అని ఆకాశ్ దీప్ క్యాప్షన్ జత చేశాడు.శుభాకాంక్షల వెల్లువఈ క్రమంలో సహచర ఆటగాళ్లు, అభిమానుల నుంచి ఆకాశ్ దీప్- అక్షితా రాజ్ (India pacer Akash Deep Wedding)కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా నవదంపతులను విష్ చేశారు.ఇదిలా ఉంటే.. ఆకాశ్ దీప్ స్నేహితులు షేర్ చేసిన ఓ వీడియో క్లిప్ నెట్టింట వైరల్గా మారింది. ఇందులో.. ‘‘నీ పెళ్లికి భారత క్రికెట్ దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను ఎందుకు పిలవలేదు’’ అని ఓ వ్యక్తి అడిగాడు.అందుకు వాళ్లను పిలవలేదు!ఇందుకు బదులుగా ఆకాశ్ దీప్.. ‘‘పెళ్లి బనారస్ (వారణాసి)లో జరుగుతుంది కదా!’’ అని అనడంతో నవ్వులు పూశాయి. కాగా కోహ్లి, ధోని, రోహిత్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా కోహ్లి కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎగబడతారో తెలిసిందే. అందుకే తన పెళ్లి సజావుగా సాగాలంటే కోహ్లి భయ్యా ఇక్కడ లేకపోవడమే మంచిది అన్నట్లు ఆకాశ్ దీప్ సరదాగా ఇలా బదులిచ్చాడు.కాగా బిహార్కు చెందిన ఆకాశ్ దీప్.. 2024లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగిన సిరీస్ ద్వారా ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటికి ఈ 29 ఏళ్ల పేస్ బౌలర్ టీమిండియా తరఫున 10 టెస్టులు ఆడి.. 28 వికెట్లు కూల్చాడు. గతేడాది ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ గడ్డ మీద ఆకాశ్ దీప్ సత్తా చాటాడు. బర్మింగ్హామ్ టెస్టులో పన్నెండు వికెట్లు కూల్చి సంచలనం సృష్టించాడు.ఇక ఇప్పటికి ఐపీఎల్లో పద్నాలుగు మ్యాచ్లు ఆడిన ఆకాశ్ దీప్.. పది వికెట్లు తీయగలిగాడు. ఈ ఏడాది కోల్కతా నైట్ రైడర్స్ అతడిని సొంతం చేసుకోగా.. గాయం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు.అదే విధంగా స్వదేశంలో అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్టు మ్యాచ్కు కూడా దూరమయ్యాడు. తాజాగా పెళ్లి బంధంలో అడుగుపెట్టి వ్యక్తిగత జీవితంలో నూతన అధ్యాయాన్ని ఆరంభించాడు.చదవండి: శ్రీలంకతో తొలి టెస్టు.. భారత్ బ్యాటింగ్ View this post on Instagram A post shared by Virat (@kohlixclips) -
రేపటి నుంచి భారత్-శ్రీలంక తొలి టెస్ట్
శ్రీలంక పర్యటనలో వన్డే ట్రై-నేషన్ సిరీస్ను విజయవంతంగా ముగించిన భారత్-ఏ జట్టు ఇప్పుడు రెడ్బాల్ క్రికెట్పై దృష్టి సారించింది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్టు మ్యాచ్ రేపటి నుంచి (జూన్ 25) గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా ప్రారంభం కానుంది. భారత్-ఏ జట్టుకు వికెట్కీపర్-బ్యాటర్ ధృవ్ జురెల్ నాయకత్వం వహిస్తున్నాడు. ఇటీవల దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న జురెల్కు ఇది కెప్టెన్గా కీలక అవకాశం. జట్టు వైస్ కెప్టెన్గా దేవదత్ పడిక్కల్ వ్యవహరించనున్నాడు. ఇటీవల ముగిసిన ట్రై-నేషన్ ‘ఏ’ సిరీస్లో భారత్-ఏ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఫైనల్లో శ్రీలంక-ఏను 66 పరుగుల తేడాతో ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆ విజయంతో జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పుడు అదే జోరును నాలుగు రోజుల ఫార్మాట్లో కొనసాగించాలని భారత్-ఏ లక్ష్యంగా పెట్టుకుంది. గాలే పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటంతో బ్యాటర్లకు ఇది కఠిన పరీక్షగా మారే అవకాశం ఉంది. మరోవైపు స్వదేశంలో ఆడుతున్న శ్రీలంక-ఏ జట్టు కూడా ప్రతిఘటన చూపేందుకు సిద్ధమవుతోంది.తొలి మ్యాచ్ రేపటి నుంచి 28 వరకు జరుగుతుండగా, రెండో మ్యాచ్ జూలై 2 నుంచి 5 వరకు గాలే వేదికగానే నిర్వహించబడుతుంది.జట్ల వివరాలు..భారత ఏ జట్టు: సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, అమన్ మోఖడే, ఆయుశ్ పాండే, షేక్ రషీద్, రుతురాజ్ గైక్వాడ్, హర్షిత్ దూబే, అన్షుల్ కంబోజ్, సరాన్ష్ జైన్, ఆకిబ్ నబీ దార్, ధృవ్ జురెల్, ఎన్ జగదీశన్, గుర్నూర్ బ్రార్, యశ్ ఠాకూర్, జీషన్ అన్సారీశ్రీలంక ఏ జట్టు: నువనిదు ఫెర్నాండో, అషెన్ బండార, అహాన్ విక్రమసింఘే, అసంక మనోజ్, పవంత వీరసింఘే, సహాన్ అరచ్చిగే (కెప్టెన్), రవిందు ఫెర్నాండో, దిలుమ్ సుదీర, ప్రవీణ్ మనీషా, కేషారా నువంత, సోహన్ డి లివేరా, నిరోషన్ డిక్వెల్లా, కవిందు పతిరత్నే, మొహమ్మద్ షిరాజ్, చమిక గుణశేఖర, దులాజ్ సముదిత, -
వైభవ్ సూర్యవంశీ తమ్ముడి మరో భారీ సెంచరీ.. పదేళ్లకే!
భారత సంచలన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం టీమిండియాతో కలిసి ఐర్లాండ్లో ఉన్నాడు. అతడి అంతర్జాతీయ టీ20 అరంగేట్రం దాదాపుగా ఖరారై పోయింది. ఇలాంటి తరుణంలో వైభవ్ సూర్యవంశీ.. తన తమ్ముడి గురించి షేర్ చేసిన పోస్టు వైరల్గా మారింది.టీమిండియాతో ఐర్లాండ్కుబిహార్లోని సమస్తిపూర్కు చెందిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) పన్నెండేళ్లకే రంజీల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పద్నాలుగేళ్లకే రాజస్తాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్లోనూ అడుగుపెట్టాడు. రాయల్స్ ఓపెనర్గా 2025లో 35 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 2026లో సంచలన ప్రదర్శనతో మెరిశాడు.ఆరెంజ్ క్యాప్పదహారు మ్యాచ్లలో కలిపి ఏకంగా 776 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ అత్యధిక పరుగుల వీరుడిగా.. ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఈ క్రమంలో భారత్- ‘ఎ’ జట్టుతో పాటు.. టీమిండియాకు కూడా ఎంపికయ్యాడు పదిహేనేళ్ల వైభవ్. ఇక శ్రీలంక వేదికగా ముక్కోణపు వన్డే సిరీస్ లీగ్ దశలో అతడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.అయితే, ఫైనల్ మ్యాచ్లో కేవలం 29 బంతుల్లో 94 పరుగులు సాధించిన వైభవ్.. జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం టీమిండియాతో కలిసి ఐర్లాండ్కు పయనమయ్యాడు. ఈ క్రమంలో తన తమ్ముడి విజయాన్ని సెలబ్రేట్ చేస్తూ ఇన్స్టా స్టోరీ షేర్ చేశాడు.తమ్ముడూ తగ్గేదేలేసమస్తిపూర్ స్థానిక ప్రాక్టీస్ మ్యాచ్లో రిషవ్ ఎలెవన్కు ప్రాతినిథ్యం వహించిన వైభవ్ తమ్ముడు, పదేళ్ల ఆశీర్వాద్ సూర్యవంశీ.. భారీ శతకం సాధించాడు. వైశాలి ఎలెవన్పై 119 బంతుల్లో 19 బౌండరీలు, ఆరు సిక్సర్లు బాది 168 పరుగులు సాధించాడు. ఓపెనర్గా దిగిన ఆశీర్వాద్ శతక ఇన్నింగ్స్ కారణంగా రిషవ్ ఎలెవన్ ఘన విజయం సాధించింది. ఇందుకు సంబంధించిన స్కోరు కార్డును షేర్ చేస్తూ తమ్ముడి ప్రదర్శన పట్ల వైభవ్ మురిసిపోయాడు.కాగా ఆశీర్వాద్ ఇటీవలే తేజ్పూర్ క్రికెట్ అకాడమీ తరఫున మ్యాచ్ ఆడి.. 87 బంతుల్లోనే 103 పరుగులు సాధించాడు. ఇప్పుడిలా మరో సెంచరీ సాధించాడు. కాగా వైభవ్కు అన్న ఉజ్వల్, తమ్ముడు ఆశీర్వాద్ ఉన్నారు. చదవండి: డ్రెసింగ్ రూమ్లోకి వైభవ్కు నో ఎంట్రీ! -
డ్రెస్సింగ్ రూమ్లోకి వైభవ్కు నో ఎంట్రీ
వండర్కిడ్ వైభవ్ సూర్యవంశీ టీమిండియాకు ఎంపికైనా, అతడికి జట్టు డ్రెస్సింగ్ రూమ్లోకి మాత్రం ప్రవేశం లేదు. ఎందుకంటే, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అమలు చేస్తున్న బాలల భద్రతా నిబంధనల ప్రకారం, 16 ఏళ్ల లోపు ఆటగాళ్లు పూర్తిస్థాయి పెద్దల డ్రెస్సింగ్ రూమ్లను ఉపయోగించకూడదు. ఈ నిబంధనల నేపథ్యంలో 15 ఏళ్ల వైభవ్ కోసం ఈసీబీ ప్రత్యేక డ్రెస్సింగ్ రూమ్ కేటాయించింది.మ్యాచ్ల సమయంలో మాత్రం వైభవ్ జట్టు డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లవచ్చు. సహచర ఆటగాళ్లతో మాట్లాడడం, జట్టు సమావేశాల్లో పాల్గొనడం వంటి విషయాలపై ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ మ్యాచ్కు ముందు, తర్వాత దుస్తులు మార్చుకోవడం వంటి కార్యక్రమాల కోసం తప్పనిసరిగా ప్రత్యేక గదినే ఉపయోగించాల్సి ఉంటుంది. ఈసీబీ ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం.ప్రస్తుతం వైభవ్ ఎదుర్కొంటున్న పరిస్థితినే 15 ఏళ్ల మ్యాక్స్ డౌమన్ అనే స్టార్ ఫుట్బాలర్ ఎదుర్కొంటున్నాడు. ఆర్సెనల్ క్లబ్కు ఆడే డౌమన్కు కూడా వైభవ్లాగే ప్రత్యేక నిబంధనలు వర్తిస్తున్నాయి. అతనికి కూడా క్లబ్లో ప్రత్యేక మార్పిడి గది ఏర్పాటు చేశారు.ఇదిలా ఉంటే, ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్ల కోసం వైభవ్ భారత జట్టుతో కలిసి యూకేకు చేరుకున్నాడు. ఈ సిరీస్లలో అతడు ఏ మ్యాచ్లో బరిలోకి దిగినా, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన అతి పిన్న వయస్కుడైన భారత అంతర్జాతీయ క్రికెటర్ రికార్డును బద్దలు కొడతాడు.వైభవ్ ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనలు చేసి టీమిండియాలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజాగా అతడు శ్రీలంకలో జరిగిన ఏ-జట్ల ట్రై సిరీస్లోనూ చెలరేగి ఆడాడు. లంకతో జరిగిన ఫైనల్లో 29 బంతుల్లో 94 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్తో భారత జట్టుకు టైటిల్ అందించాడు.ఈ ప్రదర్శన తర్వాత అభిమానులంతా వైభవ్ భారత సీనియర్ జట్టు అరంగేట్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐర్లాండ్తో 2 మ్యాచ్ల టీ20 సిరీస్ జూన్ 26, 28 తేదీల్లో జరుగనుంది. అనంతరం జులై 1, 4, 7, 9, 11 తేదీల్లో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ షెడ్యూలైంది.బీసీసీఐ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసిందివైభవ్ యూకే పర్యటన నేపథ్యంలో బీసీసీఐ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వైభవ్ సంరక్షణ, మానసిక సౌకర్యం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని అతడి తల్లిదండ్రులను కూడా యూకే పర్యటనకు అనుమతిచ్చింది. టీమిండియాలో అందరూ పెద్దవారే ఉండటంతో, వైభవ్ కొత్త వాతావరణానికి అలవాటు పడేందుకు కుటుంబ సభ్యుల సాన్నిహిత్యం ఉపయోగపడుతుందని బీసీసీఐ భావించింది. -
టీమిండియా ప్లేయింగ్ 11 చూస్తే.. ఇంగ్లాండ్ వణకాల్సిందే
-
ఎమ్మెల్సీగా తిలక్ వర్మ స్నేహితుడు
టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ చిన్ననాటి స్నేహితుడు విక్రమ్ కాకడే మహారాష్ట్ర శాసన మండలి (ఎమ్మెల్సీ) సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ముంబైలోని విధాన్ భవన్లో ఇవాళ (జూన్ 23) జరిగిన కాకడే ప్రమాణస్వీకారానికి తిలక్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా తిలక్ మాట్లాడుతూ.. నా స్నేహితుడి విజయాన్ని చూసి గర్వంగా ఉందని అన్నాడు."మేమిద్దరం చిన్నప్పటి నుంచి స్నేహితులం. ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం చాలా ఆనందంగా ఉంది. అందుకే ప్రత్యేకంగా వచ్చి కలిశాను. ఆయన ఎప్పుడూ ప్రజలకు సహాయం చేస్తుంటారు. ఈ స్థాయికి చేరుకోవడం గర్వకారణం" అని తెలిపాడు.ఇదే సందర్భంగా క్రికెట్ గురించి మాట్లాడుతూ.. ప్రపంచకప్ ఇంకా దూరంలోనే ఉందని, ప్రస్తుతం భారత జట్టు ఒక్కో సిరీస్పై దృష్టి పెడుతూ ముందుకు సాగుతోందని చెప్పాడు. ప్రతిరోజూ కష్టపడి మరింత మెరుగుపడటమే మా లక్ష్యం అని పేర్కొన్నాడు.మహాయుతి జోరుమహారాష్ట్ర శాసన మండలి ఎన్నికల్లో అధికార కూటమి మహాయుతి ఘన విజయం సాధించింది. 17 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 16 స్థానాలను కైవసం చేసుకుని ఆధిపత్యాన్ని చాటుకుంది. బీజేపీ 11, శివసేన 3, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 2 రెండు స్థానాలు గెలుచుకున్నాయి. పూణే నుంచి పోటీ చేసిన విక్రమ్ కాకడే (NCP) ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం. -
చేజారిన వరల్డ్ రికార్డ్.. కన్నీళ్లు పెట్టుకున్న బుడ్డాడు..!


