breaking news
rohit sharma
-
వన్డే ర్యాంకింగ్స్ లో కోహ్లి-రోహిత్ జోరు!
-
ODI WC: మీకు దమ్ముంటే అతడిని తప్పించండి!
వన్డే వరల్డ్కప్ విజేత, భారత మాజీ క్రికెటర్ మదన్ లాల్ టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మకు అండగా నిలిచాడు. దమ్ముంటే అతడిని జట్టు నుంచి తప్పించాలంటూ సెలక్టర్లకు సవాల్ విసిరాడు. కాగా రోహిత్ శర్మ భవితవ్యం గురించి గత కొంతకాలంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇదే చివరి మ్యాచ్ అంటూ..వన్డే వరల్డ్కప్-2027 నాటికి రోహిత్ 40వ వసంతంలో అడుగుపెడతాడు. వయసు రీత్యా ఫిట్నెస్ సమస్యల వల్ల అతడు జట్టుకు భారం అవుతాడనే అభిప్రాయాలు వ్యక్తంగా.. పది కిలోలకు పైగా బరువు తగ్గి స్లిమ్, ఫిట్గా మారాడు హిట్మ్యాన్. అయినప్పటికీ అతడి రిటైర్మెంట్పై ఊహాగానాలు ఆగలేదు.తాజాగా ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో ఆదివారం లార్డ్స్ మ్యాచ్ రోహిత్ కెరీర్లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ అనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, ఈ మ్యాచ్లో శతక్కొట్టి (138) మరీ విమర్శకులకు బ్యాట్తోనే సమాధానం చెప్పాడు రోహిత్. అంతేకాదు.. ఆ తర్వాత రిటైర్మెంట్ వార్తలపై స్వయంగా స్పందించాడు.ఆడినంత కాలం ఇలాగే..‘నేను అరంగేట్రం చేసినప్పటి నుంచీ ఇలాంటి చర్చలు, విమర్శలు వస్తూనే ఉన్నాయి. నేను ఆడినంత కాలం ఇవి కొనసాగుతూనే ఉంటాయి. అందుకే వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గ్రౌండ్లో నేను ఏం చేస్తున్నాననేదే నాకు ముఖ్యం. జట్టు విజయానికి నా వంతు కృషి చేయడంపైనే నా దృష్టి. ఈ చర్చలు సాగనివ్వండి లేకపోతే మజా ఏముంటుంది.నా పని మైదానం లోపల... వారి పని బయట’ అని రోహిత్ తనదైన శైలిలో స్పందించాడు. ఈ క్రమంలో మదన్ లాల్ సైతం హిట్మ్యాన్కు మద్దతుగా నిలిచాడు. ‘‘నేడో.. రేపో.. ప్రతీ ఒక్క ఆటగాడు ఏదో ఒకరోజు రిటైర్ అవ్వాల్సిందే. అయితే, రోహిత్ శర్మ ఇప్పుడు అద్భుతంగా ఆడుతున్నాడు. అతడు ఇంకా ఆడాలనుకుంటే ఆడనివ్వండి.ఒకవేళ దమ్ము, ధైర్యం ఉంటేసెలక్టర్లకు ఒకవేళ దమ్ము, ధైర్యం ఉంటే అతడిని తప్పించి ముందుకు సాగండి చూద్దాం. ప్రస్తుతం అతడు మంచి ఫామ్లో ఉన్నాడు. ఇలాంటపుడు అతడి విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అంతేగానీ.. అతడి దగ్గరకు వెళ్లి.. ‘నువ్వు మా దీర్ఘకాలిక, వన్డే వరల్డ్కప్ ప్రణాళికల్లో గానీ లేవు’ అని అన్నారనుకోండి.అప్పుడు అతడు.. ‘ఏం.. ఎందుకు మీ ప్లాన్లో నేను లేను. నేను పరుగులు రాబడుతున్నా కదా!.. మరి నన్నెలా పక్కనపెడతారు’ అని అడుగుతాడు. అలా అడిగే హక్కు అతడికి ఉంది’’ అని మదన్ లాల్ సెలక్టర్లకు సవాల్ విసిరాడు. కాగా ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు గుడ్బై చెప్పిన రోహిత్ వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. టీమిండియాకు కెప్టెన్గా రెండు ఐసీసీ టైటిళ్లు అందించిన ఘనత అతడిది. టీ20 ప్రపంచకప్- 2024, చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియాను విజేతగా నిలిపాడు.చదవండి: డెబ్బై పరుగులు చేయగానే గిల్కు కండరాలు పట్టేస్తాయి! -
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో శుబ్మన్ గిల్
టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ వన్డేల్లో వరల్డ్నంబర్ వన్ బ్యాటర్గా నిలిచేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించిన తాజా వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో అగ్రస్ధానానికి గిల్ మరింత చేరవయ్యాడు. ప్రస్తుతం అగ్రస్ధానంలో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డారిల్ మిచెల్ 802 రేటింగ్ పాయింట్లతో నంబర్ 1 స్థానంలో ఉండగా.. గిల్ (801) కేవలం ఒక్క పాయింట్ తేడాతో రెండో స్థానంలో నిలిచాడు. తదుపరి ఐసీసీ ర్యాంకింగ్స్ అప్డేట్లో గిల్ అగ్రస్థానానికి చేరుకుంటే.. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో అగ్రపీఠాన్ని అదరోహించిన అత్యంత పిన్న వయస్కుడైన భారత కెప్టెన్గా చరిత్ర సృష్టిస్తాడు. గతంలో భారత్ తరపున వన్డేల్లో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజ క్రికెటర్లు టాప్ ర్యాంక్ను సొంతం చేసుకున్నారు. కాగా ఇంగ్లండ్తో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్లో గిల్ అదరగొట్టాడు. మూడు మ్యాచ్లలో 94.00 అద్భుత సగటుతో 188 పరుగులు సాధించి, భారత్ తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ ప్రదర్శ కారణంగానే అతడిని నంబర్-1 ర్యాంక్ రేసులో ఉన్నాడు.కాగా ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత బ్యాటర్ల హవా కొనసాగుతోంది. గిల్తో పాటు విరాట్ కోహ్లి 767 పాయింట్లతో మూడో స్థానంలో, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 758 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ సిరీస్లో రోహిత్, కోహ్లి కూడా మెరుగైన ప్రదర్శన చేశారు. ఇక ఇదే సిరీస్లో దుమ్ములేపిన ఇంగ్లండ్ వెటరన్ జో రూట్ నాలుగు స్ధానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంక్కు చేరుకున్నాడు. -
ODI WC: భారత జట్టు ఇదే.. వాళ్లకు నో ఛాన్స్!
ఇంగ్లండ్తో వన్డే సిరీస్లోనూ టీమిండియాకు భంగపాటే ఎదురైంది. తొలుత టీ20 సిరీస్లో ఆతిథ్య జట్టు చేతిలో 4-0 క్లీన్స్వీప్ అయిన భారత జట్టు.. ఆ తర్వాత వన్డే సిరీస్లో 2-1తో ఓడిపోయింది. తొలి వన్డేలో గెలిచిన గిల్ సేన.. ఆ తర్వాత రెండు వన్డేల్లోనూ ఓడిపోయింది.ఫిట్నెస్లేని ఆటగాళ్లకు గిల్ వార్నింగ్ముఖ్యంగా లార్డ్స్లో భారత బౌలర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది. ఇక జస్ప్రీత్ బుమ్రా గాయం వల్ల ఈ మ్యాచ్కు అందుబాటులో లేకుండా పోయాడు. అంతకుముందే ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా గాయపడి జట్టుకు దూరమయ్యాడు.ఇక ఈ సిరీస్ కంటే ముందే ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి కూడా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో తరచూ గాయపడే ఆటగాళ్ల వల్ల తుదిజట్టు కూర్పు దెబ్బతింటోందని కెప్టెన్ శుబ్మన్ గిల్ అన్నాడు. వన్డే వరల్డ్కప్-2027లో వరుసగా ఏడు మ్యాచ్ల దాకా ఆడాల్సి ఉంటుందని.. అలాంటి కీలక సమయంలో వీరితో కష్టమేనంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు.తమ ఫిట్నెస్ ప్రమాణాలు మెరుగుపడితేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలమని గిల్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. ఇలాంటి తరుణంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ బ్యాటర్ అభినవ్ ముకుంద్ వరల్డ్కప్ జట్టును ఎంచుకున్నాడు.వారికే పెద్దపీటటాపార్డర్లో ఎలాంటి మార్పులు చేయని అభినవ్.. ఓపెనర్లుగా రోహిత్ శర్మ- కెప్టెన్ శుబ్మన్ గిల్ జోడీని వన్డౌన్లో విరాట్ కోహ్లిని కొనసాగించాడు. అయితే బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్కు మాత్రం చోటివ్వలేదు. ఇక వికెట్ కీపర్లుగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్లను ఎంచుకున్న అభినవ్.. మిడిలార్డర్లో వీరితో పాటు శ్రేయస్ అయ్యర్కు చోటిచ్చాడు.ఆల్రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లను ఎంచుకున్న అభినవ్ ముకుంద్.. రవీంద్ర జడేజాను పక్కనపెట్టాడు. స్పెషలిస్టు స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్కు స్థానమిచ్చిన అతడు.. వరుణ్ చక్రవర్తికి చోటివ్వలేదు.ఇక పేస్ విభాగంలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, గుర్నూర్ బ్రార్లకు చోటు ఇచ్చాడు. ప్రిన్స్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్ పేర్లను అభినవ్ ముకుంద్ పరిగణనలోకి తీసుకోలేదు. వీళ్లు కూడా ఉండవచ్చుఅయితే, వరల్డ్కప్ టోర్నీకి ఇంకా సమయం ఉంది కాబట్టి.. నితీశ్ కుమార్ రెడ్డి, శివం దూబే, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, అర్ష్దీప్ సింగ్ ఆఖరి నిమిషంలో జట్టులోకి వచ్చినా అభినవ్ ఆశ్చర్యం లేదన్నాడు. కాగా వచ్చే ఏడాది సౌతాఫ్రికా- జింబాబ్వే- నమీబియా వేదికలుగా అక్టోబరు- నవంబరు మధ్య వన్డే వరల్డ్కప్ జరుగనుంది.వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి అభినవ్ ముకుంద్ ఎంచుకున్న భారత జట్టురోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, ప్రసిద్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్.చదవండి: ఐపీఎల్ టూ ఇంగ్లండ్.. ఢిల్లీ ఆటగాడికి లక్కీ ఛాన్స్! -
ఇంగ్లండ్ అతడికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది.. మీరేం చేస్తున్నారు?
టీమిండియాతో వన్డే సిరీస్లో ఇంగ్లండ్ స్టార్ జో రూట్ అదరగొట్టాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా తొలి వన్డేలో 76 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ వన్డౌన్ బ్యాటర్.. కార్డిఫ్లో జరిగిన రెండో వన్డేలో 99 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. సెంచరీ చేసే అవకాశం ఉన్నా.. సహచరుడికి మ్యాచ్ ముగించే అవకాశం ఇచ్చి.. హుందాగా వ్యవహరించాడు.ఈ మ్యాచ్లో రూట్ ఇన్నింగ్స్ కారణంగా ఇంగ్లండ్ జయభేరి మోగించి సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇక లార్డ్స్ వేదికగా నిర్ణయాత్మక మూడో వన్డేలోనూ రూట్ మరోసారి తన అనుభవాన్ని చూపించాడు. కేవలం 39 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మొత్తంగా 48 బంతుల్లో తొమ్మిది ఫోర్లు బాది 74 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇంగ్లండ్ తొలి క్రికెటర్గా రికార్డుఇక మూడో వన్డేలో గెలిచి ఇంగ్లండ్ సిరీస్ 2-1తో కైవసం చేసుకోగా.. టీమిండియా ఓటమితో నిరాశగా వెనుదిరిగింది. రూట్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.నిజానికి గత కొంతకాలంగా రూట్ వన్డేల్లోనూ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ ముప్పై ఐదేళ్ల బ్యాటర్ గత ఆరు వన్డే ఇన్నింగ్స్లో చేసిన పరుగులు వరుసగా.. 61, 75, 111*, 76*, 99*, 74*. తద్వారా ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో వరుసగా ఆరు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన తొలి క్రికెటర్గా రూట్ చరిత్రకెక్కాడు.ఇంగ్లండ్ అతడికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది.. మీరేం చేస్తున్నారు?ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ సదగోపన్ రమేశ్ టీమిండియా యాజమాన్యం వైఖరిని విమర్శించాడు. ఇంగ్లండ్ మేనేజ్మెంట్ జో రూట్కు పూర్తి స్వేచ్ఛనిచ్చి.. మంచి ఫలితాలు రాబడుతోందన్నాడు. అదే సమయంలో భారత జట్టు యాజమాన్యం మాత్రం దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి విషయంలో తప్పు చేస్తోందని మండిపడ్డాడు.కాగా ఇప్పటికే రోహిత్- కోహ్లి అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. వన్డే వరల్డ్కప్-2027 ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అయితే, అనూహ్య రీతిలో రోహిత్ను కెప్టెన్సీ తప్పించిన యాజమాన్యం.. రో-కో ప్రపంచకప్ ఆడతారో లేదోనన్న అంశంపై తమకు స్పష్టత లేదన్నారు.రోహిత్ భారీ శతకంఈ క్రమంలోనే లార్డ్స్లో ఇంగ్లండ్తో మూడో వన్డే సందర్భంగా రోహిత్ శర్మ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోడుతన్నాడంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే, ఈ మ్యాచ్లో రోహిత్ భారీ శతకం (138)తో రాణించి ఊహాగానాలకు చెక్ పెట్టాడు. తాను రిటైర్ కాబోవడం లేదని స్పష్టం చేశాడు.మీరు తప్పు చేస్తున్నారుఈ పరిణామాల నేపథ్యంలో నేపథ్యంలో రమేశ్ స్పందిస్తూ.. ‘‘విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు యాజమాన్యం మద్దతుగా ఉండాల్సిన సమయం ఇది. వాళ్లిద్దరు ఇప్పటికీ వన్డే ర్యాంకింగ్స్లో టాప్-5లో ఉన్న సత్తా కలవారు. ఓసారి ఇంగ్లండ్ మేనేజ్మెంట్ను చూడండి. జో రూట్కు వాళ్లు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నారు. అతడి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టుకునేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు.అతడిపై ఏమాత్రం ఒత్తిడి పెట్టడం లేదు. ఇంగ్లండ్ రూట్ను తమ బలంగా భావిస్తోంది. కానీ భారత జట్టు యాజమాన్యం మాత్రం రోహిత్- విరాట్లనే తమ వెన్నెముకగా భావించాల్సింది పోయి వారి విషయంలోనే స్పష్టత లేకుండా చేస్తోంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో రోహిత్ వరుసగా 11, 26, 138 పరుగులు చేయగా.. కోహ్లి 5, 74, 65 పరుగులు సాధించాడు.చదవండి: లార్డ్స్ వన్డేలో అదే హైలైట్: పాక్ మాజీ క్రికెటర్ -
జైస్వాల్ కు అవకాశం ఇవ్వాలి.. రోహిత్ రిటైర్మెంట్ పై యూవీ కీలక వ్యాఖ్యలు
-
లార్డ్స్ మ్యాచ్లో అదే హైలైట్: పాక్ మాజీ క్రికెటర్
టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ కెరీర్ చరమాంకానికి చేరిందంటూ గత కొంతకాలంగా వస్తున్న వార్తలకు.. ‘హిట్మ్యాన్’ లార్డ్స్లో శతకంతో చెక్ పెట్టాడు. ఇంగ్లండ్తో మూడో వన్డే సందర్భంగా క్రికెట్ ‘మక్కా’లో సెంచరీ బాది తన బ్యాట్ పదును ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. కాగా ఇంగ్లండ్తో లార్డ్స్ వన్డేనే రోహిత్ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్లో హిట్మ్యాన్ 110 బంతుల్లోనే పదిహేడు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాది 138 పరుగులతో అదరగొట్టాడు.లార్డ్స్ మ్యాచ్లో అదే హైలైట్అనంతరం తన రిటైర్మెంట్ వార్తలపై స్పందిస్తూ.. తాను క్రికెట్ ఆడుతున్నంత కాలం... రిటైర్మెంట్ ఊహాగానాలు వస్తూ ఉంటాయని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. ఇలాంటి వార్తలతో పోరాడటం కంటే... మైదానంలో పరుగులు సాధించడంపైనే దృష్టి పెడతానని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లతో పాటు పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ సైతం రోహిత్ శర్మకు మద్దతుగా నిలిచాడు. గేమ్ ప్లాన్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ‘‘ఈ సిరీస్లో గెలిచేందుకు ఇంగ్లండ్కు అర్హత ఉంది. అయితే, ఆ విషయం కంటే కూడా రోహిత్ శర్మ సెంచరీ చేయడమే లార్డ్స్ మ్యాచ్కు హైలైట్. ప్రపంచంలోని అత్యుత్తమ వన్డే బ్యాటర్లలో తానూ ఒకడినని.. ఇప్పటికీ తన ఆటలో పదును తగ్గలేని రోహిత్ తన ఇన్నింగ్స్ ద్వారా స్టేట్మెంట్ ఇచ్చాడు. అతడి భవిష్యత్తు గురించి చాలా వదంతులు వస్తున్నాయి. వన్డే వరల్డ్కప్-2027 ప్రణాళికల్లో అతడు లేడని చాలా మంది అంటున్నారు. వాళ్లు తలచుకుంటేనే..అయితే, తనను విమర్శించే వాళ్లందరికీ రోహిత్ బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. రోహిత్, విరాట్ కోహ్లి వంటి ఆటగాళ్లను ఎవరూ జట్టు నుంచి బయటకు పంపలేరు. ఆటకు వీడ్కోలు పలకడానికి సరైన సమయం వచ్చిందని భావిస్తే వాళ్లే స్వయంగా తప్పుకొంటారు. రిటైర్మెంట్ అనేది కేవలం వారి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. భారత క్రికెట్కు వీరిద్దరు చేసిన సేవలు వెలకట్టలేనివి. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చే క్రమంలో మిగతా ఫార్మాట్ల నుంచి వారే తప్పుకొన్నారు. అందుకే వాళ్లు నేటికీ సూపర్స్టార్లుగానే కొనసాగుతున్నారు’’ అని కమ్రాన్ అక్మల్ రో-కోలపై ప్రశంసలు కురిపించాడు. కాగా ఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్లో 4-0తో వైట్వాష్ అయిన టీమిండియా.. వన్డే సిరీస్ను 1-2తో కోల్పోయింది.ఇదిలా ఉంటే.. 2024 టీ20 ప్రపంచకప్ టోర్నీలో టీమిండియాను చాంపియన్గా నిలిపిన తర్వాత.. రోహిత్- కోహ్లి అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికారు. గతేడాది వారం రోజుల వ్యవధిలో ఇద్దరూ టెస్టులకూ గుడ్బై చెప్పారు. వరల్డ్కప్-2027 ఆడటమే లక్ష్యంగా వన్డేల్లో కొనసాగుతున్నారు.చదవండి: ఆటకు గుడ్బై చెప్పు... భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
సెంచరీ చేయకపోతే రోహిత్ ను రిటైర్ చేయించేవారు.. గంభీర్ కుట్రను బయటపెట్టిన అశ్విన్
-
లైవ్లోనే గంభీర్కు ఇచ్చిపడేసిన హిట్ మ్యాన్..!
-
‘రోహిత్, కోహ్లిలను టచ్ చేయడం అసాధ్యం’
టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భవితవ్యంపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్, కోహ్లిలను జట్టులో నుంచి తొలగించడం చాలా కష్టతరమని, బలవంతంగా పంపించాలని చూస్తే మాత్రం అభిమానులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించాడు. ఇటీవలే రోహిత్ రిటైర్మెంట్పై ఊహాగానాలు వచ్చిన వేళ అశ్విన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.తన యూట్యూబ్ షో 'ఆష్ కి బాత్’లో అశ్విన్ మాట్లాడుతూ... 'రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆడాలని అనుకుంటే వారిని జట్టు నుంచి తప్పించడం చాలా చాలా కష్టం. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది.. వారి అద్భుతమైన కెరీర్ రికార్డులు. రోహిత్ ఇప్పటికే 12 వేల అంతర్జాతీయ పరుగులు చేశాడు. అలాంటి ఆటగాడిని సులభంగా పక్కన పెట్టడం సాధ్యం కాదు. కోహ్లి గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు. తన ఆటతో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. Photo Credit: BCCI Twitterఇక రెండో కారణం ఏంటంటే.. అది రోహిత్, కోహ్లికి భారీ అభిమాన బలం ఉంది. వీరిద్దరు మ్యాచ్లు ఆడుతున్నారంటే.. వారిని చూసేందుకే లక్షలాది మంది అభిమానులు స్టేడియాలకు తరలివస్తారు. అలాంటి స్టార్ ఆటగాళ్లను జట్టు నుంచి తప్పిస్తే భారీ స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. వారిని తప్పించాలని చూస్తే అభిమానులు ఊరుకుంటారా? ఒకవేళ తొలగిస్తే మాత్రం స్టేడియం పైకప్పు లేచిపోవడం గ్యారంటీ' అంటూ తనదైన శైలిలో అశ్విన్ చమక్కులు పంచాడు.Photo Credit: BCCI Twitterఇంగ్లండ్తో వన్డే సిరీస్లో తొలి రెండు వన్డేల్లో రోహిత్ విపలం కావడంతో మూడో వన్డే అతడికి చివరిది కానుందని, ఇంగ్లండ్తో సిరీస్ తర్వాత రోహిత్ అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలకనున్నాడని వార్తలు వచ్చాయి. అవన్నీ తప్పుడు వార్తలంటూ బీసీసీఐ కొట్టిపారేయడంతో ఊహాగానాలకు తెరపడింది. ఇక రోహిత్ కూడా తన రిటైర్మెంట్పై వస్తున్న వార్తలకు బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. ఇంగ్లండ్తో మూడోవన్డేలో రోహిత్ శర్మ సెంచరీతో మెరిశాడు. 110 బంతుల్లో 138 పరుగులు సాధించాడు. మరోవైపు కోహ్లి కూడా అర్ధసెంచరీతో రాణించి తమకు తిరుగులేదని చాటిచెప్పాడు. ఇక బౌలర్ల పరిస్థితి గురించి అశ్విన్ కాస్త భిన్నంగా స్పందించాడు. 'మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ లేదా భువనేశ్వర్ కుమార్ వంటి బౌలర్లు జట్టులో లేకపోతే కొంతమంది మాత్రమే ప్రశ్నిస్తారు. కానీ స్టార్ బ్యాటర్ల జరిగినంత స్థాయిలో చర్చ జరగదు. భవిష్యత్తులో బౌలర్ల కోసం కూడా అభిమానులు అదే స్థాయిలో గళమెత్తితే వారిని కూడా జట్టు నుంచి తప్పించడం కష్టమవుతుంది. ఇది జరగాలని నేను కోరుకుంటున్నా' అని అశ్విన్ తెలిపాడు. Read: స్పెయిన్ నంబర్వన్.. ర్యాంకింగ్స్లో మొరాకో, నార్వే సంచలనం -
అంతా కోహ్లి వల్లే.. రిటైర్మెంట్ పై తొలిసారి స్పందించిన రోహిత్
-
రోహిత్ శర్మ రిటైర్మెంట్ ? రోహిత్ లేకపొతే కష్టం.. SHUBMAN GILL షాకింగ్ కామెంట్స్
-
రిటైర్ అవ్వమన్నారు.. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు
-
లార్డ్స్లో సెంచరీ.. రోహిత్ శర్మ వ్యాఖ్యలు వైరల్
రిటైర్మెంట్ వార్తల నడుమ లార్డ్స్ మైదానంలో టీమిండియా దిగ్గజం రోహిత్ శర్మ అద్భుత శతకంతో మెరిశాడు. ఇంగ్లండ్తో ఆదివారం నాటి మూడో వన్డే సందర్భంగా 138 పరుగులు సాధించాడు. తొలుత నెమ్మదిగా ఆడిన హిట్మ్యాన్ ఆ తర్వాత గేరు మార్చి.. ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.ఈ క్రమంలో 110 బంతుల్లో 17 ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 138 పరుగులు చేశాడు. అయితే, జేకబ్ బెతెల్ అనూహ్య రీతిలో రోహిత్ను బౌల్డ్ చేశాడు. ఇక ఈ మ్యాచ్లో మరో ఓపెనర్, కెప్టెన్ శుబ్మన్ గిల్ (77), వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి (74) అర్ధ శతకాలు సాధించినా ఫలితం లేకుండా పోయింది. నిర్ణయాత్మక మ్యాచ్లో 27 పరుగుల తేడాతో ఓడి టీమిండియా సిరీస్ను 1-2తో ఇంగ్లండ్కు కోల్పోయింది.The name is Rohit Gurunath Sharma. 🫡The occasion? A Lord's century. 💯Watch #ENGvIND 3rd ODI LIVE NOW on Sony Sports Network TV channels. #SonySportsNetwork #MamlaPersonalHai #ExtraaaInnings pic.twitter.com/G5HoYMO0BV— Sony Sports Network (@SonySportsNetwk) July 19, 2026రూమర్లు కొత్తేం కాదుఇదిలా ఉంటే.. తాజాగా బీసీసీఐ టీవీతో మాట్లాడిన రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలపై స్పందించాడు. ‘‘మైదానంలోకి వచ్చి బ్యాటింగ్ చేయడం నా ముఖ్య విధి. దేశానికి ప్రాతినిథ్యం వహించడం గొప్ప విషయం. నా అరంగేట్రం రోజు నుంచి నేటి దాకా అదే నిబద్ధత, అంకితభావంతో ముందుకు సాగుతున్నాను.అంతేకాదు నేను అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన నాటి నుంచే ఇలాంటి వార్తలు వింటూ ఉన్నాను. నేను మళ్లీ గ్రౌండ్లోకి వెళ్లే దాకా ఈ వదంతులు ఆగవు. అయినా.. ఇలాంటి రూమర్లు నాపై ఎలాంటి ప్రభావం చూపలేవు. మైదానంలో నా ఆట తీరు ఎలా ఉందన్నదే ముఖ్యం.జట్టు విజయం కోసం నా వంతు కృషి చేస్తాను. కేవలం ఆ ఒక్క విషయంపైనే నా దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. అయినా ఇలాంటి వదంతులు ఉంటేనే కదా.. మనకూ కాస్త సరదాగా అనిపిస్తుంది. నా పని నాదే. బయట ఎవరి పని వాళ్లదే. వాళ్లు ఇలాంటి రూమర్లతో ప్రాచుర్యం పొందాలనుకుంటారు’’ అని రోహిత్ శర్మ గాసిప్రాయుళ్లకు కౌంటర్ వేశాడు.కాగా ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకొన్న రోహిత్ శర్మ.. వన్డే వరల్డ్కప్-2027 ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. అయితే, లార్డ్స్లో రోహిత్ చివరి మ్యాచ్ ఆడబోతున్నాడనే ప్రచారం జరుగగా.. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కొట్టిపారేశాడు. కెప్టెన్ గిల్ సైతం ఇవన్నీ కేవలం ఊహాగానాలే అన్నాడు.మా మధ్య అవగాహన ఉందిఇదిలా ఉంటే.. రోహిత్- కోహ్లి కలిసి అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా 400 మ్యాచ్లలో కలిసి ఆడిన తొలి భారత జోడీగా చరిత్రకెక్కారు. ఈ నేపథ్యంలో రోహిత్ స్పందిస్తూ.. ‘‘మా కెరీర్ తొలి నాళ్ల నుంచి మేము కలిసి ఆడుతున్నాం. ఇప్పటికే మేమిద్దరం కలిసి ఎన్నోసార్లు మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాము.మధ్య ఓవర్లలో కోహ్లి వస్తే అతడితో కలిసి ఆడటం నాకెంతో సంతోషంగా ఉంటుంది. ఈరోజు కూడా ఇద్దరం కలిసే ఆడాము. మా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంది. ఆట మధ్యలో మేము ఎక్కువగా చర్చించుకుంటాము. ఒకరి ఆలోచనలు ఒకరం పంచుకుంటూ.. ఒకరినొకరం అర్థం చేసుకుంటూ బ్యాటింగ్ చేస్తూ ఉంటాము’’ అని కోహ్లితో ఉన్న అనుబంధం, సమన్వయం గురించి చెప్పుకొచ్చాడు.చదవండి: మెరుగుపడాల్సిందే: శుబ్మన్ గిల్ వార్నింగ్ -
రోహిత్ సెంచరీ వృథా.. లార్డ్స్ వన్డేలో టీమిండియా ఓటమి
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో భారత్ కోల్పోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ బెన్ డక్కెట్ (141 పరుగులు, 135 బంతుల్లో, 18 ఫోర్లు, 1 సిక్స్) భారీ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు జాకబ్ బెథెల్ (91), జో రూట్ (74 నాటౌట్, 48 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. భారత బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు.రో-కో హిట్.. మిడిలార్డర్ ఫట్అనంతరం 388 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్కు వీరిద్దరూ 147 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత 77 పరుగులు చేసిన గిల్.. రషీద్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు.అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి, రోహిత్తో జతకట్టాడు. వీరిద్దరూ దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలో రోహిత్ 34 బంతుల్లో తన 34వ వన్డే సెంచరీ మార్క్ను పూర్తి చేసుకున్నాడు. వరుస బౌండరీలు బాది మంచి జోరు మీద ఉన్న రోహిత్(110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్లతో 138) జాకబ్ బెథల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. రోహిత్ ఔటైన తర్వాత భారత వికెట్ల పతనం మొదలైంది. మిడిలార్డర్ బ్యాటర్లు ఒక్కరు కూడా రాణించలేకపోయారు. ఇషాన్ కిషన్(14), శ్రేయస్ అయ్యర్(0) వరుస ఓవర్లలో ఔటయ్యారు. దీంతో కావాల్సిన రన్రేట్ భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలో కోహ్లి(74) కూడా ఓ భారీ షాట్కు ప్రయత్నించి పెవిలియన్కు చేరాడు.దీంతో మ్యాచ్ భారత్ చేతులనుంచి చేజారిపోయింది. కేఎల్ రాహుల్(12), అక్షర్ పటేల్(2) నిరాపరిచారు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 360 పరుగుల వద్ద ఆగిపోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కుర్రాన్ 4 వికెట్లతో భారత్ను దెబ్బ తీశాడు. కాగా ఇంగ్లండ్ టూర్లో భారత్ టీ20 సిరీస్తో పాటు వన్డే సిరీస్ను కూడా కోల్పోయి ఘోర పరాభవాన్ని మూట కట్టుకుంది. -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్కడు
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తన ఫామ్ను తిరిగి అందుకున్నాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో మూడో వన్డేలో రోహిత్ సూపర్ సెంచరీతో మెరిశాడు. 388 పరుగుల భారీ లక్ష్య చేధనలో అతడు చెలరేగి ఆడాడు. ఈ క్రమంలో హిట్మ్యాన్ కేవలం కేవలం 84 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో తన 34వ వన్డే శతకాన్ని అందుకున్నాడు.మొత్తంగా ఈ మ్యాచ్లో 110 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. 17 ఫోర్లు, 5 సిక్స్లతో 138 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ అద్భుత సెంచరీతో రోహిత్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.రోహిత్ సాధించిన రికార్డులు ఇవే👉ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో వన్డేల్లో సెంచరీ సాధించిన తొలి భారత బ్యాటర్గా రోహిత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతకుముందు ఈ గ్రౌండ్లో అత్యధిక వన్డే స్కోరు చేసిన భారత్ ఆటగాడిగా రికార్డు సౌరవ్ గంగూలీ పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో గంగూలీని హిట్మ్యాన్(138) అధిగమించాడు. ఈ రికార్డు సచిన్, కోహ్లి వంటి దిగ్గజాలకు కూడా సాధ్యం కాలేదు.👉విదేశీ గడ్డపై ఒకే దేశంలో అత్యధిక అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ వరల్డ్ సృష్టించాడు ఇంగ్లండ్లో రోహిత్కు ఇది ఎనిమిదవ వన్డే సెంచరీ. ఇంతకుముందు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్, సయీద్ అన్వర్, డివిలియర్స్, క్వింటన్ డికాక్ సంయుక్తంగా ఉండేది. వీరంతా ఒకే దేశంలో 7 వన్డే సెంచరీలు నమోదు చేశారు. అయితే ఈ మ్యాచ్లో అద్భుత సెంచరీ సాధించడంతో రోహిత్ ఈ దిగ్గజ క్రికెటర్లను దాటేశాడు.👉వన్డే చరిత్రలోనే ఎక్కువ వయసులో (39 సంవత్సరాల 80 రోజులు) సెంచరీ సాధించిన భారత ఆటగాడిగానూ రోహిత్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (38 ఏళ్ల 327 రోజులు) పేరిట ఉండేది.👉అంతర్జాతీయ క్రికెట్లో సేనా (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలపై అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. సేనా దేశాల జట్లపై రోహిత్ ఇప్పటివరకు 343 సిక్సర్లు కొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్(342) పేరిట ఉండేది. రోహిత్, గేల్ తర్వాత స్ధానాల్లో విరాట్ కోహ్లి(179), ఎంఎస్ ధోని(177), షాహిద్ అఫ్రిది -
లార్డ్స్లో విధ్వంసం.. శతక్కొట్టిన రోహిత్ శర్మ
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 388 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఇంగ్లండ్ బౌలర్లకు రోహిత్ చుక్కలు చూపించాడు.ఈ క్రమంలో హిట్మ్యాన్ కేవలం 84 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో తన 34వ వన్డే శతకాన్ని అందుకున్నాడు.తన ఫామ్పై విమర్శలు చేస్తున్న వారికి రోహిత్ బ్యాట్తోనే సమాధనమిచ్చాడు. లార్డ్స్లో వన్డేల్లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. ఓవరాల్గా 110 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. 17 ఫోర్లు, 5 సిక్స్లతో 138 పరుగులు చేసి ఔటయ్యాడు.కాగా లార్డ్స్ వన్డే అనంతరం రోహిత్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కానీ ఈ ముంబై ఆటగాడు తన సూపర్ సెంచరీ ఈ రూమర్స్కు చెక్పెట్టాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 387 పరుగుల భారీ స్కోర్ సాధించింది. -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా సంయుక్తంగా 400 మ్యాచ్లు ఆడిన భారత జోడీగా రికార్డు సాధించారు. ఇంగ్లండ్తో లార్డ్స్ వేదికగా ఆదివారం నాటి మూడో వన్డే సందర్భంగా రో-కో ఈ ఫీట్ నమోదు చేశారు.అగ్రస్థానంలో ఎవరంటే?ఇక మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన జోడీగా శ్రీలంక దిగ్గజాలు కుమార్ సంగక్కర- మహేళ జయవర్ధనె కొనసాగుతున్నారు. వీరిద్దరు కలిసి శ్రీలంక తరఫున 550 మ్యాచ్లలో భాగమయ్యారు. ఆ తర్వాత మూడు స్థానాల్లోనూ లంక దిగ్గజాలే ఉండటం విశేషం. ఇక రోహిత్- కోహ్లి జోడీ ఈ జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతోంది.కాగా 2007లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రోహిత్ శర్మ 67 టెస్టులు, 159 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఇప్పటికి 287 వన్డేలు పూర్తి చేసుకున్నాడు. ఇక 2008లో అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లి 123 టెస్టులు, 125 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఇప్పటికి 313 వన్డేలు పూర్తి చేసుకున్నాడు.వన్డే వరల్డ్కప్-2027 ఆడటమే లక్ష్యంగాటీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్గా నిలిచిన తర్వాత రోహిత్- కోహ్లి సంయుక్తంగా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అదే విధంగా గతేడాది రోహిత్ టెస్టు ఫార్మాట్కు గుడ్బై చెప్పగా.. వారం రోజుల వ్యవధిలోనే కోహ్లి సైతం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇద్దరూ ప్రస్తుతం వన్డే వరల్డ్కప్-2027లో ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ చేతిలో 4-0తో టీ20 సిరీస్లో క్లీన్స్వీప్నకు గురైంది టీమిండియా. ఈ క్రమంలో వన్డే సిరీస్ను విజయంతో ఆరంభించిన భారత జట్టు.. రెండో వన్డేలో తడబడింది. ఫలితంగా సిరీస్ 1-1తో సమం కాగా.. లార్డ్స్ వేదికగా ఆదివారం నాటి నిర్ణయాత్మక మూడో వన్డేతో విజేత ఎవరో తేలుతుంది.ఇంగ్లండ్తో తొలి వన్డేలో రోహిత్ 11 పరుగులు చేయగా.. కోహ్లి 5 పరుగులకే అవుటయ్యాడు. ఇక రెండో వన్డేలో రోహిత్ 28 పరుగులు చేయగా.. కోహ్లి అర్ధ శతకం (65)తో అలరించాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన జోడీలు👉కుమార్ సంగక్కర- మహేళ జయవర్ధనె (శ్రీలంక): 550 మ్యాచ్లు👉తిలకరత్నె దిల్షాన్- మహేళ జయవర్ధనె (శ్రీలంక): 426 మ్యాచ్లు👉కుమార్ సంగక్కర- తిలకరత్నె దిల్షాన్ (శ్రీలంక): 418 మ్యాచ్లు👉సనత్ జయసూర్య- ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక): 408 మ్యాచ్లు👉జాక్వెస్ కలిస్- మార్క్ బుచర్ (సౌతాఫ్రికా): 407 మ్యాచ్లు👉రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి (ఇండియా): 400* మ్యాచ్లు.చదవండి: టీమిండియాకు భారీ షాక్! -
రంగంలోకి జైషా..ఒక్క ఫోన్ కాల్ తో వణికిపోయిన గంభీర్, అగార్కర్
-
రోహిత్ కాదు..! త్వరలో ఆ ముగ్గురు రిటైర్మెంట్ ఫిక్స్?
టీమిండియా స్టార్ ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్కు సంబంధించి జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. లార్డ్స్ వేదికగా ఆదివారం ఇంగ్లండ్తో జరగనున్న మూడో వన్డేనే రోహిత్కు భారత్ తరపున ఆఖరి మ్యాచ్ అని జాతీయ మీడియాలో సైతం కథనాలు వెలువడ్డాయి.అయితే 'హిట్మ్యాన్' భవిష్యత్తు ప్రణాళికల్లో కొనసాగుతాడని, లార్డ్స్ వన్డే అతడి చివరి మ్యాచ్ కాదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ రోహిత్ కంటే ముందే మరో ముగ్గురు భారత స్టార్ ఆటగాళ్లు వన్డే ఫార్మాట్కు గుడ్-బై చెప్పే అవకాశం కనిపిస్తోంది. ఆ ముగ్గురు స్టార్ ఆటగాళ్లు ఎవరో ఓ లుక్కేద్దాం.మహ్మద్ షమీఈ జాబితాలో వెటరన్ పేసర్ మహ్మద్ షమీ ఉంటాడు. షమీ గతేడాదిగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. వన్డే ప్రపంచకప్- 2023లో భారత్ తరఫున అత్యుత్తమ బౌలర్గా నిలిచిన షమీ.. ఆ తర్వాత గాయాల కారణంగా రెండేళ్లపాటు ఆటకు దూరమయ్యాడు. తిరిగి ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు అతడు భారత జట్టులోకి వచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికి.. అతడు మళ్లీ జట్టులో చోటు కోల్పోయాడు. ఫిట్నెస్ సమస్యల పరంగా అతడిని పక్కన పెట్టనట్లు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ స్పష్టం చేసింది. ఆ తర్వాత అతడు దేశవాళీ క్రికెట్లో రాణించినప్పటికి సెలక్టర్లు మాత్రం జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకోలేదు. అతడి స్దానంలో యువ బౌలర్లను సెలెక్షన్ కమిటీ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్ యువ పేసర్లు సత్తాచాటుతున్నారు. దీంతో షమీకి తిరిగి భారత జట్టులో చోటు దక్కే సూచనలు కనిపించం లేదు. ఈ క్రమంలో 35 ఏళ్ల షమీ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆశ్చర్యపోనక్కర్లేదు. షమీ తన కెరీర్లో మూడు ఫార్మాట్లు కలిపి 405 వికెట్లు పడగొట్టాడు.యుజ్వేంద్ర చహల్ఇక ఈ జాబితాలో రెండో పేరు యుజ్వేంద్ర చహల్. చాహల్ 2023 నుంచి ఇప్పటివరకు భారత్ తరపున ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. ప్రస్తుతం జట్టులో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఫ్రంట్లైన్ స్పిన్నర్లుగా ఉన్నారు. అంతేకాకుండా హర్ష్ దూబే, మానవ్ సుతార్ వంటి యువ ఆటగాళ్లను సెలెక్టర్లు పరిశీలిస్తున్నారు. వీరికి తోడు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు కూడా జట్టులో ఉన్నారు. ఈ నేపథ్యంలో చాహల్ కూడా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించింది.రవీంద్ర జడేజాఇక స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా త్వరలోనే వన్డేల నుంచి తప్పుకోనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. రెండేళ్ల కిందట టీ20లకు వీడ్కోలు పలికిన జడ్డూ.. ప్రస్తుతం కేవలం వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో మాత్రమే కొనసాగుతున్నాడు. వన్డేల్లో కూడా అతడికి అవకాశం రావడం లేదు. అఫ్గాన్ సిరీస్తో పాటు ఇంగ్లండ్తో వన్డేలకు అతడిని పక్కన పెట్టారు. 2023 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత జడేజా కేవలం 13 వన్డేలు మాత్రమే ఆడాడు. ముఖ్యంగా 2026లో ఆడిన 3 వన్డేల్లో కేవలం 43 పరుగులు మాత్రమే చేసి, ఒక్క వికెట్ కూడా తీయలేదు. దీంతో అతడికి ప్రత్యామ్నాయంగా అక్షర్ పటేల్కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని సెలెక్షన్ కమిటీ భావిస్తోంది. దీంతో జడేజా వన్డేలకు వీడ్కోలు పలికి కేవలం టెస్టుల్లోనే కొనసాగే ఛాన్స్ ఉంది. -
రోహిత్పైనే అందరి దృష్టి
లండన్: భారత ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే కెరీర్పై గత మూడు రోజులుగా సాగుతున్న చర్చకు నేడు తెరపడనుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్తో టీమిండియా మూడో వన్డే ఆడనుంది. ఈ మ్యాచ్తోనే రోహిత్ అంతర్జాతీయ కెరీర్ ముగియనుందనే వార్తలు వెలువడటంతో... అభిమానులందరి దృష్టి ‘హిట్ మ్యాన్’పైనే ఉండనుంది. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగాలని రోహిత్ భావిస్తున్నా... సెలక్టర్లు అందుకు సుముఖంగా లేరని రోహిత్ సన్నిహిత వర్గాలు అంటుండగా... లార్డ్స్ మ్యాచ్ రోహిత్ శర్మకు చివరిది కాదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. రోహిత్ కుటుంబ సభ్యులు లండన్ చేరుకోవడంతో అతని అంతర్జాతీయ కెరీర్ ముగియనుందనే వాదనకు బలం చేకూరుతోంది. అదే జరిగితే వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్ను భారత జెర్సీలో చూడటం ఇదే చివరిసారి కానుంది. తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా... రెండో మ్యాచ్లో గెలిచి ఇంగ్లండ్ లెక్క సరిచేసింది. దీంతో ఈ పోరులో గెలిచిన జట్టు సిరీస్ చేజిక్కించుకోనుంది. రో‘హిట్’ కొట్టేనా! గత రెండు మ్యాచ్ల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన రోహిత్ బ్యాట్ నుంచి మెరుపు ఆరంభం ఆశిస్తుండగా... కెపె్టన్ శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ నిలకడ కొనసాగించాల్సిన అవసరముంది. అస్వస్థతతో గత మ్యాచ్కు దూరమైన కేఎల్ రాహుల్ తిరిగి రావడం ఖాయం కావడంతో ఇషాన్ కిషన్ బెంచ్కే పరిమితం కానున్నాడు. గాయం కారణంగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టుకు దూరం కాగా... అతడి స్థానంలో ఎంపికైన లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్ష్ దూబేకు తుది జట్టులో చోటు దక్కుతుందా చూడాలి. బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా మునపటి వాడి ప్రదర్శిస్తుండగా... ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ అతడికి అండగా నిలుస్తున్నారు. మరోవైపు గత మ్యాచ్లో టాపార్డర్ నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించకపోయినా... ఒంటరి పోరాటంతో జట్టును గెలిపించిన రూట్పై ఇంగ్లండ్ భారీ ఆశలు పెట్టుకుంది. గత మూడు వన్డేల్లోనూ నాటౌట్గా నిలచిన రూట్... భారత్పై తొలి వన్డేలో 76, రెండో వన్డేలో 99 పరుగులు చేశాడు. రూట్ నిలకడకు ఇతర బ్యాటర్ల దూకుడు తోడైతే ఇంగ్లండ్ను ఆపడం కష్టతరమే! బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్పైనే ఆ జట్టు ప్రధానంగా ఆధారపడుతోంది. పిచ్ ఎలా ఉందంటే... లార్డ్స్లో టీమిండియాకు గొప్ప రికార్డేమీ లేదు. ఈ మైదానంలో భారత జట్టు వన్డే మ్యాచ్ గెలిచి రెండు దశాబ్దాలు దాటింది. చివరగా 2004లో దినేశ్ కార్తీక్ అరంగేట్రం చేసిన మ్యాచ్లో భారత్ గెలిచింది. ఓవరాల్గా ఈ మైదానంలో తొమ్మిది వన్డేలు ఆడిన టీమిండియా నాలుగు మ్యాచ్ల్లో నెగ్గింది. అందులో 1983 వన్డే ప్రపంచకప్ ఫైనల్ కూడా ఉంది. పిచ్ బౌలింగ్కు అనుకూలం. ఇటీవల న్యూజిలాండ్తో టెస్టు సందర్భంగా పిచ్ అనూహ్యంగా స్పందించింది. గత రికార్డు చూసుకుంటే లక్ష్యఛేదన కన్నా... మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయావకాశాలు ఎక్కువ. మ్యాచ్కు వర్ష సూచన లేదు. తుది జట్లు (అంచనా) భారత్: గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, అక్షర్, శివమ్ దూబే, కుల్దీప్/హర్ష్ దూబే, బుమ్రా, గుర్నూర్, ప్రసిధ్. ఇంగ్లండ్: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), డకెట్, బెథెల్, రూట్, బట్లర్, సామ్ కరన్, విల్ జాక్స్, అట్కిన్సన్, ఆర్చర్, సాఖిబ్/టంగ్, ఆదిల్ రషీద్. -
రిటైర్మెంట్ ఊహాగానాలపై రోహిత్ తొలి స్పందన!
టీమిండియా సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ తన రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలపై తొలిసారి స్పందించాడు. రోహిత్ రిటైర్మెంట్కు సంబంధించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పేర్కొన్నారు. టీమిండియా భవిష్యత్తు ప్రణాళికల్లో జట్టులో రోహిత్ శర్మ ఉంటాడని సైకియా అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో లార్డ్స్ వేదికగా రేపు జరగనున్న చివరి వన్డే కోసం భారత ఆటగాళ్లు ప్రాక్టీస్కు వచ్చారు. ఈ సమయంలో రోహిత్ శర్మ భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్తో సుదీర్ఘంగా చర్చించిన ఫొటోలు బయటికి వచ్చాయి. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణను ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియోలో సితాన్షు కోటక్తో రోహిత్ మాట్లాడుతూ..'బయట జరుగుతున్న విషయాలతో మనకు సంబంధం లేదు. అవన్నీ పట్టించుకోవద్దు' అని పేర్కొనడం వినిపించింది. దీంతో అసలు టీమిండియాలో రోహిత్ శర్మ రిటైర్మెంట్కు సంబంధించి ఇంటర్నల్ చర్చలు కూడా జరగలేదని దీన్నిబట్టి స్పష్టంగా తెలుస్తోంది.ఇక శుక్రవారం రోహిత్ వన్డే కెరీర్పై సైకియా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘రోహిత్ కెరీర్కు సంబంధించి ఏవేవో వార్తలు వస్తున్నాయి. ఆదివారం లార్డ్స్లో రోహిత్ చివరి వన్డే మ్యాచ్ ఆడబోతున్నాడనే విషయంపై ఎలాంటి చర్చ జరగలేదు. భారత వన్డే జట్టులో రోహిత్ కీలక సభ్యుడు. జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లో అతడు భాగం. లార్డ్స్ వన్డే అతడికి చివరి మ్యాచ్ కాదు’ అని సైకియా వెల్లడించాడు. సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తీరుపై బీసీసీఐ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో రోహిత్ వన్డే కెరీర్కు రిటైర్మెంట్ వార్తలకు ఫుల్స్టాప్ పడ్డట్లు అయింది. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో రోహిత్ ఆడిన రెండు వన్డేలు కలిపి కేవలం 37 పరుగులు మాత్రమే చేశాడు. అంతకముందు అఫ్గానిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్లో రోహిత్ వరుసగా 16, 48, 79 పరుగులు చేశాడు. తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో వరుస వైఫల్యాలతో రోహిత్ రిటైర్మెంట్ వార్తలు తెరమీదకు వచ్చాయి. Rohit Sharma 🗣️ Dekho yeh sb yhha khada hai "bahar kya chal raha hai ussya hamara kya lena dena" 🔥ROHIT FOR 2027 WC 🙌🏻#RohitSharma #odiworldcup2027 pic.twitter.com/cR4p52AS3Q— THE LLORD (@BlueBloodcric) July 18, 2026చదవండి: సిరీస్ విజయంపై గురి.. లార్డ్స్లో టీమిండియాకు ఘన చరిత్ర! -
‘బాధ ఎందుకు? అతడి వీడ్కోలు వేడుకలా జరపాల్సిందే!’
ఇంగ్లండ్తో ఆదివారం జరగనున్న వన్డే మ్యాచ్ రోహిత్ శర్మకు ఆఖరిదని, ఆ తర్వాత అతడు రిటైర్మెంట్ ఇవ్వనున్నట్లు ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా రోహిత్ రిటైర్మెంట్ వార్తలపై స్పందించారు. అవన్నీ తప్పుడు వార్తలని, జట్టులో కొనసాగినంతకాలం రోహిత్ శర్మ టీమిండియాకు ఆడుతాడని, అతడి రిటైర్మెంట్ ఇప్పుడే ఉండదని పేర్కొంటూ ఊహాగానాలకు తెరదించాడు. అయితే రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలపై భారత దిగ్గజం కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ ఎప్పుడు ఆటకు వీడ్కోలు పలికినా అతడి రిటైర్మెంట్ను ఒక వేడుకలా సెలబ్రేట్ చేయాలని బీసీసీఐకి సూచించారు. 19 ఏళ్ల కెరీర్లో కెప్టెన్గా, ప్లేయర్గా ఎన్నో అరుదైన మైలురాళ్లను అందుకున్న రోహిత్ శర్మకు గౌరవంగా వీడ్కోలు పలకాల్సిన అవసరముందన్నారు. రిటైర్మెంట్ అనేది క్రికెటర్లకు కామన్ అని, దాని గురించి బాధపడొద్దని, ఆ ప్రక్రియను ఒక వేడుకలా జరుపుకోవాలని కపిల్ హితవు పలికారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ‘రిటైర్మెంట్ అనే పదం వినగానే ఎందుకు బాధపడాలి. సమయం వచ్చింది కాబట్టే అంతా రోహిత్ వీడ్కోలు గురించి మాట్లాడుకుంటున్నారు. 19 ఏళ్లుగా రోహిత్ తన ఆటతో ఎంతో సంతోషాన్ని పంచాడు. ఏదోఒక రోజు అందరూ రిటైర్ అవ్వాల్సిందే. నాతో పాటు సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ ఇలా అందరం ఆటకు వీడ్కోలు పలికినవాళ్లమే. ఒకవేళ రోహిత్ రిటైర్మెంట్కు సమయం వచ్చినప్పుడు మనమంతా దానిని ఒక వేడుకగా జరుపుకోవాలి. రోహిత్ వీడ్కోలు ఎప్పుడు పలికినా ఆ మ్యాచ్లో మాత్రం సెంచరీ సాధించాలని బలంగా కోరుకుంటున్నా.’ అని కపిల్ దేవ్ తెలిపారు.ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో రోహిత్ ఆడిన రెండు వన్డేలు కలిపి కేవలం 37 పరుగులు మాత్రమే చేశాడు. అంతకముందు అఫ్గానిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్లో రోహిత్ వరుసగా 16, 48, 79 పరుగులు చేశాడు. తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో వరుస వైఫల్యాలతో రోహిత్ రిటైర్మెంట్ వార్తలు తెరమీదకు వచ్చాయి. Greater Noida, Uttar Pradesh: When asked about speculation that this match at Lord's could be Rohit Sharma's last ODI, Former Indian cricket team captain and President of PGTI, Kapil Dev says, "... He has entertained the nation immensely, something very few players have… pic.twitter.com/ytrOdnUipk— IANS (@ians_india) July 18, 2026Read: వరుస ఓటములు.. విండీస్ జట్టులో భారీ మార్పులు! -
రోహిత్ రిటైర్మెంట్ పై టీమిండియా కోచ్ క్లారిటీ
-
విశ్రాంతి వద్దన్న రోహిత్.. అతడి కోసం గిల్ అనూహ్య నిర్ణయం!
టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇంగ్లండ్తో లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగే మూడో వన్డే హిట్మ్యాన్ కెరీర్లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ వార్తల్ని కొట్టిపారేశాడు. లార్డ్స్ వన్డే రోహిత్కు చివరి మ్యాచ్ కాదని స్పష్టం చేశాడు.సెలక్టర్లపై బీసీసీఐ ఆగ్రహం!అదే విధంగా ఈ విషయంలో లీకులు ఇచ్చారని సెలక్టర్లపై బీసీసీఐ ఆగ్రహం చేసినట్లు సమాచారం. ఇలాంటి తరుణంలో మరో ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. నిజానికి అఫ్గానిస్తాన్తో ఇటీవల స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ నుంచే రోహిత్ శర్మను పక్కనపెట్టాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం.అప్పుడే డిసైడ్ అయ్యారువిశ్రాంతి పేరిట రోహిత్ను పక్కనపెట్టి.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ను అఫ్గాన్తో సిరీస్లో ఆడించాలనే యోచనలో ఉన్నారట. అయితే, ఇందుకు రోహిత్ ససేమిరా అనడంతో.. కెప్టెన్ శుబ్మన్ గిల్ స్వయంగా తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘గత నెలలో స్వదేశంలో అఫ్గానిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్ నుంచి రోహిత్ శర్మను తప్పించాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నారు. కానీ అతడు ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఆఖరిదైన మూడో వన్డేలోనైనా విశ్రాంతి తీసుకోవాలని కోరారు.విశ్రాంతి వద్దన్న రోహిత్.. గిల్ అనూహ్య నిర్ణయం!అతడి స్థానంలో జైస్వాల్ను ఆడించాలనుకున్నారు. కానీ రోహిత్ రెస్ట్ తీసుకునేందుకు నిరాకరించాడు. దీంతో జైస్వాల్ను ఎలాగైనా ఆడించాలనే ఉద్దేశంతోనే కెప్టెన్ శుబ్మన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగాడు’’ అని పేర్కొన్నాయి. అదే విధంగా.. ‘‘అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయిన తర్వాత రోహిత్కు అసలైన సవాలు ఎదురైంది.అతడు దేశవాళీ క్రికెట్లోనూ కేవలం రెండు మ్యాచ్లే ఆడాడు. కానీ ఆశించిన స్థాయిలో లయను అందుకోలేకపోయాడు. ఇటీవల కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఫామ్ కోల్పోయిన రోహిత్ విషయంలో సెలక్టర్లు అయితే ఇప్పటికే తమ నిర్ణయం గురించి చెప్పేశారు. రోహిత్ శర్మ, బోర్డు తీసుకునే నిర్ణయం ఆధారంగానే అతడు వన్డే వరల్డ్కప్ టోర్నీ-2027 ఆడతాడా? లేదా? అన్నది తేలుతుంది’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.తొలుత విఫలమైనా..కాగా అఫ్గాన్తో వన్డే సిరీస్లో రోహిత్ శర్మ 16, 48, 79 పరుగులు సాధించాడు. ఇక రెండో వన్డేతో తుదిజట్టులోకి వచ్చిన జైస్వాల్ నిరాశపరిచినా (4).. మూడో వన్డేలో అజేయ శతకం (110*)తో ఆకట్టుకున్నాడు. మరోవైపు.. తొలి వన్డేలో ఓపెనర్గా దిగి 84 పరుగులతో అజేయంగా నిలిచిన గిల్.. తర్వాత రెండు వన్డేలో మూడో నంబర్ బ్యాటర్గా వచ్చి భారీ శతకం (154)తో దుమ్ములేపాడు.ఇదిలా ఉంటే.. రెగ్యులర్ వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాల వల్ల ఈ సిరీస్కు దూరం కావడంతో.. అతడి స్థానంలో యశస్వి జైస్వాల్కు జట్టులో చోటు దక్కింది. ఈ వన్డే సిరీస్లో భారత్ అఫ్గాన్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఇక తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో రోహిత్ శర్మ ఇప్పటికి రెండు వన్డేలలో వరుసగా 11, 26 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ వార్తలు తెరమీదకు రావడం గమనార్హం.చదవండి: అదే మా కొంప ముంచింది: శుబ్మన్ గిల్ -
రోహిత్ రిటైర్మెంట్ పై విరాట్ కోహ్లి షాకింగ్ రియాక్షన్
-
బద్దలు కొట్టలేని రోహిత్ శర్మ రికార్డులు ఇవే..!
భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ ముగింపు దశకు చేరుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంగ్లండ్తో లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డే అతని చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే, భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ వన్డే బ్యాటర్ శకం ముగిసినట్లే. ఈ సందర్భంగా చాలా కాలం పాటు చెక్కుచెదరకుండా నిలిచే అతని అరుదైన రికార్డులపై ఓ లుక్కేద్దాం.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లురోహిత్ శర్మ టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి 513 మ్యాచ్ల్లో 657 సిక్సర్లు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో మరే బ్యాటర్ ఇప్పటివరకు ఇన్ని సిక్సర్లు కొట్టలేదు. వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 553 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలువన్డేల్లో ఒక డబుల్ సెంచరీ చేయడమే గొప్ప ఘనతగా భావిస్తారు. అలాంటిది రోహిత్ ఏకంగా మూడు డబుల్ సెంచరీలు నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. 2013లో ఆస్ట్రేలియాపై 209, 2014లో శ్రీలంకపై 264, 2017లో శ్రీలంకపైనే అజేయంగా 208 పరుగులు చేశాడు. ఇప్పటివరకు మరే బ్యాటర్ రెండు డబుల్ సెంచరీలు కూడా నమోదు చేయలేదు.వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు2014లో కోల్కతాలో శ్రీలంకపై రోహిత్ ఆడిన 264 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఇప్పటికీ వన్డే చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా కొనసాగుతోంది. 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లతో ఈ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు.ఒకే ప్రపంచకప్లో అత్యధిక సెంచరీలు2019 ప్రపంచకప్లో రోహిత్ శర్మ ఏకంగా ఐదు సెంచరీలు బాదాడు. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంకపై శతకాలు నమోదు చేసి ఒకే ప్రపంచకప్ ఎడిషన్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆ టోర్నీలో మొత్తం 648 పరుగులతో టాప్ స్కోరర్గా కూడా నిలిచాడు.ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సెంచరీలుప్రపంచకప్ల్లో రోహిత్ ఇప్పటివరకు ఏడు సెంచరీలు సాధించాడు. డేవిడ్ వార్నర్, సచిన్ టెండూల్కర్ తలో ఆరు సెంచరీలతో అతని తర్వాతి స్థానాల్లో ఉన్నారు.వన్డేల్లో అత్యధిక 150+ స్కోర్లువన్డేల్లో 150కు పైగా ఎనిమిది ఇన్నింగ్స్లు ఆడిన ఏకైక బ్యాటర్ రోహిత్ శర్మ. వీటిలో మూడు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. డేవిడ్ వార్నర్ ఏడు 150+ స్కోర్లతో రెండో స్థానంలో ఉండగా.. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ తలో ఐదు సార్లు ఈ ఘనత సాధించారు.ఈ గణాంకాలు చూస్తే రోహిత్ శర్మ పేరు మీద ఉన్న కొన్ని రికార్డులను సమీప భవిష్యత్తులో బద్దలు కొట్టడం అత్యంత కష్టమనే విషయం స్పష్టమవుతోంది. రోహిత్ పేరిట లిఖించిబడిన ఈ రికార్డులు భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. -
‘లార్డ్స్ వన్డే ఆఖరిది కాదు’
న్యూఢిల్లీ: ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ వన్డే రిటైర్మెంట్పై వాదోపవాదాలు నడుస్తున్న తరుణంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టతనిచ్చింది. ఇంగ్లండ్తో లండన్లోని లార్డ్స్ మైదానం వేదికగా ఆదివారం జరగనున్న మూడో వన్డే రోహిత్ శర్మ కెరీర్కు చివరిదనే వాదనను బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా తోసిపుచ్చాడు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుండగా... అందులో ఆడాలని రోహిత్ భావిస్తుండగా... అతడి స్థానంలో యశస్వి జైస్వాల్కు అవకాశం ఇవ్వాలని సెలక్టర్లు యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రోహిత్ వన్డే కెరీర్పై శుక్రవారం సైకియా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘రోహిత్ కెరీర్కు సంబంధించి ఏవేవో వార్తలు వస్తున్నాయి. ఆదివారం లార్డ్స్లో రోహిత్ చివరి వన్డే మ్యాచ్ ఆడబోతున్నాడనే విషయంపై ఎలాంటి చర్చ జరగలేదు. భారత వన్డే జట్టులో రోహిత్ కీలక సభ్యుడు. జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లో అతడు భాగం. లార్డ్స్ వన్డే అతడికి చివరి మ్యాచ్ కాదు’ అని సైకియా వెల్లడించాడు. సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తీరుపై బీసీసీఐ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో రోహిత్ వన్డే కెరీర్కు రిటైర్మెంట్ వార్తలకు ఫుల్స్టాప్ పడ్డట్లు అయింది. కెప్టెన్ గా భారత జట్టుకు టి20 ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీ అందించిన రోహిత్... వన్డే వరల్డ్ కప్ గెలవడమే తన లక్ష్యమని ఇప్పటికే పలుమార్లు ప్రకటించాడు. 2023లో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్లో రోహిత్ సారథ్యంలోని భారత జట్టు ఫైనల్లో ఆ్రస్టేలియా చేతిలో ఓడి రన్నరప్గా నిలవగా... ఈసారి చిరకాల కల నెరవేర్చుకునేందుకు రోహిత్ మరో ఏడాది పాటు కెరీర్ కొనసాగించేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నాడు. -
రోహిత్ ఫ్యాన్స్ కు హార్ట్ బ్రేక్..LORDS లో రిటైర్మెంట్!
-
రోహిత్ భవితవ్యంపై టీమిండియా కోచ్ స్పందన!
టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్పై ఊహాగానాలు వ్యక్తమవుతున్న వేళ అతడి భవితవ్యంపై టీమిండియా మేనేజ్మెంట్ తొలిసారి స్పందించింది. 2027 వన్డే ప్రపంచకప్కు సంబంధించి ప్రణాళికల్లో భాగంగా జట్టు నుంచి రోహిత్ను తప్పించినట్లు బీసీసీఐ ఇప్పటికే హిట్మ్యాన్కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. లార్డ్స్ వన్డే రోహిత్ కెరీర్లో చివరిదని ప్రచారం నడుస్తోన్న వేళ టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ రిటైర్మెంట్పై సమాధానాన్ని దాటవేసిన సితాన్షు అతడి పేలవ బ్యాటింగ్ ప్రదర్శనపై మాత్రం స్పందించాడు. రోహిత్ శర్మపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు.అతడు పెద్ద ప్లేయర్ అని... అలాంటోడు భారత జట్టుకు అవసరమని పేర్కొన్నారు. రోహిత్ శర్మ స్థానంలో ఇషాన్ కిషన్, యశస్వి జైష్వాల్ లకు ఓపెనర్ గా అవకాశాలు ఇస్తారా ? అని మీడియా అడిగిన ప్రశ్నలకు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ సమాధానం ఇచ్చారు. వరుసగా రెండు వన్డేల్లో విఫలమైనంత మాత్రానా రోహిత్ ఆటను జడ్జ్ చేయలేమని కుండబద్దలు కొట్టారు. నిజానికి రోహిత్ శర్మ ఒక టాప్ క్లాస్ ఆటగాడని కితాబిచ్చాడు. హిట్మ్యాన్ ఒకసారి టచ్ లోకి వచ్చాడంటే అతడిని ఆపడం ఎవరి తరం కాదన్నాడు. ఇది ఇలా ఉండగా లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డే రోహిత్ శర్మకు చివరిది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. 2027 వరల్డ్ కప్ ప్లాన్స్ భాగంగా జట్టులో కూడా రోహిత్ శర్మ లేడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రోహిత్ రిటైర్మెంట్పై ప్రశ్న వేయగా.. దీనికి మాత్రం సితాన్షు కోటక్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం ఆసక్తి కలిగించింది.పేలవ ప్రదర్శన39 ఏళ్ల రోహిత్ శర్మ వన్డే ప్రపంచకప్ 2027 ఆడాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం తాను ఫిట్గా ఉండేదుకు 10 కిలోల బరువు కూడా తగ్గాడు. ఫిట్నెస్ నిరూపించుకున్నప్పటికీ బ్యాటింగ్లో మాత్రం వరుసగా విఫలమవుతూనే వస్తున్నాడు. స్వదేశంలో అఫ్గానిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్లో మూడు వన్డేలు కలిపి 143 పరుగులు సాధించాడు. ఇందులో ఒక అర్ధసెంచరీ ఉంది. తొలి వన్డేలో 69 బంతుల్లో 79 పరుగులు చేసిన రోహిత్ రెండు, మూడు వన్డేల్లో వరుసగా 48, 16 పరుగులు సాధించాడు. ఇక ఇంగ్లండ్తో సిరీస్లో వరుసగా రెండు వన్డేల్లో 11, 26 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.Batting coach Sitanshu Kotak has thrown his weight behind Rohit Sharma despite a slow start to the series for the former skipper 🗣️#ENGvIND pic.twitter.com/VuNEOojFDP— Cricbuzz (@cricbuzz) July 17, 2026Read: ‘రోహిత్ రిటైర్మెంట్ వార్తలపై కోహ్లి రియాక్షన్!’ -
‘రోహిత్ రిటైర్మెంట్ వార్తలపై కోహ్లి రియాక్షన్!’
టీమిండియా సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్పై ఊహాగానాలు వ్యక్తమవుతున్న వేళ మరో సీనియర్ విరాట్ కోహ్లి రియాక్షన్ ఆసక్తిగా మారింది. లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డే రోహిత్కు ఆఖరిదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా జట్టు నుంచి రోహిత్ను తొలగిస్తున్నట్లు బీసీసీఐ ముందే హిట్మాన్కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి రోహిత్ నిజంగానే అంతర్జాతీయ క్రికెట్కు ఈడ్కోలు పలుకుతాడా? లేదా అన్నది ఇంగ్లండ్తో జరిగే మూడో వన్డే ద్వారా తేలిపోనుంది. ఇదిలా ఉంటే రోహిత్ శర్మ రిటైర్ అవ్వనున్నాడనే వార్తలు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రోల్స్తో ఊగిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్తో రెండో వన్డే సందర్భంగా రోహిత్, కోహ్లి, బుమ్రాలు పక్కపక్కనే కూర్చొని మ్యాచ్ను సీరియస్గా వీక్షించిన వీడియో ఒకటి బయటికొచ్చింది. అయితే కోహ్లి, రోహిత్ పక్కపక్కనే కూర్చోవడం చాలా అరుదు. దీంతో వీడియోను లింక్ చేస్తూ ఒక అభిమాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'డ్రెసింగ్ రూమ్లో కోహ్లి, రోహిత్లు ఇలా పక్కపక్కన కూర్చోవడం ఎప్పుడూ చూడలేదు. రోహిత్ రిటైర్ అవ్వబోతున్నాడనే వార్త తెలిసినప్పటి నుంచి కోహ్లి దిగాలుగా కనిపిస్తున్నాడని, అతడి పక్కనే కూర్చొని ధైర్యం చెబుతున్నట్లుగా అనిపిస్తోందని, నిజమైన స్నేహం అంటే ఇదేనంటూ' కామెంట్ చేశాడు.ఇక రోహిత్ శర్మ రిటైర్మెంట్పై అటు హిట్మ్యాచ్ కానీ, ఇటు బీసీసీఐ ఇప్పటివరకు స్పందించలేదు. బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కొటక్ కూడా రోహిత్ ఫామ్పై స్పందించాడే తప్ప అతడి రిటైర్మెంట్పై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో కొంతమంది అభిమానులు వచ్చే వన్డే ప్రపంచకప్ వరకు రోహిత్ ఆడుతాడని, తన ఫిట్నెస్ను మెరుగుపరుచుకునేందుకు రోహిత్ 10 కిలోల బరువు కూడా తగ్గాడని, మూడో వన్డేలో భారీ ఇన్నింగ్స్తో మెరుస్తాడని జోస్యం చెబుతున్నారు. ఇక శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ 44 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (66 బంతుల్లో 65; 8 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (71 బంతుల్లో 66; 5 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 44.1 ఓవర్లలో 6 వికెట్లకు 235 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ జో రూట్ (133 బంతుల్లో 99 నాటౌట్; 9 ఫోర్లు) సెంచరీకి ఒక్క పరుగు దూరంలో అజేయంగా నిలిచాడు. Never seen Kohli and Rohit sit together in the dressing room like this. Kohli's looking concerned seems like that Rohit retirement news is actually true and he knows. pic.twitter.com/7vcOZejDMq— Dhillon (@sehajdhillon_) July 16, 2026Read: అపశకునం ముద్ర.. ఫైనల్కు దూరంగా అర్జెంటీనా అధ్యక్షుడు! -
రోహిత్ శర్మ రిటైర్మెంట్..? ఎల్లుండే ఆఖరి మ్యాచ్?
టీమిండియా స్టార్ ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడా? అంటే అవునానే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. ఆదివారం(జూలై 19) ఇంగ్లండ్తో జరగనున్న మూడో వన్డే అతడి చివరి ఇంటర్ననేషనల్ మ్యాచ్ కానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇది రోహిత్ తనంతంట తాను తీసుకున్న నిర్ణయం కాదని, సెలక్టర్ల ఒత్తిడి మేరకే అతడు తప్పుకొంటున్నాడని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ హిట్మ్యాన్తో మాట్లాడి భవిష్యత్తు ప్రణాళికలపై పూర్తి స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో రోహిత్ శర్మకు చోటు లేదని అగార్కర్ చెప్పినట్లు సమాచారం.అతడి స్థానంలో యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్కు అవకాశమివ్వనున్నట్లు ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ తమ కథనంలో రాసుకొచ్చింది. జైశ్వాల్ తాను ఆడిన ప్రతీ మ్యాచ్లో నూ అద్భుతంగా రాణిస్తున్నప్పటికి, జట్టులో ఓపెనింగ్ స్లాట్స్ ఖాళీ లేకపోవడంతో అతడికి చోటు దక్కడం లేదు.ఈ క్రమంలోనే 2027 వన్డే ప్రపంచకప్ నాటికి యశస్విని పూర్తి స్ధాయి ఓపెనర్గా సిద్దం చేయాలని మేనెజ్మెంట్ భావిస్తోంది. ముఖ్యంగా రోహిత్ శర్మ వయస్సును కూడా సెలక్టర్లు పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే వరల్డ్ కప్ నాటికి 40 ఏళ్ల 6 నెలలకు పైగా వయసు ఉండే రోహిత్ ఫిట్నెస్పై కూడా బీసీసీఐకి సందేహాలు ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అసంతృప్తిలో రోహిత్!అయితే ఈ నిర్ణయంపై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే అతడు బీసీసీఐ పెద్దలతో మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. రోహిత్ ఇప్పటికే టీ20ఐలు, టెస్టుల నుంచి తప్పుకోగా.. వన్డే క్రికెట్ మాత్రమే ఆడుతున్నారు. అతడు టెస్టుల నుంచి తప్పుకున్నప్పటి నుంచి, రోహిత్ భవిష్యత్తుపై సెలెక్షన్ కమిటీ టీమ్ మేనేజ్మెంట్తో నిరంతరం చర్చిస్తూనే ఉంది. కాగా రోహిత్ ఇటీవల ఆశించిన విధంగా రోహిత్ ఆడలేకపోతున్నాడు. సిడ్నీలో 121 నాటౌట్ ఇన్నింగ్స్ తర్వాత 11 మ్యాచ్లు ఆడిన 35.18 సగటుతో 387 పరుగులు చేశాడు. వీటిలో 3 అర్ధ సెంచరీలు ఉన్నా... అతని స్థాయిలో బ్యాటింగ్లో దూకుడు కనిపించలేదు. ముఖ్యంగా ఇంగ్లండ్తో రెండు వన్డేల్లో కలిపి 68 బంతుల్లో 37 పరుగులే చేయగలిగాడు. ఇక వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్గా గుర్తింపు ఉన్న రోహిత్ 19 ఏళ్ల కెరీర్లో 287 వన్డేల్లో 48.58 సగటుతో 11,757 పరుగులు చేశాడు. వీటిలో 33 సెంచరీలు, 62 అర్ధసెంచరీలు ఉన్నాయి.చదవండి: అదే మా కొంపముంచింది.. చాలా బాధగా ఉంది: శుబ్మన్ గిల్ -
అరుదైన మైలురాయిని తాకిన రో-కో
టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కలిసికట్టుగా మరో ఘనత సాధించారు. అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఇద్దరు 8000 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేశారు. తద్వారా ఈ ఘనత సాధించిన మూడో భారత జోడీగా, ఓవరాల్గా తొమ్మిదో జోడీగా రికార్డుల్లోకెక్కారు.వీరికి ముందు భారత్ తరఫున గంగూలీ-టెండూల్కర్ (12400), ద్రవిడ్-టెండూల్కర్(11037) ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రికార్డు శ్రీలంక స్టార్ ద్వయం మహేళ జయవర్దనే-కుమార సంగక్కర (13368) పేరిట ఉంది.కార్డిఫ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో వన్డేలో రో-కో జోడీ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 30 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. గిల్ (31), రోహిత్ (26), ఇషాన్ కిషన్ (1) ఔట్ కాగా.. విరాట్ (65), శ్రేయస్ (33) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కర్రన్, అట్కిన్సన్, జాక్స్ తలో వికెట్ తీశారు. కాగా, 3 మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి వన్డే గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
ODI WC: రోహిత్ విఫలం.. ట్విస్ట్ ఇచ్చిన గంభీర్!
ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో టీమిండియా శుభారంభం అందుకుంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజ వేసింది.రో- కో విఫలంఅయితే, ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తీవ్రంగా నిరాశపరిచారు. ఓపెనింగ్ బ్యాటర్ రోహిత్ 21 బంతులు ఎదుర్కొని కేవలం 11 పరుగులు చేసి.. సామ్ కరన్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఇక వన్డౌన్ బ్యాటర్ కోహ్లి.. ఆరు బంతుల్లో ఒక ఫోర్ బాది.. ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్కప్-2027 టోర్నీలో రో-కో ఆడటంపై మరోసారి చర్చమొదలైంది.ప్రయోగాలు చేస్తాంఇప్పటికే ప్రయోగాలు చేస్తామంటూ కెప్టెన్ శుబ్మన్ గిల్ స్పష్టం చేసిన తరుణంలో.. రోహిత్- కోహ్లిని పక్కనపెట్టే సాహసం చేస్తారా? అన్న సందేహాలు వ్యక్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ వర్గాలు స్పోర్ట్స్ టాక్తో మాట్లాడుతూ రోహిత్ విషయంలో మేనేజ్మెంట్ వైఖరి గురించి కీలక విషయాలు వెల్లడించాయి.ట్విస్ట్ ఇచ్చిన గంభీర్!‘‘పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ ఇప్పటికే ఎంతో గొప్పగా సేవ చేశాడు. కాబట్టి కోచ్ (గంభీర్) అతడికి స్వేచ్ఛనిచ్చాడు. ఇన్నాళ్లుగా ఎలా ఆడాడో.. ఇప్పుడు కూడా అలాగే ఆడేమని స్వేచ్ఛగా వదిలేశాడు.అయితే, భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం కోచ్ అతడి పట్ల సానుకూలంగా ఉన్నాడు. ముఖ్యంగా రోహిత్ ఒత్తిడి లేకుండా.. ప్రశాంతమైన మనసుతో మ్యాచ్ ఆడేలా చూస్తున్నారు. అలా అయితేనే రోహిత్ తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలడని యాజమాన్యం నమ్ముతోంది.మేనేజ్మెంట్కు ఆ విషయం తెలుసునిజానికి రోహిత్ ఒత్తిడిలో ఉంటే ఏం జరిగిందో చూశాం కదా!.. కాబట్టి ఇప్పుడు మేనేజ్మెంట్ అతడి ప్రతి ఇన్నింగ్స్ను భూతద్దంలో పెట్టి చూడాలనుకోవడం లేదు. అతడి స్థాయి ఏమిటో యాజమాన్యానికీ తెలుసు. రోహిత్ ప్రశాంతంగా.. ఒత్తిడి లేకుండా ఆడితే ఫలితాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రస్తుతానికి మేనేజ్మెంట్ అతడిపై నమ్మకం ఉంచింది. టెక్నిక్లో ఉన్న చిన్నపాటి లోపాలు సరిచేసుకుంటే హిట్మ్యాన్కు తిరుగు ఉండదు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. కాగా హెడ్కోచ్ గౌతం గంభీర్ రోహిత్ శర్మ పట్ల సానుకూలంగానే ఉన్నట్లు దీనిని బట్టి తెలుస్తోంది. అతడి అనుభవం, దూకుడైన ఆట జట్టుకు ఉపయోగపడుతుందని భావిస్తున్న గంభీర్.. వరల్డ్కప్లో హిట్మ్యాన్ను ఆడించేందుకు సుముఖంగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.చదవండి: IND vs ENG: అతడిని ఆరో స్థానంలో ఆడిస్తారా? -
రెండో వన్డేలో రోహిత్, కోహ్లికి విశ్రాంతి..?
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సిరీస్లో రెండో వన్డే కార్డిప్ వేదికగా 16వ తేదీ జరుగనుంది.ఈ మ్యాచ్కు ముందు భారత జట్టు రోటేషన్ విధానంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని జట్టులో పలు కాంబినేషన్లను పరీక్షిస్తున్నట్లు కెప్టెన్ శుభ్మన్ గిల్ వెల్లడించాడు.తొలి వన్డే అనంతరం మాట్లాడిన అతడు.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సరైన సమతుల్యత కలిగిన జట్టును ఎంపిక చేసేందుకు విభిన్న కాంబినేషన్లను పరిశీలిస్తున్నామని తెలిపాడు.ప్రపంచకప్ దక్షిణాఫ్రికాలో జరుగనుండగా, అక్కడి పరిస్థితులకు ఇంగ్లండ్ పిచ్లు కొంతవరకు సమానంగా ఉంటాయని.. అందుకే ఈ సిరీస్ను ప్రయోగాలకు ఉపయోగించుకుంటున్నామని వివరించాడు.ఈ వ్యాఖ్యలతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు విశ్రాంతి ఇవ్వొచ్చనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. దీనిపై అధికారిక ప్రకటన అయితే లేదు.ఒకవేళ వీరిలో ఎవరికైనా విశ్రాంతినిస్తే, వికెట్కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్కు తుది జట్టులో చోటు దక్కే అవకాశముంది. అవసరానికి అనుగుణంగా బ్యాటింగ్ క్రమంలో మార్పులు చేసి జట్టు సమతుల్యతను కొనసాగించే అవకాశం ఉంది. కాగా, తొలి వన్డేలో రోహిత్ శర్మ 11, విరాట్ కోహ్లి 5 పరుగులకు ఔటై నిరాశపరిచారు. -
IPL 2027: ముంబై ఇండియన్స్ కెప్టెన్గా తిలక్ వర్మ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యధికంగా ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన తొలి జట్టు ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో ట్రోఫీని ముద్దాడింది.అయితే, అనూహ్య రీతిలో 2024 సీజన్కు ముందు రోహిత్ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించింది యాజమాన్యం. హిట్మ్యాన్ స్థానంలో గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న తమ మాజీ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. అయితే, రోహిత్పై వేటు వేసి.. పాండ్యాను కెప్టెన్ చేయడాన్ని సొంతజట్టు అభిమానులే జీర్ణించుకోలేకపోయారు.ఘోర పరాజయాలుహార్దిక్తో పాటు ముంబై యాజమాన్యాన్నీ భారీ ఎత్తున ట్రోల్ చేశారు. అందుకు తగ్గట్లుగానే 2024లో ముంబై ఘోర పరాజయాలు చవిచూసింది. పద్నాలుగింట కేవలం నాలుగు గెలిచి అట్టడుగున పదోస్థానంలో నిలిచింది. అయితే, గతేడాది మాత్రం ప్లే ఆఫ్స్ చేరి పరువు నిలబెట్టుకుంది.కానీ తాజా సీజన్లో మాత్రం మళ్లీ పాత కథే పునరావృతమైంది. ఐపీఎల్-2026లో ముంబై పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచి తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అతడిని తొలగించాలనే డిమాండ్లు పెరిగాయి.జట్టును వీడుతున్న హార్దిక్ఈ క్రమంలో హార్దిక్ సైతం ముంబై జట్టును వీడేందుకు సిద్ధమయ్యాడు. అతడిని ట్రేడ్ చేసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. చెన్నై జట్టుతో చేరేందుకు హార్దిక్ కూడా ఇంట్రస్ట్గానే ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ ఎవరా అన్న చర్చ మొదలైంది. ఈ విషయం గురించి వచ్చే వారానికల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా అందించిన కథనం ప్రకారం.. 2026లో జట్టు ప్రదర్శన గురించి హెడ్కోచ్ మహేళ జయవర్దనెతో వచ్చేవారం ముంబై యాజమాన్యం సమీక్ష నిర్వహించనుంది.కెప్టెన్గా తిలక్ వర్మ!హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ అంశంతో పాటు.. కొత్త కెప్టెన్గా ఎవరిని నియమించాలన్న విషయం గురించి కూడా మేనేజ్మెంట్ చర్చించనుంది. కెప్టెన్సీ రేసులో టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు.. టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.అనుభవం, ప్రతిభ పరంగా బుమ్రావైపే యాజమాన్యం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. అయితే, ఈ పేస్బౌలర్ తరచూ గాయాల బారిన పడటం ఆందోళనకరంగా పరిణమించింది. ఇక యువ ఆటగాడికి పగ్గాలు అప్పగించాలనుకుంటే మాత్రం తిలక్ వర్మనే కెప్టెన్గా ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది.బుమ్రాను కాదని తిలక్కు ఇస్తారా?తిలక్ చుట్టూ కొత్త జట్టును నిర్మించాలని యాజమాన్యం యోచిస్తున్నట్లు సమాచారం. కాగా 2022లో ముంబై జట్టుతో చేరిన ఈ హైదరాబాదీ స్టార్.. ప్రతి సీజన్లోనూ ఇప్పటికి 300కు పైగా పరుగులు చేశాడు. అయితే, ఇటీవల.. ముఖ్యంగా టీమిండియా టీ20 వైస్ కెప్టెన్గా నియమితుడైన తర్వాత తిలక్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్న అతడిని జట్టు నుంచే తొలగించాలంటూ క్రిష్ణమాచారి శ్రీకాంత్ వంటి మాజీ క్రికెటర్లు డిమాండ్ చేశారు. అయితే, ఇంగ్లండ్తో ఐదో టీ20 సందర్భంగా తిలక్ మెరుపు అర్ధ శతకం (25 బంతుల్లో 53)తో రాణించాడు. కానీ ఈ మ్యాచ్లో ఓడిపోయిన టీమిండియా.. ఇంగ్లండ్ చేతిలో 4-0తో క్లీన్స్వీప్ అయింది.చదవండి: IND vs ENG: అతడిని ఆరో స్థానంలో ఆడిస్తారా? -
IND vs ENG: ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్
భారత్ ఘన విజయంఎడ్జ్బాస్టన్ వన్డేలో 6 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్ధేశించిన 259 పరుగుల లక్ష్యాన్ని భారత్ 45.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్(85) టాప్ స్కోరర్గా నిలిచాడు. నిలకడగా ఆడిన గిల్ గాయం కారణంగా రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. గిల్తో పాటు అక్షర్ పటేల్(55 నాటౌట్), వాషింగ్టన్ సుందర్(52 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(35) కీలక ఇన్నింగ్స్లు ఆడారు.విజయం దిశగా భారత్ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ విజయం దిశగా అడుగులు వేస్తోంది. 66 బంతుల్లో 43 పరుగులు కావాలి. క్రీజులో అక్షర్ పటేల్(35), వాషింగ్టన్ సుందర్(29) ఉన్నారు.గిల్ రిటైర్డ్ హర్ట్80 పరుగుల వద్ద గిల్ రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్కు చేరాడు. అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్ క్రీజ్లోకి వచ్చాడు. 34 పరుగులతో శ్రేయస్ అప్పటిక క్రీజ్లో ఉన్నాడు. 26.1 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 151-2గా ఉంది. ఈ మ్యాచ్లో గెలవాలంటే భారత్ మరో 108 పరుగులు చేయాలి. నిలకడగా ఆడుతున్న గిల్, శ్రేయస్గిల్ (74), శ్రేయస్ అయ్యర్ (32) నిలకడగా ఆడుతున్నారు. 24 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 141-2గా ఉంది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే మరో 118 పరుగులు చేయాలి. రోహిత్, కోహ్లి ఔట్ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లి (5) ఘోరంగా విఫలమయ్యారు. సామ్ కర్రన్ బౌలింగ్లో రోహిత్ ఔట్ కాగా.. ఆర్చర్ బౌలింగ్లో విరాట్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 8.3 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 48-2గా ఉంది. రోహిత్ ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన భారత్7.3వ ఓవర్- 259 పరుగుల ఛేదనలో టీమిండియా 43 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 21 బంతుల్లో ఫోర్ సాయంతో 11 పరుగులు చేసిన రోహిత్ సామ్ కర్రన్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. గిల్కు (26) జతగా విరాట్ కోహ్లి క్రీజ్లోకి వచ్చాడు. బర్మింగ్హామ్ వేదికగా టీమిండియాతో తొలి వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఎడ్జ్బాస్టన్లో 47.5 ఓవర్లలో 258 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ బెన్ డకెట్ (43) రాణించగా.. జో రూట్ (76 నాటౌట్), లియామ్ డాసన్ (68) అర్ధ శతకాలతో అదరగొట్టారు. మిగిలిన వారిలో విల్ జాక్స్ (20) చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు.భారత బౌలర్లలో అక్షర్ పటేల్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. గుర్నూర్ బ్రార్, ప్రసిద్ కృష్ణ తలా రెండు.. బుమ్రా, శివం దూబే చెరో వికెట్ దక్కించుకున్నారు. 259 పరుగుల లక్ష్యంతో టీమిండియా బ్యాటింగ్కు దిగింది. అప్డేట్స్..ఇంగ్లండ్ ఆలౌట్47.5: అక్షర్ బౌలింగ్లో జోష్ టంగ్ బౌల్డ్ (0)తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్47.3:అక్షర్ బౌలింగ్లో ఆదిల్ రషీద్ స్టంపౌట్ (1)ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్45.6: అక్షర్ పటేల్ బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్కు క్యాచ్ ఇచ్చి ఎనిమిదో వికెట్గా వెనుదిరిగిన జోఫ్రా ఆర్చర్ (12). స్కోరు 250-8 (46). క్రీజులోకి ఆదిల్ రషీద్ రాగా.. రూట్ 69 పరుగులతో ఉన్నాడు.ఏడో వికెట్ డౌన్43.6: అక్షర్ పటేల్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చిన డాసన్. 68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్. క్రీజులోకి జోఫ్రా ఆర్చర్. రూట్ 59 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 228-7 (44).డాసన్, రూట్ హాఫ్ సెంచరీలు42 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 214-6రూట్ 51, డాసన్ 63 పరుగులతో ఉన్నారు.కుదురుగా ఆడుతున్న రూట్, డాసన్జో రూట్ (30), లియామ్ డాసన్ (34) కుదురుగా ఆడుతున్నారు. 32 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 160-6గా ఉంది. 27 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 128-627 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 128-6గా ఉంది. రూట్ 21, లియామ్ డాసన్ 11 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్21.4వ ఓవర్- 107 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. శివమ్ దూబే బౌలింగ్లో రాహుల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో విల్ జాక్స్ (20) ఔటయ్యాడు. 100 దాటిన ఇంగ్లండ్ స్కోర్21 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోర్ 104-5గా ఉంది. జో రూట్ (9), విల్ జాక్స్ (19) క్రీజ్లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్16.4: ప్రసిద్ బౌలింగ్లో సామ్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి డకౌట్గా వెనుదిరిగాడు.నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్16.1: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో బ్రార్కు క్యాచ్ ఇచ్చి బట్లర్ అవుట్ (5). కేవలం 19 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్. సామ్ కర్రాన్ క్రీజులోకి రాగా.. రూట్ 6 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 80-4.మూడో వికెట్ డౌన్13.1: బుమ్రా బౌలింగ్లో మూడో వికెట్గా వెనుదిరిగిన ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (1). క్రీజులోకి జోస్ బట్లర్. రూట్ సున్నా పరుగులతో ఉన్నాడు. స్కోరు: 64-3.రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్12.4: గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చిన డకెట్. హాఫ్ సెంచరీకి ఏడు పరుగులదూరంలో నిలిచిన డకెట్ (43).తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్12.2: గుర్నూర్ బ్రార్ బౌలింగ్ వాషింగ్టన్ సుందర్కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్గా వెనుదిరిగిన జేకబ్ బెతెల్ (14).పవర్ ప్లేలో ఇంగ్లండ్ స్కోరు: 51-0 (10)ఓపెనర్లు బెన్ డకెట్ 41, జేకబ్ బెతెల్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు.రో-కో రాకఇక ఈ సిరీస్ సందర్భంగా భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ చాలాకాలం తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెడుతున్నారు. ఏడు మ్యాచ్లలో ఇంగ్లండ్దే గెలుపు! 👉ఈ ఇద్దరు చివరగా సొంతగడ్డపై న్యూజిలాండ్తో జనవరిలో జరిగిన వన్డే సిరీస్లో పాల్గొన్నారు. ఇక ఎడ్జ్బాస్టన్లో జరిగిన గత ఏడు వన్డేల్లోనూ ఇంగ్లండ్ గెలుపొందడం విశేషం. అయితే, చివరగా 2014లో టీమిండియా చేతిలో ఇంగ్లండ్ ఓడింది. బట్లర్ @ 200👉మరోవైపు.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ కెరీర్లో ఇది 200వ వన్డే. తద్వారా ఇంగ్లండ్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఇయాన్ మోర్గాన్ (225 వన్డేలు) తర్వాతి స్థానాన్ని బట్లర్ ఆక్రమించాడు. ఇదిలా ఉంటే.. ముందుగా టీ20 సిరీస్ జరగగా ఆతిథ్య ఇంగ్లండ్ టీమిండియాను 4-0తో వైట్వాష్ చేసింది. తుదిజట్లుఇంగ్లండ్జాకబ్ బెథెల్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), సామ్ కర్రన్, విల్ జాక్స్, జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్ఇండియారోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ. -
వరల్డ్కప్ ప్రణాళికలు వేరు.. కోహ్లితో ఏం మాట్లాడానంటే?: గిల్
ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో క్లీన్స్వీప్నకు గురైన టీమిండియా వన్డే సిరీస్కు సన్నద్ధమైంది. ఇరుజట్ల మధ్య బర్మింగ్హామ్ వేదికగా తొలి వన్డేకు రంగం సిద్ధమైంది. ఈ సిరీస్తో భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తిరిగి మైదానంలో అడుగుపెడుతున్నారు.ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదుఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. శిక్షణ సందర్భంగా కోహ్లితో జరిగిన సంభాషణ గురించి వివరించాడు. ‘‘అత్యుత్తమ కాంబినేషన్తో ముందుకు వెళ్లడమే మా ప్రధాన ప్రణాళిక. దీని గురించే మేము మాట్లాడుకున్నాము.కొంతమంది ప్రస్తుతం జట్టులో లేకపోవచ్చు. వీరిలో పేస్ బౌలర్లు, ఆల్రౌండర్లు, స్పిన్నర్లు.. ఇలా ఎవరైనా సరే ఆయా విభాగం నుంచి భవిష్యత్తులో సేవలు అందించేందుకు జట్టులోకి రావొచ్చు. ఇక విరాట్ భాయ్, రోహిత్ భాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు.గత దశాబ్ద కాలంగా వారిద్దరు టీమిండియా బ్యాటింగ్ లైనప్ వెన్నెముకగా ఉన్నారు. వారు జట్టులో అంతర్భాగం. వారి అనుభవం, నైపుణ్యం మా జట్టు విలువను పెంచుతాయి. అయితే, వన్డే ప్రపంచకప్ ప్రణాళికలు కాస్త భిన్నంగా ఉంటాయి.ఇక్కడి వికెట్ల మాదిరే వీలైనన్ని వైవిధ్యమైన కాంబినేషన్లు ప్రయత్నించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వరల్డ్కప్ వేదికైన సౌతాఫ్రికాలోని పిచ్లు.. ఇక్కడి (ఇంగ్లండ్) వికెట్ల మాదిరే ఉంటాయి. కాబట్టి మా బలాన్ని పరీక్షించుకునే క్రమంలో ఇది అత్యంత కీలకమైన సిరీస్గా మారింది. కొత్త వాళ్లకు అవకాశం నిజానికి మా తుదిజట్టులో ఎప్పుడూ పెద్దగా మార్పులు జరగలేదు. అయితే, కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చే క్రమంలో స్వల్ప మార్పులు చోటుచేసుకోవచ్చు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం ద్వారా.. ఒత్తిడిలో వారు ఏమేరకు రాణించగలరో తెలుసుకోవచ్చు. తద్వారా ప్రపంచకప్ టోర్నీకి ముందే జట్టు కూర్పు గురించి మాకు ఒక అవగాహన వస్తుంది’’ అని శుబ్మన్ గిల్ తెలిపాడు.ఇక టీ20 సిరీస్లో ఇంగ్లండ్ చేతిలో 4-0తో వైట్వాష్ కావడం తమపై ఎలాంటి ప్రభావం చూపబోదని గిల్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ‘‘ఈ రెండూ వేర్వేరు ఫార్మాట్లు. వేర్వేరు జట్లు. వేర్వేరు లక్ష్యాలు. కాబట్టి ఈ సిరీస్పై గత టీ20 సిరీస్ ప్రభావం ఉంటుందని నేను అనుకోవడం లేదు’’ అని గిల్ అన్నాడు.చదవండి: టీమిండియాలోకి సూర్యకుమార్ యాదవ్! -
కోహ్లి, రోహిత్ వచ్చేశారు...
బర్మింగ్హామ్: ‘టి20 సిరీస్ ప్రభావం మాపై ఉండదు. ఫార్మాట్ వేరు, జట్టు వేరు, లక్ష్యం వేరు. పూర్తిగా భిన్నమైన, కొత్త తరహా వాతావరణం ఇక్కడ కనిపించనుంది’... ఇంగ్లండ్తో భారత్ వన్డే సిరీస్ ఆరంభానికి ముందు కెప్టెన్ శుబ్మన్ గిల్ చేసిన వ్యాఖ్య ఇది. ఐర్లాండ్–ఇంగ్లండ్ పర్యటనలో కలిపి ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా ఆరు పరాజయాలు మూటగట్టుకున్న టీమిండియా ఇప్పుడు వన్డే ఫార్మాట్లో పోరుకు సిద్ధమైంది. ఇక్కడైనా తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సత్తా చాటి సిరీస్లో పైచేయి సాధించాలని భారత్ పట్టుదలగా ఉంది. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం జరుగుతున్న సన్నాహాలను దృష్టిలో ఉంచుకొని చూస్తే టి20లకంటే ఈ ఫార్మాట్లో టీమిండియా ప్రదర్శన కీలకం కానుంది. భారత జట్టు తాము ఆడిన గత 6 వన్డే సిరీస్లలో 3 సిరీస్లు కోల్పోయింది. అయితే ఇంగ్లండ్తో జరిగిన గత 5 వన్డేల్లోనూ భారత్ గెలవడం విశేషం. బుమ్రా 2 ఏళ్ల 8 నెలల తర్వాత... మాజీ కెప్టెన్లు, స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ రాకతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. వీరికి తోడు నిలకడగా రాణించే కెప్టెన్ గిల్ ఆట జట్టుకు అదనపు బలం. ఎలాగైనా వరల్డ్ కప్ ఆడాలనే లక్ష్యంతో ఉన్న కోహ్లి, రోహిత్ ఈ క్రమంలో తమకు లభించే ప్రతీ అవకాశాన్ని సమర్థంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వారిద్దరి నుంచి అత్యుత్తమ ప్రదర్శనను ఆశించవచ్చు. ఈ టాప్–3 తర్వాత శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మిడిలార్డర్ బాధ్యతలు తీసుకుంటారు. వన్డేల్లో రెగ్యులర్ బ్యాటర్గా రాహుల్ ఇప్పటికే పలు మార్లు తన విలువను చూపించాడు. ఇప్పుడు శ్రేయస్పై మాత్రం అదనపు భారం ఉంది. పేస్ బౌలింగ్లో అన్నింటికంటే పెద్ద బలం జస్ప్రీత్ బుమ్రా పునరాగమనంగా చెప్పవచ్చు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత బుమ్రా వన్డేలే ఆడలేదు! మరో ఇద్దరు యువ పేసర్లు గుర్నూర్, ప్రిన్స్లకు చోటు కల్పిస్తారా... ఒకరిని పక్కన పెట్టిన అర్ష్ దీప్ను ఆడిస్తారా చూడాలి.ఆల్రౌండర్లే బలం... టి20 సిరీస్లో అద్భుత ప్రదర్శనతో చెలరేగిన ఇంగ్లండ్ అదే ఊపులో వన్డే సిరీస్పై కన్నేసింది. టి20 టీమ్లో ఉన్న కెప్టెన్ బ్రూక్, ఆర్చర్, బెతెల్, బట్లర్, కరన్, టంగ్, రషీద్, జాక్స్లు వన్డేల్లో కూడా జట్టును గెలిపించగల సమర్థులు. వీరందరితో పాటు సీనియర్ బ్యాటర్ జో రూట్ వన్డే జట్టులో ఉండటం ఇంగ్లండ్కు పెద్ద సానుకూలాశం. అయితే జనవరిలో శ్రీలంకతో తలపడిన తర్వాత టీమ్ ఒక్క వన్డే కూడా ఆడలేదు. దాంతో ఈ ఫార్మాట్లో సన్నద్ధత విషయంలో కొంత తడబాటు కనిపించింది. అయితే సొంతగడ్డపై సిరీస్ కాబట్టి ఇంగ్లండ్ ఈ సవాల్ను అధిగమించగలదు. 2024 నుంచి ఆడిన 7 వన్డే సిరీస్లలో 5 ఓడిపోయిన ఇంగ్లండ్... చాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. -
తిరిగొచ్చిన రో-కో ద్వయం.. తొలి వన్డేకు భారత జట్టు ఇదే!
ఇంగ్లండ్ గడ్డపై టీ20 సిరీస్లో దారుణ పరాజయం తర్వాత శుబ్మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా వన్డే సిరీస్ ఆడేందుకు సమాయత్తమవుతోంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా మంగళవారం (జూలై 14న) ఇరుజట్లు తొలి వన్డే మ్యాచ్ ఆడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే టెస్టులు, టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వన్డే జట్టుతో కలిశారు. ఇక తొలి వన్డేకు తుది జట్టు అంచనా ఒకసారి పరిశీలించి చూద్దాం.వీరితో పాటు సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా జాయిన్ కావడంతో టీమిండియా బలం పెరిగింది. 20 ఓవర్ల ఫార్మాట్ నుంచి 50 ఓవర్ల ఫార్మాట్కు ఆట మారడానికి తోడు, సీనియర్లు అంతా జట్టులోకి రావడంతో టీమిండియా ఇప్పుడు పేపర్పై దుర్భేద్యంగా కనిపిస్తోంది. 39 ఏళ్ల రోహిత్, 38 ఏళ్ల కోహ్లికి 2027 వన్డే ప్రపంచకప్ ఆఖరిది కానుండడంతో వీరిద్దరు రాణించాలని ఉవ్విళ్లూరుతున్నారు. టీ20 సిరీస్లో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్లు తమ బౌలింగ్తో టీమిండియా బ్యాటర్లను బెంబెలెత్తించారు. కానీ వన్డే ఫార్మాట్లో కోహ్లి, రోహిత్ వంటి అనుభవజ్ఞులు రావడంతో ఈ ఇద్దరు బౌలర్ల ఆటలు సాగకపోవచ్చని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్యాటింగ్లో గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్తో పాటు కేఎల్ రాహుల్ కీలకంగా మారనున్నారు.ఆల్రౌండ్ విభాగంలో అక్షర్పటేల్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్లు ఉన్నప్పటికీ వీరిలో ఇద్దరికి మాత్రమే అవకాశం రానుంది. ఇక బౌలింగ్ విభాగాన్ని జస్ప్రీత్ బుమ్రా నడిపించనుండగా.. టీ20 సిరీస్లో విఫలమైనప్పటికీ అర్ష్దీప్కు మరో చాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరో స్పిన్నర్ అవసరమనుకుంటే కుల్దీప్ యాదవ్ తుదిజట్టులో చోటు దక్కించుకుంటాడు. లేదంటే ప్రసిధ్ క్రిష్ణ, గుర్నూర్ బ్రార్లలో ఒకరికి అవకాశం కల్పించవచ్చు. మొత్తానికి టీ20 సిరీస్లో ఓటమి పాలైనప్పటికీ వన్డే సిరీస్కు మాత్రం సీనియర్ల రాకతో టీమిండియా కొత్తగా కనిపిస్తోంది. మ్యాచ్ సమయం: భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఎడ్జ్బాస్టన్ వేదికగా ప్రారంభం కానుంది.తుదిజట్టు అంచనా: శుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ క్రిష్ణ/ గుర్నూర్ బ్రార్ -
సచిన్, కోహ్లి సరసన గిల్.. టీమిండియా కెప్టెన్గా రికార్డు
టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్ అరుదైన ఫీట్ సాధించాడు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీని రాయల్ బాక్స్ నుంచి వీక్షించిన నాలుగో భారత కెప్టెన్గా గిల్ నిలిచాడు. గతంలో భారత్ నుంచి సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు కెప్టెన్ హోదాలో రాయల్ బాక్స్ నుంచి వింబుల్డన్ టోర్నీ మ్యాచ్లను వీక్షించారు. తాజాగా గిల్ వీరి సరసన చేరాడు. శుక్రవారం లండన్లోని ఆల్ ఇంగ్లండ్ టెన్నిస్ క్లబ్లో జకోవిచ్, సినర్ మ్యాచ్ను గిల్ ప్రత్యక్షంగా వీక్షించాడు. మరో విశేషమేమిటంటే గిల్ పక్కనే భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో పాటు అతడి భార్య అంజలి కూడా ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి వింబుల్డన్ మ్యాచ్ వీక్షిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక వీరితో పాటు విండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా, నెదర్లాండ్స్ స్టార్ ఫుట్బాల్ ఆటగాడు వర్గిల్ వాన్ డిక్, బ్రిటన్ యాక్టర్ బెనెడిక్ట్ కంబర్బాచ్, హ్యూగ్ లారి, డామియన్ లూయిస్లు కూడా రాయల్ బాక్స్ నుంచి మ్యాచ్ను వీక్షించారు. ఇక గిల్ ఇటీవలే సిల్వర్స్టోన్ సర్క్యూట్ వేదికగా జరిగిన బ్రిటీష్ గ్రాండ్ప్రిక్స్ టోర్నీకి కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.ఇక ప్రస్తుతం టీమిండియా జట్టు ఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 0-3తో ఇంగ్లండ్కు సిరీస్ కోల్పోయిన టీమిండియా ఇవాళ చివరి మ్యాచ్ను సౌతాంప్టన్ వేదికగా ఆడుతోంది. టీ20 సిరీస్ ముగిసిన వెంటనే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ మొదలుకానుంది. వన్డే సిరీస్కు గిల్తో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి జాయిన్ కానుండడంతో జట్టు పరిపూర్ణం కానుంది. 2027 వన్డే ప్రపంచ కప్ సన్నాహకంగా ఈ వన్డే సిరీస్ను ఉపయోగించుకుంటామని, దక్షిణాఫ్రికా పరిస్థితులకు ఇక్కడి వాతావరణం సరితూగుతుందని గిల్ వెల్లడించాడు. Shubman Gill with Sachin Tendulkar and Anjali Tendulkar at Wimbledon ❤️ pic.twitter.com/mLkqV9Tjfg— Shubman Gill Fc (@ShubmanGill7fc) July 10, 2026Read: ఒళ్లు మండిన గాఫ్.. బదులు తీర్చుకుంటానని హెచ్చరిక! -
ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన రోహిత్ శర్మ
ఇంగ్లండ్-భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్ మరో 8 రోజుల్లో ప్రారంభం కానుంది. తొలి వన్డే ఎడ్జ్బాస్టన్ వేదికగా జూలై 14న జరగనుంది. ఈ సిరీస్ కోసం భారత స్టార్ ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టాడు. ఇంగ్లండ్కు చేరుకున్న రోహిత్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన ప్రాక్టీస్ను మొదలు పెట్టాడు. వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జరగబోయే ఈ సిరీస్లో సత్తాచాటాలని హిట్మ్యాన్ ఉవ్విళ్లూరుతున్నాడు. చివరగా అఫ్గానిస్తాన్తో వన్డేల్లో కూడా ఈ ముంబైకర్ రాణించాడు. ఇప్పుడు అదే ఫామ్ను ఇంగ్లీష్ గడ్డపై కొనసాగించేందుకు రోహిత్ సన్నదమవుతున్నాడు. మరోవైపు అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు గాయం కారణంగా దూరమైన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దీంతో ఇంగ్లండ్తో వన్డేల్లో కోహ్లి ఆడనున్నాడు. ప్రస్తుతం లండన్లో ఉన్న విరాట్ త్వరలోనే భారత జట్టుతో కలిసే అవకాశముంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సైతం జట్టుతో చేరనున్నాడు. అతడు కూడా తన బౌలింగ్ ప్రాక్టీస్ను మొదలు పెట్టాడు. అయితే ఇంగ్లండ్ టూర్కు స్టార్ ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి గాయం కారణంగా దూరమయ్యారు. నితీశ్ స్ధానంలో సూర్యన్ష్ షెడ్గేని జట్టులోకి తీసుకున్నారు.ఇంగ్లండ్తో వన్డేలకు భారత జట్టుశుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, సూర్యన్ష్ షెడ్గే , కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్.చదవండి: శ్రీలంక గడ్డపై ద్రవిడ్ కుమారుడి విశ్వరూపం! -
రోహిత్ శర్మ సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టిన అనామక ఆటగాడు
టీమిండియా డాషింగ్ బ్యాటర్ రోహిత్ శర్మ పేరిట ఉన్న అత్యధిక అంతర్జాతీయ సిక్సర్ల రికార్డును ఓ అనామక బ్యాటర్ బద్దలు కొట్టాడు. ఆస్ట్రియాకు చెందిన కరణ్బీర్ సింగ్ ఈ ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్ 151 ఇన్నింగ్స్ల్లో 205 సిక్సర్లు కొడితే.. కరణ్బీర్ సింగ్ కేవలం 59 ఇన్నింగ్స్ల్లోనే హిట్మ్యాన్ రికార్డును బ్రేక్ చేశాడు.తాజాగా హంగేరితో జరిగిన మ్యాచ్లో కరణ్బీర్ సింగ్ ఈ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో అతడు కేవలం 57 బంతుల్లోనే 164 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 12 భారీ సిక్సర్లు, 18 ఫోర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్లో కొట్టిన సిక్సర్లతో టీ20 అంతర్జాతీయాల్లో అతని మొత్తం సిక్సర్ల సంఖ్య 207కు చేరింది.టీ20 అంతర్జాతీయాల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 బ్యాటర్ల జాబితాలో కరణ్బీర్ సింగ్, రోహిత్ శర్మ తర్వాతి స్థానాల్లో యూఏఈకి చెందిన మహ్మద్ వసీమ్ (196), టీమిండియా తాజా మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (179), ఇంగ్లండ్ వెటరన్ జోస్ బట్లర్ (173) ఉన్నారు.తాజా ఇన్నింగ్స్లో కరణ్బీర్ సింగ్ మరో భారీ రికార్డుకు తృటిలో కోల్పోయాడు. టీ20 అంతర్జాతీయాల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు అయిన 172 పరుగుల రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ పేరిట ఉంది. ఈ రికార్డును కరణ్బీర్ (164) కేవలం ఎనిమిది పరుగుల తేడాతో చేజార్చుకున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. కరణ్బీర్ రికార్డు ప్రదర్శనకు అబిదుల్లా కొత్వా అనే ఆటగాడి సునామీ ఇన్నింగ్స్ (26 బంతుల్లో 93 నాటౌట్; 2 ఫోర్లు, 12 సిక్సర్లు) తోడవ్వడంతో ఆస్ట్రియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఇది టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో రెండో అత్యధిక జట్టు స్కోరు. 2024లో గాంబియాపై జింబాబ్వే చేసిన 344/4 మాత్రమే దీనికంటే ఎక్కువ.ఇక కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హంగేరి ఏ దశలోనూ పోరాటం ప్రదర్శించలేక 165 పరుగులకు ఆలౌట్ కావడంతో ఆస్ట్రియా 157 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.30 ఏళ్ల కరణ్బీర్ సింగ్ ఆస్ట్రియా జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. టాపార్డర్ బ్యాటర్గా, మీడియం పేసర్గా జట్టుకు సేవలందిస్తున్నాడు. ఇప్పటివరకు 60 టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో 48.71 సగటున, 175.41 స్ట్రయిక్రేట్తో 2533 పరుగులు చేశాడు. అతని ఖాతాలో నాలుగు సెంచరీలు, 20 అర్ధసెంచరీలు ఉన్నాయి. బౌలింగ్లో 39 వికెట్లు కూడా తీశాడు.గత ఏడాది కూడా కరణ్బీర్ మరో విశేష రికార్డు సృష్టించాడు. ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక టీ20 అంతర్జాతీయ పరుగులు చేసిన బ్యాటర్గా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ రికార్డును అధిగమించాడు. 2025లో కేవలం 32 ఇన్నింగ్స్ల్లోనే 1,488 పరుగులు చేసి అసోసియేట్ దేశాల క్రికెట్లో తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ పేరిట ఉన్న మరో అరుదైన రికార్డును అధిగమించడం ద్వారా ప్రపంచ టీ20 క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు. -
రోహిత్ శర్మకు గుడ్బై?
టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ చరమాంకానికి చేరుకుందా?... వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి ముందే అతడిని తప్పించాలని యాజమాన్యం భావిస్తోందా? అంటే జాతీయ మీడియా వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది.కాగా 2007లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రోహిత్ శర్మ.. ధోని సారథ్యంలో ఓపెనర్గా ప్రమోట్ అయ్యి జట్టులో పాతుకుపోయాడు. అంచెలంచెలుగా ఎదిగి కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన రోహిత్ 2024లో భారత్కు టీ20 ప్రపంచకప్ అందించాడు.ఆ వెంటనే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. గతేడాది టెస్టులకూ రిటైర్మెంట్ ఇచ్చాడు. ప్రస్తుతం కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నాడు. ఇక 2025లో కెప్టెన్ హోదాలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పటికీ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అతడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించింది.ఇంగ్లండ్తో సిరీస్ ఆఖరిది?కాగా వన్డే వరల్డ్కప్-2027లో ఆడాలనే కలతో రోహిత్ శర్మ ముందుకు సాగుతుండగా.. సెలక్టర్లు మాత్రం అతడిని కొనసాగించేందుకు సిద్ధంగా లేనట్లు సమాచారం. స్పోర్ట్స్ టాక్ చర్చలో భాగంగా రోహిత్ అంశం తెరమీదకు రాగా.. ఇంగ్లండ్తో సిరీస్ హిట్మ్యాన్ కెరీర్లో ఆఖరిదంటూ అక్కడున్న వారు బాంబు పేల్చారు.ఇటీవల స్వదేశంలో అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు ముందు రోహిత్ గాయపడ్డ సంగతి తెలిసిందే. అయినప్పటికీ కష్టపడి ఫిట్నెస్ సాధించి మూడు మ్యాచ్లలోనూ భాగమయ్యాడు. అయితే, తొలి వన్డేలో 16 పరుగులకే నిష్క్రమించిన రోహిత్.. రెండో వన్డేలో 48 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మూడో వన్డేలో 78 పరుగులతో సత్తా చాటాడు.అఫ్గానిస్తాన్తో సిరీస్కు ముందేనిజానికి అఫ్గానిస్తాన్తో సిరీస్కు ముందే సెలక్టర్లు రోహిత్ శర్మ వన్డే కెరీర్ గురించి అతడికి స్పష్టతనిచ్చినట్లు సమాచారం. ఇదే ఆఖరి సిరీస్ అని రోహిత్కు చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. తుదిజట్టు నుంచి అతడిని పక్కనపెట్టాలనే యోచన చేసినట్లు తెలుస్తోంది.అయితే, ఆ ఆలోచన మార్చుకున్న యాజమాన్యం.. ఇంగ్లండ్ సిరీస్ రూపంలో హిట్మ్యాన్కు మరో అవకాశం ఇవ్వాలని భావించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇంగ్లండ్ గడ్డ మీద విఫలమైతే.. అదే అతడి కెరీర్లో ఆఖరి సిరీస్ అవుతుందని సెలక్టర్లు స్పష్టం చేసినట్లు సమాచారం.కాగా అఫ్గాన్తో వన్డే సిరీస్కు విరాట్ కోహ్లి దూరం కాగా.. అతడి స్థానంలో యశస్వి జైస్వాల్కు అవకాశం వచ్చింది. రోహిత్ శర్మతో కలిసి రెండు, మూడో వన్డేలో ఓపెనింగ్ చేసిన జైసూ 4, 110 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో వన్డేల్లో రోహిత్ శర్మ వారసుడిగా జైసూను పూర్తిస్థాయి ఓపెనర్గా బరిలోకి దించాలని యాజమాన్యం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.నిజమేనా?కానీ ఇంగ్లండ్తో సిరీస్కు రోహిత్ శర్మనే ఎంపిక చేయడం చూస్తుంటే మాత్రం ఈ ఊహాగానాలు నిజం కాదనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. వరల్డ్కప్నకు ముందు మరికొన్ని వన్డేలు మాత్రమే మిగిలి ఉన్నందున జైస్వాల్ను తీసుకొచ్చి రిస్క్ చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా అఫ్గానిస్తాన్తో సిరీస్లో రోహిత్- జైస్వాల్ ఓపెనర్లుగా రాగా.. కెప్టెన్ శుబ్మన్ గిల్ వన్డౌన్లో ఆడాడు. దీనిని బట్టి రోహిత్ను ఇంకొంతకాలం కొనసాగిస్తారనే చర్చా నడుస్తోంది.అగార్కర్, గంభీర్ కఠిన నిర్ణయంఏదేమైనా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్కోచ్ గౌతం గంభీర్ మాత్రం రోహిత్ను పక్కనపెట్టాలని గట్టిగా ఫిక్సయినట్లు బీసీసీఐ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. వరల్డ్కప్ నాటికి రోహిత్కు 40 ఏళ్లు వస్తాయి. ఈ క్రమంలోనే ఫిట్నెస్ దృష్ట్యా ఈ వెటరన్ ప్లేయర్ను పక్కనపెట్టాలని యాజమాన్యం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా రోహిత్ శర్మ ఇప్పటి వరకు 285 వన్డేలు ఆడి 11720 పరుగులు సాధించాడు. అంతేకాదు వన్డేల్లో ఓవరాల్గా మూడు డబుల్ సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్గా హిట్మ్యాన్ కొనసాగుతున్నాడు. ఇలాంటి దిగ్గజ ఆటగాడికి యాజమాన్యం ఎటువంటి వీడ్కోలు ఇస్తుందో చూడాలి మరి!!చదవండి: కన్నీటి పర్యంతమైన నెయ్మార్! -
పెళ్లి చేసుకున్న టీమిండియా స్టార్.. కోహ్లి, ధోనికి ఆహ్వానం లేదు!
టీమిండియా పేసర్ ఆకాశ్ దీప్ ఓ ఇంటివాడయ్యాడు. అక్షిత రాజ్తో కలిసి మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టాడు. వారణాసిలో బుధవారం వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఆకాశ్ దీప్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.శాశ్వత ఇన్నింగ్స్ఇందుకు.. ‘‘ఈ అందమైన పెళ్లి వేడుక.. ఇద్దరు దిగ్గజాలు తమ శాశ్వత ఇన్నింగ్స్ మొదలుపెట్టే ఘట్టాన్ని అందంగా చిత్రీకరిస్తున్నట్లుగా ఉంది. రీటేక్లు ఏమీ లేవు. నమ్మకం, టీమ్ స్పిరిట్తో మేము ముందుకు సాగుతున్నాం’’ అని ఆకాశ్ దీప్ క్యాప్షన్ జత చేశాడు.శుభాకాంక్షల వెల్లువఈ క్రమంలో సహచర ఆటగాళ్లు, అభిమానుల నుంచి ఆకాశ్ దీప్- అక్షితా రాజ్ (India pacer Akash Deep Wedding)కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా నవదంపతులను విష్ చేశారు.ఇదిలా ఉంటే.. ఆకాశ్ దీప్ స్నేహితులు షేర్ చేసిన ఓ వీడియో క్లిప్ నెట్టింట వైరల్గా మారింది. ఇందులో.. ‘‘నీ పెళ్లికి భారత క్రికెట్ దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను ఎందుకు పిలవలేదు’’ అని ఓ వ్యక్తి అడిగాడు.అందుకు వాళ్లను పిలవలేదు!ఇందుకు బదులుగా ఆకాశ్ దీప్.. ‘‘పెళ్లి బనారస్ (వారణాసి)లో జరుగుతుంది కదా!’’ అని అనడంతో నవ్వులు పూశాయి. కాగా కోహ్లి, ధోని, రోహిత్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా కోహ్లి కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎగబడతారో తెలిసిందే. అందుకే తన పెళ్లి సజావుగా సాగాలంటే కోహ్లి భయ్యా ఇక్కడ లేకపోవడమే మంచిది అన్నట్లు ఆకాశ్ దీప్ సరదాగా ఇలా బదులిచ్చాడు.కాగా బిహార్కు చెందిన ఆకాశ్ దీప్.. 2024లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగిన సిరీస్ ద్వారా ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటికి ఈ 29 ఏళ్ల పేస్ బౌలర్ టీమిండియా తరఫున 10 టెస్టులు ఆడి.. 28 వికెట్లు కూల్చాడు. గతేడాది ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ గడ్డ మీద ఆకాశ్ దీప్ సత్తా చాటాడు. బర్మింగ్హామ్ టెస్టులో పన్నెండు వికెట్లు కూల్చి సంచలనం సృష్టించాడు.ఇక ఇప్పటికి ఐపీఎల్లో పద్నాలుగు మ్యాచ్లు ఆడిన ఆకాశ్ దీప్.. పది వికెట్లు తీయగలిగాడు. ఈ ఏడాది కోల్కతా నైట్ రైడర్స్ అతడిని సొంతం చేసుకోగా.. గాయం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు.అదే విధంగా స్వదేశంలో అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్టు మ్యాచ్కు కూడా దూరమయ్యాడు. తాజాగా పెళ్లి బంధంలో అడుగుపెట్టి వ్యక్తిగత జీవితంలో నూతన అధ్యాయాన్ని ఆరంభించాడు.చదవండి: శ్రీలంకతో తొలి టెస్టు.. భారత్ బ్యాటింగ్ View this post on Instagram A post shared by Virat (@kohlixclips) -
అందుకు అతడే అర్హుడు.. తప్పించలేమని.. ఎంపిక చేస్తే ఎలా?
అఫ్గనిస్తాన్తో స్వదేశంలో వన్డే సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన టీమిండియా.. ఐర్లాండ్లో అడుగుపెట్టింది. ఐరిష్ జట్టుతో టీ20 సిరీస్ ఆడనున్న భారత జట్టు.. అనంతరం ఇంగ్లండ్తో టీ20, వన్డే సిరీస్లు ఆడనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆయా సిరీస్లకు బీసీసీఐ తమ జట్లను ప్రకటించింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma)ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరి ప్రయోజనాల కోసం జట్టుకు ఎంపిక చేయొద్దని.. జట్టు గురించి మాత్రమే ఆలోచించాలంటూ సెలక్టర్లకు హితవు పలికాడు.అందుకు అతడే అర్హుడురోహిత్ శర్మ స్థానంలో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ను ఆడిస్తే బాగుంటుందని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఆడిన గత మూడు వన్డేల్లో యశస్వి జైస్వాల్ రెండు శతకాలు బాదాడు. సౌతాఫ్రికా మీద 116 పరుగులతో అజేయంగా నిలిచిన జైసూ.. ఆ తర్వాత అఫ్గానిస్తాన్పై వరుసగా 4, 110* పరుగులు చేశాడు.భారత వన్డే జట్టు ఓపెనింగ్ జోడీలో ఒకరిగా ఎవరికైనా అవకాశాలు రావాల్సి ఉందంటే.. అందుకు జైస్వాల్ అర్హుడు. కానీ దురదృష్టవశాత్తూ అతడికి అవకాశాలు రావడం లేదు. ఒకవేళ సెలక్టర్లు రోహిత్ శర్మను వన్డే వరల్డ్కప్-2027 ప్రణాళికల్లో భాగం చేయాలనుకుంటే అది వాళ్ల ఇష్టం.తప్పించలేము కాబట్టి ఎంపిక చేస్తామంటే ఎలా?నిజానికి భారత క్రికెట్లో ‘స్టార్’ ప్లేయర్లకు ఎల్లప్పుడూ పెద్దపీట వేసే సంప్రదాయం ఉంది. వ్యక్తిగత ఇమేజ్, ఆట తీరు దృష్ట్యా మాత్రమే వారికి అవకాశాలు దక్కుతాయి. ఇప్పుడు రోహిత్ విషయంలోనూ అదే జరుగుతోందనిపిస్తోంది. నిజంగానే అతడు వరల్డ్కప్ జట్టుకు అవసరమని భావించి సెలక్ట్ చేస్తే ఫర్వాలేదు.అంతేగానీ.. అతడిని తప్పించలేము కాబట్టి ఆడిస్తాం అంటే కుదరదు. విరాట్, రోహిత్ లేదంటే బుమ్రాకు ఏది అత్యుత్తమం అని కాకుండా.. జట్టు ప్రయోజనాల కోసం ఏమి చేయాలి? భారత క్రికెట్ను ఎలా ముందుకు తీసుకువెళ్లాలి? అన్న అంశాలపై మాత్రమే దృష్టి పెట్టాల్సి ఉంటుంది’’ అని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు. కాగా అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. కాగా అఫ్గన్తో సిరీస్కు కోహ్లి దూరం కాగా.. అతడి స్థానంలో జైస్వాల్ జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇంగ్లండ్ పర్యటనతో కోహ్లి తిరిగి జట్టుతో చేరనున్నాడు.చదవండి: శ్రీలంకతో తొలి టెస్టు.. భారత్ బ్యాటింగ్ -
'పద్మశ్రీ' అందుకున్న రోహిత్ శర్మ
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డును ఇవాళ (జూన్ 23) అందుకున్నాడు. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు ఈ గౌరవాన్ని ప్రదానం చేశారు.ఈ ఏడాది జనవరిలోనే రోహిత్తో పాటు భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్కు కూడా పద్మశ్రీ ప్రకటించారు. హర్మన్ప్రీత్ గత నెలలో అవార్డు అందుకోగా, తాజాగా రోహిత్ ఈ గౌరవాన్ని స్వీకరించాడు.టీమిండియాకు అందించిన సేవలకు గుర్తింపుగత కొన్నేళ్లుగా భారత జట్టుకు రోహిత్ అందించిన సేవలు, అతని నాయకత్వంలో జట్టు సాధించిన విజయాలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారం ప్రకటించింది. రోహిత్ కెప్టెన్సీలో భారత్ 2024 టీ20 ప్రపంచకప్ను గెలుచుకోవడంతో పాటు, 2025 ఛాంపియన్స్ ట్రోఫీని కూడా కైవసం చేసుకుంది.దిగ్గజాల సరసన రోహిత్పద్మశ్రీ అందుకున్న భారత క్రికెట్ ప్రముఖుల జాబితాలో ఇప్పుడు రోహిత్ కూడా చేరాడు. ఇప్పటికే సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, రాహుల్ ద్రవిడ్, గౌతమ్ గంభీర్, కపిల్ దేవ్, ఎంఎస్ ధోని వంటి దిగ్గజాలు ఈ గౌరవాన్ని అందుకున్నారు.ఇంగ్లండ్ పర్యటనకు సిద్ధంహామ్స్ట్రింగ్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న రోహిత్ త్వరలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నాడు. శుభ్మన్ గాల్ నాయకత్వంలోని భారత జట్టు జూలై 14 నుంచి 19 వరకు జరిగే మూడు వన్డేల సిరీస్లో ఇంగ్లండ్తో తలపడనుంది. ఆ సిరీస్కు ఎంపికైన జట్టులో రోహిత్ కూడా చోటు దక్కించుకున్నాడు. -
రోహిత్ సరికొత్త రికార్డు.. భారత వన్డే క్రికెట్ హిస్టరీలోనే
చెపాక్ వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. 219 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 28.4 ఓవర్లలో చేధించింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్(110) అజేయ శతకంతో మ్యాచ్ ఫినిష్ చేశాడు. అతడితో పాటు మరో సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 219 పరుగుల లక్ష్య ఛేదనలో హిట్మ్యాన్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. 69 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 79 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన మూడో భారత ఆటగాడిగా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ను రోహిత్ అధిగమించాడు. రోహిత్కు ఇది 95వ హాఫ్ సెంచరీ. ద్రవిడ్ తన వన్డే కెరీర్లో 94 ఆర్ధ శతకాలు నమోదు చేశాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (145) టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా.. విరాట్ కోహ్లి(131) రెండో స్ధానంలో ఉన్నాడు.అదేవిధంగా వన్డే క్రికెట్ చరిత్రలో టీమిండియా తరపున హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రోహిత్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 39 ఏళ్ల 51 రోజుల వయస్సులో వయస్సులో అతడు ఈ ఫీట్ సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు భారత మాజీ క్రికెటర్ మొహిందర్ అమర్నాథ్ పేరిట ఉండేది. అమర్నాథ్ 1989లో పాకిస్తాన్పై 39 ఏళ్ల 21 రోజుల వయసులో ఆర్ధ శతకం నమోదు చేశాడు. తాజా మ్యాచ్తో అమర్నాథ్ ఆల్టైమ్ రికార్డు హిట్మ్యాన్ బ్రేక్ చేశాడు.చదవండి: IND vs AFG: భారత వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి -
భారత వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి
చెపాక్ వేదికగా భారత్తో జరుగుతున్న ఆఖరి వన్డేలోనూ అఫ్గానిస్తాన్ తమ మార్క్ చూపించలేకపోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకే కుప్పకూలింది. భారత పేసర్ ప్రసిద్ద్ కృష్ణ 5 వికెట్లతో పర్యాటక జట్టు పతనాన్ని శాసించాడు.అయితే 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన అఫ్గాన్ను కెప్టెన్ హాష్మతుల్లా షాహిది(102) సెంచరీతో ఆదుకున్నాడు. అతడితో పాటు ఓమర్జాయ్(50) హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.అఫ్గాన్కు షాక్!అయితే సెకెండ్ ఇన్నింగ్స్లో బంతి పడక ముందే భారత్ స్కోర్ బోర్డులో 5 పరుగులు చూసి అందరూ షాక్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్లో అఫ్గాన్ కెప్టెన్ చేసిన చిన్న పొరపాట్ల వల్ల భారత జట్టుకు 5 పెనాల్టీ పరుగులు లభించాయి. షాహిది పిచ్ మధ్య (డేంజర్ లైన్)లో పదే పదే నడిచినందుకు జరిమానా విధించారు.మ్యాచ్ 31వ ఓవర్ సమయంలో షాహిదీ పిచ్ మధ్యలో నడుస్తుండటాన్ని గమనించిన అంపైర్లు, అతనికి మొదటి అధికారిక హెచ్చరిక ఇచ్చారు. అయినప్పటికీ, 40వ ఓవర్ చివరి బంతికి షాహిదీ మళ్లీ అదే తప్పు చేస్తూ డేంజర్ జోన్లోకి దూసుకెళ్లాడు.దీంతో ఫీల్డ్ అంపైర్లు క్రిస్ గాఫానీ, రోహన్ పండిట్లు ఐదు పరుగులు పెనాల్టీ విధిస్తూ అఫ్గాన్కు షాకిచ్చారు. నిబంధనలో పిచ్ మధ్యలో నవడవడం గానీ పరిగెత్తడం గానీ చేయకూడదు. బూట్ల స్పైక్స్ వల్ల పిచ్ దెబ్బతిని, అక్కడ గుంతలు పడే ప్రమాదం ఉంది.తొలి ఓవర్లో 23 రన్స్కాగా కాగా భారత ఇన్నింగ్స్లో మొదట ఓవర్ వేసిన అఫ్గాన్ పేసర్ అజ్మతుల్లా ఓమర్జాయ్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తొలి బంతిని డాట్గా సంధించిన ఓమర్జాయ్.. ఆ తర్వాత వైడ్లు, నోబాల్స్తో విసుగు తెప్పించాడు. అంతకుతోడు భారత ఓపెనర్ యశస్వి జైశ్వాల్ మూడు ఫోర్లు బాదాడు.దీంతో టీమిండియా పెనాల్టీ రూపంలో లభించిన ఐదు పరుగులతో కలిపి తొలి ఓవర్లో మొత్తం 23 పరుగులు చేసింది. అయితే తొలి ఓవర్లో ఇన్ని పరుగులు రావడం 52 ఏళ్ల భారత వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. అంతకుముందు 2004లో కొలంబో వేదికగా బంగ్లాదేశ్పై మొదటి ఓవర్లో 22 పరుగులు భారత్ సాధించింది. తాజా మ్యాచ్తో గత రికార్డును టీమిండియా అధిగమించింది.చదవండి: IPL 2026: 'అలాగైతే ఢిల్లీని వీడు.. వేలంలోకి వెళ్ళిపో' -
రోహిత్ శర్మ హ్యాట్రిక్.. వీడియో వైరల్
చెన్నై వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ మధ్య జరుగుతున్న మూడో వన్డే ఓ అద్భుతమైన రికార్డుకు వేదికైంది. టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, పేసర్ ప్రసిద్ద్ కృష్ణ కలిసి అరుదైన ఫీట్ను సాధించారు. వీరిద్దరి కాంబినేషన్లో ఓ యూనిక్ హ్యాట్రిక్ నమోదైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్కు ప్రసిద్ద్ కృష్ణ ఆరంభంలోనే చుక్కలు చూపించాడు. తన సంచలన బౌలింగ్తో అఫ్గాన్ టాపార్డర్ను కుప్పకూల్చాడు.ప్రసిద్ద్ వేసిన తన స్పెల్ మొదటి బంతికే గుర్బాజ్ అవుట్ అయ్యాడు. ఆఫ్ స్టంప్ వెలుపల పడిన బంతిని గుర్బాజ్ ఆఫ్సైడ్ ఆడగా, అది ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్లో ఉన్న రోహిత్ శర్మ చేతుల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత 6 ఓవర్లో ప్రసిద్ధ్ వేసిన షార్ట్ లెంగ్త్ బంతిని రహ్మత్ షా లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ లీడింగ్ ఎడ్జ్ తీసుకున్న బంతిని మళ్లీ స్లిప్స్లో ఉన్న హిట్మ్యాన్ అందుకున్నాడు. అంతేకాకుండా 8వ ఓవర్లో ఇబ్రహీం జద్రాన్ డ్రైవ్ చేయడానికి ప్రయత్నించి ఫస్ట్ స్లిప్లో ఉన్న రోహిత్కే క్యాచ్ ఇచ్చాడు. దీంతో రోహిత్ క్యాచ్ల హ్యాట్రిక్ పూర్తి అయింది. ఒక వన్డే మ్యాచ్లో ఒకే బౌలర్ బౌలింగ్లో మూడు క్యాచ్లు పట్టిన మూడవ భారత ఫీల్డర్గా రోహిత్ నిలిచాడు. అతడి కంటే ముందు వి.వి.ఎస్. లక్ష్మణ్ (2004లో జింబాబ్వేపై ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్లో), శిఖర్ ధావన్ (2018లో బంగ్లాదేశ్పై జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో) ఈ ఫీట్ సాధించారు.చదవండి: MLC 2026: ఐపీఎల్లో డ్రింక్స్ బాయ్.. కట్ చేస్తే! అక్కడ కేవలం 25 బంతుల్లోనేIdentical setups, identical results 🔄Prasidh Krishna 🤝 Rohit Sharma 😎 Updates ▶️ https://t.co/kHgF4bqTg3#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/Bf2YPIA59l— BCCI (@BCCI) June 20, 2026 -
రోహిత్, కోహ్లీ భవితవ్యంపై బీసీసీఐ స్పందన!
వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆ మెగాటోర్నీలో ఆడతారా లేదా అన్న దానిపై బీసీసీఐ కీలక అప్డేట్ ఇచ్చింది. 2027 వన్డే ప్రపంచకప్ చర్చకు వస్తే ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లీలు ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ ఇద్దరు ఆటకు పూర్తిగా వీడ్కోలు పలుకుతారనే వార్తలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే తాజాగా బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా పీటీఐకి ఇంటర్వ్యూ ఇస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా రోడ్మ్యాప్ను రూపొందిస్తున్నామని, ఈ ప్రయాణంలో కొంతమంది ఆటగాళ్లకు అవకాశాలు లభించకపోవచ్చని పేర్కొన్నారు. సైకియా మాటలను బట్టి చూస్తే జట్టులో సీనియర్లుగా చెలామణి అవుతున్న రోహిత్, కోహ్లీలను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు ఉన్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే రోహిత్, కోహ్లీ వన్డే ప్రపంచకప్ వరకు జట్టులో కొనసాగుతారా లేదా అన్నదానిపై సెలెక్షన్ కమిటీ హెడ్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. నిజానికి కోహ్లి, రోహిత్లు మంచి ఫామ్లో ఉన్నప్పటికీ సైకియా వ్యాఖ్యలు సమాధానం కంటే ప్రశ్నలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.గంభీర్, అగార్కర్ల మాదిరిగానే, రోహిత్, కోహ్లీల 2027 ప్రపంచ కప్ అవకాశాలపై సైకియా కూడా స్పష్టమైన వైఖరిని వెల్లడించలేదు. ఈ విషయంపై బీసీసీఐ ఏమైనా అంతర్గత చర్చలు జరిపిందా అని అడగ్గా, ఇది ప్రాథమికంగా కొనసాగుతున్న ప్రక్రియ అని, ఇందులో భాగస్వాములందరూ తమ అభిప్రాయాలలో ఏకీభవిస్తున్నారని సైకియా అన్నారు. 'మాది చాలా సమన్వయంతో కూడిన బృందం, ఇందులో చాలా మంది నిపుణులు ఉన్నారు. సంబంధిత వర్గాలన్నింటినీ కలుపుకొని వెళ్తాము. ఏ నిర్ణయాలలోనైనా క్రికెట్ కమిటీ, సెలెక్టర్లు, సహాయక సిబ్బంది, ప్రధాన కోచ్, సంబంధిత ఆటగాళ్లతో సహా ఇతర భాగస్వాములందరూ పాలుపంచుకుంటారు.క్రమం తప్పకుండా సంభాషణలు జరుగుతున్నాయి. అందువల్ల, మనకు ప్రత్యేక సంప్రదింపుల సమావేశం అవసరం లేదు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ' అని సైకియా పేర్కొన్నారు. ప్రస్తుతం రోహిత్ శర్మ అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్లో ఆడుతుండగా, కోహ్లీ గాయంతో సిరీస్కు దూరమయ్యాడు. -
మీ వల్ల గందరగోళంలో శుబ్మన్ గిల్: మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా యాజమాన్యం తీరును భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి విమర్శించాడు. అఫ్గానిస్తాన్తో రెండో వన్డేలో టాపార్డర్లో మార్పులు చేయడాన్ని తప్పుబట్టాడు. కాగా స్వదేశంలో అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.తొలుత ధర్మశాలలో అఫ్గాన్ను చిత్తు చేసిన భారత జట్టు.. లక్నో వేదికగా బుధవారం రెండో వన్డేలో అఫ్గాన్ను 170 పరుగుల తేడాతో చిత్తు చేసి ఈ ఘనత సాధించింది. తద్వారా వన్డే కెప్టెన్గా శుబ్మన్ గిల్ ఖాతాలో తొలి సిరీస్ విజయం చేరింది.ఇదిలా ఉంటే.. అఫ్గాన్తో రెండో వన్డేలో టీమిండియా తమ ఓపెనింగ్ జోడీని మార్చింది. కెప్టెన్ శుబ్మన్ గిల్కు బదులు.. యశస్వి జైస్వాల్ రోహిత్ శర్మతో పాటు ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే, చాన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన జైసూ పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం నాలుగు పరుగులు చేసి నిష్క్రమించాడు.మరోవైపు.. రోహిత్ 48 పరుగులు చేయగా.. వన్డౌన్లో వచ్చిన గిల్ భారీ శతకం (154)తో దుమ్ములేపాడు. ఇక గత మ్యాచ్లో మూడో స్థానంలో ఆడిన ఇషాన్ కిషన్.. ఈసారి నాలుగో నంబర్ బ్యాటర్గా బరిలోకి దిగి మెరుపు సెంచరీ (79 బంతుల్లో 125)తో అదరగొట్టాడు. అయితే, ఈ మార్పులతో జట్టు భారీ విజయం సాధించినప్పటికీ మనోజ్ తివారీ మాత్రం నాయకత్వ బృందాన్ని విమర్శించాడు.క్రిక్బజ్తో మాట్లాడుతూ.. ‘‘భవిష్యత్తులో తలనొప్పిగా మారడం తప్ప ఈ ప్రయోగంతో ఎలాంటి ప్రయోజనం లేదు. రోహిత్ శర్మతో యశస్వి జైస్వాల్ను ఓపెనింగ్ చేయించి శుబ్మన్ గిల్ను వన్డౌన్కి డిమోట్ చేశారు. ఆ స్థానంలో గిల్ భారీగా పరుగులు రాబట్టాడు.ఇప్పుడా విషయం గందరగోళానికి కారణం కావొచ్చు. నేను మళ్లీ ఓపెనర్గా వెళ్లాలా? లేదంటే వన్డౌన్లోనే ఆడాలా అని గిల్ కన్ఫ్యూజ్ అవుతాడు. అసలు యాజమాన్యం ఇలా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదు. ఇక్కడ స్పష్టత లోపించింది.ఏదేమైనా జైస్వాల్ను ఆడించడం మంచి విషయం. ఎందుకంటే అతడు అన్ని ఫార్మాట్లలో ఆడగల సమర్థుడు. అతడికి మళ్లీ అవకాశం రావడం హర్షణీయం. ఇక రోహిత్ శర్మ అఫ్గన్తో రెండో వన్డేలో పెద్దగా దూకుడు ప్రదర్శించలేదు. అతడిపై బయటి నుంచి ఒత్తిడి ఎక్కువవుతోంది’’ అని మనోజ్ తివారి చెప్పుకొచ్చాడు. -
IND vs AFG: ఇషాన్ కిషన్ ‘ఫాస్టెస్ట్’ సెంచరీ
అఫ్గనిస్తాన్తో రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ శతక్కొట్టాడు. లక్నో వేదికగా కేవలం 71 బంతుల్లోనే వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అఫ్గనిస్తాన్ మీద వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్గా ఇషాన్ కిషన్ నిలిచాడు.టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ధర్మశాల వేదికగా తొలి మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో గెలిచింది భారత జట్టు. ఇక లక్నోలోని ఏకనా స్టేడియంలో బుధవారం నాటి రెండో వన్డేలో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగింది.జైసూ విఫలం.. పాపం రోహిత్ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (4) విఫలం కాగా.. రోహిత్ శర్మ అర్ద శతకానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రషీద్ ఖాన్ బౌలింగ్లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు.ఇలాంటి తరుణంలో వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ శుబ్మన్ గిల్, నాలుగో నంబర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. గిల్ 77 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా.. ఇషాన్ 71 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఇషాన్ సెంచరీ ఇన్నింగ్స్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. 𝐓𝐡𝐞 𝐈𝐬𝐡𝐚𝐧-𝐝𝐚𝐚𝐫 𝐊𝐢𝐬𝐡𝐚𝐧 𝐬𝐡𝐨𝐰 𝐢𝐧 𝐋𝐮𝐜𝐤𝐧𝐨𝐰! 🤩He switched gears seamlessly, completely taking the game away with a magnificent ton! 🔥#INDvAFG | 2nd ODI | LIVE NOW 👉https://t.co/YiwP9pOAPC pic.twitter.com/sMtq9hV2z8— Star Sports (@StarSportsIndia) June 17, 2026వీరిద్దరి విజృంభణ కారణంగా టీమిండియా 34 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 276 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఇక ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ మొత్తంగా 79 బంతుల్లో 14 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 125 పరుగులు చేసి.. నంగేయాలియా బౌలింగ్లో ఇక్రామ్ అలిఖిల్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.అఫ్గనిస్తాన్పై వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన క్రికెటర్లు1.ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లండ్)- 2019లో 57 బంతుల్లో శతకం2. రోహిత్ శర్మ (ఇండియా)- 2023లో 63 బంతుల్లో శతకం3. ఇషాన్ కిషన్ (ఇండియా)- 2026లో 71 బంతుల్లో శతకం4. గ్లెన్ మాక్స్వెల్ (ఆస్ట్రేలియా)- 2023లో 76 బంతుల్లో శతకం5. శుబ్మన్ గిల్ (ఇండియా)- 2026లో 77 బంతుల్లో శతకం.చదవండి: చెలరేగిన బ్యాటర్లు.. అఫ్గన్పై భారత్ భారీ స్కోరు -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
లక్నో వేదికగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. యశస్వి జైశ్వాల్తో కలిసి భారత ఇన్నింగ్స్ను ప్రారంభించిన రోహిత్.. అఫ్గాన్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. హిట్ మ్యాన్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 48 పరుగులు చేశాడు.రోహిత్ ఈ మెరుపు ఇన్నింగ్స్తో 14,000 లిస్ట్-ఎ పరుగులను పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన ఐదో భారత క్రికెటర్గా రోహిత్ నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ కంటే ముందు దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ ఉన్నారు.అదేవిధంగా లిస్ట్-ఎ క్రికెట్లో అత్యంత వేగంగా 14,000 పరుగులు పూర్తి చేసిన రెండో భారత బ్యాటర్గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు సచిన్(348 ఇన్నింగ్స్లు) పేరిట ఉండేది. హిట్మ్యాన్ 345 ఇన్నింగ్స్లలో అందుకుని సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో కోహ్లి(290) అగ్రస్ధానంలో ఉన్నాడు.లిస్ట్-ఎ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు:సచిన్ టెండూల్కర్: 21,999 పరుగులువిరాట్ కోహ్లీ: 16,447 పరుగులుసౌరవ్ గంగూలీ: 15,622 పరుగులురాహుల్ ద్రావిడ్: 15,271 పరుగులురోహిత్ శర్మ: 14,007+ పరుగులుఅత్యంత వేగంగా 14,000 లిస్ట్-ఎ పరుగులు చేసిన భారత ప్లేయర్లువిరాట్ కోహ్లి-290రోహిత్ శర్మ-345సచిన్ టెండూల్కర్- 348చదవండి: రాక రాక వచ్చిన అవకాశం.. జైస్వాల్ అట్టర్ ఫ్లాప్ -
IND vs AFG: యశస్వి జైస్వాల్ ఫెయిల్
టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ వన్డే పునరాగమనంలో తీవ్రంగా నిరాశపరిచాడు. అఫ్గనిస్తాన్తో బుధవారం నాటి మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన జైసూ.. సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు. కాగా టెస్టు ఫార్మాట్లో ఓపెనర్గా స్థానం సుస్థిరం చేసుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. వన్డే అరంగేట్రం కోసం చాలాకాలం ఎదురుచూడాల్సి వచ్చింది.సెంచరీతో ముగించి..ఎట్టకేలకు గతేడాది స్వదేశంలో ఇంగ్లండ్తో సిరీస్ సందర్భంగా వన్డేల్లో అడుగుపెట్టాడు జైసూ. అయితే, అరంగేట్రంలో 15 పరుగులే చేసి విఫలమయ్యాడు. ఇక చివరగా గతేడాది డిసెంబరులో సౌతాఫ్రికాతో మ్యాచ్లో మరోసారి ఓపెనర్గా అవకాశం దక్కించుకున్న జైస్వాల్ అజేయ శతకంతో అలరించాడు.మొత్తంగా 121 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 116 పరుగులు సాధించాడు. అయితే, ఆ తర్వాత మళ్లీ జైస్వాల్కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. తాజాగా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి దూరం కావడంతో.. సెలక్టర్లు జైసూకు పిలుపునిచ్చారు.రాక రాక వచ్చిన అవకాశంఅయితే, ధర్మశాల వేదికగా అఫ్గనిస్తాన్తో తొలి వన్డేలో జైసూకు తుదిజట్టులో చోటు దక్కలేదు. లక్నో వేదికగా బుధవారం నాటి రెండో వన్డేకు ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి దూరం కాగా.. జైస్వాల్కు ఆడే అవకాశం వచ్చింది. రోహిత్ శర్మకు జోడీగా ఓపెనర్గా వచ్చిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ తొమ్మిది బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క ఫోర్ బాది నాలుగు పరుగులే చేసి అవుటయ్యాడు.విమర్శలుఅఫ్గన్ యువ పేసర్ మహ్మద్ సలీమ్ సఫీ బౌలింగ్లో నంగేయాలియా ఖరోటికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాగా సలీమ్ సఫీకి వన్డేలో ఇదే తొలి వికెట్ కావడం గమనార్హం. ఏదేమైనా రాక రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక చతికిల పడ్డ జైస్వాల్పై అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆట తీరును మార్చుకుంటేనే వన్డే వరల్డ్కప్-2027 జట్టులో బ్యాకప్ ఓపెనర్గానైనా చోటు దక్కుతుందని.. లేదంటే ఇషాన్ కిషన్ జట్టులో పాతుకుపోతాడని అంటున్నారు. కాగా ఇప్పటికి ఐదు వన్డేల్లో కలిపి జైస్వాల్ 175 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం ఉంది. ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్ ఇటీవల ఏకైక టెస్టులోనూ జైసూ విఫలమయ్యాడు. కేవలం 24 పరుగులకే అవుటయ్యాడు.చదవండి: వైభవ్ వివాదం.. స్పందించిన బీసీసీఐ -
చరిత్రకు అడుగుదూరంలో గిల్.. రోహిత్ను ఊరిస్తున్న రికార్డు!
అఫ్గానిస్తాన్తో జరుగుతున్న వన్డే సిరీస్లో ఇప్పటికే తొలి వన్డే గెలిచిన టీమిండియా రెండో విజయంతో పాటు సిరీస్ గెలుపుపై కూడా కన్నేసింది. ఈ నేపథ్యంలో లక్నో వేదికగా ఇవాళ రెండో వన్డే జరగనుంది. తొలి వన్డేలో గిల్ తప్పిదంతో రనౌట్ అయిన సీనియర్ క్రికెటర్, ఓపెనర్ రోహిత్ శర్మను ఒక అరుదైన రికార్డు ఊరిస్తుంది. ఆఫ్గన్తో రెండో వన్డేలో రోహిత్ శర్మ మరో 10 పరుగులు చేస్తే లిస్ట్-ఏ క్రికెట్లో 14వేల పరుగులు మైలురాయిని అందుకోనున్నాడు. ఇక కెప్టెన్గా శుబ్మన్ గిల్ కూడా ఒక అరుదైన ఫీట్కు అడుగు దూరంలో ఉన్నాడు. వన్డే కెప్టెన్గా గిల్కు ఇదే మొదటి సిరీస్. ఇప్పటికే టీమిండియా తొలి వన్డే గెలిచింది. రెండో వన్డేలోనూ గెలిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ భారత్ వశం కానుంది. ఈ క్రమంలో స్వదేశంలో తొలి వన్డే సిరీస్ గెలిచిన కెప్టెన్గా గిల్ నిలవనున్నాడు. ఇక రెండో వన్డేకు కుల్దీప్ యాదవ్, జైస్వాల్కు చోటు దక్కే అవకాశముందని ఇప్పటికే గిల్ ప్రకటించాడు. ఇక తొలి వన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గిల్ అజేయ ఇన్నింగ్స్కు తోడు కేఎల్ రాహుల్ దనాధన్ ఇన్నింగ్స్తో టీమిండియా సులువుగానే గెలిచింది. అయితే బౌలింగ్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ విజయంతో ఆ అంశం పెద్దగా ప్రభావం చూపలేదు. రెండో వన్డేలో అన్ని విభాగాల్లో రాణించి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. తొలి వన్డేకు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. రహ్మనుల్లా గుర్బాజ్ (102) సెంచరీ సాధించాడు. అనంతరం టీమిండియా 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. గిల్ (84 నాటౌట్), కేఎల్ రాహుల్ (39 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు.Read: కాన్వేకు ప్రమోషన్.. కివీస్ ఆటగాళ్ల కాంట్రాక్టు జాబితా ఇదే! -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. వరల్డ్ రికార్డు బ్రేక్
ధర్మశాల వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను దురదృష్టం వెంటాడింది. 16 పరుగులు చేసి మంచి టచ్లో కనిపించిన రోహిత్.. అనుహ్యంగా రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. కాగా హిట్మ్యాన్ క్రీజులో ఉన్నది కాసేపే అయినా పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.రోహిత్ సాధించిన రికార్డులు ఇవే👉అంతర్జాతీయ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లలో కలిపి) ఓపెనర్గా 16,000 పరుగుల మైలురాయిని రోహిత్ శర్మ అందుకున్నాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ ఈ ఫీట్ నమోదు చేశాడు. అతడు ఈ రికార్డును కేవలం 384 ఇన్నింగ్స్ల్లోనే సాధించాడు. దీంతో అత్యంతవేగంగా ఈ ఫీట్ను అందుకున్న ఓపెనర్గా ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్(390) రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు.👉ఓవరాల్గా ప్రపంచ క్రికెట్ చరిత్రలో 16,000 పరుగుల మైలు రాయిని అందుకున్న 7వ ఓపెనర్గా రోహిత్ నిలిచాడు.👉అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్గా వీరేంద్ర సెహ్వాగ్ను అధిగమించడానికి రోహిత్ శర్మ ఇప్పుడు కేవలం 110 పరుగుల దూరంలో ఉన్నాడు. సెహ్వాగ్ తన కెరీర్లో ఓపెనర్గా మొత్తం 16,119 పరుగులు చేశాడు.👉ఈ మ్యాచ్ బరిలోకి దిగడం ద్వారా రోహిత్ శర్మ.. భారత క్రికెట్ చరిత్రలో అత్యధిక వయసులో వన్డే మ్యాచ్ ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు మోహిందర్ అమర్నాథ్ పేరిట ఉండేది. ఆయన 39 ఏళ్ల 36 రోజుల వయసులో 1989లో తన చివరి వన్డే ఆడారు. ఇప్పుడు 39 సంవత్సరాల 44 రోజుల వయస్సు కలిగిన హిట్మ్యాన్.. అమర్నాథ్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.చదవండి: FIFA World Cup: ఆఖరి క్షణంలో అద్భుతం.. సుదీర్ఘ నిరీక్షణకు తెర -
ఆఫ్గన్తో తొలి వన్డే.. భారత ఓపెనర్ల అరుదైన రికార్డు!
ధర్మశాల వేదికగా అఫ్గానిస్తాన్తో తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కెప్టెన్ శుబ్మన్ గిల్ వేర్వేరుగా అరుదైన రికార్డులు సాధించారు. రోహిత్ శర్మ విషయానికొస్తే మ్యాచ్లో రోహిత్ 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఓపెనర్గా అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లు కలిపి 16 వేల పరుగుల మార్క్ను దాటడం విశేషం. అయితే మంచి ఈజ్తో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గిల్తో సమన్వయం లోపం వల్ల రనౌట్గా వెనుదిరిగాడు. మరోవైపు ఇదే మ్యాచ్లో ఓపెనర్ గిల్ కూడా వన్డేల్లో 3వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో అత్యంత వేగంగా 3వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో బ్యాటర్గా గిల్ నిలిచాడు. గిల్ 67 ఇన్నింగ్స్లో 3వేల పరుగుల మార్క్ను అందుకొని రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ హషీమ్ ఆమ్లా (57 ఇన్నింగ్స్లు) తొలి స్థానంలో ఉన్నాడు. ఇక షై హోప్, ఇమామ్ ఉల్ హక్, ఫఖర్ జమాన్లు 67 ఇన్నింగ్స్ల్లో ఈ ఫీట్ సాధించారు.Scaling Mt. 16,000 🗻A monumental milestone unlocked by Rohit Sharma as an opener in international cricket 👏🫡Updates ▶️ https://t.co/lCuohEZYAl #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/vyC4C0oPvg— BCCI (@BCCI) June 13, 2026 Major Milestone for our Captain 🫡Shubman Gill becomes the fastest Indian and 2⃣nd fastest player overall to amass 3⃣0⃣0⃣0⃣ ODI runs 🙌🔝He also brings up his fifty!Updates ▶️ https://t.co/lCuohEZYAl#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/tdxL7cvo7X— BCCI (@BCCI) June 13, 2026 -
రోహిత్ శర్మకు గాయం.. ఆఫ్గన్తో తొలి వన్డేకు డౌట్!
అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలినట్లుగా అనిపిస్తోంది. సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడి చేతి వేలికి గాయమైనట్లు తెలుస్తోంది. ప్రసిధ్ క్రిష్ణ వేసిన బంతిని ఆడే క్రమంలో రోహిత్ మిస్ చేయడంతో అతడి కుడిచేతి బొటనవేలిని బలంగా తాకింది. అయితే రోహిత్ శర్మ మాత్రం తన ప్రాక్టీస్ను కొనసాగించాడు. కానీ అర్ష్దీప్ సింగ్ వేసిన బంతులను ఆడడంలో రోహిత్ ఇబ్బంది పడడం చూస్తుంటే చేతివేలి గాయం పెద్దదిగానే కనిపిస్తోంది. దీంతో ఆఫ్గన్తో తొలి వన్డేలో రోహిత్ ఆడడం అనుమానంగానే కనిపిస్తోంది. ఒకవేళ రోహిత్ గాయంతో దూరమైతే గిల్తో కలిసి జైస్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశముంది. అప్పుడు వన్డౌన్లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్కు రానున్నాడు. ఇక మరో సీనియర్ విరాట్ కోహ్లీ కండరాల గాయంతో ఆఫ్గన్తో వన్డే సిరీస్కు దూరమయ్యాడు. అయితే కోహ్లీ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడని, ఇంగ్లండ్తో జరగనున్న వన్డే సిరీస్కు కోహ్లీ అందుబాటులో ఉంటాడని వార్తలు వస్తున్నాయి. అయితే 2027 వన్డే ప్రపంచకప్ రోహిత్, కోహ్లీకి చివరి టోర్నీ కానుందన్న ప్రచారం నేపథ్యంలో ఈ ఇద్దరు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన అవసరముంది. ఇక రోహిత్ గాయంతో దూరమయ్యే అవకాశాలు ఉంటే మాత్రం అతడి స్థానంలో జైస్వాల్ బరిలోకి దిగనున్నాడు.భారత తుది జట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, కుల్దీప్ యాదవ్.Rohit Sharma very rusty in the nets so far. Prasidh Krishna delivery hits him on the right thumb, plenty hitting the maker’s mark on the bat and then thick outside edge to a Arshdeep Singh delivery. pic.twitter.com/65M2pKVVeF— Sahil Malhotra (@Sahil_Malhotra1) June 12, 2026చదవండి: ఫ్యాబ్-4: ఇద్దరు పోయారు.. మరో ఇద్దరు మిగిలారు! -
చరిత్రకు అడుగు దూరంలో రోహిత్.. బద్దలు కానున్న 37 ఏళ్ల రికార్డు
టీమిండియా స్టార్ ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరీర్లో మరో అరుదైన మైలు రాయిని అందుకునేందుకు సిద్దమయ్యాడు. అఫ్గానిస్తాన్తో ధర్మశాల వేదికగా జరగనున్న తొలి వన్డేలో బరిలోకి దిగనున్న రోహిత్.. భారత క్రికెట్ చరిత్రలో అత్యధిక వయసులో వన్డే మ్యాచ్ ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు భారత మాజీ ప్లేయర్, 1983 వరల్డ్ కప్ విజేత జట్టు సభ్యుడు మొహిందర్ అమర్నాథ్ పేరిట ఉంది.ఆయన 39 ఏళ్ల 36 రోజుల వయసులో 1989లో తన చివరి వన్డే ఆడారు. ఇప్పుడు 39 సంవత్సరాల 44 రోజుల వయస్సు కలిగిన హిట్మ్యాన్.. అమర్నాథ్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేయనున్నాడు. 2007లో భారత్ తరపున వన్డే అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ, 19 ఏళ్ల తన సేవలను అందిస్తూనే ఉన్నాడు.కెరీర్ ఆరంభంలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్న రోహిత్.. ఎంఎస్ ధోని కెప్టెన్సీలో తిరుగులేని ఆటగాడిగా నిలిచాడు. ధోనీ 2013లో రోహిత్ను ఓపెనర్గా పంపడం ఆయన కెరీర్ను మలుపు తిప్పింది. ఓపెనర్గా మారిన తర్వాతే రోహిత్ ప్రపంచ స్థాయి బ్యాటర్గా ఎదిగాడు. ఆ తర్వాత భారత జట్టు పగ్గాలను కూడా చేపట్టాడు. అతడి కెప్టెన్సీలోనే భారత్ 2023 ప్రపంచకప్ను తృటిలో కోల్పోయింది.ఫైనల్ వరకు అజేయంగా నిలిచిన మెన్ ఇన్ బ్లూ, తుది మొట్టుపై బోల్తా పడింది. టీ20 ప్రపంచకప్-2026ను మాత్రం అతడి కెప్టెన్సీలోనే టీమిండియా గెలుచుకుంది. తన 19 ఏళ్ల కెరీర్లో రోహిత్ ఎన్నో ఘనతలు సాధించాడు. వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్గా చారిత్రత్మక రికార్డును ఈ ముంబైకర్ కలిగి ఉన్నాడు. అంతేకాకుండా వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు (7 సెంచరీలు) చేసిన రికార్డు రోహిత్ పేరిటే ఉంది. రోహిత్ శర్మ ఇప్పటివరకు 282 వన్డే మ్యాచ్ల్లో 11,577 పరుగులు సాధించాడు. -
గంభీర్తో మాకు సంబంధం లేదు!.. సీనియర్ల రూటే వేరు!
అఫ్గనిస్తాన్తో సిరీస్తో టీమిండియా వన్డే ప్రపంచకప్-2027 సన్నాహకాలు మొదలుకానున్నాయి. గిల్ సేన స్వదేశంలో అఫ్గన్తో మూడు వన్డేలు ఆడేందుకు సన్నద్ధమైంది. గాయం కారణంగా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి ఈ సిరీస్కు దూరం కాగా.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం కాలు నొప్పితో దూరమయ్యే పరిస్థితి నెలకొంది.మరోవైపు.. లెజెండరీ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్నెస్ సాధించడం టీమిండియాకు సానుకూలాంశంగా మారింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన దిగ్గజ ద్వయం రోహిత్- కోహ్లి వన్డేల్లో మాత్రం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.గంభీర్, అగార్కర్ విముఖత?వన్డే ప్రపంచకప్-2027 ఆడటమే లక్ష్యంగా రో-కో ముందుకు సాగుతున్నారు. అయితే, హెడ్కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం వీరి పట్ల సుముఖంగా లేనట్లు సమాచారం. వరల్డ్కప్ ఆడే విషయంలో రో-కో తమకు ఎలాంటి హామీ ఇవ్వలేదని అగార్కర్ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించాడు.తలవంచనుఅయితే, ఇందుకు కోహ్లి ఇటీవలే గట్టి కౌంటర్ ఇచ్చాడు. తనను తాను నిరూపించుకోవాలని పదే పదే ఒత్తిడి చేస్తే.. అందుకు తాను తలవంచనని చెప్పేశాడు. డ్రెసింగ్రూమ్లో తన అవసరం లేదనుకుంటే తన గురించి చర్చే అనవసరం అని పేర్కొన్నాడు.ఈ పరిణామాల నేపథ్యంలో రో-కో భవితవ్యం గురించి మరోసారి చర్చ మొదలైంది. ఈ క్రమంలో బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. సంచలన విషయాలు వెల్లడించాయి. సీనియర్ ఆటగాళ్లు గంభీర్, అగార్కర్లను కాదని యాజమాన్యంతో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నాయి.గంభీర్తో మాకు సంబంధం లేదు‘‘జట్టులో దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. కెప్టెన్ గిల్ ప్రతీ విషయంలో డ్రెసింగ్రూమ్ గట్టిగా తన గొంతు వినిపించాల్సి ఉంది. టెస్టు, టీ20 ఫార్మాట్లలో మాదిరి గంభీర్ వన్డే జట్టు విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోవడం లేదు.అయితే ఇప్పుడు పరిస్థితి కాస్త మారింది. వన్డే వరల్డ్కప్ సన్నాహకాలు మొదలైపోయాయి. గంభీర్- గిల్ ఇకపై మరి కాస్త కఠినంగా ఉండవచ్చు. డ్రెసింగ్రూమ్లో తన ఐడియాలను బలంగా వినిపించవచ్చు.చాలా ఏళ్లుగా అత్యంత గొప్పగా.. సేవలు అందిస్తున్న సీనియర్లు వచ్చే పదహారు నెలల్లో జట్టులో తమ పాత్ర ఏమిటన్న అంశం గురించి గంభీర్తో కాకుండా నేరుగా యాజమాన్యంతో చర్చిస్తున్నారు. తమ భవితవ్యంపై స్పష్టతనివ్వాలని కోరుతున్నారు’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. చదవండి: వాళ్లకే దిక్కులేదు.. అతడిని ఎలా ఎంపిక చేస్తారు? -
రోహిత్, పాండ్యా ఫిట్నెస్పై కీలక అప్డేట్!
అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్నెస్కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. పాండ్యాకు బీసీసీఐ సీఓఈ స్పోర్ట్స్ బృందం నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ లభించింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జరిగిన పలు మ్యాచ్ సిమ్యులేషన్లలో పాండ్యా పాల్గొన్నాడని, ఎక్కడా అసౌకర్యంగా కనిపించలేదని మెడికల్ బృందం తెలిపింది. అతడు పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయడంతో పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. దీంతో జూన్ 13 నుంచి ధర్మశాల వేదికగా జరగనున్న భారత్, ఆఫ్గన్ తొలి వన్డేలో పాండ్యా ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు రోహిత్ శర్మ కూడా ఇప్పటికే ఫిట్నెస్ నిరూపించు కున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ శుభవార్త చెప్పాడు. ఆఫ్గన్తో వన్డే సిరీస్కు రోహిత్, పాండ్యా అందుబాటులో ఉంటారని తెలిపాడు. అయితే ఫిట్నెస్ క్లియరెన్స్కు సంబంధించి సర్టిఫికెట్ను మెడికల్ సీవోఈ బృందం ఇంకా అందించలేదు. అయితే తనకు అందిన సమాచారం మేరకు రోహిత్, పాండ్యా ఫిట్నెస్ నిరూపించుకున్నారని, అయితే మెడికల్ టీమ్ ఇంకా సర్టిఫికెట్లు ఇవ్వలేదని తెలిపాడు. అయితే వారి నుంచి ఒక్కసారి క్లియరెన్స్ వస్తే మాత్రం రోహిత్, పాండ్యాలు ఆఫ్గన్తో వన్డే సిరీస్లో ఆడతారని స్పష్టం చేశాడు. కానీ వన్డే సిరీస్లో ఈ ఇద్దరూ పాల్గొనాలంటే పాండ్యా, రోహిత్లు తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో రోహిత్ శర్మ చాలా మ్యాచ్లకు అందుబాటులో లేడు. కండరాల గాయంతో గ్రూప్ దశలో ఐదు మ్యాచ్కు దూరమవ్వగా, పాండ్యా లీగ్ ఆఖరి దశలో వెన్నునొప్పి కారణంగా చివరి మ్యాచ్లకు దూరమయ్యాడు. ఆ తర్వాత పాండ్యా, రోహిత్ శర్మలు ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించేందుకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శిబిరానికి వచ్చారు.చదవండి: వైభవ్ సూర్యవంశీ విఫలం.. తీవ్ర నిరాశలో అభిమానులు! -
టీమిండియాకు గుడ్ న్యూస్
త్వరలో ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు శుభవార్త అందుతుంది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్నెస్ పరీక్షల కోసం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)కు చేరుకున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సందర్భంగా రోహిత్ హామ్స్ట్రింగ్ గాయానికి గురైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు.తాజాగా ఆ పునరావాసాన్ని పూర్తి చేసుకొని CoEకు చేరాడు. అక్కడ రోహిత్కు మూడు రోజుల పాటు ఫిట్నెస్ పరీక్షలు, నెట్ సెషన్లు, బ్యాటింగ్ ప్రాక్టీస్ నిర్వహించనున్నారు. ఇందులో ఫ్లడ్లైట్ల కింద ప్రత్యేక బ్యాటింగ్ సెషన్ కూడా ఉండనుంది. ఈ పరీక్షల్లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధిస్తేనే రోహిత్కు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ఆడేందుకు వైద్యుల అనుమతి లభించనుంది.తొలుత జూన్ 9న జట్టుతో కలిసి వెళ్లాల్సి ఉన్న రోహిత్, ఇప్పుడు ఫిట్నెస్ క్లియరెన్స్ తర్వాత మాత్రమే జట్టులో చేరనున్నాడు. జూన్ 11న ధర్మశాలకు చేరుకుని, జూన్ 13న జరిగే తొలి వన్డేకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.39 ఏళ్ల రోహిత్ ఇటీవల ఐపీఎల్లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, వన్డే ఫార్మాట్లో మాత్రం భారత జట్టుకు కీలక ఆటగాడిగానే కొనసాగుతున్నాడు. ముఖ్యంగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతని అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతోంది. 2027 ప్రపంచకప్ ఆడాలన్న లక్ష్యంతో రోహిత్ వన్డేల్లో కొనసాగుతున్నాడు. మిగతా ఫార్మాట్లకు ఇతను రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
సూర్యను తొలగించడంపై రోహిత్ స్పందన!
టీమిండియా టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేయడంపై సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ స్పందించాడు. కెప్టెన్సీ అనేది అంత సులభంగా రాదని అయ్యర్ను చూస్తే తనకు స్పష్టంగా అర్థమవుతుందని తెలిపాడు. 2024లో కేకేఆర్కు టైటిల్ అందించిన అయ్యర్ మరుసటి ఏడాది పంజాబ్ కింగ్స్ను ఫైనల్ చేర్చాడు. ఐపీఎల్లో కెప్టెన్గా అతడి ప్రదర్శనలే ఇవాళ టీమిండియా టీ20 కెప్టెన్ను చేసిందని పేర్కొన్నాడు. అక్కడ నేర్చుకున్న విషయాలు ఇవాళ భారత కెప్టెన్సీకి అవసరమైన అనుభవాన్ని అందించనుందని తెలిపాడు. టీ20 ముంబై లీగ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న రోహిత్ శర్మ శనివారం మ్యాచ్కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. ‘గత కొన్నేళ్లుగా శ్రేయస్ అయ్యర్ ఆటతీరు చూసుకుంటే అతడు కెప్టెన్గా అద్భుతాలు చేయబోతున్నాడనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ముంబై క్రికెటర్లకు ఏదీ సులభంగా రాదని, కెప్టెన్సీ అనే హోదాను కష్టపడి సంపాదించుకోవాలన్న విషయం శ్రేయస్కు తెలుసు.’అని వివరించాడు. సూర్యకుమార్ను టీ20 కెప్టెన్సీ నుంచి తొలగించడంపై కూడా రోహిత్ స్పందించాడు. ‘టీమిండియా టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ తనదైన ముద్ర వేశాడు. సూర్యకుమార్కు కెప్టెన్సీ అంత సులభంగా దక్కలేదన్న విషయం నాకు తెలుసు. ఎందుకంటే సూర్యకుమార్ జట్టులోకి వచ్చే సమయానికే అతడి వయసు 31 లేదా 32 ఉంటుంది. ఆ వయసులో ఫామ్లో ఉండడమే గొప్ప విషయం. కానీ సూర్య దానిని అధిగమించడమే కాదు టీ20 క్రికెట్లో ఆటగాడిగా, కెప్టెన్గా తనదైన ముద్ర వేశాడు. ఎల్లప్పుడూ పోరాడడంలో సూర్య ముందుండే వాడు. భారత్కు మూడో టీ20 ప్రపంచకప్ రావడంలో కెప్టెన్గా అతడి పాత్ర అమోఘం. తనకు వచ్చిన అవకాశాలను సూర్య రెండు చేతులా ఒడిసి పట్టుకున్నాడు. ఐదేళ్లలోనే అతడు టీమిండియాకు ఎంతో చేశాడు. ముంబై ఆటగాళ్లలోనే ఇది స్వతహాగా ఉన్న లక్షణం. ఏదీ ఊరికే రాదు, కష్టపడి సంపాదించుకోవాల్సిందే అన్న విషయం మా క్రికెటర్లకు తెలుసు.’ అని చెప్పుకొచ్చాడు. ఇక రోహిత్ శర్మ గాయం కారణంగా అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ ఆడడం అనుమానమే. గాయంతో బాధపడుతున్న భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ ఈనెల 8న సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ (సీఓఈ)లో చేరనున్నాడు. బెంగళూరులోని ఈ సెంటర్లో అతడి ఫిట్నెస్ను పరీక్షించనున్నారు. మూడు రోజుల పాటు సీఓఈలో ఉండి, ఆ తర్వాత అఫ్ఘానిస్థాన్తో వన్డే సిరీస్ కోసం జట్టుతో చేరనున్నాడు.Rohit Sharma congraluating Shreyas Iyer for becoming the T20 Captain of India ❤️- The Mumbai Boys! pic.twitter.com/vcDf8yrPXW— Johns. (@CricCrazyJohns) June 6, 2026చదవండి: క్రీడాస్ఫూర్తిని మంటగలిపిన కేఎల్ రాహుల్! -
కోహ్లి అవుట్.. రీప్లేస్మెంట్ను ప్రకటించిన బీసీసీఐ
అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి దూరమయ్యాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. కాగా ఐర్లాండ్, ఇంగ్లండ్లో పర్యటించే... అదే విధంగా ఆసియా క్రీడలు-2026లో పాల్గొనే భారత టీ20 జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది.కొత్త టీ20 కెప్టెన్కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)ను తప్పించిన సెలక్టర్లు.. శ్రేయస్ అయ్యర్కు పగ్గాలు అప్పగించారు. ఇక చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని కూడా టీమిండియాకు ఎంపిక చేసి యూకే టూర్తో పాటు ఆసియా క్రీడల జట్టులోనూ చోటిచ్చారు.కోహ్లి ఎప్పుడు వస్తాడో తెలియదుఈ జట్ల ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ విరాట్ కోహ్లి గురించి అప్డేట్ అందించాడు. కోహ్లి గాయంపై తమకు ఇంకా స్పష్టత రాలేదని.. అతడు ఎంతకాలం ఆటకు దూరంగా ఉంటాడో తెలియదని పేర్కొన్నాడు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్ నాటికి అతడు ఫిట్గా ఉంటాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు.కోహ్లి స్థానంలో అతడేఅదే సమయంలో విరాట్ కోహ్లి స్థానంలో యశస్వి జైస్వాల్ను అఫ్గన్తో వన్డే సిరీస్కు ఎంపిక చేసినట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపాడు. కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- గుజరాత్ టైటాన్స్ మధ్య ఐపీఎల్-2026 ఫైనల్ సందర్భంగా కోహ్లి గాయపడిన సంగతి తెలిసిందే. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న కోహ్లి దాదాపు ఆరు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.రోహిత్ సంగతేంటి?ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ గురించి మాత్రం బోర్డు ఎలాంటి అప్డేట్ అందించలేదు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఈ ముంబై ఇండియన్స్ స్టార్ ఇంతవరకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)కు చేరుకోనే లేదు.మరోవైపు.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మాత్రం ఇప్పటికే బెంగళూరుకు చేరుకున్నాడు. అయితే, గాయంపై స్పష్టత లేకపోవడంతో అతడిని టీ20 జట్టుకు ఎంపిక చేయలేదని అగార్కర్ తెలిపాడు. కాగా అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్తో వన్డే సిరీస్ జట్టును ప్రకటిస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ సందర్భంగా తెలియజేశారు.అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు భారత జట్టు (అప్డేటెడ్)శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, అర్ష్దీప్ సింగ్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, రోహిత్ శర్మ (ఫిట్నెస్ ఆధారంగా), హార్దిక్ పాండ్యా (ఫిట్నెస్ ఆధారంగా).షెడ్యూల్జూన్ 14, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నై వేదికగా అఫ్గనిస్తాన్తో మూడు వన్డేలు.చదవండి: BCCI: వైభవ్ సూర్యవంశీ వచ్చేశాడు -
‘అతడు జట్టులో ఉంటే టీమిండియా వరల్డ్కప్ గెలవదు’
వన్డే ప్రపంచకప్-2027 టోర్నీకి ముందు టీమిండియాకు కొన్ని మ్యాచ్లే మిగిలి ఉన్నాయి. ఇందులో భాగంగా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో మూడు వన్డేలు ఆడనున్న భారత జట్టు.. అనంతరం ఇంగ్లండ్ పర్యటనలోనూ మూడు మ్యాచ్లు ఆడనుంది.రో-కో ఆడతారా?ఆ తర్వాత షెడ్యూల్ ప్రకారం టీమిండియా సొంతగడ్డపై వెస్టిండీస్తో మూడు.. అనంతరం న్యూజిలాండ్తో మూడు, శ్రీలంకతో మూడు వన్డేలు ఆడుతుంది. మొత్తానికి మెగా టోర్నీకి ముందు భారత్ దాదాపు పదిహేను వన్డేలు ఆడుతుంది. అయితే, దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) వరల్డ్కప్లో ఆడతారా? లేదా? అన్న అంశంపై గత కొంతకాలంగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే.అనుభవజ్ఞులైన రో-కో జట్టులో ఉంటేనే గెలుపు అవకాశాలు మెరుగుపడతాయని మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు. అయితే, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం వాళ్లిద్దరు మెగా టోర్నీకి అందుబాటులో ఉండే విషయమై తమకు ఇంత వరకు సమాచారం లేదన్నాడు. కానీ రో-కో మాత్రం తాము ఈ ఈవెంట్కు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు.గాయాల బెడదదేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో కూడా ఆడిన దిగ్గజ ద్వయం.. గత కొంతకాలంగా మంచి ఫామ్ కొనసాగించారు. అయితే, అఫ్గన్తో సిరీస్కు ముందు రోహిత్- కోహ్లి గాయపడటం మరోసారి చర్చకు తావిచ్చింది. 39 ఏళ్ల రోహిత్.. 38 ఏళ్ల కోహ్లి తొడ కండరాల గాయంతో బాధపడుతున్నారు.కోహ్లి దాదాపు ఆరు వారాల పాటు ఆటకు దూరం కానుండగా.. రోహిత్ అఫ్గన్తో ఆఖరి వన్డే నాటికి ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జ్యోతిష్కుడిగా చెప్పుకొనే గ్రీన్స్టోన్ లోబో సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ జట్టులో ఉంటే టీమిండియా ఈసారి కూడా వన్డే వరల్డ్కప్ గెలవదని పేర్కొన్నాడు.రోహిత్ జట్టులో ఉంటే జట్టు గెలవదుటైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘వన్డే ప్రపంచకప్ గెలిచే భారత జట్టులో రోహిత్ శర్మ భాగంగా ఉంటాడని నేను అనుకోవడం లేదు. చాలా మంది నన్ను ఇదే విషయం గురించి అడుగుతున్నారు. రోహిత్ అసలు జట్టులో ఉంటాడా? లేదా? అని వారు ఉత్సుకతతో ఉన్నారు.సెలక్టర్లు కోరుకుంటే అతడు జట్టులో ఉంటాడు. అయితే, ఒక విషయం స్పష్టంగా చెప్పగలను. రోహిత్ శర్మ జట్టులో ఉంటే మాత్రం టీమిండియా ఈసారి వరల్డ్కప్ గెలవదు’’ అని గ్రీన్స్టోన్ లోబో పేర్కొన్నాడు.సారథిగా ఇప్పటికే ఎన్నో విజయాలుఏదేమైనా ఇప్పటికే రోహిత్ శర్మ సారథిగా ఎన్నో విజయాలు సాధించాడన్న గ్రీన్స్టోన్ లోబో.. ముంబై ఇండియన్స్ కారణంగా అతడు వన్డే వరల్డ్కప్ గెలవలేకపోయాడని విచిత్రమైన వ్యాఖ్యలు చేశాడు. ‘‘కెప్టెన్గా రోహిత్ 2024లో టీ20 ప్రపంచకప్ సాధించాడు. వన్డే వరల్డ్కప్-2023 టోర్నీలోనూ అతడే సారథిగా ఉన్నాడు.అయితే, దురదృష్టవశాత్తూ కప్ గెలవలేకపోయాడు. నిజానికి ఫ్రాంఛైజీ క్రికెట్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా అతడు ఐదు టైటిళ్లు గెలిచాడు. ఒకవేళ అలా జరుగకపోయి ఉంటే.. వన్డేలపై మరింత దృష్టి పెట్టి వరల్డ్కప్ కొట్టేవాడు. ముంబై ఇండియన్స్ వల్ల టీమిండియా నష్టపోయింది’’ అని గ్రీన్స్టోన్ లోబో వ్యాఖ్యానించాడు.అభిమానుల ఆగ్రహంఈ నేపథ్యంలో జ్యోతిష్కుడి వ్యాఖ్యలపై రోహిత్ శర్మ అభిమానులు భగ్గుమంటున్నారు. ఫేమస్ అయ్యేందుకు లాజిక్ లేకుండా మాట్లాడటం సరికాదని.. అసలు దిగ్గజ ఆటగాడి గురించి మాట్లాడే అర్హతే నీకు లేదంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. కాగా రోహిత్ సారథ్యంలో 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా.. 2025లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (వన్డే ఫార్మాట్)ని సొంతం చేసుకుంది.చదవండి: కోపంతో ఊగిపోయిన వైభవ్ సూర్యవంశీ -
గాయాల బారిన సీనియర్లు.. టీమిండియాకు షాక్ తప్పదా?
ఐపీఎల్ 2026 సీజన్ ముగియడంతో టీమిండియా ప్రస్తుతం అఫ్గానిస్తాన్తో జరగనున్న టెస్టుతో పాటు వన్డే సిరీస్పై దృష్టి సారించింది. రేపటి నుంచి భారత్, అఫ్గానిస్తాన్ మధ్య ముల్లన్పూర్ వేదికగా ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు గిల్ నేతృత్వంలోని టీమిండియా స్టేడియానికి చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది. టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత వెంటనే మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్కు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేర్లను పరిగణలోకి తీసుకొని ఎంపిక చేశారు. అయితే పిక్క కండరాల గాయంతో కోహ్లీ ఈ సిరీస్కు దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో కోహ్లీ స్థానంలో జట్టులోకి వచ్చేది ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆఫ్గన్తో వన్డే సిరీస్కు కోహ్లీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. జూన్ 13న ధర్మశాల వేదికగా జరగనున్న తొలి వన్డేకు రుతురాజ్ అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ప్రకటన విడుదల చేసినట్లు నివేదికలు వచ్చాయి. కానీ రుతురాజ్ గైక్వాడ్ భారత-ఏ జట్టుతో కలిసి శ్రీలంక పర్యటనకు బయల్దేరి వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఈ వార్తలన్నింటికీ ఫుల్స్టాప్ పడినట్లయింది.లంక పర్యటనలో భారత్.. శ్రీలంక-ఏ, అప్గానిస్తాన్-ఏ జట్లతో కలిసి ట్రై సిరీస్ ఆడనుంది. తాజాగా రుతురాజ్ కొలంబోలో దర్శనమివ్వడంతో మరి కోహ్లీ స్థానంలో ఆడే ఆటగాడు ఎవరన్నది ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది. అయితే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.ఎటూ తేల్చని బీసీసీఐ?ఆఫ్గన్తో వన్డే సిరీస్కు 15 మందితో జట్టును ప్రకటించడంతో కోహ్లీ దూరమైన అతడి స్థానాన్ని ఆ సిరీస్కు ఎంపికైన ఆటగాళ్లలో ఒకరితోనే భర్తీ చేయాలనే నిర్ణయానికి బీసీసీఐ వచ్చినట్లు తెలుస్తోంది. కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా ఆఫ్గన్తో వన్డే సిరీస్ ఆడడం అనుమానంగానే ఉంది. అతడు కూడా పిక్క కండరాల గాయంతో బాధపడుతుండడం టీమిండియాకు ప్రతికూలంగా మారనుంది. మరోవైపు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా జట్టులోని సీనియర్లంతా గాయాల బారిన పడడంతో వన్డే సిరీస్లో అప్గానిస్తాన్ మనకు షాక్ ఇచ్చినా ఆశ్చర్యపోనసరం లేదని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. కోహ్లీ, రోహిత్, పాండ్యాలు దూరమైతే మాత్రం బీసీసీఐ వీరి స్థానంలో కనీసం ఇద్దరినైనా జట్టులోకి తీసుకోవాల్సిన అవసరముంటుంది. అయితే వన్డే సిరీస్కు ఇంకా సమయం ఉండడంతో బీసీసీఐ దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోనుంది.ఆఫ్గన్తో వన్డే సిరీస్కు టీమిండియాశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేచదవండి: ఫిఫాకు ట్రోఫీ తిరిగివ్వని బ్రెజిల్.. విలువెంతో తెలుసా? -
రోహిత్- కోహ్లి ఆడతారా?.. స్పందించిన టీమిండియా కోచ్
అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అందుబాటులో ఉంటారా? లేదా?.. క్రికెట్ వర్గాల్లో ఇప్పుడిదే చర్చనీయాంశం. ఐపీఎల్-2026లో కోహ్లి అదరగొట్టిన సంగతి తెలిసిందే.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓపెనర్గా కొనసాగుతున్న కోహ్లి.. ఈ సీజన్లో 16 మ్యాచ్లలో కలిపి 675 పరుగులు సాధించాడు. గుజరాత్ టైటాన్స్తో ఫైనల్లో 75 పరుగులతో అజేయంగా నిలిచి ఆర్సీబీ వరుసగా రెండోసారి ట్రోఫీ ముద్దాడటంలో కీలక పాత్ర పోషించాడు.అంతలోనే గాయమా?ఇక ఆర్సీబీ రెండోసారి టైటిల్ విజేతగా అవతరించిన తరుణంలో కోహ్లి సంబరాలు అంబరాన్నంటాయి. భార్య అనుష్క శర్మ, సహచర ఆటగాళ్లతో కలిసి అతడు ఉత్సాహంగా డాన్స్ చేసిన దృశ్యాలు వైరల్గా మారాయి. అయితే, అంతలోనే కోహ్లి తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడనే వార్త బయటకు వచ్చింది.ఫలితంగా అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు కోహ్లి దూరమయ్యాడనే వార్త చక్కర్లుకొడుతోంది. మరోవైపు.. ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయం కారణంగా ఐదు మ్యాచ్లకు దూరమయ్యాడు. ఆ తర్వాత తిరిగి వచ్చినా ఇంపాక్ట్ ప్లేయర్గానే బరిలోకి దిగాడు.రోహిత్ కూడా డౌటేఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సైతం సిరీస్కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే తాజాగా స్పందించాడు. అఫ్గనిస్తాన్తో టీమిండియా ఏకైక టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడుతూ..కోచ్ ఏమన్నాడంటే..‘‘ఇప్పటి వరకు మాకు కూడా అధికారిక సమాచారం అందలేదు. విరాట్, రోహిత్ వంటి స్టార్ ప్లేయర్లు గాయాల వల్ల దూరవుతున్నారంటే అది నిజంగా పెద్ద వార్తే. అయితే, ఏ ఆటగాడి విషయంలోనైనా ప్రొటోకాల్ ఒకేలా ఉంటుంది.వాళ్లు ఫిట్నెస్ పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. మ్యాచ్ ఆడేందుకు ఫిట్గా ఉన్నారా? లేరా? అన్నది మా వైద్య బృందం నిర్ణయిస్తుంది. వారి సూచన ప్రకారమే రో-కోలను ఆడించాలా? వద్దా? అన్నది తేలుతుంది.ఒకవేళ వాళ్లు దూరమైతే వారి స్థానాలను భర్తీ చేసే అంశంపై కూడా యాజమాన్యం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని డష్కాటే తెలిపాడు. కాగా జూన్ 6- 20 మధ్య టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఏం జరుగుతోంది?ఇదిలా ఉంటే.. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి.. కేవలం వన్డేల్లో కొనసాగుతున్నారు. వన్డే వరల్డ్కప్-2027 ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ మెగా టోర్నీకి ముందు కొన్ని వన్డేలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇలాంటి తరుణంలో రో-కో గాయాల బారిన పడటం అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది. చదవండి: ‘పంజాబ్ కింగ్స్ ఈ ఐదుగురిని వదిలేయాలి’ -
కింద పడ్డ రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో రోహిత్ నడుస్తూ బ్యాలెన్స్ కోల్పోయి నేలపై ముందుకు పడ్డాడు. ఈ వీడియో ఇప్పటిదా లేక పాతదా అన్న విషయంపై క్లారిటీ లేనప్పటికీ.. రోహిత్ అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. తమ ఆరాధ్య ఆటగాడు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు అందుబాటులో ఉంటాడా లేదా అని గాబరా పడుతున్నారు.రోహిత్ త్వరలో ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే వన్డే సిరీస్కు ఎంపికైన విషయం తెలిసిందే. అతడు టెస్ట్, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి టీ20ల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. రోహిత్ తాజాగా ముగిసిన ఐపీఎల్ 2026లో హ్యామ్స్ట్రింగ్ గాయంతో పలు మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. అయితే ఆడిన మ్యాచ్ల్లో మాత్రం తనదైన క్లాస్ను ప్రదర్శించి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లు ఆడాడు.🚨🚨ROHIT SHARMA OUT OF THE FIRST 2 ODIs AGAINST AFGHANISTAN [CRICBUZZ]According to reliable sources and reports, Rohit Sharma suffered a knee twist after losing balance and is feeling discomfort. As per reports, he won't be available for the opening two games. India's… pic.twitter.com/xVn7qXcQg0— Oxygen (@Oxygen18_) June 3, 2026కాగా, ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే వన్డే సిరీస్కు రోహిత్తో పాటు విరాట్ కోహ్లి కూడా ఎంపికయ్యాడు. అతడు కూడా రోహిత్లాగే టెస్ట్, అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లకు గుడ్బై చెప్పి, కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2026లో రోహిత్తో పోలిస్తే విరాట్ చాలా మెరుగ్గా ఆడాడు. వరుసగా రెండో ఎడిషన్లో తన జట్టు ఛాంపియన్గా నిలపడంలో ప్రధానపాత్ర పోషించాడు. గుజరాత్తో జరిగిన ఫైనల్స్లో అజేయమైన అర్ద సెంచరీతో తన జట్టును ఛాంపియన్గా నిలిపాడు.రోహిత్, విరాట్ 2027 వన్డే ప్రపంచకప్ దృష్ట్యా అంతర్జాతీయ వన్డేల్లో కొనసాగుతున్నారు. ఆ సమయం వరకు ఫామ్లో ఉండి, ఫిట్నెస్ కాపాడుకుంటూ ఉంటేనే జట్టులో ఉంటారని సెలెక్టర్లకు వారిద్దరికి ఖరాకండిగా చెప్పారు. ఈ మేరకే రో-కో అడుగులు వేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్తో వన్డే మ్యాచ్లు జూన్ 13, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా జరుగనున్నాయి. -
హార్దిక్, రోహిత్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు.. ఒకవేళ అదే జరిగితే?
అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఫిట్నెస్ను పరీక్షించుకునేందుకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)కి వెళ్లనున్నాడు. వారం రోజుల పాటు అతను ఇక్కడ ఉండి వివిధ రకాల డ్రిల్స్లో పాల్గొనడంతోపాటు ‘మ్యాచ్ సిమ్యులేషన్స్’లో సాధన చేస్తాడు. ఐపీఎల్లో గాయం కారణంగా నాలుగు మ్యాచ్లకు దూరమైన అతను కోలుకొని మళ్లీ బరిలోకి దిగాడు.అయితే భారత వన్డే జట్టులోకి ఎంపిక కావడంలో బీసీసీఐ వైద్య బృందం అతడిని ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిందిగా సూచించింది. ఫిట్గా ఉంటేనే టీమ్లో అతని ఎంపిక ఖాయమవుతుంది. దాంతో పాండ్యా సీఓఈకి చేరాడు. పాండ్యాతో పాటు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను కూడా సీఓఈలో హాజరు కావాలని వైద్యులు చెప్పగా... ఇప్పటి వరకు రోహిత్ విషయంలో మాత్రం ఎలాంటి సమాచారం లేదు. హిట్మ్యాన్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు.ఈ గాయం కారణంగానే ఇటీవల ముగిసిన ఐపీఎల్-2026లో రోహిత్ నాలుగు మ్యాచ్లకు దూరమయ్యాడు. అంతేకాకుండా ఈ ముంబైకర్ దాదాపు చాలా మ్యాచ్లలో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగాడు. అఫ్గానిస్తాన్తో వన్డేలకు రోహిత్ ఎంపికైనప్పటికి.. తన ఫిట్నెస్ను మాత్రం నిరూపించుకోవాల్సి ఉంది. ఒకవేళ ఫిట్నెస్ పరీక్షలో రోహిత్ విఫలమైతే ఈ వన్డే సిరీస్కు దూరం కానున్నాడు. అతడికి బ్యాకప్గా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ రిజర్వ్లో ఉంచినట్లు తెలుస్తోంది. అఫ్గాన్తో వన్డే సిరీస్ జూన్ 13 నుంచి ప్రారంభం కానుంది.అఫ్గాన్తో వన్డేలకు భారత జట్టు ఇదే:శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ(ఫిట్నెస్ లోబడి), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.చదవండి: IND vs AFG: టీమిండియా కెప్టెన్గా కేఎల్ రాహుల్? -
ODI WC: రోహిత్ శర్మ ఎందుకిలా చేస్తున్నాడు?
దాదాపు రెండు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉంది టీమిండియా. భారత జట్టులోని ప్రధాన ఆటగాళ్లంతా ఐపీఎల్-2026తో బిజీ బిజీగా గడిపారు. ఇక ఈ మెగా టోర్నీకి ఆదివారం నాటి ఫైనల్తో తెరపడింది.ఈ నేపథ్యంలో జూన్ 6 నుంచే టీమిండియా రంగంలోకి దిగనుంది. స్వదేశంలో అఫ్గనిస్తాన్తో తొలుత ఓ టెస్టు మ్యాచ్ ఆడి.. ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక అఫ్గన్తో మ్యాచ్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే తమ జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.ఫిట్నెస్లోబడే...శుబ్మన్ గిల్ సారథ్యంలో అఫ్గన్తో ఆడే ఈ జట్లలో వన్డేలకు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపికయ్యారు. అయితే, వీరిద్దరు ఫిట్నెస్లోబడే ఆడతారని బీసీసీఐ స్పష్టం చేసింది. కాగా ఐపీఎల్-2026లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్కు ఆడిన రోహిత్ శర్మ.. సీజన్ మధ్యలో గాయపడ్డాడు.తొడ కండరాల గాయంతో ఐదు మ్యాచ్లకు రోహిత్ దూరమయ్యాడు. ఆ తర్వాత తిరిగి జట్టుతో చేరినా ఇంపాక్ట్ ప్లేయర్గానే బరిలోకి దిగాడు. మరోవైపు.. హార్దిక్ పాండ్యా సైతం వెన్నునొప్పితో నాలుగు మ్యాచ్లు ఆడలేకపోయాడు.క్లియరెన్స్ వస్తేనే..ఈ నేపథ్యంలో రోహిత్, హార్దిక్లను అఫ్గన్తో సిరీస్కు ఎంపిక చేసినప్పటికీ.. ఫిట్నెస్ ఆధారంగానే వారు ఆడతారో, లేదో తేలుతుందని బీసీసీఐ జట్టు ప్రకటన సమయంలో వెల్లడించింది. అదే విధంగా.. వీరిద్దరిని సిరీస్ ఆరంభానికి రెండు వారాల ముందే బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది.ఇంత వరకు రిపోర్టు చేయని రోహిత్!అక్కడి వైద్య బృందాన్ని సంప్రదించి.. వేగంగా కోలుకొనే అంశంపై దృష్టి పెట్టాలని.. వారి నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా మంగళవారం (జూన్ 2)న బెంగళూరుకు పయనం కానుండగా.. రోహిత్ శర్మ మాత్రం ఇంత వరకు రిపోర్టు చేయలేదని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వెల్లడించింది.కాగా వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి ముందు టీమిండియా కొద్ది వన్డేలు మాత్రమే ఆడనుంది. ఇలాంటి తరుణంలో రోహిత్ గాయపడటం.. బోర్డు ఆదేశాలు పాటించే అంశంలో స్పష్టత లేకపోవడం సందేహాలకు తావిస్తోంది.రేసులోకి జైసూ!ఇప్పటికే రోహిత్కు బదులు యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ పేర్లను శుబ్మన్ గిల్ ఓపెనింగ్ జోడీగా పరిగణించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ విషయంలో బోర్డు కూడా సానుకూలంగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 39 ఏళ్ల రోహిత్ శర్మనే స్వయంగా తప్పుకోనున్నాడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ముల్లన్పూర్లో భారత్- అఫ్గన్ మధ్య ఏకైక టెస్టు జరుగనుండగా.. జూన్ 13, 17, 20 తేదీల్లో వన్డే సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: IPL 2026: అత్యుత్తమ జట్టు ఇదే! -
రెండో టైటిల్.. ఆర్సీబీ సాధించిన రికార్డులు ఇవే
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీ నెగ్గింది. ఐపీఎల్-2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. అహ్మదాబాద్లో ఆదివారం టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.టాపార్డర్ను కుదేలు చేసి ఆదిలోనే ప్రత్యర్థిని దెబ్బకొట్టిన ఆర్సీబీ.. గుజరాత్ను 155 పరుగులకే పరిమితం చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగి రెండు ఓవర్లు మిగిలి ఉండగానే పనిపూర్తి చేసింది. తద్వారా ఏకపక్ష విజయం సాధించి.. తమ స్థాయి ఏమిటో మరోసారి నిరూపించుకుంది. ఈ క్రమంలో ఆర్సీబీ తమ పేరిట పలు రికార్డులు లిఖించుకుంది. అవేమిటంటే..ఆర్సీబీ సాధించిన రికార్డులు ఇవే👉ఐపీఎల్ టోర్నీ టైటిల్ను వరుసగా రెండేళ్లు గెల్చుకున్న మూడో జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ (2010, 2011లో), ముంబై ఇండియన్స్ (2019, 2020లో) మాత్రమే ఈ ఘనత సాధించాయి.👉ఐపీఎల్లో 2011లో ‘ప్లే ఆఫ్స్’ ఫార్మాట్ మొదలయ్యాక ఇప్పటి వరకు ‘ప్లే ఆఫ్స్’లోని క్వాలిఫయర్–1 మ్యాచ్లో గెలిచిన జట్టే విజేతగా నిలువడం ఇది 13వసారి కావడం విశేషం. చెన్నై (2011, 2018, 2021, 2023లో), కోల్కతా (2012, 2014, 2024లో), ముంబై (2015, 2019, 2020లో), బెంగళూరు (2025, 2026), గుజరాత్ టైటాన్స్ (2022లో) జట్లు ఈ ఘనత సాధించాయి. 👉చెన్నై (5 సార్లు), ముంబై (5 సార్లు), కోల్కతా (3 సార్లు) జట్ల తర్వాత ఐపీఎల్ టోర్నీ టైటిల్ను రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు గెలిచిన నాలుగో జట్టుగా బెంగళూరు నిలిచింది.దిగ్గజాల సరసన రజత్ పాటీదార్👉ఐపీఎల్ టైటిల్ను రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు గెలిచిన నాలుగో కెప్టెన్ రజత్ పాటీదార్. గతేడాది (2025) పాటీదార్ సారథ్యంలోనే బెంగళూరు తొలిసారి ఐపీఎల్ టైటిల్ నెగ్గింది. ఈ జాబితాలో ధోని, రోహిత్ శర్మ (5 సార్లు చొప్పున), గౌతమ్ గంభీర్ (2 సార్లు) ఉన్నారు.👉ఒకే వేదికపై రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ సాధించిన మూడో జట్టు బెంగళూరు. 2025లోనూ అహ్మదాబాద్లోనే బెంగళూరు టైటిల్ నెగ్గింది. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ (కోల్కతా, ఈడెన్గార్డెన్స్; 2013, 2015లో; హైదరాబాద్, ఉప్పల్ స్టేడియం; 2017, 2019లో), కోల్కతా నైట్రైడర్స్ (చెన్నై, ఎంఎ చిదంబరం స్టేడియం; 2012, 2024లో) ఉన్నాయి.చదవండి: వైభవ్ గురించి కోహ్లి ఏమన్నాడంటే!Moments that became memories. Memories that became history. 🏆🎥 Reliving the defining moments of @RCBTweets going back-2️⃣-back in Ahmedabad ❤️#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/mHL9U36rB1— IndianPremierLeague (@IPL) June 1, 2026 -
గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం! రోహిత్ శర్మకు భారీ షాక్?
వన్డే వరల్డ్కప్-2027లో టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆడుతాడా? లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 39 ఏళ్ల రోహిత్ శర్మ ప్రస్తుతం ఫిట్నెస్ సమస్యలతో సతమవుతున్నాడు. తొడ కండరాల గాయం కారణంగా ఐపీఎల్-2026లో రోహిత్ కేవలం 9 మ్యాచ్లు మాత్రమే ఆడాడు.ఆ తర్వాత పునరాగమనం చేసినప్పటికి పూర్తి ఫిట్నెస్తో మాత్రం హిట్మ్యాన్ కనిపించలేదు. కేవలం ఇంపాక్ట్ ప్లేయర్గా మాత్రమే బరిలోకి దిగాడు. అయితే ఈ జూన్లో అఫ్గానిస్తాన్తో జరగనున్న వన్డే సిరీస్కు రోహిత్ను ఎంపిక చేసినప్పటికి, అతడు ఆడేది అనుమానమే. సిరీస్ ప్రారంభ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధిస్తేనే రోహిత్ శర్మను జట్టులో కొనసాగించే అవకాశముంది.కాగా వన్డే ప్రపంచకప్-2027 టోర్నీ భవిష్యత్తు ప్రణాళికలలో భాగంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ స్థానంలో మరొక ముంబై ఆటగాడు, యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ను ఓపెనర్గా గంభీర్ భావిస్తున్నట్లు 'క్రిక్బ్లాగర్' వెబ్సైట్ పేర్కొంది.వాస్తవానికి అఫ్గానిస్తాన్తో సిరీస్కే రోహిత్ స్థానంలో జైశ్వాల్ను ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావించందంట. కానీ రోహిత్ శర్మ బోర్డు అధికారులతో ఫోన్ చేసి మాట్లడడంతో సెలక్టర్లు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారని 'క్రిక్బ్లాగర్' వెల్లడించింది.జైస్వాల్ ఎంపికపై సస్పెన్స్కాగా జైశ్వాల్ గతేడాది డిసెంబర్లో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో భారత్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. రెగ్యూలర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయం కారణంగా దూరం కావడంతో జైశ్వాల్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ను జైశూ ప్రారంభించాడు.తొలి రెండు మ్యాచ్లలో నిరాశపరిచిన యశస్వి.. వైజాగ్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో మాత్రం శతక్కొట్టాడు. దీంతో జైశ్వాల్ను అఫ్గాన్తో వన్డేలకు కూడా ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ సెలక్టర్లు ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో అతడు పేరు లేదు. ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్కు మాత్రమే కాకుండా, శ్రీలంకలో జరగబోయే ముక్కోణపు సిరీస్ కోసం ప్రకటించిన 'ఇండియా-ఎ' జట్టులోనూ జైస్వాల్కు చోటు దక్కలేదు. రోహిత్ ఫిట్నెస్ను దృష్టిలో పెట్టుకుని జైశ్వాల్ను 'ఇండియా-ఎ' జట్టుకు ఎంపిక చేయకపోయినట్లు తెలుస్తోంది. ఒకవేళ అఫ్గాన్తో వన్డేలకు రోహిత్ దూరమైతే ఆ స్ధానాన్ని జైశ్వాల్ భర్తీ చేయనున్నాడు.ఆఫ్గాన్ వన్డే సిరీస్కు భారత జట్టుశుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ (ఫిట్నెస్కు లోబడి), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్), హార్దిక్ పాండ్యా (ఫిట్నెస్కు లోబడి), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే. -
రోహిత్ శర్మ వద్దు.. ముంబై కెప్టెన్గా అతడే సరైనోడు
ఐపీఎల్-2026 సీజన్లో ఘోర ప్రదర్శన తర్వాత ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తీవ్రమైన మానసిక ఒత్తిడి, అంతర్గత విభేదాలు, శారీరక అలసటతో సతమతమవుతున్న ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ముంబై ఫ్రాంచైజీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ ఏడాది సీజన్ మధ్యలోనే పాండ్యా తన నిర్ణయాన్ని టీమ్ మేనెజ్మెంట్కు తెలియజేసినట్లు ఐపీఎల్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఐపీఎల్-2024 సీజన్లో ముంబై ఇండియన్స్ యాజమాన్యం రోహిత్ శర్మను తప్పించి మరి తమ జట్టు పగ్గాలను హార్దిక్కు అప్పగించింది.కానీ వారి నమ్మకాన్ని పాండ్యా నిలబెట్టుకోలేకపోయాడు. ఆ సీజన్లో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచింది. ఆ తర్వాత సీజన్లో క్వాలిఫయర్-2 వరకు ముంబైని పాండ్యా తీసుకొచ్చాడు. కానీ తాజా ఎడిషన్లో మాత్రం పాండ్యా కెప్టెన్గా, వ్యక్తిగత ప్రదర్శన పరంగా దారుణంగా విఫలమయ్యాడు. 14 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ కేవలం నాలుగింట గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానానికి పరిమితమైంది. దీంతో ముంబై ఇండియన్స్ యాజమాన్యం కూడా హార్దిక్ కెప్టెన్సీపై అసంతృప్తిలోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.అయితే ఐపీఎల్-2027కు ముందు పాండ్యా నేరుగా మెగా వేలంలోకి వస్తాడా? లేదా ట్రేడింగ్ పద్ధతి ద్వారా మరేదైనా జట్టుతో ఒప్పందం కుదుర్చుకుంటాడా అనేది ఇంకా స్పష్టత లేదు. దీంతో వచ్చే ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఐదు టైటిల్స్ను అందించిన రోహిత్ శర్మ మరోసారి ముంబై జట్టు పగ్గాలను చేపట్టేందుకు సిద్దంగా లేడని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ముంబై తదుపరి కెప్టెన్ ఎవరన్న విషయంపై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు."ముంబై ఇండియన్స్కు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ బెస్ట్ ఛాయిస్. మళ్లీ రోహిత్ శర్మను కెప్టెన్గా నియమించడం అనేది వెనక్కి అడుగు వేయడమే అవుతుంది. ఎందుకంటే రోహిత్ వయస్సును కూడా పరిగణలోకి తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో సూర్యనే బెటర్" అని జాఫర్ తన యూట్యూబ్ ఛానల్లలో పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: రాజస్తాన్ సరికొత్త చరిత్ర.. సన్రైజర్స్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్ -
జైస్వాల్కు క్షమాపణ చెప్పండి.. రోహిత్ ఎందుకు?
టీమిండియా తరఫున అరంగేట్రంలోనే సెంచరీతో చెలరేగాడు యశస్వి జైస్వాల్. వెస్టిండీస్తో టెస్టులో శతక్కొట్టి జట్టును గెలిపించాడు. ఆ పర్యటనలోనే అంతర్జాతీయ టీ20లలోనూ అడుగుపెట్టాడు.టెస్టుల్లో స్టార్ ఓపెనర్గా ఎదిగిన జైస్వాల్ (Yashasvi Jaiswal).. వన్డే అరంగేట్రానికి మాత్రం రెండేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు గతేడాది సెలక్టర్లు అతడి నిరీక్షణకు తెరదించారు. స్వదేశంలో ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు అతడిని ఎంపిక చేశారు.అజేయ శతకంఈ క్రమంలో ఇంగ్లండ్తో తొలి వన్డేలో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగిన జైసూ.. 15 పరుగులకే అవుటయ్యాడు. ఆ తర్వాత మళ్లీ తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అనంతరం సొంతగడ్డపై గతేడాది సౌతాఫ్రికాతో తన చివరి వన్డే ఆడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. అజేయ శతకం (116)తో ఆకట్టుకున్నాడు.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ టీమిండియా సెలక్టర్లు, దిగ్గజ ఓపెనర్ రోహిత్ శర్మను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. జైస్వాల్ను సెలక్టర్లు క్షమాపణ కోరాలని సూచించాడు. స్పోర్ట్స్స్టార్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ..సెలక్టర్ల ఆలోచన ఏమిటి?‘‘యశస్వి జైస్వాల్ తన చివరి వన్డే ఇన్నింగ్స్లో 116 పరుగులతో అజేయంగా నిలిచాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అతడు మళ్లీ వన్డే ఆడనే లేదు. సెలక్టర్లు 24 ఏళ్ల జైస్వాల్కు బదులు.. ఫిట్నెస్పై స్పష్టత లేని వెటరన్ బ్యాటర్ (రోహిత్ శర్మ) వైపు మొగ్గుచూపుతున్నారు.అతడు ఇప్పుడు ఫామ్లో కూడా లేడు. దీని వెనుక ఉన్న లాజిక్ ఏమిటో నాలాంటి వాళ్లకు కాస్త అర్థమయ్యేలా వివరించండి. అసలు వన్డే వరల్డ్కప్-2027 సన్నద్ధత విషయంలో సెలక్టర్ల ఆలోచన ఏమిటి?ఫోన్ చేసి మరీ క్షమాపణలు చెప్పాలిరోహిత్ శర్మ విషయంలో వాళ్లు రాజీ పడాల్సి వచ్చిందో.. లేదంటే ఇంకెందుకు అతడిని కొనసాగిస్తున్నారో నాకైతే తెలియదు. ఏదేమైనా వాళ్లు జైస్వాల్కు ఫోన్ చేసి మరీ క్షమాపణలు చెప్పాలి. కఠినమైన టెస్టు ఫార్మాట్లో ఈ యువ ఆటగాడు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు.24 ఏళ్ల వయసులోపే ఎన్నెన్నో శతకాలు బాదాడు. అతడి బంగారు భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయకండి. విరాట్ కోహ్లి విషయం పక్కనపెడితే.. రోహిత్ శర్మను ఇంకెందుకు కొనసాగిస్తున్నారు?రోహిత్ ఇంకెందుకు?అజిత్ అగార్కర్ టీమిండియా విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాడని నాకైతే అనిపించడం లేదు. ఇప్పటికీ రోహిత్ మాత్రమే వన్డేల్లో కీలక ఓపెనర్ అని భావిస్తున్నారా? అతడికి బదులు జైస్వాల్ లేదంటే సాయి సుదర్శన్కు అవకాశం ఇవ్వొచ్చు కదా!’’ అని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.కాగా వన్డే వరల్డ్కప్-2023లో కెప్టెన్గా టీమిండియాను ఫైనల్కు చేర్చిన రోహిత్ శర్మ.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో విజేతగా నిలిపాడు. అయితే, ఆ తర్వాత అనూహ్య రీతిలో మేనేజ్మెంట్ అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించి.. పగ్గాలు శుబ్మన్ గిల్కు అప్పగించింది. అతడి సారథ్యంలో భారత్ ఇప్పటికి ఒక్క సిరీస్ గెలవలేదు.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026 ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో ఓ టెస్టు, మూడు వన్డేలు ఆడుతుంది. వన్డే సిరీస్లో ఫిట్నెస్కు లోబడి రోహిత్ శర్మ ఆడతాడని సెలక్టర్లు స్పష్టం చేశారు. ఈ జట్టులో జైస్వాల్కు చోటు దక్కలేదు. చదవండి: మేము ఇక్కడిదాకా రావటమే గొప్ప: రియాన్ పరాగ్ -
‘ముంబై తప్పు తెలుసుకుంది.. కెప్టెన్గా అతడే!’
మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్కు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. ఐపీఎల్-2026లో గ్రూప్ దశలో పద్నాలుగు మ్యాచ్లకు గానూ ముంబై.. కేవలం నాలుగు మ్యాచ్లే గెలిచింది. ఫలితంగా ఎనిమిది పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది.ఐదుసార్లు చాంపియన్కాగా రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీలో ముంబై గతంలో ఏకంగా ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ 2024లో అతడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించింది యాజమాన్యం. అతడి స్థానంలో... గుజరాత్ టైటాన్స్ను విజేతగా (2022) నిలిపిన తమ మాజీ ఆటగాడు హార్దిక్ పాండ్యాను తిరిగి జట్టులోకి తీసుకుంది. అంతేకాదు కెప్టెన్గానూ బాధ్యతలు అప్పగించింది.ఘోర పరాభవంముంబై ఇండియన్స్ సారథిగా తొలి ప్రయత్నంలోనే హార్దిక్ ఘోర పరాభవం చవిచూశాడు. సొంత జట్టు అభిమానుల నుంచే తీవ్ర వివక్ష ఎదుర్కోవడంతో పాటు.. జట్టును మరీ దారుణంగా చిట్టచివరన పదో స్థానంలో నిలిపాడు. అయితే, ఆ తర్వాత టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించడంతో హార్దిక్పై నెగిటివిటీ కాస్త తగ్గింది.గతేడాది ప్లే ఆఫ్స్ చేరినా.. అదే జోరులో 2025లో ముంబైని ప్లే ఆఫ్స్ చేర్చాడు హార్దిక్ పాండ్యా. అయితే, తాజా ఎడిషన్లో మళ్లీ పాత కథే పునరావృతమైంది. ఈసారి కెప్టెన్గా.. ఆల్రౌండర్గా అతడు పూర్తిగా విఫలమయ్యాడు. వెన్నునొప్పి కారణంగా నాలుగు మ్యాచ్లకు దూరమైన హార్దిక్.. 10 మ్యాచ్లు ఆడి 206 పరుగులు చేయడంతో పాటు.. కేవలం నాలుగు వికెట్లు తీశాడు.ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాపై అంబానీల సారథ్యంలోని యాజమాన్యం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య అభిప్రాయ భేదాలు తారస్థాయికి చేరుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ముంబై ఇండియన్స్ సన్నిహిత వర్గాలు ఎన్డీటీవీకి కీలక విషయాలు వెల్లడించాయి.ముంబై తప్పు తెలుసుకుంది‘‘ముంబై ఇండియన్స్ యాజమాన్యం తమ తప్పును తెలుసుకుంది. అయితే, రోహిత్ శర్మ తిరిగి పగ్గాలు చేపట్టేందుకు ఏమాత్రం సిద్ధంగా లేడు. కానీ.. అతడి ఆశీర్వాదం ఉన్న వ్యక్తే ముంబై ఇండియన్స్ తదుపరి కెప్టెన్ అవుతాడనడంలో సందేహం లేదు. రోహిత్ సూచించిన ఆటగాడికే కెప్టెన్సీ దక్కే అవకాశం ఉంది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా సైతం ముంబైని వీడే ప్రయత్నాల్లో ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నాడు. ఇటీవల తన ఫోన్ స్క్రీన్పై ‘07:07’ టైమ్ను షేర్ చేయడంతో.. అతడు చెన్నై సూపర్ కింగ్స్లో చేరబోతున్నాడని నెటిజన్లు భావించారు.మేనేజ్మెంట్తో సంబంధాలు దెబ్బతింటేఈ విషయం గురించి కూడా సదరు వర్గాలు స్పందించాయి. ‘‘హార్దిక్ కచ్చితంగా ట్రాన్స్ఫర్ కోరుకుంటాడు. కేవలం కెప్టెన్సీ విషయంలోనే కాదు.. వ్యక్తిగతంగానూ అతడు జట్టుకు దూరమవ్వాలని కోరుకుంటున్నాడు.ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నపుడు మేనేజ్మెంట్తో సంబంధాలు దెబ్బతింటే ఎవరైనా ఇలాగే చేస్తారు కదా!.. ఆటగాళ్లు కూడా ఇందుకు మినహాయింపు కాదు’’ అని ముంబై ఇండియన్స్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.చదవండి: GT vs RR: వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే? -
రోహిత్, విరాట్లను భయపెట్టిన పాట్ కమిన్స్ నే వణికించిన బుడ్డాడు..!
-
పాటీదార్ ఒక స్లో పాయిజన్.. కప్పు గెలిస్తే చరిత్రే!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ ఆ జట్టును వరుసగా రెండో ఏడాది ఫైనల్ చేర్చడంలో సఫలమయ్యాడు. నాయకుడంటే ముందుండి నడిపించాలి. ఆ మాటలను ఇవాళ పాటీదార్ అక్షరాలా చేసి చూపించాడు. మొదట తన అద్భుత బ్యాటింగ్తో జట్టు భారీ స్కోరు సాధించడంలో పాటీదార్ కీలకపాత్ర పోషించి షాన్దార్గా నిలిచాడు. త్రుటిలో సెంచరీ చేజారినా, బ్యాటింగ్లో పొరపాట్లు ఉన్నా సరే, అతడి విలువైన ఇన్నింగ్స్ దానిని మర్చిపోయేలా చేసింది. ఈ నేపథ్యంలో వరుసగా తన టీమ్ను రెండోసారి ఫైనల్ చేర్చిన అతను మరో టైటిల్ అందిస్తే చరిత్రలో నిలిచిపోతాడనడంలో సందేహం లేదు. గుజరాత్పై విజయంతో ఐపీఎల్లో ఒక జట్టును వరుసగా రెండుసార్లు ఫైనల్ చేర్చిన కెప్టెన్ల జాబితాలో పాటీదార్ చేరిపోయాడు. గతంలో ఎంఎస్ ధోని (సీఎస్కే, 2010, 2011), రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్ 2019, 2020), హార్దిక్ పాండ్యా ( గుజరాత్ టైటాన్స్ 2022, 2023), శ్రేయస్ అయ్యర్ (2024లో కేకేఆర్, 2025లో పంజాబ్) ఈ ఘనత సాధించారు.స్లో పాయిజన్ బ్యాటింగ్..రజత్ పాటీదార్ బ్యాటింగ్ స్టైల్ స్లో పాయిజన్ అని చెప్పొచ్చు. స్లో పాయిజన్ మెళ్లిగా ఎక్కినా బలంగా ప్రభావం చూపుతుంది. అదే తరహాలో ముందు స్లోగా ఆడడం.. ఒకసారి కుదురుకున్నాక అతడి విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడం పాటీదార్ స్టైల్. 2025 సీజన్లో బ్యాటింగ్లో కూడా ఫర్వాలేదనిపించే ప్రదర్శన (143.77 స్ట్రైక్రేట్తో 312 పరుగులు) చేసిన అతను ఈసారి మరింతగా చెలరేగిపోయాడు. టైటిల్ సాధించిన నాయకుడిగా వచ్చిన ఆత్మవిశ్వాసం కావచ్చు తాజా సీజన్లో అతను అసాధారణ బ్యాటింగ్ను ప్రదర్శిస్తున్నాడు. తాను ఎదుర్కొన్న 247 బంతుల్లో అతను 486 పరుగులు (5 అర్ధసెంచరీలు) సాధించాడు. వీటిలో 29 ఫోర్లు, 41 సిక్సర్ల ద్వారానే 362 పరుగులు రాబట్టడం అతని బ్యాటింగ్ ధాటి ఏమిటో చూపించింది. మంగళవారం మ్యాచ్లో అతను అద్భుత షాట్లతో ఆకట్టుకున్నాడు. ఆరుగురు ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొన్న అతనూ ఎవరినీ వదలకుండా అందరి బౌలింగ్లో సిక్సర్లు బాదాడు. కుల్వంత్ ఓవర్లో దూకుడు ప్రదర్శించిన తర్వాత రషీద్ ఓవర్లో అతను 2 భారీ సిక్స్లు కొట్టాడు. వీటిలో ఎక్స్ట్రా కవర్ మీదుగా కొట్టిన సిక్స్ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. రబాడ ఓవర్లోనూ రెండు సిక్స్లు కొట్టిన అతను 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. సిరాజ్ ఓవర్లో వరుసగా 6, 4 బాదిన అతను ప్రసిధ్ వేసిన ఆఖరి ఓవర్లోనూ 2 సిక్స్లు కొట్టాడు. ఇలా కెప్టెన్గా, ఆటగాడిగా సూపర్ సక్సెస్ అయిన రజత్ పాటీదార్ తొందరలో టీమిండియా గడప కూడా తొక్కే అవకాశం లేకపోలేదు.Captains who led their teams into back to back IPL Finals:- MS Dhoni (2010, 2011). - Rohit Sharma (2019, 2020). - Hardik Pandya (2022, 2023). - Shreyas Iyer (2024, 2025). - Rajat Patidar (2025, 2026). pic.twitter.com/2evHNpBfQK— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2026Breathtaking Batting 🤯🎥 Rajat Patidar leaving the best in the business awestruck 😳❤️Updates ▶️ https://t.co/9rs6u5obOw#TATAIPL | #Qualifier1 | #TheFinalLeap | #RCBvGT | @RCBTweets pic.twitter.com/5BFUDFTHH1— IndianPremierLeague (@IPL) May 26, 2026చదవండి: ‘క్రెడిట్ నాది కాదు.. మ్యాచ్ను గెలిపించింది వాళ్లే!’ -
రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ నిరాశపరిచాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ధ్రువ్ జురేల్కు క్యాచ్ ఇచ్చిన రోహిత్ డకౌట్గా వెనుదిరిగాడు. దీంతో రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ డకౌట్తో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సార్లు సున్నా పరుగులకే అవుట్ అయిన ఆటగాడిగా గ్లెన్ మాక్స్వెల్తో కలిసి రోహిత్ శర్మ సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ ఐపీఎల్లో ఇప్పటివరకు మొత్తం 19 సార్లు డకౌట్ అయ్యాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన గ్లెన్ మాక్స్వెల్ కూడా 19 డకౌట్లతో రోహిత్ శర్మతో పాటే మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. వీరి తర్వాత దినేష్ కార్తీక్, సునీల్ నరైన్ చెరో 18 డకౌట్లతో రెండో స్థానంలో ఉన్నారు. అలాగే స్పిన్ బౌలర్లు పియూష్ చావ్లా, రషీద్ ఖాన్ లు కూడా చెరో 16 సార్లు సున్నా పరుగులకే అవుటయ్యి ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.మ్యాచ్ విషయానికొస్తే ముంబై ఇండియన్స్పై రాజస్తాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులకు పరిమితమైంది. ముంబైపై విజయంతో రాజస్తాన్ ప్లేఆఫ్స్ చేరుకోగా ఎన్నో ఆశలు పెట్టుకున్న పంజాబ్, కేకేఆర్లు కూడా లీగ్ దశలోనే ఇంటిబాట పట్టాయి.చదవండి: 'మోసగాడు.. వచ్చాడు 18 కోట్లు పట్టుకెళ్లాడు!' -
అభిమానికి రోహిత్ క్షమాపణ.. ఎందుకంటే?
ముంబై ఇండియన్స్ స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ తన అభిమానికి క్షమాపణ చెప్పడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విషయంలోకి వెళితే.. ముంబై ఇండియన్స్ గత మ్యాచ్ను ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో ఆడింది. పూర్తి వన్సైడ్గా జరిగిన ఈ మ్యాచ్లో ముంబై 4 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. కేకేఆర్కు సొంత స్టేడియం కావడంతో ఆ జట్టుకు భారీగా అభిమానులు వచ్చినప్పటికీ, ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కూడా కొంతమంది ఉన్నారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ ముగిసిన తర్వాత చాలా మంది అభిమానులు ముంబై ఇండియన్స్ బస చేసే హోటల్ ముందు ఆటగాళ్ల కోసం నిరీక్షించారు. ముఖ్యంగా రోహిత్ శర్మను చూడడం కోసం చాలాసేపు ఎదురుచూశారు. అందులోనే ఒక చిన్న అమ్మాయి కూడా ఉంది. రోహిత్ బయటకు వచ్చినప్పటికీ ఆ అమ్మాయిని పట్టించుకోలేదు. దీంతో ఆ అమ్మాయి ఎమోషనల్ అయ్యి ఏడ్వడం ప్రారంభించింది. దీనిని వీడియో తీసిన కొందరు అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోను చూసిన రోహిత్ శర్మ వెంటనే క్షమాపణతో కూడిన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 'టెన్షన్, గందరగోళం మధ్య వీటన్నింటిని పట్టించుకోవడం కాస్త కష్టమని రోహిత్ తెలిపాడు. అయితే నాకోసం నిరీక్షించిన చిన్న అమ్మాయిని కలవకపోడం బాధగా అనిపించింది. నా చర్య పట్ల క్షమాపణ చెబుతున్నా. మరో విషయం ఏంటంటే ఈసారి ఎప్పుడు కోల్కతాకు వచ్చినా ఆ అమ్మాయిని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడుతానని అందరికీ వాగ్దానం చేస్తున్నా.' అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. రోహిత్ ఒక అభిమానికి ఇలా క్షమాపణ చెబుతూ ప్రత్యేకంగా వీడియో విడుదల చేయడంపై అభిమానులు తెగ సంతోషపడిపోయారు. 'రోహిత్ తనను ఇష్టపడే వ్యక్తులను ఎప్పుడు బాధపెట్టడానికి ఇష్టపపడడని' కామెంట్లు చేస్తున్నారు. కేకేఆర్తో మ్యాచ్లో రోహిత్ శర్మ పెద్దగా రాణించలేకపోయాడు. 13 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ సౌరభ్ దూబే బౌలింగ్లో వెనుదిరిగాడు. ఈ సీజన్లో గాయంతో పలు మ్యాచ్లకు దూరమైన రోహిత్ 8 మ్యాచ్ల్లో 283 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థసెంచరీలున్నాయి. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. కెప్టెన్ పాండ్యా (26) టాప్ స్కోరర్గా నిలిచాడు.అనంతరం కేకేఆర్ స్వల్ప టార్గెట్ను ఛేదించడానికి కష్టపడినప్పటికీ మనీష్ పాండే, రోవ్మెన్ పావెల్ మధ్య 64 పరుగుల భాగస్వామ్యం కేకేఆర్ను విజయతీరాలకు చేర్చింది. ఇప్పటికే సీజన్ నుంచి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్ 13 మ్యాచ్ల్లో 8 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. ముంబై తమ చివరి లీగ్ మ్యాచ్ను రాజస్తాన్ రాయల్స్తో ఆడనుంది.Rohit Sharma apologized to the fangirl who started crying at Eden Gardens after not being able to meet him. Rohit made a special video for her and said sorry, and he also promised that he would meet her the next time he comes to Kolkata.🥹❤️bRO doesn’t disappoint his fans.🙌 pic.twitter.com/NA5FR9AlMM— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 23, 2026చదవండి: ఎస్ఆర్హెచ్ త్రిమూర్తుల అరుదైన ఫీట్! -
BCCI: వరల్డ్కప్ ఓపెనర్ రేసులో ఊహించని పేరు!
భారత క్రికెట్లో సరికొత్త సంచలనం వైభవ్ సూర్యవంశీ. గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఈ బిహారీ పిల్లాడు.. ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో)తో దుమ్ములేపాడు. ఆ తర్వాత భారత అండర్-19 జట్టు తరఫున, వరల్డ్కప్-2025లో సత్తా చాటాడు.గాలివాటం కాదుప్రపంచకప్ ఫైనల్లో భారీ విధ్వంసకర శతకం (80 బంతుల్లో 175)తో రాణించిన వైభవ్.. భారత్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్-2026లోనూ రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా దుమ్ములేపుతున్నాడు. పదమూడు మ్యాచ్లలో కలిపి 579 పరుగులు సాధించాడు. తద్వారా తన ప్రదర్శనలు గాలివాటం కాదని నిరూపించుకున్నాడు.భారత్-‘ఎ’ జట్టులో చోటుఈ నేపథ్యంలో పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీని టీమిండియాకు ఎంపిక చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే, బీసీసీఐ మాత్రం తొలుత అతడిని భారత్-‘ఎ’ జట్టులో ఆడించాలని నిర్ణయించింది. శ్రీలంకలో జరిగే ముక్కోణపు వన్డే సిరీస్కు అతడిని ఎంపిక చేసింది. లంక, అఫ్గన్ ‘ఎ’ జట్లతో తలపడే ఈ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్.రోహిత్కు గండంఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి ఇప్పటి నుంచే ఓపెనింగ్ జోడీపై టీమిండియా యాజమాన్యం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దిగ్గజ ఓపెనర్ రోహిత్ శర్మను ఫిట్నెస్ కారణాల దృష్ట్యా టోర్నీ నుంచి తప్పించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.ఈ క్రమంలో కెప్టెన్ శుబ్మన్ గిల్కు జోడీగా ఇషాన్ కిషన్ను ఆడిస్తూ.. బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్ను ఎంపిక చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇందుకు తగ్గట్లుగానే అఫ్గన్తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్కు ఇషాన్ ఎంపికయ్యాడు.జైసూ ఎదురుచూపులుఇక రోహిత్ శర్మ ఫిట్నెస్కు లోబడి.. ఈ సిరీస్లో ఆడతాడని బీసీసీఐ తెలిపింది. మరోవైపు.. అఫ్గన్తో ఏకైక టెస్టుకు ఎంపికైన యశస్వి జైస్వాల్ను వన్డేల నుంచి మాత్రం పక్కనపెట్టారు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఓ వార్త సంచలనంగా మారింది.శ్రీలంకలో భారత్-‘ఎ’ జట్టు తరఫున గనుక నిలకడగా రాణిస్తే.. వన్డే వరల్డ్కప్-2027 నేపథ్యంలో వైభవ్ పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకుంటారన్నది దాని సారాంశం. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు క్రిక్బ్లాగర్తో మాట్లాడుతూ..ఫామ్ కొనసాగిస్తే వన్డే వరల్డ్కప్ జట్టులో చోటు‘‘వైభవ్ సూర్యవంశీ త్వరలోనే టీమిండియాకు ఆడబోతున్నాడు. భారత్-ఎ తరఫున అతడి ప్రదర్శనను బట్టి ఎంత త్వరగా జాతీయ జట్టులోకి వస్తాడన్నది తెలుస్తుంది. సెలక్టర్లు అతడి ఆట తీరును నిశితంగా గమనిస్తున్నారు. అతడు ఇలాగే నిలకడగా ఆడుతూ.. ఫామ్ కొనసాగిస్తే వన్డే వరల్డ్కప్-2027 ఆడే భారత జట్టులో చోటు దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అతడికి ఆకాశమే హద్దు’’ అని పేర్కొన్నాయి. కాగా ఒకవేళ 15 ఏళ్ల వైభవ్ గనుక ఊహించని రీతిలో ఈ జట్టులోకి వస్తే నిజంగా అదొక సంచలనమే అవుతుంది.చదవండి: ‘నేను పుట్టకముందు సచిన్ అరంగేట్రం.. ఆ రికార్డు బద్దలు కొడతా’ -
BCCI: రోహిత్ శర్మకు బై.. బై!.. వరల్డ్కప్ జట్టులోకి అతడు?
టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ భవితవ్యంపై మరోసారి ఊహాగానాలు ఊపందుకున్నాయి. భారత్కు రెండు ప్రపంచకప్ ట్రోఫీలు అందించిన ఈ మాజీ కెప్టెన్.. వన్డే వరల్డ్కప్-2027లో పాల్గొనడంపై సందేహాలు నెలకొన్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సన్నిహిత వర్గాలు తాజాగా వెల్లడించిన వివరాలే ఇందుకు కారణం.టైటిల్ గెలిచిన తర్వాత వేటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచిన తర్వాత అనూహ్య రీతిలో రోహిత్ శర్మ (Rohit Sharma)ను వన్డే కెప్టెన్సీ నుంచీ తప్పించింది బీసీసీఐ. ప్రస్తుతం కేవలం యాభై ఓవర్ల ఫార్మాట్లోనే హిట్మ్యాన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఐసీసీ టైటిల్ గెలిచిన తర్వాత అతడిపై వేటు వేసింది యాజమాన్యం.ప్రస్తుతం కేవలం బ్యాటర్గా కొనసాగుతున్న 39 ఏళ్ల రోహిత్ శర్మ ఊహించని రీతిలో సన్నబడ్డాడు. దాదాపు పది కిలోలకు పైగా బరువు తగ్గి ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో సత్తా చాటాడు. స్వదేశంలోనూ మెరుగైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు.ఫిట్నెస్ సమస్యలుఇదిలా ఉంటే.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికినప్పటికీ ఐపీఎల్లో రోహిత్ శర్మ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్తో కొనసాగుతున్న అతడు 2026 సీజన్లో తొడ కండరాల గాయం వల్ల కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడు.ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్కు సెలక్టర్లు అతడిని ఎంపిక చేసినప్పటికీ.. ఫిట్నెస్కు లోబడి ఈ సిరీస్లో పాల్గొంటాడని స్పష్టం చేశారు. ఈ క్రమంలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ సంచలన కథనం వెలువరించింది.బాగా సన్నబడ్డాడు.. కానీ రోహిత్ భవిష్యత్ గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు గత మూడు వారాల్లో రోహిత్ ఎప్పుడూ రిపోర్టు చేయలేదు. అతడు బాగా సన్నబడ్డాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అతడి శరీరం యాభై ఓవర్ల ఫార్మాట్కు సిద్ధంగా ఉందా? లేదా? అన్న అంశంపై ఆందోళన నెలకొంది.జట్టులో ఉంటే అతడు యాభై ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేయాల్సి ఉంటుంది. ఐపీఎల్ మాదిరి వన్డే క్రికెట్లో ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ లేదు కదా!.. నలభై ఏళ్ల వయసుకు దగ్గరపడుతున్న తరుణంలో రోహిత్ శరీరం ఎలా స్పందిస్తుందన్నది ముఖ్యం.రోహిత్కు బై.. బై!.. జైసూకు లైన్ క్లియర్!నిజానికి వరల్డ్కప్ టోర్నీకి ముందు ఆడే వన్డేల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. కాబట్టి రోహిత్కు ప్రత్యామ్నాయంగా బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్ను సిద్ధం చేయాల్సి ఉంది. ఇషాన్ కిషన్ ఇప్పటికే వన్డే జట్టులోకి వచ్చాడు.అతడు కూడా ఓపెనింగ్ చేయగలడు. వన్డే వరల్డ్కప్ జట్టులో రోహిత్ ఫిట్నెస్ కారణాల దృష్ట్యా చోటు దక్కించుకోలేకపోయినా.. శుబ్మన్ గిల్ లేదంటే యశస్వి జైస్వాల్ గాయపడినా మరో బ్యాకప్ ఓపెనర్ను కూడా సిద్ధం చేసుకుంటే బాగుంటుంది’’ అని తెలిపినట్లు సదరు కథనం పేర్కొంది. అగార్కర్ సంకేతాలుకాగా చాలా ఏళ్లుగా.. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ- ప్రస్తుత సారథి శుబ్మన్ గిల్ భారత వన్డే జట్టు ఓపెనింగ్ జోడీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవల స్పందించే క్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ కంటే ముందు ఓపెనర్గా యశస్వి జైస్వాల్కే తాము ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశాడు. తద్వారా రోహిత్కు ఉద్వాసన పలికి.. జైసూను బ్యాకప్ ఓపెనర్గా ఎంపిక చేస్తామనే సంకేతాలు ఇచ్చాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.చదవండి: హార్దిక్ పాండ్యాను శిక్షించిన బీసీసీఐ -
అఫ్గాన్తో సిరీస్కు భారత జట్టు ప్రకటన
ఐపీఎల్ 2026 సీజన్లో వేర్వేరు జట్లలో ఆడుతున్న టీమిండియా ఆటగాళ్లు మళ్లీ ఒక్కటిగా కలిసి ఆడనున్నారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియా స్వదేశంలో అప్గానిస్తాన్తో ఒక టెస్టు సహా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మంగళవారం భారత జట్టును ప్రకటించింది. ఏకైక టెస్టుతో పాటు వన్డేలకు శుబ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. జూన్ 6 నుంచి ముల్లన్పూర్ వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది.ఏకైక టెస్టు మ్యాచ్కు కెప్టెన్ గిల్కు కేఎల్ రాహుల్ డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. మరోవైపు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించనున్నాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కోల్పోయాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున నిలకడగా రాణిస్తున్న ప్రిన్స్ యాదవ్కు తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు.ఇక టీమిండియా సీనియర్ క్రికెటర్లు రవీంద్ర జడేజాతో పాటు స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రాలకు అఫ్గాన్తో సిరీస్కు విశ్రాంతి కల్పించిట్లు బీసీసీఐ తెలిపింది. అఫ్గానిస్తాన్తో ఒకే టెస్టు మ్యాచ్ కావడంతో జడేజాను తప్పించామని, టీ20 ప్రపంచకప్ నుంచి బిజీగా క్రికెట్ ఆడుతున్న బుమ్రాను భవిష్యత్తులో టీమిండియా ఆడబోయే కీలక సిరీస్లను దృష్టిలో ఉంచుకొని అతడికి విశ్రాంతి కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఇక సీనియర్ ఆటగాడు కోహ్లీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మరో సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాలను వన్డే జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ, ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ఐపీఎల్లో అదరగొడుతున్న టీమిండియా సీనియర్ భువనేశ్వర్ కుమార్ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. మరోవైపు మహ్మద్ షమీ విషయంలో సెలెక్షన్ కమిటీలో ఎలాంటి చర్చ జరగలేదని అగార్కర్ తెలిపాడు. ఇక తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి టెస్టు జట్టులో తన స్థానాన్ని నిలుపుకున్నాడు.అఫ్గాన్తో ఏకైక టెస్టుకు టీమిండియా: శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.అఫ్గాన్తో వన్డేలకు భారత జట్టు: శుబ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, అర్ష్దీప్ సింగ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, రోహిత్ శర్మ*, హార్దిక్ పాండ్యా*.మ్యాచ్ల షెడ్యూల్..జూన్ 6 నుంచి 10 వరకు- ఏకైక టెస్టు (ముల్లన్ పూర్, ఛండీగఢ్)తొలి వన్డే : జూన్ 14 (ధర్మశాల)రెండో వన్డే : జూన్ 17 (లక్నో)మూడో వన్డే : జూన్ 20 (చెన్నై)🚨 News 🚨Presenting #TeamIndia's squads for the @IDFCFIRSTBank Test match and the 3️⃣-match ODI series against Afghanistan in June 🙌#INDvAFG pic.twitter.com/hFiABALLld— BCCI (@BCCI) May 19, 2026📸The Men's Selection Committee Meeting for #TeamIndia's squad announcement for the upcoming @IDFCFIRSTBank Test match and the three-match ODI series against Afghanistan is underway in Guwahati.#INDvAFG pic.twitter.com/VlA94h1nFC— BCCI (@BCCI) May 19, 2026చదవండి: ధోని వీడ్కోలు.. ఒక శకం ముగిసింది! -
వన్డే వరల్డ్కప్ ఆడటంపై కోహ్లి కీలక వ్యాఖ్యలు
భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి.. వన్డే వరల్డ్కప్-2027 టోర్నీలో ఆడతాడా? లేదా?.. చాన్నాళ్లుగా క్రికెట్ వర్గాల్లో ఈ చర్చ నడుస్తోంది. ‘సూపర్ స్టార్లు’ అయినా సరే తమను తాము ఎప్పటికప్పుడు నిరూపించుకోవాలని హెడ్కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ గట్టిగానే చెబుతున్నారు.తమ దృష్టిలో దిగ్గజాలు, యువ ఆటగాళ్లు సమానమనే సంకేతాలు ఇస్తున్నారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ను విజేతగా నిలిపిన తర్వాత కెప్టెన్ పదవి నుంచి రోహిత్ శర్మను తప్పించడం ఇందుకు నిదర్శనం. అంతేకాదు రో-కోలను మేనేజ్మెంట్ దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో తప్పక ఆడాలని ఆదేశించింది.మౌనం వీడిన కోహ్లిఈ ఇద్దరూ అక్కడా సత్తా చాటి తమను తాము నిరూపించుకున్నారు. అయినప్పటికీ వయసు రిత్యా రో-కోను వరల్డ్కప్ ఆడిస్తారా? లేదా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో విరాట్ కోహ్లి (Virat Kohli) తన భవిష్యత్తుపై మౌనం వీడాడు.వన్డే వరల్డ్కప్-2027లో ఆడతారా? లేదా? అన్న అంశంపై స్పందిస్తూ.. ‘‘నా దృష్టి కోణం ఒక్కటే. నా జట్టు విలువ పెంచేలా నా శాయశక్తులా కృషి చేస్తా. అక్కడున్న వాళ్లు కూడా నా వల్ల జట్టుకు మేలు చేకూరుతుందని భావించాలి. అప్పుడే నేను జట్టులో ఉంటాను.పదే పదే నిరూపించుకోవాలనే ఒత్తిడి వస్తే..అయితే, పదే పదే నన్ను నేను నిరూపించుకోవాలనే ఒత్తిడి వస్తే.. అక్కడ నాకు స్థానం ఉండదని పరోక్షంగా నాకు నేను చెబుతున్నట్లు అర్థం. ఏదేమైనా నిజాయితీగా ఆట కోసం సన్నద్ధం కావడం అత్యంత ముఖ్యం. బ్యాటింగ్ చేయడానికి వెళ్లే ముందు ప్రతిసారి నా తల వంచుకుని.. కొత్తగా మైదానంలోకి దిగినట్లే వెళ్తాను.నా క్రికెట్ కెరీర్లో దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. అందుకు నేను కృతజ్ఞుడిని. కఠినంగా శ్రమించడమే నాకు తెలుసు. సరైన రీతిలో ఆడటమే నా లక్ష్యం. అలాగే ఆడతాను కూడా. వన్డే మ్యాచ్లో నలభై ఓవర్ల పాటు.. వికెట్ల మధ్య పరుగులు తీయాల్సి వస్తే నేను కచ్చితంగా ఆ పనిని పూర్తి చేస్తా.As I said, if Kohli feels the team management or BCCI wants him to prove his worth, he’ll retire the next day and that’s exactly what he said.He added "Ofc I want to play 2027 WC " 😭♥️ pic.twitter.com/eOv07nN6fc— Gaurav (@Melbourne__82) May 15, 2026ప్రతి బాల్ నా కెరీర్లో ఆఖరిది అనే ఆలోచనతోనేనాకెలాంటి ఫిర్యాదులూ ఉండవు. ఎందుకంటే.. మ్యాచ్లో ఊహించని పరిస్థితులు ఎదురైనా.. అందుకు తగ్గట్లుగా జట్టు కోసం ఉపయోగపడేలా ముందే నేను సన్నద్ధమవుతా. మ్యాచ్లో ఎదుర్కొనే ప్రతి బాల్ నా కెరీర్లో ఆఖరి బంతి అనే ఆలోచనతోనే సిద్ధమవుతా.వికెట్ల మధ్య అలుపు లేకుండా పరిగెడతా. ఇంత చేసినా నా విలువ, స్థాయి ఏమిటో నిరూపించుకోవాలని అంటున్నారంటే.. అక్కడ నా అవసరం లేదు అని అర్థం. నాకు అది అక్కర్లేదు కూడా!’’ అని కోహ్లి నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ పాడ్కాస్ట్లో కోహ్లి చేసిన ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. గంభీర్, అగార్కర్ వైఖరి నచ్చకే అతడు ఈ విధంగా స్పందించాడని అభిమానులు అంటున్నారు.కాగా 2024లో టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రో-కో.. గతేడాది అనూహ్యంగా టెస్టులకూ గుడ్బై చెప్పారు. ఇప్పుడు ఇద్దరూ వన్డేలతో పాటు ఐపీఎల్లో కొనసాగుతున్నారు. ఆర్సీబీ తరఫున కోహ్లి ఐపీఎల్-2026 సీజన్లో ఇప్పటికి 12 మ్యాచ్లు ఆడి 484 పరుగులు సాధించాడు.చదవండి: రాహుల్ ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు! -
రాహుల్ ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు!
టీమిండియా మాజీ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత హెడ్కోచ్ గౌతం గంభీర్ ఆలోచనా విధానానికి తాను వ్యతిరేకమని చెప్పకనే చెప్పాడు. రవిశాస్త్రి తర్వాత భారత జట్టుకు మార్గనిర్దేశకుడిగా వచ్చిన ద్రవిడ్.. జట్టును విజయపథంలో నిలిపాడు.టైటిల్ గెలిచిన తర్వాతఆరంభంలో సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి.. 2024లో టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ద్రవిడ్ తన పదవి నుంచి సగర్వంగా వైదొలిగాడు. అంతకుముందు ద్రవిడ్ మార్గనిర్దేశనంలోనే భారత్ వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్కు చేరింది.ఇక ద్రవిడ్ నిష్క్రమణ తర్వాత గంభీర్ హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. అతడి కోచింగ్లో టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025, టీ20 ప్రపంచకప్-2026 టైటిళ్లు గెలిచింది. అయితే, చాంపియన్స్ ట్రోఫీ విజయంలో ద్రవిడ్దే కీలక పాత్ర అని.. అతడు నిర్మించిన జట్టే టైటిల్ గెలిచిందని నాటి కెప్టెన్ రోహిత్ శర్మ ద్రవిడ్కు క్రెడిట్ ఇచ్చాడు.కోహ్లి, రోహిత్ రిటైర్మెంట్కు కారణమా?ఇదిలా ఉంటే.. గంభీర్ టీమిండియాలో సూపర్స్టార్ సంస్కృతిని పారద్రోలి.. సూపర్ టీమ్గా ఎదిగేందుకు ప్రాధాన్యం ఇస్తాడని అతడి సన్నిహిత వర్గాలు ఇటీవల తెలిపాయి. టెస్టు ఫార్మాట్ నుంచి దిగ్గజాలు, సూపర్ స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వారం వ్యవధిలోనే వైదొలగడంతో గంభీర్తో విభేదాలే కారణమనే వార్తలు వచ్చాయి.ప్రతీ క్రీడకు ‘హీరో’ల అవసరం ఉందిఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ తాజాగా టీమిండియాలో ‘సూపర్ స్టార్ కల్చర్’పై స్పందించాడు. స్కూప్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ‘‘ప్రతీ క్రీడకు ‘హీరో’ల అవసరం ఉంది. తమ ప్రదర్శనల ద్వారానే ప్లేయర్లు హీరోలుగా ఎదుగుతారు.మైదానంలో మన ప్రదర్శన బాగుంటునే జాతి మనల్ని గుర్తిస్తుంది. ముఖ్యంగా భారత్లో అద్భుతంగా ఆడితే ఓ రేంజ్లో ప్రశంసలు వస్తాయి. అదే సమయంలో విమర్శలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అందరి దృష్టి ఆటగాళ్ల మీదే ఉంటుంది. మన ప్రదర్శనలను ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తారు.వారే స్ఫూర్తి దాతలుకాబట్టి ఈ దేశంలో ఎంతో గొప్పగా ఆడితే తప్ప సూపర్ స్టార్ లేదంటే దిగ్గజ ప్లేయర్ అనే హోదా రాదు. వ్యక్తిగత ప్రదర్శన బాగుంటే జట్టు విజయాలకూ మనం దోహదపడినవాళ్లము అవుతాము’’ అని రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. సూపర్ స్టార్లు భావితరాలకు స్ఫూర్తినిస్తారని.. వారి అవసరం తప్పక ఉందని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. కాగా గంభీర్ సూపర్ స్టార్ ట్యాగులు వద్దంటూ అందరినీ ఒకే గాటన కట్టాలని చూస్తుంటే.. ద్రవిడ్ మాత్రం ఈ మేరకు స్పందించడం గమనార్హం.చదవండి: టీమిండియా టీ20 కెప్టెన్గా అతడే! -
సోషల్ మీడియా ను షేక్ చేస్తున్న రోహిత్ టీజర్
-
పాక్ జట్టులో రోహిత్, గిల్..!
పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఓ ఘోర తప్పిదం జరిగింది. బ్రాడ్కాస్టర్ చేసిన ఓ భారీ పొరపాటు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాక్ ఆటగాళ్ల గణాంకాలు చూపాల్సిన సమయంలో, స్క్రీన్పై భారత క్రికెటర్ల పేర్లు కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.పాక్-బంగ్లా మధ్య తొలి టెస్ట్ మే 8న షేర్-ఏ బంగ్లా స్టేడియం వేదికగా ప్రారంభమైంది. రెండో రోజు ఆట సందర్భంగా బ్రాడ్కాస్టర్ పాక్ జట్టు టెస్ట్ గణాంకాలను ప్రదర్శించే గ్రాఫిక్ను చూపించింది. అయితే అందులో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, అర్షదీప్ సింగ్ తదితర భారత ఆటగాళ్ల పేర్లు కనిపించాయి.ఈ తప్పిదం వెంటనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమానులు మీమ్స్, సరదా కామెంట్లతో బ్రాడ్కాస్టర్ను ట్రోల్ చేశారు. కొందరు ఐపీఎల్ మోడ్లోనే గ్రాఫిక్స్ తయారు చేశారా..? అంటూ సెటైర్లు వేశారు. మరోవైపు పాక్ అభిమానులు మాత్రం ఇది సాధారణ తప్పిదం కాదని, నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే, బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేసింది. కెప్టెన్ నజ్ముల్ హొసేన్ షాంటో అద్భుత సెంచరీతో జట్టును నిలబెట్టాడు. మొమినుల్ హక్ 91, ముష్ఫికర్ రహీం 71 పరుగులతో కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 413 పరుగులకు ఆలౌటైంది. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్ ఐదు వికెట్లతో మెరవగా.. షాహీన్ అఫ్రిది 3, హసన్ అలీ, నౌమన్ అలీ తలో వికెట్ తీశారు. కాగా, ఈ మ్యాచ్కు పాక్ స్టార్ బ్యాటర్ గాయం కారణంగా దూరమయ్యాడు. -
రోహిత్ శర్మకు చేదు అనుభవం
టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మకు చేదు అనుభవం ఎదురైంది. కారులో ప్రయాణిస్తూ అభిమానులకు అభివాదం చేస్తుండగా.. సడెన్గా ఇద్దరు కుర్ర అభిమానులు రోహిత్ చేతికి ఉన్న ఖరీదైన వాచీని లాగే ప్రయత్నం చేశారు. Rohit Sharma Fans tried to snatch his 3.25 Cr "Giraffe" watch from his wrist. And suddenly he close the mirror. pic.twitter.com/vMIQFxcdxt— Aman (@Proteinkohli) May 8, 2026వెంటనే అప్రమత్తమైన రోహిత్ సదరు కుర్రాళ్లను మందలిస్తూ.. అద్దాలు మూసివేశాడు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింతో తెలీదు కానీ, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది. రోహిత్ ధరించిన ఆ వాచీ విలువు రూ.3.25 కోట్లని తెలుస్తోంది. వాచీ బ్రాండ్ నేమ్ రోలెక్స్ జిరాఫ్ అని అంటున్నారు.ఇదిలా ఉంటే, రోహిత్ ప్రస్తుతం ఐపీఎల్ 2026తో బిజీగా ఉన్నాడు. సీజన్ ఆరంభంలో గాయపడిన అతను.. ఇటీవలే రీఎంట్రీ ఇచ్చాడు. వచ్చీరాగానే లక్నో సూపర్ జెయింట్స్పై మెరుపు ఇన్నింగ్స్ (44 బంతుల్లో 84) ఆడాడు. ఫలితంగా ముంబై 229 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలుండగానే ఛేదించింది.అయితే ఈ గెలుపు ముంబైకి కంటితుడుపుగా మాత్రమే పనికొచ్చింది. ఎందుకంటే ఆ జట్టు అప్పటికే ప్లే ఆఫ్స్ అవకాశాలను చాలా సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం ముంబై 10 మ్యాచ్ల్లో మూడే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఆ జట్టు ఇకపై ఆడాల్సిన నాలుగు మ్యాచ్ల్లో గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. -
‘ఎవరి తరం కాలేదు.. ఆ ఫీట్ను శ్రేయస్ సాధిస్తాడు’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్లు విజయవంతమైన కెప్టెన్లుగా ముద్రపడ్డారు. ఇందులో ధోని, రోహిత్లు ఐదేసి సార్లు ఐపీఎల్ ట్రోఫీలు అందుకోగా.. గంభీర్ సారథ్యంలో కేకేఆర్ రెండుసార్లు ఐపీఎల్ టైటిల్స్ అందుకుంది. తాజాగా వీరి సరసన చేరేందుకు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సిద్ధమవుతున్నాడు. 2024లో కేకేఆర్కు మూడోసారి టైటిల్ అందించిన శ్రేయస్ లక్కీ కెప్టెన్గా మారిపోయాడు. జట్లు మారినప్పటికీ తన కెప్టెన్సీ, ఆటతీరుతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా అయ్యర్ పేరు సంపాదించాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ను అయ్యర్ విజేతగా నిలబెడితే ధోని, రోహిత్ శర్మను కూడా అధిగమిస్తాడని మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. జియో హాట్స్టార్కు ఇంటర్య్వూ ఇచ్చిన పఠాన్ మాట్లాడుతూ.. 'ధోని, రోహిత్, గంభీర్ వంటి అత్యుత్తమ ఐపీఎల్ కెప్టెన్లను దాటుకొని మరీ తొలి స్థానంలో నిలుస్తాడు. ఎందుకంటే ధోని, రోహిత్, గంభీర్లు ఒకే జట్టుకు టైటిల్స్ అందించారు. కానీ అయ్యర్ మాత్రం ఇప్పటికే కేకేఆర్కు టైటిల్ అందించాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్కు కూడా టైటిల్ అందిస్తే వేర్వేరు జట్లకు టైటిల్స్ అందించిన తొలి కెప్టెన్గా అయ్యర్ నిలవనున్నాడు. అంతేకాదు ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్, పంజాబ్ ఇలా మూడు వేర్వేరు జట్లను కూడా ఐపీఎల్లో ఫైనల్ చేర్చిన ఘనత అయ్యర్ సొంతం. ఒకవేళ అయ్యర్ ఈ సీజన్లో అది సాధిస్తే మాత్రం అతడి రికార్డు చెరిగిపోనిదిగా మిగిలిపోతుంది' అని పఠాన్ పేర్కొన్నాడు.ఇక ఐపీఎల్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న అయ్యర్ 2020 సీజన్లో ఆ జట్టును రన్నరప్గా నిలిపాడు. ఆ తర్వాత కేకేఆర్కు మారిన శ్రేయస్ అయ్యర్ 2024 సీజన్లో ఆ జట్టును చాంపియన్గా నిలిపాడు. 2025 సీజన్లో పంజాబ్ను ఫైనల్ చేర్చిన అయ్యర్ 2026 సీజన్లోనూ ఆ జట్టును టైటిల్ దిశగా అడుగులు వేయిస్తున్నాడు. పంజాబ్ తరఫున 33 మ్యాచ్లు, ఢిల్లీ తరఫున 41 మ్యాచ్లు, కేకేఆర్ తరఫున 29 మ్యాచ్లకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా పనిచేశాడు. అతని సక్సెస్ రేటు 90 శాతం ఉండడం గమనార్హం.చదవండి: ‘ఏం పాపం చేశాం.. ఇదేనా మాకిచ్చే విలువ!’ -
'వావ్ వాట్ ఏ ప్లేయర్.. ఏ మాత్రం మారలేదు'
ఐపీఎల్-2026 సీజన్లో సోమవారం ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఐదు మ్యాచ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ తన లోని క్లాస్ను మరోసారి చూపించాడు.229 పరుగుల భారీ లక్ష్య చేధనలో హిట్మ్యాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్తో కలిసి స్కోర్ బోర్డును రోహిత్ పరుగులు పెట్టించాడు. రోహిత్ కేవలం 44 బంతుల్లోనే 6 ఫోర్లు, 7 సిక్స్లతో 84 పరుగులు చేశాడు. 39 ఏళ్ల వయసులోనూ ఏ మాత్రం అతడి బ్యాటింగ్ తగ్గలేదని ఈ ఇన్నింగ్స్ చూస్తే మనకు అర్ధమవుతోంది. ఓవరాల్గాఈ సీజన్లో కేవలం 5 మ్యాచ్లు మాత్రమే ఆడిన రోహిత్, 174.01 స్ట్రైక్ రేటుతో 221 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మపై లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ ప్రశంసల వర్షం కురిపించాడు."వాట్ ఏ ప్లేయర్.. వాట్ ఏ ప్లేయర్. రోహిత్ శర్మ ఒక అద్భుతమైన ఆటగాడు. గతంలో ఆస్ట్రేలియా కోచ్గా ఉన్నప్పుడు ప్రత్యర్థిగా అతడి సత్తాను చూశాను. ఇప్పుడు ఎల్ఎస్జీ కోచ్గా అదే చూస్తున్నాను. అతడి బ్యాటింగ్లో ఏ మాత్రం మార్పు రాలేదు. ప్రపంచంలోని గొప్ప ప్లేయర్లు అందరిని చూసేందుకు ఐపీఎల్ ఒక వేదిక" అని లాంగర్ పేర్కొన్నాడు.కాగా రోహిత్ శర్మకు ఆస్ట్రేలియాపై గొప్ప రికార్డు ఉంది. ముఖ్యంగా వైట్బాల్ క్రికెట్లో ఆసీస్ బౌలర్లకు రోహిత్ చుక్కలు చూపించేవాడు. ఆస్ట్రేలియాలోని బౌన్సీ పిచ్లపై సైతం రోహిత్ తనదైన శైలిలో చెలరేగిపోయేవాడు.చదవండి: ముంబై ఇండియన్స్కు భారీ షాక్.. ఇంటికి వెళ్లిపోయిన కెప్టెన్? -
13 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ
ఐపీఎల్ 2026లో హిట్మ్యాన్ రోహిత్ శర్మ మరోసారి తన క్లాస్ను చాటుకున్నాడు. గాయం నుంచి తిరిగి వచ్చిన వెంటనే అద్భుత ఇన్నింగ్స్తో అభిమానులను అలరించాడు. అంతేకాకుండా 13 ఏళ్ల పాత రికార్డును కూడా బద్దలు కొట్టాడు. వాంఖడే వేదికగా నిన్న (మే 4) లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో దుమురేపాడు. భారీ లక్ష్య ఛేదనలో కేవలం 44 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఓ భారీ వ్యక్తిగత రికార్డు నెలకొల్పాడు. తన ఐపీఎల్ కెరీర్లో ఓ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్ల (7) రికార్డును నమోదు చేశాడు. ఈ మ్యాచ్కు ముందు వరకు ఓ ఇన్నింగ్స్లో అత్యధికంగా 6 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. అదీ 13 ఏళ్ల కిందట తొలిసారి ఈ ఫీట్ను సాధించాడు. 2013 ఎడిషన్లో ఇదే వాంఖడే వేదికగా పంజాబ్పై సిక్సర్ల సిక్సర్ కొట్టాడు. ఆతర్వాత 3 సార్లు ఒకే ఇన్నింగ్స్లో 6 సిక్సర్లు కొట్టాడు. ఐపీఎల్ కెరీర్లో రెండు సెంచరీలు చేసినా, వాటిలోనూ తలా ఐదు సిక్సర్లు మాత్రమే బాదాడు.తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్లో రోహిత్ అలవోకగా సిక్సర్లు బాదుతుంటే చూడముచ్చటగా ఉండింది. వింటేజ్ రోహిత్ శర్మను గుర్తు చేసింది. ఈ మ్యాచ్లో రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగి లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సహచర ఓపెనర్ ర్యాన్ రికెల్టన్తో కలిసి తొలి వికెట్కు ఏకంగా 143 పరుగులు జోడించి, గెలుపుకు బలమైన పునాది వేశాడు.రోహిత్-రికెల్టన్ వీరవిహారం చేయడంతో లక్నో నిర్దేశించిన 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ సునాయాసంగా (మరో 8 బంతులు మిగిలుండగానే) ఛేదించింది. ఇది ఐపీఎల్ చరిత్రలో ఆ జట్టుకు అత్యధిక ఛేదనగానూ నిలిచింది. ఈ గెలుపుతో ముంబై ప్లే ఆఫ్స్ అవకాశాలను ఇంకా సజీవంగా ఉంచుకుంది. తదుపరి ఆడబోయే 4 మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధిస్తే, ప్లే ఆఫ్స్ రేసులో ఉండే అవకాశం ఉంది. మే 10న జరిగే తదుపరి మ్యాచ్లో ముంబై ఆర్సీబీతో తలపడనుంది. ఆతర్వాతి మ్యాచ్ల్లో పంజాబ్, కేకేఆర్, రాజస్థాన్ జట్లను ఢీకొట్టాల్సి ఉంది. -
అదృష్టం ఉండాలి.. వాళ్లను తప్పుబట్టను: పంత్
లక్నో సూపర్ జెయింట్స్ రాత మారలేదు. ముంబై ఇండియన్స్తో సోమవారం నాటి మ్యాచ్లో పరాజయం పాలైంది. తద్వారా ఐపీఎల్-2026లో వరుసగా ఆరో (డబుల్ హ్యాట్రిక్) ఓటమి నమోదు చేసింది. తద్వారా పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది.మా వాళ్లు స్వేచ్ఛగా ఆడారుఈ నేపథ్యంలో ముంబై చేతిలో ఓటమిపై లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘మేము శుభారంభం అందుకున్నాం. అయితే, అదే ఆట తీరు కొనసాగించి మరికొన్ని పరుగులు రాబడితే ఇంకా బాగుండేది. ఈ మ్యాచ్లో మాకూ సానుకూలాంశాలు ఉన్నాయి.కానీ అవేంటో ఇప్పుడు చెప్పలేను. మా వాళ్లు స్వేచ్ఛగా ఆడారు. అయితే, ఆఖర్లో ముంబై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. సొంతమైదానం కాబట్టి ఇక్కడి పిచ్ పరిస్థితులకు వాళ్లు బాగా అలవాటు పడ్డారు. ముందుగా చెప్పినట్లు మేము ఇంకో 10-15 పరుగులు చేసి ఉంటే బాగుండేది.వారిని తప్పుపట్టలేనుఈ వికెట్ మీద 220-230 పరుగులు చేయడం కాస్త సులువే. ఆరంభంలో మాదే పైచేయిగా ఉంది. బౌలర్లను ఓటమికి బాధ్యులను చేయలేను. వారిని తప్పుపట్టలేను. మా బౌలర్లు అత్యద్భుతంగా బౌల్ చేశారు’’ అని పంత్ పేర్కొన్నాడు.అదృష్టం కావాలయ్యా!ఈ క్రమంలో..‘బాగానే ఆడుతున్నారు. అయినా ఓడిపోతున్నారు. మీ జట్టుకు ఇంకేం కావాలి?’ అని హోస్ట్ అడుగగా.. ‘‘మాకు కొంచెం అదృష్టం కావాలయ్యా!.. అదొక్కటే నేను ఇప్పుడు చెప్పగలను’’ అని పంత్ సమాధానం ఇచ్చాడు. ‘ఎలాంటి అదృష్టం?’ అని హోస్ట్ ప్రశ్నించగా.. ‘‘మాకు ఆశీర్వాదాలు కావాలి. మేము ఇంకాస్త పట్టుదలగా ముందుకు సాగాలి’’ అని పంత్ బదులిచ్చాడు.పూరన్ బ్యాట్ ఝులిపించినా..కాగా వాంఖడే వేదికగా టాస్ ఓడిన లక్నో తొలుత బ్యాటింగ్కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 228 పరుగులు సాధించింది. నికోలస్ పూరన్ విధ్వంసకర అర్ధ శతకం (21 బంతుల్లో 63)తో మెరవగా.. మార్క్రమ్ (31 నాటౌట్), హిమ్మత్ సింగ్ (40 నాటౌట్) తమ వంతు సాయం అందించారు. ఇక పంత్ 15 పరుగులే చేశాడు.High, Handsome and 2⃣ points 💙@mipaltan seal their highest run-chase in #TATAIPL history ✌️Scorecard ▶️ https://t.co/elXSOvaeig #KhelBindaas | #MIvLSG pic.twitter.com/G5rSddXCbc— IndianPremierLeague (@IPL) May 4, 2026అయితే, ముంబై ఓపెనర్లు రియాన్ రికెల్టన్ (32 బంతుల్లో 83), రోహిత్ శర్మ (44 బంతుల్లో 84) ఆకాశమే హద్దుగా చెలరేగి లక్నోకు షాకిచ్చారు. వీరిద్దరితో పాటు నమన్ ధిర్ (12 బంతుల్లో 23 నాటౌట్) మెరుపులు మెరిపించగా.. 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి ముంబై లక్ష్యాన్ని ఛేదించింది. లక్నోను ఆరు వికెట్ల తేడాతో ఓడించి.. వాంఖడేలో ఈ సీజన్లోవరుసగా నాలుగు ఓటముల తర్వాత తొలి విజయం నమోదు చేసింది.చదవండి: నువ్వసలు ఏం చేశావు బుమ్రా?.. గావస్కర్ ఫైర్! -
తన పరువు తానే తీసుకున్న బాబర్ ఆజం!
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం కల ఎట్టకేలకు నెరవేరింది. అతడి సారథ్యంలో పెషావర్ జెల్మీ పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)-2026 టైటిల్ గెలిచింది. హైదరాబాద్ కింగ్స్మెన్తో ఆదివారం జరిగిన పోరులో పెషావర్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.తద్వారా తొలిసారి పీఎస్ఎల్లో చాంపియన్గా అవతరించింది. సీజన్ ఆసాంతం అద్భుతంగా రాణించిన పెషావర్ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam).. ఈ మ్యాచ్లో మాత్రం గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. రాణించిన ఆరోన్ హార్డీఅయినప్పటికీ హైదరాబాద్ విధించిన 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పెషావర్ విజయవంతంగా ఛేదించింది. ఆరోన్ హార్డీ (39 బంతుల్లో 56 నాటౌట్), అబ్దుల్ సమద్ (34 బంతుల్లో 48) రాణించి జట్టును గెలిపించారు.దీంతో తొలిసారి పీఎస్ఎల్ టైటిల్ గెలిచిన ఆనందంలో బాబర్ ఆజం ఎగిరి గంతేశాడు. ముఖ్యంగా ట్రోఫీ అందుకునే సమయంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ శైలిని అనుకరించబోయి నెటిజన్ల చేతికి చిక్కాడు. రోబో మాదిరి నడిచి వెళ్లి..కాగా 2024లో టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ను విజేతగా నిలిపిన సారథి రోహిత్.. రోబో మాదిరి నడుచుకుంటూ వెళ్లి ట్రోఫీ అందుకుని సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే, ఇప్పుడు బాబర్ కూడా అదే స్టైల్లో వెళ్లి ట్రోఫీ తీసుకోవాలనుకున్నాడు. కానీ రోబో మాదిరి కాకుండా వెనుక నుంచి ఎవరో తరిమినట్లుగా చిన్న పిల్లాడిలా పరిగెత్తుకు వచ్చి ట్రోఫీ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.Babar Azam tried to copy Rohit Sharma’s ICC Men's T20 World Cup celebration but turned a legendary moment into a meme 😭😭😭 pic.twitter.com/xrxjxsRI55— Ankur (@flick_class) May 4, 2026రోహిత్ను కాపీ కొట్టబోయి బొక్కబోర్లా పడ్డాడుదీంతో.. ‘‘రోహిత్ శర్మను కాపీ కొట్టబోయి బొక్కబోర్లా పడ్డాడు. మీమర్లకు పండుగ చేసుకునే అవకాశం ఇచ్చాడు’’ అంటూ బాబర్ ఆజంపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా పీఎస్ఎల్ తాజా సీజన్లో బాబర్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. పదకొండు మ్యాచ్లలో కలిపి 588 పరుగులు సాధించి.. టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.కాగా పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కరాచీ, లాహోర్లో పీఎస్ఎల్ మ్యాచ్లు నిర్వహించింది. ప్లే ఆఫ్స్నకు ప్రేక్షకులను అనుమతించినా ప్రజా రవాణా ద్వారానే స్టేడియానికి చేరుకోవాలనే షరతు పెట్టింది. ఏదేమైనా మరోసారి ఐపీఎల్కు పోటీగా వచ్చి బొక్కబోర్లా పడింది. కాగా మార్చి 26 నుంచి మే 3 వరకు పీఎస్ఎల్ తాజా ఎడిషన్ నడించింది.చదవండి: ఐపీఎల్లో మరో సిక్సర్ల చిచ్చరపిడుగు.. వైభవ్ సూర్యవంశీలాగే..! -
రికార్డుల రారాజు రోహిత్ శర్మకు బర్త్డే విషెస్ (ఫోటోలు)
-
రోహిత్ శర్మ అభిమానులకు చేదు వార్త
ముంబై ఇండియన్స్ అభిమానులకు చేదు వార్త. ఆ జట్టు స్టార్ బ్యాటర్ మరోసారి జట్టుకు దూరమయ్యాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో ఇవాళ (ఏప్రిల్ 29) జరుగుతున్న కీలక పోరులో కూడా రోహిత్ ఆడటం లేదు. హ్యామ్స్ట్రింగ్ గాయం కారణంగా అతడు వరుసగా నాలుగో మ్యాచ్కు దూరమయ్యాడు.టాస్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా రోహిత్ గాయంపై కీలక అప్డేట్ ఇచ్చాడు. "రోహిత్ ఇంకా పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేదు. అతడు తిరిగి రావడానికి ఇంకొన్ని మ్యాచ్లు పట్టొచ్చు" అని స్పష్టం చేశాడు. దీంతో ముంబై అభిమానులు అతని రీ-ఎంట్రీ కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.రోహిత్ గైర్హాజరీ ముంబైకి భారీ ఎదురుదెబ్బగా పరిగణించబడుతుంది. అతని అనుభవం, ఆరంభ ఓవర్లలో దూకుడు జట్టుకు ఎంతో అవసరం. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో ఓపెనర్లుగా ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్ బరిలోకి దిగారు. ఈ మ్యాచ్లో ముంబై టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.ఆరంభ ఓవర్లలో ముంబై ఓపెనర్లు చెలరేగిపోతున్నారు. జాక్స్, రికెల్టన్ పోటీపడి బౌండరీలు, సిక్సర్లు బాదుతున్నారు. 6 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 78-0గా ఉంది. జాక్స్ 38, రికెల్టన్ 37 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఇప్పటివరకు బౌలింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఎసాన్ మలింగ ఒక్కడే జాక్స్-రికెల్టన్ జోడీ ధాటి నుంచి తప్పించుకున్నాడు. కమిన్స్, హింగే, హర్ష్ దూబే, సాకిబ్ హుసేన్ను వీరి జోడీ చెడుగుడు ఆడుకుంది.ఈ మ్యాచ్లో ముంబై రెండు మార్పులతో బరిలోకి దిగింది. డికాక్ స్థానంలో రికెల్టన్, సాంట్నర్ స్థానంలో రాబిన్ మింజ్ బరిలోకి దిగారు. ఎస్ఆర్హెచ్ విషయానికొస్తే.. ఈ జట్టు ఓ మార్పు చేసింది. శివాంగ్ కుమార్ స్థానంలో హర్ష్ దూబే తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లు..సన్రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(w), నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(సి), హర్ష్ దూబే, సకీబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే, ఎషాన్ మలింగముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), విల్ జాక్స్, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, AM గజన్ఫర్, అశ్వనీ కుమార్ -
రోహిత్ ఆడడంపై ముంబై క్లారిటీ!
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో ఆ జట్టు ఆడిన చివరి మూడు మ్యాచ్లకు డగౌట్కే పరిమితమయ్యాడు. అయితే ముంబై ఇండియన్స్ ఇవాళ ఎస్ఆర్హెచ్తో తలపడనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్లోనైనా రోహిత్ బరిలోకి దిగుతాడా లేడా అన్నది అనుమానమే. తాజాగా ఈ విషయమై ముంబై ఇండియన్స్ స్పష్టత ఇచ్చింది. కండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని ముంబై యాజమాన్యం పేర్కొంది. అయితే ఎస్ఆ ర్హెచ్తో మ్యాచ్కు ముందు రోహిత్ శర్మ నెట్స్లో ప్రాక్టీస్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్కు రోహిత్ కచ్చితంగా అందుబాటులో ఉంటాడని ముంబై అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ముంబై యాజమాన్యం మాత్రం రోహిత్ విషయంలో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదనిపిస్తోంది. రోహిత్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆడించాలని భావిస్తోంది. ఈరోజు ఉదయం వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ సెషన్కు హాజరైన రోహిత్ శర్మ బ్యాటింగ్ జోలికి పోలేదు. వార్మప్, రన్నింగ్ అనంతరం కాసేపు ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ సపోర్ట్ స్టాఫ్తో కాసేపు ముచ్చటించి మైదానం వీడాడు. ఏప్రిల్ 12న ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్ సమయంలో రోహిత్కు తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఫిజియో మైదానంలోనే హిట్మ్యాన్కు ట్రీట్మెంట్ చేసినప్పటికీ నొప్పి తగ్గలేదు. దీంతో మరుసటి ఓవర్లోనే రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన రోహిత్ మరోసారి బ్యాటింగ్కు రాలేదు. ఆ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ భారీ తేడాతో ఓటమి చవిచూసింది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఏడు మ్యాచ్లాడి కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించి పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఎస్ఆర్హెచ్ మాత్రం మధ్యలో పరాజయాలు చవిచూసినా వరుసగా నాలుగు విజయాలు సాధించి జోరు కనబరుస్తోంది. 8 మ్యాచ్ల్లో 5 విజయాలు, ఒక ఓటమితో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.చదవండి: సోదరి ఓటమి.. జడేజా ఇంట మరోసారి విభేదాలు! -
జోస్ బట్లర్పై మండిపడుతున్న రోహిత్ శర్మ అభిమానులు
ఇంగ్లండ్ స్టార్ వికెట్కీపర్ బ్యాటర్, గుజరాత్ టైటాన్స్ కీలక ప్లేయర్ జోస్ బట్లర్ తన ఆల్టైమ్ ఐపీఎల్ డ్రీమ్ ఎలెవన్ను ప్రకటించి అభిమానుల్లో చర్చకు తెరలేపాడు. బట్లర్ టీమిండియా విధ్వంసకర ఆటగాడు, ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మకు ఈ జట్టులో చోటు కల్పించకపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.బట్లర్ రోహిత్ను విస్మరించడాన్ని హిట్మ్యాన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రోహిత్పై శీతకన్ను ప్రదర్శించి, అతని సమవుజ్జీ అయిన విరాట్ కోహ్లిని జట్టులోకి తీసుకోవడాన్ని తప్పుబడుతున్నారు. బట్లర్ ఈ జట్టుకు కెప్టెన్గా టీమిండియా దిగ్గజం ఎంఎస్ ధోనిని ఎంపిక చేశాడు.ఈ జట్టులో బట్లర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లకు పెద్దపీట వేశాడు. ఓపెనర్లుగా విరాట్ కోహ్లి, క్రిస్ గేల్లను ఎంపిక చేసి.. మూడో స్థానంలో 'మిస్టర్ ఐపీఎల్'గా పేరొందిన సురేశ్ రైనాకు చోటిచ్చాడు. నాలుగో స్థానంలో ఏబీ డివిలియర్స్ను ఎంపిక చేశాడు.మిడిలార్డర్లో వెస్టిండీస్ దిగ్గజాలు కీరన్ పోలార్డ్, ఆండ్రీ రసెల్\కు స్థానం కల్పించి.. వికెట్ కీపర్గా ఎంఎస్ ధోనిని ఎంచుకున్నాడు.ఆల్రౌండర్లుగా రషీద్ ఖాన్, సునీల్ నరైన్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలను లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రాకు అప్పగించాడు. ఈ జట్టులో బట్లర్ తన పేరును కూడా చేర్చకోకపోవడం కొసమెరుపు.మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ స్టువర్ట్ బ్రాడ్తో నిర్వహించిన 'For The Love Of Cricket' పోడ్కాస్ట్లో బట్లర్ తన ఆల్టైమ్ ఐపీఎల్ జట్టును వెల్లడించాడు.బట్లర్ ఎంపిక చేసిన ఆల్టైమ్ ఐపీఎల్ జట్టు:విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, సురేష్ రైనా, ఏబీ డివిలియర్స్, కీరన్ పోలార్డ్, ఆండ్రే రస్సెల్, ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), రషీద్ ఖాన్, సునీల్ నరైన్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా. -
‘అందుకే రోహిత్ను పక్కన పెట్టాల్సి వచ్చింది’
టీమిండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ. టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిళ్లను అతడి సారథ్యంలోనే భారత్ గెలుచుకుంది. దిగ్గజ కెప్టెన్గా ఎదిగిన రోహిత్కు.. కెరీర్ ఆరంభంలో ఒకానొకనాడు జట్టులో చోటే కరువైంది.ముఖ్యంగా 2011 వన్డే వరల్డ్కప్ సమయంలో సెలక్టర్లు రోహిత్ శర్మను పక్కనపెట్టారు. ఈ విషయం గురించి టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాడు రోహిత్ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలు వెల్లడిస్తూ.. అతడిని క్షమాపణలు కోరాడు. బాధపడుతూనే ఉన్నాను‘‘ప్రతి ఇంటర్వ్యూలో తాను 2011 వరల్డ్కప్ ఆడటం మిస్సయ్యానని రోహిత్ చెబుతూ ఉన్నాడు. నిజంగా అతడి విషయంలో ఆరోజు జరిగిన దానిపట్ల నేటికీ నేను బాధపడుతూనే ఉన్నాను. గతేడాది అతడిని కలిసి.. ‘సారీ బాస్.. ఆనాడు మేము ఉద్దేశపూర్వకంగా ఏదీ చేయలేదు’ అని చెప్పాను.అప్పుడు మేము ఆల్రౌండ్ ప్రతిభ గల వాళ్లకే పెద్దపీట వేయాలని భావించాము. 1983 మాదిరే ఈ టోర్నీలో ఆడించాలనే ఆలోచనతో ఉన్నాము. మేము ఊహించినట్లుగానే ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ నిలిచాడు.అందుకే రోహిత్ను పక్కనపె ట్టాల్సి వచ్చిందికొన్ని మ్యాచ్లలో హాఫ్ ఆల్రౌండర్లు కూడా రాణించారు. సెహ్వాగ్, సచిన్, సురేశ్ రైనా కూడా కొన్ని ఓవర్లు బౌలింగ్ చేశారు. యూసఫ్ పఠాన్ సైతం హాఫ్ ఆల్రౌండరే. ఈ హాఫ్ ఆల్రౌండర్ కాన్సెప్టులో పడి రోహిత్ శర్మను పక్కనపెట్టాల్సి వచ్చింది.పాపం అతడికి జట్టులో చోటు దక్కలేదు. నిజానికి 2011 వరల్డ్కప్ టోర్నీలో ఆడేందుకు అతడు అర్హుడే. కానీ జట్టు ప్రయోజనాల దృష్ట్యా అతడిని ఎంపిక చేయలేకపోయాము’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు. కాగా 2011లో ధోని సారథ్యంలో టీమిండియా టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే.చదవండి: బంధం తెంచుకున్న కోహ్లి!.. రెస్టారెంట్ మూసివేత -
నాకు ఫీల్డింగ్ పెట్టడం రాదు అంతా రోహితే చూసుకునేవాడు..
-
ముంబై పతనం: రోహిత్ నుంచి బుమ్రా వరకు.పాండ్య బలుపే కారణమా..?
-
హార్దిక్ ఇక చాలు..! కెప్టెన్సీ అతడికి అప్పగించేయ్
-
దిగ్గజాలు విరాట్, రోహిత్ను అధిగమించిన మంధాన
భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన టీ20 క్రికెట్లో చారిత్రాత్మక ఘనత సాధించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 13 పరుగులు చేసి ఆమె.. భారత తరఫున (పురుషులు, మహిళలు) టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా రికార్డుల్లోకెక్కింది. ఈ క్రమంలో పురుషుల విభాగంలో దిగ్గజాలైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మను అధిగమించింది. విరాట్ 125 మ్యాచ్ల టీ20 కెరీర్లో 4188 పరుగులు.. రోహిత్ తన 159 మ్యాచ్ల టీ20 కెరీర్లో 4231 పరుగులు చేయగా.. మంధాన 161 మ్యాచ్ల టీ20 కెరీర్లో 4244 పరుగులు చేసింది.భారత మహిళల విభాగం ఒక్కటే తీసుకుంటే.. మంధన తర్వాతి స్థానాల్లో హర్మన్ప్రీత్ కౌర్ (191 మ్యాచ్ల్లో 3854 పరుగులు), జెమీమా రోడ్రిగ్స్ (119 మ్యాచ్ల్లో 2587 పరుగులు), షఫాలీ వర్మ (99 మ్యాచ్ల్లో 2553 పరుగులు) ఉన్నారు.ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. మహిళల విభాగంలో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ సూజీ బేట్స్ (181 మ్యాచ్ల్లో 4717 పరుగులు) టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా కొనసాగుతుండగా.. మంధాన రెండో స్థానంలో ఉంది. పురుషుల విషయానికొస్తే.. పాక్ బ్యాటర్ బాబర్ ఆజమ్ (145 మ్యాచ్ల్లో 4596 పరుగులు) టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.కాగా, ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో నిన్న జరిగిన తొలి టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన టీమిండియా... నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (33 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... జెమీమా రోడ్రిగ్స్ (29 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్), షఫాలీ వర్మ (20 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (13), రిచా ఘోష్ (5), కాశ్వి గౌతమ్ (10) విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఖాకా 3 వికెట్లు పడగొట్టగా... టుమీ రెండు వికెట్లు తీసింది.అనంతరం బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ లారా వోల్వార్ట్డ్ (51), అన్నెరీ డెర్క్సన్ (44 నాటౌట్) సౌతాఫ్రికాను గెలిపించారు. సూన్ లస్ 13, తజ్మిన్ బ్రిట్స్ 10, అన్నెకే బాష్ 8, క్లో ట్రయాన్ 18 (నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 2, అరుంధతి రెడ్డి, శ్రీచరణి తలో వికెట్ తీశారు. రెండో టీ20 ఏప్రిల్ 19న ఇదే డర్బన్ వేదికగా జరుగనుంది. -
శ్రేయస్ స్టన్నింగ్ క్యాచ్.. షాకైన రోహిత్, సూర్య!
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్తో మెరిశాడు. గురువారం ముంబై ఇండియన్స్తో మ్యాచ్ సందర్భంగా బౌండరీ లైన్ వద్ద అయ్యర్ అదిరిపోయే క్యాచ్ అందుకున్నాడు. అతని స్టన్నింగ్ క్యాచ్ను కళ్లారా చూసిన ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఆశ్చర్యపోయారు. మార్కో యాన్సెన్ వేసిన 18వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని భారీ సిక్సర్ బాదిన హార్దిక్ రెండో బంతిని డాట్ చేశాడు. మూడో బంతిని లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడగా.. సిక్సర్గా దూసుకొచ్చిన బంతిని బౌండరీ లైన్పై అయ్యర్ అద్భుతంగా అందుకొని చాకచక్యంగా లోపలికి విసిరేసాడు. అక్కడే ఉన్న బార్ట్లెట్ ఏ తప్పిదం చేయకుండా అందుకున్నాడు. ఎడమవైపు గాల్లోకి ఎగురుతూ బంతిని అందుకోవడంతో పాటు అంతే సమర్థవంతంగా అయ్యర్ లోపలికి విసిరేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. క్యాచ్ పూర్తయిన వెంటనే శ్రేయస్ అయ్యర్.. ఇప్పుడు అరవండంటూ ప్రేక్షకులను ఉద్దేశించి సైగలు చేశాడు. అప్పటి వరకు అరిచిన ముంబై ఫ్యాన్స్.. ఈ క్యాచ్తో మౌనం వహించారు. దాంతో వారిని ఇంకా గట్టిగా అరవాలంటూ అయ్యర్ కోరాడు. అయితే అయ్యర్ పట్టిన క్యాచ్కు డగౌట్లో ఉన్న రోహిత్, సూర్యకుమార్లు ఫిదా అయ్యారు. వాట్ ఏ క్యాచ్ అని రోహిత్ సూర్యతో చెబుతున్నట్లు కెమెరాల్లో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.SHREYAS IYER, WHAT HAVE YOU DONE!! 🤯🎥 One of the best catches you would see in the #TATAIPL history 🔥🔥Updates ▶️ https://t.co/Fn2dxJ4zYR#KhelBindaas | #MIvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/6EKgHR82cL— IndianPremierLeague (@IPL) April 16, 2026SKY & ROHIT COULDN'T BELIEVE IT - SHREYAS IYER YOU BEAUTY 😍 pic.twitter.com/lo0McmMaJh— Johns. (@CricCrazyJohns) April 16, 2026 -
ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 16) పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య బిగ్ ఫైట్ జరుగనుంది. వాంఖడే వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్కు ముందు ముంబై ఇండియన్స్కు భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్కు దూరం కానున్నాడని తెలుస్తుంది.రోహిత్ ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా గాయపడిన (Hamstring Injury) విషయం తెలిసిందే. స్కాన్లలో గాయం ఉందా లేదా అన్న విషయం స్పష్టంగా తెలియడం లేదు. దీంతో ఎంఐ మేనేజ్మెంట్ ముందు జాగ్రత్త చర్యగా హిట్మ్యాన్కు కొద్ది రోజుల పాటు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. గుజరాత్తో మ్యాచ్ (ఏప్రిల్ 20) సమయానికి రోహిత్ పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. కాగా, ఆర్సీబీ మ్యాచ్లో రోహిత్ బ్యాటింగ్ చేస్తూ మధ్యలోనే వైదొలిగిన విషయం తెలిసిందే.పంజాబ్తో మ్యాచ్కు రోహిత్ దూరమైతే, ఇప్పటికే కష్టాల్లో ఉన్న ముంబై ఇండియన్స్ మరింత ఇబ్బంది పడనుంది. ఈ సీజన్లో ముంబై తొలి మ్యాచ్ విజయం తర్వాత హ్యాట్రిక్ పరాజయాలు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. రోహిత్ విషయానికొస్తే.. ఈ సీజన్లో అతను ఓ మోస్తరు ఫామ్లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 137 పరుగులు చేశాడు. పంజాబ్ మ్యాచ్కు రోహిత్ మిస్ అయితే అతని స్థానంలో నమన్ ధీర్కు ఓపెనర్గా అవకాశం దక్కవచ్చు.మరోపక్క నేటి పంజాబ్ మ్యాచ్కు స్టార్ ఆల్రౌండర్ విల్ జాక్స్ అందుబాటులో ఉంటాడు. జాక్స్ బుధవారమే జట్టుతో చేరాడు. అతను తుది జట్టులో ఉంటాడా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు.పంజాబ్ విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుత సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఓటమి ఎరుగని జట్టు ఏదైనా ఉందా అంటే అది పంజాబే. ఈ సీజన్లో పంజాబ్ 4 మ్యాచ్ల్లో 3 విజయాలు సొంతం చేసుకొని పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. కేకేఆర్తో జరగాల్సిన ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.పంజాబ్తో మ్యాచ్కు ముంబై ఇండియన్స్ తుది జట్టు (అంచనా)..ర్యాన్ రికెల్టన్, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, ట్రెంట్ బౌల్ట్, మయాంక్ మార్కండే, జస్ప్రీత్ బుమ్రా -
బాంబు పేల్చిన టీమిండియా మాజీ క్రికెటర్!
టీమిండియా మాజీ ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ విషయంలో పెద్ద బాంబు పేల్చాడు. కోచ్గా గంభీర్ను తొలగిస్తే టీమిండియాలో విపత్తు తప్పదంటూ బీసీసీఐని హెచ్చరించాడు. 2024 టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్కు టీమిండియా హెడ్కోచ్గా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే గంభీర్ సారథ్యంలో భారత జట్టు మిశ్రమ ఫలితాలను అందుకుంది. చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, టీ20 ప్రపంచకప్లు భారత్ గంభీర్ కోచ్గా ఉన్న సమయంలోనే వచ్చాయి. అయితే ఇదే సమయంలో జట్టులో సీనియర్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవడం వెనుక గంభీర్ పాత్ర ఉందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. వన్డే, టీ20 ఫార్మాట్లో గంభీర్ కోచ్గా పర్వాలేదనిపించినప్పటికీ టెస్టు ఫార్మాట్లో దారుణంగా విఫలమవ్వడంతో అతన్ని కోచ్గా తప్పించాలనే డిమాండ్లు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే మునాఫ్ పటేల్ గంభీర్కు అండగా నిలిచాడు. మునాఫ్ పటేల్ మాట్లాడుతూ.. ‘గంభీర్ వంటి నిఖార్సైన వ్యక్తిని కోచ్ పదవి నుంచి తొలగిస్తే, భారత జట్టులోని స్టార్ ఆటగాళ్లను మేనేజ్ చేయడం ఎవరికైనా చాలా కష్టమవుతుంది. గంభీర్ అత్యంత నిజాయితీ గల వ్యక్తి. ముక్కుసూటిగా మాట్లాడే అతని తత్వాన్ని అందరూ ఇష్టపడరు. కానీ జట్టు ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలనైనా తీసుకోవడానికి వెనుకాడరు. ముఖ్యంగా జట్టులో క్రమశిక్షణ తప్పినా లేదా ఆటగాళ్లు సరిగ్గా రాణించకపోయినా, వారిని జట్టు నుంచి తప్పించే ధైర్యం గంభీరకు ఉంది. విరాట్ కోహ్లి లేదా రోహిత్ శర్మ వంటి దిగ్గజ ఆటగాళ్లకు 'నో' చెప్పడం అంత తేలికైన విషయం కాదు. తన కఠిన నిర్ణయాలతో శత్రువులను కూడా పెంచుకున్నాడు. అయితే కోచ్గా తన పనిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడని మాత్రం బలంగా చెప్పగలను.’ అని మునాఫ్ వెల్లడించాడు. ఎన్సీఏ క్రికెట్ అకాడమీలో సౌకర్యాల్లో కొరత స్పష్టంగా కనిపిస్తోందని మునాఫ్ పేర్కొన్నాడు. ఆటగాళ్ల ఫిట్నెస్, ప్రాక్టీస్, రీహాబిలిటేషన్ సెంటర్ సహా ఇతర కార్యక్రమాలకు వినియోగించే ఎన్సీఏ అకాడమీలో ప్రస్తుతం బలమైన వ్యవస్థ కనిపించడం లేదని తెలిపాడు. వెంటనే ఎన్సీఏ అకాడమీని పటిష్టపరిచేందుకు బీసీసీఐ చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ఫిజియోథెరపిస్టులు, కోచ్లు, సరైన శిక్షణ వంటి ప్రాథమిక సౌకర్యాలను మరింత మెరుగుపరచాలని మునాఫ్ వెల్లడించాడు. కాగా దేశ వ్యాప్తంగా క్రికెట్ ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో బీసీసీఐ 2000 సంవత్సరంలో బెంగళూరు కేంద్రంగా ఎన్సీఏ అకాడమీని స్థాపించింది. ప్రస్తుతం మునాఫ్ పటేల్ ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బౌలింగ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో రెండు విజయాలు సాధించి, నాలుగు పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: సంచలన నిర్ణయం.. 32 ఏళ్లకే రిటైర్మెంట్! -
ఐపీఎల్ నుంచి రోహిత్ శర్మ అవుట్?
ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ వరుసగా హ్యాట్రిక్ ఓటములను చవిచూసింది. ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 18 పరుగుల తేడాతో ముంబై ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్లో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గాయపడడం ముంబై ఇండియన్స్ మేనెజ్మెంట్ను కలవరపెడుతోంది.241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి రోహిత్ శర్మ మంచి ఆరంభాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ ముంబై ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో రోహిత్ శర్మ తొడ కండరాలు పట్టేశాయి. వికెట్ల మధ్య పరిగెత్తేందుకు రోహిత్ ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి రోహిత్ కుడి హ్యామ్స్ట్రింగ్కు బ్యాండేజ్ వేశాడు. కానీ ఏ మాత్రం రోహిత్ నొప్పి లేదు. దీంతో అదే ఓవర్లో రోహిత్ రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. రిహిత్ ఇలా మధ్యలోనే వెళ్లిపోవడంతో వాంఖడే స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. తర్వాత మరి అతడు బ్యాటింగ్కు రాలేదు. రోహిత్ స్కాన్ రిపోర్ట్లు కోసం ముంబై మేనెజ్మెంట్ ఎదురుచూస్తోంది. అతడి గాయంపై మ్యాచ్ అనంతరం ముంబై స్టార్ షేర్ఫేన్ రూథర్ఫర్డ్ అప్డేట్ ఇచ్చాడు."రోహిత్ తొడ కండరాలు పట్టేసినట్లు అన్పిస్తోంది. కానీ అధికారికంగా ఏమీ ఖరారు కాలేదు. ప్రస్తుతం అతడు మా వైద్యబృందం పర్యవేక్షణలో ఉన్నాడు. స్కాన్ రిపోర్ట్ల కోసం వేచి చూస్తున్నాం. రోహిత్ ఫిట్నెస్ గురించి త్వరలోనే పూర్తి సమాచారం తెలుస్తుంది" రూథర్ఫర్డ్ పేర్కొన్నాడు.ఒకవేళ రోహిత్ గాయం గ్రేడ్-1లో ఉన్నట్లయితే పూర్తిగా కోలుకోవడానికి సుమారు నాలుగు వారాల సమయం పట్టనుంది. అదే జరిగితే రోహిత్ ఐపీఎల్-2026 సీజన్ మధ్యలోనే వైదొలిగే అవకాశముంది. ఏదేమైనప్పటికి రోహిత్ త్వరగా కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.చదవండి: BCCI: ఫోన్ చూసిన రోమీ, వైభవ్ సూర్యవంశీ.. బీసీసీఐ కఠిన చర్యలు! -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ లెజెండ్ రోహిత్ శర్మ మరో చారిత్రాత్మక మైలురాయిని తాకాడు. క్యాష్ రిచ్ లీగ్లో ముంబై ఇండియన్స్ తరఫున 6000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. నిన్న (ఏప్రిల్ 12) వాంఖడే స్టేడియంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు.ఈ మ్యాచ్కు ముందు రోహిత్కు ఈ మైలురాయిని చేరుకునేందుకు 6 పరుగులు కావాల్సి ఉన్నాయి. జేకబ్ డఫీ వేసిన మూడో ఓవర్లోపుల్ షాట్తో సిక్సర్ కొట్టి ఈ ఘనత (231వ మ్యాచ్) సాధించాడు. ఈ మ్యాచ్లో 13 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 19 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు.ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..రోహిత్ శర్మ- 6002 (2 సెంచరీలు/40 అర్ద సెంచరీలు) సూర్యకుమార్ యాదవ్- 3776 (2/29)కీరన్ పొలార్డ్- 3412 (0/16)అంబటి రాయుడు- 2416 (0/14) సచిన్ టెండూల్కర్- 2334 (1/13) ఐపీఎల్, ఛాంపియన్స్ లీగ్తో కలిపి ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ చేసిన పరుగులు..- 240 మ్యాచ్ల్లో 6275 పరుగులు. - రోహిత్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ (3915), పొలార్డ్ (3823) ఉన్నారు. విరాట్ కోహ్లీతో పోలిక - ఐపీఎల్లో ఒకే జట్టుకు అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. - విరాట్ ఆర్సీబీ తరఫున 271 మ్యాచ్ల్లో 8840 పరుగులు చేశారు. - IPL + CLT20 కలిపి 9264 పరుగులు చేశారు. ఇదిలా ఉంటే, నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ చారిత్రక మైలురాయిని తాకినా, ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో తడబడిన ముంబై ఇండియన్స్ 5 వికెట్లు కోల్పోయి 222 పరుగుల వద్ద ఆగిపోయింది. ఫలితంగా ఆర్సీబీ 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఆర్సీబీ తరఫున ఫిల్ సాల్ట్ (78), విరాట్ కోహ్లి (50), రజత్ పాటిదార్ (53), టిమ్ డేవిడ్ (34 నాటౌట్), కృనాల్ పాండ్యా (4-0-26-1) అద్భుత ప్రదర్శనలు చేయగా.. ముంబై ఇండియన్స్ తరఫున హార్దిక్ పాండ్యా (4-0-39-1), రూథర్ఫోర్డ్ (71 నాటౌట్) చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేశారు. -
రోహిత్ శర్మకు సంబంధించి బిగ్ న్యూస్
దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మకు సంబంధించి ఓ బిగ్ న్యూస్ అందుతుంది. హిట్మ్యాన్పై బయోపిక్ రాబోతుందని సోషల్మీడియా కోడై కూస్తోంది. ఇవాళ (ఏప్రిల్ 9) రోహిత్ ఇన్స్టాలో షేర్ చేరిన స్టోరీ ఈ పుకార్లకు తావిచ్చింది.రోహిత్ షేర్ చేసిన క్రిప్టిక్ పోస్ట్లో నెట్ఫిక్స్ లోగో కలిగిన డ్రాఫ్ట్ #45 అనే స్క్రిప్ట్ డాక్యుమెంట్ కనిపిస్తుంది. దీనిపై Champion అని రాసి ఉంది. Rohit Sharma’s copy అనే వాటర్మార్క్ ఉండటంతో, హిట్మ్యాన్ ఈ ప్రాజెక్ట్లో భాగస్వామ్యం అయ్యాడని అభిమానులు భావిస్తున్నారు. #collab అనే క్యాప్షన్ Netflixతో అధికారిక ఒప్పందం ఉందని సూచిస్తోంది. Rohit bhai ab Netflix Netflix pe bhi pull karenge ❤️ pic.twitter.com/mOdNjOIr09— Johns. (@CricCrazyJohns) April 9, 2026వీటన్నిటినీ బట్టి హిట్మ్యాన్పై డాక్యుమెంటరీ లేదా బయోపిక్ రాబోతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్-రోహిత్ బ్యాక్డ్రాప్లో డాక్యూ–సిరీస్ ఉంటుందని కొందరనుకుంటున్నారు. మరికొందరేమో, రోహిత్ స్పోర్ట్స్–థీమ్ షోలో పాల్గొనబోతున్నాడని చర్చించుకుంటున్నారు.ఇదిలా ఉంటే, అంతర్జాతీయ స్థాయిలో టెస్ట్, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. మరోవైపు ఫ్రాంచైజీ క్రికెట్లో ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026లో హిట్మ్యాన్ ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపిస్తున్నాడు. తొలి మ్యాచ్లో 78 (38) పరుగులు, ఆతర్వాతి మ్యాచ్లో 35 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మూడో మ్యాచ్లో 5 పరుగులు సహా.. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో 118 పరుగులు చేశాడు. హిట్మ్యాన్ తన తదుపరి మ్యాచ్ను ఏప్రిల్ 12న ఆడనున్నాడు. వాంఖడే జరిగే ఆ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆర్సీబీతో తలపడుతుంది. -
BCCI: అది సరికాదు.. యువీకే తప్పలేదంటే...
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్లలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు యువరాజ్ సింగ్. భారత జట్టు 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్కప్ గెలవడంతో ఈ మాజీ ఆల్రౌండర్ది కీలక పాత్ర. ఈ మెగా టోర్నీ తర్వాత క్యాన్సర్ఉందని తేలగా.. మొక్కవోని విశ్వాసంతో మహమ్మారి జయించి తిరిగి మైదానంలో అడుగుపెట్టిన ఘనుడు యువీ.అయితే, కెరీర్ చరమాంకంలో యువీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. జట్టులో చోటు ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో 2019 వన్డే వరల్డ్కప్లో ఆడాలన్న కోరిక తీరకుండానే యువీ రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది.కనీస సమాచారం కూడా ఇవ్వకుండా..ఈ విషయం గురించి యువరాజ్ సింగ్ తాజాగా స్పోర్ట్స్ తక్ ఇంటర్వ్యూలో స్పందించాడు. నాటి కెప్టెన్ విరాట్ కోహ్లి, హెడ్కోచ్ రవిశాస్త్రి తన పేరును పరిగణనలోకి తీసుకోలేదని.. అందుకు సంబంధించి కనీస సమాచారం కూడా ఇవ్వలేదని వాపోయాడు. ఫిట్నెస్ పరీక్ష పాసైనా ఎదురుచూపులు తప్పలేదని.. అందుకే రిటైర్మెంట్ ఇచ్చానని తెలిపాడు.అంతటి యువీకే తప్పలేదంటేఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ యువీ వ్యాఖ్యలపై స్పందించాడు. యువరాజ్ పట్ల యాజమాన్యం వైఖరి తనను నిరాశపరిచిందని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘మొదట్లో వార్తా పత్రికల్లో చూసి ఆటగాళ్లు తమ కెరీర్ కొనసాగుతుందా? ముగిసిపోయిందా? అని తెలుసుకునేవాళ్లు.అయితే, యాజమాన్యం మరీ ఇంత ఘోరంగా ఉండాల్సింది కాదు. టీమిండియాకు రెండు వరల్డ్కప్లు అందించిన యువరాజ్ సింగ్ వంటి దిగ్గజాల విషయంలోనైనా కాస్త మెరుగ్గా ప్రవర్తించాల్సింది. తనను ఎవరూ సంప్రదించకుండానే రిటైర్మెంట్ తీసుకునేలా చేశారని యువీ అన్నాడు. ఇలా చేయడం సరికాదు. కచ్చితంగా ఆటగాళ్లతో చర్చించి వారికి మేనేజ్మెంట్ స్పష్టతనివ్వాలి’’ అని వసీం జాఫర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు. రో-కోలకు చెప్పండికాగా యువీ ఇటీవల మాట్లాడుతూ.. మేనేజ్మెంట్ తన విషయంలో వ్యవహరించినట్లు మరెవరి విషయంలో వ్యవహరించకూడదని అన్నాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతూ.. వరల్డ్కప్-2026 రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు కూడా మేనేజ్మెంట్ సరైన సమాచారం ఇవ్వాలని యువీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. వాళ్లిద్దరు గొప్ప ఆటగాళ్లని.. వారిని సాదరంగా పంపితే బాగుంటుందని పేర్కొన్నాడు.చదవండి: CSKకు గుడ్న్యూస్.. విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు! -
రోహిత్ దెబ్బకు ఢిల్లీ క్యాపిటల్స్కు మైండ్ బ్లాక్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. అయితే ముంబై ఇండియన్స్ బ్యాటర్ రోహిత్ శర్మ చేసిన ఒక తుంటరి పనికి ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు కుల్దీప్ యాదవ్, కేఎల్ రాహుల్ మైండ్ బ్లాక్ అయింది. విషయంలోకి వెళితే.. ముంబై ఇన్నింగ్స్ 9వ ఓవర్ కుల్దీప్ యాదవ్ వేశాడు. కాగా కుల్దీప్ వేసిన బంతిని రోహిత్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి మిస్సయ్యి రోహిత్ పక్కనుంచి వెళ్లి కీపర్ కేఎల్ రాహుల్ చేతుల్లో పడింది. అయితే కుల్దీప్ రోహిత్ చేతిని తాకి కీపర్ చేతుల్లోకి పడిందన్న అనుమానం కలిగి అంపైర్కు అప్పీల్ చేశాడు. ఇక్కడే రోహిత్ తనలోని తుంటరి చేష్టలను బయటకు తీశాడు. తాను ఔటయ్యానంటూ రోహిత్ డగౌట్ వెళుతున్నట్లు అంపైర్కు సైగలు చేశాడు. కానీ అంపైర్ మాత్రం రోహిత్ ఔట్ అంటూ వేలు పైకి ఎత్తలేదు. అయితే రోహిత్ తాను ఔట్ అంటూ పెవిలియన్ వైపు నడవడం చూసి కుల్దీప్, రాహుల్ డీఆర్ ఎస్ రివ్యూ కోరారు. దీంతో థర్డ్ అంపైర్ రివ్యూను పరిశీలిస్తున్న సమయంలోనే రోహిత్ పగలబడి నవ్వాడు. ఎందుకంటే బంతి తనకు చాలా దూరంగా వెళ్లిందన్న విషయం రోహిత్కు తెలుసు. రిప్లేలో కూడా అదే కనిపించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ తన రివ్యూను వృథా చేసుకున్నట్లయింది. ఆ తర్వాత రోహిత్ కుల్దీప్, రాహుల్ వైపు చూడగా వారు చిరునవ్వుతో కనిపించారు. ముంబై ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం రోహిత్ మట్లాడుతూ.. ‘కుల్దీప్ రివ్యూకు వెళతాడని ముందే ఊహించాను. బంతి నాకు తగల్లేదని నేను క్లియర్గా ఉన్నప్పటికీ.. కుల్దీప్ 50-50 చాన్స్తో రివ్యూకు వెళ్లొచ్చని ఊహించాను. నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అలా చేశాను. అందుకే పెవిలియన్కు వెనుదిరుగుతున్నట్లు నటించాను. నాకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాను. మరుసటి ఓవర్లోనే నా ఇన్నింగ్స్కు తెరపడింది. కానీ కుల్దీప్, రాహుల్తో జరిగిన ఫన్నీ మూమెంట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.’ అని చెప్పుకొచ్చాడు. కాగా మ్యాచ్లో రోహిత్ శర్మ ఇన్నింగ్స్ను మంచి ఈజ్తోనే ప్రారంభించాడు. 26 బంతుల్లో 35 పరుగులు చేసిన హిట్మ్యాన్ అక్షర్ పటేల్ బౌలింగ్లో వెనుదిరిగాడు. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ (51) అర్థసెంచరీ సాధించాడు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకుంది. సమీర్ రిజ్వీ (90) సంచలన ఇన్నింగ్స్తో ఢిల్లీకి విజయాన్ని అందించాడు.Mind games, ft. Rohit Sharma and Kuldeep Yadav 😉🎥 Hear Rohit's take on the eventful DRS call involving the duo 😄#TATAIPL | #KhelBindaas | #DCvMI | @ImRo45 | @imkuldeep18 | @DelhiCapitals | @mipaltan pic.twitter.com/vUw7eAZhwX— IndianPremierLeague (@IPL) April 4, 2026చదవండి: మొదట్లో చితక్కొట్టినా చివర్లో వణికించాడు! -
IPL 2026: ధోనిని అధిగమించిన రోహిత్
ముంబై ఇండియన్స్ విధ్వంసకర బ్యాటర్ రోహిత్ శర్మ మరో రికార్డును తన ఖాతాలోకి వేసుకున్నాడు. ఐపీఎల్లో ఓ ప్రత్యర్దిపై అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 2026 ఎడిషన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో ఇవాళ (ఏప్రిల్ 4) జరుగుతున్న మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో ఓ సిక్సర్ బాదిన రోహిత్.. ఢిల్లీ క్యాపిటల్స్పై తన సిక్సర్ల సంఖ్యను 51కి పెంచుకున్నాడు. తద్వారా ఐపీఎల్లో ఓ ప్రత్యర్దిపై అత్యధిక సిక్సర్లు బాదిన విభాగంలో ఎంఎస్ ధోనిని అధిగమించాడు. ధోని ఆర్సీబీపై 50 సిక్సర్లు బాదాడు. ఈ విభాగంలో రోహిత్, ధోని తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లి ఉన్నాడు. విరాట్ సీఎస్కేపై 48 సిక్సర్లు కొట్టాడు. ఓవరాల్గా ఐపీఎల్లో ఓ ప్రత్యర్దిపై అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు క్రిస్ గేల్ ఖాతాలో ఉంది. గేల్ పంజాబ్ కింగ్స్పై 61, కేకేఆర్పై 54 సిక్సర్లతో తొలి స్థానాలను ఆక్రమించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. రోహిత్ శర్మ ఈ ఐపీఎల్ సీజన్ను అద్భుతంగా ప్రారంభించాడు. తొలి మ్యాచ్లో కేకేఆర్పై మెరుపు అర్ద సెంచరీ (38 బంతుల్లో 78 పరుగులు; సిక్స్లు, 7 ఫోర్లు) చేసిన అతను.. ఇవాళ ఢిల్లీతో మ్యాచ్లో 26 బంతుల్లో 35 పరుగులు (5 ఫోర్లు, 1 సిక్స్) చేశాడు.ఢిల్లీ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ 19 ఓవర్ల తర్వాత 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబై బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ముకేశ్ కుమార్ 2, ఎంగిడి, అక్షర్ పటేల్, విప్రాజ్ నిగమ్, నటరాజన్ తలో వికెట్ తీశారు. కుల్దీప్ యాదవ్ (3-0-31-0) మినహా ఢిల్లీ బౌలర్లంతా పొదుపుగా కూడా బౌలింగ్ చేశారు. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్లో తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (51) అర్ద సెంచరీతో రాణించగా.. రోహిత్ శర్మ (35) ఓ మోస్తరు స్కోర్తో పర్వాలేదనిపించాడు. -
రోహిత్ను ఊరిస్తున్న అరుదైన రికార్డు!
ఐపీఎల్ 2026 సీజన్ శనివారం డబుల్ హెడర్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మను అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్పై రోహిత్ శర్మ ఇప్పటివరకు 37 మ్యాచ్ల్లో 1057 పరుగులు సాధించాడు. కాగా రోహిత్ కంటే ముందు కోహ్లీ ఉన్నాడు. ఈ ఆర్సీబీ స్టార్ బ్యాటర్ 30 ఇన్నింగ్స్ల్లో 1,130 పరుగులు సాధించాడు. కోహ్లీ కంటే 73 పరుగులు వెనుకబడి ఉన్న రోహిత్ ఢిల్లీతో మ్యాచ్లోనే ఆ ఫీట్ను సాధిస్తాడా లేదా అనేది చూడాలి. ఈ సీజన్ను రోహిత్ శర్మ మంచి ఈజ్తో ప్రారంభించాడు. కేకేఆర్తో జరిగిన తొలి మ్యాచ్లోనే రోహిత్ 38 బంతుల్లోనే 78 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. కేకేఆర్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇక ఇవాళ్టి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో పోలిస్తే ముంబై ఇండియన్స్ ఫేవరెట్గా కనిపిస్తోంది. ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై 21-16 విజయాలతో ఢిల్లీపై ఆధిక్యతను కలిగి ఉంది. గత ఐదు మ్యాచ్ల్లో ఢిల్లీపై ముంబై నాలుగు విజయాలు సాధించడం విశేషం.చదవండి: ‘నువ్వొక అద్భుతం.. ప్రపంచం నీ పాదాల చెంతకు’ -
BCCI: రోహిత్, కోహ్లికి ముఖం మీదే చెప్పేయండి: యువీ
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మను ఉద్దేశించి లెజెండరీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్కప్-2027లో ఆడించే విషయంలో యాజమాన్యం (బీసీసీఐ) వీరిద్దరికి ఇప్పుడే స్పష్టతనిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగాకాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత రో-కో (Rohit Sharma- Virat Kohli) అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అనూహ్య రీతిలో గతేడాది రోజుల వ్యవధిలోనే వీరిద్దరు టెస్టులకూ గుడ్బై చెప్పేశారు. ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్న రోహిత్- కోహ్లి ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.అయితే, రోహిత్ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన క్రమంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ రో-కో భవితవ్యం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరు వరల్డ్కప్ ఆడేందుకు కట్టుబడి ఉన్నారో లేదో తమకు తెలియదన్నాడు. అయితే, రో-కో మాత్రం ఇందుకు భిన్నంగా సూపర్ ఫామ్తో ముందుకు సాగుతూ తమ లక్ష్యం ఏమిటో ఆటతోనే చెప్పకనే చెబుతున్నారు.తుది నిర్ణయం సెలక్టర్లదేఈ పరిణామాల గురించి యువరాజ్ సింగ్ తాజాగా స్పందించాడు. స్పోర్ట్స్ తక్ చానెల్తో మాట్లాడుతూ.. ‘‘రోహిత్- కోహ్లి ఆలోచన ఏమిటో నాకైతే తెలియదు. అయితే, ఈ ఇద్దరూ కూడా వరల్డ్కప్ ఆడేందుకు నిబద్ధతతో పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, వారిని ఆడించాలా? లేదా? అన్న నిర్ణయం మాత్రం సెలక్టర్లదే.నిజం నిష్ఠూరంగా ఉన్నా.. వీరిద్దరి భవితవ్యాన్ని నిర్ణయించేంది సెలక్టర్లే. నా అభిప్రాయం ప్రకారం వారిద్దరు గొప్ప ఆటగాళ్లు. అయితే, వరల్డ్ ఆడించే విషయంలో మేనేజ్మెంట్ వారికి స్పష్టతనిస్తే మంచిది. ఇలాంటి విషయాల గురించి ఆటగాళ్లతో మనస్ఫూర్తిగా చర్చించాలి.ముఖ్యంగా ఇద్దరూ కెరీర్ చరమాంకంలో ఉన్నారు. కాబట్టి వారి విషయంలో నిజం నిష్ఠూరంగా ఉన్నా.. ముందుగానే ముఖం మీద చెప్పేస్తే బాగుంటుంది. కాకపోతే భారత క్రికెట్లో ఇలా జరగడం లేదు’’ అని యువీ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు.ఎక్కడి నుంచో వచ్చి ధోనీ కెప్టెన్ అయ్యాడు ఇక టీమిండియా యాజమాన్య వైఖరిని ఈ సందర్భంగా యువీ గుర్తు చేసుకున్నాడు. కెప్టెన్ ఎంపిక అంచనాలకు అందకుండా సాగుతుందని పేర్కొన్నాడు. తాను టీమిండియాకు వైస్కెప్టెన్గా వ్యవహరిస్తున్న సమయంలో జట్టులో సీనియర్ ప్లేయర్లు ఉన్నప్పటికీ... అనూహ్యంగా ధోనీని భారత జట్టు కెప్టెన్గా ఎంపిక చేసిన విషయాన్ని యువీ గుర్తు చేసుకున్నాడు.తాజాగా ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్... ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో జట్టు పగ్గాలు అభిషేక్ శర్మకు కాకుండా ఇషాన్ కిషన్కు అప్పగించిన నేపథ్యంలో యువీ మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘ఈ నిర్ణయం నన్ను నిరాశ పరిచింది. దీన్ని ఒక ఆటగాడి కోణం నుంచి చూస్తే... ఉదాహరణకు ఒక ఆటగాడు ప్రపంచకప్నకు ముందు చక్కటి ఫామ్తో తన రాష్ట్ర జట్టు తరఫున సత్తా చాటి వరల్డ్కప్నకు ఎంపికయ్యాడు.అక్కడ కూడా మెరుగైన ప్రదర్శనతో జట్టుకు వరల్డ్కప్ అందించాడు. అలాంటి ప్లేయర్ను ఫ్రాంచైజీ కెప్టెన్గా ఎంపిక చేసింది. మరోవైపు ఏడేళ్లుగా ఒక ప్లేయర్ ఆ ఫ్రాంచైజీ కోసం ప్రాణం పెట్టి అద్భుతంగా ఆడుతున్నాడు. ఇలాంటి అనుభవం నాకు కూడా జరిగిందిఅయినప్పటికీ అతడికి జట్టు కెప్టెన్ పదవి కాకుండా వైస్కెప్టెన్ పదవి దక్కింది. మైదానంలో అడుగు పెట్టినప్పుడు అతడి మానసిక స్థితి ఎలా ఉంటుంది. ఇలాంటి అనుభవం నాకు కూడా జరిగింది.నేను భారత జట్టుకు వైస్కెప్టెన్గా వ్యవహరిస్తున్న సమయంలో హర్భజన్, సెహ్వాగ్ వంటి సీనియర్లు జట్టులో ఉన్నా... ఎక్కడి నుంచో వచ్చి ధోని కెపె్టన్ అయ్యాడు. కారణాలు ఏవైనా మీరు భారత కెప్టెన్గా ఉంటారా లేదా అనేది ఫ్రాంచైజీ క్రికెట్ నిర్ణయించదు. కానీ ఆటగాడి కోణం నుంచి చూస్తే ఇది నిరాశ కలిగించే అంశం’ అని యువరాజ్ అన్నాడు. 2007లో జట్టులో సీనియర్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ధోనీకి అనూహ్యంగా జట్టు పగ్గాలు అప్పజెప్పడంపై యువీ ఈ పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. చదవండి: ఎంతపని చేశావ్ అయ్యర్.. పంజాబ్ జట్టుకు షాక్! -
నేను ముందే చెప్పాను కదా!: అంపైర్తో రోహిత్ శర్మ
టీమిండియా దిగ్గజ కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ ఐపీఎల్-2026 టోర్నీని ఘనంగా ఆరంభించాడు. కోల్కతా నైట్ రైడర్స్ (KKR)తో ఆదివారం నాటి మ్యాచ్లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ వింటేజ్ హిట్మ్యాన్ను గుర్తుచేశాడు. కేవలం 38 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 78 పరుగులు సాధించాడు.Rohit Sharma in his element 🙌🎥 Enjoy his scintillating early smacks for six 👊#MI are 64/0 after 5 overs.Updates ▶️ https://t.co/JmJcgsoHQ7#TATAIPL | #KhelBindaas | #MIvKKR | @mipaltan | @ImRo45 pic.twitter.com/ys8k0JNHlW— IndianPremierLeague (@IPL) March 29, 2026ఇక ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కోల్కతా (KKR vs MI)పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా 2012 తర్వాత తొలిసారి ఐపీఎల్లో తమ ఆరంభ మ్యాచ్లో ముంబై గెలుపు జెండా ఎగురవేసింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా అంపైర్తో రోహిత్ శర్మ (Rohit Sharma) వ్యవహరించిన తీరు వైరల్గా మారింది.గేజ్ టెస్టు నిర్వహిస్తుండగా.. కేకేఆర్ విధించిన 221 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ బ్యాటింగ్కు వస్తున్న సమయంలో.. అంపైర్ అతడి బ్యాట్ను పరీక్షించాడు. బ్యాట్ పరిమాణం సరిగ్గా ఉందా అన్న విషయాన్ని తెలుసుకునేందుకు గేజ్ టెస్టు నిర్వహిస్తుండగా.. రోహిత్ తన బ్యాట్ సరిగ్గానే ఉందంటూ రియాక్షన్ ఇచ్చాడు.నేను ముందే చెప్పాను కదా!అయితే, నిబంధన ప్రకారం బ్యాట్ను టెస్టు చేసిన అంపైర్ సంతృప్తి వ్యక్తం చేయగా.. ‘నేను ముందే చెప్పాను కదా!’ అన్నట్లుగా రోహిత్ శర్మ నవ్వులు చిందిస్తూ మైదానంలోకి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు హిట్మ్యాన్ అభిమానులను ఆకర్షిస్తున్నాయి.కాగా గతేడాది ఎక్కువగా ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా వచ్చిన రోహిత్.. ఈసారి మాత్రం తుదిజట్టులో భాగంగా బరిలోకి దిగుతున్నాడు. దీంతో అతడి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక టీమిండియాకు టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ అందించిన ఘనత రోహిత్ శర్మది. కెప్టెన్ హోదాలో ముంబైని సైతం ఐదుసార్లు చాంపియన్గా నిలిపాడు. అయితే, 2024లో ముంబై రోహిత్ను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. చదవండి: IPL: ఈ ఐదు రికార్డులను ఎవరూ బ్రేక్ చేయలేరు!?pic.twitter.com/0A7i9X5ybq— • (@ClassyCricket) March 30, 2026 -
IPL 2026: ముగ్గురు మొనగాళ్లు!
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభమై రెండు రోజులే అయినప్పటికీ రెండు మ్యాచ్ల్లోనూ చేజింగ్ చేసిన జట్లే గెలవడం అభిమానులకు కిక్ ఇస్తోంది. అంతకంటే ఎక్కువ కిక్ ఇస్తున్న వార్త ఏదైనా ఉందంటే.. టీమిండియా సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానే, విరాట్ కోహ్లీల బ్యాటింగ్ అని చెప్పొచ్చు. 40 ఏండ్లకు దగ్గర్లో ఉన్న ఈ ముగ్గురు మొనగాళ్లు బ్యాటింగ్లో అద్భుతాలు చేస్తున్నారు. ఈ సీజన్లో తాము ఆడిన తొలి మ్యాచ్లోనే ఈ త్రయం తమ ప్రదర్శనతో అదరగొట్టారు. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత రోహిత్, కోహ్లీలు పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికితే.. జట్టులో అవకాశాల్లేక టీ20 క్రికెట్ ఆడే అవకాశం రహానే ఎప్పుడో కోల్పోయాడు. కానీ తాజాగా ప్రారంభమైన ఐపీఎల్ 19వ సీజన్లో మాత్రం తమ బ్యాటింగ్ విన్యాసాలతో అభిమానులను అలరిస్తున్నారు. ఈ ముగ్గురూ ఇలాగే ఆడుతూ పోతే రాబోయే మ్యాచ్ల్లో ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలే అని చెప్పొచ్చు.రోహిత్ శర్మ..భారత కెప్టెన్గా 2024 టీ20 ప్రపంచకప్ను అందుకున్న రోహిత్ శర్మ ఆ తర్వాత ఆ ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ శర్మ జనవరిలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ఆడాడు. ఆ సిరీస్లో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ లేదు. మూడు వన్డేలు కలిపి కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఇవాళ ఐపీఎల్లో మాత్రం తొలి మ్యాచ్లోనే రోహిత్ శర్మ విధ్వంసకర ఆటతీరును ప్రదర్శించాడు. కేకేఆర్తో మ్యాచ్లో 38 బంతుల్లోనే 78 పరుగులు చేసిన రోహిత్ అలవోకగా బంతులను బౌండరీ అవతలకు పంపిస్తూ పాత హిట్మ్యాన్ను గుర్తు చేశాడు. రికిల్టన్ కంటే ముందే ఔటైనప్పటికీ ఫోర్లు, సిక్సర్లతో కేకేఆర్కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముఖ్యంగా మ్యాచ్లో రోహిత్ ఫుట్వర్క్ అద్భుతమని చెప్పొచ్చు. ఎక్కడా చిన్న తప్పిదం లేకుండా ఇన్నింగ్స్ ఆసాంతం మంచి టైమింగ్తో షాట్లు ఆడాడు. తొలి మ్యాచ్తోనే ఫామ్ అందుకున్న రోహిత్ నుంచి సీజన్ ముగిసేలోపు మరిన్ని అద్భుత ఇన్నింగ్స్లు వచ్చే అవకాశముంది. View this post on Instagram A post shared by IPL (@iplt20)విరాట్ కోహ్లీ..కోహ్లీది కూడా అచ్చం రోహిత్ స్టోరీనే. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలో సభ్యుడైన కోహ్లీ రోహిత్తో కలిసి ఏకకాలంలో టీ20లకు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత జనవరిలో న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లోనూ కోహ్లీ అదరగొట్టాడు. ఆ సిరీస్లో కోహ్లీ 3 మ్యాచ్ల్లో 240 పరుగులు సాధించి భారత్ తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు. తాజాగా అదే ఫామ్ను ఐపీఎల్లోనూ కంటిన్యూ చేశాడు. ఐపీఎల్ 19వ సీజన్లో ఎస్ఆర్హెచ్తో జరిగిన ఆరంభ మ్యాచ్లో బెంగళూరు స్టార్ కోహ్లీ చివరి వరకు నాటౌట్గా నిలిచి జట్టును గెలిపించాడు. కోహ్లీ (38 బంతుల్లో 69 నాటౌట్) చేజింగ్లో తనను కొట్టేవారు లేరని మరోసారి నిరూపించాడు. కోహ్లీ ఇన్నింగ్స్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. సీజన్ ఆద్యంతం కోహ్లీ ఇదే దూకుడు ప్రదర్శిస్తే ఆరెంజ్ క్యాప్ కూడా సొంయ్యే అవకాశం లేకపోలేదు. View this post on Instagram A post shared by IPL (@iplt20)అజింక్యా రహానే..రోహిత్, కోహ్లీలు రెండేళ్ల కిందట టీ20లకు వీడ్కోలు పలికితే రహానే టీమిండియా తరఫున తన చివరి టీ20 ఆడి దాదాపు పదేళ్లు కావొస్తోంది. రహానే 2016లో వెస్టిండీస్తో చివరి టీ20 ఆడాడు. అప్పటి నుంచి టెస్టుల్లో కొన్నాళ్లు ఆడిన రహానే ఇప్పుడు అవకాశాలు లేవు. దీంతో ఐపీఎల్లో మాత్రమే కొనసాగుతున్న రహానే గత రెండు, మూడు సీజన్లలో ఆట స్వరూపాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. రహానేను ఎక్కువగా టెస్టు క్రికెట్లో చూడడం వల్ల అతడి నుంచి నెమ్మదైన ఆటనే అభిమానులు ఊహించేవారు. కానీ ఐపీఎల్లో రహానే ఆడుతున్న తీరు షాక్ కలిగిస్తోందని చెప్పొచ్చు. తాజాగా ఐపీఎల్ 19వ సీజన్లో ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో రహానే కేకేఆర్ కెప్టెన్గా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 67 పరుగులు చేసిన రహానే ఇన్నింగ్స్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. గతంలో చెన్నై సూపర్కింగ్స్కు ఆడినప్పుడు కూడా రహానే ఇదే దూకుడును ప్రదర్శించి సరికొత్త ఆటను రుచి చూపించాడు. మొత్తంగా టీమిండియా సీనియర్లయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానేలు ఒక్క మ్యాచ్తోనే ఆటలో మొనగాళ్లమని నిరూపించుకున్నారు.చదవండి: ‘14 ఏండ్లకు మమ్మల్ని కరుణించాడు’ -
‘14 ఏండ్లకు మమ్మల్ని కరుణించాడు’
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్లో విజయం సాధించడం పట్ల ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా సంతోషం వ్యక్తం చేశాడు. గత 13 సీజన్లలో తొలి మ్యాచ్లో తమను ఓటములే పలకరించాయని, కానీ 14 ఏండ్ల తర్వాత ఆ దేవుడు తమను కరుణించాడని పేర్కొన్నాడు. సీజన్లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్, కేకేఆర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో కేకేఆర్పై సునాయాస విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కెప్టెన్ పాండ్యా మాట్లాడాడు. ‘ఇది ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విజయం. గత 13 సీజన్లను ఓటమితోనే ప్రారంభించాం. కానీ ప్రతీ సీజన్ ప్రారంభ మ్యాచ్ను గెలవాలనే బలమైన సంకల్పంతోనే బరిలోకి దిగేవాళ్లం. 2013 నుంచి 2025 వరకు మాకు ఓటములే ఎదురయ్యాయి. కేకేఆర్పై విజయం పట్ల మా జట్టు పూర్తి సంతోషంగా ఉంది. ఎందుకంటే భారీ లక్ష్యాలను ఛేధించడం అంత సులువు కాదు. తొలి ఇన్నింగ్స్లో కేకేఆర్ పవర్ ప్లేలో మా బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో భారీగా పరుగులు వచ్చాయి. కానీ పవర్ ప్లే తర్వాత మా బౌలర్లు గాడిన పడి కేకేఆర్ మరింత భారీ స్కోరు చేయకుండా అడ్డుకోవడంలో సక్సెస్ అయ్యారు. లేదంటే కేకేఆర్ 240 లేదా 250కి పైగా స్కోరు చేసి ఉండేదేమో. కళ్ల ముందు భారీ టార్గెట్ కనిపిస్తున్నప్పటికీ మా టాప్ ఓపెనర్లు రోహిత్- రికిల్టన్లు తమ బ్యాటింగ్తో అదరగొట్టారు. ముఖ్యంగా రోహిత్ భాయ్ బ్యాట్ నుంచి కొన్ని అద్భుతమైన షాట్లు వచ్చాయి. అదే సమయంలో రికిల్టన్ కూడా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అయితే డికాక్ను కాదని రికిల్టన్కు అవకాశమివ్వడం రిస్క్ అనిపించినా అతడు తన బ్యాటింగ్తో మా అనుమానాలను పటాపంచలు చేశాడు. ఇక రోహిత్ భయ్యా గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. టీ20 క్రికెట్కు గ్యాప్ వచ్చినప్పటికీ గ్రౌండ్ నలువైపులా షాట్లు ఆడుతూ పాత రోహిత్ను గుర్తుకుతెచ్చాడు. రోహిత్ శర్మ కేవలం మా జట్టు ఆటగాడు మాత్రమే కాదు అతను మాకు మార్గనిర్దేశకుడు. ఎన్నో ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నప్పటికీ శార్దూల్ ఠాకూర్ తన సొంత జట్టుకు ఆడడం లేదన్న ఫీలింగ్ అతనికి ఉండేది. నాకు తెలిసి ఇవాళ్టితో శార్దూల్కు ఆ ఫీలింగ్ పోయి ఉండాలి (నవ్వుతూ). ఒక నిఖార్సైన ఆల్రౌండర్కు అర్థం శార్దూల్ ఠాకూర్. ఇవాళ మ్యాచ్ హీరో శార్దూల్ అని కచ్చితంగా చెప్పగలను’ అంటూ ముగించాడు. కేకేఆర్తో మ్యాచ్లో మూడు వికెట్లు తీసిన శార్దూల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకున్నాడు.చదవండి: కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ -
కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ శుభారంభం చేసింది. 2012 సీజన్ తర్వాత తాము ఆడిన తొలి మ్యాచ్లో విజయాన్ని అందుకొని సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. అయితే కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత ఇన్నింగ్స్తో మెరిశాడు. క్రీజులో తాను ఉన్నాడంటే పరుగులు రావాల్సిందే. 38 బంతుల్లో 78 పరుగులు చేసిన రోహిత్ ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండడం విశేషం. ఈ నేపథ్యంలోనే తన సహచరుడు, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డును రోహిత్ శర్మ బద్దలుకొట్టాడు. టీ20 క్రికెట్లో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ తొలి స్థానానికి చేరుకున్నాడు. గతంలో డెక్కన్ చార్జర్స్తో పాటు ముంబై ఇండియన్స్ తరఫున కేకేఆర్పై రోహిత్ శర్మ 36 మ్యాచ్ల్లో 1161 పరుగులు సాధించాడు. ఇక కేకేఆర్తో మొత్తం 36 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ డెక్కన్ చార్జర్స్ తరఫున 6 మ్యాచ్ల్లో 116 పరుగులు, ముంబై ఇండియన్స్ తరఫున 30 మ్యాచ్ల్లో 1045 పరుగులు సాధించడం విశేషం.ఇంతకముందు విరాట్ కోహ్లీ చెన్నై సూపర్కింగ్స్పై 36 మ్యాచ్ల్లో 1160 పరుగులు చేశాడు. తాజాగా కేకేఆర్తో మ్యాచ్లో రోహిత్ 78 పరుగులు చేయడంతో కోహ్లీ రికార్డు బ్రేక్ చేసినట్లయింది. అయితే కోహ్లీ పంజాబ్ కింగ్స్పై (36 మ్యాచ్ల్లో 1159 పరుగులు), ఢిల్లీ క్యాపిటల్స్పై( 32 మ్యాచ్ల్లో 1154 పరుగులు) సాధించాడు. అయితే ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్ పంజాబ్ లేదా ఢిల్లీతో ఎప్పుడు ఆడినా ఈసారి రోహిత్ శర్మను కోహ్లీ దాటేసి మరోసారి నంబర్వన్ స్థానాన్ని ఆక్రమించనున్నాడు. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు చేసింది. రహానే (67), రఘువంశీ (51), రింకూ సింగ్ (33 నాటౌట్) రాణించారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా, పాండ్యా ఒక వికెట్ తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఓపెనర్లు రికిల్టన్ (81), రోహిత్ శర్మ (78) దూకుడుతో 19.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. చదవండి: అందుకే చేజింగ్ మాస్టర్ అనేది! -
ముంబై మెరిసె... నిరీక్షణ ముగిసె...
గత 13 సీజన్లుగా ఐపీఎల్ తొలి మ్యాచ్లో విజయం సాధించలేకపోయిన ముంబై ఇండియన్స్... ఎట్టకేలకు ఆ అడ్డంకిని అధిగమించింది. 2012 తర్వాత తొలిసారి ముంబై జట్టు విజయంతో ఐపీఎల్ సీజన్ను ప్రారంభించింది. వాంఖడే స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన పోరులో బౌలర్ల క్రమశిక్షణకు బ్యాటర్ల దూకుడు తోడవడంతో ముంబై ఘనవిజయం సాధించింది.‘లోకల్ బాయ్’ శార్దుల్ ఠాకూర్ చక్కటి బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టడి చేయగా... బ్యాటింగ్లో రోహిత్, రికెల్టన్ మెరుపులతో హార్దిక్ పాండ్యా బృందం గెలుపు బోణీ కొట్టింది. తాజా సీజన్లో వరుసగా రెండో మ్యాచ్లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 200కు మించి స్కోరు చేసినా... దానిని కాపాడుకోవడంలో విఫలమైంది. ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ను ముంబై ఇండియన్స్ విజయంతో ప్రారంభించింది. ఆదివారం జరిగిన పోరులో ముంబై 6 వికెట్ల తేడాతో కోల్కతా నైట్రైడర్స్ను ఓడించింది. పచ్చికతో కనిపించిన పిచ్ బౌలర్లకు సహకరిస్తుందనుకుంటే... వాంఖడేలో ఇరు జట్ల బ్యాటర్లు పరుగుల పండగ చేసుకున్నారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 220 పరుగులు చేసింది. అజింక్య రహానే (40 బంతుల్లో 67; 3 ఫోర్లు, 5 సిక్స్లు) కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకోగా... అంగ్క్రిష్ రఘువంశీ (29 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక అర్ధశతకం చేశాడు. ఫిన్ అలెన్ (17 బంతుల్లో 37; 6 ఫోర్లు, 2 సిక్స్లు), రింకూ సింగ్ (33 నాటౌట్; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 39 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. ర్యాన్ రికెల్టన్ (43 బంతుల్లో 81; 4 ఫోర్లు, 8 సిక్స్లు), రోహిత్ శర్మ (38 బంతుల్లో 78; 6 ఫోర్లు, 6 సిక్స్లు) హాఫ్సెంచరీలతో విజృంభించారు. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ముంబైకిదే అత్యధిక లక్ష్య ఛేదన కావడం విశేషం. 10 ఓవర్లలో 120... అభిమానులతో కిక్కిరిసిన మైదానంలో తొలుత బ్యాటింగ్కు దిగిన కోల్కతాకు శుభారంభం దక్కింది. తొలి రెండు ఓవర్లలో 14 పరుగులు రాగా... మూడో ఓవర్ నుంచి మోత మొదలైంది. గజన్ఫర్ బౌలింగ్లో అలెన్ 4, 6, 6తో విజృంభించాడు. ఇక హార్దిక్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో రహానే, అలెన్ దంచికొట్టారు. తొలి రెండు బంతులకు రహానే సిక్స్లు బాదితే... చివరి మూడు బంతులకు అలెన్ ఫోర్లు కొట్టాడు. దీంతో 26 పరుగులు వచ్చాయి. ఫలితంగా 4 ఓవర్లు ముగిసేసరికి నైట్రైడర్స్ 57 పరుగులు రాబట్టింది. తదుపరి ఓవర్లో రెండు ఫోర్లు రాగా... చేంజ్ బౌలర్గా వచ్చిన శార్దుల్ ఈ జోడీని విడదీశాడు. అయినా రహానే నిలకడగా ఆడటంతో 10 ఓవర్లు ముగిసేసరికి కోల్కతా 120/2తో నిలిచింది. ఆ తర్వాత ముంబై బౌలర్లు పట్టు బిగించడంతో పరుగుల రాక గగనమైంది. ముంబై కుర్రాడు అంగ్క్రిష్ రఘువంశీ చక్కటి షాట్లు ఆడినా... వైస్ కెప్టెన్ రింకూ సింగ్ ఆశించినంత వేగంగా ఆడలేకపోయాడు. దీంతో చివరి 10 ఓవర్లలో కోల్కతా 100 పరుగులకు పరిమితమైంది. శార్దుల్ ‘లక్కీ హ్యాండ్’ 2015 నుంచి ఐపీఎల్ ఆడుతున్న శార్దుల్ ఠాకూర్ ఆరు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించిన తర్వాత... ఈ సీజన్లో ముంబై గూటికి చేరాడు. దేశవాళీల్లో ముంబై జట్టుకు సారథ్యం వహించే శార్దుల్... ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన తొలి మ్యాచ్లో అదరగొట్టాడు. తన తొలి ఓవర్లోనే ప్రమాదకర అలెన్ను వెనక్కి పంపిన అతడు... రెండో ఓవర్లో గ్రీన్ (18; 1 ఫోర్, 1 సిక్స్)ను బుట్టలో వేసుకున్నాడు. ధాటిగా ఆడుతున్న రహానేను సైతం అతడే అవుట్ చేసి కోల్కతా మరింత భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశాడు. అలవోకగా... ఐపీఎల్లో తమ అత్యధిక లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆడుతూ పాడుతూ ముందుకు సాగింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, రికెల్టన్ పోటీపడి బౌండరీలు బాదడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వరుణ్ చక్రవర్తి వేసిన ఐదో ఓవర్లో 4, 6, 4తో రఫ్ఫాడించిన రోహిత్... కార్తీక్ త్యాగీ ఓవర్లో మరో రెండు సిక్స్లతో 23 బంతుల్లో హాఫ్సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో ‘హిట్మ్యాన్’కు ఇదే వేగవంతమైన అర్ధశతకం. మరో ఎండ్లో రికెల్టన్ కూడా దూకుడు కనబర్చడంతో పవర్ప్లేలో ముంబై 88 పరుగులు చేసింది. ఈ క్రమంలో రికెల్టన్ 24 బంతుల్లో ‘ఫిఫ్టీ’ఖాతాలో వేసుకున్నాడు. తొలి వికెట్కు 11.5 ఓవర్లలో 148 పరుగులు చేశాక రోహిత్ అవుట్ కాగా... ‘ఇంపాక్ట్ ప్లేయర్’ సూర్యకుమార్ యాదవ్ (16; 3 ఫోర్లు) ప్రభావం చూపలేకపోయాడు. రికెల్టన్ దురదృష్టవశాత్తు రనౌట్ కాగా... తిలక్ వర్మ (20; 4 ఫోర్లు), కెప్టెన్ హార్దిక్ (18 నాటౌట్; 3 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేయడంతో ముంబై మరో ఐదు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది.కెప్టెన్ కామెంట్చాలా ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్లో విజయం సాధించాం. 13 ఏళ్ల అనంతరం సీజన్ ఆరంభ పోరులో గెలవడం ఆనందంగా ఉంది. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా అనిపించింది. 220 లక్ష్యం పెద్దదేం కాదు. అందుకు తగ్గట్లే రోహిత్, రికెల్టన్ ఆరంభం నుంచే దూకుడు కనబర్చారు. శార్దుల్ ఠాకూర్ నుంచి జట్టు ఇలాంటి ప్రదర్శనే ఆశిస్తోంది. ఇక అతడి కెరీర్ ముగిసే వరకు ముంబై ఇండియన్స్తోనే ఉంటాడు. –హార్దిక్ పాండ్యా, ముంబై కెప్టెన్ 221 ఐపీఎల్లో ముంబైకు ఇదే అత్యధిక లక్ష్యఛేదన. 2021లో చెన్నై సూపర్ కింగ్స్పై చేజ్ చేసిన 219 పరుగుల లక్ష్యం రెండో స్థానానికి చేరింది. 200కు పైగా లక్ష్యాన్ని ఛేదించడం ముంబైకిది ఆరోసారి. పంజాబ్ కింగ్స్ ఎనిమిదిసార్లు ఈ ఘనత సాధించింది.గ్రీన్ విఫలం ఐపీఎల్ 19వ సీజన్ వేలంలో భారీ ధర (రూ. 25.20 కోట్లు) పెట్టి కోల్కతా నైట్రైడర్స్ కొనుగోలు చేసుకున్న ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చి 18 పరుగులే చేసిన అతడు... బౌలింగ్లో ఒక్క ఓవర్ కూడా వేయలేదు. » 2024 టి20 ప్రపంచకప్లో భారత జట్టుకు ట్రోఫీ అందించిన తర్వాత ఆడిన ఐపీఎల్లో రోహిత్ శర్మ ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా దర్శనమివ్వగా... ఇప్పుడు తాజా టి20 ప్రపంచకప్ విజయం అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ తరఫున ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగాడు. » దక్షిణాఫ్రికా స్టార్ క్వింటన్ డికాక్ను కాదని... అదే దేశానికి చెందిన ర్యాన్ రికెల్టన్కు ముంబై తుది జట్టులో చోటు కల్పించగా... అతడు ఐపీఎల్లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరుతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. » కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయర్లు ఫిన్ అలెన్ (న్యూజిలాండ్), ముజరబాని (జింబాబ్వే)తో పాటు ముంబై ఇండియన్స్ ఆటగాడు గజన్ఫర్ (అఫ్గానిస్తాన్) ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్లో అరంగేట్రం చేశారు. » ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కోల్కతా నైట్ రైడర్స్ సారథి అజింక్య రహానే కండరాలు పట్టేయడంతో నాలుగో ఓవర్లో అతడు మైదానాన్ని వీడాడు. మిగతా మ్యాచ్లో రింకూ సింగ్ జట్టుకు నాయకత్వం వహించాడు. 1161 ఐపీఎల్లో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రోహిత్ (కోల్కతాపై 1161 పరుగులు) గుర్తింపు పొందాడు. విరాట్ కోహ్లి (పంజాబ్ కింగ్స్పై 1159 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు. 190 ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు ఆడిన విదేశీ ప్లేయర్గా సునీల్ నరైన్ గుర్తింపు పొందాడు. కీరన్ పొలార్డ్ (189 మ్యాచ్లు) పేరిట ఉన్న రికార్డును నరైన్ సవరించాడు.స్కోరు వివరాలుకోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: రహానే (సి) హార్దిక్ (బి) శార్దుల్ 67; అలెన్ (సి) తిలక్ (బి) శార్దుల్ 37; గ్రీన్ (సి) రూథర్ఫోర్డ్ (బి) శార్దుల్ 18; రఘువంశీ (సి) తిలక్ (బి) హార్దిక్ 51; రింకూ (నాటౌట్) 33; రమణ్దీప్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 10; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 220. వికెట్ల పతనం: 1–69, 2–109, 3–145, 4–205. బౌలింగ్: బౌల్ట్ 4–0–38–0; హార్దిక్ 3–0–39–1; గజన్ఫర్ 4–0–51–0; బుమ్రా 4–0–35–0; శార్దుల్ 4–0–39–3; మార్కండే 1–0–16–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (రనౌట్) 81; రోహిత్ (సి) అనుకూల్ (బి) అరోరా 78; సూర్యకుమార్ (సి) రింకూ (బి) కార్తీక్ 16; తిలక్ (సి) (సబ్) మనీశ్ (బి) నరైన్ 20; హార్దిక్ (నాటౌట్) 18; నమన్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 6; మొత్తం (19.1 ఓవర్లలో 4 వికెట్లకు) 224. వికెట్ల పతనం: 1–148, 2–179, 3–184, 4–215. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–52–1; ముజరబాని 3–0–34–0; వరుణ్ చక్రవర్తి 4–0–48–0; కార్తీక్ త్యాగి 4–0–43–1; నరైన్ 3–0–30–1; అనుకూల్ రాయ్ 1.1–0–15–0. -
IPL 2026: రోహిత్ శర్మ ఉగ్రరూపం.. సరికొత్త చరిత్ర
ఐపీఎల్ 2026లో భాగంగా కేకేఆర్తో ఇవాళ (మార్చి 29) జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ చెలరేగిపోతున్నాడు. కేవలం 23 బంతుల్లోనే అర్ద సెంచరీ (3 ఫోర్లు, 5 సిక్సర్లు) పూర్తి చేసి ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ భారీ రికార్డు నెలకొల్పి, చరిత్ర సృష్టించాడు.కేకేఆర్తో మ్యాచ్ అంటేనే పూనకం వచ్చినట్లు ఊగిపోయే హిట్మ్యాన్, మరోసారి అదే తరహా ప్రదర్శనతో రెచ్చిపోయి, ఐపీఎల్ చరిత్రలో ఈ ఫ్రాంచైజీపై అత్యధిక పరుగులు (36 మ్యాచ్ల్లో 1094 పరుగులు, 6 అర్ద సెంచరీలు, ఓ సెంచరీ) చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్కు ముందు వరకు ఈ రికార్డు డేవిడ్ వార్నర్ (1093 పరుగులు) పేరిట ఉండేది. ఈ జాబితాలో రోహిత్, వార్నర్ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లి (1021), శిఖర్ ధవన్ (907), సురేశ్ రైనా (829) ఉన్నారు.ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీఈ మ్యాచ్లో రోహిత్ చేసిన 23 బంతుల హాఫ్ సెంచరీ, ఐపీఎల్లో అతనికి వేగవంతమైందిగా నిలుస్తుంది. అతని గత ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ 25 బంతుల్లో వచ్చింది. 2015 ఎడిషన్ ఫైనల్లో సీఎస్కేపై ఈ ఫీట్ సాధించాడు.మరో మైలురాయిఈ హాఫ్ సెంచరీతో రోహిత్ ఐపీఎల్లో మరో మైలురాయిని తాకాడు. ఈ హాఫ్ సెంచరీ అతనికి ఐపీఎల్లో 50వది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ నాలుగో స్థానంలో ఉన్నాడు. అతని కంటే ముందు విరాట్ కోహ్లి (72), డేవిడ్ వార్నర్ (66), శిఖర్ ధవన్ (53) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. కేకేఆర్ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ దూసుకుపోతుంది. 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 110 పరుగులు చేసి, లక్ష్యానికి మరో 111 పరుగుల దూరంలో ఉంది. రోహిత్ శర్మ (59), రికెల్టన్ (50) అర్ద సెంచరీలు పూర్తి చేసి ఇన్నింగ్స్లు కొనసాగిస్తున్నారు.అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. రహానే (67), రఘువంశీ (51) అర్ద సెంచరీలతో రాణించగా.. రింకూ సింగ్ (33 నాటౌట్) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలో ఫిన్ అలెన్ (37) సైతం మెరుపులు మెరిపించాడు. భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్న కెమరూన్ గ్రీన్ (18) దారుణంగా విఫలం కాగా.. రమన్దీప్ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ (4-0-39-3), ట్రెంట్ బౌల్ట్ (4-0-38-0) అద్భుతంగా బౌలింగ్ చేయగా..హార్దిక్ పాండ్యా ఓ వికెట్ తీశాడు. -
అసలు నిన్ను గుర్తుపట్టనే లేదు: షాకైన నీతా అంబానీ
టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ గత కొంతకాలంగా ఫిట్నెస్పై దృష్టి సారించాడు. అంతర్జాతీయ క్రికెట్లో మరికొంతకాలం కెరీర్ పొడిగించుకునే క్రమంలో ఇప్పటికే దాదాపు పది కిలోల బరువు తగ్గాడు. అంతటితో ఆగకుండా మరింత సన్నబడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు.స్లిమ్గా మారిన రోహిత్ శర్మ ఈ క్రమంలో మునుపటి కంటే మరింత స్లిమ్గా మారిన రోహిత్ శర్మ లుక్ (Rohit Sharma Transformation) చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ సహ యజమాని నీతా అంబానీ సైతం రోహిత్లో వచ్చిన మార్పు చూసి ఫిదా అయ్యారు. కాగా ఐపీఎల్-2026 టోర్నీకి శనివారం తెరలేవనున్న సంగతి తెలిసిందే.బెంగళూరు వేదికగా ఆర్సీబీ- సన్రైజర్స్ (RCB vs SRH) మ్యాచ్తో టోర్నీ మొదలుకానుండగా.. మార్చి 29న ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ను ఎదుర్కోనుంది. ఈ క్రమంలో వాంఖడేలో ముంబై ఇండియన్స్ జట్టు ప్రాక్టీస్ చేస్తుండగా.. నీతా అంబానీ వచ్చి ఆటగాళ్లను పలకరించారు.నేనసలు నిన్ను గుర్తుపట్టనే లేదుఈ సందర్భంగా ముంబై కోచింగ్ సిబ్బంది, ఆటగాళ్లతో కరచాలనం చేసిన ఆమె.. రోహిత్ శర్మను చూసి షాకయ్యారు. ‘‘ఓరి దేవుడా!.. రోహిత్ నేనసలు నిన్ను గుర్తుపట్టనే లేదు. నువ్వు కుర్రాడిలా కనిపిస్తున్నావు’’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇందుకు రోహిత్ నవ్వులు చిందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వన్డేలలో కొనసాగుతున్న రోహిత్కాగా 38 ఏళ్ల రోహిత్ శర్మ ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికాడు. వన్డే వరల్డ్కప్-2027లొ టీమిండియాకు ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. కెప్టెన్ హోదాలో భారత్కు టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిళ్లను రోహిత్ అందించాడు. అయితే, చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత బీసీసీఐ అతడిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది. దీంతో ఆటగాడిగా జట్టులో కొనసాగుతున్నాడు రోహిత్. కాగా ముంబైకి ఐదుసార్లు టైటిల్ అందించిన దిగ్గజ కెప్టెన్ రోహిత్.. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా సారథ్యంలో జట్టులో కొనసాగుతున్నాడు.చదవండి: IPL 2026: కుర్ర క్రికెటర్లపైనే అందరి దృష్టి!Mrs. Nita Ambani met the squad during training ahead of the start of TATA IPL 2026! 💙 pic.twitter.com/r2Gy9NaDOc— Mumbai Indians (@mipaltan) March 27, 2026 -
వేసవి ఛాయిస్.. బస్సే బిగ్బాస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమాన చార్జీలు పెరగడం, రైళ్ల రద్దీ తదితర అంశాల నేపథ్యంలో వేసవి సీజన్లో బస్సు ప్రయాణాలకు గణనీయంగా డిమాండ్ పెరగనున్నట్లు అభిబస్ సీవోవో రోహిత్ శర్మ చెప్పారు. ఇక పండుగలు, పెళ్లిళ్లు, తమిళనాడు .. పుదుచ్చేరి మొదలైన చోట్ల ఎన్నికలు జరగనుండటం కూడా ప్రయాణాలకి దోహదపడనున్నట్లు ఆయన చెప్పారు. క్రూడాయిల్ రేట్ల పెరుగుదలతో విమాన ప్రయాణాలు భారంగా మారడమనేది, పరోక్షంగా బస్సు ఆపరేటర్లకు ప్రయోజనం చేకూర్చనుందని పేర్కొన్నారు.సాధారణంగా విమానాలు, రైళ్లు, వ్యక్తిగత వాహనాలతో బస్సుల సెగ్మెంట్ పోటీ పడాల్సి ఉంటుందని తెలిపారు. అయితే, ఫ్లయిట్ చార్జీలు పెరిగినా, రైల్వే వెయిటింగ్ లిస్టులు పెరిగినా.. బస్సులకు మరింత డిమాండ్ ఏర్పడుతుందన్నారు. పీక్ సీజన్లో ప్రయాణికులను ఆకర్షించేందుకు 25 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు శర్మ వివరించారు. హైదరాబాద్–విజయవాడలాంటి కీలక రూట్లలో డిమాండ్ ఉంటోందని శర్మ చెప్పారు.పింక్ సీట్ ఆప్షన్లాంటి భద్రతా ఫీచర్ల కారణంగా సోలోగా ప్రయాణించే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. హోలీ పండుగ వారానికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఏకంగా 70 శాతం పెరగ్గా, మహిళల ప్యాసింజర్ల సంఖ్య 80 శాతం పెరిగినట్లు శర్మ వివరించారు. 6.5 లక్షల రూట్లలో 6,200 ఆపరేటర్లకు అగ్రిగేటరుగా వ్యవహరిస్తున్న అభిబస్.. ఈ విభాగంలో రెండో స్థానంలో ఉంది. ఉబర్తో జట్టు..ఇంటర్సిటీ బస్ టికెట్ బుకింగ్స్ సదుపాయాన్ని మరింతగా అందుబాటులోకి తెచ్చేలా ఉబర్తో కూడా చేతులు కలిపినట్లు శర్మ చెప్పారు. దీనితో ఉబర్ యాప్ నుంచే నేరుగా పలు ప్రాంతాలకు బస్ టికెట్లను బుక్ చేసుకునే వీలుందని ఆయన వివరించారు. ప్రస్తుతం 17 రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలతో కలిసి పని చేస్తున్నామన్నారు. టీఎస్ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ మొదలైనవి వీటిలో ఉన్నాయి.ఇక అష్యూర్డ్ ప్రోగ్రాం కింద బస్సుల జాప్యం, రద్దు లాంటి సేవల నాణ్యత లోపాలకు 150% వరకు రీఫండ్ ఆఫర్ చేస్తున్నామని, ప్రస్తుతం ఈ ప్రోగ్రాంలో సుమారు 360 మంది ఆపరేటర్లు చేరారని శర్మ చెప్పారు. ఆన్లైన్ ట్రావెల్ సంస్థ ఇక్సిగోలో భాగమైన అభిబస్ ప్లాట్ఫాంపై 2026 ఆర్థిక సంవత్సరం క్యూ3లో స్థూల లావాదేవీల విలువ (జీటీవీ) 36% వృద్ధితో రూ. 670.9 కోట్లకు చేరగా, ఆదాయం 47% పెరిగి రూ. 75.5 కోట్లకు చేరింది. ప్రయాణికుల సంఖ్య 33% పెరిగి 67.3 లక్షలకు చేరింది. -
రోహిత్, కోహ్లి అభిమానులకు కిక్కెక్కించే వార్త
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అభిమానులకు కిక్కెక్కించే వార్త ఇది. టెస్ట్లు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న ఈ ఇద్దరు, వచ్చే ఏడాది (2027) మే వరకు 20 వన్డేలు ఆడే అవకాశం ఉంది. రో-కో ఎలాంటి విరామాలు తీసుకోకుండా ఆడితే ఇది జరుగుతుంది.తాజాగా బీసీసీఐ రానున్న హోం సీజన్లో టీమిండియా షెడ్యూల్ను ప్రకటించింది. ఇందులో ఏకంగా 9 వన్డేలు ఉన్నాయి. మిగతా 11 వన్డేలకు భారత్ విదేశాల్లో ఆడనుంది. 2027 మే వరకు ఇంటా-బయటా టీమిండియా షెడ్యూల్ ఇలా ఉండబోతుంది.ఐపీఎల్ తర్వాత జూన్ 6 నుంచి ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఏకైక టెస్ట్ మరియు 3 వన్డేల సిరీస్ కోసం భారత్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో జరిగే టెస్ట్ మ్యాచ్ జూన్ 6 నుంచి 10 వరకు ముల్లాన్పూర్ వేదికగా జరుగనుంది. అనంతరం ధర్మశాల (జూన్ 14), లక్నో (జూన్ 17), చెన్నై (జూన్ 20) వేదికలుగా మూడు వన్డేలు జరుగనున్నాయి.అనంతరం భారత్ జులైలో ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో 5 టీ20లు, 3 వన్డేలు జరుగనున్నాయి. టీ20లు జులై 1, 4, 7, 9, 11 తేదీల్లో చెస్టర్ లీ స్ట్రీట్, ఓల్డ్ ట్రాఫర్డ్, ట్రెంట్ బ్రిడ్జ్, బ్రిస్టల్, సౌథాంప్టన్ వేదికలుగా జరుగనుండగా.. వన్డేలు జులై 14, 16, 19 తేదీల్లో ఎడ్జ్బాస్టన్, కార్డిఫ్, లార్డ్స్లో జరుగనున్నాయి.సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో 3 వన్డేలు సహా 5 టీ20లు జరుగనున్నాయి. వన్డేలు సెప్టెంబర్ 27, 30, అక్టోబర్ 3 తేదీల్లో తిరువనంతపురం, గౌహతి, ముల్లాన్పూర్ వేదికలుగా జరుగనుండగా.. టీ20లు అక్టోబర్ 6, 9, 11, 14, 17 తేదీల్లో లక్నో, రాంచీ, ఇండోర్, డెహ్రాడూన్, బెంగళూరు నగరాల్లో జరుగనున్నాయి.తర్వాత టీమిండియా ఆడబోయే వన్డేల వివరాలు..టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో 5 వన్డేలు ఆడే అవకాశం ఉంది. ఈ సిరీస్పై స్పష్టత రావాల్సి ఉంది.డిసెంబర్లో శ్రీలంక భారత్లో పర్యటించి 3 వన్డేలు ఆడుతుంది. ఈ మ్యాచ్లు డిసెంబర్ 13, 16, 19 తేదీల్లో ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్లో జరుగనున్నాయి.వచ్చే ఏడాది జనవరిలో జింబాబ్వే 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం భారత్లో పర్యటిస్తుంది. ఈ మ్యాచ్లు జనవరి 3, 6, 9 తేదీల్లో కోల్కతా, హైదరాబాద్, ముంబైలో జరగుతాయి. -
ముంబై మురిపించేనా!
ఎనిమిదేళ్ల వ్యవధిలో ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచి సంచలనం సృష్టించిన ముంబై ఇండియన్స్... ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమవుతోంది. గత ఐదు సీజన్లలో కనీసం ఒక్కసారీ ఫైనల్ చేరలేకపోయిన హార్దిక్ పాండ్యా బృందం... ఆరో టైటిల్ వేటకు సిద్ధమైంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్, తిలక్ వర్మ, డికాక్, సాంట్నర్, బౌల్ట్, బుమ్రా ఇలా జట్టు మొత్తం స్టార్లతో నిండి ఉండగా... వీరంతా కలిసికట్టుగా కదంతొక్కాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఇటీవల టీమిండియా టి20 ప్రపంచకప్ నిలబెట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా, సూర్యకుమార్, హార్దిక్, తిలక్ ఫుల్ఫామ్లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ బలాబలాలను పరిశీలిస్తే... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యధిక టైటిల్స్ సాధించిన రెండు జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ గత ఐదేళ్లుగా ట్రోఫీ కోసం పరితపిస్తోంది. క్షణాల్లో మ్యాచ్ను మలుపు తిప్పగల స్టార్లు... బంతిని అదే పనిగా బౌండరీకి తరలించగల హిట్టర్లు... రెప్పపాటులో వికెట్లను పడగొట్టగల బౌలర్లు... ఇలా జట్టులో అన్నీ ఉన్నా ఆరో టైటిల్ మాత్రం దరిచేరడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో వివిధ జట్లకు సారథ్యం వహించిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, సాంట్నర్ ఇలా నాయకులతో నిండి ఉన్న జట్టును ఈ సీజన్లో హార్దిక్ ఎలా నడిపిస్తాడనేది కీలకం. లీగ్ ఆరంభం నుంచే సచిన్, పాంటింగ్ వంటి స్టార్ ఆటగాళ్లతో నిండి ఉన్న ముంబై ఇండియన్స్కు రోహిత్ శర్మ 2013లో తొలిసారి ట్రోఫీ అందించాడు... ఆ తర్వాత అతడి సారథ్యంలోనే 2015, 2017, 2019, 2020లో ముంబై జట్టు విజేతగా నిలిచింది. కానీ అక్కడి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయిన ముంబై... ఈ సీజన్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాలని భావిస్తోంది. ప్లేయర్లను తీర్చిదిద్దడంలో మంచి అనుభవమున్న ముంబై ఫ్రాంచైజీ... 2026 వేలంలో దక్షిణాఫ్రికా విధ్వంసక ఓపెనర్ డికాక్, విండీస్ హిట్టర్ రూథర్ఫర్డ్ను అతి తక్కువ ధరకే దక్కించుకుంది. హెడ్ కోచ్ జయవర్ధనే ఈ ఇద్దరి సేవలను ఎలా వినియోగించుకుంటాడనేది ఆసక్తికరం. రోహిత్ ‘ఇంపాక్ట్ ప్లేయర్’గానే... ముంబై జట్టుకు ఐదుసార్లు ట్రోఫీ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈసారి కూడా ఇంపాక్ట్ ప్లేయర్గానే బరిలోకి దిగే అవకాశాలున్నాయి. వన్డేల్లో మాత్రమే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘హిట్మ్యాన్’ ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించాడు. రోహిత్తో కలిసి డికాక్ ఇన్నింగ్స్ ప్రారంభించనుండగా... తిలక్వర్మ, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, నమన్లతో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్ను ప్రత్యర్థి నుంచి లాగేసుకోవడంలో వీరికి అపార అనుభవం ఉంది. బ్యాటింగ్ ఆర్డర్లో ఒక్క డికాక్ మినహా మిగిలిన వాళ్లంతా భారత ఆటగాళ్లే కావడంతో... విదేశీ ఆటగాళ్ల సేవలను వినియోగించుకునే విషయంలో ఫ్రాంచైజీకి మంచి వెసులుబాటు ఉంది. ఈ కోటాలో డికాక్, రికెల్టన్, రూథర్ఫర్డ్, సాంట్నర్, విల్ జాక్స్, బాష్, ట్రెంట్ బౌల్ట్, ఘజన్ఫర్ అందుబాటులో ఉండగా... డికాక్, జాక్స్, సాంట్నర్, బౌల్ట్ తుదిజట్టులో ఉండటం ఖాయమే. పరిస్థితులను బట్టి రూథర్ఫర్డ్, ఘజన్ఫర్ను పరిశీలించవచ్చు. బుమ్రాపైనే భారం... టీమిండియా వరుసగా రెండోసారి టి20 ప్రపంచకప్ కైవసం చేసుకోవడంలో ప్రధాన పాత్ర పోషించిన బుమ్రాపైనే ముంబై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్గా మన్ననలు అందుకుంటున్న అతడు స్థాయికి తగ్గట్లు రాణిస్తే జట్టుకు తిరుగుండదు. బౌల్ట్, దీపక్ చాహర్ నుంచి అతడికి సహకారం అందితే ముంబైను ఆపడం ప్రత్యర్థులకు కష్టతరమే. తాజా టి20 ప్రపంచకప్లో అదరగొట్టిన ఇంగ్లండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్తో పాటు న్యూజిలాండ్ కెపె్టన్ సాంట్నర్ స్పిన్ భారం మోయనున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్గా బౌలింగ్లో అవసరమైతే మయాంక్ మార్కండే, అశ్వని కుమార్, శార్దుల్ ఠాకూర్ అందుబాటులో ఉన్నారు. గత 13 సీజన్లను ముంబై జట్టు పరాజయంతో ప్రారంభించింది. ఈసారి ఓటమితో కాకుండా గెలుపుతో బోణీ కొడుతుందో లేదో చూడాలి. ముంబై ఇండియన్స్ జట్టు: హార్దిక్ పాండ్యా (కెపె్టన్), రోహిత్, సూర్యకుమార్, రాబిన్ మిన్జ్, రూథర్ఫర్డ్, రికెల్టన్, డికాక్, దానిశ్, తిలక్, నమన్ ధీర్, సాంట్నర్, రాజ్ బావా, అథర్వ, మయాంక్ రావత్, కార్బిన్ బాష్, విల్ జాక్స్, శార్దుల్, ట్రెంట్ బౌల్ట్, మయాంక్ మార్కండే, దీపక్ చాహర్, అశ్వని కుమార్, రఘుశర్మ, ఇజహార్, ఘజన్ఫర్, బుమ్రా.ముంబై ఇండియన్స్ గణాంకాలుఆడిన మ్యాచ్లు 277 గెలిచినవి 153 ఓడినవి 124 అత్యుత్తమ ప్రదర్శన: చాంపియన్ (2013, 2015, 2017, 2019, 2020), రన్నరప్ (2010). -
ODI WC: బీసీసీఐ బిగ్ ప్లాన్.. షార్ట్లిస్టులో ఇరవై పేర్లు!
ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియా 2024 నుంచి ఏకంగా మూడు టైటిళ్లు గెలిచింది. టీ20 ప్రపంచకప్-2024, చాంపియన్స్ ట్రోఫీ-2025, టీ20 ప్రపంచకప్-2026లలో చాంపియన్గా నిలిచింది. తదుపరి వన్డే వరల్డ్కప్-2027 టోర్నీ రూపంలో మరో ఐసీసీ ఈవెంట్ వేచి ఉంది.షార్ట్లిస్టులో ఇరవై పేర్లు!ఈ మెగా టోర్నీకి దాదాపు పద్దెనిమిది నెలలకు పైగానే సమయం ఉంది. అయినప్పటికీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటి నుంచే జట్టు ఎంపికపై దృష్టి సారించింది. ఇప్పటికే దాదాపు ఇరవై మంది ఆటగాళ్లను షార్ట్లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2026 ప్రదర్శన కూడా ఇందులో కీలకం కానున్నట్లు సమాచారం.ప్రణాళికలు సిద్ధంచీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సహా ఎస్ఎస్ దాస్, ఆర్పీ సింగ్, అజయ్ రాత్రా, ప్రజ్ఞాన్ ఓజా ఇందుకు సంబంధించి కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు PTIతో మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్క సెలక్టర్ ఐపీఎల్లో వారానికి ఒక్క మ్యాచ్ అయినా ప్రత్యక్షంగా చూసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో ఉంది.తద్వారా వారానికి ఐదు మ్యాచ్లు కవర్ అవుతాయి. ఇక టీవీలోనూ మ్యాచ్లు వీక్షించడం ద్వారా ఆటగాళ్ల ఫామ్పై సెలక్టర్లు ఓ అంచనాకు వస్తారు’’ అని పేర్కొన్నాయి. కాగా టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మలపై సెలక్టర్లు ఎక్కువగా దృష్టి సారించే అవకాశం ఉంది.వారికి చోటు ఉందా?ఐపీఎల్లో కోహ్లి బెంగళూరు జట్టు తరఫున, రోహిత్ ముంబై తరఫున కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టెస్టు, అంతర్జాతీయ టీ20లకు స్వస్తి పలికిన రో-కోలకు ఈసారి ఐపీఎల్ అత్యంత కీలకం కానుంది. గతేడాది దేశీ వన్డే క్రికెట్ బరిలో దిగిన ఈ ఇద్దరూ అక్కడా సత్తా చాటారు. ఆ తర్వాత టీమిండియా తరఫునా అదరగొట్టారు. తద్వారా తాము వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇచ్చారు. అయితే, సెలక్టర్లు వీరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.చదవండి: పాకిస్తాన్కు షాకిచ్చిన బంగ్లా క్రికెట్ బోర్డు! -
T20 WC 2026: బీసీసీఐకి అగార్కర్ రిక్వెస్ట్!
టీమిండియా గత మూడేళ్లలో పరిమిత ఓవర్ల క్రికెట్లో నాలుగు ఐసీసీ టోర్నమెంట్లు ఆడింది. సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023 ఎడిషన్లో రన్నరప్గా నిలిచిన రోహిత్ సేన.. 2024లో అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో చాంపియన్గా నిలిచింది.ఇక దుబాయ్లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ను కూడా రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ సొంతం చేసుకుంది. తాజాగా స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్-2026లో సూర్య (Suryakumar Yadav) కెప్టెన్సీలో విజేతగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. అంతేకాదు సొంతగడ్డపై తొలిసారి, వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి పొట్టి క్రికెట్ వరల్డ్కప్ గెలిచిన తొలి జట్టుగా రికార్డు సాధించింది.సాహసోపేత నిర్ణయాలుఈ నాలుగు సందర్భాల్లోనూ టీమిండియా చీఫ్ సెలక్టర్గా అజిత్ అగార్కర్ ఉన్నాడు. 2020-21లోనే ఈ పదవి కోసం అతడు పోటీ పడగా చేతన్ శర్మకు అవకాశం దక్కింది. అయితే, చేతన్ శర్మ టీమిండియా ఆటగాళ్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడి పదవి పోగొట్టుకున్నాడు.ఫలితంగా జూన్, 2023లో అజిత్ అగార్కర్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. జట్టు ఎంపిక విషయంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ ఒక్కోసారి విమర్శలు కూడా మూటగట్టుకున్నాడు ఈ మాజీ క్రికెటర్. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్టులకు గుడ్బై చెప్పిన నేపథ్యంలో హెడ్కోచ్ గౌతం గంభీర్తో పాటు అగార్కర్పై కూడా విమర్శలు వచ్చాయి.రో-కో ఆడటం కష్టమంటూఅంతేకాదు వన్డే వరల్డ్కప్-2027లో రో-కో ఆడటం కష్టమంటూ అతడు చేసిన వ్యాఖ్యలు, అర్ధంతరంగా రోహిత్ శర్మను వన్డే సారథిగా తప్పించి శుబ్మన్ గిల్కు పగ్గాలు ఇవ్వడం అగార్కర్పై అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి.అదే సమయంలో టీ20 ప్రపంచకప్-2026 జట్టు నుంచి టెస్టు, వన్డే కెప్టెన్ గిల్ను తప్పించడం.. అతడి స్థానంలో వచ్చిన ఇషాన్ కిషన్ చెలరేగడం అగార్కర్పై సానుకూలత వచ్చేలా చేశాయి. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడికి మంచి రికార్డే ఉన్నా.. టెస్టుల్లో మాత్రం చేదు అనుభవాలు ఉన్నాయి. 2023-25 వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో టీమిండియా కనీసం ఫైనల్కు కూడా చేరకపోవడం ఇందుకు నిదర్శనం.మరోసారి..ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025కి ముందే అగార్కర్ పదవీకాలాన్ని పొడగిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. అగార్కర్ మరోసారి తన పదవీకాలాన్ని పొడిగించాల్సిందిగా బీసీసీఐని అభ్యర్థించినట్లు సమాచారం.వన్డే వరల్డ్కప్-2027 ముగిసే వరకు తనను చీఫ్ సెలక్టర్గా కొనసాగించాలని అగార్కర్ బోర్డుకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. వెస్ట్జోన్ నుంచి ఓ మాజీ క్రికెటర్ కూడా ఈ పదవి కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీమిండియాపై ప్రభావం చూపిన అగార్కర్ విషయంలో బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం భారత క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.చదవండి: Dinesh Karthik: 40 ఏళ్ల వయసులో తండ్రైన దినేష్ కార్తీక్ -
’నేను, కోహ్లి, రోహిత్ రిటైర్ అవ్వాలని గంభీర్ కోరుకున్నా పర్లేదు’
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హెడ్కోచ్గా గౌతం గంభీర్ తన పనిని సరిగ్గానే చేశాడని పేర్కొన్నాడు. ఏదేమైనా సరైన సమయంలోనే తాను ఆటకు వీడ్కోలు పలికానని భావిస్తున్నట్లు తెలిపాడు.గంభీర్ హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్నాళ్లకే టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లగా.. టూర్ మధ్యలోనే అనూహ్యంగా అశూ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆసీస్తో తొలి టెస్టులో అశూను బెంచ్కే పరిమితం చేసిన యాజమాన్యం.. వాషింగ్టన్ సుందర్ (Washington Sundar)ను ఆడించింది.పిలిచి.. మళ్లీ తప్పించిఅయితే, రెండో టెస్టు కోసం అశూను పిలిపించింది. ఆ తర్వాత మూడో టెస్టులో అతడి స్థానాన్ని రవీంద్ర జడేజా (Ravindra Jadeja)తో భర్తీ చేశారు. దీంతో ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే అశ్విన్ రిటైర్మెంట్ ఇవ్వడం చర్చకు దారితీసింది. ఇందుకు గంభీర్ కారణం అయి ఉంటాడనే ఊహాగానాలు వచ్చాయి.ఏదేమైనా టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే (619) తర్వాతి స్థానాన్ని ఆక్రమించిన అశూ (537).. ఇంకొన్నాళ్లు ఆడి ఉంటే అతడి రికార్డు సమం చేయగలిగే వాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అశూ తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.అదే అతిపెద్ద బలం‘‘సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం నాకున్న అతిపెద్ద బలం. అది తప్పా, ఒప్పా అని ప్రజలు చర్చించుకున్నా నేనేం పట్టించుకోను. పెర్త్లో వాషీ, ఆ తర్వాత అడిలైడ్లో నేను, బ్రిస్బేన్లో జడేజా.. ఇలా ఒకరి తర్వాత ఒకరం స్పిన్ దళాన్ని నడిపించాము.నేను జట్టులోకి వస్తూ పోతూ ఉన్నాను. దానర్థం వాషీ, జడ్డూకు నేను మార్గం సుగమం చేయాలనే కదా అనిపించింది. వద్దన్నా నేను పట్టుకుని వేలాడే రకం కాదు. కెరీర్లో నేను చాలా దూరం వచ్చేశాను. అనుకున్నవి సాధించగలిగాను. కొంతమంది ఈ విషయంలో గంభీర్ గురించి వారికి నచ్చినట్లు మాట్లాడారు.నేను, కోహ్లి, రోహిత్ రిటైర్ అవ్వాలని గంభీర్ కోరుకున్నా పర్లేదుకోచ్గా తన జాబ్ తాను చేశాడు. ఒకవేళ నేను, విరాట్, రోహిత్.. రిటైర్మెంట్ ప్రకటించాలని ఆయన కోరుకుని ఉండవచ్చు. హెడ్కోచ్గా ఆయన ఆలోచనలు ఆయనకు ఉంటాయి. ఇందులో తప్పుబట్టడానికి ఏమీలేదు.స్వార్థం, ఈగో వదిలేయాలని నేను ఎల్లప్పుడూ అనుకుంటూ ఉంటాను. ఇప్పటికీ ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మనం మనుషులం. భావోద్వేగాలు ఉండటం సహజం’’ అని అశూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. కాగా ఆసీస్ టూర్ తర్వాత అకస్మాత్తుగా రోహిత్ శర్మ టెస్టులకు గుడ్బై చెప్పగా.. అనూహ్య రీతిలో టెస్టు దిగ్గజ బ్యాటర్ కోహ్లి సైతం ఇదే బాటలో నడిచాడు. దీంతో గంభీర్పై మరోసారి విమర్శలు వచ్చాయి. చదవండి: T20 WC Final: ’అర్ష్దీప్ చేసిన పనికి అతడికి క్షమాపణలు చెప్పాను’ -
రోహిత్ శర్మ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తిరిగి అభిమానులను అలరించేందుకు సిద్దమవతున్నాడు. ఐపీఎల్-2026 సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున హిట్మ్యాన్ బరిలోకి దిగనున్నాడు. ఈ ఏడాది సీజన్ కోసం రోహిత్ పూర్తి స్థాయిలో టీమ్తో కలిసి ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. మంగళవారం నెట్స్లో రోహిత్ తీవ్రంగా శ్రమించాడు. అయితే ఈ క్యాష్ రిచ్ లీగ్ ఆరంభానికి ముందు రోహిత్ అభిమానులకు ముంబై ఇండియన్స్ హెడ్కోచ్ మహేలా జయవర్ధనే గుడ్ న్యూస్ చెప్పాడు. ఐపీఎల్-19వ సీజన్లో రోహిత్ శర్మను 'ఇంపాక్ట్ ప్లేయర్'గా ఉపయోగించే ఆలోచన లేదని, అతను పూర్తిస్థాయి ఆటగాడిగా మైదానంలో ఉంటాడని జయవర్ధనే స్పష్టం చేశాడు.కాగా గత సీజన్లో రోహిత్ చాలా మ్యాచ్లలో ఇంపార్ట్ ప్లేయర్గా బరిలోకి దిగాడు. కేవలం బ్యాటింగ్ మాత్రమే చేసి, మిగితా సమయంలో డగౌట్లో ఉండేవాడు. కానీ ఇప్పుడు ఫీల్డ్లో కూడా తన అనుభవాన్ని కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పంచుకోనున్నాడు."గతేడాది రోహిత్ శర్మ చిన్న చిన్న గాయాలతో బాధపడ్డాడు. అందుకే అతడిని మేము ఇంపాక్ట్ సబ్గా ఉపయోగించాము. వర్క్లోడ్ మేనెజ్మెంట్లో భాగంగానే విశ్రాంతి ఇచ్చాము. మైదానంలో ఉన్నా లేకపోయినా అతడి ప్రభావం జట్టుపై కచ్చితంగా ఉంటుంది. కానీ ఈ ఏడాది సీజన్లో మాత్రం రోహిత్ను కచ్చితంగా ఎక్కువ సమయం మైదానంలోనే ఉంచుతాము.అయితే జట్టులో ఎక్కువ మంది ఆల్రౌండర్ల ఉన్నందున.. మ్యాచ్ పరిస్థితుల బట్టి ఇంపాక్ట్ ప్లేయర్ను రోటేట్ చేస్తాము" అని ఓ ఇంటర్వ్యూలో జయవర్ధనే పేర్కొన్నాడు. ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్లో మార్చి 29న కేకేఆర్తో తలపడనుంది.చదవండి: T20 WC: డీఎస్పీగా సంజూ శాంసన్!? -
రోహిత్ సాధన షురూ...
ముంబై: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చెరో ఐదు టెటిల్స్తో అగ్ర స్థానంలో ఉన్నాయి. అయితే గత ఐదు సీజన్లలో ముంబై ప్రదర్శన ఆశించినంత మెరుగ్గా లేదు. 2020లో ట్రోఫీని అందుకున్న తర్వాత టీమ్ పెద్దగా ఆకట్టుకోలేదు. మూడు సీజన్లలో ‘ప్లే ఆఫ్స్’కు చేరడంలో విఫలమైన జట్టు... మిగిలిన రెండు సందర్భాల్లో నాలుగో స్థానానికే పరిమితమైంది. ప్రస్తుత జట్టుతో 2026లోనైనా జట్టు రాత మారుతుందా అనేది చూడాలి. ఈ నేపథ్యంలో ముంబై స్టార్ బ్యాటర్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి స్థాయిలో టీమ్తో కలిసి ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో రోహిత్ చివరి సారి మైదానంలోకి దిగాడు. ఆ సిరీస్లో అతను వరుసగా 26, 24, 11 పరుగులు చేశాడు. ఇప్పుడు మళ్లీ బ్యాట్ పట్టి ఐపీఎల్ కోసం అతను సన్నద్ధమవుతున్నాడు. మంగళవారం సాధనలో అతను సుదీర్ఘ సమయం పాటు నెట్స్లో గడిపాడు. బౌలర్లందరినీ అలవోకగా ఎదుర్కొంటూ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా రోహిత్ గతంలో కంటే పూర్తి ఫిట్గా, చురుగ్గా కనిపిస్తుండటం విశేషం. 2025 సీజన్లో రోహిత్ 15 ఇన్నింగ్స్లలో 149.28 స్ట్రయిక్ రేట్తో 418 పరుగులు సాధించాడు. టీమ్ హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే పర్యవేక్షణలో జట్టు ఆటగాళ్ల ప్రాక్టీస్ సాగింది. -
రోహిత్, కోహ్లీతో విభేదాలు.. మౌనం వీడిన గంభీర్!
టీమిండియా స్టార్క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మెరుగైన సంబంధాలు కొనసాగించలేదా అనే విషయం ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఎందుకంటే గంభీర్ కోచ్గా వచ్చిన కొద్ది రోజులకే బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్ వైఫల్యం అనంతరం రోహిత్, విరాట్లు ఏకకాలంలో టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికారు. ఈ ఇద్దరు టెస్టు ఫార్మాట్కు వీడ్కోలు పలకడానికి ఒకరకంగా గంభీరే కారణమని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. తాజాగా కోల్కతాలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి అతిథిగా హాజరైన గంభీర్ చాలా విషయాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా రోహిత్, కోహ్లీతో ఉన్న బంధాన్ని నేరుగా కాకుండా పరోక్షంగా ప్రస్తావించడం ఆసక్తి కలిగించింది. ‘మనిషిగా నేను తప్పులు చేయడం సహజం. కోచ్ పాత్రలో ఉన్నప్పుడు తప్పులు జరుగుతాయి. అలాగే ఆటగాళ్లు కూడా తప్పులు చేయడం జరుగుతుంటుంది. గత 18 నెలల్లో కోచ్గా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ దాని గురించి పెద్దగా పట్టించుకోను. సోషల్ మీడియాలో నేను కోహ్లి, రోహిత్లకు వ్యతిరేకంగా వస్తున్న ప్రతి కామెంట్కు సమాధానం ఇవ్వడం నా పని కాదు. భారత జట్టు నా ఒక్కడిదే కాదు.. అది డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నవాళ్లతో పాటు దేశంలోని ప్రతి ఒక్కరిది. కానీ ఒక విషయం మాత్రం కచ్చితంగా నమ్ముతా. అదేంటంటే కొన్నిసార్లు మంచి ఉద్దేశంతో తీసుకునే నిర్ణయాలు విఫలం కావొచ్చు. కానీ తప్పుడు ఉద్దేశంతో కూడిన తప్పుడు నిర్ణయాలు మాత్రం డ్రెస్సింగ్ రూమ్లో ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. పని విషయంలో నేను నిజాయితీగా ఉన్నంతవరకు, ఎదుటివారి కళ్లలోకి చూస్తూ ధైర్యంగా మాట్లాడగలను. నా తప్పు లేనంత వరకు అన్ని విషయాల్లో కఠినంగానే ఉంటాను.’అని గంభీర్ చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ల ఓటమి తర్వాత కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మలను బీసీసీఐ సమీక్షకు పిలిచింది. ఆ సమయంలో టీమిండియా ఆటగాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డుకుంటూ బోర్డు అనేక మార్గదర్శకాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని గంభీర్ స్వాగతించగా, రోహిత్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. అప్పుడే రోహిత్ శర్మను టెస్టు కెప్టెన్గా వైదొలగాలని బోర్డు ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొంతకాలానికే రోహిత్ శర్మ, కోహ్లీలు టెస్టు కెరీర్కు గుడ్బై చెప్పారు. రోహిత్ టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలు శుబ్మన్ గిల్కు అప్పగించారు. గిల్ కెప్టెన్సీలో ఇంగ్లండ్, వెస్టిండీస్లపై టెస్టు సిరీస్లు నెగ్గినప్పటికీ, ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో మిశ్రమ ఫలితమే వచ్చింది. ఇక కోహ్లీ, రోహిత్ శర్మలు ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ ఇద్దరు అంతర్జాతీయ కెరీర్కు గుడ్బై చెప్పే అవకాశముంది.🚨 BREAKING & EXCLUSIVE 🚨 "I am human, I am allowed to make mistakes": Gautam Gambhir opens up on dressing room relationships. He also shares his views on Rohit Sharma-Virat Kohli@AgeasFederal #GautamGambhir #Trailblazers4 pic.twitter.com/alsJdNHvm4— RevSportz Global (@RevSportzGlobal) March 16, 2026 -
ఇదేం పద్ధతి?.. బీసీసీఐపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఫైర్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీరుపై టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘అసలు ఇదేం పద్ధతి.. చరిత్ర చెరిగిపోదు.. మీ కుట్రలు ఫలించవు’’ అంటూ తీవ్ర స్థాయిలో సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమం ‘నమన్-2026’లో దొర్లిన తప్పిదమే ఇందుకు కారణం.రెండు ఐసీసీ టైటిళ్లువిరాట్ కోహ్లి (Virat Kohli) తర్వాత టీమిండియా పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ 2024లో టీ20 ప్రపంచకప్, 2025లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని భారత్కు అందించాడు. తద్వారా మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni-3)తర్వాత టీమిండియాకు అత్యధిక టైటిళ్లు అందించిన సారథిగా చరిత్రకెక్కాడు.ఇక 2024లో టీ20 వరల్డ్కప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20 క్రికెట్కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. గతేడాది టెస్టులకూ గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్న హిట్మ్యాన్కు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది,వన్డే కెప్టెన్గా ఇప్పటికీ సిరీస్ గెలవని గిల్గతేడాది.. అనూహ్య రీతిలో ఆస్ట్రేలియాతో సిరీస్కు ముందు రోహిత్ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి.. శుబ్మన్ గిల్ను సారథిగా నియమించింది. గిల్ కెప్టెన్సీలో భారత్ ఇప్పటి వరకు ఒక్క వన్డే సిరీస్ కూడా గెలవలేదు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతిలో ఓడిన గిల్ సేన.. సొంతగడ్డపై మరీ దారుణంగా న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్స్వీప్నకు గురైంది.ఇదిలా ఉంటే.. నమన్ అవార్డుల పురుషుల విభాగంలో భారత అత్యుత్తమ క్రికెటర్ అవార్డు గిల్కు దక్కింది. ఇంగ్లండ్తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్లో 754 పరుగులు చేసి అటు బ్యాటర్గా, ఇటు సారథిగా గిల్ అత్యుత్తమ ఆటతీరు కనబరిచినందుకు ఈ అవార్డు వరించింది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 విన్నింగ్ కెప్టెన్?ఈ నేపథ్యంలో గిల్ మాట్లాడుతున్న సమయంలో.. నిర్వాహకులు.. ‘శుబ్మన్ గిల్, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 విన్నింగ్ కెప్టెన్’’ అని అతడి పేరును స్క్రీన్పై వేశారు. ఇదే రోహిత్ శర్మ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.ఇంత వరకు ఒక్క వన్డే సిరీస్ గెలవని కెప్టెన్కు ఏకంగా చాంపియన్స్ ట్రోఫీ విన్నింగ్ కెప్టెన్ అని వేయడం ఏమిటని, రోహిత్ శర్మ ఘనత చెరిపేసినా చెరిగిపోదని బీసీసీఐకి చురకలు అంటిస్తున్నారు. మరికొందరు మాత్రం పొరపాటున తప్పు దొర్లి ఉంటుందని కామెంట్ చేస్తుండగా.. రోహిత్ను అవమానించేందుకే ఇలా చేశారంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.చదవండి: : అతడికి 6 ఓవర్లు చాలు.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తాడుReally???? pic.twitter.com/R0w8hrjFZq— Rohan💫 (@rohann__45) March 15, 2026 -
మా జట్లను చూస్తుంటే గర్వంగా ఉంది: రోహిత్ శర్మ
విశ్వవేదికపై భారత పురుషల, మహిళల జట్లు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. వరుసగా రెండు ఐసీసీ వరల్డ్కప్ టైటిల్స్ గెలుచుకుని తమ సత్తాను మరోసారి క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పాయి. గతేడాది జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ విజేతగా హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ నిలిచింది. ముంబై వేదికగా జరిగిన జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించిన ఉమెన్ ఇన్ బ్లూ.. తొలి వరల్డ్కప్ టైటిల్ను ముద్దాడింది.ఈ చారిత్రత్మక విజయం భారత క్రీడారంగంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. మరోవైపు సొంతగడ్డపై జరిగిన మెన్స్ టీ20 వరల్డ్కప్-2026 ఛాంపియన్స్గా సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా అతరించింది.వరుసగా రెండోసారి టైటిల్ను నిలబెట్టుకున్న తొలి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో హర్మన్, సూర్య బృందాలపై టీమిండియా స్టార్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. తమ జట్లు సాధించిన విజయాల పట్ట తనకు ఎంతో గర్వంగా ఉందని రోహిత్ అన్నాడు."విజయాల వెనుక ప్రత్యేకమైన రహస్యాలు ఏమి లేవు. కేవలం కఠోర శ్రమ మాత్రమే ఉంది. ఈ విజయాలను అందుకోవడానికి ఎంతో శ్రమించారు. మైదానంలో ఆడే ఆటగాళ్లే కాకుండా, తెర వెనుక పని చేసే ఎంతో మంది సిబ్బంది కృషి కూడా ఈ విజయాల్లో దాగి ఉంది. వారందరికీ ఈ క్రెడిట్ దక్కాలి.గత రెండేళ్లలో మా జట్లు సాధించిన విజయాల పట్ల చాలా గర్వంగా ఉంది. కేవలం పురుషల జట్టు మాత్రమే కాదు ముంబైలో ఉమెన్స్ టీమ్ కూడా అద్భుతం చేసింది. ఈ విజయాల జోరును ఇలాగే కొనసాగిస్తూ.. భవిష్యత్తులో దేశం కోసం మరిన్ని మేజర్ టైటిళ్లను గెలవాలని ఆశిస్తున్నా" అని రోహిత్ ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ పేర్కొన్నాడు.చదవండి: సన్రైజర్స్కు పాక్ ప్లేయర్ ఆడడం కష్టమే? -
విసిగిపోయాం.. రోహిత్ శర్మకు హార్దిక్ పాండ్యా వార్నింగ్!?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్రకెక్కింది. రోహిత్ శర్మ సారథ్యంలో 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో ట్రోఫీని ముద్దాడింది.ఆరో టైటిల్ కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న ముంబై (MI) ఈసారి ఎలాగైనా చాంపియన్గా నిలవాలని పట్టుదలగా ఉంది. కాగా గతేడాది పద్నాలుగింట ఎనిమిది గెలిచిన ముంబై నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే.హార్దిక్కు పగ్గాలుఇదిలా ఉంటే... 2024లో గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యా (Hardik Pandya)ను ముంబై తమ కెప్టెన్గా నియమించింది. దీంతో రోహిత్ శర్మను తొలగించి అతడి స్థానంలో హార్దిక్కు పగ్గాలు ఇవ్వడం పట్ల సొంతజట్టు అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. హార్దిక్ను మైదానం లోపల, వెలుపలా తీవ్ర స్థాయిలో ట్రోల్ చేశారు.ఈసారి మంచి మార్కులేఆ ఏడాది ముంబై మరీ దారుణంగా పద్నాలుగుకు నాలుగు మ్యాచ్లే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున పదోస్థానానికే పరిమితమైంది. అయితే, గతేడాది ప్లే ఆఫ్స్ చేర్చిన హార్దిక్ కెప్టెన్సీకి మంచి మార్కులే పడ్డాయి. మరోవైపు.. గత సీజన్లో రోహిత్ శర్మ ఎక్కువగా ఇంపాక్ట్ ప్లేయర్గానే బరిలో దిగాడు. మొత్తంగా 15 ఇన్నింగ్స్లో కలిపి 418 పరుగులు సాధించాడు.రోహిత్ శర్మకు హార్దిక్ పాండ్యా వార్నింగ్!?ఈ పరిణామాల నేపథ్యంలో హార్దిక్ పాండ్యా- రోహిత్ శర్మకు సంబంధించి ఓ వదంతి పుట్టుకొచ్చింది. రోహిత్ ప్రదర్శన పట్ల అసంతృప్తితో ఉన్న హార్దిక్ అతడికి వార్నింగ్ ఇచ్చాడని దాని సారాంశం. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ ఓ నెటిజన్.. ‘‘ఐపీఎల్ 2026 ఆరంభానికి ముందు హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మకు గట్టిగానే హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.ఒకవేళ ఈసారి రోహిత్ శర్మ ప్రదర్శన సరిగ్గా లేకపోతే.. తాను సహించే ప్రసక్తే లేదని మేనేజ్మెంట్కు తేల్చి చెప్పాడు. యాజమాన్యం కూడా గత 10-12 ఏళ్లుగా రోహిత్ బ్యాటింగ్తో విసిగిపోయి ఉంది. అతడి స్ట్రైక్రేటు 120 కూడా దాటడం లేదు. ఎక్కువ మొత్తం అందుకుంటున్న ఆటగాడి నుంచి ఈ ప్రవర్తన మేము ఊహించలేదని వాపోతోంది’’ అని పేర్కొన్నారు.స్పందించిన ముంబైఈ ట్వీట్ వైరల్ కాగా.. ముంబై ఇండియన్స్ తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి స్వయంగా స్పందించింది. ‘‘అవునా.. ఏదైనా జరగొచ్చు’’ అంటూ నవ్వుతున్న ఎమోజీ జోడించి.. ఎవరికిష్టం వచ్చినట్లు వారు రాస్తారు అన్న అర్థంలో రూమర్లను కొట్టిపారేసింది. చదవండి: IPL 2026: సీఎస్కేను కోర్టుకీడ్చిన కావ్యా మారన్!Kuch bhi! 😂 https://t.co/lEiFBgaEoh pic.twitter.com/SYw1im5Mfi— Mumbai Indians (@mipaltan) March 13, 2026 -
రోహిత్-కోహ్లి అభిమానులకు శుభవార్త
భారత దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త అందుతుంది. 2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా క్రికెట్లో కొనసాగుతున్న రో-కోకు ఆ మెగా టోర్నీకి ముందు అదనపు వన్డేలు ఆడే ఆస్కారమున్నట్లు తెలుస్తుంది. ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్లో (FTP) షెడ్యూలైన మ్యాచ్లకు అదనంగా కొన్ని దేశాలు భారత్తో వన్డేలు ఆడేందుకు బీసీసీఐని సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఏడాది భారత్ షెడ్యూల్ కిక్కిరిసిపోయింది. అదనంగా మ్యాచ్లు అంటే అభిమానులకు పండగే. శ్రీలంక, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఐర్లాండ్ దేశాల క్రికెట్ బోర్డులు అదనపు మ్యాచ్ల కోసం బీసీసీఐని అభ్యర్థిస్తున్నట్లు తెలుస్తుంది.కొద్ది రోజుల కిందటే టీ20 ప్రపంచకప్ ముగిసిన విషయం తెలిసిందే. మార్చి 28 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రెండు నెలలకు పైగా ప్రపంచ క్రికెటర్లంతా బిజీగా ఉంటారు. టీమిండియా అంతర్జాతీయ షెడ్యూల్ జూన్లో ఆఫ్ఘనిస్తాన్ సిరీస్తో మొదలవుతుంది.అనంతరం జులై 1 నుంచి భారత జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం ఇంగ్లండ్లో పర్యటించాల్సి ఉంది. ఈ మధ్యలోనే ఐర్లాండ్ జట్టు టీమిండియాతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం అభ్యర్థిస్తుందట. ఈ విషయం పట్ల బీసీసీఐ కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తుంది.ఆతర్వాత భారత జట్టు ఆగస్టు–సెప్టెంబర్ నెలల్లో టెస్ట్, టీ20 సిరీస్ల కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. ఇది కాకుండా శ్రీలంక జట్టు ఈ ఏడాది చివర్లో భారత్తో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం రిక్వెస్ట్ చేస్తుందని తెలుస్తుంది.ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తుంది. ఇందులో 2 టెస్ట్లు, 3 వన్డేలు, 5 టీ20లు షెడ్యూల్ అయ్యాయి. వీటికి అదనంగా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మరిన్ని వన్డేలు ఆడాలని బీసీసీఐని కోరుతుంది.వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ఇంగ్లండ్ కూడా భారత్తో అదనపు వన్డే సిరీస్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇవే కాక బంగ్లాదేశ్, జింబాబ్వే లాంటి చిన్న జట్లతో పరిమిత ఓవర్ల సిరీస్లు కూడా FTPకి అదనంగా ప్రోగ్రెస్లో ఉన్నట్లు తెలుస్తుంది.మొత్తానికి 2027 వన్డే ప్రపంచకప్కు సన్నద్దం కావాలనుకుంటున్న విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు మెగా టోర్నీకి ముందు వీలైనన్ని వన్డేలు ఆడే అవకాశం దొరికేలా ఉంది. ఇది వారివారి అభిమానులకు పండగే. రో-కో టెస్ట్, టీ20లకు వీడ్కోలు పలికి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్ వచ్చే ఏడాది సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికగా అక్టోబర్, నవంబర్ నెలల్లో జరుగనుంది. ఈ లోపు రో-కో పదుల సంఖ్యలో వన్డేలు ఆడే అవకాశం ఉంటుంది. దీని వల్ల దిగ్గజాలు మరిన్ని రికార్డులు బద్దలు కొట్టి, అభిమానుల గుండెల్లో తమ స్థానాలను మరింత సుస్థిరం చేసుకుంటారు.ఐపీఎల్ 2026 అనంతరం టీమిండియా షెడ్యూల్ (అంచనా)..ఆఫ్ఘనిస్తాన్తో 3 వన్డేలు, ఓ టెస్ట్ఐర్లాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లకు సన్నాహాలు జరుగుతున్నాయిఇంగ్లండ్తో 3 వన్డేలు, 5 టీ20లు (అదనపు మ్యాచ్లపై ఆసక్తి)శ్రీలంకతో 3 టీ20లు, 2 టెస్ట్లుబంగ్లాదేశ్తో 3 వన్డేలు, 3 టీ20లు (ప్రభుత్వ అనుమతి అవసరం)ఆఫ్ఘనిస్తాన్తో 3 టీ20లుజింబాబ్వే టీ20 సిరీస్కు సన్నాహాలు జరుగుతున్నాయివెస్టిండీస్తో 3 వన్డేలు, 5 టీ20లుఆసియా క్రీడలున్యూజిలాండ్తో 3 వన్డేలు, 5 టీ20లు, 2 టెస్ట్లు (అదనంగా 2 వన్డేలకు అభ్యర్థన)శ్రీలంకతో 3 వన్డేలు, 3 టీ20లుఆస్ట్రేలియాతో 5 టెస్ట్లు -
T20 WC: రోహిత్, ద్రవిడ్పై సూర్యకుమార్ విమర్శలు?!
టీమిండియా ఇప్పటికి మూడు టీ20 ప్రపంచకప్ ట్రోఫీలు గెలిచింది. ఐసీసీ తొలిసారి 2007లో ప్రవేశపెట్టిన పొట్టి క్రికెట్ వరల్డ్కప్లో ధోని సారథ్యంలో విజేతగా నిలిచిన భారత్.. 2024లో రోహిత్ కెప్టెన్సీలో టైటిల్ గెలిచింది. తాజాగా సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో 2026లో సొంతగడ్డపై ట్రోఫీని ముద్దాడి చరిత్ర సృష్టించింది.2024 మాదిరి కాదుఅయితే, 2024లో నాటి కెప్టెన్ రోహిత్- హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rohit Sharma- Rahul Dravid) అనుసరించిన విధానాలకు, 2026లో సూర్య- గంభీర్ వ్యూహాలకు చాలా తేడా ఉందని యాజమాన్యం చెబుతోంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ విషయంపై స్వయంగా స్పందించాడు. వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడకూడదనే నియమం పెట్టుకున్నామని.. అదే తమకు సత్ఫలితాలు ఇచ్చిందని పేర్కొన్నాడు.వ్యక్తిగత రికార్డులను పక్కనపెట్టి..‘‘2024 టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఎలా ఆడామో మాకు తెలుసు. అయితే, అదే బ్రాండ్ ఆఫ్ క్రికెట్తో కొనసాగితే కష్టమని అర్థమైంది. అందుకే.. వ్యక్తిగత మైలురాళ్లను పక్కన పెట్టి మ్యాచ్లు గెలవడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం.ఈసారి సెమీ ఫైనల్ వరకు అందరూ ఈ విషయాన్ని గమనించే ఉంటారు.. మా జట్టులోని ఆటగాళ్లలో ఒక్కరూ టాప్ రన్ స్కోరర్ లేదంటే లీడింగ్ వికెట్ టేకర్గా లేరు. అయినా సరే మేము గెలుస్తూనే ఉన్నాం.ప్రతి మ్యాచ్లో ప్రతి ఒక్క ఆటగాడు తనవంతు సహకారం అందించాడు. వ్యక్తిగత రికార్డులను పక్కనపెట్టి.. ఇలా జట్టుగా ముందుకు సాగాలన్న వ్యూహాన్ని ఓ వైరస్లాగా వ్యాప్తి చేయాలని మేము నిర్ణయించుకున్నాం. పద్దెనిమిది నెలల క్రితమే ఈ సంప్రదాయాన్ని జట్టులో ప్రవేశ పెట్టాము’’ అని సూర్యకుమార్ యాదవ్ ఇండియన్ ఎక్స్ప్రెస్తో పేర్కొన్నాడు.కోహ్లిపై విమర్శలుఇక టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ సైతం సూర్య అభిప్రాయంతో ఏకీభవించాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి గురించి అతడు చేసిన వ్యాఖ్యలు అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ‘‘గత వరల్డ్కప్ గెలిచిన జట్టులో రోహిత్, విరాట్, జడేజా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో నిండి ఉంది.ఈసారి బుమ్రా, హార్దిక్ తప్ప పెద్దగా అనుభవం ఉన్న వాళ్లు లేరు. అయితే, అప్పటికి ఇప్పటికి మేము ఇన్నింగ్స్ ప్లాన్ చేసిన విధానం వేరుగా ఉంది. మా ఆలోచనకు తగినట్లు అప్పుడు రోహిత్ శర్మ మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడేవాడు.కానీ విరాట్ కోహ్లి యాంకర్ ఇన్నింగ్స్ ఆడేవాడు. ఇతరులతో కలిసి భాగస్వామ్యాలు నెలకొల్పడం, కాస్త నెమ్మదిగా ఆడటం వంటి వ్యూహం ఉండేది. కానీ ఇప్పుడలా కాదు. హార్దిక్, అభిషేక్ వంటి ఆటగాళ్లు తమదైన శైలిలో కొత్త జోష్ తీసుకువచ్చారు. 2024, 2026 జట్ల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఇదే’’ అని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు.చదవండి: T20 WC 2026: ‘అతడిపై వేటు నా నిర్ణయమే.. నాపై కోప్పడ్డాడు’ -
కోహ్లీ అందుకే రాలేకపోయాడా!
సొంతగడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్ను టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత జట్టు ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్కు అందుకుంది. అయితే ఈ మ్యాచ్కు ముఖ్య అతిథులుగా మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ హాజరైన సంగతి తెలిసిందే. అయితే కింగ్ విరాట్ కోహ్లీ మాత్రం ప్రపంచప్ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు రాకపోవడం వెనుక సోషల్ మీడియాలో అభిమానుల మధ్య పెద్ద చర్చే జరుగుతున్నది. కోహ్లీ రాకపోవడం వెనుక అభిమానులు ఎవరికి వారే తమకు నచ్చింది ఊహించుకుంటున్నారు. ధోనీ, రోహిత్లు కెప్టెన్లుగా ఐసీసీ ట్రోఫీలు సాధించారని, కానీ కోహ్లీ మాత్రం కెప్టెన్గా ఒక ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేకపోయాడని, అందుకే తాజా టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్కు హాజరయ్యేందుకు సముఖత వ్యక్తం చేయలేదని భావిస్తున్నారు. దక్షిణాఫ్రికా వేదికగా 2007 తొలి టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు ధోనీ సారథ్యం వహించగా, అమెరికా, వెస్టిండీస్లు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన 2024 టీ20 ప్రపంచకప్ను నెగ్గిన టీమిండియాకు రోహిత్ కెప్టెన్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే కోహ్లీ 2017 చాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్కప్, 2021 ఐసీసీ టెస్టు చాంపియన్షిప్, 2021 టీ20 ప్రపంచకప్ వంటి మేజర్ టోర్నీల్లో కెప్టెన్గా వ్యవహరించినప్పటికీ టైటిల్ అందుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. మరోవైపు టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్ కోహ్లీ తన కుటుంబంతో సహా లండన్లో స్థిరపడిన సంగతి తెలిసిందే. మూడు ఫార్మాట్లలో క్రికెట్ ఆడినంత కాలం కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయాడు. తాజాగా ఒక్క ఫార్మాట్కే పరిమితం కావడంతో కుటుంబంతో సమయం గడపడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాడని, అందుకే టీ20 ప్రపంచకప్ ఫైనల్ వీక్షించేందుకు అహ్మదాబాద్కు రాలేకపోయాడని పలువురు అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. ఇక ప్రపంచకప్ ఫైనల్తో పాటు అంతకముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్కు కూడా రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీలు తమ కుటుంబాలతో కలిసి వీక్షించేందుకు వచ్చారు. కేవలం వన్డే ఫార్మాట్కు మాత్రమే ఆడుతున్న కోహ్లీ గత జనవరిలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో ఆడాడు. ఆ సిరీస్లో కోహ్లీ సెంచరీ సహా అర్థసెంచరీ సాధించి జట్టు తరఫున టాప్ స్కోరర్గా నిలిచి తన ఫామ్ను కొనసాగిస్తూ వస్తున్నాడు.చదవండి: ఐపీఎల్ 2026పై బిగ్ అప్డేట్ -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్
టీ20 ప్రపంచకప్-2026 సెమీ ఫైనల్లో టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ అదరగొట్టాడు. ఇంగ్లండ్ బౌలింగ్ను చితక్కొడుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మూడో ఓవర్లో తనకు లభించిన లైఫ్ను సద్వినియోగం చేసుకున్న ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ మెరుపు ఇన్నింగ్స్తో అలరించాడు.Ohhhhh, Harry Brook! 😳Sanju Samson makes the most of the lifeline and sends it into the stands! 🚀ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/zOWfIEAdUv— Star Sports (@StarSportsIndia) March 5, 2026మరోసారి సెంచరీ మిస్అయితే, దురదృష్టవశాత్తూ మరోసారి సెంచరీ మిస్సయ్యాడు. ప్రపంచకప్ టోర్నీ ఆరంభానికి ముందు ఫామ్లేమితో సతమతమైన సంజూ ఓపెనర్గా జట్టులో స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే. టీ20 ఓపెనర్, వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్ అతడి స్థానాన్ని భర్తీ చేసి అదరగొట్టాడు.అయితే, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్కు దూరం కాగా.. తొలిసారి సంజూకు వరల్డ్కప్ మ్యాచ్ ఆడే అవకాశం వచ్చింది. అయితే, ఈ మ్యాచ్లో వేగంగా ఆడిన సంజూ 8 బంతుల్లో 22 పరుగులు చేసి అవుటయ్యాడు.అనంతరం సూపర్-8 జింబాబ్వేతో మ్యాచ్ సందర్భంగా తిరిగి తుదిజట్టులోకి వచ్చిన సంజూ.. 15 బంతుల్లో 24 రన్స్ చేయగలిగాడు. అయినప్పటికీ మేనేజ్మెంట్ ఈసారి సంజూపై నమ్మకం ఉంచింది. ఈ క్రమంలో వెస్టిండీస్తో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సంజూ 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్ను గెలిపించి సెమీ ఫైనల్కు చేర్చాడు. అయితే, మూడు పరుగులతో అక్కడ సెంచరీ మిస్సయ్యాడు.8 ఫోర్లు, 7 సిక్స్లు కొట్టితాజాగా ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లోనూ సంజూ శతకం చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. భారత్ ఇన్నింగ్స్లో పద్నాలుగో ఓవర్లో విల్ జాక్స్ బౌలింగ్కు దిగాడు. అతడి బౌలింగ్లో తొందరపడి షాట్కు యత్నించిన సంజూ.. ఫిల్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లు కొట్టి 89 పరుగులు సాధించి.. సెంచరీకి పదకొండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.Just Hardik Pandya things at the Wankhede Stadium! 🔥🚨 RECORD ALERT: 19 sixes by #TeamIndia - the most in an innings in ICC Men's T20 World Cup history!ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/JdGVdpz1B4— Star Sports (@StarSportsIndia) March 5, 2026ఇక ఓపెనర్ అభిషేక్ శర్మ (9)తో కలిసి తొలి వికెట్కు 20 పరుగులు జోడించిన సంజూ.. వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (39)తో కలిసి రెండో వికెట్కు 45 బంతుల్లో 97 పరుగులు, శివం దూబేతో కలిసి మూడో వికెట్కు 43 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది.చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్టీ20 ప్రపంచకప్ ఎడిషన్లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్గా సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్తో సెమీ ఫైనల్ సందర్భంగా ఈ ఘనత సాధించాడు.టీ20 ప్రపంచకప్ ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్లు👉సంజూ శాంసన్- 16 సిక్స్లు- 2026లో👉రోహిత్ శర్మ- 15 సిక్స్లు- 2024లో👉శివం దూబే- 15 సిక్స్లు- 2026లో👉ఇషాన్ కిషన్- 14 సిక్స్లు- 2026లో👉హార్దిక్ పాండ్యా- 14 సిక్స్లు- 2026లో👉యువరాజ్ సింగ్- 12 సిక్స్లు- 2007లో.చదవండి: IND vs ENG: సెమీస్లోనూ ఫెయిల్.. జట్టు నుంచి తీసేయండి! -
ధోని, కోహ్లీ, రోహిత్ గ్రూప్లో సంజూ
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 మ్యాచ్లో వెస్టిండీస్పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ తర్వాత టీమిండియా వికెట్కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఆ ఇన్నింగ్స్కు భారత అభిమానులే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ముగ్దులయ్యారు. ప్రస్తుతం భారత క్రికెట్ సర్కిల్స్లో ఏ నోట విన్నా సంజూ పేరే వినిపిస్తుంది. అప్పటిదాకా తిట్టిపోసిన వారు కూడా విండీస్పై చారిత్రక ఇన్నింగ్స్ తర్వాత సంజూను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.అప్పటికే స్టార్ డమ్ ఉన్న సంజూ, ఆ ఒక్క ఇన్నింగ్స్తో దాన్ని మరింత పెంచుకున్నాడు. ఎంతలా అంటే.. భారత మాజీ వికెట్కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ సంజూను దిగ్గజలు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో పోల్చేంతలా. డీకే సంజూను ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో సమానంగా అభిమానుల ఆదరణ పొందుతున్న ఆటగాడిగా అభివర్ణించాడు. అతని మాటల్లో.. సంజూ దేశంలో అత్యంత అభిమానించబడే క్రికెటర్. ఆయనలో ఏదో ప్రత్యేకత ఉంది. ఎత్తుపల్లాలు ఎదురైనా, అభిమానులు ఎప్పుడూ ఆయనపై నమ్మకం ఉంచారని అన్నాడు.డీకే అభిప్రాయం ప్రకారం, సంజూ ప్రపంచకప్ ప్రారంభం నుంచే జట్టులో ఉండాల్సింది. ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్లపై కష్టపడుతున్న ఎడమచేతి వాటం బ్యాటర్లకు ప్రత్యామ్నాయంగా సంజూ సమతుల్యతను తీసుకొచ్చాడు.వాస్తవానికి సంజూ టాలెంట్ ఎప్పుడూ గుర్తింపు పొందినా.. గాయాలు, అస్థిరత, ఎంపికల మార్పులు అతని కెరీర్ను దెబ్బతీశాయి. అయినప్పటికీ, అతను సహజమైన స్ట్రోక్ ప్లే, ఆత్మవిశ్వాసంతో తిరిగి తనను చాటుకున్నాడు.కాగా, విండీస్తో జరిగిన సూపర్-8 మ్యాచ్లో భారత్ 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత టాపార్డర్ తడబడింది. ఈ దశలో సంజూ (50 బంతుల్లో 97 పరుగులు; 12 ఫోర్లు, 4 సిక్సులు) తానున్నానంటూ ముందుకొచ్చి టీమిండియాను గెలిపించాడు. తద్వారా భారత్ సెమీస్ బెర్త్ ఖరారైంది. రేపు జరుగబోయే సెమీస్లో భారత్ ఇంగ్లండ్తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్లోనూ సంజూ కీలకమయ్యే అవకాశం ఉంది. -
T20 WC 2026: సికందర్ రజా ప్రపంచ రికార్డులు
జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో అటు సారథిగా.. ఇటు ఆటగాడిగా అతడు సాధిస్తున్న విజయాలే ఇందుకు కారణం. ‘అండర్డాగ్’గా ఈ టోర్నీ బరిలో దిగిన జింబాబ్వే.. అనూహ్య రీతిలో సూపర్-8 దశకు చేరుకుంది.మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించి మార్గం సుగమం చేసుకున్న జింబాబ్వే.. శ్రీలంకను కూడా ఓడించి గ్రూప్-బి టాపర్గా నిలిచింది. ఇక శ్రీలంకతో గురువారం నాటి మ్యాచ్లో జింబాబ్వే విజయంలో సికందర్ రజాదే కీలక పాత్ర. కొలంబో వేదికగా లంక విధించిన 179 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.లక్ష్య ఛేదనలో ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ (48 బంతుల్లో 63 నాటౌట్), తాడివనాషే మరుమాని (34) శుభారంభం అందించగా.. రజా కెప్టెన్ ఇన్నింగ్స్ (26 బంతుల్లో 45)తో మెరిశాడు. ఇక ఈ మ్యాచ్లో రజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ క్రమంలో అతడు సరికొత్త చరిత్ర సృష్టించాడు.ప్రపంచ రికార్డులుఅంతర్జాతీయ టీ20లలో అత్యధికంగా ఇరవైసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తొలి ఫుల్ మెంబర్ జట్టు ఆటగాడిగా నిలిచాడు. అదే విధంగా అత్యంత పెద్ద వయసులో ఐసీసీ టోర్నీలో ఈ పురస్కారం పొందిన ఆటగాడిగా భారత దిగ్గజం రోహిత్ శర్మ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును రజా బద్దలు కొట్టాడు.కాగా 2025 చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా రోహిత్ 37 ఏళ్ల 335 రోజుల వయసులో POTM పొందగా.. రజా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో తాజాగా 39 ఏళ్ల 301 రోజుల వయసులో అవార్డు పొందాడు.టెస్టు హోదా ఉన్న జట్ల (ఫుల్ మెంబర్) తరఫున అంతర్జాతీయ టీ20లలో అత్యధికసార్లు POTM పొందిన ఆటగాళ్లుసికందర్ రజా- జింబాబ్వే- 20సార్లుసూర్యకుమార్ యాదవ్- ఇండియా- 17సార్లువిరాట్ కోహ్లి- ఇండియా- 16సార్లుమహ్మద్ నబీ- అఫ్గనిస్తాన్- 14సార్లు.చదవండి: T20 WC: ‘పీసీబీ చీఫ్ రెచ్చగొట్టడం వల్లే.. నష్టపోయాము’ -
వైభవ్ సూర్యంశీ సంచలన నిర్ణయం!
విధ్వంసకర ఆట తీరుతో క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో సత్తా చాటి వెలుగులోకి వచ్చిన ఈ బిహారీ పిల్లాడు.. భారత్ తరఫునా అదరగొడుతున్నాడు. పద్నాలుగేళ్ల వయసులోనే అండర్-19 స్థాయిలో అదరగొడుతున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. వరల్డ్కప్ ఫైనల్లోనూ దుమ్ములేపాడు.జింబాబ్వే వేదికగా ఇంగ్లండ్పై భారీ శతకం (80 బంతుల్లో 175) బాదిన వైభవ్ సూర్యవంశీ.. భారత్ ఆరోసారి వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడటంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు భారత్ అండర్-19 జట్టు తరఫున ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా గడ్డ మీద ఈ చిచ్చరపిడుగు సత్తా చాటాడు.అంతేకాదు.. దక్షిణాఫ్రికాలో ఏకంగా కెప్టెన్గా వ్యవహరించిన వైభవ్.. యూత్ వన్డే సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేయడం విశేషం. ఇలా టీనేజ్లోనే క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తున్న ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు.. ఆటతో బిజీగా ఉన్న కారణంగా చదువు విషయంలో ఏడాది వెనుకపడనున్నాడు.బిహార్లోని తేజ్పూర్కు చెందిన వైభవ్ సూర్యవంశీ.. అక్కడి మాడెస్టీ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 17- మార్చి 11 మధ్య జరగాల్సిన సీబీఎస్ఈ క్లాస్ 10 బోర్డు ఎగ్జామ్కు వైభవ్ సూర్యవంశీ హాజరు కావాల్సి ఉంది. తొలుత వైభవ్ పరీక్షలు రాస్తాడని వార్తలు వచ్చాయి.అయితే, తాజా సమాచారం ప్రకారం వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది పరీక్షలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మాడెస్టీ స్కూల్ డైరెక్టర్ ఆదర్శ్ కుమార పింటూ నిర్ధారించారు. వైభవ్కు అడ్మిట్ కార్డు కూడా జారీ చేశామని.. అయితే, ఆఖరి నిమిషంలో అతడు మనసు మార్చుకున్నట్లు వెల్లడించారు.వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఈ మేరకు తమ నిర్ణయాన్ని తెలిపినట్లు పింటూ పేర్కొన్నారు. కాగా వరుస సిరీస్లు, వరల్డ్కప్ టోర్నీతో బిజీగా గడిపిన వైభవ్.. ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ క్యాంపుతో ఐపీఎల్కు సన్నద్ధమయ్యే పనిలో ఉన్నాడు. దీంతో పరీక్షలకు సరిగ్గా ప్రిపేర్ కాలేకపోయాడని.. అందుకే ఈసారి పరీక్షలు రాయొద్దని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆటతో పాటు వైభవ్ చదువును కూడా బ్యాలెన్స్ చేస్తే బాగుండనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.దిగ్గజాల క్వాలిఫికేషన్ తెలుసా?ఇక వైభవ్ పరీక్షలు స్కిప్ చేసిన నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజాల విద్యార్హతల అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. క్రికెట్ దేవుడిగా పేరొందిన సచిన్ టెండుల్కర్ పదో తరగతిలో ఫెయిల్ అయ్యాడు. ఈ ముంబైకర్ ఆట మీద మాత్రమే దృష్టి పెట్టి అంతర్జాతీయ క్రికెట్లో వంద శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్గా ప్రసిద్ధికెక్కాడు.మరోవైపు.. టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. ఇంటర్ చదివాడు. రైల్వేలో ఉద్యోగం చేస్తూ టీమిండియాలోకి వచ్చి జట్టు గతినే మార్చివేశాడు ఈ జార్ఖండ్ డైనమైట్. ఇక ఢిల్లీకి చెందిన రన్మెషీన్ విరాట్ కోహ్లి కూడా పన్నెండో తరగతి వరకే చదివాడు. అదే విధంగా.. భారత్కు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన సారథి, ముంబైకర్ రోహిత్ శర్మ సైతం ఇంటర్తోనే ఆపివేసినట్లు తెలుస్తోంది.చదవండి: IND vs PAK: అతడి ఆటకు మేము లొంగిపోము: సూర్య -
‘ఎ’ గ్రేడ్లో గిల్, బుమ్రా, జడేజా
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సీనియర్ జట్టు ఆటగాళ్లకు సంబంధించి 2025–26కు గాను వార్షిక కాంట్రాక్ట్లను ప్రకటించింది. గత సీజన్ వరకు ఉన్న ‘ఎ ప్లస్’ గ్రేడ్ను తొలగించిన బోర్డు... ఈ సారి ‘ఎ’, ‘బి’, ‘సి’ గ్రేడ్లతోనే జాబితాను ఖరారు చేసింది. భారత టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్తో పాటు ఆల్ ఫార్మాట్ స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ‘ఎ’ గ్రేడ్లో స్థానం లభించగా...భారత టెస్టు జట్టులో అందరికంటే ఎక్కువ అనుభవజు్ఞడైన రవీంద్ర జడేజాకు కూడా ‘ఎ’ గ్రేడ్ దక్కడం విశేషం. ఇప్పుడు కేవలం వన్డేలకే పరిమితమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిను ‘బి’ గ్రేడ్లో చేర్చగా, టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ‘బి’లోనే ఉన్నాడు. వాషింగ్టన్ సుందర్కు ‘సి’ నుంచి ‘బి’కు ప్రమోషన్ లభించగా...వన్డే, టి20ల్లో రెగ్యులర్ సభ్యుడైన అక్షర్ పటేల్ స్థాయిని తగ్గించి ‘సి’లోకి చేర్చారు. 2024–25 కాంట్రాక్ట్తో పోలిస్తే ఎవరినీ అదనంగా చేర్చలేదు. నాడు 34 మందితో జాబితా ఉండగా...ఇప్పుడు నలుగురు ఆటగాళ్లు షమీ, సర్ఫరాజ్, రజత్ పాటీదార్, ముకేశ్ కుమార్లను కాంట్రాక్ట్నుంచి తప్పించి 30 మందికి పరిమితం చేశారు. అక్టోబర్ 1, 2025 నుంచి 26 సెప్టెంబర్, 2026 మధ్య కాలానికి కొత్త కాంట్రాక్ట్లు వర్తిస్తాయి. గ్రేడ్ ‘ఎ’ – శుబ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా గ్రేడ్ ‘బి’ – రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, సిరాజ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్. గ్రేడ్ ‘సి’ – అక్షర్ పటేల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, సంజు సామ్సన్, అర్‡్షదీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ఆకాశ్దీప్, ధ్రువ్ జురేల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి, అభిõÙక్ శర్మ, సాయిసుదర్శన్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్. ‘ఆ నలుగురు’ టాప్ గ్రేడ్లో...భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ విజయం అందుకోవడంలో కీలక పాత్ర పోషించిన నలుగురు ప్లేయర్లకు ‘ఎ’ గ్రేడ్ కాంట్రాక్ట్ లభించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన, ఆల్రౌండర్ దీప్తి శర్మ, బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ‘ఎ’ జాబితాలో ఉన్నారు. గ్రేడ్ ‘బి’లో నలుగురు ప్లేయర్లు ఉండగా, గ్రేడ్ ‘సి’లో 13 మంది కలిపి మొత్తం 21 మంది సీనియర్ మహిళా క్రికెటర్లకు బీసీసీఐ కాంట్రాక్ట్ ఇచి్చంది. గ్రేడ్ ‘ఎ’ – హర్మన్ప్రీత్, స్మృతి మంధాన, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్ గ్రేడ్ ‘బి’ – రేణుకా ఠాకూర్, షఫాలీ వర్మ, రిచా ఘోష్, స్నేహ్ రాణా గ్రేడ్ ‘సి’ – రాధ యాదవ్, అమన్జోత్ కౌర్, ప్రతీక రావల్, క్రాంతి గౌండ్, ఉమా ఛెత్రి, అరుంధతి రెడ్డి, శ్రీచరణి, యస్తిక భాటియా, హర్లీన్ డియోల్, కాశ్వీ గౌతమ్, కమలిని, వైష్ణవి శర్మ, తేజల్ హసబ్నిస్. 🚨 BCCI ANNUAL CONTRACT 2025-26 🚨 pic.twitter.com/UxNOSYkEnE— Johns. (@CricCrazyJohns) February 9, 2026ఆయా కాంట్రాక్ట్ల్లో ఉన్న వారికి వార్షిక వేతనం కింద ఎంత మొత్తం అందనుందో తెలియరాలేదు. గత వార్షిక కాంట్రాక్ట్ల్లో ఏ ప్లస్ గ్రేడ్లో ఉండిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాకు రూ. 7 కోట్లు లభించేవి. గ్రేడ్-ఏలో ఉండిన వారికి రూ. 5 కోట్లు, గ్రేడ్-బిలో ఉండిన వారికి రూ. 3 కోట్లు, గ్రేడ్-సిలో ఉండిన ప్లేయర్లకు రూ. కోటి రూపాయలు లభించేవి. -
ముకేశ్ అంబానీకి నో చెప్పిన రోహిత్ శర్మ!
టీమిండియా దిగ్గజ కెప్టెన్గా పేరొందాడు రోహిత్ శర్మ. భారత్కు 2024లో టీ20 ప్రపంచకప్ అందించిన హిట్మ్యాన్.. 2025లో చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచాడు. ఇక ఇప్పటికే అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్, టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ కేవలం వన్డేలలో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. 2007లో టీ20 ప్రపంచకప్ టోర్నీ మొదలుకాగా ఇప్పటి వరకు అన్ని ఎడిషన్లలోనూ రోహిత్ భాగమయ్యాడు. అయితే, రిటైర్మెంట్ నేపథ్యంలో తొలిసారి టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో హిట్మ్యాన్ ప్రేక్షకుడిగా మిగిలిపోయాడు. ఇక పొట్టి ఫార్మాట్లో సత్తా చాటి తానేంటో నిరూపించుకున్న రోహిత్ శర్మను ఐసీసీ ఈసారి వరల్డ్కప్ అంబాసిడర్గా నియమించింది.వాంఖడేలో వరల్డ్కప్ ట్రోఫీతో ఎంట్రీఈ నేపథ్యంలో శనివారం ఈ మెగా ఈవెంట్కు తెరలేవగా.. సొంత మైదానం ముంబైలోని వాంఖడేలో వరల్డ్కప్ ట్రోఫీతో ఎంట్రీ ఇచ్చాడు రోహిత్ శర్మ. అమెరికాతో మ్యాచ్ నేపథ్యంలో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పి.. మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించాడు.అంబానీ కుటుంబం ఆప్యాయతఇక భారత వ్యాపార దిగ్గజం, కుబేరుడు ముకేశ్ అంబానీ కుటుంబం కూడా ఈ మ్యాచ్కు హాజరైంది. భార్య నీతా, కుమారుడు ఆకాశ్ అంబానీ తదితరులతో కలిసి ముకేశ్ మ్యాచ్కు విచ్చేశారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పక్కకు వెళ్లాలని చూడగా.. ముకేశ్ అంబానీ మాత్రం అతడి చేయి పట్టుకుని ఆపి మరీ ఆకాశ్కు- తనకు మధ్య కూర్చోబెట్టుకున్నారు.ముకేశ్ అంబానీ స్వయంగా ఛాయ్ ఇవ్వగాఅంతేకాదు.. మధ్యలో టీతో పాటు స్నాక్స్తో కూడిన సాసర్ను ముకేశ్ అంబానీ రోహిత్ శర్మకు అందించారు. అయితే, రోహిత్ మాత్రం సున్నితంగా తిరస్కరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.Last night, Rohit Sharma was going to sit beside Ritika, but Mukesh Ambani asked him to sit next to him instead 🤍 pic.twitter.com/d9YEMXajlv— Kusha Sharma (@Kushacritic) February 8, 2026కాగా 2011 నుంచి రోహిత్కు అంబానీ కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉంది. అంబానీల యాజమాన్యంలోని ముంబై ఇండియన్స్కు కెప్టెన్గా వ్యవహరించిన హిట్మ్యాన్ ఐదుసార్లు ట్రోఫీ అందించాడు. 2013 నుంచి పదేళ్లపాటు సారథిగా కొనసాగిన రోహిత్ శర్మను తప్పించి.. 2023లో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది ముంబై ఇండియన్స్. అయితే, రోహిత్ మాత్రం ఆటగాడిగా అదే జట్టుతో కొనసాగుతుండటం విశేషం.చదవండి: Gautam Gambhir: సతీసమేతంగా టీమిండియాకు ఘన స్వాగతం.. వీడియో వైరల్ -
టి20 వరల్డ్ కప్ ప్రారంభ వేడుక అదుర్స్ (ఫొటోలు)
-
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు భారీ షాకిచ్చిన బీసీసీఐ
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు భారీ షాకిచ్చినట్లు తెలుస్తుంది. త్వరలో ప్రకటించబోయే సెంట్రల్ కాంట్రాక్ట్ల జాబితాలో వీరిద్దరూ డిమోషన్కు గురైనట్లు సమాచారం. గతంలో విరాట్, రోహిత్ ఏ ప్లస్ కేటగిరిలో ఉండేవారు. తాజాగా ఆ కేటగిరిని పూర్తిగా రద్దు చేస్తూ.. రో-కోను బి కేటగిరిలోకి తరలించినట్లు ప్రచారం జరుగుతుంది. రో-కో టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. బీసీసీఐ నిబంధనల ప్రకారం మూడు ఫార్మాట్లకు అందుబాటులో ఉన్న వారికే అత్యుత్తమ కేటగిరి (ఏ ప్లస్) లభిస్తుంది. రో-కో రెండు ఫార్మాట్ల నుంచి తప్పుకోవడంతో వారు బి కేటగిరిలోకి పడిపోయారు.అయితే ఇక్కడ ఓ ఆసక్తికర విషయం బయటపడింది. టీ20, టెస్ట్ల నుంచి తప్పుకున్న రో-కో ఏ ప్లస్ నుంచి బి కేటగిరికి పడిపోగా.. టీ20ల నుంచి తప్పుకున్న రవీంద్ర జడేజా మాత్రం ఏ కేటగిరిలోనే ఉన్నట్లు తెలుస్తుంది. జడ్డూతో పాటు భారత వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్, పేసు గుర్రం మరియు ఆల్ ఫార్మాట్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రమే ఏ కేటగిరిలో ఉన్నారు. బుమ్రా, జడ్డూ 2024-25 సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో విరాట్, రోహిత్తో పాటు ఏ ప్లస్లో ఉండేవారు. ఇప్పుడు ఏ ప్లస్ రద్దు కావడంతో బుమ్రా, జడ్డూ ఏ కేటగిరిలోకి వచ్చారు.ఇకపై సెంట్రల్ కాంట్రాక్ట్లో మూడు కేటగిరిలు (ఏ, బి, సి) మాత్రమే ఉంటాయని సమచారం. గిల్, బుమ్రా, జడ్డూ ఏ కేటగిరిలో ఉండగా.. రో-కోతో పాటు టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, సిరాజ్, పంత్, శ్రేయస్ అయ్యర్, జైస్వాల్, కుల్దీప్ యాదవ్ కేటగిరి బిలో ఉన్నారు.సి కేటగిరిలో అక్షర్ పటేల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దుబే, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాష్ దీప్, ధృవ్ జురెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నట్లు సమాచారం. -
సీసీఎల్ విజేతగా కర్ణాటక.. రోహిత్ శర్మ స్టైల్లో కిచ్చా సుదీప్ ఎంట్రీ..!
సెలబ్రిటీ క్రికెట్ లీగ్-2026 విజేతగా కర్ణాటక బుల్డోజర్స్ నిలిచింది. ఫైనల్లో బెంగాల్ టైగర్స్ను ఓడించిన కిచ్చా సుదీప్ సేన టైటిల్ ఎగరేసుకుపోయిది. ఇది కర్ణాటక బుల్డోజర్స్కు మూడో టైటిల్ కావడం విశేషం. దాదాపు 12 ఏళ్ల గ్యాప్ తర్వాత సీసీఎల్ కప్ను కర్ణాటక గెలుచుకుంది. ఈ మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. కోయంబత్తూరులోని ఎస్ఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో ఈ ఫైనల్ పోరు జరిగింది.అయితే ఈ కప్ గెలిచాక కర్ణాటక బుల్డోజర్స్ సంబురాలు చేసుకుంది. మ్యాచ్ గెలిచిన కప్ అందుకునేందుకు వెళ్లిన కెప్టెన్ కిచ్చా సుదీప్ డిఫరెంట్ స్టైల్లో అలరించాడు. 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా రోహిత్ శర్మ రోబో వాక్ స్టైల్లో వెళ్లి కప్ అందుకున్నారు. తాజాగా సీసీఎల్లోనూ అదే సీన్ రిపీట్ చేశాడు కిచ్చా సుదీప్. రోహిత్ శర్మ స్టైల్లోనే రోబో వాక్ చేస్తూ సీసీఎల్ ట్రోఫీని అందుకున్నాడు. ఈ వీడియో నెట్టింట కాస్తా వైరల్ కావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. దీంతో అభిమానులు కిచ్చా సుదీప్ ట్రోఫీ వాక్ వీడియో క్లిప్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఫైనల్లో కర్ణాటక బుల్డోజర్స్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో బెంగాల్ టైగర్స్ను 129 పరుగులకే పరిమితం చేశారు. ఆ తర్వాత బరిలోకి దిగిన కర్ణాటక బుల్డోజర్స్ ఓపెనర్ రాజీవ్ హను కేవలం 35 బంతుల్లో 69 పరుగులు చేసి పరుగులు చేయడంతో సునాయాసంగా విజయం సాధించింది. ఇంకా మూడు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో కర్ణాటక టీమ్ ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు. ఈ సీజన్లో బెంగాల్ టైగర్స్ రన్నరప్గా నిలిచింది.ఇక కిచ్చా సుదీప్ సినిమాల విషయానికొస్తే కన్నడ యాక్షన్ ఎంటర్టైనర్ మార్క్తో అలరించాడు. ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. సుదీప్ ఇటీవల సినిమాల్లో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఇది మూడు దశాబ్దాల స్ఫూర్తిదాయకమైన ప్రయాణం అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. Kiccha Sudeep replicated the iconic Rohit Sharma's victory walk. ❤️🏆 pic.twitter.com/G5taR1D2kw— AdityaVarma (@AdityaVarma45_) February 2, 2026 -
రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు బ్రేక్
ఐర్లాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం రోహిత్ శర్మ పేరిట ఉన్న అరుదైన టీ20 ప్రపంచ రికార్డును అతడు బద్దలు కొట్టాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో తొలి టీ20 సందర్భంగా స్టిర్లింగ్ ఈ ఘనత సాధించాడు. ఇంతకీ ఆ రికార్డు ఏమిటంటారా?!టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా రెండు మ్యాచ్లు ఆడేందుకు ఐర్లాండ్ జట్టు.. యూఏఈ పర్యటనకు వెళ్లింది. ఇరుజట్ల మధ్య రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా.. గురువారం తొలి టీ20 జరిగింది. దుబాయ్ వేదికగా టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది.మెరుపు ఇన్నింగ్స్ఓపెనర్లలో కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (8) విఫలం కాగా.. రాస్ అడేర్ (39) మెరుగ్గా రాణించాడు. మిగిలిన వారిలో వికెట్ కీపర్ బ్యాటర్ లోర్కాన్ టకర్ (25 బంతుల్లో 38), కర్టిస్ కాంఫర్ (25) ఫర్వాలేదనిపించగా.. బెంజమిన్ కలిజ్ (12 బంతుల్లో 26 నాటౌట్), జార్జ్ డాక్రేల్ (10 బంతుల్లో 22 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐర్లాండ్ ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు సాధించింది. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దిఖి, హైదర్ అలీ చెరో రెండు.. ముహమ్మద్ అర్ఫాన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో 19.5 ఓవర్లలో 121 పరుగులకే యూఏఈ ఆలౌట్ అయింది.57 పరుగుల తేడాతో విజయం ఐర్లాండ్ బౌలర్లు మాథ్యూ హాంప్రేస్, గరేత్ డెలాని తలా మూడు వికెట్లు పడగొట్టి యూఏఈ బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేయగా.. బారీ మెకార్తి రెండు వికెట్లు పడగొట్టాడు. జార్జ్ డాక్రేల్, మార్క్ అడేర్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో తొలి టీ20లో ఐర్లాండ్ 57 పరుగుల తేడాతో విజయం సాధించి 1-0తో సిరీస్లో ఆధిక్యంలో నిలిచింది.ఇక పాల్ స్టిర్లింగ్కు అంతర్జాతీయ స్థాయిలో ఇది 160వ టీ20 మ్యాచ్ కావడం విశేషం. తద్వారా ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ పొట్టి ఫార్మాట్లో.. అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా.. భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును స్టిర్లింగ్ బద్దలు కొట్టాడు. కాగా 2024లో టీమిండియాకు టీ20 వరల్డ్కప్ అందించిన తర్వాత అంతర్జాతయ టీ20లకు రోహిత్ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక టీ20 మ్యాచ్లు ఆడిన క్రికెటర్లుపాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్): 2009- 2026*- 160 మ్యాచ్లురోహిత్ శర్మ (ఇండియా): 2007-2024- 159 మ్యాచ్లుజార్జ్ డాక్రేల్ (ఐర్లాండ్): 2010-2026*- 153 మ్యాచ్లుమహ్మద్ నబీ (అఫ్గనిస్తాన్): 2010-2026- 148 మ్యాచ్లుజోస్ బట్లర్ (ఇంగ్లండ్): 2011-2025- 144 మ్యాచ్లు.చదవండి: Kohli Instagram Deactivate: ఇన్స్టాకు గుడ్బై ?.. కంగారుపడ్డ విరాట్ కోహ్లి ఫ్యాన్స్! -
శివాలెత్తిన శివమ్ దూబే.. రోహిత్ శర్మ రికార్డు సమం
వైజాగ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా ఓటమి పాలైనప్పటికి.. ఆల్రౌండర్ శివమ్ దూబే మాత్రం తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 216 పరుగుల భారీ లక్ష్య చేధనలో భారత జట్టుకు ఆరంభం నుంచే కష్టాలు ఎదురయ్యాయి. మెన్ ఇన్ బ్లూ 60 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఓవైపు క్రమం తప్పుకొండా వికెట్లు పడుతున్నప్పటికి ఈ ముంబై స్టార్ మాత్రం తన విధ్వంసకర బ్యాటింగ్ను కొనసాగించాడు. భారత ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన స్పిన్నర్ ఇష్ సోధీకి దూబే చుక్కలు చూపించాడు.ఆ ఓవర్లో దూబే ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. తొలి బంతికి రెండు పరుగులు తీసిన దూబే.. ఆ తర్వాత వరుసగా 4,6,4,6,6 బాదాడు. ఈ క్రమంలో ఒకే అత్యధిక పరుగులు సాధించిన మూడో భారత బ్యాటర్గా రోహిత్ శర్మ రికార్డును దూబే సమం చేశాడు. ఈ జాబితాలో యువరాజ్ సింగ్(36), సంజూ శాంసన్(30) తొలి రెండు స్ధానాల్లో ఉన్నాడు.అయితే ఓ దశలో మ్యాచ్ను గెలిపించేలా కన్పించిన దూబే.. దురదృష్టవశాత్తు రనౌట్గా వెనుదిరిగాడు. మొత్తంగా కేవలం 23 బంతుల్లో మాత్రమే ఎదుర్కొన్న దూబే 7 ఫోర్లు, 3 సిక్స్లతో 65 పరుగులు చేశాడు. దూబేతో పాటు రింకూ సింగ్(39) రాణించాడు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కాగా ఐదు మ్యాచ్ల సిరీస్ను భారత్ ఇప్పటికే 3-1 తేడాతో సొంతం చేసుకుంది.कल शिवम दुबे ने 15 गेंदों पर फिफ्टी पीट दिया।घोड़े के पैर में जंजीर नहीं बाधेंगे तो वो इतिहास ही रचेगा।pic.twitter.com/6f80FCvmlJ— Shubham Shukla (@Shubhamshuklamp) January 29, 2026 -
హార్దిక్, అర్ష్ దీప్ కీలకం: రోహిత్
న్యూఢిల్లీ: భారత జట్టు టి20 వరల్డ్ కప్ నిలబెట్టుకోవాలంటే అర్ష్ దీప్ సింగ్, హార్దిక్ పాండ్యాలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని జట్టు మాజీ కెప్టెన్, బ్యాటర్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. కొత్త బంతితో అర్ష్ దీప్ చాలా ప్రమాదకారి అని, మిడిలార్డర్లో పాండ్యా బలమైన బ్యాటింగ్ జట్టుకు అదనపు ప్రయోజనాన్ని ఇస్తుందని రోహిత్ అన్నాడు. రోహిత్ నాయకత్వంలోనే 2024లో టీమిండియా వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ‘కొత్త, పాత బంతులను ఒకే తరహాలో స్వింగ్ చేయడం అర్ష్ దీప్ ప్రత్యేక బలం కాగా రెండు సందర్భాల్లోనూ వికెట్లు పడగొట్టగలడు. 2024 ఫైనల్లో అతను చాలా బాగా బౌలింగ్ చేసాడు. ఆరంభంలో డికాక్ వికెట్ తీసిన అర్ష్ దీప్ 19వ ఓవర్లో తక్కువ పరుగులు ఇవ్వడం విజయానికి బాటలు వేసింది. ఈసారీ అదే జరుగుతుంది. జట్టులో పాండ్యా కూడా ఆల్రౌండర్గా ఎంతో విలువైన ఆటగాడు. బ్యాటింగ్ చివరి నాలుగు ఓవర్లలో 50 పరుగులు రాబట్టగలడు. అవసరమైతే 50/4 స్కోరు నుంచి జట్టు ఇన్నింగ్స్ను నిలబెట్టగలడు. పైగా ఏ దశలోనైనా బౌలింగ్ చేయగల సామర్థ్యం కూడా అతని సొంతం’ అని రోహిత్ ప్రశంసించాడు. -
‘పద్మభూషణ్’ విజయ్ అమృత్రాజ్
న్యూఢిల్లీ: తన ఆటతీరుతో అంతర్జాతీయస్థాయిలో భారత టెన్నిస్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన విజయ్ అమృత్రాజ్ను కేంద్ర ప్రభుత్వం సముచితరీతిలో గౌరవించింది. 2026 సంవత్సరానికి ప్రకటించిన కేంద్ర పౌర పురస్కారాల్లో విజయ్ అమృత్రాజ్కు మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మ భూషణ్’ లభించింది. ఈసారి క్రీడా విభాగంలో మొత్తం తొమ్మిది మంది ‘పద్మ’ అవార్డులకు ఎంపికయ్యారు. క్రికెటర్లు రోహిత్ శర్మ (మహారాష్ట్ర), హర్మన్ప్రీత్ కౌర్ భుల్లర్ (పంజాబ్)... పారాథ్లెట్ ప్రవీణ్ కుమార్ (ఉత్తరప్రదేశ్), భారత మహిళల హాకీ జట్టు గోల్కీపర్ సవితా పూనియా (హరియాణా), హాకీ కోచ్ బల్దేవ్ సింగ్ (పంజాబ్), యుద్ధకళల్లో వెటరన్ కోచ్లు భగవాన్దాస్ రైక్వార్ (మధ్యప్రదేశ్), పజానివెల్ (పుదుచ్చేరి), జార్జియాకు చెందిన రెజ్లింగ్ కోచ్, దివంగత వ్లాదిమిర్ మెస్త్విరిష్విలిలకు ‘పద్మశ్రీ’ అవార్డులు లభించాయి. ఒలింపిక్స్లో కాంస్య పతకాలు గెలిచిన భారత రెజ్లర్లు యోగేశ్వర్ దత్, బజరంగ్ పూనియాలకు వ్లాదిమిర్ శిక్షణ ఇచ్చారు. 35 ఏళ్ల సవితా పూనియా భారత హాకీ జట్టుకు 308 మ్యాచ్ల్లో గోల్కీపర్గా వ్యవహరించింది. టోక్యో, రియో ఒలింపిక్స్లో పోటీపడింది. మూడుసార్లు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ఉత్తమ గోల్కీపర్గా ఎంపికైంది. పారాథ్లెటిక్స్లో హైజంప్ ఈవెంట్లో ఆడే 22 ఏళ్ల ప్రవీణ్ రెండు ఒలింపిక్ పతకాలు సాధించాడు. టి64 కేటగిరీలో పోటీపడే ప్రవీణ్ 2024 పారిస్ పారాలింపిక్స్లో స్వర్ణ పతకం, 2020 టోక్యో పారాలింపిక్స్లో రజత పతకం సాధించాడు. గత ఏడాది ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో కాంస్యం గెల్చుకున్నాడు. 2022 ఆసియా పారా క్రీడల్లో బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. తమిళనాడుకు చెందిన 72 ఏళ్ల విజయ్ అమృత్రాజ్ అమెరికాలోని కాలిఫోరి్నయాలో స్థిరపడ్డారు. 1970 నుంచి 1993 వరకు ఆయన ప్రొఫెషనల్ కెరీర్ సాగింది. విజయ్ 15 సింగిల్స్ టైటిల్స్, 13 డబుల్స్ టైటిల్స్ సాధించారు. ఓవరాల్గా 405 మ్యాచ్ల్లో గెలిచారు. 312 మ్యాచ్ల్లో ఓడిపోయారు. 1980లో కెరీర్ బెస్ట్ 18వ ర్యాంక్ను అందుకున్నారు. 13,30,503 డాలర్లు ప్రైజ్మనీ సంపాదించారు. టెన్నిస్లోని నాలుగు గ్రాండ్స్లామ్ టోర్నీల్లో ఆయన బరిలోకి దిగారు. 32 సార్లు గ్రాండ్స్లామ్ టోర్నీల్లో ఆడిన విజయ్ వింబుల్డన్లో రెండుసార్లు (1973, 1981), యూఎస్ ఓపెన్లో రెండుసార్లు (1973, 1974) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. 2024లో అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు సంపాదించిన విజయ్... ప్రపంచ పురుషుల టీమ్ టెన్నిస్ టోర్నీ డేవిస్కప్లోనూ ఆకట్టుకున్నారు. డేవిస్కప్లో రెండుసార్లు (1974, 1987) భారత జట్టు రన్నరప్గా నిలవడంలో కీలకపాత్ర పోషించారు. 1983లో ‘పద్మశ్రీ’ పొందిన విజయ్కు 1974లో ‘అర్జున అవార్డు’ కూడా లభించింది. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర టెన్నిస్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న విజయ్ హాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు. తన నాయకత్వ పటిమతో రోహిత్ శర్మ భారత క్రికెట్ జట్టుకు ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. రోహిత్ కెప్టెన్సీలోనే టీమిండియా 2024లో టి20 ప్రపంచకప్ టైటిల్... 2025లో చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ సాధించింది. ఐపీఎల్లో రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు ఐదుసార్లు విజేతగా నిలిచింది. 2024లో అంతర్జాతీయ టి20ల నుంచి, 2025లో టెస్టు క్రికెట్ నుంచి రిటైరైన రోహిత్ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 38 ఏళ్ల రోహిత్ భారత్ తరఫున 67 టెస్టులు ఆడి 4301 పరుగులు... 282 వన్డేలు ఆడి 11,577 పరుగులు... 159 టి20లు ఆడి 4231 పరుగులు సాధించాడు.గత 17 ఏళ్లుగా భారత మహిళల క్రికెట్ జట్టులో సభ్యురాలిగా ఉన్న హర్మన్ప్రీత్ కెప్టెన్సీలో గత ఏడాది టీమిండియా వన్డే వరల్డ్కప్ టైటిల్ గెలిచింది. స్వదేశంలో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికా జట్టును ఓడించిన భారత్ తొలిసారి ఈ ఘనత సాధించింది. 36 ఏళ్ల హర్మన్ ఇప్పటి వరకు 6 టెస్టులు ఆడి 200 పరుగులు... 161 వన్డేలు ఆడి 4409 పరుగులు, 187 టి20లు ఆడి 3784 పరుగులు చేసింది. మూడు ఫార్మాట్లలో కలిపి 8 సెంచరీలు, 38 అర్ధ సెంచరీలు సాధించిన హర్మన్ 75 వికెట్లు కూడా పడగొట్టింది. -
హిట్మ్యాన్ రోహిత్ శర్మకు పద్మశ్రీ అవార్డు
2026 పద్మ అవార్డులను భారత ప్రభుత్వం ఇవాళ (జనవరి 25) ప్రకటించింది. మొత్తం 131 మంది ఈ అవార్డులకు ఎంపిక కాగా.. ఇందులో 113 మందికి పద్మశ్రీ, 13 మంది పద్మభూషణ్, ఐదుగురికి పద్మవిభూషణ్ అవార్డులు లభించాయి. ఇందులో క్రీడారంగానికి సంబంధించి ఎనిమిది మందికి పద్మ అవార్డులు లభించగా.. వీరిలో టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్రాజ్కు పద్మవిభూషణ్, భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, భారత సీనియర్ మహిళల క్రికెట్ జట్టు ప్రస్తుత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్, భారత సీనియర్ మహిళల హాకీ జట్టు గోల్కీపర్ సవిత పూనియా సహా మరో ముగ్గురికి (బల్దేవ్ సింగ్, భగవాన్దాస్ రైక్వార్, కే పజనివేల్) పద్మశ్రీ అవార్డులు లభించాయి. -
'హిట్మాన్'పై అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మపై యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హిట్మాన్ అడుగుజాడల్లో నడుస్తున్నానని చెప్పాడు. టి20 పవర్ ప్లేలో రోహిత్ శర్మలా ఆడటానికి ప్రయత్నిస్తున్నానని అన్నాడు. తనపై హిట్మాన్ ప్రభావం గురించి జియోస్టార్తో మాట్లాడుతూ.. "రోహిత్ భాయ్ దేశం కోసం చాలా చేశాడు. పవర్ప్లేలో అతడు ఇచ్చే ప్రారంభాల కారణంగా ఎల్లప్పుడూ ఒత్తిడి ఉంటుందని అన్నాడు. రోహిత్ శర్మ పాత్ర పోషించాలని కోచ్ గౌతమ్ గంభీర్ తనకు సూచించినట్టు వెల్లడించాడు.గంభీర్తో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ప్రోత్సహంతో తాను రోహిత్ శర్మ ఫార్ములాను అనుసరిస్తున్నానని అభిషేక్ తెలిపాడు. "నేను జట్టులోకి వచ్చినప్పుడు.. కోచ్, కెప్టెన్ నా నుంచి అదే ఆశించారు. తొలి బంతి నుంచే విరుచుకుపడడం నాకు ఇష్టం కాబట్టి.. అది నా శైలికి కూడా సరిపోతుందని భావించాను. రోహిత్ భాయ్ అడుగుజాడల్లో నడుస్తున్నాను. టీమిండియా తరపున ఇలా ఆడుతూ రాణించడం నాకు నిజంగా సంతోషంగా ఉంద''ని అన్నాడు.దూకుడుగా ఆడటమే నా పనితన ఆటతీరును మెరుగు పరుచుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటానని అభిషేక్ శర్మ చెప్పాడు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడి.. జట్టు భారీస్కోరుకు బాటలు వేయాలని భావిస్తానని చెప్పాడు. "నేను ఇంకా పూర్తిగా పరిణతి చెందానని చెప్పను, ఎందుకంటే ఎల్లప్పుడూ మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది. కానీ మొదటి ఆరు ఓవర్లలో దూకుడుగా క్రికెట్ ఆడటమే నా పని అని భావిస్తున్నాను. దీని కోసం చాలా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను మంచి ఆరంభం ఇస్తే జట్టు ఆ ఊపును అనుసరించగలదని నాకు తెలుసు. అందుకే జట్టుకు ఆరంభం ఇవ్వాలని ప్రతిసారి అనుకుంటాన''ని ఈ డాషింగ్ ఓపెనర్ పేర్కొన్నాడు.వారితో ప్రాక్టీస్ చేస్తాటి20 ప్రపంచకప్కు సన్నద్ధత కోసం మాట్లాడుతూ.. తన దూకుడుకు అనుగుణంగా ప్రాక్టీస్ చేస్తానని, మ్యాచ్లకు ముందు తానెప్పుడూ ఇదే ఫాలో అవుతానని అన్నాడు. ''నాకు వారం లేదా 10 రోజులు సమయం దొరికినప్పుడు, తదుపరి సిరీస్ లేదా మ్యాచ్లలో నేను ఎదుర్కొనబోయే బౌలర్లను గుర్తుంచుకుంటాను. వారిలా బౌలింగ్ చేసే వారితో ప్రాక్టీస్ చేస్తాను. కొత్త బంతితో అవుట్-స్వింగర్లు, ఇన్-స్వింగర్లు వేయమని చెప్పి బ్యాటింగ్ చేస్తుంటాను. టి20 వరల్డ్కప్లో భాగంగా దేశవ్యాప్తంగా భిన్నమైన పరిస్థిల్లో వేర్వేరు జట్లతో ఆడాల్సి ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ చాలా ముఖ్యమ''ని అభిషేక్ అభిప్రాయపడ్డాడు.పవర్ హిట్టింగ్తో హిట్2024, జూలైలో టి20లో అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ పవర్ హిట్టింగ్తో తన స్థానాన్ని జట్టులో సుస్థిరం చేసుకున్నాడు. అతి తక్కువ కాలంలోనే నంబర్వన్ బ్యాటర్ ఎదిగాడు. ఇప్పటివరకు 34 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడి 190.92 స్ట్రైక్ రేట్తో 1199 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. కాగా, ఫిబ్రవరి 7 నుంచి జరిగే టి20 ప్రపంచకప్లోనూ తన జోరును కొనసాగించాలని ఈ ఎడంచేతి వాటం ఓపెనర్ ఉవ్విళ్లూరుతున్నాడు. చదవండి: ప్రధాని తర్వాత కష్టమైన జాబ్.. గంభీర్పై ప్రశంసలు


