breaking news
rohit sharma
-
లార్డ్స్లో విరాట్ కోహ్లి.. ఆ సిరీస్కు సన్నద్ధం.. సెలక్టర్లకు మెసేజ్!
వన్డే వరల్డ్కప్-2027 వరకు టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) ఆటలో కొనసాగుతారా?.. ఈ ఇద్దరి పేర్లను మెగా ఐసీసీ టోర్నీకి బీసీసీఐ (BCCI) సెలక్టర్లు పరిగణిస్తున్నారా? లేదా?.. భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఇదో హాట్టాపిక్.ఇటీవల ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ నుంచి విరాట్, రోహిత్ పేర్లు మాయంకావడం.. ఆ తర్వాత తప్పును సరిదిద్దుకున్న ఐసీసీ మళ్లీ వారి పేర్లను చేర్చడం.. వన్డే రిటైర్మెంట్ వార్తలకు ఊతమిచ్చింది. ఇలాంటి తరుణంలో విరాట్, రోహిత్.. ఇద్దరూ తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టడం ద్వారా వదంతులకు చెక్ పెట్టేశారు.లార్డ్స్ మైదానంలో ప్రాక్టీస్ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్కు తాము సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. కాగా ప్రస్తుతం లండన్లో ఉన్న విరాట్ కోహ్లి.. తాజాగా ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో నెట్ ప్రాక్టీస్ చేయడం విశేషం. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ దాదాపు రెండు గంటల పాటు నెట్స్లో తీవ్రంగా శ్రమించినట్లు సమాచారం.స్పిన్, పేస్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ... వైవిధ్యభరితమైన షాట్లు ఆడుతూ కోహ్లి తన ప్రాక్టీస్ సెషన్ను పూర్తిచేసినట్లు తెలిసింది. ఇక ప్రాక్టీస్కు వెళ్లిన సమయంలో లార్డ్స్ స్టేడియంలో అభిమానులతో కలిసి కోహ్లి ఫొటోలకు ఫోజులిచ్చాడు.భారత్-ఎ తరఫునమరోవైపు.. రోహిత్ శర్మ కూడా ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టగా.. మరో అనూహ్య నిర్ణయం కూడా తీసుకున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియా-ఎ జట్టుతో స్వదేశంలో జరుగబోయే అనధికారిక వన్డే సిరీస్లో భారత్-ఎ తరఫున ఆడాలని రోహిత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు ముందే రోహిత్ టెస్టులకు కూడా గుడ్బై చెప్పగా.. ఆ వెంటనే కోహ్లి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, ఈ ఇద్దరూ వన్డేల్లో మాత్రం కొనసాగుతామని స్పష్టం చేశారు.ఆసీస్ సిరీస్తో కోహ్లి, రోహిత్ రీ ఎంట్రీఇక రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టీ20లలో సూర్యకుమార్ యాదవ్, టెస్టుల్లో శుబ్మన్ గిల్ టీమిండియా పగ్గాలు చేపట్టారు. గిల్ సారథ్యంలో ఇంగ్లండ్ గడ్డ మీద ఐదు టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేసిన భారత్.. తదుపరి యూఏఈ వేదికగా సూర్య కెప్టెన్సీలో ఆసియా టీ20 కప్-2025 టోర్నీ ఆడనుంది. సెప్టెంబరు 9-28 వరకు జరిగే ఈ ఖండాంతర టోర్నీ అనంతరం స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టులు ఆడుతుంది భారత జట్టు. ఆ తర్వాత అక్టోబరులో ఆస్ట్రేలియా పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడనుంది. చదవండి: Asia Cup 2025: అదొక వింత నిర్ణయం.. కెప్టెన్ అయ్యే ప్లేయర్ను జట్టు నుంచి తీసేస్తారా?రోహిత్, విరాట్ కోహ్లి రిటైర్మెంట్!? .. బీసీసీఐ ఉపాధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు -
పాపం హార్దిక్ పాండ్యా!.. బీసీసీఐ ఉపాధ్యక్షుడి కామెంట్స్ వైరల్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అద్భుతమైన ఆట తీరుతో హిట్మ్యాన్ కోట్లాది మంది ఫ్యాన్స్ను సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన రోహిత్.. టీ20లలోనూ ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే.ఇక ఐపీఎల్ (IPL)లోనూ ముంబై ఇండియన్స్కు కెప్టెన్గా వ్యవహరించి.. జట్టును ఏకంగా ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన ఘనత రోహిత్కు ఉంది. క్యాష్ రిచ్ లీగ్లో ఈ ఫీట్ నమోదు చేసిన మొదటి సారథి కూడా ఇతడే!.. అయితే, గతేడాది ముంబై ఇండియన్స్ ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది.రోహిత్పై వేటు.. పాండ్యాకు పగ్గాలురోహిత్ను తప్పించి.. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యా (Hardik Pandya)ను కెప్టెన్గా నియమించింది. అయితే, హిట్మ్యాన్ అభిమానులు ఈ విషయాన్ని అంత తేలికగా జీర్ణం చేసుకోలేకపోయారు. రోహిత్ను పక్కనపెట్టడాన్ని విమర్శిస్తూ.. ముంబై ఇండియన్స్ను తప్పుబట్టడంతో పాటు హార్దిక్ను సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.పాపం హార్దిక్.. చేదు అనుభవంఅంతేకాదు.. ముంబై ఇండియన్స్ సొంత మైదానం వాంఖడేలోనూ హార్దిక్ పాండ్యాపై నేరుగానే తిట్ల వర్షం కురిపించారు. అతడిని హేళన చేస్తూ కించపరిచేవిధంగా వ్యవహరించారు. అయితే, హార్దిక్ మాత్రం ఇందుకు కౌంటర్ ఇచ్చేందుకు బదులు.. ఆటపై మరింతగా శ్రద్ధ పెట్టాడు.కానీ ముంబై ఇండియన్స్ను విజయవంతంగా ముందుకు నడపలేకపోయాడు. హార్దిక్ సారథ్యంలో 2024లో ఆ జట్టు మరీ చెత్త ప్రదర్శనతో పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. అయితే, ఆ తర్వాత టీ20 ప్రపంచకప్-2024లో హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణించాడు.వరల్డ్కప్ గెలిచిన వీరుడురోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత మరోసారి రోహిత్ సారథ్యంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ను టీమిండియా సొంతం చేసుకోవడంలోనూ పాలుపంచుకున్నాడు.రోహిత్ శర్మ ఫ్యాన్స్ అలా చేశారుఅయితే, 2024 నాటి ఐపీఎల్లో వాంఖడే వేదికగా హార్దిక్ పాండ్యా ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తాజాగా స్పందించాడు. యూపీటీ20 యూట్యూబ్ చానెల్తో మాట్లాడుతూ.. ‘‘అలాంటి సంఘటనలు జరిగినపుడు బీసీసీఐలోని వ్యక్తులు సదరు ఆటగాళ్లతో మాట్లాడతారు.వారికి ధైర్యం చెబుతారు. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని సూచిస్తారు. నిజానికి హార్దిక్ విషయంలో రోహిత్ శర్మ ఫ్యాన్స్ అలా చేశారు. తమ అభిమాన ఆటగాడి స్థానంలో అతడు కెప్టెన్గా రావడాన్ని సహించలేకపోయారు.హార్దిక్ పరిణతితో వ్యవహరించాడురోహిత్ వారినేమీ అతడిపైకి ఉసిగొల్పలేదు. అంతేకాదు.. హార్దిక్కు కూడా ఇలా జరుగవచ్చని ముందు నుంచే అవగాహన ఉంది. ఏదేమైనా ఆ పరిస్థితుల్లో హార్దిక్ పరిణతితో వ్యవహరించాడు. ఆ ప్రభావం తనమీద పడకుండా చూసుకున్నాడు.భావోద్వేగాల్లో కూరుకుపోకుండా.. ఆటకు మరిన్ని మెరుగులు దిద్దుకున్నాడు. ఒక్కసారి ఆటగాళ్లు తిరిగి గొప్పగా రాణిస్తే తిట్టిన వారే.. ప్రశంసించడం మొదలుపెడతారు’’ అని రాజీవ్ శుక్లా చెప్పుకొచ్చాడు.చదవండి: Asia Cup 2025: అదొక వింత నిర్ణయం.. కెప్టెన్ అయ్యే ప్లేయర్ను జట్టు నుంచి తీసేస్తారా? -
రోహిత్, విరాట్ కోహ్లి రిటైర్మెంట్!? .. బీసీసీఐ ఉపాధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు
టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు ఆస్ట్రేలియా టూర్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీ20లు, టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న వీరిద్దరూ కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు.ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత రో-కో ద్వయం ఇప్పటివరకు భారత తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే వన్డే ప్రపంచకప్-2027 దృష్ట్యా వీరిద్దరి స్ధానాల్లో యువ ఆటగాళ్లను బీసీసీఐ సిద్దం చేయనుందని, అక్టోబర్లో ఆసీస్తో జరగనున్న మూడు మ్యాచ్ల వన్డేల సిరీసే ఆఖరిదని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సీనియర్ ద్వయం రిటైర్మెంట్ వార్తలపై బీసీసీఐ (BCCI ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించాడు. అవన్నీ వట్టి రూమర్సే అని అతడు కొట్టిపారేశారు. రోహిత్, కోహ్లి ఇద్దరూ వైట్ బాల్ క్రికెట్లోకి తిరిగొచ్చేందుకు తమ ట్రైనింగ్ను తిరిగి ప్రారంభించారు. కాగా రాజీవ్ శుక్లా ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో శుక్లాను సచిన్ టెండూల్కర్లాగానే రోహిత్, కోహ్లిలకు ప్రత్యేకంగా ఫేర్వెల్ నిర్వహిస్తారా ? అని హోస్ట్ ప్రశ్నించాడు."రోహిత్, కోహ్లి ఇంకా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కాలేదు. వారిద్దరూ ఇంకా వన్డేలు ఆడుతున్నారు. వారు ప్రస్తుతం కేవలం రెండు ఫార్మాట్ల నుంచి మాత్రమే తప్పుకొన్నారు. మరో ఫార్మాట్లో ఆడుతున్నప్పుడు మీరెందుకు వారి ఫేర్వెల్ గురుంచి మాట్లాడుతున్నారు? వారి రిటైర్మెంట్ గురించి మీరంతా ఎందుకు ఆందోళన చెందుతున్నారు? బీసీసీఐకి ఒక పాలసీ ఉంటుంది. బీసీసీఐ ఎవరిని కూడా రిటైర్మెంట్ ఇవ్వమని అడగదు. వారే సొంతంగా తమ నిర్ణయాలు తీసుకోవాలి. ప్లేయర్ తీసుకునే నిర్ణయాన్ని మేము గౌరవిస్తాము. ఆటగాళ్లు విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో మాకు తెలుసు. కానీ ఇదంతా ఇప్పుడు అనవసరం.విరాట్ కోహ్లి చాలా ఫిట్గా ఉన్నాడు. రోహిత్ శర్మ కూడా బాగా ఆడుతున్నాడు. కాబట్టి వారి ఫేర్వెల్ గురుంచి ఆలోచిండం ఆపయేండి" అని శుక్లా పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది ఆక్టోబర్లో భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది.చదవండి: Asia Cup 2025: 'ఆసియాకప్ గెలిచేది ఆ జట్టే'.. వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం -
ఆస్ట్రేలియా టూర్.. రోహిత్ శర్మ ఊహించని నిర్ణయం!?
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్వదేశంలో ఆస్ట్రేలియా-ఎతో జరిగే అనాధికారిక మూడు వన్డేల సిరీస్లో భారత్-ఎ తరపున ఆడేందుకు రోహిత్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.ఈ మూడు వన్డేల సిరీస్ సెప్టెంబర్ 30 నుంచి ఆక్టోబర్ 5 మధ్య కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనుంది. కాగా టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ ప్రస్తుతం కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగనున్నాడు. ఈ ఏడాది ఆక్టోబర్లో భారత జట్టు మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఐపీఎల్-2025 తర్వాత క్రికెట్ దూరంగా ఉంటున్న హిట్మ్యాన్.. ఆసీస్-ఎతో జరిగే అనాధికారిక సిరీస్ను సన్నహాకంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రేవ్ స్పోర్ట్స్ రిపోర్ట్ ప్రకారం.. రోహిత్ ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐకి తెలియజేసినట్లు తెలుస్తోంది.కాగా ఆస్ట్రేలియా టూర్ తర్వాత రోహిత్ పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలకనున్నట్లు వార్తలు వినిపించాయి. వన్డే ప్రపంచకప్-2027ను దృష్టిలో పెట్టుకుని రోహిత్, కోహ్లి స్దానాల్లో యువ ఆటగాళ్లను సిద్దం చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.అంతేకాకుండా వన్డేల్లో తన స్ధానాన్ని కాపాడుకోవాలంటే విజయ్ హజారే ట్రోఫీ-2025లో ఆడమని రోహిత్ను సెలక్టర్లు కోరనున్నట్లు సమాచారం. మరి రోహిత్ ఈ దేశవాళీ వన్డే టోర్నీలో ఆడుతాడో లేదో వేచి చూడాలి. అయితే ఆసియాకప్ ముగిసిన తర్వాత వన్డే జట్టు భవిష్యత్తు గురించి చర్చించడానికి సెలెక్టర్లు ముంబైలో సమావేశం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.ఒకవేళ రోహిత్ తన కెరీర్ను ముగిస్తే భారత వన్డే కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా రోహిత్ శర్మ చివరగా విజయ్ హాజారే ట్రోఫీ 2018లో ముంబై తరపున ఆడాడు.చదవండి: Ajinkya Rahane: ఇక గుడ్ బై.. అజింక్య రహానే సంచలన నిర్ణయం -
హ్యాట్సాఫ్: రోహిత్ భార్య రితికా అలా.. సూర్య సతీమణి దేవిశా ఇలా
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సతీమణి దేవిశా శెట్టి (Devisha Shetty)ఇన్స్టా స్టోరీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారత స్పిన్నర్ యజువేంద్ర చహల్ (Yuzuvendra Chahal) మాజీ భార్య ధనశ్రీ వర్మకు మద్దతు తెలుపుతూ ఓ షార్ట్ వీడియోను దేవిశా షేర్ చేసింది. ఈ నేపథ్యంలో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.ఈ ఏడాది విడాకులు మంజూరుఅసలేం జరిగిందంటే.. కొరియోగ్రాఫర్, నటి అయిన ధనశ్రీ వర్మను ప్రేమించిన చహల్ 2020లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత కొన్నాళ్లకే వైవాహిక బంధంలో పొరపొచ్చాలు వచ్చాయి. దీంతో దాదాపు రెండేళ్లుగా దూరంగా ఉంటున్న ఈ జంటకు.. ఈ ఏడాది మార్చిలో అధికారికంగా విడాకులు మంజూరు అయ్యాయి.చహల్ స్పందన ఇదిఈ విషయం గురించి చహల్ స్పందిస్తూ.. తన జీవిత భాగస్వామిని మనస్ఫూర్తిగా ప్రేమించినా.. విడిపోక తప్పలేదంటూ ధనశ్రీని పరోక్షంగా విమర్శించాడు. ఇక విడాకులకు ముందే ఆర్జే మహ్వశ్తో కలిసి ట్రిప్పులకు వెళ్లిన చహల్.. ఆమె తనకు స్నేహితురాలు మాత్రమేనని.. తమ మధ్య ప్రేమ లేదని చెప్పాడు.ఇదిలా ఉంటే.. బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకుల తీర్పు కోసం వెళ్లిన సమయంలో చహల్.. ‘బీ యువర్ ఓన్ షుగర్ డాడీ’ అనే కొటేషన్ ఉన్న కస్టమైజ్డ్ టీ షర్టు వేసుకున్నాడు. దీనర్థం.. ‘ఆర్థికంగా స్వతంత్రంగా ఉండండి.. మీ బాగోగులు మీరే చూసుకోండి.. ఆర్థిక సాయం, బహుమతుల కోసం ఇతరులపై ఆధారపడకండి’. దీనిని బట్టి ధనశ్రీ భరణం అడుగుతున్న కారణంగానే చహల్ ఇలా చేశాడని నెటిజన్లు కామెంట్లు చేశారు.‘గోల్డ్ డిగ్గర్’ పోస్టుకు లైక్ కొట్టిన రితికామరోవైపు.. చహల్ ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న ఆర్జే మహ్వశ్ సైతం.. ధనశ్రీని నిందించేలా ఆర్థిక స్వాతంత్ర్యం గురించి అదే సమయంలో పోస్ట్ పెట్టింది. ఇంకోవైపు.. జర్నలిస్టు శుభంకర్ మిశ్రా ధనశ్రీని ‘గోల్డ్ డిగ్గర్ (డబ్బు కోసం సంబంధం పెట్టుకునే మహిళ)’ అంటూ అసభ్యకర రీతిలో విమర్శించాడు.ఇందుకు.. టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే లైక్ కొట్టి.. పరోక్షంగా ధనశ్రీపై ఆ జర్నలిస్టులాగే నిందలు వేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న ధనశ్రీ వర్మ తన విడాకుల గురించి తొలిసారిగా మాట్లాడింది.గట్టిగా ఏడ్చేశాతన జీవిత భాగస్వామి కోసం చేయాల్సినవన్నీ చేశానని.. అయితే, అతడే ముందుగా వైవాహిక బంధం నుంచి వైదొలిగాడని ధనశ్రీ తెలిపింది. అంతేకాదు.. తనపై నిందలు మోపేలా చహల్ అలాంటి టీ షర్టు ధరిస్తాడని ముందుగానే తనకు తెలుసునంది. తన పార్ట్నర్ను ఎంతో ప్రేమించానని.. అందుకే విడాకుల తీర్పు వినగానే కోర్టులోనే గట్టిగా ఏడ్చేశానంటూ ఆవేదనను పంచుకుంది.విడాకుల నేపథ్యంలో తనపై విపరీతమైన నెగటివిటీ వచ్చిందని.. అయితే, తన తల్లిదండ్రుల కోసం స్ట్రాంగ్గా ఉన్నట్లు నటిస్తున్నానని ధనశ్రీ చెప్పుకొచ్చింది. సున్నితమైన ఈ అంశంలో తన గోప్యతకు భంగం కలిగించేలా ఎంతో మంది ఎన్నో విధాలుగా పిచ్చి కూతలు కూశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.అత్యంత గౌరవం, ప్రేమ.. హ్యాట్సాఫ్ఇందుకు సంబంధించిన షార్ట్ వీడియోను తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేసిన దేవిశా శెట్టి.. ‘‘నీ పట్ల అత్యంత గౌరవం, ప్రేమ ఉన్నాయి’’ అంటూ ధనశ్రీ వర్మకు మద్దతుగా నిలిచింది. ఈ నేపథ్యంలో ధనశ్రీ పట్ల టీమిండియా కెప్టెన్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ల సతీమణులు.. రితికా సజ్దే, దేవిశా శెట్టి వైఖరిని పోలుస్తూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. తొలుత తప్పంతా ధనశ్రీ వర్మదే అని భావించినా.. కొత్త మహిళ రాక (మహ్వశ్)తో అంతా అర్థమైపోయిందంటూ కొందరు వ్యాఖ్యానిస్తుండగా.. మరి కొందరు మాత్రం ఎప్పటిలాగే ధనశ్రీనే నిందిస్తున్నారు.ఇదిలా ఉంటే.. సూర్యకుమార్ యాదవ్ తదుపరి ఆసియా కప్-2025 టోర్నీతో బిజీ కానున్నాడు. మరోవైపు.. టీ20, టెస్టులకు గుడ్బై చెప్పిన రోహిత్ శర్మ వన్డే రీఎంట్రీ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇక చహల్ చాలా కాలంగా టీమిండియాకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. చదవండి: అక్కకు బెస్ట్ ఫ్రెండ్.. అర్జున్ టెండుల్కర్- సానియా చందోక్ ఏజ్ గ్యాప్ ఎంతంటే? -
టీమిండియా వన్డే కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్?
భారత క్రికెట్ జట్టుకు ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో వెర్వేరు కెప్టెన్లు ఉన్న సంగతి తెలిసిందే. వన్డే జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ కొనసాగుతుండగా.. టెస్టు, టీ20 జట్ల సారథులుగా శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు.అయితే ఇప్పటికే టెస్టు, టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ త్వరలో వన్డేలకు కూడా గుడ్బై చెప్పే అవకాశముంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ వారుసుడిగా వన్డే జట్టు పగ్గాలు ఎవరు చేపడతారన్న ఆసక్తి అందరిలోనే నెలకొంది. భారత వన్డే కెప్టెన్సీ రేసులో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ముందంజలో ఉన్నట్టు సమాచారం.రోహిత్ తర్వాత అయ్యర్ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా ప్రస్తుతం 50 ఓవర్ల ఫార్మాట్లో రోహిత్ డిప్యూటీగా శుబ్మన్ గిల్ ఉన్నాడు. అయితే వర్క్లోడ్ మెనెజ్మెంట్లో భాగంగా వన్డే కెప్టెన్గా గిల్ను కాదని అయ్యర్ను నియమించాలని బీసీసీఐ పెద్దలు యోచిస్తున్నరంట. కాగా ఇటీవ ఆసియాకప్కు ప్రకటించిన భారత జట్టులో శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కలేదు. అన్ని ఫార్మాట్లలో అద్భుతమైన ఫామ్లో ఉన్న ముంబై బ్యాటర్ను సెలక్ట్ చేయకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి."ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు పరిస్థితులు బట్టి గిల్ను వన్డే వైస్ కెప్టెన్గా నియమించడం జరిగింది. కానీ రాబోయో కాలంలో భారత క్రికెట్ జట్టు వరుస ద్వైపాక్షిక సిరీస్లు, ఐసీసీ ఈవెంట్లతో బీజీగా గడపనుంది. కాబట్టి మూడు ఫార్మాట్లలో ఒకే ఆటగాడు కెప్టెన్గా ఉండడం అసాధ్యం.అందుకే గిల్ను టెస్టు కెప్టెన్సీతో పాటు టీ20ల్లో వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాము. భవిష్యత్తులో అతడు టీ20 కెప్టెన్ అయ్యే అవకాశముంది. కానీ వన్డే కెప్టెన్సీ విషయంలో మాత్రం బీసీసీఐ ప్రణాళికలు మరో విధంగా ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు కెప్టెన్సీ రేసులో ఉన్నారని " దైనిక్ జాగరణ్ తమ రిపోర్ట్లో పేర్కొంది.కాగా శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా భారత జట్టు కెప్టెన్గా వ్యవహరించలేదు. కానీ దేశవాళీ క్రికెట్లో మాత్రం కెప్టెన్గా అతడికి అపారమైన అనుభవం ఉంది. ముంబై జట్టుకు అతడు సారథ్యం వహించాడు. 2024/25 విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టును అయ్యర్ నడిపించాడు. ఈ టోర్నీలో అతడు ను 5 మ్యాచ్ల్లో 325 పరుగులు సాధించాడు. 2024 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో అయ్యర్ ముంబై జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి టైటిల్ను అందించాడు.చదవండి: CPL 2025: పొలార్డ్ మెరుపులు వృథా.. ఉత్కంఠ పోరులో నైట్ రైడర్స్ ఓటమి -
తప్పు సరిదిద్దుకున్న ఐసీసీ.. రీఎంట్రీ ఇచ్చిన రోహిత్, కోహ్లి
ఐసీసీ ఇవాళ (ఆగస్ట్ 20) ప్రకటించిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో ఘోర తప్పిదం జరిగింది. గత వారం ర్యాంకింగ్స్లో రెండు, నాలుగు స్థానాల్లో ఉండిన టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి.. తాజా ర్యాంకింగ్స్లో టాప్-100లో కూడా కనబడలేదు. ఈ ఇద్దరి పేర్లు ఆకస్మికంగా మాయం కావడంపై సోషల్మీడియాలో భారీ ఎత్తున డిస్కషన్స్ నడుస్తుండగా ఐసీసీ స్పందించింది.సాంకేతిక లోపం కారణంగా రోహిత్, కోహ్లి పేర్లు ర్యాంకింగ్స్లో కనబడలేదని వివరణ ఇచ్చింది. తప్పును సరి దిద్దుకుంటూ వారిద్దరి పేర్లను తిరిగి ర్యాంకింగ్స్ జాబితాలో చేర్చింది. అప్డేట్ చేసిన తర్వాత రోహిత్, కోహ్లి తమ పాత ర్యాంకులైన రెండు, నాలుగు స్థానాలను తిరిగి దక్కించుకున్నారు.రోహిత్, కోహ్లి వన్డే ర్యాంకింగ్స్లోకి రీఎంట్రీ ఇవ్వడంతో వారి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తొలుత ర్యాంకింగ్స్లో కనపడకపోయే సరికి రోహిత్, కోహ్లి వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించారని ప్రచారం జరిగింది. అయితే సాంకేతిక లోపం కారణంగా తప్పిదం జరిగిందని తెలిసి రోహిత్, కోహ్లి అభిమానుల మనసులు కుదుటపడ్డాయి.కాగా, సాంకేతిక లోపం కారణంగా తాజా వన్డే ర్యాంకింగ్స్లో మరిన్ని తప్పిదాలు దొర్లాయి. రోహిత్, కోహ్లి పేర్లు మాయమైపోవడంతో పాటు పలువురు రిటైరైన ఆటగాళ్ల పేర్లు జాబితాలో ప్రత్యక్షమయ్యాయి. ఇందులో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్, స్టీవ్ టికోలో, అలెక్స్ ఓబండ, థామస్ ఒడోయో, అన్షీ రథ్ లాంటి పేర్లు ఉన్నాయి. తప్పిదాన్ని గుర్తించిన తర్వాత ఐసీసీ వీరి పేర్లను తొలగించింది.సవరించిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా ఆటగాడు శుభ్మన్ గిల్ అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ, బాబర్ ఆజమ్, విరాట్ కోహ్లి, డారిల్ మిచెల్, చరిత్ అసలంక, హ్యారీ టెక్టార్, శ్రేయస్ అయ్యర్, ఇబ్రహీం జద్రాన్, కుసాల్ మెండిస్ టాప్-10లో ఉన్నారు. -
రోహిత్, కోహ్లికి ఊహించని షాకిచ్చిన ఐసీసీ.. ఆకస్మికంగా తొలగింపు
ఐసీసీ తాజాగా (ఆగస్ట్ 20) ప్రకటించిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను భారీ షాక్కు గురి చేశాయి. గత వారం ర్యాంకింగ్స్లో రెండు, నాలుగు స్థానాల్లో ఉన్న ఈ ఇద్దరు.. వారం తిరిగేలోపే ర్యాంకింగ్స్ నుంచి పూర్తిగా మాయమైపోయారు. ఇవాళ (ఆగస్ట్ 20) ప్రకటించిన ర్యాంకింగ్స్లో రోహిత్, కోహ్లి పేర్లు కనిపించలేదు. ఇది చూసి రోహిత్, కోహ్లితో పాటు వారి అభిమానులు కూడా షాక్కు గురవుతున్నారు. ఇంత సడెన్గా తమ ఆరాధ్య ఆటగాళ్ల పేర్లు ఎలా మాయమైపోయాయని ఆశ్చర్యపోతున్నారు. ఇలా జరగడంలో ఐసీసీ తప్పిదమేమైనా ఉందా అని ఆరా తీస్తున్నారు. కొందరేమో రోహిత్, కోహ్లి టీ20, టెస్ట్ తరహాలో వన్డే రిటైర్మెంట్ కూడా సడెన్గా ప్లాన్ చేశారేమోనన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఐసీసీ రూల్స్ ఇలా..!ఐసీసీ ర్యాంకింగ్ రూల్స్ ప్రకారం.. ఓ ఆటగాడు 9-12 నెలల కాలంలో సంబంధింత ఫార్మాట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోతే ర్యాంకింగ్స్ నుంచి తొలగిస్తారు. అయితే తాజా ఉదంతంలో రోహిత్, కోహ్లి విషయంలో అలా జరగలేదు. వీరిద్దరు మార్చి 9న, అంటే ఐదు నెలల కిందట ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడారు. ఈ లెక్కన రోహిత్, కోహ్లి పేర్లు సడెన్గా వన్డే ర్యాంకింగ్స్ నుంచి తొలగించడానికి వీల్లేదు.మరి ఏం జరిగి ఉంటుంది..?రోహిత్, కోహ్లి పేర్లు వన్డే ర్యాంకింగ్స్ నుంచి ఆకస్మికంగా తొలగించడం వెనుక ఏదైనా కుట్ర (బీసీసీఐ) దాగి ఉందా అని వారి అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు 2027 వన్డే వరల్డ్కప్ వరకు ఈ ఫార్మాట్లో కొనసాగుతామని పరోక్షంగా చెప్పారు. అయితే ఈ విషయంలో బీసీసీఐ సానుకూలంగా లేదని తెలుస్తుంది.రోహిత్, కోహ్లి రెండు ఫార్మాట్లలో లేకపోయినా యువ ఆటగాళ్లతో టీమిండియా పటిష్టంగా ఉందని వారి భావన. వీరిద్దరు వన్డేల నుంచి తప్పుకున్నా జట్టుపై పెద్ద ప్రభావముండదని వారి అభిప్రాయం. ఇప్పటి నుంచే వన్డేల్లో రోహిత్, కోహ్లి ప్రత్యామ్నాయాలకు తగినన్ని అవకాశాలిస్తే 2027 వరల్డ్కప్ సమయానికి రాటుదేలతారని వారి అంచనా. ఇవన్ని దృష్టిలో పెట్టుకొని బీసీసీయే రోహిత్, కోహ్లిలను బలవంతంగా వన్డేల నుంచి తప్పుకునేలా చేస్తుందన్న వాదన వినిపిస్తుంది. ఇందులో భాగంగానే వారి పేర్లను వన్డే ర్యాంకింగ్స్ నుంచి తొలగించేలా ఐసీసీకి లేఖ రాసి ఉంటుందని ప్రచారం జరుగుతుంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ.. ఇదే జరిగి ఉంటుందని రోహిత్, కోహ్లి అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంటే, వన్డే ర్యాంకింగ్స్ నుంచి రోహిత్, కోహ్లి పేర్లు తొలగింపు తర్వాత కూడా శుభ్మన్ గిల్ టాప్ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. బాబర్ ఆజమ్ రెండో స్థానానికి ఎగబాకాడు. టీమిండియా నుంచి శ్రేయస్ అయ్యర్ ఆరో స్థానంలో ఉన్నాడు. -
‘గిల్ కాదు!.. రోహిత్ తర్వాత వన్డే కెప్టెన్గా అతడే ఉండాలి’
టీమిండియాకు ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లు ఉన్నారు. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ను చాంపియన్గా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ (Rohit Sharma) అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలకగా.. సూర్యకుమార్ యాదవ్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు.భారత టీ20 జట్టు కెప్టెన్గా రేసులో ముందున్న ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)ను కాదని మేనేజ్మెంట్ సూర్య వైపు మొగ్గు చూపింది. మరోవైపు.. ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనకు ముందే రోహిత్ టెస్టులకు కూడా గుడ్బై చెప్పేశాడు. దీంతో యువ ఆటగాడు శుబ్మన్ గిల్ (Shubman Gill) టీమిండియా టెస్టు ఫార్మాట్ సారథిగా పగ్గాలు చేపట్టాడు.సత్తా చాటుతున్న సూర్యఅయితే, వన్డేల్లో మాత్రం రోహిత్ శర్మనే కెప్టెన్గా కొనసాగుతున్నాడు. ఏదేమైనా రోహిత్ రిటైర్మెంట్ నిర్ణయం తర్వాత టీ20లలో సూర్య వరుస విజయాలతో అతడికి సరైన వారసుడు అనిపించుకుంటుండగా.. గిల్ సైతం కెప్టెన్గా మొదటి ప్రయత్నంలోనే మంచి మార్కులు సాధించాడు.ఇంగ్లండ్ గడ్డ మీద రాణించిన గిల్ఇంగ్లండ్ గడ్డ మీద బ్యాటర్గా 754 పరుగులు సాధించి రికార్డులు కొల్లగొట్టిన గిల్.. సారథిగా సిరీస్ను 2-2తో సమం చేసి సత్తా చాటాడు. ఇక అంతకంటే ముందు.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025ని రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.తద్వారా రెండో ఐసీసీ ట్రోఫీ సాధించి.. మహేంద్ర సింగ్ ధోని (3) తర్వాత.. అత్యధిక టైటిళ్లు గెలిచిన కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ వన్డే వరల్డ్కప్-2027 వరకు సారథిగా కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వన్డేల్లో రోహిత్ వారసుడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.గిల్ కాదు!.. రోహిత్ తర్వాత వన్డే కెప్టెన్గా అతడే ఉండాలిరోహిత్ శర్మ తర్వాత భారత వన్డే జట్టుకు కెప్టెన్ అయ్యే అర్హత శ్రేయస్ అయ్యర్కే ఉందని అంబటి రాయుడు అన్నాడు. ‘‘అద్భుతమైన నైపుణ్యాలతో గతేడాది ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ను చాంపియన్గా నిలిపాడు.ఈ ఏడాది.. యువకులతో కూడిన పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్కు చేర్చాడు. అతడొక అసాధారణ నైపుణ్యాలున్న కెప్టెన్. త్వరలోనే అతడు టీమిండియా కెప్టెన్గా నియమితుడు కావాలి’’ అని శుభంకర్ మిశ్రా చానెల్లో రాయుడు పేర్కొన్నాడు.వన్డేలలో సూపర్ హిట్కాగా టీ20, వన్డే జట్లకు కూడా త్వరలోనే శుబ్మన్ గిల్ కెప్టెన్ కానున్నాడనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇలాంటి సమయంలో రాయుడు మాత్రం ఈ మేరకు భిన్నంగా స్పందిస్తూ.. శ్రేయస్ అయ్యర్ పేరును ప్రస్తావించడం విశేషం. ఇదిలా ఉంటే.. భారత వన్డే జట్టులో ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కీలక ఆటగాడు. వన్డే వరల్డ్కప్-2023లో రెండు శతకాల సాయంతో 530 పరుగులు చేసిన అయ్యర్.. చాంపియన్స్ ట్రోఫీలో 243 పరుగులు సాధించాడు. భారత్ ఈ టైటిల్ గెలవడంలో శ్రేయస్ అయ్యర్దే కీలక పాత్ర. చదవండి: నాన్సెన్స్.. అసలేం అనుకుంటున్నారు?: రోహిత్, కోహ్లి, గిల్పై మాజీ క్రికెటర్ ఆగ్రహం -
అసలేం అనుకుంటున్నారు?: రోహిత్, కోహ్లి, గిల్పై మాజీ క్రికెటర్ ఆగ్రహం
టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ తీరుపై భారత మాజీ క్రికెటర్ కర్సన్ ఘవ్రీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దిగ్గజ బ్యాటర్ సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) కు కనీస మర్యాద ఇవ్వకుండా ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డాడు. అనుభవం, నైపుణ్యం ఉన్న లెజెండ్ సలహాలు ఇస్తే.. వాటిని సానుకూల దృక్పథంతో స్వీకరించాలే తప్ప.. ప్రతి విమర్శలు చేస్తారా? అంటూ ఫైర్ అయ్యాడు.పాతికేళ్లకు పైగా..భారత దిగ్గజ క్రికెటర్లలో ఒకడిగా పేరొందిన సునిల్ గావస్కర్.. ఆ తర్వాత కామెంటేటర్గా అవతారమెత్తాడు. పాతికేళ్లకు పైగా తన వ్యాఖ్యానంతో ప్రేక్షకులను అలరిస్తూ.. మైదానంలో ఆటగాళ్లు చేసే తప్పులను విశ్లేషిస్తూ విమర్శలు చేస్తూంటాడు ‘లిటిల్ మాస్టర్’. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ (Shubman Gill) ఆట తీరును సందర్భానుసారం విమర్శిస్తూ కామెంట్లు చేశాడు.కోహ్లి కౌంటర్.. రోహిత్ ఫిర్యాదు!ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఐపీఎల్లో కోహ్లి స్ట్రైక్ రేటును ప్రస్తావించడం.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియా కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మపై గావస్కర్ చేసిన విమర్శలను వాళ్లు తేలికగా తీసుకోలేకపోయారు. తాను స్ట్రైక్రేటు గురించి కాకుండా .. జట్టు ప్రయోజనాల కోసమే ఆడతానని కోహ్లి స్పష్టం చేయగా.. గావస్కర్ కామెంట్రీపై రోహిత్ శర్మ ఏకంగా బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి.గిల్కు ఆయన అవసరం ఎంతగానో ఉందిఈ పరిణామాల నేపథ్యంలో గావస్కర్ సహచర ఆటగాడు కర్సన్ ఘవ్రీ.. నవతరం ఆటగాళ్ల తీరు సరిగ్గా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘గత 25 ఏళ్లకు పైగా గావస్కర్ కామెంట్రీ చేస్తున్నాడు. యువ ఆటగాళ్లకు ఆయన మాటలు విలువైన సలహాలు. కానీ.. మన ఆటగాళ్లలో కొందరు మాత్రం సలహాల కోసం గావస్కర్ వద్దకు వెళ్లనే వెళ్లరు.విదేశీ ఆటగాళ్లు గావస్కర్ సలహాల కోసం వస్తుంటే.. మనోళ్లు మాత్రం ఆయనను పట్టించుకోరు. ఇప్పుడు భారత జట్టులో ఉన్న ప్రతీ ఆటగాడు కచ్చితంగా గావస్కర్ వద్దకు వెళ్లాలి. ముఖ్యంగా శుబ్మన్ గిల్కు ఆయన అవసరం ఎంతగానో ఉంది.విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ల ఆటను గావస్కర్ విమర్శించాడని వార్తలు వస్తాయే తప్ప.. సలహాల కోసం వాళ్లు ఆయనను సంప్రదించినట్లు ఎక్కడా కనబడదు. ఏదేమైనా గావస్కర్ సలహాలు ఇస్తే దానిని స్వీకరించకపోవడం నాన్సెన్స్ అనే చెప్పాలి.ఎవరైతే ఏంటి? అసలేం అనుకుంటున్నారు?నువ్వు రోహిత్ శర్మ లేదంటే విరాట్ కోహ్లి అయితే ఏంటి?.. దిగ్గజాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. గావస్కర్ ఏం చెప్పినా అది మీ మంచి కోసమే. అంతెందుకు రవిశాస్త్రి కూడా విమర్శలు చేస్తాడు. అయితే, గావస్కర్ తనదైన శైలిలో మంచీ, చెడూ విశ్లేషిస్తాడు’’ అని మాజీ పేసర్ కర్సన్ ఘవ్రీ విక్కీ లల్వాణీ పాడ్కాస్ట్లో పేర్కొన్నాడు.చదవండి: ఆసియా కప్- 2025: అభిషేక్ శర్మకు జోడీగా.. వైభవ్ సూర్యవంశీ ఉండాలి: మాజీ కెప్టెన్ -
అప్పుడు ధోనీ, ఇప్పుడు రోహిత్ పొగరు ప్రో మ్యాక్స్ భయ్యా
-
విరాట్, రోహిత్ రిటైర్మెంట్ వెనుక కుట్ర..? మాజీ ప్లేయర్ సంచలన కామెంట్స్
భారత టెస్టు క్రికెట్ చరిత్రలో రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ తమకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు. భారత క్రికెట్కు డాదాపు 16 ఏళ్ల పాటు తమ సేవలను అందించిన ఈ ఇద్దరి లెజెండరీ క్రికెటర్లకు సరైన వీడ్కోలు మాత్రం లభించింది.ఈ కోవకు చెందిన వారే టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు. వారిద్దరూ కూడి ఎటువంటి వీడ్కోలు లేకుండా తమ టెస్టు కెరీర్లను ముగించారు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్, కోహ్లిలు వారం రోజుల వ్యవధిలో టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి అందిరికి షాకిచ్చారు.ఈ సీనియర్ ద్వయం లేకుండానే ఇంగ్లండ్కు వెళ్లిన భారత జట్టు ఐదు మ్యాచ్ల సిరీస్ను 2-2తో సమంగా ముగించింది. అయితే తాజాగా రోహిత్, కోహ్లి రిటైర్మెంట్లపై భారత మాజీ ఆల్ రౌండర్ కర్సన్ ఘావ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐలో రాజకీయాల వల్లే వారిద్దరూ త్వరగా రిటైరయ్యారని ఆయన ఆరోపించాడు."వరల్డ్ క్రికెట్లో ప్రస్తుతం అత్యంత ఫిట్గా ఉండే క్రికెటర్లలో విరాట్ కోహ్లి ఒకడు. మరో మూడేళ్ల పాటు భారత జట్టు తరపున ఆడే సత్తా కోహ్లికి ఉంది. అటువంటిది ఆకస్మికంగా కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించడం వెనక కొన్ని శక్తులు ఉన్నాయని నేను అనుకుంటున్నాను.అంతేకాకుండా సుమారు 14 ఏళ్ల పాటు భారత జట్టుకు తన సేవలను అందించిన విరాట్కు బీసీసీఐ కనీసం ఫేర్వెల్ కూడా ఏర్పాటు చేయలేదు. కోహ్లి, రోహిత్ వంటి ఆటగాళ్లు ఘనమైన వీడ్కోలుకు ఆర్హులు. ఇది బీసీసీఐలోని అంతర్గత రాజకీయాల కారణంగా జరిగింది.దీనిని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ కారాణాలతోనే కోహ్లి త్వరగా రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్ శర్మ కూడా కావాలనుకుంటే మరి కొన్నాళ్ల పాటు ఆడేవాడు. కానీ కొంత మంది బీసీసీఐ పెద్దలు అతడిని జట్టు నుంచి బయటకు పంపాలని చూశారు. వారు కోరుకున్న విధంగానే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాడని" విక్కీ లాల్వానీ షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఘావ్రీ పేర్కొన్నాడు. -
గిల్కు వారిద్దరి సపోర్ట్ కావాలి.. లేదంటే కష్టమే: సురేష్ రైనా
టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్లో వీరిద్దరూ భారత జెర్సీలో కన్పించనున్నారు. అయితే ఈ సిరీస్ తర్వాత రోహిత్, కోహ్లిలు ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వన్డే వరల్డ్కప్-2027 కోసం వారిద్దరూ స్ధానంలో యువ ఆటగాళ్లను సిద్దం చేసే యోచనలో సెలక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో రో-కో వన్డే భవిష్యత్తుపై టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే ఫార్మాట్లో రోహిత్, కోహ్లి సేవలు భారత జట్టుకు కచ్చితంగా అవసరమని రైనా అభిప్రాయపడ్డాడు."ప్రస్తుత భారత వన్డే జట్టులో నంబర్ 1, నంబర్ 3లో సరైన ఆటగాళ్లు లేరు. ప్రత్యేకంగా ఛేజింగ్లో ఆయా స్ధానాల్లో నిలకడగా రాణించే ఆటగాళ్లు కావాలి. కాబట్టి ఎంతో అనుభవం ఉన్న రోహిత్, విరాట్ భారత జట్టులో కొనసాగాలి. వారిద్దరి తమ సేవలను టీమిండియాకు మరి కొన్నాళ్లపాటు అందించాలి. ఇక శుబ్మన్ గిల్ ఇంగ్లండ్ పర్యటనలో అద్బుతంగా రాణించాడు.వన్డే జట్టును కూడా నడిపించగలడు. కానీ గిల్కు విరాట్, రోహిత్ లాంటి ఆటగాళ్లు అవసరం. వారిద్దరూ వరల్డ్కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్ గెలిచిన జట్లలో సభ్యులుగా ఉన్నారు. ఇద్దరూ లెజెండరీ కెప్టెన్లు. కచ్చితంగా వారిద్దరూ భారత డ్రెస్సింగ్ రూమ్లో భాగం కావాలి" అని టెలికాం ఆసియా స్పోర్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైనా పేర్కొన్నాడు. కాగా భవిష్యత్తులో వన్డేల్లో కూడా భారత జట్టు పగ్గాలను గిల్కు అప్పగించే సూచనలు కన్పిస్తున్నాయి.చదవండి: అప్పటిలా కాదు.. అన్నీ మారిపోయాయి.. కోహ్లితో మాట్లాడాలంటే..: భువీ -
'రోహిత్ కెప్టెన్ కాకపోయింటే ఎప్పుడో పక్కన పెట్టేవారు'
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో సిడ్నీ వేదికగా ఆఖరి టెస్టుకు అప్పటి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. రోహిత్ తన పేలవ ఫామ్ కారణంగా తనంతట తానే సిడ్నీ టెస్టు నుంచి వైదొలిగాడు.కానీహెడ్ కోచ్ గౌతం గంభీర్ కావాలనే అతడిని జట్టు నుంచి తప్పించాడని రూమర్స్ వినిపించాయి. తాజాగా ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆల్రౌండర్, ఈ సిరీస్లో బ్రాడ్కాస్టర్ బృందంలో ఉన్న ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.రోహిత్ టెస్టు క్రికెట్లో ఇబ్బంది పడుతున్నప్పటికి రోహిత్కు బ్రాడ్కాస్టర్లు మద్దతుగా నిలిచారని ఇర్ఫాన్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ రోహిత్ కెప్టెన్ కాకపోయింటే అతడు ఎప్పుడో జట్టులో చోటు కోల్పోయే వాడని పఠాన్ అన్నారు."వైట్-బాల్ క్రికెట్లో రోహిత్ శర్మ అద్బుతమైన ఆటగాడు. కానీ టెస్టు క్రికెట్లో మాత్రం క్రమంగా ఫామ్లో స్థిరత్వం లోపించింది. ముఖ్యంగా గతేడాది అతడు సగటు చాలా పేలవంగా ఉంది. ఒకవేళ రోహిత్ కెప్టెన్ కాకపోయింటే ఎప్పుడో టెస్టు జట్టులో తన స్ధానాన్ని కోల్పోయేవాడు.రోహిత్ శర్మకు మేము అవసరానికి మించి మద్దతు ఇచ్చామని చాలా మంది విమర్శించారు. మీరు ఒకరిని ఇంటర్వ్యూకి ఆహ్వానించి వారితో తప్పుగా ప్రవర్తిస్తారా? వారు ఎటువంటి స్థితిలో ఉన్న మనం గౌరవంగా వ్యవహరించాలి. మేము కూడా ఆదే చేశాము.ఎందుకంటే అతడు మా అతిథి. అతడికి మేము సపోర్ట్గా నిలుస్తూనే, తన ఫామ్ను మెరుగుపరుచుకోవాలని మేము సూచించాము. కానీ అతడు అప్పటికే తుది జట్టులో చోటుకు అనర్హుడు" అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పఠాన్ పేర్కొన్నాడు.కాగా ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ అందరికి షాకిచ్చాడు. 38 ఏళ్ల హిట్మ్యాన్ తన కెరీర్లో 67 మ్యాచ్లు ఆడి 40.57 సగటుతో 4,301 పరుగులు సాధించాడు. రోహిత్ స్ధానంలో యువ ఆటగాడు శుబ్మన్ గిల్ కెప్టెన్గా ఎంపికయ్యాడు.చదవండి: సచిన్కు కాబోయో కోడలు సానియా ఆస్తి ఎంతో తెలుసా? -
'టీమిండియా మూడు ఫార్మాట్ల కెప్టెన్గా అతడే సరైనోడు'
భారత పురుషుల క్రికెట్ జట్టుకు మూడు ఫార్మాట్లలో వెర్వేరు కెప్టెన్లు ఉన్న సంగతి తెలిసిందే. వన్డేల్లో రోహిత్ శర్మ, టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్, టెస్టుల్లో శుబ్మన్ గిల్ టీమిండియా సారథిలుగా ఉన్నారు. రోహిత్ శర్మ టీ20, టెస్టుల నుంచి రిటైర్ కావడంతో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా ఈ ముగ్గురు కెప్టెన్ల విధానంపై బీసీసీఐ మాజీ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియాకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్గా శుబ్మన్ గిల్ను ఎంపిక చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు."ప్రస్తుతం శుబ్మన్ గిల్ను చూస్తుంటే 2017లో విరాట్ కోహ్లిలా కన్పిస్తున్నాడు. లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోని హయంలో విరాట్ బాగా రాటు దేలాడు. ఆ తర్వాత అతడి వారుసుడిగా కోహ్లి భారత జట్టు పగ్గాలు చేపట్టాడు. ఇప్పుడు గిల్ కూడా విరాట్ లాగే రోహిత్ సారథ్యంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. టెస్ట్ కెప్టెన్గా గిల్ను నియమించి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తన ముందుచూపును చాటుకున్నాడు. టీ20 ఫార్మాట్కు కూడా గిల్ సరిపోతాడు. 2026 టీ20 ప్రపంచకప్ తర్వాత సూర్యకుమార్ యాదవ్కు బదులుగా ఎవరు కెప్టెన్సీ తీసుకుంటారనే దానిపై బీసీసీఐ స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలి.ఇతర దేశాలు మాదిరిగా భారత్లో స్ప్లిట్ కెప్టెన్సీ దీర్ఘకాలంలో పనిచేయదు. అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్న ఒక ఆటగాడు ఒక ఫార్మాట్కు కెప్టెన్గా ఉన్నప్పుడు, మిగిలిన ఫార్మాట్లకు కూడా అతనే నాయకత్వం వహించాలి. గిల్ బ్యాటర్గా కూడా రాణించాడు.అంతేకాకుండా ఐపీఎల్లో కూడా అతడు సారథ్యం వహించాడు" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గాంధీ పేర్కొన్నాడు. కాగా రోహిత్ శర్మ భారత వన్డే జట్టు కెప్టెన్గా గిల్ ఎంపికయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.చదవండి: Asia Cup 2025: సంజూ శాంసన్కు నో ఛాన్స్..? ఆర్సీబీ స్టార్కు చోటు? -
పంజరంలో బంధిస్తామంటే ఎలా?: రితికా భావోద్వేగం.. మనసు కరిగేలా..
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సతీమణి రితికా సజ్దే (Ritika Sajdeh) తీవ్ర భావోద్వేగానికి లోనైంది. దేశ రాజధాని ప్రాంతం నుంచి వీధి కుక్కలను తొలగించాలంటూ సుప్రీం ఇచ్చిన ఆదేశాలపై స్పందిస్తూ ఉద్వేగపూరిత నోట్ రాసింది.మా హృదయ స్పందన‘‘వాళ్లు వీటిని ప్రమాదకారులు అంటున్నారు. మేము మాత్రం ఇవే మా హృదయ స్పందన అంటాము. ఢిల్లీ- ఎన్సీఆర్ ప్రాంతంలోని వీధి కుక్కలన్నింటినీ బంధించి.. అక్కడి నుంచి పంపించి వేయాలని సుప్రీం కోర్టు అంటోంది.నైట్ గార్డుల్లా సూర్యోదయం లేదు.. స్వేచ్ఛా లేదు.. వాటిని ప్రతి ఉదయం పలకరించే ముఖాలు కూడా కనబడవు. అయినా.. ఇవి కేవలం ‘వీధి కుక్కలు’ మాత్రమే కాదు. ఒక్క బిస్కెట్ కోసం టీ స్టాల్ దగ్గర పడిగాపులు పడుతూ ఉంటాయి. రాత్రుళ్లు షాప్కీపర్లకు సాయంగా నైట్ గార్డుల్లా చెప్పకుండానే డ్యూటీ చేస్తాయి.స్కూల్ నుంచి పిల్లలు తిరిగి వస్తుంటే వారిని చూసి ప్రేమగా తోక ఊపుతాయి. చలిలో.. తమను పట్టించుకోని సిటీకి కాపలా కాస్తుంటాయి. అవును.. కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవమే. కుక్కకాట్లు, వాటి వల్ల కలిగే నష్టం కూడా ఉంది.పంజరంలో బంధిస్తామంటే ఎలా?అంతమాత్రాన జాతి మొత్తాన్ని పంజరంలో బంధిస్తామంటే ఎలా? ఇదెలాంటి పరిష్కారం? అసలు స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారా? రెగ్యులర్గా వాక్సినేషన్లు వేస్తున్నారా? కమ్యూనిటీ ఫీడింగ్ జోన్లు ఉన్నాయా. దత్తత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా?.. వీటి ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొనవచ్చు.నోరులేని మూగజీవాలు.. పాపంఅప్పుడు వాటిని శిక్షించాల్సిన పని ఉండదు. బంధించాల్సిన అవసరమూ ఉండదు. నోరులేని మూగజీవాలను కాపాడలేని సమాజం.. తన ఆత్మనే కోల్పోతుంది. ఈరోజు ఈ కుక్కలు.. రేపు మరోటి? ఇప్పటికైనా అందరూ గొంతెత్తండి. ఎందుకంటే పాపం వాటికి నోరు లేదు. ఈ సందేశాన్ని వ్యాప్తి చేయండి’’ అంటూ రితికా సజ్దే తీవ్ర భావోద్వేగానికి లోనైంది.కాగా దేశ రాజధాని ప్రాంతంలో ఇటీవలి వీధి కుక్కల వరుస దాడుల వల్ల పసిపిల్లలు, వృద్ధులు పడుతున్న బాధలు, రేబిస్ బారిన పడి మరణించిన వ్యక్తుల గురించి మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. వీటిని సుమోటోగా స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టి.. 8 వారాల్లోపు వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.ప్రజల మేలు కోసమే..అంతేకాదు.. ఈ చర్యలను అడ్డుకోవాలని చూస్తే జంతు ప్రేమికులుగా చెప్పుకొనే వాళ్లు కూడా తీవ్ర పరిణామాలు చవిచూడక తప్పదని హెచ్చరించింది. ప్రజల మేలు కోసం చేసే పనులను అడ్డుకోవడం సరికాదని పేర్కొంది. ఈ నేపథ్యంలో జంతు ప్రేమికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నోరులేని మూగజీవాల పట్ల ఇంత కఠినంగా ఉండవద్దని న్యాయస్థానానికి విన్నవిస్తున్నారు. ఈ క్రమంలో రితికా సజ్దే సైతం సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకుంది.చదవండి: వీధి కుక్కల తీర్పుపై సుప్రీం కోర్టు యూటర్న్? -
ఐదు నెలలగా ఆటకు దూరం.. అయినా బాబర్ను వెనక్కి నెట్టిన రోహిత్
ఓ వైపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై సందిగ్ధం కొనసాగుతుండగా.. మరోవైపు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో మాత్రం హిట్మ్యాన్ తన స్ధానాన్ని మెరుగుపరుచుకున్నాడు. గత ఐదు నెలలగా 50 ఓవర్ల క్రికెట్కు రోహిత్ దూరంగా ఉన్నప్పటికి తాజా ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో రెండో స్ధానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో దారుణంగా విఫలమైన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం 5 రేటింగ్ పాయింట్లు కోల్పోయి మూడో ర్యాంక్కు పడిపోయాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ 756 రేటింగ్ పాయింట్లతో బాబర్ ర్యాంక్ను ఆక్రమించాడు.బాబర్ ఖాతాలో ప్రస్తుతం 751 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. కాగా ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ అగ్రస్ధానంలో టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ 784 రేటింగ్ పాయింట్లతో కొనసాగుతున్నాడు. నాలుగో స్ధానంలో టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లి నిలిచాడు.రోహిత్ చివరిగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత తరపున ఆడాడు. తన అద్బుతమైన నాయకత్వంతో భారత్కు ఏడో ఐసీసీ టైటిల్ను అందించాడు. ఈ మెగా టోర్నీలో రోహిత్ ఐదు మ్యాచ్లు ఆడి 180 పరుగులు చేశాడు.భారత తరపున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రోహిత్ నాలుగో స్ధానంలో నిలిచాడు. కానీ టీమిండియా టాప్-ఆర్డర్ బ్యాటర్లలో అత్యధిక స్ట్రైక్-రేట్ను మాత్రం శర్మనే కలిగి ఉన్నాడు. ఈ ఏడాది నవంబర్లో రోహిత్ను తిరిగి భారత జెర్సీలో చూసే అవకాశముంది.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో రోహిత్తో పాటు విరాట్ కోహ్లి కూడా ఆడనున్నాడు. ఈ సిరీస్ తర్వాత రోకో ద్వయం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వన్డే ప్రపంచకప్-2027ను దృష్టిలో పెట్టుకుని వారిద్దరి స్దానంలో యువ ఆటగాళ్లను సిద్దం చేసేందుకు సెలక్టర్లు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రోహిత్ శర్మ స్ధానంలో వన్డే కెప్టెన్గా గిల్ను నియమించాలని అజిత్ అగార్కర్ అండ్ కో భావిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాడు. రోహిత్ శర్మ వారుసుడిగా భారత టెస్టు జట్టు పగ్గాలను చేపట్టిన గిల్.. తన తొలి సిరీస్లోనే ఆకట్టుకున్నాడు. గిల్ సారథ్యంలోని భారత జట్దు ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేసింది.చదవండి: బాబర్ ఆజం వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన గిల్.. ఆ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్గా.. -
రోహిత్ శర్మ సన్నద్ధత
ముంబై: భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ కొంత విరామం తర్వాత మళ్లీ క్రికెట్ మైదానంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో ఫిట్నెస్కు పదును పెడుతున్నాడు. తన మిత్రుడు, వ్యక్తిగత కోచ్ అయిన అభిషేక్ నాయర్తో కలిసి అతను మంగళవారం జిమ్ ట్రైనింగ్లో పాల్గొన్నాడు. రోహిత్ ఇప్పటికే టెస్టులు, టి20లనుంచి రిటైర్ కావడం, అన్ని ఫార్మాట్లలో కొత్త ఆటగాళ్లు సత్తా చాటుతుండటంతో వన్డేల్లో కూడా అతను కొనసాగే అంశంపై ఇటీవల చర్చ మొదలైంది. 2027 వన్డే వరల్డ్ కప్లో ఆడాలనే లక్ష్యంతో రోహిత్ ఉన్నా... ఇప్పటికిప్పుడు దీనిపై ఇంకా స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో నాయర్ పర్యవేక్షణలోనే రోహిత్ త్వరలోనే నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్కు దిగే అవకాశం ఉంది. అతను చివరిసారిగా జూన్ 1న ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత భారత టెస్టు జట్టు ఇంగ్లండ్లో పర్యటించగా... రోహిత్ కూడా అదే సమయంలో ఇంగ్లండ్లోనే సరదాగా సెలవులు గడిపాడు. ఇప్పుడు విరామం తర్వాత మళ్లీ క్రికెట్పై దృష్టి పెట్టాడు. భారత్ తమ తర్వాతి వన్డేలో అక్టోబర్ 19న ఆ్రస్టేలియాలో బరిలోకి దిగుతుంది. 2025–26 సీజన్లో టీమిండియా మరో 9 వన్డే మ్యాచ్లు మాత్రమే ఆడనుంది. ఆసీస్ టూర్తో పాటు స్వదేశంలోనే దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్లతో భారత్ తలపడుతుంది. భవిష్యత్తు సంగతి ఎలా ఉన్నా... ప్రస్తుతానికి రోహిత్ వన్డేల్లో టాప్ బ్యాటర్గానే కొనసాగుతున్నాడు. 11,168 పరుగులు మాత్రమే కాదు, 32 సెంచరీలు, మూడు డబుల్ సెంచరీలతో అతనికి ఘనమైన రికార్డు ఉంది. భారత్ ఆడిన తమ చివరి టోర్నీ చాంపియన్స్ ట్రోఫీలో కెపె్టన్గా జట్టును విజేతగా నిలపడంతో పాటు ఫైనల్లో రోహిత్ స్వయంగా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన విషయం గమనార్హం. -
కొత్త కారు కొన్న రోహిత్ శర్మ.. ఎన్ని కోట్లంటే?
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ గ్యారేజ్లో మరో కొత్త కారు వచ్చి చేరింది. రోహిత్ ఎరుపు రంగు లాంబోర్గిని ఉరుస్ కారును కొనుగోలు చేశాడు. కొన్ని రోజుల క్రితమే ఈ లగ్జరీ కారు ముంబైలోని రోహిత్ ఇంటికి డెలివరీ అయింది.కాగా హిట్మ్యాన్ గతంలో కూడా నీలం రంగు లాంబోర్గిని ఉరుస్ కారు ఉండేది. అయితే ఆ కారును డ్రీమ్11 కాంటెస్ట్ విజేతకు అందజేయడంతో.. ఇప్పుడు కొత్త లాంబోర్గిని కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఈ కాస్ట్లీ కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ క్రమంలో అతడి కారు నంబర్ 3015ను అభిమానులు డీకోడ్ చేశారు. '3015' అనే సంఖ్య హిట్మ్యాన్ ఇద్దరు పిల్లల పుట్టినరోజులను సూచిస్తుంది. డిసెంబర్ 30 రోహిత్ కుమార్తె సమీరా బర్త్డే కాగా.. నవంబర్ 15 హిట్మ్యాన్ కొడుకు అహాన్ పుట్టిన రోజు.అంతేకాకుండా మొత్తం అంకెల్ను కలిపితే రోహిత్ జెర్సీ నంబర్ 45 వస్తోంది. రోహిత్ పాత కారుకు 264 నెంబర్ ఉండేది. ఆ నెంబర్ .. వన్డేల్లో రోహిత్ చేసిన అత్యధిక స్కోర్న్ సూచిస్తోంది. కాగా కొత్త ఉరుస్ ఎస్ఈ కారు ధర రూ. 4.57 కోట్లగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇక టెస్టు, టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఈ ఏడాది నవంబర్లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్లో రోహిత్ను అభిమానులు భారత జెర్సీలో చూసే అవకాశముంది.చదవండి: Mohammed Shami: ‘సెలక్టర్లు అతడిని తప్పించలేదు.. తనే తప్పుకొన్నాడు’ -
క్రికెట్లో కలకాలం నిలిచిపోయే రికార్డులు.. ఎవ్వరూ బ్రేక్ చేయలేరు!
ఏ ఆటలోనైనా రికార్డులు ఉండేదే బద్దలు కొట్టడానికి అంటారు. ఇటీవల జింబాబ్వేతో టెస్టులో క్వాడ్రపుల్ సెంచరీ (400)కి చేరువైన వేళ సౌతాఫ్రికా క్రికెటర్ వియాన్ ముల్దర్ (Wiaan Muldar).. తాను 367 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న వేళ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు.అనంతరం ముల్దర్ మాట్లాడుతూ.. వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా (Brian Lara) పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టడం ఇష్టం లేకే తాను ఈ పనిచేశానని వెల్లడించాడు. అయితే, లారా మాత్రం పైన చెప్పిన విధంగా.. ‘రికార్డులు ఉన్నవి బద్దలు కొట్టడానికే.. ఇంకోసారి ఇలాంటి అవకాశం వస్తే చేజార్చుకోవద్దు’ అని సుతిమెత్తగానే మందలించాడు.ఏదేమైనా.. ప్రస్తుతానికి అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా లారా ప్రపంచ రికార్డు అలాగే ఉండిపోయింది. మరి క్రికెట్ చరిత్రలో ఎన్నటికీ బ్రేక్ కాని ఇలాంటి టాప్-10 రికార్డులను కలిగి ఉన్న ప్లేయర్లు ఎవరో తెలుసుకుందామా?!1. సర్ జాక్ హాబ్స్ఇంగ్లండ్ బ్యాటింగ్ దిగ్గజం సర్ జాక్ హాబ్స్ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఏకంగా 61,760 పరుగులు సాధించాడు. ఇందులో 199 సెంచరీలు, 273 అర్ధ శతకాలు ఉన్నాయి. సగటు 50.70. 1905- 1934 మధ్య కాలంలో సర్ జాక్ హాబ్స్ ఈ మేర పరుగుల వరద పారించాడు. ఆధునిక తరంలో ఏ క్రికెటర్ కూడా ఈ ఫీట్ను కనీసం టచ్ చేయలేడని చెప్పవచ్చు.2. సర్ డాన్ బ్రాడ్మన్ఆస్ట్రేలియా లెజెండరీ బ్యాటర్ సర్ బ్రాడ్మన్ 52 టెస్టుల్లో కలిపి 6996 పరుగులు సాధించాడు. ఇందులో 5028 పరుగులు 12 డబుల్ సెంచరీల ద్వారా వచ్చినవే. సగటు 99.94. ప్రపంచ క్రికెట్లో ఇంత వరకు ఇంత గొప్ప యావరేజ్తో టెస్టుల్లో పరుగులు సాధించనేలేదు.3. ముత్తయ్య మురళీధరన్శ్రీలంక స్పిన్ దిగ్గజం టెస్టుల్లో 800, వన్డేల్లో 534, టీ20లలో 13 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో అతడు తీసిన వికెట్ల సంఖ్య 1347. ఇప్పట్లోనే కాదు.. కెరీర్ వ్యవధి రోజురోజుకీ తగ్గిపోతున్న ఆధునిక క్రికెట్ యుగంలో ఇక ముందు కూడా ఎవరికీ ఈ మేర వికెట్లు తీయడం సాధ్యంకాదనే చెప్పవచ్చు.4. సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar)టీమిండియాకు ఎనలేని గుర్తింపు తెచ్చిన.. ‘మాస్టర్ బ్లాస్టర్’, క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ 22 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 463 వన్డేలు ఆడాడు. 49 శతకాలు, 96 హాఫ్ సెంచరీల సాయంతో 18,426 పరుగులు సాధించాడు. అత్యుత్తమ స్కోరు 200 నాటౌట్. ఈ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం ఎవరితరం కాకపోవచ్చు.5. జేసన్ గిల్లెస్పిబంగ్లాదేశ్తో 2006 నాటి టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియా ఫాస్ట్బౌలర్ జేసన్ గిల్లెస్పి నైట్ వాచ్మన్గా టాపార్డర్లో బ్యాటింగ్కు వచ్చాడు. నాటి మ్యాచ్లో ఏకంగా 201 పరుగులు సాధించాడు. నైట్ వాచ్మన్గా వచ్చి ఈ మేర డబుల్ సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడు గిల్లెస్పి.6. రోహిత్ శర్మభారత దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేల్లో ఏకంగా మూడు డబుల్ సెంచరీలు సాధించాడు. అత్యుత్తమ స్కోరు 264. శ్రీలంకతో 2014 నాటి మ్యాచ్లో రోహిత్ 33 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో ఈ మేర భారీ స్కోరు సాధించాడు. చెక్కుచెదరని ఈ రికార్డుకు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు.7. క్రిస్ గేల్ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో వెస్టిండీస్ స్టార్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఆర్సీబీ తరఫున పుణె వారియర్స్పై భారీ అజేయ శతకం సాధించాడు. 66 బంతుల్లోనే 175 పరుగులు సాధించి నాటౌట్గా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ హయ్యస్ట్ స్కోరు కావడం విశేషం.8. మిస్బా ఉల్ హక్పాకిస్తాన్ ఫినిషర్ వన్డేల్లో 5000కు పైగా పరుగులు సాధించాడు. కెరీర్లో ఒక్క సెంచరీ కూడా సాధించకుండానే ఈ మైలురాయిని చేరుకున్న ఏకైక క్రికెటర్ మిస్బా ఉల్ హక్.9. జిమ్ లేకర్ఇంగ్లండ్ స్పిన్నర్ 1956లో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో తొమ్మిది.. రెండో ఇన్నింగ్స్లో పది వికెట్లు తీశాడు. ఇప్పటి వరకు సింగిల్ టెస్టులో ఏ బౌలర్ కూడా మళ్లీ ఈ ఫీట్ను నమోదు చేయలేకపోయాడు.10. చమిందా వాస్శ్రీలంక లెఫ్టార్మ్ బౌలర్ చమిందా వాస్ జింబాబ్వేతో మ్యాచ్ సందర్భంగా వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. 2001లో జింబాబ్వేతో వన్డేలో అతడు కేవలం 19 పరుగులు ఇచ్చి.. ఏకంగా ఎనిమిది వికెట్లు కూల్చాడు.చదవండి: ధోని కాదు!.. ‘ప్రపంచంలో బెస్ట్ వికెట్ కీపర్ అతడే’ -
ఫామ్లో ఉంటే కొనసాగించాలి
కోల్కతా: భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలను వన్డే ఫార్మాట్లో కొనసాగించడమే ఉత్తమమని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో రోహిత్, కోహ్లి అసాధారణ క్రికెటర్లని... ఫామ్లో ఉంటే మరిన్ని రోజులు ఈ ఇద్దరినీ ఆడించాలని ‘దాదా’ సూచించాడు. మీడియాలో రోహిత్, కోహ్లి భవితవ్యంపైనే తరచూ ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఆ్రస్టేలియా పర్యటనతోనే ఇద్దరి అంతర్జాతీయ కెరీర్ ముగుస్తుందనే వార్తలపై స్పందించిన గంగూలీ ‘నాకు వాటి గురించి ఏమాత్రం తెలియదు. కాబట్టి వ్యాఖ్యానించను’ అని అన్నాడు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అతను మీడియాతో మాట్లాడుతూ ‘ఇద్దరి ఫామ్ను చూడాలి. బాగా ఆడుతుంటే కొనసాగించాలి. వన్డేల్లో కోహ్లిది అసాధారణ రికార్డు. రోహిత్ది కూడా! జట్టుకు భారంగా ఏమీ లేరు. బాధ్యతగానే రాణిస్తున్నారు. అలాంటపుడు ఈ ఫార్మాట్లో కొనసాగించడంలో తప్పేముంది’ అని అన్నాడు. కోహ్లి, రోహిత్ ఇదివరకే టి20, టెస్టులకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. టీమిండియానే ఫేవరెట్... వచ్చే నెలలో జరిగే ఆసియా కప్ టి20 టోర్నీలో భారతే ఫేవరెట్ అని గంగూలీ అన్నాడు. ‘టెస్టుల్లో భారత్ ఎంతటి కఠినమైన ప్రత్యర్థో ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనలో చాటుకుంది. వన్డే, టి20ల్లో కూడా మన జట్టు మేటిగా ఉంది. దుబాయ్ వేదికపై భారత్ తప్పకుండా సత్తా చాటుకుంటుంది. కొత్త కెప్టెన్ శుబ్మన్ గిల్ మంచి నాయకుడు. అతనికి మంచి భవిష్యత్తు ఉంది’ అని ‘దాదా’ చెప్పాడు. సభ్యుల సహకారంతో బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్ష పదవికి మరోసారి పోటీ పడతానని గంగూలీ తెలిపాడు. 2015 నుంచి 2019 వరకు ‘క్యాబ్’ అధ్యక్షుడిగా కొనసాగిన గంగూలీ... తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగానూ పని చేశాడు. తదుపరి వన్డే ప్రపంచకప్ 2027లో జరగనుంది. ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అప్పటివరకు కోహ్లి, రోహిత్ ఆడతారనే స్పష్టత ఎవరికీ లేదు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా పర్యటనతోనే ఆ ఇద్దరి భవితవ్యం తేలిపోతుందనే చర్చ మీడియాలో జోరందుకుంది. అక్టోబర్ 19న ఆ్రస్టేలియా టూర్ మొదలవుతుంది. పెర్త్, అడిలైడ్, సిడ్నీ వేదికలపై టీమిండియా మూడు వన్డేలు ఆడుతుంది. అలాగే స్వదేశంలో దక్షిణాఫ్రికాతోనూ మూడు వన్డేల ద్వైపాక్షకి సిరీస్లో పాల్గొంటుంది. వచ్చే క్యాలెండర్ ఇయర్లో న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్, వెస్టిండీస్లతో భారత్కు బిజీ షెడ్యూల్ ఉంది. -
'రోహిత్ ఒక మంచి స్పిన్నర్ అవుతాడనుకున్నా.. కానీ ఒక రోజు'
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్తో విరుచుకుపడడం అందరికి తెలిసిందే. కానీ హిట్మ్యాన్కు బంతితో కూడా మ్యాజిక్ చేసే సత్తా ఉంది. ఐపీఎల్లో అతడి పేరిట ఓ హ్యాట్రిక్ కూడా ఉంది. ఐపీఎల్-2009 సీజన్లో డక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన రోహిత్..ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో హ్యాట్రిక్ సాధించాడు. అయితే రోహిత్ శర్మ ఆఫ్ స్పిన్నర్ నుంచి పూర్తి స్ధాయి బ్యాటర్గా మారడంలో అతడి చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ది కీలక పాత్ర. తాజాగా ఓ పాడ్ కాస్ట్లో రోహిత్ క్రికెట్ జర్నీ గురించి దినేష్ లాడ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు."రోహిత్ శర్మను నేను తొలిసారి ఒక బౌలర్గా చూశాను. అప్పుడు అతడి వయస్సు దాదాపు 13 సంవత్సరాలు. ఆ సమయంలో రోహిత్ మా స్కూల్ టీమ్తో మ్యాచ్ ఆడాడు. అప్పుడే అతడిలో అద్బుతమైన టాలెంట్ ఉందని గుర్తించాను. దీంతో రోహిత్ను మా స్కూల్లో చేర్పంచమని అతడి మామతో చెప్పాను.ఆ తర్వాత రోహిత్ మా స్కూల్లో 1999లో చేరాడు. అతడికి బౌలింగ్ నేర్పించడం మొదలు పెట్టాను. అప్పటికి ఇంకా రోహిత్ ఏళ్లు లోపే ఉన్నుందన అండర్-14, అండర్-16 టోర్నీలో ఆడేందుకు సిద్దం చేయాలని నిర్ణయించుకున్నాను. ఒక మంచి ఆఫ్ స్పిన్నర్ అవుతాడనుకున్నా.కానీ ఒక రోజు నేను రోహిత్ బ్యాటింగ్ అద్బుతంగా చేస్తుండడం నేను చూశాను. బంతి పడేటప్పుడు అతడు తన బ్యాట్ను తీసుకురావడం నేను గమనించాను. వెంటనే అతడి దగ్గరకు వెళ్లి నీవు బ్యాటింగ్ కూడా చేయగలవా అని అడిగాను. అందుకు అతడు చేస్తాను సార్ అని సమాధానం చెప్పాడు.ఆ తర్వాత అతడి నెట్ ప్రాక్టీస్లో ఆరో స్ధానంలో బ్యాటింగ్ చేసే అవకాశమిచ్చాను. అంతకుముందు అతడికి ఒక్కసారి కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసే అవకాశమివ్వలేదు. అది నా తప్పు. లేదంటే అప్పుడు బ్యాటింగ్ గురుంచి నాకు తెలిసిండేంది.ఆ తర్వాత ఒక మ్యాచ్లో ఏడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చి 40 పరుగులు చేశాడు. రోహిత్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికి దురదృష్టవశాత్తూ మేము మ్యాచ్ ఓడిపోయాము. హారిస్ షీల్డ్ తర్వాత అండర్-14 ప్రాక్టీస్ ప్రారంభమైనప్పుడు నేను రోహిత్కు నెట్స్లో రెండు లేదా స్థానంలో బ్యాటింగ్ ఇవ్వడం ప్రారంభించాను.అతడికి బ్యాటింగ్లో చాలా మంచి ప్రతిభ ఉందని అన్పించింది. దీంతో అతడికి బౌలింగ్ బదులుగా బ్యాటింగ్పై ఎక్కువగా దృష్టిపెట్టమని చెప్పాను. రోహిత్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిని కొనసాగిస్తూ వచ్చాడు. ఇప్పుడు అతడు పూర్తిస్ధాయి బ్యాటర్గా ఉన్నాడని" ఓ యూట్యూబ్ ఛానల్ పాడ్ కాస్ట్లో లాడ్ పేర్కొన్నాడు.చదవండి: 'సిరాజ్ ఒక పోరాట యోధుడు'.. హైదరాబాదీపై పాక్ దిగ్గజం ప్రశంసలు -
కోహ్లి, రోహిత్ అభిమానులకు చేదు వార్త
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అభిమానులకు చేదు వార్త. ఈ భారత స్టార్ ద్వయం త్వరలోనే వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించి కెరీర్ను ముగిస్తారని సమాచారం. అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరుగబోయే సిరీసే వీరికి చివరిదని ఓ ప్రముఖ దినపత్రిక తమ కథనంలో పేర్కొంది. రోహిత్, కోహ్లి ఇప్పటికే టీ20లకు, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.కొద్ది రోజుల ముందు వరకు రోకో (రోహిత్, కోహ్లి) 2027 వన్డే వరల్డ్కప్ వరకు ఆడతారని ప్రచారం జరిగింది. అయితే తాజా నివేదిక ప్రకారం ఇది తప్పని తెలుస్తుంది. ఒకవేళ రోకో 2027 వరల్డ్కప్ ఆడాలని అనుకుంటే డిసెంబర్లో జరిగే విజయ్ హజారే ట్రోఫీలో తమను తాము నిరూపించుకోవాలని బీసీసీఐ ఆదేశించిందట.ఇంగ్లండ్ పర్యటనకు ముందు కూడా బీసీసీఐ రోహిత్, కోహ్లిలకు రంజీల్లో నిరూపించుకోవాలని కండీషన్ పెట్టింది. బోర్డు ఆదేశానుసారం వారు అలా చేసినా, అనూహ్యంగా టెస్ట్ల నుంచి తప్పుకున్నారు.ఇప్పుడు వన్డేల విషయంలోనూ రోకో గతంలో ఎదుర్కొన్న ఛాలెంజ్నే ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది. జట్టులోకి రావాలంటే తప్పక దేశవాలీ టోర్నీల్లో రాణించాల్సి ఉంటుంది.యువ ఆటగాళ్ల నుంచి ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఈ మేరకు నిర్ణయించినట్లు తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే రోహిత్, కోహ్లి 2027 వరల్డ్ కప్ వరకు ఆడటం అనుమానంగా కనిపిస్తుంది. వీరికి వయసు మీద పడినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇటీవల వైరలైన కోహ్లి తెల్ల గడ్డం ఫోటో ఇందుకు నిదర్శనం. పైకి కనిపించకపోయినా కోహ్లి కంటే రోహితే వయోభారం సమస్యలను అధికంగా ఎదుర్కొంటున్నాడు. రోహిత్ విషయానికొస్తే.. బాగా లావైపోయి ఆటకు పనికొస్తాడా అన్నట్లు కనిపిస్తున్నాడు. టీ20, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో వీరు ప్రాక్టీస్కు పెద్దగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపించడం లేదు. కోహ్లి లండన్లోనే మకాం వేసి అప్పుడప్పుడు బ్యాట్ను తిప్పుతుండగా.. రోహిత్ పూర్తిగా ప్రాక్టీస్ మానేసి కుటుంబంతో జాలీ ట్రిప్లు ఎంజాయ్ చేస్తున్నాడు. -
టీమిండియాలోకి ఎలా వచ్చావో మర్చిపోయావా జైస్వాల్..: రోహిత్
ముంబై జట్టును వీడాలని నిర్ణయించుకున్న టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నాడు. గోవాకు వెళ్లిపోవాలని నిశ్చయించుకున్న ఈ యువ ఆటగాడు తిరిగి ముంబైకే ఆడాలని ఫిక్సయ్యాడు. అయితే, జైసూ తన నిర్ణయం మార్చుకోవడానికి ప్రధాన కారణం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma).ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అధ్యక్షుడు అజింక్య నాయక్ వెల్లడించాడు. ‘‘ముంబై వంటి జట్టుకు ప్రాతినిథ్యం వహించడం ఎంతటి గర్వకారణమో రోహిత్ శర్మ.. యశస్వికి అర్థమయ్యేలా చెప్పాడు.టీమిండియాలోకి ఎలా వచ్చావో మర్చిపోవద్దురికార్డు స్థాయిలో 42సార్లు రంజీ ట్రోఫీ గెలిచిన ఘనమైన చరిత్ర ముంబైకి ఉంది. అంతేకాదు.. తన ప్రతిభను నిరూపించుకోవడానికి వేదికను కల్పించి.. టీమిండియాకు ఆడే స్థాయికి తీసుకువచ్చింది ముంబై అసోసియేషన్ అన్న విషయం మర్చిపోవద్దని రోహిత్.. యశస్వికి గుర్తు చేశాడు.ఇందుకు యశస్వి ముంబైకి రుణపడి ఉండాలని హితబోధ చేశాడు. ముంబైలోనే క్రికెట్ ప్రయాణం మొదలుపెట్టిన యశస్వి.. ఇక్కడ అన్ని ఏజ్ గ్రూపుల జట్లకు ఎంపికైన విషయాన్ని మర్చిపోవద్దని సూచించాడు.యశస్వి రిక్వెస్ట్.. మేము కూడా ఓకే చెప్పామురోహిత్ శర్మతో పాటు ముంబైకి ఆడిన మరి కొందరు దిగ్గజ క్రికెటర్లతో చర్చించిన తర్వాత యశస్వి జైస్వాల్ తనకు మంజూరు చేసిన నిరభ్యంతర పత్రాన్ని వెనక్కి తీసుకోవాలంటూ మాకు మరోసారి ఈ-మెయిల్ పంపాడు. తాను గోవా జట్టుకు మారడం లేదని తెలిపాడు. మేము అతడి అభ్యర్థనకు సానుకూలంగా స్పందించి ఆమోదం తెలిపాము’’ అని అజింక్య నాయక్ పేర్కొన్నట్లు ముంబై మిర్రర్ తన కథనంలో వెల్లడించింది.యూపీ నుంచి ముంబై.. టీమిండియా దాకా ఇలాకాగా ఉత్తరప్రదేశ్కు చెందిన యశస్వి జైస్వాల్ క్రికెటర్ కావాలన్న కలను నెరవేర్చుకునేందుకు పదకొండేళ్ల వయసులో ముంబైకి వచ్చాడు. అంచెలంచెలుగా ఎదిగి భారత్ అండర్-19 జట్టులో చోటు సంపాదించిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 2020 వరల్డ్కప్లో రన్నరప్గా నిలిచిన జట్టులో సభ్యుడు. అంతకంటే ముందు ముంబై తరఫున దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసి వెలుగులోకి వచ్చాడు.అయితే, ముంబై జట్టులోని సీనియర్ ఆటగాడితో విభేదాలు అంటూ వార్తలు వచ్చిన వేళ.. తాను గోవాకు ఆడాలనుకుంటున్నట్లు ఎంసీఏకు యశస్వి లేఖ రాశాడు. అయితే, కొన్నిరోజుల తర్వాత మళ్లీ ముంబైకే ఆడతానని స్పష్టం చేశాడు. కాగా యశస్వి జైస్వాల్ ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ ఆడాడు. ఆండర్సన్ - టెండుల్కర్ ట్రోఫీలో జైసూ మొత్తంగా 400 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి.ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20లు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ముంబై దిగ్గజం రోహిత్ శర్మ.. ప్రస్తుతం టీమిండియా వన్డే జట్టు కెప్టెన్గా కొనసాగుతున్నాడు. కాగా జైసూ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా తన టెస్టు కెరీర్ ఆరంభించిన విషయం తెలిసిందే.చదవండి: IND vs WI: అతడి ఖేల్ ఖతం.. శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీ పక్కా! -
ఆటగాళ్లు వస్తుంటారు.. పోతుంటారు: గంభీర్ స్పీచ్ వైరల్
ఇంగ్లండ్ గడ్డ మీద ఆద్యంతం ఆసక్తిగా సాగిన టెస్టు సిరీస్లో టీమిండియా మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా ఆఖరిదైన ఐదో టెస్టులో అసాధారణ రీతిలో పుంజుకుని ఆతిథ్య జట్టుపై విజయభేరి మోగించింది. తద్వారా ఓడిపోవడం ఖాయమనుకున్న ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)ని 2-2తో సమం చేసింది.దీంతో వరుస పరాజయాల తర్వాత హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)కు కాస్త ఊరట లభించింది. టెస్టు జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ (Shubman Gill)కు కూడా శుభారంభమే దక్కింది. అయితే, తుదిజట్టు విషయంలో కొన్ని అనూహ్య ఎంపికలు, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను సిరీస్ మొత్తానికి దూరంగా ఉంచడం వీరిద్దరిపై విమర్శలకు కారణమయ్యాయి.దిగ్గజాల రిటైర్మెంట్ తర్వాత..ఏదేమైనా స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్, కెప్టెన్ రోహిత్ శర్మ, దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత... అది కూడా విదేశీ గడ్డ మీద జరిగిన సిరీస్లో భారత్ ఈ మేర సఫలం కావడం హర్షించదగ్గ విషయమే. ఈ పరిణామాల నేపథ్యంలో హెడ్కోచ్ గౌతం గంభీర్ డ్రెసింగ్రూమ్లో చేసిన ప్రసంగం వైరల్గా మారింది.ఆటగాళ్లు వస్తుంటారు.. పోతుంటారు‘ఇక్కడ ఈ సిరీస్ను 2–2తో ముగియడం చాలా గొప్ప ఫలితం. అందరికీ నా అభినందనలు. అయితే మనం మెరుగుపడేందుకు ఇంకా అవకాశం ఉంటుంది. దాని కోసం మరింత కష్టపడుతూనే ఉండాలి. అలా చేస్తే సుదీర్ఘ కాలం టీమిండియా ప్రపంచ క్రికెట్ను శాసించగలదు.ఆటగాళ్లు వస్తుంటారు, పోతుంటారు. డ్రెస్సింగ్రూమ్లో సంస్కృతి ఎలా ఉండాలంటే అందరూ ఇందులో భాగం కావాలని కోరుకోవాలి. ఇదే మనం చేయాల్సిన పని’ అని గంభీర్ మార్గనిర్దేశనం చేశాడు. ఓవల్లో విజయం తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో గంభీర్ ఈ మేరకు ఆటగాళ్లతో ప్రత్యేకంగా మాట్లాడాడు.గొప్పగా అనిపించిందిఈ సందర్భంగా ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అనే ప్రత్యేక అవార్డును రవీంద్ర జడేజా చేతుల మీదుగా వాషింగ్టన్ సుందర్ అందుకున్నాడు. ‘ఇంగ్లండ్లో వరుసగా నాలుగు టెస్టులు ఆడే అవకాశం రావడం నా అదృష్టం. ఇక్కడ బాగా ఆడాలని ఎంతో కోరుకున్నాను. ప్రతీ రోజు మన జట్టు ఆడిన తీరు చాలా గొప్పగా అనిపించింది’ అని సుందర్ వ్యాఖ్యానించాడు.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్-2025 ఫలితాలు👉తొలి టెస్టు- హెడింగ్లీ, లీడ్స్- ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలుపు✊రెండో టెస్టు- ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్- 336 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం- ఈ వేదికపై భారత్కు ఇదే తొలి గెలుపు👉మూడో టెస్టు- లార్డ్స్, లండన్- 22 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లండ్🤝నాలుగో టెస్టు- ఓల్డ్ ట్రఫోర్డ్, మాంచెస్టర్- డ్రా✊ఐదో టెస్టు- కెన్నింగ్టన్ ఓవల్, లండన్- ఆరు పరుగుల తేడాతో టీమిండియా గెలుపు🤝సిరీస్ ఫలితం- 2-2తో సమంచదవండి: Asia Cup 2025: ఆసియా కప్లో గిల్, జైస్వాల్! View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
కోహ్లి, రోహిత్ శర్మ ఫ్యాన్స్కు భారీ షాక్?
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను అభిమానులు టీమిండియాలో జెర్సీలో చూసి దాదాపు 6 నెలలపైనే అవుతోంది. ఇంగ్లండ్ పర్యటనకు ముందు అనుహ్యంగా టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ దిగ్గజ క్రికెటర్లు.. కేవలం వన్డేల్లో మాత్రమే ఆడాలని నిర్ణయించుకున్నారు.అయితే ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటనలో విరాట్, రోహిత్లను చూడొచ్చని ఫ్యాన్స్ భావించారు. కానీ రాజకీయ, దౌత్యపరమైన పరిణామాలతో బంగ్లా పర్యటనను బీసీసీఐ రద్దు చేసింది. దీంతో అభిమానులకు నిరాశే మిగిలింది. తిరిగి వీరిద్దని ఆక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్లో చూసే అవకాశముంది. కానీ ఈ సీనియర్ ద్వయం వన్డే ప్రపంచకప్-2027లో ఆడడం అనుమానమే. వీరిద్దరి వన్డే భవిష్యత్తుపై బీసీసీఐ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇదే విషయంపై ఓ బీసీసీఐ సీనియర్ అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు."కోహ్లి, రోహిత్ శర్మ వన్డే ఫ్యూచర్పై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటాము. వన్డే ప్రపంచకప్-2027కు మాకు ఇంకా రెండు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం ఉంది. అప్పటికి కోహ్లి, రోహ్లి ఇద్దరి వయస్సు 40 సంవత్సరాలు దాటుతోంది. కాబట్టి ఈ మెగా ఈవెంట్ కోసం మేము స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. కొంతమంది యువ ఆటగాళ్లకు కూడా జట్టులో అవకాశమివ్వాలి. కోహ్లి, రోహిత్ ఇద్దరూ వైట్బాల్ క్రికెట్లో భారత జట్టు ఎంతో కాలం నుంచి తమ సేవలను అందిస్తున్నారు. ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో భాగమయ్యారు. వారు ప్రతీదీ సాధించారు.కాబట్టి అటువంటి లెజెండరీ క్రికెటర్లను రిటైర్మెంట్ ప్రకటించాలని ఎవరూ ఒత్తిడి తీసుకురారు. కానీ తదుపరి వన్డే సైకిల్ ప్రారంభమయ్యే సమయానికి వారు వారు మానసికంగా, శారీరకంగా సిద్దంగా ఉన్నారో లేదో పరీక్షించక తప్పదు అని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.చదవండి: టీమిండియా గెలుస్తుందని నాకు ముందే తెలుసు: సౌరవ్ గంగూలీ -
టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా టాప్ క్రికెటర్లు వీరే!
ఇది టీ20ల జమానా.. కో...డితే బంతి బౌండరీ దాటాల్సిందే.. పొట్టి ఫార్మాట్లో ఫోర్లు, సిక్సర్లు సులువుగానే కొట్టేయవచ్చు. కానీ టెస్టుల్లో సిక్స్ బాదడం అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. సంప్రదాయ ఫార్మాట్లో ఆచితూచి ఆడకపోతే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది.మంచి నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు కూడా మాత్రమే సరిగ్గా షాట్ను కనెక్ట్ చేసి టెస్టుల్లో సిక్స్లు బాదగలరు. అప్పట్లో ఆడం గిల్క్రిస్ట్, వీరేందర్ సెహ్వాగ్, బ్రెండన్ మెకల్లమ్, క్రిస్ గేల్ (Chris Gayle) అలవోకగా సిక్సర్లు కొడితే.. తర్వాత రోహిత్ శర్మ (Rohit Sharma), మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) కూడా తమదైన షాట్లతో అలరించారు.కాలానికి అనుగుణంగా పిచ్లు ఫ్లాట్గా మారుతున్న వేళ ప్రస్తుతం డిఫెన్స్ షాట్లకు బదులు దూకుడుగా బౌలర్లపై విరుచుకుపడే బ్యాటర్ల సంఖ్య పెరుగుతోంది. టెస్టు క్రికెట్లో ప్రస్తుతం టీమిండియా యువ తరంగాలు రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్ విధ్వంసకర షాట్లతో వీరూ, రోహిత్, ధోనిల సిక్సర్ల వారసత్వాన్ని కొనసాగిస్తుండగా.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా వీరికి పోటీనిస్తున్నాడు.సెహ్వాగ్ రికార్డు సమం చేసిన పంత్అయితే, ఇంగ్లండ్తో నాలుగో టెస్టు సందర్భంగా సిక్సర్ల రికార్డులో పంత్ సెహ్వాగ్ను సమం చేశాడు. టెస్టుల్లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్గా చరిత్రకెక్కాడు. కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా భారత్- ఇంగ్లండ్ ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్లో తలపడుతున్న విషయం తెలిసిందే. తొలి టెస్టులో ఇంగ్లండ్.. రెండో టెస్టులో భారత్ గెలిచాయి.ఇక కీలకమైన మూడో టెస్టులో ఆఖరి వరకు పోరాడినా టీమిండియాకు ఓటమే ఎదురైంది. దీంతో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో మాంచెస్టర్ వేదికగా బుధవారం మొదలైన నాలుగో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులు చేసింది. గాయం వేధిస్తున్నాఅయితే, తొలి రోజు ఆటలో గాయపడిన పంత్ 37 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగి.. రెండో రోజైన గురువారం తిరిగి వచ్చి మరో 17 పరుగులు సాధించాడు. టీమిండియా మెరుగైన స్కోరు చేయడంలో పంత్ అర్ధ శతకం కూడా కీలకం.మొత్తంగా 75 బంతులు ఎదుర్కొన్న పంత్.. 54 పరుగులు సాధించాడు. ఇందులో మూడు ఫోర్లు, రెండు సిక్స్లు ఉన్నాయి. జోఫ్రా ఆర్చర్లో బాదిన సిక్సర్తో పంత్ సెహ్వాగ్ రికార్డును సమం చేయడం విశేషం. అయితే మ్యాచ్ల పరంగా చూస్తే సెహ్వాగ్ కంటే పంత్ ముందే ఈ మైలురాయిని చేరుకున్నాడు.Rishabh-Panti Max! 🔥😎They tried to hit him where it hurts... Pant responds by hitting it out of the park! Toughness has a new name @RishabhPant17 🙌🏻#ENGvIND 👉 4th TEST, DAY 2 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/Y3btplYguV pic.twitter.com/6a2zPCQsr5— Star Sports (@StarSportsIndia) July 24, 2025 టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా టాప్-10 క్రికెటర్లు వీరే🏏1.రిషభ్ పంత్- 47 మ్యాచ్లలో కలిపి 90 సిక్సర్లు*🏏2. వీరేందర్ సెహ్వాగ్- 103 మ్యాచ్లలో కలిపి 90 సిక్సర్లు🏏3.రోహిత్ శర్మ- 67 మ్యాచ్లలో కలిపి 88 సిక్సర్లు🏏4. మహేంద్ర సింగ్ ధోని- 90 మ్యాచ్లలో కలిపి 78 సిక్సర్లు🏏5. రవీంద్ర జడేజా- 84 మ్యాచ్లలో కలిపి 74 సిక్సర్లు🏏6. సచిన్ టెండుల్కర్- 200 మ్యాచ్లలో కలిపి 69 సిక్సర్లు🏏7. కపిల్ దేవ్- 131 మ్యాచ్లలో కలిపి 61 సిక్సర్లు🏏8. సౌరవ్ గంగూలీ- 113 మ్యాచ్లలో కలిపి 57 సిక్సర్లు🏏9. శుబ్మన్ గిల్- 36 మ్యాచ్లలో కలిపి 43 సిక్సర్లు🏏10. హర్భజన్ సింగ్- 103 మ్యాచ్లలో కలిపి 42 సిక్సర్లు.👉కాగా టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం 23 టెస్టుల్లోనే ఇప్పటికే 41 సిక్సర్లు బాదాడు. అతడు ఈ రికార్డు జాబితాలో టాప్-10లోకి చేరుకోవడానికి మరీ ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.చదవండి: ఏడ్చేసిన కరుణ్ నాయర్.. ఓదార్చిన కేఎల్ రాహుల్.. ఇక గుడ్బై!? -
రోహిత్ లేడు!.. టీమిండియా ఆల్టైమ్ గ్రేటెస్ట్ క్రికెటర్లు వీరే!
భారత క్రికెట్లో అత్యంత గొప్ప క్రికెటర్లు ఎవరన్న ప్రశ్నకు టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) తనదైన శైలిలో బదులిచ్చాడు. తన దృష్టిలో ఐదుగురు ఆల్టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్లు ఉన్నారన్న ఈ మాజీ సారథి.. 70, 80, 90వ దశకాల నుంచి ముగ్గురు ఆటగాళ్లకు ఇందులో చోటిచ్చాడు.ఇక నయా క్రికెటర్లలో దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni)తో పాటు లెజెండరీ బ్యాటర్, తనకు అత్యంత సన్నిహితుడైన విరాట్ కోహ్లిల పేర్లను రవిశాస్త్రి ఈ జాబితాలో చేర్చాడు. ఈ మేరకు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు మైకేల్ వాన్, అలిస్టర్ కుక్లతో కలిసి క్రికెట్ పాడ్కాస్ట్లో పాల్గొన్న రవిశాస్త్రిని.. భారత అత్యుత్తమ క్రికెటర్లలో టాప్-5 పేర్లు చెప్పాల్సిందిగా అడిగారు.ధోనికే పెద్దపీటఇందుకు బదులిస్తూ.. ‘‘కచ్చితంగా ఈ జాబితాలో సునిల్ గావస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండుల్కర్ ఉంటారు.. వీరితో పాటు విరాట్ కోహ్లి కూడా ఉండాల్సిందే.. వీరంతా తమ అద్భుత ఆట తీరుతో యువ ఆటగాళ్లపై ప్రభావం చూపారు.నిజానికి బిషన్ సింగ్ బేడీ పేరు కూడా చెప్పాలి. కానీ ఎంఎస్ ధోని ఆయన కంటే ముందు వరుసలో ఉంటాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా కూడా ఉన్నాడు. అయితే, అతడు ఇంకా యువకుడే.. తనలో ఇంకా ఎంతో క్రికెట్ మిగిలి ఉంది. మిగిలిన వాళ్లు తమ అంతర్జాతీయ క్రికెట్ను ముగించేశారు కదా!నంబర్ వన్ అంటే సచినేనా దృష్టిలో సన్నీ కపిల్, సచిన్, ధోని, విరాట్... ఈ ఐదుగురే ఆల్టైమ్ టాప్-5 గ్రేటెస్ట్ ప్లేయర్లు. వీరిలో నంబర్ వన్ ఎవరని అడిగితే గావస్కర్ పేరే చెప్తా. అతడి బ్యాటింగ్ అద్భుతం. ఇక కపిల్ అసాధారణ క్రికెటర్.అయితే, వీరందరిలో ఫుల్ ప్యాకేజీ నంబర్ వన్ ఎవరంటే సచిన్ టెండుల్కర్. 24 ఏళ్ల పాటు సుదీర్ఘ కెరీర్ కొనసాగించిన అతడు.. ఏకంగా 100 సెంచరీలు సాధించాడు. వసీం అక్రమం, వకార్ యూనిస్, ఇమ్రాన్ ఖాన్ వంటి పాక్ పేస్ దిగ్గజాలను..అదే విధంగా.. ఆసీస్, ఇంగ్లండ్ పేసర్లు స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్.. ప్రొటిస్ నుంచి జాక్వెస్ కల్లిస్, షాన్ పొలాక్.. ఇలాం ప్రతి ఒక్కరిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. టెక్నిక్ పరంగా అతడి ఆట అమోఘం’’ అని రవిశాస్త్రి అలిస్టర్ కుక్, మైకేల్ వాన్లకు చెప్పాడు. అయితే, టీమిండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన మరో దిగ్గజ కెప్టెన్, మేటి బ్యాటర్ రోహిత్ శర్మకు మాత్రం రవిశాస్త్రి టాప్-5లో చోటివ్వలేదు.కాగా 1981- 1992 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన రవిశాస్త్రి.. అంతర్జాతీయ స్థాయిలో 80 టెస్టులు, 150 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 11 శతకాలు, ఒక డబుల్ సెంచరీ సాయంతో 3839 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. వన్డేల్లో 3108 రన్స్ రాబట్టాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి.చదవండి: IND vs ENG: అతడిని కాదని అన్షుల్ను ఎలా ఎంపిక చేస్తారు?: సెలక్టర్లపై ఫైర్ -
రోహిత్ శర్మకు భారీ షాక్!?.. వన్డే కెప్టెన్గానూ గిల్?
గతేడాది నుంచి టీమిండియాలో భారీ మార్పులే జరుగుతున్నాయి. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ గెలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో పాటు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli), ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ టీ20 క్రికెట్కు వీడ్కోలు పలికారు.హార్దిక్ పాండ్యాకు ఊహించని షాకిస్తూఈ క్రమంలో మరో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఊహించని షాకిస్తూ పవర్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్తో రోహిత్ స్థానాన్ని భర్తీ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI). టీమిండియా టీ20 కొత్త కెప్టెన్గా సూర్యకు పగ్గాలు అప్పగించగా.. అతడు ద్వైపాక్షిక సిరీస్లలో వరుస విజయాలు అందిస్తూ దూసుకుపోతున్నాడు.ఇక టీ20ల నుంచి తప్పుకొన్న తర్వాత టెస్టు, వన్డే జట్టు కెప్టెన్గా కొనసాగిన రోహిత్ శర్మకు వన్డేల్లో మోదం, టెస్టుల్లో ఖేదం అన్నట్లుగా పరిస్థితి మారింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా టెస్టుల్లో 3-0తో క్లీన్స్వీప్ కావడంతో పాటు.. ఆస్ట్రేలియా పర్యటనలోనూ 3-1తో ఓడి పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది.టెస్టు రిటైర్మెంట్ ప్రకటనఈ రెండు సిరీస్లలో బ్యాటర్గా, కెప్టెన్గా పూర్తిగా విఫలమైన రోహిత్ శర్మ.. ఇంగ్లండ్ పర్యటనకు ముందు కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్లోనూ టెస్టులకు సారథిగా అతడే ఉంటాడని ముందుగా బీసీసీఐ లీకులిచ్చినా.. అనూహ్యంగా రోహిత్ నుంచి టెస్టు రిటైర్మెంట్ ప్రకటన వచ్చింది. అయితే, వన్డేల్లో మాత్రం తాను కొనసాగుతానని రోహిత్ శర్మ చెప్పగా.. బీసీసీఐ కూడా తమ వన్డే కెప్టెన్ అంటూ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.టీమిండియా టెస్టు సారథిగా గిల్ఇక రోహిత్ శర్మ తర్వాత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా టెస్టులకు గుడ్బై చెప్పాడు. వీరిద్దరి కంటే ముందే.. అంటే ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నపుడే స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ కూడా వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలో టెస్టుల్లో ప్రస్తుత టీమిండియాలో రవీంద్ర జడేజా సీనియర్గా ఉండగా.. జస్ప్రీత్ బుమ్రాకు పగ్గాలు అప్పగిస్తారని అంతా భావించారు.అయితే, పనిభారాన్ని తగ్గించే నిమిత్తం బుమ్రా నిర్ణయానుసారమే అతడి పేరును బోర్డు కెప్టెన్సీకి పరిగణనలోకి తీసుకోలేదు. ఈ క్రమంలో అనూహ్య రీతిలో యువ ఆటగాడు శుబ్మన్ గిల్ టీమిండియా టెస్టు సారథిగా ఎంపికయ్యాడు.చారిత్రాత్మక విజయంతో..ఇక కెప్టెన్గా తొలి టెస్టులోనే సెంచరీ బాది రికార్డులు సృష్టించిన గిల్.. తొలి ప్రయత్నంలో గెలుపును మాత్రం అందుకోలేకపోయాడు. అయితేనేం.. రెండో టెస్టులోనే చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఎడ్జ్బాస్టన్లో డబుల్ సెంచరీ (269), సెంచరీ (161)తో చెలరేగి.. ఈ వేదికపై తొలిసారి భారత్కు గెలుపు అందించాడు.తదుపరి వన్డే సిరీస్లో కెప్టెన్గా గిల్! ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. రెవ్స్పోర్ట్స్ జర్నలిస్టు ఒకరు.. ‘‘తదుపరి వన్డే సిరీస్లో గిల్ కెప్టెన్గా ఉండబోతున్నాడు’’ అని ట్వీట్ చేశారు. దీంతో రోహిత్ శర్మను తప్పించి గిల్కు వన్డే పగ్గాలు కూడా అప్పగిస్తారా? అనే చర్చ నడుస్తోంది. వన్డే వరల్డ్కప్-2027లో జరుగనున్న విషయం తెలిసిందే.అప్పటికి రోహిత్ శర్మకు 40 ఏళ్లు వస్తాయి గనుక.. అతడు ఆడకపోవచ్చని కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్తో పాటు.. కోహ్లి కూడా వరల్డ్కప్ టోర్నీ కంటే ముందే వన్డేలకూ గుడ్బై చెబుతాడంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరు ఇప్పటికే టీమిండియాకు ఎనలేని సేవ చేశారని.. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని పేర్కొంటున్నారు.ఇకపై ఐపీఎల్లో మాత్రమే రో-కో కొనసాగితే చాలని అంటున్నారు. కాగా టెస్టు రిటైర్మెంట్ తర్వాత బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ సందర్భంగా వీరిద్దరు రీఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. అయితే, బీసీసీఐ మాత్రం సెప్టెంబరులో జరగాల్సిన ఈ సిరీస్ను వాయిదా వేసింది. ఈ క్రమంలో నవంబరులో ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్ సందర్భంగా రోహిత్, కోహ్లి పునరాగమనం చేయనున్నారు. ఇంతలోనే రోహిత్ నుంచి పగ్గాలు గిల్ చేపట్టబోతున్నాడనే వదంతి సోషల్ మీడియాలో వ్యాపిస్తోంది.చదవండి: కావాలనే క్వాడ్రపుల్ సెంచరీ (400) మిస్.. లారా రియాక్షన్ ఇదే7th May ko kaha tha. Baar baar mat poocho bhai log. #RohitSharma #ShubmanGill https://t.co/PWcHEyJHbr— Rohit Juglan (@rohitjuglan) July 10, 2025Whenever India's next odi series will be - Gill will lead— Rohit Juglan (@rohitjuglan) July 10, 2025 -
రోహిత్, కోహ్లి అభిమానులకు గుడ్ న్యూస్
దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా ఆగస్ట్లో జరగాల్సిన భారత్-బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల సిరీస్ ఏడాది పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ఆగస్ట్లో టీమిండియా ఖాళీగా ఉండనుంది. ఈ ఖాళీని భర్తీ చేసేందుకు బీసీసీఐ శ్రీలంక క్రికెట్ బోర్డుతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఆగస్ట్లో భారత్, శ్రీలంక మధ్య పరిమిత ఓవర్ల సిరీస్లు (3 వన్డేలు, 3 టీ20లు) నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది.ఇందుకు శ్రీలంక బోర్డు ఒకే చెబితే మరికొద్ది రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆగస్ట్లో జరగాల్సిన లంక ప్రీమియర్ లీగ్ కూడా వాయిదా పడటంతో భారత్తో సిరీస్ ఆడేందుకు శ్రీలంక బోర్డుకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకపోవచ్చు. ఆగస్ట్ చివర్లో శ్రీలంక జింబాబ్వేలో పర్యటించాల్సి ఉంది. ఆలోపే భారత్తో సిరీస్ జరిగే ఆస్కారం ఉంది. భారత్ చివరిసారిగా 2023లో శ్రీలంకలో పర్యటించింది. ఈ ఏడాది లంకలో టీమిండియా పర్యటన షెడ్యూల్ కాలేదు. అయితే అనుకోకుండా ఈ ప్రతిపాదన వచ్చింది.ఆగస్ట్లో బరిలోకి దిగనున్న దిగ్గజాలు..?భారత్, శ్రీలంక మధ్య ఆగస్ట్లో పరిమిత ఓవర్ల సిరీస్ల ప్రస్తావనకు రావడంతో టీమిండియా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఫ్యాన్స్ పట్టరాని సంతోషంతో తేలిపోతున్నారు. శ్రీలంక పర్యటనలో భారత్ మూడు వన్డేలు ఆడే అవకాశం ఉంది. ఇప్పటికే టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లి ఈ వన్డే సిరీస్లో తప్పక ఆడతారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ సిరీస్ సాధాసాధ్యాలపై మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ సిరీస్లో రోహిత్, కోహ్లి పాల్గొనే దానిపై కూడా క్లారిటీ రానుంది.ఒకవేళ శ్రీలంకతో సిరీస్ సాధ్యపడకపోతే మాత్రం రోహిత్, కోహ్లి అభిమానులు వారి రాక కొరకు అక్టోబర్ వరకే వేచి చూడాల్సిందే. అక్టోబర్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జరుగనుంది. ఆస్ట్రేలియాలో జరిగే ఈ సిరీస్లో భారత్ 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఈ సిరీస్లో రోహిత్, కోహ్లి తప్పక ఆడే అవకాశం ఉంది. రోహిత్, కోహ్లి చివరిగా ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో కలిసి ఆడారు. ఆ టోర్నీలో భారత్ విజేతగా నిలిచి 13 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించింది. ఆ టోర్నీ తర్వాతే రోహిత్, కోహ్లి రోజుల వ్యవధిలో టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. అంతకుముందు వీరిద్దరు ఒకేసారి (2024 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత) టీ20 ఫార్మాట్కు గుడ్బై చెప్పారు. -
కోహ్లి, రోహిత్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..
అంతా ఊహించిందే జరిగింది. బంగ్లాదేశ్లో భారత జట్టు పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ధ్రువీకరించింది. ఇరు బోర్డుల అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్ కమిట్మెంట్స్, రెండు జట్ల షెడ్యూల్ను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాము.ఈ సిరీస్ను వచ్చే ఏడాది సెప్టెంబర్లో నిర్వహించేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆతృతగా ఎదురుచూస్తోంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని భారత క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.వాయిదా ఎందుకంటే?కాగా ఈ ఏడాది ఆరంభం నుంచే బంగ్లా-భారత్ వైట్బాల్ సిరీస్లపై నీలినీడలు కమ్ముకున్నాయి. బంగ్లా పర్యటనకు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూసింది. కానీ భద్రతా కారణాల దృష్ట్యా ఈ పర్యటనను వాయిదా వేసుకోమని భారత ప్రభుత్వం బీసీసీఐని సూచించినట్లు తెలుస్తోంది.మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం కూలాక అక్కడ చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలతో బంగ్లాదేశ్ అట్టుడికింది. ప్రస్తుతం తాత్కాళిక ప్రభుత్వ ఏర్పాటుతో పరిస్థితులు అదుపులో ఉన్నట్లు కనబడుతున్నప్పటికీ, నివురుగప్పిన నిప్పులా మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తితే ఛాన్స్ ఉంది. అంతకుతోడు బంగ్లాదేశ్ మాజీ మంత్రులు, రాజకీయ నేతలపై అక్కడ తరచూ మూకదాడులు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.వచ్చే ఏడాదికల్లా ఎన్నికలు పూర్తయితే పరిస్థితిలో మార్పుంటుందని బోర్డు భావిస్తోంది. వీటిన్నంటిని పరిగణలోకి తీసుకునే ఈ పర్యటను బీసీసీఐ వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం.. భారత జట్టు ఆతిథ్య బంగ్లాతో వచ్చేనెల 17 నుంచి 31 వరకు చిట్టగాంగ్, ఢాకా వేదికలపై మూడేసి చొప్పున వన్డేలు, టి20లు ఆడాల్సి ఉంది. రోహిత్-కోహ్లి ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..మరోవైపు తమ ఆరాధ్య క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను మైదానంలో చూడాలన్న ఆశపడ్డ అభిమానులు మరి కొన్న నెలలు వేచి చూడాల్సిందే. టెస్టు, టీ20లకు ప్రకటించిన రోహిత్, కోహ్లి కేవలం వన్డేల్లో మాత్రమే ఆడనున్నారు. ఈ క్రమంలో బంగ్లాతో జరిగే వన్డే సిరీస్లో వీరిద్దరని చూడవచ్చని అంతా భావించారు. కానీ ఇప్పుడు టూర్ వాయిదా పడడంతో ఫ్యాన్స్కు నిరాశే ఎదురైంది. ఈ ఏడాది ఆక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్లో రో-కో ద్వయం ఆడనున్నారు.చదవండి: సునామీ శతకంతో విరుచుకుపడ్డ వైభవ్ సూర్యవంశీ.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్ -
‘అతడి డబుల్ సెంచరీ.. నా కెరీర్కు ముగింపు’
టీమిండియా ఓపెనర్గా శిఖర్ ధావన్ (Shikhar Dhawan) తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. రోహిత్ శర్మ (Rohit Sharma)తో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించిన ఈ లెఫ్టాండర్.. ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా వన్డేల్లో అత్యుత్తమంగా రాణించాడు. తన కెరీర్లో మొత్తంగా 167 వన్డేలు ఆడిన గబ్బర్ 6793 పరుగులు సాధించాడు.అయితే, నయా స్టార్లు శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్ (Ishan Kishan)ల రాకతో టీమిండియాలో ధావన్ స్థానం ప్రశ్నార్థకమైంది. ఈ ఇద్దరు ఓపెనర్లుగా పాతుకుపోవడంతో పాటు.. వీరికి తోడు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ కూడా రేసులోకి వచ్చారు. ఫలితంగా ధావన్ను సెలక్టర్లు పట్టించుకోవడమే మానేశారు.ఈ క్రమంలో 2022లో టీమిండియా తరఫున చివరగా ఆడిన శిఖర్ ధావన్.. రెండేళ్ల పాటు పునరాగమనం కోసం ఎదురుచూశాడు. కానీ యువ ఆటగాళ్ల జోరు ముందు నిలవలేక గతేడాది ఆగష్టులో అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడ్కోలు పలికాడు.అతడి డబుల్ సెంచరీ.. నా కెరీర్కు ముగింపుతాజాగా ఈ విషయాల గురించి శిఖర్ ధావన్ స్పందించాడు. బంగ్లాదేశ్ మీద ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ బాదినపుడే తన కెరీర్ ముగింపు దశకు వచ్చిందని భావించినట్లు తెలిపాడు. ఈ మేరకు.. ‘‘నేను చాలాసార్లు ఫిఫ్టీలు బాదాను. ఎన్నోసార్లు డెబ్బైలలో అవుటయ్యాను.వాటిని సెంచరీలుగా మలచడంలో విఫలమయ్యాను. ఎప్పుడైతే ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్తో వన్డేలో 200 పరుగులు చేశాడో.. అప్పుడే నా కెరీర్ ముగింపునకు వచ్చేసిందని నా మనసు చెప్పింది. నా అంతరాత్మ చెప్పినట్లే జరిగింది.ఆ సమయంలో నా స్నేహితులు, శ్రేయోభిలాషులు నా గురించి చాలా ఫీలయ్యారు. నేనెక్కడ బాధపడిపోతానో అని నన్ను కనిపెట్టుకుని ఉన్నారు. కానీ నేను మాత్రం జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టాను’’ అని హిందుస్తాన్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. కాగా డబుల్ సెంచరీ వీరుడు ఇషాన్ కిషన్ కూడా అనతికాలంలోనే క్రమశిక్షణా రాహిత్యం వల్ల జట్టులో చోటుతో పాటు.. సెంట్రల్ కాంట్రాక్టు కూడా కోల్పోవడం గమనార్హం. మరోవైపు.. గిల్ మాత్రం నిలకడైన ఆటతో టీమిండియా టెస్టు కెప్టెన్గా ఎదిగాడు.ఒక్కరూ మాట్లాడలేదుఇక జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత ఒక్కరు కూడా తనను మళ్లీ కాంటాక్టు చేయలేదని ఈ సందర్భంగా ధావన్ చెప్పుకొచ్చాడు. ‘‘జట్టులో చోటు కోల్పోవడం సాధారణ విసయమే. పద్నాలుగేళ్ల వయసు నుంచే మాకు ఇది అలవాటు అవుతుంది.అంతేకాదు ఎవరి బిజీలో వాళ్లుంటారు. పర్యటనల్లో బిజీబిజీగా గడుపుతూ ఉంటారు. అయితే, ద్రవిడ్ భాయ్ మాత్రం ఆ సమయంలో నాతో మాట్లాడాడు. ఆయన నాకు మెసేజ్ చేశారు’’ అని ధావన్ తెలిపాడు. కాగా శిఖర్ ధావన్ ప్రస్తుతం లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు. నేపాల్ ప్రీమియర్ లీగ్లో, లెజెండ్స్ లీగ్ క్రికెట్లోనూ అతడు భాగమవుతున్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్.. తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు -
రోహిత్ శర్మ సరసన మంధాన.. భారత మూడో ప్లేయర్గా ఘనత
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన భారత ప్లేయర్ల జాబితాలో స్థానం సంపాదించింది. ఈ క్రమంలో టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సరసన చేరింది.ఇంగ్లండ్ మహిళా జట్టు (England Women vs India Women)తో రెండో టీ20 సందర్భంగా స్మృతి మంధాన ఈ ఫీట్ నమోదు చేసింది. కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు భారత మహిళా క్రికెట్ జట్టు ఇంగ్లండ్కు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ మొదలుకాగా.. మొదటి మ్యాచ్లో భారత్ 97 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.150వ టీ20 మ్యాచ్ఇక బ్రిస్టల్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన రెండో టీ20లోనూ ఆతిథ్య ఇంగ్లండ్పై.. భారత్ 24 రన్స్ తేడాతో గెలుపొందింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0తో ముందంజలో నిలిచింది. ఇక స్మృతి మంధానకు ఇది అంతర్జాతీయ స్థాయిలో 150వ టీ20.రోహిత్, హర్మన్ సరసనఇప్పటి వరకు భారత్ తరఫున టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ (159), మహిళా జట్టు సారథి హర్మన్ప్రీత్ కౌర్ (179) మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు. తాజాగా స్మృతి మంధాన కూడా ఈ లిస్టులో చేరిపోయింది. కాగా 149 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లలో కలిపి స్మృతి మంధాన 124కు పైగా స్ట్రైక్రేటుతో 3873 పరుగులు సాధించింది.తద్వారా మహిళల టీ20 ఫార్మాట్లో న్యూజిలాండ్ స్టార్ సుజీ బేట్స్ తర్వాత అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్గా స్మృతి కొనసాగుతోంది. అంతేకాదు.. అంతర్జాతీయ టీ20లలో నాలుగు వేల మైలురాయికి కూడా స్మృతి చేరువైంది. పురుషుల క్రికెట్లో ఇప్పటి వరకు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం, టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు మాత్రమే ఈ ఘనత సాధ్యమైంది. ఇక భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో శతకం బాదిన తొలి మహిళా క్రికెటర్గానూ స్మృతి చరిత్రకెక్కిన విషయం తెలిసిందే.రెండో టీ20లో విఫలంఇదిలా ఉంటే... తన 150వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్లో స్మృతి మంధాన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయింది. ఇంగ్లండ్తో తొలి టీ20లో శతకంతో చెలరేగిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. తాజాగా రెండో టీ20లో 13 బంతులు ఎదుర్కొని 13 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగింది.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. బ్రిస్టల్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన హర్మన్ సేన నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 157 పరుగులకే పరిమితమైంది. దీంతో 24 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఇక భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన అమన్జోత్ కౌర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 40 బంతుల్లోనే 63 పరుగులతో అజేయంగా నిలవడంతో పాటు.. ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్-బ్రంట్ (13) రూపంలో కీలక వికెట్ తీసింది పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అమన్జోత్.అగ్ర స్థానానికి చేరువైన స్మృతిభారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఒక స్థానం మెరుగుపర్చుకొని మూడో స్థానానికి చేరింది. ఇంగ్లండ్తో తొలి టీ20లో సెంచరీతో విజృంభించిన స్మృతి... మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో 771 పాయింట్లతో నాలుగు నుంచి మూడో ర్యాంక్ను అందుకుంది. మంధాన కెరీర్లో ఇవే అత్యధిక రేటింగ్ పాయింట్లు కావడం విశేషం.హర్మన్ప్రీత్ కౌర్ అందుబాటులో లేకపోవడంతో ఇంగ్లండ్తో తొలి మ్యాచ్లో కెప్టెన్గానూ వ్యవహరించిన మంధాన... ఈ ఫార్మాట్లో తొలి శతకం తన పేరిట లిఖించుకున్న విషయం తెలిసిందే. తద్వారా మూడు ఫార్మాట్ల (టెస్టు, వన్డే, టి20)లో సెంచరీ చేసిన తొలి భారత మహిళా క్రికెటర్గా చరిత్ర సృష్టించింది. ఇప్పటికే వన్డే బ్యాటింగ్ ర్యాకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న స్మృతి... టీ20ల్లో సైతం ఆ దిశగా ఆడుగులు వేస్తోంది.టీ20 ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా ప్లేయర్ బెత్ మూనీ (794 పాయింట్లు), వెస్టిండీస్ ప్లేయర్ హీలీ మాథ్యూస్ (774 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో భారత్ నుంచి హర్మన్ప్రీత్ కౌర్ (12వ ర్యాంక్), షఫాలీ వర్మ (13వ ర్యాంక్), జెమీమా రోడ్రిగ్స్ (15వ ర్యాంక్) టాప్–20లో చోటు దక్కించుకున్నారు. బౌలింగ్ విభాగంలో భారత్ నుంచి దీప్తి శర్మ (735 పాయింట్లు) మూడో ర్యాంక్లో ఉండగా... రేణుక సింగ్ (721 పాయింట్లు) ఆరో ర్యాంక్లో ఉంది. చదవండి: చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్.. తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు -
రోహిత్, కోహ్లికి నో ఛాన్స్!.. వరుణ్ చక్రవర్తి డ్రీమ్ టీ20 ఎలెవన్ ఇదే
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన డ్రీమ్ టీ20 ఎలెవన్ (Dream T20 Eleven)ను ప్రకటించాడు. ఇందులో భారత దిగ్గజ టీ20 స్టార్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli)లకు మాత్రం చోటు దక్కలేదు. అయితే, ఇందులో ఓ ట్విస్టు ఉంది. కాగా కర్ణాటకలోని బీదర్లో జన్మించిన వరుణ్ తొలుత ఆర్కిటెక్ట్గా పనిచేశాడు.నటన వైపు అడుగులుఆ తర్వాత గిటార్ ప్లేయర్గానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని తన స్నేహితులతో కలిసి ఓ సినిమా షూటింగ్కు వెళ్లాడు. అయితే, అక్కడ ఆ అవకాశం దొరకలేదు కానీ.. క్రికెట్ ఆడతాడు కాబట్టి ఆ సినిమాలోని ఓ పాత్రకు వరుణ్ ఎంపికయ్యాడు. అలా నటుడిగా మారిన తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్'కు దర్శకుడిగానూ వ్యవహరించాడు.క్రికెట్ నైపుణ్యాలకు మెరుగుపెట్టుకునిఅయితే, తర్వాత మళ్లీ పాత కథే. ఇంటీరియర్ డిజైనర్గా సత్తా చాటాలనుకుని కంపెనీ పెట్టి చేతులు కాల్చుకున్నాడు. పాతికేళ్ల వయసుకే ఇన్ని అనుభవాలు సంపాదించిన వరుణ్.. క్రికెట్ నైపుణ్యాలకు మెరుగుపెట్టుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్నాడు.శ్రీలంకతో టీ20 మ్యాచ్ సందర్భంగా 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన వరుణ్ చక్రవర్తి.. ఈ ఏడాది వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025ని భారత్ కైవసం చేసుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 18 టీ20లు, నాలుగు వన్డేలు ఆడిన ఈ రైటార్మ్ లెగ్బ్రేక్ స్పిన్నర్ వరుసగా 33, 10 వికెట్లు తీశాడు.ట్విస్ట్ ఏమిటంటేప్రస్తుతం విరామం తీసుకుంటున్న వరుణ్ చక్రవర్తి.. మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన డ్రీమ్ టీ20 ఎలెవన్ను చెప్పాలంటూ అశూ.. వరుణ్ను అడిగాడు. అయితే, ఇక్కడే ఓ మెలిక పెట్టాడు. వరుణ్తో కలిసి ఆడిన ఆటగాళ్ల నుంచే జట్టును ఎంపిక చేసుకోవాలని చెప్పాడు.ఈ క్రమంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలను వదిలేసి వరుణ్ తన జట్టును ప్రకటించాడు. ఓపెనర్లుగా బట్లర్, హెడ్లను ఎంచుకున్న అతడు.. వన్డౌన్లో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు చోటిచ్చాడు. అదే విధంగా.. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్లో తన సహచర ఆటగాళ్లైన ఆండ్రీ రసెల్, సునిల్ నరైన్లను కూడా వరుణ్ తన జట్టులోకి ఎంపిక చేసుకున్నాడు. ఇక టీమిండియా నుంచి సూర్యతో పాటు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకు స్థానం కల్పించాడు. స్పిన్నర్ల జాబితాలో రషీద్ ఖాన్కు పెద్దపీట వేశాడు. శ్రీలంక యువ పేసర్ పతిరణకు కూడా వరుణ్ తన జట్టులో చోటిచ్చాడు.వరుణ్ చక్రవర్తి డ్రీమ్ టీ20 ఎలెవన్:జోస్ బట్లర్ (ఇంగ్లండ్), ట్రవిస్ హెడ్ (ఆస్ట్రేలియా), సూర్యకుమార్ యాదవ్ (ఇండియా), నికోలస్ పూరన్ (వెస్టిండీస్), హెన్రిచ్ క్లాసెన్ (సౌతాఫ్రికా), హార్దిక్ పాండ్యా (ఇండియా), ఆండ్రీ రసెల్ (వెస్టిండీస్), సునిల్ నరైన్(వెస్టిండీస్), రషీద్ ఖాన్ (అఫ్గనిస్తాన్), జస్ప్రీత్ బుమ్రా (ఇండియా), మతీశ పతిరణ (శ్రీలంక).చదవండి: ‘షర్మిలా ఠాగూర్, సైఫ్ అలీ ఖాన్ను పిలవండి.. ఎవరూ వేలెత్తి చూపరు’ -
రితికా కంటే ముందు ఆమెతో ప్రేమలో రోహిత్?.. నన్గా మారిన నటి?!
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తన వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ ఓనమాలు దిద్దిన స్టేడియం పిచ్పైనే మోకాళ్లపై కూర్చుని ప్రేయసి రితికా (Ritika Sajdeh)కు ప్రేమను వ్యక్తపరిచినట్లు వెల్లడించాడు. ఆమె కూడా సంతోషంగా ఒప్పుకోవడంతో ఇద్దరం పెళ్లి బంధంతో ఒక్కటయ్యామని రోహిత్ శర్మ తన రొమాంటిక్ ప్రపోజల్ గురించి చెబుతూ నవ్వులు చిందించాడు.ఇద్దరు పిల్లలు.. ముచ్చటైన కుటుంబంమాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అతడి భార్య గీతా బస్రా కలిసి నిర్వహిస్తున్న యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూకు భార్య రితికాతో కలిసి హాజరైన రోహిత్ ఈ విషయాన్ని వెల్లడించాడు. కాగా రోహిత్- రితికా చాలా ఏళ్ల పాటు డేటింగ్ చేసి.. 2015, డిసెంబరు 13న పెళ్లిపీటలు ఎక్కారు. వీరికి కూతురు సమైరా, కుమారుడు అహాన్ సంతానం.తెరపైకి సోఫియా హయత్ పేరుఇక రోహిత్ శర్మ తన ప్రేమకథ గురించి వివరించిన నేపథ్యంలో గతంలో అతడు డేటింగ్ చేసిన అమ్మాయిల గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ క్రమంలో ప్రధానంగా తెరపైకి వచ్చిన పేరు సోఫియా హయత్ (Sofia Hayat).లండన్లో కామన్ ఫ్రెండ్ ద్వారా సోఫియా- రోహిత్లకు పరిచయమైంది. తొలిచూపులోనే రోహిత్ను ఇష్టపడ్డ సోఫియా అతడితో డేటింగ్ చేసిందనే ప్రచారం ఉంది. అయితే, ప్రేమలో ఉన్నపుడు ఇద్దరూ కూడా ఈ విషయం గురించి బయటపెట్టలేదు. కానీ.. మీడియాలో వీరి గురించి వార్తలు రాగా.. 2012లో సోఫియా స్వయంగా స్పందించింది.నేను రోహిత్ శర్మతో డేటింగ్ చేశా‘‘ఇకనైనా వదంతులకు స్వస్తి పలుకుదాం. అవును.. నేను రోహిత్ శర్మతో డేటింగ్ చేశా. కానీ ఇప్పుడు అదంతా ముగిసిపోయింది.. ఇకపై జీవితంలో అతడితో మరోసారి డేటింగ్ చేయను. ఈసారి నేను మనసున్న మంచి వ్యక్తి కోసం మాత్రమే ఎదురుచూస్తున్నా’’ అని సోఫియా ట్వీట్ చేసింది.అందుకే బ్రేకప్ చెప్పానుఅంతేకాదు.. రోహిత్ శర్మతో తన బంధం ముగిసిపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ.. ‘‘అతడు మంచివాడు. కలిసి ఉన్నపుడు ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్లం. అయితే, అతడు బిడియస్తుడు. హోటల్స్, రూమ్స్ దగ్గర మేము మీడియా కంటపడకూడదని భావించేవాళ్లం.కానీ మీడియాకు టిప్ అందింది. అపుడు మా మేనేజరే ఈ విషయం గురించి స్పందించారు. రోహిత్తో ఉన్న నాకున్న రిలేషన్పై గౌరవంతో నేనూ ఏమీ మాట్లాడలేదు. కానీ ఓసారి రోహిత్ మీడియాతో మాట్లాడుతున్నపుడు నా గురించి ప్రశ్న ఎదురుకాగా.. నేను కేవలం తన అభిమానిని మాత్రమే అని చెప్పాడు.దాంతో నేను చాలా బాధపడ్డాను. అందుకే అతడితో బ్రేకప్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతడితో ఉన్న అన్ని రకాల కాంటాక్టులను చెరిపివేశా’’ అని సోఫియా గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. పెదవి విప్పని రోహిత్అయితే, రోహిత్ మాత్రం ఆమెతో ప్రేమ, బ్రేకప్ గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే.. వివాదాలకు కేరాఫ్ అయిన సోఫియా.. విరాట్ కోహ్లి కోసం తాను రోహిత్ను వదిలేశానంటూ మరో ట్వీట్ చేసింది. దీన్ని బట్టి చూస్తే ఆమె ప్రచారం కోసమే ఇదంతా చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.నటి నుంచి నన్గా?సోఫియా హయత్ బ్రిటిష్ మోడల్, సింగర్. ఆ తర్వాత టెలివిజన్ రంగంలోకి ప్రవేశించింది. హిందీ బిగ్బాస్ 7లో సోఫియా పాల్గొంది. 2013లో బిగ్ బ్రదర్ ఇండియన్ వర్షన్లోనూ తళుక్కుమంది. అయితే, 2016లో అందరికీ షాకిస్తూ... ఆధ్యాత్మిక బాటలో నడుస్తూ.. నన్గా మారినట్లు ప్రకటించింది. తన పేరును గైయా సోఫియా మదర్గా మార్చుకుంది. యోగా టీచర్, హీలర్గా తన ఇన్స్టాగ్రామ్ బయోలో పేర్కొంది.చదవండి: ధావన్పై మండిపడ్డ రోహిత్ శర్మ.. షాకింగ్ విషయం బయటపెట్టిన గబ్బర్ -
అది ఆసీస్కు రిటర్న్ గిఫ్ట్
న్యూఢిల్లీ: సరిగ్గా ఏడాది క్రితం... జూన్ 29న భారత జట్టు రోహిత్ శర్మ నాయకత్వంలో టి20 వరల్డ్ కప్ గెలుచుకుంది. 2007లోనూ టి20 వరల్డ్ కప్ విజయంలో భాగంగా ఉన్న రోహిత్ నాయకుడిగా సాధించిన తొలి టి20 టోర్నీ ఇది. ఈ టోర్నమెంట్లో ఎప్పటిలాగే పాకిస్తాన్తో మ్యాచ్తో పాటు సెమీస్కు ముందు ఆ్రస్టేలియాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ ఎప్పటికీ మర్చిపోలేనివి. ఈ నేపథ్యంలో ‘జియో–హాట్స్టార్’ రూపొందించిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ కెప్టెన్ రోహిత్ నాటి మ్యాచ్లకు సంబంధించి పలు విషయాలను గుర్తు చేసుకున్నాడు. ఆ్రస్టేలియాతో పోరులో భారత్ 24 పరుగులతో విజయం సాధించింది. 41 బంతుల్లోనే 92 పరుగులు చేసిన రోహిత్ శర్మ... స్టార్క్ వేసిన ఒక ఓవర్లో 4 సిక్స్లు, ఫోర్తో ఏకంగా 28 పరుగులు రాబట్టాడు. అంతకుముందు ఏడు నెలల క్రితం జరిగిన వన్డే వరల్డ్ కప్లో ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడిన టీమిండియా తీవ్ర నిరాశకు లోనైంది. ఆ ఓటమి తమ మనసుల్లోనే ఉండటంతో ఆసీస్పై గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగామని రోహిత్ చెప్పాడు. ‘మేం ఈ మ్యాచ్ గెలిస్తే ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుందన్న మాట చాలు మాలో స్ఫూర్తి నింపడానికి. నవంబర్ 19న మాతో పాటు మన దేశ అభిమానులందరికీ ఆనందం దూరం చేశారనే విషయం మనసులో మెదులుతూనే ఉంది. కాబట్టి వారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని భావించాం. అయితే అది అంత సులువు కాదని, మైదానంలోనే చూపించాలని భావించాం. అందుకే ఒక్కసారి బ్యాటింగ్కు దిగగానే నేను ఏం చేయగలనో అది చేశాను. స్టార్క్తో గతంలో చాలాసార్లు తలపడ్డా. ఈసారి అతడు నన్ను అవుట్ చేయడానికి కాకుండా పరుగులు ఇవ్వకుండా ఆపేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నట్లు అర్థమైంది. అక్కడే నేను సగం గెలిచాను. ఆపై విరుచుకుపడ్డాను. సెంచరీలు సాధించడం గొప్పే. కానీ మ్యాచ్ పరిస్థితి, దికను బట్టి చూస్తే ఈ ఇన్నింగ్స్ సెంచరీకంటే ఎంతో విలువైంది. నాకు సంబంధించి ఇది నా అత్యుత్తమ ప్రదర్శన’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. అంతకుముందు పాకిస్తాన్తో మ్యాచ్లో కూడా 140 చేస్తే గెలుస్తామని భావించామని... 119 పరుగులు చేసిన తర్వాత కూడా 2–3 వికెట్లు తీస్తే పాక్ను ఓడించగలమని నమ్మకం ఉందని చెప్పాడు. నిజానికి మ్యాచ్ ఫలితంకంటే దానికి ముందు ఉండే హడావిడే ఎప్పుడూ ప్రత్యేకమని అతను అన్నాడు. ‘బయట మాకు ముప్పు ఉందని చెబుతూ మ్యాచ్కు రెండు రోజుల ముందు నుంచి కూడా హోటల్ బయటకు మమ్మల్ని వెళ్లనీయలేదు. మీడియా, అభిమానులతో నిండిపోయిన హోటల్ కనీసం నడవడానికి కూడా వీలు లేని విధంగా మారిపోయింది. అప్పుడు ఇది సాధారణ మ్యాచ్ కాదని మాకు అర్థమైంది. గ్రౌండ్కు వెళ్లిన తర్వాత కూడా ఇరు దేశాల అభిమానుల జోష్ను చూస్తే ఆశ్చర్యం వేసింది. పాకిస్తాన్పై నేను ఎన్నో మ్యాచ్లు ఆడాను. కానీ ఆటకు ముందు కనిపించే వాతావరణం ప్రత్యేకతే వేరు. దానికి ఏదీ సాటి రాదు’ అని రోహిత్ శర్మ వివరించాడు. -
ధావన్పై మండిపడ్డ రోహిత్ శర్మ.. షాకింగ్ విషయం బయటపెట్టిన గబ్బర్
టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan).. ‘ది వన్: క్రికెట్, మై లైఫ్ అండ్ మోర్’ పేరిట ఆటోబయోగ్రఫీ రాశాడు. తన వ్యక్తిగత జీవితంలోని విశేషాలను కూడా ఇందులో వెల్లడించాడు. ఈ క్రమంలో ఓ షాకింగ్ విషయాన్ని గబ్బర్ బయటపెట్టాడు.భారత్-‘ఎ’ జట్టు 2006లో ఆస్ట్రేలియాలో పర్యటించగా.. నాటి ఆ టీమ్లో ధావన్తో పాటు టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా ఉన్నాడు. ఇక ఈ టూర్లోనే ధావన్ ఓ బ్రిటిష్ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. తనను విడిచి ఉండలేని స్థితికి చేరుకున్న గబ్బర్ ఆమెను హోటల్ గదికి కూడా తీసుకువచ్చేవాడట.ఆమె నా కోసమే పుట్టింది.. తన చర్య.. అప్పటికి రూమ్మేట్ రోహిత్ శర్మకు ఎంతో విసుగు తెప్పించిందని గబ్బర్ తన పుస్తకంలో రాశాడు. స్పోర్ట్స్స్టార్ కథనం ప్రకారం.. ‘‘ఆమె చాలా అందంగా ఉండేది. ఒకరోజు నేను అకస్మాత్తుగా ప్రేమలో పడిపోయాను. ‘ఆమె నా కోసమే పుట్టింది.. తననే నేను పెళ్లి చేసుకోబోతున్నాను’ అంటూ మైకంలో తేలిపోయాను.అప్పటికి జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో నేను హాఫ్ సెంచరీ చేశాను. పర్యటన బాగానే జరుగుతోంది. ప్రతి మ్యాచ్ ముగిసిన తర్వాత ఆమెను కలిసేందుకు వెళ్లేవాడిని. తనను నా హోటల్ రూమ్కు తీసుకువచ్చేవాడిని.నువ్వు అసలు నన్ను నిద్రపోనిస్తావా?అప్పుడు రోహిత్ శర్మ నాతో పాటు అదే గదిలో ఉండేవాడు. అయితే, తనకు ఇదంతా నచ్చేది కాదు. ‘నువ్వు అసలు నన్ను నిద్రపోనిస్తావా?’ అంటూ హిందీలో కంప్లైంట్ చేస్తూ ఉండేవాడు.ఓరోజు సాయంత్రం నేను ఆమెతో కలిసి డిన్నర్కు వెళ్లేందుకు సిద్ధమయ్యా. అప్పటికే మా గురించి జట్టులో అందరికీ తెలిసిపోయింది. నేను ఆరోజు ఆమె చేయి పట్టుకుని హోటల్ లాబీ నుంచి వెళ్తుండగా.. జాతీయ జట్టులోని సెలక్టర్ ఒకరు మమ్మల్ని చూశారు.తప్పు చేయలేదుఅయినా సరే నేను ఆమె చేతిని వీడలేదు. ఎందుకంటే.. నేను ఎటువంటి తప్పు చేయడం లేదని నాకు తెలుసు. ఆ పర్యటనలో బాగా రాణిస్తే జాతీయ జట్టులో చోటు దక్కుతుందని తెలుసు. కానీ రోజురోజుకూ నా ప్రదర్శన దిగజారిపోయింది’’ అని శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు.కాగా శిఖర్ ధావన్ రోహిత్ శర్మతో కలిసి చాలాకాలం టీమిండియా ఓపెనర్గా ఉన్నాడు. తన అంతర్జాతీయ కెరీర్లో 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడిన గబ్బర్.. టెస్టుల్లో 2315, వన్డేల్లో 6793, టీ20 మ్యాచ్లలో 1759 పరుగులు సాధించాడు.ఇక శిఖర్ ధావన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీ అనే డివోర్సీని పెళ్లాడిన.. అతడు కొన్నేళ్ల క్రితం ఆమెతో విడిపోయాడు. ప్రస్తుతం ఐర్లాండ్ బ్యూటీ సోఫీ షైన్తో లిన్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఆయేషా- ధావన్లకు కుమారుడు జొరావర్ ఉన్నాడు.చదవండి: IND vs ENG 2nd Test: భారత జట్టులో కీలక మార్పులు.. అతడిపై వేటు! తెలుగోడికి చోటు? -
T20 WC: భయంతో వణికిపోయా.. అతడే గేమ్ ఛేంజర్: రోహిత్ శర్మ
టీమిండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma). అతడి సారథ్యంలో 2024లో టీ20 ప్రపంచకప్ (T20 World Cup) గెలిచిన భారత్.. యాభై ఓవర్ల ఫార్మాట్లో ఈ ఏడాది చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)ని కూడా కైవసం చేసుకుంది. ఇక పొట్టి వరల్డ్కప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్.. ఇటీవలే టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.ప్రస్తుతం భారత వన్డే జట్టు కెప్టెన్గా కొనసాగుతున్న రోహిత్ శర్మ.. టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్ నాటి జ్ఞాపకాలను తాజాగా గుర్తు చేసుకున్నాడు. ఒక దశలో తాను భయంతో వణికిపోయానని.. అయితే, తమ జట్టు మీద తనకున్న నమ్మకం వమ్ముకాలేదని పేర్కొన్నాడు. అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ మ్యాచ్ను తిరిగి తమ ఆధీనంలోకి తీసుకువచ్చిందని తెలిపాడు.ఆదుకున్న కోహ్లి, అక్షర్, దూబేకాగా బార్బడోస్ వేదికగా గతేడాది జూన్లో జరిగిన వరల్డ్కప్ ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాతో తలపడింది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా... ఓపెనర్ రోహిత్ శర్మ 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. వన్డౌన్లో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ డకౌట్ కాగా.. పవర్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ 3 పరుగులకే అవుటయ్యాడు.ఈ క్రమంలో దూకుడుగా మొదలుపెట్టి 1.3 ఓవర్లలోనే 23 పరుగులు సాధించిన టీమిండియా.. ఐదో ఓవర్ పూర్తయ్యేసరికి 34 పరుగులు మాత్రమే చేసి మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఇలాంటి దశలో మరో ఓపెనర్ విరాట్ కోహ్లి (76), ఐదు, ఆరు స్థానాల్లో వచ్చిన అక్షర్ పటేల్ (47), శివం దూబే (27) జట్టును ఆదుకున్నారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి టీమిండియా 176 పరుగులు చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఎనిమిది వికెట్ల నష్టానికి 169 పరుగులే చేయగలిగింది. దీంతో ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి టీమిండియా పదమూడేళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది.భయంతో వణికిపోయాను.. ఏమీ తోచలేదుఈ విషయాలను గుర్తు చేసుకున్న రోహిత్ శర్మ.. ‘‘నిజం చెప్పాలంటే నేను వణికిపోయాను. నాకసలు ఏమీ తోచలేదు. ఫలితం విషయంలో ప్రత్యర్థికి అవకాశం ఇచ్చామా అనిపించింది.అయితే, నా మనసులో మాత్రం మా లోయర్ ఆర్డర్ మీద పూర్తి నమ్మకం ఉంది. ఆ టోర్నీ మొత్తంలో వారికి ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రానప్పటికీ.. ఈసారి కచ్చితంగా ప్రభావం చూపుతారని నమ్మాను.అతడే గేమ్ ఛేంజర్నిజానికి చాలా మందికి అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ గురించి గుర్తుండకపోవచ్చు. అయితే, అతడే గేమ్ ఛేంజర్. క్లిష్ట పరిస్థితుల్లో 31 బంతుల్లో 47 పరుగులు చేయడం గొప్ప విషయం. ఇక విరాట్ గురించి చెప్పేదేముంది. తను అద్భుత బ్యాటింగ్తో మరోసారి ఆకట్టుకున్నాడు’’ అని పేర్కొన్నాడు. జియోహాట్స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఫైనల్లో విరాట్ కోహ్లి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా... భారత ప్రధాన పేసర్ ‘జస్ప్రీత్ బుమ్రా’ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు.చదవండి: విధ్వంసకర శతకం, మూడు ఫిఫ్టీలు.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్ -
రోహిత్... ‘ప్రేమ కథా చిత్రం’
ముంబై: మైదానంలో సహచరులతో సరదాగా ఉంటూ... ప్రత్యర్థి బౌలర్ల భరతం పట్టే భారత వన్డే కెపె్టన్ రోహిత్ శర్మ... తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి అభిమానులకు తెలియని విషయాలు తాజాగా పంచుకున్నాడు. భార్య రితికా సజ్దేకు తొలిసారి తన ప్రేమను వ్యక్త పరిచిన విధానాన్ని వెల్లడించాడు. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, గీతా బస్రా దంపతుల యూట్యూబ్ చానల్లో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో రోహిత్ తన ప్రేమకథను వివరించాడు. తాను చిన్నప్పుడు క్రికెట్ ఓనమాలు నేర్చుకున్న మైదానంలోని పిచ్పై మోకాళ్ల మీద కూర్చొని రితికాకు లవ్ ప్రపోజ్ చేసినట్లు తెలిపాడు. ‘నా ప్రేవ వ్యక్తీకరణ రొమాంటిక్గా జరిగింది. నా కెరీర్ ప్రారంభమైన చోటే లవ్ ప్రపోజ్ చేయాలని నిర్ణయించుకున్నా. అందుకోసం ముందే అంతా సిద్ధం చేసుకున్నా. ఓ సాయంత్రం రితికా నా కోసం ఇంటి నుంచి భోజనం తీసుకొచ్చింది. ఇద్దరం కలిసి మెరీన్ డ్రైవ్లో కబుర్లు చెప్పుకుంటూ అది లాగించాం. ఆ తర్వాత ఐస్క్రీమ్ తిందామని చెప్పి తనను కారు ఎక్కించుకున్నా. మరీన్ డ్రైవ్, హాజీ అలీ, వర్లీ ఇలా ముందుకు వెళ్తుంటే... ఐస్క్రీమ్ షాప్ ఇంకెక్కడుంది అని రితికా ఎదురు ప్రశి్నంచింది. బాంద్రా తప్పించి తనకు ముంబై సిటీ ఎక్కువ తెలియదు. దీంతో బోరీవాలిలో మంచి ఐస్క్రీమ్ దొరుకుతుందని అబద్ధం చెప్పి తీసుకెళ్లా. కారు ఒక చోట పార్క్ చేసి ఆమెను మైదానంలోకి తీసుకెళ్లా. అప్పటికే నా స్నేహితులతో చెప్పి కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేయించా. ఆ క్షణాలను ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేశా. పిచ్ మధ్యకు వెళ్లిన తర్వాత మోకాళ్లపై కూర్చొని తనకు నా ప్రేమను వ్యక్త పరిచా’ అని రోహిత్ తన ప్రేమ కథను వివరించాడు. గతేడాది టి20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం ఆ ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ... ఇటీవల టెస్టు క్రికెట్ నుంచి సైతం తప్పుకున్నాడు. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న హిట్మ్యాన్... ఐపీఎల్ అనంతరం కుటుంబంతో కలిసి గడుపుతున్నాడు. -
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
టెస్టు క్రికెట్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మరోసారి తన సత్తా చాటాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో పంత్ ఫియర్లెస్ ఇన్నింగ్స్ ఆడాడు. యశస్వి జైశ్వాల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన రిషబ్.. తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేశాడు.మొదటి రోజు ఆటముగిసే సమయానికి పంత్ 65 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 6 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో పంత్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.హిట్మ్యాన్ రికార్డు బ్రేక్..వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ హిస్టరీలోనే అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా పంత్ రికార్డులెక్కాడు. పంత్ ఇప్పటివరకు డబ్ల్యూటీసీలో 35 మ్యాచ్లు ఆడి 58 సిక్సర్లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ(56) పేరిట ఉండేది.తాజా మ్యాచ్తో రోహిత్ను రిషబ్ అధిగమించాడు. ఇక ఓవరాల్గా ఈ ఫీట్ సాధించిన జాబితాలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(83) అగ్రస్ధానంలో ఉండగా.. పంత్ రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్లో మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో కెప్టెన్ శుబ్మన్ గిల్(127 నాటౌట్), యశస్వి జైశ్వాల్(101) సెంచరీలతో మెరిశారు.చదవండి: అలా అయితే అవుట్ అయిపోతావు! గిల్కు పంత్ వార్నింగ్.. వైరల్ -
అచ్చం నాన్నలాగే!.. కుమారుడితో రోహిత్- రితికా.. వీడియో వైరల్
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం కుటుంబంతో సమయం గడుపుతున్నాడు. ఐపీఎల్-2025 తర్వాత దొరికిన విరామాన్ని పూర్తిగా ఫ్యామిలీకే కేటాయించిన హిట్మ్యాన్.. తాజాగా ముంబై విమానాశ్రయంలో దర్శనమిచ్చాడు. భార్య రితికా సజ్దే, కుమార్తె సమైరా, చిన్నారి కుమారుడు అహాన్లతో కలిసి రోహిత్ ఎయిర్పోర్టులో ప్రవేశించాడు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వీడియో ద్వారా రోహిత్ కొడుకు అహాన్ ఫేస్ పూర్తిగా రివీల్ అయింది. అహాన్ను చూసిన అభిమానులు.. ‘‘అచ్చం నాన్నలాగే ఉన్నాడు’’ కామెంట్లు చేస్తున్నారు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ను విజేతగా నిలిపిన రోహిత్ శర్మ.. కెప్టెన్గా రెండో ఐసీసీ ట్రోఫీని అందుకున్నాడు. అంతకు ముందు టీ20 ప్రపంచకప్-2024లోనూ టీమిండియాను చాంపియన్గా నిలిపాడు హిట్మ్యాన్. ఆ తర్వాత అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. ప్రస్తుతం ఐపీఎల్లో కొనసాగుతున్నాడు.ఐపీఎల్-2025లో భాగంగా హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహించిన రోహిత్.. పదిహేను మ్యాచ్లలో కలిపి 418 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక ఎలిమినేటర్ మ్యాచ్లో భాగంగా గుజరాత్ టైటాన్స్పై అతడు ఈ సీజన్లో తన అత్యధిక స్కోరు (81) నమోదు చేశాడు.అయితే, క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడటంతో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ మధ్యలోనే రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే ముందే తన నిర్ణయాన్ని వెల్లడించాడు.కాగా టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన 38 ఏళ్ల రోహిత్.. వన్డేల్లో మాత్రం కొనసాగనున్నట్లు స్పష్టం చేశాడు. ఈ క్రమంలో ఆగష్టులో అతడు మళ్లీ మైదానంలో దిగనున్నాడు. బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ నేపథ్యంలో సారథిగా పునరాగమనం చేయనున్నాడు.ఇక 2007లో అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ.. టీమిండియా తరఫున ఇప్పటి వరకు 273 వన్డేలు ఆడి.. 11168 పరుగులు సాధించాడు. ఇందులో 32 శతకాలు ఉన్నాయి. ఇక వన్డేల్లో రోహిత్ ఎవరికీ సాధ్యం కాని రీతిలో అత్యధికంగా మూడు డబుల్ సెంచరీలు చేయడం విశేషం. అంతేకాదు.. యాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక స్కోరు (264) అతడిదే కావడం గమనార్హం. అదే విధంగా.. 159 టీ20లలో ఐదు శతకాల సాయంతో రోహిత్ 4231 పరుగులు చేశాడు. 67 టెస్టుల్లో కలిపి 4301 రన్స్ సాధించాడు. View this post on Instagram A post shared by Rohit Saraiya (@rohitsaraiya.official) -
విధ్వంసకర శతకం.. గేల్, కోహ్లి సెంచరీల క్లబ్లో చేరిన మ్యాక్స్వెల్
మేజర్ లీగ్ క్రికెట్ 2025 ఎడిషన్లో భాగంగా లాస్ ఏంజెలెస్ నైట్రైడర్స్తో ఇవాళ (జూన్ 18) జరిగిన మ్యాచ్లో వాషింగ్టన్ ఫ్రీడం కెప్టెన్, ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ సుడిగాలి శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్లో మ్యాక్సీ కేవలం 49 బంతుల్లో 13 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో అజేయమైన 106 పరుగులు చేశాడు. ఈ సెంచరీకి మ్యాక్స్వెల్కు టీ20ల్లో ఎనిదవది.ఈ సెంచరీతో మ్యాక్స్వెల్ క్రిస్ గేల్, విరాట్ కోహ్లి టీ20 సెంచరీల క్లబ్లో చేరాడు. పొట్టి క్రికెట్లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో 10వ స్థానానికి దూసుకొచ్చాడు. పొట్టి క్రికెట్లో అత్యధిక సెంచరీల రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. ఈ ఫార్మాట్లో గేల్ 22 శతకాలు బాదాడు. గేల్ తర్వాత ఈ రికార్డు పాక్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్ (11) పేరిట ఉంది. ఈ ఫార్మాట్లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి 9 సెంచరీలు బాదాడు. తాజా సెంచరీతో మ్యాక్స్వెల్ మైఖేల్ క్లింగర్, ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్, రోహిత్ శర్మ సరసన చేరాడు. వీరంతా పొట్టి క్రికెట్లో తలో ఎనిమిది సెంచరీలు బాదారు.పొట్టి క్రికెట్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్-10 క్రికెటర్లు..గేల్-22బాబర్ ఆజమ్-11విరాట్ కోహ్లి-9రిలీ రొస్సో-9మైఖేల్ క్లింగర్-8ఆరోన్ ఫించ్-8డేవిడ్ వార్నర్-8జోస్ బట్లర్-8రోహిత్ శర్మ-8మ్యాక్స్వెల్-8మ్యాచ్ విషయానికొస్తే.. మ్యాక్స్వెల్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడం నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (68/4) బరిలోకి దిగిన మ్యాక్సీ తొలుత నిదానంగా ఆడాడు. తొలి 15 బంతుల్లో కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. ఆతర్వాత మ్యాక్సీకి పూనకం వచ్చింది. 34 బంతుల్లో 13 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 95 పరుగులు చేశాడు. ఒబస్ పియెనార్ను (15 బంతుల్లో 11 నాటౌట్) మరో ఎండ్లో పెట్టుకొని మ్యాక్సీ తన విధ్వంసకాండను కొనసాగించాడు. వాషింగ్టన్ ఇన్నింగ్స్లో మ్యాక్సీ మినహా మిచెల్ ఓవెన్ ఒక్కడే (11 బంతుల్లో 32) కాస్త పర్వాలేదనిపించాడు. రచిన్ రవీంద్ర 8, ఆండ్రియస్ గౌస్ 12, మార్క్ చాప్మన్ 17, జాక్ ఎడ్వర్డ్స్ 11 పరుగులు చేశాడు. నైట్రైడర్స్ బౌలర్లలో కోర్నె డ్రై, తన్వీర్ సంఘా తలో 2 వికెట్లు పడగొట్టగా.. జేసన్ హోల్డర్ ఓ వికెట్ తీశాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నైట్రైడర్స్ 16.3 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. జాక్ ఎడ్వర్డ్స్, మిచెల్ ఓవెన్ తలో 3, సౌరభ్ నేత్రవల్కర్ 2, మార్క్ అడైర్, ఇయాన్ హోలండ్ చెరో వికెట్ పడగొట్టి నైట్రైడర్స్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. నైట్రైడర్స్ ఇన్నింగ్స్లో సైఫ్ బదార్ (32), జేసన్ హోల్డర్ (23), షాడ్లే (12), కోర్నె డ్రై (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఈ జట్టులో తొలి ముగ్గురు బ్యాటర్లు అలెక్స్ హేల్స్, సునీల్ నరైన్, ఉన్ముక్త్ చంద్ డకౌట్ కాగా.. రోవ్మన్ పావెల్ (4), మాథ్యూ ట్రంప్ (2), ఆండ్రీ రసెల్ (4) సింగిల్ డిజిట్ స్కోర్లకే టపా కట్టేశారు. సూపర్ సెంచరీ చేసిన మ్యాక్స్వెల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
WTC Final 2025: రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన ట్రివిస్ హెడ్
లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ 2025లో ఆసీస్ ఆటగాడు ట్రవిస్ హెడ్ ఓ మైలురాయిని దాటాడు. ఈ మ్యాచ్లో విఫలమైనా హెడ్ (13 బంతుల్లో 11) ఓ ఘనత సాధించాడు. ఐసీసీ ఫైనల్స్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న రోహిత్ శర్మను అధిగమించి, ఆ స్థానానికి చేరాడు.ఐసీసీ ఫైనల్స్లో రోహిత్ 11 ఇన్నింగ్స్ల్లో 322 పరుగులు చేయగా.. ఈ మ్యాచ్లో పరుగులతో కలుపుకొని హెడ్ 4 ఇన్నింగ్స్ల్లోనే 329 పరుగులు చేశాడు. ఐసీసీ ఫైనల్స్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు రికార్డుల రిరాజు విరాట్ కోహ్లి పేరిట ఉంది. విరాట్ 11 ఇన్నింగ్స్ల్లో 411 పరుగులు చేశాడు.వాస్తవానికి ఈ మ్యాచ్కు ముందు హెడ్ విరాట్ రికార్డుపైనే కన్నేశాడు. తొలి ఇన్నింగ్స్లో విఫలమైన రెండో ఇన్నింగ్స్లో అయినా హెడ్కు విరాట్ రికార్డు బద్దలు కొట్టే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్లో హెడ్ 83 పరుగులు చేస్తే విరాట్ పేరిట ఉన్న ఈ అల్టైమ్ రికార్డు బద్దలవుతుంది.ఘనమైన రికార్డుట్రవిస్ హెడ్కు ఐసీసీ ఫైనల్స్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. 2021-23 డబ్ల్యూటీసీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్లో 163, రెండో ఇన్నింగ్స్లో 18 పరుగులు చేశారు. 2023 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో 137 పరుగులు చేశాడు. తాజాగా జరుగుతున్న 2023-25 డబ్ల్యూటీసీ ఫైనల్లో 11 పరుగులు చేశాడు. హెడ్ ఐసీసీ ఫైనల్స్లో చేసిన రెండు సెంచరీలు భారత్నే చేయడం విశేషం. ఈ సైకిల్ డబ్ల్యూటీసీలో భారత్ ఫైనల్స్కు చేరలేదు. మూడో స్థానంతో సరిపెట్టుకుంది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. రబాడ (5/51), జన్సెన్ (3/49), కేశవ్ మహారాజ్ (1/19), మార్క్రమ్ (1/5) ధాటికి 56.4 ఓవర్లలో 212 పరుగులకే కుప్పకూలింది. 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్ను స్టీవ్ స్మిత్ (66), బ్యూ వెబ్స్టర్ (72) అర్ద సెంచరీలతో ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్కు 79 పరుగులు జోడించి ఆసీస్ గౌరవప్రదమైన స్కోర్ సాధించేందుకు దోహదపడ్డారు. వీరిద్దరు ఔటయ్యాక ఆసీస్ ఇన్నింగ్స్ మరోసారి పేకమేడలా కూలింది. మధ్యలో అలెక్స్ క్యారీ (23) కాసేపు పోరాడాడు.ఆసీస్ ఇన్నింగ్స్లో స్మిత్, వెబ్స్టర్, క్యారీతో పాటు లబూషేన్ (17), ట్రవిస్ హెడ్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా 20 బంతుల డకౌట్ కావడంతో ఆసీస్ పతనం మొదలైంది. ఈ మ్యాచ్తో ఖ్వాజాకు జోడీగా లబూషేన్తో ఓపెనింగ్ ప్రయోగం చేసినప్పటికీ సత్ఫలితం రాలేదు.ఖ్వాజాను రబాడ, లబూషేన్ను జన్సెన్ ఔట్ చేశారు. గాయం నుంచి కోలుకొని చాలాకాలం తర్వాత తిరిగి వచ్చిన కెమరూన్ గ్రీన్ (4) దారుణంగా విఫలమయ్యాడు. ఇతని వికెట్ కూడా రబాడకే దక్కింది. స్టీవ్ స్మిత్ను మార్క్రమ్, క్యారీని కేశవ్ మహారాజ్.. హెడ్, లియోన్ను (0) జన్సెన్ ఔట్ చేశారు. వెబ్స్టర్, కమిన్స్ (1), స్టార్క్ (1) వికెట్లు రబాడ ఖాతాలోనే వెళ్లాయి.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికాకు కూడా ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. తొలి ఓవర్లోనే మార్క్రమ్ను స్టార్క్ డకౌట్ చేశాడు. జట్టు స్కోర్ 19 పరుగుల వద్ద ఉండగా మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ను (16) స్టార్కే పెవిలియన్కు పంపాడు. వన్డౌన్ బ్యాటర్గా ప్రమోషన్ పొందిన వియాన్ ముల్దర్ (6) దారుణంగా విఫలమయ్యాడు. అతని వికెట్ కమిన్స్కు దక్కింది. అనంతరం వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ను (2) హాజిల్వుడ్ ఔట్ చేశాడు. దీంతో 30 పరుగులకే సౌతాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. సౌతాఫ్రికాను గట్టెక్కించే బాధ్యత బవుమా (3), బెడింగ్హమ్ భుజస్కందాలపై ఉంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్ 43/4గా ఉంది. ప్రస్తుతం ఆ జట్టు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 169 పరుగులు వెనుకపడి ఉంది. -
రోహిత్ ను చావు దెబ్బ తీసింది ఇతనే!
-
సడెన్ షాక్లిస్తున్న స్టార్ క్రికెటర్లు.. ఆందోళనలో అభిమానులు
అంతర్జాతీయ క్రికెట్కు ఈ ఏడాది అచొచ్చినట్లు లేదు. స్టార్ క్రికెటర్లు ఒక్కొరుగా రిటైర్మెంట్ ప్రకటిస్తూ క్రికెట్ అభిమానులకు సడెన్ షాక్లిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ మార్టిన్ గప్తిల్ తొలుత రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆతర్వాత టీమిండియా స్పీడ్స్టర్ వరుణ్ ఆరోన్, బంగ్లాదేశ్ బ్యాటింగ్ దిగ్గజం తమీమ్ ఇక్బాల్, టీమిండియా వికెట్కీపర్ వృద్దిమాన్ సాహా, శ్రీలంక స్టార్ బ్యాటర్ దిముత్ కరుణరత్నే, బంగ్లాదేశీ స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ మహ్మదుల్లా రిటైర్మెంట్ ప్రకటించారు. కొద్ది రోజుల కిందట సౌతాఫ్రికా విధ్వంసకర యోధుడు హెన్రిచ్ క్లాసెన్ అనూహ్య పరిణామాల మధ్య రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా విండీస్ సిక్సర్ల వీరుడు నికోలస్ పూరన్ 29 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ అభిమానులను షాక్కు గురి చేశాడు. పైన పేర్కొన్న ఆటగాళ్లంతా క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికారు.సడెన్ షాక్లు..ఈ ఏడాది కొందరు క్రికెటర్లు సడెన్ షాక్లు ఇచ్చారు. మొదటి షాక్ ఆసీస్ దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఇచ్చాడు. స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆతర్వాత ఆసీస్ విధ్వంసకర వీరుడు మార్కస్ స్టోయినిస్ మరో షాక్ ఇచ్చాడు. స్టోయినిస్ వన్డే ఫార్మాట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ఆతర్వాత బంగ్లాదేశ్ ఆల్టైమ్ గ్రేట్ వన్డే బ్యాటర్ ముష్ఫికర్ రహీం మరో షాక్ ఇచ్చాడు. అప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రహీం వన్డేల నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.క్రికెట్ దునియాకే భారీ షాక్..ఈ ఏడాది క్రికెట్ అభిమానులకు టీమిండియా దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అతి పెద్ద షాక్లు ఇచ్చారు. వీరిద్దరు ఈ ఏడాది టెస్ట్ ఫార్మాట్కు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించారు. రోహిత్, విరాట్ టెస్ట్ ఫార్మాట్ నుంచి వైదొలగడం భారత క్రికెట్కు భారీ లోటు. ఈ ఇద్దరు మరో భారత ఆటగాడు రవీంద్ర జడేజాతో కలిసి 2024 టీ20 వరల్డ్కప్ అనంతరం పొట్టి ఫార్మాట్కు గుడ్బై చెప్పారు. రోహిత్, కోహ్లి టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించాక శ్రీలంక దిగ్గజ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ కూడా సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. -
రోహిత్, కోహ్లి ఫేర్వెల్కు ప్లాన్ చేస్తున్న క్రికెట్ ఆస్ట్రేలియా
భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టీ20, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇరువురు వన్డేలకు మాత్రమే అందుబాటులో ఉన్నారు. రోకో (రోహిత్, కోహ్లి) 2027 వన్డే వరల్డ్కప్ వరకు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతామని సూచనప్రాయంగా తెలిపినట్లు సమాచారం.రోకో ఈ ఆగస్ట్లో బంగ్లాదేశ్తో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో టీమిండియా తరఫున బరిలోకి దిగవచ్చు. అనంతరం అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లోనూ పాల్గొనవచ్చు. ఒకవేళ ఈ సిరీస్లో రోకోకు పాల్గొంటే కెరీర్లో వారికి అదే చివరి ఆస్ట్రేలియా పర్యటన అవుతుంది.ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా రోహిత్, కోహ్లి ఫేర్వెల్కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. హిందుస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం.. క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో టాడ్ గ్రీన్బర్గ్ అక్టోబర్లో జరిగే భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ సందర్భంగా రోహిత్, కోహ్లిలకు ఘనంగా వీడ్కోలు పలకాలని ప్లాన్ చేస్తున్నారు.ఓ సందర్భంగా టాడ్ ఇలా అన్నారు. మా దేశంలో (ఆస్ట్రేలియా) విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడటం అదే చివరిసారి కావచ్చు. ఒకవేళ అలా అయితే వారికి గొప్పగా వీడ్కోలు పలకాల్సిన ధర్మం మాకుంది. వారిరువురు భారత క్రికెట్తో పాటు అంతర్జాతీయ క్రికెట్కు ఎంతో చేశారు. అలాంటి వారికి గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన చేస్తాము.ఇదిలా ఉంటే, రోహిత్, కోహ్లి తాజాగా ముగిసిన బోర్డర్ గవాస్కర్ సిరీస్ తర్వాత టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. వారిద్దరి కెరీర్లో చివరి టెస్ట్లు ఆస్ట్రేలియా గడ్డపైనే ఆడారు. అయితే ఆ సిరీస్ జరిగే నాటికి రోహిత్, కోహ్లి రిటైర్మెంట్ గురించి ఆలోచించకపోయి ఉండవచ్చు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు చోటు చేసుకున్న పరిణామాల అనంతరం వారిద్దరు రోజుల వ్యవధిలో టెస్ట్లకు గుడ్బై చెప్పారు.బీసీసీఐ సైతం రోహిత్, కోహ్లిలకు ఫేర్వెల్ పలకలేకపోయింది. ఈ జోడీ టెస్ట్ల్లో ఇంకొంతకాలం కొనసాగుతారని అంతా అనుకున్నారు. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ, వారిద్దరు టెస్ట్లకు గుడ్బై చెప్పి భారత క్రికెట్ అభిమానులను షాక్కు గురి చేశారు. రోకో 2027 వరల్డ్కప్ వరకు వన్డేల్లో కొనసాగుతామని చెప్పినప్పటికీ.. ఈ విషయంపై కూడా అంత గ్యారెంటీ లేదు.ఎందుకంటే, ఆ సమయానికి రోహిత్ వయసు 40, కోహ్లి వయసు 38గా ఉంటుంది. ఆ టైమ్ వరకు ఇరువురు ఫిట్గా ఉంటారో లేదో. ఈ విషయంలో కోహ్లి గురించి ఆలోచన లేనప్పటికీ, రోహిత్పైనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే రోహిత్ ఫిట్నెస్కు సంబంధించి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాడు. మరో రెండేళ్ల తర్వాత అంటే అతని పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో మరి. -
రోహిత్ శర్మకు షాక్..! టీమిండియా కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్?
ఐపీఎల్-2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ తుది మెట్టుపై బోల్తా పడినప్పటికి.. ఆ జట్టు సారథి శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీతో అందరిని ఆకట్టుకున్నాడు. తన అద్బుతమైన కెప్టెన్సీతో పంజాబ్ కింగ్స్ను పదేళ్ల తర్వాత ఫైనల్కు చేర్చాడు. మరోవైపు వ్యక్తిగత ప్రదర్శన పరంగా అయ్యర్ దుమ్ములేపాడు.దీంతో అయ్యర్కు అంతర్జాతీయ క్రికెట్లో రివార్డు లభించినట్లు తెలుస్తోంది. ఇండియన్స్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ ప్రకారం.. టీమిండియా వైట్బాల్ కెప్టెన్సీ రేసులో శ్రేయస్ ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా గత కొంతకాలంగా కేవలం వన్డేలకే పరిమితైన అయ్యర్ భారత టీ20 జట్టులోకి పునరాగమనం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కెప్టెన్సీ రేసులో శ్రేయస్..శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. కానీ ఈ ఏడాది ఐపీఎల్లో తన అద్బుత ప్రదర్శన తర్వాత అయ్యర్ టీ20 సెటప్లోకి కూడా వచ్చే అవకాశముంది. అంతేకాకుండా అయ్యర్ ఇప్పుడు వైట్కెప్టెన్సీ రేసులో కూడా ఉన్నాడు అని ఓ బీసీసీఐ అధికారి ది ఇండియన్స్ ఎక్స్ప్రెస్తో పేర్కొన్నారు.కాగా ప్రస్తుతం భారత జట్టు టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఉండగా.. రోహిత్ శర్మ వన్డే జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ ఇటీవలే నియమితుడయ్యాడు. అయితే మూడు ఫార్మాట్లకు వెర్వేరు కెప్టెన్లను నియమించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే టెస్టులకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ త్వరలోనే వన్డేలకు సైతం వీడ్కోలు పలికే ఛాన్స్ ఉంది. ఒకవేళ రిటైర్మెంట్ ప్రకటించికపోయినా కెప్టెన్సీ నుంచి మాత్రం తప్పుకునే అవకాశముంది. ఈ క్రమంలో అయ్యర్కు వన్డే పగ్గాలు అప్పగించాలని బీసీసీఐ పెద్దలు యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.చదవండి: ENG vs WI: జోస్ బట్లర్ విధ్వంసం.. విండీస్ను చిత్తు చేసిన ఇంగ్లండ్ -
నా నిర్ణయంతో మా నాన్న చాలా ఫీలయ్యారు: రోహిత్ శర్మ
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ ఇటీవలే టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కీలకమైన ఇంగ్లండ్ సిరీస్కు ముందు రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడించి అందరికి షాకిచ్చారు. అయితే హిట్మ్యాన్ నిర్ణయంతో కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, అతడి తండ్రి గురునాథ్ శర్మ సైతం నిరాశకు లోనయ్యారంట. ఈ విషయాన్ని స్వయంగా రోహిత్నే వెల్లడించాడు."మా నాన్న.. నేను రెడ్ బాల్తో క్రికెట్ ఆడటం ఎక్కువగా చూశారు. అందుకే ఆయనకు టెస్టు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నేను టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆయన కొంచెం నిరాశచెందారు. అదే సమయంలో నా సుదీర్ఘ కెరీర్ పట్ల ఆయన సంతోషం కూడా వ్యక్తం చేశారు.ఈ రోజు ఈస్ధాయికి నేను చేరుకున్నానంటే అందులో కీలక పాత్ర మా నాన్నదే. తల్లిదండ్రులు సపోర్ట్ లేకుండా మనం ఏదీ సాధించలేము. నాకు కూడా టెస్టు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నా కెరీర్ తొలి రోజు నుంచే ఆయన టెస్టు క్రికెట్కు అభిమానిగా మారారు. నేను వన్డేలో 264 పరుగులు చేసిన రోజు నాకు ఇంకా ఇప్పటికి బాగా గుర్తుంది. ఆ రోజు మాన్న నా దగ్గరకు వచ్చి ఏదో మొక్కుబడిగా బాగా ఆడావని ప్రశంసించారు. అంతే తప్ప అతనిలో ఎటువంటి ఉత్సాహం కన్పించలేదు" అని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ పేర్కొన్నాడు.రోహిత్ తన టెస్ట్ కెరీర్లో 67 మ్యాచ్లు ఆడి 40.57 సగటుతో 4,301 పరుగులు సాధించారు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి. 2019లో దక్షిణాఫ్రికాపై సాధించిన 212 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరు. కెప్టెన్గా 24 టెస్టులకు నాయకత్వం వహించి, 12 విజయాలు, 9 ఓటములు, 3 డ్రాలు నమోదు చేశాడు.చదవండి: IND vs ENG; 'అతడికి చాలా అనుభవం ఉంది.. ఇంగ్లండ్ టూర్లో కీలకం కానున్నాడు' -
GT Vs MI: కీలక మ్యాచ్లో రఫ్ఫాడించిన ముంబై.. గుజరాత్కు ఝలక్ (ఫొటోలు)
-
MI Vs GT: ముంబై ముందుకు... గుజరాత్ ఇంటికి
ఒత్తిడితో కూడిన మ్యాచ్లు ఆడటంలో ఆరితేరిన ముంబై ఇండియన్స్... గుజరాత్ టైటాన్స్ను చిత్తు చేసి క్వాలిఫయర్–2కు చేరింది. బ్యాటింగ్లో రోహిత్ శర్మ దూకుడుకు... బెయిర్స్టో, సూర్యకుమార్ మెరుపులు తోడవడంతో మొదట భారీ స్కోరు చేసిన ముంబై... ఆ తర్వాత బౌలింగ్లోనూ ఆకట్టుకొని ముందంజ వేసింది. టాప్–3 ఆటగాళ్లపైనే ఎక్కువ ఆధారపడిన గుజరాత్... కీలక ఎలిమినేటర్ పోరులో అది సాధ్యపడక పరాజయంతో లీగ్ నుంచి నిష్క్రమించింది. ముల్లాన్పూర్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ క్వాలిఫయర్–2కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ పోరులో ముంబై 20 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్పై విజయం సాధించింది. మొదట ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (50 బంతుల్లో 81; 9 ఫోర్లు, 4 సిక్స్లు) దుమ్మురేపగా... జానీ బెయిర్స్టో (22 బంతుల్లో 47; 4 ఫోర్లు, 3 సిక్స్లు), సూర్యకుమార్ యాదవ్ (20 బంతుల్లో 33; 1 ఫోర్, 3 సిక్స్లు) ధాటిగా ఆడారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, సాయి కిషోర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (49 బంతుల్లో 80; 10 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... వాషింగ్టన్ సుందర్ (24 బంతుల్లో 48; 5 ఫోర్లు, 3 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 2... బుమ్రా, గ్లీసన్, సాంట్నర్, అశ్వని కుమార్ తలా ఒక వికెట్ తీశారు. ఆదివారం జరగనున్న క్వాలిఫయర్–2లో పంజాబ్ కింగ్స్తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. దంచుడే దంచుడు... టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై జట్టుకు ఓపెనర్లు రోహిత్, బెయిర్స్టో మెరుపు ఆరంభాన్నిచ్చారు. రికెల్టన్ అందుబాటులో లేకపోవడంతో... ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన బెయిర్స్టో తన విలువ చాటుకున్నాడు. ప్రసిధ్ కృష్ణ వేసిన రెండో ఓవర్లో ఫోర్తో దూకుడు పెంచిన బెయిర్స్టో... ప్రసిధ్ కృష్ణ వేసిన నాలుగో ఓవర్లో పరుగుల పండగ చేసుకున్నాడు. వరసగా 6, 4, 6, 6, 4... 26 పరుగులు పిండుకున్నాడు. సిరాజ్ ఓవర్లో రెండు ఫోర్లతో టచ్లోకి వచ్చిన రోహిత్ సాయి కిషోర్ బౌలింగ్లో 6, 4, 4తో గేర్ మార్చాడు. 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ ఇచ్చిన క్యాచ్ను కోట్జీ వదిలేయగా... 12 పరుగుల వద్ద మెండిస్ మరో సులువైన క్యాచ్ను నేలపాలు చేశాడు. దీన్ని పూర్తిగా వినియోగించుకున్న రోహిత్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి ముంబై జట్టు 79/0తో నిలిచింది. స్పిన్నర్ల రాకతో స్కోరు వేగం మందగించగా... బెయిర్స్టోను అవుట్ చేసి సాయి కిషోర్ గుజరాత్కు బ్రేక్ ఇచ్చాడు. రషీద్ ఓవర్లో 4, 6 ద్వారా ఐపీఎల్లో 7 వేల పరుగులతో పాటు 300 సిక్స్లు పూర్తి చేసుకున్న రోహిత్... 28 బంతుల్లో హాఫ్సెంచరీ మార్క్ అందుకున్నాడు. క్రీజులో ఉన్నంతసేపు భారీ షాట్లతో విరుచుకుపడిన సూర్యకుమార్ను సాయి కిషోర్ పెవిలియన్ పంపగా... ఈ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ (11 బంతుల్లో 25; 3 సిక్స్లు) కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. స్లో బంతితో రోహిత్ను ప్రసిధ్ కృష్ణ బుట్టలో వేసుకోగా... చివరి ఓవర్లో మూడు సిక్స్లు కొట్టిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 22 నాటౌట్; 3 సిక్స్లు) జట్టుకు భారీ స్కోరు అందించాడు. సుదర్శన్ పోరాడినా... భారీ లక్ష్యఛేదనలో గుజరాత్కు శుభారంభం లభించలేదు. కెప్టెన్ గిల్ (1) ఇన్నింగ్స్ నాలుగో బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో మరో ఓపెనర్ సుదర్శన్ బాధ్యతగా ముందుకు సాగాడు. ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడిన కుశాల్ మెండిస్ (10 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్స్లు) కాస్త సహకరించగా... సుదర్శన్ క్లాస్ కవర్ డ్రైవ్లతో ఆకట్టుకున్నాడు. భారీ లక్ష్యం కళ్లముందు ఉన్నా... ఏమాత్రం వెరవని టైటాన్స్ పవర్ప్లే ముగిసేసరికి 66/1తో నిలిచింది. గ్లీసన్, హార్దిక్, బుమ్రా, సాంట్నర్ ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టిన పసుదర్శన్ 28 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మెండిస్ వెనుదిరిగాక క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ కూడా ఆకట్టుకున్నాడు. ప్రమాదక బుమ్రా బంతులను కాచుకున్న ఈ జంట... మిగిలిన ఓవర్లలో ధాటిగా పరుగులు రాబట్టింది. దీంతో 13 ఓవర్లు ముగిసేసరికి టైటాన్స్ 148/2తో నిలిచింది. విజయానికి 42 బంతుల్లో 81 పరుగులు కావాల్సిన దశలో... బుమ్రా అద్భుత యార్కర్తో సుందర్ను క్లీన్ బౌల్డ్ చేయడంతో పరిస్థితి మారిపోయింది. సుదర్శన్ను గ్లీసన్ను అవుట్ చేయగా... రూథర్ఫోర్డ్ (24; 4 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. చివర్లో రాహుల్ తెవాటియా (16; 1 ఫోర్, 1 సిక్స్), షారుక్ ఖాన్ (13; 1 సిక్స్) మెరుపులు జట్టును గెలిపించలేకపోయాయి. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రషీద్ (బి) ప్రసిధ్ కృష్ణ 81; బెయిర్స్టో (సి) కోట్జీ (బి) సాయి కిషోర్ 47; సూర్యకుమార్ (సి) సుందర్ (బి) సాయి కిషోర్ 33; తిలక్ (సి) మెండిస్ (బి) సిరాజ్ 25; హార్దిక్ (నాటౌట్) 22; నమన్ ధీర్ (సి) రషీద్ (బి) ప్రసిధ్ కృష్ణ 9, సాంట్నర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 228. వికెట్ల పతనం: 1–84, 2–143, 3–186, 4–194, 5–206. బౌలింగ్: సిరాజ్ 4–0–37–1; ప్రసిధ్ కృష్ణ 4–0–53–2; సాయి కిషోర్ 4–0–42–2; రషీద్ ఖాన్ 4–0–31–0; కోట్జీ 3–0–51–0; సుందర్ 1–0–7–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (బి) గ్లీసన్ 80; గిల్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 1; మెండిస్ (హిట్ వికెట్) (బి) సాంట్నర్ 20; సుందర్ (బి) బుమ్రా 48; రూథర్ఫోర్డ్ (సి) తిలక్ (బి) బౌల్ట్ 24; తెవాటియా (నాటౌట్) 16; షారుక్ ఖాన్ (సి) సూర్యకుమార్ (బి) అశ్వని కుమార్ 13; రషీద్ ఖాన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–3, 2–67, 3–151, 4–170, 5–193, 6–208. బౌలింగ్: బౌల్ట్ 4–0–56–2; బుమ్రా 4–0–27–1; గ్లీసన్ 3.3–0–39–1; హార్దిక్ పాండ్యా 3–0–37–0; సాంట్నర్ 1–0–10–1; నమన్ ధీర్ 1–0–9–0; అశ్వని కుమార్ 3.3–0–28–1. -
IPL 2025, Eliminator Match: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ఐపీఎల్లో రోహిత్ శర్మ రెండు భారీ రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో ఇవాళ (మే 30) జరుగుతున్న కీలక ఎలిమినేటర్ మ్యాచ్లో 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. ఐపీఎల్లో 7000 పరుగులు సహా 300 సిక్సర్లు పూర్తి చేశాడు.ఈ ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 2 సిక్సర్లు బాదిన రోహిత్ ఐపీఎల్లో 300 సిక్సర్లు కొట్టిన తొలి భారత క్రికెటర్గా, ఓవరాల్గా రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్లో 8 పరుగుల వద్ద 7000 పరుగులు పూర్తి చేసిన రోహిత్ ఐపీఎల్లో విరాట్ కోహ్లి తర్వాత ఈ మార్కును తాకిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్-5 బ్యాటర్లు..క్రిస్ గేల్-357రోహిత్ శర్మ-300విరాట్ కోహ్లి-291ఎంఎస్ ధోని-264ఏబీ డివిలియర్స్-251ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు..విరాట్ కోహ్లి-8618రోహిత్ శర్మ-7000 (ఇన్నింగ్స్ కొనసాగుతుంది)శిఖర్ ధవన్-6769డేవిడ్ వార్నర్-6565సురేశ్ రైనా-5528మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ 13 ఓవర్ల అనంతరం రెండు వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (36 బంతుల్లో 60; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (0) క్రీజ్లో ఉన్నారు. ముంబై ఇన్నింగ్స్లో జానీ బెయిర్స్టో 22 బంతుల్లో 47 (4 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ 20 బంతుల్లో 33 పరుగులు (ఫోర్, 3 సిక్సర్లు) చేశారు. ఈ ఇద్దరి వికెట్లు సాయి కిషోర్కు దక్కాయి. కాగా, ఈ మ్యాచ్లో ఓడిన జట్టు లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు ఫైనల్కు ముందు మరో మ్యాచ్ (క్వాలిఫయర్-2లో పంజాబ్తో) ఆడాల్సి ఉంటుంది. నిన్న జరిగిన క్వాలిఫయర్-1లో పంజాబ్పై విజయం సాధించి ఆర్సీబీ నేరుగా ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. -
IPL 2025: రోహిత్ చాలా అనాసక్తిగా ఆడుతున్నాడు.. భారత మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపిస్తున్నాడు. ఈ సీజన్లో అతను 13 మ్యాచ్ల్లో మూడు హాఫ్ సెంచరీల సాయంతో 329 పరుగులు చేశాడు. హిట్మ్యాన్ ఈ సీజన్లో ఓ మోస్తరుగా రాణిస్తున్నా విమర్శకులు అతన్ని టార్గెట్ చేస్తున్నారు.రోహిత్ ప్రదర్శనలు ఈ సీజన్లో ముంబై ఇండియన్స్కు పెద్దగా ఉపయోగపడలేదని అంటున్నారు. హిట్మ్యాన్ చాలా నిర్లక్ష్యంగా, అనాసక్తిగా ఆడుతూ వికెట్ పారేసుకుంటున్నాడని ఆరోపిస్తున్నారు. తాజాగా హిట్మ్యాన్ వ్యతిరేకులతో భారత మాజీ బౌలర్ అతుల్ వాసన్ కూడా గళం కలిపాడు.ఈ సీజన్లో రోహిత్ ప్రదర్శనలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. క్రీడా జీవితంలో అన్ని సాధించాక రోహిత్ చాలా అనాసక్తిగా కనిపిస్తున్నాడంటూ కామెంట్ చేశాడు. రోహిత్లో ప్రేరణ కొరవడిందని అన్నాడు. ప్రేరణ కోసం అతను లక్ష్యాలను సెట్ చేసుకోవాలని సూచించాడు.వాసన్ వ్యాఖ్యలు ఘాటుగా ఉన్నప్పటికీ అతని అభిప్రాయంతో ఏకీభవించాల్సిందే. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ కోల్పోయినప్పటి నుంచి రోహిత్లో ఏదో తెలినీ తేడా కనిపిస్తుంది. మునుపటిలా అతను జట్టు కోసం ఆడటం లేదు. చాలా నిర్లక్ష్యంగా షాట్లు ఆడుతూ వికెట్ పారేసుకుంటున్నాడు. ఈ సీజన్లోనూ అదే జరిగుతుంది. ఒకటి, రెండు మ్యాచ్లు మినహా రోహిత్ శ్రద్దగా ఆడింది లేదు. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగుతూ జట్టు జయాపజయాల పట్ల పట్టీపట్టనట్లున్నాడు. టీమ్లో అతని ఇన్వాల్మెంట్ ఎక్కడా కనిపించడం లేదు. ఎవరి కోసమో అడుతున్నా అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో అతని బాండింగ్ మొదటి నుంచే మిస్ అయినట్లు కనిపిస్తుంది. రోహిత్ అభిమానులు పైకి ఏమీ చెప్పలేకపోతున్నా అసలు విషయం వారికి బాగా తెలుసు. తమ ఆరాధ్య ఆటగాడు వంద శాతం కమిట్మెంట్తో ఆడటం లేదని లోలోపల వారూ మదనపడుతున్నారు.సూర్యకుమార్ యాదవ్ మెరుపులు, రికెల్టన్ ప్రతిభ, బౌలర్ల కష్టంతో ముంబై ఇండియన్స్ అనూహ్య రీతిలో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించినప్పటికీ ఎలిమినేటర్ మ్యాచ్లో ఆ జట్టు నెగ్గుకొస్తుందన్న ఆశలు లేవు. అదే రోహిత్ వంద శాతం కమిట్మెంట్తో ఆడితే ఫలితం అనుకూలంగా రావచ్చు. -
MI VS PBKS: రోహిత్ శర్మను ఊరిస్తున్న రెండు భారీ రికార్డులు
ఐపీఎల్ 2025లో భాగంగా జైపూర్ వేదికగా ఇవాళ (మే 26) జరుగనున్న కీలక మ్యాచ్లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచేందుకు ఈ మ్యాచ్ ఫలితం ఇరు జట్లకు చాలా కీలకమవుతుంది. ఈ మ్యాచ్లో పంజాబ్ గెలిస్తే 19 పాయింట్లతో టాప్ ప్లేస్కు చేరుతుంది. ముంబై గెలిచినా (గుజరాత్ కంటే మెరుగైన రన్రేట్ ఉండటం చేత) 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలుస్తుంది. లీగ్ దశ మ్యాచ్లు పూర్తయ్యే సరికి తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లకు అదనపు ప్రయోజనం (క్వాలిఫయర్-1లో ఓడినా ఫైనల్కు చేరేందుకు క్వాలిఫయర్-2లో పోటీ పడే అవకాశం ఉంటుంది) చేకూరుతుందన్న విషయం తెలిసిందే.పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న జట్లు (ప్రస్తుతం)..గుజరాత్- 18 (0.254)పంజాబ్- 17 (0.327)ఆర్సీబీ- 17 (0.255)ముంబై- 16 (1.292)మూడు సిక్సర్ల దూరంలో..!ఇదిలా ఉంటే, నేటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ రెండు భారీ రికార్డులపై కన్నేశాడు. ఈ మ్యాచ్లో రోహిత్ మూడు సిక్సర్లు బాదితే ఐపీఎల్లో 300 సిక్సర్ల అరుదైన మైలురాయిని తాకుతాడు. క్యాష్ రిచ్ లీగ్లో క్రిస్ గేల్ ఒక్కడే ఇప్పటివరకు 300 సిక్సర్ల మైలురాయిని తాకాడు. రోహిత్ తర్వాత 300 సిక్సర్ల మార్కు తాకేందుకు విరాట్ కోహ్లికి అవకాశముంది. విరాట్ ఐపీఎల్లో ఇప్పటివరకు 291 సిక్సర్లు బాదాడు.మరో 67 పరుగులు చేస్తే..!నేటి మ్యాచ్లో రోహిత్ మరో 67 పరుగులు చేస్తే ఐపీఎల్లో అత్యంత అరుదైన 7000 పరుగుల మార్కును తాకుతాడు. క్యాష్ రిచ్ లీగ్లో విరాట్ కోహ్లి మాత్రమే ఈ అరుదైన ఘనత సాధించాడు. విరాట్ ఖాతాలో 8552 పరుగులు ఉండగా.. రోహిత్ ఖాతాలో 6933 పరుగులు ఉన్నాయి. విరాట్, రోహిత్ తర్వాత ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లుగా శిఖర్ ధవన్ (6769), డేవిడ్ వార్నర్ (6565), సురేశ్ రైనా (5528) ఉన్నారు.వార్నర్, విరాట్ తర్వాత..!నేటి మ్యాచ్లో రోహిత్ 47 పరుగులు చేస్తే పంజాబ్ కింగ్స్పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి చేరతాడు. పంజాబ్పై అత్యధిక పరుగులు చేసిన టాప్-2 బ్యాటర్లుగా డేవిడ్ వార్నర్ (1134), విరాట్ కోహ్లి (1104) చలామణి అవుతున్నారు.నేటి మ్యాచ్లో తుది జట్లు (అంచనా)..పంజాబ్: ప్రభ్సిమ్రన్ సింగ్ (wk), ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్, శ్రేయాస్ అయ్యర్, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, హర్ప్రీత్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్/ప్రవీణ్ దూబేముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికిల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా -
వారిద్దరు లేకపోవడం లోటే కానీ...
న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్కు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడం వారి వ్యక్తిగత నిర్ణయమని, ఇందులో ఇతరుల పాత్ర ఏమీ లేదని భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. వారిద్దరు లేకపోవడం జట్టుకు లోటే అయినా...వారి స్థానాల్లో వచ్చే ఆటగాళ్లకు ఇది మంచి అవకాశమని అతను అన్నాడు. ‘ఒక ఆటగాడు కెరీర్ మొదలు పెట్టినప్పుడు తన ఇష్ట ప్రకారమే ముగింపు కూడా ఇవ్వాలనుకుంటాడు. అది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. కోచ్, సెలక్టర్ లేదా దేశంలో ఎవరికి కూడా అతడు ఎప్పుడు రిటైర్ కావాలో ఎప్పుడు రిటైర్ కాకూడదో చెప్పే హక్కు లేదు. కాబట్టి వారిది తమ స్వంత నిర్ణయంగానే భావించాలి. ఈ ఇద్దరు అనుభవజు్ఞలు లేకపోవడం కొంత వరకు కష్టమే. అయితే ఇతర ప్లేయర్లకు ఇది చాలా మంచి అవకాశం. నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్లుగా వారు బాధ్యత తీసుకోవాలి. చాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరమైనప్పుడు కూడా నేను ఇదే చెప్పాను. ఇతర బౌలర్లు సత్తా చాటి జట్టును గెలిపించారు కదా. ఈసారి కూడా ఎంతో మంది తమ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు. కోహ్లి, రోహిత్ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడే విషయంపై తాను ఇప్పుడే ఏమీ చెప్పలేనని, అందుకు చాలా సమయం ఉందని భారత కోచ్ స్పష్టం చేశాడు. -
ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్.. భారత స్టార్ పేసర్ ఔట్?
ఇంగ్లండ్, భారత్ మధ్య జరిగే ఐదు టెస్టుల (ENG vs IND) సిరీస్కు ముందే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు భారత్ స్టార్ పేసర్ మహమ్మద్ షమీ (Mohammed Shami) దూరమయ్యే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. టెస్టు మ్యాచ్లో షమీ సుదీర్ఘ స్పెల్స్ వేయలేడని బీసీసీఐ (BCCI) వైద్యబృందం చెప్పినట్లు తెలుస్తోంది.బీసీసీఐ అధికారి ఒకరు.. షమీ ఐపీఎల్లో సన్రైజర్స్ తరఫున నాలుగు ఓవర్లు వేశాడు. షమీ ఒక రోజులో పది ఓవర్ల కంటే ఎక్కువ ఓవర్లు వేస్తాడా.. అన్న విషయం బోర్డుకు, సెలెక్టర్లకు తెలియదు. ఇంగ్లండ్లో టెస్టుల్లో పేసర్లు ఎక్కువ స్పెల్స్ వేసే అవసరం ఉండొచ్చు. అక్కడి పిచ్లు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి. ఎక్కువగా పేసర్లే వికెట్లు తీస్తారు. అందుకే మేం ఎలాంటి ఛాన్స్లు తీసుకోలేం అని నేషనల్ మీడియాకు చెప్పుకొచ్చారు.మరోవైపు.. ఇంగ్లండ్ సిరీస్కు మరో 20 రోజులే సమయంలో షమీపై (BCCI) వైద్యబృందం కూడా ఓ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. షమీ టెస్టుల్లో సుదీర్ఘ స్పెల్స్ వేయలేడని బీసీసీఐ వైద్యబృందం యాజమాన్యానికి చెప్పినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతడిని జట్టులోకి తీసుకుంటే.. ఐదు టెస్టులూ ఆడే అవకాశాలు చాలా తక్కువని ఆ కథనాల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ షమీని టెస్టు సీరిస్కు ఎంపిక చేయకపోతే అతడి స్థానంలో అర్ష్దీప్ సింగ్కు అవకాశం లభించవచ్చు. షమీ టెస్టుల్లో చివరిసారిగా ఓవల్లో ఆస్ట్రేలియాపై 2023 WTC Finalలో ఆడిన సంగతి తెలిసిందే.🚨 NO SHAMI IN ENGLAND TOUR 🚨 - Mohammed Shami is unlikely to play in the Test series against England. (Devendra Pandey/Express Sports). pic.twitter.com/tjIlRHFgR7— Tanuj (@ImTanujSingh) May 23, 2025ఇదిలాఉండగా.. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ.. భారత జట్టును శనివారం ప్రకటించనుంది. రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో.. ఎవరికి సారథ్య బాధ్యతలు అప్పగిస్తారన్న విషయం ఆసక్తికరంగా మారింది. రోహిత్, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత తొలిసారి భారత జట్టు ఎంపిక ఉండనుంది అనే చర్చ నడుస్తోంది. ఇక టెస్టు కెప్టెన్సీ రేసులో శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా పోటీలో ఉన్నారు. కోహ్లీ, రోహిత్.. స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారని అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
రోహిత్ శర్మకు ఘోర అవమానం!.. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాడా?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆకస్మికంగా టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే రోహిత్ శర్మ అనూహ్య రిటైర్మెంట్పై పలు ఊహాగానాలు వినిపించాయి. ఇంగ్లండ్తో టెస్టులకు ముందు భారత టెస్ట్ కెప్టెన్గా రోహిత్ తొలగించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుందని, అందుకే అతడు రిటైర్మెంట్ ప్రకటించాడని ప్రచారం జరిగింది. తాజాగా రోహిత్ శర్మ రిటైర్మెంట్పై ప్రముఖ క్రీడా వెబ్సైట్ స్కై స్పోర్ట్స్ సంచలన రిపోర్ట్ను వెల్లడించింది. ఇంగ్లండ్ టెస్టు సిరీస్కు కెప్టెన్గా తనను ఎంపిక చేయాలని, టూర్ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటిస్తానని బీసీసీఐకి హిట్మ్యాన్ తెలియజేసినట్లు తమ రిపోర్ట్లో పేర్కొంది. కానీ బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాత్రం రోహిత్ను కేవలం ఆటగాడిగా మాత్రమే ఎంపిక చేస్తామని, కెప్టెన్గా వేరే ప్లేయర్కు అవకాశమిస్తామని చెప్పినట్లు సదరు వెబ్సైట్ తమ నివేదికలో వెల్లడించింది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ తన రెడ్ బాల్ కెరీర్ను ముగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన వారం రోజులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం టెస్టులకు వీడ్కోలు పలికాడు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు భారత జట్టుకు కొత్త టెస్టు కెప్టెన్ రానున్నాడు.కెప్టెన్సీ రేసులో శుబ్మన్ గిల్ ముందుంజలో ఉన్నాడు. ఇక రోహిత్ తన టెస్ట్ కెరీర్లో 67 మ్యాచ్లు ఆడి 40.57 సగటుతో 4,301 పరుగులు సాధించారు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి. 2019లో దక్షిణాఫ్రికాపై సాధించిన 212 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరు. కెప్టెన్గా 24 టెస్టులకు నాయకత్వం వహించి, 12 విజయాలు, 9 ఓటములు, 3 డ్రాలు నమోదు చేశాడు.చదవండి: ఐపీఎల్-2025 ఫ్లే ఆఫ్స్ వేదికలు ఖరారు.. ఫైనల్ ఎక్కడంటే? -
రోహిత్ను నిండా ముంచిన గిల్
-
రోహిత్ శర్మకు రాహుల్ ద్రవిడ్ మెసేజ్.. వీడియో వైరల్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)పై మాజీ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) ప్రశంసలు కురిపించాడు. సారథిగా రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన హిట్మ్యాన్ను ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) సత్కరించిన తీరుపై హర్షం వ్యక్తం చేశాడు. కాగా రోహిత్కు అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. తల్లిదండ్రుల చేతుల మీదుగాముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో అతడి పేరిట స్టాండ్ను నెలకొల్పారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్.. రోహిత్ తల్లిదండ్రులు పూర్ణిమా- గురునాథ్ శర్మతో కలిసి ‘రోహిత్ శర్మ స్టాండ్’ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో రోహిత్ భార్య రితికా సజ్దేతో పాటు తమ్ముడు విశాల్ శర్మ, అతడి భార్య దీపాళీ షిండే కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు. ఇలాంటి ఓ రోజు వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదన్నాడు.నూటికి నూరు శాతం అర్హుడివికుటుంబ సభ్యుల త్యాగాల వల్లే తాను ఉన్నత స్థితికి చేరుకున్నానని.. తన ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి హిట్మ్యాన్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మకు టీమిండియా మాజీ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపించాడు. ఇంతటి గౌరవానికి నువ్వు నూటికి నూరు శాతం అర్హుడివని కొనియాడాడు.‘‘శుభాకాంక్షలు.. ఈ గౌరవానికి నువ్వు అన్ని విధాలా అర్హుడవి. కుటుంబ సభ్యులు, స్నేహితుల ముందు స్టాండ్ ఆవిష్కరణ.. ఇలాంటి రోజు ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. రోహిత్ శర్మ స్టాండ్లోకి నువ్వు మరిన్ని సిక్స్లు కొట్టాలని ఆశిస్తున్నా.నాకెప్పుడైనా ముంబై స్టేడియంలో టికెట్లు దొరక్కపోతే ఎవరిని సంప్రదించాలో ఇప్పుడు బాగా తెలిసింది. నీ పేరిట స్టాండ్ ఉంది కదా.. ఆ విషయాన్ని అస్సలు మర్చిపోను’’ అంటూ ద్రవిడ్ వీడియో సందేశం ద్వారా రోహిత్ను అభినందిస్తూనే ఇలా చమత్కరించాడు.వరల్డ్కప్ గెలిచారుకాగా రోహిత్ శర్మ- ద్రవిడ్ల జోడీ టీమిండియాను పరిమిత ఓవర్ల క్రికెట్లో అగ్రస్థానంలో నిలిపింది. అయితే, టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ సెమీస్లోనే నిష్క్రమించడంతో వీరిద్దరిపై విమర్శలు వచ్చాయి. ఇద్దరూ రాజీనామా చేయాలనే డిమాండ్లు పెరిగాయి.ఈ క్రమంలో అనూహ్య రీతిలో రోహిత్ కెప్టెన్సీలో జట్టును తిరిగి పుంజుకునేలా చేశాడు ద్రవిడ్. అందుకు ప్రతిఫలంగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచింది. అదే విధంగా వీరిద్దరి కాంబినేషన్లో వన్డే వరల్డ్కప్-2023లో రన్నరప్గానూ నిలిచింది. ఇక టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ద్రవిడ్ హెడ్కోచ్ పదవి నుంచి తప్పుకోగా.. గౌతం గంభీర్ ఆ బాధ్యతలు స్వీకరించాడు.రోహిత్- గంభీర్ కాంబోలో ఇటీవలే భారత్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచింది. కాగా గతేడాది ప్రపంచకప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు గుడ్బై చెప్పిన రోహిత్ శర్మ.. ఇటీవలే టెస్టులకు కూడా వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం అతడు భారత వన్డే జట్టు కెప్టెన్గా కొనసాగుతున్నాడు. మరోవైపు.. ద్రవిడ్ ప్రస్తుతం ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్ హెడ్కోచ్గా పనిచేస్తున్నాడు.చదవండి: Suresh Raina: కోహ్లి జీవితంలో అన్నీ ఉన్నాయి.. అదొక్కటే లోటుRahul Dravid's message to RO got us like... 🥹💙P.S. The humour at the start & end 😂👌#MumbaiIndians #PlayLikeMumbai #RohitSharmaStand | @ImRo45 | @rajasthanroyals pic.twitter.com/sdnasfUIKi— Mumbai Indians (@mipaltan) May 17, 2025 -
బాబర్ ఆజం వరల్డ్ ఎలెవన్: కోహ్లి, బుమ్రాలకు దక్కని చోటు
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam) టీ20 ఫార్మాట్లో తన అత్యుత్తమ జట్టును ప్రకటించాడు. తన వరల్డ్ ఎలెవన్లో తనతో పాటు టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli), ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)లకు మాత్రం బాబర్ చోటివ్వలేదు.టీమిండియా నుంచి ఆ ఇద్దరుఅయితే, భారత్ నుంచి మరో ఇద్దరు ఆటగాళ్లను మాత్రం బాబర్ ఆజం తన జట్టుకు ఎంపిక చేసుకున్నాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో దుమ్మురేపిన రోహిత్ శర్మతో పాటు.. టీమిండియా టీ20 జట్టు ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్లకు చోటిచ్చాడు. కాగా ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్లో రోహిత్ శర్మ అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్నాడు.హిట్మ్యాన్ ఖాతాలో 4231 పరుగులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవర్ హిట్టర్గా పేరొందిన రోహిత్ను బాబర్ ఆజం తన జట్టులో ఓపెనర్గా ఎంపిక చేసుకున్నాడు. అతడికి జోడీగా పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్కు స్థానం ఇచ్చాడు.ఇక వన్డౌన్లో పాక్కే చెందిన ఫఖర్ జమాన్ను సెలక్ట్ చేసుకున్న బాబర్.. మిడిలార్డర్లో ధనాధన్ దంచికొట్టే సూర్యకుమార్ యాదవ్ను నాలుగో నంబర్ బ్యాటర్గా ఎంచుకున్నాడు. అదే విధంగా ఇంగ్లండ్ విధ్వంసకర వీరుడు జోస్ బట్లర్, సౌతాఫ్రికా హార్డ్ హిట్టర్ డేవిడ్ మిల్లర్లను ఐదు, ఆరు స్థానాలకు ఎంపిక చేసుకున్నాడు.ఏకైక స్పిన్నర్ ఏడో స్థానంలో సౌతాఫ్రికా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ మార్కో యాన్సెన్కు చోటు ఇచ్చిన బాబర్ ఆజం.. ఎనిమిదో స్థానానికి అఫ్గనిస్తాన్ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్ను ఎంచుకున్నాడు. ఇక పేస్ దళంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో పాటు ఆసీస్కే చెందిన మరో ఫాస్ట్బౌలర్ మిచెల్ స్టార్క్లకు బాబర్ తన జట్టులో స్థానం ఇచ్చాడు. వీరితో పాటు ఇంగ్లండ్ పేసర్ మార్క్వుడ్ను పేస్ దళంలో చేర్చాడు.తన జట్టులో పవర్ హిట్టర్లతో పాటు విలక్షణ బౌలర్లు ఉన్నారని.. అందుకే ఈ టీమ్ సమతూకంగా ఉంటుందని బాబర్ ఆజం చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ అతడు ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో కనీసం గ్రూప్ దశను కూడా దాటకుండానే పాకిస్తాన్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబర్ ఆజంను కెప్టెన్సీ నుంచి తప్పించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ను వన్డే, టీ20 జట్ల కెప్టెన్గా నియమించింది. అయితే, అతడి సారథ్యంలోనూ పాక్ ఘోర పరాభవాలు చవిచూస్తోంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలలో వన్డేలు గెలవడం మినహా చెప్పుకోదగ్గ విజయాలేవీ సాధించలేదు.ఇక ఇటీవల నిర్వహించిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో రిజ్వాన్ బృందం ఒక్క గెలుపు కూడా లేకుండానే టోర్నీని ముగించింది. అయితే, ఈ రెండు సందర్భాల్లోనూ రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఐసీసీ ట్రోఫీలు గెలవడం విశేషం. కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ విజేతగా నిలిచిన తర్వాత రోహిత్, కోహ్లి అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరూ టెస్టులకు కూడా రిటైర్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఐపీఎల్తో పాటు వన్డేలలోనూ కొనసాగుతున్నారు.బాబర్ ఆజం వరల్డ్ ఎలెవన్:రోహిత్ శర్మ, మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, సూర్యకుమార్ యాదవ్, జోస్ బట్లర్, డేవిడ్ మిల్లర్, మార్కో యాన్సెన్, రషీద్ ఖాన్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, మార్క్వుడ్.చదవండి: బుమ్రా వద్దే వద్దు!.. కెప్టెన్గా ఆ ఇద్దరిలో ఒకరు బెటర్: టీమిండియా మాజీ కోచ్ -
కోహ్లి జీవితంలో అన్నీ ఉన్నాయి.. అదొక్కటే లోటు: సురేశ్ రైనా
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)ని ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ‘రన్మెషీన్’ తన వృత్తిగత జీవితంలో అన్నీ సాధించేశాడని.. అయితే, పదిహేడేళ్లుగా ఓ లోటు మాత్రం అలాగే మిగిలిపోయిందన్నాడు. ఇంతకీ అదేమిటంటే..!?కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి కోహ్లి.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ విషయంలోనూ రోహిత్నే అనుసరించాడు.రోహిత్ సంప్రదాయ క్రికెట్కు వీడ్కోలు పలికిన వారంలోపే తానూ టెస్టుల నుంచి వైదొలుగుతున్నట్లు కోహ్లి వెల్లడించాడు. ఇక ఇప్పటికే ఫ్రాంఛైజీ టీ20 క్రికెట్ లీగ్ ఐపీఎల్లో కొనసాగుతున్న వీరిద్దరు.. భారత్ తరఫున వన్డేల్లోనూ కొనసాగనున్నారు.ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్కాగా ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచాడు. అంతకు ముందు దక్కన్ చార్జర్స్ ఆటగాడిగానూ ట్రోఫీ గెలిచిన జట్టులో భాగమయ్యాడు. అయితే, క్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచీ అంటే 2008 నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తోనే ఉన్న కోహ్లికి ఇంత వరకు ఐపీఎల్ టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.చిరకాల కల నెరవేరేనా?ఈసారి మాత్రం కోహ్లి చిరకాల కల నిజమయ్యేలా కనిపిస్తోంది. ఐపీఎల్-2025లో వరుస విజయాలతో జోరు మీదున్న పాటిదార్ సేన చాంపియన్గా నిలవాలనే పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్లుగానే ఆర్సీబీ ఈసారి ఇప్పటికే పదకొండు మ్యాచ్లలో ఎనిమిది గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.ఇక ఐపీఎల్-2025 పునఃప్రారంభం నేపథ్యంలో శనివారం నాటి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో ఆర్సీబీ తలపడనుంది. ఈ నేపథ్యంలో సురేశ్ రైనా స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే కోహ్లి మైదానంలో దిగబోతున్నాడు.కోహ్లి జీవితంలో అన్నీ ఉన్నాయి.. అదొక్కటే లోటుఒకవేళ ఆర్సీబీ గనుక ఈసారి ట్రోఫీ గెలిస్తే అతడి సంతోషానికి అవధులు ఉండవు. ఆర్సీబీకి వెన్నెముక, ప్రధాన బలం అతడే. తన జీవితంలో అన్నీ ఉన్నాయి.. అయితే, ఆర్సీబీ ట్రోఫీ గెలవకపోవడం మాత్రమే లోటు.ఆర్సీబీకి టైటిల్ అందించేందుకు అతడు తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఈసారి ఆర్సీబీ ట్రోఫీని ముద్దాడుతుందనే అనుకుంటున్నా. విరాట్ కోహ్లి బ్యాట్ నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్ జాలువారితే అదేమీ పెద్ద కష్టం కాబోదు’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా.. కోహ్లితో పాటు మిగిలిన పది మంది కూడా రాణిస్తేనే ఇది సాధ్యమవుతుందని రైనా చెప్పుకొచ్చాడు. కాగా ఈ సీజన్లో ఇప్పటి వరకు 11 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి.. 505 పరుగులు సాధించి.. ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్నాడు.ఆరెంజ్ క్యాప్ పోటీలో సూర్యకుమార్ యాదవ్ (510), సాయి సుదర్శన్ (509), శుబ్మన్ గిల్ (508)లతో కోహ్లి పోటీపడుతున్నాడు. కాగా ఆర్సీబీ- కేకేఆర్ మధ్య మే 17 నాటి మ్యాచ్కు వర్షం ఆటంకంగా మారే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక అన్న సంగతి తెలిసిందే. చదవండి: బుమ్రా వద్దే వద్దు!.. కెప్టెన్గా ఆ ఇద్దరిలో ఒకరు బెటర్: టీమిండియా మాజీ కోచ్ -
‘బుమ్రా వద్దే వద్దు!.. కెప్టెన్గా ఆ ఇద్దరిలో ఒకరు బెటర్’
భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్ అంశంపై టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి తన అభిప్రాయం పంచుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ సారథిగా నియమించకూడదని యాజమాన్యానికి సూచించాడు. పేస్ దళ నాయకుడికి బదులు యువ ఆటగాడికి పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందంటూ ఇద్దరు స్టార్ల పేర్లు చెప్పాడు.దిగ్గజాల వీడ్కోలుకాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27 సీజన్ భారత్- ఇంగ్లండ్ సిరీస్తో మొదలుకానున్న విషయం తెలిసిందే. స్టోక్స్ బృందంతో ఐదు టెస్టుల్లో తలపడేందుకు టీమిండియా అక్కడకు వెళ్లనుంది. అయితే, ఈ కీలక పర్యటనకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇక దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా రోహిత్ బాటలోనే సంప్రదాయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలో భారత జట్టు కొత్త కెప్టెన్, నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేసే ఆటగాడు ఎవరన్న అంశాలు చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ రివ్యూ షోలో భాగంగా ప్రజెంటర్, బుమ్రా సతీమణి సంజనా గణేషన్తో రవిశాస్త్రి తన అభిప్రాయాలు పంచుకున్నాడు.బుమ్రానే ఫస్ట్ చాయిస్.. కానీ వద్దే వద్దు‘‘నా వరకైతే.. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత కచ్చితంగా జస్ప్రీత్ బుమ్రానే కెప్టెన్గా ప్రథమ ప్రాధాన్యం ఇవ్వగలిగే ఆటగాడు. అయితే, నేను జస్ప్రీత్ సారథి కావాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే.. కెప్టెన్గా ఉంటే అతడిపై అదనపు భారం పడుతుంది.బౌలర్గానూ బుమ్రా సేవలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. అతడు తన శరీరాన్ని మరీ ఎక్కువగా కష్టపెట్టకూడదు. తీవ్రమైన వెన్నునొప్పి తర్వాత ఇటీవలే బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఐపీఎల్ ఆడుతున్నాడు.ఒత్తిడికి లోనయ్యే అవకాశంఅయితే, అక్కడ కేవలం నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా మాత్రమే ఉంటుంది. కానీ టెస్టుల్లో 10- 15 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. ఇలా బౌలర్గా, కెప్టెన్గా అదనపు భారం పడితే అతడు తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.ఆ ఇద్దరిలో ఒకరు బెటర్ఇక యువ ఆటగాళ్లకు కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందంటూ.. ‘‘కెప్టెన్గా శుబ్మన్ సరైన వాడు అనిపిస్తోంది. అతడికి అవకాశం ఇస్తే బాగుంటుంది. అతడి వయసు 25- 26 ఏళ్ల మధ్య ఉంటుంది. సారథిగా తనను తాను నిరూపించుకుంటే.. దీర్ఘకాలం కొనసాగల సత్తా అతడికి ఉంది.రిషభ్ పంత్ను పక్కన పెట్టే వీలు లేదు. నా దృష్టిలో టీమిండియా టెస్టు కొత్త కెప్టెన్లుగా వీరిద్దరిలో ఒకరే అత్యుత్తమ ఎంపిక. మరో దశాబ్దకాలం పాటు టీమిండియాకు ఆడగలరు.ఇప్పటికే ఇద్దరూ ఐపీఎల్లో జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. వారికి ఆ అనుభవం కూడా పనికివస్తుంది. అందుకే గిల్, పంత్లలో ఒకరికి టీమిండియా కెప్టెన్గా అవకాశం ఇస్తే బాగుంటుంది’’ అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. గా జూన్ 20 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ మొదలుకానుంది.కాగా గతంలో ఇంగ్లండ్ పర్యటనలో ఓసారి భారత టెస్టు జట్టు కెప్టెన్గా వ్యవహరించాడు. ఇటీవల ఆస్ట్రేలియా టూర్లో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో పెర్త్, సిడ్నీ టెస్టుల్లో టీమిండియాకు సారథ్యం వహించాడు. ఈ ఐదు టెస్టుల సిరీస్లో పెర్త్లో మాత్రమే గెలిచిన భారత జట్టు.. 1-3తో ట్రోఫీని చేజార్చుకుంది.చదవండి: రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక! -
ముంబై వాంఖడేలో రో‘హిట్’ శర్మ స్టాండ్.. ఆనందంలో ఫ్యామిలీ (ఫొటోలు)
-
రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తల్లిదండ్రులు పూర్ణిమా శర్మ- గురునాథ్ శర్మ కన్నీటి పర్యంతమయ్యారు. కష్టాల కడలిని దాటి శిఖరాగ్రానికి చేరుకున్న కుమారుడిని చూసి పుత్రోత్సాహంతో పొంగిపోయారు. కాగా బ్యాటర్గా, కెప్టెన్గా తనకంటూ ప్రత్యేక అధ్యాయం రచించుకున్న రోహిత్ శర్మను అతని సొంత సంఘం ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) సముచిత రీతిలో గౌరవించిన విషయం తెలిసిందే.ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలో ఒక ప్రేక్షకుల గ్యాలరీకి ‘రోహిత్ శర్మ స్టాండ్’ అని పేరు పెట్టింది. ఈ స్టాండ్ ఆవిష్కరణ కార్యక్రమంశుక్రవారం జరిగింది. రోహిత్ తల్లిదండ్రులు పూర్ణిమ, గురునాథ్, భార్య రితిక (Ritika), మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ కార్యక్రమానికి హాజరై ‘రోహిత్ శర్మ స్టాండ్’ను ప్రారంభించారు. రోహిత్ భావోద్వేగంఈ సందర్భంగా మాట్లాడుతూ రోహిత్ భావోద్వేగానికి గురయ్యాడు. ‘నేడు ఇక్కడ జరిగిన కార్యక్రమాన్ని నేను కలలో కూడా ఊహించలేదు. ఇదో ప్రత్యేక అనుభూతి. మ్యాచ్లలో సాధించే ఎన్నో మైలురాళ్లకంటే విశేషమైంది.వాంఖడేలాంటి ప్రతిష్టాత్మక మైదానంలో ఎంతో మంది దిగ్గజాల సరసన నా పేరు కనిపిస్తున్న ఆనందాన్ని మాటల్లో వర్ణించలేదు. ఈ స్టేడియంలో నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. నేను ఇంకా క్రికెట్ ఆడుతున్నాను. వచ్చే బుధవారం ఇక్కడ నా స్టాండ్ ముందు ఐపీఎల్ మ్యాచ్ ఆడబోతున్నాను. అది చాలా గొప్ప అనుభవం అవుతుంది.ఇక భారత్ తరఫున మ్యాచ్ ఆడితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. నా కుటుంబ సభ్యులందరి ముందు ఈ కార్యక్రమం జరిగింది. అందరికీ ఎంతో కృతజ్ఞుడను’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!మరోవైపు.. కుమారుడి పేరిట స్టాండ్ ఆవిష్కరణ కాగానే పూర్ణిమా- గురునాథ్ ఆనందభాష్పాలు రాల్చగా.. రితిక కూడా తీవ్ర భావోద్వేగానికి లోనైంది. కన్నీళ్లు తుడుచుకుంటూ మామగారి వెనుకగా వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.కాగా కార్యక్రమంలో భారత మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ పేరిట, సీనియర్ అడ్మినిస్ట్రేటర్, ఐసీసీ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ పేరిట కూడా స్టాండ్లను ఆవిష్కరించిన ఎంసీఏ... ఇటీవలే కన్నుమూసిన మాజీ అధ్యక్షుడు అమోల్ కాలే పేరిట ప్రత్యేక లాంజ్ను కూడా ప్రారంభించింది. ‘నేనైతే సిడ్నీలో రోహిత్ను ఆడించే వాడిని’ మరోవైపు.. ఆస్ట్రేలియాతో సిరీస్తో చివరి టెస్టుకు ముందు తాను ఫామ్లో లేనంటూ రోహిత్ శర్మ స్వయంగా తప్పుకొన్నాడు. సిడ్నీలో జరిగిన ఈ టెస్టుకు దూరమైన అతను మళ్లీ టెస్టు ఆడకుండానే ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే తాను జట్టు కోచ్గా ఉండి ఉంటే రోహిత్ను తప్పనిసరిగా ఆ టెస్టులో ఆడించే వాడినని మాజీ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.‘సిరీస్ ముగిసిపోలేదు కాబట్టి కచి్చతంగా అతడిని ఆడించే వాడిని. సిరీస్లో 1–2తో వెనుకబడి ఉన్న సమయంలో జట్టును వదలవద్దని చెప్పేవాడిని. ఆ టెస్టులో తేడా ఒక 30–40 పరుగులు మాత్రమే. ఫామ్ ఎలా ఉన్న అతనో మ్యాచ్ విన్నర్. పిచ్పై పరిస్థితిని అర్థం చేసుకొని ఓపెనర్గా ఒక 35–40 పరుగులు చేసి ఉంటే చాలు మ్యాచ్ ఫలితం మారిపోయేదేమో. సిరీస్ కూడా సమంగా ముగిసేది. అక్కడ రోహిత్ ఆడకపోవడం నన్ను చాలా కాలం వెంటాడింది’ అని రవిశాస్త్రి తన మనసులో మాటను పంచుకున్నాడు. చదవండి: Rohit Sharma Interesting Facts: పేద కుటుంబంలో పుట్టి.. కోటీశ్వరుడిగా! లగ్జరీ ఇల్లు, కార్లు.. ఆస్తి ఎంతంటే?#WATCH | Mumbai | Rohit Sharma stands unveiled at Wankhede stadium. Indian ODI men's cricket team captain Rohit Sharma and his family, Maharashtra CM Devendra Fadnavis, NCP-SCP chief Sharad Pawar, and others, are also present.The Mumbai Cricket Association (MCA) is formally… pic.twitter.com/K39kSfRkCY— ANI (@ANI) May 16, 2025 -
కలలో కూడా ఊహించలేదు.. మాటల్లో వర్ణించలేను: రోహిత్ శర్మ భావోద్వేగం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) ఘనంగా సత్కరించింది. వాంఖడే స్టేడియం (Wankhede Stadium)లో రోహిత్ శర్మ పేరిట ఉన్న స్టాండ్ను శుక్రవారం ఆరంభించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్తో కలిసి రోహిత్ తల్లిదండ్రులు పూర్ణిమా శర్మ- గురునాథ్ శర్మ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్టేడియంలో రోహిత్ శర్మ స్టాండ్ను ఆవిష్కరించారు.ప్రతి ఒక్కరికి ధన్యవాదాలుఆ సమయంలో సీనియర్ నేత శరద్ పవార్, భారత జట్టు మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్లతో పాటు హిట్మ్యాన్ సతీమణి రితికా సజ్దే కూడా అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ‘‘ఇక్కడి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.అసలు ఇలాంటి ఓ రోజు వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ముంబైకి.. టీమిండియాకు ఆడాలని కలలు కంటూ పెరిగాను. దేశానికి నా వంతు సేవ చేయాలని భావించాను. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలు సాధించాను.కఠిన సవాళ్లు ఎదుర్కొంటూ ఎన్నెన్నో మైలురాళ్లు అధిగమించాను. అయితే, వాటన్నింటికంటే ఈరోజు ఎంతో ప్రత్యేకమైనది. వాంఖడే వంటి ప్రసిద్ధ స్టేడియంలో నా పేరు ఇలా.. ఈ మైదానంతో నాకెన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి.మాటల్లో వర్ణించలేనుప్రపంచంలోని పేరెన్నికగన్న రాజకీయ నాయకులతో పాటు నా పేరు ఉండటం.. హో.. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. ఎంసీఏ సభ్యులు, యాజమాన్యానికి నేను కృతజ్ఞుడిని. నేను ఇంకా క్రికెటర్గా కొనసాగుతున్న సమయంలోనే ఇలాంటి గౌరవం దక్కడం ఎంతో ఎంతో ప్రత్యేకం.రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యాను. ఇంకో ఫార్మాట్ ఆడుతూనే ఉన్నాను. నిజంగా ఈ భావనను మాటల్లో ఎలా చెప్పాలో తెలియడం లేదు. టీమిండియా తరఫున, ఐపీఎల్లో ముంబై తరఫున ఇక్కడికే వచ్చి మళ్లీ ఆడబోతున్నా. ఇంతకంటే గొప్పది నా జీవితంలో మరొకటి ఉండదు.వారి త్యాగాలు మరువలేనివిమా అమ్మానాన్న, నా భార్య, తమ్ముడు, మరదలు.. ఇలా కుటుంబమంతా ఇక్కడే ఉంది. వారందరి సమక్షంలో ఈ గౌరవం అందుకోవడం నాకు ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. నా కోసం వారంతా తమ జీవితంలోని చాలా సంతోషాలను త్యాగం చేశారు.మా ముంబై ఇండియన్స్ జట్టు కూడా ఇక్కడే ఉంది. నా ప్రసంగం ముగిసిన వెంటనే వాళ్లు మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెడతారు’’ అంటూ రోహిత్ శర్మ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. ఇటీవలే టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, వన్డేల్లో మాత్రం కొనసాగనున్నాడు.ఇక టీ20 ప్రపంచకప్-2024తో పాటు టీమిండియాకు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 అందించిన ఘనత రోహిత్ సొంతం. తద్వారా మహేంద్ర సింగ్ ధోని (3) తర్వాత భారత్కు అత్యధిక (రెండు) ఐసీసీ టైటిళ్లు అందించిన కెప్టెన్గా రికార్డు సాధించాడు.ఇదిలా ఉంటే.. వాంఖడేలో ఇప్పటి వరకు సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, వినోద్ మన్కడ్, దిలీప్ వెంగ్సర్కార్ పేరిట స్టాండ్స్ ఉన్నాయి. తాజాగా రోహిత్ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. చదవండి: ‘రోహిత్ జట్టులో లేకపోయినా నష్టమేమీ లేదు.. అది పెద్ద విషయమే కాదు’𝗧𝗛𝗘 𝗥𝗢𝗛𝗜𝗧 𝗦𝗛𝗔𝗥𝗠𝗔 𝗦𝗧𝗔𝗡𝗗 🫡🏟#MumbaiIndians #PlayLikeMumbai #RohitSharmaStand | @ImRo45 pic.twitter.com/dqdWu6YSQ5— Mumbai Indians (@mipaltan) May 16, 2025 -
నేను కోచ్గా ఉండుంటే.. రోహిత్కు అలా జరిగేది కాదు: రవిశాస్త్రి
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవలే తన 12 ఏళ్ల టెస్టు కెరీర్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ తన రిటైర్మెంట్కు ముందు టెస్టు క్రికెట్లో కెప్టెన్గా, ఆటగాడిగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు. న్యూజిలాండ్ చేతిలో భారత్ తొలిసారి టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ కావడం, ఆస్ట్రేలియాతో బీజీటీలో చిత్తుగా ఓడి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు దూరం కావడం వంటివి రోహిత్ను మానసికంగా దెబ్బతీశాయనే చెప్పుకోవాలి. రోహిత్ తన కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాపై ఆడాడు. ఆ తర్వాత బీజీటీలోని ఆఖరి మ్యాచ్ నుంచి హిట్ మ్యాన్ స్వచ్ఛందంగా తానంతట తనే తప్పుకున్నాడు. దీంతో కనీసం ఫేర్వెల్ మ్యాచ్ లేకుండానే రోహిత్ తన కెరీర్ను ముగించాడు. ఈ క్రమంలో భారత మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను కోచ్గా ఉండుంటే, సిడ్నీ టెస్టులో రోహిత్ ఆడేవాడని రవిశాస్త్రి వెల్లడించాడు."ఐపీఎల్-2025 సీజన్ టాస్ సమయంలో రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తుండగా చాలాసార్లు చూశాను. కానీ ఆ సమయంలో అతడితో మాట్లాడటానికి తగినంత సమయం దొరకలేదు. ఓసారి మాత్రం అతడి దగ్గరకు వెళ్లి భుజంపై చేయి వేసి మాట్లాడాను. నేను కోచ్గా ఉండుంటే సిడ్నీ టెస్టు(బీజీటీలో ఆఖరి టెస్టు)లో ఆడకుండా ఉండేవాడివి కాదు అని చెప్పా. సిరీస్ అప్పటికి ఇంకా ముగియలేదు కాబట్టి కచ్చితంగా మిమ్మల్ని ఆడించేవాడిని. ఎందుకంటే 2-1తో ప్రత్యర్ధి జట్టు ముందుంజలో ఉన్నా, నేను వెనకడుగు వేసే వ్యక్తిని కాదు. ఆఖరి టెస్టు మ్యాచ్ 30-40 పరుగుల తేడాతో సాగింది. సిడ్నీ పిచ్ చాలా ట్రిక్కీగా ఉంది. రోహిత్ ఫామ్లో ఉన్న లేకపోయానా జట్టులో కచ్చితంగా ఉండాల్సిందే.ఎందుకంటే అతడు మ్యాచ్ విన్నర్. సరిగ్గా ఇదే విషయం రోహిత్ కూడా చెప్పాను. ఒకవేళ రోహిత్ ఆ మ్యాచ్లో ఆడి అక్కడ పరిస్థితులకు తగ్గట్టు జట్టును నడిపించి ఉంటే సిరీస్ సమమయ్యేది. అయితే ప్రతీ కోచ్కు వేర్వేరు స్టైల్స్ ఉంటాయి. ఇది నా శైలి. కేవలం నా ఆలోచిన విధానాన్ని మాత్రమే రోహిత్కు తెలియజేశాను. ఎప్పటి నుంచో ఇది నా మనసులో ఉంది. ఎట్టకేలకు అతడికి తెలియజేశాను" అని ఐసీసీ రివ్యూలో రవిశాస్త్రి పేర్కొన్నాడు. కాగా రవిశాస్త్రి వ్యాఖ్యలు బట్టి చూస్తే ప్రస్తుత భారత హెడ్కోచ్ గౌతం గంభీర్కు పరోక్షంగా కౌంటరిచ్చినట్లు అన్పిస్తోంది. గంభీర్తో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి విభేదాలు తలెత్తినట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో రో-కో టెస్టులకు వీడ్కోలు పలికినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
‘రోహిత్ శర్మ జట్టులో లేకపోయినా పెద్దగా నష్టమేమీ లేదు’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను ఉద్దేశించి సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కలినన్ (Daryll Cullinan) ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టెస్టు క్రికెట్లో భారత్కు రోహిత్ గొప్పగా చేసిందేమీ లేదని.. అతడు రిటైర్ అయినా టీమిండియాకు పెద్దగా నష్టం లేదని పేర్కొన్నాడు.అదే విధంగా.. విరాట్ కోహ్లి (Virat Kohli) లేకపోయినా.. బౌలర్లు రాణిస్తే భారత్ ఇంగ్లండ్లో గట్టెక్కగలదని డారిల్ కలినన్ అభిప్రాయపడ్డాడు. కాగా గత కొంతకాలంగా టెస్టుల్లో ఫామ్లేమితో సతమతమవుతున్న రోహిత్ శర్మ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.న్యూజిలాండ్తో స్వదేశంలో 3-0తో రోహిత్ సేన వైట్వాష్ కావడం.. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని 3-1తో చేజార్చుకోవడంతో.. హిట్మ్యాన్పై విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ సిడ్నీలో ఆఖరిదైన ఐదో టెస్టు నుంచి తప్పుకొన్నా.. టెస్టుల్లో కొనసాగుతానని నాడు రోహిత్ స్పష్టం చేశాడు.రో- కో లేకుండానేఈ క్రమంలో ఇంగ్లండ్ పర్యటనలో అతడే పగ్గాలు చేపడతాడనే వార్తలు రాగా.. అనూహ్యంగా మే 7న రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత ఆరురోజులు తిరిగే లోపే విరాట్ కోహ్లి కూడా సంప్రదాయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఫలితంగా.. వీరిద్దరు లేకుండా యువ భారత జట్టు జూన్ 20 నుంచి ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడబోతోంది.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కలినన్ హిందుస్తాన్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ‘‘రోహిత్ శర్మ టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ గురించి చాలా రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి అతడు సరైన నిర్ణయం తీసుకున్నాడు.రోహిత్ లేకపోయినా నష్టమేమీ లేదునిజం చెప్పాలంటే.. టెస్టుల్లో రోహిత్ కెరీర్ అంత గొప్పగా ఏమీలేదు. సొంతగడ్డ మీదైనా.. విదేశాల్లోనైనా అదే తీరు. ఇటీవల ఆస్ట్రేలియాతో సిరీస్లో కెప్టెన్గా ముందుండి నడిపించాల్సింది పోయి.. అతడే దారుణంగా విఫలమయ్యాడు. కాబట్టి రోహిత్ వీడ్కోలు పలకడం వల్ల భారత టెస్టు క్రికెట్కు వచ్చిన నష్టమేమీ లేదు’’ అని డారిల్ కలినన్ పేర్కొన్నాడు.బౌలర్లంతా ఫిట్గా ఉంటే చాలుఇక ఇంగ్లండ్తో సిరీస్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘టీమిండియా బౌలర్లందరూ ఫిట్గా ఉండి.. రాణించినట్లయితే ఇంగ్లండ్లో భారత్కు గెలుపు అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి’’ అని కలినన్ అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లి లేకపోయినా రాణించగల సత్తా టీమిండియాకు ఉందని పేర్కొన్నాడు. కాగా జూన్ 20 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్తో టీమిండియా టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ తన ప్రయాణం మొదలుపెట్టే అవకాశం ఉంది.కాగా 58 ఏళ్ల డారిల్ కలినన్ 1993 నుంచి 2001 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. సౌతాఫ్రికా తరఫున 70 టెస్టులు, 138 వన్డేలు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. సంప్రదాయ క్రికెట్లో 4554 పరుగులు, వన్డేల్లో 3860 రన్స్ సాధించాడు. మరోవైపు.. రోహిత్ శర్మ టీమిండియా తరఫున 67 టెస్టుల్లో 4301 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లి 123 టెస్టులాడి 9230 రన్స్ సాధించాడు.చదవండి: మాట తప్పారు!.. ఆర్సీబీకి తిరిగి ఆడాలని అనుకోలేదు: పాటిదార్ -
టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్.. రోహిత్, కోహ్లి తదుపరి ఆడబోయే మ్యాచ్లు ఇవే..!
టీ20లకు, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా దిగ్గజ బ్యాటర్లు, కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇకపై వన్డేల్లో మాత్రమే కనిపిస్తారు. ఈ ఇద్దరు 2027 ప్రపంచకప్ వరకు ఆడి 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి కూడా తప్పుకుంటారని తెలుస్తుంది. అయితే ఈ మధ్యలో రోహిత్, కోహ్లి భారత్ తరఫున ఎన్ని వన్డేలు ఆడతారని క్రికెట్ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు.ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాం ప్రకారం భారత్ 2027 వన్డే వరల్డ్కప్ వరకు 9 సిరీస్ల్లో 8 మంది ప్రత్యర్థులపై 27 మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్న భారత ఆటగాళ్లు క్యాష్ రిచ్ లీగ్ ముగిసిన వెంటనే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరతారు. అక్కడ ఆగస్ట్ వరకు 4 వరకు గడపనున్న భారత్.. అదే నెల 17వ తేదీ నుండి బంగ్లాదేశ్లో పర్యటించనుంది. ఇక్కడి నుండి టీమిండియా వన్డే క్రికెట్ షెడ్యూల్ మొదలుకానుంది.బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు ఆడనుంది. రోహిత్, కోహ్లి ఈ సిరీస్లో చెలరేగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్లో స్పిన్ ఫ్రెండ్లీ పిచ్లు ఉండటంతో రోకోను ఆపడం బంగ్లా బౌలర్లకు పెద్ద సవాలే అవుతుంది.అనంతరం భారత్ అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు (5 టీ20లు కూడా ఆడుతుంది) ఆడనుంది.ఈ ఏడాది చివర్లో టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో ఆల్ ఫార్మాట్ సిరీస్లు ఆడనుంది. ఈ పర్యటనలో సౌతాఫ్రికా టీమిండియాతో రెండు టెస్ట్లు, 5 టీ20లు సహా మూడు వన్డేలు ఆడనుంది.వచ్చే ఏడాది (2026) జనవరిలో భారత్ స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు వన్డేల్లో తలపడనుంది. ఈ సిరీస్లో కూడా విరాట్, రోహిత్ తమదైన మార్కును చూపించే అవకాశం ఉంది.అనంతరం చాలా గ్యాప్ తర్వాత జూన్లో భారత్ స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది. ఈ పర్యటనలో ఆఫ్ఘన్లు టీమిండియాతో మూడు వన్డేలు ఆడనున్నారు. స్వదేశంలో ఆడబోయే సిరీస్ కావడంతో ఈ సిరీస్లో కూడా రోకో చెలరేగే అవకాశం ఉంది.జూలైలో భారత్ ఇంగ్లండ్లో పర్యటించి మూడు వన్డేలు ఆడనుంది. ఈ పర్యటనలో రోహిత్, కోహ్లి సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది.సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భారత్ స్వదేశంలో వెస్టిండీస్తో మూడు వన్డేలు ఆడనుంది.అక్టోబర్, నవంబర్ మాసాల్లో టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు వన్డేలు ఆడనుంది.డిసెంబర్లో భారత్ స్వదేశంలో శ్రీలంకతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతుంది.దీని తర్వాత భారత్ 2027లో సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే వన్డే వరల్డ్కప్లో పాల్గొంటుంది. ఈ మెగా టోర్నీ రోహిత్-కోహ్లిల జమానాకు చివరిదయ్యే అవకాశం ఉంది. ఈ మధ్యలో ఏవైనా వ్యక్తిగత ఇబ్బందులు ఎదురైతే తప్ప రోహిత్, కోహ్లి దాదాపుగా అన్ని మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది. దిగ్గజాలు వన్డే వరల్డ్కప్తో తమ క్రికెట్ ప్రస్తానాన్ని ముగిస్తారేమో చూడాలి. -
Rohit-Kohli: ప్రస్తుతానికి ఎలాంటి కమిట్మెంట్స్ లేవు.. ఫోకస్ అంతా ఐపీఎల్పైనే..!
రోజుల వ్యవధిలో టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెట్ దిగ్గజాలు ప్రస్తుతం తమ ఫోకస్ అంతా ఐపీఎల్ 2025పైనే పెట్టారు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు, మధ్యలో కూడా వారిపై ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్కు సంబంధించిన ఒత్తిడి ఉండేది. టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో వారిద్దరు ఫ్రీబర్డ్స్ అయ్యారు. వారిపై ఐపీఎల్ మినహా ఎలాంటి బాధ్యతా లేదు. ఈ ఇద్దరు దిగ్గజాలు అంతర్జాతీయ టీ20లకు గతేడాదే రిటైర్మెంట్ ప్రకటించారు. వారు ఇకపై భారత్ తరఫున వన్డేలకు మాత్రమే అందుబాటులో ఉంటారు. భారత్ ఆడబోయే వన్డేలు సమీప భవిష్యత్తులో లేవు. దీంతో వారి దృష్టి మొత్తం ఐపీఎల్ 2025పైనే కేంద్రీకృతమై ఉంది.మే 17 నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో రోహిత్, కోహ్లి ముందున్న తక్షణ కర్తవ్యం వారి జట్లను ప్లే ఆఫ్స్కు చేర్చడం. ఇందు కోసం వారు అందరి కంటే ముందుగానే ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఐపీఎల్ రీవైజ్డ్ షెడ్యూల్కు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారా లేదా అన్న సందిగ్దత కొనసాగుతుండగా.. ఈ భారత సూపర్ స్టార్లు మాత్రం దాని తాలూకా ఆలోచనలు లేకుండా ప్రాక్టీస్లో నిమగ్నమై ఉన్నారు. ఐపీఎల్ తదుపరి లెగ్ కోసం రోహిత్ మూడు రోజుల కిందటి ప్రాక్టీస్ మొదలుపెట్టగా.. విరాట్ ఇవాళే బరిలోకి దిగాడని తెలుస్తుంది.ఐపీఎల్ పాక్షికంగా వాయిదా పడే సమయానికి రోహిత్, విరాట్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్, ఆర్సీబీ పాయింట్ల పట్టికలో నాలుగు, రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్ బెర్తుకు అతి చేరువలో ఉన్నాయి. ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడిన ముంబై 7 విజయాలతో 14 పాయింట్లు సాధించగా.. ఆర్సీబీ 11 మ్యాచ్ల్లో ఎనిమిది గెలిచి 16 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ముంబై ఈ సీజన్లో మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. మే 21న ఢిల్లీతో (ముంబై), మే 26న పంజాబ్తో (జైపూర్) తలపడనుంది. ముంబై ఈ రెండు మ్యాచ్ల్లో భారీ తేడాతో గెలిస్తే ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్ బెర్త్ సాధిస్తుంది.ఆర్సీబీ విషయానికొస్తే.. ఆ జట్టు ఈ సీజన్లో మరో మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. మే 17న కేకేఆర్తో (బెంగళూరు), మే 23న సన్రైజర్స్తో (బెంగళూరు), మే 27న లక్నోతో (లక్నో) తలపడనుంది. ఈ మూడు మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ గెలిచినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది.ఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ తమ ఆరో టైటిల్ వేట కొనసాగిస్తుండగా.. ఆర్సీబీ తమ తొలి టైటిల్ దిశగా సానుకూల అడుగులు వేస్తుంది. ప్రస్తుతం ఎలాంటి అంతర్జాతీయ కమిట్మెంట్స్ లేని రోహిత్, విరాట్ తమ జట్లకు ఐపీఎల్ టైటిల్ గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. -
వారిద్దరూ లెజెండరీ క్రికెటర్లు.. 50 ఏళ్ల వరకు ఆడాల్సింది: యువీ తండ్రి
భారత టెస్టు క్రికెట్లో దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి శకం ముగిసిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనకు ముందు వీరిద్దరూ టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాకిచ్చారు. తొలుత రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలకగా..అతడి బాటలోనే కోహ్లి సైతం నడిచాడు. ఇంగ్లండ్ పర్యటనకు వరకు కొనసాగాలని కోహ్లిని బీసీసీఐ సూచించినప్పటికి కింగ్ మాత్రం తన మనసును మార్చుకోలేదు.ఈ క్రమంలో భారత క్రికెట్కు అందించిన సేవలకు గాను రోహిత్, కోహ్లిలపై మాజీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మాజీ క్రికెటర్, టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ చేరాడు. రోహిత్, కోహ్లి ఇద్దరూ గొప్ప ఆటగాళ్లు అని యోగరాజ్ కొనియాడాడు.కాగా రో -కో ద్వయం రిటైర్మెంట్ ప్రకటించడంతో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టను ఇంగ్లండ్ టూర్కు వెళ్లనుంది. ఈ ఐదు మ్యాచ్ల సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మే 23న ప్రకటించే అవకాశముంది. భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్గా యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది."విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు అద్బుతమైన ఆటగాళ్లు. ఈ లెజెండ్స్ రిటైర్మెంట్ ప్రకటించడం భారత క్రికెట్కు నిజంగా గట్టి ఎదురుదెబ్బే అవుతోంది. సరిగ్గా ఇదే పరిస్థితి 2011లో కూడా నెలకొంది. ఆ ఏడాది చాలా మంది స్టార్ ప్లేయర్లు రిటైర్ అవ్వడం, మరి కొంత మందిని సెలక్టర్లు పక్కన పెట్టడం వంటి చేశారు.ఆ సమయంలో భారత క్రికెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంది. అయితే ప్రతీ ఒక్క ప్లేయర్ ఏదో ఒక సమయంలో రిటైర్ అవ్వక తప్పదు. కానీ రోహిత్, కోహ్లి మాత్రం కాస్త తొందరపడ్డారనే అన్పిస్తోంది. ఇంకా చాలా క్రికెట్ ఆడే సత్తా వారిలో ఉంది. యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు వారిద్దరూ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు.వీరిద్దరూ రిటైర్ అవ్వడంతో భారత జట్టులో మొత్తం యువ ఆటగాళ్లే ఉన్నారు. అనుభవం లేని ఆటగాళ్లతో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తే అది కఠిన సవాలే అవుతుంది. ఇంగ్లండ్ వంటి కండీషన్స్లో రాణించడం అంత సులువు కాదు. కోహ్లి, రోహిత్ వంటి గొప్ప ఆటగాళ్లు కనీసం 50 ఏళ్ల వరకు అయినా ఆడాలి. వారి నిర్ణయంతో నేను ఆశ్యర్యపోయాను. యువ ఆటగాళ్లను గైడ్ చేసేందుకు అనుభవం ఉన్న ఆటగాళ్లు లేకుండా అయిపోయారని" ఎఎన్ఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్ పేర్కొన్నాడు.చదవండి: ఓపెనర్గా కేఎల్ రాహుల్.. నాలుగో స్థానంలో ‘కొత్త’ ఆటగాడు! -
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి సంబంధించి బిగ్ అప్డేట్
టీమిండియా దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. టీ20, టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినా ఈ ఇద్దరి గ్రేడ్ ఏ ప్లస్ కాంట్రాక్ట్ కొనసాగుతుందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. రెండు ఫార్మాట్లకు వీడ్కోలు పలికినా రోహిత్, కోహ్లి ఇంకా భారత క్రికెట్లో భాగమేనని, గ్రేడ్ ఏ ప్లస్లో సకల సదుపాయాలకు వారు అర్హులేనని సైకియా ఏఎన్ఐతో మాట్లాడుతూ చెప్పారు. నిబంధనల ప్రకారం మూడు ఫార్మాట్లలో కొనసాగే భారత క్రికెటర్లకే బీసీసీఐ ఏ ప్లస్ కాంట్రాక్ట్ వర్తిస్తుంది. భారత క్రికెట్కు రోహిత్, విరాట్ చేసిన సేవల కారణంగా వారికి ఏ ప్లస్ కాంట్రాక్ట్ కొనసాగనుంది.కాగా, బీసీసీఐ గత నెలలోనే 2024-25 సంవత్సరానికి గానూ తమ వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను (34 మంది) ప్రకటించింది. ఈ జాబితాలో భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా తమ ఏ ప్లస్ కేటగిరీని రీటైన్ చేసుకున్నారు. క్రమశిక్షణారాహిత్యం కారణంగా గతేడాది కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కాంట్రాక్ట్ జాబితాలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.శ్రేయస్ బి కేటగిరీలో, ఇషాన్ సి కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, యువ పేసర్ హర్షిత్ రాణా తొలిసారి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందారు.సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా మొత్తం నాలుగు కేటగిరీలుగా విభజించడింది. ఇందులో ఏ ప్లస్ కింద విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరికి ఏడాది 7 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.గ్రేడ్-ఏలో సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా, షమీ, రిషబ్ పంత్ ఉన్నారు. వీరికి ఏడాదికి 5 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.గ్రేడ్-బిలో సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. వీరికి ఏడాదికి 3 కోట్ల రూపాయలు శాలరీగా లభించనుంది.గ్రేడ్-సిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, రజత్ పాటిదార్, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ఉన్నారు. వీరికి ఏడాదికి కోటి రూపాయలు శాలరీగా లభించనుంది.ఈ ఏడాది కొత్తగా కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్లు: ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చకరవర్తి, హర్షిత్ రాణా, శ్రేయస్ అయ్యర్ఈ ఏడాది కాంట్రాక్ట్ కోల్పోయిన ఆటగాళ్లు: శార్దూల్ ఠాకూర్, జితేష్ శర్మ, కేఎస్ భరత్, అవేష్ ఖాన్ఈ ఏడాది పదోన్నతి పొందిన ఆటగాడు: రిషబ్ పంత్ (బి కేటగిరి నుండి ఏ కేటగిరికి)రిటైర్డ్ అయిన ఆటగాడు: రవిచంద్రన్ అశ్విన్ (కేటగిరి ఏ నుంచి ఔట్) -
రోహిత్ శర్మకు సత్కారం.. ఇంటికి ఆహ్వానించి సన్మానించిన సీఎం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు ఘన సత్కారం లభించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) హిట్మ్యాన్ను తన ఇంటికి ఆహ్వానించి.. సన్మానించారు. ఈ విషయాన్ని సీఎం స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.కాగా రోహిత్ శర్మ ఇటీవలే టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ (Test Cricket Retirement) ప్రకటించిన విషయం తెలిసిందే. మే 7న ఇందుకు సంబంధించి ఈ కుడిచేతి వాటం బ్యాటర్ అధికారిక ప్రకటన విడుదల చేశాడు. తెలుపు రంగు జెర్సీలో దేశానికి ప్రాతినిథ్యం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవమంటూ భారమైన హృదయంతో వీడ్కోలు పలికాడు.అయితే, వన్డేల్లో మాత్రం తాను కొనసాగుతానని రోహిత్ శర్మ ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ.. అతడే వన్డే జట్టు కెప్టెన్గా కొనసాగుతాడని పేర్కొంది. అధికారిక నివాసానికి ఆహ్వానించిన సీఎంకాగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అతడిని తన అధికారిక నివాసానికి ఆహ్వానించారు. పుష్ఫగుచ్ఛం అందించి.. శాలువాతో రోహిత్ను ఫడ్నవిస్ సత్కరించారు. అతడితో కలిసి కాసేపు సరదాగా ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పంచుకుంటూ.. ‘‘భారత క్రికెట్ రోహిత్ శర్మను నా అధికారిక నివాసం ‘వర్ష’కు ఆహ్వానించడం.. ఆయనను కలిసి మాట్లాడటం ఎంతో గొప్పగా అనిపిస్తోంది.టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్కు ప్రకటించిన రోహిత్ శర్మకు శుభాకాంక్షలు. జీవితంలోని తదుపరి అధ్యాయంలోనూ ఆయన ఇలాగే మరింత విజయవంతం కావాలని ఆశిస్తున్నా’’ అని దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొన్నారు.దిగ్గజ కెప్టెన్గాకాగా టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ ఇప్పటికే రెండు ఐసీసీ ట్రోఫీలు సాధించిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ను చాంపియన్గా నిలపడంతో పాటు.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (వన్డే) కూడా అందించాడు. అయితే, గత కొంతకాలంగా టెస్టుల్లో మాత్రం రోహిత్ శర్మ ప్రదర్శన ఇటు కెప్టెన్గా.. అటు బ్యాటర్గా బాగాలేదు.రోహిత్ సారథ్యంలో టీమిండియా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది సొంతగడ్డపై విదేశీ జట్టు చేతిలో ఓడిపోయింది. న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల సిరీస్లో 3-0తో వైట్వాష్కు గురైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా.. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. ఫలితంగా ఈసారి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (2025) ఫైనల్కు చేరుకోలేకపోయింది.కోహ్లి కూడా ఇదే బాటలోఆ తర్వాత ముంబై తరఫున రోహిత్ శర్మ రంజీ బరిలో దిగి కూడా విఫలమయ్యాడు. ఈ పరిణామాల నేపథ్యంలోనూ ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లోనూ బీసీసీఐ అతడినే కెప్టెన్గా కొనసాగిస్తుందని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, అనూహ్యంగా బుధవారం రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక ఆ తర్వాత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా టెస్టులకు వీడ్కోలు పలికాడు. వీరిద్దరు లేకుండానే జూన్ 20 నుంచి టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్తో యువ బ్యాటర్ శుబ్మన్ గిల్ టీమిండియా కొత్త కెప్టెన్గా నియమితుడు కానున్నట్లు తెలుస్తోంది.చదవండి: Ind vs Eng: కుర్రాళ్లతో ఈ సిరీస్ ఆడటం కష్టం.. వాళ్లిద్దరు ఉంటే బెటర్! -
Ind vs Eng: కుర్రాళ్లతో ఈ సిరీస్ కష్టమే.. వాళ్లిద్దరు ఉంటే బెటర్!
టీమిండియా ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli) స్థానాల్లో వెటరన్ క్రికెటర్లను తీసుకువస్తే బాగుంటుందని సెలక్టర్లకు సలహా ఇచ్చాడు. అజింక్య రహానే (Ajinkya Rahane), ఛతేశ్వర్ పుజారాలను జట్టులోకి తిరిగి తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.దిగ్గజాల వీడ్కోలు ఇంగ్లండ్ గడ్డపై రాణించాలంటే ఇలాంటి సీనియర్ల అవసరం ఉందని.. యువ ఆటగాళ్లు అక్కడ ఒత్తిడిని తట్టుకోలేరని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా కెప్టెన్ రోహిత్ శర్మ, దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇటీవలే టెస్టు ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.తొలుత రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడించగా.. ఆ తర్వాత ఆరు రోజులలోపే కోహ్లి కూడా ఇదే బాటలో నడిచాడు. వీరిద్దరి నిష్క్రమణ కంటే ముందే దిగ్గజ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా టెస్టులకు గుడ్బై చెప్పాడు.ఫలితంగా టీమిండియా టెస్టు జట్టులో సీనియర్లు లేనిలోటు కచ్చితంగా కనిపిస్తుంది. అదీ ఇంగ్లండ్ వంటి పటిష్ట జట్టును వారి సొంత గడ్డపై ఎదుర్కోవడం యువ ఆటగాళ్లకు అంతతేలికేమీ కాదు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ..రహానే, పుజారా రీ ఎంట్రీ‘‘రోహిత్ రిటైర్ అయినా విరాట్ కోహ్లి జట్టుతో కొనసాగి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ బోర్డు అతడిని ఒప్పించేందుకు విఫలయత్నం చేసిందని తెలిసింది. మరి అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారాల పునరాగమనం ఇప్పుడైనా చూడవచ్చా? ఈ ఒక్క సిరీస్ కోసమైనా వాళ్లను ఎంపిక చేస్తారా?అసలు జట్టు సరైన దిశలోనే వెళ్తుందా? రాబోయేది అల్లాటప్పా సిరీస్ కాదు.. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాలి. వేరే జట్టుతో మ్యాచ్లు ఆడాల్సి ఉంటే.. పర్లేదు కుర్రాళ్లని పంపవచ్చు అని అనుకోవచ్చు.కానీ ప్రస్తుత పరిస్థితి అంత తేలికగా తీసుకునేలా లేదు. కచ్చితంగా రహానే, పుజారాల గురించి ఆలోచించాలి. వాళ్లిద్దరు ఇంకా అద్భుతంగా ఆడుతున్నారు. పరుగులు కూడా రాబడుతున్నారు. వాళ్లు జట్టుతో ఉంటే కుర్రాళ్లకు కాస్త ధైర్యంగా ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు.చివరగా అపుడేకాగా రహానే 2023 జూలైలో చివరగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. ఇక మొత్తంగా తన అంతర్జాతీయ కెరీర్లో 85 టెస్టులు ఆడి 5077 పరుగులు సాధించాడు. మరోవైపు.. ఛతేశ్వర్ పుజారా 103 టెస్టులాడి 7195 పరుగులు సాధించాడు. నయా వాల్గా పేరొందిన పుజ్జీ చివరగా 2023 ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.ఆ తర్వాత జట్టుకు దూరమైన వీరిద్దరు రంజీల్లో అదరగొడుతున్నారు. అయితే, రహానే, పుజారాలను మాత్రం సెలక్టర్లు ఇన్నాళ్లూ పరిగణనలోకి తీసుకోలేదు. మరి ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలోనైనా వీరికి పిలుపునిస్తారేమో చూడాలి!చదవండి: IPL 2025: ఎవరు ఆడతారు... ఎవరు ఆగిపోతారు? -
గిల్ వద్దు.. టీమిండియా కెప్టెన్గా అతడే సరైనోడు!
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం దృష్టి మొత్తం టీమిండియా మీద కేంద్రీకృతమై ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో పాటు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత.. వారి స్థానాల్ని భర్తీ చేసేదెవరన్న చర్చ నడుస్తోంది. కాగా గత కొంతకాలంగా సంప్రదాయ ఫార్మాట్లో ఘోర పరాభవాలు చవిచూసిన భారత జట్టు.. తదుపరి ఇంగ్లండ్ను ఢీకొట్టనుంది.ఇరు జట్ల మధ్య ఈ మేర ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్తో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27 ఆరంభం కానుంది. ఇంగ్లండ్ వేదికగా జరిగే ఈ కీలక సిరీస్కు టీమిండియా ఈసారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లేకుండానే వెళ్లనుండటం ఆసక్తిగా మారింది.పనిభారం పడకుండా ఉండేందుకే?ఇక ఈ సిరీస్ నుంచి యువ బ్యాటర్ శుబ్మన్ గిల్ టీమిండియా టెస్టు కెప్టెన్గా పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయమైపోయిందనే వార్తలు వస్తున్నాయి. ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై పనిభారం పడకుండా ఉండేందుకే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.బుమ్రా కూడా ఫిట్నెస్పై దృష్టి సారించే క్రమంలో తనకు తానుగా కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకొన్నాడని మరికొన్ని వార్తలు. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.టెస్టు కెప్టెన్గా బుమ్రానే సరైనోడుటీమిండియా టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ను కాదని.. బుమ్రాకే పగ్గాలు అప్పగించాలని సన్నీ అభిప్రాయపడ్డాడు. ‘‘ప్రతి ఒక్కరు పనిభారం అంటూ బుమ్రా గురించి ఏదేదో మాట్లాడేస్తున్నారు. నిజానికి అతడికి మాత్రమే ఈ వర్క్లోడ్ గురించి పూర్తిగా తెలుస్తుంది. తన శరీరం ఒత్తిడిని తట్టుకోగలదా? లేదా ? అనేది బుమ్రాకు మాత్రమే తెలుస్తుంది.ఆ కారణంతో కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టడం సరికాదు. ఎందుకంటే కెప్టెన్గా ఇతరులు ఎవరు ఉన్నా.. బుమ్రాతో అదనపు ఓవర్లు వేయించాలనే చూస్తారు. మరి అలాంటపుడు పనిభారం పెరగదా?జట్టులో బుమ్రా నంబర్ వన్ బౌలర్. తనే కెప్టెన్గా ఉంటే ఎప్పుడు విరామం తీసుకోవాలి.. ఎప్పుడు బరిలోకి దిగాలనే విషయాల్లో వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకోగలడు. అందుకే నా వరకైతే జస్ప్రీత్ బుమ్రానే తదుపరి టెస్టు కెప్టెన్గా నియమించాలి.పనిభారం అంటూ వచ్చే ఊహాగానాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏం చేయాలో బుమ్రాకు బాగా తెలుసు. కెప్టెన్గా అతడే ఉండటం అత్యుత్తమ నిర్ణయం అని నా అభిప్రాయం’’ అని గావస్కర్ స్పోర్ట్స్ టుడేతో వ్యాఖ్యానించాడు.గతంలోనూ నాయకుడిగాకాగా బుమ్రా గతంలో ఓసారి ఇంగ్లండ్ పర్యటనలో టెస్టు జట్టు నాయకుడిగా వ్యవహరించాడు. ఆ తర్వాత ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా తొలుత పెర్త్లో.. ఆఖరిగా సిడ్నీలో ఐదో టెస్టులో కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే, సిడ్నీ టెస్టు సందర్భంగా వెన్నునొప్పి తిరగబడటంతో దాదాపు మూడు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్-2025తో ఇటీవలే పునరాగమనం చేశాడు. ఇదిలా ఉంటే.. జూన్ 20 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ మొదలుకానుంది. చదవండి: CA: ఇష్టం లేకపోతే వెళ్లొద్దులే! -
కోహ్లి, రోహిత్ వన్డే వరల్డ్కప్-2027 ఆడరు: టీమిండియా దిగ్గజం
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli), కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను ఉద్దేశించి భారత మాజీ సారథి సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇద్దరూ వన్డే వరల్డ్కప్-2027 ఆడే అవకాశం లేదని కుండబద్దలు కొట్టాడు. కాగా గత కొంతకాలంలో టెస్టుల్లో భారత జట్టు వైఫల్యం చెందుతున్న విషయం తెలిసిందే.ఇద్దరూ రిటైర్ అయ్యారుస్వదేశంలో న్యూజిలాండ్తో సిరీస్లో 3-0తో క్లీన్స్వీప్ కావడం సహా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2025ని 3-1తో కోల్పోయింది. ఈ రెండు సిరీస్లలో విఫలమైన నేపథ్యంలో తొలుత రోహిత్ శర్మ.. ఆ తర్వాత వారం తిరిగే లోపే కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు.యాభై ఓవర్ల ఫార్మాట్లో అతడే కెప్టెన్వీరిద్దరు ఇప్పటికే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ నుంచి కూడా వైదొలిగిన విషయం తెలిసిందే. ఇక తాను వన్డేల్లో కొనసాగుతానని రోహిత్ తెలపగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా యాభై ఓవర్ల ఫార్మాట్లో అతడే కెప్టెన్ అని స్పష్టం చేసింది.మరోవైపు.. కోహ్లి సోమవారం(మే 12) నాటి రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా టెస్టులకు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడే గానీ.. వన్డేల గురించి ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ టుడేతో మాట్లాడిన గావస్కర్.. కోహ్లి- రోహిత్ వరల్డ్కప్-2027 నాటికి జట్టులో ఉండే పరిస్థితి కనిపించడం లేదన్నాడు.కోహ్లి, రోహిత్ వన్డే వరల్డ్కప్-2027 ఆడరు‘‘వన్డే ఫార్మాట్లో వాళ్లిద్దరు అత్యద్భుతమైన ఆటగాళ్లు. అయితే, 2027 ప్రపంచకప్ నాటికి సెలక్షన్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేము. వాళ్లిద్దరు వరల్డ్కప్ జట్టులో ఉంటారో లేదో తెలియదు. అందుకు తగ్గట్లుగా వారి ప్రదర్శన కొనసాగుతుందా? అంటే అదీ తెలియదు.ఒకవేళ సెలక్షన్ కమిటీ వాళ్లపై నమ్మకం ఉంచితే ఇద్దరూ మరో ప్రపంచకప్ ఆడతారు. అయితే, నా అభిప్రాయం ప్రకారం.. కోహ్లి- రోహిత్ మరో వరల్డ్కప్ ఆడే అవకాశం లేదు.ఒకవేళ వాళ్లిద్దరు వచ్చే ఏడాది గనుక మంచి ఫామ్లో ఉంటే.. అది కూడా శతకాలు బాదితే... అప్పుడు దేవుడు కూడా వాళ్లను జట్టు నుంచి తప్పించలేడు! కానీ అదంతా జరుగుతుందో లేదో చూడాలి’’ అని గావస్కర్ తన అభిప్రాయం పంచుకున్నాడు. తిరుగులేని రికార్డులుకాగా వన్డేల్లో అత్యధికంగా మూడుసార్లు డబుల్ సెంచరీ చేసిన బ్యాటర్గా రోహిత్ కొనసాగుతుంటే.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఈ ఫార్మాట్లో 51 శతకాలు బాది కోహ్లి ప్రపంచ రికార్డు సాధించాడు. తద్వారా దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ వన్డే సెంచరీల రికార్డును అతడు బద్దలు కొట్టాడు. కాగా ప్రస్తుతం రోహిత్ వయస్సు 38 ఏళ్లు కాగా.. కోహ్లికి 36 ఏళ్లు. ఈ ఇద్దరూ వరల్డ్కప్ నాటికి వరసగా 40, 38వ పడిలో అడుగుపెడతారు. ఫిట్నెస్ కాపాడుకుంటూ ఫామ్ను కొనసాగిస్తే వీరు 2027 టీమిండియా ప్రపంచకప్ జట్టులో ఉండటం ఖాయమే!చదవండి: కోహ్లి రిటైర్మెంట్పై బీసీసీఐ ట్వీట్.. మండిపడుతున్న అభిమానులు -
కోహ్లి రిటైర్మెంట్.. గంభీర్ రియాక్షన్ వైరల్
టీమిండియా దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) తన టెస్టు కెరీర్కు వీడ్కోలు పలికాడు. సంప్రదాయ ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఇందుకు టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) స్పందించిన తీరు వైరల్గా మారింది.కాగా ఢిల్లీకి చెందిన కోహ్లి, గంభీర్ల మధ్య గతంలో విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా ఎన్నోసార్లు ఈ విషయం బహిర్గతమైంది. మైదానంలోనే ఇద్దరూ గొడవ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.అనూహ్యంగా ఇద్దరూ కలిసిపోయారుఅలాంటిది గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా రాగానే కోహ్లి కెరీర్ ప్రమాదంలో పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ ఇద్దరికీ పొసగదని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఇద్దరూ కలిసిపోయారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఇద్దరూ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు.టెస్టుల్లో టీమిండియా పేలవ ప్రదర్శనఅంతేకాదు.. జట్టు ప్రయోజనాల కోసం తామిద్దరం కలిసి ప్రయాణిస్తామని చెప్పారు. అందుకు తగ్గట్లుగానే వారి మధ్య అనుబంధం పెరిగిందని బీసీసీఐ వర్గాలు కూడా పేర్కొన్నాయి. అయితే, గత కొంతకాలంగా టెస్టుల్లో టీమిండియా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది.గంభీర్ మార్గదర్శనంలో భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్వాష్ అయింది. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2025లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ను 3-1తో కోల్పోయింది.ఈ క్రమంలో కెప్టెన్గా, బ్యాటర్గా విఫలమైన రోహిత్ శర్మ రిటైర్ అవ్వాలనే డిమాండ్లు పెరిగాయి. అందుకు అనుగుణంగా ఇంగ్లండ్ టూర్కు ముందు బుధవారం రోహిత్ తన రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా కోహ్లి కూడా అదే నిర్ణయం తీసుకున్నాడు.నిన్ను మిస్సవుతాము చీక్స్నిజానికి కోహ్లి ఇంగ్లండ్లో కెప్టెన్గా వ్యవహరించి ఆ తర్వాత రిటైర్ అవ్వాలని అనుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే, ఇందుకు యాజమాన్యం నిరాకరించిందని.. గంభీర్ యువ నాయకుడిని కోరుకోవడం దీనికి కారణమనేది వాటి సారాంశం.ఈ నేపథ్యంలో కోహ్లి రిటైర్మెంట్ తర్వాత గంభీర్ ఎక్స్ వేదికగా తన స్పందన తెలియజేసిన తీరు వైరల్గా మారింది. ‘‘ఆట పట్ల సింహంలాంటి ఆకలి కలిగి ఉన్న వ్యక్తి.. నిన్ను మిస్సవుతాము చీక్స్’’ అంటూ కోమ్లి ఫొటోను పంచుకున్నాడు. కాగా కోహ్లి ముద్దు పేరు చీకూ అన్న విషయం తెలిసిందే.వీడ్కోలు మ్యాచ్, సిరీస్ అవసరం లేదుఇదిలా ఉంటే.. ఇటీవల రోహిత్, కోహ్లిల గురించి గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వారి భవిష్యత్తు గురించి తాను ఏమీ చెప్పలేనని, వారిద్దరి ఆట బాగున్నంత కాలం వయసుతో సంబంధం లేదని అభిప్రాయపడ్డాడు.‘జట్టును ఎంపిక చేయడం సెలక్టర్ల బాధ్యత. అది నా చేతుల్లో లేదు. బాగా ఆడుతున్నంత వరకు కోహ్లి, రోహిత్ జట్టులో ఉంటారు. అతని వయసు 40 అయినా 45 అయినా సమస్య ఏముంది. కోచ్, సెలక్టర్ లేదా బీసీసీఐ కూడా ఫలానా ఆటగాడిని నువ్వు తప్పుకోవాలని చెప్పదు. ప్రదర్శన బాగుంటే 2027 వన్డే వరల్డ్ కప్ వరకు కూడా ఉంటారేమో. అయినా వారి ఆట ఎలా ఉందో చాంపియన్స్ ట్రోఫీలో ప్రపంచమంతా చూసింది కాబట్టి నేను కొత్తగా చెప్పేదేముంది.నా అభిప్రాయం ప్రకారం క్రికెటర్లకు వీడ్కోలు మ్యాచ్ లేదా సిరీస్ అనేది ఉండరాదు. అలాంటి ఒక్క మ్యాచ్కంటే ఇన్నేళ్లు జట్టు కోసం ఏం చేశాడో గుర్తు చేసుకోగలిగితే అదే పెద్ద గౌరవం. దేశపు అభిమానులు మిమ్మల్ని, మీ ఆటను ఇన్నేళ్లు ఇష్టపడటానికి మించి ఫేర్వెల్ ఏముంటుంది’ అని గంభీర్ ప్రశ్నించాడు. చదవండి: కోహ్లి రిటైర్మెంట్పై బీసీసీఐ ట్వీట్.. మండిపడుతున్న అభిమానులుA man with lion’s passion! Will miss u cheeks…. pic.twitter.com/uNGW7Y8Ak6— Gautam Gambhir (@GautamGambhir) May 12, 2025 -
కోహ్లి రిటైర్మెంట్పై బీసీసీఐ ట్వీట్.. మండిపడుతున్న అభిమానులు
భారత టెస్టు క్రికెట్లో ఓ శకం ముగిసింది. దిగ్గజ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli Retirement) సంప్రదాయ ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. తాను టెస్టుల నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. పద్నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్కు ముగింపు పలుకుతున్నట్లు భారమైన హృదయంతో వెల్లడించాడు.బీసీసీఐ ట్వీట్ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కోహ్లికి కృతజ్ఞతలు చెబుతూ ఓ ట్వీట్ చేసింది. ‘‘టెస్టు క్రికెట్లో ఓ శకం ముగిసిపోయింది.. కానీ వారసత్వం మాత్రం ఎప్పటికీ కొనసాగుతుంది.టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. అయితే, టీమిండియాకు ఆయన చేసిన సేవలు ఎల్లప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. థాంక్యూ విరాట్ కోహ్లి’’ అంటూ కోహ్లి ఫొటోలు పంచుకుంది.దిగ్గజ ఆటగాడికి వీడ్కోలు పలికే విధానం ఇదేనా?అయితే, బీసీసీఐ తీరుపై టీమిండియా, కోహ్లి అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దిగ్గజ ఆటగాడికి వీడ్కోలు పలికే విధానం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెస్టుల్లో వరుస వైఫల్యాలకు కేవలం ఆటగాళ్లనే బాధ్యుల్ని చేయడం సరికాదంటూ చురకలు అంటిస్తున్నారు.కాగా గత కొంతకాలంగా టెస్టుల్లో భారత జట్టు ఘోర పరాభవాలు చవిచూసిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై న్యూజిలాండ్తో 3-0తో వైట్వాష్ కావడంతో పాటు.. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2025ని 3-1తో చేజార్చుకుంది.రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి కూడాఈ రెండు సిరీస్లలోనూ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి కూడా విఫలయ్యాడు. పెర్త్లో సెంచరీ బాదినప్పటికీ.. ఆ తర్వాత ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతుల్ని ఆడే క్రమంలో దాదాపు ఎనిమిది సార్లు ఒకే రీతిలో అవుటయ్యాడు. ఆ తర్వాత ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీ బరిలో దిగి.. అక్కడా విఫలమయ్యాడు.ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లిల ఆట తీరుపై విమర్శలు వచ్చాయి. అయితే, వీళ్లిద్దరు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ ముగిసేంత వరకు మాత్రం జట్టుతో ఉంటారని అంతా భావించారు. అంతలోనే బుధవారం రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించగా.. తాజాగా కోహ్లి కూడా అదే బాటలో నడిచాడు.కాగా రోహిత్ను వైదొలగాల్సిందిగా ముందుగానే సెలక్టర్లు కోరగా.. కోహ్లిని మాత్రం మరికొంతకాలం వేచి చూడాల్సిందిగా కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే, కోహ్లి కెప్టెన్సీ చేపట్టాలనే ఉద్దేశంతో ఉండగా.. ఇందుకు బీసీసీఐ నిరాకరించిందని బోర్డు సన్నిహిత వర్గాలు చెప్పడం అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది.బలవంతంగా రిటైర్ అయ్యేలా చేశారనిమరోవైపు.. కోచ్గా గౌతం గంభీర్ విఫలమైనా ఎలాంటి చర్యలు చేపట్టని బీసీసీఐ.. రోహిత్, కోహ్లిలను మాత్రం బలవంతంగా రిటైర్ అయ్యేలా చేసిందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ ఇద్దరూ.. ముఖ్యంగా టెస్టుల్లో భారత్ను అగ్రపథంలో నిలిపిన కోహ్లికి మైదానంలో ఘనంగా వీడ్కోలు పలకాల్సింది పోయి... ఇలా సోషల్ మీడియాలో సాధారణ ఆటగాళ్లలా రిటైర్మెంట్ ప్రకటించే దుస్థితి కల్పించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పది వేల పరుగులు చేస్తానంటూఒకవేళ కోహ్లి, రోహిత్ రిటైర్ అవ్వాలని నిర్ణయించుకుంటే ఈ ఏడాది ఆరంభంలోనే సిడ్నీ టెస్టులోనే వీడ్కోలు ఏర్పాటు చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే మాత్రం ఇప్పటికిప్పుడు వీరిద్దరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉందని కనిపిస్తోందంటున్నారు. ఈ సందర్భంగా టెస్టుల్లో పది వేల పరుగులు చేస్తానంటూ కోహ్లి గతంలో చెప్పిన మాటలు గుర్తు చేస్తున్నారు. కాగా కోహ్లి తన టెస్టు కెరీర్లో 9230 పరుగులు చేశాడు. ఈ మైలురాయికి 770 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.చదవండి: PSL 2025: క్షిపణి దాడి నుంచి తప్పించుకున్న ఆసీస్ క్రికెటర్లు! -
రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లి
అనుకున్నదే జరిగింది.. ఊహాగానాలే నిజమయ్యాయి!.. అవును.. టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాడు. ఇంగ్లండ్తో కీలక సిరీస్కు ముందు తన నిర్ణయాన్ని ప్రకటించాడు.ఈ మేరకు.. ‘‘బ్యాగీ బ్లూ ధరించి టెస్టు క్రికెట్లో అడుగుపెట్టి ఇప్పటికి పద్నాలుగు ఏళ్లు గడిచాయి. ఈ ఫార్మాట్లో సుదీర్ఘకాలం కొనసాగుతానని నేను నిజంగా ఊహించనే లేదు.ఈ ఫార్మాట్ ఆటగాడిగా నన్ను ఎంతో పరీక్షించింది. నన్ను తీర్చిదిద్దింది. ఎన్నో పాఠాలు నేర్పించింది. వ్యక్తిగత జీవితంలోనూ నేను వాటిని అనుసరిస్తాను.వైట్ జెర్సీలో ఆడటం వ్యక్తిగతంగానూ ఎంతో ప్రత్యేకమైనది. సుదీర్ఘంగా క్రీజులో ఉండటం.. అందులోనూ గుర్తుండిపోయే చిన్న చిన్న పెద్ద జ్ఞాపకాలు ఎల్లకాలం నాతో పాటే ఉంటాయి.ఈ ఫార్మాట్కు వీడ్కోలు పలకడం మనసుకు భారంగా ఉంది.. కానీ ఇందుకు ఇదే సరైన సమయమని అనిపించింది. ఆట కోసం నా సర్వస్వాన్ని ధారపోశాను. అందుకు ఆట కూడా నాకెంతో తిరిగి ఇచ్చింది. నిజానికి నేను చేసిన దాని కంటే.. ఆశించిన దానికంటే ఎక్కువగానే ఇచ్చింది.మనస్ఫూర్తిగా.. కృతజ్ఞతా భావంతో నేను ఈ ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నాను. క్రికెట్కు, నా సహచర ఆటగాళ్లకు, నా ప్రయాణాన్ని సుదీర్ఘకాలం కొనసాగించేలా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.టెస్టు కెరీర్ సంతృప్తికరం. నేనెప్పుడు దీని గురించి తలచుకున్నా తప్పకుండా నా మోముపై చిరునవ్వు వెల్లివిరిస్తుంది. #269.. ఇక సెలవు’’ అంటూ కోహ్లి ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. 2011లో టెస్టుల్లో అరంగేట్రంకాగా 2008లో వన్డేల ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విరాట్ కోహ్లి.. ఆ తర్వాత మూడేళ్లకు అంటే 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. వెస్టిండీస్తో జమైకా వేదికగా టీమిండియా ఆడిన తొలి టెస్టులో క్యాప్ అందుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేశాడు.చేదు అనుభవం తర్వాత తొలి ఇన్నింగ్స్లో పది బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేసి నిష్క్రమించాడు. రెండో ఇన్నింగ్స్లో 54 బంతులు ఎదుర్కొని 15 రన్స్ మాత్రమే చేయగలిగాడు. అయితే, ఈ చేదు అనుభవం తర్వాత కోహ్లి తన ఆటను మెరుగుపరచుకున్నాడు.టీమిండియా మేటి టెస్టు బ్యాటర్లలో ఒకడిగా ఎదిగాడు. కెప్టెన్గానూ సంప్రదాయ క్రికెట్లో భారత్ను అగ్రస్థానంలో నిలిపాడు. ఆస్ట్రేలియా గడ్డపై చిరస్మరణీయ విజయం అందించాడు.తన కెరీర్లో మొత్తంగా 123 టెస్టులు ఆడిన కోహ్లి 9230 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో 31 అర్ధ శతకాలు, 30 సెంచరీలు, ఏడు డబుల్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 254.రోహిత్తో పాటే..కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. తాజాగా రోహిత్ టెస్టులకు గుడ్ బై చెప్పిన ఆరు రోజులకే తానూ వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. కాగా గత కొంతకాలంగా రోహిత్, కోహ్లి టెస్టుల్లో విఫలమవుతున్న విషయం తెలిసిందే. ఇక కోహ్లి చివరగా పెర్త్లో ఆస్ట్రేలియా మీద తన టెస్టు సెంచరీ సాధించాడు. ఇక రోహిత్, కోహ్లి వన్డేలలో మాత్రం కొనసాగనున్నారు.చదవండి: PSL 2025: క్షిపణి దాడి నుంచి తప్పించుకున్న ఆసీస్ క్రికెటర్లు! -
IND vs ENG: టీమిండియా కెప్టెన్గా గిల్.. వైస్ కెప్టెన్గా అతడే!
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు టీమిండియా కొత్త కెప్టెన్ నియామకం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ (Rohit Sharma) నిష్క్రమణ నేపథ్యంలో యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ (Shubman Gill)కు పగ్గాలు అప్పగించేందుకు బోర్డు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా.. అతడికి డిప్యూటీగా మరో యువ ఆటగాడినే ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.ఈసారి కనీసం ఫైనల్ చేరకుండానేగతేడాది టెస్టుల్లో పరాభవాల పాలైన టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC)-2025 ఫైనల్కు దూరమైన విషయం తెలిసిందే. వరుసగా రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరినప్పటికీ టైటిల్కు అడుగుదూరంలో నిలిచిపోయిన భారత్.. ఈసారి ఆలోటు తీర్చుకుంటుందనుకుంటే ఇలా మొత్తానికే మోసం వచ్చింది.స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు టెస్టుల్లో 3-0తో వైట్వాష్ కావడం.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (BGT)-2025లో 3-1తో ఓడటం ఇందుకు ప్రధాన కారణాలు. ఈ రెండు సందర్భాల్లోనూ కెప్టెన్గా, బ్యాటర్గా విఫలమైన రోహిత్ శర్మ బుధవారమే సంప్రదాయ ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు.విరాట్ కోహ్లి కూడా రోహిత్ బాటలోనే!ఈ క్రమంలో మరో సీనియర్ బ్యాటర్, దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లి కూడా రోహిత్ బాటలోనే నడుస్తాడనే వార్తలు వినిపించాయి. కోహ్లి ఇంగ్లండ్తో సిరీస్లో కెప్టెన్గా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నా.. బోర్డు అందుకు సమ్మతించలేదని.. అందుకే అతడు ఈ మేర తీవ్ర నిర్ణయానికి వచ్చినట్లు వదంతులు వ్యాపించాయి.వైస్ కెప్టెన్గా పంత్డబ్ల్యూటీసీ 2025-27 కొత్త సీజన్లో యువ రక్తంతో నిండిన జట్టును ఇప్పటి నుంచే సిద్ధం చేయాలనే యోచనలో ఉన్న బోర్డు.. కోహ్లికి నో చెప్పిందన్నది వాటి సారాంశం. తాజా సమాచారం ప్రకారం.. శుబ్మన్ గిల్ను కెప్టెన్గా నియమించాలని బీసీసీఐ నిర్ణయించింది. మే ఆఖరి వారంలో ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.అదే విధంగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ను వైస్ కెప్టెన్గా నియమించాలని సెలక్టర్లు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి గిల్ కంటే పంత్ సీనియర్. అంతేకాదు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి విదేశీ గడ్డలపై సమర్థవంతంగా ఆడిన అనుభవం అతడికి ఉంది.అయితే, ఇటీవల ఆసీస్ పర్యటనలో పంత్ పూర్తిగా విఫలమయ్యాడు. షాట్ల ఎంపిక విషయంలో పదే పదే తప్పులు చేస్తూ విమర్శల పాలయ్యాడు. ఇలాంటి తరుణంలో గిల్ వైపు మొగ్గు చూపిన యాజమాన్యం.. అతడి చుట్టూ భవిష్యత్ జట్టును నిర్మించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వర్తించే పంత్పై అదనపు భారం మోపకుండా.. బ్యాటింగ్పైనే ప్రధానంగా దృష్టి పెట్టేలా బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టెస్టులతో డబ్ల్యూటీసీ 2025-27 సీజన్ ఆరంభం కానుంది. జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఇంగ్లండ్ వేదికగా ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరుగుతుంది. చదవండి: SRH: బ్యాటర్ల వైఫల్యం... బౌలర్ల నిస్సహాయత -
BCCI: ప్లీజ్ కింగ్!.. కోహ్లిని ఒప్పించేందుకు రంగంలోకి అతడు!
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (VIrat Kohli) రిటైర్మెంట్ వార్తల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోహ్లిని మరికొన్నాళ్లు టెస్టుల్లో కొనసాగేలా ఒప్పించేందుకు.. భారత క్రికెట్లో అత్యంత అత్యంత ప్రభావశీలుడైన వ్యక్తిని రంగంలోకి దించినట్లు సమాచారం.ప్రకటన చేయకపోయినా...కాగా టీమిండియా కెప్టెన్, సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులకు గుడ్బై చెప్పిన మూడు రోజుల్లోపే భారత క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచే మరో వార్త శనివారం వచ్చిన విషయం తెలిసిందే. స్టార్ ఆటగాడు, జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన విరాట్ కోహ్లి కూడా టెస్టులనుంచి రిటైర్ కావాలని భావిస్తున్నట్లు దాని సారాంశం. ఈ ‘రన్మెషీన్’ అధికారికంగా తన రిటైర్మెంట్పై ఎలాంటి ప్రకటన చేయకపోయినా... తాను టెస్టులనుంచి తప్పుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు బోర్డుకు అతడు సమాచారం అందించాడు.కోహ్లిని ఒప్పించేందుకు రంగంలోకి అతడు!ఇంగ్లండ్తో కీలకమైన సిరీస్ కోసం త్వరలోనే జట్టును ఎంపిక చేయనున్న నేపథ్యంలో.. దానికంటే ముందే తన మనసులో మాటను కోహ్లి బీసీసీఐకి తన నిర్ణయం గురించి తెలియజేశాడు. అయితే కోహ్లి రిటైర్మెంట్ ప్రకటన చేయకుండా బీసీసీఐ ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే రోహిత్ రిటైర్ కాగా, శుబ్మన్ గిల్ జట్టు కెప్టెన్గా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్లాంటి పటిష్ట జట్టుతో సమరంలో జట్టులో అనుభవలేమి సమస్య కావచ్చు. అందుకే కనీసం ఈ సిరీస్ వరకైనా కోహ్లి జట్టులో కొనసాగాలని బోర్డు కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్లో అత్యంత ప్రభావశీలుడైన వ్యక్తి ఒకరితో కోహ్లిని ఒప్పించేందుకు బోర్డు సిద్ధమైనట్లు తెలుస్తోంది.అతడితో మాట్లాడిన తర్వాతే కోహ్లి తన టెస్టు రిటైర్మెంట్పై అధికారిక ప్రకటన చేయవచ్చు. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ను గెలుచుకున్న తర్వాత రోహిత్ శర్మతో పాటు కోహ్లి కూడా ఈ ఫార్మాట్ నుంచి తప్పుకొన్నాడు. అయితే, వన్డేల్లో మాత్రం రోహిత్తో పాటే అతడు మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది.టెస్టు క్రికెట్లోనూ ప్రత్యేక స్థానంకాగా విరాట్ కోహ్లి వన్డే రికార్డులు చాలా గొప్పగా, ఘనంగా ఉన్నాయి. అందరి దృష్టిలో అతడు గొప్ప వన్డే ఆటగాడే అయినప్పటికీ.. టెస్టు క్రికెట్లో తనకంటూ కోహ్లి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. వ్యక్తిగత ప్రదర్శనలతో కాకుండా ఈతరం క్రికెటర్లలో టెస్టులను బతికించేందుకు సిద్ధపడిన ఏకైక బ్యాటర్గా గుర్తింపు పొందాడు.సంప్రదాయ ఫార్మాట్కు ఒక ‘దిక్సూచి’లా నిలబడి పునరుత్తేజం నింపేందుకు కోహ్లి ప్రయత్నించాడు. టెస్టుల్లో గతంలో కనిపించని దూకుడు, వ్యూహాలతో అత్యుత్తమ కెప్టెన్గా జట్టును నడిపించాడు. అయితే టెస్టుల్లో అతడి బ్యాటింగ్ ప్రదర్శన ఇటీవల అంత గొప్పగా లేదు. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఆస్ట్రేలియాపై పెర్త్లో కోహ్లి సెంచరీ చేశాడు. అయితే సిరీస్లోని మిగతా టెస్టుల్లో ఘోరంగా విఫలమయ్యాడు.గత రెండేళ్లలో కోహ్లి సగటు 32.56 మాత్రమే. ఇదే ఫామ్తో ఇంగ్లండ్కు వెళితే కోహ్లి ఎంత బాగా ఆడతాడనేది సందేహమే. పైగా రోహిత్ కూడా లేకపోవడంతో అందరి దృష్టీ తనపైనే ఉండటంతో తీవ్ర ఒత్తిడి ఖాయం. జట్టు సంధి దశలో తానూ తప్పుకుంటే మెరుగని కోహ్లి ఆలోచిస్తుండవచ్చు.ఇక కెరీర్లో 123 టెస్టులు ఆడిన కోహ్లి 46.85 సగటుతో 9230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 అర్ధసెంచరీలు ఉన్నాయి. మరో 770 పరుగులు చేస్తే అతను 10 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. చదవండి: Virat Kohli: ‘కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది.. అందుకే’! -
సోషల్ మీడియాలోనే రిటైర్మెంట్.. రోహిత్ను ఇలాగే పంపిస్తారా?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవలే టెస్టు క్రికెట్కు విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్తో జరగనున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు రోహిత్ తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించి అందరికి షాకిచ్చాడు. అయితే భారత జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మను ముందే తొలిగించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా రోహిత్ లాంటి అద్భుతమైన కెప్టెన్ సోషల్ మీడియాలో రిటైర్మెంట్ ప్రకటించడం పట్ల భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రోహిత్కు సరైన విడ్కోలు లభించలేదని తివారీ అభిప్రాయపడ్డాడు."రోహిత్ శర్మ అద్బుతమైన కెప్టెన్. కెప్టెన్గా అతడి ట్రాక్ రికార్డు చాలా బాగుంది. అతడి సారథ్యంలో భారత్ 12 టెస్టుల్లో విజయం, మూడు మ్యాచ్లను డ్రాగా ముగించింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు కూడా చేర్చాడు. అటువంటి కెప్టెన్కు సరైన విడ్కోలు లభించలేదు. రోహిత్ శర్మ సోషల్ మీడియాలో కాకుండా మైదానంలో మ్యాచ్ ఆడిన తర్వాత రిటైర్ అయి ఉంటే బాగుండేది. అది అతడికి సరైన విడ్కోలు అయి ఉండేది. కానీ రోహిత్ విషయంలో అది జరగలేదని" పరోక్షంగా బీసీసీఐపై తివారీ మండిపడ్డాడు. రోహిత్ తన టెస్ట్ కెరీర్లో 67 మ్యాచ్లు ఆడి 40.57 సగటుతో 4,301 పరుగులు సాధించారు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి. 2019లో దక్షిణాఫ్రికాపై సాధించిన 212 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరు. కెప్టెన్గా 24 టెస్టులకు నాయకత్వం వహించి, 12 విజయాలు, 9 ఓటములు, 3 డ్రాలు నమోదు చేశాడు.చదవండి: పాకిస్తాన్కు అంత సీన్ లేదు.. త్వరలోనే ఐపీఎల్ మళ్లీ మొదలు: గంగూలీ -
Virat Kohli: ‘కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది.. అందుకే’!
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) టెస్టులకు వీడ్కోలు పలకబోతున్నాడన్న వార్తల నడుమ.. తాజాగా మరో ప్రచారం తెరమీదకు వచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తన అభ్యర్థనను తిరస్కరించిన కారణంగానే కోహ్లి ఈ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధపడ్డాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈసారి ఫైనల్ చేరకుండానేకాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2023-25 సీజన్ ఆరంభంలో అదరగొట్టిన రోహిత్ సేన.. అసలు సమయానికి చేతులెత్తేసిన విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్వాష్కు గురైన టీమిండియా.. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలోనూ వైఫల్యాలను కొనసాగించింది.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2025లో భాగంగా ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లోనూ 3-1తో ఓటమిపాలైంది. తద్వారా ఈసారి ఫైనల్ చేరకుండానే ఇంటి బాట పట్టింది. రెండు సిరీస్లలో ఇంతటి ఘోర పరాభవానికి కారణం కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల బ్యాటింగ్ వైఫల్యమే.అయితే, కోహ్లి ఆసీస్ గడ్డపై ఓ శతకంతో మెరిసి టచ్లోకి వచ్చినట్లు కనిపించినా.. రోహిత్ మాత్రం పూర్తిగా తేలిపోయాడు. అనంతరం ఈ ఇద్దరూ రంజీ ట్రోఫీ బరిలో దిగి అక్కడా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ టెస్టుకు వీడ్కోలు పలకాలనే డిమాండ్లు రాగా.. బుధవారం ఇందుకు సంబంధించి అతడు అధికారిక ప్రకటన విడుదల చేశాడు.సోషల్ మీడియా వేదికగాతాను టెస్టు ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు రోహిత్ శర్మ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇంగ్లండ్తో జూన్ 20 నుంచి మొదలుకానున్న డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్ ఆరంభానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక కోహ్లి కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమయ్యాడని తాజాగా వార్తలు వస్తున్నాయి.జట్టుకు బలం అతడుఅయితే, బీసీసీఐ మాత్రం కోహ్లిని ఇంగ్లండ్తో సిరీస్ వరకైనా ఆడాలని కోరినట్లు తెలుస్తోంది. ఎన్డీటీవీతో బీసీసీఐ వర్గాలు ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘కోహ్లి ఇంకా పరుగుల దాహంతోనే ఉన్నాడు. అతడు డ్రెసింగ్రూమ్లో ఉంటే జట్టుకు బలం.ఇప్పట్లో టెస్టులకు గుడ్బై చెప్పాలనే నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరాం’’ అని పేర్కొన్నాయి.కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది?అయితే, టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. రోహిత్ శర్మ వీడ్కోలు నేపథ్యంలో విరాట్ కోహ్లి తనకు కెప్టెన్సీ కావాలని అడిగినట్లు తెలుస్తోంది. అయితే, బీసీసీఐ మాత్రం ఇందుకు విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. శుబ్మన్ గిల్ వంటి యువ ఆటగాడికి పగ్గాలు అప్పగించాలని బోర్డు సహా ప్రధాన కోచ్ గౌతం గంభీర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘డబ్ల్యూటీసీ కొత్త సైకిల్ మొదలుకానుంది. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు కెప్టెన్ నియమించాలని బోర్డు భావిస్తోంది.హెడ్కోచ్ గంభీర్ కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు. కొత్తతరం ఆటగాళ్లతో పటిష్ట జట్టు తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇంగ్లండ్ వంటి మేటి జట్టుతో సిరీస్ నుంచే ఈ పని మొదలుపెట్టాలని భావిస్తున్నారు. అందుకే కొత్త నాయకుడి వైపే యాజమాన్యం మొగ్గు చూపుతోంది’’ అని పేర్కొన్నాయి.కెప్టెన్గానూ హిట్కాగా గతంలో కెప్టెన్గా ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్- గావస్కర్ ట్రోఫీ గెలవడంతో పాటు టెస్టుల్లో భారత్ను అగ్రస్థానంలో నిలిపిన ఘనత కోహ్లికి ఉంది. టెస్టుల్లో అతడి రికార్డులు అమోఘం. అయితే, వన్డే కెప్టెన్సీ నుంచి తనను తొలగించిన తర్వాత... సౌతాఫ్రికా పర్యటనలో ఓటమి అనంతరం టెస్టు పగ్గాలు కూడా వదిలేశాడు.కోహ్లి సారథ్యంలో డబ్ల్యూటీసీ 2019-21లో టీమిండియా ఫైనల్కు చేరింది. అయితే, ఆ తర్వాత రోహిత్ గైర్హాజరీలో కూడా కోహ్లి ఎప్పుడూ కెప్టెన్గా వ్యవహరించలేదు. బ్యాటర్గా కొనసాగేందుకే ఇష్టపడ్డాడు. అలాంటిది ఇప్పుడు కోహ్లి కెప్టెన్సీ అడిగాడని.. అందుకు బోర్డు నిరాకరించిందనే వార్తలు కల్పితాలే అని విశ్లేషకులు భావిస్తున్నారు.చదవండి: IPL 2025: మిగిలిన మ్యాచ్లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్! -
విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!.. బీసీసీఐకి చెప్పేశాడు!
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) కూడా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) బాటలోనే నడవనున్నట్లు తెలుస్తోంది. టెస్టు క్రికెట్ నుంచి వైదొలిగేందుకు ఈ ‘రన్మెషీన్’ సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయం గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి కోహ్లి ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలుస్తోంది.ఇప్పుడే వద్దుఅయితే, సెలక్టర్లు మాత్రం కోహ్లిని మరికొన్నాళ్లు కొనసాగాల్సిందిగా కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం.. ‘‘టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ గురించి కోహ్లి ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశాడు. తాను టెస్టుల నుంచి వైదొలుగుతానని బోర్డుకు చెప్పాడు.అయితే, ఇంగ్లండ్తో కీలక సిరీస్ ముందున్న నేపథ్యంలో కోహ్లి తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని బీసీసీఐ అతడిని కోరింది. ఇంతవరకు అతడు మాత్రం ఈ విజ్ఞప్తిపై తన స్పందన తెలియజేయలేదు’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.రోహిత్ గుడ్బైకాగా టెస్టుల్లో గత కొంతకాలంగా రోహిత్ శర్మ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అతడి సారథ్యంలో సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్స్వీప్నకు గురైన భారత జట్టు.. ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 1-3తో కోల్పోయింది. ఈ రెండు సిరీస్లలో ఆటగాడిగానూ విఫలమైన రోహిత్.. ఇటీవలే టెస్టులకు గుడ్బై చెప్పాడు.కోహ్లికి ఘనమైన రికార్డులుఇక ఈ రెండు సిరీస్లలో కోహ్లి కూడా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఆసీస్తో పెర్త్లో శతకం బాదడం మినహా పెద్దగా అతడి బ్యాట్ నుంచి మెరపులేవీ లేవు. ఈ నేపథ్యంలో కోహ్లి కూడా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే, కోహ్లి టెస్టు కెరీర్ ఎంతో ఘనమైనది. ముఖ్యంగా ఒంటిచేత్తో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి విదేశీ గడ్డలపై భారత్ను గెలిపించిన రికార్డు అతడి సొంతం.కాబట్టి రోహిత్ విషయంలో రిటైర్మెంట్కు సులువుగానే ఓకే చెప్పిన సెలక్టర్లు.. కోహ్లిని మాత్రం కొనసాగాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో మొదటిదైన ఇంగ్లండ్ సిరీస్లో అతడిని తప్పక ఆడించాలని బోర్డు నిర్ణయించుకున్నట్లు సమాచారం.కాగా 2011లో టీమిండియా తరఫున టెస్టుల్లో అడుగుపెట్టిన కోహ్లి ఇప్పటికి 123 మ్యాచ్లు ఆడాడు. సగటున 46.85తో 9230 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో 30 టెస్టు శతకాలు, 31 హాఫ్ సెంచరీలు, ఏడు డబుల్ సెంచరీలు ఉన్నాయి.వన్డేలలో ఇద్దరూ కొనసాగుతారు!మరోవైపు.. రోహిత్ విషయానికొస్తే.. భారత్ తరఫున 67 టెస్టుల్లో 12 శతకాలు, ఒక ద్విశతకం సాయంతో 4301 పరుగులు చేశాడు. ఇక టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాను విజేతగా నిలిపిన తర్వాత రోహిత్ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లి కూడా రోహిత్తో పాటే తానూ వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు.ఇప్పుడు రోహిత్ టెస్టులకు గుడ్బై చెప్పగా.. కోహ్లి కూడా అతడిని అనుసరించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాగా ఈ ఇద్దరు ఇటీవల టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలవడంలో కీలక పాత్ర పోషించారు. కాబట్టి వన్డే వరల్డ్కప్-2027 వరకు యాభై ఓవర్ల ఫార్మాట్లో మాత్రం కొనసాగనున్నట్లు తెలుస్తోంది.చదవండి: IPL 2025: మిగిలిన మ్యాచ్లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్! -
IND vs ENG: టీమిండియా కెప్టెన్గా అతడే ఉండాలి: అనిల్ కుంబ్లే
టెస్టుల్లో గత సిరీస్లలో వరుస పరాభవాలు చవిచూసిన టీమిండియా.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC)-2025 ఫైనల్కు దూరమైంది. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్ను విజయంతో ఆరంభించాలని పట్టుదలగా ఉంది. ఇక 2025-27 సీజన్లో భాగంగా తొలుత ఇంగ్లండ్ (India vs England)తో తలపడనుంది.ఇంగ్లండ్ వేదికగా జూన్ 20 నుంచి ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. అయితే, ఈ కీలక సిరీస్కు రోహిత్ శర్మ (Rohit Sharma) అందుబాటులో ఉంటాడని.. అతడినే కెప్టెన్గా కొనసాగిస్తారని తొలుత వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా రోహిత్ బుధవారం అధికారికంగా టెస్టులకు వీడ్కోలు పలికాడు.రేసులో నలుగురు!ఈ నేపథ్యంలో టీమిండియా టెస్టు కెప్టెన్గా రోహిత్ శర్మ వారసుడు ఎవరన్న అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. యువ ఆటగాళ్లు శుబ్మన్ గిల్, రిషభ్ పంత్ (Rishabh Pant)లకు అవకాశం ఇవ్వాలని కొంత మంది మాజీలు సూచిస్తుంటే.. మరికొంత మంది మాత్రం సీనియర్లైన కేఎల్ రాహుల్ లేదా పేస్దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాకు పగ్గాలు ఇవ్వాలంటున్నారు.కాగా బుమ్రా ఇటీవలి కాలంలో ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిపై పనిభారం పడకుండా ఉండేందుకు వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తొలగించాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి తరుణంలో భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే మాత్రం బుమ్రాకు మద్దతుగా నిలిచాడు.టీమిండియా కెప్టెన్గా అతడే ఉండాలిఇంగ్లండ్తో సిరీస్కు బుమ్రాను కెప్టెన్గా నియమించాలని బీసీసీఐకి సూచించాడు. ఈ మేరకు.. ‘‘ఫాస్ట్ బౌలర్గా సుదీర్ఘకాలం కొనసాగడం అంత సులువేమీ కాదు. గాయాల బెడద వేధిస్తూనే ఉంటుంది.ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత చాన్నాళ్లు విరామం తీసుకున్న అనంతరం బుమ్రా మళ్లీ ఐపీఎల్తో తిరిగి ఆటలో అడుగుపెట్టాడు. అతడికి ఫిట్నెస్ సమస్యలు ఉన్నాయన్న మాట వాస్తవమే.అయితే, కనీసం ఇంగ్లండ్తో సిరీస్లో మాత్రం కెప్టెన్గా అతడికే బాధ్యతలు అప్పగించండి. ఆ తర్వాత ఫిట్నెస్ విషయంలో సమస్యలు తలెత్తితే ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోండి’’ అని కుంబ్లే ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు.కాగా బుమ్రాపై పనిభారం తగ్గించే క్రమంలో ఇంగ్లండ్లో అత్యధికంగా మూడు మ్యాచ్లలో మాత్రమే అతడిని ఆడించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. కాబట్టి ఒకవేళ అతడిని కెప్టెన్ను చేస్తే.. మధ్యలోనే మరొకరిని సారథిగా నియమించాల్సి వస్తుందనే కారణంతో.. బుమ్రా పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదని సమాచారం.ఐదు టెస్టులూ ఆడకపోతే ఏంటి?అయితే, బుమ్రా నిజంగానే ఇంగ్లండ్లో ఐదు టెస్టులూ ఆడకపోవచ్చన్న కుంబ్లే.. కెప్టెన్గా నియమించేందుకు అదేమీ అడ్డుకాకపోవచ్చని పేర్కొన్నాడు. బుమ్రా గైర్హాజరీలో వైస్ కెప్టెన్ సారథిగా బాధ్యతలు తీసుకుంటాడని.. ఇందులో ఎలాంటి సమస్యా ఉండదని అభిప్రాయపడ్డాడు.కాగా బుమ్రా గతంలో ఇంగ్లండ్ పర్యటనలో కెప్టెన్గా వ్యవహరించాడు. ఇటీవల ఆస్ట్రేలియా టూర్లో భాగంగా రోహిత్ శర్మ గైర్హాజరీలో సారథిగా బాధ్యతలు నిర్వర్తించాడు. కెప్టెన్గా.. పెర్త్లో జరిగిన తొలి టెస్టులో భారత్ను గెలిపించిన ఈ రైటార్మ్ పేసర్.. సిడ్నీ టెస్టులో మాత్రం జట్టుకు విజయం అందించలేకపోయాడు.ఇక టీమిండియా గత రెండు టెస్టు సిరీస్లలో ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో కనీవినీ ఎరుగని రీతిలో 3-0తో వైట్వాష్కు గురికావడం సహా.. ఆసీస్ పర్యటనలో పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(3-1)ని చేజార్చుకుంది. ఈ రెండు సిరీస్లలో రోహిత్ శర్మ కెప్టెన్గా, ఆటగాడిగా పూర్తిగా విఫలమయ్యాడు.చదవండి: IPL 2025: ధనాధన్గా దూసుకొచ్చారు -
అది అతని వ్యక్తిగత నిర్ణయం
న్యూఢిల్లీ: భారత విజయవంతమైన కెప్టెన్, ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ రిటైర్మెంట్ నిర్ణయం పూర్తిగా అతని వ్యక్తిగతమని బోర్డు సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. వచ్చే నెలలో ఇంగ్లండ్తో ఐదు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్కు ముందు రోహిత్ బుధవారం అనూహ్యంగా సంద్రదాయ టెస్టు ఫార్మాట్కు గుడ్బై చెప్పాడు. ఇది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో పాటు క్రికెట్ అభిమానుల్ని నిర్ఘాంతపరిచింది. సీనియర్ క్రికెటర్, కోల్కతా నైట్రైడర్స్ సారథి రహానే సైతం రోహిత్ నిర్ణయం షాక్కు గురి చేసిందని వ్యాఖ్యానించాడు. ‘హిట్మ్యాన్’ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంపై శుక్లా స్పందించారు. ‘అది పూర్తిగా అతని వ్యక్తిగత నిర్ణయం. ఇందులో బోర్డు పాత్ర ఏమీ లేదు. బోర్డు పాలసీ ప్రకారం ఎవరైనా ఆటగాడు ఆటకు వీడ్కోలు పలికితే... ఆ నిర్ణయం సవరించుకునేలా ఒత్తిడి చేయం. అలాగే ఎలాంటి సూచన గానీ, సంప్రదింపులు గానీ జరపం’ అని అన్నారు. అయితే సుదీర్ఘ కాలం ఆటగాడిగా, సారథిగా భారత క్రికెట్ అతను అందించిన సేవల్ని కొనియాడుతామన్నారు. ‘రోహిత్ ముమ్మాటికీ గొప్ప బ్యాటర్. అతను వన్డే క్రికెట్లో కొనసాగుతానని చెప్పడం ఇందులో సానుకూలాంశం.కాబట్టి అతని విశేషానుభవం, అసాధారణ ప్రదర్శన భారత వన్డే జట్టుకు బాగా ఉపయోగపడుతుంది’ అని శుక్లా అన్నారు. టెస్టుల్లో టీమిండియా తదుపరి సారథి ఎవరనేదానిపై సీనియర్ పేసర్ బుమ్రా సహా, బ్యాటర్లు కేఎల్ రాహుల్, శుబ్మన్ గిల్ల పేర్లు వినిపిస్తున్నప్పటికీ శుక్లా వీటిని కొట్టిపారేశారు. రోహిత్ వారసుడి ఎంపిక సెలక్షన్ కమిటీ చూసుకుంటుందని స్పష్టం చేశారు. -
రోహిత్కు ముందే తెలుసు.. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాడు:సెహ్వాగ్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం(మే 7) టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటిచాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం.. ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్ను భారత టెస్ట్ కెప్టెన్గా తొలగించాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఈ విషయాన్ని రోహిత్ శర్మకు తెలియజేసినట్లు వినికిడి. ఈ క్రమంలోనే హిట్మ్యాన్కు టెస్టు క్రికెట్కు విడ్కోలు పలికి అందరికి షాకిచ్చాడు. సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై రోహిత్ ఆసంతృప్తిగా ఉన్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ తీసుకున్న నిర్ణయంతో తన ఆశ్చర్యపోయినట్లు సెహ్వాగ్ తెలిపాడు."రోహిత్ నిర్ణయం నన్ను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందకంటే ఇంగ్లండ్ పర్యటనకు తను సిద్దమవుతున్నట్లు రోహిత్ శర్మ ఇటీవల చాలా సందర్బాల్లో వెల్లడించాడు. అంతేకాకండా ఆస్ట్రేలియా సిరీస్లో ఆఖరి టెస్టు అనంతరం తన రిటైర్మెంట్పై రోహిత్ ఓ క్లారిటీ ఇచ్చాడు. తను ఎక్కడికీ వెళ్ళడం లేదని, ఇప్పటిలో రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన లేదని స్పష్టం చేశాడు.కానీ అంతలోనే ఏమి జరిగిందో ఆర్ధం కావడం లేదు. కచ్చితంగా సెలక్టర్లతో చర్చించాకే రోహిత్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు. ఇంగ్లండ్ పర్యటనకు తనను టెస్టు కెప్టెన్గా ఎంపిక చేయమని లేదా పూర్తిగా ఆటగాడిగా కూడా పరిగణలోకి తీసుకోబోమని రోహిత్తో సెలక్టర్లు చెప్పండొచ్చు. అందుకే జట్టును ప్రకటించక ముందే రోహిత్ టెస్టులకు విడ్కోలు పలికాడు. సెలక్టర్లు తమ నిర్ణయాన్ని ప్రకటించకముందే రోహిత్ తనంతట తానే తప్పుకొన్నాడు. కానీ రోహిత్ శర్మ లాంటి ఆటగాడిని ఎవరూ వదులుకోవాలని అనుకోరు. మూడు ఫార్మాట్లలో రోహిత్ తనదైన ముద్రవేశాడు. అతడి రికార్డులు అద్వితీయమైనవి" అని క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: గిల్, బుమ్రా, పంత్ కాదు.. టీమిండియా కెప్టెన్గా అతడే -
టెస్టు క్రికెట్కు రోహిత్ గుడ్బై
4 జనవరి, 2025: ‘బ్యాటింగ్లో పరుగులు సాధించలేకపోతున్నాను. జట్టు ప్రయోజనాల కోసం ఈ మ్యాచ్లో ఆడరాదని నేనే నిర్ణయం తీసుకున్నా. నేను టెస్టుల నుంచి తప్పుకోవడం లేదు. ఇది నా రిటైర్మెంట్ ప్రకటనకాదు’... ఆ్రస్టేలియాతో సిడ్నీ టెస్టు సమయంలో రోహిత్ శర్మ చెప్పిన మాట ఇది. 7 మే, 2025: ‘నేను టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్న విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. సాంప్రదాయ ఫార్మాట్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం. అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. ఇకపై వన్డేల్లో మాత్రం కొనసాగుతాను’... టెస్టుల్లో తాను రిటైర్ అవుతున్నట్లు రోహిత్ ప్రకటన.న్యూఢిల్లీ: దాదాపు నాలుగు నెలల క్రితం రోహిత్ సిడ్నీ టెస్టు నుంచి తనంతట తాను తప్పుకున్నప్పుడే అంతా అతని కెరీర్ ముగిసిందని భావించారు. పేలవమైన ఫామ్తో ఇబ్బంది పడుతున్న అతను వచ్చే జూన్లో ఇంగ్లండ్ పర్యటనకు వెళతాడా లేదా అనే సందేహాలు అప్పుడే వినిపించాయి. అయితే క్రికెట్లో వేగంగా అంతా మారిపోతుందని, రాబోయే కొన్ని నెలల్లో తాను పరుగులు సాధిస్తానంటూ రిటైర్మెంట్ వార్తలను 38 ఏళ్ల రోహిత్ కొట్టిపారేశాడు. ఇటీవల ఇంగ్లండ్ టూర్ కోసం కుదించిన 30 మంది జాబితాలో అతని పేరు కూడా ఉందని తేలడంతో ఇంగ్లండ్కు వెళ్లడం ఖాయమనిపించింది. అయితే ఇప్పుడు అతని రిటైర్మెంట్ ప్రకటన వచ్చిoది. మరికొద్ది రోజుల్లో ఇంగ్లండ్తో సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించనున్న నేపథ్యంలో తన టెస్టు కెరీర్ గురించి ఉన్న సందేహాలపై స్పష్టత వచ్చేలా అతను నిర్ణయం తీసుకున్నాడు. గత ఏడాది టి20 వరల్డ్ కప్లో సారథిగా భారత్ను విజేతగా నిలిపిన అనంతరం ఆ ఫార్మాట్ నుంచి తప్పుకున్న రోహిత్ ఇప్పుడు టెస్టులకు దూరమయ్యాడు. ఇకపై తనకు బాగా కలిసొచ్చిన, ఇష్టమైన వన్డే ఫార్మాట్లో మాత్రం కొనసాగనున్నాడు.కారణాలు స్పష్టం...రోహిత్ శర్మపై నిర్ణయానికి సంబంధించి మంగళవారం సెలక్టర్లు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. చాంపియన్స్ ట్రోఫీలో జట్టును గెలిపించడంతో రోహిత్కు నాయకుడిగా తిరుగు లేదు. అయితే వన్డే ఫామ్ను టెస్టులకు అన్వయించరాదని సెలక్టర్లు భావించారు. ముందుగా అతని కెప్టెన్సీపై చర్చ జరిగింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చూస్తే మరొకరికి నాయకత్వ బాధ్యతలు ఇవ్వడం మేలని అనుకున్నారు. కెపె్టన్గా కాదంటే బ్యాటర్ కోణంలో చూస్తే టెస్టుల్లో అతని ఫామ్ చాలా పేలవంగా ఉంది. సిడ్నీ తరహాలోనే తుది జట్టులో స్థానం దక్కడం కూడా కష్టం. ఇలాంటప్పుడు విఫల బ్యాటర్ను కెప్టెన్ కాబట్టి తుది జట్టులోకి తీసుకోవడంలో అర్థం లేదని భావించిన సెలక్టర్లు రోహిత్కు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. స్వదేశంలో బంగ్లాదేశ్తో సిరీస్ నుంచి రోహిత్ బ్యాటింగ్ వైఫల్యం కొనసాగింది. 2 టెస్టుల్లో కలిపి 42 రన్స్ చేసిన అతను... న్యూజిలాండ్పై 3 టెస్టుల్లో కలిపి కేవలం 91 పరుగులు చేయడమే కాకుండా చరిత్రలో తొలిసారి కివీస్ చేతిలో భారత్ 0–3తో సిరీస్ కోల్పోయింది. ఆపై ఆసీస్తో తొలి టెస్టు ఆడని రోహిత్ తర్వాతి 3 టెస్టుల్లో కలిపి 31 పరుగులే చేశాడు. పేలవ ఫామ్తో చివరి టెస్టు నుంచి తనే తప్పుకున్నాడు.రోహిత్ టెస్టు కెరీర్ గణాంకాలుఆడిన టెస్టులు: 67 ఆడిన ఇన్నింగ్స్: 116 చేసిన పరుగులు: 4301 సగటు: 40.57 అత్యధిక స్కోరు: 212 సెంచరీలు: 12 అర్ధ సెంచరీలు: 18 ఫోర్లు: 473 సిక్స్లు: 88 పట్టిన క్యాచ్లు: 88 తీసిన వికెట్లు: 2అప్పుడప్పుడు కొన్ని ‘హిట్స్’వన్డేల్లో రోహిత్ శర్మ పేరిట అసాధారణ రికార్డులు ఉన్నాయి... టి20ల్లో రెండు వరల్డ్ కప్ విజయాల్లో భాగం... కెపె్టన్గా రెండు ఐసీసీ టోర్నీలు నెగ్గిన ఘనత... కానీ వీటితో పోలిస్తే అతని టెస్టు కెరీర్ అంత ఘనంగా కనిపించదు. అక్కడక్కడ కొన్ని గుర్తుంచుకునే ప్రదర్శనలు వచ్చినా ఈ ఫార్మాట్లో రోహిత్ ఎప్పుడూ తనదైన ముద్ర వేయలేకపోయాడు. సరిగ్గా చెప్పాలంటే అతని టెస్టు కెరీర్ ఎప్పుడూ నిలకడ లేకుండా పడుతూ లేస్తూనే సాగింది. SENA (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో కలిపి 25 టెస్టులు ఆడినా ఒకే ఒక శతకం ఉండటం అతని కెరీర్లో ఒక వైఫల్యం. అయితే ఈ విషయంలో అతను ఎప్పుడూ నిరాశ చెందలేదు. తనకు తెలిసిన ఆటను, తనదైన శైలిలోనే ఆడుకుంటూ పోయాడు తప్ప కొత్తగా ‘అత్యుత్తమ టెస్టు క్రికెటర్’ అనిపించుకోవాలనే తాపత్రయం, పట్టుదలను కనబర్చలేదు. టెస్టుల్లో మిడిలార్డర్ బ్యాటర్గా, ఆపై ఓపెనర్గా రెండు పార్శా్వల్లో అతని కెరీర్ సాగింది. ఘనారంభం... 2010లో నాగపూర్లో దక్షిణాఫ్రికా టెస్టు... వీవీఎస్ లక్ష్మణ్ గాయం నుంచి కోలుకోకపోవడంతో రోహిత్కు తుది జట్టులో అవకాశం దక్కింది. అయితే మ్యాచ్ ఆరంభానికి కొద్దిసేపు ముందు వామప్లో భాగంగా ఫుట్బాల్ ఆడుతూ గాయపడటంతో మ్యాచ్ ఆడలేకపోయాడు. ఆ తర్వాత మరో మూడున్నరేళ్ల పాటు టెస్టు అవకాశం కోసం వేచి చూడాల్సి వచ్చిoది. 2013లో వెస్టిండీస్తో ఆడిన తొలి రెండు టెస్టుల్లో 177, 111 నాటౌట్ స్కోర్లతో తన రాకను ఘనంగా చాటాడు. అయితే ఆ తర్వాత ఆటలో పదును లోపించడంతో వైఫల్యాలు ఎదురయ్యాయి. అప్పుడప్పుడు అనూహ్యంగా వచ్చిన అవకాశాలను కూడా వాడుకోలేకపోయాడు. తర్వాతి ఐదేళ్లలో 23 టెస్టులు ఆడితే ఒకే ఒక సెంచరీ సాధించాడు! బౌన్సీ పిచ్లపై అతని అవసరం ఉందంటూ సెలక్టర్లు ఆ్రస్టేలియాలో రెండు టెస్టులు ఆడించగా ఒక అర్ధసెంచరీ చేశాడు. ఓపెనర్గా చెలరేగి... వన్డేల్లో ఓపెనర్గా సూపర్ సక్సెస్ అయిన రోహిత్ ను టెస్టుల్లోనూ ఓపెనర్గా ప్రయత్నించవచ్చని కోచ్ రవిశాస్త్రి చేసిన సూచన రోహిత్ కెరీర్ను మార్చింది. తన అమ్మ ఊరు విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాపై ఓపెనర్గా ఆడిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్లలో 176, 127 పరుగులు చేసి కొత్త రోహిత్ పరిచయమయ్యాడు. అదే సిరీస్లో చేసిన 212 పరుగులు అతని కెరీర్లో ఏకైక డబుల్ సెంచరీ. ఓపెనర్గానే 43 టెస్టుల్లో 2697 పరుగులు సాధించిన అతను 9 శతకాలు నమోదు చేసి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. ఓవల్లో సత్తా చాటి... చెన్నైలో స్పిన్తో గింగిరాలు తిరుగుతున్న పిచ్పై 161 (ఇంగ్లండ్పై) స్వదేశంలో అతని చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్. అయితే రోహిత్ కెరీర్లో హైలైట్గా నిలిచిన ఇన్నింగ్స్లో 2021 ఓవల్ మైదానంలో వచ్చింది. ఇంగ్లండ్పై తొలి ఇన్నింగ్స్లో 99 పరుగుల ఆధిక్యం కోల్పోయిన తర్వాత రెండో ఇన్నింగ్స్లో పోరాడుతూ అతను చేసిన 127 పరుగులు జట్టును గెలిపించాయి. భారత్కు 24 టెస్టుల్లో రోహిత్ కెప్టెన్గా వ్యవహరించగా జట్టు 12 మ్యాచ్లు గెలిచి 9 ఓడింది. 2023 వరల్డ్ టెస్టు చాంపియన్íÙప్లో టీమిండియాను ఫైనల్ చేర్చడం అతని నాయకత్వంలో అత్యుత్తమ ప్రదర్శన. – సాక్షి క్రీడా విభాగం -
క్రికెట్ అభిమానులకు గుండె పగిలే వార్త.. రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ
టీమిండియా అభిమానులకు గుండె పగిలే వార్త. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని హిట్మ్యాన్ స్వయంగా తన ఇన్స్టా ఖాతా ద్వారా వెల్లడించాడు. తన రిటైర్మెంట్ తక్షణమే అమల్లోకి వస్తుందని రోహిత్ పేర్కొన్నాడు. రోహిత్ తన రిటైర్మెంట్ ప్రకటనలో ఇలా రాసుకొచ్చాడు. "అందరికీ నమస్కారం, నేను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్న విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. తెల్ల దుస్తుల్లో నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా గౌరవంగా ఉంది. సంవత్సరాలుగా మీ అందరి ప్రేమ మరియు మద్దతుకు ధన్యవాదాలు. వన్డే ఫార్మాట్లో కొనసాగుతాను"38 ఏళ్ల రోహిత్ భారత్ తరఫున 67 టెస్ట్లు ఆడి 40.6 సగటున 4301 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ, 11 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2022లో విరాట్ కోహ్లి నుంచి టెస్ట్ కెప్టెన్సీని చేపట్టిన రోహిత్.. 24 టెస్ట్ల్లో టీమిండియా సారథిగా వ్యవహరించాడు. ఇందులో 12 మ్యాచ్ల్లో భారత్ను విజేతగా నిలబెట్టాడు. 9 మ్యాచ్ల్లో భారత జట్టు ఓడగా.. మూడు మ్యాచ్లు డ్రా అయ్యాయి. రోహిత్ తర్వాత టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్ను ప్రకటించాల్సి ఉంది. రేసులో శుభ్మన్ గిల్ ముందున్నాడు. రోహిత్ గతేడాది పొట్టి ప్రపంచకప్ తర్వాత టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో రోహిత్ భారత్ను జగజ్జేతగా నిలిపాడు. ఇదిలా ఉంటే, ఇటీవలి కాలంలో టెస్ట్ల్లో రోహిత్ శర్మ ప్రదర్శన చాలా దారుణంగా ఉండింది. గత 10 టెస్ట్ మ్యాచ్ల్లో హిట్మ్యాన్ ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. తాజాగా ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. 5 ఇన్నింగ్స్ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. పేలవ ప్రదర్శన కారణంగా ఆ సిరీస్ ఆఖరి మ్యాచ్లో రోహిత్ స్వతాహాగా జట్టు నుంచి తప్పుకున్నాడు.అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లోనూ రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. ఆ సిరీస్లో మూడు మ్యాచ్ల్లో కేవలం 91 పరుగులు మాత్రమే చేశాడు. వ్యక్తిగతంగా విఫలం కావడమే కాకుండా ఈ రెండు సిరీస్ల్లో రోహిత్ కెప్టెన్గానూ విఫలమయ్యాడు. ఈ రెండు సిరీస్లను భారత్ కోల్పోయింది. -
ఆల్టైమ్ ఐపీఎల్ జట్టు.. రోహిత్ శర్మకు నో ప్లేస్
ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రికెట్ దిగ్గజాలు ఆడమ్ గిల్క్రిస్ట్, షాన్ పొలాక్ తమ ఆల్టైమ్ ఐపీఎల్ జట్టును ప్రకటించారు. ఈ జట్టులో వారు ఏడుగురు భారత ప్లేయర్లు, నలుగురు విదేశీ ఆటగాళ్లకు చోటిచ్చారు. ఈ జట్టుకు సారధిగా ఎంఎస్ ధోనిని ఎంపిక చేశారు. ఆశ్చర్యకరంగా ఈ జట్టులో హిట్మ్యాన్ రోహిత్ శర్మకు చోటు దక్కలేదు.🚨 G.O.A.T #IPL XI alert 🚨@gilly381 & @7polly7 build their best #IPL XI, right here#IPL2025 #ViratKohli #MSDhoni @myvoltas pic.twitter.com/NolGsfGAZ8— Cricbuzz (@cricbuzz) May 6, 2025ఈ జట్టుకు ఓపెనర్లుగా క్రిస్ గేల్, విరాట్ కోహ్లిని ఎంపిక చేశారు. విదేశీ ప్లేయర్ల ఎంపికలో గిల్క్రిస్ట్ క్రిస్ గేల్ పేరు ప్రతిపాదించగా.. పొలాక్ ఏబీ డివిలియర్స్ను ఎంపిక చేశాడు. ఏబీడి ఆధునిక టీ20 బ్యాటింగ్కు ఆధ్యుడని పొలాక్ ప్రశంసించాడు. మిగిలిన రెండు విదేశీ ఆటగాళ్ల బెర్త్ల కోసం గిల్క్రిస్ట్, పొలాక్ కలిసి లసిత్ మలింగ, సునీల్ నరైన్ పేర్లను ప్రతిపాదించారు. బౌలింగ్ ఎరీనాలో మలింగ 'గోట్' అని పొలాక్ కీర్తించాడు. స్పిన్ బౌలింగ్ విభాగంలో రషీద్ ఖాన్ కంటే సునీల్ నరైనే మోస్ట్ వ్యాల్యుయబుల్ ప్లేయర్ అని పొలాక్ అభిప్రాయపడ్డాడు.వన్డౌన్లో బ్యాటింగ్ కోసం గిల్క్రిస్ట్, పొలాక్ కలిసి సురేశ్ రైనాను ఎంపిక చేశారు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు ఏబీడిని ఎంచుకున్నారు. ఐదో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ కమ్ వికెట్ కీపర్గా ఆరో స్థానంలో ఎంఎస్ ధోని, ఆల్రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, సునీల్ నరైన్ను ఎంపిక చేశారు. పేస్ బౌలర్లుగా మలింగ, బుమ్రా.. స్పెషలిస్ట్ స్పిన్నర్గా చహల్ను ఎంపిక చేశారు.ఆడమ్ గిల్క్రిస్ట్, షాన్ పొలాక్ కలిసి ఎంపిక చేసిన ఐపీఎల్ ఆల్ టైమ్ XI: క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, ఏబీ డివిలియర్స్, సూర్యకుమార్ యాదవ్, ఎంఎస్ ధోని (కెప్టెన్ కమ్ వికెట్కీపర్), రవీంద్ర జడేజా, సునీల్ నరైన్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్. -
MI vs GT: అందరికీ అప్పుడే.. సిరాజ్కు ఇప్పుడు!
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)కు... భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టీ20 ప్రపంచకప్ విజేత ఉంగరాన్ని అందించాడు. గతేడాది జరిగిన పొట్టి ఫార్మాట్ వరల్డ్కప్లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కప్ గెలిచిన ఆ జట్టులోని సభ్యులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవలి వార్షిక అవార్డుల కార్యక్రమంలో ప్రత్యేక ఉంగరాలు బహుకరించింది.అందరికీ అప్పుడే.. సిరాజ్కు ఇప్పుడు!ముంబై వేదికగా జరిగిన ఈ వేడుకకు సిరాజ్ గైర్హాజరు కాగా... సోమవారం వాంఖడే స్టేడియంలో సిరాజ్కు రోహిత్ శర్మ ఈ బహుమతిని అందించాడు. ఐపీఎల్లో భాగంగా మంగళవారం గుజరాత్ టైటాన్స్- ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న సిరాజ్కు ముంబై స్టార్ రోహిత్ ఈ ఉంగరాన్ని అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ రింగ్లో ఆటగాడి పేరు, జెర్సీ నంబర్తో పాటు జాతీయ చిహ్నం అశోక చక్రను పొందుపరిచారు.ముంబైతో మ్యాచ్కు ముందు గుజరాత్ టైటాన్స్కు గుడ్న్యూస్ఇదిలా ఉంటే.. దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడపై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారు. రిక్రియేషనల్ (సరదా కోసం తీసుకునే) డ్రగ్స్ వాడటం వల్ల అతడిపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) తాత్కాలిక నిషేధం విధించగా... సస్పెన్షన్ సమయంలో ‘సబ్స్టాన్స్ అబ్యూస్’ చికిత్స పూర్తి చేయడంతో అతడిపై నిషేధాన్ని తొలగించారు. దీంతో రబడ ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్కు అందుబాటులోకి వచ్చాడు.ఈ మేరకు దక్షిణాఫ్రికా ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రగ్ ఫ్రీ స్పోర్ట్ (ఎస్ఏఐడీఎస్) ఒక ప్రకటనలో తెలిపింది. ‘రబడ డోపింగ్కు పాల్పడినట్లు ఏప్రిల్ 1న నిర్ధారణ అయింది. దీంతో అతడిపై తాత్కాలిక నిషేధం విధించారు. ఆ సమయంలో ఐపీఎల్ ఆడుతున్న రబడ తక్షణమే దక్షిణాఫ్రికాకు తిరిగి వచ్చాడు. దక్షిణాఫ్రికా డోపింగ్ నిరోధక నియమాల ప్రకారం ప్రత్యేకంగా నిర్వహించే సబ్స్టాన్స్ అబ్యూస్ చికిత్స తీసుకున్నాడు. రెండు సెషన్లు పూర్తి కావడంతో అతడిపై విధించిన తాత్కాలిక నిషేధం ముగిసింది.నా వృత్తిపై గౌరవం, భక్తితో ఉంటానుఅతడు నెల రోజుల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. రబడ ఇప్పుడు నిరభ్యంతరంగా మ్యాచ్లు ఆడోచ్చు’ అని ఎస్ఏఐడీఎస్ వెల్లడించింది. ‘ఈ సంఘటనతో కుంగిపోను. ముందుకు సాగడమే నా లక్ష్యం. నిరంతరం కష్టపడుతూ నా వృత్తిపై గౌరవం, భక్తితో ఉంటాను’అని రబడ అన్నాడు. క్రీడల్లో మెరుగైన ప్రదర్శనకు ఉపయోగపడే డ్రగ్స్ తరహాలో కాకుండా కొకైన్, హెరాయిన్, గంజాయి వంటి వాటిని రిక్రియేషనల్ డ్రగ్స్గా వ్యవహరిస్తారు.ఆటగాళ్లు వీటిని వాడితే నిబంధనల ప్రకారం గరిష్టంగా నాలుగేళ్ల నిషేధం పడే అవకాశం ఉన్నా... సరదా కోసమే వాటిని వాడినట్లు... ఆ సమయంలో ఎలాంటి మ్యాచ్లు లేకపోవడంతోనే అలా చేసినట్లు ప్లేయర్ నిరూపించగలిగితే స్వల్ప నిషేధంతో తప్పించుకోవచ్చు. ఇక ముప్పై ఏళ్ల రబడ ఈ ఏడాది జనవరిలో ఎస్ఏ20 సందర్భంగా ఈ డ్రగ్ తీసుకున్నట్లు టెస్టుల్లో తేలింది. ఇప్పుడు సస్పెన్షన్ ఎత్తివేయడంతో వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు రబడ అందుబాటులో ఉండనున్నాడు. చదవండి: వయసుతో పనేంటి?.. అతడు మరో ఆరేళ్లపాటు ఐపీఎల్ ఆడతాడు: వరుణ్ చక్రవర్తి 𝙈𝙤𝙢𝙚𝙣𝙩 𝙩𝙤 𝘾𝙝𝙚𝙧𝙞𝙨𝙝 👏@mdsirajofficial receives a special ring from #TeamIndia Captain @ImRo45 for his impactful contributions in the team's victorious ICC Men's T20 World Cup 2024 campaign 💍@Dream11 pic.twitter.com/dHSnS4mwu1— BCCI (@BCCI) May 5, 2025 -
IND vs ENG: బుమ్రాకు షాక్.. వైస్ కెప్టెన్గానూ అవుట్!
గత కొంతకాలంగా టెస్టుల్లో పేలవ ప్రదర్శన కనబరిచిన టీమిండియా.. ఇంగ్లండ్లో సత్తా చాటి పూర్వ వైభవం పొందాలని పట్టుదలగా ఉంది. ఇంగ్లండ్తో సిరీస్లో నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెలక్టర్లు సీనియర్ టీమ్, భారత ‘ఎ’ జట్టు కోసం కలిపి ఇప్పటికే ప్రాథమికంగా 35 మంది ప్రాబబుల్స్ను ఎంపిక చేశారు. ఇందులో కెప్టెన్గా రోహిత్ శర్మ (Rohit Sharma)పేరు దాదాపుగా ఖరారు కాగా.. వైస్ కెప్టెన్ ఎవరన్న అంశంపై సందిగ్దం నెలకొంది.నిజానికి స్వదేశంలో న్యూజిలాండ్తో 3-0తో క్లీన్స్వీప్, ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో బోర్డర్ గావస్కర్ ట్రోఫీ (BGT)ని చేజార్చుకున్న తర్వాత రోహిత్ టెస్టు భవితవ్యంపై సందేహాలు నెలకొన్నాయి. కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గానూ అతడు విఫలం కావడంతో ఇక సంప్రదాయ ఫార్మాట్కు వీడ్కోలు పలుకుతాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కెప్టెన్గానే కాదు.. వైస్ కెప్టెన్గానూ బుమ్రా అవుట్!ఈ నేపథ్యంలో రోహిత్ స్థానాన్ని పేస్ దళ నాయకుడు, టెస్టు జట్టు వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)తో భర్తీ చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం రోహిత్నే కెప్టెన్గా కొనసాగించేందుకు మొగ్గు చూపిన బోర్డు.. బుమ్రా పేరును కనీసం వైస్ కెప్టెన్సీ రేసులోనూ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ.. ‘‘ఐదు టెస్టులకూ అందుబాటులో ఉండే ఆటగాడికే వైస్ కెప్టెన్ ఇవ్వాలని భావిస్తున్నాం.నిజానికి బుమ్రా ఈ పర్యటనలో అన్ని మ్యాచ్లు ఆడడు. కాబట్టి కెప్టెన్కు డిప్యూటీగా వేర్వేరు మ్యాచ్లలో వేర్వేరు ఆటగాళ్లను నియమించలేము. అందుకే ఐదు టెస్టులు ఆడే ఆటగాడినే వైస్ కెప్టెన్గా ఎంపిక చేస్తాం’’ అని పేర్కొన్నాయి.గాయం తిరగబెట్టే అవకాశం!కాగా ఆస్ట్రేలియా పర్యటనలో ఐదింట రెండు టెస్టులకు కెప్టెన్గా వ్యవహరించడంతో పాటు.. పేస్ దళం భారం మొత్తాన్ని బుమ్రానే మోశాడు. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2023-25 సీజన్లో ముప్పై రెండు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. కానీ ఈ సిరీస్లో భారత్ ఓడిపోయింది. మరోవైపు.. ఆఖరిదైన సిడ్నీ టెస్టులో బుమ్రా గాయపడ్డాడు.వెన్నునొప్పి తిరగబెట్టడంతో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 మొత్తానికి బుమ్రా అందుబాటులో లేకుండా పోయాడు. ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ ఆరంభ మ్యాచ్లకూ అతడు దూరమయ్యాడు. దాదాపు మూడు నెలల పాటు ఆటకు దూరంగానే న్నాడు.ఈ క్రమంలో బుమ్రా ఫిట్నెస్ దృష్ట్యా ఇంగ్లండ్లోనూ అతడిని వరుస మ్యాచ్లలో ఆడిస్తే మళ్లీ గాయం తిరగబెట్టే అవకాశం ఉందని పలువురు మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు.బుమ్రా వంటి విలువైన ఫాస్ట్ బౌలర్ను కాపాడుకోవాలంటే.. ఒక టెస్టు ముగిసిన తర్వాత రెండో టెస్టు కోసం అతడికి విశ్రాంతినివ్వాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుమ్రాపై పనిభారం తగ్గించే విషయంలో సెలక్టర్లు కూడా ఓ నిర్ణయానికి వచ్చారని.. అందుకే వైస్ కెప్టెన్సీ రూపంలో అదనపు బాధ్యతల నుంచి కూడా తప్పించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.రేసులో ఆ మూడు పేర్లుఒకవేళ బుమ్రాను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తే.. అతడి స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్ల ఎవరన్న చర్చ ఇప్పటికే మొదలైంది. రిషభ్ పంత్ లేదంటే.. శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ల పేర్లు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, అసలే ఇంగ్లండ్తో టెస్టులు కాబట్టి యువ ఆటగాళ్ల వైపు మొగ్గుచూపకుండా.. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్లకు బోర్డు బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదు. కాగా టీమిండియా ఆటగాళ్లంతా ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్నారు. మే 25న క్యాష్ రిచ్ లీగ్ ఫైనల్ జరుగనుండగా.. ఆ తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుంది. జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ మొదలుకానుంది.చదవండి: PBKS VS LSG: అప్పుడే అంతా అయిపోలేదు: లక్నో కెప్టెన్ పంత్ -
వైభవ్ వయసు పిల్లలంతా హ్యాపీ!.. ఎందుకింత ఓర్వలేనితనం?
రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)కి చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్ టైటాన్స్తో గత మ్యాచ్లో శతక్కొట్టిన పద్నాలుగేళ్ల ఈ పిల్లాడు.. గురువారం ముంబై ఇండియన్స్ (RR vs MI)తో మ్యాచ్లో డకౌట్ అయ్యాడు.రెండు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. ముంబై పేసర్ దీపక్ చహర్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి విల్ జాక్స్కు క్యాచ్ ఇచ్చిన వైభవ్ పెవిలియన్ చేరకతప్పలేదు. ఫలితంగా 218 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్కు ఇలా ఆరంభంలోనే షాక్ తగిలింది.ముంబై బౌలర్ల ధాటికి మిగతా బ్యాటర్లు కూడా చేతులెత్తేయడంతో రాజస్తాన్ 16.1 ఓవర్లలో కేవలం 117 పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా ఏకంగా 100 పరుగుల భారీ తేడాతో ముంబై చేతిలో చిత్తుగా ఓడి.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.వైభవ్ వయసు పిల్లలంతా హ్యాపీ!.. ఎందుకింత ఓర్వలేనితనం?ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో రాజస్తాన్ బ్యాటర్లంతా విఫలమైనా సోషల్ మీడియా మాత్రం వైభవ్ సూర్యవంశీపైనే ఎక్కువగా దృష్టి సారించింది. ఆటలో ఇవన్నీ సహజమేనని కొంత మంది అతడికి అండగా నిలుస్తుంటే.. మరికొంత మంది మాత్రం విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.‘‘చిన్న వయసులో విజయవంతం కావడం బాగానే ఉంటుంది. కానీ ప్రతిసారీ అదృష్టం కలిసి రాదు.. ఈరోజు వైభవ్ వయసు పిల్లలంతా సంతోషపడి ఉంటారు.. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు అతడిని చూపించి వారి పిల్లలకు గట్టిగా క్లాసులు ఇస్తున్నారు.. అందుకే ఈ ఒక్కరోజు వారికి ఉపశమనం కలిగి ఉంటుంది.. ఇక చాలు వైభవ్ నువ్వు కూడా వెళ్లి హోం వర్క్ చేసుకో’’ అంటూ పద్నాలుగేళ్ల వయసులోనే సంచలనాలు సృష్టించిన అతడిని ఓర్వలేక విద్వేషం చిమ్ముతున్నారు.వైభవ్ను ఓదార్చిన రోహిత్మరోవైపు.. వైభవ్ అవుట్ కాగానే ముంబై ఇండియన్స్ స్టార్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అతడిని ఓదార్చిన తీరు మ్యాచ్లో హైలైట్గా నిలిచింది. వైభవ్ వెన్నుతట్టి మరేం పర్లేదు అన్నట్లుగా రోహిత్ అతడి పట్ల సానుభూతి కనబరిచాడు.తప్పక పాఠాలు నేర్చుకుంటాడుఈ విషయం గురించి కామెంటేటర్ రవిశాస్త్రి లైవ్లో మాట్లాడుతూ.. ‘‘వైభవ్ కచ్చితంగా తన పొరపాట్లను సరిచేసుకుంటాడు. రోహిత్ శర్మ అతడిలో ఆత్మవిశ్వాసం నింపేలా మంచి మాటలు చెప్పాడు.ముంబై జట్టులోని చాలా మంది ఆటగాళ్లు అతడికి అండగా నిలిచారు. ప్రతి మ్యాచ్లోనూ ఇలాంటి గొప్ప సన్నివేశాలు చూడలేము. 14 ఏళ్ల పిల్లాడు సెంచరీ చేసిన మరుసటి మ్యాచ్లోనే ఇలా డకౌట్ అయ్యాడు. క్రికెట్ అంటే అంతే మరి!.. అతడు తప్పక ఈ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుంటాడు’’ అని వైభవ్ సూర్యవంశీకి మద్దతు ప్రకటించాడు.కాగా ఐపీఎల్-2025 ద్వారా క్యాష్ రిచ్ లీగ్లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాటర్గా నిలిచాడు. అంతేకాకుండా మరెన్నో రికార్డులు సొంతం చేసుకుని.. క్రికెట్ ప్రపంచం దృష్టిని తన వైపునకు తిప్పుకొన్నాడు.ఐపీఎల్-2025: రాజస్తాన్ వర్సెస్ ముంబైవేదిక: సవాయ్ మాన్సింగ్ స్టేడియం, జైపూర్టాస్: రాజస్తాన్.. తొలుత బౌలింగ్ముంబై స్కోరు: 217/2 (20)రాజస్తాన్ స్కోరు: 117 (16.1)ఫలితం: వంద పరుగుల తేడాతో రాజస్తాన్పై ముంబై గెలుపు.చదవండి: RR VS MI: కంటిపై 7 కుట్లు పడినా అదిరిపోయే ప్రదర్శన చేసిన హార్దిక్ 6️⃣ on the trot & now they’re on 🔝A massive 1⃣0⃣0⃣-run win for #MI to sit right where they want to 👊Scorecard ▶ https://t.co/t4j49gXHDu#TATAIPL | #RRvMI | @mipaltan pic.twitter.com/20KEle7S6n— IndianPremierLeague (@IPL) May 1, 2025Deepak Chahar saved lacs of children from getting embarassed in front of their parents tonight pic.twitter.com/fOiMFV4XzZ— Sagar (@sagarcasm) May 1, 2025Rohit Sharma appreciating Vaibhav Suryavanshi after the match win last night.❤️The true leader @ImRo45 🐐 pic.twitter.com/t0iFGnBLOG— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 2, 2025 -
IPL 2025, RR VS MI: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
వెటరన్ ఓపెనర్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున 6000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో ఇవాళ (మే 1) జరుగుతున్న మ్యాచ్లో రోహిత్ ఈ ఘనత సాధించాడు.2011 నుంచి ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ఆడుతున్న హిట్మ్యాన్ ఆ ఫ్రాంచైజీ తరఫున 231 మ్యాచ్లు ఆడి 2 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీల సాయంతో 6017 పరుగులు చేశాడు.ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్కు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. రోహిత్ తర్వాత కీరన్ పోలార్డ్ ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. పోలీ ఎంఐ తరఫున 211 మ్యాచ్ల్లో 18 హాఫ్ సెంచరీల సాయంతో 3915 పరుగులు చేశాడు. పోలార్డ్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఎంఐ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు.స్కై ఈ ఫ్రాంచైజీ తరఫున 109 మ్యాచ్ల్లో 2 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీల సాయంతో 3460 పరుగులు చేశాడు. ఈ జాబితాలో స్కై తర్వాతి స్థానాల్లో అంబటి రాయుడు (2635), సచిన్ టెండూల్కర్ (2599) ఉన్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (53), ర్యాన్ రికెల్టన్ (61) ఆ జట్టుకు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్కు 116 పరుగులు జోడించారు. అనంతరం స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు ఔటయ్యారు. 15 ఓవర్ల ముగిసే సమయానికి ముంబై స్కోర్ 146/2గా ఉంది. సూర్యకుమార్ యాదవ్ (18), హార్దిక్ పాండ్యా (10) క్రీజ్లో ఉన్నారు. -
Rohit Sharma: ఆ 'మూడు రికార్డులు' ఎవ్వరూ బద్దలు కొట్టలేరు..!
టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఇవాళ (ఏప్రిల్ 30) 38వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా హిట్మ్యాన్కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సహచర క్రికెటర్లతో పాటు అభిమానులు సోషల్మీడియా వేదికగా రోహిత్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.BIRTHDAY CELEBRATION OF INDIAN CAPTAIN ROHIT SHARMA ♥️ pic.twitter.com/cQQRzoRpCd— Johns. (@CricCrazyJohns) April 30, 2025ప్రస్తుతం ఐపీఎల్ 2025 ఆడుతున్న రోహిత్.. తన జట్టు సభ్యులు మరియు భార్య రితక సజ్దేతో కలిసి కేక్ కట్ చేశాడు. హిట్మ్యాన్ పుట్టిన రోజు సందర్భంగా అతను సాధించిన రికార్డులపై ఓ లుక్కేద్దాం.THE BIRTHDAY CELEBRATIONS OF HITMAN ROHIT SHARMA. 🥹- Moments of the Day. ❤️ pic.twitter.com/ZncZTNEVB6— Tanuj (@ImTanujSingh) April 30, 20252007లో టీమిండియా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ తన కెరీర్లో ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆటగాడిగా, కెప్టెన్గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. టీమిండియా తరఫున 67 టెస్ట్లు, 273 వన్డేలు, 159 టీ20లు ఆడిన హిట్మ్యాన్ మూడు ఫార్మాట్లలో కలిపి 19700 పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు, 108 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన రోహిత్ మొత్తం 266 మ్యాచ్లు ఆడి 2 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీల సాయంతో 6868 పరుగులు చేశాడు.రోహిత్ తన సుదీర్ఘ కెరీర్లో భారత జట్టు, తన ఐపీఎల్ జట్లైన డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఎన్నో రికార్డులు సాధించాడు. వీటిలో మూడు రికార్డులు మాత్రం ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. అవేంటంటే..వన్డేల్లో అత్యధిక స్కోర్ (264)2014, నవంబర్ 13న రోహిత్ శర్మ శ్రీలంకపై 264 పరుగులు (173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లు) చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటికీ ఇదే అత్యుత్తమ స్కోర్గా చలామణి అవుతుంది. బహుశా మున్ముందు కూడా ఈ రికార్డు పదిలంగానే ఉండే అవకాశం ఉంది. వన్డేల్లో ఇంత భారీ ఇన్నింగ్స్లు ఆడాలంటే చాలా సహనం కావాలి. నేటి తరం క్రికెటర్లలో ఇది కొరవడింది. కాబట్టి ఈ రికార్డు వన్డే క్రికెట్ చరిత్రలో చిరకాలం పదిలంగా ఉండే అవకాశం ఉంది.సింగిల్ వరల్డ్కప్లో అత్యధిక సెంచరీలు (5)2019 వన్డే వరల్డ్కప్లో రోహిత్ సెంచరీల సునామీ సృష్టించాడు. ఆ టోర్నీలో ఏకంగా ఐదు సెంచరీలు (సౌతాఫ్రికా, పాకిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంక) సాధించి చరిత్ర సృష్టించాడు. ఓ వరల్డ్కప్ ఎడిషన్లో ఓ ఆటగాడు చేసిన అత్యధిక సెంచరీలు ఇవే. ఈ టోర్నీలో హిట్మ్యాన్ ఉగ్రరూపం దాల్చి 9 మ్యాచ్ల్లో 648 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఈ రికార్డు బద్దలు కొట్టడం కూడా దాదాపుగా అసాధ్యమే.వన్డేల్లో అత్యధిక డబుల్ సెంచరీలు (3)వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ చేస్తేనే అత్యద్భుతం అనుకునే రోజుల్లో హిట్మ్యాన్ ఏకంగా మూడు డబుల్ సెంచరీలు బాది చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో ఇప్పటివరకు 10 డబుల్ సెంచరీలు నమోదు కాగా.. అందులో రోహిత్ ఒక్కడే మూడు సాధించడమంటే మామూలు విషయం కాదు. 2013లో ఆస్ట్రేలియాపై తన తొలి డబుల్ సెంచరీ (208 నాటౌట్) సాధించిన హిట్మ్యాన్ ఆతర్వాతి ఏడాదే (2014) శ్రీలంకపై వరల్డ్ రికార్డు డబుల్ సెంచరీ (264) సాధించాడు. 2017లో రోహిత్ మరోసారి శ్రీలంకపై డబుల్ సెంచరీ (208 నాటౌట్) చేశాడు.అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ చాలా రికార్డులు నమోదు చేసినప్పటికీ ఈ రికార్డులను మాత్రం ఎవరూ బద్దలు కొట్టలేదు.ప్లేయర్గా, కెప్టెన్గా రోహిత్ సాధించిన పలు ఘనతలు/రికార్డులు..వరల్డ్కప్ సెంచరీలు- 7 కెప్టెన్గా 2 ఐసీసీ టైటిళ్లు (2024 టీ20 వరల్డ్కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ)ఆటగాడిగా 4 ఐసీసీ టైటిళ్లువన్డేల్లో మూడు డబుల్ సెంచరీలుసింగిల్ వరల్డ్కప్లో అత్యధిక సెంచరీలువన్డేల్లో అత్యధిక స్కోర్కెప్టెన్గా అత్యధిక విన్నింగ్ పర్సంటేజీ (కనీసం 100 అంతర్జాతీయ మ్యాచ్లు)కెప్టెన్గా 5 ఐపీఎల్ టైటిళ్లుఆటగాడిగా 6 ఐపీఎల్ టైటిళ్లు -
హ్యాపీ బర్త్డే హిట్మ్యాన్... రోహిత్ శర్మ అరుదైన ఫొటోలు
-
వారెవ్వా ‘హిట్’మ్యాన్!.. పేద కుటుంబంలో పుట్టి.. కోటీశ్వరుడిగా!.. ఆస్తి ఎంతంటే?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) నేడు (ఏప్రిల్ 30)లో 38వ వసంతం అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా హిట్మ్యాన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు జట్టులో స్థానం కోసం ఎదురుచూసిన రోహిత్.. భారత్కు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన దిగ్గజ కెప్టెన్గా ఎదిగాడు.మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) నాయకత్వంలో ఓపెనర్గా ప్రమోట్ అయిన తర్వాత తన విశ్వరూపం చూపించి.. ‘హిట్మ్యాన్’గా అభిమానుల గుండెల్లో, భారత క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేశాడు. టీ20 ప్రపంచకప్-2024 (T20 WC 2024)తో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) గెలిచిన సారథిగా ప్రశంసలు అందుకున్న రోహిత్ కెరీర్, మేటి రికార్డులు, వ్యక్తిగత జీవితం, నికర ఆస్తుల విలువ తదితర వివరాలు.. అతడి బర్త్డే సందర్భంగా మీకోసం..పేద కుటుంబంలో జన్మించిన రోహిత్రోహిత్ శర్మ 1987, ఏప్రిల్ 30న మహారాష్ట్రలోని నాగ్పూర్లో జన్మించాడు. అతడి తల్లిదండ్రులు పూర్ణిమా శర్మ- గురునాథ్ శర్మ. పూర్ణిమా శర్మ విశాఖపట్నంకు చెందినవారు. ఇక రోహిత్కు తమ్ముడు విశాల్ శర్మ ఉన్నాడు.పేద కుటుంబంలో జన్మించిన రోహిత్ శర్మ క్రికెట్ మీద మక్కువతో చిన్ననాటి నుంచే అనేక కష్టాలకోర్చాడు. అంచెలంచెలుగా ఎదిగి భారత జట్టులో స్థానం సంపాదించాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రోహిత్.. ధోని కెప్టెన్సీలో ఓపెనర్గా ప్రమోట్ అయ్యాడు. ఏకైక ఆటగాడిగా రికార్డుఆ తర్వాత అతడికి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 273లు వన్డేలు, 159 టీ20లు, 67 టెస్టులు ఆడాడు. టెస్టుల్లో 4302, వన్డేల్లో 11168, టీ20లలో 4231 పరుగులు సాధించాడు.వన్డేల్లో అత్యధికంగా మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. అంతేకాదు.. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) సాధించిన క్రికెటర్గా కూడా రోహిత్ చరిత్రకెక్కాడు. ఇక అంతర్జాతీయ టీ20లలోనూ అత్యధికంగా ఐదు శతకాలు బాదాడు. ఓవరాల్గా టీమిండియా తరఫున 47 సెంచరీలు చేశాడు. ఇవేగాక సిక్సర్ల వీరుడు రోహిత్ మరెన్నో ఘనమైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఐపీఎల్లోనూ రోహిత్ శర్మకు తిరుగులేని రికార్డు ఉంది. ముంబై ఇండియన్స్ను ఏకంగా ఐదుసార్లు చాంపియన్గా నిలిపి.. క్యాష్ రిచ్ లీగ్లో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్గా చరిత్రపుటల్లో తన పేరు లిఖించుకున్నాడు. ఇప్పటికి 266 మ్యాచ్లలో కలిపి ఏకంగా 6868 పరుగులు సాధించాడు.రితికా సజ్దేతో ఆరేళ్ల పాటు ప్రేమలోఇక స్పోర్ట్స్ ఈవెంట్ మేనేజర్గా పనిచేసిన రితికా సజ్దేతో ఆరేళ్ల పాటు ప్రేమలో ఉన్న రోహిత్ 2015, డిసెంబరు 13న ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తె సమైరా (2018), కుమారుడు అహాన్ సంతానం (2024).నికర ఆస్తుల విలువ రూ. 218 కోట్లుక్రికెటర్గా ఉన్నత శిఖరాలకు ఎదిగిన రోహిత్ శర్మ ఇటు ఆటగాడిగా, అటు పలు ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్గా.. ఐపీఎల్ ద్వారా కోట్లు ఆర్జించాడు. స్పోర్ట్స్కీడా నివేదిక ప్రకారం హిట్మ్యాన్ నికర ఆస్తుల విలువ రూ. 218 కోట్లు అని తెలుస్తోంది. బీసీసీఐ ఏ+ గ్రేడ్లో ఉన్న రోహిత్ ఏడాదికి రూ. 7 కోట్లు వేతనంగా పొందుతున్నాడు.ఇక ఒక్కో టెస్టు మ్యాచ్కు రూ. 15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, టీ20కి రూ. 3 లక్షలు బోర్డు ద్వారా ఫీజుగా అందుకుంటున్నాడు. ఐపీఎల్లో ముంబై కెప్టెన్గా కోట్లాది రూపాయలు ఆర్జించిన రోహిత్ శర్మను.. ఐపీఎల్-2025కి ముందు సదరు ఫ్రాంఛైజీ రూ. 16.3 కోట్లకు రిటైన్ చేసుకుంది.లగ్జరీ ఇల్లు, కార్లురోహిత్ శర్మ ముంబైలో విలాసవంతమైన అపార్టుమెంట్లు ఉన్నాయి. వర్లిలో భార్యాబిడ్డలతో కలిసి హిట్మ్యాన్ నివసించే ఇంటి విలువ రూ. 30 కోట్లు అని జిక్యూ ఇండియా అంచనా వేసింది.ఇక రోహిత్ శర్మ గ్యారేజీలో లంబోర్గిని ఉరుస్ (రూ. 4.18 కోట్లు), మెర్సిడెజ్ బెంజ్ (1.5 కోట్లు), మెర్సిడెజ్ జీఎఎల్ఎస్ 400 డి(రూ. 1.5 కోట్లు), బీఎండబ్ల్యూ ఎం5 (రూ. 1.79 కోట్లు) , రేంజ్ రోవర్ (రూ. 2.8 కోట్లు) వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.చదవండి: Kuldeep Slaps Rinku Singh: అతడిని బ్యాన్ చేయండి, టీమిండియా స్టార్పై నెటిజన్ల ఆగ్రహం -
‘వరుసగా ఐదో విజయం.. సెంటిమెంట్ ప్రకారం టైటిల్ మాదే!’
గతేడాది చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న ముంబై ఇండియన్స్ (MI).. ఐపీఎల్-2025 (IPL 2025)ని కూడా పేలవంగానే ఆరంభించింది. తమ తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తై ఓటమితో ఈ ఎడిషన్ను మొదలుపెట్టింది.రెండో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయం పాలైన హార్దిక్ సేన.. కోల్కతా నైట్ రైడర్స్ను ఓడించి తొలి గెలుపు అందుకుంది. అయితే, ఆ తర్వాత మళ్లీ పాత కథే. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ముంబై ఇండియన్స్ ఆట తీరుపై విమర్శలు రాగా.. ఢిల్లీ క్యాపిటల్స్పై గెలుపుతో మళ్లీ విజయాల బాట పట్టింది.వరుసగా ఐదు విజయాలు ఆ తర్వాత హార్దిక్ సేన వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. సన్రైజర్స్ హైదరాబాద్ను రెండుసార్లు, చెన్నై సూపర్ కింగ్స్.. తాజాగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్పై గెలిచి వరుసగా ఐదు విజయాలు అందుకుంది. ఏదేమైనా సీజన్ను చెత్తగా మొదలుపెట్టి.. ఇలా మళ్లీ గాడిలో పడటంతో ముంబై ఇండియన్స్ శిబిరం ఆనందంలో తేలిపోతోంది.సెంటిమెంట్ ప్రకారం ఈసారి మరోవైపు.. వరుస విజయాల నేపథ్యంలో ముంబై జట్టు అభిమానులు సైతం ఖుషీ అవుతున్నారు. ఇప్పటికి ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన ఈ మేటి జట్టు.. సెంటిమెంట్ ప్రకారం ఈసారి కూడా ట్రోఫీని ముద్దాడుతుందని, టైటిల్ మాదే అని సంబరపడిపోతున్నారు.ఏకంగా నాలుగుసార్లు చాంపియన్గాకాగా గతంలో వరుసగా ఇలా ఐదుసార్లు (అంతకంటే ఎక్కువ) మ్యాచ్లు గెలిచిన ముంబై ఇండియన్స్.. ఏకంగా నాలుగుసార్లు చాంపియన్గా అవతరించింది. అంతేకాదు మరోసారి రన్నరప్గా నిలిచింది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా వరుసగా ఐదు గెలిచాం అంటూ ఈసారి తమకు తిరుగులేదన్నట్లుగా ట్వీట్ చేశాడు.ఇక ముంబైకి ఐదుసార్లు టైటిల్ అందించిన దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మను కాదని.. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాను యాజమాన్యం సారథిగా నియమించింది. అయితే, సొంత జట్టు అభిమానులకే ఇది ఏమాత్రం నచ్చలేదు. రోహిత్పై ప్రేమ.. హార్దిక్పై కోపానికి దారితీసింది. మైదానం వెలుపలా, బయటా అతడిపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి.అందుకు అనుగుణంగానే ఐపీఎల్-2024లో హార్దిక్ కెప్టెన్సీ చెత్తగా సాగింది. పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచిన ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంతో సీజన్ను ముగించింది. అయితే, ఐపీఎల్-2025లో మాత్రం ముంబై మళ్లీ విజయపరంపరను పునరావృతం చేస్తోంది. తద్వారా ఆరో టైటిల్ దిశగా దూసుకుపోతోంది.ఐపీఎల్-2025: ముంబై వర్సెస్ లక్నో👉వేదిక: వాంఖడే, ముంబై👉టాస్: లక్నో తొలుత బౌలింగ్👉ముంబై స్కోరు: 215/7 (20)👉లక్నో స్కోరు: 161 (20)👉ఫలితం: లక్నోపై 54 పరుగుల తేడాతో ముంబై విజయంఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ వరుసగా ఐదు లేదంటే అంతకంటే ఎక్కువగా విజయాలు సాధించిన సందర్భాలు ఇవే..👉2008లో ఆరుసార్లు వరుసగా👉2010లో ఐదుసార్లు వరుసగా- రన్నరప్గా👉2013లో ఐదుసార్లు వరుసగా- చాంపియన్స్గా👉2015లో ఐదుసార్లు వరుసగా- చాంపియన్స్గా👉2017లో ఆరుసార్లు వరుసగా- చాంపియన్స్గా👉2020లో ఐదుసార్లు వరుసగా- చాంపియన్స్గా👉2025లో ఐదుసార్లు వరుసగా..*.చదవండి: కేఎల్ రాహుల్తో కోహ్లి వాగ్వాదం.. గట్టిగానే బదులిచ్చిన వికెట్ కీపర్! వీడియో𝙂𝙖𝙢𝙚. 𝙎𝙚𝙩. 𝘿𝙤𝙣𝙚 ✅@mipaltan make it 5⃣ in 5⃣ and are marching upwards and onwards in the season 📈Scorecard ▶ https://t.co/R9Pol9Id6m #TATAIPL | #MIvLSG pic.twitter.com/zW7EuWhU7j— IndianPremierLeague (@IPL) April 27, 2025 -
IPL 2025 MI Vs LSG: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఐపీఎల్లో చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 27) మధ్యాహ్నం లక్నోతో జరుగబోయే మ్యాచ్లో హిట్మ్యాన్ మరో 5 సిక్సర్లు బాదితే ఐపీఎల్లో 300 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి భారతీయ బ్యాటర్గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 295 సిక్సర్లు (265 మ్యాచ్ల్లో) ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు క్రిస్ గేల్ ఒక్కడే 300 సిక్సర్లు మార్కును తాకాడు. గేల్ 142 మ్యాచ్ల్లో 357 సిక్సర్లు బాదాడు. గేల్, రోహిత్ తర్వాత ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉంది. విరాట్ 261 మ్యాచ్ల్లో 285 సిక్సర్లు కొట్టాడు.ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 బ్యాటర్లుక్రిస్ గేల్- 357రోహిత్ శర్మ- 295విరాట్ కోహ్లి- 285ఎంఎస్ ధోని- 260ఏబీ డివిలియర్స్- 251ఓవరాల్గా టీ20 క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు కూడా క్రిస్ గేల్ పేరిటే ఉంది. గేల్ ఈ ఫార్మాట్లో 1056 సిక్సర్లు బాదాడు. ప్రపంచంలో గేల్ మినహా ఏ క్రికెటర్ 1000 సిక్సర్ల మార్కును తాకలేదు. గేల్ తర్వాత కీరన్ పోలార్డ్ రెండో స్థానంలో ఉన్నాడు. పోలీ తన టీ20 కెరీర్లో 908 సిక్సర్లు బాదాడు. గేల్, పోలీ తర్వాత రసెల్ (737), పూరన్ (630) అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. పొట్టి క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-4 బ్యాటర్లు విండీస్ ఆటగాళ్లే కావడం విశేషం. ఈ జాబితాలో టీమిండియా స్టార్ రోహిత్ శర్మ ఏడో స్థానంలో, విరాట్ కోహ్లి 20వ స్థానంలో ఉన్నారు. రోహిత్ తన టీ20 కెరీర్లో 540 సిక్సర్లు బాదగా.. విరాట్ 429 సిక్సర్లు కొట్టాడు.టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-10 ఆటగాళ్లుక్రిస్ గేల్- 1056కీరన్ పోలార్డ్- 908ఆండ్రీ రసెల్- 737నికోలస్ పూరన్- 630కొలిన్ మున్రో- 557అలెక్స్ హేల్స్- 552రోహిత్ శర్మ- 540గ్లెన్ మ్యాక్స్వెల్- 530జోస్ బట్లర్- 528డేవిడ్ మిల్లర్- 505ఇదిలా ఉంటే, ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా ఇవాళ మధ్యాహ్నం ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ప్లే ఆఫ్స్కు చేరే క్రమంలో నేటి మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం ముంబై, లక్నో తలో 10 పాయింట్లు (9 మ్యాచ్లు) సాధించి పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్ (12), ఢిల్లీ (12), ఆర్సీబీ (12), పంజాబ్ (11) టాప్-4లో ఉన్నాయి. -
వాళ్లిద్దరి వల్లే ఈ మాత్రం.. ఇంకా కొన్ని మ్యాచ్లే ఉన్నాయి: కమిన్స్
ఐపీఎల్-2025 (IPL 2025)లో సన్రైజర్స్ హైదరాబాద్ వైఫల్యాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికి ఎనిమిది మ్యాచ్లు పూర్తి చేసుకున్న కమిన్స్ బృందం కేవలం రెండు మాత్రమే గెలిచింది. ముంబై ఇండియన్స్ (SRH vs MI)తో బుధవారం నాటి పోరులో ఓటమిపాలై ఈ సీజన్లో ఆరో ఓటమిని నమోదు చేసింది.కుప్పకూలిన టాపార్డర్సొంత మైదానం ఉప్పల్ వేదికగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్.. పేలవ ప్రదర్శన కనబరిచింది. ముంబై పేసర్ల ధాటికి రైజర్స్ టాపార్డర్ పేకమేడలా కుప్పకూలింది. ఓపెనర్లు ట్రవిస్ హెడ్ (0), అభిషేక్ శర్మ (8) దారుణంగా విఫలం కాగా.. ఇషాన్ కిషన్ (1) మరోసారి చేతులెత్తేశాడు.నితీశ్ రెడ్డి (2) సైతం నిరాశపరిచాడు. ఇలాంటి దశలో వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (44 బంతుల్లో 71) అద్భుత ఇన్నింగ్స్తో మెరిశాడు. అభినవ్ మనోహర్ (37 బంతుల్లో 43)తో కలిసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ ఏకంగా నాలుగు వికెట్లు కూల్చగా.. దీపక్ చహర్ రెండు, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక సన్రైజర్స్ విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ముంబై 15.4 ఓవర్లలో ఛేదించింది. రోహిత్ శర్మ (46 బంతుల్లో 70), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 40 నాటౌట్) రాణించారు.వాళ్లిద్దరి వల్లే ఈ మాత్రం.. ఈ నేపథ్యంలో ముంబై చేతిలో ఓటమి అనంతరం సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) స్పందించాడు. బ్యాటర్ల వైఫల్యమే తమ ఓటమికి కారణమని పేర్కొన్నాడు. ఈ సీజన్లో తమకు ఇంకా కొన్ని మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయని.. వికెట్ను సరిగ్గా అంచనా వేయగలిగితేనే ఇకపై ముందుకు సాగే అవకాశం ఉందని కమిన్స్ వ్యాఖ్యానించాడు.‘‘అభినవ్, క్లాసీ వల్ల మేము చెప్పుకోగదగ్గ స్కోరు చేయగలిగాం. కానీ ఈ ఇన్నింగ్స్లో మా జట్టు ప్రదర్శన అస్సలు బాలేదు. కనీసం ఇంకొక్కరైనా పట్టుదలగా నిలబడి ఉంటే బాగుండేది.ఇంకా కొన్ని మ్యాచ్లే ఉన్నాయిఇదే పిచ్పై మా తొలి మ్యాచ్లో 280 పరుగులు స్కోరు చేశాం. కానీ ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టీ20 మ్యాచ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. సమయానుగుణంగా ఇన్నింగ్స్ ఎప్పటికప్పుడు మెరుగుపరచుకుంటే మంచిది.లేదంటే పరిస్థితి చేజారుతుంది. మాకింకా కొన్ని మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. వికెట్ను కచ్చితంగా అంచనా వేసి.. అందుకు అనుగుణంగా ఆడితేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలము. అయితే, కొన్నిసార్లు మనం సఫలమైతే.. మరికొన్ని సార్లు ప్రత్యర్థి జట్టు పైచేయి సాధిస్తుంది’’ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.కాగా గతేడాది రన్నరప్గా నిలిచిన సన్రైజర్స్కు ఈ సీజన్లో ఇంకా ఆరు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఆరింటిలోనూ గెలిస్తేనే ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. మరోవైపు సన్రైజర్స్పై గెలిచిన ముంబై.. తొమ్మిదింట ఐదో విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో ఏకంగా మూడో స్థానానికి దూసుకువచ్చింది. చదవండి: IND Vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం4️⃣th consecutive win for the @mipaltan 👌They make it 2️⃣ in 2️⃣ against #SRH this season 👏Scorecard ▶ https://t.co/nZaVdtwDtv #TATAIPL | #SRHvMI pic.twitter.com/wZMMQnOEi0— IndianPremierLeague (@IPL) April 23, 2025 -
SRH VS MI: రికార్డుల్లోకెక్కిన రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ మరోసారి రికార్డుల్లోకెక్కాడు. టీ20ల్లో అత్యంత అరుదైన 12000 పరుగుల మైలురాయిని తాకాడు. నిన్న (ఏప్రిల్ 23) సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. పొట్టి క్రికెట్లో అత్యంత వేగంగా 12000 పరుగులు పూర్తి చేసిన ఐదో ఆటగాడిగా (443 ఇన్నింగ్స్ల్లో) నిలిచాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 12000 పరుగులు పూర్తి చేసిన రికార్డు క్రిస్ గేల్ (345 ఇన్నింగ్స్లు) పేరిట ఉంది. గేల్ తర్వాత విరాట్ (360), వార్నర్ (368), అలెక్స్ హేల్స్ (432) అత్యంత వేగంగా ఈ మైలురాయిని తాకారు. ఓవరాల్గా టీ20ల్లో 12000 పరుగులు పూర్తి చేసిన 8వ ఆటగాడిగా హిట్మ్యాన్ రికార్డుల్లో నిలిచాడు. రోహిత్ తన టీ20 కెరీర్లో 8 సెంచరీలు, 80 హాఫ్ సెంచరీలు చేశాడు.నిన్నటి మ్యాచ్లో రోహిత్ మెరుపు హాఫ్ సెంచరీ చేసి తన జట్టును గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్.. ముంబై బౌలర్లు ట్రెంట్ బౌల్ట్ (4-0-26-4), దీపక్ చాహర్ (4-0-12-2), హార్దిక్ పాండ్యా (3-0-31-1), బుమ్రా (4-0-39-1), సాంట్నర్ (4-0-19-0) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సన్రైజర్స్ను క్లాసెన్ (71), అభినవ్ మనోహర్ (43) ఆదుకున్నారు.అనంతరం ఛేదనలో ముంబై ఆదిలోనే రికెల్టన్ (11) వికెట్ కోల్పోయింది. అయినా రోహిత్ (46 బంతుల్లో 70; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి తమ జట్టును గెలిపించారు. ముంబై మరో 26 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ముంబై వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. -
రోహిత్, సూర్య మెరుపులు.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ముంబై విజయ భేరి మోగించింది. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.4 ఓవర్లలోనే చేధించింది.ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ(46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 70) అద్బుత ఇన్నింగ్స్ ఆడగా.. సూర్యకుమార్ యాదవ్(19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 40 నాటౌట్) మెరుపు మెరిపించాడు. సన్రైజర్స్ బౌలర్లలో ఉనద్కట్, మలింగ, అన్సారీ తలా వికెట్ సాధించారు. క్లాసెన్ విరోచిత ఇన్నింగ్స్ వృధా..సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 13 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్ను క్లాసెన్ విరోచిత పోరాటంతో ఆదుకున్నాడు. కేవలం 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. అతడితో పాటు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అభినవ్ మనోహర్ కీలక నాక్ ఆడాడు. 37 బంతుల్లో 2 ఫోర్లు, మూడు సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఆరో వికెట్కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. చాహర్ రెండు, బుమ్రా, హార్దిక్ తలా వికెట్ సాధించారు. -
పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన భారత క్రికెటర్లు..
పహల్గాం ఉగ్రదాడి యావత్ దేశాన్ని తీవ్ర విషాదంలో నెట్టింది. మంగళవారం దక్షిణ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు విచాక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ దారుణ ఘటనలో ఇప్పటి వరకు 27 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.దేశ వ్యాప్తంగా ఈ టెర్రర్ ఎటాక్పై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పాలని 140 కోట్ల మంది భారతీయలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉగ్రదాడి ఘటనను భారత మాజీ, ప్రస్తుత క్రికెటర్లు తీవ్రంగా ఖండించారు. టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, శుబ్మన్ గిల్, కేఎల్ రాహుల్తో పాటు హెడ్కోచ్ గౌతం గంభీర్ మృతుల కుటంబాలకు సంతాపం తెలియజేశారు."పహల్గామ్లో అమాయక ప్రజలపై జరిగిన దారుణమైన దాడి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల కుటుంబాలకు హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. ప్రాణాలు కోల్పోయిన వారందరి కుటుంబాలకు ఆ బలాన్ని చేకూర్చాలని ఆ దేవుడును ప్రార్థిస్తున్నాను"- విరాట్ కోహ్లి2 Virat Kohli pic.twitter.com/eAUtXo8hYZ— Virushka🫶❤️ (@KohliTheGOAT18) April 23, 2025"పహల్గామ్లో జరిగిన దాడి గురించి తెలిసిన వెంటనే నా హృదయం బరువెక్కిపోయింది. బాధితుల కుటంబాలకు ఆ దేవుడు తోడుగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను. ఇలాంటి హింసకు మన దేశంలో చోటు లేదు"- శుబ్మన్ గిల్"కశ్మీర్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధిత కుటుంబాలలకు బలం చేకూరాలని ఆ దేవడును ప్రార్థిస్తున్నాను"-కేఎల్ రాహుల్"బాధిత కుటుంబాల కోసం మనమంతా అండగా నిలుద్దాం. ఎవరైతే ఈ దుశ్చర్యకు బాధ్యులో వారు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. తప్పకుండా భారత్ స్ట్రైక్ అవుతుంది"-గౌతం గంభీర్👉భారత కెప్టెన్ రోహిత్ శర్మ హార్ట్ బ్రేకింగ్ ఎమోజీలను ఇన్స్టాలో పోస్ట్ చేశాడు.👉పెహల్గామ్ ఉగ్ర దాడిని ఖండించిన బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్-2025లో ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, మంబై ఇండియన్స్ మధ్య జరగనున్న మ్యాచ్లో ఆటగాళ్లు నల్లటి బ్యాండ్లు ధరించి బరిలోకి దిగనున్నారు. అదేవిధంగా ఈ మ్యాచ్ను చీర్లీడర్స్ లేకుండా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో బాణాసంచా కూడా పేల్చవద్దు అని నిర్ణయించారు -
అందుకే రోహిత్, విరాట్, జడేజా ఏ ప్లస్లో ఉన్నారు..!
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిన్న (ఏప్రిల్ 21) తమ సెంట్రల్ కాంట్రాక్ట్ (2024-25) ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఏ ప్లస్ కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. నిబంధనల ప్రకారం ఓ ఆటగాడికి బీసీసీఐ ఏ ప్లస్ కాంట్రాక్ట్ లభించాలంటే అతను ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అయ్యుండాలి. అయితే రోహిత్, విరాట్, జడేజా గతేడాది టీ20 వరల్డ్కప్ తర్వాత పొట్టి క్రికెట్కు గుడ్బై చెప్పి కేవలం వన్డేలు, టెస్ట్ల్లో మాత్రమే కొనసాగుతున్నారు. అయినా వారికి ఏ ప్లస్ కాంట్రాక్ట్ లభించింది. దీనిపై నిన్నటి నుంచి క్రికెట్ అభిమానుల్లో సందేహాలు ఉన్నాయి. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించినా వారిని ఎందుకు ఏ ప్లస్ కేటగిరీలో కొనసాగిస్తున్నారని సోషల్మీడియా వేదికగా డిస్కషన్స్ నడిచాయి. ఈ అంశంపై బీసీసీఐకి చెందిన ఓ కీలక అధికారి తాజాగా స్పందించాడు.రోహిత్, విరాట్, జడేజా ఆల్ ఫార్మాట్ ప్లేయర్లు కానప్పటికీ ఎందుకు ఏ ప్లస్ కేటగిరీలో ఉన్నారన్న విషయంపై వివరణ ఇచ్చాడు. 2024-25 సంవత్సరాని గానూ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ వ్యవధి అక్టోబర్ 1, 2024 నుండి సెప్టెంబర్ 30, 2025 వరకు ఉంటుంది. అయితే దీని అసెస్మెంట్ సంవత్సరం మాత్రం అక్టోబర్ 1, 2023 నుండి సెప్టెంబర్ 30, 2024 మధ్యలో ఉంటుంది. ఆ వ్యవధిలో కోహ్లీ, రోహిత్ , జడేజా అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ సభ్యులుగా ఉన్నారు. జూన్ 2024లో భారత్ టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఆ ముగ్గురు టీ20ల నుంచి తప్పుకున్నారు. ఈ సాంకేతికత ప్రకారం.. రోహిత్, విరాట్, జడేజా ఏ ప్లస్ కేటగిరీలో ఉన్నారని సదరు బీసీసీఐ అధికారి తెలిపారు.ఇదిలా ఉంటే, నిన్న ప్రకటించిన బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో మొత్తం 34 మంది చోటు దక్కించుకున్నారు. వీరిలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా తమ ఏ ప్లస్ కేటగిరీని రీటైన్ చేసుకోగా.. క్రమశిక్షణారాహిత్యం కారణంగా గతేడాది కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కాంట్రాక్ట్ జాబితాలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.శ్రేయస్ బి కేటగిరీలో, ఇషాన్ సి కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, యువ పేసర్ హర్షిత్ రాణా తొలిసారి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందారు.ఈ ఏడాది కొత్తగా ఏడుగురు (ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చకరవర్తి, హర్షిత్ రాణా) సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించకున్నారు. శార్దూల్ ఠాకూర్, జితేష్ శర్మ, కేఎస్ భరత్, అవేష్ ఖాన్ తమ కాంట్రాక్ట్ను కోల్పోయారు. రిషబ్ పంత్కు బి నుంచి ఏ కేటగిరీకి ప్రమోషన్ లభించింది. టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ కాంట్రాక్ట్ను కోల్పోయాడు.ఏ ప్లస్లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరికి ఏడాది 7 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.గ్రేడ్-ఏలో సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా, షమీ, రిషబ్ పంత్ ఉన్నారు. వీరికి ఏడాదికి 5 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.గ్రేడ్-బిలో సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. వీరికి ఏడాదికి 3 కోట్ల రూపాయలు శాలరీగా లభించనుంది.గ్రేడ్-సిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, రజత్ పాటిదార్, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ఉన్నారు. వీరికి ఏడాదికి కోటి రూపాయలు శాలరీగా లభించనుంది. -
ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు: రోహిత్పై విమర్శలు
ముంబై ఇండియన్స్ స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఫామ్లోకి రావడం ఆ జట్టుకు శుభసూచకమని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. గత మ్యాచ్ల మాదిరి ఆదిలోనే వికెట్ పారేసుకోకుండా తనదైన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించిన తీరును ప్రశంసించాడు. అయితే, ఓ ఓపెనింగ్ బ్యాటర్గా అతడి ప్రదర్శన ఎంత మాత్రం ఆమోదయోగ్యనీయం కాదని విమర్శించాడు.రూ. 16.30 కోట్లకుకాగా ఐపీఎల్-2025 (IPL 2025) మెగా వేలానికి ముందు ముంబై ఫ్రాంఛైజీ రోహిత్ శర్మను రూ. 16.30 కోట్లకు అట్టిపెట్టుకుంది. అయితే, ఈ సీజన్ ఆరంభం నుంచి అతడు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఆడిన ఆరు ఇన్నింగ్స్లో మొత్తం కలిపి 82 పరుగులు మాత్రమే చేసిన రోహిత్.. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్లో మాత్రం బ్యాట్ ఝులిపించాడు.వాంఖడేలో చెన్నై సూపర్ కింగ్స్ (MI vs CSK)తో మ్యాచ్లో రోహిత్ శర్మ 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు,. మొత్తంగా 45 బంతులు ఎదుర్కొని.. 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా హిట్మ్యాన్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.అతడి స్థాయికి ఇది అతి సాధారణ ప్రదర్శన‘‘అందరి ముఖాల్లో సంతోషం. కానీ అదే సమయంలో ఎన్నో ప్రశ్నలు. ఒకవేళ రోహిత్ శర్మ కనీసం 20 పరుగుల మార్కు దాటేందుకు ఇంకొన్ని ఇన్నింగ్స్ తీసుకుని ఉంటే.. విమర్శలు మరింత ఎక్కువయ్యేవి.అయితే, ప్రతి ఇన్నింగ్స్లోనూ అతడు మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే, ఆఖర్లో 26 అతడి అత్యధిక స్కోరుగా ఉండేది. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు.ఇప్పుడు ఫామ్లోకి వచ్చినా.. అతడి స్థాయికి ఇది అతి సాధారణ ప్రదర్శన మాత్రమే. జట్టు ఓపెనర్గా ఇలాంటి ఆట తీరు ఎంతమాత్రం సరికాదు. అయితే, ఈ మ్యాచ్లో రోహిత్ పరుగులు చేయడం జట్టుకు సానుకూల పరిణామం.మెరుగ్గా ఇన్నింగ్స్ ఆరంభించి.. ట్రేడ్మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. అయితే, అతడు ఈరోజు వికెట్ పారేసుకోకుండా ఉండటమే నాకు నచ్చిన అత్యంత గొప్ప విషయం’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు. ఏదేమైనా సూపర్స్టార్ రోహిత్ శర్మ సిక్సర్ల వర్షం కురిపిస్తుంటే ముచ్చటగా అనిపించిందని.. ఇక ముందు కూడా ఇదే ఫామ్ను కొనసాగించాలని ఆకాంక్షించాడు.చెన్నైని ఓడించిన ముంబైకాగా వాంఖడేలో టాస్ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్ చేసి.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 176 పరుగులు సాదించింది. ఇక ముంబై ఈ నామమాత్రపు లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ కోల్పోయి 15.4 ఓవర్లలోనే ఊదేసింది. రోహిత్ శర్మ (45 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లు-76 రన్స్), సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు- 68 రన్స్) కలిసి ముంబైని గెలుపు తీరాలకు చేర్చారు.చదవండి: RCB Vs PBKS: ‘హద్దు’దాటిన కోహ్లి.. కింగ్పై మండిపడ్డ శ్రేయస్ అయ్యర్!.. వీడియోA perfect way to wrap a dominant victory and seal back-to-back home wins 💙@mipaltan sign off tonight by winning round 2⃣ against their arch rival 🥳Scorecard ▶ https://t.co/v2k7Y5tg2Q#TATAIPL | #MIvCSK pic.twitter.com/u2BDXfHpXJ— IndianPremierLeague (@IPL) April 20, 2025 -
MI VS CSK: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. నిన్న (ఏప్రిల్ 20) సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న హిట్మ్యాన్.. ఐపీఎల్లో 20 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న తొలి భారత క్రికెటర్గా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్కు ముందు రోహిత్, విరాట్ కోహ్లి తలో 19 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచి భారత్ తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచిన ఆటగాళ్లుగా ఉన్నారు.విరాట్ నిన్ననే పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచి రోహిత్ రికార్డును సమం చేశాడు. అయితే గంటల వ్యవధిలోనే రోహిత్ విరాట్ను వెనక్కు నెట్టి హోల్ అండ్ సోల్గా భారత్ తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు (ఐపీఎల్) గెలుచుకున్న ఆటగాడిగా అవతరించాడు.ఓవరాల్గా ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో రోహిత్ మూడో స్థానానికి ఎగబాకాడు. ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న రికార్డు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడీ ఐపీఎల్లో 25 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఏబీడీ తర్వాత క్రిస్ గేల్ (22), రోహిత్ (20) వరుస స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో విరాట్ నాలుగో స్థానంలో ఉన్నాడు.ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్లు (టాప్-5)20 - రోహిత్ శర్మ (264 మ్యాచ్లు)19 - విరాట్ కోహ్లీ (260 మ్యాచ్లు)18 - ఎంఎస్ ధోని (272 మ్యాచ్లు)16 - యూసుఫ్ పఠాన్ (174 మ్యాచ్లు)16 - రవీంద్ర జడేజా (248 మ్యాచ్లు)ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్లు (టాప్-5)25- ఏబీ డివిలియర్స్ (184 మ్యాచ్లు)22- క్రిస్ గేల్ (142 మ్యాచ్లు)20 - రోహిత్ శర్మ (264 మ్యాచ్లు)19 - విరాట్ కోహ్లీ (260 మ్యాచ్లు)18 - ఎంఎస్ ధోని (272 మ్యాచ్లు)నిన్నటి మ్యాచ్లో రోహిత్ మరో రికార్డు కూడా సాధించాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో శిఖర్ ధవన్కు వెనక్కు నెట్టాడు. ఈ జాబితాలో విరాట్ టాప్ ప్లేస్లో ఉన్నాడు.ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు (టాప్-5)8326 - విరాట్ కోహ్లీ6786 - రోహిత్ శర్మ*6769 - శిఖర్ ధావన్6565 - డేవిడ్ వార్నర్5528 - సురేష్ రైనామ్యాచ్ విషయానికొస్తే.. నిన్న రాత్రి వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రవీంద్ర జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు,2 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.సీఎస్కే ఇన్నింగ్స్లో అరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు,2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు. ముంబై బౌలర్లలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, అశ్వనీ కుమార్, సాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఛేదనకు దిగిన ముంబై రోహిత్ శర్మ (45 బంతుల్లో 76 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 15.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. -
రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. ‘హిట్మ్యాన్’కే ఇది సాధ్యం!
టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ దిగ్గజ క్రికెటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) చాన్నాళ్ల తర్వాత అద్బుత ఇన్నింగ్స్తో మెరిశాడు. ఐపీఎల్-2025 (IPL 2025) ఆరంభం నుంచి పేలవ ఫామ్తో సతమతమైన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. చెన్నై సూపర్ కింగ్స్ (MI vs CSK)తో మ్యాచ్ సందర్భంగా ‘వింటేజ్ హిట్మ్యాన్’ను గుర్తు చేస్తూ ప్రత్యర్థి జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు.రోహిత్ ధనాధన్చెన్నై విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ శర్మ 33 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 45 బంతుల్లో 76 పరుగులతో అజేయంగా నిలిచి.. సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 68 నాటౌట్)తో కలిసి ముంబైని విజయతీరాలకు చేర్చాడు.ఇక చెన్నైతో మ్యాచ్లో ‘హిట్మ్యాన్’ అంటూ అభిమానులు ఇచ్చిన బిరుదును రోహిత్ శర్మ మరోసారి సార్థకం చేసుకున్నాడు. ఆదివారం నాటి మ్యాచ్లో అతడి ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లతో పాటు ఏకంగా ఆరు సిక్సర్లు ఉండటం ఇందుకు నిదర్శనం.This man & his pull shots >>>>#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #MIvCSKpic.twitter.com/hwnlKRNvO0— Mumbai Indians (@mipaltan) April 20, 2025 ఈ క్రమంలో రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సాధించాడు. టీ20 ఫార్మాట్లో ఒకే దేశంలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్గా చరిత్రకెక్కాడు. అంతకు ముందు ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది.ఒకే దేశంలో అత్యధిక సిక్సర్లు (అంతర్జాతీయ, లీగ్ క్రికెట్లో కలిపి) బాదిన క్రికెటర్లు👉రోహిత్ శర్మ- ఇండియాలో- 361 సిక్సర్లు👉క్రిస్ గేల్- వెస్టిండీస్లో- 357 సిక్సర్లు👉విరాట్ కోహ్లి- ఇండియాలో- 325 సిక్సర్లు👉మహేంద్ర సింగ్ ధోని- ఇండియాలో- 286 సిక్సర్లు👉కీరన్ పొలార్డ్- వెస్టిండీస్లో- 276 సిక్సర్లు👉సంజూ శాంసన్- ఇండియాలో- 274 సిక్సర్లు👉నికోలస్ పూరన్- వెస్టిండీస్లో- 271 సిక్సర్లు.ఇక ఓవరాల్గా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరఫున టెస్టుల్లో 88, వన్డేల్లో 344, టీ20లలో 205 సిక్స్లు కొట్టాడు. ఐపీఎల్లో 264 మ్యాచ్లు పూర్తి చేసుకుని 292 సిక్సర్లు బాదాడు.సీఎస్కే 176.. ఆలౌట్ముంబై- చెన్నై మధ్య మ్యాచ్ విషయానికొస్తే.. వాంఖడేలో ఆదివారం జరిగిన చిరకాల ప్రత్యర్థుల పోరులో ఆతిథ్య ముంబై పైచేయి సాధించింది. టాస్ గెలిచి చెన్నైని బ్యాటింగ్కు ఆహ్వానించిన హార్దిక్ సేన.. ధోని బృందాన్ని 176 పరుగులకు కట్టడి చేసింది.అనంతరం కేవలం ఒక వికెట్ కోల్పోయి 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ముంబై.. తొమ్మిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కాగా ఈ గెలుపుతో హ్యాట్రిక్ కొట్టిన హార్దిక్ సేన పాయింట్ల పట్టికలో ఆరోస్థానాని (8 మ్యాచ్లలో నాలుగు గెలిచి)కి దూసుకువచ్చింది. మరోవైపు.. ఇప్పటికి ఎనిమిది మ్యాచ్లు ఆడిన చెన్నైకి ఇది ఆరో పరాజయం. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: RCB Vs PBKS: ‘హద్దు’దాటిన కోహ్లి.. కింగ్పై మండిపడ్డ శ్రేయస్ అయ్యర్!.. వీడియోA #SKY special in Wankhede!#SuryaKumarYadav hits the winning runs for #MI & the Revenge is completed!Next up on #IPLRevengeWeek 👉 #KKRvGT | MON, 21 APR, 6:30 PM LIVE on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! pic.twitter.com/8rw3ZDwA5w— Star Sports (@StarSportsIndia) April 20, 2025 -
CSK Vs MI: ముంబై జెర్సీలో రాధికా మర్చంట్.. రోహిత్ ఫిఫ్టీ కొట్టగానే అనంత్ అంబానీతో కలిసి..
ఐపీఎల్-2025 ఆరంభంలో పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న ముంబై ఇండియన్స్.. గేర్ మార్చింది. ఢిల్లీ క్యాపిటల్స్పై విజయంతో గెలుపు బాట పట్టిన హార్దిక్ సేన.. ఆ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది.తాజాగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకుని.. ధోని సేనను ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా ఐపీఎల్-2025 (IPL 2025)లో హ్యాట్రిక్ విజయం నమోదు చేసి.. ఓవరాల్గా నాలుగో విజయం అందుకుంది.ఈ క్రమంలో ఎనిమిది పాయింట్లతో పట్టికలో ఆరో స్థానానికి దూసుకువచ్చింది ముంబై ఇండియన్స్. ఇక ఆదివారం నాటి సీఎస్కేతో మ్యాచ్లో ముంబై దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఫామ్లోకి రావడం జట్టుకు మరో శుభసూచకం.రోహిత్- సూర్య ధనాధన్చెన్నై విధించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్ రియాన్ రికెల్టన్ 19 బంతుల్లో 24 పరుగులు చేసి నిష్క్రమించగా.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 33 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న హిట్మ్యాన్.. మొత్తంగా 45 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 76 పరుగులతో అజేయంగా నిలిచాడు.రోహిత్కు తోడుగా సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 68 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి అద్భుత బ్యాటింగ్ కారణంగా ముంబై 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి.. సీజన్ ఆరంభ మ్యాచ్లో చెపాక్లో చెన్నై చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది.ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ యజమానులు నీతా అంబానీ (Nita Ambani), ఆకాశ్ అంబానీల సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం.. సూర్య ధనాధన్ ఇన్నింగ్స్ చూసి వారు ఖుషీ అయ్యారు.రెండు జెడల సీతలాఇక నీతా- ఆకాశ్లకు తోడు ఈసారి అంబానీల కొత్త కోడలు రాధికా మర్చంట్ (Radhika Merchant) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భర్త అనంత్ అంబానీతో కలిసి మ్యాచ్ను వీక్షించిన రాధికా.. రెండు జెడల సీతలా ముంబై జెర్సీలో తళుక్కుమన్నారు. రోహిత్ శర్మ ఫిఫ్టీ పూర్తి చేసుకోగానే కరతాళ ధ్వనులతో అనంత్- రాధికా తమ మాజీ కెప్టెన్ను అభినందించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ధోని విఫలంకాగా వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో ఆదివారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అరంగేట్ర ఆటగాడు ఆయుశ్ మాత్రే 32 పరుగులతో ఆకట్టుకున్నాడు.మరోవైపు.. రవీంద్ర జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్), శివం దూబే (32 బంతుల్లో 50) అర్ధ శతకాలతో రాణించారు. కెప్టెన్ ధోని 4 పరుగులకే పరిమితమయ్యాడు.ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా రెండు, అశ్వనీ కుమార్, మిచెల్ సాంట్నర్, దీపక్ చహర్ ఒక్కో వికెట్ తీశారు. ముంబై సీఎస్కే విధించిన లక్ష్యాన్ని ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది.చదవండి: ఒక్కోసారి మనపై మనకే డౌట్!.. నాకు దక్కిన అరుదైన గౌరవం: రోహిత్ శర్మA perfect way to wrap a dominant victory and seal back-to-back home wins 💙@mipaltan sign off tonight by winning round 2⃣ against their arch rival 🥳Scorecard ▶ https://t.co/v2k7Y5tg2Q#TATAIPL | #MIvCSK pic.twitter.com/u2BDXfHpXJ— IndianPremierLeague (@IPL) April 20, 2025 "Anant Ambani and Radhika Merchant" cheering for his captain Rohit Sharma ✊🔥.#CSKvsMI #RohitSharma pic.twitter.com/09vXEKgmxR— Aniket 𝕏 (@ImAniket264) April 20, 2025 -
CSK Vs MI: ఒక్కోసారి మనపై మనకే డౌట్!.. ఇప్పుడు ఇలా..: రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ దిగ్గజ క్రికెటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ (MI vs CSK)తో మ్యాచ్ సందర్భంగా.. చాలా కాలం తర్వాత హిట్మ్యాన్ బ్యాట్ ఝులిపించాడు. సొంత మైదానం వాంఖడేలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ 45 బంతుల్లోనే 76 పరుగులతో అజేయంగా నిలిచాడు.చాలా కాలం తర్వాత ఇలానాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో అజేయ అర్ద శతకంతో జట్టును గెలిపించిన రోహిత్ శర్మను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. ‘‘చాలా కాలం తర్వాత నేను ఇక్కడ నిలుచోగలిగాను. ఫామ్లేమి కారణంగా ఒక్కోసారి మనపై మనకే సందేహం కలుగుతుంది. మన పంథాను మార్చుకునేలా చేస్తుంది. కానీ అలాంటపుడే సంయమనంతో ఉండాలి. లేదంటే ఒత్తిడి మరింత ఎక్కువ అవుతుంది. నా వరకు ఈరోజు ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్. అందుకే ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఆడాలని ముందే నిర్ణయించుకున్నా. మా ప్రణాళికల ప్రకారమే నా ఇన్నింగ్స్ కొనసాగించాను.బంతి నా ఆధీనంలోకి వచ్చినప్పుడు బౌండరీకి తరలించాను. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగడంలో నాకెలాంటి ఇబ్బంది లేదు. ఫీల్డింగ్ వేళ చివరి 2-3 ఓవర్లలో వచ్చినా.. నేరుగా బ్యాటింగ్కే దిగినా పెద్దగా తేడా ఏమీ ఉండదు’’ అని పేర్కొన్నాడు.నాకు దక్కిన అరుదైన గౌరవంఅదే విధంగా.. వాంఖడేలో కొత్తగా తన పేరిట ఏర్పాటు చేసిన స్టాండ్ గురించి కూడా రోహిత్ శర్మ ఈ సందర్భంగా స్పందించాడు. ‘‘రోహిత్ శర్మ స్టాండ్లోకి బంతిని తరలించడాన్ని ఎంతగానో ఆస్వాదించాను. నాకు దక్కిన అరుదైన గౌరవం ఇది. ఆ పేరును పలికినప్పుడల్లా ఎలా స్పందించాలో కూడా నాకు తెలియడం లేదు.ఏదేమైనా ఈరోజు చివరి వరకు నిలిచి మ్యాచ్ను విజయంతో ముగించడం సంతోషంగా ఉంది. నా బాధ్యత కూడా అది. సరైన సమయంలో మేము గెలుపు బాట పట్టాము. వరుసగా మూడు మ్యాచ్లు గెలిచాం’’ అని రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లో చెపాక్లో చెన్నై చేతిలో ఓడిన తాజా గెలుపుతో ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ముంబై ఎనిమిదింట నాలుగు మ్యాచ్లలో గెలిచి.. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. మరోవైపు రోహిత్ శర్మ.. ఏడు ఇన్నింగ్స్ ఆడి 158 పరుగులు చేశాడు.ఐపీఎల్-2025: ముంబై వర్సెస్ చెన్నై స్కోర్లుటాస్: ముంబై.. తొలుత బౌలింగ్చెన్నై స్కోరు: 176/5 (20)ముంబై స్కోరు: 177/1 (15.4)ఫలితం: తొమ్మిది వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసిన ముంబై.చదవండి: IPL 2025: ఇటు రోహిత్.. అటు కోహ్లి A perfect way to wrap a dominant victory and seal back-to-back home wins 💙@mipaltan sign off tonight by winning round 2⃣ against their arch rival 🥳Scorecard ▶ https://t.co/v2k7Y5tg2Q#TATAIPL | #MIvCSK pic.twitter.com/u2BDXfHpXJ— IndianPremierLeague (@IPL) April 20, 2025 -
IPL 2025: ఇటు రోహిత్.. అటు కోహ్లి
భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ విజృంభించారు. భారీ షాట్లతో అలరిస్తూ ఆదివారం అభిమానులకు డబుల్ ధమాకా అందించారు. పంజాబ్ కింగ్స్తో పోరులో కోహ్లి క్లాసిక్ ఇన్నింగ్స్తో కదంతొక్కగా... చెన్నైతో మ్యాచ్లో రోహిత్ శర్మ ఊర మాస్ షాట్లతో చెలరేగిపోయాడు. ఫలితంగా పంజాబ్పై బెంగళూరు బదులు తీర్చుకోగా... చెన్నైపై ముంబై ఇండియన్స్ భారీ విజయం నమోదు చేసుకుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఓ మాదిరి ప్రదర్శనతో సరిపెట్టుకున్న రోహిత్... తనను ‘హిట్మ్యాన్’ ఎందుకు అంటారో వాంఖడేలో నిరూపించాడు. విరాట్ దూకుడుతో బెంగళూరు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లగా... రోహిత్ మెరుపులతో ముంబై నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. ఓపెనర్లుగా తొలి ఓవర్లోనే క్రీజులో అడుగుపెట్టిన ఈ ఇద్దరూ చివరి వరకు అజేయంగా నిలిచి తమ జట్లను గెలిపించడం కొసమెరుపు.ముంబై: సిక్స్... ఫోర్... ముంబై ఇన్నింగ్స్ మొత్తం ఇదే తీరు! బంతి పడటమే ఆలస్యం బౌండరీ వెళ్లెందుకు ఓసారి, సిక్స్ అయ్యేందుకు మరోసారి బంతి అదేపనిగా ముచ్చట పడిందనిపించింది. ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ, టి20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ల ఆట మ్యాచ్లో హైలైట్స్ను చూపించలేదు. హైలైట్సే మ్యాచ్గా మార్చేసింది. దీంతో ముంబై 177 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించింది. చెన్నైపై 9 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.ముందుగా చెన్నై సూపర్కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు), శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్స్లు) రాణించారు. అనంతరం ముంబై 15.4 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి 177 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ (45 బంతుల్లో 76 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్స్లు), సూర్య (30 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్లు) హోరెత్తించారు. దంచేసిన జడేజా, దూబే ఆంధ్ర కుర్రాడు షేక్ రషీద్ (20 బంతుల్లో 19; 1 ఫోర్)కు ఓపెనింగ్లో అవకాశమిస్తున్న ధోనిని నిరుత్సాహపరిచాడు. పవర్ప్లేలో 20 బంతులాడి కూడా ఒకే ఒక్క బౌండరీ బాదాడు. రచిన్ రవీంద్ర (5) విఫలమవగా, 17 ఏళ్ల ‘లోకల్ బాయ్’ ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్లు) ఉన్నది కాసేపే అయినా ఫోర్లు, సిక్స్లతో అలరించాడు. తర్వాత వచ్చిన జడేజా, దూబే భారీషాట్లు బాదడంతో చెన్నై పుంజుకుంది. ఇద్దరు నాలుగో వికెట్కు 79 పరుగులు జోడించారు. సిక్స్లు బాదిన దూబే 30 బంతుల్లో, జడేజా 34 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ధోని (4)ని బుమ్రా ఎంతో సేపు నిలువనీయలేదు. బాదుడే... బాదుడు రోహిత్ శర్మకు జతగా ఓపెనింగ్ చేసిన రికెల్టన్ తొలి ఓవర్లోనే బౌండరీలతో తమ ఉద్దేశం చాటగా, రెండో ఓవర్ నుంచి రోహిత్ విరుచుకుపడటంతో చెన్నై బౌలర్లకు కష్టాలు తప్పలేదు. మూడో ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. జేమీ ఓవర్టన్ ఓవర్న్నర (9 బంతులు) వేసిన ఐదో ఓవర్లో రికెల్టన్, రోహిత్ చెరో సిక్స్ కొట్టడంతో 18 పరుగులు వచ్చాయి. దీంతో పవర్ప్లేలో 62 పరుగులు చేసిన ముంబై తర్వాతి ఓవర్లోనే రికెల్టన్ (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ను కోల్పోయింది. సూర్యకుమార్ రావడం... రోహిత్తో కలిసి ధనాధన్ షోను డబుల్ చేసింది. ఇద్దరు బౌండరీలు, సిక్సర్లు కొట్టేందుకు పోటీపడటంతో స్టేడియం హోరెత్తింది. ముందుగా ‘హిట్మ్యాన్’ 33 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... సూర్య 26 బంతుల్లో అర్ధసెంచరీ అధిగమించాడు. ఇద్దరు బంతిని అదేపనిగా బౌండరీలైన్ను దాటిస్తూనే ఉండటంతో లక్ష్యం ముంబై వైపు నడిచివచ్చింది.స్కోరు వివరాలు చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: షేక్ రషీద్ (స్టంప్డ్) రికెల్టన్ (బి) సాంట్నర్ 19; రచిన్ (సి) రికెల్టన్ (బి) అశ్వని 5; ఆయుశ్ (సి) సాంట్నర్ (బి) దీపక్ చహర్ 32; జడేజా (నాటౌట్) 53; దూబే (సి) జాక్స్ (బి) బుమ్రా 50; ధోని (సి) తిలక్ (బి) బుమ్రా 4; జేమీ ఓవర్టన్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–16, 2–57, 3–63, 4–142, 5–156. బౌలింగ్: చహర్ 4–0–32–1, బౌల్ట్ 4–0–43–0, అశ్వని 2–0–42 –1, సాంట్నర్ 3–0–14–1, బుమ్రా 4–0–25–2, విల్ జాక్స్ 1–0–4–0, హార్దిక్ 2–0–13–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) ఆయుశ్ (బి) జడేజా 24; రోహిత్ (నాటౌట్) 76; సూర్యకుమార్ (నాటౌట్) 68; ఎక్స్ట్రాలు 9; మొత్తం (15.4 ఓవర్లలో వికెట్ నష్టానికి) 177. వికెట్ల పతనం: 1–63. బౌలింగ్: ఖలీల్ 2–0–24–0, ఓవర్టన్ 2–0– 29–0, అశ్విన్ 4–0–25–0, జడేజా 3–0–28–1, నూర్ 3–0–36–0, పతిరణ 1.4–0–34–0. ముల్లాన్పూర్: ముందు బౌలర్లు, తర్వాత బ్యాటర్లు రాణించడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తమ సొంతగడ్డపై పొగొట్టుకున్న ఫలితాన్ని పంజాబ్కు వెళ్లి రాబట్టుకుంది. ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్పై ఘనవిజయం సాధించింది. ముందుగా పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. జోష్ ఇన్గ్లిస్ (17 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్), శశాంక్ సింగ్ (33 బంతుల్లో 31; 1 ఫోర్) మెరుగ్గా ఆడారు. కృనాల్, సుయశ్లకు రెండేసి వికెట్లు దక్కాయి. తర్వాత బెంగళూరు 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి (54 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అదరగొట్టాడు. దేవదత్ పడిక్కల్ (35 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్స్లు) మెరిపించాడు. కోహ్లి ఆఖరిదాకా... పెద్ద లక్ష్యం కాకపోయినా... బెంగళూరు జట్టు తమ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (1) వికెట్ను తొలి ఓవర్లోనే కోల్పోయింది. పంజాబ్కు దక్కింది ఈ ఆరంభ సంబరమే! అటు తర్వాత కథంతా కింగ్ కోహ్లి, పడిక్కల్ నడిపించారు. వన్డౌన్ బ్యాటర్ పడిక్కల్ భారీ సిక్సర్లతో విరుచుకుపడగా... కోహ్లి క్లాసిక్స్ షాట్లతో ముల్లాన్పూర్ ప్రేక్షకుల్ని గెలిచాడు. ఇద్దరు రెండో వికెట్కు 103 పరుగులు జోడించారు. పడిక్కల్ అవుటైనా... ఆఖరిదాకా క్రీజులో నిలబడిన కోహ్లి జట్టును గెలిపించాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) డేవిడ్ (బి) కృనాల్ 22; ప్రభ్సిమ్రాన్ (సి) డేవిడ్ (బి) కృనాల్ 33; అయ్యర్ (సి) కృనాల్ (బి) షెఫర్డ్ 6; ఇన్గ్లిస్ (బి) సుయశ్ 29; నేహల్ (రనౌట్) 5; శశాంక్ (నాటౌట్) 31; స్టొయినిస్ (బి) సుయశ్ 1; యాన్సెన్ (నాటౌట్) 25; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–42, 2–62, 3–68, 4–76, 5–112, 6–114. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–26–0, యశ్ దయాళ్ 2–0–22–0, హాజల్వుడ్ 4–0–39–0, కృనాల్ పాండ్యా 4–0–25–2, షెఫర్డ్ 2–0–18–1, సుయశ్ 4–0–26–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) ఇన్గ్లిస్ (బి) అర్ష్ దీప్ 1; కోహ్లి (నాటౌట్) 73; పడిక్కల్ (సి) నేహల్ (బి) హర్ప్రీత్ 61; పాటీదార్ (సి) యాన్సెన్ (బి) చహల్ 12; జితేశ్ శర్మ (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 1; మొత్తం (18.5 ఓవర్లలో 3 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–6, 2–109, 3–143. బౌలింగ్: అర్ష్ దీప్ 3–0–26–1, జేవియర్ 3–0–28–1, హర్ప్రీత్ బ్రార్ 4–0–27–1, యాన్సెన్ 3–0–20–0, చహల్ 4–0–36–1, స్టొయినిస్ 1–0–13–0, నేహల్ 0.5–0–9–0. ఐపీఎల్లో నేడుకోల్కతా X గుజరాత్ వేదిక: కోల్కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
CSK Vs MI: రోహిత్, సూర్యకుమార్ విధ్వంసం.. చెన్నైను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2025లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్ 20) రాత్రి జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రవీంద్ర జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు,2 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సీఎస్కే ఇన్నింగ్స్లో అరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు,2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు. షేక్ రషీద్ 20 బంతుల్లో 19, రచిన్ రవీంద్ర 9 బంతుల్లో 5, ధోని 6 బంతుల్లో 6 పరుగులు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, అశ్వనీ కుమార్, సాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఛేదనకు దిగిన ముంబై రోహిత్ శర్మ (45 బంతుల్లో 76 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 15.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. స్కై వరుసగా రెండు సిక్సర్లు కొట్టి మ్యాచ్ను ముగించాడు. ఈ మ్యాచ్లో ఆది నుంచే దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ సీజన్లో తొలిసారి సామర్థ్యం మేరకు సత్తా చాటాడు. ముంబై ఇన్నింగ్స్లో రికెల్టన్ (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్) కూడా పర్వాలేదనిపించాడు. సీఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజాకు వికెట్ దక్కింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. -
PBKS VS RCB: రోహిత్ శర్మ రికార్డును సమం చేసిన కోహ్లి
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 20) మధ్యాహ్నం ముల్లాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో విరాట్ ఛేదనలో అద్భుతమైన హాఫ్ సెంచరీతో (54 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) అదరగొట్టి ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ సీజన్లో విరాట్కు ఇది మూడో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. ఓవరాల్గా 19వది.ఈ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో విరాట్ రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. రోహిత్ కూడా ఐపీఎల్లో ఇప్పటివరకు 19 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. విరాట్, రోహిత్ ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. ఓవరాల్గా ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న రికార్డు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడీ ఐపీఎల్లో 25 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఏబీడీ తర్వాత అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న రికార్డు క్రిస్ గేల్ (22) పేరిట ఉంది. ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్, రోహిత్ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్లు (టాప్-5)19 - విరాట్ కోహ్లీ (260 మ్యాచ్లు)19 - రోహిత్ శర్మ (263 మ్యాచ్లు)18 - ఎంఎస్ ధోని (272 మ్యాచ్లు)16 - యూసుఫ్ పఠాన్ (174 మ్యాచ్లు)16 - రవీంద్ర జడేజా (248 మ్యాచ్లు)ఈ మ్యాచ్లో విరాట్ మరో భారీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో విరాట్ ఇప్పటివరకు 67 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. ఇందులో 59 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో రెండో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ 66 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. ఇందులో 62 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి.ఐపీఎల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన టాప్-5 బ్యాటర్స్..విరాట్- 67 (59 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు)వార్నర్- 66 (62, 4)శిఖర్ ధవన్- 53 (51, 2)రోహిత్ శర్మ- 45 (43, 2)కేఎల్ రాహుల్- 43 (39, 4)ఏబీ డివిలియర్స్- 43 (40, 3)ఐపీఎల్లో విరాట్ పేరిట ఉన్న రికార్డు..అత్యధిక పరుగులుఅత్యధిక శతకాలుఅత్యధిక 50 ప్లస్ స్కోర్లుఅత్యధిక బౌండరీలుమ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. పవర్ ప్లేలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఆర్సీబీ బౌలర్లు.. ఆతర్వాత అనూహ్య రీతిలో పుంజుకుని పంజాబ్ను స్వల్ప స్కోర్కే కట్టడి చేసింది. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ తలో రెండు వికెట్లు తీయగా.. రొమారియో షెపర్డ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. భువనేశ్వర్ కుమార్, హాజిల్వుడ్ వికెట్లు తీయనప్పటికీ.. పొదుపుగా బౌలింగ్ చేశారు.పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రభ్సిమ్రన్ సింగ్ (33) టాప్ స్కోరర్గా కాగా.. ప్రియాన్ష్ ఆర్య 22, శ్రేయస్ అయ్యర్ 6, జోస్ ఇంగ్లిస్ 29, నేహల్ వధేరా 5, స్టోయినిస్ 1, శశాంక్ సింగ్ 31 (నాటౌట్), జన్సెన్ 25 (నాటౌట్) పరుగులు చేశారు.అనంతరం 158 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. విరాట్ అజేయ అర్ద శతకంతో (54 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించగా.. దేవ్దత్ పడిక్కల్ (35 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీ చేసి ఆర్సీబీ గెలుపుకు గట్టి పునాది వేశాడు. జితేశ్ శర్మ (8 బంతుల్లో 11 నాటౌట్; సిక్స్) సిక్సర్ బాది మ్యాచ్ను ముగించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో సాల్ట్ (1), రజత్ పాటిదార్ (12) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, హర్ప్రీత్ బ్రార్, చహల్ తలో వికెట్ పడగొట్టారు. -
ఆరోజు నాకు కోపం వచ్చింది.. అందుకే అలా అరిచాను: రోహిత్ శర్మ
టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మైదానంలో వ్యూహాలతోనే కాకుండా.. తనదైన శైలిలో సెటైర్లు పేలుస్తూ అభిమానులను ఆకట్టుకుంటాడు. ఒక్కోసారి తన సరదా చేష్టలతో సహచర ఆటగాళ్లను ఆటపట్టించే హిట్మ్యాన్.. కీలక సమయాల్లో మాత్రం గంభీరంగా మారిపోతాడు. అలా ఇంగ్లండ్ (IND vs ENG)తో 2024 నాటి టెస్టు మ్యాచ్లో రోహిత్ శర్మ అన్న మాటలు స్టంప్ మైకులో రికార్డయ్యాయి.గార్డెన్లో తిరిగేందుకు వచ్చారా?‘‘ఇక్కడ ఎవరూ ఖాళీగా.. పనీపాటా లేకుండా గార్డెన్లో తిరిగేందుకు రాలేదు’’ అంటూ సహచర ఆటగాళ్లను ఒకింత తీవ్ర స్వరంతోనే మందలించాడు. అప్పట్లో వైరల్ అయిన ఈ వ్యాఖ్యలపై రోహిత్ శర్మ తాజాగా స్పందించాడు. ‘‘ఆరోజు వైజాగ్లో మ్యాచ్. ఓవర్ పూర్తయ్యే సమయంలో మా వాళ్లు ఏదో వాకింగ్కు వచ్చినట్లు గార్డెన్లో నడిచినట్లుగా అటూ ఇటూ తిరుగుతున్నారు.ఒక్కరూ పరిగెత్తడం లేదు. మైదానంలో చురుగ్గా లేనేలేరు. మ్యాచ్ చేజారిపోతుందేమోననిపించింది. అది మాకు అతి ముఖ్యమైన, తప్పక గెలవాల్సిన మ్యాచ్. అందుకే ఈరోజు మనమంతా ఇంకాస్త ఎక్కువగా శ్రమించాలి అని మా వాళ్లకు ఆరోజు పొద్దునే గట్టిగా చెప్పాను.అందుకే నాకు కోపం వచ్చిందికానీ వాళ్లేమో గ్రౌండ్లో సరదాగా చక్కర్లు కొడుతున్నారు. అప్పుడు మేము ఒక్క వికెట్ అయినా తీయాలని పరితపించిపోతున్నాం. కానీ ఎవరూ అందుకు తగ్గ ప్రయత్నం చేసినట్లు అనిపించలేదు.అందుకే నాకు కోపం వచ్చింది. మా వాళ్లకు గట్టిగానే క్లాస్ తీసుకున్నా. ప్రత్యర్థి జట్టు భాగస్వామ్యాలను కూల్చాలని చెప్పా. అలాంటి సమయంలో సమిష్టిగా పనిచేస్తేనే ఫలితం వస్తుంది. అయితే, మా వాళ్లు ఎవరి పనిలో వాళ్లు బిజీగా ఉన్నట్లు కనిపించింది. అందుకే అలా అన్నాను’’ అని రోహిత్ శర్మ జియోహాట్స్టార్తో మాట్లాడుతూ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.106 పరుగుల తేడాతో గెలుపుకాగా గతేడాది ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఇంగ్లండ్ను 106 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తొలి టెస్టులో ఓడిన రోహిత్ సేన.. ఆ తర్వాత మిగతా నాలుగు గెలిచి.. 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది.ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు ఇంత వరకు తన స్థాయికి తగ్గట్లుగా రాణించలేదు. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లు ఆడి కేవలం 82 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కాగా ఐపీఎల్-2025 (IPL 2025) ఆరంభానికి ముందు చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో రోహిత్ టీమిండియాకు ఐసీసీ టైటిల్ అందించాడు. అంతకు ముందు టీ20 ప్రపంచకప్-2024లోనూ టీమిండియాను చాంపియన్గా నిలిపి దిగ్గజ కెప్టెన్ల జాబితాలో చేరిపోయాడు.ఇక భారత్కు పొట్టి ప్రపంచకప్ అందించిన తర్వాత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లితో కలిసి రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేవలం లీగ్ క్రికెట్లో మాత్రమే అతడు పొట్టి ఫార్మాట్లో ఆడుతున్నాడు. కాగా ముంబై ఇండియన్స్కు ఏకంగా ఐదు సార్లు ట్రోఫీ అందించిన కెప్టెన్గా ఘనత సాధించిన రోహిత్ శర్మ.. గతేడాది నుంచి ఆటగాడిగా కొనసాగుతున్నాడు.చదవండి: నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. ప్రేమగా చెంప నిమిరిన మాజీ ఓనర్! -
MI VS SRH: సిక్సర్ల సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. కోహ్లి, గేల్, ఏబీడీ సరసన చోటు
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ తమ సొంత మైదానమైన వాంఖడే స్టేడియంలో సిక్సర్ల సెంచరీ పూర్తి చేశాడు. సన్రైజర్స్తో ఇవాళ (ఏప్రిల్ 17) జరుగుతున్న మ్యాచ్లో రోహిత్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 3 సిక్సర్లు బాదిన రోహిత్ వాంఖడే స్టేడియంలో (ఐపీఎల్లో) ఇప్పటివరకు 102 సిక్సర్లు కొట్టాడు. ఒకే స్టేడియంలో సిక్సర్ల సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. కోహ్లి, గేల్, డివిలియర్స్ సరసన చేరాడు. ఈ ముగ్గురు కూడా ఆర్సీబీకి ఆడుతూ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సిక్సర్ల సెంచరీ పూర్తి చేశారు. వీరిలో కోహ్లి అత్యధికంగా 130 సిక్సర్లు బాదగా.. గేల్ 127, డివిలియర్స్ 118 సిక్సర్లు కొట్టారు. ఐపీఎల్లో ఈ ముగ్గురితో పాటు రోహిత్ మాత్రమే ఒకే వేదికలో సిక్సర్ల సెంచరీని పూర్తి చేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో మూడు సిక్సర్లు (2 ఆనికేత్, కమిన్స్ ఒకటి) సహా 22 పరుగులు, అంతకుముందు దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రెండు సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రావడంతో సన్రైజర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో అభిషేక్ 40, ట్రవిస్ హెడ్ 28, ఇషాన్ కిషన్ 2, నితీశ్ కుమార్ రెడ్డి 19, క్లాసెన్ 37, అనికేత్ 18 (నాటౌట్), కమిన్స్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2, బౌల్ట్, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ధాటిగా ఇన్నింగ్స్ను ప్రారంభించింది. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ ఎప్పటిలాగే ఆదిలో విధ్వంసం సృష్టించి, ఆతర్వాత ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో రోహిత్ 16 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 26 పరుగులు చేసి తొలి వికెట్గా వెనుదిరిగాడు. 9 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 82/2గా ఉంది. రోహిత్ ఔటయ్యాక మరో ఓపెనర్ రికెల్టన్ (31) కూడా పెవిలియన్కు చేరాడు. ప్రస్తుతం విల్ జాక్స్ (14), సూర్యకుమార్ యాదవ్ (8) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో ముంబై గెలవాలంటే 66 బంతుల్లో మరో 81 పరుగులు చేయాలి. -
కమిన్స్, స్టార్క్ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం: రోహిత్
దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఆస్ట్రేలియా 2025లో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (BGT)ని గెలిచింది. టీమిండియాను 3-1తో ఓడించి సొంతగడ్డపై సత్తా చాటింది. ఇందుకు ప్రధాన కారణం ఆసీస్ పేసర్లే అని చెప్పడంలో సందేహం లేదు.బుమ్రా@32నిజానికి భారత పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఈ ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఐదు మ్యాచ్లలో కలిపి ఏకంగా 32 వికెట్లు కూల్చాడు. తద్వారా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. కానీ బ్యాటర్ల వైఫల్యం కారణంగా టీమిండియా ఓడిపోవడంతో బుమ్రా ప్రదర్శనకు విలువ లేకుండా పోయింది.హాజిల్వుడ్ స్థానంలో వచ్చిఇక.. ప్రపంచంలోని అత్యుత్తమ పేస్ త్రయంగా ఆస్ట్రేలియా పేసర్లు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins), మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్వుడ్లకు పేరు ఉన్న విషయం తెలిసిందే. వీరిలో హాజిల్వుడ్ మూడు మ్యాచ్కు ముందు గాయపడగా.. అతడి స్థానంలో స్కాట్ బోలాండ్ వచ్చాడు. కమిన్స్, స్టార్క్తో కలిసి భారత్తో టెస్టుల్లో అతడు రాణించగా.. ఉత్తమ ఆఫ్ స్పిన్నర్లలో ఒకడైన నాథన్ లియోన్ వారికి సహకరించాడు. బ్యాటర్లు కూడా తమ పనిని చక్కగా నెరవేర్చారు.ఫలితంగా టీమిండియాపై ఆసీస్ పైచేయి సాధించడంతో పాటు.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. అంతేకాదు.. రోహిత్ సేనను డబ్ల్యూటీసీ ఫైనల్కు దూరం చేసింది. ఈ సిరీస్ గురించి టీమిండియా సారథి రోహిత్ శర్మ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.కమిన్స్, స్టార్క్ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టంబీజీటీలో తమను ఎక్కువగా ఇబ్బంది పెట్టిన బౌలర్ ఎవరన్న అంశంపై స్పందిస్తూ.. ‘‘స్కాట్ బోలాండ్ను ఎదుర్కోవడం అత్యంత కష్టమైంది. అతడి పిచ్ మ్యాప్ను మేము చెక్ చేస్తూనే ఉన్నాం. అతడి బౌలింగ్లో పరుగులు రాబట్టే విషయమై సమాలోచనలు చేశాం.ఫుల్ బాల్స్ లేవు. అంతా బంతిని వేసే కోణంలోనే ఉంది. అతడు నేరుగా పరిగెత్తుకు వస్తాడు. కాస్త జంప్ చేసి.. తన సీమ్ బౌలింగ్తో మ్యాజిక్ చేస్తాడు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో బుమ్రా తొమ్మిది ఇన్నింగ్స్లో 32 వికెట్లు తీశాడు. ఇక ఆసీస్ సారథి పది ఇన్నింగ్స్లో కలిపి 25 వికెట్లు కూల్చగా.. బోలాండ్ ఆరు ఇన్నింగ్స్లోనే 21 వికెట్లు పడగొట్టాడు. మిగతా వాళ్లలో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ 10 ఇన్నింగ్స్లో 20 వికెట్లు.. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ 10 ఇన్నింగ్స్లో 18 వికెట్లు కూల్చారు. తదుపరి ఇంగ్లండ్తోఇదిలా ఉంటే.. టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్నారు. ఈ టీ20 లీగ్కు ముందు టీమిండియా.. చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో ఐసీసీ టైటిల్ గెలిచింది. ఇక ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది.చదవండి: వికెట్ కాపాడుకోవటానికే ప్రాధాన్యం.. ఇలా అయితే కష్టం రాహుల్: పుజారా -
ముంబైకి ప్రధాన సమస్య అతడే!.. సీజన్ మొత్తం ఎలా భరిస్తారో!?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఐపీఎల్-2025లో పేలవ ఫామ్తో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ముంబై ఇండియన్స్ (Mumabi Indians)కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లలో కలిపి చేసిన పరుగులు కేవలం 56. చివరగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో రోహిత్.. 12 బంతులు ఎదుర్కొని కేవలం 18 పరుగులే చేశాడు.మరోవైపు.. ముంబై ఇండియన్స్ జట్టు పరిస్థితి కూడా దారుణంగా ఉంది. గత సీజన్లో పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచిన హార్దిక్ సేన.. ఈసారి కూడా ఆఖరి స్థానం కోసం పోటీపడుతున్నట్లుగా అనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆడిన ఆరు మ్యాచ్లలో ముంబై కేవలం రెండే గెలవడం ఇందుకు నిదర్శనం.సన్రైజర్స్ హైదరాబాద్తో ఢీఇక ఐపీఎల్-2025 (IPL 2025)లో కోల్కతా నైట్ రైడర్స్తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించిన హార్దిక్ సేన.. గురువారం నాటి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ను ఢీకొట్టనుంది. ఇందుకు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదిక.ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ వైఫల్యం ముంబైపై ఎలాంటి ప్రభావం చూపుతోందన్న అంశంపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.బ్యాటింగ్ ఆర్డరే ప్రధాన సమస్య‘‘ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.. బ్యాటింగ్ ఆర్డర్. అవును ఇది నిజమే. ఓపెనర్ రోహిత్ శర్మ పరుగులు సాధించలేకపోతున్నాడు. ఒకవేళ అతడి వైఫల్యం ఇలాగే కొనసాగితే ముంబై బ్యాటింగ్ ఆర్డర్ కుదేలవడం ఖాయం.రోహిత్ కుదురుకోకపోతే.. ఎవరిని ఎప్పుడు బ్యాటింగ్కు పంపాలో అర్థం కాని పరిస్థితి. నిజానికి ఓపెనర్గా రియాన్ రికెల్టన్ రాణిస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ డీసెంట్గా బ్యాటింగ్ చేస్తున్నారు.నమన్ ధీర్ చక్కగా ఆడుతున్నాడు. హార్దిక్ పాండ్యా కూడా ఫామ్లోనే ఉన్నాడు. ఇకపోతే.. విల్ జాక్స్ తన స్థాయికి తగ్గట్లు ఆడలేకపోతున్నా.. పర్లేదనిపిస్తున్నాడు. ఎటొచ్చీ రోహిత్ శర్మ ఫామ్లేమి వల్లే సమస్య. అతడు ఓపెనర్ కాబట్టి నమన్ ధీర్, విల్ జాక్స్ వంటి వాళ్లను బ్యాటింగ్ ఆర్డర్లో వెనుక పంపాల్సి వస్తోంది.సీజన్ ఆసాంతం అతడిని ఎలా భరిస్తుందో?ఏదేమైనా రోహిత్ వైఫల్యాలు ఇలాగే కొనసాగితే ముంబై ఇండియన్స్ సీజన్ ఆసాంతం అతడిని ఎలా భరిస్తుందో నాకైతే అర్థం కావడం లేదు’’ అని భారత జట్టు మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. రోహిత్ శర్మ గొప్ప టీ20 ప్లేయర్ అని.. అయితే, ఆది నుంచే దూకుడు ప్రదర్శించకుండా కాస్త జాగ్రత్తగా ఆడితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.చదవండి: అతడు చేసిన తప్పేంటి?.. మీకసలు తెలివి ఉందా?: షేన్ వాట్సన్ ఫైర్ -
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. టీమిండియా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
ఐపీఎల్-2025 ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్తో టీమిండియా ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. ఈ ఏడాది జూన్ 20 నుంచి భారత జట్టు తమ ఇంగ్లండ్ టూర్ను ప్రారంభించనుంది.మొదటి టెస్ట్ మ్యాచ్ హెడింగ్లీలోని లీడ్స్ వేదికగా జరుగనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ మే మూడో వారంలో ప్రకటించనుంది. ఇక ఇంగ్లండ్ టూర్కు ముందు టీమిండియా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. ఈ టూర్కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నాడని తొలుత వార్తలు వినిపించాయి.కానీ ఇప్పుడు రోహిత్ ఈ సిరీస్కు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా హిట్మ్యాన్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. రోహిత్ శర్మ ఇటీవలే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ బియాండ్23 క్రికెట్ పాడ్కాస్ట్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ ఇంగ్లండ్ సిరీస్ గురించి మాట్లాడాడు."ఇంగ్లండ్ పర్యటనకు స్టార్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంద శాతం ఫిట్గా ఉండాలని మేము కోరుకుంటున్నాము. మా ప్లేయర్లు అందరూ ఫిట్గా ఉంటే ఇంగ్లండ్లో కచ్చితంగా పై చేయి సాధిస్తాము. అయితే ఇంగ్లండ్ నుంచి కూడా మాకు గట్టి సవాలు ఎదురు కానుంది. సిరీస్ గెలిచేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాము" అని రోహిత్ పేర్కొన్నాడు. దీంతో ఇంగ్లండ్ సిరీస్లో రోహిత్ ఆడనున్నాడని అభిమానులు ఫిక్స్ అయిపోయారు -
వాంఖడేలో రోహిత్ శర్మ స్టాండ్
ముంబై: ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలోని ఒక స్టాండ్కు భారత వన్డే, టెస్టు జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పేరు పెట్టారు. దేశానికి రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మకు ఇది తామిచ్చే గౌరవమని ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) వెల్లడించింది. రోహిత్ శర్మతో పాటు భారత మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు శరద్ పవర్ పేరిట కూడా స్టాండ్లు ఏర్పాటు చేసింది. మంగళవారం ఎంసీఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. దివెచా పెవిలియన్లోని మూడో లెవల్కు రోహిత్ శర్మ పేరు పెట్టారు. గ్రాండ్ స్టాండ్ మూడో లెవల్కు శరద్ పవార్ పేరు, నాలుగో లెవల్కు వాడేకర్ ప్లేర్లు పెట్టారు. అజిత్ వాడేకర్ 1966 నుంచి 1974 మధ్య భారత జట్టు తరఫున 37 టెస్టులు, 2 వన్డేలు ఆడాడు. 1971 వెస్టిండీస్, ఇంగ్లండ్పై టెస్టు సిరీస్లు గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడు. 77 ఏళ్ల వయసులో 2018లో అజిత్ మృతిచెందారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇప్పటికే దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, దిలీప్ వెంగ్సర్కార్, సునీల్ గవాస్కర్, విజయ్ మర్చంట్ పేరుతో స్టాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటి సరసన రోహిత్ పేరు చేరింది. 2013లో టీమిండియా తరఫున టెస్టు అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ 2022లో జట్టు పగ్గాలు చేపట్టాడు. 2023 వన్డే ప్రపంచకప్లో టీమిండియాను ఫైనల్కు తీసుకెళ్లిన రోహిత్, 2024లో టి20 ప్రపంచకప్, 2025లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ అందించాడు. -
బంగ్లాతో వన్డే సిరీస్.. భారత కెప్టెన్గా గిల్! యువ సంచలనం రీ ఎంట్రీ?
భారత పురుషుల క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటన ఖారరైంది. ఈ ఏడాది ఆగస్టులో మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్లలో తలపడేందుకు బంగ్లాదేశ్కు టీమిండియా వెళ్లనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) మంగళవారం విడుదల చేసింది.ఆగస్టు 17న మిర్పూర్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో టీమిండియా పర్యటన ప్రారంభం కానుంది. ఇంగ్లండ్తో సుదీర్ఘ టెస్ట్ సిరీస్ ముగిసిన రెండు వారాలకే భారత జట్టు బంగ్లాకు పయనం కానుంది. ఈ క్రమంలో బంగ్లాతో వన్డే సిరీస్కు కెప్టెన్ రోహిత్ శర్మతో సహా సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలు గైర్హాజరు అయ్యే అవకాశం ఉంది.ఒకవేళ రోహిత్ శర్మ దూరమైతే బంగ్లాతో వన్డే సిరీస్కు భారత జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్లో గిల్తో పాటు జైశ్వాల్, కేఎల్ రాహుల్ వంటి స్టార్ ప్లేయర్ ఆడే ఛాన్స్ ఉంది. కాగా వీరు ముగ్గురు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో ఆడనునున్నారు.కానీ సెలక్టర్లు మాత్రం బంగ్లా సిరీస్కు ఈ త్రయానికి విశ్రాంతి ఇవ్వకపోవచ్చు. అదేవిధంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను బంగ్లాతో టీ20 సిరీస్లో మాత్రం ఆడేంచే అవకాశమున్నట్లు క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్లో టీ20 ఆసియా కప్-2025 జరగనుండడంతో బంగ్లా సిరీస్లో బుమ్రా ఆడడం దాదాపుగా ఖాయం. బుమ్రా ఇటీవలే గాయం నుంచి కోలుకుని ఐపీఎల్లో ఆడుతున్నాడు.మరోవైపు ఐపీఎల్లో దుమ్ములేపుతున్న గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయిసుదర్శన్ తిరిగి వన్డే, టీ20 జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. -
'అదేమి పెద్ద నేరం కాదు.. రోహిత్ బ్యాటింగ్ ఆర్డర్ను మార్చండి'
ఐపీఎల్-2025లో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ(Rohit Sharma) పేలవ ఫామ్ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ.. 11.20 సగటుతో కేవలం 56 పరుగులు మాత్రమే చేశాడు.అతడి ఇన్నింగ్స్లలో 18 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. ఈ క్రమంలో రోహిత్ శర్మపై భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ కారణంగానే ముంబై ఇండియన్స్ టాప్లో నిలవలేకపోయిందని ఆమె అభిఫ్రాయపడింది. ముంబై ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడి.. నాలుగు ఓటములు, రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో ఉంది. "ఏ ప్లేయరైనా ఫామ్ లేకపోవడం పెద్ద నేరమేమి కాదు. ప్రతీ ఒక్కరి కెరీర్లో ఎత్తు పల్లాలు ఉంటాయి. అయితే రోహిత్ ఫామ్లో లేకపోవడంతోనే ముంబై ఇండియన్స్ ఈ సారి కూడా టాప్-4లో కొనసాగలేకపోతుంది. రోహిత్ ఓపెనర్గా రాణించడంలో విఫలమవుతున్నాడు.కాబట్టి అతడిని దిగువన బ్యాటింగ్కు పంపితే జట్టుకు ప్రయోజనం చేకూరే అవకాశముంది. ముంబై చాలా అప్షన్స్ ఉన్నాయి. రోహిత్ స్ధానంలో విల్ జాక్స్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లను ప్రయత్నించవచ్చు. రోహిత్ శర్మ ఎంతటి గొప్ప ఆటగాడు మనందరికి తెలుసు. ఈ ఏడాది సీజన్లో అతడికి మంచి ఆరంభం దక్కలేదు. సహజంగా ఐపీఎల్లోనైనా, వరల్డ్కప్లోనైనా మన స్టార్ బ్యాటర్లు ఫామ్లో ఉండాలని కోరుకుంటాము. కొంతమంది వెంటనే తమ ఫామ్ను అందుకుని తిరిగి గాడిలో పడతారు. మరి కొంత మంది కాస్త ఆలస్యంగా తమ రిథమ్ను అందుకుంటారు. అంతమాత్రన వారు అత్యుత్తమ బ్యాటర్లు కాదని ఆర్ధం కాదని" పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చోప్రా పేర్కొన్నారు.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన గుంటూరు కుర్రాడు.. తొలి సీఎస్కే ప్లేయర్గా -
‘కోచ్లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)పై భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో ఓడిపోవాల్సిన మ్యాచ్లో ముంబై గెలిచిందంటే అందుకు ప్రధాన కారణం రోహిత్ అని కొనియాడాడు. కాగా ఐపీఎల్-2025 (IPL 2025)లోనూ ముంబై స్థాయికి తగ్గట్లు ఆడలేకపోతోంది.ఇప్పటి వరకు ఈ సీజన్లో హార్దిక్ సేన ఆడిన ఆరు మ్యాచ్లలో కేవలం రెండు మాత్రమే గెలిచింది. చివరగా ఢిల్లీతో ఆదివారం జరిగిన మ్యాచ్లో 12 పరుగుల తేడాతో ముంబై గట్టెక్కింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ ఓడిన ముంబై తొలుత బ్యాటింగ్ చేసింది.205 పరుగులు ఓపెనర్ రియాన్ రికెల్టన్ (25 బంతుల్లో 41), సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 40) రాణించగా.. తిలక్ వర్మ ( Tilak Varma- 33 బంతుల్లో 59), నమన్ ధీర్ (Naman Dhir- 17 బంతుల్లో 38 నాటౌట్) దంచికొట్టారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ముంబై 205 పరుగులు సాధించింది.కరుణ్ నాయర్ విధ్వంసకర ఇన్నింగ్స్ఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీ తడబడినా కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89) విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా ఆఖరి వరకు పోటీ ఇచ్చింది. ఈ క్రమంలో ప్రమాదకర బ్యాటర్ కరుణ్ నాయర్తో పాటు కేఎల్ రాహుల్, స్టబ్స్ ఆట కట్టించేందుకు రోహిత్ శర్మ ఇచ్చిన సలహాలు పనిచేశాయి.కొత్త బంతితో మ్యాజిక్బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఐపీఎల్-2025లో మంచు ప్రభావం మరీ ఎక్కువగా ఉంటే.. పదవ ఓవర్ ముగిసిన తర్వాత కొత్త బంతిని తీసుకోవచ్చు. ఈ రూల్ను ఢిల్లీతో మ్యాచ్లో హార్దిక్ పాండ్యాతో రోహిత్ అమలు చేయించాడు. జోరు మీదున్న ఢిల్లీకి అడ్డుకట్ట వేసేందుకు స్పిన్నర్ కర్ణ్ శర్మకు కొత్త బంతిని ఇవ్వాలని డగౌట్ నుంచి సూచించాడు. రోహిత్ ఇచ్చిన ఈ సలహా బాగా వర్కౌట్ అయింది. 14, 16 ఓవర్లలో కర్ణ్ ట్రిస్టస్ స్టబ్స్, కేఎల్ రాహుల్ రూపంలో కీలక వికెట్లు తీశాడు. ఇక కరుణ్ నాయర్ను మిచెల్ శాంట్నర్ను పెవిలియన్కు పంపాడు. ఈ నేపథ్యంలో 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ అయి.. ఢిల్లీ ముంబై చేతిలో ఓటమిని చవిచూసింది.కోచ్లు అహాన్ని పక్కన పెట్టాలిఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ అద్భుతం చేశాడు. స్పిన్నర్లు.. ముఖ్యంగా కర్ణ్ శర్మను రంగంలోకి దించాలని హెడ్కోచ్ మహేళ జయవర్దనేకు చెప్పాడు. కర్ణ్ ఏకంగా మూడు వికెట్లు తీసి మ్యాచ్ను మలుపు తిప్పాడు.నిజంగా ఇదొక అద్భుతమైన వ్యూహం. కానీ జయవర్ధనే తొలుత రోహిత్ మాటకు అంగీకరించలేదనిపించింది. కొన్నిసార్లు కోచ్లు తమ అహాన్ని పక్కన పెట్టి.. జట్టు ఎలా బాగుపడుతుందనే విషయం మీదే దృష్టి పెట్టాలి.రోహిత్ శర్మ డగౌట్ నుంచి ఇన్పుట్స్ ఇచ్చాడు. కానీ జయవర్ధనేకు అవి నచ్చినట్లు లేదు. ఒకవేళ జయవర్ధనే చెప్పినట్లు విని ఉంటే ఢిల్లీ చేతిలో ముంబై ఓడిపోయేది. రోహిత్ కెప్టెన్. దిగ్గజ సారథి.. కెప్టెన్ ఎప్పుడూ కెప్టెన్లాగే ఆలోచిస్తాడు. రోహిత్ వ్యూహం వల్లే ముంబై గెలిచింది’’ అని చెప్పుకొచ్చాడు.చదవండి: మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..కెప్టెన్గా అది పంత్ నిర్ణయం.. నాకు బంతి ఇస్తాడేమోనని వెళ్లా.. కానీ..: బిష్ణోయిAgar miss kiye toh ab dekho - 𝐊𝐚𝐫𝐧 𝐒𝐡𝐚𝐫𝐦𝐚 𝐤𝐚 𝐁𝐡𝐨𝐨𝐥 𝐁𝐡𝐮𝐥𝐚𝐢𝐲𝐚𝐚 🌀#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #DCvMIpic.twitter.com/T8KabriAbK— Mumbai Indians (@mipaltan) April 13, 2025 -
రోహిత్ శర్మ మాస్టర్ మైండ్.. డగౌట్ నుంచే మ్యాచ్ తిప్పేసిన హిట్మ్యాన్
ఐపీఎల్-2025 (IPL 2025) ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు తిరిగి గెలుపు బాట పట్టింది. ఈ మెగా ఈవెంట్లో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఉత్కంఠపోరులో 12 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. ఓ దశలో సునయాసంగా మ్యాచ్ గెలిచేలా కన్పించిన ఢిల్లీ.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో తొలి ఓటమి చవిచూడాల్సింది. అయితే ఢిల్లీ వికెట్లను కుప్పకూల్చడంలో ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ కీలక పాత్ర పోషించాడు. డగౌట్ నుంచే తన మాస్టర్ మైండ్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు హిట్మ్యాన్.అసలేమి జరిగిందంటే?ఈ మ్యాచ్లో 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఆడింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 13 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఢిల్లీ విజయానికి 7 ఓవర్లలో 61 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో అప్పటికే రాహుల్, స్టబ్స్ ఉన్నారు. ఇదే సమయంలో బంతి మార్చాలని అంపైర్లకు ముంబై జట్టు అభ్యర్థించింది. వారి అభ్యర్ధను అంగీకరించిన అంపైర్లు బంతిని మార్చారు. వెంటనే డగౌట్లో ఉన్న రోహిత్ శర్మ రంగంలోకి దిగాడు. రోహిత్.. హెడ్ కోచ్ జయవర్దనే, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేతో మాట్లాడి ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ కర్ణ్ శర్మతో బౌలింగ్ చేయించాలని హార్దిక్కు సైగలు చేశాడు. రోహిత్ మాట విన్న పాండ్యా.. కర్ణ్ను 14వ ఓవర్ వేసేందుకు ఎటాక్లో తీసుకొచ్చాడు.అయితే రోహిత్ ఊహించినట్టే ఆ ఓవర్లో ముంబై ఇండియన్స్కు ఫలితం దక్కింది. అద్భుతమైన ఫామ్లో స్టబ్స్ భారీ షాట్కు ప్రయత్నించి తన వికెట్ను కోల్పోయాడు. బంతి పొడిగా ఉన్నందున, రోహిత్ ప్రణాళిక సరిగ్గా పనిచేసింది. ఆ తర్వాత 16 ఓవర్ వేసిన కర్ణ్..కేఎల్ రాహుల్ను సైతం బోల్తా కొట్టించాడు. రాహుల్ వికెట్తో మ్యాచ్ ముంబై వైపు మలుపు తిరిగింది. కాగా డగౌట్లో కూర్చుని మ్యాచ్ ఫలితాన్నే మార్చేసిన రోహిత్ శర్మపై అభిమానులు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. రోహిత్ నంబర్ వన్ కెప్టెన్ ఎలా అయ్యాడో మరోసారి నిరూపించుకున్నాడని నెటిజన్లు కొనియాడుతున్నారు. అయితే ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ(18).. ఫీల్డింగ్లో బయటకు వెళ్లిపోయాడు. అతడి స్ధానంలోనే కర్ణ్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగాడు. #MI's spinners 𝙩𝙪𝙧𝙣𝙚𝙙 the game on its head! 🙌Here’s how the experts broke down their coaching staff's spot-on call to bring them in at just the right moment 🗣#IPLonJioStar 👉 #LSGvCSK | MON, 14th APR, 6:30 PM LIVE on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! pic.twitter.com/POK9x6m9Qc— Star Sports (@StarSportsIndia) April 13, 2025 -
IPL 2025: రోహిత్ శర్మ మళ్లీ ఫెయిల్.. వెళ్లి రెస్ట్ తీసుకో భయ్యా?
ఐపీఎల్-2025లో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. అతడి ఆట తీరు ఏ మాత్రం మారడం లేదు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో రోహిత్ తీవ్ర నిరాశపరిచాడు.12 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. రెండు ఫోర్లు, ఒక సిక్సర్తో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. స్పిన్నర్ విప్రజ్ నిగమ్ బౌలింగ్ రివర్స్ స్వీప్ ఆడి వికెట్ల ముందు హిట్మ్యాన్ దొరికిపోయాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ.. 11.20 సగటుతో కేవలం 56 పరుగులు మాత్రమే చేశాడు. 0,8,13,17,18 ఇవి వరుసగా రోహిత్ శర్మ చేసిన స్కోర్లు ఇవి. దీంతో మరోసారి విఫలమైన రోహిత్ను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. ఆడింది చాలు వెళ్లి రెస్టు తీసుకో రోహిత్ అంటూ పోస్ట్లు చేస్తున్నారు. మరికొంత మంది విరాట్ కోహ్లి అద్బుతంగా ఆడుతుంటే నీకు ఏమైంది రోహిత్ అంటూ ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. గతేడాది ఐపీఎల్ సీజన్లో కూడా రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. ఇక మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ దూకుడుగా ఆడుతోంది. 13 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 2 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. Rohit Sharma has become a joke . Failed again and again.. But no former indian player will talk about it because all these former players lick Rohit Sharma's feet.Pure liability in cricket. pic.twitter.com/wvIVk8GwRM— Suprvirat (@ishantraj51) April 13, 2025 -
IPL 2025: బీభత్సం సృష్టించిన గాలి దుమారం.. భయంతో కేకలు పెట్టిన రోహిత్ శర్మ
దేశ రాజధాని ఢిల్లీని నిన్న (ఏప్రిల్ 11) సాయంత్రం గాలి దుమారం వణికించింది. ఇది సృష్టించిన బీభత్సానికి జనం అల్లాడిపోయారు. ప్రజా రవాణా స్తంభించిపోయింది. విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. గాలి దూమారం ప్రభావం ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ సెషన్పై కూడా పడింది. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ నిమిత్తం ఆ జట్టు నిన్న సాయంత్రం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుంది. Straight out of a 🌪️ movie#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #DCvMI pic.twitter.com/Tv7j3ILf9v— Mumbai Indians (@mipaltan) April 11, 2025ఈ క్రమంలో గాలి దుమారం బీభత్సం సృష్టించడంతో మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న ముంబై ఇండియన్స్ బృంద సభ్యులు భయంతో వణికిపోయారు. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ కేకేలు పెడుతూ బృంద సభ్యులను మైదానం నుంచి తిరిగి రమ్మంటూ అభ్యర్థించాడు. దీనికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ యాజమాన్యం తమ అధికారిక సోషల్మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో రోహిత్ కేకేలు పెడుతుండగా.. దీపక్ చాహర్, కోచ్లు మహేల జయవర్ధనే, లసిత్ మలింగ డగౌట్ వైపు పరిగెత్తుకుంటూ వస్తారు.రోహిత్.. సహచరులను మైదానం వీడి సురక్షితంగా డగౌట్కు చేరుకోవాలని కేకేలు పెడుతూనే తన సహజ శైలిలో జోక్లు వేశాడు. తనవైపు ఫోకస్ పెట్టిన కెమెరామెన్ను "నా ముఖం ఏం చూపిస్తున్నావు. ఆ వీడియో తీసుకో" అంటూ అరిచాడు. గాలి దూమారం ధాటికి స్టేడియంలో వస్తువులు గాల్లో ఎగురుతూ కనిపించాయి.ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ ఏప్రిల్ 13వ తేదీ రాత్రి జరుగనుంది. ఈ మ్యాచ్ సమయానికి ఢిల్లీలోని వాతావరణం క్లియర్గా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్కు వర్షం నుంచి కాని, గాలి దుమారం నుంచి కాని ఎలాంటి ముప్పు లేదని ప్రకటన విడుదల చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. ప్రస్తుత సీజన్లో ఢిల్లీ అజేయ జట్టుగా కొనసాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో నాలుగు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ముంబై ఇండియన్స్ విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుత సీజన్లో ఆడిన ఐదు మ్యాచ్ల్లో నాలుగింట ఓడి పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. ఐదు మ్యాచ్ల్లో నాలుగింట గెలిచి గుజరాత్ టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా.. కేకేఆర్, ఆర్సీబీ, పంజాబ్, లక్నో, రాజస్థాన్ వరస స్థానాల్లో ఉన్నాయి. సన్రైజర్స్, సీఎస్కే చివరి నుంచి రెండు స్థానాల్లో నిలిచాయి.ఇవాళ (ఏప్రిల్ 12) డబుల్ హెడర్ మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్లో లక్నోతో గుజరాత్ తలపడనుండగా.. రాత్రి మ్యాచ్లో పంజాబ్ను సన్రైజర్స్ ఢీకొట్టనుంది. -
ఢిల్లీలో దుమ్ము తుపాను, వర్ష బీభత్సం.. 205 విమాన సర్వీసులు ఆలస్యం
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు వీస్తూ.. దుమ్ము తుపానుతో పాటు మోస్తారు వర్షం కురిసింది. ఈ క్రమంలో దుమ్ము, ధూళితో కూడిన గాలులు వీయడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు.. ఢిల్లీ క్రికెట్ స్టేడియంలో ముంబై టీమ్ ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఈ తుపాన్ రావడంతో దీనికి సంబంధించిన వీడియోను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ట్విట్టర్లో షేర్ చేశారు.వివరాల ప్రకారం.. దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ఈదురుగాలులు వీస్తూ మోస్తరు వర్షం కురిసింది. అంతకుముందు.. దుమ్ము తుపాను బీభత్సం సృష్టించింది. బలమైన గాలుల కారణంగా పలుచోట్ల కొన్నిచోట్ల చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. ఈదురుగాలుల ఎఫెక్ట్తో ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు 205 విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. దాదాపు 50 విమాన సర్వీసులను దారి మళ్లించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.Crazy wx! Gale and dust-storms at Dwarka, New Delhi.Heard from a friend at IGI airport, his aircraft was moving and guess what, he’s still on ground. You can imagine the wind speed then. #delhirain #delhiweather pic.twitter.com/BIOdq0bOq7— Anirban 👨💻✈️ (@blur_pixel) April 11, 2025ఈ నేపథ్యంలోనే ఎయిరిండియా, ఇండిగో విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. విమానాల రాకపోకల ఆలస్యం కారణంగా ఎయిర్పోర్టులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 12 గంటలుగా విమానాశ్రయంలోనే వేచి చూసినట్లు ఒక మహిళ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ప్రయాణికులు ట్విట్టర్ వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైకి వెళ్లేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చాం. ఉదయం 12 గంటలకు బుక్ చేసుకున్న విమానం కాకుండా మరొకటి ఎక్కాలని అధికారులు సూచించారు. అదికాస్త ఎక్కాక అందులోనే 4 గంటల పాటు కూర్చోబెట్టి తర్వాత దింపేశారు అని ఒక ప్రయాణికుడు తెలిపారు.Delhi NCR is under a heavy dust storm! Visuals from Gurgaon — very intense dust storm hits Gurugram. Stay safe everyone! pic.twitter.com/IqGVen4kLb— The Curious Quill (@PleasingRj) April 11, 2025ఇక, శ్రీనగర్ నుండి ఢిల్లీకి ముంబైకి సాయంత్రం 4 గంటలకు కనెక్టింగ్ విమానం ఉంది. మా విమానం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ కావాల్సి ఉంది, కానీ దుమ్ము తుఫాను కారణంగా చండీగఢ్కు మళ్లించబడింది. ఆ తర్వాత రాత్రి 11 గంటలకు తిరిగి ఢిల్లీకి వెళ్లింది అని ఎయిర్ ఇండియా విమానంలో ఉన్న మరో ప్రయాణీకుడు తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయం అయి ఉండి సరైన సమాచారం ఇవ్వకపోవడంపై ఒక ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తంచేశారు.Flight Indigo 6E2397 jammu To delhi experiencing a dust storm, affecting takeoffs and landings and potentially causing air traffic congestion at delhi airport we are diverted to jaipur after long 4 hrs waiting to land at delhi now waiting in aircraft at jaipur airport for… pic.twitter.com/2GDeO19UK1— Dr. Safeer Choudhary (@aapkasafeer) April 11, 2025 Very strong #DustStorm Hit Delhi ncr#DelhiWeather pic.twitter.com/REZY7o8v5y— Raviiiiii (@Ravinepz) April 11, 2025आज दिल्ली में बवंडर 🌪️ आ गया …सभी अपने घर में सुरक्षित रहें 🙏🏻#delhiweather #sandstorm #DelhiRains #delhi pic.twitter.com/OCf4ZE7BfS— Shivam Rajput (@SHIVAMespeare) April 11, 2025 మరోవైపు.. ఢిల్లీలోని కక్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఈదురుగాలులు వీచాయి. ఈ క్రమంలో ప్లేయర్స్ను గ్రౌండ్ నుంచి లోపలికి వెళ్లాలని రోహిత్ శర్మ హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ROHIT SHARMA, WHAT A CHARACTER 😀👌 pic.twitter.com/Ifz1YlNHX4— Johns. (@CricCrazyJohns) April 11, 2025 कल रात आए आंधी–तूफान का भयानक मंजर देखिए, गुरुग्राम का हैं वीडियो#Gurugram #Thunderstorm #WeatherUpdate #DelhiWeather pic.twitter.com/EMu90l1Bjf— Vistaar News (@VistaarNews) April 12, 2025 -
RCB VS DC: హిట్మ్యాన్ సిక్సర్ల రికార్డుకు ఎసరు పెట్టిన విరాట్ కోహ్లి
రికార్డుల రారాజుగా పేరున్న విరాట్ మరో భారీ రికార్డుపై కన్నేశాడు. ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా గుర్తింపు పొందేందుకు మరో ఐదు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. నేటి వరకు ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్గా రోహిత్ శర్మ రికార్డుల్లో ఉన్నాడు. రోహిత్ ఐపీఎల్లో 256 ఇన్నింగ్స్ల్లో 282 సిక్సర్లు బాదాడు. 248 ఇన్నింగ్స్ల్లో 278 సిక్సర్లు బాదిన విరాట్ మరో 5 సిక్సర్లు కొడితే హిట్మ్యాన్ రికార్డును బద్దలు కొడతాడు. ఐపీఎల్ 2025లో నేడు (ఏప్రిల్ 10) ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగబోయే మ్యాచ్లో విరాట్ ఈ సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టేందుకు ఆస్కారముంది. ఈ మ్యాచ్లో విరాట్ ఐదు సిక్సర్లతో పాటు హాఫ్ సెంచరీ కూడా చేస్తే మరో భారీ రికార్డును కూడా సొంతం చేసుకుంటాడు. ప్రస్తుతం టీ20ల్లో 99 హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ నేటి మ్యాచ్లో మరో హాఫ్ సెంచరీ చేస్తే హాఫ్ సెంచరీల సెంచరీని పూర్తి చేసుకుంటాడు.ఓవరాల్గా చూస్తే ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ 141 ఇన్నింగ్స్ల్లో ఏకంగా 357 సిక్సర్లు బాదాడు. గేల్ తర్వాత రోహిత్, కోహ్లి, ధోని, డివిలియర్స్ ఉన్నారు.ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 ఆటగాళ్లు..క్రిస్ గేల్- 357రోహిత్ శర్మ- 282విరాట్ కోహ్లి- 278ఎంఎస్ ధోని- 259ఏబీ డివిలియర్స్- 251కాగా, ఐపీఎల్ ప్రారంభం నుంచి సిక్సర్ల వీరుడిగా పేరున్న రోహిత్ శర్మ గత రెండు సీజన్ల నుంచి కాస్త మెత్తబడ్డాడు. 2024 సీజన్ నుంచి ఇప్పటివరకు రోహిత్ కేవలం 25 సిక్సర్లు మాత్రమే బాదాడు. సిక్సర్ల విషయంలో రోహిత్.. సహచరుడు విరాట్ కంటే ఎప్పుడూ ఓ అడుగు ముందే ఉండేవాడు. అలాంటిది గత సీజన్ నుంచి రోహిత్ విరాట్ కంటే వెనుకపడిపోయాడు. 2024 సీజన్ నుంచి రోహిత్ కేవలం 25 సిక్సర్లు మాత్రమే బాదగా.. విరాట్ 44 సిక్సర్లు కొట్టాడు. ప్రస్తుత సీజన్లో విరాట్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 6 సిక్సర్లు కొట్టాడు. ఈ సీజన్లో లక్నో ఆటగాడు నికోలస్ పూరన్ 5 మ్యాచ్ల్లో ఏకంగా 24 సిక్సర్లు బాది లీడింగ్ సిక్స్ హిట్టర్గా ఉన్నాడు. పూరన్ తర్వాత మిచెల్ మార్ష్ (15), శ్రేయస్ అయ్యర్ (14) ఉన్నారు.ఆర్సీబీ, ఢిల్లీ మధ్య ఇవాళ జరుగబోయే మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఇరు జట్లు అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్నాయి. గత రికార్డుల ప్రకారం ఢిల్లీపై ఆర్సీబీ పైచేయి సాధించినా.. ప్రస్తుత ఫామ్ను బట్టి చూస్తే ఢిల్లీకే విజయావకాశలు ఎక్కువగా ఉన్నాయి. ఇరు జట్లలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమాంతర శక్తులు ఉన్నాయి. ఢిల్లీకి బౌలింగ్లో మిచెల్ స్టార్క్ ఉండగా.. ఆర్సీబీకి హాజిల్వుడ్ ఉన్నాడు. ఢిల్లీ తరఫున స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఉండగా.. ఆర్సీబీకి విరాట్ కోహ్లి ఉన్నాడు. ఆర్సీబీలో ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, లివింగ్స్టోన్ లాంటి విధ్వంసకర వీరులు ఉండగా.. ఢిల్లీ జట్టులో జేక్ ఫ్రేజర్, డుప్లెసిస్, ట్రస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ లాంటి చిచ్చరపిడుగులు ఉన్నారు. మొత్తంగా ఇరు జట్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్నాయి.తుది జట్లు (అంచనా)..ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, యష్ దయాల్, రసిఖ్ సలామ్/సుయాష్ శర్మఢిల్లీ క్యాపిటల్స్: ఫాఫ్ డు ప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్గర్క్, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ/T నటరాజన్, ముఖేష్ కుమార్ -
భారమైనప్పుడు జట్టును పట్టుకుని వేలాడకూడదు.. కేకేఆర్ ఆల్రౌండర్ సంచలన వ్యాఖ్యలు
భారత స్టార్ క్రికెటర్లు ఎంఎస్ ధోని, రోహిత్ శర్మకు చురక తగిలేలా కేకేఆర్ వెటరన్ ఆల్రౌండర్ మొయిన్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వెటరన్ ఆటగాళ్లు వ్యక్తిగత లక్ష్యాల కోసం కెరీర్లను పొడిగించుకోకూడదని అలీ అన్నాడు. వయసు పైబడినా, జట్టు ప్రయోజనాలకు ఉపయోగపడకపోయినా స్వార్థపూరితంగా జట్టులో కొనసాగడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు.సీనియారిటీ, పదవీ విరమణపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. వ్యక్తిగత లక్ష్యాల కోసం ఏ ఆటగాడూ కెరీర్ను పొడిగించుకోకూడదు. ఆటగాళ్లు సీనియారిటీ లేదా స్టార్డమ్తో సంబంధం లేకుండా జట్టు ప్రయోజనాలే ముఖ్యం అనుకోవాలి. వెటరన్లు సరిగ్గా పెర్ఫార్మ్ చేయనప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువకులు, ప్రతిభావంతులకు మార్గం చూపాలి. పేరున్న ఆటగాడనో లేక భారీ సంఖ్యలో అభిమానులున్నారనో జట్టును పట్టుకుని వేలాడకూడదు. వాస్తవికంగా ఆలోచించాలి. జట్టుకు ఏమైనా ఉపయోగపడుతున్నామా లేదా అన్నది పరీక్షించుకోవాలి. జట్టుకు భారమైనప్పుడు హుందాగా తప్పుకోవాలని అన్నాడు. మొయిన్ చేసిన ఈ వ్యాఖ్యలు భారత స్టార్ క్రికెటర్లు, ప్రస్తుతం ఫామ్ లేమితో సతమతమవుతున్న ధోని, రోహిత్లకు చురక తగిలేలా ఉన్నాయి. ఈ ఇద్దరు వెటరన్ క్రికెటర్లు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025లో పేలవంగా ఆడుతూ జట్టుకు భారమైపోయారు. చాలామంది వీరు తప్పుకుంటే బాగుంటుందని అనుకుంటున్నప్పటికీ వారిలో ఏ మాత్రం చలనం లేదు. మాలో ఇంకా ఆడే సత్తా ఉందన్నట్లు ఊదరగొడుతున్నారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ధోని అయినా కాస్త పర్వాలేదనిపించాడు కానీ రోహిత్ అయితే దారుణంగా విఫలమవుతున్నాడు. ధోని రోహిత్ కంటే దాదాపు ఐదేళ్లు పెద్ద వాడైనప్పటికీ తనకు చేతనైన ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ధోని, రోహిత్ ప్రాతినిథ్యం వహిస్తున్న సీఎస్కే, ముంబై జట్లు కూడా పేలవంగా ఆడతున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ల్లో తలో నాలుగింట ఓడి చివరి నుంచి రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. సీఎస్కే, ముంబై ఐపీఎల్లో ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో తలో ఐదు టైటిళ్లు నెగ్గాయి.మొయిన్ విషయానికొస్తే.. ఈ ఇంగ్లిష్ క్రికెటర్ కూడా వెటరన్ ఆటగాడే. ఇతని వయసు 37 ఏళ్లు. అయితే మొయిన్ సరిగ్గా పెర్ఫార్మ్ చేయనప్పుడు జాతీయ జట్టు నుంచి తప్పుకుని యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చాడు. ప్రస్తుతం అతను ఐపీఎల్లో కేకేఆర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్లో మొయిన్ తనకు అవకాశం వచ్చిన రెండు మ్యాచ్ల్లో ఐదు పరుగులు చేసి, రెండు వికెట్లు తీశాడు. మొయిన్కు ఇంగ్లండ్ తరఫున 68 టెస్టులు, 138 వన్డేలు, 92 టీ20లు ఆడిన అనుభవం ఉంది. -
Rohit Sharma: రోహిత్ శర్మకు అరుదైన గౌరవం..!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కనుంది. ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ పేరు మీద ఒక స్టాండ్ ఏర్పాటు చేసేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ ప్రకారం.. తాజాగా జరిగిన సమావేశంలో ఎంసీఎ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.భారత కెప్టెన్గా అతడి విజయాలను ఈ ప్రత్యేక గౌరవంతో గుర్తించాలని ఎంసీఎ భావిస్తోంది. అదే విధంగా వాంఖడే స్టేడియంలోని స్టాండ్స్, వాక్వేలకు శరద్ పవార్, దివంగత విలాస్రావ్ దేశ్ముఖ్, అజిత్ వాడేకర్, ఏక్నాథ్ సోల్కర్, దిలీప్ సర్దేశాయ్, డయానా ఎడుల్జీ వంటి దిగ్గజాల పేర్లు పెట్టాలని కొంతమంది ఎంసీఏ సభ్యులు సూచిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. దీనిపై ఎంసీఏ త్వరలోనే ఓ ప్రకటన విడుదల చేసే అవకాశముంది.ధోని తర్వాత..భారత క్రికెట్ చరిత్రలో కెప్టెన్గా రోహిత్ శర్మ తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. ఎంఎస్ ధోని తర్వాత భారత జట్టులో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ శర్మ భారత్కు టీ20 వరల్డ్కప్-2024, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025ను అందించాడు.ఎంఎస్ ధోని కెప్టెన్గా భారత్కు 3 ఐసీసీ ట్రోఫీలను అందించాడు. ధోని కెప్టెన్సీలో 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని ఇండియా గెలుచుకుంది. రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు.చదవండి: IPL 2025: శార్ధూల్ ఠాకూర్ 'సెంచరీ'.. స్పెషల్ జెర్సీ అందజేత! వీడియో -
అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల..: హార్దిక్
ఐపీఎల్-2025 (IPL 2025)లో ముంబై ఇండియన్స్కు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గత మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడిన హార్దిక్ సేన.. తాజాగా సొంత మైదానం వాంఖడేలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ముందు తలవంచింది. ఆఖరి వరకు పోరాడినా పన్నెండు పరుగుల తేడాతో ఓడిపోయి పరాభవాన్ని మూటగట్టుకుంది.ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya).. తాము తీవ్ర నిరాశకు గురైనట్లు తెలిపాడు. వికెట్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉందని.. కాబట్టి తాను బౌలర్లను నిందించబోనని స్పష్టం చేశాడు. గత మ్యాచ్లో పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డ తిలక్ వర్మ ఈరోజు మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని హర్షం వ్యక్తం చేశాడు.జస్ప్రీత్ బుమ్రా రాకతో జట్టు మరింత పటిష్టంగా మారిందని.. అనుకున్న ఫలితాలు రాబట్టేందుకు సానుకూల దృక్పథంతో ముందుకు సాగటం ముఖ్యమని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. కాగా ఆర్సీబీతో సోమవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ చేసింది.ఆర్సీబీ బ్యాటర్లు ధనాధన్ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి (42 బంతుల్లో 67), దేవదత్ పడిక్కల్ (22 బంతుల్లో 37), కెప్టెన్ రజత్ పాటిదార్ (32 బంతుల్లో 64) దంచికొట్టగా.. వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ (19 బంతుల్లో 40 నాటౌట్)తో దుమ్ములేపాడు. ఫలితంగా ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా రెండేసి వికెట్లు తీయగా.. విఘ్నేశ్ పుతూర్కు ఒక వికెట్ దక్కింది. అయితే, బుమ్రా నాలుగు ఓవర్ల కోటాలో 29 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. ఇక లక్ష్య ఛేదనలో ముంబై ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ (17), రియాన్ రికెల్టన్ (17) వికెట్లు కోల్పోయింది.తిలక్, హార్దిక్ పోరాటం వృథావిల్ జాక్స్ (22), సూర్యకుమార్ యాదవ్ (28) కూడా నిరాశపరచగా.. తిలక్ వర్మ (29 బంతుల్లో 56), హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 42) అద్భుత ఇన్నింగ్స్తో గెలుపు ఆశలు రేకెత్తించారు. అయితే, బెంగళూరు బౌలర్ల ప్రతాపం ముందు వీరు తలవంచకతప్పలేదు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయిన ముంబై.. 209 పరుగుల వద్ద నిలిచిపోయి.. పరాజయాన్ని ఆహ్వానించింది.రోహిత్ రావడం వల్ల అతడు లోయర్ ఆర్డర్లోఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా స్పందిస్తూ.. ‘‘పరుగుల వరద పారింది. వికెట్ చాలా బాగుంది. అయితే, మేము ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. పిచ్ను చూసిన తర్వాత బౌలర్లను తప్పుపట్టడానికి ఏమీ లేదనిపించింది.ఇక బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానం జట్టుకు వెన్నెముక లాంటిది. గత మ్యాచ్కు రోహిత్ అందుబాటులో లేడు కాబట్టి నమన్ ధీర్ టాపార్డర్లో ఆడాడు. నమన్ బహుముఖ ప్రజ్ఞగల ఆటగాడు. అతడు ఏ స్థానంలోనైనా రాణించగలడు. రోహిత్ వచ్చాడు గనుక ఈసారి లోయర్ ఆర్డర్లో బరిలోకి దిగాడు.తిలక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడుతిలక్ వర్మ ఈరోజు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. గత మ్యాచ్లో అతడిని రిటైర్డ్ అవుట్గా వెనక్కి పిలిపించాలన్న మా కోచ్ నిర్ణయం సరైందేనని ఇప్పటికీ నమ్ముతున్నా. ఏదేమైనా పవర్ ప్లేలో పరుగులు రాబట్టడమే అత్యంత ముఖ్యం.ఈరోజు మధ్య ఓవర్లలోనూ మేము ఒకటి, రెండు సందర్భాల్లో గట్టిగా హిట్టింగ్ చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. డెత్ ఓవర్లలో ప్రత్యర్థి జట్టు బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయాం. ఇక బుమ్రా జట్టులోకి రావడం.. మా టీమ్ను ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలుపుతుందనడం అతిశయోక్తి కాదు.ఈరోజు తను బాగానే రాణించాడు. మా జట్టు ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతోనే ఉంటుంది. మా ఆటగాళ్లకు మేము అండగా ఉంటాం. తప్పక అనుకున్న ఫలితాలు రాబడతాం’’ అని చెప్పుకొచ్చాడు.చదవండి: గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్గా ఊహించని పేరు చెప్పిన కపిల్ దేవ్ A #TATAIPL Classic in every sense 🔥#RCB hold their nerves to seal a win after 1️⃣0️⃣ years against #MI at Wankhede! Scorecard ▶️ https://t.co/ArsodkwOfO#TATAIPL | #MIvRCB | @RCBTweets pic.twitter.com/uu98T8NtWE— IndianPremierLeague (@IPL) April 7, 2025 -
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
టీమిండియా మొట్టమొదటి ప్రపంచకప్ అందించిన కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev). ఈ దిగ్గజ ఆల్రౌండర్ సారథ్యంలో 1983 నాటి వన్డే వరల్డ్కప్ ఫైనల్లో వెస్టిండీస్ను ఓడించి ట్రోఫీని ముద్దాడింది. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోని (MS Doni) నాయకత్వంలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకుంది.ఈ క్రమంలో సుదీర్ఘ విరామం తర్వాత గత రెండేళ్ల కాలంలో మరో రెండు ప్రపంచకప్ టైటిళ్లను టీమిండియా తన ఖాతాలో వేసుకుంది. రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీలో టీ20 ప్రపంచకప్-2024.. ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ట్రోఫీలను కైవసం చేసుకుంది.సూర్యకుమార్ యాదవ్కు పగ్గాలుఇక పొట్టి ప్రపంచకప్లో భారత్ను విజేతగా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ వారసుడిగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) హార్దిక్ పాండ్యా పేరును ప్రకటిస్తుందనుకుంటే.. సూర్యకుమార్ యాదవ్కు పగ్గాలు అప్పగించింది.మరోవైపు.. వన్డేలకు, టెస్టులకు రోహిత్ శర్మ కెప్టెన్గా కొనసాగుతుండగా.. ఆయా ఫార్మాట్లలో శుబ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా అతడికి డిప్యూటీలుగా వ్యవహరిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరుగనుండగా.. వన్డే వరల్డ్కప్ 2027లో జరుగనుంది.నా ఎంపిక మాత్రం హార్దిక్ పాండ్యానేఈ నేపథ్యంలో పరిమిత ఓవర్ల క్రికెట్ టీమిండియాకు సరైన కెప్టెన్ ఎవరన్న అంశంపై దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు. ‘‘నా వరకు హార్దిక్ పాండ్యానే టీమిండియా వైట్బాల్ కెప్టెన్గా ఉండాలి. ఈ పదవికి చాలా మంది పోటీలో ఉన్నారని తెలుసు.అయితే, నా ఎంపిక మాత్రం హార్దిక్ పాండ్యానే. అతడు యువకుడు. వచ్చే రెండు ఐసీసీ ఈవెంట్ల కోసం అతడి చుట్టూ జట్టు నిర్మిస్తే బాగుంటుంది. నిజానికి పాండ్యా టెస్టు క్రికెట్ కూడా ఆడితే బాగుంటుంది. కానీ అతడు చాలా కాలంగా రెడ్ బాల్ క్రికెట్కు దూరంగా ఉన్నాడు. అందుకే టీమిండియాకు మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్ల అవసరం ఏర్పడింది’’ అని కపిల్ దేవ్ అన్నాడు. ‘మైఖేల్’తో మాట్లాడుతూ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.గాయాల బెడద ఎక్కువని పక్కన పెట్టారుఅయితే, హార్దిక్ను కాదని సూర్యను టీ20 కెప్టెన్గా నియమించిన సమయంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇందుకు గల కారణాన్ని వెల్లడించాడు. పేస్బౌలింగ్ ఆల్రౌండర్ అయిన హార్దిక్కు గాయాల బెడద ఎక్కువని.. అతడి లాంటి అరుదైన ఆటగాడిని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే కెప్టెన్సీ భారం మోపలేదని స్పష్టం చేశాడు.కపిల్ దేవ్ మాత్రం ఇలాకానీ.. కపిల్ దేవ్ మాత్రం పరిమిత ఓవర్ల క్రికెట్లో సూర్య, శుబ్మన్లను కాదని హార్దిక్ పాండ్యా పేరును మరోసారి కెప్టెన్సీ ఆప్షన్గా తెరమీదకు తీసుకురావడం విశేషం. కాగా టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్నారు. తదుపరి జూన్లో ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో జాతీయ జట్టు తరఫున విధుల్లో చేరనున్నారు.ఇక క్యాష్ రిచ్ లీగ్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా గతేడాది నియమితుడైన హార్దిక్ పాండ్యా.. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. ఐపీఎల్-2024లో పద్నాలుగు మ్యాచ్లకు హార్దిక్ సేన కేవలం నాలుగే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో మూడు ఓడిపోయింది. చదవండి: ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన ఇంగ్లండ్ ఆటగాడు -
MI vs RCB: యార్కర్తో దడ పుట్టించిన బుమ్రా.. వీడియో వైరల్
ఐపీఎల్-2025 (IPL 2025)లోనూ ముంబై ఇండియన్స్ పరాజయ పరంపర కొనసాగుతోంది. గతేడాది పద్నాలుగింట.. నాలుగు మ్యాచ్లే గెలిచిన హార్దిక్ సేన.. ఈసారి ఓటమితో సీజన్ను ఆరంభించింది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో మూడు ఓడిపోయి విమర్శలు మూటగట్టుకుంటోంది.బ్యాటర్లు, బౌలర్ల సమిష్టి వైఫల్యం ముంబైపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇలాంటి తరుణంలో ముంబై ఇండియన్స్కు అదిరిపోయే శుభవార్త అందింది. ఆ జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. వాంఖడేలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సోమవారం నాటి మ్యాచ్కు అందుబాటులోకి వచ్చాడు.యార్కర్తో దడ పుట్టించిన బుమ్రా..ఇక ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఈ పేస్ గుర్రం.. నెట్ సెషన్లో తన బౌలింగ్ మాయాజాలంతో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. బుమ్రా వేసిన పదునైన యార్కర్ దెబ్బకు స్టంప్స్ ఎగిరిపోగా.. ఆ బంతిని ఎదుర్కొనేందుకు ప్రయత్నించిన బ్యాటర్ బ్యాలెన్స్ చేసుకోలేక కిందపడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.రెండు నెలల విరామం తర్వాతకాగా బుమ్రా రాకతోనైనా తమ తలరాత మారుతుందని ముంబై జట్టు వేయికళ్లతో ఎదురుచూస్తోంది. ఇక ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్లో అదరగొట్టిన జస్ప్రీత్ బుమ్రా.. సిడ్నీలో జరిగిన ఆఖరి టెస్టు సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. వెన్నునొప్పితో విలవిల్లాడిన అతడు .. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత చాలా రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాడు.అయితే, ఫిట్నెస్ సాధించని కారణంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్కు కూడా బుమ్రా దూరమయ్యాడు. అదే విధంగా.. ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్లకు కూడా దూరమైన ఈ రైటార్మ్ పేసర్.. రీఎంట్రీ ఇచ్చేందుకు సన్నద్ధమయ్యాడు. కాగా జనవరి తర్వాత బుమ్రా కాంపిటేటివ్ క్రికెట్ బరిలోకి దిగనుండటం ఇదే తొలిసారి.రోహిత్ కూడామరోవైపు.. గాయం వల్ల గత మ్యాచ్కు దూరమైన ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్, మాజీ సారథి రోహిత్ శర్మ కూడా తిరిగి జట్టుతో చేరాడు. వీరిద్దరి రాకతో ముంబై ఇండియన్స్ శిబిరంలో సరికొత్త ఉత్సాహం నిండింది. కాగా ఆర్సీబీపై బుమ్రాకు అద్భుతమైన రికార్డు ఉంది. ఇది బుమ్రా వర్సెస్ ఆర్సీబీఇప్పటి వరకు బెంగళూరు జట్టుతో తాను ఆడిన 19 మ్యాచ్లలో కలిపి బుమ్రా 29 వికెట్లు తీయడం గమనార్హం. అందుకే సోమవారం నాటి పోరును బుమ్రా వర్సెస్ ఆర్సీబీగా అభివర్ణిస్తూ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుమ్రా ఆర్సీబీ బ్యాటర్లకు చుక్కలు చూపించడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు.ఇక ఆరంభ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన ముంబై ఇండియన్స్.. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ చేతిలోనూ పరాజయం పాలైంది. అనంతరం కోల్కతా నైట్ రైడర్స్పై విజయం సాధించిన హార్దిక్ సేన.. ఆఖరిగా లక్నో సూపర్ జెయింట్స్తో తలపడి మరో ఓటమిని మూటగట్టుకుంది. ప్రస్తుతం కేవలం రెండు పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: ఇలా వచ్చి.. అలా వెళ్లారు.. అసలేం చేస్తున్నారు? కావ్యా మారన్ రియాక్షన్ వైరల్Goodnight Paltan! 😊#MumbaiIndians #PlayLikeMumbai pic.twitter.com/UYghtBvYMN— Mumbai Indians (@mipaltan) April 6, 2025 -
ఆర్సీబీతో మ్యాచ్.. ముంబై ఇండియన్స్కు డబుల్ గుడ్న్యూస్
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ కీలకపోరుకు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా సోమవారం(ఏప్రిల్ 7) వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందు ముందు ముంబై ఇండియన్స్కు డబుల్ గుడ్న్యూస్ అందింది. తొలి నాలుగు మ్యాచ్లకు గాయం కారణంగా దూరంగా ఉన్న ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. పునరాగామనానికి సిద్దమయ్యాడు.ఇప్పటికే ముంబై ఇండియన్స్ జట్టులోకి చేరిన బుమ్రా, సోమవారం ఆర్సీబీతో జరగనున్న మ్యాచ్లో ఆడనున్నాడు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ మహేల జయవర్ధనే ధ్రువీకరించాడు. జస్ప్రీత్ బుమ్రా ఫిట్గా ఉన్నాడని, ఆర్సీబీతో మ్యాచ్లో ఆడే అవకాశముందని జయవర్ధనే తెలిపాడు. ఆర్సీబీతో మ్యాచ్.. ముంబై ఇండియన్స్కు డబుల్ గుడ్న్యూస్మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్కు దూరమైన ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. రోహిత్ నెట్స్లో ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. దీంతో రేపటి మ్యాచ్లో అతడు ఆడటం ఖాయమైంది. కాగా ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది. దీంతో ఆర్సీబీతో మ్యాచ్ ముంబైకి కీలకం కానుంది. -
15 ఏళ్ల పాటు కలిసి ఆడుతామని అస్సలు అనుకోలేదు: విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ.. భారత క్రికెట్ చరిత్రలో తమకంటూ ప్రత్యేకంగా కొన్ని పేజీలను లిఖించుకున్నారు. బ్యాటర్లుగానే కాకుండా కెప్టెన్లగానూ కీలక పాత్ర పోషించిన ఇద్దరు మేటి ఆటగాళ్లు. రోహిత్ శర్మ కెప్టెన్గా భారత్కు రెండు ఐసీసీ టైటిల్స్ను అందించగా.. విరాట్ కోహ్లి సారథిగా ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయాన్ని సాధించాడు. ఈ దిగ్గజ క్రికెటర్లు ప్రస్తుతం ఐపీఎల్-2025లో సీజన్లో బిజీబిజీగా ఉన్నారు. విరాట్ కోహ్లి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తుండగా.. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. సోమవారం(ఏప్రిల్ 7) వాంఖడే వేదికగా ఆర్సీబీ-ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. ఈ క్రమంలో రోహిత్ శర్మతో తనకు ఉన్న అనుబంధాన్ని విరాట్ కోహ్లి అభిమానులతో పంచున్నాడు. గత 15 ఏళ్లగా తమ క్రికెట్ జర్నీ ఎలా జరిగిందో కోహ్లి వెల్లడించాడు."ఎక్కువ కాలంగా ఒకరితో పాటు కలిసి ఆడుతున్నప్పుడు సహజంగా ఇద్దరి మధ్య మంచి అనుబంధమే ఉంటుంది. మా కెరీర్ ఆరంభంలో ఇద్దరికి ఒకే రకమైన సందేహలు ఉండేవి. ఆ సమయంలో ఆటపై మాకున్న అవగాహనను ఒకరితో మరొకరు పంచుకుంటూ, నేర్చుకుంటూ ముందుకు వెళ్లాము.కెప్టెన్సీ విషయంలో కూడా ఇద్దరూ కలిసి పనిచేశాము. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అని తారతామ్యం లేకుండా మా జర్నీని కొనసాగించాము. మా ఆలోచనలను ఒకరికొకరు పంచుకునేవాళ్లం. మేమిద్దరం ఎక్కువగా ఒకే దానికి కట్టుబడి ఉండేవాళ్లం. ఆ నమ్మకమే జట్టు కోసం మరింత పనిచేయాలనే స్పూర్తినిచ్చింది. మేము ఇద్దరం కలిసిన ఆడిన సమయాన్ని ఆస్వాదించాము. మేము మా కెరీర్లను మరింత సుదీర్ఘంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తాము. మేము ఇద్దరం భారత్ తరపున 15 ఏళ్ల పాటు కలిసి ఆడుతామని నా కెరీర్ తొలినాళ్లలో అస్సలు అనుకోలేదు. మా ప్రయాణంలో ఎన్నో విలువైన జ్ఞాపకాలు ఉన్నాయి. రోహిత్తో ఇంత కాలం పాటు కలిసి ఈ ప్రయాణాన్ని కొనసాగించగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది" అని కోహ్లి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: ప్రియురాలితో ఆసీస్ మహిళా క్రికెటర్ పెళ్ళి.. ఫోటోలు వైరల్KOHLI 🤝 ROHIT BOND ❤️- King talking about the special journey with Hitman over the years in Indian Cricket. pic.twitter.com/iL54z36xIO— Johns. (@CricCrazyJohns) April 6, 2025 -
ముంబైకి భారీ షాక్.. రోహిత్ శర్మకు గాయం
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్కు ముందు నెట్ ప్రాక్టీస్లో రోహిత్ శర్మ మోకాలికి గాయమైంది. దీంతో లక్నో మ్యాచ్కు రోహిత్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని టాస్ సందర్బంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెల్లడించాడు.అదేవిధంగా గాయంతో బాధపడుతున్న జస్ప్రీత్ బుమ్రా త్వరలోనే జట్టులోకి రానున్నట్లు పాండ్యా పేర్కొన్నాడు. ఇక రోహిత్ శర్మ స్ధానంలో రాజ్ అంగద్ బావా తుది జట్టులోకి వచ్చాడు. అయితే ఈ సీజన్లో రోహిత్ శర్మ తన మార్క్ చూపించలేకపోయాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన రోహిత్ కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు.తుది జట్లుముంబై ఇండియన్స్విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ శాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, దీపక్ చాహర్, విఘ్నేశ్ పుత్తూర్లక్నో సూపర్ జెయింట్స్ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్, కెప్టెన్) ఆయూష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ఆకాశ్ దీప్, అవేశ్ ఖాన్చదవండి: ద్రవిడ్ సెంచరీలు చేస్తే.. రూమ్లోకి వెళ్లి ఏడ్చేవాడిని: నితీష్ రాణా -
LSG Vs MI: ఏం చేయాలో.. అది సరిగ్గానే చేశాను: జహీర్ ఖాన్తో రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్-2025 (IPL 2025)లో ఇప్పటి వరకు తన మార్కు చూపలేకపోయాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఈ సీజన్లో మూడు మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్.. మొత్తంగా కేవలం 21 పరుగులే చేశాడు.తమ తొలి మ్యాచ్లో భాగంగా చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్తో పోరులో డకౌట్ అయిన రోహిత్.. గుజరాత్ టైటాన్స్పై ఎనిమిది పరుగులకే పెవిలియన్ చేరాడు. చివరగా కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో పదమూడు పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ (Rohit Sharma) బ్యాటింగ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇక ముంబై ఇండియన్స్ తదుపరి శుక్రవారం నాటి మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. ఇందుకోసం ఇప్పటికే లక్నోలోని ఏకనా స్టేడియంలో కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో లక్నో మెంటార్, టీమిండియా పేస్ దిగ్గజం జహీర్ ఖాన్ (Zaheetr Khan)తో రోహిత్ శర్మ జరిపిన సంభాషణ వైరల్గా మారింది.ఏం చేయాలో.. అది సరిగ్గానే చేశాను‘‘నేనేం చేయాలో అది సరిగ్గానే చేశాను. గతంలో చాలానే చేశాను. ఇప్పుడు కొత్త చేయాల్సింది ఏమీ లేదు’’ అని రోహిత్ జహీర్తో అన్నాడు. ఇంతలో లక్నో కెప్టెన్, టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ వచ్చి వెనుక నుంచి రోహిత్ శర్మను ఆలింగనం చేసుకున్నాడు. ఈ క్రమంలో చిన్నగా స్మైల్ ఇస్తూనే రోహిత్ సీరియస్గా తన సంభాషణను కొనసాగించాడు.ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. కాగా ఐపీఎల్-2025లో రోహిత్ వరుస వైఫల్యాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ గట్టిగానే విమర్శించాడు.మూస పద్ధతులకే పరిమితమైతే కుదరదు‘‘రోహిత్ ప్రస్తుతం గడ్డు దశను ఎదుర్కొంటున్నాడు. గత మూడు- నాలుగేళ్ల క్రితం ఉన్న పస ఇప్పుడు తన బ్యాటింగ్లో లేదు. ప్రతి ఉదయం కొత్తదే. అత్యుత్తమంగా రాణించాలంటే కఠినంగా శ్రమించకతప్పదు.పరిస్థితులు అతడి చేజారిపోయాయి. ఇప్పటికీ తన సహజమైన ప్రతిభ, మూస పద్ధతులకే పరిమితమైతే కుదరదు’’ అని మంజ్రేకర్ ఘాటు విమర్శలు చేశాడు. ఈ నేపథ్యంలో రోహిత్ జహీర్తో అన్న మాటలను మంజ్రేకర్కు ఆపాదిస్తూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.ఘనమైన చరిత్రఇదిలా ఉంటే.. గతేడాది ముంబై ఇండియన్స్.. కెప్టెన్గా రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. ఈ క్రమంలో 2025లో అతడు జట్టును వీడతాడనే ప్రచారం జరిగినా.. హిట్మ్యాన్ ముంబైతోనే కొనసాగుతున్నాడు. కాగా ముంబైకి ఐదుసార్లు ట్రోఫీ అందించిన చరిత్ర రోహిత్ శర్మకు ఉంది. క్యాష్ రిచ్ లీగ్లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి సారథి కూడా అతడే. ఇక ఐపీఎల్లో రోహిత్ శర్మ ఇప్పటి వరకు 260 మ్యాచ్లు ఆడి 6649 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు కూడా ఉన్నాయి. చదవండి: జట్టు మారనున్న తిలక్ వర్మ?.. HCA స్పందన ఇదేQ: For how long are you going to watch this reel? 😍A: Haaanjiiii 🫂💙#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #LSGvMI pic.twitter.com/e2oxVieoz2— Mumbai Indians (@mipaltan) April 3, 2025 -
మనీశ్ పాండే అరుదైన ఘనత.. ధోని, రోహిత్ సరసన
ఐపీఎల్లో టీమిండియా వెటరన్, కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాడు మనీశ్ పాండే అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి 18 వ సీజన్ వరకూ ప్రతీ సీజన్లోనూ మ్యాచ్ ఆడిన నాలుగో ప్లేయర్గా రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2025లో సీజన్లో సోమవారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ తరపున ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన పాండే.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో పాండే కంటే ముందు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఉన్నారు. పాండే ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్(2008)లో ముంబై ఇండియన్స్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఐపీఎల్-2009లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున పాండే సత్తాచాటాడు. అనంతరం 2011-2013 వరకు పూణే వారియర్స్ ఇండియాకు మనీశ్ ప్రాతనిథ్యం వహించాడు. 2014 ఐపీఎల్ సీజన్లో కేకేఆర్లోకి పాండే వచ్చాడు. ఆ ఏడాది కేకేఆర్ టైటిల్ సాధించడంలో పాండే కీలక పాత్ర పోషించాడు. 2014 నుంచి 2017 వరకు కేకేఆర్ తరపున ఆడిన పాండే.. అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్లోకి వచ్చాడు. 2018 నుంచి 2021 వరకు ఎస్ఆర్హెచ్కు పాండే ప్రాతినిథ్యం వహించాడు. 2022లో లక్నో సూపర్ జెయింట్స్, 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున పాండే ఆడాడు. మళ్లీ ఇప్పుడు తన సొంతగూటికి పాండే చేరాడు. ఐపీఎల్లో మొత్తంగా 172 మ్యాచులు ఆడిన పాండే.. అందులో 3869 పరుగులు స్కోరు చేశాడు. ఇందులో ఒక సెంచరీ.. 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా ధోనీ, కోహ్లి, రోహిత్లు మొత్తం 18 ఎడిషన్లలోనూ మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లు ఉన్నారు. ఇందులో కోహ్లి ఒక్కడే అన్ని మ్యాచ్లూ ఒకే ప్రాంఛైజీ తరపున ఆడాడు. ఈ టోర్నీ తొట్టతొలి సీజన్ నుంచి కోహ్లి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫునే ఆడుతున్నాడు.చదవండి: PAK vs NZ: పాక్తో రెండో వన్డే.. కివీస్కు భారీ షాక్! ఆరేళ్ల తర్వాత స్టార్ ప్లేయర్ రీఎంట్రీ -
సిరాజ్ సూపర్ బాల్.. రోహిత్ మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
ఐపీఎల్-2025లో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ వరుసగా రెండో మ్యాచ్లోనూ విఫలమయ్యాడు. సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్లో డకౌటైన రోహిత్ శర్మ.. ఇప్పుడు అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్పై అదే తీరును కనబరిచాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి హిట్మ్యాన్ ఔటయ్యాడు. గుజరాత్ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ అద్బుతమైన బంతితో రోహిత్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ముంబై ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్లో రోహిత్.. వరుసగా రెండు బంతుల్లో బౌండరీలు బాది మంచి టచ్లో కన్పించాడు. కానీ సిరాజ్ అదే ఓవర్లో ఐదో బంతిని రోహిత్కు ఆఫ్ స్టంప్ దిశగా గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని రోహిత్ శర్మ డిఫెండ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి అద్బుతంగా టర్న్ అయ్యి బ్యాట్, ప్యాడ్ మధ్యలో నుంచి వెళ్లి స్టంప్స్ను గిరాటేసింది. దీంతో రోహిత్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. రోహిత్ను ఔట్ చేసిన వెంటనే సిరాజ్ క్రిస్టియానో రొనాల్డో వింటేజ్ ''కాల్మా స్టైల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ తర్వాత ర్యాన్ రికెల్టన్ను కూడా సిరాజ్ బోల్తా కొట్టించాడు. కాగా మహ్మద్ సిరాజ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.Siraj is not effective🤣🤣pic.twitter.com/7cueS6DmvT— Mayank. (@PrimeKohlii) March 29, 2025 -
టీమిండియా కెప్టెన్గా శుబ్మన్ గిల్..!?
ఐపీఎల్-2025 సీజన్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడేందుకు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈ టూర్కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. పేలవ ఫామ్ కారణంగా ఇంగ్లండ్తో సిరీస్కు దూరంగా ఉండాలని రోహిత్ శర్మ నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.రోహిత్ ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐ తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. అతడు ఇంకా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో ఉన్నాడు. ఐపీఎల్-2025లో బుమ్రా ఆడేది అనుమానమే మారింది.బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరింత సమయం పట్టే అవకాశముంది. ఒకవేళ రోహిత్, బుమ్రా దూరమైతే.. ఇంగ్లండ్ పర్యటనలో భారత కెప్టెన్గా ఎవరు బాధ్యతలు చేపడాతరన్న ప్రశ్న అందరి మెదడలను తొలుస్తున్న ప్రశ్న. ఈ క్రమంలో రోహిత్, బుమ్రా బ్యాకప్గా శుబ్మన్ గిల్ పేరును సెలక్టర్లు పరిశీలిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.కాగా గిల్ ప్రస్తుతం వన్డేల్లో భారత జట్టు వైస్ కెప్టెన్గా ఉన్నాడు. అదేవిధంగా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఇక భారత క్రికెట్ జట్టు ఏడాది జూన్ 20న ఇంగ్లాండ్ పర్యటనను ప్రారంభిస్తుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ హెడింగ్లీలోని లీడ్స్ వేదికగా జరుగనుంది.తదుపరి నాలుగు టెస్ట్లు ఎడ్జ్బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్, కెన్నింగ్టన్ ఓవల్ వేదికలపై జరగనున్నాయి. అంతకంటే ముందు భారత-ఎ జట్టు రెండు అనాధికారిక టెస్టు మ్యాచ్లు ఆడనుంది. ఐపీఎల్-2025 చివరి వారంలో ఇంగ్లండ్ టూర్కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించే అవకాశముంది.చదవండి: సీఎస్కే బౌలర్ ‘ఓవరాక్షన్’.. ఇచ్చిపడేసిన కోహ్లి! నవ్వేసిన జడ్డూ -
అసాధారణ విజయాలు.. మేమంతా అందుకు అర్హులమే: రోహిత్ శర్మ
గత ఏడాది కాలంలో తాము అద్భుత విజయాలు సాధించామని.. ఇందుకు 2022లోనే పునాది పడిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు. నాటి టీ20 ప్రపంచకప్ టోర్నీలో చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుని.. ఐసీసీ ఈవెంట్లలో వరుస విజయాలతో సత్తా చాటామని పేర్కొన్నాడు. పరాజయాలకు పొంగిపోకుండా.. తమ బలాన్ని గుర్తించడం వల్లే ఇది సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశాడు.ఎన్నో ఎత్తుపళ్లాలుఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశామని.. వరుసగా రెండు ఐసీసీ టోర్నీలు గెలవడం ఆటగాళ్ల అంకితభావానికి నిదర్శనమని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2022లో సెమీస్లోనే నిష్క్రమించిన టీమిండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.కెప్టెన్గా రోహిత్ శర్మ, హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) తప్పుకోవాలనే డిమాండ్లు వినిపించాయి. అయితే, మరుసటి ఏడాది నుంచి భారత జట్టు రాత మారిపోయింది. సొంతగడ్డపై అజేయంగా వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్ చేరిన రోహిత్ సేన.. ఆఖరి మెట్టుపై మాత్రం తడబడింది. ఇక ఆ తర్వాత టీ20 ప్రపంచకప్-2024లో మాత్రం ఈ తప్పిదాన్ని పునరావృతం చేయలేదు.పరాజయమన్నదే లేకుండా దూసుకుపోయి చాంపియన్గా అవతరించింది. అనంతరం ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లోనూ ఇదే తరహాలో టైటిల్ సాధించింది. లీగ్ దశలో మూడింటికి మూడు గెలిచిన టీమిండియా.. సెమీస్లో ఆస్ట్రేలియాను, ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి ట్రోఫీ సాధించింది.అప్పుడే మాకు స్పష్టత వచ్చింది..ఈ జ్ఞాపకాలను తాజాగా నెమరు వేసుకున్న టీమిండియా సారథి రోహిత్ శర్మ.. ‘‘2022లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్లో మేము సెమీస్లోనే ఓడిపోయాం. ఆ సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే, అప్పుడే మాకో స్పష్టత వచ్చింది.జట్టులోని ప్రతి సభ్యుడి నుంచి మేము ఎలాంటి ప్రదర్శన ఆశిస్తున్నామో చెప్పాము. జట్టులో వారి పాత్ర ఏమిటో వివరించాం. అప్పటి నుంచి మా జట్టు దృక్పథం మారిపోయింది. పరాజయాలకు కుంగిపోకుండా.. మరింత గొప్పగా కమ్బ్యాక్ ఇచ్చాము.ఈ ప్రయాణంలో ఎన్నో కఠిన సవాళ్లు ఎదురయ్యాయి. అయితే, వాటన్నింటినీ అధిగమించి మా సత్తా ఏమిటో చూపించాం. కాబట్టి విజయాలను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాం. వరుస ఐసీసీ టోర్నమెంట్లలో 24 మ్యాచ్లకు గానూ 23 గెలవడం అసాధారణ విషయం.మేమంతా అందుకు అర్హులమేమేము దానిని సాధ్యం చేసి చూపించాం. బయటి నుంచి చూసే వాళ్లకు కూడా ఇది బాగానే అనిపిస్తుంది. కానీ మేము ఇందుకోసం ఎంత కష్టపడ్డామో మాకే తెలుసు. మూడు పెద్ద టోర్నమెంట్లలో జట్టు సాధించిన ఈ విజయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఈవెంట్లలో ఆడిన ప్రతి ఒక్క ఆటగాడు అన్ని రకాల గౌరవాలకు అర్హుడు’’ అంటూ రోహిత్ శర్మ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ షేర్ చేసింది.కాగా ఐపీఎల్-2025లోనూ రోహిత్ ముంబైకే ఆడుతున్నాడు. ఈ సీజన్లో తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన ముంబై.. శనివారం నాటి పోరులో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది.చదవండి: MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే! View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) -
BCCI: అతడికి ఈసారి టాప్ గ్రేడ్.. తొలిసారి వీళ్లకు చోటు!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవల మహిళల సీనియర్ జట్టుకు సంబంధించిన వార్షిక కాంట్రాక్టులను విడుదల చేసింది. అయితే, పురుషుల సీనియర్ టీమ్ సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున కాస్త జాప్యం జరుగుతోందని బోర్డు వర్గాలు వెల్లడించాయి. తాజా సమాచారం ప్రకారం మరికొన్ని రోజుల్లోనే బీసీసీఐ ఈ అంశంపై తుదినిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా.. టీమిండియా ప్రధాన కోచ్ గౌతం గంభీర్తో శనివారం సమావేశం కానున్నట్లు సమాచారం. కాగా బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లను A+, A, B, C గ్రేడ్లుగా విభజించి వార్షిక వేతనాలు అందచేస్తోన్న విషయం తెలిసిందే. రోహిత్, కోహ్లిల కొనసాగింపు!కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ గ్రేడ్ అయిన A+లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.అయితే, టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్గా నిలిచిన తర్వాత రోహిత్, కోహ్లి, జడ్డూ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం ఈ ముగ్గురు కేవలం వన్డే, టెస్టుల్లో మాత్రమే కొనసాగుతున్నారు. కాబట్టి వీరిని A+ గ్రేడ్ నుంచి తప్పించాలని బోర్డు నిర్ణయించినట్లు గతంలో వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే, టైమ్స్ ఆఫ్ ఇండియా అందించిన తాజా సమాచారం ప్రకారం.. ఈ ముగ్గురితో పాటు బుమ్రాను A+ గ్రేడ్లోనే కొనసాగించనున్నారు.అంతేకాదు..టీ20 జట్టు వైస్ కెప్టెన్గా ఉన్న స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు ఈసారి ప్రమోషన్ దక్కనుంది. B గ్రేడ్ నుంచి అతడిని A గ్రేడ్కు ప్రమోట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాదు.. క్రమశిక్షణారాహిత్యం వల్ల సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి ఈ జాబితాలో చేరనున్నాడు.అంతేకాదు.. టాప్ గ్రేడ్లో అతడిని చేర్చేందుకు బీసీసీఐ నాయకత్వ బృందం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత టాప్ రన్ స్కోరర్గా నిలిచి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు అతడికి ఈ మేర రిటర్న్గిఫ్ట్ లభించనున్నట్లు తెలుస్తోంది. అయితే, శ్రేయస్ మాదిరి అనూహ్యంగా సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన ఇషాన్ కిషన్ విషయంలో మాత్రం బీసీసీఐ ఇంకా గుర్రుగానే ఉన్నట్లు తెలుస్తోంది.టాప్ క్లాస్లో అతడి పేరుఈ విషయాల గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు మాట్లాడుతూ.. ‘‘శ్రేయస్ తిరిగి వార్షిక కాంట్రాక్టు దక్కించుకోబోతున్నాడు. అది కూడా టాప్ క్లాస్లో అతడి పేరు చేరనుంది. ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇషాన్ కిషన్ విషయంలో మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు’’ అని పేర్కొన్నాయి.తొలిసారి వీళ్లకు చోటుఇక ఈసారి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ కొత్తగా బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు దక్కించుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా బీసీసీఐ కాంట్రాక్టు దక్కించుకోవాలంటే.. ఒక క్యాలెండర్ ఇయర్లో టీమిండియా తరఫున మూడు టెస్టులు లేదంటే.. ఎనిమిది వన్డేలు.. లేదా పది అంతర్జాతీయ టీ20లు ఆడి ఉండాలి. తద్వారా మరుసటి ఏడాది సదరు ఆటగాళ్లకు బోర్డు వార్షిక కాంట్రాక్టు ఇస్తుంది.ఇక బీసీసీఐ A+ గ్రేడ్లో ఉన్న ఆటగాళ్లకు ఏడాదికి రూ. 7 కోట్లు, A గ్రేడ్లో ఉన్నవారికి రూ. 5 కోట్లు, B గ్రేడ్లో ఉన్నవారికి రూ. 3 కోట్లు, C గ్రేడ్లో ఉన్నవారికి రూ. కోటి వార్షిక జీతంగా ఇస్తుంది.గతేడాది కాలానికి (2023-24) గానూ బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్టుల జాబితాగ్రేడ్- A+: రోహిత్ శర్మ,విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాగ్రేడ్- A: రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుబ్మన్ గిల్, హార్దిక్ పాండ్యాగ్రేడ్- B: సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్గ్రేడ్- C: రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివం దూబే, రవి బిష్ణోయి, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముకేశ్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ కృష్ణ, ఆవేశ్ ఖాన్,రజత్ పాటిదార్. -
రోహిత్ శర్మ కీలక నిర్ణయం.. ఆ సిరీస్కు దూరం!
ఐపీఎల్-2025 ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడేందుకు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. అయితే ఈ సిరీస్కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.రెడ్ బాల్ క్రికెట్లో పేలవ ఫామ్ కారణంగా ఈ సిరీస్కు దూరంగా ఉండాలని రోహిత్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రోహిత్ ఇప్పటికే బీసీసీఐకి తెలియజేసినట్లు సమాచారం. అదేవిధంగా బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో విఫలమైన కోహ్లి మాత్రం ఇంగ్లండ్ సిరీస్లో ఆడనున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ న్యూజిలాండ్తో టెస్టు సిరీస్తో పాటు బీజీటీలోనూ దారుణ ప్రదర్శన కనబరిచాడు.ఆసీస్తో సిరీస్లో తొలి మ్యాచ్కు వ్యక్తిగత కారణాలతో దూరమైన హిట్ మ్యాన్.. తర్వాత రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చాడు. కానీ తన మార్క్ను చూపించలేకపోయాడు. మూడు మ్యాచ్లలో అతను 6.20 సగటుతో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్గా కూడా రోహిత్ విఫలమయ్యాడు. ఈ క్రమంలో సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టు నుంచి రోహిత్ శర్మ తనంతట తానే తప్పుకున్నాడు. ఆ మ్యాచ్ అనంతరం రోహిత్ టెస్టులకు విడ్కోలు పలకనున్నాడని ఊహగానాలు వినిపించాయి. కానీ రోహిత్ మాత్రం ఇప్పటిలో నకు రిటైరయ్యే ఉద్దేశ్యం లేదని పుకార్లకు చెక్ పెట్టాడు. కానీ ఇప్పుడు కొన్ని రోజుల పాటు టెస్టులకు దూరంగా ఉండాలని రోహిత్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ హిట్మ్యాన్ అందుబాటులేకపోతే జస్ప్రీత్ బుమ్రా జట్టు పగ్గాలను చేపట్టే అవకాశముంది. అయితే మరి కొన్ని రిపోర్ట్లు మాత్రం రోహిత్ ఇంగ్లండ్ సిరీస్కు అందుబాటులో ఉండనున్నాడని పేర్కొంటున్నాయి. రోహిత్ ఆడుతాడా, తప్పుకుంటాడా అన్నది మరి కొన్ని రోజుల్లో తేలిపోనుంది. ఇక భారత క్రికెట్ జట్టు ఏడాది జూన్ 20న ఇంగ్లాండ్ పర్యటనను ప్రారంభిస్తుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ హెడింగ్లీలోని లీడ్స్ వేదికగా జరుగనుంది. తదుపరి నాలుగు టెస్ట్లు ఎడ్జ్బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్, కెన్నింగ్టన్ ఓవల్ వేదికలపై జరగనున్నాయి. అంతకంటే ముందు భారత-ఎ జట్టు రెండు అనాధికారిక టెస్టు మ్యాచ్లు ఆడనుంది.చదవండి: IPL 2025: రియాన్ పరాగ్ చెత్త రికార్డు.. తొలి ప్లేయర్గా -
IND vs ENG: రోహిత్ భవిష్యత్తుపై నిర్ణయం.. జట్టు ప్రకటన అప్పుడే!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)- 2025 ముగిసిన వెంటనే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) రూపంలో మరో క్రికెట్ పండుగ సందడి మొదలైంది. మార్చి 22న మొదలైన ఈ క్యాష్ రిచ్ లీగ్.. మే 25న ఫైనల్తో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు అంతర్జాతీయ క్రికెట్ నుంచి దాదాపు రెండు నెలలకు పైగా విరామం లభించింది.ఇక ఐపీఎల్-2025 తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు పయనం కానుంది. జూన్ ఆఖరి వారం నుంచి ఇంగ్లిష్ జట్టుతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ మొదలుపెట్టనుంది. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మే చివరి వారంలో జట్టును ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాదు.. ఈ కీలక టెస్టు సిరీస్కు రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా కొనసాగించాలని సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బృందం మూకుమ్మడిగా హిట్మ్యాన్కు ఓటువేసినట్లు తెలుస్తోంది.రోహిత్ భవిష్యత్తుపై నిర్ణయం.. జట్టు ప్రకటన అప్పుడే!ఈ విషయాల గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్తో సిరీస్లో, ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైనప్పటికీ.. ఇంగ్లండ్తో టెస్టులకూ రోహిత్ శర్మనే కెప్టెన్గా కొనసాగించే అవకావాలు ఉన్నాయి. జట్టు ప్రకటనకు చాలా సమయం ఉంది. ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్ల నాటికి సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత ఏ క్షణమైన ప్రకటన రావొచ్చు’’ అని పీటీఐతో పేర్కొన్నాయి.ఘోర పరాభవాలుకాగా టెస్టు క్రికెట్లో గత కొంతకాలంగా రోహిత్ శర్మ వైఫల్యాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టులో అతడి నాయకత్వంలో భారత జట్టు.. 3-0తో క్లీన్స్వీప్ అయింది. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా.. విదేశీ జట్టు చేతిలో సొంతగడ్డపై మూడు మ్యాచ్ల సిరీస్లో వైట్వాష్కు గురికావడం ఇదే తొలిసారి.ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలోనూ రోహిత్ సేనకు భంగపాటే ఎదురైంది. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్లోనూ టీమిండియా ఓడిపోయింది. ఐదు టెస్టుల సిరీస్లో 3-1తో పరాజయం పాలై.. పదేళ్ల తర్వాత తొలిసారి ఆసీస్కు ఈ ట్రోఫీని చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC)- 2023-25 ఫైనల్కు చేరకుండానే నిష్క్రమించింది.ఈ రెండు సిరీస్లలో కెప్టెన్గా.. బ్యాటర్గా రోహిత్ శర్మ ఘోరంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత రంజీ బరిలో ముంబై తరఫున ఓపెనర్గా వచ్చి అక్కడా పేలవ ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతడిని టెస్టు కెప్టెన్సీ నుంచి, జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లు పెరిగాయి.తిరిగి ఫామ్లోకిఅయితే, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో రోహిత్ శర్మ ప్రదర్శన తర్వాత సీన్ మారిపోయింది. ఈ వన్డే టోర్నమెంట్లో బ్యాటర్గా, సారథిగా రాణించి భారత్కు టైటిల్ అందించాడు హిట్మ్యాన్. తద్వారా తన ఖాతాలో రెండో ఐసీసీ టైటిల్ చేర్చుకోవడంతో పాటు.. భారత్కు పుష్కరకాలం తర్వాత చాంపియన్స్ ట్రోఫీని అందించాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మకు టెస్టుల్లోనూ మరొక్క అవకాశం ఇవ్వాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.కాగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్ను చాంపియన్గా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో కొనసాగుతున్న హిట్మ్యాన్.. ఐపీఎల్-2025లో భాగంగా ముంబై ఇండియన్స్ తరఫున మరోసారి బరిలోకి దిగాడు. చదవండి: అంతా డికాకే చేశాడు.. తప్పులు ఒప్పుకుంటాం.. రిపీట్ చేయం: రియాన్ పరాగ్ -
ద్రవిడ్ గొప్పోడు.. గంభీర్ మాత్రం స్పందించడం లేదు: టీమిండియా దిగ్గజం
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) గురించి భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గౌతీ.. రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) బాటలో నడుస్తున్నాడా? లేదా? అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నాడు. ద్రవిడ్ మాదిరి గౌతీకి పెద్ద మనసు ఉందో లేదో తెలియడం లేదంటూ విమర్శనాస్త్రాలు సంధించాడు. ఇంతకీ విషయం ఏమిటంటే....భారత జట్టు ఇటీవలే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)గెలుచుకున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చిన ఈ మెగా వన్డే టోర్నీలో రోహిత్ సేన.. తమ మ్యాచ్లన్నీ దుబాయ్లోనే ఆడింది. రూ. 58 కోట్ల క్యాష్ రికార్డుగ్రూప్ దశలో మూడింటికి మూడు గెలిచి సెమీస్లో అడుగుపెట్టిన టీమిండియా.. కీలక పోరులో ఆస్ట్రేలియాను ఓడించింది. అనంతరం టైటిల్ పోరులో న్యూజిలాండ్పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీని ముద్దాడింది.తద్వారా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో రెండో ఐసీసీ టైటిల్ చేరగా.. భారత్కు పుష్కర కాలం తర్వాత చాంపియన్స్ ట్రోఫీ దక్కింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) టీమిండియాకు భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. రూ. 58 కోట్ల క్యాష్ రికార్డు ఇవ్వనున్నట్లు మార్చి 20న పత్రికా ప్రకటన విడుదల చేసింది.గంభీర్కు రూ. 3 కోట్లుఈ మొత్తంలో చాంపియన్స్ ట్రోఫీ జట్టులోని ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ. 3 కోట్ల చొప్పున.. అదే విధంగా హెడ్కోచ్ గంభీర్కు రూ. 3 కోట్లు ఇవ్వనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. సహాయక కోచ్లు, మిగతా సిబ్బందికి రూ. 50 లక్షల నగదు బహుమానం అందజేయనున్నట్లు తెలిపారు.ఈ విషయంపై సునిల్ గావస్కర్ తాజాగా తనదైన శైలిలో స్పందించాడు. ద్రవిడ్తో గంభీర్ను పోలుస్తూ స్పోర్ట్స్స్టార్కు రాసిన కాలమ్లో వింత వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తర్వాత బీసీసీఐ భారీ స్థాయిలో ప్రైజ్మనీ ప్రకటించింది. అప్పటి హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్కు ఆటగాళ్లతో సమానంగా బహుమతి ఇవ్వాలని భావించింది.ద్రవిడ్ గొప్పోడు.. గంభీర్ మాత్రం స్పందించడం లేదుకానీ అతడు అందుకు అంగీకరించలేదు. సహాయక కోచ్లతో పాటూ తానూ సమానమేనని.. వారికి ఇచ్చినంతే తనకూ ఇవ్వాలని బోర్డుకు విజ్ఞప్తి చేశాడు. లేదంటే.. తనకు దక్కిన మొత్తాన్ని సహచర కోచ్లతో పంచుకుంటానని చెప్పాడు. చెప్పిందే చేశాడు కూడా!ఇక చాంపియన్స్ ట్రోఫీలో భారత్ గెలిచిన నేపథ్యంలో బీసీసీఐ క్యాష్ రివార్డు ప్రకటించి.. రోజులు గడుస్తున్నాయి. అయినా.. ఇప్పటి వరకు ప్రస్తుత హెడ్కోచ్ నుంచి ప్రైజ్మనీ తీసుకునే విషయంలో ఎలాంటి ప్రకటనా రాలేదు.అతడు ద్రవిడ్ మాదిరి కోచ్లందరితో సమానంగా నగదు తీసుకుంటాడా? లేదా? లేదంటే.. ద్రవిడ్ ఓ మంచి రోల్ మోడల్ కాదంటారా?!’’ అని గావస్కర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.శుభపరిణామంఅదే విధంగా.. బీసీసీఐ జట్టుకు ఈ మేర భారీ ప్రోత్సాహకాలు అందించడం గొప్ప విషమమని గావస్కర్ బోర్డును ప్రశంసించాడు. ‘‘ఐసీసీ టీ20 ప్రపంచకప్ గెలిచినప్పుడు బీసీసీఐ రూ. 125 కోట్ల మేర భారీ రివార్డు ప్రకటించింది. సెలక్టర్లు, సహాయక సిబ్బందికి కూడా తగిన రీతిలో బహుమానం అందజేసింది.ఇక ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ గెలిచినందుకు రూ. 58 కోట్లు ఇవ్వడం శుభపరిణామం. ఈసారి కూడా సెలక్షన్ కమిటీ, సహాయక సిబ్బందిని దృష్టిలో పెట్టుకుంది. నిజంగా ఇది గొప్ప విషయం. అంతేకాదు.. ఐసీసీ ప్రకటించిన ప్రైజ్మనీ మొత్తాన్ని కూడా ఆటగాళ్లకే పంచడం.. వారికి తగిన రీతిలో ప్రోత్సాహకాలు అందించడం సానుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది’’ అని గావస్కర్ పేర్కొన్నాడు.చదవండి: 4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?: భారత మాజీ క్రికెటర్ -
అస్సలు జీర్ణించుకోలేకపోయా.. అయినా భాయ్కు అంతా తెలుసు: సిరాజ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో కొత్త ఫ్రాంఛైజీ తరఫున ఆడబోతున్నాడు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్. దాదాపు ఏడేళ్ల పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)కి ఆడిన ఈ హైదరాబాదీని.. మెగా వేలానికి ముందు ఆ ఫ్రాంఛైజీ వదిలేసింది. ఈ క్రమంలో రూ. 12.25 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సిరాజ్ను కొనుగోలు చేసింది.బౌలర్ల కెప్టెన్ఇక ఐపీఎల్-2025లో తమ తొలి మ్యాచ్లో భాగంగా గుజరాత్ మంగళవారం పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ‘బోరియా సీజన్ సిక్స్’తో ముచ్చటించిన సిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘శుబ్మన్ గిల్ (Shubman Gill) బౌలర్ల కెప్టెన్. గొప్ప సారథి.బౌలర్లు ఏది అడిగినా.. కాదనడు. వాళ్లకు కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తాడు. స్వేచ్ఛనిస్తాడు. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. నేను, రిషభ్ పంత్, శుబ్మన్, అక్షర్ పటేల్.. కలిసి తరచుగా డిన్నర్లకు వెళ్తూ ఉంటాం. గిల్, నేను ఒకేసారి టెస్టుల్లో అడుగుపెట్టాము. అందుకే మా బంధం ఇంతగా బలపడి ఉంటుంది’’ అని గిల్తో తనకున్న స్నేహం గురించి చెప్పుకొచ్చాడు.ఆయనొక లెజెండ్ఇక గుజరాత్ కోచ్ ఆశిష్ నెహ్రా గురించి మాట్లాడుతూ.. ‘‘ఆయనొక లెజెండ్. నెహ్రా భాయ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోకుండా ఎలా ఉండాలో ఆయనను చూసే తెలుసుకున్నా. గతంలో షమీ భాయ్ ఈ ఫ్రాంఛైజీకి ఆడాడు.నేను కూడా తనలా అద్భుతంగా ఆడి వికెట్లు తీయడం మీద మాత్రమే దృష్టి పెట్టాను. జట్టు విజయాల కోసం నా శాయశక్తులా కృషి చేస్తా’’ అని సిరాజ్ పేర్కొన్నాడు. ఇక ఈ సందర్భంగా చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టులో చోటు దక్కకపోవడం గురించి ప్రస్తావన రాగా.. ఈ హైదరాబాదీ పేసర్ హుందాగా స్పందించాడు.అస్సలు జీర్ణించుకోలేకపోయా.. ‘‘జట్టు గురించి ప్రకటన రాగానే తొలుత ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాను. ఐసీసీ ఈవెంట్ ఆడే జట్టులో నాకు చోటు లేదే అని బాధపడ్డాను. అయితే, జట్టు ప్రయోజనాల గురించే రోహిత్ భాయ్ ఆలోచిస్తాడని నాకు తెలుసు.దుబాయ్లో పేసర్లకు పెద్దగా పని ఉండదని భాయ్కు తెలుసు. ఆయన ఎంతో అనుభవజ్ఞుడైన కెప్టెన్. అక్కడి పిచ్లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయని ఆయనకు తెలుసు. అందుకే నన్ను పక్కనపెట్టాలని వాళ్లు నిర్ణయించుకున్నారు’’ అని సిరాజ్ పేర్కొన్నాడు.విశ్రాంతి దొరికిందిఏదేమైనా దేశం కోసం ఆడేటప్పుడు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుందని.. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్ కోరుకుంటాడని సిరాజ్ అన్నాడు. ఇక చాంపియన్స్ట్రోఫీ జట్టులో లేనందు వల్ల తనకు చాలాకాలం పాటు విశ్రాంతి లభించిందని.. ఆ సమయాన్ని ఫిట్నెస్ మెరుగుపరచుకునేందుకు ఉపయోగించుకున్నానని తెలిపాడు.కాగా పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్యం ఇవ్వగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్లన్నీ దుబాయ్లో ఆడింది. ఇక ఈ మెగా వన్డే టోర్నమెంట్లో గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్లను ఓడించిన రోహిత్ సేన.. సెమీస్లో ఆస్ట్రేలియాపై గెలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడింది.ఇక సిరాజ్ చివరగా ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ ఆడాడు. తదుపరి జూన్లో ఇంగ్లండ్ టూర్కు వెళ్లే జట్టుకు అతడు ఎంపికయ్యే అవకాశం ఉంది. ఇక మళ్లీ పరిమిత ఓవర్ల జట్టులో తిరిగి స్థానం సంపాదించాలంటే సిరాజ్ మియా.. ఐపీఎల్-2025లో సత్తా చాటాల్సి ఉంటుంది.చదవండి: ‘గిల్ ఒక్కడే ఏమీ చేయలేడు.. మేమంతా ఉంటేనే ఏదైనా సాధ్యం’ -
చహల్ మాజీ భార్య అంటే రోహిత్ శర్మ సతీమణికి పడదా.. ఎందుకు ఇలా చేసింది..?
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చహల్-ధనశ్రీ వర్మ ఇటీవలే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. విడాకుల అనంతరం చహల్.. ధనశ్రీకి రూ. 4.75 కోట్ల భరణం చెల్లించేందుకు ఒప్పుకున్నాడు. ధనశ్రీ చహల్ను భరణం పేరుతో డబ్బు డిమాండ్ చేయడం క్రికెట్ అభిమానులకు నచ్చలేదు. దీంతో ధనశ్రీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ధనశ్రీ చహల్ను కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుందని అంటున్నారు. ఈ విషయంలో చహల్కు అండగా నిలుస్తున్నారు. చాలా మంది క్రికెట్ అభిమానుల్లాగే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే కూడా చహల్కు మద్దతుగా నిలిచినట్లనిపిస్తుంది.తాజాగా ధనశ్రీని విమర్శిస్తూ శుభాంకర్ మిశ్రా అనే జర్నలిస్ట్ సోషల్మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. దీనికి రితిక లైక్ కొట్టింది. ఇది తెలిసి అభిమానులు ధనశ్రీ అంటే రితికకు సరిపోదా అని చర్చించుకుంటున్నారు. ధనశ్రీపై శుభాంకర్ విమర్శలతో ఏకీభవించే రితిక ఇలా చేసుంటుందని అనుకుంటున్నారు.ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..?శుభాంకర్ మిశ్రా ధనశ్రీ వర్మను 'గోల్డ్ డిగ్గర్' అని సంబోధించాడు. గోల్డ్ డిగ్గర్ అంటే డబ్బు కోసం ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకునే మహిళ అని అర్దం. వీడియోలో శుభాంకర్ ధనశ్రీని ఉద్దేశిస్తూ ఇలా కూడా అన్నాడు. విడాకుల తర్వాత ధనశ్రీ ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొనుంది. అందకే ఆమె చహల్ను భరణం పేరుతో డబ్బు డిమాండ్ చేసింది. భరణం పేరుతో భర్త నుంచి డబ్బు తీసుకుంటే అది సాధికారత ఎలా అవుతుంది. ఇలా చేసి స్వయంకృషితో ఎదిగిన మహిళ అని ఎలా చెప్పుకుంటారంటూ వ్యంగ్యంగా విమర్శించాడు.కాగా, చహల్, ధనశ్రీ వర్మ 2020లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ దగ్గర చహల్ డాన్స్ నేర్చుకునేందుకు వెళ్లేవాడు. అక్కడ వారి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. పెళ్లి తర్వాత చహల్, ధనశ్రీ సోషల్మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేవారు. ఈ ఏడాది మార్చి 20న చహల్, ధనశ్రీకి విడాకలు మంజూరయ్యాయి. గత ఏడాదిన్నరగా వీరిద్దరు కలిసి లేరని తెలుస్తుంది. అంటే వీరి వివాహ బంధం ముచ్చటగా మూడేళ్లు మాత్రమే సాగిందన్న మాట.ఇదిలా ఉంటే, చహల్ ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. చహల్ను ఇటీవలే (మెగా వేలంలో) పంజాబ్ కింగ్స్ రూ. 18 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుంది. చహల్ గత సీజన్ వరకు రాజస్థాన్ రాయల్స్కు ఆడాడు. అంతకుముందు అతను ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించే వాడు. చహల్ ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తున్నా టీమిండియాలో చోటు మాత్రం దక్కడం లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత స్పిన్ విభాగం అత్యంత పటిష్టంగా ఉండటంతో చహల్కు అవకాశాలు రావడం లేదు. చహల్ పంజాబ్ జెర్సీలో ఇవాళ (మార్చి 25) తన తొలి మ్యాచ్ ఆడనున్నాడు. నేటి మ్యాచ్లో పంజాబ్ గుజరాత్ను వారి సొంత మైదానంలో ఢీకొట్టనుంది. ధనశ్రీ విషయానికొస్తే.. ఆమె ఇటీవలే ఓ ప్రైవేట్ వీడియో ఆల్బమ్ రిలీజ్ చేసింది. ఈ వీడియోపై సోషల్మీడియాలో ద్వంద అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
IPL 2025: రోహిత్, పోలార్డ్ తర్వాత సూర్యకుమార్
ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో నిన్న (మార్చి 23) జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తాత్కాలిక సారధి సూర్యకుమార్ యాదవ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 29 పరుగులు చేసిన స్కై.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున 3000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా రోహిత్ శర్మ, కీరన్ పోలార్డ్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రోహిత్ 209 ఇన్నింగ్స్ల్లో 5458 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ తరఫున లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతుండగా.. పోలార్డ్ 171 ఇన్నింగ్స్ల్లో 3412, స్కై 95 ఇన్నింగ్స్ల్లో 3015 పరుగులు చేశాడు. ఈ ముగ్గురి తర్వాత ఎంఐ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అంబటి రాయుడు ఉన్నాడు. రాయుడు 107 ఇన్నింగ్స్ల్లో 2416 పరుగులు చేశాడు.ఇదిలా ఉంటే, సీఎస్కేతో నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. సీజన్ ఆరంభ మ్యాచ్ల్లో ఓడటం ముంబైకి ఇది వరుసగా 13వ సారి. ఈ మ్యాచ్లో సీఎస్కే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తా చాటి ముంబై ఇండియన్స్ను ఓడించింది. బ్యాటింగ్లో విఫలమైన ముంబై ఆతర్వాత బౌలింగ్లో రాణించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నూర్ అహ్మద్ (4-0-18-4), ఖలీల్ అహ్మద్ (4-0-29-3) విజృంభించడంతో 155 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) పరిమితమైంది. ముంబై ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. సూర్యకుమార్ (29), తిలక్ వర్మ (31), ఆఖర్లో దీపక్ చాహర్ (15 బంతుల్లో 28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రోహిత్ శర్మ డకౌట్ కాగా.. విధ్వంసకర వీరులు రికెల్టన్ (13), విల్ జాక్స్ (11), అరంగ్రేటం ఆటగాడు రాబిన్ మింజ్ (3), నమన్ ధిర్ (17), సాంట్నర్ (11) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. సీఎస్కే బౌలర్లలో అశ్విన్, ఇల్లిస్ కూడా తలో వికెట్ తీశారు.ఛేదనలో రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలు చేసి సీఎస్కేను గెలిపించారు. రుతురాజ్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి సీఎస్కే గెలుపుకు బలమైన పునాది వేయగా.. రచిన్ చివరి వరకు క్రీజ్లో ఉండి సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు. ఈ మ్యాచ్లో ముంబై ఓడినా అద్భుతంగా ప్రతిఘటించింది. అరంగేట్రం స్పిన్నర్ విజ్ఞేశ్ పుథుర్ (4-0-32-3) అద్భుతంగా బౌలింగ్ చేసి ఓ దశలో సీఎస్కేకు దడ పుట్టించాడు. ముంబై బౌలర్లలో విజ్ఞేశ్తో పాటు విల్ జాక్స్ (4-0-32-1), నమన్ ధిర్ (3-0-12-0) కూడా రాణించారు. మిడిల్ ఓవర్లలో వీరిద్దరు సీఎస్కేను ఇబ్బంది పెట్టారు. మొత్తంగా మ్యాచ్ ఓడినా ముంబై మంచి మార్కులే కొట్టేసింది. సీఎస్కే తమ తదుపరి మ్యాచ్లో ఆర్సీబీతో (మార్చి 28) తలపడనుండగా.. ముంబై ఇండియన్స్ గుజరాత్ను (మార్చి 29) ఢీకొట్టనుంది. -
IPL 2025: చెత్త రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా చెన్నై సూపర్కింగ్స్తో నిన్న (మార్చి 23) జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్లో 4 బంతులు ఎదర్కొని డకౌటైన హిట్మ్యాన్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డకౌట్లు అయిన ఆటగాడిగా నిలిచాడు. ఈ చెత్త రికార్డును రోహిత్.. గ్లెన్ మ్యాక్స్వెల్, దినేశ్ కార్తీక్లతో కలిసి షేర్ చేసుకున్నాడు. ఈ ముగ్గురు ఐపీఎల్లో ఇప్పటివరకు 18 సార్లు ఖాతా తెరవకుండా నిష్క్రమించారు. రోహిత్ 253 ఇన్నింగ్స్ల్లో 18 సార్లు డకౌట్ కాగా.. మ్యాక్సీ 129, డీకే 234 ఇన్నింగ్స్ల్లోనే 18 సార్లు డకౌటయ్యారు. ఈ మ్యాచ్లో రోహిత్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.మ్యాచ్ విషయానికొస్తే.. సీఎస్కే ముంబైపై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. సీజన్ ఆరంభ మ్యాచ్లో ఓడటం ముంబైకి ఇది వరుసగా 13వ సారి. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై బ్యాటర్ల వైఫల్యం కారణంగా 155 పరుగులకే పరిమితమైంది. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ 4 వికెట్లు తీసి ముంబైకి కళ్లెం వేశాడు. పేసర్ ఖలీల్ అహ్మద్ కూడా రాణించి 3 వికెట్లు తీశాడు. ఇల్లిస్, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ (31) టాప్ స్కోరర్గా నిలువగా.. సూర్యకుమార్ యాదవ్ (29), దీపక్ చాహర్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం ఛేదనకు దిగిన సీఎస్కే ఆదిలోనే ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (2) వికెట్ కోల్పోయినప్పటికీ.. ఆతర్వాత పుంజుకుంది. రచిన్ రవీంద్ర (65 నాటౌట్), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (53) మెరుపు అర్ద సెంచరీలు సాధించి సీఎస్కేను గెలిపించారు. రుతురాజ్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి సీఎస్కే గెలుపుకు బలమైన పునాది వేయగా.. రచిన్ చివరి వరకు క్రీజ్లో ఉండి సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు. ఈ మ్యాచ్లో ముంబై ఓడినప్పటికీ అద్భుతంగా ప్రతిఘటించింది. స్వల్ప స్కోర్ను కాపాడుకనేందుకు ముంబై బౌలర్లు విశ్వప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా అరంగేట్రం స్పిన్నర్ విజ్ఞేశ్ పుథుర్ (4-0-32-3) అద్భుతంగా బౌలింగ్ చేసి ఓ దశలో సీఎస్కేకు దడ పుట్టించాడు. సీఎస్కే తమ తదుపరి మ్యాచ్లో ఆర్సీబీతో (మార్చి 28) తలపడనుండగా.. ముంబై ఇండియన్స్ గుజరాత్ను (మార్చి 29) ఢీకొట్టనుంది. -
BCCI: ఒక్కో ఆటగాడికి రూ. 3 కోట్లు.. గంభీర్కు ఎంతంటే?
టీమిండియాకు ప్రకటించిన నగదు బహుమతి పంపిణీ అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఆటగాళ్లకు, కోచ్లకు, సహాయక సిబ్బందికి ఇచ్చే మొత్తం ఎంతన్నది తాజాగా వెల్లడించారు. చాంపియన్స్ ట్రోఫీ జట్టులోని ప్రతి ఆటగాడికి రూ. 3 కోట్ల మేర అందజేయనున్నట్లు తెలిపారు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. గ్రూప్ దశలో మూడింటికి మూడు గెలిచిన రోహిత్ సేన.. సెమీస్లో ఆస్ట్రేలియాపై, ఫైనల్లో న్యూజిలాండ్పై విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకుంది. ఐదు మ్యాచ్లలో అజేయంగా నిలిచి తొమ్మిది నెలల వ్యవధిలోనే మరో ఐసీసీ ట్రోఫీని సాధించింది.ఈ నేపథ్యంలో బీసీసీఐ భారత జట్టుకు భారీ క్యాష్ రివార్డు (BCCI Cash Reward) ప్రకటించింది. రూ. 58 కోట్ల నజరానా ఇవ్వనున్నట్లు గురువారం వెల్లడించింది. అయితే, ఇందులో ఎవరెవరికి ఎంత మొత్తం ఇస్తారన్న విషయం గురించి కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా వెల్లడించారు.గౌతం గంభీర్కు మూడు కోట్లువార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘జట్టులోని ప్రతి ఆటగాడికి రూ. 3 కోట్లు.. హెడ్కోచ్ గౌతం గంభీర్కు మూడు కోట్లు.. మిగిలిన కోచ్లలో అసిస్టెంట్లు ర్యాన్ టెన్ డష్కాటే, అభిషేక్ నాయర్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, ఫీల్డింగ్ కోచ్కు టి. దిలీప్నకు రూ. 50 లక్షలు.. మిగిలిన సహాయక సిబ్బందికి రూ. యాభై లక్షలు.. బీసీసీఐ అధికారులకు రూ. 25 లక్షలు ఇస్తాం’’ అని దేవజిత్ సైకియా తెలిపారు.కాగా సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023లో ఫైనల్ వరకు అజేయంగా నిలిచిన.. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఆస్ట్రేలియాతో చేతిలో ఓటమి పాలై టైటిల్ను చేజార్చుకుంది. అయితే, టీ20 ప్రపంచకప్-2024తో ఈ గాయాలను మాన్పివేసింది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఈ మెగా టోర్నీలో ఆఖరి వరకు ఓటమన్నదే లేక చాంపియన్గా నిలిచింది.దుబాయ్లోనే అన్ని మ్యాచ్లు తొమ్మిది నెలల అనంతరం తాజాగా చాంపియన్స్ ట్రోఫీలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఈ వన్డే టోర్నమెంట్కు పాకిస్తాన్ ఆతిథ్య దేశంగా వ్యవహరించిగా.. భద్రతా కారణాల వల్ల టీమిండియాను అక్కడకు పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఈ క్రమంలో ఐసీసీ జోక్యంతో దుబాయ్లో భారత జట్టు తమ మ్యాచ్లన్నీ ఆడేలా హైబ్రిడ్ మోడల్కు పాక్ అంగీకరించింది. ఇక ఒకే వేదిక మీద అన్ని మ్యాచ్లు ఆడటం వల్ల టీమిండియాకు మిగతా జట్లతో పోలిస్తే.. అదనపు ప్రయోజనాలు చేకూరాయని ఇంగ్లండ్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్లు విమర్శించారు. అయితే, భారత జట్టు ఎంతో పటిష్టంగా ఉందని.. వేదిక ఏదైనా గెలుపు టీమిండియాదేనంటూ సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు ఆ విమర్శలను తిప్పికొట్టారు. టీ20 ప్రపంచకప్-2024లో మిగతా జట్ల మాదిరే టీమిండియా కూడా ప్రయాణాలు చేసిందని.. అయినా విజేతగా నిలిచిందంటూ కౌంటర్ ఇచ్చారు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లొ పాల్గొన్న భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, రిషభ్ పంత్.సహాయక సిబ్బంది:హెడ్కోచ్ గౌతం గంభీర్, కోచ్లు అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డష్కాటే, టి. దిలీప్, మోర్నీ మోర్కెల్. చదవండి: ‘రేపు మీ బౌలింగ్ను చితక్కొడతాను చూడు!.. అన్నంత పని చేశాడు’ -
మానసిక వేదన.. అయినా తట్టుకున్నాడు.. సింహంలా తిరిగొచ్చాడు!
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)పై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించాడు. అవమానాలను దిగమింగుకుని.. సింహంలా అతడు తిరిగి వచ్చాడని కొనియాడాడు. మానసికంగా తనను వేదనకు గురిచేసినా.. అద్భుత ప్రదర్శనతో తన విలువను చాటుకున్నాడని.. భారత్ రెండు ఐసీసీ టైటిళ్లు గెలవడంలో కీలక పాత్ర పోషించాడని ప్రశంసించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో సరికొత్త హార్దిక్ పాండ్యాను చూడబోతున్నారని.. ముంబై ఇండియన్స్ను అతడు ఈసారి ప్లే ఆఫ్స్లో నిలుపుతాడని కైఫ్ ధీమా వ్యక్తం చేశాడు. అవహేళనలుకాగా గతేడాది హార్దిక్ ముంబై ఇండియన్స్ సారథిగా ఎంపికైన విషయం తెలిసిందే. ముంబైకి ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మ (Rohit Sharma)ను కాదని.. హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. సొంత మైదానం వాంఖడేలోనూ అతడిని దూషిస్తూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. హార్దిక్ కనిపిస్తే చాలు అవహేళనలతో అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా ప్రవర్తించారు.ఈ క్రమంలో ముంబై గతేడాది పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. దీంతో హార్దిక్ కెప్టెన్సీపై మరోసారి విమర్శలు తీవ్రమయ్యాయి. అయితే, ఈ చేదు అనుభవాల నుంచి త్వరగానే కోలుకున్న హార్దిక్ పాండ్యా.. టీ20 ప్రపంచకప్-2024లో సత్తా చాటాడు. జట్టు చాంపియన్గా నిలవడంలో కీలకంగా వ్యవహరించాడు.అంతేకాదు.. తాజాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా టైటిల్ గెలవడంలోనూ హార్దిక్ది కీలక పాత్ర. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్.. హార్దిక్ పాండ్యా బయోపిక్ గనుక తెరకెక్కితే గత ఏడాది కాలం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని వ్యాఖ్యానించాడు.పంటిబిగువన భరిస్తూ.. ‘‘మనసుకైన గాయాలను పంటిబిగువన భరిస్తూ.. అతడు ముందుకు సాగాడు. అభిమానులే అతడిని హేళన చేశారు. కొంతమంది అతడి గురించి చెడుగా ఆర్టికల్స్ రాశారు. ఓ ఆటగాడిగా ఇన్ని బాధలను భరిస్తూ ముందుకు సాగడం అంత తేలికైన విషయం కాదు.అతడు ఆ నొప్పిని మర్చిపోలేడు. జట్టు నుంచి తప్పిస్తే ఆ బాధ కొన్నాళ్లే ఉంటుంది. కానీ.. అభిమానులే ఇంతలా అవమానిస్తే తట్టుకోవడం కష్టం. ఓ ఆటగాడికి ఇంతకంటే మానసిక వేదన మరొకటి ఉండదు. సింహంలా పోరాడి గెలిచాడుఅయితే, అతడు కుంగిపోలేదు. సింహంలా పోరాడి గెలిచాడు. టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో హెన్రిచ్ క్లాసెన్ వంటి విధ్వంసకర వీరుడిని అవుట్ చేశాడు. చాంపియన్స్ ట్రోఫీలో జంపా బౌలింగ్లో సిక్సర్లు బాదాడు.బంతితో, బ్యాట్తో రాణించి భారత్ గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. ఒకవేళ అతడి బయోపిక్ తీస్తే.. గత ఏడాది కాలం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. సవాళ్లను, గడ్డు పరిస్థితులను అధిగమించి ఎలా ముందుకు సాగాలో తెలుస్తుంది. పాండ్యా తన బలాన్ని గుర్తించాడు. అందుకే ఇంత గొప్పగా పునరాగమనం చేశాడు. ఐపీఎల్-2025లో అతడు ముంబైని తప్పక ప్లే ఆఫ్స్ చేరుస్తాడు’’ అని కైఫ్ హిందుస్తాన్ టైమ్స్తో వ్యాఖ్యానించాడు.కాగా మార్చి 22న ఐపీఎల్ పద్దెనిమిదవ ఎడిషన్ ప్రారంభం కానుండగా.. ఆ మరుసటి రోజు ముంబై తమ తొలి మ్యాచ్ ఆడనుంది. మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్ను ఢీకొట్టనుంది. అయితే, గతేడాది స్లో ఓవర్ రేటు కారణంగా హార్దిక్ పాండ్యా తొలి మ్యాచ్కు దూరం కానున్నాడు. దీంతో అతడి స్థానంలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.చదవండి: CT 2025: టీమిండియాకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ -
CT 2025: టీమిండియాకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ
టీమిండియాపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కాసుల వర్షం కురిపించింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో విజేతగా నిలిచినందుకు భారీ క్యాష్ రివార్డు ప్రకటించింది. ఈ మెగా వన్డే టోర్నీలో ఐదింటికి ఐదు మ్యాచ్లు గెలిచి అజేయంగా చాంపియన్గా నిలిచిన రోహిత్ సేనకు రూ. 58 కోట్ల నజరానా ఇచ్చింది. రోహిత్ సేన జైత్రయాత్రను ప్రస్తావిస్తూఈ మొత్తాన్ని ఆటగాళ్లు, కోచ్లు, సహాయక సిబ్బంది.. అదే విధంగా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సభ్యులకు బీసీసీఐ పంచనుంది. ఇందుకు సంబంధించి బోర్డు గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు.. ‘‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియాకు రూ. 58 కోట్ల క్యాష్ రివార్డు ప్రకటిస్తున్నాం.మెన్స్ సెలక్షన్ కమిటీ సభ్యులతో పాటు ఆటగాళ్లు, కోచ్లు, సహాయక సిబ్బంది పనితీరును గుర్తిస్తూ వారిని ఇలా సత్కరిస్తున్నాం’’ అని పేర్కొంది. అదే విధంగా.. ‘‘కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా టోర్నీ ఆసాంతం ఆధిపత్యం కనబరిచింది. ఓటమన్నదే ఎరుగక నాలుగు విజయాలతో ఫైనల్ చేరింది.తొలుత బంగ్లాదేశ్పై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా.. ఆ తర్వాత పాకిస్తాన్పై కూడా ఆరు వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. అదే జోరును కొనసాగిస్తూ న్యూజిలాండ్పై 44 పరుగుల తేడాతో గెలిచి గ్రూప్ టాపర్ అయ్యింది. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ చేరుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించింది’’ అని బీసీసీఐ తమ ప్రకటనలో రోహిత్ సేన జైత్రయాత్రను ప్రస్తావించింది.అందుకే ఈ నగదు బహుమతిఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ మాట్లాడుతూ.. ‘‘వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు సాధించడం ఎంతో ప్రత్యేకమైనది. భారత జట్టు అంకిత భావం, ప్రపంచ వేదికపై దేశానికి వారు తెచ్చి పెట్టిన కీర్తి ప్రతిష్టలకు గుర్తింపుగా నగదు బహుమతి అందజేస్తున్నాం.ఈ గెలుపునకు కారణమైన ప్రతి ఒక్కరి సేవలను మేము గుర్తించాం. భారత్కు ఈ ఏడాది ఇది రెండో ఐసీసీ ట్రోఫీ. అండర్-19 వుమెన్స్ వరల్డ్కప్లో మనం చాంపియన్లుగా నిలిచాం. ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని కూడా సొంతం చేసుకున్నాం.దేశంలో క్రికెటింగ్ ఎకోసిస్టమ్ ఎంత పటిష్టంగా ఉందో చెప్పేందుకు ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు’’ అని హర్షం వ్యక్తం చేశాడు. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్-2024 సాధించిన రోహిత్ సేన.. ఆ టోర్నీలోనూ అన్ని మ్యాచ్లలో అజేయంగా నిలిచింది. నాడు బీసీసీఐ రోహిత్ సేనకు ఏకంగా రూ. 125 కోట్ల నజరానా ప్రకటించింది.ఎనిమిది జట్ల మధ్య పోటీతాజాగా చాంపియన్స్ ట్రోఫీలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయగా.. ఈసారి రూ. 58 కోట్ల బహుమతి ఇచ్చింది. ఇది ఐసీసీ ఇచ్చిన ప్రైజ్ మనీ (భారత కరెన్సీలో దాదాపు రూ. రూ.19.5 కోట్లు) కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఇక ఈ మెగా ఈవెంట్కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వగా.. భారత జట్టు మాత్రం తటస్థ వేదికైన దుబాయ్లోనే తమ మ్యాచ్లన్నీ ఆడింది. ఈ టోర్నీలో భారత్తో పాటు గ్రూప్-ఎ నుంచి పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీపడ్డాయి.తొలి సెమీస్లో భారత్ ఆస్ట్రేలియాను ఓడించగా.. రెండో సెమీస్లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్ చిత్తు చేసింది. ఈ క్రమంలో టీమిండియా- న్యూజిలాండ్ మధ్య మార్చి 9న జరిగిన టైటిల్ పోరులో రోహిత్ సేన నాలుగు వికెట్ల తేడాతో కివీస్ను ఓడించింది. ఈ మ్యాచ్లో అద్భుత అర్ధ శతకం(76) బాదిన కెప్టెన్ రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.చదవండి: ‘రేపు మీ బౌలింగ్ను చితక్కొడతాను చూడు!.. అన్నంత పని చేశాడు’ -
ముగ్గురు టీమిండియా కెప్టెన్లు.. అది నా అదృష్టం: హార్దిక్ పాండ్యా
జట్టులో ‘ముగ్గురు కెప్టెన్ల’ను కలిగి ఉండటం తనకు అదనపు బలమని ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా (Hardik Pandya) హర్షం వ్యక్తం చేశాడు. భిన్న ఫార్మాట్లలో టీమిండియాను ముందుకు నడిపించిన వ్యక్తుల నుంచి తాను తప్పక సలహాలు, సూచనలు తీసుకుంటానని పేర్కొన్నాడు. అంతిమంగా జట్టును విజేతగా నిలపడమే తమ లక్ష్యమని హార్దిక పాండ్యా పేర్కొన్నాడు.ఈసారి తాను రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నానన్న హార్దిక్ పాండ్యా... ఈసారి అభిమానుల నుంచి సానుకూల స్పందన మాత్రమే కోరుకుంటున్నానని తెలిపాడు. కెప్టెన్గా సూర్యకాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పద్దెనిమిదవ ఎడిషన్ మార్చి 22 నుంచి ఆరంభం కానున్న విషయం తెలిసిందే. కోల్కతా నైట్ రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్తో ఈ మెగా ఈవెంట్కు తెరలేవనుండగా.. ముంబై మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.అయితే, గతేడాది స్లో ఓవర్ రేటు కారణంగా హార్దిక్ పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం పడగా.. ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ ముంబై కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన పాండ్యా.. ఈ ఏడాది తాము కచ్చితంగా అనుకున్న ఫలితాన్ని రాబడతామని ధీమా వ్యక్తం చేశాడు.రోజురోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గదు‘‘నేను చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. అప్పుడు కూడా గెలుస్తామనే నేను విశ్వసించాను. అయితే, నేను ఇటీవలే చాంపియన్స్ ట్రోఫీలో ఆడాను. నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది, కాన్ఫిడెన్స్ గురించి నన్ను అడిగితే.. రోజురోజుకూ అది పెరుగుతుందే తప్ప తగ్గదు.ముగ్గురు టీమిండియా కెప్టెన్లు.. అది నా అదృష్టంఇక మా జట్టులో నాతో పాటు మరో ముగ్గురు కెప్టెన్లు ఉండటం ఒక రకంగా నా అదృష్టం అని చెప్పాలి. నాకు అవసరమైనపుడు వారి అనుభవాన్ని ఉపయోగించుకుంటా. టీమిండియాను మూడు ఫార్మాట్లలో భిన్న రీతిలో నడిపించిన వారి అనుభవం నాకు కచ్చితంగా అదనపు బలమే.నాకు వారు ఎల్లవేళలా మద్దతుగా ఉంటారు. క్లిష్ట పరిస్థితుల్లో నా భుజం తట్టి నన్ను ముందుకు నడిపిస్తారు. మేమంతా కలిసి అనుకున్న రీతిలో జట్టును ముందుకు తీసుకువెళ్తాం’’ అని హార్దిక్ పాండ్యా బుధవారం నాటి మీడియా సమావేశంలో పేర్కొన్నాడు.కాగా టీమిండియా వన్డే, టెస్టు సారథి రోహిత్ శర్మతో పాటు.. టెస్టుల్లో రోహిత్ గైర్హాజరీలో కెప్టెన్గా వ్యవహరిస్తున్న జస్ప్రీత్ బుమ్రా.. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.ముంబై రంగులు తప్ప ఇంకేమీ కనిపించవద్దుఇదిలా ఉంటే.. ముంబై అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘నేను టాస్ కోసం వెళ్లినపుడు.. బ్యాటింగ్కి వెళ్లినపుడు నన్ను చీర్ చేయండి. సిక్సర్ బాదితే గట్టిగా అరవండి. వాంఖడే స్టేడియంలో నాకు ముంబై రంగులు తప్ప ఇంకేమీ కనిపించవద్దు’’ అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. కాగా ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మను తప్పించి ముంబై ఫ్రాంఛైజీ గతేడాది పాండ్యాకు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.అయితే, అతడి రాకతో రోహిత్, బుమ్రా, సూర్య అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వచ్చాయి. ముంబై గతేడాది దారుణంగా విఫలమైన నేపథ్యంలో.. ఆటగాళ్ల మధ్య సమన్వయ లోపమే ఇందుకు కారణమనే విమర్శలు వచ్చాయి. గతేడాది ముంబై పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి పాయింట్ల పట్టికలో పదో స్థానంలో నిలిచింది. చదవండి: BCCI: విరాట్ కోహ్లి ఘాటు విమర్శలు.. స్పందించిన బీసీసీఐ -
‘సిక్సర్’ కొట్టేదెవరో?
ఐపీఎల్లో విజయవంతమైన జట్టుగా గుర్తింపు... హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించిన ఫ్రాంచైజీగా రికార్డు... నైపుణ్యాన్ని వలవేసి పట్టే నేర్పరితనం... యువ ఆటగాళ్లకు అండగా నిలిచే యాజమాన్యం... వెరసి ఐపీఎల్ టోర్నీ చరిత్రలో 5 ట్రోఫీలు సాధించిన ముంబై ఇండియన్స్ జట్టు గత కొన్నాళ్లుగా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతోంది. రోహిత్ శర్మ నుంచి సారథ్య బాధ్యతలు హార్దిక్ పాండ్యాకు అప్పగించడంతో జట్టులో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అభిమానుల అసహనం, మాజీల రుసరుసలు, విశ్లేషకులు వెటకారాలతో గత సీజన్ గడిచిపోగా... 2024 ఐపీఎల్ తర్వాత భారత జట్టుకు రోహిత్ శర్మ 2 ఐసీసీ ట్రోఫీలు అందించాడు. ఈ రెండింట్లో హార్దిక్ కీలకపాత్ర పోషించడంతో సమస్య సమసిపోయినట్లైంది. మరి ఈ ఏడాదైనా ముంబై సమష్టిగా సత్తాచాటి మునుపటి జోరు సాగిస్తుందా చూడాలి! ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు ఏదైనా ఉందంటే... అది ముమ్మాటికీ చెన్నై సూపర్ కింగ్సే! ఇప్పటి వరకు 15 సీజన్లు ఆడిన చెన్నై జట్టు అందులో 10 సార్లు ఫైనల్కు చేరి ఐదుసార్లు ట్రోఫీ చేజిక్కించుకుంది. ఈ గణాంకాలు చాలు ఐపీఎల్లో చెన్నై జోరు ఏంటో చెప్పేందుకు. వికెట్ల వెనక ధోని మాయాజాలం... కాన్వే, రచిన్ రవీంద్ర బ్యాటింగ్ సామర్థ్యం... శివమ్ దూబే, రవీంద్ర జడేజా ఆల్రౌండ్ మెరుపులు, అశ్విన్, పతిరణ బౌలింగ్ నైపుణ్యం ఇలా అన్నీ విభాగాల్లో పటిష్టంగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్... ఆరో కప్పువేటకు సిద్ధమైంది. –సాక్షి క్రీడావిభాగం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం నుంచి నిలకడ కొనసాగిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టు ఆరోసారి ట్రోఫీ చేజిక్కించుకునేందుకు సిద్ధమవుతోంది. గత కొన్ని సీజన్లుగా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న ముంబై ఇండియన్స్ ఈసారి మెరుగైన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా సాగుతోంది. గత సీజన్ ఆరంభానికి ముందు ఫ్రాంచైజీకి ఐదు ట్రోఫీలు (2013, 2015, 2017, 2019, 2020) అందించిన ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మను కాదని... గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను తీసుకొచ్చి సారథ్య బాధ్యతలు అప్పగించడం అభిమానులకు ఏమాత్రం రుచించలేదు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ముంబై ఇండియన్స్ నిర్ణయాన్ని దుమ్మెత్తిపోసిన అభిమానులు... మైదానంలో హార్దిక్ను గేలి చేశారు. సొంత మైదానం వాంఖడేతో పాటు... దేశంలో ఎక్కడ మ్యాచ్ ఆడేందుకు వెళ్లినా... పాండ్యాకు ఇదే అనుభవం ఎదురైంది. దీంతో సహజంగానే డ్రెస్సింగ్రూమ్ వాతావరణం దెబ్బతింది. అదే మైదానంలో ప్రస్ఫుటమైంది. గత సీజన్లో 14 మ్యాచ్లాడిన ముంబై ఇండియన్స్ జట్టు కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి 10 పరాజయాలతో పట్టికలో అట్టడుగున నిలిచింది. గత నాలుగు సీజన్లలో ఒక్కసారి (2023లో) మాత్రమే ముంబై జట్టు ప్లే ఆఫ్స్కు చేరింది. 2022, 2024లో పట్టికలో కింది స్థానంతో లీగ్ను ముగించింది. అయితే అప్పటికీ ఇప్పటికీ జట్టులో ఎంతో తేడా కనిపిస్తోంది. ఏడాది వ్యవధిలో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఐసీసీ టి20 ప్రపంచకప్తో పాటు, చాంపియన్స్ ట్రోఫీ చేజిక్కించుకుంది. ఈ రెండు విజయాల్లోనూ కీలకంగా నిలిచిన హార్దిక్ పాండ్యాను అభిమానులు తిరిగి అక్కున చేర్చుకున్నారు. దీనికి తోడు రోహిత్ వంటి అనుభవజ్ఞుడి సలహాలు, సూచనలు ఉంటే... పాండ్యా జట్టును మరింత ముందుకు తీసుకెళ్లడం ఖాయమే. బుమ్రా ఫిట్నెస్ సాధించేనా! ఆ్రస్టేలియా పర్యటన సందర్భంగా గాయపడ్డ భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్పై ముంబై ఆందోళన చెందుతోంది. వెన్నునొప్పితో చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఈ ఏస్ పేసర్... ఐపీఎల్ తొలి దశ మ్యాచ్లకు అందుబాటులో ఉండబోడని ఇప్పటికే ఫ్రాంచైజీ వెల్లడించింది. అయితే అతడి సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే దానిపై స్పష్టత లేదు. గతేడాది వేలంలో బుమ్రా, రోహిత్, హార్దిక్, సూర్యకుమార్తో పాటు హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మను ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది. అందులో అత్యధికంగా బుమ్రాకు రూ. 18 కోట్లు కట్టబెట్టింది. యువ ఆటగాడు ఇషాన్ కిషన్ను వేలానికి వదిలేసిన ముంబై... ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, సాంట్నర్తో బౌలింగ్ను మరింత పటిష్టం చేసుకుంది. రోహిత్తో కలిసి దక్షిణాఫ్రికా ప్లేయర్ రికెల్టన్ ఇన్నింగ్స్ను ఆరంభించనున్నాడు. భారత ఆటగాళ్ల విషయంలో పటిష్టంగా కనిపిస్తున్న ముంబై ఇండియన్స్... విదేశీ ఆటగాళ్ల ఎంపిక మాత్రం కాస్త అనూహ్యంగా ఉంది. లోయర్ ఆర్డర్లో ధాటిగా ఆడగల విదేశీ పించ్ హిట్టర్ లోటు కనిపిస్తోంది. రూ.5 కోట్ల 25 లక్షలు వెచ్చించి ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా తిరిగి దక్కించుకున్న నమన్ ధీర్పై భారీ అంచనాలు ఉన్నాయి. బుమ్రా గైర్హాజరీలో బౌల్ట్, సాంట్నర్, దీపక్ చాహర్, కరణ్ శర్మ పై బౌలింగ్ భారం పెరగనుంది. ఆంధ్ర ఆటగాడు పెనుమత్స సత్యనారాయణ రాజు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ జట్టులో ఉన్నా... వారికి మ్యాచ్ ఆడే అవకాశం దక్కడం కష్టమే. ముంబై ఇండియన్స్ జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్ ), రోహిత్, సూర్యకుమార్, తిలక్, రాబిన్ మిన్జ్, రికెల్టన్, శ్రీజిత్ క్రిష్ణన్, జాకబ్స్, నమన్ ధీర్, జాక్స్, సాంట్నర్, అంగద్ , విఘ్నేశ్, కార్బిన్, బౌల్ట్, కరణ్ శర్మ, దీపక్ చాహర్, అశ్వని కుమార్, టాప్లీ, వెంకట సత్యనారాయణ, అర్జున్ టెండూల్కర్, ముజీబ్, బుమ్రా. అంచనా: ముంబై ఇండియన్స్ ఆటతీరు పరిశీలిస్తే... ఆడితే అందలం, లేకుంటే అట్టడుగు స్థానం అనేది సుస్పష్టం. గత నాలుగు సీజన్లలో కేవలం ఒక్కసారే ప్లే ఆఫ్స్కు చేరిన ముంబై... స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ఈ సారి కూడా ప్లే ఆఫ్స్ చేరొచ్చు. సాధారణ ఆటగాడు సైతం... అసాధారణ ప్రదర్శన చేయడం... అప్పటి వరకు జట్టులో చోటు దక్కడమే కష్టమనుకున్న ప్లేయర్ సైతం... ‘ఎక్స్’ ఫ్యాక్టర్గా మారడం... చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో నిత్యకృత్యం.అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవడంలో చెన్నైని మించిన జట్టు లేదనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటి వరకు 5 సార్లు (2010, 2011, 2018, 2021, 2023) ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకున్న సూపర్ కింగ్స్ మరో 5 సార్లు (2008, 2012, 2013, 2015, 2019) రన్నరప్గా నిలిచింది. గతేడాదే రుతురాజ్ గైక్వాడ్కు సారథ్య బాధ్యతలు అప్పగించిన ఫ్రాంచైజీ... అతడితో పాటు రవీంద్ర జడేజాకు రూ. 18 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకుంది.పతిరణను రూ. 13 కోట్లు, శివమ్ దూబేను రూ. 12 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకుంది. అంతర్జాతీయ మ్యాచ్ ఆడి ఐదేళ్లు దాటిపోయిన మహేంద్రసింగ్ ధోనిని రూ. 4 కోట్లకు కొనసాగించింది. వీరితో పాటు రచిన్ రవీంద్రను రూ. 4 కోట్లతో ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా తిరిగి సొంతం చేసుకుంది. ఇక సుదీర్ఘ కాలం తర్వాత రవిచంద్రన్ అశ్విన్ను తిరిగి కొనుగోలు చేసుకుంది. మరి గత కొంత కాలంగా నిలకడగా రాణించలేకపోతున్న సూపర్ కింగ్స్ ఈసారి ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. తలా... అన్నీ తానై! అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన అనంతరం కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోని... ఈసారి కూడా జట్టును ముందుండి నడిపించనున్నాడు. పేరుకు రుతురాజ్ కెప్టెన్ అయినా... వికెట్ల వెనక నుంచి టీమ్కు దిశానిర్దేశం చేసేది ధోనినే అనడంలో సందేహం లేదు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడుతున్న ధోనీ గతేడాది బ్యాటింగ్ ఆర్డర్లో మరీ కింది స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. మరి ఈసారైనా అతని బ్యాట్ నుంచి మెరుపులు వస్తాయోమో చూడాలి. బ్యాటింగ్లో కాన్వే, రచిన్, దూబే, రుతురాజ్, జడేజా, ధోని కీలకం కానుండగా... పతిరణ, అశ్విన్, ఖలీల్ అహ్మద్, స్యామ్ కరన్ బౌలింగ్ బాధ్యతలు మోయనున్నారు. రచిన్, జడేజా, దూబే, దీపక్ హూడా, విజయ్ శంకర్, అశ్విన్, జేమీ ఓవర్టన్, సామ్ కరన్ ఇలా లెక్కకు మిక్కిలి ఆల్రౌండర్లు ఉండటం చెన్నైకి అదనపు బలం. ఆంధ్ర ఆటగాడు షేక్ రషీద్ జట్టులో ఉన్నా... అతడికి మ్యాచ్ ఆడే అవకాశం దక్కుతుందో లేదో వేచి చూడాలి. చెన్నై జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్ ), మహేంద్రసింగ్ ధోని, కాన్వే, రాహుల్ త్రిపాఠి, షేక్ రషీద్, వన్ష్ బేదీ, సిద్ధార్్థ, రచిన్ రవీంద్ర, రవిచంద్రన్ అశ్విన్, విజయ్ శంకర్, స్యామ్ కరన్, అన్షుల్ కంబోజ్, దీపక్ హూడా, జేమీ ఓవర్టన్, కమలేశ్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, ముకేశ్, గుర్జప్నీత్ సింగ్, నాథన్ ఎలీస్, శ్రేయస్ గోపాల్, పతిరణ. అంచనా: ఐపీఎల్లో మిగిలిన జట్లతో పోల్చుకుంటే అత్యధిక మంది ఆల్రౌండర్లు అందుబాటులో ఉన్న చెన్నై స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ఫైనల్ చేరడం పెద్ద కష్టం కాకపోవచ్చు.