breaking news
rohit sharma
-
వేలంలో అన్సోల్డ్.. కట్చేస్తే!.. ప్రపంచ రికార్డు
న్యూజిలాండ్ స్టార్లు టామ్ లాథమ్, డెవాన్ కాన్వే సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ చరిత్రలో తొలి వికెట్కు అత్యుత్తమ భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్ జోడీగా నిలిచారు. వెస్టిండీస్తో గురువారం మొదలైన మూడో టెస్టు సందర్భంగా ఈ ఘనత సాధించారు.డబ్ల్యూటీసీ (WTC) 2025-27లో భాగంగా కివీస్ జట్టు స్వదేశంలో విండీస్తో మూడు టెస్టుల సిరీస్ ఆడుతోంది. అసాధారణ పోరాటంతో వెస్టిండీస్ తొలి టెస్టు డ్రా చేసుకోగా.. రెండో టెస్టులో న్యూజిలాండ్ తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది. ఇరుజట్ల మధ్య గురువారం ‘బే ఓవల్’ వేదికగా మూడో టెస్టు మొదలైంది.ఓపెనింగ్ జోడీగా వచ్చి.. శతకాలతో చెలరేగిటాస్ గెలిచిన ఆతిథ్య కివీస్.. పర్యాటక విండీస్ను బౌలింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనింగ్ జోడీగా వచ్చిన కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ (Tom Latham), డెవాన్ కాన్వే సెంచరీలతో చెలరేగారు. లాథమ్ 246 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 137 పరుగులు చేసి.. రోచ్ బౌలింగ్లో రోస్టన్ చేజ్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.మరోవైపు.. తొలిరోజు ఆట ముగిసే సరికి కాన్వే 279 బంతుల్లో 178 పరుగులతో (25 ఫోర్లు) అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా నైట్ వాచ్మన్ జేకబ్ డఫీ (Jacob Duffy) 9 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఫలితంగా గురువారం నాటి మొదటిరోజు ఆటలో న్యూజిలాండ్ 90 ఓవర్లలో వికెట్ నష్టానికి 334 పరుగులు సాధించింది.ప్రపంచ రికార్డుఇదిలా ఉంటే.. తొలి వికెట్కు లాథమ్, కాన్వే కలిసి 520 బంతుల్లో ఏకంగా 323 పరుగులు జతచేశారు. డబ్ల్యూటీసీ చరిత్రలో ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం విశేషం. సౌతాఫ్రికాతో టెస్టులో 2019లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ- మయాంక్ అగర్వాల్ తొలి వికెట్కు 317 పరుగులు జోడించగా.. లాథమ్- కాన్వే తాజాగా ఈ రికార్డును సవరించారు.అంతేకాదు.. సొంతగడ్డపై టెస్టుల్లో అత్యధిక ఓపెనింగ్ పార్ట్నర్షిప్ సాధించిన జోడీగానూ లాథమ్- కాన్వే చరిత్రకెక్కారు. గతంలో ఈ రికార్డు చార్లెస్ స్టెవర్ట్ డెంప్స్టర్- జాన్ ఎర్నెస్ట్ మిల్స్ పేరిట ఉండేది. వీరిద్దరు కలిసి ఇంగ్లండ్పై 1930లో 276 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇదిలా ఉంటే.. అబుదాబిలో మంగళవారం జరిగిన ఐపీఎల్-2026 మినీ వేలంలో అన్సోల్డ్గా మిగిలి పోయిన కాన్వే.. వేలం తర్వాత తన తొలి మ్యాచ్లోనే రికార్డు సెంచరీ సాధించడం విశేషం.చదవండి: IPL 2026 Auction: స్టీవ్ స్మిత్, కాన్వేలకు షాక్.. వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే -
Year-Ender 2025: విరాట్ కోహ్లి నుంచి జాన్ సీనా వరకు..
2025 ఏడాదిలో క్రీడల్లో ఒక శకం ముగిసింది. మైదానంలో తమ అసాధారణ ప్రతిభతో అభిమానులను మంత్రముగ్ధులను చేసిన ఎందరో సూపర్ స్టార్లు ఈ ఏడాది (2025) తమ కెరీర్ను ముగించారు. ఈ క్రమంలో ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన క్రీడా దిగ్గజాలపై ఓ లుక్కేద్దాం.రోహిత్ శర్మ..టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఈ ఏడాది మేలో టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చాడు. 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత పొట్టి ఫార్మాట్కు గుడ్ బై చెప్పిన రోహిత్.. ఇంగ్లండ్ టూర్కు ముందు రెడ్బాల్ క్రికెట్ నుంచి తప్పుకొన్నాడు. తన టెస్టు కెరీర్లో 67 టెస్టు మ్యాచ్లు ఆడిన రోహిత్ 40.58 సగటుతో 4301 పరుగులు చేశాడు. అందులో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించిన భారత టెస్టు కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఎంపికయ్యాడు. రోహిత్ ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు.విరాట్ కోహ్లి..క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరైన విరాట్ కోహ్లి కూడా రోహిత్ శర్మ బాటలోనే నడిచాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన వారం రోజులకే కింగ్ కూడా టెస్టుల నుంచి తప్పుకొన్నాడు. టెస్ట్ క్రికెట్ అంటే తనకు అమితమైన ఇష్టమని, భారత్ తరపున ఆడినంత కాలం ఈ ఫార్మాట్లో కొనసాగుతానని కోహ్లి ఎన్నోసార్లు చెప్పారు. కానీ సడన్గా రిటైర్మెంట్ ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు. సుదీర్ఘ ఫార్మాట్ నుంచి కోహ్లి తప్పుకోవడంతో భారత టెస్ట్ క్రికెట్లో 'రో-కో' శకం ముగిసింది. విరాట్ కోహ్లి తన టెస్టు కెరీర్లో 123 మ్యాచ్లు ఆడి 9230 పరుగులు చేశాడు. 30 సెంచరీలు, 31 ఆర్ధ శతకాలు ఉన్నాయి. విరాట్ కూడా ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు.ఛతేశ్వర్ పుజారాభారత టెస్ట్ క్రికెట్ లో 'నయా వాల్' గా పేరుగాంచిన ఛతేశ్వర్ పుజారా.. ఈ ఏడాది ఆగస్టులో అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుండి తప్పుకొన్నాడు. గత కొన్నేళ్లగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నప్పటికి.. దేశవాళీ క్రికెట్లో మాత్రం పుజారా అద్భుతంగా రాణిస్తుండేవాడు. కానీ యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు తన కెరీర్ను ఛతేశ్వర్ ముగించాడు. పుజారా తన కెరీర్లో 7195 పరుగులు చేశాడు. 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయ.స్టీవ్ స్మిత్, మాక్సీ గుడ్బైఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్ వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకొని అందరికి షాకిచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 అనంతరం స్మిత్ తన నిర్ణయాన్ని వెల్లడించగా.. మాక్సీ ఈ ఏడాది జూన్లో తన రిటైర్మెంట్ను ప్రకటించాడు.హెన్రీచ్ క్లాసెన్సౌతాఫ్రికా స్టార్ హెన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్కు సడన్గా వీడ్కోలు పలికి అందరిని ఆశ్చర్యపరిచాడు. బోర్డుతో విభేదాల కారణంగా క్లాసెన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. క్లాసెన్ తన అంతర్జాతీయ కెరీర్లో 3245 పరుగులు చేశాడు.నికోలస్ పూరన్: వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ కేవలం 29 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకొని అందరినీ షాక్కు గురిచేశాడు. ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ల మోజులో పడి పూరన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.జాన్ సీనా..స్టార్ రెజ్లర్, WWE దిగ్గజం జాన్ సీనా ఈ ఏడాది డిసెంబర్లో ప్రొఫెషనల్ రెజ్లింగ్కు వీడ్కోలు పలికారు. జాన్ సీనా తన చివరి మ్యాచ్లో ఓడిపోయినప్పటికి.. ప్రపంచ రెజ్లింగ్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. జాన్ సీనా తన కెరీర్లో మొత్తం 17 వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ను సొంతం చేసుకున్నాడు.ఈ లెజెండరీ రెజ్లర్ ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలపై దృష్టి సారించారు. ఇప్పటికే 'పీస్మేకర్' (Peacemaker) వంటి సిరీస్లతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జాన్సీనా.సెర్గియో బుస్కెట్స్ (ఫుట్బాల్)స్పెయిన్ మిడ్ఫీల్డ్ మాంత్రికుడు సెర్గియో బుస్కెట్స్ మేజర్ లీగ్ సాకర్ సీజన్ ముగిసిన తర్వాత ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మయామి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ క్లబ్ తరపున లియోనెల్ మెస్సీతో కలిసి సెర్గియో ఆడాడు.పర్దీప్ నర్వాల్ (కబడ్డీ)కబడ్డీ లెజెండ్, 'డూ ఆర్ డై' స్పెషలిస్ట్ పర్దీప్ నర్వాల్ 2025 ప్రో కబడ్డీ లీగ్ (PKL) వేలంలో అమ్ముడుపోకపోవడంతో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రొఫెషనల్ కబడ్డీకి రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చాడు. అయితే కోచ్గా పనిచేసేందుకు తన సిద్దంగా ఉన్నట్లు నర్వాల్ తెలిపాడు. -
బీసీసీఐ కీలక ఆదేశాలు
ముంబై: ప్రస్తుత భారత జట్టులోని క్రికెటర్లు ఎవరైనా సరే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీకి దూరం కావద్దని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసింది. అవకాశం ఉంటే అన్ని మ్యాచ్లు ఆడాలని... లేదా కనీసం రెండు మ్యాచ్లు ఆడాలని సీనియర్ సెలక్షన్ కమిటీ ఆదేశించింది. కాగా డిసెంబర్ 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీ జరుగుతుంది. ఇదిలా ఉంటే.. దక్షిణాఫ్రికాతో భారత్ చివరి టీ20 జరిగే డిసెంబర్ 19, న్యూజిలాండ్తో తొలి వన్డే జరిగే జనవరి 11 మధ్య సమయంలో అవకాశం ఉన్న అన్ని మ్యాచ్లు ఆడాలని బోర్డు తేల్చి చెప్పింది. రో-కోలకు మా త్రమే కాకుండాఇక భారత్ తరఫున ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకే కాకుండా ఇతర రెగ్యులర్ క్రికెటర్లకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. దక్షిణాఫ్రికాతో రెండో టి20 ముగియగానే ఆటగాళ్లకు ఈ విషయాన్ని బోర్డు వెల్లడించినట్లు సమాచారం.అదే విధంగా.. ఎవరైనా ఆటగాడు గాయంతో బాధపడుతూ ఆడలేని స్థితిలో ఉన్నట్లు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) అన్ఫిట్గా తేలిస్తేనే వారికి సడలింపు ఉంటుంది. జనవరి మొదటి వారంలో ఒకే రోజు న్యూజిలాండ్తో వన్డే సిరీస్, టీ20 వరల్డ్ కప్ జట్లను సెలక్టర్లు ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు.. కుటుంబ సన్నిహితులు ఒకరు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతోనే జస్ప్రీత్ బుమ్రా ధర్మశాలలో మూడో టీ20 మ్యాచ్కు దూరమైనట్లు తెలిసింది. అంతా బాగుంటేనే అతడు తర్వాతి మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడు.క్రీడాసమాఖ్యల జాబితాలో బీసీసీఐ లేదు! న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)ల జాబితాలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) లేదని క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పష్టం చేసారు. త్వరలో అమల్లోకి రానున్న కొత్త క్రీడా చట్టానికి సంబంధించి లోక్సభలో జరిగిన చర్చపై జవాబిస్తూ మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. బీసీసీఐని ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చే అవకాశం ఉందా అంటూ టీఎంసీ ఎంపీ మాల రాయ్ అడిగిన ప్రశ్నకు మాండవీయ సమాధానమిచ్చారు. చదవండి: IND vs SA: అక్షర్ పటేల్ స్థానంలో అతడే.. బీసీసీఐ ప్రకటన -
18 ఏళ్లుగా బెస్ట్ ఫ్రెండ్ 10 ఏళ్లుగా హస్బెండ్.. రోహిత్-రితిక పెళ్లిరోజు (ఫొటోలు)
-
విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి అభిమానులకు ఎగిరి గంతేసే శుభవార్త. ఇటీవల సౌతాఫ్రికాతో వరుస సెంచరీలతో దుమ్ములేపిన ఈ రన్మెషీన్ మరోసారి బ్యాట్ పట్టి మైదానంలో దిగనున్నాడు. అయితే, ఈసారి టీమిండియా తరఫున కాకుండా.. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లి ఆడనున్నాడు.ప్రాబబుల్స్లో కోహ్లి పేరుఈ విషయాన్ని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) గురువారం ధ్రువీకరించింది. తాను విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు కోహ్లి తమకు స్వయంగా తెలిపాడని పేర్కొంది. ఈ క్రమంలోనే విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) తాజా సీజన్ ప్రాబబుల్స్లో కోహ్లి పేరును చేర్చింది. దీని గురించి డీడీసీఏ వర్గాలు ఇటీవల ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ..‘‘తాను విజయ్ హజారే ట్రోఫీ ఆడతానని విరాట్ కోహ్లి (Virat Kohli) డీడీసీఏకు సమాచారం ఇచ్చాడు. క్రికెట్లో అతడు కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. రిషభ్ పంత్ కూడాఇటీవల సౌతాఫ్రికాతో వన్డేల్లోనూ సెంచరీలు బాదాడు. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్గా ఇప్పటికీ కొనసాగుతునే ఉన్నాడు. అయితే, అతడు ఈ దేశీ టోర్నీలో ఆడటం ద్వారా యువ ఆటగాళ్లు మరింత స్ఫూర్తి పొందుతారు’’ అని పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. కోహ్లితో పాటు మరో టీమిండియా స్టార్ రిషభ్ పంత్ పేరు కూడా ప్రాబబుల్స్ లిస్టులో ఉంది. ఈసారి ఈ ఇద్దరు ఢిల్లీ తరపున మరోసారి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.గంభీర్- అగార్కర్ ఒత్తిడి వల్లేనా?కోహ్లి వరల్డ్క్లాస్ బ్యాటర్. ఇప్పటికే ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్ తర్వాత.. అత్యధిక సెంచరీలు (84) బాదిన రెండో ఇంటర్నేషనల్ ప్లేయర్గా కొనసాగుతున్నాడు.సౌతాఫ్రికాతో వన్డేల ద్వారా సూపర్ ఫామ్లోకి వచ్చిన కోహ్లి.. నిజానికి కొత్తగా నిరూపించుకునేది ఏమీ లేదు. అయితే, వన్డే వరల్డ్కప్-2027 ప్రణాళికల్లో ఉండాలంటే నిబంధనల ప్రకారం.. దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ దేశీ క్రికెట్ ఆడాల్సిందేనని యాజమాన్యం చెప్పినట్లు వార్తలు వచ్చాయి.ముఖ్యంగా హెడ్కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఈ విషయంలో పంతం పట్టినట్లు ఊహాగానాలు వినిపించాయి. గత కొన్ని రోజులుగా వీరిద్దరు రో- కోల గురించి చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. రోహిత్ను అనూహ్యంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం.. వరల్డ్కప్ ప్లాన్లో భాగంగానే ఇలా చేశామని అగార్కర్ చెప్పడం ఇందుకు నిదర్శనం.అంతేకాదు అంతకుముందు వీరిద్దరు కలిసి రో-కో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించేలా ఒత్తిడి చేశారనే ఆరోపణలూ ఉన్నాయి. ఏదేమైనా ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్- కోహ్లి.. వన్డేల్లో కొనసాగుతూ హవా చూపిస్తున్నారు.ఈ నేపథ్యంలో బోర్డు నిబంధనలకు అనుగుణంగా నడుచుకుని దేశీ టోర్నీల్లో ఆడాలనే సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇటీవల బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. రో-కో దేశీ క్రికెట్ ఆడాలని ఎవరూ ఒత్తిడి చేయడం లేదని చెప్పడం గమనార్హం. కానీ పరిణామాలు అందుకు భిన్నంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్: ఢిల్లీ ప్రాబబుల్స్ జట్టువిరాట్ కోహ్లి, రిషభ్ పంత్, దేవ్ లక్రా, యుగళ్ సైనీ, దివిజ్ మెహ్రా, సుజల్ సింగ్, రజ్నీశ్ దాదర్, అమన్ భార్తి, గోవింద్ మిట్టల్, సుమిత్ బెనీవాల్, శుభమ్ దూబే, కేశవ్ దబాస్, రాహుల్ చౌదరి, సమర్థ్ సేత్, శివమ్ త్రిపాఠి, అన్మోల్ శర్మ, శివమ్ గుప్తా, లక్షయ్ తరేజా, మనన్ భరద్వాజ్, రౌనక్ వాఘేలా, మయాంక్ గుసైన్, కేశవ్ ఆర్సింగ్,, లక్ష్మణ్, దివాన్ష్ రావత్, ప్రణవ్ రాజ్వన్షీ, ప్రన్షు విజయరణ్.చదవండి: వరల్డ్కప్ టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. భారత సంతతి ఆటగాళ్లకు చోటు -
రోహిత్ తిట్టకపోతేనే బాధపడతా.. నా డ్రీమ్ అదే: జైశ్వాల్
వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. తొలి రెండు వన్డేల్లో విఫలమై విమర్శలు ఎదుర్కొన్న జైశ్వాల్.. సిరీస్ డిసైడర్లో మాత్రం తన సత్తాను చూపించాడు. తొలి వన్డే సెంచరీ మార్క్ను అతడు అందుకున్నాడు.అయితే జైశ్వాల్ మ్యాచ్ విన్నింగ్ సెంచరీ సాధించడంలో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మది కీలక పాత్రంట. ఈ విషయాన్ని జైశ్వాల్ స్వయంగా తనంతట తానే వెల్లడించాడు. రోహిత్ యువ ఆటగాళ్లకు ఎంతో సపోర్ట్గా ఉంటాడని, ఒకవేళ జూనియర్లను మందలించిన అందులో ప్రేమ, ఆప్యాయత ఉంటాయని జైశూ తెలిపాడు.కాగా రోహిత్ శర్మ మైదానంలో జూనియర్లు తప్పు చేస్తే అప్పుడప్పుడు తిడుతూ ఉంటాడు. ఇటువంటి సంఘటనలు చాలా అతడి కెప్టెన్సీలో చాలా చోటు చేసుకున్నాయి. మిస్ ఫీల్డ్ చేసినప్పుడు, బౌలింగ్, బ్యాటింగ్ సరిగ్గా చేయినప్పుడు రోహిత్ తన నోటికి పనిచెప్పే వాడు. కానీ వాటిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరము లేదని ఓ ఇంటర్వ్యూలో జైశ్వాల్ స్పష్టం చేశాడు."రోహిత్ భాయ్ మమ్మల్ని మందలించిన ప్రతిసారి అందులో చాలా ప్రేమ, అప్యాయత ఉంటుంది. నిజానికి రోహిత్ తిట్టక పోతానే ఏం జరిగింది? ఎందుకు మందలించడం లేదు? నేను చేసిన పనికి ఆయన బాధపడ్డాడా? అన్న అభద్రతాభావం ఏర్పడుతుంది.రోహిత్, విరాట్ కోహ్లిలు డ్రెస్సింగ్ రూమ్లో ఉండడం మాలాంటి యువ ఆటగాళ్లకు ఎంతో మేలు చేకూరుతోంది. వారు గేమ్ గురుంచి చర్చిస్తారు. వారి అనుభవాలను పంచుకుంటారు. వారు గతంలో చేసిన తప్పిదాలను మేము చేయకుండా ఉండడానికి సలహాలు ఇస్తారు.రో-కో మాతో ఉంటే మేమంతా రిలాక్స్డ్గా ఉంటాము. వైజాగ్ వన్డేలో రోహిత్ భాయ్ నన్ను ఎంతగానో సపోర్ట్ చేశాడు. రోహిత్ భాయ్ నన్ను ప్రశాతంగా, సమయం తీసుకోమని సూచించాడు. తానే రిస్క్ తీసుకుంటానని చెప్పాడు. రోహిత్ లాంటి చాలా అరుదుగా ఉంటారు. అదేవిధంగా విరాట్ పాజీ(కోహ్లి) కూడా టార్గెట్ను చిన్న చిన్న లక్ష్యాలగా చేసుకుని చేధించాలని చెప్పారు. ఇక భవిష్యత్తులో టీ20 ప్రపంచకప్ ఆడాలన్నది నాకల. అంతేకాకుండా వస్తే భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించడానికి కూడా నేను సిద్దంగా ఉన్నానని 'అజెండా ఆజ్ తక్' సదస్సులో జైశ్వాల్ పేర్కొన్నాడు.చదవండి: IPL 2026 SRH Plans: కావ్య మారన్ మాస్టర్ ప్లాన్..! యార్కర్ల కింగ్పై కన్ను? -
బీసీసీఐ కీలక సమావేశం..
టీ20, టెస్టు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి... కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కాంట్రాక్ట్ల విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 22న జరగనున్న బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఆటగాళ్ల కాంట్రాక్టులతో పాటు... మహిళల దేశవాళీ క్రికెట్ చెల్లింపుల విషయంలో ప్రధానంగా చర్చ సాగనుంది. మిథున్ మన్హాస్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జరుగుతున్న తొలి ఏజీఎం ఇదే. ఇప్పటి వరకు కోహ్లి, రోహిత్ ‘ఏ ప్లస్’ కేటగిరీలో ఉండగా... ఇప్పుడు కేవలం ఒక్క ఫార్మాట్లోనే ఆడుతున్న కారణంగా ఈ ఇద్దరినీ అందులో నుంచి తొలగించే అవకాశం ఉంది. కొత్త ‘ఏ ప్లస్’ కాంట్రాక్టు జాబితాలో ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు... టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్ చోటు దక్కించుకోనున్నాడు. ఆన్లైన్లో జరగనున్న ఈ ఏజీఎంలో మహిళల దేశవాళీలో టోర్నీల మ్యాచ్ ఫీజులు, అంపైర్లు, రిఫరీల జీతభత్యాలు తదితర అంశాలపై చర్చించనున్నారు.ఇక బోర్డు డిజిటల్ సొత్తుకు సంబంధించిన చర్చ కూడా జరగనుంది. ప్రస్తుతం మిథున్ మన్హాస్ బోర్డు అధ్యక్షుడిగా కొనసాగుతుండగా... రఘురామ్ భట్ కోశాధికారిగా వ్యవహరిస్తున్నాడు. చదవండి: జోరు కొనసాగించాలని... -
రోహిత్ వెనకాలే కోహ్లి
దుబాయ్: ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డేసిరీస్లో దంచికొట్టిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి దూసుకెళ్లాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో రెండు సెంచరీలు, ఒక హాఫ్సెంచరీతో 302 పరుగులు చేసిన 37 ఏళ్ల కోహ్లి... తాజా ర్యాంకింగ్స్లో 773 పాయింట్లతో రెండు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంక్కు చేరాడు. ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ 781 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ఇద్దరి మధ్య 8 పాయింట్ల అంతరమే ఉంది. గాయం కారణంగా సఫారీలతో సిరీస్కు దూరమైన శుబ్మన్ గిల్ (723 పాయింట్లు) ఐదో ర్యాంక్లో ఉండగా... కేఎల్ రాహుల్ (649 పాయింట్లు) రెండు స్థానాలు మెరుగు పరుచుకొని 12వ ర్యాంక్లో నిలిచాడు. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో భారత స్పిన్నర్ కుల్దీప్ (655 పాయింట్లు) మూడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్లో నిలిచాడు. అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (710 పాయింట్లు) ‘టాప్’లో కొనసాగుతున్నాడు. టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో అభిషేక్ శర్మ (913 పాయింట్లు), బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి (782 పాయింట్లు) అగ్రస్థానాల్లో ఉన్నారు. టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్లో జస్ప్రీత్ బుమ్రా (879 పాయింట్లు) ‘టాప్’లో ఉండగా... యాషెస్ సిరీస్లో విజృంభిస్తున్న మిచెల్ స్టార్క్ (852 పాయింట్లు) మూడో స్థానాలు మెరుగు పరుచుకొని మూడో ర్యాంక్కు చేరుకున్నాడు. -
రెండో స్థానానికి దూసుకొచ్చిన విరాట్.. రోహిత్ తగ్గేదేలే..!
ఐసీసీ తాజాగా (డిసెంబర్ 10) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రెండో స్థానానికి దూసుకొచ్చాడు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్లో వరుసగా రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ చేయడంతో భారీగా రేటింగ్ పాయింట్లు సాధించి రెండు స్థానాలు ఎగబాకాడు. గత వారం ర్యాంకింగ్స్లో విరాట్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇదే సిరీస్లో రెండు మెరుపు అర్ద శతకాలు సాధించిన మరో టీమిండియా స్టార్ రోహిత్ శర్మ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.రోహిత్కు విరాట్కు మధ్య కేవలం 7 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. రోహిత్ ఖాతాలో 781 పాయింట్లు ఉండగా.. విరాట్ ఖాతాలో 773 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఈ ఏడాది రో-కో టాప్-2లో ముగిస్తారు. మిగతా భారత బ్యాటర్లలో కెప్టెన్ శుభ్మన్ గిల్ ఐదో స్థానాన్ని నిలబెట్టుకోగా.. శ్రేయస్ అయ్యర్ ఓ స్థానం కోల్పోయి 10వ స్థానంలో పడిపోయాడు.సౌతాఫ్రికా సిరీస్లో రాణించిన తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ 2 స్థానాలు ఎగబాకి 12వ ప్లేస్కు చేరుకోగా.. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా వరుసగా 99, 100 స్థానాల్లో నిలిచారు. ఈ వారం ర్యాంకింగ్స్లో భారత బ్యాటర్లతో పాటు సౌతాఫ్రికా బ్యాటర్లు కూడా తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. డికాక్ 3 స్థానాలు మెరుగుపర్చుకొని 13వ స్థానానికి ఎగబాకగా.. మార్క్రమ్ 4 స్థానాలు మెరుగుపర్చుకొని 25వ స్థానానికి చేరాడు. బ్రీట్జ్కే ఓ స్థానం మెరుగుపర్చుకొని 29కి, బవుమా 3 స్థానాలు మెరుగుపర్చుకొని 37వ స్థానానికి చేరారు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 3 స్థానాలు మెరుగుపర్చుకొని మూడో స్థానానికి చేరగా.. రషీద్ ఖాన్, ఆర్చర్ టాప్-2 బౌలర్లుగా కొనసాగుతున్నారు. కుల్దీప్ మినహా టాప్-10లో ఒక్క భారత బౌలర్ కూడా లేడు. రవీంద్ర జడేజా 16, సిరాజ్ 21, షమీ 23, అక్షర్ పటేల్ 33, వాషింగ్టన్ సుందర్ 81, హార్దిక్ పాండ్యా 95, వరుణ్ చక్రవర్తి 100 స్థానాలకు పడిపోగా.. అర్షదీప్ సింగ్ 29 స్థానాలు మెరుగుపర్చుకొని 66వ స్థానానికి, హర్షిత్ రాణా 13 స్థానాలు మెరుగుపర్చుకొని 80వ స్థానానికి ఎగబాకారు. ఆల్రౌండర్ల విషయానికొస్తే.. ఒమర్జాయ్, సికందర్ రజా, నబీ టాప్-3లో కొనసాగుతుండగా.. భారత్ తరఫున అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా 10, 11 స్థానాల్లో ఉన్నారు. -
రోహిత్, కోహ్లి విషయంలో బీసీసీఐ ఊహించని ప్రకటన!
టీమిండియా సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు విజయ్ హజారే ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న ఈ దేశవాళీ వన్డే టోర్నీలో రెండు లేదా మూడు మ్యాచ్లలో కోహ్లి ఆడే అవకాశముంది. రోహిత్ శర్మ మాత్రం పూర్తి స్దాయిలో అందుబాటులో ఉంటానని ముంబై క్రికెట్ అసోయేషిన్కు తెలియజేసినట్లు సమాచారం.అయితే బీసీసీఐ సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఒత్తిడితోనే రో-కో ద్వయం విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు సముఖత చూపించారని వార్తలు వచ్చాయి. చాలా మంది మాజీలు కూడా వారిద్దరూ అద్బుతమైన ఫామ్లో ఉన్నారని, డొమాస్టిక్ క్రికెట్ ఆడాలని ఒత్తిడి తీసుకురావడమేంటి అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధికారి ఒకరు సంచలన ప్రకటన చేశాడు."విజయ్ హజారే ట్రోఫీలో ఆడాలన్నది రోహిత్, కోహ్లిల వ్యక్తిగత నిర్ణయం. అంతే తప్ప కచ్చితంగా ఆడాలని వారిని ఎవరూ ఆదేశించలేదు" అని సదరు అధికారి స్పష్టం చేశారు. కాగా రో-కో ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నారు. ఇటీవల సౌతాఫ్రికాతో ముగిసిన వన్డే సిరీస్లో దుమ్ములేపారు. దీంతో వన్డే ప్రపంచకప్-2027లో వారిద్దరూ ఆడడం ఖాయమని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. అయితే ప్రపంచకప్ ప్రణాళికలలో రోహిత్-కోహ్లి ఉన్నారా లేదా అన్నది హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ క్లారిటీ ఇవ్వలేదు. కానీ వారిద్దరూ ప్రపంచ స్థాయి ఆటగాళ్లని, వారి అనుభవం డ్రెస్సింగ్ రూమ్లో అవసరమని గంభీర్ చెప్పుకొచ్చాడు.చదవండి: ENG vs AUS: 'చెత్త బౌలింగ్.. చెత్త బ్యాటింగ్.. చెత్త కెప్టెన్' -
‘రోహిత్, కోహ్లి కీలకమే కానీ’...
సాక్షి, విశాఖపట్నం: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో విజయం సాధించడంలో సీనియర్లతో పాటు... యువ ఆటగాళ్లూ కీలక పాత్ర పోషించారని భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ అన్నాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం విశాఖ వేదికగా జరిగిన చివరి వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. టి20, టెస్టు ఫార్మాట్ల నుంచి తప్పుకున్న భారత మాజీ కెప్టెన్ , ‘రన్ మెషీన్’ విరాట్ కోహ్లి ఈ మూడు మ్యాచ్ల్లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో 302 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలుచుకోగా... రోహిత్ శర్మ రెండు అర్ధశతకాలతో ఆకట్టుకున్నాడు. గంభీర్కు సీనియర్ ఆటగాళ్లకు మధ్య సయోధ్య కుదరడం లేదనే వార్తల నేపథ్యంలో... సిరీస్ విజయం అనంతరం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టులో రోహిత్, కోహ్లి ప్రాధాన్యత... పేస్ ఆల్రౌండర్గా హర్షిత్ రాణా రాణించడం... వాషింగ్టన్ సుందర్కు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇవ్వడం వంటి వివరాలు అతడి మాటల్లోనే... » కోహ్లి, రోహిత్ నాణ్యమైన ప్లేయర్లు. వాళ్లు ప్రపంచశ్రేణి ఆటగాళ్లు అని ఇప్పటికే చాలాసార్లు చెప్పా. ఇలాంటి అనుభజు్ఞలు డ్రెస్సింగ్ రూమ్లో ఉండటంతో జట్టుకు ఎంతో మేలు చేస్తుంది. » వాళ్లు చక్కగా ఆడుతున్నారు. సుదీర్ఘకాలంగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఇక ముందు కూడా దాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నా. 50 ఓవర్ల ఫార్మాట్లో వాళ్లిద్దరూ చాలా ముఖ్యం. » పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లు అందుబాటులో ఉంటే... జట్టు ఎంపికలో వెసులుబాటు ఉంటుంది. అందుకే హర్షిత్ రాణా వంటి వారిని ప్రోత్సహిస్తున్నాం. ఎనిమిదో స్థానంలో బ్యాట్తో పరుగులు చేయగల ప్లేయర్ ఉంటే ఏ జట్టుకైనా మేలే కదా. అలాంటి ఆటగాడు జట్టులో సమతూకాన్ని తీసుకువస్తాడు. 2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకొని ముగ్గురు ప్రధాన పేసర్లు జట్టులో ఉండటం తప్పనిసరి. రాణా పేస్ ఆల్రౌండర్గా మరింత పరిణతి సాధిస్తే అది టీమ్కు బాగా ఉపయోగ పడుతుంది. ఆ దిశగా అతడిని ప్రోత్సహిస్తున్నాం. » బుమ్రా అందుబాటులో లేకున్నా... అర్‡్షదీప్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా చక్కటి ప్రదర్శన కనబర్చారు. ఈ ముగ్గురికి వన్డే క్రికెట్లో పెద్దగా అనుభవం లేకపోయినా... వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకొని చక్కటి ఫలితాలు రాబట్టారు. » వన్డే క్రికెట్లో స్థిరమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉండాలని నేను అనుకోవడం లేదు. పరిస్థితులకు తగ్గట్లు ఆటగాళ్లంతా సిద్ధంగా ఉండటం మేలు. టెస్టు క్రికెట్లో అయితే ప్రతి స్థానానికి ప్రత్యేకమైన ఆటగాళ్లు ఉండటం మంచిది, కానీ, పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓపెనింగ్ జోడీ మినహా తక్కిన స్థానాలకు ఆ అవసరం లేదు. » వాషింగ్టన్ సుందర్నే తీసుకుంటే అతడు ఏ స్థానంలోనైనా చక్కగా ఒదిగిపోగలడు. విదేశాల్లో చక్కటి ఇన్నింగ్స్లు ఆడాడు. మూడో స్థానంలో, ఐదో స్థానంలో, ఎనిమిదో స్థానంలో ఇలా ఎక్కడ అవసరమైతే అక్కడ బ్యాటింగ్ చేసేందుకు చిరునవ్వుతో సిద్ధంగా ఉంటాడు. ఇలాంటి ఆటగాళ్లు జట్టులో ఉంటే ఎంతో బాగుంటుంది. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. » ఇటీవలి కాలంలో మ్యాచ్ ఫలితాలను నిర్ణయించడంలో టాస్ కీలకం అవుతోంది. మొదట బౌలింగ్ చేయడంలో, ఆ తర్వాత బౌలింగ్ చేయడంలో చాలా తేడా ఉంది. తొలి రెండు మ్యాచ్ల్లో మన బౌలర్లకు బంతిపై సరిగ్గా పట్టు చిక్కలేదు. ఇక రెండో ఇన్నింగ్స్లో మన బ్యాటర్ల ప్రతాపం అందరూ చూశారు. » వన్డే సిరీస్ ఫలితాలపై మంచు ప్రభావం చూపింది కానీ... టి20 సిరీస్కు ఆ ఇబ్బంది ఉండదు. రెండు ఇన్నింగ్స్లు సాయంత్రం తర్వాతే ప్రారంభమవుతాయి కాబట్టి ఇద్దరికీ పరిస్థితులు దాదాపు ఒకేలా ఉంటాయి. -
నాకొద్దు... లావైపోతా!
సాక్షి, విశాఖపట్నం: టెస్టుల్లో పోగుట్టుకున్న సిరీస్ తాలూకు ప్రతిష్టను భారత్ వెంటనే విశాఖ తీరంలో వన్డే సిరీస్తో నిలబెట్టుకుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో విన్నర్స్ ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చిన ఆటగాళ్లంతా హోటల్కు చేరాక కూడా సంబరాలు చేసుకున్నారు. ఇందులో భాగంగా సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ కేక్ కోసి ‘కింగ్’ కోహ్లి నోటిని తీపి చేశాడు. తర్వాత అక్కడే ఉన్న ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మకూ కేక్ ముక్కను తినిపించబోయాడు. వెంటనే ఏమాత్రం మొహమాటం లేకుండా రోహిత్ ‘ప్లీజ్... నాకొద్దు. దీన్ని తింటే తిరిగి లావెక్కిపోతా’నంటూ జైస్వాల్ ప్రయత్నాన్ని వారించాడు. దీంతో అక్కడున్న సహచరులంతా పెద్దగా నవ్వేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. లెక్కలేనన్ని లైక్స్, రీట్వీట్స్తో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. కేక్ చిన్న ముక్కే అయినా రోహిత్ కఠినమైన డైట్కు ఇబ్బంది కలగొచ్చనే బెంగతోనే ‘హిట్మ్యాన్’ సున్నితంగా తిరస్కరించాడు. కోహ్లిలాగే కేవలం వన్డేలకే పరిమితమైన ఈ స్టార్ ఓపెనర్, మాజీ విజయవంతమైన కెప్టెన్ గత కొంతకాలంగా ఫిట్నెస్పైనే ప్రధానంగా దృష్టిపెట్టాడు. వన్డే వరల్డ్కప్ (2027)కు దాదాపు ఏడాదిన్నర ఉండటంతో నోటిని డైట్ క్రమశిక్షణతో కట్టిపడేశాడు. దీనివల్లే అతను ఏకంగా 11 కిలోల బరువుతగ్గాడు. ఇంట్లో నోటిని అదుపులో పెట్టుకున్న ఈ దిగ్గజ బ్యాటర్ క్రీజులో మాత్రం బ్యాట్కు పనిచెబుతున్నాడు. ఏమాత్రం అడ్డు అదుపు లేకుండా భారీషాట్లతో చెలరేగిపోతున్నాడు. ఈ మూడు మ్యాచ్ల సిరీస్లోనూ రోహిత్ రెండు అర్ధసెంచరీలను సాధించాడు. ఈ రెండు మ్యాచ్ల్లోనూ భారత్ గెలిచింది. సిరీస్ కైవసం చేసుకుంది. -
కోహ్లి, రోహిత్లకు షాకిచ్చిన గౌతమ్ గంభీర్!
వన్డే ప్రపంచకప్-2027లో టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆడుతురా? అంటే అవునానే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే ఈ సీనియర్ క్రికెటర్లు ఇద్దరూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో రో-కో అదరగొట్టారు.కోహ్లి రెండు సెంచరీలతో సత్తాచాటి ప్లేయర్ ఆఫ్ది సిరీస్గా నిలవగా.. రోహిత్ కూడా పరుగులు వరద పారించాడు. ప్రస్తుతం ఒకే ఫార్మాట్లో ఆడుతున్నప్పటికి మిగితా క్రికెటర్ల కంటే చాలా యాక్టివ్గా, ఫిట్గా ఉన్నారు. వారి వయస్సు వారి జోరుకు అడ్డు కావడం లేదు.భారత క్రికెట్కే కాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. దీంతో రో-కో వన్డే ప్రపంచకప్లో కచ్చితంగా ఆడుతారని అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే ప్రపంచకప్ ప్రణాళికలలో రోహిత్-కోహ్లి ఉన్నారా లేదా అన్నది భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు.వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డే అనంతరం రోహిత్, కోహ్లిల భవిష్యత్తుపై గంభీర్ను విలేకరులు ప్రశ్నించారు. "రోహిత్, కోహ్లిలు ప్రపంచ స్థాయి ఆటగాళ్లు. డ్రెస్సింగ్ రూమ్లో వారి అనుభవం చాలా ముఖ్యం. వారిద్దరూ భారత్ తరపున చాలా కాలంగా ఇలాంటి ప్రదర్శనలే చేస్తున్నారు.రాబోయో రోజుల్లో కూడా తమ ఫామ్ను కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. ఇది 50 ఓవర్ల ఫార్మాట్లో చాలా ముఖ్యం. అయితే వన్డే ప్రపంచకప్కు ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉంది. మనం వర్తమానంలో ఉండటం ముఖ్యం. జట్టులోకి వచ్చే యువ ఆటగాళ్లు తమ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి" అని గంభీర్ పేర్కొన్నాడు.చదవండి: సూర్యను కెప్టెన్గా తీసేయండి..! అతడే సరైనోడు: గంగూలీ -
మూడో వన్డేలో దక్షిణాఫ్రికా చిత్తు.. సిరీస్ భారత్దే
వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో భారత్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. పర్యాటక ప్రోటీస్ జట్టును 9 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. తద్వారా మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో రాహుల్ సేన సొంతం చేసుకుంది. 271 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి 39.5 ఓవర్లలో ఛేదించింది.జైశ్వాల్ సెంచరీ..లక్ష్య చేధనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ తొలి వికెట్కు 155 పరుగుల అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. 75 పరుగులు చేసి సెంచరీ దిశగా వెళ్తున్న రోహిత్ను స్పిన్నర్ కేశవ్ మహారాజ్ పెవిలియన్కు పంపాడు. కానీ జైశ్వాల్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ప్రత్యర్ధి బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ తన తొలి వన్డే సెంచరీ మార్క్ను జైశ్వాల్ అందుకున్నాడు. ఈ ముంబై ఆటగాడు 121 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్లతో 116 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక రోహిత్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు.సఫారీ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 45 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్స్లతో 65 పరుగులు చేసి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మహారాజ్ఒక్కడే వికెట్ సాధించాడు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.Look at what it means to him! 🥳What a special knock this has been from Yashasvi Jaiswal 🙌Updates ▶️ https://t.co/HM6zm9o7bm#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/BHyNjwOGWY— BCCI (@BCCI) December 6, 2025డికాక్ సెంచరీ వృథా..అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రోటీస్ స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ (89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లు 106 పరుగులు) సెంచరీతో సత్తాచాటగా.. కెప్టెన్ బవుమా(48) రాణించాడు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలా నాలుగు వికెట్లతో ప్రోటీస్ పతనాన్ని శాసించాడు. ఈ ఓటమితో డికాక్ సెంచరీ వృథా అయిపోయింది.Virat Kohli in this series :Innings -3 Runs - 302Avg. - 151SR - 117.05100s- 250s-1Should get Man of the Series.#ViratKohli𓃵 pic.twitter.com/NVeNDgTqU2— Pedriverse (@Cules651) December 6, 2025చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బ్రేక్ -
ముఖం మాడ్చుకున్న కుల్దీప్!.. రోహిత్ ఇలా చేశావేంటి?
సౌతాఫ్రికాతో మూడో వన్డేలో భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అదరగొట్టాడు. విశాఖపట్నం వేదికగా నిర్ణయాత్మక మ్యాచ్లో నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. తద్వారా సౌతాఫ్రికా మీద ఏకంగా ఐదుసార్లు.. నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఏకైక భారత బౌలర్గా చరిత్రకెక్కాడు.మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రాంచిలో భారత్ గెలవగా.. రాయ్పూర్లో సౌతాఫ్రికా విజయం సాధించింది. ఈ క్రమంలో 1-1తో సమం కాగా.. శనివారం నాటి విశాఖపట్నం మ్యాచ్తో సిరీస్ ఫలితం తేలనుంది. వైజాగ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.270 పరుగులకు ఆలౌట్కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) నిర్ణయాన్ని సమర్థించేలా భారత బౌలర్లు మెరుగ్గా రాణించి.. సఫారీలను 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ చేశారు. పేసర్లలో ప్రసిద్ కృష్ణ (Prasidh Krishna) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. అర్ష్దీప్ సింగ్ ఒక వికెట్ తీశాడు. స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో దుమ్ములేపగా.. రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకున్నాడు.ఈ మ్యాచ్లో ఓవరాల్గా పది ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన కుల్దీప్ యాదవ్.. కేవలం 41 పరుగులు ఇచ్చాడు. డెవాల్డ్ బ్రెవిస్ (29), మార్కో యాన్సెన్ (17), కార్బిన్ బాష్ (9) రూపంలో ముగ్గురు డేంజరస్ ప్లేయర్లను వెనక్కి పంపిన కుల్దీప్.. లుంగి ఎంగిడి (1)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. పదే పదే అప్పీలు చేస్తూ.. అయితే, ఎంగిడి ఎల్బీడబ్ల్యూ చేసే క్రమంలో కుల్దీప్ యాదవ్ రివ్యూ కోసం ప్రయత్నించిన తీరు.. అందుకు రోహిత్ శర్మ స్పందించిన విధానం నవ్వులు పూయించింది. ఎంగిడి అవుట్ అయ్యాడంటూ కుల్దీప్ పదే పదే అప్పీలు చేస్తూ.. రివ్యూ తీసుకోవాల్సిందిగా కెప్టెన్ కేఎల్ రాహుల్ను కోరాడు. అయితే, అందుకు అతడు నిరాకరించాడు.ముఖం మాడ్చుకున్న కుల్దీప్ఇంతలో రోహిత్ శర్మ జోక్యం చేసుకుంటూ.. ‘‘అబే.. రివ్యూ అవసరం లేదు’’ అంటూ నవ్వుతూ కుల్దీప్ను టీజ్ చేశాడు. దీంతో ఓవైపు రాహుల్.. మరోవైపు విరాట్ కోహ్లి కూడా నవ్వులు చిందించారు. అప్పటికే ముఖం మాడ్చుకున్న కుల్దీప్ నవ్వలేక నవ్వుతూ తన స్థానంలోకి వెళ్లాడు. అయితే, కొద్దిసేపటికే అతడు అనుకున్నట్లుగా ఎంగిడిని పెవిలియన్కు పంపడం విశేషం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.చదవండి: దుమ్ములేపిన మహ్మద్ షమీ.. అయినా ఘోర పరాభవంThese are the moments we pay our internet bills for! 😉😁😍#INDvSA 3rd ODI, LIVE NOW 👉 https://t.co/Es5XpUmR5v pic.twitter.com/hPZJFPlJ0G— Star Sports (@StarSportsIndia) December 6, 2025 -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బ్రేక్
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన మైలు రాయిని చేరుకున్నాడు. మొత్తం మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) కలిపి 20,000 పరుగులను రోహిత్ పూర్తి చేసుకున్నాడు. వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో 26 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఫీట్ను హిట్మ్యాన్ అందుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన నాలుగో ఆటగాడిగా రోహిత్ రికార్డులెక్కాడు.రోహిత్ కంటే ముందు సచిన్ టెండూల్కర్( (34357), విరాట్ కోహ్లీ (27910), రాహుల్ ద్రవిడ్ (24208) ఈ ఘనత సాధించారు. రోహిత్ ఇప్పటివరకు వన్డేల్లో 11486, టెస్టుల్లో 4301, టీ20ల్లో 4231 పరుగులు చేశాడు. ఓవరాల్గా తన అంతర్జాతీయ కెరీర్లో ఈ ముంబైకర్ 50 సెంచరీలు నమోదు చేశాడు.వన్డే ఇంటర్నేషనల్స్ చరిత్రలో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా రోహిత్ కొనసాగుతున్నాడు. అదేవిధంగా వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రికార్డు కూడా రోహిత్(264) పేరిటే ఉంది. ఈ మ్యాచ్లో రోహిత్ 73 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 75 పరుగులు చేశాడు. హిట్మ్యాన్ ఈ హాఫ్ సెంచరీతో మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ రికార్డు బ్రేక్👉సౌతాఫ్రికాపై అత్యధిక అంతర్జాతీయ పరుగులు సాధించిన భారత ఓపెనర్గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. రోహిత్ ఇప్పటివరకు ఓపెనర్గా సఫారీలపై మూడు ఫార్మాట్లు కలిపి 1758 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(1734) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో సచిన్ రికార్డును హిట్మ్యాన్ బ్రేక్ చేశాడు.👉అదేవిధంగా వన్డేల్లో ఓపెనర్గా అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన మూడో ఓపెనర్గా రోహిత్ నిలిచాడు. రోహిత్ ఇప్పటివరకు 79 సార్లు ఏభై పైగా పరుగులు సాధించాడు. ఈ క్రమంలో విండీస్ లెజెండ్ క్రిస్ గేల్(78)ను అధిగమించాడు.డికాక్ సెంచరీ..ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రోటీస్ స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ (89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లు 106 పరుగులు) సెంచరీతో సత్తాచాటగా.. కెప్టెన్ బవుమా(48) రాణించాడు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలా నాలుగు వికెట్లతో సఫారీలను దెబ్బతీశారు. అనంతరం లక్ష్య చేధనలో భారత్ నిలకడగా ఆడుతోంది. 29 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 178 పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైశ్వాల్(83), విరాట్ కోహ్లి(7) ఉన్నారు.చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన డికాక్.. ప్రపంచ క్రికెట్లోనే! -
కోహ్లి, రోహిత్ కాదు.. గూగుల్లో ఎక్కువ మంది వెతికింది అతడినే
టీమిండియా లెజెండ్స్ ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను ఫ్యాన్ ఫాలోయింగ్ గురుంచి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. ధోని అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికి క్రేజ్ మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు. ఐపీఎల్లో అతడి ఆట కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అదేవిధంగా రో-కో ద్వయం కూడా కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నప్పటికి వారిని ఆరాధించేవారు చాలా మంది ఉన్నారు. కానీ 2025 ఏడాదిలో వీరి ముగ్గురుని ఓ యువ క్రికెటర్ అధిగమించాడు. అతడి గురుంచి తెలుసుకునేందుకు నెటజన్లు గూగుల్లో తెగ వెతికేశారు. అతడే భారత అండర్-19 సంచలనం, ఫ్యూచర్ స్టార్ వైభవ్ సూర్యవంశీ.14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది గూగుల్లో భారత్లో అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తిగా నిలిచాడు. ఈ వండర్ కిడ్ ఐపీఎల్, ఇండియా 'ఎ'మ్యాచ్లు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలలో తన సంచలన ప్రదర్శనతో అందరిని ఆకర్షించాడు. దీంతో అతడి గురుంచి తెలుసుకోవడానికి చాలా మంది మొగ్గు చూపారు. వైభవ్ 12 ఏళ్ల వయస్సలోనే ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసి వరల్డ్ రికార్డు సృష్టించాడు.కాగా గూగుల్ 'ఇయర్ ఇన్ సెర్చ్ 2025' నివేదిక ప్రకారం.. వైభవ్ అగ్రస్ధానంలో ఉండగా మరో యువ సంచలనం పంజాబ్ కింగ్స్ ప్లేయర్ ప్రియాన్ష్ ఆర్య సెకెండ్ ప్లేస్లో ఉన్నాడు. వీరిద్దరి తర్వాత స్దానంలో అభిషేక్ శర్మ మరియు షేక్ రషీద్ నిలిచారు. అదేవిధంగా మహిళల ప్రపంచకప్ను సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్ గురుంచి కూడా ఎక్కువ మంది నెటిజన్లు సెర్చ్ చేశారు.చదవండి: ఇండిగో సంక్షోభం.. బీసీసీఐకి ఊహించని షాక్! -
IND vs SA: ఈ హీరోని మర్చిపోతే ఎలా?.. కెప్టెన్గానూ సరైనోడు!
జట్టులో తమకంటూ ప్రత్యేక బ్యాటింగ్ స్థానం లేకపోయినా టీమిండియాకు నిస్వార్థమైన సేవలు అందిస్తున్న క్రికెటర్లలో కేఎల్ రాహుల్ ముందు వరుసలో ఉంటాడు. 2014లో ఓపెనర్గా భారత జట్టు తరఫున ప్రస్థానం మొదలుపెట్టిన ఈ కర్ణాటక ఆటగాడు.. వికెట్ కీపర్గానూ సేవలు అందించాడు.తరచూ మార్పులుఅయితే, తర్వాతి కాలంలో రాహుల్ (KL Rahul) తన ఓపెనింగ్ స్థానాన్ని కోల్పోయాడు. ముఖ్యంగా టెస్టుల్లో ఓసారి ఐదో నంబర్ బ్యాటర్గా.. మరోసారి నాలుగో స్థానంలో.. ఆ తర్వాత మళ్లీ ఓపెనర్గా ఇలా వివిధ స్థానాల్లో రాహుల్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ నిలకడైన ఆటతో రాణిస్తూ తనను తాను ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నాడు రాహుల్. దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) రిటైర్మెంట్ తర్వాత రాహుల్కు టెస్టుల్లో ఓపెనర్గా వరుస అవకాశాలు వస్తున్నాయి.కీపింగ్ బాధ్యతలు కూడా.. ఇదిలా ఉంటే.. వన్డేల్లోనూ రాహుల్ పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. టీ20 జట్టులో స్థానం కోల్పోయిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. వన్డేల్లో మాత్రం మిడిలార్డర్ బ్యాటర్గా తన సేవలు అందిస్తున్నాడు. కీపింగ్ బాధ్యతలు కూడా తానే నిర్వర్తిస్తున్న రాహుల్.. తాజాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో వన్డే సిరీస్కు తాత్కాలిక కెప్టెన్గానూ వ్యవహరిస్తున్నాడు.సఫారీ జట్టుతో తొలి వన్డేలో ఆరోస్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రాహుల్. కేవలం 56 బంతుల్లోనే 60 పరుగులు (రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) సాధించాడు. లెజెండరీ బ్యాటర్లు రోహిత్ శర్మ (57), విరాట్ కోహ్లి (135)తో రాహుల్ మెరుపు అర్ధ శతకంతో రాణించడంతో టీమిండియా 349 పరుగుల భారీ స్కోరు చేయగలిగిందిరాహుల్ విలువైన ఇన్నింగ్స్ఇక ఈ మ్యాచ్లో బౌలర్లు ఆరంభంలో తడబడినా ఆఖరి నిమిషంలో సత్తా చాటడంతో 17 పరుగుల తేడాతో భారత జట్టు గట్టెక్కింది. అదే విధంగా రెండో వన్డేలోనూ కోహ్లి శతక్కొట్టగా (102).. రుతురాజ్ గైక్వాడ్ (105) కూడా సెంచరీతో అలరించాడు. వీరిద్దరికి తోడుగా రాహుల్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈసారి ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 43 బంతుల్లోనే ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 66 పరుగులతో అజేయంగా నిలిచాడు.అయితే, ఈ మ్యాచ్లో 358 పరుగుల మేర భారీ స్కోరు సాధించినా టీమిండియా గెలవలేకపోయింది. బౌలర్ల వైఫల్యం కారణంగా నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే, ఈ మ్యాచ్లోనూ బ్యాటర్గా, కెప్టెన్గా రాహుల్ తనదైన ముద్ర వేయగలిగాడు. అయితే, రో-కోల హవాలో అతడి ఆటకు దక్కాల్సిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు.కెప్టెన్గానూ రాహుల్కు మంచి రికార్డు నిజానికి టీమిండియా కెప్టెన్గానూ రాహుల్కు మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు మొత్తంగా అతడు పద్దెనిమిదిసార్లు భారత జట్టును సారథిగా ముందుకు నడిపించాడు. ఇందులో ఏకంగా పన్నెండుసార్లు టీమిండియా గెలిచింది. రాహుల్ కెప్టెన్సీలో 14 వన్డేలకు గానూ తొమ్మిదింట విజయం సాధించిన టీమిండియా.. టెస్టుల్లో మూడింటికి రెండు, టీ20లలో ఒకటికి ఒకటి గెలిచింది.మరో విశేషం ఏమిటంటే.. రాహుల్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లి ఇప్పటికి ఏకంగా నాలుగు శతకాలు బాదడం విశేషం. ఓవరాల్గా రాహుల్ సారథ్యంలో కోహ్లి సాధించిన స్కోర్లు వరుసగా... 122,51,0,65,113,135,102. ఇందులో చివరి రెండు సెంచరీలు సౌతాఫ్రికాతో వన్డేల్లో బాదినవే.ఏదేమైనా.. టీమిండియా విజయాల్లో అనేకసార్లు కీలక పాత్ర పోషించిన రాహుల్.. తెరవెనుకే ఉండిపోతున్నాడనే అభిప్రాయం అతడి అభిమానుల్లో ఉంది. అంతేకాదు.. కెప్టెన్గానూ రాణించగల సత్తా ఉన్నా ఈ 33 ఏళ్ల ఆటగాడికి అదృష్టం కలిసి రావడం లేదని.. ప్రస్తుత పరిస్థితుల్లో వన్డే సారథిగా రాహులే సరైనోడు అన్న విషయాన్ని యాజమాన్యం గుర్తిస్తే బాగుండనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చదవండి: 5 ఏళ్లలో 23 సెంచరీలు.. టెస్ట్ క్రికెట్పై రూట్ పంజా -
రిషభ్ పంత్ చేసిన పనికి.. రోహిత్ శర్మ రియాక్షన్ వైరల్
టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ స్వభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైదానంలో బ్యాట్తో పరుగుల వరద పారించే హిట్మ్యాన్.. సారథిగా గంభీరంగా కనిపిస్తూనే.. పరిస్థితులకు తగ్గట్లు నవ్వులు పూయించడంలోనూ ముందే ఉంటాడు. ఇక మైదానం వెలుపల సహచర ఆటగాళ్లతో రోహిత్ ఫ్రెండ్లీగా ఉంటాడనే విషయం అతడి అభిమానులకు బాగా తెలుసు.తానొక లెజెండరీ బ్యాటర్, కెప్టెన్ని అనే గర్వం రోహిత్ శర్మ (Rohit Sharma)లో అస్సలు కనిపించదు. తోటి ఆటగాళ్లను ఆటపట్టించడంలో ముందుండే హిట్మ్యాన్.. తన పట్ల వారు కూడా అదే విధంగా ప్రవర్తించినా సరదాగానే ఉంటాడు. ఈ విషయాన్ని రుజువు చేసే ఘటన ఇటీవల చోటు చేసుకుంది.మూడు వన్డేల సిరీస్లో 1-1తో సమంగా..టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో సౌతాఫ్రికా (IND vs SA)తో వరుస సిరీస్లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. టెస్టుల్లో సఫారీల చేతిలో 2-0తో వైట్వాష్కు గురైన భారత జట్టు.. మూడు వన్డేల సిరీస్లో 1-1తో సమంగా ఉంది. ఆఖరి ఓవర్ ఉత్కంఠగా సాగిన తొలి వన్డేలో 17 పరుగుల తేడాతో గట్టెక్కిన టీమిండియా.. రెండో వన్డేలో మాత్రం 358 పరుగులు చేసినా లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.రాలిపడ్డ కనురెప్పఈ రెండు వన్డేల్లో రోహిత్ శర్మ వరుసగా 57, 14 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. రాయ్పూర్ వేదికగా సౌతాఫ్రికాతో రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సహచర ఆటగాడు, బెంచ్కే పరిమితమైన రిషభ్ పంత్ (Rishabh Pant).. రోహిత్ను ఆటపట్టించాడు. రోహిత్ కంటి నుంచి రాలిపడిన రెప్పను పట్టుకున్న పంత్.. అతడి చెయ్యిపై ఉంచి.. ఓ కోరిక కోరుకోమన్నాడు.ఇంతకీ రోహిత్ ఏం కోరుకున్నాడు?ఇందుకు నవ్వులు చిందించిన రోహిత్ అలాగే చేశాడు. వీరిద్దరు ఇలా సరదాగా సంభాషిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో.. ‘ఇంతకీ రోహిత్ ఏం కోరుకున్నాడు?’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంపై రోహిత్ శర్మ సన్నిహితుడు అభిషేక్ నాయర్ స్టార్ స్పోర్ట్స్ వేదికగా స్పందించాడు.రెండే రెండు కోరికలు‘‘నాకు తెలిసి ప్రస్తుతం రోహిత్కు రెండే రెండు కోరికలు ఉండి ఉంటాయి. ఒకటేమో.. ‘నేను 2027 వన్డే వరల్డ్కప్ను నా చేతుల్లో పట్టుకోవాలి’ అని.. మరొకటి.. సౌతాఫ్రికాతో మూడో వన్డేలో సెంచరీ చేయాలని’’ అంటూ అభిషేక్ నాయర్.. రోహిత్ శర్మ మాటలను డీకోడ్ చేశాడు. ఇదిలా ఉంటే.. భారత్-సౌతాఫ్రికా మధ్య శనివారం విశాఖపట్నం వేదికగా నిర్ణయాత్మక మూడో వన్డే నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. కాగా టీమిండియాకు టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 అందించిన రోహిత్ శర్మను.. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు బీసీసీఐ వన్డే కెప్టెన్సీ తొలగించిన విషయం తెలిసిందే. ఇక అంతకు ముందు రోహిత్.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్తో పాటు.. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు.చదవండి: 5 ఏళ్లలో 23 సెంచరీలు.. టెస్ట్ క్రికెట్పై రూట్ పంజా -
గిల్-రోహిత్ రికార్డు బద్దలు
యాషెస్ సిరీస్ రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ ఓపెనింగ్ జోడీ జేక్ వెదరాల్డ్-ట్రవిస్ హెడ్ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇద్దరు తొలి వికెట్కు 77 పరుగులు జోడించారు. తద్వారా ఇంగ్లండ్పై డే అండ్ నైట్ టెస్ట్లో తొలి వికెట్కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా సరికొత్త రికార్డు నెలకొల్పారు. గతంలో ఈ రికార్డు టీమిండియా ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ-శుభ్మన్ గిల్ పేరిట ఉండేది. ఈ జోడీ 2021 అహ్మదాబాద్ టెస్ట్లో తొలి వికెట్కు అజేయమైన 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.మ్యాచ్ విషయానికొస్తే.. ఓవర్నైట్ స్కోర్కు (325/9) మరో తొమ్మిది పరుగులు జోడించిన అనంతరం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్కు 334 పరుగుల వద్ద తెరపడింది. లబూషేన్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టడంతో జోఫ్రా ఆర్చర్ (38) చివరి వికెట్గా వెనుదిరిగాడు. ఆసీస్ గడ్డపై తొలి శతకం బాదిన రూట్ (138) అజేయ బ్యాటర్గా నిలిచాడు. ఆర్చర్ వికెట్ బ్రెండన్ డాగెట్కు దక్కింది. తొలి రోజు ఆటలో నిప్పులు చెరిగిన స్టార్క్ 6 వికెట్లతో ఇన్నింగ్స్ను ముగించాడు. మైఖేల్ నెసర్, స్కాట్ బోలాండ్కు తలో వికెట్ దక్కింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే 76, బ్రూక్ 31, స్టోక్స్ 19, విల్ జాక్స్ 19, అట్కిన్సన్ 4 పరుగులు చేయగా.. డకెట్, పోప్, జేమీ స్మిత్, కార్స్ డకౌట్లయ్యారు.అనంతరం బరిలోకి దిగిన ఆసీస్ ధాటిగా ఇన్నింగ్స్ను ప్రారంభించింది. అరంగేట్రం టెస్ట్లో విఫలమైన ఓపెనర్ జేక్ వెదరాల్డ్ చెలరేగి ఆడాడు. శైలికి భిన్నంగా హెడ్ నిదానంగా ఆడాడు. వీరి జోడి తొలి వికెట్కు 77 పరుగులు జోడించిన తర్వాత బ్రైడన్ కార్స్ బౌలింగ్లో హెడ్ (33) ఔటయ్యాడు. అనంతరం లబూషేన్ వెదరాల్డ్తో జత కలిశాడు. హెడ్ ఔటయ్యాక వెదరాల్డ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లబూషేన్తో కలిసి రెండో వికెట్కు అజేయమైన 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రెండో రోజు టీ విరామం సమయానికి వెదరాల్డ్ 59, లబూషేన్ 27 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. 21 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 130/1గా ఉంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 204 పరుగులు వెనుకపడి ఉంది. -
విశాఖ చేరుకున్న భారత్, దక్షిణాఫ్రికా జట్లు క్రికెట్ ఫ్యాన్ సందడి (ఫొటోలు)
-
రోహిత్ శర్మ కీలక నిర్ణయం
టీమిండియా వెటరన్ స్టార్ రోహిత్ శర్మ (Rohit Sharma) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) ఆడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తన దేశవాలీ జట్టు ముంబై తరఫున నాకౌట్ మ్యాచ్ల్లో ఆడేందుకు హిట్మ్యాన్ సమ్మతం వ్యక్తం చేశాడట. SMATలో ముంబై నాలుగు వరుస విజయాలతో దూసుకుపోతూ నాకౌట్స్కు చేరువైంది.ఇప్పటికే స్టార్ క్రికెటర్లతో పటిష్టంగా ఉన్న ముంబైకి హిట్మ్యాన్ తోడైతే వారిని ఆపడం దాదాపుగా అసాధ్యం. ఈ టోర్నీలో ముంబై డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో ఉంది. గత సీజన్లో శ్రేయస్ అయ్యర్ ముంబైకి టైటిల్ అందించాడు.ప్రస్తుత ముంబై జట్టులో భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా అజింక్య రహానే, ఆయుశ్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్ లాంటి టీమిండియా స్టార్లు ఉన్నారు. వీరికి రోహిత్ శర్మ కలిస్తే ఇంకేమైనా ఉందా..?ఈ సీజన్లో ముంబై ఆటగాళ్లంతా సూపర్ ఫామ్లో ఉన్నారు. కుర్ర ఓపెనర్ మాత్రే వరుసగా రెండో సెంచరీలు బాది జోష్లో ఉండగా.. సర్ఫరాజ్ ఖాన్ కూడా తాజాగా ఓ మెరుపు సెంచరీ చేశాడు. ఇటీవలే శార్దూల్ ఠాకూర్ ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు.ఇదిలా ఉంటే, టెస్ట్లకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ శర్మ.. 38 ఏళ్ల లేటు వయసులోనూ ఈ ఫార్మాట్లో చెలరేగిపోతున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీ, హాఫ్ సెంచరీతో దుమ్మురేపిన హిట్మ్యాన్.. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న సిరీస్లో ఓ హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికాతో మూడో వన్డే డిసెంబర్ 6 విశాఖ వేదికగా జరుగనుంది.సిరీస్ విషయానికొస్తే.. నిన్న జరిగిన రెండో వన్డేలో భారత్ భారీ స్కోర్ చేసిన ఓటమిపాలైంది. రుతురాజ్, కోహ్లి సెంచరీలు వృధా అయ్యాయి. దక్షిణాఫ్రికా బ్యాటర్లు అసమానమైన పోరాటపటిమ కనబర్చి భారత్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని ఊదేశారు. అంతకుముందు తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. -
IND vs SA: టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. భారత తుదిజట్టు అదే!
భారత్తో రెండో వన్డేలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా ఈ మ్యాచ్తో తిరిగి జట్టుతో చేరిన ప్రొటిస్ కెప్టెన్ టెంబా బవుమా మాట్లాడుతూ.. ‘‘వికెట్ పాత బడుతున్న కొద్దీ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాం. తేమ ప్రభావం కూడా ఉంటుంది. అందుకే మేము తొలుత బౌలింగ్ ఎంచుకున్నాం.అయితే, పిచ్ స్వభావం ఎలా ఉండబోతుందో ముందుగా చెప్పడం కష్టమే. గత మ్యాచ్లో మాకెన్నో సానుకూల అంశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్లో మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నాం. నాతో పాటు కేశవ్ మహరాజ్ (Keshav Maharan), లుంగి ఎంగిడి తుదిజట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్ మాకెంతో కీలకమైనది’’ అని పేర్కొన్నాడు. కాగా భారత్తో తొలి వన్డేలో విఫలమైన సఫారీ జట్టు ఓపెనర్ ర్యాన్ రికెల్టన్పై వేటు పడగా.. పేసర్లు ప్రెనేలన్ సుబ్రేయన్, ఒట్నీల్ బార్ట్మన్ తమ స్థానాలు కోల్పోయారు.తుది జట్టులో మార్పులు లేవుమరోవైపు.. మరోసారి టాస్ ఓడిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) స్పందిస్తూ.. ‘‘సుదీర్ఘకాలంగా మేము టాస్ గెలవలేకపోతున్నాం. ఏదేమైనా గత మ్యాచ్లో మా ప్రదర్శన అద్భుతంగా సాగింది. ప్రత్యర్థి జట్టు కూడా గట్టి పోటీనిచ్చింది.పరుగులు సాధించడంతో పాటు.. వరుస విరామాల్లో వికెట్లు తీస్తేనే అనుకున్న ఫలితం రాబట్టగలము.ఈ వికెట్ బాగుంది. మా తుదిజట్టులో ఎలాంటి మార్పులూ లేవు’’ అని తెలిపాడు. ఆధిక్యంలో టీమిండియాకాగా టీమిండియా- సౌతాఫ్రికా మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా రాంచి వేదికగా ఆదివారం తొలి వన్డే జరిగిన విషయం తెలిసిందే. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో భారత జట్టు 17 పరుగుల తేడాతో గెలుపు నమోదు చేసింది. తద్వారా సిరీస్లో 1-0 ఆధిక్యం సంపాదించింది.ఈ మ్యాచ్లో భారత దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli) శతక్కొట్టడం (135), రోహిత్ శర్మ మెరుపు అర్ధ శతకం (51 బంతుల్లో 57) రాణించడం హైలైట్గా నిలిచింది. ఈ నేపథ్యంలో రెండో వన్డేలోనూ రో-కో ప్రదర్శనపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరు మరోసారి చితక్కొడితే చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో వన్డే తుదిజట్లు👉వేదిక: షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం, రాయ్పూర్👉టాస్: సౌతాఫ్రికా.. తొలుత బౌలింగ్భారత తుదిజట్టుయశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్(కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ.సౌతాఫ్రికా తుదిజట్టుక్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్, టెంబా బావుమా(కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, నండ్రీ బర్గర్, లుంగి ఎంగిడి.చదవండి: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ ప్లేయర్ -
భారీ మైలురాయిపై కన్నేసిన రోహిత్ శర్మ
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇవాళ (డిసెంబర్ 3) రెండో వన్డే జరుగనుంది. రాయ్పూర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్కు ముందు భారత వెటరన్ స్టార్ రోహిత్ శర్మను ఓ భారీ రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్లో అతను 41 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) 20000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం 13 మంది మాత్రమే ఈ ఘనత సాధించారు. వీరిలో భారత్కు చెందిన వారే ముగ్గురున్నారు (సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, రాహుల్ ద్రవిడ్). వీరిలో సచిన్ అందరి కంటే ఎక్కువగా 34357 పరుగులు చేసి తిరుగులేని ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు..సచిన్-34357సంగక్కర-28016కోహ్లి-27808పాంటింగ్-27483జయవర్దనే-25957కల్లిస్-25534ద్రవిడ్-24208లారా-22358రూట్-21774జయసూర్య-21032చంద్రపాల్-20988ఇంజమామ్-20580డివిలియర్స్-20014కాగా, టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ శర్మ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో హాఫ్ సెంచరీ, ఓ సూపర్ సెంచరీతో రెచ్చిపోయిన హిట్మ్యాన్.. సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ తొలి మ్యాచ్లోనూ అదిరిపోయే అర్ద సెంచరీతో అలరించాడు. ప్రస్తుత రోహిత్ ఫామ్ను బట్టి చూస్తే.. ఇవాల్టి మ్యాచ్లో 20000 పరుగుల మార్కును చేరుకోవడం అంత కష్టమైన పనేమీ కాకపోవచ్చు. -
రోహిత్తో గంభీర్ ముచ్చట!.. అవేమీ వద్దన్న కోహ్లి!.. బీసీసీఐ సీరియస్!
భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల భవితవ్యం గురించి క్రికెట్ వర్గాల్లో గత కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. వీరిద్దరు వన్డే ప్రపంచకప్-2027 టోర్నమెంట్ వరకు కొనసాగుతారా?.. యాజమాన్యం ఇందుకు అనుకూల పరిస్థితులు కల్పిస్తుందా? అనేది దీని సారాంశం.వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి..ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించేశారు రో-కో. ఇద్దరూ కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచిన కెప్టెన్గా రోహిత్ (Rohit Sharma).. జట్టులో కీలక ఆటగాడిగా కోహ్లి (Virat Kohli) ఉన్న వేళ.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) నుంచి అనూహ్య ప్రకటన వచ్చింది.ఆస్ట్రేలియా పర్యటనకు ముందు రోహిత్ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి శుబ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించినట్లు అగార్కర్ తెలిపాడు. వన్డే వరల్డ్కప్-2027 ఆడేందుకు తాము కట్టుబడిఉన్నామనే హామీ రో-కో నుంచి రాలేదని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఆద్యంతం అద్భుత ఆట తీరుతోఅయితే, ఆసీస్ టూర్లో అందుకు భిన్నంగా రోహిత్- కోహ్లి తమదైన శైలిలో సత్తా చాటారు. తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయిన కోహ్లి మూడో వన్డేలో రాణించగా.. రోహిత్ మాత్రం ఆద్యంతం అద్భుత ఆట తీరుతో అలరించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. తాజాగా సొంతగడ్డపై సౌతాఫ్రికాతో తొలి వన్డేలోనూ ఇద్దరూ దుమ్ములేపారు.రాంచి వేదికగా రోహిత్ శర్మ మెరుపు అర్ధ శతకం (51 బంతుల్లో 57) బాదగా.. కోహ్లి ఏకంగా సెంచరీ (120 బంతుల్లో 135) చేశాడు. వన్డేల్లో 52వ, ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో 83వ శతకం బాది తన బ్యాటింగ్లో పస తగ్గలేదని నిరూపించాడు. వీరిద్దరి అద్భుత ఆట తీరు వల్లే టీమిండియా సఫారీలతో తొలి వన్డేల్లో నెగ్గింది.అగ్రెసివ్గా సెలబ్రేషన్స్ఈ నేపథ్యంలో సెంచరీ తర్వాత కోహ్లి మునుపటి కంటే అగ్రెసివ్గా సెలబ్రేట్ చేసుకోగా.. రోహిత్ సైతం కోహ్లి శతక్కొట్టడంతో మురిసిపోయాడు. కోహ్లికి మద్దతుగా చప్పట్లు కొడుతూ వారెవ్వా అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్కాగా..రో- కో ఫ్యాన్స్ హెడ్కోచ్ గౌతం గంభీర్తో పాటు అగార్కర్ను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.A leap of joy ❤️💯A thoroughly entertaining innings from Virat Kohli 🍿Updates ▶️ https://t.co/MdXtGgRkPo#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @imVkohli pic.twitter.com/llLByyGHe5— BCCI (@BCCI) November 30, 2025 బీసీసీఐ సీరియస్!ఈ పరిణామాల నేపథ్యంలో గంభీర్- అగార్కర్లతో రో-కోలకు సఖ్యత పూర్తిగా చెడిందనే ప్రచారం జరుగగా.. బీసీసీఐ వర్గాలు స్పందించాయి. దైనిక్ జాగరణ్తో మాట్లాడుతూ.. ‘‘గంభీర్తో సీనియర్ ఆటగాళ్లు రోహిత్, కోహ్లిలకు సత్సంబంధాలు లేకుండా పోయాయి. కోచ్- ఆటగాళ్ల మధ్య ఉండాల్సిన సఖ్యత వారి మధ్య లోపించింది.వీరిద్దరి భవితవ్యంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. రాయ్పూర్ లేదంటే విశాఖపట్నం వన్డేల తర్వాత ఇందుకు సంబంధించి సమావేశం జరుగుతుంది. ఆస్ట్రేలియా సిరీస్లో రోహిత్- అగార్కర్కు అస్సలు మాటల్లేవు.ఇక కోహ్లి- గంభీర్ కూడా ఎక్కువగా మాట్లాడుకోవడం లేదు. ఇందుకు తోడు రోహిత్- కోహ్లి అభిమానులు గంభీర్- అగార్కర్లను ట్రోల్ చేయడం పట్ల బీసీసీఐ సీరియస్గా ఉంది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.రోహిత్తో గంభీర్ ముచ్చట!.. అవేమీ వద్దన్న కోహ్లి!ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో తొలి వన్డే తర్వాత డ్రెసింగ్రూమ్లోకి వెళ్లే సమయంలో గంభీర్ తలుపు దగ్గరే ఉన్నా కోహ్లి పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. మరోవైపు.. హోటల్లాబీలో గంభీర్తో రోహిత్ సీరియస్గా ఏదో చర్చిస్తుండగా.. టీమ్తో హోటల్ సిబ్బంది జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసింది.తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ కేక్ కట్ చేయగా.. సిబ్బంది కోహ్లిని సైతం రావాల్సిందిగా కోరారు. అయితే, వాళ్లకు థాంక్స్ చెబుతూనే.. ‘‘అవేమీ వద్దు’’ అన్నట్లుగా సైగ చేస్తూ కోహ్లి అక్కడి నుంచి నిష్క్రమించాడు. చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గాKohli completely ignored gambhir after win 😭😭 pic.twitter.com/XNBwPZPN0q— ADITYA (@Wxtreme10) December 1, 2025Gautam Gambhir seen talking with Rohit Sharma at the team hotel while the Indian team was celebrating their victory by cutting a cake.🇮🇳❤️ pic.twitter.com/iw6ld3PCv4— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) December 1, 2025 -
వాళ్ల పోరాటం అద్భుతం: టీమిండియాకు మాజీ కెప్టెన్ వార్నింగ్
టెస్టుల్లో సౌతాఫ్రికా చేతిలో వైట్వాష్కు గురైన టీమిండియా వన్డే సిరీస్లో మాత్రం శుభారంభం చేసింది. సమిష్టి కృషితో రాణించి మొదటి వన్డేలో విజయం సాధించింది. అయితే, సఫారీలు సైతం ఓటమిని అంత తేలికగా అంగీకరించలేదు.యాన్సెన్ మెరుపు ఇన్నింగ్స్టీమిండియా విధించిన 350 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేవలం పదకొండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా.. ఆఖరి వరకు ప్రొటిస్ జట్టు గట్టిగా పోరాడింది. నాలుగో నంబర్ ఆటగాడు మ్యాథ్యూ బ్రీట్జ్కే (80 బంతుల్లో 72) ఆచితూచి ఆడగా.. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ మార్కో యాన్సెన్ (Marco Jansen) మెరుపు ఇన్నింగ్స్ (39 బంతుల్లోనే 70)తో దుమ్ములేపాడు.ఓ దశలో యాన్సెన్ సెంచరీ దిశగా పయనించగా.. కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) అద్భుత బంతితో అతడిని వెనక్కి పంపించాడు. బ్రీట్జ్కే, యాన్సెన్ నిష్క్రమించిన తర్వాత సఫారీ జట్టు ఓటమి ఖాయమనే అంచనాలు ఏర్పడగా.. మరో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కార్బిన్ బాష్ (Corbin Bosch) అద్భుత పోరాట పటిమ కనబరిచాడు. బాష్ ఒంటరి పోరాటంఓవైపు వికెట్లు పడుతున్నా తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ జట్టును విజయం దిశగా నడిపించాడు. ఆఖరి ఓవర్ వరకు బాష్ పట్టుదలగా నిలబడి అర్ధ శతకం (51 బంతుల్లో 67) పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో చివరి ఓవర్లో సౌతాఫ్రికా విజయ సమీకరణం పద్దెనిమిది పరుగులుగా మారగా.. బాష్ జోరు టీమిండియాను భయపెట్టింది. Game, set, match! 💪Prasidh Krishna bags the final wicket as #TeamIndia clinch a thrilling contest in Ranchi to go 1⃣-0⃣ up 🙌Scorecard ▶️ https://t.co/MdXtGgRkPo#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/yHpkRnlEVk— BCCI (@BCCI) November 30, 2025 అయితే, ప్రసిద్ కృష్ణ వేసిన తొలి బంతికి పరుగు రాబట్టలేకపోయిన బాష్.. రెండో బంతికి రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పదో వికెట్గా వెనుదిరిగాడు. ఫలితంగా పదిహేడు పరుగుల తేడాతో టీమిండియా గట్టెక్కింది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సౌతాఫ్రికా పోరాట పటిమను ప్రశంసిస్తూ.. అదే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, ఆటలో అలసత్వం వద్దని భారత జట్టును హెచ్చరించాడు. ఈ మేరకు..వాళ్ల పోరాటం అద్భుతం‘‘సౌతాఫ్రికా జట్టు పోరాడిన తీరు అద్భుతం. వారి ఆట కనువిందు చేసింది. చివరి ఓవర్ వరకు వాళ్లు పట్టువీడలేదు. ఇలాంటి ఆటను అందరూ ఆరాధిస్తారు. ఓడినా సరే వారిని ప్రశంసించతప్పదు.పదకొండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టు.. ఇంతలా పుంజుకుని ఆఖరి వరకు గట్టి పోటీనివ్వడం నిజంగా అద్భుతం లాంటిదే. జాగ్రత్త అంటూ వార్నింగ్తదుపరి రెండు మ్యాచ్లలో టీమిండియా జాగ్రత్తగా ఉండాలి. తమ ఆట తీరుతో సఫారీలు గట్టి హెచ్చరికనే జారీ చేశారు’’ అని గావస్కర్ స్టార్ స్పోర్ట్స్ షో వేదికగా టీమిండియాను హెచ్చరించాడు. కాగా రాంచి వేదికగా ఆదివారం నాటి తొలి వన్డేలో రోహిత్ శర్మ (57), తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (60) రాణించగా.. విరాట్ కోహ్లి భారీ శతకం (120 బంతుల్లో 135) రాణించాడు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు చేసింది.లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌట్ కావడంతో.. 17 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా మూడు, అర్ష్దీప్ సింగ్ రెండు, ప్రసిద్ కృష్ణ ఒక వికెట్ తీశారు. తదుపరి బుధ, శనివారాల్లో భారత్- సౌతాఫ్రికా మధ్య మిగిలిన రెండు వన్డేలకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
'వారిద్దరూ అద్భుతం.. ఆడకపోతే వరల్డ్ కప్ను మరిచిపోవడమే'
రాంఛీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు అద్భుత ప్రదర్శనలతో సత్తాచాటిన సంగతి తెలిసిందే. కోహ్లి భారీ శతకం (120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 135)తో కదం తొక్కగా.. రోహిత్ (51 బంతుల్లోనే 57) తనదైన శైలిలో ధనాధన్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఆరంభంలోనే జైశ్వాల్ వికెట్ కోల్పోయిన భారత జట్టుకు వీరిద్దరూ తమ అనుభవంతో భారీ స్కోర్ను అందించారు. రో-కో ద్వయం రెండో వికెట్కు ఏకంగా 136 పరుగులు జోడించారు. కాగా ఇప్పటికే టీ20, టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లిలు ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు. దీంతో వన్డే వరల్డ్కప్-2027లో ఈ వెటరన్ క్రికెటర్లు ఆడుతారా? అప్పటివరకు ఫిట్నెస్గా ఉంటారా? లాంటి సందేహలు చాలా మంది మాజీ క్రికెటర్లు వ్యక్తం చేశారు. తమ భవిష్యత్తుపై విమర్శలు చేస్తున్న వారికి ఈ వెటరన్ జోడీ అద్భుత ఇన్నింగ్స్లతో సమాధానమిచ్చింది.ఈ నేపథ్యంలో భారత మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్-కోహ్లి జోడీ లేకుండా 2027 వన్డే ప్రపంచకప్ను గెలవడం అసాధ్యమని అతడు చెప్పుకొచ్చాడు. "విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు వేరే లెవల్లో ఆడుతున్నారు. వీరిద్దరూ వన్డే ప్రపంచకప్ 2027లో ఆడాల్సిందే. రో-కో లేకుండా మనం వరల్డ్కప్ను గెలవలేం. కాబట్టి ఇకపై ప్రపంచకప్లో వారిద్దరూ ఆడుతారా? ఫిట్నెస్గా ఉంటారా? లాంటి ప్రశ్నలు వేయొద్దు. రోహిత్-కోహ్లిలు 20 ఓవర్లు పాటు కలిసి బ్యాటింగ్ చేస్తే ప్రత్యర్ధి కథ సమాప్తమైనట్లే. రాంచీలో కూడా అదే జరిగింది. వారిద్దరూ తమ సంచలన బ్యాటింగ్తో సౌతాఫ్రికా ఓటమిని శాసించారు. వారు నెలకొల్పిన భాగస్వామ్యం దక్షిణాఫ్రికాను మానసికంగా దెబ్బతీసింది. రో-కో జోడీ చాలా కష్టపడుతున్నారు. కేవలం ఒకే ఫార్మాట్లో ఆడుతూ తమ రిథమ్ కొనసాగించడం అంత సులువు కాదు. వరల్డ్కప్లో కూడా వారు కీలకం కానున్నారు" అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. ఇక తొలి వన్డేలో సౌతాఫ్రికాపై 17 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. 350 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 332 పరుగులకు ఆలౌటైంది.చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
ఎవరికీ అందనంత ఎత్తులో రోహిత్ శర్మ
సౌతాఫ్రికాతో నిన్న (నవంబర్ 30) జరిగిన వన్డే మ్యాచ్లో టీమిండియా వెటరన్ స్టార్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో 3 సిక్సర్లు బాదిన హిట్మ్యాన్.. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా (352) పాకిస్తాన్ మాజీ షాహిద్ అఫ్రిది (351) రికార్డును బద్దలు కొట్టాడు. ఈ రికార్డు విభాగంలో రోహిత్, అఫ్రిది తర్వాత 300 సిక్సర్ల మార్కు తాకిన ఏకైక ఆటగాడు విండీస్ వీరుడు క్రిస్ గేల్ (331) మాత్రమే.తాజా ప్రదర్శన అనంతరం అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ సిక్సర్ల సంఖ్య 645కి చేరింది. ఈ విభాగంలో ఇప్పటికే టాప్ ప్లేస్లో ఉన్న అతను.. రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. ఈ విభాగంలో రోహిత్ కనుచూపు మేరలో కూడా ఎవరూ లేరు. రోహిత్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్ల కొట్టిన ఆటగాడిగా క్రిస్ గేల్ (553) కొనసాగుతున్నాడు. ఆతర్వాతి స్థానాల్లో అఫ్రిది (476), బ్రెండన్ మెల్కల్లమ్ (398), జోస్ బట్లర్ (387) టాప్-5లో ఉన్నారు.ఇక్కడ గమనించదగ్గ ఓ విషయం ఏంటంటే.. ప్రస్తుతం కెరీర్ కొనసాగిస్తున్న ఆటగాళ్లలో రోహిత్ కనుచూపు మేరల్లో కూడా ఎవరూ లేరు. ఈ విభాగంలో ఐదో స్థానంలో ఉన్న జోస్ బట్లర్ హిట్మ్యాన్కు ఆమడదూరంలో ఉన్నాడు. రోహిత్కు బట్లర్కు మధ్య ఉన్న సిక్సర్ల వ్యత్యాసం ఏకంగా 258. కెరీర్ చరమాంకంలో ఉన్న బట్లర్ మహా అయితే ఇంకో 100 సిక్సర్లు కొట్టగలడు.ఈ లెక్కన అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్ల రికార్డు రోహిత్ శర్మ పేరిట చిరకాలం ఉండిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే, ఈతరం క్రికెటర్లలో ఎవరికీ మూడు ఫార్మాట్లలో కొనసాగేంత సీన్ లేదు. ఒకటి, రెండు ఫార్మాట్లతో హిట్మ్యాన్ రికార్డును బద్దలు కొట్టడం అంత ఈజీ కాదు. కాబట్టి రోహిత్ శర్మ సిక్సర్ల శర్మగా క్రికెట్ అభిమానులకు కలకాలం గుర్తుండిపోతాడు. -
నాకు 37 ఏళ్లు.. అప్పటి వరకు ఆడుతూనే ఉంటా: కోహ్లి
సౌతాఫ్రికాతో తొలి వన్డే సందర్భంగా టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి పాత ‘కింగ్’ను గుర్తుచేశాడు. రాంచి వేదికగా ఆకాశమే హద్దుగా బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించి శతక్కొట్టాడు. వన్డేల్లో 52వ సెంచరీ నమోదు చేసి.. సింగిల్ ఫార్మాట్లో అత్యధికసార్లు వంద పరుగుల మార్కు అందుకున్న ఏకైక బ్యాటర్గా ప్రపంచ రికార్డు సాధించాడు.తన ‘విన్’టేజ్ ఆటతోనే విమర్శకులకు సమాధానం ఇచ్చిన కోహ్లి (Virat Kohli).. టీమిండియా యాజమాన్యానికి కూడా తన ఫామ్ గురించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో తొలి వన్డేలో సఫారీలపై విజయానంతరం ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న కోహ్లి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. నా వయసు ఇప్పుడు 37 ఏళ్లు‘‘నేను వందకు 120 శాతం ఫామ్తో తిరిగి వస్తానని ఇప్పటికే చెప్పాను. ఈ మ్యాచ్ కోసం నేను పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాను. ఒకరోజు ముందుగానే ఇక్కడికి చేరుకుని ప్రాక్టీస్ చేశాను. నా వయసు ఇప్పుడు 37 ఏళ్లు.నా శరీరానికి కూడా తగినంత విశ్రాంతి, రికవరీ కోసం సమయం కావాలి. ఆట ఎలా ఉండబోతుందో ముందుగానే నా మైండ్లోనే ఓ స్పష్టతకు వచ్చేస్తాను. ఈరోజు మ్యాచ్లో ఇలా ఆడటం అద్భుతంగా అనిపించింది. తొలి 20- 25 ఓవర్ల వరకు పిచ్ బాగానే ఉంది. ఆ తర్వాత వికెట్ కాస్త నెమ్మదించింది.వెళ్లి బంతిని బాదడమే కదా అనుకున్నా. కానీ తర్వాత పరిస్థితికి తగ్గట్లుగా బ్యాటింగ్ చేశాను. ఇతర విషయాల గురించి పెద్దగా ఆలోచించలేదు. ఆటను పూర్తిగా ఆస్వాదించాను. చాలా ఏళ్లుగా నేను ఇదే పని చేస్తున్నాను. గత 15-16 ఏళ్లలో 300కు పైగా వన్డేలు ఆడాను.టచ్లో ఉన్నట్లే లెక్కప్రాక్టీస్లో మనం బంతిని హిట్ చేయగలిగామంటే టచ్లో ఉన్నట్లే లెక్క. సుదీర్ఘకాలం పాటు క్రీజులో నిలబడి బ్యాటింగ్ చేయాలంటే శారీరకంగా ఫిట్గా ఉండటం ముఖ్యం. ఆటకు మానసికంగా సిద్ధంగా ఉండటం అత్యంత ముఖ్యం.కేవలం గంటల కొద్ది సాధన చేస్తేనే రాణించగలము అనే మాటను నేను పెద్దగా నమ్మను. ముందుగా చెప్పినట్లు మానసికంగా సిద్ధంగా ఉంటే ఏదైనా సాధ్యమే. నేను ప్రతిరోజూ కఠినశ్రమ చేస్తాను. క్రికెట్ ఆడుతున్నాను కాబట్టే వర్కౌట్ చేయను. జీవితంలో ఇదీ ఒక భాగం కాబట్టే చేస్తాను.అప్పటి వరకు ఆడుతూనే ఉంటానాకు నచ్చినట్లుగా జీవిస్తాను. శారీరకంగా ఫిట్గా ఉండి.. మానసికంగా ఆటను ఆస్వాదించినన్ని రోజులు క్రికెట్ ఆడుతూనే ఉంటాను’’ అని కోహ్లి కుండబద్దలు కొట్టాడు. ఇప్పట్లో తాను రిటైర్ అయ్యే ప్రసక్తే లేదని సంకేతాలు ఇచ్చాడు.కాగా రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి నుంచి వన్డే వరల్డ్కప్-2027 ఆడతామనే హామీ రాలేదని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ గతంలో పేర్కొన్నాడు. అయితే, రో-కో వన్డేల్లో వరుసగా సత్తా చాటుతూ తాము ప్రపంచకప్ టోర్నీకి సిద్ధంగా ఉన్నామని చాటి చెబుతున్నారు.తాజాగా సౌతాఫ్రికాతో తొలి వన్డేలో కోహ్లి 120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 135 పరుగులు చేయగా.. ఓపెనింగ్ బ్యాటర్ రోహిత్ 51 బంతుల్లోనే 57 పరుగులు సాధించాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్కు ఏకంగా 136 పరుగులు జోడించారు. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా సఫారీలను 17 పరుగులతో ఓడించి.. మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. చదవండి: ఇచ్చిపడేశారు!.. కోహ్లి సెంచరీ.. రోహిత్ రియాక్షన్ వైరల్! A leap of joy ❤️💯A thoroughly entertaining innings from Virat Kohli 🍿Updates ▶️ https://t.co/MdXtGgRkPo#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @imVkohli pic.twitter.com/llLByyGHe5— BCCI (@BCCI) November 30, 2025 -
#INDvsSA : కింగ్ పూర్వవైభవం.. లేటు వయసులోనూ అదిరిపోయే శతకం
-
నరాలు తెగే ఉత్కంఠ.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. రాంచిలో ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో 17 పరుగుల తేడాతో సఫారీ జట్టును ఓడించింది. బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించడంతో భారత్కు ఈ గెలుపు సాధ్యమైంది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్లో 1-0తో టీమిండియా ముందంజ వేసింది. రాంచిలోని జేఎస్సీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కాంప్లెక్స్లో టాస్ వేదికగా తొలి వన్డేలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా (IND vs SA) తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 349 పరుగులు సాధించింది. రోహిత్, కోహ్లి, రాహుల్ ధనాధన్ఓపెనర్లలో రీఎంట్రీ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (18) విఫలం కాగా.. దిగ్గజ ఆటగాడు రోహిత్ శర్మ (Rohit Sharma) మెరుపు హాఫ్ సెంచరీ (51 బంతుల్లో 57)తో సత్తా చాటాడు. ఇక మరో లెజెండరీ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat kohli) భారీ శతకం (120 బంతుల్లో 135)తో చెలరేగగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ (60) అర్ధ శతకంతో అలరించాడు. మిగిలిన వారిలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 20 బంతుల్లో 32 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆదిలోనే షాకులుసౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్, నండ్రీ బర్గర్, కార్బిన్ బాష్, ఒట్నీల్ బార్ట్మన్ తలా రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికాకు భారత యువ పేసర్ హర్షిత్ రాణా ఆదిలోనే షాకులు ఇచ్చాడు. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ను డకౌట్ చేసిన రాణా.. అతడి స్థానంలో వన్డౌన్లో వచ్చిన క్వింటన్ డికాక్ను కూడా డకౌట్గా వెనక్కి పంపాడు. అదరగొట్టిన మాథ్యూ, యాన్సెన్మరో ఓపెనర్, కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (7)ను అర్ష్దీప్ సింగ్ అవుట్ చేశాడు. ఈ క్రమంలో కష్టాల్లో కూరుకుపోయిన ప్రొటిస్ జట్టును మాథ్యూ బ్రీట్జ్కే (72) ఆదుకున్నాడు. అతడికి తోడుగా ఆల్రౌండర్ యాన్సెన్ దంచికొట్టాడు. కేవలం 39 బంతుల్లోనే యాన్సెన్ 70 పరుగులు చేశాడు. మిగిలిన వారిలో టోనీ డి జోర్జి (39), డెవాల్డ్ బ్రెవిస్ (37) ఫర్వాలేదనిపించారు. భయపెట్టిన బాష్అయితే, సగం ఇన్నింగ్స్లో (25) ఓవర్లలో 162 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా సులువుగానే తలవంచుతుందనిపించగా.. టెయిలెండర్లు ప్రెనెలర్ సుబ్రేయన్ (17), నండ్రీ బర్గర్ (17) ఆల్రౌండర్ కార్బిన్ బాష్తో కలిసి మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పారు. మరోవైపు.. బాష్ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి.. 40 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుని మ్యాచ్ను ఎగురవేసుకుపోయే ప్రయత్నం చేశాడు. తొమ్మిది వికెట్లు పడినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ.. నరాలు తెగే ఉత్కంఠ రేపాడు. హాఫ్ సెంచరీ తర్వాత రెండు సిక్సర్లు బాది టీమిండియా శిబిరంలో ఆందోళన కలిగించాడు. ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో సౌతాఫ్రికా విజయ సమీకరణం ఆరు బంతుల్లో 18 పరుగులుగా మారింది. ఈసారి బంతి ప్రసిద్ కృష్ణ చేతికి ఇవ్వగా అతడు అద్భుతం చేశాడు. ప్రసిద్ కృష్ణ, రోహిత్ అద్భుతంఆఖరి ఓవర్లో రెండో బంతిని బాష్ గాల్లోకి లేపగా ఎక్స్ట్రా కవర్లో ఉన్న రోహిత్ శర్మ క్యాచ్ అందుకున్నాడు. దీంతో టీమిండియా విజయం ఖరారైంది. 17 పరుగుల తేడాతో భారత్ జయకేతనం ఎగురవేసింది.భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. పేసర్లలో హర్షిత్ రాణా మూడు, అర్ష్దీప్ రెండు, ప్రసిద్ కృష్ణ ఒక కీలక వికెట్ కూల్చి జట్టును విజయతీరాలకు చేర్చారు.చదవండి: కోహ్లి ప్రపంచ రికార్డులు.. 7000వ సెంచరీ -
ఇచ్చిపడేశారు!.. కోహ్లి సెంచరీ.. రోహిత్ రియాక్షన్ వైరల్!
‘‘వన్డే ప్రపంచకప్-2027 టోర్నమెంట్లో ఆడే విషయంపై రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి నుంచి మాకు ఎలాంటి హామీ లభించలేదు’’.. రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన వేళ టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెప్పిన మాట ఇది.ఆస్ట్రేలియా పర్యటనకు ముందు శుబ్మన్ గిల్ (Shubman Gill)ను వన్డే జట్టు కొత్త కెప్టెన్గా ప్రకటించిన అగార్కర్.. రో-కోల గురించి ఎదురైన ప్రశ్నకు అగార్కర్ (Ajit Agarkar) పైవిధంగా బదులిచ్చాడు. అయితే, ఆసీస్ టూర్లో ఆరంభంలో కోహ్లి తడబడ్డా.. రోహిత్ ఆద్యంతం అద్భుత బ్యాటింగ్తో అలరించాడు.రో- కో వన్డే భవితవ్యంపై చర్చమూడో వన్డేలో శతక్కొట్టి భారత్ను గెలిపించడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్నాడు. మరోవైపు.. ఆఖరిదైన మూడో మ్యాచ్లో కోహ్లి (Virat Kohli) సైతం భారీ అర్ద శతకంతో సత్తా చాటాడు. తాజాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో వన్డే సిరీస్కు ముందు కూడా రో- కో వన్డే భవితవ్యంపై చర్చ జరిగింది.టీమిండియాలో కొనసాగాలంటే దేశీ క్రికెట్ ఆడాలంటూ బోర్డు నుంచి రోహిత్, కోహ్లికి సందేశం వెళ్లిందనే వార్తలు వచ్చాయి. సఫారీ జట్టుతో సిరీస్ ముగిసిన తర్వాత వీరిద్దరి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకు హెడ్కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అగార్కర్ సమావేశం కానున్నారనే సమాచారం వచ్చింది.ఇచ్చిపడేశారు భయ్యా!ఇలాంటి తరుణంలో రాంచిలో సౌతాఫ్రికాతో తొలి వన్డేలో రోహిత్ శర్మ మెరుపు అర్ధ శతకం (51 బంతుల్లో 57)తో దుమ్ములేపగా.. కోహ్లి శతకం (120 బంతుల్లో 135)తో చెలరేగి తనకు తానే సాటి మరోసారి నిరూపించుకున్నాడు. ఇద్దరూ కలిసి వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మిగతా బ్యాటర్లు విఫలమైన వేళ తమ అనుభవంతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు.ఈ నేపథ్యంలో రో-కో అభిమానులు గంభీర్, అగార్కర్లను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దిగ్గజాల కెరీర్ ముగించాలని చూస్తే సహించేది లేదని.. ఒకవేళ మీ పంతం నెగ్గించుకోవాలని చూస్తే టీమిండియా భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.రోహిత్ శర్మ రియాక్షన్ వైరల్అంతేకాదు.. రో- కో భవిష్యత్తుపై కాకుండా గంభీర్- అగార్కర్ భవితవ్యంపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని.. సౌతాఫ్రికాతో టెస్టుల్లో 2-0తో వైట్వాష్కు బాధ్యతగా ముందుగా వీరిద్దరిని పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ క్రమంలో కోహ్లి సెంచరీ సెలబ్రేషన్ సమయంలో రోహిత్ శర్మ ఇచ్చిన రియాక్షన్ మరింత హైలైట్ అయింది. వన్డేల్లో రికార్డు స్థాయిలో 52వ సెంచరీ బాదడం ద్వారా అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్గా 83 శతకాలు పూర్తి చేసుకున్నాడు కోహ్లి. దీంతో గాల్లోకి ఎగిరి సంబరాలు చేసుకున్నాడు.A leap of joy ❤️💯A thoroughly entertaining innings from Virat Kohli 🍿Updates ▶️ https://t.co/MdXtGgRkPo#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @imVkohli pic.twitter.com/llLByyGHe5— BCCI (@BCCI) November 30, 2025ముఖం మీద కొట్టినట్లుగా ఇంతలో డగౌట్లో ఉన్న రోహిత్ శర్మ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ.. ‘‘ఇదిరా మన సత్తా’’ అన్నట్లుగా కాస్త అసభ్య పదజాలంతో సెలబ్రేట్ చేసుకున్నట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కాగా.. గంభీర్- అగార్కర్లకు రో- కో సరైన సమాధానం ఇచ్చారంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు అంకితభావం లేదన్న వారికి సెంచరీలతో ముఖం మీద కొట్టినట్లుగా కౌంటర్ ఇచ్చారని కామెంట్లు చేస్తున్నారు. కాగా రాంచిలో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 349 పరుగులు సాధించింది.చదవండి: ప్రపంచ రికార్డులు సృష్టించిన కోహ్లి.. సచిన్ను దాటేసి తొలి ప్లేయర్గా.. 7000వ సెంచరీRohit Sharma reaction on Virat Kohli century. 😭pic.twitter.com/hmsllR1eYm— Selfless⁴⁵ (@SelflessCricket) November 30, 2025 -
దంచికొట్టిన కోహ్లి, రోహిత్, రాహుల్.. సౌతాఫ్రికాకు భారీ లక్ష్యం
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. రాంచి వేదికగా నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. తద్వారా సౌతాఫ్రికాతో వన్డేల్లో రెండో అత్యధిక స్కోరును భారత్ నమోదు చేసింది.రోహిత్ మెరుపు అర్ధ శతకంస్వదేశంలో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రాంచి వేదికగా సౌతాఫ్రికాతో తొలి వన్డే (IND vs SA 1st ODI)లో టాస్ ఓడిన టీమిండియా.. తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (18) నిరాశపరచగా.. రోహిత్ శర్మ (Rohit Sharma) ధనాధన్ దంచికొట్టాడు. మెరుపు అర్ధ శతకం (51 బంతుల్లో 57) సాధించాడు.మరోవైపు.. రోహిత్తో కలిసి వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) కూడా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. హిట్మ్యాన్తో కలిసి రెండో వికెట్కు 136 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. కోహ్లి రికార్డు సెంచరీఈ క్రమంలో 102 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న కోహ్లి.. ఆ తర్వాత జోరు పెంచాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (56 బంతుల్లో 60)తో కలిసి ఐదో వికెట్కు 76 పరుగులు జోడించిన కోహ్లి.. నండ్రీ బర్గర్ బౌలింగ్లో రికెల్టన్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.ఈ మ్యాచ్లో మొత్తంగా 120 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 11 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 135 పరుగులు సాధించాడు. తద్వారా అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్గా 83వ శతకం, వన్డేల్లో 52వ సెంచరీ నమోదు చేశాడు. 52nd ODI hundred for the King! 🤩👑Most in a single format in international cricket 🙌🔥#INDvSA 1st ODI, LIVE NOW 👉 https://t.co/BBkwein9oF pic.twitter.com/DPYCzEZ72J— Star Sports (@StarSportsIndia) November 30, 2025రాణించిన జడేజామిగిలిన వారిలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (20 బంతుల్లో 32) వేగంగా ఆడగా.. రుతురాజ్ గైక్వాడ్ (8), వాషింగ్టన్ సుందర్ (13) విఫలమయ్యారు. ఈ క్రమంలో నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి భారత్ 349 పరుగులు సాధించి.. సౌతాఫ్రికాకు 350 పరుగుల టార్గెట్ విధించింది.సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్, నండ్రీ బర్గర్, కార్బిన్ బాష్, ఒట్నీల్ బార్ట్మన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా వన్డేల్లో టీమిండియాకు ఇది రెండో అత్యధిక స్కోరు (349/8). ఇంతకు ముందు 2010లో గ్వాలియర్ వేదికగా టీమిండియా ప్రొటిస్ జట్టుపై మూడు వికెట్ల నష్టానికి 401 పరుగులు (401/3) చేసింది. ఇదిలా ఉంటే.. శుబ్మన్ గిల్ మెడ నొప్పి వల్ల వన్డే సిరీస్కు దూరం కాగా.. కేఎల్ రాహుల్ టీమిండియాను ముందుకు నడిపిస్తున్నాడు.చదవండి: ప్రపంచ రికార్డులు సృష్టించిన కోహ్లి.. 7000వ సెంచరీ గురించి తెలుసా? -
విరాట్ కోహ్లి సూపర్ సెంచరీ.. వన్డే రారాజుకు తిరుగులేదు
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి శతక్కొట్టాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో 83వ సెంచరీని నమోదు చేశాడు. ఇక వన్డేల్లో కోహ్లికి ఇది 52వ శతకం. ఈ నేపథ్యంలో యాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక శతకాల వీరుడిగా తన రికార్డును తానే సవరించాడు కోహ్లి.వింటేజ్ కింగ్ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా వన్డేల్లో రీఎంట్రీ ఇచ్చిన కోహ్లి (Virat Kohli).. తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయి పూర్తిగా నిరాశపరిచాడు. అయితే, ఆసీస్తో మూడో వన్డేలో మాత్రం ‘వింటేజ్ కింగ్’ను గుర్తుచేశాడు. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో 74 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇక స్వదేశంలో సౌతాఫ్రికాతో తొలి వన్డేలోనూ కోహ్లి ఇదే ఫామ్ను కొనసాగించాడు. ఈ వన్డౌన్ బ్యాటర్ 102 బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడు. భారత ఇన్నింగ్స్లో 38వ ఓవర్లో ఐదో బంతికి మార్కో యాన్సెన్ బౌలింగ్లో ఫోర్ బాది కోహ్లి శతకం పూర్తి చేసుకున్నాడు. ఇందులో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.రోహిత్తో కలిసి ధనాధన్రాంచి వేదికగా టీమిండియాతో తొలి వన్డేలో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్ ఆదిలోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ (18) వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో మరో ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి కోహ్లి ఇన్నింగ్ నిర్మించాడు.రోహిత్ శర్మ అర్ద శతకం (57)తో సత్తా చాటగా.. అతడితో కోహ్లి రెండో వికెట్కు 109 బంతుల్లో 136 పరుగులు జోడించాడు. రోహిత్ అవుటైన తర్వాత కోహ్లి మరింత బాధ్యతాయుతంగా ఆడాడు. రుతురాజ్ గైక్వాడ్ (8), వాషింగ్టన్ సుందర్ (13) ఇలా వచ్చి అలా వెళ్లగా.. కేఎల్ రాహుల్ కోహ్లికి తోడుగా నిలిచాడు.ఈ క్రమంలో కోహ్లి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత గేరు మార్చిన కోహ్లి జోరు పెంచాడు. ఫలితంగా 41 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది.చదవండి: రోహిత్ శర్మ సిక్సర్ల వర్షం.. ప్రపంచ రికార్డ్ బ్రేక్ -
రాక రాక వచ్చిన అవకాశం.. ఇలా చేస్తావా?
సౌతాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా వన్డేల్లో పునరాగమనం చేసిన టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నిరాశపరిచాడు. చాన్నాళ్ల తర్వాత యాభై ఓవర్ల ఫార్మాట్లో వచ్చిన అవకాశాన్ని ఈ లెఫ్టాండర్ బ్యాటర్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మెరుగ్గానే ఇన్నింగ్స్ ఆరంభించినప్పటికీ నిలకడగా ముందుకు సాగలేకపోయాడు.ఈ నేపథ్యంలో జైస్వాల్ ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. టెస్టుల్లో ఓపెనర్గా పాతుకుపోయిన జైసూకు పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టులో మాత్రం అడపాదడపా మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. టీ20లలో శుబ్మన్ గిల్- అభిషేక్ శర్మ, వన్డేల్లో రోహిత్ శర్మ- శుబ్మన్ గిల్ ఓపెనర్లుగా రాణిస్తున్నారు. దీంతో వీరిలో ఎవరైనా గైర్హాజరైతే మాత్రమే జట్టులో చోటు దక్కుతోంది.తాజాగా స్వదేశంలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు కెప్టెన్ గిల్ గాయం కారణంగా దూరం కాగా.. జైస్వాల్ జట్టులోకి వచ్చాడు. రాంచి వేదికగా ప్రొటిస్ జట్టుతో ఆదివారం నాటి తొలి వన్డేలో రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్గా బరిలోకి దిగాడు. ఈ క్రమంలో తొలి బంతికే ఫోర్ బాది సత్తా చాటిన జైసూ.. రెండో బంతిని కూడా బౌండరీకి తరలించాడు.ఆ తర్వాత సిక్సర్ బాది దూకుడు ప్రదర్శించిన జైస్వాల్కు ప్రొటిస్ పేసర్ నండ్రీ బర్గర్ చెక్ పెట్టాడు. నాలుగో ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన బర్గర్... తొలి బంతిని అవుట్ సైడాఫ్ దిశగా సంధించగా.. జైస్వాల్ గాల్లోకి లేపాడు. ఈ క్రమంలో వేగంగా స్పందించిన వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ బంతిని ఒడిసిపట్టగా.. జైసూ పెవిలియన్ చేరాడు. మొత్తంగా 16 బంతులు ఎదుర్కొని.. రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 18 పరుగులు చేసి నిష్క్రమించాడు.ఈ నేపథ్యంలో జైస్వాల్పై విమర్శలు వస్తున్నాయి. రీఎంట్రీలో సత్తా చాటుతాడనుకుంటే.. నిరాశపరిచాడంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా సౌతాఫ్రికాతో టెస్టుల్లోనూ జైసూ విఫలమైన విషయం తెలిసిందే. రెండు టెస్టు మ్యాచ్లలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ చేసిన స్కోర్లు వరుసగా.. 12, 0, 58, 13. ప్రొటిస్ బౌలర్లను ఎదుర్కోవడంలో తడబడ్డ జైస్వాల్.. ఒక్క హాఫ్ సెంచరీతో సరిపెట్టాడు. -
రోహిత్ శర్మ సిక్సర్ల వర్షం.. ప్రపంచ రికార్డ్ బ్రేక్
టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్గా ప్రపంచ రికార్డు సాధించాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది పేరిట ఉన్న రికార్డును హిట్మ్యాన్ బ్రేక్ చేశాడు. సౌతాఫ్రికాతో ఆదివారం నాటి తొలి వన్డే సందర్భంగా రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు.మూడు వన్డేల సిరీస్లో భాగంగా సొంతగడ్డపై ప్రొటిస్ జట్టుతో రాంచి వేదికగా తొలి మ్యాచ్లో.. టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్కు దిగింది . ఓపెనర్ యశస్వి జైస్వాల్ (18) నిరాశపరచగా.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ నిలకడగా ఆడుతూ వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు.ఈ క్రమంలో రోహిత్కు తోడైన వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆది నుంచే దూకుడు ప్రదర్శించాడు. వీరిద్దరు అదరగొట్టడంతో పవర్ ప్లేలో (10 ఓవర్లు) భారత్ వికెట్ నష్టానికి 80 పరుగులు సాధించింది. తద్వారా వన్డే వరల్డ్కప్-2023 తర్వాత వన్డేల్లో తొలి పది ఓవర్లలో మొదటిసారి ఈమేర అత్యధిక స్కోరు సాధించింది. ఇక రోహిత్- కోహ్లి స్థాయికి తగ్గట్లు చెలరేగడంతో డ్రింక్స్ విరామ సమయానికి (16 ఓవర్లలో) మరో వికెట్ నష్టపోకుండా 122 పరుగులు సాధించింది.రోహిత్ శర్మ ప్రపంచ రికార్డురోహిత్ శర్మ 36 బంతుల్లో 45, కోహ్లి 44 బంతుల్లో 45 పరుగులతో క్రీజులో నిలిచారు. ఇక భారత ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ప్రొటిస్ స్పిన్నర్ సుబ్రేయన్ రంగంలోకి దిగగా.. అతడి బౌలింగ్లో తొలి రెండు బంతుల్లో రోహిత్ వరుసగా సిక్సర్లు బాదాడు. Just one Ro-𝗛𝗜𝗧 away from history! 👀🔥@ImRo45 now has the joint-most 6️⃣s in ODIs! He reached his fifty with some classy attacking strokes along the way! 🏏🔥#INDvSA 1st ODI, LIVE NOW 👉 https://t.co/BBkwein9oF#RohitSharma pic.twitter.com/DbJ822jVda— Star Sports (@StarSportsIndia) November 30, 2025 ఈ క్రమంలోనే వన్డేల్లో తన 352వ సిక్సర్ను రోహిత్ నమోదు చేశాడు. తద్వారా పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది (351 సిక్సర్లు) పేరిట ఉన్న వన్డే సిక్సర్ల రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. అనంతరం రోహిత్ 57(51 బంతుల్లో) పరుగుల వద్ద మార్కో జాన్సెన్ బౌలింగ్లో ఎల్బీగా వెనుగదిరిగాడు.కోహ్లి అర్ద శతకంమరోవైపు... కోహ్లి అర్ద శతకం పూర్తి చేసుకున్నాడు. కార్బిన్ బాష్ బౌలింగ్లో వరుసగా రెండు సిక్సర్లు బాది కెరీర్లో 76వ వన్డే ఫిఫ్టీ సాధించాడు. ఈ క్రమంలోనే 26 ఓవర్లలో టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 182 పరుగులు స్కోరు చేసింది. కాగా 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ మార్కో యాన్సెన్ బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగాడు. మొత్తంగా 51 బంతులు ఎదుర్కొన్న హిట్మ్యాన్ ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.చదవండి: శతక్కొట్టిన అభిషేక్ శర్మ.. సిక్సర్ల వర్షం.. సరికొత్త చరిత్ర -
IND vs SA ODIs: షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, జట్లు.. పూర్తి వివరాలు
టెస్టు సిరీస్ తర్వాత భారత్- సౌతాఫ్రికా వన్డేలలో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఇరుజట్ల మధ్య ఆదివారం మూడు మ్యాచ్ల సిరీస్కు తెరలేవనుంది. ఇప్పటి వరకు టీమిండియా- సౌతాఫ్రికా వన్డేల్లో ముఖాముఖి 94 మ్యాచ్లలో తలపడ్డాయి.సఫారీలదే పైచేయిఇందులో యాభై ఒక్క మ్యాచ్లు గెలిచి సౌతాఫ్రికా ఆధిపత్యం కొనసాగిస్తుండగా.. భారత్ కేవలం నలభై గెలిచింది. మూడు మ్యాచ్లు ఫలితం తేలకుండా ముగిసిపోయాయి. అయితే, ఈసారి సొంతగడ్డపై సిరీస్ జరగడం టీమిండియాకు సానుకూలంగా పరిణమించింది. టెస్టుల్లో 2-0తో వైట్వాష్ పరాభవానికి.. కనీసం వన్డేలలోనైనా గెలిచి బదులు తీర్చుకోవాలని భారత జట్టు పట్టుదలగా ఉంది.గిల్ లేకుండానే..అయితే, కెప్టెన్ శుబ్మన్ గిల్ గాయం వల్ల ఈ సిరీస్కు దూరం కావడం వల్ల ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కానీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియర్లతో పాటు జట్టులోకి తిరిగి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లు సత్తా చాటితే అతడు లేని ప్రభావం పెద్దగా పడకపోవచ్చు.ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27 సీజన్లో భాగంగా సొంతగడ్డపై సౌతాఫ్రికాతో తలపడిన టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. కోల్కతా వేదికగా ప్రొటిస్ జట్టు చేతిలో 30 పరుగుల తేడాతో ఓడిన భారత జట్టు.. గువాహటిలో ఏకంగా 408 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో సఫారీల చేతిలో 2-0తో వైట్వాష్కు గురైంది. తద్వారా పాతికేళ్ల తర్వాత మరోసారి సౌతాఫ్రికాతో టెస్టుల్లో టీమిండియా ఈ మేరకు ఘోర ఓటమి రుచిచూసింది. టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా వన్డే సిరీస్షెడ్యూల్👉తొలి వన్డే: నవంబరు 30, ఆదివారం- రాంచి👉రెండో వన్డే: డిసెంబరు 3, బుధవారం- రాయ్పూర్👉మూడో వన్డే: డిసెంబరు 6, శనివారం- విశాఖపట్నంమ్యాచ్ ఆరంభ సమయంభారత కాలమానం ప్రకారం మూడు వన్డేలు మధ్యాహ్నం 1.30 నిమిషాలకు ఆరంభమవుతాయి.ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ టీవీలో ప్రసారాలు.. డిజిటల్ మీడియాలో జియోహాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం.సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు భారత జట్టురోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ధ్రువ్ జురెల్.భారత్తో వన్డే సిరీస్కు సౌతాఫ్రికా జట్టు నండ్రీ బర్గర్, క్వింటన్ డికాక్, తెంబా బవుమా (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్మన్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, లుంగి ఎంగిడి, ర్యాన్ రికెల్టన్, టోనీ డి జోర్జి, రూబిన్ హెర్మాన్, కేశవ్ మహరాజ్, మార్కో యాన్సెన్, ఐడెన్ మార్క్రమ్, ప్రెనేలన్ సుబ్రాయేన్.చదవండి: IND vs SA: తుదిజట్టులో అతడు తప్పక ఉంటాడు: కెప్టెన్ కేఎల్ రాహుల్ -
‘రుతురాజ్ అద్భుతమైన ఆటగాడు.. ఛాన్సులు ఇస్తాం’
ప్రతిభ ఉన్నా ఆశించిన స్థాయిలో అవకాశాలు పొందలేకపోతున్న టీమిండియా ఆటగాళ్లలో రుతురాజ్ గైక్వాడ్ ఒకడు. ఈ మహారాష్ట్ర ఆటగాడు దేశవాళీ క్రికెట్లో సత్తా చాటడంతో పాటు.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు సారథ్యం వహిస్తున్నాడు. టీమిండియా ఓపెనర్గానూ తనను తాను నిరూపించుకున్న రుతు.. ఆసియా క్రీడలు-2023లో భారత జట్టు కెప్టెన్గా పసిడి పతకం గెలిచాడు.రెండేళ్ల తర్వాత..అయితే, అనుకున్న స్థాయిలో రుతుకు టీమిండియాలో ఛాన్సులు మాత్రం రావడం లేదు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ (Rohit Sharma), శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ల నుంచి ఎదురైన పోటీలో రుతు వెనుకబడిపోయాడు. ఈ క్రమంలో మరోసారి దేశీ క్రికెట్, భారత్-‘ఎ’ తరఫున అదరగొట్టి.. టీమిండియా పునరాగమనానికి రుతురాజ్ సిద్ధమయ్యాడు.దాదాపు రెండేళ్ల విరామం తర్వాత.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ సందర్భంగా రుతురాజ్ గైక్వాడ్ను సెలక్టర్లు జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. ఈసారి, కెప్టెన్ హోదాలో ఉన్న శుబ్మన్ గిల్ గాయం వల్ల దూరం అయినా.. అతడికి బ్యాకప్గా టెస్టు స్పెషలిస్టు యశస్వి జైస్వాల్ వన్డే జట్టులోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో దిగ్గజ ఓపెనర్ రోహిత్ శర్మకు.. ఓపెనింగ్ జోడీగా జైసూ, రుతులలో ఎవరు ఉంటారనేది ఆసక్తిగా మారింది.రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఆటగాడుఈ విషయంపై టీమిండియా వన్డే తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పందించాడు. సౌతాఫ్రికాతో ఆదివారం నాటి తొలి వన్డేకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఆటగాడు. ప్రస్తుతం మా వన్డే జట్టులో 5-6 స్థానాల్లో ఆటగాళ్లు ఫిక్సయిపోయారు.అయితే, తనకు వచ్చిన అవకాశాలన్నిటిని రుతురాజ్ సద్వినియోగం చేసుకున్నాడు. కాబట్టి ఈ సిరీస్లో అతడికి ఛాన్సులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాము’’ అని కేఎల్ రాహుల్ తెలిపాడు. అయితే, ఏ స్థానంలో రుతురాజ్ను ఆడించే అవకాశం ఉందన్న విషయంపై మాత్రం స్పష్టతనివ్వలేదు. కాగా ఆదివారం భారత్- సౌతాఫ్రికా మధ్య తొలి వన్డే జరుగనుంది. ఇందుకు రాంచీ వేదిక.చదవండి: అభిషేక్ శర్మ అట్టర్ఫ్లాప్.. సంజూ శాంసన్ ఫెయిల్ -
చెప్పినట్లు వింటారా?.. తమ మాటే నెగ్గించుకుంటారా?
సౌతాఫ్రికాతో టెస్టుల్లో వైట్వాష్ తర్వాత వన్డే సిరీస్కు సిద్ధమైంది టీమిండియా. సంప్రదాయ క్రికెట్లో విఫలమైనా.. పరిమిత ఓవర్ల సిరీస్లో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. నవంబరు 30- డిసెంబరు 6 మధ్య ప్రొటిస్ జట్టుతో భారత్ మూడు వన్డేలు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా రాంచి వేదికగా ఆదివారం జరిగే తొలి వన్డేకు టీమిండియా సిద్ధమైంది. దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma)తో పాటు జట్టు మొత్తం ఇప్పటికే మ్యాచ్ జరిగే వేదికకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రో- కో భవితవ్యంపై మరోసారి చర్చ మొదలైంది. వన్డే వరల్డ్కప్-2027 (ICC World Cup 2027) వరకు ఈ లెజెండరీ బ్యాటర్లు కొనసాగుతారా? లేదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.వాటి ఆధారంగానే నిర్ణయిస్తాంఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వర్గాలు ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. రోహిత్- కోహ్లిల విషయంలో యాజమాన్యం ఆచితూచి నిర్ణయం తీసుకోనుందని తెలిపాయి. జట్టులో వారి పాత్ర, అంచనాలు, ఫామ్ ఆధారంగానే వీరిద్దరు ప్రపంచకప్ టోర్నీ ఆడతారా? లేదా? అన్న విషయంపై స్పష్టత వస్తుందని పేర్కొన్నాయి.‘‘ఆస్ట్రేలియా పర్యటనలో వాళ్లిద్దరు మూడో వన్డేలో వింటేజ్ ఆటను గుర్తు చేశారు. అయితే, అప్పటికే సిరీస్ మన చేజారిపోయింది. తొలి రెండు మ్యాచ్లలో రో-కో పెద్దగా ఆకట్టుకోలేదు. కాబట్టి ఒక్క మ్యాచ్లో ఆడినంత మాత్రాన ప్రతిసారీ వారికి మినహాయింపు లభిస్తుందని అనుకోవద్దు’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియతో సదరు వర్గాలు పేర్కొన్నాయి.తిరుగులేని రో-కోవన్డేల్లో ఆకాశమంత ఎత్తుకు ఎదిగారు కోహ్లి, రోహిత్. ముఖ్యంగా ఇప్పటికే వన్డే ఫార్మాట్లో 51 శతకాలతో అత్యధిక సెంచరీల వీరుడిగా కోహ్లి కొనసాగుతుండగా.. యాభై ఓవర్ల క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఘనుడు రోహిత్ (264 పరుగులు). వీరి ఘనతను చెప్పడానికి ఇవి చిన్న ఉదాహరణలు మాత్రమే.ఇక కెప్టెన్గా రోహిత్ శర్మ ఇటీవలే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ కూడా గెలిచాడు. కానీ అనూహ్యంగా ఆస్ట్రేలియా పర్యటనకు ముందు అతడిని సారథిగా తప్పించి.. అతడి స్థాయంలో శుబ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించింది మేనేజ్మెంట్. వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి జట్టును సన్నద్ధం చేసే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.చెప్పినట్లు వింటారా?కాగా వన్డే వరల్డ్కప్ టోర్నీకి ఇంకా 22 నెలల వ్యవధి ఉంది. ఈలోపు టీమిండియా ఆడే వన్డే సిరీస్లలో ప్రదర్శన ఆధారంగానే రో- కో భవితవ్యం తేలనుందని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచకప్ నాటికి రోహిత్ 40, కోహ్లి 38 ఏళ్ల వయసు దాటేస్తారు. కాబట్టి ఫిట్నెస్ పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అయితే, ఇప్పటికే ఫిట్నెస్కు మారుపేరుగా పేరొందిన కోహ్లి.. మరింత ఫిట్గా మారగా.. రోహిత్ ఆసీస్ టూర్కు ముందు ఏకంగా పది కిలోల బరువు తగ్గి స్లిమ్గా మారిపోయాడు. అయితే, ఇప్పటికే వీరిద్దరు అంతర్జాతీయ టీ20లతో పాటు.. టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరు కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నారు.ఇలాంటి తరుణంలో ఫిట్నెస్, మ్యాచ్ ప్రాక్టీస్, ఫామ్ కోసం రో- కో దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఆడాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. బోర్డు కూడా వీరి నుంచి ఇదే కోరుకుంటోంది. అయితే, ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో తమను తాము నిరూపించుకున్న రో-కో ఇందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఇటీవల సౌతాఫ్రికా-‘ఎ’తో వన్డే సిరీస్లో వీరిద్దరు ఆడతారని ముందుగా వార్తలు వచ్చాయి.గంభీర్, అగార్కర్తో చర్చల తర్వాతే..కానీ ఈ అనధికారిక సిరీస్లో రో-కో ఆడలేదు. ఏదేమైనా సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్తో రోహిత్- కోహ్లి భవిష్యత్తుపై ఒక అంచనాకు రావాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం జరిగే సమావేశంలో హెడ్కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఈ విషయం గురించి రో-కోతో సుదీర్ఘంగా చర్చించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా వరల్డ్కప్ వంటి మెగా టోర్నీలో రోహిత్- కోహ్లి వంటి సీనియర్ల అనుభవం యువ జట్టుకు పనికివస్తుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం వీరిని మించి సత్తా చాటుతున్న యువ ఆటగాళ్లు కూడా ఎవరూ లేరు. అలాంటపుడు రో- కోను గనుక కావాలని తప్పిస్తే మాత్రం టీమిండియాకు కష్టాలు తప్పకపోవచ్చు!!చదవండి: India vs South Africa: టికెట్లు సోల్డ్ అవుట్ -
గంభీర్పై వేటు తప్పదా?.. బీసీసీఐ నిర్ణయం ఇదే!
సొంతగడ్డపై టెస్టుల్లో టీమిండియాకు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. గతేడాది న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్వాష్ అయిన భారత జట్టు.. తాజాగా సౌతాఫ్రికా చేతిలో 2-0తో క్లీన్స్వీప్ అయింది. ముఖ్యంగా గువాహటి వేదికగా రెండో టెస్టులో కనీవినీ ఎరుగని రీతిలో 408 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది.ఈ నేపథ్యంలో హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)పై విమర్శల వర్షం కురుస్తోంది. టెస్టు క్రికెట్ కోచ్గా అతడు పనికిరాడని.. వెంటనే పదవి నుంచి తొలగించాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు.కోచ్గా ఎలాంటి అనుభవం లేకపోయినా..టీ20 ప్రపంచకప్-2024 టోర్నమెంట్లో భారత్ చాంపియన్గా నిలిచిన తర్వాత రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) హెడ్కోచ్గా తప్పుకోగా.. గంభీర్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. అంతకుముందు కోచ్గా గంభీర్కు ఎలాంటి అనుభవం లేకపోయినా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అతడిపై నమ్మకం ఉంచి గురుతర బాధ్యతను అప్పగించింది.అయితే, గౌతీ వచ్చిన తర్వాత టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్లో మెరుగ్గానే రాణిస్తోంది. ఆదిలో శ్రీలంక పర్యటనలో దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత తొలిసారి వన్డే సిరీస్ను కోల్పోయింది భారత్. ఆ తర్వాతి ద్వైపాక్షిక సిరీస్లలో అదరగొట్టిన టీమిండియా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025, ఆసియా టీ20 కప్-2025 టోర్నమెంట్లలో చాంపియన్గా నిలిచి సత్తా చాటింది.ద్రవిడ్కే ఆ క్రెడిట్కానీ చాంపియన్స్ ట్రోఫీలో దక్కిన విజయాన్ని గంభీర్ ఖాతాలో వేసేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంగీకరించలేదు. ద్రవిడ్ భాయ్ తయారు చేసిన జట్టుతోనే ఇది సాధ్యమైందంటూ చాంపియన్స్ ట్రోఫీలో భారత్కు టైటిల్కు అందించిన హిట్మ్యాన్ వ్యాఖ్యానించాడు.పొమ్మనలేక పొగబెట్టి.. ప్రయోగాలతో కొంపముంచి..ఇదిలా ఉంటే.. టెస్టుల నుంచి దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ.. అంతకుముందే స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్ తప్పుకోవడానికి కారణం గంభీర్ అనే ఆరోపణలు ఉన్నాయి. పొమ్మనలేక పొగబెట్టినట్లుగా సీనియర్లను వెళ్లగొట్టాడని.. రోహిత్ నుంచి టెస్టు, వన్డే కెప్టెన్సీ శుబ్మన్ గిల్కు దక్కడంలో గంభీర్ కీలకమనే విమర్శలు వచ్చాయి.ఇవన్నీ పక్కనపెడితే.. గంభీర్ మార్గదర్శనంలోనే గతేడాది న్యూజిలాండ్ చేతిలో టీమిండియాకు టెస్టుల్లో పరాభవం ఎదురుకావడం.. తాజాగా సౌతాఫ్రికా చేతిలోనూ చిత్తుగా ఓడటం అతడి రాజీనామా డిమాండ్లకు ప్రధాన కారణం అయ్యాయి. ముఖ్యంగా టెస్టుల్లో కీలకమైన మూడు, నాలుగు స్థానాల్లో తరచూ మార్పులు, ఆల్రౌండర్లకు ప్రాధాన్యం ఇస్తూ.. స్పెషలిస్టులను పక్కనపెట్టడం, బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు కొంపముంచాయని మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడ్డారు.సంధి కాలంఈ నేపథ్యంలో గంభీర్ తన భవితవ్యంపై స్పందిస్తూ.. ‘‘టెస్టు జట్టుకు కోచ్గా నేను సరైనవాడినా కాదా అనేది చెప్పడం తన చేతుల్లో లేదు. దీనిపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది నేను గతంలోనే చెప్పినట్లు భారత జట్టు ముఖ్యం తప్ప వ్యక్తులు కాదు.చాలా మంది న్యూజిలాండ్ చేతిలో ఓటమి గురించి కూడా మాట్లాడుతున్నారు. కానీ ఇదే యువ జట్టుతోనే నేను ఇంగ్లండ్లో టెస్టు సిరీస్లో మంచి ఫలితాలు రాబట్టిన విషయం మరచిపోవద్దు. నా కోచింగ్లోనే జట్టు చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ కూడా గెలిచింది.కివీస్తో సిరీస్తో దీనిని పోల్చవద్దు. ప్రస్తుతం జట్టులో అనుభవం తక్కువగా ఉంది. ఓటమికి సాకులు చెప్పే అలవాటు నాకు ఎప్పుడూ లేదు. నిజానికి ‘సంధి కాలం’ అనే మాటను నేను వాడను కానీ మా పరిస్థితి ఇప్పుడు సరిగ్గా అలాగే ఉంది.ఈ టెస్టులో ఒకదశలో మెరుగైన స్థితిలో ఉన్న జట్టు ఒక 30 నిమిషాల స్పెల్లో కుప్పకూలింది. మన ఆటగాళ్లు ఇంకా నేర్చుకుంటున్నారు. వారికి తగినంత సమయం ఇవ్వాలి’’ అని గంభీర్ విజ్ఞప్తి చేశాడు.బీసీసీఐ నిర్ణయం ఇదే!ఈ నేపథ్యంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా? అనే ఆసక్తి భారత క్రికెట్ వర్గాల్లో నెలకొంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు తాజాగా ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఇప్పట్లో గంభీర్ స్థానాన్ని వేరే వాళ్లతో భర్తీ చేయాలనే ఆలోచన మాకు లేదు.అతడు జట్టును పునర్నిర్మిస్తున్నాడు. 2027 వరల్డ్కప్ వరకు అతడి కాంటాక్టు ఉంది. సౌతాఫ్రికాతో సిరీస్లు ముగిసిన తర్వాత జట్టు యాజమాన్యం, సెలక్టర్లతో గంభీర్ సమావేశం అవుతాడు. సంధి దశలో టెస్టు జట్టు ప్రదర్శన గురించి అతడి అభిప్రాయం ఏమిటన్నది చెబుతాడు. లోపాలు ఎలా అధిగమించాలో తన ప్రణాళికలు వివరిస్తాడు’’ అని పేర్కొన్నాయి. దీనిని బట్టి ఇప్పట్లో గంభీర్ను హెడ్కోచ్గా తప్పించేందుకు బీసీసీఐ సుముఖంగా లేదని స్పష్టమవుతోంది.చదవండి: దంచికొట్టిన సంజూ.. ఇరగదీసిన రోహన్.. సరికొత్త చరిత్ర -
అందరూ నన్నే నిందిస్తారు.. బీసీసీఐదే తుది నిర్ణయం: గంభీర్
స్వదేశంలో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత జట్టు సౌతాఫ్రికా (IND vs SA) చేతిలో 2-0తో వైట్వాష్ అయింది. గువాహటిలో జరిగిన రెండో టెస్టులో భారత బ్యాటర్ల వైఫల్యం కారణంగా.. పాతికేళ్ల తర్వాత తొలిసారి ప్రొటిస్ జట్టుకు టెస్టు సిరీస్ సమర్పించుకోవడమే గాకుండా.. క్లీన్స్వీప్నకు గురైంది.అశూ, రో-కోలను పంపించేశాడు!ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లతో పాటు హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)పై విమర్శల వర్షం కురుస్తోంది. స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్, లెజెండరీ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మలను పొమ్మనలేక పొగబెట్టాడని.. బ్యాటింగ్ ఆర్డర్లోనూ పిచ్చి ప్రయోగాలతో భారత జట్టు ఘోర పరాభవానికి కారణమయ్యాడని అభిమానులు సైతం మండిపడుతున్నారు. వెంటనే అతడిని పదవి నుంచి తొలగించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.బీసీసీఐదే తుది నిర్ణయంఈ విషయంపై గంభీర్ స్పందించాడు. సఫారీల చేతిలో గువాహటి టెస్టులో ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా విషయంలో బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ నేను కాదు.. టీమిండియానే అందరికీ ముఖ్యం. నా మార్గదర్శనంలోనే ఇంగ్లండ్లో టీమిండియా టెస్టు సిరీస్ 2-2తో సమం చేసింది.చాంపియన్స్ ట్రోఫీతో పాటు.. ఆసియా కప్ కూడా గెలుచుకుంది. ఈ జట్టు ఇంకా నేర్చుకునే దశలోనే ఉంది. ఏదేమైనా కోచ్గా నా బాధ్యత కూడా ఉంటుంది. ముందుగా నన్నే అందరూ నిందిస్తారు. ఆ తర్వాత జట్టును విమర్శిస్తారు.అందరూ నన్నే నిందిస్తారుఈ మ్యాచ్లో మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. 95/1 నుంచి 122/7కు పడిపోవడం ఎంత మాత్రం ఆమోదయోగ్యనీయం కాదు. ఏదో ఒక షాట్ను సాకుగా చూపి వ్యక్తిగతంగా ఎవరినీ టార్గెట్ చేయలేము. ప్రతి ఒక్కరిపై విమర్శలు వస్తాయి. నేను మాత్రం వ్యక్తిగతంగా ఎవరినీ నిందించను. నా విధానం ఇదే’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. కాగా గంభీర్ కోచింగ్లో టీమిండియాకు టెస్టుల్లో సొంతగడ్డపై ఇది రెండో ఘోర పరాభవం.దారుణ వైఫల్యాలుగతేడాది న్యూజిలాండ్తో స్వదేశంలో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత్ 3-0తో వైట్వాష్ అయింది. తాజాగా కోల్కతాలో సౌతాఫ్రికాతో తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా.. గువాహటిలోని బర్సపరా స్టేడియంలో మరీ దారుణంగా 408 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. సఫారీలు విధించిన 549 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 140 పరుగులకే ఆలౌట్ అయి.. మరో వైట్వాష్ను ఎదుర్కొంది.అంతకు ముందు స్వదేశంలో బంగ్లాదేశ్, వెస్టిండీస్లను క్లీన్స్వీప్ చేసిన టీమిండియా.. ఇంగ్లండ్లో ఐదు టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేసింది. అయితే, అంతకంటే ముందుగా ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో బోర్డర్ గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది. పదేళ్ల తర్వాత తొలిసారి ఈ ట్రోఫీని చేజార్చుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వేళ్లన్నీ గంభీర్ వైపే చూపిస్తున్నాయి. చదవండి: కాస్త హుందాగా ఉండండి: సౌతాఫ్రికా కోచ్పై మండిపడ్డ కుంబ్లే, డేల్ స్టెయిన్ -
టీమిండియా కెప్టెన్గా ఎవరూ ఊహించని ప్లేయర్?
ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు నుంచి మెడ గాయం కారణంగా ఆర్ధరాంతరంగా వైదొలిగిన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. అతడు జట్టుతో పాటు గౌహతికి వెళ్లినప్పటికి రెండో టెస్టుకు అందుబాటుపై సందేహలు నెలకొన్నాయి. అతడి గాయాన్ని బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే గిల్ దాదాపుగా గౌహతి టెస్టుకు దూరమైనట్లే. అతడి స్ధానంలో సాయిసుదర్శన్ను తుది జట్టులోకి రానున్నాడు.వన్డేలకు దూరం?ఇక గత కొంతకాలంగా అవిరామంగా క్రికెట్ ఆడుతున్న గిల్కు సౌతాఫ్రికాతో వన్డేలకు కూడా విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. అతడితో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా వన్డేలకు దూరం కానున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడ్డ అయ్యర్ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. దీంతో అతడిని ఆడించి రిస్క్ తీసుకోడదని బీసీసీఐ యోచిస్తోంది. వీరిద్దరితో పాటు జస్ప్రీత్ బుమ్రా, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాలకు కూడా సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గాయం కారణంగా ఆసియా కప్ ఫైనల్కు దూరమైన పాండ్యా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.ఈ క్రమంలో సఫారీలతో వన్డే సిరీస్లో భారత పగ్గాలను తిరిగి రోహిత్ శర్మకు అప్పగించాలని అజిత్ అగార్కర్ అండ్ కో నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రోహిత్ అందుకు అంగీకరించకపోతే వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ను సారథిగా నియమించనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.ఈ వన్డే సిరీస్కు భారత జట్టును సెలక్షన్ కమిటీ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది. వన్డే జట్టులోకి యశస్వి జైశ్వాల్, సాయిసుదర్శన్లు రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా నవంబర్ 30 నుంచి రాంఛీ వేదికగా ఈ మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.చదవండి: రెండో టెస్టులో ఆడాలని ఉన్నా... -
వన్డే క్రికెట్కు సరికొత్త 'కింగ్'
వన్డే క్రికెట్కు సరికొత్త కింగ్ వచ్చాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో న్యూజిలాండ్కు చెందిన 34 ఏళ్ల డారిల్ మిచెల్ (Daryl Mitchell) నంబర్ వన్ బ్యాటర్గా అవతరించాడు. తాజాగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో సూపర్ సెంచరీ (119) చేసిన మిచెల్.. రెండు స్థానాలు ఎగబాకి తొలిసారి టాప్ ప్లేస్కు చేరుకున్నాడు. 1979 తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టాప్ ప్లేస్కు చేరుకున్న తొలి న్యూజిలాండ్ ఆటగాడు మిచెలే.మిచెల్ అగ్రపీఠాన్ని అధిరోహించే క్రమంలో టీమిండియా వెటరన్ స్టార్ రోహిత్ శర్మ (Rohit Sharma) టాప్ ర్యాంక్ను కోల్పోయాడు. ఆసీస్ పర్యటనలో సంచలన ప్రదర్శనల (73, 121 నాటౌట్) తర్వాత తొలిసారి నంబర్ వన్ వన్డే బ్యాటర్గా అవతరించిన రోహిత్ కేవలం మూడు వారాలు మాత్రమే టాప్ ప్లేస్లో కొనసాగాడు. ప్రస్తుతం రోహిత్ ఓ స్థానం కోల్పోయి రెండో స్థానానికి పడిపోయాడు. మిచెల్కు (782) రోహిత్కు (781) మధ్య వ్యత్యాసం కేవలం ఒక్క రేటింగ్ పాయింట్ మాత్రమే.త్వరలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ జరుగనుండగా హిట్మ్యాన్ తిరిగి నంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంది. మరోవైపు మిచెల్ గాయం కారణంగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండు, మూడు వన్డేలకు దూరమయ్యాడు. ఈ లెక్కన చూస్తే సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో రోహిత్ ఓ మోస్తరు ప్రదర్శనలు చేసినా తిరిగి నంబర్ వన్ స్థానానికి చేరుకోవడం లాంఛనమే.ఇదిలా ఉంటే, తాజా ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్లు శుభ్మన్ గిల్ (4), విరాట్ కోహ్లి (5) నిలబెట్టుకున్నారు. టాప్-10లో ఉన్న మరో టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఓ స్థానం మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి ఎగబాకాడు. టాప్-10లో ఉన్న మిగతా ఆటగాళ్లలో బాబర్ ఆజమ్, హ్యారీ టెక్టార్ తలో స్థానం మెరుగుపర్చుకొని 6, 7 స్థానాలకు ఎగబాకగా.. శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక 3 స్థానాలు కోల్పోయి తొమ్మిదో స్థానానికి పడిపోయాడు.మిగతా భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (16), అక్షర్ పటేల్ (89), హార్దిక్ పాండ్యా (92) టాప్-100లో ఉన్నారు. క్వింటన్ డికాక్ 3, మొహమ్మద్ రిజ్వాన్ 5, ఫకర్ జమాన్ 5, డెవాన్ కాన్వే 4, , షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ 8, మైఖేల్ బ్రేస్వెల్ 4 స్థానాలు మెరుగుపర్చుకున్నారు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. రషీద్ ఖాన్ టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా, జోఫ్రా ఆర్చర్, కేశవ్ మహారాజ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. భారత్ నుంచి కుల్దీప్ యాదవ్ (6) ఒక్కడే టాప్-10లో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ 11 స్థానాలు మెరుగుపర్చుకొని తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, సిరాజ్ వరుసగా 14, 15 స్థానాల్లో నిలిచారు. షమీ 19వ స్థానంలో కొనసాగుతున్నాడు. చదవండి: ఆల్టైమ్ టీ20 జట్టు.. రోహిత్, కోహ్లికి దక్కని చోటు!.. ఓపెనర్లుగా వారే.. -
ఆల్టైమ్ టీ20 జట్టు.. రోహిత్, కోహ్లికి దక్కని చోటు! కెప్టెన్ ఎవరంటే..
ఐపీఎల్-2026 వేలానికి ముందు భారత ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer)కు భారీ షాక్ తగిలింది. గతేడాది కోట్లు కుమ్మరించి అతడిని కొనుక్కున్న కోల్కతా నైట్ రైడర్స్ (KKR) ఈసారి మాత్రం ఆక్షన్లోకి విడిచిపెట్టేసింది. అన్నీ కుదిరితే కేకేఆర్ వెంకటేశ్ను మళ్లీ సొంతం చేసుకునే అవకాశం ఉంది. కానీ 2025లో అతడి ప్రదర్శన దృష్ట్యా ఇది సాధ్యం కాకపోవచ్చు అనిపిస్తోంది.ఏకంగా రూ. 23.75 కోట్లుకాగా మధ్యప్రదేశ్కు చెందిన వెంకటేశ్ అయ్యర్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్. రూ. 20 లక్షలకు 2021లో కేకేఆర్ అతడిని కొనుగోలు చేసింది. అదే ఏడాది వెంకటేశ్ ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. పది మ్యాచ్లలో కలిపి 370 పరుగులతో సత్తా చాటిన ఈ ఆల్రౌండర్ను 2022లో ఏకంగా రూ. 8 కోట్లకు కేకేఆర్ రిటైన్ చేసుకుంది.ఇక గతేడాది కేకేఆర్ టైటిల్ గెలవడంలో వెంకీ తన వంతు పాత్ర పోషించాడు. 15 మ్యాచ్లలో కలిపి 370 పరుగులు చేసిన ఈ ఆల్రౌండర్.. ఫైనల్లోనూ సత్తా చాటాడు. ఈ క్రమంలో వెంకటేశ్ వేలంలోకి వెళ్లినా కేకేఆర్ అతడి కోసం ఏకంగా రూ. 23.75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. కానీ ఈసారి అతడు పూర్తిగా విఫలమయ్యాడు.ఆల్టైమ్ టీ20 ఎలెవన్ఐపీఎల్-2025లో పదకొండు మ్యాచ్లు ఆడి కేవలం 142 పరుగులే చేశాడు. దీంతో కేకేఆర్ వెంకటేశ్ అయ్యర్ను వేలంలోకి విడిచిపెట్టింది. ఇదిలా ఉంటే.. డిసెంబరు 16న అబుదాబి వేదికగా వేలంపాట జరుగనున్న నేపథ్యంలో క్రిక్ట్రాకర్కు వెంకీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన ఆల్టైమ్ టీ20 ఎలెవన్ను వెంకటేశ్ అయ్యర్ ప్రకటించాడు.రోహిత్, కోహ్లికి దక్కని చోటుఅయితే, వెంకీ ఎంచుకున్న టీ20 ఆల్టైమ్ జట్టులో భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు చోటు దక్కలేదు. ఐపీఎల్లో.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో పరుగుల వరద పారించిన రో-కోకు వెంకటేశ్ అయ్యర్ తన జట్టులో స్థానం ఇవ్వకపోవడం గమనార్హం.ఓపెనర్లుగా వీరూ, అభిషేక్ఇక తన జట్టులో ఓపెనర్లుగా భారత విధ్వంసకర బ్యాటర్లు వీరేందర్ సెహ్వాగ్, అభిషేక్ శర్మను ఎంచుకున్న వెంకీ.. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ను వన్డౌన్లో ఆడిస్తానని తెలిపాడు. మిస్టర్ ఐపీఎల్గా పేరొందిన టీమిండియా మాజీ బ్యాటర్ సురేశ్ రైనాను ఎంపిక చేసుకున్న అతడు.. తన జట్టులో ఇద్దరు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లుకు చోటిచ్చాడు.ఇంగ్లండ్ స్టార్ బెన్ స్టోక్స్తో పాటు టీమిండియా మేటి ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు వెంకీ ఈ మేరకు తన జట్టులో స్థానం కల్పించాడు. ఇక ఏడో స్థానానికి, వికెట్ కీపర్ బ్యాటర్గా.. కెప్టెన్గా టీమిండియా దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోనిని వెంకటేశ్ అయ్యర్ ఎంచుకున్నాడు.బౌలింగ్ విభాగంలో స్పిన్నర్లు అఫ్గనిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్, వెస్టిండీస్ దిగ్గజం సునిల్ నరైన్లకు చోటు ఇచ్చిన వెంకటేశ్ అయ్యర్.. పేస్ దళంలో భారత మేటి బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగలను ఎంచుకున్నాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్కు వెంకీ స్థానమిచ్చాడు.వెంకటేశ్ అయ్యర్ ఆల్టైమ్ టీ20 ప్లేయింగ్ ఎలెవన్ ఇదేవీరేందర్ సెహ్వాగ్, అభిషేక్ శర్మ, ఏబీ డివిలియర్స్, సురేశ్ రైనా, బెన్ స్టోక్స్, హార్దిక్ పాండ్యా, ఎంఎస్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), రషీద్ ఖాన్, సునిల్ నరైన్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రాఇంపాక్ట్ ప్లేయర్: మాథ్యూ హెడెన్. -
IPL 2026: రిటెన్షన్ జాబితా విడుదల చేసిన ఫ్రాంఛైజీలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 మినీ వేలానికి ముందు తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను ఫ్రాంఛైజీలు విడుదల చేశాయి. ఇందుకు సంబంధించి శనివారం అధికారిక ప్రకటన చేశాయి.గుజరాత్ టైటాన్స్ రిటెన్షన్ జాబితా ఇదే (Gujarat Titans Retention List)శుబ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షారుఖ్ ఖాన్, కుమార్ కుశాగ్రా (వికెట్ కీపర్), అనూజ్ రావత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, నిషాంత్ సింధు, గ్లెన్ ఫిలిప్స్, అర్షద్ ఖాన్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, సాయి కిశోర్, కగిసో రబడ, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్. చెన్నై సూపర్ కింగ్స్ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు (CSK Retention List)రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, ఎంఎస్ ధోనీ, ఉర్విల్ పటేల్, సంజు శాంసన్ (RR నుంచి ట్రేడింగ్), శివమ్ దూబే, జామీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జన్ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, శ్రేయాష్ గోపాల్, ముకేశ్ చౌదరి.సన్రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్ జాబితా (SRH Retention List)ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్, స్మరణ్ రవిచంద్రన్, అనికేత్ వర్మ, జీషన్ అన్సారీ, హర్ష్ దూబే, కమిందు మెండిస్, ఇషాన్ మలింగ, బ్రైడన్ కార్స్.ఢిల్లీ క్యాపిటల్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు (DC Retention List)అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, త్రిపురాణ విజయ్, అజయ్ మండల్, మాధవ్ తివారి, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోశ్ శర్మ, మిచెల్ స్టార్క్, విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్, దుష్మంత చమీర, నితీశ్ రాణా (రాజస్తాన్ నుంచి ట్రేడింగ్), కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, కేఎల్ రాహుల్, టి.నటరాజన్.కోల్కతా నైట్ రైడర్స్ రిటెన్షన్ జాబితా (KKR Retention List)అజింక్య రహానే, రోవ్మన్ పావెల్, అంగ్క్రిష్ రఘువన్షి, సునిల్ నరైన్, అనుకుల్ రాయ్, ఉమ్రాన్ మాలిక్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, మనీశ్ పాండే, వరుణ్ చక్రవర్తి, రమణ్దీప్ సింగ్, రింకూ సింగ్లక్నో సూపర్ జెయింట్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే (LSG Retention List)అబ్దుల్ సమద్, దిగ్వేశ్ రాఠీ, మొహ్సిన్ ఖాన్, ఐడెన్ మార్క్రమ్, హిమ్మత్ సింగ్, నికోలస్ పూరన్. ఆకాశ్ సింగ్, మణిమరన్ సిద్దార్థ్, ప్రిన్స్ యాదవ్. అర్జున్ టెండుల్కర్ (ముంబై నుంచి ట్రేడింగ్), మాథ్యూ బ్రిట్జ్జ్కే, రిషభ్ పంత్, అర్షిన్ కులకర్ణి, మయాంక్ యాదవ్, షాబాజ్ అహ్మద్, ఆవేశ్ ఖాన్, మొహమమ్మద్ షమీ (సన్రైజర్స్ నుంచి ట్రేడింగ్), ఆయుశ్ బదోని, మిచెల్ మార్ష్.ముంబై ఇండియన్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితా (MI Retention List)అల్లా ఘజన్ఫర్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్ (లక్నో నుంచి ట్రేడింగ్), అశ్వనీ కుమార్, నమన్ ధీర్, షెర్ఫానే రూథర్ఫర్డ్ (ట్రేడింగ్), కార్బిన్ బాష్, రఘు శర్మ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ చహర్, రాజ్ అంగద్బవా, తిలక్ వర్మ, హార్దిక్పాండ్యా, రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, విల్ జాక్స్, మయాంక్ మార్కండే (ట్రేడింగ్), రియాన్ రికెల్టన్.పంజాబ్ కింగ్స్ రిటెన్షన్ లిస్టు (PBKS Retention List)అర్ష్దీప్ సింగ్, మిచెల్ ఓవెన్, శ్రేయస్ అయ్యర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముషీర్ ఖాన్. సూర్యాంశ్ షెడ్గే, హర్నూర్ పన్నూ, నేహాల్ వధేరా, విష్ణు వినోద్, హర్ప్రీత్ బ్రార్, ప్రభ్సిమ్రన్ సింగ్, వైశాక్ విజయ్కుమార్, లాకీ ఫెర్గూసన్, ప్రియాంశ్ ఆర్య, జేవియర్ బార్ట్లెట్, మార్కో యాన్సెన్, పైలా అవినాశ్, యశ్ ఠాకూర్, మార్కస్ స్టొయినిస్, శశాంక్ సింగ్, యజువేంద్ర చహల్.రాజస్తాన్ రాయల్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే (RR Retention List)ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్, డొనొవాన్ ఫెరీరా (ట్రేడింగ్), సామ్ కర్రాన్ (ట్రేడింగ్), యుధ్వీర్ చరక్, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, క్వెనా మఫాక, షిమ్రన్ హెట్మెయిర్, లువాన్ డ్రి ప్రిటోరియస్, శుభమ్ దూబే, నండ్రీ బర్గర్, తుషార్ దేశ్పాండే, రవీంద్ర జడేజా (ట్రేడింగ్), వైభవ్ సూర్యవంశీ.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అట్టిపెట్టుకున్న ప్లేయర్ల జాబితా (RCB Retention List)అభినందన్ సింగ్, నువాన్ తుషార, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, దేవ్దత్ పడిక్కల్, రజత్ పాటిదార్, యశ్ దయాళ్, జేకబ్ బెతెల్, రసిఖ్ ధార్, జితేశ్ శర్మ, రొమారియో షెఫర్డ్, జోష్ హాజిల్వుడ్, సూయాంశ్ శర్మ, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్. -
రోహిత్ శర్మకు సంబంధించి బిగ్ న్యూస్
టీమిండియా వెటరన్ ఓపెనర్ రోహిత్ శర్మకు (Rohit Sharma) సంబంధించిన ఓ వార్త సోషల్మీడియాలో వైరలవుతోంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు సన్నాహకంగా రోహిత్ దేశవాలీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు (ముంబై తరఫున) సిద్దంగా ఉన్నాడని ప్రచారం జరుగుతుంది.ఈ టోర్నీలో పాల్గొనే విషయాన్ని రోహిత్ మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్కు తెలియజేశాడని, వారు కూడా సంతృప్తి వ్యక్తం చేశారని వార్తలు వస్తున్నాయి. విజయ్ హజారే ట్రోఫీతో పాటు కుదిరితే దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ రోహిత్ పాల్గొంటాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈ విషయంపై తాజాగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సెలెక్టర్ సంజయ్ పాటిల్ స్పందించాడు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కొట్టి పారేశాడు. విజయ్ హజారే టోర్నీలో కానీ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కానీ ఆడాలనుకున్న విషయాన్ని రోహిత్ తమ దృష్టికి తేలేదని స్పష్టం చేశాడు.ప్రస్తుత పరిస్థితుల్లో రోహిత్ ముంబై తరఫున ఆడితే అది గొప్ప విషయని అన్నాడు. యువ ఆటగాళ్లకు ప్రేరణగా ఉంటుందని తెలిపాడు. ఆటగాళ్లు ఎంతటి వారైనా, జాతీయ జట్టు అవకాశాలు రావాలంటే దేశవాలీ క్రికెట్లో తప్పక ఆడాలని రూల్ పెట్టిన బీసీసీఐ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్, కోచ్ గౌతమ్ గంభీర్కు ధన్యవాదాలు తెలిపాడు.కాగా, ఇటీవలికాలంలో టీమిండియా వెటరన్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భవిష్యత్పై చర్చలు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న ఈ ఇద్దరు.. 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆడాలని అనుకుంటున్నారు. ఇది జరగాలంటే రో-కో ఫిట్నెస్తో పాటు ఫామ్ను కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ రో-కోకు దేశవాలీ టోర్నీల్లో ఆడాలని సూచించినట్లు తెలుస్తుంది.ఆస్ట్రేలియా టూర్లో రోహిత్ మెరుపులుభవిష్యత్తుపై గందరగోళం నెలకొన్న తరుణంలో రోహిత్ ఆస్ట్రేలియా టూర్లో సత్తా చాటాడు. 3 వన్డేల్లో సెంచరీ, హాఫ్ సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సిరీస్లో రోహిత్ మునుపెన్నడూ కనబడని రీతిలో ఫిట్గా కనిపించాడు. ఇదే సిరీస్లో విరాట్ కోహ్లి తొలుత (తొలి 2 వన్డేల్లో డకౌట్) నిరాశపరిచినా.. ఆతర్వాత పర్వాలేదనిపించాడు (మూడో వన్డేలో హాఫ్ సెంచరీ). చదవండి: Viral Video: ఎంతుంటే ఏంటన్నయ్యా.. గెలిచానా లేదా..? -
రోహిత్ శర్మ అనుహ్య నిర్ణయం..! ఇక మిగిలింది కోహ్లినే?
ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టిన టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma).. ఇప్పుడు స్వదేశంలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు సిద్దమవుతున్నాడు. రోహిత్ ప్రస్తుతం ముంబైలోని శరద్ పవార్ ఇండోర్ అకాడమీలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. 2027 ప్రపంచ కప్ ఆడాలనే లక్ష్యంతో ఉన్న హిట్మ్యాన్.. సౌతాఫ్రికాతో సిరీస్లో కూడా తన సత్తా చూపించాలని ఉవ్విళ్లురుతున్నాడు. ఈ క్రమంలో రోహిత్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్లో ప్రారంభం కానున్న దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హాజారే ట్రోఫీలో ఆడాలని రోహిత్ ఫిక్స్ అయినట్లు సమాచారం. అంతేకాకుండా సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్లో కూడా రోహిత్ ఆడనున్నాడంట. ఇప్పటికే తన నిర్ణయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కి రోహిత్ తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా 50 ఓవర్ల ప్రపంచకప్కు ఇంకా రెండేళ్ల సమయం ఉండడంతో రోహిత్, విరాట్ కోహ్లిల ఎంపికపై బీసీసీఐ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ వన్డే జట్టుకు వారిద్దరూ ఎంపిక కావాలంటే తప్పనిసరిగా దేశీయ క్రికెట్ ఆడాలని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ విజయ్ హాజారే ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్నాడు. అయితే విరాట్ కోహ్లి(Virat Kohli) మాత్రం విజయ్ హాజారే ట్రోఫీ అందుబాటులో ఉంటాడో లేదో ఇంకా స్పష్టత రాలేదు. కోహ్లి ప్రస్తుతం లండన్లో ఉన్నాడు. ఈ నెలఖారున సౌతాఫ్రికాతో సిరీస్ కోసం స్వదేశానికి రానున్నాడు.ఇప్పటికే టెస్టులు, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్-కోహ్లిలు ప్రస్తుతం కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఈ లెజెండరీ క్రికెటర్లు ఇద్దరూ వరుసగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లలో భారత్కు ప్రాతినిథ్యం వహించనున్నారు.ఆ తర్వాత వచ్చే ఏడాది జూన్ వరకు భారత్కు వన్డే సిరీస్లు లేవు. దీంతో రో-కో తమ ఫిట్నెస్ను కోల్పోకుండా ఉండడానికి దేశవాళీ క్రికెట్లో ఆడాలని బీసీసీఐ సూచించింది. డిసెంబర్ 24 నుంచి విజయ్ హాజారే ట్రోఫీ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ చివరిసారిగా 2018లో విజయ్ హజారే ట్రోఫీలో ఆడాడు. ఈ టోర్నీలో ముంబై తరపున రెండు మ్యాచ్లు ఆడిన హిట్మ్యాన్ 50 పరుగులు చేశాడు.రోహిత్ శర్మ చివరిసారిగా 2018లో విజయ్ హజారే ట్రోఫీలో ఆడాడు. ఈ టోర్నీలో ముంబై తరపున రెండు మ్యాచ్లు ఆడిన హిట్మ్యాన్ 50 పరుగులు చేశాడు. కోహ్లి అయితే ఆఖరిగా 2010లో ఈ దేశవాళీ వన్డే టోర్నీలో ఢిల్లీ తరపున ఆడాడు.చదవండి: రోహిత్ శర్మ అనుహ్య నిర్ణయం..! ఇక మిగిలింది కోహ్లినే -
అలాంటి పని అస్సలు చేయను: కుండబద్దలు కొట్టిన గంభీర్
టీమిండియా హెడ్కోచ్, భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ (Gautam Gambhir)కు ముక్కుసూటిగా మాట్లాడటం అలవాటు. దీనికి తోడు దూకుడు స్వభావం కారణంగా ఎన్నోసార్లు విమర్శలు మూటగట్టుకున్నాడు గౌతీ. అయినా.. కూడా తగ్గేదేలే అంటూ అలాగే ముందుకు సాగుతున్నాడు. అతడి తాజా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.ఇటీవల గౌతీ మార్గదర్శనంలో ఆస్ట్రేలియా పర్యటన (IND vs AUS)లో వన్డే సిరీస్ను టీమిండియా 1-2తో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్కు ముందు వన్డే కెప్టెన్గా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న యాజమాన్యం.. టెస్టు సారథి శుబ్మన్ గిల్ (Shubman Gill)కే వన్డే పగ్గాలూ అప్పగించింది.చేదు అనుభవం ఇక వన్డే కెప్టెన్గా ఆసీస్ రూపంలో తొలి ప్రయత్నంలోనే కఠిన సవాలు ఎదుర్కొన్న గిల్.. ఇటు బ్యాటర్గా.. అటు కెప్టెన్గా చేదు అనుభవం చవిచూశాడు. తొలి రెండు వన్డేల్లో ఓడి భారత్ ముందుగానే సిరీస్ కోల్పోగా.. ఆఖరిదైన నామమాత్రపు మూడో వన్డేలో మాత్రం గెలిచి క్లీన్స్వీప్ నుంచి తప్పించుకుంది.‘రో-కో’దే కీలక పాత్రఈ విజయంలో రీఎంట్రీ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిదే కీలక పాత్ర. రోహిత్ అజేయ శతకం (121)తో దుమ్ములేపగా.. కోహ్లి 74 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. వీరిద్దరి విజృంభణ కారణంగా ఆసీస్ విధించిన 236 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో ఓటమి పట్ల గౌతం గంభీర్ తాజాగా స్పందించాడు. బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ.. సిరీస్ ఓడిపోవడం ఎంతమాత్రం ఉపేక్షించదగింది కాదని.. తాను అందుకే మూడో వన్డే గెలుపు సెలబ్రేట్ చేసుకోలేదంటూ కుండబద్దలు కొట్టాడు.వాటిని పట్టించుకోను‘‘వ్యక్తిగత ప్రదర్శనలను నేనెప్పుడూ పట్టించుకోను. అయితే, వారి ప్రదర్శన పట్ల సంతోషంగా ఉంటాను. ఏదేమైనా అంతిమంగా మనం సిరీస్ ఓడిపోయాం.అన్నింటికంటే అదే అతి ముఖ్యమైన విషయం. కోచ్గా నేను ఇలాంటి వాటిని ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకోను. ఓ ఆటగాడిగా.. వ్యక్తిగత ప్రదర్శనలను అభినందిస్తా. కానీ కోచ్గా ఇలాంటివి జీర్ణించుకోలేను.కోచ్గా అలాంటి పని ఎప్పటికీ చేయనుదేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నపుడు ఆటగాళ్లైనా, కోచ్ అయినా ఇలాంటి ఘోర ఓటమి తర్వాత వచ్చిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం సరికాదు కూడా!.. ఏదేమైనా మేము ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్ గెలిచాం. ఇదొక భిన్నమైన ఫార్మాట్. అయితే, ఈ సిరీస్లో సానుకూల అంశాలతో పాటు నేర్చుకోవాల్సిన గుణపాఠాలు కూడా ఉన్నాయి’’ అని గంభీర్ తన మనసులోని భావాలను కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పాడు.కాగా ఆసీస్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో.. మొదటి. ఆఖరి మ్యాచ్లు వర్షం వల్ల రద్దు అయ్యాయి. అయితే, రెండో టీ20లో ఓడిన సూర్యకుమార్ సేన వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది.చదవండి: వన్డే ఆల్టైమ్ జట్టు.. టీమిండియా నుంచి ముగ్గురు.. రోహిత్కు దక్కని చోటు -
వన్డే ఆల్టైమ్ జట్టు.. రోహిత్కు దక్కని చోటు
సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ హషీం ఆమ్లా (Hashim Amla) వన్డేల్లో తన ఆల్టైమ్ ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించాడు. ఈ జట్టులో టీమిండియా నుంచి ముగ్గురికి స్థానం కల్పించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. లెజెండరీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను మాత్రం విస్మరించాడు.అంతర్జాతీయ కెరీర్లో సౌతాఫ్రికా తరఫున 124 టెస్టులు, 181 వన్డేలు, 44 టీ20 మ్యాచ్లు ఆడిన హషీం ఆమ్లా.. టెస్టుల్లో 9282, వన్డేల్లో 8113, టీ20లలో 1277 పరుగులు సాధించాడు. ఇక 2023 జనవరిలో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలిగాడు ఆమ్లా. తాజాగా శుభంకర్ మిశ్రా పాడ్కాస్ట్లో పాల్గొన్న ఈ దిగ్గజ బ్యాటర్.. తన ఆల్టైమ్ వన్డే జట్టును ఎంచుకున్నాడు.ఓపెనర్లుగా వారేఈ జట్టుకు ఓపెనర్లుగా టీమిండియా లెజెండ్ సచిన్ టెండుల్కర్, ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడం గిల్క్రిస్ట్లను ఆమ్లా ఎంపిక చేసుకున్నాడు. ఇక మూడో స్థానంలో భారత మరో బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli)కి స్థానమిచ్చాడు. వన్డే ఫార్మాట్లో 51 శతకాలతో ప్రపంచ రికార్డు సాధించినందుకు తాను కోహ్లికి ఓటు వేస్తున్నట్లు ఆమ్లా ఈ సందర్భంగా తెలిపాడు.ఏడో స్థానంలో ధోనిఇక నాలుగు, ఐదు స్థానాలకు వెస్టిండీస్ లెజెండ్ బ్రియన్ లారా, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ను ఆమ్లా ఎంపిక చేశాడు. ఆరో స్థానంలో దీర్ఘకాలం తనకు సహచర క్రికెటర్గా ఉన్న జాక్వెస్ కలిస్కు చోటిచ్చిన ఆమ్లా... ఏడో స్థానానికి భారత దిగ్గజ కెప్టెన్, మూడు ఐసీసీ టైటిళ్లు సాధించిన మహేంద్ర సింగ్ ధోనిని ఎంచుకున్నాడు.బౌలర్లుగా వీరికే ఛాన్స్బౌలింగ్ విభాగంలో ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లకు ఆమ్లా చోటిచ్చాడు. శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్, ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్కు తన జట్టులో స్థానం కల్పించిన ఆమ్లా.. పేసర్ల కోటాలో పాకిస్తాన్ ఫాస్ట్బౌలింగ్ దిగ్గజం వసీం అక్రం, సౌతాఫ్రికా డైనమైట్ బౌలర్ డేల్ స్టెయిన్లకు చోటిచ్చాడు.దిగ్గజ బ్యాటర్ అయితే, టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మకు మాత్రం ఆమ్లా తన జట్టులో స్థానం ఇవ్వకపోవడం గమనార్హం. వన్డేల్లో అత్యధికంగా మూడుసార్లు డబుల్ సెంచరీ చేసిన ఘనత రోహిత్ది. అంతేకాదు యాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) కూడా అతడిదే.అంతేకాదు.. కెప్టెన్గా టీమిండియాను వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్కు చేర్చిన రోహిత్ శర్మ.. 2025లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (వన్డే) కూడా గెలిచాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో పర్యటనలో భాగంగా సిడ్నీలో జరిగిన ఆఖరి వన్డేలో శతక్కొట్టిన హిట్మ్యాన్.. ఐసీసీ వన్డే వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్గా నిలిచాడు. అదే విధంగా.. అతడి ఖాతాలో 33వ వన్డే శతకాన్ని జమ చేసుకున్నాడు.హషీం ఆమ్లా ఎంచుకున్న ఆల్టైమ్ వన్డే ప్లేయింగ్ ఎలెవన్సచిన్ టెండుల్కర్, ఆడం గిల్క్రిస్ట్, విరాట్ కోహ్లి, బ్రియాన్ లారా, ఏబీ డివిలియర్స్, జాక్వెస్ కలిస్, ఎంఎస్ ధోని, ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్, వసీం అక్రం, డేల్ స్టెయిన్.చదవండి: ‘ఆడమని బతిమిలాడినా పట్టించుకోలేదు... సెలక్టర్లు అడిగినా రాలేదు’ -
ఆడమని బతిమిలాడినా పట్టించుకోలేదు!
టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami) పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వన్డే జట్టును ప్రకటించే సమయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) చేసిన వ్యాఖ్యలు.. బదులుగా షమీ కౌంటర్ ఇవ్వడం ఇందుకు కారణం.షమీ ఫిట్నెస్ గురించి అప్డేట్ లేదని అగార్కర్ తెలపగా.. రంజీలు ఆడే తాను వన్డేలు ఆడలేనా? అంటూ షమీ గట్టిగానే బదులిచ్చాడు. తాను పూర్తి ఫిట్గా ఉన్నానని.. అయితే, జట్టు ఎంపిక సమయంలో తనను సెలక్టర్లు ఎవరూ సంప్రదించలేదని బాంబు పేల్చాడు.మరో‘సారీ’ఇందుకు బదులిస్తూ.. షమీ ఫిట్గా లేనందువల్లే అతడిని ఆసీస్ టూర్కు ఎంపిక చేయలేదని అగార్కర్ పునరుద్ఘాటించాడు. ఈ క్రమంలో బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ (Ranji Trophy) తాజా సీజన్లో ఒకే మ్యాచ్లో ఎనిమిది వికెట్లు కూల్చి ఆటతోనే బదులిచ్చాడు షమీ.ఈ పరిణామాల నేపథ్యంలో సౌతాఫ్రికాతో నవంబరులో సొంతగడ్డపై టెస్టు సిరీస్కు షమీని ఎంపిక చేస్తారనే విశ్లేషణలు రాగా.. మరోసారి సెలక్టర్లు అతడికి మొండిచేయి చూపారు. ఫలితంగా భారత జట్టు యాజమాన్యంపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఆడమని బతిమిలాడినా పట్టించుకోలేదు... ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సీనియర్ అధికారి ఒకరు షమీ గురించి సంచలన విషయాలు వెల్లడించారు. ఇంగ్లండ్ పర్యటనకు రావాల్సిందిగా షమీని సెలక్టర్లు కోరినా.. అతడు మాత్రం రాలేనని చెప్పాడంటూ ఆరోపించారు.ఈ మేరకు PTIతో మాట్లాడుతూ.. ‘‘జాతీయ జట్టు సెలక్టర్లు.. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు చెందిన సహాయక సిబ్బంది చాలాసార్లు షమీ ఫిట్నెస్ చెక్ చేయాలని కాల్ చేశారు. ఇంగ్లండ్లో జస్ప్రీత్ బుమ్రా వర్క్లోడ్ మేనేజ్మెంట్ నేపథ్యంలో షమీ సేవలను ఉపయోగించుకోవాలని ఎంతగానో తపించిపోయారు.ఇంగ్లండ్ పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా బౌలింగ్ చేయగల సత్తా ఉన్న షమీ వంటి బౌలర్ను ఎవరు మాత్రం ఎందుకు కాదనుకుంటారు?.. తనను సెలక్టర్లు ఎవరూ సంప్రదించలేదంటూ షమీ గురించి వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం.సెలక్టర్లు అడిగినా రాలేదుఅంతర్జాతీయ క్రికెట్లో వరుసగా మ్యాచ్లు ఆడేందుకు షమీ ఫిట్గా ఉన్నాడా? లేడా? అన్న అంశంపై స్పోర్ట్స్ సైన్స్ టీమ్ ఎప్పటికప్పుడు అతడి మెడికల్ రిపోర్టులు పరిశీలిస్తూనే ఉంది’’ అని సదరు అధికారి పేర్కొన్నారు. సెలక్టర్లు అడిగినా రాలేదని పరోక్షంగా వెల్లడించాడు. కాగా ఇప్పటికే టెస్టు, టీ20 జట్లలో చోటు కోల్పోయిన షమీ.. వన్డేల్లో మాత్రం సత్తా చాటుతున్నాడు.చివరగా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీలో ఈ రైటార్మ్ పేసర్ భాగమయ్యాడు. ఈ మెగా ఈవెంట్లో షమీ తొమ్మిది వికెట్లు కూల్చాడు. ఆ తర్వాత ఇంత వరకు మళ్లీ జాతీయ జట్టుకు ఆడలేదు. కెరీర్కు ఎండ్కార్డ్ఇక వన్డే వరల్డ్కప్-2027ను దృష్టిలో పెట్టుకుని రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన యాజమాన్యం.. విరాట్ కోహ్లి అందుబాటుపై కూడా క్లారిటీ లేదని చెప్పింది. ఇలాంటి తరుణంలో 35 ఏళ్ల షమీకి ఇకపై వన్డేలలోనైనా అవకాశం ఇవ్వడం దాదాపు అసాధ్యమని ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఫలితంగా షమీ అంతర్జాతీయ కెరీర్కు పూర్తిస్థాయిలో ఎండ్కార్డ్ పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: ఆ ఓవరాక్షనే వద్దనేది.. అదేమైనా వరల్డ్ కప్ ట్రోఫీనా? -
బాబర్ ఆజం ప్రపంచ రికార్డు
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం (Babar Azam) ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. సౌతాఫ్రికాతో మూడో టీ20 (PAK vs SA 3rd T20I)లో ఈ వన్డౌన్ బ్యాటర్ అదరగొట్టాడు. ధనాధన్ దంచికొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.మెరుపు హాఫ్ సెంచరీఈ క్రమంలోనే బాబర్ ఆజం అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో మరో ప్రపంచ రికార్డు సాధించాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో వైఫల్యం తర్వాత కెప్టెన్సీ కోల్పోయిన బాబర్కు.. ఆ తర్వాత జట్టులోనూ స్థానం కరువైంది. అయితే, ఇటీవల సొంతగడ్డపై సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ సందర్భంగా అతడు పునరాగమనం చేశాడు.కానీ రీఎంట్రీలో.. అంటే ప్రొటిస్తో తొలి మ్యాచ్లో బాబర్ ఆజం పూర్తిగా విఫలమయ్యాడు. రెండు బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. అయితే, రెండో టీ20లో 11 పరుగులతో అజేయంగా నిలిచి ఫర్వాలేదనిపించిన అతడు.. మూడో టీ20లో మాత్రం మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు.139 పరుగులకు కట్టడిలాహోర్ వేదికగా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పాక్.. సౌతాఫ్రికాను 139 పరుగులకు కట్టడి చేసింది. షాహిన్ ఆఫ్రిది మూడు వికెట్లు తీయగా.. ఫాహిమ్ ఆష్రఫ్ , ఉస్మాన్ తారిక్ రెండేసి వికెట్లు, సల్మాన్ మీర్జా, మొహమ్మద్ నవాజ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ప్రొటిస్ బ్యాటర్లలో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ 34 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. కార్బిన్ బాష్ 30 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. 19 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (19), సయీమ్ ఆయుబ్ (0) దారుణంగా విఫలం కాగా.. వన్డౌన్లో వచ్చిన బాబర్ బాధ్యత తీసుకున్నాడు.బాబర్కు తోడుగా కెప్టెన్ సల్మాన్ ఆఘా (26 బంతుల్లో 33) రాణించగా.. హసన్ నవాజ్ (5), నవాజ్ (0) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఇక బాబర్ మొత్తంగా 47 బంతుల్లో తొమ్మిది ఫోర్ల సాయంతో 68 పరుగులు సాధించాడు. ఆఖర్లో ఉస్మాన్ ఖాన్ 6, ఫాహిమ్ ఆష్రఫ్ 4 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయాన్ని ఖరారు చేశారు. కోహ్లి ప్రపంచ రికార్డు బద్దలుఇక మూడో టీ20లో విజయంతో పాకిస్తాన్ సౌతాఫ్రికాను 2-1తో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్ సందర్భంగా బాబర్ ఆజం అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో తన ఫిఫ్లీ ప్లస్ స్కోర్ల సంఖ్యను నలభైకి పెంచుకున్నాడు.తద్వారా ఇప్పటిదాకా అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్ల వీరుడిగా ఉన్న టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి ప్రపంచ రికార్డును బాబర్ బద్దలు కొట్టాడు. కాగా సౌతాఫ్రికాతో రెండో టీ20 సందర్భంగా 11 పరుగులు చేసిన బాబర్.. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్న భారత దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మను అధిగమించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన క్రికెటర్లు🏏బాబర్ ఆజం (పాకిస్తాన్)- 40 (3 శతకాలు, 37 ఫిఫ్టీలు)🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 39 (ఒక శతకం, 39 ఫిఫ్టీలు)🏏రోహిత్ శర్మ (ఇండియా)- 37 (5 శతకాలు, 32 ఫిఫ్టీలు)🏏మొహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్)- 31 (ఒక శతకం, 30 ఫిఫ్టీలు)🏏డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)- 29 (ఒక శతకం, 28 ఫిఫ్టీలు).చదవండి: IND vs SA: వన్డే తరహా బ్యాటింగ్!.. పాపం పంత్.. భారత్కు షాక్ -
‘వరల్డ్ నంబర్ వన్ కావాలని కోరుకోలేదు’
టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)పై భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ (Mohammad Kaif) ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ నంబర్ వన్ కావాలనే ఆశ హిట్మ్యాన్కు లేదని.. ఎల్లప్పుడూ జట్టు కోసమే తాపత్రయపడేవాడని తెలిపాడు. రోహిత్ అద్భుత కెప్టెన్సీ కారణంగానే భారత జట్టు వన్డే, టీ20లలో అగ్రస్థానానికి చేరుకుందని కొనియాడాడు.కాగా ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. యువ ఆటగాడు శుబ్మన్ గిల్ (Shubman Gill)కు సారథ్య బాధ్యతలు అప్పగించగా.. హిట్మ్యాన్ కేవలం బ్యాటర్గా జట్టులో కొనసాగుతున్నాడు. తొలిసారి అగ్రస్థానంఇక ఆసీస్ టూర్లో మూడు వన్డేల సిరీస్లో 38 ఏళ్ల రోహిత్ 202 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో తొలిసారి అగ్రస్థానం దక్కించుకున్నాడు. రెండు స్థానాలు మెరుగుపరచుకుని.. 781 పాయింట్లతో నంబర్ వన్ వన్డే బ్యాటర్గగా నిలిచాడు. అతిపెద్ద వయస్కుడిగాతద్వారా సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, శుబ్మన్ గిల్ తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టాప్ ర్యాంక్లో నిలిచిన ఐదో భారతీయ క్రికెటర్గా హిట్మ్యాన్ గుర్తింపు దక్కించుకున్నాడు. అంతేకాదు.. ఐసీసీ నంబర్వన్ ర్యాంక్ దక్కించుకున్న అతిపెద్ద వయస్కుడిగానూ రోహిత్ చరిత్ర సృష్టించాడు.వరల్డ్ నంబర్ వన్ కావాలని కోరుకోలేదుఈ నేపథ్యంలో మొహమ్మద్ కైఫ్ రోహిత్ శర్మ జట్టుకు నిస్వార్థ సేవ చేశాడంటూ అతడి అంకితభావాన్ని ప్రశంసించాడు. ‘‘ఐసీసీ వన్డే నంబర్ వన్ ర్యాంకు నడుచుకుంటూ రోహిత్ దగ్గరకు వచ్చింది. తాను ప్రపంచంలోనే నంబర్ వన్ బ్యాటర్ కావాలని రోహిత్ ఎప్పుడూ అనుకోలేదు.అలాంటి కోరిక ఒకటి మనసులో ఉందని ఎన్నడూ చెప్పనూ లేదు. తన ధ్యాస ఎల్లప్పుడూ జట్టు గురించే. టీమిండియా గెలవాలి.. టాప్లో ఉండాలి.. ఇదే తన ఆశయం. అతడు గొప్ప కెప్టెన్.టీమిండియాను నంబర్ వన్గా నిలిపాడుకీలక సమయాల్లో బ్యాట్తో రాణించడం తనకు అలవాటు. ఇక జట్టు విజయానికి కారణం ఎవరైనా వారిని తప్పక ప్రశంసిస్తాడు రోహిత్. టీమిండియా వన్డే ర్యాంకింగ్స్లో నాలుగో స్థానంలో ఉన్నపుడు రోహిత్ కెప్టెన్సీ చేపట్టాడు.జట్టును నంబర్ వన్గా నిలిపిన తర్వాత అతడు తప్పుకోవాల్సి వచ్చింది. ఇక టీ20లలో రెండో ర్యాంకులో ఉన్నపుడు పగ్గాలు చేపట్టిన రోహిత్.. ఈ ఫార్మాట్లోనూ టీమిండియాను అగ్రస్థానంలో నిలిపి.. వరల్డ్కప్ (2024) అందించి కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు’’ అని కైఫ్ ప్రశంసల వర్షం కురిపించాడు.అజేయ సెంచరీతో చెలరేగిన రోహిత్ ఇక ఇప్పటికే టీ20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ... చాంపియన్స్ ట్రోఫీ తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం ఆసీస్తో వన్డే సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. కంగారూలతో చివరి మ్యాచ్లో అజేయ సెంచరీతో చెలరేగిన రోహిత్ భారత్ తరఫున అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు చేసిన ఓపెనర్గానూ రికార్డుల్లోకెక్కాడు.కాగా 2019 వన్డే ప్రపంచకప్లో రికార్డు స్థాయిలో 5 శతకాలతో చెలరేగిన రోహిత్ శర్మ కెరీర్ అత్యుత్తమంగా 882 రేటింగ్ పాయింట్లు సాధించినా... రెండో ర్యాంక్లోనే నిలిచాడు. తాజాగా ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా అతడికి తొలిసారి ‘టాప్’ ప్లేస్ దక్కింది.చదవండి: ఓడిపోతే.. ఎలా ఉంటుందో తెలుసు.. గెలిచినా.. ఓడినా ఏడ్చేస్తా: భారత కెప్టెన్ -
రోహిత్ శర్మ ఆల్టైమ్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన బాబర్
సౌతాఫ్రికాతో రెండో టీ20లో పాకిస్తాన్ (PAK vs SA 2nd T20) ఘన విజయం సాధించింది. లాహోర్ వేదికగా సఫారీ జట్టును ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తద్వారా తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని సిరీస్ను 1-1తో సమం చేసింది.ప్రపంచ రికార్డు బద్దలుఈ మ్యాచ్ సందర్భంగా పాక్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం (Babar Azam) సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్న టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. టీ20 క్రికెట్లో హయ్యస్ట్ రన్ స్కోరర్గా బాబర్ నిలిచాడు.బాబర్ డకౌట్వరుస వైఫల్యాల నేపథ్యంలో పాక్ కెప్టెన్సీ కోల్పోయిన బాబర్ ఆజం.. చాన్నాళ్ల పాటు టీ20 జట్టులోనూ స్థానం దక్కించుకోలేకపోయాడు. ఎట్టకేలకు స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ సందర్భంగా సెలక్టర్లు అతడిని కరుణించారు. అయితే, రావల్పిండి వేదికగా సఫారీలతో తొలి టీ20లో బాబర్ డకౌట్ అయి పూర్తిగా నిరాశపరిచాడు.ఇందుకు తోడు ఈ మ్యాచ్లో పాక్ 55 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో బాబర్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అతడిని జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లు పెరిగాయి. అయితే, తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్లో పాక్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది.110 పరుగులకు ఆలౌట్లాహోర్ వేదికగా టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికాను 19.2 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌట్ చేసింది. ప్రధాన ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగిన ప్రొటిస్ జట్టు టాపార్డర్ పాక్ బౌలర్ల ధాటికి కుదేలైంది.రీజా హెండ్రిక్స్ డకౌట్ కాగా.. క్వింటన్ డికాక్ (7), టోనీ డి జోర్జి (7) పూర్తిగా విఫలమయ్యారు. యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ 25 పరుగులతో ప్రొటిస్ ఇన్నింగ్స్లో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. మిగిలిన వారిలో కెప్టెన్ డొనోవాన్ ఫెరీరా (15), కార్బిన్ బాష్ (11), ఒట్నీల్ బార్ట్మన్ (12) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు.పాక్ బౌలర్లలో ఫాహీమ్ ఆష్రఫ్ నాలుగు వికెట్లు తీయగా.. సల్మాన్ మీర్జా మూడు, నసీం షా రెండు, అబ్రార్ అహ్మద్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. 13.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 112 పరుగులు చేసి.. తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది.సయీమ్ ఆయుబ్ విధ్వంసకర అర్ధ శతకంఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (28) ఓ మోస్తరుగా రాణించగా.. సయీమ్ ఆయుబ్ విధ్వంసకర అర్ధ శతకం (38 బంతుల్లో 71) సాధించాడు. అతడికి తోడుగా బాబర్ ఆజం 18 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో 11 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలోనే బాబర్ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగుల వీరుడిగా రోహిత్ శర్మను అధిగమించాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్ను చాంపియన్గా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగుల వీరులు (టాప్-5)🏏బాబర్ ఆజం (పాకిస్తాన్)- 130* మ్యాచ్లలో 4234 పరుగులు🏏రోహిత్ శర్మ (ఇండియా)- 159 మ్యాచ్లలో 4231 పరుగులు🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 125 మ్యాచ్లలో 4188 పరుగులు🏏జోస్ బట్లర్ (ఇంగ్లండ్)- 144 మ్యాచ్లలో 3869 పరుగులు🏏పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్)- 153 మ్యాచ్లలో 3710 పరుగులు.చదవండి: అతడే మా ఓటమిని శాసించాడు.. అభిషేక్ మాత్రం అద్భుతం: భారత కెప్టెన్ -
కేకేఆర్లోకి రోహిత్ శర్మ ‘కన్ఫామ్’!.. స్పందించిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పించి హార్దిక్ పాండ్యాను తమ కెప్టెన్గా నియమించింది ముంబై ఇండియన్స్. జట్టును ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన దిగ్గజ సారథి రోహిత్ను కాదని హార్దిక్ (Hardik Pandya)కు పగ్గాలు అప్పగించింది.ఈ నేపథ్యంలో అవమానభారంతో కుంగిపోయిన రోహిత్ శర్మ 2025లో ముంబై జట్టును వీడతాడనే ప్రచారం జరిగింది. అయితే, ఊహించని విధంగా హిట్మ్యాన్ అంబానీల సారథ్యంలోని ముంబై ఇండియన్స్లోనే కొనసాగాడు. ఈ ఏడాది అదే జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.కేకేఆర్లోకి రోహిత్ శర్మ!ఐపీఎల్-2025 వేలానికి ముందు ముంబై రోహిత్ను రూ. 16.30 కోట్లతో రిటైర్ చేసుకుంది. ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించినందున తనకు ఇది సరైన ధరేనని అతడు స్వయంగా వ్యాఖ్యానించడం విశేషం. అయితే, తాజాగా రోహిత్ శర్మ జట్టు మార్పు గురించి మరో వార్త తెర మీదకు వచ్చింది.కోల్కతా నైట్ రైడర్స్ (KKR) తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన పోస్టే ఇందుకు కారణం. కాగా ఆస్ట్రేలియా ఇటీవలి వన్డే సిరీస్లో విజృంభించిన టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో తొలిసారి అగ్రస్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రపంచ నంబర్వన్ వన్డే బ్యాటర్గాసుదీర్ఘ కెరీర్లో ఎన్నో రికార్డులు సాధించిన రోహిత్ శర్మ ప్రపంచ నంబర్వన్ వన్డే బ్యాటర్గా నిలవడం మాత్రం ఇదే మొదటిసారి కావడం విశేషం. సచిన్ టెండూల్కర్, ధోని, విరాట్ కోహ్లి, శుబ్మన్ గిల్ తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టాప్ ర్యాంక్లో నిలిచిన ఐదో భారతీయ క్రికెటర్గా రోహిత్ గుర్తింపు పొందాడు. ఆసీస్తో ఇటీవల జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్లో 202 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన 38 ఏళ్ల రోహిత్... తాజా ర్యాంకింగ్స్లో రెండు స్థానాలు మెరుగు పరుచుకొని ‘టాప్’ ప్లేస్ దక్కించుకున్నాడు. రోహిత్ 781 పాయింట్లతో నంబర్వన్గా నిలవగా... భారత వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్ (745 పాయింట్లు) రెండు స్థానాలు కోల్పోయి మూడో ర్యాంక్కు పరిమితమయ్యాడు.కన్ఫామ్ అంటూ కేకేఆర్ పోస్ట్ఈ నేపథ్యంలో కేకేఆర్.. ‘‘పురుషుల వన్డేల్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ కన్ఫామ్’’ అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో రోహిత్ శర్మ కేకేఆర్లో చేరుతున్నాడనే ప్రచారం ఊపందుకుంది. ఇందుకు ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా వింగ్ గట్టిగానే బదులిచ్చింది.స్పందించిన ముంబైరోహిత్ శర్మ ఫొటోను పంచుకుంటూ.. ‘‘సూర్యుడు రేపు ఉదయించడం నిజమే.. కానీ రాత్రి (K)night మాత్రం సూర్యుడు రావడం కుదరదు. ఇది అసాధ్యం కూడా’’ అంటూ హిట్మ్యాన్ తమతోనే ఉంటాడన్నట్లుగా సంకేతాలు ఇచ్చింది. కాగా రోహిత్ శర్మ ప్రాణ స్నేహితుడు, ఫిట్నెస్ కోచ్ అభిషేక్ నాయర్ కేకేఆర్ హెడ్కోచ్గా నియమితుడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రోహిత్ జట్టు మార్పు ఉంటుందేమోననే సందేహాలు నెలకొనగా.. ముంబై ఫ్రాంఛైజీ ఇలా స్పష్టతనిచ్చేసింది.చదవండి: ఆమె ఒక అద్భుతం.. జెమీమా మాటలు ఆశ్చర్యపరిచాయి: భారత కెప్టెన్ -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో (ICC ODI Rankings) టీమిండియా వెటరన్ స్టార్ రోహిత్ శర్మ (Rohit Sharma) నంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. ఆసీస్తో జరిగిన రెండు, మూడు వన్డేల్లో (73, 121 నాటౌట్) చెలరేగడంతో 36 రేటింగ్ పాయింట్లు మెరుగుపర్చుకొని, తొలిసారి వన్డే ర్యాంకింగ్స్లో అగ్రపీఠాన్ని అధిరోహించాడు.ఈ ఘనతను రోహిత్ 38 ఏళ్ల 182 రోజల వయసులో సాధించాడు. తద్వారా అత్యంత లేటు వయసులో నంబర్ వన్ బ్యాటర్గా అవతరించిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గత వారం ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో ఉండిన రోహిత్.. రెండు స్థానాలు మెరుగుపర్చుకొని టాప్ ప్లేస్కు చేరాడు.ఈ క్రమంలో అగ్రపీఠంపై తిష్ట వేసిన సహచరుడు, వన్డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ను కిందికి దించాడు. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, శుభ్మన్ గిల్ తర్వాత నంబర్ వన్ వన్డే బ్యాటర్గా అవతరించిన భారత బ్యాటర్గానూ రికార్డుల్లోకెక్కాడు.ఆసీస్తో తాజాగా జరిగిన 3 మ్యాచ్లో సిరీస్లో (10, 9, 24) విఫలమైన గిల్ రెండు స్థానాలు కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. ఇదే సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో డకౌటైన మరో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఓ స్థానం కోల్పోయి ఆరో స్థానానికి పడిపోయాడు. ఇదే సిరీస్లోని రెండో వన్డేలో హాఫ్ సెంచరీ సాధించిన శ్రేయస్ అయ్యర్ ఓ స్థానం మెరుగుపర్చుకొని 10 నుంచి తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్ టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ 3 స్థానాలు ఎగబాకి నాలుగో ప్లేస్కు చేరుకున్నాడు. ఆసీస్ పేసర్ జోష్ హాజిల్వుడ్ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి చేరాడు. టాప్-10లో ఏకైక టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ ఓ స్థానం కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయాడు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో అక్షర్ పటేల్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి చేరగా.. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ టాప్ ప్లేస్ను ఎంజాయ్ చేస్తున్నాడు. చదవండి: రాణించిన రచిన్, మిచెల్.. న్యూజిలాండ్దే వన్డే సిరీస్ -
అదొక్కటే జీవితం కాదు.. గిల్ అవుట్ కావడం.. శ్రేయస్ గాయం వల్ల..: రోహిత్
ఆస్ట్రేలియాతో సిరీస్కు ముందు తన ఇష్ట్రపకారం తనకు నచ్చిన రీతిలో సన్నద్ధమయ్యాయని టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు. అదే ఇప్పుడు ఫలితాన్ని చూపించిందని హర్షం వ్యక్తం చేశాడు. సిడ్నీ వేదికగా ఆసీస్తో జరిగిన చివరి వన్డేలో సెంచరీ సాధించడంతో పాటు రోహిత్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా కూడా నిలిచాడు. ప్రొఫెషనల్ ఆటగాడిగా క్రికెట్ కెరీర్ కోసం సాధన చేయడం సహజమని... అయితే ఆట బయట కూడా మరో ప్రపంచం ఉందని భావించి ప్రాధాన్యతలు తెలుసుకోవాలని అతడు చెప్పాడు.క్రికెట్ ఒక్కటే జీవితం కాదు‘క్రికెటర్గా కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి ఒక సిరీస్ కోసం 4–5 నెలల సన్నద్ధం అయ్యే అవకాశం ఎప్పుడూ కలగలేదు. కాబట్టి ఈ సారి ఆ సమయాన్ని బాగా వాడుకున్నాను. నాకు నచ్చిన రీతిలో, నా ఇష్ట్రపకారం సాధన చేయాలని నిర్ణయించుకున్నా. అది బాగా పని చేసింది. మిగిలిన కెరీర్ కోసం ఏం చేయాలో అర్థమైంది కూడా.భారత్తో పోలిస్తే ఆస్ట్రేలియా భిన్నమైన పరిస్థితులు ఉన్నా చాలా సార్లు రావడంతో వాటిపై అవగాహన ఉంది. ఒక్కసారి లయ అందుకుంటే చాలని భావించా. నా కోసం ఎక్కువ సమయం కేటాయించా. జీవితంలో క్రికెట్ కాకుండా ఇతర ప్రాధాన్యతలు కూడా ఉన్నాయని తెలుసుకున్నా’ అని రోహిత్ వెల్లడించాడు.కోహ్లితో అద్భుతమైన భాగస్వామ్యంఆస్ట్రేలియా గడ్డపై ఆడతాన్ని తాను చాలా ఇష్టపడతానని, ఇక్కడి అభిమానులు కూడా ఎంతో మద్దతునిస్తారని రోహిత్ పేర్కొన్నాడు వివరించాడు. ‘సిడ్నీ వన్డేలో నేను భారీ స్కోరు చేయడంతో పాటు జట్టును గెలిపించడం సంతృప్తినిచ్చింది. చాలా కాలం తర్వాత కోహ్లితో అద్భుతమైన భాగస్వామ్యం కుదిరింది. మేం సెంచరీ పార్ట్నర్షిప్ నెలకొల్పి చాలా రోజులైంది. జట్టుకు ఇది ఉపయోగపడటం సంతోషకరం.గిల్ అవుట్ కావడం.. శ్రేయస్ గాయం వల్ల..గిల్ తొందరగా అవుట్ కావడంతో శ్రేయస్ గాయం కారణంగా మాపై బాధ్యత పెరిగింది. నేను, విరాట్ ఎన్నో ఏళ్లుగా కలిసి ఆడుతున్నాం. ఇద్దరికీ అనుభవం ఉంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలం. అందుకే క్రీజ్లో ఎంతో మాట్లాడుకుంటూ ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాం. సిరీస్ గెలవకపోయినా అభిమానులు ఎంతో మద్దతునిచ్చారు. జట్టుతో సంబంధం లేకుండా మంచి ఆటను ప్రోత్సహించిన వారికి కృతజ్ఞతలు’ అని రోహిత్ వెల్లడించాడు.మూడో వన్డేలో గెలిచికాగా ఆసీస్తో మూడు వన్డేల సిరీస్ను భారత్ కోల్పోయింది. ఆతిథ్య జట్టు తొలి రెండు వన్డేల్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోగా.. టీమిండియా నామమాత్రపు మూడో వన్డేలో గెలిచి పరువు నిలుపుకొంది. ఈ మ్యాచ్లో రోహిత్ 121, కోహ్లి 74 పరుగులతో అజేయంగా నిలిచి.. భారత్ను తొమ్మిది వికెట్ల తేడాతో గెలిపించారు. ఇద్దరూ కలిసి రెండో వికెట్కు ఏకంగా 168 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.ఇదిలా ఉంటే.. ఆసీస్తో సిరీస్కు ముందే రోహిత్ను వన్డే కెప్టెన్గా తప్పించి.. అతడి స్థానంలో శుబ్మన్ గిల్ను సారథిగా నియమించింది బీసీసీఐ. ఇక ఇప్పటికే అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రో- కో వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.చదవండి: అతడు అద్భుతం.. అహంకారం వద్దు.. రోహిత్- గిల్ సూపర్: గంభీర్ -
అతడు అద్భుతం.. అహంకారం వద్దు.. రోహిత్- గిల్ సూపర్: గంభీర్
టీమిండియా దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ (Rohit Sharma)- విరాట్ కోహ్లి (Virat Kohli) ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా ముగించారు. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత భారత జట్టు తరఫున బరిలోకి దిగిన ఈ కుడిచేతి వాటం ఆటగాళ్లు.. ఆసీస్తో మూడో వన్డేలో దుమ్ములేపారు.168 పరుగులు భాగస్వామ్యంఓపెనర్ రోహిత్ శర్మ అజేయ శతకం (125 బంతుల్లో 121*)తో చెలరేగగా.. వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి 74 పరుగులతో చెలరేగి.. ఫోర్ బాది జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. ఈ వెటరన్ బ్యాటర్లు తమ వింటేజ్ ఇన్నింగ్స్ను గుర్తుచేస్తూ.. ఏకంగా 168 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.తప్పిన గండంమరోవైపు.. అంతకు ముందు కెప్టెన్, ఓపెనర్ గిల్ (24)తో కలిసి రోహిత్ 69 పరుగుల పార్ట్నర్షిప్ నిర్మించాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా విధించిన 237 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం ఒక వికెట్ కోల్పోయి 38.3 ఓవర్లలోనే పూర్తి చేసింది. తద్వారా సిడ్నీ వన్డేలో గెలుపొంది ఆసీస్ చేతిలో క్లీన్స్వీప్ నుంచి తప్పించుకుంది.మూడు వన్డేల సిరీస్లో ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించి పరువు కాపాడుకుంది. మరోవైపు.. ఆఖరిదైన ఈ మూడో వన్డేలో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా యువ పేసర్ హర్షిత్ రాణా తన కెరీర్లో తొలిసారి నాలుగు వికెట్ల హాల్ నమోదు చేసి.. ఆసీస్ను 236 పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు.రోహిత్- గిల్ సూపర్ఈ నేపథ్యంలో డ్రెసింగ్ రూమ్లో ఆటగాళ్లతో మాట్లాడిన హెడ్కోచ్ గౌతం గంభీర్ జట్టుపై ప్రశంసలు కురిపించాడు. ‘‘శుబ్మన్, రోహిత్ మధ్య భాగస్వామ్యం అద్భుతం. ఛేదనలో వికెట్ కోల్పోకుండా 60కి పైగా పరుగులు చేయడం కలిసి వచ్చింది.ఆ తర్వాత రోహిత్-విరాట్ పార్ట్నర్షిప్ అత్యద్భుతం. ముఖ్యంగా రోహిత్ సెంచరీని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలి. అతడి ఆట తీరు అమోఘం. మ్యాచ్ను ముగించిన తీరు ప్రశంసనీయం. రోహిత్తో పాటు విరాట్ పని పూర్తి చేశాడు’’ అని గంభీర్ కొనియాడాడు.అహంకారం వద్దుఅంతకుముందు.. ‘‘బౌలర్లు కూడా అద్భుతంగా ఆడారు. హర్షిత్ అవుట్స్టాండింగ్ స్పెల్ వేశాడు. అయితే ఇది ఆరంభం మాత్రమే. ఒద్దికగా.. ఒదిగి ఉండాలి. మరింత కష్టపడాలి. అహంకారం వద్దు’’ అని గంభీర్ తన ప్రియ శిష్యుడు హర్షిత్ రాణాకు సూచించాడు. ఇక ఆఖర్లో ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును రోహిత్ శర్మ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా ఆస్ట్రేలియా పర్యటనకు ముందు వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మ తప్పించిన టీమిండియా యాజమాన్యం.. అతడి స్థానంలో శుబ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించింది. ఇక ఆసీస్ టూర్లో కెప్టెన్గా తొలి ప్రయత్నంలోనే గిల్ విఫలమయ్యాడు.మూడు వన్డేల్లో గిల్ చేసిన స్కోర్లు వరుసగా.. 10, 9, 24. ఇక కెప్టెన్గానూ సిరీస్ను ఆసీస్కు 1-2తో కోల్పోయాడు. మరోవైపు.. రోహిత్ శర్మ 8, 73, 121* పరుగులతో రాణించి మూడో వన్డేలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవడంతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా దక్కించుకున్నాడు. చదవండి: Shreyas Iyer: పరిస్థితి సీరియస్?.. సిడ్నీకి పయనమైన తల్లిదండ్రులు! View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
రోహిత్, కోహ్లి మళ్లీ రంగంలోకి దిగేది అప్పుడే..!
టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli) ఏడు నెలల విరామం తర్వాత తాజాగా ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్తో వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. టీ20లకు, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన వీరిద్దరు ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడటమే వీరి ఏకైక లక్ష్యం. ఇందులో భాగంగానే వారు ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు.రోకో తదుపరి టార్గెట్ స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే సిరీస్. ఈ సిరీస్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. నవంబర్ 30, డిసెంబర్ 3, 6 తేదీల్లో రాంచీ, రాయ్పూర్, వైజాగ్ వేదికలుగా ఈ వన్డేలు జరుగుతాయి. ఈ సిరీస్లో రోహిత్, కోహ్లి చెలరేగే అవకాశం ఉంది. స్వదేశంలో జరిగే వన్డేల్లో ఈ ఇద్దరికి ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ప్రత్యర్ధి ఎవరైనా స్వదేశంలో రోకోను ఆపడం అసాధ్యం.రో'హిట్టు'తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో రోహిత్ శర్మ సూపర్ హిట్టయ్యాడు. 3 మ్యాచ్ల్లో సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 202 పరుగులు చేశాడు. ఈ సిరీస్ను భారత్ 1-2 తేడాతో కోల్పోయినప్పటికీ రోహిత్ ప్రదర్శన మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా చివరి వన్డేలో రోహిత్ చేసిన సెంచరీ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది.భారీగా బరువు తగ్గి ఫిట్నెస్ మెరుగుపర్చుకున్న రోహిత్ ఆ మ్యాచ్లో యధేచ్చగా షాట్లు ఆడాడు. మునుపటి రోహిత్ను గుర్తు చేశాడు. రెండో వన్డేలోనూ రోహిత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కష్టమైన పిచ్పై శైలికి విరుద్దంగా, చాలా ఓపిగ్గా బ్యాటింగ్ చేసి సెంచరీకి చేరువలో ఔటయ్యాడు.ఈ రెండు ఇన్నింగ్స్ల తర్వాత రోహిత్ భవితవ్యంపై అనుమానాలు పటాపంచలయ్యాయి. ప్రస్తుతం 38 ఏళ్ల వయసున్న రోహిత్ 2027 ప్రపంచకప్ సమయానికి 40వ పడిలో ఉంటాడు.ఆ వయసులో అతనెలా ఆడగలడని చాలా మంది అనుకున్నారు. అయితే ఈ అనుమానాలకు రోహిత్ తన ప్రదర్శనలతో చెక్ పెట్టేశాడు. ఫిట్నెస్ ఇలాగే కాపాడుకుంటే 40 కాదు మరో ఐదేళ్లైనా ఆడగలనన్న సంకేతాలు పంపాడు. మొత్తంగా ఆస్ట్రేలియా సిరీస్లో హిట్టైన రోహిత్ 2027 ప్రపంచకప్కు సిద్దమంటూ సంకేతాలు పంపాడు.పరువు కాపాడుకున్న కోహ్లిఆసీస్ సిరీస్లో రోహిత్ హిట్టైతే.. అతని సహచరుడు కోహ్లి మాత్రం నాట్ బ్యాడ్ అనిపించాడు. తొలి రెండు వన్డేల్లో డకౌటైనా, మూడో వన్డేలో రోహిత్తో పాటు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ (74 నాటౌట్) ఆడి పరువు కాపాడుకున్నాడు. ఈ ఇన్నింగ్స్తో కోహ్లి భవితవ్యంపై కూడా అనుమానాలు తొలగిపోయాయి. కోహ్లి సైతం 2027 ప్రపంచకప్కు రెడీ అంటూ సంకేతాలు పంపాడు. ఫిట్నెస్ పరంగా ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉండే కోహ్లి.. ఫామ్ను కాపాడుకుంటే ఈజీగా మరో నాలుగైదేళ్లు ఆడగలడు. మొత్తానికి ఈ సిరీస్తో రోహిత్, కోహ్లి భవితవ్యంపై అనుమానాలకు తెరపడింది. ప్రపంచకప్ వరకు వారు ఈజీగా కొనసాగగలరు.ఈ మధ్యలో వారు ఆడే అవకాశమున్న మ్యాచ్లపై ఓ లుక్కేద్దాం..- స్వదేశంలో సౌతాఫ్రికాతో సిరీస్ అనంతరం వచ్చే ఏడాది స్వదేశంలోనే న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల సిరీస్ జరుగనుంది. - దీని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ భారత్లో పర్యటించి వన్డేలు ఆడనుంది. - అనంతరం ఇంగ్లండ్, బంగ్లాదేశ్ పర్యటనల్లో భారత్ వన్డే సిరీస్లు ఆడుతుంది. - ఆతర్వాత వెస్టిండీస్ భారత్లో పర్యటించి వన్డేలు ఆడనుంది. - అతర్వాత భారత్ న్యూజిలాండ్లో పర్యటించి వన్డేలు ఆడుతుంది. - 2027 వన్డే ప్రపంచకప్కు కొద్దిముందు భారత్ స్వదేశంలో శ్రీలంకతో వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్ల్లో రోకో అన్ని ఆడతారని చెప్పలేము కాని, మెజార్జీ శాతం సిరీస్ల్లో పాల్గొనే అవకాశం ఉంది. చదవండి: ఆస్ట్రేలియాతో సెమీఫైనల్కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ -
కేకేఆర్ హెడ్ కోచ్గా రోహిత్ శర్మ ఫిట్నెస్ గురు
ఐపీఎల్ 2025లో నిరాశజనక ప్రదర్శన తర్వాత కోల్కతా నైట్రైడర్స్ (KKR) తమ ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్ను తప్పించింది. తాజాగా పండిట్ స్థానాన్ని మాజీ ముంబై ఆల్రౌండర్ అభిషేక్ నాయర్తో (Abhishek Nayar) భర్తీ చేసినట్లు తెలుస్తుంది. ఫ్రాంచైజీ నిర్ణయాన్ని గత వారం నాయర్కు తెలియజేసినట్టు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.నాయర్ గతంలో కేకేఆర్ అకాడమీకి కీలకంగా పనిచేశాడు. ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో, వారి ప్రతిభను వెలికితీయడంలో అతని పాత్ర ముఖ్యమైంది. గత సంవత్సరం సహాయక సిబ్బందిగా కేకేఆర్లో చేరిన నాయర్, ఇప్పుడు ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు.42 ఏళ్ల నాయర్, ఇటీవల మహిళల ఐపీఎల్లో (WPL) యూపీ వారియర్జ్కు (UP Warriorz) హెడ్ కోచ్గా పనిచేశాడు. అతని కోచింగ్ శైలి వ్యక్తిగతంగా ఆటగాళ్లను ఫిట్నెస్, ఫామ్ పరంగా తిరిగి పుంజుకునేలా చేస్తుంది. నాయర్ ఇటీవలే టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మలో (Rohit Sharma) ఊహించిన ఫిట్నెస్ పరివర్తను తీసుకొచ్చాడు. నాయర్ సహకారంతో రోహిత్ ఏకంగా 10 కిలోల బరువు తగ్గి స్లిమ్గా తయారయ్యాడు. నాయర్ రోహిత్కు మంచి మిత్రుడు కూడా. నాయర్ రోహిత్కు మాత్రమే కాకుండా కేఎల్ రాహుల్ తదితర ఆటగాళ్లకు కూడా ఫిట్నెస్ గురుగా ఉన్నాడు.వ్యక్తిగత కోచ్గా, ఫిట్నెస్ గురుగా మంచి పేరున్న నాయర్ టీమిండియా అసిస్టెంట్ కోచ్గా మాత్రం రాణించలేకపోయాడు. ఇటీవలే బీసీసీఐ అతన్ని ఆ పదవి నుంచి తప్పించింది. టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్ నియమితుడయ్యాక నాయర్ను ప్రత్యేకంగా తన బృందంలో చేర్చుకున్నాడు. అయితే జట్టు వైఫల్యాల కారణంగా నాయర్ ఎంతో కాలం భారత సహాయ కోచ్గా ఉండలేకపోయాడు.ఇదిలా ఉంటే, గత సీజన్లో కేకేఆర్ పేలవ ప్రదర్శన చేసింది. 14 మ్యాచ్ల్లో కేవలం 5 విజయాలు మాత్రమే సాధించి, ప్లేఆఫ్స్కు చేరలేకపోయింది. తదుపరి సీజన్లో కేకేఆర్ నాయర్పై భారీ ఆశలు పెట్టుకుంది. కేకేఆర్ హెడ్ కోచ్ పదవిపై అధికారిక ప్రకటన వచ్చాక నాయర్ యూపీ వారియర్జ్ కోచ్గా కూడా కొనసాగుతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.చదవండి: చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్లు.. స్వల్ప స్కోర్కే కుప్పకూలిన న్యూజిలాండ్ -
రోహిత్ శర్మ రిటైర్మెంట్ అప్పుడే.. కన్ఫర్మ్ చేసిన కోచ్
వైట్బాల్ క్రికెట్లో టీమిండియా ముఖ చిత్రంగా నిలిచిన స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ.. మరోసారి తన మార్క్ను చూపించాడు. ఏడు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టాడు.తొలి మ్యాచ్లో విఫలమైనప్పటికి ఆ తర్వాత రెండు వన్డేల్లో సత్తాచాటాడు. అడిలైడ్లో 73 పరుగులు చేసిన హిట్మ్యాన్.. ఇప్పుడు సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో సెంచరీతో చెలరేగాడు. 38 ఏళ్ల వయసులోనూ అతని ఆట తీరు, షాట్ సెలెక్షన్ ఫ్యాన్స్ను మంత్రముగ్ధులను చేశాయి.చివరిసారిగా ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన రోహిత్.. తన అద్బుత సెంచరీతో అభిమానులకు మరుపురాని ఇన్నింగ్స్ను అందించాడు. 237 పరగుల లక్ష్య చేధనలో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్లో రోహిత్ 125 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 3 సిక్స్లతో 121 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.ఆసీస్ టూర్ తర్వాత వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడన్న ఉహగానాలకు తన సెంచరీతోనే హిట్మ్యాన్ తెరదించాడు. వన్డే వరల్డ్కప్-2027లో ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాము అని మ్యాచ్ అనంతరం రోహిత్ తెలిపాడు. ఇక రోహిత్ భవిష్యత్తు ప్రణాళికలపై అతడి చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిట్మ్యాన్ 2027 వన్డే ప్రపంచకప్లో ఆడుతాడని లాడ్ కూడా స్పష్టం చేశారు."రోహిత్లో ఇంకా పరుగుల దాహం తీరలేదు. అతడు ఈ మ్యాచ్లో అతడు బ్యాటింగ్ చేసిన విధానం, భారత జట్టును గెలిపించిన తీరు నిజంగా అద్భుతం. రోహిత్ తను ఎప్పుడు రిటైర్ అవ్వాలో ఇప్పటికే నిర్ణయించుకున్నాడు. 2027 వన్డే ప్రపంచ కప్ ఆడి ఆ తర్వాత రిటైర్ అవుతాడని" లాడ్ పేర్కొన్నాడు.కాగా రోహిత్ శర్మ తన కెరీర్లో టీ20 వరల్డ్కప్, ఆసియాకప్, ఛాంపియన్స్ ట్రోఫీలు గెలుచుకున్నప్పటికి.. వన్డే వరల్డ్కప్ అందని ద్రాక్షగా మిగిలిపోయింది. 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో రోహిత్ భాగంగా లేడు. ఆ తర్వాత 2015, 2019, 2023 ప్రపంచకప్లలోనూ అతడికి నిరాశే ఎదురైంది. దీంతో మరో రెండేళ్లలో జరిగే వరల్డ్కప్ను గెలుకుని తన కెరీర్కు ముగింపు పలకాలని రోహిత్ నిర్ణయించుకున్నాడు.చదవండి: ఆస్ట్రేలియా క్రికెటర్లకు సారీ చెప్పిన బీసీసీఐ.. -
రోహిత్ – కోహ్లి సూపర్హిట్
‘సినిమా ఇంకా మిగిలే ఉంది’... ఆ్రస్టేలియాతో చివరి వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆట చూస్తే అభిమానులందరికీ ఇదే అనిపిస్తుంది. సిరీస్ ఆరంభానికి ముందు వారి బ్యాటింగ్పై సందేహాలు, జట్టులో చోటుపై చర్చ... తొలి మ్యాచ్లో వైఫల్యం తర్వాత రోహిత్పై ఒత్తిడి పెరగగా, వరుసగా రెండు డకౌట్లు కోహ్లి సత్తాపై సందేహాలు రేకెత్తించాయి. కానీ వన్డే క్రికెట్ దిగ్గజాలుగా తమ అసలు స్థాయి ఏమిటో వారు ఇప్పుడు చూపించారు.మరికొంత కాలం తమ స్థానం గురించి ఎవరూ మాట్లాడకుండా చేశారు... అలవోకగా పరుగులు సాధించి తమ బ్యాటింగ్లో పదును తగ్గలేదని నిరూపించారు. ఆస్ట్రేలియా గడ్డపై చివరి సారిగా ఆడిన రోహిత్, కోహ్లి సిడ్నీ మైదానంలోని 40,587 మంది ప్రేక్షకులను చక్కటి షాట్లతో అలరించారు. రోహిత్ శతకంతో చెలరేగగా, కోహ్లి దీటైన ఇన్నింగ్స్ ఆడాడు. వన్డేల్లో రికార్డు స్థాయిలో 5483 పరుగులు జోడించిన ఈ జంట తమ జుగల్బందీతో మరో మ్యాచ్ను గెలిపించి ఫ్యాన్స్కు జోష్ను అందించింది. సిడ్నీ: ఆ్రస్టేలియాతో వన్డే సిరీస్ను భారత్ విజయంతో ముగించింది. ఇప్పటికే సిరీస్ కోల్పోయినా... చివరి మ్యాచ్ టీమిండియాకు ఆనందాన్ని పంచింది. శనివారం జరిగిన మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులకే ఆలౌటైంది. మాట్ రెన్షా (58 బంతుల్లో 56; 2 ఫోర్లు) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 38.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 237 పరుగులు సాధించింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (124 బంతుల్లో 121 నాటౌట్; 13 ఫోర్లు, 3 సిక్స్లు) కెరీర్లో 33వ సెంచరీ సాధించగా, విరాట్ కోహ్లి (81 బంతుల్లో 74; 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు రెండో వికెట్కు 170 బంతుల్లో అభేద్యంగా 168 పరుగులు జోడించడంతో మరో 11.3 ఓవర్లు ఉండగానే భారత్ విజయం ఖాయమైంది. తొలి రెండు వన్డేలు నెగ్గిన ఆసీస్ 2–1తో సిరీస్ సొంతం చేసుకోగా, మొత్తంగా 202 పరుగులు చేసిన రోహిత్కే ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య బుధవారం నుంచి ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ మొదలవుతుంది. హర్షిత్ రాణాకు 4 వికెట్లు... ఆ్రస్టేలియా ఇన్నింగ్స్లో టాప్–6 బ్యాటర్లు మెరుగ్గా ఆరంభించినా, ఒక్కరూ కూడా దానిని భారీ స్కోరుగా మలచలేకపోయారు. ఓపెనర్లు మిచెల్ మార్ష్(50 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్), ట్రవిస్ హెడ్ (25 బంతుల్లో 29; 6 ఫోర్లు) తొలి వికెట్కు 56 బంతుల్లోనే 61 పరుగులు జోడించారు. ఆ తర్వాత మాథ్యూ షార్ట్ (41 బంతుల్లో 30; 2 ఫోర్లు), రెన్షా కూడా ఫర్వాలేదనిపించడంతో ఒక దశలో స్కోరు 183/3 వద్ద నిలిచింది. అయితే శ్రేయస్ అద్భుత క్యాచ్తో అలెక్స్ క్యారీ (24)ని అవుట్ చేయడంతో ఆసీస్ పతనం మొదలైంది. గత మ్యాచ్ గెలిపించిన కూపర్ కలోనీ (23)తో పాటు ఇతర బ్యాటర్లెవరూ క్రీజ్లో నిలబడలేకపోయారు. ఫలితంగా 53 పరుగుల వ్యవధిలో ఆసీస్ 7 వికెట్లు కోల్పోయింది. మరో 3.2 ఓవర్లు మిగిలి ఉండగానే జట్టు ఆలౌట్ అయింది. క్యారీ క్యాచ్ పట్టే క్రమంలో శ్రేయస్ పక్కటెముకలకు తీవ్ర గాయమైంది. దీంతో అతడు కనీసం మూడు వారాల పాటు ఆటకు దూరం అయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. నితీశ్ రెడ్డి, అర్ష్ దీప్ స్థానాల్లో కుల్దీప్, ప్రసిధ్ కృష్ణలకు చోటు కల్పించింది. భారీ భాగస్వామ్యం... ఛేదనలో భారత్కు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. రోహిత్, శుబ్మన్ గిల్ (24) చకచకా 62 బంతుల్లోనే 69 పరుగులు జత చేశారు. గిల్ వెనుదిరిగిన తర్వాత ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య కోహ్లి బరిలోకి దిగాడు. తన తొలి బంతికే సింగిల్ తీయడంతో స్టేడియం హోరెత్తిపోగా, కోహ్లి కూడా నవ్వుతూ వారికి అభివాదం చేయడం విశేషం! రోహిత్, కోహ్లి జోడి ఎదురు లేకుండా దూసుకుపోయింది. రోహిత్ దూకుడు ప్రదర్శించగా, కోహ్లి తనదైన శైలిలో చూడచక్కటి షాట్లు ఆడాడు. జంపా బౌలింగ్లో లాంగాఫ్ మీదుగా రోహిత్ కొట్టిన ‘ఇన్సైడ్ అవుట్’ సిక్స్ హైలైట్గా నిలిచింది. ముందుగా 63 బంతుల్లో రోహిత్, ఆ తర్వాత 56 బంతుల్లో కోహ్లి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆసీస్ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా వికెట్ తీయడంలో విఫలమయ్యారు. జంపా బౌలింగ్లో సింగిల్తో సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ ఎలాంటి సంబరాలు చేసుకోకపోగా, భారత్ స్కోరు 200 పరుగులకు చేరింది. ఆ తర్వాత మరో 33 బంతుల్లో జట్టు మ్యాచ్ను ముగించింది. 14,255 వన్డేల్లో కోహ్లి పరుగుల సంఖ్య. సంగక్కర (14,234)ను అధిగమించిన అతను సచిన్ (18,426) తర్వాత రెండో స్థానానికి చేరుకున్నాడు.9 ఆస్ట్రేలియాపై రోహిత్ సెంచరీల సంఖ్య. సచిన్ (9)తో అతను సమంగా నిలిచాడు.50 అన్ని ఫార్మాట్లు కలిపి రోహిత్ సెంచరీల సంఖ్య. మరో 9 మంది బ్యాటర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు.స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: మార్ష్(బి) అక్షర్ 41; హెడ్ (సి) ప్రసిధ్ (బి) సిరాజ్ 29; షార్ట్ (సి) కోహ్లి (బి) సుందర్ 30; రెన్షా (ఎల్బీ) (బి) సుందర్ 56; క్యారీ (సి) అయ్యర్ (బి) రాణా 24; కనోలీ (సి) కోహ్లి (బి) రాణా 23; ఒవెన్ (సి) రోహిత్ (బి) రాణా 1; స్టార్క్ (బి) కుల్దీప్ 2; ఎలిస్ (సి) రోహిత్ (బి) ప్రసిధ్ 16; జంపా (నాటౌట్) 2; హాజల్వుడ్ (బి) రాణా 0; ఎక్స్ట్రాలు 12; మొత్తం (46.4 ఓవర్లలో ఆలౌట్) 236. వికెట్ల పతనం: 1–61, 2–88, 3–124, 4–183, 5–195, 6–198, 7–201, 8–223, 9–236, 10–236. బౌలింగ్: సిరాజ్ 5–1–24–1, రాణా 8.4–0–39–4, ప్రసిధ్ 7–0–52–1, కుల్దీప్ 10–0–50–1, అక్షర్ 6–0–18–1, సుందర్ 10–0–44–2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (నాటౌట్) 121, గిల్ (సి) క్యారీ (బి) హాజల్వుడ్ 24; కోహ్లి (నాటౌట్) 74; ఎక్స్ట్రాలు 18; మొత్తం (38.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 237. వికెట్ల పతనం: 1–69. బౌలింగ్: స్టార్క్ 5–0–31–0, హాజల్వుడ్ 6–1–23–1, ఎలిస్ 7.3–0–60–0, కనోలీ 5–0–36–0, జంపా 10–0–50–0, ఒవెన్ 1–0–2–0, షార్ట్ 4–0–29–0. -
రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG) వేదికగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ శతక్కొట్టాడు. 237 పరుగుల లక్ష్య చేధనలో ఆసీస్ బౌలర్లను హిట్మ్యాన్ ఉతికారేశాడు. మరో సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లితో కలిసి భారత జట్టును వైట్ వాష్ నుంచి గట్టెక్కించాడు.రోహిత్ ఓవరాల్గా 125 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 3 సిక్స్లతో 121 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు కోహ్లి (74నాటౌట్; 81 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఫలితంగా టీమిండియా లక్ష్యాన్ని 38.3 ఓవర్లలోనే ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది. ఇక ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్, సిరీస్గా నిలిచిన రోహిత్ పలు వరల్డ్ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.రోహిత్ శర్మ సాధించిన రికార్డులు ఇవే..👉సేనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో వన్డేల్లో అత్యధిక సిక్స్లు బాదిన విదేశీ ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. రోహిత్ ఇప్పటివరకు సేనా దేశాల్లో 95 సిక్స్లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్(92) పేరిట ఉండేది. ఈ మ్యాచ్లో 3 సిక్స్లు బాదిన రోహిత్.. గేల్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.👉21వ శతాబ్దంలో ఆస్ట్రేలియాపై వన్డే సెంచరీ చేసిన అతి పెద్ద వయష్కుడిగా రోహిత్ నిలిచాడు.38 ఏళ్ల 178 రోజులు వయస్సులో ఈ ఫీట్ సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కర(37 సంవత్సరాలు, 132 రోజులు) పేరిట ఉండేది.👉వన్డే చరిత్రలో లేటు వయసులో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న భారత ఆటగాడిగా రోహిత్ నిలిచాడు👉ఆస్ట్రేలియాలో అత్యధిక వన్డే సెంచరీలు (6) చేసిన విదేశీ బ్యాటర్గా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి (5), కుమార సంగక్కర (5)లను హిట్మ్యాన్ అధిగమించాడు. 👉ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న తొలి భారత బ్యాటర్గా రోహిత్ రికార్డులకెక్కాడు.చదవండి: థాంక్యూ ఆస్ట్రేలియా.. ఇదే మా చివరి మ్యాచ్!? రోహిత్, కోహ్లి ఎమోషనల్ -
థాంక్యూ ఆస్ట్రేలియా.. ఇదే మా చివరి మ్యాచ్!? రోహిత్, కోహ్లి ఎమోషనల్
ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు తమ చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేశారు. ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రో-కో ద్వయం.. ప్రస్తుతం కేవలం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు.ఈ సీనియర్ క్రికెటర్లు మరో రెండేళ్ల పాటు జట్టులో కొనసాగే అవకాశమున్నప్పటికి టీమిండియా మాత్రం ఇప్పటిలో వైట్ బాల్ సిరీస్లు ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లదు. మళ్లీ భారత జట్టు 2028లో ఆసీస్ టూర్కు వెళ్లే అవకాశముంది.అప్పటికి కోహ్లి-రోహిత్ల వయస్సు 40 ఏళ్లు దాటుతుందున్నందన భారత జట్టులో కొనసాగే ఛాన్స్ లేదు. దీంతో శనివారం సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేనే కోహ్లి-రోహిత్కు ఆసీస్ గడ్డపై ఆఖరి మ్యాచ్ అయింది. ఈ మ్యాచ్లో వీరిద్దరూ ఆసాధరణ ప్రదర్శన కనబరిచారు.రోహిత్ శర్మ(121) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. కోహ్లి 74 పరుగులతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 168 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. వన్డే క్రికెట్లో ఈ సీనియర్ జోడీకి 12వ 150 ప్లస్ భాగస్వామ్యం కావడం విశేషం. ఇక మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియాలో జ్ఞాపకాలను రో-కో గుర్తు చేసుకున్నారు."నేను ఆస్ట్రేలియాలో ఆడేందుకు ఎక్కువగా ఇష్టపడతాను. 2008 నుంచి ఇక్కడ ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో పర్యటించేందుకు మాకు మరొక అవకాశం లభిస్తుందో లేదో నాకు తెలియదు. కానీ ఇక్కడ ఆడిన ప్రతీ క్షణాన్ని అస్వాధించాము. ఇక్కడ మాకు సపోర్ట్గా నిలిచిన ప్రతీఒక్కరికి ధన్యవాదాలు": రోహిత్"ఆస్ట్రేలియాలో ఆడేందుకు మేము ఎంతో ఇష్టపడతాము. ఈ గడ్డపై మా నుంచి ఎన్నో అత్యుత్తమ ప్రదర్శనలు వచ్చాయి. ఇక్కడ అభిమానులు మద్దతు నిజంగా ఒక అద్భుతం. అందరికీ చాలా థాంక్స్: విరాట్ కోహ్లిచదవండి: IND vs AUS: తీవ్ర గాయం! అస్పత్రిలో శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ ప్రకటన -
రోహిత్ ఉంటే చాలు చెలరేగిపోతా.. ఛేజింగ్ అంటే నాకు ఇష్టం: కోహ్లి
సింహం ఒక అడుగు వెనక్కి వేస్తే పదడుగులు ముందుకు వేస్తుంది.. ఈ డైలాగ్ సరిగ్గా టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సరిపోతుంది. దాదాపు ఏడు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన కోహ్లి.. ఆసీస్తో జరిగిన తొలి మ్యాచ్లోనే డకౌటై తీవ్ర నిరాశపరిచాడు.అ తర్వాత రెండో మ్యాచ్లో కూడా మళ్లీ డకౌట్. దీంతో కోహ్లిపై సర్వాత్ర విమర్శల కురిసింది. కోహ్లి రిటైర్ అయపోతాడని, ఇక లండన్కు బ్యాగ్ సర్ధుకోవాల్సిందే అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. కానీ కోహ్లి అభిమానులు మాత్రం తమ ఆరాధ్య క్రికెటర్గా బలంగా తిరిగొస్తాడని నమ్మారు.వారి నమ్మకాన్ని కోహ్లి నిలబెట్టాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో విరాట్ విశ్వరూపం చూపించాడు. 237 పరుగుల లక్ష్య చేధనలో కోహ్లి హాఫ్ సెంచరీతో మెరిశాడు. 81 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 7 ఫోర్ల సాయంతో 74 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. తన అద్బుత ఇన్నింగ్స్తో సచిన్, సంగక్కరల వరల్డ్ రికార్డులను కింగ్ బ్రేక్ చేశాడు. వన్డే వరల్డ్కప్-2027కు తను సిద్దమనేని ఈ నాక్తో కోహ్లి చాటి చెప్పాడు. ఇక తన ఇన్నింగ్స్పై మ్యాచ్ అనంతరం కోహ్లి స్పందించాడు."అదృష్టవశాత్తూ డకౌట్ల నుంచి బయటపడగలిగాను. అంతర్జాతీయ క్రికెట్లో చాలా కాలం ఆడినా.. ప్రతీ మ్యాచ్ కూడా మనకు కఠిన సవాల్ను విసరుతోంది. కొన్నిసార్లు పూర్తిగా పరుగులు ఎలా సాధించాలో తెలియకపోయినట్లు అన్పిస్తోంది. ఈ జేంటల్మేన్ గేమ్ మనల్ని పరీక్షిస్తోంది. నా కెరీర్లో ఇటువంటి పరిస్థితులు చాలాసార్లు ఎదురయ్యాయి. ఈ కఠిన పరిస్థితులలే నాలోని ప్రతిభను వెలికితీశాయి. రోహిత్తో కలిసి బ్యాటింగ్ చేయడమంటే నాకు చాలా ఇష్టం. రోహిత్ శర్మ క్రీజులో ఉంటే స్ట్రైక్స్ రొటేట్ చేయడం సులభమవుతుంది. అతడితో భాగస్వామ్యాన్ని అస్వాదించాను. ఛేజింగ్ ఎల్లప్పుడూ నాలోని అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తెస్తుంది. ఇద్దరం ఆజేయంగా నిలిచి మ్యాచ్ ఫినిష్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుత జట్టులో అత్యంత అనుభవజ్ఞులైన జోడీగా మేము ఉన్నాయి. ఇంతకుముందు కూడా చాలా మ్యాచ్లలో భారీ భాగస్వామ్యాలను నెలకొల్పాము.2013లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే హోమ్ సిరీస్ నుంచి మా ఇద్దరి పార్టనర్ షిప్ మొదలైంది. ఆ మ్యాచ్లో దాదాపు 20 ఓవర్ల పాటు కలిసి బ్యాటింగ్ చేశాము. ఆస్ట్రేలియాలో మాకు లభించిన ఆదరణకు మేము రుణపడి ఉంటాము" అని కోహ్లి పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో కోహ్లి-రోహిత్ ఇద్దరూ 168 పరుగుల ఆజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.చదవండి: #ViratKohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్ -
శతక్కొట్టిన రోహిత్... కోహ్లి హాఫ్ సెంచరీ.. ఆసీస్ను చిత్తు చేసిన భారత్
ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో టీమిండియా (India Beat Australia) ఘన విజయం సాధించింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆతిథ్య జట్టును ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో మట్టికరిపించింది. భారత దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli) అద్భుత ప్రదర్శనలతో రాణించి జట్టుకు విజయం అందించారు. రోహిత్ సెంచరీతో చెలరేగగా.. కోహ్లి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పెర్త్, అడిలైడ్ వన్డేల్లో ఓడిన టీమిండియా.. సిడ్నీ వేదికగా శనివారం మూడో వన్డే ఆడింది. ఇందులో టాస్ గెలిచిన ఆసీస్ సారథి మిచెల్ మార్ష్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 236 పరుగులకు ఆసీస్ ఆలౌట్ ఈ క్రమంలో భారత బౌలర్ల ధాటికి ఆసీస్ 46.4 ఓవర్లలో 236 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (41), ట్రావిస్ హెడ్ (25 బంతుల్లో 29) ఫర్వాలేదనిపించగా.. మాథ్యూ షార్ట్ (30), అలెక్స్ క్యారీ (24), కూపర్ కన్నోలి (23) ఓ మోస్తరుగా బ్యాటింగ్ చేశారు.తొలి ఫోర్ వికెట్ హాల్అయితే, నాలుగో నంబర్ బ్యాటర్ మ్యాట్ రెన్షా తన కెరీర్లో తొలి వన్డే హాఫ్ సెంచరీ (56)తో సత్తా చాటాడు. తద్వారా ఆసీస్ ఇన్నింగ్స్లో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఇక భారత బౌలర్లలో పేసర్ హర్షిత్ రాణా నాలుగు వికెట్లు పడగొట్టి.. తన కెరీర్లో తొలి ఫోర్ వికెట్ హాల్ నమోదు చేశాడు.CLUTCH! ⭐⭐⭐⭐#HarshitRana bags his maiden 4-wicket haul in international cricket as #TeamIndia bowl out Australia in Sydney 👏#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuANAu pic.twitter.com/JXFhwCDgzX— Star Sports (@StarSportsIndia) October 25, 2025మిగిలిన వారిలో పేసర్లు మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ చెరో వికెట్ తీయగా.. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.రోహిత్, విరాట్ ధనాధన్ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నెమ్మదిగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్ (26 బంతుల్లో 24) త్వరగానే పెవిలియన్ చేరాడు. ఆసీస్ పేసర్ జోష్ హాజిల్వుడ్ బౌలింగ్లో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.ఈ క్రమంలో మరో ఓపెనర్ రోహిత్ శర్మ.. వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లితో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రోహిత్ 105 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 125 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 121 పరుగులతో అజేయంగా నిలిచాడు.Hitman has RO-ared with all class in Sydney! 💯👉 His 33rd ODI century, 50th across formats👉 9 - Joint-most 100s in ODIs against AUS👉 6- Most 100s by a visiting batter in ODIs in AUS#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuANAu pic.twitter.com/r5AtoC6u1i— Star Sports (@StarSportsIndia) October 25, 2025 కాగా రోహిత్ వన్డే కెరీర్లో ఇది 33వ శతకం కావడం విశేషం. మరోవైపు.. పెర్త్, అడిలైడ్ వన్డేల్లో డకౌట్ అయిన కోహ్లి.. ఈసారి మాత్రం తనదైన ముద్ర వేయడంలో సఫలం అయ్యాడు. వన్డే కెరీర్లో 75వ హాఫ్ సెంచరీ నమోదు చేసిన కోహ్లి.. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో 74 పరుగులు సాధించాడు. ఫోర్ బాది రోహిత్తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.Hence proved: 𝘚𝘢𝘣𝘳 𝘬𝘢 𝘱𝘩𝘢𝘭 𝘩𝘶𝘮𝘦𝘴𝘩𝘢 𝘮𝘦𝘦𝘵𝘩𝘢 𝘩𝘰𝘵𝘢 𝘩𝘢𝘪! 🙌👉 Virat Kohli's 75th ODI fifty👉 His 70th 50+ score in ODI run chases - most by any batter👉 Completes 2500 runs against AUS in ODIs#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉… pic.twitter.com/Mw6oU1cNzk— Star Sports (@StarSportsIndia) October 25, 2025ఇక ఈ మ్యాచ్లో సత్తా చాటిన రోహిత్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా గెలుచుకున్నాడు. పెర్త్లో ఎనిమిది పరుగులే చేసిన రోహిత్.. అడిలైడ్లో మాత్రం 73 పరుగులతో ఆకట్టుకున్నాడు. తాజాగా సెంచరీతో చెలరేగి మరోసారి తన విలువను చాటుకున్నాడు. ఏదేమైనా సిడ్నీ వన్డేతో తాము వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి సిద్ధంగా ఉన్నామని రో- కో చెప్పారంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు.చదవండి: సంగక్కర రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. సచిన్ తర్వాత స్థానం ‘కింగ్’దే! INDIA WINNNNNN! 🇮🇳The crowd came to witness something special in Sydney and Ro-Ko didn’t disappoint! 🫂If this was their last match in Australia, what a way to leave a legacy behind! 💙 pic.twitter.com/3MR2KxQBxh— Star Sports (@StarSportsIndia) October 25, 2025 -
సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ..
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తన అంతర్జాతీయ క్రికెట్ పునరాగనమంలో సత్తాచాటుతున్నాడు. మొన్న అడిలైడ్లో తృటిలో సెంచరీ మిస్ చేసుకున్న హిట్మ్యాన్.. ఇప్పుడు సిడ్నీలో మాత్రం ఎటువంటి తప్పిదం చేయలేదు.ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ అద్బుతమైన శతకంతో చెలరేగాడు. కేవలం 105 బంతుల్లోనే 11 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. రోహిత్కు ఇది 33వ వన్డే సెంచరీ కావడం విశేషం. 237 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో ఆసీస్ బౌలర్లకు రోహిత్ చుక్కలు చూపించాడు. తొలుత కెప్టెన్ శుభ్మన్ గిల్తో కలిసి మొదటి వికెట్కు 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రోహిత్.. ఆ తర్వాత మరో సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లితో కలిసి జట్టును విజయం దిశగా నడిపిస్తున్నాడు. రోహిత్ సెంచరీ మార్క్ను అందుకోగానే సిడ్నీ స్టేడియం దద్దరిల్లిపోయింది. మొత్తంగా 125 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. 13 ఫోర్లు, 3 సిక్స్లతో 121 పరుగులు చేశాడు. అతడితో పాటు విరాట్ కోహ్లి(74 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. వీరిద్దరి సూపర్ ఇన్నింగ్స్ల ఫలితంగా లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 38.3 ఓవర్లలో చేధించింది.చదవండి: #Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్ -
IND vs AUS: సిడ్నీ వన్డేలో భారత్ ఘన విజయం
Australia vs India, 3rd ODI Updates And Highlights: సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో టీమిండియాతో నామమాత్రపు మూడో వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల ధాటికి 236 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ లక్ష్యం: 237 పరుగులుగా నిర్దేశించింది.భారత్ ఘన విజయం..సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో వైట్ వాష్ నుంచి టీమిండియా తప్పించుకుంది. 237 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రం కోల్పోయి చేధించింది. లక్ష్య చేధనలో సీనియర్ ద్వయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు అద్బుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో చెలరేగగా.. కోహ్లి 74 పరుగులతో సత్తాచాటాడు. వీరిద్దరూ ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ను ఫినిష్ చేశారు.విజయం దిశగా32.6: జంపా బౌలింగ్లో సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ. వన్డేల్లో రోహిత్కు ఇది 33వ శతకం. 33 ఓవర్లలో టీమిండియా స్కోరు 200-1. రోహిత్ 100, కోహ్లి 59 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా విజయానికి 37 పరుగుల దూరంలో ఉంది.కోహ్లి హాఫ్ సెంచరీ..వరుసగా రెండు మ్యాచ్లలో డకౌటైన విరాట్ కోహ్లి.. సిడ్నీ వన్డేలో మాత్రం సత్తాచాటాడు. కోహ్లి 56 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. టీమిండియా స్కోరు: 178-1(29).రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ..సిడ్నీ వన్డేలోనూ రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 63 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 23 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్తో పాటు కోహ్లి(36) ఉన్నాడు.తొలి వికెట్ కోల్పోయిన భారత్10.2: గిల్ (24) రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. హాజిల్వుడ్ బౌలింగ్లో వికెట్ కీపర్ క్యారీకి క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ చేరాడు. విరాట్ కోహ్లి క్రీజులోకి వచ్చాడు. టీమిండియా స్కోరు: 70-1(10.3). రోహిత్ 32 పరుగులతో ఉన్నాడు. కోహ్లికి సిడ్నీలో ఇదే ఆఖరి మ్యాచ్ అన్నట్లుగా ప్రేక్షకులు స్టాండింగ్ ఓవియేషన్ ఇస్తూ ఎమోషనల్ అయ్యారు.పవర్ ప్లేలో టీమిండియా స్కోరు: 68-0 (10).గిల్ 24, రోహిత్ 31 పరుగులతో ఉన్నారు.నిలకడగా ఆడుతున్న రోహిత్, గిల్237 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది టీమిండియా. ఆది నుంచే ఆసీస్ బౌలర్లు కట్టడి చేయగా.. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ ఆచితూచి ఆడుతున్నారు. 8 ఓవర్లలో టీమిండియా స్కోరు 48-0. రోహిత్ 25, గిల్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.హాజిల్వుడ్ బౌల్డ్46.4: హర్షిత్ రాణా బౌలింగ్లో హాజిల్వుడ్ (0) బౌల్డ్ కావడంతో ఆసీస్ పదో వికెట్ కోల్పోయింది. ఫలితంగా 236 పరుగులకే ఆలౌట్ అయింది.తొమ్మిదో వికెట్ డౌన్46.2: హర్షిత్ రాణా బౌలింగ్లో కోహ్లికి క్యాచ్ ఇచ్చిన కన్నోలి (23). దీంతో ఆసీస్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. స్కోరు: 236-9(46.2). హాజిల్వుడ్ క్రీజులోకి రాగా... జంపా రెండు పరుగులతో ఉన్నాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా43.5: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఎనిమిదో వికెట్గా వెనుదిరిగిన నాథన్ ఎల్లిస్ (16). స్కోరు: 223-8(43.5). కన్నోలి 13 పరుగులతో ఉన్నాడు. జంపా క్రీజులోకి వచ్చాడు.ఏడో వికెట్ డౌన్38.4: కుల్దీప్ బౌలింగ్లో ఏడో వికెట్గా వెనుదిరిగిన స్టార్క్ (2). కుల్దీప్ అద్భుత బంతితో స్టార్క్ను బౌల్డ్ చేశాడు. ఆసీస్ స్కోరు: 201-7(38.4). నాథన్ ఎల్లిస్ క్రీజులోకి రాగా.. కన్నోలి 8 పరుగులతో ఉన్నాడు.ఆరో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియాఓవెన్ (1) రూపంలో ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. హర్షిత్ బౌలింగ్లో రోహిత్కు క్యాచ్ ఇచ్చి ఓవెన్ పెవిలియన్ చేరాడు. స్టార్క్ క్రీజులోకి రాగా.. 38 ఓవర్లలో ఆసీస్ స్కోరు: 199-6(38). కన్నోలి 7, స్టార్క్ ఒక పరుగుతో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా36.2: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో హాఫ్ సెంచరీ వీరుడు మ్యాట్ రెన్షా (56) లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగాడు. అయితే, ఎల్బీడబ్ల్యూ విషయంలో ఆసీస్ రివ్యూకు వెళ్లగా.. బంతి లెగ్ స్టంప్ను హిట్ చేస్తున్నట్లుగా తేలింది. దీంతో ఆసీస్ ఐదో వికెట్ కోల్పోగా.. మిచెల్ ఓవెన్ క్రీజులోకి వచ్చాడు. 37 ఓవర్లలో ఆసీస్ స్కోరు: 197-5. కన్నోలి 6 పరుగులతో ఉన్నాడు.నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా33.4: హర్షిత్ రాణా బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి క్యారీ (24) అవుట్. అద్భుతమైన క్యాచ్తో మెరిసి టీమిండియా కీలక వికెట్ పొందడంలో తన వంతు పాత్ర పోషించిన శ్రేయస్ గాయపడినట్లు తెలుస్తోంది. కూపర్ కన్నోలి క్రీజులోకి రాగా 34 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోరు: 184-4. రెన్షా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్22.3: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి మాథ్యూ షార్ట్ అవుటయ్యాడు. 41 బంతుల్లో 30 పరుగులు చేసి మూడో వికెట్గా వెనుదిరిగాడు. అలెక్స్ క్యారీ క్రీజులోకి వచ్చాడు. 24 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ మూడు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. రెన్షా 22, క్యారీ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.The only leadership summit all of us want to be part of! 📝📚#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuANAu pic.twitter.com/HzAE2KIPI1— Star Sports (@StarSportsIndia) October 25, 2025 రెండో వికెట్ డౌన్15.1: మార్ష్ (41) రూపంలో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో మార్ష్ బౌల్డ్ అయ్యాడు. మ్యాట్ రెన్షా క్రీజులోకి రాగా.. షార్ట్ 11 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 92-2 (16)A classic Axar Patel delivery! 🔥The Aussie skipper heads back, and #TeamIndia are right back in the contest! 🇮🇳👏#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuANAu pic.twitter.com/BDrWFPLvgs— Star Sports (@StarSportsIndia) October 25, 2025తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా9.2: సిరాజ్ బౌలింగ్లో ప్రసిద్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన ట్రావిస్ హెడ్. 25 బంతులు ఎదుర్కొని 29 పరుగుల చేసిన హెడ్ అవుట్. ఫలితంగా తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా. మాథ్యూ షార్ట్ క్రీజులోకి రాగా.. మార్ష్ 25 పరుగులతో ఆడుతున్నాడు. పది ఓవర్లలో ఆసీస్ స్కోరు: 63-1ఐదు ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు: 26-0(5)మిచెల్ మార్ష్ 6, ట్రావిస్ హెడ్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. సిరాజ్ భారత బౌలింగ్ అటాక్ ఆరంభించగా.. హర్షిత్ రాణా సిరాజ్ కలిసి ఆల్టర్నేటివ్ ఓవర్లలో బరిలోకి దిగాడు.ఒక మార్పుతో బరిలోకిఈ సందర్భంగా ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ మాట్లాడుతూ.. ‘‘వికెట్ బాగుందనిపిస్తోంది. అందుకే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాం. యువ ఆటగాళ్లు రాణించడం మా జట్టుకు శుభపరిణామం. 3-0తో సిరీస్ క్లీన్స్వీప్ చేసే సువర్ణావకాశం మా ముందుంది. గత మ్యాచ్లో కూపర్ కన్నోలి అద్భుతంగా ఆడాడు. ఈ వన్డేలో మేము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాం. జేవియర్ బార్ట్లెట్ స్థానంలో నాథన్ ఎల్లిస్ జట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.టీమిండియాలో రెండు మార్పులుమరోవైపు.. టీమిండియా గత మ్యాచ్లలో చేసిన పొరపాటును సరిచేసుకున్నట్లు అనిపిస్తోంది. రెండు వన్డేల్లో బెంచ్కే పరిమితం చేసిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు ఎట్టకేలకు పిలుపునిచ్చింది. ఈ మ్యాచ్లో భారత్ తమ తుదిజట్టులో రెండు మార్పులు చేసింది. అర్ష్దీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి స్థానాల్లో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణలను ఎంపిక చేసుకుంది.టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడో వన్డే తుదిజట్లుటీమిండియారోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.ఆస్ట్రేలియామిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మ్యాట్ రెన్షా, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), కూపర్ కన్నోలీ, మిచెల్ ఓవెన్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్వుడ్. -
రోహిత్ భయ్యా ఏ తప్పూ చేయలేదు.. నన్నెందుకు కెప్టెన్ చేశారు?
వన్డే కెప్టెన్గా టీమిండియా పగ్గాలు చేపట్టిన శుబ్మన్ గిల్ (Shubman Gill)కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్ (IND vs AUS ODIS 2025)ను భారత్ కోల్పోయింది. తొలి రెండు వన్డేల్లో ఓడి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది.ఈ నేపథ్యంలో వన్డే సారథిగా తొలి సిరీస్లోనే వరుసగా రెండు వన్డేలు ఓడిన ఆరో భారత కెప్టెన్గా గిల్ నిలిచాడు. అతడి కంటే ముందు అజిత్ వాడేకర్, దిలీప్ వెంగ్సర్కార్, క్రిస్ శ్రీకాంత్, మొహమ్మద్ అజారుద్దీన్, కేఎల్ రాహుల్ ఈ చేదు అనుభవాన్ని చవిచూశారు.రోహిత్ శర్మపై వేటు వేసికాగా భారత్కు టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (వన్డే)-2025 అందించిన రోహిత్ శర్మ (Rohit Sharma)పై వేటు వేసి మరీ.. బీసీసీఐ గిల్కు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అడిలైడ్లో రెండో వన్డేలో గిల్ సేన ఓటమి నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ తనదైన శైలిలో స్పందించాడు.రోహిత్ భయ్యా ఏ తప్పూ చేయలేదు..‘‘కొత్తగా పగ్గాలు చేపట్టిన ప్రతి కెప్టెన్ మదిలో ఇలాంటి ఆలోచనలే ఉంటాయి. గిల్ కూడా ఇందుకు అతీతం కాదు. అతడి జట్టులో ఇప్పుడు రోహిత్ శర్మ ఉన్నాడు. ఇప్పటికే నాయకుడిగా తనను తాను నిరూపించుకున్న దిగ్గజం. అతడి సారథ్యంలో గిల్ ఆడాడు. కెప్టెన్గా రోహిత్ ఎలాంటి తప్పూ చేయలేదని గిల్కు బాగా తెలుసు.అయినా సరే.. అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించారనీ తెలుసు. హోటల్ రూమ్లో నిద్రకు ఉపక్రమించే ముందు బహుశా గిల్ ఇదే అనుకుంటూ ఉంటాడు. ‘రోహిత్ భాయ్ ఎలాంటి తప్పూ చేయలేదు. అయినా ఎందుకిలా చేశారు?నన్నెందుకు కెప్టెన్ చేశారు?నన్ను సమర్థిస్తున్న వాళ్లు ఒక్కసారైనా రోహిత్ భాయ్ గురించి ఆలోచించారా? ఆయన రెండు ట్రోఫీలు గెలిచాడు. అయినా సరే కెప్టెన్గా వేటు వేశారు. కొత్త కెప్టెన్గా నన్ను ఎంపిక చేశారు’ అనే గిల్ట్తో సతమతమవుతూ ఉంటాడు’’ అని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ఇక టీమిండియా సిరీస్ ఓటమిపై స్పందిస్తూ..ఆ విషయం గుర్తే లేదు ‘‘వరుస సిరీస్లు, ప్రయాణ బడలిక. రోహిత్, కోహ్లి వంటి దిగ్గజాలను లీడ్ చేయడం వంటికి గిల్కు పెద్ద సవాలు. వన్డే కెప్టెన్గా గిల్ ఇప్పుడే బాధ్యతలు తీసుకున్నాడు. జట్టు మార్పు చెందే ప్రక్రియలో ఇలాంటివి సహజమే.గిల్ కాస్త ఒత్తిడికి లోనై ఉంటాడు. అతడి సారథ్యంలో మనం వన్డే సిరీస్ కోల్పోయాం. చివరగా ఎప్పుడు ఇది జరిగిందో కూడా ఎవరికీ గుర్తులేదు. గిల్ కెప్టెన్సీలో ఆరంభంలోనే ఇది జరిగింది’’ అని కైఫ్ చెప్పుకొచ్చాడు.చదవండి: WTC: ఒక్క మ్యాచ్తో మారిన పాక్ రాత.. టీమిండియాకు బూస్ట్!Oh my word! 🤩@ImRo45 is back to his very best. Just what #TeamIndia needed. 👏#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/P95TUGWl95— Star Sports (@StarSportsIndia) October 23, 2025 -
రోహిత్ నీకు ఇది ఫేర్వెల్ మ్యాచా? ఒక్క ఫోటో అయినా పెట్టు: గంభీర్
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమి పాలైనప్పటికి.. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం ఆకట్టుకున్నాడు. తొలి వన్డేలో విఫలమైన హిట్మ్యాన్ రెండో మ్యాచ్లో తన మార్క్ చూపించాడు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన రోహిత్ క్రీజులో నిలదొక్కున్నాక మాత్రం తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేస్తూ అలరించాడు.ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన జట్టు తన అద్బుత ఇన్నింగ్స్తో రోహిత్ ఆదుకున్నాడు. శ్రేయస్ అయ్యర్తో కలిసి మూడో వికెట్కు 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 97 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో 73 పరుగులు చేసిన రోహిత్ శర్మ స్టార్క్ బౌలింగ్లో బౌండరీ వద్ద క్యాచ్ రూపంలో అవుటయ్యాడు. అయితే మ్యాచ్ ముగిశాక టీమ్ హోటల్కు వెళ్లే క్రమంలో రోహిత్ శర్మను భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆటపట్టించాడు."రోహిత్.. అందరికీ ఇదే నీ ఫేర్వెల్ మ్యాచ్ అనిపిస్తోంది. ఒక్క ఫొటో అయినా పెట్టు" అని గంభీర్ అన్నాడు. అందుకు రోహిత్ నవ్వుతూ తన రూమ్కు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఆసీస్ టూర్కు ముందు వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ను తప్పించిన సంగతి తెలిసిందే.దీంతో రోహిత్ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తుపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పటికే టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన హిట్మ్యాన్ కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే వన్డే ప్రపంచకప్-2027లో రోహిత్ ఆడుతాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కూడా ఎటువంటి స్పష్టత లేదు. వరల్డ్కప్నకు ఇంకా రెండేళ్ల సమయం ఉండడంతో అప్పటికి ఈ ముంబై ఆటగాడి వయస్సు నాలభైకి చేరుకుంటుంది. ఒకవేళ రోహిత్ ఫిట్గా ఉండి, ఫామ్లో ఉంటే వరల్డ్కప్లో ఆడే అవకాశముంది. అంతేకాకుండా వరల్డ్కప్ జట్టు ఎంపికకు అందుబాటులో ఉండాలంటే దేశవాళీ టోర్నీ విజయహాజారే ట్రోఫీలో ఆడాల్సిందేనని అగార్కర్ స్పష్టం చేశాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడో వన్డే సిడ్నీ వేదికగా శనివారం జరగనుంది. View this post on Instagram A post shared by Rohit Sharma (Fan Page) (@rohit_cha_fans45)చదవండి: వరుసగా రెండుసార్లు డకౌట్.. కోహ్లి రిటైర్మెంట్?.. గావస్కర్ స్పందన ఇదే -
విరాట్ కోహ్లి రిటైర్మెంట్?.. గావస్కర్ స్పందన ఇదే
ఆస్ట్రేలియాతో రెండో వన్డేలోనూ విరాట్ కోహ్లి (Virat Kohli) విఫలమయ్యాడు. అడిలైడ్లో మంచి రికార్డు కలిగి ఉన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ గురువారం నాటి మ్యాచ్లో మాత్రం డకౌట్ అయ్యాడు. అంతకు ముందు పెర్త్ వేదికగా తొలి వన్డేలోనూ ఈ దిగ్గజ ఆటగాడు సున్నా చుట్టడం గమనార్హం.ఈ నేపథ్యంలో అడిలైడ్ వన్డేలో కోహ్లి అవుటై.. పెవిలియన్కు చేరుతున్న క్రమంలో స్టేడియంలోని ప్రేక్షకులు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. ఇందుకు ప్రతిగా కోహ్లి సైతం గ్లోవ్స్ తీసి.. ఇక సెలవు అన్నట్లుగా మైదానం వీడాడు. అయితే, కోహ్లి చర్య రిటైర్మెంట్కు సంకేతమంటూ వదంతులు వ్యాపించాయి.రెండుసార్లు డకౌట్ అయినంత మాత్రాన..ఈ విషయంపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) స్పందించాడు. ‘‘వన్డేల్లో 52 సెంచరీలు చేశాడు. 14 వేలకు పైగా పరుగులు సాధించాడు. టెస్టుల్లోనూ 32 దాకా శతకాలు ఉన్నాయి. ఇప్పటికే వేలకు వేలు పరుగులు రాబట్టాడు.అలాంటి ఆటగాడు వరుసగా రెండుసార్లు డకౌట్ అయినంత మాత్రాన తప్పుపట్టాల్సిన అవసరం ఏమీలేదు. అతడిలో ఇంకా చాలా ఆట మిగిలే ఉంది. మున్ముందు ఇంకా ఆడతాడు. తదుపరి సిడ్నీ వన్డేలో భారీ ఇన్నింగ్స్ ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.నిజానికి టెస్టు, వన్డేల్లో అడిలైడ్ కోహ్లికి ఫేవరెట్ గ్రౌండ్. అక్కడ శతకాలు బాదిన చరిత్ర అతడికి ఉంది. కాబట్టి.. సహజంగానే ఈసారి వైఫల్యాన్ని అతడితో పాటు అభిమానులూ తట్టుకోలేకపోయారు. అయినా ఆటగాడి కెరీర్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.ఆ స్పందన అమోఘంఏదేమైనా కోహ్లి మైదానాన్ని వీడుతున్న వేళ అభిమానుల నుంచి వచ్చిన స్పందన అమోఘం. ఎందుకంటే అక్కడ చాలా మంది ఆస్ట్రేలియన్లు కూడా ఉన్నారు. వారంతా కూడా భారతీయ అభిమానులతో కలిసి కోహ్లికి ఓవియేషన్ ఇచ్చారు. గొప్ప ఆటగాడికి లభించే ఆదరణకు తార్కాణం అది.ఇది చాలా చాలా ప్రత్యేకం. ఇదేమీ కోహ్లి కెరీర్కు ముగింపు కాదు. అతడు ఆటగాళ్లు కూర్చునే స్టాండ్ వైపు వెళ్లాడు. అయితే, తన పట్ల అభిమానం చూపుతున్న వారి కోసం మాత్రమే గ్లోవ్స్ తీసి వారి పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు.అంత తేలికగా ఓటమిని ఒప్పుకోడువిరాట్ కోహ్లి.. అంత తేలికగా ఓటమిని ఒప్పుకొని ఆటను వదిలేసే రకం కాదు. వరుసగా రెండుసార్లు డకౌట్ అయిన తర్వాత అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అనుకుంటున్నారా? ఛాన్సే లేదు. ఉన్నత స్థాయిలోనే అతడు ఆటకు వీడ్కోలు పలుకుతాడు.సిడ్నీ మ్యాచ్ తర్వాత.. సౌతాఫ్రికాతో స్వదేశంలో వన్డే సిరీస్ ఉంది. ఇంకా చాలా మ్యాచ్లు మిగిలే ఉన్నాయి. రోహిత్ శర్మతో కలిసి విరాట్ వన్డే వరల్డ్కప్-2027 ఆడతాడనే భావిస్తున్నా. లేదంటే టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా ఫ్యాన్స్కూడా నిరాశ చెందుతారనడంలో సందేహం లేదు.ఆ ఛాన్సే లేదుఏదేమైనా కోహ్లి తన పట్ల అభిమానం చూపిన వారికి కృతజ్ఞతగా మాత్రమే గ్లోవ్స్ తీశాడు. ఒకవేళ తను సెంచరీ చేసి ఉంటే బ్యాట్ ఎత్తి అభివాదం చేసేవాడు. కాబట్టి కోహ్లి రిటైర్మెంట్ అంటూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు’’ అని గావస్కర్ స్పోర్ట్స్తక్తో పేర్కొన్నాడు. కాగా పెర్త్ వన్డేలో ఆసీస్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడిన టీమిండియా.. అడిలైడ్లో రెండు వికెట్ల తేడాతో ఓడి సిరీస్ను చేజార్చుకుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే అంతర్జాతీయ టీ20ల, టెస్టు ఫార్మాట్కు గుడ్బై చెప్పిన కోహ్లి.. వన్డేల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.చదవండి: IND vs AUS: టీమిండియా కొంపముంచిన 22 ఏళ్ల కుర్రాడుA tough day for the King of Cricket 👑@imVkohli waved goodbye to the Adelaide crowd 🏏💬#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/yAG1uQFPA8— Star Sports (@StarSportsIndia) October 23, 2025 -
IND vs AUS: టీమిండియాపై ఆసీస్ గెలుపు.. సిరీస్ కైవసం
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో ఆతిథ్య ఆసీస్.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. పెర్త్లో జరిగిన తొలి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో గెలిచిన కంగారూలు.. తాజాగా అడిలైడ్ వేదికగా రెండో వన్డే (IND vs AUS 2nd ODI)లోనూ జయభేరి మోగించారు.టాస్ గెలిచిన ఆస్ట్రేలియాఅడిలైడ్ ఓవల్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. పర్యాటక భారత జట్టును తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఒకే ఓవర్లో ఓపెనర్, కెప్టెన్ శుబ్మన్ గిల్ (9)తో పాటు వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి (0) వికెట్ తీసి జేవియర్ బార్ట్లెట్ ఆసీస్కు శుభారంభం అందించాడు.రాణించిన రోహిత్, శ్రేయస్ఇలాంటి తరుణంలో మరో ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma), వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. రోహిత్ (97 బంతుల్లో 73), అయ్యర్ (77 బంతుల్లో 61) పరుగులతో రాణించగా.. మిగతా వారిలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (41 బంతుల్లో 44), హర్షిత్ రాణా (18 బంతుల్లో 24 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ ఆడం జంపా నాలుగు వికెట్లతో చెలరేగి భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (11) నితీశ్ రెడ్డి (8) రూపంలో కీలక వికెట్లు దక్కించుకున్నాడు. పేసర్లలో బార్ట్లెట్ గిల్, కోహ్లి, వాషింగ్టన్ సుందర్ (12) వికెట్లు తన ఖాతాలో వేసుకోగా.. మిచెల్ స్టార్క్ రోహిత్ శర్మ, అర్ష్దీప్ సింగ్ (13)లను అవుట్ చేశాడు.264 పరుగులుఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 264 పరుగులు స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో ఆసీస్ ఆరంభంలో తడబడింది. ఓపెనర్, కెప్టెన్ మిచెల్ మార్ష్ (11)ను అర్ష్దీప్ త్వరగానే పెవిలియన్కు పంపగా.. ట్రవిస్ హెడ్ (40 బంతుల్లో 28)ను హర్షిత్ రాణా అవుట్ చేశాడు.అదరగొట్టిన షార్ట్, కన్నోలి అయితే, వన్డౌన్ బ్యాటర్ మాథ్యూ షార్ట్ అద్భుత అర్ధ శతకం (74)తో మెరిసి మ్యాచ్ను తమ వైపు తిప్పే ప్రయత్నం చేయగా.. మ్యాట్ రెన్షా (30) అతడికి సహకరించాడు. షార్ట్, రెన్షా వేసిన పునాదిపై ఆల్రౌండర్ కూపర్ కన్నోలి మిచెల్ ఓవెన్తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు.Just the wicket #TeamIndia needed! 🤩#NitishKumarReddy gets the wicket and #MohammedSiraj makes amends for the dropped catch. 👏#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/YZwdPY0nr7— Star Sports (@StarSportsIndia) October 23, 2025 ఆఖర్లో వరుస విరామాల్లో వికెట్లు పడినా కన్నోలి పట్టుదలగా నిలబడ్డాడు. ఓవెన్ 23 బంతుల్లో 36 పరుగులతో వేగంగా ఆడి.. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో వెనుదిరగగా.. బార్ట్లెట్ (3), స్టార్క్ (4) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.అయితే, కన్నోలి మాత్రం నిలకడగా ముందుకు సాగాడు. 53 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 61 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 46.2 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టపోయిన ఆస్ట్రేలియా లక్ష్యం పూర్తి చేసింది. రెండు వికెట్ల తేడాతో గెలిచి.. సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంది. ఇరుజట్ల మధ్య శనివారం నాటి నామమాత్రపు మూడో వన్డేకు సిడ్నీ వేదిక. కాగా వన్డే సారథిగా గిల్కు తొలి సిరీస్లోనే ఇలా చేదు అనుభవం ఎదురైంది. ఇక రెండో వన్డేలో జంపాకు ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: బతికితే చాలనుకున్నా.. ఆకాశ్ అంబానీ హెల్ప్ చేశారు: తిలక్ వర్మ -
చరిత్ర సృష్టించిన ‘హిట్మ్యాన్’.. ఆసియాలోనే తొలి క్రికెటర్గా
ఆస్ట్రేలియా పర్యటనను పేలవంగా ఆరంభించిన టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) తిరిగి పుంజుకున్నాడు. పెర్త్లో జరిగిన తొలి వన్డేలో ఎనిమిది పరుగులే చేసిన ‘హిట్మ్యాన్’.. రెండో వన్డేలో మాత్రం రాణించాడు.అడిలైడ్ (IND vs AUS 2nd ODI)లో గురువారం నాటి మ్యాచ్లో ఓపెనింగ్ బ్యాటర్ రోహిత్ శర్మ.. అర్ధ శతకం సాధించాడు. డెబ్బై నాలుగు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. మొత్తంగా 97 బంతులు ఎదుర్కొని 73 పరుగులు సాధించాడు. ఇందులో ఏడు ఫోర్లతో పాటు రెండు సిక్సర్లు ఉన్నాయి.సరికొత్త చరిత్రఇక రోహిత్ బాదిన రెండు సిక్సర్లు కూడా భారత ఇన్నింగ్స్ 19వ ఓవర్లో వచ్చినవే. ఆసీస్ పేసర్ మిచెల్ ఓవెన్ బౌలింగ్లో తొలి బంతిని సిక్సర్గా మలిచిన హిట్మ్యాన్.. మూడో బంతిని కూడా బౌండరీ మీదుగా తరలించాడు. అయితే, తొలి సిక్సర్తోనే రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు.SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో 150 సిక్సర్లు బాదిన ఆసియా తొలి క్రికెటర్గా చరిత్రకెక్కాడు. ఇప్పటి వరకు రో‘హిట్’ శర్మ SENA దేశాల్లో మూడు ఫార్మాట్లలో కలిపి 156 మ్యాచ్లు ఆడి 151 సిక్సర్లు బాదడం విశేషం.Oh my word! 🤩@ImRo45 is back to his very best. Just what #TeamIndia needed. 👏#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/P95TUGWl95— Star Sports (@StarSportsIndia) October 23, 2025SENA దేశాల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆసియా క్రికెటర్లు🏏రోహిత్ శర్మ (ఇండియా)- 156 మ్యాచ్లలో 151*🏏సనత్ జయసూర్య (శ్రీలంక)- 171 మ్యాచ్లలో 113🏏షాహిద్ ఆఫ్రిది (పాకిస్తాన్)- 139 మ్యాచ్లలో 105🏏మహేంద్ర సింగ్ ధోని (ఇండియా)- 175 మ్యాచ్లలో 83🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 177 మ్యాచ్లలో 83.👉ఇదిలా ఉంటే.. శ్రేయస్ అయ్యర్ (61)తో కలిసి మూడో వికెట్కు 118 పరుగులు జతచేసిన రోహిత్ శర్మ.. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో జోష్ హాజిల్వుడ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక రోహిత్, శ్రేయస్ అర్ధ శతకాలకు తోడు అక్షర్ పటేల్ (41 బంతుల్లో 44), హర్షిత్ రాణా (18 బంతుల్లో 24 నాటౌట్) రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 264 పరుగులు చేయగలిగింది. చదవండి: డకౌట్ తర్వాత కోహ్లి చర్య వైరల్.. గుడ్బై చెప్పేశాడా? -
రోహిత్, శ్రేయస్ ఫిఫ్టీలు.. అదరగొట్టిన అక్షర్, హర్షిత్.. ఆసీస్ లక్ష్యం ఎంతంటే?
ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో టీమిండియా మెరుగైన స్కోరు సాధించింది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో పాటు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) అర్థ శతకాలతో రాణించగా.. ఆల్రౌండర్ అక్షర్ పటేల్తో పాటు లోయర్ ఆర్డర్లో పేస్ బౌలర్ హర్షిత్ రాణా (Harshit Rana) అదరగొట్టారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 264 పరుగులు చేయగలిగింది. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాతో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య పెర్త్లో తొలి వన్డే జరుగగా.. ఆతిథ్య ఆసీస్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ క్రమంలో ఆడిలైడ్లో గురువారం నాటి రెండో వన్డేలోనూ టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది.A tough day for the King of Cricket 👑@imVkohli waved goodbye to the Adelaide crowd 🏏💬#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/yAG1uQFPA8— Star Sports (@StarSportsIndia) October 23, 2025గిల్, కోహ్లి ఫెయిల్ఓపెనర్, కెప్టెన్ శుబ్మన్ గిల్ (9)తో పాటు వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి (0)లను వరుస బంతుల్లో ఆసీస్ యువ పేసర్ జేవియర్ బార్ట్లెట్ పెవిలియన్కు పంపాడు. దీంతో ఆదిలోనే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో మరో ఓపెనర్ రోహిత్ శర్మ, నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు.రోహిత్, శ్రేయస్ హాఫ్ సెంచరీలునెమ్మదిగా, నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ 74 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 97 బంతులు ఎదుర్కొన్న హిట్మ్యాన్ ఏడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు. అయితే, మిచెల్ స్టార్క్ బౌలింగ్లో హాజిల్వుడ్కు క్యాచ్ ఇవ్వడంతో రోహిత్ పెవిలియన్కు చేరాడు.Making Head(s) turn! 🚨#AxarPatel sends it straight back over the bowler's head for a boundary. 💪#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/GSBJAAzEbG— Star Sports (@StarSportsIndia) October 23, 2025వేగంగా ఆడిన అక్షర్, హర్షిత్ఇక శ్రేయస్ అయ్యర్ 77 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు బాది 61 పరుగుల వద్ద.. ఆడం జంపా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. 41 బంతుల్లో ఐదు ఫోర్లు కొట్టిన అక్షర్ హాఫ్ సెంచరీ (44)కి ఆరు పరుగుల దూరంలో ఉన్న వేళ.. జంపా బౌలింగ్లో అవుటయ్యాడు.Crucial runs for #TeamIndia from the blade of #HarshitRana! 👏#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/lUjw3AVjEt— Star Sports (@StarSportsIndia) October 23, 2025ఇతరులలో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (11), ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్ (12), నితీశ్ కుమార్ రెడ్డి (8) విఫలం కాగా.. టెయిలెండర్ హర్షిత్ రాణా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 18 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 24 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో పేసర్ అర్ష్దీప్ సింగ్ 14 బంతులు ఎదుర్కొని 13 పరుగులు చేశాడు.#ArshdeepSingh bhai, how much room is too much room? 🙌😄#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/bNwG2pNnt3— Star Sports (@StarSportsIndia) October 23, 2025జంపాకు నాలుగు వికెట్లుఈ నేపథ్యంలో తొమ్మిది వికెట్ల నష్టానికి టీమిండియా 264 పరుగులు సాధించి.. ఆసీస్కు 265 పరుగుల లక్ష్యం విధించింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో స్పిన్నర్ ఆడం జంపా అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. పేసర్లు బార్ట్లెట్ మూడు, స్టార్క్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. చదవండి: డకౌట్ తర్వాత కోహ్లి చర్య వైరల్.. గుడ్బై చెప్పేశాడా? -
ఏయ్.. ఏమి చేస్తున్నావు! శ్రేయస్పై రోహిత్ సీరియస్(వీడియో)
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma) సత్తాచాటాడు. 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును అద్బుతమైన హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్తో కలిసి మూడో వికెట్కు వందకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.తొలుత ఆచితూచి ఆడిన రోహిత్.. క్రీజులో సెటిల్ అయ్యాక దూకుడు పెంచాడు. 97 బంతులు ఎదుర్కొన్న హిట్మ్యాన్ 7 ఫోర్లు, 2 సిక్స్లతో 73 పరుగులు చేశాడు. అయితే భారత ఇన్నింగ్స్ను చక్కదిద్దే క్రమంలో రోహిత్-శ్రేయస్ అయ్యర్ మధ్య చిన్నపాటి మాటల యుద్దం చోటు చేసుకుంది.ఏమి జరిగిందంటే?ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోవడంతో రోహిత్ శర్మ ఎక్కువగా సింగిల్స్ పైన దృష్టిపెట్టాడు. ఈ క్రమంలో భారత ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన జోష్ హాజిల్వుడ్.. ఐదో బంతిని బ్యాక్-ఆఫ్-లెంగ్త్ డెలివరీగా రోహిత్కు సంధించాడు. ఆ బంతిని హిట్మ్యాన్ ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి అతడి ప్యాడ్లను తాకి కాస్త దూరంగా వెళ్లింది. దగ్గరలో ఫీల్డర్లు ఎవరూ లేకపోవడంతో క్విక్ సింగిల్కు కాల్ ఇచ్చాడు. అయ్యర్ మాత్రం రోహిత్ పిలుపును తిరష్కరించాడు. అయితే రన్కు పిలిచిన శ్రేయస్ రాకపోవడంపై హిట్మ్యాన్ అసహనం వ్యక్తం చేశాడు. నువ్వు త్వరగా వచ్చి ఉంటే పరుగు పూర్తయ్యేది అని రోహిత్ అనగా.. అరె.. మీరే చూసుకుని రండి.. మళ్లీ నన్ను అంటారెందుకు? అని శ్రేయస్ గట్టిగానే బదులిచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా అయ్యర్(61) సైతం హాఫ్ సెంచరీతో రాణించాడు.చదవండి: #Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. గంగూలీ ఆల్టైమ్ రికార్డు బ్రేక్Stump mic captures Rohit Sharma vs Shreyas Iyer 🤣🙌Whose call was it really?✍🏻👇#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/YipS5K9ioa— Star Sports (@StarSportsIndia) October 23, 2025 pic.twitter.com/mN9s6b7piw— crictalk (@crictalk7) October 23, 2025 -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. గంగూలీ ఆల్టైమ్ రికార్డు బ్రేక్
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును శ్రేయస్ అయ్యర్తో కలిసి రోహిత్ ఆదుకున్నాడు.తొలుత ఆచితూచి ఆడిన రోహిత్, క్రీజులో నిలదొక్కకున్నాక ప్రత్యర్ధి బౌలర్లపై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్లో 97 బంతులు ఎదుర్కొన్న హిట్మ్యాన్ 7 ఫోర్లు, 2 సిక్స్లతో 73 పరుగులు చేశాడు. సెంచరీ మార్క్ను అందుకునేలా కన్పించిన రోహిత్.. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి తన వికెట్ను కోల్పోయాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.రోహిత్ సాధించిన రికార్డులు ఇవే..👉వన్డేల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనర్గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. రోహిత్ ఇప్పటివరకు వన్డేల్లో ఓపెనర్గా 9180* పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (9146 ) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్తో గంగూలీని రోహిత్ బ్రేక్ చేశాడు. కాగా ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో సచిన్ టెండూల్కర్(15310) అగ్రస్ధానంలో ఉన్నాడు.👉ఆస్ట్రేలియా గడ్డపై ఆసీస్ జట్టుపై 1,000 కంటే ఎక్కువ వన్డే పరుగులు తొలి భారత బ్యాటర్గా రోహిత్ నిలిచాడు. ఓవరాల్గా ఐదో బ్యాటర్గా హిట్మ్యాన్ రికార్డులకెక్కాడు. అయితే ఈ ఫీట్ను అంత్యంత వేగంగా అందుకున్న రెండో బ్యాటర్ మాత్రం రోహిత్ శర్మనే కావడం గమనార్హం. రోహిత్ కేవలం 21 ఇన్నింగ్స్లలోనే ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో విండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ (19) అగ్రస్దానంలో ఉన్నాడు.👉వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ మూడో స్ధానానికి చేరుకున్నాడు. రోహిత్ ఇప్పటివరకు 11225 పరుగులు చేశాడు. ఈ క్రమంలో గంగూలీ(11221)ని రోహిత్ అధిగమించాడు.👉ఆసీస్పై వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన నాలుగో ఆటగాడిగా బ్రియాన్ లారా రికార్డును హిట్మ్యాన్ సమం చేశాడు. వీరిద్దరూ 18 హాఫ్ సెంచరీలు ఆసీస్పై సాధించారు.ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది.చదవండి: IND vs AUS: విరాట్ కోహ్లి మళ్లీ డకౌట్.. లండన్కు బ్యాగ్ సర్దుకోవాల్సిందే!? -
IND Vs AUS: ఆసీస్ చేతిలో టీమిండియా ఓటమి
IND vs Aus 2nd Odi live updates and Highlights: అడిలైడ్ వేదికగా రెండో వన్డేలో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. రెండు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓడి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్ను కోల్పోయింది. మాథ్యూ షార్ట్ (74), కూపర్ కన్నోలి (61 నాటౌట్) అద్భుత హాఫ్ సెంచరీలతో రాణించి ఆసీస్కు విజయం అందించారు. ఎనిమిదో వికెట్ డౌన్స్టార్క్ (4) రూపంలో ఆసీస్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది.ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ఏడో వికెట్గా బార్ట్లెట్ (3) వెనుదిరిగాడు. 45 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసినన ఆసీస్.. విజయానికి 30 బంతుల్లో 10 పరుగుల దూరంలో ఉంది. కన్నోలి 56, స్టార్క్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు.ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో అర్ష్దీప్ సింగ్కు క్యాచ్ ఇచ్చి మిచెల్ ఓవెన్ (36) అవుటయ్యాడు. దీంతో ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. అయితే, అర్ధ శతకంతో కూపర్ కన్నోలి జోరుమీద ఉన్నాడు. జేవియర్ బార్ట్లెట్ అతడికి సహకరిస్తున్నాడు. 43.1 ఓవర్ల ఆట ముగిసే సరికి ఆరు వికెట్లు కోల్పోయిన ఆసీస్ విజయానికి.. 41 బంతుల్లో కేవలం 16 పరుగులే అవసరం.ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్హర్షిత్ రాణా బౌలింగ్లో ఐదో వికెట్గా వెనుదిరిగాడు అర్థ శతక వీరుడు మాథ్యూ షార్ట్ (74). సిరాజ్కు క్యాచ్ ఇవ్వడంతో అతడి ఇన్నింగ్స్ ముగిసిపోగా ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. మిచెల్ ఓవెన్ క్రీజులోకి వచ్చాడు. 39 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోరు 207-5. విజయానికి 66 బంతుల్లో 58 పరుగులు కావాలి. కన్నోలి 34, మిచెల్ ఓవెన్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్26.2వ ఓవర్- 132 పరుగుల వద్ద ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో అలెక్స్ క్యారీ (9) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 30.3 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 143 పరుగులుగా ఉంది. ఈ మ్యాచ్లో ఆసీస్ గెలవాలంటే మరో 122 పరుగులు చేయాలి. మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్21.4వ ఓవర్- 109 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో మ్యాట్ రెన్షా (30) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో మాథ్యూ షార్ట్తో 50 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. షార్ట్కు (37) జతగా అలెక్స్ క్యారీ క్రీజ్లోకి వచ్చాడు.రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్12.2వ ఓవర్- 265 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ 54 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి హెడ్ (28) ఔటయ్యాడు. అంతకుముందు 8వ ఓవర్ రెండో బంతికి అర్షదీప్ సింగ్ బౌలింగ్లో కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి కెప్టెన్ మిచెల్ మార్ష్ (11) పెవిలియన్కు చేరాడు. రోహిత్, శ్రేయస్ హాఫ్ సెంచరీలు.. భారత్ స్కోర్: 264/9అడిలైడ్ వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ(73) టాప్ స్కోరర్గా నిలవగా.. శ్రేయస్ అయ్యర్(61), అక్షర్ పటేల్(44) రాణించారు. ఆఖరిలో హర్షిత్ రాణా(24), అర్ష్దీప్ సింగ్ కీలక ఇన్నింగ్స్లు ఆడారు. కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి(0), కేఎల్ రాహుల్(11) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 4 వికెట్లు పడగొట్టగా..బార్ట్లెట్ మూడు, స్టార్క్ రెండు వికెట్లు సాధించాడు.భారత్ ఎనిమిదో వికెట్ డౌన్..అడిలైడ్ వన్డేలో భారత్ ఆలౌట్ దిశగా సాగుతోంది. నితీశ్ కుమార్ రెడ్డి రూపంలో టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన నితీశ్.. ఆడమ్ జంపా బౌలింగ్లో స్టంపౌటయ్యాడు. భారత్ స్కోర్: 229-8(46 ఓవర్లు)ఏడో వికెట్ కోల్పోయిన భారత్44.1: నిలకడగా ఆడుతున అక్షర్ పటేల్ 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. జంపా బౌలింగ్లో స్టార్క్కు క్యాచ్ ఇవ్వడంతో అక్షర్ ధనాధన్ ఇన్నింగ్స్కు తెరపడింది. దీంతో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా క్రీజులోకి రాగా.. నితీశ్ రెడ్డి ఏడు పరుగులతో ఉన్నాడు. స్కోరు: 223-7(44.1)వాషీ అవుట్.. ఆరో వికెట్ డౌన్41.5: బార్ట్లెట్ బౌలింగ్లో హాజిల్వుడ్కు క్యాచ్ ఇచ్చి అవుటైన వాషింగ్టన్ సుందర్ (12). దీంతో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. నితీశ్ కుమార్ రెడ్డి క్రీజులోకి రాగా.. అక్షర్ పటేల్ 41 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 213-6(42). టీమిండియా ఐదో వికెట్ డౌన్టీమిండియా 174 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రాహుల్.. ఆడమ్ జంపా బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి వాషింగ్టన్ సుందర్ వచ్చాడు.నాలుగో వికెట్ కోల్పోయిన భారత్శ్రేయస్ అయ్యర్ (61) రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. జంపా బౌలింగ్లో అయ్యర్ బౌల్డ్. స్కోరు: 160-4(32.4). అక్షర్ 13 పరుగులతో క్రీజులో ఉన్నాడు.రోహిత్ శర్మ ఔట్..రోహిత్ శర్మ రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోంయింది. 73 పరుగులు చేసిన రోహిత్.. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి అక్షర్ పటేల్ వచ్చాడు.అయ్యర్ హాఫ్ సెంచరీ..శ్రేయస్ అయ్యర్ కూడా తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 67 బంతుల్లో అయ్యర్ తన 23వ ఆర్ధ శతకాన్ని అందుకున్నాడు. టీమిండియా స్కోరు: 94-2 (29). రోహిత్ 72 పరుగులతో క్రీజులో ఉన్నాడు.రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ21.5: కన్నోలి బౌలింగ్లో సింగిల్ తీసి అర్ధ శతకం పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ. 74 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్న హిట్మ్యాన్. వన్డేల్లో ఇది 59వ ఫిఫ్టీ. టీమిండియా స్కోరు: 94-2 (22). అయ్యర్ 33 పరుగులతో ఆడుతున్నాడు.సిక్స్లు, ఫోర్.. 17 పరుగులు19వ ఓవర్లో రోహిత్ శర్మ రెండు సిక్స్లు బాదగా.. శ్రేయస్ అయ్యర్ ఓ ఫోర్ బాదాడు. ఈ క్రమంలో మిచెల్ ఓవెన్ బౌలింగ్లో ఈ ఓవర్లో ఓవరాల్గా 17 పరుగులు వచ్చాయి. టీమిండియా స్కోరు 83-2.నిలకడగా ఆడుతున్న రోహిత్, అయ్యర్..15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(26), శ్రేయస్ అయ్యర్(13) ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.టీమిండియాకు భారీ షాక్.. కోహ్లి డకౌట్విరాట్ కోహ్లి రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. జేవియర్ బార్ట్లెట్ బౌలింగ్లో కోహ్లి వికెట్లు ముందు దొరికిపోయాడు. దీంతో ఖాతా తెరవకుండానే కోహ్లి పెవిలియన్కు చేరాడు.తొలి వికెట్ కోల్పోయిన భారత్..రెండో వన్డేలో కూడా భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ విఫలమయ్యాడు. కేవలం 9 పరుగులు మాత్రమే చేసిన గిల్.. బార్ట్లెట్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి కోహ్లి వచ్చాడు.తడబడుతున్న గిల్..6 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. ఓ వైపు శుభ్మన్ గిల్(8 బంతుల్లో 9) మంచి టచ్లో కన్పిస్తుంటే.. రోహిత్ శర్మ(28 బంతుల్లో 8) మాత్రం తడబడుతున్నాడు.అడిలైడ్ వేదికగా రెండో వన్డేలో ఆస్ట్రేలియా-భారత్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆసీస్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. తుది జట్టులోకి స్టార్ ప్లేయర్లు అలెక్స్ క్యారీ, అడమ్ జంపా వచ్చారు. మరోవైపు భారత్ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. పెర్త్లో ఆడిన జట్టునే కొనసాగించింది. కుల్దీప్ యాదవ్ మరోసారి బెంచ్కే పరిమితమయ్యాడు.తుది జట్లుఆస్ట్రేలియా : మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మాట్ రెన్షా, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కోనోలీ, మిచెల్ ఓవెన్, జేవియర్ బార్ట్లెట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్వుడ్భారత్ : రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ -
ఓపెనర్గానూ రోహిత్ శర్మపై వేటు!?.. గంభీర్, అగార్కర్ చర్య వైరల్
ఆస్ట్రేలియాతో రెండో వన్డేకు టీమిండియా స్టార్ రోహిత్ శర్మ (Rohit Sharma) సన్నద్ధమయ్యాడు. ఆప్షనల్ సెషన్లో భాగంగా నెట్స్లో తీవ్రంగా చెమటోడ్చిన హిట్మ్యాన్.. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. త్రోడౌన్స్ ఎదుర్కొంటూ బిజీబిజీగా గడిపాడు.అయితే, ప్రాక్టీస్ సెషన్ ముగించుకున్న తర్వాత రోహిత్ శర్మ మైదానాన్ని వీడే క్రమంలో ముభావంగా కనిపించడం చర్చకు దారితీసింది. ఇందుకు ప్రధాన కారణం.. హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir), చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) చర్యలే అని తెలుస్తోంది.అందుకే రోహిత్పై వేటుకెప్టెన్ హోదాలో భారత్కు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 అందించిన 38 ఏళ్ల రోహిత్ శర్మపై యాజమాన్యం ఊహించని రీతిలో వేటు వేసిన విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్-2027 టోర్నీని దృష్టిలో పెట్టుకుని రోహిత్ను తప్పించి.. అతడి స్థానంలో శుబ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించినట్లు అగార్కర్ ఆసీస్ పర్యటన జట్టు ప్రకటన సందర్భంగా తెలిపాడు.రోహిత్కు ఇష్టం లేకపోయినా..అయితే, ఇప్పటికే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ.. వన్డే కెప్టెన్గా కొనసాగాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే, కోచ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అగార్కర్ బలవంతంగానే రోహిత్ను తప్పించడంలో కీలక పాత్ర పోషించినట్లు వార్తలు వచ్చాయి.ఓపెనర్గానూ చోటివ్వరా?ఇక ఈ పరిణామాల నేపథ్యంలో.. భారత్కు రెండు ఐసీసీ టైటిళ్లు అందించిన దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డే జట్టులో ఓపెనర్గా మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే, ఆ స్థానానికీ గంభీర్- అగార్కర్ ఎసరు పెట్టినట్లు తాజా ఊహాగానాల ద్వారా తెలుస్తోంది.ఆసీస్తో రెండో వన్డేకు ముందు అడిలైడ్ ఓవల్ మైదానంలో రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్న వేళ.. గంభీర్, అగార్కర్.. యువ ఆటగాడు యశస్వి జైస్వాల్తో సుదీర్ఘ చర్చలు జరిపినట్లు సమాచారం. ఇదే రోహిత్ మూడ్ ఆఫ్ అవడానికి కారణమని రెవ్స్పోర్ట్స్ కథనం ద్వారా అర్థమవుతోంది.జైసూతో చర్చలకు అర్థం ఏమిటి?కాగా ఇప్పటికే టెస్టుల్లో ఓపెనర్గా పాతుకుపోయిన యశస్వి జైస్వాల్.. వన్డేల్లో మాత్రం అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు. రోహిత్- గిల్ వన్డే ఫార్మాట్లో ఓపెనింగ్ జోడీగా కొనసాగుతున్న నేపథ్యంలో జైసూకు ఇంత వరకు ఒకే ఒక్క వన్డే ఆడే అవకాశం వచ్చింది.అయితే, తాజాగా ఆసీస్తో వన్డే సిరీస్ నేపథ్యంలో జైస్వాల్ను బ్యాకప్ ఓపెనర్గా ఎంపిక చేశారు సెలక్టర్లు. కెప్టెన్గా తుదిజట్టులో గిల్ స్థానానికి వచ్చిన ఢోకా లేదు. మరోవైపు.. రోహిత్ కూడా పది కిలోల బరువు తగ్గి పూర్తి ఫిట్గా ఉన్నాడు. ఇలాంటి తరుణంలో గంభీర్, అగార్కర్ జైసూకు ప్రాధాన్యం ఇస్తూ చర్చలు జరపడం.. రోహిత్ అభిమానులను ఆందోళనలోకి నెట్టేసింది.భవిష్యత్తు ప్రణాళికలు అంటూ.. రోహిత్ను జట్టు నుంచే తప్పించి జైస్వాల్ ఆడిస్తారా ఏమిటి? అనే సందేహాలు ఫ్యాన్స్ను వెంటాడుతున్నాయి. ఇదిలా ఉంటే.. ప్యూర్ బ్యాటర్ అయిన జైస్వాల్.. నెట్స్లో లెగ్ స్పిన్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం గమనార్హం. గంభీర్ ఆల్రౌండర్లకే పెద్దపీట వేస్తాడన్న పేరుంది. కాబట్టి తనలోని ఆల్రౌండ్ నైపుణ్యాలతో గంభీర్ను ఆకట్టుకుని తుదిజట్టులో చోటు సంపాదించాలని జైసూ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఈ ఆప్షనల్ సెషన్కు విరాట్ కోహ్లితో పాటు గిల్ కూడా డుమ్మాకొట్టినట్లు సమాచారం.విఫలమైన రో- కోకాగా ఆసీస్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా పెర్త్లో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇరుజట్ల మధ్య గురువారం జరిగే రెండో వన్డేకు అడిలైడ్ ఓవల్ వేదిక. ఇక ఏడు నెలల తర్వాత టీమిండియా తరఫున తొలి వన్డేతో రీఎంట్రీ ఇచ్చిన రో- కో నిరాశపరిచారు. రోహిత్ 8 పరుగులే చేసి అవుట్ కాగా.. కోహ్లి డకౌట్గా వెనుదిరిగాడు. చదవండి: కోహ్లి, రోహిత్ అందుకే ఫెయిల్ అయ్యారు: టీమిండియా కోచ్ కామెంట్స్ వైరల్ -
కోహ్లి, రోహిత్ అందుకే ఫెయిల్ అయ్యారు: టీమిండియా కోచ్ కామెంట్స్
దాదాపు ఏడు నెలల తర్వాత టీమిండియా తరఫున పునరాగమనం చేసిన దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) ఊహించని రీతిలో విఫలమయ్యారు. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో ఇద్దరూ తేలిపోయారు. ఓపెనర్ రోహిత్ శర్మ 14 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ బాది ఎనిమిది పరుగులు చేయగా.. వన్డౌన్ బ్యాటర్ కోహ్లి పూర్తిగా నిరాశపరిచాడు.కోహ్లి.. తొలిసారి డకౌట్ఎనిమిది బంతులు ఎదుర్కొన్న కోహ్లి పరుగుల ఖాతా తెరవకుండానే.. మిచెల్ స్టార్క్ (Mitchell Starc) బౌలింగ్లో కూపర్ కన్నోలికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తద్వారా ఆసీస్తో వన్డేల్లో కోహ్లి తొలిసారి డకౌట్ నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో రో- కో వైఫల్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తుండగా.. టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ స్పందించిన తీరు చర్చకు దారితీసింది.కోహ్లి, రోహిత్ అందుకే ఫెయిల్ అయ్యారు‘‘వాళ్లిద్దరు ఐపీఎల్ ఆడారు. కాబట్టి రీఎంట్రీ సన్నాహకాల గురించి సందేహాలు అవసరమే లేదు. నాకు తెలిసి వాతావరణం కారణంగానే ఇలా జరిగింది. ఒకవేళ ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్కు వచ్చిన వాళ్ల టాపార్డర్కు ఇలాగే జరిగి ఉండేది.నాలుగైదుసార్ల అంతరాయం తర్వాత బ్యాటింగ్కు వెళితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. వాళ్లిద్దరు తిరిగి పుంజుకుంటారు’’ అని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు. అదే విధంగా.. ‘‘వాళ్లిద్దరు అనుభవజ్ఞులైన బ్యాటర్లు. ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చే ముందు ఇద్దరూ పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు.ఇప్పుడే వాళ్ల ప్రదర్శను జడ్జ్ చేయడం సరికాదు. ఇటీవలే వాళ్లు టెస్టుల నుంచి రిటైర్ అయ్యారు. ఆ వెంటనే ఈ సిరీస్ ఆడేందుకు వచ్చారు. ఇద్దరూ పూర్తి ఫిట్గా ఉన్నారు. సీనియర్లకు ప్రత్యేకంగా మేము ఎలాంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని సితాన్షు కొటక్ రోహిత్- కోహ్లిలను వెనకేసుకువచ్చాడు.వాళ్లిద్దరు అసలు క్రీజులోనే ఉంటేనే కదా!అయితే, కొటక్ చెప్పినట్లు రోహిత్- కోహ్లి వర్షం అంతరాయం కలిగించేంత వరకు క్రీజులోనే లేరు. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే ఇద్దరూ పెవిలియన్ చేరారు. ఈ నేపథ్యంలో.. ‘‘వాళ్లిద్దరు అసలు క్రీజులోనే ఉంటేనే కదా.. అంతరాయాల వల్ల డిస్టర్బ్ అవడానికి’’ అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.కాగా ఆసీస్- భారత్ మధ్య పెర్త్లో జరిగిన తొలి వన్డేను వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం తమకు విధించిన 131 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.చదవండి: ఆసియా కప్ భారత్దే.. కానీ నా చేతుల మీదుగానే ట్రోఫీ ఇస్తా: నఖ్వీ ఓవరాక్షన్ -
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలపై ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు
టీమిండియా తరఫున పునరాగమనంలో టీమిండియా దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) తీవ్రంగా నిరాశపరిచారు. చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 బరిలో దిగిన రో-కో తాజాగా ఆస్ట్రేలియాతో తొలి వన్డే సందర్భంగా రీఎంట్రీ ఇచ్చారు. అయితే, పెర్త్లో జరిగిన ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 14 బంతులు ఎదుర్కొని 8 పరుగులు చేయగా.. కోహ్లి మరీ ఘోరంగా విఫలమయ్యాడు.ఎనిమిది బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్గా వెనుదిరిగాడు కోహ్లి. ఆసీస్తో వన్డేల్లో కోహ్లి ఇలా సున్నా చుట్టడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan).. రోహిత్ శర్మ- విరాట్ కోహ్లిల ఆట తీరును విమర్శించాడు. గతేడాది ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (BGT) నాటి కోహ్లి వైఫల్యాలు పునరావృతం అవుతున్నాయని పేర్కొన్నాడు.ఆ వైఫల్యాలే వెంటాడుతున్నాయి.. ఇలా అయితే కష్టంకాగా బీజీటీ టెస్టు సిరీస్లో కోహ్లి ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతుల్ని ఆడబోయి దాదాపు ఎనిమిదిసార్లు అవుటైన విషయం తెలిసిందే. మరోవైపు.. రోహిత్ కూడా నాటి సిరీస్లో పూర్తిగా నిరాశపరిచాడు. అయితే, ఈ ఇద్దరు ఇప్పుడు సరికొత్తగా తిరిగివచ్చారు. టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన రో- కో వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు.ఇక ఫిట్నెస్కు మారుపేరైన కోహ్లి నెట్స్లో చెమటోడ్చి ఆస్ట్రేలియాకు చేరుకోగా.. రోహిత్ ఏకంగా పది కిలోల మేర బరువు తగ్గి మరింత ఫిట్గా తయారయ్యాడు. అయితే, ఇద్దరూ రీఎంట్రీలో విఫలం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ..‘‘ఫిట్నెస్ వేరు. మ్యాచ్ ఫిట్నెస్ వేరు. ఆసీస్తో తొలి వన్డేలో పరుగులు రాబట్టేందుకు రోహిత్ చాలా కష్టపడ్డాడు. ఇక విరాట్కేమో బీజీటీ కష్టాలు మళ్లీ తిరిగి వచ్చినట్లే కనిపిస్తోంది. అడిలైడ్, సిడ్నీ వన్డేల్లో మాత్రం వీరు కచ్చితంగా లోపాలను అధిగమించి సత్తా చాటుతారనే ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నాడు.ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడటం ఉత్తమంఇక తొలి వన్డేలో ఆసీస్ చేతిలో టీమిండియా ఓడిన నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ కీలక సూచన చేశాడు. ‘‘ఆస్ట్రేలియా వంటి దేశాల్లో పర్యటించేటపుడు.. కాస్త ముందుగానే అక్కడికి వెళ్లి ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడటం ఉత్తమం.నేరుగా వెళ్లి మ్యాచ్లు ఆడటం అంటే.. టీమిండియాకు కఠిన సవాలే. అక్కడి పిచ్ పరిస్థితులకు అంత తేలికగా అలవాటుపడలేము. బౌన్సీ పిచ్లు మనల్ని పరీక్షిస్తాయి. మన బౌలర్లు తొలి వన్డేలో సరైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేయలేకపోయారు. ఇకనైనా పొరపాట్లు సరిచేసుకుంటే బాగుంటుంది’’ అని ఇర్ఫాన్ పఠాన్ హితవు పలికాడు.చదవండి: IND vs AUS: 244 పరుగులు.. 83.84 స్ట్రైక్ రేటు! అడిలైడ్లో అదరగొట్టిన విరాట్ కోహ్లి -
244 పరుగులు.. 83.84 స్ట్రైక్ రేటు! అడిలైడ్లో అదరగొట్టిన విరాట్ కోహ్లి
టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి(Virat Kohli) తమ అంతర్జాతీయ క్రికెట్ రీ ఎంట్రీ మ్యాచ్లో నిరాశపరిచిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడు నెలల తర్వాత భారత్ తరపున ఆడిన ఈ సీనియర్ ద్వయం ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔట్ కాగా.. కోహ్లి డకౌట్గా వెనుదిరిగారు. బౌన్స్ అండ్ ఫాస్ట్ పెర్త్ పిచ్పై ఆసీస్ బౌలర్లను ఎదుర్కొవడానికి వీరిద్దరూ ఇబ్బంది పడ్డారు. హిట్మ్యాన్ జోష్ హాజిల్ వుడ్ బౌలింగ్లో ఓ బౌన్సర్ బంతికి దొరికి పోగా.. స్టార్క్ బౌలింగ్లో డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించి ఔటయ్యాడు. ఇక ఆడిలైడ్ వేదికగా జరగనున్న రెండో వన్డేలో అందరి కళ్లుపై వీరిద్దరి పైనే ఉన్నాయి. తొలి వన్డేలో విఫలమైన రో-కో అడిలైడ్లోనైనా రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఆడిలైడ్ ఓవల్లో రోహిత్, కోహ్లి ట్రాక్ రికార్డు ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.కోహ్లి రికార్డు అదుర్స్.. ఈ మైదానంలో కోహ్లికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు నాలుగు వన్డేలు ఆడిన కోహ్లి.. 61.00 సగటుతో 244 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఈ మైదానంలో అతడు చివరగా 2019లో ఆడాడు. అయితే ఈ ఓవల్ స్టేడియంలోని పిచ్ తొలుత ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించినప్పటికి.. నెమ్మదిగా స్పిన్నర్లు గేమ్లోకి వస్తారు. కాబట్టి ఈ మ్యాచ్లో కోహ్లి సత్తాచాటే అవకాశముంది. ఈ ఓవల్ మైదానంలో కోహ్లికి టెస్టుల్లో కూడా మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 5 టెస్టులు ఆడిన కింగ్ కోహ్లి.. 52.70 సగటుతో 527 పరుగులు చేశాడు. ఈ చారిత్రత్మక మైదానంలో అతడి పేరిట మూడు టెస్టు సెంచరీలు ఉన్నాయి.రోహిత్.. నో హిట్అయితే ఈ మైదానంలో గత రికార్డులు రోహిత్ శర్మను భయపెడుతున్నాయి. అడిలైడ్లో హిట్మ్యాన్ ట్రాక్ రికార్డు అస్సలు బాగోలేదు. ఇప్పటివరకు ఈ మైదానంలో 6 వన్డేలు ఆడిన ఈ మాజీ కెప్టెన్.. 21.83 సగటుతో కేవలం 131 పరుగులు మాత్రమే చేశాడు. ఇక్కడ అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 44గా ఉంది. టెస్టుల్లో కూడా రోహిత్ తన మార్క్ను చూపించలేకపోయాడు.చదవండి: 352 వికెట్లు.. 10,470 రన్స్.. కట్ చేస్తే! రిటైర్మెంట్తో షాకిచ్చిన టీమిండియా క్రికెటర్ -
ఆల్ ఫార్మాట్ గ్రేట్గా ఎదుగుతాడు: నితీశ్ రెడ్డిపై రోహిత్ శర్మ ప్రశంసలు
టీమిండియా యువ ఆల్రౌండర్ నితీశ్ కమార్ రెడ్డి (Nitish Kumar Reddy)పై భారత దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ప్రశంసలు కురిపించాడు. ఈ ఆంధ్ర ఆటగాడు మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటి ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడని పేర్కొన్నాడు.అరుదైన పేస్ బౌలింగ్ ఆల్రౌండ్ నైపుణ్యాలతో జట్టులోకి వచ్చిన నితీశ్ రెడ్డి.. ఇప్పటికే టెస్టుల్లో కీలక ఆటగాడిగా మారాడు. అంతకుముందే టీ20 ఫార్మాట్లోనూ అరంగేట్రం చేసిన ఈ విశాఖ కుర్రాడు.. తాజాగా ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్తో వన్డేల్లోనూ అడుగుపెట్టాడు.ఆల్ ఫార్మాట్ గ్రేట్గా టీమిండియా దిగ్గజ సారథి రోహిత్ శర్మ చేతుల మీదుగా వన్డే క్యాప్ అందుకున్నాడు నితీశ్ రెడ్డి. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. ‘‘క్యాప్ నంబర్ 260. నితీశ్ రెడ్డి. నీ ఆటిట్యూడ్, నైపుణ్యాలతో కెరీర్ను గొప్పగా ఆరంభించావు. ఇదే జోరును కొనసాగిస్తే వందకు 110 శాతం.. నువ్వు టీమిండియాతో సుదీర్ఘకాలం పాటు ప్రయాణం చేస్తావని చెప్పగలను. ఆల్ ఫార్మాట్ గ్రేట్గా ఎదగబోతున్నావని అనిపిస్తోంది. నీపై నాకు ఆ నమ్మకం ఉంది. ప్రతి ఫార్మాట్లోనూ ఆడాలన్న నీ కల నెరవేరింది. అందరూ నీకు తోడుగా ఉంటారునీకు జట్టు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ఆటగాడిగా నీకేం కావాలో అన్నీ సమకూరుస్తుంది. ఎప్పుడు, ఏం కావాలన్నా అందరూ నీకు తోడుగా ఉంటారు. ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తారు. గుడ్ లక్. నీ కెరీర్ గొప్పగా ఉండాలి’’ అంటూ రోహిత్ శర్మ నితీశ్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా ఆసీస్తో తొలి వన్డేలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన నితీశ్ రెడ్డి 11 బంతుల్లో రెండు సిక్సర్ల సాయంతో 19 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక ఇప్పటి వరకు టీమిండియా తరఫున టీ20 మ్యాచ్లు, తొమ్మిది టెస్టులు ఆడిన ఈ రైటార్మ్ మీడియం పేసర్.. టెస్టుల్లో ఎనిమిది, టీ20లలో మూడు వికెట్లు తీశాడు.అపుడు కోహ్లి.. ఇపుడు రోహిత్అదే విధంగా ఈ కుడిచేతి వాటం బ్యాటింగ్ ఆల్రౌండర్ ఖాతాలో టెస్టుల్లో 386, టీ20లలో 90 పరుగులు ఉన్నాయి. కాగా గతేడాది పెర్త్ వేదికగా భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి చేతుల మీదుగా టీమిండియా టెస్టు క్యాప్ అందుకున్న 22 ఏళ్ల నితీశ్ రెడ్డి.. తాజాగా అదే వేదిక మీద రోహిత్ చేతుల మీదుగా వన్డే క్యాప్ అందుకోవడం విశేషం. తన కెరీర్లో చిరస్మరణీయంగా గుర్తుండిపోయే ఈ క్షణాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.గిల్ సేనకు ఓటమిఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆసీస్తో తొలి వన్డేలో టీమిండియా ఓటమిని చవిచూసింది. వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసి తొమ్మిది వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.ఇక డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా తమ ముందు 131 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి 21.1 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా టీమిండియాపై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించి.. మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య గురువారం అడిలైడ్ వేదికగా రెండో వన్డే నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్ View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
‘అగార్కర్, గంభీర్లను తొలగిస్తేనే సరి!’.. సిగ్గు పడండి!
టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు (Navjot Singh Sidhu)కు కోపం వచ్చింది. తన గురించి అసత్య ప్రచారం చేస్తున్న వారిపై సోషల్ మీడియా వేదికగా ఈ మాజీ ఓపెనర్ మండిపడ్డాడు. ఇలాంటి నకిలీ వార్తలు ప్రచారం చేయొద్దంటూ సదరు నెటిజన్కు చురకలు అంటించాడు.అసలేం జరిగిందంటే.. టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటన (India Tour Of Australia)లో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆసీస్తో వన్డేలకు ఎంపిక చేసిన జట్టుపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్కోచ్ గౌతం గంభీర్ విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించడం.. మొహమ్మద్ షమీని కాదని హర్షిత్ రాణా (Harshit Rana)కు జట్టులో చోటివ్వడం ఇందుకు ప్రధాన కారణాలు.ఏడు వికెట్ల తేడాతో ఓటమిఈ క్రమంలో ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమి నేపథ్యంలో మరోసారి మేనేజ్మెంట్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ మ్యాచ్లో గిల్ సేన ఆసీస్ చేతిలో.. ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. వర్షం ఆటంకం కలిగించిన ఈ మ్యాచ్లో డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం విజేతను తేల్చారు.అగార్కర్, గంభీర్లను తొలగిస్తేనే సరి?ఇదిలా ఉంటే.. ఆసీస్తో వన్డేలో టీమిండియా ఓటమి తర్వాత నవజ్యోత్ సింగ్ సిద్ధు.. గంభీర్, అగార్కర్లను ఘాటుగా విమర్శించినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ దర్శనమిచ్చింది. జాడ్ ఇన్సానే అనే అకౌంట్ నుంచి ‘‘ఒకవేళ టీమిండియా వన్డే వరల్డ్కప్ గెలవాలనుకుంటే.. బీసీసీఐ అజిత్ అగార్కర్, గౌతం గంభీర్లను వీలైనంత త్వరగా తమ పదవుల నుంచి తప్పించాలి.అదే విధంగా పూర్తి గౌరవ మర్యాదలతో కెప్టెన్సీని రోహిత్ శర్మకు తిరిగి అప్పగించాలి’’ అని సిద్ధు అన్నట్లుగా ప్రచారం జరిగింది. ఇందుకు సిద్ధుతో పాటు గౌతీ, అగార్కర్ల ఫొటోలను కూడా సదరు నెటిజన్ జతచేశారు.సిగ్గు పడండిఈ విషయంపై స్పందించిన సిద్ధు.. ‘‘నేను ఎప్పుడూ ఇలాంటి మాటలు మాట్లాడలేదు. అసత్యపు వార్తలను ప్రచారం చేయకండి. అసలు ఇలాంటివి కూడా చేస్తారని అస్సలు ఊహించలేదు. సిగ్గు పడండి’’ అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. అక్టోబరు 19- నవంబరు 8 వరకు ఈ టూర్ కొనసాగుతుంది.చదవండి: నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్ -
అదేంటో.. ఎవరికీ అర్థం కాదు: DLS పద్ధతిపై గావస్కర్ విమర్శలు
ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఓటమితో ఆరంభించింది. పెర్త్ వేదికగా తొలి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. వర్షం ఆటంకం కలిగించిన కారణంగా 26 ఓవర్లకు ఈ మ్యాచ్ను కుదించగా.. భారత్ తొమ్మిది వికెట్లు నష్టపోయి 136 పరుగులు చేసింది.డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా లక్ష్యం 131 పరుగులుగా నిర్దేశించగా.. 21.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి కంగారూలు పనిపూర్తి చేశారు. తద్వారా మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆసీస్ ఆధిక్యంలో నిలిచింది.అదేంటో.. ఎవరికీ అర్థం కాదుఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డీఎల్ఎస్ (Duckworth–Lewis–Stern method) పద్ధతి ద్వారా లక్ష్యాలు ఎలా నిర్దేశిస్తారో ఎవరికీ అర్థం కాదని వాపోయాడు. ‘‘ఈ మెథడ్ అందరికీ అర్థం అవుతుందని నేను అనుకోను. అయితే, సుదీర్ఘ కాలంగా ఈ పద్ధతినే వాడుతున్నారు.ఇలా మ్యాచ్లకు వర్షాలు ఆటంకం కలిగించినపుడు.. గతంలో ఓ భారతీయుడు VJD (వి. జయదేవన్ మెథడ్)మెథడ్ను ప్రవేశపెట్టాడు. దేశవాళీ క్రికెట్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇదే ఉపయోగించేది. అయితే, ఇప్పుడు ఉపయోగిస్తున్నారో లేదో తెలియదు.ఇరుజట్లకు సమన్యాయం జరిగేలాఏదేమైనా వర్షం వల్ల మ్యాచ్కు అంతరాయం కలిగినపుడు.. ఇరుజట్లకు సమన్యాయం జరిగేలా ఉండే పద్ధతులను వాడితే బాగుంటుంది. లక్ష్యం నిర్దేశించేందుకు ప్రామాణికం ఏమిటో వివరించాల్సి ఉంటుంది’’ అని సునిల్ గావస్కర్ ఇండియా టుడేతో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.అదే విధంగా.. భారత దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఆసీస్తో తొలి వన్డేలో విఫలం కావడంపై కూడా గావస్కర్ ఈ సందర్భంగా స్పందించాడు. ‘‘టీమిండియా ఐదు నెలల క్రితమే చాంపియన్స్ ట్రోపీ గెలిచింది. జట్టు బాగుంది.రో- కో ఒక్కసారి ఫామ్లోకి వస్తేరోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తదుపరి మ్యాచ్లలో భారీగా పరుగులు రాబట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. చాన్నాళ్ల తర్వాత వారు మైదానంలో అడుగుపెట్టారు. నెట్స్లో రిజర్వు బౌలర్ల త్రోడౌన్స్ను ఎదుర్కొన్నారు. వాళ్లిద్దరు ఫామ్లోకి వస్తే టీమిండియా 300- 320 పరుగులు చేయగలదు’’ అని గావస్కర్ రో-కోకు మద్దతుగా నిలిచాడు.కాగా అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా పర్యటనకు ముందు రోహిత్ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన టీమిండియా యాజమాన్యం.. అతడి స్థానంలో శుబ్మన్ గిల్ను నయా సారథిగా ఎంపిక చేసింది. ఇక గిల్ ఇప్పటికే టెస్టు జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆసీస్- భారత్ మధ్య గురువారం జరిగే రెండో వన్డేకు అడిలైడ్ వేదిక.చదవండి: ‘నా వల్లే జట్టు ఓడింది.. ఓటమికి బాధ్యత నాదే.. తెలివిగా ఆడితే బాగుండేది’ -
నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్
ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టీమిండియా ఘోర పరాజయం (IND vs AUS 1st ODI) పాలైంది. ఏడు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) టీమిండియా యాజమాన్యం తీరుపై విమర్శలు గుప్పించాడు.పెర్త్ వన్డేలో భారత తుదిజట్టు కూర్పు సరిగ్గా లేదని.. బ్యాటింగ్ డెప్త్ కోసం బౌలింగ్ విభాగాన్ని నీరుగార్చారని అశూ మండిపడ్డాడు. వన్డే కెప్టెన్గా శుబ్మన్ గిల్ (Shubman Gill) ఆసీస్తో సిరీస్తో తన ప్రయాణం మొదలుపెట్టాడు. పెర్త్ స్టేడియంలో టాస్ ఓడిన భారత్.. ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది.రో- కో ఫెయిల్ఆసీస్ బౌలర్ల ధాటికి టీమిండియా టాపార్డర్ కుప్పకూలింది. రోహిత్ శర్మ 8, గిల్ 10 పరుగులు చేయగా.. వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (11) కూడా విఫలం కాగా.. అక్షర్ పటేల్ 31, కేఎల్ రాహుల్ 38 పరుగులతో రాణించి జట్టు పరువు కాపాడారు. ఆల్రౌండర్లలో వాషింగ్టన్ సుందర్(10), నితీశ్ కుమార్ రెడ్డి 19 (నాటౌట్) ఫర్వాలేదనిపించారు.రాణించిన మిచెల్ మార్ష్వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో టీమిండియా తొమ్మిది వికెట్లు నష్టపోయి 136 పరుగులే చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ 21.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 131 పరుగులు చేసి.. డీఎల్ఎస్ పద్ధతితో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (46 నాటౌట్), జోష్ ఫిలిప్ (37), మ్యాట్ రెన్షా (21 నాటౌట్) రాణించారు.Just when #TeamIndia needed it most! @Sundarwashi5 breaks a crucial partnership. 👏#AUSvIND 👉 1st ODI | LIVE NOW 👉 https://t.co/FkZ5L4CrRl pic.twitter.com/6e1VZmbAjz— Star Sports (@StarSportsIndia) October 19, 2025 తేలిపోయిన భారత బౌలర్లువికెట్ తీయడానికి తిప్పలు పడ్డ భారత బౌలర్లలో పేసర్ అర్ష్దీప్ సింగ్, స్పిన్నర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీశారు. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యం గురించి అశ్విన్ మాట్లాడుతూ.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ విషయంలో మేనేజ్మెంట్ తీరును తప్పుబట్టాడు.నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు‘‘వాళ్లు కేవలం ఇద్దరు స్పిన్నర్లతోనే ఎందుకు ఆడారో నేను అర్థం చేసుకోగలను. పేస్ ఆల్రౌండర్ నితీశ్ రెడ్డిని ఆడించింది బ్యాటింగ్లో డెప్త్ కోసమే. ఇక స్పిన్ ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ కూడా బ్యాటింగ్ చేయగలరు కాబట్టి నితీశ్ను వారికి జతచేశారు.కానీ ఇదేం పద్ధతి?అసలు మీరెందుకు బౌలింగ్పై దృష్టి పెట్టడం లేదు బాస్. ఇలాంటి పెద్ద మైదానాల్లో కాకపోతే కుల్దీప్ యాదవ్ ఇంకెక్కడ స్వేచ్ఛగా బౌలింగ్ చేయగలడు? ఈ పిచ్పై బంతిని తిప్పుతూ అతడు బౌన్స్ కూడా రాబట్టగలడు.అత్యుత్తమ బౌలర్లను పక్కన పెడతారా?ఏమైనా అంటే.. బ్యాటింగ్ డెప్త్ అని మాట్లాడతారు. బ్యాటింగ్ ఆర్డర్ రాణించాలంటే... బ్యాటర్లే పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది కదా! పరుగులు రాబట్టడం బ్యాటర్ల పని. అదనపు బ్యాటర్ కోసం ఆల్రౌండర్లను దించి వారి పని మరింత సులువు చేయాల్సిన అవసరం ఏముంది? జట్టులో అత్యుత్తమ బౌలర్లను పక్కనపెట్టడం ఎంత వరకు సమంజసం?కేవలం బ్యాటింగ్ ఆర్డర్ను పొడిగించుకోవడానికి తుదిజట్టు కూర్పు విషయంలో ఇలాంటి పొరపాట్లు చేయకండి’’ అని అశ్విన్.. టీమిండియా యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆసీస్- భారత్ మధ్య గురువారం రెండో వన్డేకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు అడిలైడ్ వేదిక.చదవండి: CWC 2025: ఇంగ్లండ్ చేతిలో ఓటమి.. అయినా భారత్కు సెమీస్ ఛాన్స్! ఇలా జరగాల్సిందే? -
సోదరా... రోహిత్కు పాప్కార్న్ ఇవ్వకు: అభిషేక్
భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే సందర్భంగా జరిగిన ఓ సంఘటన చర్చనీయాంశమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో శుబ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. వర్షం కారణంగా మ్యాచ్కు పలుమార్లు అంతరాయం వాటిల్లగా... చివరకు 26 ఓవర్లకు కుదించాల్సి వచ్చింది.అయితే మ్యాచ్కు పదేపదే వర్షం ఆటంకం కల్పించినప్పుడు ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్లో సేదతీరుతూ కనిపించారు. ఆ సమయంలో వ్యాఖ్యాతగా ఉన్న టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తన స్నేహితుడైన రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ శుబ్మన్ గిల్తో కలిసి పాప్కార్న్ తింటున్న రోహిత్ను చూస్తూ... ‘అరే భాయ్ ఉసే పాప్కార్న్ మత్ దే’ (సోదరా అతడికి పాప్కార్న్ ఇవ్వకు) అంటూ కామెంట్ చేశాడు.టెస్టు, టి20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ... ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు జట్టులో కొనసాగాలని భావిస్తున్న హిట్మ్యాన్... ఇటీవల ఫిట్నెస్పై ప్రత్యేక దృష్టి పెట్టాడు. చాంపియన్స్ ట్రోఫీ విజయం అనంతరం వచ్చిన విరామంలో... ఏకంగా 11 కేజీల బరువు తగ్గాడు. దీనిపై మ్యాచ్కు ముందు అభిషేక్ మాట్లాడుతూ... ‘రోహిత్ పూర్తిగా మారిపోయాడు. మరింత ఫిట్గా, మరింత దృఢంగా మారాడు. ఫిట్నెస్ పెంపొందించుకుంటే... నైపుణ్యం దానంతటదే పెరుగుతుంది. ఈ విషయంలో రోహిత్ చాలా కష్టపడ్డాడు. ఇదంతా 2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకునే కావచ్చు. అప్పటి వరకు ఆటలో కొనసాగాలంటే మొదట తన బరువు తగ్గించుకోవాలని రోహిత్ బలంగా అనుకున్నాడు. దాని వల్లే ఇదంతా సాధ్యమైంది. ఇప్పుడతడు నవ యువకుడిలా కనిపిస్తున్నాడు’ అని అన్నాడు.చదవండి: CWC 2025: ఇంగ్లండ్ చేతిలో ఓటమి.. అయినా భారత్కు సెమీస్ ఛాన్స్! ఇలా జరగాల్సిందే? -
టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్.. కోహ్లి సరసన గిల్
వన్డే క్రికెట్లో టీమిండియా (Team India) జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఈ ఏడాది రోహిత్ శర్మ సారథ్యంలో వరుసగా 8 మ్యాచ్ల్లో గెలిచిన భారత జట్టు.. శుభ్మన్ గిల్ (Shubman Gill) నేతృత్వంలో తొలి పరాజయాన్ని ఎదుర్కొంది.పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో (India vs Australia) భారత్ 7 వికెట్ల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్దతిలో) ఓటమిపాలైంది. వన్డేల్లో దాదాపుగా రెండేళ్ల తర్వాత భారత్కు ఇది తొలి పరాజయం. భారత్ చివరిగా 2023 డిసెంబర్ 19న సౌతాఫ్రికా చేతిలో ఓడింది.లేట్గా పలకరించిన పరాజయంఈ ఏడాది వన్డేల్లో భారత్ను పరాజయం చాలా లేట్గా పలకరించింది. 1991 తర్వాత ఓ ఏడాది అత్యంత లేట్గా పలకరించిన పరాజయం ఇది. నాడు భారత్కు తొలి వన్డే పరాజయం అక్టోబర్ 23న ఎదురైంది.టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ వేసిన గిల్వన్డేల్టో టీమిండియా జైత్రయాత్రకు శుభ్మన్ గిల్ బ్రేక్లు వేశాడు. భారత వన్డే జట్టుకు రెగ్యులర్ కెప్టెన్గా గిల్ తన ప్రయాణాన్ని ఓటమితో ప్రారంభించాడు.కోహ్లి సరసన గిల్ఈ ఓటమితో గిల్ మరో అప్రతిష్టను కూడా మూటగట్టుకున్నాడు. విరాట్ కోహ్లి తర్వాత మూడు ఫార్మాట్లలో తొలి మ్యాచ్లో ఓటమిపాలైన భారత కెప్టెన్గా చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. పెర్త్లో కొత్తగా నిర్మించిన ఓపస్ స్టేడియంలో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. వర్షం అంతరాయాల నడుమ 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 136 పరుగులకే పరిమితమైంది. అనంతరం ఆసీస్ 21.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్ మార్ష్ (46 నాటౌట్) ఆసీస్ను విజయతీరాలకు చేర్చాడు. భారత్ తరఫున కేఎల్ రాహుల్ (38) టాప్ స్కోరర్గా నిలువగా.. ఆఖర్లో అరంగేట్రం ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.నాలుగు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ) రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) ఈ మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యారు. ఫుల్టైమ్ వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్ (10) కూడా తొలి మ్యాచ్లో నిరాశపరిచాడు.ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమన్ తలో 2 వికెట్లు తీయగా.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్లో రెండో వన్డే అక్టోబర్ 23న అడిలైడ్ వేదికగా జరుగనుంది. కాగా, భారత జట్టు 3 మ్యాచ్ల వన్డే సిరీస్, 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.చదవండి: Test Twenty: క్రికెట్లో సరికొత్త ఫార్మాట్.. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం -
రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. సచిన్, ధోనిల సరసన
టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ(Rohit Sharma) అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 500 మ్యాచ్ల మైలు రాయిని అందుకున్నాడు. ఆదివారం పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి వన్డే సందర్భంగా రోహిత్ ఈ ఫీట్ను నమోదు చేశాడు. ఈ ఫీట్ అందుకున్న ఐదో భారత క్రికెటర్గా హిట్మ్యాన్ నిలిచాడు.ఈ జాబితాలో దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోని లు ఉన్నారు. 38 ఏళ్ల రోహిత్ భారత తరపున ఇప్పటివరకు 274 వన్డేలు, 67 టెస్టులు,159 టీ20లు ఆడాడు. గత ఏడాది జూన్లో టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్.. నాలుగు నెలల కింద టెస్టుల నుంచి తప్పుకొన్నాడు. ఈ ముంబైకర్ ప్రస్తుతం కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ తన అంతర్జాతీయ కెరీర్లో 19,708 పరుగులు చేశాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 264(వన్డేల్లో)గా ఉంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజయం తర్వాత రోహిత్ భారత్ తరపున ఆడుతున్న తొలి మ్యాచ్ ఇది. అయితే ఈ మ్యాచ్లో రోహిత్ తీవ్ర నిరాశపరిచాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.500 పైగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన టీమిండియా ప్లేయర్స్ వీరే👉 సచిన్ టెండూల్కర్ – 664 మ్యాచ్లు👉విరాట్ కోహ్లి – 551 మ్యాచ్లు👉ఎంఎస్ ధోని – 535 మ్యాచ్లు👉 రాహుల్ ద్రవిడ్ – 504 మ్యాచ్లు👉రోహిత్ శర్మ – 500 మ్యాచ్లుచదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన నితీశ్ కుమార్ రెడ్డి.. 93 ఏళ్లలో ఒకే ఒక్కడు -
చెత్త షాట్ ఆడి ఔట్.. కట్ చేస్తే! పాప్ కార్న్ తింటూ రిలాక్స్(వీడియో)
టీమిండియా టెస్టు కెప్టెన్సీని అద్బుతమైన సెంచరీతో ఆరంభించిన శుభ్మన్ గిల్.. వన్డేల్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోయాడు. భారత వన్డే సారథిగా తొలి మ్యాచ్లో గిల్ విఫలమయ్యాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో గిల్ కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఔటైన సమయంలో బాధ్యతయతంగా ఆడాల్సిన గిల్.. పేలవ షాట్ ఆడి తన వికెట్ను కోల్పోయాడు. భారత ఇన్నింగ్స్ 9 ఓవర్ వేసిన నాథన్ ఈల్లీస్.. తొలి బంతిని గిల్కు లైగ్ సైడ్ డెలివరీగా సంధించాడు. బౌలర్ ట్రాప్లో పడ్డ గిల్ ఆ డెలివరీని డౌన్ది లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు.కానీ షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో వికెట్ కీపర్ ఫిలిప్ తన ఎడమ వైపునకు డైవ్ చేస్తూ క్యాచ్ను అందుకున్నాడు. అయితే గిల్ ఔటయ్యాక మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిన గిల్.. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి పాప్ కార్న్ తింటూ రిలాక్స్గా కన్పించాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు కొంచెం బాధ లేకుండా పాప్ కార్న్ తింటూ రిలాక్స్ అవుతున్నావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ 48 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. వర్షం కారణంగా మ్యాచ్ను 32 ఓవర్లకు కుదించారు. ఇంకా 17 ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ(8), విరాట్ కోహ్లి(0), శ్రేయస్ అయ్యర్(11) తీవ్ర నిరాశపరిచారు.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన నితీశ్ కుమార్ రెడ్డి.. 93 ఏళ్లలో ఒకే ఒక్కడు😭😭 #RohitSharma𓃵 #ShubmanGillpic.twitter.com/DCNj5q3Spu— 𝓗𝓲𝓽𝓶𝓪𝓷 (@Slefless45) October 19, 2025 -
రీ ఎంట్రీలో అట్టర్ ప్లాప్.. విరాట్ కోహ్లి డకౌట్! ఇలా అయితే కష్టమే?
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) తన రీ ఎంట్రీ మ్యాచ్లో ఘోరంగా విఫలమయ్యాడు. ఆతృతగా ఎదురు చూసిన అభిమానులను కింగ్ కోహ్లి తీవ్ర నిరాశపరిచాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో విరాట్ డకౌటయ్యాడు. 8 బంతులు ఆడిన కోహ్లి తన పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు.కెప్టెన్ రోహిత్ శర్మ త్వరగా ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన కోహ్లి ఇన్నింగ్స్ను చక్కదిద్దుతాడని అంతా భావించారు. కానీ ఈ ఢిల్లీ ఆటగాడు అందరి అంచనాలను తారుమారు చేశాడు. తను ఎదుర్కొన్న తొలి బంతి నుంచే అతడు ఇబ్బంది పడుతూ కన్పించాడు. వరుసుగా ఏడు బంతుల్లో సింగిల్ రన్ కూడా రాకపోవడంతో విరాట్పై ఒత్తడి పెరిగింది. ఈ క్రమంలో 7 ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్ తొలి బంతిని ఆఫ్ స్టంప్కు వెలుపుల లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని కోహ్లి డ్రైవ్ ఆడాలని ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బ్యాక్వర్డ్ పాయింట్లో కూపర్ కొన్నోలీ అద్బుతమైన క్యాచ్ను అందుకున్నాడు. దీంతో కోహ్లి డకౌట్గా మైదానాన్ని వీడాడు. ఆస్ట్రేలియాపై వన్డేల్లో కోహ్లి డకౌట్ కావడం ఇదే తొలిసారి.అయితే వన్డే ప్రపంచకప్-2027లో ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న విరాట్ కోహ్లి.. ఈ తరహా ప్రదర్శనలు కనబరిస్తే భారత జట్టులో చోటు గల్లంతే అని చెప్పుకోవాలి. ఫిట్నెస్ పరంగా అతడికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ వరల్డ్కప్ టోర్నీకి ఇంకా రెండేళ్ల సమయం ఉండడంతో అప్పటివరకు అతడు ఫామ్ ఎలా ఉంటుందన్నది ప్రశ్నర్థకంగా మారింది. మరోవైపు యువ ఆటగాళ్ల నుంచి కోహ్లి తీవ్ర పోటీ ఎదురు అవుతోంది. దీంతో కనీసం మిగిలిన రెండు వన్డేల్లోనైనా అతడు సత్తాచాటాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరోవైపు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం తన రీఎంట్రీలో నిరాశపరిచాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.చదవండి: IND vs AUS: ఏంటి రోహిత్ ఇంత చెత్తగా ఆడావు..? ఎన్నో ఆశలు పెట్టుకున్నాముగాMitchell Starc gets Virat Kohli. pic.twitter.com/zsdEltOHRe— Mufaddal Vohra (@mufaddal_vohra) October 19, 2025 -
ఏంటి రోహిత్ ఇంత చెత్తగా ఆడావు..? ఎన్నో ఆశలు పెట్టుకున్నాముగా
టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ(Rohit sharma) తన పునరాగమనంలో తీవ్ర నిరాశపరిచాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.7 నెలల తర్వాత భారత జట్టులోకి హిట్మ్యాన్పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.కానీ అందరి ఆశలను ఈ మాజీ కెప్టెన్ ఆడియశలు చేశాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొవడానికి రోహిత్ ఇబ్బంది పడ్డాడు. మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్లు బౌన్సర్లతో రోహిత్ను భయపెట్టారు.భారత్ ఇన్నింగ్స్ 4 ఓవర్ వేసిన హేజిల్వుడ్ బౌలింగ్లో రోహిత్ స్లిప్స్లో దొరికిపోయాడు. ఆ ఓవర్లో నాలుగో బంతిని హేజిల్వుడ్ షార్ట్ ఆఫ్ గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. బౌన్స్ ఎక్కువగా ఉండడంతో ఆ బంతిని రోహిత్ ఆడకుండా వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ బంతిని ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్లో ఉన్న మాట్ రెన్షా చేతికి వెళ్లింది. దీంతో 14 బంతులు ఆడి కేవలం 8 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ శర్మ.. మైదానం వీడాల్సి వచ్చింది. పెర్త్లో మంచి ట్రాక్ రికార్డు ఉన్న రోహిత్ శర్మ.. ఈ విధంగా ఔట్ అవ్వడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఏంటి రోహిత్ ఇంత చెత్తగా ఆడావు అని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. కాగా ఆసీస్ పర్యటనకు ముందు రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్దానంలో శుభ్మన్ గిల్కు జట్టు పగ్గాలను అప్పగించారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్కు భారత్ తరపున ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం. టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు.తుది జట్లుభారత్: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మాట్ రెన్షా, కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్వుడ్చదవండి: కొంచెం కూడా సిగ్గు లేదు.. జింబాబ్వేను బ్రతిమాలుకున్న పాకిస్తాన్ -
ఆసీస్తో తొలి వన్డే.. టీమిండియా ఓటమి
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. వరుణుడి అంతరాయాల నడుమ 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది.వికెట్కీపర్ కేఎల్ (38), అక్షర్ పటేల్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖరి ఓవర్లో అరంగేట్రం ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) రెండు సిక్సర్లు బాది గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.నాలుగు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ) రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) దారుణంగా విఫలమయ్యారు. ఫుల్టైమ్ వన్డే కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే శుభ్మన్ గిల్ (10) నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (11) పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు.అనంతరం డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆసీస్ లక్ష్యాన్ని అన్నే ఓవర్లలో 131 పరుగులకు కుదించారు. ఆసీస్ 21.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్ మార్ష్ (46 నాటౌట్), రెన్షా (21 నాటౌట్) ఆసీస్ను విజయతీరాలకు చేర్చారు. రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్7.5వ ఓవర్- 44 పరుగుల వద్ద ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో రోహిత్ శర్మ క్యాచ్ పట్టడంతో మాథ్యూ షార్ట్ (8) ఔటయ్యాడు.తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్26 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. అయితే డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆసీస్ లక్ష్యాన్ని అన్నే ఓవర్లలో 131 పరుగులకు కుదించారు. ఛేదనను ఆసీస్ ఘనంగా ప్రారంభించింది. సిరాజ్ వేసిన తొలి ఓవర్లో హెడ్ రెండు బౌండరీలు బాదాడు. అయితే రెండో ఓవర్లో ఆసీస్కు షాక్ తగిలింది. అర్షదీప్ సింగ్ బౌలింగ్లో హర్షిత్ రాణాకు క్యాచ్ ఇచ్చి హెడ్ (8) ఔటయ్యాడు. స్వల్ప స్కోర్కే పరిమితమైన భారత్పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. వరుణుడి ఆటంకాల నడుమ 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. వికెట్కీపర్ కేఎల్ (38), అక్షర్ పటేల్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖరి ఓవర్లో నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) రెండు సిక్సర్లు బాది గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) దారుణంగా విఫలమయ్యారు. ఫుల్టైమ్ వన్డే కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే శుభ్మన్ గిల్ (10) నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (11) పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. వాషింగ్టన్ సుందర్ 10, హర్షిత్ రాణా 1, అర్షదీప్ సింగ్ డకౌటయ్యారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమన్ తలో 2 వికెట్లు తీయగా.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు.ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా19.6వ ఓవర్- 84 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. కుహ్నేమన్ బౌలింగ్లో రెన్షాకు క్యాచ్ ఇచ్చి అక్షర్ పటేల్ (310 ఔటయ్యాడు. రాహుల్కు (17) జతగా వాషింగ్టన్ సుందర్ క్రీజ్లోకి వచ్చాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ 26 ఓవర్లకు కుదించిన విషయం తెలిసిందే. భారత్ నాలుగో వికెట్ డౌన్..శ్రేయస్ అయ్యర్ రూపంలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన అయ్యర్.. జోష్ హాజిల్వుడ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్ పటేల్(10), కేఎల్ రాహుల్(0) ఉన్నారు. మరి కాసేపట్లో ఆట మొదలుమరో 10 నిమిషాల్లో ఆట తిరిగి ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్ను వర్షం కారణంగా 35 ఓవర్లకు కుదించారు. ప్రస్తుతం భారత్ మూడు వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది.మరోసారి వర్షం అడ్డంకి..పెర్త్ వన్డేకు వరుణుడు మరోసారి అంతరాయం కలిగించాడు. భారత్ స్కోర్ 37/3 వద్ద ఉండగా.. వర్షం రావడంతో ఆటను నిలిపివేశారు.11 ఓవర్లకు భారత్ స్కోర్: 35/311 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 35 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్ పటేల్(6), శ్రేయస్ అయ్యర్(6) ఉన్నారు.వర్షం అటంకి..తొలి వన్డేకు వరుణుడు అంతరాయం కలిగించాడు. వర్షం కారణంగా ఆట నిలిచే పోయే సమయానికి భారత్ స్కోర్: 25/3.కెప్టెన్ గిల్ ఔట్.. భారత్కు వరుస షాక్లు తగిలాయి. కెప్టెన్ గిల్ ఔట్. ఇన్నింగ్స్లో 10 పరుగులు చేసిన గిల్.. ఇల్లీస్ బౌలింగ్లో ఔటయ్యాడు. కింగ్ కోహ్లీ ఔట్..భారత్ మరో షాక్ తగిలింది. రోహిత్ బాటలోనే కింగ్ కోహ్లీ కూడా వెనుదిరిగాడు. స్టార్క్ బౌలింగ్లో కోహ్లీ.. క్యాచ్ అవుటయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో కోహ్లీ డకౌట్ అయ్యాడు. రోహిత్ శర్మ ఔట్..టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు. 4 ఓవర్లకు భారత్ స్కోర్: 14/1ఆచితూచి ఆడుతున్న ఓపెనర్లు..3 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా13 పరుగులు చేసింది. క్రీజులో శుభ్మన్ గిల్(5), రోహిత్ శర్మ(8) ఉన్నారు.బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్..పెర్త్ వేదికగా తొలి వన్డేలో ఆస్ట్రేలియా-భారత్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో భారత్ తరపున నితీశ్ కుమార్ రెడ్డి వన్డే అరంగేట్రం చేశాడు. అదేవిధంగా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు ఆల్రౌండర్లతో టీమిండియాకు బరిలోకి దిగింది.మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్లు ఫాస్ట్ బౌలర్లగా చోటు దక్కించుకున్నారు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. అయితే స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు చోటు దక్కలేదు.రోహిత్, విరాట్ కోహ్లి తిరిగి జట్టులోకి వచ్చారు. మరోవైపు ఆసీస్ తరపున ఇద్దరు ఆటగాళ్లు డెబ్యూ చేశారు. మాట్ రెన్షా, మిచెల్ ఓవెన్లకు వన్డే క్యాప్లను అందించారు.తుది జట్లుభారత్: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మాట్ రెన్షా, కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్వుడ్ -
ఆసీస్తో తొలి వన్డే.. రోహిత్, కోహ్లి ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..!
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్కు సమయం అసన్నమైంది. పెర్త్ వేదికగా ఆదివారం జరగనున్న తొలి వన్డేలో ఇరు జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. శుభ్మన్ గిల్ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగనుండగా.. ఆస్ట్రేలియా మిచెల్ మార్ష్ కెప్టెన్సీలో ఆడనుంది.అందరి దృష్టి భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma) పైనే ఉన్నాయి. వీరిద్దరూ దాదాపు ఏడు నెలల తర్వాత బ్లూ జెర్సీలో కన్పించనున్నారు. దీంతో రో-కో ద్వయం ఎలా ఆడుతారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే టీమిండియా ఫ్యాన్స్కు ఓ బ్యాడ్ న్యూస్.పెర్త్ వేదికగా జరగనున్న తొలి వన్డేకు వర్షం ముప్పు పొంచి ఉంది. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ జరిగే సమయంలో వరుణుడు పలు మార్లు ఆటకు అంతరాయం కలిగించే అవకాశముంది. వర్షం పడేందుకు 35 శాతానికి పైగా అస్కారం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం కూడా అక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి.అయితే వర్షం కారణంగా పూర్తిగా రద్దు అయ్యే సూచనలు అయితే కన్పించడం లేదు. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెర్త్ స్టేడియంలోని పిచ్ ఫాస్ట్ బౌలర్లకు స్వర్గధామమే అనే చెప్పుకోవాలి. కాబట్టి భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్చదవండి: ప్లే ఆఫ్స్కు చేరిన తెలుగు టైటాన్స్ -
IND vs AUS: కెప్టెన్సీ నుంచి తొలగిస్తారని భయపడ్డా: సూర్యకుమార్
భారత క్రికెట్ జట్టు యువ రక్తంతో నిండిపోతోంది. ఇప్పటికే టెస్టు, వన్డే ఫార్మాట్లలో కెప్టెన్సీ మార్పు కూడా జరిగింది. టెస్టులకు రోహిత్ శర్మ (Rohit Sharma) స్వచ్ఛందంగా రిటైర్మెంట్ ప్రకటించగా.. వన్డే కెప్టెన్సీ నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి అతడిని తప్పించింది.ఇక ఈ రెండు ఫార్మాట్లలోనూ రోహిత్ శర్మ స్థానాన్ని యువ ఆటగాడు శుబ్మన్ గిల్ (Shubman Gill) భర్తీ చేశాడు. ఇప్పటికే టెస్టు సారథిగా ఇంగ్లండ్ పర్యటనలో సిరీస్ను 2-2తో సమం చేసిన గిల్.. ఇటీవల స్వదేశంలో వెస్టిండీస్తో సిరీస్ను 2-0తో వైట్వాష్ చేశాడు.త్వరలోనే టీ20 పగ్గాలు కూడా అతడికేఈ క్రమంలో వన్డే సారథిగా తొలి ప్రయత్నంలోనే ఆస్ట్రేలియా పర్యటన రూపంలో గిల్కు కఠిన సవాలు ఎదురుకానుంది. ఇదిలా ఉంటే.. మూడు ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ ఉండాలని భావిస్తున్నామని.. త్వరలోనే టీ20 పగ్గాలు గిల్కు అప్పగిస్తామని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవల సంకేతాలు ఇచ్చాడు.ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘గిల్ రెండు ఫార్మాట్లకు కెప్టెన్ కావడం పట్ల సంతోషంగా ఉంది. తను అద్భుతంగా ఆడుతున్నాడు. అయితే, టీ20 కెప్టెన్సీ విషయంలో నేను అబద్ధం చెప్పను.కెప్టెన్సీ చేజారుతుందనే భయంఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా కెప్టెన్సీ చేజారుతుందనే భయం ఉంటుంది. అయితే, ఆ భయం నుంచే నన్ను నేను మరింత మెరుగుపరచుకోవాలనే ప్రేరణ కూడా వస్తుంది. మైదానం లోపల, వెలుపల గిల్తో నా రిలేషన్ అత్యద్భుతంగా ఉంది. సోదర భావంతో మెలుగుతాం.మనిషిగా, ఆటగాడిగా తను ఎలాంటివాడో నాకు పూర్తిగా తెలుసు. తను ఈ స్థాయికి చేరడం పట్ల సంతోషంగా ఉంది. అందరికీ అతడు స్ఫూర్తిగా నిలిచాడు కూడా!’’ అని సూర్యకుమార్ యాదవ్ తన మనసులోని భావాలు పంచుకున్నాడు. కాగా అక్టోబరు 18- నవంబరు 8 వరకు ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు జరుగుతాయి.ఆసియా కప్ విజేతగాఇందుకోసం గిల్ సారథ్యంలోని వన్డే జట్టు ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకోగా.. సూర్య సేన టీ20 సిరీస్కు ముందు అక్కడికి చేరుకుంటుంది. కాగా ఆసియా కప్ టీ20- 2025 టోర్నీలో సూర్యకుమార్ కెప్టెన్సీలో టీమిండియా ఇటీవలే చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే.చదవండి: రోహిత్ శర్మతో విభేదాలు!.. స్పందించిన శుబ్మన్ గిల్ -
రోహిత్ శర్మతో విభేదాలు!.. స్పందించిన శుబ్మన్ గిల్
టీమిండియా వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మ (Rohit Sharma) విజయశాతం 75. ఆటగాడిగానూ యాభై ఓవర్ల ఫార్మాట్లో హిట్మ్యాన్కు తిరుగులేదు. రెండేళ్ల క్రితం వన్డే వరల్డ్కప్లో భారత్ను ఫైనల్కు చేర్చిన రోహిత్.. ఇటీవలే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025) గెలిచాడు. రానున్న వన్డే వరల్డ్కప్లోనూ అతడే టీమిండియాకు సారథ్యం వహిస్తాడని అంతా అనుకున్నారు.పది కిలోల బరువు తగ్గి అందుకు అనుగుణంగానే ఇప్పటికే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు గుడ్బై చెప్పిన రోహిత్.. ఇటీవలే టెస్టులకూ రిటైర్మెంట్ ప్రకటించాడు. తద్వారా తన దృష్టి మొత్తం వన్డేలపైనే ఉంటుందని చెప్పకనే చెప్పాడు. అంతేకాదు.. 38 ఏళ్ల రోహిత్ ఇటీవలే పది కిలోల బరువు కూడా తగ్గి మునుపటి కంటే కూడా మరింత ఫిట్గా తయారయ్యాడు.అయితే, అనూహ్య రీతిలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది. అతడి స్థాయంలో యువ ఆటగాడు, టెస్టు సారథి అయిన శుబ్మన్ గిల్కే వన్డే జట్టు బాధ్యతలూ అప్పగించింది. వన్డే వరల్డ్కప్-2027ను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్న ట్లు బోర్డు తెలిపింది. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్తో పాటు గిల్తోనూ రోహిత్కు విభేదాలు తలెత్తాయనే ప్రచారం జరిగింది.రెండింటికీ చాలా తేడా ఉంటుందిఈ క్రమంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు శనివారం మీడియాతో మాట్లాడిన గిల్.. ఈ విషయంపై స్పందించాడు. ‘‘బయట మా గురించి జరుగుతున్న ప్రచారానికి, అంతర్గత విషయాలకు చాలా తేడా ఉంటుంది. మా మధ్య ఉన్న బంధాన్ని ఎవరూ చెరిపివేయలేరు.ఇంతకు ముందు మేమెలా కలిసి ఉన్నామో.. ఇప్పుడూ అలాగే ఉన్నాము. అతడు పూర్తి సహాయసహకారాలు అందించే వ్యక్తి. ఇన్నేళ్ల అనుభవం కారణంగా.. నేనేదైనా తప్పు చేసినట్లు భావిస్తే.. నా తప్పులను సరిదిద్దుతాడు. ఒకవేళ నాకు ఆయన సలహాలు అవసరమని భావిస్తే.. తప్పక అడుగుతా.అంతిమ నిర్ణయం నాదేప్రతి ఒక్కరి ఆలోచనలను నేను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తా. అలాగే మ్యాచ్ విషయంలో పరిస్థితులకు అనుగుణంగా నేనే అంతిమ నిర్ణయం తీసుకుంటా. రోహిత్ భాయ్, విరాట్ భాయ్తో నాకు మంచి రిలేషన్ ఉంది.నాకు ఏవైనా సందేహాలు వస్తే.. వారి సలహాలు తీసుకుంటా. నాకు సహాయం చేసేందుకు వాళ్లు కూడా ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు’’ అని శుబ్మన్ గిల్ తెలిపాడు. తద్వారా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు. కాగా రోహిత్ పాటు టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి వన్డేల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.చదవండి: IND vs AUS: జట్లు, షెడ్యూల్, వేదికలు, టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
సెలక్షన్ విషయంలో ద్రవిడ్తో విభేదాలు.. మా నిర్ణయమే ఫైనల్: అగార్కర్
టీమిండియా హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) తనదైన ముద్ర వేశాడు. రెండున్నరేళ్ల పాటు అతడి మార్గదర్శనంలో ముందుకు సాగిన భారత జట్టు టీ20 ప్రపంచకప్-2024 రూపంలో ఐసీసీ టైటిల్ గెలిచింది. అంతకుముందు.. వన్డే వరల్డ్కప్-2023 టోర్నీలో అజేయంగా ఫైనల్కు చేరి.. రన్నరప్గా నిలిచింది.ఇక ద్రవిడ్ జట్టులో నింపిన స్ఫూర్తి కారణంగానే తాము టీ20 ప్రపంచకప్తో పాటు.. తాజాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ కూడా గెలిచామని టీమిండియా తాజా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఇటీవలే వెల్లడించాడు. ద్రవిడ్ భాయ్ తమలో గెలవాలన్న పట్టుదలను మరింత పెంచి జట్టు బంగారు భవిష్యత్తుకు బాటలు వేశాడని పేర్కొన్నాడు. ఏదేమైనా రోహిత్- ద్రవిడ్ కాంబోలో టీమిండియా మంచి ఫలితాలు రాబట్టిందని చెప్పవచ్చు.ద్రవిడ్తో మాకు విభేదాలుభారత క్రికెట్లో ద్రవిడ్కు సౌమ్యుడనే పేరుంది. ఈ మాజీ కెప్టెన్ కెరీర్లో వివాదాలకు తావులేదు. అయితే, అలాంటి ద్రవిడ్ కోచ్గా మారిన తర్వాత మాత్రం జట్టు విషయంలో తగ్గేదేలే అన్నట్లు సెలక్టర్లతో వాదనలకు దిగేవాడట. తన ప్రణాళికలు, వ్యూహాలకు అనుగుణంగా జట్టు కూర్పు ఉండాల్సిందేనని పట్టుబట్టేవాడట.టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) తాజాగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘రాహుల్ ద్రవిడ్ నాకు ప్రియమైన స్నేహితుడు. అయితే, అతడు కోచ్గా ఉన్న సమయంలో మా మధ్య విభేదాలు వచ్చిన మాట వాస్తవం. అవి తగువులాటలు అని నేను చెప్పను.మా నిర్ణయమే ఫైనల్కానీ ఇద్దరి మధ్య కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు వచ్చేవి. కొన్ని విషయాల్లో తను అనుకున్నట్లే జరగాలని ద్రవిడ్ పట్టుబట్టేవాడు. ఏదేమైనా జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే మా ఆలోచనలు ఉండేవి.జట్టు ఎంపిక పూర్తిగా మా నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ఇంతకు ముందు రాహుల్.. ఇప్పుడు గంభీర్.. గతంలో రోహిత్.. ఇప్పుడు శుబ్మన్.. ఇలా కోచ్లు, కెప్టెన్లుగా ఎవరున్నా సరే.. వారికి కూడా జట్టు ఎంపిక విషయంలో జోక్యం కల్పిస్తాం. వారితో చర్చించిన తర్వాతే ఓ నిర్ణయానికి వస్తాం.మా పని అదేకోచ్, కెప్టెన్ పని సులువు చేసే విధంగా అత్యుత్తమైన పదిహేను మంది ఆటగాళ్లను ఎంపిక చేయడమే మా పని. ఒకవేళ కోచ్, కెప్టెన్ను గనుక సెలక్షన్ విషయంలో భాగం చేయకపోతే.. అంతకంటే తెలివితక్కువతనం మరొకటి ఉండదు’’ అని అగార్కర్ పేర్కొన్నాడు.కాగా టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. అక్టోబరు 19- నవంబరు 8 వరకు ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, ఈ సిరీస్కు ముందే కెప్టెన్గా రోహిత్ను తప్పించిన యాజమాన్యం.. గిల్కు వన్డే పగ్గాలూ అప్పగించింది. ఇక ఇప్పటికే అతడు టెస్టు సారథిగా జట్టును ముందుకు నడిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, వన్డే కెప్టెన్గా రోహిత్ను తొలగించిన నేపథ్యంలో గంభీర్తో పాటు అగార్కర్పైనా విమర్శలు వెల్లువెత్తాయి.చదవండి: IND vs AUS: జట్లు, షెడ్యూల్, వేదికలు, టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
25 ఫోర్లు, 8 సిక్స్లు.. పెర్త్లో బౌలర్లను ఉతికారేసిన రోహిత్ శర్మ!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ఆదివారం (అక్టోబర్ 19) నుంచి ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య తొలి వన్డే పెర్త్ వేదికగా జరగనుంది. ఇప్పటికే పెర్త్కు చేరుకున్న భారత జట్టు నెట్ ప్రాక్టీస్లో తీవ్రంగా శ్రమిస్తోంది.మరోవైపు ఆస్ట్రేలియా కూడా తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంది. రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ గాయం కారణంగా ఈ సిరీస్కు దూరం కావడంతో ఆసీస్ జట్టు పగ్గాలను మిచెల్ మార్ష్ చేపట్టాడు. ఇక మొన్నటివరకు టీమిండియా వన్డే కెప్టెన్గా వ్యవహరించిన రోహిత్ శర్మ.. ఇప్పడు కేవలం ఆటగాడిగా మాత్రమే బరిలోకి దిగనున్నాడు. భారత వన్డే జట్టు సారథ్య బాధ్యతలను యువ ఆటగాడు శుభ్మన్ గిల్కు అప్పగించారు. భారత వన్డే కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత హిట్మ్యాన్ ఆడుతున్న తొలి మ్యాచ్ కావడంతో అందరి దృష్టి అతడిపైనే ఉంది.ఆసీస్ గడ్డపై అదుర్స్..కాగా ఆస్ట్రేలియా గడ్డపై రోహిత్ శర్మకు అద్భుతమైన రికార్డు ఉంది. ఆసీస్లో ఇప్పటివరకు ఇప్పటివరకు 30 వన్డేలు(ప్రపంచకప్ మ్యాచ్లతో కలిపి) ఆడిన రోహిత్ శర్మ.. 53.12 సగటుతో 1,328 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో ఐదు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాడు.అదేవిధంగా కంగారుల గడ్డపై ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్ల్లో భారత తరపున అత్యధిక పరుగులు చేసిన రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. 19 వన్డేల్లో 58.23 సగటుతో 990 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. అత్యదిక స్కోర్ 171 పరుగులుగా ఉంది.పెర్త్లో తిరుగులేని హిట్మ్యాన్..ఇక తొలి వన్డే జరిగే పెర్త్లో కూడా రోహిత్ మంచి రికార్డు ఉంది. పెర్త్ మైదానంలో హిట్మ్యాన్ కేవలం 4 మ్యాచ్లు మాత్రమే ఆడి 122.5 సగటుతో ఏకంగా 245 పరుగులు చేశాడు. ఈ వేదికగా 2016లో ఆసీస్తో జరిగిన తొలి వన్డేలో రోహిత్ విధ్వంసం సృష్టించాడు. ఆస్ట్రేలియా బౌలర్లను ఉతికారేశాడు. ఈ మైదానంలో రోహిత్ ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆ మ్యాచ్లో 163 బంతులు ఎదుర్కొన్న హిట్మ్యాన్..13 ఫోర్లు, 7 సిక్స్లతో 171 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. పెర్త్లోనే వాకా స్టేడియంలో వన్డే సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. ఇప్పుడు అదే జోరును కనబరిచాలని రోహిత్ అభిమానులు కోరుకుంటున్నారు.చదవండి: 'ఇదొక క్రూరమైన చర్య'.. అఫ్గాన్ క్రికెటర్ల మృతిపై రషీద్ ఖాన్ దిగ్భ్రాంతి -
IND vs AUS: జట్లు, షెడ్యూల్, మ్యాచ్ టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన (India Tour Of Australia 2025)కు వెళ్లింది. ఇందులో భాగంగా ఆదివారం (అక్టోబరు 19)నాటి మ్యాచ్తో తొలుత వన్డే సిరీస్కు తెరలేస్తుంది. అనంతరం ఆసీస్- భారత్ (IND vs AUS) ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడేందుకు ముహూర్తం ఖరారైంది.ఇందుకోసం ఇప్పటికే టీమిండియా- ఆస్ట్రేలియా తమ జట్లను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య వన్డే, టీ20 సిరీస్ షెడ్యూల్, మ్యాచ్ వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ తదితర వివరాలు తెలుసుకుందాం!ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా వన్డే సిరీస్ షెడ్యూల్🏏తొలి వన్డే: అక్టోబరు 19 (ఆదివారం)- పెర్త్ స్టేడియం, పెర్త్🏏రెండో వన్డే: అక్టోబరు 23 (గురువారం)- అడిలైడ్ ఓవల్, అడిలైడ్🏏మూడో వన్డే: అక్టోబరు 25 (శనివారం)- సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ👉మ్యాచ్ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం ఆసీస్- భారత్ వన్డే మ్యాచ్లు ఉదయం 9 గంటలకు ఆరంభంఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా టీ20 సిరీస్ షెడ్యూల్🏏తొలి టీ20: అక్టోబరు 29 (బుధవారం)- మనుకా ఓవల్, కాన్బెర్రా🏏రెండో టీ20: అక్టోబరు 31 (శుక్రవారం)- మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్🏏మూడో టీ20: నవంబరు 2 (ఆదివారం)- బెలిరివ్ ఓవల్, హోబర్ట్🏏నాలుగో టీ20: నవంబరు 6 (గురువారం)- బిల్ పిప్పెన్ ఓవల్, గోల్డ్ కోస్ట్🏏ఐదో టీ20: నవంబరు 8 (శనివారం)- ది గాబా, బ్రిస్బేన్.👉మ్యాచ్ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.45 నిమిషాలకు టీ20 మ్యాచ్లు ఆరంభం.లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..👉జియో హాట్స్టార్ యాప్, వెబ్సైట్లో మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం👉టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్స్లో ప్రసారంఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు భారత జట్టుఅభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, జితేశ్ శర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.భారత్తో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, మార్నస్ లబుషేన్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.భారత్తో టీ20లకు ఆస్ట్రేలియా జట్టు (తొలి రెండు మ్యాచ్లకు మాత్రమే)మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.చదవండి: షమీ విమర్శలు.. స్పందించిన చీఫ్ సెలక్టర్ అగార్కర్ -
Ro- Ko వరుస సెంచరీలు చేస్తే.. వరల్డ్కప్లో ఆడతారా?: అగార్కర్
టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి (Virat Kohli)- రోహిత్ శర్మ (Rohit Sharma) వన్డే వరల్డ్కప్-2027 టోర్నమెంట్ వరకు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతారా?.. భారత క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు ఇదే ప్రధాన చర్చ. ఇటీవల వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ను తప్పిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్ణయం తీసుకోవడం ఇందుకు ప్రధాన కారణం.అంతేకాదు.. ఆస్ట్రేలియాతో సిరీస్కు జట్లను ప్రకటించే సమయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు ఊతమిచ్చాయి. రో- కో వన్డే ప్రపంచకప్ ఆడతామని తమకు హామీ ఇవ్వలేదని అతడు పేర్కొన్నాడు.ఆడుతూనే ఉంటాం అనే సందేశంఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన తర్వాత కోహ్లి.. ‘‘మీరు ఎప్పుడైతే ఓ పనిని మధ్యలోనే వదిలేయాలని నిర్ణయించుకుంటారో.. అప్పుడే నిజంగా మీరు విఫలమైనట్లు’’ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. తద్వారా తాను ఇంకొన్నాళ్లు ఆటలో కొనసాగే అవకాశం ఉందంటూ పరోక్షంగా అగార్కర్కు కౌంటర్ ఇచ్చాడు.మరోవైపు.. 38 ఏళ్ల రోహిత్ శర్మ సైతం ఇటీవలే పది కిలోల బరువు తగ్గి మరింత ఫిట్గా తయారయ్యాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సందర్భంగా చివరగా టీమిండియా తరఫున బరిలో దిగిన రో-కో.. ఆసీస్తో అక్టోబరు 19 నాటి తొలి వన్డేతో రీఎంట్రీ ఇవ్వనున్నారు.ఇద్దరూ అత్యద్భుతమైన ఆటగాళ్లుఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. రో- కో భవితవ్యంపై మరోసారి స్పందించాడు. ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్లో ఎదురైన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ప్రస్తుతం వాళ్లిద్దరు జట్టుతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు.ఇద్దరూ అత్యద్భుతమైన ఆటగాళ్లు. వరల్డ్కప్నకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. యువ ఆటగాళ్లు వీరి స్థానాలను ఆక్రమిస్తారేమో.. చెప్పలేము కదా!.. లేదంటే యువ ఆటగాళ్లకే జట్టులో చోటు దక్కదేమో!ఏదేమైనా రోహిత్- కోహ్లి.. ఇద్దరూ గొప్ప బ్యాటర్లు. ప్రతి మ్యాచ్ తర్వాత వారి ప్రదర్శన గురించి శల్య పరీక్ష చేయడం ఉండదు. వాళ్లు ఆడటం మొదలుపెట్టిన తర్వాత పరిస్థితులను అంచనా వేసి నిర్ణయం తీసుకుంటాం.వరుస సెంచరీలు చేస్తే.. వరల్డ్కప్లో ఆడతారా?కేవలం పరుగులు చేయడం కాదు.. ట్రోఫీ గెలవడం అత్యంత ముఖ్యం. ఒకవేళ ఆస్ట్రేలియాలో రోహిత్- కోహ్లి వరుసగా మూడు సెంచరీలు చేసినంత మాత్రాన.. వారు వన్డే వరల్డ్కప్-2027 ఆడతారనే గ్యారెంటీ లేదు కదా!..అప్పటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకునే మా నిర్ణయం ఉంటుంది’’ అంటూ రోహిత్- కోహ్లిలకు మరో మెగా టోర్నీ ఆడే అవకాశం ఇవ్వకపోచ్చని అగార్కర్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు.అదే సమయంలో తాము సీనియర్ ఆటగాళ్లకు అత్యంత గౌరవం ఇస్తామని.. వారితో జరిగే మా సంభాషణలు బయటకు రావు కాబట్టి బయట అందరూ ఏదో ఊహించుకుంటారని అగార్కర్ పేర్కొన్నాడు. కాగా అక్టోబరు 19- నవంబరు 8 వరకు భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు జరుగుతాయి. ఇదిలా ఉంటే.. రోహిత్- కోహ్లి ఇప్పటికే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్తో పాటు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.చదవండి: షమీ విమర్శలు.. స్పందించిన చీఫ్ సెలక్టర్ అగార్కర్ Brace yourselves…they’re 𝘽𝙖𝙘𝙠 𝙄𝙣 𝘽𝙡𝙪𝙚𝙨 🔥 Rohit Sharma 🤝 Virat Kohli 🎥 Watch on loop as the duo gears up for #AUSvIND 💪 #TeamIndia | @ImRo45 | @imVkohli pic.twitter.com/u99yHyFfwJ— BCCI (@BCCI) October 17, 2025 -
IND vs AUS: ఈసారైనా కంగారులను కంగారు పెట్టిస్తారా?
వరల్డ్ క్రికెట్లో రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోరుకు సమయం అసన్నమైంది. అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్లో తలపడేందుకు ఆస్ట్రేలియా-భారత్ జట్లు సిద్దమయ్యాయి. తొలి వన్డే పెర్త్ వేదికగా జరగనుంది.ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇప్పటికే పెర్త్కు చేరుకున్న భారత్ నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. మరోవైపు ఆసీస్ కూడా స్పెషల్ ట్రైనింగ్ క్యాంపులో చెమటోడ్చుతుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు బలబలాలు, గత రికార్డులు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దం.గిల్ జర్నీ మొదలు.. ఈ సిరీస్తో భారత వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్ ప్రయాణం మొదలు కానుంది. రోహిత్ శర్మ స్ధానంలో జట్టు పగ్గాలను గిల్కు సెలక్టర్లు అప్పగించిన సంగతి తెలిసిందే. టెస్టు కెప్టెన్గా తన తొలి టెస్టు సిరీస్లో ఆకట్టుకున్న గిల్.. ఇప్పుడు వన్డే సారథిగా ఎలా రాణిస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆసియాకప్, విండీస్తో టెస్టు సిరీస్ గెలిచి మంచి జోష్లో ఉన్న భారత్.. అదే జోరును ఆసీస్ గడ్డపై కొనసాగించాలని భావిస్తోంది. గిల్ సేన బ్యాటింగ్ పరంగా బలంగా ఉన్నప్పటికి.. బౌలింగ్లో మాత్రం చాలా వీక్గా కన్పిస్తోంది.బుమ్రా దూరం.. సిరాజ్పైనే భారంఆసీస్తో వన్డే సిరీస్కు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అతడి స్ధానంలో మరో స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్లో భారత్ పేస్ ధళ నాయకుడిగా సిరాజ్ వ్యవహరించనున్నాడు. అయితే భారత జట్టులో ఫాస్ట్ బౌలర్లలో సిరాజ్కు ఒక్కడికే ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన అనుభవం ఎక్కువగా ఉంది.అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ద్ కృష్ణ వంటి యువ పేసర్లకు ఆసీస్ పిచ్ల్పై పట్టు లేదు. ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్-2022లో అర్ష్దీప్ 10 వికెట్లు పడగొట్టినప్పటికి.. ఇప్పుడు వన్డే ఫార్మాట్లో ఎలా రాణిస్తాడన్నది ప్రశ్నార్ధకంగా మారింది.హర్షిత్ రాణా, ప్రసిద్ద్ కృష్ణ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆడినప్పటికి వారి స్ధాయికి తగ్గ ప్రదర్శనలు చేయలేకపోయారు. జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఒక్కడే ఉన్నాడు. అతడితో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లగా వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే ఆసీస్ పిచ్లు ఎక్కువగా పేస్ బౌలర్లు అనుకూలించే అవకాశమున్నందన తుది జట్టులో కుల్దీప్కు చోటు దక్కడం కష్టమే.రో-కోపై అందరి కళ్లు.. భారత బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా కన్పిస్తోంది. భారత్ టాప్ ఆర్డర్, మిడిలార్డర్ కెప్టెన్ శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లతో నిండి ఉన్నది. నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి స్టార్ ఆల్రౌండర్లు సైతం జట్టులో ఉన్నారు.కాబట్టి బ్యాటింగ్ పరంగా భారత్కు ఎటువంటి సమస్య లేదు. ముఖ్యంగా కోహ్లి, రోహిత్కు ఆసీస్ గడ్డపై మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ సీనియర్ ద్వయం మరోసారి చెలరేగితే కంగారులకు కంగారు తప్పదు. వీరిద్దరూ దాదాపు 7 నెలల తర్వాత భారత జట్టు తరపున ఆడేందుకు సిద్దమయ్యారు. దీంతో అందరి కళ్లు వీరిద్దరిపైనే ఉన్నాయి.ఆసీస్కు గాయల బెడద..కాగా ఈ సిరీస్లో ఆస్ట్రేలియా రెగ్యూలర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ లేకుండా ఆడనుంది. నిజంగా ఇది ఆసీస్కు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే కమ్మిన్స్కు ఒంటి చేత్తో గెలిపించే సత్తా ఉంది. అతడితో పాటు వెన్ను గాయం కారణంగా స్టార్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ సైతం భారత్తో సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. గ్రీన్ స్దానంలో మార్నస్ లబుషేన్ జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా తొలి వన్డేకు స్టార్ స్పిన్నర్ జంపా, ఇంగ్లిష్ కూడా దూరమయ్యారు. కమ్మిన్స్ లేకపోవడంతో ఆసీస్ బౌలింగ్ విభాగం కూడా కాస్త వీక్గానే కన్పిస్తోంది. మిచెల్ స్టార్, జోష్ హాజిల్వుడ్లతో కూడిన ఆసీస్ బౌలింగ్ యూనిట్ ఫవర్ ఫుల్ భారత బ్యాటింగ్ లైనప్ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. అయితే హోమ్ ఎడ్వంటేజ్ ఖచ్చితంగా ఆసీస్కు కలిసిస్తోంది.భారత్కు హెడ్ 'ఎక్'భారత బౌలర్లకు ఆసీస్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ నుంచి ముప్పు పొంచి ఉంది. టీమిండియాపై వన్డేల్లో ట్రావిస్ హెడ్కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు భారత్పై 9 వన్డేలు ఆడిన హెడ్.. 43.12 సగటుతో 345 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ కూడా ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్ 137 పరుగులుగా ఉంది. టెస్టుల్లో భారత్పై 27 మ్యాచ్లు ఆడి 46.52 సగటుతో 1163 పరుగులు సాధించాడు. ఇక అతడితో కెప్టెన్ మిచిల్ మార్ష్, మాథ్యూ షార్ట్, అలెక్స్ క్యారీ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ఏదేమైనప్పటికి ఆసీస్ కంటే భారత్ బ్యాటింగ్ విభాగమే పటిష్టంగా కన్పిస్తోంది.ఆసీస్దే పైయి..భారత జట్టు చివరగా వైట్బాల్ సిరీస్లు ఆడేందుకు 2020-21లో వెళ్లింది. అయితే వన్డే సిరీస్ను 2-1తో టీమిండియా కోల్పోయింది. ఆ సిరీస్లో భారత్ తరపున హార్దిక్ పాండ్యా టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇప్పటివరకు భారత్-ఆసీస్ మధ్య 152 వన్డే మ్యాచ్లు జరిగాయి. ఆస్ట్రేలియా 84 మ్యాచ్లలో విజయం సాధించగా, భారత్ 58 మ్యాచ్లలో గెలిచింది. 10 మ్యాచ్లు ఫలితంలేకుండా ముగిశాయి.చెత్త రికార్డు..ఆస్ట్రేలియాలో భారత్ జట్టు చెత్త రికార్డు ఉంది. ఆసీస్ గడ్డపై భారత్ 54 వన్డేలు ఆడగా.. కేవలం 14 సార్లు మాత్రమే గెలిచింది. 38 సార్లు ఓడింది, 2 మ్యాచ్లు ఫలితంలేకుండా ముగిశాయి. అక్కడ భారత్ విజయం శాతం సుమారు 25.9% మాత్రమే. -
జోరుగా టీమిండియా సాధన
పెర్త్: దాదాపు ఏడాది క్రితం పెర్త్లోని ఆప్టస్ మైదానంలో ఆ్రస్టేలియాతో జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లి అజేయ సెంచరీ సాధించాడు. అదే అతని టెస్టు కెరీర్లో చివరి సెంచరీ అయింది. ఇప్పుడు మళ్లీ అదే మైదానానికి వచ్చిన కోహ్లి కొత్త ఉత్సాహంతో కనిపించాడు. ఆసీస్తో వన్డే సిరీస్ కోసం సన్నద్ధతలో భాగంగా అతను గురువారం సుదీర్ఘ సమయం పాటు నెట్స్లో ప్రాక్టీస్ చేశాడు. ఐపీఎల్ తర్వాత మొదటిసారి బరిలోకి దిగుతున్న కోహ్లి సాధనలో బాగా చురుగ్గా పాల్గొన్నాడు. ముందుగా 20 నిమిషాల పాటు ఫీల్డింగ్ డ్రిల్స్ చేసిన అతను ఆ తర్వాత 40 నిమిషాలు బ్యాటింగ్పై దృష్టి పెట్టాడు. హర్షిత్ రాణా, అర్‡్షదీప్ సింగ్లతో పాటు స్థానిక ఆటగాళ్లు బౌలింగ్ చేయగా... ఎలాంటి తడబాటు లేకుండా చక్కటి షాట్లు ఆడాడు. అతని పక్క నెట్స్లోనే మరో స్టార్ రోహిత్ శర్మ కూడా సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. ఆరంభంలోనే కొద్దిసేపు రోహిత్ తన ఫుట్వర్క్, టైమింగ్ విషయంలో కాస్త ఇబ్బంది పడ్డాడు. అయితే కుదురుకున్న తర్వాత అతనూ సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. సెషన్ ముగిసిన తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో రోహిత్ చాలాసేపు చర్చించడం కనిపించింది. గతంతో పోలిస్తే ఈసారి కోహ్లి, రోహిత్ల వ్యవహార శైలి చాలా ఆసక్తికరంగా కనిపించింది. నెట్స్ వద్దకు అనుమతించిన అభిమానులతో సరదాగా మాట్లాడుతూ వీరిద్దరు ఆటోగ్రాఫ్లు ఇస్తూ, సెల్ఫీలు దిగుతూ సమయం గడపడం విశేషం. ఈ ఇద్దరితో పాటు కేఎల్ రాహుల్ కూడా కొద్దిసేపు ప్రాక్టీస్ చేశాడు. గురువారం ఆప్షనల్ ప్రాక్టీస్ డే కాగా... భారత్ నుంచి రెండో బృందంలో వచ్చిన సిరాజ్, కుల్దీప్, అక్షర్ తదితరులు సాధనకు దూరంగా ఉన్నారు. పూర్తి స్థాయి జట్టుకు నేడు ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. అంతకుముందు ఆస్ట్రేలియా బౌలర్లు మిచెల్ స్టార్క్, జాయ్ రిచర్డ్సన్ కూడా నెట్స్లో సాధన చేశారు. -
చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ
టీమిండియా తాజా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) చరిత్ర సృష్టించనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో (వన్డేలు, టెస్ట్లు, టీ20లు) 500 మ్యాచ్ల మార్కును తాకనున్న పదో ఆటగాడిగా, నాలుగో భారతీయుడిగా రికార్డు నెలకొల్పనున్నాడు.అక్టోబర్ 19న ఆస్ట్రేలియాతో జరుగబోయే వన్డే మ్యాచ్ (India vs Australia) రోహిత్కు అంతర్జాతీయ కెరీర్లో 500వ మ్యాచ్ అవుతుంది. ఇప్పటివరకు 499 మ్యాచ్లు ఆడిన హిట్మ్యాన్ 42.18 సగటున, 49 సెంచరీల సాయంతో 19700 పరుగులు చేశాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన రికార్డు దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ మూడు ఫార్మాట్లలో 664 మ్యాచ్లు ఆడి 100 శతకాల సాయంతో 34357 పరుగులు చేశాడు.సచిన్ తర్వాత భారత్ తరఫున విరాట్ కోహ్లి (550), ఎంఎస్ ధోని (538), రాహుల్ ద్రవిడ్ (509) మాత్రమే 500 అంతర్జాతీయ మ్యాచ్ల అరుదైన మైలురాయిని తాకారు.కాగా, రోహిత్ శర్మ గతేడాది (2024) టీ20 ప్రపంచకప్ గెలిచాక పొట్టి ఫార్మాట్కు, ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించి, వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. రోహిత్ చివరిగా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్నాడు. ఆ టోర్నీలో కెప్టెన్గా వ్యవహించిన హిట్మ్యాన్ టీమిండియాను ఛాంపియన్గా నిలిపాడు.రోహిత్ 2027 వన్డే ప్రపంచకప్ వరకు వన్డేలు ఆడాలని ప్రణాళిక సిద్దం చేసుకున్నాడు. ఇందులో భాగంగా భారీగా బరువు తగ్గి, కెరీర్ తొలినాళ్లలో రోహిత్ను గుర్తు చేస్తున్నాడు. వన్డేల్లో రోహిత్ భవితవ్యం ఆసీస్ పర్యటనలో ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. ఈ పర్యటనలో రాణిస్తే హిట్మ్యాన్ను తిరుగుండదు.ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ మూడు వన్డేలు ఆడనుంది. ఆసీస్పై హిట్మ్యాన్ను అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఈ జట్టుపై అతను 46 ఇన్నింగ్స్ల్లో 57.3 సగటున 2407 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 9 అర్ద సెంచరీలు ఉన్నాయి.🚨 ROKO IN NETS AT PERTH 🚨- Virat Kohli & Rohit Sharma in the bathing practice together at Perth ahead of ODI series. 🐐 (RevSportz).pic.twitter.com/1IMvphZIvi— Tanuj (@ImTanujSingh) October 16, 2025అభిమానులు రోహిత్ నుంచి మరోసారి ఇదే ప్రదర్శనను ఆశిస్తున్నారు. ఫ్యాన్స్ కోరికల అనుగుణంగానే హిట్మ్యాన్ కూడా కఠోరంగా శ్రమిస్తున్నాడు. నిన్న పెర్త్లో ల్యాండ్ అయిన వెంటనే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. విరాట్ కోహ్లితో కలిసి గంటల కొద్ది నెట్స్లో చమటోడ్చాడు.చదవండి: హర్భజన్ సింగ్ రీఎంట్రీ -
Rohit- Kohli: ‘మా అభిమానులకు ఇదే ఆఖరి అవకాశం’
టీమిండియా దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో చివరగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన వీరిద్దరు.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ (IND vs AUS ODIs)తో పునరాగమనం చేయనున్నారు. చాన్నాళ్ల తర్వాత రో- కో తిరిగి వస్తున్న నేపథ్యంలో అభిమానులు ఖుషీ అవుతున్నారు.అదే సమయంలో రోహిత్- కోహ్లి వన్డేల నుంచి కూడా త్వరలోనే రిటైర్ అవనున్నారనే వార్త ఫ్యాన్స్ను ఆందోళనకు గురిచేస్తోంది. ఆసీస్తో వన్డే సిరీస్కు జట్టును ప్రకటించిన సమయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.హామీ ఇవ్వలేదువన్డే కెప్టెన్గా రోహిత్పై వేటు వేసి.. శుబ్మన్ గిల్ (Shubman Gil)కు పగ్గాలు అప్పగించడంపై స్పందిస్తూ.. ‘‘వన్డే వరల్డ్కప్-2027 టోర్నీని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ ప్రణాళికల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. అంతేకాదు.. రో- కో ఈ మెగా ఈవెంట్లో ఆడతామని హామీ ఇవ్వలేదు’’ అంటూ రిటైర్మెంట్ ఊహాగానాలకు అగార్కర్ ఊతమిచ్చాడు.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. టీమిండియా టాప్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు ఆస్ట్రేలియాలోని అభిమానులకు ఇది ఆఖరి అవకాశమని కమిన్స్ అన్నాడు.ఆస్ట్రేలియాలో ఉన్న ఫ్యాన్స్కు ఇదే ఆఖరు‘‘ నిస్సందేహంగా వారిద్దరు ఆటలో చాంపియన్లు. వారితో మేం ఆడినప్పుడల్లా అభిమానులు మ్యాచ్లు చూసేందుకు ఎంతో ఉత్సాహం ప్రదర్శించారు. గత 15 ఏళ్లలో వారిద్దరు భారత్ ఆడిన ప్రతీ సిరీస్లో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియాలో ఉన్న ఫ్యాన్స్కు వారి ఆటను చూడటం ఇదే ఆఖరిసారి కావచ్చు’’ అని కమిన్స్ అభిప్రాయపడ్డాడు.కమిన్స్ లేకుండానేకాగా వెన్ను నొప్పితో బాధపడుతున్న కమిన్స్ టీమిండియాతో సిరీస్లలో ఆడటం లేదన్న విషయం తెలిసిందే. అతడి స్థానంలో.. ఆసీస్ టీ20 సారథి మిచెల్ మార్ష్.. వన్డే జట్టును కూడా ముందుకు నడిపించనున్నాడు. ఇక అక్టోబరు 19- నవంబరు 8 వరకు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది.ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే.. ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్టులకు కూడా రోజుల వ్యవధిలో రో- కో గుడ్బై చెప్పేశారు. ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్న ఈ దిగ్గజ బ్యాటర్లు.. ఐపీఎల్లోనూ అభిమానులను అలరిస్తున్నారు.చదవండి: IND vs AUS: వన్డే సిరీస్కు ముందు.. విరాట్ కోహ్లి పోస్ట్ వైరల్ -
ఎలా ఉన్నావు హీరో!
న్యూఢిల్లీ: దాదాపు ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ భారత జట్టుతో చేరారు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత వీరిద్దరు అంతర్జాతీయ క్రికెట్ బరిలోకి దిగలేదు. టెస్టు లేదా టి20 జట్టు సభ్యులుగా ఉన్న ఇతర ప్లేయర్లు కలిసి ఆడుతూ బిజీగా ఉండగా వన్డేలకే పరిమితమైన రోహిత్, కోహ్లి మాత్రం టీమ్కు దూరంగా ఉన్నారు. వన్డే, టి20ల సిరీస్ల కోసం బుధవారం భారత జట్టు రెండు బృందాలుగా ఆ్రస్టేలియాకు బయల్దేరి వెళ్లింది. మొదటి బృందంలో రోహిత్, కోహ్లి, శ్రేయస్, కెపె్టన్ శుబ్మన్ గిల్ తదితరులు ఉన్నారు. ఎలా ఉన్నావు హీరో?ఈ సందర్భంగా రోహిత్, గిల్ భేటీ ఆసక్తిని సంతరించుకుంది. తన స్థానంలోనే గిల్ను సెలక్టర్లు వన్డే కెప్టెన్ గా నియమించగా... గిల్ నాయకత్వంలో రోహిత్ తొలిసారి ఆడనున్నాడు. టూర్కు వెళ్లేందుకు ఆటగాళ్లంతా ఒకే చోటికి చేరే క్రమంలో ఇందిరాగాంధీ విమానాశ్రయంలో రోహిత్ను చూసిన గిల్ దగ్గరకు వచ్చి ఆలింగనం చేసుకున్నాడు. వెంటనే రోహిత్ కూడా ‘ఎలా ఉన్నావు హీరో’ అంటూ ఆత్మీయంగా పలకరించాడు. టీమ్ బస్సులోకి వెళ్లాక మొదటి సీటులోనే కూర్చున్న కోహ్లికి కూడా గిల్ అభివాదం చేయగా... దానికి బదులిచ్చిన కోహ్లి కెపె్టన్ భుజం తట్టి అభినందించాడు. జట్టు సహచరుల్లో కనిపించిన చిరునవ్వులు అందరి మధ్య ఉన్న అనుబంధాన్ని చూపించాయి. ఆసీస్ పర్యటనలో భాగంగా భారత జట్టు 3 వన్డేలు, 5 టి20లు ఆడుతుంది. ఆదివారం ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరుగుతుంది. 𝙀𝙣 𝙧𝙤𝙪𝙩𝙚 𝘿𝙤𝙬𝙣 𝙐𝙣𝙙𝙚𝙧 ✈️Of familiar faces and special reunions as #TeamIndia depart for the Australia challenge 😍#AUSvIND pic.twitter.com/ElV3OtV3Lj— BCCI (@BCCI) October 15, 2025 -
IND-AUS XI: కోహ్లి, రోహిత్కు నో ప్లేస్..!
టెస్ట్ల్లో, వన్డేల్లో ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ అయిన పాట్ కమిన్స్ (Pat Cummins) ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటూ రిహాబ్లో ఉన్నాడు. కమిన్స్ జులైలో వెస్టిండీస్ సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. ఆతర్వాత ఆసీస్ ఆడిన అన్ని మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. త్వరలో భారత్తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్లకు కూడా ఎంపిక కాలేదు. నవంబర్లో జరిగే యాషెస్ సిరీస్లో తొలి టెస్ట్కు కూడా అందుబాటులో ఉండకపోవచ్చు.అక్టోబర్ 19 నుంచి స్వదేశంలో భారత్తో జరుగబోయే వన్డే సిరీస్కు ముందు కమిన్స్ వార్తల్లో నిలిచాడు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా అతన్ని భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లతో కూడిన ఆల్టైమ్ వన్డే జట్టును (Cummins All Time India Vs Australia ODI XI) ఎంపిక చేయమని అడిగారు.కమిన్స్ ఆశ్చర్యకరంగా వన్డేల్లో ఆల్టైమ్ గ్రేట్ బ్యాటర్లైన విరాట్ కోహ్లి (Virat kohli), రోహిత్ శర్మను (Rohit Sharma) ఎంపిక చేయలేదు. కమిన్స్ ఛాయిస్కు క్రికెట్ అభిమానులంతా షాకయ్యారు. కోహ్లి, రోహిత్ను ఎంపిక చేయని కమిన్స్.. భారత దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్, టీమిండియా ఆల్టైమ్ గ్రేట్ కెప్టెన్ ఎంఎస్ ధోని, భారత క్రికెట్లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ను తన ఆల్టైమ్ ఫేవరెట్ వన్డే జట్టుకు ఎంపిక చేశాడు.ఈ జట్టులో కేవలం ముగ్గురు భారత ఆటగాళ్లకు మాత్రమే చోటు కల్పించిన కమిన్స్.. ఎనిమిది మంది ఆస్ట్రేలియన్లకు అవకాశం ఇచ్చాడు. డేవిడ్ వార్నర్ను సచిన్కు జోడీగా ఓపెనర్గా ఎంపిక చేసిన కమిన్స్.. ఆతర్వాత వరుసగా రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్, షేన్ వాట్సన్, మైఖేల్ బెవన్కు మిడిలార్డర్లో చోటు కల్పించాడు.వికెట్కీపర్ బ్యాటర్గా ధోనికి అవకాశం ఇచ్చిన కమిన్స్.. జహీర్ ఖాన్తో పాటు స్పెషలిస్ట్ పేసర్లుగా తన దేశానికే చెందిన గ్లెన్ మెక్గ్రాత్, బ్రెట్ లీకు చోటు కల్పించాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా దివంగత షేన్ వార్న్ను ఎంపిక చేశాడు.కమిన్స్ ఆల్టైమ్ బెస్ట్ ఇండియా, ఆస్ట్రేలియా మిక్స్డ్ వన్డే టీమ్..డేవిడ్ వార్నర్, సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్, షేన్ వాట్సన్, మైఖేల్ బెవాన్, ఎంఎస్ ధోని, షేన్ వార్న్, బ్రెట్ లీ, జహీర్ ఖాన్, గ్లెన్ మెక్గ్రాత్చదవండి: చెలరేగిన షమీ.. భారత సెలెక్టర్లకు దిమ్మతిరిగే కౌంటర్ -
గంభీర్ లేకుండానే!.. రోహిత్, కోహ్లి, శ్రేయస్ ఆస్ట్రేలియాకు..
పరిమిత ఓవర్ల సిరీస్ కోసం టీమిండియా ఆస్ట్రేలియాకు పయనమైంది. తొలి బ్యాచ్లో భాగంగా దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma), వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తదితరులు కంగారూ దేశానికి బయల్దేరారు.వీరితో పాటు టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్, ఓపెనర్ యశస్వి జైస్వాల్, ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, పేసర్లు అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ కూడా ఢిల్లీ విమానాశ్రయంలో దర్శనమిచ్చారు. ఆ సమయంలో కొంత మంది సహాయక సిబ్బంది కూడా ఆటగాళ్ల వెంట ఉన్నారు.Team India off to Australia ✈️ pic.twitter.com/FCpqxYjTSI— Virat Kohli Fan Club (@Trend_VKohli) October 15, 2025గంభీర్ లేకుండానే..అయితే, హెడ్కోచ్ గౌతం గంభీర్ లేకుండానే తొలి బ్యాచ్తో వెళ్లడం లేదు. రెండో బ్యాచ్తో కలిసి అతడు సాయంత్రం ఆస్ట్రేలియాకు బయలుదేరనున్నట్లు సమాచారం. ఇక టీమ్ బస్లో రోహిత్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్ ముందు వరుసలో కూర్చోగా.. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Virat Kohli with Team India at Airport left for Australia. pic.twitter.com/ZJ6Wb80hPC— Virat Kohli Fan Club (@Trend_VKohli) October 15, 2025 కాగా స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టులను 2-0తో వైట్వాష్ చేసిన టీమిండియా.. అక్టోబరు 19 నుంచి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ మొదలుపెట్టనుంది. ఈ సిరీస్కు ముందే వన్డే సారథిగా రోహిత్ను తప్పించిన బీసీసీఐ.. గిల్కు కెప్టెన్సీ అప్పగించింది.కెప్టెన్సీ మార్పు వెనుకఈ నేపథ్యంలో కెప్టెన్సీ మార్పు వెనుక గంభీర్ హస్తం ఉందనే విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్- కోహ్లి చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడారు. ఈ మెగా టోర్నీలో టీమిండియాను చాంపియన్గా నిలపడంలో కీలక పాత్ర పోషించారు.ఇక ఈ ఐసీసీ ఈవెంట్ తర్వాత టీమిండియా తరఫున రో- కో తొలిసారి ఆస్ట్రేలియాతో వన్డేల సందర్భంగా బరిలోకి దిగనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఫిట్గా ఉన్న ఈ ఇద్దరు కంగారూ గడ్డపై సత్తా చాటాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.వన్డే వరల్డ్కప్-2027లో ఆడతారా?కాగా 37 ఏళ్ల రోహిత్, 36 ఏళ్ల కోహ్లి వన్డే వరల్డ్కప్-2027లో ఆడతారో లేదోనని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. అయితే, పూర్తి ఫిట్గా ఉన్న ఈ ఇద్దరు తప్పక మెగా టోర్నీ ఆడతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో.. వీరిద్దరి విషయంలో మేనేజ్మెంట్ వైఖరిపైనా సందేహాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య అక్టోబరు 19 నుంచి నవంబరు 8 వరకు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: BCCI: రోహిత్, కోహ్లిలకు ఇదే ఆఖరి సిరీస్!.. స్పందించిన బీసీసీఐpic.twitter.com/BZLAUZArJP— Ro³ (@45__rohan) October 15, 2025 -
BCCI: రోహిత్, కోహ్లిలకు ఇదే ఆఖరి సిరీస్!.. స్పందించిన బీసీసీఐ
టీమిండియా దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli)- రోహిత్ శర్మ (Rohit Sharma)ల అంతర్జాతీయ క్రికెట్ భవితవ్యంపై గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. వీరిద్దరు ఇంగ్లండ్ పర్యటనలో టెస్టులు ఆడేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు వచ్చినా.. అనూహ్యంగా ఇద్దరూ ఐదు రోజుల వ్యవధిలోనే రిటైర్మెంట్ ప్రకటించారు.వన్డే కెప్టెన్సీ నుంచి తొలగింపుఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పెద్దల వైఖరితో నొచ్చుకున్న రో- కో ఈ మేరకు అనూహ్య నిర్ణయం తీసుకున్నారనే వార్తలు వినిపించాయి. ఇక ఇప్పటికే అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కూ వీడ్కోలు పలికిన రోహిత్- కోహ్లి.. ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్నారు. అయితే, ఊహించని రీతిలో రోహిత్ను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించింది బీసీసీఐ.దేశీ టోర్నీలు కూడా ఆడాలిఆస్ట్రేలియాతో సిరీస్కు ముందు రోహిత్ స్థానంలో శుబ్మన్ గిల్ (Shubman Gill)కు వన్డే జట్టు పగ్గాలు అప్పగించింది. వన్డే వరల్డ్కప్-2027ను దృష్టిలో పెట్టుకునే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. ఈ సందర్భంగా రో- కో వన్డే వరల్డ్కప్ వరకు కొనసాగుతారనే హామీ కూడా లేదని చెప్పాడు. అంతేకాదు.. అవసరమైతే ఈ ఇద్దరు దేశీ టోర్నీలు కూడా ఆడాల్సి ఉంటుందని సంకేతాలు ఇచ్చాడు.రోహిత్, కోహ్లిలకు ఇదే ఆఖరి సిరీస్!ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి వన్డేలకూ త్వరలోనే గుడ్బై చెప్పనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆసీస్తో జరిగే వన్డే సిరీస్ వీరి అంతర్జాతీయ కెరీర్లో చివరిదనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ విషయంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించాడు.స్పందించిన బీసీసీఐఢిల్లీలో మంగళవారం వెస్టిండీస్తో రెండో టెస్టులో భారత్ జయభేరి మోగించిన అనంతరం రాజీశ్ శుక్లా మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలో రో- కో వన్డే రిటైర్మెంట్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘వాళ్లిద్దరు జట్టులో ఉండటం మాకు అతిపెద్ద సానుకూలాంశం. ఇద్దరూ గొప్ప బ్యాటర్లు.వారిద్దరి సమక్షంలో టీమిండియా కచ్చితంగా ఆస్ట్రేలియాను ఓడించి తీరుతుంది. రో-కో లకు ఇదే చివరి సిరీస్ అనడం హాస్యాస్పదం. అసలు మేము ఈ విషయం గురించి ఆలోచించము. రిటైర్మెంట్ అనేది ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయం. ఏదేమైనా రోహిత్- కోహ్లికు ఆసీస్ సిరీస్ ఆఖరిది అనడం తప్పు’’ అని రాజీవ్ శుక్లా పేర్కొన్నాడు.ఇద్దరూ ఇద్దరేకాగా వన్డేల్లో కోహ్లి, రోహిత్లకు ఉన్న రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వన్డేల్లో 51 సెంచరీలతో కోహ్లి ప్రపంచ రికార్డు సాధిస్తే.. రోహిత్ వన్డే ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఏడాది వీరిద్దరు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ విజేతగా నిలవడంలో తమ వంతు పాత్ర పోషించారు.అంతేకాదు 2025లో రోహిత్ ఇప్పటికి 8 వన్డేల్లో ఓ సెంచరీ సాయంతో 302 పరుగులు చేయగా.. కోహ్లి ఏడు ఇన్నింగ్స్ ఆడి 275 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 36 ఏళ్ల కోహ్లి ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే విధంగా.. 37 ఏళ్ల రోహిత్ ఇటీవల పది కిలోలు తగ్గి మరింత ఫిట్గా తయారయ్యాడు. కాబట్టి ప్రస్తుత ఫామ్, ఫిట్నెస్ దృష్ట్యా వీరిద్దరు ఇప్పట్లో రిటైర్ కాకపోవచ్చని చెప్పవచ్చు.చదవండి: సిగ్గుచేటు అంటూ గంభీర్ ఫైర్.. బీసీసీఐ స్పందన ఇదే -
‘ప్రపంచకప్ టోర్నీకి చాలా సమయం ఉంది’
న్యూఢిల్లీ: భారత్, ఆ్రస్టేలియా మధ్య ఈ నెల 19 నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుంది. సిరీస్ ఫలితంకంటే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత మళ్లీ ఈ సిరీస్తోనే బరిలోకి దిగుతున్న వీరిద్దరు ఇప్పటికే రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయి ఒక్క వన్డేలే ఆడుతున్నారు. ఈ క్రమంలో రోహిత్ను వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించారు. ఈనేపథ్యంలో తాజా చర్చపై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇప్పటికిప్పుడు వారిద్దరి భవిష్యత్తుపై తానేమీ చెప్పలేనని స్పష్టం చేశాడు. ‘వన్డే వరల్డ్కప్కు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. కాబట్టి భవిష్యత్తుకంటే ప్రస్తుతంపైనే దృష్టి పెట్టడం ముఖ్యమని నేను భావిస్తా. వారిద్దరు అత్యుత్తమ ఆటగాళ్లు అనడంలో సందేహం లేదు. పునరాగమనం చేస్తున్న వారి అనుభవం ఆ్రస్టేలియాలో పనికొస్తుంది. వీరిద్దరు బాగా ఆడి సిరీస్ విజయంలో భాగమవుతారని ఆశిస్తున్నా’ అని గంభీర్ చెప్పాడు. గిల్కు కెప్టెన్సీ అర్హత ఉంది... భారత టెస్టు కెప్టెన్సీతో పాటు వన్డేలకు కూడా సారథ్యం వహించే సత్తా, అర్హత శుబ్మన్ గిల్కు ఉన్నాయని, ఈ హక్కును అతను సాధించుకున్నాడని గంభీర్ ప్రశంసించాడు. ‘కెప్టెన్గా గిల్ను నియమించి ఎవరూ ఔదార్యం చూపించలేదు. అతడికి ఆ అర్హత ఉంది. కోచ్గా కూడా నేను ఈ మాట చెప్పగలను. ప్రపంచ క్రికెట్లో అతి కఠినమైన పర్యటనల్లో ఇంగ్లండ్ ఒకటి. అలాంటి చోట ఐదు టెస్టులూ గట్టిగా నిలబడి సిరీస్ను సమం చేసుకోగలగడం చిన్న విషయం కాదు. బ్యాటింగ్లోనూ అదరగొట్టడంతో పాటు జట్టును సమర్థంగా నడిపి వన్డేల్లోనూ సారథి కాగల హక్కును అతను సాధించాడు’ అని గంభీర్ అన్నాడు. 2027 వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ గురించి ఇప్పుడే మాట్లాడటం అనవసరమని, వరుసగా విజయాలు సాధించడమే తమ లక్ష్యమని అతను స్పష్టం చేశాడు. భారత జట్టు నవంబర్ 9న ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడనుండగా... నవంబర్ 14 నుంచి కోల్కతాలో దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు జరుగుతుంది. అయితే ప్రొఫెషనల్ క్రికెటర్లు తక్కువ సమయంలో పరిస్థితులకు తగినట్లుగా మార్చుకోగలరని విశ్వాసం వ్యక్తం చేసిన గంభీర్... టెస్టు టీమ్లో మాత్రమే సభ్యులైన ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో బరిలోకి దిగాలని సూచించాడు. వెస్టిండీస్తో టెస్టు సిరీస్ గెలవడం పట్ల కోచ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే భారత్లో కూడా పేస్ బౌలర్లకు కూడా కాస్త అనుకూలించే విధంగా బౌన్సీ పిచ్లు ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. హర్షిత్ రాణాపై అనవసర విమర్శలు... భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్లలోనూ వరుసగా అవకాశాలు పొందుతున్న పేస్ బౌలర్ హర్షిత్ రాణాపై ఇటీవల సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిభావంతుడు కాకపోయినా... ఢిల్లీకి చెందినవాడు కావడంతో పాటు గంభీర్ ఐపీఎల్ టీమ్ కేకేఆర్కు మెంటార్గా ఉన్న సమయంలో సాన్నిహిత్యం వల్లే రాణాకు జట్టులో చోటు దక్కుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా ఇటీవల ఇదే మాట అన్నాడు. తాజా విమర్శలపై గంభీర్ తీవ్రంగా స్పందించాడు. ఈ వివాదంలో హర్షిత్కు అతను పూర్తి మద్దతు పలికాడు. ‘యూట్యూబ్లో వ్యూస్ కోసం కొందరు ఒక 23 ఏళ్ల యువ ఆటగాడిని లక్ష్యంగా చేసుకున్నందుకు సిగ్గుపడాలి. రాణా తండ్రి మాజీ క్రికెటర్ కాదు. సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ కానీ ఎన్ఆర్ఐ కానీ కాదు. అతను తన ప్రతిభను నమ్ముకొనే క్రికెట్ ఆడుతున్నాడు. ఒక ఆటగాడి ప్రదర్శన బాగా లేకుండా విమర్శించవచ్చు కానీ ఇలా వ్యక్తిగత విమర్శలు చేస్తారా. కావాలంటే నన్ను విమర్శించండి. నేను దానిని భరించగలను. కానీ 23 ఏళ్ల ఆటగాడిపై ఇది మానసికంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఆలోచించారా. భారత క్రికెట్ జట్టు ఎవరిదో సొంత ఆస్తి కాదు. మన జట్టు గెలవాలని భావించే అందరిది ఈ జట్టు అని మర్చిపోవద్దు’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు. -
‘ఆస్ట్రేలియాలో కోహ్లి రెండు సెంచరీలు చేస్తాడు’
వెస్టిండీస్తో స్వదేశంలో టెస్టు సిరీస్ను 2-0తో వైట్వాష్ చేసిన టీమిండియా.. తదుపరి ఆస్ట్రేలియా (India Tour Of Australia 2025)లో పర్యటించనుంది. కంగారూ జట్టుతో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. అక్టోబరు 19 నుంచి టీమిండియా ఆసీస్ టూర్ ప్రారంభం కానుండగా... దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) చాన్నాళ్ల తర్వాత పునరాగమనం చేయనున్నారు.అనూహ్యంగా టెస్టులకు రిటైర్మెంట్చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియాకు ఆడిన రో- కో.. ఆ తర్వాత అనూహ్యంగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక గతేడాదే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు కూడా వీడ్కోలు పలికిన ఈ ఇద్దరు మేటి బ్యాటర్లు.. వన్డేల్లో మాత్రం కొనసాగుతున్నారు.ఆస్ట్రేలియాలో గిల్ సారథ్యంలోఇలాంటి తరుణంలో రోహిత్ శర్మ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. వన్డే కెప్టెన్గా రోహిత్ను తప్పించి.. అతడి స్థానంలో శుబ్మన్ గిల్కు పగ్గాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో గిల్ సారథ్యంలో మాజీ కెప్టెన్లు రోహిత్- కోహ్లి కలిసి ఆడనున్నారు.కాగా రోహిత్పై వేటు వేసిన సమయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. రోహిత్, కోహ్లి వన్డే వరల్డ్కప్-2027 ఆడటం గురించి తమకు ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిపాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రో-కో గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.మరో నాలుగైదేళ్లు ఢోకా లేదు‘‘దయచేసి విరాట్ ఫిట్నెస్ గురించి ఎవరూ ఏమీ అడగకండి. ఫిట్నెస్ విషయంలో అతడొక గురు. అతడు ఏం చేసినా మిగతా వాళ్లు ఫాలో అయిపోతారు. కాబట్టి విరాట్ కోహ్లి ఫిట్నెస్ గురించి మనమేమీ ఆందోళన పడాల్సిన పనిలేదు.అంతర్జాతీయ క్రికెట్లో ప్రస్తుతం అతడి కంటే ఫిట్గా ఉన్న మరొక ప్లేయర్ ఎవరూ లేరు. అయితే, కోహ్లి బ్యాట్చేతపట్టి ఎప్పుడెప్పుడు మైదానంలో దిగుతాడా అని నేను ఎదురుచూస్తున్నా.చాలా రోజులుగా అభిమానులతో పాటు నేనూ అతడి ఆటను మిస్సవుతున్నాను. వన్డేల్లో కోహ్లి ఇంకా ఎంతో సాధించగలడు. ఇంకొన్నేళ్లు ఆడగల సత్తా అతడికి ఉంది. కనీసం మరో నాలుగైదేళ్లు కోహ్లి వన్డేలు ఆడతాడని నేను నమ్ముతున్నా.కేవలం ఆడటమే కాదు.. తనదైన శైలిలో ఆధిపత్యం కూడా చూపిస్తాడని విశ్వసిస్తున్నా. ఆస్ట్రేలియాలో అతడి ఆట కోసం ఎదురుచూస్తున్నా. ఇక రోహిత్ విషయంలోనూ నేను ఇదే చెప్తా.కోహ్లి రెండు సెంచరీలు చేస్తాడుఆస్ట్రేలియాలో ఈ ఇద్దరు దిగ్గజాలు భారీ స్కోర్లు సాధించి టీమిండియాను గెలిపిస్తారని ఆశిస్తున్నా. ఆస్ట్రేలియా కోహ్లికి ఇష్టమైన ప్రత్యర్థి. మూడు వన్డేల్లో కలిపి అతడు కనీసం రెండు శతకాలైనా బాదుతాడని అనుకుంటున్నా’’ అని భజ్జీ చెప్పుకొచ్చాడు. కాగా అక్టోబరు 19 నుంచి నవంబరు 8 వరకు ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య వన్డే, టీ20 సిరీస్లు జరుగనున్నాయి.చదవండి: చరిత్ర సృష్టించిన ధ్రువ్ జురెల్.. భారత తొలి క్రికెటర్గా ఫీట్ -
కెప్టెన్ అంటే ఇలాగే ఉండాలి.. అందరూ అతడిని గౌరవిస్తారు: గంభీర్
టీమిండియా టెస్టు సారథి శుబ్మన్ గిల్ (Shubman Gill)పై హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) ప్రశంసలు కురిపించాడు. టెస్టు కెప్టెన్గా అతడు తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణుడయ్యాడని.. అతడికి వంక పెట్టేందుకు ఏమీ లేదని కొనియాడాడు. తనకు ఉన్న నైపుణ్యాలతోనే గిల్ టెస్టు సారథి అయ్యాడని.. అలాగే వన్డే కెప్టెన్సీ బాధ్యతలు కూడా దక్కించుకున్నాడని పేర్కొన్నాడు.సారథిగా తొలి ప్రయత్నంలోనేకాగా ఇంగ్లండ్ పర్యటనకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించగా.. గిల్ అతడి స్థానాన్ని భర్తీ చేసిన విషయం తెలిసిందే. సారథిగా తొలి ప్రయత్నంలోనే ఇంగ్లండ్ వంటి పటిష్టమైన జట్టుతో తలపడ్డాడు. బ్యాటర్గా, కెప్టెన్గా రాణించి ఇంగ్లండ్ గడ్డ మీద ఐదు మ్యాచ్ల సిరీస్ను 2-2తో సమం చేశాడు.విండీస్ను వైట్వాష్ చేసి తొలి విజయంఇక తాజాగా వెస్టిండీస్తో స్వదేశంలో జరిగిన రెండు మ్యాచ్ల సిరీస్ను 2-0తో వైట్వాష్ చేసి.. కెప్టెన్గా గిల్ తొలి సిరీస్ విజయాన్ని రుచిచూశాడు. ఇదిలా ఉంటే.. ఇటీవలే వన్డే కెప్టెన్సీ నుంచి దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మను తప్పించిన భారత క్రికెట్ యాజమాన్యం.. గిల్కు పగ్గాలు అప్పగించింది.ఫేవటెరిజం లేదుఈ నేపథ్యంలో విమర్శలు రాగా.. విండీస్పై విజయానంతరం గంభీర్ స్పందించాడు. ‘‘అతడిని అచ్చంగా అతడిలా ఉండనివ్వడమే మేము చేసిన మంచిపని. టెస్టు లేదంటే వన్డే కెప్టెన్గా అతడిని ఎంపిక చేయడంలో ఎలాంటి ఫేవటెరిజం లేదు. ఇందుకు వందశాతం గిల్ అర్హుడు.ఎన్నో ఏళ్లుగా అతడు కఠినంగా శ్రమిస్తున్నాడు. ఇంగ్లండ్ గడ్డ మీద టెస్టు కెప్టెన్ ఇప్పటికే కఠిన సవాలు ఎదుర్కొని.. అతడు సారథిగా పాసయ్యాడు. నాణ్యమైన జట్టుపై బ్యాటర్గా, కెప్టెన్గా రాణించాడు. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ 2027 గురించి ఇప్పటి నుంచే ఆలోచించడం సరికాదు.అందరూ అతడిని గౌరవిస్తారుప్రతి మ్యాచ్లోనూ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లడం ముఖ్యం. సొంతగడ్డపై మాకిది కీలకమైన సిరీస్. ఇదే స్ఫూర్తితో మేము ముందుకు వెళ్తాం. నిజానికి ఇంగ్లండ్లో టెస్టులు ఇంతకంటే కష్టంగా ఉండేవి. ఇదే విషయాన్ని గిల్తో నేను చాలాసార్లు చెప్పాను.రెండున్నర నెలల పాటు అక్కడ గిల్ అత్యంత కఠినమైన సవాలును ఎదుర్కొన్నాడు. ఇంతకంటే అతడు ఇంకేం చేయాలి? డ్రెసింగ్రూమ్లో అందరూ అతడిని గౌరవిస్తారు. సరైన పనులు చేసినందుకు అతడికి ఇవన్నీ దక్కాయి. మాటల కంటే చేతలు ముఖ్యం’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.నాకు ఆ అవసరం ఉందిఇక ఒత్తిడిని తట్టుకునేందుకు గిల్ కోసం మెంటల్ కండిషనింగ్ కోచ్ను నియమిస్తారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ముందైతే నాకు అతడి అవసరం ఉంది’’ అంటూ నవ్వులు చిందించాడు. గెలిచినప్పుడు జట్టుకు ప్రశంసలు దక్కుతాయన్న గౌతీ.. ఓడినప్పుడు మాత్రం ఆటగాళ్లు కుంగిపోకుండా చూసుకోవడం తన బాధ్యత అని చెప్పుకొచ్చాడు.చదవండి: చరిత్ర సృష్టించిన ధ్రువ్ జురెల్.. భారత తొలి క్రికెటర్గా ఫీట్ -
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. ఆసియాలో తొలి బ్యాటర్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (Babar Azam) ఓ అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో (WTC) 3000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆసియా బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన ఎనిమిదో బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. డబ్ల్యూటీసీ 2025-27లో భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (అక్టోబర్ 12) మొదలైన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు.ఈ మ్యాచ్లో 23 పరుగులు చేసి ఔటైన బాబర్.. 2 పరుగుల వద్ద 3000 పరుగుల మైలురాయిని తాకాడు. గత మూడేళ్లుగా విఫలమవుతున్నా బాబర్ ఈ ఘనత సాధించడం విశేషం. బాబర్ కంటే అన్ని విభాగాల్లో బలమైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కూడా డబ్ల్యూటీసీలో 3000 పరుగుల మైలురాయిని తాకలేకపోయారు.ఆసియాలో అత్యధిక డబ్ల్యూటీసీ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి బాబర్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బాబర్కు అతి సమీపంగా టీమిండియా ఆటగాళ్లు శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ ఉన్నారు. కోహ్లి, రోహిత్ టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు కాబట్టి, బాబర్ను ఈ విభాగంలో అధిగమించే అవకాశం వారికి లేదు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2019లో పరిచయమైన విషయం తెలిసిందే.డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్-6 ఆసియా బ్యాటర్లుబాబర్ ఆజమ్- 3021శుభ్మన్ గిల్- 2826రిషబ్ పంత్- 2731రోహిత్ శర్మ- 2716కరుణరత్నే- 2642విరాట్ కోహ్లి- 2617డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్-8 బ్యాటర్లుజో రూట్- 6080స్టీవ్ స్మిత్- 4278మార్నస్ లబూషేన్- 4225బెన్ స్టోక్స్- 3616ట్రవిస్ హెడ్- 3300ఉస్మాన్ ఖ్వాజా- 3288జాక్ క్రాలే- 3041బాబర్ ఆజమ్- 3021పాకిస్తాన్-సౌతాఫ్రికా మ్యాచ్ విషయానికొస్తే.. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరుగుతున్న తొలి మ్యాచ్ ఇది. లాహోర్లోని గడాఫీ స్టేడియం ఈ మ్యాచ్ ఇవాళ ప్రారంభమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది.పాక్ ఇన్నింగ్స్లో నలుగురు అర్ద సెంచరీలు చేశారు. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (93) తృటిలో సెంచరీ మిస్ కాగా.. కెప్టెన్ షాన్ మసూద్ (76), వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ (62), సల్మాన్ అఘా (52) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలు చేశారు. రిజ్వాన్, సల్మాన్ అఘా క్రీజ్లో ఉన్నారు.మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (2), సౌద్ షకీల్ (0) పూర్తిగా నిరుత్సాహపరచగా.. బాబర్ ఆజమ్ (23) మంచి ఆరంభం లభించినా భారీ స్కోర్గా మలచలేకపోయాడు. సౌతాఫ్రికా బౌలర్లలో సెనురన్ ముత్తుసామి 2, రబాడ, ప్రెనెలన్ సుబ్రాయన్, సైమన్ హార్మర్ తలో వికెట్ తీశారు.చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి జట్టు -
ఏయ్.. ఏమి చేస్తున్నావు! సీరియస్ అయిన రోహిత్ శర్మ(వీడియో)
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు సిద్దమవుతున్నాడు. 38 ఏళ్ల రోహిత్ ప్రస్తుతం ముంబైలోని ప్రఖ్యాత శివాజీ పార్క్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతడు భారత మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ పర్యవేక్షణలో సన్నద్దమవుతున్నట్లు తెలుస్తోంది.హిట్మ్యాన్ శివాజీ పార్క్లో ప్రాక్టీస్ చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఓ అనుహ్య సంఘటన చోటు చేసుకుంది. శివాజీ పార్క్ వచ్చిన ఓ చిన్నారి అభిమాని రోహిత్ను కలిసేందుకు ప్రయత్నించాడు.రోహిత్ వద్దకు వెళ్లే క్రమంలో ఆ యంగ్ ఫ్యాన్తో సెక్యూరిటీ సిబ్బంది కాస్త దురుసుగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని గమనించిన రోహిత్ సెక్యూరిటీపై సీరియస్ అయ్యాడు. వారిపై గట్టి అరుస్తూ అతన్ని తనవద్దకు పంపించాలని సూచించాడు. దీంతో హిట్మ్యాన్ వద్దకు వెళ్లిన ఆ యువ అభిమాని సెల్పీ తీసుకుని ఖుషీ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రోహిత్ శర్మ మనసు బంగారం అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇటీవలే భారత వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతలు నుంచి రోహిత్ను తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్ధానంలో యువ ఆటగాడు శుభ్మన్ గిల్ను వన్డే సారథిగా, అతడికి డిప్యూటీగా శ్రేయస్ అయ్యర్ను సెలక్టర్లు నియమించారు.గత మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరిగిన తర్వాత భారత్ తరపున రోహిత్కు ఇదే తొలిమ్యాచ్. ఆసీస్ టూర్ కోసం రోహిత్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ మాజీ కెప్టెన్ గతంతో పోలిస్తే చాలా ఫిట్గా కన్పిస్తున్నాడు.చదవండి: టీమిండియాపై ఓవరాక్షన్.. కట్ చేస్తే! ఊహించని షాకిచ్చిన ఐసీసీpic.twitter.com/dx0Bn2dp6D— Ro³ (@45__rohan) October 10, 2025 -
కొత్తకారు కొన్న రోహిత్ శర్మ: ఎలాన్ మస్క్ రీపోస్ట్..
ప్రముఖ క్రికెటర్ రోహిత్ శర్మ.. ఇటీవల టెస్లా మోడల్ వై కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా టెస్లా చేసిన ఒక ట్వీట్ ఎలాన్ మస్క్ దృష్టిని ఆకర్షించింది.''టెస్లా ప్రకటన చేయవలసిన అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్లో 45 మిలియన్ల మంది అనుచరులను కలిగి ఉన్న రోహిత్ శర్మ (భారత జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్) కొత్త టెస్లా మోడల్ వై కొనుగోలు చేశారు''. అనే పోస్టు టెస్లా సహ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ దృష్టిని ఆకర్షించడంతో.. దానిని రీపోస్ట్ చేశారు. ఎక్కువమంది ఫాలోవర్స్ ఉండటం చేత ఈ కారు గురించి అందరికి తెలుస్తుందనే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.టెస్లా మోడల్ వై గురించిటెస్లా మోడల్ వై అనేది.. ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టెస్లా ఏకైక మోడల్. ఎంట్రీ లెవల్ మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), లాంగ్ రేంజ్ RWD వెర్షన్ రూ. 67.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. రెండు మోడళ్ల డెలివరీలు 2025 మూడవ త్రైమాసికంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: లాంచ్కు ముందే అన్నీ కొనేశారు!స్టాండర్డ్ మోడల్ Y RWD 60 kWh బ్యాటరీతో.. ఒక ఛార్జ్పై 500 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీ ఒక ఛార్జ్పై 622 కిమీ రేంజ్ అందిస్తుంది. రెండు వెర్షన్లు దాదాపు 295 హార్స్పవర్ను ఉత్పత్తి చేసే ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతాయి. పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. టెస్లా మోడల్ వై బేస్ RWD మోడల్ 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది, అయితే లాంగ్ రేంజ్ వెర్షన్ కొన్ని 5.6 సెకన్లలో ఈ వేగాన్ని చేరుకుంటుంది. అయితే వీటి టాప్ స్పీడ్ 201 కిమీ/గం.This is why Tesla doesn’t need to advertise - Rohit Sharma (captain of India’s national cricket team), who has 45M followers on Instagram, just bought a new Tesla Model Ypic.twitter.com/m02awSltMR https://t.co/XQSLYyo4XZ— Teslaconomics (@Teslaconomics) October 9, 2025 -
నాలో దూకుడు అలాగే ఉంది.. కానీ: గంభీర్ కామెంట్స్ వైరల్
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనలో ఇప్పటికీ దూకుడు అలాగే ఉందని.. మైదానంలో తనను తాను ఇలా ఆవిష్కరించుకోవడం తన సహజమైన భావోద్వేగం అని తెలిపాడు. అయితే, వయసు పెరుగుతున్న దృష్ట్యా ఇంట్లో వాళ్ల కోసం కొన్నిసార్లు తనను తాను సంభాళించుకుంటున్నానని తెలిపాడు.కోహ్లితోనూ గొడవటీమిండియాకు ఆడిన రోజుల్లో గంభీర్ ఎంత అగ్రెసివ్గా ఉండేవాడో క్రికెట్ ప్రేమికులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా దాయాది పాకిస్తాన్తో మ్యాచ్లో దూకుడు ప్రదర్శిస్తూ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చేవాడు. అంతేకాదు.. భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)తోనూ.. ఈ వరల్డ్కప్ విన్నర్ గొడవ పడిన విషయం తెలిసిందే.ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ‘ఢిల్లీ బాయ్స్’ గంభీర్- కోహ్లి రెండుసార్లు తీవ్ర స్థాయిలో వాగ్వాదం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. 43 ఏళ్ల గంభీర్ టీమిండియా హెడ్కోచ్గా వచ్చిన తర్వాత పాత పగలు పక్కనపెట్టి కోహ్లితో కలిసిపోయాడు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని స్వయంగా వీరిద్దరు చెప్పడంతో అభిమానుల మధ్య సోషల్ మీడియా ఫైట్స్కు తెరపడింది.ఎప్పుడూ గంభీరంగానేఇక గంభీర్ డగౌట్లోనూ ఎప్పుడూ గంభీరంగానే ఉంటాడన్న విషయం తెలిసిందే. అతడి ముఖంలో అమావాస్యకో.. పున్నమికో గానీ నవ్వు కనిపించదు. ఎప్పుడూ సీరియస్గా ఉండే గంభీర్పై ఈ విషయంలో ఎన్నో మీమ్స్ కూడా వస్తూ ఉంటాయి.నేను మారలేదుఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడిన గౌతం గంభీర్ తన వ్యవహారశైలి గురించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘నాలో ఇప్పటికీ ఆ దూకుడు అలాగే ఉంది. నేను మారలేదు. అగ్రెసివ్గా ముందుకు వెళ్లాలనుకున్నపుడు గొడవ పడటమే నాకు ముందుగా గుర్తుకువస్తుంది.ఇంట్లో పిల్లలు ఉన్నారుఅయితే, వయసు పెరిగింది కాబట్టి.. నా మనసు.. ‘ఇంట్లో పిల్లలు ఉన్నారు’ కదా అని హెచ్చరిస్తుంది’’ అంటూ గంభీర్ సరదాగా వ్యాఖ్యానించాడు. కాగా టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టు సిరీస్తో బిజీగా ఉంది.రెండు మ్యాచ్ల సిరీస్లో తొలి టెస్టులో విండీస్ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో చిత్తు చేసిన గిల్ సేన.. శుక్రవారం మొదలుపెట్టిన రెండో టెస్టులోనూ జోరు కనబరుస్తోంది. టీమిండియా- వెస్టిండీస్ రెండో టెస్టు తొలిరోజు ఆట సందర్భంగా గంభీర్ స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ పైవిధంగా స్పందించాడు. టీమ్ డిన్నర్ఇక ఈ మ్యాచ్కు ముందు గౌతీ తన ఇంట్లో టీమిండియాకు డిన్నర్పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కెప్టెన్ శుబ్మన్ గిల్తో పాటు జస్ప్రీత్ బుమ్రా,ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ప్రసిద్ కృష్ణ సహా కోచ్లు ర్యాన్ టెన్ డష్కాటే, మోర్నీ మోర్కెల్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా గంభీర్ పార్టీకి హాజరైనట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి గిల్కు పగ్గాలు అప్పగించడంపై గంభీర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో గౌతీ టీమ్ డిన్నర్ ఇవ్వడం గమనార్హం. చదవండి: ‘యువీ గనుక తన పిల్లల్ని.. నాకు అప్పగిస్తే వారికీ అదే ‘గతి’ పట్టిస్తా’ -
రోహిత్కే కాదు.. నాకు ద్రవిడ్కు ఇలానే జరిగింది: సౌరవ్ గంగూలీ
భారత వన్డే జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ స్ధానంలో యువ ఆటగాడు శుబ్మన్ గిల్ను బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా టూర్కు ముందు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా మంది సెలక్టర్ల నిర్ణయాన్ని తప్పుబట్టారు.రోహిత్ను కావాలనే కెప్టెన్సీ నుంచి తప్పించారని విమర్శించారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ను వన్డే కెప్టెన్గా ఉద్దేశపూర్వకంగానే తొలగించారనే వాదనను గంగూలీ తోసిపుచ్చాడు. ప్రతీ కెప్టెన్కు కెరీర్ ఎండ్ సమయంలో ఇలా జరుగుతుందని దాదా అభిప్రాయపడ్డాడు. రోహిత్ ఇకపై వన్డే జట్టులో ప్లేయర్గా కొనసాగనున్నాడు. అయితే వన్డే ప్రపంచకప్-2027లో హిట్మ్యాన్ ఆడుతాడో లేదో ఇంకా స్పష్టత లేదు."రోహిత్తో మాట్లాడిన తర్వాతే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. ఉద్దేశపూర్వకంగా అయితే అతడిని తప్పించి ఉండరు. రోహిత్, సెలక్టర్ల మధ్య పరస్పర అంగీకారంతోనే ఈ మార్పు చోటు చేసుకుందని అనుకుంటున్నా. రోహిత్ ఒక అద్భుతమైన కెప్టెన్. అతడు భారత్కు టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ను అందించాడు.వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా రోహిత్ ముందంజలో ఉన్నాడు. ఇక్కడ రోహిత్ కెప్టెన్సీ, ఫెర్మామ్మెన్స్ సమస్య కాదు. 2027 నాటికి రోహిత్కు 40 ఏళ్లు వస్తాయి. క్రికెట్లో వయస్సు పరంగా అది చాలా ఎక్కవ నంబర్. కెరీర్ ఆఖరిలో ప్రతీ కెప్టెన్కు ఇలానే జరుగుతోంది. నాకు,ద్రవిడ్కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. శుబ్మన్ గిల్ కూడా 40 ఏళ్ల వయస్సులో ఇదే పరిస్థితిని ఎదుర్కొంటాడు. జేంటిల్మ్యాన్ గేమ్లో ప్రతీ ఒక్కరు ఏదో రోజున తమ కెరీర్ను ముగించాల్సిందే. గిల్ను కెప్టెన్గా ప్రమోట్ చేయడం సరైన నిర్ణయమే. అతడు ఇంగ్లండ్ టూర్లో అద్భుతంగా జట్టును నడిపించాడు. కెప్టెన్గా గిల్ ఎదిగే వరకు రోహిత్ ఆడుతూనే ఉండవచ్చు" ఓ ఇంటర్వ్యూలో గంగూలీ పేర్కొన్నాడు.చదవండి: కెప్టెన్గా శార్ధూల్ ఠాకూర్.. సర్ఫరాజ్ ఖాన్ రీ ఎంట్రీ! నో సూర్య కుమార్? -
దేశవాళీ క్రికెట్లో కోహ్లి, రోహిత్!
న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ... దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో భారత జట్టు సొంతగడ్డపై న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ఆడనుండగా... దానికి ముందు ఈ ఇద్దరు స్టార్లు విజయ్ హజారే ట్రోఫీలో కనీసం మూడు మ్యాచ్లు ఆడే అవకాశాలున్నాయి. టెస్టు, టి20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు... కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. చాంపియన్స్ ట్రోఫీ విజయం అనంతరం భారత జట్టు వన్డేలు ఆడకపోగా... ఆస్ట్రేలియాతో పర్యటన కోసం రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీని యువ ఓపెనర్ శుబ్మన్ గిల్కు అప్పగించి... కోహ్లి, రోహిత్ను ప్లేయర్లుగా ఈ పర్యటనకు ఎంపిక చేశారు. ఈ ఇద్దరు 2027 వన్డే ప్రపంచకప్ వరకు జట్టులో కొనసాగాలని భావిస్తుండగా... ఆలోపు టీమిండియా ఎక్కువ వన్డే మ్యాచ్లు ఆడేది లేకపోవడంతో... ఫామ్, ఫిట్నెస్ కాపాడుకు నేందుకు దేశవాళీల్లో ఆడాలని భావిస్తున్నట్లు సమాచారం. ‘జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్న ప్రతీ ఆటగాడు అందుబాటులో ఉన్న సమయంలో దేశవాళీల్లో ఆడాల్సిందే’అని ఇప్పటికే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించిన నేపథ్యంలో ఈ ఇద్దరు బరిలోకి దిగడంపై ఆసక్తి నెలకొంది. ‘డిసెంబర్ 6న విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికా తో టీమిండియా చివరి వన్డే మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మధ్య దాదాపు ఐదు వారాల సమయం ఉంది. విజయ్ హజారే ట్రోఫీ డిసెంబర్ 24 నుంచి ప్రారంభమవుతుంది. కివీస్తో సిరీస్కు ముందు ముంబై, ఢిల్లీ జట్లు విజయ్ హజారేలో ఆరేసి మ్యాచ్లు ఆడనున్నాయి. వాటిలో కనీసం మూడిట్లో రోహిత్, కోహ్లి ఆడొచ్చు’ అని బోర్డు అధికారి వెల్లడించాడు. మరోవైపు టీమిండియా మాజీ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తపరిచాడు. ఆ ఇద్దరు ఆటగాళ్లు భారత్ ‘ఎ’ మ్యాచ్లు, విజయ్ హజారే వంటి టోర్నీల్లో ఆడుతూ ఫామ్ కొనసాగించుకోవచ్చని పేర్కొన్నాడు. -
రోహిత్పై వేటు!.. నాకు ముందే తెలుసు: శుబ్మన్ గిల్
రోహిత్ శర్మ నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) తెలిపాడు. రోహిత్ భయ్యా తనకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నాడు. టీమిండియాకు రెండు ఐసీసీ టైటిళ్లు అందించిన సారథి రోహిత్ శర్మ (Rohit Sharma).వన్డే కెప్టెన్గా రోహిత్పై వేటు!గతేడాది టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాను చాంపియన్గా నిలిపిన రోహిత్.. ఈ ఏడాది ఐసీసీ (వన్డే) చాంపియన్స్ ట్రోఫీ -2025లో జట్టుకు కప్ అందించాడు. ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన హిట్మ్యాన్.. ఇటీవలే టెస్టులకూ రిటైర్మెంట్ ప్రకటించగా.. టెస్టు సారథిగా గిల్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు.అయితే, వన్డేల్లో కొనసాగుతానని రోహిత్ శర్మ చెప్పినా.. బీసీసీఐ (BCCI) ఇటీవలే అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించింది. రోహిత్ స్థానంలో వన్డే కొత్త కెప్టెన్గా శుబ్మన్ గిల్ను నియమించింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ సందర్భంగా అతడి శకం మొదలుకానుంది. ఇక ప్రసుతం స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టు సిరీస్తో బిజీగా ఉన్న గిల్ గురువారం మీడియాతో మాట్లాడాడు.నాకు ముందే ఈ విషయం గురించి తెలుసుఈ సందర్భంగా వన్డే సారథిగా రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేయడం గురించి స్పందిస్తూ.. ‘‘టెస్టు మ్యాచ్ మధ్యలోనే ఈ ప్రకటన వచ్చింది. అయితే, అంతకంటే ముందే నాకు ఈ విషయం గురించి తెలుసు. నాకు దక్కిన గొప్ప గౌరవం. అతిపెద్ద బాధ్యత.వన్డేల్లో టీమిండియాను ముందుకు నడిపించడానికి ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నా. గత కొన్ని నెలలుగా నా జీవితం కొత్తగా మారిపోయింది. ఉత్సుకతను పెంచింది. భవిష్యత్తులో జట్టును గొప్పగా ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తా’’ అని గిల్ పేర్కొన్నాడు. మూడు ఫార్మాట్లలోనూ నాయకత్వం వహించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపాడు.రోహిత్ భాయ్ నుంచి నేర్చుకున్నవి ఇవేఇక రోహిత్ శర్మ గురించి ప్రస్తావన రాగా.. ‘‘రోహిత్ భాయ్లో ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి. వాటిని వారసత్వంగా నేను స్వీకరిస్తా. ముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండటం.. డ్రెసింగ్రూమ్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం ఆయనలో నాకు నచ్చే గుణాలు. ఈ రెండింటిని నేను తప్పకుండా కొనసాగిస్తా’’ అని గిల్ పేర్కొన్నాడు.కాగా వెస్టిండీస్తో తొలి టెస్టులో ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. అక్టోబరు 10- 14 మధ్య జరిగే రెండో టెస్టులోనూ గెలిచి వైట్వాష్ చేయాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం వేదిక. చదవండి: నిజం చెప్పడానికి సిగ్గెందుకు?: సూర్యకుమార్ యాదవ్ -
2027 వరల్డ్ కప్ కొట్టాకే రిటైర్మెంట్.. క్లారిటీ ఇచ్చిన హిట్ మ్యాన్
-
టీమిండియాకు గంభీర్ డిన్నర్ పార్టీ!.. రోహిత్- కోహ్లి ఓ రోజు ముందుగానే..
ఇటీవలే ఆసియా టీ20 కప్-2025 (Asia Cup) గెలిచిన టీమిండియా వరుస సిరీస్లతో బిజీ బిజీగా గడుపనుంది. అక్టోబరు నెల మొత్తం భారత క్రికెట్ జట్టు ఆటలో తలమునకలు కానుంది. ఇప్పటికే స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టు సిరీస్ మొదలుపెట్టిన టీమిండియా.. తొలి మ్యాచ్ను మూడు రోజుల్లోనే ముగించి జయభేరి మెగించింది.ఇరుజట్ల మధ్య ఢిల్లీ వేదికగా రెండో టెస్టుకు అక్టోబరు 10- 14 వరకు రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన (India Tour Of Australia 2025)కు బయల్దేరనుంది. అక్టోబరు 15వ తేదీనే గిల్ సేన భారత్ నుంచి ఆసీస్కు పయనం కానున్నట్లు సమాచారం.టీమిండియాకు గంభీర్ డిన్నర్ పార్టీ!అయితే, అంతకంటే ముందు హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) టీమిండియాకు తన నివాసంలో డిన్నర్ పార్టీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ఆసీస్ టూర్కు ముందు... వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మపై వేటు వేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుబ్మన్ గిల్ను కొత్త సారథిగా ఎంపిక చేసింది.అయితే, రోహిత్ను ఓపెనర్గా జట్టులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్- హెడ్కోచ్ గంభీర్పై విమర్శలు వస్తున్నాయి. వీరిద్దరు కలిసే దిగ్గజ కెప్టెన్పై వేటు వేశారంటూ పలువురు మాజీ క్రికెటర్లు రోహిత్కు మద్దతుగా నిలుస్తున్నారు.రోహిత్- కోహ్లి ఓ రోజు ముందుగానే..ఈ నేపథ్యంలో భారత జట్టు కంటే ముందే రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి ఓ రోజు ముందుగానే ఆస్ట్రేలియాకు బయల్దేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో గంభీర్.. గిల్ సేనకు ఢిల్లీలోని తన ఇంట్లో పార్టీ ఇచ్చేందుకు సిద్ధం కావడం మరోసారి సందేహాలకు తావిచ్చింది. రో-కోలకు గంభీర్తో సఖ్యత చెడిందనే గుసగుసలు మరోసారి గుప్పుమంటున్నాయి.కాగా అక్టోబరు 19- నవంబరు 8 వరకు టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. తొలుత మూడు వన్డేల సిరీస్.. ఆ తర్వాత ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించి భారత్- ఆస్ట్రేలియా ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు టీమిండియాశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైశ్వాల్.ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు టీమిండియాసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్. చదవండి: టీమిండియాతో సిరీస్లకు ఆసీస్ జట్ల ప్రకటన -
అగార్కర్కు అవమానకర ముగింపు తప్పదు: మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar)పై ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ (Steve Harmison) సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ (Rohit Sharma)- విరాట్ కోహ్లి (Virat Kohli) విషయంలో అగార్కర్కు ఓటమి తప్పదని వ్యాఖ్యానించాడు. ఈ ఇద్దరు దిగ్గజ కెప్టెన్లు.. ముఖ్యంగా కోహ్లి.. అగ్కార్ను తప్పక ఓడించితీరతాడని పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత రోహిత్- కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇటీవలే వీరిద్దరు టెస్టులకు కూడా రిటైర్మెంట్ ఇచ్చాడు. రో- కో ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతుండగా.. బీసీసీఐ ఇటీవల అనూహ్య నిర్ణయం తీసుకుంది.శుబ్మన్ గిల్కు పగ్గాలుఇటీవలే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన రోహిత్ శర్మ వన్డే కెప్టెన్గా తప్పించి.. శుబ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించింది. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా గిల్ వన్డే సారథిగా తన ప్రయాణం మొదలుపెడతాడని వెల్లడించింది. ఇక ఈ జట్టులో రోహిత్, కోహ్లి ఆటగాళ్లుగా కొనసాగనున్నారు.రో- కోకు పరోక్షంగా వార్నింగ్ఇక రోహిత్పై వేటు వేయడం గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. రో- కో వన్డే వరల్డ్కప్-2027 వరకు ఆడతారని గ్యారెంటీ లేదని పేర్కొన్నాడు. అందుకే గిల్ను కెప్టెన్ చేసినట్లు వెల్లడించాడు. అంతేకాదు.. వరల్డ్కప్ నాటికి జట్టులో ఉండాలంటే దేశీ క్రికెట్ కూడా ఆడకతప్పదని రో- కోకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు.అగార్కర్కు అవమానకర ముగింపు తప్పదుఈ విషయం గురించి స్టీవ్ హార్మిసన్ తాజాగా స్పందించాడు. ‘‘దురదృష్టవశాత్తూ.. చివరికి అగార్కర్ అవమానకరమైన ముగింపు తప్పదని భావిస్తున్నా. ఈ పోటీలో మాజీ కెప్టెన్లు గెలుస్తారా? లేదంటే మాజీ ఆల్రౌండర్దే గెలుపా? అంటే.. కచ్చితంగా ఆ ఇద్దరే గెలుస్తారని అనుకుంటున్నా.అలా కాకుండా కేవలం కోహ్లి- శర్మలను రెచ్చగొట్టడానికి.. వారిని ఎలాగైనా వరల్డ్కప్లో ఆడించాలనే ఉద్దేశంతో అగార్కర్ ఈ మాటలు అంటే అది వేరే సంగతి. నిజంగా అదొక మంచి విషయమే అవుతుంది. అలా కాకుండా వారి గురించి ఉద్దేశపూర్వకంగానే ఇలా మాట్లాడితే ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేము.కోహ్లి మాత్రం కచ్చితంగా..రోహిత్ కంటే కోహ్లికి వన్డేల్లో గొప్ప రికార్డు ఉంది. రోహిత్ కోహ్లి కంటే వయసులోనూ కాస్త పెద్దవాడు. కాబట్టి వరల్డ్కప్ నాటికి రోహిత్ విషయం ఎలా ఉన్నా.. కోహ్లి మాత్రం కచ్చితంగా కొనసాగుతాడనే అనుకుంటున్నా.ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి జట్లపై 350 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లి లేకుంటే టీమిండియా ఎలా గెలవగలదు?.. బహుశా కోహ్లి మనసులో కూడా ఇదే ఉండి ఉంటుంది. ఏదేమైనా అగార్కర్కు ఈ విషయంలో ఓటమి తప్పదు.ఛేజింగ్ కింగ్ఒకవేళ అగార్కర్ నిజంగానే రో- కో గురించి అలా అన్నాడా? లేదంటే అనువాద తప్పిదాలు ఏమైనా ఉన్నాయో నాకైతే తెలియవు’’ అని స్టీవ్ హార్మిసన్ పేర్కొన్నాడు. కాగా వన్డేల్లో ఛేజింగ్లోనే కోహ్లి 28 శతకాలు బాది 8064 పరుగులు రాబట్టాడు. ఇందులో 41 హాఫ్ సెంచరీలు కూడా ఉండటం విశేషం. అత్యుత్తమ స్కోరు 183. అంతేకాదు.. 300 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లి ఏకంగా ఏడు సెంచరీలు నమోదు చేయడం అతడు ఛేజింగ్ కింగ్ అనడానికి మరో నిదర్శనం.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
ద్రవిడ్ వల్లే సాధ్యమైంది.. చాంపియన్స్ ట్రోఫీ గెలిచాం: రోహిత్ శర్మ
టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మాజీ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) వల్లే తమకు వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు గెలవడం సాధ్యమైందని పేర్కొన్నాడు. భారత వన్డే జట్టు కెప్టెన్గా ఉద్వాసనకు గురైన తర్వాత రోహిత్ శర్మ తొలిసారి మంగళవారం మీడియా ముందుకు వచ్చాడు.ముంబైలో జరిగిన CEAT క్రికెట్ రేటింగ్ అవార్డు ప్రదానోత్సం కార్యక్రమంలో రోహిత్ పాల్గొన్నాడు. ఈ ఏడాది సారథిగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచినందుకుగానూ ప్రత్యేక పురస్కారం అందుకున్నాడు.ఒకటీ, రెండేళ్లలో సాధ్యమైంది కాదుఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఈ జట్టంటే నాకెంతో ఇష్టం. వారితో కలిసి ఆడటం, వారితో కలిసి ప్రయాణించడం గొప్ప విషయం. ఇదేదో ఒకటీ, రెండేళ్లలో సాధ్యమైంది కాదు. చాలా ఏళ్లుగా శ్రమిస్తున్న మాకు దక్కిన ప్రతిఫలం.చాలాసార్లు ఫైనల్ వరకు వచ్చి.. ట్రోఫీని చేజార్చుకున్నాం. అయితే, ఈసారి మాత్రం తప్పులు పునరావృతం కానివ్వద్దని నిర్ణయించుకున్నాం. ఒకరో.. ఇద్దరో ఆటగాళ్ల వల్ల ఇది సాధ్యం కాదు. ప్రతి ఒక్కరు గొప్పగా రాణిస్తేనే అనుకున్న ఫలితాన్ని రాబట్టగలం.నాకు, రాహుల్ భాయ్కు..చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలుపులో భాగమైన ఆటగాళ్లంతా.. టైటిల్కు అర్హులు. మేమంతా ఎన్నో ఏళ్లుగా దీనికోసం శ్రమిస్తున్నాం. కేవలం ఆట మీదే దృష్టి పెట్టాము. జట్టు నుంచి నాకు, రాహుల్ భాయ్కు అందిన సహకారం గొప్పది.టీ20 ప్రపంచకప్-2024లో మేము సిద్ధం చేసుకున్న ప్రణాళికలను పక్కాగా అమలు చేశాం. వాటినే చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ కొనసాగించాము. అయితే, 2023 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో మాత్రం ఓడిపోయాము. ఆ తర్వాత మాలో పట్టుదల మరింత పెరిగింది’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.గంభీర్కు రోహిత్ కౌంటర్కాగా ద్రవిడ్ మార్గదర్శనంలో.. రోహిత్ కెప్టెన్సీలో 2024లో పొట్టి ప్రపంచకప్ గెలిచింది టీమిండియా. ఆ తర్వాత ద్రవిడ్ హెడ్కోచ్ పదవికి రాజీనామా చేయగా.. గౌతం గంభీర్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. అయితే, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో గంభీర్ మార్గదర్శనం చేసినా.. దాని వెనుక ద్రవిడ్ ఏళ్ల శ్రమ ఉందని రోహిత్ పరోక్షంగా చెప్పడం గమనార్హం.ఇక వన్డే కెప్టెన్గా కొనసాగాలనుకున్న రోహిత్ శర్మను తప్పించి.. శుబ్మన్ గిల్ను సారథి చేయడం వెనుక గంభీర్ హస్తం ఉందనేది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో రోహిత్ ఇలా తాను రెండు ఐసీసీ టైటిళ్లు గెలవడంలో ద్రవిడ్దే కీలక పాత్ర అని చెప్పడం గమనార్హం. పరోక్షంగా గంభీర్కు హిట్మ్యాన్ ఇలా కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ పలికిన రోహిత్.. వన్డేల్లో కొనసాగుతున్నాడు. మరోవైపు.. శుబ్మన్ గిల్ ఇప్పటికే టీమిండియా టెస్టు సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. సూర్యకుమార్ యాదవ్ టీ20 జట్టు నాయకుడిగా ఉన్నాడు.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
CEAT అవార్డుల విజేతలు వీరే.. రోహిత్ శర్మకు ప్రత్యేక పురస్కారం
27వ CEAT క్రికెట్ రేటింగ్ (CCR) అవార్డుల వేడుక నిన్న (అక్టోబర్ 7) ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఇటీవలికాలంలో ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రికెటర్లకు ఈ వేడుకలో పురస్కారాలు లభించాయి. ఈ వేడుకలో మాజీ భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రధాన ఆకర్షణగా నిలిచారు. భారత వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించబడిన తర్వాత రోహిత్కు ఇది మొదటి పబ్లిక్ అప్పియరెన్స్.ROHIT SHARMA - THE LEADER 🐐 Ro received the Special award from CEAT for winning the Champions Trophy. pic.twitter.com/ad5GbSdAZG— Johns. (@CricCrazyJohns) October 7, 2025ఈ వేడుకలో రోహిత్కు ఓ ప్రత్యేక అవార్డు లభించింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలిపించినందుకుగానూ అతన్ని ఈ అవార్డు వరించింది. రోహిత్ నాయకత్వంలో భారత్ వరుసగా గెలిచిన రెండో ఐసీసీ ట్రోఫీ ఇది. 2024లో రోహిత్ సారథ్యంలో టీమిండియా టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. రోహిత్కు ఈ అవార్డును భారత బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గవాస్కర్ అందజేశారు.ఈసారి CCR అవార్డులను మెజార్టీ శాతం భారత క్రికెటర్లే గెలుచుకున్నారు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మను కాదని సంజూ శాంసన్ (Sanju Samson) టీ20 బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు.ఇటీవలికాలంలో టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని (Varun Chakravarthy) టీ20 బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరించింది.సర్పంచ్ సాబ్ శ్రేయస్ అయ్యర్కు (Shreyas Iyer) ఓ ప్రత్యేక అవార్డు ఇచ్చారు. CEAT JioStar అవార్డుతో అతన్ని సత్కరించారు.మహిళల విభాగంలోనూ టీమిండియా ఆధిపత్యం కొనసాగింది. స్మృతి మంధన, దీప్తి శర్మ బెస్ట్ బ్యాటర్, బౌలర్ అవార్డులు గెలుచుకున్నారు. అయితే, వారు ఈ అవార్డులను అందుకునేందుకు రాలేకపోయారు. ప్రస్తుతం వారు వన్డే వరల్డ్కప్లో బిజీగా ఉన్నారు.విదేశీ ఆటగాళ్ల విషయానికొస్తే.. జో రూట్కు అంతర్జాతీయ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. కేన్ విలియమ్సన్కు వన్డే బ్యాటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. హ్యారీ బ్రూక్కు టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. ఇటీవల సౌతాఫ్రికాను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్గా నిలబెట్టిన టెంబా బవుమాకు బెస్ట్ కెప్టెన్ అవార్డు లభించింది. బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారాకు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది.విజేతల పూర్తి జాబితా:ఛాంపియన్స్ ట్రోఫీ విజయానికి గుర్తుగా ప్రత్యేక అవార్డు- రోహిత్ శర్మలైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు- బ్రియాన్ లారా అంతర్జాతీయ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- జో రూట్ T20I బ్యాటర్ ఆఫ్ ది ఇయర్- సంజు శాంసన్T20I బౌలర్ ఆఫ్ ది ఇయర్- వరుణ్ చక్రవర్తిCEAT JioStar అవార్డు- శ్రేయస్ అయ్యర్ODI బ్యాటర్ ఆఫ్ ది ఇయర్- కేన్ విలియమ్సన్ODI బౌలర్ ఆఫ్ ది ఇయర్- మ్యాట్ హెన్రీCEAT లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు- B.S.చంద్రశేఖర్మహిళల బ్యాటర్ ఆఫ్ ది ఇయర్- స్మృతి మంధనమహిళల బౌలర్ ఆఫ్ ది ఇయర్- దీప్తి శర్మఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్- అంగ్రిష్ రఘువంశీఉదాత్త నాయకత్వ అవార్డు- టెంబా బవుమాటెస్ట్ బౌలర్ ఆఫ్ ది ఇయర్- ప్రభాత్ జయసూర్యటెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- హ్యారీ బ్రూక్డొమెస్టిక్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- హర్ష్ దూబేచదవండి: ఇంగ్లండ్ కెప్టెన్ ఎంగేజ్మెంట్.. పాక్ ఓవరాక్షన్ స్పిన్నర్ రిసెప్షన్ -
సియట్ అవార్డుల వేడుక.. ప్రత్యేక ఆకర్షణగా రోహిత్ శర్మ (ఫొటోలు)
-
రోహిత్పై వేటు సరైన నిర్ణయం.. కోహ్లి జట్టులో కొనసాగాలంటే..: డివిలియర్స్
టీమిండియా వన్డే కెప్టెన్ను మారుస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీసుకున్న నిర్ణయం సరైందా? కాదా? అన్న చర్చ నడుస్తూనే ఉంది. రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పించి శుబ్మన్ గిల్కు పగ్గాలు ఇవ్వడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ క్రమంలో భారత దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar)తో పాటు మదన్ లాల్ వంటి వారు సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థిస్తుండగా. హర్భజన్ సింగ్, రాబిన్ ఊతప్ప, మహ్మద్ కైఫ్ వంటి మాజీ క్రికెటర్లు దీనిని తొందరపాటు చర్యగా అభివర్ణిస్తున్నారు.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా లెజండరీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ కూడా భారత వన్డే జట్టు కెప్టెన్ మార్పు అంశంపై తాజాగా స్పందించాడు. రోహిత్ శర్మను తప్పించి గిల్ను కెప్టెన్ను చేయడం సరైన నిర్ణయమని పేర్కొన్నాడు. ఇందుకు గల కారణాలు వివరిస్తూ..రోహిత్పై వేటు సరైన నిర్ణయం‘‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి (Virat Kohli).. వన్డే వరల్డ్కప్-2027 వరకు ఆడతారో లేదో నమ్మకం లేదు. ఆ ఆలోచనతోనే శుబ్మన్ గిల్ను వన్డే కెప్టెన్గా చేసి ఉంటారు. అతడికి గొప్ప అవకాశం లభించింది.యువకుడు.. బ్యాటర్గానూ మంచి ఫామ్లో ఉన్నాడు. అద్భుతమైన నాయకుడిగా ఎదగగలడు. రోహిత్, కోహ్లి జట్టులో ఉండగానే గిల్ను కెప్టెన్ చేయడం సరైన నిర్ణయం. ఈ ఇద్దరు గొప్ప, అనుభవజ్ఞులైన కెప్టెన్ల నుంచి గిల్ ఎంతో నేర్చుకునే అవకాశం లభిస్తుంది.రోహిత్, కోహ్లి జట్టులో కొనసాగాలంటే..వారి అనుభవం తనకు ఉపయోగపడుతుంది. కెప్టెన్గా ఎదిగే క్రమంలో అతడికి ఇది ఎంతో ముఖ్యం. వాళ్లిద్దరు జట్టులో ఉండటం గిల్కు సానుకూలంగా ఉంటుంది. ఏదేమైనా ఒకవేళ రోహిత్, కోహ్లి 2027 వరల్డ్కప్ వరకు కొనసాగాలనుకుంటే.. తప్పకుండా పరుగులు రాబట్టాల్సి ఉంటుంది.సెలక్టర్లకు బ్యాట్ ద్వారానే సందేశం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం టీమిండియాలో చోటు కోసం తీవ్రమైన పోటీ ఉంది. ఈ పోటీని దాటి ముందుకు వెళ్లాలంటే కచ్చితంగా పరుగులు చేయాల్సిందే. రోహిత్, కోహ్లి వరల్డ్కప్ వరకు జట్టులో ఉంటే.. టీమిండియాకు అంతకంటే గొప్ప ఆస్తి మరొకటి ఉండదు’’ అని డివిలియర్స్ పేర్కొన్నాడు.ఆసీస్తో సిరీస్తో రీఎంట్రీకాగా ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లి.. వన్డేల్లో మాత్రం కొనసాగుతున్నారు. చివరగా ఇద్దరూ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సందర్భంగా టీమిండియా తరఫున బరిలోకి దిగారు. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్తో రో- కో పునరాగమనం చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే టీమిండియా టెస్టు కెప్టెన్గా గిల్ జట్టును ముందుకు నడిపిస్తుండగా.. టీ20 టీమ్కు సూర్యకుమార్ యాదవ్ సారథిగా ఉన్నాడు.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
అజిత్ నుంచి గిల్ వరకు.. టీమిండియా వన్డే కెప్టెన్లు వీరే
టీమిండియా కొత్త వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్ను బీసీసీఐ ఎంపిక చేసింది. రోహిత్ శర్మ స్ధానాన్ని గిల్ భర్తీ చేయనున్నాడు. ఆసీస్ టూర్ నుంచి వన్డే సారథిగా గిల్ తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. భారత వన్డే కెప్టెన్గా ఎంపికైన 28వ ఆటగాడిగా గిల్ నిలిచాడు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు భారత జట్టు వన్డే కెప్టెన్గా పనిచేసిన ప్లేయర్లపై ఓ లుక్కేద్దాం.అజిత్ వాడేకర్: వన్డేల్లో భారత్కు కెప్టెన్గా వ్యవహరించిన తొలి ఆటగాడు. అతడి నాయకత్వంలో 1974లో భారత్ రెండు వన్డేలు ఆడింది.శ్రీనివాసరాఘవన్ వెంకటరాఘవన్: శ్రీనివాసరాఘవన్ ఏడు వన్డేల్లో టీమిండియాకు నాయకత్వం వహించాడు.బిషన్ సింగ్ బేడి: లెజెండరీ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడి నాలుగు వన్డే మ్యాచ్లలో భారత్ను నడిపించాడు.సునీల్ గవాస్కర్: 1980 నుండి 1985 వరకు సునీల్ గవాస్కర్ నాయకత్వంలో భారత్ 37 వన్డే మ్యాచ్లు ఆడింది.గుండప్ప విశ్వనాథ్: 1981లో గుండప్ప విశ్వనాథ్ ఒక వన్డే మ్యాచ్కు భారత జట్టుకు నాయకత్వం వహించాడు.కపిల్ దేవ్: కపిల్ దేవ్ నాయకత్వంలో భారత్ 74 వన్డేలు ఆడింది. అతడి కెప్టెన్సీలోనే 1983 ప్రపంచ కప్ను టీమిండియా గెలుచుకుంది.సయ్యద్ కిర్మాణి: 1983లో సయ్యద్ కిర్మాణి ఒక వన్డే మ్యాచ్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు.మోహిందర్ అమర్నాథ్: 1984లో మోహిందర్ అమర్నాథ్ ఒక వన్డే మ్యాచ్లో టీమిండియా కెప్టెన్గా వ్యవహరించాడు.రవిశాస్త్రి:1986 నుండి 1991 వరకు 11 వన్డే మ్యాచ్లకు రవిశాస్త్రి టీమిండియా కెప్టెన్గా పనిచేశాడు.దిలీప్ వెంగ్సర్కార్: 1987 నుండి 1998 వరకు దిలీప్ వెంగ్సర్కార్ నాయకత్వంలో భారత్ 18 వన్డేలు ఆడింది.కృష్ణమాచారి శ్రీకాంత్: 1989లో కృష్ణమాచారి శ్రీకాంత్ భారత జట్టు కెప్టెన్గా వ్యవహరించాడు.అజారుద్దీన్: మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్సీలో భారత్ 174 వన్డే మ్యాచ్లు ఆడింది.సచిన్ టెండూల్కర్: లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ 1996 నుండి 1999 వరకు 73 వన్డేల్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. కానీ అతడి కెప్టెన్సీలో 23 మ్యాచ్ల్లో మాత్రమే భారత్ విజయం సాధించింది. అజయ్ జడేజా: అజయ్ జడేజా భారత కెప్టెన్గా 13 వన్డేల్లో వ్యవహరించాడు. కెప్టెన్గా 8 విజయాలను అందుకున్నాడు.సౌరవ్ గంగూలీ: 1999 నుండి 2005 వరకు సౌరవ్ గంగూలీ నాయకత్వంలో భారత్ 146 వన్డేలు ఆడి 76 గెలిచింది.రాహుల్ ద్రవిడ్: 2000 నుండి 2007 వరకు 79 వన్డేల్లో భారత్కు నాయకత్వం వహించిన ద్రవిడ్ 42 మ్యాచ్లను గెలిపించాడు.అనిల్ కుంబ్లే: 2002లో కుంబ్లే భారత కెప్టెన్గా ఒకే ఒక వన్డే మ్యాచ్లో వ్యవహరించాడు.వీరేంద్ర సెహ్వాగ్: వీరేంద్ర సెహ్వాగ్ నాయకత్వంలో భారత్ 12 వన్డేలు ఆడి 7 విజయాలు సాధించింది.ఎంఎస్ ధోని: వన్డేల్లో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్లలో ధోని ఒకడిగా నిలిచాడు. 2007 నుంచి 2018 వరకు అతడి సారథ్యంలో 200 మ్యాచ్లు ఆడిన భారత్.. 110 మ్యాచ్లలో విజయం సాధించింది. అతడి నాయకత్వంలో భారత్ ఆసియాకప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది.సురేష్ రైనా: 2010 నుండి 2014 వరకు 12 వన్డేల్లో రైనా భారత్కు నాయకత్వం వహించాడు.గౌతమ్ గంభీర్: ప్రస్తుత హెడ్కోచ్ భారత కెప్టెన్గా ఆరు వన్డేల్లో వ్యవహవరించాడు. మొత్తం అన్ని మ్యాచ్లలోనూ భారత్ విజయం సాధించింది.విరాట్ కోహ్లీ: 2013 నుండి 2021 వరకు భారత కెప్టెన్గా విరాట్ కోహ్లి వ్యవహరించాడు. అతడి సారథ్యంలో 95 వన్డేలు ఆడిన భారత్ 65 విజయాలు సాధించింది.అజింక్య రహానే: 2015లో, అజింక్య రహానే మూడు వన్డే మ్యాచ్ల్లో భారత్కు నాయకత్వం వహించాడు.రోహిత్ శర్మ: రోహిత్ శర్మ 2017 నుండి 2025 వరకు 56 వన్డేల్లో టీమిండియాకు నాయకత్వం వహించాడు. 42 మ్యాచ్లలో భారత్ గెలుపొందింది. అతడి కెప్టెన్సీలోనే భారత్ 2025 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.శిఖర్ ధావన్: మాజీ ఓపెనింగ్ బ్యాటర్ శిఖర్ ధావన్ కూడా 12 మ్యాచ్లలో భారత జట్టు కెప్టెన్గా వ్యవహరించాడు.కెఎల్ రాహుల్: స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇప్పటివరకు 12 వన్డేల్లో భారత్కు నాయకత్వం వహించాడు.హార్దిక్ పాండ్యా: రోహిత్ శర్మ గైర్హజరీలో హార్దిక్ పాండ్యా మూడు వన్డేల్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు.శుభ్మన్ గిల్: అక్టోబర్ 19న పెర్త్లో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్తో టీమిండియా వన్డే కెప్టెన్గా గిల్ శకం మొదలు కానుంది. -
విరాట్, రోహిత్ బలిపశువులా? టీమిండియా లో భారీ కుట్ర!
-
గిల్ కాదు!.. సూర్య తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్ అతడే!
భారత క్రికెట్లో గత కొన్నాళ్లుగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీమిండియా జూన్లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే ముందే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులకు వీడ్కోలు పలకగా.. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)కూడా సంప్రదాయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.రో- కో బైబైఅంతకంటే ముందే.. అంటే 2024లో టీమిండియా టీ20 ప్రపంచకప్ టైటిల్ సాధించిన తర్వాత రోహిత్- కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు వన్డేల్లో మాత్రమే కొనసాగుతండగా.. ఆస్ట్రేలియా టూర్కు ముందు బీసీసీఐ రోహిత్పై వేటు వేసింది. వన్డే కెప్టెన్సీ నుంచి అతడిని తప్పించింది.ఇప్పటికే టెస్టు జట్టు సారథిగా వ్యవహరిస్తున్న యువ ఆటగాడు శుబ్మన్ గిల్ (Shubman Gill)ను.. వన్డేలకూ కెప్టెన్గా నియమించింది. ఈ విషయం గురించి టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉండటం సరికాదని పేర్కొన్నాడు.గిల్కే మేనేజ్మెంట్ మద్దతువన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి పూర్తిస్థాయిలో జట్టును సిద్ధం చేసే క్రమంలో గిల్కు సారథ్య బాధ్యతలు అప్పగించినట్లు అగార్కర్ తెలిపాడు. అంతేకాదు.. రోహిత్- కోహ్లి వన్డే ప్రపంచకప్ టోర్నీ ఆడతామనే హామీ ఇవ్వలేదంటూ అభిమానుల హృదయాలు ముక్కలు చేశాడు.ఇదిలా ఉంటే.. టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్ అయిన గిల్.. త్వరలోనే టీ20 కెప్టెన్గానూ స్వీకరించబోతున్నట్లు అగార్కర్ మాటలను బట్టి అర్థమవుతోంది. ప్రస్తుతం టీమిండియా టీ20 కెప్టెన్గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్-2026 తర్వాత తప్పుకొంటే.. గిల్ అతడి స్థానాన్ని భర్తీ చేస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.టెస్టులలో ఒకే.. కానీ వన్డేలలో..ఇలాంటి తరుణంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప మాత్రం భిన్నంగా స్పందించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘టెస్టు ఫార్మాట్కు గిల్ కెప్టెన్ కావడం మంచి పరిణామం. అందుకు తాను అర్హుడినని ఇప్పటికే తను నిరూపించుకుంటున్నాడు.అయితే, వన్డేల్లో మాత్రం.. గిల్ కంటే గొప్ప సామర్థ్యమున్న ఆటగాడు టీమిండియాకు దొరికేవాడు. బ్యాటర్గా అతడి గణాంకాలు ఫర్వాలేదు. కానీ ఇప్పటికిప్పుడు కెప్టెన్ అంటేనే కాస్త చిత్రంగా ఉంది.శ్రేయస్ అయ్యర్ వైపు చూపుటీ20 ఫార్మాట్లో మాత్రం ఇప్పటికీ శుబ్మన్ గిల్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నాల్లోనే ఉన్నాడు. నాకు తెలిసి టీ20 భవిష్య కెప్టెన్గా యాజమాన్యం శ్రేయస్ అయ్యర్ వైపు దృష్టి సారించే అవకాశం ఉందనిపిస్తోంది’’ అని భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డాడు. కాగా ఫిట్నెస్ సమస్యల కారణంగా ఇటీవల టెస్టు ఫార్మాట్ నుంచి విరామం తీసుకున్న శ్రేయస్ అయ్యర్.. వన్డేల్లో మాత్రం సత్తా చాటుతున్నాడు. ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా తరఫున టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.జట్టులోనే స్థానం లేదుమరోవైపు.. ఐపీఎల్లో గతేడాది కెప్టెన్గా కోల్కతా నైట్రైడర్స్ను చాంపియన్గా నిలిపిన శ్రేయస్ అయ్యర్.. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ సారథిగా జట్టును ఫైనల్కు చేర్చాడు. బ్యాటర్గానూ పొట్టి ఫార్మాట్లో పరుగుల వరద పారించాడు. అయినప్పటికీ ఆసియా టీ20 కప్-2025 జట్టుకు సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు. ఆటగాడిగానే శ్రేయస్కు స్థానమివ్వని యాజమాన్యం.. సూర్యకుమార్ యాదవ్ తర్వాత అతడిని ఏకంగా కెప్టెన్ను చేస్తుందంటూ ఊతప్ప అంచనా వేయడం విశేషం. కాగా ఆసీస్తో వన్డేలకు గిల్కు డిప్యూటీగా.. వైస్ కెప్టెన్గా అయ్యర్ ఎంపిక కావడం గమనార్హం.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
ఇది నిజంగా సిగ్గుచేటు: రోహిత్పై గంభీర్ ‘కామెంట్స్’ వైరల్
టీమిండియా వన్డే కెప్టెన్ మార్పు విషయంలో హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పించాడంటూ హిట్మ్యాన్ అభిమానులు గౌతీని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. గౌతీతో పాటు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్క (Ajit Agarkar)ర్పై కూడా రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.అది సిగ్గుచేటుఈ నేపథ్యంలో గౌతం గంభీర్ రోహిత్ శర్మను ఉద్దేశించి గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో మరోసారి తెరమీదకు వచ్చింది. ఇందులో మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ కాకపోతే అది జట్టు చేసుకున్న దురదృష్టమే కానీ... రోహిత్కు కాదు.పరిమిత ఓవర్ల క్రికెట్ లేదంటే టీ20 జట్టుకు అతడు కెప్టెన్ కాలేదంటే.. అది సిగ్గుచేటు. ఇంతకంటే రోహిత్ శర్మ ఇంకేం చేస్తే కెప్టెన్సీకి అర్హుడు అవుతాడు?’’ అంటూ గంభీర్ టీమిండియా యాజమాన్యం తీరును విమర్శిస్తూ రోహిత్ శర్మకు మద్దతు తెలిపాడు. పరోక్షంగా విరాట్ కోహ్లిని టార్గెట్ చేశాడు.నాడు కోహ్లి స్థానంలో రోహిత్ శర్మకాగా టీ20 ప్రపంచకప్-2021లో కనీసం సెమీస్ కూడా చేరకుండానే టీమిండియా ఇంటిబాట పట్టడంతో అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత వన్డే సారథ్య బాధ్యతల నుంచి బీసీసీఐ కోహ్లిని తప్పించగా.. సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లి స్వయంగా తప్పుకొన్నాడు.ఈ క్రమంలో 2021-22 మధ్య కాలంలో కోహ్లి స్థానంలో రోహిత్ శర్మను మూడు ఫార్మాట్లలో కెప్టెన్ను చేసింది బీసీసీఐ. అప్పటి నుంచి రోహిత్ సారథ్యంలో టీ20 ద్వైపాక్షిక సిరీస్లలో సత్తా చాటిన టీమిండియా గతేడాది వరల్డ్కప్ గెలిచింది.అంతకుముందు వన్డే వరల్డ్కప్-2023లో అజేయంగా ఫైనల్ చేరింది. ఇటీవల ఐసీసీ చాంపియన్స్ట్రోఫీ-2025 గెలిచింది. అయితే, ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ వన్డేల్లో కొనసాగుతానని చెప్పగా.. బీసీసీఐ అనూహ్యంగా అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించింది.ఇపుడు రోహిత్ ప్లేస్లో గిల్రోహిత్ స్థానంలో టెస్టు సారథిగా వచ్చిన యువ ఆటగాడు శుబ్మన్ గిల్కు వన్డే పగ్గాలనూ అప్పగించింది. ఇందులో హెడ్కోచ్ గంభీర్ పాత్ర కీలకం అని తెలుస్తోంది. గంభీర్తో పాటు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కలిసి 38 ఏళ్ల రోహిత్ను కెప్టెన్గా తప్పించాలనే నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు జాతీయ మీడియాతో పేర్కొనడం గమనార్హం.ఈ నేపథ్యంలో గంభీర్ గతంలో రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపిస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. ‘‘అప్పుడలా.. ఇప్పుడిలా.. నిజంగానే ఇది సిగ్గుచేటు’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. కాగా వన్డే వరల్డ్కప్-2027 నాటికి గిల్ చుట్టు జట్టును నిర్మించే క్రమంలో అతడిని కెప్టెన్ను చేసినట్లు అగార్కర్ ఇప్పటికే స్పష్టం చేశాడు.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్Never seen anyone more hypocritical and two-faced than Gautam Gambhir. The same guy who once said, “If Rohit Sharma doesn’t become India’s captain, it’s India’s loss, not Rohit’s,” now doesn’t want him as captain after becoming coach himself. pic.twitter.com/pqRzYKDR2a— Kusha Sharma (@Kushacritic) October 4, 2025 -
గంభీర్, అగార్కర్ కలిసే చేశారు.. రోహిత్ కెప్టెన్గా ఉంటే ఆ ప్రమాదం!
‘వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మను అకస్మాత్తుగా ఎందుకు తొలగించారు?’.. భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఇదే ప్రధాన చర్చ. టీమిండియాకు రెండు ఐసీసీ టైటిళ్లు అందించిన హిట్మ్యాన్ పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మండలి తీరుపై ఓవైపు విమర్శలు వస్తుండగా.. మరోవైపు.. సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) వంటి దిగ్గజాలు మాత్రం బోర్డు నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.రోహిత్ కెప్టెన్గా ఉంటే ఆ ప్రమాదం!ఈ నేపథ్యంలో టీమిండియా వన్డే కెప్టెన్సీ మార్పునకు సంబంధించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు కీలక విషయాలు వెల్లడించాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా అందించిన వివరాల మేరకు.. ‘‘నాయకుడిగా డ్రెసింగ్రూమ్లో రోహిత్ శర్మ (Rohit Sharma) వ్యవహరించే తీరు భిన్నంగా ఉంటుంది. సారథిగా తనకంటూ ప్రత్యేక శైలి ఉంది.అయితే, తను ఇప్పుడు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. మరి అలాంటపుడు.. కేవలం ఒక్క ఫార్మాట్కు తను కెప్టెన్గా ఉంటే టీమ్ కల్చర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టిన మొదటి ఆరు నెలలు గౌతం గంభీర్ టెస్టు, వన్డే జట్ల విషయంలో వెనక ఉండే నడిపించాడు.అంతా గంభీర్ ఆధీనంలోనే..అయితే, స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవం (టెస్టుల్లో 3-0తో వైట్వాష్), ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్లో ఓటమి తర్వాత గంభీర్ అన్ని విషయాలను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు.ప్రస్తుత నిర్ణయం (కెప్టెన్సీ నుంచి రోహిత్ను తప్పించడం) కూడా గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కలిసికట్టుగా తీసుకున్నారు. రోహిత్, విరాట్ కోహ్లిల వయస్సు ఇప్పటికే 35 ఏళ్లు దాటిపోయింది. కెరీర్లో వారు చివరి అంకానికి చేరుకుంటున్నారు. ఇలాంటి దశలో అకస్మాత్తుగా రోహిత్, కోహ్లిలు ఫామ్ కోల్పోతే నాయకత్వ బృందంలో గందరగోళం తలెత్తే పరిస్థితి ఉంటుంది.గంభీర్ నిర్ణయాల వల్లే మెరుగైన ఫలితాలునిజానికి ఇంగ్లండ్ పర్యటనకు ముందే వీరిద్దరు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం గురించి కూడా ఇక్కడ ప్రస్తావించాలి. ఏదేమైనా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీతో పాటు ఇంగ్లండ్లో రెండు టెస్టుల్లోనూ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే టీమిండియా గెలిచిన తీరు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత.. రోహిత్తో పాటు కోహ్లి కూడా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. ఇక ఇటీవల ఇంగ్లండ్తో టెస్టులకు ముందు సంప్రదాయ క్రికెట్కూ ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే, ఈ దిగ్గజ బ్యాటర్లు వన్డేల్లో మాత్రం మరికొన్నాళ్లు కొనసాగుతామని స్పష్టం చేశారు.త్వరలోనే టీ20 జట్టు పగ్గాలు కూడా అతడికేకానీ అనూహ్య రీతిలో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన బీసీసీఐ.. అతడి స్థానంలో శుబ్మన్ గిల్ను వన్డేలకూ సారథిని చేసింది. వన్డే వరల్డ్కప్-2027 టోర్నీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ సెలక్టర్ అగార్కర్ వెల్లడించాడు. అంతేకాదు.. రోహిత్- కోహ్లి 2027 ప్రపంచకప్ వరకు ఆడతామని తమకు హామీ ఇవ్వలేదని పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ టూర్ సందర్భంగా గిల్ టెస్టు జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇటీవలే టీ20 జట్టులోనూ సూర్యకుమార్ యాదవ్కు డిప్యూటీగా గిల్ ఆసియా కప్-2025లో పాల్గొన్నాడు. త్వరలోనే టీ20లకు కూడా అతడే కెప్టెన్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా రోహిత్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంలో గంభీర్ కీలక పాత్ర పోషించినట్లు బీసీసీఐ వర్గాల మాటల ద్వారా స్పష్టం అవుతోంది.చదవండి: 50 ఓవర్ల క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం -
'ఇంకెందుకు ఆలస్యం.. రోహిత్ను జట్టు నుంచి కూడా తీసేయండి'
టీమిండియా వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మ స్ధానంలో శుబ్మన్ గిల్ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ నియమించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా టూర్కు జట్టు ఎంపిక సందర్భంగా ఈ అనుహ్య మార్పు చోటు చేసుకుంది. 2027 ప్రపంచ కప్ కోసం దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కకర్ పేర్కొన్నాడు. కాగా హిట్మ్యాన్ కెప్టెన్గా అద్బుతమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు.ఎంఎస్ ధోని తర్వాత మూడు ఐసీసీ వైట్ బాల్ ఈవెంట్స్లో భారత జట్టును ఫైనల్కు చేర్చిన ఏకైక కెప్టెన్గా రోహిత్ నిలిచాడు. భారత్కు టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ను రోహిత్ అందించాడు. వన్డే ప్రపంచకప్-2023లో రన్నరప్గా టీమిండియాను నిలిపాడు.అయినప్పటికి రోహిత్ను సడన్గా కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని చాలా మంది మాజీలు తప్పుబడుతున్నారు. ఈ జాబితాలోకి భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ సబా కరీం చేరాడు. రోహిత్ను కెప్టెన్సీ తప్పించడంతో అతడి వన్డే భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందని కరీం అభిప్రాయపడ్డాడు."రోహిత్ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ సెలక్టర్ల తీసుకున్న నిర్ణయం నన్ను షాక్కు గురిచేసింది. ప్రస్తుతం అస్సలు కెప్టెన్సీ మార్పు అవసరమే లేదు. భారత్కు రోహిత్ వరుసగా రెండు ట్రోఫీలను అందించాడు. వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్కు మీరు ఇచ్చే గౌరవమిదేనా? 2027 ప్రపంచకప్కు ఇంకా సమయం ఉంది. తొందరపడాల్సిన అవసరం ఏమి వచ్చింది. అతడు ఇప్పటికే ఒక ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ ఒక నాయకుడిగా అద్బుతమైన జట్టును తాయారు చేశాడు. దాని ఫలితంగానే టీ20 ప్రపంచకప్-2024, ఛాంపియన్స్ ట్రోఫీ-2025ని భారత్ సొంతం చేసుకుంది.అంతేకాకుండా ప్రస్తుతం టీ20 ఫార్మాట్లలో దుమ్ములేపుతున్న భారత జట్టు వెనక కూడా రోహిత్ ఉన్నాడు. అందులో చాలా మంది ఆటగాళ్లు రోహిత్ సారథ్యంలోనే ఆడినవారే. రోహిత్ ఐదు ఆరు నెలలు ఆడకపోతే తన కెప్టెన్సీ, బ్యాటింగ్ను మర్చిపోయినట్లు కాదు.అతడికి వన్డే ఫార్మాట్లో ఎలా ఆడాలో తెలుసు, జట్టును విజయ పథంలో ఎలా నడిపించాలో తెలుసు. జట్టులో రోహిత్ రోల్పై సెలక్టర్లు క్లారిటీ వుందో లేదో నాకు ఆర్ధం కావడం లేదు. కెప్టెన్సీ నుంచి తప్పించారంటే రోహిత్ వన్డే ఫ్యూచర్పై మీకు స్పష్టత లేదు. 2027 ప్రపంచకప్లో హిట్ మ్యాన్ ఆడాడని మీరు అనుకుంటుంటే మరి జట్టులో ఎందుకు ఉంచారు. ప్రపంచకప్ ప్రణాళికలలో అతడు లేకపోతే జట్టులో ఎందుకు తీసేయండి? ఒకవేళ అతడు మీ ప్లాన్స్లో ఉంటే కెప్టెన్సీ నుంచి తొలిగించాల్సిన అవసరం ఏముంది? ఏదేమైనప్పటికి నా వరకు అయితే సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం సరైనది కాదు" తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. -
వాళ్లలా పట్టుకుని వేలాడే రకం కాదు!.. అయినా ఎందుకిలా?: కైఫ్ ఫైర్
టీమిండియా వన్డే జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పించడం పట్ల భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ స్పందించాడు. పదహారేళ్లుగా జట్టుకు సేవలు అందిస్తున్న దిగ్గజ ఆటగాడికి.. కేవలం ఇంకొక్క ఏడాదైనా సమయం ఇచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. ఇప్పటికిప్పుడు కెప్టెన్ను మార్చాల్సిన అవసరం ఏముందని.. రోహిత్ పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీరు సరికాదని మండిపడ్డాడు.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు ముందే బీసీసీఐ వన్డే కెప్టెన్ను మార్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ను గెలిపించిన రోహిత్ను తప్పించి.. టెస్టు సారథి శుబ్మన్ గిల్ (Shubman Gill)కే వన్డే పగ్గాలూ అప్పగించింది. ఈ నేపథ్యంలో కైఫ్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.గొప్పతనాన్ని చాటుకున్నాడు‘‘టీమిండియా కోసం రోహిత్ శర్మ తన జీవితంలో ఇప్పటికే పదహారేళ్లు ఇచ్చాడు. అతడి కోసం ఒక్కటంటే ఇంకొక్క ఏడాదే కెప్టెన్గా సమయం ఇవ్వలేరా?.. ఐసీసీ ఈవెంట్లలో పదహారు మ్యాచ్లలో పదిహేను మ్యాచ్లను గెలిపించిన సారథి. వన్డే వరల్డ్కప్-2023లో జట్టును ఫైనల్కు చేర్చాడు.ఇటీవల దుబాయ్లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ట్రోఫీ ఫైనల్లో రోహిత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. జట్టుకు ట్రోఫీ అందించాడు. 2024లో టీ20 ప్రపంచకప్ గెలవగానే రిటైర్మెంట్ ప్రకటించి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు.కొందరు పట్టుకుని వేలాడతారు.. రోహిత్ అలా చేయలేదు‘మేము ప్రపంచకప్ గెలిచాం. కొత్త ఆటగాళ్లకు కూడా అవకాశాలు రావాలి’ అని తనే తప్పుకొన్నాడు. కొన్నాళ్లు లైమ్లైట్కు దూరంగా ఉన్నాడు. నిజానికి భారత క్రికెట్లో కెప్టెన్గా చాలామంది తమ కాలాన్ని పొడిగించుకునేందుకు, పదవిని పట్టుకుని వేలాడుతూ ఉంటారు.కానీ రోహిత్ శర్మ అలా చేయలేదు కదా!.. తను వాళ్ల లాంటి వాడు కాదు.. అయినా ఇలా ఎందుకు?.. నిజానికి రోహిత్ ఎంతో మంది ఆటగాళ్లను తీర్చిదిద్దాడు. వారికి ఎన్నో విషయాలు నేర్పించాడు. అయినా సరే అతడిని ఇంకొక్క ఏడాది కెప్టెన్గా కొనసాగించలేరా?ఇంత హడావుడిగా ఎందుకు?వన్డే వరల్డ్కప్-2027 గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. అందుకు ఇంకా సమయం ఉంది. అయితే, ఇప్పటికే రోహిత్ను తొలగించారు. శుబ్మన్ గిల్ కొత్త సారథిగా వచ్చాడు. గిల్ ఇంకా యువకుడే. ఇప్పుడే హడావుడిగా అతడికి వన్డే కెప్టెన్సీ అప్పగించాల్సిన అవసరమైతే నాకు కనిపించలేదు’’ అంటూ కైఫ్ బీసీసీఐ తీరును విమర్శించాడు. చదవండి: 50 ఓవర్ల క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం -
వన్డే కెప్టెన్గా ఎంపిక.. శుబ్మన్ గిల్ రియాక్షన్ వైరల్
టీమిండియా వన్డే కెప్టెన్గా ఎంపిక కావడం పట్ల శుబ్మన్ గిల్ (Shubman Gill) హర్షం వ్యక్తం చేశాడు. వన్డేల్లోనూ జట్టుకు సారథ్యం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నాడు. వరల్డ్కప్ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఈ సందర్భంగా గిల్ పేర్కొన్నాడు.కాగా ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వన్డే, టీ20 జట్లను శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అనూహ్య రీతిలో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించిన బోర్డు.. అతడి స్థానంలో గిల్కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. వన్డే వరల్డ్కప్-2027 (ICC ODI World Cup 2027) టోర్నీని దృష్టిలో పెట్టుకుని ముందుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు.ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంఈ నేపథ్యంలో తాను వన్డే కెప్టెన్గా ఎంపిక కావడం పట్ల టెస్టు సారథి శుబ్మన్ గిల్ స్పందించాడు. ‘‘వన్డే క్రికెట్లో జాతీయ జట్టును ముందుకు నడిపించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. చాంపియన్ జట్టుకు సారథిగా ఎంపిక కావడం గర్వంగా ఉంది. నేను కూడా జట్టును గొప్పగా ముందుకు నడిపించాలనే ఆశిస్తున్నా.వరల్డ్కప్ కంటే ముందు మేము 20 వరకు వన్డేలు ఆడబోతున్నాము. ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం. ప్రతి ఒక్క ఆటగాడు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే కోరుకుంటాడు. నేను కూడా అంతే. సౌతాఫ్రికాలో జరిగే ఐసీసీ టోర్నీకి మేము పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతాము. వరల్డ్కప్ గెలుస్తాం’’ అని శుబ్మన్ గిల్ పేర్కొన్నాడు.రోహిత్ ఖాతాలో రెండుకాగా చివరగా 2011లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో వన్డే వరల్డ్కప్ గెలిచిన టీమిండియా.. 2023లో సొంతగడ్డపై రోహిత్ శర్మ కెప్టెన్సీలో రన్నరప్గా నిలిచింది. అయితే, ఈ ఏడాది ఐసీసీ వన్డే చాంపియన్స్ ట్రోఫీ-2025లో మాత్రం విజేతగా నిలిచింది. తద్వారా కెప్టెన్గా రోహిత్ శర్మ ఖాతాలో రెండు ఐసీసీ టైటిళ్లు చేరాయి. అంతకుముందు టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలోనూ కెప్టెన్ హోదాలో రోహిత్ భారత్ను చాంపియన్గా నిలిపిన సంగతి తెలిసిందే.అనూహ్య రీతిలోఆ తర్వాత అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. ఇటీవలే టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేల్లో కొనసాగుతానని స్పష్టం చేసిన రోహిత్ శర్మ పది కిలోల బరువు తగ్గి ఫిట్నెస్ను మరింత మెరుగుపరచుకున్నాడు. వన్డే వరల్డ్కప్-2027 ఆడటమే లక్ష్యంగా తనను తాను తీర్చిదిద్దుకుంటున్న తరుణంలో అనూహ్య రీతిలో కెప్టెన్సీ కోల్పోయాడు. కాగా 2027లో సౌతాఫ్రికా- జింబాబ్వే- నమీబియా ఉమ్మడిగా వన్డే వరల్డ్కప్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. చదవండి: 50 ఓవర్ల క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం -
రోహిత్పై వేటు!.. సరైన నిర్ణయం.. త్వరలోనే అతడూ అవుట్: గావస్కర్
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత క్రికెట్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మ (Rohit Sharma)పై వేటువేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI).. అతడి స్థానంలో శుబ్మన్ గిల్ (Shubman Gill)ను సారథిగా ఎంపిక చేసింది.ఆసీస్తో అక్టోబరులో జరిగే వన్డే సిరీస్ సందర్భంగా గిల్ వన్డే జట్టు పగ్గాలు చేపట్టనుండగా.. రోహిత్ శర్మ కేవలం ఆటగాడిగా కొనసాగనున్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై విమర్శలు వస్తుండగా.. భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ కూడా స్పందించాడు.త్వరలోనే అతడూ అవుట్రోహిత్ శర్మపై వేటు వేస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని గావస్కర్ సమర్థించాడు. ‘‘వన్డే వరల్డ్కప్-2027 నేపథ్యంలో బోర్డు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నాకేమీ ఆశ్చర్యంగా అనిపించలేదు. ప్రస్తుతం టీ20 కెప్టెన్సీ సూర్యకుమార్ యాదవ్ చేతిలో ఉంది.ఇటీవలే అతడు టీమిండియాను ఆసియా కప్ విజేతగా నిలిపాడు. ఈ టోర్నీలో సూర్య డిప్యూటీగా, వైస్ కెప్టెన్గా గిల్ వ్యవహరించాడు. అంటే.. త్వరలోనే అతడు మూడు ఫార్మాట్లకు కెప్టెన్గా ఉండబోతున్నాడని ముందుగానే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు’’ అని గావస్కర్ స్పోర్ట్స్ టుడేతో పేర్కొన్నాడు. వన్డే ప్రపంచకప్-2027 నాటికి గిల్ చుట్టూ జట్టును నిర్మించే క్రమంలో బీసీసీఐ సరైన నిర్ణయమే తీసుకుందని అభిప్రాయపడ్డాడు. అందుకే ఈ నిర్ణయం’కెప్టెన్సీ మార్పు గురించి రోహిత్కు ముందే తెలియజేశాం. 2027 వన్డే వరల్డ్ కప్కు చాలా సమయం ఉన్నా సహజంగానే దాని గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పుడు వన్డే జరుగుతున్న తీరు చూస్తే వచ్చే రెండేళ్లలో ఎక్కువగా మ్యాచ్లు లేకపోవచ్చు. కాబట్టి కెప్టెన్ జట్టు గురించి తెలుసుకునేందుకు, తన ప్రణాళికలు రూపొందించుకునేందుకు తగినంత సమయం కావాలి. అందుకే గిల్ను ఎంపిక చేశాం. నిజంగా చెప్పాలంటే మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు ఉండటం కూడా కష్టమే. కెప్టెన్గా రోహిత్ చాలా అద్భుతంగా నడిపించాడు. ఒక వేళ చాంపియన్స్ ట్రోఫీ గెలవకపోయినా అది అతని గొప్పతనాన్ని తగ్గించదు. కానీ ఇప్పుడు కాకపోతే ఆరు నెలల తర్వాత అయినా ఏదో ఒక దశలో టీమ్ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిందే’ అని టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా తమ నిర్ణయాన్ని సమర్థించుకున్న సంగతి తెలిసిందే. -
వన్డే సారథిగా గిల్
రోహిత్ శర్మ భారత వన్డే జట్టు కెప్టెన్ హోదాలో చాంపియన్స్ ట్రోఫీలో జట్టును విజేతగా నిలిపాడు. దీని తర్వాత టీమిండియా మరో వన్డే మ్యాచ్ ఆడలేదు. లెక్క ప్రకారం చూస్తే ఏదైనా స్వల్ప మార్పు మినహా అదే జట్టు తర్వాతి సిరీస్ కోసం కొనసాగాలి. కానీ బీసీసీఐ సెలక్షన్ కమిటీ భిన్నంగా ఆలోచించింది. ఐసీసీ టోర్నీని గెలిపించినా సరే... సారథ్యం నుంచి తప్పించి అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఓపెనింగ్ బ్యాటర్గా జట్టులో స్థానం దక్కించుకోగలిగిన ఆటగాడు నాయకత్వానికి మాత్రం అవసరం లేదని తేలి్చంది. ఇప్పటికే టెస్టు కెప్టెన్గా ఉన్న శుబ్మన్ గిల్ను ఇప్పుడు వన్డే కెప్టెన్గా కూడా నియమించి మార్పుకు సెలక్టర్లు శ్రీకారం చుట్టారు. ఆటగాళ్లుగా మాత్రం రోహిత్, విరాట్ కోహ్లి భారత జట్టు తరఫున ఆ్రస్టేలియా పర్యటనకు ఎంపికయ్యారు. అహ్మదాబాద్: భారత టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ ఇప్పుడు వన్డేల్లోనూ సారథ్య బాధ్యతలు చేపడుతున్నాడు. అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ గిల్ను వన్డే జట్టు కొత్త కెప్టెన్గా నియమించింది. ఇప్పటి వరకు కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మను అనూహ్యంగా నాయకత్వం నుంచి తప్పిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై జరిగే 3 వన్డేలు, 5 టి20ల సిరీస్ల కోసం టీమ్లను సెలక్టర్లు ప్రకటించారు. కెప్టెన్గా రోహిత్ వైఫల్యం లేకపోయినా... భవిష్యత్తును, ముఖ్యంగా 2027 వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని 26 ఏళ్ల గిల్ను కెప్టెన్గా ఎంపిక చేసినట్లు సెలక్టర్లు వెల్లడించారు. ఇంగ్లండ్తో సిరీస్లో తొలి సారి టెస్టు కెప్టెన్గా వ్యవహరించిన గిల్ ఇప్పుడు రెండు ఫార్మాట్లలో కెప్టెన్ కావడంతో పాటు టి20 టీమ్కు వైస్ కెప్టెన్గా ఉన్నాడు. 2026 టి20 వరల్డ్ కప్ తర్వాత సూర్యకుమార్ యాదవ్నుంచి అతనికి టి20 సారథ్య బాధ్యతలు కూడా వచ్చే అవకాశం ఉంది. రోహిత్ వయసు (38)ను దృష్టిలో ఉంచుకొని చూస్తే 2027 వరకు ఆటగాడిగా, కెప్టెన్గా కొనసాగడం కష్టంగానే అనిపించినా... ఇంత తొందరగా అతడిని కెప్టెన్ హోదానుంచి తప్పిస్తారనేది మాత్రం ఎవరూ ఊహించలేదు. అయితే అసలు వన్డే జట్టులో ఉంటారా లేదా అనే చర్చ జరిగిన నేపథ్యంలో... రోహిత్తో పాటు మరో సీనియర్ విరాట్ కోహ్లిలకు కూడా వన్డే టీమ్లో స్థానం లభించింది. వైస్ కెప్టెన్గా శ్రేయస్... భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన జట్టులో పలు మార్పులు జరిగాయి. ఆ టీమ్లో ఉన్నవారిలో రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా ఇంకా గాయాలనుంచి కోలుకోలేదు. ఇద్దరు స్పిన్నర్లు జడేజా, వరుణ్ చక్రవర్తిలను ఎంపిక చేయలేదు. పేస్ బౌలర్ మొహమ్మద్ షమీకి కూడా జట్టులో స్థానం లభించలేదు. వారి స్థానాల్లో నితీశ్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురేల్, ప్రసిధ్ కృష్ణ, అర్‡్షదీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్ వచ్చారు. టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు వన్డేల నుంచి మరోసారి విశ్రాంతినిచ్చారు. గత ఏడాది ఆగస్టు తర్వాత వన్డేలు ఆడని సిరాజ్ తన ఇటీవలి టెస్టు ప్రదర్శనతో మళ్లీ టీమ్లోకి రాగా... టెస్టులు, టి20ల్లో ఆకట్టుకున్న ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి, కీపర్ ధ్రువ్ జురేల్లకు వన్డేల్లో ఇదే తొలి అవకాశం. దుబాయ్ తరహాలో ఎక్కువ మంది స్పిన్నర్లను ఆడించే అవకాశం ఆ్రస్టేలియాలో లేదని...అందుకే జడేజాను పక్కన పెట్టామని అగార్కర్ స్పష్టం చేశాడు. వన్డేల్లో నిలకడగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్ను ఈ సిరీస్ కోసం వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు. సుందర్కు చోటు... టి20 టీమ్లో మాత్రం సెలక్టర్లు పెద్దగా మార్పేమీ చేయలేదు. ఆసియా కప్లో విజేతగా నిలిచిన జట్టులో ఒక్క హార్దిక్ పాండ్యా మాత్రమే గాయం కారణంగా దూరమయ్యాడు. అతని స్థానంలోనే ఆల్రౌండర్గా నితీశ్ రెడ్డికి స్థానం లభించింది. ఆ 15 మందితో పాటు ఆ్రస్టేలియా పర్యటన కోసం అదనంగా 16వ ఆటగాడి రూపంలో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను ఎంపిక చేశారు. వన్డేలకు దూరంగా ఉండనున్న బుమ్రా టి20లు మాత్రం ఆడతాడు. భారత్, ఆ్రస్టేలియా మధ్య అక్టోబర్ 19, 23, 25 తేదీల్లో వన్డేలు...అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 మధ్య 5 టి20లు జరుగుతాయి. -
అందుకే రోహిత్ శర్మపై వేటు: కుండబద్దలు కొట్టిన అగార్కర్
టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ (Rohit Sharma) శకం ముగిసింది. ఇప్పటికే టెస్టు, అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన హిట్మ్యాన్.. వన్డేల్లో మాత్రం కెప్టెన్గా కొనసాగుతానని ప్రకటించాడు. అయితే, అనూహ్య రీతిలో ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రోహిత్పై వేటు వేసింది.వన్డే సారథిగా రోహిత్ శర్మను తప్పించి.. అతడి స్థానంలో.. యువ ఆటగాడు, టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill)కు పగ్గాలు అప్పగించింది. దీంతో రోహిత్ కేవలం ఆటగాడిగానే జట్టులో కొనసాగనున్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై రోహిత్ శర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిగ్గజ కెప్టెన్కు ఇది అవమానం లాంటిదేనని సోషల్ మీడియా వేదికగా సెలక్టర్ల తీరును ఎండగడుతున్నారు. వన్డేల్లో డెబ్బై ఐదుకు పైగా విజయశాతం కలిగి ఉన్న సారథి పట్ల ఇలా వ్యవహరించడం సరికాదని హితవు పలుకుతున్నారు.అందుకే రోహిత్ శర్మపై వేటుఇదిలా ఉంటే.. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్లకు జట్టును ప్రకటించిన సందర్భంగా ఈ విషయంపై వివరణ ఇచ్చాడు. ‘‘భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది.జట్టు అత్యుత్తమ ప్రయోజనాల గురించే ఆలోచించాల్సి ఉంటుంది. ముందుగానే స్పందించి.. కొత్త వ్యక్తి (గిల్) చుట్టూ జట్టును నిర్మించాల్సి ఉంటుంది. ఇది సహేతుకమైన నిర్ణయం’’ అగార్కర్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు.అదే విధంగా.. మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లు ఉండటం ప్రాక్టికల్గా అంతగా వర్కౌట్ కాదని.. అన్ని జట్లకు ఒకే కెప్టెన్ ఉండటం ద్వారా హెడ్కోచ్ గౌతం గంభీర్కు కూడా పని సులువు అవుతుందని పేర్కొన్నాడు. అయితే, కెప్టెన్సీ నుంచి తప్పించడంపై రోహిత్తో ఎలాంటి చర్చ జరిగిందన్న విషయంపై మాత్రం అగార్కర్ స్పష్టతనివ్వలేదు.అప్పటి వరకు రో-కో ఆడటం కష్టమేఏదేమైనా వన్డే వరల్డ్కప్-2027 టోర్నీని దృష్టిలో పెట్టుకుని.. కెప్టెన్సీ విషయం గురించి రోహిత్తో మాట్లాడమని మాత్రమే అగార్కర్ వెల్లడించాడు. ఇక రోహిత్తో పాటు మరో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా దేశీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఆటగాళ్లు అందుబాటులో ఉన్నపుడు కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందని మేము స్పష్టంగా చెప్పాము’’ అని పేర్కొన్నాడు.అంతేకాదు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వన్డే వరల్డ్కప్-2027 నాటికి ఆడే విషయంపై తమకు ఎలాంటి హామీ ఇవ్వలేదని అగార్కర్ ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం నిబంధనలకు అనుగుణంగా ఇద్దరికీ ఫిట్నెస్ టెస్టులు నిర్వహించామని.. ఇద్దరూ మ్యాచ్ ఆడేందుకు ఫిట్గా ఉన్నారని తెలిపాడు. కాగా అక్టోబరు 19 నుంచి నవంబరు 8 వరకు టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన బీసీసీఐ శనివారం తమ జట్లను ప్రకటించింది.చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియా టూర్కు భారత జట్టు ప్రకటన.. నితీశ్ రెడ్డికి బంపరాఫర్ -
ఆస్ట్రేలియా టూర్కు భారత జట్టు ప్రకటన.. నితీశ్ రెడ్డికి బంపరాఫర్
ఆస్ట్రేలియా టూర్కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. భారత జట్టు వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మను సెలక్టర్లు తప్పించారు. అతడి స్ధానంలో శుభ్మన్ గిల్ను కొత్త వన్డే కెప్టెన్గా నియమించారు. గత కొన్నేళ్లుగా భారత వన్డే జట్టును నడిపిస్తున్న రోహిత్ శర్మ ఇకపై కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడు.అతడితో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి కూడా వన్డే జట్టులో చోటు దక్కింది. కాగా ఆస్ట్రేలియా పర్యటనకు స్టార్ ప్లేయర్లు హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్ గాయాల కారణంగా దూరమయ్యారు. ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన పంత్ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు.అదేవిధంగా యూఏఈ వేదికగా జరిగిన ఆసియాకప్లో గాయపడ్డ హార్ధిక్ పూర్తిగా కోలుకోవడానికి మరో నెల రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరిద్దరిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. హార్ధిక్ పాండ్యా స్ధానంలో యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి వన్డే, టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. నితీష్ గత కొన్నాళ్లగా కేవలం టెస్టు జట్టులో మాత్రమే కొనసాగుతున్నాడు. కానీ హార్దిక్ గాయం పడడంతో నితీష్కు జాక్ పాట్ తగిలింది. పంత్ స్ధానంలో ధ్రువ్ జురెల్ ఎంపికయ్యాడు.బుమ్రాకు విశ్రాంతి..కాగా ఆసీస్తో వన్డే సిరీస్కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. మహ్మద్ సిరాజ్ తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. పేస్ బౌలింగ్ ఎటాక్ను సిరాజ్ లీడ్ చేయనున్నాడు. అతడితో పాటు యువ పేసర్లు అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ద్ కృష్ణలు బంతిని పంచుకోనున్నారు.స్పిన్నర్లగా కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకున్నారు. ఇక టీ20 జట్టులో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. కెప్టెన్గా సూర్య కొనసాగుతుండగా.. నితీష్, సుందర్ కొత్తగా జట్టులోకి వచ్చారు. ఆక్టోబర్ 19 నుంచి భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం కానుంది.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు భారత జట్టు:శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైశ్వాల్ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు భారత జట్టు:సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్చదవండి: BCCI: రోహిత్ శర్మకు భారీ షాక్.. టీమిండియా వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్ -
రోహిత్ శర్మకు భారీ షాక్.. టీమిండియాకు కొత్త కెప్టెన్
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు ముందు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మ(Rohit sharma) స్ధానంలో యువ ఆటగాడు శుభ్మన్ గిల్ను అజిత్ అగార్కర్ అండ్ కో నియమించింది. ఆస్ట్రేలియా టూర్కు భారత జట్టు ఎంపిక సందర్భంగా ఈ నిర్ణయాన్ని సెలక్టర్లు తీసుకున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు వన్డే జట్టులో సభ్యులుగా కొనసాగనున్నారు.2027 వన్డే ప్రపంచ కప్ దృష్ట్యా రోహిత్ శర్మ స్ధానంలో కెప్టెన్గా గిల్ను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రపంచ కప్కు ఇంకా రెండేళ్ల కంటే ఎక్కువ సమయం ఉండడంతో అప్పటివరకు రోహిత్ ఆడుతాడో లేదో స్పష్టత లేనందున భారత క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.ముగిసిన రోహిత్ శకం..భారత క్రికెట్లో కెప్టెన్గా రోహిత్ శర్మ శకం ముగిసింది. ఇప్పటికే టెస్టులకు, టీ20లకు వీడ్కోలు పలికిన హిట్మ్యాన్.. ఇప్పుడు వన్డే కెప్టెన్సీ కోల్పోయాడు. దీంతో ఆసీస్ సిరీస్లో అతడిని కెప్టెన్గా చూడాలనకున్న అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది.వన్డేల్లో భారత సారథిగా రోహిత్కు అద్భతమైన ట్రాక్ రికార్డు ఉంది. టీమిండియాకు కెప్టెన్గా ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. వన్డేల్లో 50పైగా మ్యాచ్లలో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన ఏడుగురులో ఒకడిగా రోహిత్ నిలిచాడు. వన్డేల్లో 75% విజయ శాతంతో అత్యుత్తమ కెప్టెన్గా రోహిత్ నిలిచాడు. ఇది ఎంఎస్ ధోని, గంగూలీ, కోహ్లి వంటి దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు. అదేవిధంగా అతడి సారథ్యంలోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ను భారత్ సొంతం చేసుకుంది. అదేవిధంగా వన్డే ప్రపంచకప్-2023 రన్నరప్గా భారత్ను హిట్మ్యాన్ నిలిపాడు.ఈ టోర్నీ అసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టు తుది మొట్టుపై బోల్తా పడింది. మొత్తం 56 వన్డేల్లో భారత జట్టు కెప్టెన్గా వ్యవహరించిన రోహిత్.. 42 మ్యాచ్ల్లో విజయాలను అందించాడు. అతడి కెప్టెన్సీలో భారత్ కేవలం 12 వన్డేల్లో మాత్రం ఓటమి పాలైంది.పంత్ దూరం..కాగా ఆస్ట్రేలియా టూర్కు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరమయ్యారు. హార్దిక్ పాండ్యా స్ధానంలో నితీష్ కుమార్ రెడ్డి చోటు దక్కించుకోగా.. పంత్ స్ధానంలో ధ్రువ్ జురెల్ వన్డే జట్టులోకి వచ్చాడు. ఆసీస్తో వన్డేలకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు.ఆసీస్ టూర్కు భారత వన్డే జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ , అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, విరాట్ కోహ్లిభారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్ -
రోహిత్ శర్మ భార్య రితిక సలహా.. అలా చేశా..
హిట్మాన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దేహ్ సలహా పాటించానంటున్నాడు టీమిండియా టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav). ఆ సలహా పాటించడం వలన తనకు మంచే జరిగిందంటున్నాడు స్కై. ఇంతకీ ఏ విషయంలో ఆమె సలహా పాటించాడో తెలుసా?చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై ఉత్కంఠపోరులో గెలిచి ఆసియా కప్ 2025 (Asia Cup 2025) కైవసం చేసుకోవడంతో మెన్ ఇన్ బ్లూ పిచ్చ హ్యాపీ మూడ్లో ఉంది. సిరీస్ ఆరంభం నుంచి చివరి వరకు సమిష్టిగా రాణించి కప్ అందుకోవడంతో బీసీసీఐతో పాటు ఫ్యాన్స్ కూడా సూర్య సేనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వ్యక్తిగతంగా విఫలమైనప్పటికీ జట్టును విజేతగా నిలపడంలో సక్సెస్ అయ్యాడు సూర్య. పదునైన వ్యూహాలతో మైదానంలో జట్టును ముందుండి నడిపించి విజయపథంలో నిలిపాడు. హ్యాండ్షేక్ లేని సంఘటన నుంచి చివరి రోజు ట్రోఫీ లేని వేడుకల వరకు వరుస వివాదాలు నడుమ కూల్గా నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించాడు. పాకిస్థాన్ జట్టుతో వ్యవహరించిన తీరుతో టీమిండియా అభిమానులకు మరింత దగ్గరయ్యాడు.అదే ఫాలో అవుతున్నాతాను కూల్గా ఉండటానికి రోహిత్ శర్మ వైఫ్ రితిక ఇచ్చిన సలహా ఉపయోగపడిందని సూర్యకుమార్ వెల్లడించాడు. ది ఇండియన్ ఎక్స్ప్రెస్తో అతడు మాట్లాడుతూ.. మేజర్ టోర్నమెంట్లు ఆడటానికి ముందు రోహిత్ శర్మ సోషల్ మీడియాకు (Social Media) దూరంగా ఉంటాడని రితిక చెప్పిందని తెలిపాడు. తాను కూడా అదే ఫాలో అవుతున్నానని చెప్పాడు. ఆసియాకప్ ఆడటానికి ముందు తన ఫోన్లోని సోషల్ మీడియా యాప్స్ అన్ని తొలగించినట్టు రివీల్ చేశాడు. సోషల్ మీడియాకు దూరంగా ఉండడంతో ప్రశాంతత లభించడంతో పాటు డెసిషన్ మేకింగ్ ఇంప్రూవ్ అయిందన్నాడు.ఆ యాప్స్ తీసేశా'ఆసియాకప్ ఆడేందుకు దుబాయ్ రావడానికి ముందు నా ఫోన్లోని ఇన్స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్బుక్ యాప్స్ డిలీట్ చేశాను. కమ్యూనికేషన్ కోసం వాట్సాప్ ఒకటే ఉంచాను. మన ఫోన్లో సోషల్ మీడియా యాప్స్ ఉంటే అందులో వచ్చే మెసేజ్లు అన్ని చూడాలనిపిస్తుంటుంది. మెగా టోర్నమెంట్లు ఆడటానికి ముందు రోహిత్ శర్మ (Rohit Sharma) సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడని రితిక చెప్పిన విషయం నాకు బాగా గుర్తుంది. రోహిత్ తన ఫోన్లోని యాప్స్ తొలగిస్తాడని ఆమె చెప్పింది. దీన్ని నేను కూడా ఫాలో అవుతున్నాడు. దీనివల్ల నాకు మంచే జరిగింద'ని సూర్యకుమార్ చెప్పాడు. చదవండి: మా ఆటగాళ్లంతా ఒక్కో ట్రోఫీతో సమానం -
క్రికెట్ అభిమానులకు గుండెకోత మిగిల్చిన 2025
2025వ సంవత్సరాన్ని క్రికెట్ అభిమానులు అంత ఈజీగా మరచిపోలేరు. ఎందుంటే ఈ ఏడాది ఒకరు కాదు ఇద్దరు కాదు 20 మందికి పైగా స్టార్ క్రికెటర్లు ఆటకు వీడ్కోలు (Retirement) పలికారు. ఈ విషయం సగటు క్రికెట్ అభిమానికి తీవ్ర శోకాన్ని కలిగిస్తుంది. తమ ఆరాధ్య ఆటగాళ్లు ఇకపై అంతర్జాతీయ వేదికపై ఆడరని తెలిసి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.ఈ ఏడాది న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ మార్టిన్ గప్తిల్తో రిటైర్మెంట్ల పరంపర మొదలైంది. మధ్యలో భారత దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టెస్ట్లకు వీడ్కోలు పలికారు. తాజాగా ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ వోక్స్ ఆట మొత్తానికి అల్విదా చెప్పాడు. ఈ మధ్యలో కొందరు కొన్ని ఫార్మాట్లకు మరికొందరు అంతర్జాతీయ కెరీర్ మొత్తానికి గుడ్బై చెప్పారు.ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం..మార్టిన్ గుప్తిల్ (అన్ని ఫార్మాట్లు)వరుణ్ ఆరోన్ (అన్ని ఫార్మాట్లు)తమీమ్ ఇక్బాల్ (అన్ని ఫార్మాట్లు)వృద్దిమాన్ సాహా (అన్ని ఫార్మాట్లు)షకీబ్ అల్ హసన్ (టెస్ట్)కేన్ విలియమ్సన్ (టీ20)షాపూర్ జద్రాన్ (అన్ని ఫార్మాట్లు)మహ్మదుల్లా (అన్ని ఫార్మాట్లు)దిముత్ కరుణరత్నే (అన్ని ఫార్మాట్లు)విరాట్ కోహ్లి (టెస్ట్)రోహిత్ శర్మ (టెస్ట్)మార్కస్ స్టోయినిస్ (వన్డే)స్టీవ్ స్మిత్ (వన్డే)గ్లెన్ మ్యాక్స్వెల్ (వన్డే)హెన్రిచ్ క్లాసెన్ (అన్ని ఫార్మాట్లు)ముష్ఫికర్ రహీం (వన్డే)నికోలస్ పూరన్ (అన్ని ఫార్మాట్లు)ఆండ్రీ రసెల్ (అన్ని ఫార్మాట్లు)ఏంజెలో మాథ్యూస్ (టెస్ట్)పియూశ్ చావ్లా (అన్ని ఫార్మాట్లు)అమిత్ మిశ్రా(అన్ని ఫార్మాట్లు)చతేశ్వర్ పుజారా (అన్ని ఫార్మాట్లు)మిచెల్ స్టార్క్ (టీ20)క్రిస్ వోక్స్ (అన్ని ఫార్మాట్లు)చదవండి: స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్ -
అనూహ్య రీతిలో బరువు తగ్గిన రోహిత్ శర్మ.. ఫొటో వైరల్
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కొత్త లుక్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. అంతర్జాతీయ కెరీర్ను మరికొంత కాలం పొడిగించుకునే క్రమంలో అతడు ఫిట్నెస్పై దృష్టి సారించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ అనూహ్య రీతిలో ఏకంగా పది కిలోల బరువు తగ్గాడు. అంతటితో ఆగకుండా ఇంకొంత బరువు తగ్గడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. రోహిత్ కొత్త లుక్కు సంబంధించిన ఫొటోను టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ (Abhishek Nayar) విడుదల చేశాడు.ఫొటో వైరల్‘‘10000 గ్రాములు తగ్గిన తర్వాత... ఇంకా మేము దీనిని ప్రయత్నిస్తూనే ఉన్నాము’’ అంటూ రోహిత్తో ఉన్న ఫొటోను అభిషేక్ నాయర్ పంచుకోగా.. నెట్టింట వైరల్గా మారింది. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ.. ఇటీవలే టెస్టులకు కూడా వీడ్కోలు చెప్పాడు.ప్రస్తుతం ఐపీఎల్తో పాటు వన్డేల్లో కొనసాగుతున్న 38 ఏళ్ల రోహిత్ శర్మ... తదుపరి ఆస్ట్రేలియా పర్యటన (India Tour Of Australia) సందర్భంగా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అక్టోబరులో జరిగే వన్డే సిరీస్ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్న హిట్మ్యాన్.. జిమ్లో చెమటోడుస్తున్నాడు.లక్ష్యం దిశగాఅయితే, రోహిత్ త్వరలోనే వన్డేలకు కూడా గుడ్బై చెప్పనున్నాడనే వార్తలు వచ్చాయి. వన్డే వరల్డ్కప్-2027 నేపథ్యంలో టెస్టు సారథి శుబ్మన్ గిల్ చుట్టూ జట్టును నిర్మించే క్రమంలో.. బీసీసీఐ రోహిత్కు ఉద్వాసన పలకనుందని ఊహాగానాలు వెలువడాయి.కానీ రోహిత్ శర్మ మాత్రం వన్డేల్లో తన కెరీర్ను మరికొంతకాలం పొడిగించుకోవాలని.. వరల్డ్కప్ వరకు కొనసాగాలనే పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. అందుకే ఫిట్నెస్పై పూర్తిస్థాయిలో దృష్టి సారించిన ఈ ముంబై బ్యాటర్.. తన లక్ష్యం దిశగా పయనిస్తున్నట్లు తెలుస్తోంది.దిగ్గజ కెప్టెన్గాకాగా రోహిత్ శర్మ చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా టీమిండియాకు ఆడాడు. న్యూజిలాండ్తో ఫైనల్లో భాగంగా 76 పరుగులతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మెగా ఈవెంట్లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.తద్వారా మహేంద్ర సింగ్ ధోని (3) తర్వాత టీమిండియాకు అత్యధిక ఐసీసీ టైటిళ్లు (2) అందించిన కెప్టెన్గా నిలిచాడు. చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు టీ20 ప్రపంచకప్-2024లో రోహిత్ సారథ్యంలో టీమిండియా ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. వన్డేల్లో కొనసాగుతున్న రోహిత్ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో రెండోస్థానంలో ఉన్నాడు.కోహ్లితో కలిసిఇక అక్టోబరులో ఆసీస్తో జరిగే వన్డే సిరీస్తో రోహిత్ శర్మతో పాటు టీమిండియా మరో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా పునరాగమనం చేయనున్నాడు. రోహిత్ మాదిరే కోహ్లి కూడా ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు, టెస్టులకు గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. కాగా ఆస్ట్రేలియా టూర్లో భాగంగా టీమిండియా అక్టోబరు 19- 25 వరకు మూడు వన్డేలు, అక్టోబరు 29- నవంబరు 8 వరకు ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లు ఆడనుంది.చదవండి: BCCI: అభిషేక్ శర్మకు బంపరాఫర్! -
ధోని చేసిన పని వల్లే.. రోహిత్ శర్మ ఇలా..: గంభీర్
టీమిండియా తరఫున 2007లోనే అరంగేట్రం చేశాడు రోహిత్ శర్మ (Rohit Sharma). ఐర్లాండ్తో వన్డే సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అయితే, ఈ మ్యాచ్లో రోహిత్కు బ్యాటింగ్కు చేసే అవకాశమే రాలేదు. ఆ తర్వాత కూడా మిడిల్ ఆర్డర్లోనే అతడు ఆడాడు.ఓపెనర్గా ప్రమోట్ చేసిన ధోనిఅయితే, 2012 తర్వాత నాటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. రోహిత్ శర్మను టాపార్డర్కు ప్రమోట్ చేయించాడు. ఓపెనర్గా బరిలోకి దించాడు. ఆ తర్వాత రోహిత్ వెనుదిరిగి చూడలేదు. మూడు ఫార్మాట్లలో టీమిండియా ఓపెనర్గా పాతుకుపోయి.. కెప్టెన్ స్థాయికి ఎదిగాడు.అంతేకాదు.. ధోని (3) తర్వాత భారత జట్టుకు అత్యధిక ఐసీసీ టైటిళ్లు అందించిన సారథిగా రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. 2024లో టీ20 ప్రపంచకప్, 2025లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ను విజేతగా నిలిపి ఈ ఘనత సాధించాడు. ఇక గతేడాదే అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్.. ఇటీవలే టెస్టులకూ కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇదిలా ఉంటే.. భారత టీ20 జట్టు ప్రస్తుతం ఆసియా కప్-2025 టోర్నమెంట్తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2023లో ఆసియా వన్డే కప్ సందర్భంగా రోహిత్ శర్మ గురించి ప్రస్తుత హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) చేసిన వ్యాఖ్యలు తాజాగా మరోసారి వైరల్ అవుతున్నాయి.ధోని చేసిన పని వల్లే.. రోహిత్ శర్మ ఇలా..‘‘వన్డేల్లో పది వేల పరుగులు చేయడం అతడికి అంత తేలికగా సాధ్యం కాలేదు. కెరీర్ ఆరంభం నుంచి ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాడు. కెప్టెన్గా యువ ఆటగాళ్ల వెన్నుతట్టడంలో రోహిత్ ముందుంటాడు. కష్టకాలంలో వారికి అండగా నిలుస్తున్నాడు.అయితే, ఈరోజు రోహిత్ శర్మ.. రోహిత్ శర్మగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి.. అతడు ఇలా ఉండటానికి ప్రధాన కారణం ఎంఎస్ ధోని. కెరీర్ ఆరంభంలో రోహిత్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నపుడు కూడా ధోని అతడికి పూర్తి స్థాయిలో అండగా నిలిచాడు.ఇప్పుడు రోహిత్ కూడా యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ అదే బాటలో నడుస్తున్నాడు. కెప్టెన్గా తనదైన ముద్ర వేస్తున్నాడు’’ అని గంభీర్.. అటు ధోని.. ఇటు రోహిత్పై ఒకేసారి ప్రశంసల జల్లు కురిపించాడు.రీ రీఎంట్రీకి సైప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ శర్మ ఇప్పటి వరకు 273 మ్యాచ్లు పూర్తి చేసుకుని.. 11168 పరుగులు సాధించాడు. ఇందులో 32 శతకాలు, మూడు డబుల్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక ద్విశతకాలు సాధించిన బ్యాటర్ రోహిత్ చరిత్ర పుటల్లో తన పేరు పదిలం చేసుకున్నాడు. తదుపరి ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా అతడు మళ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు.చదవండి: Asia Cup 2025 Super 4: సూపర్-4లో ఆడే జట్లు ఇవే.. షెడ్యూల్, టైమింగ్ వివరాలు -
‘అతడు ఆల్ ఫార్మాట్ ప్లేయర్.. టెస్టుల్లో మాత్రమే ఆడించడం అన్యాయం’
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జైసూ మూడు ఫార్మాట్లలో అద్భుతంగా రాణించగలడని పేర్కొన్నాడు. అయితే, అతడిని కేవలం టెస్టులకే పరిమితం చేయడం సరికాదంటూ యాజమాన్యం తీరును విమర్శించాడు.టెస్టులలో దుమ్ములేపుతున్న జైసూభారత టెస్టు జట్టు ఓపెనర్గా యశస్వి జైస్వాల్ తన స్థానం సుస్థిరం చేసుకున్న విషయం తెలిసిందే. అరంగేట్రం నుంచే శతకాలు, ద్విశతకాలతో దుమ్ములేపుతున్న ఈ ముంబై బ్యాటర్.. ఇప్పటి వరకు 24 టెస్టుల్లో కలిపి 2209 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా ఆరు సెంచరీలు, రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి.వన్డే, టీ20లలో మా త్రం నో ఛాన్స్ఇలా సంప్రదాయ ఫార్మాట్లో తనదైన ముద్ర వేస్తున్న జైసూకు పరిమిత ఓవర్ల క్రికెట్లో తగినన్ని అవకాశాలు రావడం లేదు. టీమిండియా తరఫున 23 టీ20లలో 723 పరుగులు చేసిన జైస్వాల్.. ఇప్పటి వరకు ఒకే ఒక్క వన్డే ఆడి 15 పరుగులు రాబట్టగలిగాడు. టీ20లలో ఓపెనర్గా అభిషేక్ శర్మ, వన్డేల్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా శుబ్మన్ గిల్ ఉండటంతో జైసూకు నిరాశ తప్పడం లేదు.అతడు ఆల్ ఫార్మాట్ ప్లేయర్ఈ విషయాల గురించి కామెంటేటర్, మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. యశస్వి జైస్వాల్ను మూడు ఫార్మాట్లలో ఆడించాలని మేనేజ్మెంట్కు సూచించాడు. ‘‘యశస్వి మంచి ఆటగాడు. అతడు మూడు ఫార్మాట్లలో ఆడగలడు. కానీ ఇప్పుడు అతడు కేవలం ఒకే ఫార్మాట్లో ఆడిస్తున్నారు.ఇలా చేయడం సరికాదు. అతడికి అన్యాయం చేసినట్లే. యశస్విని తప్పకుండా మూడు ఫార్మాట్లలో ఆడించాలి. స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టులు ఆడించడంతో పాటు.. తదుపరి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లోనూ యశస్వికి అవకాశం ఇవ్వాలి. అతడిని ఆసీస్ పర్యటనలో వన్డేల్లో ఆడిస్తారనే అనుకుంటున్నా.అంతేకాదు.. శ్రేయస్ అయ్యర్తో కలిసి యశస్వి కూడా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఆడతాడని నమ్ముతున్నా. దీనిపై నాకు సమాచారం లేదు. కానీ మనస్ఫూర్తిగా ఈ మాట చెబుతున్నా’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ఆసియా కప్ ముగించుకున్న తర్వాత కాగా టీమిండియా ప్రస్తుతం ఆసియా టీ20 కప్-2025 టోర్నీతో బిజీగా ఉంది. ఈ మెగా టోర్నీ ఆడే జట్టులో యశస్వి జైస్వాల్కు చోటు దక్కలేదు. స్టాండ్ బై ప్లేయర్గా మాత్రమే అతడు ఎంపికయ్యాడు.మరోవైపు.. పొట్టి ఫార్మాట్లో సూపర్ ఫామ్లో ఉన్నా.. శ్రేయస్ అయ్యర్కు కనీసం రిజర్వు ప్లేయర్గానూ స్థానం దక్కలేదు. ఇక ఆసియా కప్ టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్తో రెండు టెస్టుల సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే, టీ20 సిరీస్లు ఆడనుంది. -
IND vs PAK: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma)సరికొత్త చరిత్ర లిఖించాడు. పాకిస్తాన్పై టీ20 ఫార్మాట్లో.. పవర్ ప్లేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును అభిషేక్ శర్మ బద్దలు కొట్టాడు.ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్-2025 టోర్నమెంట్లో దుబాయ్ వేదికగా భారత్- పాక్ ఆదివారం మ్యాచ్ ఆడాయి. టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది.తొలి బంతికే బౌండరీ బాదిఈ క్రమంలో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభం అందించాడు. తొలి బంతికే బౌండరీ బాది.. పాక్ కీలక పేసర్ షాహిన్ ఆఫ్రిది (Shaheen Afridi)కి స్వాగతం పలికిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. రెండో బంతిని ఏకంగా సిక్సర్గా మలిచాడు.ధనాధన్ దంచికొట్టిఆ తర్వాత కూడా ధనాధన్ దంచికొట్టిన అభిషేక్ శర్మ మొత్తంగా.. 13 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 31 పరుగులు సాధించాడు. సయీమ్ ఆయుబ్ బౌలింగ్లో ఇచ్చిన క్యాచ్ను ఫాహిమ్ అష్రాఫ్ అందుకోవడంతో అభిషేక్ సునామీ ఇన్నింగ్స్ (3.4 ఓవర్లో)కు తెరపడింది. కాగా పాకిస్తాన్ జట్టు మీద పవర్ ప్లేలో భారత బ్యాటర్లలో ఎవరికైనా ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు (31) కావడం విశేషం. ఇదిలా ఉంటే.. అభిషేక్ (31)తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (47 నాటౌట్), తిలక్ వర్మ (31), శివం దూబే (7 బంతుల్లో 10 నాటౌట్) రాణించారు. ఫలితంగా 15.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసిన టీమిండియా.. పాక్పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.పాకిస్తాన్పై టీ20 ఫార్మాట్లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు రాబట్టిన భారత క్రికెటర్లు🏏అభిషేక్ శర్మ- 31 పరుగులు- 2025లో దుబాయ్ వేదికగా..🏏విరాట్ కోహ్లి- 29 పరుగులు- 2022లో దుబాయ్ వేదికగా🏏రోహిత్ శర్మ- 28 పరుగులు- 2022లో దుబాయ్ వేదికగా🏏కేఎల్ రాహుల్- 28 పరుగులు- 2022లో దుబాయ్ వేదికగా.చదవండి: పాక్ జట్టుకు ఘోర అవమానం!?.. అలాంటివాళ్లకు గంభీర్ కరెక్ట్! -
Asia Cup 2025: రోహిత్, రహానే సరసన బంగ్లాదేశ్ ఓపెనర్లు
ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 13) శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ ఓపెనర్లు తంజిద్ హసన్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఈ మ్యాచ్లో ఖాతా తెరవకుండానే ఔటైన వారిద్దరు.. టీ20 ఆసియా కప్ చరిత్రలో డకౌటైన నాలుగో ఓపెనింగ్ జోడీగా నిలిచింది. గతంలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, అజింక్య రహానే, బంగ్లాదేశ్కే చెందిన మరో ఓపెనింగ్ జోడీ మొహమ్మద్ మిధున్, సౌమ్య సర్కార్, ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ ఇలాంటి చెత్త ప్రదర్శన (డకౌట్లు) చేశారు. తాజా ఉదంతంతో తంజిద్-పర్వేజ్ జోడీ రోహిత్, రహానే సరసన చేసింది.కాగా, నిన్నటి ఆసియా కప్ మ్యాచ్లో బంగ్లాదేశ్ శ్రీలంక చేతిలో 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. శ్రీలంక బౌలర్లు రెచ్చిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులకే పరిమితమైంది. లంక బౌలర్లలో నువాన్ తుషార (4-1-17-1), చమీరా (4-1-17-1), హసరంగ (4-0-25-2) అద్భుతంగా బౌలింగ్ చేసి బంగ్లాదేశ్ పని పట్టారు. బంగ్లా ఇన్నింగ్స్కు ఓపెనర్లు తంజిద్, పర్వేజ్ డకౌటై చెత్త ఆరంభాన్ని ఇచ్చారు. లిట్టన్ దాస్ (28), జాకిర్ అలీ (41 నాటౌట్), షమీమ్ హొస్సేన్ (42 నాటౌట్) అతి కష్టం మీద పరుగులు చేసి బంగ్లాదేశ్కు ఆమాత్రం స్కోరైనా అందించారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో శ్రీలంక బ్యాటర్లు చెలరేగి ఆడారు. ఓపెనర్ పథుమ్ నిస్సంక (50), కమిల్ మిషారా (46 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడటంతో ఆ జట్టు 14.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
Team India: వాళ్ళు లేక విల విల! అది రో-కో రేంజ్
-
రోహిత్ శర్మకు సంబంధించి బిగ్ అప్డేట్
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరుగబోయే వన్డే సిరీస్లో హిట్మ్యాన్ పాల్గొనడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి రోహిత్ స్వయంగా క్లూ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ క్యాంప్లో ట్రైనింగ్ మొదలుపెట్టిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Rohit Sharma (@rohitsharma45)ఈ ఫోటోల్లో రోహిత్ ప్యాడింగ్ చేసుకుంటూ, స్ప్రింట్ చేస్తూ కనిపించాడు. రోహిత్ బరువు కూడా చాలా తగ్గినట్లు కనిపిస్తున్నాడు. పలు నివేదికల ప్రకారం హిట్మ్యాన్ ఇటీవలికాలంలో 8 కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తుంది. తాజాగా బీసీసీఐ నిర్వహించిన యో-యో టెస్ట్లో అతను 19.4 స్కోర్ సాధించాడని సమాచారం. రోహిత్ ఫిట్నెస్పై ఈ స్థాయిలో దృష్టి పెట్టడం ఖచ్చితంగా ఆస్ట్రేలియా పర్యటన కోసమేనన్న సంకేతాన్నిస్తుంది.టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించి, వన్డేల్లో కొనసాగుతానని స్పష్టంగా ప్రకటించినా.. రోహిత్ వన్డే భవితవ్యం అంత క్లారిటీగా లేదు. కొందరు రోహిత్ 2027 వన్డే వరల్డ్కప్ వరకు ఆడతాడని అంటుంటే, ఆస్ట్రేలియా పర్యటనే లాస్ట్ అని కొందరు, ఆస్ట్రేలియా సిరీస్ కూడా ఆడడని ఇంకొందరు అంటున్నారు.ఈ ప్రచారాల నేపథ్యంలో రోహిత్ ఫిట్గా కనిపిస్తూ ప్రాక్టీస్ మొదలుపెట్టడం, వన్డేల్లో కొనసాగాలనుకున్న అతని సంకల్పాన్ని సూచిస్తుంది. రోహిత్ రాక కోసం అతని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. హిట్మ్యాన్ చివరిగా ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా జెర్సీలో కనిపించాడు.టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన అక్టోబర్ 19న మొదలవుతుంది. ఈ పర్యటనలో భారత్ 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. తొలుత వన్డేలు, ఆతర్వాత టీ20 సిరీస్ జరుగనున్నాయి. అక్టోబర్ 19 (పెర్త్), 23 (అడిలైడ్), 25 (సిడ్నీ) తేదీల్లో వన్డేలు.. 29 (కాన్బెర్రా), 31 (మెల్బోర్న్), నవంబర్ 2 (హోబర్ట్), 6 (గోల్డ్ కోస్ట్), 8 (బ్రిస్బేన్) తేదీల్లో టీ20లు జరుగనున్నాయి. -
Asia Cup 2025: రోహిత్ శర్మ సరసన అభిషేక్ శర్మ
టీమిండియా యువ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ యూఏఈతో నిన్న (సెప్టెంబర్ 10) జరిగిన ఆసియా కప్ 2025 మ్యాచ్లో చెలరేగిపోయాడు. 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో తొలి బంతి నుంచే ఊచకోత మొదలుపెట్టిన అభిషేక్.. యూఏఈ బౌలర్లపై తారాస్థాయిలో విరుచుకుపడ్డాడు. హైదర్ అలీ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్సర్ బాదిన అభిషేక్ హిట్మ్యాన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ సరసన చేరాడు.ABHISHEK SHARMA - HIT THE FIRST BALL OF THE INNINGS FOR A SIX. 🤯 pic.twitter.com/4sWr6hOLl0— Johns. (@CricCrazyJohns) September 10, 2025రోహిత్ (2021లో ఇంగ్లండ్పై), జైస్వాల్ (2024లో జింబాబ్వేపై), సంజూ (2025లో ఇంగ్లండ్పై) కూడా గతంలో అభిషేక్ తరహాలనే ఇన్నింగ్స్ టీ20ల్లో తొలి బంతికే సిక్సర్ కొట్టారు.భారీ విజయంఅభిషేక్ విధ్వంసం ధాటికి యూఏఈ నిర్దేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 4.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. బంతుల పరంగా టీ20ల్లో భారత్కు ఇదే భారీ విజయం. మరో 93 బంతులు మిగిలుండగానే టీమిండియా లక్ష్యాన్ని ఊదేసింది. 2021లో స్కాట్లాండ్పై 81 బంతులు మిగిలుండగానే గెలుపొందడం దీనికి ముందున్న రికార్డు.ఆసియా కప్ చరిత్రలోనూ బంతుల పరంగా ఇదే భారీ విజయం. గతంలో ఈ రికార్డు ఆఫ్ఘనిస్తాన్ పేరిట ఉండేది. 2022 ఎడిషన్లో ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంకపై 59 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.27 బంతుల్లోనే టార్గెట్ ఫినిష్ఈ మ్యాచ్లో టీమిండియా మరో ఘనత కూడా సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా లక్ష్య ఛేదన చేసిన రెండో జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్లో భారత్ కేవలం 27 బంతుల్లోనే టార్గెట్ను ఊదేసింది. ఈ రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. 2022 ప్రపంచకప్లో ఆ జట్టు ఒమన్పై కేవలం 19 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన యూఏఈ.. కుల్దీప్ యాదవ్ (2.1-0-7-4), శివమ్ దూబే (2-0-4-3), వరుణ్ చక్రవర్తి (2-0-4-1), అక్షర్ పటేల్ (3-0-13-1), బుమ్రా (3-0-19-1) ధాటికి 13.1 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. యూఏఈ ఇన్నింగ్స్లో ఓపెనర్లు అలీషాన్ షరాఫు (22), ముహమ్మద్ వసీం (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. అభిషేక్, శుభ్మన్ గిల్ (9 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (2 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) ధాటికి 4.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఈ టోర్నీలో భారత్ సెప్టెంబర్ 14న పాకిస్తాన్తో తలపడనుంది. -
శ్రేయస్ భయ్యా అలా చేయగానే సంబరం.. నేను మాత్రం..: హర్షిత్ రాణా
ఐపీఎల్లో ప్రతిభను నిరూపించుకుని ఇటీవల టీమిండియాలోకి దూసుకువచ్చిన ఆటగాళ్లలో హర్షిత్ రాణా (Harshit Rana) ఒకడు. గతేడాది శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కెప్టెన్సీలోని కోల్కతా నైట్ రైడర్స్ టైటిల్ గెలవడంలో ఈ ఢిల్లీ ఎక్స్ప్రెస్ది కీలక పాత్ర. 13 మ్యాచ్లలో కలిపి ఈ పేస్బౌలర్ పందొమ్మిది వికెట్లు కూల్చాడు.గంభీర్ దృష్టిలో పడికేకేఆర్ తరఫున ప్రదర్శన ద్వారా అప్పటి మెంటార్ గౌతం గంభీర్ (Gautam Gambhir) దృష్టిలో పడిన హర్షిత్ రాణా.. గౌతీ టీమిండియా హెడ్కోచ్గా రావడంతో త్వరగానే జాతీయ జట్టులోకి వచ్చేశాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ రైటార్మ్ పేసర్ ఈ ఏడాది టీ20, వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు.ఒకే ఓవర్లో 26 పరుగులుఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు స్వదేశంలో టీమిండియా ఇంగ్లండ్తో ఆడిన సిరీస్ సందర్భంగా వన్డేలోకి వచ్చిన హర్షిత్కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. అతడి బౌలింగ్లో ఇంగ్లిష్ జట్టు ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఒకే ఓవర్లో 26 పరుగులు పిండుకున్నాడు.అయితే, సాల్ట్ను శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కలిసి సాల్ట్ (43)ను రనౌట్ చేయడంతో హర్షిత్కు కాస్త ఊరట దక్కింది. ఆ తర్వాత 23 ఏళ్ల ఈ బౌలర్.. మూడు వికెట్లతో సత్తా చాటాడు. పరుగులు కాస్త ఎక్కువగానే ఇచ్చుకున్నా.. బెన్ డకెట్ (32), హ్యారీ బ్రూక్ (0), లియామ్ లివింగ్స్టోన్ (5) వంటి ప్రమాదకర బ్యాటర్లును అవుట్ చేశాడు. తద్వారా టీమిండియా గెలుపులో తన వంతు పాత్ర పోషించాడు.శ్రేయస్ భయ్యా సాల్ట్ను రనౌట్ చేయగానేఇక హర్షిత్ రాణా ప్రస్తుతం ఆసియా కప్-2025 ఆడేందుకు టీమిండియాతో కలిసి యూఏఈలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో అతడు పంచుకున్న విషయాలు వైరల్ అవుతున్నాయి. వన్డే అరంగేట్రం గురించి గుర్తుచేసుకుంటూ.. ‘‘ఒక్క ఓవర్లోనే సాల్ట్ నా నుంచి 26 పరుగులు రాబట్టుకున్నాడు.అయితే, ఆ తర్వాత పరిస్థితి మారింది. తొలి మూడు ఓవర్లలో నేను 37 పరుగుల వరకే ఇచ్చాను. అయితే, శ్రేయస్ భయ్యా సాల్ట్ను అద్బుత రీతిలో రనౌట్ చేయగానే అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. నేనేమో సైలెంట్గా అక్కడ నిల్చున్నా.రోహిత్ భయ్యా వచ్చి.. ‘వేరే ఎండ్ నుంచి బౌల్ చెయ్’ అని చెప్పాడు. వెంటనే నా బౌలింగ్లో డకెట్ ఇచ్చిన క్యాచ్ను జైస్వాల్ పట్టాడు. తర్వాత హ్యారీ బ్రూక్ క్రీజులోకి వచ్చాడు. వచ్చీ రాగానే అతడిని పెవిలియన్కు పంపాలని అనుకున్నా.సర్ పే మారూఅందుకోసం తల మీదుగా బౌన్సర్ ఎందుకు సంధించకూడదు అని ఆలోచించా. వెంటనే.. ‘రోహిత్ భయ్యా.. సర్ పే మారూ (head-high bouncer) ’ అని అడిగాను. అందుకు భయ్యా సరేనంటూ అంగీకరించాడు. షార్ట్ పిచ్డ్ డెలివరీ సంధించగా,, బ్రూక్ దానిని షాట్ ఆడబోయి రాహుల్ భయ్యాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు’’ అని హర్షిత్ రాణా వన్డే అరంగేట్ర జ్ఞాపకాలు పంచుకున్నాడు.కాగా ఇంగ్లండ్తో సిరీస్ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ హర్షిత్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. చాంపియన్గా నిలిచిన టీమిండియాలో తానూ ఒకడిగా ఉండి.. ట్రోఫీని ముద్దాడాడు. ఇక ఇప్పటి వరకు టీమిండియా తరఫున రెండు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడిన ఈ కుడిచేతి వాటం పేసర్.. ఆయా ఫార్మాట్లలో 4, 10, 3 వికెట్లు కూల్చాడు. చదవండి: ‘యువీ, సెహ్వాగ్ వంటి వారే లేరు.. బుమ్రాను తీర్చిదిద్దండి’ -
గ్రేటెస్ట్ ప్లేయర్లు వారే.. రోహిత్కు స్థానం లేదు: టీమిండియా మాజీ క్రికెటర్
రోహిత్ శర్మ.. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. హిట్మ్యాన్ గత 18 ఏళ్ల నుంచి ఆటగాడిగా, కెప్టెన్గా తన సేవలను భారత జట్టుకు అందిస్తున్నాడు. భారత్కు రెండు ఐసీసీ టైటిల్స్ను అందించిన ఘనత అతడిది.రోహిత్ సారథ్యంలోనే టీమిండియా టీ20 వరల్డ్కప్-2024, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025ని సొంతం చేసుకుంది. అదేవిధంగా వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్గా, సింగిల్ వరల్డ్కప్ ఎడిషన్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా రోహిత్ కొనసాగుతున్నాడు. అయితే ఇన్ని ఘనతలు సాధించిన రోహిత్.. ఇండియన్ ఆల్ టైమ్ గ్రెటెస్ట్ క్రికెటర్లలో ఒకడు కాదంట. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లిల కంటే రోహిత్ వెనకబడి ఉన్నాడని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. అయితే వైట్బాల్ క్రికెట్లో మాత్రం రోహిత్ గొప్ప ప్లేయర్ అని అతడు కొనియాడాడు. టెస్టుల్లో రోహిత్కు మంచి ట్రాక్ రికార్డు లేకపోవడంతో ఆల్టైమ్ గ్రేట్ బ్యాటర్ల సరసన చోటు ఇవ్వడం లేదని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ టెస్టుల్లో కేవలం 12 సెంచరీలు మాత్రమే సాధించాడు. అందులో రెండు సెంచరీలు విదేశీ గడ్డపై వచ్చినవి. అదే టెండూల్కర్ సేనా దేశాలలో (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) 17 సెంచరీలు నమోదు చేయగా.. కోహ్లి, ద్రవిడ్ వరుసగా 12, 10 సెంచరీలు సాధించారు."ఆల్-టైమ్ ఇండియన్ బ్యాటింగ్ దిగ్గజాల జాబితాలోకి రోహిత్ సరిపోడు. ఎందుకంటే సచిన్, గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ వంటి దిగ్గజాలతో పోలిస్తే రోహిత్ వెనకబడి ఉన్నాడు. రోహిత్ వారి స్ధాయికి చేరుకోలేకపోయాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ అద్భుతమైన ప్లేయర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడు ప్రతీ జట్టుపై అధిపత్యం చెలాయించాడు. ఒక వన్డే ఇన్నింగ్స్లో దాదాపు మూడు వందల పరుగుల(264) వరకు సాధించాడు. కానీ ఆల్ టైమ్ గ్రేట్ జాబితా గురించి మాట్లేడప్పుడు టెస్ట్ క్రికెట్కు ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. రెడ్ బాల్ ఫార్మాట్లో రోహిత్ తన మార్క్ చూపించలేకపోయాడు.వైట్ బాల్ క్రికెట్ గ్రేట్..అయితే భారత క్రికెట్లో స్వార్ధం లేని ఆటగాళ్ల లిస్ట్లో రోహిత్ ముందుంజలో ఉంటాడు. అంతే కాకుండా అతడి కెప్టెన్సీ కూడా గురుంచి కూడా మాట్లాడుకోవాలి. నిజంగా అతడొక అద్బుతమైన నాయకుడు. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత అతడిపై గౌరవం, ప్రేమ మరింత పెరిగిపోయింది. జట్టు కోసం ఎన్నో త్యాగాలు చేశాడు. సెల్ప్లెస్ క్రికెటర్. వన్డే క్రికెట్లో అతడొక లెజెండ్ అని దూరదర్శన్ ది గ్రేట్ ఇండియన్ క్రికెట్ షోలో పేర్కొన్నాడు.చదవండి: మైదానంలో వాళ్లను ఆపను.. ఈసారి ఫేవరెట్ జట్టు ఏదీ లేదు: పాక్ కెప్టెన్ -
ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఆ సిరీస్కు కోహ్లి-రోహిత్ దూరం!?
అంతా ఊహించిందే జరిగింది. టీమిండియా దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు ఆస్ట్రేలియా-ఎ సిరీస్లో భాగం కావడం లేదు. ఇప్పటికే టెస్టులకు, టీ20లకు వీడ్కోలు పలికిన రోకో ద్వయం ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు.చివరగా ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జెర్సీలో కన్పించిన వీరిద్దరూ తిరిగి వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్లో ఆడనున్నారు. ఈ క్రమంలో వీరిద్దరిని స్వదేశంలో ఆస్ట్రేలియా-ఎతో జరగనున్న అనాధికారిక వన్డే సిరీస్లో భారత్-ఎ జట్టు తరపున ఆడించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది వారికి ప్రాక్టీస్ ఉపయోగపడుతుందని, అందుకు రో-కో కూడా అంగీకరించారని పలు రిపోర్ట్లు పేర్కొన్నాయి. తాజాగా ఇదే విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. ఇవన్నీ వట్టి రూమర్సే అని ఆయన కొట్టిపారేశారు."ఆస్ట్రేలియా-తో జరిగే సిరీస్లో రోహిత్, కోహ్లి ఇద్దరూ ఆడడం ఆసాధ్యమనే చెప్పాలి. ఇప్పటివరకు మేము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అంతేకాకుండా జానియర్లతో కలిసి ఆడమని వారిని మేము బలవంతం కూడా చేయము. వారింత వారు ప్రాక్టీస్ కావాలని భావిస్తే, ఆస్ట్రేలియా వన్డేలకు ముందు ఒకటి రెండు అనాధికారిక మ్యాచ్లు ఆడే అవకాశముంది. కానీ ఇది జరగకపోవచ్చు. ఎందుకంటే వారు ప్రస్తుతం చాలా ఫిట్గా ఉన్నారు. ఆస్ట్రేలియాతో వన్డేలకు రోహిత్, కోహ్లి కూడా సిద్దంగా ఉన్నారని" సదరు అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు. కాగా రోహిత్ గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా ఫిట్గా కన్పిస్తున్నాడు. దాదాపు ఎనిమిది కేజీలు తగ్గినట్లు తెలుస్తోంది. ఇటీవలే హిట్మ్యాన్ తన ఫిట్నెస్ టెస్టును క్లియర్ చేశాడు. కోహ్లి ఇంకా తన ఫిట్నెస్ టెస్టుకు హాజరు కావాల్సి ఉంది. కాగా ఈ ఏడాది ఆక్టోబర్లో ఆసీస్ పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, ఐదు టీ20 సిరీస్లో మెన్ ఇన్ బ్లూ తలపడనుంది.చదవండి: ఆల్టైమ్ ఆసియా టీ20 జట్టు: భారత్ నుంచి ఐదుగురు.. యువీకి నో ఛాన్స్ -
ఆల్టైమ్ ఆసియా టీ20 జట్టు: భారత్ నుంచి ఐదుగురు.. యువీకి నో ఛాన్స్
ఆసియా కప్- 2025 (Asia Cup) టోర్నీకి రంగం సిద్ధమైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు టీ20 ఫార్మాట్లో ఈసారి ఈ ఈవెంట్ను నిర్వహించనున్నారు. భారత్ ఆతిథ్య దేశంగా వ్యవహరించనుండగా.. టీమిండియాతో పాటు శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఒమన్, యూఏఈ, హాంకాంగ్ ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి.భారత్ నుంచి ఐదుగురుఇందుకోసం ఇప్పటికే ఎనిమిది జట్లు యూఏఈకి చేరుకుని.. అన్ని విధాలా సన్నద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బ్రెట్ లీ.. ఆసియా ఉత్తమ టీ20 జట్టును ఎంచుకున్నాడు. ఇందులో ఐదుగురు టీమిండియా స్టార్లకు చోటిచ్చిన ఈ ఆసీస్ దిగ్గజం.. బంగ్లాదేశ్ నుంచి ఒక్కరిని కూడా ఎంపిక చేయలేదు.యూఏఈ నుంచి ఇద్దరుఅయితే, అనూహ్యంగా యూఏఈ నుంచి ఇద్దరు.. హాంకాంగ్ నుంచి ఒక ఆటగాడికి బ్రెట్ లీ తన జట్టులో చోటివ్వడం విశేషం. ఇక పాకిస్తాన్ నుంచి ఇద్దరిని ఎంచుకున్న బ్రెట్ లీ... స్పిన్ విభాగంలో శ్రీలంక, అఫ్గనిస్తాన్ ప్లేయర్లకు అవకాశం ఇచ్చాడు. అయితే, బ్రెట్ లీ ఎంచుకున్న జట్టులో టీమిండియా టీ20 ప్రపంచకప్ విజేతలు యువరాజ్ సింగ్ (2007), సూర్యకుమార్ యాదవ్ (2024)లకు మాత్రం చోటు ఇవ్వకపోవడం గమనార్హం. ధోని, రో- కో తమకు తామే సాటిఐసీసీ తొలిసారి ప్రవేశపెట్టిన పొట్టి క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్గా ధోని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. 2007లో భారత్ వరల్డ్కప్ గెలవడంలో యువీది కూడా కీలక పాత్ర.ఇక అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక రన్స్కోరర్ రోహిత్ శర్మ (4231 పరుగులు). ఇక మూడో స్థానంలో విరాట్ కోహ్లి (4188) ఉన్నాడు. 2024లో కెప్టెన్గా రోహిత్ పొట్టి ప్రపంచకప్ గెలవగా.. కోహ్లి ఖాతాలో మరో టైటిల్ చేరింది. వీరితో పాటు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా కూడా టీమిండియాను చాంపియన్గా నిలపడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ టోర్నీ తర్వాత రోహిత్- కోహ్లి.. ఇద్దరూ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారుబ్రెట్ లీ ఎంచుకున్న ఆసియా ఆల్టైమ్ టీ20 ప్లేయింగ్ ఎలెవన్విరాట్ కోహ్లి (ఇండియా), రోహిత్ శర్మ (ఇండియా), మొహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్), బాబర్ హయత్ (హాంకాంగ్), మహేంద్ర సింగ్ ధోని (ఇండియా), హార్దిక్ పాండ్యా (ఇండియా), వనిందు హసరంగ (శ్రీలంక), రషీద్ ఖాన్ (అఫ్గనిస్తాన్), అమ్జద్ జావేద్ (యూఏఈ), మొహమ్మద్ నవీద్ (యూఏఈ), హ్యారిస్ రవూఫ్ (పాకిస్తాన్), జస్ప్రీత్ బుమ్రా (ఇండియా).చదవండి: ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు


