Ukraine Crisis
-
మాక్రాన్ Vs పుతిన్: ఫ్రాన్స్కు రష్యా మాస్ వార్నింగ్..
మాస్కో: ఉక్రెయిన్పై రష్యా సైన్యం దాడులు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్కు మద్దతిస్తున్న ఫ్రాన్స్కు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ తమ మాటను కాదని ఉక్రెయిన్కు దళాలను పంపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరింది. కాగా, తాజాగా రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగో.. ఫ్రాన్స్ రక్షణమంత్రి సెబాస్టియన్తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్లో దాడుల నేపథ్యంలో అక్కడ ఫ్రెంచ్ దళాల మోహరింపుపై షోయిగో ప్రస్తావించారు. ఒకవేళ నిజంగానే ఉక్రెయిన్లో ఫ్రెంచ్ దళాలు ఉంటే అది వారి దేశానికే తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. అంతేకాకుండా భవిష్యత్త్లో ఉక్రెయిన్కు సైన్యాన్ని పంపించడానికి ఫ్రాన్స్ సాహసిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. దీంతో, వీరి మధ్య సంభాషణ ఉద్రిక్తంగానే జరిగినట్టు సమాచారం. ఇక, ఇటీవల కాలంలో రష్యా విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ గురువారం మరో కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది జులైలో జరగనున్న పారిస్ ఒలింపిక్స్ను రష్యా లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. తప్పుడు సమాచారంతో ఈ క్రీడలకు ఆటంకం కలిగించేందుకు మాస్కో ప్రయత్నిస్తుందని అన్నారు. ఉక్రెయిన్పై జరుగుతున్న యుద్ధంలో రష్యా ఓటమి చెందాల్సిందేనని మెక్రాన్ ఇటీవల ప్రకటనలు ఇస్తున్నారు. రష్యాపై శత్రుత్వాన్ని ప్రేరేపించే ఉద్దేశం ఫ్రాన్స్కు లేనప్పటికీ, ఏదో ఒకరోజు ఐరోపా దళాలు ఉక్రెయిన్కు వెళ్లడం ఖాయమని చెప్పుకొచ్చారు. -
అణు బాంబు దాడిని నిలువరించిన మోదీ!
ప్రపంచవ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న పాపులారిటీ గురించి.. పలు దేశాలు ఆయనకిచ్చే గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఉక్రెయిన్ యుద్ధంలో.. భారీ నష్టం జరగకుండా ఆయన చూపించిన చొరవ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఉక్రెయిన్పై అణు బాంబును వేయాలనుకున్న రష్యా ప్రయత్నాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆపారట!. ఈ విషయాన్ని ఇద్దరు అమెరికా భద్రతాధికారులు వెల్లడించినట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనం ప్రచురించింది. ‘‘2022లో రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం మొదలయ్యాక కొన్నిరోజులకు రష్యా బలగాలకు ఒకదాని వెంట ఒకటి ఎదురు దెబ్బలు తగిలాయి. ఆ సమయంలో కీవ్ నగరం(ఉక్రెయిన్ రాజధాని)పై అణు బాంబు దాడికి రష్యా దిగబోతోందన్న సమాచారం అమెరికాకు చేరింది. అలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. మిత్రపక్షంకాని దేశాలతో పాటు భారత్ సహాకారాన్ని కోరింది అగ్రరాజ్యం. .. భారత్, చైనా సహా పలు దేశాలు అణు బాంబు ప్రయోగించాలనే ప్రయత్నాలను విరమించుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై ఒత్తిడి చేశాయి. దీంతో ఆయన వెనక్కి తగ్గారు. అలా తీవ్ర సంక్షోభం తలెత్తకుండా నివారించడంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇతర దేశాల నుండి వచ్చిన సహకారం కూడా ముఖ్యమైన పాత్ర పోషించింది’’ అని ఆ అధికారులిద్దరూ చెప్పినట్లు సదరు మీడియా కథనం పేర్కొంది. ఇదిలా ఉంటే.. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో.. తొలి నుంచి తటస్థ వైఖరి అవలంభిస్తూనే.. మానవ హక్కుల ఉల్లంఘనల చర్యలను ఖండిస్తోంది భారత్. అంతేకాదు ఈ సంక్షోభ ముగింపునకు శాంతియుత చర్చలే పరిష్కారమని చెబుతూ వస్తోంది. ఇక ఉజ్బెకిస్తాన్ వేదికగా కిందటి ఏడాదిలో జరిగిన ఎస్సీవో శిఖరాగ్ర సదస్సు (షాంఘై సహకార సంఘం) సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ సమయంలో ‘‘ఇది యుద్ధాల శకం కాదు’’ అని ప్రధాని మోదీ సూచించిన సంగతి తెలిసిందే. భారత్ వేదికగా జరిగిన జీ20 సమ్మిట్లోనూ ఈ ప్రకటన హైలైట్ కావడం గమనార్హం. -
ఆ దేశంలో ఉద్యోగాల పేరిట దారుణ మోసం: కేంద్రం కీలక ప్రకటన
ఢిల్లీ: మంచి జీతం అనగానే ట్రావెల్ ఏజెంట్ మాటలు నమ్మి హైదరాబాద్కు చెందిన అస్వాన్.. రష్యాలో ఉద్యోగం కోసం వెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లాక బలవంతంగా సైన్యం చేర్పించారు. ఆపై ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో ఆ యువకుడు ప్రాణం విడిచాడు. రష్యాలో ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మానవ అక్రమరవాణాను గుర్తించిన కేంద్రం.. తాజాగా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో భారతీయులు పలువురు చిక్కుకున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ‘‘రష్యాలో ఉద్యోగాల పేరుతో భారీ మోసాలు జరుగుతున్నాయి. ఉద్యోగాల పేరిట ప్రైవేట్ సైన్యంలో చేరుస్తున్నారు. అలాంటి వాళ్లను గుర్తించి వెనక్కి రప్పించే ప్రయత్నంలో ఉన్నాం’’ అని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో ఈ మానవ అక్రమ రవాణా నెట్వర్క్ గుర్తించినట్లు తెలిపింది కేంద్రం. మోసకారి మాటలతో రష్యా ప్రైవేట్ సైన్యంలో భారతీయుల్ని చేరుస్తున్న ఏజెంట్లను సీబీఐ గుర్తించిందని.. పలువురిపై కేసులు కూడా నమోదు చేసిందని కేంద్రం తెలిపింది. రష్యాలో ఉద్యోగాల పేరిట.. ఏజెంట్ల ఇచ్చే మోసపూరిత ప్రకటనలు నమ్మొద్దంటూ అప్రమత్తం చేసింది కేంద్రం. ఈ ముఠాలు 35 మంది భారతీయుల్ని రష్యాకు తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంతమంది ఉక్రెయిన్ యుద్ధంలో ఉన్నారన్నది స్పష్టత రావాల్సి ఉంది. -
పుతిన్ పిలిచారు.. ఉక్రెయిన్ సంక్షోభానికి తెర పడ్డట్లేనా?
మాస్కో: మూడో ఏడాదిలోకి అడుగుపెట్టక ముందే.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగియనుందా? శాంతి స్థాపనలో భారత్ పెద్దన్న పాత్ర వహించబోతోందా?.. తాజా పరిణామాలు అందుకు అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. ఉక్రెయిన్ సంక్షోభం ముగించేందుకు ముందుకు రావాలంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం అందించారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్నారు. బుధవారం ఆ దేశ అధ్యక్షుడు పుతిన్తో క్రెమ్లిన్లో జైశంకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. ఉక్రెయిన్ సంక్షోభం సహా పలు అంశాలపై వీళ్లు చర్చించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీని రష్యా పర్యటనకు పుతిన్ ఆహ్వానించారు. ‘‘మా చిరకాల మిత్రుడు, భారత ప్రధాని నరేంద్ర మోదీని చూసేందుకు మేం ఆత్రుతతో ఉన్నాం. ఆయన్ని మా దేశానికి ఆహ్వానిస్తున్నాం. ఉక్రెయిన్ పరిణామాల్ని నేను ఆయనకు( భారత ప్రధాని మోదీ) ఎప్పటికప్పుడు వివరిస్తుంటాను. కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. సమస్యను శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించబడటానికి ఆయన తన శాయశక్తులా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాడని నేను నమ్ముతున్నా’’ అని జైశంకర్ వద్ద పుతిన్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ సంక్షోభానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక చక్కని పరిష్కారం చూపగలరని తొలి నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ భావిస్తూ వస్తున్నారు. ఈ విషయంపై తరచూ ఇరు దేశాల నేతలు చర్చించుకుంటున్నారనే విషయాన్ని జైశంకర్ మీడియాకు తెలిపారు. ఈ తరుణంలో మోదీకి పుతిన్ ఆహ్వానం ఆసక్తికర చర్చకు దారి తీసింది. పుతిన్ ఆహ్వానం మేరకు వచ్చే ఏడాది వేసవి లోపు.. వీలైతే ఫిబ్రవరిలోపే మోదీ రష్యాలో పర్యటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే విజయాన్నిరష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కూడా ప్రెస్మీట్లో ధృవీకరించారు కూడా. Honoured to call on President Vladimir Putin this evening. Conveyed the warm greetings of PM @narendramodi and handed over a personal message. Apprised President Putin of my discussions with Ministers Manturov and Lavrov. Appreciated his guidance on the further developments of… pic.twitter.com/iuC944fYHq — Dr. S. Jaishankar (@DrSJaishankar) December 27, 2023 External Affairs Minister Dr S Jaishankar met Russian President Vladimir Putin in Moscow pic.twitter.com/aD7LCyjzDD — ANI (@ANI) December 28, 2023 ఇక.. భారత్-రష్యాల ద్వైపాక్షిక ఒప్పందాలు.. ఇతర సంబంధాల బలోపేతం కోసం జైశంకర్ రష్యాలో పర్యటిస్తున్నారు. పుతిన్తో భేటీకి ముందు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో జైశంకర్ విడిగా భేటీ అయ్యారు. అంతకు ముందు.. ఇరుదేశాల ఆర్థిక సంబంధిత ఒప్పందాలకు సంబంధించి రష్యా ఉప ప్రధాని డెనిస్తో సమావేశం అయ్యారు. -
వికీపీడియా ఓనర్కు భారీ షాక్ ఇచ్చిన రష్యా
మాస్కో: ఆన్లైన్ ఎన్క్లోపీడియాగా పేరున్న వికీపీడియాకు రష్యా భారీ షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఫేక్ సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోందన్న అభియోగాలను మాస్కో కోర్టు ధృవీకరించింది. ఈ మేరకు వికీపీడియా ఓనర్ అయిన వికీమీడియా ఫౌండేషన్కు 2 మిలియన్ల రూబుల్స్(24 వేల డాలర్లపైనే.. మన కరెన్సీలో 20 లక్షల రూపాయలకు పైమాటే) జరిమానా విధించింది. ఉక్రెయిన్లో రష్యా మిలిటరీ వ్యవహారాలకు సంబంధించిన తప్పుడు సమాచారం తొలగించని కారణంగానే ఈ జరిమానా విధిస్తున్నట్లు మాస్కో కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే.. స్వతంత్ర సమాచారం పేరిట వికీపీడియాలో సమాచారం పొందుపరుస్తుండడంపై రష్యా తీవ్ర అసహనంతో ఉంది. ఈ క్రమంలో వికిపీడియాకు జరిమానాల మీద జరిమానాలు విధిస్తూ వెళ్తోంది. అయితే.. వికీమీడియా మాత్రం వికీపీడియా స్టాండర్స్కు తగ్గట్లుగానే, పక్కా సమాచారన్ని పొందుపరుస్తున్నట్లు చెబుతూ వస్తోంది. -
రష్యా భరతం పట్టాలంటే సరికొత్త ఆయుధాలు కావాలి.. త్వరగా ఇవ్వండి
కీవ్: ఉక్రెయిన్ తూర్పు డొనెస్క్ ప్రాంతంలో రష్యా తరచూ దాడులు చేస్తోందని అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. తాము అత్యంత కఠిన పరిస్థితిని ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. రష్యాను దీటుగా ఎదుర్కోవాలంటే తమకు సరికొత్త ఆయుధాలు కావాలని, ప్రపంచ దేశాలు వేగంగా వాటిని తమకు అందించాలని కోరారు. ఈమేరకు ఆయన ఆదివారం వీడియో సందేశం విడుదల చేశారు. డొనెస్క్లోని బాఖ్ముత్, వుహ్లెడార్తో పాటు ఇతర చోట్ల రష్యా తరచూ భీకర దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ సేనలను దాటుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. రష్యా ఈ యుద్ధాన్ని ఇంకా సాగదీయాలని చూస్తోందని, అందుకే సమయాన్ని ఆయుధంగా మార్చుకుని శత్రు దేశాన్ని చావుదెబ్బతీయాలని జెలెన్స్కీ చెప్పారు. అత్యంత వేగంగా తమకు అధునాతన ఆయుధాలు సమకూర్చాలన్నారు. డొనెస్క్లోని బ్లాహొదాట్నే ప్రాంతంపై రష్యా దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు ఉక్రెయిన్ ఆర్మీ జనరల్ స్టాఫ్ ఆదివారం ఉదయమే వెల్లడించారు. రష్యా మాత్రం ఈ ప్రాంతాన్ని హస్తగతం చేసుకున్నట్లు ప్రకటించింది. అమెరికా, జర్మనీ వంటి దేశాలు ఇతర దేశాల సహకారంతో ఉక్రెయిన్కు ఆయుధ సాయం అందిస్తున్నాయి. అయితే అమెరికా తయారు చేసిన ఏటీఎసీఎంస్ క్షిపణులను తమకు ఇవ్వాలని జెలెన్స్కీ కోరుతున్నారు. 300 కీలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగి ఉండటం దీని ప్రత్యేకత. అయితే ఈ క్షిపణులను ఉక్రెయిన్ను ఇచ్చేందుకు అమెరికా నిరాకరిస్తోంది. చదవండి: బర్త్డే పార్టీలో కాల్పుల కలకలం.. 8 మంది మృతి.. -
రష్యా క్రూరత్వం.. ఉక్రెయిన్పై ఒకేసారి 120 మిసైల్స్తో అటాక్!
కీవ్: సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్పై కొద్ది నెలలుగా భీకర దాడులకు పాల్పడుతోంది రష్యా. ప్రధాన వనరులను ధ్వంసం చేస్తూ ఉక్రేనియన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరోమారు క్షిపణుల వర్షం కురిపించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్తో పాటు దేశవ్యాప్తంగా ఒకేరోజు 120 మిసైల్స్ను ప్రయోగించింది. ఏ వైపు నుంచి బాంబులు పడతాయోనని అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యేలా చేసింది. భారీ స్థాయిలో మిసైల్స్ ప్రయోగించినట్లు ఉక్రెయిన్ మిలిటరీ వెల్లడించింది. ‘డిసెంబర్ 29. భారీ స్థాయిలో మిసైల్స్తో దాడి జరిగింది. ఆకాశం, సముద్రం నుంచి శుత్రు దేశం ఉక్రెయిన్ను చుట్టుముట్టి మిసైల్స్తో విరుచుకుపడింది. ’అని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది ఉక్రెయిన్ వైమానిక దళం. మరోవైపు.. 120 మిసైల్స్ ప్రయోగించినట్లు అధ్యక్షుడి సహాయకుడు మైఖైలో పోడోల్యాక్ తెలిపారు. గురువారం ఉదయమే ఉక్రెయిన్ వ్యాప్తంగా రాజధాని కీవ్తో పాటు ప్రధాన నగరాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయి. ఈ క్రమంలోనే విద్యుత్తుకు అంతరాయం ఏర్పడొచ్చని, ప్రజలు నీటిని నిలువ చేసుకోవాలని కీవ్ మేయర్ విటాలి క్లిట్స్కో అప్రమత్తం చేశారు. అలాగే.. రెండో పెద్ద నగరం ఖార్కివ్లోనూ వరుస పేలుళ్లు జరిగాయి. ఇదీ చదవండి: క్యాసినో హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది సజీవ దహనం.. -
ఉక్రెయిన్కు చేసేది సాయం కాదు.. పెట్టుబడి..
వాషింగ్టన్: రష్యా తమపై దండయాత్ర చేపట్టిన తర్వాత తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. బుధవారం అమెరికా కాంగ్రెస్లో ప్రసంగించారు. అగ్రరాజ్యం తమ దేశానికి అందిస్తున్న భారీ సాయానికి కృతజ్ఞతలు చెప్పారు. అలాగే ఉక్రెయిన్కు అమెరికా అందిస్తుంది సాయం కాదని, ప్రాజాస్వామ్యం, అంతర్జాతీయ భద్రతకు అగ్రరాజ్యం పెడుతున్న పెట్టుబడి అని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. 2023లోనూ తమకు సాయాన్ని కొనసాగించారని కోరారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలపై అమెరికా విజయం సాధించినట్లు తాము కూడా వెనుకడుగు వేయకుండా రష్యాపై పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని జెలన్స్కీ స్పష్టం చేశారు. ఆయన ప్రసంగాన్ని అమెరికా కాంగ్రెస్ అభినందించింది. సభ్యలందరూ లేచి నిలబడి కరత్వాల ద్వనులతో జెలెన్స్కీ పోరాట స్ఫూర్తిని మెచ్చుకున్నారు. అగ్రరాజ్యం ఇప్పటికే ఉక్రెయిన్కు 50 బిలియన్ డాలర్లకుపైగా సాయం అందించింది. త్వరలో పేట్రియట్ మిసైల్స్ కూడా పంపిస్తామని హామీ ఇచ్చింది. అయితే అమెరికా అందిస్తున్న సాయాన్ని జెలెన్స్కీ పెట్టుబడి అనడం వెనుక కారణం లేకపోలేదు. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి అమెరికా ప్రతినిధుల సభ రిపబ్లికన్ల చేతిలోకి వెళ్లనుంది. ఉక్రెయిన్కు భారీ ప్యాకీజీపై వారు సుముఖంగా లేరు. డెమొక్రాట్లు భారీ మొత్తాన్ని యుద్ధ సాయంగా సమకూర్చడంపై ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు దిగవ సభ వాళ్ల నియంత్రణలోకే వస్తుంది కనుక కచ్చితంగా ప్యాకీజీ బిల్లును అడ్డుకుంటారు. ఈ నేపథ్యంలోనే రిపబ్లికన్ల మనసు మార్చే విధంగా జెలెన్స్కీ మాట్లాడారు. కాంగ్రెస్లో ప్రసంగించడానికి ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో శ్వేతసౌధంలో భేటీ అయ్యారు జెలెన్స్కీ. ఇద్దరూ కలిసి ఓవల్ ఆఫీస్లో కన్పించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. చదవండి: వరదలో చిక్కుకున్న పిల్లలు.. ప్రాణాలకు తెగించి కాపాడిన రియల్ హీరో.. -
ఎలాన్ మస్క్కు ఉక్రెయిన్ అధ్యక్షుడి స్ట్రాంగ్ కౌంటర్!
కీవ్: ఉక్రెయిన్పై సైనిక చర్య పేరుతో కొన్ని నెలలుగా భీకర దాడులు చేస్తోంది రష్యా. ఈ యుద్దానికి తెరదించేందుకు అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్ కొద్ది రోజుల క్రింత ఓ ప్రతిపాదన చేశారు. మాస్కో ఆక్రమిత ఉక్రేనియన్ ప్రాంతాలలో ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం, క్రిమియన్ ద్వీపకల్పంపై రష్యా సార్వభౌమత్వాన్ని అంగీకరించటం, ఉక్రెయిన్కు తటస్థ హోదా ఇవ్వడం వంటి శాంతి ఒప్పందాన్ని ప్రతిపాదించారు. అదికాస్త వివాదానికి దారి తీసింది. తాజాగా మస్క్ ప్రతిపాదనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. తమ దేశం వచ్చి అక్కడి పరిస్థితులను గమనించాక మాట్లాడాలని స్పష్టం చేశారు. ద న్యూయార్క్ టైమ్స్ బుధవారం నిర్వహించిన డీల్బుక్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్న జెలెన్స్కీ.. ఎలాన్ మస్క్ ప్రతిపాదనపై మండిపడ్డారు. ఉక్రెయిన్కు వచ్చి చూడాలని స్పష్టం చేశారు. ‘ఆయనను కొందరు ప్రభావితం చేసి ఉండొచ్చు. లేదా ఆయనే స్వతహాగా ఆ నిర్ణయానికి వచ్చి ఉండొచ్చని భావిస్తున్నా. రష్యా చేసిన మారణకాండను అర్థం చేసుకోవాలనుకుంటే.. ఉక్రెయిన్ వచ్చి సొంతంగా పరిస్థితులను పరిశీలించాలి. ఆ తర్వాత ఈ యుద్ధానికి ముగింపు ఎలా పలకాలనే విషయాన్ని సూచించాలి. ఈ యుద్ధం ఎవరు ప్రారంభించారు? ఎవరు ముంగించాలి?’ అని పేర్కొన్నారు జెలెన్స్కీ. ఇదీ చదవండి: Russia Ukraine War: రష్యా సైనికుల భార్యలే ‘రేప్ చేయమ’ని ప్రోత్సహిస్తున్నారు: జెలెన్స్కీ భార్య -
ఉక్రెయిన్పై 100 మిసైల్స్తో విరుచుకుపడిన రష్యా
కీవ్: ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా పట్టుకోల్పోతోందనే వాదనల వేళ మాస్కో సేనలు రెచ్చిపోయాయి. ఉక్రెయిన్పై మంగళవారం మిసైల్స్ వర్షం కురిపించాయి. విద్యుత్తు రంగాలే లక్ష్యంగా రష్యా బలగాలు 100కుపైగా క్షిపణులతో దాడి చేసినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. దీంతో తమ దేశంలో మరోమారు విద్యుత్తుకు అంతరాయం ఏర్పడి అంధకారంలోకి వెళ్లినట్లు ఆందోళన వ్యక్తం చేసింది. ‘100కుపైగా మిసైల్స్ను రష్యా బలగాలు ప్రయోగించాయి. అక్టోబర్ 10వ తేదీన అత్యధికంగా 84 మిసైల్స్ను ప్రయోగించగా.. ఆ సంఖ్యను మంగళవారం దాటేశాయి మాస్కో సేనలు. వారి ప్రాథమిక టార్గెట్ కీలకమైన మౌలిక సదుపాయాలు. కొన్ని క్షిపణులను కూల్చివేశం. అయితే వాటి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.’ అని పేర్కొన్నారు ఉక్రెయిన్ ఎయిర్ఫోర్స్ ప్రతినిధి యూరీ ఇగ్నాత్. ఇదీ చదవండి: చైనా అధ్యక్షుడికి చిరునవ్వుతో షేక్ హ్యండ్ ఇచ్చిన ప్రధాని మోదీ.. ఇదే తొలిసారి! -
Russia Ukraine War: పులిని చూసిన మేకల్లా పారిపోయారు!
కీవ్: ఉక్రెయిన్పై సైనిక చర్య పేరుతో భీకర దాడులు చేపట్టిన రష్యాకు కీవ్ సైన్యం ప్రతిఘటన ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలేలా చేసింది. దీంతో ఆక్రమించుకున్న కీలక నగరాలను విడిచి వెనక్కి వెళ్తున్నాయి రష్యా సేనలు. ఇటీవలే ఖేర్సన్ నగరాన్ని తమ బలగాలు ఖాళీ చేసినట్లు రష్యా ప్రకటించింది. మాస్కో బలగాలు తిరిగి వెళ్లిపోయిన క్రమంలో అక్కడి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విషయంపై సంతోషం వ్యక్తం చేసిన ఓ పౌరుడు.. రష్యా సేనలు పులిని చూసిన మేకల వలే పారిపోయాయని ఓ మీడియా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. ‘పుతిన్ మమ్మల్ని చంపాలనుకున్నాడు. కానీ తన సొంత దేశాన్ని నాశనం చేసుకున్నాడు. ఖేర్సన్ నుంచి తిరిగి వెళ్లిపోవటం రష్యాకు ఘోర పరాభవం.’ అని పేర్కొన్నాడు ఖేర్సన్ పౌరుడు. మరోవైపు.. రష్యా బలగాలు వెళ్లిపోయిన క్రమంలో స్థానికులు బ్లూ అండ్ ఎల్లో ఫ్లాగ్స్ పట్టుకుని వీధుల్లో తిరుగుతూ సంబరాలు చేసుకున్నారు. ఖేర్సన్కు స్వతంత్రం వచ్చిందంటూ నినాదాలు చేశారు. గత శనివారం పోలీసు, టీవీ, రేడియో సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. స్థానిక పరిపాలన భవనం వద్ద డ్యాన్సులు చేస్తున్న దృశ్యాలు వైరల్గా మారాయి. ఉక్రెయిన్ సాయుధ బలగాలకు చెందిన జెడ్-ఎస్-యూ అనే అక్షరాలను పలుకుతూ హోరెత్తించారు. మరోవైపు.. రష్యా బలగాలు తిరిగి వెళ్లిపోయినప్పుటికీ నగరాన్ని పునరుద్ధరించటంలో చాలా సవాళ్లు ఎదురుకానున్నాయి. రష్యాతో యుద్ధంలో ఖేర్సన్ నగరం భారీగా దెబ్బతిన్నది. నీరు, విద్యుత్తు, ఔషధాలు, ఆహారం వంటి వాటి కొరత తీవ్రంగా ఉంది. రష్యా బలగాలు వెళ్తూ వెళ్తూ కీలక మౌలిక సదుపాయాలైన సమాచార, నీటి సరఫరా, విద్యుత్తు వంటి వాటిని ధ్వంసం చేసి వెళ్లినట్లు అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ తెలిపారు. ఇదీ చదవండి: మోదీ ప్రారంభించిన 15 రోజుల్లోనే భారీ పేలుడు.. తప్పిన పెను ప్రమాదం! -
ఉక్రెయిన్ యుద్ధం: రష్యాకు ఎదురుదెబ్బ
మాస్కో: ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణలో కీలక పరిణామం చోటుచేసుకుంది!. ఉక్రెయిన్ కీలక నగరం, ప్రస్తుతం రష్యా స్వాధీనంలో ఉన్న ఖేర్సన్ నుంచి రష్యా బలగాలు వెనక్కి మళ్లాయి. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గేయ్ షోయిగు స్వయంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఖేర్సన్ సమీపాన ఉన్న నిప్రో నది వెంట ఉన్న రష్యా బలగాలను వెనక్కి పిలిపించుకుంది రష్యా. మాస్కోకు ఈ పరిణామం ఎదురుదెబ్బ కాగా, ఈ ప్రభావంతో ఉక్రెయిన్ యుద్ధం మరో మలుపు తిరగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే రష్యా ప్రకటనపై ఉక్రెయిన్ మరోలా స్పందించింది. ఖేర్సన్లో ఇంకా రష్యా బలగాలు ఉన్నాయని, ఆ ప్రాంతానికి మరిన్ని రష్యన్ బలగాలు చేరుకుంటున్నాయని ఆరోపించింది. ఖేర్సన్లో ఉక్రెయిన్ జెండా ఎగిరేంత వరకు.. రష్యా బలగాల ఉపసంహరణ ప్రకటనకు అర్థమే లేదని ఉక్రెయిన్ అధ్యక్ష భవన సలహాదారు మైఖాయిలో పోడోల్యాక్ ప్రకటించారు. ఉక్రెయిన్ దురాక్రమణ మొదలయ్యాక.. ఖేర్సన్ను వెంటనే రష్యా బలగాలు ఆక్రమించుకున్నాయి. అప్పటి నుంచి ఉక్రెయిన్ బలగాలను ఎదుర్కొనేందుకు ఈ ప్రాంతాన్ని స్థావరంగా మార్చుకున్నాయి రష్యా బలగాలు. ఇక సెప్టెంబర్లో రష్యాలో విలీనం అయినట్లుగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన నాలుగు ప్రాంతాల్లో ఖేర్సన్ కూడా ఉంది. పైగా ఈ ప్రాంతం నుంచే అణుదాడులు జరగవచ్చనే ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. ఈ తరుణంలో.. అంతటి కీలక ప్రాంతం నుంచి రష్యా తన సైన్యం ఉపసంహరణ ప్రకటన ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తమ సైనికుల ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు అక్కడి పౌరుల భద్రత దృష్ట్యా బలగాలను వెనక్కి తీసుకోవాలని రష్యా భావించిందట!. ఈ మేరకు రక్షణ మంత్రి షోయిగు.. రష్యా యుద్ధ పర్యవేక్షకుడు జనరల్ సెర్గేయ్ సురోవికిన్ మధ్య జరిగిన చర్చల సారమే.. బలగాల ఉపసంహరణగా తెలుస్తోంది. మరోవైపు ఈ పరిణామాల నడుమే ఉక్రెయిన్ బలగాలు ఖేర్సన్ను పూర్తిస్థాయిలో తమ ఆధీనంలోకి తెచ్చుకునే దిశగా ముందుకు వెళ్తుండడం గమనార్హం. ఇదీ చదవండి: 165 కిలోమీటర్లు కాలినడక నడిచి మరీ ఆ పని -
రష్యాపై గెలుపే లక్ష్యంగా ఉక్రెయిన్ 2023 వార్షిక బడ్జెట్
కీవ్: రష్యా సైనిక చర్యతో తీవ్రంగా దెబ్బతిన్న ఉక్రెయిన్.. వార్షిక బడ్జెట్ను ప్రకటించింది. 2023 ఆర్థిక ఏడాదికి గానూ ప్రవేశపెట్టిన ముసాయిదా పద్దుకు ఆ దేశ పార్లమెంట్ గురువారం ఆమోదం ముద్ర వేసింది. ఈసారి రికార్డ్ స్థాయిలో 38 బిలియన్ డాలర్ల లోటు బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు సీనియర్ పార్లమెంటేరియన్ తెలిపారు. ఇది రష్యాపై విజయాన్ని సాధించటమే లక్ష్యంగా తీసుకొచ్చిన బడ్జెట్గా పేర్కొన్నారు. మొత్తం 295 మంది సట్టసభ్యులు బడ్జెట్కు జై కొట్టారని పార్లమెంట్ ఆర్థిక, ట్యాక్స్, కస్టమ్స్ పాలసీ కమిటీ తొలి డిప్యూటీ ఛైర్మన్ యరస్లావ్ ఝెలెజ్నాక్ టెలిగ్రామ్ యాప్ వేదికగా వెల్లడించారు. అయితే, ఇతర విషయాలేమీ బయటకు చెప్పలేదు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బడ్జెట్ లోటు స్థూల దేశీయోత్పత్తిలో 20.6 శాతంగా ఉంటుదని, 2023లో జీడీపీ వృద్ధి 3.2 శాతంగా ఉండనుందని అంచనా. వచ్చే ఏడాది ద్రవ్యోల్బణం 28 శాతంగా ఉండవచ్చని కమిటీ పేర్కొంది. ‘ఇది విజయం కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్. ఎందుకంటే 27.08 బిలియన్ డాలర్లు సాయుధ దళాలు, దేశ భద్రత కోసమే కేటాయించారు. ఆ తర్వాత పింఛన్లు, ఆరోగ్యం, విద్యారంగానికి అధిక వ్యయాలు ఉన్నాయి.’ అని ప్రధానమంత్రి డేనిస్ శ్యామ్హాల్ తెలిపారు. ఇదీ చదవండి: ఊహించని ఝలక్: రష్యాకు రహస్యంగా ఉత్తరకొరియా ఆయుధ సరఫరా! -
జెలెన్స్కీ తీరుపై బైడెన్ అసహనం.. అత్యాశకు పోతే అంతే!
వాషింగ్టన్: రష్యా దాడిని తప్పుపడుతూ ఎప్పటికప్పుడూ ఉక్రెయిన్కు మద్దతుగా నిలుస్తున్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఉక్రెయిన్కు అడగక ముందే ఆర్థికంగా, ఆయుధాల సాయం అందించారు. అలాంటిది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీరుపై జో బైడెన్ అసహనం వ్యక్తం చేశారంటే నమ్ముతారా? అది నిజమే.. జో బైడెన్ అసహనం వ్యక్తం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది జూన్లో ఇరువురి మధ్య ఫోన్ సంభాషణ నడుస్తుండగా ఆయుధాల విషయంపై బైడెన్ అసహనం వ్యక్తం చేసినట్లు ఎన్బీసీ న్యూస్ సోమవారం వెల్లడించింది. జూన్ 15వ తేదీన 1 బిలియన్ డాలర్ల మానవీయ, సైనిక సాయంపై ఉక్రెయిన్ అధ్యక్షుడికి బైడెన్ ఫోన్ చేశారు. ఈ క్రమంలో బైడెన్ వివరాలు చెప్పటం ముగించాక.. ఉక్రెయిన్కు ఇంకా కావాల్సిన ఆయుధాల జాబితాను జెలెన్స్కీ చెప్పటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో అసహనానికి గురైన బైడెన్ స్వరం పెంచి.. ‘కొంచెం కృతజ్ఞత చూపించండి’ అని వ్యాఖ్యానించారు. అయితే, అలాంటిదేమి లేదని బుకాయించేప్రయత్నం చేశారు జెలెన్స్కీ. సాయం చేసినందుకు బైడెన్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ వీడియో సందేశాన్ని పంపారు. కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ రిపోర్టు ప్రకారం.. 2022లో అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధాలు ఉక్రెయిన్కు వచ్చాయి. అమెరికా ఇచ్చిన ఆయుధాల్లో హైమొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్స్, స్టింగర్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్, జావెలిన్ క్షిపణులు, ఎం-17 హెలికాప్టర్లు ఉన్నట్లు పెంటగాన్ నివేదికలు చెబుతున్నాయి. ఇదీ చదవండి: ఉక్రెయిన్ ఎఫెక్ట్: వికీపీడియాకు భారీ జరిమానా -
ఉక్రెయిన్పై రష్యా రాకెట్ల వర్షం.. ఆ నగర ప్రజలకు హెచ్చరిక!
కీవ్: ఉక్రెయిన్పై రష్యా సేనలు భీకర దాడులకు పాల్పడుతున్నాయి. తమ దేశంపై రష్యా బలగాలు అర్ధరాత్రి రాకెట్లతో విరుచుకుపడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ఆరోపించారు. ప్రముఖంగా విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. దాని ద్వారానే దేశంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందన్నారు. పవర్ కట్తో కీవ్ సహా చాలా ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లాయి. ‘మా దేశంపై ఉగ్రవాద చర్యలను రష్యా తీవ్రతరం చేసింది. రాత్రి మా శత్రుదేశం భారీ స్థాయిలో దాడి చేసింది. 36 రాకెట్లు ప్రయోగించింది. అయితే, అందులో చాలా వరకు కూల్చేశాం. కీలకమైన మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులపై దాడులు చేస్తోంది. ఇవి ఉగ్రవాద వ్యూహాలే.’ అని సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు జెలెన్స్కీ. ఖేర్సన్ నగరాన్ని వీడండి.. రష్యా విలీనం చేసుకున్న ఉక్రెయిన్లోని దక్షిణ ప్రాంతం ఖేర్సన్ నగరాన్ని వీడి ప్రజలు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని రష్యా అనుకూల అధికారులు హెచ్చరించారు. ఉక్రెయిన్ ప్రతిదాడులు పెంచిన క్రమంలో ఈ మేరకు హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన కారణంగా నగరంలోని ప్రజలంతా నైపెర్ నదికి అవతలివైపు వెళ్లాలని సూచించారు. ఇదీ చదవండి: ‘బ్రిటన్ ప్రధానిగా బోరిస్ సరైన వ్యక్తి’.. భారత సంతతి ఎంపీ మద్దతు -
‘ఉక్రెయిన్ నుంచి వెంటనే వెళ్లిపోండి’.. భారత పౌరులకు హెచ్చరిక
కీవ్: రష్యాలోని కీలకమైన కెర్చ్ వంతెన పేల్చివేతతో ఉక్రెయిన్పై భీకర దాడులు చేస్తున్నాయి మాస్కో సేనలు. ఇరాన్ ఆత్మాహుతి డ్రోన్లతో విరుచుకుపడుతుండటంతో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా దేశవ్యాప్తంగా దాడులు కొనసాగుతున్నాయి. పరిస్థితులు తీవ్రంగా మారడం వల్ల కీవ్లోని ఇండియన్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్లో ఇంకా ఎవరైనా భారత పౌరులు ఉంటే వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని ట్విటర్ వేదికగా వెల్లడించింది. ‘ఉక్రెయిన్లో భద్రతా పరిస్థితులు మరింద దిగజారుతున్నాయి. పెరుగుతున్న దాడుల దృష్ట్యా భారత పౌరులెవరూ ఇక్కడికి రావొద్దు. భారత పౌరులు, విద్యార్థులు ఎవరైనా ఇంకా ఉక్రెయిన్లోనే ఉండి ఉంటే వీలైనంత త్వరగా అందుబాటులోని మార్గాల ద్వారా దేశాన్ని విడిచి వెళ్లండి’ అని భారత రాయబార కార్యాలయం బుధవారం అడ్వైజరీ జారీ చేసింది. ఉక్రెయిన్లోని నాలుగు నగరాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన రష్యా.. బుధవారం అక్కడ మార్షల్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ చట్టానికి భయపడి ఖేర్సన్లో కొంతమంది పడవల్లో ఇతర ప్రాంతాలకు పారిపోతున్నారు. ఈ నాలుగు ప్రాంతాలను యుద్ధ కేంద్రాలుగా చేసుకుని రష్యా తమ దాడులను మరింత పెంచే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ఎంబసీ తాజా అడ్వైజరీ జారీ చేసింది. ఇదీ చదవండి: బ్రిటన్లో తీవ్రమైన సంక్షోభం.. తిండికి దూరంగా లక్షల మంది! -
ఇరాన్ ‘డ్రోన్’లతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి.. రష్యా కొత్త పంథా!
కీవ్: వారాంతం ముగిసి సోమవారం విధుల్లోకి వెళ్లే ఉద్యోగులతో బిజీగా మారిన ఉక్రెయిన్ రాజధానిని రష్యా డ్రోన్లు చుట్టుముట్టాయి. ఆత్మాహుతి బాంబర్లుగా మారి బాంబుల వర్షం కురిపించాయి. దీంతో బాంబు శబ్దాల హోరుతో కీవ్ దద్దరిల్లింది. ప్రాణభయంతో జనం సమీప సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. బాంబుల ధాటికి పలు భవనాలు నేలమట్టమయ్యాయి. కొద్దిరోజులుగా కీవ్పై దాడి ఎక్కుపెట్టిన రష్యా వైమానిక దళం దెబ్బకు రాజధాని ప్రజలు నిరంతరం ఆకాశం వైపు చూస్తూ భయంభయంగా బయట సంచరిస్తున్నారు. గతంలో క్షిపణి దాడులకు దిగిన రష్యా బలగాలు ఈసారి ఇరాన్ తయారీ షహీద్(జెరాన్–2) డ్రోన్లకు పనిచెప్పాయి. కీవ్లో ధ్వంసమైన ఒక భవంతి శిథిలాల నుంచి 18 మందిని ఉక్రెయిన్ సేనలు సురక్షితంగా కాపాడాయి. డ్రోన్ల దాడిలో కీవ్లో ఓ గర్భిణి, ఆమె భర్త సహా మొత్తం నలుగురు, సుమీ ప్రాంతంలో మరో నలుగురు కలిపి మొత్తం 8 మంది మరణించారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా యుద్ధ విమానం కూలిపోయి నలుగురు మృతి చెందిన క్రమంలో ఈ దాడులు చేసినట్లు సమాచారం. డ్రోన్ల దాడిని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఖండించారు. రష్యాకు డ్రోన్లు అందిస్తున్న ఇరాన్పై ఆంక్షలు విధించాలను యూరోపియిన్ యూనియన్ను కోరారు. ఇదీ చదవండి: పుతిన్ వార్నింగ్ని బేఖాతారు చేస్తూ..నాటో సైనిక కసరత్తులు -
ఉక్రెయిన్ను కాపాడేందుకు రంగంలోకి అమెరికా!
వాషింగ్టన్: కెర్చ్ వంతెన పేలుడుకు ప్రతీకారంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు నగరాలపై క్షిపణులతో భీకర దాడులకు దిగింది రష్యా. ఈ దాడుల్లో 10 మందికిపైగా మృతి చెందారు. మిసైల్స్తో విరుచుకుపడుతున్న రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్కు మరోమారు అండగా నిలిచింది అమెరికా. మిసైల్స్ను గాల్లోనే ధ్వంసం చేసేందుకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అందిస్తామని హామీ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. రష్యా క్షిపణి దాడుల క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీతో ఫోన్ ద్వారా మాట్లాడారు బైడెన్. ‘అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తోపాటు అవసరమైన రక్షణ వ్యవస్థలను అందిస్తామని బైడెన్ భరోసా కల్పించారు. విచక్షణారహిత దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వారికి బైడెన్ తన సంతాపం తెలిపారు. అలాగే.. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించటం, యుద్ధ నేరాలకు రష్యాను బాధ్యుడిగా చేయటానికి మిత్రపక్షాలపై ఒత్తిడి తెస్తామన్నారు.’ అని వైట్హౌస్ ఓ ప్రకటన చేసింది. మరోవైపు.. బైడెన్తో ఫోన్లో మాట్లాడిన తర్వాత ట్వీట్ చేశారు జెలెన్స్కీ. రక్షణ సహకారంలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కు మా తొలి ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఇదీ చదవండి: కీవ్పై రష్యా భీకర దాడులు -
రష్యా ప్రతీకార చర్య.. ఉక్రెయిన్పై మిసైల్స్తో భీకర దాడులు
కీవ్: కెర్చ్ వంతెన పేల్చివేతతో ఉక్రెయిన్పై సైనిక చర్యలో రష్యాకు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కీలకమైన క్రిమియా-రష్యా వంతెనపై పేలుడుకు ఉక్రెయిన్ కారణమని ఆరోపించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఇది ముమ్మాటికి ఉగ్రవాద చర్యతో సమానమని విమర్శించారు. ఆ మరుసటి రోజే ఉక్రెయిన్ రాజధాని కీవ్లో వరుస పేలుళ్లు భయానక పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ఉదయం 8.15 గంటలకు తొలిసారి పేలుడు సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. బ్లాస్ట్ జరిగిన ప్రాంతానికి భారీగా అంబులెన్స్లు తరలివెళ్లాయని పేర్కొంది. ఉక్రెయిన్లో చాలా నగరాల్లో సోమవారం మిసైల్ దాడులు జరిగినట్లు ఆరోపించారు అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. ‘మిసైల్స్ దాడిలో ఉక్రెయిన్ చిక్కుకుంది. దేశంలోని చాలా నగరాల్లో దాడులు జరిగినట్లు తెలుస్తోంది.’ అని అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ‘రాజధాని కీవ్లోని షెవ్చెన్కివిస్కీ జిల్లాలో పలు భారీ స్థాయి పేలుళ్లు సంభవించాయి.’ అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు కీవ్ మేయర్ విటాలి క్లిట్స్చ్కో. మరోవైపు.. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వీడియోల్లో పలు ప్రాంతాల్లో నల్లటి పొగ అలుముకున్నట్లు కనిపిస్తోంది. రాజధాని కీవ్పై చివరిసారిగా జూన్ 26న దాడి చేశాయి రష్యా సేనలు. తాజాగా కెర్చ్ వంతెన కూల్చివేతకు ప్రతీకార దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్లోని జపోరిజియా ప్రాంతంలో రష్యా ఆదివారం జరిపిన మిసైల్స్ దాడుల్లో 13 మంది మరణించారు. ఈ దాడిని అత్యంత క్రూరమైన దాడిగా అభివర్ణించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. ఈ దాడిలో 11 మంది చిన్నారుల సహా మొత్తం 89 మంది తీవ్రంగా గాయపడ్డారు. రష్యాలోని కీలక వంతెన పేలుడు తర్వాత ఉక్రెయిన్ పేలుళ్ల ఘటనలు పెరిగాయి. దీంతో ఉక్రెయిన్లో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: క్రిమియా వంతెన బాంబు దాడి: ఉగ్రవాదమన్న పుతిన్.. ఉక్రెయిన్ ఘాటు కౌంటర్ -
రష్యాకు గట్టి షాక్.. ఉక్రెయిన్ చేతికి ‘విలీన’ ప్రాంతాలు!
కీవ్: ఉక్రెయిన్పై కొన్ని నెలలుగా సైనిక చర్య పేరుతో భీకర దాడులు చేస్తోంది రష్యా. ఈ క్రమంలోనే నాలుగు కీలక ప్రాంతాలను ఆక్రమించుకుంది. ఆ ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకుంటున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. అయితే.. ఉక్రెయిన్ తెగువకు రష్యాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పుతిన్ సేనలను చుట్టుముడుతూ.. ఆక్రమిత ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటోంది ఉక్రెయిన్. కీవ్ వ్యూహరచనతో రష్యా సేనలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. కీలక ప్రాంతాలను వదిలి వెనక్కి మళ్లుతున్నట్లు రష్యా సైతం ఒప్పకోవటం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. తాజాగా మరో రష్యాకు గట్టి షాక్ ఇచ్చింది ఉక్రెయిన్. క్రెమ్లిన్ విలీనం చేసుకుంటున్నట్లు ప్రకటించిన నాలుగు ప్రాంతాల్లోని 400 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తిరిగి చేజిక్కించుకున్నట్లు ప్రకటించింది. ‘అక్టోబర్ నెల మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఖేర్సన్ ప్రాంతంలో సుమారు 400 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఉక్రెయిన్ బలగాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి.’ అని ఉక్రేనియన్ దక్షిణ ఆర్మీ కమాండ్ ప్రతినిధి నటాలియా గుమెనియుక్ వెల్లడించారు. మరోవైపు.. ఈ వాదనలను తోసిపుచ్చింది రష్యన్ ఆర్మీ. రష్యా సరిహద్దు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ సేనలను మరింత వెనక్కి పంపించినట్లు పేర్కొంది. దడ్చనీ, సుఖనోవ్, కడాక్, బ్రుస్కినస్కో ప్రాంతాల్లో చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నా.. తమ బలగాలు అడ్డుకుంటున్నట్లు తెలిపింది. ఇదీ చదవండి: విలీనానికి రష్యా చట్టసభ సభ్యుల ఆమోదం -
ఉక్రెయిన్ వ్యూహంతో రష్యా ఉక్కిరిబిక్కిరి.. ఆ నగరం వదిలి పరార్!
కీవ్: ఉక్రెయిన్తో గత కొన్ని నెలలుగా యుద్ధం చేస్తున్న రష్యాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రష్యా బలగాల ఆధీనంలో ఉన్న ఖార్కీవ్లోని రెండో అతిపెద్ద నగరమైన లైమన్ను ఉక్రెయిన్ దళాలు చుట్టుముట్టాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడి నుంచి మాస్కో తన బలగాలను వెనక్కి రప్పించాల్సి వచ్చింది. ఇది జెలెన్స్కీ సేనకు వ్యూహాత్మక విజయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉక్రెయిన్లోని నాలుగు కీలక ప్రాంతాలను తమలో విలీనం చేసుకుంటున్నట్లు ప్రకటించిన రెండు రోజుల్లోనే ఇలా జరగటంతో రష్యాకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఈ క్రమంలో మాస్కో స్వల్ప శ్రేణి అణు బాంబులను పరిశీలించాలని సూచించారు పుతిన్కు అత్యంత సన్నిహితుడు, చెచ్నియా నాయకుడు రామ్జాన్ కడిరోవ్. సరిహద్దు ప్రాంతంలో మార్షల్ చట్టాన్ని ప్రయోగించాలన్నారు. లైమన్ నగరం నుంచి బలగాలను ఉపసంహరించినట్లు రష్యా సైతం ప్రకటన చేసింది. అయితే, ఉక్రెయిన్ దళాలు తమను చుట్టుముట్టలేదని, తామే వ్యూహాత్మకంగా వదిలేసి వచ్చామని బుకాయించే ప్రయత్నం చేసింది. లైమన్ నగరంలో రష్యా దళాలు సుమారు 5000లకుపైగా ఉన్నాయని, శత్రు దేశ బలగాలు అంతకన్నా తక్కువేనని పేర్కొంది. ‘ఉక్రెయిన్ బలగాలు చుట్టుముట్టే ప్రమాదం ఉందన్న అంచనాలతో వ్యూహాత్మకంగా తమ బలగాలను ఉపసంహరించుకున్నాం.’ అని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. లైమన్ నగరాన్ని చుట్టుముట్టామని, తమ బలగాలు నగరంలోకి ప్రవేశించాయని ఉక్రెయిన్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఈ ప్రకటన రావటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదీ చదవండి: Russia-Ukraine War: ‘రష్యా రిఫరెండం’పై ఓటింగ్కు భారత్ దూరం -
Russia Ukraine War: ‘విలీనం’ రోజే రష్యా మొదలెట్టేసిందిగా..!
కీవ్: ఉక్రెయిన్లోని నాలుగు కీలక ప్రాంతాలను విలీనం చేసుకున్నట్లు ప్రకటించింది రష్యా. ఆ రోజు నుంచే తమ ఆధీనంలోని ప్రాంతాల్లో ఉక్రెయిన్ మద్దతుదారులను అణచివేసే దుశ్చర్యలు మొదలు పెట్టింది. ఉక్రెయిన్ జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రస్తుతం రష్యా సేనల ఆధీనంలో ఉంది. ఈ క్రమంలో న్యూక్లియర్ ప్లాంట్ డైరెక్టర్ జనరల్ ఇహోర్ మురాషోవ్ను రష్యా కిడ్నాప్ చేసినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఎనెర్హోడార్కు వెళ్తున్న క్రమంలో మురాషోవ్ కారును అడ్డగించిన రష్యా సేనలు.. ఆయన కళ్లకు గంతలు కట్టి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు కీవ్ ప్రభుత్వ న్యూక్లియర్ ఏజెన్సీ ‘ఎనర్జోఆటమ్’ వెల్లడించింది. మురాషోవ్ కిడ్నాప్.. జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ భద్రతను ప్రమాదంలో పడేసిందని ఎనర్జోఆటమ్ ప్రెసిడింగ్ పెట్రో కొటిన్ ఆందోళన వ్యక్తం చేశారు. మురాషోవ్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. మురాషోవ్ కిడ్నాప్పై రష్యా, అంతర్జాతీయ అణు విద్యుత్ ఏజెన్సీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇదీ చదవండి: Russia Ukraine War: ఉక్రెయిన్ నగరాలపై రష్యా దాడులు -
రష్యా ఆక్రమిస్తోంది.. ‘నాటో’లో త్వరగా చేర్చుకోండి మహా ప్రభో!
కీవ్: ఉక్రెయిన్లోని నాలుగు ఆక్రమిత ప్రాంతాలను తమ దేశంలో అధికారికంగా విలీనం చేసుకున్నట్లు ప్రకటించింది రష్యా. ఈ క్రమంలో మిలిటరీ కూటమి నాటోవైపు చూస్తోంది ఉక్రెయిన్. రష్యా ఆక్రమణల వేళ నాటో సభ్యత్వ ప్రక్రియను వేగవంతం చేయాలని పశ్చిమ దేశాలను కోరినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ తెలిపారు. ఈ మేరకు జెలెన్స్కీ మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అధ్యక్ష కార్యాలయం. ‘ఇప్పటికే నాటో కూటమి ప్రమాణాలకు అనుకూలంగా ఉన్నామని మేము నిరూపించుకున్నాం. నాటోలో సభ్యత్వం వేగవంతం చేయాలని కోరుతూ చేసే దరఖాస్తుపై సంతకం చేస్తూ మేము నిర్ణయాత్మక అడుగు వేస్తున్నాం. వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం రష్యాతో కీవ్ చర్చలు చేపట్టదు. కొత్త అధ్యక్షుడితోనే సంప్రదింపులు చేపడతాం.’ అని వీడియోలో మాట్లాడారు జెలెన్స్కీ. ఉక్రెయిన్లోని ఖేర్సన్, జపోరిజియా, లుహాన్స్క్, డొనెట్స్క్ ప్రాంతాలను రష్యాలో విలీనం చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. పుతిన్ ప్రకటన వచ్చిన కొద్ది సేపటికే జెలెన్స్కీ ఈ మేరకు వీడియో విడుదల చేశారు. ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా రష్యాలో చేరేందుకే ప్రజలు మొగ్గు చూపినట్లు అక్కడి నేతలు తెలిపారు. దీంతో ఉక్రెయిన్ ప్రాంతాలను అధికారికంగా తమలో విలీనం చేసుకుంది రష్యా. Ukrainian President Volodymyr Zelenskyy signs application for fast-track NATO membership after Russia's annexation of Lugansk, Donetsk, Kherson and Zaporizhzhia.#NATORussia #RussiaUkraineWar #UkraineRussianWar pic.twitter.com/i1YXuJ0B4I — Annu Kaushik (@AnnuKaushik253) September 30, 2022 ఇదీ చదవండి: రష్యా రక్తపిపాసి! ఉగ్రవాదులే ఇలా చేయగలరు: జెలెన్స్కీ -
రష్యా మరో ఎత్తుగడ.. ఉక్రెయిన్ ప్రాంతాల విలీనానికి ‘రిఫరెండం’
కీవ్: ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగాలను సంపూర్ణంగా విలీనం చేసుకొనే ప్రక్రియను రష్యా వేగవంతం చేసింది. ఆ ప్రాంతాల్లో శుక్రవారం రిఫరెండం మొదలు పెట్టింది. లుహాన్స్క్, ఖేర్సన్తోపాటు జపోరిజియా, డోనెట్స్క్లోని కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఇది మంగళవారం దాకా కొనసాగుతుందని ఉక్రెయిన్లోని రష్యా అనుకూల వర్గాలు వెల్లడించాయి. రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో రష్యన్ భాష మాట్లాడేవారే ఎక్కువ. వారంతా రష్యాలో చేరడానికి మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. తమకు అనుకూలమైన ఉక్రెయిన్ తిరుగుబాటుదారులతోనే ఈ ప్రక్రియ చేయించింది. శుక్రవారం నుంచి ప్రారంభమైన ఈ ఓటింగ్ ఈనెల 27న ముగియనుంది. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా 4ప్రాంతాలను తమ దేశంలో విలీనం చేసుకుని, సరిహద్దులను సవరించుకుంటే, వాటిజోలికి ఎవరూరారని రష్యా మాజీ అధ్యక్షుడు, ఆ దేశ భద్రతామండలి ఉపాధ్యక్షుడు మెద్వదేవ్ పేర్కొన్నారు. ఈ ప్రాంతాలు రష్యాలో విలీనం అయ్యాక వీటిని కాపాడుకునేందుకు అవసరమైతే ఎలాంటి ఆయుధాలనైనా ఉపయోగిస్తామన్నారు. పరోక్షంగా ఆయన అణు హెచ్చరికలు చేశారు. మరోవైపు.. రష్యా ఆక్రమించుకున్న 4 ప్రాంతాల్లో రెఫరెండం చేపట్టడాన్ని ఒక బూటకపు ప్రక్రియగా ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా అభివర్ణించారు. రిఫరెండంపై పశ్చిమ దేశాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదీ చదవండి: పుతిన్ ప్రకటనతో రష్యాలో అల్లకల్లోలం.. భయాందోళనతో దేశం బయటకు! -
రష్యాకు ఊహించని ఎదురుదెబ్బ.. యుద్ధంలో కీలక పరిణామం
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ సేనలు తమ భూభాగాన్ని తిరిగిపొందేందుకు శుత్రుదేశాన్ని చావుదెబ్బకొడుతూ ముందుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే రష్యాతో సరిహద్దు ప్రాంతమైన ఆగ్నేయ ఖార్కివ్ను ఉక్రెయిన్ దాదాపు తిరిగి తమ హస్తగతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓస్కిల్ నది, స్వాతోవే మధ్య రష్యా సేనలు ఏర్పాటు చేసిన రక్షణ వలయాన్ని ఉక్రెయిన్ దళాలు నిర్వీర్యం చేశాయి. ఆ ప్రాంతాన్ని దాటి ముందుకెళ్లాయి. దాదాపు తమ భూభాగంలో మెజారిటీ భాగాన్ని తిరిగి పొందాయి. ఉక్రెయిన్ సైన్యం ఇచ్చిన ఊహించని షాక్తో రష్యా సేనలు వెనక్కి తగ్గినట్లు బ్రిటన్ రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. గత్యంతరం లేక ఆ ప్రాంతానికి దూరంలో మరో రక్షణవలయాన్ని రష్యా సైన్యం ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపాయి. ఒకవేళ దాన్ని కూడా ఉక్రెయిన్ దళాలు తిరిగి ఆక్రమించుకోగలిగితే యుద్ధంలో రష్యాకు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాయి. మరోవైపు ఉక్రెయిన్లోని ఇజియం నగరం నుంచి రష్యా దళాలు వెనుదిరిగిన తర్వాత ఉక్రెయిన్ అధికారులు అక్కడ శవాల దిబ్బను గుర్తించారు. అక్కడ దాదాపు 440 మృతదేహాలున్నట్లు చెప్పారు. అయితే కచ్చితంగా ఎంతమంది చనిపోయి ఉంటారనే విషయంపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని పేర్కొన్నారు. 440 మంది మృతుల్లో వందలాది మంది పౌరులు, పిల్లలు, ఉక్రెయిన్ సైనికులు ఉన్నట్లు అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. కొంతమందిని చిత్రహింసలు పెట్టి, మరొకొంతమందిని బాంబులతో చంపి ఉంటారని తెలిపారు. రష్యా మారణహోమానికి ఇదే నిలువెత్తు సాక్ష్యమన్నారు. మరోవైపు ఉక్రెయిన్ సేనలు తమ భూభాగాన్ని తిరిగిపొందుతున్న వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చదవండి: నేరస్తులను పట్టుకునేందుకు... దాదాపు 70 శవాలను సూట్కేస్లో కుక్కి.. -
ప్రధాని మోదీని ఆకాశానికెత్తిన అమెరికా మీడియా
భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా మీడియా ఆకాశానికెత్తింది. ఉజ్బెకిస్థాన్లో నిర్వహించిన ఎస్సీఓ సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశమైన ఆయన ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని సూచించడంపై ప్రశంసలతో ముంచెత్తింది. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను హైలైట్ చేస్తూ అమెరికా ప్రముఖ వార్తా సంస్థలు, వాషింగ్టన్ పోస్టు, న్యూయార్క్ టైమ్స్ తమ పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా ప్రచురించాయి. 'సమకాలీన ప్రపంచంలో యుద్ధానికి తావులేదు.. ఉక్రెయిన్తో యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించండి' అని మోదీ పుతిన్తో అన్నారు అంటూ వాషింగ్టన్ పోస్టు హెడ్లైన్లో చెప్పింది. దీంతో రష్యా అధ్యక్షుడు ప్రపంచ నలుమూలల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నట్లు అయిందని పేర్కొంది. మోదీకి బదులిస్తూ.. యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగిస్తామని పుతిన్ మాటిచ్చారని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. భారత్ ఆందోళనను తాము అర్థం చేసుకోగలమని, చర్చల ప్రక్రియను ఉక్రెయిన్ బహిష్కరించడం వల్లే సైన్యం ఇంకా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని పుతిన్ చెప్పినట్లు వెల్లడించింది. ఎస్సీఓ సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా పుతిన్లో మాట్లాడారు. కానీ ఉక్రెయిన్ యుద్ధం గరించి ఒక్క మాట కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదని తెలుస్తోంది. మోదీ మాత్రం ఈ అంశాన్ని లేవనెత్తి యుద్ధాన్ని ఆపాలని కోరడాన్ని అమెరికా మీడియా కొనియాడింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత పుతిన్తో మోదీ భేటీ కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే పలుమార్లు ఫోన్లో ఈ విషయంపై మాట్లాడారు. చదవండి: బీజేపీ హర్ట్ అయ్యింది.. కారణం ఇదే: కేజ్రీవాల్ -
ఉక్రెయిన్ విద్యార్థులకు దేశీయంగా సీట్లు కల్పించలేం
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు దేశీయ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించలేమని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ఉక్రెయిన్ కళాశాలల అనుమతితో మరో దేశంలో వైద్య విద్య పూర్తి చేయడానికి అవకాశం కల్పిస్తామని తెలిపింది. ఈ మేరకు గురువారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు విచారించింది. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులను దేశీయ కళాశాలల్లో ప్రవేశం కల్పించడం చట్టపరంగా సాధ్యం కాదని అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. ‘నీట్లో తక్కువ మార్కులు రావడంతోనే వారంతా ఉక్రెయిన్ వెళ్లారు. నీట్లో తక్కువ మెరిట్ ఉన్న వీరికి ఇక్కడ ప్రవేశాలు కల్పిస్తే ఆయా కాలేజీల్లో సీట్లు పొందలేకపోయిన అభ్యర్థుల నుంచి పిటిషన్లు వెల్లువెత్తే ప్రమాదముంది. ఉక్రెయిన్ యుద్ధంతో కోర్స్ పూర్తి చేయలేని విద్యార్థుల కోసం సెప్టెంబరు ఆరున నేషనల్ మెడికల్ కమిషన్ జారీ చేసిన పబ్లిక్ నోటీస్తో మాకు అభ్యంతరం లేదు. అయితే ఆ నోటీసు వీరికి ఇక్కడి కాలేజీల్లో బ్యాక్ డోర్ ఎంట్రీగా భావించరాదు’ అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘తిరిగొచ్చిన విద్యార్థుల్ని దేశీయ మెడికల్ కాలేజీలకు బదిలీ చేస్తే దేశంలో వైద్య విద్య ప్రమాణాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది’ అని కేంద్రం పేర్కొంది. ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు అకడమిక్ మొబిలిటీ ప్రోగ్రామ్ కింద ఏయే దేశాల్లోని యూనివర్సిటీల్లో వైద్య విద్య పూర్తి చేయొచ్చో తెలిపే జాబితాను గురువారం నేషనల్ మెడికల్ కమిషన్ విడుదల చేసింది. అమెరికా, ఇటలీ, స్పెయిన్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, లిథువేనియా, పోలండ్, స్వీడన్, ఈజిప్టు, ఇజ్రాయెల్, గ్రీస్, ఇరాన్, చెక్ రిపబ్లిక్, జార్జియా, కజకిస్తాన్, స్లోవేకియా, హంగేరీ, ఉజ్బెకిస్తాన్, బెలారస్, లాత్వియాల్లో వైద్య విద్య పూర్తి చేయొచ్చని తెలిపింది. ఇదీ చదవండి: సర్వం అధినాయకత్వం కనుసన్నల్లోనే! -
Russia-Ukraine war: బలపడుతున్న శక్తి
‘మహిళ మగవారికన్నా బలహీనమైనది. ఆమె మనసు బహు సున్నితం. రకరకాల భావోద్వేగాలలో ఆమె స్థిరంగా ఉండలేదు...’ ఇలాంటి స్టేట్మెంట్లను ఏళ్లుగా వింటున్నాం. ఇప్పుడు స్త్రీ తనేం తక్కువ కాదు అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. శక్తిని పుంజుకుంటోంది. ఆ శక్తి ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో నుంచి పుట్టుకొచ్చింది. సమస్య వచ్చినప్పుడే సమర్థత స్థాయి ఏంటో అర్థమవుతుంది. దీనికి సరైన అర్థంలా ప్రపంచానికి కొత్తగా పరిచయం అవుతోంది ఉక్రెయిన్ మహిళ. మందుపాతర నిర్మూలనలో శిక్షణ పొందుతున్న మహిళల సంఖ్య అక్కడ రోజురోజుకూ పెరుగుతోంది. కొన్నేళ్లక్రితం వరకు ఈ రంగంలో మహిళలకు అవకాశాలు ఇవ్వడానికి అక్కడి ప్రభుత్వం వెనకంజ వేసింది. కానీ, యుద్ధం తర్వాత మహిళల్లో వచ్చిన మార్పులతో స్త్రీ శక్తి బలపడుతోంది. ఎలా పుట్టిందంటే.. భయం లేకుండా ముందుకు వచ్చే మహిళలకు రెండేళ్ల క్రితమే ఈ రంగంలోకి వచ్చి, ప్రేరణగా నిలుస్తోంది హన్నా అనే 34 ఏళ్ల మహిళ. దీంతో ఇక మహిళలు చేయలేరు అనుకున్న మరో 450 రకాల ఉద్యోగాలలో నిషేధాన్ని తొలగించి అక్కడి ప్రభుత్వం మహిళలకు ఆహ్వానం పలికింది. భయం నుంచి భరోసా వైపుగా కదులుతున్న మహిళ మార్గం మరింతగా శక్తిమంతం అవుతోంది. ఉత్తర ఉక్రేనియన్లోని చెర్నిహివ్ను చూస్తే చాలు ఐదు నెలల క్రితం జరిగిన యుద్ధం చేసిన నాశనం ఎలా ఉంటుందో చూడచ్చు. శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లు, దెబ్బతిన్న పెద్ద పెద్ద బిల్డింగులతో రోడ్లు మూసుకుపోయి ఉంటాయి. ‘ఇక్కడ పేలని మందుపాతరలు ఉన్నాయి’ అని సూచించే బోర్డ్ ఉన్నచోట ‘మందుపాతరల వల్ల కలిగే నష్టాలు, వాటిని ఎలా గుర్తించాలో, దూరంగా ఎలా ఉండాలో’ హన్నా తన చుట్టూ ఉన్న వారికి వివరిస్తుంటుంది. మందుపాతర నిర్మూలనలో శిక్షణ పొందుతున్న మహిళలకు ఆమె ప్రేరణగా నిలుస్తోంది. హన్నా రెండేళ్ల క్రితం మందుపాతరలను తొలగించే ఫౌండేషన్లో చేరింది. కిందటి ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్పై దాడికి దిగినప్పుడు ఆమె నార్త్ ఉక్రెయిన్వైపుగా వెళ్లింది. యుద్ధ నాశనం తర్వాత మందుపాతరల నుండి నగరాలను, పట్టణాలను సురక్షితంగా మార్చడానికి చెర్నిహివ్ పనిచేస్తోంది. ఏం చేస్తోందంటే... తూర్పు ఉక్రెయిన్లో 2014 జరిగిన అలజడుల కారణంగా మహిళలు అధిక సంఖ్యలో కొత్త పాత్రలను పోషించడంతో రక్షణ, భద్రతా రంగాలలో మార్పులు వేగవంతం అవడం కొంతకాలంగా కొనసాగుతోంది. మొన్నటి వరకు స్త్రీలు సమాజంలో పోరాట పాత్రల నుండి నిషేధించబడ్డారు. ఇప్పటికీ పురుషులతో సమానమైన హోదా, ప్రయోజనాలు, గుర్తింపు లేకుండా పోరాటంలో పాల్గొంటూనే ఉన్నారు. ఎంతోకాలంగా ఉన్న మూస పద్ధతులను ఎదుర్కొనేందుకు యుద్ధంలో ఒక శక్తిగా మారారు అక్కడి మహిళలు. పురుషులు ఇప్పటికే సైన్యంలో మెజారిటీ సంఖ్యలో యోధులుగా ఉండటంతో, మహిళలు తమ కుటుంబాలు చూసుకోవడంతోపాటు వ్యాపారాలను నడుపుతున్నారు. దీంతో అన్ని రంగాల్లో మహిళ స్థానం మరింతగా శక్తిని పుంజుకుంటోందని స్పష్టం అవుతుంది. ఉక్రేయిన్ సామాజిక శాస్త్రవేత్త అన్నా క్విట్ మాట్లాడుతూ –‘సాధారణంగా మహిళలలో అవగాహన పితృస్వామ్యంగా ఉంటుంది. ఈ యేడాది పెరిగిన యుద్ధంతో ఎదుర్కోవడానికి మహిళల భాగస్వామ్యం పెరిగింది’ అని వివరించడం చూస్తుంటే సమస్య మహిళను సమర్థవంతంగా ప్రపంచానికి చూపడానికే అనేది స్పష్టం అవుతోంది. ప్రపంచం చూపు తనవైపు నిజానికి సైన్యం, యుద్ధం మహిళల స్థలం కాదు. ఇది మన సమాజంలో ఎప్పటి నుంచో ఉన్న మాటే. కానీ, నేడు అన్నిదేశాలలో మహిళలకు సాయుధ దళాలలో పురుషులతో సమానమైన చట్టపరమైన హోదా ఇచ్చింది. ఈ మార్పు మరిన్ని కొత్త మార్పులకు, అవకాశాలకు మార్గం విస్తృతం చేసింది. ఫలితంగా ఉక్రెయిన్లో మహిళలకు నిషేధంలో ఉన్న రంగాలను గుర్తించి, అక్కడి చట్టాలను పక్కన పెట్టి 450 రక్షణ, భద్రతాపరమైన వృత్తులలో దేనిలోనైనా మహిళలు చేరచ్చు అని ఆహ్వానం పలికింది. వీటిలో మందుపాతర తొలగింపుతో పాటు ట్రెక్కింగ్, వెల్డింగ్, అగ్నిమాపక, భద్రత, రక్షణ ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు ‘ఉక్రెయిన్ దేశ సాయుధ దళాలలో 50,000 మందికి పైగా మహిళలు ఉన్నారని, యుద్ధం మొదలైననాటి నుంచి వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంద’ని అక్కడి రక్షణ శాఖ వెల్లడించింది. అయినప్పటికీ కీలక నిర్ణయాధికారులు, మెజారిటీ యోధులు పెరుగుతున్న మహిళల సంఖ్య స్పçష్టంగా చెప్పడం లేదనేది నిపుణులు చెబుతున్న మాట. నిజానికి మహిళలు తమకు ఏ మాత్రం గుర్తింపులేకున్నా కీలకమైన పనులు చాలా చేస్తారు. రకరకాల సంఘర్షణల్లో ఉన్న సమాజాలను నిలబెట్టే అన్ని విషయాల్లోనూ స్త్రీలు తమ సమర్థతను చూపుతారని ఉక్రెయిన్ మహిళ యుద్ధరంగాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం అవుతుండటం స్పష్టం చేస్తోంది. -
ఉక్రెయిన్తో యుద్ధంలో అన్ని వేల మంది రష్యా సైనికులు చనిపోయారా?
కీవ్: రష్యాతో ఆరు నెలలుగా జరుగుతున్న యుద్ధంలో ఆ దేశానికి చెందిన 45,550 మంది సైనికులను మట్టబెట్టినట్లు ఉక్రెయిన్ శనివారం వెల్లడించింది. శుక్రవారం ఒక్కరోజే 250 రష్యా బలగాలను హతమార్చినట్లు ఉక్రెయిన్ ఆర్మీ జనరల్ స్టాఫ్ ఫేస్బుక్ వేదికగా తెలిపారు. అంతేకాదు ఫిబ్రవరి 24 నుంచి జరుగుతున్న ఈ భీకర పోరులో రష్యాకు చెందిన 2,000 యుద్ధ ట్యాంకులు, 1,045 ఆయుధ వ్యవస్థలు, 836 డ్రోన్లు, 3,165 వాహనాలను ఉక్రెయిన్ సేనలు ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్ చెప్పిన లెక్కలకు ఆధారాలు లేకపోయినప్పటికీ ఇటీవల బ్రిటన్ రక్షణమంత్రి బెన్ వాలేస్ అంచనాలకు ఇవి దాదాపు సమానంగా ఉన్నాయి. యుద్ధంలో రష్యాకు ఇప్పటివరకు మొత్తం 80వేల మంది ప్రాణ నష్టం జరిగి ఉండవచ్చని ఆయన ఇటీవల ఓ కార్యక్రమంలో అన్నారు. అమెరికాకు న్యూయార్క్ టైమ్స్ నివేదిక మాత్రం యుద్ధంలో 25 వేల మంది రష్యా సైనికులు మరణించి ఉంటారని అంచనా వేసింది. అలాగే 9000 మంది ఉక్రెయిన్ సైనికులు రష్యా దాడుల్లో ప్రాణాలు కోల్పోయి ఉంటారని పేర్కొంది. రష్యా దాడుల్లో 5,587మంది ఉక్రెయిన్ పౌరులు మరణించి ఉంటారని కచ్చితంగా చెప్పగలమని ఐక్యరాజ్య సమితి ఇటీవల వెల్లడించింది. వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉండవచ్చని పేర్కొంది. మరోవైపు యుద్ధంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ తేల్చి చెప్పింది. తాము ఒకవేళ నాటోలో చేరాలనే ఆలోచన మార్చుకున్నా యుద్ధాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేసింది. చదవండి: అంతా చీకటే.. షింజో అబే హంతకుడి ఆవేదన -
తెరపైకి పుతిన్ బాడీ డబుల్ థియరీ!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విషయంలో పాశ్చాత్య మీడియా వీలైనంత వ్యతిరేక ప్రచారం చేసుకుంటూ పోతోంది. ఉక్రెయిన్ యుద్ధం వంకతో వీలైనంత రీతిలో పుతిన్ను బద్నాం చేస్తోంది. ఆయన ఆరోగ్యం క్షీణించిందని.. ఎక్కువ కాలం బతకడంటూ వీడియో కథనాలతో ఊదరగొడుతోంది. ఇప్పుడు ఏకంగా మరో థియరీని తెరపైకి తెచ్చింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం బాగోలేదని చాలాకాలం నుంచి వెస్ట్రన్ మీడియా వరుస కథనాలు ఇస్తోంది. ఈ క్రమంలో 69 ఏళ్ల పుతిన్ తనకు బాడీ డబుల్ను తెరపైకి తెచ్చాడంటూ ఉక్రెయిన్ కొత్త వాదన తెరపైకి తెచ్చింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పుతిన్.. నిత్యం మెడికల్ చెకప్లకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే అధికారిక కార్యక్రమాలకు ఆయన తన బాడీ డబుల్ను ఉపయోగిస్తున్నాడని ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ మేజర్ జనరల్ కైర్య్లో బుడానోవ్ చెప్తున్నాడు. పుతిన్ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తే.. చాలా భేటీల్లో ఆయన హైట్, వెయిట్, చెవుల భాగంలో తేడాలను పరిశీలించవచ్చని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మనిషి చేతి వేళ్లు యూనిక్గా ఉన్నట్లే.. చెవి భాగం సైతం యూనిక్గా ఉంటుంది. అలాంటిది పుతిన్లో ఆ భాగంలో తేడాను సులువుగా గమనించవచ్చు. బహుశా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పుతిన్.. ప్రజలకు కనిపించేందుకు వీలుగా తన బాడీ డబుల్స్ను ఉపయోగించుకుంటున్నాడేమో అని అనుమానం వ్యక్తం చేశాడు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ చీఫ్. అంతేకాదు ఇరాన్ పర్యటనకు సైతం పుతిన్ తన బాడీ డబుల్నే పంపించాడని, పైగా ఆ పర్యటనలో పుతిన్ బాగా జోష్లో కనిపించిన విషయం ఆ అనుమానాల్ని మరింత బలపరుస్తోందని చెప్పాడాయన. మరోవైపు ఈ వాదనపై క్రెమ్లిన్ గప్చుప్గా ఉండిపోయింది. పుతిన్ బాడీ డబుల్ థియరీ ఇలా తెర మీదకు రావడం ఇదే కొత్త కాదు. 2018లో పుతిన్ లాగ ముగ్గురు ఉన్నారంటూ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ ఆసక్తికర కథనం ప్రచురించింది. ఆ సమయంలో ట్విటర్లోనూ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న మూడు భిన్నమైన రూపాలున్న పుతిన్ ఫొటోలు వైరల్ అయ్యాయి కూడా. బాడీ డబుల్ అంటే.. ఒక వ్యక్తి బదులుగా అలాంటి కవళికలు ఉన్న వ్యక్తి ఆ పనిని పూర్తి చేయడం. చరిత్రలో బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్, ఫీల్డ్ మార్షల్ బెర్నార్డ్ లా మోంట్గోమెరీ, సద్దాం హుస్సేన్, జోసెఫ్ స్టాలిన్లు బాడీ డబుల్ను ఉపయోగించేవాళ్లన్న విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ఇదీ చదవండి:: గొప్పలకు పోతున్న రష్యా!... కౌంటర్ ఇచ్చిన ఆర్మీ ఇంటెలిజెన్స్ -
ఉక్రెయిన్ జైలుపై భీకర దాడి.. 53 మంది మృత్యువాత!
కీవ్: ఉక్రెయిన్లోని యుద్ధ ఖైదీలను నిర్బంధించిన జైలుపై శుక్రవారం జరిగిన భీకర రాకెట్ దాడిలో 53 మంది చనిపోగా మరో 75 మంది గాయపడ్డారు. మరియుపోల్ నగరం హస్తగతమయ్యాక యుద్ధ ఖైదీలుగా చిక్కిన ఉక్రేనియన్లను రష్యా అనుకూల వేర్పాటు వాదులు ఒలెనివ్కా జైలులోనే ఉంచారు. ఈ ఘటనపై ఉక్రెయిన్, రష్యా పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. అమెరికా రాకెట్ లాంఛర్లతోనే ఉక్రెయిన్ బలగాలు ఈ దాడి చేశాయని రష్యా ఆరోపించింది. ఘటన ప్రాంతంలో పడిన అమెరికా తయారీ రాకెట్ విడిభాగాలను కనుగొన్నట్లు అధికార నొవొస్తి వార్తా సంస్థ తెలిపింది. ఉక్రేనియన్లపై చిత్రహింసలు, మరణశిక్షల అమలును కప్పిపుచ్చుకునేందుకు రష్యానే ఈ దాడికి పాల్పడినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. ఇదీ చదవండి: డైనోసార్ అస్థిపంజరానికి 49 కోట్లు.. -
Ukraine Students: ‘మా పిల్లల భవిష్యత్తుకు కేంద్రమే భరోసా కల్పించాలి’
సాక్షి, న్యూఢిల్లీ: తమ పిల్లల భవిష్యత్తుకు కేంద్రమే భరోసా కల్పించాలని ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. రాంలీలా మైదానంలో ‘పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఉక్రెయిన్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్’ రెండో రోజు దీక్ష సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. భారతీయ వైద్య వర్సిటీల్లో తమకు అవకాశం కల్పించేలా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్టు–1956, నేషనల్ మెడికల్ కమిషన్ యాక్టులకు సవరణలు చేయాలని కోరారు. పొరుగు దేశం శ్రీలంకకు సాయం చేస్తున్న కేంద్రం దేశంలోని విద్యార్థులకు న్యాయం చేయదా అని ప్రశ్నించారు. నీట్ ర్యాంకు వచ్చినా భారత్లో ఫీజులు అధికం కాబట్టే తమ పిల్లలను ఉక్రెయిన్కు పంపాల్సి వచ్చిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. తమ పిల్లల్ని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వమే వారి భవిష్యత్తును కూడా కాపాడాలని కోరారు. ఇదీ చదవండి: లైవ్స్ట్రీమ్లో భార్య దారుణ హత్య.. భర్తకు ఉరి! -
Ukraine War: కన్నపేగు బంధం.. వీడియోలు చూస్తే కన్నీరు ఆగదు!
కీవ్: యుద్ధంలో పాల్గొనడమంటే మృత్యువుకు ఎదురెళ్లడమే. కదన రంగంలోకి అడుగుపెట్టాక ప్రాణాలతో ఇంటికి తిరిగి వెళ్తామనే గ్యారంటీ ఉండదు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ సైనికులు కొన్ని నెలలుగా పోరాడుతున్నారు. ముఖ్యంగా మహిళా సైనికులు తమ బిడ్డలు, కుటుంబాన్ని వదిలి శత్రువులను నిలువరిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి కాస్త శాంతిచడం వల్ల కొందరు తిరిగి ఇళ్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఆరేళ్ల చిన్నారి చాలా రోజుల తర్వాత తన తల్లి ఇంటికి రావడం చూసి భావోద్వేగానికి లోనయ్యాడు. ఇంటి గేటు వద్దే గోడ చాటున ఆమె కోసం ఎదురు చూశాడు. తీరా తల్లిని చూసిన ఆనందంలో ఏం చేయాలో కూడా అతనికి పాలుపోలేదు. తల్లి చిన్నారిని దగ్గరగా హగ్ చేసుకున్న ఈ వీడియోను ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ సలహాదారు ఆంటోన్ గెరాష్చెన్కో తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఉక్రెయిన్ ఇప్పుడు పోరాడుతోందని దీనికోసమే అన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు చలించిపోయారు. This is what we're fighting for. pic.twitter.com/nX6Lxd3sN6 — Anton Gerashchenko (@Gerashchenko_en) July 19, 2022 ఈ వీడియోలో పెంపుడు కుక్క కూడా చాలా రోజుల తర్వాత మహిళా సోల్జర్ను చూసి తెగ సంబరపడిపోయింది. దానికి కూడా ఒక హగ్ ఇవ్వాల్సింది అని ఓ నెటిజెన్ కామెంట్ పెట్టాడు. మరో వీడియోలో యుద్ధం నుంచి తిరిగి వచ్చిన తండ్రిని చూపించేందుకు ఓ బాలికను కళ్లు మూసి అతని వద్దకు తీసుకెళ్లింది తల్లి. చాలా రోజుల తర్వాత తండ్రిని చూసిన ఆ పాప భావోద్వేగంతో కంటతడి పెట్టుకుంది. తండ్రి కూడా ఆమెను చూసి పట్టరాని ఆనందంలో మునిగిపోయాడు. Daddy came home from war - 2. pic.twitter.com/iOZORtnUSL — Anton Gerashchenko (@Gerashchenko_en) July 9, 2022 చదవండి: రోజుకు రూ.15 వేలు సంపాదిస్తున్నా.. ఏం చేసినా ఇంత డబ్బు రాదు.. అందుకే! -
రష్యాను ఏకాకిని చేయటమా? అది అసాధ్యం: పుతిన్
మాస్కో: ఉక్రెయిన్పై సైనిక చర్యతో విరుచుకుపడుతున్న రష్యాను నిలివరించేందుకు పశ్చిమ దేశాలతో పాటు చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. అయినా.. వెనక్కి తగ్గేదేలే అంటూ దాడులు కొనసాగిస్తున్నారు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఈ నేపథ్యంలో మరిన్ని ఆంక్షలు విధించి.. ప్రపంచ దేశాలకు దూరం చేయాలనే వాదనలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రపంచ దేశాల నుంచి రష్యాను వేరు చేసి ఏకాకిని చేయటం అసాధ్యమని పేర్కొన్నారు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు దశాబ్దాలుగా మాస్కో సాధించిన ప్రగతిని నిలువరించలేవని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు పుతిన్. ‘ప్రస్తుత పరిస్థితి మా దేశానికి ప్రధాన సవాలు అని తెలుసు. మా శత్రు దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్నప్పటికీ.. మేము ప్రజల నమ్మకాన్ని, దశాబ్దాల పురోగతిని కోల్పోము. దేశంలోని సొంత సాంకేతికతను ఉపయోగించుకుంటూ కొత్త పరిష్కారం కోసం దేశం చూస్తోంది. మా దేశానికి పెద్ద సవాలు ఇది. కానీ, మేము వెనక్కి తగ్గేదే లేదు. ప్రపంచానికి దూరంగా ఏకాకిగా మారటమనేది అసాధ్యమని విస్పష్టం.’ అని పేర్కొన్నారు. రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే ప్రయత్నాలను తిప్పికొట్టారు పుతిన్. అందుకోసం దేశీయ తయారీని ప్రోత్సహించటం, అంతర్గతంగా ఎండ్ టూ ఎండ్ టెక్నాలజీని అభివృద్ధి చేయటం, విదేశీ ఎగుమతులను నిలిపివేయటం వంటి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరోవైపు.. రష్యా సాంకేతిక విభాగాలను ప్రోత్సహించటమే తమ తొలి ప్రాధాన్యమని తెలిపారు ఆ దేశ ఆర్థిక మంత్రి అంటోన్ సిలునోవ్. ప్రభుత్వం ఒక రూబల్ పెట్టుబడితో వస్తే.. ప్రైవేటు సంస్థలు మూడు రూబల్ పెట్టాలని కోరారు. ఇదీ చదవండి: ఉక్రెయిన్ని మట్టికరిపించేలా...తదుపరి దశ దాడులకు దిగుతున్న రష్యా! -
Russia Ukraine War: యుద్ధ రక్కసికి బలైన బాల్యం
కీవ్: రష్యా యుద్ధకాంక్షకు బలైన తన చిన్నారి పాపాయి మృతదేహాన్ని చూస్తూ గుండెలవిసేలా రోదించాడు ఓ తండ్రి. ఆ దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఉక్రెయిన్లోని వినిట్సియా సిటీలో గురువారం ఈ చిన్నారిని ఆమె తల్లి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా రష్యా సేనలు బాంబులతో దాడిచేశాయి. చిన్నారితో పాటు 24 మంది దుర్మరణం పాలవగా తల్లి తీవ్రంగా గాయపడి ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది! ఇదీ చదవండి: బాలిక అనుమానాస్పద మృతితో... రణరంగమైన స్కూలు -
ఉక్రెయిన్పై దాడిని ఖండించిన మాస్కో కౌన్సిలర్కు ఏడేళ్ల జైలు
మాస్కో: ఉక్రెయిన్, రష్యా యుద్ధం గత నెలుగు నెలలకుపైగా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి రష్యా సేనలు. యుద్ధం ముగించాలని ప్రపంచ నేతలు సూచిస్తున్నా, కఠిన ఆంక్షలు విధించినా వెనక్కి తగ్గటం లేదు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. తమ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ దాడిని ఖండించిన మాస్కో కౌన్సిలర్ అలెక్సీ గోరినోవ్కు ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ఖండిస్తూ మాట్లాడటమే ఆయన చేసిన తప్పు. క్రాస్నోసెల్స్కీ మున్సిపల్ కౌన్సిల్కు చెందిన 60 ఏళ్ల గోరినోవ్.. సిటీ కౌన్సిల్ సమావేశంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రశించారు. ఉక్రెయిన్లో వందల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారంటూ.. బాలల దినోత్సవంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను తప్పుపట్టారు. ఉక్రెయిన్పై రష్యా దాడిలో చినిపోయిన వారికి సంతాపం తెలుపుతూ కొద్ది సేపు మౌనం పాటించారు. దీంతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆయనపై అభియోగాలు మోపారు. రష్యా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారనే కారణంగా కేసు నమోదైనట్లు తీర్పు చెబుతున్న సందర్భంలో న్యాయమూర్తి ఒలెస్యా మెండెలెయెవ తెలిపారు. ఉక్రెయిన్పై సైనిక చర్య తర్వాత అసమ్మతి వాదులను ఎదుర్కొనేందుకు తీసుకొచ్చిన కొత్త చట్టాల ప్రకారం ఓ వ్యక్తికి జైలు శిక్ష విధించటం ఇదే మొదటి. ఈ కొత్త చట్టాల ప్రకారం.. ప్రభుత్వానికి, ఉక్రెయిన్పై ప్రత్యేక సైనిక చర్యకు వ్యతిరేకంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే వారికి గరిష్ఠంగా 15 ఏళ్ల జైలు శిక్ష విధించేందుకు వీలు కల్పించారు. సైనిక చర్య ద్వారా తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రజల్లో ఆందోళన నెలకొనేలా గోరినోవ్ మాట్లాడారని తీర్పు సందర్భంగా జడ్జి తెలిపారు. విచారణకు హాజరైన సందర్భంగా ఓ చిన్న కాగితంపై 'ఇప్పటికీ ఈ యుద్ధం మీకు అవసరమా?' అంటూ ప్రశ్నించే ప్రయత్నం చేశారు గోరినోవ్. దానిని కెమెరాకు కనిపించకుండా చేసేందుకు అక్కడి భద్రతా సిబ్బంది ప్రయత్నించారు. చదవండి: Russia-Ukraine War: అసలు యుద్ధం ముందే ఉంది -
Russia-Ukraine War: రష్యా బలగాల దాడిలో బ్రెజిల్ మోడల్ మృతి
కీవ్: రష్యా బలగాలు చేసిన క్షిపణి దాడిలో బ్రెజిల్ మాజీ మోడల్, స్నైపర్.. థాలిట డో వల్లె (39) ప్రాణాలు కోల్పోయింది. భీకర యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్లో ఉన్న ఆమె.. ఆ దేశం తరఫున స్నైపర్గా బరిలోకి దిగి రష్యా సేనలకు అడ్డుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయింది. ఖార్కివ్ నగరంపై రష్యా సైన్యం జూన్ 30న క్షిపణులతో విరుచుకుపడింది. మొదటి క్షిపణి దాడి జరిగినప్పుడు తన ట్రూప్లో థాలిట మాత్రమే ప్రాణాలతో మిగిలింది. కాని ఆ తర్వాత మరో క్షిపణి పడటంతో ఆమె మృతి చెందింది. బంకర్లో ఉన్న థాలిట కోసం వెళ్లిన బ్రెజిల్ మాజీ సైనికుడు డాగ్లస్ బురిగో (40) కూడా క్షిపణి దాడిలోనే మరణించాడు. థాలిటకు గతంలో యుద్ధంలో పాల్గొన్న అనుభవం ఉంది. ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్కు వ్యతిరేకంగా ఆమె పోరాడింది. ఇందుకు సంబంధించిన డాక్యుమెంటరీని తన యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేసింది. ఇరాక్లో పెష్మెర్గాస్ సాయుధ బలగాల తరఫున పోరాడే సమయంలోనే స్నైపర్ శిక్షణ తీసుకుంది. ఆమె అనుభవాలను పుస్తకం రూపంలో తీసుకొచ్చేందుకు ఓ రచయిత బ్రెజిల్ సైనికుడితో కలిసి పనిచేస్తున్నాడు. నటిగా.. థాలటి యుక్త వయసులో నటిగా, మోడల్గా పని చేసింది. లా చదివే సమయంలో ఆమె ఎన్జీఓలతో కలిసి జంతువులను కాపాడే కార్యక్రమాల్లో పాల్గొంది. ఆమె సోదరుడు రొడ్రిగో వైరా.. ఆమె ఓ హీరో అని చెప్పాడు. ఎంతో మంది ప్రాణాలు కాపాడేందుకు, మనవతా కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు ఆమె దేశాలు సంచరిస్తుంటుందని పేర్కొన్నాడు. ఆమె ఉక్రెయిన్కు వెళ్లి మూడు వారాలే అవుతోందని చెప్పాడు. అక్కడ సహాయక కార్యక్రమాల్లోనే పాల్గొంటూనే షార్ప్ షూటర్గా సేవలందిస్తోందని తెలిపాడు. అదే చివరిసారి ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా బలగాలు బాంబు దాడులు జరిపినప్పుడు థాలిట తృటిలో ప్రాణాలతో బయపడింది. ఆ తర్వాత ఇంటికి ఫోన్ చేసి తాను క్షేమంగానే ఉన్నానని చెప్పింది. రష్యా బలగాలు డ్రోన్ల ద్వారా తన ఫోన్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నందుకు ఎక్కువ మాట్లాడలేనని కుటుంబసభ్యులు వివరించింది. ఆ తర్వాత ఆమె గత సోమవారమే ఖార్కివ్కు వెళ్లింది. అప్పుడే చివరిసారిగా కుటుంబంతో మాట్లాడింది. -
Russia-Ukraine war: యుద్ధ పాపం పశ్చిమ దేశాలదే
మాస్కో/కీవ్: పొరుగుదేశం ఉక్రెయిన్పై తాము ప్రారంభించిన సైనిక చర్యను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి సమర్థించుకున్నారు. పశ్చిమ దేశాల విధానాలే తమను ఉక్రెయిన్పై యుద్ధానికి పురికొల్పాయని స్పష్టం చేశారు. ఆయా దేశాల చర్యకు ప్రతిచర్యగానే ఈ సైనిక చర్యకు శ్రీకారం చుట్టామన్నారు. రష్యా రాజధాని మాస్కోలోని రెడ్ స్క్వేర్లో సోమవారం ‘విక్టరీ డే’ వేడుకల్లో పుతిన్ పాల్గొన్నారు. మిలటరీ పరేడ్ను తిలకించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే, పరిశీలకులు అంచనా వేసినట్లు పుతిన్ కీలక ప్రకటనలేదీ చేయలేదు. ఉక్రెయిన్పై యుద్ధవ్యూహంలో మార్పు, పూర్తిస్థాయి యుద్ధ ప్రకటన గురించి ప్రస్తావించలేదు. 1945లో నాజీలపై రెడ్ ఆర్మీ సాగించిన పోరాటానికి, ఇప్పుడు ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి మధ్య పోలికలు ఉన్నాయని పరోక్షంగా వెల్లడించారు. సరిహద్దుల అవతలి నుంచి తమ మాతృభూమికి ముప్పు పొంచి ఉండడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని పుతిన్ తేల్చిచెప్పారు. ఉక్రెయిన్పై దండయాత్ర అత్యవసర చర్యేనని ఉద్ఘాటించారు. రష్యాకు ముప్పు రోజురోజుకూ పెరుగుతోందన్నారు. తాము సరైన సమయంలో, సరైన రీతిలో స్పందించామని అన్నారు. రష్యా భద్రతకు హామీతోపాటు ‘నాటో’ విస్తరణ యోచనను విరమించుకోవాలని కోరామన్నారు. అయినా ఫలితం కనిపించలేదని చెప్పారు. రష్యా దళాలు సొంతదేశం భద్రత కోసమే ఉక్రెయిన్లో వీరోచితంగా పోరాడుతున్నాయని ప్రశంసించారు. రష్యాపై దాడులు చేయడానికి ఉక్రెయిన్ గతంలోనే ప్రణాళికలు రచించిందని పుతిన్ ఆరోపించారు. ఉక్రెయిన్పై దాడులు ఇక ఉధృతం! రష్యా క్షిపణి దాడులను తీవ్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని ఉక్రెయిన్ సైన్యం సోమవారం తమ ప్రజలను హెచ్చరించింది. రష్యాలోని బెల్గోరాడ్ ప్రాంతంలో 19 బెటాలియన్ టాక్టికల్ గ్రూప్స్ సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. పుతిన్కు విజయం అసాధ్యం: జి–7 రష్యా నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిషేధించాలని జి–7 దేశాధినేతలు నిర్ణయానికొచ్చారు. అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ దేశాల అధినేతలు ఆదివారం రాత్రి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో వర్చువల్గా భేటీ అయ్యారు. ఈ యుద్ధంలో పుతిన్ విజయం దక్కడం అసాధ్యమని జి–7 దేశాల నాయకులు తేల్చిచెప్పారు. కాగా, పోలండ్లోని రష్యా రాయబారి సెర్గీ అండ్రీవ్కు నిరసన సెగ తగిలింది. వార్సాలోని సోవియట్ సైనిక శ్మశాన వాటికలో దివంగత రెడ్ ఆర్మీ సైనికులకు నివాళులర్పించకుండా అండ్రీవ్ను అడ్డుకున్నారు. ఆయనపై ఎర్రరంగు చల్లారు. త్వరలో మాకు రెండు ‘విక్టరీ డే’లు: జెలెన్స్కీ త్వరలో తాము రెండు విక్టరీ డేలు జరుపుకోబోతున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. ఈ మేరకు సోమవారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో తమ పూర్వీకుల ప్రాణ త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఉక్రెయిన్ ప్రజలు విజయం సాధించారని, ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలోనూ కచ్చితంగా నెగ్గుతామని ఉద్ఘాటించారు. తద్వారా త్వరలోనే రెండు విక్టరీ డేలు జరుపుకుంటామన్నారు. కొందరికి(రష్యా) ఒక్క విక్టరీ డే కూడా ఉండబోదని వ్యాఖ్యానించారు. -
2 నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రధాని మోదీ మొట్టమొదటి విదేశీ పర్యటన ఖరారైంది. ఈనెల 2 నుంచి 4వ తేదీ వరకు ప్రధాని జర్మనీ, ఫ్రాన్సు, డెన్మార్క్లను సందర్శించనున్నారని శనివారం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో యూరప్ దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఏకమైన నేపథ్యంలో జరుగుతున్న ప్రధాని పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఏడు దేశాలకు చెందిన 8 మంది నేతలతో ద్వైపాక్షిక, బహుళపాక్షిక చర్చలు జరుపుతారు. మొదటగా జర్మనీకి, తర్వాత డెన్మార్క్కు వెళ్లనున్న ప్రధాని తిరుగు ప్రయాణంలో పారిస్లో కొద్దిసేపు ఆగి, అధ్యక్షుడు మాక్రాన్తో భేటీ అవుతారు. -
యూరప్ దేశాలు ఇకనైనా మేలుకోవాలి: జైశంకర్
న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో తటస్థ వైఖరిని అవలంబిస్తున్నందుకు భారత్ను విమర్శిస్తున్న వారిపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఎదురు దాడికి దిగారు. ఆసియాకు ఎదురవుతున్న సవాళ్లను పశ్చిమ దేశాలు ఇప్పటిదాకా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ‘అఫ్గానిస్తాన్తోపాటు పలు ఆసియా దేశాల్లో పరిణామాలు ప్రపంచానికే ప్రమాదకరంగా పరిణమించినా యూరప్ దేశాలు పట్టించుకోలేదు. పైపెచ్చు మరింత వాణిజ్యం చేయాలంటూ మాకు సలహాఇచ్చాయి’ అని మంగళవారం ‘రైజినా డైలాగ్’ కార్యక్రమంలో ఆయన విమర్శించారు. నార్వే, లక్జెమ్బర్గ్ విదేశాంగ మంత్రులు, స్వీడన్ మాజీ ప్రధాని ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఉక్రెయిన్ సంక్షోభం యూరప్ దేశాలకు మేలుకొలుపన్నారు. పదేళ్లుగా ఆసియాలో సవ్యమైన పరిస్థితులు లేవన్నారు. ఆసియాలో ప్రతీ దేశ ప్రాదేశిక సార్వభౌమత్వం ప్రమాదంలో పడినప్పటికీ పశ్చిమ దేశాలకు పట్టలేదని, ఇప్పుడు ఉక్రెయిన్ సంక్షోభంతోనైనా వాళ్లు ఈ ఖండంలో సమస్యలపై దృష్టి సారించాలన్నారు. అఫ్గానిస్తాన్ పరిణామాలు, కోవిడ్ మహమ్మారి, అగ్రరాజ్యాల వైరం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపాయన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఇంధన ధరల్లో పెరుగుదల, ఆహార కొరత ఏర్పడటంతో పాటు అంతర్జాతీయ సిద్ధాంతాలు, విలువలకు విఘాతం కలిగిందన్నారు. ఇది చదవండి: తంజావూరు రథయాత్రలో అపశ్రుతి.. -
బంధం మరింత దృఢం
న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు ఫలించి శాంతి నెలకొంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. బుచా నరమేధం ఆందోళనకరమని మోదీ అన్నారు. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించిందని, స్వతంత్ర దర్యాప్తుకు డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. ఇరువురు నేతలు సోమవారం వర్చువల్గా సమావేశమయ్యారు. అమెరికాలో పర్యటిస్తున్న రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్, అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులు లాయిడ్ ఆస్టిన్, ఆంటోనీ బ్లింకెన్, అమెరికాలో భారత రాయబారి తరంజిత్సింగ్ సంధు, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ సమక్షంలో వైట్హౌస్ సౌత్ కోర్ట్ ఆడిటోరియం నుంచి బైడెన్ భేటీలో పాల్గొన్నారు. ఉక్రెయిన్లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారిన వేళ ఈ భేటీ జరుగుతోందన్నారు. రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో ఫోన్లో మాట్లాడానని, సంక్షోభాన్ని ముగించేందుకు పరస్పరం చర్చించుకోవాల్సిందిగా సూచించానని మోదీ గుర్తు చేశారు. భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా సహజ భాగస్వాములన్నారు. ఒకే వైఖరి: బైడెన్ ఉక్రెయిన్ ప్రజలకు భారత్ అందజేస్తున్న మానవీయ సహాయాన్ని బైడెన్ ప్రశంసించారు. యుద్ధం భారత్, అమెరికా సంబంధాలను అస్థిరపరచకుండా జాగ్రత్త పడటంతో పాటు వాటిని మరింతగా ముందుకు తీసుకెళ్లడంపై ఇరు దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. అందుకు తమ తాజా చర్చలు ఎంతగానో దోహదపడతాయని ఆశాభావం వెలిబుచ్చారు. ప్రపంచ శాంతికీ ఇవి తోడ్పడతాయన్నారు. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పటిష్ట రక్షణ బంధాన్ని బైడెన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘‘భారత్, అమెరికా ప్రగతిశీల ప్రజాస్వామ్యాలు. కరోనా, ఆరోగ్య భద్రత, వాతావరణ మార్పుల వంటి సమస్యలను ఎదుర్కోవడంలో ఇరు దేశాలదీ ఒకటే వైఖరి. ఇరు దేశాల ప్రజల మధ్య ఓ కుటుంబంలో, మిత్రుల మధ్య ఉండే తరహా విలువలతో కూడిన లోతైన సంబంధాలున్నాయి’’ అన్నారు. మే 24న జపాన్లో జరగనున్న క్వాడ్ శిఖరాగ్రంలో మోదీతో నేరుగా ముఖాముఖి చర్చలు జరుగుతాయని ఆకాంక్షించారు. ఉక్రెయిన్పై రష్యా దాడి ని భారత్ ఖండించకపోవడంపై, ఆ దేశంనుంచి చవకగా చమురు కొనుగోలు చేస్తుండటంపై అమెరికా అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. -
రష్యా- ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం,పుతిన్కు ఎదురు దెబ్బ!
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగిస్తుంది. సౌత్ ఈస్ట్రన్ ఉక్రెయిన్ సిటీ మారియుపోల్ టార్గెట్గా రష్యా సైన్యం షెల్లింగ్తో విరుచుకుపడుతోంది. మరోవైపు రష్యాపై ఆంక్షల భారం పెరగుతోంది. ఇప్పటి వరకు దేశాలే ఆంక్షలు ప్రకటించగా..ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు,పెట్టుబడి దారులు చేరిపోయారు. రష్యా అతిపెద్ద పెట్టుబడిదారుడు, పుతిన్ తనకు ప్రధాన శత్రువుగా భావించే బిల్ బ్రోడర్ పుతిన్నుపై విరుచుకు పడ్డారు. రష్యాతో వాణిజ్యం చేసేది లేదని తెగేసే చెప్పారు. ఇప్పుడీ బిల్ బ్రోడర్ నిర్ణయం పుతిన్కు ఎదురు దెబ్బ తగిలినట్లవుతుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్పై యుద్ధం రష్యా మరింత ఆర్ధికంగా నష్టపోయేలా చేస్తుంది. ఇప్పటికే అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యాపై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి. ముడి చమురుతోపాటు రష్యా నుంచి ఎలాంటి ఉత్పత్తుల్ని ప్రపంచ దేశాలు దిగుమతి చేసుకోకుండా నిషేధించాయి. అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ స్విఫ్ట్ నుంచి రష్యాను అమెరికా, దాని మిత్ర దేశాల బ్యాంకులు బహిష్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా రష్యా వాణిజ్యంపై రష్యా అతిపెద్ద పెట్టుబడిదారుడు బిల్ బ్రోడర్ స్పదించారు.రష్యాలో మిగిలి ఉన్న కంపెనీలు "నాజీ జర్మనీలో వ్యాపారానాన్ని కొనసాగించడంతో సమానం" అని వ్యాఖ్యానించారు. బ్రౌడర్ న్యూయార్క్ టైమ్స్తో మాట్లాడుతూ, ప్రస్తుతం పరిస్థితుల్లో ఎంతఖర్చైనా సరే "ప్రతి వ్యాపారస్థుడికి రష్యా నుండి బయటపడే నైతిక బాధ్యత ఉంది. పుతిన్ తర్వాతి పాలనలో ప్రతి ఒక్కరూ తిరిగి రావొచ్చి. కాబట్టి రష్యాలో వ్యాపారం చేయడం ఇష్టం లేక, ఆ దేశంలో కార్యకలాపాల్ని నిలిపి వేసిన వ్యాపార వేత్తలకు రష్యాకు తిరిగి రావడం ఎలా అనే అంశంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం రష్యాలో వ్యాపారం చేయడం అంటే"నాజీ జర్మనీలో వ్యాపారానాన్ని కొనసాగించడంతో సమానం" అని వ్యాఖ్యానించారు. ఒక వేళ పుతిన్ అధికారం కొనసాగితే.. రష్యా నుంచి సంస్థలు 'వెనక్కి వెళ్లాలని' కోరుకోకూడదని ఆయన అన్నారు. రష్యాకో దండం! యేల్ యూనివర్సిటీ రీసెర్చ్ ప్రకారం..ఉక్రెయిన్పై రష్యా దాడిని ఆ దేశం ఆర్ధికంగా నష్టపోయేలా చేస్తుంది. రష్యా చేస్తున్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ దేశాలు ఆంక్షలు కొనసాగిస్తున్న నేపథ్యంలో..రష్యాలోని వందల సంస్థలు కార్యకలాపాల్ని నిలిపివేస్తున్నాయి.యేల్ యూనివర్సిటీ రీసెర్చ్ సంస్థ ఇప్పటి వరకు 800 కంపెనీలు రష్యాకు గుడ్ బైచెప్పాయని తెలిపింది. మరికొన్ని కంపెనీలు పూర్తి స్థాయిలో రష్యా నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. చదవండి: 'హలో కమాన్ 'మైక్' నువ్వు సింగిలా!..అయితే నాతో మింగిల్ అవ్వు'! -
ఇమ్రాన్ ఖాన్కు ఎదురుదెబ్బ.. రష్యా సంచలన ఆరోపణ
నేషనల్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ సహకారం, ముందస్తు ఎన్నికల ప్రకటనతో అవిశ్వాసం నుంచి తప్పించుకున్న పాక్ ప్రధాని(డీ-నొటిఫై పీఎం) ఇమ్రాన్ ఖాన్కు ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించలేమని పాకిస్థాన్ ఎన్నికల కమీషన్ తేల్చేసింది. మూడు నెలల్లోగా ముందస్తు ఎన్నికలంటూ ఇమ్రాన్ ఖాన్ ప్రకటించుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఇంత తక్కువ టైంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని పాక్ ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎన్నికల కోసం కనీసం ఆరు నెలల గడువైనా అవసరమని ఈసీ అభిప్రాయపడింది. ఈ మేరకు సార్వత్రిక ఎన్నికలకు సన్నాహకానికి ఆరు నెలల సమయం పడుతుందని ఈసీపీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. నియోజకవర్గాల తాజా డీలిమిటేషన్, ముఖ్యంగా ఖైబర్ పఖ్తున్ఖ్వాలో 26వ సవరణ ప్రకారం సీట్ల సంఖ్యను పెంచడం, జిల్లా, నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాను అనుగుణంగా తీసుకురావడం ప్రధాన సవాళ్లని ఆయన పేర్కొన్నట్లు డాన్ ఒక కథనం ప్రచురించింది. పాక్ మాజీ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ పేరును ఆపద్ధర్మ ప్రధాని పదవికి ఇమ్రాన్ఖాన్ నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం పాక్ రాజకీయ బంతి.. కోర్టులో ఉంది. ప్రపంచం నవ్వుతోంది ఇదిలా ఉండగా.. తాజా పరిణామాలపై ప్రతిపక్షాలు, ఇమ్రాన్ ఖాన్ను హేళన చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం పాక్ను చూసి నవ్వుతోందని ప్రతిపక్ష పీఎంఎల్-ఎన్ నేత అహ్షన్ ఇక్బాల్ పేర్కొన్నారు. చివరి బంతి దాకా పోరాడతానన్న వ్యక్తి వికెట్లు పీకేసుకుని పారిపోయాడు అంటూ ఇమ్రాన్ ఖాన్ను ఉద్దేశించి ఎద్దేవా చేశాడు. ఇక నుంచి ఇమ్రాన్ ఖాన్ అవినీతి కథలు ఒక్కొక్కటిగా బయటికి వస్తాయని అంటున్నాడు . ఈ విషయంలో న్యాయస్థానాలు గనుక జోక్యం చేసుకోకపోతే.. రాజ్యాంగానికే అర్థం ఉండదని, భవిష్యత్తు మొత్తం నియంతలదే రాజ్యమవుతుందని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. అమెరికా పగ బట్టింది పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. మాస్కోలో పర్యటించినందుకే అమెరికా పగబట్టిందని రష్యా సంచలన ఆరోపణలకు దిగింది. పాక్ తాజా రాజకీయ పరిణామాలపై స్పందించిన రష్యా.. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్ సంక్షోభ సమయంలో.. రష్యా పర్యటనను ఆయన (ఇమ్రాన్ ఖాన్) వాయిదా వేసుకోలేదు. అందుకే అమెరికా అతన్ని శిక్షించాలని నిర్ణయించుకుంది అంటూ రష్యా విదేశాంగ శాఖ పేరిట ఒక ప్రకటన విడుదల అయ్యింది. ఇదిలా ఉండగా.. అవిశ్వాస తీర్మానానికి కొద్ది గంటల ముందు పాక్ ప్రధాని హోదాలో ఇమ్రాన్ ఖాన్ అమెరికాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. పాక్ ప్రతిపక్షాలతో కలిసి.. ఆ విదేశీ శక్తులు కుట్ర పన్ని తనను గద్దె దించే ప్రయత్నం చేస్తున్నాయంటూ ఆరోపించాడు కూడా. ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల నడుమే ఖాన్, మాస్కోలో పర్యటించాడు. ఆ సమయంలో ‘వాట్ ఏ టైమింగ్..’ అంటూ పాక్ పీఎం తన ఎగ్జయిట్మెంట్ కనబరిచిన వీడియో ఒకటి బయటకు వచ్చింది కూడా. -
భారత్ ఎకానమీకి ఉక్రెయిన్- రష్యా యుద్ధం సవాల్!
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ ఏప్రిల్ 1వ తేదీతో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) 7.4 శాతం వృద్ధి నమోదవుతుందని ఫిక్కీ ఎకనమిక్ అవుట్లుక్ సర్వే పేర్కొంది. 6 శాతం కనిష్టం–7.8 శాతం గరిష్ట స్థాయిలో జీడీపీ పురోగతి ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొంది. వృద్ధి తక్కువ స్థాయికి పడే క్లిష్ట పరిస్థితులే ఉంటాయని విశ్లేషించింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం భారత్తో పాటు గ్లోబల్ ఎకానమీకి తీవ్ర సవాలని పేర్కొంది. కాగా, ఈ ఏడాది చివరి ఆరు నెలల్లో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 4 శాతం) రేటు 50 నుంచి 75 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెరగవచ్చని సర్వే అంచనా వేసింది. సర్వేలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► ఆర్బీఐ తన ఏప్రిల్ పాలసీ సమీక్షలో రెపో రేటును యథాతథంగా ఉంచుతుందని, తద్వారా ఆర్థిక పునరుద్ధరణకు మద్దతును కొనసాగిస్తుందని భావిస్తున్నాం. ► వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల వృద్ధి అంచనా 2022–23కి 3.3 శాతం. పరిశ్రమలు, సేవల రంగాల వరుసగా 5.9 శాతం, 8.5 శాతం వృద్ధి చెందుతాయని అంచనా. ► కోవిడ్–19 మహమ్మారి నుండి ముప్పు ఇంకా పొంచి ఉండగానే, రష్యా–ఉక్రెయిన్ వివాదం కొనసాగుతుండడం ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణకు తీవ్ర సవాలును విసురుతోంది. ► రష్యా– ఉక్రెయిన్లు క్రూడ్సహా కీలక ఉత్పత్తులకు ప్రపంచ సరఫరాదారులుగా ఉన్నందున, అంతర్జాతీయ స్థాయిలో కమోడిటీల ధరలు తీవ్రమవుతున్నాయి. ఇది ప్రపంచానికి తీవ్ర సవాలు. ఈ వివాదం ఎక్కువ కాలం కొనసాగితే ముడి చమురు, సహజ వాయువు, ఆహారం, ఎరువులు, లోహాలతో సహా ప్రధాన ముడి పదార్థాల సరఫరాను మరింత దెబ్బతీస్తుంది. ► 2022 ప్రథమార్థంలో ప్రపంచ ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకోవచ్చు. ఆ తర్వాత తగ్గుతూ మధ్యస్థానికి చేరుకోవచ్చని సర్వేలో పాల్గొన్న ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ► పరిశ్రమలు, బ్యాంకింగ్, ఆర్థిక సేవల వంటి రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్థికవేత్తల నుండి మార్చిలో స్వీకరించిన అభిప్రాయాల ఆధారంగా ఎకనామిక్ అవుట్లుక్ సర్వేను ఫిక్కీ రూపొందించింది. 2021–22 చివరి త్రైమాసికం (జనవరి–మార్చి), 2022–23 ఆర్థిక సంవత్సరం ఒకటవ త్రైమాసికం (ఏప్రిల్–జూన్) ఆర్థిక అంచనాలపై సర్వే దృష్టి పెట్టింది. -
భారత్కు రష్యా ఓపెన్ ఆఫర్, డిస్కౌంట్లో ఆయిల్ కొంటే తప్పేంటట!
రష్యా నుంచి భారత్ ముడి చమురును కొనుగోలు చేస్తుంది. ఆ కొనుగోళ్లు అమెరికాతో పాటు పలు మిత్ర దేశాలకు మింగుడు పడడం లేదు. అందుకే తమని కాదని రష్యా నుంచి ఆయా ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తే భారత్పై ఆంక్షలు విధిస్తామనే హెచ్చరికలు పంపుతుంది. ఈ నేపథ్యంలో రష్యా- భారత్ల మైత్రిపై ఇన్డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్న అమెరికాకు భారత్ గట్టిగానే బదులిస్తున్నట్లు తెలుస్తోంది. 'డిస్కౌంట్కే ముడి చమురు ఇస్తామని రష్యా అంటుంది. దేశం కోసం రష్యా నుంచి చమరును కొనుగోలు చేస్తే తప్పేంటని' ప్రశ్నించారు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి. ఏప్రిల్ 1న జరిగిన 'ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్' కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..'రష్యా నుంచి భారత్ ముడి చమురును కొనుగోలు చేసింది. ఆ కార్యకలాపాలు కొనసాగుతాయి. పెట్రోలియం సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అధ్యక్షతన మరింత చమురు ఉత్పత్తుల్ని సేకరించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారని' అన్నారు. చమురు ఉత్పత్తుల కొనుగోళ్లపై రష్యా డిస్కౌంట్లు అందిస్తుంది. ఈ ప్రోత్సహాకాలతో రష్యా నుంచి ఉత్పత్తులను పెద్ద ఎత్తున కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం రష్యా ఒక్కో బ్యారల్పై భారత్కు 35 డాలర్ల డిస్కౌంట్ ఇస్తుందని, యుద్ధానికి ముందే చమరు బ్యారెల్ కొనుగోళ్ల గురించి ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయినా “నేను నా జాతీయ ప్రయోజనాలకే మొదటి స్థానం ఇస్తాను. నా ఇంధన భద్రతకు మొదటి స్థానం ఇస్తాను. డిస్కౌంట్లో ముడి చమురు అందుబాటులో ఉంటే ఎందుకు కొనుగోలు చేయకూడదు. అలా చేస్తే తప్పేంటని అర్ధం వచ్చేలా కేంద్రం ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు. చదవండి: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, భారత్కు భారీ షాక్! -
మొండిఘటం: పుతిన్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..ఆ దేశాలకు రివర్స్ ఝులక్!
రష్యా అధ్యక్షుడు పుతిన్ యురప్ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. ఓ వైపు యుద్ధంతో ఉక్రెయిన్తో పాటు శత్రు దేశాల్ని వణికిస్తూనే.. నెక్ట్స్ టార్గెట్గా ఆయా దేశాల అవసరాల్ని ఆసరాగా చేసుకొని దెబ్బకొట్టేలా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1నుంచి గ్యాస్ కొనాలంటే ఖచ్చితంగా రష్యా రూబల్స్లోనే చెల్లించాలని హుకుం జారీ చేశారు. లేని పక్షంలో శత్రు దేశాలుగా భావిస్తామని హెచ్చరించారు. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య కొనసాగుతుంది. వారాల తరబడి యుద్ధం చేస్తున్న రష్యాను కట్టడి చేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యూహాలు రచయిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ను టార్గెట్గా ఐరోపాలో పర్యటించారు. ఆ పర్యటన ముగిసింది. అదే సమయంలో అమెరికా దాని మిత్ర దేశాల ఆంక్షల కారణంగా రష్యా ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. యూరో- యూఎస్ డాలర్తో పోలిస్తే రష్యా రూబెల్స్ విలువ ఘోరంగా పతనమైంది. ఈ క్రమంలో ఉక్రెయిన్పై దండయాత్ర చేస్తున్న రష్యాపై ఆర్ధిక ఆంక్షలు విధిస్తున్న దేశాలకు భారీ ఝలక్ రష్యా అధ్యక్షుడు పుతిన్. తమ నుంచి గ్యాస్ కొనాలంటే ఖచ్చితంగా రష్యా రూబల్స్లోనే చెల్లింపులు చేయాలని షరతు విధించారని రష్యన్ మీడియా సంస్థ 'రియా నోవోష్ఠి' కథనాన్ని ప్రచురించింది. వీళ్లంతా మా శత్రువులే ఇప్పటికే తమ దేశంపై ఆంక్షలు విధించిన దేశాల్ని పుతిన్ తమ శత్రు దేశాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రష్యా 48 దేశాలతో ఓ జాబితాను విడుదల చేశారు. అమెరికా నార్వే, జపాన్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్తో పాటు అన్నీ యూరప్ దేశాలను ఈలిస్ట్లో చేర్చారు పుతిన్. ఈ దేశాలేవీ తమకు మిత్రపక్షాలు కావని స్పష్టం చేశారు. ఇప్పుడీ దేశాలు రష్యా రూబెల్స్లోనే రష్యా నుంచి గ్యాస్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. -
Russia-Ukraine war: మూతబడ్డ ‘నోబెల్ శాంతి’ పత్రిక
మాస్కో: రష్యాలో ప్రముఖ స్వతంత్ర వార్తా పత్రిక నొవయ గజెటా మూతపడింది. అధికారిక ఒత్తిళ్లే ఇందుకు కారణమని సమాచారం. ఉక్రెయిన్ సంక్షోభం ముగిసేదాకా ప్రచురణ నిలిపివేస్తున్నట్టు పుతిన్ ప్రభుత్వ తీరును సునిశితంగా విమర్శించే ఈ పత్రిక ప్రకటించింది. దాని ఎడిటర్ ద్మిత్రీ మురతోవ్ 2021 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కావడం విశేషం. నోబెల్ పతకాన్ని వేలం వేసి వచ్చే మొత్తాన్ని ఉక్రెయిన్ శరణార్థులకు ఇస్తానని ఆయన ఇటీవలే ప్రకటించారు. అన్నట్టూ, నొవయ గజెటా పురుడు పోసుకుంది కూడా మరో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆలోచనల్లోంచే కావడం విశేషం. 1990లో లభించిన నోబెల్ శాంతి బహుమతి అందుకున్న సోవియట్ యూనియన్ మాజీ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచేవ్ తద్వారా వచ్చిన మొత్తంలో కొంత భాగాన్ని ఈ పత్రిక స్థాపనకు వెచ్చించారు. (క్లిక్: ఉక్రెయిన్లో రష్యా ఉక్కిరిబిక్కిరి) -
ఉక్రెయిన్- రష్యా యుద్ధం: ఈ వారం స్టాక్ మార్కెట్ల దారెటు?
ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారమూ దిద్దుబాటు (కరెక్షన్) కొనసాగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ముగింపు తేదీ, మార్చి వాహన విక్రయాలు గణాంకాలు, కీలక ఆర్థిక గణాంకాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించవచ్చు. ఇక అంతర్జాతీయంగా ఉక్రెయిన్–రష్యాల మధ్య కొనసాగుతున్న యుద్ధం, నిరంతర పెరుగుతున్న ముడిచమురు ధరలు సెంటిమెంట్పై ప్రభావాన్ని చూపొచ్చు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ ట్రేడింగ్పైనా మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. ‘‘గత కొన్ని ట్రేడింగ్ సెషన్ల నిఫ్టీ 17,000–17,450 పాయింట్ల రేంజ్లో కదలాడుతోంది. ఈ శ్రేణిని చేధిస్తేనే తదుపరి స్థాయిలను అంచనా వేయవచ్చు’’ అని నిపుణులు చెబుతున్నారు. ఆటో, బ్యాంకింగ్, ఆర్థిక, ఎఫ్ఎంసీజీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో గతవారంలో సెన్సెక్స్ 502 పాయింట్లు, నిఫ్టీ 134 పాయింట్లను నష్టాలను చవిచూశాయి. దీంతో సూచీల రెండువారాల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఈ వారం మార్కెట్ను ప్రభావితం చేసే అంశాలు.... రష్యా ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు నెలరోజులుగా కొనసాగుతున్న ఉక్రెయిన్, రష్యాల యుద్ధం ఈక్విటీ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. శాంతి చర్చలు క్లిష్టం గా సాగుతున్నాయని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. రష్యా దూకుడుకు కళ్లెం వేసేందుకు అమెరికా పావులు కదుపుతోంది. జీ–20 కూటమి నుండి రష్యాను బహిష్కరించేందుకు ఆయా దేశాలతో చర్చలు జరుపుతామని యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. కాల్పుల విరమణ చర్చల సఫలవంతం కోసం మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. కీలకంగా ఆర్థిక, ఆటో అమ్మక గణాంకాలు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఫిబ్రవరి ద్రవ్యలోటు(ప్రభుత్వ ఆదాయాలు, వ్యయాల మధ్య బేధం) గణాంకాలను గురువారం విడుదల చేయనుంది. అదేరోజున మౌలిక రంగాల వృద్ధిగా పిలిచే ఎనిమిది రంగాల ఉత్పత్తి(ఫిబ్రవరి)డేటా వెల్లడి అవుతుంది. దేశీయ ఆటో కంపెనీలు శుక్రవారం మార్చి నెలతో గతేడాది పాటు 2021 ఆర్థిక సంవత్సరపు వాహన అమ్మక గణాంకాల వివరాలను వెల్లడించనున్నాయి. ఈ కీలకమైన ఈ గణాంకాల విడుదలకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. గురువారం ఎఫ్అండ్ఓ ముగింపు ఈ గురువారం(మార్చి 31న) నిఫ్టీ సూచీకి చెందిన మార్చి సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ పరిణామాలు ప్రపంచ పరిణామాలు ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపవచ్చు. అంతర్జాతీయంగా కోవిడ్ కేసులు తిరిగి పెరుగుతున్నాయి. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలతో సప్లై అవాంతరాలు ఆటంకం కలుగవచ్చనే అంచనాల నడుమ ఇప్పటికే క్రూడాయిల్ ధర భారీ పెరిగాయి. చమురు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా వినియోగ విశ్వాస, నిరుద్యోగ, చమురు నిల్వల డేటాతో పాటు కీలకమైన క్యూ4 జీడీపీ గణాంకాలు ఈ వారంలో విడుదల అవుతాయి. జపాన్ నిరుద్యోగ గణాంకాలు మంగవారం, యూరోజోన్ పారిశ్రామిక డేటా బుధవారం వెల్లడికానున్నాయి. వీటితో పాటు ఆయా దేశాలు విడుదల చేసే కీలక ఆర్థిక గణాంకాల ఆధారంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు కదలాడవచ్చు. మూడు నెలల్లో రూ.లక్ష కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి.. భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలతో భారత మూలధన మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు గడిచిన మూడునెలల్లో రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఎఫ్ఐఐలు ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వరుసగా రూ.28,526 కోట్లు, రూ.38,068 కోట్లు, రూ.48,261 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ గణాం కాలు వెల్లడించాయి. ‘‘ఉక్రెయిన్, రష్యాల నుంచి దిగుమతులు తక్కువగా ఉంటడంతో యుద్ధ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పరిమితంగానే ఉంది. అయితే అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ఇంధన, మెటల్స్, వ్యవసాయ తదితర కమోడిటీ ఉత్పత్తుల ధరలు దేశీయ కార్పొరేట్ ఆదాయాలను దెబ్బతీస్తాయి’’ కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ సుబానీ కురియన్ తెలిపారు. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పదిశాతం పెరిగితే దేశీయ కరెంట్ అకౌంట్ ద్రవ్యలోటు 30 బేసిస్ పాయింట్ల, సీపీఐ ద్రవ్యోల్బణం 40 బేసిస్ పాయింట్లు మేర పెరగవచ్చని కురియన్ పేర్కొన్నారు. -
మెట్రో స్టేషన్లో తలదాచుకుంటున్న ఉక్రెనియన్లు...వైరల్ అవుతున్న వీడియో
-
పుతిన్ పరమ కసాయి.. బైడెన్ తీవ్ర వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్పై దురాక్రమణతో భారీ ప్రాణ నష్టం చవిచూస్తూ.. మరో పక్క ప్రపంచాన్ని ఆందోళనలో నెట్టేసిన పుతిన్ను పరమ కసాయి వాడిగా అభివర్ణించాడు బైడెన్. యూరప్ దేశాల పర్యటనలో భాగంగా.. అగ్ర రాజ్యం అధ్యక్షుడు యుద్ధ క్షేత్ర సమీపంగా వెళ్లారు. రష్యా బాంబుల దాడులతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్ పొరుగు దేశం పోల్యాండ్లో బైడెన్ పర్యటించారు. శనివారం రాజధాని వార్సా నగరానికి వెళ్లిన బైడెన్.. అక్కడ పోల్యాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ డుడాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉక్రెయిన్, రష్యాల మధ్య సాగుతున్న యుద్ధం, తాజా పరిస్థితులు తదితరాలపై ఇరు దేశాల నేతలు చర్చించారు. ఈ వేదికగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పలు దేశాల కూటమిగా ఉన్న నాటోను చీల్చే దిశగా పుతిన్ చాలా యత్నాలే చేశారని ఆరోపించిన బైడెన్.. అందులో పుతిన్ ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో నాటో కూటమి ఉక్రెయిన్కు బాసటగా నిలిచిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావించిన బైడెన్.. ఉక్రెయిన్ను ఏకాకిగా చేసేందుకు పుతిన్ నాటోనే చీల్చేందుకు యత్నించి బొక్కబోర్లా పడ్డారని బైడెన్ వ్యాఖ్యానించారు. అంతేకాదు పుతిన్ను పరమ కసాయిగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఉక్రెయిన్ ఆక్రమణలో.. రష్యా యుద్ధ వ్యూహాన్ని మార్చి ఉంటుందని బైడెన్ అభిప్రాయపడ్డారు. ఇక బైడెన్తో చర్చల అనంతరం.. అమెరికా స్పందనపై ఉక్రెయిన్ రక్షణ మంత్రి స్పందించారు.ఈ చర్చల్ని ‘‘ఆశావాదం’’గా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉదయం బలగాలతో సరదగా గడిపిన బైడెన్.. వాళ్లతో పిజ్జా షేర్ చేసుకోవడంతో పాటు సెల్ఫీలకు ఫోజులిచ్చారు. ఉక్రెయిన్కు అవసరమైన సాయం అందించేందుకు అమెరికా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు బైడెన్. మరోపక్క రష్యా.. ఉక్రెయిన్ మిలిటరీ చర్యలో తొలి దశ మాత్రమే పూర్తైందని ప్రకటించడం విశేషం. -
కీవ్ స్వాధీనం దిశగా దూసుకెళ్తున్న రష్యా..షాకిచ్చిన హ్యాకర్లు!
ఉక్రెయిన్ రాజధాని కీవ్ను ఎలాగైనా స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా నగరంలో రష్యా సైన్యం కల్లోలమే సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా ప్రభుత్వ తీరును తప్పు బట్టిన ఆ దేశ హ్యాకర్లు అధ్యక్షుడు పుతిన్కు షాకిస్తున్నారు. ఈ వారంలో రష్యా సెంట్రల్ బ్యాంక్కు చెందిన రహస్యాల్ని బహిర్గతం చేశామని గుర్తు తెలియని హ్యాకర్స్ గ్రూప్ అధికారికంగా ట్వీట్ చేసింది. నెల రోజుల క్రితమే వార్నింగ్ తాజాగా Anonymous అనే హ్యాకర్స్ గ్రూప్ చీకటి ఒప్పందాలకు సంబంధించి 35వేల పేపర్లను బహిర్ఘతం చేస్తామని ట్వీట్ చేసింది "జస్ట్ ఇన్ #Anonymous కలెక్టివ్ రష్యా సెంట్రల్ బ్యాంక్ను హ్యాక్ చేశాం.48 గంటల్లో 35,000 కంటే ఎక్కువ రహస్య ఒప్పంద పత్రాలు విడుదల చేయబడతాయి" అని ట్వీట్లో పేర్కొంది. నెల రోజుల క్రితం ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాకు వ్యతిరేకంగా..రష్యన్ హ్యాకర్లు హెచ్చరికలు జారీ చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ఉద్దేశిస్తూ.. త్వరలో మీరు ప్రపంచ హ్యాకర్ల ఆగ్రహానికి గురవుతారని ప్రకటించారు. JUST IN: The #Anonymous collective has hacked the Central Bank of Russia. More than 35.000 files will be released within 48 hours with secret agreements. #OpRussia pic.twitter.com/lop140ytcp — Anonymous TV 🇺🇦 (@YourAnonTV) March 23, 2022 అన్నట్లుగానే ఈ వారం ప్రారంభంలో ఉక్రేనియన్ భవనాలపై దాడికి గురైన దృశ్యాలను ప్రజలకు చూపించేందుకు రష్యన్ స్టేట్ టీవీ నెట్వర్క్లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో రష్యన్లు అయోమయానికి గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా రష్యా సైన్యం కీవ్ను స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తుండగా.. రష్యా తీరును వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి సంబంధించిన రహస్యాల్ని బట్టబయలు చేస్తున్నారు. భవిష్యత్లో హ్యాకింగ్ కొనసాగుతుందని ట్వీట్ల ద్వారా పుతిన్ను హెచ్చరిస్తున్నారు. -
పుతిన్-జెలెన్స్కీ.. వాటి వెనుక బోలెడంత కథ!
దేశం కోసం అంటూ ఒకరు, తన సరిహద్దుల్లో నాటో వద్దంటూ మరొకరు.. విరామం లేకుండా యుద్ధంలో మునిగిపోయారు. ఉన్నబలగానికి ధైర్యం ఇస్తూ ఒకరు.. బలమైన బలగాలకు అధ్యక్ష భవనం నుంచే ఆదేశిస్తూ మరొకరు మొత్తం ప్రపంచాన్ని ఆందోళనలోకి నెట్టేశారు. ఇక్కడ తప్పొప్పులు ఎవరివి? నష్టం ఎటువైపు ఎక్కువ ఉంటోంది అనే విషయాలను పక్కనపెడితే.. వాళ్ల ఆటిట్యూడ్కు సంబంధించిన విషయం ఒకటి ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది. అదే వాళ్ల డ్రెస్సింగ్.. మామూలురోజుల్లో సూట్ బూట్లో సందడి చేసే ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ.. ఈ నెలరోజుల యుద్ధంలో కనిపించిన ప్రతీసారి సాదాసీదాగా గ్రీన్కలర్ టీషర్టులో కనిపిస్తున్నాడు. తద్వారా దేశంతో సమానమైన బాధను పంచుకుంటున్నాననే సందేశాన్ని పంపిస్తున్నాడాయన. ఫ్యాషన్ హిస్టారియన్స్ అంచనా ప్రకారం.. పిరికితనానికి ఎరుపు, తెలుపు, నీలం దుస్తులను ప్రతీకగా భావిస్తారు. కానీ, ఒలివ్, గ్రీన్ కలర్ టీషర్టుల్లోనే జెలెన్స్కీ ఎక్కువ దర్శనమిస్తున్నాడు. ఇవి యుద్ధ క్షేత్రంలో పాల్గొంటున్న సైన్యానికి సంకేతం. కీవ్ నుంచి పారిపోనంటూ ఇచ్చిన ప్రకటన.. ఉక్రెయిన్ ప్రజల తెగువ, పోరాట పటిమకు నిదర్శనం. అందుకే ప్రపంచానికి అర్థమయ్యేలా సాదాసీదా దుస్తుల్లోనే దర్శనమిస్తున్నాడు. తన ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్నాడు. పలు దేశాల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. పుతిన్ సంగతికొస్తే.. రష్యా మిలిటరీ చర్య మొదలైన తర్వాత.. పోయిన వారం ఓ పబ్లిక్ ఈవెంట్లో హాజరైన పుతిన్ ఓ ఫ్యాషనబుల్ కోట్లో దర్శనమిచ్చాడు. ఇటలీ నుంచి దిగుమతి అయిన ఆ కోట్ ఖరీదు సుమారు 14 వేల డాలర్లు. అంటే.. మన కరెన్సీలో అది 10 లక్షల రూపాయలకు పైనే. తద్వారా ప్రపంచానికి తన దర్శం, యుద్ధ కాంక్షను, ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని పుతిన్ భావించాడు. అయితే ఇక్కడే బెడిసి కొట్టిందేమో అనే చర్చ మొదలైంది?. ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన నేతల్లో పుతిన్ ఒకరు. విలాసాలతో పాటు దానగుణంలోనూ ఆయనకు ఆయనే సాటి. కానీ, ఉక్రెయిన్ పరిణామాలు ఆ పరిస్థితుల్ని మార్చేశాయి. రష్యా ఆర్థిక పతనం తర్వాత.. రూబుల్స్(కరెన్సీ)విలువ దారుణంగా పతనం అయ్యింది. దీంతో అధ్యక్షుడిగా పుతిన్కు అందుతున్న జీతంలోనూ కోత పడింది. పైగా రష్యా సైన్యానికి ఆర్థిక తోడ్పాటు కష్టంగా అందుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రష్యా ధనికదేశమనే సంకేతాలు ప్రపంచానికి పంపడం సరికాదనేది విశ్లేషకుల మాట. డ్రెస్సులోనే అంత ఉంది పరిస్థితులకు తగ్గట్లు వస్త్రధారణ ఉండాలనేది కొత్త విషయం ఏం కాదు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో.. యూకే అధ్యక్షుడు విన్స్టన్ చర్చిల్ సైరన్ సూట్ను ధరించేవాడు. వైమానిక దాడి జరిగినప్పుడు మీరు త్వరగా తప్పించుకునేందుక వీలుగా అది. ►ఇక అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డీ రూజ్వెల్ట్.. మిలిటరీ దుస్తుల్లో సైన్యానికి సపోర్ట్గా కనిపించేవారు. ►ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ది ఈ విషయంలో మరో తరహా వైఖరి. తానొక నియంత అని చెప్పుకోవడానికి వీలుగా.. తనలాంటి జాకెట్లు మరెవరూ ధరించకూడదన్న ఉద్దేశంతో నిషేధాజ్ఞలు, ధరించిన వాళ్లకు శిక్షలు అమలు చేయించాడు. ►ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్.. ఎయిర్ఫోర్స్ హూడీ ద్వారా సాదాసీదాను ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఏప్రిల్లో ఎన్నికలు ఉండడంతోనే.. జెలెన్స్కీని కాపీ కొడుతూ.. ఇలా సింప్లిసిటీ డ్రామాలు ఆడుతున్నాడంటూ సోషల్ మీడియాలో మాక్రోన్పై ట్రోలింగ్ నడుస్తోంది. -
రష్యా బహిష్కరణ? ఆ హక్కు ఎవరికీ లేదు!
యుద్ధ నేరాలకు పాల్పడుతోందన్న ఆరోపణలతో రష్యాను.. జీ-20 గ్రూపు నుంచి బహిష్కరించాలని అమెరికా గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఉక్రెయిన్ యుద్ధంతో ఆర్థిక ఆంక్షల ద్వారా ఇప్పటికే రష్యాను అంతర్జాతీయ సమాజం నుంచి వెలేసినంత పని చేశాయి అమెరికా దాని మిత్రపక్ష పాశ్చాత్య దేశాలు. ఈ తరుణంలో చైనా, తన మిత్ర పక్షం రష్యాకు అనుకూల గళం వినిపించింది. జీ 20 అనేది అందులో ఉన్న సభ్య దేశాలు అంతర్జాతీయ ఆర్థిక సహకారం అందించుకునే వేదిక. అదేం దేశాల మధ్య జరిగే వ్యాపారం కాదు. అందులో రష్యా కీలక సభ్యత్వం ఉన్న దేశం. అలాంటి దేశాన్ని బహిష్కరించే హక్కు ఏ ఒక్క దేశానికి ఉండదు అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇదిలా ఉండగా.. వింటర్ ఒలింపిక్స్టైంలోనే రష్యా-చైనాలు తమ బంధం బలమైందని ప్రకటించుకున్నాయి. అప్పటి నుంచి ఉక్రెయిన్ పరిణామంలో అమెరికా హెచ్చరికలను సైతం పట్టించుకోకుండా చైనా రష్యాకు మద్ధతుగా నిలుస్తోంది. మరోవైపు జీ20 కూటమి నుంచి రష్యాను బహిష్కరించే విషయమై మిత్రపక్షాలతో చర్చించనున్నట్లు వైట్హౌజ్ జాతీయ భదత్రా సలహాదారు జేక్ సల్లివాన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జీ 20 దేశాల్లో మొత్తం 19 దేశాలు ఐదు గ్రూపులుగా విడిపోయి ఉన్నాయి(యూరోపియన్ యూనియన్ అదనం). భారత్, రష్యాతో పాటు గ్రూప్-2 లో ఉంది. జీ 20కి పుతిన్! క్రిమియా ఆక్రమణ తర్వాత 2014లో జీ8 దేశాలు పుతిన్ను(రష్యా) బహిష్కరించాయి. దీంతో జీ8 కాస్త జీ7గా మారింది. ఈ తరుణంలో జీ20 నుంచి రష్యాకు అలాంటి అనుభవమే పునరావృతం అవుతుందా? అనే కోణంలో చర్చ నడుస్తోంది ఇప్పుడు. అయితే ఈ ఏడాది జీ20 సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని పుతిన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అక్టోబర్ చివర్లో బాలి(ఇండోనేషియా)లో జరగబోయే జీ 20 సదస్సుకు పుతిన్ హాజరవుతారని ఇండోనేషియాలో రష్యా దౌత్యవేత్త ల్యుద్మిలా వోరోబియెవా ప్రకటించారు. చదవండి: చైనాను ఇరుకున పెడుతున్న రష్యా! అమెరికాకు మరింత మంటపుట్టించేలా.. -
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, క్రూడాయిల్ పరుగే పరుగు..ఆందోళనలో భారత్!
న్యూఢిల్లీ: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం కారణంగా భారత్ ఎకానమీకి తీవ్ర సవాళ్లు తప్పవని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ మంగళవారం తన నివేదికలో పేర్కొంది. ఆయా అంశాల విశ్లేషణల అనంతరం ఏప్రిల్తో ప్రారంభమయ్యే (2022–23) వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి అంచనాను 10.3 శాతం నుండి 8.5 శాతానికి (1.8 శాతం) తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాను 60 బేసిస్ పాయింట్లు పెంచినట్లు పేర్కొంది. దీనితో ఈ అంచనా 8.1 శాతం నుంచి 8.7 శాతానికి పెరిగింది. అధిక పన్ను వసూళ్లుసహా, ఎకానమీలో పలు హై ఫ్రీక్వెన్సీ ఇండెక్స్లు ఊహించినదానికన్నా మెరుగ్గా ఉండడమే దీనికి కారణమని వివరించింది. 2023–24లో ఎకానమీ వృద్ధి రేటు ప్రస్తుత పరిస్థితుల ప్రకారం 7 శాతంగా ఉండే వీలుందని పేర్కొంది. గ్లోబల్ ఎకనమిక్ అవుట్లుక్– మార్చి 2022 పేరుతో వెల్లడించిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► కోవిడ్–19 మహమ్మారి అనంతరం చోటుచేసుకుంటున్న రికవరీపై యుద్ధం ప్రభావం పడుతోంది. అంతర్జాతీయంగా సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇది వృద్ధిని తగ్గిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. ► ఉక్రెయిన్పై యుద్ధం, రష్యాపై ఆర్థిక ఆంక్షలు ప్రపంచ ఇంధన సరఫరాలను ప్రమాదంలో పడేశాయి. ఆంక్షలు ఇప్పుడే రద్దయ్యే అవకాశం లేదు. ► ప్రపంచ ఇంధన సరఫరాల్లో రష్యా వాటా దాదాపు 10 శాతం. సహజ వాయువులో 17 శాతం. చమురు, గ్యాస్ ధరల పెరుగుదల పరిశ్రమ వ్యయాలను పెంచుతుంది. ఇంధన అధిక ధరల వల్ల వినియోగదారుల వాస్తవ ఆదాయాలు తగ్గుతాయి. ► డిసెంబరు త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు చాలా పటిష్టంగా ఉంది. జీడీపీ మహమ్మారి ముందస్తు స్థాయి కంటే 6 శాతం కంటే ఎక్కువగా ఉంది. అయితే వ్యవస్థలో మహమ్మారి సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. ►2020, 2021లో వచ్చిన కరోనా రెండు వేవ్లకు భిన్నంగా 2022లో నెలకొన్న మూడవ వేవ్ పరిస్థితి ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ తక్కువ నష్టంతో ఒమిక్రాన్ వేవ్ను అధిగమించిందని మా హై–ఫ్రీక్వెన్సీ డేటా సూచిస్తోంది. ►ద్రవ్యోల్బణం మరింత బలపడుతున్నట్లు కనిపిస్తోంది. క్రమంగా తగ్గేముందు 2022 డిసెంబరు త్రైమాసికంనాటికి 7 శాతంపైకి ద్రవ్యోల్బణం చేరుతుందని భావిస్తున్నాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న అప్పర్ బ్యాండ్ (2–6%), ఆపైన ద్రవ్యోల్బణం సమీపకాలంలో కొనసాగుతుందని భావిస్తున్నాం. ► గత వారం రోజుల్లో స్థానిక ఇంధన ధరలు దాదాపు ఫ్లాట్గానే ఉన్నాయి. అయితే చమురు కంపెనీలు తుదకు అధిక చమురు ధరల భారాన్ని వినియోగదారుకు (ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గింపు మినహాయింపు) బదిలీ చేస్తాయని భావిస్తున్నాము. ► 2022 క్యాలెండర్ సంవత్సరానికి భారతదేశ వృద్ధి అంచనాను గత వారం మరొక గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ 9.5% నుండి 9.1%కి తగ్గించిన సంగతి తెలిసిందే. అధిక ఇంధనం ధర, ఎరువుల దిగుమతి బిల్లు మూలధన వ్యయాన్ని పరిమితం చేస్తుందని మూడీస్ తన అంచనాల్లో పేర్కొంది. ►యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడ్ బ్యారల్ ధర ఈ నెల ప్రారంభంలో పదమూడు సంవత్సరాల గరిష్టం 140 డాలర్లకు చేరింది. భారత్ తన చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులపై ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వృద్ధి రేటు 3.5 శాతానికి పరిమితం ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను క్యాలెండర్ ఇయర్లో 70 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఫిచ్ తెలిపింది. దీనితో ఈ రేటు 4.2 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గింది. -
Ukraine War: యుద్ధం ఆపకుంటే ఆకలి కేకలు తప్పవు!
ఉక్రెయిన్ ప్రపంచంలోనే అత్యధికంగా ఆహారోత్పత్తులను ఎగుమతి చేసే దేశం. అలాంటి దేశం యుద్ధంతో తల్లడిల్లుతోంది. రష్యా బలగాల దాడుల్లో పంట పండించడం కష్టతరంగా మారడమే కాదు.. ఇప్పటికే ఉన్న పంట నాశనం అయిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే.. ఉక్రెయిన్తో పాటు కొన్ని దేశాల్లో ఆకలి కేకలను ప్రపంచం చూడాల్సి వస్తుంది. ఈ మాటలు అంటోంది ఎవరో కాదు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ. ఒకవైపు రష్యాకు లొంగిపోయే ప్రసక్తే లేదంటున్న జెలెన్స్కీ.. ఏది ఏమైనా శాంతి చర్చల ద్వారానే సమస్య పరిష్కారం కావాలని, అందుకోసం ఎంత దూరమైనా వెళ్తానని అంటున్నాడు. ఉక్రెయిన్పై రష్యా బలగాల దాడులు 27వ రోజుకి చేరిన వేళ.. మంగళవారం ఇటాలియన్ పార్లమెంట్ను ఉద్దేశించి జెలెన్స్కీ ప్రసంగించాడు. రష్యా దాడులు ఒక్క ఉక్రెయిన్ను మాత్రమే సంక్షోభంలో నెట్టేయదని, చాలా దేశాలు ఆహార కొరతతో ఇబ్బందిపడతాయని జెలెన్స్కీ అంటున్నాడు. కాబట్టి, ఆక్రమణదారులను ఓడించేందుకు సాయం చేయాలంటూ ఇటలీ ప్రతినిధులను కోరాడాయన. దానికి ఇటలీ కూడా సానుకూలంగానే స్పందించింది. ఇక ఉక్రెయిన్ నుంచి గోధుమలు, మొక్కజోన్న, సన్ఫ్లవర్ ఆయిల్ ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలోనే మేజర్ వాటాదారునిగా ఉంది ఉక్రెయిన్. అయితే రష్యా దాడుల నేపథ్యంలో.. నల్ల సముద్ర తీరాలను షిప్పులు దాటే పరిస్థితి లేకపోవడంతో ఎక్కడికక్కడే వాణిజ్యం స్థంభించి పోయింది. పైగా ఉత్పత్తుల్లో చాలావరకు పాడైపోయినట్లు ఉక్రెయిన్ అధికారులు చెప్తున్నారు. లెబనాన్, ఈజిప్ట్, యెమెన్.. ఇతర దేశాలు ఇటీవలి సంవత్సరాలలో ఉక్రేనియన్ గోధుమలపై ఆధారపడుతున్నాయి. ఈ యుద్ధం ఎఫెక్ట్తోనే గోధుమల ధరలు గత నెలలో 50% మేర పెరిగాయి. ఇదిలా ఉంటే.. పాశ్చాత్య దేశాల అధినేతలను ఉద్దేశించి జెలెన్స్కీ ఓ వీడియో లింక్ను విడుదల చేశాడు. ఉక్రెయిన్ ఎల్లప్పుడూ అతిపెద్ద ఆహార ఎగుమతిదారులలో ఒకటనే విషయం తెలుసు కదా, అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే.. ఇప్పుడు పరిస్థితుల్లో కొన్ని దేశాలు ఆకలి కేకలు పెట్టొచ్చు. రష్యన్ ఫిరంగి దాడులతో ఉన్న పంటలు నాశనం అవుతున్నాయి.. ఇంక కొత్త పంటలు ఎలా పండుతాయి? అని నిలదీశాడు. పోప్.. ప్లీజ్ జోక్యం చేసుకోండి ఉక్రెయిన్ పరిణామాలపై జెలెన్స్కీ, పోప్ ఫ్రాన్సిస్తో ఫోన్లో చర్చించినట్లు సమాచారం. ఈ విషయంలో జోక్యం చేసుకుని.. శాంతి చర్చల ద్వారా ఒక ముగింపు పలకాలని ఆయన్ని జెలెన్స్కీ కోరినట్లు సమాచారం. ఈ మేరకు చర్చల సారాంశం తాలుకా సందేశాన్ని ఆయన ట్విట్టర్లో సైతం పోస్ట్ చేశారు. అయితే పోప్-Russian Orthodox Patriarch Kirill మధ్య శాంతి స్థాపన కోసం ఈ నెల మొదట్లోనే చర్చలు జరిగాయి. కానీ, Patriarch Kirill of Moscow మాత్రం.. ఉక్రెయిన్ బలగాలను దుష్టశక్తులుగా పేర్కొంటూ యుద్ధానికి ఎగవేస్తుండడం విశేషం. ఇక యుద్ధం మొదలై.. దాదాపు నెలరోజులు కావొస్తున్న చర్చల్లో ఎలాంటి పురోగతి లేకుండా పోవడంతో ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. Talked to @Pontifex. Told His Holiness about the difficult humanitarian situation and the blocking of rescue corridors by Russian troops. The mediating role of the Holy See in ending human suffering would be appreciated. Thanked for the prayers for Ukraine and peace. pic.twitter.com/wj4hmrTRGd — Володимир Зеленський (@ZelenskyyUa) March 22, 2022 చదవండి: భాష రాక ఉక్రేనియన్ల గోస.. ఆ అంధుడికి సలాం! -
హిట్లర్ వదిలేసినా.. పుతిన్ చేతిలో ఖతమయ్యాడు!
ఉక్రెయిన్ యుద్ధంలో ఒక్కొక్కరి ఒక్కో గాథ. రోజుకో కథ బయటకు వస్తోంది. కదన రంగంలో అడుగుపెట్టడం దగ్గరి నుంచి.. ప్రాణత్యాగాల దాకా ప్రపంచాన్ని కదిలిస్తున్న కథలెన్నో. ఈ తరుణంలో హిట్లర్ సైన్యం చేతుల్లోంచి తప్పించుకున్నా.. ఇప్పుడు పుతిన్ యుద్ధ దాహానికి బలైన ఓ పెద్దాయన కథ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. బోరిస్ రోమన్చెన్కో.. 96 ఏళ్ల ఈ పెద్దాయన శుక్రవారం జరిగిన దాడుల్లో దుర్మరణం పాలయ్యాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బుచెన్వాల్ద్ డోరా ఇంటర్నేషనల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్గా పని చేశారు ఈయన. ఖార్కీవ్లో ఆయన ఉంటున్న అపార్టెమెంట్ మీద రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో బోరిస్ రోమన్చెన్కో చనిపోయినట్లు Buchenwald concentration camp మెమోరియల్ ఇనిస్టిట్యూట్ తన అధికారిక ట్విటర్ పేజీ వెల్లడించింది. రోమన్చెన్కో.. 1943 రెండో ప్రపంచ చుద్ధం సమయంలో బుచెన్వాల్ద్ కాన్సెంట్రేషన్ క్యాంప్కు తరలించబడ్డాడు. అక్కడ నాజీ సైన్యం చేతిలో చిత్రవధ అనుభవించి.. సుమారు 53 వేలమందికి పైగా చంపబడ్డారు. అయితే ప్రాణాలతో బయటపడ్డ అతికొద్ది మందిలో ఈయన ఒకడు. ఆయన అదృష్టం ఎలా ఉందంటే.. అదే ఏడాది డోరా- మిట్టెలాబూ కాన్సెంట్రేషన్ క్యాంప్లో, ది బెర్గెన్ బెల్సెన్, పీనెమిండె క్యాంప్లోనూ ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. Romanchenko మృతిపై రష్యా విదేశాంగ మంత్రి దిమిత్రి కులెబ ట్విటర్లో స్పందించారు. హిట్లర్ చేతి నుంచి తప్పించుకున్నా.. పుతిన్ చేతిలో హతమయ్యాడంటూ ఆయన రాసుకొచ్చారు. ఇక Holocaust survivorగా 2012లో బుచెన్వాల్డ్ లిబరేషన్ వేడుకల్లో రోమన్చెన్కో పాల్గొన్నాడు. Borys Romanchenko, 96, survived four Nazi concentration camps: Buchenwald, Peenemünde, Mittelbau-Dora, Bergen-Belsen. He lived his quiet life in Kharkiv until recently. Last Friday a Russian bomb hit his house and killed him. Unspeakable crime. Survived Hitler, murdered by Putin. pic.twitter.com/QYJ4xrNYC9 — Dmytro Kuleba (@DmytroKuleba) March 21, 2022 నాలుగు శరణార్థ క్యాంపుల్లోనూ ప్రాణాలతో బయటపడ్డ రోమన్చెన్కోను యమజాతకుడిగా ఆయన్ని అభివర్ణిస్తుంటారు ఉక్రెయిన్ ప్రజలు. తిరిగి 2018లోనూ ఆయన్ని ఖార్కీవ్కు చెందిన ఓ న్యూస్పేపర్ ఇంటర్వ్యూ చేసింది కూడా. ఉక్రెయిన్ అధ్యక్ష భవనం నుంచి రోమన్చెన్కో మరణంపై అధికారిక ప్రకటన వెలువడింది. -
భారత్ వణుకుతోంది.. బైడెన్ సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య విరామం లేకుండా కొనసాగుతోంది. రష్యా దాడితో ఉక్రెయిన్ అల్లకల్లోలంగా మారుతోంది. కోట్ల సంపద సర్వ నాశనం అవుతోంది. సైనికులు, అమాయక పౌరులు యుద్ధ భూమిలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఉక్రెయిన్ మళ్లీ కోలుకోడానికి దశాబ్దాలు పట్టేలా కన్పిస్తోంది. మరోవైపు ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో చాలా దేశాలు ఉక్రెయిన్కే మద్ధతుగా నిలుస్తున్నాయి. ఉక్రెయిన్కు మానవతా సాయం అందిస్తూనే.. మరోవైపు రష్యాపై నిషేధం విధిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఉక్రెయిన్, రష్యా యుద్ధం విషయంలో తటస్థ వైఖరి అనుసరిస్తున్న భారత్పై అమెరికా మరోసారి తమ అక్కసుని వెళ్లగక్కింది. రష్యాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడంలో భారత్ వణుకుతోందంటూ జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు వాషింగ్టన్లో అమెరికన్ సీఈఓల రౌండ్టేబుల్ సమావేశంలో బైడెన్ మాట్లాడుతూ.. రష్యాపై చర్యలు తీసుకునేందుకు భారత్ ఎందుకో జంకుతోందని వ్యాఖ్యానించారు. రష్యాకు వ్యతిరేకంగా కూటమి కట్టే విషయంలో భారత్ తీసుకునే నిర్ణయాల్లో అస్థిరత కనిపిస్తోందని అన్నారు. రష్యాపై భారత్ కఠిన ఆంక్షలు, నిషేధాజ్ఞలను జారీ చేయడంలో కొంతవరకు వణుకుతోందని పేర్కొన్నారు. అమెరికా మిత్రదేశాలన్నీ ఐక్యంగా రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని.. ఢిల్లీ మాత్రం అస్థిరంగా, బలహీనంగా ఉందని పేర్కొన్నారు. చదవండి: రష్యా చెప్పేదానిని నమ్మలేం.. అది అంత ఈజీ కాదు: అమెరికా క్వాడ్లో భారత్ మాత్రమే రష్యాపై కఠినంగా లేదని.. మిగతా జపాన్, ఆస్ట్రేలియా, తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయని జో బైడెన్ తెలిపారు. కాగా క్వాడ్లో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఇందులో భారత్ మినహాయిస్తే- మిగిలిన మూడు రష్యాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి. జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా ఇదివరకే రష్యాపై ఆంక్షలను విధించాయి. అయితే రష్యాతో సుదీర్ఘకాలంగా బలమైన స్నేహ సంబంధాలను కలిగి ఉన్న భారత్ తటస్థ వైఖరిని అవలంభిస్తోంది. అలాగనీ అటు యుద్ధాన్ని కూడా సమర్థించడం లేదు. శాంతియుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని చెబుతోంది. చదవండి: భాష రాక ఉక్రేనియన్ల గోస.. 7 భాషల్లో సాయం.. అంధుడికి సలాం! -
Russia Ukraine War భాష రాక ఉక్రేనియన్ల గోస.. 7 భాషల్లో సాయం.. అంధుడికి సలాం!
ఉక్రెయిన్లో రష్యా విధ్వసం కొనసాగుతోంది. యుద్ధం మొదలై నాలుగు వారాలు పూర్తవుతున్నా.. ఉక్రెయిన్లో ప్రధాన నగరాలైన కీవ్, మరియూపోల్పై రష్యా సైన్యం విరుచుపడుతోంది. అయితే ఉక్రెయిన్ నాటో సభ్యత్వాన్ని కోరదనే విషయంపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. అయితే దానికి బదులుగా ఉక్రెయిన్ భద్రత దృష్యా రష్యా కాల్పుల విరమణ ప్రకటించి, తమ దళాలను ఉపసంహరించుకోవాలని సూచించారు. అదే విధంగా రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని, మరియూపోల్లో 400 మంది ఆశ్రయం పొందుతున్న ని ఓ పాఠశాలపై బాంబులతో దాడికి తెగబడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధం కారణంగా లక్షలాది మంది ఇతర దేశాలకు వలసలు వెళుతున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ వీడిన వారి సంఖ్య ఇప్పటికే 40 లక్షలు దాటేసింది. వీరిలో సగం మంది 18 ఏళ్లు దాటని వాళ్లేనని గణాంకాలు చెప్తున్నాయి. వీరంతా తల్లులతో పాటు పోలండ్, హంగరీ, స్లొవేకియా, మాల్దోవా, రుమేనియా తదితర దేశాలకు చేరారు. కాగా కాగా సగటు ఉక్రేనియన్లు తమ భాష తప్ప మరోటి మాట్లాడరు. చాలా తక్కువ మంది ఇంగ్లిష్ అర్థం చేసుకుంటారు. మాట్లాడే వారైతే మరీ తక్కువ. స్థానికులకు కూడా చాలావరకు అటు ఇంగ్లిష్, వీరి భాష రావు. దాంతో పరాయి దేశాల్లో వారికి తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. చదవండి: ఉక్రెయిన్ ఓ శిథిల చిత్రం.. ఎవరిని కదిలించినా కన్నీటి కథలే కనీసం బస్టేషన్, రైల్వే స్టేషన్ పేర్లు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంగ్లిష్, ఉక్రేనియన్ తెలిసిన విద్యార్ధులు, మేధావులు శిబిరాలకు వెళ్లి సాయం చేస్తున్నారు. బుడాపెస్ట్లో వాలంటీర్గా పని చేసేందుకు ముందుకొచ్చిన అంధుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ‘‘శరణార్థుల్లో చాలామందికి మా భాష రాదు. వారికి అనువాదకునిగా సాయం చేస్తున్నా. నాకు 7 భాషలొచ్చు. వారికి ఏ భాషలో కావాలన్నా సాయం చేస్తా. చాలామందికి ఎటు పోవాలో కూడా తెలియదు. వారిని ఎన్జీవో శిబిరాలకు పంపుతున్నా. అంతా వదిలేసి కట్టుబట్టలతో, పుట్టెడు దుఃఖంతో వచ్చేవారికి భరోసా ఇవ్వడమే మనం చేసే గొప్ప సాయం!’’ అన్నాడతను. -
ఉక్రెయిన్ పరిస్థితులపై సాక్షి ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్
-
సేవకు చూపు అడ్డుకాదు.. అంధుడికి సేవకు సలాం
-
చైనాను ఇరుకున పెడుతున్న రష్యా ప్రకటన!
ఉక్రెయిన్ సంక్షోభంలో పెద్దన్న పాత్ర పోషించాలని ప్రయత్నిస్తున్న చైనాకు వరుస షాకులు తగులుతున్నాయి. రష్యాకు ఉక్రెయిన్ దురాక్రమణలో సహకరిస్తే.. తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని అమెరికా సహా పాశ్చాత్య దేశాలు చైనాను హెచ్చరిస్తూ వస్తున్నాయి. అయినా రష్యాకు పరోక్ష సాయం అందిస్తూనే.. శాంతి సందేశం వినిపిస్తోంది డ్రాగన్ కంట్రీ. ఈ క్రమంలో రష్యా తాజా ప్రకటన.. చైనాను మరింత ఇరకాటంలోకి నెట్టేదిగా కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా, చైనాల మధ్య బంధం మరింత బలపడుతుందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అంటున్నారు. ‘‘అంతర్జాతీయ వ్యవస్థ ఆధారపడి ఉన్న పునాదులను అన్ని పాశ్చాత దేశాలు అణగదొక్కుతున్నాయి. కానీ, చైనా, రష్యాలు మాత్రం గొప్ప శక్తులుగా ముందుకు ఎలా వెళ్లాలి అనే కోణంలోనే ఆలోచిస్తున్నాయి. ఈ సమయంలోనూ చైనా సహకారం మాకు అందడం ఆనందాన్ని ఇస్తోంది. ఇరు దేశాల మధ్య సహకారం మరింత బలపడుతుందని ఆశిస్తున్నా’’ అంటూ వ్యాఖ్యానించారు ఆయన. యూటర్న్ తర్వాతే.. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తాజాగా బీజింగ్(చైనా రాజధాని) పర్యటనకు బయలుదేరారు. గురువారం ఆయన ప్రయాణించిన విమానం.. మార్గం మధ్యలోనే యూటర్న్ తీసుకుంది. సెర్బియా నోవోసిబిర్స్క్ నుంచి మాస్కోకు తిరుగుటపా కట్టింది. అనూహ్యమైన ఈ పరిణామాలపై జోరుగా చర్చలు నడిచాయి. అమెరికా వార్నింగ్ నేపథ్యంలో పుతిన్.. సెర్గీని వెనక్కి రప్పించుకున్నాడని.. కాదుకాదు చైనానే ఆయన్ని పర్యటన రద్దు చేసుకోమని ఒత్తిడి చేసిందని.. ఇలా కథనాలు మొదలయ్యాయి. విశేషం ఏంటంటే.. ఇప్పటిదాకా ఆయన పర్యటన రద్దుపై రష్యా సైతం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భేటీ అయిన కొన్ని గంటలకే రష్యా నుంచి ఇలాంటి ప్రకటన వెలువడడం గమనార్హం. సెర్గీ ప్రకటనపై అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఉక్రెయిన్ యుద్ధం ఎవరూ కోరుకోని సంక్షోభం అని జిన్పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వద్ద ప్రస్తావించిన విషయం తెలిసిందే. సుమారు రెండు గంటలపాటు వీడియో కాన్ఫరెన్స్లో శుక్రవారం వాళ్లిద్దరి మధ్య సంభాషణ సాగింది. ప్రపంచమంతటా శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, ఇందుకోసం ఉమ్మడిగా సహకారం అందిద్దామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు సూచించారు. రష్యాకు సహకారం అందిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు బైడెన్ నేరుగా హెచ్చరించిన తర్వాతే.. జిన్పింగ్ భేటీ కావడం కొసమెరుపు. -
చమరు ధరలపై అంతర్జాతీయ ఇంధన సంస్థ కీలక వ్యాఖ్యలు..!
గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్పై రష్యా తన దాడులను కొనసాగిస్తోంది. అయితే, ఈ ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న దాడుల వల్ల అంతర్జాతీయంగా చమరు ధరలు భారీగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న చమరు ధరల వల్ల అనేక దేశాల ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఇలాంటి కఠిన సమయంలో అంతర్జాతీయ ఇంధన సంస్థ ఇంధన ధరలపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. పెరుగుతున్న ధరలను తాత్కాలికంగా తగ్గించుకోవడం కోసం 10 పాయింట్ల ప్రణాళికను సూచించింది. ప్రపంచ చమురు మార్కెట్'లో రష్యా మూడవ అతిపెద్ద ఉత్పత్తిదారుడిగా మాత్రమే కాకుండా అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇప్పుడు ఆ ప్రభావం అనేక దేశాల మీద అధికంగా ఉంది. ఆర్థిక నష్టాన్ని తగ్గించడానికి ఉన్న ఒక కీలక మార్గం చమురు డిమాండ్'ను తగ్గించడం అని అంతర్జాతీయ ఇంధన సంస్థ తెలిపింది. తాము సూచించిన 10 పాయింట్ల ప్రణాళిక వల్ల కొంత మేరకు ధరల పెరుగుదల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. అయితే, ఈ 10 పాయింట్ల ప్రణాళిక అమలకు అనేక దేశాల ప్రభుత్వ మద్దతు అవసరం అని పేర్కొంది. ఈ ప్రణాళిక అమలు అనేది ప్రతి దేశ ఇంధన మార్కెట్లు, రవాణా మౌలిక సదుపాయాలు, సామాజిక & రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాల మీద ఆధారపడుతుంది అని తెలిపింది. 10 పాయింట్ల ప్రణాళికలోని ముఖ్య అంశాలు: ప్రస్తుతం హైవేలపై ఉన్న వేగ పరిమితిని గంటకు కనీసం 10 కిలోమీటర్ల వేగం తగ్గించాలి. దీని వల్ల కార్లు వినియోగించే ఆయిల్ వినియోగం సుమారు 290 కేబీ/డీ ఆదా అవుతుంది, ట్రక్కులు వినియోగించే ఆయిల్ వినియోగం 140 కేబీ/డీ ఆదా అవుతుంది. కేబీ/డీ అంటే రోజుకు వెయ్యి బ్యారెల్స్ ఆయిల్ అని అర్ధం. వారానికి మూడు రోజులు ఇంటి నుంచి పని చేయడం వల్ల ఒక రోజు సుమారు 170 కేబీ/డీ ఆయిల్ వినియోగం ఆదా అవుతుంది. అంటే, మూడు రోజులు కలిపి సుమారు 500 కేబీ/డీ ఆదా కానుంది. ప్రతి ఆదివారం నగర రోడ్ల మీద కార్లను అనుమతి ఇవ్వకూడదు. దీనివల్ల ప్రతి ఆదివారం సుమారు 380 కేబీ/డీ ఆదా అవుతుంది; నెలకు ఒక ఆదివారం 1520 కేబీ/డీ ఆదా చేస్తుంది. ప్రజా రవాణాను, మైక్రోమొబిలిటీ, వాకింగ్, సైక్లింగ్ ప్రోత్సహించడం వల్ల సుమారు 330 కేబీ/డీ ఆదా చేస్తుంది. పెద్ద నగరాల్లో ఎక్కువగా ప్రత్యామ్నాయ ప్రైవేట్ కారు యాక్సెస్ పెంచడం వల్ల సుమారు 210 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది. కారు షేరింగ్ విధానాలను ప్రోత్సహించడం వల్ల సుమారు 470 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది. సరుకు రవాణా ట్రక్కుల కోసం సమర్థవంతమైన డ్రైవింగ్ & గూడ్స్ డెలివరీని ప్రోత్సహించడం వల్ల సుమారు 320 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది. సాధ్యమైనంత వరకు విమానాలకు బదులుగా హై స్పీడ్, నైట్ రైళ్లను వినియోగించడం వల్ల సుమారు 40 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది. ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్న చోట వ్యాపార విమాన ప్రయాణాన్ని చేపట్టక పోవడం వల్ల సుమారు 260 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలను ప్రోత్సహించడం వల్ల సుమారు 100 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది. (చదవండి: దేశంలో చౌక గృహాలకు తగ్గిన డిమాండ్..!) -
రష్యా vs ఉక్రెయిన్: మారియుపోల్ మారణహోమం..!!
-
వెనక్కి రాకుంటే.. సాలిడ్ షాక్ ఇచ్చిన రష్యా
ఉక్రెయిన్ సంక్షోభం రష్యాను ఆర్థికంగా ఇరకాటంలో పెట్టేందుకు పాశ్చాత్య దేశాలకు ఒక అవకాశం కల్పించింది. ఇప్పటికే రికార్డు స్థాయి ఆంక్షలతో రష్యాను.. అంతర్జాతీయ సమాజంలో దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ తరుణంలో నిరసన పేరిట ప్రముఖ కంపెనీలెన్నో రష్యాను వీడాయి. అయితే.. ఆ కంపెనీలకు ఇప్పుడు సాలిడ్ షాక్ ఇచ్చింది రష్యా. విదేశీ కంపెనీలు రష్యాకు తిరిగి రావడానికి డెడ్లైన్ విధించింది పుతిన్ ప్రభుత్వం. మే 1వ తేదీలోపు తిరిగి తమ దేశానికి రాకుంటే, కార్యకలాపాలను మొదలుపెట్టకుంటే.. ఆయా కంపెనీలపై పదేళ్లపాటు నిషేధం విధిస్తామని సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు రష్యా డూమా డిప్యూటీ యెవ్గెని ఫెడోరోవ్ సదరు కీలక ప్రతిపాదన వివరాలను వెల్లడించారు. ‘‘ ఇది పూర్తిగా వాళ్లకు సంబంధం లేని వ్యవహారం. వాళ్ల జోక్యం అక్కర్లేనిది. వేలమంది రష్యన్ పౌరుల పౌరులను వాళ్లు(ఆ కంపెనీలను ఉద్దేశించి) అనిశ్చితిలోకి నెట్టేశారు. వాళ్ల భవిష్యత్తు, బాగోగుల గురించి ఏమాత్రం ఆలోచించలేదు’’. అని ఆ ప్రకటన చదివి వినిపించారు ఆయన. మే 1, 2022లోపు వారి(ఆ కంపెనీలు) కార్యకలాపాలను పునరుద్దరించుకోవడానికి అనుమతిస్తున్నాం. ఒకవేళ అది జరగకుంటే.. వాణిజ్య లావాదేవీలను అడ్డుకోవడమే కాదు.. పదేళ్ల పాటు రష్యాలో కార్యకలాపాలు నిర్వహించుకోకుండా నిషేధం కూడా విధిస్తాం అని స్పష్టం చేశారు యెవ్గెని. అంతకుముందు, రష్యాను విడిచిపెట్టిన విదేశీ కంపెనీలకు బాహ్య నిర్వహణను ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ ఆలోచనకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మద్దతు ఇచ్చారు. దీని ప్రకారం.. అధికారులు దీనికి తగినంత చట్టపరమైన మార్కెట్ సాధనాలను కలిగి ఉంటారు. అయితే వ్యాపారాలను నేరుగా జాతీయకరణ చేయడం కంటే.. విదేశీ కంపెనీల్లో తాత్కాలిక పాలన విభాగం ఏర్పాటు చేసుకోవడం మంచిదనే సూచనను ఎప్పటి నుంచో చేస్తున్నారు రష్యా ఆర్థిక మేధావులు. -
రష్యాకు మరో దిగ్గజ కంపెనీ భారీ షాక్..!
ఉక్రెయిన్ - రష్యా మధ్య ఇంకా దాడులు కొనసాగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా దేశాలు రష్యా మీద అనేక ఆంక్షలు విధిస్తుంటే, ఫేస్బుక్, యూట్యూబ్, ఆపిల్ వంటి దిగ్గజ కంపెనీలు ఆ దేశంలో తమ వ్యాపార కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయి. అయితే, తాజాగా మరో దిగ్గజ చిప్ మేకర్ కంపెనీ క్వాల్కామ్ అమెరికా విధించిన ఆంక్షలకు అనుగుణంగా రష్యన్ కంపెనీలకు తన ఉత్పత్తులను విక్రయించడం నిలిపివేసినట్లు తెలిపింది. క్వాల్కామ్ కంపెనీ సీనియర్ ప్రభుత్వ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ నేట్ టిబ్బిట్స్ ఈ నిర్ణయాన్ని ట్వీటర్ వేదికగా వెల్లడించారు. "ఇది తప్పు. @Qualcomm ఉక్రెయిన్'లో దురాక్రమణ చేయకుండా శాంతియుతంగా పరిష్కారం కోసం ప్రయత్నించాలి. మేము ఉక్రేనియన్ ప్రజలకు మద్దతుగా అందించే విరాళం, తమ ఉద్యోగులు అందిస్తున్న విరాళాలకు సమానంగా ఉంటుంది. మేము అమెరికా చట్టాలు & ఆంక్షలను పాటిస్తున్నాము. రష్యన్ కంపెనీలకు మా కంపెనీ ఉత్పత్తులను విక్రయించడం లేదు" అని నేట్ టిబ్బిట్స్ అన్నారు. ఈ ట్వీట్'ని రిట్వీట్ చేస్తూ "మీ కంపెనీ @Qualcomm ఉత్పత్తులను రష్యాకు విక్రయించనందుకు ధన్యవాదాలు. @NateTibbits మాకు సహాయం అందించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. క్వాల్కామ్ సహాయం చేయాలనుకుంటే ఉక్రేనియన్ రక్షకుల కోసం శాటిలైట్ ఫోన్లను పంపవచ్చు. దీని వల్ల సైనికులు సమాచార బదిలీ వేగంగా చేసుకునే అవకాశం ఉంటుంది." అని ఫెడోరోవ్ అన్నారు. (చదవండి: రూ.2కే లీటర్ పెట్రోల్.. ఏ దేశంలో తెలుసా?) -
పుతిన్ను యుద్ధ నేరస్థుడిగా అభివర్ణించిన బైడెన్
-
Kamala Harris: ఉక్రెయిన్పై కమలా హ్యారిస్ ట్వీట్.. దుమారం
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.. ఉక్రెయిన్ సంక్షోభ సమయంలో వేసిన ఓ ట్విటర్ పోస్ట్ దుమారం రేపుతోంది. ఉక్రెయిన్ నాటో కూటమిలో భాగమేనంటూ అర్థం వచ్చేలా ట్వీట్ చేసిన ఆమె.. కాసేపటికే ఆ ట్వీట్ను డిలీట్ చేశారు. కానీ, ఈ లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.. ఉక్రెయిన్ సంక్షోభ సమయంలో యూరప్లో పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా పోల్యాండ్ వెళ్లిన ఆమె.. అక్కడి ప్రెసిడెంట్ అండ్ర్జెజ్ డూడాతో రష్యా దురాక్రమణపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె పోల్యాండ్ అధికారులకు, పోల్యాండ్లోని అమెరికా రక్షణ అధికారులతోనూ భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆమె ట్విటర్లో పోస్ట్ చేసి.. ఉక్రెయిన్ వెంట అమెరికా ఉందంటూ ట్వీట్ చేశారు. అయితే ఆమె చేసిన ట్వీట్లో ఉక్రెయిన్, నాటో కూటమిలో భాగం అని అర్థం వచ్చేలా ఉంది. ఆ పోస్ట్కి నెగెటివ్ కామెంట్లు వస్తుండడంతో అసలు విషయం అర్థమైన ఆమె.. గంట తర్వాత ఆ ట్వీట్ తొలగించి.. మరో ట్వీట్ చేశారు. చివర్లో మరియు and అనే పదం చేర్చి మరోసారి ట్వీట్ చేశారు. కానీ, అప్పటికే కమలా హారిస్ డిలీట్ చేసిన ట్వీట్ తాలుకా స్క్రీన్ షాట్లు షేర్ అయ్యాయి. దీంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా ఉపాధ్యక్షురాలికి వాస్తవ పరిస్థితుల మీద కనీస అవగాహన కూడా లేదు. ఆమె మూర్ఖత్వం మహా ప్రమాదకరమంటూ మాజీ భద్రతా అధికారి డెర్రిక్ కామెంట్ చేశాడు. ఈయనే కాదు.. వేలమంది యూజర్లు కమలా హారిస్ రాంగ్పోస్ట్పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. -
తగ్గేదే లే.. ఐసీజే ఆదేశాల్ని తిరస్కరిస్తున్నాం!: రష్యా
ఉక్రెయిన్పై ఆక్రమణలో రష్యా కఠిన నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్పై మిలిటరీ చర్యలను ఆపేయాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆదేశాలను తిరస్కరిస్తున్నట్లు రష్యా ఒక ప్రకటన చేసింది. ఏఎఫ్పీ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను తాము పరిగణనలోకి తీసుకోబోమని క్రెమ్లిన్ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్పై దాడుల్ని మరింత తీవ్రం చేయనుందనే ఆందోళన నెలకొంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఐసీజే ఆదేశాలను రష్యా తప్పక పాటించాల్సి ఉంటుంది. కానీ.. ఉక్రెయిన్ దాడిని సస్పెండ్ చేయాలని రష్యాకు UN ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను క్రెమ్లిన్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో.. పెండింగ్లో ఉన్న తీర్పు మీదే ఉక్రెయిన్ భవితవ్యం ఆధారపడి ఉందన్నిక ఐసీజే ఆదేశాల పట్టింపు లేకుండా 22వ రోజూ ఉక్రెయిన్పై ఆక్రమణ కొనసాగిస్తోంది రష్యా. మరోపక్క శాంతి చర్చలపై స్పష్టత కొరవడి గందరగోళం నెలకొంది. ఇంకోవైపు రష్యా బలగాలు మెరెఫాలో స్కూల్ భవనాన్ని నాశనం చేశాయి. ప్రాణ నష్టం గురించి తెలియాల్సి ఉంది. ఐసీజే ఆదేశాలివి.. ఉక్రెయిన్పై రష్యా దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ కోర్టు సీరియస్గా రియాక్ట్ అయ్యింది. ఉక్రెయిన్పై రష్యా దాడులు ఆపాలంటూ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే మిలిటరీ ఆపరేషన్ను నిలిపివేసి, భద్రతా బలగాలను వెనక్కు తీసుకోవాలని ఐసీజే ఆదేశించింది. కాగా, అంతర్జాతీయ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హర్షం వ్యక్తం చేశారు. అత్యున్నత న్యాయస్థానంలో తామే గెలిచామని పేర్కొన్నారు. కానీ, రష్యా మాత్రం తగ్గడం లేదు. మరోవైపు ది హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ దాడి పై జరిగిన ఓటింగ్లో భారత్ (భారత న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్ భండారీ) రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసింది. పౌరులను లక్ష్యంగా చేసుకున్నట్లు వస్తున్న కథనాలను మాస్కో వర్గాలు ఖండించాయి. సుమారు వెయ్యి మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్న Mariupol థియేటర్పై రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపించాయని కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తమ బలగాలు మరియూపోల్ భవనంపై దాడి చేయలేదని చెప్తున్నాయి. ఇంకోపక్క ఈ యుద్ధంలో ఇప్పటిదాకా 14 వేలమంది రష్యన్ సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ జనరల్స్టాఫ్ ప్రకటించారు. కొత్త గోడ ధ్వంసానికి సాయం చేయండి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ జర్మనీకి ఆసక్తికరమైన పిలుపునిచ్చారు. ఐరోపాలో రష్యా నిర్మిస్తున్న కొత్త గోడ ధ్వంసం చేయడంలో సహాయపడాలని కోరాడు. బుండెస్టాగ్ దిగువ సభ పార్లమెంటును ఉద్దేశించి గురువారం ప్రసగించిన జెలెన్స్కీ.. భావోద్వేగ ప్రసంగంతో ఆకట్టుకున్నాడు. ఇక శాంతి చర్చలపై స్పష్టత కొరవడింది. స్వీడన్, ఆస్ట్రియా తరహాలో తటస్థ దేశంగా ఉండాలన్న రష్యా ప్రతిపాదనకు ఉక్రెయిన్ ఊహూ అంటోంది. -
భారత్పై ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్, కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు! ఇక బాదుడేనా?
ఉక్రెయిన్పై రష్యా యుద్ధ ప్రభావం భారత్ నుంచి కొన్ని ఉత్పత్తుల ఎగుమతులపై తీవ్రంగా ఉంటుందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ లోక్లోభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఫార్మా సూటికల్స్, టెలికం పరికరాలు, టీ, కాఫీ, సముద్ర ఉత్పత్తులపై ఈ ప్రభావం ఉంటుందని పరిశ్రమల నుంచి అందిన సమాచారం ప్రకారం తెలుస్తోందని అన్నారు. ఇంకా ఆయన పేర్కొన్న అంశాలు ఏమిటంటే... ► యుద్ధం వల్ల దేశంలో కూడా కొన్ని నిత్యావసర వస్తువుల సరఫరాలకు విఘాతం ఏర్పడే పరిస్థితి ఉంది. సమస్య నుంచి బయటపడ్డానికి సంబంధిత వర్గాలపై నిరంతరం సంప్రదింపులు నిర్వహిస్తున్నాం. సన్ఫ్లవర్ సహా వంటనూనెల సరఫరాలు తగిన విధంగా ఉండడం, ధరల కట్డడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ► యుద్ధానంతర పరిస్థితిపై ఇప్పుడే మరింత ఖచ్చితమైన అంచనాలకు రాలేం. ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది. సవాలు అంచనాకు ప్రస్తుతం ఈ అనిశ్చితి తొలగిపోయి, పరిస్థితి స్థిరపడాల్సి ఉంటుంది. ► భారతదేశం నుండి రష్యాకు ఎగుమతి చేసే ప్రధాన వస్తువుల్లో ఫార్మాస్యూటికల్స్, టెలికం సాధనాలు, ఇనుము, ఉక్కు, టీ, రసాయనాలు ఉన్నాయి. అయితే దిగుమతులలో పెట్రోలియం, ముత్యాలు, పాక్షిక విలువైన రాళ్లు, బొగ్గు, ఎరువులు, వంట నూనెలు ఉన్నాయి. ► ఉక్రెయిన్కు భారతదేశం ఎగుమతులలో ఫార్మాస్యూటికల్స్, టెలికం సాధనాలు, వేరుశెనగ, సిరామిక్, ఇనుము, ఉక్కు ఉన్నాయి. దిగుమతుల్లో వంట నూనెలు, ఎరువులు, ఇన్కార్బానిక్ రసాయనాలు, ప్లాస్టిక్, ప్లైవుడ్, దాని అనుబంధ ఉత్పత్తులు ఉన్నాయి. ► కొత్త విదేశీ వాణిజ్య విధానాన్ని (ఎఫ్టీపీ) రూపొందించడానికి సంప్రదింపుల ప్రక్రియలో భాగంగా సంబంధిత వర్గాలతో పలు సమావేశాల నిర్వహణ జరిగింది. వారి సూచనలు, సలహాలను పూర్తి స్థాయిలో కేంద్రం పరిశీలిస్తుంది. ► భారత్ 2021–22లో 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్సి సాధిస్తుంది. ► 2021 ఏప్రిల్–జనవరి 2022 మధ్య వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు (పాడి, పాల ఉత్పత్తులతో సహా) 25 శాతంపైగా వృద్ధితో 40.87 బిలియన్లకు పెరిగాయి. ► రబ్బర్ పరిశ్రమ పురోగతికి చట్ట సవరణ. చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు దారులకు నితిన్ గడ్కరీ శుభవార్త! -
Ukraine Russia Conflict: ముంచుకొస్తున్న కొరత!.. మేలుకోకుంటే అనర్థమే
Russia-Ukraine War: ప్రపంచ ఎరువుల కొరతకు రష్యా– ఉక్రెయిన్ సంక్షోభం ఆజ్యం పోయనుందని ప్రముఖ వ్యవసాయ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధ ఫలితంగా ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్, వంటచమురు ధరలకు రెక్కలు వచ్చాయి. త్వరలో ఈ ప్రభావం ప్రపంచ ఆహార వ్యవస్థపై పడుతుందని ఆందోళనలున్నాయి. తాజాగా ఈ ప్రభావం ఎరువుల ఉత్పత్తిపై పడుతుందని, దీంతో ఒక్కమారుగా వీటి ధరలు పెరిగి పంట ఉత్పత్తి భారీగా క్షీణిస్తుందని జాన్ హామండ్, వైయోర్గోస్ గడ్నాకిస్ అనే ఆహార శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వాతావరణంలోని నత్రజనిని హైడ్రోజన్తో సంయోగం చెందించడం ద్వారా అమ్మోనియా ఉత్పత్తి చేస్తారు. ఎరువుల ఉత్పత్తిలో అమ్మోనియాది కీలక స్థానం. అమ్మోనియా తయారీకి భారీగా శక్తి అవసరపడుతుంది. అంటే ఇంధన ధరల పెరుగుదల అమ్మోనియా ఉత్పత్తిపై ప్రభావం చూపనుంది. ఇప్పటికే అమెరికాలో అమ్మోనియం నైట్రేట్ ధర టన్నుకు 650 నుంచి వెయ్యి డాలర్లకు పెరిగింది. ఇంతవరకు ఒక్క కిలో నైట్రోజన్ ఎరువు వాడిన పొలంలో సుమారు 6 కిలోల దిగుబడి వస్తే ఖర్చులు పోను లాభం మిగిలేది. కానీ ఎరువు ధర పెరగడంతో ఇప్పుడు లాభం రావాలంటే ఒక్క కిలో ఎరువు వాడకానికి 10 కిలోల పంట రావాల్సిఉంటుందని అంచనా. అలాగని ఎరువులు తక్కువగా వాడితే దాని ప్రభావం దిగుబడి, నాణ్యతపై పడుతుంది. ఈ పరిస్థితి రైతును అడకత్తెరలో పోకచెక్కలా మారుస్తోందని జాన్ ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: జపాన్లో భారీ భూకంపం… సునామీ హెచ్చరికలు జారీ వచ్చే సీజన్ నుంచి ప్రభావం ఉక్రెయిన్ సంక్షోభ ఫలితంగా ఇంధన ధరలు పెరిగిన ప్రభావం ఎరువుల ఉత్పత్తిపై వచ్చే పంట సీజన్లో కనిపిస్తుందని పరిశోధకుల అంచనా. అప్పటికి ముందే కొనుగోలు చేసిన ఎరువులు రైతుల వద్ద అయిపోవడంతో కొత్తగా ఎరువుల కొనుగోలు చేయాల్సి వస్తుంది. అప్పటికి ఇంధన ధరల పెరుగుదల ప్రభావంతో ఎరువుల రేట్లు విపరీతంగా పెరిగి ఉంటాయి. దీనివల్ల రైతు తక్కువగా ఎరువులు కొనుగోలు చేయడం జరగవచ్చని, ఇది కమతంలో పంట దిగుబడి తగ్గడానికి దారితీస్తుందని జాన్ విశ్లేషించారు. ప్రపంచ ఎరువుల ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్ధాల సరఫరా అత్యధికంగా రష్యా, ఉక్రెయిన్ నుంచి జరుగుతుంది. యూరప్లో అతిపెద్ద ఎరువుల ఉత్పత్తిదారైన యారా కంపెనీ అవసర ముడిపదార్థాలను ఉక్రెయిన్ నుంచి కొం టుంది. సంక్షోభం కారణంగా ఉక్రెయిన్ పతనమవ డం, రష్యాపై ఆంక్షలు విధించడం ముడిపదార్ధాల సరఫరాపై ప్రభావం చూపనున్నాయి. బెలారస్, రష్యాలు ప్రపంచ పొటాషియం ఉత్పత్తిలో మూడోవంతును ఉత్పత్తి చేస్తున్నాయి. ఎరువుల తయారీలో పొటాషియం కూడా కీలకపాత్ర పోషిస్తుంది. చదవండి: దాడులు ఆపండి.. రష్యాకు అంతర్జాతీయ కోర్టు కీలక ఆదేశాలు ఆహార భద్రత ఎరువుల ఉత్పత్తి తగ్గడం తత్ఫలితంగా ఆహార పదార్థాల ఉత్పత్తి తగ్గడం కలిసి అంతిమంగా ప్రపంచ ఆహార భద్రతను ప్రమాదంలోకి నెడతాయని జాన్, వైయోర్గోస్ అంచనా వేశారు. ఇప్పటికే కరోనా కారణంగా ప్రపంచ ఆహార భద్రత విషమంగా మారింది. 2019లో ప్రపంచ జనాభాలో 9 శాతం మంది కరువు కోరల్లో ఉన్నారు. కరోనా ప్రభావంతో వీరి సంఖ్య బాగా పెరిగింది. ఇప్పుడు ఎరువుల కొరత కారణంగా ప్రపంచ ఆకలి కేకలు మరింతగా పెరగనున్నాయి. ప్రభుత్వాలు తక్షణం తగిన చర్యలు తీసుకోకపోతే చాలామంది కరువు రక్కసికి బలికాక తప్పదని నిపుణుల హెచ్చరిక. ప్రజలను బతికించుకోవాలంటే ప్రభుత్వాలు ముందుగా మేలుకొని ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టడం, దేశీయంగా ఎరువుల ఉత్పత్తిని పెంచడం, పేదరిక రేఖకు దిగువన ఉన్నవారికి తగినంత ఆహార భద్రత కల్పించడం, సరిపడా ఆహారధాన్యాలను సమీకరించి నిల్వ చేసుకోవడం తదితర చర్యలు చేపట్టాలని సూచించారు. – నేషనల్ డెస్క్, సాక్షి. -
మాదేశానికి రండి..వద్దు.. ఇక్కడే చదవండి
సాక్షి, హైదరాబాద్: యుద్ధ సంక్షుభిత ఉక్రెయిన్లోని మెడికల్ కాలేజీల్లో చదువుతున్న వైద్య విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. రష్యా దాడుల నేపథ్యంలో అర్ధంతరంగా భారత్కు చేరుకున్న విద్యార్థుల్లో ఆందోళన కొనసాగుతోంది. ఒకవైపు, వారిని ఆకర్షించేందుకు ఉక్రెయిన్ పొరుగుదేశాలు ప్రయత్నిస్తోంటే, మరోవైపు వారిని నిలబెట్టుకునేందుకు ఉక్రెయిన్ యూనివర్సిటీలు కృషి చేస్తున్నాయి. బోధన మధ్యలోనే ఆగిపోవడాన్ని అదనుగా చేసుకుని ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన హంగేరీ, పోలండ్, జార్జియా, అర్మేనియా, రుమేనియాల్లోని మెడికల్ కాలేజీలు ఉక్రెయిన్లో చదువుతున్న తెలుగు విద్యార్థులకు వల వేస్తున్నాయి. ఉక్రెయిన్లో ఆగిపోయిన చదువును తమ దేశాల్లో పూర్తి చేయాలంటూ తమ ఏజెంట్ల ద్వారా కోరుతున్నా యి. ‘రుమేనియాలోని ఓ మెడికల్ కాలేజీ నుంచి నాకు ఫోన్ వచ్చింది. మూడో ఏడాది ఎంబీబీఎస్ తమ దేశంలో తక్కువ ఫీజుతో చేయమంటూ ఏజెంట్ చెప్పాడు’అని కూకట్పల్లికి చెందిన ఉక్రెయిన్ వైద్య విద్యార్థిని దివ్య తెలిపింది. ఉక్రెయిన్ నుంచి భారత్కు వచ్చే సమయంలోనే భారత విద్యార్థుల వివరాలను కొంతమంది సేకరించారు. ‘మా కాలేజీతో సంబంధం లేని వాళ్లు అప్పుడు మా ఫోన్ నంబర్లు ఎందుకు అడుగుతున్నారో తెలియదు. వారం రోజులుగా వాళ్లు ఫోన్ చేస్తున్నారు. హంగేరీలో మిగతా విద్య పూర్తి చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు’అని బోరబండలో ఉంటున్న స్వాతి చెప్పింది. హడావుడిగా ఆన్లైన్: ఇతర దేశాల విశ్వవిద్యాలయాలు వల వేయడంతో ఉక్రెయిన్ కాలేజీలు హడావుడిగా ఆన్లైన్ మంత్రం అందుకుంది. బొకోవినియా స్టేట్ మెడికల్ కాలేజీ గూగుల్ మీట్ ద్వారా ఇప్పటికే వర్చువల్ క్లాసులు ప్రారంభించినట్టు విద్యార్థులు తెలిపారు. అయితే, అవి ఆశించిన స్థాయిలో ఉండటం లేదని మలక్పేటలో ఉంటున్న వైద్య విద్యార్థిని రూపా శ్రీవాణి చెప్పారు. యుద్ధం రాకపోతే ఈపాటికి సిలబస్ చాలా వరకూ పూర్తవ్వాల్సి ఉందని, జూన్లో రెండో సెమిస్టర్కు వెళ్లేవాళ్లమని వారన్నారు. కీలకమైన నాల్గో సంవత్సరంలో ఇంటర్నల్ మెడిసిన్, నరాల సంబంధిత సబ్జెక్టుల ప్రాక్టికల్స్కు అత్యంత ప్రాధాన్యమిస్తారు. కానీ థియరీ మాత్రమే చెప్పి చేతులు దులుపుకుంటున్నారని ఎక్కువ మంది వాపోతున్నారు. అనాటమీ కేవలం పుస్తకాల్లోని పాఠాల ద్వారా నేర్చుకుంటే ఎలా బోధపడుతుందని ప్రశ్నిస్తున్నారు. వేరే చోట విద్య ఎలా?: ఉక్రెయిన్ కాలేజీల్లో పూర్తిగా ఆంగ్లంలోనే విద్యాభ్యాసం ఉంటుంది. విద్యార్థులు తేలికగా సబ్జెక్టు అర్థం చేసుకునే వీలుంది. అదేవిధంగా అక్కడ ఫ్యాకల్టీతో లోతుగా తమ భావాలు పంచుకునే అవకాశం ఉంటుంది. కానీ ఉక్రెయిన్ పొరుగు దేశాలు చాలావరకూ స్థానిక భాషను అనుసరిస్తున్నాయి. దీనివల్ల హంగేరీ, జార్జియా, పోలండ్ తదితర దేశాల్లో వైద్య విద్య చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఈలోపాన్ని గుర్తించిన పొరుగు దేశాల కాలేజీలు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించేందుకు కొత్త ఫ్యాకల్టీని ఏర్పాటు చేస్తామంటూ గాలం వేస్తున్నాయి. దీంతో ఇప్పటికే కొంతమంది అక్కడ ప్రవేశాలు పొందారు. ఆన్లైన్ అరకొరే: పి.దీప్తి (బొకోవినియన్ స్టేట్ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థిని) నాల్గో సంవత్సరం వైద్య విద్య బోధన ఈ మధ్యే ఆన్లైన్లో మొదలుపెట్టారు. ఈ ఏడాది కీలకమైన సబ్జెక్టులుంటాయి. ప్రాక్టికల్స్తో నేర్చుకుంటే తప్ప అర్థమయ్యే పరిస్థితి లేదు. ఆన్లైన్లో రోజుకు గంట మాత్రమే చెబుతున్నారు. ప్రత్యక్ష బోధనతో పోలిస్తే వైద్య విద్యకు ఆన్లైన్ ఏమాత్రం సరిపోదు. సరిహద్దు దేశాలు ఆకర్షిస్తున్నాయి: రాజు (ఎడ్యుకేషన్ కన్సల్టెంట్, హైదరాబాద్) ఉక్రెయిన్ సరిహద్దు దేశాలు తాజా పరిస్థితిని అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అక్కడ బోధన అనుకున్న స్థాయిలో లేదు. అక్కడి భాషను విద్యార్థులు ఇప్పటికిప్పుడు అర్థం చేసుకోవడమూ కష్టమే. అయితే, ఇవేవీ ఆలోచించకుండానే కొంతమంది చేరుతున్నారు. అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే విద్యార్థులు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. -
రష్యా టీవీ లైవ్షోలో నిరసన.. మహిళా జర్నలిస్ట్కు 15 ఏళ్ల వరకు జైలు శిక్ష!
యుద్ధం ఆపాలంటూ రష్యా టీవీ లైవ్ షోలో నిరసన తెలిపిన మహిళా జర్నలిస్ట్కు దాదాపు 15 ఏళ్లు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మాస్కోలోని ఛానల్1లో పనిచేస్తున్న మెరీనా ఓవ్స్యానికోవా యుద్ధం ఆపాలని ప్లకార్డుతో రష్యాకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వెంటనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న మెరీనా అనంతరం మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను న్యూయార్క్ టైమ్స్ ట్విటర్లో పోస్టు చేసింది. ఇందులో సదరు ఉద్యోగి ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి తను చేసిన ప్రయత్నాలను వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. తనను 14 గంటలపాటు పోలీసులు విచారించినట్లు తెలిపింది. తన కుటుంబాన్ని కలిసేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని తెలిపింది. అంతేగాక ఘటన తర్వాత పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు న్యాయ సహాయం కూడా అందలేదని వాపోయింది. చదవండి: రష్యాకు కోలుకోలేని దెబ్బ.. ఆవేదనలో పుతిన్..! A Russian state television employee who stormed a live broadcast Monday has been fined by a Moscow court for saying in a video that she was “deeply ashamed” to have helped make “Kremlin propaganda." She still faces a prison sentence over the protest. https://t.co/fFmgkyvmP6 pic.twitter.com/wb2FanGFsa — The New York Times (@nytimes) March 16, 2022 ‘ఉక్రెయిన్ రష్యా యుద్ధం భయంకరంగా సాగుతోంది. ఉక్రెయిన్పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకు మద్దతుగా నిలిచిన స్నేహితులు, సహోద్యోగులకు ధన్యవాదాలు. నా జీవితంలో ఇవి చాలా కఠినమైన రోజులు. రెండు రోజులుగా నిద్రపోలేదు’ అని తెలిపింది. అయితే రష్యా మహిళా జర్నలిస్ట్ నిరసన విషయం తెలిసిన యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కాగా రష్యాలోని ఓ వార్తా ఛానెల్లో జర్నలిస్ట్ లైవ్లోనే యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన విషయం తెలిసిందే. మరో జర్నలిస్ట్ వార్తలు చదువుతుండగా యుద్ధానికి వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకుని నిరసనను తెలిపింది. ‘యుద్ధం వద్దు.. యుద్ధాన్ని ఆపండి.. వాళ్లు ఇక్కడ అబద్దం చెబుతున్నారు. తప్పుడు ప్రచారాలను అసలు ఎవరూ నమ్మోద్దు’ అని నిరసన వ్యక్తం చేసింది. దీంతో రష్యా టీవీ జర్నలిస్టు నిరసన తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మెరీనా తండ్రి యుక్రెయిన్ దేశస్థుడు కావడంతో ఆమె మద్దతుగా నిరసన వ్యక్తం చేసింది. చదవండి: యుద్దం వేళ రష్యాతో భారత్ డీల్.. మోదీపై అక్కసు వెళ్లగక్కిన అమెరికా -
రష్యాతో బిజినెస్ చేస్తాం.. లాభం ఉక్రెయిన్కు ఇస్తాం!
రష్యాలో పెట్టుబడులు, వ్యాపారాలు నిలిపేస్తాం అంటూ కొన్నాళ్ల కిందట అమెరికా ఫార్మా దిగ్గజం ‘ఫైజర్’ సీఈవో అల్బర్ట బౌర్లా స్వయంగా ఒక ప్రకటన విడుదల చేశారు. మిగతా కంపెనీల్లాగే.. ఉక్రెయిన్పై యుద్ధానికి నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ నిర్ణయంలో పెద్ద మార్పే వచ్చింది ఇప్పుడు. ఉక్రెయిన్పై యుద్ధం మొదలెట్టిన రష్యాకు పారిశ్రామిక దిగ్గజాలు వరుస షాకులు ఇస్తున్నాయి. మెజారిటీ కంపెనీలు తమ కార్యకలాపాలను రష్యాలో నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించగా.. అందుకు విరుద్ధంగా రష్యాలో తమ కార్యకలాపాలు కొనసాగుతాయని ప్రకటించిన ఔషధ తయారీ దిగ్గజం ఫైజర్ ఆపై ఓ కీలక ప్రకటన చేసింది. మానవతా దృక్పథంతో ఆలోచించి.. ఇప్పుడు వ్యాపారం కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు ఫైజర్ సీఈవో వెల్లడించారు. ‘‘రష్యాలో మందుల కొరత ఏర్పడింది. ఈ తరుణంలో మేం మానవతా కోణంలో ఆలోచించాలి. అందుకే వ్యాపారం కొనసాగించాలనుకుంటున్నాం. మందులు పంపిస్తాం. అయితే.. రష్యాలో వచ్చే మొత్తం లాభాలను మాత్రం ఉక్రెయిన్కే సాయంగా అందిస్తాం. అంతేకాదు... రష్యాకు మందుల వరకు సరఫరా చేసినప్పటికీ.. అక్కడ నిర్వహిస్తున్న క్లినికల్ ట్రయల్స్ మాత్రం నిలిపివేస్తాం. ఇకపై రష్యాతో కొత్త ఒప్పందాలుండబోవ్’’ అని ఫైజర్ స్పష్టం చేసింది. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని పాశ్చాత్య దేశాలతో పాటుగా మెజారిటీ సంస్థలు తప్పుబడుతున్నాయి. అందుకు నిరసనగా రష్యాతో సంబంధాలు తెంచుకుంటున్నట్లుగా కూడా మెజారిటీ దేశాలు, సంస్థలు ప్రకటించాయి. అయితే అందుకు భిన్నంగా వ్యవహరించిన అమెరికన్ ఫార్మా కంపెనీ ఫైజర్ మాత్రం రష్యాతో సంబంధాలు కొనసాగిస్తామని చెబుతూనే.. రష్యాలో వచ్చే లాభాలను ఉక్రెయిన్కు సాయంగా ప్రకటిస్తామని కొత్త తరహాలో ప్రకటన చేయడం రష్యాకు షాక్ అనే చెప్పొచ్చు. దీనిపై రష్యా రియాక్షన్ ఎలా ఉండబోతోందో చూడాలి. -
వల్లకాడుగా మారిన కీవ్ నగరం! (ఫొటోలు)
-
ఈ సంక్షోభానికి అసలు మూలం
ఈరోజు ప్రపంచం మొత్తం పుతిన్ గురించి మాట్లాడుతోంది. కానీ రష్యాలో పాతుకుపోయిన సనాతన మతతత్వమే అసలు సమస్య. కమ్యూనిజం, సోషలిజం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించడమే కాదు, రష్యన్ సమాజంలోకి సనాతన వ్యతిరేక విలువలను తీసుకొచ్చిన ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని కూడా అక్కడి సనాతన మతం వ్యతిరేకిస్తోంది. ఈ రాజకీయ, ఆధ్యాత్మిక, సామాజిక పునాదే నేడు పుతిన్ను ఇలా తయారు చేసింది. ప్రపంచం ఇప్పుడు అఫ్గాన్ తాలిబనిజం, రష్యన్ సనాతనవాదం వంటి పలురకాల మత ఛాందసవాదాలతో తలపడుతోంది. ఈ యుద్ధంలో రష్యా గెలిచి ఉక్రెయినియన్ ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసినట్లయితే, ఉదారవాద మత ప్రపంచం తమ ప్రజాస్వామ్యం, లౌకికవాదాల ప్రయోగంలో కొత్త దశలోకి ప్రవేశించక తప్పదు. ఆధునిక కాలాల్లో పాలకవర్గ రాజకీయ శక్తులు తీవ్రమైన మత లేదా మత వ్యతిరేక కార్యకలాపాల్లో మునిగితేలడం అత్యంత ప్రతికూల పరిణామాలను తీసుకొస్తుంది. రష్యన్ అనుభవం దీన్ని స్పష్టంగా ప్రదర్శిస్తోంది. రష్యాలో కమ్యూనిస్టు దశ సంపూర్ణంగా మత వ్యతిరేకతతో కూడుకుంది. కమ్యూనిస్టు పాలనలో భయంకరమైన బాధలకు గురైన సనాతన చర్చితో ఇప్పుడు పుతిన్ రష్యా ప్రగాఢంగా ముడిపడివుంది. 20వ శతాబ్ది ప్రారంభం నుండి రష్యన్ సమాజం, ప్రభుత్వం– రెండూ మత సమస్యపై అత్యంత తీవ్రమైన వైఖరులను తీసుకున్నాయి. బోల్షివిక్ విప్లవం తర్వాత రష్యాలో మత వ్యతిరేక ప్రచారం ఎంత తీవ్రంగా సాగిందంటే, చర్చికి సంబంధించిన చిహ్నాలు, భవనాలను కూల్చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలు అప్పటికీ మతస్ఫూర్తితో ఉంటున్నందున ప్రజలందరూ నాస్తికత్వాన్ని పాటించాలని కమ్యూనిస్టులు భావించేవారు. ఇప్పుడు రష్యన్ అధ్యక్షుడు పుతిన్... మతాచరణను రాజ్యవిధానంగా నమ్మాలని ప్రజలను బలవంతపెడుతున్నారు. రష్యన్ సనాతన చర్చి ప్రామాణికమైన పితృస్వామిక వ్యవస్థ నేతృత్వంలో ఉండేది. ఇది రోమన్ కేథలిక్ మతతత్వానికి భిన్నమైనది. అందుకే పుతిన్ నిరంకుశ వ్యవస్థను పూర్తిగా సమర్థించడం, ఉక్రెయిన్పై యుద్ధాన్ని బలపర్చడమే కాకుండా యుద్ధానికి అవసరమైన బలగాలను కూడా ఇది సమీకరించింది. రష్యన్ చరిత్ర, జాతీయత పట్ల సనాతన చర్చి వ్యాఖ్యానం సరిగ్గా ఇతర ఆధ్యాత్మిక మతతత్వాలను అచ్చుగుద్దేలా ఉంటుంది. మతం అనేది జాతిని నిర్వచించే కీలక వనరుగా మారిపోయినప్పుడు ప్రతి అంశంలోనూ ఛాందసవాదం పాతుకుపోతుంది. రష్యాలో ఉక్రెయిన్ భాగమని రష్యన్ సనాతన మతబోధకులు నమ్ముతారు. ఎందుకంటే రష్యన్ సనాతన చర్చి ప్రస్తుత ఉక్రెయిన్ ప్రాంతంలో 10వ శతాబ్దంలో పుట్టింది. సెయింట్ ఆండ్రూస్ కీవన్ రస్ ప్రాంతంలో తొలి చర్చిని నెలకొల్పినట్లు చెబుతారు. అదే ఇప్పుడు ఉక్రెయిన్ రాజధాని కీవ్ పేరుతో చలామణిలో ఉంది. రష్యా, ఉక్రెయిన్, బెలారస్లను సనాతన అఖండ రష్యాగా చెప్పేవారు. దీనికీ... ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లను సనాతన హిందూ ప్రాంతాలుగా గుర్తిస్తూ అఖండ భారత్ గురించి ఆరెస్సెస్ నేతలు చెప్పేదానికీ ఏమాత్రం వ్యత్యాసం లేదు. సోవియట్ యూనియన్ శాంతియుతంగా విచ్ఛిన్నమైపోవడం ఆమోదించకూడదనీ, కనీసం సనాతన చర్చి కేంద్రంగా ఉన్న రష్యాను ఎలాగైనా సరే మళ్లీ ఐక్యపర్చాలనీ భావిస్తున్న సనాతన మతబోధకుల నుండి పుతిన్ ఈ థియరీని తీసుకొచ్చారు. సనాతన చర్చిలో కూడా అసమ్మతివాదులు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు కానీ చాలావరకు సనాతన నేతలు పుతిన్తో ఉంటున్నారు. ఈ రోజు ప్రపంచం మొత్తంగా పుతిన్ గురించి మాట్లాడుతోంది కానీ సమస్య ఒక్క పుతిన్ మాత్రమే కాదు. మొత్తం సనాతన మతతత్వానికి చెందిన మత జాతీయతే అసలు సమస్య. రోమన్ కేథలిక్ చర్చితో సనాతన రష్యన్ చర్చి విభేదించడంలో కొన్ని మౌలిక సమస్యలు ఉన్నాయి. అలాగే పశ్చిమాన ప్రొటెస్టెంట్ చర్చితో ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయి. సనాతన చర్చి మద్దతుతో పుతిన్ రష్యాకు ఎదురులేని నేతగా మారిన తర్వాత రష్యాలోని రోమన్ కేథలిక్కులపై హింసాత్మకంగా దాడి చేయడం మొదలైంది. గర్భస్రావాలపై, స్వలింగ వివాహాలపై రోమన్ చర్చి కాస్త ఉదారవాద దృక్పథం తీసుకోవడమే కాకుండా ఉదారవాద డ్రెస్ కోడ్ను కూడా పాటిస్తూ వచ్చింది. దీంతో ఇవన్నీ పాశ్చాత్య ప్రపంచ ఆధునికానంతర దశలో చొచ్చుకువచ్చిన అనైతిక విధానాలుగా సనాతన చర్చి భావించేది. పాశ్చాత్య ఉదారవాదులను సనాతనవాద రష్యన్లు తమ శత్రువులుగా భావించేవారు. అయితే రష్యన్లు ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తున్నారని దీని అర్థం కాదు. కమ్యూనిస్టు దశలో శ్రామికవర్గ నియంతృత్వ భావన రష్యన్ ప్రజల మనస్తత్వంపై ప్రతికూల ప్రభావం కలిగించింది. కమ్యూనిస్టు పాలనలో వారి అనుభవం వల్ల కావచ్చు. ప్రత్యేకించి సనాతన భావాలు కలిగినవారు సనాతన నిరంకుశ రాజకీయ పాలననే గట్టిగా విశ్వసిస్తున్నారు. నేటి రష్యాను ఆధ్యాత్మిక రాజ్యంగా మనం పిలవలేనప్పటికీ పుతిన్ వంటి స్వార్థ కాంక్షగల పాలకులు ఇలాంటి సనాతన వాతావరణాన్ని క్రమేపీ ఆధ్యాత్మిక నిరంకుశత్వంలోకి సులువుగా తీసుకుపోతారు. ఉదారవాదం, లౌకికవాదం రెండూ ప్రమాదకరమైన సిద్ధాంతాలని రష్యన్ సనాతనవాదులు నమ్ముతున్నారు. కమ్యూనిజం, సోషలిజం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించడమే కాదు, రష్యన్ సమాజంలోకి సనాతన వ్యతిరేక విలువలను తీసుకొచ్చిన ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని కూడా సనాతన చర్చి వ్యతిరేకిస్తోంది. పుతిన్ మితవాద నిరంకుశత్వం చాలా ఉపయోగకరమని ఇలాంటి జాతీయవాద ప్రాపంచిక దృక్పథాలు భావిస్తున్నాయి. తమ పొరుగున ఉన్న ఉక్రెయినియన్ ప్రజాస్వామ్యం తమ మితవాద, లాంఛనప్రాయమైన ఎన్నికలతో కూడిన నిరంకుశత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుందని సనాతన చర్చి భావిస్తోంది. చైనా తరహా మార్కెట్ కమ్యూనిజాన్ని రష్యన్లు కోరుకోవడం లేదు. కమ్యూనిస్టు వ్యవస్థలు ప్రజల ఆధ్యాత్మిక స్వయంప్రతిపత్తిని నిర్మూలించడమే కాకుండా ప్రజాజీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభుత్వం నిర్దేశిస్తూ రావడంతో... ప్రభుత్వమూ, మతమూ ఒకటిగా కలిసిపోయి ఉండే తరహా నియంతృత్వాన్ని రష్యన్ సనాతనవాదులు కోరుకుంటున్నారు. ప్రభుత్వాన్ని, మతాన్ని విడదీయడానికి ఆస్కారమే లేని ఈ వ్యవస్థే పుతిన్ను సంపూర్ణంగా బలపర్చింది. చాలావరకు ముస్లిం దేశాలు కూడా ఇలాంటి ఆధ్యాత్మిక నిరంకుశ రాజ్యవ్యవస్థలలోనే నడుస్తుంటాయి. కానీ ఇవి లౌకికవాదంతో ఘర్షణ పడవు. అఫ్గాన్ తాలిబనిజం ఒక్కటే అత్యంత తీవ్రరూపంలోకి మళ్లింది. మతం, రాజ్యవ్యవస్థ కలగలిసిన నిరంకుశత్వం... విభిన్న సామాజిక, రాజకీయ వ్యవస్థలను కొనసాగించదలుస్తున్న పొరుగుదేశాలతో యుద్ధాలు కోరుకుంటుంది. సోషలిస్టు వ్యవస్థలు కుప్పకూలిన తర్వాత ప్రపంచం తిరిగి సోషలిస్టు పూర్వ ఘర్షణల స్థాయికి చేరుకుంది. రష్యాలో ప్రజాస్వామిక సంక్షేమ జాతీయవాదం కాకుండా ఆధ్యాత్మిక జాతీయవాదమే జాతి కార్యాచరణను నిర్ణయిస్తోంది. పాశ్చాత్య ప్రపంచం రష్యాను ఒక ధూర్తదేశంగా వర్ణిస్తున్నప్పటికీ తమపై ఈ ముద్రను ఆధ్యాత్మిక జాతీయవాదం లెక్కచేయదు. క్రిస్టియన్ ప్రపంచంలో ఈ దిశను రష్యా ఇప్పుడు చూపిస్తున్నట్లుంది. ఉక్రెయిన్ కూడా ప్రభుత్వాన్ని, చర్చిని నామమాత్రంగా మాత్రమే విడదీసే ప్రజాస్వామిక నమూనాను ఆమోదించే సనాతన క్రిస్టియానిటీని కలిగి ఉన్నది కనుక ఈ యుద్ధంలో ఏం జరగబోతుందనేది వేచి చూడాలి. ప్రపంచం ఇప్పుడు అఫ్గాన్ తాలిబనిజం, రష్యన్ సనాతనవాదం వంటి పలురకాల ఆధ్యాత్మిక ఛాందసవాదాలతో తలపడుతోంది. భారతదేశంలో హిందుత్వశక్తులు పదేపదే తాము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నామనీ, రాజ్యాంగ పరిధిలో నడుస్తున్నామనీ చెప్పుకుంటున్నప్పటికీ, మతపరమైన ఛాందసవాదం ఈ శక్తులను ఏవైపునకు తీసుకుపోతుందనేది చెప్పలేం. మతమనేది ప్రభుత్వ పాలనతో కలిసిపోయాక, ఒక పాలకుడు జీవితకాల పాలకుడిగా మారాలని అభిప్రాయానికి వచ్చాక, మతపర శక్తులు పౌరసమాజాన్ని దూకుడుగా నియంత్రిస్తాయి. ఎన్నికల వ్యవస్థను కూడా తారుమారు చేసినప్పడు ఏ వ్యవస్థ అయినా నియంతృత్వంలోకి వెళ్లి తీరుతుంది. ఈ యుద్ధంలో రష్యా గెలిచి ఉక్రెయినియన్ ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసినట్లయితే, క్రిస్టియన్ ప్రపంచం తమ జాతీయవాదం, ప్రజాస్వామ్యం, లౌకికవాద తత్వాల ప్రయోగంలో కొత్త దశలోకి ప్రవేశించడం ఖాయం. ప్రొ‘‘ కంచ ఐలయ్య వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త షెపర్డ్ -
గూగుల్ హైడ్రామా! రష్యాకు మరో కోలుకోలేని దెబ్బ!
ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న భీకర యుద్ధం కొనసాగుతుంది. ఈ యుద్ధంలో రష్యాకు ధీటుగా పోరాడుతున్న ఉక్రెయిన్కు ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. దిగ్గజ టెక్ సంస్థలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే టెక్ దిగ్గజం గూగుల్ గూగుల్.. యూట్యూబ్ పరిధిలోని రష్యన్ మీడియాకు సంబంధించిన అడ్వెర్టైజ్మెంట్లును నిషేధిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ టెక్నికల్ అంశాలను సాకుగా చూపించి రష్యాలో గూగూల్ ప్లే స్టోర్, యూట్యూబ్ పేమెంట్స్ ఆధారిత అన్ని సేవలను నిలిపివేసినట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో రష్యన్లు గూగుల్ ఆధారిత పెయిడ్ సబ్ స్క్రిప్షన్లను కొనుగోలు చేయలేరు. షాపింగ్ చేయలేరు. గూగుల్ కాకుండా వేరే సెర్చ్ ఇంజిన్లు రష్యాలో సేవలు కొనసాగిస్తున్నాయి. కానీ గూగుల్ మించిన సర్వీసులు లేకపోవడం గూగుల్ నిర్ణయం ఆదేశ ప్రజలకు మరింత ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే టెక్ కంపెనీలు రష్యా - ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా రష్యాలో మైక్రోసాఫ్ట్, యాపిల్, శాంసంగ్ వంటి దిగ్గజ కంపెనీలు తమ సేవల్ని నిలిపివేశాయి. ఆర్దిక సంస్థలైన పేపాల్,వీసా, మాస్టర్ కార్డ్, అమెరికన్ ఎక్స్ప్రెస్ లు సర్వీసుల్ని ఆపేశాయి. తద్వరా రష్యాకు ఆర్ధిక సంక్షోభం తలెత్తనుందని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఫ్లీజ్ మోదీజీ!! మమ్మల్ని ఆదుకోండి..భారత్కు రష్యా బంపరాఫర్! -
దేశ భద్రత పై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష
-
ఫ్లీజ్ మోదీజీ!! మమ్మల్ని ఆదుకోండి..భారత్కు రష్యా బంపరాఫర్!
ఉక్రెయిన్పై రష్యా దాడి ఆ దేశ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది. యుద్ధంతో ప్రపంచ దేశాల నుంచి ఎదరవుతున్న ఇబ్బందుల నుంచి ఆర్ధికంగా తమను ఆదుకోవాలంటూ రష్యా భారత్ను అర్జిస్తుంది. ఇందులో భాగంగా భారత్.. తమ దేశ దేశంలోని ఆయిల్, గ్యాస్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాపై అమెరికాతో పాటు ఇతర నాటో దేశాలు గుర్రుగా ఉన్నాయి. అందుకే రష్యా నుంచి దిగుమతులపై పూర్తి స్థాయిలో నిషేధం విధించాయి. దీంతో గత రెండు వారాలుగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. శనివారం ఈ ఏడాది చివరి నాటికి రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేస్తామని జర్మనీ కీలక ప్రకటన చేసింది. ప్రతి రోజు, ప్రతి గంటకు మేము రష్యన్ దిగుమతులకు వీడ్కోలు పలుకుతున్నాంటూ జర్మన్ ఆర్థిక శాఖ మంత్రి రాబర్ట్ హబెక్ ప్రముఖ మీడియా 'ఫ్రాంక్ఫర్టర్ ఆల్జెమీన్ జైటుంగ్' కు తెలిపారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం..జర్మనీ ప్రస్తుతం చమురులో 3వ వంతు, బొగ్గులో 45శాతం రష్యా నుండి దిగుమతి చేసుకుంటోంది. అయినా సరే ఈ నెల ముగిసే సమయానికి బొగ్గు కొనుగోళ్లను, సంవత్సరం చివరి నాటికి చమురు కొనుగోళ్ల నిలిపివేస్తామని మీడియా కు వెల్లడించారు. అదే సమయంలో క్రూడాయిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో పాటు రష్యా వద్ద చమురు ధరలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. రష్యా అమెరికాకు ప్రతిరోజు 7లక్షల బ్యారల్ల చమురును ఎగుమతి చేసేది. అంతేకాకుండా, ప్రపంచ చమురు అవసరాల్లో 12శాతం, సహజవాయివుల్లో 16శాతం అవసరాల్ని రష్యా తీరుస్తుంది. ఇప్పుడు ఆ చమురును కొనేవారు లేకపోవడంతో ఆ చమరును భారత్కు అతి తక్కువ ధరకే అమ్ముతామంటూ రష్యా..,భారత్కు ఆఫర్ చేసింది. ఇప్పటికే రష్యా నుంచి భారత్కు చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 1బిలియన్లకు చేరుకున్నాయి. ఇతర దేశాల నిషేదంతో రష్యాలో..భారత్ ఆయిల్, గ్యాస్ పెట్టుబడులు పెట్టాలని ప్రధాని మోదీతో మంతనాలు జరుపుతుంది. భారత్ అందుకు అంగీకరిస్తే తాము భారత్లో కంపెనీల ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నామంటూ రష్యా ఉప ప్రధాని నోవాక్ భారత్ను సంప్రదించారంటూ భారత పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. ఒకవేళ రష్యా ఇస్తున్న ఈ ఆఫర్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. కానీ రష్యాతో స్నేహం కారణంగా అమెరికాతో పాటు నాటో దేశాలకు దూరం కావాల్సి ఉంది. ఇదే అంశంపై ప్రధాని మోదీ వేచి చూసే ధోరణిలో ఉన్నారని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: 'చిత్ర' విచిత్రమైన కథ..ఆ 'అజ్ఞాత' యోగి కేసులో మరో ఊహించని మలుపు!! -
ఉక్రెయిన్ - రష్యా యుద్ధంతో భారత్ ఎకానమీ ఢమాల్!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ మార్చి 31వ తేదీతో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) ఆర్థిక సంవత్సరంలో 8.9 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తన నివేదికలో అంచనావేసింది. ఈ ఏడాది ఏప్రిల్తో ప్రారంభమయ్యే 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంటుందని పేర్కొన్న నివేదిక, మౌలిక రంగంపై ప్రభుత్వ వ్యయాలు, ప్రైవేటు పెట్టుబడులు ఇందుకు దోహదం చేస్తాయని వివరించింది. అయితే ఉక్రెయిన్పై రష్యా యుద్ధం తదనంతర పరిణామాలు ఎకానమీకి తీవ్ర ప్రతికూల అంశాలని పేర్కొంది. ప్రత్యేకించి క్రూడ్ ధరల తీవ్రతను ప్రస్తావించింది. ‘ఇండియా అవుట్లుక్, ఫిస్కల్ 2023’ పేరుతో రూపొందించిన నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను విశ్లేషిస్తే... ► కోవిడ్–19 మహమ్మారికి సంబంధించి మూడవవేవ్ ఒమిక్రాన్ ప్రభావం అంతగా లేకపోవడం ఎకానమీకి లాభించింది. అయితే తద్వారా లభించిన ప్రయోజనం ఎకానమీకి ఏదైనా ఉందంటే, అది ఉక్రెయిన్పై రష్యా దాడి నుండి ఉత్పన్నమైన భౌగోళిక రాజకీయ కలహాల ద్వారా నీరుగారిపోయే పరిస్థితి తలెత్తింది. యుద్ధం ప్రపంచ వృద్ధి మందగమనానికి దారితీసే అంశం. చమురు సంబంధిత ఉత్పత్తుల ధరలు దీనివల్ల భారీగా పెరుగుతాయి. ప్రపంచ వృద్ధికి పొంచిఉన్న సవాళ్లలో ఇది తీవ్రమైనది. ఇది దేశీయ ఎకానమీపై కూడా తీవ్ర ప్రతికూలత చూపుతుంది. ► ప్రైవేటు వినియోగం ఇంకా బలహీనంగానే కొనసాగుతోంది. ప్రభుత్వం నుంచి ద్రవ్యపరమైన మద్దతు కూడా అంతగా లేదు. ► రిటైల్ద్రవ్యోల్బణం విషయానికొస్తే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 5.4 శాతం వద్ద స్థిరంగా ఉంటుంది. అయితే దీనికి ముడి చమురు ధర సగటు బ్యారల్కు 85 నుంచి 90 డాలర్ల మధ్య ఉండాలి. గత సంవత్సరం ప్రకటించిన ఎక్సైజ్ సుంకం తగ్గింపులను పరిగణనలోకి తీసుకోవాలి. ► చమురు ధరల తీవ్రత దీర్ఘకాలం కొనసాగితే ఎకానమీ పురోగతికి తీవ్ర విఘాతం కలుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న సూచనల ప్రకారం వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2–6 శాతం శ్రేణిలో కొనసాగాలి. అయితే జనవరిలో ఈ రేటు నిర్దేశ శ్రేణికి మించి 6.01 శాతంగా నమోదయ్యింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతంగా కొనసాగుతుందని, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని ఆర్బీఐ గత జరిగిన జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా అంచనావేసింది. యుద్ధం, క్రూడ్ ధరల తీవ్రత కొనసాగితే ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. 2022–23లో క్రూడ్ బ్యారల్ ధర 75 డాలర్లగా లెక్కించి, ఈ ప్రాతిపదిన బడ్జెట్ రూపకల్పన జరిగింది. భౌగోళిక ఉద్రిక్తతలు ఈ అంచనాలను దెబ్బతీయవచ్చు. ►వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక విధానాల అమల్లో కొంత దూకుడును ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఉపాధి కల్పించే పథకాల ప్రకటన, ఆహార సబ్సిడీలకు కేటాయింపులను పెంచడం, పెట్రోలియం ఉత్పత్తులపై సుంకాన్ని తగ్గించడం వంటి చర్యలను చేపట్టాల్సి ఉంటుంది. మహమ్మారి వల్ల తీవ్రంగా నష్టపోయిన వర్గానికి ఈ చర్యలు దోహదపడతాయి. అలాగే ఈ చర్యల వల్ల ప్రైవేట్ వినియోగ డిమాండ్ స్థిరంగా పురోగమిస్తుంది. ► ముడి చమురు ధరల తీవ్రత వల్ల, దిగుమతుల భారం పెరిగి 2022– 2023 ఆర్థిక సంవత్సరంలో దేశ కరెంట్ ఖాతా లోటు (దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) 2.2 శాతానికి పెరుగుతుందని అంచనా. సాధారణంగా ముడి చమురు ధరలో 10 డాలర్ల పెరుగుదల వల్ల క్యాడ్ 40 బేసిస్ పాయింట్లు (జీడీపీలో) పెరుగుతుంది. కార్పొరేట్ రంగం ఇప్పటికి సానుకూలం రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ నివేదిక ప్రకారం, చమురు ఎక్కువ కాలం పాటు బ్యారెల్కు 100 డాలర్లకు మించి కొనసాగితే ఎకానమీలోని పలు విభాగాలపై దీని ప్రతికూల ప్రభావం ఉంటుంది. పలు భారత్ కంపెనీల నిర్వహనా లాభాలు భారీగా పడిపోతాయి. ఇప్పటి వరకూ పరిస్థితిని పరిశీలిస్తే, దాదాపు 700 దేశీయ కంపెనీల స్థూల ఆదాయాలు బాగున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరుసగా రెండవ ఏడాది 20 శాతం వృద్ధిని నమోదుచేసుకునే పరిస్థితి ఉంది. అయితే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవలు, బీమా రంగాలు ఈ విషయంలో వెనుకబడి ఉన్నాయి. భౌగోళిక రాజకీయాలు, ఇతర ఊహించని సంఘటనలు ఎదురుకాకుంటే, 2022–23లో ఆర్థిక రికవరీ విస్తృత ప్రాతిపదికన ఉంటుంది. 10 నుంచి 14 శాతం కార్పొరేట్ ఆదాయ వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నాం. పరిశ్రమలకు సంబంధించి కేంద్రం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) వంటి పథకాలు ఎంతో ప్రయోజనం చేకూర్చుతాయి. 2019–20 ఆర్థిక సంవత్సరంతో ముగిసిన త్రైమాసికంలో పారిశ్రామిక మూలధన పెట్టుబడులు రూ.3 నుంచి 3.5 లక్షల కోట్లు ఉంటే, 2025–25 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ శ్రేణి రూ.4 నుంచి 4.5 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. భారతదేశ పెట్టుబడి దృష్టి ఇప్పుడు గ్రీన్ (పర్యావరణ అనుకూల) క్యాపిటల్ వ్యయం వైపు మళ్లుతోంది. 2023 నుండి 2030 ఆర్థిక సంవత్సరం మధ్య వార్షికంగా రూ. 2.85 లక్షల కోట్లకు పైగా ఈ విభాగాలపై వ్యయం ఉంటుందని అంచనా. ఈ కాలంలో వార్షికంగా మొత్తం పెట్టుబడులలో దాదాపు 15–20 శాతం మౌలిక, పారిశ్రామిక రంగాల్లో ఉంటాయని భావిస్తున్నాం. చదవండి: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, భారత్కు భారీ దెబ్బ!! -
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, భారత్కు భారీ దెబ్బ!!
అమెరికన్ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో ఉక్రెయిన్పై రష్యా యుద్ధం వల్ల భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి 50 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) నష్టం ఉంటుందని అంచనావేసింది. దీనితో 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7.9 శాతానికి తగ్గిస్తున్నట్లు (8.4 శాతం నుంచి) పేర్కొంది. చమురు ధరల తీవ్రత దేశంలో సవాళ్లకు దారితీస్తుందని పేర్కొంది. ఇక వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఎగువ స్థాయిలోనే 6 శాతంగా కొనసాగుతుందని విశ్లేషించింది. ఇదే పరిస్థితి కొనసాగితే స్టాగ్ఫ్లేషన్ (ఎకానమీలో స్తబ్దతతో కూడిన పరిస్థితి. ధరల తీవ్రత వల్ల వృద్ధి మందగమనం, తీవ్ర నిరుద్యోగం వంటి సవాళ్లు తలెత్తడం) సవాళ్లు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దేశానికి అంతర్జాతీయంగా సవాళ్లను తెచ్చిపెడతాయని, ఆర్థిక వ్యవస్థకు ప్రతిష్టంభన కలిగించే పరిస్థితులకు దారితీస్తాయని విశ్లేషించింది. రికవరీ కొనసాగినా అది బలహీనంగా ఉంటుందని పేర్కొంది. కరెంట్ అకౌంట్ లోటు పదేళ్ల గరిష్టం 3 శాతానికి (జీడీపీలో) పెరిగే అవకాశం ఉందని అంచనావేసింది. దేశంలో వచ్చే ఆర్థిక సంవత్సరమే సరళతర ఆర్థిక విధానానికి ముగింపు పలకవచ్చని, ఏప్రిల్ లేదా జూన్ విధాన సమీక్షలో ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను (వరుసగా 10 ద్వైమాసిక సమావేశాల నుంచి యథాతథంగా 4 శాతంగా కొనసాగుతోంది) పావుశాతం వరకూ పెంచే అవకాశం ఉందని పేర్కొంది. దేశంలో సరళతర ఆర్థిక విధానాలు మరెంతోకాలం కొనసాగించే పరిస్థితి లేదని పేర్కొంది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతంగా బడ్జెట్ అంచనావేయగా ఇది 6.9 శాతం వరకూ పెరగవచ్చని మోర్గాన్ స్టాన్లీ అంచనావేసింది. చదవండి: Anand Mahindra: యుద్ధంలో చివరికి తేలే ఫలితం ఇదే -
ఉక్రెయిన్ కు అమెరికా భారీ సాయం
-
ఉక్రెయిన్ ఎఫెక్ట్.. యాపిల్కి తప్పని కష్టాలు.. నష్టాలు..
ఉక్రెయిన్పై చేస్తున్న దాడుల్ని ఖండిస్తూ ప్రపంచ దేశాలకు చెందిన దిగ్గజ కంపెనీలు రష్యాలో కార్యకలాపాల్ని నిలిపివేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సైతం రష్యాలో ఐఫోన్ అమ్మకాల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన యాపిల్కు తీవ్ర నష్టాల్ని మిగిల్చుతున్నట్లు తెలుస్తోంది రష్యాలో యాపిల్ సేవల్ని నిలిపిస్తున్నట్లు ప్రకటించడంపై లిథువేనియాకు చెందిన ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ బుర్గా స్పందించింది. రష్యాలో యాపిల్ కార్యకలాపాలు ఆగిపోతే.. టెక్ దిగ్గజానికి ఎలాంటి నష్టం వాటిల్లుతుందనే అంశంపై ఓ అంచనా వేసింది. ఆ అంచనా ప్రకారం.. యాపిల్ సంస్థ రష్యాలో ఐఫోన్ల అమ్మకాల్ని నిలిపివేడయంతో ప్రతీ రోజూ 3 మిలియన్ డాలర్లు, సంవత్సరానికి 1.14 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోతున్నట్లు బుర్గా సంస్థ అంచనా వేసింది. ఇక మిగిలిన స్మార్ట్ ఫోన్ కంపెనీల వాటాల విషయానికొస్తే దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ 34 శాతంతో రష్యాలో అగ్రస్థానంలో ఉండగా, షావోమీ 26 శాతంతో మూడో స్థానంలో, రియల్ మీ 8 శాతం, పోకో 3 శాతం, ఇతర చిన్న బ్రాండ్లు 14 శాతం వాటా కలిగి ఉన్నాయని బుర్గా నివేదిక పేర్కొంది. కాగా, గత కొన్ని సంవత్సరాలుగా రష్యా సాధారణ స్మార్ట్ఫోన్ అమ్మకాల ఆదాయం క్రమంగా పెరుగుతోందని, వాటిని పరిగణనలోకి తీసుకుంటే యాపిల్ ఆదాయం ఎక్కువగా ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. చదవండి: ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.50 వేల యాపిల్ ఐఫోన్ రూ.10 వేలకే..! -
ఉక్రెయిన్పై యుద్ధం.. ఇక రష్యాను తిట్టేయొచ్చు!
ఉక్రెయిన్పై ఆక్రమణకుగానూ రష్యాపై కోపంతో రగిలిపోతున్నారు కొందరు. అయితే వాళ్ల తమ ఆక్రోశాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకోవడానికి కొన్ని అభ్యంతరాలు అడ్డం పడుతున్నాయి. విద్వేషపూరిత కామెంట్లు, హింసాత్మక సందేశాలు, ఉల్లంఘనల పేరిట.. అలాంటి పోస్టులకు అనుమతి ఇవ్వడం లేదు. ఈ తరుణంలో ఫేస్బుక్ కాస్త ఊరట ఇచ్చింది. ఉక్రెయిన్ ఆక్రమణ విషయంలో రష్యాకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టేందుకు ‘తాత్కాలిక’ అనుమతులు మంజూరు చేసింది ఫేస్బుక్. ఫేస్బుక్తో పాటు ఇన్స్టాగ్రామ్ యూజర్లు కూడా ఈ పరిణామాలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టొచ్చని గురువారం ప్రకటించింది మెటా సంస్థ. రష్యన్ 'ఆక్రమణదారుల'పై హింసాత్మక ప్రసంగాన్ని అనుమతించే పోస్ట్లను ఫేస్బుక్ తాత్కాలికంగా అనుమతిస్తోంది అంటూ మెటా గురువారం సాయంత్రం ఒక నోట్ రిలీజ్ చేసింది. అయితే ఇదంతా రాజకీయపరంగానే, అదీ పరిధిలోకి లోబడే ఉండాలట!. దురాక్రమణకు మూలకారకులు, ఆయా దేశాల అధ్యక్షులను(రష్యా, బెలారస్ అధ్యక్షులను ఉద్దేశించి పరోక్షంగా..) సంబంధించి కామెంట్లను అనుమతిస్తాం. ఒకవేళ అవి ఫేస్బుక్ సాధారణ ఉల్లంఘనలను దాటినా చర్యలు తీసుకుంటాం. కానీ, సాధారణ పౌరులు, సైనికులను ఉద్దేశించి హింసాత్మక పోస్టులు పెడితే మాత్రం ఎట్టిపరిస్థితుల్లో అనుమతించం అని స్పష్టం చేసింది మెటా. ఈ తాత్కాలిక పాలసీలను అర్మేనియా, అజెర్బైజాన్, ఎస్టోనియా, జార్జియా, హంగేరీ, లాత్వియా, లిథువేనియా, పోల్యాండ్, రొమేనియా, రష్యా, స్లోవేకియా, ఉక్రెయిన్లకు వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా.. రష్యా తమ దేశంలో ఫేస్బుక్పై తాత్కాలిక నిషేధం విధించినా, యూజర్లు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆ ప్లాట్ఫామ్ను వినియోగించుకుంటున్నారు. అయితే రష్యా, ఉక్రెయిన్ మరియు పోల్యాండ్తో సహా పలు దేశాల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ ఆక్రమణలో రష్యాకు అండగా ఉంటున్న బెలారస్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకాషెంకో చావుకు సంబంధించి కొన్ని పోస్ట్లను కూడా ఫేస్బుక్ తాత్కాలికంగా అనుమతులు ఇవ్వడం గమనార్హం. చదవండి: నూతన చట్టంతో ఉక్కుపాదం మోపిన రష్యా -
మార్కెట్ క్యాప్.. ఆవిరి..
-
గ్యాప్ తీసుకోలేదు..వచ్చింది అంతే! ఎలన్ మస్క్ యుద్ధం వచ్చినా ఆగేలా లేడే!
స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ప్రయోగాలతో ముందుకు సాగుతున్నాడు. ఉక్రెయిన్ - రష్యా యుద్ధం పరిణామాలు తన కలల్ని చిన్నాభిన్నం చేస్తున్నా ప్రయోగాలు మాత్రం ఆపడం లేదు. చిన్న గ్యాప్ ఇచ్చీ మళ్లీ మొదలు పెట్టాడు. తాజాగా శాటిలైట్ ఇంటర్నెట్ కోసం ఎలన్ మస్క్ 48 స్టార్లింక్ శాటిలైట్లను విజయవంతంగా ఆర్బిట్లోకి పంపించారు. గత కొన్నేళ్లుగా అమెరికన్ బిజినెస్ టైకూన్ ఎలన్ మస్క్ తక్కువ కనెక్టివిటీలో సైతం ఇంటర్నెట్ను అందించేందుకు శాటిలైట్ ఇంటర్నెట్పై ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ప్రయోగాల్లో భాగంగా చివరి సారిగా ఫిబ్రవరి 3న 49 స్టార్లింక్ శాటిలైట్లను నింగిలోకి పంపారు. అందులో 38రాకెట్లు కూలిపోయాయి. అయినా ప్రయోగాల్ని ఎక్కడా నిలిపేయలేదు.రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంలో శాటిలైట్ ఇంటర్నెట్ ఏ విధంగా ఉపయోగ పడిదో ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇప్పుడు అదే జోరుతో మరిన్ని ప్రయోగాలకు సిద్ధమయ్యారు. Liftoff! pic.twitter.com/EGxL5a9tbh — SpaceX (@SpaceX) March 9, 2022 ఈ నేపథ్యంలో ఫ్లోరిడాలోని స్పేస్ స్టేషన్ నుంచి టూ స్టేజ్ ఫాల్కన్ 9 రాకెట్తో 48శాటిలైటన్లు ఆర్బిట్లోకి పంపినట్లు ఎలన్ మస్క్ ట్వీట్ చేశాడు. కాగా, శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించేందుకు ఎలన్ మస్క్ 2019 నుంచి ఇప్పటి వరకు 2వేల స్టార్లింగ్ శాటిలైట్లను నింగిలోకి పంపారు. మరో 12వేల శాటిలైట్లపై ప్రయోగించేందుకు అనుమతి పొందగా.. మరో 30వేల రాకెట్లను ప్రయోగించేందుకు అనుమతి కోసం అప్లయ్ చేసినట్లు సమాచారం. చదవండి: జాక్పాట్!! అమెరికా ప్రెసిడెంట్గా ఎలన్ మస్క్? -
ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకోవడం లేదు.. అదే మా టార్గెట్: రష్యా
వేలాది మంది సైనికులు, వందలాది పౌరులు ప్రాణాలు వదులుతున్నారు. కోట్ల సంపద కాలి బూడిదవుతోంది. అందమైన నగరాలు స్మశానాలుగా మారుతున్నాయి. ఇవన్నీ రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్లో నెలకొన్న కళ్లు చెమర్చే పరిస్థితులు. ఉక్రెయిన్-రష్యా పోరు 14 వ రోజూ(బుధవారానికి) కూడా కొనసాగుతోంది. అయితే తాము నాటో సభ్యత్వాన్ని కోరబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేసిన నేపథ్యంలో రష్యా కాల్పుల విరమణ ప్రకటించి, శాంతియుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తుందా.. అనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. చర్చల ద్వారానే లక్ష్యాలు సాధిస్తాం ఈ నేపథ్యంలో తాజాగా ఉక్రెయిన్పై సైనిక చర్య విషయంపై రష్యా మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తమ బలగాలు పనిచేయడం లేదని, ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలగొట్టే అవసరం రష్యా మిలిటరీకి లేదని స్పష్టం చేసింది. తాము చర్చలకు ప్రాధాన్యత ఇస్తామని, చర్చల ద్వారానే లక్ష్యాలను సాధిస్తామని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా తెలిపారు. కాగా ఉక్రెయిన్-రష్యా మధ్య మరో దఫా చర్చలు జరగనున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేగాక రష్యా సైనిక చర్య పక్కా ప్రణాళిక పరంగా ముందుకు సాగుతోందన్నారు. చదవండి: విషాదం.. రష్యాతో పోరులో ఉక్రెయిన్ స్టార్ హీరో మృతి.. షాక్లో అభిమానులు కాల్పుల విరమణ మరోవైపు ఉక్రెయిన్ బుధవారం ఆరు మానవతా కారిడార్లు ద్వారా పౌరులను తరలించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మానవతా కారిడార్ల వెంబడి కాల్పులు విరమణకి రష్యా సాయుధ దళాలు అంగీకరించాయి. చదవండి: ఉక్రెయిన్కు రూ.77 కోట్ల విరాళం ప్రకటించిన స్టార్ హీరో రష్యాతో మరో రౌండ్ చర్చలకు ఉక్రెయిన్ సిద్ధం శాంతిని నెలకొల్పేందుకు రష్యాతో తదుపరి రౌండ్ చర్చలకు ఉక్రెయిన్ ప్రభుత్వం సిద్ధమవుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. -
రష్యన్ చమురు కంపెనీలు భారత్ కు భారీ బంపర్ ఆఫర్..!!
-
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం: బ్యాంక్ వినియోగదారులకు షాక్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రష్యా–ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చమురు, గ్యాస్, బొగ్గు వంటి కమోడిటీల సరఫరాకు సంబంధించి మరిన్ని సమస్యలు తలెత్తవచ్చని యూటీఐ ఏఎంసీ ఫండ్ మేనేజర్ అంకిత్ అగర్వాల్ తెలిపారు. ఇంధనాల ధరలు ఇప్పటికే అధిక స్థాయిలో ఉన్నాయని, ఇకపై మరింతగా పెరగవచ్చని పేర్కొన్నారు. ఫెడ్ రేట్లు మరికొంతకాలం యథాతథమే! ‘‘ఈ నేపథ్యంలో అమెరికా ఫెడ్ రిజర్వ్ సహా సెంట్రల్ బ్యాంకులు..వడ్డీ రేట్ల పెంపును కాస్త వాయిదా వేసే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం ఎగిసిందంటే వినియోగదారుల్లో ఖర్చు చేసే సామర్థ్యాలు దెబ్బతింటాయి. కనుక ఇలాంటప్పుడు వడ్డీ రేట్లను వేగంగా పెంచితే ప్రతికూల పరిస్థితులు తలెత్తవచ్చు. దేశీ మార్కెట్లు గణనీయంగా పెరిగిన దృష్ట్యా సాధారణంగానే ఎంతో కొంత కరెక్షన్కు గురవుతాయి. అందుకోసం వాటికి ఏదో ఒక కారణం అవసరమవుతుంది. అది ఈ రూపంలో వచ్చిందని భావించవచ్చు’’ అని అగర్వాల్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వివరించారు. ఇన్వెస్ట్ చేయాలంటే మదుపునకు సంబంధించి రంగాల వారీగా చూస్తే నిర్మాణ మెటీరియల్స్, కన్జూమర్ సర్వీసులు, హెల్త్కేర్ మొదలైనవి సానుకూలంగా కనిపిస్తున్నాయని చెప్పారు. ఇక దేశీయంగా తయారీ కార్యకలాపాలు పెరుగుతున్న క్రమంలో పారిశ్రామిక రంగ సంస్థలు, స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీలు, కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు మెరుగ్గా ఉండవచ్చని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మిడ్క్యాప్ల పనితీరు అన్నది ఆయా సంస్థల ఆదాయాలపై ఆధారపడనుందని అగర్వాల్ వివరించారు. లాంగ్టర్మ్ బెస్ట్ ప్రస్తుతం మార్కెట్లో మదుపు చేద్దామనుకుంటే..దీర్ఘకాలిక ధోరణితో వ్యవహరించాల్సి ఉంటుందని, కనీసం 3–5 ఏళ్ల వ్యవధికి ఇన్వెస్ట్ చేయడం మంచిదని పేర్కొన్నారు. దీనివల్ల సమీప భవిష్యత్తులో ఒడిదుడుకుల గురించి ఎక్కువగా ఆందోళన ఉండదని చెప్పారు. తమ కంపెనీపరంగా దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు ఉన్నవి లేదా టర్నెరౌండు సామర్థ్యాలు ఉన్న వాటిపై ఎక్కువగా దృష్టి పెడతామని, తద్వారా కాలక్రమంలో మెరుగైన రాబడులు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. -
Ukraine Crisis: రష్యాకు బిగ్ షాక్.. పుతిన్కు మరో దెబ్బ!
Ukraine War Live Updates: ఉక్రెయిన్ ఆక్రమణ విషయంలో రష్యాను మరింతగా రెచ్చగొడుతోంది అమెరికా. ఒకవైపు యుద్ధం ఆపాలంటూ పిలుపు ఇస్తూనే.. మరోవైపు ఆంక్షలు విధిస్తూ ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. దీంతో రష్యా బలగాలు ఉక్రెయిన్పై విరుచుకుపడుతున్నాయి. యుద్ధం 14వ రోజు కూడా కొనసాగుతోంది. మరోవైపు ఇవాళైన చర్చల్లో పురోగతి ఉంటుందేమో అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రష్యా-ఉక్రెయిన్ ప్రజలు. పిల్లల ఆసుపత్రిపై బాంబు దాడి.. ►ఉక్రెయిన్లో మారియూపోల్ నగరంలోని పిల్లల ఆసుపత్రిపై రష్యా బలగాలు బాంబు దాడికి పాల్పడ్డాయి. ఈ బాంబు దాడుల వల్ల ఆసుపత్రి ధ్వంసమైందని స్థానిక కౌన్సిల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ ఘటనలో ప్రాణ నష్టం గురించి తెలియాల్సి ఉంది. రష్యా చేతిలో బందీలుగా 4 లక్షల మంది ఉక్రేనియన్లు.. ► ఉక్రెయిన్లో రష్యా బలగాలు రెచ్చిపోతున్నాయి. ఉక్రెయిన్లోని మరియూపోల్లో 4 లక్షల మంది ఉక్రెయిన్ పౌరులను రష్యా బందించినట్టు ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి డిమిట్రో కులేబా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రష్యా దాడుల కారణంగా 3 వేల మంది నవజాత శిశువులకు సరైన వైద్యం, మెడిసిన్ అందక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రష్యాను ఉక్రెయిన్ పౌరులు, పిల్లలపై దాడులు ఆపాలంటూ ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు. Russia continues holding hostage over 400.000 people in Mariupol, blocks humanitarian aid and evacuation. Indiscriminate shelling continues. Almost 3.000 newborn babies lack medicine and food. I urge the world to act! Force Russia to stop its barbaric war on civilians and babies! — Dmytro Kuleba (@DmytroKuleba) March 9, 2022 రష్యాకు బిగ్ షాక్.. ► ఉక్రెయిన్పై దాడుల నేపథ్యంలో రష్యాకు మరో బిగ్ షాక్ తగిలింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం(WEF) కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాకు చెందిన సంస్థలతో ఉన్న అన్ని సంబంధాలను స్తంభింపజేస్తున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ ఆంక్షలకు అనుగుణంగా ఆంక్షల జాబితాలో ఉన్నవారికి దావోస్లో జరిగే వార్షిక సమావేశాలకు అనుమతి నిరాకరిస్తున్నట్టు పేర్కొంది. ప్రమాదంలో చెర్నోబిల్ న్యూ క్లియర్ ప్లాంట్.. ► ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు. చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్కు చెందిన పవర్ గ్రిడ్ పనిచేయడం ఆపేసిందని బిగ్ బాంబ్ పేల్చారు. నేషనల్ న్యూక్లియర్ రెగ్యులేటర్కు అందిన సమాచారం ప్రకారం.. చెర్నోబిల్లోని అన్ని కేంద్రాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం ఏర్పాటు చేసిన జనరేటర్లకు కేవలం 48 గంటలకు సరిపడా డీజిల్ మాత్రమే ఉందని వెల్లడించారు. ప్లాంట్కు విద్యుత్ సరఫరా లేకపోతే.. న్యూక్లియర్ మెటీరియల్ను చల్లార్చే వ్యవస్థలపై ప్రభావం పడుతుందన్నారు. ఈ క్రమంలో రేడియేషన్ను నియంత్రించడం కష్టమవుతుందన్నారు. దీంతో పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రష్యా దాడుల కారణంగానే చెర్నోబిల్కు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆరోపించారు. రష్యా కాల్పుల విరమణ పాటిస్తేనే గ్రిడ్కు మరమ్మతులు చేసే అవకాశం ఉంటుందన్నారు. Reserve diesel generators have a 48-hour capacity to power the Chornobyl NPP. After that, cooling systems of the storage facility for spent nuclear fuel will stop, making radiation leaks imminent. Putin’s barbaric war puts entire Europe in danger. He must stop it immediately! 2/2 — Dmytro Kuleba (@DmytroKuleba) March 9, 2022 జెలెన్ స్కీ ప్రభుత్వాన్ని పడగొట్టడం మా టార్గెట్ కాదు.. ► రష్యా, ఉక్రెయిన్ మధ్య మూడో రౌండ్లో చర్చలు జరుగుతున్నాయి. ఈసారి చర్చల్లో రెండు దేశాల బృందాలు కొంత పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్లోని జెలెన్స్కీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రష్యా ప్రయత్నించడంలేదని తెలిపింది. దేశాన్ని వీడుతున్న ప్రేయసి.. లవ్ ప్రపోజ్ చేసిన ఉక్రెయిన్ సైనికుడు ► యుద్ధం కారణంగా దేశాన్ని వీడుతున్న తన ప్రేయసికి ఉక్రెయిన్ సైనికుడు లవ్ ప్రపోజ్ చేశాడు. సడెన్గా ఇలా ప్రియుడిని చూసిన ఆనందంలో ఆమె ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యింది. క్షణాల వ్యవధిలో ఆమె.. అతడిని హగ్ చేసుకొని తాను పెళ్లి రెడీ అన్న సంకేతంతో ముద్దుపెట్టింది. అనంతరం అతడు ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగాడు. ఆ సమయంలో అక్కడున్న మిగతా సైనికులు, ఇతరులు ఆ జంటకు అభినందనలు తెలిపారు. #Watch#Ukraine️ pic.twitter.com/4DeRtEgivM — Geeta Mohan گیتا موہن गीता मोहन (@Geeta_Mohan) March 7, 2022 సుమీ నుంచి రైళ్లలో భారతీయుల తరలింపు.. ► ఉక్రెయిన్లోని సుమీలో రష్యన్ బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి అధికారుల సాయంతో సుమీ నుంచి భారతీయులను రైళ్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ఉక్రెయిన్లోని భారత ఎంబసీ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. ఈ క్రమంలోనే భారత విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తరలించడమే తమ కర్తవ్యమని ఎంబసీ తెలిపింది. 🇮🇳n students from Sumy on board the special train organised with assistance of 🇺🇦n authorities. Mission will continue to facilitate their movement westwards. Bringing back our students safely and securely will remain our priority. Be Safe Be Strong pic.twitter.com/lGNnHsfRs7 — India in Ukraine (@IndiainUkraine) March 9, 2022 రష్యా, బెలారస్పై ఈయూ మరిన్ని కఠిన ఆంక్షలు ► ఉక్రెయిన్పై దాడుల నేపథ్యంలో ఇప్పటికే రష్యాపై పలు దేశాలు, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దాడుల వేళ రష్యాకు సహకరిస్తున్న కారణంగా బెలారస్పై, రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించేందుకు యూరోపియన్ యూనియన్లోని సభ్య దేశాలు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. 12వేల మంది రష్యా సైనికులు హతం.. ఉక్రెయిన్ ► ఉక్రెయిన్పై చేపట్టిన యుద్ధంలో ఇప్పటివరకు 12,000 మందికి పైగా రష్యా సైనికులు మరణించారని ఉక్రెయిన్ వెల్లడించింది. రష్యాకు చెందిన 303 యుద్ధ ట్యాంకులు, 1036 సాయుధ వాహనాలు, 120 శతఘ్నులు, 27 యాంటీ-ఎయిర్క్రాఫ్ట్ వార్ఫేర్ సిస్టమ్స్, 48 యుద్ధ విమానాలు, 80 హెలికాప్టర్లు, 60 ఇంధన ట్యాంకులను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. మోదీజీ మీ సాయానికి థ్యాంక్స్.. బంగ్లా ప్రధాని ► ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను స్వదేశానికి తరలించేందుకు ఆపరేషన్ గంగా కొనసాగుతోంది. ఆపరేషన్ గంగాలో భాగంగా కేవలం భారతీయులే కాకుండా బంగ్లాదేశీయులు, నేపాలీలు, పాకిస్తానీలు, ట్యూనీషియన్లు కూడా ప్రత్యేక విమానాల ద్వారా భారత్ చేరుకుని ఇక్కడి నుంచి తమ స్వదేశాలను వెళ్తున్నారు. కాగా, తొమ్మిది మంది బంగ్లాదేశ్ ప్రజలు.. ఆపరేషన్ గంగాతో ఇండియా నుంచి తమ దేశానికి చేరుకున్నారు. ఈ క్రమంలో తమ దేశ పౌరులను యుద్ద ప్రభావిత ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా తరలించినందుకు మోదీకి ఆమె థ్యాంక్స్.. అంటూ వ్యాఖ్యలు చేశారు. చెర్నోబిల్పై ప్రకటన ► ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) చెర్నోబిల్ గురించి కీలక ప్రకటన చేసింది. చెర్నోబిల్తో సంబంధాలు తెగిపోయినట్లు ప్రకటించింది. రెండు వారాలుగా అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదు. రష్యా బలగాలు చెర్నోబిల్ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి.. అక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. అక్కడి స్టాఫ్ పరిస్థితి మీద కూడా ఎలాంటి అప్డేట్ లేదు అని తెలిపింది. ఇదిలా ఉండగా.. 210 మంది టెక్నీషియన్ల సరిపడా ఆహారం, మందులు ఉన్నప్పటికీ.. పరిస్థితి విషమిస్తోందని అటామిక్ ఏజెన్సీకి ఉక్రెయిన్ ఒక నివేదిక ఇచ్చింది. IAEA says it has lost contact with Chernobyl nuclear data systems. The Chernobyl nuclear power plant is no longer transmitting data to the UN watchdog, the agency says, voicing concern for staff working under Russian guard at the Ukrainian facilityhttps://t.co/rzgZhLjAij pic.twitter.com/kaZvsTN7bn — AFP News Agency (@AFP) March 9, 2022 ► మరోసారి రష్యా కాల్పుల విరమణ. బుధవారం కూడా సేఫ్ కారిడార్ల నుంచి పౌరుల తరలింపునకు అనుమతి. ప్రధాన నగరాల నుంచి పౌరుల తరలింపు ముమ్మరం. అయినా రష్యా బలగాలు ఉల్లంఘనలతో దాడులకు పాల్పడుతోందని ఉక్రెయిన్ ఆరోపణ. రష్యా చేతిలోకి కీవ్! ► మరోవైపు, ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపానికి రష్యా దళాలు చేరుకున్నాయి. వాటి దూకుడు చూస్తుంటే మరికొన్ని గంటల్లో కీవ్ రష్యా సేనల చేతుల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ► ఉక్రెయిన్ నగరమైన సుమీపై రష్యన్ సేనలు బాంబు దాడులకు దిగిన తర్వాత ఆ నగరం నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 5 వేల మందిని తరలించారు. రష్యన్ దళాల దాడిలో పలువురు మరణించినట్టు అధికారులు తెలిపారు. ► రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. 14వ రోజుకు చేరుకుంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 మిలియన్ల మంది ఉక్రెయిన్ పౌరులు దేశాన్ని విడిచిపెట్టారు. అత్యధికంగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. ► ఒకవైపు నాటో ప్రతికూల ప్రకటన, రష్యాతో సంధి కోసం పిలుపు ఇచ్చినట్లే ఇచ్చి.. యుద్ధం ఆపేదేలేదంటున్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. రష్యా దాడిని ప్రతిఘటిస్తూనే ఉండాలని తమ పౌరులకు పిలుపునిచ్చారు. ► రష్యా నుంచి చమురు దిగుమతులను నిషేధిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. అలాగే, కోకా-కోలా, పెప్సీ కూడా రష్యాలో అమ్మకాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. తమ ఆదాయంలో ఒకటి నుంచి రెండు శాతం రష్యా, ఉక్రెయిన్ నుంచే వస్తున్నట్టు కోకా-కోలా తెలిపింది. ► ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా తూర్పు, సెంట్రల్ రీజియన్లో రష్యన్ యుద్ధ విమానాలు రాత్రంతా బాంబుల వర్షం కురిపించాయి. -
ఉక్రెయిన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
యుద్ధం వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ స్వరం మారింది. నాటో సభ్యత్వం విషయంలో చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. నాటో సభ్యత్వం కోసం ఇకపై కూటమిపై ఎలాంటి ఒత్తిడి చేయబోనని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు రష్యాతో శాంతియుత చర్చల కోసమే తాను సిద్ధంగా ఉన్నానంటూ పేర్కొన్నాడు. ఏబీసీ న్యూస్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చాలాకాలం తర్వాత విషయం ఏంటో నాకు అర్థం అయ్యింది. ఉక్రెయిన్ కోసం నాటో సిద్ధంగా లేదు. మిత్రపక్షాలు (Eastern European country) వివాదాస్పద అంశాల జోలికి పోయేందుకు భయపడుతున్నాయి. ముఖ్యంగా రష్యాను ఎదుర్కొనేందుకు అవి సిద్ధంగా లేవు. ఇది గుర్తించడం కాస్త ఆలస్యమైంది. ఈ తరుణంలో నేనే చల్లబడడం మంచిది అనిపించింది. నాటో కోసం నేనింక బతిమాల దల్చుకోవడం లేదు. మోకాళ్లపై కూర్చుని అడుక్కుకోవాల్సిన అవసరం లేదు. ఉక్రెయిన్ కంటూ ఒక ఆత్మగౌరవం ఉంది. ఈ దేశాన్ని(ఉక్రెయిన్ను) అలా చూడాలనుకోవడం లేదు. అలాంటి దేశానికి నేను అధ్యక్షుడిగా ఉండాలనుకోవడం లేదు’’ అంటూ వ్యాఖ్యానించాడు జెలెన్స్కీ. అంతేకాదు రష్యా స్వతంత్ర్య రాజ్యాలుగా గుర్తించిన ఉక్రెయిన్ రెబల్స్ విషయంలోనూ కాంప్రమైజ్ కావాలని నిర్ణయించుకున్నట్లు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉక్రెయిన్లో భాగం కావాలనుకునే వ్యక్తులు అక్కడ ఎలా జీవిస్తారన్నది నాకు ముఖ్యం. రష్యన్ ఫెడరేషన్ యొక్క పౌరులుగా తమను తాము చూసే వారి అభిప్రాయంపై నాకు ఆసక్తి ఉంది. అయితే, ఈ సమస్య గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. అందుకు నేను సిద్ధం’’ అంటూ ప్రకటించాడు. దీంతో రష్యాతో శాంతియుతంగా సమస్య పరిష్కారానికి జెలెన్స్కీ సుముఖంగా ఉన్నట్లు సంకేతాలు పంపినట్లయ్యింది. మరి రష్యా నుంచి బదులు ఎలా ఉండబోతుంది? ఇప్పటికే రష్యా ఆయిల్పై అమెరికా దిగుమతి ఆంక్షలు విధించింది. ఈ తరుణంలో అగ్గిమీద గుగ్గిలంగా ఉన్న పుతిన్.. మరింత రెచ్చిపోతాడా? శాంతిస్తాడా?.. నేడు మూడో దఫా చర్చలపైనే(జరగొచ్చనే ఆశాభావం) ఆసక్తి నెలకొంది. 2008లో ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై అభ్యంతరాలతోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్పై మిలిటరీ చర్యకు దిగాడు. ఫిబ్రవరి 24 నుంచి జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున నాలుగు నుంచి ఏడు వేల మధ్య సైనికులు చనిపోయినట్లు అంచనా. అలాగే ఉక్రెయిన్ తరపు నుంచి నష్టంపై స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. సంబంధిత వార్త: నాటోపై ఆసక్తి లేదంటూనే.. జెలెన్స్కీ డబుల్ గేమ్! -
పదిరోజుల్లోనే రష్యాకు ముచ్చెమటలు!
-
హృదయ విదారకం.. ఒంటరిగా ఏడూస్తూ ఉక్రెయిన్ వీడుతున్న బాలుడు
ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య మంగళవారానికి 13వ రోజుకు చేరుకుంది. రెండు దేశాల మధ్య భీకర పోరు కొనసాగుతూనే ఉంది. అయితే ఉక్రెయిన్ నుంచి పౌరులు తరలిపోయేందుకు వీలుగా కొన్ని మార్గాల్లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో వేల మంది సైనికులు, వందలాది పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. యుద్ధ భయంతో లక్షలాది మంది దేశం విడిచి పొరుగు దేశాలైన పోలాండ్, హంగేరీ, రోమేనియాకు పోటెత్తుతున్నారు. ఉన్న ఉరిని వదిలి కట్టుబట్టలతో సరిహద్దులు దాడుతున్నారు. ఈ క్రమంలో ఎన్నో హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు గుండెలను పిండేస్తున్నాయి. తాజాగా ఓ బాలుడు దేశం వదిలి వెళ్లిపోతున్న దృశ్యం అందరినీ కలచివేస్తోంది. రష్యా దాడులకు భయపడి ఉక్రెయిన్ సరిహద్దులో ఒంటరిగా ఏడ్చుకుంటూ వలస పోతున్నాడు. ఇందుకు సంబంధించి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్గా మారింది. చదవండి: రష్యా అరాచకం.. ఉక్రెయిన్పై 500 కిలోల భారీ బాంబు ప్రయోగం The little boy in tears crosses the border alone with a plastic bag in his hand. ☹️❤️ #Ukraine #Ukrainian #StopPutinNOW pic.twitter.com/A90i0rTNPU — Eurovision Croatia 🇭🇷 (@esccroatia) March 7, 2022 శనివారం రోజు బాలుడు తన భుజంపై ఓ బ్యాగ్, అందులో బొమ్మను మోసుకుంటూ ఉక్రెయిన్ నుంచి పోలాండ్లోని మెడికాకు నడుచుకుంటూ వెళుతూ కనిపించాడు. అయితే బాలుడు ఒక్కడే వెళుతున్నాడా, ముందు వెనక తన వాళ్లు ఎవరైనా ఉన్నారా, ఆ అబ్బాయి ఎవరనే విషయాలపై స్పష్టత లేదు. దీన్ని చూసిన నెటిజన్లు.. బాలుడి పరిస్థితి చూస్తుంటే జాలేస్తోందని, కంటతడి పెట్టించే వీడియో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: Ukraine War: కాల్పుల విరమణ వేళ.. విరుచుకుపడుతున్న రష్యా బలగాలు కాగా ఉక్రెయిన్పై రష్యా వరుస దాడులతో అనుక కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. తల్లి, తండ్రి, పిల్లలు తలో దిక్కులో చిక్కుకుపోయారు. ఉక్రెయిన్పై రష్యా దాడి చేయడం వల్ల 1.7 మిలియన్లకు పైగా ప్రజలు దేశం విడిచి వెళ్లవలసి వచ్చిందని ఐక్యరాజ్యసమితి అధికారులు తెలిపారు. ఇక రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అత్యంత వేగంగా పెరుగుతున్న శరణార్థుల సంక్షోభం పరిస్థితి ఇదేనని ఐరాస పేర్కొంది. -
Ukraine Crisis: ఈ టైంలో పుతిన్ మనసు మార్చగలిగేది ఆ ఒక్కడే!
ఉక్రెయిన్పై మిలిటరీ చర్య విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మనసును మార్చగలిగేది ఒక్కరేనని అంటున్నాడు ప్రముఖ ఆర్థికవేత్త స్టీఫెన్ రోచ్. ఆ ఒక్కరు ఎవరో కాదు.. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్. ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం హోరాహోరీగా కొనసాగుతోంది. రష్యా బలగాల పోరాటాన్ని సమర్థవంతంగా తిప్పికొడుతోంది ఉక్రెయిన్ సైన్యం. అయితే నష్టం మాత్రం భారీగానే ఉంటోంది. యుద్ధం మధ్యే శాంతి చర్చలు, పౌరుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది కూడా. ఈ తరుణంలో మొండిగా ముందుకెళ్తున్న పుతిన్ను ప్రభావితం చేయగలిగే వ్యక్తి ఒక్క జింగ్పిన్ మాత్రమేనని అమెరికన్ ఎకనమిస్ట్ స్టీఫెన్ అభిప్రాయపడుతున్నారు. సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఉక్రెయిన్ పరిణామాల విషయంలో పుతిన్ మనసును మార్చగలిగే ప్రపంచలోని ఏకైక వ్యక్తి జిన్పింగ్ మాత్రమే. వాళ్లిద్దరి మధ్య బంధం అలాంటిది. ఇరు దేశాల మధ్య మంచి వాణిజ్య సంబంధాలతో పాటు రాజకీయ అవగాహన కూడా ఉంది. చైనా ఈ వ్యవహారంలో ట్రంప్కార్డుగా వ్యవహరిస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ ఉద్రిక్తతలను ఆపగలిగే శక్తి నా దృష్టిలో ఇప్పుడు జీ జిన్పింగ్ ఒక్కరికి మాత్రమే ఉంది. ఆయనొక్కడే ఇప్పుడు పుతిన్ను ప్రభావితం చేయగలరు’’ అని స్టీఫెన్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. రష్యాతో తమ బంధం ఎంతో బలమైందని, అందుకే ఈ వ్యవహారంలో స్థిమితంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు చైనా విదేశాంగ శాఖ సోమవారం వెల్లడించింది. అవసరమైతే ఇరు దేశాల(ఉక్రెయిన్-రష్యా) మధ్య సంధి కోసం ప్రయత్నిస్తామంటూ ఆఫర్ కూడా ఇచ్చింది. ఇంకోపక్క రష్యాపై ఆంక్షలను చైనా ఖండిస్తూ వస్తోంది. చదవండి: ఉక్రెయిన్లో నెత్తుటి, కన్నీటి నదులు పారుతున్నాయి -
పుతిన్ రహస్య ప్రేయసి జాడ లేదే!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న వేళ.. ఇరు దేశాల అధినేతలు, వాళ్ల వ్యక్తిగత జీవితాలు, అలవాట్లు.. వగైరా వగైరా విషయాలు తెర మీదకు వస్తున్నాయి. ఈ క్రమంలో పుతిన్ పర్సనల్ లైఫ్కు సంబంధించిన ఓ ఆసక్తికర అంశం ఇప్పుడు హాట్ హాట్ టాపిక్గా మారింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ఓ రహస్య ప్రేయసి ఉందని, ఆమె పేరు అలీనా కబయేవా అని, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం ఆమె అజ్ఞాతంలో ఉందనే టాపిక్ నడుస్తోంది. అలీనా కబయేవా.. గతంలో జిమ్నాస్ట్గా ఉండేది. పుతిన్ విడాకుల తర్వాత ఆయనతో చనువుగా ఉంటోంది. ఆపై మీడియా మేనేజర్గా.. ప్రస్తుతం రష్యా రాజకీయాల్లోనూ ఆమె తన మార్క్ చూపిస్తోంది. ల్యూడ్మిలా అలెకస్సాంద్రోనా పుతినాతో 1983లో వ్లాదిమిర్ పుతిన్ వివాహం జరిగింది. ఈ జంటకు మరియా, కటేరినా అనే కూతుళ్లు ఉన్నారు. 2014లో ల్యూడ్మిలా నుంచి అధికారికంగా విడాకులు తీసుకున్నాడు పుతిన్. ఆపై రష్యా మీడియా మొఘల్ రూపర్ట్ మర్డోర్ మాజీ భార్య వెండి డెంగ్తో పాటు పలువురు టీనేజర్లతో పుతిన్ డేటింగ్ చేసినట్లు పుకార్లు ఉన్నాయి. అయితే ల్యూడ్మిలా అలెకస్సాంద్రోనాతో పుతిన్ వైవాహిక బంధం చెడిపోవడానికి కారణం కూడా అలీనా అనేది పుతిన్ సన్నిహితుల ఆరోపణ. 2008 నుంచే అలీనాకు పుతిన్తో పరిచయం ఉందని, వాళ్ల డేటింగ్ వ్యవహారం తెలిసే ల్యూడ్మిలా మనసు విరిగి విడాకులు తీసుకుందట!. అప్పటి నుంచి సీక్రెట్ ఫస్ట్లేడీగా అలీనా కొనసాగుతోంది. 1983లో తాష్కెంట్లో పుట్టిపెరిగిన అలీనా.. రిథమిక్ జిమ్నాస్ట్. పదిహేనేళ్ల వయసులో పోర్చుగల్లో జరిగిన యూరోపిన్ ఛాంపియన్షిప్లో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్లో అలీనా బ్రాంజ్ మెడలిస్ట్ కూడా. నాలుగేళ్ల తర్వాత గ్రీస్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కూడా గెల్చుకుంది. ఇప్పటిదాకా తన కెరీర్లో ఆమె రెండు ఒలింపిక్స్ మెడల్స్, 14సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ మెడల్స్, 21 యూరోపియన్ ఛాంపియన్షిప్ మెడల్స్ గెల్చుకుందామె. 2001లో డోపిండ్ స్కాండల్స్తో ఆమె జీవితం మలుపు తిరిగింది. రెండేళ్లపాటు నిషేధానికి గురైంది. పుతిన్తో కలిసి ఆమె నలుగురు పిల్లల్ని(ఇద్దరు కవలలు) కనిందనేది రష్యన్ యాంటీ మీడియా హౌజ్ల వాదన. ఎందుకంటే ఆమె ఏనాడూ తన వ్యక్తిగత జీవితం గురించి బయటపెట్టలేదు కాబట్టి. వైవాహిక జీవితాన్ని పెంట చేసుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. సీక్రెట్ ప్రేయసిని మాత్రం అపురూపంగా చూసుకుంటున్నాడు. ఇక పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో వ్యక్తిగత ప్రశ్నలను దాటేసి పుతిన్.. తనకూ ఓ వ్యక్తిగత జీవితం ఉందని, దాని గురించి ప్రస్తావించిడం ఇష్టం లేదని, దానిని గౌరవిస్తే బాగుంటుందని మీడియాకు చురకలు అంటించిన సందర్భాలు ఎన్నో. అలీనా ఎక్కడ? ప్రస్తుతం అలీనా.. స్విస్(స్విట్జర్లాండ్) కొండల్లో సేద తీరుతున్నట్లు ఇతర దేశాల నిఘా వర్గాల ఆధారంగా కొన్ని మీడియా హౌజ్లు కథనాలు ప్రచురిస్తున్నాయి. యుద్ధం రోజురోజుకు భీకరంగా మారుతుండడంతో ముందుజాగ్రత్త చర్యగా పుతిన్ తన కుటుంబాన్ని అణుబంకర్లలో దాచి పెట్టారు. ఆమెతో తనకు జన్మించిన నలుగురు పిల్లలను కూడా అంతే భద్రంగా దాచిపెట్టారు. స్విస్ కొండల్లో అత్యంత సురక్షితమైన, రహస్యమైన ప్రాంతాల్లో వారు భద్రంగా ఉన్నట్లు ఆ కథనాల సారాంశం. -
Ukraine Crisis: సేఫ్ కారిడార్లు ఎక్కడ? భారత్ అసంతృప్తి
ఉక్రెయిన్లోని ఐదు ప్రధాన నగరాల్లో రష్యా బలగాలు కాల్పుల విరమణ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నాం 12గం. 40ని. నుంచి విరమణ మొదలు కానుంది. రాజధాని కీవ్తో పాటు ఖార్కీవ్, మరియూపోల్, సుమీ, చెర్నీగోవ్ నగరాల నుంచి తరలింపునకు క్లియరెన్స్ ఇచ్చింది. అయితే.. మిగతా చోట్ల మాత్రం దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సేఫ్ కారిడార్లపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. సుమీలో చిక్కుకుపోయిన 700 మంది భారతీయులను తరలించే ప్రక్రియ ముందుకు సాగడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలోనే భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు కోసం భారత్.. ఆపరేషన్ గంగ నిర్వహిస్తోంది. ఇందుకు పూర్తి సహకారం ఉంటుందని అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ సైతం ప్రధాని మోదీకి తెలిపాయి. అయినప్పటికీ తరలింపు ప్రక్రియకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీంతో ఇక్కడున్న వాళ్ల కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. అన్ని శత్రుత్వాలకు తక్షణం ముగింపు పలకాలని భారతదేశం నిరంతరం పిలుపునిస్తోంది. సామరస్యంగా శాంతిపూర్వక చర్చలతో ఈ సంక్షోభం ముగియాలని భారత్ భావిస్తోంది. భారతీయుల తరలింపు సురక్షితంగా జరగాలని మేం కోరుకుంటున్నాం. అని యూఎన్ అంబాసిడర్ టీఎస్ త్రిమూర్తి, భద్రతా మండలిలో ప్రసంగించారు. సేఫ్కారిడార్ కోసం పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నా.. ఇరువైపు సానుకూల స్పందన వచ్చినట్లే అనిపిస్తోందని, కానీ, అది కార్యరూపం దాల్చట్లేదని ఆందోళన వ్యక్తం చేశారాయన. భారత్తో పాటు పలు దేశాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రష్యా మరోసారి కాల్పుల విరమణ ఉపశమనం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అయినా ఇవాళ(మంగళవారం) సుమీ నుంచి భారతీయ విద్యార్థులు, ఇతర దేశాల పౌరుల తరలింపు సురక్షితంగా పూర్తవుతుందేమో చూడాలి. సంబంధిత వార్త: సుమీ నుంచి తరలింపు.. అసలు సమస్యలు ఇవే! -
ఉక్రెయిన్కు నాటో సాయం.. ఉత్తదేనా?
వాషింగ్టన్: ఉక్రెయిన్లో వైమానిక దాడులను ఉధృతం చేయాలని రష్యా ఒకవైపు యోచిస్తుండగా, మరోవైపు అమెరికా సైతం వ్యూహాలకు పదును పెడుతోంది. రష్యాను ఢీకొట్టడానికి గాను ఉక్రెయిన్ దళాలకు ఫైటర్ జెట్లు అందజేయడానికి నాటో దేశాలకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, నాటో దేశాల నుంచి ఆశించిన స్పందన రాకపోవడం గమనార్హం. ఉక్రెయిన్కు Fighter Jets అందజేసి, సహకరించడానికి ఇప్పటిదాకా నాటో దేశాలేవీ ముందుకు రాలేదు. కేవలం ప్రకటనల వరకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఈ విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన విన్నపాలు సైతం పనిచేయడం లేదు. ఫైటర్ జెట్లు పంపించాలని ఆయన పదేపదే కోరుతున్నా మిత్ర దేశాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. గగనతల శక్తిలో ఉక్రెయిన్ కంటే రష్యా ఎన్నో రెట్లు ముందంజలో ఉంది. ఉక్రెయిన్ వద్ద కేవలం 67 ఫైటర్ జెట్లు, 34 అటాక్ హెలికాప్టర్లు ఉన్నాయి. రష్యా అమ్ముల పొదిలో ఏకంగా 1,500 ఫైటర్ జెట్లు, 538 అటాక్ హెలికాప్టర్లు ఉన్నాయి. ఉక్రెయిన్కు ఏ దేశమైనా సహకరిస్తే ఆ దేశం నేరుగా తమపై యుద్ధం సాగిస్తున్నట్లుగానే పరిగణిస్తామని రష్యా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్కు ఆర్మీని గానీ, వైమానిక దళాన్ని గానీ పంపించబోమని అమెరికా ఇప్పటికే తేల్చిచెప్పింది. చదవండి: యుద్ధ గందరగోళంలో పాపం ఆయన్ని కాల్చి చంపేశారు! -
Ukraine War: 3 లక్షల మందిని రష్యా బందీలుగా ఉంచింది: ఉక్రెయిన్
Live Updates: ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం 13వ రోజుకి చేరుకుంది. ఉక్రెయిన్ నుంచి పౌరులు తరలిపోయేందుకు వీలుగా కొన్ని మార్గాల్లో తాత్కాలిక కాల్పుల విరమణ పాటిస్తామని రష్యా మరోమారు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే హ్యుమానిటేరియన్ కారిడార్ల పేరిట పౌరుల తరలింపునకు రష్యా పేర్కొన్న మార్గాల్లో అత్యధికం రష్యా, బెలారస్కు దారితీయడంపై ఉక్రెయిన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. రష్యా మధ్యయుగాల నాటి తంత్రాలను ప్రయోగిస్తోందని విమర్శించింది. సంక్షోభం తీవ్రస్థాయిలో ఉన్న మారిపోల్ తదితర నగరాల్లో ఇంతవరకు ఎలాంటి తరలింపులు నమోదు కాలేదు. ఒకపక్క కొన్నిప్రాంతాల్లో తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా బలగాలు మిగిలిన ప్రాంతాల్లో యథాతథంగా యుద్ధాన్ని కొనసాగించాయి. మైకోలైవ్ పోర్ట్లో చిక్కుకుపోయిన 75 మంది భారతీయ నావికులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఉక్రెయిన్ భారత రాయబార కార్యాలయం తెలదిపింది. ఆదివారంమొత్తం 57 మంది నావికులను బస్సులు ఏర్పాటు చేసి తరలించినట్లు తెలిపింది. నేడు మిగిలిన 23 మంది నావికుల తరలింపును ఏర్పాట్లుఉ జరుగుతున్నాయని తెలిపింది. Mission intervened to evacuate 75 🇮🇳n sailors stranded in Mykolaiv Port. Yesterday buses arranged by Mission evacuated total of 57 sailors including 2 Lebanese & 3 Syrians. Route constraints precluded evacuation of balance 23 sailors. Mission is attempting their evacuation today pic.twitter.com/zxGxqKKeZX — India in Ukraine (@IndiainUkraine) March 8, 2022 ►మారియుపోల్లో రష్యా మూడు లక్షల మంది పౌరులను బందీలుగా ఉంచిందని ఉక్రెయిన్ విదేశాంగశాఖ మంత్రి దిమిత్రో కులేబా ఆరోపించారు. ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ మధ్యవర్తిత్వంతో ఒప్పందాలు ఉన్నప్పటికీ.. రష్యా ఈ తరలింపు ప్రక్రియను అడ్డుకుంటోందని తెలిపారు. ఈ మేరకు సోమవారం ట్వీట్ చేశారు. Russia holds 300k civilians hostage in Mariupol, prevents humanitarian evacuation despite agreements with ICRC mediation. One child died of dehydration (!) yesterday! War crimes are part of Russia’s deliberate strategy. I urge all states to publicly demand: RUSSIA, LET PEOPLE GO! — Dmytro Kuleba (@DmytroKuleba) March 8, 2022 ►రష్యా సైనిక చర్య నేపథ్యంలో ఉక్రెయిన్కు చెందిన దాదాపు 17 లక్షల మంది దేశం విడిచి వెళ్లిపోయినట్లు ఐరాస పేర్కొంది.. వీరందరూ పొరుగు దేశాల్లో శరణార్థులుగా ఉంటున్నట్లు తెలిపింది.. దాదాపు 10 లక్షల మంది ఉక్రెయిన్ పౌరులకు పోలాండ్ తమ దేశంలో ఆశ్రయం కల్పించిందని, ఉక్రెయిన్- రష్యా సంక్షోభానికి తక్షణమే తెరపడని పక్షంలో లక్షలాది మంది జీవితాలు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ ఆందోళన వ్యక్తంచేసింది. ►ఉక్రెయిన్లో సుమీలో కాల్పుల విరమణ కొనసాగుతుండటంతో అక్కడి భారతీయ వైద్య విద్యార్థులను తరలించేందుకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాంతంలో సుమారు 600 మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్నారని తెలుస్తోంది. రష్యా వైపు నుంచి నిరంతర కాల్పుల కారణంగా.. వారిని ఇప్పటివరకు ఖాళీ చేయలేకపోయారు. ► రష్యా బలగాలు మరో దారుణానికి ఒడిగట్టాయి. సుమీ ప్రాంతంలో ఉన్న రెసిడెన్షియల్ భవనాలపై రష్యన్ బలగాలు 500 కిలోల బాంబుతో దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు సహా 18 మంది మృతి చెందారని ఉక్రెయిన్ సాంస్కృతిక, సమాచార పాలసీ మంత్రిత్వ శాఖ మంగళవారం ట్విట్టర్ వేదికగా తెలిపింది. Last night Russian pilots committed another crime against humanity in Sumy. They dropped 500-kilogram bombs on residential buildings. 18 civilian deaths have already been confirmed, including two children.#StopRussia — Stratcom Centre UA (@StratcomCentre) March 8, 2022 ► గ్రీన్కారిడార్కు మార్గం సుగమం. సుమీ నుంచి పోల్టావాకు బస్సుల్లో పౌరుల తరలింపు. Green corridor from Sumy to Poltava. Keep an eye. More attention, less chances it will be shelled. pic.twitter.com/6zSyj5cdD5 — Nataliya Gumenyuk (@ngumenyuk) March 8, 2022 ► కొనసాగుతున్న కాల్పుల విరమణ.. సమస్యాత్మక ప్రాంతాల నుంచి ఇరు దేశాల సైన్యం నడుమే పౌరుల తలింపు. Oekraïners negeren de Russische voedselbonnen #Ukraine #UkraineCrisis #UkraineWar #StopPutin #StopRussianAggression #WarCrimes #CrimesOfWar #PutinWarCriminal pic.twitter.com/LRTQbLyX56 — Ꮆ乇尺卂尺ᗪ 🅺🆁🅾🅾🅽 (@kroon125) March 8, 2022 ► తూర్పు, మధ్య ఉక్రెయిన్లో రష్యా బలగాల దెబ్బకి రాత్రికి రాత్రే పలు నగరాల్లో బాంబుల వర్షం కురిసింది. ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం ఓ కొలిక్కి రావాల్సి ఉంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధికారులు ధృవీకరించారు. Destroyed column of enemy equipment near #Sumy. pic.twitter.com/03GdVoxqlB — NEXTA (@nexta_tv) March 8, 2022 ► ఎక్కడా దాక్కోలేదు.. ఇదే నా లొకేషన్ రహస్య ప్రాంతానికి పారిపోయాడంటూ వస్తున్న కథనాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించాడు. తను ఎక్కడ ఉన్నానో తెలియజేసే లొకేషన్ ను ఇన్ స్టా గ్రామ్ పేజీలో జెలెన్ స్కీ షేర్ చేశారు. ‘‘నేను కీవ్ లోని బాంకోవా స్ట్రీట్ లో ఉన్నాను. నేను దాక్కోలేదు. నేను ఎవరికీ భయపడడం లేదు’’అంటూ పోస్ట్ పెట్టారు. మనం ఈ దేశ భక్తి యుద్ధంలో గెలవడానికి ఏదైనా కోల్పోవచ్చని వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 24న రష్యా యుద్ధం మొదలు పెట్టిన తర్వాత.. రష్యా దళాలు చేసిన మూడు హత్యా ప్రయత్నాల నుంచి జెలెన్ స్కీ తప్పించుకున్నట్టు కథనాలు వస్తుండడం తెలిసిందే. తనను చివరిగా చూడడం ఇదే కావచ్చంటూ కొన్ని రోజుల క్రితం ఆయన నిర్వేద ప్రకటన చేయడం గమనార్హం. ► మరికాసేపట్లో రష్యా కాల్పుల విరమణ.. ఉక్రెయిన్ పట్టణాల్లో అమలు కానుంది. అయితే మరోవైపు మిగతా ప్రాంతాల్లో రష్యా పెను విధ్వంసానికి పాల్పడుతోంది. పౌరుల భద్రతపై దృష్టి పెడుతున్న ఉక్రెయిన్.. యుద్ధంపై సరిగా ఫోకస్ చేయలేకపోతోంది. అయినప్పటికీ పౌరులు యుద్ధ రంగంలోకి దిగి.. రష్యా బలగాలను ప్రతిఘటిస్తున్నాయి. ► మరోసారి కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా. ఈసారి ఐదు నగరాల్లో. మానవతా కోణంలో తరలింపునకు అంగీకారం. రాజధాని కీవ్ను సైతం చేర్చిన వైనం. మంగళవారం ఉదయం నుంచి ప్రారంభం కానున్న కాల్పుల విరమణ. ► కీవ్, ఖార్కీవ్ నుంచి రష్యా, బెలారస్కు పౌరుల తరలింపును రష్యా ప్రొత్సహిస్తోందని, ఇది ఆందోళన కలిగించే అంశమని ఉక్రెయిన్ వాదిస్తోంది. అయితే రష్యా ఈ ఆరోపణలను ఖండించింది. ఇందులో వాస్తవం లేదని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ► 200 మంది భారతీయులు ప్రత్యేక విమానంలో మంగళవారం ఉదయం ఉక్రెయిన్ నుంచి భారత్కు సురక్షితంగా చేరుకున్నారు. రొమేనియా నుంచి ఈ విమానం చేరుకుంది. A special flight, carrying 200 Indian evacuees from Ukraine, lands in Delhi from Suceava in Romania. "While we were traveling in the bus, there were no bombings. The government & our Embassy helped us a lot, we are very happy to be back" said a student who returned from Ukraine pic.twitter.com/9HVUcguWsp — ANI (@ANI) March 8, 2022 ► ఉక్రెయిన్ సంక్షోభ నేపథ్యంలో 723 మిలియన్ డాలర్ల గ్రాంట్ మంజూరు చేసిన ప్రపంచ బ్యాంక్. ► ఉక్రెయిన్ ప్రభుత్వానికి సాయం అందించేందుకు యూఎస్ కాంగ్రెస్(చట్ట సభ) సూత్రప్రాయంగా అంగీకారం. ► సుమారు 20 వేల మందిని ఉక్రెయిన్ నుంచి భారత్కు సురక్షితంగా తరలించినట్లు భారత్ ప్రకటన. యూఎన్ అంబాసిడర్ టీఎస్ త్రిమూర్తి.. ఐరాస భద్రతా మండలిలో ప్రకటించారు. "They clearly shot to kill”: Swiss photojournalist Guillaume Briquet narrowly escaped bullets yesterday, fired by a Russian commando on a road in southern #Ukraine. The “press" markings were clearly visible on his car. 1/2 pic.twitter.com/beoz64VkRA — RSF (@RSF_inter) March 7, 2022 ► ఎవరికీ భయపడను యుద్ధం నేపథ్యంలో కీవ్ నుంచే తాను పని చేస్తున్నానని ప్రకటించుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ మరోసారి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియో రిలీజ్ చేశాడు. మనమంతా యుద్ధ క్షేత్రంలోనే ఉన్నాం. కలిసి కట్టుగా పని చేస్తున్నాం అంటూ పౌరులను ఉద్దేశించి ప్రసంగించారాయన. నేనేం దాక్కోను. ఎవరికీ భయపడను అంటూ 9 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో ఆయన పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Володимир Зеленський (@zelenskiy_official) ► ఉక్రెయిన్ రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్లో జరిగిన యుద్ధంలో రష్యా మేజర్ జనరల్ అండ్రెయ్ సుఖోవెట్స్కీ చనిపోయినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. Russian Major General Andrei Sukhovetsky, commander in chief of the 7th division of the Russian army, was killed by Ukrainian army snipers. Sukhovetsky participated in the Russian military operations in Syria and was responsible for the deaths of thousands of civilians in Syria. pic.twitter.com/tIdfLf2RPl — Husam Hezaber (@HusamHezaber) March 4, 2022 ► రష్యా ఆయిల్పై నిషేధం దిశగా ఎలాంటి ఆలోచనలు చేయలేదని అమెరికా ప్రకటన. US says no decision made about ban on importing oil from Russia Read @ANI Story | https://t.co/rUEsPresvS#Ukraine️ #Russia #Oilprices pic.twitter.com/EUpJhbOQuW — ANI Digital (@ani_digital) March 7, 2022 ► రష్యా ఆయిల్ మీద నిషేధం విధిస్తే.. ధరలు విపరీతంగా పెరుగుతాయని మాస్కో వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ► ఉక్రెయిన్పై సాగిస్తున్న యుద్ధం విషయంలో రష్యా కీలక ప్రకటన చేసింది. మిలటరీ ఆపరేషన్ తక్షణమే నిలిపివేసేందుకు తాము సిద్ధమేనని వెల్లడించింది. అయితే, తాము విధిస్తున్న నాలుగు షరతులను ఉక్రెయిన్ అంగీకరిస్తేనే అది సాధ్యమవుతుందని రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి సోమవారం తేల్చిచెప్పారు. తమ షరతు ల జాబితాను బయటపెట్టారు. అవి ఏమిటంటే.. ఉక్రెయిన్ సైన్యం వెంటనే వెనక్కి మళ్లాలని రష్యా అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఇరువైపులా కాల్పుల విరమణ పాటిద్దామని చెప్పారు. ఉక్రెయిన్ తటస్థ దేశంగానే ఉండాలని, ఆ మేరకు రాజ్యాంగ సవరణ చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర దేశాల భూభాగాల్లోకి ఉక్రెయిన్ ప్రవేశాన్ని నిరోధించేలా ఈ రాజ్యాంగ సవరణ ఉండాలన్నారు. క్రిమియాను రష్యాలో ఒక భాగంగా అధికారికంగా గుర్తించాలని ఉక్రెయిన్కు సూచించారు. డొనెట్స్క్, లుహాన్స్క్లను సైతం స్వతంత్ర రాష్ట్రాలుగా గుర్తించాలన్నారు. రష్యా విధించిన షరతులపై ఉక్రెయిన్ ఇంకా స్పందించలేదు. యుద్ధం కారణంగా దాదాపు 17 లక్షల మంది ఉక్రేనీయులు శరణార్థులుగా మారినట్లు ఐరాస ప్రకటించింది. రష్యా, ఉక్రెయిన్ బృందాలు సోమవారం జరిపిన మూడో విడత చర్చలు ఎలాంటి తుది నిర్ణయాలు తీసుకోకుండానే ముగిశాయి. అయితే, చర్చల్లో పురోగతి కనిపించిందని ఉక్రెయిన్ వర్గాలు తెలపగా, రష్యా తోసిపుచ్చింది. గురువారం ఇరుదేశాల విదేశాంగ మంత్రులు టర్కీలో సమావేశం కానున్నారు. యుద్ధం కొనసాగుతుండడంతో పలు నగరాల్లో సైనికులు, పౌరులు కలిసి దిగ్బంధనాలు ఏర్పాటు చేస్తున్నారు. సైనికుల కోసం తాత్కాలిక వంటశాలలు ఏర్పాటు చేసి ఆహారం సరఫరా చేస్తున్నారు. ► 2 లక్షల మంది ఎదురుచూపులు కీలక మారిపోల్ నగరంలో దాదాపు 2 లక్షలమంది పౌరులు దేశం విడిచిపోయేందుకు తయారుగా ఉన్నారు. వీరిని తరలించేందుకు అక్కడ రెడ్క్రాస్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో ఆహారం, నీరు తదితర నిత్యావసరాల కొరత ఏర్పడింది. స్థానికులు కనిపించిన షాపులను లూటీ చేస్తున్నారు. తరలింపు కారిడార్ ప్రకటన వచ్చేవరకు ప్రజలంతా షెల్టర్లలోనే ఉండాలని పోలీసులు ప్రకటించారు. దక్షిణ ఉక్రెయిన్ సహా తీరప్రాంతంలో రష్యా బలగాలు చెప్పుకోదగ్గ పట్టుసాధించాయి. ఇతర ప్రాంతాల్లో మాత్రం రష్యాకు ముమ్మర ప్రతిఘటన ఎదురవుతోంది. మారిపోల్ స్వాధీనమైతే రష్యా నుంచి క్రిమియాకు భూమార్గం ఏర్పాటవుతుంది. అందుకే రష్యా సేనలు ఈ ప్రాంతంపై దృష్టి పెట్టాయి. ఇప్పటివరకు యుద్ధం కారణంగా 406 మంది పౌరులు మృతి చెందారని, నిజానికి ఈ సంఖ్య మరింత పెద్దదిగా ఉండొచ్చని ఐరాస మానవహక్కుల కార్యాలయం తెలిపింది. Only Kids can put a smile on your face in the middle of war#ukraine #UkraineWar pic.twitter.com/q2Qe9Z47v5 — Ivan (@coldshowwer) March 7, 2022 ► సమ్మతం కాదు రష్యా ప్రకటించిన తాత్కాలిక కాల్పుల విరమణ తమకు ఆమోదయోగ్యం కాదని ఉక్రెయిన్ ఉప ప్రధాని ఇరినా వెరెషు్చక్ ప్రకటించారు. రష్యా ప్రకటించిన కారిడార్లలో అత్యధికం రష్యాకు, బెలారస్కు దారితీస్తున్నాయని, ఇది తాము అంగీకరించమని చెప్పారు. రష్యా సూచించిన ప్రణాళికను ఫ్రాన్స్ కూడా తిరస్కరించింది. రష్యాలో ఆశ్రయం పొందాలని ఎంతమంది ఉక్రెయిన్ ప్రజలు కోరుకుంటారని, ఇదంతా కేవలం కంటితుడుపు చర్యని ఫ్రాన్స్ వ్యాఖ్యానించింది.∙రష్యాతో చర్చలకు ఎప్పుడూ సిద్ధమేనని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చెప్పారు. రష్యా ఆక్రమణ ఆరంభించినప్పటినుంచి ఆయన పుతిన్తో 4సార్లు మాట్లాడారు. సంక్షోభ నివారణకు కృషి చేస్తామని మరోమారు ఆయన వెల్లడించారు. ఫ్రాన్స్తో పాటు ఇజ్రాయెల్ సైతం మధ్యవర్తిత్వ కృషి చేస్తోంది. రష్యా ప్రతిపాదిత మార్గాల బదులు 8 మార్గాలను ఉక్రెయిన్ ప్రతిపాదించింది. కీవ్ ప్రాంతంలో రష్యాతో తీవ్రమైన పోరు సాగుతోందని ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. ఇర్పిన్, మైకోలైవ్ ప్రాంతాలపై రష్యా విరుచుకుపడుతోందని, ఇక్కడ చాలావరకు రష్యా అధీనంలోకి వచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
రష్యా కీలక ప్రకటన.. అలా చేస్తే తక్షణమే యుద్ధం ఆపేస్తాం
ఉక్రెయిన్పై రష్యా బలగాల దాడులు 12 రోజూ కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు రెండు సార్లు కాల్పులకు విరామం ప్రకటించినప్పటికీ ప్రధాన నగరాలను టార్గెట్ చేస్తూ రష్యా దళాలు బాంబులు వర్షం కురిపిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇటు రష్యా సేనల దాడులను ఉక్రెయిన్ సైతం తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. శుత్రు బలగాల నుంచి దేశాన్ని రక్షించుకునేందుకు విరోచితంగా పోరాడుతోంది. ఈ క్రమంలో రష్యా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ తమ షరతులను అంగీకరిస్తే సైనిక చర్యను నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా వెల్లడించింది. చదవండి: Ukraine Crisis: ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పిన జెలెన్స్కీ.. ఎందుకంటే ఈ మేరకు రష్యా అధ్యక్షుడి ప్రెస్ సెక్రటరీ దిమిత్రి పెస్కోవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఉక్రెయిన్ తమ షరతులను ఒప్పుకున్నట్లైతే తక్షణమే సైనిక చర్యను నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దీనికి ఉక్రెయిన్ ఏ కూటమిలోనూ చేరకుండా ఉండేందుకు తమ రాజ్యాంగాన్నిసవరణలు చేయాలని తెలిపారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్- రష్యా మధ్య మూడో విడత శాంతి చర్చలు సోమవారం సాయంత్రం 7.30 గంటలకు జరగనున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు ప్రకటించారు. చదవండి: రష్యాతో స్నేహం ధృడంగా ఉంది.. అందుకు సిద్ధంగా ఉన్నాం: చైనా మరోవైపు రష్యాకు చెందిన ఇద్దరు ఉన్నతస్థాయి మిలిటరీ కమాండర్లు యుద్ధంలో మృతిచెందినట్లు ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. అదే విధంగా రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కైవ్కు సమీపంలోని గోస్టోమెల్ మేయర్ను కాల్చి చంపినట్లు సోమవారం స్థానిక అధికారులు తెలిపారు. ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని, రోగులకు మందులు పంపిణీ చేస్తున్న సమయంలో ఆయనతోపాటు మరో ఇద్దరిని కాల్చిచంపారని పేర్కొన్నారు. ఆయన తన ప్రజల కోసం, గోస్టోమెల్ కోసం హీరోగా ప్రాణాలు విడిచాడని తెలిపారు. -
పుతిన్కు ఫోన్ చేసిన మోదీ.. ఆయనతో నేరుగా మాట్లాడాలని సూచన..
ఉక్రెయిన్పై రష్యా కొనసాగిస్తున్న భీకర పోరు 12వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్ పరిస్థితులపై 50 నిమిషాలపాటు ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఉక్రెయిన్తో చర్చల వివరాలను పుతిన్ మోదీకి వివరించారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడి జెలెన్స్కీతో నేరుగా మాట్లాడాలని పుతిన్ను మోదీ కోరారు. ఉక్రెయిన్లో నగరాలు, సుమీ ప్రాంతాల్లో కాల్పుల విరమణ చేసి మానవతా కారిడార్ను ఏర్పాటు చేయడంపై పునతిన్కు మోదీ అభినందనలు తెలిపారు. సుమీ నుంచి భారతీయులను క్షేమంగా తలించేందుకు సహరకరించాలని పుతిన్ను కోరారు. ఈ క్రమంలో భారతీయుల తరలింపుకు తమవంతు సహకారం అందిస్తామని పుతిన్.. ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు. -
Ukraine Crisis: ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పిన జెలెన్స్కీ.. ఎందుకంటే
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. రష్యా దురాక్రమణను ఉక్రెయిన్ ధీటుగా ఎలా ఎదుర్కొంటుందో ప్రధాని నరేంద్రమోదీకి వివరించినట్లు చెప్పారు. యుద్ధ సమయంలో అత్యున్నత స్థాయిలో శాంతియుత సంభాషణలు చేసినందుకు, తమ దేశ పౌరులకు చేసిన సహాయంపై భారత్ ఉక్రెయిన్ను ప్రశంసించిందని పేర్కొన్నారు. అయితే రష్యా బలగాలను ఉక్రెయిన్ సమర్ధవంతంగా ఎదుర్కొంటున్న విధానాన్ని మోదీ ప్రశంసించారని పేర్కొన్నారు. ఉక్రెయిన్ ప్రజలకు మద్దతుగా నిలిచినందుకు మోదీకి జెలెన్స్కీ ధన్యవాదాలు తెలిపారు. చదవండి: రష్యాతో స్నేహం ధృడంగా ఉంది. అందుకు సిద్ధంగా ఉన్నాం: చైనా ఈ మేరకు సోమవారం నరేంద్రమోదీతో 35 నిమిషాల పాటు ఫోన్లో ఆయన మాట్లాడారు. అనంతరం జెలెన్ స్కీ తన అధికారిక ట్విట్టర్ ద్వారా మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ట్వీట్ చివర్లో ‘స్టాప్ రష్యా’ అనే హ్యాష్ట్యాగ్ని చేర్చారు. మరోవైపు ఉక్రెయిన్-రష్యా ప్రతినిధుల మధ్య సోమవారం మూడో విడత శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ క్రమంలో రష్యా ప్రతినిధు బృంధం నేడు బెలారస్కు చేరుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. చదవండి: War Updates: ఉక్రెయిన్ సంక్షోభంపై ఐసీజేలో విచారణ.. -
ఓవైపు యుద్ధం కొనసాగుతున్న వేళ! మరోవైపు..
ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణ 12వ రోజుకి చేరింది. పౌరుల తరలింపు ప్రక్రియ కోసం కొద్దిగంటలు కాల్పుల విరమణ ప్రకటించింది రష్యా సైన్యం. ఈలోపు పౌరుల తరలింపు వేగవంతం చేసింది ఉక్రెయిన్ సైన్యం. ఇక ఈ యుద్ధంలో నేను సైతం అంటూ ఉక్రెయిన్ సాధారణ పౌరులు కదనరంగంలోకి దూకారు. వాళ్లకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు రోజూ ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. తాజాగా.. సోషల్ మీడియాలో అలాంటి ఒక వీడియో వైరల్ అవుతోంది. సైనిక దుస్తుల్లో ఉన్న ఇద్దరు.. తోటి సైనికుల మధ్యే వివాహం చేసుకున్నారు. ఉక్రెయిన్కు చెందిన లెస్యా, వలెరీ.. ఇద్దరూ కీవ్ స్పెషల్ ట్రూప్ 112వ బెటాలియన్లో వలంటీర్లుగా పని చేస్తున్నారు. తాజాగా వీళ్లిద్దరి వివాహం జరగ్గా.. తోటి యుద్ధవీరులు వాళ్లకు పుష్ఫగుచ్ఛాలు ఇచ్చి సత్కరించారు. అందులో ఓ సైనికుడు ఉక్రెయిన్ సంగీత పరికరం వాయిస్తూ.. ఆ జంటను దీవించడం చూడొచ్చు. Volunteers from one of the 112th Battalions of the Kyiv Special Troop Brigade got married. Lesya and Valeriy have been together for twenty years and have an 18-year-old daughter, but they still haven't had time to get married. #Ukraine pic.twitter.com/R9ms9WhpUT — Ukraine Update 🇺🇦 (@Ukrain_War) March 6, 2022 జర్మన్ న్యూస్ అవుట్లెట్ బ్లిడ్కు చెందిన పౌల్ అనే రిపోర్టర్ ఆ వీడియోను షేర్ చేయడంతో వైరల్ అయ్యింది. విశేషం ఏంటంటే.. లెస్యా, వలెరీలు కొత్త జంట కాదు. ఇరవై ఏళ్లుగా సహజీవనంలో ఉన్నారు. ఈ జంటకు 18 ఏళ్ల కూతురు కూడా ఉంది. కూతురిని సేఫ్ షెల్టర్లో ఉంచి ఈ ఇద్దరూ ఇలా కీవ్ బెటాలియన్లో చేరిపోయారు. అసలే యుద్ధం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అందుకే సమయం లేదనే ఉద్దేశంతో ఇప్పుడు పెళ్లితో అధికారికంగా ఒక్కటయ్యారు. ఉక్రెయిన్కు చెందిన ఈ ఇద్దరు యుద్ధ భూమిలోనే ఇలా ఒక్కటవ్వడం ఆకట్టుకుంటోంది ఇప్పుడు. -
జెలెన్స్కీకి ప్రధాని మోదీ కృతజ్ఞతలు
ఉక్రెయిన్ సంక్షోభ పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో సోమవారం ఫోన్లో మాట్లాడారు. సుమారు 35 నిమిషాలపాటు వీళ్ల మధ్య సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. రష్యాతో ఒకవైపు పోరు కొనసాగిస్తున్నప్పటికీ.. నేరుగా శాంతి చర్చల నిర్ణయం తీసుకోవడంపై జెలెన్స్కీని ప్రధాని మోదీ అభినందించారు. అంతేకాదు భారతీయుల తరలింపు విషయంలో ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆపై ప్రస్తుత యుద్ధ పరిస్థితులపై ఇద్దరూ చర్చించుకున్నారు. రష్యా కాల్పుల విరమణ ప్రకటించిన నేపథ్యంలో.. భారత్లో చిక్కుకున్న విద్యార్థుల తరలింపును వేగవంతం చేయాలని, అందుకు సహకరించాలని మోదీ, జెలెన్స్కీని కోరారు. ప్రత్యేకించి సుమీ రీజియన్ నుంచి తరలింపు క్లిష్టంగా మారిన తరుణంలో అక్కడ ప్రత్యేకంగా దృష్టిసారించాలని మోదీ, జెలెన్స్కీని కోరినట్లు తెలుస్తోంది. -
మేం మీ బానిసలం కాదు: ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం
పాలనాపరంగానే కాదు.. దౌత్య విషయాల్లోనూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ‘పూర్’ అని నిరూపించుకుంటున్నాడు. ఆ మధ్య వాణిజ్యం పేరిట చైనా పర్యటనకి వెళ్లి మరీ.. వేర్పాటువాద దాడుల విషయంలో అక్షింతలు వేయించుకుని వచ్చాడు. ఇక ఉక్రెయిన్ యుద్ధ వాతావరణంలో రష్యా పర్యటనకు వెళ్లి మరీ తిట్లు తిన్నాడు. ఇప్పుడేమో అమెరికా-యూరప్ మిత్రపక్షాలపై అసంతృప్తి వెల్లగక్కి మరోసారి విమర్శల పాలయ్యాడు. పశ్చిమ దేశాల దౌత్య వేత్తలను ఉద్దేశించి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణను ఖండించాలని, తాము విధిస్తున్న ఆంక్షలను సమర్థించాలంటూ పశ్చిమ దేశాల రాయబారులు, ఖాన్ సాబ్ మద్దతు కోరారు. ఈ మేరకు ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానానికి మద్దతు ఇవ్వాలని యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలతో సహా 22 దౌత్య మిషన్ల అధిపతులు మార్చి 1న సంయుక్త లేఖను విడుదల చేశారు. అయితే.. దీనికి ఇమ్రాన్ ఖాన్ నుంచి ఊహించని సమాధానం ఎదురైంది. ‘‘అసలేం అనుకుంటున్నారు? మీరు చెప్పిందల్లా చేయడానికి మేం మీ బానిసలం అనుకుంటున్నారా?. యూరోపియన్ ఎంబాసిడర్లకు నా సూటి ప్రశ్న. ఇలాంటి లేఖ మీరు భారత్కు రాశారా? ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో వాళ్లను(భారత్) నిలదీశారా?. లేదుకదా? మాటిమాటికి మమ్మల్నే ఎందుకు బద్నాం చేస్తారు? మేం అంత తేలికగా దొరికామా?’’ అంటూ ఆదివారం సాయంత్రం ఓ పొలిటికల్ ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించాడు. అంతేకాదు.. ఆఫ్ఘనిస్తాన్లో పాశ్చాత్య నాటో కూటమికి మద్దతివ్వడం వల్ల పాకిస్థాన్ తీవ్రంగా నష్టపోయిందని, కృతజ్ఞతతో కాకుండా విమర్శలను ఎదుర్కొంటోందని ఆయన అన్నారు. ‘‘మేం రష్యాకు స్నేహితులం. అమెరికాకు స్నేహితులం. చైనా, యూరప్ దేశాలతోనూ స్నేహంగానే ఉంటాం. వేరేవాళ్లలాగా క్యాంపులు నడిపించడం మాకు చేతకాదు. అందుకే తటస్థంగా ఉండాలనుకుంటున్నాం’’ అని ప్రకటించాడు ఇమ్రాన్ ఖాన్. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ సంక్షోభంపై దౌత్య వేత్తలు బహిరంగంగా లేఖ రాయడం వల్లే పాక్ ఇలా చిందులు తొక్కుతోంది. -
ఉక్రెయిన్పై వార్.. ఊహించినట్లే రష్యా అడుగులు!
ఉక్రెయిన్పై యుద్ధంలో మాస్కో వర్గాలు.. పాశ్చాత్య దేశాల ఊహకు తగ్గట్లే అడుగులు వేస్తున్నాయి. ప్రధాన నగరాలు, ఆపై అణు రియాక్టర్లు, అటుపై పోర్టు సిటీలు దాడులతో ఉక్రెయిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా నిఘా వర్గాలు ఊహించినట్లే మరొకటి జరిగింది. రెండు దేశాల మధ్య యుద్ధం 12వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో.. ఉక్రెయిన్ పై యుద్ధం చేయడానికి ఇతర దేశాల ఫైటర్లను రష్యా నియమించుకుంటోంది. ఉక్రెయిన్ ను ఆక్రమించుకునే లక్ష్యంతో చేస్తున్న యుద్ధంలో రష్యా భారీ విధ్వంసానికి దిగినప్పటికీ.. ఉక్రెయిన్ దళాల నుంచి ప్రతిఘటనే ఎదురవుతోంది. రష్యా సైన్యం భారీగా నష్టపోతోంది. ఇప్పటికే ఎంతో మంది రష్యన్ సైనికులను ఉక్రెయిన్ బలగాలు చంపేశాయి. మరెందరో రష్యన్ సైనికులు ఉక్రెయిన్ కు బంధీలుగా చిక్కారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సైతం బయటకు వచ్చాయి. ఇక రష్యా కాంట్రాక్ట్ ఫైటర్లను నియమించుకుంటున్న విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో వెల్లడించింది. నలుగురు అమెరికా అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించినట్లు సదరు కథనం పేర్కొంది. సిరియాతో పాటు చెచెన్యా ఫైటర్లను ఇప్పటికే నియమించుకుందట రష్యా. ఇందుకోసం ఫైటర్లతో ఆరు నెలల ఒప్పందాన్ని సైతం కుదుర్చుకున్నట్లు సమాచారం. రోజూ 200 నుంచి 300 డాలర్ల జీతం వీళ్లకు ముట్టజెప్పనుంది రష్యా. రాజధాని కీవ్ ముట్టడి కోసమే ఈ నియామకాలని అమెరికా అధికారులు భావిస్తున్నారు. ఇక ఈ ప్రైవేట్ ఫైటర్లు నగరాల ముట్టడిలో రాటుదేలిన వాళ్లని సమాచారం. అయితే ఇప్పటి వరకు ఎంత మందిని, ఈ రెండు దేశాల నుంచే కాకుండా వేరే దేశాల నుంచి కూడా నియమించుకుందా? అనే సమాచారం మాత్రం వెల్లడించలేదు సదరు కథనం. మరోవైపు ఈ యుద్ధంలో రష్యా గనుక సిరియా సాయం తీసుకుంటే.. తాము ఉక్రెయిన్కు మద్ధతుగా రంగంలోకి దిగుతామని సిరియా రెబెల్స్ ఇప్పటికే ప్రకటించేశారు. చదవండి: ఉక్రెయిన్ ఎఫెక్ట్.. కేరళ హోటల్ నిర్ణయం వైరల్ -
War Updates: ఉక్రెయిన్కు బ్రిటన్ సాయం.. 400 మిలియన్ పౌండ్లు..
Russia-Ukraine war Live Updates: యుద్ధ వాతావరణం నడుమే శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది రష్యా. మరోవైపు తామేమీ తగ్గబోమంటూ ప్రకటించిన ఉక్రెయిన్ సైతం చర్చలకు సుముఖత వ్యక్తం చేస్తోంది. ఈ తరుణంలో యుద్ధం 12వ రోజు కొనసాగుతుండగా.. చర్చలూ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ తరుణంలో.. ►ఉక్రెయిన్కు బ్రిటన్ దేశం ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. మానవతా దృక్పథంతో 175 మిలియన్ల పౌండ్లను అందజేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. దీంతో ఇప్పటి వరకూ బ్రిటన్ 400 మిలియన్ పౌండ్లను ఉక్రెయిన్కు సాయంగా అందించింది. ►ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను పొరుగు దేశాల ద్వారా సోమవారం 7 విమానాల ద్వారా మొత్తం 1,31 మంది భారతీయులను స్వదేశానికి తరలించినట్లు పౌరవిమనయానశాఖ తెలిపింది. ►రష్యా దండయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్లో 406 మంది పౌరుల మరణించినట్లు ధృవీకరించినట్లు ఐరాస మానవ హక్కుల కార్యాలయం తెలిపింది. ఆదివారం నాటికి మరో 801 మంది గాయపడినట్లు వెల్లడించింది. ►ఉక్రెయిన్ తమ షరతులను అంగీకరించినట్లయితే సైనిక చర్యను నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా పేర్కొంది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడి ప్రెస్ సెక్రటరీ డిమిత్రి పెస్కోవ్మాట్లాడుతూ..కైవ్ తన షరతులను నెరవేర్చినట్లయితే తక్షణం సైనిక చర్యను నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఉక్రెయిన్ ఏ కూటమిలో చేరకుండా ఉండేందుకు వారు రాజ్యాంగ సవరణలు చేయాలని కోరారు. ►ఉక్రెయిన్ దళాలు రష్యా బలగాల నుంచి మైకోలాయివ్ ప్రాంతీయ విమానాశ్రయాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాయని స్థానిక గవర్నర్ విటాలి కిమ్ సోమవారం తెలిపారు. ►ఉక్రెయిన్లో చిక్కుకున్న 400 మంది భారతీయులను తీసుకొచ్చేందుకు రొమేనియా నుంచి మంగళవారం రెండు విమానాలను నడపనున్నట్లు పౌర విమానయానశాఖ పేర్కొంది. ►రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కైవ్కు సమీపంలోని గోస్టోమెల్ మేయర్ను కాల్చి చంపినట్లు సోమవారం స్థానిక అధికారులు తెలిపారు. గోస్టోమెల్ మేయర్ యూరి ఇల్లిచ్ ప్రైలిప్కో స్థానికంగా ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని,యు రోగులకు మందులు పంపిణీ చేస్తున్నప్పుడు ఆయనతోపాటు మరో ఇద్దరిని కాల్చిచంపారని పేర్కొన్నారు.అని అది పేర్కొంది. ఆయన తన ప్రజల కోసం, గోస్టోమెల్ కోసం హీరోగా ప్రాణాలు విడిచాడని తెలిపారు. ►రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పరోక్షంగా నష్టపోతున్న ప్రపంచ దేశాల స్థితిగతులపై మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర స్పందించారు. 21వ శతాబ్దంలో జరుగుతున్న ప్రపంచ యుద్ధానికి స్వాగతం చెబుతూ.. రష్యా - ఉక్రెయిన్ తోపాటు మిగిలిన ప్రపంచ దేశాలు యుద్ధం చేస్తున్నాయని ట్వీట్ చేశారు. ►ఉక్రెయిన్-రష్యా ప్రతినిధుల మధ్య సోమవారం మూడో విడత శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ క్రమంలో రష్యా ప్రతినిధు బృంధం నేడు బెలారస్కు చేరుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ►రష్యా అధ్యక్షుడు పుతిన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఉక్రెయిన్ పరిస్థితులపై 50 నిమిషాలపాటు ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ఉక్రెయిన్తో చర్చల వివరాలను పుతిన్ మోదీకి వివరించారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడితో నేరుగా మాట్లాడాలని పుతిన్ను మోదీ కోరారు. ఉక్రెయిన్లో నగరాలు, సుమీ ప్రాంతాల్లో కాల్పుల విరమణ చేసి మానవతా కారిడార్ను ఏర్పాటు చేయడంపై పుతిన్కు మోదీ అభినందనలు తెలిపారు. ►తమ దేశంపై రష్యా తన సైనిక చర్యను వెంటనే నిలిపి వేయాలని ఆదేశించాలని కోరుతూ ఉక్రెయిన్ చేసిన అభ్యర్థనపై అంతర్జాతీయ న్యాయస్థానం రెండు రోజుల విచారణను సోమవారం ప్రారంభించింది. ఈ మేరకు ఐసీజే ప్రధాన కార్యాలయం పీస్ ప్యాలెస్లో ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్ తన వాదలను నేడు కోర్టు ముందు ఉంచనుంది. రష్య మంగళవారం స్పందించే అవకాశం ఉంది. ►భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. రష్యా బలగాలకు ఉక్రెయిన్ సమర్ధవంతంగా ఎదుర్కొంటున్న విధానాన్ని మోదీ ప్రశంసించారని జెలెన్స్కీ పేర్కొన్నారు. యుద్ధ సమయంలో అత్యున్నత స్థాయిలో శాంతియుత సంభాషణలు చేసినందుకు, ఉక్రెయిన్ ప్రజలకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సోమవారం నరేంద్రమోదీతో 35 నిమిషాల పాటు ఫోన్లో ఆయన మాట్లాడారు. అనంతరం ఆయనఅధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ►రష్యా-చైనా మధ్య స్నేహం ఇప్పటికీ చాలా ధృడంగా ఉన్నట్లు చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యూ సోమవారం స్పష్టం చేశారు. అవసరమైనప్పుడు ఇరు దేశాల శాంతి పునరుద్ధర కోసం మధ్యవర్తిత్వంపై పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అయితే ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నన నేపథ్యంలో చైనా మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదే విధంగా మానవతా సహాయాన్ని ఉక్రెయిన్కు అందిస్తున్నామని వాంగ్ తెలిపారు. ►ఉక్రెయిన్లో బాంబుల మోత మోగుతుంటే తన ప్రాణాలకు ఏమైనా ఫర్వాలేదు కానీ కొడుకు క్షేమంగా ఉండాలని రైలులో ఒంటరిగా పంపించింది ఓ తల్లి. తన 11 ఏళ్ల కొడుకుకి ధైర్యం చెప్పి..తినటానికి తిండి తాగటానికి నీళ్లు అన్నీ బ్యాగులో సర్ది.. చేతిపై ఫోన్ నెంబర్ రాసి ‘క్షేమంగా..జాగ్రత్తగా వెళ్లు నాన్నా’అంటూ కొడుకును పంపించింది. అమ్మ చెప్పిన మాటలు అన్ని శ్రద్ధగా విన్న ఆ పిల్లాడు బాంబులు, క్షిపణులు, తుపాకులు గర్జిస్తూ, ఆర్తనాదాలు వినిపించే యుద్ధ భూమిలో ఒంటరిగా 1,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి యుక్రెయిన్లోని జపోరిజియా ప్రాంతం నుంచి స్లొవేకియా దేశానికి చేరుకున్నాడు. పిల్లాడు సురక్షితంగా అనుకున్న గమ్యానికి చేరుకున్నాడని తెలిసిన ఆ తల్లి హాయిగా ఊపిరి పీల్చుకుంది. ► రష్యా మా బంధం బలంగానే ఉంది: చైనా రష్యా తమకు మిత్రదేశమని, బంధం ఇంకా బలంగానే ఉందని చైనా ప్రకటించుకంది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మరోసారి ‘అవసరమైతే ఉక్రెయిన్-రష్యా సంధిలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమ’ని స్పష్టమైన ప్రకటన చేశారు. ► ఆపరేషన్ గంగలో భాగంగా.. ఉక్రెయిన్లో చిక్కుకున్న విద్యార్థులు స్పెషల్ విమానాల్లో భారత్కు చేరుకుంటున్నారు. వీలైనంత త్వరగా ఈ ఆపరేషన్ ముగించాలని భారత్ భావిస్తోంది. #WATCH | Tears of joy and some sweets at Delhi airport, as a mother breaks down on seeing her daughter Saloni, who has arrived from war-torn #Ukraine "Can't be expressed in words how happy I feel to see my child back home with me," the mother said pic.twitter.com/V2xUzXgHLG — ANI (@ANI) March 7, 2022 ► రష్యాపై ఆంక్షలు మాత్రమే సరిపోవని, యుద్ధం ఆపేలా చేయడానికి తీవ్ర చర్యలకు దిగాల్సిందేనని పశ్చిమ దేశాలతో జెలెన్స్కీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ► రష్యా సెంట్రల్ బ్యాంక్తో లావాదేవీలను నిలిపివేసిన సౌత్ కొరియా. ► జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడిన మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోనులో మాట్లాడారు. వీరిద్దరి మధ్య దాదాపు 35 నిమిషాల పాటు సంభాషణ కొనసాగింది. ఉక్రెయిన్ నుంచి భారత పౌరుల తరలింపులో సాయం పట్ల జెలెన్ స్కీకి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికీ కొందరు భారత పౌరులు ఉక్రెయిన్లోనే ఉండడంతో భారత పౌరుల తరలింపులో నిరంతరం సహకారం ఉండాలని మోదీ కోరారు. ఉక్రెయిన్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మోదీకి జెలెన్ స్కీ వివరించారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య ప్రత్యక్ష చర్చలు జరుగుతోన్న తీరును మోదీ అభినందించారు. దౌత్య మార్గాల్లో సమస్యలను పరిష్కరించాలని ఆయన చెప్పారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ► మరోసారి కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా మరోసారి కాల్పుల విరమణ ప్రకటించింది. కీవ్, ఖార్కీవ్, మరియూపోల్, సుమీ నగరాల్లో మధ్యాహ్నం 12గంటల 30 నిమిషాల నుంచి కాల్పుల విరమణ మొదలవుతుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ విషయాన్ని పలు న్యూస్ ఏజెన్సీలు సైతం ధృవీకరించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్ వ్యక్తిగత రిక్వెస్ట్ మేరకు రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విరమణ ఎంత సేపు ఉంటుందనేది మాత్రం పేర్కొనలేదు. ఈ లోపు కారిడార్ల ద్వారా పౌరులను తరలించనున్నారు. ►ఉక్రెయిన్లోని క్రమాటోర్స్క్ నగరంలోని నివాస భవనాలపై రష్యా వాయుసేన సోమవారం క్షిపణి దాడి చేసింది.వాయుసేన జరిపిన దాడుల్లో ఇద్దరు పౌరులు మరణించారు. క్రమాటోర్స్క్ నగరంలోని నివాస భవనాలపై రష్యా క్రూయిజ్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు పౌరులు మరణించారని ఉక్రెయిన్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ తెలిపింది. Russian military declares ceasefire in Ukraine from 0700 GMT to open humanitarian corridors at French President Emmanuel Macron's request: Sputnik — ANI (@ANI) March 7, 2022 ఇంకోపక్క సుమీలో భారతీయ విద్యార్థుల తరలింపు కష్టతరంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మధ్యాహ్నాం ఫోన్లో సంప్రదించనున్నట్లు పీఎంవో వెల్లడించింది. ► ఖార్కివ్ మీదుగా ఎగురుతున్న రష్యన్ యుద్ధ విమానాన్ని కూల్చేశామని, ఈ ఘటనలో పైలట్ చనిపోయినట్టు ఖార్కివ్ రీజియన్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ వెల్లడించింది. కులినిచివ్ ప్రాంతంలో విమానం కూలిపోయినట్టు వివరించింది. పైలట్కు తప్పించుకునే సమయం కూడా లేకపోయిందని, ఘటనా స్థలంలోనే ఆయన చనిపోయారని పేర్కొంది. ► బాంబులతో దద్దరిల్లుతున్న మికోలాయివ్ పోర్టు నగరం మికోలాయివ్ బాంబులతో దద్దరిల్లుతోంది. ప్రధాన నగరాలకు వశపర్చుకునే క్రమంలో రష్యా బలగాలకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో దాడులు ఉదృతం చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ సైన్యానికి పిలుపు ఇచ్చాడు. Russian forces appear to have launched a heavy artillery barrage against Mykolaiv, a day after Ukrainian troops pushed them from the city and recaptured the airport. From my vantage, I could see flashes from the attack lighting up the night sky along a large swath of the city. pic.twitter.com/cm4E0cNtN3 — Michael Schwirtz (@mschwirtz) March 7, 2022 ► రష్యాపై ఆంక్షల పర్వం రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలు కొనసాగుతున్నాయి. అమెరికా, మిత్రపక్షాలు రష్యా ఆయిల్పైనా బ్యాన్ విధించే యోచనలో ఉన్నాయి. ► అంతర్జాతీయ న్యాయస్థానంలో.. మారణహోమం దావాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉక్రెయిన్ మరియు రష్యాలు తలపడనున్నాయి. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో జరుగుతున్న దారుణాల నేపథ్యంలోనే ప్రత్యేక మిలిటరీ చర్యలకు దిగినట్లు రష్యా.. ఆధారాల్లేకుండా ఆరోపణలపై ఉక్రెయిన్ పరస్పరం వాదించనున్నాయి. ► జెలెన్స్కీకి ప్రధాని మోదీ ఫోన్! ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించనున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో ఫోన్లో మాట్లాడుకోనున్న ఇరు దేశాల నేతలు. మరోసారి భారత్ సాయం కోరనున్న జెలెన్స్కీ. భారత విద్యార్థుల తరలింపుపైనే ప్రధానంగా ప్రధాని మోదీ ఆరా తీసే అవకాశం. PM Narendra Modi to speak to Ukrainian President Zelenskyy on the phone today: GoI sources (file photos) pic.twitter.com/PuWuCv2Fqw — ANI (@ANI) March 7, 2022 ► అత్యాధునిక ప్రపంచ చరిత్రలో అతిపెద్ద మానవ సంక్షోభంగా ఉకక్రెయిన్ యుద్ధం నిలిచిపోనుందనే ఆందోళన ఐరాస వ్యక్తం చేస్తోంది. సుమారు 70 లక్షల మంది ఉకక్రెయిన్ను వీడొచ్చని అంచనా వేస్తోంది. ► ఉక్రెయిన్ సంక్షోభ నేపథ్యంలో నేడు(సోమవారం).. ఐక్యరాజ్య సమితి భద్రతామండలి అత్యవసర సమావేశం నాటో ఎంట్రీ ► నాటో దళాల ఎంట్రీని ఖంచిస్తున్న రష్యా. ఇది తీవ్ర యుద్ధానికి దారితీస్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతిహెచ్చరిక. ► ఉక్రెయిన్కు మద్దతుగా రంగంలోకి దిగిన నాటో దేశాలు. జెలెన్స్కీ సాయం కోరిన తర్వాత అమెరికా చొవరతో నాటో దేశాల్లో కదలిక. రొమేనియాకు 40 వేల మంది సైనికులు. ఫ్రాన్స్ రాఫెల్ విమానాలు, 4 పైటర్జెట్లు. పోలాండ్కు చేరుకున్న బ్రిటన్ రాయల్ ఎయిర్ఫోర్స్. ► ఫలించిన జెలెన్స్కీ విజ్ఞప్తి. నాటోకు అమెరికా గ్రీన్ సిగ్నల్. పోలాండ్కు సాయం తరలింపు. ► యుద్ధంతో నన్ను చంపేస్తే.. ఉక్రెయిన్కు సాయం చేయాలని అమెరికాను కోరిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ► ఉక్రెయిన్పై రష్యా యుద్ధం12వ రోజూ కొనసాగుతోంది. మిస్సైల్స్తో రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. మికోలాయివ్ దగ్గర హోరాహోరీ పోరు. ► యుద్ధ భయంతో ఉక్రెయిన్ నుంచి 15 లక్షల మంది వలస వెళ్లిపోయారు: ఐరాస This horrific 500-kg Russian bomb fell on a residential building in Chernihiv and didn’t explode. Many other did, killing innocent men, women and children. Help us protect our people from Russian barbarians! Help us close the sky. Provide us with combat aircraft. Do something! pic.twitter.com/3Re0jlaKEL — Dmytro Kuleba (@DmytroKuleba) March 6, 2022 ► పౌరుల తరలింపునకు సహకరిస్తామని ప్రకటించిన రష్యా.. యుద్ధం ఆపట్లేదు. దీంతో ప్రధాన నగరాల నుంచి పౌరుల తరలింపు కష్టతరంగా మారింది ఉక్రెయిన్కు. ముఖ్యంగా మరియూపోల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఒకవైపు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతున్న రష్యా.. పవర్, వాటర్ను కట్ చేసి పడేసింది నగరానికి. ► రష్యా దాడులతో మధ్య ఉక్రెయిన్లోని విన్నిట్సియా ఎయిర్పోర్ట్ సర్వనాశనం అయ్యింది. ► ఉక్రెయిన్లోని పౌరులపై రష్యా బలగాలు దాడులకు పాల్పడుతున్నాయని అమెరికా భద్రత ప్రతినిధి ఆంటోనీ బ్లింకెన్ ఆరోపిస్తున్నారు. ► ఇర్పిన్ నగరాన్ని వీడాలని ప్రయత్నిస్తున్న పౌరులు.. రష్యా దాడుల భయంతో, సైనికుల తుపాకీ బెదిరింపులతో వెనక్కి మళ్లుతున్నారు. ► ఓటీటీ కంపెనీ నెట్ఫ్లిక్స్తో పాటు కేపీఎంజీ, పీడబ్ల్యూసీ లాంటి అకౌంటింగ్ సంస్థలు, అమెరికన్ ఎక్స్ప్రెస్ లాంటి ఫైనాన్షియల్ కంపెనీలు రష్యాతో పూర్తిగా సంబంధాలు తెంపేసుకున్నట్లు ప్రకటించాయి. ► ఉక్రెయిన్కు మద్ధతుగా రష్యాలో కొనసాగుతున్న నిరసనలు. 4,500 మంది నిరసనకారులను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ► అయితే సంధి లేకుంటే సమరం ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని ఉక్రెయిన్తో తేల్చి చెప్పారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. -
ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థుల కోసం సీఎం జగన్ ప్రత్యేక చర్చలు
-
భగభగమంటున్న బంగారం ధరలు! రష్యా యుద్ధం ఆగలేదంటే అంతే సంగతులు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం బంగారం ధరలపై పడింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. ఇదే యుద్ధం మరో 2-3 నెలలు కొనసాగితే బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో 10 గ్రాముల బంగారం రూ.56వేలు, గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 2100 డాలర్లకు చేరే అవకాశం ఉండనుంది. కిలో వెండి ధర రూ.80వేల నుంచి రూ.85వేలకు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,400 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,800గా ఉంది హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,400గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,800గా ఉంది. కేరళలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,400 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,800గా ఉంది. విశాఖపట్నంలో బంగారం ధరలు అదే ట్రెండ్ను అనుసరించి 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,400 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,800గా ఉంది. హైదరాబాద్, కేరళ, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ.73,400 ఉండగా బెంగుళూరులో వెండి ధరలు రూ.73,400గా ఉంది. చదవండి: అదిరిపోయే గాడ్జెట్, ఫోన్లో మీరు అరిచి గీపెట్టినా ఎవ్వరికి వినబడదు! -
పుతిన్కు ఎలన్ మస్క్ భారీ షాక్!
స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ రష్యాకు భారీ షాకిచ్చారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలస్కీతో మంతనాలు జరిపారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో జెలస్కీ..,ఎలన్ మస్క్కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. రష్యాతో యుద్ధం జరుగుతున్న ఈ క్లిష్ట సమయంలో జెలెన్ స్కీ..ఎలన్ మస్క్తో జూమ్ కాల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా జెలెన్ స్కీ తమదేశానికి రావాలంటూ ఎలన్ మస్క్ను ఆహ్వానించారు. దీంతో పాటు ఇతర అంశాలపై చర్చలు జరిపారు. ఈ సంభాషణల సమయంలో రష్యా వార్తా వనరులను నిరోధించాలని స్టార్లింక్ను కొన్ని ప్రభుత్వాలు (ఉక్రెయిన్ కాదు) కోరాయని ఎలన్ మస్క్ తెలిపారు. యుద్ధం తర్వాత మాట్లాడుతా! ఉక్రెయిన్ ప్రభుత్వం ఎలన్ అందిస్తున్న శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని వినియోగిస్తుంది. ఈనేపథ్యంలో ఇప్పటికే రష్యా దాడిలో ధ్వంసమైన ప్రాంతాల్లో స్పేస్ ఎక్స్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందుబాటులోకి తీసుకొని రావాలని కోరుతూ ఉక్రెయిన్ ప్రధాని మస్క్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. అంతేకాదు స్పేస్ ప్రాజెక్ట్ల గురించి ఎలన్ మస్క్తో చర్చించాను. ఆ చర్చలపై యుద్ధం తర్వాత మాట్లాడతానంటూ ట్వీట్లో పేర్కొన్నారు. Talked to @elonmusk. I’m grateful to him for supporting Ukraine with words and deeds. Next week we will receive another batch of Starlink systems for destroyed cities. Discussed possible space projects 🚀. But I’ll talk about this after the war. — Володимир Зеленський (@ZelenskyyUa) March 5, 2022 మండిపడుతున్న పుతిన్ మరోవైపు ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడిని ఎలన్ ఖండించకపోయినా.. ఉక్రెయిన్కు సహకరిస్తున్నారు. ఈ తాజా పరిణామాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్కు మింగుడు పడడం లేదని వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఉక్రెయిన్లో కమ్యూనికేషన్ వ్యవస్థ కోసం శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు జెలస్కీతో మస్క్ సంప్రదింపులు జరపడాన్ని రష్యా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. స్పేస్ ఎక్స్ శాటిలైట్ ఇంటర్నెట్తో పాటు ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లపై నిషేధం విధించింది. చదవండి: ఉక్రెయిన్ - రష్యా యుద్ధం: 'పుతిన్ను ఎలిమినేట్ చేయండి సార్'! -
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం: 'పుతిన్ను ఎలిమినేట్ చేయండి సార్'!
ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఈ యుద్ధంలో ప్రపంచ దేశాల పాలకులు లైట్ తిస్కున్నా..ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పోరాట పటిమను చూసి ప్రజలు ముచ్చట పడుతున్నారు. అందుకే రష్యాను తీరును తప్పుబడుతూ జెలెన్ స్కీకి మద్దతు పలుకుతున్నారు. పనిలో పనిగా టెస్లా అధినేత ఎలన్ మస్క్ను సైతం ఉక్రెయిన్కు సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఎలన్ మస్క్కు వరుస ట్వీట్లు చేస్తున్నారు. ముఖ్యంగా రష్యాలో టెస్లాతో పాటు ఇతర సంస్థల కార్యకాలాపాల్ని నిలిపివేయాలని కోరుతున్నారు. దయచేసి రష్యాలో అన్నింటిని డీయాక్టివేట్ చేయండి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ చేస్తున్న మారణం హోమం సరైంది కాదని మండిపడుతున్నారు. అయితే ఈ ట్వీట్లపై ఎలన్ మస్క్ స్పందించ లేదు. ఒకవేళ ఆయన రియాక్ట్ అయితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. Can you turn off @Tesla in Russia as a sort of tech embargo? — Fozzy Bear (@FozzyBearPDX) February 27, 2022 కాగా, ఎలన్ మస్క్ ఉక్రెయిన్ - రష్యా సంక్షోభంలో ప్రత్యక్షంగా కాక పోయినా పరోక్షంగా ఉక్రెయిన్ కోసం చేయాల్సిన వన్నీ చేస్తున్నారు. రష్యా దాడులు మొదలైన తర్వాత ఉక్రెయిన్లో కమ్యునికేషన్ వ్యవస్థ పూర్తిగా స్తంభించి పోయింది. కరెంటు, విద్యుత్ సరఫరా, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ సేవలు చిన్నాభిన్నమయ్యాయి. దీంతో ఉక్రెయిన్లకు అండగా ఎలన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందిస్తున్నారు. చాలా మంది ఈ ఇంటర్నెట్ ద్వారా సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ జాగ్రత్త పడుతున్నారు. చదవండి: ఉక్రెయిన్లో యుద్ధం, అండగా నిలుస్తున్న ఎలన్ మస్క్..ఎలా అంటే? -
రష్యా-ఉక్రెయిన్ డిజిటల్ వార్
మాస్కో/కీవ్: రష్యా నుంచి భీకరమైన దాడుల్ని అడ్డుకోవడానికి తమ ముందున్న అన్ని మార్గాలను ఉక్రెయిన్ పూర్తి స్థాయిలో వినియోగించుకుంటోంది. సైబర్ యుద్ధాన్ని ముమ్మరం చేసింది. ఆ దేశానికి చెందిన వందలాది మంది హ్యాకర్లు డిజిటిల్ యుద్ధం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. డిజిటల్ ఆర్మీగా ఏర్పాటై రష్యా దాడుల్ని నిలువరిస్తున్నారు. ‘‘మాది ఒక రకంగా సైన్యమే, స్వీయ నియంత్రణలో ఉన్న సైన్యం’’ అని డిజిటిల్ ఆర్మీ సభ్యుడైన 37 ఏళ్ల వయసున్న రోమన్ జఖరోవ్ చెప్పారు. వీరంతా రష్యాకు చెందిన వెబ్సైట్లను బ్లాక్ చేయడం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయకుండా అడ్డుకోవడమే కాకుండా రష్యా సైనికులు ఏయే ప్రాంతాల్లో ఉన్నారో గుర్తించి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. రష్యా దాడి చేస్తున్న ప్రాంతాల్లో క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించడానికి కావాల్సినన్నీ పంపడం వంటివన్నీ ఈ డిజిటల్ ఆర్మీ దగ్గరుండి చూస్తోంది. స్టాండ్ఫర్ఉక్రెయిన్ హ్యాష్ట్యాగ్తో సామాజిక మాధ్యమాల్లో అందరి మద్దతు కూడదీస్తోంది. డిజిటల్ ఆర్మీలో చేరడానికి ముందు జఖరోవ్ ఆటోమేషన్ స్టార్టప్ను నడిపేవారు. ఆయన కింద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మార్కెటింగ్ మేనేజర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, ఆన్లైన్ యాడ్ బయ్యర్లు పని చేస్తుంటారు. ఇప్పుడు వీరంతా సైబర్ యుద్ధంలో పాలుపంచుకుంటున్నారు. అంతేకాదు రష్యా చేసే సైబర్ దాడుల నుంచి ఆత్మ రక్షణగా తమ ఇంటర్నెట్ వ్యవస్థ కుప్పకూలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మీడియా నుంచి రైల్వేల వరకు... డిజిటల్ ఆర్మీలోని రోమన్ జఖరోవ్ బృందం ‘‘లిబరేటర్’’ అనే టూల్ని రూపొందించింది. ఈ టూల్ ద్వారా ప్రపంచంలో ఎక్కడ నుంచైనా రష్యా వెబ్సైట్లపై దాడులు చేయవచ్చు. సైబర్ దాడులకు లోనుకాకుండా రష్యా దగ్గర పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ మీడియా, బ్యాంకులు, టెలిఫోన్లు, రైల్వేలు చాలా రంగాలకు చెందిన వెబ్సైట్లలో మాల్వేర్ జొప్పించి కొద్ది సేపైనా నిలువరించడంలో ఉక్రెయిన్ డిజిటల్ ఆర్మీ విజయం సాధిస్తోందని సైబర్ సెక్యూరిటీ అధికారి విక్టర్ జోరా చెప్పారు. మరికొందరు ఐటీ నిపుణులు ఐటీ ఆర్మీ అన్న పేరుతో గ్రూప్గా ఏర్పడి సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. టెలిగ్రామ్లో 2,90,000 మంది ఫాలోవర్లు ఉన్న ఈ గ్రూపు ఐటీ రంగంలో నిపుణులైన ఉక్రెయిన్లు ఎక్కడ ఉన్నా తమకు సహకారం అందించాలని పిలుపునిస్తోంది. ఇది సరైన పనేనా? ఇప్పటికే యుద్ధంతో నలిగిపోతున్న ఉక్రెయిన్లో ఇలా ప్రతీ వ్యక్తి సైబర్ యుద్ధానికి దిగడంపై సొంతదేశంలోనే వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే పేరు చెప్పుకోవడానికి ఇష్టపడని ఒక ఉక్రెయిన్ సైబర్ సంస్థ రష్యా ఉపగ్రహాలను కూడా అడ్డుకున్నామని ప్రచారం చేస్తోంది. ఉపగ్రహాలపై కూడా కన్నేశామని చెప్పుకోవడం వల్ల ఉక్రెయిన్కి మరింత నష్టం జరుగుతుందని సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపగ్రహాలనే టార్గెట్ చేస్తే అంతరిక్ష యుద్ధానికి దారి తీస్తుందని, అదే అసలు సిసలు యుద్ధంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. అయితే అంతరిక్ష రంగంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలను తాము ప్రోత్సహించడం లేదని ఉక్రెయిన్ ప్రత్యేక కమ్యూనికేషన్ల సర్వీసులకు చెందిన డిప్యూటీ చైర్మన్ జోరా స్పష్టం చేశారు. యూరప్లో ఇంటర్నెట్ సేవలు బంద్ ఉక్రెయిన్ సైబర్ దాడులతో రైల్వే టికెట్ల బుకింగ్, బ్యాంకింగ్, టెలిఫోన్ల సేవలకు తరచూ అంతరాయం కలుగుతూ ఉండడంతో రష్యా కూడా తమ హ్యాకర్లని రంగంలోకి దింపింది. రష్యా హాకర్లు ఇ–మెయిల్స్ ద్వారా మాల్వేర్లు పంపించి ఇంటర్నెట్ వ్యవస్థని స్తంభింపజేస్తున్నారు. దీంతో శుక్రవారం నాడు యూరప్ వ్యాప్తంగా జర్మనీ, ఫ్రాన్స్, హంగేరి, గ్రీస్, ఇటలీ, పోలండ్ దేశాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో యూరప్ దేశాలు కూడా పలు ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. మానవీయ కోణంలో.. రెండు దేశాల మధ్య ఈ పోరులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అసలు విలన్ అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. రష్యా నెటిజన్లు చాలా మంది సామాజిక మాధ్యమాల వేదికగా ఉక్రెయిన్కి మద్దతు ప్రకటిస్తున్నారు. అధ్యక్షుడు పుతిన్కు మతి పోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. సాధారణ రష్యన్ల నుంచి మద్దతు రావడంతో ఉక్రెయిన్ డిజిటల్ ఆర్మీ వారి పట్ల మానవీయ కోణంతో స్పందిస్తోంది. ఉక్రెయిన్ వీధుల్లో తిరుగుతున్న సైనికులు క్షేమ సమాచారాల్ని రష్యాలో వారి తల్లిదండ్రులకు తెలిసేలా ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ రూపొందించారు. వారి వీడియోలు తీసి ఉంచడం, మరణించిన సైనికులు ఫొటోలు అప్లోడ్ చేయడం, యుద్ధం వద్దంటూ గ్రాఫికల్ డిజైన్స్ సందేశాలు రూపొందించి ప్రచారం చేయడం వంటివి చేస్తున్నారు. -
ఎట్టకేలకు రష్యా - ఉక్రెయిన్ యుద్ధానికి బ్రేక్
-
సీఎం జగన్ కు తల్లిదండ్రుల ధన్యవాదాలు
-
అలా చేస్తే మర్యాద దక్కదు.. ఉక్రెయిన్ కు రష్యా వార్నింగ్
-
పారిపోలేదు..ఇక్కడే ఉన్నా: ఉక్రెయిన్ అధ్యక్షుడు
యుద్ధంలో ఓటమి భయం, ప్రాణ భయంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ.. పోల్యాండ్కు పారిపోయాడంటూ కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో జెలెన్స్కీ ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించాడు. ‘నేను ఇక్కడే కివీలోనే ఉన్నా. ఇక్కడి నుంచే పని చేస్తున్నా. ఎవరూ ఎక్కడికీ పారిపోలేదు’ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. జెలెన్స్కీ ఉక్రెయిన్ వదిలి పారిపోయాడని, పోల్యాండ్లో తలదాచుకున్నాడని రష్యా స్పీకర్ వ్యాచెస్లావ్ వోలోదిన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశాడు. అతన్ని పట్టుకునేందుకు రష్యా బలగాలు ప్రయత్నించినా.. జాడ లేకుండా పోయాడని, బహుశా పోల్యాండ్లో జెలెన్స్కీ తలదాచుకుని ఉంటాడని వోలోదిన్ పేర్కొన్నాడు. అయితే.. View this post on Instagram A post shared by Володимир Зеленський (@zelenskiy_official) ఈ క్రమంలోనే పిరికిపంద అపవాదుపై జెలెన్స్కీ తీవ్రంగా స్పందించాడు. పిరికిపందను కాను.. ఎవరూ ఎక్కడికి పారిపోరు అని వీడియోలో పేర్కొన్నాడు. మరోవైపు రష్యా పరిణామాలపై అజ్ఞాతంలో ఉంటూనే జెలెన్స్కీ స్పందిస్తున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు, మీడియా ద్వారా పాశ్చాత్య దేశాలకు విజ్ఞప్తులు చేస్తున్నాడు. -
సైబర్ దాడుల కలకలం.. ఇంటర్నెట్ ఉన్నా ఉన్నట్లుండి ఆఫ్లైన్!
ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యంలో సైబర్ దాడుల కలకలం కొనసాగుతోంది. భారీగా బ్యాంకింగ్, ప్రభుత్వ ముఖ్యంగా రక్షణ వ్యవస్థకు సంబంధించిన వెబ్సైట్లపై పడుతున్నారు హ్యాకర్లు. ఈ నేపథ్యంలో.. శుక్రవారం యూరప్ వ్యాప్తంగా వేలమంది ఇంటర్నెట్ యూజర్లకు ఒక్కసారిగా ఆఫ్లైన్ షాక్ తగిలింది. యూరప్లో జర్మనీ, ఫ్రాన్స్, హంగేరీ, గ్రీస్, ఇటలీ, పోలాండ్ దేశాల్లోని తమ క్లయింట్లకు ఇంటర్నెట్ సేవలకు విఘాతం ఏర్పడిందని, ఈ మేరకు 40వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయని, ఇదేం సాంకేతిక సమస్యకాదని ఒక ప్రకటన విడుదల చేసింది శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కంపెనీ బిగ్బ్లూ. మరోవైపు ఆరెంజ్ కంపెనీ(నోర్డెంట్) కూడా 9వేల మంది ఫ్రాన్స్ సబ్స్క్రయిబర్లు ఇబ్బంది పడినట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. వీటితో పాటు మరో ఆరు ప్రధానమైన ఇంటర్నెట్ సేవల కంపెనీలు సైతం సేవలకు విఘాతం కలిగినట్లు ప్రకటన విడుదల చేశాయి. మరోవైపు బుధవారం కూడా ఇదే తరహాలో ఇబ్బందులు ఎదురయ్యాయని, ఇది కచ్చితంగా సైబర్ దాడులేనని యూఎస్కు చెందిన వయాశాట్ ప్రకటించింది. ప్రధానంగా హ్యాకర్లు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలపైనే దృష్టి సారిస్తుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇదిలా ఉండగా.. యుద్ధ పరిస్థితుల్లో ఉక్రెయిన్లో కొత్త డేటా-నాశన వైరస్ని సైబర్ సెక్యూరిటీ కంపెనీలు గుర్తించాయి. అయితే దీని వాస్తవ ప్రభావాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
ఒక్కసారిగా ఉక్రెయిన్ లో పరిస్థితులు దారుణంగా మారాయి
-
యుద్దానికి బ్రేక్ ఇచ్చిన రష్యా..
-
ఉక్రెయిన్లో యుద్ధ విరామం!
ఉక్రెయిన్లో కాల్పుల విరమణ ప్రకటించింది రష్యా. దీంతో యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్పడింది. భారత కాలమానం ప్రకారం.. ఈ ఉదయం 11.30 ని. నుంచి కాల్పులను ఆపేసింది. ఐదున్నర గంటలపాటు ఈ విరమణ ఉంటుందని రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్లో ఉన్న విదేశీయులను తరలించేందుకు ఈ విరామం ఇచ్చింది రష్యా. ఈ మేరకు విదేశీయుల తరలింపునకు సహకరిస్తామని యూఎన్హెచ్ఆర్సీకి రష్యా తెలిపింది. మరోవైపు ప్రపంచ దేశాల ఒత్తిడితోనే రష్యా ఈ యుద్ధ విరామ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పదవ రోజు శనివారం కూడా యుద్ధం మొదలై.. విరామంతో కాసేపు బ్రేక్ పడినట్లయ్యింది. ఈ లోపు విదేశీయులను తరలించే యోచనలో ఉంది ఉక్రెయిన్. -
నా బిడ్డ మొండిఘటం.. ఉక్రెయిన్ నుంచి క్షేమంగా వస్తాడు!: రజియా బేగం
‘‘ఉక్రెయిన్ దేశం యుద్ధంలో ఉందనే సంగతి మొదట నా బిడ్డే ఫోన్ చేసి నాకు చెప్పాడు. ఎప్పటికప్పుడు వాడు తన క్షేమసమాచారాలను అందిస్తున్నాడు. వీలైతే ఫోన్ చేస్తున్నాడు. లేదంటే మెసేజ్ చేస్తున్నాడు. నాకు గుండె ధైర్యం ఎక్కువ. నా బిడ్డ కూడా నాలాగే మొండి ఘటం. వాడు క్షేమంగా ఉక్రెయిన్ నుంచి తిరిగొస్తాడనే నమ్మకం ఉంది నాకు. కానీ, తల్లి ప్రేమ కదా. అందుకే అధికారుల సాయం కోరుతున్నా’’ అని చెబుతోంది యాభై ఏళ్ల టీచరమ్మ రజియా బేగమ్. అన్నట్లు ఈమె గురించి మీకు పరిచయం ఉందో లేదో.. ఈమె అప్పట్లో నేషనల్ ఫేమస్ అయ్యారు. సుమారు రెండేళ్ల కిందట కరోనా మొదలయ్యాక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి. ఆ సమయంలో ఎక్కడికక్కడే చిక్కుపోయి.. స్వస్థలాలకు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు చాలామంది. ఈ తరుణంలో నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి ఓ తల్లి తన బిడ్డ కోసం వందల కిలోమీటర్లు స్కూటీ మీద వెళ్లి.. సురక్షితంగా అతన్ని తెచ్చేసుకుంది(1400కి.మీ.పైనే). నెల్లూరులో చిక్కుకుపోయిన కొడుకు నిజాముద్దీన్ అమన్ను తీసుకొచ్చుకునేందుకు బోధన్ ఎస్పీ నుంచి పర్మిషన్ తీసుకుని మరి సాహసం చేసింది. కొడుకు కోసం తల్లి పడ్డ ఆరాటాన్ని పలువురు నెటిజన్లు ప్రశంసించారు. సాలంపాడ్ క్యాంప్ విలేజ్లో గవర్నమెంట్ టీచర్గా పని చేసే రజియాబేగం కథ అప్పుడు బాగా వైరల్ అయ్యింది. అయితే ఆ కొడుకు అమన్ ఇప్పుడు.. వేల కిలోమీటర్ల దూరంలో ఉక్రెయిన్ సంక్షోభంలో చిక్కుకుపోయాడు. అతను ఉంటున్న ప్రాంతంలో భారతీయుల తరలింపులో ఎలాంటి పురోగతి లేదని సమాచారం. రజియా భర్త 14 ఏళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూశాడు. అందుకే తన బిడ్డను డాక్టర్ కావాలని ఆమె కోరుకుంది. ఉక్రెయిన్ సుమీ స్టేట్ యూనివర్సిటీలో చేర్పించింది. సుమారు 50 దేశాల నుంచి రెండు వేల మంది దాకా విద్యార్థులు చదువుతున్నారు ఇక్కడ. మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతున్న అమన్. ఉక్రెయిన్ యుద్ధ వాతావరణంలో ఓ బంకర్లో అతను ఆశ్రయం పొందుతున్నాడు. అయితే అతను ఉంటున్న ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన బిడ్డ మాత్రమే కాదు.. తన బిడ్డల్లాంటి వాళ్లందరినీ వీలైనంత త్వరగా ఇక్కడకు రప్పించే విధంగా చర్యలు చేపట్టాలని కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను రజియాబేగం కోరుతున్నారు. ఇప్పటికే ఆమె నిజామాబాద్ కలెక్టర్కు లేఖ కూడా రాశారు. -
గ్యాస్ క్వీన్ ఉంటే...యుద్ధమే వచ్చేది కాదు!
ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఉక్రెయిన్ – రష్యా యుద్ధం వైపు ఆసక్తిగా చూస్తోంది. ఉక్రెయిన్ సంక్షోభం రోజురోజుకీ తీవ్రంగా మారి అణు ఆయుధాలు వాడే దిశగా అడుగులు పడుతున్నాయి. ఉక్రెయిన్ సైన్యంతోపాటు అక్కడి పౌరులు సైతం రంగంలో దిగి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడుతున్నారు. కానీ మరికొద్ది గంటల్లోనో, రోజుల్లోనో ఉక్రెయిన్ రష్యా కబంధ హస్తాల్లోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో ‘యులియా టిమోషెంకో ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని గుర్తు చేసుకుంటున్నారు అక్కడి ప్రజలు. గ్యాస్ క్వీన్ గా పాపులర్ అయిన యులియా మరెవరో కాదు ఉక్రెయిన్ కు తొలి మహిళా ప్రధాని. రష్యా నిర్ణయాలకు తాము వ్యతిరేకమని బహిరంగంగానే చెప్పే తెగువ ఆమెది. పశ్చిమ దేశాలతో మంచి దౌత్య సంబంధాలను కొనసాగిస్తూ నాటోలో ఉక్రెయిన్ ను చేర్చేందుకు ప్రయత్నించింది. యులియా ప్రభుత్వం ఉన్నంత కాలం.. ఉక్రెయిన్ కు రష్యా కనీసం యుద్ధ భయాన్ని కూడా కలిగించలేక పోయింది. అందుకే అంతా యులియాను తలచుకుంటున్నారు. ఉక్రెయిన్ తొలి మహిళా ప్రధానిగా పని చేసిన యులియా 1960 నవంబర్ 27న అప్పటి యూఎస్ఎస్ఆర్ ఉక్రెయిన్ లో జన్మించింది. ఎకనామిక్స్– సైబర్నెటిక్స్ డిగ్రీని డిస్టింక్షన్ లో పూర్తిచేసింది. డిగ్రీ అయ్యాక లెనిన్ కంపెనీలో ఇంజినీర్–ఎకనమిస్ట్గా చేరింది. తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదుగుతూ యూత్ సెంటర్ టెర్మినల్కు కమర్షియల్ డైరెక్టర్గా పనిచేసింది. ఆ తరువాత ఉక్రెయిన్ యునైటెడ్ ఎనర్జీ సిస్టమ్స్ స్థాపించి దేశంలో అనేక పరిశ్రమలకు గ్యాస్ను సరఫరా చేసింది. దీనిద్వారా దేశంలోని ధనవంతుల జాబితాలో ఒకటిగా నిలిచింది. యునైటెడ్ ఎనర్జీని విజయవంతంగా నడిపించడంతో అంతా యులియాను ‘ద గ్యాస్ ప్రిన్సెస్’ అని, గ్యాస్ క్వీన్ అనీ పిలిచేవారు. ఆరెంజ్ రివల్యూషన్ మహిళా వ్యాపార వేత్తగా నిరూపించుకున్న తరువాత రాజకీయాల్లో అడుగుపెట్టింది యులియా. రాజకీయాల్లోనూ తన ముద్రవేస్తూ ఒక్కో పదవిని అలంకరిస్తూ దేశానికి తొలి మహిళా ప్రధాని అయ్యింది. 2004లో రష్యాకు అనుకూలుడైన విక్టర్ యుష్నకోవ్ 2004 ఎన్నికలలో గెలిచినప్పుడు ఆయన గెలుపుని యులియా వ్యతిరేకించింది. రిగ్గింగ్ చేసి గెలిచారని ఆరోపిస్తూ ‘ఆరెంజ్ రివల్యూషన్ ’ను తీసుకొచ్చింది. విక్టర్ పదవి నుంచి తప్పుకోవాలని ఆరెంజ్ ఉద్యమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీనికి భారీఎత్తున మద్దతు లభించింది. ఆరెంజ్ రివల్యూషన్ విజయవంతం కావడంతో యులియా దేశానికి ప్రధాని అయింది. 2005లో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు తొలి మహిళా ప్రధానిగా, 2007 డిసెంబర్ నుంచి 2010 మార్చి వరకు రెండోసారి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించింది. అంగుళం కూడా ఆక్రమించలేరు! తన హయాంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది యులియా. ముఖ్యంగా జీతాలు పెంచడం, యుటిలిటీ టారిఫ్లు తగ్గించడం వంటి వినూత్న నిర్ణయాలు ఉక్రేనియన్లను ఎంతగానో ఆకర్షించాయి. అంతేగా ‘మా మాతృభూమిని మీకు అప్పగించడానికి మేము సిద్ధంగా లేము’ అని అనేకసార్లు బహిరంగంగానే స్పష్టం చేసింది. అంగుళం భూమిని కూడా ఆక్రమించలేరని రష్యాకు సవాళ్లు విసిరేది. రెండోసారి ప్రధాని అయినప్పుడు గ్యాస్ ఒప్పందం విషయంలో చర్చలు సఫలం కాకపోవడంతో రష్యా గ్యాస్ సరఫరాను నిలిపివేసింది. ఈ సమయంలో యులియా రష్యాను తెలివిగా ఒప్పించి గ్యాస్ సరఫరాను పునరుద్ధరించింది. అందుకే ఇప్పుడంతా ఆమె నాయకత్వంలో దేశం ఉండి ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కావని వాపోతున్నారు. ఆరుసార్లు పార్లమెంట్కు ఎంపికై, రెండుసార్లు ప్రధానిగా తనదైన ముద్ర వేసిన యులియా ఇరవై ఏళ్లకుపైగా రాజకీయాల్లో చురుకుగా ఉంటూ దేశం కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. -
దేశం విడిచి వెళ్లిన ఉక్రెయిన్ అద్యక్షుడు జెలెన్స్కీ?
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ శుక్రవారం దేశం విడిచి వెళ్లినట్లు రష్యా పేర్కొంది. ఉక్రెయిన్ వీడి ప్రస్తుతం పోలాండ్లో ఉన్నారని రష్యా మీడియా తెలిపింది. అయితే ఇంతకముందు కూడా జెలెన్స్కీ దేశం విడిచిపెట్టినట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ ఆ వార్తలను ఉక్రెయిన్ అధ్యక్షుడు కొట్టిపారేశారు. తాను రాజధాని కీవ్లోనే ఉన్నట్లు అనేక వీడియోలతో స్పష్టం చేశారు. మరీ ప్రస్తుత వార్తలు ఎంత వరకు నిజమో తేలాల్సి ఉంది. కాగా ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని అంతమొందించే దిశగా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి వారం రోజుల్లోనే జెలెన్స్కీ హత్యకు మూడుసార్లు ప్రయత్నం జరిగినట్లు అంతర్జాతీయ వీడియో పేర్కొంది. అయితే ముందే అప్రమత్తమవ్వడం వల్ల ఉక్రెయిన్ భద్రతా దళాలు కుట్రలను భగ్నం చేసినట్లు తెలిపింది. చదవండి: ‘నేనేమీ కొరకను.. ఎందుకు భయం’.. పుతిన్కు జెలెన్స్కీ చురకలు కాగా జెలెన్స్కీ భద్రతా విషయంలో ఇప్పటికే పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. . దేశం విడిచి వచ్చేయండి, రక్షణ కల్పిస్తామని అగ్రరాజ్యాలు ఆహ్వానం అందించినా కాదన్నారు. ఈ క్రమంలోనే దేశం విడిచి రావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడికి అమెరికా పిలుపునిచ్చిన్పటికీ జెలెన్స్కీ తిరస్కరించారు. యుద్ధ భూమిలోనే పూర్తి స్థాయి సైనికుడిగా మారిపోయారు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడికి రక్షణ కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఫ్రాన్స్ దేశం కూడా ప్రకటించింది. చదవండి: రష్యా విధ్వంసం.. మూడో విడత చర్యలకు ఉక్రెయిన్ యత్నం! -
‘నేనేమీ కొరకను.. ఎందుకు భయం’.. పుతిన్కు జెలెన్స్కీ చురకలు
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం రోజురోజుకీ ఉగ్రరూపు దాలుస్తోంది. దేశంలోని పలు నగరాలపై రష్యా సైన్యం కనీవినీ ఎరుగని రీతిలో విరుచుకుపడుతోంది. పెద్దపెట్టున బాంబులు, క్షిపణి దాడులతో హడలెత్తిస్తోంది. రాజధాని కీవ్పై బాంబుల వర్షమే కురిపిస్తోంది. ఎక్కడ చూసినా చెలరేగుతున్న మంటలతో నగరం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. ఉక్రెయిన్లో యుద్ధం మొదలై 9 రోజులు అవుతున్నప్పటికీ ఇంకా చల్లారడం లేదు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధంలో సైన్యంతో పాటు, సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనతో నేరుగా కలిసి చర్చలు జరపాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పిలుపునిచ్చారు. అప్పుడే ఈ యుద్ధం ఆగిపోవడానికి మార్గం దొరుకుతుందని జెలెన్స్కీఅభిప్రాయపడ్డారు. ఆ సందర్భంగా పుతిన్ను ఉద్దేశించి జెలెన్స్కీ చెణుకులు విసిరారు. చదవండి: రష్యాకు లొంగిపోయిన తొలి ఉక్రెయిన్ నగరం మీడియా కాన్ఫరెన్స్లో జెలెన్స్కీ మాట్లాడుతూ.. ‘‘మనిద్దరం కలిసి అన్ని విషయాలూ ఫేస్ టు ఫేస్ చర్చించుకుందాం. అయితే, పరస్పరం 30 మీటర్ల దూరంలో కూర్చుని మాత్రం కాదు. నేనేమీ కొరకను. మరింకెందుకు భయం?’’ అని కామెంట్ చేశారు. అయితే ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో పుతిన్ చర్చల సందర్భంగా ఇద్దరూ పొడవైన టేబుల్కు చెరోవైపున కూర్చోవడాన్ని ఉద్దేశించి ఆయన ఇలా చురకలు వేశారు. అయితే రష్యా, ఉక్రెయిన్ దేశాల ప్రతినిధులు బెలారస్ సరిహద్దుల్లో రెండోసారి చర్చలు కొనసాగిస్తున్న తరుణంలో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: Viral Video: ‘మోదీ జీ ప్లీజ్ సాయం చేయండి.. ఇక్కడే ఉంటే చచ్చిపోతాం’ -
Viral Video: ‘మోదీ జీ ప్లీజ్ సాయం చేయండి.. ఇక్కడే ఉంటే చచ్చిపోతాం’
ఉక్రెయిన్పై రష్యా సైనిక బలగాల దండయాత్ర కొనసాగుతోంది. ఫిబ్రవరి 24న మొదలైన రెండు దేశాల మధ్య యుద్దం తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలను మెల్లమెల్లగా రష్యా తన గుప్పిట్లోకి తెచ్చుకుంటుంది. అయితే బాంబుల వర్షం, మిస్సైల్స్ దాడులతో విరుచుకుపడుతున్న రష్యాపై ఉక్రెయిన్ సైన్యం శక్తికి మించి పోరాడుతోంది. రష్యా బలగాలను అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఉక్రెయిన్-రష్యా మధ్య భీకర యుద్ధం నేపథ్యంలో లక్షలాది మంది అండర్ గ్రౌండ్, మెట్రో స్టేషన్లు, బంకర్లలో తలదాచుకుంటున్నారు. యుద్ధ తీవ్రతతో ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయలను స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆపరేషన్ గంగా కార్యక్రమం ద్వారా ఇప్పటికే వేలాది మందిని సురక్షితంగా భారత్కు తీసుకురాగా.. ఇప్పటికీ చాలా మంది ఉక్రెయిన్లో చిక్కుకుపోయారు. వీరంతా తినడానికి తిండి, ఉండటానికి స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఉక్రెయిన్లో ఇరుక్కుపోయిన కొంతమంది తాము ఎదుర్కొంటున్న సమస్యలను సోషల్ ద్వారా తెలియజేస్తున్నారు. ఉక్రెయిన్ సంక్షోభం రోజురోజుకూ ముదురుతున్న నేపథ్యంలో ఈశాన్య నగరమైన సుమీ స్టేట్ యూనివర్సిటీలో చిక్కుకున్న కొంతమంది విద్యార్ధులు తమను రక్షించాలంటూ విజ్జప్తి చేస్తున్నారు. వందలాది మంది ఒకచోట గ్రూప్లా ఏర్పడి తమకు తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, కరెంట్ కూడా లేదని విద్యార్థులు వాపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. చదవండి: ఉక్రెయిన్ యుద్ధం: ప్రపంచంలోనే అతిపెద్ద విమానాన్ని ధ్వంసం చేసిన రష్యా ఇందులో ఓ విద్యార్ధి మాట్లాడుతూ.. ‘మేము ఇక్కడ హాస్టల్స్లో 900 మంది వరకు ఉన్నాం. ఇక్కడ కరెంట్ లేదు. మైనస్ డిగ్రీల చలి ఉంది. తినడానికి తిండి లేదు. తాగడానికి, కనీసం బాత్రూమ్కు కూడా నీళ్లు లేవు. నిన్న రాత్రి తిన్నాం. ఇప్పటి వరకు ఏం తినలేదు. ఖార్కీవ్ వెళ్లడానికి మాకు 4,5 గంటల సమయం పడుతుంది. మళ్లీ ఖార్కివ్ నుంచి హంగేరి సరిహద్దు వరకు వెయ్యి కిలోమీటర్లు ఉంది. అక్కడికి వెళ్లేందుకు మాకు ఎలాంటి ప్రయాణ సౌకర్యాలు లేవు. చదవండి: Volodymyr Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడిపై మూడుసార్లు హత్యాయత్నం.. #UkraineRussiaWar | "We will be killed if not evacuated soon": SOS from Indian Students at Sumy State University pic.twitter.com/4rCd37eMME — NDTV (@ndtv) March 4, 2022 ఎప్పటి నుంచో మోదీ ప్రభుత్వం మమ్మల్ని రక్షిస్తుందని చూస్తున్నాం. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పటికైనా మమ్మల్ని రక్షించాలని మోదీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మోదీ జీ మమ్మల్ని ఇక్కడినుంచి బయట పడేయండి. మాకు సాయం చేయండి. లేదంటే మేము ఇక్కడే చచ్చిపోతాం’ అంటూ వేడుకున్నారు. దీనిని చూసిన నెటిజన్లు ఈ వీడియో ఉక్రెయిన్లో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులకు అద్దం పడుతోందని, వెంటనే వీరికి కేంద్రం సాయం చేయాలని కామెంట్ చేస్తున్నారు. -
ఉక్రెయిన్ అధ్యక్షుడిపై మూడుసార్లు హత్యాయత్నం.. స్కెచ్ వేసింది ఎవరంటే!
గత తొమ్మిది రోజులుగా ఉక్రెయిన్పై రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. రష్యా దాడిలో ఉక్రెయిన్కు తీవ్ర నష్టం జరుగుతున్నా వెనకడుగు వేయకుండా అంతే స్థాయిలో ప్రతి దాడి చేస్తోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీపై మూడుసార్లు హత్యాయత్నం జరిగినట్లు అంతర్జాతీయ మీడియా ప్రకటించింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి గత వారం రోజుల్లో జెలెన్స్కీపై మూడు హత్యాయత్నాలు జరిగాయని, వీటన్నింటిని ఉక్రెయిన్ భద్రతా దళం తిప్పికొట్టిన్నట్లు వెల్లడించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని అంతమొందించేందుకు రెండు వేరు వేరు గ్రూప్లు(వాగ్నర్ గ్రూప్, చెచెన్ తిరుగుబాటు దారులు) ప్లాన్ చేసినట్లు పేర్కొంది. అయితే జెలెన్స్కీని చంపడానికి కదిరోవ్ దళం.. చెచెన్యా హంతక ముఠాను రంగంలోకి దిగినట్లు రష్యాకు చెందిన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్బీ) అప్రమత్తం చేయడంతో హత్యాయత్నాన్ని తిప్పి కొట్టగలిగామని ఉక్రెయిన్ జాతీయ భద్రత, రక్షణ మండలి కార్యదర్శి డేనిలోవ్ తెలిపారు. చెచెన్యా నాయకుడు కదిరోవ్ దళంపై ముందుగానే నిఘా పెట్టడం వల్ల ప్రత్యేక ఆపరేషన్ ద్వారా హంతక ముఠాను మట్టుబెట్టామని పేర్కొన్నారు. చదవండి: అదే గనుక పేలితే ఐరోపా అంతమే: జెలెన్ స్కీ అలాగే ఉక్రెయిన్ రాజధాని కైవ్ శివార్లలో శనివారం చెచెన్ ప్రత్యేక దళాలు హతమయ్యాయని ఆయన తెలిపారు. కాగా ఇప్పటి వరకు రష్యా సైన్యం ఉక్రెయిన్లో 1,500 కంటే ఎక్కువ సైనిక సౌకర్యాలను ధ్వంసం చేసింది. అంతేగాక 58 విమానాలు, 46 డ్రోన్లు, 472 ట్యాంకులతోపాటు ఇతర సాయుధ వాహనాలు ధ్వంసమయ్యాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇగోర్ కొనాషెంకోవ్ కోనాషెంకోవ్ తెలిపారు చదవండి: రష్యా మొండితనం.. సర్వనాశనానికి సెకన్లు చాలు! -
రష్యా మొండితనం.. సర్వనాశనానికి సెకన్లు చాలు!
న్యూక్లియర్ ప్లాంట్లను యుద్ధంలో భాగం చేయకూడదు. అవి యుద్ధ స్థావరాలు కాకూడదు. ఉక్రెయిన్ జాపోరిజ్జియా అణు కేంద్రంపై రష్యా దాడుల నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఈ మాట చెప్తోంది. నిజానికి ఇదేం కొత్త మాట కాదు. అలాగే అదొక హెచ్చరిక. ఈ యుద్ధంలో యూరప్లోని అతిపెద్ద అణు రియాక్టర్ గనుక పేలితే?.. యూరప్ మొత్తం తుడిచిపెట్టుకుని పోతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది ఇప్పుడు. శాంపిల్గా.. చెర్నోబిల్ విషాదాన్నే ప్రస్తావిస్తున్నారు. సుమారు 36 ఏళ్ల కిందట(ఏప్రిల్ 26, 1986).. ఒక రాత్రి. చిన్నతప్పిదం, ఏమరపాటుతో వ్యవహరించిన తీరు.. సెకన్ల వ్యవధిలోనే అత్యంత విషాదకరమైన విధ్వంసం చోటు చేసుకుంది. అణు విద్యుత్ కేంద్రం భద్రతను పరీక్షిస్తున్న సమయంలో.. కరెంట్ సరఫరా ఆపేస్తే ఎలా ఉంటుందనే కోణంలో ప్రయోగాలు చేపట్టారు ఇంజినీర్లు. అయితే అప్పటికే అక్కడ చిన్న సమస్య ఉందని గుర్తించలేకపోయారు. నాలుగో నెంబర్ అణు రియాక్టర్లో కూలింగ్ వాటర్ సరఫరా ఆగిపోయి.. ఆవిరి ఒత్తిడి కారణంగా భారీ పేలుడు సంభవించింది. ఆ దెబ్బకు రియాక్టర్ మూత ఊడిపోయి అందులోంచి ‘కోర్’ బయటకు లీక్ అయ్యింది. చరిత్రలోనే అతిపెద్ద అణు ప్రమాదం.. పెనువిషాదం చోటు చేసుకుంది. ఘటనలో చెలరేగిన మంటలు పదిరోజుల పాటు మండుతూనే ఉన్నాయి. చెర్నోబిల్ ప్రమాదం జరిగిన టైంలో.. అక్కడికక్కడే చనిపోయింది ఇద్దరే. అటుపై రేడియేషన్ ఎఫెక్ట్తో 134 మంది అస్వతస్థకు గురయ్యారు. అందులో 28 మంది కొన్ని నెలలకు, మరికొందరు ఆ తర్వాత చనిపోయారు. కానీ, ఆ ప్రభావం ఏళ్ల తరబడి కొనసాగుతూనే వస్తోంది. ఎంతలా అంటే క్యాన్సర్, చర్మ.. గొంతు సంబంధిత వ్యాధులు, ఇతర దీర్ఘకాలిక రోగాలతో సుమారు 2 లక్షల మందికిపైగా చనిపోయారని ఒక అంచనా. ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని చెర్నోబిల్ ప్రమాదంపై పరిశోధనలు చేసిన రీసెర్చలు చెప్తుంటారు. విశేషం ఏంటంటే.. ఆ విషాదం తాలుకా జ్ఞాపకాలు మోస్తూ ఇంకా మంచానికే పరిమితమైన వాళ్లూ ఉన్నారు. బతకడం కష్టమే! చెర్నోబిల్ దుర్ఘటనలో విడుదలైన రేడియో ధార్మికత ప్రభావం కొన్ని వేల కిలోమీటర్లకు విస్తరించింది. హిరోషిమా, నాగసాకిల అణు బాంబు పేలుళ్ల కంటే ఎన్నో రెట్ల రేడియో ధార్మికతను విరజిమ్మింది. సుమారు పదమూడు దేశాలకు రేడియేషన్(ఇందులో రష్యా కూడా ఉంది) విస్తరించింది. ఈ ప్రాంతానికి దూరంగా లక్షల మందిని తరలించి.. నిషేధిత ప్రాంతంగా ప్రకటించారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. పదుల కిలోమీటర్ల పరిధిలో గట్టి కాపలా ఉంటుంది. చెర్నోబిల్ దుర్ఘటన జరిగి ఇన్నేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ నివాస యోగ్యం కాదు. సాగు కూడా నిషేధం. అక్కడ కాసే పండ్లలో, పూసే పువ్వుల్లోనూ రేడియేషన్ ఎఫెక్ట్ కనిపిస్తుంటుంది. రేడియేషన్ను తట్టుకోలుగుతున్న కొన్ని జంతువులు మాత్రమే బతకగలుగుతున్నాయి. సోవియట్ యూనియన్లో అంతర్భాగంగా ఉన్న టైంలో జరిగిన ఈ అణు దుర్ఘటన.. ఇప్పటికీ ప్రభావం చూపెడుతోంది. అందుకే ఇక్కడ రోబోలతో అణువ్యర్థాలకు గోరీ కడుతున్నారు. నిషేధిత ప్రాంతం కాబట్టే.. ఇక్కడ ఒక అణు ఇంధన నిల్వ కేంద్రాన్ని నిర్మించాలని ఉక్రెయిన్ ప్రభుత్వం అనుకుంది. కానీ, యుద్ధ పరిణామాలతో అది రష్యా చేతికి వెళ్లింది. రష్యా ఆక్రమణలో భాగంగా పట్టణాల కంటే ముందుగా చెర్నోబిల్నే ఆక్రమించుకుంది రష్యా. ఆ టైంలో రష్యా అణు యుద్ధానికి దిగుతుందేమో అనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తం అయ్యింది. కావాలనే రష్యా.. రష్యా యుద్ధ ట్యాంకులకు థర్మల్ ఇమేజ్ స్కానర్లున్నాయి. దేనిపై షూట్ చేస్తున్నారో రష్యా సైనికులకు పక్కాగా తెలుసు. కాబట్టి జాపోరిజ్జియా Nuclear Plantపై జరిగిన దాడి ప్రమాదవశాత్తూ జరిగింది కాదనేది ఉక్రెయిన్ అధ్యక్షుడి ఆరోపణ. ఒకవేళ ఈ దాడి కావాలనే జరిగినా.. జరిగే నష్టం ఏ రేంజ్లో ఉంటుందో పుతిన్కి తెలుసు. ఎందుకంటే చెర్నోబిల్ పరిణామాలను ఆయన దగ్గరుండి చూశాడు.. ఆ ప్రభావానికి గురైన జాబితాలో రష్యా కూడా ఉంది కాబట్టి. అయినా కూడా అణు బూచితో ఉక్రెయిన్ ఆక్రమణలో ముందుకెళ్లాలని చూస్తోంది. ఉక్రెయిన్ను.. మద్ధతుగా వచ్చే దేశాన్ని అణ్వాస్త్ర దాడులతో బూడిద చేస్తామంటూ హెచ్చరిస్తున్నాడు పుతిన్. ఇందులో భాగంగానే ఒకవైపు ప్రధాన నగరాల ఆక్రమణ.. మరోవైపు ఉక్రెయిన్లో ఉన్న 15 న్యూక్లియర్ రియాక్టర్ల స్వాధీనం కొనసాగిస్తోంది రష్యా. శుక్రవారం రష్యా బలగాలు దాడి చేసింది, స్వాధీనం చేసుకుంది.. అలాంటి ఇలాంటి రియాక్టర్పైన కాదు. యూరప్లోనే అతిపెద్ద అణు రియాక్టర్ జాపోరిజ్జియా. జరగరానిది ఏదైనా జరిగితే ఆ విధ్వంసం ఊహించడమే కష్టం. ఎందుకంటే చెర్నోబిల్తో పోలిస్తే కొన్ని రెట్లకు పైగా నష్టం వాటిల్లుతుంది. ఉక్రెయిన్ సహా యూరప్ దేశాలు చాలామట్టుకు నామ రూపాలు లేకుండా పోవచ్చు. ఆఖరికి రష్యా కూడా ఆ ప్రతిఫలం అనుభవించాల్సిందే. జాపోరిజ్జియా న్యూక్లియర్ ప్లాంట్లోని ఆరు రియాక్టర్లలో ఒకదానికి మంటలు అంటుకున్నాయి. అదృష్టవశాత్తూ అది రిన్నోవేషన్లో ఉంది. ఆపరేటింగ్లో లేదు. అయితే అందులో అణు ఇంధనం మాత్రం ఉంది. ఆ ఇంధనం కూడా రష్యా నుంచే వచ్చింది. మంటలు అంటుకున్నాక ఆర్పడానికి రష్యా దళాలు ఫైర్ సిబ్బందిని అనుమతించలేదు. దీంతో కాసేపు అక్కడ టెన్షన్ నెలకొంది. ఆపై సిబ్బంది అనుమతించడంతో సమయానికి మంటలు ఆపేశారు. ఘోర ముప్పు తప్పింది. అక్కడి వాతావరణంలో రేడియేషన్ లెవల్ కూడా మారలేదు. పుతిన్ ‘అణు దాడి’ హెచ్చరికల వరకు పరిమితం అయితే పర్వాలేదు. చెర్నోబిల్లో జరిగిన ఒక చిన్నతప్పిదానికే ఎఫెక్ట్ ఈ రేంజ్లో ఉంటే.. కావాలని దాడి చేసి విధ్వంసం సృష్టిస్తే.. ఆ ప్రభావం ఇంకా ఏ రేంజ్లో ఊహించడమే భయంకరంగా ఉంది. ::: సాక్షి, వెబ్ ప్రత్యేకం -
తట్టుకుని నిలబడతాం!... ఉక్రెయిన్ని పునర్నిర్మిస్తాం
Ukraine President Zelensky Vows To Rebuild Ukraine: తమ దేశం ప్రపంచ యుద్ధాలను, కరువులను, జనహననాన్ని తట్టుకొని నిలబడిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గుర్తు చేశారు. తాజా సంక్షోభాన్ని కూడా తట్టుకొని నిలబడతామని, యుద్ధానంతరం తిరిగి దేశాన్ని పునర్నిర్మించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. యుద్ధ భయాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న దేశçస్తులకు ఆయన ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఉక్రెయిన్కు జరిగిన నష్టాన్ని రష్యా భర్తీ చేయాల్సిఉంటుందని హెచ్చరించారు. ‘రెండు ప్రపంచ యుద్ధాలు, మూడుసార్లు కరువు, జనహననం, చెర్నోబిల్ విస్ఫోటనం, క్రిమియాపై దురాక్రమణను తట్టుకొని నిలిచాం. యుద్ధానంతరం దేశంలోని ప్రతి ఇల్లు, వీధి, నగరాన్ని పునరుద్ధరిస్తాం.’ అని చెప్పారు. రష్యా తమని నాశనం చేయడానికి చాలాసార్లు ప్రయత్నించి విఫలమైందన్నారు. ఇలాంటి సంక్షోభాలు చాలా చూశామని, ప్రస్తుత యుద్ధం చూసి ఉక్రేనియన్లు భయపడుతున్నారు, కుంగిపోయారు, లొంగిపోతున్నారు అని ఎవరైనా భావిస్తే వారికి తమ గురించి ఏమీ తెలియదని అర్థమని జెలెన్స్కీ చెప్పారు. ఉక్రెయిన్ గురించి పుతిన్కు ఏమీ తెలియదన్నారు. రష్యా దాడిలో ఇంతవరకు దాదాపు 2వేల మంది పౌరులు మరణించినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. గతంలో కూడా పలుమార్లు స్వదేశీయులకు జెలెన్స్కీ ధైర్యం చెప్పారు. ఉక్రేనియన్లను ఎవరూ జయించలేరన్నారు. (చదవండి: రష్యా నేరాలపై ఐసీసీలో విచారణ) -
అగ్నికీలల్లో ఉక్రెయిన్ అణుప్లాంట్.. పేలితే పెనువిషాదమే!
రష్యా వైమానిక దాడుల్లో యూరప్లోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ జాపోరిజ్జియా అగ్నికీలల్లో చిక్కుకుంది. ఈ విషయాన్ని శుక్రవారం ఉదయం ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా అధికారికంగా ప్రకటించారు. ఉక్రెయిన్కు ఆగ్నేయం వైపు నైపర్ నదీ తీరాన ఉంది జాపోరిజ్జియా పారిశ్రామిక నగరం. ఇక్కడే యూరప్లోనే అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ను నెలకొల్పారు. భారత కాలమానం ప్రకారం.. గురువారం అర్ధరాత్రి దాటాక రష్యా దళాలు ఈ ప్లాంట్పై రాకెట్ లాంఛర్లతో దాడికి తెగబడ్డాయి. నలువైపులా దాడులు చేయడంతో.. ప్లాంట్ మంటల్లో చిక్కుకుంది. Russian RPG attack on #Zaporizhzhia nuclear power plant #UkraineRussianWar #Ukriane ⚠️⚠️🚨🚨⚠️🚨🚨🌎🚀🇺🇦 pic.twitter.com/EPz6nH4Ug8 — UKRAİNİAN 💎 (@donetekk) March 4, 2022 ఉక్రెయిన్కు దాదాపు 40 శాతం అణు విద్యుత్ ఈ స్టేషన్ నుంచే సరఫరా అవుతోంది. ఇప్పటికే చెర్నోబిల్ను స్వాధీనం చేసుకున్న రష్యా.. ఇప్పుడు ఉక్రెయిన్లోని అణు ప్లాంట్లను టార్గెట్ చేసింది. జాపోరిజ్జియా గనుక పేలిందంటే.. చెర్నోబిల్ విషాదం(1986లో జరిగిన పెను విషాదం) కంటే ఘోరంగా డ్యామేజ్ ఉంటుందని, రేడియేషన్ ఎఫెక్ట్ చెర్నోబిల్ కంటే పదిరెట్లు ఎక్కువ ప్రభావం చూపెడుతుందని కుబేలా ప్రకటించారు. రష్యన్లు వెంటనే దాడుల్ని ఆపివేయాలి, అగ్నిమాపక సిబ్బందిని అనుమతించాలి, ఆ ప్రాంతాన్ని సేఫ్ జోన్గా ఏర్పాటు చేయాల్సిందే అని ట్వీట్ చేశారు కుబేలా. #Ukraine tells IAEA that fire at site of #Zaporizhzhia Nuclear Power Plant has not affected “essential” equipment, plant personnel taking mitigatory actions. — IAEA - International Atomic Energy Agency (@iaeaorg) March 4, 2022 మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్న సమయంలోనూ రష్యా దాడులు కొనసాగినట్లు సమాచారం. అయితే జాపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్ ప్రదేశంలో జరిగిన అగ్నిప్రమాదం.. కీలకమైన విభాగాల్ని ప్రభావితం చేయలేదని, ప్లాంట్ సిబ్బంది ఉపశమన చర్యలు తీసుకుంటున్నారని ఉక్రెయిన్ ప్రభుత్వం, ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి (IAEA) వెల్లడించింది. ఈ దాడులపై అమెరికా, ఉక్రెయిన్ను ఆరా తీసింది. మరోవైపు ఉక్రెయిన్ సహా పాశ్చాత్య దేశాలు న్యూక్లియర్ ప్లాంట్లపై దాడుల్ని చేయొద్దంటూ రష్యాను కోరుతున్నాయి. -
రష్యా విధ్వంసం.. మూడో విడత చర్చలకు ఉక్రెయిన్ యత్నం!
Russia-Ukraine War Day 9 LIVE Updates: భారీ నష్టం జరుగుతున్నా.. రష్యా దళాలను ఉక్రెయిన్ సేనలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. గెరిల్లా తరహా యుద్ధవ్యూహాలతో రష్యా సైన్యం చొచ్చుకురాకుండా అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. రష్యా సైన్యం కనీవినీ ఎరుగని రీతిలో బాంబులు, క్షిపణి దాడులతో హడలెత్తిస్తోంది. తొమ్మిదవ రోజూ యుద్ధం కొనసాగుతోంది. ► ఉక్రెయిన్లోని యూరప్లోనే అతిపెద్ద న్యూక్లిర్ ప్లాంట్ అయిన జిప్రోజియా న్యూక్లియర్ ప్లాంట్పై రష్యా బలగాలు దాడి నేపథ్యంలో ఐరాస భద్రతా మండలి శుక్రవారం ఉదయం 11.30 నిమిషాలకు (న్యూయార్క్ కాలామాణం ప్రకారం) అత్యవసర సమావేశం కానుంది. ► ఈ వారాంతంలో రష్యా అధికారులతో మూడవ రౌండ్ చర్చలు జరపాలని ఉక్రెయిన్ యోచిస్తోందని ఆ దేశ అధ్యక్ష సలహాదారు పేర్కొన్నారు. మరోవైపు బెలారస్లో గురువారం జరిగిన రెండో విడత చర్చల్లో యుద్ధ ప్రభావిత ప్రాంతాల నుంచి పౌరులను సురక్షితంగా పంపించేందుకు వీలుగా సేఫ్ కారిడార్లను నిర్వహించాలని ఇరు వర్గాలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పౌరుల తరలింపు సమయంలో ఆయా మార్గాల్లో కాల్పులు కూడా విరమించేందుకు అంగీకరించాయి. ► ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ దేశం విడిచి పారిపోయినట్లు రష్యా పేర్కొంది. ఉక్రెయిన్ వీడి ప్రస్తుతం పోలాండ్లో ఉన్నారని రష్యన్ మీడియా పేర్కొంది. అయితే ఇంతకముందు కూడా జెలెన్స్కీ దేశం విడిచిపెట్టినట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ ఈ ఈ వార్తలను ఉక్రెయిన్ అధ్యక్షుడు కొట్టిపారేశారు. తాను రాజధాని కీవ్లోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. మరీ ప్రస్తుత వార్తలు ఎంత వరకు నిజమో తేలాల్సి ఉంది. పూర్తి కథనానికి ఇక్కడ క్లిక్ చేయండి ► రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో దాదాపు 20 వేలకు పైగా భారతీయులు ఉక్రెయిన్ వీడినట్లు కేంద్ర విదేశాంగశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 18 విమానల్లో 4 వేల మంది స్వదేశానికి చేరుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆ దేశంలో రెండు నుంచి మూడు వేల మంది భారతీయులు ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. వీరిలో కనీసం 1,000 మంది భారతీయులు.. తూర్పు ఉక్రెయిన్లో సంఘర్షణ ప్రాంతాలు సుమీలో 700 మంది, ఖార్కివ్లో 300 మంది చిక్కుకుపోయారని అంచనా వేసింది. వారిని తరలించడానికి బస్సులను ఏర్పాటు చేయడం ప్రస్తుతం అతిపెద్ద సవాలుగా మారిందని కేంద్రం శుక్రవారం తెలిపింది. అయితే చివరి వ్యక్తిని తరలించే వరకు తాము ఆపరేషన్ గంగాను కొనసాగిస్తామని వెల్లడించింది. . ►ఉక్రెయిన్లో రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 12 లక్షలకు పైగా ఉక్రెయిన్ ప్రజలు ఇతర దేశాలకు తరలి వెళ్లినట్లు ఐక్యరాజ్య సమితి పేర్కొంది. వీరిలో దాదాపు అయిదు లక్షలమంది యువత ఉన్నట్లు తెలిపింది. ►ఉక్రెయిన్పై రష్యా దాడిలో మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి(యూఎన్హెచ్ఆర్) అత్యవసరంగా స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించి. ఈ మేరకు ఓటింగ్ నిర్వహించింది. ఈ కౌన్సిల్లో మొత్తం 47 దేశాలు ఉండగా. భారత్ మరోసారి ఈ ఓటింగ్ ప్రక్రియకుదూరంగా ఉంది. అయితే ఈ తీర్మానానికి అనుకూలంగా 32 ఓట్లు వచ్చాయి. భారత్, చైనా, పాకిస్థాన్, సుడాన్ సహా 13 దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. అయితే అనుకూల దేశాలు ఎక్కువగా ఉండటంతో తీర్మానం ఆమోదం పొందింది. Le Conseil des droits de l'homme de l'ONU a décidé d'établir d'urgence une commission d'enquête internationale indépendante suite à l'agression de la #Russie contre l'#Ukraine. VOTE ✅ POUR : 32 ❌ CONTRE : 2 ➖ ABSTENTIONS : 13 pic.twitter.com/r4yfTsAyUS — UN Human Rights Council 📍 #HRC49 (@UN_HRC) March 4, 2022 ► రష్యన్ బలగాలు జరుపుతున్న దాడి కారణంగా ఉక్రెయిన్లోని నగరాలు శ్మశానాలుగా మారాయి. VIDEO: Devastation in Ukraine town of Borodianka after Russian artillery strikes. Images show numerous buildings destroyed or badly damaged by Russian artillery strikes in the town of Borodianka, 60km northwest of Kyiv on March 3 pic.twitter.com/9KiNd54c4K — AFP News Agency (@AFP) March 4, 2022 ప్రపంచంలోనే అతిపెద్ద విమానాన్ని ధ్వంసం చేసిన రష్యా.. ►ఉక్రెయిన్లోని హోస్టోమెల్ విమానాశ్రయంలో ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఆంటోనోవ్ యాన్-225 విమానాన్ని రష్యన్ బలగాలు ధ్వంసం చేశాయి. స్థానిక మీడియా దీనికి సంబంధించిన ఓ వీడియోని ట్విట్టర్లో షేర్ చేసింది. Video confirms the world's largest plane, the Antonov An-225, was destroyed at Hostomel Airport in Ukraine, ending days of conflicting reports pic.twitter.com/0geCjAHWaa — BNO News (@BNONews) March 4, 2022 ► ఉక్రెయిన్ సైన్యం చేతిలో 9,166 మంది రష్యా సైనికులు హతం.. 33 విమానాలు, 37 హెలికాప్టర్లు, 2 బోట్లు, 60 ఇంధన ట్యాంకులు, 404 కార్లు, 251 యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ ప్రకటన. ► న్యూక్లియర్ ప్లాంట్ స్వాధీనం.. రష్యా సైన్యం యూరప్లోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్ జాపోరిజ్జియా న్యూక్లియర్ ప్లాంట్ సైట్ను స్వాధీనం చేసుకుంది. కాగా, శుక్రవారం ఉదయం ప్లాంట్పై దాడులు జరిపిన కొన్నిగంటల తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ► అణు విద్యుత్ కేంద్రంపై రష్యా దాడిని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. ఈ దాడిపై యూకే ప్రధాని బోరిస్ జాన్సన్, కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి ఫోన్ చేసి దాడిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంరతం అణు విద్యుత్ కేంద్రంపై దాడి రష్యాకు ఆమోద యోగ్యం కాదన్నారు. అక్కడ దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ► కొనసాగుతున్న ఆపరేషన్ గంగ. ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు ముమ్మరం. హిండన్ ఎయిర్బేస్కు ఈ ఉదయం చేరుకున్న రెండు విమానాలు. ► యూరప్లోనే అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ అయిన జాపోరిజ్జియా న్యూక్లియర్ప్లాంట్పై రాకెట్ దాడులు జరిగాయి. దీంతో ప్లాంట్ అగ్నికీలకల్లో చిక్కుకుంది. ఈ విషయాన్ని ఆ నగర మేయర్ ధృవీకరించారు. ఇది గనుక పేలితే చెర్నోబిల్ కంటే పదిరెట్లు నష్టం జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Ukraine nuclear plant on fire after Russia shelling#UkraineRussianWar#RussianUkrainianWarhttps://t.co/JZmT5xs2ZG pic.twitter.com/yvuaaSNRKr — Economic Times (@EconomicTimes) March 4, 2022 ► ఎనర్హోదర్ను స్వాధీనం చేసుకునేదిశగా రష్యా. ఉక్రెయిన్కు నాలుగో వంతు కరెంట్ ఇక్కడి నుంచే ఉత్పత్తి. ► చెర్నిహివ్లో రష్యా దాడులు. 22 మంది దర్మరణం పాలైనట్లు చెర్నిహివ్ గవర్నర్ ప్రకటించారు. ► ఉక్రెయిన్ యుద్దంలో మరో విద్యార్థికి గాయాలయ్యాయి. రాజధాని కీవ్లో ఆ విద్యార్థి గాయపడి చికిత్స పొందుతున్నట్లు కేంద్ర మంత్రి వీకే సింగ్ వెల్లడించారు. కీవ్ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించినట్లు గుర్తు చేశారాయ. యుద్ధ సమయంలో బుల్లెట్ అనేది జాతీయత, ప్రాంతీయత చూడదని ఆయన వ్యాఖ్యానించారు. ► నేరుగా తనతోనే చర్చలు జరపాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కోరాడు. అప్పుడే యుద్ధం ఆగే మార్గం దొరుకుతుందని అన్నారు. మరోవైపు యుద్ధం కొనసాగుతున్న తరుణంలో.. ప్లాన్లు ఇవ్వాలని, యుద్ధ విమానాలు, ఆయుధాలు అందించాలని పశ్చిమ దేశాలను కోరుతున్నాడాయన. ► యధాతధంగా రష్యా సైన్యం దాడులు కొనసాగుతాయని ఓ టెలివిజన్ ప్రసంగం ద్వారా పుతిన్ ప్రకటించారు. ► గురువారం ఉక్రెయిన్ రష్యా ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా సాగాయి. పౌరులను సురకక్షిత కారిడార్ గుండా తరలింపునకు ఇరు దేశాలు అంగీకరించాయి. -
ఇప్పుడు గులాబీ ఇచ్చి ఏం లాభం.. కేంద్రంపై భారత విద్యార్థి తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. ఆపరేషన్ గంగా కార్యక్రమంలో ఇప్పటి వరకు 18 వేల మంది భారత్కు తిరిగొచ్చినట్లు కేంద్ర విదేశాగశాఖ వెల్లడించింది. గురువారం 17 విమానాల్లో 3,726 మంది స్వదేశానికి వస్తున్నట్టు పేర్కొంది. గత 24 గంటల్లో 3 వేల మంది భారతీయులు 15 విమానాల ద్వారా ఉక్రెయిన్ నుంచి వచ్చారని తెలిపారు. ఆపరేషన్ గంగా కార్యక్రమంలో 30 విమనాల ద్వారా 6,400 మందిని ఇండియాకు తీసుకొచ్చినట్లు తెలిపారు. అయితే భారత్కు చేరిన విద్యార్థులను కేంద్ర మంత్రులు, అధికారులు స్వయంగా విమనాశ్రయానికి వెళ్లి స్వాగతం పలుకుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఉక్రెయిన్ నుంచి భారత్కు తిరిగొచ్చిన ఓ విద్యార్థి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. యుద్ధ వాతావరణం నుంచి పౌరులను రక్షించేందుకు సరైన సమయంలో చర్యలు చేపట్టనప్పుడు.. గులాబీలు అందించడం అర్థరహితమని కొట్టిపారేశాడు. బిహార్లోని మోతీహరి ప్రాంతానికి చెందిన దివ్యాన్షు సింగ్ అనే విద్యార్థి ఉక్రెయిన్లోయుద్దం మొదలైన తరువాత హంగేరి మీదుగా గురువారం మధ్యాహ్నానికి ప్రత్యేక విమానంలో ఇండియా చేరాడు. అయితే ఢిల్లీ విమానాశ్రంలో దిగిన తరువాత అతనికి గులాబీ అందించి అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియా.. మీకు భారత ఎంబసీ ఏ విధంగా సహకరించిందని ప్రశ్నించగా.. దివ్యాన్షు ఘాటుగా బదులిచ్చాడు. చదవండి: Viral Video: ఉక్రెయిన్లో ఘోరం..? ఆకలికి తాళలేక గడ్డితింటున్న బాలుడు? ‘క్రెయిన్ సరిహద్దు దాటి హంగేరిలోకి అడుగుపెట్టిన తర్వాతే మాకు సాయం లంభించింది. అంతకు ముందు ఎలాంటి సహాయం లేదు.. మేము అన్నీ ఏర్పాటు మా సొంతంగానే చేసుకున్నాం.. పది మంది కలిసి ఓ గ్రూప్గా ఏర్పడి రైలు ఎక్కాం.. ఆ రైలు కూడా కిక్కిరిసిపోయింది. కానీ స్థానికులు మాకు చాలా సహాయం చేశారు. మా పట్ల ఎవరూ అనుచితంగా ప్రవర్తించలేదు.. అయితే పోలెండ్ సరిహద్దుల్లో కొంత మంది విద్యార్థులు వేధింపులు ఎదుర్కొన్నది నిజమే. దీనికి మన ప్రభుత్వానిదే బాధ్యత.. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేవాళ్లం కాదు’ అని దివాన్షు సింగ్ తెలిపారు. ఇక తన చేతిలో ఉన్న గులాబీని పట్టుకుని ‘‘ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మాకు గులాబీ ఇచ్చారు.. దీని అర్థం ఏమిటి? దీనితో మనం ఏమి చేస్తాం? అక్కడ మాకు ఏదైనా జరిగితే మా కుటుంబాలు ఏం చేస్తాయి.. సరైన సమయంలో స్పందించి ఇతర దేశాలను అనుసరించి రోడ్మ్యాప్ రూపొందించి ఉంటే ఇన్ని ఆటంకాలు ఉండేవి కావు’ అని పేర్కొన్నారు. సరైన సమయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉంటే ప్రస్తుతం పూలు అందజేసే అవసరం ఉండేది కాదు అని దివ్యాన్షు వెల్లడించారు. చదవండి: ఉక్రెయిన్కు పెరిగిపోతున్న మద్దతు, రష్యాకు కోలుకోలేని దెబ్బ!! -
ఉక్రెయిన్లో హృదయ విదారకం.. తిండిలేక గడ్డితింటున్న బాలుడు
-
భారీ ఎదురుదెబ్బ.. రష్యన్ మేజర్ జనరల్ హతం
-
తిండిలేక గడ్డి తింటున్న బాలుడు! ఆ వీడియో సిరియాదా? ఉక్రెయిన్దా?
రోజులు గడుస్తున్న కొద్దీ ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మరింత ముదురుతోంది. ఒకవైపు రష్యాపై అగ్రదేశాలు ఆంక్షలతో విరుచుకుపడుతున్నా రష్యా వెనకడుగు వేయడం లేదు. కీలకమైన రాజధాని కీవ్, రెండో పెద్ద సిటీ ఖార్కివ్లను చేజిక్కించుకునేందుకు దూకుడుగా వ్యవహరిస్తోంది. మరోవైపు ముప్పేట చుట్టుముట్టి దాడులతో భయపెడుతున్నా ఉక్రెయిన్ తలొగ్గడం లేదు. రష్యన్ సైనికులను ఉక్రెయిన్ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. అయితే రష్యా దాడితో వేలాది మంది పౌరులు కీవ్, ఇతర సిటీల్లో మెట్రోస్టేషన్లు, షెల్టర్లు, బేస్మెంట్లు, కారిడార్లలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణలో ఇప్పటి వరకు ఎన్నో హృదయ విదారక దృశ్యాలు వెలుగు చూస్తున్నాయి. తినడానికి తిండి లేక ఎన్నో కుటుంబాలు ఆకలితో ఆలమటిస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ దృశ్యం ప్రపంచ ప్రజల చేత కన్నీరు పెట్టిస్తోంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో నెలకొన్న దారుణ పరిస్థితుల్లో.. బాలుడు ఆకలికి తట్టుకోలేక గడ్డి తింటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కన్నవారికి దూరమై, ఓదార్చేవారు లేక ఆకలి దహించడంతో కంటికి కనిపించిన గడ్డినే ఆహరంగా తీసుకున్నాడు. చిన్నారి దయనీయ పరిస్థితి ప్రతి ఒక్కరిని కలచి వేస్తోంది. చదవండి: Russia Ukraine War: భారీ ఎదురుదెబ్బ.. రష్యన్ మేజర్ జనరల్ హతం Syrian child surviving on grass pic.twitter.com/gxJfLWvOaD — Tariq Rafi (@TariqRafi14) March 2, 2022 అయితే ఈ బాలుడు ఏ దేశానికి చెందినవాడో తెలియరాలేదు. ఈ దృశ్యాలు ఉక్రెయిన్లోనే చోటుచేసుకున్నాయని కొందరు కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఆ ఘటన సిరియా యుద్ధ సమయంలో జరిగిందని చెప్తున్నారు. సిరియా యుద్ధ సమయంలోని పాత వీడియోనే మరోసారి వైరల్ అయిందని దాని తాలూకు లింక్స్ షేర్ చేస్తున్నారు. ఏదేమైనా ఉక్రెయిన్లో ఈ యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగితే బాంబుల విధ్వంసం కంటే ఆకలితో చనిపోయేవారే అధికంగా ఉంటారేమోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అణ్యం పుణ్యం తెలియని చిన్నారులు ఏం పాపం చేశారని వాపోతున్నారు. -
రణభూమిలో ఎటు చూసినా విషాదగీతికలే! (ఫొటోలు)
-
Russia-Ukraine War: అసలేంటీ ఈ బంకర్లు.. ఇండియాలో ఉన్నాయా?
ఉక్రెయిన్పై రష్యా బాంబులతో విరుచుకుపడుతోంది, అక్కడున్న భారతీయులు సహా అంతా బంకర్లలోకి వెళ్లి తలదాచుకుంటున్నారు. నాలుగైదు రోజులుగా ఈ వార్తలు వింటున్నాం. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా బంకర్లో దాక్కున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. అసలు ఏమిటీ బంకర్లు, వాటిలోకి వెళితే ఉండే రక్షణ ఏంటి? వాటిని ఎందుకు కట్టారు? ఎలా కట్టారు? మన దేశంలోనూ ఉన్నాయా? అనే ప్రశ్నలెన్నో తలెత్తుతున్నాయి.ఆ వివరాలేమిటో తెలుసుకుందామా.. యుద్ధం, విపత్తు ఏదైనా.. రక్షణ బంకర్ల ఏర్పాటు ప్రధాన లక్ష్యం యుద్ధాలు, విపత్తుల నుంచి రక్షణ పొందడం కోసమే. సింపుల్గా చెప్పాలంటే.. భూమిలో (అండర్గ్రౌండ్) రహస్యంగా కట్టుకునే గదులు, ఇళ్లనే బంకర్లు అనొచ్చు. నలుగురికి సరిపడే స్థాయి నుంచి.. పదుల సంఖ్యలో తలదాచుకోవడానికి వీలుగా బంకర్లను కట్టుకుంటుంటారు. అత్యవసర పరిస్థితిలో పనికొచ్చే మందులు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్, నీళ్లు, ఆహారం, జనరేటర్లు వంటివాటిని బంకర్లలో సిద్ధంగా ఉంచుకుంటారు. చదవండి: ఊహించని పరిణామం.. రష్యాకు మరో షాకిచ్చిన ఉక్రెయిన్ సైనికులు బంకర్ ఏదైనా సరే.. ఓ వైపు నుంచి చిన్నగా ఉపరితలానికి దారి, మెట్లు ఉంటాయి. ఎలాంటి కిటికీలుగానీ, ఇతర మార్గాలుగానీ దాదాపుగా ఉండవు. లోపల దాక్కున్నవారికి ఊపిరి ఆడేందుకు వీలుగా గాలి వచ్చిపోయేలా వెంటిలేషన్ ఏర్పాటు చేస్తారు.యుద్ధ సంక్షోభ ప్రాంతాల్లో..బంకర్ల వినియోగం చాలాకాలంగా ఉన్నా.. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వాటి వినియోగం ఎక్కువైంది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో వైమానిక దాడుల కారణంగా బంకర్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రధానంగా యూరప్, మధ్య ఆసియా దేశాలు, అమెరికాలో ఆయా దేశాల సైన్యం, రహస్య విభాగాలు బంకర్లు కట్టుకుని పోరాడగా.. జనం కూడా రక్షణ కోసం పెద్ద సంఖ్యలో బంకర్లు నిర్మించుకున్నారు. ఇప్పుడు ఉక్రెయిన్లో ఉన్న బంకర్లలో చాలా వరకు ఆ సమయంలో కట్టినవే. చదవండి: పుతిన్ తలను తెగనరకండి.. రష్యా కుబేరుడి సంచలన ప్రకటన ► తరచూ యుద్ధాలు, తిరుగుబాట్లు జరిగే ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పలు ఇతర గల్ఫ్ దేశాలు, చైనాతో సరిహద్దుల్లోని దేశాలు, ఆఫ్రికా ఖండంలోని సంక్షుభిత దేశాల్లో బంకర్లు నిర్మించుకోవడం సాధారణ విషయమే. ► ఎప్పుడూ ఏదో అలజడి ఉండే దేశాల్లో చాలా మంది ధనికులు, రాజకీయ నాయకులు.. విలాసవంతమైన బంకర్లు నిర్మించుకుంటుంటారు. ► అమెరికా, చెక్ రిపబ్లిక్, చైనా వంటి కొన్నిదేశాల్లో.. అణు బాంబుల దాడిని కూడా తట్టుకునేలా భూమిలో ఏకంగా పది, పదిహేను అంతస్తుల లోతు వరకు ఉండే భారీ బంకర్లు ఉన్నాయి. పలుచోట్ల కొండలు, గుట్టలను తొలిచి బంకర్లు నిర్మించారు. అవి సమీపంలో అణుదాడి జరిగినా తట్టుకునేలా ఉంటాయి. గుహల్లా కొన్ని.. ఇళ్లలా కొన్ని.. ► భూమి అడుగున గుహల్లా తవ్వి వాడుకునే బంకర్లు సాధారణమైనవి. తీవ్రవాద ప్రాంతాల్లో, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ వంటి దేశాల్లో తిరుగుబాటు దారులు ఇలాంటి బంకర్లను వాడుతుంటారు. మిగతావాటితో పోలిస్తే వాటికి ఖర్చు తక్కువ. కానీ రక్షణ, సదుపాయాలు కూడా తక్కువే. ► భూమిలో పెద్ద గుంత తవ్వి, దాని అడుగు నుంచీ కాంక్రీట్తో ఇల్లులా నిర్మించి.. పైన కొంత ఎత్తున మట్టిని కప్పేసేవి పెద్ద, భారీ బంకర్లు. సైన్యం వాడేందుకు, రహస్య ఆపరేషన్ల కోసం, యుద్ధాలు జరిగే ప్రాంతాలు, సరిహద్దుల్లో ప్రజల కోసం ఇలాంటివి నిర్మిస్తారు. వీటిలో రక్షణ సదుపాయాలు ఎక్కువ. ► కంటెయినర్లలా రెడీమేడ్గా ఉక్కుతో తయారు చేసే బంకర్లూ ఎక్కువే. భూమిలో అవసరమైన మేర గుంత తవ్వి ఈ రెడీమేడ్ బంకర్లను అందులో పెట్టి.. పైన మట్టి కప్పేస్తారు. అమెరికా, యూరప్ దేశాల్లో జనం ఇలాంటివి ఏర్పాటు చేసుకుంటుంటారు. ► ఏర్పాటు చేసుకునే బంకర్ను బట్టి కనీసం రూ.10 లక్షల నుంచి ఖర్చు ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ► చాలాచోట్ల బంకర్లపైన భూమిపై చిన్నపాటి పార్కులు, లాన్, గోల్ఫ్ కోర్సులు, చిన్నపాటి రేకుల షెడ్లు వంటివి ఏర్పాటు చేస్తుంటారు. దేశంలో.. కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో.. మన దేశంలోనూ జమ్మూకశ్మీర్, లడఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో విదేశీ సరిహద్దుల వెంబడి బంకర్లు ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దుల్లో మన ఆర్మీతోపాటు సాధారణ జనం కూడా బంకర్లు కట్టుకుంటుంటారు. పాకిస్తాన్ సైన్యం తరచూ కాల్పులు జరుపుతుండటం, ఉగ్రవాదుల చొరబాట్ల నేపథ్యంలో.. సరిహద్దుల్లోని ప్రజలకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వేల సంఖ్యలో బంకర్లను నిర్మించి ఇస్తోంది. అందులో కుటుంబాలకు వ్యక్తిగత బంకర్లతోపాటు ఎక్కువ మంది తలదాచుకునేలా కమ్యూనిటీ బంకర్లు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికే సుమారు 10వేల బంకర్లను నిర్మించినట్టు అధికారులు తెలిపారు. ఇవన్నీ పాకిస్తాన్, ఆక్రమిత కశ్మీర్ సరిహద్దులకు మూడు కిలోమీటర్ల లోపు.. కీలకమైన రాజౌరీ, పూంఛ్, ద్రాస్ వంటి సెక్టార్లలో ఉన్నట్టు వివరించారు. మనకు ఆపద వస్తే ఎలా? మన దేశంలో అత్యవసర పరిస్థితి వస్తే.. రాష్ట్రప తి, ప్రధాని, ఇతర కీలక ప్రముఖులకు రక్షణ కల్పించేలా బంకర్లు ఉన్నట్టు ప్రచారంలో ఉంది. కానీ కచ్చితమై ధ్రువీకరణ లేదు. దేశంలో పాకి స్తాన్, చైనా, బంగ్లాదేశ్ సరిహద్దుల్లోనే బంక ర్లున్నాయి. అంతేతప్ప ఎక్కడా బంకర్లు అనేవే లే వని రక్షణ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచ చరిత్రలో భారతదేశం ఎప్పుడూ ప్రధాన యుద్ధరంగంలో లేదని.. అందువల్ల మన దేశానికి బంకర్ల అవసరమే రాలేదని అంటున్నారు. అంతేకాదు.. ఒకవేళ వైమానిక, క్షిపణి దాడులు జరిగినప్పుడు సురక్షితంగా ఉండేందుకు ఏం చేయాలి?, ఎక్కడికి వెళ్లాలన్న దానిపై మన దేశంలో ఎవరికీ అవగాహన కూడా లేదని పేర్కొంటున్నారు. -
పాపం ఉక్రెయిన్.. చైనా పాడుబుద్ధి బయటపడిందిగా!
కుక్క తోక వంకర.. అట్లాగే ఏ మాత్రం విశ్వాసంలేని డ్రాగన్ కంట్రీ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రపంచం ఏమైపోయినా ఫర్వాలేదనే అనుకోవడం సహజం. ఒకవైపు ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా బలగాలు మోహరించిన వేళ.. ప్రపంచమంతా శాంతిని కోరుకుంటే, చైనా మాత్రం తనకు బాగా అలవాటైన వక్రబుద్ధిని ప్రదర్శించింది. నాటో కూటమిలో చేరొద్దంటూ రష్యా, ఉక్రెయిన్ ఆక్రమణకు తెగపడిన విషయం తెలిసిందే. వారం రోజులుగా ఈ పరిణామాలు ప్రపంచాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ తరుణంలో చైనా ఇరు దేశాల మధ్య దౌత్యానికి ముందుకు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తమది శాంతికాముక దేశమని, యుద్ధ ఉద్రిక్తతలను తగ్గించేందుకు, సయోధ్య కుదిర్చేందుకు తమవంతు కృషి చేస్తామని ప్రకటించుకుంది చైనా. కట్ చేస్తే.. రష్యాపై ఆంక్షలు ఏమాత్రం కరెక్ట్ కాదని తాజాగా ప్రకటన ఇచ్చింది. ఇంతలోనే ఉక్రెయిన్ ఆక్రమణ విషయంలో రష్యాకు చేసిన ఓ రిక్వెస్ట్ ఇప్పుడు బయటకు పొక్కడం సంచలనంగా మారింది. చైనా రాజధాని బీజింగ్ వేదికగా 2022 వింటర్ ఒలింపిక్స్ జరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఈ ఈవెంట్స్ జరిగాయి. ఉయిగర్లపై హింసాకాండ, మానవ హక్కుల ఉల్లంఘన, ప్రపంచానికి కరోనా వైరస్ను అంటగట్టిందనే అపవాదు.. ఇలా రకరకాల కారణాలతో అగ్రరాజ్యం సహా చాలా దేశాలు ఈ ఈవెంట్లను బహిష్కరించాయి. అయినప్పటికీ అంతర్జాతీయ సమాజానికి దూరంగా వింటర్ ఒలింపిక్స్ను అత్యంత గోప్యంగా నిర్వహించుకుంది చైనా. ఈ తరుణంలో.. రష్యా గనుక ఉక్రెయిన్పై యుద్ధానికి తెగబడితే తమకు ఇబ్బంది కలుగుతుందని, కాబట్టి శీతాకాల ఒలింపిక్స్ ముగిసేవరకు ఓపిక పట్టాలని, ఆ తర్వాత ఉక్రెయిన్పై ఎలాంటి చర్యలకు దిగినా పర్వాలేదనే ప్రతిపాదనను మాస్కో(రష్యా రాజధాని) ముందు ఉంచిందట. ఈ మేరకు చైనా సీనియర్ అధికారులు, మాస్కోతో పలుదఫాలుగా మంతనాలు చేపట్టగా.. వాళ్ల మధ్య సంభాషణలన్నీ రికార్డయ్యాయి. పాశ్చాత్య దేశాల ఇంటెలిజెన్స్ వ్యవస్థ నివేదికలు, పలు స్టింగ్ ఆపరేషన్ల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఇప్పుడు. అయితే చైనా విజ్ఞప్తికి రష్యా నుంచి ఎలాంటి స్పందన వచ్చిందనే విషయాన్ని మాత్రం ఆ నివేదికలు బయటపెట్టలేదు. ఈ ఆరోపణలపై వెంటనే స్పందించేందుకు సీఐఏ, వైట్హౌజ్ జాతీయ భద్రతా మండలి నిరాకరించింది. అయితే ఉక్రెయిన్ సంక్షోభ విషయంలో రష్యా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. తమ స్వార్థం కోసం ఆక్రమణను వాయిదా వేయాలని కోరడం బయటకు పొక్కడంతో చైనాను ఛీ కొడుతున్నాయి పలు దేశాలు. న్యూయార్క్ టైమ్స్, రాయిటర్స్ ప్రచురించిన ఈ సంచలనాత్మక కథనాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. చూద్దాం.. ఈ కథనాలపై చైనాగానీ, రష్యాగానీ ఎలా స్పందిస్తాయో!. చదవండి: రష్యాకు సపోర్ట్!! పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్.. జాగ్రత్త! -
నాన్న నేను భాగానే ఉన్నాను...
తెనాలి రూరల్/రేపల్లె: రణరంగంగా మారిన ఉక్రెయిన్లో చదువుతున్న తమ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నారోనన్న ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులకు కొంత ఊరట కలిగించే సమాచారం అందింది. తెనాలి విద్యార్థులు ఆ దేశ సరిహద్దు దాటేశారు. యుద్ధభూమిని దాటి మరో దేశంలోకి విద్యార్థులు ప్రవేశించినట్టు సమాచారం. ఉక్రెయిన్లోని ఒడెస్సాలో చదువుతున్న తెనాలి మండలం కొలకలూరుకు చెందిన షేక్ రేష్మ బుధవారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంది. ప్రస్తుతం ఢిల్లీలోని ఏపీ భవన్లో ఉన్న ఆమె గురువారం విమానంలో గన్నవరం చేరుకుంటుంది. ఇక ఉక్రెయిన్లోని జపొరిజ్జియాలో చదుతున్న తెనాలికి చెందిన చెన్నుపాటి రాణి, రావి శేషసాయి లక్ష్మీగణేష్, విష్ణుమొలకల వైష్ణవి, సమ్మెట టెండుల్కర్ వర్మ ఉక్రెయిన్–హంగేరి సరిహద్దుకు భారత కాలమానం ప్రకారం మంగళవరాం అర్ధరాత్రి దాటాక చేరుకున్నా రు. షేక్ రేష్మ అక్కడ నుంచి పాస్పోర్టులు, ఇతర తనిఖీలు పూర్తి చేసుకుని హంగేరి దేశంలోకి ప్రవేశించారు. హంగేరి సరిహద్దు నుంచి 18 గంటలు ప్రయాణించి ఆ దేశ రాజధాని బుడాపెస్ట్కు వెళ్లేందుకు రైలులో ఉన్నారు. వీరు బుధవారం అర్ధరాత్రి దాటాక బుడాపెస్ట్ చేరుకునే అవకాశం ఉంది. చెంచుపేటకు చెందని బొందలపాటి లక్ష్మీశ్రీలేఖ ఇప్పటికే బుడాపెస్ట్ చేరు కుంది. గురువారం ఉదయం ఢిల్లీ చేరుకుంటానని కుటుంబసభ్యులకు సమాచారమందించింది. ఇక రొమేనియా రాజధాని బుకారెస్ట్లోని శిబిరంలో ఇప్పటికే ఉన్న పట్టణానికి చెందిన గోపాలం రాజేష్, కొల్లిపర మండలం దంతులూరుకు చెందిన దర్శి డెయిసీ హవీలా ‘ఆపరేషన్ గంగా’లో భాగంగా తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఉక్రెయిన్ బోర్డర్కు చేరుకున్నాం వైద్య విద్యార్థినీ తల్లిదండ్రులకు ఫోన్ ‘‘నాన్న నేను భాగానే ఉన్నాను... మీరు కంగారు పడకండి. అమ్మకు ధైర్యం చెప్పండి. ఉక్రెయిన్ బోర్డర్కు చేరుకున్నాం. నాతోపాటు చాలా మంది ఉన్నారు. ఇండియాకి రావటానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారంటూ’’ ఉక్రెయిన్లో వైద్య విద్య చదువుతున్న విద్యార్థినీ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన యోగక్షేమాలపై వివరించింది. చెరుకుపల్లి మండలం గుళ్లపల్లికి చెందిన మందపాకల శ్రీనివాసరావు–శ్రీలక్ష్మిల కుమార్తె జోత్స్న భార్గవి జోప్రసి యూనివర్సిటీలో ఐదో సంవత్సరం వైద్య విద్యను అభ్యసిస్తున్నది. బుధవారం ఉదయం 11 గంటలకు తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లా డింది. తనతోపాటు ఇండియాకి చెందిన వి ద్యార్థులు 1500 మంది వరకు ఉంటారన్నారు. మేము క్షేమంగానే ఉన్నాం. ఇబ్బందేమీ లేదంటూ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పింది. -
ఉక్రెయిన్-రష్యా యుద్ధం: ఫ్రాన్స్ అధ్యక్షుడికి పుతిన్ ఫోన్!
Ukraine Crisis Live Updates: ఉక్రెయిన్పై రష్యా బలగాలు పెను విధ్వంసానికి దిగాయి. రెండు రోజులుగా గ్యాప్ లేకుండా విరుచుకుపడుతున్నాయి. ఎనిమిదవ రోజు సైతం విధ్వంసకాండ కొనసాగుతుండగా.. బెలారస్ బ్రెస్ట్ ప్రాంతంలో చర్చలు జరిగే అవకాశాలున్నట్లు సమాచారం. రష్యా తరపున సైనికులు, ఉక్రెయిన్ తరపున సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా భారీ సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ప్రధాన పట్టణాలపై ఫోకస్ చేసిన రష్యన్ బలగాలు ఖార్కీవ్ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు యుద్ధంతో ఏడు లక్షల మంది దేశం విడిచి పారిపోతుండగా.. వాళ్లకు ఆశ్రయం ఇచ్చేందుకు చాలా దేశాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. ►ఫ్రాన్స్ అధ్యక్షుడికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ ఫ్రాన్స్ అధ్యక్షుడికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేశారు. ఉక్రెయిన్లో పరిస్థితి మరింత దారుణంగా మారిందని పుతిన్తో మాట్లాడిన తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ అర్థమైందని ఆయన అన్నారు. సుమారు వారు 90 నిమిషాలు మాట్లాడారు. ►ఎట్టికేలకు ఉక్రెయిన్, రష్యా మధ్య రెండో దశ చర్చలు బెలారస్- పోలాండ్ మధ్య చర్చలు జరిగాయి. చర్చలోకి వచ్చిన ఎజెండాలోని అంశాలు ఇవే 1. వెంటనే కాల్పుల విరమణ 2.యుద్ధ విరమణ 3. పౌరులు సరిహద్దులు దాటేందుకు వీలుగా చర్యలు ►మరో సారి ఉక్రెయిన్ రష్యా మధ్య చర్చలు.. మరో రెండు గంటల్లో ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలు జరగనున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. చర్చలు చర్చలే.. దాడులు దాడులేనని అంతవరకు పరిస్థితిలో ఏ మార్పు రాదని రష్యా చెప్తోంది. మా డిమాండ్లను ఇంతకు ముందే చెప్పం.. అది ఒప్పుకుంటేనే యుద్ధం ఆగుతుందని రష్యా స్పష్టం చేసింది. దోనాస్క్ ల్యూనిస్క్లను వదిలేయాలని ఉక్రెయిన్ అంటోంది. ►యుద్ధం తర్వాత ఉక్రెయిన్ను పునర్నిర్మిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రతిజ్ఞ చేశారు. ఉక్రెయిన్కు వ్యతిరేకంగా రష్యా చేసిన ప్రతిదానికీ రష్యా తిరిగి చెల్లించేలా మా చర్యలు ఉండబోతున్నాయని తెలిపారు జెలెన్స్కీ. ►రష్యా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యన్ మేజర్ జనరల్ హతమైనట్లు వెల్లడించిన నెక్స్టా మీడియా ►రష్యాకు మరో గట్టి షాకిచ్చిన ఉక్రెయిన్ సైనికులు ప్రపంచంలోనే అత్యంత శక్తి సామర్ద్యాలు కలిగిన యుద్ధ విమానం సుఖోయ్ (ఎస్యూ-30 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్) రష్యా సైనిక పటాలంలో శత్రు దేశాలను ఇట్టే భయపెట్టే ఎయిర్ క్రాఫ్ట్. అయితే చిన్న దేశమైనప్పటికీ ఉక్రెయిన్.. తన గగన తలం మీదకు వచ్చిన రష్యా సుఖోయ్ విమానాన్ని ఒక్క దెబ్బకు కూల్చేసింది. ఈ మేరకు ఉక్రెయిన్ సైనిక బలగాల కమాండర్ ఇన్ ఛీప్ లెఫ్ట్ నెంట్ జనరల్ వాలేరీ జాలుజ్నియి కాసేపటి క్రితం ఓ ప్రకటన విడుదల చేశారు. ► ఉక్రెయిన్కు 2,700 యాంటీ ఎయిర్ మిస్సైల్స్ అందించనున్న జర్మనీ. ► ఖార్కీవ్లో పవర్ కట్. అంధకారంలోనూ ఆగని విధ్వంసం. ► ఉక్రెయిన్ ప్రధాన నగర దాడుల్లో రష్యా దళాలకు, ఉక్రెయిన్ రెబల్స్ చేతులు కలిపారు. ► ఉక్రెయిన్పై రష్యా దాడులను తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్ దళాలు రష్యా బలగాలను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడుతున్నాయి. ఈ ఉదయం నుంచి రష్యా బలగాలదే స్పష్టమైన పైచేయిగా కనిపిస్తోంది. ► స్కూళ్లు, మెట్రో స్టేషన్లే లక్ష్యంగా.. ప్రభుత్వ ఆస్తులు, కార్యాలయాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపిన రష్యా.. ఇప్పుడు పూర్తిగా పౌరులనే లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతోంది. రష్యా దాడులు తీవ్రతరం చేసి ఆసుపత్రులు, పాఠశాలలు, భవనాలపై కూడా దాడులు జరుపుతుండడం కలకలం రేపుతోంది. మరోవైపు మెట్రో స్టేషన్లు అక్కడ అండర్ గ్రౌండ్ బంకర్లుగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆశ్రయం పొందుతున్న వాళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతోంది రష్యా. ► గురువారం ఉదయం.. కీవ్లోని మెట్రో స్టేషన్ సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. డ్రుబీ నరోదివ్ మెట్రో స్టేషన్ పేలుళ్లు సంభవించడంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. కీవ్ నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలకు స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా దాడులు కొనసాగిస్తోంది. ఇప్పటికే ఖేర్సన్ నగరాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుంది. ► ఒబ్లాస్ట్, లవీవ్, మైకొలివ్, చెర్నిహివ్, తదితర ప్రాంతాల్లో రష్యా వైమానిక దాడులకు సిద్ధమైంది. తమపై విధించిన ఆంక్షలను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధమని రష్యా ఇప్పటికే ప్రకటించింది. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్లో వలసలు పెరిగాయని ఐక్యరాజ్య సమితి శరణార్థుల విభాగం తెలిపింది. నిన్నటి వరకు 7 లక్షలుగా భావించిన వలసదారుల సంఖ్యను.. ఇప్పుడు 10 లక్షలుగా ఒక నివేదికలో పేర్కొంది. మరోవైపు యూఏఈ సహా పలు దేశాలు ఉక్రెయిన్ వలసదారులకు ఆశ్రయాన్ని నిరాకరిస్తున్నాయి. ► ఇతర దేశాల జోక్యం పెరిగితే ఉక్రెయిన్తో యుద్ధంలో అణ్వస్త్రాలను వాడడానికి కూడా రష్యా వెనకాడబోదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అణుయుద్ధం విషయంలో దేశ బలగాలను రష్యా అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. రష్యా వద్ద 5,997 అణు వార్హెడ్లు ఉన్నాయని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ తెలిపింది. ► రష్యా దాడులు తీవ్రతరం చేసిన నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి బయటపడడానికి విదేశీయులు నానా కష్టాలు పడుతున్నారు. పొరుగు దేశాలకు చేరుకునే క్రమంలో చాలా మందికి ఆహారం అందట్లేదు. జనావాసాలపై కూడా రష్యా దాడులు జరుపుతుండడంతో ఉక్రెయిన్ ప్రజలు తీవ్ర భయాందోళనల్లో ఉన్నారు. ► రష్యా ఆరోపణలు.. ఖండించిన భారత్ భారత విద్యార్థులను అడ్డుగా పెట్టుకుని ఉక్రెయిన్ తమతో పోరాడుతోందని రష్యా ఆరోపణలకు దిగింది. ఖార్కివ్ నుంచి భారతీయ విద్యార్థులను తరలించడానికి రష్యా ప్రయత్నిస్తుండగా.. ఉక్రెయిన్ బలగాలు భారతీయులను బందీలుగా పట్టుకున్నాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉక్రెయిన్ నుంచి బెల్గ్రేడ్కు వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులను ఖార్కివ్లో ఉక్రెనియన్ అధికారులు బలవంతంగా నిర్బంధిస్తున్నారంటూ మేజర్ జనరల్ ఇగోర్ కోనాషెంకోవ్ ప్రకటించారు. భారత పౌరులను సురక్షితంగా తరలించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవడానికి సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయంటూ స్పష్టంచేశారు. కాగా.. ఈ ఆరోపణలపై ఉక్రెయిన్ స్పందించింది. భారత్, పాకిస్థాన్, చైనా విద్యార్థులను రష్యా బందీలుగా మార్చిందని ఉక్రెయిన్ పేర్కొంది. రష్యా ఆరోపణల అనంతరం ఉక్రెయిన్ విదేశాంగశాఖ ఈ ప్రకటన చేసింది. భారతదేశం, పాకిస్తాన్, చైనా ఇతర దేశాల విద్యార్థులు రష్యన్ సాయుధ దురాక్రమణకు బందీలుగా మారారంటూ ఆరోపించింది. ఈ పరస్పర ఆరోపణల నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. భారత విద్యార్థులను బందీలుగా తీసుకున్న విషయమేదీ తమ దృష్టికి రాలేదని ప్రకటించింది. రష్యా ఉక్రెయిన్లు పరస్పరం భారతీయుల విద్యార్థులను బందీలుగా చేసుకున్నారనే ఆరోపణలు చేసుకుంటున్నాయి. కానీ, అలాంటి సమచారం ఏదీ మా దాకా రాలేదు. ఇప్పటివరకైతే అంతా క్షేమంగా ఉన్నారు. వాళ్లను భారత్కు తరలించే ఆపరేషన్ గంగ కొనసాగుతోంది అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఉక్రెయిన్పై స్పెషల్ ఆపరేషన్లో 498 మంది సైనికులు మృతి: రష్యా రక్షణ శాఖ ► ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ ప్రధాన నగరాలైన కీవ్, ఖర్వివ్పై రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్పై గత 8 రోజులుగా రష్యా దాడులు చేస్తోంది. జనావాసాలపై రాకెట్లు, క్షిపణులతో విధ్వంసం సృష్టిస్తోంది. మరోవైపు రష్యా అణు జలాంతర్గాములను సిద్ధం చేస్తోంది. బారెంట్స్ జలాల్లోకి అణు జలాంతర్గాములను తరలిస్తోంది. ► ఖెర్సాన్, బెర్డ్యాన్స్ ఓడరేవులను రష్యా స్వాధీనం చేసుకుంది. ఒడెస్సా, మరియూపూల్ స్వాధీనం చేసుకోవడానికి రష్యా సైన్యం యత్నిస్తోంది. ఉక్రెయిన్పై స్పెషల్ ఆపరేషన్లో 498 మంది సైనికులు మృతి చెందినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ► ఉక్రెయిన్ కీలక ప్రకటన.. ఉక్రెయిన్ దక్షిణ నగరం ఖేర్సన్ రష్యా బలగాల చేతుల్లోకి వెళ్లిందని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. ► ఆపరేషన్ గంగ.. సీ-17 ఎయిర్క్రాఫ్ట్ మూడోది 208 మంది భారతీయులతో పోలాండ్ నుంచి ఢిల్లీ హిందాన్ ఎయిర్బేస్లో ఈ ఉదయం దిగింది. సురక్షితంగా వచ్చిన ప్రయాణికులతో ఎంవోఎస్ డిఫెన్స్ అజయ్ భట్ కాసేపు మాట్లాడారు. I have brought my friend's dog with me from Ukraine. Many people who had dogs left them behind in Ukraine, but I brought back this dog along with me: Zahid, a student rescued from Ukraine, at Hindan airbase pic.twitter.com/bEslfEBI6L — ANI (@ANI) March 3, 2022 ► ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. ఉక్రెయిన్ స్వాతంత్య్రాన్ని, సార్వభౌమత్వాన్ని, ఐక్యతను, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటించింది. భారత కాలమానం ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఐరాస జనరల్ అసెంబ్లీ 76వ ‘అసాధారణ’ సర్వసభ్య సమావేశం ఈ మేరకు తీర్మానం చేసింది. ► ‘ఉక్రెయిన్పై దాడి’ పేరుతో రూపొందిన తీర్మానానికి మొత్తం 193 సభ్య దేశాల్లో 141 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. ఐదు దేశాలు వ్యతిరేకించాయి. ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది. దౌత్యం, చర్చలు తప్ప వివాద పరిష్కారానికి మరో మార్గం లేదని ఈ సందర్భంగా అభిప్రాయపడింది. భారత్తో పాటు మొత్తం 35 దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. తీర్మానం ఆమోదం పొందిన సందర్భంగా కరతాళ ధ్వనులతో సమావేశ ప్రాంగణం మారుమోగిపోయింది. #UN member states demanded today #Russia to stop its use of force and withdraw immediately from #Ukraine 🇺🇦. Result 141 to 5 demonstrates Putin's unprecedented isolation on the global stage. #StandWithUkraine pic.twitter.com/65ZuVyHrCq — Kaja Kallas (@kajakallas) March 2, 2022 ► అణ్వాయుధ విభాగాన్ని యుద్ధసన్నద్ధం చేయాలన్న రష్యా నిర్ణయాన్ని సమావేశం ఖండించింది. ఆ దేశానికి బెలారస్ మద్దతును కూడా తీవ్రంగా తప్పుబట్టింది. రష్యా తక్షణం యుద్ధాన్ని ఆపాలని, ఉక్రెయిన్ నుంచి తన బలగాలన్నింటినీ బేషరతుగా, సంపూర్ణంగా, తక్షణం ఉపసంహరించాలని డిమాండ్ చేసింది. ► ఉక్రెయిన్లోని వేర్పాటువాద ప్రాంతాలను స్వతంత్ర హోదా ఇస్తూ రష్యా తీసుకున్న నిర్ణయాన్ని కూడా నిరసించింది. చర్చలు, మధ్యవర్తిత్వం ద్వారా వివాదాన్ని తక్షణం శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరింది. 15 మంది సభ్యుల ఐరాస భద్రతా మండలిలోనూ ఆదివారం ఇలాంటి తీర్మానాన్నే ప్రవేశపెట్టగా రష్యా వీటో చేయడం తెలిసిందే. ► ఈ నేపథ్యంలో జనరల్ అసెంబ్లీ అత్యవసర ప్రత్యేక సమావేశం నిర్వహించింది. కాల్పుల విరమణ తక్షణావసరమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టి.ఎస్.తిరుమూర్తి పేర్కొన్నారు. భారతీయులు, ముఖ్యంగా విద్యార్థులు భారీగా ఉక్రెయిన్లో చిక్కుబడ్డారని, ఒకరు కాల్పులకు బలయ్యారని ఆవేదన వెలిబుచ్చారు. Diplomats from #European countries left the hall of the #UN Human Rights Council before Lavrov's speech. Diplomacy in #Russia is dead pic.twitter.com/6UOsICDjU4 — NEXTA (@nexta_tv) March 1, 2022 -
క్రూడ్ మోత.. పెట్రో వాత..
ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీని ప్రభావంతో దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ రేట్లకు రెక్కలు రానున్నాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాక వచ్చే వారం నుంచి మళ్లీ రోజువారీ పెట్రో వాత మొదలు కావచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. రేట్ల పెంపు రూ. 6–10 శ్రేణిలో ఉండొచ్చని అభిప్రాయపడుతున్నాయి. న్యూఢిల్లీ: ఉక్రెయిన్తో ఉద్రిక్తతల వల్ల కావచ్చు లేదా పాశ్చాత్య దేశాలు విధించే ఆంక్షల వల్ల కావచ్చు రష్యా నుంచి ముడి చమురు, గ్యాస్ సరఫరా దెబ్బతినే అవకాశం ఉందని అంతర్జాతీయంగా మార్కెట్లో ఆందోళన నెలకొంది. దీంతో క్రూడాయిల్ రేటు బ్యారెల్కు ఏకంగా 110 డాలర్ల పైకి ఎగిసింది. 2014 తర్వాత ముడి చమురు ధర ఈ స్థాయికి ఎగియడం ఇదే ప్రథమం. ఇక భారత్ కొనుగోలు చేసే రకం క్రూడాయిల్ రేటు, ఎన్నికల హడావిడి ప్రారంభం కావడానికి ముందు .. అంటే.. గతేడాది నవంబర్లో పెట్రోల్, డీజిల్ రేట్లను రోజువారీ సవరించడం నిలిపివేసే నాటికి, సగటున 81.5 డాలర్ల స్థాయిలో ఉండేది. తాజాగా చమురు శాఖ గణాంకాల ప్రకారం ఇండియన్ బాస్కెట్ క్రూడాయిల్ ధర మార్చి 1న బ్యారెల్కు 102 డాలర్ల పైకి చేరింది. ఈ నేపథ్యంలోనే దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లకు రెక్కలు రానున్నాయని భావిస్తున్నారు. క్రూడాయిల్ 1 డాలర్ పెరిగితే.. సాధారణంగా ముడిచమురు ధర బ్యారెల్కు 1 డాలర్ మేర పెరిగితే .. లీటరు ఇంధనం రేటు 48–52 పైసల చొప్పున పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ రంగ ఇంధన రిటైలింగ్ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్)లకు పెట్రోల్, డీజిల్పై లీటరుకు సాధారణంగా లభించే రూ. 2.5 మార్జిన్ కాకుండా రూ. 5.7 మేర నష్టం వస్తోంది. దీంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మార్కెటింగ్ మార్జిన్లు తిరిగి మామూలు స్థాయికి రావాలంటే ఇంధనాల రిటైల్ ధరలను లీటరుకు రూ. 9 (10 శాతం) మేర పెంచాల్సి రావచ్చని బ్రోకరేజీ సంస్థ జేపీ మోర్గాన్ పేర్కొంది. ‘ఈ పరిస్థితిని నెగ్గుకు రావాలంటే ఎక్సయిజ్ డ్యూటీ స్వల్పంగా (లీటరుకు రూ.1–3) తగ్గించి, రిటైల్ రేట్ల పెంచే వ్యూహం అనుసరించే అవకాశం ఉంది. రాష్ట్రాల ఎన్నికలు వచ్చే వారం ముగియనుండటంతో అప్పట్నుంచి రోజువారీగా రేట్ల పెంపు మళ్లీ మొదలు కావచ్చు‘ అని తెలిపింది. మరికొన్ని వర్గాలు రేట్ల పెంపు రూ. 6–10 స్థాయిలో ఉండొచ్చని అంచనా వేశాయి. ఉత్తర్ ప్రదేశ్లో తుది విడత పోలింగ్ ఫిబ్రవరి 7న ముగియనుండగా, ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది. సాధారణంగా ఆయిల్ కంపెనీలు.. పెట్రోల్ రేట్లను రోజువారీ ప్రాతిపదికన మారుస్తుంటాయి. కానీ అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రికార్డు స్థాయిలో దాదాపు 118 రోజులుగా పెంచలేదు. ఢిల్లీలో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటరుకు రూ. 95.41, డీజిల్ రేటు రూ. 86.67గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎక్సయిజ్ డ్యూటీ, వ్యాట్ రేటును కొంత తగ్గించడంతో ఈ రేట్లు అమలవుతున్నాయి. లేకపోతే పెట్రోల్ ధర ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ. 110.04, డీజిల్ రేటు రూ. 98.42గా ఉండేది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ రేటు గతేడాది అక్టోబర్ 26న 86.40 డాలర్ల గరిష్ట స్థాయికి చేరినప్పుడు దానికి అనుగుణంగా ఈ రేట్లను సవరించారు. రూపాయికి చమురు సెగలు అంతర్జాతీయంగా బ్యారెల్ చమురు ధర 110 డాలర్లకు చేరుకోవడం ఫలితంగా డాలర్ మారకంలో రూపాయి విలువ భారీగా క్షీణిస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధ అనిశ్చితుల నేపథ్యంలో భగ్గుమన్న చమురు ధరలతో భార త్ దిగుమతుల బిల్లు మరింత భారంగా మారుతోంది. తద్వారా కరెంట్ ఖాతా లోటు పెరుగుతుందనే భయాలతో రూపాయి ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రూపాయి బుధవారం 47 పైసలు పతనమై 75.80 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 53 పైసలు నష్టపోయి 75.86 కనిష్టాన్ని తాకింది. రష్యా ఎఫెక్ట్ .. అంతర్జాతీయంగా చమురు ఉత్పత్తిలో రష్యా వాటా 10 శాతం వరకూ ఉంటుంది. యూరప్లో సహజ వాయువు ఉత్పత్తిలో మూడో వంతు వాటా రష్యాదే. భారత్ దాదాపు 85 శాతం క్రూడాయిల్ అవసరాల కోసం దిగుమతులపైనే ఆధారపడుతున్నప్పటికీ .. రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నది చాలా తక్కువే. 2021లో రష్యా నుంచి కేవలం 43,400 బ్యారెళ్లు (మొత్తం చమురు దిగుమతుల్లో సుమారు 1 శాతం) దిగుమతి చేసుకుంది. రష్యా నుంచి బొగ్గు దిగుమతులు 1.8 మిలియన్ టన్నులుగా (మొత్తం బొగ్గు దిగుమతుల్లో 1.3 శాతం) ఉంది. రష్యా నుంచి భారత్ 2.5 మిలియన్ టన్నుల ద్రవీకృత సహజ వాయువు కూడా దిగుమతి చేసుకుంది. భారత్ ఎక్కువగా సౌదీ అరేబియా, ఇరాక్, ఇతర మధ్య ప్రాచ్య, ఆఫ్రికా, ఉత్తర అమెరికా దేశాల నుంచి క్రూడాయిల్ను కొనుగోలు చేస్తోంది. కాబట్టి ప్రస్తుతం సరఫరాపరమైన సమస్యలేమీ భారత్కు లేవు. కానీ రష్యా నుంచి వచ్చే క్రూడాయిల్, గ్యాస్ తగ్గిపోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో వీటికి డిమాండ్, దానికి అనుగుణంగా రేటూ పెరిగిపోతోంది. ఇదే ప్రస్తుతం భారత్ను కలవరపర్చే అంశం. సరఫరా ఉన్నా .. తగ్గని ఆందోళన.. రష్యా నుంచి సరఫరాకు అవాంతరాల వల్ల వినియోగదారులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అమెరికా సహా అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ)లోని 31 సభ్య దేశాలు తమ దగ్గరున్న నిల్వల్లో 60 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించాయి. అయినా క్రూడ్ రేటు పరుగు ఆగలేదు. ఫ్యూచర్స్ మార్కెట్లో బ్రెంట్ ధర బుధవారం ఒక దశలో 6.50% ఎగిసి 111.7 డాలర్లకు చేరింది. దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్సే్చంజీలోను మార్చి డెలివరీ కాంట్రాక్టు రూ. 436 (5.5 శాతం) పెరిగి రూ. 8,341 వద్ద ట్రేడయ్యింది. ఐఈఏ అదనంగా అందించే క్రూడాయిల్ ఏ మూలకూ సరిపోదని, రష్యా ఆరు రోజుల్లో 60 మిలియన్ బ్యారెళ్లకు మించి ఉత్పత్తి చేస్తుందని అంచనా. 150 డాలర్లకూ పెరగొచ్చు.. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి ముడిచమురు రేటు 86 డాలర్లకు దిగి రావచ్చని జేపీ మోర్గాన్ అంచనా వేస్తోంది. అయితే, రష్యా నుంచి ఇంధన ఎగుమతులు నిల్చిపోతే ధర 150 డాలర్లకు కూడా ఎగియవచ్చని పేర్కొంది. ‘స్థూలంగా చెప్పాలంటే రష్యా ఆయిల్ సరఫరా పూర్తిగా నిల్చిపోతే (ఇరాన్ ఎగుమతులు మళ్లీ పునరుద్ధరించి, వ్యూహాత్మక చమురు నిల్వలను వాడుకుంటే పాక్షికంగా తగ్గవచ్చు) ముడి చమురు రేటు బ్యారెల్కు 150 డాలర్లకు పెరగొచ్చు. అలా కాకుండా ఇంధన లావాదేవీలను వదిలేసి.. ఆంక్షలను మిగతా విభాగాలకే పరిమితం చేస్తే మాత్రం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రేటు సగటున 110 డాలర్ల స్థాయిలో తిరుగాడవచ్చు. అప్పుడప్పుడు 120 డాలర్ల స్థాయినీ తాకుతుండవచ్చు‘ అని జేపీ మోర్గాన్ పేర్కొంది. ఉత్పత్తి పెంపుపై ఒపెక్ మల్లగుల్లాలు.. ఇంధన కొరత పరిస్థితిని చక్కదిద్దేందుకు చమురు ఉత్పత్తి దేశాల కూటమి ఒపెక్ దృష్టి పెట్టింది. ఉత్పత్తిని ఎంత మేర పెంచాలన్న దానిపై కసరత్తు చేస్తోంది. రేటు పెరగడమనేది ఉత్పత్తి దేశాలకు లాభదాయకమే అయినప్పటికీ దీనివల్ల వినియోగ దేశాలపై భారం పెరిగి అవి మాంద్యంలోకి జారుకుంటే, ఆయిల్కు డిమాండ్ పడిపోయే ప్రమాదం కూడా ఉందనే అభిప్రాయం నెలకొంది. ఒపెక్ దేశాలు చాలా ఆచి తూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని టఫ్ట్స్ యూనివర్సిటీలోనిక్లైమేట్ పాలసీ ల్యాబ్ ఎండీ అమీ మయర్స్ అభిప్రాయపడ్డారు. అటు ఉక్రెయిన్పై దాడుల కోసం రష్యాకు భారీగా ఇంధనం అవసరం అవుతుంది కాబట్టి అది ఎక్కువగా ఎగుమతులు కూడా చేయలేకపోవచ్చని ఆమె తెలిపారు. అలాంటప్పుడు ఆ కొరతను ఎవరు భర్తీ చేస్తారన్నది కూడా ఆలోచించాల్సిన అంశమన్నారు. ప్రస్తుతానికైతే సౌదీ అరేబియాకు భారీ ఉత్పత్తి సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. -
2022 కంటే ముందే ఉక్రెయిన్పై రష్యా యుద్ధం!
రష్యా యుద్ధం ప్రకటించగానే ఉక్రెయిన్ తన గగనతలాన్ని మూసివేసింది. అయితే, ఉక్రెయిన్ గగనతలంపై 2022 కంటే ముందే రష్యా యుద్ధాన్ని ప్రారంభించిందన్న సంగతి మీకు తెలుసా? యుద్ధ భయంతో ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేయడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే పౌర విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అమెరికా, నాటో దళాలకు చెందిన కొన్ని మానవరహిత గూఢచారి విమానాలు మాత్రమే ఉక్రెయిన్ గగనతలంపై ఇపుడు కనబడుతున్నాయి. అయితే గగనతలం మూసివేయడం ఉక్రెయిన్కు కొత్త కాదు. ఇది 2014కి ముందు ప్రారంభమైంది. ఆ ఏడాది తర్వాత ప్రతి సంక్షోభ సమయంలోనూ ఆకాశ మార్గాలను మూసివేయాల్సిన అనివార్యత ఉక్రెయిన్కు ఏర్పడింది. ఎందుకంటే..? 298 మంది అమాయకులు బలి ఆ రోజు 2014 జూలై 17. ఆమ్స్టర్డామ్ నుంచి కౌలాలంపూర్కు బయలుదేరిన మలేసియా ఎయిర్లైన్స్ విమానం ఎంహెచ్17 తూర్పు ఉక్రెయిన్లో రష్యా సరిహద్దుకు సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలింది. 283 మంది ప్రయాణికులు, 15 మంది విమాన సిబ్బంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ముందు అందరూ ప్రమాదంగానే భావించారు. తర్వాతే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భూతలం నుంచి క్షిపణి ప్రయోగించి విమానాన్ని కూల్చివేసినట్టు వెల్లడికావడంతో యావత్ ప్రపంచం దిగ్భ్రమకు గురైంది. అసలేం జరిగింది? దక్షిణ ద్వీపకల్పం.. అప్పటి సార్వభౌమ ఉక్రెయిన్లో భాగమైన క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది. తూర్పు ఉక్రెయిన్లోని వేర్పాటువాద, తమకు అనుకూల తిరుగుబాటు గ్రూపులకు రష్యా మద్దతునిచ్చింది. ఈ సంక్షోభ సమయంలోనే మలేసియా విమానం కూల్చివేత ఘటన జరిగింది. ఈ విమానానికి ఉక్రెయిన్లో ఎటువంటి స్టాప్లు లేవు. ఉక్రెయిన్- రష్యా సరిహద్దు మీదుగా తూర్పు ఉక్రెయిన్లోని కల్లోలిత ప్రాంతాలపై 33,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానాన్ని క్షిపణితో నేలకూల్చారు. విమానం మూడు ముక్కలై తూర్పు ఉక్రెయిన్లోని వివిధ ప్రదేశాలలో నేలపై కూలిపోయింది. మొత్తం 298 మంది ప్రయాణికులు, సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. తూర్పు ఉక్రెయిన్లోని రష్యా అనుకూల గ్రూపులు విమానాన్ని కూల్చివేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితే, ఈ దారుణ ఘటనలో తమ ప్రమేయం ఉందన్న ఆరోపణలను రష్యా నేటికీ ఒప్పుకోకపోవడం గమనార్హం. నలుగురు వ్యక్తులు, ముగ్గురు రష్యా మాజీ ఏజెంట్లు, విమానాన్ని కూల్చివేసినట్లు అభియోగాలు మోపి దర్యాప్తు సంస్థలు చేతులు దులుపుకున్నాయి. తప్పిన పెను ముప్పు 2014లో జరిగిన ఘటనకు ముందు మరికొన్ని ఉక్రెయిన్ సైనిక విమానాలు కూడా కూల్చివేయబడ్డాయి. అయితే సేఫ్ ఫ్లయింగ్ జోన్లో ఎగురుతున్న పౌర విమానంపై దాడి యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసింది. మలేసియా విమానం కూల్చివేసిన రోజు.. పలు పౌర విమానాలు అదే మార్గంలో ప్రయాణించాయి. ఎయిర్ ఇండియా విమానం ఒకటి అదే జోన్ గుండా ప్రయాణించాల్సి ఉంది. అదృష్టవశాత్తు మిగతా విమానాలు సురక్షితంగా బయటపడ్డాయి. (క్లిక్: భారత్ అభ్యర్థనకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన రష్యా..) ఉక్రెయిన్కు రష్యా దెబ్బ మలేసియా విమానం కూల్చివేత తర్వాత ఉక్రెయిన్ గగనతలం గుండా ప్రయాణించే విమానాల సంఖ్య తగ్గిపోయింది. ముఖ్యంగా తూర్పు ఉక్రెయిన్ గగనతలంపై నుంచి విమాన రాకపోకలు చాలా వరకు తగ్గాయి. ఉక్రెయిన్ గగనతలం సురక్షితం కాదన్న ప్రచారంతో మిగతా ప్రపంచం నుంచి ఉక్రెయిన్ను రష్యా దూరం చేయగలిగింది. మరోవైపు ఆర్థికంగానూ శత్రుదేశాన్ని దెబ్బకొట్టింది. తాజాగా రష్యా దురాక్రమణకు దిగడంతో.. గతానుభవాల దృష్ట్యా ఉక్రెయిన్ ముందుగా గగనతలాన్ని మూసివేసింది. దీంతో ఫిబ్రవరి 24న భారత పౌరులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు న్యూఢిల్లీ నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఉక్రెయిన్ సరిహద్దులను చేరుకోవడానికి ముందే వెనుదిరిగింది. ఉక్రెయిన్ గగనతలం మీదుగా ప్రయాణించాల్సిన ఇజ్రాయెల్ విమానం కూడా యూ-టర్న్ తీసుకోక తప్పలేదు. (క్లిక్: ఉక్రెయిన్ సంక్షోభం: చిన్నమ్మ ఈ పరిస్థితుల్లో ఉండి ఉంటేనా..) - సాక్షి, వెబ్ స్పెషల్ -
ఉక్రెయిన్ సంక్షోభం: చిన్నమ్మా.. నువ్వు లేని లోటు!
ఉక్రెయిన్ సంక్షోభాన్ని అంచనా వేయడంలో భారత ప్రభుత్వం తడబడింది. నెలన్నర కిందట.. కేవలం ఉక్రెయిన్లోని భారతీయుల క్షేమసమాచారాల సేకరణకే పరిమితం అయ్యింది అక్కడి మన ఎంబసీ. మరోవైపు ఆ సంక్షోభంలోనూ తరగతులు నిర్వహించి ఉక్రెయిన్ యూనివర్సిటీలు తప్పు చేస్తే.. విద్యా సంవత్సరం నష్టపోకూడదనే ఉద్దేశంతో భయభయంగానే అక్కడే ఉండిపోయారు భారతీయ విద్యార్థులు. అవే ఇప్పుడు ఆపరేషన్ గంగకు అవాంతరాలుగా మారాయి. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియాలో చిన్నమ్మ ‘సుష్మాస్వరాజ్’ మీద ఆసక్తికర చర్చ నడుస్తోంది. రష్యా బలగాలు ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించిన సమయంలో.. భారత ప్రభుత్వం స్పందించి ఉక్రెయిన్లోని మన రాయబార కార్యాలయాన్ని అప్రమత్తం చేసింది. పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, భారత పౌరులంతా ఎప్పటికప్పుడు అప్డేట్ల కోసం ఎంబసీ అధికారిక వెబ్సైట్ను క్రమం తప్పకుండా ఫాలో అవ్వాలని కోరింది. ఈ మేరకు తమ క్షేమసమాచారాల్ని ఎప్పటికప్పుడు వెబ్సైట్లోని ఫామ్లలో అప్డేట్ చేయాలంటూ భారత పౌరులకు సూచించింది. అయితే అప్పటికే చాలా దేశాల పౌరులు తమ తమ స్వస్థలాలకు తిరుగు ప్రయాణం అయ్యారు. ఆపై పరిస్థితి విషమిస్తున్న.. నాలుగైదు రోజుల ముందు కూడా అమెరికా సహా పలు దేశాలు తిరిగి వచ్చేయాలంటూ ఆయా దేశాల పౌరులకు సూచించాయి. కానీ, భారత ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కిస్తూ ఉండిపోయిందని, ఆ ఆలస్యమే భద్రత భయాందోళనలకు కారణమన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. ఉక్రెయిన్ భారత విద్యార్థులు ఆమె ఉండి ఉంటేనా.. ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యంలో ‘చిన్నమ్మ’ సుష్మా స్వరాజ్ ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని కొందరు నెటిజన్లు, సీనియర్ దౌత్యవేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా.. వేచిచూసే ధోరణికి ఆమె పూర్తి వ్యతిరేకమని గుర్తు చేసుకుంటున్నారు. విదేశాంగ మంత్రిగా పని చేసిన టైంలో.. దౌత్యపరంగానే కాదు, సహాయచర్యల్లోనూ ఆమె దూకుడు ప్రదర్శించేవారు. అనుమతుల కోసం ఎదురు చూడకుండా.. ఎంఈఏ ట్విటర్ హ్యాండిల్ ద్వారా స్వయంగా సుష్మాజీనే రంగంలోకి దిగేవారు. పరిస్థితి ఎలాంటిదైనా.. ఎంతటి క్షిష్టమైన సమస్య అయినా సామరస్యంగా, చాకచక్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నించేది ఈ చిన్నమ్మ. అందుకే ఇప్పుడు ఆమెను గుర్తు చేసుకుంటున్నారు. I have got the report. As per medical advice, your brother cannot travel at this stage.Your mother is with him in Georgia. /1 https://t.co/QOwtXsgmz2 — Sushma Swaraj (@SushmaSwaraj) February 1, 2017 సింగిల్ హ్యాండ్ సుష్మా.. యుద్ధం మొదలైన తర్వాతే భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగను మొదలుపెట్టింది. ఉక్రెయిన్ పొరుగు దేశాలకు విమానాలు పంపించి.. వాటి సరిహద్దులకు చేరుకున్న భారతీయులను, విద్యార్థులను తరలిస్తోంది. ఆయా దేశాలతో సమన్వయ చర్చలు ప్రారంభించి.. ఇక్కడి నుంచి నలుగురు కేంద్ర మంత్రుల్ని కార్యక్రమాల్ని పర్యవేక్షించాలని పంపించింది మోదీ ప్రభుత్వం. అయినా తరలింపులో ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. అఫ్కోర్స్.. అక్కడున్న పరిస్థితులే అందుకు కారణం అనుకోండి. అది వేరే విషయం. అయితే.. సుష్మా స్వరాజ్ ఈ పరిస్థితిలో ఉండి ఉంటే పరిస్థితిని ఎలా డీల్ చేసి ఉండేవారో? అనే చర్చను లేవనెత్తారు పలువురు నెటిజన్లు. I have asked for a report from Indian Embassy in Dubai. Indian Walked 1,000 Km To Dubai Court https://t.co/kbvwVV67QP via @ndtv @templetree1 — Sushma Swaraj (@SushmaSwaraj) November 30, 2016 వాస్తవానికి సోషల్ మీడియా వేదికగా సుష్మాజీ జోక్యం చేసుకునే తీరు చాలాసార్లు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఇతర దేశాలతో డిజిటల్ దౌత్యం ద్వారా ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు సుష్మాజీ. తెలంగాణ యువత కేటీఆర్ లాంటి ఎంతో మందికి ఒకరకంగా ఇదే స్ఫూర్తి అనే అనుకోవచ్చు. ఆపదలో ఉన్నామని, సాయం కావాలని ఎవరైనా అభ్యర్థిస్తే చాలు.. ట్విటర్ ఎంఈఏ హ్యాండిల్ ద్వారా నేరుగా రంగంలోకి దిగేవారామె. అలా.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భారతీయులకు సాయం అందించి.. వాళ్ల ఆశీర్వాదాలు, కృతజ్ఞతలు అందుకున్నారామె. వ్యక్తిగత సాయాలను పక్కనపెడితే.. 2015 ఆపరేషన్ రాహత్ గుర్తించి ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఆపరేషన్ రాహత్ నాటి ఫొటో ఒకవైపు సౌదీ అరేబియా-మిత్రపక్షాలతో సంప్రదింపులు జరుపుతూనే.. మరోవైపు ఉద్రిక్త వాతావరణం నడుమ ఐదు వేలమంది భారతీయులను, ఇతర దేశాల పౌరులను సురక్షితంగా బయటకు రప్పించిన ఘనత కచ్చితంగా ఆమె టీందే. ముఖ్యంగా బాంబులతో దద్దరిల్లిన ప్రాంతాల నుంచి పౌరులను సురక్షితంగా తరలించిన తీరు.. విరామం తీసుకోకుండా దగ్గరుండి ఆమె పర్యవేక్షించడంపై అప్పట్లో హర్షం వ్యక్తం అయ్యింది. ఇదే కాదు.. 2018 అగ్నిప్రమాదంలో పాస్పోర్టులు తగలబడి పోయి ఇబ్బందులు పడ్డ ఇల్లినాయిస్ యూనివర్సిటీ(అమెరికా) విద్యార్థులను చట్టమైన పరమైన ఇబ్బందులు తలెత్తకుండా భారత్కు రప్పించిన ఘటనా గుర్తు చేస్తున్నారు కొందరు. ఉక్రెయిన్ పరిస్థితులు వేరు కావొచ్చు.. కానీ, ఈ పరిస్థితుల్లో గనుక ఆమె ఉండి ఉంటే మాత్రం పరిస్థితి కచ్చితంగా వేరేలా ఉండేదన్న అభిప్రాయం మాత్రం అంతటా వ్యక్తం అవుతోంది. వీ మిస్ యూ చిన్నమ్మ. Repatriating our diaspora during difficult times is a competence & commitment of India that most citizens will acknowledge.I respectfully recall Smt Sushma Swaraj who became a powerful symbol of this commitment. 🙏🏽 https://t.co/lmmPQhhOm6 — anand mahindra (@anandmahindra) August 22, 2021 ::: సాక్షి, వెబ్ డెస్క్ ప్రత్యేకం -
కీవ్ నుంచి బయటపడండి.. భారత ఎంబసీ హెచ్చరికలు
ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. యుద్ధం మరింత తీవ్రతరం కావడంతో.. రాజధాని కీవ్లో ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చని, తక్షణమే కీవ్ను వీడాలని ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం భారత పౌరులకు మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది. రష్యా బలగాలు భారీగా కీవ్ నగరం వైపుగా కదులుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో రైళ్లు, ఇతర మార్గాల ద్వారా అత్యవసరంగా కీవ్ నుంచి బయటపడాలని భారత పౌరులకు(విద్యార్థులతో సహా) ఎంబసీ ద్వారా సూచించింది కేంద్ర ప్రభుత్వం. పరిస్థితి ఏ క్షణం ఎలాగైనా మారొచ్చని.. జాగ్రత్తగా సరిహద్దులకు చేరాలని ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ఉక్రెయిన్లోని పౌరులను తక్షణమే తరలించేలా సీ-17 విమానాలను పంపాలని కేంద్రం నిర్ణయించింది. త్వరగతిన తరలింపు ప్రక్రియను కొనసాగించాలని అనుకుంటోంది. మరోవైపు అమెరికా సహా పలు దేశాలు కీవ్లోని రాయబారులను తరలించింది. Advisory to Indians in Kyiv All Indian nationals including students are advised to leave Kyiv urgently today. Preferably by available trains or through any other means available. — India in Ukraine (@IndiainUkraine) March 1, 2022 -
రష్యా- ఉక్రెయిన్ మధ్య ముగిసిన చర్చలు..
-
మద్యం ప్రియులకు భారీ షాక్..!
రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో బీర్ల ధరలు భారీగా పెరగనున్నాయి. మద్యాన్ని తయారు చేసేందుకు ఉపయోగించే కీలకమైన బార్లీ ధరలు, సరఫరాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో దేశంలో బీర్ ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే, రష్యా-ఉక్రెయిన్ వివాదంతో యుఎస్, కెనడాతో పాటు ఇతర దేశాల్లో రష్యా బ్రాండెడ్ స్పిరిట్లను బహిష్కరించడంతో వోడ్కా ధర భారీగా పెరిగింది. రష్యా, ఉక్రెయిన్ బార్లీ రష్యా ప్రపంచంలో రెండవ అతిపెద్ద బార్లీ ఉత్పత్తిని కలిగి ఉండగా, ఉక్రెయిన్ ప్రపంచవ్యాప్తంగా మాల్ట్ నాల్గవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. అయితే యుద్ధ సంక్షోభం తీవ్రమైతే బార్లీ ధరలు పెరిగే అవకాశం ఉంది. దేశం బార్లీని ఉత్పత్తి చేస్తుంది భారతదేశం కూడా బార్లీని ఉత్పత్తి చేస్తుంది. దేశంలోని అనేక బ్రేవరీలు బార్లీ దేశీయ ఉత్పత్తిపై మాత్రమే ఆధారపడి ఉన్నాయి. అయితే అంతర్జాతీయ బార్లీ ధరలు పెరగడం వల్ల దేశీయంగా ధరలపై ప్రభావితం కావచ్చు. ప్రభావం ఎలా ఉంటుందో బీర్ బ్రాండ్ బిరా 91 చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంకుర్ జైన్ మాట్లాడుతూ..రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం ప్రపంచ బార్లీ ధరలపై ప్రభావం చూపుతుందని. అయితే ఇది స్వల్పంగా ఉంటుందా..? దీర్ఘంగా కొనసాగుతుందో తెలియాలని జైన్ చెప్పారు. -
ప్రధానికి పుల్ సపోర్ట్ ఇస్తానంటున్న మమతా బెనర్జీ.. అందరం ఒక్కటై..
కోల్కతా: రాజకీయంగా ఎప్పుడూ నువ్వా-నేనా అంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ప్రధాని నరేంద్రమోదీ తలపడతారనేది అందరికీ తెలిసిన విషయమే. తాజగా ఫైర్ బ్రాండ్ దీదీ ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీకి పూర్తి మద్దతు తెలిపారు. ఉక్రెయిన్ అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ మమతా ఓ లేఖను ప్రధానికి పంపారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్రమైన సంక్షోభం ఏర్పడిందని, వాటి నుంచి బయటపడటం ఎంతైనా అవసరం ఉందన్న మమతా.. అందుకోసం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడాన్ని పరిశీలించాలని ఆమె కోరారు. ఉక్రెయిన్లో ఉన్న విద్యార్థులను త్వరితగతిన దేశానికి రప్పించాలిని కోరారు. సహకార సమాఖ్య వ్యవస్థలో ఉన్న ఓ సీనియర్ ముఖ్యమంత్రిగా ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో మన దేశ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు మమత ఆ లేఖలో తెలిపారు. సంక్షోభ సమయంలో దౌత్య వ్యవహారాలను సరైన రీతిలో అమలు చేస్తారని ఆశిస్తున్నట్లు దీదీ తన లేఖలో తెలిపారు. తీవ్రమైన అంతర్జాతీయ సంక్షోభ సమయాల్లో ఒక దేశంగా ఐక్యంగా నిలబడాల్సి అవసరం ఎంతైనా ఉందని అందుకు మన దేశీయ విబేధాలను పక్కనపెట్టి ఉండాలని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ఉన్నందున, ప్రపంచానికి శాంతియుత పరిష్కారాన్ని అందించడానికి భారత్ నాయకత్వం వహించాలని ప్రధానికి సూచించారు. -
అది ఒక బీర్.. కానీ, ఇప్పుడు అదే ఉక్రెయిన్ ‘ఆయుధం’!
ఉక్రెయిన్ నగరం లీవ్.. పోలాండ్ బార్డర్కి 70 కిలోమీటర్ల దూరం. ఆ భూభాగంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తున్న రష్యా దళాలకు రెండు రోజులుగా ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. సైన్యం తుటాలు, బాంబులతో పాటు గాల్లోంచి పడుతున్న బీర్ సీసాలు.. భారీ శబ్ధాలతో పేలిపోతున్నాయి. దీంతో రష్యా బలగాలు అక్కడే ఆగిపోయాయి. ఇంతకీ ఆ బీర్.. ఎందుకలా పేలిపోతున్నాయో చెప్తున్నారు ప్రావ్డా బ్రూవరీ యజమాని యూరై జాస్టనీ. ఉక్రెయిన్ లోని లివ్ పట్టణానికి చెందిన ప్రావ్డా బ్రూవరీ బీర్ల తయారీకి ప్రసిద్ధి. కానీ, యుద్ధం నేపథ్యంలో బీర్ల తయారీని ఆపేసింది ఈ కంపెనీ. అందుకు బదులుగా రష్యా సైన్యం కోసం ప్రత్యేకంగా ‘మొలటోవ్ కాక్ టెయిల్’ తయారు చేస్తోంది. తాగడానికి కాదు.. లేపేయడానికి!. ప్రస్తుతం ఈ కంపెనీలో ఉద్యోగులు హుషారుగా ఈ బాటిల్ బాంబులను తయారు చేస్తున్నారు. ఈ బీర్ బాటిళ్లలో ఆయిల్, పెట్రోల్ మిక్స్ చేసి వాడేస్తున్నారు. అందులో గుడ్డను ముంచి రష్యా బలగాల వైపునకు విసిరేస్తున్నారు. లోపల ఉండే కాక్ టెయిల్ పెట్రోల్, ఆల్కహాల్ మాదిరే మండే స్వభావంతో ఉంటుంది. సీసా మూతభాగంలో ఉన్న వస్త్రానికి అగ్గి రాజేసి శుత్రు సేనలపై విసిరి కొడితే అవతలి వాళ్ల పని మటాషే!. ఉక్రెనియన్ టెర్రిటోరియల్ డిఫెన్స్ ఫోర్స్ల కోసం శనివారం నుంచి తయారు చేస్తున్నారు. 2014 క్రిమియా సంక్షోభం సమయంలోనూ ప్రత్యర్థుల మీద ఈ తరహా దాడులు జరిగాయట. ఆ సమయంలో కంపెనీలో పని చేసిన ఓ వ్యక్తి.. అప్పటి విషయాన్ని గుర్తు చేయడంతో మళ్లీ బీర్ బాటిల్ బాంబులు తయారవుతున్నాయి. ఈ యుద్ధానికి మద్దతుగా మేము మా వంతుగా ప్రతిదీ చేస్తాం. ఎవరో ఒకరు దీన్ని చేయాలి. 2014లోనూ దీన్ని తయారు చేసి వినియోగించిన దాఖలాలున్నాయి. మా ఉద్యోగి ఒకరికి మెలటోవ్ కాక్ టెయిల్ తయారీ గురించి తెలుసు. అందుకే దీన్ని తయారు చేయడం మొదలు పెట్టాం అని చెప్తున్నారు యూరై. ఇదిలా ఉంటే ఈ కంపెనీ గతంలోనూ ‘పుతిన్ ఖుయ్లో’ అంటూ పుతిన్ అవమానిస్తూ గతంలో బీర్లు తయారు చేసింది. అవి భయంకరంగా అమ్ముడు పోయేవి కూడా. -
ఉక్రెయిన్లో భారతీయులు.. కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్ పరిణామాలు, ముఖ్యంగా అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల తరలింపే ఎజెండాగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సోమవారం హై లెవల్ మీటింగ్ జరిగింది. ఇప్పటికే ఆపరేషన్ గంగ పేరుతో భారతీయులను స్వదేశానికి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా భేటీలో.. కేంద్రమంత్రులు స్వయంగా ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లి తరలింపు ప్రక్రియను పర్యవేక్షించాలని ప్రధాని మోదీ నిర్ణయించినట్లు సమాచారం. కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరెన్ రిజ్జు, జనరల్(రిటైర్డ్) వీకే సింగ్ ఇందులో పాల్గొననున్నట్లు అధికార వర్గాల సమాచారం. వీళ్లు హంగేరి, రొమేనియా, పోల్యాండ్, స్లొవేకియా దేశాలకు వెళ్తారు. అక్కడే ఉండి పరిస్థితి సమీక్షిస్తూ.. భారతీయుల తరలింపును వేగవంతం చేస్తారు. భారతీయులను సురక్షితంగా, త్వరగతిన స్వదేశానికి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశంగా ఈ మిషన్ను చేపట్టింది కేంద్రం. మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ ఉన్నత స్థాయి సమావేశంలో.. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సహా పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ నుంచి పోల్యాండ్కు వలసలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ తరుణంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటుండగా.. భారతీయులపై స్థానిక పోలీసులు దాడి చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఉక్రెయిన్లో సుమారు పదిహేను వేల మంది దాకా భారతీయులు ఉన్నట్లు కేంద్రం అంచనా వేస్తోంది. #WATCH | Prime Minister Narendra Modi calls a high-level meeting on the Ukraine crisis. Some Union Ministers may go to neighboring countries of Ukraine to coordinate the evacuations.#RussiaUkraineCrisis pic.twitter.com/yqTFYwspxo — ANI (@ANI) February 28, 2022 -
ఉక్రెయిన్: సారీ అమ్మా.. నేను భారత్కు రాలేను!
ఉక్రెయిన్ యుద్ధ వాతావరణంతో అక్కడి పౌరులు సైతం ఆయుధాలు చేతబడ్డి కదనరంగంలోకి దూకారు. ఇక విదేశీ పౌరులేమో ప్రాణాల కోసం పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు భారత్కు క్షేమంగా చేరుకున్నారు. మరికొందరిని రప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇంకొందరు బంకర్లలో(అండర్ గ్రౌండ్ల్లో) తలదాచుకుని సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఓ విద్యార్థిని చేసిన పని.. ఆమె కుటుంబంలో ఆందోళన కలిగిస్తుండగా.. మిగిలిన వాళ్లంతా శెభాష్ అని మెచ్చుకుంటున్నారు. Russia-Ukraine crisis: హర్యానాకు చెందిన నేహా .. మెడిసిన్ కోసం ఉక్రెయిన్ వెళ్లింది. కొన్నాళ్లు హాస్టల్లో ఉన్న ఆమె ఆ తర్వాత ఉక్రెయిన్కు చెందిన ఒక సివిల్ ఇంజనీర్ ఇంట్లో ఆశ్రయం పొందింది. ప్రస్తుత పరిస్థితుల్లో.. కావాలంటే ఆమె భారత్కు తిరిగి వచ్చేది. కానీ, ఆమె ఉంటున్న ఇంటి యజమాని యుద్ధం కోసం సైన్యంలో చేరాడు. ఈ పరిస్థితుల్లో ఆ ఇంటిని వీడేందుకు నేహ నిరాకరించింది. తనకు అన్నం పెట్టిన కుటుంబం ఆపదలో ఉంటే ఎలా రావాలంటూ.. అక్కడే ఉండిపోయింది. అదే ఇంట్లోనే ఉండి పిల్లలను చూసుకోవడంలో ఆయన భార్యకు సాయం చేయాలని నిర్ణయించుకుంది. 17 ఏళ్ల నేహా ప్రస్తుతం సదరు ఇంజనీర్ భార్య, ఆయన ముగ్గురు పిల్లలతో కలిసి బంకర్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. నేహా కుటుంబం మాతృభూమి కోసం ఎంతో త్యాగం చేసింది. ఆమె తండ్రి ఇండియన్ ఆర్మీలో పనిచేసేవాళ్లు. కొన్నేళ్ల కిందట యుద్ధంలో ఆయన కన్నుమూశారు. అప్పటి నుంచి తల్లి బాధ్యతగా ముందుకెళ్తోంది. ఆమె ప్రస్తుతం హర్యానాలోని చర్కీ దాద్రీ జిల్లాలో టీచర్గా పని చేస్తున్నారు. తన కూతురిని ఉక్రెయిన్ నుంచి రప్పించేందుకు నేహా తల్లి ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ, నేహ మాత్రం ససేమిరా అంది. ‘నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు కానీ.. ఈ పిల్లలను వదిలి రాలేను. నాకు జన్మనిచ్చిన తండ్రి దేశం కోసం అమరుడయ్యాడు. తండ్రి లాంటి వ్యక్తి దేశం కోసం పోరాటంలో ఉన్నారు. అన్నం పెట్టిన ఈ అమ్మను ఇలాంటి పరిస్థితిలో వదిలిపెట్టలేను’ అంటూ తన తల్లితో చెప్పేసింది. ఈ విషయాన్ని నేహ కుటుంబానికి దగ్గరైన సవితా జాఖర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. -
స్విఫ్ట్ నుంచి బహిష్కరణ.. రష్యాకు నిజంగానే నష్టమా?
ఆంక్షలతో రష్యాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పాశ్చాత్య దేశాలు.. మరో కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. స్విఫ్ట్ నుంచి రష్యాను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇది ఇక్కడితోనే ఆగలేదు.. రష్యా కంపెనీలు, కుబేరులకు ఉన్న ఆస్తులను గుర్తించి జప్తు చేసేందుకు ఉమ్మడి టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని కూడా అమెరికా, యూరోపియన్ కమిషన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఇంగ్లండ్, కెనడా నిర్ణయించాయి. పుతిన్కు ఈ యుద్ధం అతిపెద్ద వ్యూహాత్మక వైఫల్యంగా మిగిలిపోయేలా చేసి తీరతామంటూ ఆయా దేశాల నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. క్రమంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి రష్యాను పూర్తిగా బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఆర్థిక ఆంక్షల్లో చివరి అస్త్రంగా అభివర్ణించే స్విఫ్ట్ బహిష్కరణ వల్ల నిజంగా రష్యాకు జరిగే నష్టం ఎంతో చూద్దాం.. సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్.. షార్ట్ కట్లో స్విఫ్ట్. హెడ్ క్వార్టర్స్ బెల్జియంలో ఉంది. ప్రపంచంలోని 200 దేశాలకు పైగా లావాదేవీలకు అనుసంధానకర్త ఈ స్విఫ్ట్. సుమారు 11 వేలకు పైగా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు.. ఇందులో సభ్యులుగా ఉంటాయి. స్విఫ్ట్ పేరుకు తగ్గట్లే వేగంగా పని చేస్తుంది. ప్రపంచంలోని ఏ మూల ఉన్నా సరే.. క్షణాల్లో వ్యక్తులు ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకోవచ్చన్నమాట. స్విఫ్ట్పరంగా ఆంక్షలు విధిస్తే.. ఆటోమేటిక్గా అంతర్జాతీయ సమాజం నుంచి ఆ దేశం దూరమైనట్లే లెక్క!. అలాగే అవసరం అనుకుంటే ఆ నిషేధాన్ని ఎత్తేయొచ్చు కూడా. ఎఫెక్ట్ ఎంతంటే.. మరి స్విఫ్ట్ నుంచి రష్యాను తొలగించడం వల్ల ఏమేర ప్రభావం ఉంటుందంటే.. రష్యా బ్యాంకులు అమెరికా, కెనడా, యూరప్లోని బ్యాంకులతో అనుసంధానం కాలేవు. ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోతాయి(ఆల్రెడీ పోయాయి కూడా). ముఖ్యంగా రష్యా ధనికులపై తీవ్ర ప్రభావం పడుతుంది. రష్యా బ్యాంకుల కార్యకలాపాలు విదేశీయంగా నిలిచిపోతాయి. ఏటీఎం, నెట్బ్యాంకింగ్ సహా ఏవీ పని చేయవు. క్రమక్రమంగా రష్యాలోనూ ఈ ప్రభావం చూపెట్టే అవకాశాలు ఉన్నాయి. రష్యా సెంట్రల్ బ్యాంకు దగ్గర ఉన్న దాదాపు 60 వేల కోట్ల డాలర్లకు పైగా విదేశీ మారక ద్రవ్య నిధులపైనా ఈ నిషేధం కొనసాగుతుంది. చివరికి.. రష్యా కీలక సంపద చమురు, సహజవాయువు ఎగుమతులపైకు కూడా స్విఫ్ట్ వ్యవస్థ అవసరం. పరిస్థితి చేజారితే.. రష్యా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే అవకాశం లేకపోలేదు. అందుకే నిషేధంపై రష్యా లోలోపల గుర్రుగా ఉంది. అయితే దీనివల్ల తమకొచ్చిన నష్టం లేదని, స్విఫ్ట్కు ప్రత్యామ్నయ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటామని పైకి మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ఇంతకు ముందు.. ఇలా స్విఫ్ట్ ఆంక్షలు విధించడం గతంలోనూ జరిగింది. అణు ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్పై ఈ తరహా నిషేధం విధించడం వల్ల .. విదేశీ వాణిజ్యంలో 30 శాతం నష్టపోయింది. ఇంతకుముందు రష్యాకు ఓసారి స్విఫ్ట్ వార్నింగ్ పడింది కూడా. 2014 క్రిమియా (ఉక్రెయిన్ ఆధీనంలో ఉండేది) ఆక్రమణ సందర్భంగా స్విఫ్ట్ నిషేధం విధిస్తామని పాశ్చాత్య దేశాలు బెదిరించగా.. ఇది యుద్ధమే అవుతుందంటూ రష్యా ప్రకటించడంతో వెనక్కి తగ్గాయి. యూరప్ దేశాల నుంచి అభ్యంతరాలు? ఆర్థికంగా రష్యా రెక్కలు విరిచే చర్యలను అమెరికా, నాటో సభ్య దేశాలు ఒక్కొక్కటిగా అమల్లో పెడుతున్నాయి. అయితే.. యూరప్ తో రష్యా ఏడాదికి 8 వేల కోట్ల యూరోలకు పైనే వాణిజ్యం జరుపుతోంది. అందుకే స్విఫ్ట్పై పలు యూరప్ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఉక్రెయిన్పై మొండిగా రష్యా ముందుకు పోతుండడంతో.. నిన్నటిదాకా వ్యతిరేకించిన యూరప్ దేశాలు సైతం అంగీకారం చెప్తుండడం విశేషం. అంతేకాదు ఆంక్షలను సమర్థవంతంగా అమలు చేసేందుకు టట్రాన్స్ అట్లాంటిక్ సంయుక్త కార్యదళాన్ని ఏర్పాటు చేయనున్నట్లు యూరప్ కమిషన్(ఈసీ) ప్రెసిడెంట్ ఉర్సులా వానెడెర్ లియాన్ తెలిపారు. -
Russia-Ukraine War: ముగిసిన చర్చలు.. అమెరికా కీలక నిర్ణయం
ముగిసిన చర్చలు.. అమెరికా కీలక నిర్ణయం ► ఉక్రెయిన్-రష్యా మధ్య జరిగిన శాంతి చర్చలు ఎటూ తేలకుండా ముగియడంతో ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. మరోవైపు చర్చల ముగిసిన కాసేపటికే అగ్ర రాజ్యం అమెరికా కీలక ప్రకటన చేసింది. అమెరికా ఎంబసీ సిబ్బంది రష్యాను వీడేందుకు అనుమతిచ్చింది. రష్యాలో ఉన్న అమెరికా పౌరులు సైతం వెంటనే ఆ దేశాన్ని వీడాలని సూచించింది. కాగా, భద్రతా కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశం ►ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా రష్యా ఉక్రెయిన్ దేశాలు వెంటనే కాల్పులు విరమించుకోవాలని ఐరాస పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించనున్నారు. యుద్ధంపై 193 దేశాలు తమ అభిప్రాయాన్ని తెలపనున్నాయి. తగ్గేదేలే.. 36 దేశాల విమానాలపై నిషేధం ► ఇప్పటికే పలు దేశాలు రష్యా పై పలు రకాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే రష్యా మాత్రం వాటికి ఏ మాత్రం బెదరక పోగా తాజాగా బ్రిటన్, జర్మనీ, తదితర 36 దేశాలకు చెందిన విమానాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధాని అత్యున్నత స్థాయి సమావేశం ►ఉక్రెయిన్లో పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఉక్రెయిన్లోని భారతీయలు తరలింపు ప్రక్రియపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే భారతీయుల తరలింపును మరింత వేగవంతం చేయడంపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బెలారస్లో ముగిసిన చర్చలు ►బెలారస్లో ఉక్రెయిన్-రష్యా బృందాల మధ్య చర్చలు ముగిశాయి. సుమారు 4 గంటల పాటు ప్రతినిధుల మధ్య ఈ చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఉక్రెయిన్ నుంచి ఆరుగురు, రష్యా నుంచి ఐదుగురు ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని, క్రిమియా నుంచి కూడా బలగాలను తొలగించాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తుండగా.. నాటోలో చేరబోమని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని రష్యా పట్టుబడినట్టు సమాచారం. అయితే, ఇరు వర్గాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా చర్చలు విఫలమైనట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్కు మద్దతుగా వైట్ హౌస్ వద్ద నిరసనలు ► ఉక్రెయిన్-రష్యా సంక్షోభం అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ను తాకింది. రష్యా అధ్యక్షుడు పుతిన్కు వ్యతిరేకంగా, ఉక్రెయిన్కు మద్దతుగా ఆ దేశ జెండాలు పట్టుకుని ఉక్రేనియన్లు నిరసనలు తెలిపారు. తమ స్వదేశానికి మద్దతుగా వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ ముందు ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో ఉక్రెయిన్లో పుట్టి రష్యాలో పెరిగిన ఓ వ్యక్తి కూడా పాల్గొనడం విశేషం. #WATCH | With Ukrainian flags, prayers & slogan chanting against Russian President Putin, protesters gathered in front of the White House in Washington, DC in a show of support for Ukraine pic.twitter.com/1nBYZHcl2x— ANI (@ANI) February 28, 2022 స్వదేశం చేరుకున్న 1400 మంది భారతీయులు ► ఉక్రెయిన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కారణంగా కేంద్రం భారతీయులను స్వదేశానికి తరలిస్తోంది. కాగా, ఇప్పటి వరకు 6 ప్రత్యేక విమానాల్లో 1400 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్టు భారత విదేశాంగ శాఖకు చెందిన అధికారి అరిండమ్ బాగ్చీ తెలిపారు. ఆరు విమానాల్లో 4 బూచారెస్ట్(రొమేనియా), మరో 2 బుడాపెస్ట్(హంగేరీ) నుంచి వచ్చినట్టు పేర్కొన్నారు. As of now, six flights have arrived carrying around 1400 Indian citizens. Four flights have arrived from Bucharest (Romania) and two flights from Budapest (Hungary): MEA Spokesperson Arindam Bagchi pic.twitter.com/2K7EjEacHF — ANI (@ANI) February 28, 2022 ఉక్రెయిన్కు ఈయూలో సభ్యత్వంపై భిన్నాభిప్రాయాలు: చార్లెస్ మిచెల్ ► ఉక్రెయిన్పై రష్యా దాడుల నేపథ్యంలో తమ దేశానికి ఈయూలో సభ్యత్వం ఇవ్వాలని జెలెన్ స్కీ అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ ఉన్నతాధికారి చార్లెస్ మిచెల్ స్పందిస్తూ.. ఈయూ కూటమిలో ఉక్రెయిన్ చేరడంపై కూటమిలోని 27 దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు. ఈయూలో ఉక్రెయిన్కు వెంటనే సభ్యత్వం ఇవ్వండి: జెలెన్ స్కీ ► ఉక్రెయిన్పై రష్యా దాడుల చేస్తున్న వేళ తమ దేశానికి వెంటనే యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో సభ్యత్వం ఇవ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అభ్యర్థించారు. యూరోపియన్లందరితో కలిసి ఉండాలనేది తమ లక్ష్యమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది తమ న్యాయమైన హక్కు అని తాను అనుకుంటున్నానని, ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నట్టు జెలెన్ స్కీ పేర్కొన్నారు. బెలారస్లో చర్చలు ప్రారంభం ► బెలారస్లో ఉక్రెయిన్-రష్యా బృందాల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. బెలారస్లో ఇరు దేశాల విదేశాంగ శాఖ అధికారులు మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్.. రష్యా తక్షణమే యుద్ధం విరమించుకోవాలని కోరింది. రష్యా దాడుల్లో 102 మంది మృతి : UN ► ఉక్రెయిన్లో రష్యా దాడులతో మృత్యుల సంఖ్య పెరుగుతోంది. ఈ దాడుల్లో మొత్తం 102 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి (UN) సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. వీరిలో ఏడుగురు పిల్లలు కూడా ఉన్నట్టు వెల్లడించారు. ► అహింస ఒక్కటే మార్గం : దలైలామా ఉక్రెయిన్పై రష్యా మిలిటరీ దాడులపై ఆధ్యాత్మిక నేత దలైలామా స్పందించారు. యుద్ధాలకు కాలం చెల్లిందని, అహింస ఒక్కటే మార్గమని అన్నారు. రెండు దేశాల మధ్య హింసాత్మక ఘటనలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. మానవులంతా ఒక్కటే అన్న భావాన్ని పెంపొందించుకోవాలని రెండు దేశాలకు సూచించారు. యుద్ధాన్ని ఆపడానికి పుతిన్పై ఒత్తిడి తీసుకురండి: ఇగోర్ పోలిఖా ► ఉక్రెయిన్లో రష్యా యుద్ధాన్ని ఆపడానికి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై ఒత్తిడి తీసుకురావాలని భారత్లో ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఇగోర్ పోలీఖా తెలిపారు. ఈ క్రమంలో తమ దేశ విదేశీ భాగస్వాములందరి సాయాన్ని పోలిఖా అభ్యర్థించారు. మీ ప్రాణాలు కాపాడుకోండి.. రష్యా సైన్యానికి జెలెన్ స్కీ విజ్ఞప్తి ► ఉక్రెయిన్పై రష్యా సైనం దాడులు కొనసాగిస్తున్న వేళ జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా బలగాలను ఉద్దేశించి మీ ప్రాణాలు కాపాడుకోండి.. ఉక్రెయిన్కు వదిలివెళ్లిపోండి అంటూ విజ్ఞప్తి చేశారు. ► బెలారస్లోని ఫ్యాపిట్ వేదికగా కాసేపట్లో రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలు.. షరతులు లేకుండా ముందుకొచ్చిన రష్యా. మరోవైపు ఉక్రెయిన్లో కొనసాగుతున్న దాడులు. ► ఉక్రెయిన్కు ఊహించని సాయం!: యుద్ధ సంక్షోభ సమయంలో ఉక్రెయిన్కు ఊహించని సాయం అందింది. నాటో దళాలు, ఈయూ దేశాలు పరోక్ష సాయానికి పరిమితమైన వేళ.. యూరప్ దేశం లాట్వియా (లాత్వియా) నుంచి ఉక్రెయిన్కు ప్రత్యక్ష మద్ధతు లభించింది. ఈ మేరకు సోమవారం పార్లమెంట్లో ఓ కీలక తీర్మానం ప్రవేశపెట్టింది. ఉక్రెయిన్లో ఉన్న లాట్వియా పౌరులు అవసరమైతే యుద్ధంలో ఉక్రెయిన్ తరపున పాల్గొనవచ్చని తెలిపింది. ఇందుకోసం పార్లమెంటు సోమవారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. తమ పౌరులు ఉక్రెయిన్లో పోరాడేందుకు వీలు కల్పిస్తున్నందుకు గర్వంగా ఉందని పార్లమెంటు ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. ‘‘ఉక్రెయిన్కు మద్దతివ్వాలనుకునే, ఉక్రెయిన్ స్వాతంత్ర్యం, మా ఉమ్మడి భద్రత కోసం స్వచ్ఛందంగా సేవ చేయాలనుకునే మా పౌరులు తప్పనిసరిగా అలా చేయగలరు" అని పార్లమెంటరీ రక్షణ, హోం వ్యవహారాలు, అవినీతి నిరోధక కమిషన్ ఛైర్మన్ జూరిస్ రాంకానిస్ తరపున ఒక ప్రకటన విడుదల అయ్యింది. లాట్వియా, బాల్టిక్ పొరుగున ఉన్న ఎస్టోనియా -లిథువేనియాతో కలిసి ఒకప్పుడు రష్యా పాలనలోనే ఉండేవి. రష్యాను భద్రతా ముప్పుగా చాలా కాలంగా చూసింది. చివరికి.. ఉక్రెయిన్ మాదిరిగా కాకుండా, ఆ మూడు దేశాలు యూరోపియన్ యూనియన్, NATO లో చేరాయి. అయినప్పటికీ ఉక్రెయిన్తో లాట్వియాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ► బెలారస్కు చేరిన ఇరు దేశాల విదేశాంగ ప్రతినిధులు. మధ్యాహ్నాం 3గంటలకు చర్చలు మొదలయ్యే అవకాశం. ►ఉక్రెయిన్ అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు: సోమవారం రష్యా-ఉక్రెయిన్ మధ్య జరిగే చర్చలు సానుకూల ఫలితం ఇస్తుందని తాను అనుకోవట్లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ పేర్కొన్నారు. పరిస్థితులు అందుకు ఆశాజనకంగా లేవని కీలక వ్యాఖ్యలు చేశారాయన. చర్చలపై ఆదివారం హైడ్రామా సాగగా.. ఓవైపు రష్యా దళాలను ఎదుర్కొంటూనే చర్చలకు సిద్ధమని ప్రకటించాడాయన. అయితే ఉక్రెయిన్ ప్రతిఘటనను రష్యా జీర్ణించుకోలేకపోతోంది. అందుకే దాడులను తీవ్ర తరం చేస్తూనే.. చర్చల ప్రతిపాదనకు ఓకే చెప్పింది. ఈ క్రమంలో ఉక్రెయిన్తో పాటు రష్యా తీవ్రంగా నష్టపోతోంది కూడా. ► కీవ్లో వారాంతపు కర్ఫ్యూ ఎత్తివేత. విద్యార్థులు పశ్చిమ వైపు ప్రాంతాల రైల్వే స్టేషన్లకు వెళ్లాలని సూచన. అక్కడి నుంచి ప్రత్యేక రైళ్ల ఏర్పాటు చేసిన ఉక్రెయిన్ ప్రభుత్వం. ► ఉక్రెయిన్కు ఈయూ విమానాలు: రష్యాతో తలపడుతున్న ఉక్రెయిన్కు అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తోంది. మూడు వైపుల నుంచి చుట్టుముట్టి దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాపై చేతనైనంత మేర పోరాడుతున్న ఉక్రెయిన్కు యుద్ధ విమానాలు పంపాలని యూరోపియన్ యూనియన్ దేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు కూటమి విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ తెలిపారు. ► రష్యాకు సౌత్ కొరియా షాక్: రష్యాను ఆంక్షలతో ఇరకాటంలో పెడుతున్న పాశ్చాత్య దేశాలకు ఆసియా దేశం దక్షిణ కొరియా తోడైంది. రష్యా ఎగుమతులపై దక్షిణ కొరియా నిషేధం విధించింది. వ్యూహాత్మక వస్తువుల ఎగుమతులను నిషేధించడం ద్వారా.. రష్యాకు వ్యతిరేకంగా ఎగుమతి నియంత్రణలను కఠినతరం చేయాలని దక్షిణ కొరియా భావించింది. ఇప్పటికే SWIFT అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ నుంచి కొన్ని రష్యన్ బ్యాంకులను సౌత్కొరియా బ్యాన్ చేసింది. ఈ మేరకు రాజధాని సియోల్ నుంచి విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ► రష్యాకు మద్ధతుగా ఉన్న బెలారస్పై ఆంక్షలకు జపాన్ సిద్ధమైంది. ► సంచలనం.. పుతిన్పై ట్రావెల్ బ్యాన్: మొండిగా ఉక్రెయిన్పై దూసుకెళ్లి.. ఘోర విధ్వంసానికి తెర తీసిన రష్యా అధ్యక్షుడు పుతిన్కు వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా సంచలన ప్రకటన చేసింది. ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్, ఆయన సెక్యూరిటీ కౌన్సిల్లోని సభ్యులపై ఆస్ట్రేలియా మరిన్ని ఆంక్షలు ప్రకటించింది. వీరందరిపై ఆర్థిక, ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ స్వయంగా ప్రకటించారు. ‘‘మేము రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ఉక్రెయిన్పై చేసిన అన్యాయమైన యుద్ధాన్ని ఖండిస్తున్నాం. ఆర్థిక ఆంక్షలు, ప్రయాణ నిషేధాలు రష్యా అధ్యక్షుడు మరియు రష్యా భద్రతా మండలిలో మిగిలిన శాశ్వత సభ్యులపై గత అర్ధరాత్రి నుంచే మా(ఆస్ట్రేలియా) తరపు నుంచి అమలులోకి వచ్చాయి. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సహా 350 మందికి పైగా రష్యన్ వ్యక్తులపై ఈ ఆంక్షలు వర్తిస్తాయి’’ అని మోరిసన్ చెప్పారు. ఇదిలా ఉండగా.. యుద్ధంలోనూ ఆస్ట్రేలియా ఉక్రెయిన్కు బాసటగా.. రష్యా దాడిని ఎదుర్కొనేందుకు ప్రాణాంతకమైన సైనిక సామగ్రిని అందజేయనుంది. అయితే ఆస్ట్రేలియా తాజా ప్రకటనలో.. ఏ మెటీరియల్ను పంపుతుందనే దానిపై ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. ముట్టడి చేయబడిన ఉక్రెయిన్కు మద్దతుగా నాటో ట్రస్ట్ ఫండ్.. ప్రాణాంతకం కాని సైనిక పరికరాలు, వైద్య సామాగ్రి, 3 మిలియన్ డాలర్ల విరాళాన్ని శుక్రవారం అందించిన విషయం తెలిసిందే. ► రష్యా దాడుల్లో 350 మందికి పైగా మా పౌరులు మృతి చెందారు: ఉక్రెయిన్ ► ఆపరేషన్ గంగా.. ఐదో విమానం రాక: ఉక్రెయిన్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఆపరేషన్ గంగను నిర్వహిస్తోంది భారత్. ఇందులో భాగంగా ఐదో విమానం.. 249 మందితో బుచారెస్ట్(రొమేనియా) నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి చేరుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ స్వయంగా గాంధీనగర్ వెళ్లి వంద మంది విద్యార్థులకు స్వాగతం పలికారు. Close to 100 students from Gujarat were welcomed back by CM Bhupendra Patel this morning at Gandhinagar. These students landed from Ukraine in Mumbai and Delhi & were brought to Gujarat by Volvo buses.#RussiaUkraineCrisis pic.twitter.com/AsPR48chXO — ANI (@ANI) February 28, 2022 ► బాంబుల మోతతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్.. కార్కీవ్ నగరం ► దాడులను తక్షణమే నిలిపివేయాలి- భారత్: భద్రతా మండలిలో రష్యా దాడులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. వీటో అధికారంతో అడ్డుకుంది రష్యా. దీంతో అగ్రరాజ్యాలు ప్రత్యామ్నాయ చర్యలకు ప్రయత్నిస్తున్నాయి. ఈ సందర్భంగా.. ఉక్రెయిన్లోని తమ పౌరుల భద్రతపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రష్యా దాడులను వెంటనే ఈ మేరకు భద్రతా మండలిలో ప్రకటన విడుదల చేసింది. అయితే భారత్ ఓటింగ్కు దూరంగా ఉండడంపై పలు దేశాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ► ఈ 24 గంటలే కీలకం: ఉక్రెయిన్ పరిణామాలపై ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ.. యూకే ప్రధాని బోరిస్ జాన్సన్తో ఫోన్లో సంప్రదింపులు జరిపారు. రాబోయే 24 గంటలు ఉక్రెయిన్కు కీలకమని ఈ సందర్భంగా జెలెన్స్కీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ► ఐరాస అత్యవసర భేటీ: ఉక్రెయిన్పై రష్యా దాడులు.. ఇవాళ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశం. 11 దేశాల ఓటింగ్తో అత్యవసర భేటీకి తీర్మానం. భారత్, చైనా, యూఏఈ దూరం. ► రెడీగా ఉండండి-పుతిన్: ఉక్రెయిన్పై యుద్ధానికి దిగి ఇప్పటికే ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అవసరమైతే అణ్వాయుధాల ప్రయోగానికీ సిద్ధమనే సంకేతాలు పంపుతున్నారు. ఏ క్షణంలోనైనా ‘యుద్ధ విధులకు’ దిగేందుకు సర్వ సన్నద్ధంగా ఉండాల్సిందిగా రష్యా అణ్వాయుధ దళాలను పుతిన్ ఆదివారం ఆదేశించారు. రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్ తదితరులతో ఆయన అత్యున్నత స్థాయి సమావేశం జరిపారు. నాటో దేశాధినేతల దుందుడుకు వ్యాఖ్యలకు, రష్యాపై, తనపై విధించిన కఠినమైన ఆంక్షలకు స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. పుతిన్ ప్రకటనతో అమెరికా, పాశ్చాత్య దేశాలు కలవరపడుతున్నాయి. వివాదం చివరికి అణు యుద్ధానికి దారితీస్తుందేమోనని భయపడుతున్నాయి. అదే జరిగితే వినాశకర పరిణామాలకు దారి తీస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ► అమెరికా ఆందోళన: ఈ వివాదంలో తలదూర్చే దేశాలపై అత్యంత కఠినంగా ప్రతి చర్యకు దిగుతామని యుద్ధానికి దిగిన సందర్భంగా పుతిన్ గట్టిగా హెచ్చరించడం తెలిసిందే. రష్యా తిరుగులేని అణు శక్తి అంటూ ఆ సందర్భంగా బెదిరించారు కూడా. ఉక్రెయిన్ను ఎలాగైనా ఓడించేందుకు రసాయనిక, జీవ రసాయన ఆయుధాల ప్రయోగానికి కూడా రష్యా దిగినా ఆశ్చర్యం లేదని ఇంగ్లండ్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రుస్ హెచ్చరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా పరిణామాలపై అమెరికా ఆందోళన వెలిబుచ్చింది. యుద్ధోన్మాదాన్ని అస్సలు అంగీకారం కాని స్థాయికి పుతిన్ తీసుకెళ్తున్నారని ఐరాసలో అమెరికా రాయబారి లిండా థామస్ గ్రీన్ఫీల్డ్ దుయ్యబట్టారు. ఆయన చర్యలను అత్యంత కఠినంగా ఖండించాల్సిన అవసరముందన్నారు. ► వామ్మో ‘అణు’మానాలు: రష్యా, అమెరికా ప్రస్తుతం అతి పెద్ద అణ్వాయుధ దేశాలు. ఇవి రెండూ తమ వ్యూహాత్మక భూతల, జలాంతర్గామి అణ్వాయుధ సంపత్తిని నిరంతరం అప్రమత్తంగా, ఏ క్షణంలోనైనా యుద్ధానికి దిగేందుకు సన్నద్ధంగా ఉంచుతాయి. అయితే అణ్వాయుధాలను మోసుకెళ్లగల బాంబర్లు, యుద్ధ విమానాలు మాత్రం అవసరమనుకున్నప్పుడే రంగంలోకి దిగుతాయి. ఈ సమయంలో పుతిన్ గనక తన బాంబర్లు, యుద్ధ విమానాలను అణు దాడికి సన్నద్ధం చేసే పక్షంలో అది విపరిణామాలకే దారి తీయొచ్చు. అమెరికా కూడా అదే మాదిరిగా స్పందించక తప్పని పరిస్థితి తలెత్తుతుందని ఫెడరేసన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్లో న్యూక్లియర్ అనలిస్టు హన్స్ క్రిస్టెన్సన్ అభిప్రాయపడ్డారు. అది అంతర్జాతీయంగా పెను ఉద్రిక్తతలకు దారి తీస్తుందని హెచ్చరించారు. ► అణు ఆటలొద్దు: ఐఏఈఏ యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్లోని అణు విద్యుత్ కేంద్రాల భద్రతపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) ఆందోళన వెలిబుచ్చింది. వాటికి ప్రమాదం కలిగించే చర్యలకు దిగొద్దని రష్యాకు సూచించింది. అలాంటి చర్యలు భారీ ప్రాణ, పర్యావరణ నష్టానికి దారి తీయవచ్చని ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ మారియానో గ్రోసీ హెచ్చరించారు. వాటివద్ద పరిస్థితి ప్రస్తుతానికి అదుపులోనే ఉన్నట్టు ఉక్రెయిన్ నుంచి తమకు సమాచారముందని చెప్పారు. ఉక్రెయిన్లో నాలుగు అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలోని 15 రియాక్టర్లు దేశ విద్యుత్ అవసరాల్లో సగం మేరకు తీరుస్తున్నాయి. ఉక్రెయిన్లోని చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రాన్ని గురువారం రష్యా స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. తాజాగా దానినుంచి కాస్త హెచ్చు స్థాయిలో రేడియో ధార్మికత వెలువడుతోందని ఐఏఈఏ తెలిపింది. -
3.68 లక్షలకు చేరుకున్న ఉక్రెయిన్ వలసలు: ఐరాస
జెనీవా: రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ప్రజల వలసలు వేగంగా పెరుగుతున్నాయని ఐరాస వలస విభాగం తెలిపింది. శనివారం అంచనా ప్రకారం కనీసం 1.50 లక్షల మంది ప్రజలు ఉక్రెయిన్ వీడి పోగా ఆదివారానికి ఈ సంఖ్య 3.68 లక్షలకు చేరుకున్నట్లు పేర్కొంది. వీరంతా పోలండ్, హంగరీ, రొమేనియా తదితర దేశాల్లో తలదాచుకుంటున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్ వీడి వచ్చే వారితో పోలండ్ సరిహద్దుల్లో 14 కిలోమీటర్ల పొడవైన కార్ల క్యూ ఉందని వలస విభాగం ప్రతినిధి క్రిస్ మీజర్ ట్విట్టర్లో తెలిపారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారన్నారు. ఎముకలు కొరికే చలిలో వీరు రాత్రంతా కార్లలోనే జాగారం చేశారని చెప్పారు.