team india
-
టీ20 ప్రపంచకప్కు భారత జట్టు ప్రకటన
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్కు సంబంధించి బీసీసీఐ శనివారం భారత జట్టును ప్రకటించింది. అమితా శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ, బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా, మహిళల జట్టు ప్రధాన కోచ్ అమోల్ మజుందార్, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్లతో సమావేశమైంది. సుదీర్ఘ చర్చ అనంతరం భారత జట్టును ప్రకటించారు.హర్మన్ప్రీత్ కౌర్ రికార్డు స్థాయిలో ఐదోసారి కెప్టెన్గా జట్టును నడిపించనుండడం విశేషం. కెప్టెన్ హర్మన్ప్రీత్, స్మృతి మంధాన, జేమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రిచా ఘోష్లు బ్యాటింగ్ భారాన్ని మోయనున్నారు. ఇక ఆల్రౌండర్ దీప్తి శర్మ, రేణుకాసింగ్లు బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించనున్నారు. తెలుగు క్రికెటర్లు శ్రీచరణి, అరుంధతి రెడ్డి జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక గాయం కారణంగా దూరమైన అమన్జ్యోత్ కౌర్ స్థానంలో భారతి పుల్మాలిని ఎంపిక చేసినట్లు సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. బ్యాటర్ హర్లీన్ డియోల్, స్పిన్నర్ స్నేహ్రాణాలకు జట్టులో చోటు దక్కలేదు.15 మందితో కూడిన జట్టుకు హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వం వహించనున్నారు. జూన్ 12 నుంచి ఇంగ్లండ్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. గ్రూప్-ఏలో భారత్తో పాటు పాకిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. టీమిండియా తమ తొలి మ్యాచ్ను జూన్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఆడనుంది.ఆ తర్వాత 17న నెదర్లాండ్స్, 21న సౌతాఫ్రికా, 25న బంగ్లాదేశ్, 28న ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఇక గ్రూప్-బిలో న్యూజిలాండ్, ఇంగ్లండ్, వెస్టిండీస్, శ్రీలంక, స్కాట్లాండ్, ఐర్లాండ్ ఉన్నాయి. కాగా జూన్ 30న తొలి సెమీఫైనల్, జూలై 2న రెండో సెమీఫైనల్ జరగనున్నాయి. ఇక జూలై 5న జరగనున్న ఫైనల్ మ్యాచ్కు లార్డ్స్ ఆతిథ్యమివ్వనుంది.ఇక గతేడాది భారత్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో భారత మహిళల జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. హర్మన్ప్రీత్ నేతృత్వంలోని టీమిండియా ఆనాటి ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి తొలిసారి టీ20 ప్రపంచకప్ను ముద్దాడింది.భారత్ మ్యాచ్ల షెడ్యూల్ వివరాలు..జూన్ 14: భారత్ వర్సెస్ పాకిస్తాన్, వేదిక: ఎడ్జ్బాస్టన్జూన్ 17: భారత్ వర్సెస్ నెదర్లాండ్స్, వేదిక: హెడ్డింగేజూన్ 21: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా, వేదిక: ఓల్డ్ ట్రాఫోర్డ్జూన్ 25: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్, వేదిక: ఓల్డ్ ట్రాఫోర్డ్జూన్ 28: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా, వేదిక: లార్డ్స్భారత జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, భారతీ ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్, శ్రీ చరణి, యాస్తికా భాటియా, నందనీ శర్మ, అరుంధతీ రెడ్డి, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) చదవండి: ఒక్క హగ్కు ఇంత రాద్ధాంతమా! -
టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ
భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ 2026 తర్వాత జరుగబోయే ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్ సిరీస్లకు ఇద్దరు యువ పేసర్లు దూరమయ్యారు. ఆ ఇద్దరి పేర్లు హర్షిత్ రాణా, ఆకాశ్దీప్. వీరిద్దరు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. ఈ విషయాన్ని ఓ ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది.హర్షిత్ మోకాలి గాయంతో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకోగా.. ఆకాశ్దీప్ వెన్ను గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఇద్దరి రిహాబిలిటేషన్ సక్రమంగా సాగుతున్నప్పటికీ, పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు చాలా సమయం అవసరమని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. గాయాల కారణంగా హర్షిత్, ఆకాశ్దీప్ ఐపీఎల్కు కూడా దూరమయ్యారు.కాగా, ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత జట్టు స్వదేశంలోనే ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు వన్డేలు ఆడనుంది. అనంతరం ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లనుంది. ఈ కీలక పర్యటనల్లో ఇద్దరు ప్రధాన పేసర్లు అందుబాటులో లేకపోవడం జట్టుకు పెద్ద లోటే. -
అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త చరిత్ర
అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త చరిత్ర నమోదైంది. పసికూన జర్మనీ.. ఇంగ్లండ్, భారత్ను సైతం వెనక్కు నెట్టి మూడో అత్యధిక టీమ్ స్కోర్ను నమోదు చేసింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆస్ట్రియాతో ఇవాళ (మే 1) జరిగిన తొలి టీ20లో జర్మనీ రికార్డు స్థాయిలో వికెట్ నష్టానికి 308 పరుగులు చేసింది. అంతర్జాతీయ టీ20 చరిత్రలో ఇది మూడో అత్యధిక టీమ్ స్కోర్గా రికార్డైంది.అంతర్జాతీయ టీ20ల్లో మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన టీమిండియా కూడా ఇప్పటివరకు 300 పరుగుల మార్కును తాకలేదు. అలాంటిది ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న జర్మనీ ఈ ఘనత సాధించడం చరిత్రాత్మకం.అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఐసీసీ ఫుల్ మెంబర్ జట్లలో ఇంగ్లండ్ ఒక్కటే ఇప్పటివరకు 300 పరుగుల మార్కును తాకింది. గతేడాది సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. జర్మనీ ఈ రికార్డును సైతం అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించింది.భారత్కు పలు మార్లు 300 పరుగుల మార్కును తాకే అవకాశం వచ్చినా, ఒక్కసారి కూడా తాకలేదు. 2024లో బంగ్లాదేశ్పై చేసిన 297 పరుగులే టీ20ల్లో టీమిండియాకు అత్యధికం. ఈ విభాగంలో అత్యధిక స్కోర్ రికార్డు జింబాబ్వే పేరిట ఉంది. 2024లో ఈ జట్టు గాంబియాపై ఏకంగా 344 పరుగులు చేసింది. జింబాబ్వే తర్వాత అత్యధిక స్కోర్ చేసిన రికార్డు నేపాల్ పేరిట ఉంది. నేపాల్ 2023 ఆసియా క్రీడల్లో మంగోలియాపై 314 పరుగులు చేసింది.అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్కోర్లు* జింబాబ్వే – 344* నేపాల్ – 314* జర్మనీ – 308* ఇంగ్లండ్ – 304* భారత్ – 297మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జర్మనీ.. ఓపెనర్లు బెన్ కొహ్లెర్ కాడ్మోర్ (58 బంతుల్లో 133 నాటౌట్; 17 ఫోర్లు, 6 సిక్సర్లు), ముసద్దిక్ అహ్మద్ (48 బంతుల్లో 122; 11 ఫోర్లు, 10 సిక్సర్లు) విధ్వంసకర సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 308 పరుగులు చేసింది. ముసద్దిక్ ఔటయ్యాక వచ్చిన షాహిద్ అఫ్రిది (34 నాటౌట్) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రియా 15.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటై, 162 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఆ జట్టు తరఫున ఓపెనర్ కరణ్బీర్ సింగ్ (84) ఒక్కడే రాణించాడు. యూరప్లో కొత్త శక్తిఅంతర్జాతీయ టీ20ల్లో 300 పరుగుల మార్క్ తాకిన తొలి జట్టుగా జర్మనీ చరిత్ర సృష్టించింది. ఇది కేవలం జర్మనీ క్రికెట్కే కాదు, యావత్ యూరోపియన్ క్రికెట్ అభివృద్ధికి గొప్ప సంకేతం.బెన్ ఎవరు..?ఈ మ్యాచ్లో సెంచరీ చేసిన బెన్ కొహ్లెర్ కాడ్మోర్, ఇంగ్లండ్ క్రికెటర్ టామ్ కొహ్లెర్ కాడ్మోర్కు సోదరుడు. తల్లి జర్మనీ దేశస్థురాలు కావడం చేత బెన్ ఆ దేశం తరఫున ఆడే అర్హత సాధించాడు. -
ఐసీసీ వార్షిక టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఇవాళ (మే 1) వార్షిక టెస్ట్ ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. ఇందులో ఆస్ట్రేలియా టాప్ ప్లేస్ను నిలబెట్టుకోగా.. భారత్ మూడో స్థానంలో నిలిచింది. పాక్ జట్టు ఓ స్థానం మెరుగుపర్చుకొని, ఆరో స్థానానికి ఎగబాకింది.సౌతాఫ్రికా రెండో స్థానంలో.. ఇంగ్లండ్, న్యూజిలాండ్ నాలుగు, ఐదు స్థానాల్లో నిలువగా.. శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్ జట్లు వరుసగా 7 నుంచి 12 స్థానాల్లో ఉన్నాయి.అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న ఆస్ట్రేలియాఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. పాట్ కమిన్స్ సారథ్యంలో ఆసీస్ గతేడాది అద్భుత ప్రదర్శన చేసింది. 12 టెస్టుల్లో 10 విజయాలు సాధించి నంబర్వన్గా నిలిచింది.సౌతాఫ్రికా జట్టు రెండో స్థానాన్ని దక్కించుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజయంతో ప్రోటీస్ తమ స్థాయిని మరింత పెంచుకుంది.భారత్ మూడో స్థానంగతేడాది నుంచి భారత్ 10 టెస్టులు ఆడి నాలుగు మాత్రమే గెలిచింది. ఐదు మ్యాచ్ల్లో ఓడిపోయి, ఒకటి డ్రా చేసుకుంది. అయినప్పటికీ, 104 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లండ్ను వెనక్కి నెట్టి మూడో స్థానాన్ని కాపాడుకుంది. ఇంగ్లండ్ 102 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.పాకిస్తాన్కు లబ్దిషాన్ మసూద్ నేతృత్వంలోని పాకిస్తాన్, ఇటీవల పెద్దగా రాణించకపోయినా పాత ఫలితాల వెయిటేజ్ తగ్గడంతో శ్రీలంకను అధిగమించింది. దీంతో ఆ జట్టు ఐదో స్థానానికి ఎగబాకింది.ఐసీసీ మహిళల వన్డే వార్షిక ర్యాంకింగ్స్ను కూడా ఇదే సందర్భంగా విడుదల చేసింది. ఈ విభాగంలోనూ ఆస్ట్రేలియా టాప్ ర్యాంక్ను నిలబెట్టుకోగా.. ఇంగ్లండ్, భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, వెస్టిండీస్, ఐర్లాండ్, స్కాట్లాండ్, జింబాబ్వే, పపువా న్యూగినియా, యూఏఈ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
పరాభవంతో ముగించిన టీమిండియా
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం సౌతాఫ్రికాలో పర్యటించిన భారత మహిళల క్రికెట్ జట్టు ఓటమితో పర్యటనను ముగించింది. ఈ సిరీస్ను ఇదివరకే కోల్పోయిన టీమిండియా.. బెనోని వేదికగా ఇవాళ (ఏప్రిల్ 27) జరిగిన నామమాత్రపు చివరి టీ20లో 23 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. తద్వారా 1-4 తేడాతో సిరీస్ను కోల్పోయింది. ఈ సిరీస్లో భారత్కు లభించిన ఏకైక గెలుపు నాలుగో మ్యాచ్లో వచ్చింది.ఐదో టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (92 నాటౌట్) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో లారా మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. సూన్ లస్ 23, తజ్మిన్ బ్రిట్స్ 2, అన్నెరి డెర్క్సన్ డకౌట్, అన్నెకె బాష్ 8, క్లో ట్రయాన్ 12, నదినే డి క్లెర్క్ 1, సినాలో జఫ్టా 16 (నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్, శ్రీచరణి, దీప్తి శర్మ తలో 2 వికెట్లు తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో భారత్ ఆది నుంచే తడబడుతూ వచ్చింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ, ఒత్తిడికిలోనై చివరికి టార్గెట్ను పెద్దది చేసుకుంది. భారతి ఫుల్మలీ (40), రిచా ఘోష్ (25 నాటౌట్) భారత్ను విజయతీరాలకు చేర్చేందుకు విఫలయత్నం చేశారు. చివర్లో లక్ష్యం పెద్దది కావడంతో చేతులెత్తేశారు. ఫలితంగా భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత ఇన్నింగ్స్లో షఫాలీ వర్మ 4, అనుష్క శర్మ 17, జెమీమా రోడ్రిగ్స్ 1, కెప్టెన్ హర్మన్ప్రీత్ 22, దీప్తి శర్మ 8, అరుంధతి రెడ్డి 1, క్రాంతి గౌడ్ డకౌటయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా, డి క్లెర్క్ చెరో 2, ఎలిజ్ మారి, క్లో ట్రయాన్, ఖాకా తలో వికెట్ తీశారు. -
భారత బౌలర్లపై పాక్ బ్యాటర్ వివాదాస్పద వ్యాఖ్యలు
పాక్ క్రికెటర్లకు భారత ఆటగాళ్లపై అక్కసు వెళ్లగక్కడం పరిపాటిగా మారింది. ఇటీవలి కాలంలో ఈ తంతు మరీ ఎక్కువైంది. కొందరు ప్రస్తుత ఆటగాళ్లు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు.తాజాగా ఆ జట్టు టాపార్డర్ బ్యాటర్ హసన్ నవాజ్ భారత బౌలర్లపై తనకెప్పుడూ ఆగ్రహంగా ఉంటుందని అన్నాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతున్నాయి.ఒక ఇంటర్వ్యూలో హసన్ నవాజ్కు ప్రపంచ స్థాయి బౌలర్లను ఎలా ఎదుర్కొంటారన్న ప్రశ్న ఎదురైంది. అందుకు సమాధానంగా, మ్యాచ్ పరిస్థితిని బట్టి ఏ బౌలర్ అయినా లక్ష్యంగా చేసుకుంటామని, అవసరమైతే ఎవరిపైనైనా దాడి చేస్తామని అన్నాడు.భారత్ గురించి అడిగినప్పుడు అతని సమాధానం మరింత వివాదాస్పదంగా మారింది. "భారత్ అనగానే, ప్రతి బౌలర్ను తప్పకుండా టార్గెట్ చేయాలనిపిస్తుంది. వారి ప్రతి బౌలర్పై మాకు ప్రత్యేక ఉత్సాహం ఉంటుంది. వారిని బలంగా ఎదుర్కోవాలనుకుంటాం" అని అన్నాడు.క్రీడల్లో ప్రత్యర్థిపై గెలవాలనే తపన సహజం. అయితే "ద్వేషం" వంటి పదాల వాడకం అనవసర వివాదాలకు కారణమవుతుంది. ముఖ్యంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ లాంటి సున్నిత సందర్భాల్లో ఆటగాళ్లు మరింత బాధ్యతగా మాట్లాడాల్సి ఉంటుంది.హసన్ నవాజ్ ఇప్పటివరకు భారత్పై ఒక్క అంతర్జాతీయ టీ20 మాత్రమే ఆడాడు. ఆసియా కప్ 2025లో జరిగిన ఆ మ్యాచ్లో కేవలం ఐదు పరుగులకే ఔటయ్యాడు. కుల్దీప్ యాదవ్ అతని వికెట్ను పడగొట్టాడు.ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్లో హసన్ మంచి ఫామ్లో కనిపించాడు. క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున పది మ్యాచ్ల్లో రెండు అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నాడు. అయితే, అతని జట్టు ప్లేఆఫ్స్కు చేరుకోలేకపోయింది. -
విజయోస్తు!
నాలుగేళ్ల క్రితం జరిగిన అద్భుత ఘట్టాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో భారత పురుషుల జట్టు... సెమీఫైనల్ చేరడమే తొలి లక్ష్యంగా భారత మహిళల జట్టు... ప్రతిష్టాత్మక టీమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ థామస్ కప్, ఉబెర్కప్లలో బరిలోకి దిగనున్నాయి. హెచ్ఎస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ అసాధారణ ప్రదర్శనతో 2022లో భారత పురుషుల జట్టు తొలిసారి థామస్ కప్ టైటిల్ను సొంతం చేసుకుంది. సైనా నెహ్వాల్, పీవీ సింధు, గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప తదితరుల మెరుపులతో 2014, 2016లలో వరుసగా రెండు పర్యాయాలు భారత మహిళల జట్టు ఉబెర్ కప్లో సెమీఫైనల్ చేరుకొని కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. ఈసారి అటు పురుషుల జట్టుతోపాటు ఇటు మహిళల జట్టుకు గ్రూప్ దశలో కాస్త అనుకూలమైన ‘డ్రా’నే పడింది. తమ గ్రూప్లో టాప్–2లో నిలిచి ముందుగా క్వార్టర్ ఫైనల్ చేరడమే భారత జట్ల లక్ష్యం కానుంది. ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్ నాకౌట్ పోరులో నెగ్గితే సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకుంటాయి. బలాబలాలను పరిశీలిస్తే భారత మహిళల జట్టుతో పోలిస్తే భారత పురుషుల జట్టుకు ఈసారి పతకం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హోర్సెన్స్ (డెన్మార్క్): ప్రణయ్... కిడాంబి శ్రీకాంత్... లక్ష్య సేన్... సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... ఈ ఐదుగురికి ఎలా ఆడితే థామస్ కప్లో టైటిల్ సాధించగలమో తెలుసు. 2022లో టీమిండియాకు థామస్ కప్ దక్కడంలో ఈ ఐదుగురు కీలకపాత్ర పోషించారు. తాజాగా ఈ ఐదుగురికి ఆయుశ్ శెట్టి రూపంలో రైజింగ్ స్టార్ జత కలిశాడు. ఫలితంగా 2022 చాంపియన్ భారత జట్టు ఈసారి థామస్ కప్లో టైటిల్పై గురి పెట్టింది. సింగిల్స్లో రెండు, డబుల్స్లో ఒక విజయం లభిస్తే మ్యాచ్ వశమవుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి బలగంతో థామస్ కప్లో అడుగు పెట్టిన భారత జట్టు రెండోసారి అద్భుతం చేస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇటీవల చైనాలో జరిగిన ఆసియా చాంపియన్షిప్లో ఆయుశ్ శెట్టి రన్నరప్గా నిలిచి తన సత్తా చాటుకున్నాడు. ఫైనల్ చేరిన క్రమంలో టాప్–10లోని ముగ్గురు క్రీడాకారులను ఆయుశ్ ఓడించాడు. ఈ నేపథ్యంలో ఆయుశ్, లక్ష్య సేన్, ప్రణయ్, శ్రీకాంత్, సాత్విక్–చిరాగ్ తమ స్థాయికి తగ్గట్టు ఆడితే భారత జట్టు క్వార్టర్ ఫైనల్ చేరుకోవడం కష్టమేమీ కాదు. నేడు జరిగే గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్లో కెనడాతో భారత్ తలపడుతుంది. ఆ తర్వాత 27న ఆ్రస్టేలియాతో... 29న చైనాతో టీమిండియా మ్యాచ్లున్నాయి. మరోవైపు భారత మహిళల జట్టు ఆశలన్నీ సింగిల్స్ ప్లేయర్స్పైనే ఆధారపడి ఉన్నాయి. డబుల్స్ స్టార్ జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ వైదొలగడం భారత జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపకుండా ఉండాలంటే... మూడు సింగిల్స్లో పీవీ సింధు, ఉన్నతి హుడా, తన్వీ శర్మ, దేవిక సిహాగ్లు గెలవాల్సి ఉంటుంది. గ్రూప్ ‘ఎ’లో ఉన్న భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్ను నేడు ఆతిథ్య డెన్మార్క్ జట్టుతో ఆడుతుంది. గ్రూప్ ‘ఎ’లోనే చైనా, ఉక్రెయిన్ జట్లు కూడా ఉన్నాయి. చైనాపై భారత్ గెలిచే అవకాశాలు లేకపోవడంతో... క్వార్టర్ ఫైనల్ చేరాలంటే డెన్మార్క్, ఉక్రెయిన్ జట్లపై భారత్ నెగ్గాల్సి ఉంటుంది. డెన్మార్క్ చేతిలో భారత్ ఓడిపోతే మాత్రం నాకౌట్ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. డెన్మార్క్తో మ్యాచ్ అనంతరం భారత్ రెండో మ్యాచ్ను 25న ఉక్రెయిన్తో, మూడో మ్యాచ్ను 27న చైనాతో ఆడుతుంది. థామస్ కప్ టోర్నీకి భారత జట్టు: లక్ష్య సేన్, ఆయుశ్ శెట్టి, ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్, కిరణ్ జార్జి, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, హరిహరన్, ఎంఆర్ అర్జున్, ధ్రువ్ కపిల. ఉబెర్ కప్ టోర్నీకి భారత జట్టు: పీవీ సింధు, ఉన్నతి హుడా, తన్వీ శర్మ, దేవిక సిహాగ్, ఇషారాణి బారువా, తనీషా క్రాస్టో, ప్రియ కొంజెంగ్బమ్, శ్రుతి మిశ్రా, సెల్వం కవిప్రియ, సిమ్రన్. -
BCCI: టీమిండియా ప్లేయర్లను ‘చంపేస్తారా’?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీరుపై ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ మండిపడ్డాడు. ‘డబ్బు కోసం కక్కుర్తి పడి.. ఆటగాళ్లను చంపకండి’ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. బోర్డు మెదడుతో కాకుండా మనసుతో స్పందించి తమ ఆటగాళ్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.బిజీ షెడ్యూల్కాగా గత కొన్నేళ్లుగా టీమిండియా బిజీ షెడ్యూల్తో తలమునకలై ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్-2026 ముగిసిన వెంటనే స్వదేశంలో అఫ్గనిస్తాన్తో టెస్టు మ్యాచ్ తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఆ తర్వాత ఐర్లాండ్, జింబాబ్వే తదితర టూర్లు.ఇక ఐపీఎల్ తాజా ఎడిషన్ మే 31న ముగియనుండగా.. జూన్ 6న అఫ్గన్తో టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) బిజీ షెడ్యూల్పై గుర్రుగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ‘‘జట్టులోని చాలా మంది ఆటగాళ్లు మే 31 వరకు ఐపీఎల్తోనే బిజీగా గడపుతారు.స్వల్ప వ్యవధిలోనే జాతీయ జట్టు తరఫున విధుల్లో చేరడం ఒత్తిడిని పెంచుతుంది’’ అని గంభీర్ బోర్డు వద్ద తన వాదనను వినిపించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వార్తను ఓ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. లలిత్ మోదీ తీవ్రంగా స్పందించాడు.టీమిండియా ప్లేయర్లను ‘చంపేస్తారా’?‘‘గంభీర్ వాదనతో నేను ఏకీభవిస్తాను. విరామం లేని షెడ్యూల్తో బీసీసీఐ తమ ఆటగాళ్లను చంపినంత పని చేస్తోంది. ఇలాంటి భయంకరమైన విధానాన్ని ఆపేయండి. ఆటగాళ్లను కాస్త ఊపిరి తీసుకోనివ్వండి. వాళ్లకు కూడా కుటుంబాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కాస్త ఆనందంగా గడపనివ్వండి.భారీ ఆదాయానికి బీజం వేశానుఅయినా మీకు ఇప్పుడు అంతగా డబ్బు అవసరం ఏముంది? నేను ఇప్పటికే ఐపీఎల్ ద్వారా ఏడాదికి కావాల్సినంత ఆదాయం వచ్చేలా బీజం వేశాను కదా! ప్రపంచంలో అందరి కంటే బీసీసీఐ సంపన్న బోర్డు కావడానికి ఇదో కారణం. కాబట్టి మీరు డబ్బు గురించి బెంగ పడకండి.ఆటగాళ్ల క్షేమం గురించి కూడా ఆలోచించండి. ప్రొఫెషనల్ సీఈఓను నియమించండి. భారీగా జీతం ఇచ్చి HRను పెట్టుకోండి. ఆటగాళ్ల సెల్ఫ్ డెవలప్మెంట్పై కూడా కొంచెం ఖర్చు చేయండి. స్టేడియాలను మరింత గొప్పగా తీర్చిదిద్దండి. ప్రేక్షకులకు వరల్డ్క్లాస్ ఎక్స్పీరియన్స్ అందించండి.మనసుతో ఆలోచించండిఆటగాళ్లేమీ యంత్రాలు కాదు. మీరు మెదడుతో కాకుండా మనసుతో కూడా ఆలోచించండి’’ అని ఎక్స్ వేదికగా లలిత్ మోదీ బీసీసీఐ తీరును తూర్పారబట్టాడు. కాగా లలిత్ మోదీ ఆలోచనతో 2008లో ఐపీఎల్ రూపుదిద్దుకోగా.. లీగ్ తొలి చైర్మన్గా అతడే వ్యవహరించాడు. కానీ కొన్నేళ్లకే మనీ లాండరింగ్ ఆరోపణలతో వివాదంలో చిక్కుకున్నాడు. ఆర్థిక నేరగాడిగా ముద్రపడి.. లండన్కు పారిపోయి దశాబ్దకాలానికిపైగా అక్కడే నివాసం ఉంటున్నాడు. చదవండి: ఇప్పటికీ బాధపడుతున్నా: రోహిత్కు మాజీ కెప్టెన్ క్షమాపణలు -
‘అందుకే రోహిత్ను పక్కన పెట్టాల్సి వచ్చింది’
టీమిండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ. టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిళ్లను అతడి సారథ్యంలోనే భారత్ గెలుచుకుంది. దిగ్గజ కెప్టెన్గా ఎదిగిన రోహిత్కు.. కెరీర్ ఆరంభంలో ఒకానొకనాడు జట్టులో చోటే కరువైంది.ముఖ్యంగా 2011 వన్డే వరల్డ్కప్ సమయంలో సెలక్టర్లు రోహిత్ శర్మను పక్కనపెట్టారు. ఈ విషయం గురించి టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాడు రోహిత్ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలు వెల్లడిస్తూ.. అతడిని క్షమాపణలు కోరాడు. బాధపడుతూనే ఉన్నాను‘‘ప్రతి ఇంటర్వ్యూలో తాను 2011 వరల్డ్కప్ ఆడటం మిస్సయ్యానని రోహిత్ చెబుతూ ఉన్నాడు. నిజంగా అతడి విషయంలో ఆరోజు జరిగిన దానిపట్ల నేటికీ నేను బాధపడుతూనే ఉన్నాను. గతేడాది అతడిని కలిసి.. ‘సారీ బాస్.. ఆనాడు మేము ఉద్దేశపూర్వకంగా ఏదీ చేయలేదు’ అని చెప్పాను.అప్పుడు మేము ఆల్రౌండ్ ప్రతిభ గల వాళ్లకే పెద్దపీట వేయాలని భావించాము. 1983 మాదిరే ఈ టోర్నీలో ఆడించాలనే ఆలోచనతో ఉన్నాము. మేము ఊహించినట్లుగానే ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ నిలిచాడు.అందుకే రోహిత్ను పక్కనపె ట్టాల్సి వచ్చిందికొన్ని మ్యాచ్లలో హాఫ్ ఆల్రౌండర్లు కూడా రాణించారు. సెహ్వాగ్, సచిన్, సురేశ్ రైనా కూడా కొన్ని ఓవర్లు బౌలింగ్ చేశారు. యూసఫ్ పఠాన్ సైతం హాఫ్ ఆల్రౌండరే. ఈ హాఫ్ ఆల్రౌండర్ కాన్సెప్టులో పడి రోహిత్ శర్మను పక్కనపెట్టాల్సి వచ్చింది.పాపం అతడికి జట్టులో చోటు దక్కలేదు. నిజానికి 2011 వరల్డ్కప్ టోర్నీలో ఆడేందుకు అతడు అర్హుడే. కానీ జట్టు ప్రయోజనాల దృష్ట్యా అతడిని ఎంపిక చేయలేకపోయాము’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు. కాగా 2011లో ధోని సారథ్యంలో టీమిండియా టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే.చదవండి: బంధం తెంచుకున్న కోహ్లి!.. రెస్టారెంట్ మూసివేత -
గిల్ స్థానంలో కెప్టెన్గా పంత్..?
ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే ఏకైక టెస్ట్ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినివ్వడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. సీనియర్ల జాబితాలో కెప్టెన్ శుభ్మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నట్లు సమాచారం.ఒకవేళ గిల్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్కు దూరమైతే అతని స్థానంలో కెప్టెన్ ఎవరన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ నేపథ్యంలో గిల్కు ప్రత్యామ్నాయంగా ముగ్గురి పేర్లు పరిశీలను రావచ్చు. వీరిలో ముందుగా రిషబ్ పంత్ పేరు ఉంటుంది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా పేర్లు కూడా పరిశీలనలో ఉంటాయి.రిషబ్ పంత్ విషయానికొస్తే.. ప్రస్తుతం అతను భారత టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్గా ఉన్నాడు. ఈ కారణంగా గిల్ స్థానంలో అతడే సహజమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు. దూకుడు నాయకత్వం, మ్యాచ్ను ఒంటరిగా మలుపు తిప్పగల సామర్థ్యం పంత్ ప్రత్యేకత. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా దేశాల్లోని కఠిన పిచ్లపై సెంచరీలు సాధించడం అతని స్థాయి తెలియజేస్తుంది. ఇప్పటికే నాయకత్వ అనుభవం ఉండటం కూడా అతనికి అదనపు బలం.కేఎల్ రాహుల్భారత సెలెక్టర్లు ఒకవేళ పంత్కు కూడా విశ్రాంతినివ్వాలని భావిస్తే, తదుపరి ప్రత్యామ్నాయంగా కేఎల్ రాహుల్ ఉంటాడు. రాహుల్కు గతంలో భారత టెస్ట్ జట్టుకు సారథ్యం వహించిన అనుభవం ఉంది. 2022 బంగ్లాదేశ్ పర్యటనలో జట్టును విజయవంతంగా నడిపించడం అతని నాయకత్వ నైపుణ్యాన్ని నిరూపించింది.గిల్కు మూడో ప్రత్యామ్నాయ ఆప్షన్గా రవీంద్ర జడేజా ఉంటాడు. జడ్డూ జట్టులో అత్యంత అనుభవజ్ఞుల్లో ఒకరు. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ కీలక పాత్ర పోషించే ఆల్రౌండర్గా జడేజా ఎప్పుడూ జట్టుకు ఆధారంగా ఉంటాడు. గతంలో వైస్ కెప్టెన్గా పనిచేసిన అనుభవం ఉంది. -
సెలెక్టర్ల పరిధిలో లేని గిల్, బుమ్రా
ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా ఎంపికను భారత సెలెక్టర్లు ఇప్పటి నుంచే పరిశీలిస్తున్నారు. జూన్ 6 నుంచి న్యూ చంఢీఘడ్లో జరుగబోయే ఈ మ్యాచ్ కోసం సీనియర్లకు విశ్రాంతినివ్వాలని వారు యోచిస్తున్నారు. సీనియర్ల జాబితాలో కెప్టెన్ శుభ్మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగం కాకపోవడంతో సెలెక్టర్లు ఈ మేరకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. వర్క్లోడ్ మరో కారణంగా తెలుస్తుంది.భారత పర్యటనలో ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ మ్యాచ్తో పాటు మూడు వన్డేలు కూడా ఆడనుంది. ఆతర్వాత భారత జట్టు రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్కు వెళ్లనుంది. అనంతరం భారత్ 5 టీ20లు, 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్కు వెళ్లనుంది. ఇంగ్లండ్ సిరీస్ నేపథ్యంలో భారత సెలెక్టర్లు గిల్, బుమ్రాకు విశ్రాంతినివ్వాలని అనుకుంటున్నారు. టీమిండియా-ఇంగ్లండ్ సిరీస్ జులై 1 నుంచి ప్రారంభమవుతుంది.ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ సిరీస్లకు గిల్, బుమ్రాకు విశ్రాంతినివ్వడానికి సెలెక్టర్ల వద్ద మరో కారణం కూడా ఉంది. 2027 వన్డే వరల్డ్కప్కు వీరిద్దరు కీలకం కాబటి, మెగా టోర్నీకి ముందు వీలైనంత విశ్రాంతినివ్వవచ్చు. గిల్, బుమ్రా ఇటీవల తరుచూ గాయాల బారిన పడుతుండటంతో సెలెక్టర్లు వీరి విషయంలో రిస్క్ తీసుకునే సాహసం చేయరు. ఒకవేళ ప్రపంచకప్ దృష్ట్యా వన్డేల్లో ఆడించాలని అనుకుంటే మాత్రం ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు ఎంపిక చేయవచ్చు.బుమ్రా, గిల్ గైర్హాజరీలో ఆకిబ్ నబీ, దేవదత్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డి తదితర పేర్లను సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. వీరిలో నబీ పేరు ఖరారైందని సమాచారం. -
టీమిండియాలోకి సంచలన ఫాస్ట్ బౌలర్
రాబోయే అంతర్జాతీయ సీజన్ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత (జూన్లో) ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే సిరీస్ (టెస్ట్, మూడు వన్డేలు) కోసం సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ ప్రతిభకు అవకాశాలు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ ఫాస్ట్ బౌలర్ అకిబ్ నబీని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. నబీ ఎంపిక దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. నబీ ఈ సీజన్ రంజీ ట్రోఫీలో విశేషంగా రాణించి 60 వికెట్లు తీసి, లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. నబీ సంచలన ప్రదర్శనల కారణంగా జమ్మూ కశ్మీర్ తమ తొలి రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది. నబీ స్థిరమైన వేగంతో పాటు బంతిని ఇరు వైపుల స్వింగ్ చేయగల సమర్దుడు. 41 మ్యాచ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో అతను 156 వికెట్లు తీశాడు.భారత టెస్టు జట్టులో గత కొంతకాలంగా పేస్ బౌలింగ్ భారం ఎక్కువగా బుమ్రాపైనే పడుతుంది. ఇతర బౌలర్లు కూడా కొంతమేరకు సహకరించినప్పటికీ, స్థిరమైన ప్రత్యామ్నాయం అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నబీ వంటి యువ బౌలర్ జట్టులోకి వస్తే బుమ్రాపై ఒత్తిడి తగ్గడమే కాకుండా బౌలింగ్ విభాగానికి లోతు పెరుగుతుంది.అందుకే భారత సెలెక్టర్లు నబీని సిద్దం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ ఓ సమస్య ఉంది. నబీ బౌలింగ్ శైలి సుదీర్ఘ ఫార్మాట్కు మాత్రమే పనికొచ్చేలా కనిపిస్తుంది. దేశవాలీ క్రికెట్లో అద్భుత ప్రదర్శనల కారణంగా ఐపీఎల్ ఛాన్స్ కొట్టేసిన నబీ.. ఇక్కడ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అతను 2 మ్యాచ్ల్లో వికెట్లు తీయలేకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. మరి సెలెక్టర్లు నబీని టెస్ట్లకే పరిమితం చేస్తారో లేక పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనూ అవకాశాలు ఇస్తారో చూడాలి. -
దిగ్గజాలు విరాట్, రోహిత్ను అధిగమించిన మంధాన
భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన టీ20 క్రికెట్లో చారిత్రాత్మక ఘనత సాధించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 13 పరుగులు చేసి ఆమె.. భారత తరఫున (పురుషులు, మహిళలు) టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా రికార్డుల్లోకెక్కింది. ఈ క్రమంలో పురుషుల విభాగంలో దిగ్గజాలైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మను అధిగమించింది. విరాట్ 125 మ్యాచ్ల టీ20 కెరీర్లో 4188 పరుగులు.. రోహిత్ తన 159 మ్యాచ్ల టీ20 కెరీర్లో 4231 పరుగులు చేయగా.. మంధాన 161 మ్యాచ్ల టీ20 కెరీర్లో 4244 పరుగులు చేసింది.భారత మహిళల విభాగం ఒక్కటే తీసుకుంటే.. మంధన తర్వాతి స్థానాల్లో హర్మన్ప్రీత్ కౌర్ (191 మ్యాచ్ల్లో 3854 పరుగులు), జెమీమా రోడ్రిగ్స్ (119 మ్యాచ్ల్లో 2587 పరుగులు), షఫాలీ వర్మ (99 మ్యాచ్ల్లో 2553 పరుగులు) ఉన్నారు.ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. మహిళల విభాగంలో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ సూజీ బేట్స్ (181 మ్యాచ్ల్లో 4717 పరుగులు) టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా కొనసాగుతుండగా.. మంధాన రెండో స్థానంలో ఉంది. పురుషుల విషయానికొస్తే.. పాక్ బ్యాటర్ బాబర్ ఆజమ్ (145 మ్యాచ్ల్లో 4596 పరుగులు) టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.కాగా, ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో నిన్న జరిగిన తొలి టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన టీమిండియా... నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (33 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... జెమీమా రోడ్రిగ్స్ (29 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్), షఫాలీ వర్మ (20 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (13), రిచా ఘోష్ (5), కాశ్వి గౌతమ్ (10) విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఖాకా 3 వికెట్లు పడగొట్టగా... టుమీ రెండు వికెట్లు తీసింది.అనంతరం బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ లారా వోల్వార్ట్డ్ (51), అన్నెరీ డెర్క్సన్ (44 నాటౌట్) సౌతాఫ్రికాను గెలిపించారు. సూన్ లస్ 13, తజ్మిన్ బ్రిట్స్ 10, అన్నెకే బాష్ 8, క్లో ట్రయాన్ 18 (నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 2, అరుంధతి రెడ్డి, శ్రీచరణి తలో వికెట్ తీశారు. రెండో టీ20 ఏప్రిల్ 19న ఇదే డర్బన్ వేదికగా జరుగనుంది. -
‘అతడిని ఎంపిక చేయకపోతే టీమిండియాకే నష్టం’
ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని శ్రేయస్ సేన.. తాజాగా ముంబై ఇండియన్స్పై జయభేరి మోగించింది. వాంఖడే వేదికగా ముంబైని ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి నాలుగో విజయం నమోదు చేసింది.పంజాబ్ గెలుపులో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ది కీలక పాత్ర. ముంబై విధించిన 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగో స్థానంలో బరిలోకి దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 35 బంతుల్లో 66 పరుగులతో రాణించాడు. మొత్తంగా ఈ సీజన్లో ఇప్పటికి నాలుగు ఇన్నింగ్స్లో కలిపి శ్రేయస్ అయ్యర్ 203 పరుగులు సాధించాడు.సారథిగా, బ్యాటర్గా సూపర్హిట్గతేడాది కూడా పంజాబ్ కెప్టెన్, బ్యాటర్గా శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మొత్తంగా పదిహేడు మ్యాచ్లలో కలిపి 604 రన్స్ చేయడంతో పాటు.. జట్టును ఫైనల్కు చేర్చాడు. అంతకు ముందు దేశీ క్రికెట్లో ముంబై తరఫునా అదరగొట్టాడు. అయినప్పటికీ 2023 తర్వాత మళ్లీ అతడికి భారత టీ20 జట్టులో చోటు దక్కలేదు.ఆటతోనే అందరికీ సమాధానంఈ పరిణామాల నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. శ్రేయస్ అయ్యర్ను టీ20 జట్టుకు ఎంపిక చేయకపోతే నష్టపోయేది టీమిండియానే అని అన్నాడు. ఈ మేరకు.. ‘‘శ్రేయస్ తన ఆటతోనే అందరికీ సమాధానం చెబుతున్నాడు. అతడి ప్రతిభ ఏమిటో ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నాడు.అతడు షార్ట్ బాల్ను సరిగ్గా ఎదుర్కోలేడంటూ తరచూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే, ముంబైతో మ్యాచ్లో అతడు జస్ప్రీత్ బుమ్రాను ఎలా ఎదుర్కొన్నాడో అందరూ చూశారు కదా!.. షార్ట్ బాల్నే మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్గా మలిచాడు. అంతకు ముందు చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లోనూ ఇదే తరహాలో రాణించాడు.ఇంకెన్నిసార్లుఇంకెన్నిసార్లు అతడు తనను తాను నిరూపించుకోవాలి? శ్రేయస్ లాంటి క్రికెటర్లను చూస్తే నాకెంతో ఆదర్శంగా ఉంటుంది. స్పిన్ బౌలింగ్లో హిట్టింగ్ ఆడుతున్నాడు. షార్ట్ బాల్ బలహీనతను అధిగమించాడు. గత రెండేళ్లుగా అతడి స్ట్రైక్రేటు కూడా 170కి పైగా ఉంది.He is HIM! He is Shreyas Iyer 🫡🎥 Here's how the #PBKS skipper took on the best to reach his FIFTY 👏Updates ▶️ https://t.co/Fn2dxJ429j#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/oG9HFySe8o— IndianPremierLeague (@IPL) April 16, 2026ఫాస్ట్బౌలర్ల బౌలింగ్లో 300కు పైగా స్ట్రైక్రేటుతో పరుగులు రాబడుతున్నాడు. మంచి బంతి కోసం ఎదురుచూడటం కాదు.. వాళ్లపై అటాకింగ్కు దిగుతూ పైచేయి సాధిస్తున్నాడు. అత్యద్భుతంగా ఆడినా సరే అతడిని ఎందుకు ఎంపిక చేయడం లేదు?టీమిండియాకే నష్టంశ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాళ్లను పక్కనపెట్టడం వల్ల.. అతడి కంటే జట్టుకే ఎక్కువ నష్టం. అతడిని నాయకత్వ బృందంలో భాగం చేయకపోవడం కచ్చితంగా జట్టుకు నష్టదాయకం’’ అని అశ్విన్ టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తీరును విమర్శించాడు. కాగా ఆసియా కప్-2025కి ముందు అయ్యర్ గురించి మాట్లాడుతూ... జట్టులో ఖాళీ లేనందు వల్లే అతడిని పక్కనపెట్టామని అగార్కర్ తెలిపాడు. ఇదిలా ఉంటే.. పంజాబ్ ఈ సీజన్లో ఐదు మ్యాచ్లు పూర్తి చేసుకుని నాలుగింట గెలిచి అగ్రస్థానానికి దూసుకువచ్చింది. కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్ మాత్రం వర్షం వల్ల రద్దైపోయింది.చదవండి: ‘ఓటములకు ఆ ఒక్కడినే బాధ్యుడిని చేయలేము’ -
వైభవ్ సూర్యవంశీకి గోల్డెన్ ఛాన్స్!
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని టీమిండియాకు ఎంపిక చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే సెలక్టర్లు ఈ బుడ్డోకి పచ్చజెండా ఊపేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో ఈ ఏడాదే భారత సీనియర్ క్రికెట్ జట్టు తరఫున అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్లో తన విధ్వంసకర బ్యాటింగ్తో దుమ్మురేపుతున్న 15 ఏళ్ల వైభవ్ (Vaibhav Suryavanshi)... క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) రికార్డును బద్దలు కొట్టడం నిశ్చయమని బోర్డు వర్గాలు అంటున్నాయి. ఐపీఎల్ 19వ సీజన్ అనంతరం భారత జట్టు ఐర్లాండ్–ఇంగ్లండ్లో పర్యటించనుంది. అనంతరం జింబాబ్వేతోనూ టీ20 సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలకు కుదరకపోయినా..ఈ పర్యటనల కోసం త్వరలోనే జట్లను ప్రకటించే అవకాశం ఉంది. దీని కోసం అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ 35 మంది ప్రాబబుల్స్ పేర్లను పరిశీలిస్తోంది. వీరిలో వైభవ్ పేరు కూడా ఉంది. ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల 205 రోజుల వయసులో దాయాది పాకిస్తాన్పై అంతర్జాతీయ అరంగేట్రం చేయగా... ఆ వయసుకన్నా ముందే వైభవ్ దేశానికి ప్రాతినిధ్యం వహించేలా ఉన్నాడు. ఏజ్ గ్రూప్ క్రికెట్తో పాటు దేశవాళీ, ఐపీఎల్లో సత్తా చాటుతున్న సూర్యవంశీని సీనియర్ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఆసియా క్రీడల వరకైనాఈ నేపథ్యంలో ఒకవేళ తక్షణమే అతడికి అవకాశం కల్పించకున్నా... ఈ ఏడాది చివర్లో జరగనున్న ఆసియా క్రీడల వరకైనా సీనియర్ టీమిండియాకు ఎంపిక చేయడం ఖాయమే. ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా ఏషియన్ గేమ్స్ జరగనుండగా... అదే సమయంలో టీమిండియా వెస్టిండీస్తో మ్యాచ్లు ఆడనుంది. ఆ సమయంలో రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేయాల్సి వస్తే... అందులో ఒక దాంట్లో సూర్యవంశీని ఎంపిక చేయొచ్చు అని బీసీసీఐ అధికారి వెల్లడించారు. ‘35 మంది ప్రాబబుల్స్ నుంచి సెలెక్టర్లు జట్టును ఎంపిక చేయనున్నారు. వారందరి వీసా పనులు ప్రారంభమయ్యాయి. వైభవ్ను ఎంపిక చేయాలంటే..వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనను సెలక్టర్లు దగ్గర నుంచి పరిశీలిస్తున్నారు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ చక్కటి ప్రదర్శన కనబరుస్తున్న సమయంలో నాలుగో ఓపెనర్ అవసరమేముంది. అంతకు కావాలి అంటే యశస్వి జైస్వాల్ కూడా ఉన్నాడు. వైభవ్ను ఎంపిక చేయాలి అంటే అభిషేక్, సంజూలను తీసుకోకపోవడానికి బలమైన కారణం అంటూ ఉండాలి. వారిద్దరిలో ఒక్కరిని పక్కన పెట్టినా... కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను కొనసాగించడంపై ప్రశ్నలు తలెత్తుతాయి. అయితే ఆసియా క్రీడల సమయంలో మాత్రం రెండు జట్లు అనివార్యమే కాబట్టి వైభవ్ను ఎంపిక చేయవచ్చు’ అని అయన అన్నారు. పసిడి పతకాలుకాగా 2023లో తొలిసారి ఆసియా క్రీడలకు బీసీసీఐ పురుష, మహిళా జట్లను పంపగా.. రెండు జట్లు స్వర్ణ పతకాలు గెలిచాయి. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో టీమిండియా.. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో మహిళా జట్టు గోల్డ్ మెడల్అందుకున్నాయి.చదవండి: PSL: అక్కడ వద్దంటేనే ఇక్కడికి: పీసీబీ పరువు తీసిన పాక్ క్రికెటర్ -
విజ్డెన్ అవార్డ్స్ 2026లో టీమిండియా ప్లేయర్ల హవా
క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విజ్డెన్ అవార్డుల్లో టీమిండియా ప్లేయర్లు ఆధిపత్యం చాటారు. ఈ ఏడాది తొమ్మిది ప్రధాన అవార్డుల్లో ఏకంగా ఏడు అవార్డులు భారత ఆటగాళ్లకే దక్కాయి. ఐదు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుల్లో నాలుగు టీమిండియా ప్లేయర్లే కైవసం చేసుకున్నారు.క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్ శుభ్మన్ గిల్– గతేడాది ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్లో 754 పరుగులు, ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో 269 & 161 రవీంద్ర జడేజా– గతేడాది ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్లో 86 సగటు 516 పరుగులు. మాంచెస్టర్లో మ్యాచ్ సేవ్ చేసిన శతకం. రిషభ్ పంత్– గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో హెడింగ్లే టెస్ట్లో రెండు శతకాలు (134 & 118), మరో మ్యాచ్లో గాయంతోనూ హాఫ్ సెంచరీ. మొహమ్మద్ సిరాజ్– గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో 23 వికెట్లు, ఓవల్ టెస్ట్లో చివరి రోజు తొలి సెషన్లో 5 వికెట్లు. హసీబ్ హమీద్– ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో నాటింగ్హామ్షైర్కు 15 ఏళ్ల తర్వాత ఛాంపియన్షిప్. ఈ టోర్నీలో 66 సగటున 1258 పరుగులు. భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన దీప్తి శర్మకు లీడింగ్ వుమెన్స్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ అవార్డు లభించింది. టీమిండియా విధ్వంకర ఓపెనర్ అభిషేక్ శర్మ లీడింగ్ టీ20 క్రికెటర్ ఇన్ ద వరల్డ్ అవార్డును ఎగరేసుకుపోయాడు. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో విశేషంగా రాణించిన భారత టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ విజ్డెన్ ట్రోఫీ (సింగిల్ టెస్ట్ ప్రదర్శనకు) గెలుచుకున్నాడు. ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో డబుల్ సెంచరీ, భారీ సెంచరీ సహా 430 పరుగులు చేసి భారత్ను గెలిపించినందుకు గానూ గిల్ను ఈ అవార్డు వరించింది. ఆసీస్ స్పీడ్స్టర్ మిచెల్ స్టార్క్కు లీడింగ్ మెన్స్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ అవార్డు లభించింది. -
వైభవ్ టీమిండియా ఎంట్రీ ఖరారు
భారత క్రికెట్కు సంబంధించి ఓ సంచలన వార్త అందుతోంది. ఐపీఎల్ 2026 వీరలెవెల్లో రెచ్చిపోతున్న, యువ చిచ్చరపిడుగు, రాజస్థాన్ రాయల్స్ కెరటం వైభవ్ సూర్యవంశీ త్వరలో టీమిండియా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఐపీఎల్ తర్వాత జరిగే ఐర్లాండ్, జింబాబ్వే టీ20 సిరీస్లలో అతను బరిలోకి దిగడం ఖరారైంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉంది.15 ఏళ్ల వైభవ్ ఎంపికపై సెలెక్టర్లు తొలుత ముల్లగుల్లాలు (వయసు రిత్యా) పడినప్పటికీ.. ఆతర్వాత ప్రతిభే కొలమానంగా ఎంపికే చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. వైభవ్ ఎంపిక కేవలం ఐపీఎల్ ఆధారంగానే కాకుండా అండర్-19 జట్టు తరఫున ప్రదర్శనలు కూడా పరిగణలోకి తీసుకొని చేయనున్నట్లు సమాచారం.వైభవ్ ఈ ఏడాది అండర్-19 ప్రపంచకప్లో విశేషంగా రాణించాడు. ముఖ్యంగా ఇంగ్లండ్తో జరిగిన ఫైనల్లో ఆకాశమే హద్దుగా చెలరేగి భారీ విధ్వంసకర శతకం బాదాడు. ఫలితంగా భారత్ జగజ్జేతగా అవతరించింది. వైభవ్ ఇటీవలే దేశవాలీ క్రికెట్లోకి (బిహార్ తరఫున) కూడా అరంగేట్రం చేసి, అక్కడ కూడా సత్తా చాటాడు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొన్న భారత సెలెక్టర్లు, వైభవ్ టీమిండియా ఎంపికకు ముహూర్తం ఖరారు చేశారు.ఐపీఎల్ 2026 తర్వాత టీమిండియా ఐర్లాండ్, జింబాబ్వేల్లో పర్యటించనుంది. ఈ సిరీస్లకు వైభవ్ను ఎంపిక చేసి టీమిండియాకు గ్రాండ్గా పరిచయం చేయాలని భారత సెలెక్టర్లు భావిస్తున్నారు. ఈ సిరీస్లలో వైభవ్కు జతగా మరో చిచ్చరపిడుగు అభిషేక్ శర్మ ఉండవచ్చు. ఒకవేళ ఈ ఇద్దరు బరిలోకి దిగితే పసికూనలైన ఐర్లాండ్, జింబాబ్వే పరిస్థితి ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. వైభవ్-అభిషేక్ జోడీ టీ20 ఫార్మాట్లో అత్యంత భయంకరమైన ఓపెనింగ్ జోడీగా మారవచ్చని అంచనాలు ఉన్నాయి. చరిత్ర సృష్టిస్తాడుఐర్లాండ్, జింబాబ్వే పర్యటనల్లో వైభవ్ టీమిండియా అరంగేట్రం జరిగితే సరికొత్త చరిత్ర అవుతుంది. అతి చిన్న వయసులో టీమిండియా అరంగేట్రం చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. వైభవ్ జూన్ 26న ఐర్లాండ్పై తొలి టీ20 ఆడితే, ఆ సమయానికి అతని వయసు 15 సంవత్సరాలు 91 రోజులు అవుతుంది. ఒకవేళ ఆ మ్యాచ్ కాకపోయినా, ఐర్లాండ్, జింబాబ్వే సిరీస్ల్లో ఏ మ్యాచ్లో అరంగేట్రం చేసినా చరిత్రే అవుతుంది. ఎందుకంటే, భారత్ తరఫున అతి చిన్న వయసులో అరంగేట్రం చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 16 సంవత్సరాలు 205 రోజుల వయసులో టీమిండియా ఎంట్రీ ఇచ్చాడు. ఈ లెక్కన వైభవ్-సచిన్కు చాలా గ్యాప్ ఉంటుంది.ఆకాశమే హద్దుప్రస్తుత ఐపీఎల్ ఎడిషన్లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో సగటు 40, స్ట్రైక్ రేట్ 263.16తో 200 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్లలో ఒకడిగా చలామణి అవుతున్నాడు. ఈ ఎడిషన్లో వైభవ్.. జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్ లాంటి ప్రపంచ మేటి బౌలర్లకు సైతం చుక్కలు చూపిస్తున్నాడు. -
దానికి టైమ్ ఉంది.. కొంచెం ఓపిక పట్టాలి!
ముంబై: ఐపీఎల్లో మెరుపులతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వైభవ్ సూర్యవంశీపై మరింత ఒత్తిడి పెంచడం సరికాదని టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే అన్నాడు. 15 ఏళ్ల కుర్రాడిని అలా అతడి ఇష్టానికి వదిలేయాలని ఇప్పటి నుంచే అతడి మనసులో జాతీయ సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఒత్తిడిని నింపొద్దని ఈ స్పిన్ దిగ్గజం హితవు పలికాడు. ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండూల్కర్ కూడా టీనేజ్ వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి... ఆ తర్వాత బ్యాటింగ్ లెజెండ్గా ఎదగగా... ఇప్పుడు ఆ అవకాశం సూర్యవంశీకి ఉందని పలువురు విశ్లేషిస్తున్న నేపథ్యంలో కుంబ్లే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘అసాధారణ ప్రతిభ గల వైభవ్ సూర్యవంశీ దూకుడును ఆపడం కష్టతరమే. అయితే తొందరపాటు అంచనాలు యువ క్రీడాకారుడిపై అనవసర ఒత్తిడి పెంచుతాయి. ఈ వయసులోనే అతడు చక్కగా ఆడుతున్నాడు. అయితే మరో రెండు నెలల్లో నువ్వు టీమిండియాకు ఆడాలి అని చెప్పడం మాత్రం అతడిపై కచ్చితంగా ఒత్తిడి పెంచుతుంది. మరో పదేళ్ల తర్వాత కూడా వైభవ్ వయసు ఇంకా పాతికేళ్లే ఉంటుంది’ అని కుంబ్లే అన్నాడు. క్రికెట్లో విజయవంతం కావడానికి ఒక నిర్దిష్టమైన మార్గం అంటూ ఏదీ లేదని... నిరంతరం శ్రమిస్తూ ఎప్పటికప్పుడు మెరుగవుతూ ముందుకు సాగితే ఫలితాలు అనుకూలంగా వస్తాయని కుంబ్లే పేర్కొన్నాడు. ‘ఈ ఏడాదో, వచ్చే ఏడాదో అతడి పేరు సెలెక్టర్ల పరిశీలనకు రావడం ఖాయం. ఇప్పటికే అతడి ఆటతీరును అంతా నిశితంగా పరిశీలిస్తున్నారు. కాస్త ఓపిక పట్టడం ముఖ్యం’ అని వివరించాడు. క్రీడా సంస్కృతి పెరగాలి... భారత్కు ఒలింపిక్స్ ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కితే అది దేశ క్రీడారంగంలో కీలక మలుపుగా నిలుస్తుందని కుంబ్లే అన్నాడు. మౌలిక వసతులు పెంపొందడంతో పాటు... కొత్త తరం అథ్లెట్లకు స్ఫూర్తినిస్తుందని అభిప్రాయపడ్డారు. ‘భారీ క్రీడా పోటీలతో పరిస్థితుల్లో మార్పు వస్తుంది. 1982లో జరిగిన ఆసియా క్రీడలు నాపై చాలా ప్రభావం చూపాయి. దీంతో దేశంలో క్రీడా సంస్కృతి పెంపొందుతుంది’ అని కుంబ్లే అన్నాడు. ఏదో ఒక రోజు భారత ఫుట్బాల్ జట్టు కూడా ఫిఫా ప్రపంచకప్లో పాల్గొంటుందని జంబో ఆశాభావం వ్యక్తం చేశాడు. -
టీమిండియాలో దక్కని చోటు..!వైభవ్, ఆయుష్ మాత్రే కు షాకిచ్చిన BCCI
-
BCCI: త్వరలోనే టీమిండియా ఎంట్రీ పక్కా!
రాజస్తాన్ రాయల్స్ స్టార్, భారత అండర్-19 వరల్డ్కప్ విజేత వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇటు ఐపీఎల్లో.. అటు భారత జూనియర్ జట్టు తరఫున ఈ బిహారీ పిల్లాడు ఇరగదీస్తున్న సంగతి తెలిసిందే. విధ్వంసకర బ్యాటింగ్కు పెట్టింది పేరుగా మారి.. ఇప్పటికే ఎన్నో ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు వైభవ్.మెరుపులు మెరిపించాడుఇక ఐపీఎల్-2026లోనూ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) దుమ్ములేపుతున్నాడు. ఈ సీజన్లో రాయల్స్ ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్లూ గెలవడంలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ది కీలక పాత్ర. అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 17 బంతుల్లో 52, 18 బంతుల్లో 31, 14 బంతుల్లో 39 పరుగులు.ఈ నేపథ్యంలో భారత జాతీయ జట్టుకు వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో వరల్డ్క్లాస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు సిక్సర్తో వైభవ్ ఆహ్వానం పలికిన తీరు దిగ్గజాలను సైతం ఆకట్టుకుంటోంది.The sheer audacity of Vaibhav Sooryavanshi 🫡🎥 The 1️⃣5️⃣ year old welcomes Jasprit Bumrah with a maximum! 👏#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals pic.twitter.com/cI0zqCXz0X— IndianPremierLeague (@IPL) April 7, 2026డెస్టినీ చైల్డ్ఈ క్రమంలో భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ వైభవ్ సూర్యవంశీ ఆట తీరుపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘సూర్యవంశీ డెస్టినీ చైల్డ్. అతడి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతోంది. పదిహేనేళ్ల వయసులోనే పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడి ప్రదర్శన చూసి ఆశ్చర్యంగా ఉంది.చితక్కొడతాను అని చెప్పి మరీ కొట్టాడుఇంతకు ముందు ఎవరూ ఇలాంటి ప్రదర్శన ఇవ్వలేదు. ఈ పిల్లాడు ఏం చెప్పాడో గుర్తుందా?.. ‘నేను జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఆడేందుకు ఎదురుచూస్తున్నా. గతేడాది అవుటయ్యాను. ఈసారి మాత్రం కచ్చితంగా అతడి బౌలింగ్లో చితక్కొడతాను’ అని చెప్పాడు.అన్నట్లుగానే మొదటి బంతికే బుమ్రా బౌలింగ్లో సిక్సర్ బాదాడు. దీంతో బుమ్రా సైతం ఆశ్చర్యానికి లోనయ్యాడు. తన వ్యూహం మార్చుకుని స్లో బాల్ వేయాల్సి వచ్చింది. అసలు పరిమిత ఓవర్ల క్రికెట్లో బుమ్రా కంటే అత్యుత్తమ బౌలర్ ఎవరూ లేరు. అలాంటిది బుమ్రా బౌలింగ్లోనే వైభవ్ అదరగొట్టాడు.20 ఏళ్లు ధనాధన్దయచేసి వైభవ్ను ఇంకా ఎదురుచూసేలా చేయకండి. త్వరలోనే అతడికి టీమిండియా క్యాప్ ఇవ్వండి. అతడు ఇరవై ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడగలడు. బౌలర్లకు ఇక చుక్కలే. వారిని భయపెడుతున్న పేరు వైభవ్’’ అంటూ టీమిండియాకు వైభవ్ను ఎంపిక చేయాలని ఇర్ఫాన్ పఠాన్ బీసీసీఐకి సూచించాడు. చదవండి: Yashasvi Jaiswal: ‘టార్గెట్ మూడు ఓవర్లే.. అందుకే ఈ విధ్వంసం’ -
సెలెక్షన్ కమిటీపై షమీ సంచలన వ్యాఖ్యలు!
టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ ఐపీఎల్ 19వ సీజన్లో తన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఈ సీజన్లో లక్నో సూపర్జెయింట్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న షమీ ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో రెండు వికెట్లు తీయడమే గాక అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. అయితే దేశవాలీ, ఐపీఎల్లో మంచి ప్రదర్శన చేసినప్పటికీ బీసీసీఐ సెలెక్టర్లు మాత్రం షమీని పట్టించుకోవడం లేదు. దీంతో షమీని జాతీయ జట్టులోకి తిరిగి తీసుకోవాలనే వాదనలు పెరిగిపోయాయి. ఇక ఐపీఎల్ 19వ సీజన్లో భాగంగా గురువారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్తో లక్నో తలపడనుంది. షమీ స్వస్థలం ఉత్తర్ప్రదేశ్ అయినప్పటికీ దేశవాలీ క్రికెట్లో మాత్రం అతడు బెంగాల్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ లెక్కన ఈడెన్ గార్డెన్స్ షమీకి సొంత మైదానం వంటిది. ఇటీవలే రంజీ ట్రోఫీలోనూ బెంగాల్ తరఫున పాల్గన్న షమీ తాజాగా లక్నో తరఫున ఈడెన్లో బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో షమీ మంగళవారం బెంగాల్ ప్రొ టీ20 లీగ్ మూడో సీజన్ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఇదే కార్యక్రమానికి కేకేఆర్ కెప్టెన్ రహానే, వైస్కెప్టెన్ రింకూ సింగ్ కూడా వచ్చారు. షమీ మాట్లాడుతూ.. ‘సొంతమైదానంలో మ్యాచ్ ఆడడం ఎవరికైనా అనుకూలంగానే ఉంటుంది. ఒక లోకల్ ఆటగాడిగా కేకేఆర్కు ప్రత్యర్థిగా ఆడినప్పటికీ పిచ్పై పూర్తి అవగాహన ఉండడం సానుకూలాంశం.’ అని చెప్పుకొచ్చాడు. స్థిరమైన ప్రదర్శన చేస్తున్నప్పటికీ జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంపై కూడా షమీ తనదైన శైలిలో స్పందించాడు. ‘మనం రోజువారీ కూలీలం మాత్రమే. అవకాశం మన తలుపు తట్టేవరకు నిత్యం బౌలింగ్ వేస్తూనే ఉండాలి.’ అని సెలెక్షన్ కమిటీని ఉద్దేశిస్తూ చమత్కరించాడు. షమీ ఇంకా మాట్లాడుతూ.. ‘జీవితంలో ఎత్తుపల్లాలు, గాయాలు కావడం సహజం. కానీ మన గ్రౌండ్ లెవెల్ హార్డ్వర్క్ మూలాలు మాత్రం ఎప్పటికీ మరిచిపోకూడదు. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చానని, ఒక ఆటగాడిగా అవకాశం కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తూనే ఉంటాను. నా దృష్టిలో దేశవాలీ క్రికెట్కు అధిక ప్రాధాన్యమిస్తాను. నేను ఉత్తర్ప్రదేశ్లో పుట్టినప్పటికీ బెంగాల్ ఎప్పటికీ నా కర్మభూమినే. నాలో శక్తి, పోరాడే తత్వం ఉన్నంతవరకు బెంగాల్కు ఆడుతూనే ఉంటాను’ అని చెప్పుకొచ్చాడు. దేశవాలీ టోర్నీ అయిన రంజీ ట్రోఫీలో మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. బెంగాల్ తరఫున 16.72 ఎకానమీతో 37 వికెట్లు పడగొట్టి స్థిరమైన ప్రదర్శనతో టాప్-6 బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. రంజీలో బెంగాల్ సెమీస్ చేరడంలోనూ షమీ కీలకపాత్ర పోషించాడు. 90 పరుగులిచ్చి 8 వికెట్లు తీసి బెంగాల్ను ఫైనల్ చేర్చాడు.చదవండి: అనుభవం లేనోళ్లే ఎక్కువ.. అయినా కుమ్మేస్తున్నారు! -
BCCI: అది సరికాదు.. యువీకే తప్పలేదంటే...
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్లలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు యువరాజ్ సింగ్. భారత జట్టు 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్కప్ గెలవడంతో ఈ మాజీ ఆల్రౌండర్ది కీలక పాత్ర. ఈ మెగా టోర్నీ తర్వాత క్యాన్సర్ఉందని తేలగా.. మొక్కవోని విశ్వాసంతో మహమ్మారి జయించి తిరిగి మైదానంలో అడుగుపెట్టిన ఘనుడు యువీ.అయితే, కెరీర్ చరమాంకంలో యువీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. జట్టులో చోటు ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో 2019 వన్డే వరల్డ్కప్లో ఆడాలన్న కోరిక తీరకుండానే యువీ రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది.కనీస సమాచారం కూడా ఇవ్వకుండా..ఈ విషయం గురించి యువరాజ్ సింగ్ తాజాగా స్పోర్ట్స్ తక్ ఇంటర్వ్యూలో స్పందించాడు. నాటి కెప్టెన్ విరాట్ కోహ్లి, హెడ్కోచ్ రవిశాస్త్రి తన పేరును పరిగణనలోకి తీసుకోలేదని.. అందుకు సంబంధించి కనీస సమాచారం కూడా ఇవ్వలేదని వాపోయాడు. ఫిట్నెస్ పరీక్ష పాసైనా ఎదురుచూపులు తప్పలేదని.. అందుకే రిటైర్మెంట్ ఇచ్చానని తెలిపాడు.అంతటి యువీకే తప్పలేదంటేఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ యువీ వ్యాఖ్యలపై స్పందించాడు. యువరాజ్ పట్ల యాజమాన్యం వైఖరి తనను నిరాశపరిచిందని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘మొదట్లో వార్తా పత్రికల్లో చూసి ఆటగాళ్లు తమ కెరీర్ కొనసాగుతుందా? ముగిసిపోయిందా? అని తెలుసుకునేవాళ్లు.అయితే, యాజమాన్యం మరీ ఇంత ఘోరంగా ఉండాల్సింది కాదు. టీమిండియాకు రెండు వరల్డ్కప్లు అందించిన యువరాజ్ సింగ్ వంటి దిగ్గజాల విషయంలోనైనా కాస్త మెరుగ్గా ప్రవర్తించాల్సింది. తనను ఎవరూ సంప్రదించకుండానే రిటైర్మెంట్ తీసుకునేలా చేశారని యువీ అన్నాడు. ఇలా చేయడం సరికాదు. కచ్చితంగా ఆటగాళ్లతో చర్చించి వారికి మేనేజ్మెంట్ స్పష్టతనివ్వాలి’’ అని వసీం జాఫర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు. రో-కోలకు చెప్పండికాగా యువీ ఇటీవల మాట్లాడుతూ.. మేనేజ్మెంట్ తన విషయంలో వ్యవహరించినట్లు మరెవరి విషయంలో వ్యవహరించకూడదని అన్నాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతూ.. వరల్డ్కప్-2026 రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు కూడా మేనేజ్మెంట్ సరైన సమాచారం ఇవ్వాలని యువీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. వాళ్లిద్దరు గొప్ప ఆటగాళ్లని.. వారిని సాదరంగా పంపితే బాగుంటుందని పేర్కొన్నాడు.చదవండి: CSKకు గుడ్న్యూస్.. విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు! -
కష్టాల్లో టీమిండియాను గెలిపించాడు.. ప్రచారంలో సంజూ ని ఆకాశానికి ఎత్తేసిన మోడీ
-
‘నేనేమీ యంత్రాన్ని కాదు.. వాళ్లు మాత్రం పట్టించుకోరు’
క్రికెట్లో కొనసాగాలంటే... ఆటతో సంబంధం కలిగి ఉండాల్సిందేనని టీమిండియా వెటరన్ బౌలర్, లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మహ్మద్ షమీ అన్నాడు. శారీరకంగా ఫిట్గా ఉన్నప్పుడే నైపుణ్యాలను మెరుగు పరుచుకోగలమని పేర్కొన్నాడు. అందుకే తాను దేశవాళీల్లో అన్నీ మ్యాచ్లు ఆడుతున్నానని తెలిపాడు.కాగా 2025 మార్చి నుంచి షమీ (Mohammed Shami) టీమిండియాకు దూరమైన సంగతి తెలిసిందే. దేశీ క్రికెట్లో సత్తా చాటినా సెలక్టర్లు మాత్రం అతడిని పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2026లో తనను తాను నిరూపించుకుని మరోసారి ఆటతోనే సెలక్టర్లకు సందేశం పంపాలని షమీ పట్టుదలగా ఉన్నాడు.అత్యంత పొదుపుగాఇక ఈసారి లక్నో తరఫున బరిలోకి దిగిన షమీ.. తొలుత ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో ఒక వికెట్ తీయగలిగాడు. ఇక తాజాగా ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి లక్నో గెలుపులో కీలక పాత్ర పోషించాడు.కేవలం తొమ్మిది పరుగులే ఇచ్చిసన్రైజర్స్తో మ్యాచ్లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసిన షమీ.. కేవలం తొమ్మిది పరుగులే ఇచ్చి రెండు వికెట్లు కూల్చాడు. సన్రైజర్స్ డేంజరస్ ఓపెనర్లు ట్రవిస్ హెడ్ (7), అభిషేక్ శర్మ (0) వికెట్లు కూల్చాడు. తద్వారా లక్నో విజయంలో ముఖ్య భూమిక పోషించిన ఈ రైటార్మ్ పేసర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.నేనేమీ యంత్రాన్ని కాదుఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ టీమిండియా సెలక్టర్ల తీరును పరోక్షంగా విమర్శించాడు. ‘‘నేనేమీ యంత్రాన్ని కాదు. కెరీర్లో ఎత్తుపళ్లాలు సహజం. అయితే, గత కొన్నేళ్లుగా నేను బాగానే ఆడుతున్నా. అయినప్పటికీ వాళ్లు నన్ను పట్టించుకోవడం లేదు.అది వేరే విషయం అనుకోండి. నేను మాత్రం నిరంతరం శ్రమిస్తూ మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. అభిషేక్, హెడ్ వంటి వాళ్లకు ఏమాత్రం అవకాశం ఇచ్చినా మ్యాచ్ను లాగేసుకుంటారు. అందుకే ఆ రెండు వికెట్లు ఎంతో కీలకం. టీమిండియా తరఫున ఆడుతున్న సమయం నుంచే బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్తో చక్కటి అనుబంధం ఉంది.స్లో బంతులతో ఫలితం అదే ఇప్పుడూ కొనసాగుతోంది. గత మ్యాచ్లో మేం ఓడిపోయాం. అందుకే ఈ మ్యాచ్ కీలకమైంది. నైపుణ్యం లేకుండా ఏదీ సాధ్యం కాదు. గతంలో ఇక్కడ స్లో బంతులతో ఫలితం సాధించిన అనుభవాన్ని ఇప్పుడు ఉపయోగించా. కొత్త బంతితో బౌలింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తా’’ అని షమీ పేర్కొన్నాడు.కాగా సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో షమీ 18 డాట్ బాల్స్ వేశాడు. దీంతో అతడి ప్రదర్శనకుగానూ‘డాట్ బాల్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు చాముండేశ్వరీనాథ్ చేతుల మీదుగా షమీ ఈ పురస్కారం అందుకున్నాడు.చదవండి: ఆర్సీబీతో మ్యాచ్.. ఓటమికి పూర్తి బాధ్యత నాదే!Lala with the new ball >>>>> pic.twitter.com/Zz7XBJbm5W— Lucknow Super Giants (@LucknowIPL) April 5, 2026 -
‘ఇష్టం లేకపోతే తప్పుకో’.. సీఎస్కే ఫ్యాన్స్ ఆగ్రహం
టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలవడంలో ఓపెనర్ సంజూ శాంసన్ది కీలకపాత్ర అని చెప్పొచ్చు. సూపర్-8లో వెస్టిండీస్తో మ్యాచ్ ద్వారా ఫామ్లోకి వచ్చిన సంజూ ఆ తర్వాత సెమీస్, ఫైనల్స్లో కీలక ఇన్నింగ్స్లు ఆడి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. అదే సూపర్ఫామ్ను ఐపీఎల్ 19వ సీజన్లోనూ కొనసాగిస్తాడని అంతా భావించిన వేళ సీన్ మొత్తం రివర్స్ అయింది.రాజస్తాన్ రాయల్స్ నుంచి ఏ ముహూర్తంలో చెన్నై సూపర్కింగ్స్కు ట్రేడ్ అయ్యాడో కానీ దారుణంగా విఫలమవుతూ వస్తున్నాడు. తొలి మూడు మ్యాచ్ల్లో సీఎస్కే ఓటమి చవిచూస్తే.. శాంసన్ ఆడకపోవడం కూడా జట్టును బాగా దెబ్బతీస్తోంది. శాంసన్ ఈ సీజన్లో సీఎస్కేకు బలమవుతాడనుకుంటే దారుణ ఆటతీరుతో బలహీనంగా మారిపోయాడు. శాంసన్ వరుసగా మూడు మ్యాచ్ల్లోనూ 6,7 9 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో సీఎస్కే అభిమానులు సంజూ శాంసన్ ఆటతీరుపై గుస్సా అవుతున్నారు. టీ20 ప్రపంచకప్లో హీరోగా నిలిచిన శాంసన్ ఐపీఎల్లో జీరో అయిపోయాడంటూ ట్రోల్స్కు గురి చేస్తున్నారు. రాజస్తాన్ కెప్టెన్గా అదరగొట్టిన శాంసన్ సీఎస్కేకు వచ్చేసరికి మాత్రం పూర్తిగా విఫలమవుతున్నాడు. ముఖ్యంగా ఆడాలనే పట్టుదల శాంసన్లో ఏమాత్రం కనిపించడం లేదని సీఎస్కే అభిమానులు పేర్కొంటున్నారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అవసరమైన పరుగులు చేయాల్సిన చోట విఫలమవుతుండడం చూసి ఆసక్తి లేకపోతే జట్టు నుంచి తప్పుకుంటే బాగుంటుందేమోనని సోషల్ మీడియా వేదికగా శాంసన్కు సలహాలు ఇస్తున్నారు. మానసికంగా సిద్ధంగా లేకపోతే మాత్రం కొన్ని మ్యాచ్లకు జట్టు నుంచి తప్పుకోవడమే మేలని పేర్కొన్నారు. కెమెరాలన్నీ శాంసన్వైపు తిరిగిన ప్రతీసారి ఏదో కోల్పోయినట్లుగా శాంసన్ ఫీలవుతున్నాడని, సీఎస్కేలోకి వచ్చాకా ఇప్పటివరకు అతడు నవ్వడం తాము చూడలేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. టీ20 ప్రపంచకప్లో కనిపించిన శాంసన్ మాకు కావాలని, ఆ కసి ఎక్కడా కనిపించడం లేదని, ఇప్పటినుంచైనా కాస్త శ్రద్ద పెడితే బాగుంటుందని వాపోయారు. ఐదుసార్లు ఐపీఎల్లో చాంపియన్గా నిలిచిన సీఎస్కే ఈ సీజన్లో హ్యాట్రిక్ ఓటములు నమోదు చేసి విజయం కోసం చకోర పక్షిలా ఎదురుచూడాల్సి వస్తోంది.మ్యాచ్ విషయానికొస్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 43 పరుగుల తేడాతో చెన్నై సూపర్కింగ్స్పై విజయం సాధించింది. రజత్ పటిదార్, టిమ్ డేవిడ్, పడిక్కల్లు రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లష్టానికి 250 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ టార్గెట్తో బరిలోకి దిగిన సీఎస్కే 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది.Dear @IamSanjuSamson,If you’re not mentally in it, then step aside for a few games. This isn’t just about runs anymore. Your body language is screaming disinterest. Every time the camera’s on you, you look frustrated and disconnected. Honestly, I’ve never seen you smiling even… pic.twitter.com/L7bFl0uJbf— Madras Man (@newbatsman) April 5, 2026చదవండి: ఇరగదీస్తున్న ఇద్దరు మొనగాళ్లు.. రీఎంట్రీ ఇవ్వాల్సిందే! -
టీమిండియాకు శుభవార్త: నితీశ్ రెడ్డిపై గావస్కర్ ప్రశంసలు
సన్రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిపై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. అతడి బౌలింగ్ బాగా మెరుగుపడిందని.. టీమిండియాకు ఇదొక శుభవార్త అని పేర్కొన్నాడు. కాగా గతేడాది ఐపీఎల్లో నితీశ్ రెడ్డి (Nitish Kumar Reddy) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.తొలి మ్యాచ్లో విఫలంగాయాల కారణంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఈ ఆంధ్ర క్రికెటర్.. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లోనూ నిరాశపరిచాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (SRH vs RCB)తో మ్యాచ్లో నితీశ్ రెడ్డి బ్యాట్, బంతితో రాణించడంలో విఫలమయ్యాడు. నాలుగో నంబర్లో బ్యాటింగ్కు వచ్చి ఆరు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగుకే నిష్క్రమించిన ఈ పేస్బౌలింగ్ ఆల్రౌండర్.. రెండు ఓవర్లు బౌల్ చేసి 19 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.కేకేఆర్తో మ్యాచ్లో సూపర్ హిట్ఇక సన్రైజర్స్ తమ రెండో మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో తలపడగా.. ఈసారి నితీశ్ రెడ్డి ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన నితీశ్ 24 బంతుల్లో 39 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత బౌలింగ్లో 2 ఓవర్లు వేసి 17 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు.తద్వారా సన్రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా నితీశ్ రెడ్డి మాట్లాడుతూ.. బౌలింగ్లో తాను మెరుగుపడటానికి ‘ప్రత్యేక’ వ్యక్తి శిక్షణ కారణమని పేర్కొన్నాడు. స్లో బౌన్సర్లతోనే కేకేఆర్తో మ్యాచ్లో ఫలితం రాబట్టానని తెలిపాడు.టీమిండియాకు శుభవార్తేఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ సునిల్ గావస్కర్ నితీశ్ కుమార్ రెడ్డిని ప్రశంసించాడు. ‘‘అతడు వేగంగా బౌలింగ్ చేస్తున్నాడు. బౌలింగ్కు మరికొంత పేస్ కూడా జతచేశాడు. అతడి బౌలింగ్ శైలి, లయ మెరుగుపడ్డాయి. పూర్తి ఫిట్గా ఉన్నందు వల్లే అతడికి ఇది సాధ్యమైంది.తన ఫిజికల్ ట్రెయినర్కు అతడు క్రెడిట్ ఇచ్చాడు. అతడు ఫిట్గా ఉండటమే అతిపెద్ద సానుకూలాంశం. అతడు బౌన్స్ కూడా రాబట్టగలుగుతున్నాడు. నితీశ్ రెడ్డి ఇలా రాణించడం టీమిండియాకు శుభవార్తే అవుతుంది’’ అని గావస్కర్ కొనియాడాడు.కాగా సన్రైజర్స్ తరఫున సత్తా చాటి వెలుగులోకి వచ్చిన నితీశ్ రెడ్డి.. అనతికాలంలోనే మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. అరుదైన పేస్ బౌలింగ్ నైపుణ్యాలున్న హార్దిక్ పాండ్యా వారసుడిగా నీరాజనాలు అందుకున్నాడు. ఇలాంటి దశలో గాయాలు, ఫిట్నెస్ సమస్యల కారణంగా కాస్త వెనుకబడినా.. తిరిగి నిలదొక్కుకునే దిశగా ముందుకు సాగుతున్నాడు.చదవండి: ‘ధోని ఎక్కడి నుంచో వచ్చాడు.. రో-కోలకు ముఖం మీదే చెప్పేయండి’: యువీ -
కపిల్, ధోనీలకు యువరాజ్ క్షమాపణ!
టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ భారత మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీలకు బహిరంగ క్షమాపణలు చెప్పడం ఆసక్తి కలిగించింది. తన తండ్రి యోగ్రాజ్ సింగ్ గతంలో ధోని, కపిల్ దేవ్ల గురించి ఆరోపణలు చేయడమే క్షమాపణకు కారణమని యువీ వెల్లడించాడు. కాగా యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అతని తండ్రి యోగ్రాజ్ పలు సందర్భాల్లో ధోనిపై ఆరోపణలు చేశారు. యువరాజ్కు కెప్టెన్సీ రాకపోవడానికి ప్రధాన కారణం ధోనినేని బహిరంగంగానే విమర్శలు చేయడం అప్పట్లో వివాదానికి దారి తీసింది. తాజాగా యువరాజ్ ఒక పాడ్కాస్ట్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో యువరాజ్ మాట్లాడుతూ.. 'నేను కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీలకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను' అని అన్నారు. తన తండ్రి ఇంటర్వ్యూలు చూసినప్పుడు ఎలా అనిపిస్తుందని అడగ్గా.. 'అది సరైంది కాదని మా నాన్నకు చెప్పాను' అని యువరాజ్ పేర్కొన్నాడు. కాగా యోగ్రాజ్ సింగ్ గతంలో కపిల్ దేవ్పై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. 1980ల్లో తనను జట్టు నుంచి తొలగించినందుకు కపిల్ దేవ్ను చంపాలనుకున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 'కపిల్ దేవ్ కెప్టెన్ అయినప్పుడు నన్ను అనవసరంగా జట్టులోంచి తీసేశారు. అప్పట్లో నా పిస్టల్ తీసుకుని కపిల్ ఇంటికి వెళ్లాను. అతని తల్లి అక్కడ ఉండటంతో వదిలేశాను. ఆ రోజే నేను క్రికెట్ ఆడకూడదని, నా కొడుకు యువీతో ఆడిస్తానని నిర్ణయించుకున్నాను' అని యోగ్ రాజ్ గతంలో గుర్తు చేసుకున్నారు.బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ వంటి వారు ఆటగాళ్లను సరిగ్గా గౌరవించలేదని, మన కెప్టెన్ల వల్లే జట్టు నాశనమైందని ఆయన బహిరంగంగా విమర్శలు చేసేవారు. అయితే తన తండ్రి చేస్తున్న ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యల పట్ల యువరాజ్ సింగ్ ఇప్పుడు క్షమాపణలు కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది.15 ఏళ్ల పాటు భారత క్రికెట్లో ప్రముఖ పాత్ర వహించిన యువరాజ్ సింగ్ 2007 టీ20 ప్రపంచకప్తో పాటు 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలో సభ్యుడిగా ఉన్నాడు. అయితే ధోని కెప్టెన్సీలో ఎక్కువ మ్యాచ్లు ఆడిన యువరాజ్కు నాయకత్వ బాధ్యతలు తీసుకునే అవకాశం రాలేదు. 2000లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన యువరాజ్ సింగ్ టీమిండియా తరఫున 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20 మ్యాచ్లు ఆడాడు.చదవండి: ‘సిగ్గుపడుతున్నా.. అతడిపై నిషేధం విధించండి’Do tune in tomorrow as the Yuvraj Singh Podcast drops at 12 noon Friday on @sports_tak @YUVSTRONG12 pic.twitter.com/jGOZhiJBkz— Vikrant Gupta (@vikrantgupta73) April 2, 2026 -
‘టీమ్ ఇండియా’గా పనిచేద్దాం
న్యూఢిల్లీ: పశ్చిమాసియా పరిణామాలు, ప్రపంచ అనిశ్చిత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మన దేశంలో ఆర్థిక, వాణిజ్య స్థిరత్వాన్ని కొనసాగించడానికి, ఆహార భద్రతను విఘాతం కలగకుండా చూడడానికి, ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు, పరిశ్రమలు, సప్లై చైన్లను బలోపేతం చేయడానికి కేంద్రం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. ఆయన శుక్రవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. తాజా పరిస్థితిపై విస్తృతంగా చర్చించారు. ఆయా రాష్ట్రాల సన్నద్ధత, ప్రణాళికలను సమీక్షించారు.రాబోయే రోజుల్లో ఎలాంటి అనూహ్య పరిస్థితులు ఎదురైనా సరే ఎదుర్కోవడానికి మనమంతా ‘టీమ్ ఇండియా’ స్ఫూర్తితో కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత ప్రధాని మోదీ రాష్ట్రాల సీఎంలతో భేటీ కావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత సవాల్ను మనం కచ్చితంగా అధిగమిస్తామని ధీమా వ్యక్తంచేశారు. కోవిడ్–19 మహమ్మారి ఉధృతి సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి ఆ సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయని గుర్తుచేశారు.ప్రతికూల పరిణామాలను ఎదుర్కొన్న అనుభవం మనకు ఉందన్నారు. తాజా సంక్షోభం పట్ల మన ప్రతిస్పందన వేగంగా ఉండాలంటే సమాచారం పంచుకోవాలని, ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రాలు సైతం మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు. సప్లై చైన్లు సజావుగా పనిచేసేలా చూడాలని, సరుకుల అక్రమ నిల్వలు, రవాణా, అక్రమార్జనపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇంధనం, సరుకుల సరఫరాలో అంతరాయాలను నివారించడానికి పరిపాలనా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. నిత్యావసరాల సరఫరా పట్ల ఆందోళన తలెత్తకుండా ప్రజలకు వాటిని అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఎరువులపై ముందస్తు ప్రణాళిక అవసరం పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని, అందుకే నిరంతర పర్యవేక్షణ అవసరమని ప్రధాని మోదీ వెల్లడించారు. కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ప్రతిరోజూ పరిస్థితులను సమీక్షిస్తోందని పేర్కొన్నారు. రైతాంగానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్కు ముందు ఎరువుల నిల్వ, పంపిణీని పర్యవేక్షించడానికి ముందస్తు ప్రణాళిక అవసరమని స్పష్టంచేశారు. ప్రజల్లో భయాందోళనకు తావులేకుండా వారికి ఎప్పటికప్పుడు సరైన సమాచారాన్ని అందించాలన్నారు.తప్పుడు సమాచారం, వదంతుల వ్యాప్తిని అరికట్టాలన్నారు. ఆన్లైన్ మోసాలు, నకిలీ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తేల్చిచెప్పారు. అలాగే నౌక రవాణా, నిత్యావసర వస్తువుల సరఫరా, సముద్ర కార్యకలాపాలకు సంబంధించి తలెత్తే సవాళ్లను పరిష్కరించేందుకు సరిహద్దు, తీరప్రాంత రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని వివరించారు. ప్రజల్లో విశ్వాసం పెంపొందించడం చాలా ముఖ్యమని ప్రధానమంత్రి ఉద్బోధించారు.సహకారం, సమన్వయమే మన బలమని ఉద్ఘాటించారు. ఈ వర్చువల్ సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షాతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, జమ్మూకశీ్మర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ, అరుణాచల్ప్రదేశ్ సీఎం పెమా ఖండూ తదితరులు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల సీఎంలు పాల్గొనలేదు. -
హైదరాబాద్లో టీమిండియా రెండు మ్యాచ్లు
న్యూఢిల్లీ: భారత పురుషుల క్రికెట్ జట్టు 2026–2027 సీజన్లో హైదరాబాద్ వేదికగా రెండు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడనుంది. ఈ ఏడాది అక్టోబర్ 14న ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం వేదికగా వెస్టిండీస్తో భారత్ టి20 మ్యాచ్ ఆడనుండగా ... వచ్చే ఏడాది జనవరి 6న జింబాబ్వేతో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు 2026–27 సీజన్లో స్వదేశంలో టీమిండియా ఆడనున్న సిరీస్ల షెడ్యూల్ను బీసీసీఐ గురువారం విడుదల చేసింది. మొత్తం 17 వేదికల్లో 22 మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల ‘బోర్డర్–గావస్కర్’ టెస్టు సిరీస్ సైతం ఉంది. 1979లో చివరిసారిగా భారత్, ఆ్రస్టేలియా మధ్య భారత్లో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరగగా... మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఇరు జట్లు మన దేశంలో ఐదు మ్యాచ్ల సిరీస్ ఆడనున్నాయి. ఇక గతేడాది చివర్లో దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్కు ఆతిథ్యమిచ్చిన గువాహటి మైదానానికి... ఈ సిరీస్లో మరో టెస్టు మ్యాచ్ దక్కడం చర్చనీయాంశంగా మారింది. భారత్–ఆ్రస్టేలియా మధ్య వచ్చే ఏడాది జనవరి 21 నుంచి ప్రతిష్టాత్మక ‘బోర్డర్ –గావస్కర్’ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్కు నాగ్పూర్ ఆతిథ్యమిస్తుండగా... ఆ తర్వాత వరుసగా చెన్నై (జనవరి 29–ఫిబ్రవరి 2), గువాహటి (ఫిబ్రవరి 11–15), రాంచీ (ఫిబ్రవరి 19–23), అహ్మదాబాద్ (ఫిబ్రవరి 27–మార్చి 3)లో మ్యాచ్లు జరగనున్నాయి. ఈ జాబితాలో ముంబై, కోల్కతా లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఈ సీజన్లో స్వదేశంలో ఆడనున్న 22 మ్యాచ్ల్లో 5 టెస్టులు కాగా... 9 వన్డేలు, 8 టి20లు ఉన్నాయి. టెస్టు, టి20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ... ఈ సీజన్లో స్వదేశంలో తొమ్మిది వన్డేల్లో అభిమానులను అలరించనున్నారు. వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వేతో టీమిండియా వన్డే సిరీస్లు ఆడనుంది. జింబాబ్వే జట్టు చివరిసారిగా 2002లో భారత్లో పర్యటించింది. -
రోహిత్, కోహ్లి అభిమానులకు కిక్కెక్కించే వార్త
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అభిమానులకు కిక్కెక్కించే వార్త ఇది. టెస్ట్లు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న ఈ ఇద్దరు, వచ్చే ఏడాది (2027) మే వరకు 20 వన్డేలు ఆడే అవకాశం ఉంది. రో-కో ఎలాంటి విరామాలు తీసుకోకుండా ఆడితే ఇది జరుగుతుంది.తాజాగా బీసీసీఐ రానున్న హోం సీజన్లో టీమిండియా షెడ్యూల్ను ప్రకటించింది. ఇందులో ఏకంగా 9 వన్డేలు ఉన్నాయి. మిగతా 11 వన్డేలకు భారత్ విదేశాల్లో ఆడనుంది. 2027 మే వరకు ఇంటా-బయటా టీమిండియా షెడ్యూల్ ఇలా ఉండబోతుంది.ఐపీఎల్ తర్వాత జూన్ 6 నుంచి ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఏకైక టెస్ట్ మరియు 3 వన్డేల సిరీస్ కోసం భారత్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో జరిగే టెస్ట్ మ్యాచ్ జూన్ 6 నుంచి 10 వరకు ముల్లాన్పూర్ వేదికగా జరుగనుంది. అనంతరం ధర్మశాల (జూన్ 14), లక్నో (జూన్ 17), చెన్నై (జూన్ 20) వేదికలుగా మూడు వన్డేలు జరుగనున్నాయి.అనంతరం భారత్ జులైలో ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో 5 టీ20లు, 3 వన్డేలు జరుగనున్నాయి. టీ20లు జులై 1, 4, 7, 9, 11 తేదీల్లో చెస్టర్ లీ స్ట్రీట్, ఓల్డ్ ట్రాఫర్డ్, ట్రెంట్ బ్రిడ్జ్, బ్రిస్టల్, సౌథాంప్టన్ వేదికలుగా జరుగనుండగా.. వన్డేలు జులై 14, 16, 19 తేదీల్లో ఎడ్జ్బాస్టన్, కార్డిఫ్, లార్డ్స్లో జరుగనున్నాయి.సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో 3 వన్డేలు సహా 5 టీ20లు జరుగనున్నాయి. వన్డేలు సెప్టెంబర్ 27, 30, అక్టోబర్ 3 తేదీల్లో తిరువనంతపురం, గౌహతి, ముల్లాన్పూర్ వేదికలుగా జరుగనుండగా.. టీ20లు అక్టోబర్ 6, 9, 11, 14, 17 తేదీల్లో లక్నో, రాంచీ, ఇండోర్, డెహ్రాడూన్, బెంగళూరు నగరాల్లో జరుగనున్నాయి.తర్వాత టీమిండియా ఆడబోయే వన్డేల వివరాలు..టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో 5 వన్డేలు ఆడే అవకాశం ఉంది. ఈ సిరీస్పై స్పష్టత రావాల్సి ఉంది.డిసెంబర్లో శ్రీలంక భారత్లో పర్యటించి 3 వన్డేలు ఆడుతుంది. ఈ మ్యాచ్లు డిసెంబర్ 13, 16, 19 తేదీల్లో ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్లో జరుగనున్నాయి.వచ్చే ఏడాది జనవరిలో జింబాబ్వే 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం భారత్లో పర్యటిస్తుంది. ఈ మ్యాచ్లు జనవరి 3, 6, 9 తేదీల్లో కోల్కతా, హైదరాబాద్, ముంబైలో జరగుతాయి. -
టీమిండియా హోం షెడ్యూల్ విడుదల
2026-27 సీజన్కు సంబంధించి టీమిండియా హోం షెడ్యూల్ను బీసీసీఐ ఇవాళ (మార్చి 26) విడుదల చేసింది. ఈ సీజన్లో వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లు భారత్లో పర్యటించనున్నాయి. 17 వేదికల్లో మొత్తం 22 అంతర్జాతీయ మ్యాచ్లు (9 వన్డేలు, 8 టీ20లు, 5 టెస్ట్లు) జరగనున్నాయి.ఈ సీజన్ సెప్టెంబర్ 27న వెస్టిండీస్ పర్యటనతో మొదలవుతుంది. ఇందులో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఉన్నాయి. వన్డేలు త్రివేండ్రం, గౌహతి, న్యూ చండీగఢ్లో.. టీ20లు లక్నో, రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులో జరుగుతాయి. 🚨 FULL HOME SCHEDULE OF TEAM INDIA IN 2026-27 HOME SEASON 🇮🇳- Great work by BCCI to announce the schedule way earlier. pic.twitter.com/bWopsVcmVu— Johns. (@CricCrazyJohns) March 26, 2026డిసెంబర్లో శ్రీలంక జట్టు భారత్లో పర్యటిస్తుంది. ఈ పర్యటలో మూడు వన్డేలు ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్లో జరుగనుండగా.. మూడు టీ20లు రాజ్కోట్, కటక్, పూణేలో షెడ్యూల్ అయ్యాయి. వచ్చే ఏడాది (2027) జనవరిలో జింబాబ్వే జట్టు భారత్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు ఉంటాయి. ఇవి కోల్కతా, హైదరాబాద్, ముంబైలో జరగుతాయి. ఈ హోం సీజన్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన భాగం ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ. ఐదు టెస్టుల ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు జనవరిలో భారత్లో పర్యటించనుంది. ఈ సిరీస్లో తొలి టెస్ట్ మ్యాచ్ 21వ తేదీ నుంచి నాగ్పూర్ వేదికగా జరుగుతుంది. తరువాతి మ్యాచ్లు చెన్నై, గౌహతి, రాంచీ, అహ్మదాబాద్లో జరుగుతాయి. -
‘అదే జరిగితే.. టీమిండియా సెలక్టర్లు పట్టించుకోరు’
గతేడాది లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్గా పగ్గాలు చేపట్టాడు టీమిండియా స్టార్ రిషభ్ పంత్. మెగా వేలంలో లక్నో ఫ్రాంఛైజీ రికార్డు స్థాయిలో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు.కెప్టెన్గానూ ఫెయిల్అయితే, ఐపీఎల్-2025లో పంత్ (Rishabh Pant) దారుణంగా విఫలమయ్యాడు. పదమూడు మ్యాచ్లలో కలిపి కేవలం 269 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కెప్టెన్గానూ పంత్ ఫెయిలయ్యాడు. అతడి సారథ్యంలో లక్నో గతేడాది పద్నాలుగింట ఆరు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో పంత్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.టీమిండియా రీఎంట్రీ కష్టమేముఖ్యంగా ఫామ్లేమితో సతమతమవుతున్నా రిస్కీ షాట్లతో మూల్యం చెల్లించిన తీరుపై మాజీ క్రికెటర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా పంత్ను ఉద్దేశించి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికైనా పంత్ ఆట తీరు మారకపోతే.. భారత టీ20 జట్టులో అతడు తిరిగి స్థానం దక్కించుకోవడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు.‘‘రిషభ్ పంత్ విషయంలో విమర్శలు రావడం సరైందే. సంప్రదాయ విరుద్ధ, రిస్కీ షాట్లు ఆడటం అనే చట్రంలో అతడు ఇరుక్కుపోయాడు. ఫామ్ను తిరిగి పొందే ప్రయత్నమే చేయడం లేదు. గతేడాది మొత్తం రిస్కీ షాట్లతో విమర్శలు మూటగట్టుకున్నాడు.సెలక్టర్లు అసలు పట్టించుకోవడం లేదుటీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్గా నిలిచిన తర్వాత టీ20 జట్టుకు అతడు దూరమయ్యాడు. మిడిలార్డర్లో వికెట్ కీపర్ బ్యాటర్గా సేవలు అందించే పంత్ గురించి ఇప్పుడు సెలక్టర్లు అసలు పట్టించుకోవడం లేదు.ఓపెనర్-వికెట్ కీపర్గా ఓ ఆటగాడు రాణిస్తుంటే (సంజూ), ఓపెనర్- వికెట్ కీపర్ లేదంటే వన్డౌన్లో ఆడే వికెట్ కీపర్గా మరొకరు (ఇషాన్) దుమ్ములేపుతున్నారు. కాబట్టి ఈసారి ఐపీఎల్లో సత్తా చాటితేనైనా తిరిగి జాతీయ జట్టులో పునరాగమనం చేసే అవకాశం అయినా పంత్కు దక్కుతుంది. ఏదేమైనా జాతీయ జట్టుకు ఆడటమే ప్లేయర్ అంతిమ లక్ష్యం కదా! యువరాజ్ సింగ్ మార్గదర్శనంలో పంత్ ప్రాక్టీస్ చేయడం శుభసూచకం. ఈసారైనా పంత్ ఉత్తమంగా రాణించాలి. లేదంటే భవిష్యత్ కష్టమే’’ అని ఆకాశ్ చోప్రా జియోహాట్స్టార్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా మార్చి 28 నుంచి ఐపీఎల్-2026 షురూ కానుంది.చదవండి: రూ. 15 వేల కోట్లకు అమ్మకం.. షేన్ వార్న్ వాటా ఎంతంటే? -
‘నల్లోడు.. నల్లకేకు.. అంతలో గావస్కర్ వచ్చి’
వర్ణ వివక్ష కారణంగా మానసికంగా తానెంతో కుంగిపోయానన్నాడు భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్. తన శరీరం నలుపు రంగులో ఉన్నందున ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని వాపోయాడు. తన ప్రతిభను గుర్తించకుండా కేవలం మేని ఛాయను చూసి హేళన చేసేవారని ఆవేదన వ్యక్తం చేశాడు.ప్రతిభ ఉన్నా కాగా తమిళనాడుకు చెందిన శివరామకృష్ణన్ 1980వ దశకంలో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. మొత్తంగా తొమ్మిది టెస్టుల్లో 130 పరుగులు, 26 వికెట్లు తీసిన పడగొట్టిన అతడు.. 16 వన్డేలు ఆడి 15 వికెట్లు తీశాడు. ఇక 1985లో ఆస్ట్రేలియా వేదికగా సునిల్ గావస్కర్ సారథ్యంలో భారత జట్టు బెన్సన్ హెడ్జెస్ వరల్డ్ చాంపియన్షిప్ గెలవడంలోనూ అతడిది కీలక పాత్ర.అయితే, ఆ తర్వాత నెమ్మదిగా కనుమరుగైపోయిన శివరామకృష్ణన్ 2000 సంవత్సరంలో కామెంటేటర్ అవతారం ఎత్తాడు. ఐసీసీ క్రికెట్ కమిటీలో ప్లేయర్ రిప్రజెంటేటివ్గానూ పనిచేసిన అతడు ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా నల్లగా ఉన్నాననే కారణంతోనే 23 ఏళ్లుగా బీసీసీఐ తనను విస్మరించిందని.. టాస్లు వేయడానికి అనుమతించలేదని సంచలన ఆరోపణలు చేశాడు.షూ శుభ్రం చేయమని చెప్పాడుతాజాగా ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడిన శివరామకృష్ణన్ చిన్ననాటి నుంచి తాను ఎదుర్కొన్న వర్ణ వివక్ష గురించి గుర్తుచేసుకున్నాడు. ‘‘పద్నాలుగేళ్ల వయసులో చెపాక్లో భారత జట్టు ప్రాక్టీస్ చేస్తున్నపుడు నేను నెట్బౌలర్గా చేరాను.అప్పటికి స్కూల్ నుంచి యూనిఫామ్లోనే ఉన్నాను. వెంటనే వెళ్లి డ్రెస్ మార్చుకుని వచ్చాను. ఇంతలో భారత జట్టుకు చెందిన ఓ సీనియర్ బ్యాటర్ నన్ను పిలిచి.. తన షూ శుభ్రం చేయమని చెప్పాడు.అందుకు నేను గట్టిగానే బదులిచ్చాను. అది నా పని కాదని చెప్పేశాను. నిజానికి ఆయన నన్ను గ్రౌండ్ సిబ్బంది అనుకుని పొరబడ్డారట. జాతి, వర్ణ వివక్ష అంటే ఏమిటో అప్పటిదాకా నాకు తెలియదు. ఆ మనిషి అన్న మాటలకు ఆరోజు ఎలా స్పందించాలో నాకు తెలియలేదు.నల్లోడు అంటూ హేళనఇక తమిళనాడు జట్టులోనూ నన్ను కరుపా (నల్లోడు) అని పిలిచేవారు. ముంబై, చండీగఢ్, జలంధర్ వంటి చోట్ల బౌండరీల దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నపుడు.. ‘నల్లోడా.. నీకేమైంది?’ అంటూ హేళన చేసేవారు.నా 17వ పుట్టినరోజున అనుకుంటా. సునిల్ గావస్కర్ నా కోసం కేక్ తెప్పించాడు. ఇంతలో ఓ సీనియర్ ఆటగాడు వచ్చి.. ‘హేయ్ సన్నీ.. నువ్వు సరైన రంగున్న కేక్నే ఆర్డర్ చేశావు. నల్లబ్బాయికి నల్లటి (డార్క్ చాకొలెట్ కేక్) కేకే కరెక్ట్’ అని అన్నాడు. దీంతో నేను ఎంతో బాధపడ్డాను. కన్నీళ్లు కారుస్తూ..అంతలో సన్నీ వచ్చి నన్ను ఓదార్చి, బుజ్జగించి కేక్ కట్ చేయించాడు. అప్పటికి నా చెంపల మీదుగా కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి’’ అని చేదు అనుభవాలను లక్ష్మణ్ శివరామకృష్ణన్ గుర్తుచేసుకున్నాడు.చదవండి: రూ. 15 వేల కోట్లకు అమ్మకం.. షేన్ వార్న్ వాటా ఎంతంటే? -
‘గంభీర్.. మొరటుతనం తగ్గించుకో’
టీమిండియా హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ దూకుడు స్వభావం అందరికి తెలిసిందే. గతంలో ఆటగాడిగానైనా, ఇప్పుడు కోచ్గానైనా అదే దూకుడు మంత్రం గంభీర్ను ప్రత్యేకంగా నిలిపింది. కొన్నిసార్లు అదే దూకుడుతనం గొడవలకు కూడా దారి తీసింది. ఐపీఎల్లో విరాట్ కోహ్లీతో వైరం కూడా అలాంటి కోవకు చెందినదే. అయితే కోచ్గా గంభీర్ అంత కఠినంగా, మొరటుగా ఉండాల్సిన అవసరం లేదని టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. అదే సమయంలో భారత జట్టు ప్రధాన కోచ్గా గంభీర్ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో ప్రశాంత వాతావరణం ఉండేలా చేయడంలోనూ విజయవంతమయ్యాడని ప్రశంసించాడు. గంగూలీ మాట్లాడుతూ.. ‘నిజానికి గంభీర్ కాస్త మొరటు వ్యక్తే కావొచ్చు. కానీ అతనో పోరాటయోధుడు. నేను అతడితో కలిసి ఆడాను. అతడు పోటీతత్వం కలవాడు. ప్రతీ మ్యాచ్ను భారత్ గెలవాలని బలంగా కోరుకునేవాడు. జట్టు కోసమే ఎప్పుడు మాట్లాడుతాడు. ఎల్లప్పుడూ సమిష్టితత్వాన్ని కోరుకుంటాడు. కోచ్గా గంభీర్కు అసలైన సవాల్ ముందుంది.సౌతాఫ్రికా వేదికగా జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్ (వైట్బాల్క్రికెట్) గంభీర్ ముందున్న అతిపెద్ద లక్ష్యం. అక్కడి పరిస్థితులు అతనికి పరీక్షే అయినప్పటికీ కచ్చితంగా తన లక్ష్యాలను చేరుకోవడానికే ప్రయత్నిస్తాడు. ఇక రెడ్బాల్ (టెస్టు క్రికెట్)లో ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. ఇంగ్లండ్ సిరీస్ గంభీర్కు ఒక ఉదాహరణ. కోచ్గా అతను కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు’అని చెప్పుకొచ్చాడు. భారత ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ రెండు ఐసీసీ ట్రోఫీలు సాధించాడు. అందులో ఒకటి 2025 చాంపియన్స్ ట్రోఫీ కాగా, మరొకటి 2026 టీ20 ప్రపంచకప్. ఇక ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా వరుస సిరీస్లతో బిజీ కానుంది. ఇం2్లండ్లో సుదీర్ఘమైన వైట్ బాల్ సిరీస్కు ముందు భారత్ అఫ్గానిస్థాన్, ఐర్లాండ్లతో సిరీస్లు ఆడనుంది.చదవండి: ‘ఆ రూల్కు నేనెప్పుడూ వ్యతిరేకమే’! -
సెలక్టర్లు వింటారు: నితీశ్ రెడ్డికి ఇషాన్ కిషన్ వార్నింగ్!
డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)- సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్తో మార్చి 28న ఐపీఎల్-2026 టోర్నీకి తెరలేవనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఇందుకు వేదిక.కెప్టెన్గా ఇషాన్ కిషన్ఇక ఆరంభ మ్యాచ్లకు ప్యాట్ కమిన్స్ దూరం కాగా.. అతడి గైర్హాజరీలో సన్రైజర్స్ కెప్టెన్గా టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ వ్యవహరించనున్నాడు. ఇప్పటికే సన్రైజర్స్ నెట్ ప్రాక్టీస్, ఇంట్రాస్వ్కాడ్ మ్యాచ్లతో బిజీబిజీగా గడుపుతోంది.ఈ క్రమంలో ఆటవిడుపుగా సన్రైజర్స్ ఆటగాళ్లు అభిమానులతో మమేకం అయ్యారు. ఫ్యాన్ మీట్లో ఆసక్తికర వ్యాఖ్యలతో అలరించారు. ఇందులో భాగంగా ఆంధ్ర కుర్రాడు, టీమిండియా స్టార్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్లు.. అందుకు కెప్టెన్ ఇషాన్ కిషన్ ఇచ్చిన కౌంటర్లు.. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సెలక్టర్లు వింటారు!టెస్టు లేదంటే టీ20 ఫార్మాట్.. ఈ రెండింటిలో ఏది ఎంచుకుంటారని హోస్ట్ అడుగగా నితీశ్ రెడ్డి.. టీ20 అని సమాధానమిచ్చాడు. ఆ తర్వాత టెస్టు లేదంటే వన్డేలలో ఒకటి ఎంచుకోమనగా.. అతడు వన్డే అని బదులిచ్చాడు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ జోక్యం చేసుకుంటూ.. ‘‘నువ్వు టెస్టు జట్టులో కీలక సభ్యుడివి బ్రో. సెలక్టర్లు ఈ మాటలు వింటారు జాగ్రత్త’’ అని హెచ్చరించాడు. దీంతో నితీశ్తో పాటు ఆక్కడున్న వాళ్లంతా గట్టిగా నవ్వేశారు.𝙁𝙤𝙧 𝙩𝙝𝙚 𝙩𝙚𝙖𝙢, 𝙖𝙣𝙮𝙩𝙝𝙞𝙣𝙜 🤌 pic.twitter.com/ju8SpzTvxl— SunRisers Hyderabad (@SunRisers) March 22, 2026కాగా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన నితీశ్ రెడ్డిని.. హార్దిక్ పాండ్యాకు సరైన వారసుడిగా సెలక్టర్లు భావిస్తున్నారు. వైట్బాల్ క్రికెట్లో హార్దిక్ గైర్హాజరీలో అడపాదడపా అవకాశాలు అందుకున్న నితీశ్.. గత రెండేళ్లుగా టెస్టుల్లో మాత్రం ఆల్రౌండర్గా స్థానం సుస్థిరం చేసుకున్నాడు.అది సాధ్యం కాదు!ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇషాన్ కిషన్ నితీశ్ రెడ్డికి కౌంటర్ ఇవ్వడం గమనార్హం. ఇక ఐపీఎల్లో పవర్ ప్లేలో బ్యాటింగ్ చేయడం ఇష్టమా? లేదంటే డెత్ ఓవర్లలో బ్యాటింగ్ ఇష్టమా? అని హోస్ట్ అడుగగా.. నితీశ్ రెడ్డి పవర్ ప్లే అని సమాధానం ఇచ్చాడు.దీంతో మరోసారి ఇషాన్ కిషన్ కౌంటర్తో ముందుకు వచ్చాడు. నితీశ్ రెడ్డి రెగ్యులర్గా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు కాబట్టి.. అతడికి ఎంత ఇష్టం ఉన్నా పవర్ ప్లేలో బ్యాటింగ్ చేయలేడంటూ నవ్వులు పూయించాడు. టెస్టు జట్టులో స్థానం సుస్థిరంకాగా సన్రైజర్స్ తరఫున 2024లో సత్తా చాటి భారత టీ20 జట్టులో అడుగుపెట్టిన నితీశ్ రెడ్డి.. అదే ఏడాది ఆస్ట్రేలియాలో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. మరుసటి ఏడాది వన్డేల్లోనూ అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 10 టెస్టులు, 4 వన్డేలు, 4 టీ20 మ్యాచ్లు ఆడాడు.మరోవైపు ఇషాన్ కిషన్ దాదాపు మూడేళ్ల తర్వాత ఇటీవలే టీమిండియాలో పునరాగమనం చేశాడు. క్రమశిక్షణా రాహిత్యం వల్ల జట్టులో స్థానం కోల్పోయిన అతడు.. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి సెలక్టర్లకు సవాల్ విసిరాడు. అద్భుత ఫామ్లో ఉన్న అతడిని టీ20 ప్రపంచకప్-2026 జట్టుకు ఎంపిక చేయగా.. భారత్ చాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.చదవండి: భారత్తో స్నేహం కావాలి: పాక్కు దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్! -
దురంధర్-2లో టీమిండియా క్రికెటర్స్.. ఈ వీడియో చూశారా?
ఇప్పుడు ఎక్కడ చూసినా దురంధర్ ఫీవర్ కనిపిస్తోంది. మార్చి 19న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ప్రీమియర్స్తోనే వసూళ్లు సునామీ మొదలెట్టిన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ దాటేసింది. ఆదిత్య ధర డైరెక్షన్లో వచ్చిన ఈ సీక్వెల్ హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ విడుదలైంది. ఈ మూవీపై టాలీవుడ్ స్టార్స్తో పాటు పలువురు సినీ నటులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి సైతం దురంధర్-2 మూవీని పొగిడారు.దురంధర్-2 రిలీజ్ వేళ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో హల్చల్ చేస్తోంది. దురంధర్-2 మూవీపై రీల్స్, వీడియోలు పెద్దఎత్తున వైరలవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వీడియో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో టీమిండియా క్రికెటర్స్ నటిస్తే ఎలా ఉంటుంది? అనే కోణంలో ఓ వీడియోను రూపొందించారు. రణ్వీర్సింగ్ పాత్రలో విరాట్ కోహ్లీ కనిపించగా.. జమీల్ జమాలీ పాత్రలో వీరేంద్ర సెహ్వాగ్ ఉండేలా క్రియేట్ చేశారు. ఈ వీడియో చేసిన ఫన్నీ కోసమే అయినా.. క్రికెటర్స్ ఈ మూవీలో ఎలా కనిపిస్తారో చూస్తే మాత్రం అద్భుతంగా అనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో మీరు కూడా చూసేయండి. pic.twitter.com/GalcyV6WIe ఇండియన్ క్రికెటర్లు దురంధర్లో నటిస్తే? 💀🔥— Tupaki (@tupaki_official) March 21, 2026 -
‘సంజూకు మామయ్యలాంటి వాడిని’
భారత జట్టు స్టార్ వికెట్కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ను తర్వాతి ధోనీగా పోల్చాల్సిన అవసరం లేదని టీమిండియా హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేసినట్లు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేర్కొన్నారు. ఇటీవల తమ మధ్య జరిగిన ఒక సంభాషణలో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు శశిథరూర్ వెల్లడించారు. అయితే సంజూ శాంసన్తో బంధం ఈనాటిది కాదని, అతడికి తాను మామయ్యలాంటి వాడినని తెలిపారు. ఇటీవలే టీ20 ప్రపంచకప్ 2026లో సంజూ అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సంగతి తెలిసిందే. టోర్నీలో 321 పరుగులు చేసిన శాంసన్ ముఖ్యంగా సెమీఫైనల్, ఫైనల్లో కీలక ఇన్నింగ్స్లు ఆడి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో శశిథరూర్ సంజూ శాంసన్తో తనకున్న అనుబంధాన్ని, సంజూ విషయంలో గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకున్నాడు. ‘సంజూని మొదటిసారి 14 ఏళ్ల వయసులో చూశాను. ఆ సమయంలో అతడికి నేను ఎందుకో అంకుల్గా ఫీలయ్యాను. ఆ సమయంలోనే శాంసన్ టాలెంట్ స్పష్టంగా కనిపించింది. వికెట్ కీపింగ్, బ్యాటింగ్ రెండింట్లోనూ అసాధారణ ప్రతిభ ఉంది. అప్పుడు నేను నువ్వు తర్వాతి ధోనీ అవుతావని శాంసన్కు చెప్పాను. కానీ తర్వాత గంభీర్తో ఈ విషయమై చర్చకు వచ్చినప్పుడు, ఆయన ‘లేదండీ శాంసన్ తర్వాతి ధోనీ కాదు..వన్ అండ్ ఓన్లీ సంజూ శాంసన్’ అని చెప్పినట్లు గుర్తుంది. ఇవాళ గంభీర్ మాటలు నిజమయ్యాయి.సంజూ మరెవరికీ ప్రతిరూపం కావాల్సిన అవసరం లేదు. అతడిని అతడిలానే ఉండనిద్దాం. సంజూ శాంసన్ ఎంతో వినయంగా ఉంటాడు.మంచి నాయకుడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ను సమర్థంగా నడిపించాడు. ఇప్పుడు చెన్నై జట్టులోనూ తనకంటే ప్రత్యేకతను సాధించుకుంటాడు. జట్టుకు అవసరమైనప్పుడు స్వార్థం లేకుండా ఆడతాడు. శతకం కోసం ఆడకుండా టీమ్ కోసం పెద్ద షాట్లు ఆడాడు. అదే అతని గొప్పతనం. శాంసన్ను అన్యాయంగా జట్టు నుంచి తప్పించిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు వరుసగా మూడు మ్యాచుల్లో అద్భుతంగా రాణించడం అతని స్థిరత్వానికి నిదర్శనం. సంజూ శాంసన్కు మున్ముందు మరిన్ని అవకాశాలివ్వాలి. వన్డేల్లోనూ రెగ్యులర్గా ఆడించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది’ అని శశిథరూర్ వెల్లడించారు. ఇంతకాలం ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించిన సంజూ శాంసన్ ఈ సీజన్ నుంచి చెన్నై సూపర్కింగ్స్కు ఆడనున్నాడు. తన ఫెవరెట్ క్రికెటర్ అయిన ఎంఎస్ ధోనితో కలిసి ఆడనుండడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని శాంసన్ ఇటీవలే సీఎస్కే ప్రాక్టీస్లో జాయిన్ అయిన సందర్భంగా వెల్లడించాడు.చదవండి: 24 ఏళ్ల తర్వాత మ్యాచ్.. సంచలనం రిపీటయ్యేనా? -
టీమిండియా అభిమానులకు పండుగే పండుగ!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీని విజయవంతంగా ముగించుకున్న భారత ఆటగాళ్లు తదుపరి ఐపీఎల్ పందొమ్మిదో ఎడిషన్తో బిజీ కానున్నారు. మార్చి 28న ఈ మెగా ఈవెంట్కు తెరలేవనుంది. ఇక ఐపీఎల్-2026 ముగిసిన తర్వాత జూన్ 6-20 మధ్య టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య సిరీస్ జరుగుతుంది.ముందుగా ఐర్లాండ్ టూర్కు!ఇందులో భాగంగా భారత్- అఫ్గన్ జట్లు ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడతాయి. అనంతరం టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే, అంతకంటే ముందు భారత జట్టు ఐర్లాండ్ టూర్కు వెళ్లనున్నట్లు సమాచారం.ఐర్లాండ్ హై పర్ఫామెన్స్ డైరెక్టర్ గ్రాహమ్ వెస్ట్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్ జరుగనుందని సంకేతాలు ఇచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఐర్లాండ్ కనీసం సూపర్-8 దశకు కూడా చేరుకుండానే నిష్క్రమించింది.మంచి బూస్ట్ఇందుకు బాధ్యత వహిస్తూ పాల్ స్టెర్లింగ్ కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడు. ఈ నేపథ్యంలో.. ‘‘టీ20 ప్రపంచకప్-2028 సన్నాహకాల్లో భాగంగా పాల్ స్టెర్లింగ్ రాజీనామా చేయగా.. అతడి స్థానంలో వచ్చే కొత్త కెప్టెన్కు జూన్లో టీమిండియాతో జరిగే సిరీస్తో మంచి బూస్ట్ లభిస్తుంది’’ అని గ్రాహమ్ వెస్ట్ ప్రకటన విడుదల చేశాడు. తద్వారా భారత్- ఐర్లాండ్ సిరీస్ విషయాన్ని ఖరారు చేశాడు.కాగా గత ఏడేళ్లలో ఇప్పటి వరకు టీమిండియా ఐర్లాండ్లో మూడుసార్లు (2018, 2022, 2023)లో పర్యటించింది. ఇదిలా ఉంటే.. స్వదేశంలో అఫ్గనిస్తాన్తో సిరీస్ ముగించుకున్న తర్వాత టీమిండియా జూలైలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లేలా ముందుగా షెడ్యూల్ ఖరారైంది. జూలై 1- 19 వరకు ఇరుజట్ల మధ్య ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లు నిర్వహించాలని నిర్ణయించారు.మరింత బిజీగాఅయితే, తాజాగా ఐర్లాండ్ టూర్తో భారత జట్టు షెడ్యూల్ మరింత బిజీగా మారింది. దీంతో తమకు ఈ ఏడాదంతా పండుగేనని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. తద్వారా స్వదేశంలో మొట్టమొదటిసారి, వరుసగా రెండోసారి, ఓవరాల్గా మూడోసారి టీ20 వరల్డ్కప్ ట్రోఫీ గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది.చదవండి: ODI WC: ఇప్పటికే ఇరవై మందిని షార్ట్లిస్ట్ చేసిన బీసీసీఐ? -
అతడికి ఆ అవసరం లేదు: బీసీసీఐ
టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరికొంత కాలం తనను కొనసాగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి అతడు విజ్ఞప్తి చేసినట్లు వార్తలు వచ్చాయి. వన్డే వరల్డ్కప్-2027 వరకు తానే చీఫ్ సెలక్టర్గా ఉంటానని అగార్కర్ కోరినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి.అతడికి ఆ అవసరం లేదుఈ అంశంపై బీసీసీఐ అధికారి ఒకరు తాజాగా స్పందించారు. అగార్కర్ తమ వద్ద ఇలాంటి ప్రతిపాదన తేలేదని కొట్టిపారేశారు. PTIతో మాట్లాడుతూ.. ‘‘సెలక్షన్ ప్యానెల్లోని సబ్ కమిటీతో సహా సెలక్టర్లందరి కాంట్రాక్టు ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఉంది.అజిత్ కాంట్రాక్టు కూడా సెప్టెంబరులోనే ముగుస్తుంది. బీసీసీఐ కార్యదర్శి, అజిత్ కలిసి చర్చించిన తర్వాతే.. అజిత్ వన్డే వరల్డ్కప్-2027 వరకు కొనసాగుతాడా? లేదా? అన్న విషయంపై స్పష్టత వస్తుంది.బీసీసీఐ నిబంధనల ప్రకారం సీనియర్ సెలక్టర్ నాలుగు ఏళ్ల వరకు కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి అతడు తన పదవీకాలాన్ని పొడిగించాలని అభ్యర్థించాల్సిన అవసరం పెద్దగా ఉండదు’’ అని సదరు అధికారి పేర్కొన్నారు. కాగా 2023, జూన్లో మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ టీమిండియా చీఫ్ సెలక్టర్గా బాధ్యతలు చేపట్టాడు.సాహసోపేత నిర్ణయాలు సెలక్షన్ కమిటీ చైర్మన్గా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ అజిత్ అగార్కర్ తనదైన ముద్ర వేయగలుగుతున్నాడు. అతడి హయాంలో టీమిండియా 2023 వన్డే వరల్డ్కప్ టోర్నీలో రన్నరప్గా నిలిచింది. ఆ తర్వాత 2024లో టీ20 ప్రపంచకప్, 2025లో ఆసియా టీ20 కప్, 2025 చాంపియన్స్ ట్రోఫీ.. తాజాగా టీ20 ప్రపంచకప్-2026 టైటిళ్లను భారత్ గెలుచుకుంది.ఇక అజిత్ అగార్కర్కు తోడుగా హెడ్కోచ్గా మరో మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ వచ్చాక.. నాయకత్వ బృందంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. టీ20 కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను కాదని.. సూర్యకుమార్ యాదవ్ను నియమించగా.. అతడు 2026లో వరల్డ్కప్ గెలిచాడు. సీనియర్ల రిటైర్మెంట్ఇక వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మను తప్పించి శుబ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించగా ఇంత వరకు మూడింట ఒక్క సిరీస్ కూడా అతడు గెలవలేకపోయాడు. మరోవైపు.. ఈ జోడీ హయాంలోనే దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్కు వీడ్కోలు పలకగా.. బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక 2024లో వరల్డ్కప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు గుడ్బై చెప్పిన రో-కో.. ప్రస్తుతం వన్డేలలో మాత్రమే కొనసాగుతున్నారు. వీరిద్దరు వన్డే వరల్డ్కప్-2027 వరకు ఆడతామని సంకేతాలు ఇవ్వగా.. అగార్కర్ మాత్రం ఈ విషయంలో తమకు స్పష్టత లేదని చెప్పడం గమనార్హం.చదవండి: ODI WC: ఇప్పటికే ఇరవై మందిని షార్ట్లిస్ట్ చేసిన బీసీసీఐ? -
ధోని జెర్సీ నంబర్ మారనుందా?
టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని ఐపీఎల్ 2026 సీజన్లో తన జెర్సీ నంబర్ మార్చుకోనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ధోని జెర్సీ నంబర్ ఎంత అని చిన్న పిల్లాడిని అడిగినా టక్కున ఏడు అని చెప్పేస్తాడు. అంతలా పాతుకుపోయింది ధోని జెర్సీ నంబర్. రెండు దశాబ్దాల పాటు భారత క్రికెట్కు ఆడిన ధోని ఏడు నెంబర్ జెర్సీతోనే బరిలోకి దిగాడు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఐపీఎల్లోనూ సీఎస్కే తరఫున అదే జెర్సీ నెంబర్తో బరిలోకి దిగుతున్నాడు. అయితే తాజాగా ధోనినే స్వయంగా తన ఫేస్బుక్ ఖాతా వేదికగా తాను ధరించబోయే ఎనిమిదో నెంబర్ జెర్సీని పంచుకున్నాడు. ‘కొన్ని నంబర్లు మనతో పాటే ఉండిపోతాయి. అందులో ఏడు అనేది ఒకటి. కానీ ఇవాళ నేను 8కి స్విచ్ అవుతున్నా. ఎందుకనేది మీకు త్వరలోనే తెలుస్తోంది’ అంటూ ధోని ఒక క్యాప్షన్ జత చేశాడు. ఇది చూసిన ధోని అభిమానులు మాత్రం ‘మా ధోని ఎప్పుడు ఏడో నంబర్ జెర్సీకే కట్టుబడి ఉండాలి. అది మాకు ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చింది’ అంటూ పేర్కొన్నారు. మరికొందరు మాత్రం అది కేవలం అడ్వర్టైజ్మెంట్ కోసం ధోని చేసిన వీడియో అని తెలిపారు. నిజానికి ఎంఎస్ ధోనికి నంబర్ 7తో చాలా ప్రత్యేక అనుబంధం ఉంది. ధోనికి ఆ నంబర్ ఒక ఎమోషన్ కూడా. ధోని పుట్టిన తేదీ జూలై 7 (07/07). అందుకే కెరీర్ ఆరంభం నుంచి ధోని అదే నంబర్ను వాడుతున్నాడు. భారత క్రికెట్కు ధోనీ చేసిన సేవలకు గుర్తింపుగా బీసీసీఐ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో నంబర్ 7 జెర్సీకి రిటైర్మెంట్ కూడా ప్రకటించి అతని జెర్సీని బీసీసీఐ మ్యూజియంలో ఉంచింది. ఇలాంటి తరుణంలో ధోని తనకు అచ్చొచ్చిన నంబర్ను ఐపీఎల్లో మార్చుకోవడం సాధ్యమేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.చదవండి: ‘కెరీర్ ముగింపు మన చేతుల్లో ఉండదు’ -
బుమ్రాకు 2 కోట్ల నష్టపరిహారం!
టీమిండియా స్టార్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీసీఐ గత ఫిబ్రవరిలో 2025-26 సీజన్ కోసం ఆటగాళ్లకు వార్షిక ఫీజులకు సంబంధించి సెంట్రల్ కాంట్రాక్టు జాబితాను విడుదల చేసింది. అయితే ఇందులో ‘ఏ ప్లస్’ గ్రేడ్ను బీసీసీఐ తొలగించింది. గతంలో ఏ ప్లస్ కేటగిరీలో రోహిత్, కోహ్లీ, బుమ్రా, జడేజా ఉండేవారు. వీరిలో కోహ్లీ, రోహిత్లు కేవలం వన్డే ఫార్మాట్లో కొనసాగుతుండగా, జడేజా రెండు ఫార్మాట్లలో ఆడుతున్నాడు. దీంతో ఈ ముగ్గురి ఫీజు చెల్లింపు విషయంలో బీసీసీఐకి పెద్దగా ఇబ్బందులు లేవు. కానీ ఇప్పటివరకు ఏ ప్లస్ గ్రేడ్లో ఉన్న బుమ్రాను ఏ గ్రేడ్కు మార్చింది. ఇదే ఏ గ్రేడ్లో బుమ్రాతో పాటు టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్, జడేజా కూడా ఉన్నారు. బీసీసీఐ ఒప్పందం ప్రకారం గ్రేడ్-ఏ ఆటగాళ్లకు ఏటా రూ. 5 కోట్లు, గ్రేడ్-బి ఆటగాళ్లకు రూ.3 కోట్లు లభిస్తాయి. గ్రేడ్ సి ఆటగాళ్లు రూ. 1 కోటి అందుకుంటారు. ఇంతకముందు ఏ ప్లస్ కేటగిరీలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక ఫీజు కింద రూ. 7 కోట్లు చెల్లించేవారు. దీంతో ఇప్పటివరకు ఏ ప్లస్లో కొనసాగిన బుమ్రా ప్రస్తుతం ఏ కేటగిరీ కింద రూ. 5 కోట్లు మాత్రమే అందుకోనున్నాడు. కానీ మూడు ఫార్మాట్లు (వన్డే, టెస్టు, టీ20లు) ఆడుతూ కూడా రూ.2 కోట్లను కోల్పోవాల్సి వస్తోంది. దీంతో బుమ్రా విషయంలో బీసీసీఐ పునరాలోచనలోన పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బుమ్రాకు మిగిలిన రూ. 2 కోట్లను నష్టపరిహారంగా అందివ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే మరికొందరు ఆటగాళ్ల ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొని వారి కాంట్రాక్టు మొత్తాలను కూడా బీసీసీఐ పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. గతంలో ఏ ప్లస్ కేటగిరీ దక్కించుకోవాలంటే క్రికెటర్లు మూడు ఫార్మాట్లలో ఆడుతూ కనీసం ఒక్క ఫార్మాట్లోనైనా టాప్-10 ర్యాంకులో కొనసాగాలనే నిబంధన ఉండేది. తాజాగా ఏ ప్లస్ను రద్దు చేయడంతో ఆ నిబంధన కూడా తొలిగిపోయింది.చదవండి: ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా ఇషాన్ కిషన్ -
అవకాశమొస్తే ఆడకుండా ఉంటానా?
ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్లో టీమిండియా టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే ధోనీ, రోహిత్ శర్మ తర్వాత టీ20 ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్గా సూర్యకుమార్ అరుదైన ఘనత సాధించాడు.క్రికెట్లో మూడు ఫార్మాట్లు ఆడాలనే కల ఏ క్రికెటర్కైనా ఉంటుంది. సూర్య జట్టులోకి వచ్చి ఐదేళ్లు గడుస్తున్నప్పటికీ కేవలం టీ20లకే పరిమితం కావడం కొంతమేర ఆశ్చర్యం కలిగిస్తుంది. కెరీర్ ఆరంభంలో వన్డేలతో పాటు ఏకైక టెస్టు మ్యాచ్ ఆడిన సూర్యకుమార్ ఆ తర్వాత టీ20 స్పెషలిస్ట్గానే ముద్ర వేసుకున్నాడు. తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్యకుమార్ తాను వన్డేలు, టెస్టు మ్యాచ్లు ఆడకపోవడానికి గల కారణాలను వెల్లడించాడు. ‘ఏది రాసిపెట్టి ఉంటే జీవితంలో అదే జరుగుతుంది. తొలుత నేను క్రికెట్ ఆడడం ప్రారంభించినప్పుడు రెడ్బాల్ క్రికెట్ ఆడా. దాదాపు పదేళ్లు రంజీ ట్రోఫీలో ఆడాను. ముంబైకి ప్రాతినిధ్యం వహించాను. ఇక్కడ ప్రతి ఒక్కరూ రెడ్బాల్ క్రికెట్తోనే మొదలుపెడతారు. క్రమంగా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆట వైపు వచ్చినప్పుడు ఇక్కడే సౌకర్యంగా అనిపించింది. మరీ ముఖ్యంగా టీ20లకు బాగా సెట్ అయ్యా. వన్డేల్లోనూ మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. నాకు టెస్టు క్రికెట్పై ప్రేమ లేదని చెప్పను. ఎందుకంటే 2010 నుంచి 2020 వరకూ రంజీల్లో ఆడా. ఆ ఫార్మాట్ను ఆస్వాదించా. ఎవరైనా సరే టెస్టు క్రికెట్ ఆడే అవకాశం వస్తే వద్దంటారా చెప్పండి? అయితే నాకున్న క్రికెట్ అనుభవం ప్రకారం ఈ ఫార్మాట్లో మూడు భిన్నమైన మార్గాల్లో ఆడాల్సి ఉంటుంది.కొన్నిసార్లు త్వరగా వికెట్లు పడి ముందుగా క్రీజులోకి వెళ్తే టెస్టుల్లో మాదిరిగా నెమ్మదిగా ఆడాలి. మధ్య ఓవర్లలో స్ట్రైక్ట్ పెంచుకుంటూ పోవాలి. ఇక ఆఖర్లో టీ20ల మాదిరిగా చెలరేగాలి. అందుకేనేమో నాకు ఈ వన్డే ఫార్మాట్ సరిగా అర్థం కాలేదు అనిపిస్తుంది. నేను వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో ఆడాను.అభిమానుల నుంచి విపరీతమైన ఆదరణ దక్కింది. మూడు ఫార్మాట్లకు ఉన్న ఆకర్షణ పూర్తిగా భిన్నమైంది’ అని చెప్పుకొచ్చాడు. ఇక సూర్యకుమార్ ఇప్పటివరకు ఒక టెస్టు మ్యాచ్ ఆడి 8 పరుగులు, 37 వన్డేల్లో 773 పరుగులు సాధించాడు. ఇక 113 టీ20ల్లో 3,272 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలున్నాయి.చదవండి: రెండు ముక్కల్లో విషెస్.. ట్రోల్కు గురైన బుమ్రా! -
రెండు ముక్కల్లో విషెస్.. ట్రోల్కు గురైన బుమ్రా!
టీమిండియా స్టార్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా ఐదో వివాహ వార్షికోత్సవ వేడుకను ఘనంగా జరుపుకున్నాడు. అయితే బుమ్రా తన పెళ్లి రోజు వేడుకను పురస్కరించుకొని తన భార్యకు పంపిన రెండు ముక్కల సందేశం అతన్ని ట్రోల్కు గురయ్యేలా చేసింది. విషయంలోకి వెళితే.. పెళ్లిరోజు సందర్భంగా తన భార్య సంజనా గణేశన్కు ‘హ్యాపీ యానివర్సరీ’ అని రెండు ముక్కల్లోనే విషెస్ తెలిపాడు. బుమ్రా పోస్ట్పై సంజనా గణేశన్ స్పందిస్తూ.. ‘కిడ్నీ టచ్చింగ్ క్యాప్షన్ యార్’ అని పేర్కొంది. ఆ తర్వాత బుమ్రాతో కలిసి ఉన్న ఫోటోలను పంచుకున్న సంజనా గణేశన్.. ‘జీవితం మనల్ని ఎక్కడికి తీసుకెళ్లినా, ప్రపంచం ఎంతదూరం తీసుకెళ్లినా ఈ జ్ఞాపకాలు మాత్రం ఎల్లప్పుడూ మనతోనే ఉంటాయి. నా ప్రాణ స్నేహితుడితో వివాహం జరిగి ఐదు సంవత్సరాలు పూర్తి కావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. నీ కౌగిలిలో నన్ను బంధించి నన్ను మైమరపించావు. కానీ నా జీవితంలో నాకు అత్యంత ఇష్టమైనది మన ప్రేమకథే అని బలంగా చెప్పగలను. లవ్ యూ బుమ్రా’ అంటూ మరో పోస్టును షేర్ చేసుకుంది. ఇక స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్తో బుమ్రాకు 2013లో పరిచయం అయ్యింది. ఆ పరిచయం తర్వాత ప్రేమగా మారింది. రెండేళ్లు డేటింగ్ చేసిన అనంతరం మార్చి 15, 2021న ఈ ఇద్దరు వివాహబంధంతో ఒక్కటయ్యారు. కాగా ఈ దంపతులకు 2023లో తొలి సంతానంగా కుమారుడు జన్మించాడు. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్లో బుమ్రా తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిచాడు. 9 మ్యాచ్ల్లో 14 వికెట్లు తీసి మరో భారత స్పిన్నర్ వరుణ్చక్రవర్తితో కలిసి సమానంగా అగ్రస్థానంలో నిలిచాడు. చదవండి: ‘ఎదురుచూపులకు తెర.. ఆరోజు వచ్చేసింది’ View this post on Instagram A post shared by S A N J A N A G A N E S A N (@sanjanaganesan) -
‘ఎదురుచూపులకు తెర.. ఆరోజు వచ్చేసింది’
క్రికెట్లో భారత్ ప్రపంచాన్ని శాసించడం చూడాలనుకున్న తన కల నెరవేరే సమయం ఆసన్నమైందని టీమిండియా మహిళా దిగ్గజ క్రికెటర్ మిథాలీరాజ్ అభిప్రాయపడింది. ఆదివారం బీసీసీఐ నమన్ అవార్డ్స్ సందర్భంగా మిథాలీరాజ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ఎంతోకాలంగా నేను ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. గ్లోబల్ క్రికెట్లో భారత్ అన్ని విభాగాల్లో తన పూర్తి ఆధిపత్యాన్ని కనబరుస్తూ వస్తోంది. గత రెండు మూడేళ్లలో పురుషుల జట్టు, మహిళల జట్టు, అండర్-19 జట్లు ట్రోఫీలు కొల్లగొట్టి భారత క్రికెట్ను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లడం జరిగింది. ఇక మహిళల క్రికెట్లోనూ గతంతో పోలిస్తే చాలా మార్పులు వచ్చాయి. ఇందుకు బీసీసీఐతో పాటు జైషాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పి తీరాల్సిందే. ముఖ్యంగా గత నాలుగైదేళ్లలో భారత మహిళల క్రికెట్ జట్టు ఎంతో పరిణితి చెందడంతో పాటు ఆటలోనూ దూకుడు పెరిగింది. భారత్లో మహిళల క్రికెట్కు ఆదరణ పెరగడానికి నన్ను అందరూ ఐకాన్గా చెప్పుకుంటున్నారు. కానీ నేను నిజానికి సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ సర్ల నుంచి ప్రేరణ పొంది ఇవాళ ఈ స్థాయిలో నిలిచాను. మహిళల జట్టుకు ప్రేరణ మాత్రం ఎప్పుడు పురుషుల జట్టే అని బలంగా చెప్పగలను.’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక భారత క్రికెట్ గత రెండు మూడేళ్లలో ఆర్థికంగా మరింత ఎత్తుకు ఎదిగింది. గత రెండేళ్లలో చూసుకుంటే పురుషుల జట్టు రెండుసార్లు, మహిళల జట్లు ఒకసారి, అండర్-19 జట్లు సైతం ఐసీసీ ట్రోఫీలు కొల్లగొట్టాయి. తొలుత 2024లో రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా 17 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ రెండోసారి టైటిల్ సాధించింది. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ను సూర్య సారథ్యంలో టీమిండియా మూడోసారి కైవసం చేసుకుంది. ఆ తర్వాతి ఏడాది మహిళల జట్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్ను తొలిసారి కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఇక అండర్-19లోనూ అటు పురుషులు, మహిళల విభాగంలో టీమిండియా చాంపియన్గా నిలిచింది.చదవండి: మెద్వదెవ్ను దెబ్బకొట్టిన సిన్నర్ -
అతడి ఆట అసాధారణం.. గంభీర్పై ద్రవిడ్ ప్రశంసలు
వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ను గెలుచుకున్న భారత జట్టును మాజీ కెప్టెన్, మాజీ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రత్యేకంగా అభినందించాడు. గత మూడు దశాబ్దాల్లో మన క్రికెట్ జట్టు ఎంతో పురోగతి సాధించి అత్యుత్తమ స్థాయికి చేరిందని అతను అభిప్రాయపడ్డాడు. మన దేశంలో ప్రతిభకు ఏనాడూ కొదవ లేదని, ఇప్పుడు అలాంటి ప్రతిభ ఫలితాలను అందించడం సంతోషంగా ఉందని ద్రవిడ్ అన్నాడు. భారత్ ఇటీవల వరుసగా సీనియర్, అండర్–19 విభాగాల్లో కలిసి ఐదు ఐసీసీ టోర్నీల్లో గెలుచుకున్న విషయాన్ని ‘ది వాల్’ గుర్తు చేశాడు. సూర్యకుమార్, గంభీర్ బృందంపై ప్రశంసలు‘మన దేశంలో ప్రతిభావంతులైన క్రికెటర్లను ఎప్పుడూ కొరత లేదు. మైదానం బయట వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలనూ బోర్డు అందించింది. అత్యుత్తమ మౌలిక సౌకర్యాలతో పాటు మంచి కోచ్లు, సరైన పరిపాలకులు ఉన్నారు. జూనియర్ స్థాయిలో, దేశవాళీ క్రికెట్లో మెరుగైన వ్యవస్థ ఉంది. కానీ కొన్నిసార్లు మైదానంలో ఆశించిన ఫలితాలు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం అంతా అద్భుతంగా సాగుతోంది. ప్రతిభకు తగిన విధంగా ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఇటీవల టీ20 వరల్డ్ కప్ను చూస్తే మన జట్టు ఫేవరెట్గా బరిలోకి దిగింది. ఈ ఒత్తిడి, సవాళ్లను అధిగమించి విజేతగా నిలవడం అంత సులువు కాదు. కానీ సూర్యకుమార్, గంభీర్ బృందం దానిని చేసి చూపించింది’ అని ద్రవిడ్ విశ్లేషించాడు. అతడి ఆట అసాధారణంసామ్సన్ గురించి బాగా తెలిసిన వ్యక్తిగా ద్రవిడ్ అతడిపై ప్రశంసలు కురిపించాడు. ‘సామ్సన్ వరల్డ్ కప్ చివరి మూడు మ్యాచ్లలో ఆడిన తీరు అసాధారణం. సుదీర్ఘ కాలంగా అతను టీమ్లో ఉన్నాడు. కొన్నిసార్లు బాగా ఆడినా మరికొన్ని సార్లు కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అలాంటి ఆటగాడు భారత్కు ఎంతో అవసరమైన కీలక సమయంలో సత్తా చాటి విజయంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది’ అని ద్రవిడ్ అన్నాడు. బీసీసీఐ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించడం పట్ల ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఎంతో మంది గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం రావడం, దేశానికి ప్రాతినిధ్యం వహించడం తనకు లభించిన గొప్ప గౌరవమని అతను స్పందించాడు. చదవండి: ‘ఇది ఆరంభం మాత్రమే’ -
‘అభిషేక్ను అందుకే వెనుకేసుకొచ్చా’
ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్లో అభిషేక్ శర్మ బ్యాటింగ్ వైఫల్యం పెద్ద చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. టోర్నీ ఆరంభ దశ నుంచి సెమీస్ వరకు అభిషేక్ డకౌట్లు లేదా తక్కువ స్కోర్లకే వెనుదిరిగాడు. అయినా కూడా కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం అభిషేక్కు అవకాశాలిస్తూ అతడికి వెన్నుదన్నుగా నిలుస్తూనే వచ్చాడు. మ్యాచ్ల్లో వరుసగా విఫలమవుతున్నా జట్టులో చోటు కల్పించడంపై విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే గంభీర్ మాత్రం అభిషేక్పై పూర్తి నమ్మకం పెట్టుకున్నాడు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ అభిషేక్ టీ20 ప్రపంచకప్ ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడి అంతకముందు తనపై వచ్చిన విమర్శలన్నింటికీ సమాధానం చెప్పాడు. ఎన్ని విమర్శలు వచ్చినా అభిషేక్ను వెనుకేసుకు రావడానికి గల కారణాన్ని కోచ్ గౌతమ్ గంభీర్ తాజాగా వెల్లడించాడు. ‘2014 ఐపీఎల్ సమయంలో నేను చాలా బ్యాడ్ఫేస్ను ఎదుర్కొన్నాను. అప్పట్లో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో వరుసగా మూడు డకౌట్లు కావడంతో విమర్శలు ఎదురయ్యాయి. ఒక ఆటగాడు పరుగులు చేయలేదంటే అతని స్కోర్ కంటే ఫామ్ గురించే మాట్లాడుకుంటారు. కానీ నిజానికి అభిషేక్ అక్కడ ఫామ్ కోల్పోలేదు.. కేవలం పరుగులు మాత్రమే చేయలేకపోతున్నాడు. ఇదే విషయాన్ని అతడికి వివరించాను. అయితే అభిషేక్ క్రీజులో ఉన్నంత సేపు ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తాడు. ఈ నేపథ్యంలోనే అతను తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాలని ఆరాట పడుతుంటాడు. కానీ ఒక బ్యాటర్ 20 నుంచి 30 బంతులు ఆడినప్పుడు మాత్రమే అతని ఫామ్ను అంచనా వేయగలం. అయితే అభిషేక్ పట్టుమని 20 బంతులు కూడా ఎదుర్కోలేదు. అందుకే అవకాశమొచ్చిన ప్రతీసారి మరింత అగ్రెసివ్గా ఆడాలని చెప్పేవాడిని. అదీగాక ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బంతిని గ్రౌండ్ అవతలికి పంపించాలనుకోవడం అభిషేక్ నైజం. ఇది ఒక రకంగా మంచిదే.అంతిమంగా బయట ఏమనుకుంటున్నారన్నది ముఖ్యం కాదు.. డ్రెస్సింగ్రూమ్లో అతడి గురించి ఏమీ ఆలోచిస్తున్నారన్నదే ఇక్కడ ముఖ్యం’ అని చెప్పుకొచ్చాడు. ఇక టీ20 ప్రపంచకప్లో మూడుసార్లు డకౌట్ అయిన అభిషేక్ శర్మ న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో మాత్రం 21 బంతుల్లో 52 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియా కప్ కొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. చదవండి: అభిషేక్ను చూసి అసూయపడేవారు! -
12 కోట్ల కారుతో తళుక్కుమన్న హార్దిక్
టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా జట్టులో సభ్యుడిగా ఉన్న ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కొత్త కారుతో దర్శనమిచ్చాడు. 12 కోట్ల విలువ చేసే ఫెరారీ 12 సిలిండ్రీ కారును తన గ్యారేజీలోకి తీసుకొచ్చాడు. నలుపు రంగులో ఉన్న ఫెరారీ కారును తానే సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చాడు. కారులో అతడి పక్కనే తన గర్ల్ఫ్రెండ్ మిహికా శర్మ కూడా ఉండడం గమనార్హం. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను క్రికెట్ అభిమాని తన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’ వేదికగా షేర్ చేయడంతో వైరల్గా మారింది. కాగా హార్దిక్ పాండ్యా వద్ద ఇప్పటికే రోల్స్ రాయ్స్ ఫాంటమ్, లంబోర్గిని హురాకాన్ ఈవీవో, లంబోర్గిని యూరస్, మెర్సిడెస్ -ఏజీఎం జీ63, రేంజ్ రోవర్., ఆడీ ఏ6 కార్లు ఉన్నాయి.తాజాగా వీటి సరసన ఫెరారీ కారు వచ్చి చేరింది. ఇక హార్దిక్ పాండ్యా టీ20 ప్రపంచకప్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. తొమ్మిది మ్యాచ్ల్లో 160 స్ట్రైక్రేట్ 217 పరుగులు సాధించాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. బౌలింగ్లోనూ తన ప్రతిభ చూపిన హార్దిక్ 9 వికెట్లు పడగొట్టి తన పాత్రకు న్యాయం చేశాడు. అయితే టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమిండియా విజయోత్సవాలు చేసుకుంటున్న సందర్భంలో హార్దిక్ పాండ్యా జాతీయజెండాను శరీరానికి కప్పుకొని ఉన్న సమయంలోనే అతడి ప్రేయసి మిహికా శర్మ అతని చెంపపై ముద్దులు పెట్టడం వివాదాస్పదంగా మారింది. పాండ్యా జాతీయ జెండాను అవమానించాడని పుణేకు చెందిన వాజిద్ ఖాన్ అనే అడ్వకేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.చదవండి: తంజిద్ తొలి శతకం.. బంగ్లా భారీస్కోరు! Hardik Pandya’s new Ferrari 12Cilindri worth 12cr. pic.twitter.com/QovLNVB8kY— Mufaddal Vohra (@mufaddal_vohra) March 15, 2026 -
అభిషేక్ను చూసి అసూయపడేవారు!
టీమిండియా స్టార్ ఆటగాడు సంజూ శాంసన్ ఆల్రౌండర్ అభిషేక్ శర్మతో ఉన్న స్నేహ బంధాన్ని బయటపెట్టాడు. ఇండియా టుడే కాన్క్లేవ్ వేదికగా శాంసన్ అభిషేక్తో ఉన్న కెమిస్ట్రీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తమది నిప్పు-నీరు కాంబినేషన్ కాదని, ఇద్దరం నిప్పుకణికలమేణని శాంసన్ పేర్కొన్నాడు.అభిషేక్ పట్ల భారత ఆటగాళ్లు అసూయ పడేవారని తెలిపాడు.‘మేమిద్దరం ఐస్ అండ్ ఫైర్ కాదు.. ఫైర్ అండ్ ఫైర్. ఒకసారి అభిషేక్ మెరిస్తే, మరోసారి నేను మెరుస్తాను. 2024 నుంచే మా కాంబినేషన్ అలా కొనసాగుతూ వస్తోంది. దీనికి తోడు కేరళ-పంజాబ్ ఫ్రెండ్షిప్ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. మా మధ్య బంధం అంతా సహజంగా సాగిపోతుంది. దానిని కాంప్లికేట్ చేయదలచుకోలేదు. ఇక మైదానంలో మేమిద్దరం కలిసి బరిలోకి దిగినప్పుడు అభిషేక్ బంతి ఎలా వస్తుంది అని అడుగుతాడు. దానికి నేను సాధారణంగా వస్తుంది అని చెప్పడం, ఆ మరుసటి బంతిని అభిషేక్ సిక్స్ కొట్టడం జరిగిపోతాయి. పెళ్లి చేసుకో భాయ్..అభిషేక్ శర్మ చాలా ధైర్యవంతుడు, సమర్థుడు. మైదానం లోపల, వెలుపల అభిషేక్తో మంచి అనుబంధముంది. అయితే అభిషేక్ శర్మీ టీమిండియాకు ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో భారత ఆటగాళ్లే అతన్ని చూసి అసూయ పడేవారు. ఎందుకంటే అప్పట్లో ఎక్కడ చూసినా అభిషేక్.. అభిషేక్ అని వినిపిస్తుండేది. ఒకప్పుడు అభిషేక్ సాధారణ ఆటగాడు కావొచ్చు.. కానీ ఇప్పుడు అతనొక సూపర్స్టార్. అందుకే త్వరగా పెళ్లి చేసుకో బాయ్ అని సలహా ఇచ్చాను.’ అని పేర్కొన్నాడు. ఇక టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా వచ్చి విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. తొలి వికెట్కు 98 పరుగులు జోడించడంతో భారత్ 255 పరుగుల భారీ స్కోరు చేయడం, ఆపై న్యూజిలాండ్ 159 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 96 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్ను అందుకుంది.ఇద్దరి కథ ఒకటే..అయితే టీ20 ప్రపంచకప్ ఆరంభంలో ఇద్దరి కథ దాదాపు ఒకటే అని చెప్పొచ్చు. ఫామ్ కోల్పోయి అభిషేక్ శర్మ సతమతమవ్వగా, శాంసన్ కూడా అభిషేక్ స్థానంలో తొలుత వచ్చిన అవకాశాలను వృథా చేసుకోవడం జరిగింది. ఈ ఇద్దరు విఫలమైతున్నా కూడా జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారన్న విమర్శలు పెరిగిపోయాయి. అయితే సూపర్-8లో వెస్టిండీస్తో మ్యాచ్లో ఫామ్ను అందుకున్న శాంసన్ దానిని ఫైనల్ వరకు అలాగే కొనసాగించి విమర్శకుల నోళ్లు మూయించాడు. మరోవైపు అభిషేక్పై నమ్మకంతో జట్టు మేనేజ్మెంట్ వరుసగా అవకాశాలు ఇస్తూనే వచ్చింది. చివరకు ఫైనల్లో అభిషేక్ శర్మ తన మార్క్ ఆటతో అలరించడమే గాక టీమిండియా టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. -
ఐదేళ్ల ప్రయాణం.. దిగ్గజాల సరసన సూర్యా భాయ్!
క్రికెట్ అభిమానులంతా అతడిని ముద్దుగా మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ అని పిలుస్తుంటారు. ప్రత్యర్థి బౌలర్ ఏ యాంగిల్లో బంతి వేసినా బౌండరీ లేదా సిక్సర్ బాదడం అతడి నైజం. దూకుడైన ఆటతీరుకు మారుపేరు. ఐదేళ్లలో రెండు టీ20 ప్రపంచకప్లు గెలిచిన టీమిండియా జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. ఇందులో ఒకసారి కెప్టెన్గా ఐసీసీ టైటిల్ అందుకొని దిగ్గజాల సరసన నిలిచి అరుదైన ఘనత సాధించాడు. అతడే భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. మార్చి 14 (శనివారం)తో సూర్యకుమార్ తన క్రికెట్ కెరీర్లో ఐదేళ్ల ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ టీమిండియాతో ఐదేళ్ల ప్రయాణాన్ని తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నాడు. ‘ఐదేళ్ల ఏళ్ల క్రితం టీమిండియాకు ఆడాలన్న ఒక కల నిజమైంది. భారత జెర్సీని ధరించడమనేది ఇప్పటికీ నేను మాటల్లో పూర్తిగా వర్ణించలేని ఒక అద్భుతమైన అనుభూతి. ఈ నేపథ్యంలో ఒక ఆటగాడిగా, జట్టు కెప్టెన్గా నేను పొందిన జ్ఞాపకాలను మరోసారి పంచుకుంటున్నా.’ అంటూ ట్వీట్ చేశాడు.టీ20 క్రికెట్లో భారత తరఫున అత్యుత్తమ ఆటగాడిగా పేరు పొందిన సూర్యకుమార్ యాదవ్ 30 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడం విశేషం. మార్చి 14, 2021లో ఇంగ్లండ్తో మ్యాచ్ ద్వారా సూర్య తన కెరీర్లో తొలి టీ20 మ్యాచ్ ఆడాడు. సూర్యకుమార్ ఇప్పటివరకు టీమిండియా తరఫున 113 టీ20 మ్యాచ్లు ఆడి 162.94 స్ట్రైక్రేట్తో 3,272 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలతో పాటు 25 అర్థసెంచరీలున్నాయి.ప్రస్తుతం సూర్యకుమార్ టీ20 క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. తొలి రెండు స్థానాల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు. ఈ ఇద్దరు 2024 టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలో సభ్యుడిగా ఉన్న సూర్యకుమార్ ఆ ప్రపంచకప్లో సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో చివరి ఓవర్లో బౌండరీ వద్ద క్యాచ్ అందుకోవడం ఎన్నటికీ మరిచిపోలేని సంఘటన. సూర్య క్యాచ్ అందుకోవడంతో మ్యాచ్ భారత్వైపు తిరగడం, ఆ తర్వాత టీమిండియా టైటిల్ గెలవడం చకచకా జరిగిపోయాయి.రోహిత్ శర్మ రిటైర్మెంట్ అనంతరం కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న సూర్యకుమార్ జట్టును విజయపథంలో నడిపించడంలో విజయవంతమయ్యాడు. ఇప్పటివరకు సూర్య సారథ్యంలో 40 మ్యాచ్ల్లో గెలిచి, కేవలం ఎనిమిదింట మాత్రమే ఓడిపోయింది. అంతేకాదు టీ20 క్రికెట్లో సూర్య చేసిన నాలుగు సెంచరీలు నాలుగు వివిధ దేశాల్లో (భారత్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్) రావడం విశేషం. 2022 ఏడాదిలో సూర్యకుమార్ టీమిండియా తరఫున 31 మ్యాచ్ల్లో 187 స్ట్రైక్రేట్తో 1164 పరుగులు సాధించాడు. పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్లో వెయ్యికి పైగా పరుగులు సాధించిన తొలి భారత క్రికెటర్గా సూర్య రికార్డులకెక్కాడు. చదవండి: తూచ్.. అదంతా ఉత్తిదే!5 years ago, a dream turned into reality. Wearing the India jersey is a feeling I can still never fully put into words 🇮🇳Here’s to many more memories that we’re going to create, for team 🇮🇳 pic.twitter.com/qhis2f44tQ— Surya Kumar Yadav (@surya_14kumar) March 14, 2026 -
‘సౌతాఫ్రికా ఒక తెలివితక్కువ టీమ్’
టీ20 ప్రపంచకప్లో సౌతాఫ్రికా కంటే తెలివితక్కువ జట్టు మరొకటి లేదని ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్ అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోయి ఉంటే బలమైన టీమిండియా సెమీస్లో అడుగుపెట్టి ఉండేది కాదని, టైటిల్ గెలిచేది కాదని పేర్కొన్నాడు.‘మీకో విషయం చెప్పదలచుకున్నా. టీ20 ప్రపంచకప్లో (T20 World Cup 2026) తెలివితక్కువ జట్టు కచ్చితంగా దక్షిణాఫ్రికానే. ఎందుకంటే సూపర్-8లో భాగంగా వెస్టిండీస్తో మ్యాచ్లో సౌతాఫ్రికా ఓడిపోయి ఉంటే భారత్ టోర్నీ నుంచే నిష్క్రమించేది. కానీ విండీస్తో మ్యాచ్లో గెలిచిన సౌతాఫ్రికా ఒక రకంగా భారత్కు వరల్డ్కప్లో కొనసాగేందుకు అవకాశం కల్పించింది. కానీ సఫారీల చేతిలో ఓటమి చవిచూసిన టీమిండియా వరుసగా వెస్టిండీస్, జింబాబ్వేలను మట్టికరిపించి సెమీస్లో అడుగుపెట్టింది. నాకౌట్ పోరులో ఇంగ్లండ్ను ఓడించి ఫైనల్కు చేరుకుంది. ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలిసిందే. కానీ సౌతాఫ్రికా ఆ తప్పు చేయకపోయి ఉంటే బాగుండేది. వాస్తవానికి ఇలాంటివి జరగకూడదు. మీరు ప్రపంచకప్ గెలవాలనుకుంటే ఉత్తమ జట్టును తొందరగానే టోర్నీ నుంచి బయటకు పంపాలి’ అని వాన్ చెప్పుకొచ్చాడు.అయితే ఇంగ్లండ్ మాజీపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం.. స్వలాభం కోసం ఓడిపోవడం సరైన చర్య కాదు’.. ‘సౌతాఫ్రికాకు ఈసారి వరల్డ్కప్ గెలిచే అవకాశం చేజార్చుకుంది. ఒకవేళ సెమీస్ చేరినా ఆ జట్టు ఫైనల్ చేరకపోయి ఉండేదేమో’ అని కామెంట్స్ చేశారు. ఇక సూపర్-8లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 76 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. దీంతో నెట్ రన్రేట్ మైనస్కు పడిపోవడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. సెమీస్ అవకాశాలు కష్టంగా ఉన్నప్పటికీ వెస్టిండీస్, జింబాబ్వేలపై అద్భుతంగా ఆడిన భారత్ విజయాలతో సెమీస్ చేరింది. సెమీస్లో ఇంగ్లండ్తో భారత్ తలపడింది. కానీ ఛేదనలో ఇంగ్లండ్ వణుకు పుట్టించినప్పటికీ చివరకు గట్టెక్కిన భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ పోరు మాత్రం వన్సైడ్గా మారిపోయింది. మొదట బ్యాటింగ్లో సంజూ శాంసన్, ఆ తర్వాత బౌలింగ్లో బుమ్రాల రాణింపుతో టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్కప్ను, మొత్తంగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది.చదవండి: లార్డ్స్ స్టేడియంలో బీర్లు బంద్! -
రోహిత్-కోహ్లి అభిమానులకు శుభవార్త
భారత దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త అందుతుంది. 2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా క్రికెట్లో కొనసాగుతున్న రో-కోకు ఆ మెగా టోర్నీకి ముందు అదనపు వన్డేలు ఆడే ఆస్కారమున్నట్లు తెలుస్తుంది. ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్లో (FTP) షెడ్యూలైన మ్యాచ్లకు అదనంగా కొన్ని దేశాలు భారత్తో వన్డేలు ఆడేందుకు బీసీసీఐని సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఏడాది భారత్ షెడ్యూల్ కిక్కిరిసిపోయింది. అదనంగా మ్యాచ్లు అంటే అభిమానులకు పండగే. శ్రీలంక, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఐర్లాండ్ దేశాల క్రికెట్ బోర్డులు అదనపు మ్యాచ్ల కోసం బీసీసీఐని అభ్యర్థిస్తున్నట్లు తెలుస్తుంది.కొద్ది రోజుల కిందటే టీ20 ప్రపంచకప్ ముగిసిన విషయం తెలిసిందే. మార్చి 28 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రెండు నెలలకు పైగా ప్రపంచ క్రికెటర్లంతా బిజీగా ఉంటారు. టీమిండియా అంతర్జాతీయ షెడ్యూల్ జూన్లో ఆఫ్ఘనిస్తాన్ సిరీస్తో మొదలవుతుంది.అనంతరం జులై 1 నుంచి భారత జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం ఇంగ్లండ్లో పర్యటించాల్సి ఉంది. ఈ మధ్యలోనే ఐర్లాండ్ జట్టు టీమిండియాతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం అభ్యర్థిస్తుందట. ఈ విషయం పట్ల బీసీసీఐ కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తుంది.ఆతర్వాత భారత జట్టు ఆగస్టు–సెప్టెంబర్ నెలల్లో టెస్ట్, టీ20 సిరీస్ల కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. ఇది కాకుండా శ్రీలంక జట్టు ఈ ఏడాది చివర్లో భారత్తో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం రిక్వెస్ట్ చేస్తుందని తెలుస్తుంది.ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తుంది. ఇందులో 2 టెస్ట్లు, 3 వన్డేలు, 5 టీ20లు షెడ్యూల్ అయ్యాయి. వీటికి అదనంగా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మరిన్ని వన్డేలు ఆడాలని బీసీసీఐని కోరుతుంది.వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ఇంగ్లండ్ కూడా భారత్తో అదనపు వన్డే సిరీస్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇవే కాక బంగ్లాదేశ్, జింబాబ్వే లాంటి చిన్న జట్లతో పరిమిత ఓవర్ల సిరీస్లు కూడా FTPకి అదనంగా ప్రోగ్రెస్లో ఉన్నట్లు తెలుస్తుంది.మొత్తానికి 2027 వన్డే ప్రపంచకప్కు సన్నద్దం కావాలనుకుంటున్న విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు మెగా టోర్నీకి ముందు వీలైనన్ని వన్డేలు ఆడే అవకాశం దొరికేలా ఉంది. ఇది వారివారి అభిమానులకు పండగే. రో-కో టెస్ట్, టీ20లకు వీడ్కోలు పలికి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్ వచ్చే ఏడాది సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికగా అక్టోబర్, నవంబర్ నెలల్లో జరుగనుంది. ఈ లోపు రో-కో పదుల సంఖ్యలో వన్డేలు ఆడే అవకాశం ఉంటుంది. దీని వల్ల దిగ్గజాలు మరిన్ని రికార్డులు బద్దలు కొట్టి, అభిమానుల గుండెల్లో తమ స్థానాలను మరింత సుస్థిరం చేసుకుంటారు.ఐపీఎల్ 2026 అనంతరం టీమిండియా షెడ్యూల్ (అంచనా)..ఆఫ్ఘనిస్తాన్తో 3 వన్డేలు, ఓ టెస్ట్ఐర్లాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లకు సన్నాహాలు జరుగుతున్నాయిఇంగ్లండ్తో 3 వన్డేలు, 5 టీ20లు (అదనపు మ్యాచ్లపై ఆసక్తి)శ్రీలంకతో 3 టీ20లు, 2 టెస్ట్లుబంగ్లాదేశ్తో 3 వన్డేలు, 3 టీ20లు (ప్రభుత్వ అనుమతి అవసరం)ఆఫ్ఘనిస్తాన్తో 3 టీ20లుజింబాబ్వే టీ20 సిరీస్కు సన్నాహాలు జరుగుతున్నాయివెస్టిండీస్తో 3 వన్డేలు, 5 టీ20లుఆసియా క్రీడలున్యూజిలాండ్తో 3 వన్డేలు, 5 టీ20లు, 2 టెస్ట్లు (అదనంగా 2 వన్డేలకు అభ్యర్థన)శ్రీలంకతో 3 వన్డేలు, 3 టీ20లుఆస్ట్రేలియాతో 5 టెస్ట్లు -
అతడిని తప్పించమని ధోని చెప్పలేదు: మాజీ చీఫ్ సెలక్టర్
టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీలో భారత్ను విజేతగా నిలిపిన సారథి.యువీదే కీలక పాత్రఇక ధోని కెప్టెన్సీలో 2007, 2011 ప్రపంచకప్ టోర్నీలు గెలిచిన టీమిండియాలో భారత ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ సభ్యుడన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్ గెలవడంలో అతడిది కీలక పాత్ర. ఈ ఐసీసీ ఈవెంట్లో 363 పరుగులు చేయడంతో పాటు యువీ పదిహేను వికెట్లు కూడా తీశాడు.అదే సమయంలో యువీ క్యాన్సర్ బారిన పడినట్లు తేలగా చాన్నాళ్లు జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత కోలుకుని రీఎంట్రీ ఇచ్చినప్పటికీ 2019 వన్డే వరల్డ్కప్ జట్టులో చోటు దక్కకపోవడంతో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.తన కుమారుడి కెరీర్ నాశనమైందని.. ఈ పరిణామాల నేపథ్యంలో యువీ తండ్రి యోగ్రాజ్ సింగ్ (Yograj Singh) ఎల్లప్పుడూ ధోనిని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ధోని వల్లే తన కుమారుడి కెరీర్ నాశనమైందని.. అతడే జట్టులో యువీకి స్థానం లేకుండా చేశాడని తీవ్రమైన ఆరోపణలు చేశాడు. యువీ మీద అసూయతోనే ధోని ఇలా చేశాడని ఆరోపించాడు.ఈ క్రమంలో యోగ్రాజ్ సింగ్ ఆరోపణలపై టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ తాజాగా స్పందించాడు. యువీ విషయంలో ధోని ఏనాడూ వివక్ష చూపలేదని.. అతడిని జట్టు నుంచి తప్పించాలని ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశాడు.ధోని ఏనాడూ చెప్పలేదు..ఈ మేరకు విక్కీ లల్వాణీ షోలో మాట్లాడుతూ.. ‘‘సెలక్షన్ కమిటీ సమావేశాలు.. లేదంటే విదేశీ పర్యటనలు.. అదీ కాదంటే మ్యాచ్ల సందర్భంగా .. ఇలా ఎప్పుడూ కూడా.. ఏ సందర్భంలోనూ యువరాజ్ సింగ్ను జట్టు నుంచి తప్పించమని మహేంద్ర సింగ్ ధోని ఏనాడూ చెప్పలేదు.నా మాటలను రికార్డు చేసి పెట్టండి. ధోని ఏనాడూ ఏ ఆటగాడి గురించి చెడుగా చెప్పలేదు. అతడికి సెలక్షన్ కమిటీ నిర్ణయంపై పూర్తి నమ్మకం ఉండేది’’ అని యువీ విషయంలో నాడు సెలక్టర్లదే తుది నిర్ణయం అని సందీప్ పాటిల్ పేర్కొన్నాడు. ఇక ఓ తండ్రిగా యోగ్రాజ్ ఆవేదనలో తప్పు లేదని.. అయితే, కుమారుడి మీద ప్రేమతో మరొకరిని నిందించడం తగదని హితవు పలికాడు.చదవండి: T20 WC 2026: ‘అతడిపై వేటు నా నిర్ణయమే.. నాపై కోప్పడ్డాడు’ -
అతడిని ఎందుకు సెలక్ట్ చేయట్లేదు: గంగూలీ
టీ20 ప్రపంచకప్ టోర్నీలో తిరుగులేని జట్టుగా టీమిండియా ఆధిపత్యం కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ సారథ్యంలో 2024లో చాంపియన్గా నిలిచిన భారత్.. తాజాగా సూర్యకుమార్ కెప్టెన్సీలో సొంతగడ్డపై 2026 టైటిల్ గెలిచింది. ఈ రెండు సీజన్లలో కలిపి మొత్తంగా 17 మ్యాచ్లు ఆడిన టీమిండియా ఏకంగా 16 గెలిచింది.వరుసగా రెండోసారి పొట్టి క్రికెట్ వరల్డ్కప్ ట్రోఫీ గెలిచిన ఏకైక జట్టుగానూ చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ఫార్మాట్లో భారత్కు రెండు జట్లు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.రెండు జట్లు ఉంటే‘‘ఒకవేళ బుమ్రా ఫిట్గా ఉండి.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కూడా అందుబాటులో ఉంటే భారత్ మరో జట్టు ఏర్పాటు చేసుకోవచ్చు. టీ20 ప్రపంచకప్ ఆడేందుకు ఓ జట్టు ఉండాలి. నిజానికి కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్ వంటి వాళ్లకు టీ20 ఫార్మాట్లో అవకాశాలే రావడం లేదు.అతడిని ఎందుకు సెలక్ట్ చేయట్లేదుఇక వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచంలోని ఏ జట్టులోనైనా సరే అతడికి చోటు ఉంటుంది. శ్రేయస్ అయ్యర్ విషయానికి వస్తే.. ఇప్పటికీ అతడు భారత టీ20 జట్టులోకి రాలేకపోతున్నాడు. అతడికి అసలు ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదో నాకైతే ఇంత వరకు అర్థం కావడమే లేదు.అయ్యర్ విషయంలో యాజమాన్యం వైఖరి నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక బౌలర్ల విషయానికొస్తే ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్లకు కూడా టీ20లలో ఆడే అవకాశం రావడం లేదు. లెక్కకు మిక్కిలి ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి భారత్ రెండు టీ20 జట్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది’’ అని గంగూలీ రెవ్స్పోర్ట్స్తో పేర్కొన్నాడు.విజయవంతమైన కెప్టెన్, ఆటగాడిగాకాగా శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో విజయవంతమైన కెప్టెన్, ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 2024లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా టైటిల్ గెలిచిన అయ్యర్.. గతేడాది పంజాబ్ కింగ్స్ సారథిగా జట్టును ఫైనల్కు చేర్చాడు. ఇక ఈ రెండు సీజన్లలో కలిపి ఏకంగా దాదాపు 950 పరుగులు సాధించాడు. అయితే, టీ20 జట్టులో ఖాళీ లేకపోవడం వల్లే శ్రేయస్ అయ్యర్కు చోటు ఇవ్వలేకపోతున్నామని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.చదవండి: సచిన్ రిటైర్మెంట్ వెనుక అసలు కథ.. -
హండ్రెడ్ లీగ్ వేలం.. టీమిండియా ప్లేయర్లపై కనకవర్షం
ఇంగ్లండ్ వేదికగా జరిగే ది హండ్రెడ్ క్రికెట్ లీగ్లో తొలిసారి వేలం జరుగుతుంది. 2026 సీజన్ కోసం ఇవాళ (మార్చి 11) మహిళల విభాగం ఆక్షన్ నడుస్తుంది. ఈ వేలంలో మొత్తం 8 ఫ్రాంచైజీలు 178 మంది ప్లేయర్ల కోసం పోటీపడుతున్నారు. ఇప్పటికే కొందరు ప్లేయర్లను రిటైన్, డైరెక్ట్ సైనింగ్ చేసుకోగా.. మిగతా ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు వేలంలో పోటీపడుతున్నాయి.ఈ వేలంలో భారత మహిళా క్రికెటర్లు దీప్తి శర్మ, రిచా ఘోష్పై కనకవర్షం కురిసింది. రిచాను మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ రూ. 61.73 లక్షలకు దక్కించుకోగా.. స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మను సన్రైజర్స్ లీడ్స్ రూ. 33.96 లక్షలకు సొంతం చేసుకుంది. మరికొంతమంది భారత క్రికెటర్లు ఆరంభ రౌండ్లలో అన్సోల్డ్గా మిగిలిపోయారు. యస్తికా భాటియా, శ్రీచరణిపై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. శ్రేయాంక పాటిల్, పూజా వస్త్రాకర్, కశ్వీ గౌతమ్, శిఖా పాండే, అరుంధతి రెడ్డి, నందిని శర్మ, ఆశా శోభన, రాధా యాదవ్ ఇంకా వేలానికి రాలేదు. ఈ వేలంలో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ పాల్గొనడం లేదు. స్టార్ ప్లేయర్లు స్మృతి మంధన, జెమీమా రోడ్రిగ్స్ను వేర్వేరు ఫ్రాంచైజీలు ప్రీ సైనింగ్ చేసుకున్నాయి.ఫ్రాంచైజీలు రీటైన్, ప్రీ సైనింగ్ చేసుకున్న ప్లేయర్లు..మాంచెస్టర్ సూపర్ జెయింట్స్: సోఫీ ఎక్లెస్టోన్ (రీటైన్) స్మృతి మంధన, మెగ్ లాన్నింగ్ (ప్రీ సైనింగ్)లండన్ స్పిరిట్: గ్రేస్ హారిస్, చార్లీ డీన్ (రీటైన్), మారిజాన్ కాప్, మహికా గౌర్ (ప్రీ సైనింగ్)బర్మింగ్హామ్ ఫీనిక్స్: ఎల్లీస్ పెర్రీ (రీటైన్), ఆలిస్ కాప్సే, లూసీ హామిల్టన్, లారెన్ ఫైలర్ (ప్రీ సైనింగ్)ఎంఐ లండన్: హేలీ మాథ్యూస్, డాని వ్యాట్-హాడ్జ్, మెలీ కెర్ ప్రీ సైనింగ్)సదరన్ బ్రేవ్: లారా వోల్వార్డ్, లారెన్ బెల్, మైయా బౌచియర్ (రీటైన్), జెమిమా రోడ్రిగ్స్ (ప్రీ సైనింగ్)సన్రైజర్స్ లీడ్స్: కేట్ క్రాస్, అన్నాబెల్ సదర్లాండ్, ఫోబ్ లిచ్ఫీల్డ్ (రీటైన్)ట్రెంట్ రాకెట్స్: నాట్ స్కైవర్-బ్రంట్, యాష్ గార్డ్నర్ (రీటైన్), సోఫియా డంక్లీ, కిమ్ గార్త్ (ప్రీ సైనింగ్)వెల్ష్ ఫైర్: జార్జియా వేర్హమ్, ఫ్రెయా కెంప్, జార్జియా వోల్ (ప్రీ సైనింగ్)కాగా, రేపు (మార్చి 12) పురుషుల విభాగంలో వేలం జరుగనుంది. -
IPL 2026: కోహ్లీ ప్రాక్టీస్.. ఐపీఎల్ జరుగుతుందా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ప్రారంభ తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మాత్రం తన ప్రాక్టీస్ను మొదలుపెట్టాడు. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్బీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లీ తాజాగా ఐపీఎల్ కోసం నెట్స్లో తీవ్రంగా కసరత్తులు చేస్తున్న వీడియోనూ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. ‘ఐపీఎల్ 2026’ అని క్యాప్షన్ మాత్రమే జత చేసినప్పటికీ కోహ్లీ ప్రాక్టీస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెట్స్లో బరిలోకి దిగిన కోహ్లీ చేతికి గ్లోవ్స్, తలకు హెల్మెట్ పెట్టుకొని బరిలోకి దిగడం, బ్యాటింగ్ ప్రాక్టీస్లో కొన్ని అద్భుతమైన షాట్లు ఆడడం ముగ్ధమనోహరంగా అనిపించింది. కోహ్లీ చివరిసారిగా గత జనవరిలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ఆడాడు. ఆ సిరీస్లో కోహ్లీ ఒక సెంచరీ, అర్థసెంచరీ సాయంతో టీమిండియా తరఫున టాప్ స్కోరర్గా నిలిచినప్పటికీ భారత్ మాత్రం 1-2 తేడాతో కివీస్కు సిరీస్ కోల్పోయింది. ఇక ఐపీఎల్ 2025 విజేతగా ఆర్సీబీ నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సీజన్లో కోహ్లీ 144 స్ట్రైక్రేట్తో 657 పరుగులు సాధించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుకు కొనసాగుతూ వచ్చిన కోహ్లీ మొత్తంగా ఐపీఎల్లో 8,661 పరుగులు సాధించాడు. ఇక గతేడాది తొలిసారి టైటిల్ సాధించిన బెంగళూరు జట్టు ఈసారి కూడా టైటిల్ గెలవాలన్న కృతనిశ్చయంతో ఉంది. మార్చి 28 నుంచి ఐపీఎల్ 18వ సీజన్ షురూ కావాల్సి ఉన్నప్పటికీ బీసీసీఐ ఇప్పటికీ షెడ్యూల్ విడుదల చేయకపోవడం గమనార్హం. అయితే దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఈసారి ఐపీఎల్ను రెండు విడతల్లో నిర్వహించాలని ఇప్పటికే ఐపీఎల్ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. కానీ పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా విమాన సర్వీసుల రద్దుతో విదేశీ ఆటగాళ్ల ప్రయాణాలకు ఇబ్బంది ఏర్పడడం, ఎల్పీజీ సంక్షోభంతో బెంగళూరు, ముంబైలో హోటళ్లు మూతపడడం లాంటి కారణాల వల్ల అసలు అనుకున్న సమయానికి ఐపీఎల్ సీజన్ ప్రారంభమవుతుందా లేక వాయిదా పడుతుందా అన్నది చూడాలి.చదవండి: స్లో బంతుల వెనుక 16 ఏళ్ల కథ! View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
స్లో బంతుల వెనుక 16 ఏళ్ల కథ!
జస్ప్రీత్ బుమ్రా.. పరిచయం అక్కర్లేని పేరు. కొత్త, పాత బంతి అనే తేడా లేకుండా తన వైవిధ్యమైన బౌలింగ్ యాక్షన్తో డెత్ ఓవర్ల బౌలింగ్ స్పెషలిస్ట్గా తయారయ్యాడు. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్లో లీడింగ్ వికెట్ టేకర్గా నిలవడమే గాక జట్టు టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా ఇంగ్లండ్తో సెమీఫైనల్, న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ సందర్భంగా డెత్ ఓవర్లలో తన విలువేంటో మరోసారి నిరూపిస్తూ భారత్ను చాంపియన్గా నిలిపాడు. తనకు మాత్రమే సాధ్యమైన స్లో డెలివరీలతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టడమే గాక వికెట్లు పడగొట్టడంలోనూ విజయ వంతమయ్యాడు. మరి బుమ్రా స్లో బంతుల వెనుక దాగున్న కథాకమీషును ఒకసారి పరిశీలిద్దాం. బుమ్రా స్లో డెలివరీ కథ తెలియాలంటే 16 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిన అవసరముంది.అహ్మదాబాద్ వేదికగా కిషోర్ త్రివేదీ క్రికెట్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. 16 ఏళ్ల వయసులో బుమ్రా తొలిసారి త్రివేదీ కోచింగ్ సెంటర్కు వచ్చాడు. అయితే ఆ సమయంలో బుమ్రాకు క్రికెట్ పట్ల ఇంట్రెస్ట్ చూపేవాడు కాదు. కానీ అతని బౌలింగ్లో ఏదో తెలియని వైవిధ్యాన్ని కిశోర్ త్రివేదీ ఆనాడే కనిపెట్టాడు. బుమ్రా బంతులు వేయడానికి ముందు రనప్కు కొంత దూరమే తీసుకోవడం.. కొంత పరిగెత్తడం, కొంత నడవడం చేయడం వింతగా అనిపించింది. అంతేకాదు బంతిని బాగా బౌన్స్ వేసేవాడు. దీంతో కిశోర్ త్రివేది కోచింగ్ సెంటర్లో ఉన్న మిగతా పిల్లలు బుమ్రా బౌలింగ్ చూసి భయపడిపోయేవారు. బంతిని విడుదల చేసే పాయింట్ క్లిష్టంగా ఉండడంతో ఇతర పేసర్ల మాదిరిగా కాకుండా కాస్త భిన్నంగా ఉండడంతో బ్యాటర్లు తరచూ ఇబ్బంది పడేవారు. కోచ్ మాటలు పాటించి..బౌన్సర్లు తగ్గించి స్వింగ్, యార్కర్లపై దృష్టి పెడితే భవిష్యత్తులో మంచి బౌలర్గా ఎదిగే అవకాశముంటుందని కోచ్ కిశోర్ బుమ్రాకు సలహా ఇచ్చాడు. కోచ్ మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చిన బుమ్రా కాలక్రమంలో తన బౌలింగ్లో బౌన్సర్లు తగ్గించుకొని యార్కర్లు ఎక్కువగా వేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత బంతిని స్వింగ్ చేసే కళను కూడా ఒంటబట్టించుకున్నాడు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన బుమ్రా తన మీడియం స్లో బౌలింగ్తో చేస్తున్న అద్భుతాలను కళ్లారా చూస్తూనే ఉన్నాం.తొలి పరిచయం!బుమ్రా వైవిధ్యమైన బౌలింగ్ యాక్షన్పై అతని చిన్ననాటి కోచ్ కిశోర్ త్రివేది స్పందించారు. ‘16 ఏళ్ల వయసులో బుమ్రాను తొలిసారి చూశాను. చూసినప్పుడే బుమ్రా బౌలింగ్లో ఒక వైవిధ్యత కనిపించింది. బౌలింగ్ యాక్షన్ మార్చుకోమని ఆనాడే చెప్పి ఉంటే బుమ్రా ఇవాళ ఒక సాధారణ స్థాయి బౌలర్గా మిగిలిపోయేవాడు. బుమ్రాది ఒక యూనిక్ బౌలింగ్ యాక్షన్. స్లో ఆర్థడాక్స్ను మీడియం బౌలింగ్కు మిక్స్ చేస్తూ బంతులను విడుదల చేయడం కాస్త కఠినతరంగా ఉంటుంది. కానీ బుమ్రా దీనిని చక్కగా ఒంటబట్టించుకున్నాడు. బుమ్రాకు అది సహజత్వంగా రావడంతో బౌన్స్ను తగ్గించుకొని యార్కర్లపై దృష్టి సారించాలని చెప్పాను. ఇవాళ బుమ్రా స్థాయి ఏంటో మీ అందరికీ తెలిసిందే’ అంటూ పేర్కొన్నారు.ఇటీవల టీ20 ప్రపంచకప్లో బుమ్రా 8మ్యాచ్లాడి 14 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా బుమ్రా తన అంతర్జాతీయ కెరీర్లో 52 టెస్టుల్లో 234 వికెట్లు, 89 వన్డేల్లో 149 వికెట్లు, 95 టీ20ల్లో 121 వికెట్లు పడగొట్టాడు. 2024, 2026 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులోనూ బుమ్రా సభ్యుడిగా ఉన్నాడు. -
ఊహకందని విధంగా పెరిగిన బీసీసీఐ నజరానా
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రపంచకప్ విజేతకు నగదు బహుమతి ప్రకటించే సంప్రదాయాన్ని కొనసాగించింది. తాజాగా 2026 టీ20 ప్రపంచకప్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టుకు రూ. 131 కోట్లు రివార్డుగా ప్రకటించింది. ఈ మొత్తం 2007 పొట్టి ప్రపంచకప్ విజేత అయిన నాటి టీమిండియాతో పోలిస్తే ఏకంగా 1091.67 శాతం ఎక్కువ.2007 పొట్టి ప్రపంచకప్ గెలిచినప్పుడు ధోని నేతృత్వంలోని భారత జట్టుకు బీసీసీఐ రూ. 12 కోట్ల నగదు నజరానాను ప్రకటించింది. ప్రత్యేక బహుమతిగా ఇంగ్లండ్పై ఒకే ఓవర్లో 6 సిక్సర్లు బాదిన యువరాజ్ సింగ్కు రూ. 1 కోటి అందించింది. అలాగే సపోర్ట్ స్టాఫ్లో ఒక్కొక్కరికి రూ. 15 లక్షలు ఇచ్చింది.అదే 2026 ప్రపంచకప్కు వచ్చేసరికి.. సూర్యకుమార్ సారథ్యంలోని భారత జట్టుకు రూ. 131 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. 19 ఏళ్లలో బహుమతి మొత్తం 13 రెట్లు పెరిగింది.ఈ మధ్యలో 2024 పొట్టి ప్రపంచకప్ గెలిచిన రోహిత్ శర్మ సేనకు బీసీసీఐ రూ. 125 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. 2007తో పోలిస్తే ఈ మొత్తం రూ. 113 కోట్లు ఎక్కువ.భారత జట్టు టీ20 ప్రపంచకప్ గెలిచిన సందర్భాల్లో బీసీసీఐ ప్రకటించిన నగదు బహుమతి..- 2007లో రూ. 12 కోట్లు- 2024లో రూ. 125 కోట్లు- 2026లో రూ. 131 కోట్లుఇదిలా ఉంటే, తాజాగా ముగిసిన 2026 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో నెగ్గి వరుసగా రెండో టీ20 ప్రపంచకప్ను (2024, 2026), ఓవరాల్గా మూడో పొట్టి ప్రపంచకప్ను (2007, 2024, 2026), మొత్తంగా ఐదో ప్రపంచకప్ను (1983, 2011 (వన్డే), 2007, 2024, 2026 (టీ20)) సాధించింది. -
బుమ్రాపై పాక్ ఆటగాడి సంచలన వ్యాఖ్యలు
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై పాకిస్తాన్లో జన్మించి, యూఏఈ తరఫున ఆడిన జహూర్ ఖాన్ అనే పేస్ బౌలర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బుమ్రాకు తానే కోచింగ్ ఇచ్చానంటూ గొప్పలకు పోయాడు. స్లో డెలివరీ వేరియేషన్ను బుమ్రా తన వద్దనే నేర్చుకున్నాడని అన్నాడు.జహూర్ మాటల్లో.. 2019లో నేను ఓ టీ10 లీగ్లో లెండిల్ సిమ్మన్స్కు ఐదు స్లో డెలివరీలతో మెయిడిన్ ఓవర్ వేసాను. ఆ వీడియో చూసిన బుమ్రా.. ఇవి ఎలా వేసావు.. హ్యాండ్ గ్రిప్ ఎలా ఉంటుందని నన్ను అడిగాడు. ఆతర్వాత ముంబై ఇండియన్స్ కోచింగ్ క్యాంప్లో నేను ఆయనకు అలాంటి బంతులే వేసి చూపించాను. జహూర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. జహూర్కు అంత సీన్ లేదని భారత క్రికెట్ అభిమానులు అంటున్నారు. బుమ్రా నిరంతర అభ్యాసంతో ప్రపంచంలో అత్యుత్తమ పేసర్గా ఎదిగాడని కితాబునిస్తున్నారు.వాస్తవానికి స్లో బాల్ అనేది బుమ్రా అమ్ములపోదిలో ఓ అస్త్రం. స్లో బంతులను అతను అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేస్తాడు. చాలా సందర్భాల్లో ఇలాంటి బంతులతో ప్రత్యర్థులను బోల్తా కొట్టించాడు. ఈ స్లో బాల్స్ను కూడా బుమ్రా అందరికీ భిన్నంగా వేస్తాడు. మణికట్టు సాయంతో సంధిస్తాడు. బ్యాటర్లు వీటిని పసిగట్టడం కష్టమవుతుంది. తాజాగా జరిగిన ప్రపంచకప్లోనూ బుమ్రా ఇలాంటి బంతులను చాలాసార్లు ప్రయోగించాడు. ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో జేకబ్ బేతెల్ జోరు మీద ఉన్నప్పుడు వీటితోనే అతని ఆట కట్టించాడు. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లోనూ యార్కర్లతో పాటు ఈ స్లో డెలివరీలను ప్రయోగించాడు. ఫైనల్లో బుమ్రా అద్వితీయ ప్రదర్శన (4 వికెట్లు) కారణంగా భారత్ వరుసగా రెండో పొట్టి ప్రపంచకప్ సాధించింది. ఈ ప్రపంచకప్లో బుమ్రా 8 మ్యాచ్ల్లో 12.43 సగటున, 6.21 ఎకానమీతో 14 వికెట్లు తీసి భారత్ తరఫున లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. -
పెళ్లిపీటలెక్కనున్న స్టార్ స్పిన్నర్.. ఎప్పుడంటే?
భారత క్రికెటర్ కుల్దీప్ యాదవ్ త్వరలోనే ఒక ఇంటివాడు కానున్నాడు. మార్చి 14న తన చిన్ననాటి స్నేహితురాలైన వనిష్కను కుల్దీప్ వివాహమాడనున్నాడు. కాగా వీరి వివాహం ఉత్తరాఖండ్లోని ముసోరిలో ఒక రిసార్ట్ వేదికగా జరగనుంది. గతేడాది జూన్ 4న లక్నోలోని ఒక హోటల్లో వీరి నిశ్చితార్థ వేడుక అంగరంగవైభవంగా జరిగింది. ఇప్పటికే పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తవ్వగా మార్చి 13న ప్రీ-వెడ్డింగ్ జరగనుంది. అయితే వీరి పెళ్లి కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగనున్నట్లు సమాచారం. ఇక మార్చి 17న లక్నోలోని హోటల్ సెంట్రమ్లో గ్రాండ్గా రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు భారత క్రికెటర్లు, బీసీసీఐ బోర్డు సభ్యులు సహా ఉత్తర్ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు కూడా హాజరు కానున్నారు. అయితే వాస్తవానికి కుల్దీప్ వివాహం గతేడాని నవంబర్లోనే జరగాల్సి ఉండగా, టీ20 ప్రపంచకప్ జట్టులోకి కుల్దీప్ ఎంపిక కావడంతో పెళ్లి వాయిదా పడింది. ఇక కుల్దీప్ యాదవ్ టీ20 ప్రపంచకప్లో కేవలం పాకిస్థాన్తో మ్యాచ్లో మాత్రమే ఆడాడు. ఇక భారత క్రికెట్ జట్టు ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్ను అందుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. చదవండి: 30 ఏళ్ల క్రితమే పుట్టిన దూబే! -
క్రికెటర్ అమిత్ మిశ్రాపై గృహహింస కేసు
భారత మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రాపై గృహహింస కేసు నమోదైంది. ఈ అమిత్ మిశ్రా అందరికీ తెలిసిన టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కాదు. ఇతను ఉత్తరప్రదేశ్కు చెందిన 34 ఏళ్ల పేసర్ అమిత్ మిశ్రా. ఈ అమిత్ మిశ్రా భారత్ తరఫున ఎప్పుడూ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే ఐపీఎల్లో మాత్రం ఆడాడు.2013-14 రంజీ సీజన్లో ఉత్తర్ప్రదేశ్ తరఫున రెండో మ్యాచ్లోనే 7 వికెట్లు తీసి గుర్తింపు పొందిన ఈ అమిత్ మిశ్రాను 2014 ఐపీఎల్ ఎడిషన్లో రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఆతర్వాత గుజరాత్ లయన్స్లో చేరినా, కెరీర్ పెద్దగా ముందుకు సాగలేదు. 2018లో ఆంధ్రపై చివరి మ్యాచ్ ఆడిన తర్వాత క్రికెట్కు గుడ్బై చెప్పిన మిశ్రా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం పొందాడు. ఈ అమిత్ మిశ్రాపై అతని భార్య గరిమా తివారి గృహహింస ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తీవ్ర గృహహింస, వేధింపులు, దౌర్జన్యం అలాగే ఆత్మహత్యకు ప్రేరేపించే పరిస్థితులు సృష్టించాడని ఫిర్యాదులో పేర్కొంది. మోడల్ అయిన గరిమాకు 2019లో ఇన్స్టాగ్రామ్ ద్వారా అమిత్ మిశ్రాతో పరిచయం ఏర్పడింది. 2021లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. గరిమా ఆరోపణల ప్రకారం.. పెళ్లి తర్వాత అమిత్ మిశ్రా, అత్తమామలు నిరంతరం వేధింపులకు గురి చేశారు. రూ.10 లక్షలు, హోండా సిటీ కారు రూపంలో కట్నం కోరారని, ఆమె కుటుంబం రూ.2.5 లక్షలు ఇచ్చినా, మరింత డబ్బు కోసం వేధింపులు కొనసాగించారని తెలిపారు. మిశ్రా తరచూ మద్యం తాగి వచ్చి దుర్భాషలాడేవాడని, తిండి కూడా పెట్టకుండా వేధించేవాడని పేర్కొన్నారు. తాను మోడలింగ్ చేసిన సంపాదించిన డబ్బును కూడా బలవంతంగా లాక్కునేవాడని, అతని కారణంగా మోడలింగ్ కెరీర్ను కూడా వదిలేయాల్సి వచ్చిందని ఆరోపించారు. ఈ వేధింపుల కారణంగా ఫినైల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించానని ఆవేదన చెందారు. కాగా, గరిమా అమిత్ మిశ్రాపై ఇప్పటికే పలు కేసులు వేసింది. ఏప్రిల్ 21, 2025న గృహహింస కేసు, ఏప్రిల్ 23న నెలకు రూ.50,000 భరణం, రూ.1 కోటి పరిహారం కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా, మిశ్రా ప్రభావం వల్ల కేసులు ముందుకు సాగలేదని ఆరోపించారు. ప్రస్తుతం వేసిన కేసు విచారణ దశలో ఉంది. -
30 ఏళ్ల క్రితమే పుట్టిన దూబే!
ఒకప్పుడు క్రికెట్ అంటే కేవలం రెండు ఫార్మాట్లకే పరిమితమై ఉండేది. ఒకటి టెస్టు క్రికెట్, మరొకటి వన్డే ఫార్మాట్. ఈ రెండు ఫార్మాట్లను తలదన్నేలా 20 ఏళ్ల క్రితం పుట్టుకొచ్చింది టీ20 ఫార్మాట్. దనాధన్ ఆటతో కొద్దికాలంలోనే క్రికెట్ అభిమానుల ఆదరణ చూరగొన్న ఈ పొట్టి ఫార్మాట్ ఇవాళ ఎనలేని క్రేజ్ను సొంతం చేసుకుంది. 20 ఓవర్ల ఆటలో క్రీజులోకి వచ్చిన ప్రతీ బ్యాటర్ బౌండరీలు, సిక్సర్లు కొట్టాలనే తాయత్రయంతోనే ఉంటారు. కానీ ఇన్నింగ్స్లో చివరి 5 ఓవర్లను డెత్ ఓవర్లుగా పిలవడం ఆనవాయితీ. ఈ ఓవర్లలో నిఖార్సైన ఇన్నింగ్స్లు ఆడే బ్యాటర్ను ఫినిషర్గా పిలుస్తుంటారు. టీమిండియాకు ప్రస్తుతం శివమ్ దూబే రూపంలో మంచి హిట్టర్ దొరికాడు. తాజాగా ముగిసిన టీ20 ప్రపంచకప్లో శివమ్ దూబే 9 మ్యాచ్ల్లో 169 స్ట్రైక్రేట్ 235 పరుగులు చేసి భారత్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. దూబే ప్రదర్శనను ఇప్పటి అభిమానులు ఆకాశానికెత్తుతున్నారు కానీ నిజమైన దూబే 30 ఏళ్ల ముందే ప్రపంచానికి పరిచయమయ్యాడంటే నమ్ముతారా? కానీ ఇది అక్షరాలా నిజం.పాక్ను చీల్చిచెండాడి..1990ల్లో 50 ఓవర్ల ఆటలో 250 పరుగులు చేయడం కష్టంగా ఉండేది. టాపార్డర్, మిడిలార్డర్ రాణిస్తే తప్ప స్కోరుబోర్డు పరిగెత్తకపోయేది. అయితే 1996 వన్డే ప్రపంచకప్ సందర్భంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య క్వార్టర్ఫైనల్ పోరు రసవత్తరంగా సాగింది. ఆ మ్యాచ్లో ఓపెనర్ నవ్జ్యోత్ సిద్ధూ 93 పరుగుల మెరుపు ఇన్నింగ్స్తో యాంకర్ పాత్రను పోషించాడు. సచిన్, కాంబ్లీ, మంజ్రేకర్, అజారుద్దీన్ తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన అజయ్ జడేజా (25 బంతుల్లో 45, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) నిఖార్సైన ఆటతీరుతో పాక్ను హడలెత్తించాడు. అప్పట్లో జడేజా ఆడిన ఆట ఇవాళ దూబే ఆట కంటే రెట్టింపు అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటి పాక్ జట్టులో వకార్ యూనిస్, ముస్తాక్ అహ్మద్, సలీమ్ మాలిక్ వంటి బలమైన బౌలింగ్ లైనప్ను చీల్చిచెండాడమే ఇందుకు కారణం. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. అనంతరం పాకిస్థాన్ 248 పరుగులకు ఆలౌటైంది. 1996 ప్రపంచకప్లో సెమీస్ చేరినప్పటికీ ఆనాటి చాంపియన్స్ శ్రీలంక చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది.నిఖార్సైన ఆల్రౌండర్..ఇక 1992లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అజయ్ జడేజా భారత జట్టు తరఫున 196 వన్డేల్లో 5,359 పరుగులు, 15 టెస్టుల్లో 576 పరుగులు చేశాడు. అయితే 2000లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో దోషిగా తేలడంతో అజయ్ జడేజాపై ఐదేళ్ల నిషేధం పడింది. కానీ జట్టులో కొనసాగినన్ని రోజులు అజయ్ జడేజా నాణ్యమైన ఆల్రౌండర్గా పేరు గడించాడు. ఆ తర్వాత డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అజయ్ జడేజా స్థానాన్ని భర్తీ చేయడంలో విజయవంతమయ్యాడు.చదవండి: అందరూ మ్యాచ్ విన్నర్లే! -
అందరూ మ్యాచ్ విన్నర్లే!
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ ముగిసింది. టీమిండియా ముచ్చటగా మూడోసారి పొట్టి ప్రపంచకప్ను కైవసం చేసుకొని ఆ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు భారత క్రికెట్ జట్టుపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కూడా టీమిండియాను పొగడ్తలతో ముంచెత్తాడు. జట్టులో అందరూ మ్యాచ్ విన్నర్లు కావడమే భారత్ టైటిల్ గెలిచేందుకు కారణమైందని అఫ్రిది తెలిపాడు. ఇదే విషయమై ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘ప్రపంచకప్ ముగిసింది. టైటిల్ గెలవడంలో టీమిండియాకు అర్హత ఉంది. జట్టు కాంబినేషన్ అద్భుతం. అంతేకాదు తుది జట్టులోని 11 మంది ఆటగాళ్లే కాదు బెంచ్ మీద ఉన్న ఆటగాళ్లు కూడా మ్యాచ్ విన్నర్లే. ఒకవేళ ఫైనల్కు ముందు తుది జట్టులో మార్పులు చేసి బెంచ్ నుంచి ఆడించినా భారత్ కప్ కొట్టేందుకు సిద్ధంగా ఉండేది. నిజానికి టోర్నీమొత్తం చాంపియన్ ఆటతీరును ప్రదర్శించారు.సంజూ శాంసన్ ఒక అద్భుతం. తనదైన హిట్టింగ్తో ఇన్నింగ్స్లను నిర్మించడంలో కీలకపాత్ర పోషించేవాడు. అభిషేక్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టోర్నీ ఆసాంతం విఫలమైనా కెప్టెన్ సూర్యకుమార్కు అభిషేక్పై ఉన్న నమ్మకం అతన్ని ఫైనల్ వరకు ఆడించింది. కీలకమైన ఫైనల్లో అభిషేక్ తనలోని అసలైన ఆటతీరును పరిచయం చేశాడు. ఇషాన్ కిషన్ కూడా తనదైన శైలిలో చెలరేగడం, ఆఖర్లో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే హిట్టింగ్ జట్టుకు అదనపు ఆకర్షణ. ఇక బౌలింగ్ లో బుమ్రా అద్భుత ప్రదర్శనతో టోర్నీ ఆసాంతం బౌలింగ్ టీమ్ను తన భుజస్కందాలపై నడిపించాడు. కొత్త బంతి, పాత బంతి అనే తేడా లేకుండా, పదునైన యార్కర్లు సంధించి అతని బౌలింగ్ విలువను చాటిచెప్పాడు’ అని తెలిపాడు. ఇక ప్రపంచకప్లో పాకిస్థాన్ జట్టు చచ్చీచెడీ సూపర్-8కు చేరినప్పటికీ మూడు మ్యాచ్ల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే నమోదు చేసి టోర్నీ నుంచి నిష్క్రమించింది.చదవండి: పాక్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. 24 ఏళ్లకే రిటైర్మెంట్ -
ఐసీసీ ప్రపంచకప్ టీమ్లో సామ్సన్, బుమ్రా, పాండ్యా, ఇషాన్... కెప్టెన్గా మార్క్రమ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన టి20 ప్రపంచకప్ జట్టులో టైటిల్ నిలబెట్టుకున్న టీమిండియా నుంచి నలుగురు ఆటగాళ్లకు చోటు దక్కింది. ఈ జట్టుకు మార్క్రమ్ (దక్షిణాఫ్రికా) కెపె్టన్ కాగా, ఓపెనింగ్లో సంజూ సామ్సన్, టాపార్డర్లో ఇషాన్ కిషన్, మిడిలార్డర్లో హార్దిక్ పాండ్యా, బౌలింగ్లో పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు చోటు లభించింది. పాకిస్తాన్ నుంచి టాప్ స్కోరర్గా నిలిచిన సాహిబ్జాదా ఫర్హాన్ ఈ ఐసీసీ టీమ్లో ఓపెనర్గా ఉన్నాడు.చిత్రంగా రన్నరప్ న్యూజిలాండ్ జట్టులో నుంచి కనీసం 12వ ఆటగాడిగా కూడా ఎవరికీ చాన్స్ దక్కలేదు. ఐసీసీ టి20 ప్రపంచకప్ జట్టు: మార్క్రమ్ (కెపె్టన్), ఫర్హాన్ (పాకిస్తాన్), సామ్సన్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, బుమ్రా (భారత్), విల్ జాక్స్, ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్), జేసన్ హోల్డర్ (వెస్టిండీస్), ఎన్గిడి (దక్షిణాఫ్రికా), ముజరబాని (జింబాబ్వే), షాడ్లీ వాన్ షాలి్వక్ (అమెరికా; 12వ ప్లేయర్). -
శ్రీలంక హెడ్ కోచ్గా టీమిండియా దశ, దిశను మార్చిన వ్యక్తి
తాము సంయుక్తంగా (భారత్తో పాటు) ఆతిథ్యమిచ్చిన టీ20 ప్రపంచకప్-2026లో ఘోరంగా విఫలమైన (సూపర్-8 దశలో నిష్క్రమణ) తర్వాత శ్రీలంక క్రికెట్ జట్టు ప్రక్షాళన చేపట్టింది. టీమిండియా దశ, దిశను మార్చిన వ్యక్తిని హెడ్ కోచ్గా ఎంపిక చేసుకుంది. అతని పేరు గ్యారీ కిర్స్టన్. ఈ సౌతాఫ్రికా మాజీ ఓపెనర్ 2011లో టీమిండియాను జగజ్జేతగా (హెడ్ కోచ్గా) నిలిపాడు.పొట్టి ప్రపంచకప్ వైఫల్యాల నేపథ్యంలో అప్పటివరకు హెడ్ కోచ్గా ఉండిన సనత్ జయసూర్య తన పదవికి రాజీనామా చేయడంతో లంక క్రికెట్ బోర్డు కిర్స్టన్ను ఎంపిక చేసింది. కిర్స్టన్ రెండేళ్ల ఒప్పందంలో భాగంగా ఏప్రిల్ 15న బాధ్యతలు చేపడతారు. 2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా లంక క్రికెట్ కిర్స్టన్ నియామకం చేపట్టింది.కిర్స్టన్ను హెడ్ కోచ్గా మంచి ట్రాక్ ఉంది. అంతర్జాతీయంగా, ఐపీఎల్లో అతను విజయవంతమైన జట్లకు కోచ్గా వ్యవహరించాడు. భారత్ను వన్డే ప్రపంచ ఛాంపియన్గా నిలపడంతో పాటు ఐసీసీ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానానికి కూడా చేర్చాడు. అలాగే తన సొంత జట్టు దక్షిణాఫ్రికాకు కూడా విజయవంతంగా సేవలందించాడు. అతని కెరీర్లో ఏదైనా ఫెయిల్యూర్ ఉందా అంటే అది పాకిస్తాన్ వైట్ బాల్ జట్టుకు కోచ్గా సేవలందించడమే. పాక్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన స్వల్ప కాలంలోనే అతను రాజీనామా చేశాడు (బోర్డు మరియు ఆటగాళ్లతో విభేదాల కారణంగా).ఐపీఎల్లో కిర్స్టన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీలతో పని చేశారు. టైటాన్స్ 2022లో తొలి సీజన్లోనే టైటిల్ గెలిచినప్పుడు అతను బ్యాటింగ్ కోచ్గా ఉన్నారు. 2027 వన్డే ప్రపంచకప్కు శ్రీలంకను నేరుగా అర్హత సాధించేలా చేయడమే కిర్స్టన్ ప్రధాన లక్ష్యం. లంక క్రికెట్ కొద్ది రోజుల క్రితమే తమ మహిళల జట్టు కోచ్ను ( జేమీ సిడ్డన్స్) కూడా మార్చింది. -
ఈ విజయం వారిద్దరికీ అంకితం: గంభీర్
టీమిండియా సొంతగడ్డపై టి20 ప్రపంచకప్ విజేతగా నిలవడంతో హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ పేరు మారుమోగుతోంది. మొన్నటి వరకు అతడిని తిట్టిపోసిన వారు కూడా ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. టీమిండియా క్రెడిట్ అంతా గౌతీదేనని పొగుడుతున్నారు. గంభీర్ మాత్రం ఇద్దరు దిగ్గజాల పేర్లు చెప్పాడు. మెన్ ఇన్ బ్లూ విజయాల వెనుక వీరిద్దరూ ఉన్నారని మీడియా ముఖంగా ప్రకటించాడు.మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి మీడియాతో మాట్లాడాడు గంభీర్. టీమిండియా టి20 ప్రపంచకప్ విజయాన్ని ఎవరికి అంకితం చేస్తారని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు గంభీర్ ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చాడు. ఎవరూ ఊహించని పేర్లు చెప్పాడు. వారే రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్. టీమిండియా విజయాల్లో వీరిద్దరి పాత్ర ఎంతో ఉందని గంభీర్ గుర్తు చేసుకున్నాడు."టి20 ప్రపంచకప్ ట్రోఫీని రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్లకు అంకితం చేస్తున్నాను. భారత జట్టును ద్రవిడ్ ఒక స్థానంలో ఉంచారు. అలాగే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను లక్ష్మణ్ క్రమపద్ధతిలో నడిపిస్తూ జట్టుకు విలువైన సేవలు అందిస్తున్నార"ని గంభీర్ పేర్కొన్నాడు. రాహుల్ ద్రవిడ్.. గంభీర్ కంటే టీమిండియా హెచ్కోచ్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.వారిద్దరికీ కృతజ్ఞతలుఐసీసీ ప్రస్తుత చైర్మన్, బీసీసీఐ మాజీ కార్యదర్శి జైషా తనకు కష్టకాలంలో అండగా నిలిచారని వెల్లడించారు. గతేడాది స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఓడిపోయి విమర్శలు ఎదుర్కొన్నప్పుడు జైషా దన్నుగా నిలిచారని తెలిపాడు. ఎన్ని విమర్శలు వచ్చినా నిజాయితీగా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయారని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ను పొగిడారు. వీరిద్దరికీ గంభీర్ కృతజ్ఞతలు చెప్పాడు.భయాన్ని వదులుకోవాలితాను తన జట్టుకు జవాబుదారిగా ఉంటానని, సోషల్ మీడియాలోని వ్యక్తులకు కాదని గంభీర్ స్పష్టం చేశాడు. టీమ్ వల్లే తాను కోచ్ కాగలిగానని అన్నాడు. ఓడిపోతామనే భయాన్ని ముందుగా వదులుకోవాలని అభిప్రాయపడ్డాడు. సెమీస్, ఫైనల్లో 250 పరుగులు చేయాలంటే ధైర్యం చూపించాల్సిందేనన్నారు. ఆటగాళ్లు వ్యక్తిగత రికార్డుల కంటే ట్రోఫీలు గెలవడానికే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించాడు. తానేప్పుడు నమ్మకం ఆధారంగానే జట్టు సభ్యులను ఎంపిక చేస్తానని చెప్పాడు. చదవండి: సంజు, బుమ్రానే కాదు.. వారిద్దరూ కూడా హీరోలే! -
వరల్డ్కప్ ముగిసింది.. టీమిండియా తదుపరి షెడ్యూల్ ఇదే..!
టీ20 వరల్డ్కప్ 2026 ముగిసిన నేపథ్యంలో టీమిండియా తదుపరి షెడ్యూల్ ఎంటని అభిమానులు చర్చించుకుంటున్నారు. 20 రోజుల గ్యాప్ తర్వాత (మార్చి 28) ఐపీఎల్ 2026 ప్రారంభమవుతుంది. ఈ లీగ్ మే 31 వరకు కొనసాగుతుంది. ఆతర్వాతే టీమిండియా షెడ్యూల్ మొదలవుతుంది.జూన్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత్లో పర్యటిస్తుంది. ఇందులో ఓ టెస్ట్, వన్డే సిరీస్ జరుగుతుంది. టెస్ట్ మ్యాచ్ న్యూ చంఢీఘడ్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియంలో జూన్ 6–10 వరకు జరుగుతుంది. అనంతరం జూన్ 14, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా మూడు వన్డేలు జరుగుతాయి.ఆతర్వాత భారత్ జులైలో పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో 5 టీ20లు, 3 వన్డేలు జరుగనున్నాయి. టీ20లు చెస్టర్-లీ-స్ట్రీట్, మాంచెస్టర్, నాటింగ్హామ్, బ్రిస్టల్, సౌతాంప్టన్ వేదికలుగా జులై 1, 4, 7, 9, 11 తేదీల్లో.. వన్డేలు ఎడ్జ్బాస్టన్, కార్డిఫ్, లార్డ్స్ వేదికలుగా జులై 14, 16, 19 తేదీల్లో జరుగుతాయి.అనంతరం భారత జట్టు ఆగస్టు–సెప్టెంబర్ నెలల్లో 2 టెస్ట్లు, 2 టీ20ల సిరీస్ల కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. దీని తర్వాత సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో ఏషియన్ గేమ్స్ జరుగుతాయి. దాని తర్వాత భారత జట్టు స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో 3 టీ20లు, 3 వన్డేల సిరీస్లు ఆడుతుంది. అనంతరం స్వదేశంలోనే వెస్టిండీస్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్-నవంబర్ నెలల్లో టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తుంది. ఇందులో 2 టెస్ట్లు, 3 వన్డేలు, 5 టీ20లు జరుగనున్నాయి. ఈ ఏడాది చివర్లో శ్రీలంక జట్టు భారత్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో 3 వన్డేలు, 3 టీ20లు జరుగుతాయి. -
World Cup: తుఫాన్ బ్యాటింగ్.. ఫైనల్లో గెలుపుకు కారణం అతనే
-
T20 WC 2026: ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నీ.. భారత ఆటగాళ్ల డామినేషన్
నిన్న (మార్చి 8) జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో నెగ్గి వరుసగా రెండో ఎడిషన్లో (2024, 2026), ఓవరాల్గా మూడో పొట్టి ప్రపంచకప్ను (2007, 2024, 2026), మొత్తంగా ఐదో ప్రపంచకప్ను (1983, 2011 (వన్డే), 2007, 2024, 2026 (టీ20)) సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్ (46 బంతుల్లో 89; 5 ఫోర్లు, 8 సిక్సర్లు), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 52; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 54; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో శివమ్ దూబే (8 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో నీషమ్ 3, మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఆదిలోనే చేతులెత్తేసింది. బుమ్రా (4-0-15-4), అక్షర్ పటేల్ (3-0-27-3), హార్దికా పాండ్యా (4-0-26-1), వరుణ్ చక్రవర్తి (3-0-29-1), అభిషేక్ శర్మ (1-0-5-1) ధాటికి 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటై, 96 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. కివీస్ ఇన్నింగ్స్లో టిమ్ సీఫర్ట్ (52), మిచెల్ సాంట్నర్ (43) మాత్రమే నామమాత్రపు ప్రదర్శనలు చేశారు. 4 వికెట్లతో న్యూజిలాండ్ వెన్ను విరిచిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. సూపర్-8 నుంచి భారత విజయాల్లో కీలకపాత్ర పోషించిన సంజూ శాంసన్కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు లభించాయి.ఇదిలా ఉంటే, టోర్నీ పూర్తయ్యాక ఐసీసీ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ను ప్రకటించింది. ఇందులో భారత ఆటగాళ్ల హవా కొనసాగింది. కెప్టెన్గా ఎవరూ ఊహించని ఆటగాడు సికందర్ రజా ఎంపికయ్యాడు. భారత్ నుంచి ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా) ఎంపికయ్యారు. 12వ ఆటగాడు కూడా భారత ఆటగాడే (హార్దిక్ పాండ్యా) కావడం విశేషం.ఐసీసీ టీమ్ ఆఫ్ టీ20 వరల్డ్కప్ 2026: సంజూ శాంసన్ (wk), టిమ్ సీఫెర్ట్, ఇషాన్ కిషన్, షిమ్రాన్ హెట్మైర్, సికందర్ రజా (c), శివమ్ దూబే, విల్ జాక్స్, అక్షర్ పటేల్, లుంగి ఎంగిడి, బ్లెస్సింగ్ ముజారబాని, జస్ప్రీత్ బుమ్రా12వ ఆటగాడు: హార్దిక్ పాండ్యా -
వారు లేకుండా భారత్ ప్రపంచకప్ ఎప్పుడూ గెలవలేదు..!
2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన నిరాశను భారత జట్టు 2026 పొట్టి ప్రపంచకప్లో తుడిచిపెట్టేసింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత జట్టు మెన్స్ టీ20 వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. ఇది భారత్కు మూడో టీ20 టైటిల్. మొత్తంగా ఐదో ప్రపంచకప్ (రెండు వన్డే, మూడు టీ20). అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న (మార్చి 8) జరిగిన ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో జయభేరి మోగించి వరుసగా రెండో ఎడిషన్లో జగజ్జేతగా అవతరించింది.కాగా, టీమిండియా వరల్డ్ కప్ విజయాల వెనుక ఓ ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. 1983 వన్డే వరల్డ్కప్ విజయం నుంచి తాజాగా సాధించిన 2026 టీ20 ప్రపంచకప్ వరకు భారత్ గెలిచిన ప్రతి వరల్డ్ కప్లో ఒక సర్దార్ (పంజాబీ), ఒక కేరళ ఆటగాడు జట్టులో భాగమయ్యారు. 1983లో బల్విందర్ సంధూ (సర్దార్), సునీల్ వాల్సన్ (కేరళ)తో ఈ సంప్రదాయం మొదలైంది. 2007 (టీ20), 2011 (వన్డే) ప్రపంచకప్లలో శ్రీశాంత్ (కేరళ), హర్భజన్ సింగ్ (సర్దార్) కీలక పాత్ర పోషించారు. 2024, 2026 టీ20 వరల్డ్ కప్లలో సంజూ శాంసన్ (కేరళ), అర్ష్దీప్ సింగ్ (సర్దార్) ఈ ప్యాటర్న్ను కొనసాగించారు. రాకింగ్ సంజూ 2026 టీ20 వరల్డ్ కప్లో సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలుచుకున్నాడు. సెమీస్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన సూపర్-8 మ్యాచ్లో వెస్టిండీస్పై అజేయమైన 97 పరుగులు (50 బంతుల్లో) చేసిన సంజూ.. సెమీస్లో ఇంగ్లండ్పై, ఫైనల్లో న్యూజిలాండ్పై తలో 89 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపించాడు. ఈ టోర్నీలో సంజూ మొత్తం 5 ఇన్నింగ్స్ల్లో 321 పరుగులు సాధించాడు. 2024 ఎడిషన్లో సంజూ పూర్తిగా బెంచ్పైనే గడిపాడు. ఇది 1983లో వాల్సన్ పరిస్థితిని గుర్తు చేసింది. షేకింగ్ సర్దార్2024 ప్రపంచకప్లో టాప్ వికెట్ టేకర్గా (17 వికెట్లు) నిలిచి భారత్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన అర్షదీప్ సింగ్.. తాజా ఎడిషన్లోనూ (2026) ఇంచుమించు అదే తరహా ప్రదర్శనలతో (9 వికెట్లు) షేకింగ్ సర్దార్ అనిపించుకున్నాడు. అర్షదీప్ తన నిలకడ ప్రదర్శనలతో భారత్కు వరుసగా రెండు టీ20 టైటిళ్లు అందించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. -
T20 World Cup 2026: టీమిండియా కు వైఎస్ జగన్ అభినందనలు
-
సలాం సామ్సన్...
‘ఏమాత్రం బాధపడవద్దు మిత్రమా. సుదీర్ఘ టోర్నీ ఇది. ఏదో ఒక సమయంలో అవకాశం కచ్చితంగా లభిస్తుంది’... వరల్డ్ కప్ తొలి రోజు అమెరికాతో మ్యాచ్కు ముందు సంజు సామ్సన్కు తుది జట్టులో స్థానం లభించని సమయంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అతడికి సాంత్వన కలిగిస్తూ చెప్పిన మాట ఇది. తర్వాతి మ్యాచ్లో నమీబియాతో అభిషేక్ అనారోగ్య కారణంగా సామ్సన్కు అవకాశం దక్కింది. కానీ చేసింది 22 పరుగులే. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్లలో టీమ్లో మళ్లీ చోటు లేదు. జింబాబ్వేపై చాన్స్ లభించినా 24 పరుగులకే పరిమితం! దాంతో సామ్సన్ టీమ్కు భారం, అతని భవిష్యత్తుపై కూడా చర్చ మొదలైంది. కానీ సామ్సన్ ఓడిపోలేదు. ఇక తనకు చివరి అవకాశంగా వెస్టిండీస్తో మ్యాచ్ లభించింది. అంతే... అక్కడి నుంచి అసాధారణంగా చెలరేగిపోయాడు. వెస్టిండీస్తో కీలకపోరులో 50 బంతుల్లో 97 నాటౌట్... సెమీఫైనల్లో ఇంగ్లండ్పై 42 బంతుల్లో 89... ఫైనల్లో న్యూజిలాండ్పై 46 బంతుల్లో 89... వరుసగా మూడు ముఖ్యమైన మ్యాచ్లలో మూడు అర్ధసెంచరీలతో తిరుగులేని ప్రదర్శన. మూడుసార్లూ త్రుటిలో సెంచరీ చేజారింది.చివర్లో కాస్త ప్రయత్ని స్తే శతకాలు అతని ఖాతాలో చేరేవేమో. కానీ అతను వాటిని పట్టించుకోలేదు. ప్రతీ బంతిని జట్టు స్కోరు పెంచడానికే తప్ప ఒక్క బంతి కూడా తన వ్యక్తిగత ఘనతల కోసం ఆడేందుకు ప్రయత్ని ంచలేదు. కానీ ఈ మూడు మ్యాచ్లలో సామ్సన్ చూపించిన విధ్వంస ప్రదర్శన భారత జట్టులో అతని స్థాయిని అమాంతం పెంచేసింది. సామ్సన్కు అనవసరంగా మద్దతు ఇస్తున్నారని, అతనికి చోటు దండగ అంటూ వ్యాఖ్యానించిన వారే ఇప్పుడు అతని వల్లే వరల్డ్ కప్ గెలిచిందని ప్రశంసిస్తున్నారు. తన ఆటతోనే అందరికీ అతను ఇచ్చిన సమాధానం ఇది. సామ్సన్ 2024లో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. కానీ నాడు ఒక్క మ్యాచ్ కూడా ఆడే చాన్స్ రాకుండా ‘నామ్కే వాస్తే’గానే జట్టులో భాగంగా ఉన్నాడు. కానీ ఈసారి అతను విజయాన్ని శాసించాడు. కేవలం 5 ఇన్నింగ్స్లలో 321 పరుగులు సాధించి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు కూడా గెల్చుకొని జట్టులో ఎవరికీ అందనంత ఎత్తులో అతను నిలిచాడు. –సాక్షి క్రీడా విభాగం వెల్డన్... టీమిండియా న్యూఢిల్లీ: మూడోసారి టి20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన భారత పురుషుల క్రికెట్ జట్టుకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. అసాధారణ నైపుణ్యం, పట్టుదల, సమష్టి కృషికి భారత జట్టు విజయం నిదర్శనమని ‘ఎక్స్’ వేదికగా మోదీ ప్రశంసించారు. ‘టోర్నీ ఆద్యంతం అత్యద్భుత ఆటతీరుతో అలరించారు. దేశం మొత్తం గర్వపడేలా చేశారు. వెల్డన్... టీమిండియా’ అంటూ మోదీ కొనియాడారు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నిలబెడుతూ సూర్యకుమార్ బృందం సాధించిన టి20 ప్రపంచకప్ విజయం చరిత్రలో నిలిచిపోతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి టీమిండియాను అభినందించారు. భవిష్యత్లో భారత్ మరిన్ని విజయాలు సాధించాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. -
భారతీయులు గర్వపడే విజయమిది : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: టి20 వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ బృందానికి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. అద్భుతంగా ఆడి మళ్లీ చాంపియన్లుగా నిలిచిన కెప్టెన్ సూర్యకుమార్ నేతృత్వంలోని జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. తుదిపోరులో ప్రారంభం నుంచే భారత్ ఆధిపత్యం ప్రదర్శించిందని కొనియాడారు. అభిషేక్ శర్మ, సంజు సామ్సన్, ఇషాన్ కిషన్ బాగా ఆడారని, చివరి విజయ క్షణాలు భారతీయులందరినీ గర్వపడేలా చేశాయని అభివర్ణించారు. వరల్డ్ కప్ కిరీటం తిరిగి మన ఇంటిలోనే ఉందంటూ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా భారత జట్టుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఫైనల్లో టీమిండియా ప్రదర్శించిన అద్భుత ఆటతీరు దేశ ప్రజలందరికీ గర్వకారణమని కొనియాడారు. ఈ విజయం దేశ క్రీడా రంగానికి మరింత గౌరవం తెచ్చిందని రేవంత్ అన్నారు. -
టీ20 వరల్డ్ కప్ విజయం.. భారత్ జట్టుపై ప్రధాని మోదీ ప్రశంసలు
ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ లో భారత్ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది. టోర్నమెంట్ మొత్తం దూకుడుగా ఆడిన టీమిండియా చివరి మ్యాచ్లో కూడా తమ ప్రతిభ చాటుతూ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విజయంతో దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.Champions! Congratulations to the Indian team on winning the ICC Men’s T20 World Cup! This remarkable triumph reflects exceptional skills, determination and teamwork. They have shown outstanding grit through the tournament. This victory has filled every Indian heart with…— Narendra Modi (@narendramodi) March 8, 2026ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారత్ జట్టును అభినందించారు. సోషల్ మీడియా ద్వారా స్పందించిన ఆయన.. “ఈ విజయం ప్రతి భారతీయుడి హృదయాన్ని ఆనందంతో నింపింది. దేశం మొత్తం గర్వపడేలా చేసిన ఈ ఘనతకు టీమ్ ఇండియాకు హృదయపూర్వక అభినందనలు” అని పేర్కొన్నారు.భారత్ జట్టు సాధించిన ఈ విజయం యువతకు ప్రేరణగా నిలుస్తుందని ప్రధాని అన్నారు. క్రీడల పట్ల దేశంలో ఆసక్తిని మరింత పెంచే ఘనత ఇదేనని ఆయన అభిప్రాయపడ్డారు. -
టీ20 వరల్డ్ కప్ విజేత భారత జట్టుకు వైఎస్ జగన్ ప్రశంస
సాక్షి, తాడేపల్లి: టీ20 వరల్డ్ కప్లో భారత్ విజయం సాధించిన సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు మొత్తం టీమ్ ఇండియాకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram A post shared by YS Jagan Mohan Reddy (@ysjagan)అద్భుతమైన ఆటతీరు కనబరిచిన అభి, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లకు ప్రత్యేక అభినందనలు. దేశం అంతా గర్వపడే లాంటి విజయం సాధించారు. ఈ గెలుపు ప్రతి భారతీయుడి హృదయాన్ని ఆనందంతో నింపింది అని పేర్కొన్నారు. భారత్ జట్టు కృషి, పట్టుదల, జట్టు స్పూర్తి వల్లే ఈ విజయాన్ని సాధించగలిగిందని జగన్ అన్నారు. ఈ విజయం యువతకు ప్రేరణగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
టీమిండియాకు ఘోర పరాభవం
మల్టీ ఫార్మాట్ సిరీస్ (3 టీ20, 3 వన్డేలు, ఏకైక టెస్ట్) కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత మహిళల జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. పెర్త్లోని వాకా స్టేడియంలో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తొలుత టీ20 సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న భారత్.. ఆతర్వాత జరిగిన వన్డే సిరీస్లో క్వీన్ స్వీప్ అయ్యింది. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లో కూడా ఓడి, సిరీస్ మొత్తాన్ని కోల్పోయింది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. అన్నాబెల్ సదర్ల్యాండ్ (17-5-46-4), లూసీ హ్యామిల్టన్ (11-3-31-3), డార్సీ బ్రౌన్ (12.4-0-41-2) ధాటికి 62.4 ఓవర్లలో 198 పరుగులకే కుప్పకూలింది. భారత ఇన్నింగ్స్లో జమీమా రోడ్రిగ్స్ (52) ఒక్కరే అర్ద సెంచరీతో రాణించారు. షఫాలీ వర్మ (35), ఆఖర్లో కశ్వీ గౌతమ్ (34 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో భారత్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 323 పరుగుల భారీ స్కోర్ చేసింది. బంతితో సత్తా చాటిన సదర్ల్యాండ్ బ్యాట్తోనూ చెలరేగి సూపర్ సెంచరీ (129) చేసింది. ఎల్లిస్ పెర్రీ (76) అర్ద సెంచరీతో రాణించగా.. మిగతా ప్లేయర్లు ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. భారత బౌలర్లలో సయాలీ సత్ఘరే 4, క్రాంతి గౌడ్, దీప్తి శర్మ చెరో 2, స్నేహ్ రాణా, షఫాలీ వర్మ చెరో వికెట్ తీశారు.125 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. ఆసీస్ బౌలర్ల ధాటికి మరోసారి దారుణంగా పతనమైంది. హ్యామిల్టన్ (8-1-32-3), అలానా కింగ్ (10-2-23-2), ఆష్లే గార్డ్నర్ (4.2-1-8-2), సదర్ల్యాండ్ (6-2-15-2), డార్సీ బ్రౌన్ (14-2-45-1) దెబ్బకు 149 పరుగులకే ఆలౌటైంది. ప్రతీక రావల్ (63) ఒంటరిపోరాటం చేయగా.. స్టార్ బ్యాటర్లంతా చేతులెత్తేశారు. కెప్టెన్ హర్మన్(11), జెమీమా (14) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగా.. ఆఖర్లో స్నేహ్ రాణా (30) ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించింది.అనంతరం 25 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. కేవలం 4.3 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా విజయతీరాలకు చేరింది. జార్జియా వాల్ 16, లిచ్ఫీల్డ్ 11 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ మ్యాచ్ మూడో రోజు తొలి సెషన్లోనే ముగిసింది. -
T20 WC 2026: ఫైనల్కు ముందు టీమిండియాకు భారీ బూస్టప్
టీ20 ప్రపంచకప్ 2026 తుది అంకానికి చేరింది. ఇవాళ (మార్చి 8) అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య అంతిమ సమరం జరుగనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభం కాబోయే ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. భారత్ వరుసగా తమ రెండో టైటిల్ను, ఓవరాల్గా మూడో టైటిల్ సాధిస్తుందా లేక న్యూజిలాండ్ తొలిసారి ప్రపంచ ఛాంపియన్గా అవతరిస్తుందా అన్న విషయంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.చర్చలు, అంచనాలు ఎలా ఉన్నా.. టీమిండియాకు మాత్రం ఓ విషయం చాలా బూస్టప్ను ఇస్తుంది. అదేంటంటే.. భారత్కు టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్ చేతిలో ఇప్పటివరకు ఓటమనేదే లేదు. ఇరు జట్లు ఈ మెగా టోర్నీలో 3 సార్లు ఎదురెదురుపడగా.. మూడు సార్లు టీమిండియానే పైచేయి సాధించింది.ఓవరాల్గా (మొత్తం టీ20ల్లో) చూసినా న్యూజిలాండ్పై టీమిండియాదే పైచేయిగా ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 30 మ్యాచ్లు జరగ్గా.. 16 మ్యాచ్ల్లో భారత్, 11 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ గెలిచాయి. మూడు మ్యాచ్లు ‘టై’గా ముగిశాయి.ఇరు జట్లు గత రెండు సందర్భాల్లో ఎదురెదురుపడినప్పుడు కూడా టీమిండియానే ఆధిక్యత ప్రదర్శించింది. 2023 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో, 2025 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియానే గెలిచింది.పై అంశాలతో పాటు మరో అంశం కూడా టీమిండియాకు సానుకూలంగా ఉంది. అదే హోం అడ్వాంటేజ్. భారత్ సహజంగానే స్వదేశంలో చెలరేగిపోతూ ఉంటుంది. అభిమానుల నుంచి లభించే విపరీతమైన ప్రోత్సాహం టీమిండియాను ఎంతటి ఒత్తిడినైనా అధిగమించేలా చేస్తుంది. ఈ విషయం పలు సార్లు మిస్ ఫైర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఇదే నరేంద్ర మోదీ స్టేడియంలో ఆసీస్ చేతిలో చిత్తైంది. అయితే ఈసారి అలా జరగదని భారత అభిమానులు బలంగా నమ్ముతున్నారు. -
సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్..?
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (మార్చి 8) తుది సమరం జరుగనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్-న్యూజిలాండ్ టైటిల్ కోసం పోటీ పడతాయి. రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. భారత్ వరుసగా తమ రెండో టైటిల్ను సాధిస్తుందా లేక న్యూజిలాండ్ తొలిసారి ప్రపంచ ఛాంపియన్గా అవతరిస్తుందా అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి.మండుటెండల్లో ఈ హీట్కు తోడు మరో సంచలన విషయం వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తుంది. అదేంటంటే.. భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేటి ఫైనల్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతాడని సోషల్మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. టైటిల్ గెలిచినా, గెలవకపోయినా సూర్య నిర్ణయం మారదని పలు కథనాలు వెలువడుతున్నాయి.వయసు పైబడటం (35), మిగతా ఫార్మాట్లలో (వన్డే, టెస్ట్) అవకాశాలు లేకపోవడం చేత స్కై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తరహాలోనే స్కై కూడా కెరీర్కు వీడ్కోలు పలకాలని భావిస్తున్నట్లు సమాచారం. రోహిత్, కోహ్లి టీ20 ప్రపంచకప్ 2024 గెలుపు తర్వాత పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.గత కొంతకాలంగా ఫామ్లేమితో ఇబ్బంది పడిన సూర్య.. ఈ ప్రపంచకప్కు ముందే తిరిగి ఫామ్లోకి వచ్చాడు. ఫామ్లో ఉన్నప్పుడే కెరీర్కు పుల్స్టాప్ పెడితే గౌరవంగా ఉంటుందన్న మరో భావన కూడా సూర్య రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రభావితం చేసి ఉండవచ్చు. నేటి ఫైనల్లో ఓ మంచి ఇన్నింగ్స్ ఆడి జట్టు గెలుపుకు దోహదపడితే స్కై భారత కెప్టెన్గా తన కెరీర్కు న్యాయం చేసినట్లవుతుంది.రోహిత్ శర్మ తర్వాత భారత టీ20 జట్టు పగ్గాలు చేపట్టిన సూర్య.. కెప్టెన్గా అసమానమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు. అతని సారథ్యంలో భారత జట్టు ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. పైగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ లాంటి మేటి జట్ట భారీ సిరీస్ విజయాలు సాధించాడు. అతని కెప్టెన్సీ సక్సెస్ రేట్ 80 శాతానికి పైగా ఉందంటే, అతను ఏ రేంజ్లో విజయాలు సాధించాడో అర్దమవుతుంది. వ్యక్తిగతంగా విఫలమైనా, స్కై కెప్టెన్గా జట్టును విజయవంతంగా ముందుండి నడిపించాడు.స్కై రిటైర్మెంట్పై ఊహాగానాలు తప్పిస్తే.. ఇప్పటివరకు అతని నుంచి కానీ, బీసీసీఐ నుంచి కాని ఎలాంటి అధికారిక సమాచారమూ లేదు. ఈ విషయంపై సందిగ్దత వీడాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే. -
మరో కొత్త అవతారంలో గంగూలీ
టీమిండియా ఆటగాడిగా, కెప్టెన్గా, బీసీసీఐ, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, కోచ్గా, మెంటార్గా వివిధ హోదాల్లో క్రికెట్కు సేవలందించిన భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. త్వరలో క్రికెటేతర రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ప్రముఖ టీవీ రియాలిటీ షో 'బిగ్ బాస్' బెంగాలీ వెర్షన్కు హోస్ట్గా ఎంపికయ్యాడు. ఈ షోను ఇటీవలే కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఘనంగా ప్రకటించారు. బిగ్ బాస్ లాంచ్ వేడుక ఈడెన్ గార్డెన్స్లో భారీ లైట్ షో, కళాకారుల ప్రదర్శనలు, సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్తో ఘనంగా జరిగింది. ఈ షో స్టార్ జల్షా ఛానల్లో ప్రసారం కానుంది. బిగ్ బాస్ హోస్ట్గా ఎంపికైన సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ.. ఏ పని చిన్నది కాదు. దేశం కోసం ఆడినా, షో హోస్ట్ చేసినా, నేను పూర్తి అంకితభావంతో చేస్తాను అని అన్నాడు. కాగా, గంగూలీ ప్రస్తుతం ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ ఛైర్ పర్సన్గా, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, సౌతాఫ్రికా టీ20 లీగ్లో ప్రిటోరియా క్యాపిటల్స్ హెడ్ కోచ్గా, బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ అడ్మినిస్ట్రేటర్గా వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇవి కాకుండా ఇప్పుడు అదనంగా బిగ్ బాస్ హోస్ట్ బాధ్యతలు చేపట్టాడు.మరోవైపు గంగూలీ బయోపిక్ తెరపైకి రానున్న విషయం తెలిసిందే. అందులో రాజ్కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించనున్నారు. అపరాజిత ఆధ్యా గంగూలీ తల్లి పాత్రలో, బోమన్ ఇరానీ తండ్రి చండీ గంగూలీగా నటించనున్నట్లు సమాచారం. పాత్రకు సన్నద్ధం కావడానికి రాజ్కుమార్ రావు గంగూలీ ఇంట్లో కొంతకాలం గడపనున్నారు. -
ఫైనల్ కి ముందే బయటపడిన టీమిండియా డొల్లతనం ఫైనల్లో ఈ ముగ్గురిని తప్పించకుంటే ఓటమి పక్కా..?
-
సూర్య VS సాంట్నర్..రికార్డ్స్ చూస్తే..టీమిండియాకు మళ్లీ నిరాశేనా..?
-
ఆ పేరు చెప్తేనే వణికిపోతున్న టీం ఇండియా
-
పాత ఓటమికి ప్రతీకారం? టీమిండియా ఫైనల్ పోరు
-
ఇండియా Vs కివీస్ సన్ డే బిగ్ ఫైట్..
-
T20 WC 2026 Final: అభిషేక్పై వేటు పడుతుందా..?
టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్కు ముందు టీమిండియాను ఓ విషయం తెగ కలవరపెడతుంది. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఎన్ని అవకాశాలు ఇచ్చినా గాడిలో పడలేకపోవడంతో యావత్ భారతం ఆందోళన చెందుతుంది. ఈ టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్ల్లో డకౌట్లైన అతను.. సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్తో జరిగిన కీలక సమరాల్లోనూ చేతులెత్తేశాడు. టోర్నీ మొత్తంలో జింబాబ్వే మ్యాచ్ మినహాయించి ఒక్క మ్యాచ్లో కూడా కనీస ప్రదర్శనలు చేయలేకపోయాడు. మొత్తంగా 7 ఇన్నింగ్స్ల్లో 12.71 సగటున 89 పరుగులు మాత్రమే చేశాడు.వరుస వైఫల్యాల నేపథ్యంలో మార్చి 8న న్యూజిలాండ్తో జరుగబోయే ఫైనల్ మ్యాచ్లో అభిషేక్కు ఆడించాలా వద్దా అన్న చర్చ భారత క్రికెట్ సర్కిల్స్లో జోరుగా సాగుతుంది. మేనేజ్మెంట్ అభిషేక్ను వెనకేసుకొస్తున్నప్పటికీ.. అభిమానులు మాత్రం వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. భారత దేశ పరువు సమస్య కాబట్టి, ఛాన్స్లు తీసుకోవద్దని సూచిస్తున్నారు.క్లిష్ట సమయంలో మేనేజ్మెంట్తో పాటు సహచరులు, కోచ్ గౌతమ్ గంభీర్ అభిషేక్కు అండగా నిలుస్తున్నారు. తాజాగా మరో ఓపెనర్ సంజూ శాంసన్ మాట్లాడుతూ.. భారత జట్టు అభిషేక్పై నమ్మకం కోల్పోలేదని అన్నాడు. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా పాజిటివ్గా ఉంది. ప్రతి ఆటగాడికి ఎత్తుపల్లాలు సహజమే అని వెనకేసుకొచ్చాడు. ఒకట్రెండు మంచి షాట్లు ఆడితే ఫామ్ తిరిగి వస్తుంది. ఫైనల్ అతని రోజు కావచ్చని సహచరుడికి పూర్తి స్థాయి మద్దతు తెలిపాడు.వాస్తవానికి అభిషేక్ వరుస వైఫల్యాలకు అతనిపై ఉన్న అధిక అంచనాలే కారణమని నిపుణులు అంటున్నారు. ఒత్తిడి అధికం కావడం వల్ల అభిషేక్ తడబడుతున్నాడని అభిప్రాయపడుతున్నారు. అతనికి ఫ్రీ హ్యాండ్ ఇస్తే సత్ఫలితాలు రావచ్చని అంటున్నారు. పరుగులు రాబట్టేందుకు కష్టపడుతున్న మాట కూడా వాస్తమే అయినప్పటికీ.. ఒక్కసారి లైన్లోకి వచ్చాడంటే, అతన్ని ఆడపం కష్టమని అంటున్నారు. ఆఫ్ స్పిన్ను ఎదుర్కోవడంలో లోపాలు సరిదిద్దుకుంటే రాణించగలడని అంచనా వేస్తున్నారు. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా, కీలకమైన ఫైనల్లో రాణిస్తే మాత్రం అభిషేక్ భారత క్రికెట్లో చిరస్థాయిగా గుర్తుండిపోతాడు.ప్రస్తుత ప్రపంచకప్లో అభిషేక్ ప్రదర్శనలు..యూఎస్ఏపై 0 (1)నమీబియాపై ఆడలేదుపాకిస్తాన్పై 0 (4)నెదర్లాండ్స్పై 0 (3)సౌతాఫ్రికాపై 15 (12 బంతులు; 2 ఫోర్లు, సిక్స్)జింబాబ్వేపై 55 (30 బంతులు; 4 ఫోర్లు, 4 సిక్సర్లు)వెస్టిండీస్పై 10 (11 బంతులు; 2 ఫోర్లు)ఇంగ్లండ్పై 9 (7 బంతులు; 2 ఫోర్లు)కాగా, టీ20 ప్రపంచకప్ 2026 తుది అంకానికి చేరింది. భారత్, న్యూజిలాండ్ ఫైనల్స్కు చేరాయి. న్యూజిలాండ్ సౌతాఫ్రికాను.. భారత్ ఇంగ్లండ్ను మట్టికరిపించి తుది పోరులో అమీతుమీకి సిద్దమయ్యాయి. ఈ సమరం మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగనుంది. -
T20 WC 2026: ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ నామినీల పేర్లు ప్రకటన
2026 టీ20 ప్రపంచకప్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ నామినీల పేర్లను ఐసీసీ ఇవాళ (మార్చి 6) ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం ఎనిమిది మంది ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో ఒక టీమిండియా ప్లేయర్, ఓ పాకిస్తానీ ప్లేయర్ ఉన్నారు.భారత్ తరఫున ఈ అవార్డుకు నామినేట్ అయిన ఆ ఒకే ఒక్కడు సంజూ శాంసన్. సంజూ ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 232 పరుగులు చేశాడు. అతని సగటు 77.33, స్ట్రైక్ రేట్ 201.73గా ఉంది. ఈ టోర్నీలో భారత్ ఫైనల్కు చేరడంలో సంజూది కీలకపాత్ర. సెమీస్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో వెస్టిండీస్పై ఉగ్రరూపం (50 బంతుల్లో 97 నాటౌట్) దాల్చాడు. ఆపై సెమీస్లో ఇంగ్లండ్పై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ 89 (42 బంతులు) ఆడి భారత్ను ఫైనల్కు చేర్చాడు.పాకిస్తాన్ తరఫున ఈ అవార్డుకు నామినేట్ అయిన ప్లేయర్ సాహిబ్జాదా ఫర్హాన్. ఫర్హాన్ తన జట్టు సూపర్-8 దశ దాటలేకపోయినా, అద్బుత ప్రదర్శనలతో అలరించాడు. శ్రీలంక, నమీబియాపై శతకాలు సాధించి, ఒకే వరల్డ్ కప్లో రెండు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ టోర్నీలో 7 మ్యాచ్లు ఆడిన ఫర్హాన్.. 76.63 సగటున, 160.25 స్ట్రైక్ రేట్తో 383 పరుగులు చేశాడు.ఇతర నామినీలువిల్ జాక్స్ (ఇంగ్లండ్) – 226 పరుగులు, 9 వికెట్లు.రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్) – 128 పరుగులు, 11 వికెట్లు.ఏయిడెన్ మార్క్రమ్ (దక్షిణాఫ్రికా కెప్టెన్) – 286 పరుగులు, కీలక వికెట్లు.టిమ్ సీఫర్ట్ (న్యూజిలాండ్) – 274 పరుగులు, సెమీఫైనల్లో 58.లుంగి ఎంగిడి (దక్షిణాఫ్రికా) – 12 వికెట్లు, ఎకానమీ 7.19.షాడ్లీ వాన్ స్కాల్క్విక్ (అమెరికా) – 13 వికెట్లు, టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు.కాగా, టీ20 ప్రపంచకప్ 2026 తుది అంకానికి చేరింది. భారత్, న్యూజిలాండ్ ఫైనల్స్కు చేరాయి. న్యూజిలాండ్ సౌతాఫ్రికాను.. భారత్ ఇంగ్లండ్ను మట్టికరిపించి తుది పోరులో అమీతుమీకి సిద్దమయ్యాయి. అంతిమ సమరం మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగనుంది. -
T20 WC 2026: వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా నిన్న (మార్చి 5) జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్పై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి వరుసగా రెండో ఎడిషన్లో (2024, 2026), ఓవరాల్గా నాలుగోసారి (2007, 2014, 2024, 2026) ఫైనల్కు చేరింది.ఈ క్రమంలో టీమిండియా ఓ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. ఐసీసీ టోర్నీల్లో అత్యధిక సార్లు ఫైనల్కు చేరిన జట్టుగా చరిత్ర సృష్టించింది. తాజా ఫైనల్స్తో భారత్ ఐసీసీ టోర్నీల ఫైనల్స్ సంఖ్య 15కు చేరింది. గతంలో ఈ వరల్డ్ రికార్డు భారత్, ఆస్ట్రేలియా పేరిట సంయుక్తంగా ఉండేది. తాజాగా భారత్ ఆసీస్ ఆధిపత్యానికి తెరదించి, హోల్ అండ్ సోల్గా ప్రపంచ రికార్డు సొంతం చేసుకుంది.టీమిండియా ఫైనల్స్కు చేరిన ఐసీసీ టోర్నీలు.. భారత్ ఇప్పటివరకు 14 ఫైనల్స్లో 6 గెలిచింది, 7 ఓడింది. 2002 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వర్షం కారణంగా రద్దవగా, భారత్..శ్రీలంకతో పాటు సంయుక్తంగా ట్రోఫీని పంచుకుంది. - వన్డే వరల్డ్ కప్: 1983, 2011 విజయాలు, 2003, 2023 (రన్నరప్) - టీ20 వరల్డ్ కప్: 2007, 2024 విజయాలు, 2026 (లోడింగ్) - ఛాంపియన్స్ ట్రోఫీ: 2002 (సంయుక్త విజేత), 2013, 2025 విజయాలు, 2002, 2017 (రన్నరప్) - వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్: 2021, 2023 (రన్నరప్) ఐసీసీ టోర్నీల్లోఅత్యధిక సార్లు ఫైనల్స్కు చేరిన జట్లు 1. భారత్ – 15 2. ఆస్ట్రేలియా – 14 3. ఇంగ్లాండ్ – 9 4. న్యూజిలాండ్ – 8 5. వెస్టిండీస్ – 8 6. శ్రీలంక – 8 7. పాకిస్తాన్ – 7 8. దక్షిణాఫ్రికా – 3ఫైనల్లో న్యూజిలాండ్తో ఢీ2026 టీ20 వరల్డ్కప్ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ను ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మార్చి 8న జరుగనుంది. న్యూజిలాండ్ సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించి ఫైనల్కు చేరింది. ఫిన్ అలెన్ 33 బంతుల్లో విధ్వంసకర సెంచరీ చేసి కివీస్ను ఒంటిచేత్తో ఫైనల్కు చేర్చాడు.చరిత్రాత్మక అవకాశం టీ20 వరల్డ్ కప్లో ఇప్పటివరకు ఏ జట్టు టైటిల్ను రక్షించుకోలేదు. భారత్కు ఈసారి ఆ అవకాశం వచ్చింది. గత ఎడిషన్లో ఛాంపియన్గా నిలిచిన భారత్.. చరిత్ర తిరగరాయాలని పట్టుదలగా ఉంది. మరోవైపు, న్యూజిలాండ్ తమ తొలి టైటిల్ కోసం ఉవ్విళ్లూరుతుంది. -
ఫైనల్లోకి ఏంట్రీ ఇంగ్లాండ్ కు భారత్ ఊచకోత..
-
టీమిండియా గెలుపుకు 3 కారణాలు ఇవే
-
సెమీస్కు ముందే టీమిండియాకు 5 గుడ్ న్యూస్ లు
-
భారత్-ఇంగ్లండ్ మ్యాచ్లో బద్దలయ్యే అవకాశమున్న 3 రికార్డులు ఇవే..!
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (మార్చి 5) అత్యంత కీలకమైన సమరం జరుగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇరు జట్లు సమవుజ్జీలు కావడంతో హోరీహోరీ తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీమిండియాకు హోం అడ్వాంటేజ్ ఉన్నా, ఇంగ్లండ్ను తక్కువ అంచనా వేయకూడదని హెచ్చరిస్తున్నారు. ఇరు జట్లు సెమీస్లో ఎదురెదురుపడటం ఇది వరుసగా మూడోసారి. 2022 ఎడిషన్లో ఇంగ్లండ్ భారత్పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఆతర్వాత టైటిల్ను కూడా ఎగరేసుకుపోగా.. 2024 ఎడిషన్లో భారత్ ఇంగ్లండ్ను 68 పరుగుల తేడాతో చిత్తు చేసి, ఆతర్వాత టైటిల్ను కూడా సొంతం చేసుకుంది. గత రెండు ఎడిషన్లలో ఇరు జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్స్లో గెలిచిన జట్లు ఆతర్వాత టైటిల్ను కూడా ఎగరేసుకుపోవడంతో ఇవాల్టి మ్యాచ్కు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్స్కు చేరడమే కాకుండా, ఆతర్వాత టైటిల్ కూడా ఎగరేసుకుపోతుందని సెంటిమెంట్లను ఫాలో అయ్యే వారు నమ్ముతున్నారు.గెలుపోటముల విషయం పక్కన పెడితే, నేటి మ్యాచ్లో మూడు భారీ రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది.అత్యధిక టీమ్ టోటల్నేటి మ్యాచ్లో భారత్ టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్లో అత్యధిక టీమ్ టోటల్ను నమోదు చేసే అవకాశం ఉంది. 2016 ఎడిషన్లో వాంఖడే మైదానంలోనే విండీస్పై చేసిన 192 పరుగులే ఇప్పటివరకు అత్యధికంగా ఉంది. ప్రస్తుత భారత జట్టు బ్యాటింగ్ విభాగం గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉండటంతో నేటి మ్యాచ్లో ఈ రికార్డు బద్దలవడం ఖాయంగా కనిపిస్తుంది. వాంఖడే వికెట్ బ్యాటింగ్కు అనుకూలించే అవకాశం ఉండటంతో తొలుత బ్యాటింగ్ చేస్తే టీమిండియా 200 పైచిలుకు పరుగులు సాధిస్తుందనే అంచనా ఉంది.డేంజర్లో విరాట్ రికార్డునేటి మ్యాచ్లో బద్దలయ్యే అవకాశమున్న మరో రికార్డు టీ20 వరల్డ్కప్ నాకౌట్స్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు. ప్రస్తుతం ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉంది. 2016 ఎడిషన్ సెమీఫైనల్లో విండీస్పై విరాట్ చేసిన 89 పరుగులకే (47 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్, నాటౌట్) నేటి వరకు టీ20 ప్రపంచకప్ నాకౌట్స్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్గా ఉంది. నేటి మ్యాచ్లో ఈ రికార్డు కూడా బద్దలయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. భారత బ్యాటింగ్ ఆర్డర్లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ నుంచి ఈ రికార్డుకు ముప్పు పొంచి ఉంది.ఎవరు గెలిచినా రికార్డేనేటి మ్యాచ్లో బద్దలయ్యే అవకాశమున్న మరో రికార్డు టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక సార్లు ఫైనల్స్కు చేరిన రికార్డు. ప్రస్తుతం ఈ రికార్డు భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంక పేరిట సంయుక్తంగా ఉంది. ఈ నాలుగు జట్లు తలో మూడు సార్లు ఫైనల్స్కు చేరాయి. నేటి మ్యాచ్లో ఏ జట్టు గెలిచినా చరిత్ర అవుతుంది. భారత్ 2007, 2014, 2024 ఎడిషన్లలో ఫైనల్స్కు చేరగా.. ఇంగ్లండ్ 2010, 2016, 2022 ఎడిషన్లలో తుది పోరుకు అర్హత సాధించింది. -
నిబంధనలు ఉల్లంఘించిన ధోని.. జరిమానా
నియమ నిబంధనల విషయంలో ఎప్పుడూ నిక్కచ్చిగా ఉండే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తాజాగా ఓ నిబంధనను ఉల్లంఘించి వార్తల్లోకెక్కాడు. కొద్ది రోజుల కిందట ధోని పేరిట రిజిస్టర్ అయిన ఓ వాహనం రాంచీలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు రికార్డైంది. సదరు వాహనం వేగ పరిమితిని మించి ప్రయాణించినట్లు ఆటోమేటెడ్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్ గుర్తించడంతో మోటార్ వెహికిల్స్ యాక్ట్ సెక్షన్ 183 కింద రూ.1000 జరిమానా విధిస్తూ ఈ-చలాన్ జారీ చేశారు. ఈ ఘటన ధోని నివాసం సమీపంలో జరిగింది. ఇలాంటి ఘటనలు సర్వసాధారణమే అయినా, ధోని పేరు రావడంతో సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. ఇంతకుముందే మరో వివాదందీనికి ముందే ధోని మరో వివాదంలో చిక్కుకున్నాడు. రాంచీలోని హార్ము రోడ్లో ఉన్న ఆయన పాత నివాస స్థలాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించారని ఆరోపిస్తూ, ఝార్ఖండ్ స్టేట్ హౌసింగ్ బోర్డు నోటీసులు జారీ చేసింది. ఆ స్థలం కేవలం నివాస ప్రయోజనాల కోసం మాత్రమే కేటాయించబడిందని అధికారులు పేర్కొన్నారు. బిజీగా ధోనిట్రాఫిక్ చలాన్లు, ఇతర వివాదాలపై అవగాహన లేని ధోని ప్రస్తుతం ఐపీఎల్ 2026 సన్నాహకాల్లో బిజీగా ఉన్నాడు. 44 ఏళ్ల ధోనిని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఈ సీజన్కు కూడా రీటైన్ చేసుకుంది. అన్క్యాప్డ్ ప్లేయర్ కోటాలో (రూ. 4 కోట్లు) అతను ఎంపికయ్యాడు. గత సీజన్లో సీఎస్కే 14 మ్యాచ్ల్లో 10 ఓటములు ఎదుర్కొని చివరి స్థానంలో నిలిచింది. అయితే ధోని వ్యక్తిగంతా రాణించాడు (135.17 స్ట్రైక్ రేట్తో 196 పరుగులు). ధోనికి వయసు మీదపడినప్పటికీ.. ఆయన వ్యూహాత్మక అవగాహన, జట్టుపై నియంత్రణ CSKకి కీలకంగా మారాయి. ఈసారి జట్టు పునర్నిర్మాణ దశలో ఉన్నందున ధోని చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నాడు. సంజూ శాంసన్ లాంటి చాలామంది కీలక ఆటగాళ్లను జట్టులో చేర్చుకోవడంలోనూ ధోనిదే కీలకపాత్ర. -
రోహిత్, కోహ్లి అభిమానులకు పండగే..!
టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అభిమానులకు శుభవార్త. టెస్ట్, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న ఈ స్టార్ ద్వయానికి అదనపు అవకాశాలు రానున్నాయి. ఈ ఏడాది చివర్లో టీమిండియా మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం న్యూజిలాండ్లో పర్యటించనుంది. ఈ సిరీస్లో 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్లు షెడ్యూలయ్యాయి.2027 వన్డే ప్రపంచకప్ దృష్ట్యా వన్డే మ్యాచ్ల సంఖ్యను 3 నుంచి 5కు పెంచాలని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు బీసీసీఐకి విజ్ఞప్తి చేసింది. ఈ ప్రతిపాదనకు బీసీసీఐ కూడా సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. వన్డే మ్యాచ్ల సంఖ్య 4కు పెంచితే, టీ20 మ్యాచ్ల సంఖ్యను 3కు కుదించే అవకాశం ఉంది. ఈ విషయంలో ఇరు దేశాల క్రికెట్ బోర్డుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. వన్డేల పెంపు ఖరారైందని సమాచారం.ఈ అంశం ఇరు దేశాల క్రికెట్ బోర్డులకు వాణిజ్యపరమైన లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. రోహిత్-విరాట్ ఎక్కువ మ్యాచ్ల్లో కనబడితే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుపై కాసుల వర్షం కురిసే అవకాశం ఉంటుంది. అలాగే వన్డే ప్రపంచకప్కు ముందు రో-కోకు వీలైనంత రియల్ ప్రాక్టీస్ కూడా లభించినట్లవుతుంది. కాబట్టి న్యూజిలాండ్ పర్యటనలో వన్డే లెగ్ పొడిగించడం దాదాపుగా ఖరారైనట్టే. అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి.ఐపీఎల్ తర్వాత వన్డేలపై దృష్టిఐపీఎల్ 2026 సీజన్ మే చివర్లో ముగిసిన వెంటనే, భారత జట్టు దృష్టి వన్డే ప్రపంచకప్ సన్నాహాలపై కేంద్రీకృతమవుతుంది. గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్లో బిజీగా ఉన్న భారత జట్టు.. జూన్ మొదటి వారం నుంచి వన్డేలపై దృష్టి సారించనుంది.ఐపీఎల్ 2026 తర్వాత భారత వన్డే క్యాలెండర్ - జూన్లో ఆఫ్ఘానిస్తాన్తో మూడు మ్యాచ్లు - జూలైలో ఇంగ్లండ్తో మూడు మ్యాచ్లు - ఆగస్టులో వెస్టిండీస్తో మూడు మ్యాచ్లు - అక్టోబర్లో న్యూజిలాండ్ పర్యటన- సంవత్సరం చివర్లో శ్రీలంకతో మూడు మ్యాచ్లు -
ఆసీస్తో ఏకైక టెస్ట్.. టీమిండియాలో కీలక మార్పు
ఆసీస్తో ఏకైక టెస్ట్కు ముందు భారత మహిళల క్రికెట్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ స్థానంలో యువ పేసర్ కశ్వీ గౌతమ్ను ఎంపిక చేశారు. వర్క్లోడ్ కారణంగా రేణుకా సింగ్కు విశ్రాంతినిచ్చినట్లు సెలెక్టర్లు చెప్పారు. రేణుకా ఇప్పటివరకు మూడు టెస్టులు ఆడింది, కానీ కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసింది. ప్రస్తుత ఆసీస్ పర్యటనలోనూ 3 టీ20లు (4 వికెట్లు), 2 వన్డేలు (ఒక్క వికెట్) ఆడినా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. రేణుకా ఫామ్లో లేకపోయినా ఆమె అందుబాటులో లేకపోవడం వల్ల భారత పేస్ విభాగం అనుభవం కోల్పోనుంది. కశ్వీ విషయానికొస్తే.. ఆమెకు ఇదే తొలి టెస్ట్ మ్యాచ్. ఇప్పటివరకు 6 వన్డేలు మాత్రమే ఆడింది. ప్రస్తుత ఆసీస్ సిరీస్లో 3 వికెట్లు తీసి, 68 పరుగులు చేసింది. కశ్వీకి రేణుకా అంత అనుభవం లేకపోవడంతో ఆసీస్ మ్యాచ్లో టీమిండియా పరీక్ష ఎదుర్కోవచ్చు.భారత పేస్ విభాగంలో కశ్వీతో పాటు క్రాంతి గౌడ్, సయాలి సత్ఘరే, అమంజోత్ కౌర్ కూడా టెస్ట్ స్థాయిలో కొత్తవారే. అనుభవలేమితో భారత పేస్ విభాగం ఆసీస్ బ్యాటర్లను ఏమేరకు నిలువరించగలరో చూడాలి. మార్చి 6న పెర్త్లోని WACA మైదానంలో ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. పింక్బాల్తో జరిగే ఈ మ్యాచ్ డే అండ్ నైట్ ఫార్మాట్లో ఉంటుంది.కాగా, భారత మహిళల జట్టు మల్లీ ఫార్మాట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్ జరగగా భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అనంతరం జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆతిథ్య జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ పర్యటనలో చివరిదైన ఏకైక టెస్ట్ మార్చి 6న ప్రారంభం కానుంది. సిరీస్లో ప్రస్తుతం ఆస్ట్రేలియా 8-4 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. ఈ టెస్ట్ మ్యాచ్కి నాలుగు పాయింట్లు ఉన్నాయి. భారత్ గెలిస్తే సిరీస్ను సమం చేయగలదు. ఆసీస్తో ఏకైక టెస్ట్కు భారత జట్టు..స్మృతి మంధన, జెమీమా రోడ్రిగ్స్, ప్రతీక రావల్, షఫాలీ వర్మ, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమన్జోత్ కౌర్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, వైష్ణవి శర్మ, సయాలీ సత్ఘరే, రిచా ఘోష్, ఉమా ఛెత్రి, క్రాంతి గౌడ్, కశ్వీ గౌతమ్భారత్తో ఏకైక టెస్ట్ కోసం ఆస్ట్రేలియా జట్టు.. - అలీస్సా హీలీ (కెప్టెన్) - డార్సీ బ్రౌన్ - మైట్లాన్ బ్రౌన్ - అశ్లే గార్డ్నర్ - లూసీ హామిల్టన్ - అలానా కింగ్ - ఫీబీ లిచ్ఫీల్డ్ - బెత్ మూనీ - తాలియా మెక్గ్రాత్ - ఎలీస్ పెర్రీ - అన్నాబెల్ సతర్లాండ్ - జార్జియా వోల్ - జార్జియా వారెహామ్ -
అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్ సిగ్నల్!
ఆకిబ్ నబీ.. భారత క్రికెట్లో ఈ పేరు చర్చనీయాంశంగా మారింది. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో అతడి అత్యద్భుత ప్రదర్శనలు ఇందుకు కారణం. జమ్మూ కశ్మీర్ తొలిసారి రంజీ టైటిల్ గెలవడంలో ఈ పేస్ బౌలర్ది కీలక పాత్ర.స్పందించిన బీసీసీఐసీజన్ ఆసాంతం అద్భుత ఆట తీరుతో జట్టును గెలిపించిన ఆకిబ్ నబీ (Auqib Nabi Dar)పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడిని భారత టెస్టు జట్టుకు ఎంపిక చేయాలనే డిమాండ్లూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించాడు.అతడిదే కీలక పాత్రత్వరలోనే అతడు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాడు. అయితే, ఆకిబ్ ఎంపిక విషయంలో తుది నిర్ణయం మాత్రం సెలక్టర్లదేనని స్పష్టం సైకియా చేశాడు. ‘‘అతడు అద్భుతంగా ఆడాడు. జట్టు విజయాల్లో అతడిదే కీలక పాత్ర.క్వార్టర్ ఫైనల్లో ఐదు వికెట్లు తీశాడు. సెమీ ఫైనల్లోనూ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇక ఫైనల్లోనూ ఇదే ప్రదర్శన పునరావృతం చేశాడు. ఐదు వికెట్లతో సత్తా చాటి జట్టును గెలిపించాడు. అతడి బౌలింగ్ ఫైనల్ రాతను మార్చింది. కాబట్టి ప్రతి ఒక్కరి దృష్టిని అతడు ఆకర్షించగలిగాడు.రంజీ ట్రోఫీకి సంబంధించి ప్రతి మ్యాచ్కు మా సెలక్టర్లు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశాము. ఫైనల్ సహా కీలక మ్యాచ్లన్నీ మా సెలక్టర్లు వీక్షించారు. వాళ్లు తమ పనిని విజయవంతంగా పూర్తి చేశారనే అనుకుంటున్నా. ఇప్పటికే అతడు లైమ్లైట్లో ఉన్నాడు. సెలక్టర్లే అతడి విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారు.అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?ప్రతిభ ఉన్న వాళ్లకు అన్యాయం జరగకుండా బీసీసీఐ సరైన చర్యలు తీసుకుంటుంది. మా సెలక్టర్లు అతడితో పాటు మ్యాచ్లో మెరుగ్గా రాణించిన అందరి ఆటను గమనించారు. నబీని వెలుగులోకి తీసుకుచ్చింది ఎవరు?.. అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. జమ్మూ కశ్మీర్ సెలక్టర్లే కదా!.. దేశీ క్రికెట్లో రాష్ట్ర జట్టు తరఫున అదరగొట్టిన వారికి బీసీసీఐ సెలక్టర్లు కచ్చితంగా అవకాశం ఇస్తారు’’ అని దేవజిత్ సైకియా టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు.60 వికెట్లు కూల్చాడుకాగా కర్ణాటకతో ఫైనల్లో జమ్మూ కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఆకిబ్ నబీ ఐదు వికెట్లతో రాణించి.. కర్ణాటక బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్లో జమ్మూ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో విజేతగా అవతరించింది. తాజా రంజీ సీజన్లో 29 ఏళ్ల కుడిచేతి వాటం పేసర్ ఏకంగా 60 వికెట్లు కూల్చాడు. ఇందులో ఎనిమిది ఫైవ్ వికెట్లు హాల్స్ ఉండటం విశేషం. ఈ నేపథ్యంలోనే ఆకిబి నబీ అరంగేట్రానికి డిమాండ్లు పెరుగుతున్నాయి. చదవండి: ప్రపంచకప్ వైఫల్యాల తర్వాత కూడా బాబర్ ఆజమ్కు కెప్టెన్సీ పగ్గాలు -
టీమిండియాలో ఆందోళన.. తప్పు జరిగిందా, చరిత్ర హీనులవుతారు..!
టీ20 ప్రపంచకప్ 2026 తుది దశకు చేరింది. నాలుగు సెమీఫైనల్ బెర్త్లు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్.. రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.కాగా, ఇంగ్లండ్తో సెమీస్కు ముందు టీమిండియాను ఓ విషయం తెగ కలవరపెడుతుంది. భారత ఫీల్డింగ్ ప్రతి భారత క్రికెట్ అభిమానిని ఆందోళనకు గురి చేస్తోంది. విండీస్తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో భారత ఫీల్డర్లు ఏకంగా 3 మ్యాచ్లు నేలపాలు చేశారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ కీలక దశలో రెండు క్యాచ్లు జారవిడిచాడు. ఓ క్యాచ్ను తిలక్ వర్మ వదిలేశాడు. ఈ మ్యాచ్లో టీమిండియాకు ప్రతికూల ఫలితం వచ్చుంటే, అభిషేక్, తిలక్పై ముప్పేట దాడి జరిగుండేది. టీమిండియా గెలవడంతో ఈ ఇద్దరు భారీ ట్రోలింగ్ను తప్పించుకున్నారు.విండీస్తో మ్యాచ్ ఒక్కటే కాదు, మెగా టోర్నీ ప్రారంభం నుంచి టీమిండియా ఫీల్డింగ్ అత్యంత చెత్తగా ఉంది. సూపర్-8కి చేరిన జట్లలో అత్యంత చెత్త క్యాచింగ్ ప్రదర్శనలు మనవే. భారత ఫీల్డర్లు 100లో కేవలం 71 శాతం క్యాచ్లను మాత్రమే పట్టారు. మొత్తంగా సూపర్-8కు చేరిన జట్లలో ఏ జట్టు వదలని విధంగా ఏకంగా 13 క్యాచ్లు నేలపాలు చేశాడు. అదనంగా భారత ఫీల్డర్లు మిస్ ఫీల్డింగ్ కూడా చేసి ప్రత్యర్దిని అదనపు పరుగులు సమకూర్చారు.సెమీస్లో ఇదే పరిస్థితి కొనసాగితే టీమిండియా తప్పక మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్యాచ్లు మ్యాచ్లు గెలిపిస్తాయన్న విషయాన్ని భారత ఆటగాళ్లు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నారు. గత ప్రపంచకప్ ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచే భారత్ను జగజ్జేతగా నిలిపిన విషయాన్ని ప్రస్తుత టీమిండియా సభ్యులు గుర్తు పెట్టుకోవాలి. క్యాచ్లు నేలపాలు చేసినా, మిస్ ఫీల్డింగ్ చేసి అదనపు పరుగులు సమర్పించుకున్నా, సరిదిద్దుకోవడానికి జరగబోయేది సామాన్యమైన మ్యాచ్ కాదు. ఒక్కసారి తప్పు జరిగిపోతే, ఎంతటి స్టార్ ఆటగాడైనా చరిత్ర హీనుడవ్వాల్సిందే. కాబట్టి, సెమీఫైనల్లో ప్రతి భారత ఆటగాడు ఫీల్డ్లో జాగ్రత్తగా ఉండాలని ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. -
బీసీసీఐలో చేరిన హర్భజన్ సింగ్
భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బీసీసీఐలో చేరాడు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి, యువ స్పిన్నర్లకు మార్గదర్శకత్వం చేయనున్నాడు. ఇప్పటికే మరో భారత మాజీ బౌలర్ జహీర్ ఖాన్ ఫాస్ట్ బౌలర్లతో పని చేస్తున్నాడు. తాజాగా హర్భజన్ సింగ్ ఈ జాబితాలో చేరాడు.బీసీసీఐ మార్చి మొదటి వారంలో ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ ప్రోగ్రాంలో రెడ్ బాల్ స్పెషలైజ్డ్ క్యాంపులు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. ఈ శిబిరాలు అండర్-19 మరియు ఇండియా A జట్లలో ప్రతిభ చూపిన ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. వీరిని త్వరలోనే సీనియర్ జట్టులోకి తీసుకురావడానికి అవసరమైన నైపుణ్యాలను అందించడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. మరో దిగ్గజం కూడా..!యువ బౌలర్లకు శిక్షణ ఇచ్చేందుకు భారత మాజీలు క్యూ కడుతున్నారు. జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ ఇప్పటికే రంగంలోకి దిగగా.. మరో దిగ్గజ బౌలర్ కూడా తన స్పెషలైజేషన్లో యువ బౌలర్లకు శిక్షణ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆల్టైమ్ గ్రేట్ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రిస్ట్ స్పిన్నర్ల కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మొత్తం కార్యక్రమాన్ని మరో భారత దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ సమన్వయం చేస్తున్నారు. ఇతర మాజీ ఆటగాళ్లను కూడా ఈ శిక్షణా కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడానికి అతను సంప్రదింపులు జరుపుతున్నారు. కాగా, బీసీసీఐలో ఇలాంటి శిక్షణా శిబిరాలు కొత్తవి కావు. జగ్మోహన్ దాల్మియా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే మాజీ ఆటగాళ్లను యువ క్రికెటర్లకు మార్గదర్శకులుగా ఆహ్వానించే పద్ధతి ప్రారంభమైంది. అప్పట్లో చందు బోర్డే, ఎరపల్లి ప్రసన్న, సయ్యద్ కిర్మాణి వంటి ప్రముఖులు జోనల్ అకాడమీ శిబిరాల్లో శిక్షణ ఇచ్చారు. -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన టీమిండియా
భారత పురుషుల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ ఈవెంట్లలో 20 సార్లు సెమీఫైనల్స్కు చేరిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. టీ20 ప్రపంచకప్ 2026లో సెమీస్కు చేరడంతో ఈ ఘనత సాధించింది. భారత్ తర్వాత అత్యధిక సార్లు ఐసీసీ ఈవెంట్లలో సెమీస్కు చేరిన జట్లుగా ఆస్ట్రేలియా (18), న్యూజిలాండ్ (18) ఉన్నాయి. ఆతర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్ (16), పాకిస్తాన్ (16), సౌతాఫ్రికా (15), శ్రీలంక (11), వెస్టిండీస్ (11), ఆఫ్ఘనిస్తాన్ (1), బంగ్లాదేశ్ (1), కెన్యా (1) జట్లు ఉన్నాయి.ఐసీసీ ఈవెంట్లలో భారత్ సెమీస్కు చేరిన సందర్భాలు..వన్డే వరల్డ్కప్- 8 సార్లు (1983, 1987, 1996, 2003, 2011, 2015, 2019, 2023)టీ20 వరల్డ్కప్- 6 సార్లు (1998, 2000, 2002, 2013, 2017, 2025)ఛాంపియన్స్ ట్రోఫీ- 6 సార్లు (2007, 2014, 2016, 2022, 2024, 2026*)కాగా, టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న (మార్చి 1) జరిగిన సూపర్-8 మ్యాచ్లో వెస్టిండీస్పై విజయం సాధించడంతో భారత్ సెమీస్కు అర్హత సాధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్ (97 నాటౌట్) చారిత్రక ఇన్నింగ్స్ ఆడి భారత్ను గెలిపించాడు. ఓ పక్క వికెట్లు పడుతున్నా శాంసన్ సహనం కోల్పోకుండా కడదాకా క్రీజ్లో ఉండి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. మార్చి 4న జరిగే తొలి సెమీఫైనల్లో గ్రూప్ 1 టాపర్ సౌతాఫ్రికా, గ్రూప్-2లో రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడతాయి. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి. -
టీమిండియా టార్గెట్ 196
కోల్కతా: టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8 మ్యాచ్ లో భారత్కు 196 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది వెస్టిండీస్, ఇరు జట్లకు కీలకమైన మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ ఆది నుంచి బ్యాట్ ఝుళిపించింది. ఓపెనర్లు షాయ్ హోప్( 32: 33 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), రోస్టన్ ఛేజ్(40: 25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్)లు చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తరువాత హెట్ మెయిర్ ( 27: 12 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్ లు) చెలరేగి ఆడే యత్నం చేశాడు. విండీస్ స్కోరు బోర్డు వేగం పుంజుకునే క్రమంలో బూమ్రా బౌలింగ్ లో హెట్ మెయిర్ అవుటయ్యాడు. బూమ్రా బౌలింగ్ లో సంజూ శాంసన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు హెట్ మెయిర్. అప్పటికి విండీస్ స్కోరు 11.3 ఓవర్లలో 102 పరుగులుగా ఉంది. అయితే హెట్ మెయిర్ రెండో వికెట్గా ఔటైన తర్వాత విండీస్ స్కోరు బోర్డులో వేగం తగ్గింది. అయితే రావెన్ పావెల్(34 నాటౌట్; 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు), జాసన్ హోల్డర్(37 నాటౌట్; 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) లు ధాటిగా బ్యాటింగ్ చేశారు. ఈ జోడి కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. వీరిద్దరూ 35 బంతుల్లో 76 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో విండీస్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బూమ్రా రెండు వికెట్లు సాధించగా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది.భారత బౌలర్లలో బుమ్రా మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. బుమ్రా నాలుగు ఓవర్లలో 36 పరుగులే ఇవ్వగా, హార్దిక్ పాండ్యా తన నాలుగు ఓవర్ల కోటాలో 40 పరుగులు, అర్షదీప్ 43 పరుగులు, వరుణ్ చక్రవర్తి 40 పరుగులు ఇచ్చారు. అక్షర్ పటేల్ నాలుగు ఓవర్లలో 35 పరుగులు ఇచ్చాడు.పావెల్ అరుదైన ఘనతఈ మ్యాచ్లో రెండు సిక్సర్లు కొట్టడం ద్వారా రోవ్మాన్ పావెల్ అరుదైన ఘనతను సాధించాడు. విండీస్ తరుఫున టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. పావెల్ టీ20ల్లో 150 సిక్సర్లు మార్కును చేరుకోవడంతో విండిస్ తరుఫున ఇదే అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఆ తర్వాత స్థానంలో నికోలస్ పూరన్ 149 సిక్సర్లు కొట్టిన జాబితాలో ఉండగా, వెవిన్ లూయిస్ 136 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక క్రిస్ గేల్ 124 సిక్సర్లతో నాల్గో స్థానంలో కొనసాగుతున్నాడు.పొలార్డ్, హెట్మెయిర్లు 99 సిక్సర్లతో ఆ తర్వాత స్థానంలో ఉన్నారు. -
T20 WC 2026: విండీస్తో డూ ఆర్ డై మ్యాచ్.. టీమిండియా ఇదే..!
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (మార్చి 1) డూ ఆర్ డై మ్యాచ్ జరుగుతుంది. కోల్కతా వేదికగా జరుగనున్న ఈ సూపర్-8 మ్యాచ్లో భారత్, వెస్టిండీస్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు గ్రూప్-1 నుంచి సెమీస్కు చేరుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.అత్యంత కీలకమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్లో జింబాబ్వేపై ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. మరోవైపు ఈ మ్యాచ్ కోసం వెస్టిండీస్ ఓ మార్పు చేసింది. బ్రాండన్ కింగ్ స్థానంలో అకీల్ హొసేన్ తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లు..భారత్: సంజూ శాంసన్ (WK), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్వెస్టిండీస్: షాయ్ హోప్ (c & wk), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మాన్ పావెల్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, రోస్టన్ చేజ్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, అకీల్ హోసేన్, గుడకేష్ మోటీ, షమర్ జోసెఫ్ -
విశ్వవిజేత భారత్కు భారీ షాక్
మహిళల వన్డేల్లో విశ్వవిజేత అయిన భారత్కు ఊహించని షాక్ తగిలింది. జగజ్జేతగా అవతరించిన తర్వాతి సిరీస్లోనే మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్ను ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.హోబర్ట్ వేదికగా ఇవాళ (మార్చి 1) జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో 185 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. అంతకుముందు రెండు వన్డేలను కూడా ఆస్ట్రేలియానే గెలిచింది. అయితే దీనికి ముందు ఆసీస్లోనే జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను మాత్రం భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.ఇవాళ జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 409 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న కెప్టెన్ అలైస్సా హీలీ (98 బంతుల్లో 158; 27 ఫోర్లు, 2 సిక్సర్లు), వికెట్ కీపర్ బ్యాటర్ బెత్ మూనీ (84 బంతుల్లో 106 నాటౌట్; 10 ఫోర్లు, సిక్స్) విధ్వంసకర శతకాలతో విరుచుకుపడ్డారు. జార్జియా వాల్ (62) అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో నికోలా కేరీ (15 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) బ్యాట్ ఝులిపించింది. మిగతా ప్లేయర్లలో ఫోబ్ లిచ్ఫీల్డ్ 14, అన్నాబెల్ సదర్ల్యాండ్ 23, ఆష్లే గార్డ్నర్ 4, తహ్లియా మెక్గ్రాత్ 2, జార్జియా వేర్హమ్ ఒక్క పరుగు చేశారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా, శ్రీచరణి చెరో 2 వికెట్లు తీయగా.. రేణుకా ఠాకూర్, కశ్వీ గౌతమ్, దీప్తి శర్మ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనలో భారత్ చేతులెత్తేసింది. అలానా కింగ్ (10-1-33-4), జార్జియా వేర్హమ్ (1.1-0-3-2) ధాటికి 45.1 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌటైంది. నికోలా కేరీ, సదర్ల్యాండ్, ఆష్లే గార్డ్నర్ తలో వికెట్ తీశారు. భారత ప్లేయర్లలో స్మృతి మంధన, కశ్వీ గౌతమ్ డకౌట్ కాగా.. ప్రతీకా రావల్ 27, జెమీమా 42, కెప్టెన్ హర్మన్ 25, హర్లీన్ డియోల్ 14, దీప్తి శర్మ 29, రిచా ఘోష్ 18, శ్రీ చరణి 11 పరుగులు చేశారు. ఓటమి ఖరారయ్యాక స్నేహ్ రాణా (44) ప్రతిఘటించింది. కాగా, ఇరు జట్ల మధ్య మార్చి 6 నుంచి ఏకైక టెస్ట్ ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్తో ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన ముగుస్తుంది. -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన అర్షదీప్ సింగ్
ప్రస్తుతం జరుతున్న టీ20 వరల్డ్కప్-2026లో టీమిండియా లెఫ్డ్ అర్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో నిన్న (ఫిబ్రవరి 26) జరిగిన సూపర్-8 మ్యాచ్లో 3 వికెట్లు తీసిన అర్షదీప్.. టీ20 ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా రికార్డును అధిగమించాడు. అర్షదీప్ తన టీ20 వరల్డ్కప్ కెరీర్లో 19 మ్యాచ్ల్లో 14.25 సగటున, 7.33 ఎకానమీతో 35 వికెట్లు తీయగా.. బుమ్రా తన 19 మ్యాచ్ల వరల్డ్కప్ కెరీర్లో 14.00 సగటున 33 వికెట్లు తీశాడు. ఓవరాల్గా టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఘనత బంగ్లాదేశ్ స్పిన్నర్ షకీబ్ అల్ హసన్కు (50) దక్కుతుంది.సూపర్ ఫామ్లో అర్షదీప్ప్రస్తుత ప్రపంచకప్లో అర్షదీప్ సింగ్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 8 వికెట్లు తీశాడు. టీమిండియా గత ఎడిషన్ టీ20 ప్రపంచకప్ సాధించడంలోనూ అర్షదీప్సింగ్ కీలకపాత్ర పోషించాడు. ఆ ఎడిషన్లో 17 వికెట్లు తీసి జాయింట్ హైయ్యెస్ట్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఇప్పటివరకు 81 టీ20లు ఆడిన అర్షీదప్.. 126 వికెట్లు తీసి భారత్ తరఫున పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కొనసాగుతున్నాడు.కాగా, నిన్నటి మ్యాచ్లో అర్షదీప్ సహా జట్టులోని ప్రతి ఒక్కరు సత్తా చాటడంతో జింబాబ్వేపై టీమిండియా 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. మార్చి 1న కోల్కతాలో వెస్టిండీస్తో జరుగబోయే మ్యాచ్ భారత్కు డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్లో గెలిస్తే భారత్ సెమీస్కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడినా, మ్యాచ్ రద్దైనా విండీస్కే సెమీస్ బెర్త్ దక్కుతుంది.భారత్ వర్సెస్ జింబాబ్వే స్కోర్ వివరాలు..భారత్: 256-4 (అభిషేక్ (55), హార్దిక్ (50 నాటౌట్)జింబాబ్వే: 184-6 (బ్రియాన్ బెన్నెట్ 97 నాటౌట్, అర్షదీప్ 4-0-24-3) -
తీవ్ర విషాదం.. రింకూ సింగ్ తండ్రి కన్నుమూత
టీమిండియా విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా స్టేజ్-4 లివర్ క్యాన్సర్తో పోరాడుతున్న రింకూ తండ్రి ఖాచంద్ర సింగ్ ఇవాళ తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా ఖాచంద్ర సింగ్ గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి ఏమాత్రం మెరుగుపడకపోవడంతో వెంటిలేటర్పై ఉంచారు. పరిస్థితి మరింత విషమించడంతో నిన్న రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ (CRRT) కూడా నిర్వహించినట్టు సమాచారం. వైద్యులు శక్తివంచన లేకుండా కృష్టి చేసినా రింకూ తండ్రిని కాపాడలేకపోయారు.ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ 2026తో బిజీగా ఉన్న రింకూ సింగ్ తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించిదని తెలిసి హుటాహుటిన నోయిడాకు బయల్దేరాడు. అక్కడ రెండు రోజులు గడిపి, జింబాబ్వేతో కీలకమైన జింబాబ్వే మ్యాచ్ కోసం తిరిగి చెన్నైకి చేరుకున్నాడు. జింబాబ్వేతో మ్యాచ్ సమయానికి రింకూ జట్టులో చేరినప్పటికీ.. తుది జట్టులో అవకాశం దక్కలేదు. అయినా, ఈ మ్యాచ్లో టీమిండియా భారీ విజయం సాధించి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.తండ్రి మరణవార్త విని రింకూ హుటాహుటిన తన స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని అలీఘఢ్కు బయల్దేరాడు. 28 ఏళ్ల రింకూ చాలా పేద కుటుంబం నుంచి ఎదిగి భారత జట్టులో స్థానం సంపాదించాడు. తన సక్సెస్లో తండ్రి పాత్ర చాలా కీలకమని రింకూ గతంలో చాలా సందర్భాల్లో చెప్పాడు. రింకూ అంతర్జాతీయ క్రికెటర్గా ఎదిగినప్పటికీ.. అతని తండ్రి గ్యాస్ డెలివరీ చేస్తూనే జీవనం సాగించాడు. రింకూ తండ్రి మరణవార్త తెలిసి టీమిండియాలో విషాద ఛాయలు నెలకొన్నాయి. -
T20 WC 2026: సెమీస్లో భారత్ వర్సెస్ పాక్..?
టీ20 ప్రపంచకప్ 2026లో సెమీస్కు చేరబోయే జట్లపై ఓ అవగాహణ ఏర్పడింది. గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా ఇప్పటికే ఫైనల్-4కు అర్హత సాధించగా.. రెండో బెర్త్ కోసం వెస్టిండీస్, భారత్ మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్ బెర్త్పై కర్చీఫ్ వేసుకొని కూర్చోగా.. రెండో బెర్త్ కోసం న్యూజిలాండ్, పాక్ పోటీపడనున్నాయి.సెమీస్ బెర్త్లపై ఓ క్లారిటీ రావడంతో ఇప్పుడు అభిమానుల దృష్టంతా ఏ జట్టు ఎవరితో తలపడనుందనే అంశంపై కేంద్రీకృతమైంది. నిన్న (ఫిబ్రవరి 26) జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్ గ్రూప్-1 నుంచి విండీస్కు ప్రధాన పోటీదారుగా మారగా.. గ్రూప్-2లో రెండో బెర్త్ న్యూజిలాండ్కు దాదాపుగా ఫిక్స్ అయ్యింది. అలాగని పాక్ అవకాశాలను తీసిపారేయడానికి వీళ్లేదు.మిగతా జట్ల మాట ఎటున్నా, భారత క్రికెట్ అభిమానులు మాత్రం ప్రస్తుత ప్రపంచకప్లోనే మరోసారి భారత్, పాక్ మ్యాచ్ కోరుకుంటున్నారు. ఇరు జట్లు సెమీస్లో తలపడాలని వారు ఆకాక్షిస్తున్నారు. ఇది కష్టసాధ్యమైన ప్రక్రియే అయినప్పటికీ.. అసాధ్యం మాత్రం కాదు. కొన్ని అద్భుతాలు జరిగితే తప్పక సెమీస్లో భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుంది. అదెలా అంటే..ముందుగా భారత్ విషయానికి వద్దాం.. జింబాబ్వేపై గెలుపుతో భారత్ సెమీస్ బెర్త్పై క్లియర్ పిక్చర్ ఏర్పడింది. తదుపరి మ్యాచ్లో విండీస్ గెలిస్తే టీమిండియా సెమీస్ బెర్త్ ఖరారవుతుంది. ఓడినా లేక మ్యాచ్ రద్దైనా మెరుగైన రన్రేట్ కలిగిన విండీస్కే సెమీస్ బెర్త్ దక్కుతుంది.సెమీస్లో పాక్తో తలపడాలంటే భారత్ విండీస్పై నామమాత్రపు విజయం సాధిస్తే సరిపోదు. ఆ మ్యాచ్లో భారత్ మంచి రన్ రేట్తో భారీ విజయం సాధించాలి. అలాగే ప్రస్తుతం టేబుల్ టాపర్గా ఉన్న సౌతాఫ్రికా తమ చివరి మ్యాచ్లో జింబాబ్వే చేతిలో చిత్తుగా ఓడాలి. అప్పుడు భారత్, సౌతాఫ్రికా తలో 4 పాయింట్లతో ఉంటాయి. ఇక్కడ ప్లేసింగ్ విషయంలో రన్రేట్ కీలకమవుతుంది. విండీస్పై భారత్ భారీ తేడాతో గెలుస్తుంది కాబట్టి రన్రేట్ కూడా భారీగా పెరుగుతుంది. మరోవైపు సౌతాఫ్రికా జింబాబ్వే చేతిలో చిత్తుగా ఓడితే ఆ జట్టు రన్రేట్ భారత్ కంటే తక్కువై పోతుంది. అప్పుడు గ్రూప్ 1 టాపర్గా భారత్.. రెండో స్థానంలో సౌతాఫ్రికా ఉంటాయి.గ్రూప్-1లో అగ్రస్థానంలో నిలిచే జట్టు గ్రూప్-2లో రెండో స్థానంలో నిలిచే జట్టును సెమీస్లో ఢీకొంటుంది. సెమీస్లో భారత్-పాక్ మ్యాచ్ జరగాలి అంటే, పాక్ గ్రూప్-2 నుంచి రెండో స్థానంలో నిలివాలి. ఆ జట్టుకు ప్రస్తుతం అగ్రస్థానికి వెళ్లే ఛాన్స్లు లేవు. భారత్=పాక్ సెమీస్లో తలపడాలంటే టీమిండియానే గ్రూప్-1లో టాప్ ప్లేస్లో ఉండాలి.ఇక పాక్ గ్రూప్-2లో రెండో స్థానానికి ఎలా చేరుకునే అవకాశం ఉందంటే.. ఈ గ్రూప్ నుంచి ఇంగ్లండ్ సెమీస్ బెర్త్ ఖరారైపోయింది. పాక్కు సెమీస్ బెర్త్ దక్కాలంటే వారి చివరి మ్యాచ్లో శ్రీలంకపై అతి భారీ తేడాతో గెలిచి మంచి రన్రేట్ కూడగట్టుకోవాలి. ఇలా జరిగితే పాక్ ఖాతాలో 3 పాయింట్లు చేరతాయి. సెమీస్ బెర్త్ కోసం పాక్కు పోటీదారుగా ఉన్న న్యూజిలాండ్ ఇప్పటికే 3 పాయింట్లు ఖాతాలో కలిగి ఉండి, భారీ రన్రేట్ను కూడా సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ తమి చివరి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో సాధారణంగా ఓడినా, రెండో స్థానంలో సెమీస్కు చేరుకుంటుంది. కానీ, సెమీస్లో మనకు భారత్-పాక్ మ్యాచ్ కావాలంటే న్యూజిలాండ్పై ఇంగ్లండ్ అతి భారీ తేడాతో గెలవాలి. అప్పుడు న్యూజిలాండ్ నెట్ రన్రేట్ బాగా తగ్గిపోతుంది. అప్పటికే శ్రీలంకపై అతి భారీ తేడాతో గెలిచి మంచి రన్రేట్తో ఉన్న పాకిస్తాన్ గ్రూప్-2 నుంచి రెండో జట్టుగా సెమీస్కు చేరుతుంది.అప్పుడు గ్రూప్-1 టాపర్ భారత్.. గ్రూప్-2లో రెండో స్థానంలో నిలిచే పాకిస్తాన్ సెమీస్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. లెక్కల వరకు ఇది బాగానే ఉంది కానీ, ఇలా జరగడం చాలా కష్టం. భారత్ అష్టకష్టాలు పడి గ్రూప్-1లో టాప్ ప్లేస్కు రాగలదేమో కానీ, ఏదైనా మహాద్భుతం జరిగితేనే పాక్కు సెమీస్ బెర్త్ దక్కుతుంది. -
టీమిండియా ఇంటికేనా.? సెమీస్ చేరాలంటే.. జింబాబ్వే & వెస్టిండీస్ పై ఎంత రన్ రేట్ గెలవాలి
-
Analyst Venkatesh : టీమిండియా ఇంటికేనా.? సెమీస్ చేరాలంటే..
-
భారత్ సెమీస్ చేరాలంటే..? 11 ఓవర్లలో ఎంత ఛేజ్ చేయాలంటే..!
-
T20 WC 2026: రింకూ సింగ్కు సంబంధించి బిగ్ అప్డేట్
టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో టీమిండియా కీలక ఆటగాడు రింకూ సింగ్కు సంబంధించి బిగ్ అప్డేట్ అందుతుంది. రింకూ నిన్న తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో స్వస్థలమైన నోయిడాకు వెళ్లాడు. దీంతో అతను రేపటి (ఫిబ్రవరి 26) జింబాబ్వే మ్యాచ్కు అందుబాటులో ఉంటాడా లేదా అన్న సందిగ్దత నెలకొని ఉండింది.అయితే, ప్రస్తుతమందుతున్న సమాచారం ప్రకారం.. రింకూ రేపటి మ్యాచ్ కోసం చెన్నైకి (వేదిక) బయల్దేరినట్లు తెలుస్తుంది. మ్యాచ్ సమయానికి అతను అందుబాటులో ఉంటాడని సమాచారం. సెమీస్ నేపథ్యంలో రేపటి జింబాబ్వే మ్యాచ్ టీమిండియాకు అత్యంత కీలకం కావడంతో మేనేజ్మెంట్ రింకూ సేవలను కోల్పోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.ఇందులో భాగంగానే రింకూ ప్రయాణానికి (నోయిడా నుంచి చెన్నైకి) ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలుస్తుంది. రింకూ లోయర్ ఆర్డర్ బ్యాటింగ్లో అత్యంత కీలక ఆటగాడు. చివరి ఓవర్లలో అతను వేగంగా చేసే పరుగులు మెగా టోర్నీలో టీమిండియా భవిష్యత్తును నిర్ణయిస్తాయి. రింకూ లేని పక్షంలో మరో లోయర్ ఆర్డర్ బ్యాటర్ శివమ్ దూబేపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది జట్టు సమతుల్యతను దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టే టీమిండియా మేనేజ్మెంట్ రింకూను హుటాహుటిన చెన్నైకి పిలిపించినట్లు తెలుస్తుంది.కాగా, రింకూ తండ్రి ఏడాదికాలంగా స్టేజ్-4 లివర్ క్యాన్సర్తో పోరాడుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్పై ఉంచారు. ఈ పరిస్థితి కారణంగా రింకూ హుటాహుటిన నోయిడాకు వెళ్లాడు.సంజూ శాంసన్ పరిస్థితి ఏంటి..?రింకూ జట్టును వీడిన అనంతరం జింబాబ్వే మ్యాచ్లో సంజూ శాంసన్కు అవకాశం కల్పించాలని మేనేజ్మెంట్ భావించింది. అయితే రింకూ అందుబాటులోకి రావడంతో సంజూకు మొండిచెయ్యి తప్పదని తెలుస్తుంది. తొలుత అభిషేక్తో పాటు సంజూను ఓపెనర్గా పంపి, ఇషాన్ను వన్డౌన్లో ఆడించాలని మేనేజ్మెంట్ భావించిదట. అయితే రింకూ రీఎంట్రీతో సమీకరణలు మారేలా ఉన్నాయి. రింకూ జట్టులో చేరినా, సంజూకు అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తే మాత్రం తిలక్ వర్మపై వేటు పడవచ్చు. ముందుగా అనుకున్నట్లు అభిషేక్-సంజూ ఓపెనర్లుగా ఇషాన్ కిషన్ వన్డౌన్లో బరిలోకి దిగవచ్చు. అలాగే సౌతాఫ్రికా మ్యాచ్లో దారుణంగా విఫలమైన వాషింగ్టన్ సుందర్ను కూడా పక్కకు పెట్టి, అక్షర్ పటేల్ను జట్టులోకి తీసుకోవచ్చు.తుది జట్టు (అంచనా)..అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి -
రెండుకు రెండూ గెలిచినా సెమీస్ చేరడం కష్టమేనా..!
-
రాణించిన కెప్టెన్, వైస్ కెప్టెన్.. టీమిండియా స్కోర్ ఎంతంటే..?
ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 24) జరుగుతున్న తొలి మ్యాచ్లో టీమిండియా స్వల్ప స్కోర్కే పరిమితమైంది. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఆసీస్ బౌలర్ల ధాటికి 48.3 ఓవర్లలో 214 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (53), వైస్ కెప్టెన్ స్మృతి మంధన (58) రాణించడంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖర్లో కశ్వీ గౌతమ్ (43), రిచా ఘోష్ (23) కూడా సహకరించడంతో భారత్ 200 పరుగుల మార్కును దాటగలిగింది. వీరు మినహా భారత ఇన్నింగ్స్లో మరెవ్వరూ కనీసం రెండంకెల స్కోర్లు కూడా చేయలేదు. షఫాలీ వర్మ 4, జెమీమా రోడ్రిగ్స్ 8, దీప్తి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీచరణి తలో 2, ఓపెనర్ ప్రతీక రావల్ డకౌటయ్యారు. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్నర్ (7-0-33-3) అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించింది. మెగాన్ షట్ (9-1-42-2), సోఫీ మోలినెక్స్ (5-1-17-1), తహ్లియా మెక్గ్రాత్ (4-0-16-1), డార్సీ బ్రౌన్ (5-0-24-1) కూడా పర్వాలేదనిపించారు. అన్నాబెల్ సదర్ల్యాండ్ (8.3-1-32-0) పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్లు దక్కలేదు.కాగా, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్, ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత జరిగిన టీ20 సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. రెండు, మూడు వన్డేలు హోబర్ట్ వేదికగా ఫిబ్రవరి 27, మార్చి 1 తేదీల్లో జరుగనున్నాయి. అనంతరం మార్చి 6న టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. -
మాజీ భార్య అన్నట్లుగా చెబుతున్న మాటలపై స్పందించిన శిఖర్ ధవన్
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ తన రెండో వివాహం అనంతరం సోషల్ మీడియాలో వ్యాప్తి చెందిన కథనాలపై తీవ్రంగా స్పందించాడు. కొద్ది రోజుల కిందట ధవన్ అమెరికా ఆధారిత ఫైనాన్షియల్ కన్సల్టెంట్ సోఫీ షైన్ను ఢిల్లీ-ఎన్సీఆర్లో జరిగిన ఓ ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నాడు. ఈ వేడుక తర్వాత ధవన్, అతని మాజీ భార్య అయేషా ముఖర్జీకి సంబంధించిన పలు పోస్ట్లు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విడాకుల సమయంలో అయేషా ధవన్ను "నిన్ను ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదు" అన్నట్లు.. సోఫీతో వివాహం తర్వాత "నన్ను అభినందించవా..?" అని ధవన్ అయేషాకు కౌంటరిచ్చినట్లు పలు స్క్రిప్ట్లు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.STATEMENTI have come across some posts on social media attributing a disappointing statement about my personal life. I have never carried baggage from the past be it on the pitch or outside. I firmly believe in the power of positivity while respecting my past.This is a new…— Shikhar Dhawan (@SDhawan25) February 23, 2026వీటిపై ధవన్ అదే సోషల్మీడియా వేదికగా స్పందించాడు. ఆ స్క్రిప్ట్ను పూర్తిగా ఖండిస్తూ.. అందులో ఎంతమాత్రం నిజం లేదని కొట్టిపారేశాడు. "నేను ఎప్పుడూ గతాన్ని మోసుకెళ్లలేదు. పాజిటివిటీని నమ్ముతాను. నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అభిమానులు, కుటుంబం, మిత్రులు ఇచ్చిన ప్రేమకు కృతజ్ఞతలు. దయచేసి నా పేరుతో తప్పుడు కథనాలు సృష్టించవద్దు" అంటూ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు. కాగా, ధవన్.. ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారతీయ మహిళల అయేషా ముఖర్జీని 2011లో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడి, ఆతర్వాత ప్రేమ వివాహానికి దారి తీసింది. అయేషా ఓ మాజీ కిక్ బాక్సర్. ఆమెకు ధవన్కు ముందే వేరే వ్యక్తితో పెళ్లైంది. తొలి భర్తతో అయేషాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయేషా-ధవన్కు జోరావర్ అనే పేరు గల కుమారుడు ఉన్నాడు.అయేషా.. ఆమె మొదటి భర్తతో కలిగిన సంతానం, జోరావర్తో కలిసి ధవన్తోనే ఉండేది. అయితే మనస్పర్దల కారణంగా అయేషా-ధవన్ 2023లో విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత అయేషా జోరావర్ను తీసుకొని ఆస్ట్రేలియాకు వెళ్లిపోయింది. ఆ సమయంలో అయేషా తండ్రి-కొడుకులను కలవనివ్వలేదనే వార్తలు వచ్చాయి. జోరావర్ను మిస్ అవుతున్నట్లు ధవన్ చాలా సందర్భాల్లో సోషల్మీడియా వేదికగా తన ఆవేదనను వెళ్లగక్కాడు. అయితే ధవన్ ఏనాడూ అయేషా గురించి చెడుగా మాట్లాడలేదు. తాజాగా వస్తున్న వదంతులు ధవన్ ఎంత జెంటిల్మెనో మరోసారి రుజువు చేశాయి.అయేషాతో విడాకులైన చాన్నాళ్లకు ధవన్-సోఫీ మధ్య ప్రేమ మొదలైంది. 2025లో వీరిద్దరూ తమ సంబంధాన్ని బహిరంగం చేశారు. ఈ ఏడాది జనవరి 12న వీరి నిశ్చితార్థం జరిగింది. తాజాగా వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. సోఫీ షైన్ ప్రస్తుతం దుబాయ్లో ఉంటూ, Northern Trust Corporationలో ప్రొడక్ట్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. వీరి వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, క్రికెట్ సహచరులు పాల్గొన్నారు. -
IND VS AUS 1st ODI: మంధన మరోసారి..!
అంతర్జాతీయ క్రికెట్లో క్వీన్ స్మృతి మంధన పరుగుల ప్రవాహం ఫార్మాట్లకతీతంగా కొనసాగుతోంది. ఈ టీమిండియా స్టార్ ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండో మ్యాచ్లో హాఫ్ సెంచరీతో సత్తా చాటింది. ఇవాళ (ఫిబ్రవరి) బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ చేసిన మంధన.. దీనికి ముందు టీ20 సిరీస్ డిసైడర్ (మూడో టీ20)లో కూడా హాఫ్ సెంచరీతో మెరిసింది. తాజా హాఫ్ సెంచరీతో మంధన ఓ అరుదైన ఘనత సాధించింది.ఆస్ట్రేలియాపై వన్డేల్లో 11 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన అతికొద్ది మందిలో ఒకరిగా నిలిచింది. ఆసియా ప్లేయర్ల వరకు తీసుకుంటే మంధననే ఆసీస్పై అత్యధిక వన్డే హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్గా రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్లో మంధన 68 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 58 పరుగులు చేసి ఔటైంది. 52 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును కెప్టెన్ హర్మన్ప్రీత్తో కలిసి ఆదుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ ప్రతీక రావల్ (0) వికెట్ కోల్పోయింది. ఈ దశలో మంధన.. షఫాలీ వర్మతో (4) రెండో వికెట్కు 25 పరుగులు.. జెమీమా రోడ్రిగ్స్తో (8) మూడో వికెట్కు 27 పరుగులు.. నాలుగో వికెట్కు హర్మన్తో కలిసి 48 పరుగులు జోడించింది.33 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్ 140-5గా ఉంది. హర్మన్ప్రీత్ 32, రిచా ఘోష్ 23 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో మెగాన్ షట్, డార్సీ బ్రౌన్, ఆష్లే గార్డ్నర్, అలానా కింగ్, తహ్లియా మెక్గ్రాత్ తలో వికెట్ తీశారు. కాగా, ఈ మ్యాచ్కు ముందు జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ప్రస్తుతం మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా తొలి వన్డే జరుగుతుంది. -
T20 WC 2026: టీమిండియాను భారీ దెబ్బ కొట్టిన వెస్టిండీస్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 23) జరిగిన సూపర్-8 మ్యాచ్లో జింబాబ్వేపై వెస్టిండీస్ 107 పరుగుల భారీ తేడాతో తిరుగులేని విజయం సాధించింది. ఈ గెలుపుతో విండీస్ గ్రూప్-1లో అగ్రస్థానానికి చేరుకోవడంతో పాటు అదే గ్రూప్లో ఉన్న టీమిండియాను భారీ దెబ్బ కొట్టింది. అదేంటని అనుకుంటున్నారా..?ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసి 254 పరుగుల భారీ స్కోర్ చేసిన విండీస్.. ఆతర్వాత జింబాబ్వేను 147 పరుగులకే పరిమితం చేసి నెట్ రన్రేట్ను (5.350) భారీగా కూడగట్టుకుంది. ఈ రన్రేటే భారత్ కొంపముంచేలా ఉంది. తొలి మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో ఘోర ఓటమి తర్వాత మన జట్టు రన్రేట్ -3.800లో పడి పోగా.. సౌతాఫ్రికా రన్ రేట్ 3.800 వద్ద కూర్చుంది.ఈ గ్రూప్ నుంచి సెమీస్కు చేరే అవకాశాలు రెండు జట్లకు మాత్రమే ఉంటాయి. తొలి మ్యాచ్లో గెలిచి భారీ రన్ రేట్ కూడగట్టుకున్న విండీస్, సౌతాఫ్రికా సెమీస్ రేసులో ముందున్నాయి. భారత్, జింబాబ్వే మైనస్ రన్ రేట్లతో సెమీస్ రేసులో భారీగా వెనుకపడి పోయాయి. భారత్ సెమీస్కు చేరాలంటే తదుపరి జరిగే రెండు సూపర్-8 మ్యాచ్ల్లో (జింబాబ్వే, విండీస్) భారీ తేడాతో గెలవాలి. ఇలా గెలిచినా సెమీస్కు చేరుతుందన్న గ్యారెంటీ లేదు.ఎందుకంటే విండీస్ రన్ రేట్ విషయంలో కొండెక్కి కూర్చుంది. తదుపరి రెండు మ్యాచ్ల్లో (సౌతాఫ్రికా, భారత్) ఆ జట్టు ఏ ఒక్క మ్యాచ్ గెలిచినా దర్జాగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. మరోపక్క భారత్పై గెలిచి సౌతాఫ్రికా ఇప్పటికే మరో సెమీస్ బెర్త్పై కర్చీఫ్ వేసుకొని కూర్చుంది. ఆ జట్టు తదుపరి రెండు మ్యాచ్ల్లో తమ కంటే బలహీనమైన జింబాబ్వే, విండీస్తో పోటీ పడుతుంది. ఒకవేళ విండీస్తో ఓడినా, జింబాబ్వేపై గెలిస్తే.. మరో సెమీస్ బెర్త్ సౌతాఫ్రికా వశమవుతుంది.ఈ లెక్కన ప్రస్తుత పరిస్థితి చూస్తే, భారత్కు సెమీస్ బెర్త్ దక్కడం చాలా కష్టంగా కనిపిస్తుంది. భారత్ సెమీస్కు చేరాలంటే.. జింబాబ్వే, విండీస్పై భారీ విజయాలు సాధించడంతో పాటు సౌతాఫ్రికా, వెస్టిండీస్ తలో మ్యాచ్లో అయినా ఓడాలి. అప్పుడు కూడా భారత్కు సెమీస్ బెర్త్ దక్కుతుందని గ్యారెంటీగా చెప్పలేని పరిస్థితి.ఉదాహరణకు సౌతాఫ్రికా విండీస్ చేతిలో ఓడి, జింబాబ్వేపై గెలిస్తే.. వారి ఖాతాలో నాలుగు పాయింట్లతో పాటు మంచి రన్ రేట్ ఉంటుంది. విండీస్ భారత్ చేతిలో ఓడి, సౌతాఫ్రికాపై ఓ మోస్తరు విజయం సాధించినా.. ఆ జట్టు ఖాతాలో కూడా నాలుగు పాయింట్లు, మంచి రన్రేట్ ఉంటుంది. ఇలా జరిగి, భారత్.. జింబాబ్వే, విండీస్పై విజయాలు సాధించినా.. విండీస్, సౌతాఫ్రికా రన్రేట్ను అధిగమిస్తుందన్న గ్యారెంటీ లేదు.ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ సెమీస్కు చేరాలంటే ఒక్క సమీకరణకు మాత్రమే అధిక అవకాశాలు ఉన్నాయి. అదేంటంటే.. భారత్.. జింబాబ్వే, విండీస్పై భారీ విజయాలు సాధించాలి. మరోపక్క విండీస్.. సౌతాఫ్రికా చేతిలో కూడా ఓడాలి. అప్పుడు సౌతాఫ్రికా, భారత్ సెమీస్కు చేరుకుంటాయి.అనుకోవడానికి ఇది బాగానే ఉన్నా, ప్రస్తుతం విండీస్ ఉన్న ఫామ్ను పరిగణలోకి తీసుకుంటే ఇది జరిగే పని కాకపోవచ్చు. విండీస్ ఈ ప్రపంచకప్లో వరుసగా ఐదు మ్యాచ్ల్లో గెలిచి మాంచి జోష్లో ఉంది. తదుపరి వారు ఆడబోయే సౌతాఫ్రికా, భారత్ మ్యాచ్ల్లోనూ ఇది కొనసాగవచ్చు. ఇందులో ఏ ఒక్క మ్యాచ్లో విండీస్ గెలిచినా భారత్ మూడో పొట్టి ప్రపంచకప్ కల కల్లగా మారిపోతుంది. మొత్తంగా వెస్టిండీస్.. జింబాబ్వేపై భారీ తేడాతో గెలిచి భారత్ సెమీస్ అవకాశాలను చాలా సంక్లిష్టం చేసేసింది. ఫిబ్రవరి 26న జరిగే వెస్టిండీస్-సౌతాఫ్రికా మ్యాచ్ తర్వాత సెమీస్ బెర్త్లపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ మ్యాచ్లో ఏ జట్టు గెలిచినా, గ్రూప్-1 నుంచి ఓ సెమీస్ బెర్త్ ఖరారైపోతుంది. రెండో బెర్త్ కోసం సౌతాఫ్రికా, భారత్, జింబాబ్వే పోటీ పడాల్సి ఉంటుంది. విండీస్ చేతిలో భారీ తేడాతో ఓడినా, జింబాబ్వేకు కూడా ఇంకా సెమీస్ అవకాశాలు సజీవంగా ఉన్నాయి. ఆ జట్టు తదుపరి రెండు మ్యాచ్ల్లో భారత్, సౌతాఫ్రికాపై ఘన విజయాలు సాధించాలి. అసాధ్యమని చెప్పలేము కానీ, ఇది సాధ్యపడటం మాత్రం చాలా కష్టమే. -
T20 WC 2026: టీమిండియాలో కలకలం
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 22) సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో భారత్ 76 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్ తర్వాత భారత క్రికెట్ వర్గాల్లో కలకలం రేగింది. హ్యాట్రిక్ డకౌట్లు సహా వరుసగా నాలుగో మ్యాచ్లోనూ (15) విఫలమైన అభిషేక్ శర్మ గాయంతోనే ఈ మ్యాచ్లన్నీ ఆడాడని వైభవ్ భోలా అనే క్రీడా జర్నలిస్ట్ సోషల్మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ఈ పోస్టే కలకలానికి కారణమైంది.వైభవ్ భోలా పోస్ట్ ప్రకారం.. అభిషేక్ శర్మ ప్రపంచకప్ తొలి మ్యాచ్కు ముందే గాయపడ్డాడు. టోర్నీ ప్రారంభానికి ముందు జరిగిన అధికారిక ఫోటోషూట్ కార్యక్రమంలో అభిషేక్ చేతికి గాయమైంది. దీని వల్ల అతనికి కుట్లు కూడా పడ్డాయి. అయినా, భారత మేనేజ్మెంట్ దాన్ని దాచి అభిషేక్ను యూఎస్ఏతో మ్యాచ్లో ఆడించింది. ఆ మ్యాచ్లో అతను గోల్డెన్ డకౌటయ్యాడు. ఆ తర్వాత అతనికి కడుపు ఇన్ఫెక్షన్ కూడా రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అప్పటి వరకు మంచి ఫామ్లో ఉన్న అభిషేక్ వరుస వైఫల్యాల బాట పట్టడానికి ఇదే కారణమా అని వైభవ్ తన పోస్ట్ ద్వారా టీమిండియా మేనేజ్మెంట్ను ప్రశ్నించాడు. ఈ పోస్ట్కు అభిషేక్ చేతికి బ్యాండ్ ఎయిడ్ ఉన్న ఫోటోను జోడించాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. అభిషేక్ శర్మకు నిజంగానే గాయమైందా.. దాన్ని దాచిపెట్టే భారత మేనేజ్మెంట్ అతన్ని బరిలోకి దించుతుందా అని భారత క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ పోస్ట్లో నిజానిజాలు ఎంతో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై భారత మేనేజ్మెంట్ తక్షణమే స్పందించాలని కోరుతున్నారు.ఒకవేళ అభిషేక్కు నిజంగా గాయమై ఉంటే, కీలకమైన సౌతాఫ్రికా మ్యాచ్లో ఎందుకు ఆడించారని ప్రశ్నిస్తున్నారు. దీని మూల్యం జట్టు మొత్తం చెల్లించుకోవాల్సి వచ్చిందంటూ మండిపడుతున్నారు.ఈ సంచలన వార్తలో నిజానిజాలను పక్కన పెడితే.. ప్రస్తుత ప్రపంచకప్లో అభిషేక్ ఇబ్బంది పడుతున్నాడన్నది కాదనలేని సత్యం. తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న అభిషేక్పై సహజంగానే ఒత్తిడి ఉంటుంది. భారీ అంచనాలు ఆ ఒత్తిడిని మరింత అధికం చేశాయి. ఇదే అతని వైఫల్యాలకు ప్రధాన కారణమయ్యుండవచ్చు. అభిషేక్ ఫామ్ కోల్పోవడంపై తాజాగా దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్ అయిన అభిషేక్ పూర్తిగా ఫామ్ కోల్పోయాడని.. పవర్ప్లేలో దూకుడుగా ఆడే అతను ఆత్మవిశ్వాసం లేకుండా కనిపిస్తున్నాడని.. ప్రతి బంతిని బౌండరీకి తరలించాలనే ఆతృత పక్కన పెట్టి, సింగిల్స్తో స్ట్రయిక్ రొటేట్ చేస్తే మంచిదని సలహా ఇచ్చాడు. గవాస్కర్ విషయాన్ని కూడా పక్కన పెడితే.. సౌతాఫ్రికా మ్యాచ్లో అభిషేక్ 15 ఓవర్ల పాటు క్రీజ్లో ఉండి ఉంటే భారత్కు ఈ ఘోర పరాభవం తప్పేది. అప్పటికి అభిషేక్ ఆచితూచి ఆడాలనే ప్రయత్నం చేసినా, సౌతాఫ్రికా బౌలర్ల ఎత్తుగడల ముందు నిలబడలేకపోయాడు. ఏదిఏమైనా సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం భారత సెమీస్ అవకాశాలను మాత్రం సంక్లిష్టం చేసేసింది. ఈ ఓటమి తర్వాత భారత రన్రేట్ -3.80కి పడిపోయింది. జింబాబ్వే, విండీస్తో జరిగే మిగతా రెండు సూపర్-8 మ్యాచ్ల్లో నెగ్గినా టీమిండియా తప్పక సెమీస్కు చేరుతుందని చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. -
సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. అయినా, టీమిండియాదే వరల్డ్కప్..!
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 22) సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో భారత్ 76 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే భారత్కు ఇది అతి పెద్ద ఓటమి. ఈ ఓటమితో ఐసీసీ టోర్నీల్లో టీమిండియా జైత్రయాత్రకు కూడా బ్రేక్ పడింది. 2023 వన్డే వరల్డ్కప్ ఫైనల్ తర్వాత భారత్ ఈ మ్యాచ్లోనే (ఐసీసీ టోర్నీల్లో) ఓటమిపాలైంది. ఈ ఓటమితో భారత్ సెమీస్ అవకాశాలను సైతం కఠినం చేసుకుంది. మిగతా రెండు సూపర్-8 మ్యాచ్ల్లో జింబాబ్వే, వెస్టిండీస్పై విజయం సాధించినా.. భారత్ సెమీస్కు చేరుతుందన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే, సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం తర్వాత భారత నెట్ రన్రేట్ -3.80కు పడిపోయింది. ఇది మెరుగుపడాలంటే భారత్ తదుపరి 2 మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధించాలి. అలాగే విండీస్, జింబాబ్వే.. సౌతాఫ్రికా చేతిలోనూ ఓడాలి. ఇలా జరిగినప్పుడే భారత్ సెమీస్కు చేరుకుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా జరగడం కాస్త కష్టమే అయినా అసాధ్యమైతే కాదు.ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనూ టీమిండియాను ఓ సెంటిమెంట్ ఏకంగా టైటిల్నే ఊరిస్తుంది. అదేంటంటే.. స్వదేశంలో జరిగిన 2011 వన్డే వరల్డ్కప్లో భారత్ గ్రూప్ దశలో సౌతాఫ్రికా చేతిలో ఓడినా, టైటిల్ గెలిచింది. అలాగే స్వదేశంలోనే జరుగుతున్న ఈ ప్రపంచకప్లోనూ భారత్ సూపర్-8లో సౌతాఫ్రికా చేతిలో ఓడినా, టైటిల్ గెలుస్తుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఈ సెంటిమెంట్ సోషల్మీడియాలో భారత అభిమానులకు సౌతాఫ్రికా చేతిలో పరాభవాన్ని మరిచిపోయేలా చేస్తుంది. మరి ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.కాగా, సౌతాఫ్రికాతో మ్యాచ్లో భారత్ బౌలింగ్ విభాగంలో పర్వాలేదనిపించినా, బ్యాటర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. ఛేదించగలిగే లక్ష్యమే అయినా ఒత్తిడికి చిత్తై చేతులెత్తేశారు.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. భారత పేసర్లు జస్ప్రీత్ బుమ్రా (4-0-15-3), అర్షదీప్ సింగ్ (4-0-28-2) 20 పరుగులకే 3 వికెట్లు తీసి ఇబ్బంది పెట్టినా, ఆతర్వాత డెవాల్డ్ బ్రెవిస్ (29 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో 63; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (24 బంతుల్లో 44 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) మెరుపు విన్యాసాలతో ఇన్నింగ్స్ను చక్కదిద్దారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు ఆదిలోనే చేతులెత్తేశారు. ఇన్నింగ్స్ నాలుగో బంతికే ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్ డకౌటయ్యాడు. ఆతర్వాత రెండు బంతులకే ఫామ్లో లేని తిలక్ వర్మ (1) కూడా పెవిలియన్కు చేరాడు. గత మూడు మ్యాచ్ల్లో డకౌటై ఒత్తిడిలో ఉన్న అభిషేక్ శర్మ (15) మరోసారి అదే ఒత్తిడికి చిత్తయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ (18) బంతులు వృధా చేశాక నిస్సహాయ స్థితిలో ఔటయ్యాడు. వాషింగ్టన్ సుందర్కు (11) ప్రమోషన్ ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. శివమ్ దూబే (42) తన సహజ శైలిలో వేగంగా పరుగులు రాబట్టలేకపోయాడు. హార్దిక్ (18), రింకూ (0) కూడా నిరాశపరిచారు.మొత్తంగా భారత్ 18.5 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికా బౌలర్లు జన్సెన్ (3.5-0-22-4), కేశవ్ మహారాజ్ (3-0-24-3), కార్బిన్ బాష్ (3-0-12-2), మార్క్రమ్ (1-0-5-1) భారత పతనాన్ని శాశించారు. ఎంగిడి (4-0-15-0), రబాడ (4-0-32-0) వికెట్లు తీయలేకపోయినా అద్భుతంగా బౌలింగ్ చేశారు. -
సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం.. టీమిండియాలో కీలక మార్పు
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం ఎదురైన నేపథ్యంలో టీమిండియాలో కీలక మార్పు జరుగనుందని తెలుస్తుంది. జింబాబ్వేతో ఆడబోయే తదుపరి మ్యాచ్కు (ఫిబ్రవరి 26) స్టార్ ఆటగాడు సంజూ శాంసన్ జట్టులోకి వస్తాడని అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే హింట్ ఇచ్చాడు. రాబోయే రోజుల్లో సంజూ టాకింగ్ పాయింట్ అవుతాడని డస్కటే సౌతాఫ్రికా మ్యాచ్ పూర్తయిన అనంతరం మీడియా సమావేశంలో అన్నాడు. దీన్ని బట్టి చూస్తే జింబాబ్వే మ్యాచ్లో సంజూ బరిలోకి దిగడం ఖాయమని తెలుస్తుంది.సంజూ జట్టులోకి వస్తే ఎవరిపై వేటు వేస్తారన్నదే, ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. హ్యాట్రిక్ డకౌట్లు సహా వరుసగా నాలుగో మ్యాచ్లోనూ విఫలమైన అభిషేక్ శర్మను తప్పిస్తారా లేక చెత్త ఫామ్లో ఉన్న తిలక్ వర్మపై వేటు వేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. డస్కటే వ్యాఖ్యలను అంచనా వేస్తే.. అభిషేక్పైనే వేటు పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి.ఎందుకంటే డస్కటే లెఫ్ట్ అండ్ రైట్ ఓపెనింగ్ కాంబినేషన్ల గురించి ప్రస్తావించాడు. అతని మాటల్లో.. టాపార్డర్లో ఉన్న ముగ్గురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ప్రతి మ్యాచ్లో ఆఫ్ స్పిన్ బౌలర్లకు బలవుతున్నారు. పాకిస్తాన్ మ్యాచ్లో సల్మాన్ ఆఘా, దక్షిణాఫ్రికా మ్యాచ్లో మార్క్రమ్ పవర్ప్లేలోనే వికెట్లు తీశారు. దీంతో తక్కువ స్కోర్లకే భారత్ వికెట్లు కోల్పోయింది. ఇది ఆందోళన కలిగించే అంశం. గత 18 నెలల్లో బాగా ఆడిన ఆటగాళ్లను కొనసాగించాలా లేక సంజూని జట్టులోకి తీసుకురావాలా అన్నదే ప్రస్తుతం చర్చనీయాంశమని డస్కటే అన్నారు.డస్కటే వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ప్రత్యర్ది ఆఫ్ స్పిన్ ప్రయోగాలను విజయవంతంగా ఎదుర్కొని, పవర్ ప్లేలో వికెట్లు కోల్పోకుండా ఉండాలంటే టాపార్డర్లో రైట్ హ్యాండ్ బ్యాటర్ అవశ్యకత ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ఆప్షన్ సంజూ మాత్రమే. సంజూను ఓపెనర్గా జట్టులోకి తీసుకుంటే.. ఇషాన్ కిషన్తో కలిసి కుడి-ఎడమ కాంబినేషన్ అవుతుంది. ఈ కాంబినేషన్తో ఆఫ్ స్పిన్నర్ల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడంతో పాటు మిగతా బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్కు కూడా భంగం కలిగించవచ్చు. జింబాబ్వే మ్యాచ్లో భారత మేనేజ్మెంట్ ఈ ప్రయోగాన్ని అమలు చేస్తుందో లేదో చూడాలి.ఇషాన్కు డిమోషన్..?ఒకవేళ భారత మేనేజ్మెంట్ తదుపరి మ్యాచ్ల్లో సంజూను జట్టులోకి తీసుకొని, అభిషేక్ను కూడా కొనసాగించాలనుకుంటే గత కొంతకాలంగా చెత్త ఫామ్లో తిలక్ వర్మపై వేటు వేయక తప్పదు. అప్పుడు అభిషేక్, సంజూతో ఓపెనింగ్ చేయించి, ఇషాన్ను వన్డౌన్లో పంపవచ్చు. అయితే ఈ అడుగు పడటం అంత సులువు కాకపోవచ్చు. ఎందుకంటే, ఓపెనర్గా ఇషాన్ మంచి లయలో ఉన్నాడు. అతన్ని ఆ స్థానం నుంచి తప్పించడమంటే చాలా పెద్ద సాహసం అవుతుంది. సెమీస్ అవకాశాలు కఠినమైన తరుణంలో భారత మేనేజ్మెంట్ ఇలాంటి సాహసాల జోలికి పోకపోవచ్చు. -
T20 WC 2026: టీమిండియా ఓటమికి అసలు కారణం ఇదే..!
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 22) సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో భారత్ 76 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్లో టీమిండియా బౌలింగ్ విభాగంలో పర్వాలేదనిపించినా, బ్యాటర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. ఛేదించగలిగే లక్ష్యమే అయినా ఒత్తిడికి చిత్తై చేతులెత్తేశారు. భారత బ్యాటర్లలో ఓ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. అదే ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. ఒకట్రెండు డాట్ బాల్స్ పడంగానే భారత బ్యాటర్లు సహనాన్ని కోల్పోయారు. మూడో బంతికి కచ్చితంగా బౌండరీనో, సిక్సరో బాదాలనే ఆత్రంలో వికెట్ పారేసుకున్నారు. భారత ఇన్నింగ్స్ మొత్తం ఇదే జరిగింది. ముందుగా క్రీజ్లో కుదురుకోవాలన్న బేసిక్ సెన్స్ ఏ ఒక్కరిలో కనపడలేదు. స్ట్రయిక్ రొటేట్ అవుతుంటే ఒత్తిడి కాస్త తగ్గుతుంది. కానీ భారత బ్యాటర్లు దీనిపై దృష్టి పెట్టలేదు. ప్రతి బంతిని బాధడమే పరమావధిగా పెట్టుకున్నారు. ఇలా జరగడం చాలా కష్టం. సింగిల్స్తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ, మధ్యలో చెత్త బంతులపై ఎదురుదాడి చేసుంటే బాగుండేది, కానీ భారత బ్యాటర్లు అలా చేయలేదు.ఓ పక్క వికెట్లు పడుతున్నా, ఒక్కరు కూడా క్రీజ్లో కుదురుకుందామని అలోచించలేదు. అయితే సిక్సర్ లేకపోతే ఔట్ అన్నట్లు వ్యవహరించారు. ఇదే భారత్ కొంపముంచింది. సౌతాఫ్రికా కెప్టెన్ వూహాత్మకంగా ఓ వైపు నుంచి స్పిన్నర్లు, మరోవైపు నుంచి పేసర్లతో అటాక్ చేస్తున్నా, భారత బ్యాటర్లు మొండిగా ముందుకు వెళ్లారు. అందుకు తగిన మూల్యం చెల్లంచుకున్నారు. ఇదే ఆటతీరును జింబాబ్వే, విండీస్ మ్యాచ్ల్లో కూడా కొనసాగిస్తే.. టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలవాలన్న కల సాకారం కాకపోవచ్చు. కాబట్టి భారత బ్యాటర్లు సౌతాఫ్రికా మ్యాచ్తో గుణపాఠం నేర్చుకుంటే మంచిదన్నది అభిమానులందరి అభిప్రాయం.కాగా, నిన్నటి మ్యాచ్లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. భారత పేసర్లు జస్ప్రీత్ బుమ్రా (4-0-15-3), అర్షదీప్ సింగ్ (4-0-28-2) 20 పరుగులకే 3 వికెట్లు తీసి ఇబ్బంది పెట్టినా, ఆతర్వాత డెవాల్డ్ బ్రెవిస్ (29 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో 63; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (24 బంతుల్లో 44 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) మెరుపు విన్యాసాలతో ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. బ్రెవిస్-మిల్లర్-స్టబ్స్ త్రయం బుమ్రా, అర్షదీప్ మినహా మిగతా భారత బౌలర్లందరిపైనా విరుచుకుపడ్డారు.వరుణ్ చక్రవర్తి (4-0-47-1), హార్దిక్ పాండ్యా (4-0-45-0), శివమ్ దూబే (2-0-32-1), వాషింగ్టన్ సుందర్ (2-0-17-0)పై ఎదురుదాడి చేశారు.అనంతరం ఓ మోస్తరుకు మించిన లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు సైతం ఆదిలోనే తడబడ్డారు. అయితే సౌతాఫ్రికన్లలా కాకుండా మిడిలార్డర్ పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో భారత ఓటమి ఛేదన ప్రారంభమైన కొద్ది సమయంలోనే ఖరారైపోయింది. నాలుగో బంతికే ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్ డకౌటయ్యాడు. ఆతర్వాత రెండు బంతులకే ఫామ్లో లేని తిలక్ వర్మ (1) కూడా పెవిలియన్కు చేరాడు. గత మూడు మ్యాచ్ల్లో డకౌటై ఒత్తిడిలో ఉన్న అభిషేక్ శర్మ (15) మరోసారి అదే ఒత్తిడికి చిత్తయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ (18) క్రీజ్లోకి వచ్చిన వెంటనే పలు చూడముచ్చటైన షాట్లు ఆడినా, బంతులు వృధా కావడంతో ఒత్తిడిలో పడి వికెట్ సమర్పించుకున్నాడు. వాషింగ్టన్ సుందర్కు (11) ప్రమోషన్ ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. శివమ్ దూబే (42) తన సహజ శైలిలో వేగంగా పరుగులు రాబట్టలేకపోయాడు. హార్దిక్ (18), రింకూ (0) కూడా నిరాశపరిచారు.మొత్తంగా భారత్ 18.5 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికా బౌలర్లు జన్సెన్ (3.5-0-22-4), కేశవ్ మహారాజ్ (3-0-24-3), కార్బిన్ బాష్ (3-0-12-2), మార్క్రమ్ (1-0-5-1) భారత పతనాన్ని శాశించారు. ఎంగిడి (4-0-15-0), రబాడ (4-0-32-0) వికెట్లు తీయలేకపోయినా అద్భుతంగా బౌలింగ్ చేశారు. -
T20 WC 2026: ముందుకు పోవాలంటే అన్నీ గెలవాల్సిందే..!
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్ నిన్న (ఫిబ్రవరి 22) తమ తొలి సూపర్-8 మ్యాచ్ ఆడింది. అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా ఊహించని పరాభవం ఎదుర్కొంది. తద్వారా సెమీస్ అవకాశాలను కఠినం చేసుకుంది. సెమీస్కు చేరాలంటే టీమిండియా ఇకపై ఆడే రెండు మ్యాచ్లు (వెస్టిండీస్, జింబాబ్వే) గెలవాల్సిందే. ఏ ఒక్క మ్యాచ్లో తడబడినా ఇతర జట్ల ఫలితాలు, నెట్ రన్రేట్పై ఆధార పడాల్సిన పరిస్థితి వస్తుంది. టీమిండియా ఈ స్థితికి రాకుండా ఉండాలంటే జింబాబ్వే, వెస్టిండీస్లను చిన్న జట్లని తక్కువ అంచనా వేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.విండీస్, జింబాబ్వే పేరుకే చిన్న జట్లైనా, ఈ ప్రపంచకప్లో వారు ఏం చేశారో చూశాం. టీమిండియా లాగే ఆ జట్లు కూడా గ్రూప్ దశలో అన్ని మ్యాచ్లు గెలిచి టాపర్లుగా సూపర్-8లోకి అడుగుపెట్టాయి. పైగా ఆ జట్లు గ్రూప్ దశలో తమకంటే చాలా మెరుగైన జట్లపై విజయాలు సాధించాయి. జింబాబ్వే అయితే ఏకంగా ఆస్ట్రేలియా లాంటి అత్యుత్తమ జట్టుకే షాకిచ్చింది. శ్రీలంకను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించింది. విండీస్ విషయానికొస్తే.. ఈ జట్టులో ఇటీవలికాలంలో ఎప్పుడూ కనపడని జోష్ కనిపిస్తుంది. పటిష్టమైన ఇంగ్లండ్కు షాకివ్వడంతో పాటు చిన్న జట్లపై పెద్దగా కష్టపడకుండానే విజయాలు సాధించింది.భారత్ ఫిబ్రవరి 26న జింబాబ్వేతో.. మార్చి 1న వెస్టిండీస్తో తలపడాల్సి ఉంది. జింబాబ్వే మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో.. విండీస్ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగాల్సి ఉన్నాయి. ఆయా వేదికలు భారత్కు అనుకూలమే అయినప్పటికీ.. ఏమరపాటుగా ఉంటే మాత్రం సౌతాఫ్రికా చేతిలో ఎదురైన పరాభవమే పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి చిన్న జట్లని తేలికగా తీసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. -
ఆసియా కప్ 2026 విజేతగా భారత్
ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టైటిల్ను భారత్ వరుసగా రెండో ఎడిషన్లోనూ కైవసం చేసుకుంది. బ్యాంకాక్ వేదికగా జరిగిన 2026 ఎడిషన్లో భారత-ఏ జట్టు విజేతగా అవతరించింది. ఇవాళ (ఫిబ్రవరి 22) జరిగిన ఫైనల్లో టీమిండియా 46 పరుగుల తేడాతో బంగ్లాదేశ్-ఏపై ఘన విజయం సాధించింది. ఈ టోర్నీ తొలి ఎడిషన్ (2023) ఫైనల్లోనూ భారత-ఏ జట్టు బంగ్లాదేశ్-ఏపైనే విజయం సాధించే టైటిల్ను చేజిక్కించుకుంది.నేటి ఫైనల్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. తేజల్ హసబ్నిస్ (51 నాటౌట్), కెప్టెన్ రాధా యాదవ్ (36) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగుల చేసింది. వీరిద్దరు కాకుండా భారత ఇన్నింగ్స్లో వ్రింద దినేశ్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేసింది. మిగతా బ్యాటర్లలో నందిని కశ్యప్ 8, అనుష్క శర్మ 8, తనూజా కన్వర్ 1, ప్రేమా రావత్ 4, మిన్నూ మణి డకౌటయ్యారు. మమత మడివాలా 2 పరుగులతో అజేయంగా నిలిచింది.బంగ్లా బౌలర్ ఫాహిమ ఖాతూన్ (4-0-25-4) అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్ను కట్టడి చేసింది. మరో బౌలర్ ఫాతిమా జహా సోనియా (4-0-19-1) పొదుపుగా బౌలింగ్ చేసింది. ఫర్జానా ఎస్మిన్ (4-0-30-1) పర్వాలేదనిపించింది. మిగతా బౌలర్లలో సంజిద అక్తర్ 3 ఓవర్లలో 12 పరుగులు.. ఫరీహా త్రిస్న 3 ఓవర్లలో 23 పరుగులు.. లతా మొండల్, సదియా అక్తర్ తలో ఓవర్ వేసి 14, 9 పరుగులిచ్చారు.అనంతరం 135 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్-ఏ జట్టు తడబడింది. భారత బౌలర్లు ప్రేమా రావత్ (4-0-12-3), తనూజా కన్వర్ (3.1-0-11-2), సోనియా మెంధియా (4-0-21-2), కెప్టెన్ రాధా యాదవ్ (4-0-16-1), సైమా ఠాకోర్ (2-0-11-1), మిన్నూ మణి (2-0-17-1) ధాటికి 19.1 ఓవర్లలో 88 పరుగులకే ఆలౌటై పరాజయంపాలైంది. బంగ్లా ఇన్నింగ్స్లో 20 పరుగులు చేసిన షమీమా సుల్తానా టాప్ స్కోరర్గా నిలిచింది. సర్మిన్ సుల్తానా (18), కెప్టెన్ ఫాతిమా ఖాతూన్ (14), సదియా అక్తర్ (10) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. ప్రేమా రావత్ 3 వికెట్లు తీయడంతో పాటు 3 క్యాచ్లు కూడా పట్టి భారత గెలుపులో కీలకపాత్ర పోషించింది. -
ఆసియా కప్ ఫైనల్.. స్వల్ప స్కోర్కే పరిమితమైన టీమిండియా
ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీ ఫైనల్లో భారత-ఏ, బంగ్లాదేశ్-ఏ జట్లు తలపడుతున్నాయి. బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగుల స్కోర్కు మాత్రమే పరిమితమైంది. బంగ్లా బౌలర్ ఫాహిమ ఖాతూన్ (4-0-25-4) అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్ను కట్టడి చేసింది. మరో బౌలర్ ఫాతిమా జహా సోనియా (4-0-19-1) పొదుపుగా బౌలింగ్ చేసింది. ఫర్జానా ఎస్మిన్ (4-0-30-1) పర్వాలేదనిపించింది. మిగతా బౌలర్లలో సంజిద అక్తర్ 3 ఓవర్లలో 12 పరుగులు.. ఫరీహా త్రిస్న 3 ఓవర్లలో 23 పరుగులు.. లతా మొండల్, సదియా అక్తర్ తలో ఓవర్ వేసి 14, 9 పరుగులిచ్చారు.భారత్ ఈ మాత్రం స్కోరైనా చేసిందంటే అది తేజల్ హసబ్నిస్ (51 నాటౌట్), కెప్టెన్ రాధా యాదవ్ (36) చలవ వల్లే. వీరిద్దరు కాకుండా వ్రింద దినేశ్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగింది. మిగతా బ్యాటర్లలో నందిని కశ్యప్ 8, అనుష్క శర్మ 8, తనూజా కన్వర్ 1, ప్రేమా రావత్ 4, మిన్నూ మణి డకౌటయ్యారు. మమత మడివాలా 2 పరుగులతో అజేయంగా నిలిచింది.అనంతరం 135 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ ఆచితూచి ఆడుతుంది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్ మాత్రమే కోల్పోయి 26 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలవాలంటే 90 బంతుల్లో మరో 109 పరుగులు చేయాలి. కాగా, సెమీఫైనల్స్లో భారత్ శ్రీలంకపై, బంగ్లాదేవ్ పాకిస్తాన్పై విజయాలు సాధించి తుది పోరుకు అర్హత సాధించాయి. -
సూపర్ ఫామ్లో ఉన్న సూర్యకు మరో గుడ్ న్యూస్
సూపర్ ఫామ్లో ఉన్న భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు మరో గుడ్ న్యూస్ అందింది. 2026 జనవరి నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. పురుషుల విభాగంలో స్కైతో పాటు న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్, ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ కూడా నామినేట్ అయ్యారు. మహిళల విభాగంలో ఐర్లాండ్కు చెందిన గాబీ లూయిస్, బంగ్లాదేశ్ ప్లేయర్ శోభన మోస్టరీ, యూఎస్ఏకు చెందిన టారా నోర్రిస్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు పోటీపడుతున్నారు. గత నెలలో వీరంతా తమతమ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శనలు చేయడంతో ఐసీసీ వీరిని ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ చేసింది.డారిల్ మిచెల్జనవరిలో టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్లో డారిల్ మిచెల్ ఆకాశమే హద్దుగా చెలరేగి, తన జట్టుకు 2-1 తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. రెండు, మూడు వన్డేల్లో మిచెల్ వరుస శతకాలు సాధించి మొత్తం 352 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో అతని సగటు 176గా ఉండటం విశేషం.ఈ ప్రదర్శన తర్వాత మిచెల్ ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానానికి చేరుకున్నారు. అనంతరం జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో కూడా 186.56 స్ట్రైక్ రేట్తో 125 పరుగులు సాధించి సత్తా చాటాడు.జో రూట్రూట్ విషయానికొస్తే.. ఈ స్టార్ బ్యాటర్ జనవరి నెలలో శ్రీలంకపై ఇంగ్లండ్ 2-1 తేడాతో వన్డే సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్లో అతను వరుసగా 61, 75, 111 నాటౌట్ స్కోర్లు చేశాడు. అదనంగా రెండు వికెట్లు కూడా తీసి "ప్లేయర్ ఆఫ్ ద సిరీస్" అవార్డును కూడా అందుకున్నాడు. ఈ ప్రదర్శనల కారణంగానే రూట్ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు.సూర్యకుమార్ యాదవ్జనవరి నెలలో న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో స్కై తన పూర్వపు ఫామ్ను తిరిగి పొందాడు. అంతకుముందు 25 ఇన్నింగ్స్ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయిన స్కై.. ఆ సిరీస్లో మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. 197 స్ట్రైక్ రేట్తో 242 పరుగులు చేసి భారత్కు సిరీస్ విజయాన్ని (4-1) అందించాడు. ఈ ప్రదర్శనల కారణంగానే స్కై ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. -
విడాకులు తీసుకున్న మరో టీమిండియా క్రికెటర్
ఇటీవలికాలంలో టీమిండియా క్రికెటర్లు (శిఖర్ ధవన్, మహ్మద్ షమీ, యుజ్వేంద్ర చహల్, హార్దిక్ పాండ్యా) వరుసగా విడాకులు తీసుకుంటున్నారు. వివాహ బంధంలో ఇమడలేక భార్యలతో తెగదెంపులు చేసుకుంటున్నారు. ఈ జాబితాలో తాజాగా మరో భారత క్రికెటర్ కూడా చేరాడు.26 ఏళ్ల లెగ్ స్పిన్నర్, మరో టీమిండియా ఆటగాడు దీపక్ చాహర్ సోదరుడు అయిన రాహుల్ చాహర్ తన భార్య ఇషానీ జోహర్తో విడాకులు తీసుకున్నట్లు ఇవాళ (ఫిబ్రవరి 20) ప్రకటించాడు. ఈ విషయాన్ని చాహర్ ఓ భావోద్వేగపూర్వక నోట్తో ఇన్స్టాలో షేర్ చేశాడు.చిన్న వయసులోనే వివాహం చేసుకున్నానని, అప్పట్లో తనను తాను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానని, అది తనకు జీవిత పాఠాలు నేర్పిందని చాహర్ పేర్కొన్నాడు. గత కొన్ని సంవత్సరాలు అనుకోని పాఠాలు నేర్పాయని, గత పదిహేను నెలలు కోర్టు ప్రక్రియలతో గడిచాయని వివరించాడు. ఈ సమయం తనకు సహనం, ధైర్యం నేర్పిందని అన్నాడు. ఈ అధ్యాయం ఇప్పటికి ముగిసిందని.. ఇకపై స్వాభిమానంతో, శాంతితో, మంచి నిర్ణయాలతో కొత్త జీవితం ప్రారంభిస్తానని తెలిపాడు.ప్రేమించి పెళ్లి చేసుకొని..!- రాహుల్–ఇషానీ జోహర్ 2019 డిసెంబర్లో నిశ్చితార్థం చేసుకున్నారు. - 2022 మార్చిలో గోవాలో ఓ ప్రైవేట్ వేడుకలో వీరి వివాహం జరిగింది. - ఇషానీ ఫ్యాషన్ డిజైనర్గా పనిచేస్తూ, తరచూ రాహుల్ మ్యాచ్లకు హాజరై మద్దతు ఇచ్చేది. - వారి బంధం సోషల్ మీడియాలో అభిమానుల ప్రశంసలు కూడా అందుకుంది.- స్పష్టమైన కారణాలేమో తెలియరాలేదు కానీ, చాహర్ ఇవాళ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి, అందరినీ ఆశ్చర్యపరిచాడు.విడాకుల తర్వాత రాహుల్ చాహర్ తిరిగి క్రికెట్పై దృష్టి కేంద్రీకరించనున్నాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తొమ్మిది మ్యాచ్ల్లో ఆరు వికెట్లు మాత్రమే తీసిన చాహర్.. తిరిగి ఫామ్లోకి రావాలని కృషి చేస్తున్నాడు. చాహర్ను 2026 ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ. 5.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఈసారి ఐపీఎల్లో సత్తా చాటి తిరిగి టీమిండియా రీఎంట్రీ ఇవ్వాలని చాహర్ భావిస్తున్నాడు. -
T20 WC 2026: అందరిది ఒకే మాట.. సెమీస్కు చేరే జట్లు ఇవే..!
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 మ్యాచ్లు రేపటి నుంచి (ఫిబ్రవరి 21) ప్రారంభంకానున్న నేపథ్యంలో ఏ జట్లు సెమీస్కు చేరతాయనే చర్చ జోరుగా సాగుతోంది. పలానా జట్లు సెమీస్కు చేరతాయి.. పలానా జట్లు నిష్క్రమిస్తాయని ఎవరి అంచనాలను వారు సోషల్మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. తాజాగా స్టార్ స్పోర్ట్స్ ఛానల్ నిపుణులు కూడా ఈ టాపిక్పై తమ అంచనాలను షేర్ చేశారు.స్టార్ స్పోర్ట్స్ ప్యానెల్లో టీమిండియా మాజీలు యుజ్వేంద్ర చహల్, ఛతేశ్వర్ పుజారా, మొహమ్మద్ కైఫ్, వరుణ్ ఆరోన్, సబా కరీం, సంజయ్ బాంగర్ నిపుణులుగా ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరు ఒక్కో అంచనా కలిగి ఉన్నారు. అయితే అందరి అంచనాల్లో ఓ కామన్ పాయింట్ ఉంది. అదే టీమిండియా. ఈ ఆరుగురు సెమీస్కు చేరే జట్లలో టీమిండియాకు అవకాశం ఇచ్చారు.చహల్ భారత్తో పాటు సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు సెమీస్కు చేరతాయని అంచనా వేయగా.. పుజారా భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్తో పాటు శ్రీలంకకు ఛాన్స్ ఇచ్చాడు.కైఫ్ భారత్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు సెమీస్కు చేరతాయని అంచనా వేయగా.. వరున్ ఆరోన్ పై ముగ్గురికి భిన్నంగా భారత్తో పాటు వెస్టిండీస్, ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయిని అభిప్రాయపడ్డాడు.సబా కరీం విషయానికొస్తే.. ఈ టీమిండియా మాజీ వికెట్కీపర్ భారత్తో పాటు సౌతాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయని గెస్ చేస్తున్నాడు. మాజీ టీమిండియా ఆల్రౌండర్ బాంగర్.. భారత్తో పాటు సౌతాఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్ జట్లు సెమీస్కు చేరతాయని అభిప్రాయపడ్డాడు. ఈ నిపుణుల అంచనాల్లో ఎవరి అంచనాలు కరెక్ట్ అవుతాయో కామెంట్ చేయండి. -
పాక్ను చిత్తు చేసిన బంగ్లాదేశ్.. ఫైనల్లో భారత్తో అమీతుమీ
బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో బంగ్లాదేశ్-ఏ జట్టు ఫైనల్కు చేరింది. పాకిస్తాన్-ఏతో ఇవాళ (ఫిబ్రవరి 20) జరిగిన రెండో సెమీఫైనల్లో 54 పరుగుల తేడాతో గెలుపొంది, తుది పోరుకు అర్హత సాధించింది. ఇవాళే జరిగిన తొలి సెమీఫైనల్లో భారత-ఏ జట్టు శ్రీలంక-ఏపై 5 వికెట్ల తేడాతో గెలుపొంది, తొలి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. భారత్-ఏ, బంగ్లాదేశ్-ఏ జట్లు ఫిబ్రవరి 22న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. కెప్టెన్ ఫహీమా ఖాతూన్ 40 పరుగులతో రాణించి, బంగ్లాదేశ్కు గౌరవప్రదమైన స్కోర్ అందించింది. బంగ్లా ఇన్నింగ్స్లో ఫహీమాతో పాటు ఇష్మా తంజిమ్ (12), షమీమా సుల్తానా (13), సర్మిన్ సుల్తానా (15) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో కెప్టెన్ హఫ్సా ఖలీద్ 2, వహీదా అక్తర్, మొమినా రియాసత్, అనోషా నాసిర్, ఒమైమా సొహైల్ తలో వికెట్ తీశారు.అనంతరం 111 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్.. బంగ్లా బౌలర్ల ధాటికి ఘోరంగా పతనమైంది. 16.4 ఓవర్లలో 56 పరుగులకే కుప్పకూలింది. సంజిద (3.4-0-6-3), ఫహీమా (3-0-6-2), ఫాతిమా (4-0-11-1), ఫరీహా (3-0-14-1), ఫర్జానా (1-0-6-1) పాక్ పతనాన్ని శాశించారు. పాక్ ఇన్నింగ్స్లో షావాల్ జుల్ఫికర్ (14), యుస్రా ఆమిర్ (11), హఫ్సా ఖలీద్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కాగా, పురుషుల టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో బంగ్లా-పాక్ మధ్య చిగురించిన స్నేహం తర్వాత వచ్చిన ఫలితం కావడంతో ఈ మ్యాచ్కు ప్రాధాన్యత సంతరించుకుంది. -
చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్
భారత మహిళా క్రికెట్ జట్టు సారధి హర్మన్ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఆస్ట్రేలియాతో ఇవాళ (ఫిబ్రవరి 19) జరిగిన టీ20 మ్యాచ్తో ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్ కలుపుకొని హర్మన్ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లలో) 356 మ్యాచ్లు ఆడింది. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ ప్లేయర్ సూజీ బేట్స్ పేరిట ఉండేది. సూజీ తన కెరీర్లో 355 మ్యాచ్లు ఆడింది. ఈ జాబితాలో హర్మన్, సూజీ తర్వాతి స్థానంలో ఆసీస్ ప్లేయర్ ఎల్లిస్ పెర్రీ ఉంది. పెర్రీ తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటివరకు 349 మ్యాచ్లు ఆడింది.హర్మన్ విషయానికొస్తే.. 2009 మార్చి 7న పాకిస్తాన్పై తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. ఇప్పటివరకు 6 టెస్టులు, 161 వన్డేలు, 189 T20ల్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. 2016లో కెప్టెన్సీ చేపట్టిన హర్మన్, 2025 నవంబర్లో వన్డే వరల్డ్ కప్ గెలిపించి కోట్లాది మంది భారతీయుల కలను సాకారం చేసింది. హర్మన్ తన కెరీర్లో మూడు ఫార్మాట్లలో కలిపి 8000కిపైగా పరుగులు సాధించింది.మ్యాచ్ విషయానికొస్తే.. ఆసీస్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 19) జరిగిన రెండో మ్యాచ్లో భారత్ 19 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఓపెనర్లు జార్జియా వాల్ (57 బంతుల్లో 88; 11 ఫోర్లు, సిక్స్), బెత్ మూనీ (39 బంతుల్లో 46; 4 ఫోర్లు) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవరల్లో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. తొలుత వాల్-మూనీ ధాటికి తడబడిన భారత బౌలర్లు.. చివరి 5 ఓవర్లలో అనూహ్యంగా పుంజుకున్నారు.వాల్-మూనీ తొలి వికెట్కు 14.5 ఓవర్లలో 128 పరుగులు జోడించినా.. అరుంధతి రెడ్డి (4-0-20-2), శ్రీచరణి (3-0-28-0), రేణుకా ఠాకూర్ (4-0-27-1) ఊహించని విధంగా పుంజుకొని ఆసీస్ను భారీ స్కోర్ చేయకుండా నిలువరించారు. వాల్, మూనీ మినహా ఆసీస్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా రాణించలేకపోయారు. లిచ్ఫీల్డ్ 6, ఎల్లిస్ పెర్రీ 7, గార్డ్నర్ 10 (నాటౌట్), జార్జియా వేర్హమ్ డకౌటయ్యారు.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ను ఆసీస్ బౌలర్లు కలిసికట్టుగా రాణించి ఓడించారు. ఆష్లే గార్డ్నర్ (4-0-22-3), కిమ్ గార్త్ (3-0-16-2), అన్నాబెల్ సదర్ల్యాండ్ (4-0-18-2), సోఫీ మోలినెక్స్ (4-0-37-2) ధాటికి భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. భారత ఇన్నింగ్స్కు షఫాలీ వర్మ (29), స్మృతి మంధన (31) శుభారంభం అందించినా, ఆతర్వాత వచ్చిన వారు ఆ ఊపును కొనసాగించలేకపోయారు. కెప్టెన్ హర్మన్ (36) కాసేపు పోరాడినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.భారత ఇన్నింగ్స్లో పై ముగ్గురితో పాటు రిచా ఘోష్ (19), క్రాంతి గౌడ్ (12 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జెమీమా రోడ్రిగ్స్ (4), అమన్జోత్ (3), అరుంధతి రెడ్డి (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. దీప్తి శర్మ, శ్రీచరణి ఖాతా కూడా తెరవలేకపోయారు.కాగా, ఈ సిరీస్లో భారత్ తొలి టీ20లో 21 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్దతిలో) విజయం సాధించింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 ఫిబ్రవరి 21న అడిలైడ్ వేదికగా జరుగనుంది. ఈ ఆసీస్ పర్యటనలో భారత్ టీ20ల తర్వాత మూడు మ్యాచ్ల వన్డే సిరీస్, ఆతర్వాత ఏకైక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడనుంది. -
భారత్పై ప్రతీకారం తీర్చుకున్న ఆస్ట్రేలియా
మహిళల ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు స్వదేశంలో టీమిండియాతో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడుతుంది. ఇందులో తొలుత 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కాగా.. భారత్ తొలి మ్యాచ్లోనే ఆతిథ్య జట్టుకు షాకిచ్చి తమ ఆధిక్యతను ప్రదర్శించింది. ఈ మ్యాచ్లో ఎదురైన పరాభవానికి ఆసీస్ రెండో మ్యాచ్లోనే ప్రతీకారం తీర్చుకుంది.కాన్బెర్రా వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 19) జరిగిన రెండో టీ20లో ఆసీస్ 19 పరుగుల తేడాతో భారత్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఓపెనర్లు జార్జియా వాల్ (57 బంతుల్లో 88; 11 ఫోర్లు, సిక్స్), బెత్ మూనీ (39 బంతుల్లో 46; 4 ఫోర్లు) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవరల్లో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. తొలుత వాల్-మూనీ ధాటికి తడబడిన భారత బౌలర్లు.. చివరి 5 ఓవర్లలో అనూహ్యంగా పుంజుకున్నారు.వాల్-మూనీ తొలి వికెట్కు 14.5 ఓవర్లలో 128 పరుగులు జోడించినా.. అరుంధతి రెడ్డి (4-0-20-2), శ్రీచరణి (3-0-28-0), రేణుకా ఠాకూర్ (4-0-27-1) ఊహించని విధంగా పుంజుకొని ఆసీస్ను భారీ స్కోర్ చేయకుండా నిలువరించారు. వాల్, మూనీ మినహా ఆసీస్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా రాణించలేకపోయారు. లిచ్ఫీల్డ్ 6, ఎల్లిస్ పెర్రీ 7, గార్డ్నర్ 10 (నాటౌట్), జార్జియా వేర్హమ్ డకౌటయ్యారు.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ను ఆసీస్ బౌలర్లు కలిసికట్టుగా రాణించి ఓడించారు. ఆష్లే గార్డ్నర్ (4-0-22-3), కిమ్ గార్త్ (3-0-16-2), అన్నాబెల్ సదర్ల్యాండ్ (4-0-18-2), సోఫీ మోలినెక్స్ (4-0-37-2) ధాటికి భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. భారత ఇన్నింగ్స్కు షఫాలీ వర్మ (29), స్మృతి మంధన (31) శుభారంభం అందించినా, ఆతర్వాత వచ్చిన వారు ఆ ఊపును కొనసాగించలేకపోయారు. కెప్టెన్ హర్మన్ (36) కాసేపు పోరాడినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. భారత ఇన్నింగ్స్లో పై ముగ్గురితో పాటు రిచా ఘోష్ (19), క్రాంతి గౌడ్ (12 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జెమీమా రోడ్రిగ్స్ (4), అమన్జోత్ (3), అరుంధతి రెడ్డి (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. దీప్తి శర్మ, శ్రీచరణి ఖాతా కూడా తెరవలేకపోయారు.కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి టీ20లో 21 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్దతిలో) విజయం సాధించింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 ఫిబ్రవరి 21న అడిలైడ్ వేదికగా జరుగనుంది. ఈ ఆసీస్ పర్యటనలో భారత్ టీ20ల తర్వాత మూడు మ్యాచ్ల వన్డే సిరీస్, ఆతర్వాత ఏకైక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడనుంది. -
T20 WC 2026: ఏ జట్లకు సెమీస్ అవకాశాలు..?
టీ20 వరల్డ్కప్ 2026లో మరికొన్ని మ్యాచ్లు మిగిలుండగానే సూపర్-8 బెర్త్లు ఖరారయ్యాయి. గ్రూప్-ఏ నుంచి భారత్, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే.. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్.. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్ ఫైనల్-8కి అర్హత సాధించాయి.సూపర్-8 దశలో సౌతాఫ్రికా, వెస్టిండీస్, భారత్, జింబాబ్వే గ్రూప్ 1లో ఉండగా.. ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్ గ్రూప్ 2లో ఉన్నాయి. సూపర్-8 మ్యాచ్లు ఫిబ్రవరి 22 నుంచి ప్రారంభమవుతాయి. గ్రూప్ 1 మ్యాచ్లన్నీ భారత్లో జరుగనుండగా.. గ్రూప్ 2 మ్యాచ్లన్నీ శ్రీలంకలో జరుగుతాయి. సెమీస్, ఫైనల్స్ వేదికలు ఇంకా ఖరారు కాలేదు.సూపర్-8 సమరాలకు సర్వం సిద్దమైన వేల ఏయే జట్లు సెమీస్కు చేరతాయన్న చర్చ జోరందుకుంది. ఈ టాపిక్పై ఎవరి అంచనాలు వారికున్నా, ఒక్క విషయం మాత్రం స్పష్టమవుతుంది. ఫైనల్-4కు చేరడం ఏ జట్టుకూ అంత ఈజీగా అయితే కనిపించడం లేదు. సూపర్-8 దశకు చేరాయంటేనే ఆ జట్ల సత్తా ఏంటో ఇదివరకే నిరూపితమైనట్లు. అలాంటిది టగ్ ఆఫ్ వార్ ఫైట్లలో అన్నీ జట్లు శక్తివంచన లేకుండా పోరాడటం ఖాయంగా కనిపిస్తుంది.సూపర్ 8 దశలో రెండు గ్రూప్ల నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్కు చేరతాయి. ఇరు గ్రూప్ల్లో ఆ రెండు బెర్త్ల కోసం అన్ని జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తుంది.గ్రూప్ 1 విషయానికొస్తే.. ఈ గ్రూప్ నుంచి భారత్, సౌతాఫ్రికా హాట్ ఫేవరెట్లుగా కనిపిస్తున్నప్పటికీ.. వెస్టిండీస్, జింబాబ్వేను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ముఖ్యంగా విండీస్ విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మిగతా జట్లు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. విండీస్ ఇటీవల కాలంలో అద్భుత ప్రదర్శనలు చేస్తూ, పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. పైగా గ్రూప్ దశలో ఈ జట్టు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధించి జోష్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విండీస్తో ఏమరపాటుగా ఉంటే సౌతాఫ్రికా ప్రపంచకప్ కల ఈసారి కూడా కలగానే మిగిలిపోతుంది.ఎందుకంటే, ప్రస్తుతం భారత్ ఉన్న ఫామ్ను బట్టి చూస్తే జింబాబ్వే, వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లకు ఓడించడం అంత కష్టం కాకపోవచ్చు. పైగా టీమిండియాకు హోం అడ్వాంటేజ్ కూడా ఉంది. కాబట్టి భారత్ ఫైనల్-4కు చేరడం నల్లేరుపై నడకే అవుతుంది. ఇక మిగిలిన రెండో బెర్త్ కోసం ముక్కోణపు పోటీ ఉండే అవకాశం ఉంది. జింబాబ్వే సహా ఏ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. జింబాబ్వే గ్రూప్ దశలో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించి, తామేంటో ఈసారి ప్రపంచానికి చూపిస్తామని ఛాలెంజ్ చేసింది. మరోపక్క సౌతాఫ్రికా సమతూకమైన, పటిష్టమైన జట్టుతో గత ఎడిషన్లో తృటిలో మిస్ అయిన టైటిల్ కోసం ఆకలితో ఎదురుచూస్తుంది. విండీస్ గురించి ఇదివరకే మాట్లాడుకున్నాం. ఈ జట్టు మూడోసారి టైటిల్ సాధించి, క్రికెట్ ప్రపంచానికి షాకివ్వాలని ఉవ్విళ్లూరుతుంది. గ్రూప్ 1 నుంచి అండర్ డాగ్ ఏ జట్టు అంటే విండీస్ పేరు చెప్పాలి. జట్టు పరంగా చూసినా, ప్రస్తుత విండీస్ జట్టు గతంలో స్టార్లతో నిండిన జట్టు కంటే పటిష్టంగా కనిపిస్తుంది. షాయ్ హోప్ సారథ్యంలో ఈ జట్టు నూతనోత్సహంతో పూర్వవైభవం దిశగా ఉరకలేస్తుంది. హోప్ సహా హెట్మైర్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, రొమారియో షెపర్డ్, జేసన్ హోల్డర్, మోటీ, షమార్ జోసఫ్ సూపర్-8 దశలో సంచలన ప్రదర్శనలతో చెలరేగే అవకాశం ఉంది.గ్రూప్ 2 విషయానికొస్తే.. ఈ గ్రూప్ గ్రూప్ 1 కంటే ప్రమాదకరంగా ఉంది. పాక్ మినహా మిగతా మూడు జట్లు సెమీస్ రేసులో నువ్వా-నేనా అన్నట్లు ముందుకు సాగే అవకాశం ఉంది. ఈ గ్రూప్లో తక్కువ అంచనా వేయడానికి వీల్లేని జట్టు ఏదైనా ఉందా అంటే అది న్యూజిలాండే అవుతుంది. ఈ జట్టు సెమీస్కు చేరడమే కాదు, తమ తొలి ప్రపంచకప్ టైటిల్ సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పేపర్పై ఈ జట్టు సాదాసీదాగా కనిపించినా, పోరాటపటిమ వారిని ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన జట్టుగా నిలబెడుతుంది. ఇటీవల భారత్తో జరిగిన సిరీస్లో ఆ జట్టు పోరాటాన్ని ఇంకా ఎవ్వరూ మరిచిపోలేదు. పైగా ఈ జట్టులోకి చాలామంది ఆటగాళ్లకు ఉపఖండపు పిచ్లపై ఆడిన అనుభవం కూడా ఉంది. భారత్ తర్వాత అత్యధిక హోం అడ్వాంటేజ్ లభించే జట్టు ఏదైనా ఉందా అంటే అది న్యూజిలాండే అవుతుంది.ఈ గ్రూప్ నుంచి మరో అండర్ డాగ్గా శ్రీలంకను చెప్పుకోవాలి. ఎందుకంటే, ఈ జట్టుకు కూడా హోం అడ్వాంటేజ్ ఉంది. ప్రదర్శనల ఆధారంగా చూసినా, ఈ జట్టు గ్రూప్ దశలో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించి ఉత్సాహంగా కనిపిస్తుంది. జట్టు పరంగా చూస్తే.. వీరు పేపర్పై బలంగా కనిపించకపోయినా, తమదైన రోజున ఇంగ్లండ్, న్యూజిలాండ్ను మట్టికరిపించగల సమర్దులు. కాబట్టి ఈ గ్రూప్ నుంచి న్యూజిలాండ్తో పాటు శ్రీలంకను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ గ్రూప్ హాట్ ఫేవరెట్ ఇంగ్లండ్ విషయానికొస్తే.. చెప్పుకోవడానికి మాత్రమే ఇది ఈ గ్రూప్లో హాట్ ఫేవరెట్ అవుతుంది. ఎందుకంటే, ఈ జట్టుకు మిగతా మూడు జట్ల నుంచి టఫ్ ఫైట్ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ జట్టు గ్రూప్ దశలో పసికూనలపై గెలిచేందుకు కూడా తీవ్రంగా శ్రమించింది. పేపర్పై బలంగా కనిపిస్తున్నా, కీలక ఆటగాళ్లు ఇప్పటివరకు సామర్థ్యం మేరకు రాణించలేదు. సూపర్-8 దశలో కీలక ఆటగాళ్లు టచ్లోకి వస్తే.. ఇంగ్లండ్ను సెమీస్కు చేరకుండా ఎవ్వరూ ఆపలేరు. ఇక ఈ గ్రూప్లో అత్యంత బలహీనమైన, ఏమాత్రం అంచనాలు లేని జట్టు ఏదైనా ఉందా అంటే అది పాకిస్తానే. అతికష్టం మీద సూపర్-8కు అర్హత సాధించిన ఈ జట్టు.. ఇంగ్లండ్, న్యూజిలాండ్ లాంటి పటిష్టమైన జట్లను కాదని ముందుకు వెళ్లడం దాదాపుగా అసంభవమేనని చెప్పాలి.ఓవరాల్గా చూస్తే.. గ్రూప్ 1 నుంచి సెమీస్ రేసులో భారత్ హాట్ ఫేవరెట్ కాగా.. రెండో బెర్త్ కోసం సౌతాఫ్రికా, వెస్టిండీస్ మధ్య తీవ్రమైన పోటీ ఉండే అవకాశం ఉంది. గ్రూప్ 2 నుంచి ఏ జట్టునూ హాట్ ఫేవరెట్ అని చెప్పలేని పరిస్థితి ఉంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య ముక్కోణపు పోటీ ఉండవచ్చు. -
ఆసీస్తో రెండో టీ20.. అనూహ్యంగా పుంజుకున్న భారత బౌలర్లు
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత మహిళల జట్టు ఇవాళ (ఫిబ్రవరి 19) రెండో టీ20 ఆడుతుంది. కాన్బెర్రా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. ఆసీస్ను 163 పరుగులకే (5 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది.తొలుత ఆసీస్ ఓపెనర్లు జార్జియా వాల్ (57 బంతుల్లో 88; 11 ఫోర్లు, సిక్స్), బెత్ మూనీ (39 బంతుల్లో 46; 4 ఫోర్లు) ధాటికి తడబడిన భారత బౌలర్లు.. చివరి 5 ఓవర్లలో అనూహ్యంగా పుంజుకున్నారు.వాల్-మూనీ తొలి వికెట్కు 14.5 ఓవర్లలో 128 పరుగులు జోడించినా.. అరుంధతి రెడ్డి (4-0-20-2), శ్రీచరణి (3-0-28-0), రేణుకా ఠాకూర్ (4-0-27-1) ఊహించని విధంగా పుంజుకొని ఆసీస్ను భారీ స్కోర్ చేయకుండా నిలువరించారు. వాల్, మూనీ మినహా ఆసీస్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా రాణించలేకపోయారు. లిచ్ఫీల్డ్ 6, ఎల్లిస్ పెర్రీ 7, గార్డ్నర్ 10 (నాటౌట్), జార్జియా వేర్హమ్ డకౌటయ్యారు. స్కోర్ను 170 పరుగులైనా దాటించాలనే ఆతృతతో ఆసీస్ ఇన్నింగ్స్ చివరి రెండు బంతులకు వికెట్లు కోల్పోయింది. వేర్హమ్, పెర్రీ రనౌట్లయ్యారు. ఈ ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే వచ్చాయి. శ్రీచరణి ఆసీస్ బ్యాటర్లను అద్భుతంగా కట్టడి చేసింది. కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి టీ20లో 21 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్దతిలో) విజయం సాధించి, ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ ఆసీస్ పర్యటనలో భారత్ టీ20ల తర్వాత మూడు మ్యాచ్ల వన్డే సిరీస్, ఆతర్వాత ఏకైక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడనుంది. -
టీమిండియా అదుర్స్.. అజేయంగా... అగ్రస్థానంతో
అహ్మదాబాద్: టి20 వరల్డ్ కప్లో లీగ్ దశను భారత జట్టు నాలుగు వరుస విజయాలతో అజేయంగా ముగించింది. గ్రూప్ ‘ఎ’లో ఆడిన అన్ని మ్యాచ్లూ గెలిచి అగ్రస్థానంతో ‘సూపర్ ఎయిట్స్’కు సిద్ధమైంది. బుధవారం జరిగిన పోరులో భారత్ 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్పై నెగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శివమ్ దూబే (31 బంతుల్లో 66; 4 ఫోర్లు, 6 సిక్స్లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ చేశాడు. కెపె్టన్ సూర్యకుమార్ (28 బంతుల్లో 34; 2 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మ (27 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ పాండ్యా (21 బంతుల్లో 30; 3 సిక్స్లు) మెరిపించారు. అనంతరం నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసి ఓడిపోయింది. ‘సూపర్ ఎయిట్స్’లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో భారత్ తలపడుతుంది. చివరి 5 ఓవర్లలో 75... భారత్ టాప్–3 కూడా ఎడంచేతివాటం బ్యాటర్లు కావడంతో ఆఫ్స్పిన్నర్ ఆర్యన్ దత్తో తొలి ఓవర్ వేయించి నెదర్లాండ్స్ చేసిన ప్రయోగం బాగా పని చేసింది. మూడో బంతికే అభిషేక్ శర్మ (0) బౌల్డ్ కాగా, ఇషాన్ కిషన్ (7 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా ఆర్యన్ రెండో ఓవర్లో బౌల్డ్ అయ్యాడు. మరోవైపు తిలక్ కొన్ని చక్కటి షాట్లు ఆడటంతో పవర్ప్లేలో స్కోరు 51/2కు చేరింది. అయితే ఈ దశలో డచ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వరుసగా 20 బంతుల పాటు బౌండరీనే రాలేదు! వ్యక్తిగత స్కోరు 13 వద్ద లెవిట్ క్యాచ్ వదిలేయడంతో సూర్యకు లైఫ్ లభించింది. అయితే అదే ఓవర్లో తిలక్ వెనుదిరిగాడు. అనంతరం 2 పరుగుల వద్ద ఎల్బీ అప్పీల్పై ‘అంపైర్స్ కాల్’తో బతికిపోయిన దూబే ఆపై చెలరేగిపోయాడు. అకెర్మన్ ఓవర్లో అతను 2 సిక్స్లు, ఫోర్ బాదాడు. నాలుగో వికెట్కు దూబేతో 76 పరుగులు (35 బంతుల్లో) జోడించిన తర్వాత సూర్య అవుటయ్యాడు. 15 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 118/4. ఇక్కడి నుంచి దూబే, పాండ్యా ధాటిగా ఆడటంతో చివరి 5 ఓవర్లలో భారత్ 8 సిక్స్లు, 3 ఫోర్లతో 75 పరుగులు జోడించడం విశేషం. వాన్ బీక్ ఓవర్లో 2 సిక్స్లు, ఫోర్ బాదిన దూబే 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టపటపా... భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నెదర్లాండ్స్ బ్యాటింగ్లో ఏ దశలోనూ దూకుడు కనిపించలేదు. పవర్ప్లేలో 36/1తో ఉన్న జట్టు స్కోరు సగం ఓవర్లు ముగిసేసరికి 72/2కు చేరింది. అయితే తర్వాత 31 పరుగుల వ్యవధిలో తర్వాతి 4 కీలక వికెట్లు కోల్పోయిన డచ్ వేగంగా ఓటమి వైపు సాగింది. కాషెట్ (26), క్రోస్ (25 నాటౌట్) చివర్లో 23 బంతుల్లో 47 పరుగులు జోడించి కొంత పోరాడినా...అప్పటికే ఆలస్యమైపోయింది.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (బి) దత్ 0; ఇషాన్ (బి) దత్ 18; తిలక్ (సి) మెర్వ్ (బి) వాన్ బీక్ 31; సూర్య (సి) (సబ్) గగ్టెన్ (బి) క్లీన్ 34; దూబే (సి) (సబ్) గగ్టెన్ (బి) బీక్ 66; పాండ్యా (సి) మెర్వ్ (బి) బీక్ 30; రింకూ (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 193. వికెట్ల పతనం: 1–0, 2–39, 3–69, 4–110, 5–186, 6–193. బౌలింగ్: ఆర్యన్ దత్ 4–0–19–2, వాన్ బీక్ 4–0–56–3, అకెర్మన్ 3–0–36–0, కైల్ క్లీన్ 4–0–38–1, డి లీడ్ 4–0–28–0, వాన్డర్ మెర్వ్ 1–0–15–0. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: లావిట్ (సి) సుందర్ (బి) పాండ్యా 24; డౌడ్ (బి) వరుణ్ 20; డి లీడె (సి) వరుణ్ (బి) దూబే 33; అకెర్మన్ (సి) రింకూ (బి) వరుణ్ 23; దత్ (బి) వరుణ్ 0; ఎడ్వర్డ్స్ (బి) బుమ్రా 15; కాషెట్ (సి) వాషింగ్టన్ సుందర్ (బి) దూబే 26; క్రోస్ (నాటౌట్) 25; బీక్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–35, 2–51, 3–94, 4–94, 5–112, 6–125, 7–172. బౌలింగ్: అర్ష్ దీప్ 3–0–22–0, బుమ్రా 3–0–17–1, సుందర్ 4–0–36–0, వరుణ్ 3–0–14–3, పాండ్యా 3–0–40–1, అభిషేక్ 1–0–10–0, దూబే 3–0–35–2. -
సిక్సర్లతో విరుచుకుపడిన శివమ్ దూబే.. టీమిండియా భారీ స్కోర్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నెదర్లాండ్స్తో ఇవాళ (ఫిబ్రవరి 18) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.శివమ్ దూబే (31 బంతుల్లో 66; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) సిక్సర్లతో విరుచుకుపడి భారత్కు భారీ స్కోర్ అందించాడు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (21 బంతుల్లో 30; 3 సిక్సర్లు) కూడా ఓ మోస్తరు మెరుపులు మెరిపించాడు. ఆఖరి ఓవర్లో 3 బంతులు ఎదుర్కొన్న రింకూ సింగ్ ఓ సిక్సర్ బాది అజేయంగా నిలిచాడు.అంతకుముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 34; 2 ఫోర్లు, సిక్స్), తిలక్ వర్మ (27 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్) నిదానంగా ఆడి విసుగు తెప్పించారు. వారికి ముందు ఇషాన్ కిషన్ (7 బంతుల్లో 18; 2 ఫోర్లు, సిక్స్) తన సహజ శైలిలో మెరుపులు మెరిపించాడు. అయితే మరో భారీ షాట్కు ప్రయత్నించి ఆర్యన్ దత్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.ఈ మెగా టోర్నీలో దారుణమైన ఫామ్లో ఉన్న అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లోనూ ఉసూరుమనిపించాడు. వరుసగా మూడో మ్యాచ్లోనూ డకౌటై టీమిండియా అభిమానులను నిరాశపరిచాడు.నెదర్లాండ్స్ బౌలర్లలో లోగాన్ వాన్ బీక్ (4-0-56-3) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా, వికెట్లు తీశాడు. ఓపెనర్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మను క్లీన్ బౌల్డ్ చేసిన ఆర్యన్ దత్ (4-0-19-2) కెరీర్లోనే అత్యుత్తమ స్పెల్ వేశాడు. బాస్ డి లీడ్ (4-0-28-0) పొదుపుగా బౌలింగ్ చేసి పర్వాలేదనిపించాడు. 19వ ఓవర్లో మాత్రమే 21 పరుగులిచ్చిన కైల్ క్లెయిన్ (4-0-38-1) అంతకుముందు ఓవర్లలో టీమిండియా బ్యాటర్లను కట్టడి చేశాడు. కొలిన్ ఆకెర్మన్ (3-0-36-0), వాన్ డర్ మెర్వ్ (1-0-15-0) కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు.కాగా, ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే భారత్ సూపర్-8కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. నెదర్లాండ్స్కు సైతం ఈ మ్యాచ్ ఫలితంతో ఎలాంటి ఉపయోగం లేదు. ఈ జట్టు ఇప్పటికే ఆడిన 3 మ్యాచ్ల్లో రెండింట ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
T20 WC 2026: కొనసాగుతున్న అభిషేక్ శర్మ చెత్త ప్రదర్శన
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ చెత్త ఫామ్ కొనసాగుతోంది. ఈ టోర్నీలో తానాడిన తొలి రెండు మ్యాచ్ల్లో (యూఎస్ఏ, పాకిస్తాన్) డకౌట్లైన అభిషేక్.. ఇవాళ (ఫిబ్రవరి 18) పసికూన నెదర్లాండ్స్తో జరుగుతున్న మ్యాచ్లోనూ ఖాతా తెరవలేక హ్యాట్రిక్ డకౌట్ల అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు.ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్ అయిన అభిషేక్ తన తొలి టీ20 ప్రపంచకప్లో మూడు మ్యాచ్లు ఆడినా ఖాతా తెరవలేకపోవడం శోచనీయం. అభిషేక్కు చివరి 7 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్లో ఇది ఐదో డకౌట్ కావడం మరింత శోచనీయం.ఈ మ్యాచ్లో అభిషేక్ను జెర్సీ మార్పు కూడా కాపాడలేకపోయింది. అభిషేక్ తన రెగ్యులర్ జెర్సీ కాకుండా సిరాజ్ వేసుకునే 73వ నంబర్ జెర్సీ ధరించి బరిలోకి దిగినా ఖాతా తెరవలేకపోయాడు.తాజా డకౌట్ తర్వాత అభిషేక్ ఓ చెత్త రికార్డును సమం చేశాడు. ఓ క్యాలెండర్ ఇయర్లో టీ20ల్లో అత్యధిక డకౌట్లైన భారత బ్యాటర్గా సంజూ శాంసన్ (2024) సరసన చేరాడు. సంజూ, అభిషేక్ ఇప్పుడు తలో ఐదు డకౌట్లతో ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. నెదర్లాండ్స్తో మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ కష్టాల్లో ఉంది. పవర్ ప్లేలోనే (తొలి 6 ఓవర్లలో) ఓపెనర్లు అభిషేక్ శర్మ (0), ఇషాన్ కిషన్ (18) వికెట్లు కోల్పోయి ఎదురీదుతుంది. 6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 51-2గా ఉంది. తిలక్ వర్మ (26), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (7) క్రీజ్లో ఉన్నారు. టీమిండియా కోల్పోయిన రెండు వికెట్లు స్పిన్నర్ ఆర్మన్ దత్కే దక్కాయి. అభిషేక్, ఇషాన్లను దత్ క్లీన్ బౌల్డ్ చేయడం విశేషం. -
T20 WC 2026: పసికూనతో పోరు.. టీమిండియాలో రెండు మార్పులు
టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ ఇవాళ (ఫిబ్రవరి 18) తమ చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడుతుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నెదర్లాండ్స్తో జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నామమాత్రపు ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ స్థానాల్లో అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు నెదర్లాండ్స్ ఓ మార్పుతో బరిలోకి దిగుతుంది. ఫ్రెడ్ క్లాసెన్ స్థానంలో నోవా క్రాస్ ప్లేయింగ్ ఎలెవెన్లోకి వచ్చాడు. కాగా, ఈ మెగా టోర్నీలో భారత్ ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు సాధించి, సూపర్-8కు చేరగా.. నెదర్లాండ్స్ 3 మ్యాచ్ల్లో రెండిట ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.తుది జట్లు..నెదర్లాండ్స్: మైఖేల్ లెవిట్, మాక్స్ ఓ'డౌడ్, బాస్ డి లీడ్, కోలిన్ అకెర్మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్(w/c), జాచ్ లయన్-కాచెట్, నోహ్ క్రోస్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, కైల్ క్లైన్భారత్: ఇషాన్ కిషన్(w), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా -
టీమిండియావైపు దూసుకొస్తున్న కర్ణాటక యువ సంచలనం
భారత దేశవాలీ క్రికెట్లో ప్రస్తుతం స్మరణ్ రవిచంద్రన్ అనే పేరు మార్మోగిపోతుంది. 22 ఏళ్ల ఈ కర్ణాటక యువ బ్యాటర్ ఫార్మాట్లకతీతంగా వరుస సెంచరీలు, డబుల్ సెంచరీలతో చెలరేగిపోతూ భారత క్రికెట్లో పెను సంచలనంగా మారాడు. ఎడమ చేతి వాటం అటాకింగ్ మిడిల్డార్ బ్యాటర్ అయిన స్మరణ్.. ప్రస్తుత రంజీ సీజన్లో ఆకాశమే హద్దుగా విజృంభిస్తున్నాడు.13 ఇన్నింగ్స్ల్లో 2 డబుల్ సెంచరీలు, 2 సెంచరీలు, 3 అర్ద సెంచరీల సాయంతో 950 పరుగులు (95 సగటున) చేసిన స్మరణ్.. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా అవతరించాడు. ఈ క్రమంలో ఢిల్లీ బ్యాటర్ ఆయుశ్ దొసేజాను (949 పరుగులు) అధిగమించాడు. స్మరణ్ భీకర ఫామ్ చూసి సహచర క్రికెటర్లు అవాక్కవుతున్నారు. విశ్లేషకులు సైతం అబ్బురపడుతున్నారు.ట్విన్ సెంచరీస్ప్రస్తుతం ఉత్తరాండ్తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో స్మరణ్ ఉగ్రరూపం దాల్చాడు. రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు (135, 127) చేసి భీకర ఫామ్ను కొనసాగించాడు. స్మరణ్ సహా దేవదత్ పడిక్కల్ (232), కేఎల్ రాహుల్ (141, 70 నాటౌట్) శివాలెత్తడంతో ఈ మ్యాచ్లో కర్ణాటక బంపర్ విక్టరీ దిశగా సాగుతోంది. మొత్తం 3 డబుల్ సెంచరీలు, 3 సెంచరీలుతాజా ప్రదర్శనతో స్మరణ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 1500 పరుగుల మైలురాయిని దాటాడు. 25 ఇన్నింగ్స్ల స్వల్ప కెరీర్లో 3 డబుల్ సెంచరీలు, 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీల సాయంతో 1500 పరుగుల మార్కును క్రాస్ చేశాడు. అతని కెరీర్ సగటు 72కు పైగా ఉండటం విశేషం.లిస్ట్-ఏ క్రికెట్లోనూ తిరుగలేని మొనగాడే..!స్మరణ్ సెంచరీల మోత, పరుగుల ప్రవాహం ఫస్ట్ క్లాస్ క్రికెట్కు మాత్రమే పరిమితం కాలేదు. ఈ మైసూరు కుర్రాడు లిస్ట్-ఏ క్రికెట్లోనూ అదరగొడుతున్నాడు. ఇటీవల (2024-25) కర్ణాటక విజయ్ హజారే వన్డే ట్రోఫీ సాధించడంలో స్మరణ్ అత్యంత కీలకపాత్ర పోషించాడు. సెమీఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీతో (76) పాటు, ఫైనల్లో మెరుపు సెంచరీ (101) చేసి తన జట్టును ఛాంపియన్గా నిలిపాడు. లిస్ట్-ఏ ఫార్మాట్లో మొత్తం 14 ఇన్నింగ్స్లు ఆడిన స్మరణ్ 96.48 స్ట్రయిక్రేట్తో 50కి పైగా సగటున 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీల సాయంతో 604 పరుగులు చేశాడు.పొట్టి ఫార్మాట్లోనూ పర్వాలేదుఫస్ట్క్లాస్, లిస్ట్-ఏ ఫార్మాట్లతో పోలిస్తే స్మరణ్ టీ20 ఫార్మాట్ రికార్డు ఓ మోస్తరుగా ఉంది. పొట్టి ఫార్మాట్లో స్మరణ్ 13 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేసి 162.45 స్ట్రయిక్రేట్తో 3 అర్ద సెంచరీల సాయంతో 489 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.బౌలింగ్లోనూ మెరిపిస్తాడుస్మరణ్ విధ్వంసకర బ్యాటింగ్తో మాత్రమే కాకుండా బౌలింగ్లోనూ మెరిపించగల సమర్దుడు. కుడి చేతి ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేసే స్మరణ్ కీలక సమయాల్లో బంతితోనూ మ్యాజిక్ చేయగలడు. లోకల్ క్రికెట్లో అతను బౌలింగ్లోనూ ప్రూవ్ చేసుకున్నాడు.అనుకోకుండా వచ్చిన ఐపీఎల్ అవకాశంస్మరణ్కు ఐపీఎల్ 2025లో ఊహించని విధంగా అవకాశం వచ్చింది. ఆసీస్ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా గాయపడంతో సన్రైజర్స్ హైదరాబాద్ స్మరణ్కు అక్కున చేర్చుకుంది (30 లక్షలు). అయితే స్మరణ్కు ఆ సీజన్లో అవకాశాలు దక్కలేదు. స్మరణ్పై భారీ అంచనాలు ఉన్న ఎస్ఆర్హెచ్ అతన్ని 2026 సీజన్కు కూడా రీటైన్ చేసుకుంది. ఈ ఐపీఎల్ సీజన్లో స్మరణ్కు అవకాశం దొరికి ఇదే తరహాలో చెలరేగితే, త్వరలోనే టీమిండియా తలుపులు తట్టడం ఖాయమని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు. -
T20 WC 2026: సూపర్-8లో టీమిండియా ప్రత్యర్థులు వీరే..!
టీ20 ప్రపంచకప్ 2026 నుంచి ఆస్ట్రేలియా వైదొలగడంతో సూపర్-8 దశలో టీమిండియా ప్రత్యర్దులు ఖరారయ్యారు. సూపర్-8 గ్రూప్-1లో భారత్తో పాటు జింబాబ్వే, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. గ్రూప్-1 మ్యాచ్లన్నీ భారత్లోనే జరుగుతాయి.భారత్ తమ తొలి సూపర్-8 మ్యాచ్ను ఫిబ్రవరి 22న ఆడుతుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.భారత రెండో సూపర్-8 మ్యాచ్ ఫిబ్రవరి 26న జరుగనుంది. చెన్నైలోని చిదంబరంలో స్టేడియం వేదికగా ఈ మ్యాచ్లో భారత్ జింబాబ్వేను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ కూడా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.భారత్ తమ మూడో సూపర్-8 మ్యాచ్ను మార్చి 1న ఆడుతుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో భారత్ వెస్టిండీస్ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్ కూడా రాత్రి 7 గంటలకే ప్రారంభమవుతుంది.గ్రూప్-1లో మిగతా మ్యాచ్ల షెడ్యూల్ ఇలా..-ఫిబ్రవరి 23- జింబాబ్వే వర్సెస్ వెస్టిండీస్ (ముంబై, రాత్రి 7 గంటలకు)-ఫిబ్రవరి 26- వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (అహ్మదాబాద్, మధ్యాహ్నం 3 గంటలకు)-మార్చి 1- జింబాబ్వే వర్సెస్ సౌతాఫ్రికా (ఢిల్లీ, మధ్యాహ్నం 3 గంటలకు)మరోవైపు సూపర్-8 గ్రూప్-2 బెర్త్ల్లో ప్రస్తుతానికి మూడు ఖరారయ్యాయి. రేపు (ఫిబ్రవరి 18) జరుగబోయే మ్యాచ్లో నమీబియాపై గెలిస్తే.. పాక్ నాలుగో బెర్త్ దక్కించుకుంటుంది. సూపర్-8 గ్రూప్-2లో న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక జట్లు ఉన్నాయి. గ్రూప్-2 మ్యాచ్లన్నీ శ్రీలంకలో జరుగుతాయి. గ్రూప్-2కు సంబంధించి కూడా పలు సూపర్-8 మ్యాచ్లు ఖరారయ్యాయి.-ఫిబ్రవరి 22న ఇంగ్లండ్-శ్రీలంక (పల్లెకెలె, మధ్యాహ్నం 3 గంటలకు)-ఫిబ్రవరి 25న న్యూజిలాండ్-శ్రీలంక (కొలొంబో, రాత్రి 7 గంటలకు)-ఫిబ్రవరి 27న ఇంగ్లండ్-న్యూజిలాండ్ (కొలొంబో, రాత్రి 7 గంటలకు)గ్రూప్-1, గ్రూప్-2లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి. సెమీస్ మ్యాచ్లు మార్చి 4, 5 తేదీల్లో జరుగుతాయి. సెమీస్లో గెలిచిన జట్లు మార్చి 8న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. సెమీస్, ఫైనల్కు వేదికలు ఇంకా ఖరారు కాలేదు. -
భారత స్టార్ను కిందకి దించి అగ్రపీఠాన్ని అధిరోహించిన పాక్ ప్లేయర్
ఐసీసీ తాజాగా ప్రకటించిన మహిళల టీ20 ర్యాంకింగ్స్లో భారత్ ప్లేయర్లకు మిశ్రమ అనుభవాలు ఎదురయ్యాయి. బౌలింగ్ ర్యాంకింగ్స్లో స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ అగ్రస్థానాన్ని కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది. టాప్ ప్లేస్కు పాక్ స్పిన్నర్ సదియా ఇక్బాల్ ఎగబాకింది. గత వారం ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో ఉండిన సదియా రెండు స్థానాలు మెరుగుపర్చుకుంది. సదియా (743), దీప్తి శర్మ (729) మధ్య పాయింట్ల వ్యత్యాసం 14 పాయింట్లు మాత్రమే. ఆసీస్ పర్యటన తొలి టీ20లో పెద్దగా ప్రభావం (2-0-19-1) చూపకపోవడంతో దీప్తి టాప్ ర్యాంక్ను కోల్పోవాల్సి వచ్చింది. మరోవైపు సదియా సౌతాఫ్రికాతో తాజాగా జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో 5.82 ఎకానమీతో 5 వికెట్లు తీసి టాప్ ర్యాంక్కు చేరుకుంది.టాప్-10లోకి దూసుకొచ్చిన రేణుకా సింగ్తాజా ర్యాంకింగ్స్లో భారత స్టార్ పేసర్ రేణుకా సింగ్ టాప్-10లోకి దూసుకొచ్చింది. ఆసీస్పై తొలి టీ20లో అద్భుత ప్రదర్శన (4-1-14-2) కనబర్చడంతో ఆరు స్థానాలు మెరుగుపర్చుకొని ఐదో స్థానానికి ఎగబాకింది.అరుంధతి అదుర్స్ఇదే మ్యాచ్లో ఆకాశమే హద్దుగా (4-0-22-4) చెలరేగిన మరో భారత పేసర్ అరుంధతి రెడ్డి ఏకంగా 19 స్థానాలు మెరుగుపర్చుకొని 17వ స్థానానికి ఎగబాకింది. ఇదే మ్యాచ్లో రాణించిన స్పిన్నర్ శ్రీచరణి (3-0-14-2) ఎనిమిది స్థానాలు మెరుగుపర్చుకొని 39వ స్థానానికి ఎగబాకింది.బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ వారం పెద్దగా మార్పుల్లేవు. బెత్ మూనీ, హేలీ మాథ్యూస్, స్మృతి మంధన టాప్-3లో కొనసాగుతున్నారు. భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ ఆరో స్థానాన్ని నిలబెట్టుకోగా.. జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ తలో స్థానాన్ని మెరుగుపర్చుకొని 11, 12 స్థానాలకు ఎగబాకారు. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా ఏకంగా 31 స్థానాలు మెరుగుపర్చుకొని 29వ స్థానానికి ఎగబాకింది. మిగతా చెప్పుకోదగ్గ మార్పుల్లో సౌతాఫ్రికా బ్యాటర్ అనెరీ డెర్క్సన్ 13 స్థానాలు మెరుగుపర్చుకొని 76కు.. ఆసీస్ బ్యాటర్ జార్జియా వేర్హమ్ 9 స్థానాలు మెరుగుపర్చుకొని 90వ స్థానానికి ఎగబాకారు.ఆల్రౌండర్ల విభాగంలోనూ పెద్దగా మార్పుల్లేవు. హేలీ మాథ్యూస్, అమేలియా కెర్, దీప్తి శర్మ టాప్-3లో కొనసాగుతుండగా.. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా మాత్రం 5 స్థానాలు మెరుగుపర్చుకొని ఆరో స్థానానికి చేరింది. -
సెమీస్లో భారత్, పాక్
బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో చిరకాల ప్రత్యర్ధులు భారత్, పాకిస్తాన్ సెమీఫైనల్కు చేరాయి. ఇవాళ (ఫిబ్రవరి 17) జరిగిన మ్యాచ్ల్లో భారత-ఏ జట్టు నేపాల్పై.. పాకిస్తాన్-ఏ జట్టు యూఏఈపై ఘన విజయాలు సాధించి, ఫైనల్ ఫోర్లోకి ప్రవేశించాయి. సెమీస్లో భారత్, పాక్ ఎదుర్కోబోయే ప్రత్యర్ధులు ఎవరో రేపు జరుగబోయే బంగ్లాదేశ్-ఏ, మలేషియా.. శ్రీలంక-ఏ, థాయ్లాండ్ మ్యాచ్లతో తెలుస్తుంది.ఈ టోర్నీలో భారత్, పాక్ ఒకే గ్రూప్లో (ఏ) ఉన్నాయి. ఈ గ్రూప్ నుంచి భారత్, పాక్ మొదటి రెండు స్థానాల్లో నిలిచి సెమీస్కు అర్హత సాధించాయి. ఈ గ్రూప్లో యూఏఈ.. భారత్, పాక్కు గట్టి పోటీనిచ్చింది. ఆ జట్టు కూడా భారత్, పాక్తో సమానంగా మూడింట రెండు మ్యాచ్లు గెలిచింది. ఇవాల్టి మ్యాచ్లో పాక్ చేతిలో ఓటమితో యూఏఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-ఏలో మరో జట్టు నేపాల్, ఆడిన 3 మ్యాచ్ల్లో పరాజయాలు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే టోర్నీ నుంచి వైదొలిగింది. గ్రూప్-బిలో బంగ్లాదేశ్-ఏ సెమీస్ బెర్త్ ఇదివరకే ఖరారైనప్పటికీ.. సెమీస్లో వారు ఎదుర్కోబోయే ప్రత్యర్ది ఎవరో మలేషియా మ్యాచ్ ఫలితంతో తెలుస్తుంది. ఎందుకంటే గ్రూప్-బిలో ఆ జట్టు స్థానాన్ని (1,2) మలేషియా మ్యాచ్ ఫలితం డిసైడ్ చేస్తుంది. గ్రూప్-బిలో మరో సెమీస్ బెర్త్ కోసం శ్రీలంక-ఏ, థాయ్లాండ్ పోటీపడుతున్నాయి. ఇరు జట్ల మధ్య రేపటి మ్యాచ్లో ఏ జట్టు గెలిస్తే, ఆ జట్టుకే సెమీస్ బెర్త్ దక్కుతుంది. ప్రస్తుతం శ్రీలంక-ఏ, థాయ్లాండ్ ఆడిన రెండు మ్యాచ్ల్లో చెరో మ్యాచ్ గెలిచి బంగ్లాదేశ్-ఏ తర్వాత రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ గ్రూప్లో మలేషియా ఆడిన 2 మ్యాచ్ల్లో ఓడి నాలుగో స్థానంలో ఉంది.ఫిబ్రవరి 20న జరిగే వేర్వేరు సెమీఫైనల్స్లో భారత్, పాక్ పోటీపడతాయి. సెమీస్లో ఈ రెండు జట్లు గెలిస్తే.. ఫైనల్లో ఎదురెదురుపడతాయి. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 22న జరుగనుంది.నేపాల్ మ్యాచ్లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. తనూజా కన్వర్ 4, మిన్నూ మణి 3, కెప్టెన్ రాధా యాదవ్ 2 వికెట్లతో సత్తా చాటడంతో నేపాల్ 18 ఓవర్లలో 78 పరుగులకే కుప్పకూలింది. నేపాల్ ఇన్నింగ్స్లో సమ్జానా ఖడ్కా (22) టాప్ స్కోరర్గా నిలిచింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ 7.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. వ్రిందా దినేశ్ 39 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ను విజయతీరాలకు చేర్చింది.మరో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈని పాక్ 17.2 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని పాక్ 11 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. -
భారత్ ప్రపంచకప్ గెలుస్తుందని మూడేళ్ల ముందే తెలుసు: శ్రీశాంత్
మాజీ భారత క్రికెటర్ S. Sreesanth ‘Rooted For Life’ పోడ్కాస్ట్లో తన జీవిత ప్రయాణాన్ని వివరించారు. Dr. Pradeep Sethi గారితో జరిగిన ఈ సంభాషణ క్రికెట్కి మాత్రమే పరిమితం కాకుండా జీవితం, నమ్మకం, మనోబలం వంటి ఎన్నో అంశాలపై సాగింది. చిన్ననాటి కష్టాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు, వ్యక్తిగత ఆలోచనలు, ప్రపంచ కప్ వరకు తీసుకెళ్లిన సూత్రాలు – అన్నింటినీ శ్రీశాంత్ మనస్ఫూర్తిగా పంచుకున్నారు.ఎపిసోడ్ ప్రారంభంలోనే శ్రీశాంత్ అందరినీ – మతం, కులం అనే తేడా లేకుండా గౌరవించాలనే తన నమ్మకాన్ని చెప్పారు. జీవితం ఎత్తుపల్లాలు చూపినప్పుడు నిలబడటానికి ఒక బలమైన “బేస్” ఉండాలి అని ఆయన అభిప్రాయం. వినయం, ఆత్మగౌరవం రెండూ కలిసి నడవాలి, ప్రతి ఒక్కరిని సమానంగా చూడటం గొప్పతనానికి మూలం అని స్పష్టం చేశారు.ఈ పోడ్కాస్ట్లో హృదయాన్ని తాకే భాగం ఆయన చిన్నప్పటి ఆరోగ్య సమస్యల గురించి. మొదటిసారి తనకు వచ్చిన ట్యూమర్ శస్త్రచికిత్స, ఆ సమయంలో తన తండ్రి చూపిన అచంచలమైన భక్తి గురించి శ్రీశాంత్ గారు భావోద్వేగంగా చెప్పారు.Ettumanoor Mahadeva Temple వద్ద ఒక రూపాయి కానుక, చేసిన ప్రార్థన తన జీవితాన్ని మార్చేసిందని, అది తనకు ఒక అద్భుతం లాంటిదని వివరించారు. భగవాన్ శివుడితో తన ఆధ్యాత్మిక అనుబంధం గురించి చెబుతూ, తన చేతిపై త్రిశూలం ఆకారంలో ఉన్న జన్మమచ్చను కూడా ప్రస్తావించారు.తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ, డ్రైవర్లు, సెక్యూరిటీ సిబ్బంది సహా అందరినీ కుటుంబ సభ్యుల్లా గౌరవించాలనే విలువలు తన తండ్రి నేర్పారని చెప్పారు. మహాబలి కథ, ఓనం పండుగ ఉదాహరణగా తీసుకుని, మతం కంటే మానవత్వమే గొప్పదని పేర్కొన్నారు.సంతోషం, ఆనందం మధ్య తేడా గురించి మాట్లాడుతూ – విజయం వల్ల వచ్చే సంతోషం తాత్కాలికం కావొచ్చు, కానీ అంతరానందం మనలో నుంచే వస్తుందని అన్నారు. మంచి అయినా చెడు అయినా ప్రతి అనుభవం మనకు “తజుర్బా” ఇస్తుందని, అది మనల్ని మరింత బలంగా తయారు చేస్తుందని చెప్పారు.ICC World Twenty20 విజయానికి వెనుక ఉన్న “సీక్రెట్” గురించి మాట్లాడినప్పుడు, కప్ గెలవబోతున్నామనే నమ్మకం తనలో ముందే ఉన్నదని చెప్పారు. ట్రోఫీని చేతిలో పట్టుకున్నట్టు మూడు సంవత్సరాల ముందే ఊహించుకున్నానని వెల్లడించారు. ఆ టోర్నమెంట్లో తన కెరీర్కి మలుపుతిప్పిన క్యాచ్ గురించి కూడా గుర్తుచేసుకున్నారు.PRIDE – అంటే “Personal Responsibility in Delivering Excellence” – అనే తత్వం తన జీవితానికి ఆధారం అని చెప్పారు. జట్టులోంచి తప్పించబడిన సందర్భాలు, ఓటములు ఎదురైనప్పుడు కూడా క్రమశిక్షణ, రొటీన్, పాజిటివ్ సెల్ఫ్-టాక్ తనను నిలబెట్టాయని వివరించారు. తాత్కాలిక ప్రతిభ కంటే అలవాట్లు, క్రమబద్ధతే విజయానికి మూలం అని అన్నారు.తన పోటీ స్వభావం గురించి మాట్లాడుతూ, క్రీడల్లో ధైర్యం మరియు అజాగ్రత్త మధ్య ఉన్న సన్నని రేఖను వివరించారు. అస్టిగ్మాటిజం సమస్య, ఫాస్ట్ బౌలింగ్లో ఉన్న శారీరక ఒత్తిడి, అవుట్స్వింగ్ యార్కర్ సాధనలో చూపిన పట్టుదల గురించి పంచుకున్నారు.మైదానంలో తన సంబరాలు ఈగో వల్ల కాదు, ఆటపై ఉన్న నిజమైన ప్రేమ, ఉత్సాహం వల్లేనని చెప్పారు. విజయం ప్రయాణంలో ఇతరులను కూడా భాగస్వాములను చేయడం, పాజిటివ్ సందేశాలు పంచడం ఎంత ముఖ్యమో వివరించారు.ఈ పోడ్కాస్ట్లో కుటుంబం ప్రాధాన్యం, ప్రజా జీవితంలో మేనేజర్ల కంటే కుటుంబ సభ్యుల పాత్ర, ప్రపంచానికి ప్రేమ, పాజిటివ్ వైబ్స్ పంచాల్సిన అవసరం వంటి అంశాలు కూడా చర్చించబడ్డాయి. చివరగా తన నానమ్మ నేర్పిన జీవన పాఠాలు, యోగా ద్వారా సమతుల్యతను ఎలా కాపాడుకోవాలో శ్రీశాంత్ గారు సూచనలు ఇచ్చారు. -
పెళ్లి పీటలెక్కబోతున్న ఇషాన్ కిషన్
టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్తో బిజీగా ఉన్న అతను.. మెగా టోర్నీ ముగిసాక తన ప్రేయసి అదితి హుండియాను మనువాడబోతున్నాడని సమాచారం. ఈ విషయాన్ని ఇషాన్ తాత అనురాగ్ పాండే స్వయంగా వెల్లడించారు. ఏఎన్ఐతో ఆయన మాట్లాడుతూ.. ఇషాన్ ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకున్నా, తాము అంగీకరించేందుకు సిద్దంగా ఉన్నాము. ఇషాన్ గర్ల్ ఫ్రెండ్ పేరు అదితి. ఆమె ఓ మోడల్. పిల్లలను సంతోషపెట్టే వాటిని పెద్దలు అంగీకరించాలని అన్నాడు.#WATCH | Aurangabad, Bihar | Grandfather of Indian Cricketer Ishan Kishan, Anurag Pandey says, "...We are ready to accept whoever Ishan Kishan wants to marry. Aditi is his girlfriend...She is a model...One should accept what makes children happy..." (14.03) pic.twitter.com/narb5aZHtx— ANI (@ANI) February 14, 2026ఇషాన్కు సంబంధించిన ఈ వార్త ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతోంది. ఇషాన్ నిన్న (ఫిబ్రవరి 15) టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్తాన్పై చెలరేగిపోయాడు. కేవలం 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ ప్రధాన కారణంగా భారత్ పాక్ను 61 పరుగుల తేడాతో చిత్తు ఓడించింది. తన విధ్వంసకర ప్రదర్శనకు గానూ ఇషాన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. టీ20 ప్రపంచకప్ జట్టులోకి అనూహ్యంగా వచ్చిన ఇషాన్ అంచనాలకు మించి రాణిస్తూ.. భారత క్రికెట్ అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తున్నాడు.పాక్పై వీరబాదడు తర్వాత ఇషాన్ పెళ్లి ప్రస్తావన రావడం అభిమానులకు జోష్నిస్తుంది. వాస్తవానికి ఇషాన్-అదితి బంధంపై చాలా రోజులుగా సోషల్మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తుండేవి. కొందరు వీరిని ప్రేమికులంటే, మరికొందరు కేవలం స్నేహితులు మాత్రమేనని అన్నారు. ఇషాన్ తాత తాజా ప్రకటనతో ఇషాన్-అదితి బంధం బహిర్గతమైపోయింది. పెళ్లిపై ఇషాన్ కాని, అదితి కాని ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా, ఇరు కుటుంబాల్లో పెళ్లి చర్చలు మొదలయ్యాయనే విషయం సుస్పష్టమైంది.ఎవరీ అదితి హుండియా..?ఇషాన్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిగా చెప్పుకుంటున్న అదితి హుండియా జైపూర్కు చెందిన ఓ ప్రముఖ మోడల్. ఈ అమ్మాయి 1997 జనవరి 15న జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 29 సంవత్సరాలు. అదితి జైపూర్లోని ప్రముఖ వ్యాపార కుటుంబంలో జన్మించింది. అదితి పాఠశాల విద్యను ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ జైపూర్లో అభ్యసించింది. జైపూర్లోని సెయింట్ జేవియర్ ఇన్స్టిట్యూట్లో కాలేజీ విద్యను పూర్తి చేసింది. అదితికి మోడలింగ్ అంటే పిచ్చి. ఆమె 2016లో ఎలైట్ మిస్ రాజస్థాన్ రన్నరప్గా నిలిచింది. ఆతర్వాత 2018 మిస్ దివా కిరీటాన్ని కైవసం చేసుకుంది. 2017 ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్గా నిలిచింది. 2018లో మిస్ సుప్రానేషనల్ ఇండియా టైటిల్ను గెలుచుకుంది. అదితికి ఫ్యాషన్ రంగంలోనూ మంచి గుర్తింపు ఉంది. ఆమెకు సోషల్ మీడియాలో 2.7 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. అదితి మోడల్గా, ఇన్ఫ్లూయెన్సర్గా నెటిజన్లకు సుపరిచితురాలు. అదితి 2019లో Pehla Wargi అనే వీడియో ఆల్బమ్లోనూ నటించింది.ఇషాన్-అదితి మధ్య బంధం 2019 ఐపీఎల్ సమయంలో బయటపడింది.అప్పటి నుంచి ఆమె తరుచూ ఇషాన్తో కనిపించేది. తాజాగా పెళ్లి ప్రస్తావన రావడంతో అదితి ఎవరనే విషయాన్ని క్రికెట్ అభిమానులు గూగుల్ చేయడం మొదలుపెట్టారు. -
భారత్-పాక్ హైవోల్టేజీ మ్యాచ్.. చరిత్ర ఏం చెబుతుందంటే..?
భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లు ఎప్పుడూ మహాసంగ్రామాలను తలపిస్తాయి. ప్రత్యేకించి ప్రపంచకప్లో ఈ రెండు జట్ల పోరాటాలు అంతకుమించిన అనుభూతిని కలిగిస్తాయి. మరీ ప్రత్యేకించి, టీ20 ప్రపంచకప్లో ఈ రెండు జట్ల పోటీ ప్రళయ వాతావరణాన్ని సూచిస్తుంది.గెలుపోటములు ఎలా ఉన్నా, మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచే ఇరు దేశాల అభిమానుల మధ్య వార్ మొదలవుతుంది. ఈ పరిస్థితి దాయాదుల సమరానికి మరింత హైప్ తెచ్చిపెడుతుంది. ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు, అభిమానుల భావోద్వేగాలు ఈ మ్యాచ్లను మరింత ప్రత్యేకం చేస్తాయి. ఈ హైప్ భారత్, పాక్ అభిమానులనే కాక, విశ్వవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది.భారీ అంచనాల మధ్య టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 15) భారత్-పాక్ తలపడుతున్నాయి. ఈ హైవోల్టేజీ మ్యాచ్ కొలంబోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. టోర్నీ ప్రారంభానికి ముందు ఈ మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై అనేక అనుమానాలు ఉండేవి. బంగ్లాదేశ్కు జరిగిన అన్యాయానికి నిరసనగా పాక్ ప్రభుత్వం ఈ మ్యాచ్ రద్దు చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది.అయితే ఐసీసీ మధ్యవర్తిత్వంతో పాక్ ఈ మ్యాచ్ ఆడేందుకు తిరిగి అంగీకరించింది. జరగదనున్న మ్యాచ్ తిరిగి కార్యరూపం దాల్చడం ఈ మ్యాచ్ హైప్ను పీక్స్కు చేర్చింది. ఈ భారీ అంచనాల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్లో భారత్-పాక్ మ్యాచ్ హెడ్ టు హెడ్ రికార్డులపై ఓ లుక్కేద్దాం. ఈ మెగా టోర్నీలో భారత్కు పాక్పై స్పష్టమైన ఆధిక్యత ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 8 సార్లు ఎదురెదురుపడగా.. భారత్ ఏకంగా ఏడు సార్లు జయకేతనం ఎగురవేసింది. పాక్ ఒకే ఒక్క సందర్భంలో మాత్రమే గెలుపొందింది. టీమిండియా ఇవాళ జరుగబోయే మ్యాచ్లోనూ గెలిచి పొట్టి ప్రపంచకప్లో తమ రికార్డును (8-1 మరింత మెరుగుపర్చుకోవాలని పట్టుదలగా ఉంది.భారత జట్టు ప్రస్తుతమున్న ఫామ్ను బట్టి చూస్తే, ఇది అంత కష్టమేమీ కాకపోవచ్చు. గత కొంతకాలంగా టీమిండియా పొట్టి ఫార్మాట్లో తిరుగులేని విజయాలు సాధిస్తూ నంబర్ వన్ స్థానంలో ఉంది. జట్టులోని ప్రతి ఆటగాడు భీకర ఫామ్లో ఉన్నారు. ప్రస్తుత పాక్ జట్టును టీమిండియా ఆడుతూపాడుతూ చిత్తు చేయవచ్చు. అలాగని ఉదాసీనంగా వ్యవహరిస్తే, 2021 ఎడిషన్లో ఎదురైన పరాభవం పునరావృతమయేక్య ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి టీమిండియా చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే లాజిక్ను అమలు చేస్తే బాగుంటుంది. మరో గంటలో (రాత్రి 7 గంటలకు) ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఇప్పటి నుంచే టీవీలకు అతుక్కుపోయారు.వరుణుడి భయంఓ పక్క అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటే, కొలొంబో వాతావరణం మాత్రం అందరినీ కలవరపెడుతుంది. మ్యాచ్ సమయంలో భారీ వర్షం పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అన్ని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మ్యాచ్ కొన్ని ఓవర్లు జరిగినా చాలని దేవుళ్లను ప్రార్దిస్తున్నారు.ఒకవేళ మ్యాచ్ రద్దైతే మాత్రం భారత్, పాక్కు చెరో పాయింట్ లభిస్తుంది. తద్వారా ఈ రెండు జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. భారత అభిమానులు మాత్రం ఈ మ్యాచ్ పూర్తిగా జరగాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే, భారత జట్టు చాలా పటిష్టంగా ఉంది. ఈ జట్టుతో పాక్ సునాయాసంగా చిత్తు చేయవచ్చు. తద్వారా టీ20 ప్రపంచకప్లో తమ రికార్డును మరింత మెరుగుపర్చుకోవచ్చు.టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన భారత్-పాక్ సమరాలు..తొలి ఘట్టం – 2007 దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 వరల్డ్కప్లో భారత్-పాక్ రెండు సార్లు తలపడ్డాయి. గ్రూప్ స్టేజ్లో మ్యాచ్ టై అయ్యింది, కానీ బౌలౌట్లో భారత్ గెలిచింది. అదే టోర్నమెంట్ ఫైనల్లో మళ్లీ తలపడగా, ఎంఎస్ ధోని సారథ్యంలోని భారత జట్టు చరిత్రాత్మక విజయం సాధించింది. ఇది భారత్-పాక్ టీ20 వరల్డ్కప్ పోరాటాలకు ఆరంభం. భారత్ ఆధిపత్యం అనంతరం 2012, 2014, 2016 వరల్డ్కప్లలో భారత్ వరుస విజయాలు సాధించింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి బ్యాటర్లు అద్భుత ప్రదర్శనలతో భారత్ పాక్పై ఆధిపత్యం కొనసాగించింది. పాక్ చరిత్రాత్మక విజయం – 2021 దుబాయ్లో జరిగిన 2021 వరల్డ్కప్లో పాక్ భారత్ను 10 వికెట్ల తేడాతో ఓడించింది. ఇది పాక్కి వరల్డ్కప్ చరిత్రలో భారత్పై తొలి విజయం. బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ అద్భుత బ్యాటింగ్తో ఆ మ్యాచ్ పాక్ అభిమానులకు మరపురాని జ్ఞాపకం అయ్యింది. తిరిగి భారత్ ఆధిపత్యం 2022, 2024 వరల్డ్కప్లలో భారత్ మళ్లీ పాక్ను ఓడించింది. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు ఈ గెలుపుల్లో కీలక పాత్ర పోషించారు. -
ఆసీస్ గడ్డపై జూలు విదిల్చిన టీమిండియా.. తొలి టీ20లో ఘన విజయం
2026 ఆస్ట్రేలియా పర్యటనను భారత మహిళల జట్టు ఘన విజయంతో ప్రారంభించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 15) జరిగిన తొలి టీ20లో టీమిండియా 21 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ వద్దతిలో) గెలుపొందింది.ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్లు జూలు విదిల్చారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ను 133 పరుగులకే (18 ఓవర్లలో) కుప్పకూల్చారు. పేసర్లు రేణుకా సింగ్ (4-1-14-2), అరుంధతి రెడ్డి (4-0-22-4), క్రాంతి గౌడ్ (3-0-39-0) నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ ప్లేయర్ల భరతం పట్టారు. స్పిన్నర్లు శ్రీ చరణి (3-0-14-2), దీప్తి శర్మ (2-0-19-1) కూడా సత్తా చాటారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ (2-0-24-0) ఒక్కరే కాస్త ధారాళంగా పరుగులు సమర్పించుకుంది.ఆసీస్ ఇన్నింగ్స్లో జార్జియా వేర్హమ్ (30) టాప్ స్కోరర్ కాగా.. ఫోబ్ లిచ్ఫీల్డ్ (26), ఎల్లిస్ పెర్రీ (20), జార్జియా వాల్ (18), నికోలా క్యారీ (12) రెండంకెల స్కోర్లు చేశారు. బెత్ మూనీ (5), ఆష్లే గార్డ్నర్ (4), అన్నాబెల్ సదర్ల్యాండ్ (3), కిమ్ గార్త్ (2), డార్సీ బ్రౌన్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. కొత్త కెప్టెన్ సోఫీ మోలినెక్స్ 6 పరుగులతో అజేయంగా నిలిచింది.అనంతరం భారత్ లక్ష్య ఛేదనకు దిగిన సమయంలో వరుణుడు పలు మార్పులు ఆటంకం కలిగించాడు. జట్టు స్కోర్ 50-1 (5.1 ఓవర్లలో) వద్ద ఉండగా.. భారీ వర్షం ప్రారంభమై, ఎంతకీ తగ్గకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిన భారత్ను విజేతగా ప్రకటించారు. స్వల్ప లక్ష్య ఛేదనలో షఫాలీ వర్మ (11 బంతుల్లో 21; ఫోర్, 2 సిక్సర్లు) సహజ శైలిలో విరుచుకుపడింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి స్మృతి మంధన (16), జెమీమా రోడ్రిగ్స్ (9) క్రీజ్లో ఉన్నారు. షఫాలీ వికెట్ మోలినెక్స్కు దక్కింది. ఈ సిరీస్లో రెండో టీ20 ఫిబ్రవరి 19న కాన్బెర్రా వేదికగా జరుగనుంది. -
T20 WC 2026: పాక్తో మ్యాచ్.. టీమిండియాలో రెండు మార్పులు..?
టీ20 వరల్డ్కప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 15) భారత్-పాక్ మధ్య హైవోల్టేజీ మ్యాచ్ జరుగనుంది. కొలంబోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. టోర్నీ ప్రారంభానికి ముందు ఈ మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై అనేక అనుమానాలు నెలకొని ఉండేవి. బంగ్లాదేశ్కు జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ మ్యాచ్ రద్దు చేసుకున్నట్లు పాక్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.అయితే ఐసీసీ మధ్యవర్తిత్వంతో పాక్ ఈ మ్యాచ్ ఆడేందుకు తిరిగి అంగీకరించింది. జరగదనున్న మ్యాచ్ తిరిగి కార్యరూపం దాల్చడం ఈ మ్యాచ్ హైప్ను మరింత పెంచింది. ఓ పక్క క్రికెట్ అభిమానులు ఈ హైవోల్టేజీ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటే, కొలొంబో వాతావరణం మాత్రం అందరినీ కలవరపెడుతుంది. మ్యాచ్ సమయంలో భారీ వర్షం పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మ్యాచ్ కొన్ని ఓవర్లు జరిగినా చాలని దేవుళ్లను ప్రార్దిస్తున్నారు. ఒకవేళ మ్యాచ్ రద్దైతే మాత్రం భారత్, పాక్కు చెరో పాయింట్ లభిస్తుంది. తద్వారా ఈ రెండు జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. భారత అభిమానులు మాత్రం ఈ మ్యాచ్ పూర్తిగా జరగాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే, భారత జట్టు చాలా పటిష్టంగా ఉంది. ఈ జట్టుతో పాక్ను సునాయాసంగా చిత్తు చేయవచ్చు. తద్వారా టీ20 ప్రపంచకప్లో తమ రికార్డును మరింత మెరుగుపర్చుకోవచ్చు (8-1).ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. కడుపు నొప్పితో బాధపడుతూ, నమీబియాతో జరిగిన మ్యాచ్కు దూరంగా ఉన్న అభిషేక్ శర్మ జట్టులో తిరిగి రానున్నాడని సమాచారం. అభిషేక్ రాకతో సంజూ శాంసన్ తిరిగి బెంచ్కే పరిమితం కావాల్సి వస్తుంది. ప్రేమదాస స్టేడియం పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనుందన్న సమాచారం ఉండటంతో ఈ మ్యాచ్లో భారత్ అదనపు స్పిన్నర్తో బరిలోకి దిగే అవకాశం ఉంది. అప్పుడు అర్షదీప్ సింగ్పై వేటు పడవచ్చు. అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ ఎలెవెన్లోకి వస్తాడు. ఈ రెండు మార్పులు మినహా మిగతా జట్టు యధాతథంగా కొనసాగుతుంది.అభిషేక్, ఇషాన్ భారత ఇన్నింగ్స్ను ప్రారంభిస్తారు. వన్డౌన్లో తిలక్ వర్మ, నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్, ఐదో ప్లేస్లో హార్దిక్ పాండ్యా, ఆరో స్థానంలో శివమ్ దూబే, ఏడో ప్లేస్లో రింకూ సింగ్, స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, ఏకైక స్పెషలిస్ట్ పేసర్గా బుమ్రా బరిలోకి దిగవచ్చు. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. -
టీమిండియా బౌలర్ల విజృంభణ.. కుప్పకూలిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా గడ్డపై తొలి మ్యాచ్లోనే భారత మహిళా బౌలర్లు చెలరేగిపోయారు. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 15) జరిగిన తొలి మ్యాచ్లో ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఆసీస్ను 133 పరుగులకే (18 ఓవర్లలో) కుప్పకూల్చింది.పేసర్లు రేణుకా సింగ్ (4-1-14-2), అరుంధతి రెడ్డి (4-0-22-4), క్రాంతి గౌడ్ (3-0-39-0) నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ ప్లేయర్ల భరతం పట్టారు. స్పిన్నర్లు శ్రీ చరణి (3-0-14-2), దీప్తి శర్మ (2-0-19-1) కూడా సత్తా చాటారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ (2-0-24-0) ఒక్కరే కాస్త ధారాళంగా పరుగులు సమర్పించుకుంది.ఆసీస్ ఇన్నింగ్స్లో జార్జియా వేర్హమ్ (30) టాప్ స్కోరర్ కాగా.. ఫోబ్ లిచ్ఫీల్డ్ (26), ఎల్లిస్ పెర్రీ (20), జార్జియా వాల్ (18), నికోలా క్యారీ (12) రెండంకెల స్కోర్లు చేశారు. బెత్ మూనీ (5), ఆష్లే గార్డ్నర్ (4), అన్నాబెల్ సదర్ల్యాండ్ (3), కిమ్ గార్త్ (2), డార్సీ బ్రౌన్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. కొత్త కెప్టెన్ సోఫీ మోలినెక్స్ 6 పరుగులతో అజేయంగా నిలిచింది.కాగా, మల్లీ ఫార్మాట్ సిరీస్ కోసం భారత్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ సిరీస్లో తొలుత మూడు టీ20లు, ఆతర్వాత మూడు వన్డేలో, చివరిగా ఏకైక టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఆస్ట్రేలియాలో భారత పర్యటన షెడ్యూల్ఫిబ్రవరి 15- తొలి టీ20 (సిడ్నీ)ఫిబ్రవరి 19- రెండో టీ20 (కాన్బెర్రా)ఫిబ్రవరి 21- మూడో టీ20 (అడిలైడ్)ఫిబ్రవరి 24- తొలి వన్డే (బ్రిస్బేన్)ఫిబ్రవరి 27- రెండో వన్డే (హోబర్ట్)మార్చి 1- మూడో వన్డే (హోబర్ట్)మార్చి 6- ఏకైక టెస్ట్ (పెర్త్) -
పాక్ను చిత్తుగా ఓడించిన భారత్
ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టీ20 టోర్నీలో భారత్ పాక్పై ఘన విజయం సాధించింది. బ్యాంకాక్ వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 15) జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచ్లో టీమిండియా పాక్ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ను భారత బౌలర్లు 93 పరుగులకే (18.5 ఓవర్లలో) కుప్పకూల్చారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత బ్యాటర్లు సునాయాసంగా (10.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి) ఛేదించారు. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏలో రెండో స్థానానికి చేరింది. దీనికి ముందు మ్యాచ్లో భారత అమ్మాయిలకు యూఏఈ చేతిలో ఊహించని పరాభవం ఎదురైంది.తాజా మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. సైమా ఠాకోర్ (4-0-14-2), కెప్టెన్ రాధా యాదవ్ (3-0-11-2), ప్రేమా రావత్ (3-0-16-2), జింటిమణి కలిట (3-0-18-1), మిన్నూ మణి (2.5-0-10-1), తనూజా కన్వర్ (3-0-19-0) పాక్ ప్లేయర్ల భరతం పట్టారు. పాక్ ఇన్నింగ్స్లో షావల్ జుల్ఫికర్ (23), గుల్ రుఖ్ (21), అనోశా నాసిర్ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ తొలి బంతికే వికెట్ (హుమైరా ఖాజీ డకౌట్) కోల్పోయినప్పటికీ.. మరో ఓపెనర్ వ్రింద దినేశ్ (55) అజేయ అర్ద సెంచరీతో సత్తా చాటి భారత్ను విజయతీరాలకు చేరింది. వ్రిందకు అనుష్క శర్మ (24), తేజల్ హసబ్నిస్ (12 నాటౌట్) సహకరించారు. పాక్ బౌలర్లలో వహీదా అక్తర్, మొమినా రియాసత్కు తలో వికెట్ దక్కింది. భారత్ గ్రూప్ దశలో తమ తదుపరి మ్యాచ్లో నేపాల్తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 17న జరుగనుంది. ఈ టోర్నీలో భారత్, పాక్, యూఏఈ, నేపాల్ గ్రూప్-ఏలో ఉండగా.. థాయ్లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, మలేసియా గ్రూప్-బిలో ఉన్నాయి. -
ఈ సెంటిమెంట్ రిపీటైతే టీమిండియాదే వరల్డ్కప్..!
టీ20 వరల్డ్కప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 13) పెను సంచలనం నమోదైంది. పసికూన జింబాబ్వే.. 2021 ఎడిషన్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను 23 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో జింబాబ్వే ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్తో మాజీ జగజ్జేతను మట్టికరిపించింది. ఈ విజయం జింబాబ్వే క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది.వాస్తవానికి టీ20 ప్రపంచకప్లో జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించడం ఇది మొదటిసారి కాదు. పొట్టి ప్రపంచకప్ ప్రారంభ ఎడిషన్లోనే (2007) జింబాబ్వే ఆసీస్కు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రపంచకప్ల పరంగా చూసుకుంటే, జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించడం ఇది కూడా తొలిసారి కాదు. 1983 వన్డే ప్రపంచకప్లోనే జింబాబ్వే తొలిసారి ఆసీస్ను ఓడించింది. మొత్తంగా జింబాబ్వే తమ క్రికెట్ చరిత్రలో వారికంటే చాలా రెట్లు మెరుగైన ఆస్ట్రేలియాను ఐదు సార్లు ఓడించింది. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో రెండు సార్లు (2007, 2026), వన్డే వరల్డ్కప్లో ఒకసారి (1983), సాధారణ వన్డేల్లో రెండు సార్లు (2014, 2022) జింబాబ్వే ఆసీస్కు షాకిచ్చింది.అయితే జింబాబ్వే ఆసీస్పై సాధించిన విషయాల్లో ఓ ఆసక్తికర విషయం దాగి ఉంది. అది భారత క్రికెట్ అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చే అంశం. అదేంటంటే.. జింబాబ్వే ప్రపంచకప్ టోర్నీల్లో ఆసీస్పై విజయం సాధించిన తొలి రెండు సందర్భాల్లో భారత్ జగజ్జేతగా నిలిచింది. జింబాబ్వే తొలిసారి ఆసీస్పై విజయం సాధించిన సందర్భంలో భారత్ తొలిసారి జగజ్జేతగా నిలిచింది. జింబాబ్వే ఆసీస్పై రెండోసారి విజయం సాధించిన సందర్భంలో భారత్ రెండో సారి జగజ్జేతగా నిలిచింది.ప్రస్తుత ప్రపంచకప్లో ఈ సెంటిమెంట్ రిపీటైతే, భారత్ మరోసారి జగజ్జేతగా అవతరించడం ఖాయమని టీమిండియా అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని గూగుల్ ఇండియా కూడా విశ్లేషించింది. తాజా ప్రపంచకప్లో ఆసీస్పై జింబాబ్వే విజయం సాధించిన తర్వాత ఈ విషయం సోషల్మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈసారి కూడా టీమిండియానే టీ20 ప్రపంచ ఛాంపియన్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఈ సెంటిమెంట్కు అభిమానులు ప్రస్తుత జట్టు బలాన్ని, ఇటీవలి ఫామ్ను కూడా జోడిస్తున్నారు. భారత జట్టు గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉందని, గత రెండేళ్లలో టీమిండియా ఫామ్ అద్వితీయంగా ఉందని, పై సెంటిమెంట్కు ఈ రెండు కలిస్తే భారత్కు తిరుగే ఉండదన్న విషయం స్పష్టమవుతుందని చర్చించుకుంటున్నారు. పై ఫ్యాక్టర్స్ అన్నీ వర్కౌటై భారత్ వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి టీ20 ప్రపంచ ఛాంపియన్ కావాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు. ఇన్ని శుభ శకునాల మధ్య భారతీయులను ఓ చెడు శనుకం కూడా పలకరిస్తుంది. అదేంటంటే.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఉండి, మరోసారి ప్రపంచకప్ గెలవలేదు. ఈ బ్యాడ్ సెంటిమెంట్ ఏమైనా వర్కౌటవుతుందేమోనని టీమిండియా ఫ్యాన్స్ అందోళన చెందుతున్నారు. -
T20 World Cup 2026: నమీబియాపై టీమిండియా ఘన విజయం
టీ20 వరల్డ్కప్ 2026లో భాగంగా నమీబియాతో నేడు (ఫిబ్రవరి 12) జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్య చేదనకు దిగిన నమీబియా జట్టు 116 పరుగులకే ఆలౌట్గా నిలిచింది. దీంతో 93 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది.నమీబియా బ్యాటర్లలో లౌరెన్ స్టీన్క్యాంప్ 29 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, జాన్ ఫ్రైలింక్ 22 పరుగులు సాధించాడు. మిగితా బ్యాట్స్మెన్స్ తక్కువ స్కోర్కే వెనుదిరగడంతో నమీబియా జట్టు 116 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.భారత బౌలర్లలో వరుణ్ చకరవర్తి 3 వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, శివమ్ దూబేలకు తలో వికెట్టు దక్కింది. బ్యాటింగ్లో 52 పరుగులతో రాణించిన హార్దిక్ పాండ్యా బౌలింగ్లో కూడా రెండు వికెట్లు తీయడంతో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. తొలుత టాస్ ఓడి నమీబియా ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన భారత్ భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇషాన్, హార్దిక్ క్రీజ్లో ఉన్నంత సేపు భారత్ ఇంకా భారీ స్కోర్ సాధిస్తుందని అంతా అనుకున్నారు. అయితే చివర్లో భారత బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టడంతో 209 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది. తుది జట్లు..భారత్: సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రానమీబియా: లౌరెన్ స్టీన్క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(సి), జేజే స్మిట్, జేన్ గ్రీన్(w), రూబెన్ ట్రంపెల్మాన్, మలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, మాక్స్ హీంగో -
T20 WC 2026: అరుదైన మైలురాయిని తాకిన అర్షదీప్ సింగ్
భారత లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ పొట్టి క్రికెట్లో అరుదైన మైలురాయిని తాకాడు. ఈ ఫార్మాట్ మొత్తంలో (అంతర్జాతీయ టీ20లు, ఐపీఎల్, దేశవాలీ) 250 వికెట్లు పూర్తి చేసిన కొద్ది మంది బౌలర్ల సరసన నిలిచాడు. అర్షదీప్ కేవలం 188 మ్యాచ్ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా నమీబియాతో జరుగుతున్న మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. జాన్ ఫ్రైలింక్ వికెట్ అర్షదీప్కు 250వ వికెట్.అర్షదీప్ కెరీర్ సగటు 22 లోపే ఉండగా, ఎకానమీ రేట్ 8పైగా ఉంది. టీ20 కెరీర్ మొత్తంలో అర్షదీప్ ఐదు సార్లు నాలుగు వికెట్లు, రెండు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. అర్షదీప్ తన టీ20 కెరీర్లో ఎక్కువ శాతం భారత్, పంజాబ్, పంజాబ్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. అర్షదీప్ అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున (121) అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా చలామణి అవుతున్నాడు. ఐపీఎల్లో అర్షదీప్ 97 వికెట్లు తీశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. నమీబియాతో మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర అర్ద సెంచరీలు బాది భారత్కు ఈ స్కోర్ అందించారు.మిగతా బ్యాటర్లలో సంజూ శాంసన్ (8 బంతుల్లో 22; ఫోర్, 3 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. తిలక్ వర్మ (21 బంతుల్లో 25; 3 ఫోర్లు, 3 ఫోర్లు), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (13 బంతుల్లో 12; సిక్స్) ఆచితూచి ఆడారు. శివమ్ దూబే (16 బంతుల్లో 23; ఫోర్, సిక్స్) పర్వాలేదనిపించాడు.ఆఖర్లో రింకూ సింగ్ (6 బంతుల్లో 1) బంతులు వృధా చేశాడు. అక్షర్ పటేల్ ఎదుర్కొన్న తొలి బంతికే ఔటాయ్యడు. అర్షదీప్ సింగ్ 2 పరుగులు చేసి రనౌటయ్యాడు. వరుణ్ చక్రవర్తి ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు.నమీబియా బౌలర్లలో కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ (4-0-20-4) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రూబెన్ ట్రంపల్మెన్ (4-0-38-0), షికోంగో (3-0-41-1) కూడా పర్వాలేదనిపించాడు. స్మిట్ (4-0-50-1), బెర్నాల్డ్ స్కోల్జ్పై (4-0-41-1) భారత ఆటగాళ్లు విరుచుకుపడ్డారు. మ్యాక్స్ హెంగో (1-0-18-0) ఒక్క ఓవర్తోనే చాలించుకున్నాడు.భారీ లక్ష్య ఛేదనలో నమీబియా ఓటమి దిశగా సాగుతుంది. 11 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 88-5గా ఉంది. వరుణ్ చక్రవర్తి 3, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ తలో వికెట్ తీసి నమీబియాను దెబ్బకొట్టారు. -
ఇషాన్ విధ్వంసం, హార్దిక్ మెరుపులు.. టీమిండియా భారీ స్కోర్
టీ20 వరల్డ్కప్ 2026లో భాగంగా నమీబియాతో ఇవాళ (ఫిబ్రవరి 12) జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి నమీబియా ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన భారత్.. ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.ఇషాన్, హార్దిక్ క్రీజ్లో ఉన్నంత సేపు భారత్ ఇంకా భారీ స్కోర్ సాధిస్తుందని అంతా అనుకున్నారు. అయితే చివర్లో భారత బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టడంతో 209 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది. మిగతా భారత బ్యాటర్లలో సంజూ శాంసన్ (8 బంతుల్లో 22; ఫోర్, 3 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. తిలక్ వర్మ (21 బంతుల్లో 25; 3 ఫోర్లు, 3 ఫోర్లు), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (13 బంతుల్లో 12; సిక్స్) ఆచితూచి ఆడారు. శివమ్ దూబే (16 బంతుల్లో 23; ఫోర్, సిక్స్) పర్వాలేదనిపించాడు. ఆఖర్లో రింకూ సింగ్ (6 బంతుల్లో 1) బంతులు వృధా చేశాడు. అక్షర్ పటేల్ ఎదుర్కొన్న తొలి బంతికే ఔటాయ్యడు. అర్షదీప్ సింగ్ 2 పరుగులు చేసి రనౌటయ్యాడు. వరుణ్ చక్రవర్తి ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు.నమీబియా బౌలర్లలో కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ (4-0-20-4) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రూబెన్ ట్రంపల్మెన్ (4-0-38-0), షికోంగో (3-0-41-1) కూడా పర్వాలేదనిపించాడు. స్మిట్ (4-0-50-1), బెర్నాల్డ్ స్కోల్జ్పై (4-0-41-1) భారత ఆటగాళ్లు విరుచుకుపడ్డారు. మ్యాక్స్ హెంగో (1-0-18-0) ఒక్క ఓవర్తోనే చాలించుకున్నాడు. -
T20 WC 2026: ఊచకోత.. చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్
టీ20 వరల్డ్కప్ 2026లో భాగంగా నమీబియాతో ఇవాళ (ఫిబ్రవరి 12) జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా వికెట్కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో విధ్వంసకర హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో హాఫ్ సెంచరీ చేసిన తొలి భారత వికెట్కీపర్ బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. ఇషాన్కు ముందు ఏ భారత వికెట్కీపర్ బ్యాటర్ కూడా ఈ ఘనత సాధించలేదు. భారత్ టీ20 ప్రపంచకప్లో రెండు సార్లు ఛాంపియన్ (2007, 2024) అయినా, ఓ వికెట్కీపర్ బ్యాటర్ హాఫ్ సెంచరీ సాధించలేకపోవడం నిజంగానే ఆశ్చర్యకరం.20 బంతుల్లో హాఫ్ సెంచరీఈ రికార్డు హాఫ్ సెంచరీని ఇషాన్ కేవలం 20 బంతుల్లోనే సాధించాడు. ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి, నమీబియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్గా బరిలోకి దిగిన ఇషాన్ ఇన్నింగ్స్ ఆరంభంలో శైలికి భిన్నంగా కాస్త నిదానంగా ఆడాడు. మూడో ఓవర్లో అతను సహజ మోడ్లోకి వచ్చాడు. ఆ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదిన ఇషాన్.. ఆమరుసటి ఓవర్లో మరో బౌండరీ కొట్టాడు. ఇషాన్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో ఉగ్రరూపం దాల్చాడు. స్మట్స్ వేసిన ఆ ఓవర్లో వరుసగా 4 సిక్సర్లు, ఓ బౌండరీ బాదాడు. ఆతర్వాత ఓవర్లో వరుసగా మరో సిక్సర్, బౌండరీ కొట్టాడు. అనంతరం 7వ ఓవర్ తొలి బంతికి మరో భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో ఇషాన్ మొత్తం 24 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు. ఇషాన్ ధాటికి భారత్ 7 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును దాటింది.అంతకుముందు సంజూ శాంసన్ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సంజూ సైతం హ్యాట్రిక్ సిక్సర్లు, బౌండరీ కొట్టి, ఆమరుసటి బంతికే ఔటయ్యాడు. సంజూ 8 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్ల సాయంతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇషాన్ ఔటయ్యాక భారత స్కోర్ కాస్త నెమ్మదించింది.హార్దిక్ లైన్లోకి వచ్చాడుఅయితే హార్దిక్ పాండ్యా రాకతో భారత స్కోర్ మళ్లీ జోరందుకుంది. హార్దిక్ కేవలం 27 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ చేశాడు. సిక్సర్తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హార్దిక్, ఆమరుసటి బంతికే ఔటయ్యాడు.18.2 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 205/5గా ఉంది. శివమ్ దూబే (23), రింకూ సింగ్ క్రీజ్లో ఉన్నారు. -
T20 WC 2026: బాంబు పేల్చిన సూర్యకుమార్ యాదవ్
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 12) భారత్, నమీబియా మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో నమీబియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ బాంబు లాంటి విషయాన్ని చెప్పాడు. కడుపు నొప్పితో బాధపడుతున్న విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంకా కోలుకోలేదని తెలిపాడు. అభిషేక్ ఒకటి లేదా రెండు మ్యాచ్లు మిస్ అయ్యే అవకాశముందని అన్నాడు. ఈ లెక్కన అభిషేక్ నమీబియా మ్యాచ్తో పాటు ఫిబ్రవరి 15న పాకిస్తాన్తో జరుగబోయే మ్యాచ్కు కూడా అందుబాటులో ఉండడని చెప్పకనే చెప్పాడు.యూఎస్ఏ మ్యాచ్ సమయంలో కడుపు నొప్పితో ఇబ్బంది పడిన అభిషేక్.. సమస్య అధికం కావడంతో కొద్ది రోజుల కిందట ఆసుపత్రిలో చేరాడు. నిన్ననే అభిషేక్ డిశ్చార్జ్ అయ్యాడని వార్తలు వచ్చినప్పటికీ.. ఇవాళ టీమిండియా కెప్టెన్ చెప్పిన మాటలను బట్టి చూస్తే అభిషేక్ ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని స్పష్టంగా తెలుస్తుంది. అభిషేక్ పాకిస్తాన్తో మ్యాచ్కు కూడా దూరమైతే టీమిండయాకు ఎంతోకొంత మైనస్ అవుతుంది. అభిషేక్ ఇటీవలికాలంలో భారత విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషించాడు. అతడు ఇచ్చే మెరుపు ఆరంభాలే మ్యాచ్ ఫలితాన్ని భారత్కు అనుకూలంగా మార్చాయి. అలాంటి అభిషేక్ ప్రపంచకప్లో కీలక మ్యాచ్కు అందుబాటులో ఉండకపోతే ఏమైనా జరిగే అవకాశం ఉంది.కాగా, నమీబియాతో మ్యాచ్లో అభిషేక్ శర్మ స్థానంలో సంజూ శాంసన్ జట్టులోకి వచ్చాడు. అలాగే ఈ మ్యాచ్ కోసం భారత్ మరో మార్పు కూడా చేసింది. గత మ్యాచ్లో (యూఎస్ఏ) జ్వరం కారణంగా ఆడలేకపోయిన బుమ్రా ఈ మ్యాచ్తో తిరిగి వచ్చాడు. సిరాజ్ స్థానంలో అతను బరిలో దిగనున్నాడు.గోల్డెన్ ఛాన్స్ను మిస్ చేసుకున్న సంజూఅభిషేక్ కడుపు సమస్యతో బాధపడుతుండటంతో నమీబియా మ్యాచ్లో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ అందివచ్చిన గోల్డెన్ ఛాన్స్ను మిస్ చేసుకున్నాడు. తొలి మూడు బంతులను జాగ్రత్తగా ఆడిన సంజూ.. ఆతర్వాత వరుసగా మూడు సిక్సర్లు, ఓ బౌండరీ కొట్టి ఫామ్లోకి వచ్చినట్లు కనిపించాడు. అయితే ఆతర్వాతి బంతికే బౌలర్ బెన్ షికోంగో ఉచ్చులో (స్లో బాల్) చిక్కి వికెట్ సమర్పించుకున్నాడు. మొత్తంగా సంజూ ఈ ఇన్నింగ్స్లో 8 బంతులు ఎదుర్కొని 3 సిక్సర్లు, ఓ బౌండరీ సాయంతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. 3 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ వికెట్ నష్టానికి 35 పరుగులుగా ఉంది. ఇషాన్ కిషన్ 11, తిలక్ వర్మ ఒక్క పరుగుతో క్రీజ్లో ఉన్నారు.తుది జట్లు..భారత్: సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రానమీబియా: లౌరెన్ స్టీన్క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(సి), జేజే స్మిట్, జేన్ గ్రీన్(w), రూబెన్ ట్రంపెల్మాన్, మలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, మాక్స్ హీంగో -
నమీబియాతో మ్యాచ్.. టీమిండియాలో రెండు మార్పులు
టీ20 వరల్డ్కప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 12) రాత్రి 7 గంటలకు భారత్ వర్సెస్ నమీబియా మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు ఇన్ఫెక్షన్ నుంచి ఇంకా కోలుకోకపోవడంతో అతని స్థానంలో సంజూ శాంసన్ జట్టులోకి వచ్చాడు. అలాగే గత మ్యాచ్లో (యూఎస్ఏ) జ్వరం కారణంగా ఆడలేకపోయిన బుమ్రా ఈ మ్యాచ్తో తిరిగి వచ్చాడు. సిరాజ్ స్థానంలో అతను బరిలో దిగనున్నాడు. మరోవైపు నమీబియా కెప్టెన్ కూడా ఈ మ్యాచ్లో కోసం రెండు మార్పులు చేసినట్లు తెలిపాడు.తుది జట్లు..భారత్: సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రానమీబియా: లౌరెన్ స్టీన్క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(సి), జేజే స్మిట్, జేన్ గ్రీన్(w), రూబెన్ ట్రంపెల్మాన్, మలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, మాక్స్ హీంగో -
ICC: మాకు అన్యాయం: నమీబియా కెప్టెన్ ఆరోపణలు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో టీమిండియా- నమీబియా మధ్య గురువారం నాటి మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇరుజట్లు ముఖాముఖి తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో నమీబియా కెప్టెన్ గెర్హాడ్ ఎరాస్మస్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.కాగా ఈసారి వరల్డ్కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్, నెదర్లాండ్స్, అమెరికాతో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉంది నమీబియా. తొలి మ్యాచ్లో భాగంగా ఢిల్లీలో నెదర్లాండ్స్తో తలపడి ఓటమిపాలైంది. తమ రెండో మ్యాచ్లో భాగంగా పటిష్ట టీమిండియాను ఢీకొట్టనుంది నమీబియా.అన్యాయంఈ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఎరాస్మస్.. తమకు రాత్రి వేళ ప్రాక్టీస్ చేసే అవకాశం దక్కలేదని అసహనం వ్యక్తం చేశాడు. తమ దేశంలో ఎన్నడూ నైట్ మ్యాచ్లు ఆడలేదని.. అనుభవం లేనందున తమకు ప్రాక్టీస్కు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. ఒక రకంగా ఇది తమకు అన్యాయం చేయడం లాంటిదేనని పరోక్షంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)ని తప్పుబట్టాడు.టీమిండియాకు రెండు.. మాకు సున్నా!కాగా ఈ టోర్నీలో నమీబియా తమ మ్యాచ్లు ఉదయం లేదంటే మధ్యాహ్నం ఆడనుంది. కేవలం టీమిండియాతో మ్యాచ్ను మాత్రమే రాత్రి షెడ్యూల్ చేశారు. అయితే, ఇంత వరకు తమకు ఫ్లడ్లైట్ల వెలుగులో ఆడిన అనుభవం లేదన్న ఎరాస్మస్.. కనీసం ప్రాక్టీస్కైనా అవకాశం లేకుండా పోయిందన్నాడు.అదే సమయంలో టీమిండియాకు మాత్రం రెండు నైట్ సెషన్లు ఇచ్చారని వాపోయాడు. ఈ మేరకు.. ‘‘ఇండియాతో మ్యాచ్కు ముందు మాకు నైట్ సెషన్ కేటాయించలేదు. ఎందుకిలా చేశారో అర్థం కావడం లేదు. కానీ టీమిండియాకు మాత్రం రాత్రి పూట రెండు ప్రాక్టీస్ సెషన్లు ఇచ్చారనుకుంటా.నమీబియన్ల పోరాట పటిమ చూస్తారువాళ్లతో పాటు కెనడా కూడా నైట్ సెషన్లో ప్రాక్టీస్ చేసింది. నిజానికి కెనడా తదుపరి మ్యాచ్ మధ్యాహ్నం ఉంది. అయినా మేమేమీ వెనక్కి తగ్గము. నమీబియన్ల పోరాటం ఎలా ఉంటుందో చూపిస్తాము’’ అని గెర్హాడ్ ఎరాస్మస్ పేర్కొన్నాడు. అదే విధంగా..‘‘నమీబియాలో మాకు ఫ్లడ్లైట్లు ఉండవు. మా దగ్గర ఆ సదుపాయం లేదు. కాబట్టి ఈసారి కొత్తగా ఇక్కడ నైట్ ఆడటం సరికొత్త సవాలు. అయితే, మా వాళ్లలో కొంతమందికి విదేశీ లీగ్లలో ఆడిన అనుభవం ఉండటం సానుకూలాంశం’’ అని ఎరాస్మస్ చెప్పుకొచ్చాడు.UPDATE: భారత్కు భారీ విజయం.. 93 పరుగులతో నమీబియా ఓటమిచదవండి: టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ!


