-
విరాట్ కోహ్లిని తక్కువ అంచనా వేస్తే.. పాక్కు చుక్కలే: మిస్బా
వరల్డ్క్రికెట్లో బిగ్గెస్ట్ రైవలరీ అంటే టక్కున గుర్తు వచ్చేది భారత్-పాకిస్తాన్ మ్యాచే. ఈ దాయదుల పోరును వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వెయ్యి కళ్లుతో ఎదురుచూస్తుంటున్నారు. అభిమానుల నిరీక్షణకు తెరదించే సమయం అసన్నమవుతోంది. ఈ చిరకాల ప్రత్యర్ధిలు మరోసారి అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమవుతున్నారు. టీ20 వరల్డ్కప్-2024లో భాగంగా జూన్ 9న న్యూయార్క్ వేదికగా భారత్-పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మిస్బా వుల్ హక్ తమ జట్టుకు వార్నింగ్ ఇచ్చాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లితో చాలా జాగ్రత్తగా ఉండాలని పాక్ జట్టును మిస్బా హెచ్చరించాడు."భారత్-పాకిస్తాన్ మ్యాచ్లో విరాట్ కోహ్లి ఎక్స్ ఫ్యాక్టర్. అతడు ఇప్పటికే చాలాసార్లు పాకిస్తాన్కు ఓటమిరూచిను చూపించాడు. పాకిస్తాన్పైన అతనికి అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీలో చెలరేగిపోతాడు. విరాట్ ఎప్పుడూ ఒత్తడితో ఆడినట్లు నేను చూడలేదు. విరాట్ ఒక టాప్-క్లాస్ క్రికెటర్. ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించగల సత్తా ఉంది. విరాట్ను ఆపాలంటే ప్రత్యేక వ్యూహాలను రచించాలి. అతని స్ట్రైయిక్ రేటు పెద్ద విషయమే కాదు. అతడు తనపై వచ్చిన విమర్శలను పట్టించుకోడు. కోహ్లి విమర్శలను పొగడ్తలగా భావించి మరింత రాటుదేలుతాడని" స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిస్బా పేర్కొన్నాడు. -
T20 WC 2024: అభిమానులకు గుడ్న్యూస్!
క్రికెట్ ప్రేమికులకు అదిరిపోయే శుభవార్త! టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ మ్యాచ్లను ఉచితంగా వీక్షించే లక్కీ ఛాన్స్..!! ఈ మెగా ఈవెంట్ ప్రసారకర్త డిస్నీ+హాట్స్టార్ తమ డిజిటల్ ప్రేక్షకులకు ఈ అవకాశం కల్పించనుంది. కాగా ఈ ఏడాది జూన్ 1 నుంచి ఐసీసీ టీ20 మెన్స్ ప్రపంచకప్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. జూన్ 29 వరకు సాగనున్న ఈ ఈవెంట్లో మొత్తం 55 టీ20 మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో డిస్నీ+హాట్స్టార్ సోమవారం కీలక ప్రకటన చేసింది. తమకున్న మొబైల్ యూజర్లు వరల్డ్కప్-2024 మ్యాచ్లన్నింటినీ ఫ్రీగా చూడవచ్చని తెలిపింది. కాగా గతంలో ఆసియా వన్డే కప్-2023, వన్డే వరల్డ్కప్-2023 మ్యాచ్లను కూడా డిస్నీ తమ డిజిటల్ యూజర్ల కోసం ఉచితంగా ప్రసారం చేసింది. అదండీ సంగతి.. మీకు గనుక డిస్నీ+హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉంటే ఉచితంగా మ్యాచ్లు చూసేయొచ్చు! కాగా జూన్ 5న ఐర్లాండ్తో జరిగే మ్యాచ్తో టీమిండియా ఈ వరల్డ్కప్ ప్రయాణాన్ని ఆరంభించనుంది. అన్నట్లు టోర్నీకే హైలైట్గా భావించే భారత్- పాకిస్తాన్ మ్యాచ్ జూన్ 9న జరుగనుంది. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్ సమరం కంటే ముందు.. మరో క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ టీ20 మజాను అందించనుంది. ఈ మ్యాచ్లను కూడా జియో సినిమా తమ యాప్లో ఉచితంగా ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. చదవండి: Anant- Radhika: రోహిత్ తిరుగు పయనం.. భయ్యాకు కోపం వచ్చిందంటే! రింకూ సింగ్కు బంపరాఫర్.. టీ20 వరల్డ్కప్ జట్టులో ఛాన్స్? -
భారత్-పాక్ మ్యాచ్కు ఫుల్ క్రేజ్.. టికెట్ కనీస ధర రూ. 1.8 కోట్లు?
వరల్డ్ క్రికెట్లో పాకిస్తాన్- భారత్ మ్యాచ్కు ఉన్న క్రేజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దాయాదుల జట్లు ఎప్పుడు తలపడతాయా అని అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తుంటారు. చిరకాల ప్రత్యర్థులైన ఇండియా, పాకిస్తాన్లు ఎక్కడ తలపడినా ఇరుదేశాల ఫ్యాన్స్తో స్టేడియం నిండిపోతుంది. ఇప్పుడు మరోసారి విశ్వవేదికపై దాయాదుల పోరుకు రంగం సిద్దమైంది. టీ20 వరల్డ్కప్-2024లో పాక్-భారత్ జట్లు తాడోపేడో తెల్చుకోన్నాయి. జూన్ 9న న్యూయర్క్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. వామ్మో ఇంత ధర? అయితే దాదాపు ఏడాది తర్వాత చిరకాల ప్రత్యర్ధిలు తలపడనుండడంతో టిక్కెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దాయాదుల పోరుకు ఉన్న క్రేజ్ దృష్ట్యా టిక్కెట్ల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఒక్కో టిక్కెట్ ధర అత్యధికంగా రూ. 1.8 కోట్లు పలుకుతోంది. అవును మీరు విన్నది నిజమే. టీ20 వరల్డ్కప్ టిక్కెట్లను ఐసీసీ పబ్లిక్ బ్యాలట్ ద్వారా విక్రయిస్తోంది. ఈ క్రమంలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు టికెట్ల ధరను 6 డాలర్ల నుంచి 400 డాలర్లుగా నిర్ణయించింది. భారతీయ కరెన్సీలో కనీస టికెట్ ధర రూ.497 కాగా అత్యధిక ధర రూ.33148. అయితే సెకెండరీ మార్కెట్లలో మాత్రం టిక్కెట్ల ధరలు ఆకాశన్నంటాయి. స్టబ్హబ్, సీట్గీక్ వంటి ఆన్లైట్ ప్లాట్ఫారమ్స్ భారత్-పాక్ మ్యాచ్ క్రేజ్ను క్యాష్ చేసుకుంటున్నాయి. అధికారికంగా 400 డాలర్లు ఉన్న టిక్కెట్ సెకెండరీ మార్కెట్లో 40,000 డాలర్లు పలుకుతున్నట్లు తెలుస్తోంది. టాక్స్తో కలిపి ఏకంగా 50,000 డాలర్లు చెల్లాంచిల్సి ఉంటుంది. అంటే భారత కరెన్సీలో రూ.40లక్షల పైమాటే. యూఎస్ఏ టూడే రిపోర్ట్ ప్రకారం.. ఆన్లైన్ ప్లాట్ఫారమ్ సీట్గీక్లో భారత్-పాక్ మ్యాచ్ టిక్కెట్ల ధరలు భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. సీట్గీక్లో అత్యధిక ఖరీదైన టికెట్ ధర 175,000 డాలర్లగా నిర్ణయించినట్లు యూఎస్ఏ టూడే తమ కథనంలో పేర్కొంది. అంటే భారత కరెన్సీలో రూ.1.4 కోట్లు. అదనపు చార్జీ రూ. 4 లక్షలు కలిపి మొత్తంగా టికెట్ ధర రూ. 1.86 కోట్లు. -
మెయిన్ ‘డ్రా’కు రష్మిక అర్హత
Mumbai Open WTA-125 Rashmika Srivalli Advances To Main Draw:: ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. ముంబైలో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో ప్రపంచ 521వ ర్యాంకర్ రష్మిక 6–3, 3–6, 6–3తో ప్రపంచ 482వ ర్యాంకర్ విక్టోరియా మొర్వాయోవా (స్లొవేకియా)పై విజయం సాధించింది. 2 గంటల 28 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రష్మిక ఆరు ఏస్లు సంధించింది. వరల్డ్ గ్రూప్-1లో భారత్ డేవిస్కప్ టోర్నీలో భారత పురుషుల టెన్నిస్ జట్టు మళ్లీ వరల్డ్ గ్రూప్–1లో చోటు సంపాదించింది. ఆదివారం పాకిస్తాన్తో ముగిసిన వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్ పోటీలో 4–0తో గెలుపొందింది. చదవండి: భారత్కు మరో ఓటమి భువనేశ్వర్: మహిళల ప్రొ లీగ్ హాకీ టోర్నీలో భారత జట్టు మరో ఓటమి చవిచూసింది. నెదర్లాండ్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో టీమిండియా 1–3తో ఓడింది. భారత్ తరఫున నవనీత్ కౌర్ ఏకైక గోల్ చేసింది. నెదర్లాండ్స్ తరఫున యిబ్బీ జాన్సెన్ రెండు గోల్స్, ఫేవాన్డెర్ ఒక గోల్ సాధించారు. -
60 ఏళ్ల తర్వాత తొలిసారి... పాకిస్తాన్ను చిత్తు చేసిన టీమిండియా
ఇస్లామాబాద్: లాంఛనం పూర్తి చేసిన భారత పురుషుల టెన్నిస్ జట్టు డేవిస్కప్ టోర్నీలో మళ్లీ వరల్డ్ గ్రూప్–1లో చోటు సంపాదించింది. పాకిస్తాన్తో ఆదివారం ముగిసిన వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్ పోటీలో భారత్ 4–0తో విజయం సాధించింది. తొలి రోజు 2–0తో ఆధిక్యంలో నిలిచిన భారత్ రెండో రోజు రెండు మ్యాచ్ల్లో గెలిచింది. పురుషుల డబుల్స్లో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ ద్వయం 6–2, 7–6 (7/5)తో అకీల్ ఖాన్–ముజమ్మిల్ జంటను ఓడించడంతో భారత్కు 3–0తో విజయం ఖరారైంది. నామమాత్రమైన నాలుగో మ్యాచ్లో నికీ పునాచా 6–3, 6–4తో షోయబ్ మొహమ్మద్పై గెలవడంతో భారత్ ఆధిక్యం 4–0కు చేరింది. అప్పటికే ఫలితం తేలిపోవడంతో ఐదో మ్యాచ్ను నిర్వహించలేదు. కాగా ఆరు దశాబ్దాల తర్వాత పాకిస్తాన్ పర్యటనకు భారత్ వెళ్లడం ఇదే తొలిసారి. VIDEO | Davis Cup 2024: Indian tennis team celebrate at Islamabad Sports Complex after taking unassailable 3-0 lead against Pakistan. #DavisCup pic.twitter.com/goVGIEKD59 — Press Trust of India (@PTI_News) February 4, 2024 -
పాకిస్తాన్తో మ్యాచ్కు సర్వం సిద్దం.. ఫేవరెట్గా టీమిండియా
ఇస్లామాబాద్: డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్–1 ప్లేఆఫ్స్లో భారత జట్టు ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. నేడు, రేపు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగే పోటీల్లో విజయమే లక్ష్యంగా భారత్ ఆటకు సిద్ధమైంది. డేవిస్ కప్ చరిత్రలో పాకిస్తాన్పై భారత్ది అజేయమైన రికార్డు. దాయాది జట్టుపై ఆడిన ఏడు సార్లు కూడా భారత్ విజయం సాధించింది. ఇప్పుడు పాక్ గడ్డపై కూడా జైత్రయాత్రను కొనసాగించాలనే లక్ష్యంతో ఉంది. అయితే సొంతగడ్డపై ఈ డేవిస్ టై జరగడం, తురుపు ముక్క ఐజాముల్ హక్ ఖురేషి బరిలో ఉండటంతో పాక్ గంపెడాశలు పెట్టుకుంది. గ్రాస్ కోర్టులో ఖురే విశేష అనుభవముంది. ఈ నేపథ్యంలో భారత్కు ఏమైన కఠిన సవాల్ అంటూ ఉంటే మాత్రం అది ఖురేషి నుంచే ఎదురు కావచ్చు. ఇస్లామాబాద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మొదటి రోజు రెండు సింగిల్స్ మ్యాచ్లను నిర్వహిస్తారు. తొలి సింగిల్స్లో రామ్కుమార్ రామనాథన్... ఐజాముల్ హక్ ఖురేషితో తలపడతాడు. అనంతరం జరిగే రెండో సింగిల్స్లో శ్రీరామ్ బాలాజీ... అఖిల్ ఖాన్ను ఎదుర్కొంటాడు. శ్రీరామ్ బాలాజీ చాన్నాళ్లుగా డబుల్స్కే పరిమితమయ్యాడు. అయితే భారత సింగిల్స్ స్పెషలిస్టు అయిన సుమిత్ నగాల్... గ్రాస్కోర్టు కావడంతో పాక్ వెళ్లేందుకు విముఖత చూపాడు. దీంతో శ్రీరామ్ను సింగిల్స్ బరిలో దించాల్సి వస్తోంది. -
టీ20 వరల్డ్కప్ 2024 షెడ్యూల్ విడుదల.. జూన్ 9న భారత్-పాక్ మ్యాచ్
2024 టీ20 వరల్డ్కప్ షెడ్యూల్ను ఐసీసీ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికలుగా జరిగే ఈ మెగా టోర్నీ జూన్ 1న మొదలై 29వ తేదీన జరిగే ఫైనల్తో ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూప్లు విభజించబడి పోటీపడతాయి. గ్రూప్-ఏలో భారత్, పాక్లతో పాటు ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏ జట్లు ఉండగా.. గ్రూప్-బిలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలతో పాటు నమీబియా, స్కాట్లాండ్, ఒమన్ జట్లు.. గ్రూప్-సిలో న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లతో పాటు ఆఫ్ఘనిస్తాన్, ఉగాండ, పపువా న్యూ గినియా.. గ్రూప్-డిలో సౌతాఫ్రికా, శ్రీలంక జట్లతో పాటు బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ జట్లు ఉన్నాయి. ఈ టోర్నీలో గ్రూప్ స్టేజీ మ్యాచ్లు జూన్ 1 నుంచి 18 వరకు జరుగనుండగా.. సూపర్ 8 దశ మ్యాచ్లు జూన్ 19 నుంచి 24 వరకు జరుగుతాయి. జూన్ 26, 27 తేదీల్లో సెమీఫైనల్ మ్యాచ్లు (గయనా, ట్రినిడాడ్) జరుగనుండగా.. జూన్ 29న ఫైనల్ (బార్బడోస్) జరుగుతుంది. టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్.. జూన్ 1: యూఎస్ఏ వర్సెస్ కెనడా మ్యాచ్లన్నీ భారతకాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతాయి. Groups of T20 World Cup 2024. 🏆 pic.twitter.com/If2Dyo6GTK — Johns. (@CricCrazyJohns) January 5, 2024 మెగా టోర్నీలో గ్రూప్ దశలో టీమిండియా ఆడబోయే మ్యాచ్ల వివరాలు.. జూన్ 5: భారత్ వర్సెస్ ఐర్లాండ్ (న్యూయార్క్) జూన్ 9: భారత్ వర్సెస్ పాకిస్తాన్ (న్యూయార్క్) జూన్ 12: భారత్ వర్సెస్ యూఎస్ఏ (న్యూయార్క్) జూన్ 15: భారత్ వర్సెస్ కెనడా (ఫ్లోరిడా) INDIA vs PAKISTAN ON JUNE 9th AT NEW YORK IN T20I WORLD CUP 2024.....!!!!! pic.twitter.com/y1d6l3gT3H — Johns. (@CricCrazyJohns) January 5, 2024 గ్రూప్ దశలో జరుగబోయే మొత్తం మ్యాచ్ల వివరాలు.. జూన్ 1: యూఎస్ఏ వర్సెస్ కెనడా (డల్లాస్) జూన్ 2: నమీబియా వర్సెస్ ఒమన్ (బార్బడోస్) జూన్ 2: వెస్టిండీస్ వర్సెస్ పపువా న్యూ గినియా (గయానా) జూన్ 3: శ్రీలంక వర్సెస్ సౌతాఫ్రికా (న్యూయార్క్) జూన్ 3: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఉగాండ (గయానా) జూన్ 4: నెదర్లాండ్స్ వర్సెస్ నేపాల్ (డల్లాస్) జూన్ 4: ఇంగ్లండ్ వర్సెస్ స్కాట్లాండ్ (బార్బడోస్) జూన్ 5: భారత్ వర్సెస్ ఐర్లాండ్ (న్యూయార్క్) జూన్ 5: ఆస్ట్రేలియా వర్సెస్ ఒమన్ (బార్బడోస్) జూన్ 5: పుపువా న్యూ గినియా వర్సెస్ ఉగాండ (గయానా) జూన్ 6: యూఎస్ఏ వర్సెస్ పాకిస్తాన్ (డల్లాస్) జూన్ 6: నమీబియా వర్సెస్ స్కాట్లాండ్ (బార్బడోస్) జూన్ 7: శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ (డల్లాస్) జూన్ 7: ఐర్లాండ్ వర్సెస్ కెనడా (న్యూయార్క్) జూన్ 7: న్యూజిలాండ్ వర్సెస్ ఆప్ఘనిస్తాన్ (గయానా) జూన్ 8: నెదర్లాండ్స్ వర్సెస్ సౌతాఫ్రికా (న్యూయార్క్) జూన్ 8: ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ (బార్బడోస్) జూన్ 8: వెస్టిండీస్ వర్సెస్ ఉగాండ (గయానా) జూన్ 9: భారత్ వర్సెస్ పాకిస్తాన్ (న్యూయార్క్) జూన్ 9: ఒమన్ వర్సెస్ స్కాట్లాండ్ (ఆంటిగ్వా) జూన్ 10: సౌతాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్ (న్యూయార్క్) జూన్ 11: శ్రీలంక వర్సెస్ నేపాల్ (లాడర్హిల్) జూన్ 11: పాకిస్తాన్ వర్సెస్ కెనడా (న్యూయార్క్) జూన్ 11: ఆస్ట్రేలియా వర్సెస్ నమీబియా (ఆంటిగ్వా) జూన్ 12: వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్ (ట్రినిడాడ్) జూన్ 12: భారత్ వర్సెస్ యూఎస్ఏ (న్యూయార్క్) జూన్ 13: ఇంగ్లండ్ వర్సెస్ ఒమన్ (ఆంటిగ్వా) జూన్ 13: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పపువా న్యూ గినియా (ట్రినిడాడ్) జూన్ 13: బంగ్లాదేశ్ వర్సెస్ నెదర్లాండ్స్ (సెయింట్ విన్సెంట్) జూన్ 14: యూఎస్ఏ వర్సెస్ ఐర్లాండ్ (లాడర్హిల్) జూన్ 14: న్యూజిలాండ్ వర్సెస్ ఉగాండ (ట్రినిడాడ్) జూన్ 14: సౌతాఫ్రికా వర్సెస్ నేపాల్ (సెయింట్ విన్సెంట్) జూన్ 15: భారత్ వర్సెస్ కెనడా (ఫ్లోరిడా) జూన్ 15: నమీబియా వర్సెస్ ఇంగ్లండ్ (ఆంటిగ్వా) జూన్ 15: ఆస్ట్రేలియా వర్సెస్ స్కాట్లాండ్ (సెయింట్ లూసియా) జూన్ 16: పాకిస్తాన్ వర్సెస్ ఐర్లాండ్ (లాడర్హిల్) జూన్ 16: శ్రీలంక వర్సెస్ నెదర్లాండ్స్ (సెయింట్ లూసియా) జూన్ 16: బంగ్లాదేశ్ వర్సెస్ నేపాల్ (సెయింట్ విన్సెంట్) జూన్ 17: న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లండ్ (ట్రినిడాడ్) జూన్ 17: వెస్టిండీస్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (సెయింట్ లూసియా) సూపర్ 8 మ్యాచ్లు.. జూన్ 19: ఏ2 వర్సెస్ డి1 (ఆంటిగ్వా) జూన్ 19: బి1 వర్సెస్ సి2 (సెయింట్ లూసియా) జూన్ 20: బి2 వర్సెస్ డి2 (ఆంటిగ్వా) జూన్ 20: ఏ1 వర్సెస్ సి1 (బార్బడోస్) జూన్ 21: ఏ2 వర్సెస్ సి2 (బార్బడోస్) జూన్ 21: బి1 వర్సెస్ డి1 (సెయింట్ లూసియా) జూన్ 22: ఏ1 వర్సెస్ డి2 (ఆంటిగ్వా) జూన్ 22: సి1 వర్సెస్ బి2 (సెయింట్ విన్సెంట్) జూన్ 23: సి2 వర్సెస్ డి1 (ఆంటిగ్వా) జూన్ 23: ఏ2 వర్సెస్ బి1 (బార్బడోస్) జూన్ 24: బి2 వర్సెస్ ఏ1 (సెయింట్ లూసియా) జూన్ 24: సి1 వర్సెస్ డి2 (సెయింట్ విన్సెంట్) జూన్ 26: సెమీఫైనల్-1 (గయానా) జూన్ 27: సెమీఫైనల్-2 (ట్రినిడాడ్) జూన్ 29: ఫైనల్ (బార్బడోస్) * సెమీఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్లకు రిజర్వ్ డేస్ ఉన్నాయి. -
టీమిండియా టీ20 వరల్డ్కప్-2007 హీరోపై కేసు! కారణమిదే..
టీమిండియా మాజీ క్రికెటర్, 2007 ప్రపంచకప్ హీరో జోగీందర్ శర్మ చిక్కుల్లో పడ్డారు. హరియాణా పోలీస్ శాఖలో ప్రస్తుతం డిప్యూటీ సూపరింటెండెంట్(డీఎస్పీ)గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన ఓ వ్యక్తి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జోగీందర్ శర్మపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా హిసార్కు చెందిన పవన్ అనే వ్యక్తి జనవరి 1న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో అతడి తల్లి.. ఆస్తి తగాదాల వల్ల తలెత్తిన సమస్య కారణంగానే తన కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందుకే ఆయన పేరు కూడా చేర్చారు! ఇందులో భాగంగా జోగిందర్ శర్మ సహా ఆరుగురి పేర్లను తన ఫిర్యాదులో ఆమె ప్రస్తావించింది. ప్రస్తుతం న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న తమ ఆస్తి కేసు విషయంలో ఐదుగురు వ్యక్తులు తమపై ఒత్తిడి తీసుకువస్తున్నారని చెప్పినా.. డీఎస్పీగా ఉన్న జోగీందర్ శర్మ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తన ఫిర్యాదులో జోగీందర్ శర్మ పేరును కూడా చేర్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పవన్ను ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలతో నిందితులతో పాటు జోగీందర్ శర్మపై కూడా హరియాణా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశాం కాగా పవన్ బలవన్మరణం నేపథ్యంలో తమకు జరిగిన అన్యాయానికి బదులుగా ప్రభుత్వం పరిహారం చెల్లించాలని అతడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఆర్థిక సాయం అందించడంతో పాటు ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఈ కేసు పక్కదారి పట్టకుండా లోతుగా విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. అతనెవరో నాకు తెలియదు ఈ నేపథ్యంలో బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అయితే, ఈ విషయంపై స్పందించిన జోగీందర్ శర్మ.. ‘‘నాకు అసలు ఈ కేసు గురించి తెలియదు. పవన్ అనే వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. అతడిని ఒక్కసారి కూడా కలవలేదు’’ అని పేర్కొన్నారు. ఈ మేరకు ఇండియా టుడే కథనం ప్రచురించింది. ధోని నమ్మకం నిలబెట్టి.. ప్రపంచకప్ను ముద్దాడి టీ20 ఫార్మాట్లో 2007లో తొలిసారి ప్రవేశపెట్టిన ప్రపంచకప్ ట్రోఫీని టీమిండియా గెలవడంలో జోగీందర్ శర్మది కీలక పాత్ర. సౌతాఫ్రికా వేదికగా దాయాది పాకిస్తాన్తో నువ్వా- నేనా అన్నట్లు పోటాపోటీగా సాగిన ఫైనల్లో.. నాటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆఖరి ఓవర్లో బంతిని జోగీందర్కు ఇచ్చాడు. అప్పటికి పాక్ గెలవాలంటే నాలుగు బంతుల్లో ఆరు పరుగులు కావాలి. అలాంటి సమయంలో జోగీందర్ తెలివిగా బౌలింగ్ చేశాడు. అతడు సంధించిన బంతిని పాక్ క్రికెటర్ మిస్బా ఉల్ హక్ స్కూప్ షాట్ ఆడగా.. శ్రీశాంత్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో పాక్ ఓడింది.. టీమిండియా ప్రపంచకప్ను ముద్దాడింది. సీఎస్కేకు ఆడిన జోగీందర్ శర్మ ఇక నాటి మ్యాచ్లో జోగీందర్ శర్మ మొత్తంగా 3.3 ఓవర్ల బౌలింగ్లో 20 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఐపీఎల్లో 2010, 2011 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించి రెండు సందర్భాల్లోనూ విజేతగా నిలిచిన జట్టులో భాగమయ్యాడు. 2011 తర్వాత ఆటకు దూరమైన జోగీందర్ శర్మ క్రికెట్కు అందించిన సేవల నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం పోలీస్ ఉద్యోగం ఇచ్చింది. ప్రస్తుతం ఆయన డీఎస్పీగా ఉన్నట్లు సమాచారం. ఇక టీమిండియా తరఫున 4 వన్డే, 4 టీ20లు ఆడిన రైటార్మ్ పేసర్ జోగీందర్ శర్మ ఆయా ఫార్మాట్లలో ఒకటి, నాలుగు వికెట్లు తీశారు. NOTE: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ►ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 ►మెయిల్: roshnihelp@gmail.com. చదవండి: తరానికొక్క ఆటగాడు.. ముంబై అలా చేయకపోతే టీమిండియాకు నష్టం -
టీ20 వరల్డ్కప్ 2024లో భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?
యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికలుగా ఈ ఏడాది జూన్లో జరుగబోయే టీ20 వరల్డ్కప్ కోసం అన్ని జట్లు ఇప్పటినుంచే సన్నాహకాలు మొదలుపెట్టాయి. ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ విడుదలకు ఐసీసీ ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు తెలుస్తుంది. షెడ్యూల్, వేదికలు తదితర వివరాలను ఐసీసీ సోమవారం (జనవరి 8) వెల్లడిస్తుందని సమాచారం. ఈ టోర్నీలో గ్రూప్ స్టేజీ మ్యాచ్లన్నీ యూఎస్ఏలో.. అన్ని సూపర్-8 పోటీలు వెస్టిండీస్లో జరుగుతాయని తెలుస్తుంది. ఈ టోర్నీలో భారత్కు సంబంధించిన షెడ్యూల్పై కూడా పలు లీకులు అందాయి. టీమిండియా.. జూన్ 5న ఐర్లాండ్తో తమ తొలి గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడనున్నట్లు తెలుస్తుంది. ఆతర్వాత భారత్.. తమ చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ను ఢీకొంటుందని సమాచారం. ఈ మ్యాచ్ జూన్ 9న జరుగనుందని తెలుస్తుంది. అనంతరం జూన్ 12, 15 తేదీల్లో భారత్.. యూఎస్ఏ, కెనడాలను ఢీకొంటుందని ప్రచారం జరుగుతుంది. ఈ వివరాలను ఓ ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్ వెల్లడించింది. India's likely schedule in T20 World Cup 2024. [Sports Tak] India vs Ireland on June 5th. India vs Pakistan on June 9th. India vs USA on June 12th. India vs Canada on June 15th. pic.twitter.com/1OtZBLZTw8 — Johns. (@CricCrazyJohns) January 4, 2024 కాగా, టీ20 వరల్డ్కప్ జూన్ 4 నుంచి 30వ తేదీ మధ్యలో జరుగనున్న విషయం తెలిసిందే. కరీబియన్ దీవుల్లోని ఆంటిగ్వా అండ్ బర్బుడా, బార్బడోస్, డొమినికా, గయానా,సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ ద గ్రెనడైన్స్ నగరాల్లో .. యూఎస్ఏలోని డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్ నగరాల్లో ప్రపంచకప్ మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ ప్రపంచకప్లో మొత్తంగా 20 జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో 12 జట్లు మెగా టోర్నీకి నేరుగా అర్హత సాధించగా.. మిగతా 8 జట్లు ఆయా రీజియన్ల క్వాలిఫయర్ల ద్వారా క్వాలిఫై అయ్యాయి. ఆతిధ్య దేశాల హోదాలో యూఎస్ఏ, వెస్టిండీస్.. గత ఎడిషన్లో టాప్-8లో నిలిచిన ఇంగ్లండ్, పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్.. టీ20 ర్యాంకింగ్స్లో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు వరల్డ్కప్కు నేరుగా అర్హత సాధించగా.. ఐర్లాండ్, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్, కెనడా, నేపాల్, ఓమన్, నమీబియా, ఉగాండ జట్లు క్వాలిఫయర్స్ ద్వారా వరల్డ్కప్కు క్వాలిఫై అయ్యాయి. -
T20 WC: పాక్ ప్రమాదకర జట్టు.. యువీ వ్యాఖ్యలకు గంభీర్ రిప్లై ఇదే
రానున్న ఆరు నెలల్లో మరో క్రికెట్ మెగా టోర్నీకి తెరలేవనుంది. వచ్చే ఏడాది జూన్ 4 నుంచి టీ20 ప్రపంచకప్-2024 ఈవెంట్ ఆరంభం కానుంది. ఈ టోర్నమెంట్ సందర్భంగానైనా టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న కల తీరాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. పదేళ్లుగా భారత జట్టు ఒక్క మెగా టైటిల్ కూడా గెలవలేదన్న విషయం తెలిసిందే. పుష్కరకాలం తర్వాత వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా ఆ కరువు తీరుతుందనుకుంటే ఆఖరి మెట్టుపై రోహిత్ సేన బోల్తా పడింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలై ట్రోఫీ చేజార్చుకుంది. అయితే, ఆరు నెలల వ్యవధిలోనే టీ20 వరల్డ్కప్ రూపంలో టీమిండియాకు మరో అవకాశం దక్కనుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు గౌతం గంభీర్, యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ప్రపంచకప్-2024లో టీమిండియాకు గట్టి పోటీనిచ్చే జట్ల గురించి ఎదురైన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘అక్కడి పిచ్లపై అఫ్గనిస్తాన్ మరింత ప్రమాదకారిగా మారుతుంది. ఆస్ట్రేలియా కూడా సవాల్ విసురుతుంది. ఆ జట్టులో ఎంతో మంది ఇంపాక్ట్ ప్లేయర్లు ఉన్నారు. ప్రత్యర్థి జట్టు విజయావకాశాలను ఒంటి చేత్తో మార్చగల సత్తా ఉన్న వాళ్లు ఉన్నారు. ఇక ఇంగ్లండ్ కూడా టీ20 క్రికెట్లో కచ్చితంగా బలమైన ప్రత్యర్థే’’ అని గంభీర్ పేర్కొన్నాడు. యువరాజ్ సింగ్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. ‘‘ఈసారి సౌతాఫ్రికా ప్రపంచకప్ గెలుస్తుందనుకుంటున్నాను. వరల్డ్కప్-2023 సందర్భంగా.. ఆ జట్టు పురోగతిని చూసిన తర్వాత నాకు ఈ అభిప్రాయం ఏర్పడింది. పాకిస్తాన్ కూడా డేంజరస్ జట్టు’’ అని యువీ పేర్కొన్నాడు. ఇందుకు స్పందించిన గంభీర్.. ‘‘50 ఓవర్ల ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎలా ఉందో చూశాం కదా! అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత చెత్తగా ఫీల్డింగ్ చేయడం బహుశా ఇదే మొదటిసారి అనుకుంటా. ఇక టీ20 ఫార్మాట్లో పోటీ పడాలంటే అలా చెత్తగా ఆడితే మాత్రం వారికి అసలు అవకాశాలు ఉండవు. గత ఐదారేళ్లలో టీమిండియా ఆఖరి వరకు పట్టుదలగా పోరాడిన తీరు చూశాం. ఈసారి భారత్ ఆ అవరోధాన్ని దాటుతుందనుకుంటున్నా’’ అని కుండబద్దలు కొట్టాడు. ఓ క్రీడా చర్చలో పాల్గొన్న గౌతీ- యువీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. View this post on Instagram A post shared by Thums Up (@thumsupofficial) -
ఏడు వికెట్లతో చెలరేగిన భారత పేసర్.. 52 పరుగులకే ప్రత్యర్థి ఆలౌట్
ACC U19 Asia Cup, 2023- India U19 vs Nepal U19: అండర్-19 ఆసియా కప్-2023 టోర్నీలో భారత యువ జట్టు ఘన విజయం సాధించింది. నేపాల్ను పది వికెట్ల తేడాతో చిత్తు చేసి సెమీస్ రేసులో ముందుకు దూసుకెళ్లింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో గ్రూప్-‘ఏ’లో ఉన్న భారత్ తొలుత అఫ్గనిస్తాన్తో తలపడింది. ఈ మ్యాచ్లో అఫ్గన్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన ఉదయ్ సహారన్ సేన.. రెండో మ్యాచ్లో మాత్రం ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో సెమీస్ చేరాలంటే.. లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్లో తప్పక గెలవాల్సిన స్థితిలో నిలిచింది. ఏడు వికెట్లతో చెలరేగిన రాజ్ లింబాని ఈ నేపథ్యంలో మంగళవారం నేపాల్తో తలపడ్డ భారత జట్టు టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పేసర్ రాజ్ లింబాని ఏడు వికెట్లతో చెలరేగి నేపాల్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. 9.1 ఓవర్లలో కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి బ్యాటర్లపై పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. లింబానికి తోడుగా.. ఆరాధ్య శుక్లా రెండు, అర్షిన్ కులకర్ణి ఒక వికెట్తో రాణించారు. ఈ ముగ్గురు అద్భుత ప్రదర్శన కారణంగా.. నేపాల్ 22.1 ఓవర్లలోనే చాపచుట్టేసింది. ఓపెనర్లే పూర్తి చేశారు భారత బౌలర్ల విజృంభణ కారణంగా 52 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టును ఓపెనర్లు ఆదర్శ్, అర్షిన్ కులకర్ణి విజయతీరాలకు చేర్చారు. ఆదర్శ్ 13 బంతుల్లో 13 పరుగులతో అజేయంగా నిలవగా.. అర్షిన్ 30 బంతుల్లోనే 43 పరుగులు రాబట్టి భారత్ విజయాన్ని ఖరారు చేశాడు. ఇక ఈ గెలుపుతో భారత జట్టు సెమీస్ బెర్తును అనధికారికంగా ఖాయం చేసుకుంది. మరోవైపు.. గ్రూప్-‘ఏ’లో భాగమైన పాకిస్తాన్ మంగళవారం అఫ్గనిస్తాన్తో పోటీపడుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు 48 ఓవర్లలో 303 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ గెలిస్తే సెమీస్ చేరడం లాంఛనమే! దీంతో మరోసారి దాయాదులు భారత్- పాక్ మ్యాచ్ చూసే అవకాశం అభిమానులకు దక్కుతుంది. చదవండి: Virat Kohli: రాజు ఎక్కడైనా రాజే! టాప్లో కింగ్ కోహ్లి ACC Men's U19 Asia Cup | India-U19 vs Nepal-U19 | Highlights. https://t.co/6wE0HM9pDH#ACCMensU19AsiaCup #ACC — AsianCricketCouncil (@ACCMedia1) December 12, 2023 -
Ind vs Pak: భారత క్రికెట్ జట్టుకు నిరాశ.. సెమీస్ చేరాలంటే..
India U19 vs Pakistan U19- దుబాయ్: ఆసియా కప్ అండర్–19 క్రికెట్ టోర్నీలో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. ముందుగా భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 259 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఆదర్శ్ సింగ్ (62; 4 ఫోర్లు, 1 సిక్స్), ఉదయ్ (60; 5 ఫోర్లు), సచిన్ (58; 2 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం పాకిస్తాన్ 47 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 263 పరుగులు చేసి గెలిచింది. అజాన్ అవైస్ (105 నాటౌట్; 10 ఫోర్లు) అజేయ సెంచరీతో పాక్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక షాజైబ్ ఖాన్ (63; 4 ఫోర్లు, 3 సిక్స్లు), సాద్ బేగ్ (68 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. కాగా భారత్తో పాటు గ్రూప్-ఏలో ఉన్న పాక్ యువ క్రికెట్ జట్టుకు ఇది రెండో విజయం. ఇప్పటికే నేపాల్పై ఏడు వికెట్ల తేడాతో దేవ్ ఖనాల్ బృందం గెలుపొందింది. సెమీస్ చేరాలంటే భారత జట్టు సెమీఫైనల్ చేరాలంటే మంగళవారం నేపాల్తో జరిగే మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాలి. ఇక ఈ మ్యాచ్కు దుబాయ్లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ నంబర్ 2 వేదిక కానుంది. మరోవైపు.. పాకిస్తాన్ కూడా మంగళవారం అఫ్గనిస్తాన్తో పోరకు సిద్ధమవుతోంది. ACC Men's U19 Asia Cup | India-U19 vs Pakistan-U19 | Highlights. https://t.co/tdlQThbdXQ#ACCMensU19AsiaCup #ACC — AsianCricketCouncil (@ACCMedia1) December 10, 2023 -
చేతులెత్తేసిన బౌలర్లు.. పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓటమి
అండర్-19 ఆసియాకప్లో టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం దుబాయ్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో భారత్ పరాజయం పాలైంది. 263 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 47 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాక్ బ్యాటర్లలో అజాన్ అవైస్(105 నాటౌట్) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు సాద్ బైగ్(68 నాటౌట్), షాహజిబ్ ఖాన్(63) పరుగులతో పాక్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ మ్యాచ్లో భారత బౌలర్లు మాత్రం పూర్తిగా తేలిపోయారు. బౌలర్లలో మురగన్ అభిషేక్ ఒక్కడే రెండు వికెట్లు సాధించగా.. మిగితా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. కాగా అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఆదర్శ్ సింగ్(62), కెప్టెన్ ఉదయ్ షహరన్(60), సచిన్ దాస్(58) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో మహ్మద్ జీషన్ 4 వికెట్లతో చెలరేగాడు. -
టీమిండియాతో మ్యాచ్.. పాక్ బౌలర్ ఓవరాక్షన్! వీడియో వైరల్
వరల్డ్క్రికెట్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడతాయా అని ఇరు దేశాల అభిమానులు వెయ్యి కళ్లుతో ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో అండర్-19 ఆసియాకప్-2023లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ బౌలర్ మహ్మద్ జీషన్ ఓవరాక్షన్ చేశాడు. ఏం జరిగిదంటే? భారత్ ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన జీషన్ బౌలింగ్లోమొదటి బంతిని భారత బ్యాటర్ రుద్ర పటేల్ మిడాన్ దిశగా షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ చేతికి వేళ్లాడు. కీలక వికెట్ తీయడంతో పాక్ పేసర్ గాల్లోకి ఎగురుతూ సంబరాలు జరుపుకున్నాడు. ఈ క్రమంలో అతడి సెలబ్రేషన్స్ శృతిమించాయి. బ్యాటర్ దగ్గర వెళ్లి తన వైపు చూస్తూ గట్టిగా అరుస్తూ జీషన్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన టీమిండియా అభిమానులు మరి అంత ఓవరాక్షన్ పనికిరాదుంటా కామెంట్లు చేస్తున్నారు. Peak rivalry 🔥 Second wicket down for India🔥 #PAKvINDpic.twitter.com/cpfRi7xURd — Hassan Nawaz (@iam_hassan56) December 10, 2023 -
ఈనెల 10న భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్
ఇటీవలికాలంలో భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ల సంఖ్య బాగా పెరిగింది. వన్డే వరల్డ్కప్, అంతకుమందు ఆసియాకప్ టోర్నీల్లో టీమిండియా పాక్తో తలపడింది. ఈ రెండు టోర్నీలకు ముందు (2023, జులై) ఇరు దేశాల ఎమర్జింగ్ జట్లు ఆసియా కప్ ఫైనల్లో తలపడ్డాయి. రసవత్తరంగా సాగిన ఆ మ్యాచ్లో భారత్పై పాక్ 128 పరుగుల తేడాతో గెలుపొంది ఛాంపియన్గా నిలిచింది. అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్-పాక్లు మరోసారి తలపడనున్నాయి. ఈనెల 10న దాయాది జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. వన్డే ఫార్మాట్లో సాగనున్న ఈ టోర్నీ ఇవాల్టి (డిసెంబర్ 8) నుంచే మొదలైంది. టోర్నీలో భాగంగా ఇవాళ భారత్, ఆఫ్ఘనిస్తాన్.. నేపాల్, పాకిస్తాన్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఈ టోర్నీలో భారత్, పాక్తో పాటు మొత్తం ఎనిమిది జట్లు (ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, యూఏఈ, శ్రీలంక, జపాన్) పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ తొలి దశలో భారత్ మూడు మ్యాచ్లు ఆడుతుంది. డిసెంబర్ 8న ఆఫ్ఘనిస్తాన్, 10న పాకిస్తాన్, 12న నేపాల్ జట్లతో యంగ్ ఇండియా తలపడుతుంది. ఈ టోర్నీ ఫైనల్ డిసెంబర్ 17న జరుగుతుంది. ఈ టోర్నీలోని అన్ని మ్యాచ్లు దుబాయ్లో జరుగనున్నాయి. భారత అండర్-19జట్టు: అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాంషు మోలియా, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్ (కెప్టెన్), అరవెల్లి అవనీష్ రావు (వికెట్కీపర్), సౌమీ కుమార్ పాండే (వైస్ కెప్టెన్), మురుగన్ అభిషేక్, ఇన్నేష్ మహాజన్ (వికెట్కీపర్), ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబానీ, నమన్ తివారీ -
Ind vs Pak: మెగా క్రికెట్ టోర్నీ షెడ్యూల్ విడుదల.. భారత్- పాక్ మ్యాచ్ ఆరోజే
దాయాదులు భారత్- పాకిస్తాన్ మరోసారి మెగా క్రికెట్ టోర్నీలో పోటీ పడనున్నాయి. ఆసియా మెన్స్ అండర్-19 వన్డే కప్లో భాగంగా డిసెంబరు 10న ముఖాముఖి తలపడనున్నాయి. దుబాయ్లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ ఇందుకు వేదిక కానుంది. కాగా అండర్-19 మెన్స్ ఆసియా కప్-2023కి సంబంధించిన షెడ్యూల్ను ఆసియా క్రికెట్ మండలి శనివారం విడుదల చేసింది. దుబాయ్లో వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్న ఈ టోర్నీకి శుక్రవారం(డిసెంబరు 8) తెరలేవనుంది. గ్రూప్-ఏలో భాగమైన భారత్- అఫ్గనిస్తాన్తో మ్యాచ్తో ఈ ఈవెంట్ ఆరంభం కానుంది. అదే రోజు మరో మ్యాచ్లో పాకిస్తాన్- నేపాల్తో తలపడనుంది. గ్రూప్ దశలో మ్యాచ్లన్నీ ఐసీసీ అకాడమీ గ్రౌండ్, ఐసీసీ అకాడమీ గ్రౌండ్-2లో జరుగనున్నాయి. అయితే, డిసెంబరు 17నాటి ఫైనల్కు మాత్రం దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదిక కానుంది. ఇక మ్యాచ్లన్నీ భారత కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ఆరంభం కానున్నాయి. కాగా ఆసియా అండర్-19 కప్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి. గ్రూప్-ఏలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ సహా పాకిస్తాన్, నేపాల్, అఫ్గనిస్తాన్ పోటీ పడనుండగా.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, జపాన్, యూఏఈ తలపడనున్నాయి. భారత జట్టు కెప్టెన్గా ఉదయ్ సహారన్ ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమి కుమార్ పాండే (వైస్ కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాన్షు మొలియా, ముషీర్ ఖాన్, ధనుష్ గౌడ, అవినాష్ రావు (వికెట్ కీపర్), ఎం అభిషేక్, ఇన్నేష్ మహాజన్ (వికెట్ కీపర్), ఆర్ధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారీ. ట్రావెలింగ్ రిజర్వ్స్: ప్రేమ్ దేవ్కర్, అన్ష్ గోసాయి, మహ్మద్ అమన్. నాన్ ట్రావెలింగ్ రిజర్వులు: దిగ్విజయ్ పాటిల్, జయంత్ గోయత్, పి.విఘ్నేష్, కిరణ్ చోర్మాలే. -
పాకిస్తాన్తో తొలి టెస్టు.. ఆసీస్ జట్టు ప్రకటన! సీనియర్ ఆటగాడు ఎంట్రీ
స్వదేశంలో పాకిస్తాన్తో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడేందుకు టీమిండియా సిద్దమవుతోంది. డిసెంబర్ 14 నుంచి పెర్త్ వేదికగా పాకిస్తాన్- ఆసీస్ తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తొలి టెస్టుకు 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ జట్టుకు ప్యాట్ కమ్మిన్స్ సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా యువ పేసర్ లాన్స్ మోరిస్కు చోటు దక్కింది. అంతేకాకుండా గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ తిరిగి వచ్చాడు. లియోన్ తిరిగి రావడంతో యవ స్పిన్నర్ టాడ్ మర్ఫీకి తొలి టెస్టు జట్టులో చోటు దక్కలేదు. ఇక ఈ టెస్టు సిరీస్కు కోసం పాకిస్తాన్ ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. తొలి టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, నాథన్ లియాన్, మిచ్ మార్ష్, లాన్స్ మోరిస్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్ పాకిస్థాన్ టెస్టు జట్టు: షాన్ మసూద్ (కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, హసన్ అలీ, ఇమామ్-ఉల్-హక్, ఖుర్రం షాజాద్, మీర్ హంజా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ వసీం జూనియర్, నోమన్ అలీ, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్, సౌద్ షకీల్, షాహీన్ షా అఫ్రిది చదవండి: పాకిస్తాన్ క్రికెట్లో మరో కీలక పరిణామం.. సల్మాన్ భట్పై వేటు -
వీరూ.. ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదని చెప్పా: పాక్ మాజీ బౌలర్
#TB- Pakistan in India 2012-13: భారత్ వర్సెస్ పాకిస్తాన్.. 2012-13 నాటి సిరీస్.. దాయాది టీమిండియాతో టీ20, వన్డే సిరీస్ ఆడేందుకు పాక్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. పాక్ లెఫ్టార్మ్ పేసర్ జునైద్ ఖాన్కు పునరాగమన సిరీస్ అది. నాటి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని మూడుసార్లూ అతడే అవుట్ చేశాడు. తొలి వన్డేలో కోహ్లిని డకౌట్ చేసిన జునైద్.. రెండో మ్యాచ్లో 6 పరుగులకే పెవిలియన్కు పంపాడు. ఇక ఆఖరిదైన ఢిల్లీ మ్యాచ్లో 7 పరుగుల వద్ద నిష్క్రమించేలా చేశాడు. ఎంత మంది వికెట్లు తీసినా కోహ్లి ప్రత్యేకం అప్పట్లో జరిగిన ఈ సిరీస్ను పాకిస్తాన్ 2-1తో కైవసం చేసుకుంది. తాజాగా నాదిర్ షా పాడ్కాస్ట్లో ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న జునైద్ ఖాన్ కోహ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్లో ఎంతో మంది బ్యాటర్ల వికెట్లు తీసినప్పటికీ అందరికీ విరాట్ కోహ్లి వికెట్ మాత్రమే ప్రత్యేకంగా గుర్తుండిపోతుందని పేర్కొన్నాడు. అలా కానివ్వనన్నాడు ‘‘అండర్-19 వరల్డ్కప్ ఆడినప్పటి నుంచే మాకు పరిచయం ఉంది. నాకు బాగా గుర్తు. టీమిండియాతో ఆడటం అదే మొదటిసారి. నా కమ్బ్యాక్ సిరీస్ కూడా! మొదటి మ్యాచ్లో కోహ్లి వికెట్ తీశాను. అప్పుడు అతడు నా దగ్గరకు వచ్చి మరోసారి ఇది పునరావృతం కాదని చెప్పాడు. అయితే, ఆ తర్వాత రెండు మ్యాచ్లలోనూ నేను మళ్లీ అతడి వికెట్ పడగొట్టాను. నిన్ను వదిలే ప్రసక్తే లేదని చెప్పాను నిజానికి మూడో వన్డేకు ముందు బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కోహ్లి కలిశాడు. అప్పుడు.. ‘విరూ.. ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు’ అని చెప్పాను. అప్పుడు యూనిస్ ఖాన్ కూడా అక్కడే ఉన్నాడు. అన్నట్లుగానే నేను కోహ్లిని అవుట్ చేశాను. నా బౌలింగ్లో అతడు ఇచ్చిన క్యాచ్ను యూనిస్ భాయ్ పట్టాడు’’ అని జునైద్ ఖాన్ నాటి సిరీస్లో కోహ్లితో తనకున్న ‘వైరం’ గురించి చెప్పుకొచ్చాడు. కోహ్లి వరల్డ్క్లాస్ బ్యాటర్ అదే సమయంలో కోహ్లిపై ప్రశంసలు కురిపించిన జునైద్ ఖాన్.. ‘‘ప్రపంచంలోని టాప్-5 బ్యాటర్లలో విరాట్ కోహ్లి ఎప్పటికీ నిలిచిపోతాడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడు అసాధారణ రికార్డులు సాధిస్తున్నాడు. ఇటీవలే సచిన్ టెండుల్కర్ వన్డే సెంచరీల రికార్డును కూడా కోహ్లి బద్దలు కొట్టాడు. అతడు వరల్డ్క్లాస్ బ్యాటర్’’ అని కొనియాడాడు. అయితే, కోహ్లి- సచిన్ల కంటే తనకు రోహిత్ శర్మనే మెరుగైన బ్యాటర్ అనిపిస్తాడంటూ ఆఖర్లో ట్విస్ట్ ఇచ్చాడు జునైద్ ఖాన్. అప్పుడు మొత్తం 3 పరుగులిచ్చి మూడుసార్లూ కాగా పాకిస్తాన్ తరఫున 22 టెస్టులు, 76 వన్డేలు, 9 టీ20లు ఆడిన జునైద్ ఖాన్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 71, 110, 8 వికెట్లు తీశాడు. ఇక టీమిండియాతో 2012-13 వన్డే సిరీస్లో కోహ్లికి మొత్తంగా 24 బంతులు వేసిన జునైద్ కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి మూడుసార్లు పెవిలియన్కు పంపాడు. చదవండి: చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్.. తొలి భారత క్రికెటర్గా WTC: టీమిండియాను ‘వెనక్కి’నెట్టిన బంగ్లాదేశ్! టాప్లో పాకిస్తాన్.. -
వాళ్లకు వాళ్లు తోపులనుకుంటారు.. పాక్ మాజీలపై నిప్పులు చెరిగిన షమీ
టీమిండియా పేస్ బాద్షా మొహమ్మద్ షమీ పాకిస్తాన్ మాజీ క్రికెటర్లపై నిప్పులు చెరిగాడు. వన్డే వరల్డ్కప్ 2023 సందర్భంగా భారత పేసర్లకు ఐసీసీ ప్రత్యేక బంతులు సమకూర్చిందంటూ వారు చేసిన నిరాధారమైన ఆరోపణలపై మండిపడ్డాడు. పాక్ మాజీలు ఇలాంటి విచక్షణారహిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హెచ్చరించాడు. మీకు మీరే తోపులనుకుంటే సరిపోదని చురకలంటించాడు. ఇకనైనా మారండ్రా బాబూ అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. కాగా, 2023 వరల్డ్కప్లో భారత పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో టీమిండియా పేస్ త్రయం ఏకంగా 58 వికెట్లు పడగొట్టి, ప్రత్యర్ధి బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. మొహమ్మద్ షమీ 7 మ్యాచ్ల్లో 24 వికెట్లు పడగొట్టి వరల్డ్కప్ లీడింగ్ వికెట్ టేకర్గా నిలువగా.. జస్ప్రీత్ బుమ్రా 11 మ్యాచ్ల్లో 20 వికెట్లు, మొహమ్మద్ సిరాజ్ 11 మ్యాచ్ల్లో 14 వికెట్లు నేలకూల్చారు. Mohammad Shami thrashed Hasan Raza’s theory of different balls provided by ICC to Indians.pic.twitter.com/c6StMTRTCb — Cricketopia (@CricketopiaCom) November 21, 2023 భారత పేసర్లు గతంలో ఎన్నడూ లేనట్లుగా చెలరేగడంతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లలో అక్కసు కట్టలు తెంచుకుంది. భారత పేసర్లకు ఐసీసీ ప్రత్యేకమైన బంతులు సమకూర్చిందంటూ పాక్ మాజీ ఆటగాడు హసన్ రజా వివాదాస్పద ఆరోపణలు చేశాడు. ప్రత్యేక బంతుల కారణంగానే భారత పేసర్లు చెలరేగిపోయారంటూ మరికొంతమంది పాక్ మాజీలు ఆరోపించారు. ఈ ఆరోపణలపై షమీ తాజాగా స్పందించాడు. ప్యూమా కంపెనీకి సంబంధించిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాక్ మాజీలపై నిప్పులు చెరిగాడు. పాక్ మాజీల నిరాధారమైన ఆరోపణలు బాధించాయని అన్నాడు. ఈ సందర్భంగా షమీ మాట్లాడుతూ.. నాకైతే ఇతరుల సక్సెస్ చూసి ఎప్పుడూ ఈర్ష్య కలుగదు. ఇతరుల సక్సెస్ను ఎంజాయ్ చేయగలిగినప్పుడే మంచి ప్లేయర్ అనిపించుకుంటారు. మనకు ఏది చేయాలన్నా దేవుడే చేయాలి. నేను ఇదే నమ్ముతానని అన్నాడు. కుట్ర సిద్ధాంతాల పుట్టుకకు పాకిస్తానీల అర్హతే మూలకారణమని తెలిపాడు. పాక్ మాజీలు కొందరు తమకు తామే అత్యుత్తమమని భావిస్తున్నారని, ఇతరులెవ్వరూ వారు సాధించించి సాధించలేరని ఫీలవుతారని చురకలంటించాడు. -
బాగా ఎంజాయ్ చేశారనుకుంటా.. బై బై! మీ స్థాయికి తగునా భయ్యా?
ICC WC 2023: వన్డే వరల్డ్కప్-2023 సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సత్తా చాటిన న్యూజిలాండ్ పాకిస్తాన్ అవకాశాలను గల్లంతు చేసింది. లీగ్ దశలో ఆఖరిగా శ్రీలంకతో మ్యాచ్లో 23.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి మొత్తంగా 10 పాయింట్లు తమ ఖాతాలో జమచేసుకుంది. దీంతో పాక్ ఆశలు అడియాసలయ్యాయి. అయితే, కివీస్- లంక మ్యాచ్ ఫలితం తేలిన తర్వాత కూడా బాబర్ ఆజం బృందం సెమీస్ రేసులో నిలవాలని భావిస్తే వన్డే క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని అద్భుతం జరగాల్సిందే. అద్భుతం జరగాల్సిందే పాకిస్తాన్ తమకు మిగిలిన మ్యాచ్లో ఇంగ్లండ్పై గెలిస్తే న్యూజిలాండ్ మాదిరే 10 పాయింట్లు సాధిస్తుంది. కానీ రన్రేటు పరంగా ఎంతో ముందున్న కివీస్ జట్టును దాటాలంటే.. కోల్కతాలో శనివారం నాటి మ్యాచ్లో ఇంగ్లండ్పై పాక్ ఏకంగా 287 పరుగుల తేడాతో గెలవాలి. కర్మకాలి ఇంగ్లండ్ గనుక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంటే అక్కడే పాక్ కథ ముగిసిపోతుంది. ఎందుకంటే.. ఇంగ్లండ్ ఎంతటి లక్ష్యం విధించినా దానిని మూడు ఓవర్లలోపే పాక్ ఛేజ్ చేయాల్సి ఉంటుంది. ఇది సాధ్యమయ్యే పనైతే కాదు! కాబట్టి భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్-2023 నుంచి పాక్ అనధికారికంగా నిష్క్రమించినట్లే! ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పాకిస్తాన్ జట్టును తనదైన శైలిలో ట్రోల్ చేశాడు. సురక్షితంగా వెళ్లండి.. బైబై ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా.. ‘‘బై బై పాకిస్తాన్’’ అని రాసి ఉన్న అక్షరాల ఫొటోను హైలైట్ చేస్తూ..‘‘పాకిస్తాన్ జిందా‘భాగ్’(పారిపోండి అన్న అర్థంలో) ! మీరింతే.. ఇక్కడి దాకా రాగలరంతే! ఇక్కడి బిర్యానీ రుచి, ఆతిథ్యాన్ని పూర్తిగా ఆస్వాదించారనే అనుకుంటున్నా. విమానంలో సురక్షితంగా ఇంటికి తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నా. బై బై పాకిస్తాన్’’ అంటూ క్యాప్షన్ జత చేశాడు. దాయాది జట్టును ఉద్దేశించి ఈ మాజీ ఓపెనర్ చేసిన పోస్టు నెట్టింట వైరల్గా మారింది. కాగా వన్డే వరల్డ్కప్ ఆడేందుకు తొలుత హైదరాబాద్ చేరుకున్న పాకిస్తాన్ జట్టుకు ఘన స్వాగతం లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ ప్రేమికుల అభిమానానికి ఫిదా అయిన కెప్టెన్ బాబర్ ఆజం, పేసర్ షాహిన్ ఆఫ్రిది తదితరులు కృతజ్ఞతా భావం చాటుకున్నారు. ఇక ఆ తర్వాత వెళ్లిన ప్రతిచోటా హోటల్ నుంచి కాకుండా పాక్ ఆటగాళ్లు.. బయట నుంచి బిర్యానీలు ఆర్డర్ చేశారన్న వార్తలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో వరుస ఓటముల నేపథ్యంలో ఆ జట్టు అభిమానులు సైతం పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో పాక్ సెమీస్ ఆశలు గల్లంతైన తరుణంలో సెహ్వాగ్ ఈ మేరకు పోస్టు పెట్టడం గమనార్హం. మీ స్థాయికి తగునా? అయితే, చాలా మంది నెటిజన్లు వీరేంద్ర సెహ్వాగ్ తీరును తప్పుబడుతున్నారు. ‘‘శత్రువుకు కూడా ప్రేమను పంచే దేశానికి మీరు.. మీ స్థాయిని మరచి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు సర్. గొప్ప క్రికెటర్గా చరిత్రలో స్థానం సంపాదించిన మీకు ఆటను ఆటలాగే చూడాలని తెలియదా’’ అంటూ చురకలు అంటిస్తున్నారు. మరి వాళ్లు అన్నపుడు ఏం చేశారు? అయితే, వీరూ ఫ్యాన్స్ మాత్రం.. ‘‘భయ్యా అన్నదాంట్లో తప్పేముంది? మన జట్టును ఉద్దేశించి పాక్ క్రికెటర్లు చేసిన వ్యాఖ్యలు మీకు కనిపించవా?’’ అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. పాక్ మాజీ సారథి మహ్మద్ హఫీజ్ విరాట్ కోహ్లిని సెల్ఫిష్ అంటూ చేసిన కామెంట్లు, భారత బౌలర్లకు ప్రత్యేక బంతులు ఇచ్చారన్న రజా వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఏదేమైనా సెహ్వాగ్ చేసిన పోస్టు నెట్టింట ఇలా చర్చకు దారితీసింది. చదవండి: ఇలాంటి తోడు ఉంటే ఏదైనా సాధ్యమే! ప్రేమ, పెళ్లి.. రెయిన్బో బేబీ! View this post on Instagram A post shared by Virender Sehwag (@virendersehwag) -
కొంచెం సిగ్గుపడండి.. పాక్ మాజీ ఆటగాడికి షమీ కౌంటర్
వన్డే వరల్డ్కప్లో టీమిండియాను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ ఆటగాడు హసన్ రజాకు.. భారత పేసర్ మహ్మద్ షమీ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఈ మెగా టోర్నీలో బీసీసీఐ, ఐసీసీ కుమ్మక్కై భారత బౌలర్లకు ప్రత్యేక బంతులు ఇస్తున్నాయంటూ హసన్ రజా నిరాధరమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా డీఆర్ఎస్ని తారుమారు చేయడంలాంటి మోసపూరిత కుట్రలతో టీమిండియా విజయాలు సాధిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో రజా వ్యాఖ్యలకు టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ దిమ్మతిరిగేలా సమాధానమిచ్చాడు. ఇటువంటి నిరాధరమైన ఆరోపణలు చేయడానికి సిగ్గు ఉండాలంటూ మండిపడ్డాడు. "ఇటువంటి చెత్త వ్యాఖ్యలు చేసినందుకు కొంచెం సిగ్గుపడండి. ముందు ఆటపై దృష్టిపెట్టండి. వేరొకరి విజయాన్ని ఆస్వాదించండి. అంతేతప్ప మరొకరిని ద్వేషించడం సరికాదు. ఇదేమి లోకల్ టోర్నమెంట్ కాదు. ఐసీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వరల్డ్కప్. ఇదివరకే మీరు ఇలాంటి చెత్త కామెంట్స్ చేస్తే వసీం అక్రమ్ ఖండించారు. కనీసం మీ సొంత ఆటగాడినైనా నమ్మండి. సొంత డప్పు కొట్టుకోవడంలో బిజీగా ఉన్నారు కదా" అంటూ తన ఇనస్టాగ్రామ్ స్టోరీలో షమీ రాసుకొచ్చాడు. కాగా ఈ మెగా టోర్నీలో షమీ అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడిన షమీ 16 వికెట్లు పడగొట్టాడు. అందులో రెండు ఫైవ్ వికెట్ల హాల్స్ ఉండడం గమనార్హం. చదవండి: ICC Rankings: మళ్లీ మనోడే నెంబర్ 1.. షాహిన్ ఆఫ్రిదిని వెనక్కినెట్టిన సిరాజ్ View this post on Instagram A post shared by ICC (@icc) -
ఆసియా కప్ షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
అండర్-19 పురుషుల ఆసియాకప్-2023 షెడ్యూల్ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ బుధవారం ప్రకటించింది. ఈ మెగా టోర్నీ దుబాయ్ వేదికగా డిసెంబర్ 8 నుంచి అదే నెల 17 వరకు జరగనుంది. వన్డే ఫార్మాట్లో జరగనున్న ఈ మెగా ఈవెంట్లో మొత్తం 8 జట్లు పాల్గోనున్నాయి. ఈ 8 జట్లను మొత్తం రెండు గ్రూపులుగా ఏసీసీ విభజించింది. గ్రూప్-ఎలో భారత్, నేపాల్, ఆఫ్గానిస్తాన్, పాకిస్తాన్ జట్లు ఉన్నాయి. గ్రూపు-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, జపాన్, ఆతిథ్య యూఏఈ ఉన్నాయి. డిసెంబర్ 8న భారత్- ఆఫ్గానిస్తాన్ మధ్య మ్యాచ్తో ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ ఆసియా జెయింట్స్ మధ్య పోరులో లీగ్ మ్యాచ్లు అన్నీ ఐసీసీ అకాడమీలో జరగనున్నాయి. సెమీఫైనల్-1, ఫైనల్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. ఇక ఈ టోర్నీలో డిసెంబర్ 10న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్తో టీమిండియా తలపడనుంది. కాగా ఈవెంట్లో భారత్ డిఫెండింగ్ ఛాపింయన్స్ హోదాలో బరిలోకి దిగనుంది. చివరగా 2021లో జరిగిన ఆసియాకప్లో శ్రీలంకను చిత్తు చేసి భారత్ టైటిల్ను ముద్దాడింది. చదవండి: ఆస్ట్రేలియాతో టీమిండియా సిరీస్... హైదరాబాదీలకు బ్యాడ్న్యూస్! -
CWC 2023: పాక్ సెమీస్కు చేరి భారత్తో తలపడాలంటే ఇలా జరగాలి..
ప్రస్తుత వన్డే ప్రపంచకప్లో భారత్, పాక్లు మరోసారి (సెమీస్లో) తలపడే అవకాశాలు మినుకుమినుకుమంటున్నాయి. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో వరుణుడి కటాక్షంతో గట్టెక్కి,సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకున్న పాక్, తమ తదుపరి మ్యాచ్లో ఇంగ్లండ్పై భారీ తేడాతో నెగ్గితే సెమీస్కు చేరే ఛాన్స్ ఉంటుంది. పాక్ సెమీస్కు చేరి, భారత్తో తలపడాలంటే ఈ ఈక్వేషన్తో పాటు మరో రెండు ఈక్వేషన్స్ వర్కౌట్ అవ్వాల్సి ఉంటుంది. అవేంటంటే.. న్యూజిలాండ్ శ్రీలంక చేతిలో ఓడాలి. అలాగే ఆఫ్ఘనిస్తాన్ తమ తదుపరి మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతుల్లో ఓడాలి. ఇలా జరిగితే పాక్ 10 పాయింట్లతో నాలుగో జట్టుగా సెమీస్కు అర్హత సాధిస్తుంది. అప్పుడు పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉన్న భారత్.. నాలుగో ప్లేస్లో ఉన్న పాక్ సెమీస్లో తలపడతాయి. అయితే ఇలా జరగడం అంత ఈజీ కూడా కాకపోవచ్చు. ఒకవేళ పాక్.. ఇంగ్లండ్పై గెలచి, మరోపక్క న్యూజిలాండ్.. శ్రీలంకను మట్టికరిపిస్తే అప్పుడు ఈ ఇరు జట్లలో మెరుగైన రన్రేట్ కలిగిన జట్టు సెమీస్కు చేరుకుని భారత్తో తలపడుతుంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాల్లో ఏదో ఒక జట్టుపై భారీ తేడాతో గెలిచినా ఆ జట్టు కూడా సెమీస్ రేసులో నిలుస్తుంది. ఏ ఇబ్బంది లేకుండా పాక్ సెమీస్కు చేరాలంటే ఆ జట్టు ఇంగ్లండ్పై విజయం సాధించి, న్యూజిలాండ్ శ్రీలంక చేతిలో ఓడి, ఆఫ్ఘనిస్తాన్.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతుల్లో ఓడితే సరిపోతుంది. కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో బంగ్లాదేశ్, శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు ఇదివరకే ఎలిమినేషన్కు గురి కాగా.. భారత్, సౌతాఫ్రికా జట్లు సెమీస్కు అర్హత సాధించాయి. సెమీస్ రేసులో మూడు, నాలుగు స్థానాల కోసం ఆసీస్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పోటీ నడుస్తుంది. -
WC 2023: ప్రపంచకప్ చరిత్రలో ఇదే తొలిసారి.. అయినా పాక్ సెమీస్ చేరే ఛాన్స్! ఎలా?
ICC WC 2023- Pakistan Semis Chances Still Alive?: వన్డే వరల్డ్కప్-2023 ఆరంభానికి ముందు టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా భావించిన పాకిస్తాన్.. ఇప్పుడు కనీసం సెమీస్ చేరుతుందా లేదా అన్న స్థాయికి పడిపోయింది. ప్రపంచకప్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోయి.. విమర్శలు మూటగట్టుకుంటోంది. ఉప్పల్లో వరుస విజయాలు వన్డే ప్రపంచకప్ 13వ ఎడిషన్లో తొలుత పసికూన నెదర్లాండ్స్తో తలపడింది బాబర్ ఆజం బృందం. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 81 పరుగుల తేడాతో గెలుపొంది.. ఐసీసీ టోర్నీలో శుభారంభం చేసింది. ఆ తర్వాత అదే వేదికపై శ్రీలంకను 6 వికెట్ల తేడాతో ఓడించి సత్తా చాటింది. ఎప్పుడైతే దాయాది టీమిండియా చేతిలో పాక్ చిత్తైందో అప్పటి నుంచి జట్టు రాత మారిపోయింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చరిత్రను పునరావృతం చేస్తూ భారత జట్టు పాకిస్తాన్ను 8వసారి మట్టికరిపించింది. టీమిండియా దెబ్బ తర్వాత అన్నీ ఓటములే సొంతగడ్డపై చిరకాల ప్రత్యర్థిని ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి మరోసారి ఆధిపత్యం చాటుకుంది. ఇది మొదలు.. టీమిండియాతో మ్యాచ్ తర్వాత పాకిస్తాన్కు వరుసగా ఓటములే ఎదురయ్యాయి. చెపాక్లో ఘోర పరాభవాలు.. ఎన్నడూ లేని విధంగా బెంగళూరులో ఆస్ట్రేలియా చేతిలో 62 పరుగుల తేడాతో ఓడిన బాబర్ బృందం.. వన్డే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి అఫ్గనిస్తాన్ ముందు కూడా తలవంచింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మరీ దారుణంగా 8 వికెట్ల తేడాతో అఫ్గన్ భంగపాటుకు గురైంది. ఈ క్రమంలో సెమీస్ రేసులో నిలవాలంటే సౌతాఫ్రికాతో తప్పక గెలవాల్సిన మ్యాచ్లోనూ సీన్ రిపీట్ అయింది. చెపాక్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న మ్యాచ్లో అదృష్టం సౌతాఫ్రికాను వరించడంతో పాకిస్తాన్కు మరో ఓటమి తప్పలేదు. ఈ శతాబ్దంలో వరల్డ్కప్లో పాక్ తొలిసారి సఫారీల చేతిలో పరాజయం పాలైంది. దీంతో సెమీస్ ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు ఇంకా సజీవంగానే! అయితే, సాంకేతికంగా పాకిస్తాన్ ఇంకా రేసులో ఉన్నట్లే! ఎలా అంటే.. ఈ టోర్నీలో పాకిస్తాన్కు ఇంకా మూడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈ మేరకు బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్తో జరుగనున్న మ్యాచ్లలో పాక్ భారీ విజయాలు సాధించి రన్రేటును మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది. తద్వారా పాకిస్తాన్ ఖాతాలో 10 పాయింట్లు చేరతాయి. అయినప్పటికీ నేరుగా సెమీస్ చేరే ఛాన్స్ ఉండదు. ఇందుకోసం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇప్పటికే సౌతాఫ్రికా(భారీ రన్రేటు), టీమిండియా 10 పాయింట్లో పట్టికలో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆ మ్యాచ్ ఫలితాలపై ఆధారపడిన పాక్ భవితవ్యం న్యూజిలాండ్ 8, ఆస్ట్రేలియా 6 పాయింట్లతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మిగిలిన మ్యాచ్లన్నింటి(ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాక్, శ్రీలంక)లో ఓడిపోతే.. కేవలం ఎనిమిది పాయింట్లతో ఉంటుంది. అప్పుడు పాక్కు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అదే విధంగా.. ఆస్ట్రేలియా కూడా తమకు మిగిలిన నాలుగు మ్యాచ్లలో మూడు ఓడిపోతే పాక్కు ఛాన్స్ ఉంటుంది. తమ తదుపరి మ్యాచ్లలో ఆసీస్ న్యూజిలాండ్, ఇంగ్లండ్ చేతిలో ఓడి.. బంగ్లాదేశ, అఫ్గనిస్తాన్లలో ఏదో ఒకదానిపై గెలిచినా 8 పాయింట్లకే పరిమితం అవుతుంది కాబట్టి ఈ అవకాశం పాక్కు దక్కుతుంది. ఇంతదాకా తెచ్చుకోవడం ఎందుకు? చూద్దాం అలా కాక కేవలం న్యూజిలాండ్, ఇంగ్లండ్ చేతిలో కంగారూలు ఓడి అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్లపై గెలుపొందితే.. పాకిస్తాన్తో పాటు రన్రేటుతో పోటీపడాల్సి ఉంటుంది. ఇదేమీ కాకుండా ఆసీస్ మూడూ గెలిచినా.. న్యూజిలాండ్ రెండు, సౌతాఫ్రికా, టీమిండియా తమకు మిగిలిన మ్యాచ్లలో కనీసం రెండు గెలుపొందినా పాక్ ఇంటిబాటపట్టాల్సిందే! అదీ సంగతి.. గత నాలుగు మ్యాచ్లలో ఒక్కటి గెలిచినా పాకిస్తాన్కు ఈ పరిస్థితి దాపురించేది కాదు! కెప్టెన్ బాబర్ ఆజం అన్నట్లు ఏం జరుగుతుందోనంటూ పాక్ అభిమానులు వేచి చూడాల్సిందే. చదవండి: అంతా తెలిసే చేశావంటే నిన్నేమనుకోవాలి? అతడి రాతే అంత.. ఎప్పుడూ ఇలాగే! View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: స్నేహాలు, పర్సనల్ రిలేషన్షిప్స్.. అందుకే జట్టుకు ఈ దుస్థితి!
‘‘జట్టును ప్రకటించినప్పుడే నాకంతా అర్థమైపోయింది. స్నేహాలు, వ్యక్తిగత బాంధవ్యాల ఆధారంగానే ఈ సెలక్షన్ జరిగింది. జట్టు సమతూకంగా లేదు. ఇండియాలో వరల్డ్కప్ టోర్నీలో పాకిస్తాన్కు ఈ తిప్పలు తప్పవని నేను ముందే ఊహించాను. వాళ్లు(మేనేజ్మెంట్) అన్నీ మాట్లాడతారు గానీ సరైన వ్యూహాలు రచించలేకపోతున్నారు. ఇండియాలో పిచ్ పరిస్థితులు బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్కు అనుకూలిస్తాయన్న విషయం వాళ్లు అర్థం చేసుకుని ఉంటే బాగుండేది. సెలక్షన్ మొత్తం తప్పుల తడక ఈ టీమ్ సెలక్షన్ మొత్తం తప్పులతడకగా ఉంది. నసీం షా అందుబాటులో లేడని హసన్ అలీ చేతికి కొత్త బంతిని ఇస్తున్నారు. హసన్ అలీ కేవలం మేనేజ్మెంట్లోని కీలక సభ్యులతో తనకున్న ఫ్రెండ్షిప్ కారణంగానే జట్టులోకి వచ్చాడు. ఇక ఉసామా మిర్.. పాకిస్తాన్ సూపర్ లీగ్లో ముల్తాన్ సుల్తాన్స్కు ఆడతాడు. ముస్తాక్ అహ్మద్కు చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్తో సత్సంబంధాలు ఉన్నాయి. స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా ఆటగాళ్ల ఎంపిక జరుగుతోంది. దేశానికి ప్రాతినిథ్యం వహించే జట్టు గురించి ఎవరికీ పట్టింపు లేదు. అలాంటపుడు ఇలాంటే ఫలితాలే వస్తాయి. అప్పుడు నన్నైతే పక్కనపెట్టారు అయినా.. పాకిస్తాన్ గతంలో ఇద్దరు లెగ్ స్పిన్నర్లతో బరిలోకి దిగిందే లేదు. షాహిద్ ఆఫ్రిది ఉన్నాడన్న కారణంగా వన్డే జట్టు నుంచి నన్ను తప్పించేవారు. ఈ టోర్నీలో చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరిగినపుడు షాదాబ్ ఖాన్ను తప్పించి ఉసామా మిర్ను రప్పించారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఇమాద్ వసీం(లెఫ్టార్మ్ స్పిన్నర్)ను జట్టులోకి ఎందుకు తీసుకోలేదు’’ అంటూ పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్వప్రయోజనాల కోసం జట్టును భ్రష్టు పట్టిస్తున్నారంటూ సెలక్షన్ తీరుపై మండిపడ్డాడు. ఇకనైనా జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించకపోతే ఇలాంటి అవమానాలు మరిన్ని ఎదుర్కోక తప్పదంటూ ఘాటు విమర్శలు చేశాడు. వన్డే వరల్డ్కప్-2023లో ఇప్పటికే పాకిస్తాన్ చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుందన్న కనేరియా.. ఇకముందు కూడా కోలుకునే అవకాశం లేదంటూ కుండబద్దలు కొట్టాడు. కాగా భారత్ వేదికగా మెగా ఐసీసీ టోర్నీలో ఆరంభంలో వరుసగా రెండు విజయాలు సాధించిన పాకిస్తాన్.. ఆ తర్వాత మూడు పరాజయాలు చవిచూసింది. బాబర్ ఆజంను తప్పించాలంటూ డిమాండ్లు కనీవిని ఎరుగని రీతిలో వన్డే ఫార్మాట్లో అదీ మేజర్ ఈవెంట్లో అఫ్గనిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడింది. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్లలో మూడు ఓడి పట్టికలో ఐదో స్థానంలో ఉంది. పాకిస్తాన్ సెమీస్ రేసులో నిలవాలంటే మిగిలిన మ్యాచ్లలో గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఓటములపై స్పందించిన డానిష్ కనేరియా ఈ మేరకు ఆజ్ తక్తో మాట్లాడుతూ పాక్ బోర్డు, సెలక్టర్లను ఉద్దేశించి విమర్శలు గుప్పించాడు. కాగా పాక్ వరుస ఓటములు నేపథ్యంలో కెప్టెన్గా బాబర్ ఆజంను తప్పించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. చదవండి: WC 2023: టీమిండియాకు భారీ షాక్! హార్దిక్ పాండ్యా ఇక..
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వేగవంతంగా ధాన్యం కొనుగోళ్లు
అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
ఫలించిన ఎన్నికల సంఘం చర్యలు..
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే..
మెరుగైన ఫలితాలు సాధించాలి
వేరుశనగ క్వింటా రూ.6,410
అక్రమ నిర్మాణం తొలగింపు
జూన్ 4న కూటమికి ఏం జరుగుతుంది ?..విజయ్ బాబు సూటి ప్రశ్న
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి: ఈషా రెబ్బా
- కొడుకు, కూతుళ్ల నిర్వాకం.. తల్లికి అంత్యక్రియలు జరపకుండా..
- కొన్నేళ్లుగా పోలీసుల రక్షణలో సూర్య ఇల్లు.. కారణం ఇదే
- రెండు రోజులుగా బెంబేలెత్తించిన బంగారం.. నేడు కాస్త..
- తీహార్ జైల్లో కవితతో ఆర్ఎస్పీ, సుమన్ ములాఖత్
- షుగర్ పేషంట్లకు శుభవార్త.. మందుల ధరలు తగ్గింపు
- అమెరికాలో గంజాయి బ్యాచ్లకు ఊరట!
- తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- టీడీపీ చెప్పినట్లు ఆడినందుకే
Advertisement