rohit sharma
-
రోహిత్ శర్మ కీలక నిర్ణయం.. ఆ సిరీస్కు దూరం!
ఐపీఎల్-2025 ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడేందుకు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. అయితే ఈ సిరీస్కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.రెడ్ బాల్ క్రికెట్లో పేలవ ఫామ్ కారణంగా ఈ సిరీస్కు దూరంగా ఉండాలని రోహిత్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రోహిత్ ఇప్పటికే బీసీసీఐకి తెలియజేసినట్లు సమాచారం. అదేవిధంగా బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో విఫలమైన కోహ్లి మాత్రం ఇంగ్లండ్ సిరీస్లో ఆడనున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ న్యూజిలాండ్తో టెస్టు సిరీస్తో పాటు బీజీటీలోనూ దారుణ ప్రదర్శన కనబరిచాడు.ఆసీస్తో సిరీస్లో తొలి మ్యాచ్కు వ్యక్తిగత కారణాలతో దూరమైన హిట్ మ్యాన్.. తర్వాత రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చాడు. కానీ తన మార్క్ను చూపించలేకపోయాడు. మూడు మ్యాచ్లలో అతను 6.20 సగటుతో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్గా కూడా రోహిత్ విఫలమయ్యాడు. ఈ క్రమంలో సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టు నుంచి రోహిత్ శర్మ తనంతట తానే తప్పుకున్నాడు. ఆ మ్యాచ్ అనంతరం రోహిత్ టెస్టులకు విడ్కోలు పలకనున్నాడని ఊహగానాలు వినిపించాయి. కానీ రోహిత్ మాత్రం ఇప్పటిలో నకు రిటైరయ్యే ఉద్దేశ్యం లేదని పుకార్లకు చెక్ పెట్టాడు. కానీ ఇప్పుడు కొన్ని రోజుల పాటు టెస్టులకు దూరంగా ఉండాలని రోహిత్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ హిట్మ్యాన్ అందుబాటులేకపోతే జస్ప్రీత్ బుమ్రా జట్టు పగ్గాలను చేపట్టే అవకాశముంది. అయితే మరి కొన్ని రిపోర్ట్లు మాత్రం రోహిత్ ఇంగ్లండ్ సిరీస్కు అందుబాటులో ఉండనున్నాడని పేర్కొంటున్నాయి. రోహిత్ ఆడుతాడా, తప్పుకుంటాడా అన్నది మరి కొన్ని రోజుల్లో తేలిపోనుంది. ఇక భారత క్రికెట్ జట్టు ఏడాది జూన్ 20న ఇంగ్లాండ్ పర్యటనను ప్రారంభిస్తుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ హెడింగ్లీలోని లీడ్స్ వేదికగా జరుగనుంది. తదుపరి నాలుగు టెస్ట్లు ఎడ్జ్బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్, కెన్నింగ్టన్ ఓవల్ వేదికలపై జరగనున్నాయి. అంతకంటే ముందు భారత-ఎ జట్టు రెండు అనాధికారిక టెస్టు మ్యాచ్లు ఆడనుంది.చదవండి: IPL 2025: రియాన్ పరాగ్ చెత్త రికార్డు.. తొలి ప్లేయర్గా -
IND vs ENG: రోహిత్ భవిష్యత్తుపై నిర్ణయం.. జట్టు ప్రకటన అప్పుడే!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)- 2025 ముగిసిన వెంటనే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) రూపంలో మరో క్రికెట్ పండుగ సందడి మొదలైంది. మార్చి 22న మొదలైన ఈ క్యాష్ రిచ్ లీగ్.. మే 25న ఫైనల్తో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు అంతర్జాతీయ క్రికెట్ నుంచి దాదాపు రెండు నెలలకు పైగా విరామం లభించింది.ఇక ఐపీఎల్-2025 తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు పయనం కానుంది. జూన్ ఆఖరి వారం నుంచి ఇంగ్లిష్ జట్టుతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ మొదలుపెట్టనుంది. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మే చివరి వారంలో జట్టును ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాదు.. ఈ కీలక టెస్టు సిరీస్కు రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా కొనసాగించాలని సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బృందం మూకుమ్మడిగా హిట్మ్యాన్కు ఓటువేసినట్లు తెలుస్తోంది.రోహిత్ భవిష్యత్తుపై నిర్ణయం.. జట్టు ప్రకటన అప్పుడే!ఈ విషయాల గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్తో సిరీస్లో, ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైనప్పటికీ.. ఇంగ్లండ్తో టెస్టులకూ రోహిత్ శర్మనే కెప్టెన్గా కొనసాగించే అవకావాలు ఉన్నాయి. జట్టు ప్రకటనకు చాలా సమయం ఉంది. ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్ల నాటికి సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత ఏ క్షణమైన ప్రకటన రావొచ్చు’’ అని పీటీఐతో పేర్కొన్నాయి.ఘోర పరాభవాలుకాగా టెస్టు క్రికెట్లో గత కొంతకాలంగా రోహిత్ శర్మ వైఫల్యాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టులో అతడి నాయకత్వంలో భారత జట్టు.. 3-0తో క్లీన్స్వీప్ అయింది. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా.. విదేశీ జట్టు చేతిలో సొంతగడ్డపై మూడు మ్యాచ్ల సిరీస్లో వైట్వాష్కు గురికావడం ఇదే తొలిసారి.ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలోనూ రోహిత్ సేనకు భంగపాటే ఎదురైంది. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్లోనూ టీమిండియా ఓడిపోయింది. ఐదు టెస్టుల సిరీస్లో 3-1తో పరాజయం పాలై.. పదేళ్ల తర్వాత తొలిసారి ఆసీస్కు ఈ ట్రోఫీని చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC)- 2023-25 ఫైనల్కు చేరకుండానే నిష్క్రమించింది.ఈ రెండు సిరీస్లలో కెప్టెన్గా.. బ్యాటర్గా రోహిత్ శర్మ ఘోరంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత రంజీ బరిలో ముంబై తరఫున ఓపెనర్గా వచ్చి అక్కడా పేలవ ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతడిని టెస్టు కెప్టెన్సీ నుంచి, జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లు పెరిగాయి.తిరిగి ఫామ్లోకిఅయితే, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో రోహిత్ శర్మ ప్రదర్శన తర్వాత సీన్ మారిపోయింది. ఈ వన్డే టోర్నమెంట్లో బ్యాటర్గా, సారథిగా రాణించి భారత్కు టైటిల్ అందించాడు హిట్మ్యాన్. తద్వారా తన ఖాతాలో రెండో ఐసీసీ టైటిల్ చేర్చుకోవడంతో పాటు.. భారత్కు పుష్కరకాలం తర్వాత చాంపియన్స్ ట్రోఫీని అందించాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మకు టెస్టుల్లోనూ మరొక్క అవకాశం ఇవ్వాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.కాగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్ను చాంపియన్గా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో కొనసాగుతున్న హిట్మ్యాన్.. ఐపీఎల్-2025లో భాగంగా ముంబై ఇండియన్స్ తరఫున మరోసారి బరిలోకి దిగాడు. చదవండి: అంతా డికాకే చేశాడు.. తప్పులు ఒప్పుకుంటాం.. రిపీట్ చేయం: రియాన్ పరాగ్ -
ద్రవిడ్ గొప్పోడు.. గంభీర్ మాత్రం స్పందించడం లేదు: టీమిండియా దిగ్గజం
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) గురించి భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గౌతీ.. రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) బాటలో నడుస్తున్నాడా? లేదా? అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నాడు. ద్రవిడ్ మాదిరి గౌతీకి పెద్ద మనసు ఉందో లేదో తెలియడం లేదంటూ విమర్శనాస్త్రాలు సంధించాడు. ఇంతకీ విషయం ఏమిటంటే....భారత జట్టు ఇటీవలే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)గెలుచుకున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చిన ఈ మెగా వన్డే టోర్నీలో రోహిత్ సేన.. తమ మ్యాచ్లన్నీ దుబాయ్లోనే ఆడింది. రూ. 58 కోట్ల క్యాష్ రికార్డుగ్రూప్ దశలో మూడింటికి మూడు గెలిచి సెమీస్లో అడుగుపెట్టిన టీమిండియా.. కీలక పోరులో ఆస్ట్రేలియాను ఓడించింది. అనంతరం టైటిల్ పోరులో న్యూజిలాండ్పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీని ముద్దాడింది.తద్వారా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో రెండో ఐసీసీ టైటిల్ చేరగా.. భారత్కు పుష్కర కాలం తర్వాత చాంపియన్స్ ట్రోఫీ దక్కింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) టీమిండియాకు భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. రూ. 58 కోట్ల క్యాష్ రికార్డు ఇవ్వనున్నట్లు మార్చి 20న పత్రికా ప్రకటన విడుదల చేసింది.గంభీర్కు రూ. 3 కోట్లుఈ మొత్తంలో చాంపియన్స్ ట్రోఫీ జట్టులోని ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ. 3 కోట్ల చొప్పున.. అదే విధంగా హెడ్కోచ్ గంభీర్కు రూ. 3 కోట్లు ఇవ్వనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. సహాయక కోచ్లు, మిగతా సిబ్బందికి రూ. 50 లక్షల నగదు బహుమానం అందజేయనున్నట్లు తెలిపారు.ఈ విషయంపై సునిల్ గావస్కర్ తాజాగా తనదైన శైలిలో స్పందించాడు. ద్రవిడ్తో గంభీర్ను పోలుస్తూ స్పోర్ట్స్స్టార్కు రాసిన కాలమ్లో వింత వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తర్వాత బీసీసీఐ భారీ స్థాయిలో ప్రైజ్మనీ ప్రకటించింది. అప్పటి హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్కు ఆటగాళ్లతో సమానంగా బహుమతి ఇవ్వాలని భావించింది.ద్రవిడ్ గొప్పోడు.. గంభీర్ మాత్రం స్పందించడం లేదుకానీ అతడు అందుకు అంగీకరించలేదు. సహాయక కోచ్లతో పాటూ తానూ సమానమేనని.. వారికి ఇచ్చినంతే తనకూ ఇవ్వాలని బోర్డుకు విజ్ఞప్తి చేశాడు. లేదంటే.. తనకు దక్కిన మొత్తాన్ని సహచర కోచ్లతో పంచుకుంటానని చెప్పాడు. చెప్పిందే చేశాడు కూడా!ఇక చాంపియన్స్ ట్రోఫీలో భారత్ గెలిచిన నేపథ్యంలో బీసీసీఐ క్యాష్ రివార్డు ప్రకటించి.. రోజులు గడుస్తున్నాయి. అయినా.. ఇప్పటి వరకు ప్రస్తుత హెడ్కోచ్ నుంచి ప్రైజ్మనీ తీసుకునే విషయంలో ఎలాంటి ప్రకటనా రాలేదు.అతడు ద్రవిడ్ మాదిరి కోచ్లందరితో సమానంగా నగదు తీసుకుంటాడా? లేదా? లేదంటే.. ద్రవిడ్ ఓ మంచి రోల్ మోడల్ కాదంటారా?!’’ అని గావస్కర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.శుభపరిణామంఅదే విధంగా.. బీసీసీఐ జట్టుకు ఈ మేర భారీ ప్రోత్సాహకాలు అందించడం గొప్ప విషమమని గావస్కర్ బోర్డును ప్రశంసించాడు. ‘‘ఐసీసీ టీ20 ప్రపంచకప్ గెలిచినప్పుడు బీసీసీఐ రూ. 125 కోట్ల మేర భారీ రివార్డు ప్రకటించింది. సెలక్టర్లు, సహాయక సిబ్బందికి కూడా తగిన రీతిలో బహుమానం అందజేసింది.ఇక ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ గెలిచినందుకు రూ. 58 కోట్లు ఇవ్వడం శుభపరిణామం. ఈసారి కూడా సెలక్షన్ కమిటీ, సహాయక సిబ్బందిని దృష్టిలో పెట్టుకుంది. నిజంగా ఇది గొప్ప విషయం. అంతేకాదు.. ఐసీసీ ప్రకటించిన ప్రైజ్మనీ మొత్తాన్ని కూడా ఆటగాళ్లకే పంచడం.. వారికి తగిన రీతిలో ప్రోత్సాహకాలు అందించడం సానుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది’’ అని గావస్కర్ పేర్కొన్నాడు.చదవండి: 4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?: భారత మాజీ క్రికెటర్ -
అస్సలు జీర్ణించుకోలేకపోయా.. అయినా భాయ్కు అంతా తెలుసు: సిరాజ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో కొత్త ఫ్రాంఛైజీ తరఫున ఆడబోతున్నాడు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్. దాదాపు ఏడేళ్ల పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)కి ఆడిన ఈ హైదరాబాదీని.. మెగా వేలానికి ముందు ఆ ఫ్రాంఛైజీ వదిలేసింది. ఈ క్రమంలో రూ. 12.25 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సిరాజ్ను కొనుగోలు చేసింది.బౌలర్ల కెప్టెన్ఇక ఐపీఎల్-2025లో తమ తొలి మ్యాచ్లో భాగంగా గుజరాత్ మంగళవారం పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ‘బోరియా సీజన్ సిక్స్’తో ముచ్చటించిన సిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘శుబ్మన్ గిల్ (Shubman Gill) బౌలర్ల కెప్టెన్. గొప్ప సారథి.బౌలర్లు ఏది అడిగినా.. కాదనడు. వాళ్లకు కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తాడు. స్వేచ్ఛనిస్తాడు. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. నేను, రిషభ్ పంత్, శుబ్మన్, అక్షర్ పటేల్.. కలిసి తరచుగా డిన్నర్లకు వెళ్తూ ఉంటాం. గిల్, నేను ఒకేసారి టెస్టుల్లో అడుగుపెట్టాము. అందుకే మా బంధం ఇంతగా బలపడి ఉంటుంది’’ అని గిల్తో తనకున్న స్నేహం గురించి చెప్పుకొచ్చాడు.ఆయనొక లెజెండ్ఇక గుజరాత్ కోచ్ ఆశిష్ నెహ్రా గురించి మాట్లాడుతూ.. ‘‘ఆయనొక లెజెండ్. నెహ్రా భాయ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోకుండా ఎలా ఉండాలో ఆయనను చూసే తెలుసుకున్నా. గతంలో షమీ భాయ్ ఈ ఫ్రాంఛైజీకి ఆడాడు.నేను కూడా తనలా అద్భుతంగా ఆడి వికెట్లు తీయడం మీద మాత్రమే దృష్టి పెట్టాను. జట్టు విజయాల కోసం నా శాయశక్తులా కృషి చేస్తా’’ అని సిరాజ్ పేర్కొన్నాడు. ఇక ఈ సందర్భంగా చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టులో చోటు దక్కకపోవడం గురించి ప్రస్తావన రాగా.. ఈ హైదరాబాదీ పేసర్ హుందాగా స్పందించాడు.అస్సలు జీర్ణించుకోలేకపోయా.. ‘‘జట్టు గురించి ప్రకటన రాగానే తొలుత ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాను. ఐసీసీ ఈవెంట్ ఆడే జట్టులో నాకు చోటు లేదే అని బాధపడ్డాను. అయితే, జట్టు ప్రయోజనాల గురించే రోహిత్ భాయ్ ఆలోచిస్తాడని నాకు తెలుసు.దుబాయ్లో పేసర్లకు పెద్దగా పని ఉండదని భాయ్కు తెలుసు. ఆయన ఎంతో అనుభవజ్ఞుడైన కెప్టెన్. అక్కడి పిచ్లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయని ఆయనకు తెలుసు. అందుకే నన్ను పక్కనపెట్టాలని వాళ్లు నిర్ణయించుకున్నారు’’ అని సిరాజ్ పేర్కొన్నాడు.విశ్రాంతి దొరికిందిఏదేమైనా దేశం కోసం ఆడేటప్పుడు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుందని.. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్ కోరుకుంటాడని సిరాజ్ అన్నాడు. ఇక చాంపియన్స్ట్రోఫీ జట్టులో లేనందు వల్ల తనకు చాలాకాలం పాటు విశ్రాంతి లభించిందని.. ఆ సమయాన్ని ఫిట్నెస్ మెరుగుపరచుకునేందుకు ఉపయోగించుకున్నానని తెలిపాడు.కాగా పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్యం ఇవ్వగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్లన్నీ దుబాయ్లో ఆడింది. ఇక ఈ మెగా వన్డే టోర్నమెంట్లో గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్లను ఓడించిన రోహిత్ సేన.. సెమీస్లో ఆస్ట్రేలియాపై గెలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడింది.ఇక సిరాజ్ చివరగా ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ ఆడాడు. తదుపరి జూన్లో ఇంగ్లండ్ టూర్కు వెళ్లే జట్టుకు అతడు ఎంపికయ్యే అవకాశం ఉంది. ఇక మళ్లీ పరిమిత ఓవర్ల జట్టులో తిరిగి స్థానం సంపాదించాలంటే సిరాజ్ మియా.. ఐపీఎల్-2025లో సత్తా చాటాల్సి ఉంటుంది.చదవండి: ‘గిల్ ఒక్కడే ఏమీ చేయలేడు.. మేమంతా ఉంటేనే ఏదైనా సాధ్యం’ -
చహల్ మాజీ భార్య అంటే రోహిత్ శర్మ సతీమణికి పడదా.. ఎందుకు ఇలా చేసింది..?
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చహల్-ధనశ్రీ వర్మ ఇటీవలే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. విడాకుల అనంతరం చహల్.. ధనశ్రీకి రూ. 4.75 కోట్ల భరణం చెల్లించేందుకు ఒప్పుకున్నాడు. ధనశ్రీ చహల్ను భరణం పేరుతో డబ్బు డిమాండ్ చేయడం క్రికెట్ అభిమానులకు నచ్చలేదు. దీంతో ధనశ్రీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ధనశ్రీ చహల్ను కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుందని అంటున్నారు. ఈ విషయంలో చహల్కు అండగా నిలుస్తున్నారు. చాలా మంది క్రికెట్ అభిమానుల్లాగే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే కూడా చహల్కు మద్దతుగా నిలిచినట్లనిపిస్తుంది.తాజాగా ధనశ్రీని విమర్శిస్తూ శుభాంకర్ మిశ్రా అనే జర్నలిస్ట్ సోషల్మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. దీనికి రితిక లైక్ కొట్టింది. ఇది తెలిసి అభిమానులు ధనశ్రీ అంటే రితికకు సరిపోదా అని చర్చించుకుంటున్నారు. ధనశ్రీపై శుభాంకర్ విమర్శలతో ఏకీభవించే రితిక ఇలా చేసుంటుందని అనుకుంటున్నారు.ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..?శుభాంకర్ మిశ్రా ధనశ్రీ వర్మను 'గోల్డ్ డిగ్గర్' అని సంబోధించాడు. గోల్డ్ డిగ్గర్ అంటే డబ్బు కోసం ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకునే మహిళ అని అర్దం. వీడియోలో శుభాంకర్ ధనశ్రీని ఉద్దేశిస్తూ ఇలా కూడా అన్నాడు. విడాకుల తర్వాత ధనశ్రీ ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొనుంది. అందకే ఆమె చహల్ను భరణం పేరుతో డబ్బు డిమాండ్ చేసింది. భరణం పేరుతో భర్త నుంచి డబ్బు తీసుకుంటే అది సాధికారత ఎలా అవుతుంది. ఇలా చేసి స్వయంకృషితో ఎదిగిన మహిళ అని ఎలా చెప్పుకుంటారంటూ వ్యంగ్యంగా విమర్శించాడు.కాగా, చహల్, ధనశ్రీ వర్మ 2020లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ దగ్గర చహల్ డాన్స్ నేర్చుకునేందుకు వెళ్లేవాడు. అక్కడ వారి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. పెళ్లి తర్వాత చహల్, ధనశ్రీ సోషల్మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేవారు. ఈ ఏడాది మార్చి 20న చహల్, ధనశ్రీకి విడాకలు మంజూరయ్యాయి. గత ఏడాదిన్నరగా వీరిద్దరు కలిసి లేరని తెలుస్తుంది. అంటే వీరి వివాహ బంధం ముచ్చటగా మూడేళ్లు మాత్రమే సాగిందన్న మాట.ఇదిలా ఉంటే, చహల్ ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. చహల్ను ఇటీవలే (మెగా వేలంలో) పంజాబ్ కింగ్స్ రూ. 18 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుంది. చహల్ గత సీజన్ వరకు రాజస్థాన్ రాయల్స్కు ఆడాడు. అంతకుముందు అతను ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించే వాడు. చహల్ ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తున్నా టీమిండియాలో చోటు మాత్రం దక్కడం లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత స్పిన్ విభాగం అత్యంత పటిష్టంగా ఉండటంతో చహల్కు అవకాశాలు రావడం లేదు. చహల్ పంజాబ్ జెర్సీలో ఇవాళ (మార్చి 25) తన తొలి మ్యాచ్ ఆడనున్నాడు. నేటి మ్యాచ్లో పంజాబ్ గుజరాత్ను వారి సొంత మైదానంలో ఢీకొట్టనుంది. ధనశ్రీ విషయానికొస్తే.. ఆమె ఇటీవలే ఓ ప్రైవేట్ వీడియో ఆల్బమ్ రిలీజ్ చేసింది. ఈ వీడియోపై సోషల్మీడియాలో ద్వంద అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
IPL 2025: రోహిత్, పోలార్డ్ తర్వాత సూర్యకుమార్
ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో నిన్న (మార్చి 23) జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తాత్కాలిక సారధి సూర్యకుమార్ యాదవ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 29 పరుగులు చేసిన స్కై.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున 3000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా రోహిత్ శర్మ, కీరన్ పోలార్డ్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రోహిత్ 209 ఇన్నింగ్స్ల్లో 5458 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ తరఫున లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతుండగా.. పోలార్డ్ 171 ఇన్నింగ్స్ల్లో 3412, స్కై 95 ఇన్నింగ్స్ల్లో 3015 పరుగులు చేశాడు. ఈ ముగ్గురి తర్వాత ఎంఐ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అంబటి రాయుడు ఉన్నాడు. రాయుడు 107 ఇన్నింగ్స్ల్లో 2416 పరుగులు చేశాడు.ఇదిలా ఉంటే, సీఎస్కేతో నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. సీజన్ ఆరంభ మ్యాచ్ల్లో ఓడటం ముంబైకి ఇది వరుసగా 13వ సారి. ఈ మ్యాచ్లో సీఎస్కే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తా చాటి ముంబై ఇండియన్స్ను ఓడించింది. బ్యాటింగ్లో విఫలమైన ముంబై ఆతర్వాత బౌలింగ్లో రాణించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నూర్ అహ్మద్ (4-0-18-4), ఖలీల్ అహ్మద్ (4-0-29-3) విజృంభించడంతో 155 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) పరిమితమైంది. ముంబై ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. సూర్యకుమార్ (29), తిలక్ వర్మ (31), ఆఖర్లో దీపక్ చాహర్ (15 బంతుల్లో 28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రోహిత్ శర్మ డకౌట్ కాగా.. విధ్వంసకర వీరులు రికెల్టన్ (13), విల్ జాక్స్ (11), అరంగ్రేటం ఆటగాడు రాబిన్ మింజ్ (3), నమన్ ధిర్ (17), సాంట్నర్ (11) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. సీఎస్కే బౌలర్లలో అశ్విన్, ఇల్లిస్ కూడా తలో వికెట్ తీశారు.ఛేదనలో రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలు చేసి సీఎస్కేను గెలిపించారు. రుతురాజ్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి సీఎస్కే గెలుపుకు బలమైన పునాది వేయగా.. రచిన్ చివరి వరకు క్రీజ్లో ఉండి సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు. ఈ మ్యాచ్లో ముంబై ఓడినా అద్భుతంగా ప్రతిఘటించింది. అరంగేట్రం స్పిన్నర్ విజ్ఞేశ్ పుథుర్ (4-0-32-3) అద్భుతంగా బౌలింగ్ చేసి ఓ దశలో సీఎస్కేకు దడ పుట్టించాడు. ముంబై బౌలర్లలో విజ్ఞేశ్తో పాటు విల్ జాక్స్ (4-0-32-1), నమన్ ధిర్ (3-0-12-0) కూడా రాణించారు. మిడిల్ ఓవర్లలో వీరిద్దరు సీఎస్కేను ఇబ్బంది పెట్టారు. మొత్తంగా మ్యాచ్ ఓడినా ముంబై మంచి మార్కులే కొట్టేసింది. సీఎస్కే తమ తదుపరి మ్యాచ్లో ఆర్సీబీతో (మార్చి 28) తలపడనుండగా.. ముంబై ఇండియన్స్ గుజరాత్ను (మార్చి 29) ఢీకొట్టనుంది. -
IPL 2025: చెత్త రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా చెన్నై సూపర్కింగ్స్తో నిన్న (మార్చి 23) జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్లో 4 బంతులు ఎదర్కొని డకౌటైన హిట్మ్యాన్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డకౌట్లు అయిన ఆటగాడిగా నిలిచాడు. ఈ చెత్త రికార్డును రోహిత్.. గ్లెన్ మ్యాక్స్వెల్, దినేశ్ కార్తీక్లతో కలిసి షేర్ చేసుకున్నాడు. ఈ ముగ్గురు ఐపీఎల్లో ఇప్పటివరకు 18 సార్లు ఖాతా తెరవకుండా నిష్క్రమించారు. రోహిత్ 253 ఇన్నింగ్స్ల్లో 18 సార్లు డకౌట్ కాగా.. మ్యాక్సీ 129, డీకే 234 ఇన్నింగ్స్ల్లోనే 18 సార్లు డకౌటయ్యారు. ఈ మ్యాచ్లో రోహిత్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.మ్యాచ్ విషయానికొస్తే.. సీఎస్కే ముంబైపై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. సీజన్ ఆరంభ మ్యాచ్లో ఓడటం ముంబైకి ఇది వరుసగా 13వ సారి. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై బ్యాటర్ల వైఫల్యం కారణంగా 155 పరుగులకే పరిమితమైంది. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ 4 వికెట్లు తీసి ముంబైకి కళ్లెం వేశాడు. పేసర్ ఖలీల్ అహ్మద్ కూడా రాణించి 3 వికెట్లు తీశాడు. ఇల్లిస్, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ (31) టాప్ స్కోరర్గా నిలువగా.. సూర్యకుమార్ యాదవ్ (29), దీపక్ చాహర్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం ఛేదనకు దిగిన సీఎస్కే ఆదిలోనే ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (2) వికెట్ కోల్పోయినప్పటికీ.. ఆతర్వాత పుంజుకుంది. రచిన్ రవీంద్ర (65 నాటౌట్), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (53) మెరుపు అర్ద సెంచరీలు సాధించి సీఎస్కేను గెలిపించారు. రుతురాజ్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి సీఎస్కే గెలుపుకు బలమైన పునాది వేయగా.. రచిన్ చివరి వరకు క్రీజ్లో ఉండి సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు. ఈ మ్యాచ్లో ముంబై ఓడినప్పటికీ అద్భుతంగా ప్రతిఘటించింది. స్వల్ప స్కోర్ను కాపాడుకనేందుకు ముంబై బౌలర్లు విశ్వప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా అరంగేట్రం స్పిన్నర్ విజ్ఞేశ్ పుథుర్ (4-0-32-3) అద్భుతంగా బౌలింగ్ చేసి ఓ దశలో సీఎస్కేకు దడ పుట్టించాడు. సీఎస్కే తమ తదుపరి మ్యాచ్లో ఆర్సీబీతో (మార్చి 28) తలపడనుండగా.. ముంబై ఇండియన్స్ గుజరాత్ను (మార్చి 29) ఢీకొట్టనుంది. -
BCCI: ఒక్కో ఆటగాడికి రూ. 3 కోట్లు.. గంభీర్కు ఎంతంటే?
టీమిండియాకు ప్రకటించిన నగదు బహుమతి పంపిణీ అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఆటగాళ్లకు, కోచ్లకు, సహాయక సిబ్బందికి ఇచ్చే మొత్తం ఎంతన్నది తాజాగా వెల్లడించారు. చాంపియన్స్ ట్రోఫీ జట్టులోని ప్రతి ఆటగాడికి రూ. 3 కోట్ల మేర అందజేయనున్నట్లు తెలిపారు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. గ్రూప్ దశలో మూడింటికి మూడు గెలిచిన రోహిత్ సేన.. సెమీస్లో ఆస్ట్రేలియాపై, ఫైనల్లో న్యూజిలాండ్పై విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకుంది. ఐదు మ్యాచ్లలో అజేయంగా నిలిచి తొమ్మిది నెలల వ్యవధిలోనే మరో ఐసీసీ ట్రోఫీని సాధించింది.ఈ నేపథ్యంలో బీసీసీఐ భారత జట్టుకు భారీ క్యాష్ రివార్డు (BCCI Cash Reward) ప్రకటించింది. రూ. 58 కోట్ల నజరానా ఇవ్వనున్నట్లు గురువారం వెల్లడించింది. అయితే, ఇందులో ఎవరెవరికి ఎంత మొత్తం ఇస్తారన్న విషయం గురించి కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా వెల్లడించారు.గౌతం గంభీర్కు మూడు కోట్లువార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘జట్టులోని ప్రతి ఆటగాడికి రూ. 3 కోట్లు.. హెడ్కోచ్ గౌతం గంభీర్కు మూడు కోట్లు.. మిగిలిన కోచ్లలో అసిస్టెంట్లు ర్యాన్ టెన్ డష్కాటే, అభిషేక్ నాయర్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, ఫీల్డింగ్ కోచ్కు టి. దిలీప్నకు రూ. 50 లక్షలు.. మిగిలిన సహాయక సిబ్బందికి రూ. యాభై లక్షలు.. బీసీసీఐ అధికారులకు రూ. 25 లక్షలు ఇస్తాం’’ అని దేవజిత్ సైకియా తెలిపారు.కాగా సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023లో ఫైనల్ వరకు అజేయంగా నిలిచిన.. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఆస్ట్రేలియాతో చేతిలో ఓటమి పాలై టైటిల్ను చేజార్చుకుంది. అయితే, టీ20 ప్రపంచకప్-2024తో ఈ గాయాలను మాన్పివేసింది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఈ మెగా టోర్నీలో ఆఖరి వరకు ఓటమన్నదే లేక చాంపియన్గా నిలిచింది.దుబాయ్లోనే అన్ని మ్యాచ్లు తొమ్మిది నెలల అనంతరం తాజాగా చాంపియన్స్ ట్రోఫీలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఈ వన్డే టోర్నమెంట్కు పాకిస్తాన్ ఆతిథ్య దేశంగా వ్యవహరించిగా.. భద్రతా కారణాల వల్ల టీమిండియాను అక్కడకు పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఈ క్రమంలో ఐసీసీ జోక్యంతో దుబాయ్లో భారత జట్టు తమ మ్యాచ్లన్నీ ఆడేలా హైబ్రిడ్ మోడల్కు పాక్ అంగీకరించింది. ఇక ఒకే వేదిక మీద అన్ని మ్యాచ్లు ఆడటం వల్ల టీమిండియాకు మిగతా జట్లతో పోలిస్తే.. అదనపు ప్రయోజనాలు చేకూరాయని ఇంగ్లండ్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్లు విమర్శించారు. అయితే, భారత జట్టు ఎంతో పటిష్టంగా ఉందని.. వేదిక ఏదైనా గెలుపు టీమిండియాదేనంటూ సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు ఆ విమర్శలను తిప్పికొట్టారు. టీ20 ప్రపంచకప్-2024లో మిగతా జట్ల మాదిరే టీమిండియా కూడా ప్రయాణాలు చేసిందని.. అయినా విజేతగా నిలిచిందంటూ కౌంటర్ ఇచ్చారు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లొ పాల్గొన్న భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, రిషభ్ పంత్.సహాయక సిబ్బంది:హెడ్కోచ్ గౌతం గంభీర్, కోచ్లు అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డష్కాటే, టి. దిలీప్, మోర్నీ మోర్కెల్. చదవండి: ‘రేపు మీ బౌలింగ్ను చితక్కొడతాను చూడు!.. అన్నంత పని చేశాడు’ -
మానసిక వేదన.. అయినా తట్టుకున్నాడు.. సింహంలా తిరిగొచ్చాడు!
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)పై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించాడు. అవమానాలను దిగమింగుకుని.. సింహంలా అతడు తిరిగి వచ్చాడని కొనియాడాడు. మానసికంగా తనను వేదనకు గురిచేసినా.. అద్భుత ప్రదర్శనతో తన విలువను చాటుకున్నాడని.. భారత్ రెండు ఐసీసీ టైటిళ్లు గెలవడంలో కీలక పాత్ర పోషించాడని ప్రశంసించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో సరికొత్త హార్దిక్ పాండ్యాను చూడబోతున్నారని.. ముంబై ఇండియన్స్ను అతడు ఈసారి ప్లే ఆఫ్స్లో నిలుపుతాడని కైఫ్ ధీమా వ్యక్తం చేశాడు. అవహేళనలుకాగా గతేడాది హార్దిక్ ముంబై ఇండియన్స్ సారథిగా ఎంపికైన విషయం తెలిసిందే. ముంబైకి ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మ (Rohit Sharma)ను కాదని.. హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. సొంత మైదానం వాంఖడేలోనూ అతడిని దూషిస్తూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. హార్దిక్ కనిపిస్తే చాలు అవహేళనలతో అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా ప్రవర్తించారు.ఈ క్రమంలో ముంబై గతేడాది పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. దీంతో హార్దిక్ కెప్టెన్సీపై మరోసారి విమర్శలు తీవ్రమయ్యాయి. అయితే, ఈ చేదు అనుభవాల నుంచి త్వరగానే కోలుకున్న హార్దిక్ పాండ్యా.. టీ20 ప్రపంచకప్-2024లో సత్తా చాటాడు. జట్టు చాంపియన్గా నిలవడంలో కీలకంగా వ్యవహరించాడు.అంతేకాదు.. తాజాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా టైటిల్ గెలవడంలోనూ హార్దిక్ది కీలక పాత్ర. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్.. హార్దిక్ పాండ్యా బయోపిక్ గనుక తెరకెక్కితే గత ఏడాది కాలం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని వ్యాఖ్యానించాడు.పంటిబిగువన భరిస్తూ.. ‘‘మనసుకైన గాయాలను పంటిబిగువన భరిస్తూ.. అతడు ముందుకు సాగాడు. అభిమానులే అతడిని హేళన చేశారు. కొంతమంది అతడి గురించి చెడుగా ఆర్టికల్స్ రాశారు. ఓ ఆటగాడిగా ఇన్ని బాధలను భరిస్తూ ముందుకు సాగడం అంత తేలికైన విషయం కాదు.అతడు ఆ నొప్పిని మర్చిపోలేడు. జట్టు నుంచి తప్పిస్తే ఆ బాధ కొన్నాళ్లే ఉంటుంది. కానీ.. అభిమానులే ఇంతలా అవమానిస్తే తట్టుకోవడం కష్టం. ఓ ఆటగాడికి ఇంతకంటే మానసిక వేదన మరొకటి ఉండదు. సింహంలా పోరాడి గెలిచాడుఅయితే, అతడు కుంగిపోలేదు. సింహంలా పోరాడి గెలిచాడు. టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో హెన్రిచ్ క్లాసెన్ వంటి విధ్వంసకర వీరుడిని అవుట్ చేశాడు. చాంపియన్స్ ట్రోఫీలో జంపా బౌలింగ్లో సిక్సర్లు బాదాడు.బంతితో, బ్యాట్తో రాణించి భారత్ గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. ఒకవేళ అతడి బయోపిక్ తీస్తే.. గత ఏడాది కాలం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. సవాళ్లను, గడ్డు పరిస్థితులను అధిగమించి ఎలా ముందుకు సాగాలో తెలుస్తుంది. పాండ్యా తన బలాన్ని గుర్తించాడు. అందుకే ఇంత గొప్పగా పునరాగమనం చేశాడు. ఐపీఎల్-2025లో అతడు ముంబైని తప్పక ప్లే ఆఫ్స్ చేరుస్తాడు’’ అని కైఫ్ హిందుస్తాన్ టైమ్స్తో వ్యాఖ్యానించాడు.కాగా మార్చి 22న ఐపీఎల్ పద్దెనిమిదవ ఎడిషన్ ప్రారంభం కానుండగా.. ఆ మరుసటి రోజు ముంబై తమ తొలి మ్యాచ్ ఆడనుంది. మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్ను ఢీకొట్టనుంది. అయితే, గతేడాది స్లో ఓవర్ రేటు కారణంగా హార్దిక్ పాండ్యా తొలి మ్యాచ్కు దూరం కానున్నాడు. దీంతో అతడి స్థానంలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.చదవండి: CT 2025: టీమిండియాకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ -
CT 2025: టీమిండియాకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ
టీమిండియాపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కాసుల వర్షం కురిపించింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో విజేతగా నిలిచినందుకు భారీ క్యాష్ రివార్డు ప్రకటించింది. ఈ మెగా వన్డే టోర్నీలో ఐదింటికి ఐదు మ్యాచ్లు గెలిచి అజేయంగా చాంపియన్గా నిలిచిన రోహిత్ సేనకు రూ. 58 కోట్ల నజరానా ఇచ్చింది. రోహిత్ సేన జైత్రయాత్రను ప్రస్తావిస్తూఈ మొత్తాన్ని ఆటగాళ్లు, కోచ్లు, సహాయక సిబ్బంది.. అదే విధంగా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సభ్యులకు బీసీసీఐ పంచనుంది. ఇందుకు సంబంధించి బోర్డు గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు.. ‘‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియాకు రూ. 58 కోట్ల క్యాష్ రివార్డు ప్రకటిస్తున్నాం.మెన్స్ సెలక్షన్ కమిటీ సభ్యులతో పాటు ఆటగాళ్లు, కోచ్లు, సహాయక సిబ్బంది పనితీరును గుర్తిస్తూ వారిని ఇలా సత్కరిస్తున్నాం’’ అని పేర్కొంది. అదే విధంగా.. ‘‘కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా టోర్నీ ఆసాంతం ఆధిపత్యం కనబరిచింది. ఓటమన్నదే ఎరుగక నాలుగు విజయాలతో ఫైనల్ చేరింది.తొలుత బంగ్లాదేశ్పై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా.. ఆ తర్వాత పాకిస్తాన్పై కూడా ఆరు వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. అదే జోరును కొనసాగిస్తూ న్యూజిలాండ్పై 44 పరుగుల తేడాతో గెలిచి గ్రూప్ టాపర్ అయ్యింది. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ చేరుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించింది’’ అని బీసీసీఐ తమ ప్రకటనలో రోహిత్ సేన జైత్రయాత్రను ప్రస్తావించింది.అందుకే ఈ నగదు బహుమతిఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ మాట్లాడుతూ.. ‘‘వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు సాధించడం ఎంతో ప్రత్యేకమైనది. భారత జట్టు అంకిత భావం, ప్రపంచ వేదికపై దేశానికి వారు తెచ్చి పెట్టిన కీర్తి ప్రతిష్టలకు గుర్తింపుగా నగదు బహుమతి అందజేస్తున్నాం.ఈ గెలుపునకు కారణమైన ప్రతి ఒక్కరి సేవలను మేము గుర్తించాం. భారత్కు ఈ ఏడాది ఇది రెండో ఐసీసీ ట్రోఫీ. అండర్-19 వుమెన్స్ వరల్డ్కప్లో మనం చాంపియన్లుగా నిలిచాం. ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని కూడా సొంతం చేసుకున్నాం.దేశంలో క్రికెటింగ్ ఎకోసిస్టమ్ ఎంత పటిష్టంగా ఉందో చెప్పేందుకు ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు’’ అని హర్షం వ్యక్తం చేశాడు. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్-2024 సాధించిన రోహిత్ సేన.. ఆ టోర్నీలోనూ అన్ని మ్యాచ్లలో అజేయంగా నిలిచింది. నాడు బీసీసీఐ రోహిత్ సేనకు ఏకంగా రూ. 125 కోట్ల నజరానా ప్రకటించింది.ఎనిమిది జట్ల మధ్య పోటీతాజాగా చాంపియన్స్ ట్రోఫీలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయగా.. ఈసారి రూ. 58 కోట్ల బహుమతి ఇచ్చింది. ఇది ఐసీసీ ఇచ్చిన ప్రైజ్ మనీ (భారత కరెన్సీలో దాదాపు రూ. రూ.19.5 కోట్లు) కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఇక ఈ మెగా ఈవెంట్కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వగా.. భారత జట్టు మాత్రం తటస్థ వేదికైన దుబాయ్లోనే తమ మ్యాచ్లన్నీ ఆడింది. ఈ టోర్నీలో భారత్తో పాటు గ్రూప్-ఎ నుంచి పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీపడ్డాయి.తొలి సెమీస్లో భారత్ ఆస్ట్రేలియాను ఓడించగా.. రెండో సెమీస్లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్ చిత్తు చేసింది. ఈ క్రమంలో టీమిండియా- న్యూజిలాండ్ మధ్య మార్చి 9న జరిగిన టైటిల్ పోరులో రోహిత్ సేన నాలుగు వికెట్ల తేడాతో కివీస్ను ఓడించింది. ఈ మ్యాచ్లో అద్భుత అర్ధ శతకం(76) బాదిన కెప్టెన్ రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.చదవండి: ‘రేపు మీ బౌలింగ్ను చితక్కొడతాను చూడు!.. అన్నంత పని చేశాడు’ -
ముగ్గురు టీమిండియా కెప్టెన్లు.. అది నా అదృష్టం: హార్దిక్ పాండ్యా
జట్టులో ‘ముగ్గురు కెప్టెన్ల’ను కలిగి ఉండటం తనకు అదనపు బలమని ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా (Hardik Pandya) హర్షం వ్యక్తం చేశాడు. భిన్న ఫార్మాట్లలో టీమిండియాను ముందుకు నడిపించిన వ్యక్తుల నుంచి తాను తప్పక సలహాలు, సూచనలు తీసుకుంటానని పేర్కొన్నాడు. అంతిమంగా జట్టును విజేతగా నిలపడమే తమ లక్ష్యమని హార్దిక పాండ్యా పేర్కొన్నాడు.ఈసారి తాను రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నానన్న హార్దిక్ పాండ్యా... ఈసారి అభిమానుల నుంచి సానుకూల స్పందన మాత్రమే కోరుకుంటున్నానని తెలిపాడు. కెప్టెన్గా సూర్యకాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పద్దెనిమిదవ ఎడిషన్ మార్చి 22 నుంచి ఆరంభం కానున్న విషయం తెలిసిందే. కోల్కతా నైట్ రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్తో ఈ మెగా ఈవెంట్కు తెరలేవనుండగా.. ముంబై మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.అయితే, గతేడాది స్లో ఓవర్ రేటు కారణంగా హార్దిక్ పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం పడగా.. ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ ముంబై కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన పాండ్యా.. ఈ ఏడాది తాము కచ్చితంగా అనుకున్న ఫలితాన్ని రాబడతామని ధీమా వ్యక్తం చేశాడు.రోజురోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గదు‘‘నేను చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. అప్పుడు కూడా గెలుస్తామనే నేను విశ్వసించాను. అయితే, నేను ఇటీవలే చాంపియన్స్ ట్రోఫీలో ఆడాను. నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది, కాన్ఫిడెన్స్ గురించి నన్ను అడిగితే.. రోజురోజుకూ అది పెరుగుతుందే తప్ప తగ్గదు.ముగ్గురు టీమిండియా కెప్టెన్లు.. అది నా అదృష్టంఇక మా జట్టులో నాతో పాటు మరో ముగ్గురు కెప్టెన్లు ఉండటం ఒక రకంగా నా అదృష్టం అని చెప్పాలి. నాకు అవసరమైనపుడు వారి అనుభవాన్ని ఉపయోగించుకుంటా. టీమిండియాను మూడు ఫార్మాట్లలో భిన్న రీతిలో నడిపించిన వారి అనుభవం నాకు కచ్చితంగా అదనపు బలమే.నాకు వారు ఎల్లవేళలా మద్దతుగా ఉంటారు. క్లిష్ట పరిస్థితుల్లో నా భుజం తట్టి నన్ను ముందుకు నడిపిస్తారు. మేమంతా కలిసి అనుకున్న రీతిలో జట్టును ముందుకు తీసుకువెళ్తాం’’ అని హార్దిక్ పాండ్యా బుధవారం నాటి మీడియా సమావేశంలో పేర్కొన్నాడు.కాగా టీమిండియా వన్డే, టెస్టు సారథి రోహిత్ శర్మతో పాటు.. టెస్టుల్లో రోహిత్ గైర్హాజరీలో కెప్టెన్గా వ్యవహరిస్తున్న జస్ప్రీత్ బుమ్రా.. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.ముంబై రంగులు తప్ప ఇంకేమీ కనిపించవద్దుఇదిలా ఉంటే.. ముంబై అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘నేను టాస్ కోసం వెళ్లినపుడు.. బ్యాటింగ్కి వెళ్లినపుడు నన్ను చీర్ చేయండి. సిక్సర్ బాదితే గట్టిగా అరవండి. వాంఖడే స్టేడియంలో నాకు ముంబై రంగులు తప్ప ఇంకేమీ కనిపించవద్దు’’ అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. కాగా ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మను తప్పించి ముంబై ఫ్రాంఛైజీ గతేడాది పాండ్యాకు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.అయితే, అతడి రాకతో రోహిత్, బుమ్రా, సూర్య అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వచ్చాయి. ముంబై గతేడాది దారుణంగా విఫలమైన నేపథ్యంలో.. ఆటగాళ్ల మధ్య సమన్వయ లోపమే ఇందుకు కారణమనే విమర్శలు వచ్చాయి. గతేడాది ముంబై పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి పాయింట్ల పట్టికలో పదో స్థానంలో నిలిచింది. చదవండి: BCCI: విరాట్ కోహ్లి ఘాటు విమర్శలు.. స్పందించిన బీసీసీఐ -
‘సిక్సర్’ కొట్టేదెవరో?
ఐపీఎల్లో విజయవంతమైన జట్టుగా గుర్తింపు... హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించిన ఫ్రాంచైజీగా రికార్డు... నైపుణ్యాన్ని వలవేసి పట్టే నేర్పరితనం... యువ ఆటగాళ్లకు అండగా నిలిచే యాజమాన్యం... వెరసి ఐపీఎల్ టోర్నీ చరిత్రలో 5 ట్రోఫీలు సాధించిన ముంబై ఇండియన్స్ జట్టు గత కొన్నాళ్లుగా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతోంది. రోహిత్ శర్మ నుంచి సారథ్య బాధ్యతలు హార్దిక్ పాండ్యాకు అప్పగించడంతో జట్టులో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అభిమానుల అసహనం, మాజీల రుసరుసలు, విశ్లేషకులు వెటకారాలతో గత సీజన్ గడిచిపోగా... 2024 ఐపీఎల్ తర్వాత భారత జట్టుకు రోహిత్ శర్మ 2 ఐసీసీ ట్రోఫీలు అందించాడు. ఈ రెండింట్లో హార్దిక్ కీలకపాత్ర పోషించడంతో సమస్య సమసిపోయినట్లైంది. మరి ఈ ఏడాదైనా ముంబై సమష్టిగా సత్తాచాటి మునుపటి జోరు సాగిస్తుందా చూడాలి! ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు ఏదైనా ఉందంటే... అది ముమ్మాటికీ చెన్నై సూపర్ కింగ్సే! ఇప్పటి వరకు 15 సీజన్లు ఆడిన చెన్నై జట్టు అందులో 10 సార్లు ఫైనల్కు చేరి ఐదుసార్లు ట్రోఫీ చేజిక్కించుకుంది. ఈ గణాంకాలు చాలు ఐపీఎల్లో చెన్నై జోరు ఏంటో చెప్పేందుకు. వికెట్ల వెనక ధోని మాయాజాలం... కాన్వే, రచిన్ రవీంద్ర బ్యాటింగ్ సామర్థ్యం... శివమ్ దూబే, రవీంద్ర జడేజా ఆల్రౌండ్ మెరుపులు, అశ్విన్, పతిరణ బౌలింగ్ నైపుణ్యం ఇలా అన్నీ విభాగాల్లో పటిష్టంగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్... ఆరో కప్పువేటకు సిద్ధమైంది. –సాక్షి క్రీడావిభాగం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం నుంచి నిలకడ కొనసాగిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టు ఆరోసారి ట్రోఫీ చేజిక్కించుకునేందుకు సిద్ధమవుతోంది. గత కొన్ని సీజన్లుగా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న ముంబై ఇండియన్స్ ఈసారి మెరుగైన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా సాగుతోంది. గత సీజన్ ఆరంభానికి ముందు ఫ్రాంచైజీకి ఐదు ట్రోఫీలు (2013, 2015, 2017, 2019, 2020) అందించిన ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మను కాదని... గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను తీసుకొచ్చి సారథ్య బాధ్యతలు అప్పగించడం అభిమానులకు ఏమాత్రం రుచించలేదు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ముంబై ఇండియన్స్ నిర్ణయాన్ని దుమ్మెత్తిపోసిన అభిమానులు... మైదానంలో హార్దిక్ను గేలి చేశారు. సొంత మైదానం వాంఖడేతో పాటు... దేశంలో ఎక్కడ మ్యాచ్ ఆడేందుకు వెళ్లినా... పాండ్యాకు ఇదే అనుభవం ఎదురైంది. దీంతో సహజంగానే డ్రెస్సింగ్రూమ్ వాతావరణం దెబ్బతింది. అదే మైదానంలో ప్రస్ఫుటమైంది. గత సీజన్లో 14 మ్యాచ్లాడిన ముంబై ఇండియన్స్ జట్టు కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి 10 పరాజయాలతో పట్టికలో అట్టడుగున నిలిచింది. గత నాలుగు సీజన్లలో ఒక్కసారి (2023లో) మాత్రమే ముంబై జట్టు ప్లే ఆఫ్స్కు చేరింది. 2022, 2024లో పట్టికలో కింది స్థానంతో లీగ్ను ముగించింది. అయితే అప్పటికీ ఇప్పటికీ జట్టులో ఎంతో తేడా కనిపిస్తోంది. ఏడాది వ్యవధిలో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఐసీసీ టి20 ప్రపంచకప్తో పాటు, చాంపియన్స్ ట్రోఫీ చేజిక్కించుకుంది. ఈ రెండు విజయాల్లోనూ కీలకంగా నిలిచిన హార్దిక్ పాండ్యాను అభిమానులు తిరిగి అక్కున చేర్చుకున్నారు. దీనికి తోడు రోహిత్ వంటి అనుభవజ్ఞుడి సలహాలు, సూచనలు ఉంటే... పాండ్యా జట్టును మరింత ముందుకు తీసుకెళ్లడం ఖాయమే. బుమ్రా ఫిట్నెస్ సాధించేనా! ఆ్రస్టేలియా పర్యటన సందర్భంగా గాయపడ్డ భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్పై ముంబై ఆందోళన చెందుతోంది. వెన్నునొప్పితో చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఈ ఏస్ పేసర్... ఐపీఎల్ తొలి దశ మ్యాచ్లకు అందుబాటులో ఉండబోడని ఇప్పటికే ఫ్రాంచైజీ వెల్లడించింది. అయితే అతడి సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే దానిపై స్పష్టత లేదు. గతేడాది వేలంలో బుమ్రా, రోహిత్, హార్దిక్, సూర్యకుమార్తో పాటు హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మను ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది. అందులో అత్యధికంగా బుమ్రాకు రూ. 18 కోట్లు కట్టబెట్టింది. యువ ఆటగాడు ఇషాన్ కిషన్ను వేలానికి వదిలేసిన ముంబై... ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, సాంట్నర్తో బౌలింగ్ను మరింత పటిష్టం చేసుకుంది. రోహిత్తో కలిసి దక్షిణాఫ్రికా ప్లేయర్ రికెల్టన్ ఇన్నింగ్స్ను ఆరంభించనున్నాడు. భారత ఆటగాళ్ల విషయంలో పటిష్టంగా కనిపిస్తున్న ముంబై ఇండియన్స్... విదేశీ ఆటగాళ్ల ఎంపిక మాత్రం కాస్త అనూహ్యంగా ఉంది. లోయర్ ఆర్డర్లో ధాటిగా ఆడగల విదేశీ పించ్ హిట్టర్ లోటు కనిపిస్తోంది. రూ.5 కోట్ల 25 లక్షలు వెచ్చించి ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా తిరిగి దక్కించుకున్న నమన్ ధీర్పై భారీ అంచనాలు ఉన్నాయి. బుమ్రా గైర్హాజరీలో బౌల్ట్, సాంట్నర్, దీపక్ చాహర్, కరణ్ శర్మ పై బౌలింగ్ భారం పెరగనుంది. ఆంధ్ర ఆటగాడు పెనుమత్స సత్యనారాయణ రాజు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ జట్టులో ఉన్నా... వారికి మ్యాచ్ ఆడే అవకాశం దక్కడం కష్టమే. ముంబై ఇండియన్స్ జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్ ), రోహిత్, సూర్యకుమార్, తిలక్, రాబిన్ మిన్జ్, రికెల్టన్, శ్రీజిత్ క్రిష్ణన్, జాకబ్స్, నమన్ ధీర్, జాక్స్, సాంట్నర్, అంగద్ , విఘ్నేశ్, కార్బిన్, బౌల్ట్, కరణ్ శర్మ, దీపక్ చాహర్, అశ్వని కుమార్, టాప్లీ, వెంకట సత్యనారాయణ, అర్జున్ టెండూల్కర్, ముజీబ్, బుమ్రా. అంచనా: ముంబై ఇండియన్స్ ఆటతీరు పరిశీలిస్తే... ఆడితే అందలం, లేకుంటే అట్టడుగు స్థానం అనేది సుస్పష్టం. గత నాలుగు సీజన్లలో కేవలం ఒక్కసారే ప్లే ఆఫ్స్కు చేరిన ముంబై... స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ఈ సారి కూడా ప్లే ఆఫ్స్ చేరొచ్చు. సాధారణ ఆటగాడు సైతం... అసాధారణ ప్రదర్శన చేయడం... అప్పటి వరకు జట్టులో చోటు దక్కడమే కష్టమనుకున్న ప్లేయర్ సైతం... ‘ఎక్స్’ ఫ్యాక్టర్గా మారడం... చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో నిత్యకృత్యం.అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవడంలో చెన్నైని మించిన జట్టు లేదనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటి వరకు 5 సార్లు (2010, 2011, 2018, 2021, 2023) ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకున్న సూపర్ కింగ్స్ మరో 5 సార్లు (2008, 2012, 2013, 2015, 2019) రన్నరప్గా నిలిచింది. గతేడాదే రుతురాజ్ గైక్వాడ్కు సారథ్య బాధ్యతలు అప్పగించిన ఫ్రాంచైజీ... అతడితో పాటు రవీంద్ర జడేజాకు రూ. 18 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకుంది.పతిరణను రూ. 13 కోట్లు, శివమ్ దూబేను రూ. 12 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకుంది. అంతర్జాతీయ మ్యాచ్ ఆడి ఐదేళ్లు దాటిపోయిన మహేంద్రసింగ్ ధోనిని రూ. 4 కోట్లకు కొనసాగించింది. వీరితో పాటు రచిన్ రవీంద్రను రూ. 4 కోట్లతో ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా తిరిగి సొంతం చేసుకుంది. ఇక సుదీర్ఘ కాలం తర్వాత రవిచంద్రన్ అశ్విన్ను తిరిగి కొనుగోలు చేసుకుంది. మరి గత కొంత కాలంగా నిలకడగా రాణించలేకపోతున్న సూపర్ కింగ్స్ ఈసారి ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. తలా... అన్నీ తానై! అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన అనంతరం కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోని... ఈసారి కూడా జట్టును ముందుండి నడిపించనున్నాడు. పేరుకు రుతురాజ్ కెప్టెన్ అయినా... వికెట్ల వెనక నుంచి టీమ్కు దిశానిర్దేశం చేసేది ధోనినే అనడంలో సందేహం లేదు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడుతున్న ధోనీ గతేడాది బ్యాటింగ్ ఆర్డర్లో మరీ కింది స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. మరి ఈసారైనా అతని బ్యాట్ నుంచి మెరుపులు వస్తాయోమో చూడాలి. బ్యాటింగ్లో కాన్వే, రచిన్, దూబే, రుతురాజ్, జడేజా, ధోని కీలకం కానుండగా... పతిరణ, అశ్విన్, ఖలీల్ అహ్మద్, స్యామ్ కరన్ బౌలింగ్ బాధ్యతలు మోయనున్నారు. రచిన్, జడేజా, దూబే, దీపక్ హూడా, విజయ్ శంకర్, అశ్విన్, జేమీ ఓవర్టన్, సామ్ కరన్ ఇలా లెక్కకు మిక్కిలి ఆల్రౌండర్లు ఉండటం చెన్నైకి అదనపు బలం. ఆంధ్ర ఆటగాడు షేక్ రషీద్ జట్టులో ఉన్నా... అతడికి మ్యాచ్ ఆడే అవకాశం దక్కుతుందో లేదో వేచి చూడాలి. చెన్నై జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్ ), మహేంద్రసింగ్ ధోని, కాన్వే, రాహుల్ త్రిపాఠి, షేక్ రషీద్, వన్ష్ బేదీ, సిద్ధార్్థ, రచిన్ రవీంద్ర, రవిచంద్రన్ అశ్విన్, విజయ్ శంకర్, స్యామ్ కరన్, అన్షుల్ కంబోజ్, దీపక్ హూడా, జేమీ ఓవర్టన్, కమలేశ్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, ముకేశ్, గుర్జప్నీత్ సింగ్, నాథన్ ఎలీస్, శ్రేయస్ గోపాల్, పతిరణ. అంచనా: ఐపీఎల్లో మిగిలిన జట్లతో పోల్చుకుంటే అత్యధిక మంది ఆల్రౌండర్లు అందుబాటులో ఉన్న చెన్నై స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ఫైనల్ చేరడం పెద్ద కష్టం కాకపోవచ్చు. -
రోహిత్, కోహ్లి, బుమ్రా లేకున్నా భారత్ గెలిచింది: టీమిండియా దిగ్గజం
పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా దూసుకుపోతోంది. తొమ్మిది నెలల వ్యవధిలో రెండు ఐసీసీ ట్రోఫీలు గెలవడమే ఇందుకు నిదర్శనం. రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీలో గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత్.. ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)ని సొంతం చేసుకుంది.ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)జట్టుతో లేకపోయినా అద్భుత ప్రదర్శనతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. అంతకు ముందు పొట్టి వరల్డ్కప్ టోర్నీలో పరాజయమన్నదే లేకుండా ట్రోఫీని ముద్దాడింది. ఈ రెండు ఐసీసీ ఈవెంట్లలో వంద శాతం విజయాలతో రోహిత్ సేన తమ సత్తా చాటింది.అత్యంత పటిష్టంగాఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. భారత జట్టు ప్రస్తుతం అత్యంత పటిష్టంగా ఉందన్న సన్నీ.. బెంచ్ స్ట్రెంత్లోనూ మిగతా జట్లతో పోలిస్తే ముందు వరుసలో ఉందని పేర్కొన్నాడు. వ్యక్తులకు అతీతంగా జట్టుగా భారత్ ఎదిగిందని.. రోహిత్, కోహ్లి, బుమ్రా లాంటి వాళ్లు లేకపోయినా గెలవగల స్థాయికి చేరుకుందని అన్నాడు.రోహిత్, కోహ్లి లేకుండానేఈ మేరకు ‘మిడ్-డే’కు రాసిన కాలమ్లో.. ‘‘బుమ్రా లేకుండానే టీమిండియా చాంపియన్స్ ట్రోఫీలో అద్భుత విజయం సాధించిన తర్వాత.. వ్యక్తులను మించి టీమిండియా స్థాయి పెరిగిందని అర్థమవుతోంది. గతంలో కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లేకుండానే టీమిండియా చాలాసార్లు గెలిచింది.అయితే, వాళ్లిద్దరు ఉంటే జట్టు మరింత పటిష్టంగా మారినట్లు కనిపిస్తుంది. ఆస్ట్రేలియా పర్యటనలో జస్ప్రీత్ బుమ్రాపై టీమిండియా ఎక్కువగా ఆధారపడింది. ఇలాంటివి అరుదుగా జరుగుతూ ఉంటాయి.అయితే, అతడు లేకుండానే ఆస్ట్రేలియా వెలుపల స్వల్ప టార్గెట్లను కూడా టీమిండియా డిఫెండ్ చేసుకుంది. ఇంగ్లండ్తో సొంతగడ్డపై టీ20, వన్డే సిరీస్లలో టీమిండియా పరిపూర్ణ విజయాలు సాధించింది. భారత క్రికెట్ జట్టుతో పాటు బెంచ్ కూడా ఎంత బలంగా ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు’’ అంటూ గావస్కర్ టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపించాడు. రోహిత్, కోహ్లి లేకుండానే యువ ఆటగాళ్లు టీ20 ఫార్మాట్లో భారత్కు అద్భుత విజయాలు అందిస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.ఏకంగా 17 గెలిచిన సూర్య సేనకాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత రోహిత్- కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అంతకుముందు కూడా విశ్రాంతి పేరిట ఈ దిగ్గజాలు పలు మ్యాచ్లకు దూరమయ్యారు. ఇక రోహిత్- కోహ్లి రిటైర్మెంట్ తర్వాత టీమిండియా 20 టీ20 మ్యాచ్లు ఆడితే.. అందులో ఏకంగా 17 గెలవడం విశేషం. సూర్యకుమార్ సేన విజయాల శాతం 85గా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే గావస్కర్ పైవిధంగా స్పందించినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025కి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వగా.. రోహిత్ సేన మాత్రం ఈ వన్డే టోర్నీలో తమ మ్యాచ్లన్నీ దుబాయ్లోనే ఆడింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్లను ఓడించిన భారత్.. సెమీస్లో ఆస్ట్రేలియా, ఫైనల్లో న్యూజిలాండ్లపై గెలిచి చాంపియన్గా నిలిచింది. ఇక సెమీస్ మ్యాచ్లో కోహ్లి.. ఫైనల్లో రోహిత్ శర్మ అద్భుత అర్ధ శతకాలతో జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. మూడు ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి -
టీమిండియా స్టార్లు.. హార్డ్ హిట్టర్లు, దిగ్గజ పేసర్లు.. ముంబై ఈసారైనా..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన మేటి జట్టుగా ముంబై ఇండియన్స్కు పేరుంది. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగానూ ముంబై రికార్డు చెక్కు చెదరకుండా ఉంది. అయితే, గత కొంతకాలంగా అంబానీల ఫ్రాంఛైజీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. గతేడాది ఏకంగా పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. అయితే, మెగా వేలంలో తెలివైన కొనుగోళ్లతో మునుపటి వైభవం సాధించేలా ప్రణాళికలు రచించింది.విదేశీ, భారత్ ఆటగాళ్ల తో జట్టుని పునర్నిర్మించే ప్రయత్నం చేసింది. జస్ప్రీత్ బుమ్రాకు తోడుగా న్యూ జిలాండ్ వెటరన్ ట్రెంట్ బౌల్ట్ను రూ. 12.50 కోట్లకు కొనుగోలు చేసి బలమైన బౌలింగ్ ని రూపొందించే ప్రయత్నం చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆల్ రౌండర్ దీపక్ చాహర్ను కూడా జత చేసి తమ బౌలింగ్ యూనిట్ను మరింత బలోపేతం చేసుకుంది.మిచెల్ సాంట్నర్, కర్ణ్ శర్మలను చేర్చుకోవడంతో స్పిన్ విభాగం కూడా మరింత బలపడింది. ఇక విల్ జాక్స్, బెవాన్ జాకబ్స్, ర్యాన్ రికెల్టన్ లతో బ్యాటింగ్కు మునుపటి పదును సమకూర్చారు. అయితే భారత్ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. విదేశీ ఆటగాళ్లతో పాటు, రాబిన్ మింజ్, విఘ్నేష్ పుత్తూర్ మరియు రాజ్ బావా వంటి వారిని కనుగోలు చేసి యువ జట్టుని నిర్మించే దిశగా పావులు కదిపింది. అందువల్ల, ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన ఈ జట్టు అన్ని స్థావరాలను కవర్ చేసే ఆల్ రౌండ్ జట్టును నిర్మించడానికి తమ పర్స్ను సమర్థవంతంగా ఉపయోగించింది.ముంబై ఇండియన్స్లో ప్రధాన ఆటగాళ్లుట్రెంట్ బౌల్ట్ ఈ ఎడమచేతి వాటం సీమర్ మూడు సంవత్సరాల తర్వాత ఐపీఎల్ లో మళ్ళీ ముంబై ఇండియన్స్కు తిరిగి ఆడబోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్లలో ముంబై ఇండియన్స్కు చెందిన జట్ల తరపున ఆడుతూనే ఉన్నాడు. బౌల్ట్ పవర్ప్లేలో రాణించడంలో మంచి దిట్ట. బుమ్రాతో పాటు ముంబై బౌలింగ్ ని ప్రారంభించే అవకాశముంది.ర్యాన్ రికెల్టన్దక్షిణాఫ్రికాలో బాగా రాణిస్తున్న స్టార్లలో ఒకరు గా ఖ్యాతి గడించిన రికెల్టన్ ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ లో తన బ్యాటింగ్ తో పరుగుల వర్షం కురిపించాడు. ఈ 28 ఏళ్ల వికెట్ కీపర్ ను మరో క్వింటన్ డి కాక్ గా నిపుణులు భావిస్తున్నారు.రాబిన్ మింజ్వికెట్ కీపర్ కూడా అయినా రాబిన్ మింజ్ తన అసాధారణ స్ట్రోక్ ప్లే తో విజృభించి ఆడగలడు. దురదృష్టవశాత్తు బైక్ ప్రమాదం కారణంగా గత సీజన్కు దూరమైన , మింజ్ ఈ సీజన్లో మళ్ళీ తన సత్తా చూపించాలిని పట్టుదలతో ఉన్నాడు.ముజీబ్ ఉర్ రెహమాన్గాయం కారణంగా జట్టు నుంచి తప్పుకున్న తోటి ఆఫ్ఘన్ దేశస్థుడు ఎ ఎం గజన్ఫర్ స్థానంలో ఈ ఆఫ్ స్పిన్నర్ను జట్టులోకి తీసుకున్నారు. రెహమాన్ తన టి 20 కెరీర్లో 18.11 సగటు తో నిలకడగా బౌలింగ్ చేయగల సామర్ధ్యముంది.బెవాన్ జాకబ్స్న్యూజిలాండ్ కి చెందిన 22 ఏళ్ల హార్డ్ హిట్టింగ్ బ్యాటర్. తన అసాధారణ స్ట్రోక్ ప్లే తో ఇటీవల కాలం లో బాగా రాణిస్తున్నాడు. టీ20 కెరీర్లో 148.42 స్ట్రైక్ రేట్ తో ఉన్న జాకబ్స్ ఈ సీజన్లో అనేక మంది బౌలర్లకు తలనొప్పిగా పరిణమించే అవకాశం ఉంది.ముంబై ఇండియన్స్ జట్టుజస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్, నమన్ ధిర్, రాబిన్ మింజ్, కర్ణ్ శర్మ, ర్యాన్ రికెల్టన్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహమాన్, విల్ జాక్స్, అశ్వనీ కుమార్, మిచెల్ సాంట్నర్, రీస్ టాప్లే, క్రిష్ణన్ శ్రీజిత్, రాజ్ అంగద్ బవా, సత్యనారాయణ రాజు, బెవాన్ జేకబ్స్ అర్జున్ టెండుల్కర్, లిజాడ్ విలియమ్స్, విఘ్నేశ్ పుత్తూరు, కార్బిన్ బాష్.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. మూడు ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి -
IND vs ENG: టీమిండియా కెప్టెన్గా అతడే! బీసీసీఐ గ్రీన్ సిగ్నల్?
టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ (Rohit Sharma) కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో అతడే భారత జట్టును ముందుకు నడిపించనున్నట్లు సమాచారం. భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) నాయకత్వ బృందం రోహిత్తో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.మరోసారి సూపర్ ‘హిట్’కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో రోహిత్ శర్మ టీమిండియాను విజేతగా నిలిపిన విషయం తెలిసిందే. ఈ మెగా వన్డే టోర్నీలో భారత్ ఐదింటికి ఐదూ గెలిచి అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. ముఖ్యంగా న్యూజిలాండ్తో ఫైనల్లో రోహిత్ శర్మ అద్భుత అర్ధ శతకం(76)తో బ్యాటర్గానూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.తద్వారా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచి.. ఇంత వరకు ఏ కెప్టెన్కూ సాధ్యం కాని ఘనతను రోహిత్ సాధించాడు. అంతకంటే ముందు ఇంగ్లండ్తో స్వదేశంలో వన్డే సిరీస్లోనూ హిట్మ్యాన్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. అయితే, ఈ అద్బుత ప్రదర్శన కంటే ముందు రోహిత్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు.అత్యంత ఘోర ఓటమి కారణంగాముఖ్యంగా సొంతగడ్డపై న్యూజిలాండ్తో టెస్టుల్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత్.. 3-0తో వైట్వాష్కు గురైంది. భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత ఘోర ఓటమి. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్లోనూ టీమిండియా పరాజయం పాలైంది. ఐదు టెస్టుల సిరీస్లో 3-1తో ఓడి దశాబ్ద కాలం తర్వాత కంగారూలకు ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని చేజార్చుకుంది. అంతేకాదు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు చేరకుండానే నిష్క్రమించింది.ఇక ఈ రెండు సిరీస్లలో కెప్టెన్గా.. బ్యాటర్గా రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత రంజీ బరిలో ముంబై తరఫున ఓపెనర్గా వచ్చి అక్కడా వైఫల్యాన్ని కొనసాగించాడు. సీన్ రివర్స్ఈ పరిణామాల నేపథ్యంలో రోహిత్ శర్మ టెస్టులకు గుడ్బై చెప్పాలనే డిమాండ్లు పెరిగాయి. జస్ప్రీత్ బుమ్రాకు పగ్గాలు అప్పగించాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, చాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత పరిస్థితి మారిపోయింది.రోహిత్ శర్మకు మద్దతుగా భారత మాజీ క్రికెటర్లు గళం వినిపిస్తున్నారు. కాగా ఐపీఎల్-2025 కారణంగా దాదాపు రెండు నెలలపాటు అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉండనున్న టీమిండియా.. జూన్ ఆఖర్లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఇంగ్లిష్ జట్టుతో ఐదు టెస్టులు ఆడనుంది.ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు మాట్లాడుతూ.. ఈ సిరీస్లో రోహిత్నే కెప్టెన్గా కొనసాగించాలని సూచించాడు. సొంతగడ్డపై ఇంగ్లండ్ను ఓడించాలంటే రోహిత్ వంటి అనుభవజ్ఞుడి సేవలు అవసరమని పేర్కొన్నాడు. ఇక బీసీసీఐ సన్నిహిత వర్గాలు తాజాగా ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాయి.బీసీసీఐ గ్రీన్ సిగ్నల్‘‘రోహిత్ ఏం చేయగలడో మరోసారి నిరూపితమైంది. బీసీసీఐలో భాగమైన ప్రతి ఒక్కరు ఇంగ్లండ్ పర్యటనలోనూ అతడినే కొనసాగించాలని.. అతడే సరైన సారథి అని నమ్ముతున్నారు. అటు రోహిత్ కూడా రెడ్ బాల్ క్రికెట్లో కొనసాగేందుకు ఆసక్తిగానే ఉన్నట్లు బోర్డుకు తెలిపాడు’’ అని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ మరికొంతకాలం టెస్టులు ఆడటం ఖాయమైపోయిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కాగా టీ20 ప్రపంచకప్-2024, చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలవడంతో మహేంద్ర సింగ్ ధోని తర్వాత భారత్కు అధిక ఐసీసీ టైటిళ్లు అందించిన కెప్టెన్గా రోహిత్ చరిత్రకెక్కిన విషయం తెలిసిందే. గతేడాది పొట్టి వరల్డ్కప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్నాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత మాట్లాడుతూ.. ఇప్పట్లో తనకు రిటైర్ అయ్యే ఉద్దేశం లేదని తెలిపాడు. ఇక రోహిత్ ప్రస్తుతం ఐపీఎల్-2025 సన్నాహకాలతో బిజీగా ఉన్నాడు.చదవండి: IPL 2025: హార్దిక్పై నిషేధం.. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా సూర్యకుమార్..? -
ఐపీఎల్కు ముందు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న రోహిత్
అతి పెద్ద క్రికెట్ పండుగ ఐపీఎల్ మరో 8 రోజుల్లో ప్రారంభం కానుంది. క్యాష్ రిచ్ లీగ్ 18వ ఎడిషన్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచ ఆతృతగా ఎదురుచూస్తుంది. లీగ్లో పాల్గొనే ఫ్రాంచైజీలన్నీ సన్నాహకాల్లో బిజీగా ఉన్నాయి. ఆటగాళ్లు ఒక్కొక్కరుగా జట్లతో చేరుతున్నారు. ఫ్రాంచైజీల ముఖ్యులు వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నారు.రెండు నెలలకు పైగా సాగే ఈ మెగా ఈవెంట్లో మొత్తం 74 మ్యాచ్లు జరుగనున్నాయి. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్, ఆర్సీబీ మధ్య మ్యాచ్తో ఐపీఎల్ 2025 ప్రారంభమవుతుంది. మే 25న జరిగే ఫైనల్లో ముగుస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం భారత ఆటగాళ్లు కూడా ఒక్కొక్కరుగా తమతమ శిబిరాలకు చేరుకుంటున్నారు. అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఆల్రెడీ డ్యూటీకి ఎక్కేశారు. యాడ్స్తో బిజీగా ఉన్న విరాట్ కోహ్లి మరికొద్ది రోజుల్లో ఆర్సీబీతో జతకడతాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సుదీర్ఘంగా సాగే ఐపీఎల్కు ముందు సేద తీరుతున్నాడు. రోహిత్ సరదాగా కుటుంబంతో కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటోలో రోహిత్.. తన నెలల చిన్నారి, కూతురు సమైరా మరియు భార్య రితికాతో కలిసి బోట్లో ప్రయాణిస్తూ కనిపించాడు.ఐపీఎల్ 2025లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచింది. ఐపీఎల్ హిస్టరీలో సీఎస్కే, ముంబై ఇండియన్స్ మాత్రమే ఐదు టైటిల్స్ సాధించాయి. రోహిత్ గత సీజన్కు ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. రోహిత్ తర్వాత హార్దిక్ పాండ్యా ముంబై పగ్గాలు చేపట్టాడు. హార్దిక్ కెప్టెన్సీలో ముంబై గత సీజన్లో పేలవ ప్రదర్శన చేసింది. త్వరలో ప్రారంభం కానున్న సీజన్లో ముంబై ప్రస్థానం మార్చి 23న మొదలవుతుంది. చెన్నై వేదికగా ఆ రోజు జరిగే మ్యాచ్లో ముంబై.. సమవుజ్జీ సీఎస్కేతో తలపడుతుంది. ఈ మ్యాచ్పై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి.ఈ సీజన్ కోసం ముంబై ఇండియన్స్ పెద్దగా మార్పులేమీ చేయలేదు. మెగా వేలంలో బడా స్టార్లకు ఎర వేయలేదు. కొత్తగా విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, ర్యాన్ రికెల్టన్ లాంటి విదేశీ ఆటగాళ్లు జట్టులో చేరారు. ట్రెంట్ బౌల్ట్కు గతంలో ముంబై ఇండియన్స్తో అనుబంధం ఉంది. మెగా వేలానికి ముందు ముంబై రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాను రీటైన్ చేసుకుంది.ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్..హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, తిలక్ వర్మ, నమన్ ధిర్, సూర్యకుమార్ యాదవ్, బెవాన్ జాకబ్స్, రాజ్ భవా, విల్ జాక్స్, విజ్ఞేశ్ పుథుర్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, సత్యనారాయణ రాజు, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, రాబిన్ మింజ్, కృష్ణణ్ శ్రీజిత్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్, రీస్ టాప్లే, కర్ణ్ శర్మ, దీపర్ చాహర్, ముజీబ్ రెహ్మాన్ -
ఎవరూ ఊహించని నిర్ణయం.. రోహిత్ వ్యూహం భేష్: పాక్ దిగ్గజం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)పై పాకిస్తాన్ మాజీ సారథి వకార్ యూనిస్ ప్రశంసలు కురిపించాడు. న్యూజిలాండ్తో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో హిట్మ్యాన్ అనుసరించిన వ్యూహాలు అమోఘమని కొనియాడాడు. కీలక మ్యాచ్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని జట్టును విజేతగా నిలిపాడని ప్రశంసించాడు. కాగా ఫిబ్రవరి 19న మొదలైన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) మార్చి 9న ముగిసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చిన ఈ వన్డే టోర్నమెంట్లో.. టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్లో తమ మ్యాచ్లు ఆడింది. అజేయ చాంపియన్గాగ్రూప్ దశలో మూడింటికి మూడు (బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్) గెలిచిన రోహిత్ సేన.. సెమీస్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఇక ఫైనల్లో కివీస్ (India vs New Zealand)ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని ముద్దాడింది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ మాట్లాడుతూ.. కుల్దీప్ యాదవ్ను ముందుగా బౌలింగ్కు పంపడమే మ్యాచ్కు టర్నింగ్ అని అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మను తప్పక అభినందించాలన్నాడు. ఈ మేరకు ఓ యూట్యూబ్ చానెల్తో మాట్లాడుతూ.. ‘‘కుల్దీప్ను ముందుగా పంపడమే ఈ మ్యాచ్లో కీలకంగా మారింది.ఎవరూ ఊహించని నిర్ణయంరోహిత్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ప్రత్యర్థి జట్టు అస్సలు ఊహించి ఉండదు. సాధారణంగా కుల్దీప్ యాదవ్ 20- 25 ఓవర్ల తర్వాతే బౌలింగ్కి వస్తాడు. కాబట్టి న్యూజిలాండ్కు ఇది కచ్చితంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.కుల్దీప్ ఇంత ముందుగా వస్తాడని కివీస్ ఓపెనర్లు అస్సలు ఊహించి ఉండరు. అక్షర్ లేదా జడేజా వస్తారని వాళ్లు అనుకుని ఉంటారు. అయితే, ఇక్కడే రోహిత్ శర్మ తన మార్కు చూపించాడు. అద్భుతమైన వ్యూహంతో అనుకున్న ఫలితాన్ని రాబట్టాడు’’ అని వకార్ యూనిస్ కొనియాడాడు.అతడి రాకతో కివీస్ కుదేలుకాగా కివీస్తో ఫైనల్లో రోహిత్ శర్మ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను పదకొండో ఓవర్లోనే బరిలోకి దించాడు. తన తొలి ఓవర్లోనే ప్రమాదకర ఓపెనర్ రచిన్ రవీంద్ర(37)ను బౌల్డ్ చేసిన కుల్దీప్.. పదమూడో ఓవర్లో కేన్ విలియమ్సన్(11) రూపంలో మరో కీలక వికెట్ పడగొట్టాడు. దీంతో భారత్కు శుభారంభం లభించింది. ఈ మ్యాచ్లో ఉత్తమంగా (10-0-40-2) రాణించిన కుల్దీప్ యాదవ్ జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. కాగా దుబాయ్ వేదికగా న్యూజిలాండ్తో టైటిల్ పోరులో టాస్ ఓడిన ఇండియా తొలుత బౌలింగ్ చేసింది. డారిల్ మిచెల్(63), మైఖేల్ బ్రాస్వెల్(53 నాటౌట్) అర్ధ శతకాల కారణంగా.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకున్నాడు. పేసర్ మహ్మద్ షమీ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక లక్ష్య ఛేదనలో కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ(76) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. శ్రేయస్ అయ్యర్(48), కేఎల్ రాహుల్(34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9) రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు. చదవండి: CT 2025: ఒకే వేదికపై ఆడటం అదనపు ప్రయోజనమే.. విమర్శలతో ఏకీభవిస్తా: స్టార్క్ -
అసెంబ్లీలో స్టార్ హీరోయిన్పై నోరు పారేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
జైపూర్ : అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నోరు పారేసుకున్నారు. రాష్ట్రంలో సెకండ్ గ్రేడ్ యాక్టర్ బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ (madhuri dixit) ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. సెకండ్ గ్రేడ్ యాక్టర్లు తప్ప మీకు ఇంకెవరి ఫొటోలు దొరకలేదా? షారుఖ్ ఖాన్ తప్ప మిగిలిన నటులంతా ఆ కోవకే చెందుతారంటూ తన నోటికి పనిచెప్పారు. ప్రస్తుతం సదరు కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది.రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష కాంగ్రెస్.. రాష్ట్రంలో జరిగిన ఐఫా అవార్డ్ల ఫంక్షన్పై బీజేపీ ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించింది.ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే టికారం జుల్లీ (Congress MLA Tikaram Jully) అసెంబ్లీలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఐఫా (IIFA Awards 2025) ఉత్సవాల్ని నిర్వహించింది. ఐఫా పేరిట దేనికి ఎంతెంత? ఖర్చు పెట్టారో లెక్కలు బయటకు తీయాలి. మీరు ఏర్పాటు చేసిన హోర్డింగ్లు రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తున్నట్లుగా లేదు. ఐఫాను ప్రమోట్ చేస్తునట్లుంది.ఐఫా వల్ల రాష్ట్రానికి ఏ ఒరిగింది? ఈ కార్యక్రమానికి వచ్చిన సినీ ప్రముఖులు టూరిస్ట్ ప్రాంతాల్ని సందర్శించారా? సినీ ఇండస్ట్రీ నుంచి ఐఫా కార్యక్రమానికి వచ్చిన స్టార్లు ఎవరు? నాకు తెలిసి షారుఖ్ఖాన్ మినహా మిగిలిన వాళ్లందరూ సెకండ్ గ్రేడ్ యాక్టర్లే. ఫస్ట్ గ్రేడ్ యాక్టర్లు ఈ కార్యక్రమానికి వచ్చినట్లు లేదే? అని వ్యాఖ్యానించారు.దీంతో ఎమ్మెల్యే టికారం జుల్లీ వ్యాఖ్యల్ని అధికార బీజేపీ ఎమ్మెల్యేలు ఖండించారు. ప్రతి స్పందనగా.. అవును మాధిరి దీక్షిత్ ఇప్పుడు సెకండ్ గ్రేడ్ యాక్టర్. నాటి దిల్, బేటా సినిమాలకు మాత్రమే ఆమె స్టార్. ఆమె ఎరా ఎప్పుడో ముగిసింది’అని తాను చేసిన వ్యాఖ్యల్ని సమర్ధించుకున్నారు.కొద్ది రోజుల క్రితం ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నేత షామా మొహమ్మద్ (shama mohamed) ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ రాజకీయ దుమారం రేపింది. షామా తన ట్వీట్లో రోహిత్ శర్మ (rohit sharma) ఫిట్గా లేడు! బరువు తగ్గాలి. భారత క్రికెట్ జట్టులో గత సారథులతో పోల్చితే ఆకట్టుకోని కెప్టెన్ అతడే’ అని రాసుకొచ్చింది. ఆమె చేసిన ట్వీట్పై పెద్ద ఎత్తున దుమారమే చెలరేగింది.భారతీయులు రోహిత్ శర్మకు మద్దతు పలుకుతూ షామాపై విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలు తట్టుకోలేక దెబ్బకు దిగొచ్చారు. దుబాయ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టును విజయపథం వైపు నడిపించారంటూ రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించారు. -
CT 2025: రికార్డులు బద్దలు.. సరికొత్త చరిత్ర! ఏకంగా 11 వేల కోట్లకు పైగా..
భారత్లో క్రికెట్ ఓ ‘మతం’ లాంటిది.. వేదిక ఏదైనా టీమిండియా ఆడుతోందంటే అందరూ టీవీలకు అతుక్కుపోవాల్సిందే. ఆ వెసలుబాటు లేని వాళ్లకు డిజిటల్ మీడియా రూపంలో ప్రత్యామ్నాయం ఉండనే ఉంది. ఇక ఇటీవల జరిగిన మెగా ఐసీసీ ఈవెంట్ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) జియోహాట్స్టార్(JioHotstar)లో ప్రత్యక్ష ప్రసారం అయిన విషయం తెలిసిందే.11 వేల కోట్ల నిమిషాలకు పైగాఈ నేపథ్యంలో తాజాగా ఈ టోర్నమెంట్ వ్యూయర్షిప్నకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఈ వన్డే టోర్నీకి 540.3 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక వాచ్ టైమ్ ఏకంగా 11 వేల కోట్ల నిమిషాలకు పైగా నమోదు కావడం విశేషం. అంతేకాదు.. ఓవరాల్గా 6.2 కోట్ల మంది వ్యూయర్స్ ఈ మెగా ఈవెంట్ను వీక్షించినట్లు బ్రాడ్కాస్టర్ వెల్లడించింది.కాగా 2017లో చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించారు. నాటి ఫైనల్లో టీమిండియాపై గెలిచి పాకిస్తాన్ టైటిల్ సొంతం చేసుకుంది. అయితే, అప్పటి నుంచి సుదీర్ఘకాలం పాటు ఈ టోర్నీని వాయిదా వేశారు. ఈ క్రమంలో 2025లో తిరిగి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించేందుకు సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్(Pakistan) ఆతిథ్య హక్కులు దక్కించుకోగా.. టీమిండియా మాత్రం భద్రతా కారణాల వల్ల దుబాయ్లో తమ మ్యాచ్లు ఆడింది.కాగా పాకిస్తాన్లో 1996 తర్వాత ఓ ఐసీసీ టోర్నీ జరగడం ఇదే తొలిసారి. ఇక ఫిబ్రవరి 19న పాకిస్తాన్లో మొదలైన ఈ వన్డే ఈవెంట్ మార్చి 9న భారత్- న్యూజిలాండ్ మధ్య దుబాయ్ వేదికగా ఫైనల్తో ముగిసింది. హిట్మ్యాన్ ఖాతాలో రెండో ఐసీసీ టైటిల్ఇక ఈ టోర్నమెంట్లో రోహిత్ సేన ఆది నుంచి ఆఖరి వరకు అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్... సెమీస్లో ఆస్ట్రేలియాను, ఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తు చేసింది.తద్వారా హిట్మ్యాన్ ఖాతాలో రెండో ఐసీసీ టైటిల్ చేరింది. మరోవైపు.. ఈ వన్డే టోర్నీలో తొలిసారి అడుగుపెట్టిన అఫ్గనిస్తాన్ ఇంగ్లండ్ వంటి పటిష్ట జట్టును చిత్తు చేసి గెలుపు నమోదు చేయడం విశేషం. ఇక వన్డే వరల్డ్కప్-2023 విజేత ఆసీస్పై రన్నరప్ టీమిండియా ప్రతీకారం తీర్చుకోవడం కూడా హైలైట్గా నిలిచింది.ఇన్ని ప్రత్యేకతలు ఉన్న చాంపియన్స్ ట్రోఫీ-2025ని కోట్లాది మంది వీక్షించడంలో ఆశ్చర్యమేమీ లేకపోయినా.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 540 కోట్లకు పైగా వ్యూస్ రావడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్' 18 నెట్వర్క్లో టీవీలో ప్రసారాలు జరుగగా.. జియోహాట్స్టార్లోనూ ప్రత్యక్ష ప్రసారం చేశారు. అత్యధిక వ్యూస్ ఆ మ్యాచ్కేకాగా మిగతా మ్యాచ్లతో పోలిస్తే టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఫైనల్కు అత్యధిక వ్యూస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ పోరుకు ఏకంగా 124.2 కోట్ల వీక్షణలు వచ్చాయి.కాగా మొత్తంగా చాంపియన్స్ ట్రోఫీకి వచ్చిన వ్యూయర్షిప్లో ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, గోవా, పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి 38 శాతం మేర వ్యూస్ వచ్చినట్లు సమాచారం. ఇక వైఫై సాయంతో మ్యాచ్ వీక్షించిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందు ఉంది. కాగా 16 మాధ్యమాల్లో చాంపియన్స్ ట్రోఫీని ప్రసారం చేశారు. తొమ్మిది భాషల్లో కామెంట్రీ ఇచ్చారు.ఇక ఈ మెగా టోర్నీలో గెలవడం ద్వారా భారత్ ఖాతాలో ఏడో ఐసీసీ టైటిల్ చేరింది. 1983 వన్డే వరల్డ్కప్, 2002లో శ్రీలంకతో కలిసి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ, 2024 టీ20 ప్రపంచకప్, 2025 చాంపియన్స్ ట్రోఫీలను భారత్ గెలుచుకుంది. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పాల్గొన్నాయి. దుబాయ్తో పాటు కరాచీ, లాహోర్, రావల్పిండి ఇందుకు వేదికలు.చదవండి: IPL 2025: అతడి గురించి ఎవరూ మాట్లాడమే లేదు.. మూడో స్థానంలో ఆడిస్తారా? -
WC 2027: రోహిత్ శర్మ ప్లానింగ్ ఇదే!.. అతడి మార్గదర్శనంలో సన్నద్ధం!
‘‘ఇంకో విషయం చెప్పాలి.. ఈ ఫార్మాట్ నుంచి నేను రిటైర్ కావడం లేదు. ఇకపై వదంతులు ప్రచారం చేయకుండా ఉండాలనే ఈ మాట చెబుతున్నా’’... ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) చేసిన వ్యాఖ్యలు ఇవి. తాను భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదని.. జీవిత ప్రయాణంలో ఎదురైన వాటినే తాను స్వీకరిస్తానని స్పష్టం చేశాడు.ప్రస్తుతం తన దృష్టి మొత్తం ఆట మీదే ఉందని.. 2027 వన్డే వరల్డ్కప్ నాటికి కొనసాగుతానా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేనని రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు.. రిటైర్మెంట్ గురించి ఇప్పుడు తాను ఎలాంటి కామెంట్లూ చేయలేనని పేర్కొన్నాడు.ఊహాగానాలు ఆగటం లేదుక్రికెట్ ఆడటాన్ని ఇప్పటికీ పూర్తిగా ఆస్వాదిస్తున్నానని.. జట్టుతో సమయం గడపడం తనలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోందని.. సహచర ఆటగాళ్లు కూడా తనతో ఉండేందుకు ఇష్టపడుతున్నారని హిట్మ్యాన్ తెలిపాడు. ఇంత చెప్పినప్పటికీ రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు ఆగటం లేదు. అతడి భవిష్యత్తు గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి.వన్డేల్లో కొనసాగినా.. టెస్టులకు మాత్రం రోహిత్ దూరం కానున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక యాభై ఓవర్ల ఫార్మాట్లో మరో రెండేళ్లకు అంటే.. 2027 తర్వాత రోహిత్ పక్కకు తప్పుకోవడం లాంఛనమేననే వార్తలు వస్తున్నాయి. కాగా రోహిత్ వచ్చే నెలలో 38వ వసంతంలో అడుగుపెడతాడు.నలభై ఏళ్ల వయసులో ఎలా?వన్డే వరల్డ్కప్-2027(ICC ODI World Cup 2027) నాటికి అతడికి నలభై ఏళ్లు వస్తాయి. ఇక సౌతాఫ్రికా- జింబాబ్వే- నమీబియా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా ఐసీసీ ఈవెంట్ కంటే ముందు టీమిండియా దాదాపు 27 వన్డేలు ఆడనుంది. సమయాన్ని బట్టి ఇందుకు అదనంగా మరికొన్ని మ్యాచ్లు కూడా షెడ్యూల్ కావచ్చు. అయితే, వరల్డ్కప్ నాటికి రోహిత్ ఫిట్గా ఉండేందుకు ఇప్పటి నుంచే సన్నాహాకాలు మొదలుపెట్టాడని క్రిక్బజ్ నివేదిక పేర్కొంది.అతడి మార్గదర్శనంలో సన్నద్ధం!టీమిండియా కోచ్ అభిషేక్ నాయర్ మార్గదర్శనంలో రోహిత్ తన ప్రయాణాన్ని కొనసాగించేందుకు వీలుగా ప్రత్యేక షెడ్యూల్ రూపొందించుకున్నట్లు సమాచారం. కాగా ఇంటెలిజింట్, వినూత్న టెక్నిక్లకు నాయర్ పెట్టింది పేరు. దినేశ్ కార్తిక్, కేఎల్ రాహుల్ తదితర స్టార్ ప్లేయర్లు నాయర్ విధానాలు పాటించి కష్టకాలం నుంచి బయటపడ్డారు.ఇప్పుడు రోహిత్ శర్మ కూడా అదే బాటలో పయనించనున్నట్లు తెలుస్తోంది. ఇక హిట్మ్యాన్ ప్రస్తుతం ఐపీఎల్-2025కి సన్నద్ధమయ్యే పనిలో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా సారథ్యంలో అతడు ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. కాగా ముంబైకి ఏకంగా ఐదుసార్లు ట్రోఫీ అందించి.. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్గా రోహిత్ తన పేరిట చెక్కుచెదరని రికార్డును లిఖించుకున్నాడు. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాను చాంపియన్గా నిలిపిన తర్వాత రోహిత్.. అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.చదవండి: IPL 2025: అతడి గురించి ఎవరూ మాట్లాడమే లేదు.. మూడో స్థానంలో ఆడిస్తారా? -
కెప్టెన్గా, ఓపెనర్గా రోహిత్ శర్మనే..!
ప్రతిష్టాత్మక విజ్డన్ సంస్థ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ను ఇవాళ (మార్చి 13) ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్గా, ఓపెనర్గా టీమిండియా సారధి రోహిత్ శర్మను ఎంపిక చేసింది. ఈ జట్టులో ఐదుగురు టీమిండియా ఆటగాళ్లకు చోటు దక్కింది. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి విజ్డన్ టీమ్ ఆఫ్ ద టోర్నీకి ఎంపికయ్యారు. ఈ జట్టుకు న్యూజిలాండ్ నుంచి నలుగురు.. ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల నుంచి చెరో ఆటగాడు ఎంపికయ్యారు. న్యూజిలాండ్ నుంచి రచిన్ రవీంద్ర, మైఖేల్ బ్రేస్వెల్, కెప్టెన్ మిచెల్ సాంట్నర్, ఫైనల్కు ముందు గాయపడిన స్పీడ్స్టర్ మ్యాట్ హెన్రీ విజ్డన్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇంగ్లండ్ నుంచి జో రూట్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అజ్మతుల్లా ఒమర్జాయ్ విజ్డన్ జట్టుకు ఎంపికయ్యారు.రోహిత్కు జతగా రచిన్ రవీంద్ర ఓపెనర్గా ఎంపిక కాగా.. విరాట్ వన్డౌన్లో, జో రూట్ నాలుగో స్థానం కోసం ఎంపిక చేయబడ్డారు. వికెట్కీపర్ బ్యాటర్గా కేఎల్ రాహుల్ ఎంపిక కాగా.. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కోటాలో ఒమర్జాయ్, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా బ్రేస్వెల్, సాంట్నర్ ఎంపికయ్యారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి.. స్పెషలిస్ట్ పేసర్లుగా మహ్మద్ షమీ, మ్యాట్ హెన్రీ ఎంపికయ్యారు.ఛాంపియన్స్ ట్రోఫీ జట్టును ఎంపిక చేయడంతో పాటు విజ్డన్ టీమిండియా ఆటగాళ్లకు రేటింగ్లు కూడా ఇచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రదర్శనల ఆధారంగా ఈ రేటింగ్లు ఇచ్చింది. భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్, వరుణ్ చక్రవర్తి అత్యధిక రేటింగ్ పాయింట్లు పొందారు. వీరికి 10కి 9 పాయింట్లు లభించాయి. రాహుల్, వరుణ్ తర్వాత విరాట్ అత్యధిక రేటింగ్ పాయింట్లు పొందాడు. విరాట్కు 10కి 8.5 రేటింగ్ పాయింట్లు లభించాయి. ఆతర్వాత రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్కు తలో 8 పాయింట్లు లభించాయి. శుభ్మన్ గిల్కు 7.5.. షమీ, జడేజాలకు తలో 7.. హార్దిక్, హర్షిత్ రాణాకు 10కి 6 పాయింట్లు లభించాయి.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్ను ఓడించి మూడోసారి టైటిల్ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ అజేయ జట్టుగా నిలిచింది. ఈ టైటిల్తో భారత్ ఐసీసీ టైటిళ్ల సంఖ్య ఏడుకు చేరింది. రోహిత్ సారథ్యంలో టీమిండియా వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు సాధించింది. కేవలం ఏడాదిలోపే భారత్ టీ20 వరల్డ్కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలను కైవసం చేసుకోవడం విశేషం. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో రోహిత్ శర్మ బాధ్యతాయుతమైన అర్ద శతకం సాధించి టీమిండియా విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనకు గానూ రోహిత్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది. -
రోహిత్... పైపైకి!
దుబాయ్: టీమిండియా కెప్టెన్ ఫైనల్లో చక్కటి ఇన్నింగ్స్తో భారత జట్టుకు మూడోసారి ట్రోఫీ దక్కడంలో కీలకపాత్ర పోషించిన రోహిత్ శర్మ తాజా ర్యాంకింగ్స్లో మూడో స్థానానికి చేరాడు. న్యూజిలాండ్తో జరిగిన తుదిపోరులో అర్ధశతకంతో ఆకట్టుకున్న రోహిత్ రెండు ర్యాంక్లు మెరుగు పర్చుకొని 756 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.భారత యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ (784 పాయింట్లు) ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... టాప్–10లో మొత్తం నలుగురు భారత ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. చాంపియన్స్ ట్రోఫీలో 218 పరుగులు చేసి ఆకట్టుకున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (736 పాయింట్లు) ఒక స్థానం కోల్పోయి 5వ ర్యాంక్లో నిలవగా... మిడిలార్డర్లో కీలక ఇన్నింగ్స్లతో ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్ (704 పాయింట్లు) 8వ ర్యాంక్లో స్థిరంగా కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర 14 స్థానాలు ఎగబాకి 14వ ర్యాంక్కు చేరగా... డారిల్ మిషెల్ ఒక స్థానం మెరుగు పర్చుకొని ఆరో ర్యాంక్లో నిలిచాడు. బౌలర్ల ర్యాంకింగ్స్లో కుల్దీప్ యాదవ్ (650 పాయింట్లు) మూడు స్థానాలు ఎగబాకి భారత్ తరఫున అత్యుత్తమంగా మూడో ర్యాంక్లో నిలిచాడు. రవీంద్ర జడేజా (616 పాయింట్లు) కూడా మూడు స్థానాలు మెరుగు పరుచుకొని పదో ర్యాంక్కు చేరాడు. న్యూజిలాండ్ సారథి సాంట్నర్ (657 పాయింట్లు) రెండో ర్యాంక్కు చేరగా... శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ తీక్షణ (680 పాయింట్లు) ‘టాప్’ ప్లేస్లో కొనసాగుతున్నాడు. వన్డే ఆల్రౌండర్ల జాబితాలో భారత్ నుంచి రవీంద్ర జడేజా (10వ ర్యాంక్) ఒక్కడే టాప్–10లో కొనసాగుతున్నాడు. -
ఛాంపియన్స్ ట్రోఫీ బెస్ట్ టీమ్.. రోహిత్ శర్మకు షాక్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ముగిసిన సంగతి తెలిసిందే. ఆదివారం(మార్చి 9) దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి భారత్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 12 ఏళ్ల తర్వాత తిరిగి భారత్ సొంతమైంది.ఈ క్రమంలో టోర్నీలో ఉత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో కూడిన జట్టును భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రకటించాడు. ఈ పదకొండు మంది సభ్యుల జట్టులో నలుగురు భారత ప్లేయర్లకు చోటు దక్కింది. కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం అశ్విన్ తన ఎంచుకున్న టీమ్లో చోటు ఇవ్వలేదు. రోహిత్ శర్మ ఫైనల్లో 74 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అంతేకాకుండా కెప్టెన్సీ పరంగా రోహిత్ అదరగొట్టాడు. టోర్నీలో భారత్ ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ విజేతగా నిలిపాడు. ఐసీసీ ప్రకటించిన ఉత్తమ టీమ్లో కూడా రోహిత్కు చోటు దక్కలేదు.కాగా అశ్విన్ తన ఎంపిక చేసిన జట్టులో న్యూజిలాండ్కు చెందిన రచిన్ రవీంద్ర, ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్లకు ఓపెనర్లగా అవకాశమిచ్చాడు. అదేవిధంగా ఫస్ట్ డౌన్లో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి, సెకెండ్ డౌన్లో శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కింది. వికెట్ కీపర్గా ఆస్ట్రేలియాకు చెందిన జోష్ ఇంగ్లిష్ను అశూ ఎంచుకున్నాడు.ఫినిషర్గా డేవిడ్ మిల్లర్కు ఛాన్స్ లభించింది. ఆల్రౌండర్ల కోటాలో అజ్మతుల్లా ఓమర్జాయ్, మైఖల్ బ్రేస్వెల్.. స్పెషలిస్ట్ స్పిన్నర్లగా వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్లకు చోటు దక్కింది. ఏకైక ఫాస్ట్ బౌలర్గా కివీస్ స్పీడ్ స్టార్ మాట్ హెన్రీని అశ్విన్ ఎంపిక చేశాడు. అశ్విన్ తన జట్టులో 12వ ప్లేయర్గా న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ను ఎంచుకున్నాడు. అయితే ఐసీసీ మాత్రం తన ప్రకటించిన టీమ్కు శాంట్నర్ను కెప్టెన్గా ఎంపిక చేయడం గమనార్హం.ఆర్ అశ్విన్ ఎంపిక చేసిన బెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు: రచిన్ రవీంద్ర, బెన్ డకెట్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, జోష్ ఇంగ్లిస్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మైఖేల్ బ్రేస్వెల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మాట్ హెన్రీ. 12వ ఆటగాడు: మిచెల్ సాంట్నర్చదవండి: రిషబ్ పంత్ ఇంట్లో పెళ్లి భజాలు.. సందడి చేయనున్న భారత క్రికెటర్లు -
చాంపియన్స్ మనమే..!
చాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్ -
చాంపియన్స్ ట్రోఫీతో బుమ్రా భార్య సంజనా.. రోహిత్ శర్మతో ముచ్చట్లు (ఫోటోలు)
-
CT: ఇండియా-‘బి’ టీమ్ కూడా ఫైనల్ చేరేది: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
భారత జట్టు ‘బలం’ ముందు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్(Michael Vaughan) తలవంచాడు. టీమిండియా విజయాలను తక్కువ చేసి మాట్లాడిన అతడే.. పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రపంచంలోనే గొప్ప జట్టు అని భారత్ను కొనియాడాడు. ‘హోం అడ్వాంటేజ్’ అంటూ విమర్శలుచాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో రోహిత్ సేనకు ‘హోం అడ్వాంటేజ్’ ఉంటుందని విమర్శించిన వాన్.. ఇప్పుడు ద్వితీయ శ్రేణి జట్టుతోనే టీమిండియా టైటిల్ గెలవగలదని కితాబు ఇచ్చాడు.కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మొదలు కాగా.. టీమిండియా భద్రతా కారణాల దృష్ట్యా అక్కడికి వెళ్లలేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆమోదంతో తటస్థ వేదికైన దుబాయ్లోనే తమ మ్యాచ్లన్నీ ఆడింది. అయితే, ఒకే మైదానంలో ఆడటం వల్ల ఇతర జట్లతో పోలిస్తే భారత్కు అదనపు ప్రయోజనాలు చేకూరుతున్నాయని.. అలవాటైన స్టేడియంలో ఆడటం వారికి సానుకూలాంశమని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు విమర్శించారు.అంతేగాక.. టీమిండియాతో మ్యాచ్ల కోసం ఇతర జట్లు పాకిస్తాన్- దుబాయ్(Dubai) మధ్య ప్రయాణాలు చేయడం కూడా ఇబ్బందికరమేనని పేర్కొన్నారు. వేదిక ఏదైనా టీమిండియాకు తిరుగు లేదంటూ సునిల్ గావస్కర్ వంటి భారత క్రికెట్ దిగ్గజాలు ఈ విమర్శలను తిప్పికొట్టారు.ఏదేమైనా గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్లను ఓడించి టాపర్గా సెమీస్ చేరిన రోహిత్ సేన.. ఆస్ట్రేలియాపై గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం నాటి మ్యాచ్లో న్యూజిలాండ్ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి విజేతగా అవతరించింది.టీమిండియా-‘బి’ టీమ్ కూడా ఫైనల్ చేరేదిఈ నేపథ్యంలో మైకేల్ వాన్ భారత జట్టు ఆట తీరును కొనియాడాడు. అదే విధంగా.. భారత్ ‘బెంచ్ స్ట్రెంత్’ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘‘నిజాయితీగా చెప్పాలంటే.. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇండియా అత్యుత్తమ జట్టుగా కొనసాగుతోంది. ఈ విజయానికి వారు అర్హులు. టీ20 ప్రపంచకప్ గెలిచిన వెంటనే.. ఇండియా చాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచింది.జైస్వాల్, వర్మ, శర్మ, స్కై, పంత్, రెడ్డి, సుందర్, చహల్, అర్ష్దీప్, బుమ్రా, బిష్ణోయిలతో కూడిన జట్టు కూడా ఫైనల్కు చేరేది. టైటిల్ కూడా గెలిచేది. వైట్బాల్ క్రికెట్లో వారి బెంచ్ బలానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం మరొకటి ఉండదు’’ అని మైకేల్ వాన్ ‘ఎక్స్’ పోస్టులో రాసుకొచ్చాడు.అతడు దూరం.. వారు బెంచ్కే పరిమితంకాగా భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా చాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి దూరం కాగా.. యశస్వి జైస్వాల్ను ఆఖరి నిమిషంలో తప్పించి వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకుంది మేనేజ్మెంట్. ఇక ఈ జట్టులో రిషభ్ పంత్కు స్థానం దక్కినా.. వికెట్ కీపర్ కోటాలో కేఎల్ రాహుల్ను తుదిజట్టులో ఆడించారు. దీంతో పంత్ బెంచ్కే పరిమితమయ్యాడు. వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్లదీ ఇదే పరిస్థితి.ఇక వీరితో పాటు తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, యజువేంద్ర చహల్, రవి బిష్ణోయిలతో కూడిన జట్టు కూడా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేరేదంటూ మైకేల్ వాన్ పేర్కొనడం విశేషం.చదవండి: Team of the Tourney 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్కు దక్కని చోటు -
All Time India ODI XI: రోహిత్, కోహ్లిలకు చోటు.. కెప్టెన్గా ఎవరంటే?
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) విజేతగా నిలవడంతో టీమిండియా ఐసీసీ టైటిళ్ల సంఖ్య ఏడుకు చేరింది. భారత్ తొలిసారి 1983లో ప్రపంచకప్ను ముద్దాడింది. నాటి వన్డే వరల్డ్కప్ టోర్నమెంట్లో అండర్డాగ్స్గా బరిలోకి దిగిన కపిల్ సేన ఏకంగా చాంపియన్గా నిలిచి చరిత్ర సృష్టించింది. పటిష్ట వెస్టిండీస్ జట్టును ఓడించి వరల్డ్కప్ విజేతగా నిలిచింది.ఫలితంగా టీమిండియాకు మొట్టమొదటి ఐసీసీ ట్రోఫీ అందించిన సారథిగా కపిల్ దేవ్(Kapil Dev).. భారత క్రికెట్ చరిత్రలో తన పేరును అజరామరం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత దాదాపు రెండు దశాబ్దాలకు పైగా భారత జట్టుకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా దక్కలేదు. అయితే, మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) ఆ లోటును తీర్చేశాడు.ధోని ఖాతాలో ముచ్చటగా మూడుఅంతర్జాతీయ క్రికెట్ మండలి 2007లో తొలిసారిగా ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్ను టీమిండియాకు అందించాడు. అనంతరం 2011లో వన్డే వరల్డ్కప్ గెలిచిన కెప్టెన్గానూ ధోని నిలిచాడు. అంతేనా.. 2013లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ను విజేతగా నిలిపి.. అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన భారత కెప్టెన్గా ఇప్పటికీ కొనసాగుతున్నాడు.రోహిత్ ‘డబుల్’ హ్యాపీఇక తాజాగా రోహిత్ శర్మ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచి రెండో ఐసీసీ టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన హిట్మ్యాన్.. తాజా ఈ వన్డే టోర్నమెంట్లోనూ జట్టును అజేయంగా ముందుకు నడిపి ట్రోఫీని ముద్దాడాడు. తద్వారా ధోని తర్వాత అత్యధిక సార్లు టీమిండియాను చాంపియన్గా నిలిపిన కెప్టెన్గా నిలిచాడు ఈ వన్డే ‘ట్రిపుల్’ డబుల్ సెంచరీల వీరుడు.మరి కపిల్ దేవ్, ధోని, రోహిత్ శర్మ.. కెప్టెన్లుగా ఈ ఘనతలు సాధించారంటే అందుకు అప్పటి జట్లలో ఉన్న ఆటగాళ్లది కూడా కీలక పాత్ర. 1983లో ఆల్రౌండర్ మొహిందర్ అమర్నాథ్ సెమీ ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా రాణించి జట్టును ఫైనల్కు చేర్చాడు.ఇక 2011 ప్రపంచకప్లో యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లిలు కూడా అద్భుతంగా ఆడారు. హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ తమ వంతు పాత్ర పోషించగా.. తాజా చాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్ రోహిత్, కోహ్లిలతో పాటు రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ కూడా రాణించారు.బుమ్రాకు దక్కని చోటుఈ నేపథ్యంలో తన ఆల్టైమ్ వన్డే తుదిజట్లులో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ వీరందరికి చోటివ్వడం గమనార్హం. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత చిన్నపిల్లాడిలా గంతులేసిన ఈ మాజీ సారథి... తాజాగా తన వన్డే బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ను పంచుకున్నాడు. ఈ జట్టులో క్రికెట్ దేవుడ్, వంద శతకాల వీరుడు సచిన్ టెండుల్కర్కు ఓపెనర్గా గావస్కర్ చోటిచ్చాడు. అయితే, ఈ జట్టుకు టీమిండియా ప్రధాన పేసర్, ప్రపంచస్థాయి ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను మాత్రం గావ స్కర్ ఎంపిక చేయలేదు.సునిల్ గావస్కర్ ఆల్టైమ్ వన్డే ఎలెవన్:సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, మొహిందర్ అమర్నాథ్, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), కపిల్ దేవ్, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, మహ్మద్ షమీ, జహీర్ ఖాన్. భారత్ గెలిచిన ఐసీసీ టైటిళ్లు ఇవే1983- వన్డే వరల్డ్కప్2002- చాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా 2007- టీ20 ప్రపంచకప్2011- వన్డే వరల్డ్కప్2013- చాంపియన్స్ ట్రోఫీ2024- టీ20 ప్రపంచకప్2025- చాంపియన్స్ ట్రోఫీ.చదవండి: Team of the Tourney 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్కు దక్కని చోటు -
‘2027’పై ఇప్పుడే చెప్పను!
దుబాయ్: వరుసగా గత మూడు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్ చేరిన భారత జట్టు రెండు టైటిల్స్ నెగ్గి మరో దాంట్లో రన్నరప్గా నిలిచింది. ఈ మూడు టోర్నీలు కలిపి 24 మ్యాచ్లు ఆడితే ఒక్క వరల్డ్ కప్ ఫైనల్ మినహా మిగతా 23 మ్యాచ్లు గెలిచింది. వరుసగా టి20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీలలో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా ట్రోఫీని సాధించింది. ఇది అసాధారణ ఘనత అని, తమ జట్టు స్థాయిని ప్రదర్శించామని భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే ఇది చాలా పెద్ద ఘనత. మా టీమ్ ఎంత బలంగా ఉందో ఇది చూపించింది. ఆటగాళ్ల ప్రదర్శనతో పాటు వారి మధ్య చక్కటి సమన్వయం, బయటి అంశాలను పట్టించుకోకుండా ఒత్తిడిని అధిగమించి ఇలాంటి విజయాలు సాధించడం అసాధారణం. విజయం సాధించాలనే ఒకే ఒక లక్ష్యంతో అందరూ పని చేశారు’ అని రోహిత్ అన్నాడు. వరుసగా రెండు ఐసీసీ టోర్నీలు సాధించడం అంత సులువైన విషయం కాదని, దాని వెనక చాలా శ్రమ ఉందని అతను చెప్పాడు. ‘చాలా తక్కువ జట్లు మాత్రమే ఓటమి లేకుండా వరుసగా రెండు ట్రోఫీలు గెలిచాయి. అన్నీ మా వ్యూహాల ప్రకారమే ఆడి సఫలమయ్యాం. వన్డే వరల్డ్ కప్లో చాలా అద్భుతంగా ఆడిన తర్వాత కూడా ఫైనల్లో ఓడాం. ఇదే విషయాన్ని కుర్రాళ్లకు చెబుతూ గత రెండు ఫైనల్స్కు ముందు చివరి బంతి పడే వరకు పోరాడమని స్ఫూర్తి నింపాం. ఇదే ఫలితాన్ని అందించింది’ అని రోహిత్ వెల్లడించాడు. తమ తుది జట్టులో వైవిధ్యమైన ఆటగాళ్లు ఉండటం విజయానికి కారణమని కూడా అతను విశ్లేషించాడు. ‘1 నుంచి 11వ నంబర్ ఆటగాడి వరకు ఏదో ఒక రూపంలో జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ సమష్టితత్వంతో పాటు గెలవాలనే కసి కూడా వారిలో కనిపించింది’ అని రోహిత్ వివరించాడు. 2027 వన్డే వరల్డ్ కప్లో ఆడే విషయంపై తాను ఇప్పుడే ఎలాంటి వ్యాఖ్య చేయనని, ప్రస్తుతానికి తాజా విజయాలను ఆస్వాదిస్తున్నట్లు రోహిత్ స్పష్టం చేశాడు. ఈ ఫార్మాట్ నుంచి తాను రిటైర్ కావడం లేదని ఆదివారమే మ్యాచ్ అనంతరం అతను వెల్లడించాడు. ‘ప్రస్తుతం అంతా బాగుంది. భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం అప్పుడే లేదు. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతానా లేదా అని ఇప్పుడే చెప్పను. దీని గురించి ఈ సమయంలో మాట్లాడటం అనవసరం. నా కెరీర్లో ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్లాను. మున్ముందు ఏం జరుగుతుందో ఎప్పుడూ ఆలోచించలేదు. నా సహచరులతో కలిసి క్రికెట్ను ఆస్వాదిస్తున్నాను. అది చాలు’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. -
CT 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్కు దక్కని చోటు
పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy) ఎడిషన్ మార్చి 9న దుబాయ్లో ముగిసింది. టైటిల్ పోరులో న్యూజిలాండ్తో తలపడ్డ టీమిండియా జయకేతనం ఎగురవేసి ట్రోఫీని ముద్దాడింది. గ్రూప్ దశలో మూడు.. సెమీస్, ఫైనల్ గెలిచి అజేయంగా ఈ వన్డే టోర్నమెంట్ను ముగించింది.ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) తాజాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ను ప్రకటించింది. ఈ పదకొండు మంది సభ్యుల జట్టులో భారత్ హవా కొనసాగింది. టీమిండియా నుంచి ఈ జట్టులో ఏకంగా ఐదుగురు క్రికెటర్లు స్థానం సంపాదించారు.పాకిస్తాన్కు మొండిచేయిమరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగి గెలుపన్నదే లేకుండా నిష్క్రమించిన పాకిస్తాన్కు మొండిచేయి ఎదురైంది. అంతేకాదు.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్ల నుంచి కూడా ఒక్క ఆటగాడూ ఐసీసీ జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. ఇక టీమిండియా తర్వాత న్యూజిలాండ్ నుంచి అత్యధికంగా నలుగురు ఐసీసీ ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కించుకున్నారు. అదే విధంగా అఫ్గనిస్తాన్ నుంచి ఇద్దరు ఇందులో ఉన్నారు. అయితే, ఇందులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ జట్టుకు సారథిగా కివీస్ నాయకుడు మిచెల్ సాంట్నర్ ఎంపికయ్యాడు.నాలుగు వికెట్ల తేడాతో ఓడించికాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ పోటీపడగా.. టీమిండియా, కివీస్ సెమీస్ చేరాయి. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, అఫ్గనిస్తాన్ బరిలో దిగగా.. ఆసీస్, ప్రొటిస్ జట్లు సెమీ ఫైనల్లో అడుగుపెట్టాయి.ఈ క్రమంలో తొలి సెమీస్ మ్యాచ్లో భారత్- ఆసీస్ను... రెండో సెమీస్లో కివీస్ ప్రొటిస్ను ఓడించి ఫైనల్కు చేరుకున్నాయి. ఈ క్రమంలో దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో రోహిత్ సేన సాంట్నర్ బృందాన్ని నాలుగు వికెట్ల తేడాతో ఓడించి చాంపియన్గా అవతరించింది. ఈ మ్యాచ్లో 76 పరుగులతో రాణించిన భారత సారథి రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవగా.. మొత్తంగా రెండు శతకాల సాయంతో 263 పరుగులు సాధించిన కివీస్ యువ ఆటగాడు రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కింది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’రచిన్ రవీంద్ర(న్యూజిలాండ్), ఇబ్రహీం జద్రాన్(అఫ్గనిస్తాన్), విరాట్ కోహ్లి(ఇండియా), శ్రేయస్ అయ్యర్(ఇండియా), కేఎల్ రాహుల్(ఇండియా), గ్లెన్ ఫిలిప్స్(న్యూజిలాండ్), అజ్మతుల్లా ఒమర్జాయ్(అఫ్గనిస్తాన్), మిచెల్ సాంట్నర్(కెప్టెన్, న్యూజిలాండ్), మ్యాట్ హెన్రీ(న్యూజిలాండ్), వరుణ్ చక్రవర్తి(ఇండియా)12వ ఆటగాడు: అక్షర్ పటేల్(ఇండియా)చాంపియన్స్ ట్రోఫీ-2025లో వీరి ప్రదర్శన👉రచిన్ రవీంద్ర- రెండు శతకాల సాయంతో 263 రన్స్. స్పిన్ బౌలర్గానూ రాణించిన రచిన్. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎంపిక👉ఇబ్రహీం జద్రాన్- ఒక సెంచరీ సాయంతో 216 పరుగులు. ఇంగ్లండ్పై అఫ్గన్ గెలుపొందడంలో కీలక పాత్ర👉విరాట్ కోహ్లి- ఒక శతకం సాయంతో 218 పరుగులు. పాకిస్తాన్పై అజేయ సెంచరీ. వన్డేల్లో అత్యంత వేగంగా పద్నాలుగు వేల మార్కు అందుకున్న క్రికెటర్గా ప్రపంచ రికార్డు.👉శ్రేయస్ అయ్యర్- రెండు అర్ధ శతకాల సాయంతో 243 రన్స్. టీమిండియా చాంపియన్గా నిలవడంతో కీలక మిడిలార్డర్ బ్యాటర్గా రాణింపు.👉కేఎల్ రాహుల్- 140 పరుగులు. వికెట్ కీపర్గానూ సేవలు.👉గ్లెన్ ఫిలిప్స్- 177 పరుగులు. రెండు వికెట్లు, ఐదు క్యాచ్లు.👉అజ్మతుల్లా ఒమర్జాయ్- 126 రన్స్, ఏడు వికెట్లు.👉మిచెల్ సాంట్నర్- 4.80 ఎకానమీతో తొమ్మిది వికెట్లు👉మహ్మద్ షమీ- 5.68 ఎకానమీతో తొమ్మిది వికెట్లు. ఇందులో ఓ ఫైవ్ వికెట్ హాల్.👉మ్యాట్ హెన్రీ- 5.32 ఎకానమీతో పది వికెట్లు👉వరుణ్ చక్రవర్తి- 4.53 ఎకానమీతో తొమ్మిది వికెట్లు👉అక్షర్ పటేల్- 4.35 ఎకానమీతో ఐదు వికెట్లు.చదవండి: అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్ View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
Dhoni- Rohit: స్వర్ణయుగం.. ఇద్దరూ ఇద్దరే! నాకు మాత్రం అదే ముఖ్యం!
భారత్ క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni)కి ప్రత్యేక స్థానం ఉంది. సుదీర్ఘ కాలం తర్వాత అతడి నాయకత్వంలోనే టీమిండియాకు మళ్ళీ ప్రపంచ కప్ విజయం లభించింది. 1983లో కపిల్ దేవ్(Kapil Dev) నేతృత్వంలోని తొలిసారి వన్డే ప్రపంచ కప్ సాధించిన భారత్.. 2007 తర్వాత ధోని నాయకత్వంలో వరుసగా మూడు ఐసీసీ టైటిల్స్ సాధించింది. అయితే, సారథిగా ధోని నిష్క్రమణ తర్వాత భారత్ విజయ పరపంపరకి రోడ్బ్లాక్ పడింది. పదకొండు సంవత్సరాలు ట్రోఫీ లేకుండా మిగిలిపోయింది. ఇలాంటి కఠిన దశలో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ(Rohit Sharma) 2024, 2025లో వరుసగా వరుసగా రెండు ఐసీసీ ట్రోఫీ లను గెలిపించి భారత్కి కొత్త హీరో గా ఖ్యాతి వహించాడు.భారత క్రికెట్కు స్వర్ణయుగంవైట్-బాల్ క్రికెట్లో భారతదేశం తిరిగి తమ స్వర్ణ యుగానికి చేరుకుందా అంటే అవుననే చెప్పాలి. 2010ల ప్రారంభంలో ధోని చూపించిన నాయకత్వ లక్షణాలు ఇప్పుడు రోహిత్ శర్మ లో కూడా కనిపిస్తున్నాయి. వీరిద్దరూ సాధించిన ఐసీసీ ట్రోఫీలను పరిశీలిస్తే ఇది కరక్టే అనిపిస్తుంది. ఎంఎస్ ధోని సహజంగా ఎక్కువగా మాట్లాడాడు. సరిగ్గా అవసరమైనప్పుడు తన నిర్ణయాలు, వ్యక్తిగత సామర్ధ్యం ఏమిటో చూపిస్తాడు. తన స్థాయి ఏమిటో తెలియజేస్తాడు.ఇప్పుడు రోహిత్ శర్మ సరిగ్గా అదే చేసి చూపించాడు. ఇక ట్రోఫీల పరంగా చూస్తే ధోని 2007లో టీ20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలను భారలత్కి అందించాడు.ఇప్పుడు రోహిత్ శర్మ నాయకత్వం లో భారత్ 2023లో వన్డే ప్రపంచ కప్ రన్నరప్గా నిలిచింది. 2024లో టీ20 ప్రపంచ కప్ గెలిచింది. మళ్ళీ ఈ సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపొందింది.అప్పటి భారత జట్టు వెనుకబాటుకి కారణం?2014- 2022 మధ్య భారత్ జట్టు వెనుకడిందని చెప్పవచ్చు. నిజానికి టీమిండియాకు అపారమైన ప్రతిభ గల ఆటగాళ్లు ఉన్నా సరళంగా చెప్పాలంటే, వారు తమ బృందానికి న్యాయం చేయడంలో విఫలమయ్యారు. ఈ కాలంలో భారత్ జట్టు ఐసీసీ ప్రధాన టోర్నమెంట్లలో నిలకడ గా ఆడి నాకౌట్ దశలకు చేరుకున్నప్పటికీ, ట్రోఫీ లను అందుకోవడంలో విఫలమైంది. ఫైనల్ కి చేరుకున్న జట్లని ఎవ్వరూ గుర్తుపెట్టుకోరు.ట్రోఫీ గెలిస్తేనే ఆ జట్టు చరిత్రలో విజయం సాధించిన జట్టుగా కీర్తిని గడిస్తుంది. ధోని నాయకత్వంలో భారత్ జట్టు 2007 టీ20 ప్రపంచ కప్ విజయం ఊహించనిది. 2011లో భారత్ భారీ అంచనాల రీతి తగ్గట్టుగా ఆడి సొంత గడ్డ పై ప్రపంచ కప్ను సాధించింది. ఈ టోర్నమెంట్లో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్ , హర్భజన్ సింగ్ వంటి ఆటగాళ్లు భారత్ జట్టు విజయంలో కీలక భూమిక వహించారు.ఇక 2013 నాటికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సురేశ్ రైనా, ఇషాంత్ శర్మలతో కూడిన కొత్త తరం ఆటగాళ్లు భారత జట్టులోకి చేరారు. ఇంగ్లండ్లో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నప్పుడు ధోని వ్యూహాత్మక ప్రతిభ స్పష్టంగా కనిపించింది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలతో పాటు కొత్త ఫాస్ట్ బౌలర్ల ఆవిర్భావంతో అప్పుడు జట్టును బలోపేతం చేశారు.కాగా 2017లో విరాట్ కోహ్లీ వైట్-బాల్ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించినప్పుడు, అతడి టెస్ట్ విజయం పరిమిత ఓవర్ల ఆధిపత్యంగా మారలేదు. రెడ్-బాల్ క్రికెట్ పట్ల కోహ్లీకి స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ వైట్-బాల్ టోర్నమెంట్లలో కోహ్లీ అదే విజయ పరంపరను కొనసాగించలేకపోయాడు.రోహిత్ నాయకత్వంలో పునరుజ్జీవనంఇప్పుడు రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ మళ్ళీ మునుపటి విజయ పరంపరను కొనసాగించే స్థాయికి ఎదిగింది. 2007 పరాజయం తర్వాత ధోని భారత్ జట్టు ని ఎలా పునర్నిమించాడో ఇప్పుడు రోహిత్ తనదైన శైలి లో అదే చేసి చూపించాడు. జట్టు లో ఉత్తేజాన్ని పెంచాడు. ఎక్కడా తలవొగ్గ కుండా దూకుడుగా ఆడటాన్ని అలవాటు చేసాడు.2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్, 2021 టీ20 ప్రపంచ కప్లో పాకిస్తాన్తో జరిగిన అవమానం, 2022లో ఇంగ్లండ్ చేతిలో జరిగిన సెమీ-ఫైనల్ ఓటమి వంటి హృదయ విదారక సంఘటనలు రోహిత్ మనస్తత్వంలో మార్పును రేకెత్తించాయి. భారత్ జట్టులో తీసుకురావాల్సిన మార్పును సరిగ్గా గుర్తించాడు.నాకు అదే ముఖ్యం2019 ప్రపంచ కప్ లో రోహిత్ ఐదు సెంచరీలు సాధించినప్పటికీ చివరికి ట్రోఫీ గెలువలేకపోవడం బాగా అసంతృప్తిని మిగిల్చింది. రోహిత్ వ్యక్తిగతంగా రాణించినప్పటికీ అది జట్టు విజయానికి దోహదం చేయలేదన్న బాధ అతన్ని కలిచివేసింది. “నేను 2019 ప్రపంచ కప్లో వ్యక్తిగతంగా బాగా రాణించాను. కానీ మేము ట్రోఫీ గెలవలేకపోయాం.ఆ సెంచరీల పరంపర, పరుగుల వరద నాకు సంతృప్తి ఇవ్వలేకపోయింది. వ్యక్తిగతంగా 30 లేదా 40 పరుగులు చేసినప్పటికీ ట్రోఫీ గెలిస్తే లభించే ఆనందం వేరే స్థాయిలో ఉంటుంది. అలా చేయడం నాకు చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను" అని రోహిత్ ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీ విజయం అనంతరం వ్యాఖ్యానించడం అతని లోని పరిణతికి అద్దం పడుతుంది.విజయం అనేది ఒక వ్యసనం లాంటిది. భారత్ ఐసీసీ వైట్-బాల్ మ్యాచ్లలో ఇంతవరకు వరుసగా 24 మ్యాచ్లలో 23 గెలించిందంటే మామూలు విషయం కాదు. వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లను కైవసం చేసుకున్న రోహిత్ శర్మ ఇప్పుడు చారిత్రాత్మక ట్రిపుల్పై దృష్టి పెట్టాడు. అంటే 2027 వన్డే ప్రపంచ కప్లో టీమిండియాను విజయపథాన నడిపించాలని భావిస్తున్నాడు. అదే జరిగితే రోహిత్ శర్మ ఎంఎస్ ధోని నాయకత్వ రికార్డుని సమం చేసినట్టే!ఇక ఓవరాల్గా కెప్టెన్లుగా ధోని- రోహిత్ రికార్డులు చూస్తే ఇద్దరూ చెరో ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచారు. ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున.. రోహిత్ ముంబై ఇండియన్స్ తరఫున ఈ ఫీట్ నమోదు చేశారు. ఆసియాకప్ టోర్నమెంట్లోనూ రెండుసార్లు టీమిండియాను విజయపథంలో నిలిపారు. ధోని 2010, 2016.. రోహిత్ 2018, 2023లో టైటిల్స్ గెలిచారు. ఇక చాంపియన్స్ లీగ్ ట్రోఫీలో ధోని రెండుసార్లు (2010, 2014).. రోహిత్ ఒకసారి(2013) టైటిల్ సాధించారు.చదవండి: తప్పులు సరిదిద్దుకుని.. ‘టాప్’ రన్ స్కోరర్గా.. మాటలకు అందని అనుభూతి! -
తప్పులు సరిదిద్దుకుని.. ‘టాప్’ రన్ స్కోరర్గా.. మాటలకు అందని అనుభూతి!
తొలిసారి ఐసీసీ ట్రోఫీని ముద్దాడిన అనుభూతిని మాటల్లో వర్ణించలేనంటున్నాడు టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer). ప్రస్తుతం తన కాళ్లు నేలమీద నిలవడం లేదని.. ఇంతకంటే గొప్ప భావన మరొకటి ఉండదంటూ ఆనందంలో మునిగితేలుతున్నాడు. డ్రెస్సింగ్ రూమ్లో సహచర ఆటగాళ్ల సంతోషం చూసి తన మనసు గాల్లో తేలిందని ఉద్వేగానికి లోనయ్యాడు.అనూహ్య పరిస్థితుల్లో జట్టుకు దూరంకాగా వన్డే ప్రపంచకప్-2023లో అద్భుతంగా రాణించిన శ్రేయస్ అయ్యర్.. ఆ తర్వాత అనూహ్య పరిస్థితుల్లో జట్టుకు దూరమయ్యాడు. దేశవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించాడన్న ఆరోపణలతో సెంట్రల్ కాంట్రాక్టు(BCCI Cetral Contract) కూడా కోల్పోయాడు. అయితే, ఈ ముంబైకర్ తనకు ఎదురైన చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని తనను తాను సరిదిద్దుకున్నాడు.తప్పులు సరిదిద్దుకుని..బోర్డు ఆదేశాలను పాటిస్తూ ముంబై తరఫున దేశీ క్రికెట్ బరిలో దిగిన శ్రేయస్.. కఠినశ్రమ, అంకితభావంతో తనను నిరూపించుకున్నాడు. వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడ్డ ఈ ముంబై ఆటగాడు... దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్గా వ్యవహరించి టైటిల్ గెలిచాడు. రంజీల్లో సత్తా చాటి తన విలువను చాటుకున్నాడు.అంతేకాదు.. ఐపీఎల్-2024(IPL 2024)లో కోల్కతా నైట్ రైడర్స్ సారథిగా వ్యవహరించి.. జట్టును చాంపియన్గా నిలిపాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టులో పునరాగమనం చేసిన శ్రేయస్ అయ్యర్.. స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో సూపర్ ఫామ్తో పరుగులు రాబట్టాడు. తొలి వన్డేకు మోకాలి నొప్పి కారణంగా విరాట్ కోహ్లి దూరం కాగా.. అతడి స్థానంలో తుదిజట్టులో చోటు దక్కించుకుని జట్టుకు విజయాలు అందించాడు.జట్టుకు వెన్నెముకలా నిలిచిఈ క్రమంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపికైన జట్టులో స్థానం సంపాదించిన శ్రేయస్ అయ్యర్ ఇక్కడా అద్బుతంగా రాణించాడు. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో రాణిస్తూ జట్టుకు వెన్నెముకలా నిలిచాడు. ఈ వన్డే టోర్నమెంట్లో మొత్తంగా టీమిండియా ఆడిన ఐదు మ్యాచ్లలో కలిపి శ్రేయస్ 48.60 సగటుతో 243 పరుగులు రాబట్టాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.20 పరుగుల తేడాతో..తద్వారా ఈ టోర్నీలో టీమిండియా తరఫున టాప్ రన్ స్కోరర్గా నిలిచిన శ్రేయస్ అయ్యర్.. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన రచిన్ రవీంద్రకు 20 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. రచిన్ రెండు శతకాల సాయంతో 263 పరుగులు సాధించి ఓవరాల్గా అత్యధిక పరుగుల వీరుడిగా నిలవగా.. శ్రేయస్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.ఇక ఆదివారం నాటి ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్ను ఓడించడంలోనూ శ్రేయస్ అయ్యర్ది కీలక పాత్ర. కివీస్ విధించిన 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ శుబ్మన్ గిల్(31), విరాట్ కోహ్లి(1) రూపంలో కీలక వికెట్లు కోల్పోయిన వేళ.. రోహిత్ శర్మ(76)తో కలిసి శ్రేయస్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. మొత్తంగా 62 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 48 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్(33 బంతుల్లో 34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9 నాటౌట్) రాణించారు. తద్వారా మరో ఓవర్ మిగిలి ఉండగానే రోహిత్ సేన టార్గెట్ పూర్తి చేసి నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.మాటలకు అందని అనుభూతిఅనంతరం చాంపియన్గా నిలిచిన భారత్కు ట్రోఫీతో పాటు విన్నింగ్స్ మెడల్స్ అందించారు. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘‘ఈ అనుభూతిని మాటల్లో ఎలా వర్ణించాలో తెలియడం లేదు. నేను గెలిచిన మొదటి ఐసీసీ ట్రోఫీ ఇదే. ఈ టోర్నమెంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి ఫైనల్ వరకు మా జట్టు జైత్రయాత్ర అమోఘం.నిజం చెప్పాలంటే.. నేను ఒత్తిడిలోనే మరింత గొప్పగా రాణించగలను. సవాళ్లను ఎదుర్కోవడం నాకు భలే మజాను ఇస్తుంది. ఈ టోర్నమెంట్లో నాకు అద్భుత ఆరంభం లభించింది. దానిని అలాగే కొనసాగించాను. అయితే, భారీ స్కోర్లు సాధించలేకపోయాను. అయినప్పటికీ జట్టు విజయాలకు నా ప్రదర్శన దోహదం చేసింది కాబట్టి ఆనందంగానే ఉన్నాను. ఇంతకంటే సంతృప్తి, సంతోషం మరొకటి ఉండదు’’ అని హర్షం వ్యక్తం చేశాడు.చదవండి: అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్ -
ఎక్కడైనా టీమిండియాదే గెలుపు!.. ఇచ్చిపడేసిన పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్
టీమిండియాపై పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రం(Wasim Akram) ప్రశంసలు కురిపించాడు. వేదిక ఏదైనా రోహిత్ సేనకు తిరుగులేదని.. అద్భుత ప్రదర్శనతో విజయాలు సాధిస్తున్న తీరు అమోఘమని కొనియాడాడు. ఎల్లవేళలా తమ కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్కోచ్ గౌతం గంభీర్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) అనుకున్న ఫలితాన్ని రాబట్టగలిగిందని ప్రశంసించాడు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఈ మెగా టోర్నీ నిర్వహణ హక్కులు దక్కించుకోగా.. టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్లో తమ మ్యాచ్లు ఆడింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్లను ఓడించిన రోహిత్ సేన.. సెమీస్లో ఆస్ట్రేలియాను, ఫైనల్లో న్యూజిలాండ్లపై గెలిచి టైటిల్ సాధించింది.బీసీసీఐ అనుసరించిన విధానాల వలనే..అయితే, ఒకే వేదికపై ఆడటం భారత్కు సానుకూలంగా మారిందనే విమర్శల నేపథ్యంలో పాక్ దిగ్గజ ఫాస్ట్బౌలర్ వసీం అక్రం తనదైన శైలిలో స్పందించాడు. బీసీసీఐ అనుసరించిన విధానాలే టీమిండియా జైత్రయాత్రకు కారణమని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘ప్రస్తుత భారత జట్టు ప్రపంచంలోని ఏ వేదికపై ఆడినా కచ్చితంగా గెలుస్తుంది.ఒక్క ఓటమి కూడా లేకుండాదుబాయ్లో ఆడినందుకు టీమిండియా లాభపడిందని చాలా మంది అంటున్నారు. కానీ పాకిస్తాన్లో ఆడినా రోహిత్ సేన టైటిల్ గెలిచేది. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో భారత జట్టు కూడా అన్ని టీమ్స్ మాదిరే వివిధ వేదికలకు ప్రయాణాలు చేసింది. మరి అజేయంగానే చాంపియన్గా నిలిచింది కదా! ఒక్క ఓటమి కూడా లేకుండా ట్రోఫీని ముద్దాడింది.ఐసీసీ ఈవెంట్లలో భారత జట్టుకు నిలకడకు ఇది నిదర్శనం. రోహిత్ శర్మ నాయకత్వ పటిమకు ఇదో కొలమానం. న్యూజిలాండ్తో స్వదేశంలో టీమిండియా టెస్టు సిరీస్లో కనీవినీ ఎరుగని రీతిలో 3-0తో వైట్వాష్ అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో.. పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది.అంతకు ముందు శ్రీలంకకు వన్డే సిరీస్ను కూడా కోల్పోయింది. ఇలాంటి సమయాల్లో బోర్డుపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. కెప్టెన్, కోచ్లను తొలగించాలనే డిమాండ్లు వస్తాయి. అయితే, బీసీసీఐ మాత్రం తమ సారథికి, శిక్షకుడికి అన్ని వేళలా పూర్తి మద్దతుగా నిలిచింది. అందుకు తగ్గ ఫలితాన్ని చాంపియన్స్ ట్రోఫీలో చాంపియన్గా నిలవడం ద్వారా పొందింది’’ అని వసీం అక్రం పేర్కొన్నాడు.మూడోసారి ఈ ఐసీసీ టైటిల్ను కైవసంకాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో టీమిండియా కివీస్ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా మూడోసారి(2002, 2013, 2025) ఈ ఐసీసీ టైటిల్ను కైవసం చేసుకుంది. దుబాయ్లో ఆదివారం రాత్రి ముగిసిన ఈ మ్యాచ్లో టాస్ ఓడిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(63), మైకేల్ బ్రాస్వెల్(40 బంతుల్లో 53 నాటౌట్) రాణించడం ద్వారా నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ చెరో రెండు, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ శతకం(83 బంతుల్లో 76)తో రాణించగా.. శ్రేయస్ అయ్యర్(48), కేఎల్ రాహుల్(33 బంతుల్లో 34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9 నాటౌట్) జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. రోహిత్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ టోర్నీలో పాకిస్తాన్ ఒక్క విజయం కూడా లేకుండా నిష్క్రమించడం గమనార్హం.చదవండి: అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్ TEAM INDIA ARE CHAMPIONS AGAIN! 🏆🇮🇳#ChampionsTrophyOnJioStar #INDvNZ #ChampionsTrophy2025 pic.twitter.com/Uh6EZWFfSL— Star Sports (@StarSportsIndia) March 9, 2025 -
Rohit Sharma: పెను తుపాను తలొంచి చూస్తే తొలి నిప్పు కణం అతడే
-
ఐసీసీ ఈవెంట్లలో తిరుగులేని కోహ్లి, రోహిత్.. ఇద్దరూ ఇద్దరే..!
ఐసీసీ వైట్ బాల్ టోర్నీలు (పరిమిత ఓవర్ల టోర్నీలు) అనగానే టీమిండియా కృష్ణార్జునులు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు పూనకం వస్తుంది. ఈ ఇద్దరు మామూలు మ్యాచ్ల్లో ఎలా ఆడినా ఐసీసీ ఈవెంట్లలో మాత్రం చెలరేగిపోతారు. ఇందుకు తాజా నిదర్శనం 2025 ఛాంపియన్స్ ట్రోఫీ. ఈ ఐసీసీ టోర్నీలో విరాట్ ఆది నుంచే చెలరేగగా.. రోహిత్ కీలకమైన ఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి భారత్ను ఛాంపియన్గా నిలిపాడు.ఈ ఇద్దరు గడిచిన 18 ఏళ్లలో భారత్కు ఐసీసీ టోర్నీల్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. రోహిత్ ఆటగాడిగా 2007 టీ20 వరల్డ్కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ.. కెప్టెన్గా 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయాల్లో భాగం కాగా.. విరాట్ ఆటగాడిగా 2011 వన్డే వరల్డ్కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2024 టీ20 వరల్డ్కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయాల్లో భాగమయ్యాడు.ఐసీసీ ఈవెంట్లలో కోహ్లి, రోహిత్ల ట్రాక్ రికార్డును పరిశీలిస్తే ప్రపంచంలో ఏ ఆటగాడికి సాధ్యం కాని రికార్డు వీరు సొంతం చేసుకున్నారు. కోహ్లి, రోహిత్ ఐసీసీ వైట్బాల్ టోర్నీల్లో ఇప్పటివరకు (ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్) తలో 90 మ్యాచ్లు ఆడి 70కి పైగా విజయాల్లో (కోహ్లి 72, రోహిత్ 70) భాగమయ్యారు. ప్రపంచంలో మరే క్రికెటర్ ఐసీసీ వైట్బాల్ టోర్నీల్లో వీరు సాధించినన్ని విజయాలు సాధించలేదు. కోహ్లి, రోహిత్ తర్వాత ఐసీసీ వైట్ బాల్ టోర్నీల్లో అత్యధిక మ్యాచ్లు గెలిచిన ఘనత మహేళ జయవర్దనేకు దక్కుతుంది. జయవర్దనే 93 మ్యాచ్ల్లో 57 విజయాలు సాధించాడు.ఐసీసీ వైట్ బాల్ టోర్నీల్లో అత్యధిక మ్యాచ్లు గెలిచిన ఆటగాళ్లు..విరాట్ కోహ్లి- 72 (90 మ్యాచ్లు)రోహిత్ శర్మ- 70 (90)మహేళ జయవర్దనే- 57 (93)కుమార సంగక్కర- 56 (90)రవీంద్ర జడేజా- 52 (66)రికీ పాంటింగ్- 52 (70)ఎంఎస్ ధోని- 52 (78)ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విషయానికొస్తే.. ఈ టోర్నీలో భారత్ అజేయ జట్టుగా ఫైనల్కు చేరి ఫైనల్లో న్యూజిలాండ్ను మట్టికరిపించి ఛాంపియన్గా నిలిచింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత స్పిన్నర్లు చెలరేగిన వేల డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్వెల్ (53 నాటౌట్) అద్భుతమైన అర్ద సెంచరీలు సాధించి న్యూజిలాండ్కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. ఆదిలో రచిన్ రవీంద్ర (37), ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (34) మంచి ఇన్నింగ్స్లు ఆడగా.. విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11), టామ్ లాథమ్ (14),మిచెల్ సాంట్నర్ (8) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో 2.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఛేదనలో రోహిత్ (76) భారత్కు శుభారంభాన్ని అందించారు. శుభ్మన్ గిల్తో (31) కలిసి తొలి వికెట్కు 105 పరుగులు జోడించాడు. అయితే భారత్ 17 పరుగుల వ్యవధిలో గిల్, కోహ్లి (1), రోహిత్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (48), అక్షర్ పటేల్ (29) మంచి భాగస్వామ్యం నెలకొల్పి భారత్ను తిరిగి గేమ్లోకి తెచ్చారు. అయితే శ్రేయస్, అక్షర్ కూడా స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో టీమిండియా మరోసారి కష్టాల్లో పడింది.ఈ దశలో కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజాతో (18 నాటౌట్) కలిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్ను విజయతీరాలకు చేర్చాడు. జడేజా బౌండరీ బాది భారత్ను గెలిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్, బ్రేస్వెల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జేమీసన్, రచిన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం భారత్కు ఇది మూడోసారి (2002, 2013, 2025). ఫైనల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. టోర్నీ ఆధ్యాంతం రాణించిన రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు లభించింది. -
అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్
మరోసారి చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) గెలవాలన్న న్యూజిలాండ్ ఆశలపై టీమిండియా నీళ్లు చల్లింది. పాతికేళ్ల క్రితం ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుని 2025 ఫైనల్లో కివీస్ను ఓడించి విజేతగా నిలిచింది. అయితే, ఈ మ్యాచ్లో తమ జట్టు ఆఖరి వరకు పోరాడిన తీరు అద్భుతమని కెప్టెన్ మిచెల్ సాంట్నర్ సహచర ఆటగాళ్లను అభినందించాడు. ఈ టోర్నమెంట్ తమకు చేదు-తీపిల కలయికగా మిశ్రమ అనుభూతిని మిగిల్చిందని పేర్కొన్నాడు.కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన ఈ మెగా వన్డే టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. గ్రూప్-ఎ నుంచి భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ బరిలో నిలిచాయి. ఈ క్రమంలో లీగ్ దశలో మూడింటికి మూడూ గెలిచి సెమీస్కు చేరిన రోహిత్ సేన.. సెమీస్లో ఆసీస్పై గెలుపొందింది. మరోవైపు.. గ్రూప్ దశలో కేవలం టీమిండియా చేతిలో ఓడిన కివీస్.. సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి ఫైనల్లో భారత్ను ఢీకొట్టింది.దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన టైటిల్ పోరులో భారత్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడి రిక్తహస్తాలతో వెనుదిరిగింది. అయితే, 49వ ఓవర్ వరకు ఫలితం తేలకుండా న్యూజిలాండ్ బౌలర్లు అడ్డుపడటం... ఆఖరి వరకు పట్టుదలగా పోరాడిన తీరును ప్రస్తావిస్తూ సాంట్నర్(Mitchell Santner) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆఖర్లో మాకు మిశ్రమ అనుభూతి లభించింది. అయితే, ఫైనల్లో పటిష్ట జట్టు చేతిలో ఓడిపోయినందువల్ల పెద్దగా బాధపడాల్సిన పనిలేదు.మ్యాచ్ ఆసాంతం మేము టీమిండియాను సవాల్ చేయగలిగాం. అది మాకు సంతృప్తినిచ్చింది. ఒకటీ రెండు చిన్నతప్పుల వల్ల మ్యాచ్ మా చేజారింది. ఏదేమైనా ఈ జట్టును చూసి నేను గర్విస్తున్నాను. టోర్నీ ఆసాంతం మా వాళ్లు అద్భుతంగా ఆడారు. అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్లతో మా జట్టు సమతూకంగా ఉంది. ఇలాంటి జట్టుకు కెప్టెన్గా ఉండటం అంత తేలికేమీ కాదు. నాకైతే ఈ టోర్నీ అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చింది.ముందుగా చెప్పినట్లు మేము బలమైన జట్టు చేతిలో ఓడిపోయాం. ఇంకో 20 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో!.. అయితే, రోహిత్ శర్మ(Rohit Sharma) తన అద్భుత బ్యాటింగ్తో మ్యాచ్ను మా నుంచి లాగేసుకున్నాడు. ఫైనల్ వరకు మా ఆటతీరు అద్బుతంగా సాగింది. టైటిల్ పోరులోనూ మేము ఆఖరి వరకు పోరాడటం గర్వకారణం’’ అని 33 ఏళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ సాంట్నర్ తమ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.కాగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన సాంట్నర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రచిన్ రవీంద్ర(37),గ్లెన్ ఫిలిప్స్(34) ఫర్వాలేదనిపించగా.. డారిల్ మిచెల్(63), మైకేల్ బ్రాస్వెల్(53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత యాభై ఓవర్లలో కివీస్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు స్కోరు చేసింది.భారత బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ పొదుపుగా బౌలింగ్ చేసి రెండేసి వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకోగా.. పేసర్లలో షమీ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనను దూకుడగా ఆరంభించిన భారత్ 49 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది.ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(83 బంతుల్లో 76, 7 ఫోర్లు, మూడు సిక్సర్లు) అద్భుత అర్ధ శతకం సాధించగా.. శ్రేయస్ అయ్యర్(48), కేఎల్ రాహుల్(33 బంతుల్లో 34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9 నాటౌట్) రాణించారు. కివీస్ బౌలర్లలో మైకేల్బ్రాస్వెల్, మిచెల్ సాంట్నర్రెండేసి వికెట్లు కూల్చగా.. రచిన్ రవీంద్ర, కైలీ జెమీసన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోగా.. సిరీస్ ఆసాంతం రాణించిన రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.చదవండి: మా స్పిన్నర్లు అద్భుతం: రోహిత్ శర్మ -
రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు.. ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాలేదు!
రోహిత్ శర్మ.. ఈ పేరు భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. కేవలం తొమ్మిది నెలల వ్యవదిలోనే భారత జట్టుకు రెండు ఐసీసీ టైటిల్స్ను అందించిన లీడర్ అతడు. రోహిత్ సారథ్యంలో టీ20 ప్రపంచకప్-2024 విజేతగా నిలిచిన టీమిండియా.. ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ను ముద్దాడింది.న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. మూడో సారి ఛాంపియన్స్గా నిలిచింది. ఈ విజయంతో పాతికేళ్ల కిందట కివీస్ చేతిలో పరాభావానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. దీంతో యావత్తు దేశం మొత్తం సంబరాల్లో మునిగితేలుతోంది. ప్రధాని నుంచి సామన్య మానవుడి వరకు టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.భారత కెప్టెన్ రోహిత్ శర్మది కీలకపాత్ర. రోహిత్ కెప్టెన్గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా అదరగొట్టాడు. ఫైనల్ మ్యాచ్లో 76 పరుగుల తేడాతో కీలక ఇన్నింగ్స్ ఆడిన హిట్మ్యాన్.. ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు..👉ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఫైనల్ పోరులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న తొలి కెప్టెన్గా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఏ జట్టు కెప్టెన్ కూడా ఈ ఫీట్ సాధించలేదు.👉అదేవిధంగా భారత్కు అత్యధిక ఐసీసీ టైటిల్స్ను అందించిన రెండో కెప్టెన్గా రోహిత్ నిలిచాడు. ఈ జాబితాలో దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోని ఉన్నాడు. ధోని సారథ్యంలో టీ20 ప్రపంచకప్-2007, వన్డే ప్రపంచకప్-2011, ఛాంపియన్స్ ట్రోఫీ-2013లను భారత్ కైవసం చేసుకుంది. ధోని మొత్తంగా భారత్కు మూడు టైటిల్స్ను అందించగా.. రోహిత్ రెండు టైటిల్స్ను సాధించాడు.👉పరిమిత ఓవర్ల ఐసీసీ ఈవెంట్లలో అత్యధిక విన్నింగ్ శాతం కెప్టెన్గా రోహిత్ నిలిచాడు. రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు వరుసగా మూడు వైట్బాల్ ఐసీసీ టోర్నీ ఫైనల్స్కు చేరింది. చివరి మూడు టోర్నమెంట్లలో భారత్ కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఓడిపోయింది.అది కూడా 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్. ఆ తర్వాత రెండు టోర్నీలను టీమిండియా ఆజేయంగా ముగించింది. దీంతో ఐసీసీ ఈవెంట్లలో రోహిత్ శర్మ విన్నింగ్ పర్సంటేజి 90 శాతంగా ఉంది. రోహిత్ తర్వాతి స్ధానాల్లొ పాంటింగ్(88 శాతం), గంగూలీ(80శాతం) ఉన్నారు.చదవండి: కోహ్లి, గిల్ కాదు.. అతడే సైలెంట్ హీరో: రోహిత్ శర్మ -
రోహిత్ను ఆలింగనం చేసుకున్న అనుష్క శర్మ.. ప్రత్యేక అభినందనలు
వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ నాటి చేదు అనుభవాన్ని మరిపిస్తూ టీమిండియా అద్భుత విజయం సాధించింది. సొంతగడ్డపై ఎదురైన పరాభవాన్ని మరిపించేలా.. దుబాయ్లో చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) గెలిచి అభిమానులకు కానుక అందించింది. ఈ మెగా వన్డే టోర్నమెంట్ ఆద్యంతం అజేయంగా నిలిచి పరిపూర్ణ విజయంతో ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది.పాతికేళ్ల క్రితం న్యూజిలాండ్(India vs New Zealand) చేతిలో ఫైనల్లో ఓడిపోయిన భారత జట్టు తాజాగా అదే ప్రత్యర్థిని ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. నాలుగు వికెట్ల తేడాతో కివీస్పై గెలుపొంది 2025 చాంపియన్స్ ట్రోఫీ విజేతగా అవతరించింది. దీంతో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ నేపథ్యంలో టీమిండియాపై.. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై ప్రశంసల వర్షం కురుస్తోంది.స్వదేశంలో వన్డే వరల్డ్కప్-2023లో తన అద్భుత కెప్టెన్సీతో జట్టును ఫైనల్ చేర్చిన హిట్మ్యాన్.. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాను చాంపియన్గా నిలిపాడు. తాజాగా చాంపియన్స్ ట్రోఫీ గెలిచి రెండో ఐసీసీ టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా మహేంద్ర సింగ్ ధోని తర్వాత ఎక్కువ ఐసీసీ ట్రోఫీలు గెలిచిన రెండో కెప్టెన్గా నిలిచాడు.ఆత్మీయంగా హత్తుకుని.. శుభాకాంక్షలుఇక చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత సహచరులు రోహిత్ శర్మతో తమ ఆనందాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. స్టార్ బ్యాటర్, మాజీ సారథి విరాట్ కోహ్లి అయితే సంతోషంతో తబ్బిబ్బైపోయాడు. ఆ సమయంలో రోహిత్ కుటుంబంతో పాటు కోహ్లి ఫ్యామిలీ కూడా అక్కడే ఉంది.అయితే, విజయానంతరం రోహిత్ తన కుమార్తె సమైరాను ముద్దాడటంతో పాటు భార్య రితికాను ఆలింగనం చేసుకుని సంతోషం పంచుకున్నాడు. ఆ సమయంలో రితికా పక్కనే ఉన్న కోహ్లి భార్య అనుష్క శర్మ రోహిత్ను ప్రత్యేకంగా అభినందించింది. అంతేకాదు ఆత్మీయంగా అతడిని హత్తుకుని శుభాకాంక్షలు తెలిపింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కాగా చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా గెలవగానే అనుష్క- కోహ్లి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఆనందాన్ని పంచుకున్నారు. ఇక టీమిండియాకు మద్దతుగా అనుష్క పలుమార్లు స్టేడియంలో సందడి చేయడంతో పాటు భర్త విరాట్ అద్భుతంగా ఆడిన వేళ గాల్లో ముద్దులు ఇస్తూ అతడిపై ప్రేమను చాటుకున్న సందర్భాలు కోకొల్లలు. This moment!🏆❤️#AnushkaSharma hugged #ViratKohli after India's epic win in the #ICCChampionsTrophy2025 finals. #INDvsNZ pic.twitter.com/QmEDAJcziu— Filmfare (@filmfare) March 9, 2025 విరాట్ కూడా తాను కీలక మైలురాయిని అందుకున్న ప్రతివేళా సతీమణికి దానిని అంకితమిస్తాడు. ముఖ్యంగా ఫామ్లేమితో సతమతమైన వేళ అనుష్క వల్లే తాను తిరిగి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేవాడినని.. ఆమె తనకు నైతికంగా ఎల్లవేళలా మద్దతు ఇస్తుందని గతంలో వెల్లడించాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ బారత్ వర్సెస్ న్యూజిలాండ్ వేదిక: దుబాయ్, మార్చి 9టాస్: న్యూజిలాండ్ .. మొదట బ్యాటింగ్కివీస్ స్కోరు: 251/7 (50)టీమిండియా స్కోరు: 254/6 (49)ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై గెలిచి చాంపియన్గా భారత్ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రోహిత్ శర్మ(83 బంతుల్లో 76) Anushka Sharma specially called Rohit Sharma and gave him a tight hug.🔥They are like a family bro.#INDvNZ pic.twitter.com/6UgeFchHVT— 𝐕𝐢𝐬𝐡𝐮 (@Ro_45stan) March 9, 2025 -
కోహ్లి, గిల్ కాదు.. అతడే సైలెంట్ హీరో: రోహిత్ శర్మ
భారత క్రికెట్ జట్టు ఏడాది తిరగకముందే మరో ఐసీసీ టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా టీమిండియా నిలిచింది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత జట్టు.. ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా అవతరించింది. అయితే ఈ మెగా టోర్నీలో భారత తరపున అత్యంత కీలకమైన ప్రదర్శన చేసిన ఆటగాడు ఎవరంటే? కొంతమంది ఫైనల్లో 76 పరుగులు చేసిన రోహిత్ శర్మ పేరు చెబుతుంటే.. మరి కొంతమంది పాక్పై సెంచరీ, సెమీస్లో హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లి పేరు చెబుతున్నారు. వీరిద్దరూ కాకపోతే కేవలం మూడు మ్యాచ్ల్లో 9 వికెట్ల వికెట్లు పడగొట్టిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పేరును ఎంచుకుంటున్నారు.. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం.. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) అందరికంటే అద్బుతంగా ఆడాడని ప్రశించాడు. అయ్యర్ ఒక సైలెంట్ హీరో అని హిట్మ్యాన్ కొనియాడాడు.సూపర్ శ్రేయస్..అవును.. ఈ మెగా టోర్నీ అసాంతం శ్రేయస్ అయ్యర్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో జట్టు కష్టాల్లో ఉన్న ప్రతీసారి అతడు ముందుకు వచ్చి ఆదుకున్నాడు. మిడిలార్డర్లో భారత జట్టు వెన్నెముకగా నిలిచాడు. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లోనూ అయ్యర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ ఔటయ్యాక అక్షర్ పటేల్తో కలిసి నాలుగో వికెట్కు 61 పరుగుల మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఒకవేళ ఈ భాగస్వామ్యం రాకపోయింటే పరిస్థితి మరో విధంగా ఉండేది. ఓవరాల్గా శ్రేయస్ 5 మ్యాచ్ల్లో 243 పరుగులు చేశాడు. ఈ టోర్నమెంట్లో భారత్ తరపున అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు."శ్రేయస్ అయ్యర్ మాకు సైలెంట్ హీరో. అతడు మిడిలార్డర్లో చాలా కీలకమైన ఆటగాడు. ఈ మ్యాచ్లో నేను ఔటయ్యాక అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అక్షర్తో భాగస్వామ్యం నెలకొల్పాడు. ప్రతీ మ్యాచ్లోనూ తన వంతు పాత్ర పోషించాడు. అతడు ఒత్తిడిలో ఇంకా అద్బుతంగా ఆడుతాడని" రోహిత్ శర్మ పేర్కొన్నాడు.అప్పుడు వేటు.. ఇప్పుడు ప్రమోషన్కాగా గతేడాది అయ్యర్ తన కెరీర్లో కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. దేశవాళీ క్రికెట్లో ఆడాలన్న తమ ఆదేశాలను ధిక్కరించడంతో అయ్యర్ను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తప్పించింది. అంతేకాకుండా అతడు జాతీయ జట్టుకు కూడా దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి పని అయిపోయింది అంతా భావించారు. కానీ అయ్యర్ మాత్రం పడిలేచిన కేరటంలా తిరిగొచ్చాడు.దేశవాళీ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరచడంతో అతడిని సెలక్టర్లు తిరిగి జాతీయ జట్టులోకి తీసుకున్నారు. తన రీ ఎంట్రీలో అయ్యర్ దుమ్ములేపుతున్నాడు. ఈ క్రమంలో అతడికి తిరిగి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. త్వరలోనే బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది.చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్.. ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే? -
ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్.. ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?
గత కొన్ని రోజులుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు శుభం కార్డ్ పడింది. ఈ మెగా టోర్నీ విజేతగా భారత్(Teamindia) నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను 4 వికెట్ల తేడాతో ఓడించిన భారత జట్టు.. రికార్డుస్థాయిలో మూడోసారి చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.టోర్నీ ఆసాంతం ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటిన రోహిత్ సేన.. ఫైనల్లోనూ అదే జోరును కనబరిచి పుష్కరకాలం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని తిరిగి భారత్కు తీసుకొచ్చింది. భారత్ చివరగా 2013లో ధోని సారథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకోగా.. మళ్లీ రోహిత్ శర్మ నాయకత్వంలో తిరిగి సాధ్యమైంది. ఇక ఛాంపియన్స్గా నిలిచిన భారత్ ఎంత ప్రైజ్మనీని గెల్చుకుంది, రన్నరప్గా న్యూజిలాండ్ ఎంత మొత్తం దక్కించుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.విజేతకు ఎంతంటే?ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్గా నిలిచిన టీమిండియాకు 2.4 మిలియన్ డాలర్లు ( భారత కరెన్సీలో దాదాపు రూ. రూ.19.5 కోట్లు) అందుకుంది. అదే విధంగా రన్నరప్గా నిలిచిన కివీస్కు 1.12 మిలియన్ డాలర్ల (రూ.9.72కోట్లు) ప్రైజ్మనీ దక్కింది. సెమీఫైనల్లో ఓటిమిపాలైన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లకు 560,000 డాలర్లు (రూ.4.86కోట్లు) లభించాయి. ఐదో, ఆరో స్ధానాల్లో నిలిచిన జట్లు 350,000 డాలర్లు(రూ. 3 కోట్లు పైగా).. ఏడవ, ఎనిమిదవ స్థానంలో ఉన్న జట్లు 140,000 డాలర్లు(రూ. సుమారు 1.2 కోట్లు) దక్కించుకున్నాయి. గ్రూపు స్టేజిలో విజయం సాధించిన జట్టుకు 34,000 డాలర్లు (సుమారు రూ. 33 లక్షలు) అందనుంది. ఈ మెగా టోర్నీలో పాల్గోన్నందకు ప్రతీ జట్టుకు 125,000 డాలర్లు(రూ.కోటి) ఐసీసీ అందజేయనుంది. అంటే ఈ మెత్తాన భారత్కు రూ. 21 కోట్లపైనే అందింది.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా భారత జట్టు అవతరించింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను 4 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను తిరిగి ముద్దాడింది. ఈ విజయంతో 25 ఏళ్ల కిందట కివీస్ చేతిలో ఎదురైన పరాభావానికి భారత జట్టు బదులు తీర్చుకుంది. ఈ మెగా టోర్నీలో అద్వితీయమైన ప్రదర్శన కనబరిచిన రోహిత్ సేన.. మరోసారి 140 కోట్లమంది భారతీయులను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది.ఈ విజయంలో జట్టులోని ప్రతీ ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారు. తొలుత బౌలర్లు అదరగొట్టగా.. అనంతరం బ్యాటర్లు తమ పని తాము చేసుకుపోయారు. కివీస్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది.రోహిత్ మాస్.. రాహుల్ క్లాస్లక్ష్య చేధనలో కెప్టెన్ రోహిత్ శర్మ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఓవర్ నుంచే కివీస్ బౌలర్లను హిట్మ్యాన్ టార్గెట్ చేశాడు. పవర్ ప్లేలో బౌండరీల వర్షం కురిపించాడు. 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. అయితే సెంచరీ చేరువలో ఓ భారీ షాట్కు ప్రయత్నించి స్టంపౌట్ రూపంలో పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మరోసారి వెన్నముకగా నిలిచారు. శ్రేయస్ అయ్యర్ (62 బంతుల్లో 48, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (33 బంతుల్లో 34 నాటౌట్, 1 ఫోర్, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63), మైఖేల్ బ్రేస్వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు సాధించగా.. మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు.టీమిండియా వరల్డ్ రికార్డు..కాగాభారత్కు ఇది మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్. ఈ క్రమంలో టీమిండియా ఓ ప్రపంచరికార్డును తమ పేరిట లిఖించుకుంది. మూడు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను గెలుచుకున్న మొదటి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. 2002లో శ్రీలంకతో కలిసి సంయుక్తంగా ట్రోఫీని గెలుచుకున్న టీమిండియా.. ఆ తర్వాత 2013, 2025లో ఈ మెగా టోర్నీ టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా, భారత్ పేరిట సంయుక్తంగా ఉండేది. కానీ ఈ విజయంతో ఆసీస్ను మెన్ బ్లూ అధిగమించింది. అదేవిధంగా వరుసగా రెండు ఐసీసీ టోర్నీల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఛాంపియన్స్గా నిలిచిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. టీ20 ప్రపంచకప్-2024లో ఆజేయంగా విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు.. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఒక్క మ్యాచ్లో కూడా టీమిండియా ఓడిపోలేదు.చదవండి: #Rohit Sharma: రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక ప్రకటన.. -
రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక ప్రకటన..
విశ్వవేదికపై మరోసారి భారత జెండా రెపరెపలాడింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా భారత క్రికెట్ జట్టు నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను 4 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను ముద్దాడింది.ఈ విజయంతో ఏడాది తిరగకముందే మరో ఐసీసీ టైటిల్ భారత్ ఖాతాలో వేసుకుంది. కెప్టెన్గా రోహిత్ శర్మ వరుసగా రెండో ఐసీసీ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. ఈ క్రమంలో తన వన్డే రిటైర్మెంట్ వస్తున్న వార్తలకు రోహిత్ శర్మ చెక్ పెట్టాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన హిట్మ్యాన్.. ఇప్పటిలో రిటైర్ అయ్యే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశాడు.ఇప్పుడే కాదు.."చాలా సంతోషంగా ఉంది. చక్కటి క్రికెట్ ఆడిన మాకు దక్కిన ఫలితమిది. మొదటి నుంచి మా స్పిన్నర్లు ప్రభావం చూపించారు. ఎన్నో అంచనాలు ఉన్న సమయంలో వారు నిరాశపర్చలేదు. ఈ సానుకూలతను మేం సమర్థంగా వాడుకున్నాం. రాహుల్ మానసికంగా దృఢంగా ఉంటాడు.సరైన షాట్లను ఎంచుకుంటూ ఒత్తిడి లేకుండా అతను ఈ మ్యాచ్ను ముగించగలిగాడు. అతని వల్లే అవతలి వైపు పాండ్యా స్వేచ్ఛగా ఆడగలిగాడు. మా బ్యాటర్లంతా ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చారు. వరుణ్ బౌలింగ్లో ఎంతో ప్రత్యేకత ఉంది. అతను కీలక సమయాల్లో వికెట్లు తీశాడు. ఇలాంటి పిచ్పై అలాంటి బౌలర్ కావాలని అంతా కోరుకుంటారు. మాకు ఇది సొంత మైదానం కాకపోయినా పెద్ద సంఖ్యలో వచ్చి మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. దూకుడుగా బ్యాటింగ్ చేసేందుకు నన్ను కోచ్ ప్రోత్సహించారు. మరో విషయం నేను స్పష్టం చేయదల్చుకున్నాను. నేను ఈ ఫార్మాట్నుంచి రిటైర్ కావడం లేదు.ఎలాంటి వదంతులు రాకూడదని ఇది చెబుతున్నాను. సుదీర్ఘమైన క్రికెట్ ఆడినవారికి ఇంకా ఆడాలని ఉంటుంది. అయితే ఇది యువ ఆటగాళ్లపై ప్రభావం చూపుతోంది అని 38 ఏళ్ల రోహిత్ పోస్ట్మ్యాచ్ ప్రెస్కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు. కాగా రోహిత్, కోహ్లి ఇద్దరూ 2027 వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగే అవకాశముంది.భారత్ ఆల్రౌండ్ షో..ఈ ఫైనల్ పోరులో టీమిండియా ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63), మైఖేల్ బ్రేస్వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు సాధించగా.. మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 252 పరుగుల లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ (83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 76) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా.. శ్రేయస్ అయ్యర్(62 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 48), కేఎల్ రాహుల్(33 బంతుల్లో ఫోర్, సిక్స్తో 34 నాటౌట్) కీలక నాక్స్ ఆడారు. కివీస్ బౌలర్లలో సాంట్నర్, బ్రేస్వెల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర, జెమీసన్ చెరో వికెట్ సాధించింది.చదవండి:మా స్పిన్నర్లు అద్భుతం.. ఆ ఇద్దరు సూపర్.. అతడు నాణ్యమైన బౌలర్: రోహిత్ -
భారత జట్టు అపూర్వ విజయంపై వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. జట్టు విజయం మన దేశానికి గర్వకారణమైన క్షణం అని చెప్పుకొచ్చారు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో అసాధారణ విజయం సాధించిన అనంతరం భారత జట్టుకు వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. ‘ఇది ఎంతో అర్హమైన అజేయ విజయం. మన దేశానికి గర్వకారణమైన క్షణం! టీమిండియాకు అభినందనలు’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.Congratulations to Team India on their exceptional victory! in ICC Champions Trophy 2025. This is a highly deserving unbeaten victory. A proud moment for our nation! Kudos to Team India.#ChampionsTrophy2025 #INDvsNZ— YS Jagan Mohan Reddy (@ysjagan) March 9, 2025 -
భారత్ ఘన విజయం.. అభిమానంతో దద్దరిల్లిన ట్యాంక్ బండ్ (ఫొటోలు)
-
IND Vs NZ: చాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్ (ఫొటోలు)
-
వన్డే విజయం తెచ్చిన ఆనందం...
నవంబర్ 19, 2023... కోట్లాది మంది భారతీయుల ఆశలు మోస్తూ వన్డే వరల్డ్ కప్లో ఫైనల్ బరిలోకి దిగిన భారత్ అనూహ్య పరాజయంతో అభిమానుల గుండెలు బద్దలయ్యాయి... జూన్ 29, 2024... టి20 ఫార్మాట్లో తమ స్థాయికి తగ్గ ఆటను కనబరుస్తూ భారత జట్టు వరల్డ్ కప్ గెలుచుకుంది...ఫ్యాన్స్కు కాస్త ఊరట... మార్చి 9, 2025... అంచనాలకు అనుగుణంగా ప్రతీ మ్యాచ్లో సంపూర్ణ ఆధిక్యంతో భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ సాధించింది... దేశవ్యాప్తంగా అన్ని చోట్లా ఆనందం... సాక్షి క్రీడా విభాగం : సుమారు 16 నెలల వ్యవధిలో భారత జట్టు మూడు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్ చేరింది. వాటిలో రెండింటిలో విజేతగా నిలిచింది. వన్డే వరల్డ్ కప్ ఓటమి వేదన ఇప్పటికీ తీరనిది అయినా మిగతా రెండు విజయాలతో సాంత్వన దక్కిందనేది మాత్రం వాస్తవం. అంతర్జాతీయ క్రీడల్లో ఒక టోర్నమెంట్కు, మరో టోర్నమెంట్కు పోలిక ఉండదు. ఒక విజయానికి, మరో విజయానికి సంబంధం ఉండదు. దేని ప్రత్యేకత దానిదే. కానీ గెలుపు ఇచ్చే కిక్ మాత్రం ఎప్పుడైనా ఒకటే! ఇప్పుడు టీమిండియా ఆటగాళ్లు దానినే అనుభవిస్తున్నారు.వరల్డ్ కప్ కాకపోయినా టాప్–8 జట్ల మధ్య జరిగిన సమరంలో భారత్ తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యులైన రోహిత్, కోహ్లి, జడేజా ఇప్పుడూ ఉన్నారు. 2017 ఫైనల్లో పాక్ చేతిలో ఓడిన వారిలో ఈ ముగ్గురితో పాటు హార్దిక్ పాండ్యా, షమీ కూడా ఉన్నారు. షమీ, అయ్యర్, రాహుల్, హర్షిత్ రాణా, వరుణ్, సుందర్లకు ఇదే తొలి ఐసీసీ టైటిల్. దాని విలువ ఏమిటో వారి ఆనందంలోనే కనిపిస్తోంది. స్పిన్నర్లే విన్నర్లు... చాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టును ప్రకటించినప్పుడు ‘ఐదుగురు స్పిన్నర్లా’ అంటూ అన్ని వైపుల నుంచి ఆశ్చర్యం వ్యక్తమైంది. పైగా అప్పటికే ఎంపిక చేసిన జట్టులో ఉన్న బ్యాటర్ యశస్వి జైస్వాల్ను తప్పించి మరీ వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేశారు. టోర్నీలో మన స్పిన్నర్ల ప్రదర్శన చూస్తే ఇది ఎంత సరైన నిర్ణయమో తేలింది. సుందర్కు మ్యాచ్ ఆడే అవకాశం రాకపోగా... మిగతా నలుగురు వరుణ్, కుల్దీప్, అక్షర్, జడేజా పెను ప్రభావం చూపించారు. ఈ నలుగురు కలిసి మొత్తం 26 వికెట్లు పడగొట్టారు. ఇందులో వరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కేవలం 15.11 సగటుతో అతను 9 వికెట్లు తీశాడు. లీగ్ దశలోనే కివీస్ పని పట్టిన అతను ఫైనల్లోనూ అదే ఆటను ప్రదర్శించి జట్టు విజయానికి కారణమయ్యాడు. కీలకమైన యంగ్, ఫిలిప్స్ వికెట్లు తీసిన అతను కనీసం ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవడం విశేషం! టోర్నీకి ముందు అతను ఒకే ఒక వన్డే ఆడాడు. ‘వరుణ్ బౌలింగ్లో ఏదో ప్రత్యేకత ఉంది. నెట్స్లో కూడా అతను మాకు మామూలుగానే బౌలింగ్ చేస్తాడు. తన అసలైన ఆయుధాలను మ్యాచ్లోనే ప్రదర్శిస్తాడు. అలా చేస్తే చాలు’ అంటు రోహిత్ చేసిన ప్రశంస వరుణ్ విలువను చూపించింది. ఆరంభంలో కుల్దీప్ పెద్దగా ప్రభావం చూపకపోయినా... తుది పోరులో రెండు కీలక వికెట్లతో కివీస్ను నిలువరించాడు. జడేజా, అక్షర్ కూడా కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థులను కట్టి పడేశారు. వీరిద్దరి ఎకానమీ 4.35 మాత్రమే ఉందంటే వారు ఎంత పొదుపుగా బౌలింగ్ చేశారో అర్థమవుతుంది. గాయం నుంచి కోలుకొని తిరిగొచ్చిన షమీ గతంలోలా అద్భుతంగా బౌలింగ్ చేయకపోయినా కీలక సమయాల్లో జట్టును ఆదుకున్నాడు. టోర్నీలో అతను తీసిన 9 వికెట్లలో సెమీస్లో స్మిత్ను అవుట్ చేసిన క్షణం హైలైట్గా నిలిచింది. బుమ్రా లేని లోటును పూరిస్తూ ఈ సీనియర్ బౌలర్ తన వంతు పాత్రను పోషించాడు. బ్యాటర్లు సమష్టిగా... బ్యాటింగ్లో ఎప్పటిలాగే విరాట్ కోహ్లి (మొత్తం 218 పరుగులు) భారత జట్టు మూల స్థంభంగా నిలిచాడు. 1 సెంచరీ, 1 అర్ధసెంచరీతో రెండుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా అతను జట్టును గెలిపించాడు. టోర్నీకి ముందు అతని బ్యాటింగ్పై కాస్త సందేహాలు రేగినా... వాటిని అతను పటాపంచలు చేశాడు. కోహ్లినే స్వయంగా చెప్పినట్లు ఆ్రస్టేలియా టూర్ తర్వాత తాము ఒక విజయం కోసం చూస్తున్న స్థితిలో ఈ టైటిల్ దక్కింది. మొత్తం పరుగులు చూస్తే రోహిత్ శర్మ (180) తక్కువగానే కనిపిస్తున్నా... ఓపెనర్గా అతను చూపించిన ప్రభావం ఎంతో ఉంది. శ్రేయస్ అయ్యర్ (243) జట్టు అత్యధిక స్కోరర్గా నిలవగా, గిల్ (188 పరుగులు) ఒక సెంచరీతో తాను ప్రధాన పాత్ర పోషించాడు. తనపై వస్తున్న విమర్శలకు జవాబిస్తూ కేఎల్ రాహుల్ (140 పరుగులు) మూడు మ్యాచ్లలో చివరి వరకు నిలిచి జట్టును గెలుపు తీరం చేర్చాడు. ఐదో స్థానంలో ప్రమోట్ అయిన అక్షర్ పటేల్ (109 పరుగులు) కూడా ఆకట్టుకున్నాడు. టాప్–6 బ్యాటర్లు ఆశించిన స్థాయిలో ఆడటంతో ఆందోళన లేకపోయింది. ఐదు మ్యాచ్లలో భారత్ నాలుగు సార్లు సునాయాసంగా 232, 242, 265, 252 లక్ష్యాలను అందుకుంది. కెప్టెన్ గా రోహిత్ ముద్ర... భారత్ నుంచి ధోని మాత్రం కెపె్టన్గా ఒకటికి మించి ఐసీసీ టైటిల్స్ సాధించాడు. ఇప్పుడు రెండు ట్రోఫీలతో రోహిత్ శర్మ తన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాడు. మరో దాంట్లో ఫైనల్ కూడా చేర్చిన ఘనత, వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో ఫైనల్లో సారథిగా వ్యవహరించిన ఘనత కూడా అతని ఖాతాలో ఉంది. చాంపియన్స్ ట్రోఫీలో కీలక సమయాల్లో కెప్టెన్ గా అతను జట్టును నడిపించిన తీరు హైలైట్గా నిలిచింది. గంభీర్కు ఊరట... ద్రవిడ్ నుంచి కోచ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత గంభీర్ కోచింగ్లో చెప్పుకోదగ్గ ఫలితాలు రాలేదు. శ్రీలంకపై టి20 సిరీస్, స్వదేశంలో ఇంగ్లండ్తో సిరీస్ లు గెలిచినా వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. సొంతగడ్డపై న్యూజిలాండ్, ఆ తర్వాత ఆసీస్ చేతిలో టెస్టుల్లో చిత్తయిన అవమాన భారం మాత్రమే అందరికీ గుర్తుండిపోయింది.ఇలాంటి సమయంలో వచ్చిన గెలుపు కోచ్గా అతనికి ఊరటనిచ్చిoదనడంలో సందేహం లేదు. ‘అంతర్జాతీయ క్రికెట్లో సంతృప్తికరమైన ఆట ఎప్పటికీ ఉండదు. ప్రతీసారి ఏదో ఒక విషయం మెరుగు పర్చుకోవాల్సిందే. అప్పుడే నిలకడగా ఫలితాలు వస్తాయి’ అంటూ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపిన కోచ్ ఇప్పుడు ఫైనల్ అనంతరం చిరునవ్వులు చిందించాడు.ప్రధాని ప్రశంసలు... మూడోసారి చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచిన భారత క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ‘అద్భుతమైన మ్యాచ్...అద్భుతమైన ఫలితం... ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన మన క్రికెట్ జట్టును చూసి గర్వపడుతున్నా. టోర్నమెంట్ ఆసాంతం వారంతా చాలా బాగా ఆడారు. అసాధారణ ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన మన జట్టుకు నా అభినందనలు’ అని ‘ఎక్స్’లో మోదీ పేర్కొన్నారు. టీమిండియాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చందబ్రాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అభినందనలు తెలిపారు.మాజీ సీఎం జగన్ అభినందనలు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో అసాధారణ విజయం సాధించిన భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం రాత్రి తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా స్పందించారు. ‘ఇది ఎంతో అర్హమైన అజేయ విజయం. మన దేశానికి గర్వకారణమైన క్షణం! టీమిండియాకు అభినందనలు’ అని ఆయన పేర్కొన్నారు.7 భారత్ సాధించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టైటిల్స్ సంఖ్య. ఇందులో 2 వన్డే వరల్డ్కప్లు (1983, 2011), 2 టి20 వరల్డ్కప్లు (2007, 2024), 3 చాంపియన్స్ ట్రోఫీలు (2022, 2013, 2025) ఉన్నాయి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా 10 ఐసీసీ టైటిల్స్తో అగ్రస్థానంలో ఉంది.ఎవరికెంత ప్రైజ్మనీ అంటే? విజేత భారత్ 22 లక్షల 40 వేల డాలర్లు (రూ. 19 కోట్ల 52 లక్షలు) రన్నరప్ కివీస్ 11 లక్షల 20 వేల డాలర్లు (రూ. 9 కోట్ల 76 లక్షలు) -
మనమే చాంపియన్స్
భారత జట్టు మరోసారి తమ చాంపియన్ ఆటను ప్రదర్శించింది. తొలి మ్యాచ్ నుంచి అన్ని రంగాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తూ వచ్చిన జట్టు అజేయంగా విజయప్రస్థానాన్ని ముగించింది. అటు బౌలింగ్లో, ఇటు బ్యాటింగ్లో సమష్టి ఆటతో ఒక్కో ప్రత్యర్థిని పడగొడుతూ వచ్చిన జట్టు తమ స్థాయికి తగ్గ విజయాన్ని అందుకుంది. ఏడాది వ్యవధిలో మరో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టైటిల్ను సొంతం చేసుకొని ప్రపంచ క్రికెట్పై తమ ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపించింది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని పూర్తిగా మరచిపోయేలా కాకపోయినా... ఈ ఫార్మాట్లో మరో ప్రతిష్టాత్మక టైటిల్ను గెలుచుకొని అభిమానులకు ఆనందాన్ని పంచింది. 2013లాగే ఒక్క ఓటమి కూడా లేకుండా టీమిండియా ట్రోఫీని గెలుచుకోవడం విశేషం. ఫైనల్లో టాస్ ఓడినా న్యూజిలాండ్ను సాధారణ స్కోరుకే పరిమితం చేయడంతోనే భారత్కు గెలుపు దారులు తెరుచుకున్నాయి. మన స్పిన్ చతుష్టయాన్ని ఎదుర్కోవడంలో మళ్లీ తడబడిన కివీస్ భారీ స్కోరు సాధించలేకపోయింది. ఛేదనలో రోహిత్ శర్మ దూకుడైన ఆరంభం లక్ష్యాన్ని అందుకునేందుకు తగిన పునాది వేసింది. మధ్యలో కొద్దిసేపు కివీస్ స్పిన్నర్లూ ప్రభావం చూపడంతో 17 పరుగుల వ్యవధిలో 3 కీలక వికెట్లు కోల్పోయి కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే లక్ష్యం మరీ చిన్నది కావడంతో సమర్థమైన బ్యాటింగ్ లైనప్ తడబడకుండా టీమ్ను విజయతీరం చేర్చింది. క్రికెట్లో ‘మంచి బాలురు’వంటి న్యూజిలాండ్ టీమ్ మరోసారి ‘పోరాడి ఓడిన’ ముద్రతోనే నిరాశగా నిష్క్రమించింది.దుబాయ్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ–2025ను భారత్ సొంతం చేసుకుంది. లీగ్ దశలో మూడు మ్యాచ్లతో పాటు సెమీఫైనల్, ఫైనల్ కలిపి ఆడిన ఐదు మ్యాచ్లలో ఓటమి లేకుండా జట్టు టైటిల్ గెలుచుకుంది. దుబాయ్లో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో మాజీ చాంపియన్ న్యూజిలాండ్పై విజయం సాధించింది. గతంలో భారత్ 2002, 2013లలో కూడా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను గెల్చుకుంది. ఫైనల్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. డరైల్ మిచెల్ (101 బంతుల్లో 63; 3 ఫోర్లు), మైకేల్ బ్రేస్వెల్ (40 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లకు 254 పరుగులు సాధించి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (83 బంతుల్లో 76; 7 ఫోర్లు, 3 సిక్స్లు) చెలరేగగా... శ్రేయస్ అయ్యర్ (62 బంతుల్లో 48; 2 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టోర్నీ మొత్తంలో 263 పరుగులు చేసి 3 వికెట్లు తీసిన న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు గెల్చుకున్నాడు. మిచెల్ హాఫ్ సెంచరీ... కివీస్ ఇన్నింగ్స్ను రచిన్ రవీంద్ర (29 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా మొదలు పెట్టాడు. పాండ్యా ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అతను షమీ ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. దాంతో ఆరో ఓవర్లోనే భారత్ స్పిన్నర్ వరుణ్ను బౌలింగ్కు దింపింది. విల్ యంగ్ (23 బంతుల్లో 15; 2 ఫోర్లు)ను అవుట్ చేసి అతను ఓపెనింగ్ జోడీని విడదీశాడు. 10 ఓవర్లలో కివీస్ స్కోరు 69 పరుగులకు చేరింది. తన తొలి బంతికే రచిన్ను బౌల్డ్ చేసిన కుల్దీప్, తన రెండో ఓవర్లో విలియమ్సన్ (14 బంతుల్లో 11; 1 ఫోర్)ను పెవిలియన్ పంపించి ప్రత్య ర్థిని దెబ్బ కొట్టాడు.లాథమ్ (30 బంతుల్లో 14) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ (52 బంతుల్లో 34; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే స్పిన్నర్లను ఎదుర్కోవడంలో బ్యాటర్లు బాగా ఇబ్బంది పడటంతో పరుగులు నెమ్మదిగా వచ్చాయి. వరుసగా 81 బంతుల పాటు బౌండరీనే రాలేదు. ఎట్టకేలకు 91 బంతుల్లో మిచెల్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఒక వైపు తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు కోల్పోయినా... ఆఖర్లో బ్రేస్వెల్ వేగంగా ఆడటంతో జట్టు స్కోరు 250 పరుగులు దాటింది. చివరి 10 ఓవర్లలో కివీస్ 79 పరుగులు చేసింది. నలుగురు భారత స్పిన్నర్లు కలిపి 38 ఓవర్లలో 144 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా... ఇద్దరు పేసర్లు 12 ఓవర్లలో 104 పరుగులిచ్చి ఒకే వికెట్ తీయడం మన స్పిన్నర్ల ప్రభావాన్ని చూపించింది. రాణించిన అయ్యర్... ఇన్నింగ్స్ రెండో బంతికే సిక్స్తో మొదలు పెట్టిన రోహిత్ తన ఇన్నింగ్స్ ఆసాంతం దూకుడుగా ఆడాడు. నాథన్ స్మిత్ ఓవర్లో అతను 2 ఫోర్లు, సిక్స్ కొట్టాడు. మరో ఎండ్లో శుబ్మన్ గిల్ (50 బంతుల్లో 31; 1 సిక్స్) పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించాడు. 10 ఓవర్లలో స్కోరు 64 పరుగులు కాగా, 41 బంతుల్లోనే రోహిత్ హాఫ్ సెంచరీ మార్క్ను చేరుకున్నాడు. ఎట్టకేలకు శతక భాగస్వామ్యం తర్వాత గిల్ అవుట్ కావడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆపై మరో 17 పరుగుల తేడాతో రెండు కీలక వికెట్లు తీసి కివీస్ పైచేయి సాధించింది. బ్రేస్వెల్ తొలి బంతికి కోహ్లి (1) వికెట్ల ముందు దొరికిపోగా, రోహిత్ భారీ షాట్కు ప్రయత్నించి స్టంపౌటయ్యాడు. ఈ దశలో అయ్యర్, అక్షర్ పటేల్ (40 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్) కలిసి చక్కటి సమన్వయంతో జాగ్రత్తగా ఆడుతూ మళ్లీ ఇన్నింగ్స్ను నడిపించారు. అయితే వీరిద్దరిని తక్కువ వ్యవధిలో వెనక్కి పంపడంతో కివీస్ బృందంలో ఆశలు రేగాయి. అయితే కేఎల్ రాహుల్ (33 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ముందుండి నడిపిస్తూ జట్టును విజయం దిశగా తీసుకెళ్లాడు. 68 బంతుల్లో 69 పరుగులు చేయాల్సిన స్థితిలో బరిలోకి దిగిన రాహుల్కు హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) సహకరించాడు. 49వ ఓవర్ చివరి బంతిని జడేజా (6 బంతుల్లో 9 నాటౌట్; 1 ఫోర్) డీప్స్క్వేర్ లెగ్ దిశగా ఫోర్ కొట్టడంతో భారత్ విజయాన్ని పూర్తి చేసుకుంది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: యంగ్ (ఎల్బీ) (బి) వరుణ్ 15; రచిన్ (బి) కుల్దీప్ 37; విలియమ్సన్ (సి అండ్ బి) కుల్దీప్ 11; మిచెల్ (సి) రోహిత్ (బి) షమీ 63; లాథమ్ (ఎల్బీ) (బి) జడేజా 14; ఫిలిప్స్ (బి) వరుణ్ 34; బ్రేస్వెల్ (నాటౌట్) 53; సాంట్నర్ (రనౌట్) 8; స్మిత్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 16; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 251. వికెట్ల పతనం: 1–57, 2–69, 3–75, 4–108, 5–165, 6–211, 7–239. బౌలింగ్: షమీ 9–0–74–1, పాండ్యా 3–0–30–0, వరుణ్ చక్రవర్తి 10–0–45–2, కుల్దీప్ యాదవ్ 10–0–40–2, అక్షర్ పటేల్ 8–0–29–0, రవీంద్ర జడేజా 10–0–30–1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (స్టంప్డ్) లాథమ్ (బి) రచిన్ 76; శుబ్మన్ గిల్ (సి) ఫిలిప్స్ (బి) సాంట్నర్ 31; కోహ్లి (ఎల్బీ) (బి) బ్రేస్వెల్ 1; శ్రేయస్ అయ్యర్ (సి) రచిన్ (బి) సాంట్నర్ 48; అక్షర్ పటేల్ (సి) రూర్కే (బి) బ్రేస్వెల్ 29; కేఎల్ రాహుల్ (నాటౌట్) 34; హార్దిక్ పాండ్యా (సి అండ్ బి) జేమీసన్ 18; జడేజా (నాటౌట్) 9; ఎక్స్ట్రాలు 8; మొత్తం (49 ఓవర్లలో 6 వికెట్లకు) 254. వికెట్ల పతనం: 1–105, 2–106, 3–122, 4–183, 5–203, 6–241. బౌలింగ్: జేమీసన్ 5–0–24–1, రూర్కే 7–0–56–0, స్మిత్ 2–0–22–0, సాంట్నర్ 10–0–46–2, రచిన్ 10–1–47–1, బ్రేస్వెల్ 10–1–28–2, ఫిలిప్స్ 5–0–31–0. ఫిలిప్స్ అసాధారణంఫీల్డింగ్ అత్యుత్తమ ప్రమాణాలు చూపిస్తూ తన స్థాయిని పెంచుకున్న ఫిలిప్స్ ఆదివారం మరోసారి దానిని ప్రదర్శించాడు. షార్ట్ కవర్ వైపు గిల్ షాట్ ఆడగా అసాధారణంగా గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో ఫిలిప్స్ అందుకోవడం అందరినీ ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. ఈ టోర్నీలో అతను ఇప్పటికే కోహ్లి, రిజ్వాన్ క్యాచ్లను కూడా ఇదే తరహాలో అందుకున్నాడు. క్యాచ్లు వదిలేశారు...భారత జట్టు ఫీల్డింగ్లో పలు అవకాశాలు చేజార్చింది. కష్టసాధ్యమే అయినా ఏకంగా నాలుగు క్యాచ్లు వదిలేసింది. అయితే లైఫ్ లభించిన ఆటగాళ్లెవరూ దానిని పెద్దగా సది్వనియోగం చేసుకోలేకపోవడంతో పెద్దగా నష్టం జరగలేదు. రచిన్ రవీంద్ర స్కోరు 29 వద్ద ఉన్నప్పుడు రెండుసార్లు బతికిపోయాడు. షమీ రిటర్న్ క్యాచ్ వదిలేయగా, అయ్యర్ మరో క్యాచ్ వదిలేశాడు. మిచెల్ స్కోరు 38 వద్ద రోహిత్ క్యాచ్ వదిలేయగా, ఫిలిప్స్ స్కోరు 27 వద్ద గిల్ క్యాచ్ వదిలేసి అవకాశమిచ్చాడు. ఆ తర్వాత కివీస్ కూడా గ్రౌండ్ ఫీల్డింగ్ అద్భుతంగా చేసినా... రెండు క్యాచ్లు వదిలేసింది. గిల్ 1 పరుగు వద్ద మిచెల్ క్యాచ్ వదిలేయగా, అయ్యర్ 44 పరుగుల వద్ద ఉన్నప్పుడు జేమీసన్ అతి సులువైన క్యాచ్ను అందుకోలేకపోయాడు. 12 రోహిత్ శర్మ వరుసగా 12వసారి టాస్ ఓడిపోయాడు. ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉన్న వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా (12) రికార్డును సమం చేశాడు. అయితే మ్యాచ్లు గెలుస్తూ ఐసీసీ టైటిల్ సాధించిన వేళ ఇలాంటి టాస్లు ఎన్ని ఓడిపోయినా రోహిత్కు లెక్క లేదు! ‘నేను రిటైర్ కావడం లేదు’ చాలా సంతోషంగా ఉంది. చక్కటి క్రికెట్ ఆడిన మాకు దక్కిన ఫలితమిది. మొదటి నుంచి మా స్పిన్నర్లు ప్రభావం చూపించారు. ఎన్నో అంచనాలు ఉన్న సమయంలో వారు నిరాశపర్చలేదు. ఈ సానుకూలతను మేం సమర్థంగా వాడుకున్నాం. రాహుల్ మానసికంగా దృఢంగా ఉంటాడు. సరైన షాట్లను ఎంచుకుంటూ ఒత్తిడి లేకుండా అతను ఈ మ్యాచ్ను ముగించగలిగాడు. అతని వల్లే అవతలి వైపు పాండ్యా స్వేచ్ఛగా ఆడగలిగాడు. మా బ్యాటర్లంతా ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చారు. వరుణ్ బౌలింగ్లో ఎంతో ప్రత్యేకత ఉంది. అతను కీలక సమయాల్లో వికెట్లు తీశాడు. ఇలాంటి పిచ్పై అలాంటి బౌలర్ కావాలని అంతా కోరుకుంటారు. మాకు ఇది సొంత మైదానం కాకపోయినా పెద్ద సంఖ్యలో వచ్చి మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. దూకుడుగా బ్యాటింగ్ చేసేందుకు నన్ను కోచ్ ప్రోత్సహించారు. మరో విషయం నేను స్పష్టం చేయదల్చుకున్నాను. నేను ఈ ఫార్మాట్నుంచి రిటైర్ కావడం లేదు. ఎలాంటి వదంతులు రాకూడదని ఇది చెబుతున్నాను –రోహిత్, భారత కెప్టెన్ గొప్పగా అనిపిస్తోంది. ఆ్రస్టేలియాతో సిరీస్ తర్వాత సరైన రీతిలో పునరాగమనం చేయాలని భావించాం. కుర్రాళ్ళతో కలిసి ఆడటం ఎంతో బాగుంది. వారు సరైన సమయంలో స్పందిస్తూ జట్టును ముందుకు తీసుకెళుతున్నారు. ఇన్నేళ్లుగా ఆడుతున్న తర్వాత ఒత్తిడి కొత్త కాదు. టైటిల్ గెలవాలంటే ఆటగాళ్లంతా రాణించాల్సి ఉంటుంది. అందరూ సమష్టిగా సత్తా చాటడంతోనే ఇది సాధ్యమైంది. సరైన, తగిన సమయం సమయం చూసి తప్పుకోవడం ముఖ్యం (రిటైర్మెంట్పై). –విరాట్ కోహ్లి -
Virat Kohli: అద్భుత విజయం.. అంతులేని సంతోషం!.. ఆసీస్ టూర్ తర్వాత..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) ఫైనల్లో టీమిండియా విజయం పట్ల స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) హర్షం వ్యక్తం చేశాడు. టోర్నమెంట్ ఆసాంతం జట్టులోని ప్రతి ఒక్క సభ్యుడు టైటిల్ గెలిచేందుకు తమ వంతు సహకారం అందించాడని తెలిపాడు. భారత జట్టులో ప్రస్తుతం ప్రతిభకు కొదువలేదని.. యువ ఆటగాళ్లు సీనియర్ల సలహాలు తీసుకుంటూనే తమదైన శైలిలో ముందుకు సాగుతున్న తీరును కొనియాడాడు.కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్.. ఆదివారం దుబాయ్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య ఫైనల్తో ముగిసింది. ఈ వన్డే టోర్నీలో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్ ఇంగ్లండ్ పోటీపడ్డాయి. అయితే, ఆసీస్ను ఓడించి టీమిండియా.. సౌతాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్ తుదిపోరుకు అర్హత సాధించాయి.ఈ క్రమంలో మార్చి 9 నాటి మ్యాచ్లో రోహిత్ సేన ఆఖరి వరకు పోరాడి కివీస్పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది.. టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో విజయానంతరం కోహ్లి తన మనసులోని భావాలు పంచుకున్నాడు. ‘‘ఇది అద్భుత విజయం. ఆస్ట్రేలియా పర్యటనలో చేదు అనుభవం తర్వాత పెద్ద టోర్నమెంట్ గెలవాలని మేము కోరుకున్నాం.సరైన దిశలోఇలాంటి తరుణంలో చాంపియన్స్ ట్రోఫీ గెలవడం అద్భుతంగా అనిపిస్తోంది. యువ ఆటగాళ్లతో కలిసి ఆడటం సంతోషంగా ఉంది. సీనియర్లుగా మేము మా అనుభవాలను వారితో పంచుకుంటున్నాం. వారు కూడా మా సలహాలు, సూచనలు తీసుకుంటూనే తమదైన శైలిలో రాణిస్తున్నారు.జట్టు ప్రస్తుతం సరైన దిశలో వెళ్తోంది. ఈ టోర్నీ మొత్తాన్ని మేము ఆస్వాదించాం. కొంతమంది బ్యాట్తో రాణిస్తే.. మరికొందరు బంతితో ప్రభావం చూపారు. అంతా కలిసి జట్టు విజయంలో భాగమయ్యారు. ఐదు మ్యాచ్లలో ప్రతి ఒక్కరు సరైన సమయంలో సరైన విధంగా రాణించి జట్టు గెలుపునకు బాటలు వేశారు. నిజంగా మాకు ఇది చాలా చాలా అద్భుతమైన టోర్నమెంట్’’ అంటూ కోహ్లి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.కాగా ఈ టోర్నీలో దాయాది పాకిస్తాన్తో మ్యాచ్లో శతకం(100 నాటౌట్)తో మెరిసిన కోహ్లి.. ఆసీస్తో సెమీ ఫైనల్లోనూ అద్భుత అర్ధ శతకం(84)తో రాణించాడు. అయితే టైటిల్ పోరులో మాత్రం దురదృష్టవశాత్తూ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే.. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్లను చిత్తు చేసిన రోహిత్ సేన.. సెమీస్లో ఆసీస్ను, ఫైనల్లో కివీస్ను ఓడించి అజేయంగా టైటిల్ విజేతగా నిలిచింది. ఇక కెప్టెన్గా రోహిత్ శర్మకు ఇది రెండో ఐసీసీ టైటిల్. గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన హిట్మ్యాన్.. తాజాగా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను కూడా సాధించాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ స్కోర్లు👉వేదిక: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, దుబాయ్👉టాస్: న్యూజిలాండ్... తొలుత బ్యాటింగ్👉న్యూజిలాండ్ స్కోరు: 251/7 (50)👉కివీస్ టాప్ రన్ స్కోరర్: డారిల్ మిచెల్(101 బంతులలో 63)👉టీమిండియా స్కోరు: 254/6 (49)👉ఫలితం: న్యూజిలాండ్పై నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రోహిత్ శర్మ(83 బంతుల్లో 7 ఫోర్లు,3 సిక్స్ లు 76 పరుగులు).చదవండి: మా స్పిన్నర్లు అద్భుతం: రోహిత్ -
మా స్పిన్నర్లు అద్భుతం.. అతడు ఒత్తిడిని చిత్తు చేశాడు: రోహిత్
పుష్కరకాలం తర్వాత టీమిండియా మరోసారి చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025)ని ముద్దాడింది. పాతికేళ్ల క్రితం న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని 2025 విజేతగా ఆవిర్భవించింది. దుబాయ్ వేదికగా ఆదివారం నాటి ఫైనల్లో కివీస్ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో సాంట్నర్ బృందంపై పైచేయి సాధించి అభిమానులకు కనులవిందు చేసింది.మా స్పిన్నర్లు అద్భుతంఈ నేపథ్యంలో విజయానంతరం భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మాట్లాడుతూ సమిష్టి కృషి వల్లే గెలుపు సాధ్యమైందని సహచరులపై ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా స్పిన్నర్లు చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆసాంతం అదరగొట్టారని కితాబులిచ్చాడు. అదే విధంగా తమకు మద్దతుగా నిలిచిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు.‘‘ఇది మా సొంత మైదానం కాదు. అయినప్పటికీ మాకు మద్దతుగా అభిమానులు ఇక్కడికి తరలివచ్చారు. మా హోం గ్రౌండ్ ఇదే అన్నంతలా మాలో జోష్ నింపారు. గెలుపుతో మేము వారి మనసులను సంతృప్తిపరిచాం.ఫైనల్లో మాత్రమే కాదు.. టోర్నీ ఆరంభం నుంచీ మా స్పిన్నర్లు గొప్పగా రాణించారు. దుబాయ్ పిచ్ స్వభావరీత్యా వారిపై భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ ఒత్తిడికి లోనుకాకుండా పనిపూర్తి చేశారు. వారి నైపుణ్యాలపై నమ్మకంతో మేము తీసుకున్న నిర్ణయాలు సరైనవే అని నిరూపించారు. వారి బలాలను మాకు అనుకూలంగా మలచుకోవడంలో మేము సఫలమయ్యాం.అతడు ఒత్తిడిని చిత్తు చేశాడుఇక.. కేఎల్ రాహుల్(KL Rahul) గురించి చెప్పాలంటే.. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒత్తిడిని దరిచేరనీయడు. అందుకే మేము అతడి సేవలను మిడిల్లో ఎక్కువగా ఉపయోగించుకున్నాం. ఈరోజు తను బ్యాటింగ్ చేస్తున్నపుడు పరిస్థితులు మాకు అంత అనుకూలంగా లేవు. అయినప్పటికీ అతడు ఏమాత్రం తడబడకుండా షాట్ల ఎంపికలో సంయమనం పాటించాడు.తనతో పాటు బ్యాటింగ్ చేస్తున్న ఆటగాడు స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించేలా చక్కటి సహకారం అందిస్తాడు. తను సరికొత్తగా కనిపిస్తున్నాడు. నాణ్యమైన బౌలర్ఇక వరుణ్ టోర్నీ ఆరంభంలో ఆడలేదు. అయితే, న్యూజిలాండ్తో లీగ్ మ్యాచ్లో ఐదు వికెట్లతో మెరిసిన తర్వాత అతడి సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. అతడొక నాణ్యమైన బౌలర్. ట్రోఫీ గెలవడంలో ప్రతి ఒక్క సభ్యుడు తమ వంతు పాత్ర పోషించారు’’ అని జట్టు ప్రదర్శన పట్ల రోహిత్ శర్మ సంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. డారిల్ మిచెల్(63), మైకేల్ బ్రాస్వెల్(53 నాటౌట్) అర్ధ శతకాలతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. షమీ, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ తీశారు.ఇక లక్ష్య ఛేదనలో భారత్కు ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్(31) శుభారంభం అందించారు. విరాట్ కోహ్లి(1) విఫలం కాగా.. శ్రేయస్ అయ్యర్(48)తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. 76 పరుగుల వద్ద రోహిత్ స్టంపౌట్ కాగా.. అక్షర్ పటేల్(29), కేఎల్ రాహుల్(33 బంతుల్లో 34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9) వేగంగా ఆడి మరో ఓవర్ మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు. రోహిత్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. -
CT 2025 Final: తొలి హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్స్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి భారత్ ముందు ఫైటింగ్ టార్గెట్ను (252) ఉంచింది. స్పిన్కు అనుకూలిస్తున్న పిచ్పై డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్వెల్ (53 నాటౌట్) అద్భుతమైన అర్ద సెంచరీలతో రాణించారు. ఫలితంగా న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో విల్ యంగ్ 15, రచిన్ రవీంద్ర 37, కేన్ విలియమ్సన్ 11, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 34, మిచెల్ సాంట్నర్ 8 పరుగులు చేశారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్లో భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినా న్యూజిలాండ్ మంచి స్కోర్ చేయగలిగింది.అనంతరం 252 పరుగుల లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్ రోహిత్ శర్మ ధాటిగా ఇన్నింగ్స్ను ప్రారంభించాడు. రోహిత్ కేవలం 41 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐసీసీ టోర్నీల ఫైనల్స్లో రోహిత్ శర్మకు ఇది తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఈ టోర్నీ ప్రస్తుత ఎడిషన్లోనూ రోహిత్కు ఇదే తొలి హాఫ్ సెంచరీ.18 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 103/0గా ఉంది. రోహిత్తో (62 బంతుల్లో 69; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) పాటు శుభ్మన్ గిల్ (46 బంతుల్లో 29; సిక్స్) క్రీజ్లో ఉన్నాడు. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే మరో 32 ఓవర్లలో 149 పరుగులు చేయాలి.ఐసీసీ టోర్నీల ఫైనల్స్లో రోహిత్ శర్మ స్కోర్లు.. 69*(62), 2025 CT 9(5), 2024 T20 WC47(31), 2023 ODI WC43(60), 2023 WTC15(26), 2023 WTC30(81), 2021 WTC34(68), 2021 WTC0(3), 2017 CT29(26), 2014 T20 WC9(14), 2013 CT30*(16), 2007 T20 WC -
రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే?
అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిన కెప్టెన్గా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా రికార్డును సమం చేశాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా రోహిత్ ఈ ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నాడు.రోహిత్ ఇప్పటివరకు వన్డేల్లో వరుసగా 12 సార్లు టాస్ ఓడిపోయాడు. బ్రియాన్ లారా కూడా వరుసగా 12 సార్లు టాస్ ఓడిపోయాడు. ఇక ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్కు కివీస్ స్టార్ పేసర్ మాట్ హెన్రీ గాయం కారణంగా దూరమయ్యాడు.ఆజేయంగా భారత్..ఇక ఈ టోర్నీలో టీమిండియా ఆజేయంగా ఫైనల్కు చేరింది. లీగ్ స్టేజిలో మూడుకు మూడు మ్యాచ్లు గెలిచిన భారత్.. సెమీస్లో ఆస్ట్రేలియాపై అద్బుతమైన విజయం సాధించింది. ఫైనల్లో కూడా కివీస్ను ఓడించి మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను తమ ఖాతాలో వేసుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే ఐసీసీ టోర్నీల్లో ఇప్పటివరకు ఫైనల్లో ఒక్కసారి కివీస్పై భారత్ గెలవలేదు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2000, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి చవిచూసింది.వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన కెప్టెన్లు👉బ్రియన్ లారా- వెస్టిండీస్ మాజీ సారథి- అక్టోబరు 1998- మే 1999 వరకు- 12 సార్లు 👉రోహిత్ శర్మ- ఇండియా కెప్టెన్- నవంబరు 2023- మార్చి 2025*-12 సార్లు 👉పీటర్ బారెన్- నెదర్లాండ్స్ మాజీ కెప్టెన్- మార్చి 2011 నుంచి ఆగష్టు 2013-11 సార్లుఫైనల్ మ్యాచ్కు తుది జట్లున్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కైల్ జామిసన్, విలియం ఓరూర్కే, నాథన్ స్మిత్భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిచదవండి: Champions Trophy: ఫైనల్కు ముందు న్యూజిలాండ్కు భారీ షాక్.. -
న్యూజిలాండ్తో ఫైనల్.. రోహిత్ మరో కప్ను అందిస్తాడా?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్కు సర్వం సిద్దమైంది. దుబాయ్ వేదికగా మరికొన్ని గంటల్లో భారత్- న్యూజిలాండ్ మధ్య తుది పోరుకు తెరలేవనుంది. 25 ఏళ్ల తర్వాత.. ఐసీసీ వన్డే టోర్నీ టైటిల్ ఫైట్లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఆఖరిగా తలపడిన ఛాంపియన్స్ ట్రోఫీ-2000 ఫైనల్లో భారత్ను 4 వికెట్ల తేడాతో కివీస్ ఓడించింది. దీంతో నేడు జరగనున్న ఫైనల్లో న్యూజిలాండ్ను ఎలాగైనా ఓడించి తమ 25 ఏళ్ల పగకు ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ కసితో ఉంది. మరోవైపు కివీస్ జట్టు సైతం గతంలో తరహాలోనే మరోసారి ట్రోఫీని ఎగరేసుకుపోవాలనే పట్టుదలతో ఉంది. ఇరు జట్లు సమవుజ్జీలగా ఉండడంతో ఈ టైటిల్ పోరు అభిమానులను ఆఖరివరకు మునివేళ్లపై నిలబెట్టడం ఖాయం.రోహిత్ మరో కప్ను అందిస్తాడా?కాగా భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ జట్టును నాలుగు ఐసీసీ ఈవెంట్లలోనూ ఫైనల్ చేర్చాడు. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్-2023, వన్డే వరల్డ్ కప్-2023, టీ20 వరల్డ్ కప్, ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆఖరి పోరుకు అర్హత సాధించింది. డబ్ల్యూటీసీ, వన్డే ప్రపంచకప్లో ఆఖరి మెట్టుపై బోల్తా పడిన భారత జట్టు.. మరుసటి ఏడాది జరిగిన పొట్టి ప్రపంచకప్లో మాత్రం టీమిండియా అద్బుతం చేసింది.టీ20 వరల్డ్కప్-2024 విశ్వవిజేతగా టీమిండియా నిలిచింది. ఇప్పుడు ధోని తర్వాత రెండు ఐసీసీ టైటిల్స్ సాధించిన భారత సారథిగా నిలిచేందుకు అతను అడుగు దూరంలో ఉన్నాడు. దీనిని అతను అందుకుంటాడా అనేది నేడు జరిగే ఫైనల్ పోరులో తేలుతుంది. 2013లో చాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్గా బరిలోకి దిగిన రోహిత్ తన బ్యాటింగ్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడా?కాగా ఛాంపియన్స్ ట్రోఫీ విజయం సాధిస్తే వన్డేల నుంచి రోహిత్ శర్మ తప్పకోనున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే బీసీసీఐతో హిట్మ్యాన్ మాట్లాడాడని, ఫైనల్ మ్యాచ్ తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించనున్నాడని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ కీలక మ్యాచ్కు ముందు జరిగిన విలేకరుల సమావేశానికి కూడా రోహిత్ గైర్హజారీ అయ్యాడు. రిటైర్మెంట్కు సంబంధించిన ప్రశ్నలను నివారించేందుకే ప్రెస్ కాన్ఫరెన్స్కు హిట్మ్యాన్ హాజరు కాలేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే గిల్ మాత్రం డ్రెసింగ్ రూమ్లో ఏ ఆటగాడి రిటైర్మెంట్ గురించి చర్చ జరగడం స్పష్టం చేశాడు. రోహిత్ వన్డేల్లో కొనసాగుతాడా లేదా రిటైర్మెంట్ ప్రకటిస్తాడో? ఆదివారం తేలిపోనుంది.చదవండి: Champions Trophy final: 'వరుణ్ కాదు.. అతడితోనే న్యూజిలాండ్కు ముప్పు' -
'అతడు 20 ఓవర్లు ఆడితే ఛాంపియన్స్ ట్రోఫీ భారత్దే'
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో రసవత్తర పోరుకు సమయం అసన్నమైంది. దుబాయ్ వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్లో భారత్-న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తెల్చుకునేందుకు సిద్దమయ్యాయి. 12 ఏళ్ల విరామం తర్వాత తిరిగి ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకోవాలని టీమిండియా ఊవ్విళ్లరూతోంది.ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆజేయంగా నిలిచిన భారత జట్టు.. అదే జోరును ఫైనల్లో కూడా కొనసాగించాలని తహతహలాడుతోంది. మరోవైపు కివీస్ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ-2000 ఫైనల్ ఫలితాన్ని పునరావృతం చేయాలని వ్యూహాలు రచించింది. సరిగ్గా 25 ఏళ్ల క్రితం జరిగిన ఈ మెగా టోర్నీ ఫైనల్లో భారత్ను న్యూజిలాండ్ ఓడించింది.ఆ తర్వాత వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్-2021 ఫైనల్లో కూడా టీమిండియా పరాజయం పాలైంది. ఈ రెండు ఓటములకు బదులు తీర్చుకోవడానికి భారత్కు ఇదే సరైన అవకాశం. ఇక టైటిల్ పోరు నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలను వెల్లడించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 20 ఓవర్లు పాటు బ్యాటింగ్ చేస్తే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంటుందని చోప్రా జోస్యం చెప్పాడు. అదేవిధంగా హిట్మ్యాన్ కెప్టెన్సీపై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు."రోహిత్ శర్మ అద్బుతమైన కెప్టెన్. మైదానంలో వ్యూహాలు రచించడంలో రోహిత్ దిట్ట. గత మూడు ఐసీసీ వైట్బాల్ టోర్నీల్లో అతడి కెప్టెన్సీలో భారత్ కేవలం ఒకే ఒక మ్యాచ్లో ఓడిపోయింది. ఈ ఫైనల్ పోరులో భారత్ విజయం సాధిస్తే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల ఖాతాలో నాలుగు ఐసీసీ ట్రోఫీలు చేరుతాయి.ఈ ఫీట్ సాధించిన తొలి భారత క్రికెటర్లగా వారిద్దరూ నిలుస్తారు. రోహిత్ శర్మ ఎల్లప్పుడూ దూకుడుగానే ఆడుతాడు. పవర్ప్లేలో పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఈ మ్యాచ్లో కాస్త ఎక్కువ సేపు అతడు ఆడితే బాగుంటుంది. రోహిత్ 20 ఓవర్లు ఆడితే భారత్దే ఛాంపియన్స్ ట్రోఫీ అని"చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.కాగా రోహిత్ శర్మ ఈ మెగా టోర్నీలో పర్వాలేదన్పిస్తున్నాడు. క్రీజులో ఉన్నంత సేపు పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే తన లభించిన ఆరంభాలను భారీ ఇన్నింగ్స్లగా రోహిత్ మలచలేకపోతున్నాడు.తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), శుబ్మన్ గిల్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, కుల్దీప్, వరుణ్. న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్), యంగ్, రచిన్, విలియమ్సన్, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, బ్రేస్వెల్, జేమీసన్, రూర్కే, హెన్రీ/ డఫీ.చదవండి: Champions Trophy final: 'వరుణ్ కాదు.. అతడితోనే న్యూజిలాండ్కు ముప్పు' -
రోహిత్తో నాకు మంచి అనుబంధం ఉంది.. అతడు చాలా గ్రేట్: గంభీర్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ పోరులో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడేందుకు సిద్దమయ్యాయి. ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు భారత కెప్టెన్ రోహిత్ శర్మపై హెడ్కోచ్ గౌతం గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు.రోహిత్ శర్మతో తనకు మంచి అనుబంధం ఉందని గంభీర్ తెలిపాడు. కాగా రోహిత్ సారథ్యంలోని భారత జట్టు ప్రస్తుతం అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో వరుస విజయాలతో టీమిండియా ఫైనల్కు దూసుకెళ్లింది. అయితే ఫైనల్కు చేరడంలో కోచ్ గంభీర్ పాత్ర కూడా ఉంది. అక్షర్ పటేల్ను బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ చేయడం, వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకురావడం వంటివి గంభీర్ తీసుకున్న నిర్ణయాలే. అయితే వైట్బాల్ క్రికెట్లో కెప్టెన్గా, కోచ్గా అదరగొడుతున్న రోహిత్-గంభీర్ జోడీ.. రెడ్ బాల్ క్రికెట్లో ఇంకా తమ మార్క్ చూపించలేకపోయారు.న్యూజిలాండ్తో టెస్టు సిరీస్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఘోర పరాభావం తర్వాత వీరద్దరూ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచి విమర్శించిన వారితోనే శెభాష్ అన్పించుకోవాలని వీరు భావిస్తున్నారు."రోహిత్ శర్మ తనొక కెప్టెన్ అని, అన్ని అధికారాలు ఉన్నాయని ఎన్నడూ భావించలేదు. అద్భుతమైన వ్యక్తిత్వం కలవాడు. అతడితో నాకు బలమైన అనుబంధం ఉంది. మంచి మనసు ఉన్న వారు మంచి నాయకుడిగా కూడా మారుతారు. అందుకే ఐపీఎల్లో అతడు కెప్టెన్గా అన్ని టైటిల్స్ సాధించగలిగాడు.భారత్కు టీ20 ప్రపంచకప్ను అందించాడు. అయితే చరిత్ర ఎప్పుడు గతంగానే ఉంటుంది. ఇప్పుడు మా ముందు కొత్త సవాలు ఉంది. ఫైనల్ మ్యాచ్లో కూడా అతడు బ్యాటర్ గానే కాకుండా సారథిగా కూడా అత్యుత్తమ ప్రదర్శన చేయగలడని ఆశిస్తున్నాను" అని ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతీ పేర్కొన్నాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత హిట్మ్యాన్ భారత వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలిగే సూచనలు కన్పిస్తున్నాయి.చదవండి: పాతికేళ్ల పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా? -
పాతికేళ్ల పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా?
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరులో తలపడేందుకు భారత్, న్యూజిలాండ్ సంసిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు జట్లు ఈ టోర్నమెంట్ ఫైనల్లో తలపడటం ఇది రెండోసారి. ఈ ఫైనల్ కి ముందు రెండు జట్లూ సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. ఈ టోర్నమెంట్ గ్రూప్ దశ మ్యాచ్లోభారత్ ఇప్పటికే కివీస్ను 44 పరుగుల తేడాతో ఓడించి కొద్దిగా పైచేయి తో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ 79 పరుగులు సాధించగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ ని అద్భుతంగా నిలువరించడం తో భారత్ విజయం సాధించింది.పాతికేళ్ల క్రితం... భారత్ ని దెబ్బతీసిన న్యూజిలాండ్అయితే భారత్, న్యూజిలాండ్ జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడటం ఇది రెండోసారి. గతంలో అక్టోబర్ 15, 2000న కెన్యా రాజధాని నైరోబిలోని జింఖానా క్లబ్ గ్రౌండ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కివీస్ జట్టు భారత్ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీ ని ఎగరేసుకుపోయింది. కెప్టెన్ సౌరవ్ గంగూలీ అద్భుతమైన సెంచరీ చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఆరు వికెట్లకు 264 పరుగులు చేసింది. గంగూలీ మరియు సచిన్ టెండూల్కర్ 26.3 ఓవర్లలో తొలి వికెట్కు 141 పరుగుల భాగస్వామ్యంతో పునాది వేశారు. టెండూల్కర్ 69 పరుగుల వద్ద రనౌట్ కావడంతో ఈ భాగస్వామ్యం తెగిపోయింది. అయితే, గంగూలీ తన ఇన్నింగ్స్ను కొనసాగించాడు, 130 బంతుల్లో 117 పరుగులు చేసి భారత్ కి ఆశలు రేకెత్తించాడు. అయితే అల్ రౌండర్ క్రిస్ కైర్న్స్ విజృంభించి 113 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచి కివీస్ కి విజయాన్ని చేకూర్చాడు.రోహిత్ కి కలిసిరాని టాస్భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ కి మాత్రం ప్రస్తుతం టాస్ కలిసి రావట్లేదు. రోహిత్ వరుసగా గత 14 వన్డే మ్యాచ్ లలో టాస్ గెలవలేక పోయాడు. 2023 నవంబర్ 19న అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్తో ప్రారంభమైన ఈ టాస్ పరాజయాల పరంపర ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే భారత్ మాత్రం ఈ 14 మ్యాచ్లలో తొమ్మిది విజయాలు సాధించింది, నాలుగింటిలో ఓటమి పాలయింది ఒక మ్యాచ్ (శ్రీలంకతో)తో టై గా ముగిసింది.ప్రస్తుత దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదిక గా ఆడుతున్న భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లోని ఇంతవరకూ జరిగిన నాలుగు మ్యాచ్ ల లో టాస్ ఓడిపోయింది, అయినప్పటికీ అన్ని మ్యాచ్ లలో విజయం సాధించింది. అందువల్ల టాస్ భారత్ విజయావకాశాల పై ప్రభావం చూపించలేదన్నది వాస్తవం. అయితే ఇక్కడి వాతావరణ పరిస్థితులు రెండవ స్థానంలో బ్యాటింగ్ చేసే జట్టుకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని తొలుత భావించారు. కానీ అలాంటిదేమీ ఈసారి కనిపించలేదు. భారత్ మొదట బ్యాటింగ్ చేసినప్పుడు ఒకసారి ఛేజింగ్ చేస్తూ మూడు మ్యాచ్లు గెలిచింది. ఇక్కడి వాతావరణం లో మంచు ఎక్కువగా లేకపోవడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. రాత్రులు వాతావరణం చల్లగా ఉండటంతో, టోర్నమెంట్లో మంచు పెద్ద పాత్ర పోషిస్తుందని భావించారు. అదృష్టవశాత్తూ అది జరగలేదు.వరుణ్ చక్రవర్తి కీలకం"ఈ సమయంలో ఈ మైదానంలో కొంచెం ఎక్కువ మంచు ఉంటుందని నేను అనుకున్నాను. అదృష్టవశాత్తూ అలా జరగలేదు. కాబట్టి టాస్ నిజానికి పెద్ద అంశం కాదని నేను భావిస్తున్నాను" అని న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెస్సన్ అన్నాడు. "ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు వెళుతున్నప్పుడు ఎవరు టాస్ గెలుస్తారనే దాని గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక భారత్ అభిమానులైతే రోహిత్ శర్మ వరుసగా 14 మ్యాచ్ల లో టాస్ ఓడిపోయాడని నిద్ర మానుకోవాల్సి పని లేదు." అని హెస్సన్ వ్యాఖ్యానించాడు. ఫైనల్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా?సరిగ్గా పాతికేళ్ల క్రితం క్రితం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పరాజయం చవిచూసిన భారత్ ఇప్పుడు న్యూజిలాండ్ పై ప్రతీకారం తీర్చుకుంటుందా? 25 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘోర పరాజయాన్నిభారత్ అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేదు. ఇన్నేళ్లకు ఈ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి రోహిత్ శర్మ బృందానికి అవకాశం కలిగింది. భారత్ జట్టు ప్రస్తుతం మంచి ఫామ్లో ఉంది మరియు టోర్నమెంట్లోని అన్ని మ్యాచ్లలో విజయం సాధించింది. రోహిత్ బృందం ఈ విజయ్ బాటను కొనసాగించాలన్న దృఢ సంకల్పంతో ఉంది. మరి ఈ ఫైనల్లో ఏమి జరుగుతుందో చూద్దాం.!చదవండి: భారత తుదిజట్టులో ఓ మార్పు.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వారికే: రవిశాస్త్రి -
IND vs NZ: ‘అండర్డాగ్స్ అని మర్చిపోండి.. అతడి దూకుడుకు కళ్లెం వేస్తే..’
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఫైనల్లో టీమిండియా ఫేవరెట్గా బరిలో దిగనుంది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లను చిత్తు చేసి టాపర్గా సెమీస్ చేరిన రోహిత్ సేన.. కీలక పోరులోనూ తన సత్తా చాటింది. వన్డే ప్రపంచకప్-2023 విజేత ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.ఐసీసీ టోర్నమెంట్ల ఫైనల్లో భారత జట్టుపై కివీస్(India vs New Zealand)దే పైచేయి అయినా.. దుబాయ్లో ప్రేక్షకుల మద్దతు మాత్రం రోహిత్ సేనకే లభించనుంది. అయితే, టీమిండియా ఎంత పటిష్టంగా ఉన్నప్పటికీ.. తమదైన రోజున న్యూజిలాండ్ను ఆపడం ఎవరితరం కాదు. ఈ విషయాన్ని కివీస్ జట్టు గుర్తించాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్(Shoaib Akhtar) అంటున్నాడు.అండర్డాగ్స్ అని మర్చిపోండిభారత్- న్యూజిలాండ్ ఫైనల్లో తలపడనున్న తరుణంలో కివీస్కు అక్తర్ కీలక సూచనలు చేశాడు. ‘‘మీరు టీమిండియాతో ఆడుతున్నామన్న విషయాన్ని మర్చిపోండి. మీరు అండర్డాగ్స్గా పరిగణింపబడతారనే అంశాన్నీ విస్మరించాలి. మీ జట్టు బాగా లేదని భావించవద్దు.సాంట్నర్కు గెలుస్తామనే నమ్మకం ఉంది. కెప్టెన్గా అతడు టైటిల్ గెలవాలని బలంగా కోరుకుంటున్నాడు. కాబట్టి కివీస్ ఏ దశలోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఇక భారత్తో మ్యాచ్ విషయంలో మీకు అతిపెద్ద సవాలు రోహిత్ శర్మ.అతడి దూకుడుకు కళ్లెం వేస్తేపవర్ ప్లేలో గనుక అతడికి అవకాశం ఇస్తే పరిస్థితి చేజారినట్టే. ఏమాత్రం దయ చూపకుండా అతడు దూకుడుగా ముందుకుపోతాడు. ముఖ్యంగా స్పిన్నర్లను ఒత్తిడిలోకి నెట్టగలడు. సాంట్నర్ను అటాక్ చేస్తాడు. కెప్టెన్గా తన జట్టులో ఆత్మవిశ్వాసం నింపాలంటే బ్యాటర్గానూ రాణించాలని అతడికి తెలుసు.70 శాతం టీమిండియాకే అవకాశంఓపెనర్గా తనదైన ముద్ర వేసి నిష్క్రమించాలనే కోరుకుంటాడు. కాబట్టి అతడి విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు. ఇక ఫైనల్ విజేతపై అంచనా గురించి చెప్పాలంటే 70 శాతం టీమిండియాకే అవకాశం ఉంది. వాళ్ల బ్యాటర్లు పరిణతితో ఆడుతున్నారు. స్పిన్నర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, న్యూజిలాండ్ తమ శాయశక్తులు ఉపయోగిస్తే మాత్రం మరోసారి టైటిల్ గెలిచే అవకాశం లేకపోలేదు’’ అని రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ గేమ్ ఆన్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. స్మిత్ను ఆదర్శంగా తీసుకోండిఇదే షోలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మాట్లాడుతూ.. న్యూజిలాండ్ బ్యాటర్లు ఆస్ట్రేలియా సారథి స్టీవ్ స్మిత్ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించాడు. ‘‘స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ చక్కటి సమన్వయంతో ముందుకు సాగటమే భారత బ్యాటర్ల గొప్ప లక్షణం. మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పగలిగితే బౌలర్లపై ఒత్తిడి ఉండదు.ఇక సెమీస్లో స్మిత్ భారత స్పిన్నర్ల బౌలింగ్లో ఆడిన విధానం కివీస్ బ్యాటర్లకు స్ఫూర్తిదాయకం. గ్యాప్స్లో షాట్లు బాదుతూ హాఫ్ సెంచరీ(73)తో రాణించాడు. ఫైనల్లో న్యూజిలాండ్ బ్యాటర్లూ అదే చేయాలి’’ అని షోయబ్ మాలిక్ సూచనలు చేశాడు. కాగా 2000 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్పై గెలుపొంది టైటిల్ గెలిచిన న్యూజిలాండ్... వరల్డ్ టెస్టు చాంపియన్షిప్(2023)లోనూ టీమిండియా ను ఓడించి ట్రోఫీని ముద్దాడింది. చదవండి: కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్బై? ఆటగాడిగా కొనసాగింపు? బీసీసీఐ నిర్ణయం? -
రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడితే...
న్యూఢిల్లీ: భారత కెప్టెన్ , స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫైనల్లో భారీ ఇన్నింగ్స్ ఆడితే అది మ్యాచ్నే ప్రభావితం చేస్తుందని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ విశ్లేషించారు. ‘హిట్మ్యాన్’ 25, 30 పరుగులకే పరిమితం కాకుండా ఎక్కువసేపు క్రీజులో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ టోర్నీలో రోహిత్ మెరుపు ఆరంభాల కోసం ప్రతిసారి ఎదురుదాడికి దిగుతున్నాడు. కానీ ఇదే క్రమంలో వెంటనే అవుటవుతున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్పై చేసిన 41 పరుగులే రోహిత్ అత్యధిక స్కోరుగా ఉంది. దీనిపై గావస్కర్ మాట్లాడుతూ ‘ఒకవేళ రోహిత్ 25 ఓవర్లపాటు బ్యాటింగ్ చేస్తే భారత్ 180 నుంచి 200 పరుగులు సాధిస్తుంది. అప్పుడు రెండు, మూడు వికెట్లు పడినా ఇన్నింగ్స్కు ఏ ఇబ్బంది ఉండదు. అక్కడి నుంచి సులువుగా 350 పరుగుల మార్క్ను దాటేస్తుంది. ఈ విషయాన్ని భారత కెపె్టన్ గుర్తుంచుకోవాలి. ఓపెనింగ్ మెరుపులు మెరిపించి వెళ్లడం కంటే కూడా కాస్త దూకుడుగా ఆడుతూ కనీసం 25–30 ఓవర్ల పాటు క్రీజును అట్టిపెట్టుకుంటే మ్యాచ్ రూపురేఖలే మారుతాయ్. రోహిత్ ఆట ఇన్నింగ్స్పై పెను ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో ఫైనల్ మ్యాచ్ను ప్రత్యర్థి చేతుల్లోంచి లాగేసుకోవచ్చు’ అని అన్నారు. భారత కెప్టెన్ పాక్పై 20, న్యూజిలాండ్పై 15, ఆ్రస్టేలియాపై 28 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు అర్ధసెంచరీ కూడా బాదలేకపోయాడు. న్యూజిలాండ్కు నాసిర్ హుస్సేన్ మద్దతు చాంపియన్స్ ట్రోఫీలో భారత్ అజేయమైన జట్టే అయినప్పటికీ ఫైనల్లో ట్రోఫీ గెలిచే అర్హత న్యూజిలాండ్కే ఉందని ఇంగ్లండ్ మాజీ కెపె్టన్ నాసిర్ హుస్సేన్ అన్నాడు. ‘కివీ క్రికెటర్లు చోకర్లు కాదు. ఒత్తిడిలోనూ నిలబడే స్థైర్యం వారికుంది. ప్రపంచశ్రేణి ఆటగాళ్లు ప్రస్తుత జట్టులో ఉన్నారు. అమీతుమీలో వారంతా శక్తికిమించే పోరాడతారు’ అని వివరించాడు. -
Ind vs NZ: ఫైనల్కు వర్షం ముప్పు లేదు! కానీ ‘టై’ అయితే.. విజేతగా ఎవరు?
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) తుది అంకానికి చేరుకుంది. మొత్తం ఎనిమిది జట్లు భాగమైన ఈ వన్డే టోర్నమెంట్లో టీమిండియా- న్యూజిలాండ్(India vs New Zealand) ఫైనల్కు చేరుకున్నాయి. టైటిల్ కోసం దుబాయ్ వేదికగా ఆదివారం ఇరుజట్లు తలపడనున్నాయి. కాగా ఐసీసీ నాకౌట్ మ్యాచ్లలో కివీస్ భారత జట్టుపై మెరుగైన రికార్డు కలిగి ఉంది.పాతికేళ్ల క్రితం అలా2000లో చాంపియన్స్ ట్రోఫీ(నాడు ఐసీసీ నాకౌట్ ట్రోఫీ) తుదిపోరులో టీమిండియాపై గెలుపొంది న్యూజిలాండ్ టైటిల్ సాధించింది. అనంతరం 2019 వన్డే వరల్డ్కప్ సెమీ ఫైనల్లో కోహ్లి సేనను ఓడించడంతో పాటు.. 2023 వరల్డ్ టెస్టు చాంపియన్షిప్(World Test Championship) ఫైనల్లోనూ టీమిండియాపై గెలుపొంది ట్రోఫీని ఎగురేసుకుపోయింది.ఈ క్రమంలో సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023లో భారత్ న్యూజిలాండ్పై ప్రతీకారం తీర్చుకుంది. సెమీస్ మ్యాచ్లో కివీస్ను చిత్తు చేసి ఫైనల్కు దూసుకువెళ్లింది. ఇక తాజా చాంపియన్స్ ట్రోఫీ ఎడిషన్ గ్రూప్ దశలోనూ రోహిత్ సేనదే సాంట్నర్ బృందంపై పైచేయిగా ఉంది. గ్రూప్-‘ఎ’ నుంచి పోటీపడ్డ ఈ రెండు జట్లు బంగ్లాదేశ్, పాకిస్తాన్లను ఓడించి సెమీస్ చేరుకున్నాయి. అయితే, గ్రూప్ దశలో ఆఖరిదైన మ్యాచ్లో మాత్రం టీమిండియా న్యూజిలాండ్ను ఓడించి టాపర్గా నిలిచింది.అనంతరం సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరగా.. న్యూజిలాండ్ సౌతాఫ్రికాను చిత్తు చేసి టీమిండియాతో ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పటిష్టమైన ఇరుజట్ల మధ్య ఈ పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది. టైటిల్ పోరు ‘టై’గా మారితే పరిస్థితి ఏంటి?మరి ఒకవేళ సమవుజ్జీల మధ్య టైటిల్ పోరు ‘టై’గా మారితే పరిస్థితి ఏంటి?.. సూపర్ ఓవర్లోనూ ఇద్దరూ సరిసమానంగా ఉంటే విజేతగా ఎవరిని నిర్ణయిస్తారు? అనే ప్రశ్నలు సగటు అభిమాని మదిలో మెదులుతున్నాయి.మరి ఇందుకు సమాధానం ఏమిటంటే.. ఒకవేళ మ్యాచ్ ‘టై’ అయితే సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేల్చడం పరిపాటే. అయితే, సూపర్ ఓవర్లోనూ రెండు జట్లు సమానంగా ఉంటే.. విజేత తేలేంత వరకూ సూపర్ ఓవర్లు నిర్వహిస్తూనే ఉంటారు. 2019 వరల్డ్కప్ ఫైనల్ విన్నర్ను తేల్చిన విధానంపై విమర్శలు రాగా.. ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.అప్పట్లో వివాదంనాడు ఫైనల్లో న్యూజిలాండ్- ఇంగ్లండ్ మ్యాచ్ను ‘టై’ చేసుకున్నాయి. అదే విధంగా సూపర్ ఓవర్లోనూ నువ్వా-నేనా అన్నట్లు తలపడి.. మళ్లీ ‘టై’ చేశాయి. దీంతో బౌండరీ కౌంట్ ఆధారంగా ఇంగ్లండ్ను చాంపియన్గా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఐసీసీ తీరుపై విమర్శలు రాగా.. ఇకపై ఐసీసీ టోర్నీల్లో ఒకవేళ మ్యాచ్ ‘టై’ అయితే.. విజేత తేలేంత వరకు సూపర్ ఓవర్ నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది.ఇక దుబాయ్లో వర్షం ముప్పులేదు. కానీ ఒకవేళ వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దయితే ఇరుజట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తారు. 2002లో వరణుడి కారణంగా ఫైనల్ మ్యాచ్ సాగే వీలు లేకపోవడంతో భారత్- శ్రీలంకను టైటిల్ విజేతగా ప్రకటించారు. నిజానికి అప్పుడు రెండురోజుల్లో 110 ఓవర్ల ఆట పూర్తైనా.. ఆపై కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.చదవండి: కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్బై? ఆటగాడిగా కొనసాగింపు? బీసీసీఐ నిర్ణయం? -
కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్బై?.. బీసీసీఐ నిర్ణయం ఏమిటి?
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా ఎదురులేని విజయాలతో ఫైనల్కు చేరుకుంది. గ్రూప్ దశలో టాపర్గా నిలవడంతో పాటు సెమీస్లో ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. దుబాయ్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్(India vs New Zealand)తో మ్యాచ్లో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. ఇక ఈ మెగా వన్డే టోర్నమెంట్ తర్వాత టీమిండియాలో కీలక మార్పు చోటుచేసుకోనున్నట్లు సమాచారం.రోహిత్ శర్మ(Rohit Sharma) భారత వన్డే, టెస్టు జట్ల కెప్టెన్సీకి వీడ్కోలు పలికి కేవలం ఆటగాడిగా కొనసాగనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ అంశం గురించి ఇప్పటికే చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్కోచ్ గౌతం గంభీర్ మధ్య చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. అది రోహిత్ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుందిఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియా ఘోర పరాజయం తర్వాత జరిగిన ఈ సమీక్షలో రోహిత్ భవిష్యత్తు గురించి చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సన్నిహిత వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘తనలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా మిగిలే ఉందని రోహిత్ విశ్వసిస్తున్నాడు. అయితే, తన భవిష్యత్ కార్యాచరణ ఏమిటన్న అంశం గురించి యాజమాన్యం అతడిని అడిగింది. రిటైర్మెంట్ ప్రకటిస్తాడా లేదా అన్నది పూర్తిగా అతడి నిర్ణయమే. అయితే, కెప్టెన్సీ విషయంలో మాత్రం మేనేజ్మెంట్ మార్పు వైపు మొగ్గుచూపుతున్నట్లు అనిపిస్తోంది. వచ్చే వరల్డ్కప్ నాటికి జట్టును సిద్ధం చేసుకోవాలని దిగ్గజ కెప్టెన్ రోహిత్కూ తెలుసు. ఇదే విషయం గురించి కోచ్, చీఫ్ సెలక్టర్ అతడితో మాట్లాడారు.కోహ్లి గురించి కూడా చర్చ.. కానీఇక విరాట్ కోహ్లి గురించి చర్చకురాగా.. మేనేజ్మెంట్ కూడా అతడితో మాట్లాడినట్లు తెలిసింది. అయితే, అతడి భవిష్యత్తుకు ఇప్పట్లో ఢోకా లేనట్లే అనిపిస్తోంది’’ అని పేర్కొన్నాయి. కాగా ద్వైపాక్షిక సిరీస్లలో టీమిండియాకు తిరుగులేని విజయాలు అందించడంతో పాటు ఐసీసీ టోర్నీల్లోనూ గొప్పగా రాణించిన కెప్టెన్గా రోహిత్ శర్మ పేరొందాడు.ఏకైక సారథిగా అరుదైన ఘనతగతేడాది అతడి కెప్టెన్సీలో టీమిండియా టీ20 ప్రపంచకప్-2024లో చాంపియన్గా నిలిచింది. అనంతరం అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు రోహిత్ వీడ్కోలు పలకగా.. విరాట్ కోహ్లి కూడా అతడి బాటలో నడిచాడు. ప్రస్తుతం ఈ దిగ్గజ బ్యాటర్లు వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్నారు. ఇటీవల ఇంగ్లండ్తో సిరీస్లో శతకం బాది రోహిత్.. చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్పై సెంచరీ కొట్టి కోహ్లి వన్డేల్లో ఫామ్లోకి వచ్చారు. అయితే, టెస్టుల్లో మాత్రం వారి వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను ఫైనల్కు చేర్చడం ద్వారా ఇంత వరకు ఏ కెప్టెన్కూ సాధ్యం కాని ఘనతను రోహిత్ శర్మ సాధించాడు. ఐసీసీ వన్డే వరల్డ్కప్, వరల్డ్ టెస్టు చాంపియన్షిప్, టీ20 ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీ టోర్నీల్లో తమ జట్టును ఫైనల్కు తీసుకువెళ్లిన ఏకైక కెప్టెన్గా చరిత్రకెక్కాడు. ఇక ఇటీవల ఆసీస్తో సెమీస్ మ్యాచ్లో విజయానంతరం గంభీర్కు రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి ప్రశ్నలు ఎదురుకాగా.. తమ కెప్టెన్ అద్భుతమైన టెంపోతో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇలాంటి విషయాలపై తానేమీ మాట్లాడలేనన్నాడు.చదవండి: Steve Smith: కోహ్లికి ముందే తెలుసు! -
25-30 పరుగులు చేస్తే చాలా?: గంభీర్కు టీమిండియా దిగ్గజం కౌంటర్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar) కీలక సూచనలు చేశాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఫైనల్లో దూకుడు వద్దని.. సంయమనంతో ఆడాలని సూచించాడు. అదే విధంగా.. రోహిత్ బ్యాటింగ్ శైలిని సమర్థిస్తూ హెడ్కోచ్ గౌతం గంభీర్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని సన్నీ కుండబద్దలు కొట్టాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ ముగింపు దశకు చేరుకున్న విషయం తెలిసిందే.తొలి సెమీస్లో ఆస్ట్రేలియాను టీమిండియా.. రెండో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్ ఓడించాయి. ఈ క్రమంలో దుబాయ్లో ఆదివారం నాటి టైటిల్ పోరులో టీమిండియా- న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ వన్డే టోర్నమెంట్కు ఆతిథ్యం దేశం పాకిస్తాన్ అయినప్పటికీ భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు తమ మ్యాచ్లన్నీ దుబాయ్లో ఆడుతోన్న విషయం తెలిసిందే.ఒక్క ఫిఫ్టీ కూడా లేదుగ్రూప్ దశలో భాగంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్లను చిత్తు చేసిన భారత్.. సెమీస్లోనూ సత్తా చాటి అజేయంగా ఫైనల్లో అడుగుపెట్టింది. అంతాబాగానే ఉన్నా కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి మాత్రం ఇంత వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన రాలేదు. నాలుగు మ్యాచ్లలో అతడు చేసిన స్కోర్లు వరుసగా... 41(36 బంతుల్లో), 20(15 బంతుల్లో), 15(17 బంతుల్లో), 28(29 బంతుల్లో).దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. దీంతో రోహిత్ శర్మ బ్యాటింగ్, భవిష్యత్పై విమర్శలు రాగా.. గంభీర్ అతడికి మద్దతుగా నిలిచాడు. అద్భుతమైన టెంపోతో ఆడుతున్న హిట్మ్యాన్ జట్టుకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాడని పేర్కొన్నాడు.గంభీర్ వ్యాఖ్యలతో ఏకీభవించని గావస్కర్ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘కెప్టెన్గా అతడు జట్టును ప్రభావితం చేస్తున్నాడన్నది నిజమే. అయితే, బ్యాటర్గా 25-30 పరుగులు మాత్రమే చేస్తే తన ప్రదర్శన పట్ల అతడు సంతోషంగా ఉంటాడా? ఓ బ్యాటర్గా అదొక లోటే.జట్టుపై నీ ఆట తీరుతో ప్రభావం చూపడం ఎంత ముఖ్యమో.. బ్యాటర్గా ఓ 25 ఓవర్ల పాటు క్రీజులో నిలబడితే మరింత గొప్పగా ప్రభావితం చేయవచ్చు. ఏడు, ఎనిమిది, తొమ్మిది ఓవర్లపాటే ఆడితే మజా ఏం ఉంటుంది?వైవిధ్యభరిత షాట్లు ఆడటంలో దిట్ట.. కానీదూకుడుగా ఆడటం మంచిదే కావొచ్చు. కానీ.. కొన్నిసార్లు అది బెడిసికొట్టవచ్చు. నిజానికి రోహిత్ గనుక 25- 30 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తే.. టీమిండియా సగం ఇన్నింగ్స్ తర్వాత 180- 200 పరుగులకు చేరుకుంటుంది. ప్రత్యర్థి నుంచి మ్యాచ్ను లాగేసుకునే సత్తా రోహిత్కు ఉంది. అతడొక ప్రతిభావంతుడైన బ్యాటర్.వైవిధ్యభరిత షాట్లు ఆడటంలో దిట్ట. అయితే, గత వన్డే వరల్డ్కప్ నుంచి రోహిత్ శైలి పూర్తిగా మారిపోయింది, దూకుడుగా ఆడేందుకు అతడు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. కొన్నిసార్లు ఈ విషయంలో విజయవంతమైనా.. కీలక మ్యాచ్లలో మాత్రం ఆచితూచి నిలకడగా ఆడటం మంచిది’’ అని న్యూజిలాండ్తో ఫైనల్కు ముందు గావస్కర్ రోహిత శర్మకు సూచించాడు.రోహిత్ శర్మ ప్రపంచ రికార్డుఇదిలా ఉంటే.. నాలుగు ఐసీసీ ఈవెంట్లలోనూ జట్టును ఫైనల్కు చేర్చిన తొలి కెప్టెన్గా రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సాధించాడు. వన్డే, టీ20 ప్రపంచకప్ టోర్నీలు.. అదే విధంగా వరల్డ్ టెస్టు చాంపియన్షిప్, తాజాగా చాంపియన్స్ ట్రోఫీలో భారత్ను ఫైనల్కు చేర్చడం ద్వారా ఈ ఘనత సాధించాడు.చదవండి: ‘లాహోర్లో ఫైనల్ జరిగితే బాగుండేది’.. బీసీసీఐ స్ట్రాంగ్ రియాక్షన్ -
మాట్లాడుకుంటూనే ఉండండి: రోహిత్-రాహుల్పై జడ్డూ అసహనం!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో జైత్రయాత్ర కొనసాగించిన భారత క్రికెట్ జట్టు.. ఫైనల్లోనూ గెలిచి విజయాన్ని పరిపూర్ణం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. సమిష్టి ప్రదర్శనతో గ్రూప్ దశలో టాపర్గా నిలిచిన రోహిత్ సేన సెమీస్లోనూ అదరగొట్టిన విషయం తెలిసిందే. ఐసీసీ నాకౌట్ మ్యాచ్లలో గత కొంతకాలంగా భారత్కు చేదు అనుభవాలను మిగిల్చిన ఆస్ట్రేలియా(India vs Australia)ను ఓడించింది.కంగారూ జట్టును ఏ దశలోనూ కోలుకోనివ్వకుండా చేసి చిరస్మరణీయ విజయంతో టీమిండియా ఫైనల్కు దూసుకువెళ్లింది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న ఓ సరదా సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మాట్లాడుకున్న మాటలు స్టంప్ మైకులో రికార్డు కాగా.. ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.264 పరుగులకు ఆసీస్ ఆలౌట్కాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్లో చాంపియన్స్ ట్రోఫీ మొదలుకాగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్లన్నీ తటస్థ వేదికైన దుబాయ్లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలి సెమీస్లో భాగంగా భారత్ మంగళవారం ఆసీస్ జట్టును ఢీకొట్టింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.ఈ క్రమంలో ఓపెనర్ కూపర్ కన్నోలి(0)ని డకౌట్ చేసి మహ్మద్ షమీ టీమిండియాకు శుభారంభం అందించగా.. విధ్వంసకర ఓపెనర్ ట్రవిస్ హెడ్(39)ను వరుణ్ చక్రవర్తి స్వల్ప స్కోరుకే పెవిలియన్కు చేర్చాడు. ఈ దశలో స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్(73)తో ఆకట్టుకోగా.. అలెక్స్ క్యారీ(61)అతడికి సహకరించాడు. అయితే, మిగతా వాళ్లు స్థాయికి తగ్గట్లు రాణించకపోవడంతో ఆసీస్ 49.3 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. 264 పరుగులు స్కోరు చేసింది.టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి రెండు, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు. అయితే, జడ్డూ బౌలింగ్ చేసే సమయంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. మాములుగా తనకు ఇచ్చిన సమయంలోపే ఓవర్లు ముగిస్తాడని జడేజాకు పేరుంది.జడేజా అసహనంఅయితే, కెప్టెన్ రోహిత్ , వికెట్ కీపర్ రాహుల్ వల్ల ఆలస్యం అవుతుందేమోనని జడ్డూ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. స్టంప్ మైకులో రికార్డైన సంభాషణ ప్రకారం.. జడేజా..‘‘బంతి అంతగా టర్న్ అవటం లేదు’’ అనగా.. రోహిత్ ఇందుకు బదులిస్తూ.. ‘‘ఇంకో మూడు బాల్స్ వేయాల్సి ఉంది కదా. స్లిప్ తీసుకో. బంతి స్పిన్ అవ్వచ్చు’’ అని పేర్కొన్నాడు.మీరు చర్చలు జరుపుతూనే ఉండండిఇంతలో కేఎల్ రాహుల్ జోక్యం చేసుకుంటూ.. ‘‘ఇప్పటి వరకు ఒక్క బంతి మాత్రమే టర్న్ అయింది’’ అని పేర్కొన్నాడు. వీళ్ల చర్చలతో చిర్రెత్తిపోయిన జడేజా.. ‘‘మీరిద్దరు ఇలా మట్లాడుతూనే ఉండండి. ఈ వ్యవధిలోనే నేను మిగిలిన నా మూడు బంతులు వేసేస్తా’’ అని కౌంటర్ వేశాడు.ఇదిలా ఉంటే.. ఆసీస్ విధించిన 265 పరుగుల లక్ష్య ఛేదనను భారత్ మరో పదకొండు బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. విరాట్ కోహ్లి అర్ధ శతకం(84)తో అదరగొట్టగా.. శ్రేయస్ అయ్యర్(45), కేఎల్ రాహుల్(42 నాటౌట్) రాణించారు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో 28) కూడా తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో 48.1 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసిన టీమిండియా.. ఆసీస్ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. దుబాయ్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్తో టైటిల్ పోరులో తలపడుతుంది.చదవండి: Steve Smith: కోహ్లికి ముందే తెలుసు!Jab tak baat hogi, ek aur over hojayegi! 🤣That’s the speed of #Jadeja – blink, and the over’s done! Some on field stump mic gold!#ChampionsTrophyOnJioStar 👉 🇮🇳🆚🇦🇺 LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2 & Sports18-1!📺📱 Start Watching FREE on… pic.twitter.com/nsIpsZyAbb— Star Sports (@StarSportsIndia) March 4, 2025 -
కోహ్లి పైపైకి.. పడిపోయిన రోహిత్ శర్మ!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో ముందుకు దూసుకువచ్చాడు. ఆరు నుంచి నాలుగో స్థానానికి ఎగబాకాడు. మరోవైపు.. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం తన మూడో ర్యాంకు కోల్పోయాడు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా అదరగొడుతున్న విషయం తెలిసిందే. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్లను ఓడించి గ్రూప్-‘ఎ’ టాపర్గా సెమీ ఫైనల్కు చేరింది భారత్. దుబాయ్లో మంగళవారం జరిగిన సెమీస్ మ్యాచ్లో ఆస్ట్రేలియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు దూసుకువెళ్లింది.నిరాశపరిచిన రోహిత్ఇక ఈ మ్యాచ్లో ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma- 28) నిరాశపరచగా.. వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి మాత్రం అద్భుత అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. 98 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 84 పరుగులు చేసి జట్టు విజయానికి బాటలు వేశాడు. మిగతా వాళ్లలో శ్రేయస్ అయ్యర్(45), వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్(42 నాటౌట్) రాణించారు. ఫలితంగా ఈ మ్యాచ్లో ఆసీస్ విధించిన 265 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో పదకొండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.నాలుగో స్థానానికిఇదిలా ఉంటే.. ఆసీస్తో మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కారణంగా.. ఐసీసీ ప్రకటించిన తాజా వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో కోహ్లి అదరగొట్టాడు. 747 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఇక టీమిండియా మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ ఆసీస్తో మ్యాచ్లో విఫలమైనా(8) తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మరోవైపు.. రోహిత్ మూడు నుంచి ఐదో ర్యాంకుకు పడిపోయాడు.ఇదిలా ఉంటే.. ఐసీసీ మెన్స్ ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ అక్షర్ పటేల్ దుమ్ములేపాడు. ఏకంగా 17 స్థానాలు ఎగబాకి 13వ ర్యాంకు సాధించాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్లో శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ టాప్లో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికా స్పిన్ బౌలర్ కేశవ్ మహరాజ్ రెండు స్థానాలు మెరుగుపరచుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు.. న్యూజిలాండ్ స్టార్ మ్యాట్ హెన్రీ మూడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంకులో నిలిచాడు.ఐసీసీ మెన్స్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే1. శుబ్మన్ గిల్(ఇండియా)- 791 రేటింగ్ పాయింట్లు2. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 770 రేటింగ్ పాయింట్లు3. హెన్రిచ్ క్లాసెన్(సౌతాఫ్రికా)- 760 రేటింగ్ పాయింట్లు4. విరాట్ కోహ్లి(ఇండియా)- 747 రేటింగ్ పాయింట్లు5. రోహిత్ శర్మ(ఇండియా)- 745 రేటింగ్ పాయింట్లు.చదవండి: శుబ్మన్ గిల్ చేసిన ‘తప్పు’..! టీమిండియాకు శాపమయ్యేది! ఎందుకంటే.. -
రోహిత్ గురించి ప్రశ్న.. ఇచ్చి పడేసిన గంభీర్! నాకన్నీ తెలుసు...
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ ఐసీసీ వన్డే టోర్నమెంట్లో గ్రూప్ దశలో హ్యాట్రిక్ విజయాలు సాధించిన రోహిత్ సేన.. సెమీస్లోనూ అదరగొట్టింది. దుబాయ్లో ఆదివారం నాటి ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు దూసుకువెళ్లింది.ఈ నేపథ్యంలో.. ఓవైపు భారత జట్టుపై ప్రశంసలు కురుస్తుండగా.. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఫామ్, భవిష్యత్తు గురించి చర్చలు నడుస్తున్నాయి. ఇటీవలి కాలంలో టెస్టులు, వన్డేల్లో ఫామ్లేమితో సతమతమైన హిట్మ్యాన్.. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇంకెంతకాలం ఆడతాడు?ఈ క్రమంలో ఆసీస్పై టీమిండియా విజయానంతరం హెడ్కోచ్ గౌతం గంభీర్ మీడియాతో మాట్లాడగా.. ఇందుకు సంబంధించి ప్రశ్న ఎదురైంది. ‘‘రోహిత్ ఫామ్ సంగతేంటి? అతడు ఇంకెంతకాలం ఆడతాడని మీరనుకుంటున్నారు’’ అని ఓ విలేకరి ప్రశ్నించారు.ఇందుకు గంభీర్ ఘాటుగానే కౌంటర్ ఇచ్చాడు. ‘‘చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడబోతున్నాం. ఇలాంటి సమయంలో మీ ప్రశ్నకు నేనెలా బదులివ్వగలను. మా కెప్టెన్ వేరే లెవల్ టెంపోతో బ్యాటింగ్ చేస్తూ సహచర ఆటగాళ్లలో సరికొత్త ఉత్సాహం నింపుతూ.. భయం లేకుండా, దూకుడుగా ఆడాలని చెబుతూ ఉంటే నేను ఈ ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఇవ్వగలను?ఇచ్చి పడేసిన గంభీర్!మీరంతా పరుగులు, సగటు గురించే మాట్లాడతారు. అయితే, కోచ్గా నేను కెప్టెన్ ప్రభావం జట్టుపై ఎలా ఉందనేది చూస్తాను. జర్నలిస్టులు, నిపుణులకు గణాంకాలు మాత్రమే కావాలి. కానీ మా కెప్టెన్ జట్టుకు ఆదర్శంగా ఉంటూ.. డ్రెస్సింగ్రూమ్లో సానుకూల వాతావరణం నింపుతుంటే మాకు ఇంకేం కావాలి’’ అని గంభీర్ సదరు విలేకరి ప్రశ్నపై ఒకింత అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రోహిత్ శర్మ అభిమానులు గౌతం గంభీర్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజమైన కోచ్ ఇలాగే ఉంటాడని.. 37 ఏళ్ల రోహిత్ 2027 వన్డే వరల్డ్కప్ వరకు కొనసాగుతాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.264 పరుగులు చేసి ఆలౌట్ఇక సెమీస్ మ్యాచ్ విషయానికొస్తే.. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మంగళవారం టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. ట్రవిస్ హెడ్(39) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ స్టీవ్ స్మిత్(73), అలెక్స్ క్యారీ(61) అర్ధ శతకాలతో రాణించారు. ఈ క్రమంలో ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో భారత బౌలర్లలో పేసర్ మహ్మద్ షమీ(3/48), స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి(2/49), రవీంద్ర జడేజా (2/40) రాణించగా.. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.రాణించిన కోహ్లి, అయ్యర్, రాహుల్ఆస్ట్రేలియా విధించిన లక్ష్యాన్ని 48.1 ఓవర్లలోనే టీమిండియా పూర్తి చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(28) దూకుడుగా ఆడగా.. విరాట్ కోహ్లి అద్భుత అర్ధ శతకం సాధించాడు. శ్రేయస్ అయ్యర్(45)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్ది 84 పరుగులు సాధించాడు. ఇక కేఎల్ రాహుల్ 34 బంతుల్లోనే 42 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చగా.. హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో 28) ధనాధన్ దంచికొట్టాడు.ఈ క్రమంలో ఆరు వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసిన భారత్ ఆసీస్ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. విరాట్ కోహ్లికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.చదవండి: కుల్దీప్ యాదవ్పై మండిపడ్డ కోహ్లి, రోహిత్!.. గట్టిగానే తిట్టేశారు -
గెలిపించినందుకు థాంక్యూ భయ్యా.. రాహుల్ను హగ్ చేసుకున్న ఫ్యాన్ (ఫొటోలు)
-
ఆఖరి వరకు ఏమీ చెప్పలేం.. వారిద్దరి వల్లే ఈ విజయం: రోహిత్ శర్మ
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత క్రికెట్ జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో వరల్డ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాను 4 వికెట్ల తేడాతో మట్టికర్పించిన టీమిండియా.. ఐదోసారి ఈ మెగా టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ విజయంతో వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది. ఈ సెమీస్ పోరులో భారత్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది.తొలుత బౌలర్లు సత్తాచాటగా.. అనంతరం బ్యాటర్లు సమిష్టగా రాణించారు. 265 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 48.1 ఓవర్లలో చేధించింది. ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లి(Virat Kohli) మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలో ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్ వికెట్లు కోల్పోయినప్పటికి విరాట్ మాత్రం తన క్లాస్ను చూపించాడు.మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్తో కలిసి స్కోర్బోర్డును ముందుకు నడిపించాడు. అయ్యర్(45) ఔటయ్యాక అక్షర్ పటేల్తో కూడా కోహ్లి భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే విజయానికి మరో 39 పరుగులు కావల్సిన దశలో ఓ భారీ షాట్కు ప్రయత్నించి కోహ్లి ఔటయ్యాడు. 98 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 5 ఫోర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. కేవలం 16 పరుగుల దూరంలో తన 52వ వన్డే సెంచరీ చేసే అవకాశాన్ని కింగ్ కోహ్లి కోల్పోయాడు. ఆఖరిలో కేఎల్ రాహుల్(34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 42 నాటౌట్), హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లతో 28) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఆసీస్ బౌలర్లలో ఎల్లీస్, జంపా రెండు వికెట్లు పడగొట్టగా.. బెన్ ద్వార్షుయిస్, కొన్నోలీ చెరో వికెట్ పడగొట్టారు. ఇక అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) స్పందించాడు. ఈ మెగా టోర్నీ ఫైనల్కు చేరడం చాలా సంతోషంగా ఉందని రోహిత్ చెప్పుకొచ్చాడు."ఆటలో ఆఖరి బంతి పడే వరకు ఏమీ చెప్పలేం. ఆసీస్ ఇన్నింగ్స్ ముగిశాక ఇది మరీ చిన్న స్కోరేమీ కాదని, విజయం కోసం మేం చాలా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని అర్థమైంది. ఎందుకంటే సెకెండ్ ఇన్నింగ్స్లో పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో మనం అంచనా వేయలేం. పిచ్పై ఎక్కువ దృష్టి పెట్టకుండా మా ఆటనే నమ్ముకున్నాం. కానీ పిచ్ కూడా కాస్త మెరుగ్గా అనిపించింది. న్యూజిలాండ్తో మ్యాచ్ కంటే ఈ రోజు పిచ్ చాలా బెటర్గా ఉంది.ఈ మ్యాచ్లో మా బ్యాటర్లు అద్బుతంగా రాణించారు. మేము 48 ఓవర్ వరకు గేమ్ను తీసుకుండొచ్చు. కానీ మా ఛేజింగ్లో ప్రశాంతంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా టార్గెట్ను ఫినిష్ చేశాము. మాకు అదే ముఖ్యం. అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించిడంతోనే ఈ విజయం సాధ్యమైంది. జట్టులో అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉన్నారు.ఇక తుది జట్టు కూర్పు ఎప్పుడూ సవాల్గానే ఉంటుంది. ఆరు బౌలింగ్ ప్రత్యామ్నాయాలు, ఎనిమిదో నంబర్ వరకు బ్యాటింగ్ చేయగలవారు ఉండాలని మేం కోరుకున్నాం. దానిని బట్టే జట్టును ఎంపిక చేశాం. ఇప్పుడు ఆ ఆరుగురు బౌలర్లను సమర్థంగా వాడుకున్నాం.విరాట్ కోహ్లి మరోసారి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడు ఎన్నో ఏళ్లుగా ఇదే తరహాలో జట్టును గెలిపిస్తూ వస్తున్నాడు. పవర్ ప్లేలో రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత మాకు ఓ పెద్ద భాగస్వామ్యం కావాలనుకున్నాం. శ్రేయస్ అయ్యర్, కోహ్లి మాకు ఆ భాగస్వామ్యం అందించారు. కేఎల్(రాహుల్), హార్దిక్ పాండ్యా కూడా ఆఖరిలో అద్భుతంగా ఆడారు. ఫైనల్కు ముందు ఆటగాళ్లంతా ఫామ్లో ఉంటే జట్టులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే దాని గురించి అతిగా ఆలోచించడం లేదు. సమయం వచి్చనప్పుడు అంతా సరైన రీతిలో స్పందిస్తారు అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్లో రోహిత్ పేర్కొన్నాడు. కాగా ఆదివారం జరగనున్న ఫైనల్లో దక్షిణాఫ్రికా లేదా న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది.చదవండి: కుల్దీప్ యాదవ్పై మండిపడ్డ కోహ్లి, రోహిత్!.. గట్టిగానే తిట్టేశారు! -
Rohit Sharma: చరిత్రలో ఒకే ఒక్కడు
దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 4) జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి సెమీఫైనల్లో భారత్ ఆస్ట్రేలియాను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా వరుసగా మూడోసారి (2013, 2017, 2025), మొత్తంగా ఐదోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు అర్హత సాధించింది. ఈ గెలుపుతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. నాలుగు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్కు చేరిన తొలి కెప్టెన్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రోహిత్ సారథ్యంలో టీమిండియా 2023 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, 2023 వన్డే వరల్డ్కప్, 2024 టీ20 వరల్డ్కప్.. తాజాగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్స్ చేరింది. ప్రపంచంలో ఏ ఇతర కెప్టెన్ ఈ నాలుగు ఐసీసీ టోర్నీల్లో తన జట్టును ఫైనల్స్కు చేర్చలేదు. ప్రస్తుతం ఈ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమే.ప్రతీకారం తీర్చుకున్న భారత్తాజాగా గెలుపుతో భారత్ 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్స్లో ఆసీస్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. 2023 వరల్డ్కప్ ఫైనల్స్ తర్వాత వన్డేల్లో భారత్ ఆసీస్ను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. హ్యాట్రిక్ విజయాలుఇతర టోర్నీలో భారత్ పాలిట కొరకరాని కొయ్యగా ఉన్న ఆస్ట్రేలియా.. ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోలేకపోతుంది. ఈ టోర్నీలో భారత్ ఆసీస్పై ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఇరు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్స్లో మూడుసార్లు ఎదురెదురుపడగా.. మూడు సందర్భాల్లో టీమిండియానే జయకేతనం ఎగురవేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్స్లో భారత్, ఆస్ట్రేలియా తొలిసారి 1998 ఎడిషన్ క్వార్టర్ ఫైనల్స్లో తలపడ్డాయి. ఆ మ్యాచ్లో భారత్ 44 పరుగుల తేడాతో గెలుపొందింది. తర్వాత 2000 ఎడిషన్ క్వార్టర్ ఫైనల్స్లో ఇరు జట్లు రెండో సారి ఢీకొన్నాయి. ఈసారి భారత్ 20 పరుగుల తేడాతో ఆసీస్ను మట్టికరిపించింది. తాజాగా 2025 ఎడిషన్ సెమీస్లో గెలుపుతో భారత్ ఆసీస్పై హ్యాట్రిక్ విజయాలు (ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్స్లో) నమోదు చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించారు. ఆసీస్ ఆటగాళ్లలో ట్రవిస్ హెడ్ 39, కూపర్ కన్నోలీ 0, లబూషేన్ 29, జోస్ ఇంగ్లిస్ 11, మ్యాక్స్వెల్ 7, డ్వార్షుయిస్ 19, ఆడమ్ జంపా 7, నాథన్ ఇల్లిస్ 10 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.ఛేదనలో విరాట్ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ (84) ఆడటంతో భారత్ 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. మ్యాక్స్వెల్ బౌలింగ్లో సిక్సర్ బాది కేఎల్ రాహుల్ (42 నాటౌట్) మ్యాచ్ను ఫినిష్ చేశాడు. ఆఖర్లో హార్దిక్ (24 బంతుల్లో 28) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. భారత్ గెలుపులో శ్రేయస్ అయ్యర్ (45), అక్షర్ పటేల్ (27) తలో చేయి వేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (28) టీమిండియాకు మెరుపు ఆరంభాన్ని అందించాడు. భారత ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ (8) ఒక్కడే సింగిల్ డిజిట్ స్కోర్కు ఔటయ్యాడు. ఆసీస్ బౌలర్లలో ఇల్లిస్, జంపా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. డ్వార్షుయిస్, కన్నోలీ చెరో వికెట్ దక్కించుకున్నారు.కాగా, రేపు (మార్చి 5) జరుగబోయే రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లాహోర్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్లో విజేతతో భారత్ మార్చి 9న జరిగే ఫైనల్లో తలపడుతుంది. -
CT 2025, IND VS AUS 1st Semis: రోహిత్, విరాట్ ఇలాంటి నిర్ణయం ఎందుకు?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ (మార్చి 4) తొలి సెమీఫైనల్ జరుగుతుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఆటగాళ్లలో ట్రవిస్ హెడ్ 39, కూపర్ కన్నోలీ 0, లబూషేన్ 29, జోస్ ఇంగ్లిస్ 11, మ్యాక్స్వెల్ 7, డ్వార్షుయిస్ 19, ఆడమ్ జంపా 7, నాథన్ ఇల్లిస్ 10 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.ఛేదనలో భారత్ లక్ష్యం దిశగా పయనిస్తుంది. 33 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 167/3గా ఉంది. శుభ్మన్ గిల్ (8), రోహిత్ శర్మ (28), శ్రేయస్ అయ్యర్ (45) ఔట్ కాగా.. విరాట్ కోహ్లి (64), అక్షర్ పటేల్ (20) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే 17 ఓవర్లలో మరో 98 పరుగులు చేయాలి. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ వికెట్ కూపర్ కన్నోలీకి.. గిల్ వికెట్ డ్వార్షుయిస్కు.. శ్రేయస్ అయ్యర్ వికెట్ ఆడమ్ జంపాకు దక్కింది.pic.twitter.com/9zGKhnuFuP— kuchnahi123@12345678 (@kuchnahi1269083) March 4, 2025రోహిత్, విరాట్ చెత్త నిర్ణయంకాగా, భారత్ బ్యాటింగ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఓ చెత్త నిర్ణయం తీసుకున్నారు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ చివరి బంతికి కూపర్ కన్నోలీ బౌలింగ్లో రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూ అయినట్లు ఫీల్డ్ అంపైర్ ప్రకటించాడు. రోహిత్ వికెట్ల ముందు దొరికిపోయినట్లు సుస్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయం రోహిత్తో పాటు నాన్ స్ట్రయికింగ్ ఎండ్లో ఉన్న విరాట్ కోహ్లి కూడా తెలుసు. అయినప్పటికీ రోహిత్, కోహ్లితో చర్చించి రివ్యూ వెళ్లడం అభిమానులను విస్మయానికి గురి చేసింది. వికెట్ల ముందు దొరికిపోయినట్లు క్లియర్గా తెలుస్తున్నా రోహిత్, కోహ్లి రివ్యూకి వెళ్లడమేంటని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మ్యాచ్లో చాలా దూరం ప్రయాణించాల్సి ఉండగా అనవసరంగా రివ్యూ వేస్ట్ చేశారని దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా, కన్నోలీ సంధించిన ఫుల్ లెంగ్త్ బంతిని స్వీప్ చేయబోయి రోహిత్ వికెట్ల ముందు ఈజీగా దొరికిపోయాడు. -
‘ఎందుకింత నిర్లక్ష్యం?’.. కుల్దీప్పై మండిపడ్డ కోహ్లి, రోహిత్!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy).. సెమీ ఫైనల్ మ్యాచ్.. అసలే ఆస్ట్రేలియా.. ఏమాత్రం అవకాశం ఇచ్చినా మ్యాచ్ను లాగేసుకునే ఆటగాళ్లకు ఆ జట్టులో కొదువలేదు. అలాంటి ప్రత్యర్థితో తలపడుతున్నపుడు ఒళ్లంతా కళ్లు చేసుకోవాలి. ముఖ్యంగా ఫీల్డింగ్ చేస్తున్నపుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి కీలక మ్యాచ్లలో ప్రతీ పరుగు ఎంతో విలువైనది. సింగిలే కదా అని వదిలేస్తే అదే మన పాలిట శాపంగా మారవచ్చు. అందుకే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli).. భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చేసిన తప్పిదాన్ని సహించలేకపోయారు. మైదానంలోనే అతడిపై ఈ ఇద్దరు తిట్ల దండకం అందుకున్నారు.ఎందుకింత నిర్లక్ష్యం? మండిపడ్డ దిగ్గజాలు‘ఎందుకింత నిర్లక్ష్యం’ అన్నట్లుగా గుడ్లు ఉరిమి చూస్తూ కుల్దీప్ యాదవ్పై ‘విరాహిత్’ ద్వయం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసీస్తో సెమీస్ మ్యాచ్ సందర్భంగా 32వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మిడ్ వికెట్ మీదుగా బంతిని బాది.. అలెక్స్ క్యారీతో సమన్వయం చేసుకుని సింగిల్ కోసం వెళ్లాడు.ఈ క్రమంలో వేగంగా కదిలిన విరాట్ కోహ్లి వెంటనే బంతిని కలెక్ట్ చేసుకుని నాన్- స్ట్రైకర్ ఎండ్ దగ్గర ఉన్న కుల్దీప్ వైపు వేశాడు. అయితే, కుల్దీప్ మాత్రం బంతిని అందుకునే ప్రయత్నం కూడా చేయకుండా.. బాల్ దూరంగా వెళ్తున్నపుడు అలాగే చూస్తుండిపోయాడు. కనీసం దానిని ఆపేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. బహుశా బంతి వికెట్లను తాకుతుందని అతడు అలా చేసి ఉంటాడు.అయితే, అలా జరుగలేదు. ఇంతలో కవర్స్లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ వచ్చి వెంటనే బంతిని ఆపి.. ఆసీస్కు అదనపు పరుగు రాకుండా అడ్డుకున్నాడు. ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్ వైపు చూస్తూ అతడిపై మండిపడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. 264 పరుగులకు ఆసీస్ ఆలౌట్కాగా దుబాయ్ వేదికగా ఈ సెమీస్ మ్యాచ్లో టీమిండియా ఆస్ట్రేలియాను 264 పరుగులకు కట్టడి చేయగలిగింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ(3/48), వరుణ్ చక్రవర్తి(2/49), రవీంద్ర జడేజా (2/40) రాణించగా.. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ నిరాశపరిచాడు. ఎనిమిది ఓవర్ల బౌలింగ్లో 44 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.సెమీస్లో ఈ నాలుగుఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఎనిమిది జట్లు భాగంగా ఉన్నాయి. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ గ్రూప్ దశలోనే ఈ వన్డే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాయి. ఇక పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లను నాకౌట్ చేసి గ్రూప్-‘ఎ’ నుంచి టీమిండియా, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ చేరగా.. గ్రూప్-‘బి’ నుంచి అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్లను ఇంటికి పంపి సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్లో అడుగుపెట్టాయి. భారత్ మంగళవారం దుబాయ్ వేదికగా.. ఆసీస్ను నాలుగు వికె ట్ల తేడాతో ఓడించి ఫైనల్ చేరింది. విరాట్ కోహ్లి(84), శ్రేయస్ అయ్యర్(45), కేఎల్ రాహుల్(42) రాణించారు. సౌతాఫ్రికా- న్యూజిలాండ్ లాహోర్లో బుధవారం అమీతుమీ తేల్చుకుంటాయి. చదవండి: NZ vs PAK: రిజ్వాన్, బాబర్లపై వేటు.. పాక్ కొత్త కెప్టెన్గా స్టార్ ఆల్రౌండర్Chuldeep😭😭 https://t.co/KNa6yFug5e pic.twitter.com/fHfGsRl8iD— S A K T H I ! (@Classic82atMCG_) March 4, 2025😂😂😂 https://t.co/r5K5MJW6XX pic.twitter.com/iVansWOhAv— Ayush. (@Ayush_vk18) March 4, 2025 -
CT 2025, IND VS AUS: సిక్సర్ల శర్మ.. హిట్మ్యాన్ ఖాతాలో మరో రికార్డు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఖాతాలో మరో రికార్డు చేరింది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy-2025) భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (మార్చి 3) జరుగుతున్న మ్యాచ్లో ఓ సిక్సర్ బాదిన రోహిత్.. ఐసీసీ వన్డే ఈవెంట్లలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా అవతరించాడు. రోహిత్ ఐసీసీ వన్డే టోర్నీల్లో ఇప్పటివరకు 42 ఇన్నింగ్స్ల్లో 65 సిక్సర్లు బాదాడు. గతంలో ఈ రికార్డు రోహిత్, క్రిస్ గేల్ పేరిట సంయుక్తంగా ఉండేది. గేల్ 51 ఇన్నింగ్స్ల్లో 64 సిక్సర్లు బాదాడు. ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాస్-5 ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది.రోహిత్ శర్మ-65 సిక్సర్లు (42 ఇన్నింగ్స్లు)క్రిస్ గేల్-64 (51 ఇన్నింగ్స్లు)గ్లెన్ మ్యాక్స్వెల్-49 (30 ఇన్నింగ్స్లు)డేవిడ్ మిల్లర్-45 (30 ఇన్నింగ్స్లు)సౌరవ్ గంగూలీ-42 (32 ఇన్నింగ్స్లు)మ్యాచ్ విషయానికొస్తే.. రోహిత్ 29 బంతుల్లో 3 బౌండరీలు, ఓ సిక్సర్ సాయంతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ టోర్నీలో రోహిత్కు మరోసారి మంచి ఆరంభం లభించినప్పటికీ భారీ స్కోర్ చేయలేకపోయాడు. రోహిత్ తక్కువ స్కోర్కే ఔట్ కావడం టీమిండియా విజయావకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. 265 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ రెండో వికెట్గా వెనుదిరిగాడు. అంతకుముందు మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ కూడా తక్కువ స్కోర్కే (8) ఔటయ్యాడు. రోహిత్ ఔటయ్యే సమయానికి టీమిండియా స్కోర్ 43/2గా ఉంది. విరాట్ కోహ్లి (5), శ్రేయస్ అయ్యర్ (0) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది. రోహిత్ శర్మ వికెట్ కూపర్ కన్నోలీకి.. గిల్ వికెట్ డ్వార్షుయిస్కు దక్కింది.ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలు చేసి ఆసీస్కు ఫైటింగ్ స్కోర్ అందించారు. ఆసీస్ ఆటగాళ్లలో ట్రవిస్ హెడ్ 39, కూపర్ కన్నోలీ 0, లబూషేన్ 29, జోస్ ఇంగ్లిస్ 11, మ్యాక్స్వెల్ 7, డ్వార్షుయిస్ 19, ఆడమ్ జంపా 7, నాథన్ ఇల్లిస్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
IND vs AUS: ఛేదించేశారు..
ఆస్ట్రేలియా(India vs Australia)తో సెమీ ఫైనల్లో టీమిండియా బౌలర్లు రాణించారు. కంగారూ జట్టు భారీ స్కోరు చేయకుండా అడ్డుకట్ట వేశారు. 49.3 ఓవర్లలోనే స్మిత్ బృందాన్ని ఆలౌట్ చేశారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో తొలి సెమీ ఫైనల్లో గ్రూప్-‘ఎ’ టాపర్ భారత్- గ్రూప్-బి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా తలపడుతున్నాయి.దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో మంగళవారం నాటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఆరంభంలోనే ఓపెనర్ కూపర్ కన్నోలి(0) వికెట్ కోల్పోయిన ఆసీస్ ఇన్నింగ్స్ను మరో ఓపెనర్ ట్రవిస్ హెడ్, కెప్టెన్ స్టీవ్ స్మిత్ చక్కదిద్దారు. హెడ్ 33 బంతుల్లో 39 పరుగులు చేయగా.. వరుణ్ చక్రవర్తి అద్భుత బంతితో అతడిని పెవిలియన్కు పంపాడు.స్మిత్, క్యారీ హాఫ్ సెంచరీలుఇక అర్ధ శతకం పూర్తి చేసుకుని ప్రమాదకారిగా మారిన స్మిత్ ఆటను మహ్మద్ షమీ కట్టించాడు. 73 పరుగుల వద్ద ఉన్న సమయంలో స్మిత్ను అతడు బౌల్డ్ చేశాడు. మిగతా వాళ్లలో మార్నస్ లబుషేన్ ఫర్వాలేదనిపించగా.. అలెక్స్ క్యారీ మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 57 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. అయితే, మైదానంలో పాదరసంలా కదిలిన శ్రేయస్ అయ్యర్ అతడిని రనౌట్ చేశాడు.షమీకి మూడు వికెట్లుఇదిలా ఉంటే.. గ్లెన్ మాక్స్వెల్(7)నున అక్షర్ పటేల్ బౌల్డ్ చేయగా.. బెన్ డ్వార్షుయిస్(19), ఆడం జంపా(7), నాథన్ ఎల్లిస్(10), తన్వీర్ సంఘా(1 నాటౌట్) కనీస పోరాటం చేయలేదు. ఫలితంగా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో పేసర్ మహ్మద్ షమీ అత్యధికంగా మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకోగా.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఒక వికెట్ దక్కించుకున్నాడు. స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి రెండు, ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు.ఛేదిస్తే చరిత్రే..కాగా ఐసీసీ టోర్నమెంట్లలో 2011 తర్వాత టీమిండియా నాకౌట్ మ్యాచ్లలో ఆస్ట్రేలియాను ఓడించలేకపోయింది. అయితే, ఇప్పుడు మాత్రం ఆసీస్ విధించిన లక్ష్యాన్ని ఛేదిస్తే సరికొత్త రికార్డు సృష్టించింది. కాగా ఐసీసీ వన్డే వరల్డ్కప్ లేదా చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లలో ఆస్ట్రేలియా విధించిన అత్యధిక లక్ష్య ఛేదనను పూర్తి చేసిన ఏకైక జట్టు టీమిండియానే.వన్డే ప్రపంచకప్-2011 టోర్నీలో అహ్మదాబాద్ వేదికగా క్వార్టర్ ఫైనల్లో ఆసీస్ ఇచ్చిన 261 పరుగుల టార్గెట్ను నాడు ధోని సేన పూర్తి చేసింది. ఇక తాజాగా ఆస్ట్రేలియా 265 పరుగుల లక్ష్యాన్ని విధించింది. దీనిని ఛేదిస్తే ఆస్ట్రేలియాపై తమకున్న రికార్డును తామే బద్దలుకొట్టినట్లవుతుంది. అప్డేట్: విరాట్ కోహ్లి(84), శ్రేయస్ అయ్యర్(45), కేఎల్ రాహుల్(42) రాణించడంతో భారత్ ఆసీస్ ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేసి నాలుగు వికె ట్ల తేడాతో గెలుపొందింది.చాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి సెమీస్- తుదిజట్లు ఇవేటీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.ఆస్ట్రేలియా కూపర్ కన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా.చదవండి: రోహిత్ శర్మ ‘చెత్త’ రికార్డు! -
రోహిత్ శర్మ ‘చెత్త’ రికార్డు!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఖాతాలో ఓ చెత్త రికార్డు నమోదైంది. వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిన సారథుల జాబితాలోకి హిట్మ్యాన్ చేరాడు. నెదర్లాండ్స్ మాజీ కెప్టెన్ పీటర్ బారెన్ పేరిట ఉన్న రికార్డును అతడు సమం చేశాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్ తొలి సెమీ ఫైనల్లో టీమిండియా- ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య మ్యాచ్సందర్భంగా రోహిత్ ఖాతాలో ఈ ఫీట్ నమోదైంది.టాపర్గా నిలిచిన టీమిండియాకాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా మొదలైన ఈ వన్డే టోర్నీలో టీమిండియా మాత్రం దుబాయ్లో తమ మ్యాచ్లు ఆడుతోంది. గ్రూప్-‘ఎ’లో భాగంగా తొలుత బంగ్లాదేశ్, పాకిస్తాన్లను ఓడించి సెమీస్ చేరిన రోహిత్ సేన.. గ్రూప్ దశలో ఆఖరిదైన న్యూజిలాండ్ మ్యాచ్లోనూ గెలిచి టాపర్గా నిలిచింది. అయితే, ఈ మూడు మ్యాచ్లలో రోహిత్ శర్మ టాస్ ఓడిపోవడం గమనార్హం.తాజాగా ఆస్ట్రేలియాతో మంగళవారం నాటి సెమీస్ మ్యాచ్లోనూ రోహిత్ను మరోసారి దురదృష్టం పలకరించింది. టాస్ గెలిస్తే తమకు నచ్చిన విధంగా మ్యాచ్లో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే, గత పదకొండు సందర్భాల్లోనూ రోహిత్ టాస్ ఓడి ప్రత్యర్థి జట్టుకే మొదటి ఛాయిస్ ఇచ్చేశాడు. వరుసగా పదకొండుసార్లు టాస్ ఓడిపోయాడు.ఇక వన్డే ఇంటర్నేషనల్స్లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిన కెప్టెన్గా బ్రియన్ లారా ముందున్నాడు. అతడి తర్వాతి స్థానంలో పీటర్ బారెన్, రోహిత్ శర్మ కొనసాగుతున్నారు.వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన కెప్టెన్లు👉బ్రియన్ లారా- వెస్టిండీస్ మాజీ సారథి- అక్టోబరు 1998- మే 1999 వరకు- 12 సార్లు టాస్ ఓడిపోయాడు.👉పీటర్ బారెన్- నెదర్లాండ్స్ మాజీ కెప్టెన్- మార్చి 2011 నుంచి ఆగష్టు 2013👉రోహిత్ శర్మ- ఇండియా కెప్టెన్- నవంబరు 2023- మార్చి 2025*గ్రూప్ దశలోనే ఆ జట్ల ఇంటిబాటకాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో మొత్తం ఎనిమిది జట్లు భాగమయ్యాయి. ఆతిథ్య జట్టు హోదాలో నేరుగా పాకిస్తాన్ అర్హత సాధించగా.. వన్డే వరల్డ్కప్-2023లో అదరగొట్టిన ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్లతో పాటు ఇంగ్లండ్ టోర్నీలో అడుగుపెట్టాయి.ఈ క్రమంలో వీటిని రెండు గ్రూపులుగా విభజించగా గ్రూప్-ఎ నుంచి భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీపడ్డాయి. పాక్, బంగ్లాదేశ్లతో పాటు.. అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ గ్రూప్ దశలోనే నిష్క్రమించగా.. భారత్, న్యూజిలాండ్.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీ ఫైనల్కు చేరుకున్నాయి. దుబాయ్లో మార్చి 4న తొలి సెమీస్లో భారత్- ఆసీస్.. లాహోర్ మార్చి 5న రెండో సెమీస్లో సౌతాఫ్రికా-న్యూజిలాండ్ తలపడేలా షెడ్యూల్ ఖరారైంది.చదవండి: IND vs AUS: ఆ ఒక్కడే కాదు.. వాళ్లంతా ప్రమాదకరమే.. మేము గెలవాలంటే: స్మిత్ -
IND vs AUS: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతడే: సురేశ్ రైనా
క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా టీమిండియా- ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ గురించే చర్చ. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) కీలక పోరులో విజయం సాధించే జట్టుపై మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో మెజారిటీ మంది భారత్వైపే మొగ్గుచూపుతున్నారు. ఒకే వేదికపైనే తమ మ్యాచ్లన్నీ ఆడటం టీమిండియాకు సానుకూలంగా మారిందని అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా(Suresh Raina) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకునే ఆటగాడిపై తన అంచనా తెలియజేశాడు. భారత్- ఆసీస్ మ్యాచ్లో టీమిండియా రన్మెషీన్ విరాట్ కోహ్లి ఈ అవార్డు గెలుచుకుంటాడని జోస్యం చెప్పాడు.ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతడేఅదే విధంగా.. ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్లో కెప్టెన్ రోహిత్ శర్మ శతకం బాదితే టీమిండియా గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందని సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. అయితే, ఫీల్డింగ్, క్యాచ్ల విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా మొదటికే మోసం వస్తుందని రోహిత్ సేనను రైనా హెచ్చరించాడు.ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఆసీస్తో మ్యాచ్లో విరాట్ కోహ్లి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలుస్తాడు. ఇక ఈ ఐసీసీ టోర్నీలో శ్రేయస్ అయ్యర్ ఎంత అద్భుతంగా ఆడుతున్నాడో మనం చూస్తూనే ఉన్నాం.కోహ్లి అయితే వికెట్ల మధ్య పరిగెడుతున్న తీరు అబ్బురపరుస్తోంది. రోహిత్ శర్మ- శుబ్మన్ గిల్ శుభారంభం అందిస్తే మనకు తిరుగు ఉండదు. అయితే, కేఎల్ రాహుల్ కూడా బ్యాట్ ఝులిపించాడు. అతడు కూడా ఫామ్లోకి వస్తే జట్టుకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. రోహిత్ గనుక సెంచరీ చేశాడంటే విజయం మనదే.అయితే, ఫీల్డింగ్లో నిర్లక్ష్యం వద్దు. క్యాచ్లు మిస్ చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి’’ అని సురేశ్ రైనా టీమిండియాకు సూచనలు ఇచ్చాడు. కాగా ఆస్ట్రేలియాతో ఐసీసీ టోర్నమెంట్లలో 2011 నుంచి టీమిండియాకు పరాభవాలే ఎదురవుతున్నాయి. కీలక మ్యాచ్లలో ఆసీస్ చేతిలో ఓడిపోతోంది. అయితే, దుబాయ్లో జరిగే ఈ మ్యాచ్లో మాత్రం టీమిండియా ఫేవరెట్గా కనిపిస్తోంది.ఇక దుబాయ్ వేదికగా మంగళవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. టీమిండియా ఫీల్డింగ్ చేస్తోంది. ఆసీస్ తుదిజట్టులో రెండు మార్పులు చేయగా.. భారత్ కివీస్తో ఆడిన టీమ్తోనే బరిలోకి దిగింది.సెమీ ఫైనల్ 1- తుదిజట్లు ఇవేభారత్రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.ఆస్ట్రేలియా కూపర్ కన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా.చదవండి: CT 2025: కివీస్తో సెమీస్.. సఫారీలకు గాయాల బెడద! జట్టులోకి స్టార్ ప్లేయర్ -
Champions Trophy 2025: ఆసీస్పై ఘన విజయం.. ఫైనల్లో టీమిండియా
ICC Champions Trophy 2025- India vs Australia, 1st Semi-Final: 4 వికెట్ల తేడాతో ఆసీస్ను చిత్తు చేసిన భారత్48.1వ ఓవర్: మ్యాక్స్వెల్ బౌలింగ్లో సిక్సర్ బాది కేఎల్ రాహుల్ (42 నాటౌట్) మ్యాచ్ను ఫినిష్ చేశాడు. భారత్ 4 వికెట్ల తేడాతో ఆసీస్ను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులు చేయగా.. భారత్ 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఛేదనలో విరాట్ కోహ్లి కీలకమైన ఇన్నింగ్స్ (84) ఆడి భారత్ను గెలిపించాడు. ఆఖర్లో హార్దిక్ (24 బంతుల్లో 28) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ గెలుపులో శ్రేయస్ అయ్యర్ (45), అక్షర్ పటేల్ (27) తలో చేయి వేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (28) మెరుపు ఆరంభాన్ని అందించాడు. అంతుకుముందు స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.84 పరుగుల వద్ద విరాట్ కోహ్లి ఔట్42.4 ఓవర్: 225 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. ఆడమ్ జంపా బౌలింగ్లో డ్వార్షుయిస్కు క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లి (84) ఔటయ్యాడు.కేఎల్ రాహుల్కు (31) జతగా హార్దిక్ పాండ్యా క్రీజ్లోకి వచ్చాడు.నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా34.5వ ఓవర్: నాథన్ ఇల్లిస్ బౌలింగ్లో అక్షర్ పటేల్ (27) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 35 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 178/4గా ఉంది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే 90 బంతుల్లో 87 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. విరాట్కు (68) జతగా కేఎల్ రాహుల్ క్రీజ్లోకి వచ్చాడు. మూడో వికెట్ కోల్పోయిన భారత్26.2వ ఓవర్: ఆడమ్ జంపా బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్ (45) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. విరాట్కు (51) జతగా అక్షర్ పటేల్ క్రీజ్లోకి వచ్చాడు. టీమిండియా స్కోర్ 134/3గా ఉంది.హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్24.5వ ఓవర్: ఆడమ్ జంపా బౌలింగ్లో బౌండరీ బాది విరాట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విరాట్ ఈ ఇన్నింగ్స్లో 53 బంతులు ఎదుర్కొని 4 బౌండరీలు సాధించాడు. విరాట్కు జతగా మరో ఎండ్లో శ్రేయస్ (43) ఉన్నాడు. 25 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 131/2గా ఉంది.రోహిత్ శర్మ అవుట్7.5: రోహిత్ శర్మ(29 బంతుల్లో 28) రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ఆసీస్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కూపర్ కన్నోలి బౌలింగ్లో రోహిత్ లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగాడు. కోహ్లి ఐదు పరుగులతో ఉండగా.. శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు: 43-2(8)గిల్ అవుట్4.6: శుబ్మన్ గిల్ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. డ్వార్షుయిస్ బౌలింగ్లో గిల్ బౌల్డ్ అయ్యాడు. పదకొండు బంతులు ఎదుర్కొని 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. కోహ్లి క్రీజులోకి రాగా.. రోహిత్ శర్మ 21 పరుగులతో ఉన్నాడు. భారత్ స్కోరు: 30-1 ఆసీస్ ఆలౌట్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఆడం జంపా బౌల్డ్అయ్యాడు. ఏడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పదో వికెట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో 49.3 ఓవర్లలో 264 పరుగులు చేసి ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. టీమిండియాకు 265 పరుగుల లక్ష్యాన్ని విధించింది. భారత బౌలర్లలో పేసర్లు మహ్మద్ షమీ మూడు వికెట్లు , హార్దిక్ పాండ్యా ఒక వికెట్ తీయగా.. స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆసీస్నాథన్ ఇల్లిస్(10) రూపంలో ఆసీస్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి అతడు అవుటయ్యాడు. ఆసీస్ స్కోరు: 262-9(49). తన్వీర్సంఘా క్రీజులోకి వచ్చాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆసీస్.. క్యారీ ఔట్47.1వ ఓవర్: 249 పరుగుల వద్ద ఆసీస్ ఎనిమిదో వికెట్ను కోల్పోయింది. అలెక్స్ క్యారీ (61) స్ట్రయిక్ తన వద్దే ఉంచుకునేందుకు లేని రెండో పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన డైరెక్ట్ త్రోతో క్యారీని రనౌట్ చేశాడు. ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్45.1 ఓవర్: 239 పరుగుల వద్ద ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్ క్యాచ్ పట్టడంతో బెన్ డ్వార్షుయిస్ (19) పెవిలియన్కు చేరాడు. అలెక్సీ క్యారీకి (54) జతగా ఆడమ్ జంపా క్రీజ్లోకి వచ్చాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న క్యారీ42.2 ఓవర్: కీలకమైన తరుణంలో అలెక్స్ క్యారీ అద్భుతమైన హాఫ్ సెంచరీ చేశాడు. క్యారీ 48 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 45 ఓవర్ల అనంతరం ఆసీస్ స్కోర్ 240/6గా ఉంది. క్యారీ 54, బెన్ డ్వార్షుయిష్ 19 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఆసీస్కు బిగ్ షాక్37.3:ఆసీస్ బిగ్ హిట్టర్ గ్లెన్ మాక్స్వెల్ను అనూహ్య రీతిలో అక్షర్ బౌల్డ్ చేశాడు. ఐదు బంతుల్లో ఏడు పరుగులు చేసి మాక్సీ నిష్క్రమించాడు. క్యారీ 39 పరుగులతో ఉండగా.. డ్వార్షుయిస్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 205/6 (37.3)ఎట్టకేలకు స్మిత్ అవుట్36.4: భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారి ఇబ్బంది పెట్టిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఎట్టకేలకు అవుటయ్యాడు. షమీ బౌలింగ్లో బౌల్డ్ అయి 73 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. స్కోరు: 198/5 (36.5). మాక్స్వెల్ క్రీజులోకి వచ్చాడు.నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్26.6: రవీంద్ర జడేజా బౌలింగ్ జోష్ ఇంగ్లిస్ విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఫలితంగా ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. 12 బంతులు ఎదుర్కొన్న ఇంగ్లిస్ 11 పరుగులు చేసి నిష్క్రమించాడు. మరోవైపు.. స్మిత్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అలెక్స్ క్యారీ క్రీజులోకి వచ్చాడు. ఆసీస్ స్కోరు: 144-4మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్22.3: లబుషేన్ రూపంలో ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా అతడు వెనుదిరిగాడు. 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. జోష్ ఇంగ్లిస్ క్రీజులోకి వచ్చాడు. ఆసీస్ స్కోరు: 111/3 (22.4)వంద పరుగుల మార్కు దాటేసిన కంగారూలు20 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ స్కోరు: 105/2స్మిత్ 36, లబుషేన్ 24 రన్స్తో ఉన్నారు.పద్నాలుగు ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోరు: 72/2లబుషేన్ 4, స్మిత్ 23 పరుగులతో ఉన్నారు.8.2: ట్రవిస్ హెడ్ అవుట్ఆసీస్కు భారీ షాక్ తగిలింది. హార్డ్ హిట్టర్, ఓపెనర్ ట్రవిస్ హెడ్ అవుటయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో శుబ్మన్ గిల్కు క్యాచ్ ఇచ్చి 39 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. దీంతో ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. మార్నస్ లబుషేన్ క్రీజులోకి వచ్చాడు. ఆసీస్ స్కోరు: 54/2 (8.2) కన్నోలీ డకౌట్ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. మూడు ఓవర్లు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఓపెనర్ కూపర్ కన్నోలీ డకౌట్ అయ్యాడు. షమీ బౌలింగ్లో కీపర్ రాహుల్కు క్యాచ్ ఇచ్చిన కూపర్ డకౌట్గా పెవిలియన్ బాట పట్టాడు. 3 ఓవర్లకు ఆసీస్ స్కోర్ 4/1గా ఉంది. ప్రస్తుతం క్రీజులో హెడ్, స్మీత్ కొనసాగుతున్నారు. టాస్ గెలిచిన ఆసీస్ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి సెమీ ఫైనల్ మ్యాచ్కు నగారా మోగింది. దుబాయ్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. ‘‘పిచ్ పొడిగా ఉంది. ఇక్కడ మేము రెండు సెషన్ల పాటు ప్రాక్టీస్ చేశాం. బ్యాటింగ్ చేయడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం.బంతి స్పిన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. టీమిండియా బలమైన జట్టు. గత మ్యాచ్లో ఆడిన జట్టులో రెండు మార్పులు చేశాం. మాథ్యూ షార్ట్ స్థానంలో కూపర్ కన్నోలి వచ్చాడు. స్పెన్సర్ జాన్సన్స్థానాన్ని తన్వీన్ సంఘా భర్తీ చేశాడు’’ అని తెలిపాడు.అదే జట్టుతో భారత్మరోవైపు టీమిండియా సారథి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘పిచ్ స్వభావం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంది. గత మూడు మ్యాచ్లలో మేము రాణించాం. కివీస్తో ఆడిన జట్టుతోనే మరోసారి ముందుకు వెళ్తున్నాం’’ అని పేర్కొన్నాడు. కాగా గత మ్యాచ్లో పేసర్ హర్షిత్ రాణాపై వేటు వేసి స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఆడించగా.. అతడు ఐదు వికెట్లతో మెరిశాడు. ఇక సెమీస్లోనూ స్పిన్నర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న అంచనాల నడుమ భారత్తో పాటు ఆసీస్ కూడా వారివైపే మొగ్గు చూపింది.తుదిజట్లు ఇవేభారత్రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.ఆస్ట్రేలియా కూపర్ కన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా. -
IND vs AUS: అతడిలో ప్రత్యేక ప్రతిభ ఉంది: రోహిత్ శర్మ
ఆస్ట్రేలియా(India vs Australia)తో సెమీ ఫైనల్లో తుదిజట్టు కూర్పు గురించి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కీలక వ్యాఖ్యలు చేశాడు. నలుగురు స్పిన్నర్లతో ఆడాలా? వద్దా? అనే అంశంపై సమాలోచనలు జరుపుతున్నామన్నాడు. పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా తమ వ్యూహాలు మార్చుకుంటామని స్పష్టం చేశాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) తొలి సెమీస్ మ్యాచ్లో రోహిత్ సేన ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.దుబాయ్ వేదికగా మంగళవారం జరిగే ఈ మ్యాచ్లో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి. ఇక ఐసీసీ నాకౌట్ మ్యాచ్లలో గత కొన్నేళ్లుగా కంగారూల చేతిలో తమకు ఎదురవుతున్న చేదు అనుభవాలకు ఈ మ్యాచ్తో సమాధానం చెప్పాలని భారత్ ఎదురుచూస్తోంది.ఇక ఈ వన్డే టోర్నీ లీగ్ దశలో మూడింటికి మూడూ గెలిచి హ్యాట్రిక్ విజయాలతో రోహిత్ సేన పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలో దిగనుండగా.. ఇంగ్లండ్, ఆసీస్ మాజీ క్రికెటర్లు మాత్రం ఒకే వేదికపై ఆడటం వల్ల టీమిండియాకు అదనపు ప్రయోజనాలు చేకూరుతున్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు.విమర్శకులకు రోహిత్ కౌంటర్ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ.. ‘‘ఒకే నగరంలో ఉంటూ ఒకే వేదికపై అన్ని మ్యాచ్లు ఆడటం పట్ల మాపై విమర్శలు వస్తున్నాయి. అయితే ఇదేమీ మాకు అదనపు ప్రయోజనం కలిగించడం లేదు.ప్రతీసారి పిచ్ కొత్త సవాళ్లు విసురుతోంది. మూడు మ్యాచ్లలోను పిచ్ భిన్నంగా స్పందించింది. ఇది మా సొంత మైదానం కాదు. దుబాయ్లో మేం తరచుగా మ్యాచ్లు ఆడం. మాకు కూడా ఇది కొత్తగానే ఉంది’’ అని కౌంటర్ ఇచ్చాడు.అతడిలో ప్రత్యేక ప్రతిభఅదే విధంగా.. ‘‘ఆస్ట్రేలియా ఎప్పుడైనా బలమైన ప్రత్యర్థే. మైదానంలో సహజంగానే కొంత ఉత్కంఠ ఖాయం. అయితే గెలవాలనే ఒత్తిడి మాపైనే కాదు వారిపైనా ఉంది. కీలక ఆటగాళ్లు లేకపోయినా ఆ జట్టులో పోరాటపటిమకు లోటు ఉండదు.కాబట్టి మా వ్యూహాలు, ప్రణాళికలకు అనుగుణంగా మేం బాగా ఆడటం ముఖ్యం. వరుణ్ చక్రవర్తిలో ప్రత్యేక ప్రతిభ ఉంది. అతడి ఎంపికపై కొన్ని విమర్శలు వచ్చినా సరే, జట్టు ప్రయోజనాల కోసం ప్రత్యేక ఆటగాడిగా చూస్తూ అతడికి సరైన సమయంలో అవకాశం ఇవ్వడం ముఖ్యం. మా నమ్మకాన్ని అతడు నిలబెట్టుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్లోనూ నలుగురు స్పిన్నర్లను ఆడించాలనేలా పిచ్ ఊరిస్తోంది. కానీ ఆఖరి నిమిషంలో ఏదైనా జరగవచ్చు’’ అని రోహిత్ శర్మ తమ తుదిజట్టులో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇచ్చే అంశం గురించి ప్రస్తావించాడు.కాగా గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో ఒకే జట్టుతో బరిలోకి దిగిన టీమిండియా.. ఆఖరిగా న్యూజిలాండ్తో మ్యాచ్లో మాత్రం అదనపు స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తిని బరిలోకి దింపింది. కివీస్తో మ్యాచ్లో అతడు ఏకంగా ఐదు వికెట్లు తీయడంతో ఆసీస్తో మ్యాచ్లో తుదిజట్టు కూర్పు భారత్కు తలనొప్పిగా మారింది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియారోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా.బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో ఆడిన జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.న్యూజిలాండ్తో ఆడిన జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.చదవండి: షమీ సాబ్.. ఇప్పటికే చాలా ఎక్కువైంది.. అతడి పని పట్టాల్సిందే..: టీమిండియా దిగ్గజం -
రోహిత్పై బాడీషేమింగ్ కామెంట్స్.. కోహ్లీని వదలని షామా!
న్యూఢిల్లీ: స్టార్ బ్యాటర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై బాడీ షేమింగ్ పోస్టుతో వివాదంలో చిక్కుకున్న కాంగ్రెస్ నేత షామా మహమ్మద్.. ఎట్టకేలకు స్పందించారు. రోహిత్ అభిమానులు, టీమిండియా మాజీలు, బీజేపీ, ఆఖరికి సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ జాతీయ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.‘‘ఓ ఆటగాడు ఎప్పుడూ ఫిట్గా ఉండాలన్నది నా అభిప్రాయం. అందుకే రోహిత్ శర్మ విషయంలో పరిశీలనపూర్వకంగానే నేను మాట్లాడా. అతను కాస్త ఓవర్వెయిట్ అనిపించాడు. అందుకే అలా ట్వీట్ చేశా. అందులో బాడీ షేమింగ్ ఏం లేదు. నేనేం తప్పు చేయలేదు’’ అని అన్నారామె. ఈ క్రమంలో.. గతంలో టీమిండియా మాజీ కెప్టెన్ల పేర్లను ప్రస్తావించిన షామా.. వాళ్లతో రోహిత్ను బాడీని పోల్చారు.#WATCH | On her comment on Indian Cricket team captain Rohit Sharma, Congress leader Shama Mohammed says, "It was a generic tweet about the fitness of a sportsperson. It was not body-shaming. I always believed a sportsperson should be fit, and I felt he was a bit overweight, so I… pic.twitter.com/OBiLk84Mjh— ANI (@ANI) March 3, 2025ఇది ప్రజాస్వామ్యం.. అందులో తప్పేం ఉంది. నాకు మాట్లాడే హక్కు ఉంది అని అన్నారామె. అలాగే.. ఈ సందర్భంగా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై షామా ప్రశంసలు గుప్పించారు. గతంలో పాక్పై ఓటమి తర్వాత మహమ్మద్ షమీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో షమీకి కోహ్లీ అండగా నిలిచాడు. అందుకు కోహ్లీని కూడా విమర్శించారు. తోటి ఆటగాళ్లకు అండగా ఉంటూ జట్టును ముందు ఉండి నడిపించడం, పరుగులు చేయడం, ప్రత్యర్థి జట్టు ప్రదర్శన గురించి తెలిసి ఉండడం.. ఇవన్నీ మంచి సారథికి ఉండే లక్షణాలు. ఇవన్నీకోహ్లీకి ఉన్నాయి. ప్రత్యర్థులు బాగా ఆడినా మెచ్చుకునేందుకు కోహ్లీ వెనకాడడు’’ అని షామా అన్నారు. అయితే ఇదే షామా గతంలో కోహ్లీపై చేసిన ఓ పోస్ట్ అంటూ ఒక స్క్రీన్ షాట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.2018లో కెప్టెన్గా ఉన్న సమయంలో కోహ్లీ ఓ ఫ్యాన్ పెట్టిన పోస్టుకు తీవ్రంగా స్పందించాడు. ‘‘నాకు భారతీయుల కంటే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రీడాకారుల క్రికెట్ బాగుంటుంది. ఇక కోహ్లీని అయితే జనాలు అనసవరంగా ఆకాశానికి ఎత్తేస్తుంటారు’’ అని ఓ ఫ్యాన్ చేసిన పోస్టును కోహ్లీ స్వయంగా చదివి వినిపించాడు.‘‘నువ్వు ఇండియాలో ఉండాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. భారత్లో ఉంటూ ఇతర దేశాలపై అభిమానం చూపించడం ఏమిటి. నీకు నేను నచ్చకపోవడంపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే, ఇతర దేశాల వారు నచ్చినప్పుడు నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం’’ అని కోహ్లీ అన్నాడు.అయితే.. కోహ్లీ పోస్టుపై అప్పట్లో షామా చాలా ఘాటుగా స్పందించారు. ‘‘బ్రిటిషర్లు కనిపెట్టిన ఆటను కోహ్లీ ఆడుతుంటాడు. విదేశీ బ్రాండ్లకు ప్రచారం చేస్తూ కోట్లు సంపాదిస్తుంటాడు. పెళ్లి కూడా ఇటలీలో చేసుకున్నాడు. హెర్షెల్ గిబ్స్ తన ఫేవరెట్ క్రికెటర్ అని కూడా చెబుతాడు. కెర్బర్ తన ఫేవరెట్ టెన్నిస్ ప్లేయర్ అని అంటాడు. కానీ ఇతర దేశాల క్రీడాకారులను అభిమానించే వారు మాత్రం దేశాన్ని విడిచిపెట్టి పోవాలని అంటాడు’’ అని షామా మండిపడ్డారు. రోహిత్పై ఆమె చేసిన కామెంట్లు దుమారం రేపడం, కోహ్లీని పొగడడం నేపథ్యంలో ఈ పోస్ట్ మళ్లీ తెరపైకి వచ్చింది.షామా ఏమన్నారంటే..ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్తో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. ‘‘క్రీడాకారుడిగా రోహిత్ శర్మ ఫిట్గా లేడు. అతడు బరువు తగ్గాలి. అంతేకాదు.. గత కెప్టెన్లతో పోలిస్తే అత్యంత ఆకట్టుకోని సారథి ఇతడే’’ అని షామా రాసుకొచ్చారు. ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్గా మారడంతో దీనిపై తీవ్ర వివాదం రాజుకుంది. -
షమీ సాబ్.. ఇప్పటికే చాలా ఎక్కువైంది.. ఇక..: టీమిండియా దిగ్గజం
ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్కు ముందు టీమిండియాకు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) మూడు కీలక సూచనలు చేశాడు. కంగారూలకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వకూడదని.. గత మూడు మ్యాచ్ల ఫలితాన్నే ఇక్కడా పునరావృతం చేయాలని కోరాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్ గ్రూప్-ఎ టాపర్గా నిలిచింది.ఈ మెగా టోర్నమెంట్కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుండగా.. దుబాయ్(Dubai)లో తమ మ్యాచ్లు ఆడుతున్న టీమిండియా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. తొలుత బంగ్లాదేశ్ను.. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్(India vs Pakistan)ను.. అనంతరం ఆఖరి మ్యాచ్లో భాగంగా న్యూజిలాండ్ జట్టును ఓడించింది. ఈ క్రమంలో ఈ వన్డే టోర్నమెంట్ తొలి సెమీ ఫైనల్లో భాగంగా మంగళవారం ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.అయితే, ఐసీసీ టోర్నీల్లో 2011 తర్వాత నాకౌట్ మ్యాచ్లలో ఆసీస్దే పైచేయిగా ఉన్న నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రోహిత్ సేనకు పలు సూచనలు చేశాడు. ముందుగా ట్రవిస్ హెడ్ ఆట కట్టించాలని.. ఆ తర్వాత గ్లెన్ మాక్స్వెల్ లాంటి వాళ్ల పనిపట్టాలని భారత బౌలర్లకు సూచించాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ..షమీ సాబ్.. ఇప్పటికే చాలా ఎక్కువైంది కదా..‘‘ముందుగా ట్రవిస్ హెడ్ గురించి మీ మెదళ్లలో గూడు కట్టుకున్న భయాన్ని తీసేయండి. వీలైనంత త్వరగా అతడిని అవుట్ చేయడం మంచిది. షమీ సాబ్.. ఇప్పటికే చాలా ఎక్కువైంది కదా.. హెడ్కు ఎక్కువ పరుగులు చేసే అవకాశం అస్సలు ఇవ్వద్దని గుర్తుపెట్టుకోండి.ఇక నా రెండో సూచన ఏమిటంటే.. గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్ వంటి హార్డ్ హిట్టర్లు ఆస్ట్రేలియా జట్టులో ఉన్నారు. వాళ్లు అలవోకగా సిక్సర్లు, ఫోర్లు బాదుతారు. ఫాస్ట్ పేస్లో వాళ్లకు ఎక్కువగా పరుగులు చేసే అవకాశం ఇవ్వకండి.మూడోది.. ముఖ్యమైన సూచన.. ఇది నాకౌట్ మ్యాచ్ అన్న విషయాన్ని మీరు పూర్తిగా మర్చిపోండి. సాధారణ మ్యాచ్ మాదిరిగానే దీనిని భావించండి’’ అని భజ్జీ రోహిత్ సేనకు సలహాలు ఇచ్చాడు. ఈ మూడు బలహీనతలను అధిగమిస్తే విజయం కచ్చితంగా టీమిండియానే వరిస్తుందని అభిప్రాయపడ్డాడు.విధ్వంసకరవీరుడు.. చితక్కొట్టాడుకాగా ట్రవిస్ హెడ్కు టీమిండియాపై మంచి రికార్డు ఉంది. ముఖ్యంగా వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో మ్యాచ్ టీమిండియా చేజారడానికి ప్రధాన కారణం ఈ విధ్వంసకరవీరుడు. నాడు అహ్మదాబాద్ మ్యాచ్లో భారత స్పిన్ త్రయం కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా.. బౌలింగ్ను చితక్కొట్టాడు. కేవలం 120 బంతుల్లోనే 137 పరుగులు సాధించి ఆసీస్ ఆరోసారి విశ్వవిజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే భజ్జీ హెడ్ను టార్గెట్ చేయాలని భారత బౌలర్లకు చెప్పాడు.టీమిండియాదే గెలుపుఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రోహిత్ సేనకు మద్దతు పలికాడు.‘‘గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టు ఇది. వన్డే వరల్డ్కప్ ఫైనల్ కూడా దాదాపుగా వీళ్లే ఆడారు. ఏ రకంగా చూసినా మన జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ప్రత్యర్థి జట్టు ఏదైనా దానిని ఓడించగల సత్తా టీమిండియాకు ఉంది’’ అని పేర్కొన్నాడు. సెమీ ఫైనల్లో భారత్ ఆసీస్ను ఓడించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. చదవండి: IPL 2025: కొత్త కెప్టెన్ పేరును ప్రకటించిన కేకేఆర్ -
Ind vs Aus: ఆసీస్ గొప్ప జట్టు.. కానీ..: రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా టైటిల్ రేసులో ముందుకు దూసుకుపోతోంది. గ్రూప్-‘ఎ’లో భాగంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్లను ఓడించి.. మూడింట మూడు విజయాలతో టాపర్గా నిలిచింది. ఇదే జోరులో సెమీ ఫైనల్లోనూ గెలుపొంది టైటిల్ పోరుకు అర్హత సాధించాలనే పట్టుదలతో ఉంది.నాకౌట్ మ్యాచ్లలో..అయితే, సెమీస్లో గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా(India vs Australia) రూపంలో పటిష్టమైన ప్రత్యర్థి జట్టు రోహిత్ సేనకు సవాలుగా మారింది. ద్వైపాక్షిక సిరీస్ల సంగతి పక్కనపెడితే.. 2011 తర్వాత ఐసీసీ టోర్నమెంట్ల నాకౌట్ మ్యాచ్లలో కంగారూ జట్టు చేతిలో టీమిండియాకు పరాభవాలు తప్పడం లేదు. సొంతగడ్డపై లక్షలకు పైగా ప్రేక్షకుల నడుమ వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో భారత్ కమిన్స్ బృందం చేతిలో ఓడిన తీరును అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.ఈ క్రమంలో మంగళవారం దుబాయ్లో ఆసీస్తో జరిగే సెమీస్ మ్యాచ్లో ప్రతీకారం తీర్చుకోవాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. భారత మాజీ క్రికెటర్లు సైతం గత చేదు అనుభవాలను మరిపించేలా రోహిత్ సేన ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఆసీస్ గొప్ప జట్టు.. కానీ..‘‘ఆసీస్ పటిష్ట జట్టు. మాకు గొప్ప ప్రత్యర్థి. అయితే, సెమీస్తో మ్యాచ్లో మా విధానం మారదు. గత మూడు మ్యాచ్ల మాదిరే మా ప్రణాళికలు ఉంటాయి. అయితే, ఆసీస్ జట్టును బట్టి వ్యూహాల్లో కొన్ని మార్పులు చేసుకుంటాం.ఇక సెమీ ఫైనల్ అంటే మా మీద మాత్రమే ఒత్తిడి ఉంటుందని అనుకోకూడదు. ఆస్ట్రేలియా పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. అయితే, జట్టుగా ఎలా రాణించాలన్న అంశం మీదే మేము ఎక్కువగా దృష్టి సారించాం. బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణిస్తే మాకు తిరుగే ఉండదు. సుదీర్ఘకాలంగా ఆస్ట్రేలియా గొప్ప జట్టుగా కొనసాగుతోంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, మేము కూడా తక్కువేమీ కాదు. ప్రత్యర్థి ముందు అంత తేలికగా తలవంచే రకం కాదు.ఇరుజట్లకు ఈ మ్యాచ్ అత్యంత ముఖ్యమైంది. మేము అన్ని విధాలుగా సన్నద్ధమవుతున్నాం. ప్రణాళికలు పక్కాగా అమలు చేస్తే.. అనుకున్న ఫలితం అదే వస్తుంది. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్పై విజయం తర్వాత పీటీఐతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా రోహిత్ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా.ఆస్ట్రేలియా జట్టుజేక్ ఫ్రేజర్-మెక్గర్క్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ క్యారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడం జంపా, స్పెన్సర్ జాన్సన్, సీన్ అబాట్, ఆరోన్ హార్డీ, తన్వీర్ సంఘా, కూపర్ కన్నోలి.చదవండి: ఇదేం పని జడ్డూ? ఆటగాడు ఇలా చేయొచ్చా?: కివీస్ మాజీ క్రికెటర్ ఫైర్ -
BCCI: ‘రోహిత్ లావుగా ఉన్నాడు.. కెప్టెన్గానూ గొప్పోడు కాదు ’.. స్పందించిన బీసీసీఐ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ షామా మొహమద్(Dr Shama Mohamed) చేసిన వ్యాఖ్యలను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా(Devajit Saikia ) ఖండించారు. బాధ్యతగల పదవిలో ఉన్న వ్యక్తుల నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో భారత్ సెమీ ఫైనల్ ఆడేందుకు సిద్ధమవుతుంటే.. రాజకీయ నాయకులు జట్టుపై ప్రభావం పడేలా ఇలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.కాగా చాంపియన్స్ ట్రోఫీ- 2025లో భాగంగా టీమిండియా ఆదివారం న్యూజిలాండ్తో మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. కివీస్ను 44 పరుగుల తేడాతో ఓడించి హ్యాట్రిక్ విజయంతో లీగ్ దశను ముగించింది. అయితే, దుబాయ్లో జరిగిన ఈ మ్యాచ్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ 15 పరుగులకే అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన షామా మొహమద్ ‘ఎక్స్’ వేదికగా రోహిత్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.యావరేజ్ ఆటగాడు.. అవునా?‘‘క్రీడాకారులు ఫిట్గా ఉండాలి. అతడు అధిక బరువుతో ఉన్నాడు. కెప్టెన్గానూ ఆకట్టుకోలేకపోతున్నాడు. మాజీ కెప్టెన్లతో పోలిస్తే అసలు అతడు ఎందుకూ కొరగాడు. యావరేజ్ ఆటగాడు’’ అని షామా పేర్కొన్నారు. అయితే, రోహిత్ శర్మను ఉద్దేశించి ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ద్వైపాక్షిక సిరీస్లలో భారత్కు అధిక విజయాలు అందించడంతో పాటు.. కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని తర్వాత టీమిండియాకు వరల్డ్కప్ అందించిన సారథి, వన్డేలలో అత్యధికంగా మూడు డబుల్ సెంచరీ చేసిన మొనగాడి పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు సరికాదంటూ పెద్ద ఎత్తున షామాపై ట్రోలింగ్ జరిగింది.అదేమీ బాడీ షేమింగ్ కాదే!ఈ నేపథ్యంలో వివరణ ఇచ్చే క్రమంలో షామా మొహమద్ మాట్లాడిన తీరు రోహిత్ అభిమానులకు మరింత ఆగ్రహం తెప్పించింది. ‘‘క్రీడాకారులకు ఫిట్నెస్ ఎంత ముఖ్యమో చెప్పే క్రమంలో నేను ఆ ట్వీట్ చేశాను. అదేమీ బాడీ షేమింగ్ కాదే!.. నేను కేవలం ఫిట్నెస్ గురించే మాట్లాడాను. అతడు కాస్త లావుగా ఉన్నాడనిపించింది. అదే విషయం గురించి ట్వీట్ చేశా.కారణం లేకుండానే నాపై మాటల దాడికి దిగుతున్నారు. ఇతర కెప్టెన్లు.. అంటే ధోని, గంగూలీ, ద్రవిడ్, టెండుల్కర్, కపిల్ దేవ్, విరాట్ కోహ్లిలతో అతడిని పోల్చినప్పుడు రోహిత్ గురించి నాకేం అనిపించిందో అదే చెప్పాను. ఇది ప్రజాస్వామ్యం. నా అభిప్రాయాన్ని పంచుకునే హక్కు నాకు ఉంది. నా మాటల్లో తప్పేముంది?నేను ఓ వ్యక్తిని ఉద్దేశించి ఇలా మాట్లాడలేదు. అయినా ప్రజాస్వామ్యం గురించి అర్థం చేసుకోవడంలో నేను విఫలమయ్యాననుకుంటా. నాకు తెలిసి ప్రజాస్వామ్యంలో ఇలా మాట్లాడకూడదేమో’’ అని షామా మొహమద్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే, షామా వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలపగా.. బీజేపీ మాత్రం ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.హుందాగా ప్రవర్తించాలిఇక ఈ విషయంపై తీవ్రస్థాయిలో దుమారం రేగడంతో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్వయంగా స్పందించారు. ‘‘టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఇలాంటి మాటలు వినాల్సి రావడం దురదృష్టకరం. బాధ్యత గల పదవుల్లో ఉన్న వ్యక్తులు హుందాగా ప్రవర్తించాలి. టీమిండియా కీలక సెమీ ఫైనల్ ఆడేముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు’’ అని షామా వ్యాఖ్యలను ఖండించారు.కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడించిన రోహిత్ సేన.. తదుపరి పాకిస్తాన్, న్యూజిలాండ్పై వరుస విజయాలు సాధించింది. ఈక్రమంలో గ్రూప్-‘ఎ’ టాపర్గా నిలిచిన టీమిండియా మంగళవారం నాటి తొలి సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.చదవండి: వారిద్దరూ అద్భుతం.. కానీ అది మాకు తలనొప్పిగా మారింది: రోహిత్#WATCH | On her comment on Indian Cricket team captain Rohit Sharma, Congress leader Shama Mohammed says, "It was a generic tweet about the fitness of a sportsperson. It was not body-shaming. I always believed a sportsperson should be fit, and I felt he was a bit overweight, so I… pic.twitter.com/OBiLk84Mjh— ANI (@ANI) March 3, 2025 -
రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత బాడీ షేమింగ్ వ్యాఖ్యలు
ఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ నాయకురాలు షామా మొహమ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారు. రోహిత్ లావుగా ఉంటాడు.. బరువు తగ్గాలని వ్యాఖ్యలు చేశారు. ఏదో లక్కీగా అతడికి కెప్టెన్సీ దక్కిందని చెప్పుకొచ్చారు. దీంతో, వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా ఆమె వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు.దుబాయ్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ రోహిత్ తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. ఈ క్రమంలో రోహిత్ ఆటతీరుపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షామా మొహమ్మద్ ఘాటుగా స్పందించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. షామా మొహమ్మద్ ట్విట్టర్ వేదికగా రోహిత్ను టార్గెట్ చేసి.. రోహిత్ లావుగా ఉంటాడు. అతడు బరువు తగ్గాలి. ఫిటినెస్ ఉండదు ఏదో అదృష్టం కొద్ది రోహిత్ భారత జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ఇప్పటివరకు అత్యంత చెత్త కెప్టెన్ రోహిత్. సచిన్, కోహ్లీ, ధోనీలతో పోలిస్తే రోహిత్ జస్ట్ యావరేజ్ ఆటగాడు’ అంటూ కామెంట్స్ చేశారు.Congress leader Shama Mohamed has insulted and mocked 'National Pride' and T20 world cup winning captain Rohit Sharma .Congress with Rahul Gandhi at their helm is giving certificate of mediocrity to others ! Some jokes write themselves. pic.twitter.com/IQlquH4mri— विकास प्रताप सिंह राठौर🚩🇮🇳 (@V_P_S_Rathore) March 3, 2025దీంతో, ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బీజేపీ నేతలు, నెటిజన్లు షామా మొహమ్మద్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంతో ఆమె తన ట్వీట్ను సోషల్ మీడియా నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో షామా మొహమ్మద్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి స్పందిస్తూ..‘భారత క్రికెట్ జట్టును అభిమానించే ప్రతి దేశభక్తుడికి ఇది అవమానం. కాంగ్రెస్ విమర్శలను నేను ప్రశ్నిస్తున్నాను. రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేసే మీకు కెప్టెన్సీ గురించి ఏం తెలుస్తుంది అంటూ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారా? అంటూ ఎద్దేవా చేశారు. దీంతో, మరోసారి షామా మొహమ్మద్ స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ తనకు ఉందని చెప్పుకొచ్చారు. Shame on Congress!Now they are going after the Indian Cricket Captain!Do they expect Rahul Gandhi to now play cricket after failing in Indian politics! https://t.co/taWuC8bqgi— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) March 2, 2025ఇదిలా ఉండగా.. విరాట్ కోహ్లీ తర్వాత 2022 నుంచి రోహిత్ శర్మ(37) భారత జట్టుకు కెప్టెన్గా కొనసాగుతున్నాడు. రోహిత్ నాయకత్వంలో, గత సంవత్సరం భారత జట్టు టీ20 ప్రపంచ కప్ను సాధించింది. ఐపీఎల్లో కూడా రోహిత్ సారథ్యంలోనే ముంబై జట్టు ఐదుసార్లు ట్రోఫీని దక్కించుకుంది. క్రికెట్ చరిత్రలోనే రోహిత్కు పలు రికార్డులు ఉన్న సంగతి తెలిసిందే. -
వారిద్దరూ అద్భుతం.. కానీ అది మాకు తలనొప్పిగా మారింది: రోహిత్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూపు స్టేజిని భారత్ ఆజేయంగా ముగించింది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో 44 పరుగుల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ (98 బంతుల్లో 79; 4 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించగా... హార్దిక్ పాండ్యా (45 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్స్లు), అక్షర్ పటేల్ (61 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత జట్టును అయ్యర్, అక్షర్ తమ అద్భుత ఇన్నింగ్స్లతో అదుకున్నారు. నాలుగో వికెట్కు వీరిద్దరూ 98 పరుగులు జోడించారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ (5/42) ఐదు వికెట్లతో భారత్ను దెబ్బ తీశాడు. అనంతరం లక్ష్య చేధనలో కివీస్ 205 పరుగులకే కుప్పకూలింది. భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించాడు.అతడితో పాటు కుల్దీప్ యాదవ్ రెండు, హార్దిక్, జడేజా, అక్షర్ తలా వికెట్ సాధించారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో కేన్ విలియమ్సన్(81) టాప్ స్కోరర్ నిలిచాడు. కాగా భారత్ తమ తొలి సెమీఫైనల్లో మంగళవారం(మార్చి 4) ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. సెమీస్కు ముందు ఇటువంటి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని రోహిత్ తెలిపాడు."ఈ మెగా టోర్నీ గ్రూపు స్టేజిని విజయంతో ముగించాలని భావించాము. మేము అనుకున్నది జరిగినందుకు చాలా అనందంగా ఉంది. న్యూజిలాండ్ జట్టు ఇటీవల కాలంలో మెరుగైన ప్రదర్శన చేస్తోంది. అటువంటి జట్టును ఓడించాలంటే మన ప్రణాళికలను సరిగ్గా అమలు చేయాలి. పవర్ ప్లేలో 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డాము.ఆ సమయంలో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ అద్బుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఆఖరిలో హార్దిక్ పాండ్యా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మా దగ్గర క్వాలిటీ బౌలర్లు ఉండడంతో డిఫెండ్ చేసుకునే టోటల్ లభించందని భావించాము. అదే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాం. నిజంగా వరుణ్ చక్రవర్తి ఒక మిస్టరీ స్పిన్నరే.అతడిని ఎవరితోనూ పోల్చలేం. తొలి రెండు మ్యాచ్లకే బెంచ్కే పరిమితమైన అతడికి ఓ ఛాన్స్ ఇద్దామని ఈ మ్యాచ్లో ఆడించాము. అతడు బంతితో అద్భుతం చేశాడు. తదుపరి మ్యాచ్ కోసం మేము ప్రస్తుతం ఆలోచించడం లేదు. కానీ అతని అద్భుత ప్రదర్శనతో టీమ్ కాంబినేషన్ కొంచెం తలనొప్పిగా మారింది. ఈ టోర్నమెంట్లో ప్రతీ మ్యాచ్ను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇటువంటి మెగా ఈవెంట్లలో తప్పులు జరగడం సహజం.కానీ తప్పిదాలను సరిదిద్దుకుని ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం. ఆసీస్తో సెమీస్ మంచి గేమ్ కానుంది. ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ మ్యాచ్ కోసం నేను అతృతగా ఎదురుచూస్తున్నాను. ఈ మ్యాచ్లో మేము అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాము" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్లో రోహిత్ శర్మ పేర్కొన్నాడు.చదవండి: Champions Trophy: భారత్తో సెమీఫైనల్.. ఆసీస్ జట్టులోకి విధ్వంసకర ఆటగాడు -
భారత్ వర్సెస్ న్యూజిలాండ్.. తుది జట్లు ఇవే
Updates:పీకల్లోతు కష్టాల్లో టీమిండియాటాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్మూడో వికెట్గా వెనుదిరిగిన విరాట్కోహ్లి(11) ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసేనాటికి భారత్ స్కోర్ 44-3తొలి వికెట్ డౌన్.. గిల్ ఔట్టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ శుబ్మన్ గిల్(2) రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. మాట్ హెన్రీ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు. 4 ఓవర్లకు భారత్ స్కోర్: 15/1. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఆఖరి లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్, భారత్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది.యువ పేసర్ హర్షిత్ రాణాకు మెనెజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. అతడి స్ధానంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు కివీస్ కూడా ఓ మార్పుతో ఆడుతోంది. డెవాన్ కాన్వే స్ధానంలో డార్లీ మిచెల్ జట్టులోకి వచ్చాడు. కాగా ఈ మ్యాచ్ టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి ఇది 300వ వన్డే కావడం విశేషం.తుది జట్లుభారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిన్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, కైల్ జామీసన్, విలియం ఒరూర్కేచదవండి: 'ఐపీఎల్ను బాయ్కట్ చేయండి'.. భారత్పై అక్కసు వెల్లగక్కిన ఇంజమామ్ -
Champions Trophy: టీమిండియాకు గుడ్ న్యూస్..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. ఆదివారం(మార్చి 2) దుబాయ్ వేదికగా న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది. ఇప్పటికే సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకున్న టీమిండియా.. ఈ మ్యాచ్లో కూడా గెలిచి టేబుల్ టాపర్గా లీగ్ స్టేజిని ముగించాలని భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్కు ముందు భారత్కు గుడ్ న్యూస్ అందింది.తొడ కండరాల గాయంతో బాధపడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఈ గాయం కారణంగా రెండు రోజుల పాటు ప్రాక్టీస్ సెషన్కు దూరంగా ఉన్న రోహిత్.. తిరిగి మళ్లీ నెట్స్లో అడుగుపెట్టాడు. శుక్రవారం దాదాపు 95 నిమిషాల పాటు రోహిత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెష్కాట్ ధ్రువీకరించాడు."రోహిత్ శర్మ గాయంపై ఎటువంటి ఆందోళన అవసరం లేదు. అతడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. నెట్స్లో చాలా సమయం పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఫీల్డింగ్ ప్రాక్టీస్లో కూడా అతడు భాగమయ్యాడు. అతడికి ఈ గాయాన్ని ఎలా మెనెజ్ చేయాలో బాగా తెలుసు" అని ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్లో టెన్ డెష్కాట్ పేర్కొన్నాడు. మరోవైపు జ్వరం బారిన పడిన ఓపెనర్ శుబ్మన్ గిల్ కూడా కివీస్తో మ్యాచ్కు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు శనివారం తమ ఆఖరి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనుంది. కాగా న్యూజిలాండ్తో మ్యాచ్ కోసం భారత తుది జట్టులో ఎటువంటి మార్పులు చోటుచేసుకోపోవచ్చు.తొలి రెండు మ్యాచ్ల్లో ఆడిన జట్టునే ఈ మ్యాచ్కు కొనసాగించే అవకాశముంది. దీంతో వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ మరోసారి బెంచ్కే పరిమితమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.భారత తుది జట్టు (అంచనా)రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.చదవండి: Champions Trophy: సెమీస్కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్.. -
IND vs NZ: కివీస్తో మ్యాచ్కు రోహిత్ దూరం.. కెప్టెన్గా అతడు!
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా ఆఖరి లీగ్ మ్యాచ్కు సన్నద్ధమవుతోంది. ఈ ఐసీసీ వన్డే టోర్నమెంట్లో ఇప్పటికే సెమీ ఫైనల్ చేరుకున్న రోహిత్ సేన.. న్యూజిలాండ్తో ఆదివారం నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. అయితే, ఈ మ్యాచ్కు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.రోహిత్కు రెస్ట్ ఇవ్వడమే మంచిదిపాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా హిట్మ్యాన్ పిక్కల నొప్పితో బాధపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మైదానం వీడి కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ ఫీల్డింగ్కు వచ్చాడు. అయితే, నొప్పి ఇంకా పూర్తిగా తగ్గలేదని తెలుస్తోంది. దుబాయ్లో జరిగిన ప్రాక్టీస్ సెషన్లోనూ అతడు బ్యాటింగ్ చేయలేకపోయాడు. దీంతో కివీస్తో మ్యాచ్కు దూరంగా ఉండాలని రోహిత్ శర్మ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.సెమీస్ మ్యాచ్ మార్చి 4, 5 తేదీల్లోనే జరుగనున్న తరుణంలో రోహిత్కు విశ్రాంతిన్విడమే మంచిదని యాజమాన్యం కూడా భావిస్తున్నట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్(Shubman Gill) తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. గిల్తో పాటు ఓపెనర్గా రాహుల్అయితే, గిల్ జ్వరంతో బాధపడుతున్నాడని వార్తలు రాగా.. ఆప్షనల్ నెట్ సెషన్లో అతడు గంటలపాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడంతో వాటికి చెక్ పడింది.ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ గనుక దూరమైతే గిల్కు ఓపెనింగ్ జోడీగా కేఎల్ రాహుల్ వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే మరో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్కు తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఇక గ్రూప్-‘ఎ’ నుంచి కివీస్ కూడా భారత్తో పాటు సెమీస్ చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 2 నాటి మ్యాచ్లో గెలిచి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో సెమీ ఫైనల్ బరిలో దిగాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. అంతేకాదు.. ఈ మ్యాచ్లో గెలుపు ఆధారంగానే గ్రూప్-‘ఎ’ విజేతతో పాటు సెమీస్ ప్రత్యర్థి ఎవరన్నది తేలనుంది.కాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలైంది. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ బరిలో నిలిచాయి. అయితే, గ్రూప్-‘ఎ’లో వరుసగా రెండు మ్యాచ్లో ఓడటంతో పాటు.. తమ మధ్య ఆఖరి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో పాక్- బంగ్లా కనీసం ఒక్క విజయం లేకుండానే నిష్క్రమించాయి. ఇక గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ ఇంటిబాటపట్టింది. ఇక ఈ టోర్నీలో టీమిండియా తమ మ్యాచ్లు అన్నీ దుబాయ్లో ఆడుతోంది.చదవండి: అఫ్గన్ చేతిలో ఓటమి.. బట్లర్ సంచలన నిర్ణయం?! -
Ind vs NZ: కివీస్తో మ్యాచ్లో ఓపెనర్గా అతడు.. పంత్కి ఛాన్స్!
న్యూజిలాండ్(India vs New Zealand)తో వన్డే నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓపెనింగ్ జోడీ మారవచ్చని.. అదే విధంగా.. కొత్తగా ఇద్దరు ఆటగాళ్లకు జట్టులో దక్కవచ్చని అంచనా వేశాడు. అయితే, తాను మాత్రం ఇలాంటి మార్పులు వద్దనే సూచిస్తానని పేర్కొన్నాడు.సెమీస్లో భారత్, కివీస్ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా భారత్.. పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్లతో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉంది. ఈ క్రమంలో లీగ్ దశలో భాగంగా తొలుత బంగ్లాదేశ్ను ఓడించిన రోహిత్ సేన.. అనంతరం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై కూడా జయభేరి మోగించింది. మరోవైపు.. న్యూజిలాండ్ కూడా ఈ రెండు జట్లపై గెలిచి భారత్తో పాటు సెమీస్ చేరింది.రోహిత్ శర్మ దూరం?ఈ క్రమంలో లీగ్ దశలో చివరగా నామమాత్రపు మ్యాచ్లో భారత్- కివీస్ ఆదివారం తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇరుజట్లకు సెమీస్కు సన్నాహకంగా మారనుంది. ఇందులో గెలిచి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని భారత్- న్యూజిలాండ్ పట్టుదలగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. పాక్తో మ్యాచ్ సందర్భంగా పిక్కల్లో నొప్పితో బాధపడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. పూర్తిస్థాయిలో కోలుకోలేదని సమాచారం.అదే విధంగా.. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ కూడా జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్తో మ్యాచ్లో టీమిండియా మార్పులు చేయబోతోందా? రోహిత్ శర్మ ఇందులో ఆడకపోవచ్చు. మహ్మద్ షమీ కూడా విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది.రిషభ్ పంత్, అర్ష్దీప్ సింగ్లకు అవకాశంకేఎల్ రాహుల్ ఓపెనర్గా రాబోతున్నాడు. రిషభ్ పంత్, అర్ష్దీప్ సింగ్లకు ఈసారి తుదిజట్టులో చోటు దక్కుతుందనే వార్తలు వస్తున్నాయి. ఇలా జరగొచ్చు. లేదంటే జరగకపోవచ్చు. కానీ నా అభిప్రాయం ప్రకారం భారత్ గత రెండు మ్యాచ్లలో ఆడిన జట్టుతోనే ముందుకు వెళ్లాలి.గెలుపు మనకు ఓ అలవాటుగా మారినప్పుడు.. అదే జట్టును కొనసాగిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు ఉంటాయి. చాంపియన్స్ ట్రోఫీలో జడ్డూ గత మ్యాచ్లలో పెద్దగా వికెట్లు తీయలేదు. అయినా సరే అతడిని కొనసాగించాల్సిందే. జడ్డూను కాదని వరుణ్ చక్రవర్తిని తీసుకువచ్చే ఆలోచన కూడా యాజమాన్యానికి ఉండి ఉండవచ్చు.జడ్డూనే ఆడించాలిలేదా.. కివీస్ జట్టులో ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఎక్కువ కాబట్టి వాషింగ్టన్ సుందర్ను ఆడించే యోచనలో ఉండొచ్చు. కానీ జడ్డూనే ఆడించాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే.. అతడు తదుపరి సెమీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇలాంటి సమయంలో విశ్రాంతి పేరిట పక్కనపెట్టకూడదు’’ అని అభిప్రాయపడ్డాడు.ఒకవేళ తుదిజట్టులో మార్పు చేయాలని భావిస్తే షమీని తప్పించి అర్ష్దీప్ను ఆడిస్తే ప్రయోజనకరంగానే ఉంటుందని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో తొమ్మిది ఓవర్ల కోటా వేసిన స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 37 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. ఇక పాకిస్తాన్తో మ్యాచ్లో మాత్రం ఏడు ఓవర్లలోనే 40 రన్స్ ఇచ్చిన జడ్డూ ఒక వికెట్ తీయగలిగాడు. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో కేఎల్ రాహుల్తో కలిసి వికెట్ కీపర్ కోటాలో అవకాశం దక్కించుకున్న రిషభ్ పంత్కు మాత్రం తుదిజట్టులో ఆడే ఛాన్స్ రావడం లేదు. అయితే, కివీస్తో మ్యాచ్కు రోహిత్ దూరంగా ఉంటే మాత్రం.. రాహుల్ ఓపెనర్గా వస్తే.. పంత్కు చోటు దక్కవచ్చు.బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో మ్యాచ్లలో ఆడిన భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.బెంచ్: రిషభ్ పంత్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్.చదవండి: అతడొక అద్భుతం.. క్రెడిట్ తనకే.. బాధగా ఉంది: బట్లర్ -
టీమిండియాకు భారీ షాక్.. రోహిత్కు గాయం! గిల్కు జ్వరం?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా తమ ఆఖరి లీగ్ మ్యాచ్కు సన్నద్దమవుతోంది. ఈ టోర్నీలో భాగంగా మార్చి 2న న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది. ఇప్పటికే సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకున్న భారత జట్టు.. కివీస్పై కూడా గెలిచి గ్రూపు స్టేజిని విజయంతో ముగించాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ కోసం దుబాయ్లోని ఐసీసీ ఆకాడమీ గ్రౌండ్లో మెన్ ఇన్ బ్లూ తీవ్రంగా శ్రమిస్తోంది.అయితే ఈ మ్యాచ్కు ముందు భారత్కు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో భాదపడుతున్నట్లు తెలుస్తోంది. హిట్మ్యాన్తో పాటు స్టార్ ప్లేయర్ శుబ్మన్ గిల్కు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీంతో వీరిద్దరూ బుధవారం జరిగిన టీమ్ నెట్ ప్రాక్టీస్కు దూరమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అస్వస్థత కారణంగా గిల్ హోటల్ రూమ్కే పరిమితం కాగా.. రోహిత్ శర్మ మైదానంకు వచ్చినప్పటికి ప్రాక్టీస్లో మాత్రం పాల్గోలేదని క్రిక్బజ్ తమ కథనంలో పేర్కొంది. గాయం తీవ్రతరం కాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ప్రాక్టీస్ను రోహిత్ స్కిప్ చేశాడని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.కాగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో బాధపడ్డాడు. కొన్ని ఓవర్ల పాటు ఆటకు కూడా దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత తిరిగి మైదానంలో వచ్చాడు. అయినప్పటికి రోహిత్ అంత ఫిట్నెస్గా కన్పించలేదు. అయితే రోహిత్, గిల్ ప్రాక్టీస్కు దూరంగా ఉండడంపై బీసీసీఐ నుంచి ఎటుంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.సూపర్ ఫామ్లో గిల్..కాగా శుబ్మన్ గిల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో 101 పరుగులు చేసిన గిల్.. పాకిస్తాన్పై 46 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ కూడా తొలి రెండు మ్యాచ్ల్లో తన బ్యాట్ను ఝలిపించాడు. ఒకవేళ వీరిద్దరూ న్యూజిలాండ్తో మ్యాచ్కు దూరమైతే భారత్కు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి. మరోవైపు గాయం నుంచి కోలుకున్న స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన ప్రాక్టీస్ను మొదలు పెట్టాడు. రోహిత్, గిల్ కివీస్తో మ్యాచ్కు దూరమైతే వారి స్ధానాల్లో వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.చదవండి: అతడొక అద్భుతం.. క్రెడిట్ తనకే.. బాధగా ఉంది: బట్లర్ -
ఐదో స్థానానికి ఎగబాకిన విరాట్.. టాప్-10లో నలుగురు టీమిండియా బ్యాటర్లు
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో (ICC ODI Rankings) భారత బ్యాటర్ల హవా కొనసాగింది. టాప్-10లో ఏకంగా నలుగురు భారత బ్యాటర్లు చోటు దక్కించుకున్నారు. శుభ్మన్ గిల్ (Shubman Gill) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రోహిత్ (Rohit Sharma) మూడు, విరాట్ (virat Kohli) ఐదు, శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తొమ్మిది స్థానాల్లో ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్పై సెంచరీ చేయడంతో విరాట్ ఓ స్థానాన్ని మెరుగుపర్చుకుని ఐదో స్థానానికి చేరాడు. తాజా ర్యాంకింగ్స్లో ఛాంపియన్స్ ట్రోఫీ సెంచరీ హీరోలు గణనీయంగా లబ్ది పొందారు. విల్ యంగ్ 8 స్థానాలు మెరుగుపర్చుకుని 14వ స్థానానికి.. బెన్ డకెట్ 27 స్థానాలు మెరుగుపర్చుకుని 17వ స్థానానికి.. రచిన్ రవీంద్ర 18 స్థానాలు మెరుగుపర్చుకుని 24వ స్థానానికి.. టామ్ లాథమ్ 11 స్థానాలు మెరుగుపర్చుకుని 31వ స్థానానికి.. జోస్ ఇంగ్లిస్ 18 స్థానాలు మెరుగుపర్చుకుని 88వ స్థానానికి చేరారు. టాప్-10లో భారత బ్యాటర్లతో పాటు బాబర్ ఆజమ్ (2), హెన్రిచ్ క్లాసెన్ (4), డారిల్ మిచెల్ (6), హ్యారీ టెక్టార్ (7), చరిత్ అసలంక (8), షాయ్ హోప్ (10) ఉన్నారు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టాప్-10లో కుల్దీప్ (3వ స్థానం) మినహా భారత్కు ప్రాతినిథ్యం లేదు. లంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ టాప్లో కొనసాగుతుండగా.. రషీద్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నాడు. కేశవ్ మహారాజ్, బెర్నాల్డ్ స్కోల్జ్, మ్యాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్, గుడకేశ్ మోటీ, షాహీన్ అఫ్రిది, ఆడమ్ జంపా టాప్-10లో ఉన్నారు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టాప్-10లో ఎలాంటి మార్పులు లేవు. మొహమ్మద్ నబీ, సికందర్ రజా, అజ్మతుల్లా ఒమర్జాయ్, మెహిది హసన్ మిరాజ్, రషీద్ ఖాన్, మిచెల్ సాంట్నర్, మ్యాక్స్వెల్, బ్రాండన్ మెక్ముల్లెన్, రవీంద్ర జడేజా, గెర్హార్డ్ ఎరాస్మస్ టాప్-10లో కొనసాగుతున్నారు. ఈ వారం ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో ఒకే ఒక చెప్పుకోదగ్గ మార్పు జరిగింది. న్యూజిలాండ్ ఆటగాడు మైఖేల్ బ్రేస్వెల్ ఏకంగా 26 స్థానాలు మెరుగుపర్చుకుని 11వ స్థానానికి చేరాడు.జట్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా ఎవరికీ అందనంత ఎత్తులో టాప్ ప్లేస్లో కొనసాగుతుంది. ఆసీస్, పాకిస్తాన్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఆతర్వాతి స్థానాల్లో నిలిచాయి. -
టీమిండియా స్టార్లపై ‘చీఫ్ సెలక్టర్’ ఆగ్రహం! అగార్కర్కు విన్నపం
టీమిండియా స్టార్ క్రికెటర్ల తీరుపై ముంబై క్రికెట్ అసోసియేషన్(MCA) చీఫ్ సెలక్టర్ సంజయ్ పాటిల్(Sanhay Patil) ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొక్కుబడిగా రంజీల్లో ఆడటం వల్ల ముంబై జట్టుకు తీరని అన్యాయం జరిగిందన్నాడు. ‘స్టార్ల’ కోసం ఉత్తమంగా రాణిస్తున్న వర్ధమాన క్రికెటర్లను పక్కనపెట్టడం వల్ల భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందన్నాడు.దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేకాగా జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనప్పుడు సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిబంధన విధించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను అతిక్రమించిన ఇషాన్ కిషన్(Ishan Kishan), శ్రేయస్ అయ్యర్లను వార్షిక కాంట్రాక్టు జాబితా నుంచి తప్పించి వేటు వేసింది. తద్వారా ఆటగాళ్లంతా డొమెస్టిక్ క్రికెట్ బరిలో దిగాలనే కచ్చితమైన సంకేతాలు ఇచ్చింది.కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుఈ నేపథ్యంలో టెస్టుల్లో ఫామ్లేమితో సతమతమైన కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు రికార్డుల రారాజు విరాట్ కోహ్లి కూడా రంజీ బరిలో దిగారు. ఇక రోహిత్తో పాటు అతడి ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్, టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, శివం దూబే తదితరులు ముంబై తరఫున మ్యాచ్లు ఆడారు.అయితే, రోహిత్తో పాటు జైస్వాల్ తాము ఆడిన ఒకే ఒక్క మ్యాచ్లో విఫలమయ్యారు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ముంబై.. ఈసారి సెమీస్లోనే ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ సంజయ్ పాటిల్ తమ జట్టు వైఫల్యానికి టీమిండియా ఆటగాళ్లే పరోక్ష కారణమనేలా వ్యాఖ్యలు చేశాడు.అగార్కర్కు విన్నపం‘‘ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెటర్ల వల్ల అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. అంతేకాదు.. ఆసక్తిలేకుండా దేశీ జట్టు తరఫున బరిలోకి దిగి వారు బాగా ఆడకపోతే నష్టం మనకే వస్తుంది. కాబట్టి అసోసియేషన్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.బీసీసీఐ ఆదేశాల వల్ల మనం వారికి జట్టులో చోటు ఇస్తున్నామన్న మాట వాస్తవం. టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, సెలక్షన్ కమిటీ మొత్తానికి నాదొక విన్నపం. కేవలం మీరు చెప్పారన్న కారణంగానే ఇంటర్నేషనల్ స్టార్లు దేశీ మ్యాచ్లు ఆడుతున్నారు.బోర్డు కఠినంగా వ్యవహరిస్తుందనే ఉద్దేశంతో తమను తాము కాపాడుకునేందుకు మాత్రమే ఇలా చేస్తున్నారు. కానీ ఇకపై దేశవాళీ మ్యాచ్లలో కూడా వారి ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటామని మీరు హెచ్చరించండి.టీమిండియాకు ఎంపిక చేసే సమయంలో ఈ ప్రదర్శనను పరిశీలిస్తామని చెప్పండి. అలా కాకుండా కేవలం ఆడి రండి అని చెబితే మాత్రం దేశీ జట్ల మీద ప్రతికూల ప్రభావం పడుతుంది’’ అని స్పోర్ట్స్టార్తో సంజయ్ పాటిల్ వ్యాఖ్యానించాడు.సెమీస్లో విదర్భ చేతిలో ఓటమికాగా రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూళ్ ఒక్కడే మెరుగ్గా రాణించాడు. ఇక కెప్టెన్ అజింక్య రహానే సహా సూర్యకుమార్ యాదవ్ విదర్భతో సెమీ ఫైనల్లో పూర్తిగా నిరాశపరిచారు. రహానే 18, 12 పరుగులు చేయగా.. సూర్య 0, 23 రన్స్ మాత్రమే చేశాడు. మరోవైపు.. శివం దూబే 0, 12 పరుగులకే పరిమితమయ్యాడు. ఇక శార్దూల్ 33 ఓవర్లలో 133 పరుగులు ఇచ్చి కేవలం రెండు వికెట్లు తీశాడు. రెండు ఇన్నింగ్స్లో 37, 66 పరుగులు చేశాడు.చదవండి: NZ vs BAN: చర్రిత సృష్టించిన రచిన్ రవీంద్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
Ind vs NZ: కివీస్తో మ్యాచ్లో అతడికి విశ్రాంతి!
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భారత జట్టు అదరగొడుతోంది. ఈ వన్డే ఫార్మాట్ టోర్నమెంట్లో తొలుత బంగ్లాదేశ్తో తలపడ్డ టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. అనంతరం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్(India vs Pakistan)పై కూడా ఇదే ఫలితాన్ని పునరావృతం చేసింది.దుబాయ్ వేదికగా సమిష్టిగా రాణించి దాయాదిపై విజయం సాధించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. తదుపరి లీగ్ దశలో భాగంగా చివరగా పటిష్ట న్యూజిలాండ్ జట్టుతో రోహిత్ సేన ఆదివారం తలపడనుంది. ఇక తొలి రెండు మ్యాచ్లలోనూ భారత్ ఒకే జట్టుతో ఆడింది. ఈ నేపథ్యంలో కివీస్తో నామమాత్రపు మ్యాచ్లో మాత్రం ఒక మార్పు చేస్తే బాగుంటుందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డారెన్ గాఫ్ అన్నాడు.షమీ లేకపోయినాకివీస్తో మ్యాచ్లో భారత తుదిజట్టు గురించి తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ‘‘షమీకి విశ్రాంతినివ్వాలి. పాకిస్తాన్పై అద్భుత విజయంతో టీమిండియా విశ్వాసం రెట్టింపు అయింది. వారి బ్యాటింగ్ లైనప్ బాగుంది.కాబట్టి దుబాయ్లో మరో స్పిన్నర్ను అదనంగా తుదిజట్టులో చేర్చుకోవచ్చు. లాహోర్ మాదిరి దుబాయ్ పిచ్ మరీ అంత ఫ్లాట్గా కూడా ఏమీ లేదు. ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న షమీని కాపాడుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంది.అంతేకాదు.. హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేసిన విధానం అద్భుతంగా ఉన్న కారణంగా షమీ లేకపోయినా పెద్దగా ఆందోళనపడాల్సిన పనిలేదు. నాకు తెలిసి న్యూజిలాండ్తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఈ ఒక్క మార్పు చేస్తుంది. షమీని పక్కనపెట్టి మరో స్పిన్నర్ను ఆడిస్తుంది’’ అని డారెన్ గాఫ్ హిందుస్తాన్ టైమ్స్తో పేర్కొన్నాడు.కాగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో 10 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తిచేసిన షమీ.. 53 పరుగులు ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు. అయితే పాకిస్తాన్తో మ్యాచ్లో పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్ తీయలేకపోయాడు. చీలమండ గాయం తాలుకు నొప్పి తిరగబెట్టడంతో పాక్తో మ్యాచ్ సందర్భంగా కాసేపు అతడు విశ్రాంతి తీసుకున్నాడు.ఇక చాంపియన్స్ ట్రోఫీ-2025లో విజేతపై తన అంచనా తెలియజేస్తూ.. ‘‘టీమిండియా పటిష్టంగా ఉంది. ఇందులో సందేహం లేదు. వన్డేల్లో ఇటీవల ఇంగ్లండ్ జట్టును మట్టికరిపించిన విధానం అద్బుతంగా అనిపించింది.టైటిల్ ఫేవరెట్ టీమిండియానేఇక ఇండియాతో పాటు సౌతాఫ్రికా, న్యూజిలాండ్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. మరి టోర్నీలో ఎవరు విజేతగా అవతరిస్తారని అడిగితే మాత్రం నేను టీమిండియానే ఎంచుకుంటాను. బ్యాటింగ్లో భారత్ అదరగొడుతోంది. ప్రపంచస్థాయి బౌలర్, ప్రధాన పేసర్ అయిన జస్ప్రీత్ బుమ్రా జట్టుతో లేకపోయినా ఆ ప్రభావం పడకుండా సమిష్టిగా రాణిస్తోంది. అందుకే నా టైటిల్ ఫేవరెట్ టీమిండియానే’’ అని ఇంగ్లండ్ మాజీ పేసర్ డారెన్ గాఫ్ చెప్పుకొచ్చాడు.కాగా బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో మ్యాచ్లలో టీమిండియా ఒక స్పెషలిస్టు స్పిన్నర్(కుల్దీప్ యాదవ్), ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు(అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా), ఒక పేస్బౌలింగ్ ఆల్రౌండర్(హార్దిక్ పాండ్యా), ఇద్దరు పేసర్ల(హర్షిత్ రాణా, మహ్మద్ షమీ)లతో బరిలోకి దిగింది.చాంపియన్స్ ట్రోఫీ-2025లో బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో మ్యాచ్లలో భారత తుదిజట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.బెంచ్: రిషభ్ పంత్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్.చాంపియన్స్ ట్రోఫీ-2025లో న్యూజిలాండ్ జట్టువిల్ యంగ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మాట్ హెన్రీ, కైలీ జెమీసన్, విలియం ఒరూర్కీ, డారిల్ మిచెల్, నాథన్ స్మిత్, మార్క్ చాప్మన్, జాకొబ్ డఫీ.చదవండి: NZ vs BAN: చర్రిత సృష్టించిన రచిన్ రవీంద్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
ఆ ముగ్గురు అద్బుతం.. కోహ్లి గురించి చెప్పేదేమీ లేదు: రోహిత్ శర్మ
టీమిండియా బౌలింగ్ దళంపై కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ప్రశంసలు కురిపించాడు. పాకిస్తాన్తో మ్యాచ్లో తమ బౌలర్లు అదరగొట్టారని.. ప్రత్యర్థిని నామమాత్రపు స్కోరుకు కట్టడి చేసి తమపై కాస్త ఒత్తిడిని తగ్గించారని అన్నాడు. మిడిల్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేసిన తీరు అద్భుతమని బౌలర్లను కొనియాడిన రోహిత్ శర్మ.. ఇక ఛేజ్మాస్టర్ విరాట్ కోహ్లి(Virat Kohli) నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ రావడం తననేమీ ఆశ్చర్యపరచలేదని తెలిపాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025లో బంగ్లాదేశ్పై గెలిచి విజయంతో ఈ ఐసీసీ టోర్నీని ఆరంభించిన రోహిత్ సేన.. ఆదివారం నాటి తమ రెండో మ్యాచ్లో పాకిస్తాన్ను ఓడించింది. చిరకాల ప్రత్యర్థిపై ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించి సెమీ ఫైనల్ రేసులో మున్ముందుకు దూసుకుపోయింది.దుబాయ్ వేదికగా దాయాది పాకిస్తాన్తో తలపడ్డ టీమిండియా.. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో 49.4 ఓవర్లలో ప్రత్యర్థిని 241 పరుగులకు ఆలౌట్ చేసింది. కుల్దీప్ యాదవ్ మూడు, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లతో మెరవగా.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా ఒక్కో వికెట్ తీశారు. అదే విధంగా.. అక్షర్ తన అద్భుత ఫీల్డింగ్తో రెండు రనౌట్లలో భాగమయ్యాడు.ఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 42.3 ఓవర్లలోనే టార్గెట్ను ఊదేసింది. విరాట్ కోహ్లి ఫోర్ బాది శతకం పూర్తి చేసుకోవడంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. మిగతా వాళ్లలో ఓపెనర్ శుబ్మన్ గిల్(46), మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్(56) అద్బుత ఇన్నింగ్స్ ఆడారు.ఈ నేపథ్యంలో విజయానంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ... జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘బంతితో మేము మ్యాచ్ ఆరంభించిన విధానం సూపర్. బౌలింగ్ విభాగం అద్భుతమైన ప్రదర్శనతో పాకిస్తాన్ను నామమాత్రపు స్కోరుకే పరిమితం చేసింది. లక్ష్య ఛేదనలో లైట్ల వెలుగులో బ్యాటింగ్ చేయడం ఈ పిచ్పై ఎంత బాగుంటుందో.. స్లో వికెట్పై ఆడటం అంతే కఠినంగానూ ఉంటుందని మాకు తెలుసు.అయితే, మా బ్యాటింగ్ లైనప్ త్వరగానే పనిపూర్తి చేసింది. ఏదేమైనా.. అక్షర్, కుల్దీప్, జడేజా మిడిల్ ఓవర్లలో గొప్పగా రాణించారు. వన్డే ఫార్మాట్లో తమకున్న అనుభవాన్ని ఇక్కడ చూపించారు. రిజ్వాన్తో పాటు సౌద్ షకీల్ల వికెట్లు మాకు కీలకం. వారిద్దరిని ఎక్కువ సేపు క్రీజులో ఉండనీయవద్దనే మా ప్రయత్నాలు ఫలించాయి.ఈ ముగ్గురు స్పిన్నర్లు ఈరోజు అద్భుతమే చేశారు. అయితే, పేసర్లు హార్దిక్, హర్షిత్, షమీ బౌలింగ్ చేసిన విధానాన్ని కూడా మనం మర్చిపోకూడదు. బౌలింగ్ యూనిట్లో ప్రతి ఒక్కరు తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించారు.ఇక కోహ్లి దేశం కోసం ఆడటాన్ని ఎంతగా ఇష్టపడతాడో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జట్టు ప్రయోజనాల కోసం తన శక్తినంతా ధారపోస్తాడు. కీలక సమయంలో తనలోని అత్యుత్తమ నైపుణ్యాలను మరింత మెరుగ్గా ప్రదర్శిస్తాడు. కోహ్లి అంటే ఏమిటో ఈరోజు మరోసారి నిరూపించాడు.డ్రెసింగ్ రూంలో కూర్చున వాళ్లలో ఒక్కరు కూడా కోహ్లి ఇన్నింగ్స్ చూసి ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే.. సుదీర్ఘకాలంగా జట్టు కోసం అతడేం చేస్తున్నాడో అందరికీ తెలుసు. మిడిల్ ఓవర్లలో.. మరో ఎండ్లోని బ్యాటర్లతో చక్కటి సమన్వయంతో అతడు ముందుకు సాగిన విధానం అద్భుతం. అంతేకాదు తనదైన స్టైల్లో మ్యాచ్ను ముగించడం రెట్టింపు సంతోషం. గిల్, శ్రేయస్ కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడారు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.చదవండి: ‘ఏంటిది?’.. రిజ్వాన్ చర్యకు హర్షిత్ రాణా రియాక్షన్ వైరల్.. గంభీర్ కూడా! -
IND Vs PAK: అఫ్రిది కళ్లు చెదిరే యార్కర్.. రోహిత్ శర్మ షాక్! వీడియో వైరల్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో దుబాయ్ వేదికగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ స్పీడ్ స్టార్ షాహీన్ అఫ్రిది సంచలన బంతితో మెరిశాడు. అఫ్రిది ఇన్స్వింగ్ యార్కర్తో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు రోహిత్ శర్మ ఘనమైన ఆరంభించేందుకు ప్రయత్నించాడు.అందుకు తగ్గట్టుగానే భారత ఇన్నింగ్స్ రెండో ఓవర్లో సిక్సర్, ఫోర్ బాది రోహిత్ మంచి టచ్లో కన్పించాడు. దీంతో కెపెన్ నుంచి భారీ ఇన్నింగ్స్ రావడం ఖాయమని అందరూ భావించారు. కానీ షాహీన్ అఫ్రిది మాత్రం అందరి ఆశలపై నీళ్లు చల్లాడు. ఐదో ఓవర్ వేసిన అఫ్రిది ఆఖరి బంతిని రోహిత్కు అద్బుతమైన ఇన్స్వింగింగ్ యార్కర్గా సంధించాడు.అఫ్రిది వేసిన బంతికి రోహిత్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. హిట్మ్యాన్ తన బ్యాట్ను కిందకు దించే లోపే బంతి వెళ్లి స్టంప్స్ను గిరాటేసింది. దీంతో రోహిత్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. రోహిత్ 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్తో 20 పరుగులు చేశాడు.మూడేసిన కుల్దీప్.. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో సౌద్ షకీల్(62) టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ రిజ్వాన్(46), ఖుష్దిల్ షా(38) మెరుగ్గా ఆడారు. ఇక భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు.చదవండి: IND vs PAK: రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు.. What a yorker by Shaheen AfridiRohit Sharma gone 🔥🔥Pakistan vs India | India vs Pakistan#ViratKohli𓃵 #ICCChampionsTrophy2025 #RohitSharma𓃵 #BabarAzam𓃵 #CT25 #PakistanCricket #INDvsPAK #ENGvsAUS #ENGvAUS #AUSvENG #AUSvsENG #PAKvIND #PAKvsINDIA #INDvPAK #IndiavsPakistan pic.twitter.com/3Jzczetqth— SOHAIB (@S0HAIB_7) February 23, 2025 -
IND vs PAK: రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంతవేగంగా 9000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఓపెనర్గా రోహిత్ వరల్డ్ రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్లో ఒక్క పరుగు వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ ఈ ఘనతను అందుకున్నాడు.హిట్మ్యాన్ ఈ ఫీట్ను కేవలం 181 ఇన్నింగ్స్లలో సాధించాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ 197 ఇన్నింగ్స్లలో ఈ ఫీట్ సాధించాడు. ఇక ఓవరాల్గా ఈ రికార్డు సాధించిన ఆరో ప్లేయర్గా హిట్మ్యాన్ నిలిచాడు.కాగా వన్డే ఫార్మాట్లో రోహిత్ శర్మకు అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు ఏకంగా తన కెరీర్లో మూడు డబుల్ సెంచరీలను రోహిత్ నమోదు చేశాడు. ఓవరాల్గా తన కెరీర్లో 270 వన్డేలు ఆడిన రోహిత్..48.89 సగటుతో 11049 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 32 సెంచరీలు ఉన్నాయి. ఇక పాకిస్తాన్తో మ్యాచ్లో రోహిత్ క్విక్ ఇన్నింగ్స్ ఆడి ఔటయ్యాడు. 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్తో 20 పరుగులు చేశాడు. ఈ హైవోల్టేజ్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో వన్డౌన్ బ్యాటర్ సౌద్ షకీల్(62) టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ రిజ్వాన్(46), ఖుష్దిల్ షా(38) మెరుగ్గా ఆడారు. ఇక భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు.వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్లు వీరే..సచిన్ టెండూల్కర్-15310సనత్ జయసూర్య- 12740క్రిస్ గేల్-10179ఆడమ్ గిల్క్రిస్ట్- 9200సౌరవ్ గంగూలీ- 9146రోహిత్ శర్మ 9000చదవండి: ‘ఏంటిది?’.. రిజ్వాన్ చర్యకు హర్షిత్ రాణా రియాక్షన్ వైరల్.. గంభీర్ కూడా! -
#INDvsPAK : భారత్-పాకిస్తాన్ మ్యాచ్ హైలైట్స్ (ఫోటోలు)
-
పాక్తో మ్యాచ్లో అతడిని ఆడించాల్సింది.. కానీ: గావస్కర్
బంగ్లాదేశ్పై గెలుపొంది చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)ని విజయంతో ఆరంభించింది టీమిండియా. రెండో మ్యాచ్లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో రోహిత్ సేన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్(India vs Pakistan)ను ఢీకొట్టింది. దుబాయ్ వేదికగా ఆదివారం నాటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ భారత జట్టును తొలుత ఫీల్డింగ్కు ఆహ్వానించింది.ఆ నలుగురు మళ్లీ బెంచ్ మీదేఇక ఈ మ్యాచ్లో టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. బంగ్లాదేశ్తో ఆడిన తుదిజట్టునే పాక్తో మ్యాచ్లోనూ కొనసాగించింది. స్టార్ ప్లేయర్లు రిషభ్ పంత్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్కు మరోసారి మొండిచేయి చూపింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ టాస్ సమయంలో స్పోర్ట్స్ ప్రజెంటర్ మయాంతి లాంగర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ప్లేయింగ్ ఎలెవన్ విషయంలో మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాడు.ఒక్క మార్పు చేసి ఉంటే బాగుండేది..‘‘అయినా.. వాళ్లెందుకు తుదిజట్టులో మార్పులు చేయాలి? ఇది స్లో వికెట్. అంతేగాక ప్రస్తుత ప్లేయింగ్ ఎలెవన్తోనే వారు గత మ్యాచ్ గెలిచారు. అయితే, ఒక్క మార్పు చేసి ఉంటే బాగుండేది. వరుణ్ చక్రవర్తిని పాకిస్తాన్తో మ్యాచ్లో ఆడించి ఉండాల్సింది. కానీ గత మ్యాచ్లో ఐదు వికెట్లు తీసిన మహ్మద్ షమీని ఎలా పక్కనపెట్టగలరు?అంతేగాక.. మరో పేసర్ హర్షిత్ రాణా కూడా గత మ్యాచ్లో ఎలాంటి తప్పిదాలు చేయలేదు. అందుకే టీమిండియాపాక్తో పోరులోనూ అదే జట్టుతో బరిలోకి దిగింది’’ అని సునిల్ గావస్కర్ నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ మాత్రం ఒక మార్పుతో మైదానంలో దిగింది. ఆరంభ మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడిన సమయంలో ఫఖర్ జమాన్ గాయపడగా.. భారత్తో మ్యాచ్లో సౌద్ షకీల్తో అతడి స్థానాన్ని భర్తీ చేసింది.2017లో చివరిసారిగాకాగా చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్- పాకిస్తాన్ 2017లో చివరిసారిగా తలపడ్డాయి. నాడు లీగ్ దశలో టీమిండియా గెలుపొందగా.. ఫైనల్లో మాత్రం పాకిస్తాన్ భారత జట్టును ఓడించిన టైటిల్ ఎగురేసుకపోయింది. ఈ క్రమంలో దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత మరోసారి చాంపియన్స్ ట్రోఫీ జరుగుతుండగా. ఆతిథ్య జట్టు హోదాలో డిఫెండింగ్ చాంపియన్గా పాక్ బరిలోకి దిగింది.అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా మాత్రం తమ మ్యాచ్లన్నీ దుబాయ్లో ఆడుతోంది. ఇక ఈ మెగా టోర్నీలో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ ట్రోఫీ కోసం తలపడుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లలో పాకిస్తాన్పై న్యూజిలాండ్, బంగ్లాదేశ్పై భారత్, అఫ్గనిస్తాన్పై సౌతాఫ్రికా, ఇంగ్లండ్పై ఆస్ట్రేలియా గెలుపొందాయి. పాయింట్ల పట్టికలో గ్రూప్-ఎ నుంచి న్యూజిలాండ్.. గ్రూప్-బి నుంచి సౌతాఫ్రికా టాప్లో ఉన్నాయి.పాకిస్తాన్తో మ్యాచ్లో భారత తుదిజట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.పాకిస్తాన్ ప్లేయింగ్ ఎలెవన్సౌద్ షకీల్, బాబర్ ఆజం, ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్/వికెట్ కీపర్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహిన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్.చదవండి: షమీ చెత్త రికార్డు.. చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే.. -
టీమిండియా చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్-భారత్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ షురూ అయింది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్ధులు తాడోపేడో తెల్చుకుంటున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్లో పాక్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. గాయపడిన ఫఖార్ జమాన్ స్దానంలో ఇమామ్ ఉల్ హాక్ తుది జట్టులోకి వచ్చాడు. భారత్ మాత్రం తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు.టీమిండియా చెత్త రికార్డు..కాగా ఈ మ్యాచ్ ప్రారంభం కాకముందే టీమిండియా ఓ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. వన్డే క్రికెట్ చరిత్రలో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిన జట్టుగా భారత్ చెత్త రికార్డును నెలకొల్పింది. వన్డే వరల్డ్కప్-2023 నుంచి భారత్ ఇప్పటివరకు వన్డేల్లో వరుసగా 12 సార్లు టాస్ ఓడిపోయింది.ఇంతకుముందు ఈ రికార్డు నెదర్లాండ్స్ క్రికెట్ జట్టు పేరిట ఉండేది. డచ్ జట్టు 2011-2013 కాలంలో వరుసగా 11 సార్లు టాస్ ఓడిపోయింది. తాజా మ్యాచ్తో నెదర్లాండ్స్ను భారత్ అధిగమించింది. అదేవిధంగా వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిన మూడో కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు.రోహిత్ ఇప్పటివరకు వరుసగా 9 సార్లు టాస్ ఓడిపోయాడు. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా అగ్రస్ధానం ఉన్నాడు. లారా వన్డేల్లో వరుసగా 12 సార్లు టాస్ ఓడిపోయాడు.తుది జట్లు..పాకిస్తాన్: సౌద్ షకీల్, బాబర్ ఆజమ్, ఇమామ్ ఉల్ హక్, రిజ్వాన్ (కెప్టెన్, సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, షమీ, కుల్దీప్ యాదవ్చదవండి: షమీ చెత్త రికార్డు.. చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే.. -
పాకిస్థాన్ వర్సెస్ ఇండియా హైవోల్టేజ్ మ్యాచ్.. ఫ్యాన్స్ సందడి (ఫొటోలు)
-
CT 2025 Ind vs Pak: కోహ్లి సూపర్ సెంచరీ.. పాక్ను చిత్తు చేసిన భారత్
ICC CT 2025 India vs Pakistan Updates: చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్ను టీమిండియా చిత్తు చేసింది. 2017 ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. దాయాది జట్టు విధించిన 242 పరుగుల లక్ష్యాన్ని 42.3 ఓవర్లలోనే ఛేదించి ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. లక్ష్య ఛేదనలో కోహ్లి 42.3 ఓవర్లో కోహ్లి ఫోర్ బాది సెంచరీ పూర్తి చేసుకొని.. భారత్ను విజయతీరాలకు చేర్చాడు. కోహ్లి వంద పరుగులతో అజేయంగా నిలవగా.. శ్రేయస్ అయ్యర్(56), శుబ్మన్ గిల్(46) రాణించారు. ఈ విజయంతో భారత్ సెమీస్ రేసులో ముందుకు దూసుకుపోయింది.పాక్ 241 ఆలౌట్క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన దాయాదుల పోరుకు తెరలేచింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్(India vs Pakistan) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పాక్ తొలుతబ్యాటింగ్ చేసి 241 పరుగులకు ఆలౌట్ కాగా.. టీమిండియా ఛేజింగ్కు దిగింది.41 ఓవర్లలో టీమిండియా స్కోరు: 225-4విజయానికి ఇంకా 17 పరుగుల దూరంలో భారత్నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియాహార్దిక్ పాండ్యా రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. షాహిన్ ఆఫ్రిది బౌలింగ్లో పాండ్యా(8) కీపర్ రిజ్వాన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. స్కోరు: 223-4. కోహ్లి 86 పరుగులతో ఉండగా అక్షర్ పటేల్ క్రీజులోకి వచ్చాడు. విజయానికి ఇంకా 19 పరుగులు కావాలి.మూడో వికెట్ కోల్పోయిన టీమిండియాశ్రేయస్ అయ్యర్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఖుష్దిల్ బౌలింగ్లో శ్రేయస్ ఇచ్చిన క్యాచ్ను ఇమామ్ అద్భుతరీతిలో క్యాచ్ అందుకున్నాడు. దీంతో 56 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శ్రేయస్ అయ్యర్ నిష్క్రమించాడు. హార్దిక్ పాండ్యా క్రీజులోకి రాగా కోహ్లి 85 పరుగులతో ఉన్నాడు. భారత్ స్కోరు: 215/3 (39). విజయానికి 66 బంతుల్లో 27 పరుగులు కావాలి.అర్ధ శతకం పూర్తి చేసుకున్న శ్రేయస్ అయ్యర్శ్రేయస్ అయ్యర్ తన వన్డే కెరీర్లో 21వ హాఫ్ సెంచరీ సాధించాడు. భారత్ విజయానికి ఇంకా 41 పరుగుల దూరంలో ఉంది. స్కోరు: 201/2 (37) విజయం దిశగా భారత్36 ఓవర్లలో టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. కోహ్లి 81, శ్రేయస్ 49 పరుగుల వద్ద ఉన్నారు. విజయానికి 42 పరుగులు కావాలి.34 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 185/2కోహ్లి 69, శ్రేయస్ 46 రన్స్తో ఆడుతున్నారు. పాక్పై గెలవాలంటే ఇంకా 57 పరుగులు కావాలి.టీమిండియా స్కోరు: 168/2 (31) కోహ్లి 65, శ్రేయస్ అయ్యర్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు. విజయానికి ఇంకా 74 పరుగులు కావాలి.29 ఓవర్లలో టీమిండియా స్కోరు: 150/2.శ్రేయస్ అయ్యర్ 17, కోహ్లి 64 పరుగులతో ఉన్నారు. ఇద్దరూ కలిసి 69 బంతుల్లో యాభై పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. విజయానికి ఇంకా 92 పరుగులు కావాలి.కోహ్లి హాఫ్ సెంచరీవిరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ ఆచితూచి ఆడుతున్నారు. ఈ క్రమంలో 63 బంతుల్లో కోహ్లి అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. శ్రేయస్ అయ్యర్ 28 బంతుల్లో 12 పరుగులతో ఉన్నాడు. టీమిండియా స్కోరు: 132/2 (26.1).భారత్ రెండో వికెట్ డౌన్..100 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 46 పరుగులు చేసిన శుబ్మన్ గిల్.. అర్బర్ ఆహ్మద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. 18 ఓవర్లకు భారత్ స్కోర్: 102/214 ఓవర్లకు భారత్ స్కోర్: 87/114 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది. క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి(23) దూకుడుగా ఆడుతున్నాడు. అతడితో పాటు శుబ్మన్ గిల్(41) పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు.టీమిండియా తొలి వికెట్ డౌన్..242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. 20 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మను షాహీన్ అఫ్రిది అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు.దూకుడుగా ఆడుతున్న రోహిత్..4 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(16), శుబ్మన్ గిల్(9) పరుగులతో ఉన్నారు.2 ఓవర్లకు భారత్ స్కోర్: 12/02 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(11), శుబ్మన్ గిల్(0) ఉన్నారు.241 పరుగులకు పాక్ ఆలౌట్..టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ ఎంచుకోగా.. రోహిత్ సేన ఫీల్డింగ్కు దిగింది. ఈ క్రమంలో 49.4 ఓవర్లలో పాకిస్తాన్ 241 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ బ్యాటర్లలో వన్డౌన్ బ్యాటర్ సౌద్ షకీల్(62) టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ రిజ్వాన్(46), ఖుష్దిల్ షా(38) మెరుగ్గా ఆడారు. ఇక భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు.పాక్ ఆలౌట్.. స్కోరెంతంటే?49.4: హర్షిత్ రాణా బౌలింగ్లో ఖుష్దిల్ (38) కోహ్లికి క్యాచ్ ఇచ్చి పదో వికెట్గా వెనుదిరిగాడు. పాక్ స్కోరు: 241 (49.4).48.6: తొమ్మిదో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్షమీ బౌలింగ్లో హ్యారిస్ రవూఫ్ సింగిల్ పూర్తి చేసుకుని రెండోరన్ కోసం పరిగెత్తగా అక్షర్ పటేల్ అద్భుత త్రో వేశాడు. బంతిని అందుకున్న వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ స్టంప్స్ను గిరాటేయడంతో రవూఫ్(7) తొమ్మిదో వికెట్గా వెనుదిరిగాడు. పాక్ స్కోరు: 241/9 (49.2) 46.4: ఎనిమిదో వికెట్ కోల్పోయిన పాక్నసీం షా(14) రూపంలో పాకిస్తాన్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి నసీం పెవిలియన్ చేరాడు. పాక్ స్కోరు: 222/8 (47). ఖుష్దిల్ షా 27 పరుగులతో ఉన్నాడు. ఏడో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్42.5: కుల్దీప్ బౌలింగ్లో షాహిన్ ఆఫ్రిది లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగాడు.ఆరో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్42.4: కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఆరో వికెట్గా వెనుదిరిగిన సల్మాన్ ఆఘా. పందొమ్మిది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజాకు క్యాచ్ ఇచ్చిన సల్మాన్ పెవిలియన్ చేరాడు.40 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ స్కోరు: 183/5 (40)ఖుష్దిల్ షా 8, సల్మాన్ ఆఘా 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఐదో వికెట్ డౌన్రవీంద్ర జడేజా బౌలింగ్లో తయ్యబ్ తాహిర్(4) బౌల్డ్. ఐదో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్. స్కోరు: 165/5 (36.1) నాలుగో వికెట్ కోల్పోయిన పాక్34.5: హాఫ్ సెంచరీ వీరుడు సౌద్ షకీల్(62) రూపంలో పాకిస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో షకీల్ ఇచ్చిన క్యాచ్ను బౌండరీ లైన్ వద్ద అక్షర్ పటేల్ ఒడిసిపట్టాడు.33.2: మూడో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్అక్షర్ పటేల్ బౌలింగ్లో బౌల్డ్ అయిన రిజ్వాన్. షకీల్తో కలిసి రిజ్వాన్ వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేయగా అక్షర్ ఈ జోడీని విడదీశాడు. 77 బంతులు ఎదుర్కొన్న రిజ్వాన్ మూడు ఫోర్ల సాయంతో 46 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. సల్మాన్ ఆఘా క్రీజులోకి వచ్చాడు. షకీల్ 57 పరుగులతో ఉన్నాడు.30 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ స్కోరు: 129/2రిజ్వాన్ 39, షకీల్ 44 రన్స్తో క్రీజులో ఉన్నారు.25 ఓవర్లలో పాకిస్తాన్ స్కోరు: 99/2షకీల్ 29, రిజ్వాన్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు.21 ఓవర్లలో పాకిస్తాన్ స్కోరు: 82-2రిజ్వాన్ 15, షకీల్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.పొదుపుగా బౌల్ చేస్తున్న టీమిండియా ప్లేయర్లు17 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ స్కోరు: 72/2 (17). రిజ్వాన్ 23 బంతుల్లో 10, సౌద్ షకీల్ 27 బంతుల్లో 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.కట్టుదిట్టంగా భారత్ బౌలింగ్పవర్ప్లే ముగిసే సరికి పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి కేవలం 52 పరుగులు చేసింది. రిజ్వాన్ 4, షకీల్ మూడు పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 52-29.2: రెండో వికెట్ డౌన్పాక్ మరో ఓపెనర్ ఇమామ్ రనౌట్గా వెనుదిరిగాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో మిడాన్ మీదుగా షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమైన ఇమామ్.. సింగిల్ కోసం వెళ్లాడు. అయితే, సరైన సమయంలో క్రీజులోకి చేరకోకపోవడంతో అవుటయ్యాడు. ఫీల్డర్ అక్షర్ పటేల్ డైరెక్ట్ త్రోతో వికెట్ కోల్పోయాడు. 26 బంతులు ఎదుర్కొని 10 పరుగులు చేసి ఇమామ్ వెనుదిరిగాడు. రిజ్వాన్ క్రీజులోకి వచ్చాడు. పాక్ స్కోరు: 48/2 (9.3) 8.2: తొలి వికెట్ కోల్పోయిన పాకిస్తాన్టీమిండియా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి బాబర్ ఆజం పెవిలియన్ చేరాడు. మొత్తంగా 26 బంతులు ఎదుర్కొన్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ఇమామ్కు జతగా సౌద్ షకీల్ క్రీజులోకి వచ్చాడు. పాక్ స్కోరు: 45/1 (8.3) ఆరు ఓవర్లలో పాక్ స్కోరు: 26/0 (6)బాబర్ 10, ఇమామ్ 9 పరుగులతో ఉన్నారు. మూడు ఓవర్లో పాకిస్తాన్ స్కోరు: 14-0రెండు ఓవర్లు ముగిసే సరికి పాక్ స్కోరు: 10-0బాబర్, ఇమామ్ చెరో రెండు పరుగులతో క్రీజులో ఉన్నారు.తొలి ఓవర్లో పాకిస్తాన్ స్కోరు: 6-0బాబర్ ఆజం 0, ఇమామ్ ఉల్ హక్ ఒక పరుగుతో ఉన్నారు. తొలి ఓవర్లో మీ ఏకంగా ఐదు వైడ్లు వేయడం గమనార్హం. తద్వారా పాకిస్తాన్కు అదనంగా ఐదు పరుగులు వచ్చాయి.భారత్ వర్సెస్ పాకిస్తాన్ తుది జట్లుభారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్పాకిస్తాన్: సౌద్ షకీల్, బాబర్ ఆజం, ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్/వికెట్ కీపర్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహిన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్. -
Champions Trophy 2025: పాక్తో కీలక సమరం.. మళ్లీ టాస్ ఓడిన రోహిత్ శర్మ
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్, పాకిస్తాన్ జట్లు ఇవాళ (ఫిబ్రవరి 23) తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ వరుసగా తొమ్మిదో మ్యాచ్లో టాస్ ఓడాడు. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఎలాంటి ప్రయోగాలు చేయలేదు. గత మ్యాచ్లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. పాక్ మాత్రం ఓ మార్పుతో బరిలోకి దిగింది. న్యూజిలాండ్తో మ్యాచ్లో గాయపడిన ఫకర్ జమాన్ స్థానంలో ఇమామ్ ఉల్ హక్ తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లు..పాకిస్తాన్: సౌద్ షకీల్, బాబర్ ఆజమ్, ఇమామ్ ఉల్ హక్, రిజ్వాన్ (కెప్టెన్, సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, షమీ, కుల్దీప్ యాదవ్ -
'అతడొక అద్భుతం.. పాక్పై 60 బంతుల్లోనే సెంచరీ చేస్తాడు'
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్-పాకిస్తాన్(India vs Pak) మధ్య బ్లాక్ బాస్టర్ మ్యాచ్కు మరో 24 గంటల్లో తెరలేవనుంది. ఆదివారం(ఫిబ్రవరి 23)న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధిలు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వెయ్యుకళ్లతో ఎదురుచూస్తున్నారు.ఈ మ్యాచ్లో గెలిచి సెమీపైనల్ బెర్త్ను ఖారారు చేసుకోవాలని భారత్ భావిస్తుంటే.. పాకిస్తాన్ మాత్రం ఎలాగైనా గెలిచి కమ్బ్యాక్ ఇవ్వాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాక్తో మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) సెంచరీతో మెరుస్తాడని యువీ జోస్యం చెప్పాడు.కాగా ఆస్ట్రేలియా పర్యటనలో నిరాశపరిచిన హిట్మ్యాన్.. ఇంగ్లండ్ సిరీస్తో తన ఫామ్ను అందుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో రోహిత్ కేవలం 36 బంతుల్లో 41 పరుగులు చేసి ఔటయ్యాడు."రోహిత్ శర్మ ఫామ్లో ఉన్నా.. లేకపోయిన అది నాకు ముఖ్యం కాదు. నేను ఎప్పుడు రోహిత్ లాంటి మ్యాచ్ విన్నర్లకు సపోర్ట్గా ఉంటాను. ముఖ్యంగా వన్డే క్రికెట్లో విరాట్ కోహ్లితో పాటు రోహిత్ కూడా భారత్కు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించాడు. రోహిత్ ఫామ్ లేమితో సతమతమవుతున్నప్పటికి.. కొన్ని కొన్ని మ్యాచ్ల్లో పరుగులు సాధించడం సానుకూళ అంశం.కచ్చితంగా ప్రత్యర్ధికి రోహిత్ నుంచి ముప్పు పొంచి ఉంది. పాక్తో మ్యాచ్లో రోహిత్ ఫామ్ను అందుకుంటే 60 బంతుల్లోనే సెంచరీ సాధిస్తాడు. అది అతడి నైజం. ఒక్కసారి రిథమ్ను అందుకుంటే అతడిని ఆపడం ఎవరి తరం కాదు. అతడు బౌండరీలు మాత్రమే కాదు సిక్సర్లను కూడ ఈజీగా కొట్టగలడు. ప్రపంచక్రికెట్లో షార్ట్ బాల్స్ను అత్యుత్తమంగా ఆడే ఆటగాళ్లలో రోహిత్ ఒకడు.ఏ బౌలర్ అయినా 145 కి.మీ పైగా వేగంతో బౌలింగ్ చేసినా.. ఆ షార్ట్బాల్ను సిక్సర్గా మలిచే సత్తా అతడికి ఉంది. అతని స్ట్రైక్ రేట్ ఎల్లప్పుడూ 120-140 మధ్య ఉంది. రోహిత్ తనదైన రోజున సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ను గెలిపించగలడు. కాగా దుబాయ్లోని పరిస్థితులు పాకిస్తాన్ కలిసొచ్చే అవకాశముంది.వారు అక్కడ చాలా క్రికెట్ ఆడారు. అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో వారికి బాగా తెలుసు. స్లో వికెట్స్పై స్పిన్ను బాగే ఆడే ఆటగాళ్లు ఇరు జట్లలో కూడా ఉన్నారు. ఏ జట్టు అయితే అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణిస్తుందో ఆ జట్టే విజేతగా నిలుస్తుందని" జియో హాట్స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ పేర్కొన్నాడు.తుది జట్లు(అంచనా)భారత్: శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిపాకిస్తాన్: ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్చదవండి: భారత్తో మ్యాచ్.. మాకు స్పెషలేమి కాదు: పాక్ స్టార్ బౌలర్ -
Champions Trophy 2025: దాయాదుల సమరంలో ఎవరిది పైచేయి..?
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాదుల సమరంలో (India Vs Pakistan) రేపు జరుగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా భారత్, పాకిస్తాన్ జట్లు దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ భారత్పై ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని ఆ దేశ అభిమానులు ఊహల్లో ఊరేగుతుంటే.. భారత అభిమానులు ఈసారి గెలుపు తమదే అని ధీమాగా ఉన్నారు. ఎవరి అంచనాలు ఎలా ఉన్పప్పటికీ ఫలితం తేలాలంటే రేపటి వరకు ఆగాలి.చరిత్ర పరిశీలిస్తే.. భారత్, పాకిస్తాన్ వన్డేల్లో ఇప్పటివరకు 135 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 57 సార్లు విజయం సాధించగా.. పాక్ 73 మ్యాచ్ల్లో గెలుపొందింది. 5 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు.ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్ల హెడ్ టు హెడ్ రికార్డ్స్ విషయానికొస్తే.. భారత్పై పాక్ స్వల్ప ఆధిక్యత కలిగి ఉంది. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు ఇప్పటివరకు ఐదు సార్లు ఎదురెదురుపడగా.. పాక్ 3, భారత్ 2 మ్యాచ్ల్లో గెలుపొందాయి.ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాక్ తొలిసారి 2004 ఎడిషన్లో ఢీకొన్నాయి. నాటి మ్యాచ్లో (బర్మింగ్హమ్) పాక్ భారత్పై విజయం సాధించింది. ఆ మ్యాచ్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 200 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ ద్రవిడ్ (67), అజిత్ అగార్కర్ (47) భారత్ 200 పరుగల మార్కును తాకేందుకు దోహదపడ్డారు. అనంతరం మొహమ్మద్ యూసఫ్ (81 నాటౌట్), ఇంజమామ్ ఉల్ హక్ (41) రాణించడంతో పాక్ విజయతీరాలకు చేరింది.ఛాంపియన్స్ ట్రోఫీలో రెండోసారి దాయాదుల సమరంలో 2009లో జరిగింది. సెంచూరియన్ వేదికగా నాడు జరిగిన మ్యాచ్లో మరోసారి పాక్నే విజయం వరించింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. షోయబ్ మాలిక్ (128), మొహమ్మద్ యూసఫ్ (87) సత్తా చాటడంతో 302 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో తడబడిన భారత్.. రాహుల్ ద్రవిడ్ (76), గౌతమ్ గంభీర్ (57) రాణించినప్పటికీ లక్ష్యానికి 54 పరుగుల దూరంలో నిలిచిపోయింది.2013 ఎడిషన్లో భారత్, పాక్లు మూడోసారి ఢీకొట్టాయి. ఈసారి భారత్.. పాక్ను మట్టికరిపించింది. బర్మింగ్హమ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్ష ప్రభావితమైన ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 165 పరుగులకే ఆలౌటైంది. ఛేదనలో శిఖర్ ధవన్ (48) రాణించడంతో భారత్ సునాయాసంగా విజయం సాధించింది. ఆ సీజన్లో భారత్.. శ్రీలంకతో కలిసి సంయుక్తంగా విజేతగా నిలిచింది.2017 ఎడిషన్లో భారత్, పాక్ అదే బర్మింగ్హమ్ వేదికగా నాలుగోసారి తలపడ్డాయి. ఈసారి కూడా భారత్దే పైచేయి అయ్యింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్ శర్మ (91), శిఖర్ ధవన్ (68), విరాట్ కోహ్లి (81 నాటౌట్) చెలరేగడంతో భారత్ 319 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన పాక్ 164 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూగట్టుకుంది.2017 ఎడిషన్లోనే భారత్, పాక్ మరోసారి తలపడ్డాయి. ఆ సీజన్ ఫైనల్లో పాక్.. భారత్ను ఓడించి తమ తొలి టైటిల్ను ఎగరేసుకుపోయింది. ఓవల్లో జరిగిన ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. ఫకర్ జమాన్ (114) సెంచరీతో కదంతొక్కాడు. అనంతరం ఛేదనలో భారత్ తడబడింది. 30.3 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో హార్దిక్ పాండ్యా (76) టాప్ స్కోరర్గా నిలిచాడు.ఏడేళ్ల అనంతరం భారత్, పాక్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆరోసారి తలపడుతున్నాయి. ఇరు జట్ల ఫామ్ ప్రకారం చూస్తే.. పాక్పై టీమిండియా పైచేయి సాధించే అవకాశం ఉంది. ఈ ఎడిషన్లో భారత్ ఇప్పటికే బంగ్లాదేశ్పై విజయం సాధించి ఉత్సాహంగా ఉండగా.. పాక్ తమ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో చావుదెబ్బ తిని సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. రేపు జరుగబోయే మ్యాచ్లో భారత్ చేతిలో ఓడితే పాక్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.బలాబలాల విషయానికొస్తే.. పాక్తో పోలిస్తే భారత్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. భారత బ్యాటింగ్ లైనప్ను చూస్తే ప్రపంచంలో ఎంతటి మేటి జట్టైనా గజగజ వణకాల్సిందే. ఓపెనర్ శుభ్మన్ గిల్ అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ కూడా మాంచి టచ్లో కనిపించాడు. పాకిస్తాన్ అనగానే విరాట్కు పూనకం వస్తుంది. ఇటివలికాలంలో విరాట్ పెద్దగా ఫామ్లో లేకపోయినా పాక్తో మ్యాచ్ అంటే అతను చెలరేగుతాడు. శ్రేయస్ అయ్యర్ అయ్యర్ సైతం మంచి ఫామ్లో ఉన్నాడు. బంగ్లాతో మ్యాచ్లో నిరాశపర్చినా తిరిగి గాడిలో పడతాడు. బంగ్లా మ్యాచ్లో కేఎల్ రాహుల్ సైతం మంచి ఇన్నింగ్స్ ఆడి టచ్లోకి వచ్చాడు. ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా గత కొంతకాలంగా అద్భుతంగా రాణిస్తున్నారు. బౌలింగ్ విభాగంలోనూ పాక్తో పోలిస్తే భారత్ పటిష్టంగానే కనిపిస్తుంది. షమీ గత మ్యాచ్లో ఐదు వికెట్లతో చెలరేగాడు. అదే మ్యాచ్లో అక్షర్ తృటిలో హ్యాట్రిక్ చేజార్చుకున్నాడు. యువ పేసర్ హర్షిత్ రాణా సైతం మంచి ఫామ్లో ఉన్నాడు. స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ పాక్పై రెచ్చిపోయేందుకు రెడీగా ఉన్నారు.పాక్ విషయానికొస్తే.. భారత్తో పోలిస్తే ఈ జట్టు పరిస్థితి భిన్నంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఈ జట్టు పేలవంగా ఉంది. గడిచిన మ్యాచ్లో ఈ జట్టు న్యూజిలాండ్ చేతిలో చావుదెబ్బతింది. ఆ మ్యాచ్లో బాబర్ ఆజమ్, ఖుష్దిల్ షా మినహా ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. కీలక ఆటగాడు ఫకర్ జమాన్ తొలి మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడి టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. కెప్టెన్ రిజ్వాన్ పెద్దగా ఫామ్లో లేదు. బాబర్, రిజ్వాన్ తప్పించి పాక్ బ్యాటింగ్ లైనప్లో అనుభవజ్ఞుడైన ఆటగాడే లేడు. సౌద్ షకీల్, సల్మాన్ అఘా ఎప్పుడు రాణిస్తారో వారికే తెలీదు. బౌలింగ్ విషయానికొస్తే.. పాక్ బౌలింగ్ గతంలో ఎన్నడూ లేనంత ఛండాలంగా ఉంది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో పాక్ పేసర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. షాహీన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్ పోటీ పడి పరుగులు ఇచ్చారు. స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ పర్వాలేదనిపించినా స్పిన్ను గట్టిగా ఆడే భారత బ్యాటర్ల ముందు నిలవడం చాలా కష్టం. ఎలా చూసినా పాక్పై పైచేయి సాధించేందుకు భారత్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
CT 2025: వారిద్దరు బాగా ఆడారు.. అయినా క్రెడిట్ మా వారికే దక్కుతుంది: రోహిత్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో (Champions Trophy) టీమిండియా ఘనంగా బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో నిన్న (ఫిబ్రవరి 20) జరిగిన మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో స్థాయికి తగ్గట్టుగా రాణించింది. ఫీల్డింగ్లో నిరాశపరిచినా బౌలర్లు, బ్యాటర్లు టీమిండియాకు విజయం చేకూర్చారు. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ను ఓడించడంపై సంతృప్తి వ్యక్తం చేశాడు. బంగ్లా బ్యాటర్లు హృదయ్, జాకిర్ అలీ అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు. వారిద్దరు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారని అభినందించాడు. షమీ ఐదు వికెట్ల ప్రదర్శనను కొనియాడాడు. ఇలాంటి ప్రదర్శనల కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నామని అన్నాడు. షమీ సామర్థ్యం గురంచి తెలుసని చెప్పాడు. జట్టుకు అవసరమైన ప్రతిసారి షమీ అద్భుత ప్రదర్శనలతో ముందుకొస్తాడని కితాబునిచ్చాడు. శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ను కూడా ప్రశంసించాడు. గిల్ నుంచి ఇలాంటి ప్రదర్శనలు ఆశ్చర్యానికి గురి చేయవని అన్నాడు. గిల్ స్థాయి ఏంటో తమకు తెలుసని తెలిపాడు. అతనో క్లాసికల్ ప్లేయర్ అని కొనియాడాడు. గిల్ చివరి వరకు క్రీజ్లో ఉండటం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు.అక్షర్ హ్యాట్రిక్ను నేలపాలు చేయడంపై స్పందిస్తూ.. అది చాలా సులభమైన క్యాచ్. నా స్థాయి క్రికెటర్ అలాంటి క్యాచ్ను తప్పక పట్టుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు అలా జరుగలేదు. సునాయాసమైన క్యాచ్ను వదిలేసినందుకు చింతిస్తున్నాను. అక్షర్ హ్యాట్రిక్ మిస్ అయినందుకు చాలా బాధేసింది. రేపు అతన్ని డిన్నర్కు తీసుకెళ్తానంటూ నవ్వులు పూయించాడు.పిచ్ తీరుపై స్పందిస్తూ.. ఊహించిన దానికంటే నిదానంగా ఉందని అన్నాడు. తర్వాతి మ్యాచ్లో కూడా పిచ్ ఇలాగే ఉంటుందని చెప్పలేమని తెలిపాడు. ఒక్క మ్యాచ్తోనే పిచ్ను అంచనా వేయడం కష్టమని పేర్కొన్నాడు. ముందుగా పిచ్ ఇలా ఉంటుందని చెప్పడానికి నేను క్యూరేటర్ను కాదని జోక్ చేశాడు. మొత్తంగా జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగా టోర్నీల్లో ఒత్తిడి ఉంటుందని, జట్టుగా మేము దాన్ని అధిగమించగలమని విశ్వాసం వ్యక్తం చేశాడు.కాగా, నిన్నటి మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. తౌహిద్ హృదయ్ వీరోచిత శతకంతో (100) పోరాడటంతో 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది. హృదయ్కు జాకిర్ అలీ (68) సహకరించాడు. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండిన బంగ్లాదేశ్కు ఈ ఇద్దరు గౌరవప్రదమైన స్కోర్ను అందించారు. భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు.అనంతరం శుభ్మన్ గిల్ (101) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్ మరో 3.3 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రోహిత్ శర్మ (41) తన సహజ శైలిలో బ్యాట్ను ఝులింపించగా.. కేఎల్ రాహుల్ (41 నాటౌట్) సిక్సర్ కొట్టి భారత్ను గెలిపించాడు. భారత ఇన్నింగ్స్లో విరాట్ (22), శ్రేయస్ (15), అక్షర్ (8) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. భారత్ తమ తదుపరి మ్యాచ్లో దాయాది పాకిస్తాన్ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ మార్చి 23న దుబాయ్లోనే జరుగుతుంది. -
Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఖాతాలో ఓ భారీ రికార్డు చేరింది. హిట్ మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్గా 100 విజయాలు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్తో (Ricky Ponting) కలిసి అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు. రోహిత్ ఇప్పటివరకు (బంగ్లాతో మ్యాచ్) 138 మ్యాచ్ల్లో భారత కెప్టెన్గా వ్యవహరించి 100 విజయాలు సాధించాడు. రోహిత్ సారథ్యంలో టీమిండియా 33 మ్యాచ్ల్లో ఓడింది. మూడు మ్యాచ్లు డ్రా కాగా.. ఓ మ్యాచ్ టై అయ్యింది.కెప్టెన్గా రోహిత్ సాధించిన 100 విజయాల్లో 50 టీ20ల్లో వచ్చినవి కాగా.. 38 వన్డేల్లో, 12 టెస్ట్ల్లో వచ్చాయి. కెప్టెన్గా రోహిత్ విజయాల శాతం 70కి పైగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్కు ముందు రికీ పాంటింగ్ ఒక్కడే ఈ స్థాయి విన్నింగ్ పర్సంటేజీతో విజయాలు సాధించాడు. ఓ విషయంలో పాంటింగ్తో పోలిస్తే రోహితే గ్రేట్ అని చెప్పాలి. పాంటింగ్ 28 ఏళ్ల వయసులో కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి ఈ స్థాయి విజయాలు సాధిస్తే.. హిట్ మ్యాన్ 30 ఏళ్ల తర్వాత టీమిండియా కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించి విజయాల సెంచరీ పూర్తి చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 30 ఏళ్ల వయసు తర్వాత 100 విజయాలు సాధించిన ఏకైక కెప్టెన్గానూ హిట్ మ్యాన్ రికార్డు నెలకొల్పాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో రికీ పాంటింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. రికీ తన కెరీర్లో ఆసీస్కు 324 మ్యాచ్ల్లో సారథ్యం వహించి 220 మ్యాచ్ల్లో గెలిపించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 200కు పైగా విజయాలు సాధించిన ఏకైక కెప్టెన్ పాంటింగ్ మాత్రమే. పాంటింగ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన ఘనత టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి దక్కుతుంది. ధోని 332 మ్యాచ్ల్లో టీమిండియా కెప్టెన్ వ్యవహరించి 178 మ్యాచ్ల్లో గెలిపించాడు. ధోని తర్వాత విరాట్ కోహ్లి (135) అత్యధికంగా టీమిండియాను గెలిపించాడు.2017లో మొదలైన రోహిత్ ప్రస్తానం2017లో తొలిసారి టీమిండియా కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన రోహిత్.. 2021-22లో టీమిండియా ఆల్ ఫార్మాట్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. రోహిత్ సారథ్యంలో టీమిండియా గతేడాది టీ20 వరల్డ్కప్ గెలిచింది. రోహిత్ టీమిండియాను 2023 వన్డే వరల్డ్కప్, 2021-2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేర్చాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ తొలి విజయం సాధించింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. తౌహిద్ హృదయ్ వీరోచిత శతకంతో (100) పోరాడటంతో 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది. హృదయ్కు జాకిర్ అలీ (68) సహకరించాడు. ఈ మ్యాచ్లో షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. అనంతరం శుభ్మన్ గిల్ (101) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్ మరో 3.3 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రోహిత్ శర్మ (41) తన సహజ శైలిలో బ్యాట్ను ఝులింపించగా.. కేఎల్ రాహుల్ (41 నాటౌట్) సిక్సర్ కొట్టి భారత్ను గెలిపించాడు.11000 పరుగుల క్లబ్లో రోహిత్ఈ మ్యాచ్లో రోహిత్ వన్డేల్లో 11000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. విరాట్ తర్వాత వన్డేల్లో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ ఘనతను కోహ్లి 222 ఇన్నింగ్స్ల్లో సాధించగా.. రోహిత్కు 261 ఇన్నింగ్స్లు పట్టింది. -
IND Vs BAN: చాంపియన్స్ ట్రోఫీ తొలి పోరులో బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం (ఫొటోలు)
-
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బద్దలు
అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో అత్యంతవేగంగా 11000 పరుగుల మైలు రాయిని అందుకున్న రెండో క్రికెటర్గా రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. ఈ ఫీట్ను చేరుకోవడానికి రోహిత్కు 261 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి.ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ ఈ రికార్డును 276 ఇన్నింగ్స్లలో సాధించాడు. తాజా మ్యాచ్తో లిటల్మాస్టర్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. కాగా ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో రన్-మెషీన్ విరాట్ కోహ్లి అగ్రస్ధానంలో ఉన్నాడు. కోహ్లి 2019లో కేవలం 222 ఇన్నింగ్స్ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు.రోహిత్ ధనాధన్ ఇన్నింగ్స్..కాగా ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. తొలి రెండు ఓవర్లలో కాస్త ఆచితూచి ఆడిన రోహిత్.. మూడో ఓవర్ నుంచి బౌండరీల మోత మొదలు పెట్టాడు. కేవలం 36 బంతుల్లో 7 ఫోర్లతో 41 పరుగులు చేసి రోహిత్ శర్మ ఔటయ్యాడు. టాస్కిన్ ఆహ్మద్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి హిట్మ్యాన్ తన వికెట్ను కోల్పోయాడు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది.బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ హ్రిదయ్(118 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 100) విరోచిత సెంచరీతో చెలరేగగా.. జాకర్ అలీ(68) ఆర్ధ శతకంతో రాణించాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఫైవ్ వికెట్ హాల్తో మెరిశాడు. తన 10 ఓవర్ల కోటాలో షమీ 53 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు. అతడితో పాటు హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టాడు.వన్డేల్లో అత్యంత వేగంగా 11000 పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..1 - విరాట్ కోహ్లి: 222 ఇన్నింగ్స్లు2 - రోహిత్ శర్మ: 261 ఇన్నింగ్స్3 - సచిన్ టెండూల్కర్: 276 ఇన్నింగ్స్4 - రికీ పాంటింగ్: 286 ఇన్నింగ్స్లు5 - సౌరవ్ గంగూలీ: 288 ఇన్నింగ్స్చదవండి: Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. -
రోహిత్ శర్మ మంచి మనసు.. ఫ్యాన్స్ ఫిదా! వీడియో వైరల్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో ఎంత యాక్టివ్గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్మ్యాన్ తనదైన శైలిలో సహచర ఆటగాళ్లపై పంచ్లు వేస్తూ నవ్వులు పూయిస్తుంటాడు. అంతేకాకుండా ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్ల పట్ల కూడా రోహిత్ తన మంచి మనుసు చాటుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.తాజాగా రోహిత్ శర్మ మరో తన క్రీడా స్పూర్తిని ప్రదర్శించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్, భారత జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో బంగ్లా బ్యాటర్ జాకర్ అలీ షూ లేస్ను రోహిత్ కట్టాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది.దీంతో సోషల్ మీడియా వేదికగా భారత కెప్టెన్పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శెభాష్ హిట్మ్యాన్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా ఈ మ్యాచ్లో జాకర్ అలీ ఇచ్చిన ఈజీ క్యాచ్ను రోహిత్ జారవిడిచాడు. తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఏకంగా 68 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు.హృదయ్ సూపర్ సెంచరీ..ఇక టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ హ్రిదయ్(118 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 100) విరోచిత సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు జాకర్ అలీ(68) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.35 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన బంగ్లాను జాకర్ అలీ, హృదయ్ తమ అద్భుత ఇన్నింగ్స్లతో ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్కు 154 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 5 వికెట్లతో చెలరేగగా.. హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టాడు.తుది జట్లు..బంగ్లాదేశ్: తంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, రిషాద్ హొస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మన్భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్చదవండి: IND vs BAN: ఎంత పనిచేశావు రోహిత్..పాపం అక్షర్ పటేల్! వీడియో వైరల్ -
Champions Trophy: టీమిండియాను వెంటాడుతున్న బ్యాడ్ లక్
టాస్ విషయంలో టీమిండియాను బ్యాడ్ లక్ వెంటాడుతుంది. 2023 వన్డే వరల్డ్కప్ ఫైనల్ నుంచి భారత్ వరుసగా 11 వన్డేల్లో టాస్ ఓడింది. ప్రపంచ క్రికెట్లో ఒక్క నెదర్లాండ్స్ మాత్రమే భారత్లా వరుసగా 11 వన్డేల్లో టాస్ ఓడింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ తాజాగా టాస్ ఓడింది.రోహిత్ సారథ్యంలో 8 రాహుల్ కెప్టెన్సీలో 3వన్డేల్లో భారత్ వరుసగా కోల్పోయిన 11 టాస్ల్లో.. ఎనిమిది రోహిత్ శర్మ సారథ్యంలో కాగా.. మూడు కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన 2023 వరల్డ్కప్ ఫైనల్లో భారత్.. రోహిత్ శర్మ నేతృత్వంలో టాస్ ఓడింది. ఆతర్వాత సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల్లో భారత్.. కేఎల్ రాహుల్ సారథ్యంలో టాస్ ఓడింది. అనంతరం శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల్లో భారత్.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టాస్లు ఓడింది. తాజాగా ఇంగ్లండ్తో జరిగిన మూడు వన్డేల్లో భారత్.. రోహిత్ సారథ్యంలో టాస్లు ఓడింది. తాజాగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్.. రోహిత్ శర్మ సారథ్యంలో టాస్ ఓడింది.పీకల్లోతు కష్టాల్లో బంగ్లాదేశ్ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టిన షమీ.. బంగ్లా పతనానికి నాంది పలికాడు. ఆతర్వాత రెండో ఓవర్లో యువ పేసర్ హర్షిత్ రాణా వికెట్ తీశాడు. దీని తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చిన షమీ.. తిరిగి ఏడో ఓవర్లో మరో వికెట్ తీశాడు.అక్షర్కు హ్యాట్రిక్ మిస్ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో అక్షర్ పటేల్ మ్యాజిక్ చేశాడు. ఈ ఓవర్లో వరుసగా రెండు, మూడు బంతులకు వికెట్లు తీసిన అక్షర్.. రోహిత్ శర్మ చేసిన తప్పిదం కారణంగా హ్యాట్రిక్ తీసే సువర్ణావకాశాన్ని కోల్పోయాడు. ఈ ఓవర్ నాలుగో బంతికి స్లిప్స్లో జాకిర్ అలీ అందించిన సునాయాసమైన క్యాచ్ను రోహిత్ జారవిడిచాడు.13 ఓవర్లలో 50 పరుగులు13 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ ఐదు వికెట్ల నష్టానికి 50 పరుగులుగా ఉంది. తంజిద్ హసన్ 25, సౌమ్య సర్కార్ 0, కెప్టెన్ షాంటో 0, మెహిది హసన్ 5, ముష్ఫికర్ 0 పరుగులకు ఔట్ కాగా.. తౌహిద్ హృదోయ్ (10), జాకిర్ అలీ (7) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ, అక్షర్ తలో రెండు.. హర్షిత్ ఓ వికెట్ పడగొట్టారు. -
‘టీమిండియా ఓడినా.. 2027 వరల్డ్కప్ వరకు అతడే కెప్టెన్’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్(Mohammad Kaif) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్కప్-2027 వరకు హిట్మ్యాన్ సారథిగా కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ అసాధారణ విజయాలు సాధించాడన్న కైఫ్.. అతడు సమీపకాలంలో రిటైర్ అయ్యే ప్రసక్తి లేదని పేర్కొన్నాడు.కాగా టీమిండియా ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ వేదికగా బుధవారం ఈ మెగా టోర్నీ మొదలుకాగా.. దుబాయ్లో భారత జట్టు తమ మ్యాచ్లన్నీ ఆడనుంది. తొలుత గురువారం బంగ్లాదేశ్తో తలపడనున్న రోహిత్ సేన.. ఆ తర్వాత ఫిబ్రవరి 23న పాకిస్తాన్, మార్చి 2న న్యూజిలాండ్లతో మ్యాచ్లు ఆడుతుంది.ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ?ఇదిలా ఉంటే.. 37 ఏళ్ల రోహిత్ శర్మకు ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ కానుందంటూ సురేశ్ రైనా, ఆకాశ్ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో టీమిండియా ఓడిపోయినా రోహిత్ శర్మ భవిష్యత్తుకు ఢోకా ఏమీ ఉండబోదని జోస్యం చెప్పాడు.కోచ్లకే ఇబ్బంది.. రోహిత్ సేఫ్ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా.. ‘‘కెప్టెన్గా రోహిత్ శర్మ సాధించిన విజయాలు అందరికీ సాధ్యం కాకపోవచ్చు. వన్డే ప్రపంచకప్-2023 ఈవెంట్లో టీమిండియాను ఫైనల్కు చేర్చాడు. ఆ తర్వాత మనవాళ్లు ఎక్కువగా వన్డే క్రికెట్ ఆడలేదు. ఆ దేవుడి దయ వల్ల ఇలా జరుగకూడదు.. కానీ ఒకవేళ టీమిండియా గనుక చాంపియన్స్ ట్రోఫీలో గొప్పగా రాణించకపోతే కోచ్లు మాత్రమే ఇబ్బందుల్లో పడతారు.అప్పటి దాకా అతడే కెప్టెన్అయితే, రోహిత్ శర్మకు మాత్రం ఎలాంటి సమస్యా ఉండదు. టెస్టుల్లో చోటు విషయంలో స్పష్టత లేదు గానీ.. వన్డేల్లో మాత్రం అతడి స్థానాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. ప్రస్తుతం అతడు ఫామ్లో ఉన్నాడు. ఇంగ్లండ్తో వన్డేల్లో విధ్వంసర సెంచరీ బాదాడు.జట్టుకు అద్భుతమైన క్లీన్స్వీప్ విజయం అందించాడు. బ్యాటర్గా వన్డేల్లో అతడి రికార్డు గొప్పగా ఉంది. సారథిగా విజయాల శాతం కూడా ఎక్కువే. అందుకే ఈ టోర్నమెంట్లో టీమిండియా కాస్త చెత్తగా ఆడినా.. ఓడినా జట్టులో అతడి స్థానం పదిలంగానే ఉంటుంది. 2027 వన్డే వరల్డ్ప్ వరకు అతడు కొనసాగుతాడు’’ అని మహ్మద్ కైఫ్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొంటున్న భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: CT 2025: అదొక చెత్త నిర్ణయం.. అతడి వల్లే ఇదంతా: మాజీ క్రికెటర్ ఫైర్ -
Champions Trophy 2025: బంగ్లాదేశ్తో మ్యాచ్.. రోహిత్ను ఊరిస్తున్న భారీ రికార్డులు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ ఇవాళ (ఫిబ్రవరి 20) తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. దుబాయ్లో జరిగే ఈ మ్యాచ్లో టీమిండియా.. బంగ్లాదేశ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను పలు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి.ఈ మ్యాచ్లో హిట్మ్యాన్ మరో 12 పరుగులు చేస్తే.. వన్డేల్లో 11,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత బ్యాటర్గా, ప్రపంచంలో 10వ ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. 2007 జూన్ 23న బెల్ఫాస్ట్ లో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్.. ఇప్పటివరకు 268 మ్యాచ్లు ఆడి 10,988 పరుగులు చేశాడు.వన్డేల్లో 11000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు..సచిన్ టెండూల్కర్ (భారత్)- 18,426కుమార్ సంగక్కర (శ్రీలంక)- 14,234విరాట్ కోహ్లీ (భారత్)- 13,963రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)-13,704సనత్ జయసూర్య (శ్రీలంక)- 13,430మహేల జయవర్ధనే (శ్రీలంక)- 12,650ఇంజమామ్-ఉల్-హక్ (పాకిస్థాన్)- 11,739జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా)- 11,579సౌరవ్ గంగూలీ (భారత్)- 11,363ఈ మ్యాచ్లో రోహిత్ 11000 పరుగులు పూర్తి చేస్తే మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసకుంటాడు. సహచరుడు విరాట్ కోహ్లీ తర్వాత ప్రపంచంలో అత్యంత వేగంగా 11000 వన్డే పరుగులు పూర్తి చేసిన రెండో ప్లేయర్గా రికార్డుకెక్కుతాడు. విరాట్ 222 ఇన్నింగ్స్ల్లో ఈ మైలురాయిని తాకగా.. రోహిత్కు 260వ ఇన్నింగ్స్లో 11000 పరుగులు పూర్తి చేసే అవకాశం వచ్చింది.వన్డేల్లో అత్యంత వేగంగా 11000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు..విరాట్ కోహ్లీ (భారత్)- 222 ఇన్నింగ్స్లుసచిన్ టెండూల్కర్ (భారత్)- 276రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 286సౌరవ్ గంగూలీ (భారత్)- 288జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా)- 293 నేటి మ్యాచ్లో రోహిత్ సెంచరీ చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో 50 సెంచరీలు పూర్తి చేసిన మూడో భారతీయ ఆటగాడిగా, ప్రపంచంలో 10వ క్రికటర్గా రికార్డుల్లోకెక్కుతాడు. రోహిత్ ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిపి 49 సెంచరీలు చేశాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు..సచిన్ టెండూల్కర్ (భారత్)- 100విరాట్ కోహ్లీ (భారత్)- 81రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 71కుమార్ సంగక్కర (శ్రీలంక)- 63జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా)- 62హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా)- 55మహేల జయవర్ధనే (శ్రీలంక)- 54బ్రియాన్ లారా (వెస్టిండీస్)- 53జో రూట్ (ఇంగ్లాండ్)- 52రోహిత్ శర్మ (భారత్)- 49ఇవాళ జరుగబోయే మ్యాచ్లో టీమిండియా గెలిస్తే.. కెప్టెన్గా రోహిత్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు వచ్చి చేరుతుంది. నేటి మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే..రోహిత్ ఖాతాలో 100 అంతర్జాతీయ విజయాలు నమోదవుతాయి. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో భారత కెప్టెన్గా రోహిత్ రికార్డుల్లోకెక్కుతాడు. రోహిత్ ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో 99 విజయాలు (137 మ్యాచ్ల్లో) సాధించాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్లు..ఎంఎస్ ధోనీ- 179విరాట్ కోహ్లీ- 137మొహమ్మద్ అజారుద్దీన్- 104రోహిత్ శర్మ- 99సౌరవ్ గంగూలీ- 97నేటి మ్యాచ్లో రోహిత్ 14 సిక్సర్లు కొడితే వన్డేల్లో అత్యధిక సిక్స్లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృస్టిస్తాడు. ప్రస్తుతం పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది (398 మ్యాచ్ల్లో 351 సిక్సర్లు) పేరిట ఈ రికార్డు ఉంది. రోహిత్ ఇప్పటివరకు 268 మ్యాచ్ల్లో 338 సిక్సర్లు బాదాడు. -
మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లే ఉన్నారు: రోహిత్ శర్మ కౌంటర్
మెగా క్రికెట్ పోరుకు టీమిండియా సిద్ధమైంది. దుబాయ్ వేదికగా గురువారం చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) బరిలో దిగనుంది. తొలి పోరులో రోహిత్ సేన బంగ్లాదేశ్తో తలపడనుంది. ఈ క్రమంలో శనివారమే దుబాయ్(Dubai)కు చేరుకున్న భారత జట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమించింది. లీగ్ దశలో మూడు మ్యాచ్లు కీలకమే కాబట్టి విజయంతో టోర్నమెంట్ను మొదలుపెట్టాలనే పట్టుదలతో ఉంది.మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లే ఉన్నారుఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) జట్టు ఎంపిక తీరుపై వస్తున్న విమర్శలపై స్పందించాడు. ‘‘చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టులో ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడంపై తీవ్ర చర్చ సాగుతోంది. అయితే మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లను మాత్రమే ఎంపిక చేశాం. మరో ముగ్గురు బ్యాటింగ్ చేయగల ఆల్రౌండర్లు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ చేయగల ప్లేయర్లు జట్టుకు అవసరం. ఈ ముగ్గురు జట్టుకు వైవిధ్యాన్ని అందిస్తారు. అయినా మేం మా బలాన్ని బట్టి ఆటగాళ్లను ఎంచుకుంటాం. జడేజా, అక్షర్, వాషీ జట్టులో ఉంటే మాకు భిన్న రకాల ప్రణాళికలతో ముందుకు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. మాకు బ్యాటింగ్, బౌలింగ్ చేయగల ఆటగాళ్ల అవసరం ఉంది.టీమిండియా గురించి మాట్లాడేవారు ఇతర జట్లలో ముగ్గురు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లు ఉంటే.. వారి వద్ద ఆరుగురు పేసర్లు ఉన్నారేంటి అని అడగరు’’ అంటూ రోహిత్ శర్మ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. ఈ సందర్భంగా చాంపియన్స్ ట్రోఫీ గెలవడమే తమ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్న హిట్మ్యాన్.. ప్రస్తుతం బంగ్లాదేశ్తో మ్యాచ్పైనే తమ దృష్టి మొత్తం కేంద్రీకృతమై ఉందని తెలిపాడు.కొత్తగా వరుణ్ చక్రవర్తికాగా చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపిక చేసిన పదిహేను మంది సభ్యుల భారత జట్టులో స్పిన్ దళానికి ప్రాధాన్యం దక్కింది. ప్రాథమిక జట్టులో ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్తో పాటు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాత్రమే ఉన్నాడు. అయితే, ఫైనల్ టీమ్ను ఖరారు చేసే సమయంలో బీసీసీఐ సెలక్టర్లు ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్పై వేటు వేసి అతడి స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తీసుకువచ్చారు. ఫలితంగా జట్టులో ఏకంగా ఐదుగురు స్పిన్నర్లకు చోటు దక్కినట్లయింది.ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్, మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ సహా పలువురు మాజీ క్రికెటర్లు సెలక్టర్ల తీరును విమర్శించారు. మెగా టోర్నీకి ఏకంగా ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడం వల్ల తుదిజట్టు కూర్పు దెబ్బతినే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పైవిధంగా స్పందించాడు.ఇదిలా ఉంటే.. గ్రూప్-‘ఎ’ పోటీలో భాగంగా గురువారం తమ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడనున్న టీమిండియా.. తదుపరి ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్ను ఢీకొట్టనుంది. అనంతరం లీగ్ దశలో ఆఖరిగా న్యూజిలాండ్తో మార్చి 2న మ్యాచ్ ఆడనుంది. ఇక ఈ టోర్నీలో గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ పోటీపడుతున్నాయి. కాగా మెగా ఈవెంట్లో తొలి మ్యాచ్లో ఆతిథ్య పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడింది.చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: CT 2025: షెడ్యూల్, జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం.. లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే మా లక్ష్యం: రోహిత్ శర్మ
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. గురువారం(ఫిబ్రవరి 19)న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) విలేకరుల సమావేశంలో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా హిట్మ్యాన్ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని రోహిత్ తెలిపాడు."దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. ప్రతీ ఐసీసీ టైటిల్ కూడా మాకు ముఖ్యమైనదే. ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ఇక్కడకు వచ్చాము. అయితే ప్రస్తుతం మా దృష్టి బంగ్లాదేశ్ మ్యాచ్పైనే ఉంది. ఈ మెగా టోర్నీని విజయంతో ఆరంభించాలని భావిస్తున్నాము.మాపై ఎటువంటి ఒత్తడి లేదు. జట్టులోని ప్రతీ ఒక్కరికి వారి రోల్పై ఓ క్లారిటీ ఉంది. ఇంతకుముందు టోర్నీలో భారత్ తరపున ఎలా ఆడామో, ఇప్పుడు కూడా అలానే ఆడుతాము. ఈ టోర్నీకి ముందు ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లో మా కుర్రాళ్లు బాగా రాణించారు. అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచాము. వారిని తక్కువ స్కోర్లకే పరిమితం చేశాము. కానీ ప్రతీ సిరీస్, వేదిక ఒక కొత్త సవాలు వంటిందే. గతంలో దుబాయ్లో మేము చాలా క్రికెట్ ఆడాము. పిచ్ను వీలైనంత త్వరగా అంచనా వేయడం చాలా ముఖ్యం. పరిస్థితులను బట్టి మన ప్లాన్స్ను మార్చుకోవాలి" అని ప్రెస్కాన్ఫరెన్స్లో రోహిత్ పేర్కొన్నాడు. కాగా ఈ టోర్నీ కోసం ఐదు రోజుల ముందే దుబాయ్కు చేరుకున్న భారత జట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమించింది.బుమ్రా లేకుండానే..ఇక ఈ మెగా ఈవెంట్లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే ఆడనుంది. బుమ్రా వెన్ను గాయం కారణంగా ఈ మినీ వరల్డ్కప్నకు దూరమయ్యాడు. అతడి స్దానంలో యువ పేసర్ హర్షిత్ రాణాను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అదేవిధంగా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ను జట్టు నుంచి రిలీజ్ చేశారు. అతడికి బదులుగా మణికట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకున్నారు.బంగ్లాపై మనదే పై చేయి..కాగా వన్డేల్లో బంగ్లాదేశ్పై భారత్ మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు వన్డే ఫార్మాట్లో 41 సార్లు తలపడగా.. భారత్ 32 విజయాలు నమోదు చేయగా, బంగ్లా జట్టు కేవలం ఎనిమిదింట మాత్రమే గెలుపొందింది. ఇందులో మూడు విజయాలు చివరి ఐదు మ్యాచ్ల్లో రావడం గమనార్హం. చివరగా ఈ రెండు జట్లు వన్డే ప్రపంచకప్-2023లో ముఖాముఖి తలపడ్డాయి. ఈ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో బంగ్లాను భారత్ చిత్తు చేసింది.చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ: ఈ జట్ల మధ్యే ప్రధాన పోటీ?.. కివీస్కు ఛాన్సులు ఎక్కువే! -
CT 2025: షెడ్యూల్, జట్లు, టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) రూపంలో మెగా క్రికెట్ పండుగ అభిమానులకు కనువిందు చేయనుంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలయ్యే ఈ ఐసీసీ టోర్నమెంట్ మార్చి 9న ఫైనల్తో ముగియనుంది. ఈ ఈవెంట్లో ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి.ఇందులో భాగంగా గ్రూప్-‘ఎ’ నుంచి భారత్(India), పాకిస్తాన్(Pakistan), న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్, వేదికలు,జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ తదితర వివరాలు తెలుసుకుందామా?!చాంపియన్స్ ట్రోఫీ-2025 పూర్తి షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం(భారత కాలమానం ప్రకారం)👉1. ఫిబ్రవరి 19- పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్- ఎ, నేషనల్ స్టేడియం, కరాచీ (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉2. ఫిబ్రవరి 20- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్, గ్రూప్-ఎ, దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉3. ఫిబ్రవరి 21- అఫ్గనిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా, గ్రూప్-బి, నేషనల్ స్టేడియం, కరాచి(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉4. ఫిబ్రవరి 22- ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్, గ్రూప్-బి, గడాఫీ స్టేడియం, లాహోర్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉5. ఫిబ్రవరి 23- ఇండియా వర్సెస్ పాకిస్తాన్, గ్రూప్-ఎ, దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉6. ఫిబ్రవరి 24- బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్-ఎ, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉7. ఫిబ్రవరి 25- ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా, గ్రూప్-బి, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉8. ఫిబ్రవరి 26- అఫ్గనిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్, గ్రూప్-బి, గడాఫీ స్టేడియం, లాహోర్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉9. ఫిబ్రవరి 27- పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, గ్రూప్-ఎ, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉10. ఫిబ్రవరి 28- అఫ్గనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా, గ్రూప్-బి, గడాఫీ స్టేడియం, లాహోర్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉11. మార్చి 1- సౌతాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్, గ్రూప్-బి, నేషనల్ స్టేడియం, కరాచి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉12. మార్చి 2- ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్-ఎ, దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉సెమీ ఫైనల్ 1: మార్చి 4- దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(ఇండియా క్వాలిఫై అయితే), 👉సెమీ ఫైనల్ 2: మార్చి 5- గడాఫీ స్టేడియం లాహోర్(పాకిస్తాన్ క్వాలిఫై అయితే)👉ఫైనల్ మార్చి 9: గడాఫీ స్టేడియం లాహోర్ లేదా దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(ఇండియా క్వాలిఫై అయితే).లైవ్ టెలికాస్ట్, ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..భారత్లో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, స్పోర్ట్స్ 18లో లైవ్ టెలికాస్ట్. అదే విధంగా.. జియోహాట్స్టార్ యాప్లో లైవ్ స్ట్రీమింగ్. స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియా(ఎక్స్) హ్యాండిల్లో ఉన్న వివరాల ప్రకారం.. జియోహాట్స్టార్లో ఉచితంగా మ్యాచ్లు చూడవచ్చు. టెలివిజన్, మొబైల్లలో ఈ వెసలుబాటు ఉంటుంది.చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్లుగ్రూప్-ఎఇండియా రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.నాన్ ట్రావెలింగ్ సబ్స్టిట్యూట్స్: యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్, శివం దూబే.పాకిస్తాన్మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, ఉస్మాన్ ఖాన్, మహ్మద్ హస్నైన్, షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా.న్యూజిలాండ్డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, విల్ ఓ రూర్కీ, నాథన్ స్మిత్, విల్ యంగ్, జాకబ్ డఫీ, మైఖేల్ బ్రేస్వెల్, కైల్ జెమీషన్.బంగ్లాదేశ్సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొసేన్ శాంటో (కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, పర్వేజ్ హొస్సేన్ ఇమాన్, తాంజిమ్ హసన్ సకీబ్, నహీద్ రాణా, నసూమ్ అహ్మద్.గ్రూప్-బిఆస్ట్రేలియాజేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, సీన్ అబాట్, అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా, బెన్ డ్వార్షూయిస్, స్పెన్సర్ జాన్సన్.ట్రావెలింగ్ రిజ్వర్స్: కూపర్ కొనొలి.సౌతాఫ్రికాటెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డెర్ డసెన్, వియాన్ ముల్దర్, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి, కగిసో రబడా, ర్యాన్ రికెల్టన్, తబ్రేజ్ షంసీ, కార్బిన్ బాష్ట్రావెలింగ్ రిజర్వ్: క్వెనా మఫాకా.ఇంగ్లండ్జోస్ బట్లర్ (కెప్టెన్), బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జో రూట్, బ్రైడన్ కార్సే, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, టామ్ బాంటన్.అఫ్గనిస్తాన్ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), ఇక్రమ్ అలీఖిల్, గుల్బాదిన్ నాయబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫరూఖీ, ఫరీద్ మాలిక్, నంగ్యాల్ ఖరోటీ, నవీద్ జద్రాన్రిజర్వ్ ప్లేయర్లు: డార్విష్ రసూలీ, బిలాల్ సమీ.చదవండి: బంగ్లాదేశ్తో మ్యాచ్కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్ -
Ind vs Ban: భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్!
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్కు టీమిండియా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈ మెగా ఈవెంట్లో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగనున్న రోహిత్ సేనకు లీగ్ దశలోని మూడు మ్యాచ్లు కీలకమే. ఇందులో ఒక్కటి ఓడినా సెమీ ఫైనల్ చేరే అవకాశాలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మూల్యం చెల్లించాల్సి వస్తుందంటున్నాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra). టీమిండియా ఈ టోర్నీలో ఆడబోయే తొలి మ్యాచ్కు తన ప్లేయింగ్ ఎలెవన్ ఇదేనంటూ యూట్యూబ్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. పేసర్ల విభాగంలో మాత్రంజట్టులో ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లతో పాటు ఓ స్పెషలిస్టు స్పిన్నర్ తప్పక ఉంటాడన్న ఆకాశ్ చోప్రా.. అయితే, ఈ విషయంలో కెప్టెన్, హెడ్కోచ్ ఎవరివైపు మొగ్గుచూపుతారన్నది చెప్పడం కాస్త కష్టమేనని పేర్కొన్నాడు. ఇక పేసర్ల విభాగంలో మాత్రం మొదటి ప్రాధాన్య ఆటగాడిగా అర్ష్దీప్ సింగ్కు తప్పక స్థానం దక్కుతుందని అంచనా వేశాడు.కాగా 2017 తర్వాత తొలిసారిగా చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. పాకిస్తాన్(Pakistan) వేదికగా ఈ వన్డే ఫార్మాట్ టోర్నీ మొదలుకానుండగా... టీమిండియా మాత్రం తమ మ్యాచ్లు దుబాయ్లో ఆడనుంది. ఇందులో భాగంగా గురువారం(ఫిబ్రవరి 20) రోహిత్ సేన తమ తొలి మ్యాచ్ ఆడనుంది. గ్రూప్-‘ఎ’లో ఉన్న బంగ్లాదేశ్తో తలపడనుంది.ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ- శుబ్మన్ గిల్.. కెప్టెన్, వైస్ కెప్టెన్.. ఓపెనర్లుగా వీరే ఉంటారు. ఇక వన్డౌన్ బ్యాటర్ గురించి సందేహాలు అక్కర్లేదు. రన్ మెషీన్ కోహ్లి మూడో స్థానంలో వస్తాడు.ఇక నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడతాడు. నా అభిప్రాయం ప్రకారం.. అక్షర్ పటేల్ ఐదు, కేఎల్ రాహుల్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తారు. హార్దిక్ పాండ్యా ఏడు.. రవీంద్ర జడేజా ఎనిమిదో స్థానంలో ఆడతారు. ఒకవేళ రోహిత్ శర్మ కోరుకుంటే కుల్దీప్ యాదవ్ తుదిజట్టులో ఉంటాడు.నా ఓటు కుల్దీప్ యాదవ్కేఅలా కాకుండా గంభీర్ తన నిర్ణయానుగుణంగానే వెళ్లాలనుకుంటే మాత్రం వరుణ్ చక్రవర్తికి అవకాశం వస్తుంది. అయితే, నేను మాత్రం కుల్దీప్ యాదవ్కే ఓటు వేస్తాను. ఇక నా జట్టులో అర్ష్దీప్ సింగ్ తప్పక ఉంటాడు.అతడికి తోడుగా మహ్మద్ షమీ తుదిజట్టులో ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ అలాగాక హర్షిత్ రాణాను పిలిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మిడిల్, డెత్ ఓవర్లలో అతడు చక్కగా రాణించగలడు’’ అని పేర్కొన్నాడు. దుబాయ్ పిచ్లకు అనుగుణంగా టీమిండియా బ్యాటర్లు క్రీజులో కాస్త ఎక్కువ సమయం గడిపితేనే భారీ స్కోర్లు చేయగలిగే ఆస్కారం ఉంటుందని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025: టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్కు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత తుదిజట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్/వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ షమీ/హర్షిత్ రాణా.చదవండి: శివమ్ దూబే విజృంభణ.. కీలక మ్యాచ్లో ఐదు వికెట్లు -
రోహిత్, కోహ్లి, జడేజా లపైనే ఛాంపియన్స్ ట్రోఫీ భారం
దాదాపు పదేళ్ల విరామం తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని రెండోసారి గెలుచుకోవాలనే భారత జట్టు గట్టి పట్టుదలతో ఉంది. గతంలో 2013లో ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ లో జరిగిన ఫైనల్ లో ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని భారత్ జట్టు ఐదు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై విజయసాధించి ఈ ట్రోఫీని చేజిక్కించుకుంది. మళ్ళీ ఇప్పటి దాకా భారత్ ఈ ట్రోఫీని గెలుచుకోలేక పోయింది. 2017 జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ జట్టు భారత్ పై 180 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి ట్రోఫీ ని దక్కించుకుంది. మళ్ళీ ఈ ట్రోఫీ ని సాధించాలంటే భారత్ తన సత్తా చావాల్సిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్, దుబాయ్ లలో ఈ నెల 19 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి ఎంతో ప్రాముఖ్యముంది.ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేని భారత్ జట్టు ఫిబ్రవరి 20వ తేదీన దుబాయ్లో బంగ్లాదేశ్తో తన తొలి మ్యాచ్ ఆడుతుంది. తర్వాత ఫిబ్రవరి 23న ఇదే వేదిక పైన తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ని ఎదుర్కొంటుంది. ఆ తర్వాత మెన్ ఇన్ బ్లూ మార్చి 2న న్యూజిలాండ్తో తలపడనుంది.ఇంగ్లండ్పై స్వదేశంలో భారత్ ఇటీవల 3-0 తేడాతో వన్డే సిరీస్ను చేజిక్కించుకోవడంతో అభిమానుల్లోనూ, జట్టు ఆటగాళ్లలోనూ ఆత్మవిశ్వాసం పెరిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ గతేడాది వెస్టిండీస్ లో జరిగిన టి20 ప్రపంచ కప్ లో ఆడిన రీతి లో మళ్ళీ రాణించి మరో ఐసీసీ ట్రోఫీ ని భారత్ కి తెస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.రోహిత్, కోహ్లి, జడేజా లకు చివరి అవకాశం?గత సంవత్సరం టీ 20 ప్రపంచ కప్ సాధించిన తర్వాత భారత్ జట్టు ముంబై వాంఖడే స్టేడియం సమీపంలోని వీధుల్లో ఓపెన్ బస్సు లో పరేడ్ చేసింది. మళ్ళీ అలాంటి దృశ్యం రిపీట్ కావాలంటే కెప్టెన్ రోహిత్, కోహ్లీ మళ్ళీ తమ మునుపటి ఫామ్ ని కనిపించడం తప్పనిసరి.అయితే ఆస్ట్రేలియా పర్యటన లో ఘోరంగా విఫలమైన ఈ ఇద్దరు టాప్ ఆర్డర్ బ్యాటర్ ఇంగ్లాండ్ సిరీస్ లో పరుగులు సాధించి ఆత్మవిశ్వాసం తో ఉన్నారు. ఇంగ్లాండ్తో జరిగిన కటక్ వన్డేలో రోహిత్ 90 బంతుల్లో 119 పరుగులు చేశాడు. కోహ్లీ అహ్మదాబాద్లో జరిగిన చివరి వన్డే లో తన 73వ అర్ధ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఇది వారిద్దరికీ తాత్కాలిక ఉపశమనం కలిగించి ఉండవచ్చు కానీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో ఈ అగ్రశ్రేణి క్రికెటర్లు ఇద్దరూ తమ మునుపటి ఫామ్ ని చూపించక తప్పదు.వన్డే చరిత్రలో 14,000 పరుగులు చేసిన మూడవ బ్యాటర్గా నిలిచేందుకు కోహ్లీకి 37 పరుగులు అవసరం, మరో వైపు 11,000 పరుగులు పూర్తి చేసిన పదో బ్యాట్స్మన్గా నిలిచేందుకు రోహిత్కు కేవలం 12 పరుగులు మాత్రమే అవసరం. కానీ భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవకుండా వీరిద్దరూ ఈ వ్యక్తిగత రికార్డులు సాధించినా పెద్దగా ప్రయోజనం ఉండదు.భవిష్యత్తు పై చర్చ ఐసిసి మెగా ఈవెంట్కు ముందు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తు పై చర్చ జరుగుతోంది. గత సంవత్సరం టి 20 ప్రపంచ కప్ గెలుచుకున్న తర్వాత ఈ ముగ్గురూ ఇప్పటికే అంతర్జాతీయ టి 20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన తర్వాత జట్టులోని సీనియర్ ఆటగాళ్ల ఇక రిటైర్మెంట్ ప్రకటించవచ్చని పుకార్లు వ్యాపించాయి. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినట్లయితే ఈ ముగ్గురు సీనియర్లు ఆటగాళ్లు మరికొంత కాలం ఆడే అవకాశం ఉందని, భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించాడు. "ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మరో ఐసీసీ టోర్నమెంట్ మరో రెండు, మూడు ఏళ్ళ వరకు లేదు.వచ్చే ఏడాది టి 20 ప్రపంచ కప్ ఉన్నప్పటికీ ఈ ముగ్గురు ఇప్పటికే టి 20ల నుంచి రిటైర్ అయ్యారు. ఇక 2027 లో జరిగే వన్డే ప్రపంచ కప్ కి చాల కాలం ఉంది. అప్పటి దాకా వీరు ముగ్గురూ వన్డే క్రికెట్ లో కొనసాగడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో రోహిత్, విరాట్, జడేజా లకు ఇదే చివరి ఐసీసీ టోర్నమెంట్ కావచ్చని, చోప్రా వ్యాఖ్యానించాడు.యువ ఆటగాళ్ల కు అద్భుత అవకాశంవన్డే వైస్ కెప్టెన్గా యువ బ్యాటర్ శుభమాన్ గిల్కు పెద్ద ప్రమోషన్ వచ్చింది. పైగా ఈ ఫార్మాట్లో దాదాపు 61 సగటు ఉన్న ఈ బ్యాట్స్మన్ ఛాంపియన్స్ ట్రోఫీలో విజృభించి తన సత్తా చాటాలని ఎంతో ఆసక్తి గా ఉన్నాడు. గాయం కారణంగా బుమ్రా లేకపోయిన కారణంగా అర్ష్దీప్ సింగ్ , హర్షిత్ రాణా వంటి యువ బౌలర్లకు ఇది అద్భుత అవకాశం. ఈ నేపధ్యం లో గిల్, శ్రేయాస్ అయ్యర్, కె ఎల్ రాహుల్ వంటి బ్యాటర్, అర్ష్దీప్ సింగ్, రాణా వంటి యువ ఆటగాళ్లకి అంతర్జాతీయ వేదిక పై తమ సత్తా చాటేందుకు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఒక అద్భుత అవకాశంగా కనిపిస్తోంది. మరి ఈ యువ ఆటగాళ్లు రాణించి భారత్ కి మరో ఐసీసీ ట్రోఫీ తెస్తారేమో చూడాలి. -
CT 2025: కోహ్లి, హెడ్ కాదు!.. టాప్ రన్ స్కోరర్గా అతడే: ఆసీస్ మాజీ కెప్టెన్
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి ఎనిమిది జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆతిథ్య వేదికలకు చేరుకుని ఐసీసీ టోర్నమెంట్కు సన్నాహకాలు మొదలుపెట్టాయి. ఇక ఈ మెగా ఈవెంట్ నిర్వహణ హక్కులను పాకిస్తాన్(Pakistan) దక్కించుకోగా.. టీమిండియా మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్(Dubai)లో తమ మ్యాచ్లు ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి చేరుకున్న రోహిత్ సేన ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది.ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ సెమీ ఫైనలిస్టులు, ఫైనలిస్టులు, విజేతపై తమ అంచనాలు తెలియజేశారు. వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ టీమిండియాను టైటిల్ ఫేవరెట్గా పేర్కొనగా.. పాకిస్తాన్ లెజెండరీ ఫాస్ట్బౌలర్ షోయబ్ అక్తర్ ఈసారి కూడా భారత్- పాక్ ఫైనల్లో తలపడతాయని జోస్యం చెప్పాడు.ఇక ఓవరాల్గా మెజారిటీ మంది భారత్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా టాప్-4కు చేరతాయని అంచనా వేశారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్(Michael Clarke) సైతం ఈ ఐసీసీ ఈవెంట్కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీ-2025లో అత్యధిక పరుగుల, వికెట్ల వీరులు, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, టోర్నీ విజేతపై తన అంచనాలు తెలియజేశాడు.టాప్ రన్ స్కోరర్, లీడింగ్ వికెట్ టేకర్గా వారే‘‘ఈసారి టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలవబోతోంది. వాళ్ల కెప్టెన్ ఫామ్లోకి వచ్చాడు. అంతేకాదు.. ఈసారి అతడే చాంపియన్స్ ట్రోఫీలో టాప్ రన్స్కోరర్ కాబోతున్నాడు. అతడు మునుపటి లయను అందుకోవడం సంతోషంగా ఉంది. టీమిండియాకు అతడి సేవలు అవసరం.ఇక ఈసారి ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలవబోతున్నాడు. అయితే, ఇంగ్లండ్ జట్టు ప్రదర్శనపై మాత్రం నేను ఎక్కువగా అంచనాలు పెట్టుకోలేదు. అయితే, ఆర్చర్ మాత్రం ఓ సూపర్స్టార్. అందుకే అతడే ఈసారి లీడింగ్ వికెట్ టేకర్ అని చెప్పగలను.‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా హెడ్ఇక ఈ టోర్నమెంట్లో ట్రవిస్ హెడ్ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవుతాడు. ప్రస్తుతం అతడు భీకర ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్లో గతేడాది అదరగొట్టాడు. ఇటీవల టెస్టుల్లోనూ దుమ్ములేపాడు. అయితే, శ్రీలంక పర్యటనలో కాస్త వెనుకబడినట్లు అనిపించినా మళ్లీ త్వరలోనే బ్యాట్ ఝులిపించగలడు.అయితే, ట్రవిస్ హెడ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ స్థాయిలో ప్రదర్శన ఇచ్చినా.. ఈసారి ఆస్ట్రేలియా మాత్రం ఫైనల్లో ఓడిపోతుందని అనిపిస్తోంది. ఏదేమైనా హెడ్ మాత్రం హిట్టవ్వడం ఖాయం. నిజానికి అతడి బౌలింగ్ కూడా బాగుంటుంది. కానీ.. బౌలింగ్లో అతడి సేవలను ఆస్ట్రేలియా ఎక్కువగా ఉపయోగించుకోవడం లేదు’’ అని మైకేల్ క్లార్క్ బియాండ్23 క్రికెట్ పాడ్కాస్ట్లో అతన అభిప్రాయాలు పంచుకున్నాడు. క్లార్క్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతుండగా.. విరాట్ కోహ్లి అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈసారి కింగ్ కోహ్లినే టాప్ రన్స్కోరర్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలుస్తాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ పాల్గొంటున్నాయి.చదవండి: ఐపీఎల్ 2025లో SRH షెడ్యూల్ ఇదే.. హైదరాబాద్లో జరుగబోయే మ్యాచ్లు ఇవే..! -
ICC Champions Trophy: దుబాయ్కు చేరుకున్న భారత జట్టు..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) కోసం భారత క్రికెట్ జట్టు దుబాయ్లో అడుగుపెట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్కోచ్ గౌతం గంభీర్తో కూడిన తొలి బృందం శనివారం దుబాయ్కు చేరుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.ఈ మొదటి బ్యాచ్లో రోహిత్-కోహ్లిలతో పాటు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్లు ఉన్నారు. మిగతా ప్లేయర్లు ఆదివారం దుబాయ్కు చేరుకునే అవకాశముంది.ఇక దుబాయ్కు చేరుకున్న భారత ఆటగాళ్లు ఆదివారం నుంచి తమ ప్రాక్టీస్ను మొదలు పెట్టనున్నారు. ఈ టోర్నీలో రన్నరప్గా బరిలోకి దిగుతున్న బారత జట్టు.. ఈసారి ఎలాగైనా ఛాంపియన్స్గా నిలవాలని పట్టుదలతో ఉంది. అయితే ఈ మెగా ఈవెంట్కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు.బుమ్రా స్ధానంలో యువ పేసర్ హర్షిత్ రాణాకు సెలక్టర్లు అవకాశమిచ్చారు. అదేవిధంగా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ను జట్టు నుంచి తప్పించారు. జైశ్వాల్ స్ధానంలో మణికట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకున్నాడు. ఇటీవల కాలంలో వరుణ్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ మెగా టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో తలపడనుంది. అనంతరం ఫిబ్రవరి 23న ఇదే వేదికలో దాయాది పాకిస్తాన్తో అమీతుమీ తెల్చుకోనుంది. కాగా భారత్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉంది. ఈ టోర్నీకి ముందు స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను రోహిత్ సేన క్లీన్ స్వీప్ చేసింది.చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: ENG vs IND: రోహిత్ శర్మకు బిగ్ షాక్.. టీమిండియా కెప్టెన్గా స్టార్ ప్లేయర్? -
దుబాయ్కు పయనమైన టీమిండియా.. రోహిత్, కోహ్లి, గంభీర్లతో పాటు..
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఫీవర్ మొదలైపోయింది. ఈ మెగా టోర్నమెంట్లో పాల్గొనేందుకు టీమిండియా దుబాయ్కు పయనమైంది. హెడ్కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir)తో పాటు రోహిత్ సేన శనివారం ముంబై నుంచి బయల్దేరింది. ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో టీమిండియా సభ్యులు కనిపించడంతో అభిమానులు వారి ఫొటోలు తీసుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా 2017లో చివరిసారిగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరిగింది. నాడు ఫైనల్ చేరుకున్న భారత జట్టు అనూహ్య రీతిలో దాయాది పాకిస్తాన్ చేతి(India vs Pakistan)లో ఓటమిపాలై.. టైటిల్ను చేజార్చుకుంది. అందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఇప్పుడు సమయం వచ్చింది.తటస్థ వేదికపైపాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ మొదలుకానుండగా.. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా అక్కడికి వెళ్లడం లేదు. అయితే, పాక్ క్రికెట్ బోర్డు మాత్రం భారత జట్టు తమ దేశానికి తప్పక రావాలని పట్టుబట్టగా...బీసీసీఐ అందుకు నిరాకరించింది. ఆఖరికి అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) జోక్యంతో తటస్థ వేదికపై టీమిండియా మ్యాచ్లు ఆడేందుకు మార్గం సుగమమైంది.ఈ నేపథ్యంలో ఐసీసీ నిర్ణయం మేరకు రోహిత్ సేన తమ మ్యాచ్లన్నీ దుబాయ్లో ఆడనుంది. ఇందుకోసం జనవరి 18న ప్రాథమిక జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఇటీవలే రెండు మార్పులతో తమ జట్టును ఖరారు చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో చాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే పదిహేను మంది సభ్యుల వివరాలు మంగళవారం వెల్లడించింది.రెండు మార్పులుయువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ను తప్పించి అతడి స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి చోటిచ్చిన యాజమాన్యం.. జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా హర్షిత్ రాణాకు పిలుపునిచ్చింది. ఇక ఈ టోర్నీలో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా తమ ప్రయాణం మొదలుపెట్టనుంది.అనంతరం దాయాది పాకిస్తాన్తో ఫిబ్రవరి 23న తలపడనున్న రోహిత్ సేన.. లీగ్ దశలో ఆఖరిగా న్యూజిలాండ్ను మార్చి 2న ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో స్వదేశంలో సిరీస్ ద్వారా ఈ వన్డే టోర్నీకి టీమిండియాకు కావాల్సినంత ప్రాక్టీస్ లభించింది.మరో సానుకూలాంశంసొంతగడ్డపై ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన భారత్కు.. కెప్టెన్ రోహిత్ శర్మ(సెంచరీ), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(అర్ధ శతకం) ఫామ్లోకి రావడం మరో సానుకూలాంశం. ఇక ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే క్రమంలో రోహిత్ సేన శనివారమే దుబాయ్కు పయనమైంది. రోహిత్-కోహ్లిలతో పాటు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్ తదితరులు ఎయిర్పోర్టులో తళుక్కుమన్నారు.వీరితో పాటు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ సహా సహాయక సిబ్బంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు బయల్దేరారు.చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: రోహిత్, కోహ్లితో పాటు అతడికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ: భారత మాజీ క్రికెటర్ #WATCH | Mumbai: The first batch of the Indian Cricket team departs for Dubai to participate in the ICC Champions Trophy.All matches of Team India will be held in Dubai, while the rest will take place in Pakistan. The ICC Champions Trophy will begin on February 19 and will… pic.twitter.com/C4VdRPddyn— ANI (@ANI) February 15, 2025#WATCH | Mumbai: Cricketer Hardik Pandya arrives at the airport as the first batch of the Indian Cricket team departs for Dubai to participate in the ICC Champions Trophy. All matches of Team India will be held in Dubai, while the rest will take place in Pakistan. The ICC… pic.twitter.com/CmIjdDrRtW— ANI (@ANI) February 15, 2025 -
రోహిత్ శర్మకు బిగ్ షాక్.. టీమిండియా కెప్టెన్గా స్టార్ ప్లేయర్?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohitsharma) టెస్టు భవిష్యత్తు ప్రశ్నర్థకంగా మారింది. గతేడాదిగా టెస్టు క్రికెట్లో రోహిత్ శర్మ దారుణమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. అటు కెప్టెన్గా, ఇటు బ్యాటింగ్ పరంగా రోహిత్ పూర్తిగా తేలిపోతున్నాడు. గతేడాది ఆఖరిలో స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు వైట్వాష్కు గురైంది.స్వదేశంలో ప్రత్యర్ధి చేతిలో మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత్ వైట్వాష్ కావడం ఇదే మొదటి సారి. ఆ తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోనూ రోహిత్ తీరు మారలేదు. తొలి టెస్టుకు వ్యక్తిగత కారణాలతో దూరమైన హిట్మ్యాన్.. ఆ తర్వాతి మ్యాచ్లకు అందుబాటులోకి వచ్చాడు. తొలి టెస్టులో విజయం సాధించిన భారత్.. రోహిత్ వచ్చాక వరుసగా మూడు మ్యాచ్లలో ఓటమి చవిచూసింది.ఈ మూడు మ్యాచ్లలోనూ రోహిత్ తీవ్ర నిరాశపరిచాడు. దీంతో ఆఖరి టెస్టుకు భారత కెప్టెన్ తనంతంట తనే జట్టు నుంచి తప్పుకున్నాడు. అనంతరం స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో రోహిత్ పర్వాలేదన్పించాడు. తొలి వన్డేలో విఫలమైన ఈ ముంబైకర్.. ఆ తర్వాతి రెండో వన్డేలో మాత్రం విధ్వంసకర శతకంతో చెలరేగాడుఅయితే ఆ జోరును మూడో వన్డేలో కొనసాగించలేకపోయాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు రోహిత్ సిద్దమవుతున్నాడు. ఈ మెగా టోర్నీ తర్వాత శర్మ భవిష్యత్తుపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది. ఏదేమైనప్పటికి టెస్టుల్లో మాత్రం రోహిత్ కెరీర్ ముగిసినట్లేనని తాజా రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.కెప్టెన్గా బుమ్రా..?ఈ ఏడాది జూన్లో ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్కు హిట్మ్యాన్ను ఎంపిక చేసే అవకాశం లేదని పిటిఐ తమ నివేదికలో పేర్కొంది. అతడి స్ధానంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprith Bumrah)కు జట్టు పగ్గాలను అప్పగించాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం.కాగా బుమ్రా ప్రస్తుతం గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి సైతం అతడు దూరమయ్యాడు. బుమ్రా తిరిగి ఐపీఎల్-2025తో తిరిగి మైదానంలో అడుగపెట్టే అవకాశముంది. కాగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో బుమ్రా రెండు పర్యాయాలు భారత జట్టుకు నాయకత్వం వహించాడు.పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బుమ్రా సారథ్యంలోని భారత జట్టు 295 పరుగుల తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది. బుమ్రా మరోసారి సిడ్నీలో జరిగిన ఆఖరి టెస్టులో భారత జట్టు కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే ఈ మ్యాచ్లో బుమ్రా గాయం కారణంగా మధ్యలోనే వైదొలగడంతో టీమిండియా ఓటమి చవిచూసింది.ఒకే ఒక హాఫ్ సెంచరీ..గత 15 టెస్టు ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ 164 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ ఉంది. రోహిత్ గత 15 ఇన్నింగ్స్లో వరుసగా 6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10 పరుగులు చేశాడు. చివరగా మెల్బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో 3 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 9 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. ఈ ఏడాది 14 టెస్టులాడిన రోహిత్.. 26 ఇన్నింగ్స్లో 24.76 సగటుతో 619 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మరో రెండు హాఫ్ సెంచరీలున్నాయి.చదవండి: రోహిత్, కోహ్లితో పాటు అతడికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ: భారత మాజీ క్రికెటర్ -
CT 2025: రోహిత్ శర్మ ఇంకో 183 పరుగులు చేస్తే...
ఇంగ్లండ్తో స్వదేశంలో వన్డే సిరీస్(India vs England)ను ఘనంగా ముగించిన టీమిండియా తదుపరి చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)తో బిజీ కానుంది. బట్లర్ బృందాన్ని 3-0తో క్లీన్స్వీప్ చేసిన రోహిత్ సేన.. ఆత్మవిశ్వాసంతో ఈ ఐసీసీ టోర్నమెంట్లో అడుగుపెట్టనుంది.ఇక ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఈ మెగా ఈవెంట్ ఆరంభం కానుండగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్లన్నీ తటస్థ వేదికైన దుబాయ్లో ఆడనుంది. లీగ్ దశలో భాగంగా తొలుత బంగ్లాదేశ్తో ఫిబ్రవరి 20న.. అనంతరం ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో.. ఆ తర్వాత మార్చి 2న న్యూజిలాండ్తో భారత జట్టు తలపడనుంది.అరుదైన రికార్డు ముంగిట హిట్మ్యాన్ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. దుబాయ్లో చరిత్ర సృష్టించేందుకు హిట్మ్యాన్ ఇంకా 183 పరుగుల దూరంలో ఉన్నాడు. కాగా గత కొంతకాలంగా పేలవ ఫామ్తో సతమతమైన రోహిత్ శర్మ ఇంగ్లండ్తో రెండో వన్డే సందర్భంగా వింటేజ్ హిట్మ్యాన్ను గుర్తు చేశాడు.డెబ్బై ఆరు బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్న రోహిత్ శర్మ... తన వన్డే కెరీర్లోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. కటక్లో జరిగిన ఈ మ్యాచ్లో మొత్తంగా పన్నెండు ఫోర్లు, ఏడు సిక్స్ల సాయంతో 119 పరుగులు చేశాడు. అయితే, తదుపరి మ్యాచ్లో మాత్రం పేసర్ మార్క్ వుడ్ సంధించిన సూపర్ డెలివరీని ఆడలేక.. మళ్లీ విఫలమై ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు.ఇంకో 183 పరుగులు జతచేశాడంటేఇక తదుపరి రోహిత్ శర్మ దుబాయ్ వేదికగా ఐసీసీ వన్డే టోర్నీ చాంపియన్స్ ట్రోఫీ బరిలో దిగనున్నాడు. కాగా దుబాయ్లో ఇప్పటి వరకు అతడు వన్డేల్లో 317 పరుగులు సాధించాడు. ఈ ఈవెంట్ సందర్భంగా ఇందుకు ఇంకో 183 పరుగులు జతచేశాడంటే.. దుబాయ్లో అత్యధిక వన్డే పరుగులు సాధించిన బ్యాటర్గా రోహిత్ శర్మ చరిత్రకెక్కుతాడు.ప్రస్తుతం ఈ ప్రపంచ రికార్డు స్కాట్లాండ్కు చెందిన రిచీ బెరింగ్టన్ పేరిట ఉంది. అతడు ఇప్పటి వరకు దుబాయ్లో వన్డేల్లో 424 పరుగులు సాధించాడు. టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ 342 పరుగులతో భారత బ్యాటర్లలో టాప్లో కొనసాగుతున్నాడు.కాగా వన్డేల్లో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో రోహిత్ శర్మ మూడు డబుల్ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో అతడి అత్యధిక స్కోరు 264. ఇక మొత్తంగా ఇప్పటి వరకు టీమిండియా తరఫున 260 వన్డేలు పూర్తి చేసుకుని 10988 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో 338 వన్డే సిక్సర్లు ఉన్నాయి. చాంపియన్స్ ట్రోఫీ-2025కి టీమిండియారోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: రోహిత్, కోహ్లితో పాటు అతడికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ: భారత మాజీ క్రికెటర్ -
ఆ ముగ్గురికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ: భారత మాజీ క్రికెటర్
దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) టోర్నమెంట్ నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ మొదలుకానుంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-‘బి’ నుంచి అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టైటిల్ కోసం పోటీపడనున్నాయి.ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎనిమిది బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఇక 2017లో చివరగా విరాట్ కోహ్లి(Virat Kohli) సారథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ ఆడిన టీమిండియా.. ఈసారి రోహిత్ శర్మ(Rohit Sharma) కెప్టెన్సీలో బరిలో దిగనుంది. నాటి జట్టులో భాగమైన కోహ్లి, రోహిత్తో పాటు.. రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా కూడా ఈసారి చాంపియన్స్ ట్రోఫీ టీమ్లో చోటు దక్కించుకున్నారు.ఆ ముగ్గురికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ నలుగురిలో ముగ్గురికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ కాబోతుందంటూ జోస్యం చెప్పాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘మీ అంచనా వందశాతం నిజమేనని మనస్ఫూర్తిగా చెబుతున్నా.కచ్చితంగా ఇలా జరిగే అవకాశం అయితే ఉంది. త్వరలోనే చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. ఆ తర్వాత వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ రూపంలో మరో ఐసీసీ టోర్నీ ఉంది. అయితే, ఈ ఈవెంట్లో టీమిండియా ఫైనల్కు చేరలేదు కాబట్టి.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా ఇందులో ఆడే అవకాశం లేదు.కారణం ఇదేఇక మరుసటి ఏడాది టీ20 ప్రపంచకప్ జరుగనుంది. అయితే, ఇప్పటికే ఈ ముగ్గురు అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. కాబట్టి ఇందులోనూ వీరు భాగం కాలేరు. ఇక.. మళ్లీ 2027లో వన్డే వరల్డ్కప్ జరుగుతుంది. అందుకు ఇంకా చాలా సమయమే ఉంది. అప్పటికి పరిస్థితుల్లో భారీ మార్పులు రావచ్చు. కాబట్టి.. కోహ్లి, రోహిత్, జడేజాలకు ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ కానుందని చెప్పవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.అన్నీ బాగుండి ఆడాలని కోరుకుంటే మాత్రంఅయితే, ఈ ముగ్గురు లేని లోటు తెలియకుండా టీమిండియా ఆడగలిగినపుడే ఇది సాధ్యమవుతుందని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ఫిట్గా ఉండటంతో పాటు ఫామ్ కొనసాగిస్తూ తమకు నచ్చినంత కాలం ఆడాలని ఫిక్సయితే మాత్రం వీరిని ఎవరూ ఆపలేరనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఇంటర్నేషనల్ పొట్టి ఫార్మాట్కు గుడ్బై చెప్పారు. అయితే, ఐపీఎల్లో మాత్రం ఈ ముగ్గురూ కొనసాగుతున్నారు. ఇక రోహిత్ త్వరలోనే 38వ వసంతంలో అడుగుపెట్టనుండగా.. కోహ్లి, జడేజాలకు ఇప్పుడు 36 ఏళ్లు. చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: CT 2025: సురేశ్ రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్కప్ వీరులకు నో ఛాన్స్! -
అద్భుత ఫామ్.. అతడిని ఆపతరమా!.. ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలే!
చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్(ICC Champions Trophy 2025)కు ముందు ఇంగ్లండ్పై క్లీన్స్వీప్ విజయం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కి సంతృప్తిని మిగిల్చింది. విజయానంతరం మాట్లాడుతూ.. "ఈ సిరీస్లో మేము ఏదైనా పొరపాటు చేశామని నేను భావించడం లేదు. అయితే జట్టు సమిష్టిగా మరింత మెరుగ్గా ఆడాలని నేను భావిస్తున్నాను. ఇందుకు సంబంధించిన కొన్ని విషయాలున్నాయి. తప్పకుండా జట్టు మరింత మెరుగ్గా ఆడాలని నేను కోరుకుంటున్నాను" అని రోహిత్ వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం.అయ్యర్ అద్భుత ఫామ్ వాస్తవానికి... ఇంగ్లండ్తో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్లో భారత్ బ్యాటింగ్ అన్ని విధాలా ఆకట్టుకుంది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మోకాలి నొప్పి కారణంగా తొలి వన్డే నుంచి వైదొలగడంతో.. తుదిజట్టులోకి వచ్చాడు అయ్యర్. అద్భుత రీతిలో రాణించి మరోసారి టీమిండియా మిడిలార్డర్కు వెన్నెముక గా నిలిచాడు.ఇంగ్లండ్ జట్టులో మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, సాకిబ్ మహమూద్ వంటి అగ్రశ్రేణి పేస్ బౌలర్లున్నారు. వారిని ఎదుర్కొని రాణించడం ఆషామాషీ విషయం కాదు. ఇందుకు అనుగుణంగా తన స్టాన్స్ ని కూడా మార్పు చేసుకొని అయ్యర్ తన మునుపటి ఫామ్ ని ప్రదర్శించాడు. అయ్యర్ ఫామ్ ఫిబ్రవరి 19న ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ జట్టుకి కొత్త ఉత్సాహాన్నిస్తుందనడంలో సందేహం లేదు.భారత్ జట్టులో నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చే అయ్యర్ పై మిడిల్ ఓవర్లలో నిలకడగా పరుగులు సాధించాల్సిన బాధ్యత ఉంటుంది. గతం లో 2023 ప్రపంచ కప్లో అద్భుతంగా రాణించిన అయ్యర్ తర్వాత అనూహ్యంగా జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత గాయాల కారణంగా గత సంవత్సరం ఒక్క రంజీ ట్రోఫీ మ్యాచ్ కూడా ఆడకపోవడంతో తన కేంద్ర కాంట్రాక్టును కోల్పోవడంతో శ్రేయస్ అయ్యర్ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.చలించని దృఢ సంకల్పంఅయితే అయ్యర్ దృఢ సంకల్పం ఎప్పుడూ చలించలేదు. దేశవాళీ వైట్-బాల్ టోర్నమెంట్లలో నిలకడగా రాణించి 188.52 స్ట్రైక్ రేట్తో 345 పరుగులతో, 2024-25 సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్ లో ఐదు ఇన్నింగ్స్లలో 131.57 సగటుతో 325 పరుగులు చేశాడు.కేవలం ఒకే ఒక్కసారి అవుట్ అయ్యాడు. దేశవాళీ టౌర్నమెంట్లలో మళ్ళీ మునుపటి రీతిలో రాణిస్తుండంతో మళ్ళీ భారత్ జట్టులో స్థానం సంపాదించాడు. తొలి వన్డేలో కోహ్లి గాయంతో ఇలా కీలకమైన బ్రేక్ దొరికింది. దాంతో చెలరేగిపోయిన అయ్యర్ జట్టుకి తన అవసరం ఎలాంటితో చూపించి సత్తా చాటుకున్నాడు. ఇంగ్లండ్పై అద్భుతమైన ప్రదర్శనఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో భారత్ 3-0 తో విజయం సాధించడంలో అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్లో వరుసగా 59 పరుగులు (తొలి వన్డే) , 44 (రెండో వన్డే), 78 పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లీ గాయపడిన కారణంగానే తాను ఈ సిరీస్ లోని తొలి వన్డే లో ఆడగలిగానని అయ్యర్ వెల్లడించాడు. అయితే ఆ అవకాశాన్ని అయ్యర్ రెండు చేతులతో అందిపుచ్చుకున్నాడు.అందుకే కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చిన తర్వాత కూడా అయ్యర్ స్థానం జట్టులో పదిలంగా నిలిచింది. ఇంగ్లండ్తో జరిగిన చివరి మ్యాచ్లో 78 పరుగులతో అయ్యర్ వన్డేల్లో తన 20వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో అయ్యర్ ఐదు సెంచరీలు కూడా చేసాడు. మొత్తం 65 వన్డేల్లో 48.18 సగటుతో 2,602 పరుగులు సాధించాడు. ఇక 2023 ప్రపంచ కప్ లో అయ్యర్ అద్భుతంగా రాణించి 66.25 సగటుతో 113.24 స్ట్రైక్ రేట్తో 530 పరుగులు చేశాడు. ఇంతటి అపార అనుభవం ఉన్న అయ్యర్ మళ్ళీ మునుపటి రీతిలో రాణిస్తుండంతో చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత్ బ్యాటింగ్ను నిలువరించడం ప్రత్యర్థి జట్లకు అంత తేలికైన విషయం కాదు. చదవండి: CT 2025: సురేశ్ రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్కప్ వీరులకు నో ఛాన్స్! -
Ind vs Pak: టీమిండియా చేతిలో ఓటమి తర్వాత కసి పెరిగింది! ఫైనల్లో అలా..
క్రికెట్ ప్రపంచంలో భారత్- పాకిస్తాన్(India vs Pakistan) మ్యాచ్కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇరుదేశాల అభిమానులతో పాటు క్రికెట్ ప్రేమికులంతా దాయాదుల పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఇక గత కొన్నేళ్లుగా ఆసియా కప్, ఐసీసీ వంటి ప్రధాన ఈవెంట్లలో మాత్రమే ఈ చిరకాల ప్రత్యర్థుల ముఖాముఖి పోటీపడుతుండగా.. అత్యధిక సార్లు భారత్ పైచేయి సాధించింది.కానీ 2017 నాటి చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) ఫైనల్లో మాత్రం టీమిండియాకు దాయాది చేతిలో భంగపాటు ఎదురైంది. లీగ్ దశలో పాక్ను చిత్తు చేసిన భారత జట్టు.. టైటిల్ పోరులో మాత్రం దురదృష్టవశాత్తూ ఓటమిపాలైంది. ఇక ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ మొదలుకానున్న తరుణంలో నాటి విన్నింగ్ పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్(Sarfaraz Ahmed) గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.మాలో కసి పెరిగిందిచాంపియన్స్ ట్రోఫీ-2017లో తమ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘గ్రూప్ స్టేజ్లో టీమిండియా చేతిలో ఓడిపోయిన తర్వాత జట్టు సమావేశంలో భాగంగా సీనియర్లు షోయబ్ మాలిక్, మొహమ్మద్ హఫీజ్ మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. జట్టులో అలాంటి వ్యక్తులు ఉండటం అదనపు బలం.ఆరోజు నుంచి మా ఆలోచనా ధోరణి మారిపోయింది. ఆ చేదు అనుభవం నుంచి పాఠాలు నేర్చుకున్నాం. జట్టులో రెండు మార్పులతో బరిలోకి దిగి వరుస విజయాలు సాధించాం. సౌతాఫ్రికా, శ్రీలంక జట్లను ఓడించాం.టీమిండియా మనకు కొత్తదేమీ కాదుఇక ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో మా బౌలర్లు అద్భుతంగా ఆడి గెలిపించారు. ఆ తర్వాత టీమిండియాతో ఫైనల్. అప్పుడు రెట్టింపు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాల్సిన పరిస్థితి. అందరూ పూర్తిగా రిలాక్స్ అవ్వాలని మా వాళ్లకు సందేశం ఇచ్చాను.అత్యుత్తమ జట్లను ఓడించాం. ఇక టీమిండియా కూడా మనకు కొత్తదేమీ కాదు. మనం చూడని జట్టూ కాదు. ఫలితం ఏమిటన్న విషయం గురించి ఆలోచించవద్దు. గెలిచేందుకు వంద శాతం ప్రయత్నం చేశామా లేదా అన్నది మాత్రమే ముఖ్యం.ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలుసు. చివరి వికెట్ పడగానే మాకు కలిగిన అనుభూతిని మాటల్లో వర్ణించలేము’’ అంటూ ఐసీసీతో తన జ్ఞాపకాలు పంచుకున్నాడు సర్ఫరాజ్ అహ్మద్. కాగా లండన్ వేదికగా నాటి ఫైనల్లో పాకిస్తాన్ కోహ్లి సేనపై 180 పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది.దుబాయ్లో టీమిండియా మ్యాచ్లుఇక 2017లో ఫైనల్ ఆడిన జట్టులో ఉన్న రోహిత్ శర్మ ప్రస్తుతం కెప్టెన్గా ఉండగా.. విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా కూడా ప్రస్తుత చాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈసారి పాకిస్తాన్ ఈ ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులు సంపాదించుకోగా.. భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు దుబాయ్లో తమ మ్యాచ్లు ఆడనుంది. ఇక భారత్- పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి 23న మ్యాచ్ జరుగనుంది. ఈసారి.. టీమిండియా హాట్ ఫేవరెట్గా బరిలో దిగనుంది. చదవండి: CT 2025: ఏ జట్టునైనా ఓడిస్తాం.. చాంపియన్స్ ట్రోఫీ మాదే: బంగ్లాదేశ్ కెప్టెన్ -
క్రెడిట్ అతడికే ఇవ్వాలి.. నా స్థానంలో ఎవరున్నా అంతే: రోహిత్ శర్మ
ఇంగ్లండ్తో మూడో వన్డేలో తాను అవుటైన తీరు పట్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) స్పందించాడు. బౌలర్ అద్భుతమైన బంతిని సంధించాడని.. అది ఆడటం ఎవరితరం కాదంటూ తనను తాను సమర్థించుకున్నాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి ముందు భారత క్రికెట్ జట్టు అద్భుతమైన విజయం అందుకున్న విషయం తెలిసిందే.స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను రోహిత్ సేన 3-0తో క్లీన్స్వీప్ చేసింది. తొలుత నాగ్పూర్లో బట్లర్ బృందాన్ని నాలుగు వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. కటక్లో జరిగిన రెండో వన్డేలోనూ నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ మ్యాచ్తో ఫామ్లోకి వచ్చిన భారత ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ.. విధ్వంసకర శతకం(119) బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.మార్క్వుడ్ సూపర్ డెలివరీఅయితే, అహ్మదాబాద్లో బుధవారం జరిగిన మ్యాచ్లో మాత్రం హిట్మ్యాన్ తేలిపోయాడు. రెండు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. ఇంగ్లండ్ పేసర్ మార్క్వుడ్(Mark Wood) గంటకు దాదాపు 142 కిలోమీటర్ల వేగంతో సంధించిన బంతిని ఆడటం తప్ప రోహిత్ శర్మకు మరో ఆప్షన్ లేకపోయింది. ఈ క్రమంలో అవుట్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతిని వికెట్ కీపర్ ఫిలిప్ సాల్ట్ తన కుడివైపునకు డైవ్ చేసి మరీ ఒడిసిపట్టాడు. దీంతో రోహిత్ నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది.టాస్ ఓడిన టీమిండియా.. ఇలా ఆరంభంలోనే వికెట్ కోల్పోయినప్పటికీ భారీ స్కోరు చేయగలిగింది. ఓపెనర్ శుబ్మన్ గిల్(112) శతకంతో చెలరేగగా.. విరాట్ కోహ్లి(52), శ్రేయస్ అయ్యర్(78), కేఎల్ రాహుల్(40) రాణించడం వల్ల నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులు చేసింది.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. వీరి దెబ్బకు 34.2 ఓవర్లలో 214 పరుగులు చేసి బట్లర్ బృందం ఆలౌట్ అయింది. ఫలితంగా 142 పరుగుల తేడాతో గెలిచిన భారత్ సిరీస్ను సంపూర్ణ విజయంతో ముగించింది.క్రెడిట్ మొత్తం బౌలర్కే ఇవ్వాలిఈ నేపథ్యంలో విజయానంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘ఈ సిరీస్ సాగిన తీరుపట్ల ఎంతో సంతోషంగా ఉంది. సవాళ్లు ఉంటాయని ముందే తెలుసు. ఊహించనవి కూడా జరగడం సహజమే. నా విషయంలో క్రెడిట్ మొత్తం బౌలర్కే ఇవ్వాలి. బౌలర్గా నన్ను సవాల్ చేయడం అతడి కర్తవ్యం. బ్యాటర్గా బౌలర్ను ఎదుర్కోవడం నా పని.ఇక్కడ ఇద్దరం ఒకరితో ఒకరం పోటీ పడే క్రమంలో నేను ఆ బంతిని ఆడటంలో విఫలమయ్యాను. ఆ విషయం పక్కనపెడితే.. ఈ సిరీస్లో మా జట్టు ఆడిన తీరు పట్ల సంతృప్తిగా ఉన్నాను. అయితే, కొన్ని విషయాల్లో మాత్రం మా ఆట తీరును మెరుగుపరచుకోవాల్సి ఉంది.చాంపియన్ టీమ్వాటి గురించి నేను ఇక్కడ వివరణ ఇస్తూ ఉండలేను. అయితే, జట్టుగా నిలకడైన ప్రదర్శన చేయడం పట్ల మాకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. చాంపియన్ టీమ్ రోజురోజుకూ మరింత మెరుగవ్వాలని ఆశించడం సహజమే కదా! మేమూ అంతే.. తమకు నచ్చిన విధంగా ఆడేలా మా ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం. అందుకు వరల్డ్కప్(2023) చక్కటి ఉదాహరణ. అయితే, నాడు అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయాం. ఆటలో ఇవన్నీ భాగమే’’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో పరిపూర్ణ విజయం సాధించిన టీమిండియా తదుపరి చాంపియన్స్ ట్రోఫీ బరిలో దిగనుంది. తదుపరి ఐసీసీ టోర్నీలోపాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఈ ఐసీసీ టోర్నీ మొదలుకానుండగా.. ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా రోహిత్ సేన తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. లీగ్ దశలో తొలుత బంగ్లాదేశ్తో.. అనంతరం పాకిస్తాన్, న్యూజిలాండ్లతో మ్యాచ్లు ఆడనుంది. ఇక 2017లో చివరగా నిర్వహించిన ఈ వన్డే ఫార్మాట్ ఈవెంట్లో ఫైనల్ చేరిన టీమిండియా పాక్ జట్టు చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. చదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్గా అరుదైన రికార్డువారెవ్వా!.. శుబ్మన్ గిల్ ప్రపంచ రికార్డు Captain @ImRo45 is presented the winners trophy by ICC Chairman, Mr @JayShah as #TeamIndia clean sweep the ODI series 3-0 👏👏#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/1XaKksydw9— BCCI (@BCCI) February 12, 2025 -
CT 2025: సీన్ రివర్స్.. బ్యాటింగ్ ఓకే.. బుమ్రా లేని లోటు తీరేనా?
ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్కు ముందు ఇంగ్లండ్తో నిర్వహించిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ద్వారా భారత్ బ్యాటింగ్పై ఇటీవల రేకెత్తిన అనేక ప్రశ్నల కి సమాధానం లభించింది. ఈ సిరీస్ తో భారత్ బ్యాటింగ్ ఇబ్బందులు మాత్రం తొలిగినట్టే కనిపిస్తున్నాయి. ఇంతకుముందు కటక్ లో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు.ఇక బుధవారం అహ్మదాబాద్లో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 55 బంతుల్లో 52 పరుగులు సాధించి తన ఫామ్ పై వస్తున్న విమర్శలకు అడ్డుకట్ట వేసాడు. ఇక ఓపెనర్గా వచ్చిన యువ బ్యాటర్ శుబ్మన్ గిల్ కూడా సెంచరీ సాధించడంతో భారత్ బ్యాటింగ్ మళ్ళీ గతంలో లాగా పటిష్టంగా కనిపిస్తోంది. కోహ్లీ రికార్డ్ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కి వ్యతిరేకంగా అంతర్జాతీయ క్రికెట్లో 4,000 పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్గా విరాట్ కోహ్లీ రికార్డ్ కూడా సాధించాడు. ఇంగ్లండ్పై 4,000 పరుగుల మైలురాయిని అధిగమించిన ఆరో బ్యాట్స్మన్గా కోహ్లీ ఘనత వహించాడు. ఇంగ్లాండ్పై అన్ని ఫార్మాట్లలో కలిపి 87వ మ్యాచ్ లలో ఎనిమిది సెంచరీలు, 23 అర్ధ సెంచరీలు, 41.23 సగటు తో కోహ్లీ ఈ ఘనత సాధించాడు.ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్మాన్ ఇంగ్లండ్పై 37 టెస్ట్ మ్యాచ్ల్లో 5,028 పరుగులు సాధించి తో ఈ పట్టిక లో అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాత ఆస్ట్రేలియా కి చెందిన అలన్ బోర్డర్ (124 ఇన్నింగ్స్లలో 4850), స్టీవ్ స్మిత్ (114 ఇన్నింగ్స్లలో 4815), వెస్టిండీస్ బ్యాటర్ వివియన్ రిచర్డ్స్ (84 ఇన్నింగ్స్లలో 4488), ఆస్ట్రేలియాకే చెందిన రికీ పాంటింగ్ (99 ఇన్నింగ్స్లలో 4141) వరుసగా తర్వాత స్థానాలలో ఉన్నారు. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలోనూ అంతకుముందు స్వదేశంలో జరిగిన శ్రీలంక, న్యూజిలాండ్ లతో జరిగిన సిరీస్ లలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ పేలవంగా ఆడటంతో వీరిద్దరి ఫామ్పై పలు విమర్శలు చెలరేగాయి. కానీ ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్ లో వీరిద్దరూ కూడా పరుగులు సాధించడంతో భారత్ జట్టు మేనేజిమెంట్ ఊపిరి పీల్చుకుంది.బుమ్రా లేని భారత్ బౌలింగ్ అయితే బ్యాటింగ్ విషయం పర్వాలేదనిపించినా ప్రస్తుతం బౌలింగ్ పెద్ద సమస్య గా పరిణమించే ప్రమాదముంది. భారత్ ప్రధాన బౌలర్ వెన్ను నొప్పి కారణంగా ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకొన్నాడు. జనవరిలో ఆస్ట్రేలియా తో జరిగిన సిడ్నీ టెస్ట్ సమయంలో మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ నుంచి వైదొలిగిన బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ను కూడా తాత్కాలిక జట్టు నుంచి తొలగించారు అతని స్థానంలో ఇటీవల కాలంలో నిలకడగ రాణిస్తున్న స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేశారు. బుమ్రా తాజాగా బెంగళూరులో తీయించుకున్న స్కాన్లలో తీవ్రమైన ఇబ్బంది కనిపించక పోయినప్పటికీ, పూర్తి స్థాయిలో కోలుకోడానికి రెండు వారాలు పట్టే అవకాశం ఉన్నందున అతనికి మరింత విశ్రాంతి ఇవ్వాలని మేనేజిమెంట్ నిర్ణయించింది. గాయం కారణంగా బుమ్రా దూరమవుతున్న రెండవ ఐసీసీ టోర్నమెంట్ ఇది. గతంలో వెన్నునొప్పి కి ఆస్ట్రేలియాలో జరిగిన శస్త్రచికిత్స కారణంగా 2022 టి20 ప్రపంచ కప్ నుంచి కూడా బుమ్రా వైదొలిగిన విషయం తెలిసిందే.స్పిన్నర్ల పైనే భారం బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ సిరీస్లో వన్డే అరంగేట్రం చేశాడు. జనవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ మరియు ఇంగ్లండ్ సిరీస్ కోసం తాత్కాలిక జట్టును ప్రకటించినప్పుడు, ఇంగ్లండ్ వన్డేలకు బుమ్రాకు పూర్తిగా కోలుకోని కారణంగా రాణాని జట్టులోకి ఎంపిక చేశారు. గాయం నుంచి కోలుకొని మళ్ళీ జట్టులోకి వచ్చిన మహమ్మద్ షమీ కూడా ఇంకా పూర్తి స్థాయి ఫామ్ సాధించలేక పోతున్నాడన్న విషయం, ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లో తేటతెల్లమైంది.ఇక వీరిద్దరి తర్వాత మూడవ అత్యంత సీనియర్ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ని ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత జట్టు నుంచి తప్పించడం తో భారత్ పేస్ బౌలింగ్ షమీ , అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా ల పై ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పేస్ బౌలింగ్ కన్నా, స్పిన్నర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి ల పైనే ఎక్కువ భారం పడే అవకాశం ఉంది. -
IND vs ENG 3rd ODI: మూడో వన్డేలో భారత్ ఘన విజయం
IND vs ENG 3rd Odi Live Updates: భారత్ ఘన విజయం..అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో 142 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయాన్ని అందుకుంది. దీంతో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. 357 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు.. 34.2 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది.భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణాచ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సుందర్, కుల్దీప్ చెరో వికెట్ సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో గాస్ అట్కినసన్(38), టామ్ బాంటన్(38) టాప్ స్కోరర్లగా నిలవగా.. డకెట్(34) మరోసారి దూకుడుగా ఆడాడు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులు చేసి భారత్ ఆలౌట్ అయింది. శుబ్మన్ గిల్(112) శతక్కొట్టగా.. విరాట్ కోహ్లి(52), శ్రేయస్ అయ్యర్(78) అర్ధ శతకాలతో రాణించారు. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్రాహుల్ సైతం 29 బంతుల్లోనే 40 పరుగులతో మెరిశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మార్క్ వుడ్ రెండు, సకీబ్ మహమూద్, గస్ అట్కిన్సన్, జో రూట్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఓటమి దిశగా ఇంగ్లండ్..ఇంగ్లండ్ వరుస క్రమంలో మూడు వికెట్లను కోల్పోయింది. తొలుత హ్యారీ బ్రూక్ను హర్షిత్ రాణా క్లీన్ బౌల్డ్ చేయగా.. ఆ తర్వాత లైమ్ లివింగ్ స్టోన్, అదిల్ రషీద్ పెవిలియన్కు చేరారు. 31 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 179/8ఇంగ్లండ్ ఐదో వికెట్ డౌన్..జోస్ బట్లర్ రూపంలో ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన బట్లర్.. హర్షిత్ రాణా బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు.ఇంగ్లండ్ నాలుగో వికెట్ డౌన్..జో రూట్ రూపంలో ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన రూట్.. అక్షర్ పటేల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ జోస్ బట్లర్ వచ్చాడు. 22 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 137/4మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్టామ్ బాంటన్ రూపంలో ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో కీపర్ కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి అతడు పెవిలియన్ చేరాడు. మొత్తం 41 బంతులు ఎదుర్కొని 38 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఇంగ్లండ్ స్కోరు: 126/3 (18). రూట్ 20 పరుగులతో ఉండగా.. హ్యారీ బ్రూక్ క్రీజులోకి వచ్చాడు.నిలకడగా ఆడుతున్న రూట్, బాంటన్ఇంగ్లండ్ బ్యాటర్లు టామ్ బాంటన్(25), జో రూట్(9) నిలకడగా ఆడుతున్నారు. 14 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 102/2ఇంగ్లండ్ రెండో వికెట్ డౌన్.. సాల్ట్ ఔట్ఫిల్ సాల్ట్ రూపంలో ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన సాల్ట్.. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి జో రూట్ వచ్చాడు. 10 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 84/2. ఇంగ్లండ్ తొలి వికెట్ డౌన్..60 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడిన బెన్ డకెట్(32).. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి టామ్ బాంటన్ వచ్చాడు.టీమిండియా భారీ స్కోరుఇంగ్లండ్తో మూడో వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. శుబ్మన్ గిల్(112) శతక్కొట్టగా.. విరాట్ కోహ్లి(52), శ్రేయస్ అయ్యర్(78) అర్ధ శతకాలతో రాణించారు. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్రాహుల్ సైతం 29 బంతుల్లోనే 40 పరుగులతో మెరిశాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులు చేసి భారత్ ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మార్క్ వుడ్ రెండు, సకీబ్ మహమూద్, గస్ అట్కిన్సన్, జో రూట్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఎనిమిదో వికెట్గా వెనుదిరిగిన హర్షిత్ రాణాటెయిలెండర్ హర్షిత్ రాణా రూపంలో టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. గస్ అట్కిన్సన్ బౌలింగ్లో బట్లర్కు క్యాచ్ ఇచ్చి అతడు పెవిలియన్ చేరాడు. 10 బంతుల్లో 13 పరుగులు చేసి నిష్క్రమించాడు. భారత్ స్కోరు: 353-8(49). అర్ష్దీప్ సింగ్ క్రీజులోకి వచ్చాడు.ఏడో వికెట్ డౌన్.. రాహుల్ నిష్క్రమణకేఎల్ రాహుల్ రూపంలో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ పేసర్ సకీబ్ మహమూద్ బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్(ఎల్బీడబ్ల్యూ)గా రాహుల్.. 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. హర్షిత్ రాణా క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 334-7(47).ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియాజో రూట్ బౌలింగ్లో అక్షర్ పటేల్ ఆరో వికెట్గా వెనుదిరిగాడు. 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టామ్ బాంటన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి రాగా.. కేఎల్ రాహుల్ 21 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 308-6(44). టీమిండియా ఐదో వికెట్ డౌన్.. పాండ్యా ఔట్టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన పాండ్యా.. అదిల్ రషీద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి అక్షర్ పటేల్ వచ్చాడు. 42 ఓవర్లకు భారత్ స్కోర్: 295/5అయ్యర్ ఔట్.. టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 78 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. అదిల్ రషీద్ బౌలింగ్లో ఔటయ్యాడు.క్రీజులోకి హార్దిక్ పాండ్యా వచ్చాడు. 40 ఓవర్లకు భారత్ స్కోర్: 275/4మూడో వికెట్ కోల్పోయిన టీమిండియాసెంచరీ వీరుడు శుబ్మన్ గిల్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఆదిల్ రషీద్ బౌలింగ్లో గిల్ బౌల్డ్ అయ్యాడు. 112 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. కేఎల్ రాహుల్ క్రీజులోకి రాగా.. శ్రేయస్ అయ్యర్ 52 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 227/3 (34.4) గిల్ సెంచరీ..అహ్మదాబాద్ వన్డేలో టీమిండియా ఓపెనర్ శుబ్మన్ గిల్ సెంచరీతో మెరిశాడు. 92 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్లతో సాయంతో గిల్ తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. గిల్కు ఇది ఏడో వన్డే సెంచరీ కావడం విశేషం. 31 ఓవర్లకు భారత్ స్కోర్: 213/2. క్రీజులో గిల్(104)తో పాటు శ్రేయస్ అయ్యర్(48) ఉన్నాడు.విరాట్ కోహ్లి ఔట్..విరాట్ కోహ్లి రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన కోహ్లి.. అదిల్ రషీద్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు.గిల్, కోహ్లి హాఫ్ సెంచరీలు..మూడో వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి(51), గిల్(60) అదరగొడుతున్నారు. వీరిద్దరూ ఈ మ్యాచ్లో తమ హాఫ్ సెంచరీలను పూర్తి చేస్తున్నారు. 18 ఓవర్లకు భారత్ స్కోర్: 120/1నిలకడగా ఆడుతున్న కోహ్లి, గిల్..16 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. కోహ్లి(41), గిల్(48) నిలకడగా ఆడుతున్నారు.10 ఓవర్లకు భారత్ స్కోర్: 52/110 ఓవర్లు ముగిసే టీమిండియా వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లి(17), శుబ్మన్ గిల్(28) పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన టీమిండియాకెప్టెన్ రోహిత్ శర్మ రూపంలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. రెండో వన్డేల్లో విధ్వంసకర శతకం(119)తో చెలరేగిన రోహిత్.. తాజాగా ఒక్క పరుగుకే నిష్క్రమించాడు. మార్క్వుడ్ బౌలింగ్లో వికెట్ కీపర్ ఫిలిప్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కోహ్లి క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 8-1(2)అహ్మదాబాద్ వేదికగా మూడో వన్డేలో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈమ్యాచ్లో ఇంగ్లండ్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. జేమీ ఓవర్టన్ స్థానంలో టామ్ బాంటన్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు భారత్ మూడు మార్పులతో ఆడుతోంది. రవీంద్ర జడేజా, మహ్మద్ షమీలకు విశ్రాంతి ఇవ్వగా.. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ ముగ్గురి స్థానంలో వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చారు.కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్కు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. సూర్యకుమార్ సేన చేతిలో పొట్టి ఫార్మాట్ సిరీస్లో 4-1తో ఓడిపోయిన బట్లర్ బృందం.. వన్డే సిరీస్ను కూడా కోల్పోయింది.నాగ్పూర్, కటక్ వేదికలుగా జరిగిన తొలి రెండు వన్డేల్లో రోహిత్ సేన జయభేరి మోగించగా.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ 2-0తో ఓటమిపాలైంది. తాజాగా అహ్మదాబాద్ వేదికగా నామమాత్రపు మూడో వన్డేలోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. తుదిజట్లుటీమిండియారోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్.ఇంగ్లండ్ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), టామ్ బాంటన్, లియామ్ లివింగ్స్టోన్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సకీబ్ మహమూద్. -
ఆఖరికి అతడికి జట్టులో స్థానమే లేకుండా చేశారు? ఇదేం పద్ధతి?
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తమ జట్టును ఖరారు చేసింది. ప్రాథమిక జట్టులో రెండు మార్పులు చేస్తూ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)ను తప్పించిన యాజమాన్యం.. జట్టులో కొత్తగా ఇద్దరు బౌలర్లకు చోటిచ్చింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) బీసీసీఐ సెలక్టర్ల తీరును విమర్శించాడు. జైస్వాల్పై వేటు వేయడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఈ మాజీ ఓపెనర్.. సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ను పక్కనపెట్టడాన్నీ తప్పుబట్టాడు.యశస్వి జైస్వాల్పై వేటుకాగా జనవరి 18న బీసీసీఐ చాంపియన్స్ ట్రోఫీకి తమ ప్రాథమిక జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో యశస్వి జైస్వాల్తో పాటు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేర్లు కూడా ఉన్నాయి. అయితే, బుమ్రా వెన్నునొప్పి నుంచి కోలుకోకపోవడంతో ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీకి తమ జట్టును ఖరారు చేసేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆయా బోర్డులకు ఫిబ్రవరి 12 వరకు గడువు ఇవ్వగా.. మంగళవారం రాత్రి బీసీసీఐ కీలక ప్రకటన చేసింది.యశస్వి జైస్వాల్పై వేటు వేయడంతో పాటు బుమ్రా ఈ టోర్నీ నుంచి తప్పుకొన్నట్లు తెలిపింది. వీరి స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాతో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిలను ప్రధాన జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా భారత జట్టు గురించి ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఆఖరికి అతడికి జట్టులోనే స్థానమే లేకుండా చేశారుఈ మేరకు.. ‘‘బుమ్రా గైర్హాజరీ కారణంగా సెలక్టర్లు సిరాజ్ వైపు మొగ్గు చూపుతారని అనుకున్నా. అలా అయితే నలుగురు పేసర్లు జట్టులో ఉండేవారు. ఇక మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. తుదిజట్టులో యశస్విని ఆడించేందుకు శ్రేయస్ అయ్యర్నే పక్కనపెట్టాలని చూసిన యాజమాన్యం ఇప్పుడు కనీసం అతడికి చాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్థానం కూడా కల్పించకపోవడం గమనార్హం’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.కాగా ఇప్పటికే టెస్టుల్లో, టీ20లలో ఓపెనర్గా తనను తాను నిరూపించుకున్న యశస్వి జైస్వాల్.. ఇటీవల ఇంగ్లండ్తో స్వదేశంలో తొలి మ్యాచ్ సందర్భంగా వన్డేల్లో అరంగేట్రం చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అతడు భారత ఇన్నింగ్స్ ఆరంభించగా.. వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ వన్డౌన్లో వచ్చాడు.ఇక మోకాలి గాయం వల్ల భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్కు దూరం కాగా.. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ తనకు అచ్చొచ్చిన నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. ధనాధన్ ఇన్నింగ్స్(36 బంతుల్లో 59) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.కోహ్లి గాయం కారణంగానేఈ క్రమంలో మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. కోహ్లి గాయం కారణంగానే తనకు తుదిజట్టులో చోటు దక్కిందని.. లేదంటే ఈ మ్యాచ్లో తాను భాగమయ్యేవాడినే కాదని తెలిపాడు. అంటే.. జైస్వాల్ను ఆడించే క్రమంలో అయ్యర్ను తప్పించేందుకు కూడా మేనేజ్మెంట్ వెనుకాడలేదని తేలింది. అయితే, తాజాగా జైసూను చాంపియన్స్ ట్రోఫీ ప్రధాన జట్టు నుంచి తీసేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా పైవిధంగా స్పందించాడు.ఇదిలా ఉంటే.. అరంగేట్ర వన్డేలో జైస్వాల్ విఫలమయ్యాడు. 22 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్ మూడు ఫోర్ల సాయంతో 15 పరుగులు చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో వికెట్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. మరోవైపు.. ఇంగ్లండ్తో సిరీస్ల సందర్భంగా సత్తా చాటిన హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఏకంగా చాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్థానం సంపాదించారు.చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: Chris Gayle: అతడొక వరల్డ్క్లాస్ ప్లేయర్.. ఈసారి చాంపియన్స్ ట్రోఫీ వారికే -
Ind vs Eng 3rd ODI: వరుణ్ చక్రవర్తికి గాయం.. ఆ ఇద్దరికి విశ్రాంతి
Ind vs Eng 3rd ODI: టీమిండియాతో అహ్మదాబాద్ వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తన నిర్ణయం గురించి ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(Jos Buttler) మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మేము ముందుగా బౌలింగ్ చేయాలని అనుకుంటున్నాం. మ్యాచ్ సాగే కొద్దీ పిచ్ పరిస్థితి మెరుగుపడవచ్చు. తొలి రెండు వన్డేల్లో మేము ముందుగా బ్యాటింగ్ చేశాం. అందుకే చాంపియన్స్ ట్రోఫీకి ముందు కాస్త కొత్తగా ప్రయత్నిస్తున్నాం. వికెట్ బాగుంది. ఇక్కడే మేము న్యూజిలాండ్తో వరల్డ్కప్ మ్యాచ్ ఆడాం. నల్లరేగడి మట్టి పిచ్ సెకండాఫ్లో బ్యాటింగ్కు ఇంకాస్త అనుకూలంగా మారుతుంది. ఈరోజు మేము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాం. జేమీ ఓవర్టన్ స్థానంలో టామ్ బాంటన్ జట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.మరోవైపు.. టాస్ సందర్భంగా రోహిత్ శర్మ(Rohit Sharma) తాము మూడు మార్పులతో మూడో వన్డే ఆడుతున్నట్లు వెల్లడించాడు. రవీంద్ర జడేజా, మహ్మద్ షమీలకు విశ్రాంతినిచ్చామన్న రోహిత్.. దురదృష్టవశాత్తూ వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్కు దూరమయ్యాడని తెలిపాడు. వరుణ్ పిక్కల్లో నొప్పితో బాధపడుతున్నట్లు తెలిపాడు. ఇక ఈ ముగ్గురి స్థానంలో వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ తుదిజట్టులోకి వచ్చినట్లు రోహిత్ శర్మ వెల్లడించాడు.కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్కు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. సూర్యకుమార్ సేన చేతిలో పొట్టి ఫార్మాట్ సిరీస్లో 4-1తో ఓడిపోయిన బట్లర్ బృందం.. వన్డే సిరీస్ను కూడా కోల్పోయింది. నాగ్పూర్, కటక్ వేదికలుగా జరిగిన తొలి రెండు వన్డేల్లో రోహిత్ సేన జయభేరి మోగించగా.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ 2-0తో ఓటమిపాలైంది.తాజాగా అహ్మదాబాద్ వేదికగా నామమాత్రపు మూడో వన్డేలోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు ఒక్క వన్డేలో అయినా గెలిచి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకునే పనిలో ఉంది. మరోవైపు.. క్లీన్స్వీప్ విజయంతో ఐసీసీ టోర్నీలో అడుగుపెట్టాలని టీమిండియా పట్టుదలగా ఉంది. తుదిజట్లుటీమిండియారోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్.ఇంగ్లండ్ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), టామ్ బాంటన్, లియామ్ లివింగ్స్టోన్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సకీబ్ మహమూద్.చదవండి: 119 ఏళ్ల రికార్డు బద్దలు: ప్రపంచంలోనే తొలి టెస్టు జట్టుగా ఐర్లాండ్ ఘనత -
ఇంగ్లండ్తో మూడో వన్డే.. భారీ రికార్డుకు చేరువలో రోహిత్
అహ్మదాబాద్ వేదికగా భారత్, ఇంగ్లండ్ (IND VS ENG 3rd ODI) మధ్య ఇవాళ (ఫిబ్రవరి 12) మూడో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఓ భారీ మైలురాయిని అధిగమించే అవకాశం ఉంది. నేటి మ్యాచ్లో హిట్మ్యాన్ మరో 13 పరుగులు చేస్తే, వన్డే క్రికెట్లో 11000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 10వ ఆటగాడిగా.. నాలుగో భారతీయ క్రికెటర్గా రికార్డు నెలకొల్పుతాడు. వన్డే క్రికెట్లో ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ (18426), కుమార సంగక్కర (14232), విరాట్ కోహ్లి (13911), రికీ పాంటింగ్ (13704), సనత్ జయసూర్య (13430), మహేళ జయవర్దనే (12650), ఇంజమామ్ ఉల్ హక్ (11739), జాక్ కల్లిస్ (11579), సౌరవ్ గంగూలీ (11363) మాత్రమే 11000 పరుగుల మైలురాయిని దాటారు.విరాట్ తర్వాత అత్యంత వేగంగా..!నేటి మ్యాచ్లో రోహిత్ 11000 పరుగుల మైలురాయిని తాకితే.. విరాట్ కోహ్లి (Virat Kohli) తర్వాత అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం రోహిత్ 259 వన్డే ఇన్నింగ్స్ల్లో 10987 పరుగులు చేశాడు. విరాట్.. 11000 పరుగుల మైలురాయిని తన 222వ ఇన్నింగ్స్లోనే అధిగమించాడు.సెంచరీ చేస్తే మరో రికార్డునేటి మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీ చేస్తే సచిన్ టెండూల్కర్ (100), విరాట్ కోహ్లి (81) తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో 50 సెంచరీలు పూర్తి చేసిన మూడో భారత క్రికెటర్గా రికార్డుల్లోకెక్కుతాడు. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన 10వ క్రికెటర్గా రికార్డు నెలకొల్పుతాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు సచిన్, విరాట్, పాంటింగ్ (71), సంగక్కర (63), కల్లిస్ (62), హాషిమ్ ఆమ్లా (55), జయవర్దనే (54), బ్రియాన్ లారా (53), జో రూట్ (52) మాత్రమే యాభై సెంచరీలు పూర్తి చేశారు. కాగా, ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. అంతకుముందు జరిగిన తొలి వన్డేలోనూ భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సుడిగాలి శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్లో రోహిత్ కేవలం 76 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్కు వన్డేల్లో ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. -
వరల్డ్క్లాస్ ప్లేయర్.. ఈసారి చాంపియన్స్ ట్రోఫీ వారికే: క్రిస్ గేల్
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో విజేతగా ఎవరన్న అంశంపై వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్(Chris Gayle) తన అంచనా తెలియజేశాడు. ఈసారి టీమిండియానే టైటిల్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు. కాగా 2013లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్.. 2017లో ఫైనల్ చేరింది.తటస్థ వేదికపై రోహిత్ సేనఅయితే, నాటి టైటిల్ పోరులో దాయాది పాకిస్తాన్ చేతిలో ఓడిపోయి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత మరోసారి ఈ వన్డే ఫార్మాట్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ ఆతిథ్య హక్కులు దక్కించుకోగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు నిరాకరించింది.ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)తో ఈ విషయం గురించి చర్చించగా.. తటస్థ వేదికపై రోహిత్ సేన మ్యాచ్లు ఆడేలా హైబ్రిడ్ విధానానికి అంగీకరించింది. అయితే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తొలుత ఈ ప్రతిపాదనకు అంగీకరించకపోయినా.. ఐసీసీ చర్యలకు ఉపక్రమించడంతో దిగివచ్చింది. దీంతో దుబాయ్ వేదికగా టీమిండియా తమ మ్యాచ్లు ఆడేందుకు మార్గం సుగమమైంది.రెండు గ్రూపులుమరోవైపు.. పాకిస్తాన్లోని రావల్పిండి, కరాచి, లాహోర్ నగరాలను వేదికలుగా ఎంపిక చేశారు. ఇక ఈ టోర్నీకి ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, పాకిస్తాన్ అర్హత సాధించగా.. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉండగా.. గ్రూప్-‘బి’లో ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఉన్నాయి.ఇక ఫిబ్రవరి 19న పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య కరాచీ వేదికగా మ్యాచ్తో చాంపియన్స్ ట్రోఫీ-2025కి తెరలేవనుంది. మరోవైపు.. టీమిండియా ఫిబ్రవరి 20న ఈ ఐసీసీ ఈవెంట్లో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. లీగ్ దశలో తొలుత బంగ్లాదేశ్తో తలపడనున్న రోహిత్ సేన.. ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఢీకొట్టనుంది. అనంతంర మార్చి 2న న్యూజిలాండ్తో తలపడుతుంది.ఐసీసీ టోర్నీలలో అద్భుతంగాకాగా సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్-2023లో ఫైనల్ వరకు అజేయంగా నిలిచిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై తడబడింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దాదాపు లక్ష మందికి పైగా ప్రేక్షకుల నడుమ ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై.. టైటిల్ను చేజార్చుకుంది. అయితే, అనంతరం టీ20 ప్రపంచకప్-2024లో ఆఖరి వరకు జైత్రయాత్ర కొనసాగించి చాంపియన్గా అవతరించింది.ఇదే జోరులో చాంపియన్స్ ట్రోఫీలోనూ అడుగుపెట్టనున్న రోహిత్ సేనకు.. ఇంగ్లండ్తో వన్డే సిరీస్ మంచి సన్నాహకంగా ఉపయోగపడుతోంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలుత నాగ్పూర్లో నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన భారత్.. కటక్లో జరిగిన రెండో వన్డేలోనూ నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై విజయం సాధించింది. ఇక రెండో వన్డే సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చి.. విధ్వంసకర శతకం(90 బంతుల్లో 119 రన్స్) బాదడం టీమిండియాకు అతిపెద్ద సానుకూలాంశంగా పరిణమించింది.అతడొక వరల్డ్క్లాస్ ప్లేయర్ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ తక్తో మాట్లాడిన విండీస్ హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్.. ‘‘చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియానే ఫేవరెట్. టైటిల్ గెలిచే జట్టు ఇదే’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ.. ‘‘అతడొక వరల్డ్క్లాస్ ప్లేయర్. వన్డేల్లో డబుల్ సెంచరీలు చేసిన ఘనత అతడిది. హిట్మ్యాన్ అతడు. వన్డేల్లో నా సిక్సర్ల రికార్డును బ్రేక్ చేశాడు. టెస్టుల్లో విఫలమైనా మెగా టోర్నీలో మాత్రం తప్పక రాణిస్తాడు’’ అని క్రిస్ గేల్ విశ్వాసం వ్యక్తం చేశాడు.చదవండి: IPL 2025: కొత్త యాజమాన్యం చేతిలోకి గుజరాత్ టైటాన్స్! -
రోహిత్లాగే కోహ్లి కూడా ఫామ్లోకి వస్తాడు.. చాంపియన్స్ ట్రోఫీ భారత్దే..!
ముంబై: భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli) రాణిస్తే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) భారత్ వశమవుతుందని శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (Muttiah Muralitharan) అన్నాడు. రిలయన్స్ శీతల పానియాల ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన అతను మీడియాతో ముచ్చటించాడు. ‘ఇద్దరు అసాధారణ ఆటగాళ్లు. ప్రపంచ శ్రేణి బ్యాటర్లు. ఎప్పుడైనా సరే క్లాస్ శాశ్వతం. ఫామ్ లేకపోవడం తాత్కాలికం. తప్పకుండా రోహిత్లాగే కోహ్లి కూడా ఫామ్లోకి వస్తాడు. ఇద్దరు ప్రత్యర్థి బౌలింగ్పై ఎదురుదాడికి దిగితే టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంటుంది’ అని మురళీ వివరించాడు. రోహిత్ బృందం ఆల్రౌండ్ వనరులతో పటిష్టంగా కనబడుతోందన్నాడు. భారత్ సహా పాక్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లలో నాణ్యమైన స్పిన్ బౌలర్లు ఉన్నారని, పాకిస్తాన్లోని పిచ్లు స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తాయని చెప్పాడు. -
కోహ్లి ఫామ్లోకి వస్తే భారత్కు తిరుగులేదు..
ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్ట్ నుండి పేలవమైన ఫామ్ కారణంగా వైదొలిగిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆ తర్వాత జరిగిన రంజీ ట్రోఫీ టోర్నమెంట్ లో కూడా ఆశించిన విధంగా రాణించలేక పోయాడు. ఈ నేపధ్యం లో ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ ముందు రోహిత్ మళ్ళీ ఫామ్ లోకి రావడం చాల ముఖ్యమైన విషయం.వరుసగా పది ఇన్నింగ్స్ల లో ( తొమ్మిది టెస్టులు, ఒక వన్డే) విఫలమైన రోహిత్ చివరికి ఆదివారం కటక్లో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో తన మునుపటి ఫామ్ ని ప్రదర్శించి సిక్సర్ల మోత మోగించాడు. రోహిత్ కటక్ ప్రేక్షకులను నిజంగా అలరించాడు, 12 ఫోర్లు మరియు 7 సిక్సర్లు తో వన్డేల్లో తన 32వ సెంచరీ సాధించి, భారత్ ఈ మూడు మ్యాచ్ ల సిరీస్ చేజిక్కించుకునేందుకు తన వంతు పాత్ర పోషించాడు. జట్టు రధ సారధి లాగా ముందుండి నడిపించాడు.ఈ సెంచరీతో, రోహిత్ 30 ఏళ్లు నిండిన క్రికెటర్లలో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన భారత క్రికెటర్ గా రికార్డ్ నమోదు చేసాడు. లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ గతంలో 35 సెంచరీలు తో చేసిన రికార్డును రోహిత్ అధిగమించాడు. భారత్ తరపున ఓపెనర్గా అత్యధిక పరుగులు చేసిన వారి లో రోహిత్ ఇప్పుడు రెండో స్థానానికి చేరుకున్నాడు. రోహిత్ అన్ని ఫార్మాట్లలో ఓపెనర్గా 15,404 పరుగులు సాధించాడు. గతంలో సచిన్ టెండూల్కర్ 15,335 పరుగులతో సాధించిన మరో రికార్డును కూడా రోహిత్ ఈ మ్యాచ్ తో అధిగమించాడు. వీరేంద్ర సెహ్వాగ్ 15,758 పరుగులతో ఈ జాబితా లో అగ్ర స్థానం లో ఉన్నాడు. "చాలా సంవత్సరాలుగా నేను క్రికెట్ ఆడుతున్నాను. నేను ఏమి చేయాలో నాకు తెల్సు. నా నుండి ఏమి అవసరమో నాకు అర్థమైంది. పిచ్ లోకి వెళ్లి నేను చేసింది అదే" అని రోహిత్ మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు.రోహిత్ మళ్ళీ ఫామ్ లోకి రావడంతో భారత్ జట్టు మానేజిమెంట్ కి పెద్ద తలనొప్పి తగ్గింది. ఇక మూడో వన్డేలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా సెంచరి సాధించినట్టయితే ఛాంపియన్స్ ట్రోఫీ కి ముందు భారత్ బ్యాటింగ్ గాడి లో పడినట్టే. బ్యాటింగ్ స్థానం లో మార్పులుఅయితే భారత్ బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు పై పలువురు మాజీ ఆటగాళ్లు జట్టు మేనేజిమెంట్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ను వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ కంటే ముందుగా పంపడం పై పెద్ద దుమారమే చెలరేగుతోంది. టాప్ ఆర్డర్ బ్యాటర్ అయిన రాహుల్ జట్టు అవసరాల అనుగుణంగా బ్యాటింగ్ స్థానాన్ని మార్చడం పై జట్టు మేనేజిమెంట్ పలు విమర్శలు ఎదుర్కొంటోంది."అక్షర్ పటేల్ మళ్ళీ కెఎల్ రాహుల్ కంటే ముందుగా బ్యాటింగ్ రావడమేమిటి? నాకు మాటలు కూడా రావడం లేదు. రాహుల్ లాంటి నైపుణ్యమైన బాట్స్మన్ ని ఆరో స్థానానికి నెట్టడం చాల దారుణం. అక్షర్ను రాహుల్ కన్నా ముందుగా బ్యాటింగ్ పంపడం. అదీ ఇలాంటి పిచ్ పై సరైన నిర్ణయం కాదు, అని భారత్ మాజీ ఆటగాడు దొడ్డ గణేష్ వ్యాఖ్యానించాడు. -
హర్షిత్ రాణాపై రోహిత్ శర్మ ఫైర్!.. వీడియో వైరల్
టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా(Harshit Rana)పై కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘మెదడు పని చేస్తోందా?.. మనసు ఎక్కడపెట్టి ఆడుతున్నావు?’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ఇంగ్లండ్తో రెండో వన్డే సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి.కాగా కటక్ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్(India vs England) మధ్య ఆదివారం రెండో వన్డే జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పర్యాటక ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో ఫిల్ సాల్ట్(26) నిరాశపరిచినా.. బెన్ డకెట్ మాత్రం అర్ధ శతకం(56 బంతుల్లో 65)తో మెరిశాడు. వన్డౌన్లో వచ్చిన జో రూట్(72 బంతుల్లో 69) కూడా హాఫ్ సెంచరీ సాధించాడు.ఉచితంగా నాలుగు పరుగులుఇక హ్యారీ బ్రూక్(31) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ జోస్ బట్లర్ పాతుకుపోయే ప్రయత్నం చేశాడు. అయితే, ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో 32వ ఓవర్ను భారత యువ పేస్ బౌలర్ హర్షిత్ రాణా వేశాడు. అప్పుడు క్రీజులో ఉన్న బట్లర్ ఐదో బంతిని డిఫెన్స్ ఆడగా.. బంతిని అందుకున్న రాణా వికెట్ల వైపునకు త్రో చేశాడు.అయితే, అది స్టంప్స్ను తాకకపోగా.. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చేతికి కూడా అందకుండా బౌండరీ వైపు దూసుకువెళ్లింది. దీంతో రాణా చేసిన తప్పు వల్ల ఇంగ్లండ్కు ఉచితంగా నాలుగు పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన రోహిత్ శర్మ.. హర్షిత్ రాణాను చూస్తూ.. ‘మెదడు ఎక్కడ పెట్టుకుని ఆడుతున్నావు?’ అన్నట్లుగా సైగలతో అతడిపై అసహనం వెళ్లగక్కాడు.రోహిత్ విశ్వరూపంఇదిలా ఉంటే.. ఇక బట్లర్ 34 పరుగులు చేసి నిష్క్రమించగా.. లివింగ్స్టోన్ 41 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లు విఫలం కాగా 49.5 ఓవర్లలో ఇంగ్లండ్ 304 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు రవీంద్ర జడేజా మూడు, వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ పడగొట్టగా.. పేసర్లు హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక లక్ష్య ఛేదనలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ శతకం(90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు- 119 రన్స్) చెలరేగగా.. శుబ్మన్ గిల్(60), శ్రేయస్ అయ్యర్(47 బంతుల్లో 44), అక్షర్ పటేల్(43 బంతుల్లో 41*) కూడా రాణించారు. ఫలితంగా 44.3 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన టీమిండియా 308 పరుగులు చేసింది. ఇంగ్లండ్పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది.చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ టెండుల్కర్ను దాటేసి.. Rohit sharma angry on harshit rana on overthrow #LCDLFAllStars #SEVENTEEN #jailstool #DelhiElectionResults #cepostaperte pic.twitter.com/XEUjyQMRdK— kyaa haal hai (@Nittin08572676) February 9, 2025What a way to get to the HUNDRED! 🤩A treat for the fans in Cuttack to witness Captain Rohit Sharma at his best 👌👌Follow The Match ▶️ https://t.co/NReW1eEQtF#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/oQIlX7fY1T— BCCI (@BCCI) February 9, 2025 -
క్రిస్ గేల్ను అధిగమించిన రోహిత్.. ప్రపంచ రికార్డుకు గురి
తాను బ్యాట్ ఝులిపిస్తే ప్రత్యర్థి జట్టు బౌలర్ల పరిస్థితి ఎలా ఉంటుందో.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మరోసారి నిరూపించాడు. ఇంగ్లండ్తో రెండో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగి.. బౌండరీలు, సిక్స్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో రో‘హిట్’.. వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్(Chris Gayle) సిక్సర్ల రికార్డును బద్దలుకొట్టాడు. అంతేకాదు.. అరుదైన ప్రపంచ రికార్డుకు మరింత చేరువయ్యాడు.కాగా గత కొంతకాలంగా బ్యాటింగ్ కష్టాలు ఎదుర్కొంటున్న రోహిత్ శర్మ.. కటక్ వన్డేతో ఫామ్లోకి వచ్చేశాడు. ఇంగ్లండ్(India vs England)తో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో డెబ్బై ఆరు బంతుల్లోనే శతకమార్కును అందుకుని.. తన వన్డే కెరీర్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో పన్నెండు ఫోర్లతో పాటు.. ఏడు సిక్స్లు ఉన్నాయి.రెండో స్థానానికి ఈ క్రమంలో వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ రెండోస్థానానికి చేరుకున్నాడు. క్రిస్ గేల్ను అధిగమించి షాహిన్ ఆఫ్రిది తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 267 వన్డేలు పూర్తి చేసుకున్న రోహిత్ 338 సిక్స్లు బాదాడు.మరోవైపు.. వెస్టిండీస్ తరఫున 301 వన్డేల్లో గేల్ 331 సిక్సర్లు కొట్టాడు. ఇక పాకిస్తాన్ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది 351 సిక్స్లతో వన్డేల్లో అత్యధిక సిక్సర్ల వీరుడిగా కొనసాగుతున్నాడు. అతడి ప్రపంచ రికార్డుకు రోహిత్ శర్మ ఇంకా కేవలం పదమూడు సిక్స్ల దూరంలో ఉన్నాడు. అయితే, అంతర్జాతీయ క్రికెట్లో ఓవరాల్గా టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ ఇప్పటికే అత్యధిక సిక్సర్ల వీరుడిగా అవతరించిన విషయం తెలిసిందే. అతడి ఖాతాలో ఏకంగా 631 సిక్స్లు ఉన్నాయి. రోహిత్ వన్డేల్లో 338, టీ20లలో 205, టెస్టుల్లో 88 సిక్స్లు బాదాడు.సిరీస్ కైవసంకాగా ఇంగ్లండ్తో స్వదేశంలో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడుతున్న టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. తొలుత సూర్యకుమార్ బృందం ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 4-1తో సొంతం చేసుకోగా.. మరో వన్డే మిగిలి ఉండగానే వన్డే సిరీస్ను రోహిత్ సేన 2-0తో కైవసం చేసుకుంది. కటక్లో ఆదివారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. బట్లర్ బృందాన్ని 304 పరుగులకు ఆలౌట్ చేసింది.ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ... మొత్తంగా తొంభై బంతుల్లో 119 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ మెరుపు అర్ధ శతకం(52 బంతుల్లో 60) రాణించగా.. శ్రేయస్ అయ్యర్(44), అక్షర్ పటేల్(41 నాటౌట్) మరోసారి రాణించారు.ఈ క్రమంలో 44.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసిన టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. హిట్ షోతో అలరించిన రోహిత్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య బుధవారం ఆఖరి వన్డే జరుగుతుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ టెండుల్కర్ను దాటేసి.. -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. తిరుగులేని హిట్మ్యాన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనర్గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar)ను అధిగమించాడు. ఇంగ్లండ్తో రెండో వన్డే(India vs England) సందర్భంగా ఈ ఘనత సాధించాడు. అదే విధంగా.. ఈ మ్యాచ్లో శతక్కొట్టడం ద్వారా మరిన్ని రికార్డులను హిట్మ్యాన్ తన ఖాతాలో వేసుకున్నాడు.అద్భుత ఇన్నింగ్స్కాగా రోహిత్ శర్మ గత కొంతకాలంగా పేలవ ఫామ్తో విమర్శలు మూటగట్టుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టెస్టుల్లో కెప్టెన్గా, బ్యాటర్గా దారుణంగా విఫలమైన అతడు రిటైర్ అయిపోవాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే, ఇంగ్లండ్తో కటక్ వన్డేలో తనదైన శైలిలో విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడి.. విమర్శించినవాళ్లే ప్రశంసించేలా రోహిత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.వన్డే కెరీర్లోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీబరాబతి స్టేడియంలో లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు రోహిత్ శర్మ. ఫ్లడ్లైట్ల సమస్య కారణంగా కాసేపు అవాంతరాలు ఎదురైనా.. అతడి ఏకాగ్రత చెదరలేదు. ఒంటిమీదకు బాణాల్లా దూసుకువస్తున్న ఇంగ్లండ్ ఫాస్ట్బౌలర్ల బంతులను సమర్థవంతంగా ఎదుర్కొన్న రోహిత్ శర్మ తన వన్డే కెరీర్లోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు.డెబ్బై ఆరు బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ ఇన్నింగ్స్లో ఏకంగా పన్నెండు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. అయితే, లియామ్ లివింగ్స్టోన్ బౌలింగ్లో ఆదిల్ రషీద్కు క్యాచ్ ఇవ్వడంతో హిట్మ్యాన్ ధనాధన్ ఇన్నింగ్స్కు తెరపడింది.ఇక ఈ మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనర్గా నిలిచాడు. మూడు ఫార్మాట్లలో కలిపి ఓపెనర్గా రోహిత్ శర్మ ఇప్పటి వరకు 15404 పరుగులు చేశాడు. తద్వారా సచిన్ టెండుల్కర్ను అధిగమించాడు.కాగా ఓపెనర్గా సచిన్ టెండుల్కర్ 15335 పరుగులు చేశాడు. మరోవైపు.. ఈ జాబితాలో విధ్వంసకర మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 15758 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడి తర్వాతి స్థానంలోకి ఇప్పుడు రోహిత్ దూసుకువచ్చాడు. కాగా 2007లో అరంగేట్రం చేసిన రోహిత్.. 2013లో ఓపెనర్గా ప్రమోట్ అయ్యాడు.ద్రవిడ్ను అధిగమించివన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ (267 వన్డేల్లో 10,987 పరుగులు) నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఇప్పటి వరకు నాలుగో స్థానంలో ఉన్న రాహుల్ ద్రవిడ్ (344 వన్డేల్లో 10,889 పరుగులు) ఐదో స్థానానికి చేరాడు. టాప్–3లో సచిన్ టెండూల్కర్ (463 వన్డేల్లో 18,246 పరుగులు), విరాట్ కోహ్లి (296 వన్డేల్లో 13,911 పరుగులు), సౌరవ్ గంగూలీ (311 వన్డేల్లో 11,363 పరుగులు) ఉన్నారు.32వ శతకంవన్డేల్లో రోహిత్ శర్మ సెంచరీలు 32. తద్వారా అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ మూడో స్థానంలో ఉన్నాడు. టాప్–2లో విరాట్ కోహ్లి (50), సచిన్ టెండూల్కర్ (49) ఉన్నారు.ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే.. కటక్లో ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. 49.5 ఓవర్లలో 304 పరుగులకు బట్లర్ బృందం ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రోహిత్ సేన 44.3 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది. ఆరు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసిన భారత్.. నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. భారత్- ఇంగ్లండ్ మధ్య నామమాత్రపు మూడో వన్డే అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరుగుతుంది.చదవండి: జట్టు కోసం కొన్ని పరుగులు చేశా.. అతడొక క్లాసీ ప్లేయర్: రోహిత్ శర్మ -
జట్టు కోసం కొన్ని పరుగులు చేశా.. అతడొక క్లాసీ ప్లేయర్: రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఫామ్లోకి వచ్చేశాడు. ఇంగ్లండ్(India vs England)తో రెండో వన్డేలో విధ్వంసకర బ్యాటింగ్తో శతక్కొట్టి తన ఆటను విమర్శిస్తున్న వాళ్లకు బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. కో..డితే బంతి బౌండరీ దాటడమే అన్నట్లుగా తనదైన శైలిలో హిట్టింగ్ ఆడి.. క్రికెట్ ప్రేమికులకు కనులవిందు చేశాడు. అద్భుతమైన ఇన్నింగ్స్తో చెలరేగి.. జట్టును గెలిపించాడు.నా గేమ్ప్లాన్ అదేఈ నేపథ్యంలో విజయానంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ... సెంచరీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఈరోజు ఆటను పూర్తిగా ఆస్వాదించాను. జట్టు కోసం పరుగులు చేయడం ఎల్లప్పుడూ సంతృప్తిని ఇస్తుంది. ముఖ్యంగా సిరీస్ గెలవాలంటే మాకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం.నిజానికి టీ20 ఫార్మాట్ కంటే కాస్త సుదీర్ఘమైన.. టెస్టుల కంటే చిన్నదైన ఫార్మాట్ ఇది. అందుకే పరిస్థితులకు తగ్గట్లుగా ఎప్పుటికప్పుడు ప్రణాళికలు మార్చుకుంటూ వెళ్లాలి. ఈరోజు నా వ్యూహాలను పక్కాగా అమలు చేయగలిగాను.నల్లరేగడి మట్టి పిచ్ ఇది. జారుతూ ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. వికెట్ మీదకు కాకుండా.. శరీరం మీదకు బంతులు సంధిస్తున్న ఇంగ్లండ్ బౌలర్ల వ్యూహాన్ని పసిగట్టి నేను పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాను.గిల్ క్లాసీ ప్లేయర్గ్యాప్ దొరికినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాను’’ అని రోహిత్ శర్మ తన ఆటతీరుపై సంతృప్తి వ్యక్తం చేశాడు. అదే విధంగా.. శుబ్మన్ గిల్(Shubman Gill), శ్రేయస్ అయ్యర్ నుంచి తనకు మద్దతు లభించించదన్న హిట్మ్యాన్.. ‘‘ఇద్దరూ చక్కగా సహకరించారు. వాళ్లతో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదించాను. గిల్ చాలా చాలా క్లాసీ ప్లేయర్. అతడి ఆటను నేను దగ్గరగా గమనించాను. పరిస్థితి ఎలా ఉన్న తలవంచని స్వభావం. అతడి బ్యాటింగ్ గణాంకాలే ఇందుకు నిదర్శనం’’ అని రోహిత్ శర్మ గిల్పై ప్రశంసలు కురిపించాడు.మిడిల్ ఓవర్లే ముఖ్యంఇక టీమిండియా ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఏదేమైనా మిడిల్ ఓవర్లలో వికెట్లు కాపాడుకోవడం అత్యంత ముఖ్యం. మధ్య ఓవర్లలో ఆట తీరును బట్టే ఫలితం నిర్ణయించబడుతుంది. ఒకవేళ అప్పుడే మనం జాగ్రత్తపడితే డెత్ ఓవర్లలో పెద్దగా భయపడాల్సిన అవసరం ఉండదు.నాగ్పూర్లో కూడా మేము ఇదే విధంగా మిడిల్ ఓవర్లలో చక్కగా రాణించాం. తద్వారా ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచి అనుకున్న ఫలితాన్ని రాబట్టగలిగాం. రోజురోజుకూ మరింత గొప్పగా మారేలా మా జట్టు సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోంది. జట్టులోని ప్రతి సభ్యుడికి తన పాత్ర ఏమిటో తెలుసు. కెప్టెన్, కోచ్ వాళ్ల నుంచి ఎలాంటి ఆట తీరును ఆశిస్తున్నారో ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. కాబట్టి ముందుకు అనుకున్న వ్యూహాలను పక్కాగా అమలు చేస్తే దేని గురించి ఆందోళన చెందాల్సిన పని ఉండదు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.సిరీస్ కైవసంకాగా ఇంగ్లండ్తో రెండో వన్డేలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఒడిశాలోని కటక్లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. 49.5 ఓవర్లలో 204 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ బెన్ డకెట్(65), జో రూట్(69) అర్ధ శతకాలతో రాణించారు.భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీయగా.. మహ్మద్ షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ తీశారు. ఇక లక్ష్య ఛేదనలో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్లు- 119) సెంచరీతో చెలరేగి జట్టు విజయానికి బాటలు చేశాడు.మరో ఓపెనర్ శుబ్మన్ గిల్(60) అర్ధ శతకంతో రాణించగా.. శ్రేయస్ అయ్యర్(44), అక్షర్ పటేల్(41 నాటౌట్) లక్ష్యాన్ని పూర్తి చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. రో‘హిట్’ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఇక ఈ విజయంతో టీమిండియా ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంది. ఇరుజట్ల మధ్య బుధవారం నామమాత్రపు మూడో వన్డే జరుగుతుంది.చదవండి: SA T20: ఫైనల్లో సన్రైజర్స్ చిత్తు.. ఛాంపియన్స్గా ముంబై టీమ్What a way to get to the HUNDRED! 🤩A treat for the fans in Cuttack to witness Captain Rohit Sharma at his best 👌👌Follow The Match ▶️ https://t.co/NReW1eEQtF#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/oQIlX7fY1T— BCCI (@BCCI) February 9, 2025𝗔 𝘀𝘂𝗽𝗲𝗿 𝘀𝗵𝗼𝘄 𝘁𝗼 𝘀𝗲𝗮𝗹 𝗮 𝘄𝗶𝗻 𝗶𝗻 𝗖𝘂𝘁𝘁𝗮𝗰𝗸! ✅The Rohit Sharma-led #TeamIndia beat England by 4⃣ wickets in the 2nd ODI & take an unassailable lead in the ODI series! 👏 👏Scorecard ▶️ https://t.co/NReW1eEQtF#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/G63vdfozd5— BCCI (@BCCI) February 9, 2025 -
IND Vs ENG: రోహిత్ సూపర్ సెంచరీ..రెండో వన్డేలో ఇంగ్లండ్పై టీమిండియా గెలుపు (ఫొటోలు)
-
రో‘హిట్స్’... భారత్దే సిరీస్
చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత శిబిరానికి గొప్ప శుభవార్త! క్రికెట్ను శ్వాసించే అభిమానులకు కచ్చితంగా ఇది తీపి కబురు! ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ(Rohit Sharma) ఫామ్లోకి వచ్చాడు. అట్లాంటి... ఇట్లాంటి... ఆటతో కాదు. 300 పైచిలుకు పరుగుల వేటలో భారత్ ఉండగా... తనశైలి రో‘హిట్స్’తో అలరిస్తూ, లక్ష్యాన్ని కరిగిస్తూ, శతకంతో కదంతొక్కాడు. అతని జోరుకు మైదానం హోరెత్తింది. పెద్ద లక్ష్యమే అయినా చిన్నబోయింది. ఇంకో మ్యాచ్ ఉండగానే వన్డే సిరీస్ కూడా టీమిండియా వశమైంది.కటక్: భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) వరుసగా రెండు, మూడు మ్యాచ్లు విఫలమైనా... తక్కువ స్కోరుకు అవుటైనా... విమర్శకులు ఈ మధ్య నెట్టింట తెగ విరుచుకుపడుతున్నారు. ఆదివారం ‘హిట్మ్యాన్’ విరుచుకుపడ్డాడు. నోటితో కాదు... బ్యాట్తో! నెట్లో కాదు... మైదానంలో! అద్భుతమైన సెంచరీతో కొండంత లక్ష్యాన్ని టీమిండియా అలవోకగా ఛేదించేలా చేశాడు. దీంతో ఆఖరి పోరు మిగిలుండగానే వన్డే సిరీస్ కూడా భారత్ చేతికి చిక్కింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (56 బంతుల్లో 65; 10 ఫోర్లు), జో రూట్ (72 బంతుల్లో 69; 6 ఫోర్లు), లివింగ్స్టోన్ (32 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. బ్యాట్ గర్జిస్తున్న వేళ భారత బౌలర్లంతా పరుగులు సమరి్పంచుకుంటే... రవీంద్ర జడేజా (10–1–35–3) మాత్రం పూర్తి కోటా వేసి వికెట్లు తీసి పరుగుల వేగాన్ని అడ్డుకున్నాడు. అనంతరం కఠినమైన లక్ష్యమే అయినా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ రోహిత్ (90 బంతుల్లో 119; 12 ఫోర్లు, 7 సిక్స్లు) వీరోచిత శతకంతో భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ శుబ్మన్ గిల్ (52 బంతుల్లో 60; 9 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (47 బంతుల్లో 44; 3 ఫోర్లు, 1 సిక్స్) ఇద్దరూ కెపె్టన్తో కలిసి ఇన్నింగ్స్ను నడిపించారు. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ను 2–0తో దక్కించుకుంది. చివరిదైన మూడో వన్డే ఈనెల 12న అహ్మదాబాద్లో జరుగుతుంది. డకెట్, రూట్... ఫిఫ్టీ–ఫిఫ్టీ ఇంగ్లండ్ ఓపెనర్లు సాల్ట్ (26; 2 ఫోర్లు, 1 సిక్స్), డకెట్ దూకుడుగా ఆడి తొలి వికెట్కు 81 పరుగులు జోడించారు. డకెట్ 36 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. అతడు అవుటయ్యాక రూట్, హ్యారీ బ్రూక్ (31; 3 ఫోర్లు, 1సిక్స్) నింపాదిగా ఆడటంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఆద్యంతం సాఫీగా సాగిపోయింది. రూట్ 60 బంతుల్లో తన వన్డే కెరీర్లో 56వ అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అనంతరం కెపె్టన్ బట్లర్ (34; 2 ఫోర్లు), లివింగ్స్టోన్ (32 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్లు)లు సైతం పరుగులు సాధించడంతో ఇంగ్లండ్ 300 పైచిలుకు స్కోరు చేయగలిగింది. షమీ, రాణా, పాండ్యా, వరుణ్ తలా ఒక వికెట్ తీశారు. 76 బంతుల్లో శతకం ఎంతటి బ్యాటింగ్ పిచ్ అయినా... 305 పరుగుల లక్ష్యం వన్డేల్లో అంత ఈజీ కానేకాదు. చక్కని శుభారంభం... కడదాకా ఓర్పుగా, నేర్పుగా ఒక బ్యాటరైనా క్రీజులో నిలిస్తేనే గెలుపు ఆశలుంటాయి. సరిగ్గా నాయకుడు రోహిత్ కూడా ఇదే చేశాడు. ఓపెనింగ్లో గిల్తో జతగా మొదట లక్ష్యానికి అనువైన ఆరంభమిచ్చాడు. దీంతో 6.2 ఓవర్లలోనే భారత్ స్కోరు 50 దాటింది. భారీ షాట్లతో విరుచుకుపడిన ‘హిట్మ్యాన్’ 30 బంతుల్లో అర్ధసెంచరీ సాధించగా, గిల్ 45బంతుల్లో పూర్తి చేశాడు. ఇద్దరి పట్టుదలతో 14వ ఓవర్లోనే జట్టు 100కు చేరుకుంది. తర్వాత గిల్ ని్రష్కమించినా, కోహ్లి (5) విఫలమైనా ... ఆ ప్రభావం ఇన్నింగ్స్పై పడకుండా అయ్యర్తో కలిసి ధాటిని కొనసాగిస్తూ టీమిండియాను లక్ష్యంవైపు నడిపించాడు. ఈ క్రమంలో 76 బంతుల్లో సెంచరీ సాధించాక భారీ షాట్కు యతి్నంచి అవుటయ్యాడు. అప్పుడు జట్టు స్కోరు 29.4 ఓవర్లలో 220/3. ఇక గెలిచేందుకు 125 బంతుల్లో 85 చేస్తే చాలు. ఈ పనిలో అక్షర్ పటేల్ (43 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు) అజేయంగా భాగమవడంతో 33 బంతులు మిగిలుండగానే భారత్ మ్యాచ్ నెగ్గింది.ఫ్లడ్లైట్లు మొరాయించడంతో... బారాబతి స్టేడియంలోని ఫ్లడ్లైట్లు మొరాయించడంతో ఆటకు అరగంటకు పైగానే అంతరాయం ఏర్పడింది. డేనైట్ వన్డేలు, టి20ల కోసం మైదానం చుట్టూరా... ఎనిమిది చోట్ల ఫ్లడ్లైట్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఒకదాంట్లో సమస్య వచ్చింది. భారీ లక్ష్యఛేదనకు దిగిన భారత్ 6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ధనాధన్ వేగంతో 48 పరుగులు చేసింది. ఈ సమయంలో క్లాక్ టవర్ వద్ద వున్న ఫ్లడ్లైట్లు ఆగిపోయాయి. దీంతో 35 నిమిషాల పాటు మ్యాచ్ను నిలిపేసి లైట్లు వెలిగాకే తిరిగి మ్యాచ్ను నిర్వహించారు.స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) జడేజా (బి) వరుణ్ 26; డకెట్ (సి) పాండ్యా (బి) జడేజా 65; రూట్ (సి) కోహ్లి (బి) జడేజా 69; బ్రూక్ (సి) గిల్ (బి) రాణా 31; బట్లర్ (సి) గిల్ (బి) పాండ్యా 34; లివింగ్స్టోన్ (రనౌట్) 41; ఓవర్టన్ (సి) గిల్ (బి) జడేజా 6; అట్కిన్సన్ (సి) కోహ్లి (బి) షమీ 3; రషీద్ (రనౌట్) 14; మార్క్ వుడ్ (రనౌట్) 0; సఖిబ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 15; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 304. వికెట్ల పతనం: 1–81, 2–102, 3–168, 4–219, 5–248, 6–258, 7–272, 8–297, 9–304, 10–304. బౌలింగ్: షమీ 7.5–0–66–1, హర్షిత్ రాణా 9–0–62–1, పాండ్యా 7–0–53–1, వరుణ్ 10–0–54–1, జడేజా 10–1–35–3, అక్షర్ 6–0–32–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రషీద్ (బి) లివింగ్స్టోన్ 119; గిల్ (బి) ఓవర్టన్ 60; కోహ్లి (సి) సాల్ట్ (బి) రషీద్ 5; అయ్యర్ (రనౌట్) 44; అక్షర్ పటేల్ (నాటౌట్) 41; కేఎల్ రాహుల్ (సి) సాల్ట్ (బి) ఓవర్టన్ 10; పాండ్యా (సి) ఓవర్టన్ (బి) అట్కిన్సన్ 10; జడేజా (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 8; మొత్తం (44.3 ఓవర్లలో 6 వికెట్లకు) 308. వికెట్ల పతనం: 1–136, 2–150, 3–220, 4–258, 5–275, 6–286. బౌలింగ్: సఖిబ్ 6–0–36–0, అట్కిన్సన్ 7–0–65–1, మార్క్ వుడ్ 8–0–57–0, ఆదిల్ రషీద్ 10–0–78–1, ఓవర్టన్ 5–0– 27–2, లివింగ్స్టోన్ 7–0–29–1, రూట్ 1.3–0–15–0. -
IND Vs ENG: హిట్మ్యాన్ సూపర్ షో.. సిరీస్ టీమిండియా కైవసం
కటక్: ఇంగ్లండ్తో కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగి ఆడి జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. ఇంగ్లండ్ నిర్దేశించిన 305 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 44.3 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. రోహిత్ శర్మ వీరవిహారంతో టీమిండియా అవలీలగా విజయం సాధించింది. ఫలితంగా సిరీస్ను 2-0 తేడాతో ఇంకోమ్యాచ్ ఉండగానే కైవసం చేసుకుంది టీమిండియా.హిట్మ్యాన్ సూపర్ షో..చాలాకాలం తర్వాత బ్యాటింగ్లో చెలరేగిన రోహిత్.. సెంచరీతో మెరిశాడు. గత కొంతకాలంగా ఫామ్ కోసం తంటాలు పడుతున్న హిట్ మ్యాన్.. తిరిగి సత్తా చాటాడు. తనపై వరుసగా వస్తున్న విమర్శలకు బ్యాట్తోనే సమాదానం చెప్పాడు రోహిత్. 76 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్లతో తనదైన శైలిలో రెచ్చిపోయి శతకం పూర్తి చేసుకున్నాడు. సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేయడం విశిషం. ఇది రోహిత్కు 18 నెలల తర్వాత వన్డేల్లో తొలి సెంచరీ. 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్లతో 119 పరుగులు చేశాడు రోహిత్. ఇది రోహిత్కు 32వ వన్డే శతకం.కోహ్లి విఫలం..శుభ్మన్ గిల్(60; 52 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) తో కలిసి భారీ ాభాగస్వామ్యాన్ని నెలకొల్పాడు రోహిత్. ఈ జోడి తొలి వికెట్కు 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత గిల్ తొలి వికెట్గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో క్రీజ్లోకి వచ్చిన కోహ్లి(5) మరోసారి విఫలమయ్యాడు. 8 బంతుల్లో ఒక ఫోర్ కొట్టిన అనంతరం కోహ్లి ెపెవిలియన్ బాట పట్టాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్లో ాసాల్ట్ుకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు ివిరాట్.ఆకట్టుకున్న అయ్యర్కోహ్లి ఔటైన తర్వాత సెకండ్ డౌన్లోక్రీజ్లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఆకట్టుకున్నాడు. రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ను పరుగులు పెట్టించాడు. ఒకవైపు రోహిత్ దూకుడుగా ఆడుతుంటే అయ్యర్.. స్ట్రైక్రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్ను నడిపించాడు. ఈ జోడి 70 పరుగులు జోడించిన తర్వాత రోహిత్ మూడో వికెట్గా ఔటయ్యాడు.లివింగ్ స్టోన్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి రషీద్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో 220 పరుగుల వద్ద రోహిత్ రూపంలో టీమిండియా మూడో వికెట్ ను కోల్పోయింది. రోహిత్ ఔటైన స్వల్ప వ్యవధిలోనే అయ్యర్ సైతం పెవిలియన్ చేరాడు. 47 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 44 పరుగులు చేసిన అయ్యర్..రనౌట్ అయ్యాడు.నిరాశపరిచిన రాహుల్.. మెరిసిన అక్షర్ఫోర్త్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన కేఎల్ రాహుల్ మరోసారి నిరాశపరిచాడు. 14 బంతుల్లో 1 ఫోర్ సాయంతో 10 పరుగులు చేసిన రాహుల్.. జెమీ ఓవర్టాన్ బౌలింగ్ లో సాల్ట్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అక్షర్ పటేల్ మాత్రం బ్యాటింగ్ లో మెరిశాడు. ఆడపా దడపా షాట్లుకొడుతూ నిలకడగా బ్యాటింగ్ చేశాడు. 43 బంతుల్లో 4 ఫోర్లతో41 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు అక్షర్.అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్కు ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(26), బెన్ డకెట్(65)లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడి 81 పరుగులు జత చేసిన తర్వాత సాల్ట్ తొలి ివికెట్ గా పెవిలియన్ చేరాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి సాల్ట్ ఔటయ్యాడు. అనంతరం జో రూట్ తో కలిసి ఇన్నింగ్స్ను ముందకు తీసుకెళ్లాడు డకెట్. అయితే వీరి భాగస్వామ్యం ఎంతో సేపో నిలవలేదు. డకెట్ను రవీంద్ర జడేజా పెవిలియన్ కు పంపాడు.ఆపై బ్రూక్(31), జాస్ బట్లర్(34)లు కాస్త ఫర్వాలేదనిపించారు. జో రూట్ 72 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 69 పరుగులు చేసి ఇన్నింగ్స్,ను చక్కదిద్దాడు. ఆఖరి ఓవర్ వరకూ లివింగ్స్టోన్(41) ఉండటంతో ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, షమీ, హర్షిత్ రానా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది.నాగ్పూర్లో జరిగిన తొలి వన్డేలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసింది. ఇక నామమాత్రమైన మూడో వన్డే అహ్మదాబాద్లో బుధవారం జరుగనుంది. -
రెండో వన్డే: హిట్మ్యాన్ వీరవిహారం
కటక్: టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ వీరవిహారం చేశాడు. చాలాకాలం తర్వాత బ్యాటింగ్లో చెలరేగిన రోహిత్.. సెంచరీతో మెరిశాడు. గత కొంతకాలంగా ఫామ్ కోసం తంటాలు పడుతున్న హిట్ మ్యాన్.. తిరిగి సత్తా చాటాడు. తనపై వరుసగా వస్తున్న విమర్శలకు బ్యాట్తోనే సమాదానం చెప్పాడు రోహిత్. 76 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్లతో తనదైన శైలిలో రెచ్చిపోయి శతకం పూర్తి చేసుకున్నాడు. సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేయడం విశిషం. ఇది రోహిత్కు 18 నెలల తర్వాత వన్డేల్లో తొలిసారి సెంచరీ.కటక్లో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ నిర్దేశించిన 305 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో ఓపెనర్గా దిగిన రోహిత్,.. సొగసైన ఇన్నింగ్స్ ఆడాడు. శుభ్మన్ గిల్(60; 52 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ జోడి తొలి వికెట్కు 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత గిల్ తొలి వికెట్గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో క్రీజ్లోకి వచ్చిన కోహ్లి(5) మరోసారి విఫలమయ్యాడు. రోహిత్ సెంచరీ చేసే సమయానికి టీమిండియా ఇంకా 119 పరుగులు చేయాల్సింది ఉంది. రోహిత్కు జతగా శ్రేయస్ అయ్యార్ క్రీజ్లో ఉన్నాడు. ఇది రోహిత్కు 32వ వన్డే శతకం. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్కు ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(26), బెన్ డకెట్(65)లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడి 81 పరుగులు జత చేసిన తర్వాత సాల్ట్ తొలి ివికెట్ గా పెవిలియన్ చేరాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి సాల్ట్ ఔటయ్యాడు. అనంతరం జో రూట్ తో కలిసి ఇన్నింగ్స్ను ముందకు తీసుకెళ్లాడు డకెట్. అయితే వీరి భాగస్వామ్యం ఎంతో సేపో ినిలవలేదు. డకెట్ను రవీంద్ర జడేజా పెవిలియన్ కు పంపాడు.ఆపై బ్రూక్(31), జాస్ బట్లర్(34)లు కాస్త ఫర్వాలేదనిపించారు. జో రూట్ 72 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 69 పరుగులు చేసి ఇన్నింగ్స్,ను చక్కదిద్దాడు. ఆఖరి ఓవర్ వరకూ లివింగ్స్టోన్(41) ఉండటంతో ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, షమీ, హర్షిత్ రానా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది. -
ఇంగ్లండ్ రెండో వన్డే.. వరుణ్ చక్రవర్తి అరంగేట్రం! కోహ్లి వచ్చేశాడు
కటక్లోని బారాబతి స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్లు రెండో వన్డేలో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత తుది జట్టులో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి చోటు దక్కింది.తొలి వన్డేకు గాయం కారణంగా దూరమైన కోహ్లి.. పూర్తి ఫిట్నెస్ సాధించడంతో తిరిగి జట్టులోకి జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా ఈ మ్యాచ్తో వరుణ్ చక్రవర్తి భారత తరపున వన్డే అరంగేట్రం చేశాడు. టీ20ల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండడంతో వరుణ్కు వన్డేల్లో కూడా అవకాశం దక్కింది. కోహ్లి, వరుణ్ రాకతో జైశ్వాల్,కుల్దీప్ యాదవ్ బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది.మరోవైపు ఇంగ్లండ్ తమ జట్టులో మూడు మార్పులు చేసింది. గుస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, జేమీ ఓవర్టన్ తుది జట్టులోకి వచ్చారు. దీంతో జాకబ్ బెతల్, కార్స్, అర్చర్లకు ఇంగ్లండ్ మెనెజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది.తుది జట్లుఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవన్: బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జామీ ఓవర్టన్, గుస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తిచదవండి: SL vs AUS: చరిత్ర సృష్టించిన స్మిత్.. ప్రపంచంలో తొలి ప్లేయర్గా -
రోహిత్ ప్రాక్టీస్ ఆపేయ్.. ఫస్ట్ ఆ పనిచేయు: భారత మాజీ క్రికెటర్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) పేలవ ఫామ్తో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత రోహిత్ శర్మ ఆటతీరు పేలవంగా మారిపోయింది. టెస్టులు, వన్డేల్లో హిట్మ్యాన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో దారుణంగా విఫలమైన రోహిత్.. ఇప్పుడు ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో అదే తీరును కనబరుస్తున్నాడు.నాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఒకప్పుడు షార్ట్ పిచ్ బంతులను అలోవకగా సిక్సర్లగా మలిచిన రోహిత్.. ఇప్పుడు అదే బంతులకు ఔట్ అవుతుండడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రోహిత్ తన ఫామ్ను అందుకోవాలని సగటు భారత అభిమాని కోరుకుంటున్నాడు. ఈ క్రమంలో రోహిత్కు భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కీలక సూచనలు చేశాడు. రోహిత్ శర్మ తన రిథమ్ను తిరిగి పొందడానికి గతంలో తను ఆడిన వీడియోలు చూడాలని బంగర్ అభిప్రాయపడ్డాడు."రోహిత్ శర్మ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. తన కెరీర్లో పరుగులు చేయని దశను అనుభవిస్తున్నాడు. అయితే అతడు తన ఫామ్ను తిరిగి అందుకోవడానికి ఎక్కువగా నెట్స్లో శ్రమిస్తున్నాడు. కానీ కొన్నిసార్లు ఎక్కువగా సాధన చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. అతడు ఒంటరిగా ఉండి బ్యాటర్గా తన గత విజయాలను గుర్తు చేసుకోవాలి. గతంలో తన బ్యాటింగ్ చేసిన వీడియోలను చూడాలి. ప్రస్తుతం ఎక్కడ తప్పు జరుగుతుందో గుర్తించి సరిదిద్దుకోవాలి. కొన్ని సార్లు ఇలా చేయడం ఫలితాన్ని ఇస్తోంది. ఒక్కసారి రిథమ్ను అందుకొంటే చాలు. అంతేకానీ ఎక్కువగా ఆలోచించి నిరాశలో కూరుకుపోకూడదు" అని బంగర్ పేర్కొన్నాడు. కాగా కటక్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో వన్డే ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్లోనైనా రోహిత్ తన బ్యాట్కు పనిచేబుతాడో లేదో చూడాలి. కాగా ఈ మ్యాచ్కు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి అందుబాటులో ఉండనున్నాడు. గాయం కారణంగా తొలి వన్డేకు దూరమైన కోహ్లి.. ఇప్పుడు తన ఫిట్నెస్ను తిరిగిపొందాడు . ఈ విషయాన్ని భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ ధ్రువీకరించాడు. కింగ్ ఎంట్రీతో యశస్వి జైశ్వాల్పై వేటు పడే ఛాన్స్ ఉంది. రెండో వన్డేకు భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్చదవండి: SL vs AUS: సూపర్ మేన్ స్మిత్.. ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్! వీడియో వైరల్ -
నాయకుడే ఇలా ఉంటే ఎలా?: రోహిత్పై కపిల్ దేవ్ వ్యాఖ్యలు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) వరుస వైఫల్యాల నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్(Kapil Dev) కీలక వ్యాఖ్యలు చేశాడు. సారథి విఫలం కావడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నాడు. అదే విధంగా.. గెలిచినపుడు బ్రహ్మరథం పట్టినవాళ్లు ఓడినపుడు అదే స్థాయిలో విమర్శిస్తారని ఆటగాళ్లకు గుర్తు చేశాడు. విజయగర్వం తలకెక్కితే అడుగులు తడబడతాయని.. అందుకే ఆటగాళ్లను ఎవరూ అతిగా ప్రశంసించవద్దని సూచించాడు.దారుణ వైఫల్యాలుఅంతర్జాతీయ క్రికెట్లో ఫార్మాట్లకు అతీతంగా గత పది ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ సాధించిన స్కోర్లు వరుసగా... 2, 3, 9, 10, 3, 6, 18, 11, 0, 8. ఇటీవల ఇంగ్లండ్(India vs England)తో తొలి వన్డేలోనూ ‘హిట్మ్యాన్’ దారుణంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్లో ఏడు బంతులు ఎదుర్కొన్న రోహిత్.. రెండు పరుగులే చేసి అవుటయ్యాడు. పేసర్ సకీబ్ మహమూద్ బౌలింగ్లో లియామ్ లివింగ్స్టోన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.అయితే, నాగ్పూర్ వేదికగా గురువారం జరిగిన ఈ వన్డేలో వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్(96 బంతుల్లో 87), శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 52), అక్షర్ పటేల్(47 బంతుల్లో 52) అద్భుత అర్ధ శతకాలతో రాణించారు. తద్వారా ఇంగ్లండ్పై టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఒకవేళ ఫలితం వేరుగా ఉంటే.. రోహిత్ శర్మపై విమర్శలు మరింత పదునెక్కేవి.నేరుగా చాంపియన్స్ ట్రోఫీ-2025లోఇక ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ తర్వాత టీమిండియా నేరుగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో అడుగుపెడుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు. క్రికెట్ అడ్డా యూట్యూబ్ చానెల్తో మాట్లాడుతూ.. ‘‘రోహిత్ బిగ్ ప్లేయర్. అతడు త్వరలోనే ఫామ్లోకి వస్తాడని ఆశిస్తున్నా.అదే విధంగా కోచ్ గౌతం గంభీర్కు కూడా గుడ్లక్ చెబుతున్నా. ఎవరికైనా ఒక పనిలో కుదురుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఇక ఇప్పుడు దేశం మొత్తం భారత క్రికెట్ జట్టు ప్రదర్శనలపై మరింత దృష్టి సారించింది. ఇటీవలి కాలంలో టీమిండియా ఒడిదొడుకులు ఎదుర్కొంది.సారథి ఇలా ఉంటే.. సమస్యలు తప్పవుఅయితే, సొంతగడ్డపై మెరుగ్గానే రాణించింది. అయినప్పటికీ స్థూలంగా ఇటీవల వైఫల్యాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ ఫామ్లేమి ఆందోళనకు గురిచేస్తోంది. సారథి ఇలా ఉంటే.. జట్టుపై ప్రభావం పడుతుంది. సమస్యలు తప్పవు’’ అని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.ఇక టీమిండియాపై అభిమానుల ఆగ్రహం గురించి ప్రస్తావన రాగా.. ‘‘జట్టు గత కొంతకాలంగా పేలవ ప్రదర్శన(టెస్టుల్లో) కనబరిచింది. అభిమానులకు కోపం రావడంలో తప్పులేదు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత మన ఆటగాళ్లకు ఎంతటి ఘన స్వాగతం లభించిందో గుర్తుంది కదా!పొగిడినవాళ్లు.. తిడతారు కూడానేనైతే నా జీవితంలో మునుపెన్నడూ అలాంటి దృశ్యాలు చూడలేదు. కాబట్టి మనవాళ్ల ప్రదర్శన బాగా లేనప్పుడు కచ్చితంగా విమర్శలు వస్తాయి. అందుకే ఆటగాళ్లకు అతిగా పొగడవద్దని నేను ఎప్పుడూ చెబుతూ ఉంటా. దాని ద్వారా వచ్చే ఒత్తిడిని తట్టుకోవడం అంత సులువేమీ కాదు. ఒకవేళ జట్టు, ఆటగాళ్ల ప్రదర్శనను విశ్లేషించాలన్న సద్విమర్శలు మాత్రమే చేయాలనేది నా అభిప్రాయం’’ అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు.చదవండి: Indv vs Eng: సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్ -
BCCI: రోహిత్ సేనకు ప్రత్యేకమైన వజ్రపు ఉంగరాలు.. వీడియో చూశారా?
టీమిండియా ఆటగాళ్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) అరుదైన కానుకలు అందించింది. టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)లో విజేతగా నిలిచిన భారత జట్టులోని సభ్యులకు వజ్రపుటుంగరాలు ప్రదానం చేసింది. ఉంగరాల పైభాగంలో అశోక్ చక్ర గుర్తుతో పాటు.. సైడ్లో ఆటగాళ్ల జెర్సీ నంబర్ వచ్చేలా ప్రత్యేకంగా వీటిని తీర్చిదిద్దారు.ఈసారి ప్రత్యేకమైన కానుకలుఅంతేకాదు.. ఈ మెగా టోర్నీలో ఆఖరి వరకు అజేయంగా నిలిచిన జట్టు జైత్రయాత్రకు గుర్తుగా విజయాల సంఖ్యను కూడా ఈ డిజైన్లో చేర్చారు. ఇటీవల నమన్ అవార్డుల వేడుక సందర్భంగా రోహిత్ సేన(Rohit Sharma&Co)కు ఈ వజ్రపు ఉంగరాలను బోర్డు ఆటగాళ్లకు అందజేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్గా మారింది.‘‘టీ20 ప్రపంచకప్లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా ఆటగాళ్లను చాంపియన్స్ రింగ్తో సత్కరిస్తున్నాం. వజ్రాలు శాశ్వతమే కావచ్చు. అయితే, కోట్లాది మంది హృదయాల్లో వీరు సంపాదించిన స్థానం మాత్రం ఎన్నటికీ చెక్కుచెదరదు. అలాగే ఈ ఉంగరం కూడా అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది’’ అని బీసీసీఐ పేర్కొంది.కాగా అమెరికా- వెస్టిండీస్ వేదికలుగా గతేడాది పొట్టి ప్రపంచకప్ టోర్నీ జరిగిన విషయం తెలిసిందే. లీగ్ దశలో ప్రతి మ్యాచ్ గెలిచిన రోహిత్ సేన.. సౌతాఫ్రికాతో ఫైనల్లోనూ జయభేరి మోగించింది. ఆఖరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి.. ట్రోఫీని దక్కించుకుంది.ఓవరాల్గా ఐదోసారితద్వారా దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత మరోసారి టీమిండియా ఖాతాలో ఐసీసీ టైటిల్ చేరింది. అదే విధంగా.. ఓవరాల్గా ఐదో ట్రోఫీ భారత్ కైవసమైంది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో తొట్టతొలి ప్రపంచకప్(వన్డే) గెలిచిన టీమిండియా.. 2007లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో టీ20 ప్రపంచకప్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ ధోని నాయకత్వంలోనే 2011 వన్డే వరల్డ్కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీని భారత్ దక్కించుకుంది. ఇక గతేడాది రోహిత్ శర్మ కూడా ఈ ఐసీసీ విన్నింగ్ కెప్టెన్ల జాబితాలో చేరిపోయాడు.ఇక టీ20 ప్రపంచకప్-2024లో గెలిచిన అనంతరం బీసీసీఐ రోహిత్ సేనకు అత్యంత భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. కళ్లు చెదిరే రీతిలో ఏకంగా రూ. 125 కోట్ల క్యాష్ ప్రైజ్ను కానుకగా ఇచ్చింది. నాడు ఇలా ఆటగాళ్లపై కనకవర్షం కురిపించిన బోర్డు.. తాజాగా వజ్రపు ఉంగరాలతో మరోసారి ఘనంగా సత్కరించింది.టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టులోని సభ్యులురోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చహల్, సంజు శాంసన్, మహ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్.చదవండి: సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్Presenting #TeamIndia with their CHAMPIONS RING to honour their flawless campaign in the #T20WorldCup 🏆Diamonds may be forever, but this win certainly is immortalised in a billion hearts. These memories will 'Ring' loud and live with us forever ✨#NamanAwards pic.twitter.com/SKK9gkq4JR— BCCI (@BCCI) February 7, 2025 -
హిట్ మ్యాన్ కాదు.. మ్యాగీమ్యాన్
-
Ind vs Eng: ‘రోహిత్ కెప్టెన్సీలో ఆ ఇద్దరు కలిసి ఆడటం ఆశ్చర్యమే’
ఇంగ్లండ్తో వన్డే సిరీస్ను టీమిండియా(India vs England) విజయంతో ఆరంభించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో నాగ్పూర్ వేదికగా పర్యాటక జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఈ మ్యాచ్లో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా(Ravindra Jadeja), అక్షర్ పటేల్(Axar Patel).. ఇద్దరూ అదరగొట్టడం విశేషం.ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇలా జడ్డూ, అక్షర్ కలిసి ఆడతారని తాను అస్సలు ఊహించలేదన్నాడు. ఏదేమైనా ఈ మ్యాచ్లో ఇద్దరు రాణించడం శుభసూచకమని.. అయితే అక్షర్ కంటే జడ్డూ మెరుగ్గా బౌలింగ్ చేశాడని కితాబిచ్చాడు.జడ్డూ, అక్షర్.. ఒకరు బౌలింగ్లో.. ఒకరు బ్యాటింగ్లోకాగా ఇంగ్లండ్తో తొలి వన్డేలో లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలక వికెట్లు తీశాడు. తొమ్మిది ఓవర్ల బౌలింగ్లో కేవలం 26 పరుగులే ఇచ్చి స్టార్ బ్యాటర్లు జో రూట్(19), జొకొబ్ బెతెల్(51) వికెట్లతో పాటు.. టెయిలెండర్ ఆదిల్ రషీద్(8)ను అవుట్ చేశాడు.ఇక లక్ష్య ఛేదనలో భాగంగా జడేజాకు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. మొత్తంగా 10 బంతులు ఎదుర్కొని 12 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు.. జోస్ బట్లర్ (52) రూపంలో బిగ్ వికెట్ దక్కించుకున్న మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్.. బ్యాటర్గానూ దుమ్ములేపాడు.ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అక్షర్ పటేల్ 47 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్సాయంతో 52 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా వీరిద్దరి గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘ఈ మ్యాచ్ సందర్భంగా రవీంద్ర జడేజా అంతర్జాతీయ క్రికెట్లో 6000 పరుగులు పూర్తి చేసుకోవడంతో 600 వికెట్ల క్లబ్లో చేరాడు.రోహిత్ కెప్టెన్సీలో ఆ ఇద్దరు కలిసి ఆడతారని అస్సలు అనుకోలేదుతద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి స్పిన్నర్గా రికార్డు సాధించాడు. అంతకు ముందు ఫాస్ట్బౌలర్ కపిల్ పాజీ ఈ ఫీట్ అందుకున్నాడు. నిజానికి ఈ మ్యాచ్లో అతడికి ఆడే అవకాశం వస్తుందా లేదా అన్న సందేహం ఉండేది. ఎందుకంటే.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో అతడు పదిహేనవ ఆటగాడిగా ఉన్నాడు.నిజానికి ఇద్దరు లెఫ్టార్మ్ స్పిన్నర్లను ఒకే మ్యాచ్లో ఆడించరనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇలాంటిది జరుగుతుందని నేను అనుకోలేదు. కానీ ఈరోజు(గురువారం) ఇది జరిగింది.ఈ మ్యాచ్లో జడ్డూ అక్షర్ కంటే మెరుగ్గా బౌలింగ్ చేశాడు. అక్షర్కు బ్యాటింగ్కు చేసే అవకాశం వచ్చింది. ఇకపై జడ్డూ బౌలింగ్ ఆల్రౌండర్.. అక్షర్ బ్యాటింగ్ ఆల్రౌండర్గా మీకు(మేనేజ్మెంట్) ఉపయోగపడతాడు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి వన్డే స్కోర్లు👉వేదిక: విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగ్పూర్👉టాస్: ఇంగ్లండ్.. బ్యాటింగ్👉ఇంగ్లండ్ స్కోరు: 248 (47.4)👉భారత్ స్కోరు: 251/6 (38.4)👉ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై భారత్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శుబ్మన్ గిల్(96 బంతుల్లో 87 పరుగులు).చదవండి: సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్ -
శుబ్మన్ గిల్ కాదు.. ఫ్యూచర్ టీమిండియా కెప్టెన్ అతడే?!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం భారత క్రికెట్ జట్టు తమ సన్నాహాకాలను ప్రారంభించింది. ఈ మెగా టోర్నీ ప్రిపేరేషన్లో భాగంగా టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్లో తలపడుతోంది. ఇప్పటికే తొలి వన్డేలో పర్యాటక ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్.. మిగిలిన రెండు వన్డేలకు సిద్దమవుతోంది.ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఫిబ్రవరి 15న రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యంలోని భారత జట్టు దుబాయ్ పయనం కానుంది. ఈ మెగా టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తలపడనుంది. ఈ మ్యాచ్ కంటే ముందు టీమిండియా.. యూఏఈ లేదా బంగ్లాదేశ్తో వామాప్ మ్యాచ్ ఆడనుంది. కాగా ఈ మెగా ఈవెంట్ కోసం 15 మంది సభ్యులతో కూడిన పటిష్టమైన జట్టును అజిత్ అగర్కార్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అయితే వెన్ను గాయంతో బాధపడుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటుపై మాత్రం ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది.కెప్టెన్గా హార్దిక్..!ఇక ఇది ఇలా ఉండగా.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడంలో భారత్ విఫలమైతే రోహిత్ శర్మ స్ధానంలో వన్డే కెప్టెన్గా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం వన్డేల్లో రోహిత్ శర్మ డిప్యూటీగా స్టార్ ప్లేయర్ శుబ్మన్ గిల్(Shubman Gill) ఉన్నాడు. అయితే గిల్ను వైస్ కెప్టెన్గానే కొనసాగించి జట్టు పగ్గాలను మాత్రం హార్దిక్కు అప్పగించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. కాగా గతేడాది వరకు టీ20ల్లో టీమిండియా వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా కొనసాగాడు.రోహిత్ శర్మ గైర్హజారీలో చాలా మ్యాచ్ల్లో భారత కెప్టెన్గా పాండ్యా వ్యవహరించాడు. టీ20 వరల్డ్కప్-2024లో కూడా రోహిత్ శర్మ డిప్యూటీగా ఈ బరోడా ఆల్రౌండర్ ఉన్నాడు. కానీ రోహిత్ శర్మ రిటైరయ్యాక భారత టీ20 కెప్టెన్గా హార్దిక్ను కాదని సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేసి సెలక్షన్ కమిటీ అందరికి షాకిచ్చింది. అయితే సూర్య కెప్టెన్గా రాణిస్తున్నప్పటికి వ్యక్తిగత ప్రదర్శన పరంగా మాత్రం విఫలమవుతున్నాడు.రోహిత్ రిటైర్మెంట్..!కాగా ఈ మెగా టోర్నీ అనంతరం రోహిత్ శర్మ కూడా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ వార్తలపై రోహిత్ శర్మ మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇంగ్లండ్తో తొలి వన్డేకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో రోహిత్కు ఇదే ప్రశ్న ఎదురైంది. "నా ప్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడటానికి ఇది సందర్భం కాదు. ప్రస్తుతం నా దృష్టి అంతా ఇంగ్లండ్ సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ పైనే ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం" అంటూ హిట్మ్యాన్ బదులిచ్చాడు. దీంతో రిటైర్మెంట్ పై క్లారిటీ ఇవ్వకుండా దాటవేసేలా రోహిత్ మాట్లాడటం అనేక అనుమానాలకు తావిస్తోంది. రోహిత్ భవితవ్యం తేలాలంటే మరో నెల రోజులు అగాల్సిందే.చదవండి: IND vs ENG: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు.. -
తుదిజట్టులో నాకసలు స్థానమే లేదు.. రోహిత్ కాల్ తర్వాత..: శ్రేయస్ అయ్యర్
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) పునరాగమనంలో అదరగొట్టాడు. దేశవాళీ క్రికెట్లో అదరగొట్టిన ఈ ముంబైకర్.. ఇంగ్లండ్(India vs England)తో తొలి వన్డేలోనూ అదే ఫామ్ను కొనసాగించాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ మెరుపు అర్ధ శతకంతో రాణించి భారత్ గెలుపొందడంలో తన వంతు పాత్ర పోషించాడు.అయ్యర్ షాకింగ్ కామెంట్స్ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్పై ప్రశంసల వర్షం కురుస్తుండగా.. విజయానంతరం అతడొక షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. నాగ్పూర్ వన్డే తుదిజట్టులో తనకు తొలుత అసలు స్థానమే లేదని చెప్పాడు. అయితే, ఆఖరి నిమిషంలో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) నుంచి ఫోన్ కాల్ వచ్చిందని.. అప్పటికప్పుడు మ్యాచ్ కోసం తనను తాను మానసికంగా సన్నద్ధం చేసుకున్నట్లు తెలిపాడు.ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘ఇదొక సరదా ఘటన. గత రాత్రి నేను సినిమా చూస్తూ సమయం గడిపేద్దామని అనుకున్న. అయితే, అంతలోనే అకస్మాత్తుగా కెప్టెన్ నుంచి కాల్ వచ్చింది. విరాట్ మోకాలు ఉబ్బిపోయింది కాబట్టి.. నీకు ఆడే అవకాశం రావొచ్చు అని మా కెప్టెన్ చెప్పాడు.తుదిజట్టులో నాకసలు స్థానమే లేదువెంటనే నా గదికి పరిగెత్తుకుని వెళ్లాను. మరో ఆలోచన లేకుండా నిద్రకు ఉపక్రమించాను. ఆ క్షణంలో ఆ ఆనందాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో కూడా నాకు తెలియలేదు. నిజానికి తొలి వన్డేలో మొదట నాకు ఆడే అవకాశం రాలేదు.దురదృష్టవశాత్తూ విరాట్ గామపడటం వల్ల నన్ను పిలిచారు. అయితే, ఏదో ఒక సమయంలో కచ్చితంగా నాకు అవకాశం వస్తుందనే ఉద్దేశంతో నన్ను నేను సన్నద్ధం చేసుకుంటూనే ఉన్నాను. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. గతంలో ఓసారి ఆసియా కప్ సమయంలో నేను గాయపడినపుడు నా స్థానంలో వేరొకరు వచ్చి శతకం బాదారు’’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.అదే నాకు ఉపయోగపడిందిఇక దేశవాళీ క్రికెట్ ఆడటం వల్ల ప్రయోజనాలను వివరిస్తూ.. ‘‘గతేడాది డొమెస్టిక్ సీజన్ను నేను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నా. ఇన్నింగ్స్ ఎలా నిర్మించాలన్న అంశం గురించి నేను మరిన్ని పాఠాలు నేర్చుకునే వీలు కలిగింది. కాలానుగుణంగా నా ఆటకు మెరుగులు దిద్దుకున్నా. నైపుణ్యాలకు పదును పెట్టుకున్నాను.ప్రతి విషయంలోనూ పరిపూర్ణత సాధించేందుకు కృషి చేశా. ముఖ్యంగా ఫిట్నెస్పై కూడా మరింత దృష్టి సారించాను. అదే నాకు ఇప్పుడిలా ఉపయోగపడింది’’ అని శ్రేయస్ అయ్యర్ సంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా ముంబై తరఫున రంజీల్లో తాజా సీజన్లో అయ్యర్ ఓ ద్విశతకం బాదాడు. అంతేకాదు.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్గా ముంబైకి టైటిల్ అందించాడు.నాలుగు వికెట్ల తేడాతో రోహిత్ సేన విజయంఇక భారత్- ఇంగ్లండ్ వన్డే విషయానికొస్తే.. నాగ్పూర్లో గురువారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బట్లర్ బృందం తొలుత బ్యాటింగ్ చేసింది. ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించినా.. భారత బౌలర్ల మెరుగైన ప్రదర్శన కారణంగా 47.4 ఓవర్లలో 248 పరుగులు చేసి ఆలౌట్ అయింది.లక్ష్య ఛేదనలో టీమిండియా పందొమ్మిది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న వేళ వన్డౌన్ బ్యాటర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ శుబ్మన్ గిల్(96 బంతుల్లో 87), నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 59), ఆల్రౌండర్ అక్షర్ పటేల్(47 బంతుల్లో 52) ధనాధన్ దంచికొట్టారు. ఫలితంగా 38.4 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి భారత్ టార్గెట్ను పూర్తి చేసింది.చదవండి: IND vs ENG: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డుSHREYAS on F-IYER! 🔥@ShreyasIyer15 shifts gears by taking on Jofra Archer for back-to-back sixes! 💪Start watching FREE on Disney+ Hotstar#INDvENGOnJioStar 1st ODI 👉 LIVE NOW on Disney+ Hotstar, Star Sports 2, Star Sports 3, Sports 18-1 & Colors Cineplex! pic.twitter.com/HrQ3WLGuPe— Star Sports (@StarSportsIndia) February 6, 2025 -
చాలా సంతోషంగా ఉంది.. వారి వల్లే గెలిచాము: రోహిత్ శర్మ
ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా(Teamindia) అద్భుతమైన విజయంతో ఆరంభించింది. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్(England)ను భారత్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్(67 బంతుల్లో 4 ఫోర్లతో 52), జాకోబ్ బెతెల్(64 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 51) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలా మూడు వికెట్లు పడగొట్టగా.. మహమ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ సాధించారు.గిల్, అయ్యర్ మెరుపులు..అనంతరం 249 పరుగుల లక్ష్యాన్ని భారత్ 6 వికెట్లు కోల్పోయి కేవలం 38.4 ఓవర్లలోనే అందుకుంది. భారత బ్యాటర్లలో భ్మన్ గిల్(96 బంతుల్లో 14 ఫోర్లతో 87 ), అక్షర్ పటేల్(47 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 52 ) శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 59) హాఫ్ సెంచరీలతో రాణించారు.ఆదిలోనే కెప్టెన్ రోహిత్ శర్మ(2),యశస్వి జైస్వాల్(15) వికెట్లను భారత్ కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన అయ్యర్.. ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. గిల్ ఓవైపు ఆచితూచి ఆడినప్పటికి.. అయ్యర్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. శ్రేయస్ ఔటైన తర్వాత గిల్ కూడా తన బ్యాట్కు పనిచెప్పాడు. అతడితో పాటు బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చిన అక్షర్ పటేల్ సైతం దూకుడుగా ఆడాడు. ఆఖరిలో రవీంద్ర జడేజా(12),హార్దిక్ పాండ్యా(9) ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) స్పందించాడు. ఈ మ్యాచ్లో తమ కుర్రాళ్ల ప్రదర్శనపై హిట్మ్యాన్ సంతోషం వ్యక్తం చేశాడు."తొలి మ్యాచ్లోనే విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత మేము ఈ ఫార్మాట్లో ఆడాము. వీలైనంత త్వరగా తిరిగి రీగ్రూప్ అయ్యి విజయం కోసం ఏమి చేయాలన్నదానిపై దృష్టి పెట్టాలనుకున్నాము. మా అంచనాలకు తగ్గట్టుగానే ఈ మ్యాచ్లో మేము రాణించాము. అయితే ఇంగ్లండ్ ఓపెనర్లు ఆరంభంలో దూకుడుగా ఆడి మాపై ఒత్తిడి పెంచారు. కానీ మా బౌలర్లు అద్బుతమైన కమ్బ్యాక్ ఇచ్చారు. ఇది సుదీర్ఘమైన ఫార్మాట్. ఈ ఫార్మాట్లో తిరిగి పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతీ మ్యాచ్లోనూ మలుపులు ఉంటాయి. అంతేతప్ప మ్యాచ్ మన చేతి నుంచి చేజారిపోయిందని కాదు. తిరిగి కమ్బ్యాక్ ఇచ్చే స్కిల్స్ మన వద్ద ఉండాలి. ఈ క్రెడిట్ మొత్తం మా బౌలర్లకే దక్కుతుంది. నిజంగా వారి వల్లే తిరిగి గేమ్లోకి వచ్చాము. మిడిలార్డర్లో లెఫ్ట్ హ్యాండర్ ఉండాలని భావించాము. అందుకే అక్షర్ పటేల్కు తుది జట్టులో ఛాన్స్ ఇచ్చాము.అక్షర్ పటేల్ బ్యాట్తో ఏమి చేయగలడో మనందరికి తెలిసిందే. అతడు తానెంటో మరోసారి నిరూపించాడు. శ్రేయస్ అయ్యర్ సైతం అద్భుతంగా ఆడాడు. గిల్, అయ్యర్ నెలకొల్పిన భాగస్వామ్యం చాలా కీలకంగా మారింది. ఛాపింయన్స్ ట్రోఫీ ముందు మాకు ఎటువంటి ప్రత్యేక ప్రణాళికలు లేవు. అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించి ముందుకు వెళ్లాలి అనుకుంటున్నామని" పోస్ట్ మ్యాచ్ప్రెజెంటేషన్లో రోహిత్ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన హర్షిత్ రాణా.. తొలి భారత ప్లేయర్గా -
IND VS ENG 1st ODI: కొనసాగుతున్న రోహిత్ వైఫల్యాల పరంపర
అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా కెప్టెన్ రోహిత శర్మ (Rohit Sharma) వైఫల్యాల పరంపర కొనసాగుతుంది. కొద్ది రోజుల కిందటి వరకు టెస్ట్లకే పరిమితమైన రోహిత్ బ్యాడ్ ఫామ్.. ఇప్పుడు వన్డేలకు కూడా పాకింది. ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో రోహిత్ కేవలం 2 పరుగులకే ఔటయ్యాడు. భారీ అంచనాల నడుమ ఈ మ్యాచ్ బరిలోకి దిగిన రోహిత్ చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. ఈ మ్యాచ్లో తొలి బంతి నుంచే రోహిత్ కాన్ఫిడెంట్గా కనిపించలేదు. ఇంగ్లండ్ పేసర్లు జోఫ్రా ఆర్చర్, సాకిబ్ మహమూద్లను ఎదుర్కొనేందుకు హిట్మ్యాన్ చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తం 7 బంతులు ఎదుర్కొన్న రోహిత్ సాకిబ్ మహమూద్ బౌలింగ్లో లివింగ్స్టోన్కు సునాయాసమైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అత్యంత చెత్తగా ఔటైన అనంతరం రోహిత్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నీ పని అయిపోయింది పో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్కు ముందు రోహిత్ రంజీల్లో ఆడి, అక్కడా మర్యాద పోగొట్టుకున్నాడు. పసికూన జమ్మూ అండ్ కశ్మీర్తో జరిగిన మ్యాచ్లో వరుసగా 3, 28 పరుగులకు ఔటయ్యాడు. అంతకుముందు జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ వైఫల్యాలు పతాక స్థాయికి చేరాయి. ఆ సిరీస్లో మూడు మ్యాచ్లు ఆడిన రోహిత్ కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. ఆ సిరీస్లో ఫామ్తో తెగ ఇబ్బంది పడిన రోహిత్ చివరి టెస్ట్ నుంచి స్వతాహాగా తప్పుకున్నాడు. 2024-25 సీజన్లో మూడు ఫార్మాట్లలో రోహిత్ ప్రదర్శనలు పరిశీలిస్తే దారుణంగా ఉన్నాయి. గత 16 ఇన్నింగ్స్లలో రోహిత్ కేవలం ఒకే అర్ద సెంచరీ చేశాడు. అతను బ్యాటింగ్ సగటు కేవలం 10.37గా ఉంది. గత ఏడాదంతా కలుపుకుని రోహిత్ కేవలం 166 పరుగులే చేశాడు.2024-25లో మూడు ఫార్మాట్లలో రోహిత్ ప్రదర్శనలు ఇలా ఉన్నాయి..652382520818113610392 (నేటి మ్యాచ్)టెస్ట్లతో పోలిస్తే వన్డేల్లో పర్వాలేదనిపించే రోహిత్.. ఇక్కడ కూడా విఫలం కావడంతో అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజంగానే తమ ఆరాధ్య ఆటగాడి పని అయిపోయిందా అనుకుంటూ మదనపడుతున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో 248 పరుగులకే ఆలౌటైంది. రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ను చావుదెబ్బ కొట్టారు. షమీ, అక్షర్, కుల్దీప్ తలో వికెట్ తీశారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (52), జేకబ్ బేతెల్ (51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఓపెనర్లు బెన్ డకెట్ (32), ఫిలిప్ సాల్ట్ (43) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రూట్ 19, బ్రూక్ 0, లివింగ్స్టోన్ 5, కార్స్ 10, ఆదిల్ రషీద్ 8, సాకిబ్ మహమూద్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం 249 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ (15) త్వరగా ఔటైనా.. శ్రేయస్ అయ్యర్ (59) మెరుపు ఇన్నింగ్స్తో భారత ఇన్నింగ్స్కు గట్టి పునాది వేశాడు. శుభ్మన్ గిల్ (35), అక్షర్ పటేల్ (18) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే మరో 111 పరుగులు చేయాలి. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, జడేజా ఇంకా బ్యాటింగ్కు రావాల్సి ఉంది. -
ఇంగ్లండ్తో తొలి వన్డే.. టీమిండియా ఘన విజయం
ఇంగ్లండ్తో తొలి వన్డే.. టీమిండియా ఘన విజయంనాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ 38.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిడిలార్డర్ బ్యాటర్లు శుభ్మన్ గిల్ (87), శ్రేయస్ అయ్యర్ (59), అక్షర్ పటేల్ (52) అర్ద సెంచరీలు సాధించి టీమిండియాను గెలిపించారు.ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. అక్షర్ ఔట్లక్ష్యానికి 28 పరుగుల దూరంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ అనంతరం ఆదిల్ రషీద్ బౌలింగ్లో అక్షర్ పటేల్ (52) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్.. లక్ష్యానికి 85 పరుగుల దూరంలో భారత్ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ 60 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే మరో 85 పరుగులు చేయాలి. గిల్తో పాటు అక్షర్ (29) క్రీజ్లో ఉన్నాడు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. శ్రేయస్ ఔట్మంచి టచ్లో కనిపించిన శ్రేయస్ అయ్యర్ 59 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జేకబ్ బేతెల్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 16 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 113/3గా ఉంది. గిల్కు (28) జతగా అక్షర్ పటేల్ క్రీజ్లోకి వచ్చాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయస్ఈ మ్యాచ్లో శ్రేయస్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బేకబ్ బేతెల్ బౌలింగ్లో బౌండరీ బాది ఈ మైలురాయిని చేరుకున్నాడు. శ్రేయస్ ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. 14 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 101/2గా ఉంది. శ్రేయస్తో పాటు శుభ్మన్ గిల్ (18) క్రీజ్లో ఉన్నాడు.వరుసగా రెండు సిక్సర్లు బాదిన శ్రేయస్నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన శ్రేయస్ అయ్యర్.. జోఫ్రా ఆర్చర్ వేసిన ఏడో ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. 7 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 43/2గా ఉంది. శ్రేయస్ (18), శుభ్మన్ గిల్ (1) క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. రోహిత్ ఔట్రోహిత్ వైఫల్యాల పరంపర వన్డేల్లోనూ కొనసాగుతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమైన రోహిత్.. ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలోనూ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో 7 బంతులు ఎదుర్కొన్న రోహిత్ చెత్త షాట్ ఆడి కేవలం 2 పరుగులకే ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన భారత్249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 19 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయింది. అరంగేట్రం ఆటగాడు యశస్వి జైస్వాల్ 15 పరుగులు చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ఫిలిప్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.రెచ్చిపోయిన టీమిండియా బౌలర్లు.. 248 పరుగులకే ఆలౌటైన ఇంగ్లండ్ నాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ను 248 పరుగులకే ఆలౌట్ చేశారు. రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ను చావుదెబ్బ కొట్టగా.. షమీ, అక్షర్, కుల్దీప్ తలో వికెట్ తీశారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (52), జేకబ్ బేతెల్ (51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఓపెనర్లు బెన్ డకెట్ (32), ఫిలిప్ సాల్ట్ (43) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రూట్ 19, బ్రూక్ 0, లివింగ్స్టోన్ 5, కార్స్ 10, ఆదిల్ రషీద్ 8, సాకిబ్ మహమూద్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్241 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్లో ఆదిల్ రషీద్ (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆరో వికెట్ డౌన్.. లివింగ్స్టోన్ ఔట్183 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్లో వికెట్కీపర్ కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి లివింగ్స్టోన్ (5) ఔటయ్యాడు. హర్షిత్ రాణాకు ఇది మూడో వికెట్. ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. బట్లర్ ఔట్170 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి జోస్ బట్లర్ (52) ఔటయ్యాడు. 33 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 170/5గా ఉంది. జేకబ్ బేతెల్ (22), లివింగ్స్టోన్ క్రీజ్లో ఉన్నారు. 30 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 162/430 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 162/4గా ఉంది. జేకబ్ బేతెల్ (18), జోస్ బట్లర్ (48) క్రీజ్లో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. రూట్ ఔట్111 పరుగుల వద్ద ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్లో జో రూట్ (19) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన రాణాఅరంగ్రేటం పేసర్ హర్షిత్ రాణా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్ను దెబ్బేశాడు. 10వ ఓవర్ మూడో బంతికి డకెట్ను (32) ఔట్ చేసిన రాణా.. అదే ఓవర్ చివరి బంతికి హ్యారీ బ్రూక్ను డకౌట్ చేశాడు. 10 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 77/3గా ఉంది. జో రూట్ (1), జోస్ బట్లర్ క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. సాల్ట్ రనౌట్ఇంగ్లండ్ జట్టు 75 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ప్రమాదకరంగా కనిపించిన సాల్ట్ (26 బంతుల్లో 43; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) లేని మూడో పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు.రాణా బౌలింగ్లో చితక్కొట్టిన సాల్ట్ఆరో ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. హర్షిత్ రాణా బౌలింగ్లో వరుసగా 6,4,6,4,0,6 బాదాడు. ఒకే ఓవర్లో ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు.కట్టుదిట్టంగా భారత పేసర్ల బౌలింగ్టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్కు దిగగా.. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ భారత బౌలింగ్ ఎటాక్ ఆరంభించాడు. తొలి ఓవర్నే మెయిడిన్ వేసి శుభారంభం అందించాడు. అతడికి తోడుగా హర్షిత్ రాణా కొత్త బంతితో బరిలోకి దిగి వన్డేల్లో తన మొదటి ఓవర్నే మెయిడిన్(సున్నా పరుగులు) చేశాడు. ఐదు ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 26/0 (5)బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్నాగ్పూర్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి వన్డే ఇవాళ (ఫిబ్రవరి 6) మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఆడటం లేదు. అతని కుడి మోకాలికి గాయమైంది. కోహ్లి గాయపడటంతో యశస్వి జైస్వాల్కు అవకాశం వచ్చింది. యశస్వి.. రోహిత్తో కలిసి భారత ఇన్నింగ్స్ను ఆరంభిస్తాడు. యశస్వికి వన్డేల్లో ఇది తొలి మ్యాచ్ (డెబ్యూ). ఈ మ్యాచ్లో యశస్వితో పాటు హర్షిత్ రాణా కూడా వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఈ మ్యాచ్లో రిషబ్ పంత్కు కూడా అవకాశం దక్కలేదు. కేఎల్ రాహుల్ వికెట్కీపింగ్ బాధ్యతలను అదనంగా మోయనున్నాడు. ఈ మ్యాచ్లో భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లతో బరిలోకి దిగింది.ఇంగ్లండ్ విషయానికొస్తే.. టీ20 సిరీస్ ఆడిన జట్టులో పెద్దగా మార్పులు లేవు. జో రూట్ కొత్తగా జట్టులో చేరాడు. ఈ సిరీస్ భారత్, ఇంగ్లండ్ జట్లకు ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా ఉపయోగపడుతుంది. ఈ సిరీస్లో మొత్తం మూడు మ్యాచ్లు జరుగనున్నాయి. దీనికి ముందు ఇరు జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.తుది జట్లు..ఇండియా (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్(వికెట్కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్(వికెట్కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జేకబ్ బేతెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్ -
Ind vs Eng 1st ODI: కోహ్లి దూరం.. జైస్వాల్తో పాటు అతడి అరంగేట్రం
టీమిండియాతో తొలి వన్డేలో ఇంగ్లండ్(India vs England) టాస్ గెలిచి.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇరుజట్ల మధ్య నాగ్పూర్లో గురువారం మ్యాచ్ మొదలైంది. అయితే, దురదృష్టవశాత్తూ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) ఈ మ్యాచ్కు దూరమయ్యాడు.జైస్వాల్తో పాటు అతడి అరంగేట్రంటాస్ సందర్భంగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఈ విషయాన్ని వెల్లడించాడు. అదే విధంగా.. ఇంగ్లండ్తో తొలి వన్డేతో స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, యువ పేసర్ హర్షిత్ రాణా యాభై ఓవర్ల ఫార్మాట్లో టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తున్నట్లు వెల్లడించాడు.‘‘టాస్ ఓడినా మరేం పర్లేదు. మేము తొలుత బౌలింగ్ చేయాలనే భావించాం. బంతితో, బ్యాట్తో దూకుడుగానే రాణించాలని కోరుకుంటున్నాం. ఇదొక సరికొత్త ఆరంభం. చాంపియన్స్ ట్రోఫీకి ముందుకు మాకు వచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాం.జైస్వాల్, హర్షిత్ రాణా వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నారు. దురదృష్టవశాత్తూ మోకాలి సమస్య వల్ల కోహ్లి ఆడలేకపోతున్నాడు’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా టీమిండియా తరఫున టెస్టుల్లో ఓపెనర్గా పాతుకుపోయిన యశస్వి జైస్వాల్.. ఇప్పటికే టీ20లలోనూ అరంగేట్రం చేశాడు. ఈ రెండు ఫార్మాట్లలోనూ తనను తాను నిరూపించుకున్న జైసూ.. తాజాగా వన్డేల్లోనూ అడుగుపెట్టాడు. మరోవైపు.. హర్షిత్ రాణా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అనంతరం ఇటీవల ఇంగ్లండ్తో నాలుగో టీ20 సందర్భంగా.. శివం దూబేకు కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చి పొట్టి ఫార్మాట్లో ఎంట్రీ ఇచ్చాడు. జో రూట్కు స్వాగతంమరోవైపు.. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. సరికొత్త ఉత్సాహంతో వన్డే బరిలో దిగుతున్నామని.. జో రూట్కు తిరిగి జట్టులోకి స్వాగతం పలికాడు. ఇక తాము ప్రస్తుతం పటిష్ట జట్టుతో తలపడుతున్నామన్న బట్లర్.. హెడ్కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ప్రతి విషయంలోనూ తమను జాగ్రత్తగా చూసుకుంటున్నాడని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో తాము ముగ్గురు పేసర్లతో పాటు ఒక అదనపు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ను కూడా ఆడిస్తున్నట్లు తెలిపాడు. కాగా ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్లు ఆడే నిమిత్తం ఇంగ్లండ్ భారత్ పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తొలుత టీ20 సిరీస్ జరుగగా.. సూర్యకుమార్ సేన 4-1తో జయభేరి మోగించింది. అనంతరం గురువారం నుంచి ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్కు తెరలేచింది.భారత తుదిజట్టురోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ.భారత్తో తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టుబెన్ డకెట్, ఫిల్ సాల్ట్(వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, జాకొబ్ బెతెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్.చదవండి: హార్దిక్ పాండ్యా లేకపోతే ఏంటి?.. అతడు లేకుండానే వరల్డ్కప్ ఆడాం: రోహిత్ శర్మ -
హార్దిక్ లేకపోతే ఏంటి?.. అతడు లేకుండానే వరల్డ్కప్ ఆడాం: రోహిత్
హార్దిక్ పాండ్యా(Hardik Pandya) జట్టుతో లేకపోయినా తాము గెలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అన్నాడు. ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ సేవలు తమకు ముఖ్యమేనని.. అయితే, అతడి గైర్హాజరీలో కూడా తమవైన వ్యూహాలతో ముందుకు సాగుతామని పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో వైఫల్యం తర్వాత రోహిత్ శర్మ సొంతగడ్డపై టీమిండియా తరఫున పునరాగమనం చేస్తున్నాడు.ఇంగ్లండ్తో వన్డే సిరీస్(India vs England)లో హిట్మ్యాన్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇరుజట్ల మధ్య నాగ్పూర్లో గురువారం తొలి వన్డే జరుగనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మకు హార్దిక్ పాండ్యా గురించి ప్రశ్న ఎదురైంది. ఒకవేళ పాండ్యా గాయపడితే అతడికి ప్రత్యామ్నాయ ఆటగాడు ఎవరంటూ విలేకరులు అడిగారు.ప్రతిసారీ నెగటివ్గానే ఎందుకు?ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ‘‘ప్రతిసారీ ప్రతికూల అంశాల గురించే మనం ఎందుకు మాట్లాడాలి? ‘అతడు గాయపడతాడు.. ఇతడికి గాయమవుతుంది.. అప్పుడెలా? ఇలా జరిగితే జట్టుకు కష్టమే’.. అనే మాటలు ఎందుకు?సెలక్టర్లు, నాయకత్వ దళంలో ఇందుకు సంబంధించిన ఆలోచనలు ఉంటాయి. కానీ అవన్నీ మీకు చెప్పలేం కదా! కానీ మా వ్యూహాలు మాకుంటాయి. పాండ్యా గాయపడ్డా మేము వరల్డ్కప్ సజావుగానే పూర్తిచేశాం.అతడు గాయపడితే ఎలా అన్న ఆలోచన నాకు లేదుటోర్నీ మూడు లేదంటే నాలుగో మ్యాచ్లో అతడు గాయపడ్డాడనుకుంటా. ఆ తర్వాత కూడా మేము టోర్నీ ఆసాంతం మంచి క్రికెట్ ఆడాం. ఫైనల్లో ఓడిపోయినప్పటికీ.. అప్పటి దాకా అజేయంగా నిలిచాం. కాబట్టి ఇప్పుడు అతడు గాయపడితే ఎలా అన్న విషయం గురించి నేను ఆలోచించడం లేదు. ఒకవేళ అతడు గాయపడినా ఏం చేయాలో మాకు తెలుసు. జట్టు మొత్తం సమిష్టిగా రాణిస్తే మాకు ఎలాంటీ సమస్యా ఉండదు’’ అని రోహిత్ శర్మ ఘాటుగా సమాధానమిచ్చాడు. కాగా సొంతగడ్డపై జరిగిన వన్డే వరల్డ్కప్-2023లో బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా పాండ్యా గాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్-2024లో సత్తా చాటిన పాండ్యాతద్వారా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. మళ్లీ ఐపీఎల్-2024 ద్వారా రీఎంట్రీ ఇచ్చిన ఈ ముంబై ఇండియన్స్ కెప్టెన్.. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.బ్యాట్తో, బంతితో రాణించిన ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ వరల్డ్కప్-2024లో 144 పరుగులు చేయడంతో పాటు పదకొండు వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా సౌతాఫ్రికాతో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్లో 3/20తో రాణించి టీమిండియాకు విజయం అందించాడు. సౌతాఫ్రికా విధ్వంసకర వీరులు హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ల వికెట్లు తీసి రోహిత్ సేన చాంపియన్గా నిలవడంలో హార్దిక్ పాండ్యా ప్రధాన భూమిక పోషించాడు.ఇక ఇటీవల ఇంగ్లండ్తో టీ20 సిరీస్లోనూ హార్దిక్ పాండ్యా ఫర్వాలేదనిపించాడు. ముఖ్యంగా నాలుగో టీ20లో మెరుపు అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. 30 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 53 పరుగులు రాబట్టాడు. ప్రస్తుతం అతడు వన్డే సిరీస్కు సిద్ధమయ్యాడు. కాగా ఫిబ్రవరి 6(గురువారం), ఫిబ్రవరి 9(ఆదివారం), ఫిబ్రవరి 12(బుధవారం)న భారత్- ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేలకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు నాగ్పూర్, కటక్, అహ్మదాబాద్. ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు టీమిండియారోహిత్ శర్మ, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా. చదవండి: CT 2025: ‘నాణ్యమైన బౌలర్.. సిరాజ్ను ఎలా పక్కనపెట్టారు?’ -
ఇంగ్లండ్తో వన్డేలు: రోహిత్, కోహ్లి ఫామ్లోకి వస్తారా?
నాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్(India vs England)తో గురువారం ప్రారంభమయ్యే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం భారత్ సంసిద్ధమవుతోంది. త్వరలో ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్(ICC Champions Trophy) జరగనున్న నేపథ్యంలో ఇరుజట్లకు ఇది కీలకంగా మారింది. అయితే టీమిండియా అభిమానుల దృష్టి మాత్రం సీనియర్ బ్యాటర్లు కెప్టెన్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీల పైనే ఉంది. మామూలుగా అయితే వారిద్దరి ఎంపిక ఎప్పుడూ చర్చనీయాంశం కాదు. కానీ ప్రస్తుతం వారిద్దరూ పేలవమైన ఫామ్ తో వరుసగా విఫలమవుతూదండటంతో అందరి దృష్టి వారిపైనే ఉంది.సీనియారిటీ పరంగా వారిద్దరూ జట్టులో చాల కీలకం కావడం కూడా ఇందుకు ప్రధాన కారణం. వారిద్దరూ ఆడటం ప్రారంభిస్తే జట్టులో ఉత్తేజం మామూలు స్థాయిలో ఉండదు. ఇక అందరికీ కోహ్లీ సంగతి తెలిసిందే. అతడు ఫీల్డ్ లో మెరుపు తీగలా కలయ తిరుగుతూ జట్టు సభ్యులని ఉత్తేజపరుస్తాడు. రోహిత్ శర్మ జట్టు సారథి. జట్టుని ముందుండి నడిపించాల్సిన ఆటగాడు వరుసగా విఫలమవుతూ ఉంటే అది తప్పనిసరిగా అతని నాయకత్వ తీరు పై ప్రభావం చూపిస్త ఉందనడంలో సందేహం లేదు.పైగా వారిద్దరి వయస్సు కూడా ముప్పై అయిదు సంవత్సరాలు దాటడంతో ఈ ఇద్దరి పై ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం వారిద్దరూ మళ్ళీ ఫామ్ లోకి వస్తే తప్ప విమర్శలకి చెక్ పెట్టడం సాధ్యం కాదు. వరుసగా విఫలమవుతూ ఒత్తిడిలో ఉన్న వారిద్దరూ రిటైర్మెంట్ గురుంచి ఆలోచిస్తున్నారని వాదనలు కూడా వినిపిస్తున్నాయి.కోహ్లిని వెంబడిస్తున్న బలహీనతఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటన లో ఘోరంగా విఫలమైన రోహిత్, కోహ్లీ దేశవాళీ రంజీ ట్రోఫీ లో రాణిస్తారని అందరూ ఆశించారు. కానీ అక్కడ కూడా వారి ఆటతీరు ఆశించిన స్థాయిలో లేదు. రోహిత్, కోహ్లీ ఆగస్టులో శ్రీలంక పర్యటనలో చివరిసారిగా వన్డే క్రికెట్లో ఆడారు. ఆ సిరీస్లో రోహిత్ 141.44 స్ట్రైక్ రేట్తో మూడు ఇన్నింగ్స్లలో 157 పరుగులు చేశాడు.అయితే కోహ్లీ మాత్రం మూడు మ్యాచ్లలో కేవలం 58 పరుగులు మాత్రమే సాధించాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీకి దీర్ఘకాలంగా ఉన్న బలహీనత మళ్లీ బయటపడింది. అతను ఆఫ్-స్టంప్ దిశగా వచ్చే బంతుల్ని ఛేజ్ చేస్తూ ఏకంగా ఎనిమిది సార్లు అవుట్ అయ్యాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్ నుంచి వైదొలగడానికి ముందు ఐదు ఇన్నింగ్స్లలో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు.బ్యాటింగ్ దిగ్గజాలని గౌరవించండిఇంగ్లాండ్ లెజెండ్ కెవిన్ పీటర్సన్ మాత్రం విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మల కు మద్దతుగా నిలిచాడు. ఇటీవల కాలంలో కోహ్లీ, రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ తో ఇబ్బంది పడటం వాస్తవమే అయినా వారిద్దరూ రిటైర్మెంట్ కావాలని కోరడం అన్యాయమని చెప్పాడు. ప్రతి ఆటగాడు తమ కెరీర్లో కఠినమైన దశలను ఎదుర్కొంటాడనీ.. విరాట్, రోహిత్ లు 'రోబోలు కాదని భారత్ అభిమానులు గుర్తించాలని పీటర్సన్ పేర్కొన్నాడు."నా కెరీర్లో కూడా ఇలాంటి సవాళ్ళే ఎదురయ్యాయి. రోహిత్, విరాట్ రోబోలు కాదు. వారు బ్యాటింగ్ చేసిన ప్రతిసారీ సెంచరీ చేయడం సాధ్యం కాదు. ఆస్ట్రేలియా పర్యటనలో వారిద్దరూ విఫలమై ఉండవచ్చు. అంత మాత్రం వారిద్దరూ ఇంక అంతర్జాతీయ క్రికెట్ కి పనికిరారని ముద్ర వేయడం సరికాదు’’ అని పీటర్సన్ అన్నాడు. వారిద్దరి రికార్డులని దృష్టిలో ఉంచుకొని వారి పట్ల సానుభూతి చూపాలని పీటర్సన్ భారత్ అభిమానులకి పిలుపునిచ్చాడు.సచిన్ రికార్డుపై కోహ్లీ కన్నుభారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డేల్లో సాధించిన రికార్డుకు విరాట్ కోహ్లీ అతి చేరువలో ఉన్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 14 వేల పరుగుల మైలురాయి ని సాధించిన బ్యాటర్గా సచిన్ సాధించిన రికార్డ్ కి కోహ్లీ కేవలం 94 పరుగుల దూరంలో ఉన్నాడు. సచిన్ఈ మైలురాయి ని చేరాడనికి 350 ఇన్నింగ్స్ లు తీసుకోగా కోహ్లీ ప్రస్తుతం 283 వన్డే మ్యాచ్ లలో 58.18 సగటుతో 13,906 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ తో జరిగే మూడు మ్యాచ్ల సిరీస్ లో కోహ్లీ మరో 94 పరుగులు సాధించి ఈ రికార్డ్ ని అధిగమిస్తాడని భారత్ అభిమానులు ఆశిస్తున్నారు.చదవండి: Ind vs Eng: తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. వెటరన్ ప్లేయర్ రీఎంట్రీ