-
కోహ్లి కాదు!.. అతడు 50 ఏళ్ల వయసులోనూ క్రికెట్ ఆడగలడు!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు గత కొంతకాలంగా పొట్టి ఫార్మాట్లో ఏదీ కలిసి రావడం లేదు. టీ20 ప్రపంచకప్-2022 సెమీస్లోనే భారత జట్టు నిష్క్రమించిన తర్వాత.. సుదీర్ఘకాలం అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉన్నాడు హిట్మ్యాన్.ప్లే ఆఫ్స్ చేర్చినాగతేడాది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బరిలోకి దిగిన రోహిత్ బ్యాటర్గా స్థాయికి తగ్గట్లు రాణించలేదు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ 16 మ్యాచ్లలో కలిపి 332 పరుగులు మాత్రమే చేశాడు. ఇక జట్టును ప్లే ఆఫ్స్ చేర్చి సారథిగా సఫలమైనా.. ముంబై ఫ్రాంఛైజీ అతడిపై ఈసారి వేటు వేసింది.గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించింది. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన రోహిత్ శర్మ వచ్చే ఏడాది ఫ్రాంఛైజీని వీడేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఫోకస్ చేయలేకఇక పాండ్యా ప్రవర్తనతో విసిగిపోయిన రోహిత్ బ్యాటింగ్పై కూడా ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతున్నాడని గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. ఐపీఎల్-2024లో ఇప్పటి దాకా 13 మ్యాచ్లు ఆడి 349 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ తర్వాత టీమిండియా జూన్ 1నుంచి మొదలుకానున్న ప్రపంచకప్-2024కు సన్నద్ధంకానుంది. ఇందుకోసం ఇప్పటికే రోహిత్ శర్మ సారథ్యంలో బీసీసీఐ 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది.అయితే, ఈ మెగా టోర్నీ తర్వాత 37 ఏళ్ల రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలకనున్నట్లు సమాచారం. వయసు, ఫిట్నెస్ రీత్యా రెండు ఫార్మాట్లకు కూడా గుడ్బై చెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది నిజం కాదుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ రోహిత్ శర్మ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. "అసలు వయసు గురించి ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు.40, 42.. 45 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్తో ఉండి.. బాగా ఆడుతుంటే.. ఆ ఆటగాడి రిటైర్మెంట్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మన దేశంలో చాలా మంది 40 ఏళ్ల వయసు వచ్చిందంటే.. పిల్లల పెంపకం గురించి ఆలోచిస్తూ కాలం గడిపేయాలనే ఆలోచనతో ఉంటారు. వయసు అయిపోయిందని.. ఆటకు పనికిరామని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. 50 ఏళ్ల వయసులోనూ క్రికెట్ ఆడగలడుటీమిండియా తొలిసారి వరల్డ్ కప్ గెలిచినపుడు మొహిందర్ అమర్నాథ్ వయసు 38 ఏళ్లు. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతడే. అసలు ఏజ్ గురించి టీమిండియాలో చర్చ అనవసరం అంటాను.రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్ వంటి గొప్ప ప్లేయర్లు ఫిట్నెస్ గురించి పెద్దగా అవసరం లేదు. ఒకవేళ రోహిత్ ఆడాలనుకుంటే 50 ఏళ్ల వయసులోనూ క్రికెట్ ఆడగలడు" అని యోగ్రాజ్ సింగ్ అని స్పోర్ట్స్18తో చెప్పుకొచ్చాడు.కాగా ఫిట్నెస్కు మారుపేరైన విరాట్ కోహ్లి కెరీర్ సుదీర్ఘకాలం కొనసాగించగలడన్న విశ్లేషణల నేపథ్యంలో అతడి పేరు ఎత్తకుండా యోగ్రాజ్ కేవలం రోహిత్, వీరూ పేర్లు చెప్పడం విశేషం.చదవండి: T20 WC: హార్దిక్ను సెలక్ట్ చేయడం రోహిత్కు ఇష్టం లేదు.. కానీ! -
T20 WC: హార్దిక్ను సెలక్ట్ చేయడం రోహిత్కు ఇష్టం లేదు.. కానీ!
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ కోసం ఎంపిక చేసిన జట్టులో పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు అవకాశం ఇవ్వడం కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్కు ఇష్టం లేదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మరి అతడిని ఏకంగా వైస్ కెప్టెన్గా ప్రకటించడానికి కారణం ఏంటి?..ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్లోకి వచ్చిన గుజరాత్ టైటాన్స్ సారథి హార్దిక్ పాండ్యాను ఫ్రాంఛైజీ కెప్టెన్గా ప్రకటించింది. ఐదుసార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మపై వేటు వేసి మరీ పగ్గాలు అతడికి అప్పగించింది.అయితే, పాండ్యా యాజమాన్యం అంచనాలు అందుకోలేకపోయాడు. అంతేకాదు జట్టులో సీనియర్లు అయిన రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్లతో పాండ్యాకు సఖ్యత లేనట్లు చాలా సందర్భాల్లో నిరూపితమైంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ రెండు వర్గాలుగా విడిపోయిందనే వార్తలు గుప్పుమన్నాయి.ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శన పేలవంగా సాగడం, ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై నిలవడం ఇందుకు బలాన్ని చేకూర్చింది. కెప్టెన్గా విఫలమైన పాండ్యా ఆల్రౌండర్గానూ చెప్పుకోగదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్లలో కలిపి 144.93 స్ట్రైక్రేటుతో 200 పరుగులు స్కోరు చేయడంతో పాటు 10.59 ఎకానమీతో 11 వికెట్లు తీశాడు. అయితే, ఆరంభంలో మాత్రం వరుసగా విఫలమయ్యాడు. అయినప్పటికీ వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోగలిగాడు.ఈ నేపథ్యంలో ఫామ్లో లేకున్నా పాండ్యాకు చోటు ఇవ్వడం పట్ల బీసీసీఐ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయం గురించి ఎదురైన ప్రశ్నకు టీమిండియా ఛీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సమాధానిమిస్తూ.. తమకు అందుబాటులో ఉన్న ఆటగాళ్లలో పాండ్యా మాదిరి బ్యాటింగ్, బౌలింగ్ చేయగల సమర్థవంతమైన పేస్ ఆల్రౌండర్ లేనందు వల్లే అతడిని ఎంపిక చేసినట్లు వెల్లడించాడు.ఈ క్రమంలో దైనిక్ జాగరణ్ ఆసక్తికర కథనం వెలువరించింది. రోహిత్, అగార్కర్లకు ఇష్టం లేకపోయినా.. ఒత్తిడిలో కూరుకుపోయినందు వల్లే పాండ్యాను సెలక్ట్ చేసినట్లు తెలిపింది. అదే విధంగా.. ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలకనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో కెప్టెన్గానూ ప్రస్తుతం ప్రత్యామ్నాయం లేనందు వల్లే వైస్ కెప్టెన్గా ప్రకటించినట్లు వెల్లడించింది. -
రోహిత్ శర్మ సంచలన నిర్ణయం.. త్వరలోనే రిటైర్మెంట్!?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్కప్-2024 తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్కు విడ్కోలు పలకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే రోహిత్ శర్మ తన నిర్ణయాన్ని బీసీసీఐకు వెల్లడించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. టీ20ల్లో భారత కెప్టెన్గా రోహిత్ శర్మ స్ధానంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే హార్దిక్ను టీ20 వరల్డ్కప్-2024లో భారత జట్టు వైస్ కెప్టెన్గా సెలక్టర్లు ఎంపిక చేసినట్లు వినికిడి. అంతేకాకుండా ప్రపంచకప్కు ఎంపిక చేసిన జట్టులో హార్దిక్కు చోటు దక్కాలని సెలక్టర్లపై బీసీసీఐ ప్రత్యేక ఒత్తిడి తీసుకువచ్చినట్లు దైనిక్ జాగరణ్ తమ రిపోర్ట్లో పేర్కొంది.కాగా ఇప్పటివరకు రోహిత్ శర్మ గైర్హజరీలో టీ20ల్లో భారత జట్టును హార్దిక్ పాండ్యానే నడిపిస్తున్నాడు. రోహిత్ తర్వాత హార్దిక్ భవిష్యత్తు కెప్టెన్ అని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ ఐపీఎల్-2024 సీజన్ తర్వాత అందరి అభిప్రాయం మారిపోయింది.ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్ నూతన కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ తన మార్క్ చూపించలేకపోయాడు. రోహిత్ శర్మను తప్పించి మరి తమ జట్టు పగ్గాలను హార్దిక్కు ముంబై ఫ్రాంచైజీ అప్పగించింది.జట్టును విజయం నడిపించడంలో హార్దిక్ విఫలమయ్యాడు. అంతేకాకుండా ముంబై డ్రెస్సింగ్ రూమ్ రెండు వర్గాలగా కూడి చీలిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొంతమంది రోహిత్ శర్మ వర్గంలో ఉంటే మరి కొంతమంది పాండ్యాకు సపోర్ట్గా ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్లో కెప్టెన్గా తన మార్క్ చూపించడంలో విఫలమవుతున్న హార్దిక్.. ఒక వేళ పూర్తి స్దాయిలో భారత జట్టు పగ్గాలు చేపడితే ఏ మెరకు విజయవంతమవుతాడో చూడాలి. -
MI: ముంబై ఇండియన్స్కు గుడ్బై?.. రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ యాజమాన్యం వ్యవహారశైలి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నాడా? వచ్చే ఏడాది అతడు జట్టును వీడనున్నాడా? హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో తనకు జరిగిన అవమానం పట్ల ఆవేదన చెందుతున్నాడా?తాను నిర్మించిన సామ్రాజ్యం నుంచి తానే బయటకు వెళ్లే సమయం వచ్చిందా? అంటే అవుననే మెజారిటీ మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రోహిత్ శర్మ- కోల్కతా నైట్ రైడర్స్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ మధ్య జరిగిన తాజా ‘సంభాషణ’కు సంబంధించిన దృశ్యాలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.ఐపీఎల్-2024 కంటే ముందే కెప్టెన్గా రోహిత్ శర్మపై వేటు వేసిన ముంబై ఫ్రాంఛైజీ.. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. అపఖ్యాతిఅయితే, అతడి సారథ్యంలో పేలవ ప్రదర్శనతో చతికిల పడిన ముంబై ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతిని మూటగట్టుకుంది. రోహిత్, హార్దిక్లకు మద్దతుగా జట్టు రెండు వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలోనే ఈ వైఫల్యాలు ఎదురయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అదే విధంగా.. పాండ్యా వ్యవహార శైలి పట్ల గుర్రుగా ఉన్న రోహిత్ వచ్చే ఏడాది ముంబై జట్టును వీడనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ముంబై శనివారం కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ సన్నాహకాల్లో భాగంగా మైదానంలోకి వెళ్లిన రోహిత్- కేకేఆర్ కోచ్ అభిషేక్ నాయర్తో మాట్లాడినట్లుగా ఉన్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.అది నా ఇల్లు బ్రదర్ఇందులో.. ‘‘ఒక దాని తర్వాత మరొకటి మారిపోతూ ఉన్నాయి. వాళ్లే ఇందుకు కారణం. ఏదేమైనా గానీ.. అది నా ఇల్లు బ్రదర్.. నేను నిర్మించిన గుడి అది. ఇదే నాకు లాస్ట్’’ అంటూ రోహిత్ శర్మ వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. దీనిని బట్టి రోహిత్ ముంబై ఫ్రాంఛైజీకి గుడ్బై చెప్పడం ఖాయమని అనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ తదుపరి కేకేఆర్లో చేరితే బాగుంటుందంటూ పాకిస్తాన్ లెజెండరీ పేసర్, గతంలో కోల్కతా ఫ్రాంఛైజీతో పనిచేసిన వసీం అక్రం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిషేక్ నాయర్తో హిట్మ్యాన్ సంభాషణ మరింత హైలైట్ అవుతోంది.చదవండి: KL Rahul- Sanjeev Goenka: జట్టు గెలవాలన్న తపనే అది: బ్రెట్ లీClear audio of Rohit Sharma and Abhishek Nayar's conversation, he didn't said that it's his last IPL.Please don't make any conclusions on half said words.🙏pic.twitter.com/9lbtZRQvQB— Aryan 🇮🇳 (@Iconic_Hitman) May 10, 2024... That chat. Rohit to Nayar "Ek ek cheez change ho rha hai!,, Wo unke upar hai,,, Jo bhi hai wo mera ghar hai bhai, wo temple mene banwaya hai" Last line - "Bhai mera kya mera to ye last hai" And now KKR deleted that chatting video of Rohit Sharma and Nayar#RohitSharma pic.twitter.com/4BiQzutQdH— HitMan 🖤 (@Sachin__i) May 11, 2024 -
రోహిత్ ముంబైని వీడటం ఖాయం.. ఆ తర్వాత అతడి కెప్టెన్సీలో!
ఐపీఎల్-2024లో కొత్త కెప్టెన్తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్కు చేదు అనుభవం ఎదురైంది. ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మపై వేటు వేసి.. హార్దిక్ పాండ్యాను సారథి చేసినందుకు భారీ మూల్యమే చెల్లించింది.తాజా ఎడిషన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. కాగా రోహిత్ శర్మను కెప్టెన్గా తప్పించిన నాటి నుంచే అభిమానులు మేనేజ్మెంట్పై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాను మైదానం లోపల, వెలుపలా పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. అందుకు తగ్గట్లుగానే అతడు ఏమాత్రం రాణించలేకపోతున్నాడు. ఇంకో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానేపాండ్యా సారథ్యంలో ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచి.. ఇంకో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకొంది.ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ వాతావరణం అస్సలు బాగా లేదని.. రోహిత్, హార్దిక్లకు మద్దతుగా జట్టు రెండు వర్గాలుగా విడిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మ కన్నీళ్లుస్టార్ ఆటగాళ్ల మధ్య విభేదాల వల్లే ముంబై పరిస్థితి ఇలా మారిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్తో సోమవారం నాటి మ్యాచ్లో వైఫల్యం తర్వాత రోహిత్ శర్మ కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా ఉన్న వీడియో వీటికి మరింత బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్లో హిట్మ్యాన్ ముంబై ఫ్రాంఛైజీని వీడనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ పేస్ లెజెండ్ వసీం అక్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ ముంబైని వీడతాడువచ్చే ఏడాది రోహిత్ శర్మ కోల్కతా నైట్ రైడర్స్కు ఆడితే చూడాలని ఉందని పేర్కొన్నాడు. ఈ మేరకు స్పోర్ట్స్కీడాతో మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసి వచ్చే ఏడాది రోహిత్ శర్మ ముంబైతో కొనసాగకపోవచ్చు.అతడు కేకేఆర్లోకి రావాలని కోరుకుంటున్నాను. అక్కడ గౌతీ(గంభీర్) మెంటార్షిప్లో.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది.గొప్ప ఆటగాడుఈడెన్ గార్డెన్స్ పిచ్ మీద రోహిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. అతడొక గొప్ప ప్లేయర్. అతడు కేకేఆర్లోకి వస్తే చాలా చాలా బాగుంటుంది’’ అని వసీం అక్రం తన మనసులోని భావాలు పంచుకున్నాడు. ఇక ఈ సీజన్లో ఇప్పటికే పదకొండు మ్యాచ్లలో ఎనిమిది గెలిచి పట్టికలో అగ్రస్థానంలో ఉన్న కేకేఆర్ ప్రదర్శను ఈ సందర్భంగా కొనియాడాడు కూడా!చదవండి: SRH: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్.. ప్రపంచంలోనే తొలి టీ20 జట్టుగా.. -
T20 WC: ద్రవిడ్, రోహిత్కు నచ్చకపోవచ్చు.. కానీ నా సలహా ఇదే!
టీ20 వరల్డ్కప్-2024 నేపథ్యంలో టీమిండియా కూర్పు గురించి వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచ నంబర్ వన్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ను టాపార్డర్కు ప్రమోట్ చేయాలని సూచించాడు.తన సూచన టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మకు నచ్చకపోవచ్చని.. అయితే, జట్టు ప్రయోజనాల కోసమే తాను ఈ సలహా ఇస్తున్నానని లారా పేర్కొన్నాడు. కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా ఐసీసీ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా జూన్ 5న భారత జట్టు తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఐర్లాండ్తో మ్యాచ్తో తాజా వరల్డ్కప్లో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సారథ్యంలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.ఒంటిచేత్తో జట్టును గెలిపించిఇదిలా ఉంటే.. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఐపీఎల్-2024 బరిలో దిగిన ముంబై ఇండియన్స్ స్టార్ సూర్యకుమార్ ఆరంభంలో తడబడ్డాడు. అయితే, త్వరగానే తిరిగి ఫామ్ అందుకున్న స్కై.. ఆఖరిగా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో దుమ్ములేపాడు.నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగి 51 బంతుల్లోనే 12 ఫోర్లు, ఆరు సిక్స్ల సాయంతో 102 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. కాగా సూర్య సాధారణంగా మిడిలార్డర్లోనే బ్యాటింగ్కు వస్తాడన్న విషయం తెలిసిందే.అయితే, టీ20 ప్రపంచకప్-2022 తర్వాత వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు దూరంగా ఉన్న సమయంలో మూడో స్థానంలో దిగాడు సూర్య. అలా 14 ఇన్నింగ్స్ ఆడి 479 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, నాలుగు అర్ధ శతకాలు ఉండటం విశేషం.మూడో నంబర్లోనే ఆడించాలిఇక నాలుగో స్థానంలో ఓవరాల్గా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 35 ఇన్నింగ్స్ ఆడిన సూర్య 1402 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో బ్రియన్ లారా ఆసక్తికర విశ్లేషణతో ముందుకు వచ్చాడు.‘‘టీమిండియా మేనేజ్మెంట్కు నచ్చుతుందో లేదో గానీ నా సలహా మాత్రం ఇదే. సూర్యను మూడో నంబర్లోనే బ్యాటింగ్కు పంపాలి. వన్డౌన్లోనే అతడు ఆడాలి.టాపార్డర్లో ఆడటమే సరైందిటీ20 అత్యుత్తమ ప్లేయర్లలో సూర్య ఒకడు. సర్ వివియన్ రిచర్డ్స్లాంటి వాళ్లతో మాట్లాడితే.. తాను మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు.అలాగే స్కై కూడా టాపార్డర్లో ఆడటమే సరైందని నేను భావిస్తాను. అతడు ఎలాగూ ఓపెనర్ కాదు.. కాబట్టి కనీసం మూడో స్థానంలోనైనా పంపిస్తే బాగుంటుంది.10- 15 ఓవర్ల పాటు సూర్య క్రీజులో ఉంటే ఏం జరుగుతుందో మనకి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసినా.. లక్ష్య ఛేదనలో అయినా సూర్య వన్డౌన్లో వస్తే ప్రయోజనకరం.కోహ్లి త్యాగం చేయాలికాబట్టి కోహ్లి నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తే బెటర్. సూర్య స్టార్ టీ20 ప్లేయర్ కాబట్టి అతడి కోసం తన స్థానం త్యాగం చేయాలి’’ అని బ్రియన్ లారా చెప్పుకొచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోహ్లి ఓపెనింగ్ చేయనున్నాడన్న వార్తల నడుమ బ్రియన్ లారా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.చదవండి: SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ప్రత్యేకంగా మీకోసమే.. -
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
‘‘నాకు తెలిసి అతడు పూర్తిగా అలసిపోయాడు. టీమిండియా కెప్టెన్గా, ముంబై ఇండియన్స్ కీలక ఆటగాడిగా విరామం లేని షెడ్యూల్తో బిజీగా గడుపుతున్నాడు.అతడికి కాస్త విశ్రాంతి అవసరం. బ్రేక్ తీసుకుని తిరిగి వస్తే తిరిగి ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంది. గత మ్యాచ్కు ముందు అతడు నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నపుడు గమనించాను.వెన్నునొప్పితో బాధపడుతున్నట్లుగా అనిపించింది. అతడు పూర్తి ఫిట్గా, సంతోషంగా ఉంటేనే ముంబైకి, టీమిండియాకు శుభసూచకం. విశ్రాంతి లేకుండా ఆడితే మాత్రం ఇబ్బందులు తప్పవు.నిజానికి బ్యాటింగ్ పరంగా తనకు సమస్య లేదు. బ్రేక్ మాత్రం అవసరం’’ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, కామెంటేటర్ మైకేల్ క్లార్క్ అన్నాడు. టీమిండియా సారథి రోహిత్ శర్మను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.అదొక్కటి తప్ప కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ఆటగాడిగా కొనసాగుతున్న రోహిత్ శర్మ ఆరంభంలో బాగానే ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో సునామీ సెంచరీతో విరుచుకుపడ్డాడు కూడా!కానీ గత కొంతకాలంగా రోహిత్ శర్మ ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్నాడు. గత ఐదు ఐపీఎల్ మ్యాచ్లలో రోహిత్ సాధించిన పరుగులు కేవలం 33. ఇందులో నాలుగుసార్లు అతడు సింగిల్ డిజిట్ స్కోర్లు నమోదు చేశాడు.మరోసారి వైఫల్యంఇక సన్రైజర్స్తో సోమవారం నాటి మ్యాచ్లోనూ రోహిత్ వైఫల్యం కొనసాగింది. ఐదు బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులు చేసి నిష్క్రమించాడు రోహిత్. టైమింగ్ మిస్ అయి వికెట్ పారేసుకున్నాడు.అలా అయితే తిరిగి ఫామ్లోకిఈ నేపథ్యంలో మైకేల్ క్లార్క్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. రోహిత్ శర్మకు విశ్రాంతినివ్వాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశాడు. ఓవైపు టీ20 వరల్డ్కప్-2024 నేపథ్యంలో జట్టు ఎంపిక, కూర్పు, ప్రెస్మీట్లు.. మరోవైపు ముంబై ఇండియన్స్ మ్యాచ్లతో రోహిత్ అలసిపోయాడని పేర్కొన్నాడు.అందుకే కాస్త బ్రేక్ ఇస్తే తిరిగి పుంజుకోగలడని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ సీజన్లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ ఆడిన 12 మ్యాచ్లలో కలిపి 330 పరుగులు మాత్రమే చేయగలిగాడు. చదవండి: Rohit Sharma Crying Video: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్ -
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
ఐపీఎల్-2024 టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు పెద్దగా కలిసి రావడం లేదు. సీజన్ ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ కెప్టెన్ పదవిని కోల్పోయిన హిట్మ్యాన్.. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.కానీ బ్యాటర్గా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 12 ఇన్నింగ్స్లో కలిపి రోహిత్ శర్మ చేసిన పరుగులు 330. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో పదిహేడో స్థానం(మే 7 నాటికి)లో ఉన్నాడు.ఆ సెంచరీ మినహా!ఈ ఎడిషన్లో చెన్నై సూపర్ కింగ్స్ మీద సాధించిన శతకం(105 నాటౌట్) మినహా మిగతా మ్యాచ్లలో రాణించలేకపోయాడు. తాజాగా సన్రైజర్స్తో సోమవారం ముగిసిన మ్యాచ్లోనూ రోహిత్ శర్మ విఫలమయ్యాడు.భావోద్వేగానికి గురైన రోహిత్!వాంఖడే మైదానంలో ఐదు బంతులు ఎదుర్కొన్న రోహిత్.. కేవలం ఒక్క ఫోర్ కొట్టి అవుటయ్యాడు. రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఈ నేపథ్యంలో నిరాశగా మైదానం వీడిన రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లి తీవ్ర భావోద్వేగానికి గురైనట్లుగా కనిపించాడు. దుఃఖాన్ని ఆపుకొంటూ రోహిత్ కన్నీళ్లను తుడుచుకుంటున్నట్లుగా కనిపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.పాపం రోహిత్ఈ వీడియో చూసిన రోహిత్ శర్మ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ‘‘టీ20 వరల్డ్కప్నకు ముందు నిన్నిలా చూడలేకపోతున్నాం హిట్మ్యాన్. ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ నిర్ణయం వల్లే ఇదంతా. కెప్టెన్సీ నుంచి అవమానకరంగా తప్పించి అతడిని ఒత్తిడిలోకి నెట్టేశారు.ఐదుసార్లు ట్రోఫీ అందించిన కెప్టెన్పై వేటు వేశారు. అందుకు తగిన మూల్యం చెల్లిస్తున్నారు’’ అంటూ ముంబై జట్టు మేనేజ్మెంట్పై మండిపడుతున్నారు. ఏదేమైనా రోహిత్ శర్మ వైఫల్యాలను అధిగమించి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా సన్రైజర్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ఈ సీజన్లో నాలుగో విజయం అందుకుంది. చదవండి: ధోని గురించి నిజాలు ఇవే! మాజీ క్రికెటర్లకు కౌంటర్Rohit Sharma crying in the dressing room. pic.twitter.com/GRU5uF3fpc— Gaurav (@Melbourne__82) May 6, 2024💯 & winning runs in styleSuryakumar Yadav hits a maximum to bring up his century 👏Watch the recap on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #MIvSRH | @mipaltan pic.twitter.com/RlaOZ8l2i0— IndianPremierLeague (@IPL) May 6, 2024 -
T20 World Cup 2024: చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ
టీమిండియా సారధి రోహిత్ శర్మ ప్రపంచ క్రికెట్లో ఏ ఆటగాడికి సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకోనున్నాడు. త్వరలో ప్రారంభంకాబోయే టీ20 వరల్డ్కప్కు ఎంపికైన హిట్మ్యాన్ ఇప్పటివరకు జరిగిన అన్ని ప్రపంచకప్లకు ఎంపికైన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు. 2007 ఎడిషన్ నుంచి వరుసగా అన్ని ఎడిషన్లలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన రోహిత్.. తొలి ప్రపంచకప్ ఛాంపియన్ జట్టైన టీమిండియాలో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఆతర్వాత 2009, 2010, 2012, 2014, 2016, 2021, 2022 ఎడిషన్లలోనూ భాగమయ్యాడు. తదుపరి ప్రపంచకప్ ఎడిషన్ హిట్మ్యాన్కు తొమ్మిదో ఎడిషన్ కానుంది. ప్రపంచ క్రికెట్లో బంగ్లా ఆల్రౌండర్ షకీబ్ ఉల్ హసన్ కూడా తొలి ఎనిమిది ఎడిషన్లలో పాల్గొన్నాడు. బంగ్లా ప్రపంచకప్ జట్టును ప్రకటించాల్సి ఉంది. రాబోయే ప్రపంచకప్లో షకీబ్ స్థానంపై అనుమానాలు నెలకొన్నాయి. వయసు పైబడిన రిత్యా అతను ప్రపంచకప్ ఆడతాడో లేదో తెలీదు. టీ20 ప్రపంచకప్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఘనత కూడా రోహిత్ శర్మ పేరిటే ఉంది. హిట్మ్యాన్ ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 39 మ్యాచ్లు ఆడాడు. పొట్టి ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత విరాట్ కోహ్లి.. అత్యధిక వికెట్ల రికార్డు షకీబ్ పేరిట ఉన్నాయి.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్కప్ తొమ్మిదో ఎడిషన్ ఈ ఏడాది జూన్ 1 నుంచి ప్రారంభంకానుంది. యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికలుగా ఈ టోర్నీ జరుగనుంది.తొలి మ్యాచ్ యూఎస్ఏలోని డల్లాస్ నగరంలో కొత్తగా నిర్మించిన మైదానంలో జరుగనుంది. ఈ మ్యాచ్లో ఆతిథ్య యూఎస్ఏ జట్టు.. కెనడాతో తలడనుంది.మెగా టోర్నీ భారత్ ప్రస్తానం జూన్ 5న మొదలవుతుంది. ఆ రోజు జరిగే మ్యాచ్లో టీమిండియా.. ఐర్లాండ్తో తలపడుతుంది. ప్రపంచకప్లో బిగ్ ఫైట్, దాయాదుల సమరం జూన్ 9న జరుగునుంది. ఈ మెగా సమరానికి న్యూయార్క్ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. -
రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులోకి వచ్చిన తొలినాళ్లలో రోహిత్ ఇంగ్లిష్ సరిగ్గా మాట్లాడలేకపోయేవాడని.. దాంతో సరదాగా అతడిని తాము ఏడిపించేవాళ్లమని పేర్కొన్నాడు.అయితే, రోహిత్కు మాత్రం అందరితో కలిసి ఉండటం ఇష్టమని.. అతడు గొప్ప మనసున్న వ్యక్తి అంటూ యువీ కొనియాడాడు. ఈసారి రోహిత్ శర్మ కచ్చితంగా ప్రపంచకప్ సాధిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.ఇంత వరకూ నో ఐసీసీ టైటిల్స్!టీ20 ప్రపంచకప్-2021 తర్వాత టీమిండియా సారథిగా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ ఒక్క ఐసీసీ టోర్నీలోనూ టైటిల్ అందించలేకపోయాడు. అతడి కెప్టెన్సీలో 2022 టీ20 ప్రపంచకప్లో సెమీస్లోనే ఇంటిబాట పట్టిన భారత్.. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లోనూ చేతులెత్తేసింది.ఇక సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లోనూ బోల్తాపడి తృటిలో ట్రోఫీని చేజార్చుకుంది. ద్వైపాక్షిక సిరీస్లు, ఆసియా వన్డే కప్-2023 మినహా ఒక్క మెగా ఈవెంట్లోనూ రోహిత్ సేన ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది.రోహిత్కు ఇంగ్లిష్ రాదుఈ క్రమంలో ప్రస్తుతం అందరి కళ్లు టీ20 ప్రపంచకప్-2024 మీదే ఉన్నాయి. 37 ఏళ్ల రోహిత్ శర్మ ఈసారైనా టైటిల్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా మొదలుకానున్న ఈ ఐసీసీ టోర్నీకి యువరాజ్ సింగ్ అంబాసిడర్గా ఎంపికైన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఐసీసీతో మాట్లాడుతూ యువీ రోహిత్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అతడికి అసలు ఇంగ్లిష్ రాదు. ముంబైలోని బోరివలీ వీధుల నుంచి వచ్చిన వాడు. చాలా సరదాగా ఉంటాడు.ఇంగ్లిష్ విషయంలో మాత్రం అతడిని మేము ఏడిపించేవాళ్లం. భాష సంగతి పక్కనపెడితే అతడి మనసు మాత్రం వెన్న. ఎంత ఎదిగినా తన ప్రవర్తనలో ఎలాంటి మార్పూ లేదు. రోహిత్ శర్మలో గొప్ప గుణం అదే.నా బెస్ట్ ఫ్రెండ్ తాను సరదాగా ఉండటంతో పాటు చుట్టూ ఉన్న వాళ్లకు కూడా వినోదం పంచుతాడు. గొప్ప నాయకుడు. క్రికెట్ రంగంలో నాకున్న అత్యంత సన్నిహితుల్లో రోహిత్ కూడా ఒకడు.ఈసారి రోహిత్ శర్మ వరల్డ్కప్ ట్రోఫీ ఎత్తాలని.. వరల్డ్కప్ మెడల్ మెడలో వేసుకుంటే చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అతడు ఇందుకు వందకు వంద శాతం అర్హుడు’’ అని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు.అతడే సరైన కెప్టెన్ ఒత్తిడిలోనూ సరైన నిర్ణయాలు తీసుకోగల సత్తా ఉన్న రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్గా ఉండటం బీసీసీఐ తీసుకున్న సరైన నిర్ణయమని ఈ సందర్భంగా యువీ అన్నాడు. ఐపీఎల్లో ఐదు ట్రోఫీలు గెలిచిన రోహిత్ లాంటి వ్యక్తి టీ20 వరల్డ్కప్-2024లోనూ భారత్ను ముందుకు నడిపించడం సానుకూలాంశమని పేర్కొన్నాడు.చదవండి: ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే! -
హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
టీమిండియా భవిష్య కెప్టెన్ గురించి బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ తర్వాత భారత జట్టు సారథిగా పగ్గాలు చేపట్టగల అర్హత అతడికే ఉందంటూ ఓ ముంబైకర్ పేరు చెప్పాడు.కాగా టీ20 ప్రపంచకప్-2021 తర్వాత విరాట్ కోహ్లి స్థానంలో రోహిత్ శర్మను కెప్టెన్ను చేసింది బీసీసీఐ. హిట్మ్యాన్ సారథ్యంలో అన్ని ఫార్మాట్లలో ఏక కాలంలో నంబన్ వన్గా నిలిచిన టీమిండియా.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం సత్తా చాటలేకపోయింది.ఫైనల్ వరకూ వచ్చినా టీ20 ప్రపంచకప్-2022లో సెమీస్లోనే నిష్క్రమించిన రోహిత్ సేన.. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో ఓడి ట్రోఫీని ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. అదే విధంగా.. సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023లోనూ విజయ లాంఛనం పూర్తి చేయలేక.. ఆస్ట్రేలియా చేతిలో ఓడి ఆఖరి మెట్టుపై టైటిల్ను చేజార్చుకుంది.ఇక ఇప్పుడు మరో మెగా టోర్నీకి టీమిండియా సిద్ధమవుతోంది. పొట్టి ఫార్మాట్లో వరల్డ్కప్ ఈవెంట్కు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రోహిత్ శర్మ నాయకత్వంలోని పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.ఇందులో మిడిలార్డర్ బ్యాటర్, క్రమశిక్షణా చర్యల నేపథ్యంలో సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్కు మాత్రం చోటు దక్కలేదు. అయితే, ఐపీఎల్-2024లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా మాత్రం అయ్యర్ దూసుకుపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్లలో కేకేఆర్ ఎనిమిది గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎమ్ఎస్కే ప్రసాద్ అయ్యర్ కెప్టెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలా కాదు. ‘‘హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలా కాదు.. శ్రేయస్ అయ్యర్ను టీమిండియా తదుపరి కెప్టెన్గా తీర్చిదిద్దబడ్డాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ క్రమపద్ధతిలో సారథిగా ఎదిగేందుకు బాటలు వేసుకున్నాడు.గత రెండేళ్లలో అతడి గణాంకాలు అద్బుతం. ఇక ఇండియా-ఏ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. నాకు తెలిసి ఇండియా- ఏ ఆడిన 10 సిరీస్లలో ఎనిమిది గెలిచింది. అందులో ఎక్కువసార్లు భారత జట్టును ముందుకు నడిపింది శ్రేయస్ అయ్యరే!టీమిండియా తదుపరి కెప్టెన్గా అతడు తయారుచేయబడ్డాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తర్వాత సారథిగా రిషభ్ పంత్తో శ్రేయస్ అయ్యర్ పోటీపడుతున్నాడు. పంత్ కంటే ముందే..నిజానికి పంత్ కంటే కూడా శ్రేయస్ అయ్యర్ ఒక అడుగు ముందే ఉన్నాడని చెప్పవచ్చు’’ అని రెవ్స్ట్పోర్ట్స్తో ఎంఎస్కే ప్రసాద్ వ్యాఖ్యానించాడు. అయితే, ఇదంతా గతం. బీసీసీఐతో విభేదాల నేపథ్యంలో అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోవడంతో ఇప్పుడు జట్టులో స్థానం గురించి పోటీ పడాల్సిన పరిస్థితి.చదవండి: ‘SRH అని ఎవరన్నారు?.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’ -
రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
ఐపీఎల్-2024లో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తన మార్క్ను చూపించలేకపోతుకున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా శుక్రవారం వాఖండే వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ నిరాశపరిచాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన హిట్మ్యన్.. కేకేఆర్ బౌలర్లను ఎదుర్కోవడానికి తీవ్రంగా కష్టపడ్డాడు.ఈ క్రమంలో కేవలం 11 పరుగులు మాత్రమే చేసి కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్లో ఔటయ్యాడు. కాగా ఐపీఎల్లో నరైన్ బౌలింగ్లో రోహిత్ ఔట్ కావడం ఇది ఎనిమిదో సారి.దీంతో రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే బౌలర్ చేతిలో అత్యధిక సార్లు ఔట్ అయిన బ్యాటర్గా రోహిత్ శర్మ నిలిచాడు. అంతకుముందు రోహిత్ శర్మ స్పిన్నర్ అమిత్ మిశ్రా చేతిలో కూడా 7 సార్లు ఔటయ్యాడు. రోహిత్ పాటు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప, రిషబ్ పంత్, రహానే కూడా 7 సార్లు ఒకే బౌలర్ చేతిలో ఔటయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై ఇండియన్స్పై కేకేఆర్ 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. -
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ స్టార్, టీమిండియా కెప్టెన్ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగడం సందేహాలకు తావిచ్చింది. ఐపీఎల్-2024 ఆరంభం నుంచి ముంబై తరఫున అన్ని మ్యాచ్లలోనూ మైదానంలోకి దిగాడు హిట్మ్యాన్.అయితే, కేకేఆర్తో మ్యాచ్లో మాత్రం అతడు ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా వచ్చాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో విశ్రాంతి తీసుకున్న రోహిత్.. లక్ష్య ఛేదనలో బ్యాటింగ్కు వచ్చాడు.కానీ ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. 12 బంతులు ఎదుర్కొని ఒక సిక్స్ సాయంతో 11 పరుగులు మాత్రమే చేసి.. సునిల్ నరైన్ బౌలింగ్లో మనీశ్ పాండేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.ఆందోళనలో అభిమానులుఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఫిట్నెస్పై సందేహాలు తలెత్తాయి. అసలే టీ20 ప్రపంచకప్-2024 ఆరంభానికి సమయం దగ్గరపడుతున్న తరుణంలో కెప్టెన్ సాబ్కు ఏమైందంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. క్లారిటీ ఇచ్చిన చావ్లాఈ క్రమంలో ముంబై ఇండియన్స్ స్పిన్నర్ పీయూశ్ చావ్లా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘‘రోహిత్ తేలికపాటి వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది’’ అని రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్గా పంపడానికి గల కారణం వెల్లడించాడు.అదే విధంగా.. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ వరుస వైఫల్యాల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘పేరు, ప్రఖ్యాతుల కోసం బరిలోకి దిగినపుడు.. పోరాటం కొనసాగిస్తూనే ఉండాలి. ప్లే ఆఫ్స్నకు అర్హత సాధిస్తామా లేదా అన్నది పక్కనపెడితే.. జట్టు ప్రయోజనాల కోసం ఆడటమే ఆటగాళ్ల ప్రథమ కర్తవ్యం’’ అని పీయూశ్ చావ్లా చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్లలో ముంబై ఎనిమిది ఓడిపోయింది.ఇదిలా ఉంటే.. జూన్ 1 నుంచి మొదలుకానున్న టీ20 వరల్డ్కప్-2024లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు.. ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ఇటు కెప్టెన్గా.. అటు ఆల్రౌండర్ పాండ్యా విఫలమవుతున్నా బీసీసీఐ అతడిపై నమ్మకం ఉంచింది. గతేడాది అక్టోబరు తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినా.. ఐసీసీ టోర్నీలో ఏకంగా వైస్ కెప్టెన్గా బాధ్యతలు అప్పగించింది. -
కేకేఆర్తో మ్యాచ్.. అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్
ఐపీఎల్-2024లో డూఆర్డై మ్యాచ్కు ముంబై ఇండియన్స్ సిద్దమైంది. శుక్రవారం (మే 3) వాంఖడే స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ముంబై ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే కచ్చితంగా ఈ మ్యాచ్లో గెలవాల్సిందే. అయితే ఈ మ్యాచ్కు ముందు ముంబై స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్లో రోహిత్ మరో 54 పరుగులు సాధిస్తే.. కేకేఆర్పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఓపెనర్, ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ డేవిడ్ వార్నర్ను రోహిత్ అధిగమిస్తాడు. కాగా ఇప్పటివరకు కేకేఆర్పై 32 మ్యాచ్లు ఆడిన రోహిత్.. 1040 పరుగులు చేశాడు. ఈ జాబితాలో వార్నర్ అగ్రస్ధానంలో ఉన్నాడు. ఇప్పటివరకు కేకేఆర్పై 32 మ్యాచ్లు ఆడిన వార్నర్.. 1093 పరుగులు చేశాడు. అదే విధంగా హిట్మ్యాన్ ఈ మ్యాచ్లో మరో 39 పరుగులు చేస్తే.. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలుస్తాడు.ఈ జాబితాలో రోహిత్ ప్రస్తుతం 6526 పరుగులతో నాలుగో స్ధానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ ఐపీఎల్లో ఇప్పటివరకు 6564 పరుగులు చేశాడు. -
WC: ఒకవేళ రోహిత్ దూరమైతే: భారత మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యా నైపుణ్యాలపై సందేహాలు అక్కర్లేదని.. కెప్టెన్గానూ జట్టును ముందుకు నడిపించగల సత్తా అతడికి ఉందని పేర్కొన్నాడు.ఒకవేళ రోహిత్ శర్మ ఏదేని కారణాల చేత ఐసీసీ టోర్నీ మ్యాచ్లకు దూరమైతే.. సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని పాండ్యాకు సూచించాడు. ఐపీఎల్ వైఫల్యాలు మరిచి వరల్డ్కప్నకు రెడీగా ఉండాలని ఓజా చెప్పుకొచ్చాడు.కాగా వన్డే వరల్డ్కప్-2023లో బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. అప్పటి నుంచి భారత జట్టుకు దూరమయ్యాడు. చీలమండ గాయం నుంచి కోలుకుని ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ఐపీఎల్-2024 బరిలో దిగాడు.అయితే, ఆశించిన స్థాయిలో రాణించకపోలేతున్న పాండ్యా కెప్టెన్గా, ఆటగాడిగా విఫలమవుతున్నాడు. అతడి సారథ్యంలో ముంబై ఇప్పటి వరకు పది మ్యాచ్లు ఆడి కేవలం మూడే గెలిచిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ జట్టులో అతడికి స్థానమే ఇవ్వకూడదనే డిమాండ్లు వినిపించాయి. అయితే, బీసీసీఐ మాత్రం మెగా ఈవెంట్లో ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మకు డిప్యూటీగా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసింది.ఈ క్రమంలో భారత మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘అతడు నిజమైన నాయకుడిగా బరిలోకి దిగాలని నేను కోరుకుంటున్నా. ఒకవేళ రోహిత్కు ఏమైనా జరిగితే.. అలా జరగాలని మనం కోరుకోము.కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అతడు జట్టు దూరమైతే హార్దిక్ పాండ్యానే జట్టును ముందుకు నడిపించాలి కదా. కాబట్టి హార్దిక్ అందుకు అన్ని వేళలా సన్నద్ధంగా ఉండాలి.బ్యాటర్గానూ మరింత బాధ్యతాయుతంగా ఆడాలి. నిజానికి అతడు ఉంటేనే జట్టు సమతూకంగా ఉంటుంది. టీమిండియా సెలక్షన్ గురించి ఎవరు మాట్లాడినా తొలుత హార్దిక్ పేరే గుర్తుకువస్తుంది.అవసరమైన వేళ అదనపు బ్యాటర్గా.. బౌలర్గా తను సేవలు అందించగలడు. ఐపీఎల్లో ఏం జరుగుతుందన్న విషయం గురించి పక్కనపెట్టి వరల్డ్కప్ పైన శ్రద్ధ పెట్టాలి. అవసరమైతే కెప్టెన్గానూ జట్టును ముందుకు నడిపించడానికి హార్దిక్ పాండ్యా సన్నద్ధంగా ఉండాలి’’ అని సూచించాడు.కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీ జూన్ 1న మొదలుకానుంది. టీమిండియా జూన్ ఐదున తమ తొలి మ్యాచ్లో ఐర్లాండ్తో తలపడుతుంది. -
గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
టీమిండియా తరఫున రెండు ప్రపంచకప్లు గెలిచిన జట్లలో భాగమైన గౌతం గంభీర్.. ఐపీఎల్లోనూ తనదైన ముద్ర వేశాడు. కోల్కతా నైట్ రైడర్స్కు చాలా కాలం పాటు ప్రాతినిథ్యం వహించిన ఈ మాజీ ఓపెనర్ ఎన్నో రికార్డులు సాధించాడు.అంతేకాదు కెప్టెన్గా కేకేఆర్ను రెండుసార్లు చాంపియన్గా నిలిపాడు. 2012, 2014 సీజన్లలో ట్రోఫీ గెలిచి సత్తా చాటాడు గంభీర్. ఆ తర్వాత ఢిల్లీ ఫ్రాంఛైజీకి మారినా కెరీర్ సాఫీగా సాగకపోవడంతో ఆటకు వీడ్కోలు పలికాడు గౌతీ.ఈ క్రమంలో గతేడాది లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్గా వ్యవహరించిన ఈ బీజేపీ ఎంపీ.. తాజా ఎడిషన్లో మళ్లీ కేకేఆర్ గూటికి చేరాడు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని జట్టుకు మెంటార్గా ఉన్నాడు.ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో తనకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన ఆటగాడి పేరు ఈ సందర్భంగా వెల్లడించాడు.‘‘క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ కాదు... ఐపీఎల్లో కెప్టెన్గా ఉన్నపుడు నన్ను భయపెట్టిన ఒకే ఒక్క బ్యాటర్ రోహిత్ శర్మ. అతడు బరిలో ఉన్నాడంటే ప్లాన్ ఏ, ప్లాన్ బీ, ప్లాన్ సీ కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి.ఎందుకంటే రోహిత్ శర్మను ఆపడం ఎవరితరం కాదు. అందుకే అతడి కోసం తప్ప మరే ఇతర బ్యాటర్ కోసం కూడా నేను ఇన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోలేదు. ఒక్కోసారి రాత్రుళ్లు నిద్రపోకుండా మరీ వ్యూహాలు రచించిన సందర్భాలు ఉన్నాయి’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.కాగా ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్తో కేకేఆర్ శుక్రవారం తలపడనున్న తరుణంలో ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా ప్రస్తుత సీజన్లో కేకేఆర్ ఆడిన తొమ్మిదింట గెలిచి రెండో స్థానంలో ఉండగా.. ముంబై పదింట కేవలం మూడు గెలిచి తొమ్మిదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. -
T20 WC జట్టులో నో ఛాన్స్.. రింకూతో రోహిత్ సీరియస్ డిస్కషన్
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో పాల్గొనబోయే భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. అమెరికా- వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి ఆరంభం కానున్న ఈ మెగా టోర్నీలో టీమిండియాకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాడు.సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది జనవరిలో అఫ్గనిస్తాన్తో స్వదేశంలో సిరీస్ ద్వారా విరాట్ కోహ్లితో పాటు రోహిత్ అంతర్జాతీయ టీ20లలో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతకు ముందు అతడి గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ భారత జట్టును ముందుకు నడిపించారు.అయితే, అనుభవానికే పెద్ద పీట వేసిన బీసీసీఐ ఐసీసీ టోర్నీలో మాత్రం రోహిత్ శర్మనే కెప్టెన్గా ఉంటాడని ప్రకటించింది. అందుకు అనుగుణంగానే అతడి సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును మంగళవారం ప్రకటించింది.రాహుల్పై వేటు.. రింకూకు మొండిచేయిహార్దిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్గా ఛాన్స్ ఇచ్చిన సెలక్టర్లు.. వికెట్ కీపర్ కోటాలో రిషభ్ పంత్, సంజూ శాంసన్లకు అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్పై వేటు వేశారు. అదే విధంగా.. కచ్చితంగా వరల్డ్కప్ ఆడతాడనుకున్న నయా ఫినిషర్ రింకూ సింగ్కు కూడా మొండిచేయి చూపారు.ఈ విషయం గురించి గురువారం రోహిత్ శర్మతో కలిసి ప్రెస్మీట్లో పాల్గొన్న బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందిస్తూ.. ఇందుకు గల కారణం వెల్లడించాడు. అదనపు బౌలర్ అవసరం ఉన్నందు వల్లే దురదృష్టవశాత్తూ రింకూకు చోటివ్వలేకపోయామని తెలిపాడు.రింకూతో రోహిత్ సీరియస్ డిస్కషన్ఈ క్రమంలో రోహిత్ శర్మ రింకూతో ముచ్చటించిన వీడియో వైరల్గా మారింది. ఐపీఎల్-2024లో భాగంగా రోహిత్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై శుక్రవారం కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది.వాంఖడే వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్కు ముందు కేకేఆర్ ప్రాక్టీస్ చేస్తుండగా హిట్మ్యాన్ అక్కడికి వెళ్లాడు. కేకేఆర్ సారథి శ్రేయస్ అయ్యర్తో పాటు రింకూ, మెంటార్ గౌతం గంభీర్తో మమేకమయ్యాడు. రోహిత్ను చూడగానే రింకూ నవ్వుతూ పలకరించాడు.ఆ తర్వాత రోహిత్ రింకూతో సీరియస్గా డిస్కస్ చేసినట్లు కనిపించింది. బహుశా వరల్డ్కప్ ఈవెంట్ గురించే హిట్మ్యాన్ మాట్లాడి ఉంటాడని అభిమానులు భావిస్తున్నారు. కాగా వరల్డ్కప్-2024 జట్టుతో పాటు రింకూ రిజర్వ్ ప్లేయర్గా ప్రయాణించనున్నాడు. టీ20 ప్రపంచకప్-2024లో పాల్గొనే టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.రిజర్వ్ ప్లేయర్లు: శుబ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.Match Hitman ke ghar rakhoge toh mehman nawazi ke liye Hitman khud aayega na 😎🫶#MumbaiMeriJaan #MumbaiIndians | @ImRo45 | @ShreyasIyer15 | @rinkusingh235 | @KonaBharat | @GautamGambhir pic.twitter.com/6W9VRKbZBs— Mumbai Indians (@mipaltan) May 2, 2024 -
చేజారిన కెప్టెన్సీ.. ఎట్టకేలకు మౌనం వీడిన రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ కెప్టెన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు రోహిత్ శర్మ అభిమానులు. రికార్డు స్థాయిలో ముంబైని ఏకంగా ఐదుసార్లు విజేతగా నిలిపిన హిట్మ్యాన్పై వేటు వేస్తూ ఫ్రాంఛైజీ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నారు.స్టేడియంలో లోపలా.. వెలుపలా పెద్ద ఎత్తున ట్రోలింగ్కు దిగుతున్నారు. హార్దిక్ పాండ్యాకు ప్రేక్షకుల నుంచి ఎదురవుతున్న చేదు అనుభవాలే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో గురువారం నాటి మీడియా సమావేశంలో రోహిత్ శర్మ తొలిసారిగా ఈ విషయంపై స్పందించాడు.టీ20 ప్రపంచకప్-2024కు సంబంధించిన జట్టు గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి ముంబైలో రోహిత్ విలేకరులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ కోల్పోవడం గురించి ప్రశ్న ఎదురైంది.నాకు ఇదేమీ కొత్త కాదుఇందుకు బదులిస్తూ.. ‘‘జీవితంలో ఇదంతా భాగమే. అన్నీ మనం అనుకున్నట్లుగా జరగవు. ఏదేమైనా వేరొకరి(హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి) కెప్టెన్సీలో ఆడటం గొప్ప అనుభవం.ఇంతకు ముందు కూడా నేను చాలా మంది కెప్టెన్ల సారథ్యంలో ఆడాను. నాకు ఇదేమీ కొత్త కాదు. ఒక ఆటగాడిగా జట్టు కోసం ఏం చేయగలనో అది చేయడమే నాకు ముఖ్యం. గత నెల రోజులుగా నేను అదే పని చేస్తున్నాను’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.కాగా గతంలో మహేంద్ర సింగ్ ధోని, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లి, ఆడం గిల్క్రిస్ట్(దక్కన్ చార్జర్స్), హర్భజన్ సింగ్(ముంబై ఇండియన్స్, రిక్కీ పాంటింగ్(ముంబై ఇండియన్స్) కెప్టెన్సీలో రోహిత్ శర్మ ఆడిన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా విఫలంఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు ఆడిన 10 ఇన్నింగ్స్లో కలిపి రోహిత్ శర్మ 314 పరుగులు చేశాడు. ఇక ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా మాత్రం ఆకట్టులేకపోతున్నాడు. అతడి నాయకత్వంలో ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్లలో కేవలం మూడింట మాత్రమే ముంబై గెలిచింది. అక్కడ రోల్ రివర్స్కాగా క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్ తర్వాత వరల్డ్కప్ టోర్నీతో రోహిత్ శర్మ బిజీ కానున్నాడు. రోహిత్ సారథ్యంలోని టీమిండియా జూన్ 5న న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. తదుపరి జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది. ఈ ఐసీసీ టోర్నీలో రోహిత్కు హార్దిక్ డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.చదవండి: T20 WC 2024: ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే? -
అవును... నలుగురు స్పిన్నర్లు ఉండాల్సిందే
ముంబై: వచ్చే నెలలో జరిగే టి20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో నలుగురు స్పిన్నర్లు ఉండాలని జట్టు మేనేజ్మెంట్ నిర్ణయించిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఎంపికలో ఐపీఎల్ ప్రదర్శన చాలా పరిమితమని చెప్పాడు. ఇటీవల ప్రకటించిన భారత జట్టులో మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్లతో పాటు లెఫ్టార్మ్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్లకు చోటు దక్కింది. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో రోహిత్ మాట్లాడుతూ ‘నలుగురు స్పిన్నర్లు ఎందుకు అవసరమనేది ఇప్పుడే వెల్లడించలేను. కానీ కచ్చితంగా ఉండాలనే అనుకున్నాం. ఇందులో ఇద్దరు ఆల్రౌండర్లు (జడేజా, అక్షర్) అవసరమైనపుడు బ్యాటింగ్లో ఎదురుదాడికి దిగుతారు. పిచ్, ప్రత్యర్థి జట్లను బట్టి మా ‘నలుగురి’ ప్రణాళిక జట్టును సమతూకంగా ఉంచుతుంది. మిడిల్ ఓవర్లను సమర్థంగా ఎదుర్కొనేందుకే శివమ్ దూబేలాంటి హిట్టర్ను ఎంపిక చేశాం. ఈ ఐపీఎల్తో పాటు గతంలో టీమిండియా తరఫున దూబే బాగా ఆడాడు. ఐపీఎల్ కంటే ముందే 70, 80 శాతం జట్టు ఎంపిక కూర్పు జరిగిపోయింది. ఎందుకంటే ఐపీఎల్ ప్రదర్శన ఏరోజుకు ఆరోజు మారిపోతూనే ఉంటుంది. దానినే ప్రామాణికంగా తీసుకోలేం. కేవలం కొన్ని స్థానాల కోసమే లీగ్ను పరిగణనలోకి తీసుకున్నాం’ అని వివరించాడు. జూన్ 2 నుంచి 29 వరకు అమెరికా, వెస్టిండీస్లలో టి20 ప్రపంచకప్ జరుగుతుంది. లీగ్ దశ మ్యాచ్లన్నీ భారత్... అమెరికాలోనే ఆడుతుంది. ఆ తర్వాత సూపర్–8 దశ మ్యాచ్ల కోసం కరీబియన్ దీవులకు టీమిండియా వెళుతుంది. -
ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
టీ20 ప్రపంచకప్-2024లో భారత ఓపెనింగ్ జోడీ గురించి కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పరిస్థితులకు తగ్గట్లుగా తమ తుదిజట్టు కూర్పు ఉంటుందని స్పష్టం చేశాడు.అదే విధంగా ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా తాము జట్టును ఎంపిక చేయలేదని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. కాగా జూన్ 1న వరల్డ్కప్ మొదలుకానుండగా.. టీమిండియా జూన్ 5న న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.ఈ నేపథ్యంలో భారత జట్టు తరఫున కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ ఆరంభిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు తుదిజట్టులో చోటు దక్కదని భావిస్తున్నారు.అన్ని ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయిఈ విషయంపై స్పందించిన రోహిత్ శర్మ..‘‘ప్రస్తుతం మాకు అన్ని ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ ఓపెనింగ్ జోడీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.వెస్టిండీస్కు వెళ్లిన తర్వాత అక్కడి పరిస్థితుల ఆధారంగా మా ప్లేయింగ్ ఎలెవన్ను ఎంపిక చేసుకుంటాం. నిజానికి చాలా మంది ఐపీఎల్ గురించి మాట్లాడుతున్నారు.కానీ మేము ఎప్పటి నుంచో ఈ ఫార్మాట్లో జట్టు కూర్పు గురించి చర్చలు జరుపుతూనే ఉన్నాం. చాలా కాలం క్రితమే 15 మంది సభ్యుల జట్టు గురించి తుది నిర్ణయం తీసుకున్నాం. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా మేము మా ప్రణాళికలు మార్చుకోలేదు’’ అని చెప్పుకొచ్చాడు.ఐపీఎల్ ప్రదర్శన ఇలాకాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ఆటగాడిగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఆడిన పది మ్యాచ్లలో కలిపి 315 పరుగులు చేశాడు. మరోవైపు కోహ్లి ఆర్సీబీ ఓపెనర్గా బరిలోకి దిగుతూ 10 మ్యాచ్లలో కలిపి 500 పరుగులు రాబట్టాడు. ఇక యశస్వి జైస్వాల్ రాజస్తాన్ రాయల్స్కు ఆడుతూ 9 మ్యాచ్లలో కలిపి కేవలం 249 పరుగులే చేశాడు.అయితే, ఓపెనింగ్ స్థానం కోసం జరిగిన పోటీలో జైస్వాల్ ప్రధాన జట్టులో చోటు దక్కించుకోగా.. శుబ్మన్ గిల్ రిజర్వ్ ప్లేయర్గా ఎంపికయ్యాడు. కానీ.. ఐపీఎల్-2024లో ప్రస్తుతం 509 పరుగులతో టాప్ స్కోరర్గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు మాత్రం మొండిచేయి చూపారు సెలక్టర్లు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
'రింకూ ఒక అద్బుతం.. కానీ అతడిని సెలక్ట్ చేయలేకపోయాం'
టీ20 వరల్డ్కప్-2024కు ప్రకటించిన భారత జట్టులో నయా ఫినిషర్ రింకూ సింగ్కు చోటు దక్కకపోయిన సంగతి తెలిసిందే. 15 మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టులో రింకూకు ఛాన్స్ ఇవ్వని సెలక్టర్లు.. నామమాత్రంగా స్టాండ్బైగా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఇదే విషయం క్రీడా వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. అద్బుత ఫామ్లో రింకూను ఎంపిక చేయకపోవడాన్ని చాలా మంది మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు.తాజాగా ఈ విషయంపై బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్ స్పందించాడు. జట్టులో అదనపు బౌలర్ అవసరం ఉండటంతోనే రింకూను సెలక్ట్ చేయలేదని అగార్కర్ తెలిపాడు.రింకూ సింగ్ అద్బుతమైన ఆటగాడని మాకు తెలుసు. దురుదృష్టవశాత్తూ రింకూను సెలక్ట్ చేయలేకపోయాం. అతడిని ఎంపిక చేయకపోవడానికి వెనుక ఓ కారణముంది. మేము ఎక్స్ట్రా స్పిన్నర్ను ఎంపిక చేయాలనుకున్నాం. అందుకే రింకూకు ప్రధాన జట్టులో చోటు దక్కలేదు. మా నిర్ణయం రింకూను బాధపెట్టవచ్చు. కానీ జట్టు బ్యాలెన్స్ కారణంగా అతడిపై వేటు వేయక తప్పలేదు. అయినప్పటికి అతడు ట్రావెలింగ్ రిజర్వ్గా జట్టుతో పాటు వెళ్తాడని ప్రెస్ కాన్ఫరెన్స్లో అగార్కర్ పేర్కొన్నాడు. -
T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
ఐపీఎల్-2024 ముగియగానే టీ20 ప్రపంచకప్ రూపంలో మరో మెగా ఈవెంట్ మొదలుకానుంది. మే 26న క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్కు తెరపడనుండగా.. జూన్ 1 నుంచి వరల్డ్కప్ టోర్నీ షురూ కానుంది. ఇక టీమిండియా జూన్ 5న ఐర్లాండ్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.ఇందుకోసం ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ ఈవెంట్లో పాల్గొనబోయే 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి స్ట్రైక్రేటు గురించి క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే.రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న ఈ రన్మెషీన్ ఇప్పటి వరకు 10 మ్యాచ్లలో కలిపి 147.49 స్ట్రైక్రేటుతో 500 పరుగులు చేశాడు. టాప్ స్కోరర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, టీ20లలో కోహ్లి స్ట్రైక్రేటు టీమిండియాకు ఇబ్బంది కానుందంటూ కొంతమంది మాజీ క్రికెటర్లు విమర్శిస్తుండగా.. ఏబీ డివిలియర్స్ వంటి దిగ్గజాలు కోహ్లికి మద్దతుగా నిలుస్తున్నారు.అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టుకు అవసరంఈ విషయంపై బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తాజాగా స్పందించాడు. ‘‘కోహ్లి స్ట్రైక్రేటు గురించి మేము చర్చించలేదు. ఐపీఎల్కు, అంతర్జాతీయ క్రికెట్కు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టుకు అవసరం. మా జట్టు ప్రస్తుతం పూర్తి సమతూకంగా ఉంది. ఐపీఎల్ నుంచి సానుకూల అంశాలను మాత్రమే మనం స్వీకరించాలి. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో ఆడేటపుడు ఒత్తిడిని జయించే అనుభజ్ఞులైన ఆటగాళ్ల అవసరం ఎక్కువగా ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. తద్వారా కోహ్లి కోసం యువ ప్లేయర్లకు అన్యాయం చేస్తున్నారంటూ విమర్శిస్తున్న వారికి గట్టిగానే కౌంటర్ వేశాడు అగార్కర్. రోహిత్ శర్మతో కలిసి గురువారం నాటి మీడియా సమావేశంలో భాగంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఇక కోహ్లి గురించి ప్రశ్న ఎదురుకాగానే రోహిత్ శర్మ మాత్రం నవ్వేయడం గమనార్హం.టీ20 ప్రపంచకప్-2024కు బీసీసీఐ ప్రకటించిన జట్టు:రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.రిజర్వ్ ప్లేయర్లు: శుబ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.చదవండి: అందుకే రాహుల్ను సెలక్ట్ చేయలేదు.. పంత్, సంజూకు: అగార్కర్ -
అందుకే రాహుల్ను సెలక్ట్ చేయలేదు.. పంత్, సంజూకు: అగార్కర్
టీ20 వరల్డ్కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టు ఎంపికపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను వరల్డ్కప్కు ఎంపిక చేయకపోవడం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ మెగా టోర్నీకి రాహుల్ను సెలక్ట్ చేయకపోవడానికి గల కారణాన్ని తాజాగా బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు.మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసే వికెట్ కీపర్ బ్యాటర్ తమకు కావాలనుకున్నామని, అందుకే రాహుల్ను ఎంపిక చేయలేదని అగార్కర్ చెప్పుకొచ్చాడు."రాహుల్ టీ20ల్లో ఎక్కువగా టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. మేము మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే వికెట్ కీపర్ బ్యాటర్ను ఎంపిక చేయాలనకున్నాం. అందుకే రాహుల్ను పక్కన పెట్టి సంజూ శాంసన్, రిషబ్ పంత్లకు స్పెషలిస్టు వికెట్ కీపర్ బ్యాటర్లగా ఎంపిక చేశాము. వీరిద్దరికి మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసే సత్తా ఉందని" ప్రెస్కాన్ఫరెన్స్లో అగార్కర్ పేర్కొన్నాడు. ఈ ప్రెస్కాన్ఫరెన్స్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పాల్గోన్నాడు.భారత టీ20 ప్రపంచకప్ జట్టు:రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్. -
అప్పుడు అజిత్ లేడు.. అందుకే విరామం: రోహిత్ క్లారిటీ
టీ20 ప్రపంచకప్-2022 తర్వాత తాను అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉండటంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. నాడు టెస్టు క్రికెట్కు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలోనే పొట్టి ఫార్మాట్ నుంచి సుదీర్ఘ విరామం తీసుకున్నట్లు తెలిపాడు.కాగా వరల్డ్కప్-2022లో భారత జట్టు సెమీస్లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రోహిత్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ప్రక్షాళన చర్యలు చేపట్టిన బీసీసీఐ నాటి సెలక్షన్ బోర్డును రద్దు చేసింది. అయితే, చీఫ్ సెలక్టర్గా తిరిగి చేతన్ శర్మనే కొనసాగిస్తూ సభ్యులను మాత్రం మార్చింది. ఈ క్రమంలో చేతన టీమిండియాపై వ్యాఖ్యలతో చిక్కుల్లో పడగా.. అతడిని తప్పించిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్గా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ను నియమించింది.ఈ నేపథ్యంలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి దాదాపు ఏడాది కాలం పాటు అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉండటంపై చర్చ నడిచింది. టీ20 ప్రపంచకప్-2024లో వీరిద్దరు ఆడతారా లేదా అనే సందేహాల నడుమ అఫ్గనిస్తాన్తో స్వదేశంలో సిరీస్తో రీఎంట్రీ ఇచ్చారు.ఈ క్రమంలో రోహిత్ శర్మనే కెప్టెన్గా కొనసాగుతాడని బీసీసీఐ స్పష్టం చేసింది కూడా. అదే విధంగా హిట్మ్యాన్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును మంగళవారం ప్రకటించింది.ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి గురువారం మీడియా ముందుకు వచ్చిన రోహిత్ శర్మ టీ20లలో తన గైర్హాజరీ గురించి కీలక విషయాలు వెల్లడించాడు. ‘‘టీ20 ప్రపంచకప్ జరుగుతుందన్న సమయంలో మేము చాలా వరకు అంతర్జాతీయ మ్యాచ్లు మిస్సయ్యాం.టెస్టు ఫార్మాట్లో మ్యాచ్లను మిస్ చేసుకోవాలని ఎవరూ భావించరు. నిజానికి ఈ ఫార్మాట్కే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి కూడా. ఈ విషయం గురించి నేను సహచర ఆటగాళ్లు, కోచ్లతో చర్చించాను.ఆ తర్వాత అజిత్ వచ్చాడు. మేము చర్చించిన అంశాల గురించి అప్పుడు అతడికి తెలియదు. ఎప్పుడు ఏ ఫార్మాట్కు సంబంధించి కీలక ఈవెంట్ ఉంటుందో అదే ఫార్మాట్కు ప్రాధాన్యం ఇవ్వాలని భావించాం.తొలుత టీ20 ప్రపంచకప్, తర్వాత వరల్డ్ టెస్టు చాంపియన్షిప్.. అనంతరం 50 ఓవర్ల క్రికెట్లో వరల్డ్కప్.. ఈ క్రమంలోనే చాలా వరకు టీ20లు నేను మిస్సయ్యాను’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. కాగా జూన్ 1 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుండగా.. జూన్ 5 టీమిండియా తమ తొలిమ్యాచ్లో ఐర్లాండ్తో తలపడనుంది. -
టీ20 వరల్డ్కప్ వేటగాళ్లు.. భారత్ ప్లేయర్స్ బయోడేటా (ఫొటోలు)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సీబీఎస్ఈ పది, పన్నెండవ తరగతి ఫలితాలు విడుదల
ఎవరి లెక్క వారిదే..!
ఓటరు తీర్పు... ఈవీఎంలలో భద్రం
రాయల్ ఎన్ఫీల్డ్ దగ్ధం
వైఎస్సార్సీపీ గెలుపుకోసం పనిచేసిన వారికి ధన్యవాదాలు
దళిత మహిళా సర్పంచ్పై జనసేన దాడి
రామతీర్థంలో వైభంగా పూర్ణాహుతి
గ్రామాల్లో ద్రాక్ష పంట
చికెన్
పశువుల ఎరువుతో భూసారం పెంపు
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement