breaking news
India vs Pakistan
-
పాక్ క్రికెట్ దిగ్గజం కన్నుమూత
పాకిస్తాన్ క్రికెట్కు మూలపురుషులుగా నిలిచిన మహ్మద్ బ్రదర్స్లో ఒకరైన వజీర్ మహ్మద్ (95) ఇవాళ (అక్టోబర్ 13) యునైటెడ్ కింగ్డమ్లోని బర్మింగ్హామ్లో తుదిశ్వాస విడిచారు. వయో భారం కారణంగా వజీర్ కన్నుమూశారు. 1952లో భారత్, పాక్ మధ్య జరిగిన తొలి టెస్ట్ సిరీస్లో పాల్గొన్న వజీర్, అప్పటి నుంచి 1959 వరకు 20 టెస్టులు ఆడి 801 పరుగులు చేశారు.వజీర్ తన కెరీర్లో తొలి టెస్ట్ మ్యాచ్ను భారత్తోనే ఆడారు. ఆ మ్యాచ్లో అతను కేవలం 12 పరుగులు మాత్రమే చేసి, రెండు ఇన్నింగ్స్ల్లో వినూ మన్కడ్ బౌలింగ్లో ఔటయ్యారు. వజీర్కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి రికార్డు ఉంది. 105 మ్యాచ్ల్లో 11 సెంచరీలు, 26 అర్ధ సెంచరీల సాయంతో 4930 పరుగులు చేశారు.వజీర్ పాక్కు ప్రాతినిథ్యం వహించిన నలుగురు మహ్మద్ బ్రదర్స్లో ఒకరు. వజీర్ సోదరుడు హనీఫ్ మహ్మద్ క్రికెట్ ప్రపంచానికి సుపరిచితుడు. హనీఫ్ 2016 ఆగస్టు 11న 81 ఏళ్ల వయసులో కన్నుమూశారు.వజీర్ మరణించే సమయానికి నీల్ హార్వీ, ట్రెవర్ మెక్మహన్ తర్వాత మూడవ అతిపెద్ద వయస్సు గల టెస్ట్ క్రికెటర్గా ఉన్నారు. -
అభిషేక్ గొప్ప ప్లేయరేమి కాదు.. 3 బంతుల్లో ఔట్ చేస్తా! పాక్ బౌలర్ ఓవరాక్షన్
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వరల్డ్ నంబర్ 1 బ్యాటర్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అభిషేక్ ఇటీవలే ముగిసిన ఆసియాకప్లో దుమ్ములేపాడు. ఈ మెగా టోర్నీలో 7 మ్యాచ్లు ఆడిన అభిషేక్ 200 స్ట్రైక్ రేట్తో 314 పరుగులు చేశాడు.ప్లేయర్ ఆఫ్ది టోర్నీగా నిలిచిన అభిషేక్ ఇన్నింగ్స్లలో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఖండాంతర టోర్నీలో దాయాది పాకిస్తాన్కు అభిషేక్ చుక్కలు చూపించాడు. ఒక ఫైనల్లో తప్ప మిగితా లీగ్, సూపర్-8లలో పాక్ బౌలర్లను శర్మ ఉతికారేశాడు.సూపర్-4 మ్యాచ్లో అయితే అభిషేక్ బ్యాటింగ్ జోరుకు పాక్ స్పీడ్స్టార్ హ్యారిస్ రౌఫ్ తన సహనాన్ని కోల్పోయాడు. అభిషేక్తో వాగ్వాదానికి దిగాడు. రౌఫ్కు అభిషేక్ బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. ఈ పంజాబ్ క్రికెటర్ పాక్పై మూడు మ్యాచ్లు ఆడి 110 పరుగులు చేశాడు.ఇక ఇది ఇలా ఉండగా.. తాజాగా అభిషేక్ శర్మపై పాకిస్తాన్ పేసర్ ఇహ్సానుల్లా ఓ ఛాలెంజ్ విసిరాడు. అభిషేక్ తన బౌలింగ్ను ఎదుర్కొలేడని.. కేవలం మూడు బంతుల్లో ఔట్ చేయగలని అతడు చెప్పుకొచ్చాడు. ఇహ్సానుల్లా పాక్ తరపున కేవలం 4 టీ20ల్లో మాత్రమే ఆడాడు. అభిషేక్తో కలిసి అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. "నేను భారత్తో ఆడితే అభిషేక్ నా బౌలింగ్ను ఎదుర్కోలేడు. అతడిని ఔట్ చేయడానికి నాకు కేవలం మూడు బంతులు చాలు అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇహ్సానుల్లా పేర్కొన్నాడు. ఈ పాక్ ఆటగాడికి ఇండియన్ ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు.ఆసియాకప్ మ్యాచ్లు చూడలేదా? అయితే మీ బౌలర్లను అభిషేక్ గురించి అడుగు అని పోస్ట్లు పెడుతున్నారు. అభిషేక్ తిరిగి భారత జట్టు తరపున ఈ నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్లో ఆడనున్నాడు.చదవండి: వన్డే కెప్టెన్గా రోహిత్పై వేటు!.. నాకు ముందే తెలుసు: గిల్ -
భారత్-పాక్ మ్యాచ్లు వద్దు.. అందుకు వారు ఒప్పుకొంటారా?: బీసీసీఐ
ఆసియాప్-2025లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ఊహించని పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ అంతటా భారత జట్టు ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో అంటిముట్టనట్టే ఉన్నారు. కనీసం కరచాలనం చేసేందుకు కూడా ఇష్టపడలేదు. అంతేకాకుండా ఫైనల్ మ్యాచ్ అనంతరం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదగా ట్రోఫీని తీసుకోవడానికి కూడా భారత్ నిరాకరించింది.నఖ్వీ పీసీబీ చీఫ్తో పాటు పాక్ మంత్రిగా ఉండడమే అందుకు కారణం. అయితే ఈ ఆసియాకప్లో జరిగిన సంఘటనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది భారత్కు సపోర్ట్ చేస్తే మరి కొతమంది పాక్కు మద్దతుగా నిలిచారు.ఇదే విషయంపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ అథర్టన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇరు దేశాల మధ్య సమస్యలు పరిష్కారం అయ్యే వరకు భారత్-పాకిస్తాన్ మ్యాచ్లను నిర్వహించవద్దని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి అథర్టన్ సూచించాడు. అతడి వ్యాఖ్యలపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందించారు."భారత్-పాకిస్తాన్ మధ్య సమస్యలు అంత సులువుగా పరిష్కరం కావు. బయట నుంచి వ్యక్తులు ఏదైనా మాట్లాడుతారు. ఏదైనా చెప్పినంత ఈజీ కాదు. అందుకు స్పాన్సర్లు, బ్రాడ్కాస్టర్లు అంగీకరిస్తారా? ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియానే కాదు ఏ ప్రధాన జట్టు అయినా టోర్నమెంట్ నుండి వైదొలిగితే తర్వాత స్పాన్సర్లను ఆకర్షించడం చాలా కష్టమని" సదరు అధికారి పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది ఆసియాకప్లో మూడు సార్లు పాక్-భారత్ జట్లు తలపడ్డాయి. మూడు మ్యాచ్లలోనూ పాక్ను టీమిండియా చిత్తు చేసింది. అయితే విన్నింగ్ ట్రోఫీ ఇప్పటివరకు ఇంకా భారత్ వద్ద చేరలేదు.చదవండి: Prithvi Shaw: భారీ శతకంతో చెలరేగిన పృథ్వీ షా -
IND vs PAK: పాకిస్తాన్ క్రికెటర్కు భారీ షాకిచ్చిన ఐసీసీ
పాకిస్తాన్ మహిళా క్రికెటర్ సిద్రా ఆమిన్ (Sidra Amin)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) భారీ షాకిచ్చింది. భారత్తో మ్యాచ్ సందర్భంగా ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఆమెను మందలించింది. అదే విధంగా.. ఓ డీమెరిట్ (Demerit Point) పాయింట్ను కూడా సిద్రా ఖాతాలో జమ చేసింది.అసలేం జరిగిందంటే... ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్ ఆడే మ్యాచ్లు మాత్రం తటస్థ వేదికైన శ్రీలంకలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దాయాదులు భారత్- పాక్ మధ్య ఆదివారం (అక్టోబరు 5) కొలంబో వేదికగా తలపడ్డాయి.భారత్ 247 పరుగులకు ఆలౌట్ఆర్.ప్రేమదాస స్టేడియంలో అనుకోని విధంగా టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు ప్రతికా రావల్ (31), స్మృతి మంధాన (23) ఫర్వాలేదనిపించగా.. వన్డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ 46 పరుగులతో రాణించింది.మిగతా వారిలో జెమీమా రోడ్రిగెస్ (32), దీప్తి శర్మ (25), రిచా ఘోష్ (35 నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో డయానా బేగ్ నాలుగు వికెట్లు దక్కించుకోగా.. కెప్టెన్ ఫాతిమా సనా షేక్, సైదా ఇక్బాల్ చెరో రెండు, రమీన్ షమీమ్, నష్రా సంధూ ఒక్కో వికెట్ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.బౌలర్ల విజృంభణఇక లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లు మునీబా అలీ (2), సదాఫ్ షమాస్ (6) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వాళ్లు కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయారు.సిద్రా ఆమిన్ హాఫ్ సెంచరీఐదో నంబర్లో ఆడిన నటాలియా పర్వేజ్ 33 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. వన్డౌన్ బ్యాటర్ సిద్రా ఆమిన్ ఒంటరి పోరాటం చేసింది. 106 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 81 పరుగులు చేసింది. అయితే, పాక్ ఇన్నింగ్స్ 40వ ఓవర్ ఐదో బంతికి స్నేహ్ రాణా బౌలింగ్లో హర్మన్ప్రీత్కు క్యాచ్ ఇవ్వడంతో సిద్రా ఇన్నింగ్స్కు తెరపడింది.అప్పటికే పాక్ ఓటమి దాదాపు ఖరారు కాగా.. సిద్రా తన బ్యాట్ను నేలకేసి కొట్టి అసహనం వ్యక్తం చేసింది. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన ఐసీసీ.. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఆమెకు శిక్ష విధించింది.అందుకే సిద్రాకు పనిష్మెంట్ఈ మేరకు.. ‘‘ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం.. అంతర్జాతీయ మ్యాచ్లో క్రికెట్ పరికరాలు, దుస్తులు లేదంటే గ్రౌండ్ ఎక్విప్మెంట్, ఫిట్టింగ్స్ వంటి వాటికి నష్టం కలిగించేలా వ్యవహరించడం నేరం. సిద్రా ఈ నిబంధనను ఉల్లంఘించింది.అందుకే ఆమెను మందలించడంతో పాటు.. తన క్రమశిక్షణా రికార్డులో ఓ డీమెరిట్ పాయింట్ జత చేస్తున్నాం. గత 24 నెలల కాలంలో ఆమె చేసిన మొదటి తప్పిదం కాబట్టి ఇంతటితో సరిపెడుతున్నాం’’ అని ఐసీసీ సోమవారం నాటి ప్రకటనలో పేర్కొంది. సద్రా తన తప్పును అంగీకరించింది కావున తదుపరి విచారణ అవసరం లేకుండా పోయిందని.. ఐసీసీ ఈ సందర్భంగా తెలియజేసింది.ఆధిపత్యం చాటుకున్న భారత్కాగా సిద్రా అర్ధ శతకం వృథాగా పోయింది. భారత బౌలర్ల ధాటికి 43 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసి పాక్ ఆలౌట్ అయింది. దీంతో భారత్ 88 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి.. వన్డేల్లో ముఖాముఖి పోరులో మరోసారి తమ ఆధిపత్యాన్ని (12-0) చాటుకుంది. పాక్తో తాజా మ్యాచ్లో భారత బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ క్రాంతి గౌడ్, దీప్తి శర్మ మూడేసి వికెట్లతో చెలరేగగా.. స్నేహ్ రాణా రెండు వికెట్లు తీసింది. దీప్తి, హర్మన్ రెండు రనౌట్లలో భాగమయ్యారు.స్ప్రే ప్రయోగిస్తూఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా మైదానంలో పురుగుల వల్ల భారత బ్యాటర్లు ఇబ్బంది పడుతున్న వేళ పాక్ కెప్టెన్ ఫాతిమా సనా స్ప్రే ప్రయోగిస్తూ.. పురుగులను వెళ్లగొట్టడం హైలైట్గా నిలిచింది. అంపైర్ల అనుమతితోనే ఆమె ఇలా చేయడం గమనార్హం.చదవండి: World Cup 2025: టీమిండియా చేతిలో ఓడినా చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ -
పాక్పై రికార్డు విజయం.. ఆసీస్ దిగ్గజాన్ని అధిగమించిన టీమిండియా కెప్టెన్
మహిళల వన్డే వరల్డ్కప్ 2025లో (Women's Cricket World Cup 2025) భాగంగా పాకిస్తాన్తో నిన్న (అక్టోబర్ 5) జరిగిన మ్యాచ్లో (India vs Pakistan) టీమిండియా 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి ఓ మోస్తరు స్కోర్కే (247) పరిమితమైనప్పటికీ.. ఆతర్వాత ఆ స్కోర్ను విజయవంతంగా కాపాడుకుంది. క్రాంతి గౌడ్ (10-3-20-3) అద్భుతమైన బౌలింగ్తో పాక్ పతనాన్ని శాశించింది. క్రాంతితో పాటు దీప్తి శర్మ (9-0-45-3), స్నేహ్ రాణా (8-0-38-2) కూడా సత్తా చాటడంతో పాక్ 43 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. పాక్ తరఫున సిద్రా అమీన్ (81) ఒంటరిపోరాటం చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అంతకుముందు భారత ఇన్నింగ్స్ డయానా బేగ్ (10-1-69-4) ధాటికి తడబడింది. టాపార్డర్ మొత్తానికి మంచి ఆరంభాలు లభించినా, ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. ఆఖర్లో రిచా ఘోష్ (20 బంతుల్లో 35 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించింది.ఈ గెలుపుతో భారత్ వన్డే ఫార్మాట్లో దాయాదిపై తమ రికార్డును (12-0) మరింత మెరుగుపర్చుకుంది. అలాగే వరల్డ్కప్ టోర్నీల్లోనూ పాక్పై ఆధిపత్యాన్ని (5-0) కొనసాగించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత క్రికెట్ జట్లు పాక్ను వరుసగా నాలుగు ఆదివారాల్లో ఓడించాయి. దీనికి ముందు భారత పురుషుల జట్టు ఆసియా కప్లో పాక్ను వరుసగా మూడు ఆదివారాల్లో ఓడించి ఆసియా ఛాంపియన్గా అవతరించింది.ఇదిలా ఉంటే, నిన్నటి గెలుపుతో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet kaur) ఓ అరుదైన ఘనత సాధించింది. వన్డేల్లో ఆమె ప్లేయర్గా 90వ విజయాన్ని నమోదు చేసి, మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్ల జాబితాలో ఏడో స్థానానికి ఎగబాకింది. ఈ క్రమంలో ఆసీస్ దిగ్గజ ప్లేయర్, ఆ జట్టు మాజీ కెప్టెన్, రెండు సార్లు వన్డే ప్రపంచకప్ విన్నర్ మెగ్ లాన్నింగ్ను (Meg Lanning) అధిగమించింది. లాన్నింగ్ తన కెరీర్లో ప్లేయర్గా 89 విజయాలు సాధించగా.. హర్మన్ నిన్నటి మ్యాచ్తో ఆమెను దాటేసింది. ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అగ్రస్థానంలో ఉంది. మిథాలీ తన వన్డే కెరీర్లో 129 విజయాలు సాధించింది.మహిళల వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్లుమిథాలీ రాజ్- 129ఎల్లిస్ పెర్రీ- 125అలైస్సా హీలీ- 103బెలిండ క్లార్క్- 94కేట్ సీవర్ బ్రంట్- 93కేట్ ఫిజ్ప్యాట్రిక్- 91హర్మన్ప్రీత్ కౌర్- 90మెగ్ లాన్నింగ్- 89 చదవండి: లంక ప్రీమియర్ లీగ్లో భారత ఆటగాళ్లు.. చరిత్రలో తొలిసారి..! -
టీమిండియా చేతిలో ఓడినా చరిత్ర సృష్టించిన పాకిస్తాన్
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్ 2025లో (Women's Cricket World Cup) భాగంగా నిన్న (అక్టోబర్ 5) భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ (Inida vs Pakistan) జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ 88 పరుగుల తేడాతో పాక్ను ఓడించి, వన్డే ఫార్మాట్లో దాయాదిపై తమ రికార్డును (12-0) మరింత మెరుగుపర్చుకుంది. అలాగే వరల్డ్కప్ టోర్నీల్లోనూ పాక్పై ఆధిపత్యాన్ని 5-0 తేడాతో కొనసాగించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత క్రికెట్ జట్లు పాక్ను వరుసగా నాలుగు ఆదివారాల్లో ఓడించారు.తాజాగా ముగిసిన పురుషుల ఆసియా కప్లో టీమిండియా గ్రూప్ (సెప్టెంబర్ 14), సూపర్-4 (సెప్టెంబర్ 21), ఫైనల్ (సెప్టెంబర్ 28) మ్యాచ్ల్లో వరుసగా మూడు ఆదివారాల్లో పాక్ను ఓడించగా.. ఇప్పుడు భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్లో భాగంగా పాక్ను వరుసగా నాలుగో ఆదివారం (అక్టోబర్ 5) చిత్తు చేసింది.తాజా మ్యాచ్లో భారత మహిళా జట్టు చేతిలో ఓడినా పాక్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వన్డేల్లో పాక్ తొలిసారి భారత్ను ఆలౌట్ చేసింది. ఇరు జట్ల మధ్య దీనికి ముందు 11 మ్యాచ్లు జరిగినా, అందులో పాక్ బౌలర్లు ఒక్కసారి కూడా భారత్ను ఆలౌట్ చేయలేదు.నిన్న జరిగిన వరల్డ్కప్ మ్యాచ్లో పాక్ పేసర్ డయానా బేగ్ (10-1-69-4) చెలరేగడంతో భారత్ సరిగ్గా 50 ఓవర్లు ఆడి 247 పరుగులకు ఆలౌటైంది. మహిళల వన్డేల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు కాకుండా టీమిండియా చేసిన అత్యధిక స్కోర్ ఇదే. ఈ మ్యాచ్లో భారత ప్లేయర్లు ఏకంగా 173 బంతులకు పరుగులు చేయలేదు.ప్రస్తుత ప్రపంచకప్ టోర్నీలో ఓ జట్టు ఇన్ని బంతులకు పరుగులు చేయలేకపోవడం ఇదే ప్రప్రధమం. గత 34 వన్డేల్లో భారత మహిళల జట్టు ఈ మార్కును (173 డాట్ బాల్స్) తాకడం ఇది రెండోసారి. 2023 జనవరిలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 181 బంతులను వృధా చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. భారత బ్యాటర్లను ఉన్న టాలెంట్ ప్రకారం ఈ స్కోర్ నిజంగానే చాలా చిన్నది. అయినా భారత బౌలర్లు దాన్ని విజయవంతంగా కాపాడుకొని పాక్ను మట్టికరిపించాడు. ఈ మ్యాచ్లో భారత్ తక్కువ స్కోర్కే (247 ఆలౌట్) పరిమితం కావడానికి ఇతరత్రా కారణాలు కూడా ఉన్నాయి.టీమిండియా బ్యాటింగ్ చేసే సమయంలో పురుగులు చాలా ఇబ్బంది పెట్టాయి. వీటి వల్ల భారత బ్యాటర్లు ఏకాగ్రత సాధించలేకపోయారు. ఓ దశలో పురుగులను పారద్రోలేందుకు స్ప్రేను కూడా ప్రయోగించారు. అయితే అప్పటికే సగం మ్యాచ్ ఆయిపోయింది. నిన్నటి మ్యాచ్లో భారత్ పాక్పై భారీ స్కోర్ చేయలేకపోవడానికి పిచ్ మరో కారణం. పిచ్ను మ్యాచ్కు 48 గంటల ముందు వరకు క్లోజ్ చేసి ఉంచారు. దీంతో తేమ ఎక్కువై బంతి నిదానంగా కదిలింది. దీని వల్ల కూడా భారత బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. ఆఖర్లో రిచా ఘోష్ (20 బంతుల్లో 35 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోయుంటే భారత్ ఇంకాస్త తక్కువ స్కోర్కే పరిమితమై ఉండేది. చదవండి: World Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. స్ప్రే ప్రయోగించిన పాక్ కెప్టెన్ -
పాక్ ఓపెనర్ది ఔటా? నాటౌటా? రూల్స్ ఏమి చెబుతున్నాయి
భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య వైరం మరింత ముదురుతోంది. మొన్న ఆసియాకప్లో ఇరు జట్ల మధ్య చోటు చేసుకున్న సంఘటనలు మరవకముందే.. మహిళల వన్డే ప్రపంచకప్-2025లో చిరకాల ప్రత్యర్ధుల మధ్య మరో వివాదం చోటు చేసుకుంది.ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా భారత్-పాక్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో పాక్ ఓపెనర్ మునీబా అలీ రనౌట్ వివాదస్పదమైంది. పాక్ అభిమానులు మునీబాది నాటౌట్ అంటుంటే ఇండియన్ ఫ్యాన్స్ క్లియర్ ఔట్ అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.అసలేమి జరిగిదంటే?పాకిస్తాన్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన క్రాంతి గౌడ్ ఆఖరి బంతిని మునీబాకు మిడిల్ అండ్ లెగ్ స్టంప్ దిశగా సంధించింది. ఆ బంతిని మునీబా లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించింది. కానీ బంతి బ్యాట్కు మిస్స్ అయ్యి మునీబా అలీ ఫ్రంట్ ప్యాడ్ తాకుతూ వికెట్ కీపర్ వైపు వెళ్లింది.దీంతో భారత ప్లేయర్లు ఎల్బీడబ్ల్యూకి అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌట్ అంటూ తల ఊపారు. ఇంతలోనే మునీబా క్రీజు బయటకు ఒక్క అడుగు ముందుకు వేసి తిరిగి రావడానికి ప్రయత్నించింది. ఇదే సమయంలో దీప్తి శర్మ వికెట్ కీపర్ వెనక నుంచి డైరక్ట్ త్రోతో స్టంప్స్ను గిరాటేసింది. దీంతో ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్కు రిఫర్ చేశారు. తొలుత థర్డ్ అంపైర్ నాటౌట్గా సూచించినప్పటికి.. అంపైర్ కెరిన్ క్లాస్ట్ ఆ తర్వాత పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించి తన నిర్ణయాన్ని మార్చి ఔట్గా ప్రకటించింది. బంతి స్టంప్స్కు తాకే సమయంలో మనీబా బ్యాట్ గాల్లో ఉందని అంపైర్ చెప్పుకొచ్చారు. థర్డ్ అంపైర్ నిర్ణయంతో పాక్ శిబిరం మొత్తం షాక్కు గురయ్యారు. అయితే బంతి స్టంప్స్కు తాకక ముందు మునీబా బ్యాట్ పాపింగ్ క్రీజులో ఉంచింది. కాబట్టి నాటౌట్ అంటూ పాక్ కెప్టెన్ ఫాతిమా సనా ఫోర్త్ అంపైర్తో వాగ్వాదానికి దిగింది. ఫోర్త్ అంపైర్ రూల్స్ను వివరించడంతో ఆమె వెనక్కి తగ్గింది. ఏదేమైనప్పటికి మైదానంలో కాసేపు గందరగోళం నెలకొంది.రూల్స్ ఏమి చెబుతున్నాయి?ఎంసీసీ కొత్త రూల్స్ ప్రకారం.. ఒక బ్యాటర్ బంతి స్టంప్స్కు తాకక ముందు తన బ్యాట్ను పాపింగ్ క్రీజ్ వెనుక ఒక్కసారి ఉంచితే చాలు. ఆ తర్వాత బంతి స్టంప్స్కు తాకే సమయంలో బ్యాట్ గాల్లో ఉన్న కూడా నాటౌట్గా పరిగిణిస్తారు. అయితే ఈ రూల్ కేవలం రన్కు ప్రయత్నించేటప్పుడు మాత్రమే వర్తిస్తుంది. కానీ మునీబా రన్ కోసం పరిగెత్తలేదు. క్రీజులో నిలబడి బయటకు వెళ్లి వచ్చింది. కాబట్టి ఆమె అవుట్ వికెట్ కీపర్ బ్యాటర్ స్టంప్ చేయడంతో సమానం. బంతి బెయిల్స్ పడగొట్టిన సమయంలో ఆమె బ్యాట్ గాలిలో ఉంది. అందుకే థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించారు. అదే ఆమె రన్కు ప్రయత్నించే సమయంలో ఇలా జరిగింటే నాటౌట్ ఇచ్చేవారు.రూల్ 30.1 ప్రకారం.. మునీబాను ఔట్గా ప్రకటించారు. ఈ రూల్ ప్రకారం ఒక బ్యాటర్ తన బ్యాట్ లేదా పాదం లేదా శరీరంలోని ఏ భాగమైనా పాపింగ్ క్రీజ్ చివరన లేకపోతే ఔట్గానే పరిగణిస్తారు.రూల్ 30.1.2 ప్రకారం.. ఒక బ్యాటర్ రన్కు పరిగెత్తడం లేదా డైవ్ చేసే సందర్భాల్లో బ్యాట్ ఒక్కసారి పాపింగ్ క్రీజు వెలుపుల గ్రౌండింగ్ చేస్తే చాలు. అనంతరం బెయిల్స్ పడే సమయంలో బ్యాట్ గాల్లో ఉన్నా నాటౌట్గానే లెక్కలోకి తీసుకుంటారు. View this post on Instagram A post shared by Star Sports India (@starsportsindia) -
మా ఓటమికి కారణమదే.. లేదంటే ఈజీగా గెలిచేవాళ్లం: పాక్ కెప్టెన్
ఐసీసీ మహిళల ప్రపంచకప్లో కొలంబో వేదికగా ఆదివారం భారత్తో జరిగిన మ్యాచ్లో 88 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ ఓటమి పాలైంది. బౌలింగ్లో పర్వాలేదన్పించిన పాక్ జట్టు.. బ్యాటింగ్లో మాత్రం తేలిపోయింది. 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు 43 ఓవర్లలో 159 రన్స్కే కుప్పకూలింది.యువ ఫాస్ట్ బౌలర్ క్రాంతి గౌడ్, సీనియర్ ఆల్రౌండర్ దీప్తి శర్మ తలా మూడు వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించారు. వీరితో పాటు స్నేహ్ రాణా రెండు వికెట్లు తీశారు. పాక్ బ్యాటర్లలో సిద్రా అమిన్ (106 బంతుల్లో 81; 9 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేసింది.అంతకుముందు భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగుల వద్ద ఆలౌటైంది. హర్లీన్ డియోల్ (65 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలవగా.. రిచా ఘోష్ (20 బంతుల్లో 35 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుగా ఆడింది. మహిళల వన్డేల్లో పాక్పై భారత్కు ఇది వరుసగా 12వ విజయం కావడం విశేషం. అయితే ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ ఫాతిమా సనా స్పందించింది. ప్రత్యర్ధి భారత జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో విఫలమయ్యామని సనా చెప్పుకొచ్చింది."పవర్ప్లేలో మేము చాలా పరుగులు ఇచ్చాము. అదే విధంగా డెత్ ఓవర్లలో మేము మెరుగ్గా బౌలింగ్ చేయలేకపోయాము. నేను బౌలింగ్ చేసినప్పుడు బంతి స్వింగ్ అవుతున్నట్లు అన్పించింది. కానీ డయానా బేగ్ మాత్రం సీమ్, స్వింగ్ మధ్య కాస్త కన్ఫూజన్కు గురైంది.నేను మాత్రం బంతి స్వింగ్ అవుతుందని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని నేను పదేపదే చెబుతునే ఉన్నాను. మా తదుపరి మ్యాచ్లో ఆమె మెరుగ్గా రాణిస్తుందని అశిస్తున్నాను. తొలుత భారత్ను 200 కంటే తక్కువ పరుగులకు పరిమితం చేసి ఉంటే బాగుండేది. ఆ టోటల్ను మేము సులువుగా చేధించేవాళ్లం.అయితే బ్యాటింగ్లో మేము కాస్త తడబడ్డాము. కానీ మా బ్యాటింగ్ లైనప్ అద్బుతంగా ఉంది. టాప్ 5లో మంచి బ్యాటర్లు ఉన్నారు. మా తర్వాతి మ్యాచ్లో రాణిస్తారని భావిస్తున్నారు. బ్యాటింగ్లో భాగస్వామ్యాలు నెలకొల్పడం అవసరం. ఈ మ్యాచ్లో మేడు అది చేయలేకపోయాము. అయితే సిద్రా పోరాటం గురించి ఎంత చెప్పుకొన్న తక్కువే. ఆమె నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తుంది. మా జట్టులో సిద్రా కీలక సభ్యురాలు" అని సనా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో పేర్కొంది. ఈ మ్యాచ్లో బేగ్ నాలుగు వికెట్లు పడగొట్టినప్పటికి 69 పరుగులు సమర్పించుకుంది.చదవండి: IND vs AUS: ఒకప్పుడు కోహ్లితో కలిసి ఆడారు.. కట్ చేస్తే.. ఇప్పుడు అంపైర్లగా! -
పాకిస్తాన్తో మ్యాచ్.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన టీమిండియా
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (ICC Women's World Cup 2025) భాగంగా పాకిస్తాన్తో ఇవాళ (అక్టోబర్ 5) జరుగుతున్న మ్యాచ్లో (India vs Pakistan) టీమిండియా (Team India) సామర్థ్యం మేరకు రాణించలేకపోయింది. కొలొంబో వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి పాక్ (Pakistan) ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసి ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైంది. నిర్ణీత 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 247 పరుగులకు ఆలౌటైంది.46 పరుగులతో హర్లీన్ డియోల్ టాప్ స్కోరర్గా నిలువగా.. రిచా ఘోష్ 35 (నాటౌట్), జెమీమా రోడ్రిగెజ్ 32, ప్రతీక రావల్ 31, దీప్తి శర్మ 25, స్మృతి మంధన 23, స్నేహ్ రాణా 20, హర్మన్ప్రీత్ 19, శ్రీ చరణి 1, క్రాంతి గౌడ్ 8, రేణుకా సింగ్ డకౌటయ్యారు. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లకు మంచి ఆరంభాలు లభించినా పెద్దగా స్కోర్లుగా మలచలేకపోయారు.పాక్ బౌలర్లలో డయానా బేగ్ 4 వికెట్లతో సత్తా చాటగా.. సదియా ఇక్బాల్, కెప్టెన్ ఫాతిమా సనా తలో 2, రమీన్ షమీమ్, సష్రా సంధు చెరో వికెట్ పడగొట్టారు.స్ప్రే ఉపయోగించిన పాక్ కెప్టెన్భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చిన్నచిన్న పురుగులు పలు మార్లు మ్యాచ్కు అంతరాయం కలిగించాయి. ఓ దశలో పరుగుల సమస్య ఎక్కువ కావడంతో అంపైర్ అనుమతితో పాక్ కెప్టెన్ పరుగుల నివారణ స్ప్రేను ప్రయోగించింది. ఇన్నింగ్స్ 28వ ఓవర్లో ఇది జరిగింది. స్ప్రే ఉపయోగించిన తర్వాత పురుగుల ప్రభావం తగ్గడంతో భారత బ్యాటింగ్ సజావుగా సాగింది.టాస్ సమయంలో గందరగోళంటాస్ సమయంలో గందరగోళం నెలకొంది. పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా టాస్ గెలిచినట్లు రిఫరీ షాండ్రే ఫ్రిట్జ్, అనౌన్సర్ మెల్ జోన్స్ ప్రకటించారు. వాస్తవానికి పాక్ కెప్టెన్ టాస్ గెలవలేదు.భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ టాస్ వేయగానే ఫాతిమా "టెయిల్స్" అని చెప్పింది. కానీ రిఫరీ ఫ్రిట్జ్, అనౌన్సర్ మెల్ జోన్స్ "హెడ్స్"గా వినిపించుకున్నారు. తీరా నాణెం "హెడ్స్"గా పడడంతో టాస్ పాకిస్తాన్ గెలిచిందని ప్రకటించారు. టాస్ గెలిచిన ఫాతిమా ఫీల్డింగ్ ఎంచుకోగా, దీనిపై భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం ఆసక్తికరం.చదవండి: భారత్తో నిర్ణయాత్మక మూడో వన్డే.. ఆస్ట్రేలియా భారీ స్కోర్ -
World Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. స్ప్రే ప్రయోగించిన పాక్ కెప్టెన్
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (ICC Women's World Cup 2025) భాగంగా భారత్-పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య ఇవాళ (అక్టోబర్ 5) జరుగుతున్న మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో పాక్ కెప్టెన్ ఫాతిమా సనా మ్యాజిక్ స్ప్రేను (Spray) ప్రయోగించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. ఇంతకీ పాక్ కెప్టెన్ ఎందుకలా చేసిందని అభిమానులు ఆరా తీస్తున్నారు.వివరాల్లో వెళితే.. కొలొంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి చిన్నచిన్న పురుగులు మైదానమంతా వ్యాపించి ఇరు జట్ల ఆటగాళ్లను ఇబ్బంది పెట్టాయి. ఈ పరుగుల కారణంగా మ్యాచ్కు పలు మార్లు అంతరాయం కలిగింది.ఇన్నింగ్స్ మధ్యలో పురుగుల ప్రభావం చాలా ఎక్కువైంది. దీని వల్ల భారత ఆటగాళ్లు బ్యాటింగ్ చేయలేకపోయారు. ఈ విషయమై అప్పుడు క్రీజ్లో ఉన్న భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ అంపైర్కు ఫిర్యాదు చేసింది. పురుగుల వల్ల తాను బంతిపై దృష్టి సారించలేకపోతున్నానని తెలిపింది.దీంతో ఇన్నింగ్స్ 28వ ఓవర్లో అంపైర్ పురుగులు తరిమే స్ప్రేను ఉపయోగించేందుకు పర్మిషన్ ఇచ్చాడు. పాక్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ ఒకరు స్ప్రే తీసుకొచ్చి వారి కెప్టెన్ ఫాతిమా సనాకు ఇవ్వగా, ఆమె దాన్ని ఉపయోంచి పురుగులను తరిమికొట్టింది. స్ప్రే ఉపయోగించిన తర్వాత కాస్త ఉపశమనం లభించడంతో భారత ఆటగాళ్లు బ్యాటింగ్కు కొనసాగించారు.శ్రీలంకలోని క్రికెట్ మైదానాల్లో ఇలాంటి సన్నివేశాలు తరుచూ కనిపిస్తుంటాయి. పురుగులు, జంతువులు, పాములు పిలవని పేరంటాలకు వచ్చి పోతుంటాయి. తాజాగా భారత జట్టు ప్రాక్టీస్ చేస్తుండగా మైదానంలోకి పెద్ద పాము ప్రవేశించింది. పాములు పట్టే వారు వచ్చి దాన్ని తీసుకెళ్లి అడవిలో వదిలేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 44 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ప్రతీక రావల్ (31), స్మృతి మంధన (23), హర్లీన్ డియోల్ (46), హర్మన్ప్రీత్ (19), జెమీమా రోడ్రిగెజ్ (32) ఔట్ కాగా.. దీప్తి శర్మ (24), స్నేహ్ రాణా (16) క్రీజ్లో ఉన్నారు.చదవండి: భారత్తో నిర్ణయాత్మక మూడో వన్డే.. ఆస్ట్రేలియా భారీ స్కోర్ -
World Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు ముందు టాస్ గందరగోళం
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's Cricket World Cup 2025) భారత్, పాకిస్తాన్ (India VS Pakistan) మ్యాచ్ టాస్ గందరగోళం మధ్య ప్రారంభమైంది. కొలొంబోలోని ప్రేమదాస వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా టాస్ గెలిచినట్లు రిఫరీ షాండ్రే ఫ్రిట్జ్, అనౌన్సర్ మెల్ జోన్స్ ప్రకటించారు. వాస్తవానికి పాక్ కెప్టెన్ టాస్ గెలవలేదు.భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ టాస్ వేయగానే ఫాతిమా "టెయిల్స్" అని చెప్పింది. కానీ రిఫరీ ఫ్రిట్జ్, అనౌన్సర్ మెల్ జోన్స్ "హెడ్స్"గా వినిపించుకున్నారు. తీరా నాణెం "హెడ్స్"గా పడడంతో టాస్ పాకిస్తాన్ గెలిచిందని ప్రకటించారు. టాస్ గెలిచిన ఫాతిమా ఫీల్డింగ్ ఎంచుకోగా, దీనిపై భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.ఇటీవల పురుషుల ఆసియా కప్లో జరిగిన విధంగానే టాస్ అనంతరం భారత కెప్టెన్ పాక్ కెప్టెన్కు హ్యాండ్ షేక్ ఇవ్వలేదు. టాస్ ఫలితం వెలువడగానే ఇరువురు కెప్టెన్లు చెరో దిక్కు అయ్యారు. ఈ మ్యాచ్లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. భారత్ తరఫున అమన్జోత్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో రేణుకా సింగ్కి అవకాశం ఇచ్చారు. పాకిస్తాన్ తరఫున ఒమైమా సోహాలీ స్థానంలో సదాఫ్ షమాస్ జట్టులోకి వచ్చింది.తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ సగం ఓవర్లు పూర్తయ్యే సమయానికి 3 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధన (23), ప్రతీక రావల్ (31), హర్మన్ప్రీత్ (19) ఔట్ కాగా.. హర్లీన్ డియోల్ (31), జెమీమా రోడ్రిగెజ్ (1) క్రీజ్లో ఉన్నారు.కాగా, పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇటీవల ముగిసిన పురుషుల ఆసియా కప్లో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు హ్యాండ్ షేక్కు నిరాకరించారు. ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలిచిన తర్వాత ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహిసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించింది. చదవండి: భారత్ నా మాతృభూమి, దేవాలయం లాంటిది: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు -
భారత జట్టుతో అనుబంధం.. హర్మన్ గొప్ప ప్లేయర్: పాక్ కెప్టెన్ ప్రశంసలు
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur)పై పాకిస్తాన్ సారథి ఫాతిమా సనా ప్రశంసలు కురిపించింది. హర్మన్ అనుభవజ్ఞురాలైన ప్లేయర్ అని.. ఆమె జట్టును నడిపించే తీరు అద్భుతమని కొనియాడింది. కాగా వరుసగా నాలుగో ఆదివారం భారత్- పాకిస్తాన్ మ్యాచ్కు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే.పాక్పై వరుస విజయాలతో ట్రోఫీ సొంతంఇటీవల పురుషుల క్రికెట్ ఆసియా టీ20 కప్-2025 (Asia Cup) సందర్భంగా దాయాదులు తలపడ్డాయి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అనంతరం ఈ ఖండాంతర టోర్నీలో తొలిసారి జరిగిన ముఖాముఖి పోరులో టీమిండియా.. లీగ్, సూపర్ దశలతో పాటు ఫైనల్లో పాక్ను చిత్తు చేసి ట్రోఫీ గెలిచింది.అయితే, ఈ మ్యాచ్ల సందర్భంగా పాక్ జట్టుతో కరచాలనానికి సూర్యకుమార్ సేన నిరాకరించగా.. పాక్ జట్టు హైడ్రామా నడిపించింది. అంతేకాదు.. హ్యారిస్ రవూఫ్తో పాటు ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ రెచ్చగొట్టే రీతిలో వ్యవహరించి ఐసీసీతో మొట్టికాయలు తిన్నారు.ట్రోఫీ, మెడల్స్ ఎత్తుకుపోయిన నక్వీఇక పీసీబీ చైర్మన్, పాక్ మంత్రి మొహ్సిన్ నక్వీనుంచి ట్రోఫీ తీసుకునేందుకు భారత జట్టు నిరాకరించగా.. అతడు ట్రోఫీ, మెడల్స్తో పారిపోయాడు. తన దగ్గరకు వస్తేనే వాటిని ఇస్తానంటూ ఓవరాక్షన్ చేయగా.. బీసీసీఐ ఐసీసీ వద్దనే ఈ పంచాయితీ తేల్చుకునేందుకు సిద్ధమైంది.ఈసారి కూడా నో షేక్హ్యాండ్ఇలాంటి పరిణామాల నడుమ ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 సందర్భంగా భారత్- పాక్ జట్ల మధ్య ఆదివారం (అక్టోబరు 5) జరిగే మ్యాచ్పై ఆసక్తి నెలకొంది. కొలంబో వేదికగా దాయాదితో జరిగే పోరులో హర్మన్సేన కూడా కరచాలనానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో మ్యాచ్కు మీడియాతో మాట్లాడిన పాక్ కెప్టెన్ ఫాతిమా సనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘హర్మన్ప్రీత్ కౌర్ సీనియర్, అనుభవజ్ఞురాలైన ప్లేయర్. అద్బుత రీతిలో జట్టును ముందుకు నడిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.తనొక ప్రతిభావంతమైన ప్లేయర్. పరిస్థితులకు తగ్గట్లు హిట్టింగ్ ఆడగలదు.. డిఫెండ్ కూడా చేసుకోగలదు. మైదానంలో తన వ్యూహాలను పక్కాగా అమలు చేస్తుంది’’ అని భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ను ప్రశంసించింది.అంతా ఒకే కుటుంబం అదే విధంగా.. ‘‘2022 వరల్డ్కప్లో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత.. భారత జట్టు మొత్తం మా దగ్గరికి వచ్చి.. మమ్మల్ని పలకరించింది. మాతో కలిసి వారు తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆరోజు ఎంతో ప్రత్యేకం.ఆరోజే ఆ ఇరుజట్ల మధ్య గొప్ప అనుబంధం ఉందని నాకు అనిపించింది’’ అంటూ ఫాతిమా సనా గత జ్ఞాపకాలు గుర్తుచేసుకుంది. ప్రస్తుతం బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసనని.. అయితే, మైదానంలో ఉండే 20- 22 ప్లేయర్లు అంతా ఒక కుటుంబం లాంటివారేనని పేర్కొంది. ఐసీసీ వరల్డ్కప్ ఆడటం ప్రతి ఒక్క ప్లేయర్ కల అని.. తామంతా కేవలం ఆట మీద మాత్రమే దృష్టి పెడతామని ఫాతిమా సనా తెలిపింది.ఈసారి ఏకపక్ష విజయమేఅయితే, సనా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాక్ ఆటగాళ్ల మనస్తత్వం ఎలాంటిదో ఇటీవలే మరోసారి చూశామని.. ట్రోఫీ ఎత్తుకెళ్లే నక్వీ నడిపించే బోర్డుకు చెందిన ఆటగాళ్లు ఇలా మాట్లాడటం ఆశ్చర్యకరమని నెటిజన్లు పేర్కొంటున్నారు.కాగా భారత్- పాక్ మహిళా జట్లు గతంలో 11 వన్డేల్లో ముఖాముఖి తలపడగా.. అన్ని మ్యాచ్లలోనూ భారత్ విజయం సాధించింది. ఈసారి కూడా గెలుపు ఏకపక్షమయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. అయితే, వర్షం రూపంలో దాయాదుల పోరుకు ప్రమాదం పొంచి ఉంది. ఇదిలా ఉంటే.. హర్మన్ప్రీత్ కౌర్కు బదులుగా భారత బౌలింగ్ కోచ్ ఆవిష్కార్ సాల్వీ మీడియా సమావేశానికి హాజరయ్యాడు. ఈ క్రమంలో భారత్- పాక్ మహిళా జట్ల మధ్య అనుబంధం గురించి పాక్ జర్నలిస్టు ప్రశ్నించగా.. టీమిండియా మేనేజర్ తదుపరి ప్రశ్నకు వెళ్దామని చెప్పారు.చదవండి: 50 ఓవర్ల క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం -
మహిళల ప్రపంచకప్లో నేడు భారత్ X పాకిస్తాన్
భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్లు వరుసగా నాలుగో ఆదివారం అంతర్జాతీయ వేదికపై తలపడనున్నాయి. అయితే ఈ సారి ఇది మహిళల సమరం. వన్డే వరల్డ్ కప్లో భాగంగా నేడు కొలంబోలో భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. బలాబలాలపరంగా చూస్తే పాక్కంటే భారత్ ఎంతో మెరుగైన స్థితిలో ఉంది. ఇరు జట్ల మధ్య గతంలో 11 వన్డేలు జరగ్గా అన్నీ భారతే గెలిచింది. పాక్ ఒక్క మ్యాచ్లోనూ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. భారత్ కనీసం 80 పరుగుల తేడాతో లేదా... 5 వికెట్ల తేడాతో ఈ మ్యాచ్లలో విజయాలు సాధించింది. ఈ సారి కూడా ఫలితం అదే వచ్చే అవకాశం ఉంది. ఈ టోర్నీ తొలి పోరులో శ్రీలంకపై సునాయాస విజయం సాధించగా... పాక్ జట్టు బంగ్లా చేతిలో చిత్తుగా ఓడింది. పురుషుల ఆసియా కప్ తరహాలోనే ఈ మ్యాచ్లోనూ పాక్ క్రికెటర్లతో కరచాలనం చేయరాదని హర్మన్ సేన నిర్ణయించింది. ఈ మ్యాచ్ కోసం భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. మరో వైపు కొలంబోను వర్షాలు వెంటాడుతున్నాయి. ఇదే వేదికపై శనివారం ఆసీస్, శ్రీలంక మధ్య మ్యాచ్ రద్దయిన నేపథ్యంలో నేటి మ్యాచ్కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. -
ఆసియాకప్ ట్రోఫీని భారత్కు ఇవ్వొద్దు.. ఆ మొండితనం ఏంటి?
భారత క్రికెట్ జట్టు ఆసియాకప్ విజేతగా నిలిచి ఐదు రోజులు అవుతున్నప్పటికి ట్రోఫీ మాత్రం ఇంకా తమ వద్దకు చేరలేదు. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదగా మెడల్స్తో పాటు ట్రోఫీని అందుకోవడానికి భారత్ నిరాకరిచింది.పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్తో పాటు ఆ దేశ మంత్రిగా ఉండడంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో నఖ్వీ ట్రోఫీని, మెడల్స్ను తనతో పాటు తీసుకుని వెళ్లిపోయాడు. అతడి తీరుపై బీసీసీఐ తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. దీంతో దిగొచ్చిన నఖ్వీ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డు అందజేయనున్నట్లు వార్తలు వచ్చాయి.కానీ ఇప్పటివరకు యూఏఈ క్రికెట్ బోర్డు, బీసీసీఐ గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా ఈ ట్రోఫీ వివాదంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా తన చేతుల మీదగా ట్రోఫీని తీసుకోకూడదనే వైఖరిని కొనసాగిస్తే, నఖ్వీని తన నిర్ణయాన్ని మార్చుకోవద్దని అలీ సూచించాడు. ఈ పాక్ మాజీ క్రికెటర్ టీమిండియాపై మరోసారి తన అక్కసు వెళ్లగక్కాడు."టీమిండియా నంబర్ వన్ జట్టుగా కొనసాగుతోంది. కానీ వారు చేసే పనులు మాత్రం థర్డ్ క్లాస్ను తలపిస్తున్నాయి. మొహ్సిన్ నఖ్వీనే ఆసియాకప్ ట్రోఫీని అందజేయాలి. వారు అందుకు నిరాకరిస్తే, ఖచ్చితంగా ప్రపంచం దృష్టిలో చెడ్డ పేరు తెచ్చుకుంటారు.అటువంటి అప్పుడు ఎట్టిపరిస్థితిలలోనూ ట్రోఫీని అప్పగించకూడదు. భారత్ బాగా ఆడి గెలిచింది. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ మొండితనం ఏంటి? మొహ్సిన్ నఖ్వీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మెన్గా ఉన్నారు. అదే ఐసీసీ ఈవెంట్ అయివుండి చైర్మెన్ జై షా నుండి పాకిస్తాన్ ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించినా కూడా నేను తప్పు పట్టేవాడిని" అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలీ పేర్కొన్నాడు.కాగా ఈ ఏడాది ఆసియాకప్ టోర్నీలో మొత్తంగా మూడు సార్లు పాక్ను భారత్ చిత్తు చేసింది. అయితే అతడి వ్యాఖ్యలకు టీమిండియా అభిమానులు కౌంటరిస్తున్నారు. ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేదు, ముందు మీ జట్టు సంగతి చూసుకో అని నెటిజన్లు పోస్ట్లు పెడుతున్నారు.చదవండి: IND vs AUS: పాపం తిలక్ వర్మ.. సెంచరీ జస్ట్ మిస్! భారత్ స్కోరెంతంటే? -
ట్రోఫీ కావాలంటే నా ఆఫీస్కు వచ్చి తీసుకో.. భారత కెప్టెన్కు నఖ్వీ షరతు
ఆసియా కప్ (Asia cup 2025) ట్రోఫీ విషయంలో ఏసీసీ (Asia Cricket Council) అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ (Mohsin Naqvi) మొండిపట్టు వీడటం లేదు. తన వద్ద ఉంచుకున్న ట్రోఫీని నిర్వహకులకు ఇచ్చేయాలని నిన్న (సెప్టెంబర్ 30) జరిగిన ఏసీసీ సమావేశంలో బీసీసీఐ ఉపాథ్యక్షుడు రాజీవ్ శుక్లా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడు. పైగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు (Surya Kumar Yadav) కొత్త షరతు పెట్టాడు.ట్రోఫీ కావాలంటే స్వయంగా నా ఆఫీస్కు వచ్చి తీసుకోవాలని అహంకారపూరిత వ్యాఖ్యలు చేశాడు. నఖ్వీ వాఖ్యలపై భారత క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నఖ్వీ ఓవరాక్షన్ చూస్తుంటే రక్తం మరిగిపోతుందంటూ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. నఖ్వీ విషయంలో బీసీసీఐ, ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. తక్షణమే అతన్ని ఏసీసీ అధ్యక్ష హోదా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.కాగా, ఆసియా కప్ ఫైనల్లో భారత్ పాక్ను చిత్తుగా ఓడించి ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న మొహిసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకునేందుకు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిరస్కరించాడు. ఇందుకు ప్రతిగా నఖ్వీ భారత ఆటగాళ్లకు అందించాల్సిన మెడల్స్ను, ట్రోఫీని ఎత్తుకెళ్లిపోయాడు. నఖ్వీ ట్రోఫీ ఇవ్వకపోయినా భారత ఆటగాళ్లు కృత్రిమంగా ట్రోఫీని అందుకున్నట్లు సంబురాలు చేసుకున్నారు. దీనిపై నిన్న జరిగిన ఏసీసీ సర్వసభ్య సమావేశం బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. అయినా నఖ్వీ మొండిపట్టు వీడలేదు. ట్రోఫీ గురించి ఏజీఎంలో చర్చించాల్సిన అవసరం లేదని, మరో సమావేశంలో మాట్లాడుకుందామని దాటవేశాడు. నఖ్వీ ప్రవర్తనపై యావత్ భారతావణి మండిపడుతుంది. వీడి వేశాలేంట్రా బాబు అని అనుకుంటుంది. ట్రోఫీ తీసుకున్నా, తీసుకోకపోయినా విజేతలం మనమే అని సర్దుకుపోతుంది.చదవండి: అయ్యయ్యో! పుండు మీద కారం జల్లినట్లుగా.. -
ఆ పాక్ ఆటగాడికి థ్యాంక్స్.. అతడి వల్లే గెలిచాము: అశ్విన్
ఆసియాకప్-2025ను సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ను ఓడించి టైటిల్ను భారత్ ముద్దాడింది. ఈ విజయంలో భారత టాపార్డర్ బ్యాటర్ తిలక్ వర్మది కీలక పాత్ర. 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా కేవలం 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్టార్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ తమ మార్క్ చూపించలేకపోయారు. ఈ సమయంలో తిలక్ వర్మ(69) జట్టు బాధ్యతను తన భుజానపై వేసుకున్నాడు. ఆఖరి వరకు ఆజేయంగా నిలిచి భారత్ను ఛాంపియన్గా నిలిపాడు. దీంతో తిలక్ వర్మపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురిసింది. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేరాడు. మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడిన తిలక్ వర్మను అశూ ప్రశంచాడు. ఈ లెజెండరీ స్పిన్నర్ సెటైరికల్గా పాకిస్తాన్ పేసర్ హరిస్ రౌఫ్కు కూడా కృతజ్ఞతలు తెలిపాడు.భారత్తో జరిగిన సూపర్-4 మ్యాచ్లో రవూఫ్ తన ఓవరాక్షన్తో వార్తల్లో నిలిచాడు. మైదానంలో ఫీల్డింగ్ చేస్తుండగా అభిమానులు కోహ్లి, కోహ్లి అని అరవగా.. రవూఫ్ ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత ఫైటర్ జెట్లను కూల్చేశామని సైగలు చేశాడు.దీంతో అతడిపై భారత అభిమానులు ఫైరయ్యారు. ఫైనల్లో మ్యాచ్లో భారత బ్యాటర్లు అతడిని ఉతికారేశారు. అతడు ఓకే ఓవర్లో ఏకంగా 17 పరుగులు ఇచ్చాడు. అతడు కేవలం 3.4 ఓవర్లలో 50 పరుగులు ఇచ్చి పాక్ ఓటమికి, భారత్ గెలుపునకు పరోక్షంగా కారణమయ్యాడు. ఈ కారణంతోనే అతడికి అశ్విన్ ధన్యవాదాలు తెలిపాడు."తిలక్ వర్మ తన అద్బుతమైన ఇన్నింగ్స్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ మ్యాచ్లో అతడు తన పరిపక్వతను చూపించాడు. తిలక్ ఆడిన ఇన్నింగ్స్ గురించి ఎంతచెప్పుకొన్న తక్కువే. తిలక్ వర్మ ఒత్తిడిని తట్టుకుని ఆడాడు. స్పిన్నర్లను కూడా అద్బుతంగా ఎదుర్కొన్నాడు. అదేవిధంగా హారిస్ రవూఫ్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అతడి బౌలింగ్ వల్లే మేము సునాయసంగా మ్యాచ్ను గెలిచాము. తిలక్ వికెట్ పై బౌన్స్ కొంచెం ఉందని గ్రహించి స్క్వేర్ గా ఆడటం ప్రారంభించాడు. అతడి షాట్ సెలక్షన్ కూడా బాగుంది.హరిస్ రౌఫ్ వేసిన ఆఖరి ఓవర్లో తిలక్ వర్మ కొట్టిన సిక్స్ చాలా సులభం అని అంతా అనుకుంటున్నారు. కానీ ఆ షాట్ ఆడటం చాలా కష్టం. లైన్ లో పడిన బంతిని పిక్ చేయడం అంత సులువు కాదు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్లు కూడా బాగా బౌలింగ్ చేశారు. వారి కమ్బ్యాక్ వల్లే పాక్ను 150 పరుగులు లోపు కట్టడి చేయగలిగాము" అని తన యూట్యూబ్ ఛానెల్ అశ్విన్ పేర్కొన్నాడు. -
'అతడు కోచ్గా పనికిరాడు.. చెత్త కెప్టెన్సీ కూడా'.. పాక్ టీమ్పై అక్తర్ ఫైర్
ఆసియాకప్ 2025 ఫైనల్లో భారత్ చేతిలో పాకిస్తాన్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 146 పరుగులకు ఆలౌటైంది. ఒకనొక దశలో స్కోర్ బోర్డు 200 పరుగులు దాటేలా కన్పించినప్పటికి భారత బౌలర్లు కమ్బ్యాక్ ఇవ్వడంతో పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పేక మేడలా కుప్పకూలింది. ఆ తర్వాత లక్ష్య చేధనలో భారత్ తడబడినప్పటికి.. మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ(69) అద్భుతపోరాటంతో జట్టును ఛాంపియన్గా నిలిపాడు. అయితే భారత్ చేతిలో ఓటమిని పాక్ మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.ఈ క్రమంలో లెజెండరీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.. పాకిస్తాన్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్పై విమర్శలు గుప్పించాడు. జట్టు ప్లానింగ్ లో లోపాలు ఉన్నాయని, యువ ఆటగాళ్లకు సరైన అవకాశాలు ఇవ్వడం లేదని అక్తర్ మండిపడ్డాడు."టీమ్ మెనెజ్మెంట్ సరైన వ్యూహాలను రచించడంలో పూర్తిగా విఫలమైంది. సెన్స్లెస్ కోచింగ్. హెడ్ కోచ్ ఏమి నిర్ణయాలు తీసుకుంటున్నాడో నాకు ఆర్ధం కావడం లేదు. అతడు కోచ్గా పనికిరాడు. ఇలా కఠినంగా మాటలు ఆడుతున్నందుకు క్షమించండి. జట్టు సెలక్షన్ కూడా బాగోలేదు. యువ ఆటగాడు హసన్ నవాజ్ను మళ్లీ బెంచ్కే పరిమితం చేశారు. అతడొక మ్యాచ్ విన్నర్. అయినా అతడిని ఆడించడం లేదు. అంతేకాకుండా పేసర్ సల్మాన్ మీర్జా ఓ అవకాశమివ్వాల్సింది. ఒక్క మ్యాచ్లో కూడా అతడిని ఆడించలేదు. ఈ ఓటమి మమ్మల్ని చాలా బాధించింది. దేశం మొత్తం గెలుపు కోసం ఎదురు చూసింది. కానీ మరోసారి మమ్మల్ని నిరాశపరిచారు. మిడిలార్డర్లో బ్యాటింగ్ కష్టాలు ఇప్పటికి కొనసాగుతున్నాయి. అందరికి ఆ విషయం తెలుసు. కానీ అందుకు పరిష్కారం మాత్రం మెనెజ్మెంట్ వెతకడం లేదు.మిడిలార్డర్లో మొహమ్మద్ నవాజ్పై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అంతేకాకుండా లోయార్డర్లో బ్యాటర్లు కనీసం 50 పరుగులు జోడించాలని ఆశిస్తున్నారు. కొన్ని సార్లు షాహీన్ అఫ్రిదిని ఫహీమ్ అష్రఫ్ కంటే ముందు బ్యాటింగ్ పంపుతున్నారు. ఆఖరిలో వారు రాణిచండం వల్లే 175 పరుగులకు చేరుకోగల్గుతున్నారు. ఏదేమైనప్పటికి చాలా లోపాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దుకోవాల్సి ఉంది.సల్మాన్ కెప్టెన్సీ కూడా బాగోలేదు. బౌలింగ్ మార్పులు చేయడంలో అతడు విఫలమయ్యాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నప్పుడు.. హారిస్ రౌఫ్ను తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అతడు ఒకే ఓవర్లో 17 పరుగులు ఇచ్చాడు. ఇదే మ్యాచ్ను టర్న్ చేసింది. పాక్ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి" అని తప్మాడ్ అనే ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ పేర్కొన్నాడు. -
హైదరాబాద్లో సందడి చేసిన ఆసియా కప్ ఫైనల్ హీరో
సెప్టెంబర్ 28న పాకిస్తాన్తో జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్లో (Asia Cup 2025) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి భారత్ను ఒంటిచేత్తో గెలిపించిన హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ (Tilak Varma).. ఇవాళ నగరంలో సందడి చేశాడు. తాను చిన్నతనంలో శిక్షణ పొందిన లేగాలా క్రికెట్ అకాడమీని (Legala Cricket Academy) సందర్శించాడు. తిలక్ను చూసేందుకు క్రికెట్ అభిమానులు ఎగబడ్డారు. తిలక్కు, అతని కోచ్ సలామ్ బయాష్కు అకాడమీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా తిలక్ మాట్లాడుతూ.. ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా గెలవడం చాలా సంతృప్తినిచ్చింది. ఆ మ్యాచ్లో టీమిండియాను గెలిపించడమే టార్గెట్గా పెట్టుకొని ఆడాను. ఆ సమయంలో మా కళ్ల ముందు దేశమే కనిపించింది. నేను ఆడిన ఇన్నింగ్స్లలో ఇదే అత్యుత్తమమైంది. ఫైనల్లో పాక్ ఆటగాళ్ల స్టెడ్జింగ్ మాపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. విరాట్ కోహ్లి నాకు ఎంతో స్పూర్తినిచ్చాడు. విరాట్ కోహ్లితో నన్ను పోల్చడం గర్వంగా ఉందని అన్నాడు.కాగా, 23 ఏళ్ల తిలక్కు లెగాలా క్రికెట్ అకాడమీనే పునాది. లింగంపల్లి ప్రాంతంలో ఉన్న ఈ అకాడమీ తిలక్కు క్రికెట్లో తొలి పాఠాలు నేర్పింది. కోచ్ సలాం బయాష్ మార్గదర్శకత్వంలో తిలక్ 11 ఏళ్ల వయసులోనే ప్రతిభను చాటాడు. తిలక్ ఇంటి నుంచి అకాడమీకి రోజూ 40 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వచ్చేది.కోచ్ సలాం బయాష్ తిలక్ను స్వయంగా తన వాహనంలో తీసుకొచ్చి, తిరిగి ఇంటికి చేర్చేవాడు. 2020లో తిలక్ అండర్-19 వరల్డ్కప్కు ఎంపిక కావడంలో అకాడమీ పాత్ర చాలా కీలకం. తిలక్ టీమిండియాకు ఎంపికయ్యే వరకు వారానికి నాలుగు రోజుల పాటు అకాడమీకి వెళ్లేవాడు. ఆసియా కప్ హీరోయిక్స్ తర్వాత తిలక్ హైదారాబాద్ యువతకు స్పూర్తిగా మారాడు. చదవండి: టీమిండియాకు బ్యాడ్ న్యూస్ -
కొనసాగుతున్న ఆసియా కప్ హైడ్రామా.. ట్రోఫీ తిరిగి ఇచ్చేందుకు షరతులు పెట్టిన నఖ్వీ
ఆసియా కప్ 2025 (Asia cup 2025) హైడ్రామా ఇంకా కొనసాగుతూనే ఉంది. టోర్నీ ముగిసి రెండు రోజులైనా ఛాంపియన్గా నిలిచిన భారత జట్టుకు (Team India) విన్నింగ్ ట్రోఫీ అందలేదు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహిసిన్ నఖ్వీ (Mohsin Naqvi) చేతుల మీద నుంచి విన్నింగ్ ట్రోఫీని అందుకునేందుకు టీమిండియా నిరాకరించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా నఖ్వీ ట్రోఫీతో పాటు భారత ఆటగాళ్లకు ఇవ్వాల్సిన మెడల్స్ను తీసుకెళ్లిపోయాడు. భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకున్నా గెలుపు సంబురాలు అద్భుతంగా చేసుకున్నారు.తాజాగా నఖ్వీ తాను ఎత్తుకెళ్లి పోయిన ట్రోఫీని, మెడల్స్ను భారత ఆటగాళ్లకు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించినట్లు తెలుస్తుంది. అయితే ఇందుకు ఓ కండీషన్ పెట్టాడట. అతనే స్వయంగా భారత కెప్టెన్కు ట్రోఫీని, మిగతా ఆటగాళ్లకు మెడల్స్ను ఇస్తానని చెప్పాడట. నఖ్వీ పెట్టిన ఈ కండీషన్కు భారత ఆటగాళ్లు ససేమిరా అన్నట్లు సమాచారం. ఈ వివాదం అతి త్వరలో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇవాళ (సెప్టెంబర్ 30) జరుగబోయే ఏసీసీ సమావేశంలో బీసీసీఐ నఖ్వీని తూర్పారబెట్టాలని డిసైడైంది. ఇది అతని పదవికే ముప్పు తెచ్చిపెట్టవచ్చు. ఈ వివాదాన్ని బీసీసీఐ ఐసీసీ వరకు కూడా తీసుకెళ్లకుండా ఏసీసీలోనే తెంచేయాలని కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తుంది.కాగా, సెప్టెంబర్ 28న జరిగిన ఆసియా కప్ ఫైనల్లో భారత్ పాకిస్తాన్ను 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఉత్కంఠగా సాగిన లో స్కోరింగ్ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పాక్.. కుల్దీప్ యాదవ్ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.అనంతరం 147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ సైతం తొలుత తడబడినప్పటికీ.. తిలక్ వర్మ (53 బంతుల్లో 69; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ద శతకంతో టీమిండియాను గెలిపించాడు. సంజూ శాంసన్ (24), శివమ్ దూబే (33) తిలక్కు సహకరించారు. రింకూ సింగ్ బౌండరీ బాది మ్యాచ్ను ముగించాడు.ఈ టోర్నీలో భారత్ మొత్తం మూడు సార్లు పాక్ను ఓడించింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు హ్యాండ్షేక్ను నిరాకరించారు. దీన్ని అవమానంగా భావించిన పీసీబీ నానా యాగీ చేసినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.తమకు అనుకూలంగా ఏదీ జరగడం లేదని తెలిసి పీసీబీ వారి ఆటగాళ్లను రెచ్చగొట్టింది. భారత్ను, భారత ఆటగాళ్లను ఉద్దేశిస్తూ పాక్ ఆటగాళ్లు హరీస్ రౌఫ్, సాహిబ్జాదా ఫర్హాన్ చాలా ఓవరాక్షన్ చేశారు. దీనికి కూడా పాక్ ఆటగాళ్లు మూల్యం చెల్లించుకున్నారు. పాక్ ఆటగాళ్ల కవ్వింపులకు ఎక్కడా సహనం కోల్పోని టీమిండియా మైదానంలో వారికి తగు రీతో బద్ది చెప్పింది.చదవండి: ప్రపంచ క్రికెట్లో పెను సంచలనం.. మాజీ ఛాంపియన్ను మట్టికరిపించిన పసికూన -
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్
టీమిండియా వికెట్కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson) చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన వికెట్కీపర్ బ్యాటర్గా అవతరించాడు. తాజాగా జరిగిన ఆసియా కప్ ఫైనల్లో సంజూ ఈ ఘనత సాధించాడు. ఎంఎస్ ధోని (MS Dhoni) పేరిట ఉండిన ఈ రికార్డును సంజూ తన పేరిట బదిలి చేసుకున్నాడు.పాకిస్తాన్తో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో (Asia Cup 2025) సంజూ ఓ సిక్సర్ కొట్టాడు. దీంతో కలుపుకొని టీ20ల్లో అతని సిక్సర్ల సంఖ్య 55కి చేరింది. కేవలం 48 ఇన్నింగ్స్ల్లోనే సంజూ ఈ సిక్సర్లను బాదాడు. ధోని విషయానికొస్తే.. అతని ఖాతాలో 54 టీ20 సిక్సర్లు ఉన్నాయి. ఈ విభాగంలో సంజూ, ధోని తర్వాతి స్థానంలో రిషబ్ పంత్ ఉన్నాడు. పంత్ ఖాతాలో 52 సిక్సర్లు ఉన్నాయి.ఆసియా కప్లో సంజూ మరో ఘనత కూడా సాధించాడు. ఓ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత వికెట్కీపర్ బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. ఈ టోర్నీలో సంజూ మొత్తం 7 సిక్సర్లు బాదాడు. గతంలో ఈ రికార్డు ధోని, పంత్ పేరిట సంయుక్తంగా ఉంది. ధోని 2009 టీ20 వరల్డ్కప్లో, పంత్ 2024 టీ20 వరల్డ్కప్లో తలో 6 సిక్సర్లు బాదారు.కాగా, ఆసియా కప్ 2025లో భారత్ విజేతగా అవతరించింది. ఫైనల్లో పాకిస్తాన్పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది, 9వ సారి ఆసియా ఛాంపియన్గా నిలిచింది. ఉత్కంఠగా సాగిన లో స్కోరింగ్ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పాక్.. కుల్దీప్ యాదవ్ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.అనంతరం 147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ సైతం తొలుత తడబడినప్పటికీ.. తిలక్ వర్మ (53 బంతుల్లో 69; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ద శతకంతో టీమిండియాను గెలిపించాడు. సంజూ శాంసన్ (24), శివమ్ దూబే (33) తిలక్కు సహకరించారు. రింకూ సింగ్ బౌండరీ బాది మ్యాచ్ను ముగించాడు. ఈ టోర్నీలో భారత్ మొత్తం మూడు సార్లు పాక్ను ఓడించింది. చదవండి: ప్రపంచ క్రికెట్లో పెను సంచలనం.. మాజీ ఛాంపియన్ను మట్టికరిపించిన పసికూన -
ఐదు రోజుల్లో మరోసారి భారత్, పాకిస్తాన్ క్రికెట్ సమరం
తాజాగా ముగిసిన పురుషుల ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్ (India vs Pakistan) జట్లు ఏకంగా మూడు సార్లు ఎదురెదురుపడ్డాయి. గ్రూప్ దశ, సూపర్-4, ఫైనల్లో.. తలపడిన ప్రతిసారి భారత్ పాక్ను చిత్తుగా ఓడించి, తొమ్మిదో సారి ఆసియా ఛాంపియన్గా అవతరించింది. ఈ ఆసియా కప్ టోర్నీలో మునుపెన్నడూ చోటు చేసుకొని హైడ్రామా చోటు చేసుకుంది.పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు హ్యాండ్షేక్కు నిరాకరించారు. టీమిండియాను ఏమీ చేసుకోలేక పాక్ క్రికెట్ బోర్డు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్పై ఐసీసీకి ఫిర్యాదు చేసి శునకానందం పొందింది. ఐసీసీ తిరిగి వారికే అక్షింతలు వేయడంతో తోకముడిచి భారత ఆటగాళ్లను, భారతీయులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది.సూపర్-4 దశ మ్యాచ్లో పాక్ ఆటగాళ్లు హరీస్ రౌఫ్, సాహిబ్జాదా ఫర్హాన్ భారత ఆటగాళ్లను సంజ్ఞలతో కవ్వించే ప్రయత్నం చేశారు. టీమిండియా మాత్రం ఈసారి కూడడా ఆటతీరుతోనే వారికి బుద్ది చెప్పింది.ఫైనల్లో భారత్ పాక్ను ముచ్చటగా మూడోసారి ఓడించిన తర్వాత డ్రామా మరింత రక్తి కట్టింది. టైటిల్ గెలిచిన తర్వాత భారత ఆటగాళ్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్కు ఛైర్మన్గా ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని అందుకునేందుకు నిరాకరించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత క్రికెటర్లు ఆసియా కప్ వేదికగా పాక్ ఆటగాళ్లకు చేయాల్సిన మర్యాదంతా చేశారు. పాకిస్తాన్ను క్రికెట్ మైదానంలో మరో దెబ్బ కొట్టేందుకు టీమిండియాకు అతి త్వరలో మరో అవకాశం రానుంది. ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్కప్-2025లో (ICC Women's World Cup 2025) భారత్ అక్టోబర్ 5న పాకిస్తాన్తో తలపడనుంది. ఈసారి కూడా టీమిండియా పాక్ను చిత్తుగా ఓడించాలని యావత్ భారతావణి కోరుకుంటుంది. ఈ మ్యాచ్ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగనుంది. ఈ మెగా టోర్నీకి శ్రీలంకతో పాటు భారత్ కూడా ఆతిథ్యమిస్తున్నా.. రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పాక్ మ్యాచ్లన్నీ శ్రీలంకలో నిర్వహిస్తున్నారు. మొత్తానికి మరో 5 రోజుల్లో పాక్కు బుద్ది చెప్పే అవకాశం భారత్కు మరోసారి రానుంది.కాగా, మహిళల వన్డే వరల్డ్కప్ రేపటి నుంచే (సెప్టెంబర్ 30) ప్రారంభం కానుంది. గౌహతి వేదికగా జరిగే మ్యాచ్లో భారత్, శ్రీలంక తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమవుతుంది. చదవండి: క్రికెట్ అభిమానులకు గుండెకోతను మిగిల్చిన 2025 -
Asia Cup 2025: సూర్యకుమార్ యాదవ్ చేశాడని పాకిస్తాన్ కెప్టెన్ కూడా..!
నిన్న (సెప్టెంబర్ 28) జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్లో (Asia cup 2025) భారత్ పాకిస్తాన్ను (India vs Pakistan) చిత్తుగా ఓడించి 9వ సారి టైటిల్ను (వన్డే, టీ20) కైవసం చేసుకుంది. టీమిండియా (Team India) టైటిల్ గెలిచిన అనంతరం చాలా హైడ్రామా చోటు చేసుకుంది.భారత ఆటగాళ్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్కు ఛైర్మన్గా ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని అందుకునేందుకు నిరాకరించారు. దీనికి ప్రతిగా నఖ్వీ టీమిండియాకు ఇవ్వాల్సిన ట్రోఫీని, మెడల్స్ను ఎత్తుకెళ్లిపోయాడు.భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకుండా సంబురాలు చేసుకొని నఖ్వీ పుండుపై కారం చల్లారు. మధ్యలో పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా నఖ్వీ చేతి నుంచి అందుకున్న రన్నరప్ చెక్ను అక్కడే పడేసి ఓవరాక్షన్ చేశాడు. పహల్గాం ఉగ్రవాడికి ప్రతిగా భారత ఆటగాళ్లు ఈ టోర్నీ ఆరంభం నుంచి పాక్ ఆటగాళ్లకు హ్యాండ్ షేక్ను నిరాకరించిన విషయం తెలిసిందే. ఫైనల్ సహా ఇరు జట్లు తలపడిన మూడు సందర్భాల్లో ఇదే జరిగింది.ఈ హైడ్రామా నడుమ టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సంచలన నిర్ణయం తీసుకొని పాకిస్తానీల గుండెల్లో అగ్గి రాజేస్తూ, తన దేశభక్తిని చాటుకున్నాడు. ఆసియా కప్ ద్వారా అతనికి లభించబోయే మ్యాచ్ ఫీజ్ మొత్తాన్ని పహల్గాం ఉగ్రదాడిలో బాధిత కుటుంబాలకు, అలాగే భారత సాయుధ దళాలకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు.స్కై తీసుకున్న ఈ నిర్ణయంపై యావత్ భారతావణి హర్షం వ్యక్తం చేస్తుంది. భారతీయులంతా స్కైను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. స్కైను కాపీ కొడుతూ పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా (Salman Agha) 'ఆపరేషన్ సిందూర్' బాధితులకు తన ఆసియా కప్ మ్యాచ్ ఫీజ్ మొత్తాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు.కాగా, నిన్న జరిగిన ఫైనల్లో పాకిస్తాన్పై టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ లో స్కోరింగ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పాక్.. కుల్దీప్ యాదవ్ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.అనంతరం 147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ సైతం తడబడింది. అయితే తిలక్ వర్మ (53 బంతుల్లో 69; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ద శతకంతో టీమిండియాను గెలిపించాడు. సంజూ శాంసన్ (24), శివమ్ దూబే (33) తిలక్కు సహకరించారు. రింకూ సింగ్ బౌండరీ బాది మ్యాచ్ను ముగించాడు.చదవండి: Asia Cup: సూర్యకుమార్ యాదవ్ సంచలన నిర్ణయం.. -
అంత పొగరా?.. స్టేజ్ పైనే చెక్ను విసిరేసిన పాక్ కెప్టెన్! వీడియో
ఆసియాకప్-2025లో భారత్-పాకిస్తాన్ జట్లు మూడు సార్లు తలపడ్డాయి. మూడు సార్లు కూడా పాక్కు జట్టుకు భారత్ చేతిలో పరాభావం ఎదురైంది. లీగ్ స్టేజి, సూపర్-4లో టీమిండియాపై ఓటమి చవిచూసిన పాకిస్తాన్కు ఇప్పుడు ఫైనల్లో కూడా భంగపాటు తప్పలేదు.ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన తుది పోరులో 5 వికెట్ల తేడాతో పాక్పై భారత్ ఘన విజయం సాధించింది. అయితే భారత్ చేతిలో ఓటమిని పాక్ ఆటగాళ్లు జీర్ణించుకులేకపొతున్నారు. అంతకుతోడు భారత ఆటగాళ్లు కనీసం కరచాలనం చేయకపోవడం, ఫైనల్ ప్రెజెంటేషన్ వేడుకలలో వారితో కలిసి పాల్గోకపోవడంతో దాయాది ఆటగాళ్లు ఫ్రస్టేషన్ పీక్స్ చేరింది.ఫైనల్ మ్యాచ్ ముగిసినంతరం ఏసీసీ ఛీప్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు భారత జట్టు నిరాకరించింది. పాక్ ఆటగాళ్లు పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సెర్మనీకు సిద్దంగా ఉన్నప్పటికి భారత ఆటగాళ్లు మాత్రం వేదిక దగ్గరకు కూడా రాలేదు. దీంతో పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సెర్మనీ దాదాపు గంట ఆలస్యంగా ప్రారంభమైంది. కేవలం పాక్ ఆటగాళ్లు మాత్రమే రన్నరప్ మెడల్స్ను తీసుకున్నారు.పాక్ కెప్టెన్ ఓవరాక్షన్..ఈ క్రమంలో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాకు ఆసియన్ క్రికెట్ కౌన్సెల్ (ఏసీసీ) చైర్మెన్, ఏసీసీ ప్రతినిథి ఆమినుల్ ఇస్లాం రన్నరప్ టైటిల్ అందజేశారు. అయితే ఇక్కడే సల్మాన్ అలీ ఓవరాక్షన్ చేశాడు. చెక్కు తీసుకున్న పాక్ కెప్టెన్ వెంటనే స్టేజ్ మీద నుంచి కిందకు విసిరేశాడు.అతడి తీరుతో వేదిక మీద ఉన్న వారు షాక్కు గురయ్యారు. మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా టీమిండియా ఆసియా కప్ టైటిల్ అందుకోవడానికి ఇష్టపడకపోవడంతో సల్మాన్ ఇలా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత స్టేజిపై నుంచి కిందకు వస్తుండగా సల్మాన్ను భారత్ ఫ్యాన్స్ గట్టిగా అరుస్తూ హేళన చేశారు. దీంతో అతడు చేసేదేమి లేక నవ్వుతూ వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు మరి అంత పొగరు పనికిరాదు అని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: Asia Cup 2025: ట్రోఫీ, మెడల్స్ని ఎత్తుకెళ్లిన పీసీబీ చైర్మెన్.. బీసీసీఐ సీరియస్Salman agha gadiki ekkado kalinattu vundi lucha gadu🤣🤣🤣 #INDvPAK pic.twitter.com/GkEn7deKZj— 𝙸𝚝𝚊𝚌𝚑𝚒 ❟❛❟ (@itachiistan1) September 28, 2025 -
చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్.. ఆసియాకప్ హిస్టరీలోనే
ఆసియాకప్-2025లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన ఫైనల్లో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కుల్దీప్ తన స్పిన్ మ్యాజిక్తో పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. చెలరేగి ఆడుతున్న పాక్ బ్యాటర్ల దూకుడుకు కళ్లెం వేశాడు.కుల్దీప్ యాదవ్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 30 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో కుల్దీప్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఆసియాకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా కుల్దీప్ నిలిచాడు. పాక్ బ్యాటర్ సైమ్ అయూబ్ను ఔట్ చేసినంతరం ఈ రికార్డును కుల్దీప్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక బౌలింగ్ దిగ్గజం లసిత్ మలింగ పేరిట ఉండేది.తాజా మ్యాచ్తో మలింగ(33 వికెట్లు) ఆల్టైమ్ రికార్డును యాదవ్ బ్రేక్ చేశాడు. కుల్దీప్ తన ఆసియాకప్(వన్డే, టీ20)లో ఇప్పటివరకు 36 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది ఆసియాకప్లో ఏడు మ్యాచ్లు ఆడిన కుల్దీప్ మొత్తంగా 17 వికెట్లు పడగొట్టాడు.అంతేకాకుండా ఒక ఆసియాకప్ ఏడిషన్లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్గా కూడా కుల్దీప్ రికార్డు స్పష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పేరిట ఉంది. ఆసియాకప్-2004లో పఠాన్ 14 వికెట్లు పడగొట్టాడు. తాజా ఎడిషన్లో 17 వికెట్లు సాధించిన కుల్దీప్.. పఠాన్ను అధిగమించాడు. కాగా ఫైనల్లో పాకిస్తాన్ను 5 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో రికార్డు స్ధాయిలో తొమ్మిదోసారి ఆసియాకప్ను భారత్ కైవసం చేసుకుంది.ఆసియాకప్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లు..కుల్దీప్ యాదవ్(భారత్)-36లసిత్ మలింగ(శ్రీలంక)-33ముత్తయ్య మురళీధరన్(శ్రీలంక)-30చదవండి: Asia Cup 2025: ట్రోఫీ, మెడల్స్ని ఎత్తుకెళ్లిన పీసీబీ చైర్మెన్.. బీసీసీఐ సీరియస్ -
సూర్యకుమార్ యాదవ్ సంచలన నిర్ణయం..
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన దేశభక్తిని చాటుకున్నాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో తను ఆడిన మ్యాచ్ల ఫీజుల మొత్తాన్ని భారత సైన్యంతో పాటు పహల్గాం ఉగ్రదాడిలో బాధితులైన కుటుంబాలకు సూర్య విరాళంగా ఇచ్చాడు.ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్ అనంతరం సూర్య తన నిర్ణయాన్ని వెల్లడించాడు. "ఆసియాకప్ టోర్నీలో వచ్చే నా మొత్తం మ్యాచ్ ఫీజును పహల్గామ్ ఉగ్రవాద దాడిలో బాధితులైన కుటంబాలకు, మన సాయుధ దళాలకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. మీరు ఎల్లప్పుడూ నా ఆలోచనలలో ఉంటారు. జై హింద్." అని ఎక్స్లో స్కై పేర్కొన్నాడు. ఈ ఖండాంతర టోర్నీలో మిస్టర్ 360 మొత్తం 7 మ్యాచ్లు ఆడాడు. ఒక్కో మ్యాచ్కు రూ. 4 లక్షలు అందుకుంటున్నాడు. ఈ ఏడు మ్యాచ్లకు గానూ రూ.28 లక్షలు మ్యాచ్ ఫీజు రూపంలో సూర్యకి దక్కనుంది. అయితే పాకిస్తాన్పై లీగ్ మ్యాచ్ విజయాన్ని సాయుధ దళాలకు అంకితం చేసినందుకు సూర్య మ్యాచ్ ఫీజులో ఐసీసీ 30 శాతం కోత విధించింది.దీంతో అతడు రూ. 26.80 లక్షలు డొనేట్ చేయనున్నాడు. కాగా ఆదివారం జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో పాక్ను భారత్ ఓడించింది. టీమిండియా ఆసియాకప్ను కైవసం చేసుకోవడం ఇది ఏడోసారి కావడం విశేషం. పాక్పై గెలుపుతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. కాగా టోర్నీ ఆరంభం నుంచే పాకిస్తాన్పై భారత్ తమ నిరసనను తెలియజేసింది. పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా ఈ టోర్నీ మొత్తంగా పాక్ ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్లు కరచాలనం చేయలేదు. ఆఖరికి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చీఫ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదగా ట్రోఫీని కూడా భారత్ తీసుకోలేదు.చదవండి: Asia Cup 2025: ట్రోఫీ, మెడల్స్ని ఎత్తుకెళ్లిన పీసీబీ చైర్మెన్.. బీసీసీఐ సీరియస్ -
ట్రోఫీ, మెడల్స్ని ఎత్తుకెళ్లిన పీసీబీ చైర్మెన్.. బీసీసీఐ సీరియస్
ఆసియాకప్-2025 ఛాంపియన్స్గా టీమిండియా నిలిచిన అనంతరం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్మైదానంలో హైడ్రామా చోటు చేసుకుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చీఫ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదగా ట్రోఫీని స్వీకరించడానికి భారత ఆటగాళ్లు నిరాకరించారు.ప్రోటోకాల్ ప్రకారం.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ బాస్ అయిన మొహ్సిన్ నఖ్వీనే విజేతకు ట్రోఫీ అందించాలి. కానీ భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల కారణంగా ట్రోఫీని అతడి నుంచి తీసుకోవాడనికి మెన్ ఇన్ బ్లూ సముఖత చూపలేదు.దీంతో దాదాపు గంట అలస్యంగా ప్రారంభమైన పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో కేవలం పాక్ ఆటగాళ్లే రన్నరప్ మెడల్స్ను అందుకున్నారు. అయితే భారత జట్టు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్-చైర్మన్ ఖలీద్ అల్ జరూని, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మెన్ అమీనుల్ ఇస్లాం చేతుల మీదగా ట్రోఫీని అందుకుంటామని తెలియజేసింది. అందుకు వారిద్దరూ అంగీకరించారు. కానీ మొహ్సిన్ నఖ్వీ మాత్రం తానే అందిస్తానని మొండిపట్టు పట్టాడు. దీంతో టీమిండియా పూర్తిగా ట్రోఫీనే తీసుకోమని తేల్చి చెప్పేసింది. భారత్ తీరుతో సహనం కోల్పోయిన పీసీబీ చీఫ్.. ఆసియా కప్ ట్రోఫీతో పాటు, టీమిండియా ఆటగాళ్లకు ఇవ్వాల్సిన మెడల్స్ను హోటల్కు తీసుకువెళ్లిపోయాడు. ఈ క్రమంలో నఖ్వీ వ్యవహరించిన తీరు పట్ల సర్వాత్ర విమర్శల వర్షం కురుస్తోంది. ఇదే విషయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. మొహ్సిన్ నఖ్వీ చర్యను భారత క్రికెట్ బోర్డు సీరియస్గా తీసుకుంటున్నట్లు సైకియా తెలిపారు.బీసీసీఐ సీరియస్.."భారత్-పాకిస్తాన్ మధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికి తెలుసు. పాకిస్తాన్ సీనియర్ లీడర్స్లో ఒకరిగా ఏసీసీ చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ కొనసాగుతున్నారు. అటువంటి అప్పుడు అతడి చేతుల మీదగా ట్రోఫీని ఎలా తీసుకుంటాము? అతడి నుంచి మేము ఆసియా కప్ ట్రోఫీని తీసుకోకూడదని ముందే నిర్ణయించుకున్నాము. అతడు చేతుల మీదగా తీసుకోవడం లేదంటే ట్రోఫీ వద్దని కాదు. ట్రోఫీని, పతకాలను హోటల్ గదికి తీసుకువెళ్లే హక్కు ఎవరు ఇచ్చారు? నఖ్వీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు. అతడికి కొంచెం కూడా జ్ఞానం లేదు. ఈ విషయంపై మేం ఐసీసీకి ఫిర్యాదు చేస్తాం. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. ట్రోఫీ, పతకాలు వీలైనంత త్వరగా భారత్కు పంపిస్తారని ఆశిస్తున్నా" అని ఎఎన్ఐతో సైకియా పేర్కొన్నాడు.చదవండి: అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్ -
నా కెరీర్లో ఇలా ఎప్పుడు జరగలేదు.. కానీ చాలా సంతోషంగా ఉంది: సూర్య
ఆసియాకప్-2025కు ఆదివారం(సెప్టెంబర్ 28) ఎండ్ కార్డ్ పడింది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను ఓడించిన భారత జట్టు.. రికార్డు స్ధాయిలో తొమ్మిదోసారి ఆసియాకప్ విజేతగా నిలిచింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం దుబాయ్ అంతర్జాతీయ మైదానంలో అనుహ్యపరిణామాలు చోటు చేసుకున్నాయి.ఈ టోర్నీ ఆరంభం నుంచే పాక్తో అంటి ముట్టకుండా ఉంటున్న భారత జట్టు.. ఫైనల్ మ్యాచ్లోనూ అదే తీరును కొనసాగించింది. అయితే ఈసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చైర్మెన్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీకి టీమిండియా ఝులక్ ఇచ్చింది.అతడి చేతుల మీదగా విన్నింగ్ ట్రోఫీని తీసుకోవడానికి భారత ఆటగాళ్లు నిరాకరించారు. మొహ్సిన్ నఖ్వీ ప్రస్తుతం పీసీబీ చైర్మెన్తో పాటు పాకిస్తాన్ మంత్రిగా కొనసాగుతున్నాడు. ఈ కారణంతోనే అతడి చేతుల మీదగా ట్రోఫీని తీసుకోవడానికి టీమిండియా సముఖత చూపలేదు. దీంతో గ్రౌండ్కు తీసుకొచ్చిన ట్రోఫీని వెనక్కి తీసుకెళ్లారు. భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే సంబరాలు చేసుకున్నారు. ఇదే విషయంపై పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. తన కెరీర్లో ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత ట్రోఫీ తీసుకోపోవడం ఇదే తొలిసారి సూర్య చెప్పుకొచ్చాడు."నా క్రికెట్లో కెరీర్లో ఇలాంటి సంఘటనను ఇప్పటివరకు చూడలేదు. ఓ జట్టు ఛాంపియన్స్గా తర్వాత ట్రోఫీని అందుకోకపోవడం ఇదే మొదటి సారి. మేము కష్టపడి ఛాంపియన్గా నిలిచినప్పటికి, ట్రోఫీని తిరస్కరించాలని నిర్ణయించుకున్నాము. మేము ఈ నెల 4వ తేదీ నుంచి ఇక్కడే(దుబాయ్) ఉన్నాము. ప్రతీ మ్యాచ్లోనూ వంద శాతం ఎఫక్ట్ పెట్టి విజయం సాధించాము. ఒక్క రోజు వ్యవధిలో వరుసగా రెండు మ్యాచ్లు ఆడి టైటిల్ను సొంతం చేసుకున్నాము. ఇందుకు మేము అన్ని రకాలగా అర్హులు. ఇంతకుమించి నేను చెప్పలేను. ట్రోఫీల గురించి మాట్లాడితే.. 14 మంది సహచరులు, సహాయక సిబ్బంది రూపంలో నా డ్రెసింగ్ రూమ్లో ఉన్నాయి. నా దృష్టిలో వారే నిజమైన ట్రోఫీలు. ఈ ఆసియా కప్ ప్రయాణంలో సపోర్ట్ స్టాప్ మాకు అన్ని విధాలగా అండగా నిలిచారు. మా కుర్రాళ్లు కూడా టోర్నీ అంతటా అద్బుతంగా రాణించారు. ఫైనల్ మ్యాచ్లో గెలవాలనకున్నాము. మేము అనుకున్నట్లు గెలిచాం. మ్యాచ్ ముగిసిన తర్వాత బిగ్ స్క్రీన్పై భారత్ గెలిచినట్లు, ఆసియా కప్ 2025 ఛాంపియన్స్ అని రాసి ఉంది. అంతకంటే మాకు ఇంకేమి కావాలి. చాలా సంతోషంగా ఉంది అని" సూర్య పేర్కొన్నాడు. అయితే హ్యాండ్ షేక్ వివాదం, ట్రోఫీ తీసుకోకపోవడానికి కారణాలపై పాక్ జర్నలిస్టు అడిగిన సమాధానాలను సూర్య దాటవేశాడు. చదవండి: అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్ -
అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు టీమిండియా చేతిలో మరోసారి చావు దెబ్బ ఎదురైంది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఆసియాకప్ ఫైనల్లో పాక్ను ఐదు వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో 13 ఏళ్ల తర్వాత ఆసియాకప్ టైటిల్ను ముద్దాడాలన్న పాక్ ఆశలపై మెన్ ఇన్ బ్లూ నీళ్లు జల్లింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో కేవలం 146 పరుగులకే ఆలౌట్ అయింది. పెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ 57, ఫకర్ జమాన్ 46 పరుగులతో రాణించగా.. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో ప్రత్యర్ధి పతనాన్ని శాసించగా.. బుమ్రా, వరుణ్, అక్షర్ పటేల్ తలా రెండేసి వికెట్లు సాధించారు. అనంతరం 147 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ తిలక్ వర్మ(53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 69 పరుగులు నాటౌట్) చారిత్రత్మక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయామని అఘా చెప్పుకొచ్చాడు.జీర్ణించుకోలేక పోతున్నాం.."ఈ ఓటమిని మేం జీర్ణించుకోలేక పోతున్నాం. బ్యాటింగ్లో మెరుగ్గా రాణించలేకపోయాము. మాకు మంచి ఆరంభం లభించినప్పటికి భారీ స్కోర్ సాధించలేకపోయాము. బౌలింగ్లో మాత్రం మేము అద్భుతంగా రాణించాము. ఆఖరి వరకు గెలిచేందుకు అన్ని విధాలగా మేము ప్రయత్నించాము.బ్యాటింగ్లో మంచి ఫినిషింగ్ చేసి ఉంటే కథ వేరేలా ఉండేది. స్ట్రయిక్ని సరిగ్గా రొటేట్ చేయలేకపోయాం. కీలక సమయంలో వరుసగా వికెట్లు కోల్పోయాం. అందుకే మేము అనుకున్న స్కోర్ చేయలేకపోయాము. ఈ మ్యాచ్ నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాము.మా బ్యాటింగ్ తప్పిదాలను సరిదిద్దుకుంటాము. భారత బౌలర్లు కూడా బాగా బౌలింగ్ చేశారు. మా ఇన్నింగ్స్ మిడిల్ ఓవర్లలో అద్బుతమైన కమ్బ్యాక్ ఇచ్చారు. ఆఖరి 6 ఓవర్లలో భారత విజయానికి 63 పరుగులు అవసరమయ్యాయి. దీంతో మాకు గెలిచేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని భావించాను.కానీ దురదృష్టవశాత్తూ ఓటమి చవి చూశాము. అయితే మా బౌలర్లు కూడా తీవ్రంగా శ్రమించారు. వారి ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. ఈ టోర్నీలో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. మా తదుపరి సవాల్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాము.మేము బలంగా తిరిగి వస్తామన్న నమ్మకం మాకు ఉందని" పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో సల్మాన్ పేర్కొన్నాడు. కాగా ఈ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ను భారత్ బహిష్కరిచింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ అయిన మొహసిన్ నఖ్వీ చేతుల మీదగా ట్రోఫీని తీసుకునేందుకు టీమిండియా నిరాకరించింది.చదవండి: Asia Cup 2025: పట్టు బట్టిన పీసీబీ చైర్మెన్.. ఊహించని షాకిచ్చిన భారత్ -
పట్టు బట్టిన పీసీబీ చైర్మెన్.. ఊహించని షాకిచ్చిన భారత్
ఆసియాకప్-2025 విజేతగా టీమిండియా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో దాయాది పాకిస్తాన్ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత జట్టు.. తొమ్మిదో సారి ఆసియాకప్ టైటిల్ను ముద్దాడింది. ప్రత్యర్ధి నిర్ధేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించింది.భారత విజయంలో మిడిలార్డర్ బ్యాటర్, హైదరాబాదీ తిలక్ వర్మ (53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 69 పరుగులు నాటౌట్) కీలక పాత్ర పోషించాడు. లక్ష్య చేధనలో 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును తిలక్ వర్మ తన అద్బుత ఇన్నింగ్స్తో ఛాంపియన్గా నిలిపాడు.అతడితో పాటు సంజూ శాంసన్(24), శివమ్ దూబే(33) రాణించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. బుమ్రా, వరుణ్, అక్షర్ తలా రెండు వికెట్లు సాధించారు.ట్రోఫీని నిరాకరించిన భారత్.. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత హైడ్రామా చోటు చేసుకుంది. మ్యాచ్ ముగిసి 45 నిమిషాల సమయం దాటినా బహుమతి ప్రదానోత్సవం జరగలేదు. దాంతో ఏం జరిగిందనే అంశంపై చర్చ మొదలైంది. భారత జట్టు విజేత ట్రోఫీని స్వీకరించే విషయంలో వివాదం నెలకొనడమే అందుకు కారణమని తేలింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ అయిన మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా కప్ను అందుకునేది లేదని టీమిండియా స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్-చైర్మన్ ఖలీద్ అల్ జరూని, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మెన్ అమీనుల్ ఇస్లాం ట్రోఫీని అందించడానికి ముందుకొచ్చారు. అందుకు టీమిండియా కూడా అంగీకరించింది. కానీ మొహసిన్ నఖ్వీ మాత్రం తనే స్వయంగా ట్రోఫీ అందిస్తాని పట్టుబట్టాడు. దీంతో భారత్ ప్రేజెంటేషన్ వేడుకునే కాకుండా ఏకంగా ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించింది. దెబ్బకు పీసీబీ చైర్మెన్తో పాటు పాక్ ఆటగాళ్లు షాకయ్యారు.కేవలం పాక్ ఆటగాళ్లు మాత్రమే రన్నరప్ మెడల్స్ను అందుకున్నారు. భారత్ నుంచి తిలక్, దూబే, అభిషేక్ మాత్రం స్పాన్సర్ల నుంచి తమ వ్యక్తిగత బహుమతులు అందుకున్నారు. అయితే ఫైనల్ వేడుక ముగిసిన అనంతరం టీమిండియా ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవతున్నాయి.Big Breaking 🚨🚨Team India refuses to accept the Asia Cup 2025 Trophy 🏆 from Pakistan interior minister and ACC Chairman Mohsin Naqvi.Someone just picked up the trophy and walked off the ground.Another Embarrassing Moment for 🇵🇰Video 📷#INDvsPAK #AsiaCupFinal #Tilak pic.twitter.com/h4CrRZgcUF— Globally Pop (@GloballyPop) September 28, 2025చదవండి: ‘ఠాకూర్’ జితాదియా... -
ఆసియా కప్ విజేతగా టీమిండియా.. ఫైనల్లో పాకిస్తాన్పై గెలుపు
ఆసియా కప్ 2025 (Asia cup 2025) విజేతగా టీమిండియా (Team India) అవిర్భవించింది. ఇవాళ (సెప్టెంబర్ 28) జరిగిన ఫైనల్లో పాకిస్తాన్పై (India vs Pakistan) 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ లో స్కోరింగ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పాక్.. కుల్దీప్ యాదవ్ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (57), ఫకర్ జమాన్ (46) రాణించడంతో పాక్ తొలుత భారీ స్కోర్ చేసేలా కనిపించింది. 11.2 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి 100 పరుగుల మార్కును తాకిన ఆ జట్టు.. భారత బౌలర్లు ఒక్కసారిగా లైన్లోకి రావడంతో తట్టుకోలేకపోయింది.33 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 9 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో కుల్దీప్తో పాటు అక్షర్ పటేల్ (4-0-26-2), వరుణ్ చక్రవర్తి (4-0-30-2), బుమ్రా (3.1-0-25-2) కూడా సత్తా చాటారు. పాక్ ఇన్నింగ్స్లో ఓపెనర్లతో పాటు వన్ డౌన్ బ్యాటర్ సైమ్ అయూబ్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు.అనంతరం 147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ సైతం తడబడింది. అయితే తిలక్ వర్మ (53 బంతుల్లో 69; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ద శతకంతో టీమిండియాను గెలిపించాడు. సంజూ శాంసన్ (24), శివమ్ దూబే (33) తిలక్కు సహకరించారు. రింకూ సింగ్ బౌండరీ బాది మ్యాచ్ను ముగించాడు. అంతకుముందు భారత్ 20 పరుగులకే అభిషేక్ శర్మ (5), శుభ్మన్ గిల్ (12), సూర్యకుమార్ యాదవ్ (1) వికెట్లు కోల్పోయింది. పాక్ బౌలర్లలో ఫహీమ్ అఫ్రాఫ్ 3 వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్ తలో వికెట్ తీశారు. ఈ టోర్నీలో భారత్ పాక్పై గెలవడం ఇది మూడోసారి. అంతకుముందు గ్రూప్ దశలో, సూపర్-4లో కూడా టీమిండియానే విజయం సాధించింది. -
Asia cup 2025 Final: పాక్కు కౌంటరిచ్చిన బుమ్రా
భారత్, పాకిస్తాన్ (India vs pakistan) మధ్య జరుగుతున్న ఆసియా కప్ 2025 ఫైనల్లో (Asia cup 2025 Final) హైడ్రామా చోటు చేసుకుంది. సూపర్-4 మ్యాచ్లో పాక్ బౌలర్ హరీస్ రౌఫ్ (Haris Rauf) చేసిన ఓవరాక్షన్కు టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) కౌంటరిచ్చాడు.BUMRAH HAS GIVEN A PERFECT MEDICINE TO RAUF...!!! 🥶💥 pic.twitter.com/DpItOev4aO— Johns. (@CricCrazyJohns) September 28, 2025ఇన్నింగ్స్ 18వ ఓవర్లో అద్భుతమైన యార్కర్తో హరిస్ రౌఫ్ను క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా.. విమానం కూలిపోయినట్లు సంజ్ఞ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో హల్చల్ చేస్తుంది. రౌఫ్కు సరైన సమాధానం చెప్పావంటూ భారత అభిమానులు బుమ్రాను ప్రశంసిస్తున్నారు.సూపర్-4 మ్యాచ్లో రౌఫ్ ఫీల్డింగ్ చేసే సమయంలో విమానం క్రాష్ అయినట్లు సంజ్ఞలు చేశాడు. అలాగే ఆరు సంఖ్యను సూచిస్తూ చేతి వేళ్లను ప్రదర్శించాడు. రౌఫ్ చర్యలపై బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేయగా.. అతనికి 30 శాతం మ్యాచ్ ఫీజ్ను జరిమానాగా విధించారు.అదే మ్యాచ్లో మరో పాక్ ఆటగాడు కూడా అభ్యంతరకంగా ప్రవర్తించాడు. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అనంతరం బ్యాట్ను గన్లా భావిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇతనిపై కూడా బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అయితే ఫర్హాన్ను ఐసీసీ మందలింపుతో వదిలిపెట్టింది.కాగా, నేటి ఫైనల్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పాక్.. కుల్దీప్ యాదవ్ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (57), ఫకర్ జమాన్ (46) రాణించడంతో పాక్ తొలుత భారీ స్కోర్ చేసేలా కనిపించింది. 11.2 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి 100 పరుగుల మార్కును తాకిన ఆ జట్టు.. భారత బౌలర్లు ఒక్కసారిగా లైన్లోకి రావడంతో తట్టుకోలేకపోయింది.33 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 9 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో కుల్దీప్తో పాటు అక్షర్ పటేల్ (4-0-26-2), వరుణ్ చక్రవర్తి (4-0-30-2), బుమ్రా (3.1-0-25-2) కూడా సత్తా చాటారు. పాక్ ఇన్నింగ్స్లో ఓపెనర్లతో పాటు వన్ డౌన్ బ్యాటర్ సైమ్ అయూబ్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు.చదవండి: Asia cup 2025 Final: సరికొత్త సంప్రదాయం -
Asia cup 2025 Final: సరికొత్త సంప్రదాయం
ఆసియా కప్ 2025 ఫైనల్లో (Asia cup 2025 Final) ఇవాళ (సెప్టెంబర్ 28) భారత, పాకిస్తాన్ (India vs Pakistan) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టీమిండియా (Team India) టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేస్తుంది. టాస్ సమయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇరు జట్ల కెప్టెన్లతో మాట్లాడేందుకు ఇద్దరు ప్రతినిధులు ఏర్పాటు చేయబడ్డారు.సాధారణంగా ఏ మ్యాచ్కైనా టాస్ సమయంలో ఒకరే ప్రతినిధి ఇద్దరు కెప్టెన్లతో మాట్లాడతాడు. అయితా ఈసారి అలా కాకుండా పాకిస్తాన్ (Pakistan) కెప్టెన్తో ఒకరు, భారత కెప్టెన్తో మరొకరు మాట్లాడేందుకు ఏర్పాటు చేయబడ్డాడు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో భారత్కు చెందిన రవిశాస్త్రి మాట్లాడగా.. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘాతో అదే దేశానికి చెందిన వకార్ యూనిస్ సంభాషించాడు.టాస్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి పాక్ కెప్టెన్తో హ్యాండ్ షేక్కు దూరంగా ఉన్నాడు. టాస్ సమయంలో ఇద్దరు ప్రతినిధుల ఐడియాను బీసీసీఐ ప్రతిపాదించినట్లు తెలుస్తుంది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేస్తున్న టీమిండియా సాధారణంగా బౌలింగ్ చేస్తుంది. పాకిస్తాన్ ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్, ఫకర్ జమాన్ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ శివమ్ దూబేతో బౌలింగ్ అటాక్ను ప్రారంభించాడు. అతను 2 ఓవర్లలో 12 పరుగులకే ఇచ్చి పర్వాలేదనిపించాడు. బుమ్రా 2, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలో ఓవర్ వేశారు.6 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 45/0గా ఉంది. ఫర్హాన్ 31, ఫకర్ జమాన్ 12 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. కాగా, భారత్, పాకిస్తాన్ 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో ఫైనల్లో తలపడటం ఇదే మొదటిసారి. అందుకే ఈ మ్యాచ్కు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుత టోర్నీలో భారత్, పాక్ ఇప్పటికే రెండు సార్లు తలపడగా.. రెండు సందర్భాల్లో టీమిండియానే విజయం సాధించింది.చదవండి: చరిత్ర సృష్టించిన రాహుల్ చాహర్.. 166 ఏళ్ల పురాతన రికార్డు బద్దలు -
ఆసియా కప్ 2025 విజేత టీమిండియా
ఆసియా కప్ 2025 విజేతగా టీమిండియా అవిర్భవించింది. ఇవాళ (సెప్టెంబర్ 28) జరిగిన ఫైనల్లో పాకిస్తాన్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ లో స్కోరింగ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ కాగా.. భారత్ మరో 2 బంతులు మిగిలుండగా లక్ష్యాన్ని ఛేదించింది. తిలక్ వర్మ (69) అజేయ అర్ద శతకంతో టీమిండియాను గెలిపించాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తిలక్తిలక్ 41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 50 పరుగులు పూర్తి చేసుకున్డాను. 16 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 111/4గా ఉంది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే 24 బంతుల్లో 36 పరుగులు చేయాలి. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా12.2వ ఓవర్- 77 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. అబ్రార్ అహ్మద్ బౌలింగ్లో ఫర్హాన్కు క్యాచ్ ఇచ్చి సంజూ శాంసన్ (24) ఔటయ్యాడు. ఆచితూచి ఆడుతున్న తిలక్, శాంసన్20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో భారత బ్యాటర్లు తిలక్ వర్మ (24), సంజూ శాంసన్ (16) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. 10 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 58/3గా ఉంది.స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడుతున్న టీమిండియా147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా తడబడుతుంది. 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. గిల్ (12) మూడో వికెట్గా వెనుదిరిగాడు. ఫహీమ్ అష్రఫ్ బౌలింగ్లో హరీస్ రౌఫ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కష్టాల్లో టీమిండియా147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా కష్టాల్లో పడింది. 10 పరుగులకే ఇన్ ఫామ్ బ్యాటర్ అభిషేక్ శర్మ (5), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (1) వికెట్లు కోల్పోయింది. చెలరేగిన కుల్దీప్.. 146 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పాక్.. కుల్దీప్ యాదవ్ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (57), ఫకర్ జమాన్ (46) రాణించడంతో పాక్ తొలుత భారీ స్కోర్ చేసేలా కనిపించింది. 11.2 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి 100 పరుగుల మార్కును తాకిన ఆ జట్టు.. భారత బౌలర్లు ఒక్కసారిగా లైన్లోకి రావడంతో తట్టుకోలేకపోయింది.33 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 9 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో కుల్దీప్తో పాటు అక్షర్ పటేల్ (4-0-26-2), వరుణ్ చక్రవర్తి (4-0-30-2), బుమ్రా (3.1-0-25-2) కూడా సత్తా చాటారు. పాక్ ఇన్నింగ్స్లో ఓపెనర్లతో పాటు వన్ డౌన్ బ్యాటర్ సైమ్ అయూబ్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు.చెలరేగిన కుల్దీప్ఇన్నింగ్స్ 17వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీసి పాక్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. తొలి బంతికి సల్మాన్ అఘా, నాలుగో బంతికి షాహీన్ అఫ్రిది (0), ఆఖరి బంతికి ఫహీమ్ అష్రాఫ్ (0) ఔటయ్యారు. 16 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 134/8గా ఉంది. నవాజ్, హరీస్ రౌఫ్ క్రీజ్లో ఉన్నారు.ఆరో వికెట్ కోల్పోయిన పాక్16.1వ ఓవర్- 133 పరుగుల వద్ద పాక్ ఆరో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో సంజూ శాంసన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో సల్మాన్ అఘా (8) ఔటయ్యాడు. కష్టాల్లో పాకిస్తాన్పాక్ జట్టు మరోసారి కష్టాలో పడింది. తొలుత పరుగు వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. ఈసారి 5 పరుగుల వ్యవధిలో మరో 2 వికెట్లు కోల్పోయింది. దీంతో పాక్ 15.3 ఓవర్లలో 132 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. సల్మాన్ అఘా (7), మొహమ్మద్ నవాజ్ (1) క్రీజ్లో ఉన్నారు. 14 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 118/3పరుగు వ్యవధిలో రెండు వికెట్లు (సైమ్ అయూబ్ (14), మొహమ్మద్ హరీస్ (0)) కోల్పోవడంతతో పాక్ స్కోర్ నెమ్మదించింది. 14 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 118/3గా ఉంది. ఫకర్ జమాన్ (38), సల్మాన్ అఘా (3) క్రీజ్లో ఉన్నారు. 100 పరుగులు పూర్తి చేసుకున్న పాకిస్తాన్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాక్ 11.2 ఓవర్లలోనే 100 పరుగులు (వికెట్ నష్టానికి) పూర్తి చేసుకుంది. 12 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 107/1గా ఉంది. ఫకర్ జమాన్ (33), సైమ్ అయూబ్ (13) క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన పాక్9.4వ ఓవర్- 84 పరుగుల వద్ద పాక్ తొలి వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ అనంతరం సాహిబ్జాదా ఫర్హాన్ (57) ఔటయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో తిలక్ వర్మ క్యాచ్ పట్టడంతో ఫర్హాన్ పెవిలియన్కు చేరాడు. ధాటిగా ఆడుతున్న పాక్ ఓపెనర్లు.. ఫర్హాన్ హాఫ్ సెంచరీతొలుత నిదానంగా ఆడిన పాక్ ఓపెనర్లు గేర్ మార్చారు. సాహిబ్జాదా ఫర్హాన్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో ఓపెనర్ ఫకర్ జమాన్ 18 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 22 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. 9 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 77/0గా ఉంది. జాగ్రత్తగా ఆడుతున్న పాకిస్తాన్ ఓపెనర్లుటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ ఆచితూచి ఆడుతుంది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (24), ఫకర్ జమాన్ (6) చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు. 4 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 32/0గా ఉంది.క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సేవలను కోల్పోయింది. గాయం కారణంగా అతను ఈ మ్యాచ్లో ఆడటం లేదు. అతని స్థానంలో రింకూ సింగ్ తుది జట్టులోకి వచ్చాడు. గత మ్యాచ్ మిస్ అయిన శివమ్ దూబే, బుమ్రా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. తుది జట్లు.. పాకిస్తాన్: సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(సి), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్(w), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్ భారత్: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(సి), తిలక్ వర్మ, సంజు శాంసన్(w), శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి -
Ind vs Pak: అప్పుడు బాయ్కాట్ అన్నారు.. ఇప్పుడేమో ఎగబడుతున్నారు..!
ఆసియా కప్-2025లో (Asia Cup 2025) ఇవాళ (సెప్టెంబర్ 28) భారత్-పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య మెగా ఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.ఈ టోర్నీలో భారత్, పాక్ తలపడటం ఇది మూడోసారి. అంతకుముందు గ్రూప్ దశ, సూపర్-4లో ఇరు జట్లు తలపడ్డాయి. ఈ రెండు పర్యాయాల్లో టీమిండియా పాక్ను చిత్తుగా ఓడించింది. నేడు జరుగబోయే ఫైనల్లోనూ అదే సీన్ రిపీట్ కాబోతుందని భారత అభిమానులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.కాగా, నేటి భారత్-పాక్ ఫైనల్ మ్యాచ్ను భారతవ్యాప్తంగా 100కు పైగా పీవీఆర్ ఐనాక్స్ (PVR INOX) స్క్రీన్లపై ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ అంశం ప్రస్తుతం సోషల్మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇదే టోర్నీలో భారత్, పాక్ గ్రూప్ దశ, సూపర్-4లో తలపడినప్పుడు బాయ్కాట్ అన్న జనాలు.. ఫైనల్ మ్యాచ్ వచ్చేసరికి టికెట్ల కోసం ఎగబడుతున్నారు.ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ కొందరు నెటిజన్లు వ్యంగ్యమైన కామెంట్లు చేస్తున్నారు. బాయ్కాట్ గ్యాంగ్ టికెట్ బుకింగ్ గ్యాంగ్గా మారిందని ఎద్దేవా చేస్తున్నారు. భారత్-పాక్ మ్యాచ్ను బాయ్కాట్ చేయాలని ఉద్యమాలు చేసిన వాళ్లే, ఇప్పుడు టికెట్ల కోసం క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. భారత్-పాక్ మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉండగా దేశంలోని ప్రధాన నగరాల్లో స్క్రీనింగ్ హంగామా నడుస్తుంది. PVR INOX స్క్రీన్లపై దాయాదుల తుది సమరాన్ని వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఎగబడుతున్నారు. PVR INOX స్క్రీన్లతో పాటు దేశవాప్తంగా చాలా చోట్ల ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసి మ్యాచ్ను లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన టికెట్లు దక్కించుకునేందుకు అభిమానులు చిన్నపాటి యుద్దాలే చేస్తున్నారు. చదవండి: ఇకపై అదే అర్హత.. వైభవ్ సూర్యవంశీ అలానే వచ్చాడు.. బీసీసీఐ కీలక నిర్ణయం -
పాక్తో ఫైనల్... ‘స్టార్ ప్లేయర్’పై వేటు!.. భారత తుదిజట్టు ఇదే!
ఆసియా కప్-2025 టోర్నమెంట్ ఫైనల్కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ భారత జట్టు యాజమాన్యానికి కీలక సూచనలు చేశాడు. ఏడుగురు బ్యాటర్లు చాలని.. నలుగురు స్పెషలిస్టు బౌలర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. యూఏఈ వేదికగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్ టోర్నీలో భారత్ అజేయంగా ఫైనల్కు చేరుకుంది.దుబాయ్ వేదికగా ఆదివారం జరిగే టైటిల్ పోరులో భారత్.. దాయాది పాకిస్తాన్ (IND vs PAK)తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పుపై మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.శివం దూబే వద్దు‘‘నేనైతే శివం దూబే (Shivam Dube) బదులు అర్ష్దీప్ సింగ్ను ఆడిస్తా. ఆల్రౌండర్ అయిన దూబేకు బ్యాటింగ్ చేసే అవకాశమే రావడం లేదు. కాబట్టి ఈసారి నేను ఏడుగురు బ్యాటర్లనే ఆడిస్తా. కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వస్తాడు.ఆ స్థానంలో వచ్చిన వాళ్లు 20, 50 పరుగులు చేయాల్సిన అవసరమేమీ ఉండకపోవచ్చు, ఓ బౌండరీ లేదంటే సిక్సర్ బాది పది పరుగులు చేసినా చాలు. కుల్దీప్ ఆ మాత్రమే స్కోరు చేయగలడు.టీమిండియాదే విజయంఏదేమైనా శివం దూబే బంతితో మెరుగ్గా రాణిస్తున్న మాట నిజమే. పాకిస్తాన్తో గత మ్యాచ్లో రెండు కీలక వికెట్లు తీశాడు. అయితే, ఫైనల్లో మాత్రం అర్ష్దీప్ సింగ్కే నా ఓటు. రామ్ లేదంటే రావణ్.. ఎవరు ఆడినా సరే టీమిండియా విజయం సాధించడం మాత్రం ఖాయం’’ అని చిక్కా చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. ఆసియా కప్ లీగ్ దశలో పాకిస్తాన్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన భారత్.. సూపర్-4 మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఆసియా కప్-2025 ఫైనల్కు క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఎంపిక చేసుకున్న తుదిజట్టుఅభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.చదవండి: ఆసియా కప్-2025 ఫైనల్: అది సూర్య ఇష్టం.. గెలిచేది మేమే: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్ -
‘సూర్యకుమార్ వెంట పడకండి.. అలా చేయమని ఒత్తిడి పెంచకండి’
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)కు భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin)అండగా నిలిచాడు. సూర్యపై ఒత్తిడి పెంచడం సరికాదని.. కెప్టెన్గా తనదైన శైలిలో అతడు విజయాలు సాధిస్తున్న తీరు అద్భుతమని కొనియాడాడు. కాగా ఆసియా కప్-2025 టీ20 టోర్నీలో టీమిండియా అజేయంగా ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.అయితే, నామమాత్రపు మ్యాచ్లో బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు చేయడం.. బ్యాటర్గా విఫలం కావడం పట్ల సూర్యపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. కాగా గత కొంతకాలంగా సూర్య బ్యాటింగ్ వైఫల్యాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత తొమ్మిది ఇన్నింగ్స్లో సూర్య 12.41 సగటు, 112.98 స్ట్రైక్రేటుతో కేవలం 87 పరుగులే చేయగలిగాడు.బ్యాటింగ్ వైఫల్యంపై విమర్శలుఇక ఆదివారం నాటి ఫైనల్లో టీమిండియా పాకిస్తాన్ (IND vs PAK)తో తలపడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ బ్యాటింగ్ వైఫల్యంపై మరోసారి చర్చ జరుగుతుండగా.. అశ్విన్ స్పందించాడు. ‘‘కెప్టెన్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ సగటు పడిపోయిందని చాలా మంది విమర్శిస్తున్నారు.కానీ అతడు పగ్గాలు చేపట్టిన తర్వాతే కదా.. కొత్త బ్రాండ్తో టీమిండియా ముందుకు సాగుతోంది. అతడి సగటు 40 ఉండాల్సిన అవసరం లేదు. టీ20 క్రికెట్లో యావరేజ్ గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.హైరిస్క్ మ్యాచ్లుకెప్టెన్గా సూర్య హైరిస్క్ మ్యాచ్లు ఆడుతున్నాడు. నిజంగా అతడి నైపుణ్యాలు అద్భుతం. గతంలో రోహిత్ శర్మ కూడా ఇలానే చేశాడు. తన వికెట్ కంటే కూడా.. దూకుడుగా ఆడటంపైనే దృష్టి పెట్టాడు. ఇప్పుడు సూర్య అదే అనుసరిస్తున్నాడు. వన్డౌన్కే పరిమితం కాకుండా బ్యాటింగ్ ఆర్డర్లో వేర్వేరు స్థానాల్లో వస్తున్నాడు.అతడి వెంట పడకండిసూర్య తక్కువ స్ట్రైక్ రేటుతో 40 పరుగులు చేయడం కంటే కూడా... 170కి పైగా స్ట్రైక్రేటుతో 25 పరుగులు చేసినా నేను సంతోషిస్తా. దయచేసి అతడి వెంట పడకండి. అతడిపై ఒత్తిడి పెంచకండి. టీ20 క్రికెట్లో బ్యాటర్ సగటు కంటే.. అతడి ఇన్నింగ్స్ ఎంతమేర ప్రభావం చూపుతుందనేదే ముఖ్యం’’ అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కాగా ఆసియా కప్-2025లో సూర్య ఇప్పటికి ఐదు ఇన్నింగ్స్ ఆడి 71 పరుగులు చేశాడు. లీగ్ దశలో పాక్తో మ్యాచ్లో 37 బంతుల్లో 47 పరుగులు చేయడం అతడి తాజా అత్యుత్తమ ప్రదర్శన. చదవండి: ఆసియా కప్-2025 ఫైనల్: అది సూర్య ఇష్టం.. గెలిచేది మేమే: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్ -
అది సూర్యకుమార్ ఇష్టం.. గెలిచేది మేమే: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో లీగ్, సూపర్-4 దశలో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది పాకిస్తాన్. తొలుత గ్రూప్-‘ఎ’ మ్యాచ్లో భాగంగా ఏడు వికెట్ల తేడాతో ఓడిన పాక్.. తర్వాత సూపర్-4లో ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.అయితే, సూపర్-4లో బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల తప్పిదాల కారణంగా అదృష్టవశాత్తూ ఫైనల్కు చేరుకోగలిగింది. ఈ క్రమంలో ఆదివారం నాటి టైటిల్ పోరులో టీమిండియా (IND vs PAK)తో తలపడేందుకు అర్హత సాధించింది.ఫొటోషూట్కు వెళ్లని సూర్యఇదిలా ఉంటే.. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా టీమిండియా పాక్ ఆటగాళ్లతో కరచాలనానికి నిరాకరించడంతో పాటు.. వారితో మైదానంలో ఎలాంటి కమ్యూనికేషన్ పెట్టుకోవడం లేదు. ఈ క్రమంలోనే ఫైనల్ కోసం జరిగే కెప్టెన్ల ఫొటోషూట్కు టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) హాజరు కాలేదని సమాచారం.అది సూర్యకుమార్ ఇష్టంఈ నేపథ్యంలో ఫైనల్కు ముందు మీడియాతో మాట్లాడిన పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) ఈ విషయంపై స్పందించాడు. ‘‘అది పూర్తిగా అతడి (సూర్య) ఇష్టం. అదే అతడి నిర్ణయం. ఒకవేళ రావాలి అనుకుంటే వస్తాడు. లేదంటే లేదు. ఇందులో నేను చేయగలిగింది ఏమీ లేదు’’ అని సల్మాన్ పేర్కొన్నాడు.గెలిచేది మేమేఇక టైటిల్ పోరు గురించి ప్రస్తావన రాగా.. ‘‘మేము గెలుస్తాం. అత్యుత్తమ క్రికెట్ ఆడటమే మా లక్ష్యం. ఒకవేళ మేము ఉత్తమంగా రాణించి.. 40 ఓవర్ల పాటు మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయగలిగితే.. ఏ జట్టునైనా ఇట్టే ఓడించగలము’’ అని సల్మాన్ ఆఘా చెప్పుకొచ్చాడు.అదే విధంగా.. ‘‘ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇరుజట్లపై తీవ్రమైన ఒత్తిడి ఉండటం సహజం. ఒకవేళ ఒత్తిడి లేదని ఎవరైనా చెబితే అది అబద్ధమే అవుతుంది. ఏదేమైనా ఈ ఎడిషన్లో మేము వాళ్ల కంటే ఎక్కువ తప్పిదాలు చేశాము. అందుకే కొన్ని మ్యాచ్లు గెలవలేకపోయాము.తక్కువ తప్పులు చేసిన వారిదే విజయంఅయితే, ఈసారి ఎవరైతే తక్కువ తప్పులు చేస్తారో వారిదే విజయం. మేము మెరుగ్గా బ్యాటింగ్ చేయగలిగితే తప్పకుండా అనుకున్న ఫలితాన్ని రాబట్టగలము’’ అని సల్మాన్ ఆఘా పేర్కొన్నాడు.కాగా పాక్తో ఫైనల్కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బలు తగిలాయి. శ్రీలంకతో నామమాత్రపు సూపర్-4 మ్యాచ్ సందర్భంగా అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా కండరాలు పట్టేయడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. అయితే, అభి, తిలక్ ఫిట్గానే ఉన్నా.. హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉంటాడో లేదోనన్న సందిగ్దం నెలకొంది. ఏదేమైనా ఇప్పటి వరకు ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన సూర్యకుమార్ సేననే టైటిల్ ఫేవరెట్ అని చెప్పడంతో సందేహం లేదు. అయితే, ఫీల్డింగ్ విషయంలో మాత్రం భారత జట్టు ఇంకాస్త జాగ్రత్తగా ఉంటేనే దాయాదిపై సులువుగా గెలవగలదు.చదవండి: Asia Cup Ind vs Pak: ఆఖరి పోరాటం -
IND vs PAK: బలహీనంగానే పాకిస్తాన్.. భయపెడుతున్న ముఖాముఖి రికార్డు!
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో ఫైనల్కు రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా ఆదివారం నాటి టైటిల్ పోరులో దాయాదులు భారత్- పాకిస్తాన్ (IND vs PAK) తలపడనున్నాయి. లీగ్ దశలో యూఏఈ, పాకిస్తాన్, ఒమన్ జట్లను ఓడించి అజేయంగా సూపర్-4కు చేరింది టీమిండియా.అదే విధంగా.. సూపర్-4లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లపై విజయం సాధించింది. తద్వారా ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్లలో గెలిచి అజేయంగా ఫైనల్లో తలపడేందుకు సిద్ధమైంది. మరోవైపు.. పాకిస్తాన్ లీగ్ దశలో యూఏఈ, ఒమన్లపై గెలిచి సూపర్-4 చేరగలిగింది.పాకిస్తాన్ బలహీనంగానేతర్వాత సూపర్-4లో శ్రీలంక, బంగ్లాదేశ్తో మ్యాచ్లలో గట్టెక్కడం ద్వారా ఎట్టకేలకు ఫైనల్కు అర్హత సాధించింది. అయితే, టీమిండియాతో పోలిస్తే అన్ని రంగాల్లో పాకిస్తాన్ బలహీనంగానే కనిపిస్తోంది. తమ చివరి సూపర్–4 మ్యాచ్లో కూడా బంగ్లాదేశ్తో దాదాపు ఓటమికి చేరువై అదృష్టవశాత్తూ తప్పించుకోగలిగింది. ఇక భారత్తో ఆడిన రెండు మ్యాచ్లలో కూడా టీమ్ ప్రదర్శన పేలవంగా ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో కూడా చెప్పుకోదగ్గ ఆటగాళ్లు కనిపించడం లేదు. 160 పరుగులతో టీమ్ టాప్ స్కోరర్గా ఉన్న ఫర్హాన్ ఒక్క మ్యాచ్లో అర్ధ సెంచరీ మినహా ప్రభావం చూపలేదు. సయీమ్ విఫలమైనా.. జట్టులోనేఫఖర్ జమాన్ (Fakhar Zaman) తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వకపోగా... మిగతా ప్రధాన బ్యాటర్లంతా విఫలమయ్యారు. కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) కనీసం ఒక్క మ్యాచ్లో కూడా రాణించలేదు. ఆరు ఇన్నింగ్స్లలో కలిపి అతను చేసింది 64 పరుగులే. ‘పాక్ అభిషేక్ శర్మ’ అంటూ కొన్నాళ్ల క్రితం కీర్తించిన సయీమ్ అయూబ్ ఏకంగా రికార్డు స్థాయిలో 4 డకౌట్లతో ఘోర ప్రదర్శన కనబర్చాడు. అయితే మరో చెప్పుకోదగ్గ ప్రత్యామ్నాయం కూడా లేదు కాబట్టి ఈ మ్యాచ్లోనూ అతని స్థానంపై ఎలాంటి ఢోకా లేదు. వీరందరిలో తుది పోరులో ఎవరు రాణిస్తారనేది చూడాలి. పాక్ సాధారణ స్కోరు నమోదు చేయాలన్నా మిడిలార్డర్లో తలత్, హారిస్లు కనీస ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. బౌలింగ్లో షాహిన్ అఫ్రిది ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించినా... భారత్ ఓపెనర్లు అతడిని అలవోకగా ఎదుర్కొంటున్నారు. రవూఫ్, అబ్రార్, ఫహీమ్, నవాజ్ మన బ్యాటర్లనను అడ్డుకోవడం అంత సులువు కాదు.పిచ్, వాతావరణం దుబాయ్లో సాధారణ వికెట్. అటు బ్యాటింగ్తో పాటు ఇటు బౌలింగ్కు కూడా అనుకూలం. అయితే రెండో సారి బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయావకాశాలు ఉంటాయని పదే పదే రుజువైంది. కాబట్టి టాస్ గెలిచిన టీమ్ ఫీల్డింగ్ ఎంచుకోవడం ఖాయం ముఖాముఖి పోరులో..భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య వన్డే, టీ20లు కలిపి ఇప్పటి వరకు పన్నెండు ఫైనల్ మ్యాచ్లు జరిగాయి. వీటిలో భారత్ నాలుగు గెలవగా... పాకిస్తాన్ ఎనిమిది ఫైనల్లలో విజయం సాధించింది.తుదిజట్ల వివరాలు అంచనా:టీమిండియా:సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్ ), అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్, సంజూ శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.పాకిస్తాన్సల్మాన్ ఆఘా (కెప్టెన్ ), సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సయీమ్ అయూబ్, హొసేన్ తలత్, మొహమ్మద్ హ్యారిస్, షాహిన్ అఫ్రిది, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, హ్యారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్. చదవండి: Asia Cup Ind vs Pak: ఆఖరి పోరాటం -
భవిష్యత్ ఆశాకిరణం.. అతడిని బెంచ్కే పరిమితం చేయండి: పాక్ మాజీ క్రికెటర్
టీమిండియా చేతిలో రెండుసార్లు ఓడిపోయినప్పటికీ పాకిస్తాన్ ఎట్టకేలకు ఆసియా కప్-2025 టోర్నమెంట్ ఫైనల్కు చేరుకుది. సూపర్-4లో బంగ్లాదేశ్, శ్రీలంక జట్లపై విజయం సాధించడం ద్వారా టైటిల్ పోరుకు అర్హత సాధించింది. మరోవైపు.. భారత్ లీగ్, సూపర్-4 దశలో పరాజయమన్నదే లేకుండా ఫైనల్లో పాక్ (IND vs PAK)తో తలపడేందుకు సిద్ధమైంది.అయితే, ఈ టోర్నీలో పాకిస్తాన్ బౌలింగ్ పరంగా ఫర్వాలేదనిపించినా.. బ్యాటింగ్లో మాత్రం తడబడుతోంది. ముఖ్యంగా భారీ అంచనాలతో బరిలోకి దిగిన యువ ఓపెనర్ సయీమ్ ఆయుబ్ (Saim Ayub) దారుణంగా విఫలమవుతున్నాడు.హ్యాట్రిక్ డకౌట్లుఒమన్తో మ్యాచ్లో గోల్డెన్ డకౌట్ అయిన సయీమ్ ఆయుబ్.. టీమిండియా, యూఏఈతో మ్యాచ్లలోనూ పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. ఇలా హ్యాట్రిక్ డకౌట్లతో విమర్శల పాలైన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. సూపర్-4లో భాగంగా భారత్తో మ్యాచ్లో 21 పరుగులు చేయగలిగాడు.ఆ తర్వాత శ్రీలంకతో మ్యాచ్లో రెండు పరుగులు చేయగలిగిన సయీమ్.. బంగ్లాదేశ్తో మ్యాచ్లో మరోసారి డకౌట్ అయ్యాడు. బ్యాటింగ్ పరంగా విఫలమైనా పార్ట్ టైమ్ స్పిన్నర్గా ఏడు వికెట్లు తీయగలిగాడు.భవిష్యత్ ఆశాకిరణంఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ సయీమ్ ఆయుబ్ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. ‘‘అతడు రెండోసారి డకౌట్ అయినపుడే.. బెంచ్కే పరిమితం చేయాలని చెప్పాను. దానర్థం అతడిలో ప్రతిభ లేదని కాదు.అతడు టాలెంటెడ్ ప్లేయర్. పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్ ఆశాకిరణం. కానీ కొన్నిసార్లు అనుకున్న ఫలితాలు రావు. ఆ క్రమంలో రోజురోజుకీ మరింత దిగజారితే ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఆయుబ్ విషయంలో ఇదే జరిగింది. అతడి బాడీ లాంగ్వేజ్ పూర్తిగా వీక్గా అనిపిస్తోంది.ఇలాంటపుడు బెంచ్కే పరిమితం చేయాలిబౌలింగ్ చేస్తున్నాడు కాబట్టి అతడిని తుదిజట్టులోకి తీసుకుంటున్నారు. కానీ అతడు బౌలింగ్ కోసం కాదు.. బ్యాటింగ్ కోసం జట్టులో ఉంటున్నాడు. అతడు పరుగులు చేస్తున్నాడా లేదా అనేది ముఖ్యం. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అది జరగడం లేదు. అతడిని బెంచ్కే పరిమితం చేయాల్సి ఉంటుంది’’ అని వకార్ యూనిస్ పేర్కొన్నాడు. కాగా భారత్- పాకిస్తాన్ ఆసియా కప్-2025 ఫైనల్లో ఆదివారం తలపడనున్నాయి. ఇందుకు వేదిక దుబాయ్.చదవండి: ఆసియా కప్: చరిత్ర సృష్టించిన నిసాంక.. కోహ్లి ఆల్టైమ్ రికార్డు బద్దలు -
ఆసియా కప్: పాక్తో ఫైనల్కు ముందు టీమిండియాకు రెండు భారీ షాకులు
ఆసియా కప్-2025 టోర్నమెంట్ ఫైనల్కు ముందు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మతో పాటు.. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడినట్లు సమాచారం. సూపర్-4 దశలో ఆఖరిగా టీమిండియా శ్రీలంకతో తలపడిన విషయం తెలిసిందే.ఒకే ఒక్క ఓవర్ వేసిదుబాయ్ వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. ఏడు పరుగులు ఇచ్చి.. కుశాల్ మెండిస్ (0) రూపంలో కీలక వికెట్ తీశాడు. అయితే, ఆ తర్వాత హార్దిక్ మళ్లీ బౌలింగ్కు రానేలేదు. అంతకు ముందు బ్యాటింగ్కు దిగిన హార్దిక్ రెండు పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు.ఫీల్డింగ్కు రాని అభిషేక్మరోవైపు.. మరోసారి మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగిన అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61) కూడా శ్రీలంక ఇన్నింగ్స్ సందర్భంగా పూర్తిస్థాయిలో ఫీల్డింగ్కు అందుబాటులో ఉండలేదు. దీంతో టీమిండియా అభిమానుల్లో కలవరం నెలకొంది. కాగా లంకపై సూపర్ ఓవర్లో భారత్ విజయం సాధించిన తర్వాత టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మీడియాతో మాట్లాడాడు.అప్పుడే ఫిట్నెస్పై అంచనాకు వస్తాంఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మల గురించి ప్రస్తావన రాగా.. ‘‘హార్దిక్ కండరాలు పట్టేశాయి. శుక్రవారం రాత్రి.. శనివారం ఉదయం పరీక్షించిన తర్వాత అతడి ఫిట్నెస్పై అంచనాకు వస్తాము. ఆ తర్వాతే అతడి గురించి నిర్ణయం తీసుకుంటాం. ఇక అభిషేక్ శర్మ కూడా కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు. అయితే, తను బాగానే ఉన్నాడు. ఇప్పటికైతే గాయం పెద్దదేమీ కాదు’’అని మోర్నీ మోర్కెల్ తెలిపాడు. కానీ దురదృష్టవశాత్తూ హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ పూర్తిస్థాయిలో ఫిట్గా లేకుంటే మాత్రం టీమిండియాకు తలనొప్పి తప్పదు.ఇద్దరూ అత్యంత కీలకంఇప్పటి వరకు ఆసియా కప్-2025 టోర్నీలో టాప్ రన్ స్కోరర్గా ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మ టీమిండియా టాపార్డర్లో అత్యంత కీలకం. మరోవైపు.. ఫైనల్ మ్యాచ్లలో ఒత్తిడిని అధిగమించి వికెట్లు తీయడంతో పాటు పరుగులు రాబట్టడంలో హార్దిక్ పాండ్యా దిట్ట. ముఖ్యంగా పాకిస్తాన్తో మ్యాచ్లలో మరింత మెరుగ్గా రాణించిన రికార్డు పాండ్యాకు ఉంది. కాగా లీగ్, సూపర్-4 దశలో అజేయంగా నిలిచిన టీమిండియా.. ఆదివారం (సెప్టెంబరు 28) నాటి ఫైనల్లో దాయాది పాకిస్తాన్తో తలపడనుంది. ఈ టైటిల్ పోరుకు దుబాయ్ వేదిక. చదవండి: సూర్యకుమార్పై ఐసీసీ చర్య -
Asia cup 2025: పాకిస్తాన్ ఆటగాళ్ల ఓవరాక్షన్పై ఐసీసీ చర్యలు
ఆసియా కప్ 2025లో (Asia cup 2025) భాగంగా సెప్టెంబర్ 21న టీమిండియాతో జరిగిన సూపర్-4 మ్యాచ్లో (India vs Pakistan) పాకిస్తాన్ ఆటగాళ్లు హారిస్ రౌఫ్ (Haris Rauf), సాహిబ్జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) ఓవరాక్షన్ చేసిన విషయం తెలిసిందే.ఆ మ్యాచ్లో రౌఫ్ ఫీల్డింగ్ చేసే సమయంలో విమానం క్రాష్ అయినట్లు సంజ్ఞలు చేశాడు. అలాగే ఆరు సంఖ్యను సూచిస్తూ చేతి వేళ్లను ప్రదర్శించాడు. ఫర్హాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అనంతరం బ్యాట్ను గన్లా భావిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. పాక్ ఆటగాళ్లు చేసిన ఈ ఓవరాక్షన్పై బీసీసీఐ అభ్యంతం వ్యక్తం చేసింది. ఐసీసీకి ఫిర్యాదు చేసింది.దీనిపై రౌఫ్, ఫర్హాన్ ఇవాళ (సెప్టెంబర్ 26) విచారణ ఎదుర్కొన్నారు. మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ (Richie Richardson) ఆధ్వర్యంలో జరిగిన ఈ విచారణలో వారిద్దరూ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ను (Level 1 offence) ఉల్లంఘించినట్లు నిర్ధారించారు. ఈ చర్యలు గేమ్ స్పిరిట్ను దెబ్బతీసేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.ఇలాంటి ప్రవర్తన మరోసారి రిపీట్ చేస్తే సహించేది లేదంటూ రౌఫ్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జరిమానాగా మ్యాచ్ ఫీజ్లో 30 శాతం కోత విధించారు. ఫర్హాన్కు సైతం వార్నింగ్ ఇస్తూ.. మందలింపుతో వదిలిపెట్టారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.సూర్యకుమార్కు జరిమానాఇదే టోర్నీలో పాకిస్తాన్తో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఆ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించగా.. ఆ విజయాన్ని సూర్యకుమార్ "ఆపరేషన్ సిందూర్" అనే ప్రభుత్వ చర్యను ప్రస్తావిస్తూ, భారత మిలిటరీ సర్వీసెస్కు అంకితం చేశాడు.ఈ వ్యాఖ్యలపై పీసీబీ అభ్యంతరం తెలుపుతూ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఈ విషయమై సూర్యకుమార్ను సైతం విచారణ చేసి, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించింది. అలాగే మ్యాచ్ ఫీజ్లో 30 శాతం విధించినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే, ఆసియా కప్లో ఇదివరకే రెండు సార్లు (గ్రూప్ దశ, సూపర్-4) తలపడిన భారత్-పాకిస్తాన్.. ఆదివారం జరుగబోయే ఫైనల్లో మరోసారి తలపడనున్నాయి. పై రెండు సందర్భాల్లో భారత్ పాక్ను చిత్తుగా ఓడించింది. చదవండి: సెలెక్ట్ చేస్తారని అనుకున్నా.. కరుణ్ నాయర్ ఆవేదన -
మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. మా ఫీల్డింగ్ సూపర్: పాక్ కెప్టెన్
ఆసియా కప్-2025 టోర్నమెంట్ ఫైనల్లో టీమిండియా ప్రత్యర్థిగా పాకిస్తాన్ ఖరారైంది. దుబాయ్లో గురువారం జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్పై పదకొండు పరుగుల తేడాతో గట్టెక్కిన పాక్.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలో ఆదివారం (సెప్టెంబరు 28) భారత జట్టుతో ఫైనల్లో (IND vs PAK In Final) తలపడేందుకు సిద్ధపడింది.135 పరుగులుకాగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో టాస్ ఓడిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (4), ఫఖర్ జమాన్ (13) నిరాశపరచగా.. సయీమ్ ఆయుబ్ డకౌట్ అయ్యాడు. కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) 19 పరుగులు చేయగా.. హుసేన్ తలట్ 3 పరుగులకే నిష్క్రమించాడు.Mustafizur Rahman sends the Pakistan captain packing 💨☝️Watch #PAKvBAN LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/bkPfVMxULa— Sony Sports Network (@SonySportsNetwk) September 25, 2025ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వికెట్ కీపర్ బ్యాటర్ మొహమ్మద్ హ్యారిస్ 23 బంతుల్లో 31, మొహమ్మద్ నవాజ్ 15 బంతుల్లో 25 పరుగులతో ఆకట్టుకున్నారు. వీరికి తోడుగా పేసర్ షాహిన్ ఆఫ్రిది 13 బంతుల్లో 19 పరుగులతో రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి పాకిస్తాన్ 135 పరుగులు చేయగలిగింది.రాణించిన పాక్ బౌలర్లుబంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా... మెహదీ హసన్, రిషాద్ హొసేన్ రెండేసి వికెట్లు తీశారు. ముస్తాఫిజుర్ రహమాన్కు ఒక వికెట్ దక్కింది. ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. పాక్ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 124 పరుగులే చేసింది. షమీమ్ హొసేన్ (30) ఒక్కడే ఇరవై పరుగుల వ్యక్తిగత స్కోరు దాటాడు.పాక్ ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది, హ్యారిస్ రవూఫ్ మూడేసి వికెట్లు కూల్చి సత్తా చాటగా.. సయీమ్ ఆయుబ్ రెండు, మొహమ్మద్ నవాజ్ ఒక వికెట్ పడగొట్టారు.అతడి బౌలింగ్ అద్భుతంఇక బంగ్లాదేశ్పై విజయంతో ఫైనల్లో అడుగుపెట్టిన నేపథ్యంలో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా తమ జట్టు ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. అదే విధంగా.. తాము ఆదివారం నాటి పోరుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.‘‘ఇలాంటి మ్యాచ్లలో గెలిచామంటే మేమొక ప్రత్యేక జట్టు అనే చెప్పవచ్చు. మా జట్టులోని ప్రతి ఒక్కరు మెరుగ్గా ఆడారు. అయితే, బ్యాటింగ్ విభాగంలో మేము మరింత మెరుగుపడాల్సి ఉంది. ఆ దిశగా మేము ఇప్పటికే తీవ్రంగా కృషి చేస్తున్నాము కూడా!షాహిన్ ఓ ప్రత్యేకమైన ఆటగాడు. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా రాణించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అతడి బౌలింగ్ అద్భుతంగా ఉంది. ఏదేమైనా మేము ఇంకో 15 పరుగులు చేసి ఉంటే విజయం సులభమయ్యేది.ఏ జట్టునైనా ఓడించగలముఅయితే, మా బౌలర్లు గొప్పగా రాణించి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి అనుకున్న ఫలితం రాబట్టారు. ఇక మేము అద్భుతంగా ఫీల్డింగ్ చేయడం వల్లే విజయం సాధ్యమైందని చెప్పవచ్చు. మా కోచ్ కఠినంగా ప్రాక్టీస్ చేయిస్తున్నారు. ఎక్స్ట్రా సెషన్స్ పెడుతున్నారు.హెడ్కోచ్ మైక్ హసన్.. ‘ఫీల్డింగ్ చేస్తేనే మీకు జట్టులో స్థానం ఉంటుంది’ అని చెప్పాడు. ఫీల్డింగ్ విషయంలో మా వాళ్లు అంత కఠినంగా ఉంటున్నారు. మా జట్టు ప్రస్తుతం గొప్పగా ఉంది. మేము ఏ జట్టునైనా ఓడించగలము. ఆదివారం నాటి మ్యాచ్లో ఇది చేసి చూపించేందుకు ప్రయత్నిస్తాం’’ అని సల్మాన్ ఆఘా పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో బంగ్లాపై నామ మాత్రపు గెలుపు సాధించినందుకే ఇంత అతి వద్దంటూ నెటిజన్లు సల్మాన్ను ట్రోల్ చే స్తున్నారు.టీమిండియా చెత్త ఫీల్డింగ్కాగా లీగ్ దశలో అజేయంగా ఉండి సూపర్-4 చేరిన భారత జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఫైనల్ చేరింది. అయితే, ఆసియా కప్ తాజా ఎడిషన్లో టీమిండియా ఇప్పటి వరకు అత్యధికంగా.. ఏకంగా 12 క్యాచ్లు డ్రాప్ చేసింది. మరోవైపు.. పాక్ కేవలం నాలుగు క్యాచ్లు మాత్రమే నేలపాలు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో పటిష్టంగా ఉన్న సూర్యసేన.. ఫీల్డింగ్ తప్పిదాలు సరిచేసుకుంటేనే విజయం నల్లేరు మీద నడక అవుతుంది. లేదంటే భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు.చదవండి: IND vs WI: అందుకే అతడిని ఎంపిక చేయలేదు: అజిత్ అగార్కర్ -
పాక్ ఆటగాళ్ల బరితెగింపు.. షాకిచ్చిన బీసీసీఐ!.. మరోసారి పీసీబీ ఓవరాక్షన్
టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా కవ్వింపులకు పాల్పడ్డ పాకిస్తాన్ ఆటగాళ్లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) చర్యలకు ఉపక్రమించింది. భారతీయల మనోభావాలు దెబ్బతినేలా.. రెచ్చగొట్టేలా ప్రవర్తించిన సాహిబ్జాదా ఫర్హాన్, హ్యారిస్ రవూఫ్లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి ఫిర్యాదు చేసింది.కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆసియా టీ20 కప్-2025 వేదికగా భారత్- పాక్ (IND vs PAK)జట్లు తొలిసారి ముఖాముఖి తలపడిన విషయం తెలిసిందే. లీగ్ దశలో మ్యాచ్ సందర్భంగానే టీమిండియా తమ వైఖరిని దాయాదికి తెలియజేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా పాక్ ఆటగాళ్లతో కరచాలనానికి నిరాకరించింది.రెచ్చగొట్టేలా సెలబ్రేషన్స్ఇక సూపర్-4 మ్యాచ్లోనూ టీమిండియా తన వైఖరిని కొనసాగించింది. అయితే, లీగ్ దశ మ్యాచ్లో కాస్త సైలెంట్గానే ఉన్నపాక్ ఆటగాళ్లు.. ఈసారి మాత్రం రెచ్చగొట్టేలా కవ్వింపులకు పాల్పడ్డారు. ఓపెనర్ ఫర్హాన్ అర్ధ శతకం పూర్తి చేసుకోగానే.. ఏకే-47 మాదిరి బ్యాట్ను ప్రేక్షకుల వైపు ఎక్కుపెట్టి.. కాలుస్తున్నట్లు సంబరాలు చేసుకున్నాడు.పహల్గామ్లో ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను కాల్చి చంపిన ఘటనను ఈ చర్య ద్వారా ఫర్హాన్ మరోసారి గుర్తుచేసినట్లయింది. అయితే, మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ కూడా.. తాను సాధారణంగా హాఫ్ సెంచరీకి సెలబ్రేట్ చేసుకోనని.. ఈసారి మాత్రం ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని అనిపించిందని మరోసారి రెచ్చగొట్టాడు.‘6-0’ సంజ్ఞతో రవూఫ్ కవ్వింపులుఅంతేకాదు.. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా తాను లెక్కచేయనంటూ ఫర్హాన్ అహంకారపూరితంగా మాట్లాడాడు. ఇక హ్యారిస్ రవూఫ్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ‘6-0’ సంజ్ఞతో టీమిండియా అభిమానుల వైపు చూస్తూ అతి చేశాడు.కాగా పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరిట భారత ఆర్మీ.. ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఇందుకు బదులుగా పాక్ సైన్యం రంగంలోకి వచ్చి ఎదురుదాడికి ప్రయత్నించగా.. భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ ఘటనలో పాక్ ఎయిర్బేస్లు కూడా ధ్వంసమైనట్లు సమాచారం.కిక్కురమనలేదుఅయితే, రవూఫ్ మాత్రం పాక్ చెప్పుకొంటున్నట్లుగా.. తాము భారత్కు చెందిన ఆరు యుద్ధ విమానాలు కూల్చేశామన్నట్లు ఇలా సైగ చేయడం గమనార్హం. లీగ్ దశలో షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. ఆటలు, రాజకీయం వేరు అంటూ సుద్దులు చెప్పిన పాక్.. సూపర్-4 మ్యాచ్లో తమ ఆటగాళ్లు ఇంత యథేచ్చగా బరితెగించినా కిక్కురమనలేదు.షాకిచ్చిన బీసీసీఐఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ.. పాక్ ఆటగాళ్ల ప్రవర్తనపై ఐసీసీకి ఇ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సాహిబ్జాదా ఫర్హాన్, హ్యారిస్ రవూఫ్ల నుంచి ఐసీసీ లిఖిత పూర్వక వివరణ అడిగే అవకాశం ఉంది. విచారణలో భాగంగా వీరిద్దరు ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. లీగ్, సూపర్-4 దశలో పాక్ను చిత్తు చేసిన టీమిండియా.. బుధవారం నాటి మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడించి ఆసియా కప్ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది.పాక్ బోర్డు ఓవరాక్షన్బీసీసీఐ చర్యల నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు కూడా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై ఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. లీగ్ దశలో పాకిస్తాన్పై తమ విజయాన్ని సూర్య.. పహల్గామ్ బాధితులు, ఆపరేషన్ సిందూర్ సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత ఆర్మీకి అంకితం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి పీసీబీ.. ఐసీసీని ఆశ్రయించినట్లు సమాచారం.చదవండి: అసలు అక్కడ ఏం ఉంది?: అభిషేక్ శర్మపై గావస్కర్ ‘ఫైర్’ -
BCCI: అభిషేక్ శర్మకు బంపరాఫర్!
టీమిండియా యువ క్రికెటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఆసియా టీ20 కప్- 2025 టోర్నమెంట్లో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు ఇన్నింగ్స్లో కలిపి 208కి పైగా స్ట్రైక్రేటుతో అభిషేక్ శర్మ 173 పరుగులు సాధించాడు.తీవ్రమైన ఒత్తిడిలోనూతద్వారా ఇప్పటికి టాప్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా పాకిస్తాన్పై రెండుసార్లు అభిషేక్ శర్మ చితక్కొట్టిన తీరు టీమిండియా విజయాల్లో హైలైట్గా నిలిచింది. లీగ్ దశలో పాక్పై 13 బంతుల్లోనే 31 పరుగులు సాధించిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. సూపర్-4లో 39 బంతుల్లోనే 74 పరుగులతో చెలరేగాడు.బంపరాఫర్దాయాదితో సూపర్-4 మ్యాచ్లో తీవ్రమైన ఒత్తిడిలోనూ అభిషేక్ శర్మ.. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ (47)తో కలిసి తొలి వికెట్కు 105 పరుగులు జోడించి సత్తా చాటాడు. ఈ ప్రదర్శనల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ పంజాబీ బ్యాటర్కు బంపరాఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఆసియా కప్-2025 టోర్నీ ముగిసిన తర్వాత.. టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత వన్డే, టీ20 సిరీస్లు ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మను ఆసీస్తో టీ20లతో పాటు వన్డేల్లోనూ ఆడించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.గిల్కు విశ్రాంతి?కాగా శుబ్మన్ గిల్ ఇటీవలే టెస్టు జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ గడ్డపై ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ను కెప్టెన్గా 2-2తో సమం చేశాడు. అనంతరం.. నెలరోజుల విరామం తర్వాత ఆసియా కప్ బరిలో దిగాడు. అయితే, ఆసియా కప్ ముగిసిన వెంటనే విండీస్తో సిరీస్ ఆడనున్నాడు.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా టూర్ సందర్భంగా గిల్కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. టీ20లలో ఇప్పటికే ఓపెనర్గా పాతుకుపోయిన అభిషేక్ శర్మ ఇంతవరకు వన్డేల్లో అరంగేట్రం చేయలేదు. ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి గిల్ వన్డేల్లో ఓపెనింగ్ చేస్తున్నాడు.జైస్వాల్కు అన్యాయంఅయితే, ఆసీస్తో సిరీస్లలో గిల్ రెస్ట్ తీసుకుంటే అభిషేక్ శర్మను ఓపెనర్గా ఎంపిక చేస్తారనే వార్తలు వస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. అభిషేక్ శర్మ ఆసీస్ గడ్డపై వన్డేల్లో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా దేశీ యాభై ఓవర్ల ఫార్మాట్లో అతడికి మెరుగైన రికార్డు ఉంది.లిస్ట్-ఎ క్రికెట్లో 61 మ్యాచ్లు ఆడిన అభిషేక్ శర్మ 2014 పరుగులు చేశాడు. ఒకవేళ అభిని ఆసీస్తో వన్డేలకు ఎంపిక చేస్తే.. మరో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు అన్యాయం చేసినట్లే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.ఇప్పటికే టీమిండియా టెస్టు ఓపెనర్గా స్థానం సుస్థిరం చేసుకున్న యశస్వి జైస్వాల్.. టీ20లలో తన మార్కు చూపించాడు. అయితే, వన్డేల్లో మాత్రం ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చాడు. స్వదేశంలో ఈ ఏడాది ఇంగ్లండ్తో సిరీస్ సందర్భంగా జైసూ ఒకే ఒక్క వన్డే ఆడి.. 15 పరుగులు చేశాడు. ఇంత వరకు అతడికి వన్డేల్లో నిరూపించుకునే అవకాశమే రాలేదు.వన్డే టాపార్డర్లోఇలాంటి సమయంలో అభిషేక్ శర్మ జట్టులోకి వచ్చాడంటే.. జైసూకు అవకాశాలు సన్నగిల్లవచ్చు. అయితే, ఇప్పటికే టీ20, టెస్టుల నుంచి తప్పుకొన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వన్డేలకూ రిటైర్మెంట్ ప్రకటిస్తే మాత్రం వన్డే టాపార్డర్లో జైసూ, అభి, గిల్లను చూసే అవకాశాలను కొట్టిపారేయలేము. కాగా టీమిండియా తరఫున టీ20లలో అభిషేక్ శర్మ 21 టీ20లలో 708 పరుగులు సాధించాడు. మరోవైపు.. జైస్వాల్ 23 టీ20లలో 723, 24 టెస్టుల్లో 2209 రన్స్ రాబట్టాడు.చదవండి: IND vs AUS: మరోసారి దుమ్మురేపిన వైభవ్ సూర్యవంశీ.. భారత్ భారీ స్కోరు -
‘వాళ్లు ఎలా ప్రవర్తించారో చూశాం.. మా జట్టు గర్వకారణం’
సూర్యకుమార్ సేనపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే (Ryan ten Doeschate) ప్రశంసలు కురిపించాడు. పాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా తమ జట్టు సంయమనంతో వ్యవహరించిన తీరు గర్వకారణం అన్నాడు. పాక్ ఆటగాళ్ల కవ్వింపు చర్యలకు తమ ప్లేయర్లు బ్యాట్తో సమాధానమిచ్చిన విధానం అమోఘమని కొనియాడాడు.ఆసియా కప్ టీ20- 2025 టోర్నీలో భాగంగా భారత్- పాకిస్తాన్ (IND vs PAK) ఇప్పటికి రెండుసార్లు తలపడ్డాయి. లీగ్ దశలో పాక్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా ఆ జట్టుతో షేక్హ్యాండ్కు నిరాకరించింది.తీవ్రస్థాయిలో కవ్వింపులుఇక సూపర్-4 మ్యాచ్లోనూ భారత జట్టు మరోసారి పాక్పై పైచేయి సాధించింది. ప్రత్యర్థిని ఆరు వికెట్ల తేడాతో ఓడించి.. వరుసగా రెండో గెలుపు అందుకుంది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా పాక్ ఆటగాళ్లు తీవ్రస్థాయిలో కవ్వింపులకు పాల్పడ్డారు.ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ అర్ధ శతకం (58) పూర్తి చేసుకోగానే ఏకే-47 మాదిరి బ్యాట్ ఎక్కుపెట్టి కాల్పులు జరుపుతున్నట్లు సెలబ్రేట్ చేసుకున్నాడు. కాగా జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు అమాయక పర్యాటకులపై కాల్పులు జరిపి వారి ప్రాణాలు పొట్టనబెట్టుకున్న విషయం విదితమే.బ్యాట్తోనే సమాధానమిచ్చారుదీంతో ఫర్హాన్ సెలబ్రేషన్స్ పాక్ బుద్ధిని చూపిస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు.. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నపుడు పాక్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది, హ్యారీస్ రవూఫ్ భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ- శుబ్మన్ గిల్ (Shubman Gill)లతో మాటల యుద్ధానికి దిగారు.అయితే, ఈ యువ ఆటగాళ్లకు పాక్ ఆటగాళ్లకు బ్యాట్తోనే సమాధానమిచ్చారు. అభి- గిల్ కలిసి తొలి వికెట్కు ఏకంగా 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి పాక్కు తమ స్థాయి ఏమిటో చూపించారు. ఈ పరిణామాలపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ డష్కాటే స్పందించాడు.వాళ్ల చేష్టలు పట్టించుకోము‘‘హ్యారిస్ రవూఫ్ ఏం చేశాడో నేను కూడా చూశాను. అయితే, మా వాళ్లు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఆట మీద మాత్రమే దృష్టి పెటారు. అందుకు నాకు గర్వంగా ఉంది.బ్యాట్తోనే క్రీడా యుద్ధంలో మా వాళ్లు గెలిచారు. ఈ టోర్నీలో మా ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. సంయమనంగా ఉంటున్నారు. మాతో మ్యాచ్లో పాక్ తొలుత బాగానే బ్యాటింగ్ చేసింది. అప్పుడే అతడు (ఫర్హాన్) అలా చేశాడు.అయితే, మేము తిరిగి పుంజుకున్న తీరు గొప్పగా ఉంది. 10 ఓవర్ల తర్వాత మా బౌలర్లు మ్యాచ్ను చేతుల్లోకి తీసుకున్నారు. కానీ పాక్ ఆటగాళ్ల ప్రవర్తన ఎలా ఉందో అందరం చూశాం.గర్వకారణంవాళ్లు ఏదో చెప్పాలని ప్రయత్నించారు. అయితే, మా వాళ్లు కేవలం ఆటకే పరిమితమై తమ పని పూర్తి చేశారు. నిజానికి ఈ మ్యాచ్లో మా ఆటగాళ్లపై కూడా ఒత్తిడి ఉంది. కానీ వాళ్లు ఎప్పుడూ కట్టు దాటలేదు.ఇలాంటి మ్యాచ్లలో నియంత్రణ కోల్పోవడం సహజం. మా వాళ్లు మాత్రం అలా చేయలేదు. వాళ్ల సెలబ్రేషన్స్, మా బ్యాటర్లతో పాక్ బౌలింగ్ విభాగం వాగ్వాదాలు దృష్టి మళ్లించేవే. అయితే, ముందుగా చెప్పినట్లు మా జట్టు వేటినీ పట్టించుకోకుండా.. అత్యుత్తమ ప్రదర్శనతో గెలిచిన తీరు మాకు ఆనందదాయకం’’ అని డష్కాటే హర్షం వ్యక్తం చేశాడు. చదవండి: బీసీసీఐకి శ్రేయస్ అయ్యర్ లేఖ!.. ఇకపై నేను... -
ఆసియా కప్-2025: ఫైనల్ రేసు.. ఏ జట్లకు అవకాశాలు ఎక్కువ?
ఆసియా కప్ టీ20- 2025 టోర్నమెంట్ ముగింపు దశకు చేరుకుంటోంది. సూపర్-4 దశలో భాగంగా ఇప్పటికే మూడు మ్యాచ్లు పూర్తయ్యాయి. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ శ్రీలంక (BAN vs SL)పై నాలుగు వికెట్ల తేడాతో గట్టెక్కగా.. టీమిండియా పాకిస్తాన్ (IND vs PAK)ను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది.ఇక తాజాగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్.. శ్రీలంకపై ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా ఫైనల్ చేరే అవకాశాలను సజీవం చేసుకుంది. మరోవైపు.. ఇప్పటికే సూపర్-4లో బంగ్లా చేతిలో ఓడిన శ్రీలంక.. తాజాగా పాక్ చేతిలోనూ ఓడి ఫైనల్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది.అయితే, ఇతర జట్ల ఫలితాల ఆధారంగా లంక జట్టుకు ఇంకా దింపుడుకళ్లెం ఆశలు మిగిలి ఉన్నట్లే!.. ఈ నేపథ్యంలో టైటిల్ పోరుకు అర్హత సాధించేందు (Asia Cup 2025 Final Scenarios)కు నాలుగు జట్లకు అవసరమైన సమీకరణలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం!ఫైనల్ రేసు.. ఏ జట్లకు అవకాశాలు ఎక్కువ?సూపర్-4లో టీమిండియా తొలి మ్యాచ్లో పాక్పై గెలిచి రెండు పాయింట్లు సాధించింది. నెట్ రన్రేటు పరంగానూ(+0.689) మెరుగ్గా ఉండటం వల్ల ప్రస్తుతం టాపర్గా ఉంది. ఇక పాకిస్తాన్ రెండింట ఒక విజయంతో రెండు పాయింట్లతో.. +0.226 నెట్ రన్రేటుతో రెండో స్థానంలో ఉంది.మరోవైపు.. బంగ్లాదేశ్ ఒక విజయంతో రెండు పాయింట్లు (+0.121) సాధించి మూడో స్థానంలో ఉండగా.. లంక రెండింటికి రెండు ఓడి ఆఖరి ప్లేస్లో నిలిచింది.టీమిండియాకు నల్లేరు మీద నడకేఇక బుధవారం నాటి మ్యాచ్లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్తో తలపడనుంది. టీ20 ఫార్మాట్లో ఇరుజట్లు ముఖాముఖి ఎదురుపడిన సందర్భాల్లో భారత్ 16 సార్లు గెలుపొందగా.. బంగ్లా ఒకే ఒక్కసారి విజయం సాధించింది. కాబట్టి ఈ మ్యాచ్ ఫలితాన్ని తేలికగానే అంచనా వేయవచ్చు.బంగ్లాపై గెలిస్తే భారత్ ఖాతాలో మరో రెండు పాయింట్లు చేరతాయి. ఆ తర్వాత శ్రీలంకను కూడా ఓడిస్తే.. టీమిండియా అజేయంగా ఫైనల్కు చేరుకుంటుంది. మరోవైపు.. పాకిస్తాన్ తమకు మిగిలిన ఒక్క మ్యాచ్లో బంగ్లాదేశ్ను తప్పక ఓడించాల్సి ఉంటుంది. లేదంటే పాక్ అవకాశాలు సంక్లిష్టమవుతాయి.అలాంటపుడు టీమిండియా చేతిలో బంగ్లా ఓడినప్పటికీ.. పాక్, బంగ్లాలు పాయింట్ల పరంగా సమమవుతాయి. అప్పుడు నెట్ రన్ రేటుది కీలక పాత్ర. అలా కాకుండా.. పాక్ బంగ్లాపై గెలవడంతో పాటు.... టీమిండియా బంగ్లా, లంకలను ఓడించిందంటే.. పాక్ కూడా టైటిల్ పోరుకు నేరుగా అర్హత సాధిస్తుంది.ఇది టీ20 ఫార్మాట్ గురూ!ఒకవేళ ఊహించని రీతిలో బంగ్లాదేశ్ గనుక టీమిండియాపై గెలిస్తే.. అదే విధంగా శ్రీలంక చేతిలో భారత జట్టు ఓడితే అప్పుడు పాక్తో పాటు బంగ్లాకు అవకాశాలు మిగిలి ఉంటాయి. ఇది దాదాపు అసాధ్యం. ప్రస్తుత టీమిండియా పటిష్టంగా ఉంది కాబట్టి.. ఇది జరగకపోవచ్చు. ఏదేమైనా ఫైనల్ చేరే అవకాశాలు టీమిండియా, పాకిస్తాన్లకే ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఇది టీ20 ఫార్మాట్ కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేము. అయితే, చరిత్రను బట్టి భారత్- పాక్ ఫైనల్లో ఢీకొట్టుకునే అవకాశాలను మాత్రం కొట్టిపడేయలేము. ఇదిలా ఉంటే.. దాయాది పాక్ను లీగ్ దశలో, సూపర్-4లో టీమిండియా ఓడించిన విషయం తెలిసిందే.మరి శ్రీలంక పరిస్థితి ఏమిటి?శ్రీలంక ఫైనల్ రేసులోకి రావాలంటే.. బంగ్లాదేశ్.. టీమిండియా, పాకిస్తాన్లపై గెలవాలి. అంతేకాదు.. తమ ఆఖరి మ్యాచ్లో టీమిండియాపై శ్రీలంక భారీ తేడాతో విజయం సాధించాలి. అప్పుడే లంక ఆశలు మిగిలి ఉంటాయి.చదవండి: వెక్కిరించిన పాక్ బౌలర్.. ఒకటి కాదు.. రెండుసార్లు ఇచ్చిపడేసిన హసరంగ -
‘అతడికి అసలు ఆ అర్హత ఉందా?.. ఏం చేస్తున్నాడో తనకైనా తెలుసా?’
పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) మండిపడ్డాడు. సల్మాన్ జట్టుకు బలహీనతగా మారాడని.. తనేం చేస్తున్నాడో తనకైనా అర్థమవుతోందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే విధంగా.. కోచ్ మైక్ హసన్ నిర్ణయం చెత్తగా ఉందంటూ అక్తర్ విమర్శించాడు.ఆసియా కప్-2025 టీ20 టోర్నమెంట్లో భారత్ చేతిలో పాక్ వరుస పరాజయాలు చవిచూసిన విషయం తెలిసిందే. లీగ్ దశలో సూర్యకుమార్ సేన చేతిలో సల్మాన్ ఆఘా బృందం ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక సూపర్-4లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్లోనూ ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.ఆరో స్థానంలో బ్యాటింగ్కు...దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ అర్ధ శతకం (58)తో రాణిచంగా.. ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ సల్మాన్ ఆఘా 13 బంతుల్లో 17 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.ఇదిలా ఉంటే.. భారత్ ఏడు బంతులు మిగిలి ఉండగానే పాక్ విధించిన లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఆఘా బ్యాటింగ్ స్థానంలో ఆరో ఆటగాడిగా రావడం పట్ల అక్తర్ స్పందించాడు.అతడికి అసలు ఆ అర్హత ఉందా?‘‘జట్టులో బలహీనమైన లింక్ ఏదైనా ఉందంటే.. సల్మాన్ ఆఘానే. అసలు అతడు ఆరోస్థానంలో ఆడేందుకు అర్హుడా? మిడిలార్డర్లో వీకెస్ట్ లింక్. అతడు ఏం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడు.టీమిండియాతో మ్యాచ్లో డౌన్లో వస్తాడా? హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ వంటి వాళ్లు భారత జట్టులో ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తారా?.. ప్రత్యర్థి జట్టుతో కనీసం పోలికైనా అక్కర్లేదా?కోచ్ చెప్పిన మాట వినడం మంచిదే. కానీ దాని వల్ల ఉపయోగం లేనపుడు ఎందుకు అలా చేయడం?.. కోచ్ నిర్ణయం నన్ను ఆశ్చర్యపరిచింది. కెప్టెన్గా తనేం చేస్తున్నాడో అసలు సల్మాన్కైనా తెలుసా?’’ అంటూ అక్తర్ ఫైర్ అయ్యాడు. కాగా ఫైనల్ రేసులో నిలిచే క్రమంలో పాకిస్తాన్ మంగళవారం శ్రీలంకతో చావో రేవో తేల్చుకోనుంది. అబుదాబి ఇందుకు వేదిక.చదవండి: IND vs AUS: శ్రేయస్ అయ్యర్ అనూహ్య నిర్ణయం.. గుడ్బై చెప్పేసి.. -
టీ తాగారు.. భారత్ దెబ్బకు తోకముడిచారు!.. పాక్ బుద్ధి మారదు!
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మైదానంలో పాకిస్తాన్ ఆటగాళ్ల వెకిలి చేష్టలు ఎక్కువయ్యాయి. భారత్పై తమదే పైచేయి అని నమ్మించే ప్రయత్నంలో బొక్కబోర్లా పడుతున్నా వారి తీరు మాత్రం మారడం లేదు. సీనియర్ క్రికెటర్లకు తామేమీ తీసిపోమన్మట్లుగా ఫుట్బాల్ యువ ఆటగాళ్లు కూడా ఓవరాక్షన్తో వివాదాలకు కారణమవుతున్నారు.కాగా జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఇందుకు భారత ఆర్మీ ఉగ్రమూకలకు గట్టి కౌంటర్ ఇచ్చింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలను ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’తో నేలమట్టం చేసింది. అయితే, ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం దాడి చేస్తే.. అందుకు ప్రతిగా పాక్ ఆర్మీ ముందుకు వచ్చి మరోసారి తమ బుద్ధిని చాటుకుంది. ఈ క్రమంలో పాక్తో అన్ని సంబంధాలు.. ముఖ్యంగా క్రీడల్లోనూ వారితో ఎలాంటి పోటీ వద్దంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే, ఆసియాకప్-2025 (Asia Cup 2025) టోర్నీలో మాత్రం టీమిండియా పాక్తో ఆడేందుకు భారత ప్రభుత్వం అనుమతినిచ్చింది. బహుళ దేశాలు పాల్గొంటున్న టోర్నీ కావున ఇందుకు సమ్మతించింది.పప్పులు ఉడకపోవడంతోఈ నేపథ్యంలో లీగ్ దశలో పాక్ ఆటగాళ్లతో టీమిండియా కరచాలనానికి నిరాకరించింది. దీనిని అవమానంగా భావించిన పాక్.. ఐసీసీకి ఫిర్యాదు చేసింది. తమ పప్పులు ఉడకపోవడంతో ఆదివారం నాటి సూపర్-4 మ్యాచ్లో ఆటగాళ్లు మైదానంలో ఆటతో కాకుండా తమ చేష్టలతో కవ్వింపులకు పాల్పడ్డారు.ఇక పాక్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ అర్ధ శతకం (58) పూర్తి చేసుకోగానే.. ఏకే-47 మాదిరి బ్యాట్ ఎక్కుపెట్టి ప్రేక్షకులను కాలుస్తున్నట్లు సంబరాలు చేసుకున్నాడు. మరోవైపు.. హ్యారిస్ రవూఫ్ (Haris Rauf).. ‘మీ యుద్ధ విమానాలను కూల్చామన్నట్లుగా’ టీమిండియా అభిమానులకు సైగ చేశాడు.టీ తాగారు.. తోక ముడిచారుతాజాగా ఫుట్బాల్ మ్యాచ్లో కూడా పాక్కు చెందిన ఓ ఆటగాడు ఇదే తరహాలో భారత జట్టును రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కొలంబో వేదికగా దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–17 టోర్నమెంట్లో భాగంగా సోమవారం గ్రూప్-‘బి’లోని చివరి మ్యాచ్లో భారత్- పాక్ తలపడ్డాయి. భారత్ తరఫున దలాల్మువాన్ గాంగ్టే 31వ నిమిషంలో గోల్ చేయగా.. 43వ నిమిషంలో పాక్ ప్లేయర్ మొహమ్మద్ అబ్దుల్లా ఒక గోల్ సాధించాడు. ఈ క్రమంలోనే పాక్ ఆటగాళ్లు అతి చేశారు. టీ తాగుతున్నట్లుగా అభినయిస్తూ భారత జట్టును టీజ్ చేశారు. కాగా గతంలో సర్జికల్ స్ట్రైక్స్ సందర్భంగా ఎయిర్ఫోర్స్ వింగ్ అభినందన్ వర్ధమాన్ అనూహ్య రీతిలో పాక్ ఆర్మీ చేతికి చిక్కగా.. ఆయన టీ తాగుతున్నట్లుగా ఉన్న ఫొటోను విడుదల చేసింది.అయితే, 2019 నాటి ఈ ఘటనలో అభినందన్ దాదాపు 60 గంటలపాటు పాక్ నిర్బంధంలో ఉండగా.. జనీవా ఒప్పందం ప్రకారం తిరిగి భారత్కు అప్పగించారు. ఇపుడు ఇదే విషయాన్ని గుర్తుచేస్తున్నట్లుగా పాక్ యువ ఆటగాడు వ్యవహరించడం విశేషం.భారత్ చేతిలో ఓటములేఅయితే, ఈ మ్యాచ్లో భారత్- పాకిస్తాన్ను 3-2తో ఓడించడంతో పరాజయ భారంతో దాయాది తోకముడిచింది. ఇక ఈ గెలుపుతో భారత్ గ్రూప్-బి టాపర్గా సెమీస్ చేరగా.. రెండో స్థానంలో పాక్ కూడా క్వాలిఫై అయింది. సెమీ ఫైనల్లో భారత్- నేపాల్తో, పాకిస్తాన్ బంగ్లాదేశ్తో తలపడతాయి. ఇదిలా ఉంటే.. ఆసియా కప్ టీ20 టోర్నీలో భారత్ లీగ్, సూపర్ దశలో పాక్ను చిత్తు చేసింది.చదవండి: ఎవర్నీ లెక్కచేయను.. నా తీరే అంత.. నచ్చినట్లు చేస్తా: పాక్ బ్యాటర్ ఎక్స్ట్రాలుSuch a disgraceful celebration by Pakistani U17 Team at SAFF, Glad we beat them 3-2 today! pic.twitter.com/kfksfrP4h3— The Khel India (@TheKhelIndia) September 22, 2025 -
సెహ్వాగ్ ఆడినపుడు ఇలాంటి వాళ్లు లేరు: అభిషేక్ శర్మ
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు తన సత్తా ఏమిటో మరోసారి చూపించాడు. ఆసియా కప్-2025 టోర్నీలో లీగ్ దశలో పాక్పై 13 బంతుల్లో 31 పరుగులు చేసిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. తాజాగా ఆదివారం నాటి సూపర్-4 మ్యాచ్లో మరోసారి దంచికొట్టాడు.ధనాధన్ దంచికొట్టిన అభి.. పాక్ బౌలర్లు విలవిల దుబాయ్లో జరిగిన పాక్తో జరిగిన ఈ మ్యాచ్లో 39 బంతుల్లోనే 74 పరుగులు సాధించాడు. పాక్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది (Shaheen Afridi), హ్యారిస్ రవూఫ్ బౌలింగ్లో అభిషేక్ చితక్కొట్టాడు. అయితే, స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (Abrar Ahmed) బౌలింగ్లో హ్యారిస్ రవూఫ్కు క్యాచ్ ఇవ్వడంతో అభిషేక్ మెరుపు ఇన్నింగ్స్కు తెరపడింది.ఏదేమైనా షాహిన్, రవూఫ్ల బౌలింగ్లో అభిషేక్ ధనాధన్ దంచికొట్టిన తీరు అభిమానులకు మజా ఇచ్చిందనడంలో సందేహం లేదు. ఇక అభిషేక్కు తోడు మరో ఓపెనర్ , వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ (28 బంతుల్లో 47), నాలుగో నంబర్ బ్యాటర్ తిలక్ వర్మ (19 బంతుల్లో 30 నాటౌట్) రాణించడంతో.. మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే.. పాక్ విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేదించింది.వీరూ పాజీ హిట్టింగ్ ఆడిన రోజుల్లోఈ నేపథ్యంలో విజయానంతరం ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అభిషేక్ శర్మ ఆసియా కప్ బ్రాడ్కాస్టర్ సోనీ స్పోర్ట్స్తో మాట్లాడాడు. ఈ క్రమంలో పాక్ జట్టు బౌలర్ల గురించి మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్తో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘‘వీరూ పాజీ హిట్టింగ్ ఆడిన రోజుల్లో పాక్ బౌలర్లు గట్టి పోటీనిచ్చేవారు. కానీ ప్రస్తుత జట్టులో అలాంటి బౌలర్లు ఎవరూ లేరు’’ అని పేర్కొన్నాడు. ప్రస్తుత పాక్ బౌలింగ్ దళం బలహీనంగా ఉందని అభిషేక్ శర్మ అభిప్రాయపడ్డాడు. కాగా సెహ్వాగ్ టీమిండియాకు ఆడిన సమయంలో షోయబ్ అక్తర్ వంటి మేటి బౌలర్లు పాక్ జట్టులో ఉండేవారన్న సంగతి తెలిసిందే.సెంచరీ చేయాల్సిందిఇదిలా ఉంటే.. అభిషేక్ శర్మ పాక్తో మ్యాచ్లో సెంచరీ మిస్ కావడం తనకు కాస్త వెలితిగా అనిపించిందని ఈ సందర్భంగా సెహ్వాగ్ అన్నాడు. ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయని.. 50s, 70s లను శతకాలుగా మార్చాలని ఈ వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్కు సెహ్వాగ్ సూచించాడు.‘‘నువ్వు 70 పరుగులు దాటావంటే.. 100 చేసేందుకు కచ్చితంగా ప్రయత్నించు. సునిల్ గావస్కర్ నాకో మాట చెప్పారు. ‘నువ్వు రిటైర్ అయినపుడు ఈ 70, 80 స్కోర్లు నీకు గుర్తుకువస్తాయి. ఆరోజే వాటిని సెంచరీలుగా మలిస్తే బాగుండదని అనిపిస్తుంది’ అన్నారు.ఎందుకంటే వందకు చేరువయ్యే అవకాశం మళ్లీ మళ్లీ రాదు కదా!.. అద్భుతంగా బ్యాటింగ్ చేసిన రోజు నాటౌట్గా ఉండేందుకు నువ్వు ప్రయత్నించు’’ అని సెహ్వాగ్ అభిషేక్ శర్మతో అన్నాడు.చదవండి: ఫ్రాంఛైజీ సహ యజమానిగా కేఎల్ రాహుల్Abhishek Sharma gets a priceless advice from Virender Sehwag ✨ @YUVSTRONG12, did the call finally happen? 👀 😅Watch the #DPWorldAsiaCup2025, Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/SqHa1k4mAA— Sony Sports Network (@SonySportsNetwk) September 22, 2025 -
పాకిస్తాన్కు మరోసారి షాకిచ్చాడు!.. అప్పుడలా.. ఇప్పుడు ఇంకో ఏడుపు!
ఆసియా కప్-2025 టోర్నీలో పాకిస్తాన్కు మరోసారి చేదు అనుభవం తప్పలేదు. దుబాయ్లో ఆదివారం జరిగిన సూపర్- 4 మ్యాచ్లో టీమిండియా చేతిలో సల్మాన్ ఆఘా బృందం ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో.. నో-షేక్హ్యాండ్ వివాదం తర్వాత పాక్ క్రికెట్ బోర్డు మరోసారి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తలుపుతట్టింది.అప్పుడలా.. ఇప్పుడు ఇంకో ఏడుపు!కాగా లీగ్ దశలో పాక్తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు పాక్ జట్టుతో కరచాలనం చేసేందుకు నిరాకరించారు. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే, దీనిని అవమానంగా భావించిన పాక్.. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ (Andy Pycropt) వల్లే ఇలా జరిగిందంటూ ఐసీసీకి ఫిర్యాదు చేసింది.రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించాలంటూ డిమాండ్ చేసింది. అయితే, ఐసీసీ మాత్రం దిగిరాలేదు. పాక్ ఆడే మ్యాచ్లకు మరోసారి అతడినే రిఫరీగా ఎంపిక చేసింది. లీగ్ దశలో ఆఖరిగా యూఏఈతో పాటు.. తాజాగా టీమిండియాతో సూపర్-4 మ్యాచ్లోనూ ఆండీ పైక్రాఫ్ట్ రిఫరీగా వ్యవహరించాడు.క్యాచ్ విషయంలో వివాదంఇదిలా ఉంటే.. ఆదివారం నాటి మ్యాచ్లో పాక్ ఓపెనర్ ఫఖర్ జమాన్ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) బౌలింగ్లో భారత వికెట్ కీపర్ సంజూ శాంసన్ (Sanju Samson)కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అయితే, బంతి నేలను తాకిన తర్వాతే సంజూ చేతుల్లోకి వెళ్లిందని భావించిన ఫఖర్ జమాన్.. కాసేపు క్రీజులోనే ఉండి అసహనం వ్యక్తం చేశాడు.ఈ విషయంలో ఫీల్డ్ అంపైర్ స్పష్టతనివ్వకపోవడంతో.. టీవీ అంపైర్ దగ్గరకు పంచాయతీ చేరింది. అయితే, వివిధ కోణాల్లో పరిశీలించిన తర్వాత.. బంతి కింద సంజూ వేళ్లు ఉన్నాయంటూ.. దీనిని క్లీన్ అవుట్గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పాక్ అంపైర్ తీరుపై అసంతృప్తి వెళ్లగక్కింది.పాకిస్తాన్కు మరోసారి షాకిచ్చాడు!ఈ విషయమై రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్కు ఫిర్యాదు చేయగా.. తన పరిధిలో లేదంటూ ఆయన బదులిచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాక్ సన్నిహిత వర్గాలు టెలికామ్ఏసియా.నెట్తో మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ జట్టు మేనేజర్ నవీద్ చీమా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్కు ఈ విషయం గురించి ఫిర్యాదు చేశాడు.అయితే, తన పరిధిలో లేదంటూ ఆయన రిప్లై ఇచ్చాడు. దీంతో మేనేజర్ ఐసీసీకి మెయిల్ చేశాడు. అంపైర్పై ఫిర్యాదు చేశాడు’’ అని పేర్కొన్నాయి.ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. ‘‘అంపైర్లు కొన్నిసార్లు తప్పులు చేస్తారు. అది సహజమే. కానీ ఈసారి బంతి కీపర్ చేతుల్లో పడేకంటే ముందు నేలను తాకినట్లు అనిపించింది’’ అని పేర్కొన్నాడు.చదవండి: ఎవర్నీ లెక్కచేయను.. నా తీరే అంత.. నచ్చినట్లు చేస్తా: పాక్ బ్యాటర్ ఎక్స్ట్రాలు -
నువ్వు ఏకే-47 అంటే.. వాళ్లు ఏకంగా ‘బ్రహ్మోస్’ ప్రయోగించారు: పాక్ మాజీ క్రికెటర్
టీమిండియాతో మ్యాచ్లో పాకిస్తాన్ (IND vs PAK) జట్టు ఆట తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా (Danish Kaneria) విమర్శలు గుప్పించాడు. ప్రత్యర్థి జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నపుడు కనీసం 200 పరుగులైనా స్కోరు చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.ఆసియా కప్-2025 టోర్నీలో తొలుత లీగ్ దశలో భారత్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైన పాక్.. తాజాగా సూపర్-4 మ్యాచ్లోనూ ఆరు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సల్మాన్ ఆఘా బృందం.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఫర్హాన్ ఓవరాక్షన్పాక్ ఇన్నింగ్స్లో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (45 బంతుల్లో 58) టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. అయితే, చేసింది హాఫ్ సెంచరీయే అయినా.. ఏకే-47 మాదిరి గన్ ఎక్కుపెట్టి కాలుస్తున్నట్లు ఫర్హాన్ ఓవరాక్షన్ చేశాడు. అయితే, లక్ష్య ఛేదనలో టీమిండియా ఇందుకు బ్యాట్తోనే సమాధానమిచ్చింది.ఓపెనర్లు అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74)- శుబ్మన్ గిల్ (28 బంతుల్లో 47) పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. విధ్వంసకర బ్యాటింగ్తో తొలి వికెట్కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరికి తోడు తిలక్ వర్మ 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి.. పాక్ను మరోసారి కంగుతినిపించింది.ఈ నేపథ్యంలో టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ (Abhishek Sharma), శుబ్మన్ గిల్లపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరు ఆది నుంచే అద్భుత రీతిలో బ్యాటింగ్ చేశారని కొనియాడాడు. ఈ క్రమంలో ఫర్హాన్ సెలబ్రేషన్ చేసుకున్న తీరును కూడా కనేరియా విమర్శించాడు.నువ్వు ఏకే-47 అంటే.. వాళ్లు ఏకంగా ‘బ్రహ్మోస్’ ప్రయోగించారు‘‘సాహిబ్జాదా ఫర్హాన్ ఏకే-47 గన్ కాలుస్తున్నట్లు సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత శుబ్మన్ గిల్- అభిషేక్ శర్మ తమ బ్యాట్లతోనే ఏకంగా బ్రహ్మోస్ ప్రయోగించారు.ముఖ్యంగా అభిషేక్ శర్మ అయితే ముద్దులు విసురుతూనే బౌండరీల వర్షం కురిపించాడు. పాక్ బౌలింగ్పై వారిద్దరు విరుచుకుపడ్డారు. ఇందుకు పాక్ ఆటగాళ్ల వద్ద సమాధనమే లేకుండా పోయింది.మీరు ఉతుకుడు అని సంబరపడ్డారు. వారు ఉతికి.. ఉతికి ఆరేశారు. ప్రత్యర్థి జట్టులో అభిషేక్ శర్మ- శుబ్మన్ గిల్ వంటి ఓపెనర్లు ఉన్నపుడు 200 పరుగుల స్కోరు కూడా చిన్నదే అయిపోతుంది. వాళ్లిద్దరు క్లాస్ ప్లేయర్లు’’ అంటూ డానిష్ కనేరియా వార్తా సంస్థ IANSతో పేర్కొన్నాడు. -
ఎవర్నీ లెక్కచేయను.. నా తీరే అంత.. నచ్చినట్లు చేస్తా: పాక్ బ్యాటర్ ఎక్స్ట్రాలు
టీమిండియాతో మ్యాచ్లో అతి చేసిన పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (Sahibzada Farhan)పై విమర్శల వర్షం కురుస్తోంది. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత అతడు సంబరాలు చేసుకున్న తీరే ఇందుకు కారణం.ఐ డోంట్ కేర్అయితే, తానేమీ సెలబ్రేషన్స్ విషయంలో పశ్చాత్తాపపడటం లేదని.. తన తీరే అంత అని ఫర్హాన్ తన చర్యను సమర్థించుకున్నాడు. ఎవరేమనుకున్నా ‘ఐ డోంట్ కేర్’ అంటూ హెచ్చులకు పోయాడు. కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆసియా కప్-2025 వేదికగా భారత్- పాక్ తొలిసారి తలపడ్డాయి.లీగ్ దశలో పాక్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన భారత్ (IND vs PAK).. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్లో సూపర్-4 దశలో ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే, పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా భారత ఆటగాళ్లు పాక్ జట్టుతో ఆది నుంచే కరచాలనానికి నిరాకరించారు.గన్ పేలుస్తున్నట్లుగా ఈ నేపథ్యంలో సాహిబ్జాదా ఫర్హాన్ చర్య వివాదానికి దారితీసింది. భారత్తో మ్యాచ్లో 34 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్న అతడు.. వెంటనే బ్యాట్ను ఏకే-47 తుపాకి మాదిరి ప్రేక్షకుల వైపు ఎక్కుపెట్టి గన్ పేలుస్తున్నట్లుగా అభినయించాడు.ఓవైపు పహల్గామ్లో అమాయక పర్యాటకులను కాల్చి చంపిన ఘాతుకానికి నిరసనగా టీమిండియా షేక్హ్యాండ్ No- Shakehand)కు నిరాకరిస్తుంటే.. ఫర్హాన్ ఇలా రెచ్చగొట్టేలా ప్రవర్తించడంపై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై సాహిబ్జాదా ఫర్హాన్ తాజాగా స్పందిస్తూ.. మరోసారి అతి చేశాడు. ఈసారి అలా చేయాలనిపించింది‘‘మీరు సిక్సర్ల గురించి మాట్లాడుతున్నారేమో.. భవిష్యత్తులో ఇంకా ఎక్కువే చూస్తారు. ఇక సెలబ్రేషన్ గురించి అంటారా.. ఆ సమయంలో అలా చేయాలని అనిపించిందంతే.మామూలుగా 50 కొడితే నేను సెలబ్రేట్ చేసుకోను. కానీ ఈసారి అలా చేయాలనిపించింది. దాని గురించి ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను. ఎక్కడైనా సరే దూకుడుగా ఆడటం నా లక్ష్యం. టీమిండియా అయినా.. ఏ జట్టు అయినా నా శైలి ఇలాగే దూకుడుగా ఉంటుంది’’ అని మీడియా సమావేశంలో ఫర్హాన్ పేర్కొన్నాడు.అంతొద్దుకాగా 2018లో ఆస్ట్రేలియాతో టీ20 సందర్భంగా 29 ఏళ్ల ఫర్హాన్ పాక్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటివరకు 24 టీ20 మ్యాచ్లు ఆడి.. 510 పరుగులు చేయగలిగగాడు. ఈ నేపథ్యంలో అతడి వ్యాఖ్యలను ఉటంకిస్తూ నెటిజన్లు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. సెంచరీలు బాదిన వాళ్లు కూడా ఇలా ఓవరాక్షన్ చేయరంటూ చురకలు అంటిస్తున్నారు.ఇక టీమిండియాతో మ్యాచ్లో ఫర్హాన్ 45 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేశాడు. శివం దూబే బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.చదవండి: ఇంకోసారి అలా అనకండి: పాక్ జట్టు పరువు తీసిన సూర్యసెకండ్ వికెట్ పడగొట్టిన Shivam Dube 💥 చూడండి #INDvPAK లైవ్Sony Sports Network TV Channels & Sony LIV లో#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/EZGkRemo4D— Sony Sports Network (@SonySportsNetwk) September 21, 2025इनको कौन समझाये ये बैट है AK47 नहीं 😡😡#INDvPAK pic.twitter.com/oV456mlCXq— Shivani (@shivani_di) September 21, 2025 -
పాక్ను చిత్తు చేసిన భారత్.. గౌతం గంభీర్ పోస్ట్ వైరల్
దాయాది పాకిస్తాన్కు టీమిండియా మరోసారి తమ స్థాయి ఏమిటో చూపించింది. దూకుడైన ఆటతో ‘చిరకాల ప్రత్యర్థి’కి చెక్పెట్టి .. పొట్టి ఫార్మాట్లో మరోసారి ఆధిపత్యాన్ని చాటుకుంది. కాగా ఆసియా కప్-2025 టోర్నీలో భాగంగా లీగ్ దశలో ఏడు వికెట్ల తేడాతో పాక్ను ఓడించిన భారత్.. తాజాగా కీలకమైన సూపర్-4 దశలోనూ సత్తా చాటింది.దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ సేన.. సల్మాన్ ఆఘా బృందాన్ని ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. పాక్ను నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులకు కట్టడిచేయగలిగింది.అభిషేక్- గిల్ ధనాధన్ఇక లక్ష్య ఛేదనలో టీమిండియా మరోసారి తన మార్కును చూపించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (Abhishek Sharma)- శుబ్మన్ గిల్ (Shubman Gill) అద్భుత రీతిలో ఆకట్టుకున్నాడు. అభిషేక్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లు బాది 74 పరుగులు చేయగా.. గిల్ 28 బంతుల్లో 47 పరుగులు సాధించాడు.వీరికి తోడుగా తిలక్ వర్మ (19 బంతుల్లో 30) ధనాధన్ బ్యాటింగ్తో అలరించాడు. ఈ క్రమంలో 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే నష్టపోయి టీమిండియా లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో టీ20 ఫార్మాట్లో పదిహేనుసార్ల ముఖాముఖి పోరులో టీమిండియా పాక్పై పన్నెండోసారి గెలుపు జెండా ఎగురవేసింది.దిగ్గజాలు లేకుండానేఈసారి ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలు లేకుండానే యువ భారత జట్టు పాక్ను ఓడించడం విశేషం. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ జట్టు ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.ఫియర్లెస్..ఇన్స్టా స్టోరీలో ‘‘ఫియర్లెస్.. ఫియర్లెస్.. ఫియర్లెస్’’ అంటూ అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్లతో పాటు టీమిండియా ఫొటోను గంభీర్ షేర్ చేశాడు. తమకు భయం లేదు.. తిరుగు లేదు అన్నట్లుగా గంభీర్ ప్రత్యర్థి జట్లకు పరోక్షంగా హెచ్చరిక జారీ చేశాడు. ముఖ్యంగా మైదానంలో అతి చేసిన దాయాది పాక్కు తనదైన శైలిలో ఇలా కౌంటర్ వేశాడు. చదవండి: ఇంకోసారి అలా అనకండి: పాక్ జట్టు పరువు తీసిన సూర్య -
పాక్ బౌలర్ల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన అభిషేక్, గిల్
ఆసియా కప్-2025 సూపర్-4 మ్యాచ్లో టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ పేసర్లకు చేదు అనుభవం ఎదురైంది. తమ బౌలింగ్లో భారత బ్యాటర్లు చితక్కొడుతుంటే వారి అసహనం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలో ఆటపై దృష్టి పెట్టాల్సింది పోయి .. నోటికి పనిచెప్పారు.పాక్ జట్టుకు ఓటమిని కానుకగాతమ బౌలింగ్లో ఉతికారేస్తున్న ఓపెనర్లు అభిషేక్ శర్మ (Abhishesk Sharma)- శుబ్మన్ గిల్ (Shuban Gill)లతో వాదులాటకు దిగేందుకు ప్రయత్నించారు. ఇందుకు వారిద్దరు బ్యాట్తోనే సమాధానమిచ్చి.. పాక్ జట్టుకు ఓటమిని కానుకగా అందించారు. దీంతో ఆడలేక అతి చేసిన పాక్ ఆటగాళ్లకు మరోసారి అవమానం తప్పలేదు.అసలేం జరిగిందంటే.. లీగ్ దశలో టీమిండియా చేతిలో చిత్తైన పాక్ (IND vs PAK).. తాజాగా సూపర్-4 మ్యాచ్లోనూ ఓడిపోయింది. అయితే, బ్యాటింగ్ పరంగా మాత్రం మెరుగ్గా రాణించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.ఆది నుంచే పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారుఅయితే, టీ20 వరల్డ్ నంబర్ వన్ అయిన భారత జట్టు పాక్ విధించిన లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో ఊదేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74), శుబ్మన్ గిల్ (28 బంతుల్లో 47) ఆది నుంచే పాక్ బౌలర్లపై దూకుడు ప్రదర్శించారు. ఇద్దరూ బౌండరీలు బాదుతూ పాక్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు.ఈ క్రమంలో పాక్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది, హ్యారీస్ రవూఫ్.. అభిషేక్- గిల్లను మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. షాహిన్ బౌలింగ్లో ఇరగొట్టిన గిల్.. అతడి ఓవరాక్షన్కు బదులుగా ‘‘వెళ్లి బంతి తెచ్చుకో’’ అంటూ కౌంటర్ ఇచ్చాడు.ఇక హ్యారిస్ రవూఫ్ పదే పదే మాటలతో కవ్వింపులకు పాల్పడగా.. అభిషేక్ ఓ దశలో అతడికి దగ్గరగా వెళ్లి బదులిచ్చే ప్రయత్నం చేశాడు. ఇంతలో అంపైర్ వచ్చి రవూఫ్ను పక్కకు తీసుకువెళ్లాడు.అస్సలు నచ్చలేదుఈ విషయంపై మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. పాక్ బౌలర్లు కారణం లేకుండా మీద మీదకు వచ్చారని.. దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నాడు. తనకు అది అస్సలు నచ్చలేదని తెలిపాడు. తాము మాత్రం అనవసర విషయాల పట్ల కాకుండా ఆటపై మాత్రమే దృష్టి పెట్టామంటూ పాక్ బౌలర్లకు మరోసారి కౌంటర్ ఇచ్చిపడేశాడు.ఇక గిల్- అభిషేక్ శర్మ సోషల్ మీడియా వేదికగా.. ‘‘మీవి మాటలు- మావి చేతలు’’ అంటూ పాక్కు తమ ఓటమిని గుర్తు చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా ఈ ఇద్దరు పంజాబీ ఆటగాళ్లు చిన్ననాటి నుంచి స్నేహితులు. భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ వీరికి మెంటార్. ఇక తాజా మ్యాచ్లో విరాట్ కోహ్లిలేని లోటు పాక్ ఆటగాళ్లకు తెలియకుండా చేశారంటూ గిల్- అభిలపై టీమిండియా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.చదవండి: ఛీ.. మీ బుద్ధిమారదా?.. బరితెగించిన పాక్ ఆటగాళ్లు!Ye Naya Bharat Hain. Ye Bekhauf Bharat hai! 💪 Watch the Asia Cup, Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/mn3n9OEZjv— Sony Sports Network (@SonySportsNetwk) September 21, 2025 -
అభిషేక్ శర్మ వరల్డ్ రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా ఘనత
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) అదరగొడుతున్నాడు. లీగ్ దశలో తొలుత యూఏఈపై ప్రతాపం చూపించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 16 బంతుల్లోనే 30 పరుగులు సాధించాడు.మరోసారి విశ్వరూపంఆ తర్వాత పాకిస్తాన్తో మ్యాచ్ (IND vs PAK)లో అభిషేక్ శర్మ విజృంభించాడు. కేవలం 13 బంతుల్లోనే 31 పరుగులు సాధించి.. దాయాదికి తన సత్తా ఏమిటో చూపించాడు. అనంతరం ఒమన్పై 15 బంతుల్లోనే 38 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. తాజాగా సూపర్-4లో భాగంగా పాకిస్తాన్కు మరోసారి విశ్వరూపం చూపించాడు.దుబాయ్ వేదికగా ఆదివారం నాటి మ్యాచ్లో అభిషేక్.. పాక్ బౌలింగ్ను ఉతికారేశాడు. 39 బంతులు ఎదుర్కొని.. ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 74 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ (28 బంతుల్లో 47)తో కలిసి తొలి వికెట్కు వందకు పైగా పరుగులు జతచేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.అతి తక్కువ బంతుల్లోనే 50 సిక్సర్లుఇలా కెరీర్ ఆరంభం నుంచి అద్భుత రీతిలో బ్యాటింగ్ చేస్తున్న అభిషేక్ శర్మ.. తాజాగా పాక్తో మ్యాచ్ సందర్భంగా ప్రపంచ రికార్డు సాధించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో.. అతి తక్కువ బంతుల్లోనే 50 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్గా చరిత్రకెక్కాడు. అంతేకాదు తక్కువ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఎవిన్ లూయీస్ వరల్డ్ రికార్డును అభిషేక్ సమం చేశాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టీమిండియా పాక్ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా సూపర్-4 దశలోనూ మరోసారి దాయాదికి ఓటమి రుచి చూపించింది. కాగా లీగ్ దశలో భారత్.. పాక్పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.అతి తక్కువ బంతుల్లోనే అంతర్జాతీయ టీ20లలో 50 సిక్సర్లు బాదిన ఫుల్ మెంబర్ (టెస్టు హోదా) జట్ల ఆటగాళ్లుఅభిషేక్ శర్మ (ఇండియా)- 331 బంతుల్లోనే 50 సిక్సర్లుఎవిన్ లూయీస్ (వెస్టిండీస్)- 366 బంతుల్లో 50 సిక్సర్లుఆండ్రీ రసెల్ (వెస్టిండీస్)- 409 బంతుల్లో 50 సిక్సర్లుహజ్రతుల్లా జజాయ్ (అఫ్గనిస్తాన్)- 492 బంతుల్లో 50 సిక్సర్లుసూర్యకుమార్ యాదవ్ (ఇండియా)- 509 బంతుల్లో 50 సిక్సర్లుఅతి తక్కువ ఇన్నింగ్స్లో అంతర్జాతీయ టీ20లలో సిక్సర్లు బాదిన ఆటగాళ్లు (ఫుల్ మెంబర్ జట్లు)అభిషేక్ శర్మ- 20 ఇన్నింగ్స్లోఎవిన్ లూయీస్- 20 ఇన్నింగ్స్లోహజ్రతుల్లా జజాయ్- 22 ఇన్నింగ్స్లోక్రిస్ గేల్- 25 ఇన్నింగ్స్లోసూర్యకుమార్ యాదవ్- 29 ఇన్నింగ్స్లో. చదవండి: ఛీ.. మీ బుద్ధిమారదా?.. బరితెగించిన పాక్ ఆటగాళ్లు!కోత.. ఊచకోత 💥Abhishek Sharma ఇచ్చిపడేసాడంతే! 🥁చూడండి #INDvPAK లైవ్Sony Sports Network TV Channels & Sony LIV లో#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/0ufRZ5nDs6— Sony Sports Network (@SonySportsNetwk) September 21, 2025 -
పవర్ ప్లేలో వాళ్లు అద్భుతం.. మేమింకా స్థాయికి తగ్గట్లు ఆడలేదు: పాక్ కెప్టెన్
టీమిండియాతో మ్యాచ్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మరోసారి పరాభవమే ఎదురైంది. ఆసియా కప్-2025 టోర్నీమెంట్లో లీగ్ దశలో భారత్ చేతిలో పరాజయం పాలైన పాక్.. తాజాగా సూపర్-4 దశలోనూ అదే ఫలితాన్ని చవిచూసింది. అయితే, గత మ్యాచ్ కంటే ఈసారి కాస్త మెరుగైన ప్రదర్శన చేయగలిగింది.ఈ నేపథ్యంలో టీమిండియా చేతిలో ఓటమిపై పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) స్పందించాడు. తాము ఇంతవరకు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదని.. అయితే, మెరుగ్గా ఆడామని పేర్కొన్నాడు. పవర్ ప్లేలో టీమిండియా మ్యాచ్ను తమ నుంచి లాగేసుకుందని .. తాము ఇంకో 10- 15 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని వ్యాఖ్యానించాడు.171 పరుగులుదుబాయ్ వేదికగా ఆదివారం నాటి మ్యాచ్లో టాస్ ఓడిన పాక్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో సాహిబ్జాదా ఫర్హాన్ (45 బంతుల్లో 58) రాణించగా.. ఫఖర్ జమాన్ (9 బంతుల్లో 15) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. హ్యాట్రిక్ డకౌట్ల ‘స్టార్’ సయీబ్ ఆయుబ్ (17 బంతుల్లో 21) ఈసారి ఫర్వాలేదనిపించగా.. హుసేన్ తలట్ (10), మొహమ్మద్ నవాజ్ (21) తేలిపోయారు.అభి- గిల్ రఫ్పాడించారుకెప్టెన్ సల్మాన్ ఆఘా 17, ఫాహిమ్ ఆష్రఫ్ 20 బంతులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి పాక్ 171 పరుగులు చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74), శుబ్మన్ గిల్ (28 బంతుల్లో 47) ఆకాశమే హద్దుగా చెలరేగారు.పవర్ ప్లేలో విజృంభణతో తొలి వికెట్కు వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అభి (Abhishek Sharma)- గిల్ (Shubman Gill) మ్యాచ్ను టీమిండియా వైపు తిప్పేశారు. తిలక్ వర్మ (19 బంతుల్లో 30 నాటౌట్) కూడా వేగంగా ఆడగా.. 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా పని పూర్తి చేసింది.మా స్థాయికి తగ్గట్లుగా ఆడనేలేదుఈ నేపథ్యంలో సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. ‘‘ఇంత వరకు మేము మా స్థాయికి తగ్గట్లుగా ఆడనేలేదు. అయితే, మెరుగ్గా ఆడామని చెప్పగలను. కానీ పవర్ ప్లేలోనే వారు మ్యాచ్ను మా నుంచి లాగేసుకున్నారు. ఇంకో 10- 15 పరుగులు చేసి.. 180 వరకు స్కోరు బోర్డు మీద పెట్టి ఉంటే బాగుండేది.పవర్ ప్లేలో వాళ్లు అద్భుతంఏదేమైనా పవర్ ప్లేలో వాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అదే మ్యాచ్ను మలుపు తిప్పింది. మా జట్టులోనూ ఫఖర్, ఫర్హాన్ బాగా బ్యాటింగ్ చేశారు. హ్యారీ కూడా మెరుగ్గా ఆడాడు. తదుపరి శ్రీలంకతో మ్యాచ్లో సత్తా చాటుతాం’’ అని పేర్కొన్నాడు.కాగా గతంలో సొంతగడ్డపై బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లలో సల్మాన్ బృందం మూడు మ్యాచ్లలోనూ 200కు పైగా స్కోరు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని విలేకరులు సల్మాన్ ఆఘా దగ్గర తాజాగా ప్రస్తావించారు.ఇందుకు బదులిస్తూ.. ‘‘అక్కడికి .. ఇక్కడికి పరిస్థితులు వేరు. మాకు మంచి పిచ్ దొరికితే కచ్చితంగా 200కు పైగా స్కోరు చేస్తాము. కానీ ఈ పిచ్లు మాకు అంతగా సహకరించడం లేదు’’ అని సల్మాన్ ఆఘా చెప్పుకొచ్చాడు. చదవండి: ఇంకోసారి అలా అనకండి: పాక్ జట్టు పరువు తీసిన సూర్యStarting your Monday with the Blue Storm that lit up Dubai last night 🌪️ 💙 Watch the #DPWorldAsiaCup2025, Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/DNKy14ylYn— Sony Sports Network (@SonySportsNetwk) September 22, 2025 -
ఛీ.. మీ బుద్ధిమారదా?.. బరితెగించిన పాక్ ఆటగాళ్లు!
టీమిండియాతో మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాళ్లు బరితెగించారు. ఓ బ్యాటర్ ఏకే-47 మాదిరి బ్యాట్తో సంబరాలు చేసుకుంటే.. ఇంకో ఆటగాడు ఇంకాస్త దిగజారి వ్యవహరించాడు. ప్రేక్షకులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడు. దీంతో భారత నెటిజన్లు పాక్ ఆటగాళ్లపై సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఛీ.. మీ బుద్ధి మారదా?‘‘ఛీ.. మీ బుద్ధి మారదా? ఇంతకంటే ఇంకెంతకు దిగజారుతారు?’’ అంటూ చివాట్లు పెడుతున్నారు. అసలేం జరిగిందంటే.. ఆసియా కప్-2025 టోర్నీ సూపర్-4లో భాగంగా భారత్- పాకిస్తాన్ (IND vs PAK) ఆదివారం తలపడ్డాయి.దుబాయ్లో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసి.. పాక్ను 171 పరుగులకు కట్టడిచేసింది. ఆపై 18.5 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇదిలా ఉంటే.. పాక్ ఇన్నింగ్స్లో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) టాప్ రన్స్కోరర్గా నిలిచాడు.ఏకే-47 గన్ ఎక్కుపెట్టినట్లుగాఫర్హాన్ నలభై ఐదు బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 58 పరుగులు సాధించాడు. అయితే, హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగానే ఏకే-47 గన్ ఎక్కుపెట్టినట్లుగా అభినయిస్తూ బ్యాట్ను చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు.విరాట్ కోహ్లి నామస్మరణయువ ఆటగాడు ఫర్హాన్ సంగతి ఇలా ఉంటే.. సీనియర్ ప్లేయర్ హ్యారిస్ రవూఫ్ మరో అడుగు ముందుకు వేశాడు. బౌండరీ రోప్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో భారత దిగ్గజం విరాట్ కోహ్లి నామస్మరణ చేస్తూ ప్రేక్షకులు టీమిండియాను ఉత్సాహపరిచారు. దీంతో టీ20 ప్రపంచకప్-2022లో కోహ్లి తన బౌలింగ్లో రెండు వరుస సిక్స్లు బాది.. మ్యాచ్ను లాగేసుకున్న విషయం అతడికి గుర్తుకు వచ్చినట్లు ఉంది.ఇదొక దిగజారుడు చర్యఅయితే, ఇందుకు తాజా మ్యాచ్లో తన బౌలింగ్తో సమాధానం ఇవ్వాల్సింది పోయి.. రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్.. భారత్కు చెందిన ఆరు ఫైటర్ జైట్లను కూల్చామని ప్రగల్బాలు పలికిన విషయం తెలిసిందే. మరోసారి ఈ విషయాన్ని గుర్తుచేస్తూ.. హ్యారిస్ రవూఫ్ సైగలు చేశాడు.అంతకు ముందు ప్రాక్టీస్ సమయంలో ఫుట్బాల్ ఆడుతూ.. 6-0sతో లీడ్లో ఉన్నామంటూ భారత జర్నలిస్టుల ముందు పాక్ ఆటగాళ్లు అతి చేశారు. ఈ నేపథ్యంలో ఇదొక దిగజారుడు చర్య అంటూ క్రికెట్ ప్రేమికులు పాక్ ఆటగాళ్ల తీరును విమర్శిస్తున్నారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు భారత ఆటగాళ్లు నిరాకరిస్తున్న విషయం తెలిసిందే.ఆసియా కప్ -2025 సూపర్ 4: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్👉పాకిస్తాన్ స్కోరు: 171/5 (20)👉టీమిండియా స్కోరు: 174/4 (18.5)👉ఫలితం: ఆరు వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేసిన టీమిండియా.చదవండి: ఇంకోసారి అలా అనకండి: పాక్ జట్టు పరువు తీసిన సూర్య Haris Rauf never disappoints, specially with 6-0. pic.twitter.com/vsfKKt1SPZ— Ihtisham Ul Haq (@iihtishamm) September 21, 2025సెకండ్ వికెట్ పడగొట్టిన Shivam Dube 💥 చూడండి #INDvPAK లైవ్Sony Sports Network TV Channels & Sony LIV లో#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/EZGkRemo4D— Sony Sports Network (@SonySportsNetwk) September 21, 2025 -
ఇంకోసారి అలా అనకండి: పాక్ జట్టు పరువు తీసిన సూర్య
దాయాది పాకిస్తాన్పై టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఆసియా కప్-2025 లీగ్ దశలో పాక్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన సూర్యకుమార్ సేన.. సూపర్-4లో భాగంగా మరోసారి ఇదే ఫలితాన్ని పునరావృతం చేసింది.దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్.. పాకిస్తాన్ (IND vs PAK)ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. టీ20 ఫార్మాట్లో పాక్పై టీమిండియాకు ఇది పన్నెండో విజయం. ఇప్పటికి పదిహేను సార్లు ముఖాముఖి పోటీ పడగా.. భారత్ ఈ మేరకు ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉంది.ఇంకోసారి అలా అనకండి ఈ నేపథ్యంలో పాక్పై విజయానంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మీడియా సమావేశంలో భాగంగా చిరకాల ప్రత్యర్థుల పోరు అంటూ ఓ విలేకరి ప్రస్తావించగా.. ‘‘సర్.. ఇకపై నుంచైనా ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ను ప్రత్యర్థుల పోరు అని అనడం మానేయాలి.పాక్ జట్టు పరువు తీసిన సూర్యసర్.. ఏ రకంగా చూసినా ఇలా అనేందుకు నాకు ఎలాంటి కారణం కనపడటం లేదు. ఇంకా రైవలరీ ఏంటి? రెండు జట్లు 15 మ్యాచ్లలో తలపడి ఒకటి 8.. ఇంకోటి 7 గెలిస్తే దానిని ప్రత్యర్థుల పోరుగా అభివర్ణించవచ్చు. కానీ ఇక్కడ 13- 1, 12-3 లా ఉన్నపుడు ఇంకా ఇలా ఎలా అనగలం?అసలు రెండు జట్ల మధ్య పోటీ అనేదే లేదు కదా!’’ అని సూర్యకుమార్ యాదవ్.. పాక్ జట్టుకు తమ స్థాయి ఏమిటో తెలియజేశాడు. కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారిగా ఆసియా కప్ లీగ్ దశలో భారత్- పాక్ ముఖాముఖి పోటీపడిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్లో పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు భారత జట్టు నిరాకరించింది.బుద్ధి చూపించారుదీంతో రచ్చకెక్కిన పాక్ బోర్డు.. నానాయాగీ చేసి.. టోర్నీ నుంచి వైదొలుగుతామని బెదిరించింది. అయితే, ఐసీసీ దిగిరాకపోవడంతో టోర్నీలో కొనసాగుతోంది. ఇక ఆదివారం నాటి మ్యాచ్లోనూ పాక్ తన బుద్ధి చూపించింది. అర్ధ శతకం (34 బంతుల్లో) పూర్తి చేసుకున్న తర్వాత పాక్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్ ఏకే-47 పేలుస్తున్న తరహాలో బ్యాట్ చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు. మ్యాచ్ మధ్యలోనూ ఆటగాళ్లను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు.సూపర్-4 : భారత్ వర్సెస్ పాకిస్తాన్ స్కోర్లు👉వేదిక: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, దుబాయ్👉టాస్: భారత్.. తొలుత బౌలింగ్👉పాక్ స్కోరు: 171/5 (20)👉భారత్ స్కోరు: 174/4 (18.5)👉ఫలితం: పాక్పై ఆరు వికెట్ల తేడాతో భారత్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74).చదవండి: వైభవ్ సూర్యవంశీ ధనాధన్.. ఆసీస్ను చిత్తు చేసిన భారత్..Starting your Monday with the Blue Storm that lit up Dubai last night 🌪️ 💙 Watch the #DPWorldAsiaCup2025, Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/DNKy14ylYn— Sony Sports Network (@SonySportsNetwk) September 22, 2025 -
విధ్వంసం సృష్టించిన అభిషేక్.. పాక్ను మరోసారి చిత్తు చేసిన భారత్
ఆసియా కప్-2025లో టీమిండియా పాక్ను మరోసారి చిత్తు చేసింది. ఇవాళ (సెప్టెంబర్ 21) జరిగిన సూపర్-4 మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి భారత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.రాణించిన ఫర్హాన్ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (58) అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో ఫహీమ్ అష్రాఫ్ (20 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా ఆటగాళ్లలో ఫకర్ జమాన్ 15, సైమ్ అయూబ్ 21, హుస్సేన్ తలాత్ 10, మొహమ్మద్ నవాజ్ 21, సల్మాన్ అఘా 17 (నాటౌట్) పరుగులు చేశారు.ఫీల్డర్ల వైఫల్యం.. భారీగా పరుగులిచ్చిన బుమ్రా ఈ మ్యాచ్లో భారత బౌలర్లు పాక్కు ఊహించిన దానికంటే ఎక్కువ స్కోర్ ఇచ్చారు. ఫీల్డర్లు ఏకంగా నాలుగు క్యాచ్లు (అభిషేక్ 2, కుల్దీప్, గిల్ తలో ఒకటి) వదిలిపెట్టారు. బుమ్రా ఎన్నడూ లేనంత ధారాళంగా పరుగులు (4-0-45-0) సమర్పించుకోగా.. మిగతా బౌలర్లు కూడా ఓ మోస్తరు ప్రదర్శనలే చేశారు.వరుణ్ చక్రవర్తి చాలా మ్యాచ్ల తర్వాత వికెట్ లేకుండా మిగిలిపోయాడు. స్ట్రయిట్ బౌలర్లు పెద్దగా రాణించని వేళ, శివమ్ దూబే 2 వికెట్లతో పర్వాలేదనిపించాడు. కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు. అక్షర్ పటేల్తో కెప్టెన్ సూర్యకుమార్ ఒకే ఓవర్ వేయించాడు.విధ్వంసం సృష్టించిన అభిషేక్ 172 పరుగుల లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు శుభ్మన్ గిల్ (28 బంతుల్లో 47; 8 ఫోర్లు), అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగిపోయారు. తొలి వికెట్కు 9.5 ఓవర్లలో 105 పరుగులు జోడించారు. అనంతరం భారత్ పరుగు వ్యవధిలో గిల్, సూర్యకుమార్ యాదవ్ (0) వికెట్లు కోల్పోయింది. మరో 17 పరుగుల తర్వాత (123 పరుగుల వద్ద) అభిషేక్ శర్మ కూడా ఔటయ్యాడు.ఈ దశలో సంజూ శాంసన్, తిలక్ వర్మ నిదానంగా ఆడటంతో స్కోర్ నెమ్మదించింది. 148 పరుగుల వద్ద సంజూ (13) ఓ చెత్త షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. అనంతరం హార్దిక్ (7 నాటౌట్) సాయంతో తిలక్ వర్మ (30 నాటౌట్) టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 2, అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రాఫ్కు తలో వికెట్ దక్కాయి. -
Ind VS Pak Super 4 Match: రికార్డును మరింత మెరుగుపర్చుకున్న హార్దిక్
ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్తాన్తో ఇవాళ (సెప్టెంబర్ 21) జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన పేరిట ఉన్న ఓ రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. ఈ మ్యాచ్లో ఫకర్ జమాన్ (9 బంతుల్లో 15; 3 ఫోర్లు) వికెట్ తీసిన అతను.. పాకిస్తాన్తో టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా మరింత మెరుగయ్యాడు. హార్దిక్ పాక్తో కేవలం 8 టీ20 ఇన్నింగ్స్ల్లో 15 వికెట్లు పడగొట్టాడు.హార్దిక్ తర్వాత పాక్పై అత్యధిక టీ20 వికెట్లు తీసిన ఘనత భువనేశ్వర్ కుమార్కు దక్కుతుంది. భువీ 7 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో హార్దిక్, భువీ తర్వాతి స్థానాల్లో బుమ్రా (7), అర్షదీప్ సింగ్ (7) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి భారత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ జోరు ప్రదర్శిస్తుంది. 11.2 ఓవర్లలోనే ఆ జట్టు 100 పరుగుల మార్కును తాకింది. సాహిబ్జాదా ఫర్హాన్ (56) మెరుపు అర్ద సెంచరీతో బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా హుస్సేన్ తలాత్ (6) క్రీజ్లో ఉన్నాడు. 12 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 103/2గా ఉంది. హార్దిక్ ఫకర్ జమాన్ వికెట్ తీయగా.. శివమ్ దూబేకు సైమ్ అయూబ్ (21) వికెట్ దక్కింది.కాగా, ఈ మ్యాచ్ టాస్ సమయంలో కూడా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాక్ కెప్టెన్కు షేక్ హ్యాండ్ నిరాకరించాడు. ఈ కారణంగా గ్రూప్ దశ మ్యాచ్లో పెద్ద వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ బోర్డు ఈ వివాదానికి మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను బాధ్యుడిగా చూపుతూ అతన్ని ఆసియా కప్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ను ఐసీసీ తోసిపుచ్చి పైక్రాఫ్ట్కు అండగా నిలిచింది. పైగా నేటి మ్యాచ్లో కూడా పైక్రాఫ్ట్నే రిఫరీగా కొనసాగించింది. -
Ind VS Pak Super 4 Match: పాక్ను చిత్తు చేసిన భారత్
పాక్ను మరోసారి చిత్తు చేసిన భారత్ఆసియా కప్-2025లో టీమిండియా పాక్ను మరోసారి చిత్తు చేసింది. ఇవాళ (సెప్టెంబర్ 21) జరిగిన సూపర్-4 మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి భారత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (58) అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో ఫహీమ్ అష్రాఫ్ (20 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.అనంతరం బరిలోకి దిగిన భారత్.. అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. భారత ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ (28 బంతుల్లో 47; 8 ఫోర్లు), తిలక్ వర్మ (30 నాటౌట్) కూడా రాణించారు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్16.4వ ఓవర్- 148 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. హరీస్ రౌఫ్ బౌలింగ్లో సంజూ శాంసన్ (13) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అభిషేక్ ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన భారత్12.2వ ఓవర్- 123 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. అబ్రార్ అహ్మద్ బౌలింగ్లో సిక్సర్ బాదిన మరుసటి బంతికే అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) ఔటయ్యాడు. అభిషేక్ మరో భారీ షాట్కు ప్రయత్నించే క్రమంలో హరీస్ రౌఫ్కు క్యాచ్ ఇచ్చాడు. తిలక్ వర్మకు (1) జతగా సంజూ శాంసన్ క్రీజ్లోకి వచ్చాడు. రెండో వికెట్ కోల్పోయిన భారత్10.3వ ఓవర్- హరీస్ రౌఫ్ బౌలింగ్లో అబ్రార్ అహ్మద్ క్యాచ్ తీసుకోవడంతో సూర్యకుమార్ యాదవ్ (0) ఔటయ్యాడు. బంతి లీడింగ్ ఎడ్జ్ తీసుకొని నేరుగా అబ్రార్ చేతుల్లోకి వెళ్లింది. భారత్ స్కోర్ ప్రస్తుతం 106/2గా ఉంది. అభిషేక్కు (58) జతగా తిలక్ వర్మ క్రీజ్లోకి వచ్చాడు.తొలి వికెట్ కోల్పోయిన భారత్9.5వ ఓవర్- 105 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఫహీమ్ అష్రాఫ్ బౌలింగ్లో శుభ్మన్ గిల్ (28 బంతుల్లో 47; 8 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అభిషేక్ శర్మకు (57) జతగా సూర్యకుమార్ యాదవ్ క్రీజ్లోకి వచ్చాడు.దూకుడుగా ఆడుతున్న భారత ఓపెనర్లు172 పరుగుల లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు విధ్వంసం సృష్టిస్తున్నారు. పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. గిల్ 35, అభిషేక్ 33 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో భారత్ గెలుపుకు ఇంకా 84 బంతుల్లో 103 పరుగులు మాత్రమే చేయాలి. విధ్వంసం సృష్టిస్తున్న భారత ఓపెనర్లు172 పరుగుల లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 4 ఓవర్లలో భారత్ వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. గిల్ 22, అభిషేక్ 21 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. తొలి బంతికే సిక్సర్ బాదిన అభిషేక్172 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ తొలి బంతికే సిక్సర్ బాదాడు. షాహీన్ అఫ్రిది బౌలింగ్లో ఈ ఘనత సాధించాడు. తొలి ఓవర్ తర్వాత భారత్ స్కోర్ 9/0గా ఉంది. అభిషేక్ 8, గిల్ 1 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్ పాక్కు ఊహించిన దానికంటే ఎక్కువ స్కోరే ఇచ్చింది. ఫీల్డర్లు ఏకంగా నాలుగు క్యాచ్లు (అభిషేక్ 2, కుల్దీప్, గిల్ తలో ఒకటి) వదిలిపెట్టడంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. బుమ్రా ఎన్నడూ లేనంత ధారాళంగా పరుగులు (4-0-45-0) సమర్పించుకోగా.. మిగతా బౌలర్లు కాస్త పర్వాలేదనిపించారు. వరుణ్ చక్రవర్తి చాలా మ్యాచ్ల తర్వాత వికెట్ లేకుండా మిగిలిపోయాడు. స్ట్రయిట్ బౌలర్లు పెద్దగా రాణించని వేళ, శివమ్ దూబే 2 వికెట్లతో పర్వాలేదనిపించాడు. కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు అక్షర్ పటేల్తో కెప్టెన్ సూర్యకుమార్ ఒకే ఓవర్ వేయించాడు. పాక్ ఇన్నింగ్స్లో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (58) టాప్ స్కోరర్గా నిలువగా.. ఆఖర్లో ఫహీమ్ అష్రాఫ్ (20 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా ఆటగాళ్లలో ఫకర్ జమాన్ 15, సైమ్ అయూబ్ 21, హుస్సేన్ తలాత్ 10, మొహమ్మద్ నవాజ్ 21, సల్మాన్ అఘా 17 (నాటౌట్) పరుగులు చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చుకున్న భారత బౌలర్లు11.2 ఓవర్లలోనే 100 పురుగులు పూర్తి చేసి భారీ స్కోర్ చేస్తుందనుకున్న పాక్కు భారత బౌలర్లు పగ్గాలు వేశారు. 19 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 159/5గా మాత్రమే ఉంది. నాలుగో వికెట్ కోల్పోయిన పాక్14.1వ ఓవర్- 115 పరుగుల వద్ద పాక్ నాలుగో వికెట్ కోల్పోయింది. శివమ్ దూబే బౌలింగ్లో సూర్యకుమార్ క్యాచ్ పట్టడంతో ఫర్హాన్ (58) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన పాక్13.1వ ఓవర్-110 పరుగుల వద్ద పాక్ మూడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ బౌలింగ్లో వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి హుస్సేన్ తలాత్ (10) ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన పాక్.. ఎట్టకేలకు క్యాచ్ పట్టిన అభిషేక్ఈ మ్యాచ్లో రెండు క్యాచ్లు వదిలేసిన అభిషేక్ శర్మ ఎట్టకేలకు ఓ క్యాచ్ పట్టుకున్నాడు. శివమ్ దూబే బౌలింగ్లో సైమ్ అయూబ్ (21) ఆడిన షాట్ను అభిషేక్ కష్టమైనా క్యాచ్గా మలిచాడు. 10.3 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 93/2గా ఉంది. ఫర్హాన్కు (53) జతగా హుస్సేన్ తలాత్ క్రీజ్లోకి వచ్చాడు. పాక్ ఓపెనర్ మెరుపు హాఫ్ సెంచరీపాక్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ మెరుపు అర్ద సెంచరీతో మెరిశాడు. కేవలం 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో ఈ మైలురాయిని తాకాడు. అక్షర్ పటేల్ బౌలింగ్లో సిక్సర్తో ఫర్హాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 10 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 91/1గా ఉంది. ఫర్హాన్తో (52) పాటు సైమ్ అయూబ్ (21) క్రీజ్లో కొనసాగుతున్నాడు. మరో క్యాచ్ జారవిడిచిన అభిషేక్తొలి ఓవర్లో ఈజీ క్యాచ్ వదిలేసిన అభిషేక్ శర్మ 8వ ఓవర్లో మరో క్యాచ్ జారవిడిచాడు. క్యాచ్ పట్టకపోగా బంతి బౌండరీ ఆవల పడింది (సిక్సర్). 8 ఓవర్ల తర్వాత పాకిస్తాన్ స్కోర్ 70/1గా ఉంది. ఫర్హాన్ 39, సైమ్ అయూబ్ 13 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. రెండు డ్రాప్ క్యాచ్లు.. పవర్ ప్లేలో భారీగా స్కోర్ చేసిన పాకిస్తాన్భారత ఫీల్డర్లు రెండు ఈజీ క్యాచ్లు డ్రా చేయగా, పాకిస్తాన్ పవర్ ప్లేలో భారీగా స్కోర్ చేసింది. 6 ఓవర్లలో ఆ జట్టు వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. ఈజీ క్యాచ్ జారవిడిచిన కుల్దీప్4.4వ ఓవర్- వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో సైమ్ అయూబ్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను కుల్దీప్ యాదవ్ జారవిడిచాడు. 5 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 42/1గా ఉంది. ఫర్హాన్ 20, సైమ్ 5 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అభిషేక్ శర్మ కూడా ఓ ఈజీ క్యాచ్ను డ్రాప్ చేశాడు. హార్దిక్ బౌలింగ్లో ఫకర్ ఔట్పాకిస్తాన్ ఓపెనర్ ఫకర్ జమాన్ (15) ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో కీపర్ సంజూ శాంసన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. హర్దిక్ వేసిన మూడో ఓవర్ మూడో బంతికి ఫకర్ ఆడదామా.. వ ద్దా అనే అనుమానంతో బ్యాట్ ను పెట్టాడు. ఆ బంతి ఫకర్ బ్యాట్ను ముద్దాడుతూ వెళ్లి కీపర్ సంజూ చేతుల్లో పడింది. అయితే దీనిపై కాస్త అనుమానం వచ్చింది. అది సంజూ శాంసన్ గ్లౌజ్లో పడే ముందు నేలను తాకినట్లు అనిపించింది. కానీ అది నేలను తాకకుండా సంజూ ఫింగర్స్ను తాకుతూగ్లౌజ్లో పడటంతో ఫకర్ పెవిలియన్కు చేరక తప్పలేదు. అయితే ఈ నిర్ణయంపై ఫకర్ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు.తొలి ఓవర్లోనే పాక్ ఓపెనర్కు లైఫ్పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్కు తొలి ఓవర్లోనే లైఫ్ లభించింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అభిషేక్ శర్మ చేతిలో పడిన క్యాచ్ను వదిలేశాడు. బుమ్రా వేసిన రెండో ఓవర్లో ఫకర్ జమాన్ రెండు బౌండరీలు బాది జోరును ప్రదర్శించాడు. 2 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 17/0గా ఉంది. ఫకర్ 11, ఫర్హాన్ 6 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ఆసియా కప్ 2025లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 21) జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో భారత్, పాకిస్తాన్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా స్థానాల్లో బుమ్రా, వరుణ్ చక్రవర్తి తుది జట్టులోకి వచ్చారు. పాకిస్తాన్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది. గత మ్యాచ్లో ఆడిన హసన్ నవాజ్, ఖుష్దిల్ షా ఈ మ్యాచ్లో ఆడటం లేదు.తుది జట్లు..భారత్: అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(సి), తిలక్ వర్మ, సంజు శాంసన్(w), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిపాకిస్తాన్: సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, మహ్మద్ హరీస్(w), ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(c), మహ్మద్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఫమీమ్ అష్రాఫ్, షాహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్ -
అదో గల్లీ జట్టు.. భారత్-పాక్ హోరాహోరీ సమరాలు ఇక చరిత్రే..!
ఆసియా కప్ 2025లో భాగంగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్ 21) జరుగబోయే సూపర్ 4 మ్యాచ్కు ముందు పాకిస్తాన్ జట్టుపై భారత మాజీ సెలెక్టర్, వరల్డ్కప్ విన్నిర్ (1983) కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ జట్టు చెన్నై లోకల్ లీగ్లో 7వ డివిజన్ జట్టులా ఉందని అన్నారు.ఇలాంటి బలహీనమైన జట్టుతో ఆసియా కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో పాల్గొనడం పాకిస్తాన్ చేసుకున్న అదృష్టమని తెలిపారు. ఈ జట్టుకు టీమిండియాతో ఆడే అర్హత లేదని అభిప్రాయపడ్డారు. పాక్ జట్టును అసోసియేట్ దేశాల జట్లతోనే ఆడించాలని సూచించారు.ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్లు ఇకపై జనాన్ని ఆకర్షించవని అన్నారు. భారత్-పాక్ హోరీహోరీ సమరాలు చరిత్రే అని అభిప్రాయపడ్డారు. హెస్సన్ లాంటి కోచ్ వల్ల కూడా పాక్కు ఒరిగేదేమీ లేదని తెలిపారు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్లో వ్యాఖ్యానించారు.శ్రీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ క్రికెట్ అభిమానులే సానుకూలంగా స్పందిస్తున్నారు. నిజంగానే తమ జట్టు గల్లీ జట్ల కంటే హీనంగా ఉందని అంటున్నారు. తమ దేశ క్రికెట్ చరిత్రలో ఇంత దారుణమైన జట్టును చూడలేదని చర్చించుకుంటున్నారు.కాగా, ప్రస్తుత ఆసియా కప్లో పాకిస్తాన్ చచ్చి చెడి సూపర్ 4కు అర్హత సాధించింది. గ్రూప్ దశలో ఒమన్పై ఘనంగా గెలిచినా.. టీమిండియా చేతిలో ఘెర పరాజయాన్ని ఎదుర్కొంది. సూపర్ 4కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో యూఏఈ చేతిలో భంగపాటును తృటిలో తప్పించుకుంది. -
పాక్తో పోరు.. ఆ ఇద్దరిపై వేటు!.. భారత తుదిజట్టు ఇదే!
ఆసియా కప్ టీ20-2025 టోర్నమెంట్లో అసలైన పోటీ మొదలైంది. లీగ్ దశలో సత్తా చాటిన టీమిండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ సూపర్-4కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టైటిల్ వేటలో భాగంగా బంగ్లా- లంక మధ్య శనివారం జరిగిన మ్యాచ్లో.. బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది.బంగ్లా సంచలన విజయంతోఆఖరి వరకు పట్టువదలకుండా పోరాడి.. శ్రీలంకను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి.. ముందంజ వేసింది. ఇక ఆదివారం (సెప్టెంబరు 21) నాటి మ్యాచ్లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ తలపడనున్నాయి. దుబాయ్లో జరిగే ఈ మ్యాచ్లో భారత తుదిజట్టులో కీలక మార్పు జరిగే అవకాశం ఉంది.బుమ్రా రీఎంట్రీ.. ఆ ఇద్దరిపై వేటులీగ్ దశలో ఆఖరిగా ఒమన్తో జరిగిన మ్యాచ్లో విశ్రాంతి తీసుకున్న ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వడం లాంఛనమే. అదే విధంగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా తిరిగి జట్టులోకి రానున్నాడు. ఈ క్రమంలో యువ పేసర్లు అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణాలపై వేటు పడే అవకాశాలు ఉన్నాయి.అక్షర్ దూరమైతే మాత్రంఅయితే, ఒమన్తో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గాయపడిన విషయం తెలిసిందే. క్యాచ్ అందుకునే క్రమంలో కిందపడిన అక్షర్ తల మైదానాన్ని బలంగా కొట్టుకోవడంతో.. అతడు గ్రౌండ్ వీడి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కూడా మళ్లీ ఫీల్డింగ్కు రాలేదు. ఈ నేపథ్యంలో పాక్తో మ్యాచ్కు అక్షర్ దూరమయ్యే అవకాశం ఉంది.అదే జరిగితే అర్ష్దీప్ లేదంటే హర్షిత్లలో ఒకరు తమ స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో టీమిండియా తరఫున వంద వికెట్ల క్లబ్లో చేరిన అర్ష్ వైపు మేనేజ్మెంట్ మొగ్గుచూపుతుందా?.. లేదంటే హెడ్కోచ్ గౌతం గంభీర్ ప్రియ శిష్యుడు హర్షిత్కు ఓటు వేస్తుందా? అన్నది చూడాల్సి ఉంది. ఈ స్వల్ప మార్పులు మినహా భారత్ పాత జట్టుతోనే పాక్తో బరిలో దిగే అవకాశం ఉంది.గ్రూప్-ఎ టాపర్గా టీమిండియాగ్రూప్-ఎలో భాగంగా యూఏఈ, పాకిస్తాన్, ఒమన్ జట్లపై హ్యాట్రిక్ విజయాలు సాధించిన టీమిండియా.. టాపర్గా సూపర్-4లో అడుగుపెట్టింది. ఇదే గ్రూపు నుంచి యూఏఈ, ఒమన్లపై విజయాలతో పాక్ కూడా సూపర్-4కు అర్హత సాధించింది. మరోవైపు.. గ్రూప్-బిలో అఫ్గనిస్తాన్, హాంకాంగ్లను ఎలిమినేట్ చేసి.. శ్రీలంక, బంగ్లాదేశ్ క్వాలిఫై అయ్యాయి.భారత్ వర్సెస్ పాకిస్తాన్ సూపర్-4భారత తుదిజట్టు అంచనా:అభిషేక్ శర్మ (ఓపెనర్), శుబ్మన్ గిల్ (వైస్ కెప్టెన్- ఓపెనర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్-బ్యాటర్), తిలక్ వర్మ (బ్యాటర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్ బ్యాటర్), శివం దూబే (ఆల్రౌండర్), హార్దిక్ పాండ్యా (ఆల్రౌండర్), అక్షర్ పటేల్ (ఆల్రౌండర్)/అర్ష్దీప్ సింగ్ (పేసర్), వరుణ్ చక్రవర్తి (స్పిన్నర్), కుల్దీప్ యాదవ్(స్పిన్నర్), జస్ప్రీత్ బుమ్రా (పేసర్). -
ఓడిపోయామన్న బాధ లేదు.. నేనే గనుక అక్కడి ఉంటేనా..! కథ వేరే..
పాకిస్తాన్ క్రికెట్ జట్టు తీరుపై టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్ ఓడిపోయామన్న బాధ లేకుండా.. కేవలం ‘నో- షేక్హ్యాండ్’ మీద రాద్ధాంతం చేయడంపైనే దృష్టి పెట్టారని మండిపడ్డాడు. కరచాలనం విషయంలో మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ తప్పేమీ లేదని.. తానే గనుక అతడి స్థానంలో ఉంటే పాక్ జట్టుతోనే సారీ చెప్పించుకునేవాడినని అశూ అన్నాడు.పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్తాన్ (IND vs PAK) జట్లు ఆసియా కప్ టీ20-2025లో భాగంగా తొలిసారి ముఖాముఖి తలపడిన విషయం తెలిసిందే. దుబాయ్ వేదికగా గత ఆదివారం (సెప్టెంబరు 14) జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా పాక్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. అయితే, పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా భారత ఆటగాళ్లు.. పాక్ ప్లేయర్లతో కరచాలనానికి నిరాకరించారు.ఆసియా కప్ నుంచి వైదొలుగుతామని డ్రామాఈ విషయాన్ని అవమానంగా భావించిన పాక్ క్రికెట్.. రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ వ్యవహారశైలిపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఇక ముందు పాక్ ఆడే మ్యాచ్లకు రిఫరీగా ఆయనను తొలగించాలని కోరింది. లేదంటే ఆసియా కప్ నుంచి వైదొలుగుతామని డ్రామా చేసింది. అయితే, ఐసీసీ దిగిరాకపోగా.. యూఏఈతో పాక్ మ్యాచ్లోనూ ఆండీనే కొనసాగించింది. అంతేకాదు.. తదుపరి సూపర్-4లో భాగంగా ఆదివారం (సెప్టెంబరు 21) నాటి భారత్- పాక్ పోరులోనే అతడినే రిఫరీగా ఎంపిక చేసింది.స్కూల్ టీచరా? లేదా ప్రిన్సిపలా?ఈ నేపథ్యంలో పాక్ వ్యవహారశైలిపై అశ్విన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. ‘‘నిజానికి మీ పరువు పోకుండా ఆండీ పైక్రాఫ్ట్ మిమ్మల్ని కాపాడారు. తాము హ్యాండ్షేక్ చేయమన్న విషయాన్ని టీమిండియా ముందుగానే రిఫరీకి చెప్పింది. అదే విషయాన్ని ఆయన మీకు చెప్పారు. అంతే. కానీ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మీరు చేసిన డ్రామా ఏంటి? అసలు దేని గురించి మీ రాద్ధాంతం?..అయినా ఆండీ పైక్రాఫ్ట్ ఏమైనా స్కూల్ టీచరా? లేదా ప్రిన్సిపలా?.. సూర్య దగ్గరికి వెళ్లి.. ‘రండి.. వచ్చి కరచాలనం చేయండి’ అని చెప్పాలా? ఆయన పని అది కాదు కదా!.. కాబట్టి ఇందులో మీకు ఆయన తప్పు ఎక్కడ కనిపించింది? మీతోనే సారీ చెప్పించుకునేవాడినినేనే గనుక ఆండీ స్థానంలో ఉండి ఉంటే.. ఇలా చేసినందుకు మీతోనే సారీ చెప్పించుకునేవాడిని. ఆయన మీకెందుకు క్షమాపణ చెప్పాలి?’’ అంటూ పాక్ క్రికెట్ బోర్డు తీరును అశ్విన్ ఏకిపారేశాడు. కాగా యూఏఈతో మ్యాచ్కు ముందు బాయ్కాట్ నాటకం ఆడిన పాక్.. ఐసీసీ దిగిరాకపోవడంతో రిఫరీ ఆండీ తమకు క్షమాపణలు చెప్పాడంటూ ఆడియోలేని ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. -
Asia Cup 2025: భారత్తో సూపర్-4 మ్యాచ్.. పాకిస్తాన్కు భారీ పంచ్..!
ఆసియా కప్ 2025లో భాగంగా రేపు (సెప్టెంబర్ 21) భారత్, పాకిస్తాన్ మధ్య సూపర్-4 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్కు ముందు పాకిస్తాన్కు భారీ పంచ్ పడినట్లు తెలుస్తుంది. ఈ టోర్నీలో భారత్తో గ్రూప్ స్టేజీ మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న షేక్ హ్యాండ్ వివాదంలో పాక్ క్రికెట్ బోర్డు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే.ఆ మ్యాచ్లో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు కరచాలనం ఇవ్వలేదు (టాస్ సందర్భంగా, మ్యాచ్ అయిపోయాక). దీన్ని అవమానంగా భావించిన పీసీబీ భారత ఆటగాళ్లను ఏమీ చేసుకోలేక, మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్పై పడింది. పైక్రాఫ్ట్ భారత ఆటగాళ్ల పట్ల పక్షపాతంగా (తమ ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వరన్న భారత మేనేజ్మెంట్ సందేశాన్ని పాక్ కెప్టెన్కు చేరవేశాడని) వ్యవహరించి, క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించాడని ఆరోపించింది.ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ పైక్రాఫ్ట్ను ఆసియా కప్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఐసీసీకి పలు లేఖలు రాసింది. యూఏఈతో మ్యాచ్కు ముందు ఓ అడుగు ముందుకేసి బాయ్కాట్ బెదిరింపులకు దిగింది. ఐసీసీ కన్నెర్ర చేయడంతో కనీసం తమ మ్యాచ్లకైనా పైక్రాఫ్ట్ను పక్కన పెట్టాలని కాళ్ల బేరానికి వచ్చింది.పీసీబీ ఉడత ఊపులను, డిమాండ్లను తోసిపుచ్చిన ఐసీసీ, పైక్రాఫ్ట్కు మద్దతుగా నిలిచింది. అతన్నే యూఏఈతో మ్యాచ్కు రిఫరీగా కొనసాగించింది. ఒకవేళ పాక్ జట్టు ఆసియా కప్ను బాయ్కాట్ చేయాలనుకుంటే భారీ మొత్తంలో నగదు చెల్లించాలని రివర్స్ వార్నింగ్ ఇచ్చింది. ఇంతటితో ఆగకుండా తాజాగా మరో షాక్ ఇచ్చింది.గత మ్యాచ్ తాలూకా గాయాలు తగ్గకముందే రేపు భారత్తో జరుగబోయే సూపర్-4 మ్యాచ్కు మరోసారి పైక్రాఫ్ట్నే రిఫరీగా నియమించింది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. ఈ మేరకు ఐసీసీ ఇదివరకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఐసీసీ కొట్టిన ఈ చావుదెబ్బకు సూపర్-4 మ్యాచ్కు ముందే పాక్ ఢీలా పడిపోయింది. కాగా, రేపటి భారత్-పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. -
IND PAK మ్యాచ్ జరగదా? ఐసీసీ కీలక నిర్ణయం!
-
‘అతడి’ని హగ్ చేసుకున్న సూర్య.. ఎందుకిలా చేశావు?
టీమిండియాతో మ్యాచ్లో ఒమన్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. అంచనాలకు మించి రాణించి.. గెలుపు కోసం సూర్యుకుమార్ సేనను శ్రమించేలా చేసింది. పటిష్ట భారత జట్టుకు గట్టి పోటీనిచ్చి సత్తా చాటి ప్రశంసలు అందుకుంటోంది.ఆసియా కప్-2025 టీ20 టోర్నీలో భాగంగా శుక్రవారం టీమిండియాను ఢీకొట్టింది ఒమన్. అబుదాబి వేదికగా టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో అభిషేక్ శర్మ మరోసారి ధనాధన్ (15 బంతుల్లో 38) దంచికొట్టగా.. శుబ్మన్ గిల్ (Shubman Gill- 5) మరోసారి నిరాశపరిచాడు.సంజూ శాంసన్ అర్ధ శతకంఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson) అర్ధ శతకం (56)తో రాణించి భారత ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అతడికి తోడుగా ఆల్రౌండర్ అక్షర్ పటేట్ (13 బంతుల్లో 26), తిలక్ వర్మ (18 బంతుల్లో 29), హర్షిత్ రాణా (8 బంతుల్లో 13 నాటౌట్) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా ఎనిమిది వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఒమన్ బౌలర్లలో షా ఫైజల్, జితేన్ రామనంది, ఆమిర్ ఖలీమ్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. ఒమన్ టాపార్డర్ సూపర్ హిట్ఇక టీమిండియా విధించిన 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒమన్ శుభారంభం అందుకుంది. ఓపెనర్లలో కెప్టెన్ జతీందర్ సింగ్ (32) ఫర్వాలేదనిపించగా.. ఆమిర్ ఖలీమ్ అద్భుత అర్ధ శతకం (46 బంతుల్లో 64, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) బాదాడు.ఇక వన్డౌన్ బ్యాటర్ హమ్మద్ మీర్జా సైతం హాఫ్ సెంచరీ (33 బంతుల్లో 51) చేశాడు. అయితే, జతీందర్ను కుల్దీప్ యాదవ్, ఆమిర్ను హర్షిత్ రాణా, మీర్జాను హార్దిక్ పాండ్యా పెవిలియన్కు పంపడంతో ఒమన్ జోరుకు బ్రేక్ పడింది. మిగిలిన వారిలో వికెట్ కీపర్ వినయ్ శుక్లా (1)ను అర్ష్దీప్ సింగ్ అవుట్ చేశాడు.అంచనాలు తలకిందులుఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయిన ఒమన్.. 167 పరుగుల వద్ద నిలిచింది. దీంతో టీమిండియా 21 పరుగుల తేడాతో గెలిచి.. లీగ్ దశను అజేయంగా ముగించింది. అయితే, ఈ మ్యాచ్లో ఒమన్పై భారత జట్టు ఏకపక్ష విజయం సాధిస్తుందని అంతా ఊహించారు.కానీ అంచనాలు తలకిందులు చేస్తూ సూర్యసేనకు జతీందర్ సింగ్ బృందం గట్టి పోటీనిచ్చింది. టీ20 ఫార్మాట్లోని మజాను పంచింది. ఒమన్ ఆట తీరుకు భారత జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్ కూడా ఫిదా అయ్యాడు. మ్యాచ్ అనంతరం ఒమన్ ఆటగాళ్లతో ముచ్చటిస్తూ వారిపై ప్రశంసలు కురిపించాడు.ఆమిర్ ఖలీమ్ను హగ్ చేసుకున్న సూర్యఅంతేకాదు.. ఒమన్పై గెలిచిన తర్వాత ఇరుజట్లు ఆటగాళ్లు కరచాలనం చేసే సమయంలో సూర్య చేసిన పని వైరల్గా మారింది. 43 ఏళ్ల వయసులో అద్భుత బ్యాటింగ్తో అలరించిన ఆమిర్ ఖలీమ్ను సూర్య ఆలింగనం చేసుకున్నాడు. అయితే, అతడు పాకిస్తాన్లోని కరాచీకి చెందిన వాడు కావడం గమనార్హం.ఇలా ఎందుకు చేశావు? నీకిది తగునా?ఈ నేపథ్యంలో ఆమిర్ను అభినందిస్తూ సూర్య చేసిన పనిని కొందరు సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం .. ‘‘పాక్కు చెందిన వ్యక్తిని ఎలా హత్తుకుంటావు?’’ అని ప్రశ్నిస్తున్నారు.కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆసియా కప్ వేదికగా దాయాది పాకిస్తాన్తో ముఖాముఖి తలపడిన టీమిండియా.. ఆ జట్టు ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. బాధితులకు అండగా మెగా వేదికగా ఇలా నిరసన తెలిపింది. అయితే, సూర్య ఇప్పుడిలా అదే దేశానికి చెందిన ఆటగాడిని హగ్ చేసుకోవడం విమర్శలకు తావిచ్చింది. జట్టంతా ఒకే కుటుంబమని..కాగా యూఏఈతో పాటు ఒమన్ క్రికెట్ జట్లలో భారత్, పాక్కు చెందిన ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఈ విషయం గురించి యూఏఈ కెప్టెన్ మొహమ్మద్ వసీమ్ మాట్లాడుతూ.. తమ జట్టంతా ఒకే కుటుంబమని.. యూఏఈనే తమ దేశమని.. తమలో భారత్, పాక్ అనే మాట వినిపించవని చెప్పాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమిర్ను సూర్య హత్తుకోవడం నేరమేమీ కాదంటూ అతడి ఫ్యాన్స్ సపోర్టు చేసుకుంటున్నారు.చదవండి: PKL 12: తెలుగు టైటాన్స్ గెలుపుబాట𝘚𝘶𝘳𝘺𝘢 𝘋𝘢𝘥𝘢, 𝘦𝘬 𝘩𝘪 𝘥𝘪𝘭 𝘩𝘢𝘪𝘯, 𝘬𝘪𝘵𝘯𝘦 𝘣𝘢𝘢𝘳… 💙Encouraging words from India’s captain to Oman’s heroes ✨Watch the #DPWorldAsiaCup2025, Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #INDvOMAN pic.twitter.com/Mng5zOIrOH— Sony Sports Network (@SonySportsNetwk) September 19, 2025 -
పాకిస్తాన్తో మ్యాచ్కు ముందు టీమిండియాకు భారీ షాక్!
ఆసియా కప్-2025 టోర్నమెంట్ లీగ్ దశను టీమిండియా అజేయంగా ముగించింది. ఆఖరిగా శుక్రవారం ఒమన్తో జరిగిన మ్యాచ్లో 21 పరుగుల తేడాతో గెలిచి.. గ్రూప్-ఎ టేబుల్ టాపర్గా తన స్థానాన్ని నిలుపుకొంది. తదుపరి సూపర్-4 దశలో తమ తొలి మ్యాచ్లో భాగంగా భారత్.. దాయాది పాకిస్తాన్తో తలపడేందుకు షెడ్యూల్ ఖరారైంది.అయితే, దుబాయ్ వేదికగా ఆదివారం జరిగే ఈ మ్యాచ్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఒమన్తో మ్యాచ్ సందర్భంగా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel Injury) గాయపడ్డాడు. భారత్ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒమన్ వన్డౌన్ బ్యాటర్ మహ్మద్ మీర్జా (33 బంతుల్లో 51) దూకుడగా ఆడాడు.మైదానానికి బలంగా కొట్టుకున్న తలఈ క్రమంలో పదిహేనో ఓవర్లో శివం దూబే (Shivam Dube) బౌలింగ్లో మీర్జా బంతిని గాల్లోకి లేపగా.. మిడాఫ్ నుంచి పరిగెత్తుకుని వచ్చిన అక్షర్.. క్యాచ్ పట్టేందుకు విఫలయత్నం చేశాడు. ఈ క్రమంలో అదుపుతప్పి కిందపడిన అక్షర్ తల మైదానానికి బలంగా కొట్టుకుంది.దీంతో ఫిజియో వచ్చి పరీక్షించి.. అతడిని మైదానం నుంచి తీసుకువెళ్లాడు. ఆ తర్వాత అక్షర్ మళ్లీ ఫీల్డింగ్కు రాలేదు. అయితే, ఈ విషయం గురించి స్పందించిన భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ అప్డేట్ అందించాడు. అక్షర్ పటేల్ బాగానే ఉన్నాడని చెప్పాడు.స్పష్టత లేదుకానీ అక్షర్ గాయం తీవ్రతపై పూర్తి స్పష్టతనివ్వలేదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్తో సూపర్-4 మ్యాచ్కు అతడు అందుబాటులో ఉంటాడో లేదోనన్న సందిగ్దత నెలకొంది. కాగా యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో భారత్ లీగ్ దశలో మూడింటికి మూడు గెలిచింది. యూఏఈ, పాకిస్తాన్, ఒమన్లను ఓడించి అజేయంగా నిలిచింది. ఇక స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు రెండు వికెట్లు తీయడంతో పాటు.. 26 పరుగులు సాధించాడు. చదవండి: Asia Cup 2025 Super 4: సూపర్-4లో ఆడే జట్లు ఇవే.. షెడ్యూల్, టైమింగ్ వివరాలు -
ఆసియా కప్: సూపర్-4లో ఆడే జట్లు ఇవే.. షెడ్యూల్, టైమింగ్ వివరాలు
ఆసియా కప్-2025 టోర్నమెంట్ కీలక దశకు చేరుకుంది. మొత్తంగా ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ ఖండాంతర టోర్నీలో రెండు గ్రూపులు ఉన్న విషయం తెలిసిందే. లీగ్ స్టేజ్లో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ పోటీ పడ్డాయి. అయితే, వీటిలో భారత్, పాకిస్తాన్.. శ్రీలంక, బంగ్లాదేశ్ సూపర్-4 (Asia Cup Super 4)లో అడుగుపెట్టగా.. యూఏఈ, ఒమన్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ ఎలిమినేట్ అయ్యాయి. కాగా లీగ్ దశలో ఒకే ఒక్క మ్యాచ్ మిగిలి ఉంది. నామమాత్రపు మ్యాచ్ఆఖరిగా భారత్- ఒమన్ మధ్య శుక్రవారం మ్యాచ్ జరుగుతుంది. అయితే, టీమిండియా ఇప్పటికే యూఏఈ, పాకిస్తాన్ జట్లను ఓడించి సూపర్-4కు చేరగా.. పాక్ ఒమన్, యూఏఈలపై గెలిచి అర్హత సాధించింది. దీంతో టీమిండియా- ఒమన్ మధ్య మ్యాచ్ నామమాత్రపు మ్యాచ్గానే మిగిలిపోనుంది. మరోవైపు.. నాలుగు పాయింట్లతో పాటు నెట్ రన్ రేటు (+4.793) పరంగానూ టీమిండియా ప్రస్తుతం మెరుగైన స్థితిలో ఉన్నందున.. ఒమన్ మ్యాచ్ తర్వాత కూడా గ్రూప్-ఎ టాపర్గా ఉండటం లాంఛనమే.గ్రూప్-బి నుంచి ఆ రెండు జట్లుఇక గ్రూప్-బి విషయానికొస్తే... అబుదాబి వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ ద్వారా ఫలితం తేలింది. అఫ్గనిస్తాన్ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన లంక.. రషీద్ ఖాన్ బృందాన్ని నాకౌట్ చేసింది. ఫలితంగా లంకతో పాటు బంగ్లాదేశ్ సూపర్-4కు క్వాలిఫై అయింది. గ్రూప్-బి లీగ్ మ్యాచ్లన్నీ ముగిసిపోవడంతో టాపర్గా శ్రీలంక నిలవగా.. బంగ్లాదేశ్ రెండో స్థానం ఆక్రమించింది. ఈ నేపథ్యంలో ఆసియా కప్-2025 సూపర్-4 దశ షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ టైమింగ్ వివరాలు తెలుసుకుందాం!సూపర్-4 షెడ్యూల్👉మ్యాచ్ 1: సెప్టెంబరు 20- శనివారం- శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్- దుబాయ్👉మ్యాచ్ 2: సెప్టెంబరు 21- ఆదివారం- భారత్ వర్సెస్ పాకిస్తాన్- దుబాయ్👉మ్యాచ్ 3: సెప్టెంబరు 23- మంగళవారం- పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక- అబుదాబి👉మ్యాచ్ 4: సెప్టెంబరు 24- బుధవారం- భారత్ వర్సెస్ బంగ్లాదేశ్- దుబాయ్👉మ్యాచ్ 5: సెప్టెంబరు 25- గురువారం- పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్- దుబాయ్👉మ్యాచ్ 6: సెప్టెంబరు 26- శుక్రవారం- భారత్ వర్సెస్ శ్రీలంక- దుబాయ్ఫైనల్👉సెప్టెంబరు 28- దుబాయ్టైమింగ్స్👉ఫైనల్ సహా సూపర్-4 మ్యాచ్లన్నీ కూడా భారత కాలమానం ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు ఆరంభంలైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే👉టీవీ: సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్👉డిజిటల్: సోనీ లివ్ వెబ్సైట్, మొబైల్ యాప్జట్లు ఇవేటీమిండియాసూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.పాకిస్తాన్సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహిన్ అఫ్రిది, సూఫియాన్ మొకిమ్శ్రీలంకచరిత్ అసలంక (కెప్టెన్), కుశాల్ మెండిస్ (వికెట్కీపర్), పాతుమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా, కమిల్ మిషార, దసున్ షనక, కమిందు మెండిస్, వనిందు హసరంగ, నువానీదు ఫెర్నాండో, దునిత్ వెల్లాలగే, చమిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, మతీశ పతిరణ, నువాన్ తుషార, దుష్మంత చమీరా, బినుర ఫెర్నాండో.బంగ్లాదేశ్లిట్టన్ కుమార్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఇమాన్, సైఫ్ హసన్, తౌహిద్ హ్రిదోయ్, జాకర్ అలీ అనిక్, షమీమ్ హొస్సేన్, క్వాజీ నూరుల్ హసన్ సోహన్, షాక్ మహేదీ హసన్, రిషద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తాంజిమ్ హసన్ సకీబ్, టస్కిన్ అహ్మద్, షరీఫుల్ ఇస్లాం, షైఫ్ ఉద్దీన్స్టాండ్బై ప్లేయర్లు: సౌమ్య సర్కార్, మెహిదీ హసన్ మిరాజ్, తన్వీర్ ఇస్లాం, హసన్ మహమూద్. చదవండి: Asia Cup: మా జట్టులో భారత్, పాక్ వినిపించదు.. మేమంతా ఒకే కుటుంబం -
ఒక్కోసారి ఒంటె మీద కూర్చున్నా.. కుక్కకాటు తప్పదు!
ఆసియా కప్-2025 టోర్నమెంట్ లీగ్ దశలో పాకిస్తాన్ యువ ఓపెనర్ సయీమ్ ఆయుబ్ (Saim Ayub) దారుణంగా విఫలమయ్యాడు. ఆడిన మూడు మ్యాచ్లలోనూ అతడు డకౌట్ అయ్యాడు. ఒమన్, టీమిండియా, యూఏఈ జట్లతో మ్యాచ్లలో పరుగుల ఖాతా తెరవకుండానే 23 ఏళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్ వెనుదిరిగాడు.అయితే, బ్యాటర్గా విఫలమైనా.. వికెట్లు తీయడంలో మాత్రం సఫలమయ్యాడు ఈ పార్ట్టైమ్ స్పిన్నర్. ఇప్పటి వరకు మూడు మ్యాచ్లలో కలిపి ఆరు వికెట్లు పడగొట్టాడు. స్పెషలిస్టు బౌలర్ల కంటే అతడే ఓ అడుగు ముందున్నాడు. ముఖ్యంగా టీమిండియాతో మ్యాచ్లో పాక్ తీసిన మూడు వికెట్లు అతడి ఖాతాలోనే ఉండటం ఇందుకు నిదర్శనం.ఒక్కోసారి ఒంటె మీద కూర్చున్నా.. కుక్కకాటు తప్పదు!ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ (Rashid Latif) సయీమ్ ఆయుబ్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. ఓ వ్యక్తి ఒంటెపై కూర్చుని ఉన్నా కుక్కకాటు నుంచి మాత్రం తప్పించుకోలేడు’’ అని లతీఫ్ పేర్కొన్నాడు. మేనేజ్మెంట్ నుంచి మద్దతు దక్కుతున్నా ఆయుబ్ను దురదృష్టం వెంటాడుతూనే ఉందన్న అర్థంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ఓ బ్యాటర్ పరుగులు తీయకుండా.. వికెట్లు తీయడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు.పరుగుల విధ్వంసం సృష్టిస్తాడు‘‘ప్రతి ఒక్కరి కెరీర్లో గడ్డు దశ అనేది ఒకటి ఉంటుంది. అతడు వైవిధ్యభరితమైన షాట్లు ఆడేందుకు ప్రయత్నించి విఫలమవుతున్నాడు. బ్యాటర్గా కాకుండా.. బౌలింగ్ విభాగంలో రాణిస్తున్నందున అతడికి తుదిజట్టులో చోటు దక్కుతోంది. అయితే, కీలక మ్యాచ్లలో మాత్రం అతడు తప్పక పరుగుల విధ్వంసం సృష్టిస్తాడు’’ అని రషీద్ లతీఫ్ ధీమా వ్యక్తం చేశాడు.ఇదిలా ఉంటే.. గ్రూప్-‘ఎ’లో భాగంగా టీమిండియా చేతిలో ఓడిన పాక్.. యూఏఈ, ఒమన్లపై గెలిచింది. ఈ క్రమంలో భారత జట్టుతో కలిసి ఈ గ్రూపు నుంచి సూపర్-4కు అర్హత సాధించింది. ఈ క్రమంలో చిరకాల ప్రత్యర్థులైన భారత్- పాక్ జట్ల మధ్య సెప్టెంబరు 21న సూపర్-4 మ్యాచ్ జరుగనుంది. సూపర్-4 బెర్తు ఖరారుఇక లీగ్ దశలో యూఏఈ, పాకిస్తాన్లను చిత్తుగా ఓడించిన సూర్యకుమార్ సేన.. ముందుగానే సూపర్-4 బెర్తు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, పాక్తో మ్యాచ్ ఆడినప్పటికీ.. ఆ జట్టు ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్లు కరచాలనం చేయలేదు. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ విషయంపై నానాయాగీ చేసిన పాక్ క్రికెట్ బోర్డు బాయ్కాట్ పేరిట డ్రామాకు తెరతీసింది. అయితే, తమ పాచికలు పారకపోవడంతో యూఏఈతో బుధవారం మ్యాచ్ ఆడిన పాక్.. 41 పరుగుల తేడాతో గెలిచి సూపర్-4కు చేరుకుంది.చదవండి: అతడు అత్యద్భుతం.. ఏ జట్టునైనా ఓడించగలము: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్UAE strike early vs Pakistan 🤯Watch #PAKvUAE LIVE NOW, on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/gVRGeSYoBv— Sony Sports Network (@SonySportsNetwk) September 17, 2025 -
అందుకే ఆసియా కప్లో ఆడుతున్నాం!.. అవునా?.. నిజమా?!
‘నో- షేక్హ్యాండ్’ వివాదంలో రచ్చ చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆఖరికి తలవంచకతప్పలేదు. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్పై పీసీబీ చేసిన ఫిర్యాదులకు ఆధారాల్లేవని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాక్ బోర్డు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లు అయింది. ఫలితంగా ‘బాయ్కాట్’ నాటకాన్ని పక్కనపెట్టిన పాక్ జట్టు.. యూఏఈతో బుధవారం మ్యాచ్ ఆడింది. అంతేకాదు ఈ మ్యాచ్కు రిఫరీ కూడా ఆండీనే కావడం విశేషం. అయితే, ‘సమాచార లోపం కారణంగానే ఇది జరిగిందంటూ పైక్రాఫ్ట్ మాకు క్షమాపణ చెప్పారు. ఆడియో లేని వీడియో.. చీప్ ట్రిక్స్ ఈ విషయంలో నిబంధనల ఉల్లంఘనపై విచారణ జరిపిస్తామని ఐసీసీ కూడా చెప్పింది’ అంటూ పీసీబీ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు పైక్రాఫ్ట్తో తమ బృందం చర్చిస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. అయితే పాక్ ఏదైనా రుజువులు చూపిస్తే తప్ప వారి ఆరోపణలపై తాము విచారణ చేసే అవకాశాలు లేవని ఐసీసీ అధికారి ఒకరు స్పష్టం చేసినట్లు సమాచారం.ఇదిలా ఉంటే.. ఆడియో లేకుండా పాక్ విడుదల చేసిన వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మరీ ఇలాంటి చీప్ ట్రిక్స్ పనికిరావని.. నిజంగానే రిఫరీ క్షమాపణ చెప్పి ఉంటే ఆడియో కూడా పెట్టాల్సిందని చురకలు అంటిస్తున్నారు.బాయ్కాట్కు అందరి మద్దతు ఉంది.. కానీఇదిలా ఉంటే.. తాము ఆసియా కప్ నుంచి వైదొలగకపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ పీసీబీ చీఫ్, ఆసియా క్రికెట్ మండలి ప్రస్తుత అధ్యక్షుడు మొహ్సిన్ నక్వీ కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు. ‘‘సెప్టెంబరు 14 తర్వాత జరిగిన పరిస్థితుల గురించి అందరికీ తెలుసు. మ్యాచ్ రిఫరీ విషయంలో మేము అభ్యంతరాలు లేవనెత్తాము.కాసేపటి క్రితమే మ్యాచ్ రిఫరీ మా జట్టు కోచ్, కెప్టెన్, మేనేజర్తో మాట్లాడారు. నో- షేక్హ్యాండ్ ఘటన జరగకుండా ఉండాల్సిందని విచారం వ్యక్తం చేశారు. ఏదేమైనా ఈ విషయంలో విచారణ జరపాల్సిందేనని మేము ముందుగానే ఐసీసీకి ఫిర్యాదు చేశాం.రాజకీయాలు, క్రీడలను కలపకూడదు. ఆటను ఆటగానే ఉండనివ్వాలి. ఒకవేళ మనం బాయ్కాట్ చేస్తే.. అదొక అతిపెద్ద నిర్ణయం అవుతుంది. మనకు ప్రధాన మంత్రి, ప్రభుత్వ అధికారులు, ప్రజల మద్దతు ఉంది. చింత చచ్చినా పులుపు చావలేదు!కానీ ఈ విషయాన్ని మేము నిశితంగా పరిశీలించి చర్యలు తీసుకుంటాం’’ అంటూ నక్వీ అసలు కారణం చెప్పకుండా చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా రిఫరీ విషయంలో తమదే పైచేయి అయినందన్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు.కాగా సెప్టెంబరు 14న పాక్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే, పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా భారత జట్టు పాక్ ఆటగాళ్లతో కరచాలనానికి నిరాకరించింది. దీంతో అవమానభారంతో రగిలిపోయిన పాక్.. బాయ్కాట్ అంశాన్ని తెరమీదకు తెచ్చింది. అయితే, ఒకవేళ నిజంగానే వాళ్లు ఈ టోర్నీని బహిష్కరిస్తే మిగతా వారికి వచ్చే నష్టమేమీ లేదు.వారికే నష్టంఇప్పటికే ఆర్థికంగా అంతంతమాత్రంగా ఉన్న పాక్ బోర్డు పరిస్థితి మాత్రం మరింత దిగజారడం ఖాయం. టోర్నీ నుంచి రావాల్సిన ఆదాయం కోసమే కొనసాగినా.. నక్వీ ఇలా సాకులు చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే.. బుధవారం నాటి మ్యాచ్లో యూఏఈని ఓడించిన పాక్.. సూపర్-4కు అర్హత సాధించింది. ఈ క్రమంటో సెప్టెంబరు 21న సల్మాన్ ఆఘా బృందం టీమిండియాను ఢీకొట్టనుంది.చదవండి: అతడు అత్యద్భుతం.. ఏ జట్టునైనా ఓడించగలము: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్ -
అతడు అత్యద్భుతం.. ఏ జట్టునైనా ఓడించగలము: పాక్ కెప్టెన్
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు సూపర్-4 దశకు అర్హత సాధించింది. పసికూన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను 41 పరుగుల తేడాతో ఓడించి.. లీగ్ దశను విజయవంతంగా ముగించింది. యూఏఈ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికి ఎట్టకేలకు గట్టెక్కిన పాక్.. మరోసారి టీమిండియతో తలపడేందుకు సిద్ధమైంది.దుబాయ్ వేదికగా సెప్టెంబరు 21న పాకిస్తాన్.. టీమిండియా (Ind vs Pak)ను ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో యూఏఈపై విజయానంతరం పాక్ సారథి సల్మాన్ ఆఘా (Salman Agha).. తాము ఏ జట్టునైనా ఓడించగలమంటూ కాస్త అతిగా మాట్లాడాడు. ‘‘మేము ఈ మ్యాచ్లో మెరుగ్గా ఆడాము. అయితే, మధ్య ఓవర్లలో ఇంకాస్త శ్రమించాల్సింది.అబ్రార్ అహ్మద్ అత్యద్భుతంఏదైమైనా మా బౌలర్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది. కానీ బ్యాటింగ్ పరంగానే మేము నిరాశకు లోనయ్యాం. ఇప్పటి వరకు మా అత్యుత్తమ స్థాయి ప్రదర్శనను కనబరచలేకపోయాం. ఒకవేళ ఈరోజు మేము మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే.. 170-180 పరుగులు సాధించేవాళ్లం.షాహిన్ ఆఫ్రిది మ్యాచ్ విన్నర్. అతడి బ్యాటింగ్ కూడా మెరుగుపడింది. ఇక అబ్రార్ అహ్మద్ (2/13) అత్యద్భుతంగా రాణించాడు. చేజారే మ్యాచ్లను మావైపు తిప్పడంలో అతడు ఎల్లప్పుడూ ముందే ఉంటాడు.ఎలాంటి జట్టునైనా ఓడించగలముమున్ముందు ఎదురయ్యే ఎలాంటి సవాలుకైనా మేము సిద్ధంగా ఉన్నాము. మేము ఇలాగే గొప్పగా ఆడితే.. ఎలాంటి జట్టునైనా ఓడించగలము’’ అని సల్మాన్ ఆఘా చెప్పుకొచ్చాడు. పరోక్షంగా టీమిండియాను ఉద్దేశించి.. తాము సూపర్-4 పోరుకు సిద్ధమంటూ హెచ్చరికలు జారీ చేశాడు.నాటకీయ పరిణామాల నడుమకాగా గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ పోటీపడ్డాయి. ఈ క్రమంలో యూఏఈ, పాక్లను ఓడించి టీమిండియా తొలుత సూపర్ ఫోర్కు అర్హత సాధించగా.. ఒమన్ ఎలిమినేట్ అయింది. అయితే, గ్రూప్-ఎ నుంచి మరో బెర్తు కోసం పాక్- యూఏఈ బుధవారం రాత్రి తలపడ్డాయి. దుబాయ్లో జరిగిన ఈ మ్యాచ్లో పాకిస్తాన్ 41 పరుగుల తేడాతో గెలిచి.. తమ బెర్తును ఖరారు చేసుకోగా.. యూఏఈ ఎలిమినేట్ అయింది. ఇదిలా ఉంటే.. టీమిండియా చేతిలో పాక్ ఏడు వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్లో పాక్ ఆటగాళ్లతో ఎలాంటి కమ్యూనికేషన్ పెట్టుకోని భారత జట్టు.. మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా కరచాలనానికి నిరాకరించింది. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంది. దీనిని అవమానంగా భావించిన పాక్.. ఐసీసీకి ఫిర్యాదు చేయడంతో పాటు తాము బాయ్కాట్ చేస్తామంటూ రచ్చచేసింది. అయితే, ఆఖరికి పాక్ తలొగ్గక తప్పలేదు. యూఏఈతో మ్యాచ్కు గంట కావాలనే ఆలస్యం చేసినా.. చివరకు మళ్లీ మైదానంలో అడుగుపెట్టింది.పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ స్కోర్లుటాస్: యూఏఈ.. తొలుత బౌలింగ్పాక్ స్కోరు: 146/9 (20)యూఏఈ స్కోరు: (17.4)ఫలితం: యూఏఈపై 41 పరుగుల తేడాతో పాక్ గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షాహిన్ ఆఫ్రిది (14 బంతుల్లో 29 నాటౌట్.. మూడు ఓవర్ల బౌలింగ్లో 16 పరుగులు ఇచ్చి 2 వికెట్లు).చదవండి: ఒకప్పుడు ‘చిరుత’.. ఇప్పుడు మెట్లు ఎక్కాలన్నా ఆయాసమే! -
Asia Cup 2025: మళ్లీ భారత్-పాక్ మ్యాచ్.. ఎప్పుడంటే?
ఆసియాకప్-2025లో చిరకాల ప్రత్యర్ధులు భారత్-పాకిస్తాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన గ్రూపు-ఎ మ్యాచ్లో యూఏఈను 41 పరుగుల తేడాతో పాక్ చిత్తు చేసింది. దీంతో గ్రూపు-ఎ నుంచి సూపర్ 4కు ఆర్హత సాధించిన జట్టుగా పాకిస్తాన్ నిలిచింది.ఈ క్రమంలో సెప్టెంబర్ 21(ఆదివారం) దుబాయ్ వేదికగా జరగనున్న సూపర్-4 మ్యాచ్లో మెన్ ఇన్ బ్లూ.. మెన్ ఇన్ గ్రీన్ తాడోపేడో తెల్చుకోనున్నాయి. మరోసారి దాయాది పాక్ను చిత్తు చేయాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. కాగా లీగ్ స్టేజిలో భాగంగా గత ఆదివారం(సెప్టెంబర్ 14) జరిగిన మ్యాచ్లో పాక్పై 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.128 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే హ్యాండ్ షేక్ వివాదమే ఎక్కువగా హైలెట్ అయింది. ఈ మ్యాచ్లో పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరాచాలనాన్ని తిరష్కరించారు.దీంతో ఘోర అవమానంగా భావించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. భారత్ ఆటగాళ్లతో పాటు మ్యాచ్ రిఫరీ అండీ పైక్రాప్ట్పై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. కానీ రూల్ బుక్లో ప్రత్యర్ధి ఆటగాళ్లతో హ్యాండ్ షేక్ చేయడం తప్పనిసారి అని లేకపోవడంతో ఐసీసీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు సూపర్-4లో కూడా నో హ్యాండ్ షేక్ విధానాన్ని భారత్ కొనసాగించనుంది.చదవండి: మరోసారి బీభత్సం సృష్టించిన సాల్ట్.. ఈసారి పసికూన బలి -
Asia Cup 2025: పాక్ 'బాయ్కాట్' బెదిరింపులకు తలొగ్గని ఐసీసీ
నో హ్యాండ్షేక్ ఉదంతంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెనక్కు తగ్గింది. ఇవాళ (సెప్టెంబర్ 17) యూఏఈతో మ్యాచ్కు కొద్ది గంటల ముందు పీసీబీ హైడ్రామా నడిపింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను ఆసియా కప్ నుంచి తప్పించాలని భీష్మించుకు కూర్చుంది. పైక్రాఫ్ట్ను తప్పించకపోతే యూఏఈతో మ్యాచ్ను బాయ్కాట్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేసింది. మ్యాచ్ ప్రారంభానికి సమయం ఆసన్నమైనా, వారి ఆటగాళ్లను హోటల్ రూమ్ల నుంచి బయటకు రానివ్వలేదు.దీంతో ఆసియా కప్లో పాక్ కొనసాగడంపై కాసేపు నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఈ విషయంలో ఐసీసీ కూడా ఏమాత్రం తగ్గకపోవడంతో పాక్ క్రికెట్ బోర్డే తోక ముడిచింది. నో హ్యాండ్షేక్ ఉదంతంతో పైక్రాఫ్ట్ది ఏ తప్పు లేదని ఐసీసీ మరోసారి పీసీబీకి స్పష్టం చేసింది. మ్యాచ్ అఫీషియల్స్ విషయంలో పీసీబీ అతిని సహించబోమని స్ట్రిక్ట్గా వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది.దీంతో చేసేదేమీ లేక పీసీబీ తమ ఆటగాళ్లను మ్యాచ్ ఆడటానికి మైదానానికి రావాల్సిందిగా ఆదేశించింది. మ్యాచ్ను గంట ఆలస్యంగా ప్రారంభించాలని నిర్వహకులకు కబురు పంపింది. భారతకాలమానం ప్రకారం పాక్-యూఏఈ మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా, పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్లో భారత క్రికెటర్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారు. దీన్ని అవమానంగా భావించిన పాక్.. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది.అలాగే ఆ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్ను ఆసియా కప్ నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. పైక్రాఫ్ట్ షేక్హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్ సల్మాన్ అఘాకు చెప్పాడని, ఈ వివాదానికి అతనే బాధ్యుడని గగ్గోలు పెట్టింది.పీసీబీ డిమాండ్లను పరిశీలించిన ఐసీసీ.. షేక్ హ్యాండ్ ఇవ్వడమనేది ఆటగాళ్ల వ్యక్తిగత విషయమని కొట్టిపారేసింది. అలాగే షేక్హ్యాండ్ ఉదంతంలో పైక్రాఫ్ట్ పాత్ర ఏమీ లేదని, యూఏఈతో మ్యాచ్కు అతన్నే రిఫరీగా కొనస్తామని ప్రకటించింది. -
Asia Cup 2025: యూఏఈతో మ్యాచ్ను బాయ్కాట్ చేయనున్న పాకిస్తాన్..?
ఆసియా కప్-2025లో భాగంగా భారత్, పాకిస్తాన్ క్రికెటర్ల మధ్య చోటు చేసుకున్న 'హ్యాండ్షేక్ వివాదం' తీవ్రరూపం దాల్చినట్లు కనిపిస్తుంది. పాక్ క్రికెట్ టీమ్ ఇవాళ (సెప్టెంబర్ 17) యూఏఈతో జరుగబోయే మ్యాచ్ సహా ఆసియా కప్ మొత్తాన్ని బాయ్కాట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. యూఏఈతో మ్యాచ్ ప్రారంభానికి గంట సమయం మాత్రమే ఉన్నా, పాక్ క్రికెటర్లు ఇంకా హోటల్ రూమ్ల నుంచి బయటికి రాలేదని సమాచారం. హ్యాండ్షేక్ వివాదంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ కాసేపట్లో పాక్ నుంచి మీడియా సమావేశం నిర్వహిస్తాడని తెలుస్తుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్ సందర్భంగా భారత క్రికెటర్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారు. దీన్ని అవమానంగా భావించిన పాక్.. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అలాగే ఆ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్ను ఆసియా కప్ నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. పైక్రాఫ్ట్ షేక్హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్ సల్మాన్ అఘాకు చెప్పాడని, ఈ వివాదానికి అతనే బాధ్యుడని పీసీబీ గగ్గోలు పెడుతుంది.పీసీబీ డిమాండ్లను పరిశీలించిన ఐసీసీ.. షేక్ హ్యాండ్ ఇవ్వడమనేది ఆటగాళ్ల వ్యక్తిగత విషయమని కొట్టిపారేసింది. అలాగే షేక్హ్యాండ్ ఉదంతంలో పైక్రాఫ్ట్ పాత్ర ఏమీ లేదని యూఏఈతో మ్యాచ్కు అతన్నే రిఫరీగా కొనసాగించేందుకు నిర్ణయించుకుంది.ఐసీసీ నిర్ణయాలతో ఖంగుతిన్న పీసీబీ చేసేదేమీ లేక ఆసియా కప్ను బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే, ఆసియా కప్లో ముందు దశకు (సూపర్-4) వెళ్లాలంటే పాక్ యూఏఈపై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంది. గ్రూప్-ఏలో పాక్ పసికూన ఒమన్పై విజయం సాధించి, టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది. మరోవైపు యూఏఈ టీమిండియా చేతిలో ఓడి, ఒమన్పై విజయం సాధించింది.ప్రస్తుతం పాక్, యూఏఈ ఆడిన రెండు మ్యాచ్ల్లో చెరో విజయంతో పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఒకవేళ పాక్ యూఏఈతో మ్యాచ్ను బహిష్కరిస్తే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇదే జరిగితే యూఏఈ భారత్తో పాటు సూపర్-4కు చేరుకుంటుంది. -
‘వాళ్ల క్యారెక్టరే అంత.. చదువు, సంస్కారం ఉంటే ఇలాంటివి చేయరు’
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొహ్మద్ యూసఫ్పై టీమిండియా మాజీ ఆల్రౌండర్ మదన్ లాల్ (Madan Lal) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. పబ్లిసిటీ కోసం ఎంతకైనా దిగజారడం పాక్ క్రికెటర్లకు అలవాటేనని.. వాళ్ల క్యారెక్టరే అంత అంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా పాకిస్తాన్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే.నో- షేక్హ్యాండ్దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. పాక్ను 127 పరుగులకే పరిమితం చేసింది. ఇక స్వల్ప లక్ష్య ఛేదనను 15.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి పూర్తి చేసింది. ఇదిలా ఉంటే.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారి దాయాదితో ముఖాముఖి తలపడిన టీమిండియా మైదానంలో ఏ దశలోనూ పాక్ ఆటగాళ్లతో ఎలాంటి కమ్యూనికేషన్ పెట్టుకోలేదు.టాస్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ సారథి సల్మాన్ ఆఘాకు షేక్హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా టీమిండియా ఇదే పంథా అనుసరించింది. దీనిని తీవ్ర అవమానంగా భావించిన పాక్.. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారంటూ నానాయాగీ చేసింది.సూర్యకుమార్ యాదవ్పై దిగజారుడు వ్యాఖ్యలుఈ క్రమంలో పాక్ మాజీ క్రికెటర్ మొహ్మద్ యూసఫ్.. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. సూర్య పేరును కావాలనే తప్పుగా పలుకుతూ ‘ఆ పంది’ కుమార్ అంటూ చీప్ కామెంట్లు చేశాడు. అంతేకాదు.. అంపైర్లను అడ్డుపెట్టుకుని టీమిండియా మ్యాచ్ గెలిచిందంటూ ఆరోపించాడు.పాకిస్తాన్ క్రికెటర్ల క్యారెక్టరే అంతఈ నేపథ్యంలో 1983 వరల్డ్కప్ విజేత మదన్ లాల్ మొహ్మద్ యూసఫ్ తీరుపై మండిపడ్డాడు. ‘‘పాకిస్తాన్ క్రికెటర్ల క్యారెక్టరే అంత. ఎవరైనా దూషించే హక్కు మీకెక్కడిది?.. వాళ్లకు ఇలా మాట్లాడటం మాత్రమే తెలుసు. అంతకంటే ఇంకేమీ పట్టదు.సొంత జట్టు ప్లేయర్లనే తిట్టిన చరిత్ర వారికి ఉంది. వరుస పరాజయాలతో విసుగెత్తిపోయి ఉన్నారు. అందుకే ఇప్పుడు ఇతర జట్ల ఆటగాళ్లను కూడా దూషించడం మొదలుపెట్టారు. దీనిని బట్టి వాళ్ల చదువు, సంస్కారాలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. ఇలా మాట్లాడేవారంతా మూర్ఖులు.పబ్లిసిటీ కోసమే ఈ విషయం గురించి మనం ఎక్కువగా మాట్లాడకూడదు. నిజానికి మనమే వాళ్లకు ఎక్కువగా ప్రచారం ఇస్తున్నాం. వాళ్లకు కావాల్సింది కూడా ఇదే. పబ్లిసిటీ కోసం వాళ్లు ఏమైనా చేస్తారు. భారత జట్టు గురించి మాట్లాడుతూ వ్యూస్ కోసం యూట్యూబ్ చానెళ్లు ఇలాంటి పనిచేస్తున్నాయి’’ అని 74 ఏళ్ల మదన్ లాల్ ANIతో పేర్కొన్నాడు.అదే విధంగా.. టీమిండియా తమ అద్భుత ఆట తీరుతో గెలిచిందంటూ యూసఫ్కు మదన్ లాల్ కౌంటర్ ఇచ్చాడు. కొన్నిసార్లు అంపైర్లు తప్పు చేసినా.. ఇప్పుడున్న అత్యాధునిక సాంకేతికతో వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు.చదవండి: చావో- రేవో!.. పాకిస్తాన్ సూపర్-4కు అర్హత సాధించాలంటే.. -
చావో- రేవో!.. పాకిస్తాన్ సూపర్-4కు చేరాలంటే..
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా ఇప్పటికే సూపర్-4 దశకు అర్హత సాధించింది. గ్రూప్-‘ఎ’లో ఉన్న భారత జట్టు తొలుత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)ని ఓడించింది. యూఏఈ విధించిన లక్ష్యాన్ని 4.3 ఓవర్లలోనే ఛేదించి తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.సూపర్-4 బెర్తు ఖరారైంది ఇలా..ఇక రెండో మ్యాచ్లో సూర్యకుమార్ సేన.. దాయాది పాకిస్తాన్ (Ind vs Pak)ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ క్రమంలో నాలుగు పాయింట్లు సంపాదించిన టీమిండియా.. యూఏఈ- ఒమన్ను ఓడించి.. ఎలిమినేట్ చేయగానే సూపర్-4 బెర్తు ఖరారు చేసుకుంది. ఇక గ్రూప్-‘ఎ’ నుంచి రెండో బెర్తు కోసం పాకిస్తాన్- యూఏఈ పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం నాటి మ్యాచ్లో ఇరుజట్లు చావోరేవో తేల్చుకోనున్నాయి. కాగా యూఏఈ- పాకిస్తాన్ ఈ టోర్నీలో ఇప్పటి వరకు చెరో మ్యాచ్ గెలిచాయి. ఈ రెండు జట్లు ఒమన్ను ఓడించి చెరో రెండు పాయింట్లు సాధించాయి.గెలిచిన జట్టుకే అవకాశంఈ క్రమంలో దుబాయ్ వేదికగా జరిగే బుధవారం జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు ఖాతాలో మరో రెండు పాయింట్లు చేరతాయి. తద్వారా మొత్తంగా నాలుగు పాయింట్లతో సూపర్-4కు అర్హత సాధిస్తుంది.అంటే.. పాకిస్తాన్ యూఏఈని ఓడిస్తే.. నేరుగా సూపర్-4లో అడుగుపెడుతుంది. ఒకవేళ యూఏఈ గెలిస్తే.. టీమిండియాతో కలిసి గ్రూప్-‘ఎ’ నుంచి సూపర్-4కు అర్హత సాధిస్తుందన్న మాట.ఫలితం తేలకుంటే మాత్రంఒకవేళ మ్యాచ్ గనుక ‘టై’ అయినా.. ఏదేని కారణాల చేత ఫలితం తేలకపోయినా ఇరుజట్లకు చెరో పాయింట్ వస్తుంది. అప్పుడు నెట్ రన్రేటు ఆధారంగా మెరుగ్గా ఉన్న జట్టుకు బెర్తు ఖరారు అవుతుంది. ప్రస్తుతం నెట్ రన్రేటు పరంగా పాకిస్తాన్ (+1.649).. యూఏఈ కంటే మెరుగ్గా ఉంది. కాబట్టి ఈ సమీకరణ ఆధారంగా పాకిస్తాన్కే సూపర్-4 చేరే అవకాశం ఉంటుంది.AI ఆధారిత టేబుల్ఒమన్, హాంకాంగ్ ఎలిమినేట్యూఏఈ వేదికగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్ టోర్నీలో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ... గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ పాల్గొంటున్నాయి. ఇప్పటికే గ్రూప్-‘ఎ’ నుంచి ఒమన్.. గ్రూప్-‘బి’ నుంచి హాంకాంగ్ ఎలిమినేట్ అయ్యాయి.చదవండి: IND Vs PAK Handshake Row: ఐసీసీ యూటర్న్.. పాకిస్తాన్కు ఊరట?! -
Handshake Row: ఐసీసీ యూటర్న్.. పాకిస్తాన్కు ఊరట?!
ఆసియా కప్-2025 టోర్నీలో టీమిండియాతో మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) రచ్చకెక్కింది. తమ ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్లు కరచాలనం చేయకపోవడాన్ని పీసీబీ జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలో భారత్, పాక్ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్ (Andy Pycroft)ను తక్షణం ఆసియా కప్ నుంచి తప్పించాలని పీసీబీ డిమాండ్ చేసింది.ఆయనే బాధ్యుడంటూ..ఈ మేరకు ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లకు ఫిర్యాదు కూడా చేసింది. మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ షేక్హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్ సల్మాన్ ఆఘాకు చెప్పాడని, ఈ వివాదానికి ఆయనే బాధ్యుడని ఫిర్యాదులో ప్రముఖంగా పేర్కొంది.ఈ విషయంపై మంగళవారం స్పందించిన ఐసీసీ పాక్ బోర్డు ఫిర్యాదును తోసిపుచ్చింది. ‘సోమవారం రాత్రే ఐసీసీ తమ నిర్ణయాన్ని వెలువరించింది. రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ను తప్పించలేమని పాక్ బోర్డు ఫిర్యాదును తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశాం’ అని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. కాగా జింబాబ్వేకు చెందిన పైక్రాఫ్ట్కు అంతర్జాతీయ క్రికెట్లో విశేషానుభవం వుంది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో సీనియర్ రిఫరీ అయిన ఆయన మూడు ఫార్మాట్లలో కలిసి 695 మ్యాచ్లకు రిఫరీగా వ్యవహరించారు. పురుషులు, మహిళల మ్యాచ్లు కలిపి ఉన్నాయి.ఐసీసీ యూటర్న్.. పాక్కు ఊరట?!ఈ నేపథ్యంలో కనీసం తమ మ్యాచ్ల వరకైనా ఆండీ క్రాఫ్ట్ను దూరం పెట్టి రిచీ రిచర్డ్సన్కు రిఫరీ బాధ్యతలు ఇవ్వాలని పీసీబీ కోరింది. కాగా ఆసియా కప్ టోర్నీలో బుధవారం పాకిస్తాన్- యూఏఈ మధ్య జరిగే మ్యాచ్కూ పైక్రాఫ్ట్ రిఫరీగా ఉన్నారు. అయితే, పీసీబీ విజ్ఞప్తిని మన్నించిన ఐసీసీ.. ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆడబోయే అన్ని మ్యాచ్ల నుంచి పైక్రాఫ్ట్ను రిఫరీగా తప్పించినట్లు ఎన్డీటీవీ తన తాజా కథనంలో పేర్కొంది.కాగా పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ సారథి సల్మాన్ ఆఘాకు షేక్హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా భారత ఆటగాళ్లు పాక్ జట్టుతో కరచాలనం చేయలేదు. కచ్చితమైన నిబంధనలేమీ లేవుఈ నేపథ్యంలో పీసీబీ రిఫరీతో పాటు టీమిండియా తీరును తప్పుబట్టగా.. ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వాలన్న కచ్చితమైన నిబంధనలేమీ లేవని బీసీసీఐ కౌంటర్ ఇచ్చింది.ఇక దుబాయ్ వేదికగా ఏడు వికెట్ల తేడాతో పాక్ను ఓడించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కొన్ని అంశాలు క్రీడాస్ఫూర్తికి మించినవి ఉంటాయంటూ పాక్ విమర్శలను తిప్పికొట్టాడు. పాక్పై ఈ గెలుపును ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత సైన్యానికి అంకితం చేస్తున్నట్లు తెలిపాడు. అలాగే పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని సూర్య స్పష్టం చేశాడు.చదవండి: సూర్యకుమార్పై పాక్ మాజీ కెప్టెన్ దిగజారుడు వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన కోచ్ -
సూర్యపై పాక్ మాజీ కెప్టెన్ దిగజారుడు వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన కోచ్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొహ్మద్ యూసఫ్ (Mohammed Yousuf)పై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) చిన్ననాటి కోచ్ అశోక్ అస్వాల్కర్ మండిపడ్డాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన క్రికెటర్ నుంచి ఇలాంటి చెత్త మాటలు ఊహించలేదన్నాడు. అయినా అతడి స్థాయికి ఇంతకంటే గొప్పగా మాట్లాడతాడనుకోలేదంటూ చురకలు అంటించాడు.ఆసియా కప్-2025 టోర్నీలో భాగంగా టీమిండియా ఆదివారం పాక్తో మ్యాచ్ ఆడింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ టీ20 పోరులో సూర్యకుమార్ సేన సల్మాన్ ఆఘా బృందాన్ని ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. బీసీసీఐ కౌంటర్ అయితే, టాస్ సమయంలోగానీ.. మ్యాచ్ ముగిసిన తర్వాత గానీ భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయలేదు. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు మద్దతుగా పాక్ ఆటగాళ్లతో షేక్హ్యాండ్కు నిరాకరించింది.దీనిని అవమానంగా భావించిన పాక్ జట్టు.. విషయాన్ని ఐసీసీ వరకు తీసుకువెళ్లగా.. కచ్చితంగా షేక్హ్యాండ్ చేయాలన్న నిబంధన లేదంటూ బీసీసీఐ కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ మొహ్మద్ యూసఫ్ టీమిండియాపై అవాకులు, చెవాకులు పేలుతూ అక్కసు వెళ్లగక్కాడు.సూర్య పేరును ఉద్దేశపూర్వకంగానే తప్పుగా పలుకుతూషేక్హ్యాండ్ గురించి సామా టీవీలో మాట్లాడుతూ.. సూర్యకుమార్ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సూర్య పేరును ఉద్దేశపూర్వకంగానే తప్పుగా పలుకుతూ పంది అనే అర్థం వచ్చేలా దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు అంపైర్లను అడ్డుపెట్టుకుని గెలిచారంటూ నిరాధార ఆరోపణలు చేశాడు. అతడి మాటలకు అక్కడున్న వాళ్లు పళ్ళు ఇకిలిస్తూ శునకానందం పొందారు.ఇంతకంటే ఇంకా ఎంతకు దిగజారగలరు?ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ చిన్ననాటి కోచ్ అశోక్ అస్వాల్కర్ స్పందించాడు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఇంతకంటే ఇంకా ఎంతకు దిగజారగలరు? వాళ్లు ఇలాంటి చెత్త మాటలు మాట్లాడుతూనే ఉంటారు.మైదానంలో ఏం చేయాలో మాత్రం అది చేయరు. కానీ మైదానం వెలుపల ఇలాంటి పిచ్చి మాటలతో హైలైట్ అవుతారు. ప్రపంచం మొత్తం వీరిని గమనిస్తూనే ఉంది. ఇంతకంటే టీమిండియాను వారు ఏం చేయగలరు?ప్రతి ఒక్కరికి తమకంటూ గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన వ్యక్తి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడంటే వారు ఎలాంటి వారో అర్థం చేసుకోవచ్చు. అయినా.. ఎవరైనా సరే తమ స్థాయికి తగ్గట్లే మాట్లాడతారు కదా!మా జట్టు గొప్పగా ఆడుతోందిఆట గురించి ఎలాంటి విమర్శలు చేసినా తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా ఇలా చేయడం ముమ్మాటికీ తప్పే. మీరు ఏదైనామాట్లాడాలనుకుంటే ఆట గురించి మాట్లాడండి. మా జట్టు గొప్పగా ఆడుతోంది. మీ ఆటగాళ్ల పరిస్థితి ఎలా ఉందో చూసుకోండి. క్రికెట్ మీద మాత్రమే దృష్టి పెట్టి.. బాగా ఆడితే మిమ్మల్ని కూడా ఎవరో ఒకరు పొగుడుతారు. అంతేగానీ ఇతర జట్ల ఆటగాళ్ల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు’’ అంటూ అశోక్ అస్వాల్కర్ మొహ్మద్ యూసఫ్నకు గట్టిగానే చురకలు అంటించాడు.చదవండి: టీమిండియా ‘బిగ్ లూజర్’ అంటూ కామెంట్లు?.. పాక్ మీడియాపై పాంటింగ్ ఫైర్ -
ఇంగ్లండ్లో భారత్–పాక్ మ్యాచ్లు
లుసానే: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) హాకీ ప్రొ లీగ్ కొత్త సీజన్ ఈ డిసెంబర్లోనే మొదలవుతుంది. 2025–26కు సంబంధించిన ప్రొ లీగ్ డిసెంబర్ 9 నుంచి అర్జెంటీనా, ఐర్లాండ్లలో జరుగుతుందని హాకీ వర్గాలు తెలిపాయి. ఈ సీజన్లో ఐర్లాండ్ మహిళల జట్టు, పాకిస్తాన్ పురుషుల జట్టు కొత్తగా చేరుతున్నాయి. ఈ రెండు జట్లు నేషన్స్ కప్ హాకీ టోర్నమెంట్ నుంచి అర్హత సాధించినట్లు ఎఫ్ఐహెచ్ తెలిపింది. వచ్చే సీజన్ మొత్తం 10 దేశాల్లో జరుగనుంది. రికార్డుస్థాయిలో 144 మ్యాచ్లు నిర్వహించనున్నారు. భారత్లో ఫిబ్రవరి 10 నుంచి 15 వరకు జరుగుతాయి. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జూన్ 23 నుంచి 28 మధ్య ఇంగ్లండ్ వేదికగా రెండు మ్యాచ్లు జరుగుతాయి. ఈ లీగ్లో విజేతగా నిలిచిన జట్లు 2028 ఒలింపిక్స్కు అర్హత సాధిస్తాయి. డిసెంబర్ 9న జరిగే పురుషుల ఈవెంట్ తొలి మ్యాచ్లో జర్మనీతో బెల్జియం తలపడుతుంది. దీంతో పాటు ఇంగ్లండ్ ఆడే మ్యాచ్లు కూడా ఐర్లాండ్లోనే జరుగుతాయి. అదే రోజు అర్జెంటీనాలో జరిగే మ్యాచ్లో ప్రస్తుత చాంపియన్ నెదర్లాండ్స్తో పాకిస్తాన్ ఢీకొంటుంది. అనంతరం చైనా, స్పెయిన్, ఆ్రస్టేలియా, భారత్, ఇంగ్లండ్, నెదర్లాండ్స్, బెల్జియం, జర్మనీలలో జూన్ 28 వరకు లీగ్ దశ మ్యాచ్లే జరుగుతాయి. -
టీమిండియా ‘బిగ్ లూజర్’?.. పాక్ మీడియాపై పాంటింగ్ ఫైర్
టీమిండియా- పాకిస్తాన్ మధ్య ‘నో-షేక్హ్యాండ్ No- Shakehand)’ వివాదం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆసియా కప్-2025 టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా దాయాదులు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత జట్టు పాక్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది.అయితే, పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు భారత జట్టు నిరాకరించింది. షేక్హ్యాండ్ లేకుండానే డ్రెసింగ్ రూమ్కు వెళ్లిపోయింది. ఈ క్రమంలో తమను అవమానించారంటూ పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసేవరకు వెళ్లింది.మరోవైపు.. షేక్హ్యాండ్ చేయాలన్న నిబంధన లేదని.. తమ ఆటగాళ్లు చేసిన దాంట్లో తప్పేమీ లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో టీమిండియాను సమర్థిస్తూ భారత మాజీ క్రికెటర్లు వ్యాఖ్యలు చేయగా.. ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్ మాత్రం సూర్యకుమార్ సేనను విమర్శించినట్లు వార్తలు వైరల్ అయ్యాయి.టీమిండియా ‘బిగ్ లూజర్’?‘‘ఈ మ్యాచ్ ఎల్లకాలం గుర్తుండిపోతుంది. ఇండియా బిగ్ లూజర్గా మనకు గుర్తుంటుంది. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు వెళ్లిన పాకిస్తానీ జట్టు ప్రవర్తన జెంటిల్మేన్ గేమ్లో వాళ్లను అమరులుగా నిలిపితే.. భారత జట్టు మాత్రం పరాజితగా మిగిలిపోతుంది’’ అని పాంటింగ్ అన్నట్లుగా పాక్ మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.అసలు అలాంటి కామెంట్లు చేయనేలేదుఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్పై భారతీయ నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో పాంటింగ్ స్వయంగా ఈ విషయంపై స్పందించాడు. ‘‘సోషల్ మీడియాలో నా పేరు చెప్పి వైరల్ అవుతున్న వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి.నేను అసలు అలాంటి కామెంట్లు చేయనేలేదు. అసలు ఆసియా కప్ టోర్నమెంట్ గురించి నేను ఇంత వరకు బహిరంగంగా ఒక్క మాట కూడా మాట్లాడనే లేదు’’ అంటూ పాక్ నెటిజన్లకు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు. ‘ఎక్స్’ వేదికగా పాంటింగ్ ఈ మేరకు స్పష్టతనిచ్చాడు.ఐపీఎల్తో విడదీయరాని అనుబంధంకాగా ఆసీస్ దిగ్గజ కెప్టెన్గా పేరొందిన పాంటింగ్కు ఐపీఎల్తో విడదీయరాని అనుబంధం ఉంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు హెడ్కోచ్గా పనిచేసిన ఈ లెజెండరీ బ్యాటర్.. గతేడాది పంజాబ్ కింగ్స్కు మార్గనిర్దేశనం చేశాడు. అతడి గైడెన్స్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ ఫైనల్ చేరింది. అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. చదవండి: ఛీ.. మరీ సిగ్గు లేకుండా తయారయ్యారు.. ఇదేం పద్ధతి? -
‘అల్లుడు’ నీ పరుగులేం అక్కర్లేదు.. పాక్ ప్లేయర్పై అఫ్రిది ఫైర్
ఆసియాకప్-2025లో దుబాయ్ వేదికగా ఆదివారం భారత్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. అయితే ప్రస్తుతం అంతా పాక్ చెత్త ప్రదర్శన గురించి కాకుండా ఈ మ్యాచ్ అనంతరం చెలరేగిన హ్యాండ్ షేక్ వివాదం గురించే చర్చించుకుంటున్నారు.కానీ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మాత్రం తమ జట్టు చెత్త ఆటను మర్చిపోలేదు. తాజాగా ఓ టీవీ ఛానల్ డిబేట్లో పాల్గోన్న అఫ్రిది.. తన అల్లుడు షాహీన్ షా అఫ్రిదిని విమర్శించాడు. షాహీన్ షా అఫ్రిది బౌలింగ్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.అఫ్రిది బౌలింగ్ను భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఉతికారేశాడు. కానీ బ్యాటింగ్లో మాత్రం అఫ్రిది మెరుపులు మెరిపించాడు. కేవలం 16 బంతుల్లో 33 పరుగులు చేసి పాక్ స్కోర్ 100 పరుగుల మార్కు దాటడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే షాహీన్ బ్యాట్తో కాకుండా బంతితో రాణించి ఉంటే బాగుండేదని షాహిద్ అఫ్రిది అన్నాడు."షాహీన్ బ్యాటింగ్లో కొన్ని పరుగులు చేశాడు. అతడి ఆడిన ఇన్నింగ్స్ ఫలితంగానే మా జట్టు స్కోర్ 100 పరుగులు దాటింది. అందుకు అతడికి ధన్యవాదాలు. కానీ షాహీన్ నుంచి నేను ఆశించింది పరుగులు కాదు. అతడు నుంచి మంచి బౌలింగ్ కావాలి. అలాగే అయుబ్ నుంచి నేను బౌలింగ్ను కోరుకోను.అతడు పరుగులు చేయాలి. జట్టులో అతడి పాత్ర ఎంటో షాహీన్ ఆర్ధం చేసుకోవాలి. కొత్త బంతిని స్వింగ్ చేసి, వికెట్లు సాధించేందుకు మార్గాలను అన్వేషించాలి. అతను తన గేమ్ ప్లాన్పై దృష్టి సారించాలి" అని సామా టీవీ ఇంటర్వ్యూలో అఫ్రిది పేర్కొన్నాడు -
ఛీ.. మరీ సిగ్గు లేకుండా తయారయ్యారు.. ఇదేం పద్ధతి?
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ (Atul Wassan) తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. మరీ సిగ్గు లేకుండా తయారయ్యారంటూ ఘాటు విమర్శలు చేశాడు. అసలేం జరిగిందంటే.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత టీమిండియా- పాకిస్తాన్ ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నీలో భాగంగా తొలిసారి ముఖాముఖి తలపడిన విషయం తెలిసిందే.మరోసారి జయభేరిదుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో భారత జట్టు పాక్పై ఆధిపత్యం కొనసాగిస్తూ మరోసారి జయభేరి మోగించింది. సల్మాన్ ఆఘా బృందాన్ని ఏడు వికెట్ల తేడాతో సూర్యకుమార్ సేన చిత్తు చేసింది. ఇదిలా ఉంటే.. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా.. భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరచాలనానికి నిరాకరించారు.రచ్చకెక్కిన పాక్ బోర్డుటాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ సారథి సల్మాన్ ఆఘాను పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా భారత జట్టు ఇదే పంథా అనుసరించింది. పాక్ ప్లేయర్లు షేక్హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేసినట్లు కనిపించగా.. భారత ఆటగాళ్లు మాత్రం ఇందుకు విముఖత వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు రచ్చకెక్కింది. తమను అవమానించారని.. క్రీడాస్ఫూర్తికి ఇది విరుద్దమని గగ్గోలు పెడుతోంది. మ్యాచ్ రిఫరీపై వేటు వేయాలంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి.మరీ సిగ్గు లేకుండా తయారయ్యారుఈ విషయంపై భారత మాజీ పేసర్ అతుల్ వాసన్ ఘాటుగా స్పందించాడు. ‘‘ఛీ.. వాళ్లు మరీ సిగ్గు లేకుండా తయారయ్యారు. షేక్హ్యాండ్ ఇవ్వాలంటూ మనల్ని బలవంతపెట్టాలని చూస్తున్నారు. ఇదేం పద్ధతి?.. మీకు అవమానం జరిగిందని ప్రపంచం మొత్తానికి తెలిసింది.మీతో కరచాలనం చేసేందుకు మేము సిద్ధంగా లేమని స్పష్టంగా అర్థమైంది కదా!.. మరి ఇంకెందుకు కరచాలనం కావాలంటూ పట్టుబడుతున్నారు? ఈ విషయంపై ఫిర్యాదు చేయడం ద్వారా తమను తామే మరింతగా కించపరుచుకున్నట్లు అయింది. అందుకే మ్యాచ్ ఆడారుఇలా కంప్లైంట్ చేయడం ద్వారా తమకు పరిణతి లేదని వారే చెప్పినట్లుగా ఉంది. క్రీడా విధానానికి అనుగుణంగానే మనం ఆ మ్యాచ్ ఆడాము.అంతేగానీ.. వాళ్లు మన నుంచి ఇంతకంటే ఎక్కువగా ఆశించడం తప్పే అవుతుంది. ఎందుకంటే మీరంటే మాకు ఇష్టం లేదు’’ అంటూ అతుల్ వాసన్ వార్తా సంస్థ ANIతో తన మనసులోని భావాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు.చదవండి: Asia Cup Handshake Controversy: హ్యాండ్ షేక్ వివాదం.. పాకిస్తాన్కు ఐసీసీ షాక్? -
'షేక్ హ్యాండ్’ వివాదంలో బిగ్ ట్విస్ట్.. అతడి తప్పేమీ లేదు?
ఆసియా కప్లో భాగంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అనంతరం ‘నో-షేక్ హ్యాండ్’ వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యుడిగా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేయడంతో ఈ వివాదం మరింత రాజుకుంది.పాకిస్తాన్ జట్టు సభ్యులతో కరచాలనం చేయకూడదనే తమ నిర్ణయానికి భారత్ టాస్ నుంచి ఆట ముగిసే వరకు కట్టుబడి ఉంది. టాస్ సందర్భంగా ఆండీ పైక్రాప్ట్.. భారత సారధి సూర్యకుమార్ దగ్గరికి షేక్ హ్యాండ్ కోసం వెళ్లవద్దని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాతో చెప్పాడు.ఇక్కడ నుంచే ఈ వివాదం మొదలైంది. దీంతో మ్యాచ్ రిఫరీ క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించాడని వెంటనే అతడిని ఆసియాకప్ నుంచి తప్పించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది.అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పుడు వరకు ఇండియన్ టీమ్ మెనెజ్మెంట్ సూచన మేరకే పై క్రాప్ట్.. నో షేక్ హ్యాండ్ కోసం అఘాకు చెప్పాడని అంతా అనుకున్నారు. కానీ టైమ్స్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. పీసీబీ ఛీఫ్ మొహ్సిన్ నఖ్వీ హెడ్గా ఉన్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ సూచనల మేరకే పై క్రాప్ట్ నో షేక్ హ్యాండ్ గురించి సల్మాన్ అఘాకు తెలియజేశాడంట."హ్యాండ్ షేక్ వివాదంతో ఐసీసీకి సంబంధం ఏంటి? మ్యాచ్ అధికారులను నియమించడంతో ఐసీసీ పాత్ర ముగిస్తోంది. ఆ తర్వాత అంతా ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఏసీసీ నుంచి ఒకరు పైక్రాఫ్ట్తో మాట్లాడారు.దాని ఫలితమే టాస్ వద్ద మనం చూశాము. పైక్రాప్ట్తో ఎవరు మట్లాడారు..? దేని గురించి చర్చించారో తెలుసుకోవాల్సి బాధ్యత ఏసీసీ చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీపై ఉంది. అంతే తప్ప ఈ వివాదాన్ని మరింత తీవ్రం చేస్తూ ఐసీసీ వైపు వేలు చూపిస్తే ఫలితం ఉండదు అని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి.చదవండి: సూర్య గ్రేట్.. మా ఐన్స్టీన్ మాత్రం తొలుత బ్యాటింగ్ తీసుకున్నాడు: షోయబ్ అక్తర్ -
మా ఐన్స్టీన్ మాత్రం తొలుత బ్యాటింగ్ తీసుకున్నాడు: షోయబ్ అక్తర్
ఆసియాకప్-2025లో భాగంగా భారత్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. బౌలింగ్, బ్యాటింగ్లో దుమ్ములేపిన టీమిండియా దాయాది పాక్ను చావుదెబ్బ కొట్టింది. అయితే భారత్ చేతిలో ఓటమిని పాక్ మాజీ క్రికెటర్లు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.అంతేకాకుండా మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ప్లేయర్లతో కరచాలనం చేసేందుకు నిరాకరించారు. ఒకవైపు ఓటమి, మరోవైపు భారత్ చేసిన పనికి పాక్ మాజీ ఆటగాళ్లు ఘోర అవమానంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాపై ఆ జట్టు మాజీ స్పీడ్ స్టార్ షోయబ్ అక్తర్ విమర్శల వర్షం కురిపించాడు. సల్మాన్ తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడాన్ని అక్తర్ తప్పుబట్టాడు."టాస్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పిచ్ రిపోర్ట్ మొత్తం చెప్పాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో మంచు ప్రభావం ఉండే అవకాశముందని, పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని అతడు అంచనా వేశాడు. మా బ్యాటింగ్ లైనప్ చాలా డెప్త్గా ఉంది.మేం మొదట బౌలింగే చేయాలనుకున్నాం అని సూర్య స్పష్టంగా చెప్పాడు. కానీ మా ఐన్స్టీన్ (సల్మాన్ అలీ ఆఘా) మాత్రం పిచ్ గురించి ఏమీ తెలుసుకోకుండానే మేం మొదట బ్యాటింగ్ చేస్తాం అన్నాడు. అందుకు తగ్గ మూల్యం పాక్ చెల్లించుకుందని" అక్తర్ ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.అదేవిధంగా భారత్ ఆటగాళ్లు హ్యాండ్ షేక్ ఇవ్వడంపై కూడా అక్తర్ స్పందించాడు. "నాకు మాటలు రావడం లేదు. చాలా బాధగా ఉంది. గెలిచిన టీమిండియాకు శుభాకాంక్షలు. కానీ మీరు క్రికెట్ మ్యాచ్ను రాజకీయాల నుంచి వేరుగా ఉంచండి. మీ గురించి మేము ఎన్నో గొప్ప విషయాలు చెప్పాము. మేము ఈ నో షేక్ హ్యాండ్ చర్య గురించి మాట్లాడొచ్చు. ప్రతి ఇంట్లోనూ గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ వాటిని మరచిపోయి ముందుకు సాగిపోవాలి" అని అక్తర్ అన్నాడు.చదవండి: పాకిస్తాన్తో ఆడితే తప్పు కాదా? షేక్ హ్యాండ్ ఇస్తేనే తప్పా?: మనోజ్ తివారీ -
పాకిస్తాన్తో ఆడితే తప్పు కాదా? షేక్ హ్యాండ్ ఇస్తేనే తప్పా?: మనోజ్ తివారీ
ఆసియాకప్-2025లో పాకిస్తాన్ జట్టుతో సంప్రదాయ కరచాలనాన్ని టీమిండియా ఆటగాళ్లు తిరష్కరించిన సంగతి తెలిసిందే. ఈ ఖండాంతర టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధులు మధ్య పోరు జరిగింది. అయితే ఈ మ్యాచ్ టాస్ దగ్గర నుంచి ఆట ముగిసే వరకు భారత జట్టు పాకిస్తాన్ ఆటగాళ్లతో అంటిముట్టనట్టు ఉన్నారు.తొలుత టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించాడు. అనంతరం మ్యాచ్ ముగిశాక కూడా కరచాలనం చేసేందుకు భారత జట్టు ఇష్టపడలేదు. దీంతో భారత జట్టు తీసుకున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.కానీ భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ మాత్రం టీమిండియా మెనెజ్మెంట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. పాకిస్తాన్తో ఆడాలని నిర్ణయించుకున్నప్పుడు, షేక్ హ్యాండ్ ఇస్తే తప్పు ఏముందని తివారీ అన్నాడు. అయితే పాకిస్తాన్ మ్యాచ్తో భారత్ బహిష్కరించాలని తివారీ ముందే నుంచే తన వాదన వినిపిస్తూ వస్తున్నాడు."నేను భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్తో ఆసియాకప్ మొత్తాన్ని బాయ్కట్ చేస్తున్నాను. ఎందుకంటే క్రికెట్ అనేది కేవలం ఒక క్రీడ మాత్రమే. క్రీడలకు ఇచ్చిన విలువ జీవితాలకు ఇవ్వడం లేదు. ఇది నాకు నచ్చడం లేదు. మనం మానవ జీవితాలను క్రీడలతో పోల్చడం సరి కాదు" అని పాకిస్తాన్తో మ్యాచ్కు ముందు తివారీ స్టెట్మెంట్ ఇచ్చాడు.ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. "పాక్ ఆటగాళ్లతో హ్యాండ్ షేక్ను తిరష్కరించడం సరైన నిర్ణయం కాదు. మీరు పాకిస్తాన్తో ఆడాలని నిర్ణయించుకున్నప్పుడు.. హ్యాండ్ షేక్ చేస్తే తప్పు ఏముంది. పాక్తో మ్యాచ్ను బహిష్కరించి మీరు ఏది చెప్పినా ప్రజులు నమ్మేవారు.ఈ టోర్నీ ఆరంభానికి ముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో సూర్యకుమార్ యాదవ్.. పాకిస్తాన్ కెప్టెన్కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ వీడియోను నేను చూశాను. మరి అప్పుడు ఎలా కరచాలనం చేశారు. ఆ సమయంలో మీకు తప్పు అన్పించలేదా? అంటే ఇప్పుడు విమర్శకుల నుంచి తప్పించుకోవడం కోసం నో హ్యాండ్ షేక్ నిర్ణయం తీసుకున్నారా? ముందే వారి కెప్టెన్, చైర్మెన్కు హ్యాండ్ షేక్ ఇచ్చి ఇప్పుడు మ్యాచ్లో తిరష్కరించి ఏమి సాధించారో నాకు ఆర్ధం కావడం లేదు. విమర్శకుల నుంచి తామును తాము రక్షించుకోవడానికే ఈ విజయాన్ని పహల్గామ్ బాధితులకు, భారత సాయుధ దళాలకు అంకితం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు" అని ఇన్సైడ్ స్పోర్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తివారీ పేర్కొన్నాడు.చదవండి: Asia Cup Handshake Controversy: హ్యాండ్ షేక్ వివాదం.. పాకిస్తాన్కు ఐసీసీ షాక్? -
సూపర్-4కు అర్హత సాధించిన భారత్.. పాకిస్తాన్ మరి?
ఆసియాకప్ 2025లో గ్రూపు-ఎ నుంచి భారత క్రికెట్ జట్టు సూపర్-4కు అర్హత సాధించింది. ఈ మెగా టోర్నీ గ్రూపు-ఎలో భాగంగా సోమవారం అబుదాబి వేదికగా యూఏఈ, ఒమన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఒమన్ను 42 పరుగుల తేడాతో యూఏఈ చిత్తు చేసింది.దీంతో ఆడిన మూడు మ్యాచ్లలోనూ ఓటమి పాలైన ఒమన్ టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. ఇదే సమయంలో వరుసగా రెండు మ్యాచ్లలో గెలిచి టేబుల్ టాపర్గా కొనసాగుతున్న సూపర్ ఫోర్కు క్వాలిఫై అయిన తొలి జట్టుగా నిలిచింది.రెండో జట్టు ఏది?ఇక గ్రూపు-ఎ నుంచి సూపర్ ఫోర్ రౌండ్కు అర్హత సాధించేందుకు పాకిస్తాన్, యూఏఈ జట్లు పోటీపడుతున్నాయి. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో భారత్, పాకిస్తాన్, యూఏఈ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. సెప్టెంబర్ 17న దుబాయ్ వేదికగా యూఏఈ-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు భారత్తో పాటు సూపర్-4లో అడుగు పెడుతోంది. బుధవారం జరిగే మ్యాచ్లో యూఏఈను ఓడించడం పాక్కు అంత సులువు కాదు.ఈ టోర్నీకి ముందు జరిగిన ట్రైసిరీస్లో కూడా పాక్కు యూఏఈ గట్టి పోటీ ఇచ్చింది. ఇప్పుడు ఆసియాకప్లోనూ అదే పట్టుదలతో పాక్ను ఢీకొట్టేందుకు ఆతిథ్య యూఏఈ సిద్దమైంది. పాకిస్తాన్ ఎప్పుడూ ఎలా ఆడుతుందో ఎవరూ ఊహించలేరు. పాకిస్తాన్ జట్టు జింబాబ్వే వంటి పసికూన చేతిలో కూడా ఓడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ రెండు జట్లలో ఎవరూ సూపర్-4కు వస్తారన్నది ముందే అంచనా వేయడం కష్టమనే చెప్పాలి. మరోవైపు భారత ఆటగాళ్లు తమకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో పాకిస్తాన్ ఘోర అవమానంగా ఫీల్ అవుతోంది. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని పీసీబీ డిమాండ్ చేస్తోంది. ఐసీసీ చర్యలు తీసుకోపోతే యూఏఈతో మ్యాచ్ను బాయ్కాట్ చేస్తామని పాకిస్తాన్ క్రికెట్ బెదరిస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే యూఏఈ సూపర్-4కు ఆర్హత సాధిస్తోంది.చదవండి: Asia cup 2025: హ్యాండ్ షేక్ వివాదం.. పాకిస్తాన్కు ఐసీసీ షాక్? -
హ్యాండ్ షేక్ వివాదం.. పాకిస్తాన్కు ఐసీసీ షాక్?
ఆసియాకప్-2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత హ్యాండ్ షేక్ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాళ్లతో భారత ప్లేయర్లు కరచాలనం చేసేందుకు నిరాకరించారు. పెహల్గమ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ వంటి పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్తో మ్యాచ్ ఆడడటంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలోనే బీసీసీఐ సూచన మేరకు నో హ్యాండ్షేక్ విధానాన్ని భారత్ అనుసరించినట్లు తెలుస్తోంది. ఇందుకు నిరసనగా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్కు హాజరకాలేదు. అదేవిధంగా భారత ఆటగాళ్లు పరస్పర కరచాలనం తిరస్కరించడంపై పాకిస్తాన్ అగ్గిమీద గుగ్గిలమవుతోంది.ఈ ఘటనపై పీసీబీ ఐసీసీకి,ఏసీసీకి ఫిర్యాదు చేసింది. భారత్, పాక్ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్ను ఆసియాకప్ 2025 నుంచి వెంటనే తొలగించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసింది. 'నో హ్యాండ్షేక్' గురుంచి పైక్రాఫ్ట్కు ముందే తెలుసు అని పీసీబీ ఆరోపిస్తుంది. పైక్రాఫ్ట్ టాస్ సందర్బంగా ఈ విషయాన్ని తమ కెప్టెన్కు తెలియజేశాడని, కానీ మ్యాచ్ అనంతరం కూడా ఇదే విధానం కొనసాగుతుందని ఆయన చెప్పలేదని పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఉల్లంఘన జరిగింది. మ్యాచ్ రిఫరీపై చర్య తీసుకోవాలి పాక్ క్రికెట్ ఐసీసీని అభ్యర్దించింది. ఒకవేళ ఐసీసీ చర్యలు తీసుకోపోతే యూఏఈతో జరిగే తమ తదుపరి మ్యాచ్ను బహష్కిరిస్తామని పీసీబీ బెదరింపులకు దిగింది.పీసీబీకి షాక్..?అయితే ఆసియా కప్ మ్యాచ్ రిఫరీల ప్యానెల్ నుండి ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించాలని పీసీబీ చేసిన అభ్యర్థనను ఐసీసీ తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. క్రిక్బజ్ ప్రకారం.. పీసీబీ వాదనతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఏకీభవించకపోయినట్లు సమాచారం.ఈ ఘటనతో పైక్రాఫ్ట్కు సంబంధం లేదని పీసీబీకి ఐసీసీ తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా ఆటగాళ్లు తప్పనిసరిగా హ్యాండ్ షేక్ ఇవ్వాలని ఎంసీసీ మాన్యువల్లో లేదు అని ఐసీసీ ప్రతినిథులు పీసీబీ చీఫ్కు మెయిల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఐసీసీ అధికారికంగా స్పందించాల్సిన అవసరముంది.చదవండి: PKL 12: ఉత్కంఠపోరులో తెలుగు టైటాన్స్ ఓటమి.. -
Asia Cup 2025: ‘చేయి’ కలపలేదని...
దుబాయ్: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నిలో భారత్, పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఫలితం ఏకపక్షంగా ముగిసింది. చెత్తగా ఆడిన పాకిస్తాన్ తమ ఆటతీరును విశ్లేషించు కోవాల్సిందిపోయి ఇరు జట్ల ఆటగాళ్లు ‘షేక్ హ్యాండ్’ ఇచ్చుకోలేదనే అంశంపై వివాదాన్ని రాజేస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) దీనిపైనే దృష్టి పెట్టినట్లుంది. ఫిర్యాదులు, చర్యలు చేపట్టాలంటూ తెగ హడావుడి చేస్తోంది. కానీ కరచాలనం తిరస్కరణ కొత్తదేమీ కాదు. టెన్నిస్లో, ఫుట్బాల్లోనూ ఉద్రిక్తతలు, రాజకీయ వైరం కారణంగా ఆయా దేశాలకు చెందిన ప్లేయర్లు ఎన్నోసార్లు ‘షేక్ హ్యాండ్’ ఇచ్చుకోలేదు. దీనిపై టెన్నిస్ ఇంటిగ్రిటీ గానీ, ఫుట్బాల్ సమాఖ్య (ఫిపా) గానీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ పీసీబీ మాత్రం నానా యాగీ చేస్తోంది. మ్యాచ్ రిఫరీని తొలగించండి మ్యాచ్ ముగిసిన తర్వాత తమ జట్టు ఆటగాళ్లతో టీమిండియా క్రికెటర్లు పరస్పర కరచాలనం తిరస్కరించడంపై పీసీబీ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఆదివారం నాటి లీగ్ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన అండీ పైక్రాఫ్ట్ను తక్షణమే తొలగించాలని ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ)కి ఫిర్యాదు చేసింది. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జోక్యం చేసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. ఎందుకంటే ఏసీసీ చీఫ్గా పీసీబీ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ ఉంటే, ఐసీసీ చీఫ్గా భారత్కు చెందిన జై షా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై ఎవరెలా స్పందిస్తారోనన్నది, ఎలా ముగింపు పలుకుతారో అన్నది ఆసక్తికరంగా మారింది. ‘మ్యాచ్ రిఫరీపై ఐసీసీకి ఫిర్యాదు చేశాం. ఐసీసీ నియమావళి, ఎంసీసీ చట్టాలు, క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధంగా మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ వ్యవహరించారు. దీన్ని తీవ్రంగా పరిగణించి వెంటనే ఆయన్ని ఆసియా కప్ నుంచి తొలగించాలని పీసీబీ డిమాండ్ చేస్తోంది’ అని ఏసీసీ చీఫ్ కూడా అయిన నఖ్వీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. టాస్ వేసే సమయంలోనే భారత కెపె్టన్ సూర్యకుమార్తో షేక్హ్యాండ్ చేయొద్దని పాక్ కెపె్టన్ సల్మాన్ అగాతో రిఫరీ పైక్రాఫ్ట్ చెప్పారని పీసీబీ పేర్కొంది. టీమ్ షీట్ల మారి్పడి సజావుగా జరగలేదని పాకిస్తన్ జట్టు మేనేజర్ నవిద్ చిమా కూడా ఏసీసీకి ఫిర్యాదు చేశారు. షీమ్ షీట్లను ఇద్దరు కెపె్టన్లు మార్చుకోవడం సహజం. కానీ ఈ సారి టీమ్ షీట్లను కెపె్టన్ల నుంచి రిఫరీ తీసుకున్నారు. తెలుసా... ఆతిథ్య హక్కులు దక్కవు!పాక్తో క్రికెట్ మ్యాచ్లు ఆడొద్దు, ఇకపై జరగొద్దు అని భారత్లో చాలా మంది విమర్శలు చేస్తున్నారు. కానీ బహుళ జట్లు బరిలో ఉండే ఈవెంట్లలో తప్పుకుంటే ప్రతిష్టాత్మక మెగా ఈవెంట్ ఆతిథ్య హక్కులు పొందే అవకాశాలు రావు. ఎందుకంటే ప్రస్తుతం క్రికెట్ ఇప్పుడు ఒలింపిక్ చార్టర్లో భాగమైంది. లాస్ ఏంజెలిస్–2028 ఒలింపిక్స్లో నిర్వహణకు సిద్ధమైంది. ఇక భారత్ 2030 కామన్వెల్త్ క్రీడలు, 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం పోటీపడాలనుకుంటుంది. ఇలాంటి సమయంలో పాక్తో ఆడం, మ్యాచ్లను బహిష్కరిస్తామంటే ఆతిథ్య ఆశలు, అవకాశాలు అడుగంటుతాయి.గతంలో... టెన్నిస్లో...ఇప్పుడు ఆసియా కప్ క్రికెట్లో షేక్హ్యాండ్ ఇవ్వకపోవడం వివాదాస్పదం చేస్తున్నారు కానీ... ఇలా జరగడం క్రీడల్లో ఇదేమీ మొదటిసారి కాదు. 2023లో ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నిలో ఉక్రెయిన్కు చెందిన స్వితోలినా, బెలారస్ ప్లేయర్ విక్టోరియా అజరెంకా మ్యాచ్ అనంతరం షేక్హ్యాండ్ ఇచ్చుకోలేదు. వింబుల్డన్ నిర్వాహక కమిటీ స్వితోలినాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ అంశాన్ని అసలు పట్టించుకోనేలేదు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధంలో బెలారస్ అండగా నిలవడమే ఈ వైఖరికి కారణం కాగా... ఇప్పటికీ కూడా పలువురు ఉక్రెయిన్ ప్లేయర్లతో... బెలారస్, రష్యా ప్లేయర్లు కరచాలనం చేయడం లేదు. అమెరికా, ఇరాన్ దేశాల వైరం కారణంగా ఫుట్బాల్లో ఇరుజట్లు తలపడినపుడు కూడా ఆటగాళ్ల మధ్య షేక్హ్యాండ్స్ కనిపించవు. అదేమీ నిబంధన కాదు... రూల్ బుక్ చూస్కోండి పహల్గాంలో పాక్ ఉగ్రమూకల ఊచకోతకు గురైన కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు పాకిస్తానీ క్రికెటర్లతో పరస్పరం చేయి కలపకూడదని జట్టు మేనేజ్మెంట్ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఇది కోచ్ గంభీర్దో లేదంటే కెపె్టన్ సూర్యకుమార్ నిర్ణయం కానేకాదని జట్టు వర్గాలు స్పష్టం చేశాయి. దాయాది క్రికెటర్ల షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సమర్థించుకుంది. ‘ప్రత్యర్థి ఆటగాళ్లతో కరచాలనం ఇవ్వాలనే నిబంధనేది రూల్ బుక్లో లేదు. ఇది పూర్తిగా గుడ్విల్తో ముడిపడిన స్నేహపూర్వక అంశమే! అంతేకానీ చట్టం అయితే కాదు. కాబట్టి కచ్చితంగా షేక్హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు’ అని బోర్డు సీనియర్ అధికారి ఒకరు స్పష్టత ఇచ్చారు. -
హ్యాండ్ షేక్ వివాదంలో అనూహ్య పరిణామం
భారత్-పాక్ ఆటగాళ్ల హ్యాండ్ షేక్ వివాదంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విషయాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడని సొంత అధికారినే సస్పెండ్ చేసింది. జట్టు క్రికెట్ ఆపరేషన్ష్ డైరెక్టర్ ఉస్మాన్ వాహ్లాపై పీసీబీ సస్పెన్షన్ వేటు వేసింది. అధ్యక్షుడు నఖ్వీ బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించి వాహ్లాను ఫైర్ చేశాడని తెలుస్తుంది.ఈ విషయాన్ని హ్యాండిల్ చేసే విషయంలో వాహ్లా నుంచి ఎక్కువగా ఆశించాము. అయితే అతను నిరాశపరిచాడు. వాహ్లా కారణంగా భారత్ ముందు పాక్ పరువు పోయింది. టాస్కు ముందే మ్యాచ్ రిఫరీ కరచాలనం విషయాన్ని ప్రస్తావించినా, వాహ్లా పరిస్థితిని నియంత్రించడంలో విఫలమయ్యాడని నఖ్వీ అన్నట్లు సమాచారం.కాగా, ఆసియా కప్లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వని విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ఆటగాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. సూపర్-4 దశ మ్యాచ్లోనూ భారత ఆటగాళ్లు నో హ్యాండ్షేక్ పాలసీని కొనసాగించనున్నట్లు తెలుస్తుంది.ఈ విషయంపై పీసీబీ ఇప్పటికే నానా యాగీ చేస్తుంది. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అలాగే మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను ఆసియా కప్ విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. భారత ఆటగాళ్లు క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించారని, ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డారని వారికి తగని నీతులు చెబుతుంది.ఐసీసీ తమ డిమాండ్లను పరిష్కరించకపోతే యూఏఈతో తదుపరి జరుగబోయే మ్యాచ్ను బహిష్కరిస్తామని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఐసీసీ మాత్రం ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అన్నది ఆటగాళ్ల వ్యక్తిగతం అంశమని లైట్ తీసుకుంది. పీసీబీ మాత్రం భారత్ ముందు తమ పరువు పోయిందని ఐసీసీ ముందు గగ్గోలు పెడుతుంది. -
హ్యాండ్ షేక్ వివాదం.. భారత్కు ఫైన్ పడుతుందా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
ఆసియాకప్-2025 గ్రూపు-ఎలో భాగంగా ఆదివారం భారత్-పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో పాక్ను 7 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే హ్యాండ్షేక్ వివాదమే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసన తెలిపింది.టాస్ దగ్గర నుంచి మ్యాచ్ పూర్తి అయ్యేంతవరకు పాక్ ఆటగాళ్లను టీమిండియా కనీసం పట్టించుకోలేదు. గతంలో ఇరు జట్లు తలపడినప్పుడు ఆటగాళ్లు ఒకరొకరు పలకరించుకునేవారు. కానీ ఈసారి కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. మైదానంలోకి వచ్చామా, గెలిచి వెళ్లామా అన్నట్లు భారత జట్టు తమ వైఖరిని కనబరిచింది.తొలుత టాస్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘాతో కరచాలనం చేసేందుకు నిరాకరించాడు. కనీసం అతడి ముఖం కూడా చూడకుండా సూర్య డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిపోయాడు. ఇదంతా ముందుస్తు ప్రణాళికలో భాగంగానే జరిగింది.ఆ తర్వాత మ్యాచ్ ముగిశాక కూడా పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు భారత జట్టు నిరాకరించింది. అంతేకాకుండా పాక్ ప్లేయర్లు టీమిండియా డ్రెసింగ్రూమ్ వైపు వెళ్లగా.. సహాయక సిబ్బంది తలుపు మూసేసినట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ టీమ్ అసహననానికి లోనైంది. ఫలితంగా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సెర్మనీని సల్మాన్ ఆఘా బహిష్కరించాడు. ఆ తర్వాత విలేకరుల సమావేశంలో పాల్గోన్న పాక్ హెడ్ కోచ్ మైక్ హసన్ భారత ఆటగాళ్లు తమ పట్ల వ్యవహరించిన తీరు బాధ కలిగించందని చెప్పుకొచ్చాడు.ఈ హ్యాండ్ షేక్ వివాదంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సైతం స్పందించింది. "భారత ఆటగాళ్లు కరచాలనం చేయకపోవడం పట్ల జట్టు మేనేజర్ నవీద్ చీమా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది క్రీడా స్పూర్తికి విరుద్దం. నిరసనలో భాగంగా తమ కెప్టెన్ను పోస్టు మ్యాచ్ సెర్మనీకి పంపలేదని" పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ హ్యాండ్ షేక్ వివాదంపై ఏసీసీకి, ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు పీసీబీ సిద్దమైనట్లు సమాచారం. అంతేకాకుండా ఐసీసీ చర్యలు తీసుకుపోతే యూఏఈతో తమ తదుపరి మ్యాచ్ను బహిష్కరిస్తామని పీసీబీ బెదిరిస్తోంది.ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టుపై ఐసీసీ చర్యలు తీసుకుంటుందా? అసలు రూల్స్ ఏమి చెబుతున్నాయి? అన్న విషయాలను ఓసారి తెలుసుకుందాం. ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయి?ఆసియాకప్ను ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహిస్తున్నప్పటికి.. ఈ టోర్నీపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్కు పూర్తి అధికారం ఉంటుంది. ఈ టోర్నీలో పాల్గోనే జట్లు, ఆటగాళ్లకు ఐసీసీ ప్రవర్తనా నియమావళి వర్తిస్తుంది. ఐసీసీ ఎల్లప్పుడూ క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహిస్తుంది.ఆటగాళ్లు తమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఐసీసీ కచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. కానీ మ్యాచ్ ముగిశాక ఇరు జట్ల ఆటగాళ్లు తప్పనిసరిగా షేక్ హ్యాండ్ ఇవ్వాలనే నిబంధన ఐసీసీ రూల్స్ బుక్లో ఎక్కడా లేదు. షేక్ హ్యాండ్ అనేది క్రీడా స్ఫూర్తికి చిహ్నంగా మాత్రమే పరిగణిస్తారు. అదేమి ఖచ్చితమైన రూల్ కాదు. కరచాలనం చేయాలా వద్దా అన్నది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఐసీసీ రూల్ బుక్ ముందు మాటలో ఆటగాళ్లు.. సహచరులను, మ్యాచ్ అధికారులను, అంపైర్లను గౌరవించడం గురుంచి ఉంటుంది. అంతే తప్ప షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం నేరమని ఐసీసీ తమ రూల్స్లో ఎక్కడా ప్రస్తావించలేదు.ఒకవేళ ఆటగాళ్లతో దురుసగా ప్రవర్తించి కరచాలనం చేయకపోతే దాన్ని ఐసీసీ నేరంగా పరిగణిస్తోంది. కానీ ఈ సందర్భంలో టీమిండియా ఆటగాళ్లు ప్రత్యర్థులను ఏ మాత్రం రెచ్చ గొట్టేలా ప్రవర్తించలేదు. దీంతో భారత జట్టుకు ఐసీసీ ఎటువంటి జరిమానా విధించే అవకాశం లేదు.బీసీసీఐ స్పందన ఇదే..ఈ విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. "మీకు ఏదైనా సందేహం ఉంటే ఒక్కసారి రూల్ బుక్ను చదవండి. అందులో ఎక్కడ కూడా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు కరచాలనం ఇవ్వాలని ప్రత్యేకంగా ఏమీలేదు. అది కేవలం మర్యాదపూర్వకమైన సంజ్ఞ మాత్రమే. షేక్ హ్యాండ్స్ ఇవ్వాలా లేదా అన్నది వారి సొంత నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప ప్రత్యేకంగా చట్టం ఏమీ లేదు. కాబట్టి ఇండియన్ క్రికెట్ టీమ్ ప్రత్యర్థి జట్టుతో కరచాలనం చేయకపోయిన అదేమి పెద్ద నేరం కాదు" అని సదరు అధికారి పీటీఐతో పేర్కొన్నారు. -
ఐసీసీకి పాక్ బెదిరింపులు.. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోకపోతే..!
ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 14) జరిగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ వివాదాస్పదంగా మారింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు పాక్ జాతీయ గీతానికి బదులు 'జిలేబీ బేబీ' పాట ప్లే చేశారు. ఇది ఓ రకమైన గందరగోళాన్ని సృష్టించింది.టాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాక్ సారధి సల్మాన్ అఘాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత్ ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు.మ్యాచ్ అనంతరం కూడా భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు హ్యాండ్షేక్ ఇవ్వకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిపోయారు. భారత ఆటగాళ్లు తమ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ నిరాకరించడాన్ని పాక్ క్రికెట్ బోర్డు చాలా సీరియస్గా తీసుకుంది.ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లి భారత ఆటగాళ్లపై, మ్యాచ్ రిఫరి ఆండీ పైక్రాఫ్ట్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. భారత ఆటగాళ్లు క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించారని, వారికి పైక్రాఫ్ట్ వంత పాడాడని ఆరోపిస్తుంది.యూఏఈతో తదుపరి మ్యాచ్ సమయానికి (సెప్టెంబర్ 17) తమ డిమాండ్లకు పరిష్కారం చూపకపోతే ఆ మ్యాచ్ను బహిష్కరిస్తామని ఐసీసీకి ధమ్కీ ఇచ్చింది. పీసీబీ బహిష్కరణ బెదిరింపుతో షేక్ హ్యాండ్ ఉదంతం తీవ్ర రూపం దాల్చినట్లైంది.భారత ఆటగాళ్లు క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించడమే కాకుండా ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనకు కూడా పాల్పడిందని పీసీబీ గగ్గోలు పెడుతుంది. తాజాగా యూఏఈతో మ్యాచ్ రద్దు చేసుకుంటామని కొత్త పాట మొదలుపెట్టింది.మొత్తంగా ఈ వివాదం ఎలాంటి ఉద్రిక్తతలకు దారి తీస్తుందోనని క్రీడాభిమానులు భయపడుతున్నారు. కాగా, నిన్నటి మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ను 7 వికెట్ల తేడాతో చిత్తు ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో పాక్ తొలుత బ్యాటింగ్ చేసి 127 పరుగులకే పరిమితం కాగా.. భారత్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. -
'అలా ఎక్కడా రాసి లేదు'.. షేక్హ్యాండ్పై పాక్కు బీసీసీఐ స్ట్రాంగ్ కౌంటర్
ఆసియాకప్-2025లో ఆదివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో టీమిండియా విజయభేరి మ్రోగించింది. అయితే ఈ మ్యాచ్ టాస్ సందర్భంగా గానీ, ఆట ముగిశాక కానీ భారత జట్టు ఆటగాళ్లు పాకిస్తాన్ ప్లేయర్లతో కరచాలనం చేసేందుకు ఇష్టపడలేదు. ఎటువంటి కరచాలనాలు, పలకరింపులు లేకుండా తమ పని తాము చేసుకుని మైదానం వీడారు.పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా ఇండియన్ టీమ్ మెనెజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ సూపర్-4లో మరోసారి పాక్తో తలపడితే సూర్య అండ్ కో ఇదే పద్దతిని కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. బీసీసీఐ నుంచి అనుమతి లభించిన తర్వాతే పాక్ ఆటగాళ్లతో హ్యాండ్ షేక్చేయకూడదనే నిర్ణయాన్ని టీమిండియా తీసుకుందంట. అయితే భారత ఆటగాళ్లు తమతో కరచాలనం చేయకపోవడంపై పాకిస్తాన్ టీమ్ అసహనం వ్యక్తం చేసింది. ఇది క్రీడా స్పూర్తికి విరుద్దమని, భారత జట్టు తీరుపై ఆసియా క్రికెట్ కౌన్సిల్కు ఫిర్యాదు చేసేందుకు పాకిస్తాన్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్కు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు గట్టి కౌంటరిచ్చారు. పాక్ ఫిర్యాదు చేసిన అది చెల్లదు అని ఆయన తెలిపారు."మీకు ఏదైనా సందేహం ఉంటే ఒక్కసారి రూల్ బుక్ను చదవండి. అందులో ఎక్కడ కూడా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు కరచాలనం ఇవ్వాలని ప్రత్యేకంగా ఏమీలేదు. అది కేవలం మర్యాదపూర్వకమైన సంజ్ఞ మాత్రమే. షేక్ హ్యాండ్స్ ఇవ్వాలా లేదా అన్నది వారి సొంత నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప ప్రత్యేకంగా చట్టం ఏమీ లేదు. కాబట్టి ఇండియన్ క్రికెట్ టీమ్ ప్రత్యర్థి జట్టుతో కరచాలనం చేయకపోయిన అదేమి పెద్ద నేరం కాదు" అని సదరు అధికారి పీటీఐతో పేర్కొన్నారు.చదవండి: Asia Cup 2025: ఇది కదా సక్సెస్ అంటే.. గురువు రికార్డునే బద్దలు కొట్టిన అభిషేక్ -
ముదురుతున్న IND-PAK 'షేక్ హ్యాండ్' వివాదం
ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 14) జరిగిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కొత్త వివాదానికి దారి తీసింది. మ్యాచ్ పూర్తయ్యాక భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లకు హ్యాండ్షేక్ ఇవ్వకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లిపోయారు. దీన్ని అవమానంగా భావించిన పాక్ క్రికెట్ బోర్డు భారత ఆటగాళ్లపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. భారత ప్లేయర్లు క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొంది.తాజాగా పీసీబీ నిన్నటి మ్యాచ్కు రిఫరిగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్పై (జింబాబ్వే) కూడా ఐసీసీకి కంప్లైంట్ చేసింది. పైక్రాఫ్ట్ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. దీనిపై పీసీబీ చైర్మన్ మొహిసిన్ నఖ్వీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ “ICC కోడ్ ఆఫ్ కండక్ట్, MCC Spirit of Cricket నిబంధనలను పైక్రాఫ్ట్ ఉల్లంఘించారు. వెంటనే ఆయన్ని తొలగించాలి” అని పేర్కొన్నారు.పైక్రాఫ్ట్కు ఏం సంబంధం..?నిన్నటి భారత్-పాక్ మ్యాచ్కు రిఫరిగా వ్యవహరించిన పైక్రాఫ్ట్ భారత ఆటగాళ్లు క్రీడా స్పూర్తికి విరుద్దంగా (షేక్ హ్యాండ్ ఇవ్వకుండా) ప్రవర్తించడాన్ని లైట్గా తీసుకున్నాడని పీసీబీ ఆరోపిస్తుంది. పైక్రాఫ్ట్ భారత ఆటగాళ్ల ప్రవర్తనపై చర్య తీసుకోలేదని అంటుంది. టాస్ సమయంలో పైక్రాఫ్ట్ ఇరు కెప్టెన్లను హ్యాండ్షేక్ ఇచ్చుకోవద్దని చెప్పినట్టు ఆరోపిస్తుంది. పాక్ టీమ్ మేనేజర్ నవీద్ చీమా పైక్రాఫ్ట్పై మాటల డోసును పెంచాడు. ఉర్దూ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పైక్రాఫ్ట్ ప్రవర్తనను “అస్పోర్ట్స్మన్షిప్”గా అభివర్ణించాడు.మొత్తంగా చూస్తే షేక్ హ్యాండ్ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తుంది. భారత్-పాక్ ఇదే టోర్నీలో మరోసారి (సూపర్-4) తలపడాల్సి ఉంది. సెప్టెంబర్ 21న జరిగే ఆ మ్యాచ్లో కూడా భారత ఆటగాళ్లు నో షేక్ హ్యాండ్ పాలసీని కొనసాగిస్తారని తెలుస్తుంది. ఈ వివాదం రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసేలా ఉంది.ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ను 7 వికెట్ల తేడాతో చిత్తు ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో పాక్ తొలుత బ్యాటింగ్ చేసి 127 పరుగులకే పరిమితం కాగా.. భారత్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇది కదా సక్సెస్ అంటే.. గురువు రికార్డునే బద్దలు కొట్టిన అభిషేక్
ఆసియాకప్-2025లో దుబాయ్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 128 పరుగుల లక్ష్య చేధనలో పాక్ బౌలర్లను అభిషేక్ ఉతికారేశాడు. ఈ పంజాబ్ ఆటగాడు ఇన్నింగ్స్ తొలి బంతి నుంచే బౌండరీలు బాదడం మొదలు పెట్టాడు. అభిషేక్ కేవలం 13 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్స్లతో 31 పరుగులు చేశాడు. ఈ యువ సంచలనం తన ఇన్నింగ్స్ను 238.46 స్ట్రైక్ రేట్తో ముగించాడు. ఈ మ్యాచ్లో అద్బుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన అభిషేక్.. తన మెంటార్ యువరాజ్ సింగ్ రికార్డును బ్రేక్ చేశాడు.పాకిస్తాన్పై టీ20ల్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన భారత బ్యాటర్గా అభిషేక్ రికార్డులెక్కాడు. యువరాజ్ సింగ్ 2012లో పాక్పై 200.00 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి 36 బంతుల్లో 72 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్లో 238.46 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన అభిషేక్.. యువీని అధిగమించాడు. కాగా అభిషేక్ శర్మ కెరీర్ ఎదుగుదలలో యువరాజ్ది కీలక పాత్ర. అతడి గైడెన్స్లోనే అభిషేక్ ఇంతలా రాటు దేలాడు. ఈ పంజాబీ బ్యాటర్కు యువీ దగ్గరుండి మరి మెళకువలు నేర్పాడు. ఇప్పుడు అభిషేక్ టీ20ల్లో ఏకంగా వరల్డ్ నెం1 బ్యాటర్గా కొనసాగుతున్నాడు. కాగా ఈ మ్యాచ్లో పాక్ను 7 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
పాక్తో టీమిండియా మ్యాచ్.. సురేశ్ రైనా సంచలన వ్యాఖ్యలు!
టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ (IND vs PAK)ను ఉద్ధేశించి టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాక్తో మ్యాచ్ ఆడటం భారత ఆటగాళ్లకు ఇష్టం లేదని అన్నాడు. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కుదుర్చుకున్న ఒప్పందం కారణంగానే వారంతా బరిలోకి దిగాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని వేదికలపై పాక్తో మ్యాచ్లు బహిష్కరించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే, ఆసియా క్రికెట్ మండలి (ACC), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిర్వహించే బహుళ దేశాలు పాల్గొనే టోర్నీల్లో మాత్రం పాక్తో ఆడేందుకు కేంద్ర ప్రభుత్వం టీమిండియాకు అనుమతినిచ్చింది.షేక్హ్యాండ్ నిరాకరణఈ నేపథ్యంలో ఆసియా టీ20 కప్-2025లో భాగంగా దుబాయ్ వేదికగా పాక్తో మ్యాచ్ ఆడిన భారత్.. ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా దాయాదిపై మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. అంతేకాదు.. పాక్ ఆటగాళ్లకు షేక్హ్యాండ్ నిరాకరించడం ద్వారా తమ నిరసనను బహిరంగంగానే తెలియజేసింది.ఎవరికీ ఇష్టం లేదు.. కానీ బీసీసీఐ వల్లే..అయితే, అసలు పాకిస్తాన్తో మ్యాచ్ ఆడాల్సిన అవసరమే లేదు కదా అంటూ కొందరు మాత్రం టీమిండియాను విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో సురేశ్ రైనా స్పందిస్తూ.. ‘‘ఆటగాళ్లను వ్యక్తిగతంగా కలిసి.. ‘ఆసియా కప్లో పాక్తో ఆడటం ఇష్టమేనా అడిగితే కచ్చితంగా లేదు’ అనే చెప్తారు.కానీ బీసీసీఐ ముందుగా ఇందుకు అంగీకరించిన కారణంగా బలవంతంగానైనా వారు ఆడాల్సి వచ్చింది. సూర్యకుమార్ యాదవ్ సేన పాక్తో మ్యాచ్ ఆడేందుకు వ్యక్తిగతంగా విముఖంగా ఉన్నారని నేను నమ్ముతున్నా. భారత జట్టులోని ఏ ఒక్క ఆటగాడికి కూడా పాక్తో మ్యాచ్ ఆడటం ఇష్టం లేదని కచ్చితంగా చెప్పగలను’’ అని రైనా స్పోర్ట్స్తక్తో పేర్కొన్నాడు.పాక్తో మ్యాచ్ బహి ష్కరించిన ఇండియాకాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత వరల్డ్ చాంపియన్షిన్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్)లో పాక్ చాంపియన్స్తో మ్యాచ్ ఆడాల్సి ఉండగా ఇండియా చాంపియన్స్ ఇందుకు తిరస్కరించింది. ఇంగ్లండ్ వేదికగా జరిగే ఈ టీ20 లీగ్లో పాక్తో మ్యాచ్ను లీగ్ దశలోనే బహిష్కరించింది. కానీ ఆ తర్వాత సెమీస్లో కూడా పాక్తో తలపడాల్సి రాగా.. అప్పుడు కూడా నిరాకరించి టోర్నీ నుంచే నిష్క్రమించింది. కాగా యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా చాంపియన్స్ జట్టులో శిఖర్ ధావన్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ వంటి ప్లేయర్లు ఉన్నారు.చదవండి: IND vs PAK: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ -
చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్.. పాక్ ఆటగాడి రికార్డు బ్రేక్
ఆసియాకప్-2025లో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్లో బంతితో మ్యాజిక్ చేసిన కుల్దీప్.. ఇప్పుడు రెండో మ్యాచ్లో పాకిస్తాన్పై కూడా అదే తీరును కనబరిచాడు.ఆదివారం దుబాయ్ వేదికగా పాక్తో జరిగిన మ్యాచ్లో కుల్దీప్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతడి స్పిన్ బౌలింగ్ను ఎదుర్కొవడానికి పాక్ బ్యాటర్లు ముప్పు తిప్పలు పడ్డారు. ఈ ఎడమ చేతి వాటం స్పిన్నర్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 18 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఓ అరుదైన ఫీట్ను కుల్దీప్ తన పేరిట లిఖించుకున్నాడు.భారత్-పాకిస్తాన్ మధ్య టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసిన స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ రికార్డులెక్కాడు. ఇంతకుముందు వరకు ఈ ఘనత పాక్ స్పిన్నర్ మొహమ్మద్ నవాజ్ పేరిట ఉండేది. ఆసియాకప్-2022లో భారత్పై నవాజ్ 33 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు. తాజా మ్యాచ్లో కేవలం 18 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన కుల్దీప్.. నవాజ్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్ను 7 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. ప్రత్యర్ధి నిర్ధేశించిన 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.5 ఓవర్లలో చేధించింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలవగా..భిషేక్ శర్మ (13 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు.పాక్ బౌలర్లలో అయూబ్ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులకే పరిమితమైంది.చదవండి: ఏడ్చేసిన షోయబ్ అక్తర్..! కాస్తైనా బుద్ధి లేదంటూ ఫ్యాన్స్ ఫైర్ -
ఏడ్చేసిన షోయబ్ అక్తర్..! కాస్తైనా బుద్ధి లేదంటూ ఫ్యాన్స్ ఫైర్
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు టీమిండియా (IND vs PAK) గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ముఖాముఖి తలపడిన తొలి పోరులో దాయాదికి చుక్కలు చూపించింది. దుబాయ్ వేదికగా ఆసియా కప్-2025 (Asia Cup)లో సమిష్టి ప్రదర్శనతో రాణించి.. పాక్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది.ఊహించని దెబ్బఅయితే, ఆట పరంగానే కాకుండా.. నైతికంగానూ భారత జట్టు పాకిస్తాన్ను ఊహించని దెబ్బ కొట్టింది. మైదానంలో పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. అంతేకాదు.. షేక్హ్యాండ్ కోసం మరోసారి ప్రయత్నం చేసినా డ్రెసింగ్రూమ్ తలుపులు మూసివేసినట్లు సమాచారం.మంచిగానే బుద్ధి చెప్పారుఈ విషయంపై స్పందించిన టీమిండియా అభిమానులు.. ‘‘ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశానికి మంచిగానే బుద్ధి చెప్పారు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా భారత ఆటగాళ్లను సమర్థిస్తున్నారు. అయితే, పాకిస్తాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మాత్రం నో- షేక్హ్యాండ్ చర్యను జీర్ణించుకోలేకపోయాడు.‘‘నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. నా మనసు ముక్కలైంది. హ్యాట్సాఫ్ ఇండియా. కానీ మీరు క్రికెట్ మ్యాచ్ను రాజకీయాల నుంచి వేరుగా ఉంచండి. మీ గురించి మేము ఎన్నో గొప్ప విషయాలు చెప్పాము.అక్తర్ కంటతడిఅలాంటి మాకు ఈ నో-షేక్హ్యాండ్ చర్య గురించి కూడా ఏదైనా మాట్లాడే హక్కు ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ వాటినే గుర్తుపెట్టుకుని ఇలా చేయకూడదు. మరచిపోయి ముందుకు సాగిపోవాలి.ఇది క్రికెట్. చేతులు కలపండి. కాస్త దయ చూపండి’’ అంటూ అక్తర్ కంటతడి పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ నెటిజన్లు అక్తర్కు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇస్తున్నారు.షేక్హ్యాండ్ ఇవ్వనందుకే ఇంత బాధగా ఉంటే..‘‘అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకల గురించి మర్చిపోవాలా?.. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా?.. షేక్హ్యాండ్ ఇవ్వనందుకే మీరు ఇంతగా బాధపడిపోతున్నారు.. తమ వారిని శాశ్వతంగా పోగొట్టుకున్న బాధితుల మనసులో ఎలాంటి అలజడి చెలరేగుతుందో మీరు కనీసం ఊహించగలరా?మ్యాచ్ గెలవడమే కాదు.. ఇలా వారికి సరైన బుద్ధి చెప్పినందుకు టీమిండియాకు హ్యాట్సాఫ్. దెబ్బ అదుర్స్’’ అంటూ అక్తర్ తీరును ఏకిపారేస్తూ.. సూర్యకుమార్ సేనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా ఇటీవల కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు.ఇందుకు బదులుగా భారత ఆర్మీ ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసి ధ్వంసం చేసింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పాకిస్తాన్ సైన్యం.. ఎదురుదాడికి ప్రయత్నించగా.. భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆసియా కప్ టోర్నీలో టీమిండియా- పాక్ ముఖాముఖి తలపడటం గమనార్హం.చదవండి: IND vs PAK: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మShoaib Akhtar crying over the handshake saga 😂 Same guy was chilling with Asim Munir & Afridi months back. Well done Surya – strike as deep as Nur Khan Air Base! 🔥🇮🇳 #INDvsPAK #IndianCricket #IndiaVsPakistan #aisacup2025 #indvspak2025 https://t.co/6O4XkugN8U pic.twitter.com/t9V8pCk0U8— Gaurav (@k_gauravs) September 15, 2025CAKEWALK 👏#TeamIndia cruise past Pakistan, chasing 127 inside 16 overs 🤩 Watch #DPWorldAsiaCup2025, from Sept 9-28 on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/EncO07RSlD— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 -
IND vs PAK: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma)సరికొత్త చరిత్ర లిఖించాడు. పాకిస్తాన్పై టీ20 ఫార్మాట్లో.. పవర్ ప్లేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును అభిషేక్ శర్మ బద్దలు కొట్టాడు.ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్-2025 టోర్నమెంట్లో దుబాయ్ వేదికగా భారత్- పాక్ ఆదివారం మ్యాచ్ ఆడాయి. టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది.తొలి బంతికే బౌండరీ బాదిఈ క్రమంలో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభం అందించాడు. తొలి బంతికే బౌండరీ బాది.. పాక్ కీలక పేసర్ షాహిన్ ఆఫ్రిది (Shaheen Afridi)కి స్వాగతం పలికిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. రెండో బంతిని ఏకంగా సిక్సర్గా మలిచాడు.ధనాధన్ దంచికొట్టిఆ తర్వాత కూడా ధనాధన్ దంచికొట్టిన అభిషేక్ శర్మ మొత్తంగా.. 13 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 31 పరుగులు సాధించాడు. సయీమ్ ఆయుబ్ బౌలింగ్లో ఇచ్చిన క్యాచ్ను ఫాహిమ్ అష్రాఫ్ అందుకోవడంతో అభిషేక్ సునామీ ఇన్నింగ్స్ (3.4 ఓవర్లో)కు తెరపడింది. కాగా పాకిస్తాన్ జట్టు మీద పవర్ ప్లేలో భారత బ్యాటర్లలో ఎవరికైనా ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు (31) కావడం విశేషం. ఇదిలా ఉంటే.. అభిషేక్ (31)తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (47 నాటౌట్), తిలక్ వర్మ (31), శివం దూబే (7 బంతుల్లో 10 నాటౌట్) రాణించారు. ఫలితంగా 15.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసిన టీమిండియా.. పాక్పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.పాకిస్తాన్పై టీ20 ఫార్మాట్లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు రాబట్టిన భారత క్రికెటర్లు🏏అభిషేక్ శర్మ- 31 పరుగులు- 2025లో దుబాయ్ వేదికగా..🏏విరాట్ కోహ్లి- 29 పరుగులు- 2022లో దుబాయ్ వేదికగా🏏రోహిత్ శర్మ- 28 పరుగులు- 2022లో దుబాయ్ వేదికగా🏏కేఎల్ రాహుల్- 28 పరుగులు- 2022లో దుబాయ్ వేదికగా.చదవండి: పాక్ జట్టుకు ఘోర అవమానం!?.. అలాంటివాళ్లకు గంభీర్ కరెక్ట్! -
‘అక్కడికి వెళ్లినా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.. అందుకే మా కెప్టెన్ ఇలా’
టీమిండియా చేతిలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు (IND vs PAK)కు మరోసారి పరాభవమే ఎదురైంది. ఆసియా కప్ టీ20 టోర్నీ-2025లో భాగంగా భారత్ చేతిలో సల్మాన్ ఆఘా బృందం ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరుదేశాలు ముఖాముఖి తలపడటం ఇదే మొదటిసారి.ఈ నేపథ్యంలో తీవ్రమైన భావోద్వేగాల వ్యక్తీకరణల నడుమ భారత్- పాక్ మైదానంలో దిగాయి. ‘బాయ్కాట్’ ట్రెండ్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryalumar Yadav) ముందుగానే జాగ్రత్తపడ్డాడు. టాస్ సమయంలో పాక్ సారథి సల్మాన్ ఆఘా (Salman Agha)కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనానికి భారత ఆటగాళ్లు నిరాకరించారు. ఈ క్రమంలో పాక్ ప్లేయర్లు టీమిండియా డ్రెసింగ్రూమ్ వైపు వెళ్లగా.. సహాయక సిబ్బంది తలుపు మూసేసినట్లు తెలుస్తోంది.అక్కడికి వెళ్లినా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు..ఈ క్రమంలో అవమానభారంతో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్కు కూడా రాలేదు. ఈ విషయంపై పాక్ కోచ్ మైక్ హసన్ వివరణ ఇచ్చాడు. ‘‘ఏదో ఫ్లోలో అలా జరిగిపోయి ఉంటుందని అనుకున్నాం. వారితో కరచాలనం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ మా ప్రత్యర్థి జట్టు చేసిన పని మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది.ఆ తర్వాత కూడా షేక్హ్యాండ్ ఇవ్వడానికి వెళ్లాము. కానీ వాళ్లు అప్పటికే చేంజింగ్ రూమ్కి వెళ్లిపోయారు. నిజంగానే మేము కరచాలనానికి సిద్ధంగా ఉన్నా ఇలా జరగడం బాధ కలిగించింది’’ అని మైక్ హసన్ మీడియాతో పేర్కొన్నాడు.ఆడుతూ.. పాడుతూ.. అలవోకగా..కాగా దుబాయ్ వేదికగా భారత- పాక్ ఆదివారం తలపడ్డాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (40), పేసర్ షాహిన్ ఆఫ్రిది (33) రాణించడంతో.. నిర్ణీత 20 ఓవర్ల ఆటలో తొమ్మిది వికెట్ల నష్టానికి 127 పరుగులు చేయగలిగింది.భారత బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లతో చెలరేగగా.. అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలకు చెరో ఒక వికెట్ దక్కింది.ఇక లక్ష్య ఛేదనను టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. 15.4 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 131 పరుగులు చేసింది. ఫలితంగా దాయాదిపై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. పాక్ స్పెషలిస్టు బౌలర్లంతా విఫలం కాగా.. పార్ట్టైమ్ స్పిన్నర్ సయీమ్ ఆయుబ్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.చదవండి: పాక్ జట్టుకు ఘోర అవమానం!?.. అలాంటివాళ్లకు గంభీర్ కరెక్ట్! Trick after trick, Pakistan fell for Kuldeep's magic show 🪄Watch the #DPWorldAsiaCup2025, from Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/F5lOWqPrvK— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 -
ఒకటి.. రెండు.. మూడు.. అయ్యో పాపం! తిలక్ నవ్వులు.. వీడియో
ఆసియా కప్-2025 టోర్నీలో టీమిండియాతో మ్యాచ్లో పాకిస్తాన్ (Ind Vs Pak) ఆది నుంచే తడబడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్ల ధాటికి తాళలేక నామమాత్రపు స్కోరు కూడా చేయలేకపోయింది.అభిషేక్ శర్మ ధనాధన్ఏదేమైనా బ్యాటింగ్లో కాస్త ఫర్వాలేదనిపించినా.. బౌలింగ్లో మాత్రం పాక్ తేలిపోయింది. దాయాది విధించిన లక్ష్యాన్ని పటిష్ట టీమిండియా 15.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత ఓపెనర్లలో అభిషేక్ శర్మ (13 బంతుల్లో 31) మరోసారి విధ్వంసం సృష్టించగా.. శుబ్మన్ గిల్ (10) మాత్రం ఈసారి విఫలమయ్యాడు.రాణించిన తిలక్, సూర్యఅయితే, వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 47 నాటౌట్)తో కలిసి.. నాలుగో నంబర్ బ్యాటర్ తిలక్ వర్మ (31 బంతుల్లో 31) మెరుగ్గా రాణించాడు. అయితే, పన్నెండో ఓవర్లో తిలక్ 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నపుడు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.మూడుసార్లు ప్రయత్నించినా ఇందుకు పాక్ స్పిన్నర్ మహ్మద్ నవాజ్ పొరపాటే కారణం. తన బౌలింగ్లో తిలక్ ఇచ్చిన స్ట్రెయిట్ క్యాచ్ను పట్టడంలో నవాజ్ దారుణంగా విఫలమయ్యాడు. మూడుసార్లు ప్రయత్నించినా బంతిని ఒడిసిపట్టలేకపోయాడు. దీంతో తిలక్ వర్మ.. ‘మనం సేఫ్’ అన్నట్లుగా చిరునవ్వులు చిందించగా.. మహ్మద్ నవాజ్ మాత్రం నేలపై పంచ్లు కొడుతూ తనను తాను తిట్టుకున్నాడు.ఇంతలో మరో ఎండ్లో ఉన్న సూర్య వేగంగా స్పందించి.. రనౌట్ ప్రమాదం జరగకుండా చూసుకున్నాడు. అంతేకాదు.. జాగ్రత్తగా ఉండమంటూ తిలక్కు సైగ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఒకటి.. రెండు.. మూడు.. అయ్యో పాపం!‘‘ఒకటి.. రెండు.. మూడు.. అయ్యో పాపం!.. ప్రపంచంలోని బెస్ట్ స్పిన్నర్ ఇంత చెత్తగా ఫీల్డింగ్ చేస్తాడా?’’ అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్తాన్ హెడ్కోచ్ మైక్ హసన్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్ మహ్మద్ నవాజ్ మా జట్టులో ఉన్నాడు’’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు ఇలా కౌంటర్లు ఇస్తున్నారు.ఇదిలా ఉంటే.. సూర్యకుమార్తో కలిసి శివం దూబే (7 బంతుల్లో 10) ఆఖరి వరకు అజేయంగా నిలిచి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. ఇక ఆసియా కప్ టోర్నీలో భారత్కు ఇది వరుసగా రెండో విజయం. తొలుత యూఏఈని ఓడించిన టీమిండియా.. తాజాగా పాక్పై గెలిచి సూపర్-4కు లైన్ క్లియర్ చేసుకుంది.చదవండి: ఈ విజయం వారికి అంకితం.. నేను ఎల్లప్పుడూ ఆ బౌలర్లకు అభిమానినే: సూర్య Looked simple… until the ball turned lava 🤭Watch #INDvPAK LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/wVztsgkJv3— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 -
పాక్ జట్టుకు ఘోర అవమానం!?.. అలాంటివాళ్లకు గంభీర్ కరెక్ట్!
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో టీమిండియా వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి మ్యాచ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను ఓడించిన సూర్య సేన.. ఆదివారం నాటి రెండో మ్యాచ్లో దాయాది పాకిస్తాన్ను చిత్తు చేసింది. దుబాయ్ వేదికగా ఏడు వికెట్ల తేడాతో సల్మాన్ ఆఘా బృందాన్ని ఓడించి.. చిరకాల ప్రత్యర్థిపై తమదే పైచేయి అని మరోసారి నిరూపించింది.కాగా పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ఆర్మీ ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట ఉగ్రమూకలకు గట్టిగా బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత కూడా క్రీడల్లోనూ పాక్తో ఎలాంటి సంబంధాలు ఉండకూడదనే డిమాండ్లు వచ్చాయి. అయితే, బహుళ దేశాలు ఆడుతున్న ఆసియా కప్ టోర్నీలో మాత్రం దాయాదితో ఆడేందుకు కేంద్ర అనుమతినివ్వగా.. ఆదివారం మ్యాచ్ జరిగింది.నో షేక్హ్యాండ్!స్థాయికి తగ్గట్లుగానే టీమిండియా మరోసారి రాణించి పాక్పై ఘన విజయం సాధించింది. అయితే, సాధారణంగా టాస్ వేసినపుడు, ఆట ముగిసిన తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోవడం ఆనవాయితీ. అయితే, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత ఆటగాళ్లు కనీసం ఒక్క చిరునవ్వు గానీ.. షేక్హ్యాండ్ గానీ లేకుండానే వెనుదిరిగారు.ముఖం మీదే తలుపు వేశారు!ఆ తర్వాత పాక్ ఆటగాళ్లు ఇండియన్ డ్రెసింగ్ రూమ్ వైపునకు రాగా.. సిబ్బంది వారి ముఖం మీదే తలుపు వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘షేక్హ్యాండ్’ ఇవ్వకపోవడంపై భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు.క్రీడాస్ఫూర్తికి మించినవి కూడా ఉంటాయి‘‘ముందుగానే ఈ విషయం గురించి నిర్ణయం తీసుకున్నాము. ఇక్కడికి కేవలం మ్యాచ్ ఆడేందుకు మాత్రమే మేము వచ్చాము. వారికి సరైన విధంగా బదులిచ్చాము. కొన్ని విషయాలు క్రీడాస్ఫూర్తికి మించినవి ఉంటాయి. ఈ విజయం ఆపరేషన్ సిందూర్లో ధైర్యసాహసాలు చూపిన భారత ఆర్మీకి అంకితం. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు మేము ఎల్లవేళలా మద్దతుగా ఉంటాము’’ అని సూర్య చెప్పాడు.అలాంటివాళ్లకు గంభీర్ కరెక్ట్!కాగా టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ నిర్ణయానుగుణంగానే భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో షేక్ హ్యాండ్కు నిరాకరించినట్లు ‘టెలికామ్ ఆసియా స్పోర్ట్’ పేర్కొంది. అంతేకాదు మైదానంలోనూ వారితో ఒక్క మాట కూడా మాట్లాడవద్దని గౌతీ ముందుగానే హెచ్చరించినట్లు తెలిపింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ నేపథ్యంలో.. ‘‘పాకిస్తాన్కు సరైన విధంగా బుద్ధిచెప్పారు. ఉగ్రమూకలను ప్రోత్సహించే దేశానికి చెందిన ఆటగాళ్లకు ఇలాంటి సన్మానాలు తప్పవు. ఇలాంటి వారికి గంభీరే కరెక్ట్’’ అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ఆసియా కప్-2025 టీ20 టోర్నీ: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్👉పాక్ స్కోరు: 127/9 (20)👉టీమిండియా స్కోరు: 131/3 (15.5)👉ఫలితం: పాక్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.చదవండి: Asia Cup 2025: అభిషేక్ విధ్వంసం.. షాహిన్ అఫ్రిదికి ఫ్యూజ్లు ఔట్! వీడియో CAKEWALK 👏#TeamIndia cruise past Pakistan, chasing 127 inside 16 overs 🤩 Watch #DPWorldAsiaCup2025, from Sept 9-28 on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/EncO07RSlD— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 -
ఈ విజయం వారికి అంకితం.. నేను ఎల్లప్పుడూ ఆ బౌలర్లకు అభిమానినే: సూర్య
పాకిస్తాన్ జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించింది. ఆసియా కప్-2025 టోర్నమెంట్లో భాగంగా ఆదివారం పాక్ (IND vs PAK)తో తలపడిన భారత్.. ఏడు వికెట్ల తేడాతో దాయాదిని చిత్తు చేసింది. తద్వారా సూపర్-4 దశకు మార్గాన్ని సుగమం చేసుకుంది.ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శనపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సంతృప్తి వ్యక్తం చేశాడు. అదే విధంగా.. చిరకాల ప్రత్యర్థి పాక్పై సాధించిన ఈ విజయాన్ని భారత సైన్యానికి అంకితం చేశాడు. అంతేకాదు.. తన పుట్టినరోజున టీమిండియా అభిమానులకు ఇలాంటి కానుక ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నాడు.పాక్పై టీమిండియా గెలుపు అనంతరం సూర్య మాట్లాడుతూ.. ‘‘స్టేడియంలోని ప్రేక్షకులు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం సంతోషకరం. టీమిండియాకు నా తరఫున ఇదొక రిటర్న్ గిఫ్ట్ లాంటిది. ముందు నుంచి గెలుపుపై ఆత్మవిశ్వాసంగానే ఉన్నాము.స్పిన్నర్లకు నేను ఎల్లప్పుడూ అభిమానినేఅన్ని మ్యాచ్లలాగే ఇదీ ఒకటి అని ముందుగానే అన్నింటికీ సిద్ధమయ్యాము. ఈ టోర్నీలో పాల్గొంటున్న అన్ని జట్లను ఎలా ఎదుర్కోవాలో ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. కొన్ని నెలల క్రితమే ఇక్కడ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచాము. ఇక్కడి పిచ్లపై స్పిన్నర్ల అవసరం ఎలాంటిదో నాకు తెలుసు. మధ్య ఓవర్లలో మ్యాచ్ను మలుపు తిప్పగల స్పిన్నర్లకు నేను ఎల్లప్పుడూ అభిమానినే’’ అని తెలిపాడు. భారత సైన్యానికి ఈ విజయం అంకితంఅదే విధంగా.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు మేము ఎల్లవేళలా అండగా ఉంటామని ఈ సందర్భంగా మరోసారి చెబుతున్నాను. ఉగ్రమూకలను ఏరివేయడంలో ధైర్యసాహసాలు చూపిన భారత సైన్యానికి ఈ విజయం అంకితం చేస్తున్నాము.వారు ఎల్లప్పుడూ ఇలాగే మనల్ని గర్వపడేలా చేస్తూ.. ఆదర్శంగా నిలుస్తూ ఉంటారని కోరుకుంటున్నా. వారి ముఖాలపై చిరునవ్వులు తీసుకువచ్చేందుకు మైదానంలో మాకు వచ్చిన ఏ అవకాశాన్ని మేము వదులుకోము’’ అంటూ సూర్యకుమార్ యాదవ్ ఉద్వేగానికి లోనయ్యాడు.భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ స్కోర్లు👉వేదిక: దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, దుబాయ్👉టాస్: పాకిస్తాన్.. తొలుత బ్యాటింగ్👉పాక్ స్కోరు: 127/9 (20)👉భారత్ స్కోరు: 131/3 (15.5)👉ఫలితం: పాక్పై ఏడు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కుల్దీప్ యాదవ్ (4 ఓవర్ల కోటాలో 18 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు).చదవండి: Asia Cup 2025: అభిషేక్ విధ్వంసం.. షాహిన్ అఫ్రిదికి ఫ్యూజ్లు ఔట్! వీడియోThis victory is for you, India 🇮🇳 Watch #DPWorldAsiaCup2025, Sept 9-28, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/KXXzoF9fIR— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 -
‘షేక్ హ్యాండ్’ లేదు!
సాధారణంగా టాస్ వేసిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు చేతులు కలపడం ఆనవాయితీ. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కానీ, ఒక చిరునవ్వు కానీ వివాదానికి, అనవసరపు చర్చకు దారి తీసే అవకాశం ఉంది. అందుకే కావచ్చు అటు సూర్యకుమార్ యాదవ్ గానీ ఇటు సల్మాన్ ఆగా కానీ అందుకు సాహసించలేదు. ‘షేక్ హ్యాండ్’ ఇవ్వకుండా, కనీసం ఒకరివైపు మరొకరు చూడకుండా ఇద్దరూ చెరో వైపునకు వెళ్లిపోయారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోకుండా వెళ్లిపోయారు. టోర్నీ ఆరంభానికి ముందు జరిగిన కెప్టెన్ల సమావేశంలో ఏసీసీ అధ్యక్షుడు, పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీకి సూర్యకుమార్ షేక్ హ్యాండ్ ఇవ్వడం మన అభిమానులకు అసంతృప్తిని కలిగించింది. ఆ ఒక్క విజువల్ను మళ్లీ మళ్లీ చూపిస్తూ సోషల్ మీడియాలో అంతా సూర్యను, బీసీసీఐని ఆడుకున్నారు. దాంతో ఈసారి అతను కూడా జాగ్రత్త పడ్డాడు! -
అభిషేక్, సూర్య మెరుపులు.. పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్
ఆసియాకప్-2025లో టీమిండియా జోరు కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన తమ రెండో మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను భారత్ చిత్తు చేసింది. పాక్ విధించిన 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.5ఓవర్లలో చేధించింది.ఈ స్వల్ప లక్ష్య చేధనలో అభిషేక్ శర్మ(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 31), తిలక్ శర్మ(31) మెరుపు ఇన్నింగ్స్లు ఆడగా.. సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్తో 47), శివమ్ దూబే(10) ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశారు. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్ ఒక్కడే మూడు వికెట్లు సాధించాడు. మిగతా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.కుల్దీప్ మ్యాజిక్..అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ భారత బౌలర్ల దాటికి విలవిల్లాడింది. పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 127 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో సాహిబ్జాదా ఫర్హాన్(40) టాప్ స్కోరర్గా నిలవగా.. షాహిన్ అఫ్రిది(16 బంతుల్లో 4 సిక్స్లతో 33) ఆఖరిలో మెరుపులు మెరిపించాడు.భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. స్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో భారత్ సూపర్-4కు ఆర్హత సాధించింది. ఇక తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో సెప్టెంబర్ 19న ఒమన్తో తలపడనుంది.#PKMKBForever#INDvsPAK pic.twitter.com/wSdhqOsx8R— Sarcastic Ujel (@Sarcasticujel) September 14, 2025 -
అభిషేక్ విధ్వంసం.. షాహిన్ అఫ్రిదికి ఫ్యూజ్లు ఔట్! వీడియో
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఆసియాకప్-2025లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్తాన్పై అభిషేక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 128 పరుగుల లక్ష్య చేధనలో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించాడు.ముఖ్యంగా పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిదిని ఈ పంజాబ్ ఆటగాడు ఉతికారేశాడు. భారత ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన అఫ్రిది బౌలింగ్లో అభిషేక్ తొలి బంతినే బౌండరీకి మలిచాడు. ఆ తర్వాత రెండో బంతికి లాంగాఫ్ మీదగా అభిషేక్ కొట్టిన సిక్స్ మ్యాచ్ మొత్తానికి హైలెట్గా నిలిచింది. మళ్లీ మూడో ఓవర్ వేసిన అఫ్రిది బౌలింగ్లో అభిషేక్ ఓ ఫోర్, భారీ సిక్సర్ బాదాడు. దీంతో షాహీన్ తెల్లముఖం వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. అభిషేక్ శర్మ కేవలం 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 31 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతకుముందు యూఏఈతో మ్యాచ్లో అభిషేక్ కూడా 30 పరుగులు చేశాడు.భారత్ ఘన విజయం..ఇక ఈ మ్యాచ్లో పాక్పై 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 15.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా చేధించింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్సర్తో 47 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలవగా.. అభిషేక్ శర్మ(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 31), తిలక్ శర్మ(31) రాణించారు.6️⃣ & 4️⃣ last time, 4️⃣ & 6️⃣ this time 🥵🥶Stay put & watch #INDvPAK as Abhishek takes off - #DPWORLDASIACUP2025. LIVE on #SonyLIV & #SonySportsNetwork TV Channels 📺#AsiaCup pic.twitter.com/guAssBLFJC— Sony LIV (@SonyLIV) September 14, 2025 -
Asia Cup 2025: నిన్ను ఎవరు భయ్యా కెప్టెన్ చేశారు?
ఆసియాకప్-2025లో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ఈ మెగా టోర్నీలో వరుసగా రెండో మ్యాచ్లోనూ సల్మాన్ అలీ విఫలమయ్యాడు. ఒమన్తో జరిగిన తొలి మ్యాచ్లో గోల్డెన్ డకౌటైన సల్మాన్.. ఇప్పుడు దుబాయ్ వేదికగా భారత్తో మ్యాచ్లో కూడా పేలవ ప్రదర్శన కనబరిచాడు.కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ తొలి బంతి నుంచే భారత స్పిన్నర్లను ఎదుర్కొవడానికి తీవ్రంగా శ్రమించాడు. ఆఖరికి 12 బంతులు ఆడి కేవలం 3 పరుగులు చేసిన సల్మాన్.. అక్షర్ పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు. అతడి వికెట్ పాక్ మరింత ఒత్తిడిలో కూరుకుపోయింది.దీంతో కెప్టెన్గా దారుణ ప్రదర్శన కనబరుస్తున్న అలీ అఘాను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. నిన్ను ఎవరు భయ్యా కెప్టెన్ చేశారు? అంటూ ఓ యూజర్ ఎక్స్లో పోస్ట్ చేశాడు. మహ్మద్ రిజ్వాన్ నుంచి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన సల్మాన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. కెప్టెన్గా ఒకట్రెండు సిరీస్లు గెలిపించినప్పటికి ఆటగాడిగా మాత్రం విఫలమవుతున్నాడు. దీంతో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని పాక్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.SALMAN ALI AGHA IN T20Is4(2) – 0(1) – 1(9) – 13(19) – 32(32)5 innings, 50 runs, 10 avg, 79 SR. pic.twitter.com/6rgh4P6ZlA— junaiz (@dhillow_) March 4, 2025ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులకే పరిమితమైంది. పాక్ బ్యాటర్లలో సాహిబ్జాదా ఫర్హాన్(40) టాప్ స్కోరర్గా నిలవగా.. షాహిన్ అఫ్రిది(16 బంతుల్లో 4 సిక్స్లతో 33) ఆఖరిలో మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ తీశారు. -
కోహ్లి రికార్డు బ్రేక్ చేసిన హార్దిక్ పాండ్యా
ఆసియా కప్-2025 (Asia Cup)లో భాగంగా టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా పాకిస్తాన్కు ఆదిలోనే షాకిచ్చాడు. భారత బౌలింగ్ అటాక్ను ఆరంభించిన ఈ పేస్ ఆల్రౌండర్ తొలి బంతిని వైడ్గా సంధించాడు. అయితే, ఆ తర్వాత వెంటనే వికెట్ తీసి టీమిండియాకు శుభారంభం అందించాడు.హార్దిక్ వేసిన అవుట్స్వింగర్ను తప్పుగా అంచనా వేసిన పాక్ ఓపెనర్ సయీమ్ ఆయుబ్.. బంతిని గాల్లోకి లేపగా జస్ప్రీత్ బుమ్రా క్యాచ్ పట్టాడు. దీంతో ఆయుబ్ డకౌట్ అయ్యాడు. ఫలితంగా పాక్ తొలి వికెట్ కోల్పోగా.. హార్దిక్ ఖాతాలో తొలి వికెట్ చేరింది.పాండ్యా సూపర్ క్యాచ్ఇక ఆ మరుసటి ఓవర్లో హార్దిక్ పాండ్యా మంచి క్యాచ్ అందుకున్నాడు. బుమ్రా బౌలింగ్లో వన్డౌన్ బ్యాటర్ మహ్మద్ హ్యారిస్ (3) ఇచ్చిన క్యాచ్ను పాండ్యా కష్టపడి పట్టాడు. బ్యాట్ టాప్ ఎడ్జ్ను తాకిన బంతి గాల్లోకి లేవగా లాంగ్ లెగ్లో నుంచి పరిగెత్తుకుని వచ్చి మరీ అందుకున్నాడు. ఫలితంగా పాక్ రెండో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా.. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లిని అధిగమించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న రెండో భారత ఫీల్డర్గా నిలిచాడు. రోహిత్ శర్మ 65 క్యాచ్లతో అగ్రస్థానంలో ఉండగా.. హార్దిక్ పాండ్యా.. మహ్మద్ హ్యారిస్ క్యాచ్తో కలిపి 55 క్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. దుబాయ్ వేదికగా ఆసియా కప్-2025 టోర్నమెంట్లో భారత్- పాక్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పది ఓవర్ల ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది.అంతర్జాతీయ టీ20లలో అత్యధిక క్యాచ్లు అందుకున్న భారత ఫీల్డర్లురోహిత్ శర్మ- 65హార్దిక్ పాండ్యా- 55*విరాట్ కోహ్లి- 54సూర్యకుమార్ యాదవ్- 51*సురేశ్ రైనా- 42. చదవండి: టీమిండియా కెప్టెన్గా తిలక్ వర్మ.. బీసీసీఐ ప్రకటన𝗕𝗢𝗢𝗠! 💥India are tearing through. Pakistan lose their 2nd wicket 🔥Watch #INDvPAK LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/xqJXwEHqnf— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 -
బుమ్రా బౌలింగ్లో 6 సిక్స్లు కొడతాడన్నారు.. కట్ చేస్తే! తొలి బంతికే ఔట్
ఆసియాకప్-2025లో పాకిస్తాన్ యువ ఓపెనర్ సైమ్ అయూబ్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఒమన్తో జరిగిన తొలి మ్యాచ్లో గోల్డెన్ డకౌటైన అయూబ్.. ఇప్పుడు దుబాయ్ వేదికగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో అదే తీరును కనబరిచాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అయూబ్ తను ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. పాక్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన పాండ్యా.. మొదటి బంతిని ఆఫ్ స్టంప్ దిశగా బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని అయూబ్ ఆఫ్ సైడ్ పాయింట్ దిశగా షాట్ ఆడేందుకు ప్రయత్నిచాడు.అయూబ్ షాట్ అద్బుతంగా కనక్ట్ చేసినప్పటికి బంతి మాత్రం నేరుగా బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న జస్ప్రీత్ బుమ్రా చేతికి వెళ్లింది. దీంతో ఒక్కసారిగా అయూబ్ తెల్లముఖం చేశాడు. చేసేదేమిలేక నిరాశతో పెవిలియన్కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.అయితే భారత్ మ్యాచ్కు ముందు అయూబ్ను ఉద్దేశించి పాక్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ ఇచ్చిన స్టెట్మెంట్ ఇప్పుడు భారత అభిమానులు ప్రస్తావిస్తున్నారు. బుమ్రా బౌలింగ్లో అయూబ్ ఆరు సిక్స్లు కొడతాడని అహ్మద్ బిల్డప్ ఇచ్చాడు.దీంతో అహ్మద్, అయూబ్ను కలిసి నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. "భారత్పై కనీసం ఒక్క పరుగు చేయలేకపోయావు, నీవా బుమ్రా బౌలింగ్లో 6 సిక్స్లు కొడతావని" ఓ యూజర్ ఎక్స్లో పోస్ట్ చేశాడు.6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో తొలి వికెట్గా అయూబ్ వెనుదిరగగా.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో మహ్మద్ హరిస్(3) ఔటయ్యాడు. అయితే వీరిద్దరి ఔటయ్యాక ఫఖార్ జమాన్(16), సాహిబ్జాదా ఫర్హాన్(19) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 6 ఓవర్లు ముగిసే సారికి పాక్ రెండు వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది.Aapka Mother of all Rivalries mein 𝘏𝘈𝘙𝘋𝘐𝘒 swaagat 😉 Watch #INDvPAK LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/AEQE0TLQju— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025చదవండి: IND vs PAK: టాస్ గెలిచినా అదే చేసేవాళ్లం: సూర్య!.. తుదిజట్లు ఇవే Saim Ayub is gone! #Pakistan lose their first wicket. 🏏#PAKvIND #INDvsPAK pic.twitter.com/9p3V2jakgd— Maham Awan (@awanmaham_) September 14, 2025 -
IND vs PAK: టాస్ గెలిచినా అదే చేసేవాళ్లం: సూర్య!.. తుదిజట్లు ఇవే
భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్కు నగారా మోగింది. టీమిండియాతో మ్యాచ్లో పాక్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసియా కప్-2025 టోర్నమెంట్లో భాగంగా గ్రూప్-‘ఎ’లో ఉన్న దాయాదుల మధ్య ఆదివారం నాటి పోరుకు దుబాయ్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.ఈసారి టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఈ ఖండాంతర టోర్నీలో టీమిండియా, పాక్లతో పాటు యూఏఈ, ఒమన్ గ్రూప్-‘ఎ’లో ఉన్నాయి. ఇప్పటికే భారత జట్టు యూఏఈపై ఘన విజయం సాధించగా.. పాకిస్తాన్ ఒమన్పై గెలుపొందింది. ఈ క్రమంలో చిరకాల ప్రత్యర్థులు ఈ టోర్నీలో తమ రెండో మ్యాచ్లో పరస్పరం తలపడుతున్నాయి.మేము గొప్పగా ఆడుతున్నాముఇక భారత్తో మ్యాచ్లో టాస్ గెలిచిన నేపథ్యంలో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. ‘‘మేము తొలుత బ్యాటింగ్ చేస్తాము. గత కొన్ని రోజులుగా మేము గొప్పగా ఆడుతున్నాము. ఈ మ్యాచ్ కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నాం.ఇది కాస్త స్లో వికెట్లా కనిపిస్తోంది. అందుకే తొలుత బ్యాటింగ్ చేసి మెరుగైన స్కోరు సాధించాలని పట్టుదలగా ఉన్నాము. గత ఇరవై రోజులుగా మేము ఇక్కడ ఆడుతున్నాం కాబట్టి పిచ్ పరిస్థితులపై మాకు పూర్తి అవగాహన ఉంది’’ అని పేర్కొన్నాడు.కాగా ఆసియా కప్ టోర్నీ సన్నాహకాల్లో భాగంగా పాక్.. యూఏఈ- అఫ్గనిస్తాన్తో టీ20 ట్రై సిరీస్ ఆడింది. ఈ ముక్కోణపు సిరీస్ను పాక్ కైవసం చేసుకుంది. మరోవైపు.. టీమిండియాకు కూడా దుబాయ్ పిచ్లు కొత్తేం కాదు.తొలుత బౌలింగ్ చేయాలనే భావించాంఇక టాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘మేము తొలుత బౌలింగ్ చేయాలనే భావించాం. వికెట్ చాలా బాగుంది. పాతబడే కొద్ది బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. తేమగా ఉంది. కాబట్టి డ్యూ ఉంటుందని ఆశిస్తున్నాం. ఈ మ్యాచ్లో... యూఏఈతో ఆడిన తుదిజట్టునే ఆడిస్తున్నాం’’ అని తెలిపాడు.ఆసియా కప్-2025 భారత్ వర్సెస్ పాకిస్తాన్ తుదిజట్లుటీమిండియాఅభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిపాకిస్తాన్సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, మహ్మద్ హారీస్(వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా(కెప్టెన్), హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్.చదవండి: టీమిండియా కెప్టెన్గా తిలక్ వర్మ.. బీసీసీఐ ప్రకటన Coin falls in favour of Pakistan and they choose to bat first 🏏Watch #INDvPAK LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/IU98kUSWda— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 -
Asia Cup 2025: పాకిస్తాన్పై భారత్ ఘన విజయం
India vs Pakistan Match live updates: దుబాయ్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. పాక్ నిర్ధేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 15.5 ఓవర్లలో చేధించింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్సర్తో 47 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలవగా.. అభిషేక్ శర్మ(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 31), తిలక్ శర్మ(31) రాణించారు. పాక్ బౌలర్లలో అయూబ్ ఒక్కడే మూడు వికెట్లు సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులకే పరిమితమైంది.తిలక్ ఔట్..తిలక్ వర్మ రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన తిలక్ వర్మ.. సైమ్ అయూబ్ బౌలింగ్లో ఔటయ్యాడు. భారత విజయానికి ఇంకా 31 పరుగులు కావాలి. క్రీజులో సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే ఉన్నారు.నిలకడగా ఆడుతున్న సూర్య, తిలక్..8 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ వర్మ(19), సూర్యకుమార్ (9) ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 57 పరుగులు కావాలి.రెండో వికెట్ కోల్పోయిన భారత్..అభిషేక్ శర్మ రూపంలో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. అభిషేక్ కేవలం 13 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్స్లతో 31 పరుగులు చేసి ఔటయ్యాడు. 4 ఓవర్లకు భారత్ స్కోర్: 42/1. క్రీజులో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు.భారత్ తొలి వికెట్ డౌన్.. గిల్ ఔట్128 పరుగుల లక్ష్య చేధనలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన శుబ్మన్ గిల్.. సైమ్ అయూబ్ బౌలింగ్లో స్టంపౌట్గా వెనుదిరిగాడు. 2 ఓవర్లకు భారత్ స్కోర్: 22/1. అభిషేక్ శర్మ (5 బంతుల్లో 12) దూకుడుగా ఆడుతున్నాడు.టీమిండియా టార్గెట్@128దుబాయ్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత బౌలర్లు చెలరేగారు. టీమిండియా బౌలర్ల దాటికి పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులకే పరిమితమైంది. పాక్ బ్యాటర్లలో సాహిబ్జాదా ఫర్హాన్(40) టాప్ స్కోరర్గా నిలవగా.. షాహిన్ అఫ్రిది(16 బంతుల్లో 4 సిక్స్లతో 33) ఆఖరిలో మెరుపులు మెరిపించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ తీశారు.తొమ్మిదో వికెట్ డౌన్..పాకిస్తాన్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన సోఫియన్ ముఖియమ్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.పాక్ ఎనిమిదో వికెట్ డౌన్..పాకిస్తాన్కు ఆలౌట్కు చేరువైంది. ఫహీం అష్రఫ్(11) రూపంలో పాక్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అష్రప్ ఔటయ్యాడు. 18 ఓవర్లకు పాక్ స్కోర్: 99/8. క్రీజులో షాహీన్ అఫ్రిది(15), ముఖియమ్(1) ఉన్నారు.పాక్ ఏడో వికెట్ డౌన్..సాహిబ్జాదా ఫర్హాన్ రూపంలో పాకిస్తాన్ ఏడో వికెట్ కోల్పోయింది. 40 పరుగులు చేసిన ఫర్హాన్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు.కుల్దీప్కు ఇది మూడో వికెట్. 16.1 ఓవర్లకు పాక్ స్కోర్: 83/712.5: ఆరో వికెట్ కోల్పోయిన పాక్కుల్దీప్ యాదవ్ మహ్మద్ నవాజ్ను డకౌట్ చేశాడు. వికెట్ల ముందు దొరకబుచ్చుకుని వచ్చీ రాగానే పెవిలియన్కు పంపాడు. దీంతో పాక్ ఆరో వికెట్ కోల్పోయింది. స్కోరు: 65/6 (13).12.4: ఐదో వికెట్ కోల్పోయిన పాక్కుల్దీప్ యాదవ్ బౌలింగ్ హసన్ నవాజ్ (5) అక్షర్ పటేల్కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్గా వెనుదిరిగాడు. సాహిబ్జాదా 32, నవాజ్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 64/5 (12.4).నాలుగో వికెట్ కోల్పోయిన పాక్9.6: అక్షర్ పటేల్ మరోసారి అదరగొట్టాడు. అద్భుతమైన బంతితో సల్మాన్ ఆఘా (3)ను పెవిలియన్కు పంపాడు. అక్షర్ బౌలింగ్లో సల్మాన్ ఇచ్చిన బంతిని అభిషేక్ శర్మ క్యాచ్ పట్టడంతో పాక్ నాలుగో వికెట్ కోల్పోయింది. స్కోరు: 49/4 (10). సల్మాన్ స్థానంలో హసన్ నవాజ్ క్రీజులోకి రాగా.. సాహిబ్జాదా 22 పరుగులతో క్రీజులో ఉన్నాడు. Axar Patel joins the party 🥳Fakhar Zaman departs for just 17.Watch #INDvPAK LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/xwkBnHbnqr— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 మూడో వికెట్ కోల్పోయిన పాక్7.4: అక్షర్ పటేల్ బౌలింగ్లో ఫఖర్ జమాన్ (17) అవుటయ్యాడు. జమాన్ ఇచ్చిన క్యాచ్ను తిలక్ వర్మ అద్భుత రీతిలో పట్టడంతో.. పాక్ మూడో వికెట్ కోల్పోయింది. పాక్ స్కోరు: 45/3 (7.4) పవర్ ప్లేలో పాకిస్తాన్ స్కోరు: 42/2 (6)సాహిబ్జాదా 19, ఫఖర్ జమాన్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారుమూడు ఓవర్ల ఆట ముగిసే సరికి పాకిస్తాన్ స్కోరు: 20/2సాహిబ్జాదా మూడు, ఫఖర్ జమాన్ పది పరుగులతో క్రీజులో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన పాక్1.2: బుమ్రా బౌలింగ్లో రెండో వికెట్గా వెనుదిరిగిన మహ్మద్ హ్యారిస్. మూడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి హ్యారిస్ అవుటయ్యాడు. పాక్ స్కోరు: 6/2 (1.2)తొలి వికెట్ కోల్పోయిన పాక్..0.1: పాకిస్తాన్కు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో సైమ్ అయూబ్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఆసియాకప్-2025లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడతున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాకిస్తాన్ తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరి ఫాస్ట్ బౌలర్లలతో మెన్ ఈన్ గ్రీన్ బరిలోకి దిగింది. స్పీడ్ స్టార్ హరిస్ రౌఫ్ మరోసారి బెంచ్కే పరిమితమయ్యాడు. మరోవైపు భారత్ కూడా తమ ప్లేయింగ్ ఎలెవన్లో ఎటువంటి మార్పులు లేకుండా ఆడుతోంది. ప్రాక్టీస్ సెషన్లో గాయపడిన సూపర్ స్టార్ శుబ్మన్ గిల్ పూర్తి ఫిట్నెస్ను సాధించాడు. దీంతో గిల్కు తుది జట్టులో చోటు దక్కింది. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ స్పిన్నర్లగా ఉండగా.. జస్ప్రీత్ బుమ్రా ఫ్రంట్ లైన్ పేసర్గా ఉన్నాడు. బుమ్రాతో పాటు ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే బంతిని పంచుకోనున్నారు.తుది జట్లుభారత్ : అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిపాకిస్థాన్ : సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, మహ్మద్ హారీస్(వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్ -
మెదడు ఉందా?.. లేదా?.. అతడే నిరూపించాలి: ఇచ్చిపడేసిన దాదా
పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్కోచ్ మైక్ హసన్ కు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. హసన్ మెదడు పనిచేస్తుందో లేదో ఆ జట్టు స్పిన్నర్ మొహమ్మద్ నవాజే (Mohammad Nawaz)నిరూపించాల్సి ఉందని పేర్కొన్నాడు. ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో భాగంగా భారత్- పాక్ మధ్య మ్యాచ్ నిర్వహణకు ఆదివారం (సెప్టెంబరు 14) షెడ్యూల్ ఖరారైంది.ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్ఈసారి యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో టీమిండియా, పాకిస్తాన్ ఇప్పటికే చెరో విజయం సాధించాయి. తద్వారా గ్రూప్-‘ఎ’లో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఇదిలా ఉంటే.. దాయాదుల పోరు నేపథ్యంలో పాక్ హెడ్కోచ్ మైక్ హసన్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్ మొహమ్మద్ నవాజ్ మా జట్టులో ఉన్నాడు’’ అని పేర్కొన్నాడు.ఇదే విషయాన్ని సౌరవ్ గంగూలీ దగ్గర ఆనంద్ బజార్ పత్రిక విలేకరి ప్రస్తావించారు. ‘‘పాకిస్తాన్ కోచ్ మైక్ హసన్.. ప్రపంచలోని అత్యుత్తమ స్పిన్నర్ మా జట్టులో ఉన్నాడు’’ అని అన్నాడు సదరు విలేకరి చెప్పగా.. ‘‘ఎవరా స్పిన్నర్?’’ అని దాదా అడిగాడు.మెదడు ఉందా?.. లేదా?.. అతడే నిరూపించాలిఇందుకు బదులిస్తూ.. ‘‘మొహమ్మద్ నవాజ్’’ అని విలేకరి పేర్కొనగా.. ‘‘సరే.. తమ కోచ్ మెదడు సరిగ్గా పనిచేస్తుందని నిరూపించాల్సిన బాధ్యత సదరు స్పిన్నర్పైనే ఉంది’’ అంటూ గంగూలీ ఘాటుగా కౌంటర్గా ఇచ్చాడు.వీళ్లంతా వరల్డ్క్లాస్ క్రికెటర్లుఅదే విధంగా.. భారత్- పాక్ జట్ల మధ్య పోలికల గురించి ప్రస్తావన రాగా.. ‘‘రెండు జట్లకు అసలు పోలికే లేదు. పాక్ జట్టు నాణ్యత రోజురోజుకీ దిగజారిపోతోంది. వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్, సయీద్ అన్వర్, ఇంజమామ్ ఉల్ హక్, యూనిస్ ఖాన్, మొహహ్మద్ యూసఫ్... వీళ్లంతా వరల్డ్క్లాస్ క్రికెటర్లు.కానీ పాకిస్తాన్కు ఇపుడు ఆడుతున్న ప్లేయర్లు ఉన్నారో మీరే చూడండి. ఇక ఆ టీ20 జట్టులో బాబర్ ఆజం లేడు. మహ్మద్ రిజ్వాన్ కూడా లేడు. ఫఖర్ జమాన్ ఓకే. బౌలింగ్లో షాహిన్ ఆఫ్రిది, హ్యారిస్ రవూఫ్ ఫర్వాలేదు.షాహిన్ ఎన్నటికీ వసీం అక్రం కాలేడుకానీ టాలెంట్ విషయంలో షాహిన్ ఆఫ్రిది ఎన్నటికీ వసీం అక్రం కాలేడు కదా!.. వసీం, వకార్, షోయబ్లతో షాహిన్ లేదంటే రవూఫ్లను పోల్చగలమా? టీ20 ఫార్మాట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టమే. ఏదేమైనా ప్రస్తుత టీమిండియా- పాక్ జట్లకు ఎలాంటి పోలికా లేదని స్పష్టంగా చెప్పగలను’’ అని గంగూలీ పేర్కొన్నాడు. చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన భారత ఓపెనింగ్ జోడి -
భారత్తో మ్యాచ్.. అలా జరిగితే మాదే విజయం: షోయబ్ మాలిక్
ఆసియాకప్-2025లో అసలు సిసలైన పోరుకు సమయం అసన్నమైంది. ఈ ఖండాంతర టోర్నీలో భాగంగా మరికాసేపట్లో దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ చిరకాల ప్రత్యర్దుల పోరు తీవ్ర ఉద్రిక్తల నడుమ జరగనుంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్ వంటి పరిణామాల నేపథ్యంలో పాక్తో మ్యాచ్ను బహిష్కరించాలని దేశ వ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. బాయ్ కాట్ ఇండియా వర్సెస్ పాక్ హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ఎక్స్లో ట్రెండ్ అవుతుంది. కానీ ఈ మ్యాచ్లో తలపడేందుకు ఇరు జట్లు సిద్దమయ్యాయి. మరికాసేపట్లో ఇరు జట్ల ఆటగాళ్లు స్టేడియంకు చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉడేందుకు దుబాయ్ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. స్టేడియంలోకి జెండాలు, గొడుగులు, బ్యాన్సర్ లాంటివి పోలీసులు అనుమతించడం లేదు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు ముందు పాకిస్తాన్ వెటరన్ షోయబ్ మాలిక్ తన జట్టుకు కీలక సూచనలు చేశాడు. ఈ మ్యాచ్లో భారత టాపార్డర్ను తొందరగా ఔట్ చేస్తే పాక్కు గెలిచే అవకాశముందని మాలిక్ అభిప్రాయపడ్డాడు."ఈ మ్యాచ్లో టాస్ కీలకంగా మారనుంది. కానీ టాస్ అనేది ఎవరి చేతుల్లోనూ లేదు. ఒకవేళ పాక్ టాస్ ఓడిపోయినా కూడా మ్యాచ్ గెలిచేందుకు గెలిచేందుకు కొన్ని అవకాశాలు ఉన్నాయి. భారత్ అగ్రశ్రేణి బ్యాటర్లలో ముగ్గురు, నలుగురుని త్వరగా అవుట్ చేసి వారిని తక్కువ స్కోర్కే పరిమితం చేస్తే వారిని ఓడించవచ్చు.భారత్ స్కోర్ 150-160 మధ్య ఉంటే మనకు విజయం సాధించే అవకాశముంటుంది" అని ఓ లోకల్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాలిక్ పేర్కొన్నాడు. ఆసియాకప్లో పాక్పై భారత్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు 18 మ్యాచ్లలో తలపడ్డాయి. ఇందులో భారత్ 10 మ్యాచ్లలో గెలిస్తే, ఆరింట పాక్ విజయం సాధించింది. రెండు మ్యాచ్లలో ఫలితం రాలేదు. అయితే ఆసియాకప్ వన్డే ఫార్మాట్లో 15 మ్యాచ్లు జరగ్గా.. ఎనిమిదింట్లో భారత్.. ఐదింట్లో పాక్ గెలిచాయి. మూడు టీ20 మ్యాచ్లలో రెండింట్లో భారత్, ఒకసారి పాక్ విజయం సాధించాయి. మరోసారి పాక్పై భారత్ ఆధిపత్యం చెలాయించే అవకాశముంది. దీంతో హిస్టరీ చూసి మాట్లాడు అని మాలిక్కు టీమిండియా ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు.చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన భారత ఓపెనింగ్ జోడి -
కాసేపట్లో భారత్-పాక్ మ్యాచ్.. క్రిస్ గేల్ ఆసక్తికర ట్వీట్
ఆసియాకప్ 2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు రంగం సిద్దమైంది. మరికాసేపట్లో దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్ధుల పోరుకు తెరలేవనుంది. ఓ వైపు బాయ్కాట్ డిమాండ్ వినిపిస్తున్నప్పటికి.. ఈ హైవోల్టేజ్ మ్యాచ్లో తలపడేందుకు ఇరు జట్లు సిద్దమయ్యాయి.ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, మాజీ క్రికెటర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందులో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం,యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ కూడా ఉన్నాడు. భారత్-పాక్ పోరు నేపథ్యంలో గేల్ ఆసక్తికర ట్వీట్ చేశాడు."ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఉర్రూతలూగించేందుకు భారత్-పాక్ జట్లు మరోసారి సిద్దమయ్యాయి. ఇరు జట్లు కూడా తమ సూపర్ స్టార్లు లేకుండా ఆడుతున్నాయి. దీంతో భారత్-పాక్ రైవలరీలో కొత్త శకం ప్రారంభం కానుంది. సీనియర్ ప్లేయర్లు లేనప్పటికి ఈ రోజు మ్యాచ్ అదరిపోతుందని ఆశిస్తున్నాను" గేల్ ఎక్స్లో రాసుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్లో ఇరు జట్లు తమ స్టార్ ప్లేయర్లు లేకుండా ఆడుతున్నాయి.భారత దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ మెగా టోర్నీలో భాగం కావడం లేదు. మరోవైపు పాక్ స్టార్ ప్లేయర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజంలను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఇటీవల కాలంలో ఈ నలుగురు క్రికెటర్లు లేకుండా భారత్-పాక్ మ్యాచ్ జరగనుండడం ఇదే తొలిసారి. కాగా ఆసియాకప్లో పాక్పై భారత్దే పై చేయిగా ఉంది. ఆసియా కప్లో ఇప్పటి వరకు 19 మ్యాచ్ల్లో భారత్, పాక్ ముఖాముఖి తలపడ్డాయి. టీమిండియా 10 మ్యాచుల్లో విజయం సాధిస్తే.. పాక్ ఆరు మ్యాచుల్లో గెలిచింది. 3 మ్యాచ్ల్లో మాత్రం ఫలితం తేలలేదు.తుది జట్లు (అంచనా)భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, గిల్, సామ్సన్, తిలక్, శివమ్ దూబే, పాండ్యా, అక్షర్, కుల్దీప్, బుమ్రా, వరుణ్. పాకిస్తాన్: సల్మాన్ ఆగా (కెప్టెన్), ఫర్హాన్, అయూబ్, ఫఖర్, హసన్, హారిస్, నవాజ్, ఫహీమ్, అఫ్రిది, ముఖీమ్, అబ్రార్ చదవండి: పాక్తో మ్యాచ్ బహిష్కరించాలంటూ విజ్ఞప్తులు!.. ఆటగాళ్లకు గంభీర్ మెసేజ్ ఇదే.. -
IND vs PAK: మనదే ఏకపక్ష విజయం.. అలా వద్దే వద్దు!.. ఊరించి మరీ..!
చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ (IND vs PAK) క్రికెట్ జట్లు ముఖాముఖి తలపడేందుకు ముహూర్తం ఖరారైంది. ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో భాగంగా ఆదివారం రాత్రి (సెప్టెంబరు 14) దాయాదులు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు సబా కరీం, ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అతడికి తిరుగులేదుటీమిండియా మాజీ వికెట్ కీపర్ సబా కరీం మాట్లాడుతూ.. భారత్- పాక్ మ్యాచ్లో కొందరు ఆటగాళ్ల మధ్య పోరు చూసేందుకు తాను ఆసక్తిగా ఉన్నానని తెలిపాడు. ‘‘పాక్ పేసర్ షాహిన్ ఆఫ్రిది- టీమిండియా స్టార్లు అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్ల మధ్య పోటీ ఎలా ఉండబోతుందో చూడాలి.ఇక కుల్దీప్ యాదవ్ మధ్య ఓవర్లలో ఎలా బౌలింగ్ చేయబోతున్నాడదనేది కూడా ఆసక్తికరం. బుమ్రా గురించి మాత్రం నేను మాట్లడను. ఎందుకంటే.. అతడికి తిరుగులేదు. ఎవరితో పోటీ కూడా లేదు. ఈసారి పాక్ జట్టు కనీస పోటీ ఇస్తుందనే అనుకుంటున్నా.ఏకపక్ష విజయంటీమండియా ఏకపక్ష విజయం సాధిస్తుంది. ప్రస్తుతం జట్టు పటిష్టంగా ఉంది. అందుకే సులువుగానే గెలుస్తారని నమ్ముతున్నా’’ అని సబా కరీం పేర్కొన్నాడు. అయితే, భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాత్రం భిన్నంగా స్పందించాడు.ఆఖరి వరకు సాగాలి.. ఊరించి గెలవాలి‘‘భారత్- పాక్ మ్యాచ్ ఆఖరి వరకు ఉత్కంఠగా సాగాలి. టీ20 ప్రపంచకప్-2022లో చివరి బంతి వరకు మ్యాచ్ సాగింది. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో కూడా ఇలాగే జరిగింది. అక్కడ బుమ్రా హీరో అయ్యాడు. ఈసారి కూడా పాక్ను ఊరించి మరీ టీమిండియా విజయం సాధించాలి’’ అని ఇర్ఫాన్ పఠాన్ ఆకాంక్షించాడు.కాగా 2022 ప్రపంచకప్లో భారత్ ఆఖరి బంతికి పరుగు తీసి.. పాక్పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక 2024 వరల్డ్కప్ టోర్నీలో ఆరు పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఇదిలా ఉంటే.. ఈసారి యూఏఈ వేదికగా ఆసియా కప్ టోర్నీని టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గ్రూప్-‘ఎ’లో ఉన్న భారత్, పాకిస్తాన్ ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచాయి. భారత్ యూఏఈపై అద్భుత విజయం సాధించగా.. పాక్ ఒమన్ను ఓడించింది.బాయ్కాట్ చేయాలంటూ డిమాండ్లుపహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్తో మ్యాచ్ను టీమిండియా బహిష్కరించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఇదొక మల్టీలేటరల్ టోర్నీ కావున ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దాయాదుల పోరుకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. కానీ.. మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న చర్చలు ఇప్పటికీ జరుగుతున్నాయి.చదవండి: విరాట్ కోహ్లిపై తాలిబన్ అగ్రనేత ఆసక్తికర వ్యాఖ్యలు -
Asia Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా..?
ఆసియా కప్ 2025లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 14) జరుగబోయే భారత్, పాకిస్తాన్ మ్యాచ్పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ మ్యాచ్ను బహిష్కరించాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు ఈ మ్యాచ్కు ససేమిరా అంటున్నాయి. మ్యాచ్ చూడకుండా టీవీలు ఆఫ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.దేశవాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఈ మ్యాచ్ రద్దుకు పిలుపునిచ్చాయి. మ్యాచ్ ప్రారంభానికి మరికొద్ది గంటల సమయమే ఉన్న నేపథ్యంలో మ్యాచ్ బహిష్కరణ పిలుపులు తారాస్థాయికి చేరాయి. సోషల్మీడియా #BoycottIndvsPak హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ప్రస్తుత సందిగ్ద పరిస్థితుల్లో మ్యాచ్ జరుగుతోందో లేదోనని యావత్ క్రీడా ప్రపంచం ఆసక్తిగా గమనిస్తుంది.ఈ మ్యాచ్లో దుబాయ్లోని దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. మ్యాచ్ ప్రారంభానికి మరో 8 గంటలు ఉన్న నేపథ్యంలో ఏమైనా జరగవచ్చని (రద్దు) నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మెజార్జీ శాతం భారతీయులకు ఈ మ్యాచ్ జరగడం అస్సలు ఇష్టం లేదు. కొందరు ఈ మ్యాచ్ రద్దు చేయాలని సుప్రీం కోర్టును సైతం ఆశ్రయించారు. అయితే క్రికెట్ను రాజకీయాలతో ముడిపెట్టలేమని పలువురు వేసిన పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది.కాగా, ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ ఆధారిత ఉగ్రమూకలు ఈ దాడులకు తెగబడ్డాయి. ఇందుకు భారత్ కూడా ధీటుగా బదులిచ్చింది. ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్లో తలదాచుకున్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. భారత్ కొట్టిన ఈ దెబ్బకు పాక్ విలవిలలాడిపోయింది.అపరేషన్ సిందూర్ తర్వాత భారత్ ఏ విషయంలోనూ పాక్తో సంబంధాలు పెట్టుకోకూడదని నిర్ణయించుకుంది. ఇందుకు అంతర్జాతీయ వేదికలపై జరిగే మేజర్ క్రీడా పోటీలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. ఈ క్రమంలోనే భారత్ బహుళ దేశాలు పాల్గొంటున్న ఆసియా కప్లో పాక్తో మ్యాచ్కు సిద్దమైంది. అయితే ఈ మ్యాచ్ రద్దుకు భారత్లో ఆందోళనలు ఉధృతమవడంతో సందిగ్దత నెలకొంది. -
భారత్-పాక్ ఆసియా కప్ మ్యాచ్పై పొలిటికల్ వార్
-
పాకిస్తాన్తో మ్యాచ్.. టీమిండియాకు భారీ షాక్!
ఆసియాకప్-2025లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ప్రాక్టీస్ సమయంలో భారత స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ గాయపడ్డాడు.త్రోడౌన్ స్పెషలిస్ట్ బౌలింగ్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా బంతి గిల్ చేతికి బలంగా తాకింది. వెంటనే గిల్ నొప్పితో విలవిల్లాడు. ఆ తర్వాత ఫిజియో వచ్చి అతడి ఐస్ ప్యాక్ పెట్టి చికిత్స అందించాడు. అయితే విశ్రాంతి తీసుకున్నాక గిల్ తన ప్రాక్టీస్ను తిరిగి మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కానీ గిల్ కాస్త ఆసౌకర్యంగా కన్పించనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయితే ఇప్పటివరకు అతడి గాయంపై టీమ్ మెనెజ్మెంట్ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ గిల్ గాయం కారణంగా దూరమైతే అది భారత్కు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి. గిల్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్లో 20 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.భారత్ తుది జట్టు(అంచనా)అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి -
భారత్తో మ్యాచ్.. అతడిని చూసి వణకిపోతున్న పాకిస్తాన్!
ఆసియాకప్-2025లో ఉత్కంఠభరితమైన పోరుకు సమయం అసన్నమైంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఈ మ్యాచ్ వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెహల్గమ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ వంటి పరిణామాల తర్వాత దాయాదుల పోరు జరగనుండడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఈ హైవోల్టేజ్ ఈ మ్యాచ్ కోసం తమ వ్యూహాలను ఇరు జట్లు సిద్దం చేసుకుంటున్నాయి. ఇరు జట్లు తమ తొలి మ్యాచ్లలో విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్నాయి. యూఏఈతో ఆడిన తుది జట్టునే పాక్తో మ్యాచ్కు భారత్ కొనసాగించే అవకాశముంది.అభిషేక్ 'ఫియర్'అయితే భారత యువ సంచలనం అభిషేక్ శర్మను చూసి పాకిస్తాన్ భయపడుతందంట. అతడి కోసం పాక్ టీమ్ మెనెజ్మెంట్ ప్రత్యేక వ్యూహాలను రచిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అభిషేక్ను ఎలాగైనా పవర్ ప్లే లోపు ఔట్ చేసేందుకు మెన్ ఇన్ గ్రీన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అతడి బ్యాటింగ్కు సంబంధించిన పాత వీడియోలను పాక్ హెడ్ కోచ్ తమ బౌలర్లకు చూపించి ప్రాక్టీస్ చేయస్తున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అభిషేక్కు అవుట్సైడ్ ఆఫ్స్టంప్ బంతుల వీక్నెస్ ఉంది. అతడి బలహీనతను క్యాష్ చేసుకోవాలని పాక్ భావిస్తోంది. కానీ ఒక ఆరు ఓవర్ల పాటు అభిషేక్ క్రీజులో ఉంటే పాక్ బౌలర్లను షేక్ ఆడించేస్తాడు. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్లో కూడా ఈ పంజాబ్ బ్యాటర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 30 పరుగులు చేసి ఔటయ్యాడు.అభిషేక్.. విధ్వంసకర బ్యాటింగ్కు పెట్టింది పేరు. అంతర్జాతీయ టీ20ల్లో అతడి స్ట్రైక్ రేటు 193.50గా ఉంది. అంతేకాకుండా ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తరపున ఎన్నో తుపాన్ ఇన్సింగ్స్లు ఈ లెఫ్డ్ హ్యాండ్ బ్యాటర్ ఆడాడు.చదవండి: టీమిండియాతో మ్యాచ్.. పాక్ జట్టులోకి డేంజరస్ బౌలర్? -
టీమిండియాతో మ్యాచ్.. పాక్ జట్టులోకి డేంజరస్ బౌలర్?
ఆసియాకప్-2025లో తమ తొలి మ్యాచ్లో ఒమన్ను చిత్తు చేసిన పాకిస్తాన్.. ఇప్పుడు అసలు సిసలైన పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా పాక్ ఆదివారం తమ చిరకాల ప్రత్యర్ధి భారత్ తలపడనుంది. పాక్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉంది.ఈ ఈవెంట్కు ముందు యూఏఈ వేదికగా జరిగిన ట్రైసిరీస్ను కూడా మెన్ ఇన్ బ్లూ సొంతం చేసుకుంది. ఒమన్తో జరిగిన మ్యాచ్లో పాక్ బ్యాటింగ్ పరంగా కాస్త నిరాశపరిచినప్పటికి బౌలింగ్లో మాత్రం అదరగొట్టింది. ముఖ్యంగా స్పిన్నర్లు సైమ్ అయూబ్, మహ్మద్ నవాజ్, సోఫియన్ ముఖియమ్, అబ్రార్ ఆహ్మద్ అద్బుతంగా రాణించారు. అయితే భారత్తో మ్యాచ్కు మాత్రం పాక్ తుది జట్టులో ఓ మార్పు చోటు చేసుకునే అవకాశముంది.హ్యారిస్ రౌఫ్ ఇన్..?తొలి మ్యాచ్కు బెంచ్కే పరిమితమైన స్పీడ్ స్టార్ హారిస్ రౌఫ్ను ప్లేయింగ్ ఎలెవన్లోకి తీసుకురావాలని పాక్ టీమ్ మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. యూఏఈతో మ్యాచ్లో ఫ్రంట్ లైన్ పేసర్గా షాహీన్ అఫ్రిది ఒక్కడే ఆడాడు. అతడితో ఆల్రౌండర్ ఫహీమ్ అష్రఫ్ బంతిని పంచుకున్నాడు. కానీ టీమిండియా వంటి కఠిన ప్రత్యర్ధితో ఆడుతున్నప్పుడు కచ్చితంగా పాక్ వ్యూహాలు మారుతాయి. స్పిన్నర్ సోఫియన్ ముఖియమ్ను పక్కన పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతడి స్ధానంలోనే రౌఫ్ ఎంట్రీ ఇవ్వనున్నాడంట. దుబాయ్ వికెట్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. అయితే భారత బ్యాటర్లు స్పిన్నర్లకు ఎలాగో మెరుగ్గానే ఆడుతారు. కాబట్టి అదనపు ఫాస్ట్ బౌలర్తో బరిలోకి దిగేందుకు పాక్ సిద్దమైందంట. ముఖియమ్ను పక్కన పెట్టిన అర్బర్ ఆహ్మద్, నవాజ్, అయూబ్ రూపంలో ముగ్గురు స్పిన్నర్లు ఉంటారు. ఒకవేళ నాలుగో స్పిన్నర్ అవసరమైతే కెప్టెన్ సల్మాన్ సైతం బంతిని గింగరాలు తిప్పగలడు. ఈ ఒక్క మార్పు మినహా ఒమన్తో ఆడిన జట్టునే పాక్ కొనసాగించే అవకాశముంది.భారత్తో మ్యాచ్కు పాక్ జట్టు..సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, ఫఖర్ జమాన్, సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), హసన్ నవాజ్, మహ్మద్ హారీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, సుఫియాన్ ముఖీమ్ -
యుద్దం తర్వాత తొలి మ్యాచ్.. దుబాయ్ దద్దరిల్లిపోతుంది: అక్తర్
వరల్డ్ క్రికెట్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు ఉన్న క్రేజు గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు జట్లు ఎప్పెడెప్పుడు తలపడతాయా? అని ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తుంటారు. చివరగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్-పాక్ జట్లు తలపడ్డాయి.ఇప్పుడు మరోసారి అభిమానులను అలరించేందుకు చిరకాల ప్రత్యర్ధులు సిద్దమయ్యారు. ఆసియాకప్-2025లో భాగంగా ఆదివారం(సెప్టెంబర్ 14) దాయాదులు అమీతుమీ తేల్చుకోనున్నారు. అయితే ఈసారి ఈ హైవోల్టేజ్ మ్యాచ్పై అభిమానుల ఆసక్తి కాస్త తగ్గినట్లు అన్పిస్తోంది. సాధారణంగా భారత్- పాక్ మ్యాచ్ టిక్కెట్లు నిమిషాల్లో హట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. కానీ ఈసారి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. అమ్మకాలు ప్రారంభమై పది రోజులు అవుతున్నప్పటికి టిక్కెట్లు ఇంకా పూర్తి స్ధాయిలో అమ్ముడు పోలేదు. పహల్గామ్ ఉగ్ర దాడి, "ఆపరేషన్ సిందూర్" నేపథ్యంలో పాక్తో మ్యాచ్ను బాయ్ కాట్ చేయాలని చాలా మంది సూచిస్తున్నారు. ఈ కారణంగానే టిక్కెట్లు ఇంకా అమ్ముడుపోలేదని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.ఆదివారం భారత్-పాక్ మ్యాచ్కు దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం హౌస్ ఫుల్ కావడం ఖాయమని అక్తర్ జోస్యం చెప్పాడు. "భావోద్వేగాలు ఉప్పొంగుతున్నాయి. యుద్దం తర్వాత పాకిస్తాన్ తొలిసారి భారత్తో ఆడనుంది. అలాంటిప్పుడు స్టేడియం ఎలా హౌస్ ఫుల్ కాకుండా ఉంటుంది? టిక్కెట్లు అమ్ముడుపోవడం లేదని నాతో ఒకరు అన్నారు. వెంటనే అవన్నీ వట్టి రూమర్సే అని, అన్నీ అమ్ముడుపోయాయి అని చెప్పా. ఇదంతా బయట జరుగుతున్న ప్రచారమే అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ పేర్కొన్నాడు.చదవండి: SA20: సన్ రైజర్స్తో తెగదెంపులు.. కట్ చేస్తే! ఇప్పుడు ఆ జట్టు కెప్టెన్గా ఎంపిక -
భారత్తో మ్యాచ్ ముఖ్యం కాదు.. మా టార్గెట్ అదే: పాక్ ఓపెనర్
ఆసియాకప్-2025లో రసవత్తర పోరుకు సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం(సెప్టెంబర్ 14) దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు అన్ని విధాల సిద్దమైంది.ఇప్పటికే ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు శుభారంభం చేశారు. టీమిండియా తమ తొలి మ్యాచ్లో యూఏఈను చిత్తు చేయగా.. పాక్ తమ మొదటి మ్యాచ్లో ఒమన్ను మట్టికర్పించింది. ఈ మల్టీనేషన్ టోర్నమెంట్లలో పాక్పై భారత్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. చివరగా ఈ రెండు జట్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో పాక్ను భారత్ చిత్తు చేసింది. ఇప్పుడు మళ్లీ ఆరు నెలలు తర్వాత దాయాదుల మధ్య క్రికెట్ సమరం జరగనుంది. ఈ మ్యాచ్లో కూడా పాక్పై పూర్తి ఆధిపత్యం చెలాయించాలని భారత్ పట్టుదలతో ఉంది. ఇక ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్కు ముందు పాక్ యువ ఓపెనర్ సైమ్ అయూబ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమకు టీమిండియాపై గెలవడం ఒక్కటే ముఖ్యం కాదని, టోర్నీ విజేతగా నిలవడమే తమ లక్ష్యమని అయూబ్ చెప్పుకొచ్చాడు."మాకు జ్ఞాపకాలు ముఖ్యం కాదు. మా దృష్టింతా ప్రస్తుతం టోర్నమెంట్పైనే ఉంది. ఆసియాకప్ విజేతగా మేము నిలవాలనుకుంటున్నాము. టీమిండియాతో మ్యాచ్ ఒక్కటే మాకు ముఖ్యం కాదు. ఛాంపియన్షిప్ను గెలిచేందుకు మేము ఆతృతగా ఎదురు చూస్తున్నాము" అని ఒమన్తో మ్యాచ్ అనంతరం అయూబ్ పేర్కొన్నాడు.కాగా ఒమన్తో మ్యాచ్లో అయూబ్ బ్యాట్తో విఫలమైన బంతితో సత్తా చాటాడు. రెండు కీలక వికెట్లు పడగొట్టి పసికూన పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో మొహమ్మద్ హ్యారిస్ (43 బంతుల్లో 66) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్, ఆమిర్ కలీమ్ మూడేసి వికెట్లు తీయగా.. మొహమ్మద్ నదీమ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం లక్ష్య చేధనలో ఒమన్ కేవలం 67 పరుగులకే ఆలౌటైంది.ఫలితంగా 93 పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది. పాక్ బౌలర్లలో సూఫియాన్ ముకీమ్, సయీమ్ ఆయుబ్ ఫాహిమ్ అష్రాఫ్ రెండేసి వికెట్లు సాధించారు. వీరితోపాటు షాహిన్ ఆఫ్రిది, అబ్రార్ అహ్మద్ , మొహమ్మద్ నవాజ్తలా ఒక వికెట్ పడగొట్టారు.చదవండి: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా.. -
Asia Cup 2025: ఏ జట్టునైనా ఓడిస్తాం: పాకిస్తాన్ కెప్టెన్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో శుభారంభం అందుకుంది. తొలి మ్యాచ్లో పసికూన ఒమన్ను ఎదుర్కొన్న సల్మాన్ ఆఘా బృందం.. 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. దుబాయ్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాక్.. తొలుత బ్యాటింగ్ చేసింది.ఆయుబ్ డకౌట్.. హ్యారిస్ అర్ధ శతకంఓపెనర్లలో షాహిబ్జాదా ఫర్హాన్ (29) ఫర్వాలేదనిపించగా.. సయీమ్ ఆయుబ్ డకౌట్ అయ్యాడు. అయితే, వన్డౌన్ బ్యాటర్ మొహమ్మద్ హ్యారిస్ అర్ధ శతకం (43 బంతుల్లో 66)తో రాణించడంతో పాక్ ఇన్నింగ్స్ గాడినపడింది.హ్యారిస్తో పాటు ఫఖర్ జమాన్ (16 బంతుల్లో 23 నాటౌట్) రాణించగా.. నవాజ్ 19 పరుగులు చేయగలిగాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో పాక్ ఏడు వికెట్ల నష్టానినకి 160 పరుగులు రాబట్టగలిగింది. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్, ఆమిర్ కలీమ్ మూడేసి వికెట్లు తీయగా.. మొహమ్మద్ నదీమ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. 67 పరుగులకే ఆలౌట్ చేసిఇక లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్ను పాక్ 67 పరుగులకే ఆలౌట్ చేసి సత్తా చాటింది. స్పిన్నర్లు సూఫియాన్ ముకీమ్, సయీమ్ ఆయుబ్.. పేసర్ ఫాహిమ్ అష్రాఫ్ రెండేసి వికెట్లు తీయగా.. షాహిన్ ఆఫ్రిది (పేసర్), అబ్రార్ అహ్మద్ (స్పిన్నర్), మొహమ్మద్ నవాజ్ (స్పిన్నర్) తలా ఒక వికెట్ పడగొట్టారు.ఇక ఒమన్ బ్యాటర్లలో హమావ్ మీర్జా 27 పరుగులతో టాప్ రన్స్కోరర్గా నిలిచాడు. ఒమన్పై విజయానంతరం పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. బౌలింగ్ విభాగం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తమ జట్టులో మేటి స్పిన్నర్లు ఉన్నారని.. యూఏఈ వంటి వేదికపై వారి అవసరమే ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నాడు.స్పిన్నర్లు కీలకం‘‘బ్యాటింగ్పై మేము మరింత దృష్టి సారించాల్సి ఉంది. అయితే, బౌలింగ్ పరంగా మా వాళ్లు అద్భుతం. మా బౌలర్ల ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను. మా జట్టులో ముగ్గురు స్పిన్నర్లు.. తమకు తామే ప్రత్యేకం. వీరికి తోడుగా ఆయుబ్ కూడా ఉన్నాడు.దుబాయ్, అబుదాబి వంటి వేదికల్లో స్పిన్నర్లు కీలకం. మాకు 4-5 స్పిన్ ఆప్షన్లు ఉండటం సానుకూలాంశం. అయితే, మేము ఈ మ్యాచ్లో 180 పరుగులు చేయాల్సింది. కానీ ఒక్కోసారి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతాము. ఆటలో ఇలాంటివి సహజం.ఎలాంటి జట్టునైనా ఓడించగలమునిజానికి ఇక్కడ మేము చాలా రోజులుగా ఆడుతున్నాం. ఈ టోర్నీకి ముందు టీ20 ట్రై సిరీస్ ఆడాము. అలవోకగానే సిరీస్ను సొంతం చేసుకున్నాము. సుదీర్ఘ కాలంలో మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయగలిగితే ఎలాంటి జట్టునైనా ఓడించగలము’’ అని సల్మాన్ ఆఘా ధీమా వ్యక్తం చేశాడు.కాగా యూఏఈ వేదికగా ఆసియా కప్-2025లో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, ఒమన్, యూఏఈ... గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ రేసులో ఉన్నాయి. ఇక ఇప్పటికే టీమిండియా యూఏఈపై గెలుపొందగా.. పాక్ ఒమన్పై గెలిచింది. అయితే, నెట్ రన్రేటు పరంగా అందనంత ఎత్తులో ఉన్న భారత్ (+10.483) ప్రస్తుతం గ్రూప్-‘ఎ’ టాపర్గా ఉండగా.. పాక్ (+4.650) రెండో స్థానంలో ఉంది.ఆసియా కప్-2025: పాకిస్తాన్ వర్సెస్ ఒమన్ స్కోర్లు👉పాకిస్తాన్- 160/7 (20)👉ఒమన్- 67 (16.4)👉ఫలితం: ఒమన్పై 93 పరుగుల తేడాతో పాక్ గెలుపు.చదవండి: సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు బద్దలు.. తొలి ప్లేయర్గా సాల్ట్ చరిత్ర -
నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే: శుబ్మన్ గిల్
టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మ (Abhishek Sharma)తో కలిసి జీవితాంతం బ్యాటింగ్ చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. దాదాపు ఏడాది విరామం తర్వాత గిల్ భారత టీ20 జట్టులో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే.ఆసియా కప్-2025 (Asia Cup 2025) టోర్నీలో భాగంగా యూఏఈతో మ్యాచ్లో గిల్ ఆడాడు. తన చిన్ననాటి స్నేహితుడు అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తొమ్మిది బంతుల్లోనే 20 పరుగులతో అదరగొట్టాడు. తద్వారా యూఏఈ విధించిన 57 పరుగుల లక్ష్యాన్ని.. టీమిండియా 4.3 ఓవర్లలోనే ఛేదించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక గిల్ టీమిండియాతో కలిసి తదుపరి దాయాది పాకిస్తాన్ (సెప్టెంబరు 14)తో మ్యాచ్కు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ బ్రాడ్కాస్టర్ సోనీ స్పోర్ట్స్ గిల్ ర్యాపిడ్ ఫైర్ సెషన్లో పాల్గొన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో పలు ప్రశ్నలకు అతడు జవాబు ఇచ్చాడు.👉ఈ టోర్నమెంట్ కోసం మీరు ఎన్ని బ్యాట్లు తీసుకువచ్చారు?😊గిల్: తొమ్మిది బ్యాట్లు👉ఏ బ్యాటర్తో కలిసి జీవితాంతం బ్యాటింగ్ చేయాలని అనుకుంటున్నారు?😊గిల్: ప్రస్తుతానికైతే అభిషేక్ శర్మతో కలిసి👉మీరు ఏ ఆటగాడి నుంచైనా దొంగతనం చేయాలని అనుకునే నైపుణ్యం ఏమిటి?😊గిల్: ఏబీ డివిలియర్స్ స్కూప్ షాట్👉మీరు ఎదుర్కొన్న కఠినమైన బౌలర్?😊గిల్: జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లండ్)👉మీ క్రికెట్ కెరీర్లో ఇప్పటి వరకు అత్యంత మధురమైన జ్ఞాపకం?😊గిల్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలవడం.👉మీ చీట్ మీల్లో ఉండే ఫుడ్?😊గిల్: ప్యాన్కేక్స్, బటర్ చికెన్, దాల్ మఖ్నీ.మూడు ఫార్మాట్ల భవిష్య కెప్టెన్గా..ఇరవై ఆరేళ్ల శుబ్మన్ గిల్ ఇటీవలే భారత టెస్టు జట్టు కెప్టెన్గా పగ్గాలు చేపట్టాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ నేపథ్యంలో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా టీమిండియా సారథిగా సరికొత్త బాధ్యతలు తీసుకున్నాడు. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో 754 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.ఇక కెప్టెన్గా ఎడ్జ్బాస్టన్లో టీమిండియాకు తొలి విజయం అందించిన సారథిగా గిల్ చరిత్రకెక్కాడు. ఈ ఐదు మ్యాచ్ల సిరీస్ను భారత 2-2తో సమం చేసుకోవడంలో బ్యాటర్గానూ తన వంతు పాత్ర పోషించాడు. కాగా ప్రస్తుతం టీమిండియాకు మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లు ఉన్న విషయం తెలిసిందే. వన్డేలకు రోహిత్ శర్మ, టీ20లకు సూర్యకుమార్ యాదవ్, టెస్టులకు గిల్ సారథ్యం వహిస్తున్నారు.అయితే, భవిష్యత్తులో మూడు ఫార్మాట్లకు కలిపి గిల్ను నియమించేలా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే అతడిని టీ20 జట్టులోకి వైస్ కెప్టెన్గా తీసుకువచ్చింది. త్వరలోనే గిల్ భారత వన్డే, టీ20 జట్లకు కూడా కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.చదవండి: సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు బద్దలు.. తొలి ప్లేయర్గా సాల్ట్ చరిత్రThe Prince took on the rapid-fire challenge. Here’s how it went… Watch cricket's 𝑼𝑳𝑻𝑰𝑴𝑨𝑻𝑬 𝑹𝑰𝑽𝑨𝑳𝑹𝒀 come alive on Sept 14, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV 📺#SonySportsNetwork #DPWorldAsiaCup2025 #INDvPAK pic.twitter.com/d2Rz0TUVGa— Sony Sports Network (@SonySportsNetwk) September 12, 2025 -
పాక్ను ఓడించడానికి వైభవ్ సూర్యవంశీ వంటి వాళ్లు చాలు!
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా తొలి మ్యాచ్లోనే తమ సత్తా చూపించింది. ఈసారి టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఈ ఈవెంట్లో తొలుత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) జట్టుతో తలపడిన సూర్యకుమార్ సేన ఏకపక్ష విజయం సాధించింది.యూఏఈని తొలుత 57 పరుగులకే ఆలౌట్ చేసిన భారత జట్టు.. కేవలం 4.3 ఓవర్లలోనే లక్ష్య ఛేదనను పూర్తి చేసింది. తద్వారా తమ బలాన్ని మరోసారి నిరూపించుకుంది. మరోవైపు.. పాకిస్తాన్ ఈ టోర్నీ ఆరంభానికి ముందు యూఏఈ- అఫ్గనిస్తాన్లతో టీ20 ట్రై సిరీస్ ఆడింది. అయితే, ఈ రెండు జట్లపై మరీ అంత సునాయాసంగా మాత్రం గెలవలేకపోయింది. ఆసియా కప్ తొలి మ్యాచ్లో ఒమన్పై మాత్రం 93 పరుగుల తేడాతో గెలిచింది.వైభవ్ సూర్యవంశీ వంటి వాళ్లు చాలు!ఇక ఆసియా కప్ టోర్నీలో భాగంగా.. చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ సెప్టెంబరు 14న ముఖాముఖి తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. టీమిండియా పాక్ను చిత్తుగా ఓడించడం ఖాయం అంటున్నారు. అంతేకాదు.. ప్రస్తుత బలాబలాల దృష్ట్యా దాయాది స్థాయికి భారత ద్వితీయ శ్రేణి జట్టు సరిపోతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రియాన్ష్ ఆర్య, పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీ వంటి ఐపీఎల్ స్టార్లు ఉన్న జట్టుతో పాక్ను ఓడించవచ్చనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.ఆఫ్రో-ఆసియా కప్గా మార్చాలిఈ టోర్నీ ఆరంభానికి ముందు టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ.. ఆసియా క్రికెట్ మండలి (ACC)కి ఓ విజ్ఞప్తి చేశాడు. సౌతాఫ్రికాను కూడా ఈ టోర్నీలో చేర్చి.. దీనిని ఆఫ్రో-ఆసియా కప్గా మార్చాలన్నాడు. అంతేకాదు.. భారత్ నుంచి ప్రధాన జట్టుతో పాటు ‘ఎ’ టీమ్ను కూడా బరిలో దించాలని.. అప్పుడే కాస్త పోటీ ఉంటుందని అభిప్రాయపడ్డాడు.ఇండియా- ‘బి’ జట్టు సరిపోతుందిఇక టీమిండియా మాజీ పేసర్ అతుల్ వాసన్ (Atul Wassan) తాజాగా మాట్లాడుతూ.. పాకిస్తాన్ ప్రస్తుత జట్టును ఓడించేందుకు భారత ద్వితీయ శ్రేణి జట్టు చాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘‘90వ దశకంలో పాకిస్తాన్ పటిష్ట జట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ జట్టు బలహీనంగా కనిపిస్తోంది. ప్రస్తుత తరుణంలో పాకిస్తాన్ను ఓడించేందు ఇండియా- ‘బి’ జట్టు సరిపోతుంది. రో-కోను మిస్ కావడం లేదుఏదేమైనా ఈ టోర్నీలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల గైర్హాజరీ మాత్రం నన్ను బాధించడం లేదు. ఎందుకంటే వారి గురించి ఆలోచించడం మొదలుపెడితే.. నేను సునిల్ గావస్కర్, కపిల్ దేవ్ల గురించి ఆలోచిస్తూనే ఉండిపోతాను. కాలంతో పాటుగా ముందుకు సాగటమే ఉత్తమం’’ అని అతుల్ వాసన్ న్యూస్18తో పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రంపచకప్-2024లో భారత్ చాంపియన్గా నిలిచిన తర్వాత కోహ్లి, రోహిత్ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవలే టెస్టులకు కూడా ఈ దిగ్గజాలు వీడ్కోలు పలికారు.చదవండి: బుమ్రా బౌలింగ్లో మా వాడు 6 సిక్స్లు కొడతాడు: పాక్ ప్లేయర్ ఓవరాక్షన్ -
పాక్తో మ్యాచ్.. టీమిండియా తుది జట్టు ఇదే! అతడికి నో ఛాన్స్?
ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. ఈ దాయాదుల పోరు కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ మెగా టోర్నీని ఇప్పటికే టీమిండియా అద్బుతమైన విజయంతో ప్రారంభించింది.బుధవారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో యూఏఈను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 4.3 ఓవర్లలోనే భారత్ ఊదిపడేసింది. ఇప్పుడు పాకిస్తాన్పై కూడా అదే జోరును కొనసాగించాలని మెన్ ఇన్ బ్లూ భావిస్తోంది. మరోవైపు పాక్ తమ తొలి మ్యాచ్లో శుక్రవారం దుబాయ్ వేదికగానే ఒమన్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో పసికూన ఒమన్ను పాక్ ఓడించడం దాదాపు ఖాయం అని చెప్పాలి. కానీ ఆదివారం మాత్రం పాక్కు భారత్ నుంచి కఠిన సవాల్ ఎదురుకానుంది. బ్యాటింగ్, బౌలింగ్లో దుమ్ములేపుతున్న సూర్య సేనను పాక్ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.నో ఛేంజ్..?కాగా పాక్తో మ్యాచ్కు భారత తుది జట్టులో ఎటువంటి మార్పులు చోటు చేసుకోపోవచ్చు. యూఈఏతో ఆడిన ప్లేయింగ్ ఎలెవన్తో టీమిండియా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తుది జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్గా సంజూ శాంసన్ను కొనసాగించనున్నారు.యూఏఈతో మ్యాచ్లో సంజూకు బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. ఈ కేరళ ఆటగాడు మిడిలార్డర్లో బ్యాటింగ్కు రానున్నాడు. ఈ మ్యాచ్లో కూడా భారత ముగ్గురు స్పిన్నర్లతో ఆడే అవకాశముంది. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఇద్దరూ స్పెషలిస్టు స్పిన్నర్లగా కొనసాగనున్నారు. దీంతో యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ మరోసారి బెంచ్కే పరిమితమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా ప్రధాన పేసర్గా ఉండనున్నాడు. అతడితో పాటు మీడియం పేస్ బౌలర్లు శివమ్ దూబే, హార్ధిక్ పాండ్యా బంతిని పంచుకోనున్నారు.భారత్ తుది జట్టు(పాకిస్తాన్)అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిచదవండి: టీమిండియాలో నో ఛాన్స్.. ఆ కసి అక్కడ చూపించేశాడు! 12 ఫోర్లు, 2 సిక్స్లతో -
బుమ్రా బౌలింగ్లో మా వాడు 6 సిక్స్లు కొడతాడు: పాక్ ప్లేయర్
ఆసియాకప్-2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు సమయం అసన్నమవుతోంది. సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధులు అమీతుమీ తెల్చుకోనున్నారు. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. భారత్ ఇప్పటికే తమ తొలి మ్యాచ్లో యూఏఈను చిత్తు చేయగా.. పాక్ జట్టు వారి మొదటి మ్యాచ్లో శుక్రవారం ఒమన్తో తలపడనుంది.పాకిస్తాన్ కూడా వారి తొలి మ్యాచ్లో సునాయసంగా విజయం సాధించే అవకాశముంది. కానీ అసలు సిసలైన సవాల్ ఆదివారం ఎదురుకానుంది. ఆసియాకప్లో పాక్పై టీమిండియాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. మరోసారి దాయాదిపై తమ జోరును కొనసాగించాలని సూర్యకుమార్ సేన ఉవ్విళ్లూరుతోంది.ప్రత్యర్ధి పాక్ సైతం ఎలాగైనా టీమిండియాను ఓడించాలని పట్టుదలతో ఉంది. ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ తన్వీర్ అహ్మద్ సంచలన కామెంట్స్ చేశాడు. టీమిండియా సూపర్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో పాక్ యవ ఓపెనర్ సైమ్ అయూబ్ వరుసగా ఆరు సిక్స్లు కొడతాడని తన్వీర్ బిల్డప్ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన్వీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. దీంతో భారత అభిమానులు తన్వీర్కు కౌంటరిస్తున్నారు. బుమ్రా బౌలింగ్లో అయూబ్ కనీసం ఫోర్ అయినా కొడతాడా? అని ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. కాగా ప్రపంచ క్రికెట్లో బుమ్రా నెంబర్ వన్ బౌలర్గా కొనసాగుతున్నాడు. స్మిత్, రూట్, స్టోక్స్ వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లు సైతం బుమ్రా బౌలింగ్ను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డారు. అటువంటిది ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు అంటే అది కలలో కూడా జరగదు. అయితే పాక్ జట్టులో అయూబ్ గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. 41 టీ20ల్లో 816 పరుగులు చేశాడు. ఆఫ్ బ్రేక్ బౌలింగ్ కూడా అయూబ్ చేయగలడు.చదవండి: మా జట్టుకు మాత్రం.. గిల్ ఇలా ఆడడు: గుజరాత్ టైటాన్స్ కోచ్ -
భారత్-పాక్ మ్యాచ్ రద్దుకు సుప్రీం కోర్టులో పిల్.. న్యాయస్థానం స్పందన ఇదే..!
ఆసియా కప్ 2025లో భాగంగా ఈ నెల 14న దుబాయ్లో జరుగబోయే భారత్-పాకిస్తాన్ మ్యాచ్పై సుప్రీం కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (PIL) దాఖలైంది. ఈ మ్యాచ్ను రద్దు చేయాలని ఉర్వశి జైన్ నేతృత్వంలో నలుగురు న్యాయ విద్యార్థులు ఆర్టికల్ 32 ప్రకారం పిటిషన్ను దాఖలు చేశారు.పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జాతీయ గౌరవానికి విరుద్ధమని వారు పిటిషన్లో పేర్కొన్నారు. మ్యాచ్ నిర్వహణ అమరవీరుల కుటుంబాలకు బాధ కలిగించే చర్యగా అభిప్రాయపడ్డారు.అయితే, ఈ పిటిషన్ను జస్టిస్ జె.కె.మహేశ్వరి, విజయ్ బిష్ణోయి నేతృత్వంలోని బెంచ్ విచారణకు తీసుకోలేదు. "ఇది కేవలం మ్యాచ్ మాత్రమే.. వదిలేయండి" అంటూ న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్పై రాజకీయ, సామాజిక భావోద్వేగాలు ఉన్నప్పటికీ, సుప్రీం కోర్టు ఈ విషయాన్ని క్రీడా పరంగా మాత్రమే పరిగణించింది. క్రికెట్ను జాతీయ ప్రయోజనాల కంటే పైగా చూడలేమన్న అభిప్రాయాలు ఉన్నా, ప్రస్తుత విధానాలు మరియు అంతర్జాతీయ ఒప్పందాలు కారణంగా మ్యాచ్ను కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బహుల దేశాలు పాల్గొనే టోర్నీల్లో పాక్తో మ్యాచ్ను రద్దు చేసుకుంటే, అది భారత ఆటగాళ్ల కెరీర్లపై ప్రభావం చూపే ప్రమాదముంది.బహుల దేశాలు పాల్గొనే టోర్నీల్లో టీమిండియా పాక్తో తలపడనున్నా, ద్వైపాక్షిక సిరీస్లు మాత్రం ఆడదు. ఈ విషయాన్ని బీసీసీఐ ఇదివరకే స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే, ఆసియా కప్లో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. నిన్న (సెప్టెంబర్ 10) యూఏఈతో జరిగిన మ్యాచ్ను టీమిండియా 27 బంతుల్లోనే ముగించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. కుల్దీప్ యాదవ్ (2.1-0-7-4), శివమ్ దూబే (2-0-4-3), వరుణ్ చక్రవర్తి (2-0-4-1), అక్షర్ పటేల్ (3-0-13-1), బుమ్రా (3-0-19-1) ధాటికి 13.1 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. అభిషేక్ శర్మ (16 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (9 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (2 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) చెలరేగడంతో 4.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు ఇంకా అమ్ముడుపోలేదు.. ఆసక్తి తగ్గిందా..? ఆగ్రహమా..?
క్రీడ ఏదైనా భారత్, పాకిస్తాన్ సమరమంటే నెలల ముందుగానే టికెట్లు అమ్ముడుపోతుంటాయి. రేట్ ఎంతైనా కొనేందుకు అభిమానులు వెనుకాడరు. కొన్ని సందర్భాల్లో టికెట్ల ధరలు లక్షల్లో ఉన్నా జనాలు తగ్గలేదు.అయితే తాజా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. క్రికెట్ ఆసియా కప్లో భాగంగా ఈ నెల 14న దుబాయ్లో దాయాదుల పోరు జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్కు సంబంధించి ఇప్పటివరకు టికెట్లు అమ్ముడుపోలేదు.ఇందుకు విపరీతంగా పెరిగిన రేట్లు ఓ కారణమని తెలుస్తుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రెండు ప్రీమియం సీట్ల ధర రూ. 2.5 లక్షలుగా (VIP Suites East) ఉంది. - Royal Box: ₹2.30 లక్షలు- Sky Box East: ₹1.67 లక్షలు- Platinum, Lounge, Pavilion: ₹28,000-₹75,000- సాధారణ టికెట్ ధర ₹10,000గా ఉన్నాయి.ఇవి సాధారణంగా ఉండే రేట్ల కంటే చాలా ఎక్కువ. ఆర్దిక స్థితి బాగా ఉన్న అభిమానులు కూడా ఇంత రేట్లు పెట్టి టికెట్లు కొనడానికి వెనకడుగు వేస్తారు.టికెట్లు అమ్ముడుపోకపోవడానికి ఇదో కారణమైతే, భారత్-పాక్ల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు మరో కారణంగా తెలుస్తుంది. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి దాడి తర్వాత భారతీయులు ఏ విషయంలోనూ పాక్తో సంబంధాలు పెట్టుకోవాలని అనుకోవడం లేదు. ఇరు దేశాలు క్రికెట్ మ్యాచ్ల్లో తలపడటం కూడా చాలా మందికి ఇష్టం లేదు. ఈ కారణంగానే భారత్-పాక్ ఆసియా కప్ సమరంపై ఆసక్తి తగ్గి ఉంటుంది. పైగా ఆసియా కప్లో భారత్ తలపడబోయే పాక్ జట్టు గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా బలహీనంగా ఉంది. భారత అభిమానులు ఆసక్తి చూపకపోవడానికి ఇదీ ఓ కారణం కావచ్చు. ద్వితియ శ్రేణి జట్లపై గెలిచినా మజా ఉండదన్నది చాలా మంది భావన. -
మైదానంలో వాళ్లను ఆపను.. ఈసారి ఫేవరెట్ జట్టు ఏదీ లేదు: పాక్ కెప్టెన్
పొట్టి క్రికెట్ ప్రేమికులకు వినోదం పంచేందుకు ఆసియా కప్-2025 (Asia Cup 2025) టోర్నమెంట్ సిద్ధంగా ఉంది. అఫ్గనిస్తాన్- హాంకాంగ్ (AFG vs HK) మ్యాచ్తో మంగళవారం (సెప్టెంబరు 9) ఈ మెగా ఈవెంట్కు తెరలేస్తుంది. ఈ నేపథ్యంలో టోర్నీలో పాల్గొనే ఎనిమిది జట్ల కెప్టెన్లు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)తో పాటు.. రషీద్ ఖాన్ (అఫ్గనిస్తాన్), చరిత్ అసలంక (శ్రీలంక), లిటన్ దాస్ (బంగ్లాదేశ్), సల్మాన్ ఆఘా (పాకిస్తాన్), జతీందర్ సింగ్ (ఒమన్), ముహమ్మద్ వసీం (యూఏఈ), యాసిమ్ ముర్తాజా (హాంకాంగ్) విలేకరులతో ముచ్చటించారు.హుందాగా బదులిచ్చిన సూర్యఈ క్రమంలో ఆసియా కప్ తాజా ఎడిషన్ టోర్నీ విజేతగా టీమిండియా ఫేవరెట్ కదా అన్న ప్రశ్న వచ్చింది. ఇందుకు సూర్య తనదైన శైలిలో హుందాగా సమాధానమిచ్చాడు. ‘‘మీకెవరు ఈ విషయం చెప్పారు?.. నేనైతే ఎప్పుడూ వినలేదు.అయితే, సుదీర్ఘకాలంగా మేము టీ20 క్రికెట్లో ఉత్తమంగా రాణిస్తున్నాం. ఇప్పుడు కూడా టోర్నీకి పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాము’’ అని సూర్య తెలిపాడు. ఇక ఇదే ప్రశ్నకు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ఇచ్చిన సమాధానం వైరల్గా మారింది.షాకింగ్గా సల్మాన్ సమాధానంటీమిండియాను ఫేవరెట్గా భావిస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘టీ20 క్రికెట్లో గంట.. రెండు గంటల సమయంలోనే అంతా తలకిందులైపోతాయి. మ్యాచ్ రోజు ఎవరైతే గొప్పగా ఆడతారో వారిదే విజయం. అందుకే ఈ ఫార్మాట్ టోర్నీలో ఓ జట్టు ఫేవరెట్గా ఉంటుందని నేను అనుకోను’’ అని సల్మాన్ ఆఘా పేర్కొన్నాడు.మైదానంలో వాళ్లను ఆపనుఇక మైదానంలో ఫాస్ట్బౌలర్లను కట్టడి చేస్తారా అని విలేకరులు అడుగగా.. ‘‘ఫాస్ట్ బౌలర్లు అంటేనే దూకుడుగా ఉంటారు. వారిని దాని నుంచి మనం వేరుచేయలేము. ఎవరైతే మైదానంలో అగ్రెసివ్ ఉండాలనుకుంటారో వారికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.క్రీడా స్ఫూర్తికి భంగం కలగనంత వరకు స్వేచ్ఛ కొనసాగుతుంది. నా వైపు నుంచైతే ఫాస్ట్బౌలర్లపై ఎలాంటి ఆంక్షలూ ఉండవు’’ అని సల్మాన్ ఆఘా స్పష్టం చేశాడు.కాగా ఆసియా కప్-2025 టోర్నీకి ముందు పాకిస్తాన్.. యూఏఈ- అఫ్గనిస్తాన్లతో ముక్కోణపు టీ20 సిరీస్ ఆడింది. ఇందులో యూఏఈ, అఫ్గన్లపై వరుస విజయాలతో ఫైనల్ చేరింది. టైటిల్ పోరులో రషీద్ ఖాన్ బృందాన్ని ఓడించి సిరీస్ను కైవసం చేసుకుంది. తద్వారా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో పాక్ బరిలోకి దిగుతోంది.టీమిండియాదే హవాఇదిలా ఉంటే.. ఆసియా కప్ టోర్నీలో ఆది నుంచీ టీమిండియాదే హవా. ఇప్పటికి ఎనిమిది సార్లు భారత్ టైటిల్ గెలవగా.. శ్రీలంక ఆరుసార్లు చాంపియన్గా నిలిచింది. పాకిస్తాన్ రెండుసార్లు మాత్రమే ట్రోఫీని సొంతం చేసుకోగలిగింది. ఇక ఈసారి దాయాదులు భారత్- పాక్ సెప్టెంబరు 14న ముఖాముఖి తలపడనున్నాయి.చదవండి: ముందుగానే స్టేజీ దిగిపోయిన పాక్ కెప్టెన్.. సూర్య, రషీద్ ఖాన్ ఏం చేశారంటే? -
ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ఖండాంతర క్రికెట్ టోర్నమెంట్ ఆసియా కప్ (Asia Cup). ఈసారి పొట్టి ఫార్మాట్లో జరిగే ఈ ఈవెంట్లో ఎనిమిది జట్లు భాగంగా ఉన్నాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో టీమిండియా (2023 వన్డే ఫార్మాట్ విజేత) బరిలోకి దిగుతుండగా.. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఒమన్, యూఏఈ, హాంకాంగ్ కూడా పాల్గొంటున్నాయి.ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్వే అయినా.. పాక్ కూడా ఈ ఈవెంట్లో భాగమైనందున తటస్థ వేదికైన యూఏఈలో మ్యాచ్లు నిర్వహిస్తారు. మరి.. ఆసియా కప్-2025 టోర్నీ పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం, ప్రత్యక్ష ప్రసారం తదితర వివరాలు తెలుసుకుందామా!!గ్రూపులు- రెండుగ్రూప్-‘ఎ’- భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్గ్రూప్-‘బి’- శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్పూర్తి షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం👉సెప్టెంబరు 9: అఫ్గనిస్తాన్ వర్సెస్ హాంగ్కాంగ్- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 10: ఇండియా వర్సెస్ యూఏఈ- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు 👉సెప్టెంబరు 11: బంగ్లాదేశ్ వర్సెస్ హాంగ్కాంగ్- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 12: పాకిస్తాన్ వర్సెస్ ఒమన్- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 13: బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 14: ఇండియా వర్సెస్ పాకిస్తాన్- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 15: యూఏఈ వర్సెస్ ఒమన్- అబుదాబి- సాయంత్రం 5.30 నిమిషాలకు👉సెప్టెంబరు 15:శ్రీలంక వర్సెస్ హాంగ్కాంగ్- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 17: పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 18: శ్రీలంక వర్సెస్ అఫ్గనిస్తాన్- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 19: ఇండియా వర్సెస్ ఒమన్- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 20: గ్రూప్- బి టాపర్ వర్సెస్ రెండో స్థానంలో ఉన్న జట్టు (B1 Vs B2)- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 21: గ్రూప్-ఎ టాపర్ వర్సెస్ రెండో స్థానంలో ఉన్న జట్టు (A1 vs A2)- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 23: A2 vs B1- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 24: A1 vs B2- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 25: A2 vs B2- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 26: A1 vs B1- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 28: ఫైనల్- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు.జట్లు ఇవేటీమిండియాసూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.పాకిస్తాన్సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహిన్ అఫ్రిది, సూఫియాన్ మొకిమ్యూఏఈముహమ్మద్ వసీం (కెప్టెన్), అలిశాన్ షరాఫూ, ఆర్యాంశ్ శర్మ (వికెట్ కీపర్), ఆసిఫ్ ఖాన్, ధ్రువ్ పరాశర్, ఈథన్ డిసౌజా, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్దిఖీ, మతీఉల్లా ఖాన్, ముహమ్మద్ ఫారూక్, ముహమ్మద్ జవాదుల్లా, ముహమ్మద్ జోహైబ్, రాహుల్ చోప్రా (వికెట్ కీపర్), రోహిద్ ఖాన్, సిమ్రన్జీత్ సింగ్, సాఘిర్ ఖాన్.ఒమన్జతీందర్ సింగ్ (కెప్టెన్), హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా, సూఫియాన్ యూసుఫ్, ఆశిష్ ఒడెదెరా, అమీర్ కలీమ్, మహ్మద్ నదీమ్, సూఫియాన్ మెహమూద్, ఆర్యన్ బిష్త్, కరణ్ సోనావాలే, జిక్రియా ఇస్లాం, హస్నైన్ అలీ షా, ఫైసల్ షా, మహమ్మద్ ఇమ్రాన్, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాస్తవ.శ్రీలంకచరిత్ అసలంక (కెప్టెన్), కుశాల్ మెండిస్ (వికెట్కీపర్), పాతుమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా, కమిల్ మిషార, దసున్ షనక, కమిందు మెండిస్, వనిందు హసరంగ, నువానీదు ఫెర్నాండో, దునిత్ వెల్లాలగే, చమిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, మతీశ పతిరణ, నువాన్ తుషార, దుష్మంత చమీరా, బినుర ఫెర్నాండో.బంగ్లాదేశ్లిట్టన్ కుమార్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఇమాన్, సైఫ్ హసన్, తౌహిద్ హ్రిదోయ్, జాకర్ అలీ అనిక్, షమీమ్ హొస్సేన్, క్వాజీ నూరుల్ హసన్ సోహన్, షాక్ మహేదీ హసన్, రిషద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తాంజిమ్ హసన్ సకీబ్, టస్కిన్ అహ్మద్, షరీఫుల్ ఇస్లాం, షైఫ్ ఉద్దీన్స్టాండ్బై ప్లేయర్లు: సౌమ్య సర్కార్, మెహిదీ హసన్ మిరాజ్, తన్వీర్ ఇస్లాం, హసన్ మహమూద్.అఫ్గనిస్తాన్రషీద్ ఖాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, దర్విష్ రసూలీ, సెదిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీం జనత్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, షరాఫుద్దీన్ అష్రఫ్, మహ్మద్ ఇషాక్, ముజీబ్ ఉర్ రహమాన్, అల్లాహ్ గజన్ఫార్. నూర్ అహ్మద్, ఫారిక్ అహ్మద్ మాలిక్, నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూకీరిజర్వ్ ఆటగాళ్లు: వఫివుల్లా తారఖాల్, నంగ్యాల్ ఖరోటే, అబ్దుల్లా అహ్మద్జాయ్హాంకాంగ్యాసిమ్ ముర్తాజా (కెప్టెన్), బాబర్ హయత్, ఆదిల్ మెహమూద్, జీషన్ అలీ (వికెట్ కీపర్), ఎహ్సాన్ ఖాన్, అనాస్ ఖాన్, షాహిద్ వాసిఫ్ (వికెట్ కీపర్), కల్హన్ చల్లు, హరూన్ అర్షద్, నిజకత్ ఖాన్, ఆయుశ్ శుక్లా, అలీ హసన్, నస్రుల్లా రానా, ఐజాజ్ ఖాన్, ఎండీ ఘజన్ఫర్, మార్టిన్ కోయెట్జి, అతీక్ ఇక్బాల్, మహ్మద్ వాహిద్, అన్షుమన్ రథ్, కించిత్ షా.ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..ఆసియా కప్-2025 టీ20 మ్యాచ్లను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ (టీవీ)లో వీక్షించవచ్చు. డిజిటల్ యూజర్ల కోసం సోనీలివ్ వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.ప్రైజ్ మనీ ఎంతంతంటే?ఆసియాకప్-2022(టీ20 ఫార్మాట్) ఛాంపియన్స్గా నిలిచిన శ్రీలంకకు దాదాపు 200,000 డాలర్ల( సుమారు రూ. 1.6 కోట్లు) ప్రైజ్మనీ లభించింది. ఈ ఏడాది ఆసియా విజేతగా నిలిచే జట్టుకు 300,000 డాలర్లు (దాదాపు రూ. 2.6 కోట్లు) నగదు బహుమతి ఏసీసీ అందజేయనున్నట్లు సమాచారం. గత ఎడిషన్తో పోలిస్తే ఇది 50 శాతం అధికం. రన్నరప్గా నిలిచే జట్టు 150,000 డాలర్లు (సుమారు రూ. 1.3 కోట్లు) ప్రైజ్మనీ సొంతం చేసుకోనుంది. మూడు, నాలుగు స్ధానాల్లో నిలిచే జట్లు వరుసగా రూ. 80, 60 లక్షలు దక్కించుకోనున్నాయి.చదవండి: కుంబ్లేకి చెప్పి ఏడ్చాను.. అయినా పట్టించుకోలేదు.. కేఎల్ రాహుల్ కాల్ చేసి: క్రిస్ గేల్ -
Asia Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ న్యాయనిర్ణేతలు వీరే..!
ఆసియా కప్-2025లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య ఈనెల 14న జరుగనున్న గ్రూప్ స్టేజీ మ్యాచ్ కోసం న్యాయనిర్ణేతల (Match Officials) జాబితాను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్ 8) ప్రకటించింది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ హై వోల్టేజీ మ్యాచ్కు ఫీల్డ్ అంపైర్లుగా రుచిర పల్లియగురుగె (శ్రీలంక), మసుదుర్ రెహ్మాన్ (బంగ్లాదేశ్) ఎంపిక చేయబడ్డారు. వీరిద్దరికి అంతర్జాతీయ అంపైర్లుగా అపార అనుభవం ఉంది.రుచిరాకు 160కి పైగా అంతర్జాతీయ మ్యాచ్ల్లో న్యాయనిర్ణేతగా పని చేసిన అనుభవం ఉండగా.. మసుదూర్ 70కి పైగా మ్యాచ్ల్లో అంపైర్గా వ్యవహరించాడు. రుచిరా 2019 వన్డే వరల్డ్కప్, 2022 మహిళల వరల్డ్కప్ లాంటి మెగా టోర్నీల్లో పని చేయగా.. మసుదూర్ 2022 ఆసియా కప్ ఫైనల్లో అంపైర్గా వ్యవహరించాడు.భారత్, పాక్ మధ్య తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో, ఆసియా కప్ మ్యాచ్లో ఫీల్డ్ అంపైర్ల పాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే, మైదానంలో వారు తీసుకునే నిర్ణయాలు ఇరు దేశాల అభిమానుల భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయి. ఇరు జట్లకు సంబంధించి ఏ ఒక్క తప్పు నిర్ణయం తీసుకున్నా, దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.ఈ మ్యాచ్కు సంబంధించి ఐసీసీ టీవీ అంపైర్, ఫోర్త్ అంపైర్, మ్యాచ్ రిఫరీ పేర్లను కూడా ప్రకటించింది. టీవీ అంపైర్గా అహ్మద్ పక్తీన్ (ఆఫ్ఘానిస్తాన్), ఫోర్త్ అంపైర్గా ఇజతుల్లా సఫీ (ఆఫ్ఘానిస్తాన్) వ్యవహరించనున్నారు. మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ (జింబాబ్వే) ఉంటారు. -
ఖాళీ కడుపుతోనే పాక్పై సెంచరీ చేశా: వీరేంద్ర సెహ్వాగ్
ఆసియాకప్-2025కు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. సెప్టెంబర్ 9న అబుదాబి వేదికగా అఫ్గానిస్తాన్-హాంకాంగ్ మ్యాచ్తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అయితే ఈ మల్టీ నేషనల్ టోర్నమెంట్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. దాదాపు ఆరు నెలల తర్వాత క్రికెట్ మైదానంలో చిరకాల ప్రత్యర్ధులు అమీతుమీ తెల్చుకోనున్నారు.సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా దాయాదుల పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అధికారిక బ్రాడ్ కాస్టర్ సోన్ స్పోర్ట్స్ నెట్వర్క్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. పాకిస్తాన్తో తన ఆడిన రోజులను సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. పాక్పై ఓడిపోయినా ప్రతీసారి తన అసహనానికి లోనయ్యేవాడని అని అతడు తెలిపాడు. "పాకిస్తాన్పై ఓడిపోయిన ప్రతీసారి నేను కుంగిపోయేవాడిని. ఫలితంగా నా ఏకాగ్రతను కోల్పోయేవాడని. ఆ సమయంలో ప్రతిదీ కోల్పోయినట్లు అన్పించేది" అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.కాగా ఈ నజాఫ్గఢ్ నవాబుకు ప్రత్యర్ధి పాకిస్తాన్ అయితే చాలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయేవాడు. ముఖ్యంగా టెస్టుల్లో అయితే పాక్కు చుక్కలు చూపించేవాడు. సెహ్వాగ్ తన తొలి ట్రిపుల్ సెంచరీని పాక్ పైనే నమోదు చేశాడు.2008లో పాకిస్తాన్ టూర్లో కరాచీ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్లో సెహ్వాగ్ ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికి అభిమానులకు గుర్తుండిపోతుంది. 300 పరుగుల టార్గెట్ను చేధించే క్రమంలో వీరు సూపర్ సెంచరీతో చెలరేగాడు. 95 బంతుల్లోనే 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 119 పరుగులు సాధించాడు. ఈ సెంచరీ కోసం కూడా తాజా ఇంటర్వ్యూలో వీరేంద్రుడు మాట్లాడాడు."కరాచీ వన్డే రోజున నేను ఊపవాసంతో ఉన్నాను. ఖాలీ కడుపుతో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. కానీ ఆ మ్యాచ్లో పరుగులు సాధించి నా ఆకలిని తీర్చుకున్నాను" అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. -
కోహ్లి భిన్నమైన ప్లేయర్!.. కానీ టఫెస్ట్ బ్యాటర్ మాత్రం అతడే: షాహిన్ ఆఫ్రిది
పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది (Shaheen Afridi) తనకు కఠిన సవాలు విసిరిన బ్యాటర్ పేరును తాజాగా వెల్లడించాడు. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli) అందరి కంటే భిన్నమైన ఆటగాడు అని చెప్పిన షాహిన్.. అతడి కంటే ఓ సౌతాఫ్రికా బ్యాటర్కు బౌల్ చేయడం అత్యంత కష్టమని చెప్పాడు.అనతికాలంలోనే కీలక బౌలర్గా కాగా టీనేజీలోనే పాకిస్తాన్ తరఫున షాహిన్ ఆఫ్రిది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 2018లో వెస్టిండీస్తో మ్యాచ్ సందర్భంగా అరంగేట్రం చేసిన అతడు.. అనతికాలంలోనే కీలక బౌలర్గా ఎదిగాడు. ఇప్పటి వరకు పాక్ తరఫున 84 టీ20లు, 66 వన్డేలు, 31 టెస్టులు ఆడిన షాహిన్ ఆఫ్రిది.. ఆయా ఫార్మాట్లలో వరుసగా.. 107, 131, 116 వికెట్లు కూల్చాడు.ఏడేళ్ల కెరీర్లో షాహిన్ ఆఫ్రిది ఎంతో మంది మేటి బ్యాటర్లకు బౌలింగ్ చేశాడు. అయితే, ఈ లెఫ్టార్మ్ పేసర్ కేవలం ఆసియా కప్, ప్రపంచకప్ వంటి టోర్నీల్లో మాత్రమే టీమిండియా ఆటగాళ్లకు బౌల్ చేశాడు. ఈ నేపథ్యంలోనే.. తనకు కఠిన సవాలు విసిరిన బ్యాటర్ ఎవరన్న విషయంలో విరాట్ కోహ్లిని కాదని సౌతాఫ్రికా దిగ్గజం హషీమ్ ఆమ్లాకు ఓటేశాడు.టెస్టులలో ఒక్కసారి కూడా..సౌతాఫ్రికా తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి హషీమ్ ఆమ్లా 18672 పరుగులు చేశాడు. ఇందులో 55 సెంచరీలు, 80 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక ఈ మాజీ క్రికెటర్ను టెస్టుల్లో అవుట్ చేయడంలో పాతికేళ్ల షాహిన్ ఆఫ్రిది ఒక్కసారి కూడా సఫలం కాలేదు. అతడికి 31 పరుగులు సమర్పించుకున్నాడు.అదే విధంగా.. వన్డేల్లో హషీమ్ ఆమ్లాను రెండుసార్లు అవుట్ చేయగలిగిన షాహిన్ ఆఫ్రిది.. 40 పరుగులు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ పాడ్కాస్ట్లో మాట్లాడిన ఈ పాక్ పేసర్కు.. మీ కెరీర్లో ఇంత వరకు ఎదుర్కొన్న టఫెస్ట్ బ్యాటర్ ఎవరన్న ప్రశ్న ఎదురైంది.కోహ్లి భిన్నమైన ప్లేయర్!.. కానీ టఫెస్ట్ బ్యాటర్ మాత్రం అతడేఇందుకు బదులిస్తూ.. ‘‘వన్డేల్లో, టెస్టుల్లో ఆయనతో మ్యాచ్లు ఆడాను. ఇంగ్లండ్ టీ20 టోర్నీ విటలిటి బ్లాస్ట్లో కూడా ఆయనతో పోటీపడ్డాను. ఆయనొక గొప్ప బ్యాటర్. తన ప్రణాళికలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉంటాడు.అందుకే హషీం ఆమ్లానే నాకు కఠినమైన సవాలు విసిరిన బ్యాటర్ అని చెప్పగలను. ఇక విరాట్ కోహ్లి విషయానికొస్తే.. అతడొక భిన్నమైన ప్లేయర్. అయితే, నా వరకు మాత్రం హషీమ్ భాయ్ మాత్రం అందరికంటే టఫెస్ట్ బ్యాటర్’’ అని షాహిన్ ఆఫ్రిది పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం యూఏఈ పర్యటనలో జట్టుతో కలిసి ఉన్న షాహిన్.. తదుపరి ఆసియా కప్ టీ20-2025 టోర్నీలో ఆడనున్నాడు. సెప్టెంబరు 9 -28 వరకు జరిగే ఈ ఈవెంట్కు యూఏఈ వేదిక.చదవండి: భారత జట్టు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ ప్రకటన -
IND vs PAK: కేంద్రం అనుమతి.. బీసీసీఐ స్పందన ఇదే
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా- పాకిస్తాన్ (Ind vs Pak) మ్యాచ్ నిర్వహణపై సందిగ్దం పూర్తిగా తొలగిపోయింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పాక్తో క్రికెట్ మ్యాచ్కు రాజముద్ర వేసిన విషయం తెలిసిందే. తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించింది.కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఆసియా కప్ టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్ దక్కించుకుంది. కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో ఉన్న ఒప్పందం దృష్ట్యా తటస్థ వేదికపై మ్యాచ్లు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.రెండు గ్రూపులు.. ఎనిమిది జట్లుఇక సెప్టెంబరు 9- 28 మధ్య నిర్వహించే ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్.. గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ టైటిల్ కోసం పోటీపడనున్నాయి.ఇదిలా ఉంటే.. ఒకే గ్రూపులో ఉన్న భారత్- పాక్ లీగ్ దశలో ఒకసారి కచ్చితంగా ముఖాముఖి తలపడాల్సి ఉంది. సెప్టెంబరు 14న చిరకాల ప్రత్యర్థుల పోరుకు షెడ్యూల్ ఖరారైంది. ఆ తర్వాత సూపర్ ఫోర్ దశలో.. అన్నీ సజావుగా సాగితే ఫైనల్లోనూ ఈ రెండు జట్లు పోటీ పడే అవకాశం ఉంది.అనుమతినిచ్చిన కేంద్ర ప్రభుత్వం అయితే, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్తో క్రీడల్లోనూ అన్ని సంబంధాలు తెంచుకోవాలనే డిమాండ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆసియా కప్ టోర్నీలోనూ దాయాదుల పోరు ఉండబోదనే వార్తలు వచ్చాయి. అయితే, ఇదొక మల్టీలేటరల్ ఈవెంట్ (ఇతర దేశాలు కూడా పాల్గొంటున్న టోర్నీ) కావడంతో కేంద్ర ప్రభుత్వం ఇందుకు అంగీకరించింది.బీసీసీఐ స్పందన ఇదేఅయితే, ఈ విషయంపై బీసీసీఐ మాత్రం ఇంత వరకు నోరు విప్పలేదు. తాజాగా.. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించాడు. ‘‘కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించాలనేది బీసీసీఐ విధానం. ఇప్పుడు కూడా అంతే. మల్టీ నేషనల్ టోర్నమెంట్ లేదంటే అంతర్జాతీయ స్థాయి టోర్నీలో ఆడాలన్నా కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పక తీసుకుంటాం.భారత్తో సంబంధాలు బాగాలేని దేశాల జట్లతో ఆడాలా? లేదా? అన్న విషయాన్ని కూడా కేంద్రమే నిర్ణయిస్తుంది. ఆసియా కప్ టోర్నీలో కూడా వివిధ దేశాలు పాల్గొంటున్నందున మాకు అనుమతి లభించింది. ఆసియా క్రికెట్ నియంత్రణ మండలి లేదంటే అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహించే టోర్నీల్లో టీమిండియా ఆడకుండా ఉండదు కదా!ఫిఫా, ఏఎఫ్సీ.. ఇలా ఈ క్రీడలోనైనా.. మేము ప్రత్యేకంగా ఓ దేశంతో మ్యాచ్ ఆడబోమని చెబితే.. ఇండియన్ ఫెడరేషన్ మీద ఆంక్షలు విధించే అవకాశం ఉండవచ్చు’’ అని దేవజిత్ సైకియా పేర్కొన్నాడు. ద్వైపాక్షిక సిరీస్లలో మాత్రం టీమిండియా పాక్తో ఆడబోదని స్పష్టం చేశాడు.చదవండి: చిన్ననాటి గురువుకు రూ. 80 లక్షల సాయం.. హార్దిక్, కృనాల్ మంచి మనసు -
భారత్కు వచ్చేందుకు పాక్ క్రికెట్ టీమ్ నిరాకరణ..?
మహిళల వన్డే ప్రపంచ కప్ ఓపెనింగ్ సెర్మనీ కోసం పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత్లో అడుగుపెట్టేందుకు నిరాకరించినట్లు తెలుస్తుంది. ఈ టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్కు ముందు గౌహతిలోని బార్సపరా స్టేడియంలో ప్రారంభ వేడుకలు జరగాల్సి ఉన్నాయి. ఇందు కోసం టోర్నీలో పాల్గొనే జట్లన్నీ హాజరుకానున్నాయి. అయితే భారత్తో సత్సంబంధాలు లేని కారణంగా పాక్ ఈ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.ఓపెనింగ్ సెర్మనీలో ప్రముఖ బాలీవుడ్ గాయని శ్రేయా ఘోసల్తో లైవ్ పెర్ఫార్మెన్స్ ఏర్పాటు చేయబడింది. ఈ వేడుకను ఐసీసీ గ్రాండ్గా ప్లాన్ చేసింది. ఓపెనింగ్ సెర్మనీ అనంతరం కెప్టెన్ల ఫోటో షూట్, ప్రత్యేక మీడియా సమావేశం కూడా జరునున్నాయి. వీటికి కూడా పాక్ దూరం కానుందని సమాచారం.భారత్–పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు 2008 నుంచి నిలిచిపోయిన విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఈ సంబంధాలు మరింత క్షీణించాయి. బీసీసీఐ-పీసీబీ ఒప్పందం మేరకు ఇరు జట్లు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడనున్నాయి. అది కూడా తటస్ట్ వేదికల్లో మాత్రమే.త్వరలో ప్రారంభం కాబోయే వరల్డ్కప్లో పాకిస్తాన్ తమ మ్యాచ్లను శ్రీలంకలో ఆడనుంది. ఆ జట్టు అక్టోబర్ 2న తమ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడుతుంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 5న కొలొంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగనుంది. -
వన్డే వరల్డ్కప్కు టిక్కెట్లు విడుదల.. కేవలం రూ. 100 మాత్రమే
భారత్, శ్రీలంక వేదికలగా జరగనున్న మహిళల వన్డే ప్రపంచకప్-2025కు రంగం సిద్దమైంది. సెప్టెంబర్ 30 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇప్పటికే మ్యాచ్లు జరిగే వేదికలు, మ్యాచ్ షెడ్యూల్ వివరాలను ఐసీసీ వెల్లడించింది. తాజాగా ఈ వన్డే వరల్డ్కప్కు సంబంధించిన మ్యాచ్ల టికెట్లను అందుబాటులో ఉంచినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించింది. ఈ టోర్నీ మొత్తం ఐదు నగరాల్లో జరగనుంది. భారత్లోని గౌహతి, ఇండోర్, నవీ ముంబై, విశాఖపట్నం నాలుగు వేదికలు కాగా.. శ్రీలంకలోని కొలంబోని ప్రేమదాస స్టేడియం 11 మ్యాచ్లకు ఆతిథ్యమివ్వనుంది.ఐసీసీ కీలక నిర్ణయం..అయితే అభిమానులను భారీ సంఖ్యలో స్టేడియం రప్పించేందుకు అన్ని లీగ్ మ్యాచ్ల టిక్కెట్ల ధరను ఐసీసీ కేవలం రూ. 100 రూపాయలగా నిర్ణయించింది. మొదటి దశ టిక్కెట్ల అమ్మకాలు గురువారం (సెప్టెంబర్ 4) రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యాయి.అయితే ఫస్ట్ ఫేజ్లో కేవలం కేవలం గూగుల్ పే వినియోగదారులు మాత్రమే బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ ఐసీసీ ఉమెన్స్ వరల్డ్కప్కు గూగల్ గ్లోబల్ పార్టనర్గా వ్యవహరిస్తోంది. ఇక రెండో దశ సెప్టెంబర్ 9న భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. సెకెండ్ ఫేజ్లో టిక్కెట్లు మొత్తం అందరికి అందుబాటులో ఉంటాయి.కాగా కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగే పాకిస్తాన్-భారత్ మ్యాచ్కు సంబంధించిన టిక్కెట్లను ఇంకా విడుదల చేయలేదు. ఈ మ్యాచ్తో పాటు బంగ్లాదేశ్ vs పాకిస్తాన్, ఆస్ట్రేలియా vs శ్రీలంక టిక్కెట్లను కూడా ఇంకా అందుబాటులో ఉంచలేదు.కాగా ఈ టోర్నీ తొలి మ్యాచ్లో సెప్టెంబర్ 30ను గౌహతి వేదికగా భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు ముందు గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీని నిర్వహించనున్నారు. ఈ ఆరంభ వేడుకల్లో స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ సందడి చేయనుంది. వరల్డ్కప్ టిక్కెట్లు ఇంత తక్కువ ధరకు విక్రయించడం ఇదే తొలిసారి.చదవండి: గంభీర్, సెహ్వాగ్, భజ్జీ.. అంతా బాధితులే: ధోనిపై మరోసారి యువీ తండ్రి ఫైర్ -
ఆసియా కప్-2025 విజేతలుగా మనోళ్లే.. కానీ ఆ జట్టుతో జాగ్రత్త!
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ రూపంలో మినీ క్రికెట్ సంగ్రామం అభిమానులకు కావాల్సినంత మజా పంచనుంది. ఈసారి పొట్టి ఫార్మాట్లో నిర్వహించే ఈ ఖండాంతర టోర్నీకి సెప్టెంబరు 9న తెరలేవనుంది. ఆతిథ్య హక్కులు భారత్వే అయినా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో గత ఒప్పందం దృష్ట్యా తటస్థ వేదికైన యూఏఈలో ఆసియా కప్ ఈవెంట్ జరుగనుంది.పాకిస్తాన్ను చిత్తు చేసిగ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్.. గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ ఈ టోర్నీలో తలపడనున్నాయి. కాగా చివరగా 2022లో టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ జరుగగా.. నాటి ఫైనల్లో శ్రీలంక పాకిస్తాన్ను చిత్తు చేసి టైటిల్ గెలిచింది. ఆనాడు రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా సూపర్ ఫోర్ దశలో ఊహించని రీతిలో పాకిస్తాన్, శ్రీలంక చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది.ప్రపంచకప్ టోర్నీలో సత్తా చాటిన భారత్అయితే, ఆ చేదు జ్ఞాపకాన్ని చెరిపివేసేలా రోహిత్ సేన.. టీ20 ప్రపంచకప్-2024 (T20 World Cup) ట్రోఫీని సొంతం చేసుకుంది. టోర్నీ ఆసాంతం అజేయంగా నిలిచి టైటిల్ను గెలుచుకుంది. ఈ టోర్నీలో పాక్ కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. అంతేకాదు.. అమెరికా వంటి పసికూన చేతిలో ఓడి ఓటమిపాలైంది.చాంపియన్స్ ట్రోఫీ కూడా టీమిండియాదేఇదిలా ఉంటే.. గత ఆసియా కప్-2023 టోర్నీ వన్డే ఫార్మాట్లో జరుగగా రోహిత్ సేన విజేతగా నిలిచింది. అనంతరం సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023లో అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియా.. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై రన్నరప్తో సరిపెట్టుకుంది. అయితే, యాభై ఫార్మాట్లోనే జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో రోహిత్ సేన టైటిల్ గెలిచి సత్తా చాటింది.పాకిస్తాన్ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వగా తటస్థ వేదికైన దుబాయ్లో టీమిండియా తమ మ్యాచ్లు ఆడింది. ఈ టోర్నీలో పాక్ జట్టు గెలుపున్నదే లేకుండా నిష్క్రమించగా.. శ్రీలంక అసలు ఈ ఈవెంట్కు అర్హతే సాధించలేదు. మరోవైపు.. బంగ్లాదేశ్ కూడా వరుస ఓటములతో ఇంటిబాట పట్టింది.అఫ్గనిస్తాన్ అద్భుత ప్రదర్శనలుఅయితే, టీ20 ప్రపంచకప్-2024లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి పటిష్ట జట్లను ఓడించడంతో పాటు.. సెమీస్ చేరి అఫ్గనిస్తాన్ సంచలనం సృష్టించింది. అంతేకాదు.. వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా తొలిసారి పాకిస్తాన్ను ఓడించి సెమీ ఫైనల్ దగ్గరగా వచ్చింది.కానీ.. ఆఖరి నిమిషంలో ఒత్తిడిలో చిత్తై లీగ్ దశలోనే నిష్క్రమించినా.. తొలిసారి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి మాత్రం అర్హత సాధించింది అఫ్గన్ జట్టు. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ను ఓడించి సత్తా చాటింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మదన్ లాల్ ఆసియా కప్ విజేత ఎవరన్న అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.విజేత టీమిండియానే.. కానీ ఆ జట్టుతో జాగ్రత్త‘‘టీమిండియా అద్భుత నైపుణ్యాలు గల జట్టు. కచ్చితంగా హాట్ ఫేవరెట్ టీమిండియానే. అయితే, టీ20 ఫార్మాట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ ప్రదర్శనలను ఓసారి పరిశీలించాలి.ముఖ్యంగా అఫ్గనిస్తాన్. గత కొన్నాళ్లుగా ఈ ఫార్మాట్లో వాళ్లు అద్భుత విజయాలు అందుకుంటున్నారు. కచ్చితంగా పాకిస్తాన్కు అఫ్గనిస్తాన్ గట్టి పోటీ ఇస్తుంది. అఫ్గన్ల ఆత్మవిశ్వాసం, ఫామ్ అసాధారణంగా ఉన్నాయి.కాబట్టి శ్రీలంక, బంగ్లాదేశ్లతో పాటు అఫ్గనిస్తాన్ను కూడా ఈ టోర్నీలో స్ట్రాంగ్ కంటెండర్గా పేర్కొనవచ్చు’’ అని వార్తా సంస్థ ANIతో మదన్ లాల్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా సెప్టెంబరు 9న అఫ్గనిస్తాన్- హాంకాంగ్ మ్యాచ్తో మొదలయ్యే ఆసియా కప్-2025 టోర్నీ సెప్టెంబరు 28న ఫైనల్తో ముగుస్తుంది.చదవండి: ఇంకెంత రెస్ట్ కావాలి: రోహిత్పై గంభీర్ ఫైర్.. నాడు.. -
నేను.. రోహిత్ ఘోరంగా ఢీకొట్టుకున్నాం.. ఆరోజు ధోని ఫైర్: కోహ్లి
భారత క్రికెట్లో ఈ ముగ్గురు ఆటగాళ్లు ఎవరివారే ప్రత్యేకం. మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఘనుడు. విరాట్ కోహ్లి (Virat Kohli).. టెస్టుల్లో టీమిండియాను అగ్రపథాన నిలిపిన సారథి.. సచిన్ టెండుల్కర్ తర్వాత అత్యధిక సెంచరీల వీరుడిగా చెరగని రికార్డు..రోహిత్ శర్మ (Rohit Sharma).. హిట్మ్యాన్గా గుర్తింపు.. వన్డే, టీ20లలో తిరుగులేని బ్యాటర్.. కెప్టెన్గా భారత్కు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన నాయకుడు. అయితే, కోహ్లి, రోహిత్ తొలినాళ్లలో ధోని సారథ్యంలోనే ఆడారు. అతడి నాయకత్వంలోనే రోహిత్ ఓపెనర్గా ప్రమోట్ అయితే.. కోహ్లి నాడు భవిష్య కెప్టెన్గా ఎదిగాడు.నాడు పాకిస్తాన్తో టీమిండియా మ్యాచ్ఆసియా టీ20 కప్-2025 సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ముగ్గురికి సంబంధించిన ఓ పాత ఘటన తాజాగా వైరల్ అవుతోంది. ఆసియా వన్డే కప్-2012లో భాగంగా నాడు టీమిండియా పాకిస్తాన్తో తలపడింది. ఆరోజు 231/2తో పటిష్టంగా ఉన్న పాక్ జట్టు.. భారీ స్కోరు దిశగా పయనిస్తుండగా.. కోహ్లి- రోహిత్ వల్ల తప్పిదం జరిగింది.ఒకరినొకరు ఢీకొట్టుకుని కిందపడిపోయారుటీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో..38 ఓవర్ తొలి బంతిని ఉమర్ అక్మల్ బౌండరీ దిశగా తరలించాడు. బంతిని ఆపే క్రమంలో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి- రోహిత్ బలంగా ఒకరినొకరు ఢీకొట్టుకుని కిందపడిపోయారు. ఫలితంగా పాక్కు అదనంగా మరో రెండు పరుగులు.. మొత్తంగా త్రీ రన్స్ వచ్చాయి.ధోనికి చాలా కోపం వచ్చిందిదీంతో కెప్టెన్ ధోని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటన గురించి 2020లో అశ్విన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లి మాట్లాడాడు. ‘‘ఆరోజు ఎంఎస్ ఏమాత్రం సంతోషంగా లేడు. అప్పుడు తనకి చాలా కోపం వచ్చింది. వాళ్లు భారీ భాగస్వామ్యాలు నెలకొల్పుతున్నారు. మన వల్ల అదనపు పరుగులు కూడా వస్తున్నాయి.అప్పుడు వాళ్లకు ఒక్క పరుగే రావాల్సింది. కానీ మనం మూడు ఇచ్చాము. ఇర్ఫాన్ బంతి వెంట నెమ్మదిగా పరిగెడుతూ ధోని వైపు త్రో చేశాడు. అప్పుడు ఎంఎస్.. ‘అసలు వీళ్లిద్దరు అలా ఎలా ఢీకొట్టుకున్నారు. మూడు పరుగులు ఎలా ఇచ్చారు’ అన్నట్లుగా ముఖంలో భావాలు పలికించాడు.ఆరోజు నేను మిడ్ వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా.. రోహిత్ డీప్ స్వ్కేర్ లెగ్లో ఉన్నాడు. ఇద్దరమూ బంతిని పట్టుకోవాలని పరిగెత్తాము. ఇంతలో నా తల కుడి భాగం అతడి భుజానికి బలంగా తాకింది. అప్పటికి అదేమీ సీరియస్ అనిపించలేదు.కానీ ఐదు నిమిషాల తర్వాత అసలేం జరిగిందో మాకు అర్థమైంది’’ అని కోహ్లి గుర్తుచేసుకున్నాడు. కాగా నాటి మ్యాచ్లో పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. ఛేజింగ్ ‘కింగ్’ భారీ సెంచరీఇక లక్ష్య ఛేదనలో ఆకాశమే హద్దుగా చెలరేగిన కోహ్లి 148 బంతుల్లో 183 పరుగులు సాధించి.. టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. సచిన్ టెండుల్కర్తో కలిసి రెండో వికెట్కు 133 పరుగులు జోడించిన కోహ్లి.. రోహిత్తో కలిసి 172 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా.. ఆరు వికెట్లు మిగిలి ఉండగానే.. 48 ఓవర్లలో భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. నాటి మ్యాచ్లో కోహ్లి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.చదవండి: తప్పుకొన్న తిలక్ వర్మ.. జట్టులోకి గుంటూరు కుర్రాడు -
ఆసియా కప్-2025: కీలక అప్డేట్.. ఆ ఒక్కటి మినహా..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా సెప్టెంబరు 9న ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈ ఈవెంట్లో ఎనిమిది జట్లు పాల్గొంటుండగా.. మొత్తంగా 19 మ్యాచ్లు జరుగనున్నాయి.గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, ఒమన్, యూఏఈ.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ అమీతుమీ తేల్చుకుంటాయి. కాగా ఈ టోర్నీలో మ్యాచ్లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7. 30 నిమిషాలకు ఆరంభం కావాల్సింది. అయితే, తాజాగా మ్యాచ్ ఆరంభ సమయంలో మార్పులు చేస్తున్నట్లు యూఏఈ క్రికెట్ ప్రకటించింది.ఫైనల్తో సహా..ఆసియా కప్-2025 టోర్నీలో 19 మ్యాచ్లకు గానూ.. 18 మ్యాచ్లు (ఫైనల్తో సహా) భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఆరంభమవుతాయి. సెప్టెంబరులో యూఏఈలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బ్రాడ్కాస్టర్ల అభ్యర్థన మేరకు యూఏఈ క్రికెట్ ఈ మేరకు మ్యాచ్ సమయాల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.కాగా సెప్టెంబరు 15న అబుదాబిలోని జాయేద్ క్రికెట్ స్టేడియంలో యూఏఈ- ఒమన్ మధ్య జరిగే మ్యాచ్ టైమింగ్లో మాత్రం మార్పులేదు. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 9న అఫ్గనిస్తాన్- హాంకాంగ్ మధ్య మ్యాచ్తో ఆసియా కప్ టోర్నీకి తెరలేవనుంది. సెప్టెంబరు 28న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.లీగ్ దశ షెడ్యూల్👉సెప్టెంబరు 9: అఫ్గనిస్తాన్ వర్సెస్ హాంగ్కాంగ్- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 10: ఇండియా వర్సెస్ యూఏఈ- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు 👉సెప్టెంబరు 11: బంగ్లాదేశ్ వర్సెస్ హాంగ్కాంగ్- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 12: పాకిస్తాన్ వర్సెస్ ఒమన్- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 13: బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 14: ఇండియా వర్సెస్ పాకిస్తాన్- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 15: యూఏఈ వర్సెస్ ఒమన్- అబుదాబి- సాయంత్రం 5.30 నిమిషాలకు👉సెప్టెంబరు 15:శ్రీలంక వర్సెస్ హాంగ్కాంగ్- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 17: పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 18: శ్రీలంక వర్సెస్ అఫ్గనిస్తాన్- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 19: ఇండియా వర్సెస్ ఒమన్- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకుసూపర్ 4 దశ👉సెప్టెంబరు 20: గ్రూప్- బి టాపర్ వర్సెస్ రెండో స్థానంలో ఉన్న జట్టు (B1 Vs B2)- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 21: గ్రూప్-ఎ టాపర్ వర్సెస్ రెండో స్థానంలో ఉన్న జట్టు (A1 vs A2)- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 23: A2 vs B1- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 24: A1 vs B2- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 25: A2 vs B2- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 26: A1 vs B1- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 28: ఫైనల్- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు.చదవండి: రాజస్తాన్ రాయల్స్కు ద్రవిడ్ గుడ్బై.. అధికారిక ప్రకటన విడుదల -
భారత్-పాక్ మ్యాచ్.. టిక్కెట్ ధర ఎన్ని లక్షలంటే?
క్రికెట్ మైదానంలో భారత్-పాకిస్తాన్ మధ్య యుద్దానికి సమయం అసన్నమవుతోంది. ఆసియాకప్-2025లో భాగంగా దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థులు అమీతుమీ తెల్చుకోన్నారు. ఈ దాయుదుల పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ హై వోల్టేజ్ మ్యాచ్ను చాలా మంది ఫ్యాన్స్ నేరుగా స్టేడియంకు వెళ్లి వీక్షించేందుకు ఆసక్తిచూపుతున్నారు. దీంతో భారత్-పాక్ మ్యాచ్ క్రేజుని బ్లాక్ మార్కెట్లు సొమ్ముచేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. బ్లాక్ మార్కెట్లో ఒక్కో టిక్కెట్ ధర ఏకంగా రూ.15.75 లక్షలు పలికినట్లు తెలుస్తోంది.అయితే ఈ మ్యాచ్కు సంబంధించిన టిక్కెట్ల అమ్మకాలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇంకా ప్రారంభించలేదు. ఒకట్రెండు రోజుల్లో టిక్కెట్ల విక్రయాలను ప్రారంభించే అవకాశముంది. కానీ కొన్ని థర్డ్ పార్టీ వెబ్సైట్లు మాత్రం కచ్చితంగా టిక్కెట్లు ఇస్తామని అభిమానుల నుంచి భారీ మొత్తాన్ని వసులు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు సైతం స్పందించింది.ఆసియాకప్ టిక్కెట్లను ఇంకా రిలీజ్ చేయలేదు. రెండు రోజుల్లో టిక్కెట్ల అమ్మకం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అభిమానులు అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే టిక్కెట్లు కొనుగోలు చేయాలి. అనాధికరిక వెబ్సైట్లలో టికెట్లను కొని మోసపోవద్దు అని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఓ ప్రకటనలో పేర్కొంది.🎟️ ATTENTION FANS 🎟️An important update regarding tickets for the DP World Asia Cup 2025.#ACC pic.twitter.com/CYe4k0fRFi— AsianCricketCouncil (@ACCMedia1) August 19, 2025ఈ ఆసియాకప్లో భారత్-పాక్ జట్లు మూడు సార్లు తలపడే అవకాశముంది. లీగ్ స్టేజితో పాటు సూపర్-4లోనూ దాయాదులు ముఖాముఖి తలపడే ఛాన్స్ ఉంది. ఈ రెండు జట్లే ఫైనల్ చేరితే సెప్టెంబర్ 28న మరోసారి ముచ్చటగా మూడో సారి భారత్, పాక్ మ్యాచ్ జరగుతోంది.మరోవైపు పెహల్గమ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తమయ్యాయి. దీంతో ఆసియాకప్లో పాక్తో మ్యాచ్ను భారత్ బహిష్కిరించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి.కానీ విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) నుండి బీసీసీఐకి అనుమతి లభించింది. దీంతో భారత్-పాక్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరగనుంది.చదవండి: కోహ్లి, గిల్ కాదు.. అతడికి బౌలింగ్ చేయడం కష్టం: ఇంగ్లండ్ స్టార్ పేసర్ -
మా ప్రిపరేషన్స్ ముగిశాయి.. టీమిండియాతో మ్యాచ్కు సిద్దం: పాక్ క్రికెటర్
ఆసియాకప్-2025 కౌంట్డౌన్ ప్రారంభమైంది. సెప్టెంబర్ 9 నుండి 28 వరకు యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. అయితే ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గోంటున్నప్పటికి అందరి దృష్టి పాకిస్తాన్-భారత్ టీమ్స్ పైనే ఉంది. ఈ రెండు జట్లు ఎప్పెడ్పుడా తలపడతాయా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదుచూస్తున్నారు.వారి నిరీక్షణకు మరో రెండు వారాల్లో తెరడపడనుంది. సెప్టెంబర్ 14న అబుదాబి వేదికగా చిరకాల ప్రత్యర్ధులు భారత్-పాక్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ ఏషియన్ క్రికెట్ టోర్నీ కోసం పాకిస్తాన్ జట్టు అన్ని విధాల సిద్దమవుతోంది. ఇప్పటికే యూఏఈ గడ్డపై అడుగు పెట్టిన పాక్ జట్టు.. తమ ప్రాక్టీస్ను కూడా ముగించింది.ఆసియాకప్ సన్నాహాకల్లో భాగంగా మెన్ ఇన్ గ్రీన్.. యూఏఈ, అఫ్గాన్ జట్లతో టైసిరీస్లో తలపడనుంది. ఈ ముక్కోణపు టీ20 ట్రై సిరీస్ ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 7 వరకు జరగనుంది. అక్కడికి ఒక్క రోజు తర్వాత ఆసియాకప్ ప్రారంభం కానుంది. ఇక ఈ ఆసియాకప్ ప్రిపరేషన్స్పై పాకిస్తాన్ యువ సంచలనం హసన్ నవాజ్ అప్డేట్ ఇచ్చాడు. ఈ టోర్నీ కోసం తమ సన్నాహకాలు ముగిశాయి, గెలిచేందుకు అన్నివిధాల ప్రయత్నిస్తామని నవాజ్ చెప్పుకొచ్చాడు."ఆసియాకప్ కోపం మా ప్రిపరేషన్స్ ముగిశాయి. సాధరణంగా ప్రతీ మ్యాచ్లోనూ ఒత్తిడి ఉంటుంది. కానీ మేము ఆటను ఆస్వాదించేందుకు ప్రయత్నిస్తాము. ప్రతీ మ్యాచ్ను ఒక ఛాలెంజ్గా తీసుకుని ముందుకు వెళ్తాము. ఇక భారత్-పాక్ మ్యాచ్ గురించి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు.ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడినా భారీ అంచనాలు నెలకొంటాయి. అయితే మేము మాత్రం ఎటువంటి ఒత్తిడి తీసుకోకుండా మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయాలనుకుంటున్నాము. యూఏఈ కండీషన్స్లో బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. ప్రతీ బంతిని బౌండరీకి తరలించేలా ఇక్కడి పిచ్లు లేవు. బంతిని సరిగ్గా అంచనా వేసి ఆడాలి. ప్రతీ బంతికి సిక్స్ కొట్టడం నా ఉద్దేశ్యం కాదు.కాస్త దూకుడుగా ఆడి ప్రత్యర్ధి బౌలర్లపై ఒత్తిడి తీసుకు రావాలన్నదే నా ప్లాన్. కోచ్ మైక్ హెస్సన్ నుండి నేను చాలా నేర్చుకున్నాను. అతడు మాకు అన్ని విధాలగా సపోర్ట్గా ఉంటున్నాడు" అని జియో సూపర్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నవాజ్ పేర్కొన్నాడు. కాగా ఈ టోర్నీలో పాక్ తమ తొలి మ్యాచ్లో సెప్టెంబర్ 11న ఒమన్తో తలపడనుంది.చదవండి: నేను ఆడడం ఎవరికైనా సమస్యా? నా రిటైర్మెంట్ అప్పుడే: షమీ -
పాక్, భారత్, శ్రీలంక కాదు.. ఆసియాకప్ గెలిచేది వాళ్లే: పాక్ మాజీ క్రికెటర్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఆసియాకప్-2025 మరో పది రోజుల్లో షూరూ కానుంది. తొలి మ్యాచ్లో సెప్టెంబర్ 9న అబుదాబి వేదికగా అఫ్గానిస్తాన్, హాంకాంగ్ జట్లు తలపడనున్నాయి. మొత్తం ఈ టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గోనున్నాయి.డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టీమిండియా బరిలోకి దిగనుంది. ఇప్పటికే ఖండంతర టోర్నీ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు. ఓ మల్టీ నేషనల్ టోర్నమెంట్లో భారత జట్టు కెప్టెన్గా సూర్య వ్యవహరించడం ఇదే మొదటి సారి. ఈ మెగా ఈవెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్లో సెప్టెంబర్ 10న దుబాయ్ వేదికగా యూఏఈ జట్టుతో తలపడనుంది. అనంతరం సెప్టెంబర్ 14 హైవోల్టేజ్ మ్యాచ్లో పాకిస్తాన్ను భారత్ ఢీకొట్టనుంది. ఈ టోర్నమెంట్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ ఒకటి కంటే ఎక్కువసార్లు ముఖాముఖి తలపడే అవకాశముంది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియాకప్ టోర్నీలో క్రికెట్కు ప్రాధాన్యం ఇవ్వకుండా, తమ లాభాలను పెంచుకోవడమే కోసం బ్రాడ్కాస్టర్లు ప్రయత్నిస్తున్నారని అలీ మండిపడ్డాడు."క్రికెట్ ప్రస్తుతం డబ్బు సంపాదించే ఆటగా మరిపోయింది. నిజంగా ఇది దురదృష్టకరం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్రాంచైజ్ లీగ్లలో వ్యాపార ప్రయోజనాలకు అగ్రస్ధానం ఇస్తుండగా.. ఆ తర్వాత రెండో స్ధానం క్రికెట్కు ఇస్తున్నారు. ఇప్పుడు ఆసియాకప్లో కూడా అదే జరుగుతుంది.ఈ టోర్నీలో పాకిస్తాన్, భారత్, శ్రీలంక గెలవదు. నిజమైన విజేతలు బ్రాడ్కాస్టర్లు అవుతారు. ఏ నిర్ణయమైనా మైదానంలో ఆటగాళ్లు కాదు, బ్రాడ్ కాస్టర్లే తీసుకుంటారు" అని ఓ ఛానల్కు ఇచ్చిన అలీ పేర్కొన్నాడు. కాగా పెహల్గమ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తమయ్యాయి. దీంతో ఆసియాకప్లో పాక్తో మ్యాచ్ను భారత్ బహిష్కిరించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. కానీ విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) నుండి బీసీసీఐకి అనుమతి లభించింది. దీంతో భారత్-పాక్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరగనుంది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నిల్ ఇచ్చినప్పటికి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అనేక మంది మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. అదేవిధంగా పాక్-భారత్ మ్యాచ్కు సంబంధించి అధికారిక బ్రాడ్ క్రాస్టర్ సోనీ నెట్వర్క్ ఓ ప్రోమో విడుదల చేసింది. దీంతో సోనీపై కూడా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.చదవండి: DPL: బౌలర్లు ఇక కాస్కోండి.. జూనియర్ సెహ్వాగ్ వచ్చేస్తున్నాడు! వీడియో -
ఆసియా కప్-2025: ఒమన్ జట్టు ప్రకటన.. కెప్టెన్ మనోడే
ఆసియా కప్-2025 టోర్నమెంట్కు ఒమన్ తమ క్రికెట్ జట్టును ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగే ఈ ఈవెంట్కు పదిహేడు మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం వెల్లడించింది. ఈ జట్టుకు ఓపెనింగ్ బ్యాటర్ జతీందర్ సింగ్ (Jatinder Singh) కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.కొత్తగా నలుగురు.. కెప్టెన్ మనోడేఇక ఆసియా కప్ ఆడబోయే ఒమన్ జట్టులో జితేందర్ (పంజాబ్లోని లుథియానాలో జన్మించాడు)తో పాటు వినాయక్ శుక్లా, సమయ్ శ్రీవాస్తవ, ఆర్యన్ బిస్త్ తదితర భారత సంతతి ఆటగాళ్లు ఉన్నారు. మరోవైపు.. సూఫియాన్ యూసఫ్, జిక్రియా ఇస్లాం, ఫైజల్ షా, నదీం ఖాన్ కొత్తగా ఈ టీ20 జట్టులోకి వచ్చారు.ఇదే తొలిసారిఇదిలా ఉంటే.. ఒమన్ ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఒమన్ హెడ్కోచ్ దులీప్ మెండిస్ మాట్లాడుతూ.. ‘‘ఆసియా కప్ వంటి ప్రధాన టోర్నీలో ఆడటం మా జట్టుకు లభించిన గొప్ప అవకాశం.గ్లోబల్ వేదిక మీద మా నైపుణ్యాలు ప్రదర్శించే ఛాన్స్ దక్కినందుకు సంతోషంగా ఉంది.భారత్, పాకిస్తాన్ వంటి జట్లతో ఆడటం అద్భుతమైన అవకాశం. టీ20 మ్యాచ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఒక్క మ్యాచ్ కూడా మా రాతను మార్చేయవచ్చు.మా జట్టులో అనుభవజ్ఞులతో పాటు యువకులు కూడా ఉన్నారు. ఈ టోర్నీలో పాల్గొనడం ద్వారా మా ఆటగాళ్ల ఆత్మవిశ్వాసంతో పాటు మానసిక దృఢత్వం కూడా మరింతగా పెరుగుతుంది’’ అని హర్షం వ్యక్తం చేశాడు.ఎనిమిది జట్లుకాగా ఆసియా కప్-2025 ఈవెంట్లో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ పోటీపడతాయి. ఇక ఈ టోర్నీలో సెప్టెంబరు 12న ఒమన్ తమ తొలి మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడుతుంది. సెప్టెంబరు 15న యూఏఈతో మ్యాచ్ ఆడనుండగా.. సెప్టెంబరు 19న టీమిండియాను ఢీకొడుతుంది.ఇదిలా ఉంటే.. ఆసియా కప్-2025 టోర్నీకి ఇప్పటికే భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ తమ జట్లను ప్రకటించగా... తాజాగా ఒమన్ కూడా ఈ జాబితాలో చేరింది. కాగా సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.ఆసియా కప్-2025 టోర్నమెంట్కు ఒమన్ జట్టుజతీందర్ సింగ్ (కెప్టెన్), హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా, సూఫియాన్ యూసుఫ్, ఆశిష్ ఒడెదెరా, అమీర్ కలీమ్, మహ్మద్ నదీమ్, సూఫియాన్ మెహమూద్, ఆర్యన్ బిష్త్, కరణ్ సోనావాలే, జిక్రియా ఇస్లాం, హస్నైన్ అలీ షా, ఫైసల్ షా, మహమ్మద్ ఇమ్రాన్, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాస్తవ.చదవండి: ఒక్క సిక్స్తో అంతా తలకిందులయ్యేది.. అప్పుడు నేను..: సిరాజ్ -
'టీమిండియాపై విజయం మాదే'.. మీకు అంత సీన్ లేదులే! పాక్ బౌలర్కు కౌంటర్
ఆసియాకప్-2025 సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురుచుస్తోంది. సెప్టెంబర్ 14న దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్ధులు భారత్, పాక్ అమీతుమీ తెల్చుకోనున్నాయి.ఈ ఆసియా జెయింట్స్ పోరు కోసం ఇరు దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. భారత జట్టు సూర్యకుమార్ కుమార్ యాదవ్ సారథ్యంలో ఈ టోర్నీ బరిలోకి దిగనుండగా.. ప్రత్యర్ధి పాక్ జట్టు సల్మాన్ అలీ అఘా కెప్టెన్సీలో ఆడనుంది. ఈ ఈవెంట్ కోసం పాక్ తమ సన్నాహకాలను ప్రారంభించింది. ఆసియాకప్ ఆరంభానికి ముందు యూఏఈ, అఫ్గానిస్తాన్లతో పాక్ ట్రైసిరీస్ ఆడనుంది. ప్రస్తుతం పాక్ జట్టు దుబాయ్లోని ఐసీసీ ఆకాడమీలో తీవ్రంగా శ్రమిస్తోంది. కాగా ఆసియాకప్లో భారత్-పాక్ జట్లు రెండు సార్లు తలపడే అవకాశముంది. మెన్ ఇన్ బ్లూ, మెన్ ఇన్ గ్రీన్ గ్రూపు-ఎలో ఉన్నాయి. ఈ రెండు జట్లు సూపర్ 4కి అర్హత సాధించి సెకెండ్ రౌండ్లో మళ్లీ తలపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రౌఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాతో జరిగే రెండు మ్యాచ్ల్లో విజయం తమదే థీమా వ్యక్తం చేశాడు."ఐసీసీ ఆకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్న హ్యారీస్ రవూఫ్ను ఓ అభిమాని భారత్-పాకిస్తాన్ మ్యాచ్ గురించి అడిగాడు. భారత్ జరిగే రెండు మ్యాచ్ల్లో గెలుపు మాదే అంటూ రవూఫ్ బదలిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రవూఫ్ కౌంటిరిస్తున్నారు. మీకు అంత సీన్ లేదులే ముందు యూఏఈ పై గెలవండి అంటూ" ఓ యూజర్ ఎక్స్లో పోస్ట్ చేశాడు. కాగా గ్రూపు-ఎలో భారత్, పాక్తో పాటు యూఈఏ, ఒమన్ కూడా ఉన్నాయి. ఇక ఆసియాకప్ లో పాక్పై భారత్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది.ఆసియాకప్ టోర్నీ(వన్డే, టీ20)లో దాయాదులు ఇప్పటివరకు ముఖాముఖి 18 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా పదింట విజయం సాధించగా.. పాక్ ఆరు మ్యాచ్ల్లో గెలుపొందింది. మరో రెండు మ్యాచ్లు డ్రాగా ముగిశాయి.ఆసియా కప్ కోసం భారత జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివం దూబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా మరియు రింకు సింగ్.ఆసియా కప్ కోసం పాకిస్తాన్ జట్టుసల్మాన్ ఆగా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారిస్ (వికెట్ కీపర్), హారిస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం, సాహిబ్జాదా ఫర్హాన్, సామ్ అయూబ్, సల్మాన్ మిర్జా, షాహీన్ అఫ్రిది ,సుఫియాన్ ముఖీమ్.చదవండి: 1258 బంతులు.. 521 పరుగులు.. ఆ స్టయిలే వేరు!.. వారసుడు ఎవరో? -
ODI World Cup 2025: పాకిస్తాన్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
భారత్, శ్రీలంక వేదికలగా జరగనున్న మహిళల వన్డే ప్రపంచకప్-2025 కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్రకటించింది. ఈ జట్టుకు సీనియర్ ఆల్రౌండర్ ఫాతిమా సనా నాయకత్వం వహించనుంది. ఐసీసీ టోర్నీల్లో పాక్ జట్టు కెప్టెన్గా ఫాతిమా సనా వ్యవహరించడం ఇదే తొలిసారి.అదే విధంగా నటాలియా పర్వైజ్, రమీన్ షమీమ్, సదాఫ్ షమాస్, సాదియా ఇక్బాల్, షావాల్ జుల్ఫికర్ వంటి యంగ్ ప్లేయర్లు తొలిసారి వన్డే ప్రపంచకప్లో పాక్ తరపున ఆడనున్నారు. డయానా బేగ్, ఒమైమా సోహైల్ వంటి సీనియర్ ప్లేయర్లు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.సెప్టెంబర్ 30న ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నమెంట్లో పాకిస్తాన్ మహిళల జట్టు తమ అన్ని మ్యాచ్లను కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆడనుంది. అదేవిధంగా ఆక్టోబర్ 5న కొలంబో వేదికగా భారత్-పాక్ జట్లు తలపడనున్నాయి.ఈ మెగా ఈవెంట్ కోసం భారత జట్టును ఇప్పటికే బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. హర్మాన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు తమ తొలి మ్యాచ్లో సెప్టెంబర్ 30న గౌహతి వేదికగా శ్రీలంకతో ఆడనుంది.మహిళల వన్డే ప్రపంచకప్కు పాక్ జట్టుఫాతిమా సనా (కెప్టెన్), మునీబా అలీ సిద్ధిఖీ (వైస్ కెప్టెన్), అలియా రియాజ్, డయానా బేగ్, ఎమాన్ ఫాతిమా, నష్రా సుంధు, నటాలియా పర్వైజ్, ఒమైమా సొహైల్, రమీన్ షమీ, సదాఫ్ షమాస్, సాదియా ఇక్బాల్, షావాల్ జుల్ఫికర్, సిద్రా అమిన్ (సిద్రా అమీన్ మరియు) అరూబ్ షానాన్-ట్రావెలింగ్ రిజర్వ్లు: గుల్ ఫిరోజా, నజిహా అల్వీ, తుబా హసన్, ఉమ్-ఎ-హని మరియు వహీదా అక్తర్వన్డే వరల్డ్కప్-2025 టోర్నీకి భారత మహిళా క్రికెట్ జట్టుహర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, యస్తిక భాటియా, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రిచా ఘోష్, అమన్జోత్ కౌర్, రాధ యాదవ్, రేణుక ఠాకూర్, శ్రీచరణి, స్నేహ్ రాణా. స్టాండ్బై: సయాలీ సత్ఘరే, తేజల్ హసబ్నిస్, ప్రేమ రావత్, ప్రియా మిశ్రా, ఉమా ఛెత్రి, మిన్ను మణి -
షాకింగ్.. ఆసియాకప్ ఫైనల్లో ఒక్కసారి కూడా తలపడని భారత్-పాక్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఆసియాకప్-2025కు సమమయం దగ్గరపడుతోంది. ఈ ఆసియా సింహాల పోరు సెప్టెంబర్ 9నంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో ప్రారంభం కానుంది. ఈ ఖండంతర టోర్నీ కోసం అన్ని జట్లు తమ సన్నహాకాలను ప్రారంభించాయి.ఇప్పటికే భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. భారత జట్టులో శ్రేయస్ అయ్యర్, యశస్వి జైశ్వాల్ వంటి స్టార్ ప్లేయర్లు, పాక్ జట్టులో మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం వంటి సీనియర్ ప్లేయర్లు పేర్లు లేకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక టోర్నీలో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది. అయితే ఆసియాకప్ టీ20 ఫార్మాట్లో మాత్రం టీమిండియా చివరగా 2016లో టైటిల్ను సొంతం చేసుకుంది. అయితే ఈ ఆసియాకప్ టోర్నీకి సంబంధించి అందరిని ఆశ్చర్యపరిచే విషయం ఒకటి ఉంది.ఒక్కసారి కూడా.. 41 సంవత్సరాల ఆసియాకప్ చరిత్రలో చిరకాల ప్రత్యర్ధిలు పాకిస్తాన్-భారత్ ఒక్కసారి కూడా ఫైనల్లో తలపడలేదు. ప్రపంచ క్రికెట్లో రెండు గట్టి ప్రత్యర్థులుగా ఉన్న పాక్-భారత్ ఒక్కసారి కూడా సంయుక్తంగా ఫైనల్కు చేరలేకపోయాయి.ఓవరాల్గా ఆసియాకప్ టోర్నీ(వన్డే, టీ20)లో దాయాదులు ఇప్పటివరకు ముఖాముఖి 18 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా పదింట విజయం సాధించగా.. పాక్ ఆరు మ్యాచ్ల్లో గెలుపొందింది. మరో రెండు మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. చివరగా రెండు జట్లు ఆసియాకప్ వన్డే ఫార్మాట్లో తలపడ్డాయి. ఆసియాకప్-2023లో పాక్ను 228 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. ఆసియా కప్ ఫైనల్లో భారత్, శ్రీలంక జట్లు అత్యధికంగా 9 సార్లు తలపడ్డాయి.కాగా ఆసియాకప్ చరిత్రలో భారత్ అత్యధికంగా ఎనిమిది సార్లు ఛాంపియన్గా నిలిచింది. అందులో 7 సార్లు వన్డే ఫార్మాట్లో టైటిల్ను సొంతం చేసుకోగా.. ఒక్కసారి టీ20 ఫార్మాట్లో టీమిండియా విజేతగా నిలిచింది. ఇక భారత్ తర్వాత శ్రీలంక ఆరు సార్లు, పాకిస్తాన్ రెండుసార్లు ఈ ట్రోఫీని ముద్దాడాయి. ఇక ఈ ఏడాది ఖండాంత పోరులో భారత్-పాక్ మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా జరగనుంది.చదవండి: మా నాన్న చాలా నేర్పించారు.. కానీ అతడే నాకు రోల్ మోడల్: ఆర్యవీర్ సెహ్వాగ్ -
ఆసియాకప్ పుట్టింది ఇలా.. తొలి టైటిల్ ఎవరిదంటే?
ఆసియా దేశాల మధ్య క్రికెట్ సమరానికి సమయం ఆసన్నమవుతోంది. సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్లో మొత్తం 8 జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఇందుకోసం ఆయా జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి.ఇప్పటికే భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఈ క్రమంలో ఈ ఆసియాకప్ ఎప్పుడు మొదలైంది? ఈ ఖండాంతర టోర్నీలో భారత జట్టు రికార్డు ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.సెప్టెంబర్ 13.. 1984న ఒక కొత్త వన్డే టోర్నమెంట్ క్రికెట్ ప్రపంచానికి పరిచయమైంది. అదే ఆసియా కప్. దక్షిణాసియా పొరుగు దేశాలైన భారత్, పాకిస్తాన్, శ్రీలంకల మధ్య క్రికెట్, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచేందుకు 19 సెప్టెంబర్, 1983న ఆసియా క్రికెట్ కౌన్సిల్ను స్ధాపించారు. ఈ ఏసీసీనే ఆసియాకప్ పుట్టుకకు కారణమైంది. తొలి టైటిల్ మనదే..ఆసియాకప్ తొలి ఎడిషన్కు యూఏఈలోని షార్జా అతిథ్యమిచ్చింది. అయితే ఈ టోర్నీలో 1983 ఐసీసీ ప్రూడెన్షియల్ ప్రపంచ కప్ విజేతగా నిలిచిన టీమిండియా పాల్గొనడంతో మరింత ప్రాధన్యత సంతరించుకుంది. అయితే ఈ టోర్నీకి 1983 ప్రపంచ కప్ గెలిచిన పూర్తి జట్టును బీసీసీఐ పంపలేదు. కపిల్ దేవ్, కె శ్రీకాంత్, సయ్యద్ కిర్మాణి, మోహిందర్ అమర్నాథ్ వంటి ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చారు. వారి స్దానంలో మనోజ్ ప్రభాకర్, చేతన్ శర్మ, సురీందర్ ఖన్నా వంటి ఆటగాళ్లు మాత్రం తొట్ట తొలి ఆసియాకప్లో భాగమమయ్యారు. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్లోనే సునీల్ గావస్కర్ సారథ్యంలోని భారత బృందం అద్బుతం చేసింది.ఈ మ్యాచ్లో శ్రీలంకను ఏకంగా 10 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. అయితే తొలి ఎడిషన్లో కేవలం శ్రీలంక, భారత్, పాక్ జట్లు మాత్రమే తలపడ్డాయి. ఫైనల్లో పాక్ను చిత్తు చేసిన భారత్ తొట్ట తొలి ఆసియాకప్ టైటిల్ను సొంతం చేసుకుంది.ఏకైక జట్టుగా శ్రీలంక..ఇప్పటివరకు 16 ఆసియాకప్లు జరిగితే అన్ని టోర్నీలో ఆడిన ఆడిన ఏకైక జట్టుగా శ్రీలంక నిలిచింది. ఇక భారత్, పాకిస్తాన్లు చెరో 15 సార్లు ఆసియాకప్లో పాల్గొన్నాయి. శ్రీలంకతో క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్న కారణంగా 1986 టోర్నమెంట్ను భారత్ బహిష్కరించింది. అనంతరం భారత్ వేదికగా 1990-91 ఆసియాకప్ను పాక్ బాయ్కట్ చేసింది. ఇదే కారణంతో 1993లో ఆసియాకప్ను నిర్వహించలేదు. బంగ్లాదేశ్ కూడా 15 సార్లు ఆసియాకప్లో భాగమైంది.ఐసీసీ జోక్యం..కాగా 2015లో ఆసియాకప్నకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. టోర్నీ నిర్వహించే ఆసియా క్రికెట్ కౌన్సిల్కు ఐసీసీ అధికారాలు తగ్గించింది. ఇకపై ఆసియాకప్ రెండేళ్లకోసారి వన్డే, టి20 ఫార్మాట్లో రొటేషన్ పద్దతిలో జరుగుతుందని తెలిపింది.ఐసీసీ టోర్నీలకు అనుగుణంగా ఆసియాకప్ను నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఫలితంగా 2016లో ఆసియాకప్ను తొలిసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించారు. టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు సన్నాహక టోర్నమెంట్గా అది ఉపయోగపడింది. మొట్టమొదటి ఆసియాకప్ టీ20 టోర్నీ టైటిల్ను కూడా టీమిండియానే కైవసం చేసుకుంది.తిరుగులేని భారత్..1984 నుంచి 2023 వరకు 16 సార్లు ఆసియా కప్ను నిర్వహించారు. 2022 లో చివరిసారిగా టీ20 ఫార్మాట్లో నిర్వహించగా, నాడు ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి శ్రీలంక విజేతగా నిలిచింది. అయితే ఈ టోర్నీలో భారత జట్టుకు మాత్రం ఘనమైన రికార్డు ఉంది. ఇక ఆసియాకప్ చరిత్రలో భారత్ అత్యధికంగా ఎనిమిది సార్లు ఛాంపియన్గా నిలిచింది. అందులో 7 సార్లు వన్డే ఫార్మాట్లో టైటిల్ను సొంతం చేసుకోగా.. ఒక్కసారి టీ20 ఫార్మాట్లో టీమిండియా విజేతగా నిలిచింది. ఇక భారత్ తర్వాత శ్రీలంక ఆరు సార్లు, పాకిస్తాన్ రెండుసార్లు ఈ ట్రోఫీని ముద్దాడాయి.చదవండి: Asia Cup 2025: 'ఆసియాకప్ గెలిచేది ఆ జట్టే'.. వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం -
Asia Cup 2025: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్కు గ్రీన్ సిగ్నల్
ఆసియా కప్-2025లో భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్కు గ్రీన్ సిగ్నల్ లభించింది. పీటీఐ నివేదిక ప్రకారం.. ఖండాంతర టోర్నీలో దాయాదితో సమరానికి భారత క్రీడా మంత్రిత్వ శాఖ అనుమతిచ్చింది. బహుళ దేశాలు పాల్గొనే టోర్నీలో టీమిండియా పాక్తో ఆడితే ఆపబోమని స్పష్టం చేసింది. అయితే పాక్తో ఏ క్రీడలో అయినా ద్వైపాక్షిక సిరీస్లు మాత్రం ఉండవవి తేల్చి చెప్పింది. వారు తమ గడ్డపై అడుగు పెట్టడానికి కానీ.. భారత జట్టు పాక్లో ఆడటానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో అనుమతివ్వబోమని తెలిపింది. అంతర్జాతీయ టోర్నీల్లో, తటస్థ వేదికలపై పాకిస్తాన్తో మ్యాచ్లు ఆడితే అభ్యంతరం లేదని పేర్కొంది. ఈ లెక్కన సెప్టెంబర్ 14న దుబాయ్లో జరుగబోయే భారత్, పాకిస్తాన్ మ్యాచ్కు లైన్ క్లియర్ అయినట్లే.కాగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా కప్లో భారత్, పాక్ మ్యాచ్పై అనుమానాలు ఉండేవి. ఈ టోర్నీలో టీమిండియా పాక్తో ఆడేందుకు భారత ప్రభుత్వం అనుమతించదని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారానికి చెక్ పెడుతూ భారత క్రీడా మంత్రిత్వ శాఖ టీమిండియాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఆసియా కప్ టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి దుబాయ్, అబుదాబీ వేదికలుగా జరుగనుంది. ఈ టోర్నీలో భారత్, పాక్ ఒకే గ్రూప్లో (ఏ) ఉన్నాయి. టీమిండియా సెప్టెంబర్ 10న దుబాయ్ వేదికగా యూఏఈతో తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. అనంతరం సెప్టెంబర్ 14న పాకిస్తాన్తో.. సెప్టెంబర్ 19న ఒమన్తో టీమిండియా తలపడనుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టును ఆగస్ట్ 19న ప్రకటించారు.ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు..సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్ -
Asia Cup: ‘ఆఖరి నిమిషంలో కూడా మనసు మార్చుకోవచ్చు’
ఆసియా కప్-2025 (Asia Cup)టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజ పేసర్ వసీం అక్రం (Wasim Akram) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మెగా ఈవెంట్లో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ఆఖరి నిమిషంలో రద్దైనా ఆశ్చర్యపోనక్కర్లేదన్నాడు. ఏనాటికైనా పరిస్థితులు చక్కబడి దాయాదులు టెస్టు సిరీస్లో పోటీపడితే చూడాలని ఉందని తెలిపాడు.ఎనిమిది జట్లుఈసారి టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ టోర్నీ నిర్వహించనున్నారు. భారత్ ఆతిథ్య హక్కులు దక్కించుకున్నా.. పాక్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం ప్రకారం తటస్థ వేదికైన యూఏఈలో ఈ మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ ఖండాంతర టోర్నీలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్లతో పాటు ఒమన్, హాంకాంగ్, యూఏఈ పాల్గొంటున్నాయి.అఫ్గనిస్తాన్- హాంకాంగ్ మ్యాచ్తో ఆసియా కప్ టోర్నీకి సెప్టెంబరు 9న తెరలేవనుండగా.. 28న ఫైనల్తో ముగుస్తుంది. ఇక ఈ ఈవెంట్లో చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ సెప్టెంబరు 14న తొలిసారి తలపడనున్నాయి. అన్నీ సజావుగా సాగితే మరో రెండుసార్లు దాయాదులు పరస్పరం ఢీకొట్టే అవకాశం ఉంది.అయితే, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరుదేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రీడల్లో ఏ స్థాయిలోనూ పాకిస్తాన్తో ఆడొద్దనే డిమాండ్లు వెల్లువెత్తాయి. కానీ.. ఆసియా కప్ టోర్నీలో పాక్తో మ్యాచ్ను బహిష్కరించే పరిస్థితి కనబడటం లేదు. ఏదేమైనా భారత ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే బీసీసీఐ ఈ విషయంలో నిర్ణయం తీసుకోనుంది.ఈ నేపథ్యంలో పాక్ లెజెండ్ వసీం అక్రం స్పందిస్తూ.. ‘‘ఆసియా కప్ షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. దీనిపై వ్యతిరేకత కూడా వస్తోంది. అయితే, పాకిస్తాన్లో మేము మాత్రం సైలైంట్గానే ఉన్నాము. ఆఖరి నిమిషంలో కూడా మనసు మార్చుకోవచ్చుఒకవేళ వాళ్లు మాతో మ్యాచ్ ఆడినా.. ఆడకపోయినా ఓకే. ఆఖరి నిమిషంలో వారు మనసు మార్చుకున్నా ఆట ముందుకు సాగుతూనే ఉంటుంది. అయితే, నా జీవితకాలంలో భారత్- పాకిస్తాన్ మధ్య టెస్టు సిరీస్ జరిగితే చూడాలని ఉంది’’ అని ఓ పాడ్కాస్ట్లో వ్యాఖ్యానించాడు.అదే విధంగా.. ‘‘రాజకీయాలు వేరు. వాటి గురించి నాకు తెలియదు. వాళ్లు వారి దేశం గురించి ఆలోచిస్తున్నారు. అలాగే మేము కూడా. అయితే, అంతకు మించి ఎక్కువ మాట్లాడకూడదు. ఎవరైనా సరే తమ దేశం సాధించిన విజయాల గురించి తలచుకోవడానికే ఇష్టపడతారు. అక్కడితో ఆగిపోతే అంతా బాగుంటుంది’’ అని వసీం అక్రం చెప్పుకొచ్చాడు.కాగా భారత్- పాకిస్తాన్ చివరగా ఈ ఏడాది ఫిబ్రవరిలో యూఏఈ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో ముఖాముఖి తలపడ్డాయి. దుబాయ్లో జరిగిన ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లి సెంచరీతో చెలరేగి.. టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. పాక్పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన రోహిత్ సేన.. ఆ తర్వాత వరుస విజయాలతో చాంపియన్గా నిలిచింది.చదవండి: Asia Cup 2025: ‘చెత్త సెలక్షన్.. అతడంటే ఎవరికి ఇష్టమో అందరికీ తెలుసు’