Malladi vishnu
-
‘అసలు తిరుమలలో ఏం జరుగుతోంది?’
తాడేపల్లి : టీటీడీ గోశాలలో ఆవులు చనిపోవడంపై నిజా నిర్దారణ కమిటీ వేయాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. టీటీడీ గోశాలలో గోవుల మృతికి కారణాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయో నిజానిర్దారణ చేయాలన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి శనివారం మాట్లాడిన మల్లాది విష్ణు.. టీటీడీని రాజకీయ పునరావాసంగా మార్చేశారని ధ్వజమెత్తారు. ‘ఈరోజు కూడా కొందరు పాదరక్షలతో మహాద్వారం వరకు వెళ్లారంటే విజిలెన్స్ ఏం చేస్తోంది?, స్వామివారికి నైవేద్యం కూడా పది నిమిషాలు ఆలస్యంగా పెట్టారు. అసలు తిరుమలలో ఏం జరుగుతోంది?, గోమాతల మృతికి కారణం సరైన ఆలనాపాలన లేకపోవడమే. ఆహారం, పర్యవేక్షణ లేకనే గోవులు చనిపోయాయి.టీటీడీ అధికారులు గోవుల మృతిపై ఎందుకు స్పందించలేదు?, సెలెబ్రిటీలే తప్ప సామాన్యులకు స్వామివారిని దర్శించుకునే అవకాశం లేకుండా చేశారు. టీటీడీని టీడీపీ ఆఫీసుగా మార్చారు. లోకేష్ పిఏ దందా కొండ మీద పెరిగి పోయింది. తిరుమలలో ఎగ్ పలావు దొరకటం, మద్యం దొరకటం ఏంటి?, క్యూలలో ఫ్రాంక్ వీడియోలు తీస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు?, గోమాత టీడీపీ వారికి పబ్లిసిటీ కావచ్చు, మాకు మాత్రం సెంటిమెంట్. గత చంద్రబాబు హయాంలో కూడా విజయవాడలో గోవులు చనిపోయాయి. టీడీపీ గోశాలలో గోవుల మృతిపై సుబ్రహ్మణ్య స్వామి పిల్ వేయాలనుకోవటం గొప్ప విషయం. ఆయన పోరాటం ఆయన చేస్తారు. మేము కూడా గోవుల మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. తిరుమలలో స్వామీజీలపై అరాచకంగా ప్రవర్తించారు. వారిపై పెట్టిన కేసులను తొలగించాలి. స్వామిజీలపై ఈ రకమైన కక్షసాధింపు మంచిది కాదు’అని మల్లాది విష్ణు హెచ్చరించారు. -
ఆరోగ్యశ్రీ ఆగిపోయింది మొర్రో అంటే..వైద్యం చిట్కాలు చెప్తున్న చంద్రబాబు
-
కూటమి నేతలు ఇలాంటి చర్యలు మానుకోవాలి: మల్లాది విష్ణు
-
Malladi Vishnu: రకరకాల వేశాలు వేయడం కాదు ఆలయాలు కూల్చి వేస్తుంటే ఏంచేస్తున్నావ్
-
గణపతి ఆలయం కూల్చివేత.. కూటమి సర్కార్పై వైఎస్సార్సీపీ ఫైర్
సాక్షి, విజయవాడ: దేవి నగర్ ట్రెండ్ సెట్ గేటెడ్ కమ్యూనిటీ కామన్ సైట్లో స్థానికులు నిర్మించుకుంటున్న గణపతి ఆలయాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. నిర్మాణం పూర్తవుతున్న సమయంలో బుల్డోజర్లతో కూల్చేశారు. వీఎంసీ కూల్చి వేసిన గణపతి ఆలయాన్ని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరిశీలించారు.ఈ సందర్భంగా మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం, వీఎంసీ అధికారులపై మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని కాపాడతామంటూ కూటమి నేతలు వేషాలేస్తున్నారని.. కూటమి పాలనలో దేవుడికే రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో వైకుంఠద్వార దర్శనం క్యూలైన్లలో తొక్కిసలాట జరిగి భక్తుల ప్రాణాలు పోయాయి’’ అని మల్లాది ఆగ్రహం వ్యక్తం చేశారు.టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆలయాల కూల్చివేతలే. గతంలో విజయవాడలో ఆలయాలను కూల్చివేశారు. ఇటీవల కాశీనాయన ఆశ్రమాన్ని, జ్యోతిక్షేత్రంలోని అన్నదాన సత్రాలను కూల్చివేశారు. హిందూధర్మం అని వేషాలేసుకునే పవన్ కల్యాణ్కు తన పోర్టుపోలియోలో ఏం జరుగుతుందో తెలియదా?. నిన్న కాక మొన్న వివినరసరాజు వీధిలో గోశాలను కూల్చేశారు. ఈ రోజుకీ గోవులు ఎండలో మాడిపోతున్నాయి.ట్రెండ్ సెట్ గేటెడ్ కమ్యూనిటీ స్థానికులు ఏడాది క్రితం ఆలయ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ప్రారంభ దశలో అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడెలా కూల్చుతారు. ఆలయ గర్భగుడిని బుల్డోజర్లతో కూల్చివేశారు. ఎవరి ఆదేశాల మేరకు వీఎంసీ అధికారులు గణపతి ఆలయాన్ని కూల్చివేశారు. కూల్చివేతలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలి’’ అని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. -
కాశీనాయనక్షేత్రం దాడిపై పవనికి మల్లాది విష్ణు కౌంటర్
-
‘హిందూ ధర్మం మీద దాడి జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?’
తాడేపల్లి : కాశీనాయన జ్యోతి క్షేత్రం పరమ పవిత్రమైనదని, మహారాష్ట్ర, కర్ణాటక నుండి కూడా భక్తులు వచ్చే ప్రాంతమని అలాంటి క్షేత్రం మీద అటవీ శాఖ అధికారులు దాడులు చేయడం వెనుక ఏపీ ప్రభుత్వం హస్తం ఉందని వైఎస్సార్సీపీ నేత మల్లాది విష్ణు విమర్శించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చి వేయడం నిజంగా దారుణమన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మల్లాడి విష్ణు మాట్లాడుతూ.. కాశీనాయనక్షేత్రం మీద జరిగిన దాడి.. హైందవ ధర్మం మీద జరిగిన దాడిగా పేర్కొన్నారు. ‘ పవన్ కళ్యాణ్ పరిధిలోని అటవీ శాఖ ఈ దారుణానికి పాల్పడింది* అని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. ఇది హిందూ ధర్మం మీద జరిగిన దాడిరాష్ట్రంలో హైందవ ధర్మాన్ని కాపాడతాననే పవన్ కళ్యాణ్.. మరి ఈ విషయంలో మిన్నుకుండి పోవడానికి కారణం ఏమిటి?, పవన్ కళ్యాణ్ కి తెలిసే ఇది జరిగింది. కూటమి నేతల అనుమతితోనే ఈ కూల్చివేతలు జరిగాయి. హిందూ ధర్మం మీద జరిగిన దాడిగా భావించే వైఎస్సార్సీపీ స్పందించింది. ఆ ప్రాంతాన్ని సందర్శించింది. ఎన్నో సేవా కార్యక్రమాలను కాశినాయన చేశారు. వందేళ్ల పాటు జీవించి అందరికీ ఆధ్యాత్మికతను బోధించారు. అలాంటి కాశీనాయన క్షేత్రం మీద అటవీ శాఖ దాడులు, కూల్చివేతలు జరిగాయి. వైఎస్సార్సీపీ ఆందోళనకు దిగాక మళ్ళీ నిర్మాణాలు చేస్తామంటూ హడావుడి చేస్తున్నారు. ప్రభుత్వం ఏం చేస్తోంది..?హిందూ ధర్మం మీద జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?, తిరుమల లడ్డూ విషయంలో జనాన్ని తప్పదారి పట్టించారు. భక్తులు క్యూలో చనిపోతే క్షమించమని ప్రాధేయపడ్డారు. అసలు ఇన్ని ఘోరాలు జరుగుతుంటే హిందూ భక్తులు ఎందుకు క్షమించాలి? , ముందు జాగ్రత్తగా ఎందుకు చర్యలు చేపట్టడం లేదు?, వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆ 13 హెక్టార్లను మినహాయించాలని కేంద్రానికి లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ ఏమైపోయావ్..?ఈ ప్రభుత్వం ఆ రికార్డులను కూడా పరిశీలించదా?, చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా హిందూ ఆలయాల మీద దాడులు జరుగుతూనే ఉంటాయి. విజయవాడలో ఆలయాలు కూల్చారు. తిరుపతి లో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చారు. సతావర్తి సత్రం భూముల కుంభకోణం చేశారు. పుష్కరాల్లో జనం చనిపోయారు. ఇలా అనేక సంఘటనలు చంద్రబాబు హయాంలోనే జరిగాయి. సంబంధం లేకపోయినా తిరుపతి విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు క్షమాపణ చెప్పారు?, ఇప్పుడు కాశినాయన క్షేత్రం వద్ద కూల్చివేతలు చేస్తే ఆయన ఎందుకు పట్టించుకోలేదు?, లోకేష్ క్షమాపణలు చెప్పడం ఎందుకు?, మా హయాంలో ఏం జరిగినా వెంటనే స్పందించాం. అంతర్వేదిలో రధం తగులపడితే నూతన టెక్నాలజీతో కొత్త రధాన్ని నిర్మించాం. చంద్రబాబు హయాంలోనే హిందూ ఆలయాలపై నిర్లక్ష్యం జరుగుతోంది’ అని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. అటవీ ప్రాంతం పేరుతో ఆధ్యాత్మికతపై దాడి! -
మల్లాది విష్ణు కుమార్తె వివాహ వేడుకకు హాజరైన YS జగన్
-
మల్లాది విష్ణు కుమార్తె వివాహానికి హాజరైన వైఎస్ జగన్ (ఫోటోలు)
-
మల్లాది విష్ణు కుమార్తె వివాహానికి హాజరైన వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుమార్తె వివాహం నేడు(ఆదివారం) ఎస్ఎస్ కన్వెన్షన్స్లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు.వైఎస్ జగన్కు మల్లాది విష్ణు, ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. వివాహ మండపం వద్దకు చేరుకున్న వైఎస్ జగన్.. వధూవరులు లక్ష్మీ చంద్రిక, తనికెళ్ల వేంకట సుబ్రహ్మణ్య సాయి కిరణ్లకు శుభాకాంక్షలు తెలియజేసి.. ఆశీర్వదించారు. వివాహ వేడుకకు వైఎస్సార్సీపీ నేతలు హాజరయ్యారు. -
మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేశారు: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: అధికారం కోసం చంద్రబాబు అడ్డగోలు హామీలిచ్చారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కుదేలైపోయిందని.. వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో వచ్చిన ప్రతీ సమస్యను వైఎస్ జగన్ మేనిఫెస్టోలో చేర్చారని.. సమాజంలో అసమానతలను తొలగించేందుకు ఆయన కృషి చేశారన్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని విమర్శించారు. ఎన్నికల్లో రకరకాల హామీలిచ్చి దానికి సూపర్ సిక్స్ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆ సూపర్ సిక్స్ ఏమైపోయిందని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాం. ఏడు నెలల కాలంలో లక్షా 46 వేల కోట్ల రూపాయల అప్పుచేసి రికార్డు సృష్టించారు. మమ్మల్ని విమర్శించి.. మాపై తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రతీ మంగళవారాన్ని అప్పులవారంగా మార్చేశారు.. దీనికి చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలి’’ అని మల్లాది విష్ణు నిలదీశారు.‘‘వైఎస్ జగన్ పాలన ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచింది. టీడీపీ మంత్రులకు ఎవరికైనా చిత్తశుద్ధి ఉంటే మాతో చర్చకు రావాలని సవాల్ చేస్తున్నాం. కరెంట్ ఛార్జీలు పెంచారు.. యూజర్ ఛార్జీలు పెంచారు.. పన్నుల భారం మోపారు. ప్రజల నుంచి డబ్బులు పిండి సంపద సృష్టి అని చెప్పుకుంటున్నారు. ఒక్క మంత్రి కూడా సరిగా పనిచేయడం లేదని నిన్నటి ర్యాంకులను చూస్తేనే అర్ధమవుతోంది’’ అని మల్లాది విష్ణు దుయ్యబట్టారు.‘‘లక్షా 46 వేల కోట్లు అప్పుచేసి ఆర్ధిక విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు తప్పుడు కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులపై అక్రమ కేసులతో వేధిస్తున్నారు’’ అని విష్ణు ధ్వజమెత్తారు. -
పేదల ఇళ్లపై కూటమి సర్కార్ కుట్ర: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: పేదల ఇళ్లపై కూటమి సర్కార్ కుట్ర చేస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. మంగళవారం ఆయన.. నున్న, సూరంపల్లిలో జగనన్న కాలనీలను సందర్శించారు. లబ్ధిదారులతో మాట్లాడి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. తాగునీరు, వీధి దీపాలు లేక ఇబ్బందులు పడుతున్నామని గృహ యజమానులు తెలిపారు.నిరుపేదల సొంతింటి కల సాకారం కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాలనీల పేరుతో ఏకంగా మినీ సిటీలనే నిర్మించిందన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా 31.70 లక్షల ఇళ్లపట్టాలు అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం. సెంట్రల్ నియోజకవర్గంలో 23,490 మంది నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు కేటాయించాం. తొలిదశలో 14,986 ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా.. 2,712 ఇళ్లు పూర్తి అయ్యాయి. మరో 2 వేల ఇళ్లు చివరి దశలో ఉన్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత ఆ ఇళ్లన్నింటినీ పాడుబెడుతోంది.’’ అని మల్లాది విష్ణు మండిపడ్డారు.‘‘పైగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్లు ఇస్తామని కేబినెట్ మీటింగ్లో ప్రభుత్వ పెద్దలు చెప్పడం హాస్యాస్పదం. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి.. ఇప్పటివరకు ఒక్కరికి కూడా సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. అమరావతిలో పేదలెవరు ఉండకూడదనే రీతిలో ఈ కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వంలో నియోజకవర్గంలోని 8,504 మంది పేదలకు అమరావతిలో స్థలాలు కేటాయించాం.ఇదీ చదవండి: కూటమిలో ‘లోకేష్’ రాగం.. మరోసారి బాబు మైండ్ గేమ్?..కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్దాక్షిణ్యంగా నిర్మాణాలను నిలిపివేసింది. దీంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరగడం, మరోవైపు అద్దెల భారంతో లబ్ధిదారులు ఆర్థిక వెతలను ఎదుర్కొంటున్నారు. తక్షణమే పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలి. లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలి. లేనిపక్షంలో పేదల తరపున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతుంది’’ అని మల్లాది విష్ణు తెలిపారు. -
టీటీడీలో లోకేష్ ప్రైవేట్ మనుషులు..మల్లాది విష్ణు రియాక్షన్
-
KSR Live Show: జగన్ పై కోపంతో విద్యావ్యవస్థపై చంద్రబాబు కుట్ర
-
టీటీడీ, చంద్రబాబుపై మల్లాది విష్ణు ఫైర్
-
46 మంది చనిపోయారు ఆ పాపం నీదే చంద్రబాబు
-
పింఛన్లపై ‘కూటమి’ కుట్ర: మల్లాది విష్ణు
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ హయాంలో పెన్షన్ల పంపిణీ పారదర్శకంగా జరిగిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఐదేళ్ల పాటు ఏ సమస్యా లేకుండా వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించారన్నారు. మంగళవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో వృద్దులు, వికలాంగులు, వ్యాధిగ్రస్తులకు వాలంటీర్లు అండగా నిలిచారన్నారు.‘‘చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థను బ్రేక్ చేశారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి వాలంటీర్లను పక్కకు తప్పించారు. ఇది పెన్షన్దారులకు శరాఘాతంగా మారింది. చంద్రబాబు నిర్వాకంతో 44 మంది వృద్దులు పెన్షన్ల కోసం వెళ్లి మృతిచెందారు. ఎన్నికలకు ముందు పింఛన్లను వెయ్యి పెంచి ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత కుట్రలు, కుతంత్రాలకు తెర తీశారు. ఒక చెత్తో ఇస్తున్నట్టు నటిస్తూ రెండో చేత్తో పెన్షన్లు తొలగిస్తున్నారు. 66 లక్షలకు పైగా పెన్షన్లు జగన్ హయాంలో అందించారు. ఇప్పుడు 3 లక్షలమంది పెన్షన్లను చంద్రబాబు తొలగించారు’’ అని విష్ణు మండిపడ్డారు.‘‘అధికారంలోకి వచ్చాక చంద్రబాబు వృద్ధులు, వికలాంగుల ఆత్మగౌరవం దెబ్బ తీశారు. ఇంకా 2 లక్షల మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఇవ్వకపోగా అదనంగా మరో మూడు లక్షల పెన్షన్లు తొలగించటం అన్యాయం. పెన్షన్దారుల మీద కూడా ఇలా కుట్రలు చేయటం అవసరమా?. పార్టీలు మారితేనే పెన్షన్ ఇస్తామని టీడీపీ వారు అంటున్నారు. ఇలాంటి ధోరణి మంచిది కాదు’’ అని మల్లాది విష్ణు హితవు పలికారు‘‘వైఎస్ జగన్ హయాంలో అర్హులందరికీ పెన్షన్ అందించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ నియోజకవర్గంలో పార్టీ మారితేనే పెన్షన్లు ఇస్తామనటం సరికాదు. అలా కాదంటే పక్క జిల్లాలకు పెన్షన్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇలాంటి పనులు చేయటం సబబు కాదు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షలమంది పెన్షన్లు తొలగించటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం’’ అని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. -
మంచు ఫ్యామిలీ వివాదంపై మల్లాది విష్ణు రియాక్షన్
-
నల్ల చట్టాలు తేవడంలో కూటమి సర్కార్ ముందుంది: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: ఏపీలో సోషల్ మీడియాను నియంత్రించే విధంగా కొత్త చట్టాలు తేవడం దారుణమన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. నల్ల చట్టాలు తేవడంలో కూటమి ప్రభుత్వం ముందు వరుసలో ఉందంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడలోని సింగ్ నగర్లో పార్టీ కార్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘రాజ్యాంగం ప్రతీ పౌరుడికి భద్రత, హక్కులు, స్వేచ్ఛ కల్పించింది. కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ బయటకు వచ్చినప్పుడు భద్రత కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా నడుచుకుంటోంది.కూటమి ప్రభుత్వం చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తోంది. సోషల్ మీడియాను నియంత్రించే విధంగా కొత్త చట్టాలు తేవటం దారుణం. నల్ల చట్టాలు తేవడంలో కూటమి ప్రభుత్వం ముందుంది. ఆంధ్ర రాష్ట్రంలో వినూత్నమైన పరిపాలన జరుగుతోంది. ప్రజల హక్కులు హరించబడుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వైఎస్ జగన్పై దుష్ప్రచారం చేసి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచింది. రాజ్యాంగం అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం వద్ద అధికారులు ఎందుకు నివాళులర్పించలేదు?. ప్రభుత్వం, అధికారులు వివక్షత చూపిస్తున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు.ఇది కూడా చదవండి: AP: సోషల్ మీడియా కార్యకర్తలపై పెరిగిన వేధింపులు -
KSR Live Show: చంద్రబాబు సర్కార్ మోసపూరిత హామీలు, దుర్మార్గాలు
-
చంద్రబాబుకు మాటలెక్కువ.. పని తక్కువ: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం, చంద్రబాబుకు మాటలెక్కువ.. పని తక్కువ అంటూ కామెంట్స్ చేశారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఇదే సమయంలో తిరుపతి దేవస్థానం బోర్డు లిస్టులో బ్రాహ్మణులు ఎందుకు లేరు అని ప్రశ్నించారు. చంద్రబాబుకి బ్రాహ్మణ సామాజిక వర్గం అంటే చిన్నచూపు అంఊ ఘాటు వ్యాఖ్యలు చేశారు.వైఎస్సార్సీపీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం, చంద్రబాబుకు మాటలెక్కువ పని తక్కువ. దేవస్ధానం బోర్డుల్లో బ్రాహ్మణులకు స్ధానం కలిపిస్తామని చెప్పారు. తిరుపతి దేవస్ధానంలో బోర్డు లిస్టులో బ్రాహ్మణులు ఎందుకు లేరు?. కేబినెట్ మీటింగ్లో, జీవోలో గొప్పలు చెప్పుకున్నారు. 2024, 2019, 2014లో ఒక్క నియోజకవర్గంలో ఒక్కరికి కూడా పోటీ చేయడానికి టికెట్ ఇవ్వలేదు.600 మంది వేద పడింతులకు మూడు వేల చొప్పున స్కాలర్షిప్ ఇస్తున్నట్లు కమిషనర్ చెప్పారు. ఈ మేరకు తీర్మాణం చేసింది వైఎస్సార్సీపీనే. తీర్మానం చేయడమే కాదు.. నిధులు కూడా విడుదల చేశాం. ఇప్పుడు బ్రాహ్మణులకు చోటు లేదు కాబట్టే దాన్ని పక్కదారి పట్టించడానికి స్కాలర్షిప్ ఇస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబుకి బ్రాహ్మణ సామాజిక వర్గం అంటే చిన్నచూపు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభలో ఎక్కడా బ్రాహ్మణులకు స్ధానం కల్పించలేదు. కేబినెట్లో వాళ్లు చేసిన నిర్ణయాన్ని నేడు ఉల్లఘించారు. ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. బ్రాహ్మణులకు టీటీడీలో ప్రాతినిధ్యం లేదు.హిందూ సమాజానికి, ఆధ్యాత్మిక చింతనలో బ్రాహ్మణ వర్గాన్ని గౌరవించడంలో పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వం విఫలం చెందింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
దేవాలయాల జోలికొస్తే ఊరుకోం.. చంద్రబాబుపై మల్లాది ఫైర్
సాక్షి,విజయవాడ : హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, దేవాలయాల జోలికి వస్తే ఊరుకోమని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ మధురా నగర్లో మున్సిపల్ అధికారులు అత్యుత్సహం ప్రదర్శిస్తున్నారు. ఇటీవల దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని కాలువ గట్టు వివి.నరసరాజు రోడ్డులో స్థానికులు చేపట్టిన దుర్గాదేవి ఆలయం నిర్మాణాలు తొలగించారు.తాజాగా,అదే ప్రాంతంలో శ్రీకృష్ణుడి మందిరం వద్ద ఏర్పాటు చేసిన గోశాలను కూల్చివేశారు. సుమారు 15 గోవులకు నీడ లేకుండా చేశారు.గోశాల కూల్చివేతలపై సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం, కూటమి ప్రభుత్వం , మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడ్డారు.‘గోశాలను కూల్చేయడం హిందూ ధర్మానికి వ్యతిరేకం.సుమారు 15 గోవులకు నీడ లేకుండా చేశారు. సనాతన ధర్మాన్ని రక్షిస్తామని చెప్పే పెద్దమనుషులు సమాధానం చెప్పాలి.ఈ కూల్చివేతల బాధ్యత చంద్రబాబు,పవన్,దేవాదాయశాఖ మంత్రిదే,రాష్ట్రప్రభుత్వ శాఖలే దుర్మార్గంగా వ్యవహరించడం హిందూ ధర్మం,సనాతన ధర్మం పైన దాడిగానే పరిగణించాలి. గోవుల రక్షణ వైఎస్సార్సీపీ ధ్యేయం.కెనాల్ బండ్ ప్రొటెక్ట్ చేయాలని మేం ఆనాడే నిధులిచ్చాం.ఫెన్సింగ్ పనులు ప్రారంభించాం. బుల్డోజర్లతో ఇలా కూల్చివేతలకు పాల్పడటం ప్రజల మనోభావాలు దెబ్బతీయడమే. మరోసారి గుడుల జోలికి వస్తే ఊరుకోం.పుష్కరాల సమయంలో అనేక దేవాలయాలను చంద్రబాబు కూల్చివేయించారు. ఆంజనేయ విగ్రహం మున్సిపల్ ట్రాక్టర్లో తీసుకెళ్లారు. హిందూవుల మనోభావాలకు వ్యతిరేకంగా ఆనాడూ..ఈనాడూ చంద్రబాబు వ్యవహరిస్తున్నారు సమస్యను రెండు రోజుల్లో పరిష్కరించాలి’ అని సూచించారు. -
ఎల్లో గ్యాంగ్ తో కలిసి షర్మిల కుట్రలు..
-
విజయవాడ లడ్డు ఇష్యూ.. మల్లాది విష్ణు స్ట్రాంగ్ రియాక్షన్
-
KSR Live Show: సనాతనధర్మం ముసుగులో పవన్ కొత్త అవతారం
-
విజయవాడ వరదలు వచ్చి నెల రోజులు.. బాధితులకు చంద్రబాబు చేసింది..
-
రాజీనామా..!? వాళ్ల గోతిలో వాళ్లే పడ్డారు
-
ఇది చంద్రబాబు బీ టీం.. సిట్ పై మల్లాది విష్ణు విమర్శలు
-
ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోంది : మల్లాది
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద బురద జల్లాలని చూస్తే.. ఆ బురద మీ మీదే పడుతుందని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. రాష్ట్రంలో కూటమి నేతల అరాచకాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం గాలి కొదిలేసింది. రాజకీయ దుర్భుద్ధితో ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోంది. టీటీడీ లడ్డూ ప్రసాదాన్ని చంద్రబాబు ప్రభుత్వం రాజకీయాలకు వాడుకుంటుంది. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రజలను గందరగోళంలోకి నెట్టేసింది. నెయ్యి ట్యాంకర్లు ఎప్పుడొచ్చాయి. ఎప్పుడు తిప్పి పంపించారో డేటాతో సహా చెప్పాం. ఈవో ఒకలా, చంద్రబాబు మరోలా మాట్లాడుతున్నారు.ఏపీలో రౌడీరాజ్యం నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు రౌడీల్లా మారారు. పోలీసులు ఎమ్మెల్యేల కనుసన్నల్లో నడుస్తున్నారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళితే వారిపైనే కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆ ప్రాంతాన్ని దోచుకుతింటున్నారు. సొంత పార్టీ వాళ్లే టీడీపీ ఆఫీస్కు వెళ్లి కొలికపూడిపై ఫిర్యాదు చేశారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రభుత్వ వైద్యుడిపై దాడి చేసి బూతులు తిట్టారు. డిప్యూటీ సీఎం పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారు..ప్రజలకు సమాధానం ఏం చెబుతారు. ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అంబేద్కర్ బ్యానర్ను చించేసి అవమానించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తన దగ్గర ఓ రెడ్ బుక్ ఉందని బెదిరిస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేలను గెలిపించింది ఇందుకేనా? అని ప్రశ్నించారు. వరద బాధితులకు సాయం చేయాల్సింది పోయి వారినే బెదిరిస్తున్నారు. వరద బాధితులపై లాఠీఛార్జి చేయడమేంటి. సాయం అడిగినందుకు చెట్టుకు కట్టేసి కొట్టడమేంటి. విజయవాడ మునిగిపోతే నిర్లక్ష్యంగా ఎన్యుమరేషన్ చేశారు. ఎన్యుమరేషన్ సరిగా చేయాలని మేం స్వయంగా కలెక్టర్ను కలిసి కోరాం. కానీ మా విజ్ఞప్తులను పట్టించుకోలేదు.లడ్డూ వివాదంపై సిట్ వల్ల ఏం ఉపయోగం. సిట్ చంద్రబాబుకు బీ టీమ్ వంటిది. మమ్మల్ని దోషులుగా నిలబెట్టాలని ప్రయత్నించి...ప్రభుత్వమే ప్రజల ముందు దోషిగా నిలబడింది.రాజకీయాల కోసమే లడ్డూ అంశాన్ని చంద్రబాబు వాడుకున్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే లడ్డూ వివాదం పై సీబీఐ విచారణ జరిపించాలి. సుప్రీంకోర్టు పై మాకు అచెంచలమైన విశ్వాసం ఉంది. మా హయాంలో ఏ తప్పూ జరగలేదని..మేం గుండెల మీద చేయి వేసుకుని చెబుతున్నాం. వైఎస్ జగన్ మీద బురద జల్లాలని చూస్తే..ఆ బురద మీపైనే పడింది. వైఎస్ జగన్ జగన్ ఐదేళ్లలో హిందూత్వాన్ని కాపాడారని గుర్తు చేశారు. కూటమి వందరోజుల పాలనలో అరాచకం..రౌడీయిజం.. ఘోరాలకు అడ్డేలేకుండా పోయింది. రౌడీ ఎమ్మెల్యేల అరాచకాలపై చర్యలు తీసుకోకపోతే వైఎస్సార్సీపీ ఉద్యమిస్తుందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. 👉 చదవండి : చంద్రబాబు ఓ పొలిటికల్ జాదు -
అనంతపురంలో రాముడి విగ్రహం ధ్వంసం ఘటనపై మల్లాది విష్ణు రియాక్షన్
-
అధికారం కోసం అబద్ధాలు..
-
7 వేల కోట్లు నష్టం..700 కోట్లు ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారు
-
నిండా ముంచేసి.. అరకొర సాయమంటే ఎలా బాబూ?: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: వరదలు వస్తాయని తెలిసినా ప్రజలను చంద్రబాబు సర్కార్ అప్రమత్తం చేయలేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ప్రభుత్వంలోని పెద్దల తప్పిదాన్ని అధికారులపై వేస్తున్నారని ధ్వజమెత్తారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘మేము వరద ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాం.. రూ.7 వేల కోట్ల వరకు నష్టం జరిగిందని భావిస్తున్నాం.. ప్రభుత్వం రూ.700 కోట్లు మాత్రమే ఇస్తామంటోంది.’’ అని దుయ్యబట్టారు.‘‘చంద్రబాబు నిర్లక్ష్యమే ప్రజలను ముంచేసింది. కాలనీలకు కాలనీలే నీటిలో మునిగిపోయాయి. ఇల్లు మునిగితే రూ.25 వేలు ఇస్తే ఏ మూలకి సరిపోతుంది?. ఫర్నీచర్ విలువ, వాహనాల విలువ చంద్రబాబుకు తెలుసా?. బాధితుల కష్టాలు చూసి జగన్ చలించిపోయారు. అందుకే మా వంతుగా బాధితులకు సాయం అందించాం. ప్రభుత్వం రైతులకు పదివేలు ఇస్తే ఏం సరిపోతుంది?. చంద్రబాబు ప్రకటించిన ప్యాకేజీని పెంచాలి. ఆస్తి పన్నును రద్దు చేయాలని కోరతున్నాం. ఒక నెల కరెంటు బిల్లును పూర్తిగా రద్దు చేయాలి.ఇదీ చదవండి: పవన్.. గొంతు ఎందుకు పెగలడం లేదు?..నష్టపోయిన ఆటోల స్థానంలో ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి కొత్తవి ఇప్పించాలి. రెండు లక్షల వడ్డీలేని రుణాలను చిన్న పరిశ్రమల వారికి ఇప్పించాలి. చంద్రబాబు వైఖరి వలన 60 మంది పైనే చనిపోయారు. 7 వేల కోట్ల నష్టం జరిగితే 7 వందల కోట్లతో సరిపెట్టేలా చూడటం భావ్యం కాదు. వరదల వైఫల్యానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు.నిండా ముంచి ఇప్పుడు పాతిక వేలు ఇస్తామంటే ఎలా?: దేవినేని అవినాష్విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ, వరద బాధితులకు సహాయం చేయటంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. మా పార్టీ తరపున ప్రతి ఇంటికీ సాయం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు చేయలేక పోతోంది?. నిండా ముంచి ఇప్పుడు పాతిక వేలు ఇస్తామంటే ఎలా కుదురుతుంది?. పేద, మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రతి ఇంటికీ కనీసం యాభై వేలు చొప్పున ఇవ్వాలి’’ అని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. -
ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చుకోవటానికి బోట్ల విషయం తెరపైకి తెచ్చారు
-
విజయవాడను ముంచిన పాపం చంద్రబాబు ప్రభుత్వానిదే: మల్లాది విష్ణు
-
‘జనం లేని సమయంలో నష్టం అంచనా.. గృహోపకరణాల సంగతేంటీ?’
సాక్షి, తాడేపల్లి: వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలను కాపాడటంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. తుపానుకు ముందు తీసుకోవాల్సిన చర్యల విషయంలో సర్కార్ ఘోర వైఫల్యం చెందిందని చెప్పారు. ఇదే సమయంలో ఇప్పటికైనా సహాయక చర్యల్లో వేగం పెంచి బాధితులను ఆదుకోవాలని సూచించారు.కాగా, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘విజయవాడలోకి వరద వచ్చి ఎనిమిది రోజులు అయినా ప్రభుత్వంలో చలనం లేదు. కాలమే సమస్యకు పరిష్కారం చూపుతుందన్నట్టుగా ఉన్నారు. వర్షాలు, వరదల గురించి ముందే సమాచారం ఉన్నా పట్టించుకోలేదు. 28న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో వరదల గురించి కనీసంగా కూడా చర్చించలేదు. తుపానుకు ముందు తీసుకోవాల్సిన చర్యల విషయంలో ఘోర వైఫల్యం చెందారు.వరద వచ్చి లక్షన్నర మంది గ్రౌండ్ ఫ్లోర్లోని వారు మునిగిపోతే పట్టించుకోలేదు. ఎంతసేపూ వైఎస్ జగన్ను విమర్శించటమే తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు. ప్రజలకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోరంటూ సాక్షాత్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీనే అన్నారు. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉందా?. రెండు లక్షల మందిని తరలించలేకపోతే కనీసం అలర్ట్ చేస్తే వారే వెళ్లిపోయేవారు కదా?. అదికూడా చేయకుండా జనం చనిపోవడానికి కారణం అయ్యారు. పది రోజులుగా మురుగు నీరు నిల్వ ఉంటే పట్టించుకోవటం లేదు. పారిశుధ్యం దారుణంగా మారింది. సహాయక చర్యల్లో వేగం పెంచాలి.ఇళ్ల దగ్గర జనం లేని సమయంలో నష్టం అంచనా వేయటం ఏంటి?. వ్యాపార సంస్థల నష్టాన్ని కూడా అంచనాలు వేయాలి. ఇళ్లలో నష్టపోయిన గృహోపకరణాలకు కూడా నష్ట పరిహారం అందించాలి. బుడమేరు వరద తప్పిదం వెనుక బాధ్యులెవరో చెప్పాలి. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇంత నష్టానికి కారకులెవరో తేల్చాలి. ప్రజలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది. పేదలను కోటీశ్వరులను చేస్తామని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు పేదలు రోడ్డున పడ్డారు, కోటీశ్వరులు పేదలయ్యారు. 35వేల క్యూసెక్కుల నీటిని ఎవరికీ చెప్పకుండా ఎలా కిందకు వదిలారు?.అధికారులంతా బందర్ రోడ్డులో, బీఆర్టీఎస్ రోడ్డులోనే కనపడుతున్నారు తప్ప వరద ప్రాంతాల్లో కనపడటం లేదు. బోట్లను వదిలి బ్యారేజిని కూల్చాలని ఆరోపణలు చేసే బదులు వాటిపై విచారణ చేయాలి. పర్మిషన్ లేని బోట్లు ఎవరి చేతుల్లో ఉన్నాయో కూడా విచారణ జరపాలి. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ప్రకటించాలి. వరద ముంపునకు కారకులెవరో కూడా వెంటనే తేల్చాలి. చిన్న ఉద్యోగి నుండి పెద్ద అధికారి వరకు ఉదాసీనంగా వ్యవహరించారు. అందుకే వరదలతో లక్షల మంది ఇక్కట్ల పాలయ్యారు’ అంటూ కామెంట్స్ చేశారు. -
రాష్ట్రం మునిగిపోతుంటే.. చంద్రబాబు నిద్రపోతున్నాడు
-
స్నేహితుడి కోసం వెళ్లాడు.. అవును అతను పుడింగే..
-
చంద్రబాబు అన్న క్యాంటీన్ పై మల్లాది విష్ణు షాకింగ్ కామెంట్స్
-
పేరు తీసేసినంత మాత్రాన, ప్రజల హృదయాల్లో చరిత్రను చెరపలేరు
-
YSRCP రాజ్యసభ ఎంపీలకు చంద్రబాబు ఆఫర్ నిజమే.. కానీ.. !
-
ఎల్లోబాన్లపై వైఎస్సార్సీపీ ఆగ్రహం
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచకాలపై వైయస్సార్సీపీ నేతలు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా వినుకొండలో పార్టీ కార్యకర్త దారుణహత్య. పుంగనూరులో ఎంపీ పి.మిధున్రెడ్డిపై రాళ్లతో దాడి. వాహనాల «ధ్వంసం ఘటనలను వారు ముక్త కంఠంతో ఖండించారు.అ«ధికారం చేపట్టిన టీడీపీ తొలి రోజు నుంచి పాలన గాలికి వదిలేసి, కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని, ఎక్కడికక్కడ దాడుల చేస్తోందని వారు ఆక్షేపించారు. ఇకనైనా టీడీపీ తన వైఖరి మార్చుకోకపోతే, భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోకతప్పదని వైయస్సార్సీపీ నేతలు, నాయకులు హెచ్చరించారు.వైయస్సార్సీపీ నేతలు.. ఎవరు, ఏమన్నారంటే..: ప్రశాంతంగా ఉన్న పుంగనూరు నియోజకవర్గంలో ఘర్షణ వాతావరణం సృష్టించారు. రాళ్ళతో, మారణాయుధాలతో దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ డైరెక్షన్లోనే పుంగనూరు ఘటన చోటు చేసుకుంది. పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధిని అడ్డుకోవాలన్న కుట్రలో భాగమే ఈరోజు అక్కడ రాళ్ల దాడి, వాహనాల ధ్వంసం జరిగింది. రూ.5 వేల కోట్లతో ఎలక్ట్రిక్ కార్ల ఫ్యాక్టరీ పుంగనూరులో ఏర్పాటవుతుంటే, దాన్ని ఎలాగైనా ఆపాలన్న కుట్ర చేస్తున్నారు. ఎల్లకాలం మీ ఆటలు సాగవు. ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. నా సొంత నియోజకవర్గంలో పర్యటించకుండా ఉండాలని చూస్తున్నారు. అందుకే మా వాహనాలు ధ్వంసం చేశారు. నాపై రాళ్ల దాడి చేశారు.:::పి.మిధున్రెడ్డి. రాజంపేట ఎంపీపుంగనూరు నా ఇంటికి వచ్చిన ఎంపీ పి.మిధున్రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. మారణాయుధాలు, రాళ్లతో ఎంపీ మిథున్రెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించారు. నా వాహనాలతో పాటు, మిథున్రెడ్డి వాహనాలు కూడా ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా, పోలీసులు పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. వారు టీడీపీ తొత్తులుగా వ్యవహరించారు.:::రెడ్డప్ప. చిత్తూరు మాజీ ఎంపీఎంపీ మిధున్రెడ్డిపై రాళ్ళ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో దాడులు హత్యలు దారుణంగా పెరిగిపోయాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సమంజసం కాదు. దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. దీన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు. దాడులు చేస్తున్న వారికి ప్రజలు సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారు.:::గొల్ల బాబురావు. ఎంపీ (రాజ్యసభ సభ్యుడు)చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి వద్ద ఎంపీ మిధున్రెడ్డిపై దాడి అమానుషం. ఎంపై రాళ్ల దాడి చేసి, వారి వాహనాలు« «ధ్వంసం చేయడం అత్యంత హేయం. టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో రాక్షస, ఆరాచక పాలన సాగుతోంది. ఈ దాడులపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. ప్రజలు అధికారాన్ని ఇస్తే, సభ్య సమాజం తలదించుకునేలాగా టీడీపీ నాయకులు ప్రవర్తించడం సిగ్గుచేటు.:::ఇస్సాక్ బాషా. వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ.రేపు (19వ తేదీ, శుక్రవారం) ఉదయం మా పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి వినుకొండలో పర్యటిస్తారు. టీడీపీ కార్యకర్త చేతిలో దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. ఆ కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పడానికే, ఆయన రేపు వినుకొండలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది, వందలాది ప్రజలు, పోలీసులు చూస్తుండగానే, వినుకొండ నడిరోడ్డులో మా పార్టీ కార్యకర్తను నరికి చంపడం అంటే.. అంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా?. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది.. ఇలా పార్టీ కార్యకర్తలను నరికి చంపడానికా?. వినుకొండలో తెలుగుదేశం పార్టీ కొత్త సాంప్రదాయానికి బీజం వేసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పని చేస్తున్నాడన్న కారణంతోనే రషీద్ను దారుణంగా నరికి చంపారు.:::బొల్లా బ్రహ్మనాయుడు. మాజీ ఎమ్మెల్యే (వినుకొండ)వినుకొండ టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ ఘటన.. మనసున్న ప్రతి ఒక్కరినీ కలచివేస్తుంది. అంత కిరాతకమైన దృశ్యాలు ఆ వీడియోలో కన్పిస్తున్నాయి. రషీద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాను.ఆంధ్రప్రదేశ్ను అత్యాచారప్రదేశ్గా మార్చొద్దు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోంది. లా అండ్ ఆర్డర్ కనిపించడం లేదు. కేవలం నారా లోకేష్ ఆర్డర్ కనిపిస్తోంది. వినుకొండ లాంటి ఘటనలు రాష్ట్రంలో ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. వాటన్నింటిపై ప్రధాని మోదీ గారు, కేంద్ర హోం మంత్రి అమిత్షాగారు దృష్టి పెట్టాలి. అలాగే రాష్ట్రంలో ఈ ఒకటిన్నర నెలల్లో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలి.:::సి.అనిల్కుమార్ యాదవ్. మాజీ మంత్రి.వినుకొండలో జరిగిన హత్య ఒక రాజకీయ హత్య. అలాగే ఎంపీ మిథున్రెడ్డిపై దాడి అత్యంత హేయం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. వినుకొండలో మా పార్టీ కార్యకర్తను అత్యంత పాశవికంగా హత్య చేసి, దాన్ని వ్యక్తిగత హత్యగా చిత్రీకరించడం దారుణం. టీడీపీ దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు పుంగనూరు వెళ్లిన ఎంపీ మిధున్రెడ్డిపై రాళ్లతో దాడి చేయడం అత్యంత హేయమైన చర్య. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ఒక పార్లమెంటు సభ్యుడికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం, సామాన్య కార్యకర్తలకు ఏ విధమైన రక్షణ కల్పిస్తుంది?. ఏకంగా ఒక ఎంపీపైనే రాళ్లతో దాడి చేస్తున్నా, రక్షణ కల్పించకుండా పోలీసులు చోద్యం చూశారంటే, ఇక్కడ ఏ విధమైన ఆటవిక పాలన కొనసాగుతుందో అర్ధం చేసుకోవాలి. గతంలో ఎన్నడూ లేనటువంటి సంస్కృతిని ఇప్పుడు చూస్తున్నాం. అధికారం శాశ్వతం కాదు అనేది గుర్తుంచుకొంటే బాగుంటుంది.:::ధర్మాన కృష్ణదాస్. మాజీ మంత్రి. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వ పాలన తాలిబన్ల పాలనను తలపిస్తోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్పై దృష్టి పెట్టకుండా సూపర్ మ్యాజిక్ చేసి మోసం చేస్తున్నారు. కూటమి నాయకులు దళితులనే టార్గెట్ చేసి దాడులు చేయడం హేయమైన చర్య. ఈ కూటమి తాలిబన్లను తరమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. మీ దాడులపై మా పార్టీ ప్రతి దాడులకు దిగితే తట్టుకోలేరు.:::కోరుముట్ల శ్రీనివాసులు. మాజీ ఎమ్మెల్యే (రైల్వే కోడూరు)రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. చంద్రబాబు మార్క్ రాజకీయాలు నడుస్తున్నాయి. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. హత్యలు, దొమ్మీలు ఆస్తి నష్టం జరుగుతూనే ఉంది. ఈ తరహా పద్ధతి మారకపోతే తిరగబడాల్సి వస్తుంది. పుంగనూరులో ఎంపీ మిథున్రెడ్డిపై జరిగిన దాడి దారుణం. వెంటనే రాజ్యాంగ వ్యవస్థలు జోక్యం చేసుకోవాలి. ఇకనైనా చంద్రబాబు తన పద్ధతి మార్చుకోవాలి.:::జక్కంపూడి రాజా. మాజీ ఎమ్యెల్యే. (తూ.గో.జిల్లా)కూటమి పాలనలో రాష్ట్రంలో అరాచకం నడుస్తోంది. టీడీపీ నాయకులు దాడులు, మర్డర్లు ,మానభంగాలతో చెలరేగిపోతున్నారు. ఇందుకేనా మీకు ప్రజలు అధికారం ఇచ్చింది?. మీ పాలనలో గ్రామాలలో ఎన్నో కుటుంబాలు వలస వెళ్లిపోయాయి. వినుకొండలో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే మా పార్టీ కార్యకర్తను నరికి చంపడం దారుణం.:::కాసు మహేష్రెడ్డి. మాజీ ఎమ్మెల్యే (గురజాల).తెలుగుదేశం నాయకులు అసలు ఎందుకు దాడులు చేస్తున్నారు?. నడిరోడ్డుపైన పోలీసులు ఉండగానే రషీద్ను అత్యంత దారుణంగా చంపడం దుర్మార్గపు చర్య. గతంలో జిల్లా ఎస్పీగా మల్లికాగార్గ్, నెల రోజులపాటు పని చేసినప్పుడు, ఈ తరహా దాడులు కాస్త తగ్గాయి. జిల్లాకు చెందిన ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, సీఎం చంద్రబాబును కలిసి, ఎస్పీని మార్చమని కోరారు. ఆయన వెంటనే ఆ పని చేశారు. ఇప్పుడు వినుకొండలో మా పార్టీ కార్యకర్తను దారుణంగా హత్య చేశారు. ఘటన జరిగిన వెంటనే, ఎలాంగి దర్యాప్తు చేయకుండానే, అర్ధరాత్రి మీడియాతో మాట్లాడిన జిల్లా ఎస్పీ, అది వ్యక్తిగత, పాత కక్షల వల్లనే జరిగిందని చెప్పడం దారుణం. మరోవైపు రషీద్ను నరికి చంపిన జిలానీ, వాస్తవానికి టీడీపీకి చెందినవాడైనా, అతడు తమ పార్టీ కార్యకర్త అంటూ, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. నిజానికి గత ఎన్నికల్లో జిలానీ, టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు కోసం పని చేశారు.:::మర్రి రాజశేఖర్. ఎమ్మెల్సీ.చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు చేయటమే తెలుగుదేశం కార్యకర్తలు పనిగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వారు గాలికి వదిలేశారు. హత్య జరిగిన తరవాత అర్ధరాత్రి ప్రెస్మీట్ పెట్ని ఎస్పీ, పాతకక్షల వల్లే రషీద్ హత్య జరిగిందని చెప్పడం దారుణం.:::గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి. మాజీ ఎమ్మెల్యే (నర్సారావుపేట) పక్కా ప్లాన్తో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. గడిచిన 45 రోజులుగా ఏపీలో జరుగుతున్న హింస ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. 31 హత్యలు, 35 మంది ఆత్మహత్యలు జరిగాయి. ఏకంగా 2,750 కుటుంబాలు ప్రాణభయంతో వలస పోయాయి. ప్రతిపక్షాన్ని టెర్రరైజ్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ ని తలపిస్తున్నారు. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి. హైకోర్టు కోర్టు కూడా సుమోటోగా తీసుకోవాలి. వినుకొండ హత్యకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. అటు పుంగనూరులో ఎంపీ మిథున్రెడ్డిపై రాళ్ల దాడి చేశారు. ఇందుకేనా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది?. వారం లోగా పరిస్థితిని చక్కదిద్దాలి. లేకపోతే రాజీనామా చేయాలి. మా ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా నిలుస్తుంది.:::కనుమూరు రవిచంద్రారెడ్డి, వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల కూడా గడవక ముందే మా పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలపై టీడీపీ దాడులు తీవ్రమయ్యాయి. ఎంపీ మిధున్రెడ్డిపై పుంగనూరులో రాళ్లదాడిని ఖండిస్తున్నాం. సౌమ్యుడిగా, మంచి వ్యక్తిగా పేరున్న మిథున్రెడ్డిపై టీడీపీ దాడి ఎంత వరకు సబబు?. తమ నియోజకవర్గంవలో పర్యటించే హక్కు, ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధికి, ప్రజాస్వామ్యంలో హక్కు ఉంటుంది. ఆ హక్కును కాలరాయాలని టీడీపీ చూడడం దారుణం.:::అకేపాటి అమర్నాథ్రెడ్డి. రాజంపేట ఎమ్మెల్యే.రాష్టంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. గుంటూరు జిల్లాలో వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ వారి దాడులు తీవ్రమవుతున్నాయి. వినుకొండలో నడి రోడ్డుపై రషీద్ను దారుణంగా నరికి చంపారు. వ్యక్తిగత వివాదాలు, పాతకక్షల వల్లే ఆయన హత్య జరిగిందని, అర్థరాత్రి హడావిడిగా ఎస్పీ చెప్పడం దారుణం. అలాంటి ఎస్పీకి రాష్ట్రంలో పని చేసే అర్హత లేదు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దాడులు పెరిగాయి. దాదాపు 3 వేల కుటుంబాలు ఇళ్లు, ఊళ్లు వదిలి వెళ్లాయి. మరోవైపు మహిళలు, మైనర్ బాలికలపై అఘాయిత్యాలు అధికమయ్యాయి. మా పార్టీ వారిపై నానాటికీ దాడులు పెరుగుతున్నా, పోలీసులు అస్సలు పట్టించుకోవడం లేదు. చంద్రబాబు 40 రోజుల పాలనలో అనేక దారుణాలు జరిగాయి. ఆడపిల్లల జోలికి వస్తే.. భయపడేలా చేస్తామన్న పవన్కళ్యాణ్.. ఇప్పుడు నోరు మెదపడం లేదు.:::కాకాణి గోవర్థన్రెడ్డి. మాజీ మంత్రి.పుంగనూరులో ఎంపీ మిథున్రెడ్డిపై రాళ్ల దాడి, ఆయన వాహనాల «ధ్వంసం హేయమైన చర్య. ప్రజాస్వామ్య పద్దతిలో ప్రజలచే ఎన్నుకోబడిన పార్లమెంట్ సభ్యుడు మిథున్రెడ్డి. పుంగనూరులో మాజీ ఎంపీ ఇంటికి వెళ్లిన ఆయనపై టీడీపీ శ్రేణులు రాళ్ల దాడి చేయడం, ఆయన వాహనాలు ధ్వంసం చేయడం పిరికిపంద చర్య. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వరుసగా జరుగుతున్న హత్యలు, దాడులు, ఆస్తుల ధ్వంసం, కూల్చివేతల సంఘటనలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. గతంలో ఏనాడూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. నెల రోజులుగా వరుసగా పసిపిల్లలపై అత్యాచారాలు జరగడం చాలా దురదృష్టకరం, బాధాకరం. నంద్యాల జిల్లా నందికొట్కూరు ముచ్చుమర్రిలో తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారానికి గురై, హత్యకు గురైనా, ఇప్పటికీ ఆ బాలిక మృతదేహం కనుక్కోక పోవడం దారుణం.:::జి.శ్రీకాంత్రెడ్డి. వైయస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడురాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్రెడ్డిపై దాడి అత్యంత హేయం. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ఒక పార్లమెంటు సభ్యునికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకి ఏవిధమైన రక్షణ కల్పిస్తుంది. ఒక ఎంపీపై రాళ్ల దాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులే చోద్యం చూస్తుంటే ఏవిధమైన ఆటవిక పాలన కొనసాగుతుందో అర్ధం చేసుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ లేనటువంటి సంçస్కృతిని ఇప్పుడు చూస్తున్నాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి. అధికారం శాశ్వతం కాదు.:::గురుమూర్తి. ఎంపీ (తిరుపతి) -
లా అండ్ ఆర్డర్ విఫలం..
-
ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై మల్లాది విష్ణు రియాక్షన్
-
సీఎం జగన్ 5 ఏళ్ల సంక్షేమ పాలనపై మల్లాది విష్ణు రియాక్షన్
-
ఆరోగ్యశ్రీ సేవలు ఆగలేదు
సాక్షి, అమరావతి/అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో ఎక్కడా ఆరోగ్యశ్రీ సేవలు ఆగలేదని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. కానీ టీడీపీ, బీజేపీ నాయకులు పనిగట్టుకుని ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయాయని విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధైర్యం ఉంటే ఆరోగ్యశ్రీ సేవలపై పచ్చ నేతలు బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. ఈ మేరకు మల్లాది విష్ణు శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు యథాతథంగా కొనసాగుతున్నాయి. ఎక్కడా అంతరాయం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.అయినా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయంటూ కొన్ని పత్రికలు అబద్ధాలు వండివారుస్తూ పేదలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పేదల సంపూర్ణ ఆరోగ్యానికి భరోసా కలి్పస్తూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నిరీ్వర్యం చేసిన టీడీపీకి ఈ పథకం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. టీడీపీ హయాంలో కేవలం తెల్ల రేషన్కార్డు కలిగిన కుటుంబాలకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తించేది. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక తెల్ల రేషన్కార్డు కలిగిన కుటుంబాలతోపాటు రూ.5లక్షలలోపు ఆదాయం ఉన్న మధ్య తరగతి కుటుంబాలకు కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో 1.42కోట్లకు పైగా కుటుంబాలకు ప్రస్తుతం ఆరోగ్యశ్రీ వర్తిస్తోంది.దీనిని తెలుగుదేశం నేతలు కాదనగలరా?.. టీడీపీ హయాంలో కేవలం 1,059 మాత్రమే ఉన్న ప్రొసీజర్లను సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం 3,257కి పెంచింది. ఉచిత వైద్య పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతూ సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ పాలనలో కేవలం 919 ఆస్పత్రులకు మాత్రమే పరిమితమైన ఆరోగ్యశ్రీ సేవలను మా ప్రభుత్వం 2,371 ఆస్పత్రులకు విస్తరించింది. ఇతర రాష్ట్రాల్లోని నెట్వర్క్ ఆస్పత్రులను 72 నుంచి 204కి పెంచింది. టీడీపీ పాలనలో ఆరోగ్యశ్రీ నిధులన్నీ చంద్రబాబు దురి్వనియోగం చేయగా, నేడు గ్రీన్ చానల్ ద్వారా పారదర్శకంగా చెల్లింపులు జరుగుతున్నాయి. ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ ద్వారా 42.91లక్షల మందికి రూ.13,471కోట్ల విలువైన వైద్యసేవలు అందించాం2023–24 ఆరి్థక సంవత్సరానికి సంబంధించి నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.3,566కోట్లు చెల్లించింది. 2024–25 ఆరి్థక సంవత్సరంలో తొలి రెండు నెలల్లో రూ.366కోట్లు చెల్లించగా, తాజాగా మరో రూ.200కోట్ల బకాయిలు విడుదల చేసింది. అదేవిధంగా ప్రజలకు ఇంటి వద్దే వైద్యసేవలు అందించేలా ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం అమలుచేసింది. ప్రభుత్వ వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు రూ.16,852కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతోపాటు నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేసింది.గత ఐదేళ్లలో వైద్యశాఖలో సుమారు 54వేల పోస్టులను భర్తీ చేసింది. ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రులలో పేదలకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందుతున్నాయి. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఆరోగ్య సూచీల్లో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉంది. ప్రజలకు డిజిటల్ వైద్యసేవలు, పౌరులకు టెలీ మెడిసిన్ సేవల కల్పనలోనూ ఏపీ తొలి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడి ఆరోగ్య అవసరాలు తీర్చడమే లక్ష్యంగా సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అహరి్నశలు పనిచేస్తోంది.’ అని విష్ణు పేర్కొన్నారు. -
టీడీపీ అంటేనే కుట్ర కుతంత్రం.. చంద్రబాబుపై రెచ్చిపోయిన మల్లాది విష్ణు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు
-
ఓటర్లపై కూటమి ప్రలోభాల వల
సాక్షి, అమరావతి: ఎన్నికల నియమావళిని పదేపదే ఉల్లంఘిస్తూ.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. ఈ మేరకు ఆదివారం వెలగపూడి సచివాలయంలో ఈసీని కలిసి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాకు వెల్లడించిన వివరాలు.. ► రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ నేతలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న ఘటనలను ఎప్పటికప్పుడు ఈసీ దృష్టికి తీసుకెళ్తున్నాం. కడప బహిరంగ సభలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. అన్ని పార్టీల నుంచి డబ్బులు తీసుకుని, ఓట్లు మాత్రం కాంగ్రెస్కు వేయమని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా మాట్లాడారు. దీనిపై ఆధారాలతో ఈసీకి ఫిర్యాదు చేశాం. ► విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి, టీడీపీ నేత కేశినేని చిన్ని, ఓటర్లను ప్రలోభ పరుస్తూ డబ్బులు పంచడాన్ని కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. ఆనాడు కేంద్ర కేబినెట్లో ఉండి కూడా, రాష్ట్ర ప్రయోజనాలను సుజనా పూర్తిగా పక్కన పెట్టారు. ప్రత్యేక హోదాను సమాధి చేసి ప్యాకేజీగా మార్చడంలో సుజనా చౌదరి, సీఎం రమేష్ల పాత్రే కీలకం. ► సీఎస్, డీజీపీలపై నర్సీపట్నం సభలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు వాడిన భాష సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. అధికారులను తూలనాడటం, వ్యవస్థలను తేలిక చేసి మాట్లాడటం, చంద్రబాబు నుంచి అభ్యర్థుల వరకు షరా మామూలైపోయింది. – పింఛన్ దారుల విషయంలోనూ ఏవిధంగా కూటమి నేతలు చులకన చేసి మాట్లాడారో ఈసీ దృష్టికి తీసుకువెళ్లాం. మైనార్టీలపై బాబు కపట ప్రేమ ‘‘మైనార్టీల గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు, టీడీపీకి ఏమాత్రం లేదు. ఆనాడు దివంగత మహానేత మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ తీసుకువస్తుంటే, కోర్టుకు వెళ్లి మరీ అడ్డుకుంది టీడీపీ కాదా? అధికారంలో ఉండి కూడా ఎన్నికలకు ముందు 4 నెలల వరకు మైనార్టీలకు కేబినెట్లో స్థానం కల్పించని వ్యక్తి చంద్రబాబు. కానీ సీఎం వైఎస్ జగన్ తన తొలి కేబినెట్లోనే మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించి, మైనార్టీల పక్షపాతిగా నిలిచారు’’ అని విష్ణు పేర్కొన్నారు. అమరావతి పేరుతో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఆడిన డ్రామాలను ప్రజలు గ్రహించినందునే స్థానిక ఎన్నికల్లో అక్కడి ప్రజలు టీడీపీని చిత్తుగా ఓడించారని గుర్తుచేశారు. రైతు రుణమాఫీని ఎగ్గొట్టి అన్నదాతలకు ద్రోహం చేసిన చంద్రబాబు రైతు సంక్షేమంపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎవరెన్ని విమర్శలు గుప్పించినా ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం ఖాయమని స్పష్టంచేశారు. ఎమ్మెల్యే వెంట నవరత్నాల కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఎ. నారాయణమూర్తి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సభ్యులు శ్రీనివాసరెడ్డి ఉన్నారు. సుజనా చౌదరి, కేశినేని చిన్నిపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు గాం«దీనగర్ (విజయవాడ సెంట్రల్): ఎన్నికల ప్రచారంలో భాగంగా హారతి పళ్లెంలో డబ్బులు వేసిన ఘటనపై ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి, టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని)పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రిటర్నింగ్ ఆఫీసులో ఆయన ఫిర్యాదు చేశారు. డబ్బుల పంపిణీపై వార్తా చానల్స్, వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగ్స్, హారతి పళ్లంలో డబ్బులు వేస్తున్న వీడియోలు ఎన్నికల అధికారులకు అందజేశారు. పూర్తి ఆధారాలు ఉన్నందున ఎన్నికల నియమావళిలో సూచించిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుజనా చౌదరి డబ్బుల సంచులతో పశ్చిమ నియోజకవర్గానికి వచ్చారన్నారు. తొలిరోజే ఆయన కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని తెలిపారు. -
వాలంటీర్లపై ‘పచ్చ’ కుట్ర.. చంద్రబాబుపై వైఎస్సార్సీపీ నేతల ఫైర్
సాక్షి, విజయవాడ: పెన్షన్ పంపిణీపై నిమ్మగడ్డ అండ్ కో ఫిర్యాదుపై ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు మండిపడ్డారు. సీఎం జగన్ చెప్పినట్లు పేదలకు, పెత్తందార్లుకు మధ్య జరుగుతున్న యుద్ధం అన్నారు. పేదలకు అందించే పెన్షన్లు నిలుపుదల చేయించడం దురదృష్టకరమన్నారు. పెన్షన్ల పంపిణీ అంశంపై ఈసీ పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. లబ్ధిదారులు ఇబ్బందులు పడతారు: ఎంపీ కేశినేని పెన్షన్లు ఆపేస్తే లబ్ధిదారులు ఇబ్బంది పడతారన్నారని ఎంపీ కేశినేని నాని అన్నారు. మొన్నటి వరకూ ఒకటవ తేదీనే పెన్షన్ ఇచ్చేవాళ్లం. ఆ విధానాన్ని కొనసాగించేలా ఈసీ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పెన్షనర్ల నోట్లో మట్టికొట్టారు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, 64 లక్షల మంది పెన్షనర్ల నోట్లో మట్టికొట్టారన్నారు. నిమ్మగడ్డ రమేష్తో పాటు మరికొందరు చంద్రబాబు ఏజెంట్లుగా.. తొత్తులుగా మారారని దుయ్యబట్టారు. చంద్రబాబు డైరెక్షన్లోనే పెన్షన్లను అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. దీనికి టీడీపీ కచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిందేనన్నారు. వృద్ధుల ఉసురు పోసుకున్న చంద్రబాబు: వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, నిమ్మగడ్డ రమేష్ అండ్ బ్యాచ్ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో మూడు రోజులు క్యూలో నిలబడితేనే కానీ పెన్షన్లు వచ్చేవి కాదు. ఈ కుట్రకు కారణం చంద్రబాబే. వృద్ధుల ఉసురు చంద్రబాబుకు కచ్చితంగా తగులుతుంది. సీఎం జగన్ ఇంటికే పెన్షన్లు అందిస్తున్నారు. వాలంటీర్ల ద్వారా ఇంటికే పెన్షన్ల ప్రక్రియను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. -
చంద్రబాబుకు మల్లాది విష్ణు స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, విజయవాడ: టీడీపీ తీరు ఆత్మస్తుతి పరనిందలాగా మారిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రభుత్వంపై పనిగట్టుకుని బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. ‘విధ్యంసం’ పుస్తకం పేరుతో ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు,పవన్ దిగజారిపోయి వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబు తన గురించి తాను రాసుకున్న ‘మనసులో మాట’ పుస్తకాన్ని బయటపెట్టాలి. చంద్రబాబు ఐదేళ్ల పాలనకు.. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనకు బహిరంగ చర్చకు మేం సిద్ధం. ఎక్కడ చర్చకు రమ్మన్నా వచ్చేందుకు రెడీ. చంద్రబాబుకు ఇదే నా సవాల్. పథకాలిస్తుంటే ఏపీ శ్రీలంక అయిపోతుందన్నావ్. ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు ఆరు గ్యారంటీలిస్తానంటున్నావ్. ప్రజలు నిన్ను నమ్మం బాబు అంటున్నారు’’ మల్లాది విష్ణు పేర్కొన్నారు. నీ గురించి గొప్పగా.. సీఎం జగన్పై తప్పుగా ప్రచారం చేయిస్తున్నావ్. బాబు జమానా అవినీతి ఖజానా అని పుస్తకం వేసింది సీపీఐ కాదా?. సీఎం జగన్పై బురద చల్లడానికే ‘విధ్వంసం’ పుస్తకాన్ని తెచ్చారు. సీఎం జగన్ని ఢీకొట్టే సత్తాలేక బాబు ఇతర పార్టీలను కలుపుకుంటున్నాడు. కుర్చీ కోసం పాకులాడటం తప్ప.. ప్రజలకు మేలు జరగాలనే ఆలోచన మీకులేదు. ఐదేళ్లలో విజయవాడ నగరానికి ఒక్క మంచి పనైనా చేశావా?. విజయవాడ అభివృద్ధి పై చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి’’ అంటూ మల్లాది విష్ణు హితవు పలికారు. ‘‘పరిపాలనకు మీరు పనికిరారని, ప్రజలు 2019లో మిమ్మల్ని విధ్వంసం చేశారు. తప్పుడు సంకేతాలివ్వాలనే టీడీపీ నేతలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. విధ్వంసం పుస్తకం వెనుక చంద్రబాబు, పవన్, సీపీఐ రామకృష్ణ ఉన్నారు. మూడు రాజధానులే మా పార్టీ విధానం. ఏపీలో పొత్తులు తేలాక ఎవరి పై ఎవరు రాళ్లు విసురుతారో.. ఎవరి కుర్చీ ఎవరు మడతపెడతారో తేలిపోతుంది. పొత్తులు ప్రకటించాక మంచి వినోదం మొదలవుతుంది. ఏపీని మోసం చేసిన పార్టీలే మళ్లీ కలిసి పోటీ చేయాలనుకుంటున్నాయి. చంద్రబాబు,పవన్ ది రెండు నాల్కల ధోరణి. వాలంటీర్లపై చంద్రబాబు, పవన్ ఏం మాట్లాడారో.. ఇప్పుడేం మాట్లాడుతున్నారో అంతా గమనిస్తున్నారు’’ అని మల్లాది విష్ణు పేర్కొన్నారు. -
175 స్థానాలలో పోటీ చేసే దమ్ము లేక..టీడీపీ పై మల్లాది విష్ణు ఫైర్
-
అసెంబ్లీలో టీడీపీ తీరు అత్యంతహేయంగా ఉంది: మల్లాది
-
మల్లాది విష్ణుకి టికెట్ ?..సజ్జల కీలక కామెంట్స్
-
ఒక్క హగ్తో యెల్లో బ్యాచ్కి చెక్
ఎన్టీఆర్, సాక్షి: పార్టీ విజయం కోసం కొన్ని మార్పులు తప్పవని.. అలాంటప్పుడు అలకలు సహజమని.. పరిస్థితులు త్వరలోనే చక్కబడతాయంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు ముందు నుంచే చెబుతున్నాయి. అయితే యెల్లో మీడియా మాత్రం ఈ అలకల్ని భూతద్ధంలో పెట్టి చూపించే యత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఇవాళ్టి విజయవాడ సెంట్రల్ పరిణామాలు.. ఆ బ్యాచ్ నోళ్లు మూయించాయి. వైఎస్సార్సీపీ నుంచి తొలి గెలుపు విజయవాడ సెంట్రల్దే కావాలని.. వెల్లంపల్లి శ్రీనివాస్ను గెలిపించాలంటూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గురువారం పిలుపు ఇచ్చారు. అంతేకాదు విజయవాడలో పార్టీ కొత్త కార్యాలయం ప్రారంభ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అయితే టీడీపీ అనుకూల మీడియా చానెల్స్, పత్రికలు చాలారోజుల నుంచి వీళ్ల మధ్య ఏదో వైరం నడుస్తున్నట్లు చూపించే యత్నం చేసింది. ఒక అడుగు ముందుకేసి ఆయన పార్టీని కూడా వీడుతారంటూ ఊహాజనిత కథనాలు రాశాయి. అయితే ఆ రోతరాతలకు ఒక్క హగ్తో చెక్ పెట్టారు ఈ ఇద్దరూ. విజయవాడ సెంట్రల్ సింగ్ నగర్ లో వైఎస్సార్సీపీ ఇంఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ నూతన కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి ఆఫీస్కు ర్యాలీ తన ఆఫీస్ నుంచి మల్లాది వచ్చారు. ఈ సందర్భంగా మల్లాదికి వెల్లంపల్లి ఆత్మీయ స్వాగతం పలికారు. అంతేకాదు.. ఈ ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నాని.. పలువురు నేతలు కూడా పాల్గొన్నారు. సమిష్టిగా పని చేయడం ద్వారా ఈ ఎన్నికల్లో విజయం సాధించి తీరాతామని ఈ సందర్భంగా ఈ ఇద్దరు ప్రకటించారు. -
'మందలో ఒకరిగా కాదు.. వందలో ఒకరిగా..' : ఆర్.కే. రోజా
నేటి యువత దేశానికే ఆదర్శంగా నిలవాలని, యూత్ ఐకాన్ లుగా తయారవ్వాలని, స్వామి వివేకానంద జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖామాత్యులు ఆర్.కే. రోజా పిలుపునిచ్చారు. జాతీయ యువజన దినోత్సవంను పురష్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి జాతీయ యువజన దినోత్సవ వేడుకలను శుక్రవారం అత్యంత వేడుకగా నిర్వహించారు. యువజన వేడుకలకు ముఖ్య అతిధిగా హజరైన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖామాత్యులు ఆర్.కే. రోజా మాట్లాడుతూ యువత దేశానికి వెన్నెముక అని నేటి యువత అన్ని రంగాల్లో తమ ప్రాముఖ్యతను చాటుకోవాలని ఆకాంక్షించారు. స్వామి వివేకానంద ప్రసంగాలను ఆదర్శంగా తీసుకుని యువత ఆయా రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. కడివెడు కబుర్ల కన్నా గరిటెడు ఆచరణ మేలు అని అన్నారు. స్వామి వివేకానంద చెప్పినట్లు యువత శక్తిపై అపార నమ్మకాన్ని ఉంచి వారి అభ్యున్నతి కోసం మన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని మంత్రి ఆర్.కె. రోజా తెలిపారు. స్వామి వివేకానంద యువతకు మార్గనిర్ధేశం చేశారని, ఆయన ఆశయాలకు, ఆకాంక్షలకు, స్ఫూర్తికి అనుగుణంగా యువత నడిస్తే వారికి తిరుగుండదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖామాత్యులు ఆర్.కే. రోజా పేర్కొన్నారు. హిందూ యోగిగా స్వామి వివేకానంద మన దేశ సంస్కృతి, సాంప్రదాయాల ఔన్నత్యాన్ని విదేశాల్లో చాటి చెప్పిన తొలి వ్యక్తి అని కొనియాడారు. స్వామి వివేకానంద స్థాపించిన రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ లు నేడు సమాజానికి ఎంతో సేవ చేస్తున్నాయని వివరించారు. అందుకనే 120 సంవత్సరాల తరువాత కూడా స్వామి వివేకానంద గొప్పతనాన్ని ఇప్పటికీ చెప్పుకుంటున్నామన్నారు. స్వామి వివేకానంద మన దేశంలో జన్మించటం మనం చేసుకున్న అదృష్టమని మంత్రి ఆర్. కె. రోజా పేర్కొన్నారు. నేటి యువత మందలో ఒకరిగా కాదు వందలో ఒకరిగా నిలవటానికి వారి వారి రంగాల్లో విశేష కృషి చేయాలని కోరారు. స్వామి వివేకానంద సముద్ర కెరటం నాకు ఆదర్శమన్నారని, అంటే ప్రయత్నం చేసి ఓడిపోవచ్చు కాని ప్రయత్నం చేయటంలోనే ఓడిపోకూడదని, యువత తమ జీవితంలో ఒక గోల్ నిర్ణయించుకుని నిరంతరం శ్రమిస్తే విజయం తథ్యమని మంత్రి ఆర్. కె. రోజా అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురష్కరించుకుని ప్రతి ఏడాది యువజనోత్సవాలు నిర్వహిస్తున్నామని, అలాగే ఈ ఏడాది థీమ్ యూత్ ఫర్ డిజిటల్ ఇండియా గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిదన్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన యువజనోత్సవ పోటీల్లో ప్రధమంగా నిలిచిన విజేలందరినీ, ఈ ఏడాది నాసిక్ లో నిర్వహించే జాతీయ స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొనటానికి పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 12 నుంచి 16 వరకు మహారాష్ట్రలోని నాసిక్ లో నిర్వహిస్తున్న జాతీయ యువజనోత్సవాల్లో ప్రతిభ చూపి మన రాష్ట్రానికి మరిన్నీ బహుమతులు తీసుకురావాలని మంత్రి ఆర్.కె. రోజా కోరారు. రండి-మెల్కోండి-లక్ష్యాన్ని చేరుకోండి అన్న స్వామి వివేకానంద స్ఫూర్తిని యువత అందిపుచ్చుకోవాలని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. యువతకు మార్గనిర్ధేశకులు స్వామి వివేకానంద అని అన్నారు. యువత అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రభుత్వం దేశంలోనే మన ముందు వరుసలో ఉండటం గర్వకారణమని, అందుకు మన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కు ధన్యవాదాలు తెలిపారు. ఆడుదాం ఆంధ్రాకు స్ఫూర్తి స్వామి వివేకానంద అని పేర్కొన్నారు. యువత మానసిక వికాసం, శారీరక ధారుడ్యం పెంచుకోవాలని ఎమ్మెల్యే విష్ణు కోరారు. యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న స్వామి వివేకానంద జీవితానికి సంబంధించిన నాలుగు చిన్న కథలను విద్యార్థులకు వివరించి అందులోనుంచి సమయస్ఫూర్తి, శారీరక బలం, మానసిక బలం, ధైర్యం ప్రాముఖ్యతను యువతకు వివరించారు. ఈ నాలుగు జీవితంలో భాగం చేసుకోవాలని అప్పుడే యువత తమ లక్ష్యాన్ని మరింత త్వరగా చేరుకుంటారన్నారు. స్వామి వివేకానంద దేశ భవిష్యత్ గురించి కూడా చెప్పారని రాబోయే తరాలు మన సంస్కృతికి, సాంప్రదాయలకు పెద్దపీట వేస్తారని అన్నారని గుర్తుచేశారు. రామకృష్ణ మిషన్ స్వామిజీ తాతా మహారాజ్ మాట్లాడుతూ స్వామి వివేకానంద గొప్ప దేశభక్తుడని, ఆయన రచనలు యువతకు ఆదర్శమని అన్నారు. స్వామి వివేకానంద యువతకు దిక్సూచి అని కొనియాడారు. భారతదేశం గొప్పతనాన్ని తెలుచుకోవాలంటే వివేకానందుడి జీవితాన్ని చదివితే తెలుస్తుందన్నారు. సనాతన ధర్మం గొప్ప తనాన్ని నేటి యువత గుర్తించాలన్నారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి అతిధులు ఘన నివాళులర్పించారు. అనంతరం జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించిన యువజనోత్సవాల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందచేశారు. అలాగే యువజన శాఖ ఆధ్వర్యంలో అధికారులు మంత్రి రోజాను ఘనంగా సత్కరించారు. ఈ ఏడాది మన రాష్ట్రం సాధించిన లార్జెస్ట్ యూత్ ఐకాన్ ఫెస్టివల్ అవార్డును మంత్రి రోజా యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్నకు అందచేశారు. వేదికపై చెస్ మాస్టర్ ఎం. లలిత్ బాబును మంత్రి రోజా శాలువా, పూలామాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో యువజన సర్వీసుల శాఖ కమిషనర్ కె. శారదాదేవి, డిప్యూటీ మేయర్ ఎ. శైలజారెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ షేక్. ఆసీఫ్, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పి. మహేష్ తదితరులు పాల్గొన్నారు. - కమిషనర్, సమాచార, పౌర సంబంధాల శాఖ, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. -
మల్లాది విష్ణు, నేను వేరు కాదు: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మల్లాది విష్ణు, తాను వేరు కాదు.. ఇద్దరూ ఒక్కటేనని వెల్లంపల్లి స్పష్టం చేశారు. అలాగే, బోండా ఉమా హద్దు మీరి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, వెల్లంపల్లి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. మల్లాది విష్ణుతో కలిసి విజయవాడ సెంట్రల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తాం. మల్లాది విష్ణు, నేను వేరు కాదు.. ఇద్దరం ఒక్కటే. సామాజిక సమీకరణాల్లో భాగంగానే మార్పులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలను తూచా తప్పకుండగా పాటిస్తాం. సీఎం వైఎస్ జగన్ పథకాలు, సంక్షేమ పాలనే వైఎస్సార్సీపీని, మమ్మల్నిని గెలిపిస్తాయి. టీడీపీ నేత బోండా ఉమ హద్దు మీరి మాట్లాడుతున్నాడు. బోండా ఉమ హద్దు మీరితే సహించేది లేదు. ముందు వాళ్ల సీట్లు కన్ఫర్మ్ చేసుకోవాలి అని హితవు పలికారు. -
పేదల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి సీఎం జగన్: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-
మాజీ సిఎం చంద్రబాబు రాష్ట్రానికి పనికొచ్చే పని ఏం చేశారు?- వైసీపీ ఎమ్మెల్యే మల్లాదివిష్ణు
-
నారా లోకేష్ పై మల్లాది విష్ణు సెటైర్లు
-
నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి .. మల్లాది విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్
-
మైనారిటీలపై చంద్రబాబు కక్ష సాధింపు..మల్లాది విష్ణు ఫైర్..
-
పురంధేశ్వరిపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్
-
శ్రీవారి పాదాల సాక్షిగా నారా భువనేశ్వరిని ఒక్కటే అడుగుతున్నా
-
జైల్లో చంద్రబాబు కేజీ బరువు పెరగడంపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు సెటైర్లు..
-
డబ్బులిస్తే అతను ఏ పనైనా చేస్తాడు
-
అవినీతి అనకొండ చంద్రబాబు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-
రాజరాజేశ్వరిపేటలో గడపగడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం
-
బాలకృష్ణ, టీడీపీ నేతలపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు
-
సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత టీడీపీ, జనసేనకు లేదు: మల్లాది విష్ణు
-
ఈ స్కిల్ స్కామ్ లో పవన్ కళ్యాణ్ వాటా ఎంతో నిన్నే అర్ధమయింది
-
సీపీఐ, జనసేనపై మల్లాది విష్ణు సీరియస్ కామెంట్స్
సాక్షి, విజయవాడ: సీపీఐ రామకృష్ణ, చంద్రబాబు, పవన్పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు తొత్తులా సీపీఐ రామకృష్ణ వ్యవహరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. జనసేన సిద్ధాంతం లేని పార్టీ అని ఎద్దేవా చేశారు. అలాగే, బాలకృష్ణ, పవన్ నోరు అదుపులో పెట్టకుని మాట్లాడాలని హెచ్చరించారు. కాగా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి చేసిన చంద్రబాబును సీపీఐ సమర్థిస్తోంది. చంద్రబాబుకు తొత్తులా రామకృష్ణ వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు చేసిన స్కాంలు పవన్కు కనబడట్లేదా?. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం 12 నుంచి 6 శాతానికి తగ్గింది. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. జనసేన సిద్ధాంతం లేని పార్టీ అని తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్కు అత్యుత్సహం ఎక్కువైంది. దత్త తండ్రి అరెస్ట్ను పవన్ జీర్ణించుకోలేకపోతున్నాడు. అవినీతి చేసిన వ్యక్తిని సపోర్టు చేయడం సిగ్గుచేటు. చంద్రబాబు చేసిన అవినీతిలో పవన్, బాలకృష్ణకు కూడా వాటా ఉందా?. చంద్రబాబు ఒక ఆర్థిక నేరస్థుడు. పవన్కు భయం పట్టుకుంది. అందుకే ఈరోజు జైలుకి వెళ్లాడు. పవన్ బీజేపీతో వివాహం.. టీడీపీతో కాపురం చేస్తున్నాడు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: మాకొద్దు ‘బాబు’ వర్రీ.. మాకెందుకు ఈ కొరివి! -
బాలకృష్ణ చంద్రబాబు తప్పు గురించి మాట్లాడటంలేదు: మల్లాది విష్ణు
-
టీడీపీ బంద్కు మద్దతుగా పిలుపునివ్వడానికి పవన్కు సిగ్గుందా
విజయవాడ: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంపై ఎమ్మెల్యే,మల్లాది విష్ణు స్పందించారు. చంద్రబాబు చేతిలో అధికారం ఉందన్న గర్వంతో అడ్డూ అదుపూ లేకుండా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కౌరవసభగా మార్చేశారు.. ఆదివారం ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించిన నేపథ్యంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. 2014 నుంచి 19 వరకూ చంద్రబాబు పాలనంతా అవినీతిమయమేనని ప్రజల జీవన స్థితిగతులు మార్చేందుకు కనీస చర్యలు కూడా తీసుకోలేదన్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ కళ్లు నెత్తిమీద పెట్టుకుని పాలించారని శాసన సభను కౌరవ సభగా మార్చి రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయడానికి ప్రయత్నించారన్నారు. అన్నీ కుంభకోణాలే.. స్కిల్ స్కాంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి దొరికిపోయాడని అమరావతి పేరుతో ప్రజలను మభ్యపెట్టారని ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ ఐదేళ్ల పాలనలో అన్నీ కుంభకోణాలేనన్నారు. ఆ ఐదేళ్ల రాక్షస పాలనలో కిందనున్న కార్యకర్తలు జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారని పైనున్న మంత్రులు,ముఖ్యమంత్రి స్కాముల పేరుతో దోచుకున్నారన్నారు. తుస్సుమన్న బంద్.. అవినీతికి కేరాఫ్ అడ్రస్ టీడీపీ పార్టీ అని మరోసారి నిరూపితమైంది నిజంగా తమ తప్పు లేకపోతే స్కిల్ కుంభకోణంతో తనకు సంబంధం లేదని చంద్రబాబు, టీడీపీ నాయకులు ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. తప్పు చేసినట్టు ఆధారాలున్నాయి కాబట్టి రిమాండ్ విధిస్తే ఆఘమేఘాల మీద బంద్ కు పిలుపునిచ్చారు. తీరా చూస్తే బంద్ పూర్తిగా విఫలమవ్వడంతో టీడీపీ పరువుపోయిందన్నారు. ఆయనకు సిగ్గులేదు.. టీడీపీ బంద్కు మద్దతుగా పిలుపునివ్వడానికి పవన్కు అసలు సిగ్గుందా అని ప్రశ్నించారు. బాబు జమానాలో అంతా అవినీతికి పాల్పడే ఖజానా నింపుకుందని ఏమీ తెలియనట్టు ఈరోజు చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నాడని అన్నారు. ఈరోజు వైసీపీ ప్రభుత్వం అవినీతికి ఎక్కడా ఆస్కారం లేకుండా మేం పాలన చేస్తున్నామన్నారు. చంద్రబాబు తప్పులన్నీ తాను చేసి నిందలు మాపై వేస్తున్నాడని అన్నారు. నోరు జాగ్రత్త.. చంద్రబాబుకి మద్దతిచ్చే పార్టీల వైఖరి చూస్తే నవ్వొస్తుంది. చంద్రబాబు మోదీని పొగుడుతాడు. మోదీని పొగిడిన చంద్రబాబును సీపీఐ వెనకేసుకొని వస్తుంటుంది. ఇక జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడతాడో ఆయనకే అర్ధం కాదన్నారు. పవన్ పులివెందుల గురించి మాట్లాడే ముందు అక్కడి సంస్కృతి గురించి తెలుసుకుని మాట్లాడాలన్నారు. తెలుసుకుని మాట్లాడు.. చంద్రబాబుకు, పవన్కు అమరావతి తప్ప మరొకటి తెలియదని పేదలకు సొంతింటి కల నెరవేరిందంటే అది పులివెందుల నుంచి వచ్చిన వ్యక్తి ఆలోచన వలనేనని అన్నారు. అమ్మ ఒడి, ఫీజురీయింబర్స్ మెంట్ వంటి అనేక పథకాలు వచ్చాయంటే అది పులివెందుల వ్యక్తి నుంచి వచ్చిన ఆలోచనల చలవేనని అన్నారు. పేదలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న పవన్కు మానవత్వమే లేదని అన్నారు. అసలు పవన్కు సీఎం జగన్ను విమర్శించే అర్హతే లేదన్నారు. ఇది కూడా చదవండి: చెంపలు వేసుకోవాల్సింది పోయి జనాన్ని రెచ్చగొడతారా? -
చంద్రబాబు నీచ రాజకీయం ప్రజలకు తెలుసు : మల్లాది విష్ణు
-
అదో విఫల గళం
సాక్షి, అమరావతి: నారా లోకేశ్ పాదయాత్రకు బాహుబలి స్థాయిలో బిల్డప్లు ఇచ్చేందుకు చంద్రబాబు, ఎల్లో మీడియా ఎంత ప్రయత్నించినా ప్రజలు జోకర్గానే భావిస్తున్నారని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ సమన్వయకర్త(విజయవాడ తూర్పు) దేవినేని అవినాశ్ వ్యాఖ్యానించారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. పాదయాత్రకు ప్రజా స్పందన లేకపోవడంతో చంద్రబాబు తన దత్తపుత్రుడు పవన్ను రంగంలోకి దించారని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ సైకోల్లా ప్రవర్తిస్తుండటం వల్లే వారిని ప్రజలు ఆదరించడం లేదన్నారు. సంక్షేమాభివృద్ధి పథకాలతో ప్రజలు మెచ్చేలా పరిపాలిస్తున్న సీఎం వైఎస్ జగన్ ప్రభంజనంలో ఆ ముగ్గురూ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. ఆ ముగ్గురూ ద్రోహులే: వెలంపల్లి శ్రీనివాస్ అధికారంలో ఉండగా విజయవాడ, గుంటూరు ప్రాంతాలను ఏమాత్రం అభివృద్ధి చేయకుండా చంద్రబాబు, లోకేశ్ ద్రోహం చేశారు. టీడీపీ సర్కార్కు మద్దతిచ్చిన పవన్కళ్యాణ్ కూడా ద్రోహే. ఆ ముగ్గురూ కృష్ణా పుష్కరాల పేరుతో విజయవాడలో 45 దేవాలయాలను కూల్చేసిన హిందూ ద్రోహులు. మహాత్మాగాంధీ, పొట్టిశ్రీరాములు విగ్రహాలను సైతం ధ్వంసం చేసిన ద్రోహులు. కుల మతాలు, పార్టీలకు అతీతంగా సీఎం జగన్ సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. వాటిని పొందిన వారిలో టీడీపీ నేతలు వర్ల రామయ్య, బుద్దా వెంకన్న కూడా ఉన్నారు. లోకేశ్ పాదయాత్రకు టీడీపీ నేతలు కూడా స్పందించడం లేదు. టీడీపీకి ఉన్న ముగ్గురు ఎంపీల్లో కేశినేని నాని, గల్లా జయదేవ్.. లోకేశ్ పాదయాత్రను బహిష్కరించారు. లోకేశ్ పాదయాత్రపై చంద్రబాబుకు నమ్మకం ఉంటే 175 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పే ధైర్యం ఉందా? 175 స్థానాల్లో జనసేన అభ్యర్థులను పోటీకి పెట్టే దమ్ము పవన్కు ఉందా? రాజకీయాల్లో జీరో అయిన పవన్ ఇప్పుడు సినిమాల్లో కూడా జీరో అయిపోయారు. ఆ ముగ్గురూ సన్నాసులు కాబట్టే కలసి పోటీ చేసి జగన్ను ఎదుర్కోవాలని ప్రయత్నిస్తున్నారు. విదేశీ విద్య పథకం ద్వారా ఆర్య వైశ్యుల పిల్లలను కూడా విదేశాలకు పంపిన ఘనత సీఎం జగన్ది. పొట్టిశ్రీరాములు ప్రాణత్యాగం ఫలితంగా నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరిస్తే రాష్ట్ర అవతరణ దినాన్ని జూన్ 2కు మార్చింది చంద్రబాబే. దాన్ని మళ్లీ మార్చి నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవాన్ని సీఎం జగన్ నిర్వహిస్తున్నారు. బ్యారేజ్పై ఫొటో షూట్కు రూ.5 కోట్లు: మల్లాది విష్ణు టీడీపీ హయాంలో వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రకాశం బ్యారేజీ మీదుగా వెళ్తామంటే అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారు. నల్ల బెలూన్లతో నిరసన తెలిపి పసుపు నీళ్లతో కడిగే స్థాయికి దిగజారిపోయారు. ఇప్పుడు లోకేశ్ పాదయాత్రను మేం ఎక్కడన్నా అడ్డుకునే ప్రయత్నం చేశామా? డబ్బులు, మద్యాన్ని పంచి పెయిడ్ వర్కర్లతో ప్రకాశం బ్యారేజ్పై ఈవెనింగ్ వాక్ చేసిన లోకేశ్ ఫొటో షూట్కు రూ.5 కోట్లు ఖర్చు పెట్టారు. విజయవాడ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన రూ.500 కోట్లను దారి మళ్లించి ద్రోహం చేసింది చంద్రబాబే. దొంగ టీడీఆర్ బాండ్లను తయారు చేసి అమ్మిన పార్టీ టీడీపీ. అమ్మవారి దేవాలయంలో క్షుద్ర పూజలు చేసిన వ్యక్తి లోకేశ్. బ్రాహ్మణ వీధిలో గోశాలను కూలగొట్టి గోవులకు నిలువ నీడ లేకుండా చేశారు. నదీ తీరంలో పురోహితులకు చోటు లేకుండా చేసిన ఘనత కూడా టీడీపీదే. మేం 11 అంశాలతో రూపొందించిన చార్జ్షిట్కు లోకేశ్, చంద్రబాబు సమాధానం చెప్పాలి. జగనన్న కాలనీల ద్వారా విజయవాడలో 90 వేల మందికి ఇళ్ల స్థలాలు అందించిన ఘనత సీఎం జగన్ది. టీడీపీ పాలనలో వైశ్యులు, ముస్లింలు, బ్రాహ్మణులకు ఏం చేశారో లోకేశ్ చెప్పాలి. ఆర్–5 జోన్లో విజయవాడకు చెందిన 30 వేల మందికి సీఎం జగన్ ఇళ్ల పట్టాలిస్తుంటే వాటిని రద్దు చేస్తానని చంద్రబాబు చెబుతున్నాడు. చంద్రబాబు, లోకేశ్, పవన్ ముగ్గురూ సైకోలే. విజయవాడ నగరం వైఎస్సార్సీపీ అడ్డా. ఎర్ర పుస్తకం పట్టుకుని సైకోలా: దేవినేని అవినాశ్ పెయిడ్ వర్కర్లతో ఈవెనింగ్ వాక్ చేస్తున్న లోకేశ్కు 2014–19 మధ్య ప్రజలకు ఏం చేశారో చెప్పే దమ్ముందా? ఎర్ర పుస్తకం పట్టుకుని సైకోలా ఊగిపోతున్నాడు. లోకేశ్ యాత్ర వల్ల చంద్రబాబు సీఎం కాలేరు. లోకేశ్ ఎమ్మెల్యే కాలేడు. చంద్రబాబూ? ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిది. గత నాలుగేళ్లలో సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో విజయవాడ నగరం మౌలిక సదుపాయాల కల్పనతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. రిటైనింగ్ వాల్, ఫ్లైఓవర్లు వంటి అనేక నిర్మాణాలు పూర్తి చేశారు. పాదయాత్రలో లోకేశ్ వాటిని చూడాలి. టీడీపీ హయాంలో పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ను సింగపూర్ కంపెనీకి కట్టబెట్టాలని చూస్తే ఇప్పుడు సీఎం జగన్ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. -
ప్రభుత్వంపై చంద్రబాబు, పవన్ దుష్ప్రచారం చేస్తున్నారు: మల్లాది
-
పుంగనూరు పోలీసులపై దాడి కేసు.. మరో 9 మంది అరెస్ట్
సాక్షి, చిత్తూరు జిల్లా: రాష్ట్రంలో సంచలనం కలిగించిన పుంగనూరు పోలీసులపై దాడి కేసులో మరో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మొత్తం ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 72కు చేరుకుంది. A1 ముద్దాయి అయిన పుంగనూరు టీడీపీ ఇంఛార్జి చల్లా బాబు పరారీలో ఉన్నారు. అతని కోసం ఆరు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. మరోవైపు ఈ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దాడి జరిగిన రోజు ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో చెక్ పోస్ట్, టోల్ గేట్ వద్దనున్న సీసీ కెమెరాలు ద్వారా వాహనాలు నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.అనంతపురం, బెంగళూరు,రాయచోటి ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ నాయకుల,కార్యకర్తల వివరాలు సేకరిస్తున్నారు. చదవండి: టీడీపీ రాక్షస క్రీడ సాక్షి, విజయవాడ: పుంగనూరులో చంద్రబాబు సృష్టించిన విధ్వంసకాండను ఖండిస్తూ పైపుల రోడ్డు సెంటర్లో నిరసన చేపట్టారు. నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిఫ్యూటీ మేయర్ శైలజారెడ్డి, వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. పుంగనూరులో చంద్రబాబు పర్యటనలో టీడీపీ శ్రేణులు చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రౌడీయిజం చేస్తూ దౌర్జన్యంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడని, ముందస్తుగా వ్యూహం పన్ని పోలీసులపై దాడులు చేసి పోలీసు వాహనాలను తగలబెట్టించాడని మండిపడ్డారు. ‘మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉందంటాడు. కానీ గత కొన్ని రోజులుగా చంద్రబాబు వైఖరి చాలా జుగుప్సాకరంగా ఉంది. అంజు యాదవ్ విషయంలో పవన్ పోలీసు యంత్రాంగం మొత్తాన్ని తప్పుబట్టాడు. పోలీసులపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తే ఎందుకు పవన్ ఖండించలేదని ప్రశ్నిస్తున్నా. ప్రతిపక్షాలు ప్రస్టేషన్ లో ఉన్నాయి. భవిష్యత్తులో గెలవలేమనే భయం ప్రతిపక్షాల్లో ఉంది. పుంగనూరులో రాబోయే తరాల్లో గెలుపు సాధ్యం కాదని భావించి హింసకు పాల్పడ్డారు. కర్రలు, తుపాకులు తీసుకొచ్చి చేసిన వీరంగం టీడీపీ ఏ స్థాయికైనా దిగజారిపోతుందనేదానికి నిదర్శనం. ప్రాజెక్టుల పేర్లతో హింసను ప్రోత్సహించడానికి ఆలోచన చేస్తున్న చంద్రబాబు నైజాన్ని ఖండిస్తున్నాం’ అని పేర్కొన్నారు. -
అర్ధరాత్రి గడప గడపకు నిర్వహించిన ఎమ్మెల్యే విష్ణు
-
వారాహి యాత్ర పిచ్చోడి చేతిలో రాయిలా మారింది: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: పవన్ కల్యాణ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వారాహి యాత్ర పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని దుయ్యబట్టారు. యాత్రలో పవన్ తన విధానాలను చెప్పుకోవాలి కానీ, ఇతరులను దూషించడం సరికాదని హితవు పలికారు. ‘‘సేవా దృక్ఫథంతో పనిచేస్తున్న వలంటీర్లపై పవన్ వ్యాఖ్యలు సిగ్గుచేటు. ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతోందనడం దిగజారుడుతనం. చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ నడుస్తున్నాడు. వలంటీర్ వ్యవస్థ గురించి చంద్రబాబు కూడా గతంలో కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు. వలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్కు లేదు. ఏ ఆధారాలతో వలంటీర్ల పై పవన్ ఆరోపణలు చేశాడో చెప్పాలి’’ అంటూ మల్లాది విష్ణు నిప్పులు చెరిగారు. చదవండి: పవన్ అడ్డంగా దొరికిపోయాడు.. తన బట్టలు తానే ఊడదీసుకుని.. ‘‘పవన్ కల్యాణ్కు మామూలుగానే తిక్క. ఆ తిక్కతోనే వలంటీర్ల పై వ్యాఖ్యలు చేస్తున్నాడు. తక్షణమే పవన్.. వలంటీర్లకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’’ అని ఎమ్మెల్యే విష్ణు హెచ్చరించారు. -
విజయవాడ: ఇందిరాగాంధీ స్టేడియంలో బక్రీద్ వేడుకలు
సాక్షి, విజయవాడ: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బక్రీద్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో పాటు ప్రార్థనల్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో ముస్లిం సోదరులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో సుఖ సంతోషాల పాలన నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు చాలా గొప్ప సేవలు అందిస్తోందన్నారు. ఈ సందర్బంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ప్రేమ, త్యాగాలకు ప్రతీక బక్రీద్. ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకునేందుకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం. చంద్రబాబు హయాంలో మైనార్టీలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. వైఎస్సార్ తర్వాత ముస్లింలకు మేలు చేస్తున్నది సీఎం జగన్ మాత్రమే. మైనార్టీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: అల్లాహ్ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి.. ముస్లింలకు సీఎం జగన్ బక్రీద్ శుభాకాంక్షలు -
వై నాట్ 175తో చంద్రబాబుకు భయం
ఒంగోలు అర్బన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కాగా అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధితో పూర్తి విశ్వాసంతో వై నాట్ 175 అనే నినాదం తీసుకోవడంతో చంద్రబాబుకు భయం పట్టుకుందని ఏపీ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. శుక్రవారం ఒంగోలు వచ్చిన ఆయన స్పందన భవనంలో నవరత్నాలు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఏ నారాయణమూర్తి, కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్లతో కలిసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ప్రియారిటీ ఇండికేటర్స్పై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చిన్న పిల్లల ఆరోగ్య రక్షణ, గర్భిణులు, బాలింతలు, శిశు మరణాలను అరికట్టేందుకు తీసుకున్న చర్యలతో సత్ఫలితాలు వచ్చాయన్నారు. పేదరిక నిర్మూలన, విద్యా, వ్యవసాయం, వైద్యం రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మార్పులు తీసుకొచ్చి ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నట్లు తెలిపారు. సమీక్ష సమావేశంలోని అంశాలను వివరించారు.గతంలో పలుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నవరత్నాలు ఎందుకు ప్రవేశపెట్టలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు. వైఎస్సార్ సీపీ నవరత్నాలు, టీఆర్ఎస్ పార్టీలో కొన్ని, కర్ణాటకలో మ్యానిఫెస్టోలోవి మరికొన్ని కాపీ కొట్టి చంద్రబాబు మ్యానిఫెస్టో అని విడుదల చేయడం హాస్యాస్పదం అన్నారు. కాపీ కొట్టిన మ్యానిఫెస్టోతో చంద్రబాబు విఫలమై నవ్వులపాలయ్యాడన్నారు. వైఎస్ జగన్ నవరత్నాలు అమలు చేస్తుంటే రాష్ట్రం అప్పుల పాలై శ్రీలంక అవుతుందని బుకాయించిన చంద్రబాబు ఇప్పుడు అవే పథకాలను ఆయన మ్యానిఫెస్టోగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆర్థిక కష్టాలు ఉన్నా ఇచ్చిన మాటల మేరకు జగన్ నవరత్నాలను అమలు చేశారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్య, వ్యవసాయం, వైద్యం, గృహాల గురించి పట్టించుకున్నాడా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఒక మాట, అధికారం వచ్చాక మరో మాట చెప్పడం ప్రజలకు తెలియంది కాదని, ఆయన్ను నమ్మే పరిస్థితులు రాష్ట్రంలో లేవన్నారు. పవన్కళ్యాణ్ను ఉద్దేశించి మాట్లాడుతూ వీకెండ్ పర్యటనలు పట్టించుకోమన్నారు. సిద్దాంతం, ఎజెండాలు లేని పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ పాదయాత్రలు వైఎస్సార్ సీపీని ఏమీ చేయలేవన్నారు. రాష్ట్రంలో 55 శాతానికిపైగా ప్రజలు జగన్తో ఉన్నారని, అందుకు మున్సిపాలిటీ, జెడ్పీ, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు పక్కా తీర్పును ఇవ్వడమే నిదర్శనమన్నారు. పవన్కళ్యాణ్ అమితాబ్తో కలిసినా, అమిత్షాతో కలిసినా ఒరిగేదేమీ లేదన్నారు. -
గతంలో 600 హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన బాబు
-
‘చంద్రబాబు అందితే జుట్టు...అందకపోతే కాళ్లు పట్టుకుంటాడు’
సాక్షి, విజయవాడ: తమ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందరికీ ఇళ్లు ఇవ్వాలనే ఆలోచన చేశారని, పేదల మీద అద్దెలు భారం పడకుండా, సొంత ఇల్లు ఉండాలనుకున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. ‘ రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు కొని అందరికీ ఇళ్లిచ్చారు. పేదల ఇళ్ల కోసం గత ప్రభుత్వం కనీస ఆలోచన చేయలేదు. పేదల ఇళ్ల విషయాన్ని ఎన్నికల నినాదంగా వాడుకుని వదిలేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో 7600 ఇళ్లను అమరావతిలో ఇస్తున్నాం.చంద్రబాబు చేయని కుట్రలేదు...మాటని మార్చలేదు.అమరావతిలో పేదలు ఉండకూడదనుకున్నారు. అమరావతిలో తన అనుచరులతో కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారు. హైకోర్టు,సుప్రీంకోర్టుల నుంచి మాకు సానుకూలంగా తీర్పునిచ్చాయి. చంద్రబాబు అందితే జుట్టు...అందకపోతే కాళ్లు పట్టుకుంటాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పేదలకు రెండు సెంట్ల స్థలం ఇచ్చామని గొప్పలు చెబుతున్నాడు. విజయవాడలో ఎంతమందికి రెండు సెంట్లు ఇచ్చాడో చంద్రబాబు సమాధానం చెప్పాలి. ధైర్యముంటే ఇళ్ల స్థలాలు తీసుకున్న లబ్ధిదారుల పేర్లు, నెంబర్లు ఇవ్వాలని కోరుతున్నా. విజయవాడ నగరంలో 95 వేల మందికి స్థలాలు కొని అమరావతి...ఇతర ప్రాంతాల్లో ఇచ్చారు.పేదలకు ఒక హక్కు...ధైర్యాన్ని ఇచ్చారు. పేదల పక్షపాత ప్రభుత్వం మాది. ధనికుల పక్షపాతి గత టీడీపీ ప్రభుత్వం. టీడీపీ అధికారంలోకి వస్తే పేదలను ఖాళీ చేయిస్తామని అచ్చెన్నాయుడే చెప్పాడు.చంద్రబాబు కుయుక్తులు పనిచేయవు. టిడ్కో ఇళ్లలో అప్లికేషన్లను జిరాక్సులు తీసి అమ్మిన చరిత్ర టీడీపీ నేతలది’ అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. -
ఎమ్మెల్యే మల్లాది విష్ణును పరామర్శించిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆయన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. ఆయన తల్లి బాలాత్రిపుర సుందరమ్మ కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతూ ఆమె మృతి చెందారు. విజయవాడ ఎంజీ రోడ్లోని మల్లాది విష్ణు నివాసానికి చేరుకున్న సీఎం.. బాలా త్రిపుర సుందరమ్మ భౌతిక కాయానికి నివాళులర్పించారు. పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపారు. (చదవండి: తుని రైలు దగ్ధం కేసును కొట్టివేసిన విజయవాడ రైల్వే కోర్టు) -
ఏపీ: ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు మాతృవియోగం
సాక్షి, కృష్ణా: విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి బాలాత్రిపుర సుందరమ్మ కన్నుమూశారు. దీంతో పలువురు వైఎస్సార్సీపీ నేతలు మల్లాది విష్ణు కుటుంబ సభ్యులకు సంఘీభావం చెబుతున్నారు. ఇదీ చదవండి: 24న ‘నావిక్–01’ ఉపగ్రహ ప్రయోగం -
రజినీకాంత్ తో పొగిడించుకున్నంత మాత్రనా చంద్రబాబు వెన్నుపోటుదారుడు కాకపోడు : మల్లాది విష్ణు
-
రాజకీయ పార్టీలకు అతీతంగా పాలన చేస్తున్న ఘనత సీఎం జగన్ దే
-
‘విజన్ ఉన్న నాయకుడు సీఎం జగన్’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ద్వారా ప్రతీ కుటుంబాన్ని కలిసినట్టు వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో కోటి లక్షల కుటుంబాలను కలుసుకున్నామని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాలనను సమర్థిస్తూ కోటి 10లక్షల మిస్ట్ కాల్స్ వచ్చాయి. 80శాతం మంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ప్రజలంతా జగన్కు జేజేలు పలుకుతున్నారు. చంద్రబాబు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా పథకాలు అందిస్తున్నాం. రజనీకాంత్కు ఏపీ రాజకీయాల గురించి ఏం తెలుసు?. ఎవరో రాసిచ్చిన స్స్ర్కిప్ట్ చదవడం సినిమా వాళ్లకు అలవాటే. చంద్రబాబు విజన్ అనేది కల్పిత కథ. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తొస్తారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ.. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి 80శాతం ప్రజల మద్దతు ఉంది. డీబీటీ ద్వారా నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. 99శాతం హామీలు అమలు చేశాం కాబట్టే మమ్మల్ని నమ్ముతున్నారు. ఎంపీ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. విజన్ ఉన్న నాయకుడు సీఎం జగన్. మెగా పీపుల్స్ సర్వేలో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కోటి 45 లక్షల కుటుంబాలకు కోటి 10లక్షల మిస్డ్ కాల్స్ వచ్చాయి. సీఎం జగన్పై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇదే నిదర్శనం. దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. ప్రజలంతా సీఎం జగన్ పాలనపై హర్షం వ్యక్తం చేశారు. ప్రజా మద్దతు పుస్తకంలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. చంద్రబాబులా గాలిలో లెక్కలు చెప్పడం లేదు. వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజలంతా జగన్ననే మా భవిష్యత్ అంటున్నారు. చంద్రబాబు కనీసం సర్వే ఆలోచన కూడా చేయలేదు. కుల, మత, రాజకీయాలకతీతంగా సీఎం జగన్ పాలన చేస్తున్నారు. అందుకే ప్రజల నుంచి ఈ స్థాయిలో మద్దతు వచ్చింది. ఇది కూడా చదవండి: థాంక్యూ సీఎం సార్.. మీ సాయంతో అంతరిక్షం అందుకుంటున్నా -
‘చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి’
సాక్షి, విజయవాడ: ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేయడమే చంద్రబాబు పని అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దుయ్యబట్టారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దళితులను అవమానించేలా మాట్లాడుతున్నారని, వర్గాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘కర్షకులు, రైతులు, వృద్ధులు, పిల్లలు, మహిళలు అన్ని వర్గాలు మళ్లీ జగన్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. కోటి గృహాలకు వెళ్తే 80 లక్షల మిస్డ్ కాల్స్ ఇచ్చారు. మెగా సర్వేలో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ‘‘జగనన్నే మా భవిష్యత్తు’’ చూశాక చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తన క్యాడర్ జారిపోకుండా ఉండేందుకు చంద్రబాబు గొడవలు సృష్టిస్తున్నారు. ముఖ్యమంత్రి కుర్చీ తప్ప చంద్రబాబుకు ఏమీ అక్కర్లేదు’’ అని ఎమ్మెల్యే మల్లాది నిప్పులు చెరిగారు. చదవండి: రామోజీరావు, ఈనాడు పత్రికపై మంత్రి మేరుగు నాగార్జున ఫైర్ ‘‘మురుగునీరు, డ్రైనేజీపైనా పన్ను వేసిన వ్యక్తి చంద్రబాబు. పేదలంటే చంద్రబాబుకు చులకన. ఆయన చెప్పేది వినలేక జనం పారిపోతున్నారు. ఏ ఇంటికి వెళ్లినా మేము జగన్ ఫ్యాన్స్ అని చెప్తున్నారు. జగన్ పరిపాలనా దక్షత ప్రజలకు అర్థం అయ్యింది’’ అని మల్లాది విష్ణు అన్నారు. -
‘నారా లోకేష్, బాలకృష్ణ.. ఇద్దరూ జోకర్లే’
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ ఇద్దరూ జోకర్లే అని అన్నారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడుకి బుర్ర లేదంటూ ఫైర్ అయ్యారు. కాగా, మల్లాది విష్ణు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల గుండెల్లోంచి వచ్చిన కార్యక్రమమే జగనన్నే మా భవిష్యత్తు. ఏడాది ముందే ప్రజల ముందుకు వెళ్లగలిగే గట్స్ ఉన్న పార్టీ మాదే అని స్పష్టం చేశారు. ప్రజలకు ఏం చేశామో చెప్పుకోలేని పరిస్థితుల్లో మిగిలిన పార్టీలున్నాయి. ఈ రాష్ట్రానికి చంద్రబాబు ఏం చేశాడు. మేం చేసింది చెప్పడానికే ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నాం. ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధిలో నడిపిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. విద్య, వైద్య రంగంలో సమూల మార్పులు తెస్తున్నారు. చెప్పుకోవడానికి ఏమీ లేక టీడీపీ నేతలు మాపై విమర్శలు చేస్తున్నారు. నారా లోకేష్, బాలకృష్ణ ఇద్దరూ జోకర్లే. అచ్చెన్నాయుడుకి అసలు బుర్ర ఉందా లేదా?. ఎవరో నలుగురు ఎమ్మెల్యేలు గడ్డితిన్నంత మాత్రాన అందరూ అలా ఉంటారనుకోవడం పొరబాటు. మా గురించి పక్కన పెట్టి ముందు మీపార్టీ గురించి ఆలోచించుకోండి. గన్నవరంలో రోడ్డు మీదే కొట్టుకున్నారు. చంద్రబాబు పర్యటిస్తే పంచాయతీ పెట్టేందుకు గుడివాడలో మీ పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారు అంటూ చురకలు అంటించారు. -
కాపీ కొట్టే చంద్రబాబుకి క్రెడిబిలిటీ ఎక్కడిది: మల్లాది విష్ణు
-
చంద్రబాబు, అయన కొడుకు రోడ్డు మీద పడ్డారు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-
నారా లోకేష్, చంద్రబాబులే.. అసలైన మోసగాళ్లు: మల్లాది
-
దమ్ముంటే చర్చకు రండి.. టీడీపీ నేతల వ్యాఖ్యలపై మల్లాది విష్ణు ఫైర్
-
చంద్రబాబు నీచ రాజకీయాలపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్
-
చంద్రబాబుకు సీఎం జగన్ను విమర్శించే హక్కు లేదు: మల్లాది విష్ణు
-
ప్రపంచం మెచ్చుకుంటున్న వాలంటీర్ల వ్యవస్థపై ఎల్లో కుట్రలు
-
పవన్ కల్యాణ్కు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని 175 సీట్లలో ఒంటరిగా చేస్తానని చెప్పే దమ్ము పవన్ కల్యాణ్కు ఉందా? అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు. శ్రీకాకుళం యువశక్తి సభలో జనసేనాని చేసిన ప్రసంగంపై సాక్షి టీవీతో మాట్లాడుతూ ఎమ్మెల్యే మల్లాది తీవ్రంగా స్పందించారు. ‘‘పవన్ యువశక్తి సభలో అసభ్యంగా మాట్లాడాడు. సీఎం జగన్ను విమర్శించే అర్హత అసలు పవన్కు ఉందా?. సజ్జల , మంత్రుల గురించి మాట్లాడే స్థాయి ఉందా?.. బాంచన్ దొర అంటూ చంద్రబాబు కాళ్ల దగ్గర చేరావు. ఊడిగం చేయడానికే రాజకీయాల్లోకి వచ్చావు’ అని మల్లాది మండిపడ్డారు. ‘పవన్ కల్యాణ్కు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది. ఎవడితో ఉంటావో తెలియని నువ్వు.. ఎవరితో పోరాటం చేస్తావు?. జనసేన , వీర మహిళలను చంద్రబాబుకు పవన్ తాకట్టు పెట్టాడు. తన సభకు వచ్చిన అభిమానులను , జనసేన శ్రేణులను పవన్ అవమానిస్తూ వస్తున్నాడు. రెండు చోట్ల ఓడిపోయింది నిజం కాదా?. మంత్రి రోజా మాట్లాడిన మాటల్లో తప్పేముంది?’ అని ఎమ్మెల్యే మల్లాది మండిపడ్డారు. ‘సీఎం జగన్ను విమర్శించడమంటే.. ఆంధ్రరాష్ట్ర ప్రజలను అవమానపరచడమే. రాష్ట్ర విభజన సమయంలో కూడా నువ్వు రాజకీయాల్లోనే ఉన్నావ్ కదా. మరి అప్పుడెందుకు చంద్రబాబుకు మద్దతిచ్చావు?. సభలు సమావేశాల్లో తిట్టడం కాదు.. విడివిడిగా వస్తారో అంతా కలిసి వస్తారో 2024లో చూసుకుందాం అని ఎమ్మెల్యే మల్లాది, పవన్కు సవాల్ విసిరారు. -
టీడీపీ సోషల్ మీడియాకు మల్లాది విష్ణు వార్నింగ్
-
ఆరోజు చెప్పుతో కొడతాను అన్నావు.. ఇప్పుడు ఏం చేయాలి నిన్ను: మల్లాది విష్ణు
-
‘సంక్రాంతి ప్యాకేజీ కోసమే చంద్రబాబుతో పవన్ భేటీ’
సాక్షి, సత్తన్నపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు, దత్తపుత్రుడు జనసేన పవన్ కల్యాణ్ మధ్య ఉన్న ముసుగు మరోసారి తొలిగిపోయింది. వీరిద్దరూ రెండోసారి సమావేశం కావడంతో టీడీపీకి జనసేన మద్దతుపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, వీరి భేటీపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ.. జనసేనను టీడీపీలో కలిపేయాలి. చంద్రబాబు, పవన్ కలిసినా మాకు నష్టం లేదు. చంద్రబాబు దగ్గర పవన్ ఊడిగం చేస్తున్నాడు. పవన్ కల్యాణ్కు నైతిక విలువలు లేవు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 175 సీట్లకు 175 గెలుస్తుంది. మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. సంక్రాంతి ప్యాకేజీ కోసమే చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్లాడు. దత్త తండ్రి ఇంటికి దత్తపుత్రుడు వెళ్లాడు. కందుకూరు, గుంటూరుతో అమాయకులు చనిపోతే పరామర్శించలేదు. పవన్ కల్యాణ్కు సిగ్గులేదు. చంద్రబాబు ఇంటికి వెళ్లడం పవన్కు సిగ్గుగా అనిపించడం లేదా?. చంద్రబాబు, పవన్ కలిసినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అంగుళం కూడా కదపలేరు. విజయవాడ.. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. 2014లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి రాష్ట్రాన్ని నాశనం చేశాయి. బాబు చెప్పినట్టు ఆడతాడు కాబట్టే పవన్ దత్తపుత్రుడు అయ్యాడు. ఇప్పుడు చెప్పు తీసుకుని ఎవరిని కొట్టాలో పవన్ చెప్పాలి?. ఈ భేటీతో వీరిద్దరి మధ్య ముసుగు తొలిగిపోయింది. ఏపీని వదిలేసి పక్కరాష్ట్రంలో కూర్చుని జీవో నెంబర్-1పై చర్చించడమేంటి?. ప్యాకేజీకి లొంగిపోయాడు కాబట్టే చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లాడు. వీళ్ల కలయిక వల్ల ఏపీకి ఒరిగేదేమీ లేదు అంటూ కామెంట్స్ చేశారు. సంక్రాంతి పండుగ మామూళ్ళ కోసం దత్తతండ్రి@ncbn వద్దకు దత్త పుత్రుడు@PawanKalyan — Gudivada Amarnath (@gudivadaamar) January 8, 2023 సంక్రాంతికి అందరింటికి గంగిరెద్దులు వెళ్తాయి చంద్రబాబు ఇంటికి పవన్కళ్యాణ్ వెళ్ళాడు డుడు బసవన్నలా తల ఊపడానికి ! @ncbn @PawanKalyan — Ambati Rambabu (@AmbatiRambabu) January 8, 2023 -
పోలీసులపై చంద్రబాబు దురుసు ప్రవర్తన అమానుషం: మల్లాది విష్ణు
-
పదకొండు మంది మృతికి చంద్రబాబే కారణం : మల్లాది విష్ణు
-
టీడీపీ ప్రచార ఆర్భాటానికి అమాయకుల ప్రాణాలు బలి : మల్లాది విష్ణు
-
పెన్షన్లపై బాబు, ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోంది : విష్ణు
-
మల్లాది విష్ణు కుమార్తె వివాహానికి హాజరైన సీఎం వైఎస్ జగన్
-
ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుమార్తె వివాహానికి హాజరైన సీఎం జగన్
మంగళగిరి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుమార్తె వివాహానికి సీఎం జగన్ హాజరయ్యారు. మంగళగిరి సీకే కన్వెన్షన్లో జరిగిన వివాహ వేడుకకు హాజరైన సీఎం జగన్.. నూతన వధూవరులు లలిత నాగదుర్గ, సాయి సూర్యతేజలను ఆశీర్వదించారు. కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్.. ఆ జంటకు బొకేను అందజేశారు. అనంతరం అక్కడ ఉన్న అభిమానులతో ముచ్చటించారు. సీఎం జగన్. వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరయ్యే క్రమంలో తిరిగి బయల్దేరే క్రమంలో ఆ ప్రాంగణమంతా అభిమానులు హర్షాతిరేకలతో సందడిగా మారిపోయింది. -
చంద్రబాబు పెద్ద అబద్దాల కోరు : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-
‘చిరంజీవి గౌరవాన్ని మంటలో కలిపాడు.. పవన్కు నైతిక విలువలు లేవు’
సాక్షి, తాడేపల్లి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు నేతలు ఫైరవుతున్నారు. ► నల్లపురెడ్డి ప్రసన్న కుమార్రెడ్డి పవన్ కల్యాణ్ తండ్రి పరువు తీశాడు. చిరంజీవి గౌరవాన్ని మంటలో కలిపాడు. సభ్య సమాజం తలదించుకునేలా పవన్ మాట్లాడాడు. రాజకీయాలకు పవన్ కల్యాణ్ పనికిరాడు. ► మల్లాది విష్ణు.. పవన్కు సిద్ధాంతం, నైతిక విలువలు లేవు. ప్రజాప్రతినిధులను దుర్బాషలాడటం సరికాదు. చంద్రబాబు చేతిలో పవన్ కీలుబొమ్మ. ► కిలారి రోశయ్య.. పవన్ వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. కాపులకు పవన్ చేసింది శూన్యం. దిశ, దశ లేని పార్టీగా జనసేన మిగిలిపోతుంది. రాజకీయాల్లో నైతిక విలువలు లేని వ్యక్తి పవన్. ► అంబటి రాంబాబు.. జనసైనికులా? బాబు బానిసలా. యుద్ధానికి సిద్ధం అన్నావ్.. చంద్రబాబు సంకెక్కావ్. పిరికోళ్లందరూ కలిసే రండి చూసుకుందాం. జనసైనికులా ? బాబు బానిసల ? — Ambati Rambabu (@AmbatiRambabu) October 19, 2022 -
చంద్రబాబు పై ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్
-
కృష్ణంరాజు మృతి.. పలువురు ఏపీ ప్రముఖల సంతాపం
ప్రముఖ నటుడు రెబల్స్టార్ కృష్ణం రాజు(83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణంరాజు గారి మరణం వెండతెరకు తీరని లోటు: మల్లాది విష్ణు కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటులు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి మృతి బాధాకరమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయం. తన అద్భుత నటనతో, భిన్నమైన పాత్రలతో తెలుగు చలన చిత్ర స్థాయిని పెంచిన నటుడాయన. ఐదున్నర దశాబ్దాల కాలంలో 180కి పైగా చిత్రాలలో నటించి.. ఎన్నో కీర్తి కిరీటాలు, జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్నారు. అధికంగా కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. సినీ రంగంలో క్రమశిక్షణతో కూడిన జీవితానికి ఆయనొక ఉదాహరణగా నిలిచారు. ఆయన అకాల మరణానికి చింతిస్తూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మంచితనానికి మారుపేరు: మంత్రి జోగి.రమేష్ మంచితనానికి మారుపేరైన కృష్ణంరాజు గారి మరణం తీవ్రంగా కలిచివేసింది. సినీ, రాజకీయ రంగాలలో కృష్ణంరాజు గారిది చెరగని ముద్ర. విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో రెబల్ స్టార్ గా శాశ్వత స్థానం సంపాదించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. పార్లమెంటు సభ్యుడుగా కేంద్రమంత్రిగా పనిచేసిన కృష్ణంరాజు గారు నైతిక విలువలకు కట్టుబడిన వ్యక్తి.ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. కృష్ణంరాజు మృతి బాధాకరం: మాజీ మంత్రి వెలంపల్లి ప్రముఖ సినీ నటులు రెబల్ స్టార్ మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు మృతి చెందడం బాధాకరమని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. కృష్ణంరాజు నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయం అన్నారు. తన అద్భుత నటనతో, భిన్నమైన పాత్రలతో తెలుగు చలన చిత్ర స్థాయిని పెంచిన వ్యక్తి కృష్ణంరాజు అన్నారు. ఐదున్నర దశాబ్దాల కాలంలో 180కి పైగా చిత్రాలలో నటించి ఎన్నో కీర్తి కిరీటాలు, జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్నారన్నారు. సినీరంగంలో క్రమశిక్షణతో కూడిన జీవితానికి ఆయనొక ఉదాహరణగా చెప్పుకోవచ్చురు. ఆయన అకాల మరణానికి చింతిస్తూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్నారు.ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు అ ప్రకటనలో పేర్కొన్నారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: సినీ రంగంలోనే కాకుండా రాజకీయాల్లోను రెబల్ స్టార్గా వెలిగిన కృష్ణంరాజు మృతి తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటు అని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. పశ్చిమగోదావరి జిల్లా: రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి పట్ల ప్రభుత్వ చీఫ్ ముదునూరి ప్రసాదరాజు ఆయన చిత్ర పటానికి ఘన నివాళులర్పించారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి నర్సాపురం, మొగల్తూరు ప్రజలకు తీరని లోటు. మొగల్తూరు ఖ్యాతి ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి కృష్ణంరాజు అని ప్రసాదరాజు కొనియాడారు. ► కృష్ణంరాజు మృతిపట్ల రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మెన్ పాతపాటి సర్రాజు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ► కృష్ణంరాజు మృతిపట్ల సంతాపం తెలిపి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ విజయవాడ: హీరో, మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు మృతికి మాజీ మంత్రి శ్రీరంగనాథ రాజు సంతాపం తెలిపారు. కృష్ణం రాజు తెలుగు నటుడిగా విశిష్ట గుర్తింపు పొందారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరనిలోటు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. -
అధికారం లేనప్పుడే బ్రాహ్మణులు గుర్తొస్తారా?
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ఎల్లో మీడియాకు చంద్రబాబు అధికారంలో లేనప్పుడే బ్రాహ్మణులు గుర్తుకొస్తారా? అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు. బ్రాహ్మణ సంక్షేమంపై కొన్ని పత్రికల్లో వెలువడ్డ అసత్య కథనాలను ఆయన మంగళవారం ఓ ప్రకటనలో ఖండించారు. టీడీపీకి కొమ్ము కాస్తూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు విష ప్రచారం సాగిస్తున్నాయని ధ్వజమెత్తారు. బ్రాహ్మణుల సాంఘిక, ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి సీఎం జగన్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పచ్చ మీడియా నిస్సిగ్గుగా అబద్ధాలను ప్రచారం చేస్తోందన్నారు. బాబు పాలన బ్రాహ్మణులకు చీకటి యుగం బాబు పాలన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చీకటి యుగమన్నారు. వైఎస్ జగన్ సీఎంగా వచ్చాకే బ్రాహ్మణ కార్పొరేషన్ను పటిష్టం చేసి కొత్త వెలుగులు నింపారని గుర్తు చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్కు చంద్రబాబు హయాంలో కేటాయించిన మొత్తం రూ.285 కోట్లు కాగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిక మూడేళ్లలోనే రూ.398.88 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. నవరత్నాల ద్వారా బ్రాహ్మణ సామాజిక వర్గానికి రెట్టింపు సంక్షేమాన్ని అందించారని పేర్కొన్నారు. అర్చకులకు వంశపారంపర్య హక్కులు కల్పించాలని విజ్ఞప్తి చేస్తే గొంతెమ్మ కోర్కెలంటూ అవమానించిన వ్యక్తి చంద్రబాబుని గుర్తుచేశారు. ఆలయాలపై చంద్రబాబు హయాంలో నియమించిన పాలక మండళ్ల వేధింపులు తట్టుకోలేక పలువురు అర్చకులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావును ఏ విధంగా అవమానించారో ఎల్లో మీడియాకు గుర్తు లేదా? అని ప్రశ్నించారు. సదావర్తి భూములు సహా రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల భూములను టీడీపీ హయాంలో మింగేశారని మండిపడ్డారు. బ్రాహ్మణులకు మూడు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. -
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కేబినెట్ హోదా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్గా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు కేబినెట్ హోదాను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. రెండేళ్ల పాటు ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ పదవిలో మల్లాది విష్ణు కొనసాగనున్నారు. చదవండి: (విజయానికి షార్ట్ కట్స్ ఉండవు: ఎంపీ విజయసాయిరెడ్డి) -
‘చవితి’పైనా రాజకీయమా?
సాక్షి, అమరావతి: వినాయక చవితి పండగను సైతం రాజకీయాలకు వాడుకోవాలని బీజేపీ, టీడీపీలు దుష్ట ఆలోచన చేస్తున్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. విఘ్నాలను తొలగించే వినాయకుడి మండపాలు, పందిళ్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టకపోయినా బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం విష్ణు మీడియాతో మాట్లాడారు. టీడీపీ–బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ కెనాల్ రోడ్డులోని వినాయకుడి గుడిని తొలగించడానికి ప్రయత్నిస్తే.. తాము ఉద్యమించామని.. దాంతో వెనక్కి తగ్గిన మాట వాస్తవం కాదా? అని విష్ణు ప్రశ్నించారు. వినాయకుడి గుడిని తొలగించడానికి ప్రయత్నించిన మీకు వినాయక చవితి గురించి మాట్లాడే నైతిక హక్కులేదని ఆ ఇద్దరు నేతలకు ఆయన స్పష్టంచేశారు. మళ్లీ వీరే ఇప్పుడు వినాయకుడిని అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపై బురదజల్లే యత్నం చేయడం సిగ్గుచేటన్నారు. ఇక 2014 నుంచి 2019 వరకూ అధికారంలో ఉన్న టీడీపీ–బీజేపీ ప్రభుత్వం రూపొందించిన నియమ, నిబంధనల ప్రకారమే వినాయక మండపాలు, పందిళ్లకు అనుమతులిస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టంచేశారు. అప్పట్లో వినాయక మండపాలకు రూ.వెయ్యి విద్యుత్ ఛార్జీగా నిర్ణయిస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాన్ని తగ్గించిందని ఆయన గుర్తుచేశారు. అలాగే, కాణిపాకంలో వరసిద్ధి వినాయకస్వామికి రూ.6 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం బంగారు రథాన్ని తయారుచేయిస్తోందని ఆయన గుర్తుచేశారు. మీ పిల్లల మీద ఒట్టేసి చెప్పండి.. హిందువులను పండగలు చేసుకోనివ్వడంలేదని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని.. అందులో నిజం ఉందని మీ పిల్లల మీద ఒట్టేసి చెప్పగలరా అని చంద్రబాబు, సోము వీర్రాజులను మల్లాది విష్ణు సవాల్ చేశారు. వీళ్లు హిందువులే కాదు.. అసలు భారతీయులే కాదన్నారు. వీరికి మరో పనిలేకే ఇలాంటి దుష్ఫ్రచారం చేస్తున్నారని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. ప్రతీ విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని.. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై వారిద్దరికీ ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆయన మండిపడ్డారు. దమ్ముంటే కేంద్రాన్ని అడిగి పోలవరానికి నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తావా అని సోము వీర్రాజుకు విష్ణు సవాల్ విసిరారు. -
ఆ విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు.. మల్లాది విష్ణు క్లారిటీ
సాక్షి, తాడేపల్లి: వినాయక చవితిని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అబద్దాల కోరుగా మారాడని విమర్శించారు. వినాయకుడిని అడ్డం పెట్టుకుని బీజేపీ, చంద్రబాబు బురద జల్లాలని చూస్తున్నారన్నారు. వినాయక చవితి పందిళ్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలోనే మండపాలకు విద్యుత్ ఛార్జీలు వసూలు చేశారన్నారు. సీఎం జగన్ వచ్చాక ఎలాంటి చార్జీలు పెంచలేదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న సోమువీర్రాజు, చంద్రబాబుపై కేసు పెట్టాలని పోలీసుల్ని కోరారు. సోము వీర్రాజుకు దమ్ముంటే పోలవరానికి నిధులు ఇప్పించాలన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కృషి చేయాలని కోరారు. ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచించారు. అబద్ధపు ప్రచారాలు తగదు గణేష్ మండపాల విషయంలో ఎలాంటి రుసుంలు వసూలు చేయడం లేదని దేవాదాయశాఖ తెలిపింది. సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు చేయడం తగదని సూచించింది. రుసుంలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ప్రచారం చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని దేవాదాయశాఖ హెచ్చరించింది. చదవండి: (కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్ విడుదల) -
పింగళి వెంకయ్య ను ఎల్లప్పుడూ స్మరించుకోవాలి
-
అధికారంలో లేనప్పుడే బ్రాహ్మణులు గుర్తొస్తారా!
సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారంలో లేనప్పుడే ఎల్లో మీడియా ఈనాడుకు బ్రాహ్మణ మేధావుల మాటలు బాగా రుచిగా ఉంటాయని, వారు అనకపోయినా అన్నారని అర్థం వచ్చేలా ఆ పత్రికలో హెడ్డింగ్లు పెట్టి వార్తా కథనాలు అల్లుతున్నారని ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఉండవల్లి అరుణ్కుమార్, దువ్వూరి సుబ్బారావు, ఐవైఆర్ కృష్ణారావు, ఎల్వీ సుబ్రహ్మణ్యం వంటి వారంతా ఈనాడుకు, రామోజీరావుకు, చంద్రబాబుకు బంధువులు అన్నట్లుగా వారి పేరిట వార్తలు రాసే బదులు.. చంద్రబాబు, రామోజీల సామాజిక వర్గం వారి వ్యాఖ్యలనే మేధావుల వ్యాఖ్యలుగా ఇప్పుడెందుకు రాయడం లేదని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్య్రం ఉందని, కాకపోతే ఈనాడుకు, టీడీపీకి రెండు మూడు వాక్ స్వాతంత్య్రాలు ఉన్నట్లు కనబడుతోందని ఆయన అన్నారు. అందులో ఒకటి అనని మాటలు అన్నట్లు చెప్పే వాక్ స్వాతంత్య్రం, రెండోది తమకు అనుకూలంగా మాట్లాడితే దాన్ని పదింతలు చేసి ప్రచురించే వాక్ స్వాతంత్య్రం, మూడోది తమకు నచ్చని పార్టీ అధికారంలో ఉంటే తమకు ఎవరు ఉపయోగపడితే వారిని ఉపయోగించుకునే వాక్ స్వాతంత్య్రం అని ఎద్దేవా చేశారు. దువ్వూరి సుబ్బారావు ఏపీ ప్రభుత్వాన్ని ఏమీ అనకపోయినా అన్నట్లుగా భావించేలా హెడ్డింగ్ పెట్టి వార్త రాశారన్నారు. ఇదే బ్రాహ్మణ సామాజిక వర్గం గురించి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కానీ, టీడీపీ కానీ ఆలోచించే పరిస్థితి లేదన్నారు. అప్పుడు అవమానించి.. టీడీపీ అధికారంలో లేకపోతే ఉండవల్లి అరుణ్కుమార్ వ్యాఖ్యలను ఫ్రంట్ పేజీలో వేస్తారని, ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యలు టీడీపీ అనుకూలంగా ఉంటేనే ప్రచురిస్తారని మల్లాది విష్ణు అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐవైఆర్ కృష్ణారావును ఏ విధంగా అవమానపర్చారో ఈనాడు పత్రికకు కానీ, ఎల్లో మీడియాకు కానీ గుర్తులేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం వారికి ఐవైఆర్ గుర్తుకొస్తున్నారన్నారు. వారు ప్రభుత్వంపై ఏం మాట్లాడకపోయినా మాట్లాడినట్లు రాసే పరిస్థితి తయారైందన్నారు. ప్రజలను కులాలు, మతాల వారీగా విడగొట్టి సీఎం జగన్ ప్రభుత్వంపై లేనివి పోగేసి కించపర్చే విధంగా, ప్రజల్లో తేలికయ్యే విధంగా వార్తలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
విజయవాడలోని 57, 62, 64 డివిజన్లలో పర్యటించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత టీడీపీకి లేదు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-
మేం చెప్పిందే చేశాం.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: సీఎం జగన్ మహిళా పక్షపాతి. గతంలో ఎవరూ చేయనంతగా మహిళలకు ఈ రెండేళ్లలో జగన్ మేలు చేకూర్చారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'మహిళలకు రాజకీయాల్లోనూ ప్రాధాన్యం కల్పించారు. నామినేటెడ్ పోస్టులు, మున్సిపల్ పదవుల్లోనూ 50% శాతం కేటాయించారు. మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని, యాప్ను రూపొందించారు. మహిళా సాధికారత కోసం నిరంతరం జగన్ శ్రమిస్తున్నారు. ఇళ్ల పట్టాలు, అమ్మఒడి అన్నీ మహిళల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని చేసినవే. చదవండి: (త్వరలో వైఎస్సార్సీపీ సభ్యత్వ నమోదు: విజయసాయిరెడ్డి) గత ప్రభుత్వంలో మహిళలపై అనేక దాడులు జరిగాయి. మొన్న చింతమనేని దగ్గర్నుంచి.. నిన్న వినోద్ జైన్ వరకూ టీడీపీ నేతలు మహిళలపై దాడులు చేసిన వారే. టీడీపీ గందరగోళంలో ఉంది. ముఖ్యమంత్రి అయ్యాకే సభలో అడుగుపెడతానని చంద్రబాబు శపథం చేశాడు. చంద్రబాబు సభకు రానప్పుడు.. ఆయన అనుచరులెందుకు వస్తున్నారు. 160 సీట్లు గెలుస్తామని అచ్చెన్నాయుడు కల కంటున్నాడు. తిరుపతిలో పార్టీ లేదు బొక్కా లేదు అన్నది అచ్చెన్నే కదా. ప్రజలను మభ్య పెట్టడానికే టీడీపీ నేతల ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు మాటలు అబద్ధాల పుట్ట. చదవండి: (చంద్రబాబు చెంచాలు మద్యం తాగి మాట్లాడుతున్నారు: పద్మజ) మేం చెప్పిందే చేశాం.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. హామీలు అమలు చేసిన బుక్లెట్ కూడా విడుదల చేశాం. రైతు రుణాలు మాఫీ చేస్తానని తప్పించుకున్న ఘనుడు చంద్రబాబు. చంద్రబాబు 600 హామీలిచ్చి తుంగలో తొక్కాడు. అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు కూడా వినిపించే అవకాశం కల్పించిన నేత సీఎం జగన్. అసెంబ్లీని రాజకీయ వేదికగా మార్చాలనేదే చంద్రబాబు ప్రయత్నం. ఎవరు ఎవరి గొంతు నొక్కేశారో రికార్డులను పరిశీలించేందుకు మేం సిద్ధం.. బాబు మీరు సిద్ధమా' అంటూ మల్లాది విష్ణు చంద్రబాబుకు సవాల్ విసిరారు. -
భోగి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-
ఆ వ్యాఖ్యలతో ఆ పార్టీ పరువు పోయింది!
-
‘ఏపీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తున్న చంద్రబాబు’
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేందుకే చంద్రబాబు గంజాయి, డ్రగ్స్ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి బూతులు మాట్లాడటాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడ పోలీస్ కంట్రోల్ రూం వద్ద ఉన్న వైఎస్సార్ పార్క్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద జనాగ్రహ దీక్ష రెండో రోజు కొనసాగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని దీక్షా శిబిరం తీర్మానించింది. ఎమ్మెల్యే మల్లాది విష్ణు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ, చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడ్ గవర్నెన్స్లో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని ఇక్కడి సంక్షేమ పథకాలను అనుకరిస్తున్నారని చెప్పారు. టీడీపీ కార్యాలయం దేవాలయం కాదని, అది ఒక దెయ్యాల కొంప అని ఎద్దేవా చేశారు. బాబు చుట్టూ ఉన్న వాళ్లంతా నాయకులు కాదని, రౌడీలు, గుండాలని పేర్కొన్నారు. చంద్రబాబు పెయిడ్ అర్టిస్ట్లను పెట్టుకుని సీఎం వైఎస్ జగన్ను తిట్టిస్తున్నారన్నారు. ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతంరెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ కొట్టిన దెబ్బకు చంద్రబాబుకు పారిపోయారని పేర్కొన్నారు. అంపశయ్య మీద ఉన్న పార్టీని కాపాడుకునేందుకు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సింహమని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారని, వాస్తవానికి ఆయన గ్రామ సింహమని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ మాట్లాడుతూ టీడీపీలో కొంతమంది పెయిడ్ ఆర్టిస్ట్లను, నెలవారి జీతగాళ్లను పెట్టుకుని ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయిస్తున్నారన్నారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని రంగాల్లో ముందుకు పోతోందన్నారు. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిని దుర్భాషలాడడం సరికాదన్నారు. దీక్షకు న్యాయవాదుల మద్దతు... ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ చేపట్టిన జనాగ్రహ దీక్షకు న్యాయవాదులు మద్దతు తెలిపారు. కోటంరాజు వెంకటేశ్వర్లు, సీహెచ్ సాయిరాం, పిళ్లా రవి, నరహరిశెట్టి శ్రీహరి, క్రిస్టోఫర్, విష్ణు, కోటయ్య, బెవర ఉమా, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దీక్షలో ఎమ్మెల్సీ కరీమున్నీసా, నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్, డెప్యూటీ మేయర్లు అవుతు శ్రీశైలజారెడ్డి, బెల్లం దుర్గ, ఏపీఐడీసీ చైర్మన్ బండి పుణ్యశీల, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్, దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, స్టాండింగ్ కమిటీ సభ్యుడు తంగిరాల రామిరెడ్డి, ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాలే పుల్లారావు, నగర అధ్యక్షుడు బూదాల శ్రీనివాసరావు, మధిర ప్రభాకరరావు, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. చదవండి: నారా వారి తాజా చిత్రం ‘36 గంటలు’.. సిగ్గు చచ్చింది -
ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో దిక్కులేని పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేనలు అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఎల్బీఎస్ నగర్లో ‘వైఎస్సార్ ఆసరా’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ నుంచి నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ పేదలకు ఇళ్లు ఇస్తుంటే చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు. చంద్రబాబు, పవన్ ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారు. సీఎం జగన్ మహిళా పక్షపాతి. మహిళలకు అండగా ఉన్నారని’’ మల్లాది విష్ణు అన్నారు. చదవండి: వారికి ఎవరి రికమండేషన్ అవసరం లేదు: పేర్ని నాని -
అచ్చెన్నాయుడుకు ఆ నైతిక హక్కు లేదు: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: రెండు విడతల వైఎస్సార్ ఆసరాకు సంబంధించిన రూ.60 కోట్లు మహిళల ఖాతాలో జమ చేశామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్లోని 58, 59, 60వ డివిజన్లకు సంబంధించిన వైఎస్సార్ ఆసరా చెక్కులను శనివారం ఎమ్మెల్సీ కరిమున్నీసా, డిప్యూటీ మేయర్ శైలాజా రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. 'చంద్రబాబు గతంలో జన్మభూమి కమిటీల పేరుతో మహిళలను మోసం చేశాడు. టీడీపీ నేతలు ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకొని నీచ రాజకీయాల చేస్తున్నారు. సింగపూర్, మలేషియా, పోలవరం యాత్రల పేరుతో చంద్రబాబు ప్రజాధనం దుర్వినియోగం చేశారు. గతంలో చంద్రబాబు రూ. 2 లక్షల కోట్లు అప్పులు చేశారు. రాష్ట్రంలో సీఎం జగన్ అవినీతి రహిత పాలన అందిస్తున్నారు. అమ్మ ఒడి గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు లేదు' అని మల్లాది విష్ణు అన్నారు. చదవండి: (తిరుపతి–మదనపల్లె ఫోర్లేన్కు శ్రీకారం) -
మహిళా పక్షపాతి సీఎం జగన్
సాక్షి, అమరావతి/పెనమలూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా పక్షపాతి అని, నామినేటెడ్ పదవులతోపాటు అన్ని రంగాల్లో మహిళలకు 50 శాతానికి మించి అవకాశాలు కల్పించడం గొప్ప విషయమని ఆర్టీసీ జోనల్ చైర్పర్సన్ తాతినేని పద్మావతి కొనియాడారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న సీఎం వైఎస్ జగన్కు మహిళలంతా ఎప్పుడూ రుణపడి ఉంటారన్నారు. ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్పర్సన్, ఆర్టీసీ బోర్డు డైరెక్టర్గాను నియమితులైన ఆమె శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పెనమలూరులో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా కార్మికుల బాధలు తీర్చేందుకు చొరవ తీసుకున్నారన్నారు. ఆర్టీసీ కార్గో సేవలు విస్తృతం చేయడానికి, ఆర్టీసీ స్థలాల్లో వాణిజ్య, వ్యాపార నిర్వహణ ద్వారా ఆదాయం పెంపునకు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులను ఆదుకున్న ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జోగి రమేష్, కైలే అనిల్కుమార్, డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ టి.కల్పలత, ఆర్టీసీ చైర్మన్ ఎ.మల్లికార్జునరెడ్డి, వైస్ చైర్మన్ చిన్నపరెడ్డి విజయానందరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక తదితరులు పాల్గొన్నారు. -
బెజవాడలో హెలీ రైడ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దసరాను పురస్కరించుకుని భక్తులు హెలీకాఫ్టర్లో విహరిస్తూ బెజవాడ అందాలను ఆస్వాదించే అవకాశాన్ని కృష్ణా జిల్లా యంత్రాంగం కల్పించింది. పర్యాటకశాఖ, నగర మునిసిపల్ కార్పొరేషన్, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో ఈ అవకాశం కల్పించారు. శనివారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ విహంగ సేవలు ప్రారంభించారు. తొలుత ఆలయ ఈవో భ్రమరాంబ ప్రయాణికులతో నగర అందాలను తిలకించారు. కలెక్టర్ జె.నివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జేసీ (అభివృద్ధి) శివశంకర్ కూడా హెలీకాఫ్టర్లో విహరించారు. నగర సీపీ బత్తిన శ్రీనివాసులు, మేయర్ భాగ్యలక్ష్మి, ఏవియేషన్ కార్పొరేషన్ ఎండీ భరత్ రెడ్డి పాల్గొన్నారు. ఉదయం 6 గంటల నుంచి హెలీరైడ్.. : ఈ నెల 17 వరకు జరిగే హెలీ రైడ్ ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. 6 నిమిషాల విహంగ యాత్రకు రూ.3,500, 13 నిమిషాలకు రూ.6 వేలుగా ధరను నిర్ణయించారు. సన్ రైజ్ ఎయిర్ చార్టర్ సంస్థ, తుంబై ఏవియేషన్ ప్రైవేట్ సంస్థ సంయుక్తంగా హెలికాప్టర్ నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. -
కుప్పం కంచుకోటను వైస్సార్సీపీ బద్దలు కొట్టింది
-
అసత్య ప్రచారాలు ఆపు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాల మేరకే అన్ని మతాల పండుగలు, కార్యక్రమాలకు ఒకే రకమైన నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం విధించిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత నెల 28న కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల్లో నాలుగో పేరా ప్రకారం బహిరంగ ప్రదేశాలలో వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వకూడదని స్పష్టంగా ఉందన్నారు. ఆ మార్గదర్శకాలను ఒకసారి చదువుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు సూచించారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే సోము వీర్రాజు నిలదీయాల్సింది కేంద్రాన్ని అని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలిసి కూడా సోము వీర్రాజు అసత్యాలు చెబుతూ రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం జారీ చేసిన ఆదేశాల గురించి తెలుసుకోకుండా, కరోనా థర్డ్ వేవ్ ముప్పును పట్టించుకోకుండా ప్రభుత్వానికి డెడ్లైన్ విధిస్తున్నామంటూ అసంబద్ధమైన కార్యక్రమాలను తెరపైకి తెస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే బహిరంగ ప్రదేశాలు, పందిళ్లలో గణేష్ నవరాత్రి ఉత్సవాలకు అనుమతి ఇవ్వడం లేదని వివరించారు. రానున్న పండుగ సీజన్లో జనం పెద్దసంఖ్యలో గుమిగూడకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు సిగ్గుందా?.. పచ్చి అబద్ధాలు ‘సోము వీర్రాజుకు అసలు సిగ్గు ఉందా? ఆలయాల్లో కూడా పండుగ నిర్వహించకూడదని ప్రభుత్వం చెప్పిందంటూ పచ్చి అబద్ధాలు వల్లిస్తున్నారు. బహిరంగ ప్రదేశాలలో పండుగ వేడుకలు నిర్వహించకూడదని కేంద్రం స్పష్టంగా మార్గదర్శకాలు జారీ చేస్తే ఇక్కడ రాద్ధాంతం చేస్తున్నారు’ అని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాలను మీరే ఉల్లంఘిస్తే ఎలా? అని ప్రశ్నించారు. కావాలంటే అలాంటి ఆదేశాలు ఎందుకు జారీ చేశారని కేంద్రాన్నే ప్రశ్నించాలని సూచించారు. కేంద్రం నుంచి రావాల్సిన కరోనా వ్యాక్సిన్లు, ఇతర నిధుల గురించి సోము వీర్రాజు ఏనాడూ మాట్లాడలేదన్నారు. కరోనా కట్టడి కోసమే.. కరోనాను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డ్స్ కార్యక్రమాన్ని వాయిదా వేసిందని మల్లాది విష్ణు గుర్తు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కూడా కరోనా నిబంధనలకు అనుగుణంగానే నిర్వహించిందన్నారు. ఆదివారం గురు పూజోత్సవ కార్యక్రమాలను కూడా రద్దు చేసిందని వివరించారు. కరోనా కట్టడి కోసం, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసమే ఈ చర్యలు తీసుకుందన్నారు. ఎవరా స్వామీజీ? ‘ఎవరో శ్రీనివాసానంద సరస్వతి స్వామి అట.. అసలు ఆయన ఎవరో తెలియదు. ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఆయనతో ఎవరు మాట్లాడిస్తున్నారో కూడా తెలియదు. దారినపోయే స్వామీజీలు ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాలని ప్రయత్నించడం సరి కాదు’ అని మల్లాది విష్ణు సూచించారు. -
బీజేపీ నాయకులు రావాల్సిన నిధులపై మాట్లాడరే : మల్లాది విష్ణు
-
బీజేపీ నాయకులు రావాల్సిన నిధులపై మాట్లాడరే : మల్లాది విష్ణు
సాక్షి, తాడేపల్లి: పండుగల విషయంలో ప్రభుత్వ నిర్ణయాలపై బీజేపీ నాయకులు రాజకీయం చేయడం తగదని బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మల్లాది విష్ణు తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో విష్ణు సోము వీర్రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ నేపథ్యంలో పండుగల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రమే తెలిపిందని, మరి అటువంటప్పుడు దీనిపై రాజకీయం చేయడం తగదన్నారు. కరోనాతోనే వైఎస్సార్ అవార్డులు, ఉపాధ్యాయ దినోత్సవం వాయిదా వేశామని తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూడా ప్రజలను అనుమతించ లేదని చెప్పారు. ప్రజల మేలు కోసమే పండుగల ఇళ్లలో చేసుకోవాలని సూచించామని స్పష్టం చేశారు. అన్ని పండుగలకు పోలీసులు ప్రజలు గుమికూడకుండా చూస్తున్నారని వివరించారు. వ్యాక్సిన్లు, కోవిడ్ టెస్టులపై ఏపీ బీజేపీ నేతలు మాట్లాడరని మండిపడ్డారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఏపీ బీజేపీ నేతలు మాట్లాడటం లేదని విమర్శించారు. చదవండి: సారీ చెప్పు లేదంటే! జావేద్ అక్తర్కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక -
‘అగ్రిగోల్డ్ ఆస్తులు కొల్లగొట్టేందుకు చంద్రబాబు యత్నించారు’
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా ఉన్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. చంద్రబాబు, టీడీపీ నేతలు అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో నీచ రాజకీయాలు చేశారని మండిపడ్డారు. మధురనగర్లో అగ్రిగోల్డ్ బాధితులు సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాటు కార్పొరేటర్ జానరెడ్డి, అగ్రిగోల్డ్ బాధితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అగ్రిగోల్డ్ ఆస్తులను దోచుకోవాలని ప్రయత్నాలు చేశాడని అన్నారు. సీఎం వైఎస్ జగన్ పరిపాలనలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగిందని తెలిపారు. 2014 నుంచి 2019లో టీడీపీ ప్రభుత్వం అమరావతి పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు. చదవండి: Andhra Pradesh: రూ.వెయ్యి కోట్లతో ప్లైవుడ్ యూనిట్ టీడీపీ నేతలు అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. సీఎం జగన్ అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన మాట నెరవేర్చారని, గ్రామ సచివాలయం ద్వారా సీఎం జగన్ అగ్రిగోల్డ్ బాధితులను గుర్తించారని తెలిపారు. రాష్ట్రంలో సీఎం జగన్ పేదరికం నిర్మూలన చేస్తున్నారని తెలిపారు. నాడు-నేడు ద్వారా విజయవాడ నగర అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. సీఎం జగన్పై చంద్రబాబు చేస్తున్న విమర్శలు సరికాదన్నారు. -
చంద్రబాబు, లోకేష్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమం, అభివృద్ధిపై దృష్టిపెట్టారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గతంలో చంద్రబాబునాయుడు రాష్ట్ర అభివృద్ధిని విస్మరించారని చెప్పారు. గురువారం గిరిపురం 24వ డివిజన్లలో గుడ్ మార్నింగ్ విజయవాడ కార్యక్రమంలో మల్లాది పాల్గొన్నారు. గడపగడపకు వెళ్లి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేష్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీ నేతల్లో మార్పురావాలని, సీఎం జగన్ రాష్ట్రంలోని పేదలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. -
వెన్నుపోటుకు పేటెంట్ రైట్ మీది కాదా?: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని మించిన క్రిమినల్ దేశంలోనే మరొకరు లేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. వెన్నుపోటుకు పేటెంట్ రైట్ మీది కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు. హత్యా రాజకీయాలతో ఎదిగిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. చంద్రబాబు శవాలను పీక్కుతినే రాజకీయాలు మానుకోవాలని మల్లాది విష్ణు హితవు పలికారు. -
సీఎం జగన్ విద్యారంగంలో పెను మార్పులు తెచ్చారు : మల్లాది
-
పెన్షన్ పై టీడీపీ ఎల్లో మీడియా నీచ రాజకీయాలు చేయడం సరికాదు
-
బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే..
సాక్షి, అమరావతి/అజిత్సింగ్నగర్ (విజయవాడ సెంట్రల్): రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు తదితర సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే టిప్పు సుల్తాన్ విగ్రహంపై బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. విజయవాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ సమస్యలూలేనట్టుగా బీజేపీ నేతలు ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఓట్లు, సీట్లు లేని బీజేపీ.. తన ఉనికిని కాపాడుకునేందుకు రోజుకో డ్రామాకు తెరపైకి తెస్తోందని దుయ్యబట్టారు. ప్రజలు తమకు నచ్చిన స్వాతంత్య్ర సమరయోధులు, నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవచ్చని, కానీ మతాల మధ్య చిచ్చు పెట్టేలా బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్నారు. ఈ సందర్భంగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు సవాల్ విసిరారు.. ► కర్ణాటకలో మీ యడ్యూరప్ప టిప్పు సుల్తాన్ వేషధారణను అనుకరించలేదా? ఆయన మాదిరిగానే టోపీ ధరించి.. కత్తిని చేతబట్టి కార్యక్రమానికి హాజరుకాలేదా? ► దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. అక్టోబర్ 25, 2017న బెంగుళూరులో విధాన సౌథ డైమండ్ జూబ్లీ వేడుకల సందర్భంగా శాసనసభ ఉమ్మడి సమావేశంలో టిప్పు సుల్తాన్పై పొగడ్తల వర్షం కురిపించలేదా? బ్రిటిష్ వారితో పోరాడి టిప్పు సుల్తాన్ వీరోచిత మరణం పొందారని కీర్తించలేదా? రాష్ట్రపతి మాట్లాడింది తప్పు అయితే.. ఇప్పటివరకు రాష్ట్రపతి కార్యాలయం ఎందుకు ఖండించలేదు? ► టిప్పు సుల్తాన్ కీర్తిని ప్రపంచం మొత్తం చాటిచెప్పేలా ఆయన శకటాన్ని ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవాల్లో ఏ ప్రభుత్వం ప్రదర్శించింది? ► జులై 15, 1974లోనే టిప్పు సుల్తాన్ పేర్న స్టాంప్లను ఆనాటి ప్రభుత్వం విడుదల చేయలేదా? -
పేదల ఇళ్లకు కంకర రాకుండా టీడీపీ కుట్ర
సాక్షి, అమరావతి: ఏళ్ల తరబడి అక్రమ మైనింగ్కు పాల్పడి దోచుకున్న టీడీపీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ ఇప్పుడు మందిని వెంటేసుకుని వెళ్లి ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నాడని మంత్రి, ఎమ్మెల్యేలు తీవ్రంగా విమర్శించారు. వైఎస్సార్సీపీ నేత కారును దేవినేని అనుచరులు ధ్వంసం చేస్తే.. ఆయన కారే ధ్వంసమైనట్లు ఎల్లోమీడియా సాయంతో దుష్ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేశ్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, విజయవాడలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా 2014–19 మధ్య జరిగిన మైనింగ్కు సంబంధించిన గూగుల్ చిత్రాలను మంత్రి విడుదల చేశారు. దాడి జరిగింది మాపైనే.. గత ఎన్నికల్లో ప్రజలు ఛీ కొట్టినా టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావుకు బుద్ధిరాలేదు. మైనింగ్లో అక్రమాలు జరిగితే అధికారుల దృష్టికి ఎందుకు తీసుకురాలేదు? ఉమా మీద ఎవరూ దాడి చేయలేదు. ఉమాయే 100 మందిని వెంటబెట్టుకుని వెళ్లి ఘర్షణ వాతావరణం క్రియేట్ చేశారు. చివరికి తనపై దాడి జరిగిందని డ్రామా నడిపించారు. ఎల్లో మీడియాలో గగ్గోలు పెట్టారు. వాస్తవంగా వైఎస్సార్సీపీ నాయకుడు దుర్గాప్రసాద్ కారుపై దాడి చేశారు. కారును ధ్వంసం చేశారు. దళిత యువకుడు సురేష్పైనా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. టీడీపీ నేతలు జరిగిన దాన్ని మసిపూసి మారేడు కాయచేస్తూ మాట్లాడారు. కొండపల్లి ప్రాంతంలో 1978 నుంచి మైనింగ్ జరుగుతోంది. టీడీపీ ప్రభుత్వం హయాంలోనే ఎన్నడూ లేనంతగా అక్రమ మైనింగ్ జరిగింది. ఉమా మైలవరం ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న సమయంలో 70 శాతం మేరకు మైనింగ్ జరిగినట్లు మ్యాప్ల్లో కనిపిస్తోంది. అధికారం పోగానే కొత్తరాగం అందుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదలుపెట్టిన ఇళ్ల నిర్మాణాలకు కంకర దొరకకూడదు, నిర్మాణాలు జరగకూడదనే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారు. – వసంత కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే అరాచకం సృష్టించేందుకే వెళ్లిన ఉమా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదల ఇళ్ల నిర్మాణానికి కంకర దొరక్కుండా ఆగిపోవాలని తెలుగుదేశం పార్టీ కుట్రచేస్తోంది. ఆ పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మైనింగ్ పేరుతో చేస్తున్న హైడ్రామా అసలు ఉద్దేశం ఇదే. గడ్డమణుగు గ్రామంలో మంగళవారం దళితులు, ప్రజలను దుర్భాషలాడిన దేవినేని తనపైనే దాడిచేశారని బొంకడం విడ్డూరంగా ఉంది. వైఎస్సార్సీపీ నాయకుడి కారును దేవినేని అనుచరులు ధ్వంసం చేస్తే.. ఆయన కారే ధ్వంసమైనట్టు ఎల్లో మీడియా సాయంతో దుష్ప్రచారం చేస్తున్నాడు. అరాచకం సృష్టించేందుకే మైనింగ్ ప్రాంతం సందర్శన పేరుతో వెళ్లిన ఉమా అక్కడ మా పార్టీ కార్యకర్తలపై దాడిచేయడమే కాకుండా దళితులు, పోలీసులను దుర్భాషలాడాడు. కొండపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో 1978 నుంచే మైనింగ్ కార్యకలాపాలు నడుస్తున్నాయి. దేవినేని ఉమా ఎమ్మెల్యే, మంత్రి అయ్యాకే 70 శాతం మైనింగ్ జరిగినట్లు గూగుల్ పటాల ద్వారా తెలుస్తోంది. అక్కడి కాంట్రాక్టర్లను, క్రషర్స్ యజమానులను బెదిరించి, కమీషన్ల కోసం బ్లాక్మెయిల్ చేశాడు. ఇవ్వకపోతే అది ఫారెస్ట్ ల్యాండ్ అంటూ రాయించి 2018లో పనులు ఆపించాడు. డబ్బులు దండుకున్నాక రెవెన్యూ మంత్రిగా ఉన్న కేఈ కృష్ణమూర్తితో అది రెవెన్యూ భూమేనని, మైనింగ్ చేసుకోవచ్చని స్టే ఇప్పించాడు. ఓడిపోయిన తర్వాత వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మైనింగ్ చేస్తున్నాడంటూ బురద చల్లుతున్నాడు. వాస్తవాలేంటో తేల్చమని పోలీసులను కోరుతున్నాం. రైతు కష్టం తెలిసిన వ్యక్తి జగన్ రైతులకు పౌరసరఫరాలశాఖ రూ.3,300 కోట్లు బకాయి పడిందని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం. సీఎం జగన్ తాను చెప్పినట్టే రూ.1,600 కోట్లు రైతుల ఖాతాల్లో వేశారు. కేంద్రం నుంచి రూ.2,800 కోట్లు వచ్చాయి. పూర్తిగా కట్టాల్సిన డబ్బుల్లో రూ.3,200 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశాం. మిగిలినవి త్వరలోనే విడుదల చేస్తాం. రైతన్న కష్టం తెలిసిన వ్యక్తి వైఎస్ జగన్. టీడీపీని బీజేపీలో విలీనం చేసేందుకు చంద్రబాబు చర్చలు జరుపుతున్నాడు. ఇంకో ఏడాదిలో ఇది జరుగుతుంది. చంద్రబాబు సింగపూర్కో, మలేసియాకో వెళ్తాడు. ఇప్పటికే తెలంగాణలో ఆ పార్టీని కాంగ్రెస్లో కలిపేశాడు. ఇలాంటి వ్యక్తిని నమ్ముకుని ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగస్వామ్యం కావద్దని ఆ పార్టీ కార్యకర్తలను కోరుతున్నాం. – కొడాలి నాని, మంత్రి రాత్రిపూట పరిశీలనకు వెళ్లారా? రాష్ట్రంలో ప్రజలంతా టీడీపీని ఏకపక్షంగా తిరస్కరించారు. మాజీ మంత్రి దేవినేని ఉమాను ఛీకొట్టి ఓడించినా బుద్ధి మారలేదు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చేతితో ఓటమిని జీర్ణించుకోలేక దేవినేని ఉమా కుట్ర చేస్తున్నారు. మైనింగ్ అక్రమాలు జరిగితే ఉమా అధికారుల దృష్టికి తీసుకురాకుండా అనుచరులతో కలిసి రాత్రిపూట పరిశీలనకు ఎందుకు వెళ్లారు? అక్రమాలు జరిగితే రాత్రులు పరిశీలనకు వెళ్లటంపై ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ నేతలపై ఉమా దాడిచేశారు. ఏదో రకంగా స్థానిక ఎమ్మెల్యే కృష్ణప్రసాద్పై బురదజల్లే ప్రయత్నం చేయటం హేయం. చిల్లరతత్వంగా వ్యవహరిస్తున్న దేవినేని ఉమా ఇకనైనా ఇలాంటి డ్రామాలు ఆపాలి. పదేపదే అసత్యాలు చెబుతూ గోబెల్స్ ప్రచారం చేయటం అలవాటైన ఆయనకు నిజాలు రుచించవు. మంగళవారం జరిగిన ఘటనపై పోలీసులు వాస్తవాలు వెల్లడించినా ఉమా డ్రామాలాడటం విడ్డూరంగా ఉంది. – మల్లాది విష్ణు, ఎమ్మెల్యే అన్నీ దోచుకుతిన్నది ఉమానే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు సొల్లు మాటలు మాట్లాడటం మానుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి 23 ఎమ్మెల్యే సీట్లు కూడా మిగలవు. డ్రామా ఆర్టిస్టు దేవినేని సొల్లు ఉమా నిన్నటి నుంచి కొత్త డ్రామాకు తెరతీశాడు. చంద్రబాబు అండ్ కో ఇలాగే ప్రవర్తిస్తుంటే గ్రామాల నుంచే కాదు.. రాష్ట్రం నుంచే తరిమితరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మైలవరం నియోజకవర్గంలో గనులు, ఇసుక, మట్టి దగ్గర నుంచి ఆఖరికి బూడిద వరకు మొత్తం దోచుకుతిన్నది దేవినేని ఉమానే. మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం మట్టి దోచుకున్నారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో గ్రావెల్ తవ్వించింది, అమ్ముకున్నది కూడా దేవినేని, టీడీపీ నేతలే. ఇసుక దోచుకున్నది వారే. అధికారంలో ఉన్న ఐదేళ్లు దోచుకుని, దాచుకుని, మళ్లీ మా ప్రభుత్వంపై నిందలు వేస్తారా? మాది స్వచ్ఛమైన పారదర్శక ప్రభుత్వం. సీఎం జగన్మోహన్రెడ్డి వైఎస్సార్సీపీ వారు తప్పుచేసినా వదిలిపెట్టారు. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి దేవినేని ఉమా, ఆయన అనుచరులు ఎస్సీ, ఎస్టీ, బీసీలను తిడితే ఊరుకుంటారా?ఉమాపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదుచేసి, శిక్ష విధించాలి. అసలు అక్రమ క్వారీయింగ్ జరగటంలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇళ్ల స్థలాల మెరక కోసం తెచ్చుకుంటున్నామని చెప్పి ప్రజలు అడ్డగిస్తే నెపం వైఎస్సార్సీపీపై వేస్తారా? కారు అద్దాలు పగలగొట్టుకుని, కారులో కూర్చొని, తనపై దాడి జరిగిందని పోలీస్ స్టేషన్కు వెళ్లారు. – జోగి రమేశ్, ఎమ్మెల్యే -
‘ప్రజలు ఛీ కొట్టినా దేవినేని ఉమా బుద్ధిమారలేదు’
సాక్షి, విజయవాడ: టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావును ప్రజలు ఛీ కొట్టినా బుద్ధిమారలేదని ఎమ్మెల్మే మల్లాది విష్ణు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వసంతకృష్ణప్రసాద్ చేతిలో ఓటమిని దేవినేని ఉమా జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. మైనింగ్లో అక్రమాలు జరిగితే.. అధికారుల దృష్టికి ఎందుకు తీసుకురాలేదని సూటిగా ప్రశ్నించారు. దేవినేని ఉమా అనుచరులతో రాత్రిపూట పరిశీలనకు వెళ్తారా.. దానిని ప్రశ్నిస్తే వైఎస్సార్సీపీ నేతలపై దాడి చేస్తారా అని మండిపడ్డారు. ఏదోరకంగా వసంతకృష్ణప్రసాద్పై బురదజల్లాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. దేవినేని ఉమా ఇలాంటి డ్రామాలు ఇకనైనా ఆపాలని హితవు పలికారు. గతంలో జక్కంపూడిలో దేవినేని ఉమాను ప్రజలే తరిమికొట్టారని గుర్తుచేశారు. దేవినేని ఉమా రాజకీయ నాయకుడు కాదు.. గోబెల్స్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, దేవినేని ఉమా డ్రామా ఆర్టిస్ట్లు సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు, దేవినేని ఉమా డ్రామా ఆర్టిస్ట్లని ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేవినేని ఉమా కాదు.. సొల్లు ఉమా అని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. మైలవరంలో మొత్తం దోచుకున్నది దేవినేని ఉమానేనని, దేవినేని ఉమా మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం మట్టి, గ్రావెల్ దోచుకున్నాడని దుయ్యబట్టారు. దేవినేని ఉమాపై ఎటువంటి దాడి జరగలేదని తెలిపారు. దేవినేని ఉమాతో ఉన్న గూండాలే దాడికి తెగబడ్డారని అన్నారు. -
బీజేపీ నేతల యాత్రలు పెద్ద డ్రామా
సాక్షి, అమరావతి: బీజేపీ నేతల మత రాజకీయాలతో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని చూస్తున్నారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలో అన్ని మతాల ప్రజలు సుఖ సంతోషాలతో కలసి ఉన్నారని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆలయాల సందర్శన పేరుతో డ్రామా యాత్రలకు ఎవరి మెప్పు కోసం తెరదీశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సోము వీర్రాజుకు విష్ణు పలు ప్రశ్నలను సంధించారు. ► వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక తెలుగుదేశం హయాంలో కూల్చివేతకు గురైన ఆలయాల పునర్నిర్మాణం చేపట్టారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ‘గుడికో గోమాత’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి ఇవ్వకముందే.. ధర్నా చేయడం ఏమిటి? ► 2016లో కృష్ణాపుష్కరాల సమయంలో చంద్రబాబు హయాంలో శతాబ్దాల నాటి చరిత్ర ఉన్న పురాతన ఆలయాల మొదలు చిన్న ఆలయాల వరకు కూల్చివేశారు. ఆనాడు సోము వీర్రాజు ఎందుకు నోరు మెదపలేదు? ► తిరుమలలో పోటు గదులను మూసివేసి వాటిలో తవ్వకాలు జరిపారు. దుర్గమ్మ గుడిలో అర్థరాత్రి తాంత్రిక పూజలు నిర్వహించారు. అర్చకులకు వంశపారంపర్యమైన హక్కులు కల్పించమంటే.. గొంతెమ్మ కోర్కెలు కోరవద్దని అవమానించారు. అప్పుడేమయ్యారు? ► చంద్రబాబు హయాంలో వేధింపులు తట్టుకోలేక అర్చకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అమరావతి సదావర్తి భూములతో సహా.. దేవాలయాల భూములను మింగేశారు. ఇవన్నీ మీ భాగస్వామ్యంలో జరగలేదా? ► తిరుమల తిరుపతి దేవస్థానానికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాలలో కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినా.. కనీసం స్పందించలేదు. ఇది కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణకు నిదర్శనం కాదా? -
విజయవాడ 36 వ డివిజన్ లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పర్యటన
-
‘జగనన్న విద్యా దీవెన పేద విద్యార్థులకు వరం’
-
‘సీఎం జగన్ మీది ఏ పార్టీ.. ఏ మతం అని చూడడు’
సాక్షి, విజయవాడ: నగరంలోని సెంట్రల్ నియోజకవర్గంలోని 50 మందికి లబ్ధిదారులకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు 29,75,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శిరీష, సునీత, అనిత, లక్ష్మీ పతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పార్టీ చూడం మతం చూడం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబు సీఎంఆర్ఎఫ్పై పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 5 కోట్ల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించాం’’ అని తెలిపారు. ‘‘సీఎం జగన్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారు. చంద్రబాబు నీచ రాజకీయాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరికి ఆరోగ్యశ్రీ అందుబాటులోకి తెచ్చాం. ఆస్పత్రి ఖర్చు1000 రూపాయలు దాటిన వారికి ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. ఆరోగ్యశ్రీకి సంబంధించిన హాస్పిటల్స్లో బకాయిలు లేకుండా చూస్తున్నాం. నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఆస్పత్రుల్లో అభివృద్ధి పనులు చేస్తున్నాం’’ అని మల్లాది విష్ణు తెలిపారు. -
‘గురుమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించాలి’
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అద్భుతమైన పాలన అందిస్తున్నారని, బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. తిరుపతిలో శనివారం బ్రాహ్మణ సంఘాల నేతలు వారు సమావేశమయ్యారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులను తిరిగి నియమించారని గుర్తుచేశారు. బ్రాహ్మణుల మనోభావాలను సీఎం జగన్ కాపాడారన్నారు. వంశపారంపర్య అర్చకత్వం కొనసాగింపుపై బ్రాహ్మణులు సీఎం వైఎస్ జగన్కు రుణపడి ఉన్నారు అని తెలిపారు. సామాన్య కుటుంబానికి చెందిన గురుమూర్తికి సీఎం జగన్ టికెట్ ఇచ్చారని, తిరుపతి ఉప ఎన్నికల్లో ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘బ్రాహ్మణుల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేశారు. బ్రాహ్మణుల పూర్వవైభవాన్ని సీఎం జగన్ ఇనుమడింపజేశారు. చంద్రబాబు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. దేవాలయాలను కూల్చిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలి. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందజేస్తున్నాం. బ్రాహ్మణ పేదల కోసం రూ.790 కోట్లతో ఈబీసీ నేస్తం. త్వరలోనే ఈబీసీ నేస్తంపై వర్క్షాప్ పెడతాం’ అని తెలిపారు. -
విజయవాడలో గుడులు కూల్చివేసింది బాబు సర్కార్ కాదా ?
-
కరకట్టవాసులకు ఇబ్బంది లేకుండా శాశ్వత పరిష్కారం
-
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే దళితులకు గౌరవం
భవానీపురం (విజయవాడ పశ్చిమ): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే దళితులకు గౌరవం లభిస్తుందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అంటూ ఎస్సీలను అగౌరవపరుస్తూ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. అమరావతిలో దళితుల భూములను కొట్టేసిన ఘనుడని అన్నారు. సంత్ గురు రవిదాస్ 644వ జయంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెద్దిపోగు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సామాజిక సంస్కరణలను తీసుకువచ్చిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్సీపీ అన్నారు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని దళితులంతా సంఘటితంగా ఉండాలన్నారు. సామాన్యులను అసామాన్యులుగా తీర్చిదిద్దే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లాంటివారు చాలా అరుదుగా ఉంటారన్నారు. అతి సామాన్యుడనైన నన్ను ఎంపీగా చేయడం, తిరుపతిలో డాక్టర్ గురుమూర్తిని ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలపటం అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. సంత్ గురు రవిదాస్ తరువాత వచ్చిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జగజ్జీవన్రామ్, పూలే వంటి మహనీయులు అసమానతలను రూపుమాపేందుకు విశేష కృషి చేశారన్నారు. కార్యక్రమంలో మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొమరవల్లి బాల కోటయ్య, కృష్ణా జిల్లా అధ్యక్షుడు అప్పికట్ల రాము, విజయవాడ పట్టణ అధ్యక్షుడు కె.ఏసుదాసు, యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.రత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాదాపు 400 మంది డప్పు కళాకారులు, చర్మకారులు వైఎస్సార్సీపీలో చేరగా.. నేతలు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. -
బాబుకు విజయవాడలో అడుగుపెట్టే నైతిక హక్కు లేదు
సాక్షి, కృష్ణా: విజయవాడలో ఎస్సార్సీపీ విజయకేతనం ఎగరవేయబోతుందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలంతా సీఎం జగనన్న అభ్యర్థులకు ఓటు వేటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబు విజయవాడలో అడుగు పెట్టే ముందు ఆయన పార్టీకి చెందిన నలుగురు నాయకుల మాటలకు సమాధానం చెప్పాలన్నారు. బీసీలు, కాపులు, మైనార్టీలకు టీడీపీ మోసం చేస్తోందని ఆ పార్టీ వారే గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. వంగవీటి రంగా హత్య కేసులో ముద్దాయిగా ఉన్న వారితో కలిసి తిరుగుతున్న నేతల తీరుపై పట్ల చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబుకు విజయవాడలో అడుగు పెట్టే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. విజయవాడ అభివృద్ధికి చంద్రబాబు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. కుప్పంలో ఫలితాలు చూసి చంద్రబాబుకు మైండ్ పోయిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ప్రజలు వైఎస్సార్సీపీని ఆదరిస్తున్నారని, టీడీపీ ఐదేళ్ల పాలనలో విజయవాడలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. చంద్రబాబు పాలన అంతా హత్యలు, కుట్రలు అన్న చందంగా సాగిందని మండిపడ్డారు. తమ 20 మాసాల పాలనలో రూ.600 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని గుర్తుచేశారు. టీడీపీ ఓటు వేస్తే నగరం అభివృద్ధికి నోచుకోదని, ఆ పార్టీ వారే టీడీపీ ఒక కులానికి కొమ్ము కాస్తోందని రోడ్డెక్కారని మండిపడ్డారు. చంద్రబాబు నగరానికి వచ్చే ముందు తాను చేయని అభివృద్ధిపై ప్రజలకు క్షమాపణ చెప్పిరావాలన్నారు. గత ఐదు సంవత్సరాలు టీడీపీ చేసిన నష్టాన్ని భర్తీ చేస్తున్నామని తెలిపారు. టీడీపీ బంగాళాఖాతంలో కలిసి పోవడానికి గల కారణం ఏంటో చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవుపలికారు. నగరంలో లక్ష మందికి ఇళ్లపట్టాలు ఇచ్చామని, ఆరోగ్యశ్రీ ద్వారా పేదల ఆరోగ్యానికి సీఎం జగన్ పెద్దపీట వేశారని గుర్తుచేశారు. చంద్రబాబు నగరంలో అడుగు పెట్టే ముందు వంగవీటి రంగా అభిమానులకు క్షమాపణ చెప్పి రావాలన్నారు. చదవండి: చంద్రబాబుకు విశాఖలో అడుగుపెట్టే హక్కే లేదు -
బెజవాడ మేయర్ పీఠం వైఎస్సార్సీపీదే: మల్లాది
విజయవాడ: జరిగే మున్సిపల్ ఎన్నికల్లో విజయవాడ మేయర్ పీఠం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధీమా వ్యక్తం చేశారు. 20 నెలల పాలనలో విజయవాడలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. సెంట్రల్ నియోజకవర్గంలో శనివారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. 58వ డివిజన్ అభ్యర్థి అవుతు శైలజతో కలిసి గడపకు గడప ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదలు, మధ్య తరగతి వారి అంశాలను అజెండా పెట్టుకుని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని తెలిపారు. . పాదయాత్రలో జగన్ చూసిన ప్రజల సమస్యలను మ్యానిఫెస్టోలో పథకాలుగా రూపొందించారని గుర్తుచేశారు. విజయవాడలో లక్ష మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని ప్రకటించారు. విద్య, వైద్యానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో రాష్టంలో రూ.70 వేల కోట్లు ప్రజల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం తమదేనని గర్వంగా తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల సమస్యలు, అవసరాలు ఒక అజెండాగా పెట్టుకున్నట్లు వివరించారు. 20 నెలల పాలనలో విజయవాడలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. విజయవాడ నగర ప్రజలు టీడీపీ అబద్ధపు మాటలు నమ్మే స్థితిలో లేరని గుర్తుచేశారు. తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని విష్ణు డిమాండ్ చేశారు. రూ.600 కోట్ల అభివృద్ధి పనులు టీడీపీకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు చిత్తశుద్ధి ఉంటే బహిరంగ చర్చకు రండి సవాల్ విసిరారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు మరోలా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ప్రభుత్వ పాలనలో నగరంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు సిద్ధాంతాలు వీగి పోయాయని.. కుప్పం ప్రజలు తిరస్కరించారని విష్ణు వివరించారు.