pre wedding
-
సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియో
డిజిటల్ మాధ్యమంతో అన్నీ లాభాలే లేనప్పటికీ, దీని ద్వారా దేశంలో మూరుమూల ప్రాంతాలకు చెందిన అనేక మంది కళాకారులు వెలుగులోకి వస్తున్నారు. తమ అద్భుతమైన కళతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతున్నారు. పెయింటింగ్, క్రాఫ్ట్, మేకప్, ఇలా అద్భుతమైన చేతిపనులతో తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారు. ఒక్కోసారి వారి నైపుణ్యం చూసి ఇంటర్నెట్ వినియోగదారులు అబ్బురపడిపోతూ ఉంటారు. ఇలాంటి కోవకు చెందిన వారే కొల్హాపూర్కు చెందిన మెహందీ/మేకప్ ఆర్టిస్ట్ సోనాలీ(Sonali) ఈమె చేసిన పనికి నెటిజనులు ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఆమె చేసిన గొప్ప పనేంటి? పదండి తెలుసుకుందాం.తన మెహిందీ, మేకప్ కళ ద్వారా సోషల్ మీడియాలో చాలా పాపులర్ సోనాలి. ఆమెకు లక్షల్లో ఫోలోయర్లు ఉన్నారు. ఆమె వేసే గోరింటాకు డిజైన్లు చాలా అద్భుతంగా ఉంటూ ఆకట్టుకుంటూ ఉంటాయి. తాజాగా ఆమె ఇన్స్టాలో షేర్ చేసిన ఒక వీడియో కోటికి పైగా వీక్షణలను పొందింది. సోనాలి నైపుణ్యాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. (35 ఏళ్ల నాటి డ్రెస్తో రాధికా మర్చంట్ న్యూ లుక్...ఇదే తొలిసారి!)అనంత్ అంబానీ రాధిక మర్చంట్ (AnantAmbani-RadhikaMerchant ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో సందడి చేసిన పాప్ స్టార్ రిహన్న (Rihanna) గుర్తుందా. సోనాలీ అచ్చం ఆమెలాగానే మేకప్ వేసుకుంది. రిహన్నాను పునఃసృష్టించిన సోనాలి అందమైన రూపాన్ని చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోకు 12.7 మిలియన్ల వ్యూస్, 6.5 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. నెటిజన్లు ఆమెపై ప్రేమను కురిపించారు. కొందరు ఆమె నైపుణ్యాలను ప్రశంసించగా, మరికొందరు ఆమె వేగవంతమైన బ్రష్ స్ట్రోక్స్ మరియు మేకప్ నైపుణ్యాలు , కంటెంట్, ఆమె భాషను మెచ్చుకున్నారు. అమేజింగ్ ఆర్ట్ అంటూ మరికొందరు కొనియాడారు. View this post on Instagram A post shared by mehndi artist sonali (@sonali_mehndi)కమాన్ గైస్.. ఇలాంటి టాలెంట్ వాళ్లను పాపులర్ చేద్దా అంటూ స్విగ్గీ ఇన్స్టామార్ట్ వ్యాఖ్యానించింది. ఇంకా నటి క్రిషన్ ముఖర్జీ కూడా సోనాలి నైపుణ్యాలను చూసి ఆశ్చర్యపోయిందంటే ఆమె ఆర్ట్ను అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు సోనాలి సోషల్ మీడియా హ్యాండిల్స్లో యాక్టివ్గా ఉండే సోనాలీ తన మేకప్ నైపుణ్యాల వీడియోను తరచూ షేర్ చేస్తూ ఉంటుంది. ఇవి లక్షల వ్యూస్, లైక్స్తో ఆదరణ పొందుతుంటాయి. ముగ్గురు పిల్లల తల్లిగా ఇంకేం పని చేస్తావని తనను ఎగతాళి చేశారనీ, కానీ తల్లిగా వర్క్ లైఫ్ను ఎలా బ్యాలెన్స్ చేస్తోందీ వివరిస్తూ చేసిన సోనాలి వీడియో కూడా 6.9 మిలియన్ల మిలియన్ల వీక్షణలను, ప్రేమపూర్వక కామెంట్లను సంపాదించడం విశేషం. చదవండి: శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు! -
కరీనా కపూర్ కజిన్ ఆదార్ జైన్ మెహందీ ఫంక్షన్ (ఫోటోలు)
-
కొత్త పెళ్లికూతురికి పసుపుతో భయంకరమై ఎలర్జీ వచ్చిందట! ఫోస్ట్ వైరల్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా తన ప్రేయసి, నటి నీలమ్ ఉపాధ్యాయను ( ఫిబ్రవరి 7న) పెళ్లి చేసుకున్నాడు. ఎంతో ఘనంగా జరిగిన ఈ వివాహ మహోత్సవానికి భార్యాభర్తలు ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ వచ్చి సందడి చేశారు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, మరీ ముఖ్యంగా ఆడపడుచు హోదాలో ప్రియాంక స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. 'సిడ్నీ కి షాదీ' తన సోదరుడి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ను హల్దీ వేడుకతో ప్రారంభిస్తున్నట్లు ఫ్యాన్స్తో పంచుకుంది. హల్దీ, బారాత్, వెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేసి అందర్నిఫిదా చేసింది. భర్త నిక్, కుమార్తెతో కలిసి కొత్త జంట సిద్ధార్థ్ చోప్రా, నీలం ఉపాధ్యాయతో పాటు, నిక్ జోనాస్ తల్లిదండ్రులుతో కలిసి స్పెషల్గా ఫొటోలకు పోజులిచ్చింది. అయితే తాజాగా మరో విషయం నెట్టింట వైరల్గా మారింది.ప్రియాంక చోప్రా 'భాభి', నీలం ప్రీవెడ్డింగ్ వేడుకల అయిన హల్దీ వేడుక (ఫిబ్రవరి 5న)లో స్కిన్ ఎలర్జీతో బాధపడిందట. 'హల్దీ' మూలంగా తనకు అలర్జీ వచ్చిందని నీలం వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీని ప్రకారం మెడ , కాలర్బోన్ ప్రాంతం చుట్టూ భయంకరమైన చర్మ అలెర్జీ స్పష్టంగా కనిపిస్తోంది. బహుశా సేంద్రీయ పసుపుకాకపోవడంతో ఆమెకు ఎలర్జీ వచ్చినట్టుంది. ముందుగా టెస్ట్ చేసినప్పిటికీ, ఎలర్జీ వచ్చిందని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వాపోయింది. ఈ ఫోటోలు నీలం నల్లపూసలతో కూడా మంగళసూత్రాన్ని కూడా చూపించింది. ఎండలో ఉండటం వల్ల ఇలా వచ్చిందా; అప్లయ్ చేయడానికి కొన్ని రోజుల ముందు ప్యాచ్ టెస్ట్ కూడా చేసా, అన్నీ బాగానే ఉన్నాయి. దీనికేంటి పరిష్కారం, అసలు ఎందుకిలా అయింది.. దయచేసి ఎవరైనా సలహా చెప్పండి అంటూ అభ్యర్థించింది.ఇదీ చదవండి :బిలియనీర్తో పెళ్లి అని చెప్పి, రూ.14 కోట్లకు ముంచేసింది : చివరికి!పసుపుతో అలెర్జీ వస్తుందా? పసుపు సాధారణంగా చాలా మందికి సురక్షితమైనది . ప్రయోజనకరమైనది. కానీ కొందరిలో దుష్ప్రభావాలను కలిగిస్తుంది. సున్నితమైన చర్మం ఉన్నవారిలో ఇది చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అత్యంత ముఖ్యమైన దుష్ప్రభావం అలెర్జీ. దీనివల్ల చర్మంపై దద్దుర్లు, దురద, వాపు మచ్చలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని చర్మంపై పూసినప్పుడు కాంటాక్ట్ డెర్మటైటిస్ లాంటి అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుంది. ఒక్కోసారి శ్వాస ఆడకపోవడంలాంటి కనిపించవచ్చు. ఇంకా లోపలికి తీసుకుంటే విరేచనాలు, వికారం,కడుపు నొప్పి వంటి తేలికపాటి జీర్ణ సమస్యల నుండి ఇనుము లోపం, పిత్తాశయ సమస్యలు, తక్కువ రక్తంలో చక్కెర స్థాయిలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు.ఎవరు జాగ్రత్తగా ఉండాలి?పిత్తాశయ వ్యాధి ఉన్నవారు పసుపును నివారించాలి. ఎందుకంటే ఇది పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. ఆస్ప్రిన్, వార్ఫరిన్ వంటి రక్తాన్ని పలుచబరిచే మందులు వాడేవారు పసుపు రక్తస్రావం పెంచే అవకాశం ఉన్నందున దానిని నివారించాలి. గర్భిణీలు , పాలిచ్చే స్త్రీలు కూడా పసుపును జాగ్రత్తగా వాడాలి.పసుపులో ఉండే పదార్ధం కర్కుమిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇవి అలెర్జీ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే, ఇది వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది.దురదలు, దద్దుర్లు తగ్గించే యాంటిహిస్టామైన్ లాంటి మందులను వాడాలి. సమస్య బాగా తీవ్రంగా ఉంటే కార్టికోస్టెరాయిడ్, అనాఫిలాక్సిస్ లాంటి మందులను వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. ఇంకా సమస్య తీవ్రతను బట్టి సబ్లింగ్యువల్ ఇమ్యునోథెరపీ అవసరం అవుతుంది. ఏదిఏమైనా సమస్యను వైద్యుడి దృష్టికి తీసుకెళ్లి, తగిన పరీక్షల అనంతరం నిపుణుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలి.కాగా సిద్ధార్థ్ చోప్రా పెళ్లి చేసుకున్న నీలం ఉపాధ్యాయ తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్గా నటించింది. 2012లో నక్షత్ర అనే మూవీతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తరువాత 2013లో హీరో అల్లరి నరేష్కు జోడీగా యాక్షన్ 3డి మూవీలో హీరోయిన్గా నటించింది నీలం. ఆ తరువాత తమిళ మూవీల్లో కూడా నటించింది. -
సిద్ధార్థ్ చోప్రా సంగీత్ పార్టీలో ప్రియాంక చోప్రా,నిక్ (ఫొటోలు)
-
జోరుగా.. హుషారుగా వసూళ్లు : ప్రీ వెడ్డింగా? ప్రీ వేస్టింగా!
పెళ్లంటే..పందిళ్లు, బాజాలు, భజంత్రీలు, బంధువుల, విందు భోజనాలు...ఇది ఒకప్పుడు ఇప్పుడు ట్రెండ్ మారింది. వివిధ రకాల ఫోటోషూట్లు వీటి స్థానాన్ని ఆక్రమించాయి. నేటి యువత పెళ్లి కంటే ప్రీ వెడ్డింగ్కే ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. వీటితోపాటు పెళ్లి, రిసెప్షెన్ డ్రస్సులకు కూడా వేలు, ఒక్కోసారి లక్షల్లో కూడా ఖర్చు చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్కు తమ చుట్టుపక్కల చూడదగిన రమణీయమైన ప్రాంతాలకు వెళ్లడం లేదా ప్రత్యేకంగా పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం చేస్తున్నారు.కాబోయే జంటలను తీసుకెళ్లడానికి కార్లు, భోజనం మొదలుకుని బస చేయడానికి హోటళ్లు, గెస్ట్ హౌస్లలో గదుల బుకింగ్ పనులన్నిటినీ ఫొటోగ్రాఫర్లే చూసుకుంటారు. కొందరు ప్రీ వెడ్డింగ్కు రూ.25 వేల నుంచి 35 వేలు చార్జీలు తీసుకుంటుండగా మరికొందరు రూ.50–75 వేల వరకు వసూలు చేస్తున్నారు. కొంత హై ఫై సౌకర్యా లు కావాలంటే ఏకంగా రూ.90 వేల వరకు చార్జీలు కూడా వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫోటోగ్రాఫర్లు, ఈవెంట్మేనేజర్లకు డిమాండ్ పెరిగింది. (ప్రియురాలికి ఫ్లాట్, లగ్జరీ కారు, అడ్డంగా బుక్కైన ప్రియుడు!)ఎంతైనా తగ్గేదేలే... గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి. వారానికి కనీసం మూడు, నాలుగు పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా పెళ్లి బాజాలు వినిపిస్తున్నాయి. సాయంత్రమైందంటే చాలు భాజాభజంత్రీలు, బ్యాండ్ల మోతలతో బారాత్లు(పెళ్లి ఊరేగింపులు) తీస్తున్న దశ్యాలే దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు పెళ్లంటే ఇంటి గుమ్మం ముందు లేదా ఖాళీ స్థలాల్లో జరిగేవి. కాని కాలం మారడంతో వాటికి స్వస్తి పలికి ఏసీ, నాన్ ఏసీ పంక్షన్ హాళ్లలో చేస్తున్నారు. ఫలితంగా హాళ్లకు డిమాండ్ పెరిగింది.ఇందుకోసం ఫొటోగ్రాఫర్లకు ఎంత చార్జీలు చెల్లించేందుకైనా వెనకాడడం లేదు. అయితే ఇది తమ తల్లిదండ్రులకు అదనపు భారంగా పరిణమిస్తుందని వధూవరులు గ్రహించలేక పోతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఫొటోగ్రాఫర్లు, మ్యూజిక్ బ్యాండ్లు, సంప్రదాయ సంగీత వాద్య బృందాలకు కూడా డిమాండ్ పెరిగింది. డిమాండ్కు తగ్గట్లుగా.... అమ్మాయిల కొరత కారణంగా గత రెండు, మూడేళ్లుగా పెళ్లిళ్లు ఎక్కువ శాతం జరగలేదు. దీనికి తోడు ముహూర్తాలు కూడా ఎక్కువగా లేకపోవడంవల్ల చాలా పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. కానీ ఈ ఏడాది ముహూర్తాలు ఎక్కువ ఉండడంవల్ల ఎక్కడ చూసిన పెళ్లి సందడి కనిపిస్తోంది. ఫంక్షన్ హాళ్లన్నీ ఇప్పటికే రిజర్వై పోయి ఉండటంతో అందుబాటులో ఉన్న స్కూళ్లు, కాలేజీ గ్రౌండ్లు, క్రీడా మైదానాలలో కూడా పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. ఒకప్పుడు ముహూర్తాలు చూసుకుని ఫంక్షన్ హాళ్లు బుక్ చేసుకునేవారు. (చిట్టి లవంగం : గట్టి లాభాలు, బరువు కూడా తగ్గొచ్చు!)కానీ ఇప్పుడు డిమాండ్ పెరగడంతో ఏ రోజు హాలు ఖాళీ ఉందో ఆరోజు ముహూర్తం పెట్టుకోవల్సిన పరిస్ఠితి వచి్చంది. ముఖ్యంగా ఫంక్షన్ హాళ్లు, బాంక్వేట్ హాళ్లలో వేడుకలకు ఖర్చు తక్కువ కావడంతోపాటు బంధువులకు భద్రత, విలువైన వస్తువులకు రక్షణ ఎక్కువ. కానీ గ్రౌండ్లలో, ఖాళీ మైదానాలలో పెళ్లి చేయాలంటే చాలా ఖర్చు చేయాల్సిఉంటుంది. భారీ వేదిక, చుట్టుపక్కల, పైన టెంట్లు నిర్మించడం, గాలికి దుమ్ము, ధూళి లేవకుండా మైదానంలో కార్పెట్లు వేయడం, కళ్లు జిగేల్మనిపించే విద్యుత్ దీపాలు, సిరీస్ లైట్ల ఏర్పాటు, వాహనాల పార్కింగ్కు ప్రత్యేకంగా స్ధలం కేటాయించడం, విలువైన వస్తువులు దొంగతనానికి గురికాకుండా కాపాడుకునేందుకు, బిచ్చగాళ్లు, బయట వ్యక్తులు వచ్చి భోజనం చేయకుండా చూసేందుకు ప్రైవేటు సెక్యురిటీ గార్డులను నియమించడం... ఇదంతా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని.మరోపక్క డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని లౌడ్స్పీకర్ల యజమానులు, బ్రాస్ బ్యాండ్ నిర్వాహకులు, బారాత్లకు అద్దెకిచ్చే ఓపెన్ టాప్ కార్లు, మెర్సిడీస్ బెంజ్ వాహనాలు, గుర్రపు బండ్ల యజమానులు అడ్డగోలుగా చార్జీలు పెంచేశారు. మేకప్కు కూడా లక్షల్లోనే... ఈ ఖర్చులన్నీ ఒక ఎత్తైతే వధూవరులు అనవసరంగా చేస్తున్న ప్రీ వెడ్డింగ్, మేకప్ ఖర్చులు హద్దులు దాటుతున్నాయి. వధూవరులతోపాటు బంధువుల మేకప్కు సైతం లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. -
PV Sindhu Pre-wedding : పీవీ సింధు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
అనంత్-రాధిక హల్దీ.. వెలుగులోకి మరో వీడియో! వైరల్
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ రాధికల పెళ్లి ఎంతలా అంగరంగ వైభవంగా జరిగిందో తెలిసిందే. ఆ వేడుకకు సంబంధించిన ప్రతి ఫోటో, వీడియోలు నెట్టింట సందడి చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అంబానీలు ధరించే కాస్ట్యూమ్స్, నగలు, తదితరాలు చాలా హాట్టాపిక్గా నిలిచాయి కూడా. అయితే ఆ వేడుకకు సంబంధించి ఓ వీడియోని మాత్రం అందరూ మిస్ అయ్యాం. సరదసరదాగా సాగే హల్దీ వేడుకకు సంబంధిచిన మరో వీడియో తాజగానెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంబానీలకు సన్నిహితుడైన అకా ఓర్హాన్ అవత్రమణి షేర్ చేసిన ఈ లేటెస్ట్ వీడియోలో అంబానీలంతా ఖుషీగా గడిపినట్లు కనిపించింది. అతిధులంతా పసుపునీళ్లు ఒకరిపై ఒకరూ వేసుకుంటూ సందడి చేశారు. ఆ వీడియోలో నీతా అంబానీ పసుపు నీళ్లు పడకుండా తప్పించుకోవడంలో విఫల ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వేడుకకు హోస్ట్గా ఉన్న నీతా అంబానీ సైతం అంరిలానే హల్దీ దాడిని ఎదుర్కోవడం ఫన్నీగా ఉంటుంది. ఇక అనంత్ అంబానీ బావమరిది ఆనంద్ పిరమల్ ఒకరిపై ఒకరు పసుపు నీళ్లు, పూలతో దాడి చేయడం, మరోపక్క అతిథులంతా నవ్వుతూ ఉన్నట్లు వీడియోలో కనిపించింది. ఈ హల్దీ ఫంక్షన్ ముంబైలోని అంబానీ కుటుంబానికి చెందిన ఆంటిలియాలో జరిగింది. ఈ వేడుకలో జాన్వీ కపూర్, అర్జున్ కపూర్, రణ్వీర్ సింగ్ తదితర తారలు పాల్గొన్నారు. అంతేగాదు ఈ లెటెస్ట్ ఓర్రీ వీడియోలో ధోల్ బీట్లు, డ్యాన్స్లతో ఇతర అతిథులు ఎంత సరదాగా గడిపారో కూడా కనిపిస్తోంది. కాగా, అనంత్ రాధిక మర్చంట్ల వివాహం ఈ ఏడాది జూలై 12న అత్యంత లగ్జరియస్గా జరిగింది. (చదవండి: అందమైన శరీరాకృతికి బీబీఎల్ సర్జరీ: అంటే ఏంటీ..? ఎదురయ్యే దుష్ర్పభావాలు..) -
గోవాలో కీర్తి సురేశ్ పెళ్లి వేడుక.. ఫోటో పంచుకున్న హీరోయిన్!
హీరోయిన్ కీర్తి సురేశ్ వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. ఈనెల 12న తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు ఆంటోనీ తటిల్ను పెళ్లాడనుంది. ఇప్పటికే కీర్తి సురేశ్ తన పెళ్లి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. గోవాలో జరగనున్న వీరి పెళ్లి వేడుకకు సంబంధించి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. తాజాగా కీర్తి సురేశ్ తన ఇన్స్టా స్టోరీస్లో ఫోటోను షేర్ చేసింది. ఇప్పటికే ఇరువురి కుటుంబ సభ్యులంతా గోవాలో ల్యాండైనట్లు తెలుస్తోంది. కాగా.. 15 ఏళ్లుగా వీరిద్దరు రిలేషన్లో ఉన్నారు.రెండు సంప్రదాయాల్లో వివాహం..ఇరు కుటుంబాల సమ్మతితో రెండు మతాలను సంప్రదాయాలనూ గౌరవించే విధంగా ఆంటోనీ, కీర్తి సురేష్ వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈనెల 12వ తేదీ ఉదయం హిందూ మత సంప్రదాయ ప్రకారం, అదేరోజు సాయంత్రం చర్చిలో క్రిస్టియన్ మత సాంప్రదాయ ప్రకారం కీర్తి సురేష్, ఆంటోనీ పెళ్లి రెండు సార్లు జరగనుందని తెలిసింది. వీరి వివాహ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం. కాగా.. కీర్తి సురేశ్ ప్రస్తుతం హిందీలో బేబీ జాన్ మూవీతో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. -
జయరామ్ కుమారుడి ఇంట పెళ్లి సందడి.. కాబోయే కోడల్ని కూతురు అన్న నటుడు (ఫోటోలు)
-
పెళ్లి సందడి.. నాగ చైతన్య- శోభిత మంగళస్నానాలు (ఫోటోలు)
-
కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి.. ప్రీ వెడ్డింగ్ ఫొటో వైరల్
టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు, హీరో శ్రీ సింహా పెళ్లికి సిద్ధమయ్యాడు. సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు మురళీమోహన్ మనవరాలు రాగ మాగంటితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని గోల్కోండ రిసార్ట్స్ లో ఆదివారం రాత్రి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.(ఇదీ చదవండి: ఆ విషయంలో నన్ను క్షమించండి.. అల్లు అర్జున్ రిక్వెస్ట్)మురళీ మోహన్కు కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు విదేశాల్లో సెటిలైంది. కుమారుడు రామ్ మోహన్.. ఈయన వ్యాపారాలను చూసుకుంటున్నారు. రామ్ మోహన్- రూపల కుమార్తెనే 'రాగ'. విదేశాల్లో బిజినెస్లో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం రాగ కూడా తన కుటుంబానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలే చూసుకుంటోంది.శ్రీసింహ విషయానికి వస్తే 'యమదొంగ' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు. 'మత్తు వదలరా' రెండు చిత్రాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్ తదితర సినిమాల్లోనూ హీరోగా నటించాడు. కీరవాణి పెద్దబ్బాయి కాలభైరవకు ఇంకా పెళ్లి కాలేదు. ఈలోపే చిన్నబ్బాయికి పెళ్లి జరగనుంది. దీంతో ఇదేమైనా ప్రేమ పెళ్లి అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: నాగచైతన్య-శోభిత పెళ్లి కార్డ్ ఇదే.. డేట్ ఫిక్స్) 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పెళ్లి కొడుకైన కిదాంబి శ్రీకాంత్.. సంగీత్లో స్పెషల్ అట్రాక్షన్గా రష్మిక మందన్న (ఫొటోలు)
-
నాగ చైతన్య- శోభితా ధూళిపాళ్ల పెళ్లి పనులు ప్రారంభం (ఫోటోలు)
-
కర్ణాటక తీరం.. ప్రీవెడ్డింగ్ షూట్ గమ్యం! (ఫొటోలు)
-
Kiran Abbavaram: గ్రాండ్గా హీరో కిరణ్ అబ్బవరం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ ఫోటోలు వైరల్
-
అనంత్ ప్రేమంతా : అందమైన రాధిక వెడ్డింగ్ లెహెంగా పైనే
ఫ్యాషన్, ఫైన్ ఆర్ట్ అద్భుతమైన కలయికతో రూపుదిద్దుకున్న వెడ్డింగ్ లెహంగా డ్రెస్ ఇది. అనంత్ అంబానీతో రాధికా మర్చంట్ వివాహం కోసం ఆర్టిస్ట్ జయశ్రీ బర్మన్ డిజైనర్ ద్వయం అబు జానీ సందీప్ ఖోస్లాతో కలిసి ఈ చిత్రకళ లెహంగాను రూపొందించారు.రోజుకు 16 గంటలు, నెలరోజుల పాటు జయశ్రీ బర్మన్ ఢిల్లీలోని తన స్టూడియోలో ఒక నెల మొత్తం ఈ లెహంగా ఫ్యాబ్రిక్పై పెయింటింగ్ చేయడానికి వెచ్చించింది.‘అనంత్–రాధికల కలయికకు ప్రతీకగా ఖగోళ మానవ బొమ్మలు, జంతుజాలం, ముఖ్యంగా ఏనుగులపై అనంత్కు ఉన్న ప్రేమను చూపేలా ఈ సృజనాత్మక కళ రూపుదిద్దుకుంది’ అని వివరించే బర్మన్ రోజుకు 15–16 గంటల సమయాన్ని ఈ ఆర్ట్వర్క్కు కేటాయించినట్టుగా వివరించింది. కోల్కతాలో జన్మించిన జయశ్రీ బర్మన్ ఇండియన్ ఆర్టిస్ట్గా గుర్తింపు పొందారు. పెయింటింగ్లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ,ప్యారిస్ లో ప్రింట్ మేకింగ్ కోర్సు చేసిన బర్మన్ తన పెయింటింగ్ ద్వారా పౌరాణిక కథలను కళ్లకు కడతారు. ఆర్టిస్ట్గానే కాదు, రచయిత్రిగానూ జాతీయ అవార్డులు అందుకున్న ఘనత బర్మన్ది. -
అంబానీ పెళ్లి వేడుక : టిక్ టాకర్ లగేజీ గాయబ్..చివరికి!
View this post on Instagram A post shared by jewelswithjules • julia hackman chafé (@juliachafe)అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహ వేడుకలు సోషల్ మీడియాలో ట్రెండిగ్లో నిలుస్తున్నాయి. ఈ వేడుకలకు హాజరయ్యేందుకు దేశ విదేశాలకు చెందిన సెలబ్రిటీలు, కంటెంట్ క్రియేటర్లు, ఇన్ఫ్లూయెన్సర్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో అనంత్, రాధిక ప్రీవెడ్డింగ్ వేడులకు ఉత్సాహంగా పయనమైన యుఎస్ టిక్టాకర్, కంటెంట్ క్రియేటర్ జూలియా చాఫ్కు వింత అనుభవం ఎదురైంది. బిలియనీర్ అంబానీ కుటుంబంపై నెలల తరబడి వీడియోలు చేసిన ఆమెకు అంబానీ ఇంట పెళ్లి సందడికి హాజరవ్వాలనేది డ్రీమ్. కానీ ఊహించని పరిస్థితి ఎదురైంది.. స్టోరీ ఏంటంటే..అంబానీ ఫ్యామిలీనుంచి అందిన ఆహ్వానం నేపథ్యంలో జూలియా చాఫ్ ఉత్సాహంగా సోమవారం ఇండియాకు బయలుదేరింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఇన్స్టాలో షేర్ చేసింది. ఇంతలో ఏజియన్ ఎయిర్లైన్స్ లో నాలుగు బ్యాగుల లగేజీ మొత్తాన్ని పోగొట్టుకుంది. ఏథెన్స్లో చిక్కుకుపోయింది. దీంతో సంబంధిత ఎయిర్లైన్ ట్యాగ్ చేస్తూ మరో పోస్ట్ పెట్టింది. మొత్తానికి లగేజీ తిరిగి దొరకడంతో తన కలను సాకారం చేసుకుంది. అంబానీ ఇంట జరిగిన వేడుకలకు హాజరైంది. ఈ వీడియోపై ఇంటర్నెట్ సంచలనం ఓరీ స్పందించాడు. View this post on Instagram A post shared by jewelswithjules • julia hackman chafé (@juliachafe) కాగా జూలియా చాఫ్తో జెమ్ డీలర్ కూడా. అంబానీ కుటుంబానికి చెందిన డైమండ్, లగ్జరీ ఆభరణాల గురించి ఈమెకు తెలిసినంతగా ఇండియన్ మీడియాకు కూడా తెలియదట. దీనికి సంబంధించిన కంటెంట్తోనే జూలియా బాగా పాపులర్ అయింది. -
హాట్స్టార్లో అనంత్-రాధికల వివాహ వేడుక స్ట్రీమింగ్
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహ వేడుకను ప్రసారం చేసేందుకు డిస్నీ హాట్స్టార్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది.అనంత్-రాధికల పెళ్లి జులై 12న జరగనుంది. దేశవ్యాప్తంగా అంబానీ అభిమానులు ఈ వేడుకను వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా డిస్నీ హాట్స్టార్ ఈ వేడుక లైవ్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. జులై 12న ‘శుభ్ వివాహ్’తో వేడుక ప్రారంభం కానుంది. జులై 13న 'శుభ్ ఆశీర్వాద్', జులై 14న ‘మంగళ్ ఉత్సవ్’ కార్యక్రమాలతో ముగియనున్నాయి. ఈ సంబరాలను హాట్స్టార్లో వీక్షించవచ్చిన కంపెనీ తెలిపింది.అనంత్ అంబానీ-రాధికల జంట ఇప్పటికే రెండుసార్లు అంగరంగ వైభవంగా ప్రీవెడ్డింగ్ వేడుకలు నిర్వహించుకుంది. ఇటీవల ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు దాదాపు 4500 కిలోమీటర్లు క్రూయిజ్లో ప్రయాణిస్తూ రెండో ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. గతంలో ఈ జంట జామ్నగర్లో తమ మొదటి ప్రీవెడ్డింగ్ వేడుకలను జరుపుకున్నారు. ఇటీవల అంబానీ కుంటుంబం 50 పేద జంటలకు సామూహిక వివాహాలను కూడా జరిపించింది. అందుకు అవసరమైన పూర్తి ఖర్చులను భరించింది. వివాహాల అనంతరం కొత్త జంటలకు అవసరమయ్యే ఇంటి సామగ్రిని అందించింది. -
దటీజ్ నీతా అంబానీ : ఈ బెనారసీ చీర స్పెషాల్టీ ఏంటో తెలుసా?
సందర్భానికి తగినట్టు దుస్తులను, నగలను, అలంకరణను ఎంచుకోవడంలో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ నీతా అంబానీది ఎపుడూ అందెవేసిన చేయి. పట్టు చీరలు, బెనారసీ, స్వదేశీ నేత చీరలు అంటే ఆమెకు ప్రాణం. తాజాగా తన చిన్నకుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సామూహిక వివాహాల కార్యక్రమంలో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. దీనికి గుట్టపూసల నెక్లెస్, స్టైలిష్ చెవిపోగులు, బన్, గజ్రా (మల్లె పూల దండ)తో ఇలా ప్రతీ విషయంలో తన ష్యాషన్ స్టయిల్ను చాటుకున్నారామె. తన సిగ్నేచర్ స్టైల్లో ఆమె లుక్, ముఖ్యంగా చీరలోని మరో ప్రత్యేకత విశేషంగా నిలిచింది. అనంత్-రాధిక వివాహ సన్నాహాకాలు జోరందుకున్న నేపథ్యంలో జూలై 12,మంగళవారం నిరుపేద కుటుంబాలకు చెందిన 50 జంటలకు సామూహిక వివాహాలను జరిపించారు. రిలయన్స్ కార్పొరేట్ పార్క్లో జరిగిన ఈ వేడుకలో నీతా అంబానీ ముదురు ఎరుపు రంగు బెనారసీ చీరలో మహారాణిలా కనిపించారు. ముఖ్యంగా చీర ఒక విషయంలో అందరినీ ఆకర్షించింది. పవిత్ర గాయత్రీ మంత్రాన్ని బంగారంతో ఎంబ్రాయిడరీ చేయించడమే దీనికి కారణం. దీంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బంగారు జరీ వర్క్, పక్షుల డిజైన్తో తీర్చి దిద్దిన అద్భుతమైన బెనారసి చీరకు తగ్గట్టుగా గుట్టపూసల నెక్లెస్ను ధరించారు. ఈ నెక్లెస్ ఆంధ్రప్రదేశ్కి చెందిన సాంప్రదాయ దక్షిణ భారత డిజైన్తో పోలి ఉందని నిపుణులు పేర్కొన్నారు. అలాగే చెవిపోగుల్లో శ్రీకృష్ణుని బొమ్మను కూడా గమనించవచ్చు.కాగా సామూహిక వివాహ వేడుకల్లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతోపాటు పెద్ద కుమారుడు, ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతా, కుమార్తె ఇషా అంబానీ పిరమల్,, భర్త ఆనంద్ పిరమల్ పాల్గొన్నారు. శ్లోకా, నీతా ఇద్దరూ నూతన వధూవరులకు ఖరీదైన బహుమతులను అందించారు. దేశవిదేశాలకు అతిరథ మహారథులసమక్షంలో జూలై 12న అనంత్-రాధిక వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. -
వరలక్ష్మి శరత్ కుమార్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ (ఫొటోలు)
-
పెళ్లికి ముందు అంబానీ ఫ్యామిలీ మరో గ్రాండ్ ఈవెంట్
ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. వీరేన్ మర్చంట్, శైలా మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ అతి త్వరలో మూడు ముళ్లతో ఒక్కటవుతున్నారు. వీరి వివాహం జూలై 12న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అత్యంత ఘనంగా జరగనుంది. ఇప్పటికే రెండు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఇప్పుడు పెళ్లికి ముందు మరో భారీ వేడుకను అంబానీ ఫ్యామిలీ నిర్వహించబోతోంది.మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో నిరుపేద యువతీయువకులకు సామూహిక వివాహాలను జరిపించబోతోంది. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను వార్తా సంస్థ ఏఎన్ఐ ప్రచురించింది. దీని ప్రకారం.. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా జూలై 2న సాయంత్రం 4.30 గంటలకు పాల్ఘర్ లోని స్వామి వివేకానంద విద్యామందిర్ లో నిరుపేదల సామూహిక వివాహాన్ని ఏర్పాటు చేశారు.అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ అత్యంత ఆడంబరంగా జరిగాయి. జామ్ నగర్ లో జరిగిన తొలి కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరుకాగా, రిహన్నా వంటి గ్లోబల్ ఐకాన్ల ప్రదర్శనలు ఇచ్చారు. మధ్యధరా సముద్రంపై క్రూయిజ్లో విశిష్టంగా జరిగిన రెండో వేడుక అయితే ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.As part of the pre-wedding celebrations of Anant Ambani and Radhika Merchant, a mass wedding of the underprivileged has been organised at 4:30 pm on 2nd July, at Swami Vivekanand Vidyamandir in Palghar. pic.twitter.com/tRu1h5Em6g— ANI (@ANI) June 29, 2024 -
భర్తతో హీరోయిన్ ఆలియా భట్ క్యూట్ (ఫొటోలు)
-
అంబానీ ప్రేయసి: ఈ ఒక్క లుక్ విలువ రూ. 1002కోట్లు! నమ్ముతారా?
అనంత్ అంబానీకి కాబోయే భార్య, రాధికా మర్చంట్ ఫ్యాషన్ ఔట్ఫిట్స్ ఫ్యాన్స్ని మంత్రముగ్దుల్ని చేస్తోంది. రిలయన్స్ వ్యాపార వారసుడు అనంత్ అంబానీ ప్రేయసిగా తన ఫ్యాషన్ స్టయిల్తో కాబోయే అత్తగారు నీతా అంబానీని మించి అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా అనంత్- రాధిక ఇటలీ - ఫ్రాన్స్ లగ్జరీ క్రూయిజ్ ప్రీ వెడ్డింగ్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో అంబానీ కోడలిగా కాబోయే వదువు రాధిక మెస్మరైజ్ చేసింది. వేలకోట్ల రూపాయలతో నిశ్చితార్థ వేడుక, మొదటి ప్రీ వెడ్డింగ్ వేడుక ఘనంగా జరిగాయి. తాజాగా రెండో ప్రీ-వెడ్డింగ్ బాష్ థీమ్ 'లా వీటా ఇ అన్ వియాజియో' (జీవితం ఒక ప్రయాణం), ఫ్యాషన్ స్టేట్మెంట్లతో ప్రతీ ఈవెంట్, దుస్తులు స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచాయి. అంబానీ ఫ్యాన్ పేజీ అందించిన డ్రెస్ ధలు హాట్ టాపిక్గా నిలుస్తున్నాయి.వైట్ డ్రెస్ మహారాణిలా, ధర రూ.1002 కోట్లురాధికా మర్చంట్ తెల్లటి తమరా రాల్ఫ్ డ్రెస్, డైమండ్ ఆభరణాలతోరాయల్లుక్లో అందంగా మెరిసి పోయింది. స్ప్రింగ్-సమ్మర్ 2024 కలెక్షన్కు చెందిన శాటిన్ గౌనులో రాణిలా కనిపించింది. పట్టు , క్రిస్టల్తో చేసిన గులాబీలు మెడ, నడుముపైనా, తలకు కిరీటంగా అమిరాయి. ఈ మొత్తం లుక్ ధర రూ. 1002కోట్లుక్రూయిజ్ బాష్లో స్టార్రి నైట్ పార్టీ కోసం రాధిక ధరించిన డైమండ్ ఇయర్కఫ్లు, లావెండర్ డ్రెస్, మొత్తం లుక్ ఖర్చు రూ. 896 కోట్లు.రెండో రోజు, టోగా పార్టీకోసం ఏరోస్పేస్ టెక్నాలజీతో తయారు చేసిన డ్రెస్, బంగారు ఆభరణాలతో డైమండ్ నగలు, బ్యాంగిల్స్ , వాచ్తో సహా మొత్తం లుక్ రూ. 697 కోట్లు.అనంత్ ప్రేమను చుట్టుకున్న ఈ లుక్ ధరఅనంత్ తన ప్రేమంతా కురిపించిన లవ్లెటర్తో రాబర్ట్ వున్ డిజైన్ చేసిన గౌను ధరించింది. లేయర్డ్ డైమండ్ నెక్లెస్, మ్యాచింగ్ చెవిపోగులు ధరించింది. ఈమొత్తం లుక్ ఖర్చు రూ. 478 కోట్లు.పాతకాలపు డియోర్ డ్రెస్లో ఖరీదైన యాక్సెసరీస్తో రాధిక అందంగా కనిపించిన మరో డ్రెస్ విలువ రూ. 26 లక్షలు రాధిక మర్చంట్ చిక్ బాల్మైన్ గౌను రూ. 5.43 లక్షలు. ఇంకా చెప్పాలంటే ఈ లిస్ట్ చాలా పెద్దదే. -
నీలం బంగారు గౌనులో మెరిసిపోతున్న శ్లోకా మెహతా..! (ఫొటోలు)
-
అనంత్ అంబానీ - రాధిక ప్రీ వెడ్డింగ్ : అనంత్ లవ్ లెటర్ను గమనించారా?
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి అంటే ఆ సందడి మామూలుగా ఉండదు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్త వీరేన్మర్చంట్, శైలా విరెన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ ముందస్తు పెళ్లి వేడుకలే ఇందుకు నిదర్శనం. అనంత్-రాధిక నిశ్చితార్థం వేడుక మొదలు ఇటీవల, ఇటలీలో నిర్వహించిన రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకల దాకా ప్రతీదీ అత్యంత ఘనంగా నిర్వహించారు. లగ్జరీ క్రూయిజ్లో 800మందికి పైగా అతిథులతో నిర్వహించిన రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన విశేషాలు రోజుకొకటి నెట్టింట విశేషంగా మారు తున్నాయి. ముఖ్యంగా కాబోయే వధువు రాధిక మర్చంట్ దుస్తులు, నగలతో పాటు, అత్తగారి హోదాలో నీతా అంబానీ లుక్, ఖరీదైన నగలు చర్చనీయాంశంగా నిలిచాయి. తాజాగా సినీ నిర్మాత రియా కపూర్ రాధిక మర్చంట్ దుస్తులకు సంబంధించిన ప్రత్యేకతలను ఇన్స్టాలో షేర్ చేశారు. రాధిక ధరించిన గౌనుపై అనంత్ లవ్ లెటర్ను అందంగా పొందుపరచడం విశేషం. View this post on Instagram A post shared by Rhea Kapoor (@rheakapoor) అలాగే బంగారు పూతతో తయారు చేసిన మరో అద్భుతమైన డ్రెస్ వివరాలను కూడా రియా అందించారు. అంబానీ రాయల్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో భాగంగా టోగా పార్టీలో రాధిక ధరించిన గ్రేస్ లింగ్ ‘కోచర్’ని గురించి పరిచయం చేశారు. రాధిక బాడీకి అతికినట్టు సరిపోయింది అంటూ దీన్ని తయారు చేసిన టీంకు అభినందనలు తెలిపారు. అత్యాధునిక 3డీ టెక్నాలజీతో 30 మంది కళాకారులు దీన్ని తయారు చేశారట. -
ఖరీదైన నగలు, అదిరే స్టయిల్ : కోడల్ని మించి మెరిసిపోయిన నీతా అంబానీ
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ రెండో ప్రీ వెడ్డింగ్ వేడుక ఇటలీలో లగ్జరీ క్రూయిజ్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కాబోయే వధూవరులు అందంగా మెరిసిపోయారు. వీరితోపాటు అనంత్ తల్లి,ఫ్యాషన్ ఐకాన్ నీతా అంబానీ మరింత అందంగా స్పెషల్గా కనిపించారు. 60 ఏళ్ల వయసులో కూడా తన అందమైన రూపంతో అందర్నీ ఆకర్షించారు.ప్రముఖ పరోపకారి, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకురాలు, రిలయన్స్ పౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా తన చిన్న కుమారుడి రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలో రెండో రోజు షియాపరెల్లి బ్రాండ్ వైట్ టోగాలో అద్భుతంగా కనిపించారు. దీనికి జతగా ఇదే బ్రాండ్కు చెందిన లక్షల విలువైన ప్రత్యేక ఆభరణాలతో స్టయలిష్ లుక్లో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆమె మెడలో ధరించిన మ్యాచింగ్ నెక్లెస్, చెవులకు స్టడ్స్, అలాగే ఒకవైపు మౌత్ బీన్, మరోవైపు బ్రాండ్ సిగ్నేచర్ ‘ఎనామెల్ ఐ’తో రూపొందించిన డబుల్ బ్రూచ్ ప్రత్యేకంగా నిలిచాయి.ఇక నీతా ధరించిన బ్రూచ్ ధర 2 లక్షల రూపాయలకు పై మాటే. అలాగే ఆమెధరించిన ‘కొల్లియర్ రూబన్ స్పైరల్’ అనే ప్రత్యేకమైన నెక్లెస్ ధర రూ. 6.15 లక్షల దాకా ఉంటుందని అంచనా.మే 31 నీతా అంబానీ ఫుల్ స్లీవ్ పర్పుల్ కలర్ పూల ఎంబ్రాయిడరీ గౌనులో మరింత అందంగా ముస్తాబయ్యారు. 4-5 క్యారెట్ల ఎమరాల్డ్-కట్ డైమండ్ నెక్పీస్ని, చెవిపోగులు, వెరైటీ సన్ గ్లాసెస్తో రాధికా అత్తగారిగా తన ఫ్యాషన్ స్టయిల్ను మరో సారి చాటుకున్నారు -
ఆ బ్యూటిఫుల్ ఫొటోలు తీసింది ఈయనే.. చార్జ్ ఎంతో తెలుసా?
Anant-Radhika pre wedding: ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, వీరేన్ మర్చంట్, శైలా మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ ఇటీవల యూరప్లోని విలాసవంతమైన క్రూయిజ్ షిప్లో రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుపుకొన్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.ఈ గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన అప్డేట్లను అంబానీ కుటుంబం నేరుగా తెలియజేయకపోయినప్పటికీ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ తీసిన అద్బుతమైన ఫొటోలు ఆ ఈవెంట్ ఎంత గ్రాండ్గా జరిగిందో తెలియజేస్తున్నాయి. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పంచుకున్న మధుర క్షణాలను ఈ ఫొటోలు మరింత అద్భుతంగా చూపిస్తున్నాయి.జోసెఫ్ రాధిక్ సెలబ్రిటీ వెడ్డింగ్స్ కవరేజ్ చేయడంలో దిట్ట. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల రెండో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్కు అంబానీ కుటుంబం ఏర్పాటు చేసుకున్న ఫొటో గ్రాఫర్ ఈయనే. ఇంత ఫేమస్ అయిన జోసెఫ్ రాధిక్ ఎప్పుడూ ఫోటోగ్రాఫర్ కావాలనుకోలేదు. ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ చదివి మూడేళ్లు కార్పొరేట్ ప్రపంచంలో పనిచేసిన జోసెఫ్ రాధిక్ తనకు ఆనందాన్నిచ్చే ఏకైక విషయం అద్భుతమైన ఫొటోలు తీయడమేనని త్వరలోనే గ్రహించాడు. అందుకే 2010లో అధిక వేతనం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి స్థాయి వెడ్డింగ్ ఫొటోగ్రఫీలో కెరీర్ను ఎంచుకున్నాడు.సోషల్ మీడియాలో వైరల్ అయ్యే పలు సెలబ్రిటీల వెడ్డింగ్ ఫోటోల వెనుక జోసెఫ్ రాధిక్ ఉన్నాడు. కత్రినా కైఫ్-విక్కీ కౌశల్, విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ, కేఎల్ రాహుల్-అతియా శెట్టి జంటలకు ఆయన వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్. ఇంతకీ జోసెఫ్ రాధిక్ ఎంత చార్జ్ చేస్తాడో చెప్పలేదు కదా.. ఆయన ఒక రోజుకు రూ .1,25,000 - రూ .1,50,000 తీసుకుంటాడు. దీనికి పన్నులు, ట్రావెల్, బస ఖర్చులు అధికం. -
అనంత్, రాధిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ - బ్యూటిఫుల్ ఫోటోలు
-
అనంత్-రాధిక క్రూయిజ్ పార్టీ : మెరిసిన రాధిక, ఫోటోలు వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన ప్రేయసి రాధికా మర్చంట్ను జులైలో పెళ్లి చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే మార్చిలో అనంత్-రాధిక తొలి ప్రీవెడ్డింగ్ పార్టీని ఘనంగా నిర్వహించారు. ఆ తరువాత కనీవినీ ఎరుగని రీతిలో ఇటలీలో రెండొ ప్రీ-వెడ్డింగ్ వేడుకను గ్రాండ్ క్రూయిజ్ పార్టీలో నిర్వహించారు. మే 29న ప్రారంభమై జూన్ 1న ఫ్రాన్స్లో ముగిసిన ఈ వేడుకలో పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు సందడి చేసిన సంగతి తెలిసిందే.తాజాగా అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ ఫోటోలు ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అనంత్ రాధికా వివాహం జరగనుంది. మూడు రోజుల పాటు జరిగే వివాహ వేడుకలో మూడు ఈవెంట్లు ఉండ బోతున్నాయి. తొలుత 'శుభ వివాహ' ఆ తర్వాత జూలై 13న 'శుభ్ ఆశీర్వాద్' , 'మంగళ ఉత్సవ్', జూలై 14న వివాహ రిసెప్షన్ ఉంటుంది. అనంత్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ప్లాట్ఫారమ్లు, రిలయన్స్ రిటైల్ వెంచర్స్, రిలయన్స్ న్యూ ఎనర్జీ , రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీ బోర్డులలో డైరెక్టర్గా పనిచేస్తున్నారు -
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ పై సందర్శకులు ఫైర్
-
అంబానీ బుక్ చేసుకున్న క్రూయిజ్లో ఒక గదికి ఒక్క రోజుకి ఎన్ని లక్షలో తెలుసా..?
-
అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలపై ఆగ్రహం.. కారణం ఇదే..
ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, సంపన్న పారిశ్రామికవేత్త రాధికా మర్చంట్ల రెండో ప్రీ వెడ్డింగ్ వేడుక సముద్రంపై విలాసవంతమైన క్రూయిజ్లో నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగింది. ఇటలీలోని పాలెర్మో నుంచి సౌత్ ఫ్రాన్స్ వరకు సుమారు 4,380 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన విలాసవంతమైన క్రూయిజ్ లైనర్లో సుమారు 800 మంది ప్రముఖులు పాల్గొన్నారు. రోమ్, పోర్టోఫినో, జెనోవా, కేన్స్ లలో ఈ నౌకకు ప్రత్యేకంగా స్టాప్లు ఏర్పాటు చేసి వేడుకలు నిర్వహించారు.అయితే ఈ వేడుక పోర్టోఫినోలోని వ్యాపారులు, స్థానిక ప్రజలకు కోపం తెప్పించింది. అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం స్థానిక బేను తీసుకుని స్థానికులకు, సందర్శకులకు అందుబాటులో లేకుండా చేయడమే ఇందుకు కారణం. ఇంతకు ముందెన్నడూ ఒక కార్యక్రమం కోసం ఇలా మొత్తం బేను మూసివేయలేదు. ఇక్కడ చాలా మంది సెలబ్రిటీల వివాహ వేడుకలు జరిగాయి. ఆస్ట్రేలియన్ సంగీతకారిణి సియా, రియాలిటీ టీవీ స్టార్ కోర్ట్నీ కర్దాషియాన్ వెడ్డింగ్ ఇక్కడే జరిగింది.మరో వైపు అనంత్ - రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలో పలు రకాల వంటకాల కోసం స్థానిక ప్రసిద్ధ రెస్టారెంట్లకు ఆర్డర్లు ఇచ్చారు. తమను లోబ్స్టర్ శాండ్విచ్లు తయారు చేయమని అడిగారిని, కానీ వేడుకలకు 20 రోజుల ముందు మాత్రమే తమకు సమాచారం ఇచ్చారని స్టీవెన్ స్పీల్బర్గ్, సర్ ఎల్టన్ జాన్, డెంజెల్ వాషింగ్టన్ మరియు సిల్వియో బెర్లుస్కోనీ వంటివారికి సేవలందించిన ప్రసిద్ధ రెస్టారెంట్ ఇల్ పునీ మేనేజర్ ఆండ్రియా మిరోలి తెలిపారు. ఈ చర్య అవమానకరంగా, అనుచితంగా ఉందని ఆయన వెల్లడించారు.ఇక సోషల్ మీడియాలో స్థానికులు, సందర్శకులు పలు పోర్టోఫినో ప్రదేశాలు తమకు అందుబాటులో లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. "చాలా మంది ఇతర సెలబ్రిటీలు, బిలియనీర్లు పోర్టోఫినోలో సంబరాలు చేసుకున్నారు, వారిలో ఎవరూ ఇతరులకు ప్రధాన పాయింట్కు యాక్సెస్ లేకుండా చేయలేదు" అని ఎక్స్ యూజర్లలో ఒకరు రాసుకొచ్చారు. -
అంబానీ బుక్ చేసుకున్న క్రూయిజ్లో వెళ్తారా.. ఒక్కరోజుకి అన్ని లక్షలా?
జులైలో పెళ్లి చేసుకోబోతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ గతంలో జామ్నగర్లో మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ చేసుకున్నారు. ఇటీవలే మరోసారి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ క్రూయిజ్ షిప్లో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుక 29 మే నుంచి జూన్ 1 వరకు జరిగింది.ఇటలీ నుంచి సౌత్ ఫ్రాన్స్ వరకు సుమారు 4,380 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన విలాసవంతమైన క్రూయిజ్ లైనర్లో సుమారు 800 మంది ప్రముఖులు పాల్గొన్నారు. అంబానీ ఫ్యామిలీ బుక్ చేసుకున్న ఈ క్రూయిజ్ షిప్ విలాసవంతమైన సదుపాయాలను కలిగి ఉంటుంది.గతంలో జామ్నగర్ వేడుకలకు అంబానీ కుటుంబం రూ.1,200 కోట్లు ఖర్చు చేసింది. ఈ సారి క్రూయిజ్ షిప్లో జరిగిన వేడుకలకు ఎంత ఖర్చు చేశారనేది అధికారికంగా వెల్లడి కాలేదు. దీనికి కూడా వేలకోట్లు ఖర్చు చేసి ఉంటారని తెలుస్తోంది.క్రూయిజ్ షిప్లో బస చేయడానికి అయ్యే ఖర్చుఅంబానీ ఫ్యామిలి బుక్ చేసుకున్న సెలబ్రిటీ అసెంట్ క్రూయిజ్ షిప్లో ఒక రాత్రి బస చేయాలనంటే ఒక గదికి 1849 డాలర్ల నుంచి 2879 డాలర్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 153705 నుంచి రూ. 239328 ఖర్చు అవుతుందని సమాచారం. సెలబ్రిటీ క్రూయిసెస్ ప్రకారం, ఓషన్-వ్యూ స్టేట్రూమ్ అండ్ సూట్ కోసం 5,736 డాలర్లు లేదా దాదాపు రూ. 4,76,828 వెచ్చించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు. 👉 : (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘సిండ్రిల్లా’లా మెరిసిన రాధికా మర్చంట్, మురిసిన అంబానీ
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్త కుమార్తెతో రాధిక మర్చంట్ రెండో ప్రీ వెడ్డింగ్ వేడుక ఇటలీలో క్రూయిజ్ షిప్లో కనీవినీ ఎరుగని రీతిలో ఘనంగా జరిగింది. గుజరాత్లోని జాం నగర్లో ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన మొదటి ప్రీ వెడ్డింగ్ వేడుకలతో పోలిస్తే, రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకను మరింత ఘనంగా నిర్వహించింది అంబానీ కుటుంబం. అలాగే ఈ వేడుకలో రాధికా మర్చంట్ తన ప్రిన్స్, అనంత్ అంబానీతో రియల్ లైఫ్ సిండ్రిల్లాలా మెరిసిపోయింది. రాధిక, నీలిరంగులోని కార్సెట్ గౌనులో అందంగా కనిపించింది. దీనికి బ్లూ డైమండ్, బ్లూ సఫైర్ నెక్లెస్, చెవిపోగులు ధరించింది. అటు అనంత్ అద్భుతమైన లుక్స్తో ఆకట్టుకున్నాడు. అనంత్ బూజీ బ్లాక్ సెల్ఫ్ డిజైన్ చేసిన బ్లాక్ టక్సేడోలో అందంగా కనిపించాడు. అందంతో మెరిసిపోతున్న ప్రేయసిని చూసి అనంత్ అంబానీ, అటు పెళ్లి కళ ఉట్టిపడుతున్ నకాబోయే కోడల్ని చూసి ముఖేష అంబానీ కూడా మురిసిపోయారు. ఇదే ఈవెంట్లో పింక్ డియోర్ దుస్తులు ధరించింది రాధిక. ఈ గౌను ధర సుమారు మూడు లక్షలట. అలాగే ఈ సందర్భంగా ఆమె ధరించిన బ్యాగ్ ధర రూ. 26 లక్షలట. ఇటలీలోని పోర్టోఫినోలో జరిగిన ఈ వేడుకకు దాదాపు 800 మందికి పైగా అతిథులుతో రూ.7500 కోట్లతో ఘనంగా జరిగిందీ వేడుక. జూలై 12న లవ్బర్డ్స్ అనంత్- రాధిక పెళ్లి పీటలెక్కనున్నారు. -
Sara Ali Khan: అంబానీ ప్రీవెడ్డింగ్.. ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న కుర్ర హీరోయిన్ (ఫోటోలు)
-
అనంత్- రాధిక ప్రీవెడ్డింగ్: ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న ధోని ఫ్యామిలీ (ఫొటోలు)
-
అంబానీయా.. మజాకా! సముద్రతీరమంతా బుక్ చేసేశాడుగా!
రాధిక మర్చంట్, అనంత్ అంబానీల ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభాగంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎంతో మంది సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ఇటలీలోని పోర్టోఫినోలో జరిగిన చివరి రోజు ఈవెంట్లో ప్రఖ్యాత ఇటాలియన్ టేనర్ ఆండ్రియా బోసెల్లి మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇటలీలో జరిగిన ఈ వేడుకలకు జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ వంటి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు సైతం హాజరయ్యారు. మొత్తం ఈ వేడుకలకు 1200 మంది అతిథులు హాజరైనట్లు సమాచారం. ఈ కార్యక్రమం కోసం అంబానీ ఏకంగా పోర్టోఫినో సముద్ర తీరం మొత్తాన్ని బుక్ చేసుకున్నారు. View this post on Instagram A post shared by yourpoookieboo(YPB) (@yourpoookieboo)అంబానీ ఫ్యామిలీ ఇటలీ సెలబ్రేషన్లకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో అంబానీ ఫ్యామిలీతో పాటు.. షారుఖ్ ఖాన్, భార్య గౌరీ ఖాన్, జాన్వీ కపూర్, కియారా అద్వానీ, రణబీర్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా మొదలైన సెలబ్రిటీలు కూడా కనిపించారు. View this post on Instagram A post shared by yourpoookieboo(YPB) (@yourpoookieboo) -
అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్.. సాంగ్స్తో జోష్ నింపిన కేటీ పెర్రీ (ఫోటోలు)
-
అనంత్-రాధిక క్రూయిజ్ పార్టీ : బాలీవుడ్ తారల సందడి, వీడియో వైరల్
బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ రెండో ప్రీ వెడ్డింగ్ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ స్పెషల్ క్యూయిజ్ పాప్-రాక్ స్టార్ కేటీ పెర్రీ అదర గొట్టేసింది. అలాగే బాలీవుడ్ హీరో రణవీర్ సందడి చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సారా అలీఖాన్ తన 'రోమన్ హాలిడే'ని ఆస్వాదిస్తూ స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. అలాగే త్వరలో తండ్రి కాబోతున్న రణ్వీర్ సింగ్ కూడా స్టేజ్పై స్టెప్పులతో అలరించాడు. క్రూయిజ్లో అతిథులతో సెల్ఫీకి పోజులిచ్చాడు. అలాగే ఓర్రీ అమాంతం ఎత్తివేసిన దృశ్యాలు నెట్టింట్ హల్ చల్ చేస్తున్నాయి.Radhika-Anant's 2nd pre wedding bash: Backstreet Boys perform 'I Wanna Be With You' at cruise party.#AmbaniWedding @backstreetboys Read more: https://t.co/fUFPEByuB0 pic.twitter.com/og7wMLZj6k— editorji (@editorji) May 30, 2024'లా వీటా ఇ అన్ వియాజియో' అనే థీమ్తో ఇచ్చిన లైవ్ ఈవెంట్ అతిథులను మెస్మరైజ్ చేసింది. ఈ ఈవెంట్ కోసం ఆమె 45 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే కొలంబియన్ సింగర్ షకీరా అంబానీ ప్రీ వెడ్డింగ్లో ప్రత్యేకంగా పెర్ఫామ్ చేయడానికి ఆమె రూ.15 కోట్లు అందుకుంటున్నట్టు సమాచారం.'స్టార్రీ నైట్స్' క్రూయిజ్ వేడుకలో లెజెండరీ బాయ్ బ్యాండ్ బ్యాక్స్ట్రీట్ బాయ్స్ హై-ఎనర్జీ ప్రదర్శనతో ఈవెంట్ షురూ అయింది. వారి ట్రేడ్మార్క్ ఆల్-వైట్ దుస్తులను ధరించి, పాపులర్ ట్రాక్స్తో ఆహూతులను అలరించారు. ఇదే పార్టీలో అంబానీ, నీతా దంపతుల పెద్ద కుమారుడు ఆకాశ్-శ్లోకా మెహతా ముద్దుల తనయ వేదా తొలి బర్త్డే వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. కాగా అనంత్-రాధిక మర్చంట్ జూలై 12న పెళ్లి పీటలెక్కబోతున్నారు. ముంబైలోని BKCలోని జియో వరల్డ్ సెంటర్లో సాంప్రదాయ హిందూ వైదిక ఆచారాల ప్రకారం ఈ వివాహం జరగనుంది. -
అనంత్-రాధికల ప్రీవెడ్డింగ్ వేడుకలో కాటిపెర్రీ పెర్ఫార్మెన్స్
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాప్ సెన్సేషన్ కాటి పెర్రీ చేసిన లైవ్ పెర్ఫార్మెన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో పెర్రీ సిల్వర్కలర్లో శరీరాన్ని హత్తుకుని ఉండే దుస్తులు ధరించి అందరినీ ఆకట్టుకుంది. తనతోపాటు ఈ ఈవెంట్లో పాల్గొన్న తన ట్రూప్ తెల్లటి దుస్తులు ధరించి వేడుకలో పాల్గొన్న సెలబ్రిటీలను అలరించారు.ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్-రాధికల రెండో ప్రీవెడ్డింగ్ వేడుకలు మే 29న ప్రారంభమై జూన్ 1న ముగుస్తాయి. క్రూయిజ్షిప్లో జరిగే ఈ వేడుకలో దాదాపు 900 మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇటలీ నుంచి దక్షిణ ఫ్రాన్స్కు సుమారు 4,380 కిలోమీటర్లమేర క్రూయిజ్ ప్రయాణం సాగుతుంది.అనంత్ అంబానీ-రాధిక మొదటి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఈ ఏడాది మార్చినెలలో ఘనంగా జరిగాయి. గుజరాత్లోని జామ్నగర్ జరిగిన ఈ వేడుకల్లో ప్రముఖులు సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో మెటా ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, గ్లోబల్ పాప్ స్టార్ రిహన్న వంటి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. ముకేశ్ అంబానీ తన కుమారుడు, కోడలు ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం సుమారు రూ.1200 కోట్లు ఖర్చు చేసినట్లు ఫోర్బ్స్ గతంలోనే నివేదించింది.ఇదీ చదవండి: భారీగా తగ్గనున్న ఎలక్ట్రానిక్ వాహన ధరలు.. ఎంతంటే..సంప్రదాయ హిందూ వైదిక ఆచారాల ప్రకారం ఈ జంట ముంబైలో జులై 12న వివాహం చేసుకోనుంది. జులై 12 శుక్రవారం రోజున శుభ వివాహ వేడుకతో పెళ్లి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జులై 13 శనివారం శుభ్ ఆశీర్వాద్, జులై 14 ఆదివారం రోజు జరిగే మంగళ్ ఉత్సవ్, వివాహ రిసెప్షన్తో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.Katy Perry performing Firework at Cannes tonight! pic.twitter.com/MafEP3OJGP— Katy Perry Today (@todaykatyp) June 1, 2024 -
అంబానీ ఇంట పెళ్లి సందడి: రెండో ప్రీ వెడ్డింగ్ బాష్ ఖర్చు ఎంతో తెలుసా?
బిలియనీర్ ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి, అందులోనూ ఈ తరంలో చివరి పెళ్లి. అందుకే బోలెడంత సందడి. ఇది చాలదన్నట్టు ఘనంగా నిశ్చితార్థం, అంగరంగ వైభవంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. ఇపుడు కనీవినీ ఎరుగని రీతిలో రెండో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు షురూ అయ్యాయి. దీంతో రోజుకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ హాట్ టాపిక్గా నిలిచింది.ముఖేష నీతా అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్తో జూలై 12న ముంబైలో జరగనుంది. దీనికి ముందుగా దక్షిణ ఫ్రాన్స్లో ఉన్న విల్లాలో దేశ విదేశాలకు చెందిన 800 మంది ముఖ్య అతిథులతో ఇటలీ నుండి ఫ్రాన్స్కు వెళ్లే మార్గంలో విలాసవంతమైన క్రూయిజ్లో రెండో ప్రీ-వెడ్డింగ్ వేడుక జరుగుతోంది. జూన్ 1, 2024న ఇటలీలోని సుందరమైన పోర్టోఫినో నగరంలో ముగుస్తుంది.తాజా సమాచారం ప్రకారం అనంత్ అంబానీ-రాధిక మూడు రోజుల ప్రీ-వెడ్డింగ్లో పాపులర్ అమెరికన్ గాయని-గేయరచయిత, కేటీ పెర్రీ ప్రదర్శన ఇవ్వనుంది. ఈ రోజు సాయంత్రం(మే 31) డార్క్ హార్స్, రోర్, ఎలక్ట్రిక్, హార్లేస్ ఇన్ హవాయి పాటలతో ఈ గ్రాండ్ ఈవెంట్లో సందడి చేయనుంది. 'లా విటా ఇ అన్ వియాజియో' (జీవితం ఒక ప్రయాణం) థీమ్తో ఈ గాలా సాగుతుంది. ఇందుకు కోసం పాప్ ఐకాన్కు భారీ మొత్తంలోనే ముట్ట చెప్పారట. ఖర్చు రూ. 7500కోట్లురూ. 424 కోట్ల విలువైన ఎస్టేట్లో నిర్వహించే రెండో ప్రీ వెడ్డింగ్ బాష్ కోసం అంబానీ కుటుంబం ఏకంగా 7,500 కోట్లు రూపాయలు వెచ్చిస్తోంది. అంతేకాదు క్రూయిజ్లోని ప్రతి సూట్ స్పా, జిమ్, స్విమ్మింగ్ పూల్ మరెన్నో విలాసవంతమైన సౌకర్యాలతో ఉంటుంది. ఒక్కోదానికి ఖర్చు సుమారు రూ. 60 లక్షలు. ఐదు గంటలు పాటు జరిగే మూడో రోజు స్పెషల్ ఈవెంట్లో డీజేలు, బాణా సంచా వెలుగులతో మోత మోగనుంది.కాగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ జూలై 12, 2024న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోనున్నారు. అతిరథ మహారథుల సమక్షంలో మూడు రోజుల పాటు పెళ్లి సంబరాలు కొనసాగనున్నాయి. -
Anant - Radhika Cruise Party : షకీరా ఆట పాట, ఫీజు తెలిస్తే ఫ్యూజులెగిరిపోతాయ్!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన ప్రేయసి రాధికా మర్చంట్ను జూలై 12, 2024న వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చిలో గుజరాత్లోని జామ్నగర్లో స్టార్-స్టడెడ్ ప్రీ-వెడ్డింగ్ వేడుకను నిర్వహించారు. ఇపుడిక రెండోసారి ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం. బిలియనీర్ స్టేటస్కి తగ్గట్టుగా ఈసారి ఇటలీలో క్రూయిజ్ షిప్లో నిర్వహిస్తుండటం విశేషం.నాలుగు రోజుల ఈవెంట్ల గురించిన వివరాలతో నిండిన రెండవ ప్రీ-వెడ్డింగ్ ఇన్విటేషన్, ప్లాన్, ఫోటోలు ఇంటర్నెట్లో హాట్ టాపిక్గా నిలిచాయి. తాజాగా మరో వార్త హల్చల్ చేస్తోంది. పాపులర్ పాప్ సింగర్, పాటల రచయిత షకీరా అనంత్ రాధిక క్రూయిజ్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. తాజా నివేదికల ప్రకారం ఈ ఈవెంట్ కోసం రూ.10-15 కోట్లు చార్జ్ చేయనుందని తెలుస్తోంది.కాగా ఇటలీలో మే 29 నుండి జూన్ 1, 2024 వరకు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ల రెండో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి. వెల్కం డిన్నర్, మే 30, 2024న 'రోమన్ హాలిడే' , 'లా డోల్స్ ఫార్ నియెంటె', 'టోగా పార్టీ'. ఆ తర్వాత, మే 31, 2024న ఆకాష్ అంబానీ శ్లోకా మెహతా కుమార్తె, వేద తొలి ఏడాది పుట్టినరోజు వేడుకలు జరగనున్నాయి. కొన్నిఇప్పటికే సల్మాన్ఖాన్, అలియా, రణబీర్దంపతులు, రణ్వీర్ సింగ్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యామిలీ ఇటలీకి పయనమైన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలతోపాటు, పలువురు ప్రముఖులు దాదాపు 800మంది పాల్గొనే అవకాశం ఉంది. అయితే జామ్నగర్ ఈవెంట్ కోసం రూ.1259 కోట్లు, కేవలం కేటరింగ్కే ఏకంగా రూ. 210 కోట్లు ఖర్చు చేసిన అంబానీ కుటుంబం ఈ సారి ఎంత వెచ్చిస్తోంది అనే చర్చ జోరుగా సాగుతోంది. -
అప్పుల్లో ఉన్నా అస్సలు తగ్గని అనిల్ అంబానీ.. కొత్త కారులో
భారతదేశంలోని అత్యంత సంపన్నులైన ముఖేష్ అంబానీ తన రెండో కొడుకు ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరపడానికి సిద్ధమయ్యారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ బాష్ 29 మే నుంచి జూన్ 1 మధ్య జరుగుతుంది. కుటుంబ సభ్యులు ఇప్పటికే ఇటలీకి బయలుదేరారు. తాజాగా ముఖేష్ అంబానీ సోదరుడు 'అనిల్ అంబానీ' బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారులో విమానాశ్రయంలో కనిపించారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో అనిల్ అంబానీ బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారులో నుంచి దిగటం చూడవచ్చు. కారు నుంచి బయటకు వచ్చిన తరువాత ఫోటోగ్రాఫర్ల వైపు కూడా చూడకుండా ముంబైలోని కలీనా విమానాశ్రయంలోకి వెళ్లారు. కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రకారం ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ పేరుతో రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. కాబట్టి ఇది అనిల్ అంబానీ కొనుగోలు చేశారా అని పలువురు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.బీవైడీ ఎలక్ట్రిక్ కారు డైనమిక్, ప్రీమియం, పర్ఫామెన్స్ అనే మూడు వేరియంట్లలో.. ఆర్కిటిక్ బ్లూ, అరోరా వైట్, అట్లాంటిస్ గ్రే, కాస్మోస్ బ్లాక్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అనిల్ అంబానీ కనిపించిన కారు ప్రీమియం వేరియంట్ అని తెలుస్తోంది.బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారు 61.44 కిలోవాట్, 82.56 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్ ఆప్షన్స్ పొందుతుంది. ఇవి వరుసగా 510 కిమీ, 650 కిమీ రేంజ్ అందిస్తాయి. వీటి ధరలు వరుసగా రూ. 41 లక్షలు, రూ. 53 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరును అందిస్తాయి. View this post on Instagram A post shared by The Viral Cinema - Sajal Jain (@theviralcinema) -
అనంత్-రాధిక ప్రీవెడ్డింగ్ ప్లాన్.. ఈసారి ఏకంగా సముద్రంలో సెలబ్రేషన్స్!
ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ జూలై 12న రాధికా మర్చంట్ను పెళ్లి చేసుకోనున్నారు. ఇప్పటికే ఓ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ పూర్తి చేసుకున్న ఈ జంట.. మరో ప్రీ వెడ్డింగ్ కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. ఇది మే 29న ప్రారంభమై జూన్ 1న ముగియనుంది.మొదటి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జామ్నగర్లో జరిగాయి. రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు క్రూయిజ్ షిప్లో జరగనున్నాయి. ఈ వేడుకకు అలియా భట్, రణబీర్ కపూర్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, అయాన్ ముఖర్జీ మొదలైన బాలీవుడ్ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు హాజరుకానున్నారు. ఈ వేడుకలకు సెలబ్రెటీలు ఇప్పటికే ముంబై నుంచి బయలుదేరారు.మే 29న ప్రారంభమై జూన్ 1న ముగియనున్న ఈ వేడుకలు ఎలా సాగనున్నాయి, డ్రెస్ ఎలా ఉంటుందనే వివరాలతో పాటు సెకండ్ ప్రీ వెడ్డింగ్ ఇన్విటేషన్ షెడ్యూల్ కూడా లీక్ అయ్యింది. ఈ ప్రయాణం ఇటలీ నుంచి దక్షిణ ఫ్రాన్స్కు సుమారు 4,380 కిలోమీటర్లు సాగుతుందని సమాచారం. ఈ వేడుకలకు దాదాపు 800 మంది అతిథులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.మే 29, బుధవారం: వెల్కమ్ లంచ్తో వేడుక ప్రారంభం కానుంది. డ్రెస్ కోడ్ క్లాసిక్ క్రూయిజ్. ఆ తరువాత 'స్టార్రీ నైట్' థీమ్ ఈవెంట్ జరుగుతుంది. దీనికి డ్రెస్ కోడ్ వెస్ట్రన్ ఫార్మల్స్.మే 30, గురువారం: అతిథులందరూ రోమ్లో దిగుతారు. అప్పుడు టూరిస్ట్ చిక్ డ్రెస్ ధరించాల్సి ఉంటుంది. సాయంత్రం 'టోగా పార్టీ'తో రెండో రోజు ముగుస్తుంది.మే 31, శుక్రవారం: మూడో రోజు థీమ్ 'వీ టర్న్స్ వన్ అండర్ ది సన్', 'లే మాస్క్వెరేడ్' అండ్ 'పార్డన్ మై ఫ్రెంచ్'. ఇది క్రూయిజ్లో ఆఫ్టర్పార్టీతో ముగుస్తుంది.జూన్ 1, శనివారం: వేడుక చివరి రోజు థీమ్ 'లా డోల్స్ వీటా'. అతిథులు ఇటాలియన్ సమ్మర్ డ్రెస్ కోడ్ను అనుసరించాల్సి ఉంటుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
ఆసియా బిలియనీర్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు చిన్న కుమారుడు అనంత్ అంబానీ -రాధికా మర్చంట్ల పెళ్లి ముచ్చట మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకుని, ప్రీ వెడ్డింగ్ బాష్ను ఘనంగా నిర్వహించుకున్న లవ్బర్డ్స్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఛలో ఇటలీ..ఈ ఏడాది మార్చిలో జామ్నగర్లో వారి గ్రాండ్ ప్రీ-వెడ్డింగ్ వేడుకల తర్వాత, అనంత్ -రాధిక మర్చంట్ ఇటలీ నుండి ఫ్రాన్స్కు ప్రయాణించే క్రూజ్లో మూడు రోజుల వేడుకను నిర్వహించనున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా మరో ప్రీ వెడ్డింగ్ వేడుకను నిర్వహించుకునేందుకు రడీగా ఉన్నారు. ఈ వేడుక కోసం బాలీవుడ్, క్రీడా, రాజకీయ రంగ ప్రముఖులు ఇటలీకి పయనమయ్యారు. ముఖ్యంగా ముఖేష్ అంబానీ, నీతా అంబానీతోపాటు,అనిల్ అంబానీ , కాబోయే వధువు రాధిక తండ్రితో కలిసి వెళ్లారు. ( ఇదీ చదవండి: అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ బాష్ : 800 మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?)అలాగే రాధిక-అనంత్కు మంచి స్నేహితులు బాలీవుడ్ స్టార్ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్ తన ముద్దుల తనయ రాహాలతో కలిసి బయలుదేరారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అలాగే ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి, పాపతో కలిసి ఎయిర్ పోర్ట్లో దర్శనిచ్చారు. అంతేనా సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్ ఇంకా బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ కూడా ఈ వేడుకకు హాజరు కానున్నారు. (చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్ : రూ.640 కోట్ల దుబాయ్ లగ్జరీ విల్లా)కాగా అనంత్-రాధిక రెండవ ప్రీ వెడ్డింగ్ బాష్ మే 28వ తేదీనుంచి 30 మధ్య దక్షిణ ఫ్రాన్స్ తీరంలో క్రూయిజ్ షిప్లో జరుగుతందని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. క్రూయిజ్ ఇటలీ నుండి బయలుదేరి, 2365 నాటికల్ మైళ్లు (4380 కిమీ) దూరం ప్రయాణించి దక్షిణ ఫ్రాన్స్లో ఉన్న వేదికకు చేరుకుంటుంది. -
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ బాష్ : 800 మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
ఆసియా కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన లేడీ లవ్ రాధిక మర్చంట్ మెడలో మూడు ముళ్లు వేసేందుకు సన్నద్ధమవున్నాడు. వచ్చే నెల (జూలై 12న) అనంత్-రాధిక వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించేందుకు అంబానీ సిద్ధమ వుతున్నారు. ఈ క్రమంలో మార్చి మూడవ తేదీవరకు జామ్నగర్లో గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకుల సందడి ఇంకా ముగియకముందే రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకకు సన్నద్ధమవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ నెల 28 నుంచి 30 మధ్య దక్షిణ ఫ్రాన్స్లో క్రూయిజ్ షిప్లో రెండో ప్రీ-వెడ్డింగ్ వేడుక జరగనుంది. క్రూయిజ్ ఇటలీ నుండి బయలుదేరి 2365 నాటికల్ మైళ్ల (4380 కి.మీ) దూరం ప్రయాణించి దక్షిణ ఫ్రాన్స్లోని గమ్యస్థానానికి చేరుకుంటుందని కూడా పేర్కొంది. ఈ వేడుక కేవలం పెళ్లి చేసుకోబోయే అనంత్-రాధికకు మాత్రమేకాదు అతిథులందరికీ కూడా అద్భుతమైన అనుభవంగా మిగలేలా సర్వ హంగులతో ఏర్పాట్లు చేస్తున్నాయిట ఇరు కుటుంబాలు. అతిధులు ఈ వేడుకలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి స్టార్ సెలబ్రిటీలతో సహా మొత్తం 800 మంది అతిథులు హాజరుకానున్నారు. రముఖ్యంగా అనంత్ సోదరుడు ఆకాష్ అంబానీ శ్లోకా మెహతా జంటతో సన్నిహితంగా ఉంటే బాలీవుడ్ జంట రణబీర్ కపూర్ అలియా భట్ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలవబోతున్నారు. క్రూయిజ్ షిప్లో మొత్తం 600 మంది సిబ్బంది అతిథుల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారట. కాగా 2017లో డ్రైవ్లో పరస్పర స్నేహితుల ద్వారా పరిచయమైన వీరిద్దరూ లవ్బర్డ్స్గా మారిపోయారు. కొన్నాళ్ల డేటింగ్ తరువాత 2023లో రాజస్థాన్లోని నాథ్ద్వారాలోని శ్రీనాథ్జీ టెంపుల్లో రాధికకు పెళ్లికి ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత ఆంటిలియాలో నిశ్చితార్థం వేడుక, 2024లో జామ్నగర్లో మూడు రోజుల పాటు ప్రీవెడ్డింగ్ హస్తాక్షర్ వేడుకను నిర్వహించిన సంగతి తెలిసిందే. -
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
పెళ్లిళ్లకు సంబంధించి ఒక్కోదేశంలో ఒక్కో ఆచారం, సాంప్రదాయం పాటిస్తారు. వీటిల్లో కొన్ని మన భారతీయ సాంప్రదాయాలను పోలి ఉంటాయి. మరికొన్ని భిన్నంగా ఉంటాయి. భారతదేశంలో కొన్ని ఆచారాల ప్రకారం అత్తవారింట అడుగు పెట్టిన నవవధువు పాయసం చేసి అత్తింటి వారి నోటిని తీపి చేస్తుంది కదా. కానీ జాంబియాలో పెళ్లికి ముందే వధువు అత్తింటి వారిని మెప్పించాలి. అలాంటి ఇంట్రస్టింగ్ ఆచారాన్ని గురించి తెలుసుకుందాం. జాంబియాలోని బెంబా తెగలో ప్రీవెడ్డింగ్ వేడుకలో భాగంగా వధువు, వధువు తరపు కుటుంబం రకరకాల వంటలను తయారు చేస్తుంది వరుడు కుటంబం కోసం. దీన్నే ఇచిలంగా ములి (అగ్నిని చూపడం) అంటారు. పెళ్లికొడుకు గౌరవార్థం జరిగే సాంప్రదాయ ఆహార వేడుక. ఈ వేడుకలో వధువు కుటుంబం వరుడికి విందు భోజనం వడ్డిస్తుంది. ఇక్కడ వధువు తన పాక నైపుణ్యాలను ప్రదర్శిస్తుంది. అలాగే భవిష్యత్తులో వధువు కుటుంబంతో కలిసి భోజనం చేయడానికి వరుడికి బహిరంగ ఆహ్వానంగా కూడా భావిస్తారు.This is a tradition in Zambia. New Bride must cook different types of native meals for her in-laws and show them what their son will be eating before they can accept her. So what will the groom do?pic.twitter.com/2fy4f1Rco0— Figen (@TheFigen_) May 6, 2024న్షిమా: మొక్కజొన్న లేదా మొక్కజొన్నతో తయారు చేసి గంజి లాంటి ఆహారాన్ని తయారు చేసి, చికెన్, ఇతర కూరగాయలతో వడ్డిస్తారు. ఈ విందుకోసం సుమారు 40కి పైగా జాంబియన్ వంటకాలు సిద్దం చేస్తారట. ఇది జాంబియన్ సంస్కృతిలో ఆహారం, ఆతిథ్యం ప్రాముఖ్యతను వెల్లడిస్తుంది. అలాగే పెళ్లికి ముందు అబ్బాయి, అమ్మాయిని చూడ్డానికి వెళ్లడం,మధ్య వర్తి రాయ‘బేరా’లు కూడా ఉంటాయి. అలాగే సంతానోత్పత్తికి ప్రతీకగా అమ్మాయి తరపు కుటుంబానికి ఒక గిఫ్ట్ను తీసుకొస్తారు. ముఖ్యంగా నిశ్చితార్థం సూచికగా అబ్బాయి, అమ్మాయికి పూసలు, డబ్బులు కానుకగా ఇస్తాడు. ఆ తరువాత ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకుంటారు. -
ఆఖరికి అంబానీ ఇంట పార్టీ అయినా ఓరీ ఉండాల్సిందే! (ఫొటోలు)
-
టీవీ నటి సురభి చందన-కరణ్ శర్మ, హల్దీ ఫంక్షన్ అదిరిందిగా( ఫోటోలు)
-
అంబానీ ఫ్యామిలీ ఫోటో అదిరిందిగా : ఫోటోలు వైరల్
రిలయన్స్అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్త కుమార్తె, అనంత్ ప్రేయసి రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకులు ఘనంగా ముగిసాయి. గుజరాత్లోని జామ్ నగర్లో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరిగాయి. అంబానీ పెద్దకోడలు, ఆకాశ్ భార్య శ్లోకా అంబానీ మన దేశం నెక్స్ట్ జనరేషన్ లీడర్లు ఒకే ఫ్రేమ్లో అంటూ ఈ ఫోటోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. జామ్నగర్లో డిన్నర్ సందర్భంగా తీసుకున్న ఫోటోకి ఆకాష్, శ్లోక ఇషా, ఆనంద్, అనంత్, రాధికల బెస్ట్ ఫోటో అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో అద్భుతం అంటూ నెటిజన్లు కమెంట్ చేశారు. రిలయన్స్ అంబానీ కుటుంబం రేపటి తరం అంటూ సోషల్ మీడియా పోస్ట్లు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ మూవీ ‘హమ్ సాథ్ సాథ్ హై’ పోస్టర్తో పోస్టింగ్లు వెల్లువెత్తాయి. మరోవైపు ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఫౌండర్ చైర్మన్గా ఉన్న ఎన్ఎంఏసీసీకి చెందిన ట్విటర్ ఖాతా కూడా వేడుకలు ఘనంగా ముగిసాయి అంటూ ట్వీట్ చేసింది. దీనికి సంబంధించి రెండు ఫోటోలను కూడా షేర్ చేసింది. Ambani family and their furry family member ‘Happy’, strike a relaxed pose at the successful completion of the pre-wedding celebrations of Anant and Radhika which started with Anna Seva for nearby village communities, followed by three day festivities with friends and family. pic.twitter.com/crLugfuX2y — Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) March 8, 2024 View this post on Instagram A post shared by Shloka Akash Ambani (@shloka_ambani) -
వజ్రాలు వైఢూర్యాలతో డిజైన్ చేసిన జాకెట్..అంబానీ కూతురుగా ఆ మాత్రం ఉండాల్సిందే (ఫొటోలు)
-
అనంత్-రాధిక ప్రీ-వెడ్డింగ్ : పాక్ జీడీపీ, నీతా నగలపై సెటైర్లు
రిలయన్స్ అధినేత బిలియనీర్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఇంటర్నెట్లో పెద్ద సంచలనంగా మారాయి. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి ఈ ఏడాది జూలై నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 1, 2, 3 తేదీల్లో ప్రీ వెడ్డింగ్ బాష్ అంగరంగ వైభంగా జరిగింది. పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకల్లో సందడి చేశారు. అయితే ఈ సందర్బంగా అంబానీ కుటుంబం ఈ వేడుకులకు ఖర్చు పెట్టిన కోట్లాది రూపాయలపై పెద్ద చర్చ నడిచింది. ప్రీ వెడ్డింగ్ వేడుకలకే ఇంత హంగామా అని కొందరు, లక్షల కోట్లకు అధిపతి అయిన ముఖేష్ అంబానీ 12 వందల కోట్లు వెచ్చించడం పెద్ద ఖర్చే కాదని మరికొందరు వాదించారు. దీంతోపాటు వందల కోట్ల విలువ చేసే అంబానీ భార్య నీతా అంబానీ, పెద్ద కొడలు శ్లోకామెహతా, కుమార్తె ఇషా అంబానీ ధరించి డైమండ్ నగలు, కాబోయే వరుడు అనంత్ అంబానీ డైమండ్ వాచ్ గురించి ఇంటర్నెట్ తీవ్ర చర్చ నడిచింది. ఇదంతా ఒక ఎత్తయితే నీతా అంబానీ ధరించి రూ. 500-600 కోట్ల విలువైన డైమండ్ నెక్లెస్ వైరల్గా మారింది. పాకిస్తాన్ జీడీపీ కంటే నీతా అంబానీ డైమండ్ నెక్లెస్ ధరే ఎక్కువ అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే ఇన్స్టాలో పలు పోస్ట్లు వైరల్గా, తాజాగా ఏఎన్ఐ షేర్ చేసిన వీడియోపై ఇదే కమెంట్లు కనిపించడం గమనార్హం. కాగా ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం పాకిస్తాన్ జీడీపీ దాదాపు 341 కోట్ల డాలర్లు (రూ. 28.23 లక్షల కోట్లు)గా ఉన్న సంగతి తెలిసిందే. Etched with the initials Anant Ambani and Radhika Merchant, Nita Ambani dons the world-famous handloom Kanchipuram saree designed by Swadesh and handcrafted by artisans. She was seen thanking the Jamnagar Reliance Parivar for their love and support during Anant and Radhika's… pic.twitter.com/YEOYdVOmjp — ANI (@ANI) March 7, 2024 -
ముఖేష్ అంబానీ ‘లడ్డూ రివర్స్’ వీడియో వైరల్, అసలు నిజం ఇది!
బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో సంచలనంగా మారింది. ముఖేష్ అంబానీ, నీతాల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఈ నెల( మార్చి) 1, 2,3 తేదీల్లో ఘనంగా జరిగాయి. గుజరాత్లోని జామ్ నగర్లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకల ప్రారంభంలో వేల మందికి అన్న దానం చేశారు. "ఖానా కమ్ పడ్ గయా హై.తూ థోడా అడ్జస్ట్ కర్ లేనా (ఫుడ్ తక్కువైంది.. కొంచెం సర్దుకు పోండి) అనే పేరుతో పోస్ట్ అయిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. అంబానీ ఎందుకు అలా చేస్తారు. అని ఆశ్చర్యపోతున్నారా? అసలు నిజం ఇది..! దీనికి సంబంధించి అసలు వీడియోను రివర్స్గా రూపొందించిన ఫేక్ వీడియో ఇది. JIO, after some years of free internet pic.twitter.com/VlFPKrsq6g — Tweeting Quarantino (@rohitadhikari92) March 5, 2024 కమ్యూనిటీ విందులో విస్తర్లలో వడ్డించిన తరువాత, భోజనాలకు కూర్చున్న వారి నుంచి లడ్డూలను వెనక్కి తీసుకుంటున్నట్టుగా వీడియో ట్విటర్లో తెగ షేర్ అవుతోంది. ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో ఇదీ సంగతి అంటూ కొంతమంది ఈ వీడియోపై కమెంట్ చేశారు. అయితే ఇది రివర్స్ వీడియో అంటూ అసలు సంగతి చెప్పారు కొంతమంది. మరి కొంతమంది యూజర్స్ జియో..ఉచితంగా డేటా అలవాటు చేసిన కొన్నాళ్ల తరువాత పరిస్థితి ఇదీ అంటూ వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. ఇదీ అసలు వీడియో.. In run up to marriage ceremony of Anant Ambani, community feast are being organized in villages around the Jamnagar refinery. Today, in Jogvad village, Billionaire #MukeshAmbani himself seen offering food to the guests in a community feast. pic.twitter.com/0Nb7dWMdVM — Kumar Manish (@kumarmanish9) February 28, 2024 కాగా అనంత్ అంబానీ తన లేడీ లవ్ రాధికా మర్చంట్తో ఈ ఏడాదిలో ఏడడుగులు వేసుందుకు రడీ అవుతున్నాడు. గత ఏడాది ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ లవ్బర్డ్స్ ఈ నెలలో అంగరంగ వైభవంగా ప్రీ- వెడ్డింగ్ బాష్ నిర్వహించారు. బాలీవుడ్సెలబ్రిటీలు, క్రీడారంగ ప్రముఖులతోపాటు బిల్గేట్స్, మార్క్ జుకర్ బర్గ్ సహా పలువురు ప్రపంచ బిజినెస్ దిగ్గజాలు ఈ వేడుకల్లో విశేషంగా నిలిచిన సంగతి తెలిసిందే. -
అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ : భారీ ఏర్పాట్లు, మొత్తం ఖర్చు ఎంతంటే..!
బిలియనీర్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. గుజరాత్లోని జామ్నగర్లో అనంత్-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు పలువురు రాజకీయ, క్రీడా, సినీ రంగ ప్రముఖులతోపాటు, గ్లోబల్ టెక్ సీఈఓలు, పాప్ ఐకాన్లు హాజరు కావడం విశేషంగా నిలిచింది. మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన ఈ ఈవెంట్ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించడం విశేషం. ప్రీ వెడ్డింగ్ సందడే ఇంత ఘనంగా జరుగుతోంటే, అదీ ముఖేష్ అంబానీ సంతానంలో జరుగుతున్న చివరి పెళ్లి వేడుక కావడంతో అనంత్ అంబానీ పెళ్లి తంతు ఇంకెంత ఘనంగా ఉంటుందో అనే చర్చ మొదలైంది. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ బాష్కు రూ.1260 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. తద్వారా ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన వేడుకగా ఇది నిలిచింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, మెటా హెడ్ మార్క్ జుకర్బర్గ్, ఇవాంకా ట్రంప్, ఇలా డజన్ల కొద్దీ ఇతర ప్రముఖులు బసకోసమే ఏకంగా సుమారు రూ. 52 కోట్లు ఖర్చు పెట్టారట. పాప్ ఐకాన్ రిహన్నా సహా, వీరందరికోసం విలాసవంతమైన వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు, దేశ, విదేశీ భారతీయ అతిథుల కోసం ముఖేష్ అంబానీ ప్రైవేట్ విమానాలను కూడా ఏర్పాటు చేశారు. కేటరింగ్ కాంట్రాక్టుకే రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. మూడు రోజుల పాటు అద్భుతమైన పూలకోసం కూడా భారీగానే వెచ్చించారట. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ప్రకారం అమెరికన్ పూల డిజైనర్ జెఫ్ లీథమ్ అదిరిపోయే కలర్ఫుల్ ఫ్లవర్ సెట్టింగ్స్ తీర్చిదిద్దాడు. కాగా 2023, జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న అనంత్ -రాధికా మర్చంట్ఈ ఏడాది జూలైలో పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్నారు. -
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
మీ కుటుంబానికి మనస్ఫూర్తిగా అభినందనలు: ఉపాసన ట్వీట్
టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ ఉపాసన- రామ్ చరణ్ ఇటీవల జరిగిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సందడి చేశారు. గుజరాత్లోని జామ్నగర్లో జరిగిన ఈ వేడుకలకు టాలీవుడ్ నుంచి కేవలం రామ్ చరణ్ దంపతులు మాత్రమే హాజరయ్యారు. ఈ ఫంక్షన్లో పలువురు బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్తో పాటు ప్రముఖ క్రీడాకారులు కూడా పాల్గొన్నారు. మూడు రోజుల పాటు కొనసాగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. ఆదివారంతో ముగిశాయి. తాజాగా ఈ వేడుకలకు హాజరైన ఉపాసన- రామ్ చరణ్ దంపతులు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఉపాసన ట్విటర్లో పోస్ట్ చేశారు. 'అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో నీతా జీ- ముఖేశ్ జీ అతిథ్యం సాటిలేనిది.. మనస్ఫూర్తిగా మీ కుటుంబానికి మా అభినందనలు' అంటూ ట్వీట్ చేశారు. అద్భుతమైన వ్యక్తులతో.. అద్భుతమైన సమయం వెచ్చించినందుకు సంతోషంగా ఉందంటూ ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. Congratulations Anant & Radhika & the whole Ambani Family. Nita Ji & Mukesh Ji your hospitality is unmatched. Thank you. Wonderful times with wonderful people pic.twitter.com/IzcrOxHN5X — Upasana Konidela (@upasanakonidela) March 4, 2024 -
ప్రీ వెడ్డింగ్లో రజినీకాంత్.. మరి ఇంత చీపా?
కోలీవుడ్ సూపర్ స్టార్ తలైవా ఇటీవలే లాల్ సలామ్ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఆయన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం తలైనా వెట్టైయాన్ అనే చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమాకు టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల గుజరాత్లోని జామ్నగర్లో ముకేశ్ అంబానీ- నీతా అంబానీల తనయుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తన ఫ్యామిలీతో కలిసి రజినీకాంత్ సందడి చేశారు. తన భార్య లతా, కూతురు ఐశ్వర్యతో కలిసి తలైవా హాజరయ్యారు. మూడు రోజుల పాటు కొనసాగిన ఈ వేడుకలు ఆదివారంతో ముగిశాయి. కాగా.. వేడుకలకు వెళ్తున్న రజినీకాంత్ తన ఫ్యామిలీతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. అయితే అదే సమయంలో ఓ మహిళ వారి వెనకాలే నడుస్తూ వచ్చింది. అయితే ఆమెను రజినీకాంత్ పక్కకు వెళ్లు అనేలా తన చేతులతో సంజ్ఞ చేస్తూ కనిపించారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ మహిళ పట్ల రజినీకాంత్ వ్యవహించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ రాస్తూ.. 'కండక్టర్ స్థాయి నుంచి వచ్చారు.. కానీ పేద ప్రజలకు, అల్లుడికి కూడా మర్యాద ఇవ్వరంటూ రాసుకొచ్చారు. మరో నెటిజన్స్ రాస్తూ..' స్టార్ హీరో ఒక మహిళతో ఎలా వ్యవహరిస్తున్నాడో చూడండి.. ఆయన అభిమానిగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా' అంటూ కామెంట్ చేశారు. 'అదే ఆయన అసలు రంగు' అని ఒకరు రాయగా.. రజినీకాంత్ చీప్ బిహేవియర్' అంటూ మరొక నెటిజన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. Cheapest behaviour from #Rajinikanth!pic.twitter.com/uw0opzNdsZ — Kolly Censor (@KollyCensor) March 3, 2024 -
అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ : ఇవాంకా ట్రంప్ డ్రెస్సింగ్ స్టయిల్ అదిరిందిగా!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎందరో అతిరథ మహారథులు, ప్రముఖులు, సెలబ్రెటీలు విచ్చేసి సందడి చేశారు. ఇక ఈ వేడుకల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు కుమార్తె ఇవాంకా తన కుటుంబంతో సహా పాల్గొంది. ఈ వేడుకలో ఆమె దేశీ అలంకరణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మార్చి 1న జరిగిన అనంత్ రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఇవాంకా తన భర్త జారెడ్ కుష్నర్, కుమార్తె అరబెల్లా రోజ్తో కలిసి సందడి చేసింది. ఇదొక 'మ్యాజికల్ రాత్రి" అంటూ క్యాప్షన్ ఇచ్చి మరీ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది. ఆమె ఆ వేడుకల్లో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన గోల్డ్ సిల్వర్ కలయిక గల చీరను ధరించింది. అందుకు తగట్టుగా వీ షేప్లో ఉండే మ్యాచింగ్ బ్లౌజ్తో గ్రాండ్ లుక్లో కనిపించింది. అయితే ఈ చీర ధర ఏకంగా రూ. 2.65 లక్షలు. అంతేగాదు ఆ చీరకు తగ్గ రేంజ్లో చెవులకు డైమండ్ జూకాలు ధరించింది. మంచి గ్లామరస్ లుక్లో అందర్నీ మిస్మరైజ్ చేసింది. ఇక రెండో రోజు జంగిల్ సఫారీలో జరిగిన వేడుకల్లో ఇవాంకా త్రెడ్ వర్క్తో కూడిని కుర్తాని ధరించింది. సింపుల్ మేకప్తో తన కూతురు అరబెల్లా రోజ్తో కలిసి సందడి చేసింది. ఇక అదే రోజు సాయంత్రం మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన తెల్లటి లెహంగాలో భారతీయ వనితలా రెడీ అయ్యింది. ఇక చివరి రోజు ఉదయం గోల్డెన్ ఎంబ్రాయిడరీతో కూడిన తెల్లటి గౌనుతో ఆకర్షించింది. ఇకా ఆమె భర్త, కూతురు కూడా దేశీ వస్త్రాధారణలో అలరించడం విశేషం. ఇక అదే రోజు సాయంత్రం అంబానీ కుటుంబం దేవుడి పూజలతో ఆ వేడుకలకు ముగింపు పలికే కార్యక్రమం కావడంతో వచ్చిన అతిధులందరికి సంప్రదాయ డ్రెస్ కోడ్ని ధరించాలని సూచించడం జరిగింది. దీంతో ఇవాంకా ఆ సాయంత్రం మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన నిమ్మపండు రంగు కశ్మీరీ లెహంగాతో సంప్రదాయ మహిళ వలే కనిపించింది. ఈ లెహంగా ధర అక్షరాల రూ. 5 లక్షలు. ఏదీఏమైన అంబానీ ఇంట పెళ్లి వేడుకల్లో పాల్గొన్న విదేశీయులు సైతం మన భారతీయ సంస్కతి తగ్గ వస్తాలంకరణలో కనిపించడం గ్రేట్ కదూ. బహుశా ఆ క్రెడిట్ అంతా అంబానీ కుంటుంబానికే దక్కుతుంది. (చదవండి: అనంత్-రాధికా: నీతా అంబానీ లాంగ్ నెక్లెస్ ధర ఎంతో తెలుసా!) -
అంబానీ-రాధిక ప్రీ-వెడ్డింగ్: ఈ బ్యూటీ సందడి మామూలుగా లేదు (ఫోటోలు)
-
సందడి సందడిగా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ (ఫొటోలు)
-
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ మెరిసిపోతున్న ఇషా అంబానీ (ఫొటోలు)
-
అనంత్ అంబానీ వాచ్..మార్క్ జూకర్ బర్గ్ భార్య షాక్
-
అంబానీ ఇంట పెళ్లి సందడి.. కళ్లు చెదిరేలా డెకరేషన్ (ఫొటోలు)
-
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. కలర్ఫుల్ లుక్లో మెరిసిన సినీతారలు (ఫొటోలు)
-
Rihanna Photos: అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్లో జోష్ నింపిన రిహాన్నా (ఫోటోలు)
-
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సెలబ్రెటీల స్పెషల్ ఫొటోలు..
-
నా జీవితం పూలపాన్పు కాదు
జామ్నగర్: అక్షరాలా ఆకాశమంత పందరి. అంగరంగ వైభవంగా జరుగుతున్న ప్రీ వెడ్డింగ్ వేడుక. ఆహూతులుగా ప్రపంచ స్థాయి సినీ, వ్యాపార, పారిశ్రామిక దిగ్గజాలు. అంతటా ఆనందం వెల్లివిరుస్తున్న వేళ. పెళ్లికొడుకు కాబోతున్న తన చిన్న కుమారుడు అనంత్ మాట్లాడిన మాటలు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని కంటతడి పెట్టించాయి. గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటైన సువిశాలమైన ప్రాంగణం ఇందుకు వేదికైంది. మూడు రోజుల వేడుకల్లో తొలి రోజు శుక్రవారం అనంత్ మాట్లాడుతూ చిన్ననాటి నుంచీ తనను వేధిస్తూ వస్తున్న ఆరోగ్య సమస్యలను ప్రస్తావించారు. ‘‘అంతా అనుకుంటున్నట్టు నా జీవితం పూలపాన్పేమీ కాదు. భరించలేని బాధల వాడిముళ్లు చిన్ననాటి నుంచీ విపరీతంగా వేధించాయి. ఒకదాని తర్వాత ఒకటిగా ఆరోగ్య సమస్యలు! కానీ అన్ని బాధలను అధిగమిస్తూ వచ్చానంటే మా అమ్మానాన్నే కారణం! నన్నెంతో అపురూపంగా చూసుకున్నారు. నిరంతరం నా వెన్నంటి నిలిచారు. నా జీవితంలో వారి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ పెళ్లి వేడుకను నాకు అత్యంత స్పెషల్గా మలచేందుకు వాళ్లు, నా కుటుంబ సభ్యులు ఎంతగా కష్టపడ్డారో నాకు మాత్రమే తెలుసు. వాళ్లెవరూ కొద్ది నెలలుగా రోజుకు 3 గంటల కంటే నిద్రే పోలేదు. వేడుకలను ఇంత గొప్పగా తీర్చిదిద్ది నన్ను సంతోషపెట్టేందుకు రోజుకు కనీసం 20 గంటల పాటు కఠోరంగా శ్రమిస్తూ వచ్చారు’’ అంటూ ఆద్యంతం ఎమోషనల్గా మాట్లాడారు. అనంత్ మాటలను ఆహూతులతో పాటు ఆసాంతం వింటూ, ఆ క్రమంలో ముప్పిరిగొన్న రకరకాల భావోద్వేగాల నడుమ ముకేశ్, నీతా అంబానీ దంపతులు తడి నిండిన కళ్లతో కుమారున్ని ఆప్యాయంగా చూసుకుంటూ ఉండిపోయారు. దాంతో అందరి మనసులూ భారమయ్యాయి. దిగ్గజాల సందడి అనంత్, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ప్రపంచ నలుమూలల నుంచీ ప్రముఖులంతా తరలివచ్చారు. పారిశ్రామిక, సినీ, క్రికెట్ దిగ్గజాలంతా వేడుకల్లో పాల్గొన్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, పారిశ్రామిక దిగ్గజాలు గౌతం అదానీ, కుమార మంగళం బిర్లా, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, సల్మాన్ఖాన్, దీపికా పడుకొణె, క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీతో పాటు పలు దేశాలకు చెందిన రాజకీయ ప్రముఖులు కూడా వీరిలో ఉన్నారు. 1,000 మందికి పైగా వీఐపీలు పాల్గొన్న ఈ వేడుకల్లో ప్రముఖ పాప్ సింగర్ రిహానా ప్రధానాకర్షణగా నిలిచారు. డైమండ్స్, రూడ్బోయ్, పోరిటప్ వంటి తన ఆల్టైం హిట్ నంబర్స్కు ఆడి పాడి ఆహూతులను ఉర్రూతలూగించారు. ప్రఖ్యాత బాలీవుడ్ గాయకుడు అరిజిత్సింగ్ తదితరులు ఆహూతులను తమ గానంతో అలరించారు. -
పర్ఫెక్ట్ అంబానీ వెడ్డింగ్: భర్తతో కలిసి సైనా సందడి (ఫొటోలు)
-
కొడుకు స్పీచ్.. ముఖేష్ అంబానీ కన్నీళ్లు! వీడియో వైరల్
Mukesh Ambani tears video : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల వివాహం త్వరలో జరుగనుంది. వివాహానికి ముందు ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సెలబ్రిటీలు ఈ గ్రాండ్ ఈవెంట్కి విచ్చేశారు. ఈ సందర్భంగా కొడుకు మాటలకు ముఖేష్ అంబానీ భావోద్వేగానికి గురయ్యారు. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అనేక మంది అతిథుల సమక్షంలో పెళ్లికొడుకు అనంత్ అంబానీ ప్రసంగించారు. తల్లిదండ్రులు ముఖేష్ అంబానీ, నీతా అంబానీలకు కృతజ్ఞతలు తెలుపుతున్నప్పుడు ముఖేష్ అంబానీ భావోద్యేగానికి గురయ్యారు. కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. అనంత్ అంబానీ చేసిన భావోద్వేగ ప్రసంగంలో ముఖ్యంగా తాను అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నప్పుడు తన తల్లిదండ్రులు అందించిన సపోర్ట్ గురించి అనంత్ అంబానీ చెబుతుండగా ముఖేష్ కళ్లలో నీళ్లు తిరిగాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ మారింది. థాంక్యూ అమ్మా.. నాన్న "ఇదంతా అమ్మ చేసిందే.. ఆమె నా కోసం చాలా కష్టపడింది. గత నాలుగు నెలలుగా ఆమె రోజుకు 18-19 గంటలు నా కోసం కష్టపడ్డారు. నేను అమ్మకు చాలా కృతజ్ఞుడను . అమ్మా, మీరు చేసిన ప్రతిదానికీ ధన్యవాదాలు" అని అనంత్ అంబానీ ప్రసంగంలో పేర్కొన్నారు. "మా నాన్న, అమ్మ ఎల్లప్పుడూ నాకు అండగా నిలిచారు. నేను ఏదైనా సాధించగలను అనే ఆత్మ విశ్వాసాన్ని నాకు కలిగించారు. మా నాన్న, అమ్మ నన్ను ఎంతగా అర్థం చేసుకున్నారో.. నేను వారికి ఎప్పటికీ కృతజ్ఞుడను" అని భావోద్వేగంతో చెప్పుకొచ్చారు. నా కొడుకులోనే చూసుకుంటున్నా కాగా అంతకుముందు వేడుకలకు విచ్చేసిన ప్రముఖ వ్యాపారవేత్తలు, కళాకారులు, క్రీడాకారులు, చలనచిత్ర ప్రముఖులు, ఇతర అతిథులందరినీ ఉద్దేశిస్తూ ముఖేష్ అంబానీ ప్రసంగించారు. కార్యక్రమానికి వచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబ అనుబంధం గురించి ప్రస్తావించారు. తన చిన్న కొడుకు అనంత్ అంబానీలోనే చనిపోయిన తన తండ్రి ధీరూభాయ్ అంబానీని చూసుకుంటున్నట్లు వెల్లడించారు. -
ప్రీవెడ్డింగ్.. ముఖేశ్ అంబానీ ఫ్యామిలీ ఇలా ముస్తాబైంది (ఫోటోలు)
-
రొమాంటిక్ సాంగ్.. ముఖేశ్-నీతాల డ్యాన్స్ చూశారా?
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఇప్పటికే అంగరంగ వైభవంగా మొదలైపోయాయి. ప్రపంచం నాలు మూలాల నుంచి పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలతో జామ్నగర్ మొత్తం సందడిగా మారింది. ఈ వేడుకల్లో ముకేశ్ అంబానీ, నీతా అంబానీ డ్యాన్స్ వేయనున్న.. దానికోసం వారు రీహార్సిల్స్ చేస్తున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెట్టింట్లో వైర్ల అవుతున్న వీడియోలో 'ప్యార్ హువా ఇక్రార్ హువా హై' అనే పాటకు లిప్ సింక్ చేస్తూ.. ట్రెడిషినల్ దుస్తుల్లో ముకేశ్ అంబానీ, నీతా అంబానీ చాలా అద్భుతంగా డ్యాన్స్ వేయడం చూడవచ్చు. కాగా అనంత్, రాధికల పెళ్లి జులై 2024లో జరుగుతుందని ఇప్పటికే వెల్లడించారు. గుజరాత్లోని జామ్నగర్లో మొదలైన 'అనంత్, రాధిక' ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలకు 1000 మంది సెలబ్రిటీలు, ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇందులో స్టార్ క్రికెటర్స్, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు ఉన్నారు. వీరి కోసం ఇప్పటికే ప్రత్యేక వసతులను ఏర్పాటు చేశారు. అనంత్, రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు 120 మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 1000 కోట్లు) ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రీవెడ్డింగ్గా రికార్డ్ క్రియేట్ చేస్తుంది. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా ఆయన ఆస్తిలో అది కేవలం 0.1శాతం మాత్రమే అని పలువురు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Isha Ambani Piramal (@_ishaambanipiramal) -
అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకల్లో సినీ తారలు.. స్పెషల్ అట్రాక్షన్గా ఉపాసన- రామ్ చరణ్ (ఫొటోలు)
-
మూడు రోజులు.. వెయ్యి కోట్లు! అంబానీ అంటే అట్లుంటది మరి..
ధనవంతుల ఇళ్లలో పెళ్లి అంటే ఖర్చు భారీగా ఉంటుందని అందరికి తెలుసు.. అలాంటిది ప్రపంచ కుబేరులలో ఒకరు, భారతదేశంలో అత్యంత సంపన్నులు అయిన 'ముఖేష్ అంబానీ' ఇంట పెళ్లి అంటే మాటలా? ఈ రోజు చాలా మంది మనసులో మెదిలే ప్రశ్న అంబానీ ఇంట జరుగుతున్న ప్రీవెడ్డింగ్ కార్యక్రమాలకు ఎంత ఖర్చు చేయనున్నారు. ఈ కథనంలో ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. లక్షల కోట్లకు అధిపతి అయిన ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్, ఎన్కోర్ హెల్త్కేర్ అధినేత 'వీరెన్ మర్చంట్' కుమార్తె రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలైపోయాయి. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు హాజరవుతున్నారు. ప్రీ వెడ్డింగ్ వేడుకలలో ఫుడ్ లిస్ట్ చూస్తేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది. తినడటానికి 2500 రకాల వంటకాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో బ్రేక్ఫాస్ట్, లంచ్, రాత్రి డిన్నర్ కోసం ఇలా చాలానే వంటకాలను తయారు చేస్తున్నారు. గుజరాత్లోని జామ్నగర్లో ఈ రోజు నుంచి మొదలైన 'అనంత్, రాధిక' ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలకు 1000 మంది సెలబ్రిటీలు, ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇందులో స్టార్ క్రికెటర్స్, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు ఉన్నారు. వీరి కోసం ఇప్పటికే ప్రత్యేక వసతులను ఏర్పాటు చేశారు. అనంత్, రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు 120 మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 1000 కోట్లు) ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రీవెడ్డింగ్గా రికార్డ్ క్రియేట్ చేస్తుంది. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా ఆయన ఆస్తిలో అది కేవలం 0.1శాతం మాత్రమే అని పలువురు చెబుతున్నారు. ఇదీ చదవండి: 10 భారతీయ కంపెనీ యాప్లపై కన్నెర్రజేసిన గూగుల్! అనంత్, రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పర్ఫామెన్స్ చేయనున్న 'రిహాన్నా'కు ఏకంగా 8 నుంచి 9 బిలియన్ డాలర్లు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 66 కోట్ల నుంచి రూ. 74 కోట్లు. దీన్ని బట్టి చూస్తే అంబానీ తన కొడుకు పెళ్లి కోసం ఎంత పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. -
Anant-Radhika Pre-Wedding: అనంత్, రాధికల ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ - ప్రముఖుల సందడి (ఫొటోలు)
-
అనంత్, రాధిక ప్రీవెడ్డింగ్ ఈవెంట్: పాప్ సింగర్ ఒక్క పర్ఫామెన్స్కే అన్ని కోట్లా?
రిలయన్స్ అధినేత 'ముఖేష్ అంబానీ' చిన్న కుమారుడు అనంత్, ఎన్కోర్ హెల్త్కేర్ అధినేత 'వీరెన్ మర్చంట్' కుమార్తె రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలైపోయాయి. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు హాజరవుతున్నారు. ఇందులో గ్లోబల్ సెన్సేషన్, పాప్ క్వీన్ 'రిహాన్నా' కూడా ఉన్నారు. రిహాన్నా గురువారమే జామ్నగర్ చేరుకుంది. ఈమె అనంత్, రాధిక ప్రీ వెడ్డింగ్ కార్యక్రమంలో పర్ఫామెన్స్ కూడా చేయనుంది. ఈ పర్ఫామెన్స్ కోసం అంబానీ ఫ్యామిలీ ఈమె కోసం 8 నుంచి 9 బిలియన్ డాలర్లు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 66 కోట్ల నుంచి రూ. 74 కోట్లు. జామ్నగర్ చేరుకున్న సమయంలో రిహాన్నా లగేజ్ ఎంతో మందికి ఆశ్చర్యానికి ఆశ్చర్యం కలిగించింది. ఈమెతో పాటు పలువురు సింగర్స్, ఇతర కళాకారులు ఈ వేడుకలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ రోజు ప్రారంభమైన ప్రీ వెడ్డింగ్ వేడుకలు మరో రెండు రోజులు (మార్చి 3) జరగనున్నాయి. ఇదీ చదవండి: అంబానీకి కాబోయే కోడలి గురించి ఈ విషయాలు తెలుసా? అనంత్, రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు స్వీడన్ మాజీ ప్రధాని కార్ల్ బిల్డ్, కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్, బొలీవియా మాజీ అధ్యక్షుడు జార్జ్ క్విరోగా, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్ రూడ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ చైర్పర్సన్ క్లాస్ వంటి వారితో పాటు దిగ్గజ కంపెనీల సీఈఓలు మొదలైనవారు ఉన్నారు. View this post on Instagram A post shared by 𝑹𝒖𝒑𝒆𝒔𝒉 𝑺𝒖𝒓𝒗𝒆 (@rupesh.surve07) -
అంబానీకి కాబోయే కోడలి గురించి ఈ విషయాలు తెలుసా?
త్వరలో మూడు ముళ్ళతో, ఏడు అడుగులతో ఒక్కటి కానున్న కొత్త జంట 'అనంత్ అంబానీ, రాధిక మర్చంట్'ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అప్పుడే మొదలైపోయాయి. ఈ కార్యక్రమానికి ఇప్పుడిప్పుడే ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు వస్తున్నారు. జామ్నగర్లో రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఒక్కో రోజు.. ఒక్కో థీమ్తో ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే చాలామందికి భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ గురించి మాత్రమే తెలిసి ఉంటుంది. అనంత్ అంబానీకి కాబోయే భార్య 'రాధిక' గురించి పెద్దగా తెలియకపోవచ్చు. నిజానికి అనంత్, రాధిక చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఈ చిన్ననాటి స్నేహమే తరువాత ప్రేమగా చిగురించి, పెళ్లి పీటల వరకు తీసుకువచ్చింది. రాధిక మర్చంట్ ఎన్కోర్ హెల్త్కేర్ సీఈఓ విరెన్ మర్చంట్, పారిశ్రామికవేత్త షైలా మర్చంట్ల చిన్న కుమార్తె. ఈమె బీడీ సోమానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి డిప్లొమో పూర్తి చేసింది. ఆ తరువాత న్యూయార్క్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. న్యూయార్క్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇండియా ఫస్ట్ ఆర్గనైజేషన్, దేశాయ్ అండ్ దివాన్లలో ఇంటర్న్షిప్ చేసింది. ఆమె రియల్ ఎస్టేట్ సంస్థ ఎస్ప్రావాలో జూనియర్ సేల్స్ మేనేజర్గా కూడా పనిచేసింది. ఆ తరువాత కుటుంబం వ్యాపారమైన ఎన్కోర్ హెల్త్కేర్ బోర్డు డైరెక్టర్గా పనిచేసింది. విలాసవంతమైన జీవనశైలిని కొనసాగిస్తున్న ఈమె ఖరీదైన దుస్తులు, వస్తువులు వినియోగించడానికి చాలా ఆసక్తి చూపుతుంది. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో ఖరీదైన హ్యాండ్ బ్యాగ్తో కనిపించి, అందరిని ఆశ్చర్యపరిచింది. ఈమె సంపద విలువ రూ. 8 నుంచి రూ. 10 కోట్లు వరకు ఉంటుందని సమాచారం. రాధిక మర్చంట్.. నీతా అంబానీ మాదిరిగా ప్రముఖ వ్యాపారవేత్త మాత్రమే కాదు క్లాసికల్ డ్యాన్సర్ కూడా, గతంలో 2022లో జియో వరల్డ్ సెంటర్లో నాట్యం చేసి ఎంతోమందిని అలరించింది. ఈమె జంతు సంక్షేమం, విద్య, మానవ హక్కుల వంటి పలు సామిజిక అంశాల మీద కూడా ఆసక్తి కలిగి ఉంది. ఇదీ చదవండి: కాబోయే కోడలి కోసం ఖరీదైన కానుకలు.. ఎంతైనా అంబానీ రేంజే వేరు.. రాధిక మర్చంట్ జులై 12న అనంత్ అంబానీతో ఏడడుగులు వేయనుంది. ఇప్పటికే అంబానీ ఫ్యామిలీ రూ.4.5 కోట్ల విలువైన బెంట్లీ కారు, వెండి లక్ష్మి గణపతి విగ్రహం, డైమండ్ నెక్లెస్ వంటి వాటిని గిఫ్ట్గా ఇచ్చినట్లు తెలుస్తోంది. -
'అనంత్, రాధిక' ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
Ira Khan-Nupur Shikhare Pre-Wedding: అమీర్ ఖాన్ మొదటి భార్య కుమార్తె 'ఇరా ఖాన్' ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్
-
నది మధ్యలో ఫోటోషూట్: అనుకోని అతిథిని చూసి భయంతో యువతి..
ఈరోజుల్లో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లికి ఏమాత్రం తగ్గకుండా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ని గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. కళ్లు చెదిరే లొకేషన్లలో అద్భుతమైన సెట్టింగులతో, ఖర్చుకు ఏమాత్రం వెనకడుగు వేనకడుగు వేయడం లేదు. సినిమా స్టైల్ను తలపించే లైటింగ్స్, ఎఫెక్ట్స్, రిచ్నెస్తో ఫోటోషూట్స్ పెట్టుకుంటున్నారు. దీనికోసం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లను నియమించుకుంటున్నారు. తమ క్రియేటివిటీకి పదును పెట్టి ఢిపరెంట్ స్టైల్లో ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇప్పుడు అందరి దృష్టని ఆకర్షిస్తున్నాయి. రీసెంట్గా ఓ జంట తీయించుకున్న ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఓ నదిలో కాబోయే జంట అందంగా ఫోటోలకు ఫోజులిస్తుండగా పాము అనుకోని అతిథిలా ఫ్రేమ్లోకి వచ్చింది. దీంతో యువతి భయపడి కేకలు వేయగా, ఆమెకు కాబోయే భర్త పక్కనే ఉండి ధైర్యం చెప్పాడు. కాసేపట్లోనే ఆ పాము అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఈ మొత్తం తతంగాన్ని ఫోటోగ్రాఫర్ కెమెరాలో బంధించాడు. వైల్డ్ ఫోటోషూట్ అంటూ వీడియోను ఇన్స్టాలో షేర్ చేయగా.. ఇప్పటికే 53 లక్షల మంది ఆ వీడియోను చూశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. పాము ఒంటిపై నుంచి వెళ్లినా అదరకుండా, బెదరకుండా చాలా చిల్ మూడ్లో ఉన్నారంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. పామును చూసి ఆ అమ్మాయి భయపడినప్పుడు ఆమె కాబోయే భర్త ధైర్యం చెప్పిన విధానంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by 🅟🅐🅡🅢🅗🅤 🅚🅞🅣🅐🅜🅔 🅟🅗🅞🅣🅞🅖🅡🅐🅟🅗🅨 (@parshu_kotame_photography150) -
Ira Khan And Nupur Shikhare's Pre-Wedding: అమీర్ ఖాన్ ఇంట పెళ్లి సందడి.. ఐరా-నిపుర్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ (ఫొటోలు)
-
స్టార్ హీరో కూతురి పెళ్లి.. మొదలైన సందడి..!
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇంట అప్పుడే పెళ్లి సందడి మొదలైంది. ఆయన కూతురు ఐరా ఖాన్.. తన ప్రియుడు నుపుర్ శిఖరేతో గత ఏడాది నవంబర్లో నిశ్చితార్థం చేసుకుంది. వచ్చే ఏడాది జనవరిలో వీరి పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో రెండు నెలలు ముందుగానే ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. పెళ్లికి ముందు జరిగే సంప్రదాయ వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులు పాల్గొని సందడి చేశారు. దీనికి సంబంధించిన పోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కెల్వన్ వేడుక అంటే.. మహారాష్ట్ర సంప్రదాయంలో భాగంగా వివాహానికి ముందు కెల్వన్ వేడుకను జరుపుకుంటారు. ఈ సంప్రదాయం ప్రకారం వధువు, వరుడు తరఫున తల్లిదండ్రులు ఒకరి కుటుంబాలకు మరొకరు ఆహ్వాన పత్రికలను అందజేస్తారు. ఈ వేడుకలో ఒకరికి ఒకరు బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ వేడుకకు ఇరువైపులా బంధువులు, సన్నిహితులు హాజరై వధూవరులకు బహుమతులు అందజేస్తారు. తాజాగా ఐరా ఖాన్ దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. కాగా.. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఐరా ఖాన్, నుపుర్ శిఖరే గత ఏడాది నవంబర్లో నిశ్చితార్థం చేసుకున్నారు. వచ్చే ఏడాది జనవరి 3, 2024న వివాహా బంధంతో ఒక్కటి కానున్నారు. కాగా.. ఐరా ఖాన్ మానసకి సమస్యలతో బాధపడే వారికి అవగాహన కల్పిస్తోంది. తన తండ్రితో కలిసి ఆత్మహత్యల నివారణకు కృషి చేస్తోంది. View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) -
Pre-Wedding Party: వరుణ్-లావణ్య ప్రీ వెడ్డింగ్ పార్టీలో అల్లు అర్జున్ (ఫొటోలు)
-
మెగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. స్పెషల్గా కనిపించిన ఆ ఇద్దరు!
మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగేందుకు టైమ్ దగ్గరకొచ్చేసింది. జూన్లో నిశ్చితార్థం చేసుకున్న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి నవంబరు 1న ఒక్కటి కాబోతున్నారు. ఈ క్రమంలో పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి. అదే టైంలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా వేడుకగా అవుతున్నాయి. కొన్నిరోజుల క్రితం చిరంజీవి ఆధ్వర్యంలో పార్టీ జరగ్గా.. ఇప్పుడు అల్లు ఫ్యామిలీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాలు రిలీజ్) ఏడేళ్ల క్రితం ఓ సినిమా షూటింగ్ కోసం తొలిసారి కలిసిన హీరోహీరోయిన్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి తొలుత ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత కొన్నిరోజులకే ప్రేమలో పడ్డారు. అప్పటినుంచి తమ బంధాన్ని సీక్రెట్గా మెంటైన్ చేస్తూ వచ్చారు. పెద్దల అంగీకారంతో ఈ ఏడాది జూన్ 9న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అలానే వీళ్ల ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. కొన్నిరోజుల ముందు మెగా జోడీ కోసం మెగాస్టార్ చిరంజీవి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. తాజాగా ఆదివారం రాత్రి అల్లు ఫ్యామిలీ ప్రీ వెడ్డింగ్ వేడుక నిర్వహించారు. ఇందులో మెగా-అల్లు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వీళ్లతో పాటు హీరో నితిన్, హీరోయిన్ రీతూ వర్మ కూడా కనిపించారు. వరుణ్ ఫ్రెండ్ నితిన్ కాగా, లావణ్య ఫ్రెండ్ రీతూవర్మ. మెగా-అల్లు ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఈ సెలబ్రేషన్స్లో పాల్గొన్నది అంటే వీళ్లే. (ఇదీ చదవండి: హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్బాస్' రతిక) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) -
Varun Lavanya Pre Wedding Pics: ఘనంగా వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
వైరల్ అవుతున్న శర్వా మ్యారేజ్ వీడియోలు..!
-
Sharwanand: శర్వానంద్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్..సంగీత్లో సందడి చేసిన రామ్ చరణ్ (ఫొటోలు)
-
ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్లో నవ్వులు పూయించిన తాత.. వీడియో వైరల్..
ఈ రోజుల్లో పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ సర్వసాధారణమైపోయింది. వధూవరులు అందమైన లోకేషన్లకు వెళ్లి ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లను పెట్టుకుని ఫొటోలు దిగుతున్నారు. దీని కోసం వేల రుపాయలు, అవసరమైతే లక్షలు కూడా ఖర్చు చేస్తున్నారు. ఉత్తరాంద్రలో కూడా ఓ జంట ఇలాగే ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్కు వెళ్లింది. కాస్త ఢిపరెంట్గా ఆలోచింది నాటు పడవలో ఓ నదిలో ఫొటోలు దిగాలనుకుంది. అయితే ఇక్కడే వాళ్లకు వింత అనుభవం ఎదురైంది. నాటు పడవ నడిపిన ఓ తాత టాలెంట్ చూసి ఈ జంట అవాక్కైంది. అమ్మాయి అబ్బాయి ఫొటో ఎలా దిగాలి, ఏ ఫోజు ఇవ్వాలో కూడా తాత చెప్పేస్తున్నాడు. చేతి ఇలా పెట్టు, కాలు ఇలా పెట్టు, అమ్మాయిని ఇలా పట్టుకో, ఇద్దరూ అటు చూసి ఫోజు ఇవ్వండి అంటూ డైరెక్షన్లు ఇచ్చేస్తున్నాడు. ఉత్తరాంద్ర యాసలో మాట్లాడుతూ తాత ఫోజులు చెప్పడం చూస్తుంటే పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్గా మారింది. పడవ నడిపే తాతే ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లా కన్పిస్తున్నాడని నెటిజన్లు చమత్కరిస్తున్నారు. ఈయన టాలెంట్ సూపర్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోను మీరూ చూసేయండి. భలే భలే ఓ అమ్మాయీ - పాత రోజులు మారాయీ ఆడపిల్లా తిరిగినచో - పట్టుకొనునూ అబ్బాయీ భలే భలే ఓ అబ్బాయీ - ఈ ఒక్క రోజే నీది పైచేయీ ఆ పిల్ల వేలెత్తినచో - నీకు మూడెను తెలుసుకోవోయీ భలే భలే ఓ అమ్మాయీ - ఈ ఒక్క రోజు నే చెప్పినట్టు చేయీ వాడి మీదకు కాలెత్తాలీ - లేకపోతే వాడికి భయముండదమ్మాయీ వాడిదేముంది వెధవాయి పట్టుకుంటాడులే బడుద్దాయి — రామ్ కేసరి, అమెరికా (ఆరుద్ర గారికి సన్నాయి) -
పెళ్లి పుస్తకంలో రంగుల పేజీలు
పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయనేది పాత మాట.. ఇక్కడే స్వర్గం సృష్టిస్తామనడం నయా ట్రెండ్.. సంప్రదాయ తంతుకు సరికొత్త హంగులద్దుతున్నారు.. ఎంగేజ్మెంట్ హంగామా.. ప్రీవెడ్డింగ్ షూట్.. ప్రత్యేక అలంకరణలు.. మెహందీ.. సంగీత్ వంటి వాటితో మెగా ఈవెంట్ను తలపింపజేస్తున్నారు.. వివాహాది శుభకార్యాలను పదికాలాల పాటు పదిలపర్చుకోవాలని వధూవరులు చూపిస్తున్న ఆసక్తిని ఉపాధిగా మలుచుకుంటున్నారు కొందరు. ముహూర్తాలు మొదలవడంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పెళ్లిసందడి ప్రారంభమైంది. ఏలూరు (ఆర్ఆర్పేట) : పెళ్లిచూపులు, నిశ్చయ తాంబూలాల నుంచి వివాహ వేడుక వరకూ భారీ బడ్జెట్తో జరుగుతున్నాయి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో వీడియోలు, ఫొటోలు తీయించుకోవడం పెళ్లి పుస్తకంలో మధుర ఘట్టంలా వధూవరులు భావిస్తున్నారు. దీంతో ఫొటో, వీడియోగ్రాఫర్లకు ఉపాధి లభిస్తోంది. అలాగే వివాహ వేడుకలో పూర్వకాలం నుంచి అరివేడు ముంత, పూలజడ, చమ్మిలి దండ, అడ్డుతెర, ఉంగరాల ఆట బిందె, మంగళస్నానాల జల్లెడ, గొడుగులు వంటి వాటికి ప్రాధాన్యముంది. పెళ్లివారి అభిరుచులకు అనుగుణంగా వీటిని రంగులు, అద్దాలతో ప్రత్యేకంగా అలంకరిస్తూ ఆకట్టుకుంటున్నారు డిజైనర్లు. భలే ముహూర్తం ఈ ఏడాది వరుసగా మూడు నెలల మూఢం కారణంగా ఎటువంటి శుభకార్యాలు జరగలేదు. ఈనెల మొదటి వారంలోనే మూఢానికి ముగింపు పడగా కొద్దిపాటు ముహూర్తాలు అందుబాటులోకి వచ్చాయి. ఈనెల 2న రాత్రి నుంచి కొద్దిపాటి పెళ్లిళ్ల ముహూర్తాలు మొదలయ్యాయి. అలాగే జనవరిలో 25 నుంచి మాఘమాసం ప్రవేశించి ఫిబ్రవరి 11వ తేదీ వరకూ గట్టి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. అనంతరం మార్చి 28 నుంచి ఏప్రిల్ 26వ తేదీ వరకూ గురు మూఢం ప్రవేశిస్తుండడంతో ముహూర్తాలకు బ్రేక్ పడనుంది. మెండైన ఉపాధి : వివాహాది శుభకార్యాలు మొదలుకావడంతో ఇప్పటికే చాలా మంది బ్యూటీషియన్లను బ్రైడల్ మేకప్ల కోసం రిజర్వ్ చేసుకున్నారు. అలాగే ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు డిమాండ్ పెరిగింది. వీరితో పాటు పూలు, విద్యుత్ అలంకరణ చేసేవారు, ఫుడ్, ఐస్క్రీమ్, పాన్ సప్లయర్లు, కేటరర్లు, ఆయా వర్గాలకు సంబంధించిన సహాయకులకు చేతినిండా పని దొరుకుతుందనే ఆశతో ఉన్నారు. దాదాపు మూడు నెలలపాటు ముహూర్తాలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు వెళ్లిన వారంతా తిరిగి ఇటుగా రానున్నారు. దృశ్య కావ్యంలా.. వధూవరుల మంగళస్నానాలకు వినియోగించే పాత్రలు, మహారాజా తలపాగాలు, కాళ్లకు తొడిగే పావుకోళ్లు, రోళ్లు, రోకళ్లు, బాసికాలు, విదేశీ పూలజడలు, అల్లికల జాకెట్లు, పట్టువస్త్రాలు, వధూవరులు ఆకర్షణీయంగా కనిపించడానికి బ్రైడల్ మేకప్లు, పూచ్చిపూల మండపాలు, విద్యుద్దీపాలంకరణ, బాణసంచా సందడి, ఆర్కెస్ట్రా, వింధు భోజనాలు ఇలా అన్నింటా ప్రత్యేకతకు ప్రాధాన్యమిస్తున్నారు. మొత్తంగా దృశ్యకావ్యంలా వివాహ తంతును జరిపించేందుకు పలువురు ఆసక్తి చూపడంతో ఆయా రంగాల్లో ని ఎందరో ముహూర్తాల సీజన్లో ఉ పాధి పొందుతున్నారు. మెహందీ.. సంగీత్ వేడుకలు వివాహా వేడుకల్లో ముఖ్యంగా మెహందీ, సంగీత్లు ప్రత్యేకతను సంతరించుకుంటున్నా యి. ఉత్తర భారతదేశంలో ఉండే ఈ వేడుకలు ఇటీవల జిల్లాలోను తళుక్కుమనిపిస్తున్నాయి. గోరింటాకు పెట్టుకోవడం, సినీ గీతాలకు నృత్యాలు చేయడం వంటి పనులు వినోదాత్మకంగా జరుగుతున్నాయి. దీంతో బ్యూటీషియన్లు, ఈవెంట్ మేనేజర్లకు ఉపాధి లభిస్తోంది. ఈవెంట్ అంటే ఓ కళ పెళ్లంటే సంప్రదాయ సంబరం. అందరినీ ఒకదగ్గరకు చేర్చి వినోదాన్ని పంచాలి. అలాంటి ఈవెంట్ను నిర్వహించడంలో ఓ కిక్ ఉంటుంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకూ అందరితో డ్యాన్స్ చేయిస్తే ఈవెంట్ ఆర్గనైజర్గా విజయం సాధించినట్టే. ఒక్కోసారి ముహూర్తం అర్ధరాత్రి ఉంటుంది. అటువంటప్పుడు అందరినీ ఆహ్లాదపరుస్తూ సమయం గడిచేలా చేయడం కూడా కళగా భావిస్తున్నాం. – అల్లాడ లావణ్య, ఈవెంట్ మేనేజర్ ఓపిగ్గా మేకప్ బ్రైడల్ మేకప్ను ఎంతో ఓపికగా చేయాలి. దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది. ఒక్కొక్కరి శరీర ఛాయకు సరిపడేలా రంగులు అద్దాల్సి ఉంటుంది. దానిని గుర్తించడం బ్యూటీషియన్కు సవాలే. కరోనా తర్వాత చాలా మంది బ్రైడల్ మేకప్కు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. దీనికి తోడు చాలా మంది ఈ రంగంలోకి రావడంతో పోటీ పెరిగి ఆదాయం తగ్గింది. అలాగే ఖర్చు కూడా పెరుగుతోంది. – బండి శిరీష, బ్యూటీషియన్, సిరీస్ హెయిర్ అండ్ బ్యూటీ ప్రత్యేక అలంకరణలు పెళ్లి తంతులో వినియోగించే ప్రతి వస్తువునూ ఆకర్షణీయంగా అలంకరించడం ట్రెండ్గా మారింది. ఇందుకు అనుగుణంగా గరికి ముంతలు, అవిరేడు ముంతలు, బాసికాలు, తలపాగాలు, సంప్రదాయ టోపీలు, పూల జడలు, గొడుగులు, బుట్టలు, బిందెలు వంటివి ప్రత్యేకంగా అలంకరిస్తున్నాం. ప్రతి దానికీ హంగులు అద్దుతూ పూసలు, పెయింటిగ్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నాం. – పి.ఉమా మహేశ్వరిదేవి, శ్రీదేవి ఉమెన్స్ వరల్డ్ యజమాని ప్రీ వెడ్డింగ్ షూట్తో.. ఇటీవల ప్రీ వెడ్డింగ్ షూట్ నంచి ఫొటో, వీడియోగ్రాఫర్లకు పెళ్లి పని మొదలవుతోంది. చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్కు ఆసక్తి చూపుతున్నారు. ఇది ఫొటోగ్రాఫర్ల పనితనానికి మచ్చు తునకగా నిలుస్తోంది. దీంతో మేం అందమైన లొకేషన్లను వెదుకుతున్నాం. పెళ్లి తంతులో ప్రతి ఘట్టాన్నీ కవర్ చేయాల్సి ఉంది. ఇందుకు తగ్గట్టు ఖరీదైన కెమెరాలు వాడుతున్నాం. వివాహాల కవరేజ్ను బట్టి ప్యాకేజీ ఉంటుంది. – కరణం ఫణి, ఫొటోగ్రాఫర్ -
Indonesia: వివాహానికి ముందే శృంగారమా? అయితే..
జకార్తా: చాలా దేశాల్లో డేటింగ్, పెళ్లికి ముందే పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొనడం లాంటి వ్యవహారాలను చాలా తేలికగా తీసుకుంటున్నారు. అయితే.. ఇస్లాం దేశమైన ఇండోనేషియా.. అలాంటివి సహించడం కుదరని అంటోంది. వివాహానికి ముందే శృంగారాన్ని నేరంగా పరిగణించాలని నిర్ణయించుకుంది. తాజాగా ఇండోనేషియా కొత్త క్రిమినల్ కోడ్ను తీసుకురాబోతోంది. దీని ప్రకారం.. వివాహానికి ముందే శృంగారంలో పాల్గొంటే శిక్షించాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ క్రిమినల్ కోడ్ను త్వరలో జరగోబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతుందట. వివాహానికి ముందే శృంగారంలో పాల్గొన్నా.. లేకుంటే వివాహేతర సంబంధం కొనసాగించినా?.. ఏడాదిపాటు కారాగార శిక్ష విధించాలని, అదే విధంగా జరిమానా కూడా విధించాలని సదరు డ్రాఫ్ట్ పేర్కొంది. అయితే.. ఇది అమలు కావాలంటే ఒకటి వివాహేతర సంబంధం విషయంలో బాధిత భార్య లేదంటే బాధిత భర్త.. ఎవరో ఒకరు ఫిర్యాదు చేయాలి. అలాగే.. వివాహం కాకముందు శృంగారంలో గనుక పాల్గొంటే.. వాళ్ల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయవచ్చు. ఆర్టికల్ 144 ప్రకారం.. కోర్టులో విచారణ ప్రారంభం కాకముందు ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. వాస్తవానికి ఈ డ్రాఫ్ట్ వచ్చి మూడేళ్లు గడుస్తోంది. అయితే.. ప్రజావ్యతిరేకతతో ఇంతకాలం ఇది అమలుకు నోచుకోలేదు. ప్రపంచంలోనే అత్యధిక ఇస్లాం జనాభా ఉన్న ఇండోనేషియాలో.. మహిళలను, మైనారిటీలను, ఎల్జీబీటీక్యూలను అణగదొక్కేందుకు వందల సంఖ్యలో నియంత్రణ చట్టాలు అమలు అవుతున్నాయి. ఇక కొత్తగా రాబోయే క్రిమినల్ కోడ్.. ఇండోనేషియా ప్రజలతో పాటు విదేశీయులకు కూడా వర్తించనుంది. అయితే ఇది టూరిజంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వ్యాపార సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
హన్సిక ఇంట పెళ్లిసందడి.. ప్రత్యేక పూజలో పాల్గొన్న జంట..!
హీరోయిన్ హన్సిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఆమె సోహైల్ కతూరియా అనే వ్యాపారవేత్తతో డిసెంబర్ 4న వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. రాజస్తాన్లోని జైపూర్లోని ప్రాచీన ప్యాలెస్ వీరి వివాహానికి వేదికగా నిలవనుంది. ఇప్పటికే హన్సిక పెళ్లిసందడి మొదలైంది. వివాహ వేడుకలో భాగంగా జరిగే'మాతా కీ చౌకీ' ముంబైలో నటి నివాసంలో ఘనంగా నిర్వహించారు. కుటుంబసభ్యుల సమక్షంలో కాబోయే వధూవరులిద్దరూ దుర్గాదేవి పూజలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరలయ్యాయి. (చదవండి: హన్సిక మ్యారేజ్ అప్ డేట్.. పెళ్లికూతురి చీరలో సందడి చేసిన భామ..!) హన్సిక, సోహైల్ కొన్నేళ్లుగా ఇద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. అంతే కాకుండా ఈ జంట వ్యాపారంలోనూ భాగస్వాములుగా ఉన్నారు. ఇద్దరి అభిరుచులు కలవడంతో కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న జంట పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. డిసెంబర్ 4న వీరి వివాహం రాజస్థాన్లోని జైపూర్లో జరగనుంది. మరోవైపు సోహైల్కు గతంలోనే హన్సిక స్నేహితురాలు రింకీని వివాహం చేసుకోగా.. కొంతకాలానికే విడాకులు తీసుకున్నారు. View this post on Instagram A post shared by Bollywoodflash (@bollywoodflash01) -
వైరల్ వీడియో: ‘ధూమ్ 4’ షూటింగ్లో కొత్త జంట!
-
‘ధూమ్ 4’ షూటింగ్లో కొత్త జంట!.. వీడియో వైరల్
అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో ‘ధూమ్’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీనికి సంబంధించి మూడు సీక్వెల్లు ఇప్పటికే రాగా ధూమ్ 4ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఓ కొత్తజంట తమ ప్రీవెడ్డింగ్ షూట్లోనే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించింది. సామాజిక మాధ్యమాల్లో ఆ దృశ్యాలు వైరల్ కాగా.. చూసిన నెటిజన్లు ‘ధూమ్ 4’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో పెళ్లిలో వీడియో ఉండకపోయినా పర్వాలేదు కానీ, ప్రీవెడ్డింగ్ షూట్ మాత్రం ఉండాలనే పట్టుతో ఉన్నారు యువత. అందుకు లక్షల్లో ఖర్చు చేస్తూ సినిమాలను మించిన యాక్షన్ సీన్లు చేస్తున్నారు. ఇలాగే.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న ఓ జంట ప్రీవెడ్డింగ్ షూట్ చేసింది. అందరిలా చేస్తే ఏముంటుందనుకున్నారో ఏమో? బైక్పై స్టంట్ చేస్తూ వీడియో షూట్ చేశారు. సినిమాల్లో చూపించినట్లుగా సుమో పైనుంచి బైక్ జంప్ చేసే స్టంట్ చేశారు. వధూవరులు ఇద్దరు పెళ్లిలో మాదిరిగా వస్త్రధారణలో బైక్పై కూర్చోగా.. దానిని తాళ్ల సాయంతో సుమో వాహనంపై నుంచి జంప్ చేసినట్లుగా చిత్రీకరించారు. ప్రస్తుతం ఆ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా ఒక్కరోజులోనే 77 మంది వీక్షించారు. ఇలా చేయకపోతే నేను పెళ్లే చేసుకోను అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చారు. నా పెళ్లిలోనూ ఇలానే చేస్తాను. ఇలా చేయకపోతే అర్థమే లేదు. ఈ ప్రీవెడ్డింగ్ షూట్కు రోహిత్ శెట్టి డైరెక్టరా? అంటూ పలువురు పేర్కొన్నారు. ఇదీ చదవండి: ‘అదే మా లక్ష్యం’.. పీఓకేపై రక్షణ మంత్రి రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు! -
Sologamy: మూడు రోజుల ముందే.. క్షమాబిందు స్వీయ వివాహం
అహ్మదాబాద్: తనను తానే వివాహమాడబోతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించిన గుజరాత్లోని వడోదరకు చెందిన క్షమాబిందు(24) తన పెళ్లి వేడుకను బుధవారం సాయంత్రం సొంతింట్లోనే జరుపుకున్నట్లు వెల్లడించింది. తన స్వీయ వివాహం(సోలోగమీ) వ్యవహారం మరింత వివాదస్పదంగా మారకూడదనే మూడు రోజులు ముందుగానే జరుపుకున్నట్లు గురువారం మీడియా ఎదుట ప్రకటించింది. వడోదరలోని గోత్రి ప్రాంతానికి చెందిన క్షమాబిందు దగ్గర్లోని ఆలయంలో ఈనెల 11వ తేదీన వివాహం చేసుకోబోతున్నట్లు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ‘ఇలాంటి పెళ్లిళ్లు ఏ గుడిలో జరిగినా అడ్డుకుంటామంటూ బీజేపీ వడోదర విభాగం ఉపాధ్యక్షురాలు సునీతా శుక్లా హెచ్చ రించారు. హిందూ యువతను పెడదోవ పట్టిస్తోందంటూ నన్ను తప్పుబట్టారు. వైదిక సంప్రదాయంలో పెళ్లి తంతును జరిపించేందుకు పూజారి నిరాకరించారు’ అని ఆమె తెలిపింది. దీంతో ఇంట్లోనే పెళ్లి జరుపుకుంది. ఈ కార్యక్రమం వీడియోను విడుదల చేసింది. సంప్రదాయ వివాహ వేడుక మాదిరిగానే జరిగిన ఈ కార్యక్రమానికి కొద్ది మంది సన్నిహితులు హాజరైనట్లు తెలిపింది. తన వివాహం దేశంలోనే మొట్టమొదటిదని క్షమాబిందు అంటోంది. త్వరలో హనీమూన్కూ వెళ్తానని ప్రకటించింది. -
డెవాన్ కాన్వే ప్రీ వెడ్డింగ్ పార్టీ.. పంచ కట్టుతో రచ్చరచ్చ చేసిన సీఎస్కే ప్లేయర్లు
Devon Conway Pre Wedding Party: ఐపీఎల్ 2022 సీజన్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రేపు (ఏప్రిల్ 21)ముంబైతో జరుగబోయే కీ ఫైట్కు ముందు ఓ ముఖ్యమైన ఈవెంట్లో పాల్గొంది. జట్టు కీలక సభ్యుడు, విదేశీ ఆటగాడు (న్యూజిలాండ్) డెవాన్ కాన్వే ప్రీ వెడ్డింగ్ పార్టీలో చెన్నై ఆటగాళ్లు రచ్చరచ్చ చేశారు. ముంబైలోని ట్రైడెంట్ హోటల్లో సీఎస్కే యాజమాన్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ పార్టీలో కాన్వే సహా సీఎస్కే బృంద సభ్యులంతా తమిళ సంప్రదాయ పంచ కట్టుతో మెరిశారు. Devonum Deviyum! 💛 Happy Whistles for the soon-to-be's! Wishing all the best to Kim & Conway for a beautiful life forever!#WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/yPJe5DBQQK — Chennai Super Kings (@ChennaiIPL) April 18, 2022 Maple & Machis! 📸 that go straight into the Yellove Album! 😍#SuperFam #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/qUAKbrCpYu — Chennai Super Kings (@ChennaiIPL) April 19, 2022 📹 Colourful Kaatchis from the last night kondattam! 😎💛#SuperFam #WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/hoJWgpzEbx — Chennai Super Kings (@ChennaiIPL) April 19, 2022 ఈ వేడుకలో కాన్వే సహా జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, మాజీ, ప్రస్తుత కెప్టెన్లు ధోని, జడేజా, మొయిన్ అలీ, బ్రావో, రుతురాజ్ గైక్వాడ్, ఉతప్ప, అంబటి రాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సహచరుడి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్కు సీఎస్కే ప్లేయర్లు కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ఈ వేడుకకు కాన్వే ఫియాన్సి కిమ్ వాట్సన్ వర్చువల్గా హాజరైంది. న్యూజిలాండ్లో ఉన్న కిమ్ పసుపురంగు పట్టు చీరలో మెరిసిపోయింది. కాన్వే, కిమ్ ఇద్దరు వర్చువల్గా సంభాషించుకుంటుండగా.. సహచర సభ్యులు చప్పట్లతో ఇద్దరినీ విష్ చేశారు. Maapilai with Thol Kodukkum thozhans! 💛#WeddingWhistles #YelloveIsInTheAir #WhistlePodu 🦁💛 https://t.co/v3boCGSb5A pic.twitter.com/AzDvpHgH5Y — Chennai Super Kings (@ChennaiIPL) April 18, 2022 Sivapu Manjal Pachai - Part 2! 😃#SuperFam #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/eyf0K0Ky9N — Chennai Super Kings (@ChennaiIPL) April 19, 2022 అనంతరం కేక్ కట్టింగ్, ఆలింగనాలతో పార్టీ సందడి సందడిగా సాగింది. ఈ ఈవెంట్కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సీఎస్కే యాజమాన్యం ట్విటర్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరలవుతున్నాయి. కాగా, డెవాన్ కాన్వే-కిమ్ వాట్సన్ 2020లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ ఏడాది వారు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఇదిలా ఉంటే, సీఎస్కే.. తమ తదుపరి మ్యాచ్లో తమ కంటే దారుణమైన ప్రదర్శన కనబరుస్తున్న ముంబై ఇండియన్స్తో తలపడనుంది. ఈ సీజన్లో సీఎస్కే ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 5 ఓటములను చవిచూడగా, ముంబై.. ఆడిన ఆరింటిలో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. Conway Kudumbathaar! 🤳Selfie with the Maapillai Side!#WeddingWhistles #YelloveIsInTheAir #WhistlePodu 🦁💛 pic.twitter.com/h4ngrhXMtB — Chennai Super Kings (@ChennaiIPL) April 18, 2022 Pudhu Maapillai ku Hip Hip Hoorayy! 🥳 When the Superfam came together to celebrate Conway’s pre wedding 💍#WeddingWhistles #YelloveIsInTheAir #WhistlePodu 🦁💛 pic.twitter.com/UCa7xQSB5v — Chennai Super Kings (@ChennaiIPL) April 18, 2022 Now showing - Kim & Conway Wedding Cassette 📼! 📹👉 https://t.co/oYBPQHs25f!#WeddingWhistles #Yellove 🦁💛 pic.twitter.com/pTLdQgTa5n — Chennai Super Kings (@ChennaiIPL) April 19, 2022 చదవండి: RCB VS LSG: కోహ్లి గోల్డెన్ డక్ ఎక్స్ప్రెషన్పై ఆసక్తికర ట్వీట్ చేసిన సజ్జనార్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఇప్పుడిదే ట్రెండ్! ఫిక్సయిపోతున్న కొత్త జంటలు.. ఖర్చుకు తగ్గేదేలే!
సిరిసిల్లఅర్బన్: పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ మూడే ముళ్లు.. ఏడే అడుగులు ఇదీ అందరికీ తెలిసిందే.. కానీ ప్రస్తుతం వీటితో పాటు పెళ్లి వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పెళ్లి వేడుకలను చెదరని మధుర జ్ఞాపకంలా జీవితాంతం గుర్తుండి పోయేలా యువతీ యువకులు పెళ్లికి సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా ప్రీవెడ్డింగ్ షూట్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎంతలా అంటే సినిమాలకు ధీటుగా చిత్రీకరించేందుకు ఎంత ఖర్చుకైనా వెనకాడడం లేదు. దీనికోసం ప్రత్యేకంగా అనుభవజ్ఞులైన నిపుణులు, కెమెరామెన్లను సాంకేతిక బృందాలను ఆశ్రయిస్తున్నారు. పాటల చిత్రీకరణకు సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, హైదరాబాద్, తదితర ప్రాంతాల్లోని పర్యాటక కేంద్రాలకు వెళ్తున్నారు. కొందరైతే సముద్ర తీర ప్రాంతాలకు, గోవాకు సైతం వెళ్లి ప్రీ వెడ్డింగ్ షూట్లో పాల్గొంటున్నారు. (చదవండి: గ్రీన్ఫీల్డ్ హైవే భూసేకరణలో ఉద్రిక్తత) లోకేషన్లను బట్టి చార్జీ ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం అందమైన ప్రదేశాలకు వెళ్తారు. ప్రీవెడ్డింగ్ ఫొటో, వీడియోగ్రాఫర్లు లొకేషన్లను బట్టి రూ.15 వేల నుంచి రూ.40వేల వరకు చార్జీ చేస్తుంటారు. వాహనఖర్చు, డ్రెస్సింగ్, తదితర ఖర్చులు వెడ్డింగ్ షూట్ చేసుకునేవారు చెల్లించాల్సి ఉంటుంది. సిరిసిల్ల, సిద్దిపేట, హైదరబాద్, ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లి ఫొటో షూట్ చేస్తుంటారు. ఒక్కో ఫొటో ప్రీ వెడ్డింగ్ షో చిత్రీకరించడానికి రెండు నుంచి నాలుగు రోజుల సమయం పడుతోంది. సినిమా తరహాలో పాటల చిత్రీకరణ విహహం నిశ్చయమైనప్పటి నుంచి పెళ్లి చేసుకునే జంటలు ప్రతీ క్షణాన్ని ప్రత్యేకంగా పదిల పర్చుకునేందుకు ప్రతీ క్షణాన్ని అందంగా మలుచుకునేందుకు ఆరాటపడుతుంటారు. ఇందుకోసం ప్రీ వెడ్డింగ్ షూట్ ఎంతగానో ఉపయోగపడుతుందని దీంతో పెళ్లికి ముందే ఒకరి భావాలు మరోకరు తెలసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్లో కాబోయే జంటల నృత్యాలు సినిమాలను తలపించేలా చూడ ముచ్చటగా ఉంటున్నాయి. వీరు నటించిన నృత్యాలను, అందమైన ఫొటోలను పెళ్లి సమయంలో భారీ ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రదర్శిస్తుండడంతో నూతన జంటలతో పాటు, పెళ్లికి వచ్చిన కుటుంబీకులు సైతం ఆనందపడుతున్నారు. (చదవండి: తొలిసారిగా ఆ ఊర్లో నడిచిన గూడ్స్ రైలు!!) ఆదరణ పెరిగింది మారుతున్న కాలానీకి అణుగుణంగా పెళ్లి జంటలు ప్రీవెడ్డింగ్ ఫొటో షూట్ కు ఇష్టపడుతున్నా రు. వారు ఎంచుకున్న ప్రదేశాలకు వెళ్లి ప్రీ వెడ్డింగ్ షూట్చేస్తాం సినిమాలను తలపించేలా చిత్రీకరిస్తుండడంతో యువతీయువకుల్లో ఆసక్తి పెరుగుతోంది. – రాము, ప్రీ వెడ్డింగ్ షూట్ ఫొటోగ్రాఫర్, సిరిసిల్ల ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ప్రీ వెడ్డింగ్ షూట్తో పెళ్లి చేసుకునే జంటలు ఒకరినొకరు అర్థంచేసుకుంటారు. దీంతో బిడియం ఉండదు. సినిమా, జానపద పాటలపై నృత్యాలు చేయగా, వాటిని పెళ్లి సమయంలో ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రదర్శిస్తుంటాం. – అనగోని చందు, ఫొట్రోగాఫర్ పెళ్లి ఒక మధుర ఘట్టం పెళ్ళి అనేది ఒక మధుర ఘట్టం లాంటిది. అలాంటి పెళ్లి వేడుకలను జీవితాంతం గుర్తిండి పోయేందుకు ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకు దోహదపడుతుంది. దీంతో ఒకరి మనోభావాలు మరోకరికి తెలుసుకునే అవకాశం ఉంటుంది. – కత్తి రఘు మౌనిక, -
సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి పెళ్లి.. మెహందీ ఫంక్షన్ ఫోటోలు వైరల్
బాలీవుడ్ నటి, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండే త్వరలో వివాహం చేసుకోనుంది. గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్న అంకిత- విక్కీజైన్లు డిసెంబర్ 14న మూడుముళ్ల బంధంతో ఒకటికానున్నారు. ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్ ఈ వివాహ వేడుకకి వేదిక కానుంది. ఇప్పటికే అంకిత ఇంట్లో పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి. శనివారం(డిసెంబర్ 11) అంకిత- విక్కీల ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. తాజాగా అంఖితా మెహందీ ఫంక్షన్ను గ్రాండ్గా జరుపుకుంది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారాయి. కరోనా నిబంధనల నేపథ్యంలో ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మాత్రమే వీరి పెళ్లి వేడుకకు హాజరుకానున్నారని తెలుస్తోంది. ఇండోర్లో జన్మించిన అంకిత 2005లో తన నటన కలను సాకారం చేసుకోడానికి ముంబైకి వచ్చింది. తన టాలెంట్ నిరూపించుకునేందుకు 'టాలెంట్ హంట్' రియాలిటీ షోలో పాల్గొంది. నాలుగేళ్ల తర్వాత 'పవిత్ర రిష్టా' టీవి సీరియల్తో పెద్ద బ్రేక్ వచ్చింది. ఈ సీరియల్తో పరిచయమైన సుశాంత్ సింగ్తో డేటింగ్ చేస్తున్నట్లు 2019లో అంకిత ప్రకటించింది. తర్వాత సుశాంత్తో ఆరేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉంది. కంగనా రనౌత్ నటించిన 'మణికర్ణిక'తో సినిమాల్లోకి అడుగుపెట్టింది అంకిత. తర్వాత 'బాఘీ 3' చిత్రంలో కూడా నటించింది. సుశాంత్తో బ్రేకప్ తర్వాత మరో బాలీవుడ్ నటుడు విక్కీజైన్తో ప్రేమలో పడింది. గత మూడేళ్లుగా వీరు ప్రేమలో మునిగితేలుతున్నారు. పెద్దల అనుమతితో ఇప్పుడు పెళ్లిపీటలెక్కుతున్నారు. -
సినిమాలను తలదన్నేలా ప్రీ వెడ్డింగ్ షూట్లు
సాక్షి, ఎదులాపురం(ఆదిలాబాద్): వివాహ వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ సమయంలో మర్చిపోలేని రీతిలో.. మధుర జ్ఞాపకంలా యువతీ యువకులు పెళ్లికి సిద్ధమవుతున్నారు. సినిమాలను తలదన్నేలా ప్రీ వెడ్డింగ్ షోలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మొదట ఖర్చుకు వెనుకాడినా.. క్రేజీ పెరుగుతుండడంతో ఇప్పుడు డబ్బులకూ వెనుకాడకుండా పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసుకుంటున్నారు. సినిమా తరహా మాదిరిగా సినీ, జానపద గీతాలపై కాబోయే జంటలు వీడియో షూట్లో చేసి వాటిని పెళ్లి జరిగే రోజు ఎల్ఈడీ స్క్రీన్పై ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేకమైన లొకేషన్స్.. ప్రీవెడ్డింగ్ షూట్ కోసం ఫొటో, వీడియో గ్రాఫర్లు ప్రత్యేక లొకేషన్లు ఎంపిక చేస్తున్నారు. జిల్లాలో కొర్టికల్, కుంటాల, పొచ్చెర జలపాతం, సాత్నాల ప్రాజెక్టు, ఖండాల, ఆదిలాబాద్ గాంధీ పార్కు, మత్తాడి వాగులు, ఆలయాలు, ప్రకృతివనాల్లో షూటింగ్ చేస్తున్నారు. ఒక్కో ఫ్రీ వెడ్డింగ్షో చిత్రీకరణకు రెండు నుంచి మూడు రోజుల సమయం తీసుకుంటున్నారు. రూ.20 వేల వరకు చార్జి ఒక్కో ప్రీవెడ్డింగ్ షోకు ఫొటో, వీడియో గ్రాఫర్లు రూ. 15 వేల నుంచి రూ.20 వేల వరకు చార్జి చేస్తున్నారు. వాహన, డ్రెస్సు, కాస్టూమ్స్, ఇతర ఖర్చులన్నీ వెడ్డింగ్ షో చేయించుకునేవారు భరిస్తారు. పెళ్లి ఫొటో, వీడియోలు, ఫ్రీ వెడ్డింగ్కు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు తీసుకుంటున్నారు. ఫ్రీ వెడ్డింగ్ షో ద్వారా జిల్లాలోని యువత ఫొటోగ్రఫీ ద్వారా ఉపాధి పొందుతున్నారు. మధుర జ్ఞాపకం ప్రీ వెడ్డింగ్ ఒక మంచి అనుభూతి. పెళ్లికి ముందు ఒకరి భావాలు మరొకరికి అంతగా తెలియదు. ప్రీ వెడ్డింగ్తో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వేదికగా నిలుస్తోంది. ఒక మధుర జ్ఞాపకం. అంతే కాకుండా ప్రస్తుతం ఒక ట్రెండ్గా సాగుతుండడంతో ప్రీ వెడ్డింగ్ తీయించుకున్నాం. – సౌరబ్, శ్రీజ, ఆదిలాబాద్ సినిమా తరహాలో వెడ్డింగ్ షో సినిమా తరహాలో పాటలు చిత్రీకరించేలా వెడ్డింగ్ షో చేస్తున్నాం. ఒక పాటకు రూ.20 వేలు తీసుకుంటుంన్నాం. స్వయం ఉపాధి పొందడంతోపాటు నలుగురికి ఉపాధి చూపుతున్నాం. చిత్రీకరించిన పాటను పెళ్లిరోజు ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ప్రదర్శిస్తున్నాం. – నవీన్, ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ చదవండి: మీసాల వెంట్రుకలతో సూటు.. ఎంత అందంగా ఉందో చూడండి! -
ప్రీవెడ్డింగ్ షూట్ కల్చర్: పెళ్లింత.. తుళ్లింత
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు..తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు... ఇదీ ఆత్రేయ రాసిన పాట.. ఇప్పటి పరిస్థితులను బట్టి రాస్తే వాటి సరసన ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేర్చేవాడేమో మనసుకవి! నాటికీ నేటికీ పెళ్లి సంప్రదాయాల్లో ఎన్నో మార్పులు ఎప్పటికప్పుడు సరికొత్తగా చేరుతున్నాయి. ఉత్తర భారతంలో మెహందీ ఫంక్షన్ మన ప్రాంతాలకూ విస్తరించింది. ఇదో వేడుకలా చేసి పెళ్లి ఖర్చులను తడిసిమోపెడు చేస్తుంటే.. కొద్దికాలంగా ప్రీవెడ్డింగ్ షూట్ కల్చర్ క్రేజీగా తయారైంది. మధ్యతరగతి వర్గాలనూ ఇది ప్రభావితం చేస్తోంది. మన పరిసరాలు షూటింగులకు అనుకూలం కావడంతో దూరం వెళ్లకుండా జిల్లావాసులు ఇక్కడే ప్రీవెడ్డింగ్ షూట్లు చేసుకుంటున్నారు. (చదవండి: వడివేలు జీవితాన్ని మలుపు తిప్పిన రైలు జర్నీ) సినిమా ప్రభావంతోనే ప్రీవెడ్డింగ్ షూట్ వచ్చింది. సినిమాలోని హీరో హీరోయిన్లు పెళ్లికి ముందు పలు అందమైన లొకేషన్లు తిరుగుతూ డ్యూయెట్లు పాడుకుంటారు. ఈ నాటకీయతకు .. అందమైన కలలకు నిజ జీవితంలోనూ దృశ్యరూపం ఇవ్వడం ఈ షూట్ ఉద్దేశం. నిశ్చితార్థం అయ్యాక పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కలిసి ఇందులో పాల్గొంటారు. జిల్లాలో వీటిపై ఇటీవల ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. మన జిల్లాలో అందమైన లోకేషన్లను వెతుక్కోనక్కరలేదు. గోదావరితోపాటు రంపచోడవరం, అడ్డతీగల, దేవీపట్నం తదితర ఏజెన్సీ ప్రాంతాలూ రా..రమ్మంటూ స్వాగతిస్తున్నాయి. దేవీపట్నంలోని తీగల బ్రిడ్జి వద్ద తప్పకుండా ఒక్క షాటైనా తప్పనిసరిగా తీస్తున్నారు. గోదావరి అందాలు, కడియం పూల నర్సరీలను బ్యాక్గ్రౌండుగా ఎంపిక చేసుకుంటున్నారు. ఫొటోగ్రాఫర్ల ఫోకస్ ప్రీవెడ్డింగ్ షూట్ ఒక కళ. వీడియోగ్రాఫర్ లేదా ఫొటోగ్రాఫర్ల సృజనాత్మకతపై ఆధారపడి ఉంటుంది. జిల్లాలో కొందరు ఫొటోగ్రాఫర్లు ఈ షూట్లపై దృష్టి పెట్టారు. శిక్షణ పొందారు. థీమ్లు ఎంచుకుని వీడియో షూట్ చేస్తారు. కొన్నిచోట్ల డ్రోన్ కెమెరాలనూ వాడుతున్నారు. వధూవరుల హావభావాలు.. నేపథ్య గీతాలు.. అందమైన లొకేషన్లతో ఇది క్లిక్ అవుతుంది. ఈ షూట్కు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకూ వెచ్చిస్తున్నా రు. ఖరీదైనప్పటికీ తమ అభిరుచికి అనుగుణంగా ఉండటంతో మారుమాట్లాడటం లేదు చాలామంది. వధూవరుల సేఫ్టీ కూడా చూడాలి 20 ఏళ్ల కిందటి వరకూ ఫొటోలు తీసుకునేవారు. తరువాత వీడియోలు వచ్చాయి. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్లు చేరాయి. కాలానుగుణంగా అభిరుచులు మారుతున్నాయి. అలాంటిదే ఈ ట్రెండ్ కూడా. కొన్ని లొకేషన్లలో వైవిధ్యం కోసం ప్రయత్నిస్తూ ప్రమాదాలపాలవుతున్నారు. ఏదైనా పరిధిలో.. పరిమితిలో ఉండాలి. షూటింగ్ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. – ఏపీ నారాయణరావు, రావ్ అండ్ రావ్ ఫొటో స్టూడియో, రాజమహేంద్రవరం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి.. ప్రీ వెడ్డింగ్ షూట్ల ద్వారా వధూవరులకు ఒకరిపై ఒకరికి అవగాహన వస్తోంది. అదే మెయిన్ కాన్సెప్ట్ అనుకుంటున్నాను. ఇద్దరిలో బెరుకు పోతుంది. షూట్ చేసేటప్పుడు ఇబ్బంది పెట్టకుండా వారి సౌకర్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. – దారా మణి, వెడ్డింగ్ షూటర్ రాంగ్ ట్రెండ్ మన దేశంలో వివాహ వ్యవస్థకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కాబోయే భార్యాభర్తలు పెళ్లికి ముందే ఒకరినొకరు అర్థం చేసుకోవడమే మంచిదే. కానీ ఈ రకంగా వీడియోలు, ఫొటోలు తీసుకొని సామాజిక మాధ్యమాల్లో పెట్టుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులుంటాయి. కొద్ది కాలం తరువాత అభిప్రాయ భేదాలు వచ్చి భార్యాభర్తలు విడిపోవలసి వస్తే ఆ వీడియోలు ప్రతిబంధకంగా మారతాయి. – నాగిరెడ్డి దారపు, వ్యక్తిత్వ జీవన, మానసిక వికాస నిపుణుడు చదవండి: ప్రమాద సమయంలో సాయి తేజ్కు సాయం చేసింది ఈ ఇద్దరే -
World Photo Graphy Day: రీల్ నుంచి.. ప్రీ వెడ్డింగ్ షూట్ వరకు..
సాక్షి, విద్యానగర్(కరీంనగర్): మనిషి జీవన ప్రస్థానంలో ప్రతీరోజు ఓ మధుర జ్ఞాపకం. ప్రతీ మలుపును పదిలంగా కళ్ల ముందుంచేది ఫొటో. అందులో వేల భావాలు దాగుంటాయి. మారుతున్న రూపాన్ని జీవితాంతం కళ్లకు కడుతుంది. మన ఇంట్లోని ప్రతీ ఫొటో వెనక ఒక జ్ఞాపకం, అనుభూతి ఉంటుంది. పుట్టిన రోజైనా.. వివాహ వేడుకైనా.. సమావేశమైనా.. టూర్కు వెళ్లినా.. ఇలా ఎక్కడ ఏం జరిగినా.. అక్కడ ఆ జ్ఞాపకాలను పది కాలాలపాటు పదిలంగా ఉంచేందుకు కావాల్సింది ఫొటోగ్రఫీ. కదిలిపోతున్న కాల ప్రవాహంలో చెదరని మధుర స్మృతుల ప్రతిబింబాలు ఫొటోలు. రసాయనాలతో రూపొందించిన ప్లేటుపై కాంతిచర్యతో ఓ రూపాన్ని బంధించడమే ఫొటోగ్రఫీ. ఈ పదం గ్రీకు భాష నుంచి వచ్చింది. ఫొటో అంటే చిత్రం.. గ్రఫీ అంటే గీయడమని అర్థం. బ్లాక్ అండ్ వైట్ ఫొటోల కాలం నుంచి నేడు ఫోన్ ద్వారా సెల్ఫీ, డ్రోన్ కెమెరాల దశకు కెమెరా కన్ను విస్తరించింది. నేడు వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. వృత్తి పోలీస్.. ప్రవృత్తి ఫొటోగ్రఫీ రామడుగు(చొప్పదండి): రామడుగు మండలంలోని లక్ష్మీపూర్కు చెందిన దాసరి మల్లేశ్ వృత్తిపరంగా ఏఆర్ కానిస్టేబుల్గా పని చే స్తున్నారు. ఆయన తన కళ్లకు కనిపించిన అందమైన దృశ్యాలను కెమెరాలో బంధిస్తూ ఫొటోగ్రఫీని ప్రవృత్తిలా మార్చుకున్నారు. అంతేకాదు పెయింటింగ్ కూడా వేస్తున్నా రు. మహిమల కేదార్రెడ్డి వద్ద ఫొటోగ్రఫీలో శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. ఆయన తీసిన ఫొటోలను చూచి చొప్పదండి ఎమ్మె ల్యే సుంకె రవిశంకర్, పోలీస్ అధికారులు అభినందించారు. 1827లో ఫొటో తీసే పరికరం.. 18వ శతాబ్దంలో కెమెరాని కనుగొనడంతో ఫొటోగ్రఫీ ప్రారంభమవగా 1820లో రసాయనిక ఫొటోగ్రఫీ మొదలైంది. ఫొటోగ్రఫీకి జీవం పోసిన వారు ఫ్రాన్స్కు చెందిన లూయీస్ జాక్వెస్ మాండే డాగురే. స్వతహాగా చిత్రకారుడైన ఆయనకు ఒక్కో చిత్రం గీయడానికి 8 గంటల సమయం పట్టేది. దీన్ని సులభతరం చేయడానికి 1827లో జోసెఫ్ నెఫ్సర్ తన మిత్రుడు నిప్సెతో కలసి ప్రయోగాలు చేసి, ఫొటో తీసే పరికరాన్ని కనుగొన్నారు. డాగురే 1839లో మొదటిసారి ఫొటోగ్రఫిక్ ప్రాసెస్ కనిపెట్టి, అదే ఏడాది ఆగస్టు 19న ప్రపంచానికి పరిచయం చేశాడు. సిల్వర్ అయోడైడ్ రసాయనంతో చిత్రానికి శాశ్వతత్వం కల్పించవచ్చని ప్రతిపాదించాడు. దీనికి గుర్తుగా 2010 నుంచి ‘వరల్డ్ ఫోటోగ్రఫీ డే’ జరుపుకుంటున్నారు. 1842 నుంచి 1880 మధ్య కాలంలో ఇండియాలో ఫొటోగ్రఫీ పరిశ్రమ విస్తరించింది. అప్పటి ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో మొదటి పోర్టరైట్ స్టూడియోను దీన్ దయాళ్ కెన్నడీ అనే మహిళ ప్రారంభిచారు. 1960 నాటికి స్టూడియో ఫొటోగ్రఫీ, 1980 నాటికి కంప్యూటర్తో కలర్ ఫొటోగ్రఫీ వచ్చింది. కలర్ ఫొటోగ్రఫీ.. 1907లో లూమియర్ సోదరులు కనుగొన్న ఆటోక్రోమ్ అనే కలర్ ఫొటోగ్రఫీ ప్రక్రియ వాణిజ్యపరంగా విజయవంతమైంది. 1935లో కొడాక్ మొట్టమొదటి కలర్ ఫిలిం (ఇంటెగ్రల్ ట్రైప్యాక్ లేదా మోనోప్యాక్)ని కొడాక్రోమ్ పేరుతో పరిచయం చేసింది. అగ్ఫా కలర్ న్యూ 1936లో రూపుదిద్దుకుంది. డిజిటల్ ఫొటోగ్రఫీ.. 1981లో సోనీ మావికా అనే కెమెరా ఛార్జీ కపుల్డ్ డివైస్ ఫర్ ఇమేజింగ్ అనే పరకరం ఉపయోగించి, కెమెరాలో ఫిలిం వాడే అవసరం లేకుండా చేశారు. 1991లో కొడాక్ ఈసీ 100 వాణిజ్య పరంగా అందుబాటులోకి వచ్చిన మొట్టమొదటి డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరా. ఇది డిజిటల్ ఫొటోగ్రఫీకి నాంది పలికింది. ప్రీ వెడ్డింగ్ షూట్... ఫొటోగ్రఫీ రంగంలో వచ్చిన ఆధునికత, డిజిటల్ ప్రక్రియతో ప్రీ వెడ్డింగ్ షూట్ జరుపుకోవడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. గతంలో పెళ్లి వేడుకలను పెళ్లి రోజు తీసే ఫొటోలతోనే సరిపెట్టుకున్న జంటలు ఇప్పుడు పెళ్లికి ముందు అందమైన లోకేషన్లలో ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ చేసుకుంటూ ఆ ఫొటోలను సోషల్ మీడియాతో పంచుకుంటున్నారు. 15 ఏళ్లుగా ఫొటోలు తీస్తున్న నేను 15 ఏళ్లుగా ఫొటోలు తీస్తున్న. గోవాలో సిగ్మా ఆర్ట్ ఫొటోగ్రఫీ ఇండియా నిర్వహించిన పోటీల్లో జాతీయస్థాయిలో సిల్వర్మెడల్ పొందాను. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ చేతులమీదుగా ఉగాది పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉంది. – బత్తుల రాజు, గోదావరిఖని కొత్త టెక్నాలజీ వచ్చింది ఫొటోగ్రఫీలో ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది. ప్రజలు ప్రీ, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్తోపాటు ఫొటోలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. టెక్నాలజీ పరంగా ముందుకెళ్లినా కరోనాతో రెండేళ్లు వెనక్కి వెళ్లినట్లయింది. ఇప్పుడు శ్రావణమాసం కావడంతో కొద్దిగా గిరాకీ పెరుగుతూ వస్తోంది. – గాలిపల్లి రవివర్మ, రవివర్మ డిజిటల్ స్టూడియో యజమాని -
ప్రీ వెడ్డింగ్ ఫోటోలను షేర్ చేసిన ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తన ప్రీ వెడ్డింగ్ వేడుకలకి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. సరిగ్గా 24 ఏళ్ల క్రితం 'ఫూలోన్ కా గెహ్నా' (కశ్మీరి సాంప్రదాయం ప్రకారం వధువును పూలతో అలంకరించే వేడుక అని అర్థం)సమయంలో తీసిన ఫోటోలని అని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ఫోటోలకు వేలసంఖ్యలో లైకులు వచ్చాయి. 1997 ఫిబ్రవరి 18 న వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాతో ప్రియాంక వివాహం జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లికి రెండు రోజుల ముందు ఈ పూల వేడుకను నిర్వహిస్తారు. ప్రియాంక షేర్ చేసిన ఫ్రీ వెడ్డింగ్ ఫోటోలో ఆమె ఆడపడుచు మిచెల్ వాద్రా కూడా ఉన్నారు. అయితే 2001లో జరిగిన కారు ప్రమాదంలో ఆమె మరణించారు. View this post on Instagram A post shared by Priyanka Gandhi Vadra (@priyankagandhivadra) ఇక గతంలో చీర కట్టులో ఉన్న ఫోటోను షేర్ చేసిన ప్రియాంక గాంధీ.. ఆమె పెళ్లి రోజు పూజా సమయంలోని ఫోటోని షేర్ చేశారు. #SareeTwitter అనే హ్యాష్ ట్యాగ్ను ఆమె పోస్టుకు ట్యాగ్ చేశారు. ప్రియాంక తన పెళ్లి నాటి ఫోటోను షేర్ చేసిన కొన్ని క్షణాల్లోనే అది వైరల్ అయిన సంగతి తెలిసిందే. బనారస్ చీరకట్టుకుని పూజలో కూర్చున్న నవవధువు ప్రియాంక ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. View this post on Instagram A post shared by Priyanka Gandhi Vadra (@priyankagandhivadra) -
సంక్రాంతికి ముందే సింగర్ సునీత పెళ్లి!
తన గాత్ర మాధుర్యంతో అభిమానులను ఓలలాడించే సింగర్ సునీత వైవాహిక జీవితం గురించి ఎన్నో పుకార్లు వచ్చాయి. కానీ ఏనాడూ ఆమె వాటిని పట్టించుకోలేరు. అయితే ఓ షోలో మాత్రం తన భర్త వల్ల ఇబ్బందిపడుతున్న విషయాన్ని బయట పెట్టారు. పిల్లలను తనే పెంచి పోషిస్తున్నట్లు తెలిపారు. ఒంటరిగానే జీవితాన్ని నెట్టుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో ఆమె వైవాహిక జీవితం గురించి వస్తున్న రూమర్లకు పుల్స్టాప్ పెట్టేశారు. కాగా సింగిల్ పేరెంట్గా పిల్లల బాధ్యత చూసుకుంటున్న ఆమె ఇటీవలే రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. (చదవండి: సునీత ప్రీ వెడ్డింగ్.. హాజరైన రేణు దేశాయ్) (సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఇన్విటేషన్ కార్డు) మ్యాంగో మీడియా గ్రూప్ హెడ్ రామ్ వీరపనేనితో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. జనవరి 9న సునీత, రామ్ల పెళ్లి ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. దీంతో ఈ జంట సంక్రాంతికి ముందే ఏడడుగులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహ కార్యక్రమానికి కేవలం ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు మాత్రమే హాజరు కాబోతున్నారట. అందువల్ల సినీ సెలబ్రిటీల కోసం సునీత నేడు ప్రీవెడ్డింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రిక నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా ఇటీవలే గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్లో సునీత-రామ్ ఓ స్పెషల్ పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనికి టాలీవుడ్ నటీనటులతో పాటు టాప్ సింగర్స్ కూడా హాజరయ్యారు. సునీతకు కాబోయే భర్త రామ్కు నితిన్ కూడా అత్యంత సన్నిహితుడు కావడంతో దగ్గరుండి ఈ వేడుకను జరిపించినట్లు సమాచారం. (చదవండి: పెళ్లికి సిద్ధమవ్వనున్న మరో బాలీవుడ్ జంట) -
ఘనంగా సింగర్ సునీత ప్రీవెడ్డింగ్ పార్టీ ఫొటోలు
-
సునీత ప్రీ వెడ్డింగ్.. హాజరైన రేణు దేశాయ్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల సింగర్ సునీత కు వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అంతేగాక జనవరిలో రామ్ను వివాహం చేసుకుంటున్నట్లు సునీత వెల్లడించారు. ఈ నేపథ్యంలో పెళ్లి సమయం దగ్గరపడుతుండటంతో వీరిద్దరూ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాన్ని ఆదివారం జరుపుకున్నారు. గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్లో ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ నటీనటులతో పాటు టాప్ సింగర్స్ హజరయ్యారు. (చదవండి: అతికొద్ది మంది సమక్షంలో సునీత పెళ్లి) కేవలం కొద్దిమంది సమక్షంలో జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్, యాంకర్ సుమ కనకాలలు సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సునీత-రామ్ల ప్రీ వెడ్డింగ్కు హీరో నితిన్ హోస్ట్గా వ్వవహరించి.. కార్యక్రమానికి సంబంధించి అన్ని పనులను దగ్గరుండి చూసుకున్నాడట. మరో విషయం ఏంటంటే సునీతకు కాబోయే భర్త రామ్కు నితిన్ కూడా అత్యంత సన్నిహితుడు కావడంలో దగ్గరుండి ఈ వేడుకను జరిపించినట్లు సమాచారం. View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) -
పెళ్లి కూతురుగా నిహారిక.. ఫోటోలు వైరల్!
కొణిదెల వారింట పెళ్లి సందడి మొదలైంది. మరో నాలుగు రోజుల్లో మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆగష్టులో నిశ్చితార్థం చేసుకున్న నిహారిక-చైతన్యల జంట డిసెంబర్ 9 మూడుముళ్ల బంధంతో ఒకటి కానున్నారు. ఈ వేడుక రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో ఘనంగా జరగనుంది. మెగా కుటుంబంలో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజులుగా ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జోరందుకున్నాయి. వీటికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేస్తున్నారు. ప్రస్తుతం నిహారిక పెళ్లి పనులకు చెందిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి: మీకన్నా నాకెవరున్నారు: నిహారిక ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా నేడు (శనివారం) నిహారికను పెళ్లి కూతురుగా చేశారు. తమ స్వగృహంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు పాల్గొన్నారు. ఇంటిని రంగురంగుల పువ్వులు, తోరణాలతో సుందరంగా అలంకరించారు. ఇక అందంగా ముస్తాబు అయిన నిహారిక ముఖంలో పెళ్లి కళ ఉట్టిపడుతోంది. కాగా నిహారిక పెళ్లి కార్యక్రమాల్లో చిరంజీవి కూతుళ్లు సుష్మిత, శ్రీజ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇదిలా ఉండగా నాగబాబు కూతురు నిహారిక వివాహం గుంటూరు ఐజీ ఎం. ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ చైతన్యతో ఈ నెల 9వ తేదీన జరగనుంది. రాజస్తాన్లో జరిగే ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇరు కుటుంబాలు రాజస్తాన్ తరలి వెళ్లనున్నాయి. చదవండి: కౌంట్డౌన్ స్టార్ట్.. మరో నాలుగు రోజుల్లోనే View this post on Instagram A post shared by Niharika K (@konidela_niharika_) View this post on Instagram A post shared by Niharika Konidela Official (@niharikakonidelaofficial) -
ప్రీ వెడ్డింగ్ షూట్.. జంట మృత్యువాత
బెంగళూరు: కొత్త జీవితం ఆరంభించాలని ఎన్నో కలలుగన్న ఓ జంట అర్ధాంతరంగా తనువు చాలించింది. వివాహ బంధంతో ఒక్కటికానున్న వధూవరులు.. ఆ వేడుకకు సంబంధించిన మధుర జ్ఞాపకాలను బంధించే క్రమంలో మృత్యువాత పడటం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ప్రీ వెడ్డింగ్ షూట్లో జరిగిన ప్రమాదం వారిని బలితీసుకున్న తీరు ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది. ఈ హృదయ విదారక ఘటన కర్ణాటకలోని మైసూరులో చోటుచేసుకుంది. వివరాలు... క్యాతమరానహళ్లికి చెందిన చంద్రు(28), శశికళ(20) దూరపు బంధువులు. గతేడాది నవంబరు 22న ఈ జంటకు నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలో ఈ ఏడాది అదే రోజున వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. పెళ్లి వేడుకల్లో భాగంగా ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకోవాలని చంద్రు, శశికళ ముచ్చటపడ్డారు. ఫొటోగ్రాఫర్ను సంప్రదించిన ఈ జంట సోమవారం ఉదయం ముదుకుతూర్లో కావేరీ నదీ తీరాన జలధామ రిసార్ట్కు చేరుకున్నారు. ఈ క్రమంలో మోటార్బోటు ఎక్కిన కాబోయే వధూవరులు, ఇంగ్లీష్ సినిమా ‘టైటానిక్’ లోని ప్రణయ దృశ్యాలను తలపించేలా ఫొటోలకు ఫోజులిచ్చారు. అయితే ఒక్కసారిగా అదుపుతప్పి నదిలో పడిపోయారు. చంద్రు, శశికళను కాపాడేందుకు ఫొటోగ్రాఫర్ చేసిన ప్రయత్నం విఫలమవ్వడంతో ఇద్దరూ జలసమాధి అయ్యారు. (చదవండి: పిచ్చి పీక్స్కు వెళ్లడం అంటే ఇదే! ) ఈ ఘటన గురించి పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. ఫొటోషూట్ కోసం వెళ్లిన సమయంలో శశికళ హైహీల్స్ ధరించి ఉన్నారని, ఫొటోలకు పోజులిస్తున్న సమయంలో అదుపు తప్పడంతో బోటు పక్కకు వంగిందని పేర్కొన్నారు. ఆ వెనువెంటనే ఆమెతో పాటు చంద్రు సైతం నీళ్లల్లో పడిపోయాడని, బోటు నడిపే వ్యక్తి, ఫొటోగ్రాఫర్కు ఈత రావడంతో బతికి బయటపడ్డారని తెలిపారు. ఈ ఘటనపై రిసార్టు యజమానికి సమన్లు జారీ చేశామని, ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఫొటోగ్రాఫర్ తమకు సమాచారం అందించగానే ఘటనాస్థలికి చేరుకున్నామని, చంద్రు, శశికళ మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. (200 ఫోన్లకు నగ్న చిత్రాలను పంపి...) -
హల్దీ వేడుక : మెరిసిపోతున్న మిహికా
సాక్షి, హైదరాబాద్ : మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలెక్కనున్న హీరో రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ పెళ్లి వేడుక సందడి మొదలైంది.పెళ్లి పనుల హడావిడి ఇరు కుటుంబాల్లోనూ ప్రారంభమైంది. పెళ్లికూతురు మిహికా బజాజ్ హల్దీ వేడుకలో మెరిసిపోయింది. వివాహానికి ముందు జరిగే ఈ వేడుకలో మిహికా పసుపు-ఆకుపచ్చ లెహంగాలో ఆకర్షణీయంగా నిలిచారు. ప్రత్యేక సీషెల్స్ డిజైనర్ ఆభరణాలతో ఆకట్టుకుంటున్నారు. (రానా-మిహికా వివాహం; వీరికి మాత్రమే ఆహ్వానం) కాగా రామానాయుడు స్టూడియోలో ఆగస్టు 8న రానా తన ప్రేమికురాలు మిహికా మెడలో మూడుముళ్లు వేయనున్న సంగతి తెలిసిందే. రానా, మిహికా కుటుంబాల నుండి కొద్ది మంది అతిథులు మాత్రమే ఈ వివాహానికి హాజరు కానున్నారు. అతిధులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించడంతోపాటు, చెఫ్లు, సర్వర్లను కూడా పరీక్షిస్తున్నామని, కరోనా ప్రోటోకాల్ ప్రకారం వారందరూ ఐసోలేషన్లో ఉన్నట్టు నిర్మాత సురేష్ వెల్లడించారు. View this post on Instagram Loving @ranadaggubati and @miheeka Bajaj's minimalistic looks for their haldi in Hyderabad today! Watch this space for more updates! Make-up Artist: @makeupartisttamanna 📸: @reelsandframes #ranadaggubati #miheekabajaj #celebrityweddings #celebritynews #lockdownwedding #bollywoodnews #celebrityweddings #breakingnews #intimateceremony #intimateweddings #weddingsutrab#haldiceremony A post shared by WeddingSutra.com (@weddingsutra) on Aug 6, 2020 at 1:37am PDT -
ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్
-
పోలీసు బందోబస్తు మధ్య దళిత వరుడి ఊరేగింపు
జైపూర్: పోలీసుల పటిష్ట భద్రత మధ్య పెళ్లికొడుకు ఊరేగింపు చేపట్టిన అరుదైన ఘటన సోమవారం రాజస్థాన్లో జరిగింది. బుంది జిల్లాలోని జారా గ్రామానికి చెందిన పరశురామ్ మేఘ్వల్ అనే దళితుడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతనికి బరాన్కు చెందిన మహిళతో ఫిబ్రవరి 4న వివాహం నిశ్చయమైంది. అయితే సంఘవాడ గ్రామానికి చెందిన ఉన్నత కులాల వ్యక్తులు దళిత వరుడి ఊరేగింపును అడ్డుకుంటారని అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. జిల్లా అధికారులను ఆశ్రయించి తమకు రక్షణ కల్పించాల్సిందిగా కోరారు. (కేరళ, పంజాబ్ బాటలో రాజస్తాన్..!) దీనికి అంగీకరించిన అధికారులు నాలుగు పోలీసు స్టేషన్ల నుంచి సుమారు 80 మంది పోలీసు సిబ్బందిని వరుడి ప్రీవెడ్డింగ్ కార్యక్రమానికి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసు బలగాల మధ్య వరుడి ఊరేగింపు కార్యక్రమం జరగడం ఆ గ్రామస్తులను విస్మయానికి గురి చేసింది. ఇక భారీగా పోలీసులు మెహరించడంతో సంగీత్ కార్యక్రమాన్ని వరుడి కుటుంబ సభ్యులు మధ్యాహ్నానికి వాయిదా వేసుకున్నారు. అనంతరం ఓ ఆలయంలో వరుడు దేవుని దీవెనలు తీసుకున్నాడు. రెండు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని అధికారులు తెలిపారు. చదవండి: ఎలుగుబంటి దెబ్బకు తోక ముడిచిన పులులు -
ఇక ప్రీ వెడ్డింగ్ షూట్లు ఉండవు..!
భోపాల్ : ప్రీ వెడ్డింగ్ షూట్లపై నిషేధం విధించడాన్ని మధ్యప్రదేశ్ పౌర సంబంధాల మంత్రి పీసీ శర్మ సమర్థించారు. తమ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ మధ్యప్రదేశ్లోని గుజరాతి, జైన్, సింధ్ మతాల సమాఖ్యలు ప్రీ వెడ్డింగ్ షూట్లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో సనాతన పద్ధతులను పాటించి పెళ్లిళ్లు జరిగితే బాగుంటుందని మంత్రి శర్మ అభిప్రాయపడ్డారు. అప్పుడే వివాహ బంధం బలంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇక సామాజిక కోణంలోనే నిషేధం నిర్ణయం తీసుకున్నట్టు ఆయా మత సమాఖ్యల ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇకపై ప్రీ వెడ్డింగ్ షూట్లు ఉండవని పేర్కొంటూ ఇటీవల ఇక్తాత్ (ఉత్తర్వు) కూడా జారీ చేశారు. గుజరాతి సమాజ్ జాతీయ కార్యదర్శి సంజయ్ పటేల్ మాట్లాడుతూ.. ‘ప్రీ వెడ్డింగ్ షూట్లు సరైనవి కావు. ఈ రోజుల్లో పెళ్లైన మూణ్నాళ్లకే దంపతులు విడిపోతున్నారు. అలాంటిది పెళ్లికి ముందే ఫొటోలు, వీడియోలు మంచి పద్ధతి కాదు. అందుకే గుజరాతి సమాజ్ కార్యనిర్వాహక కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది’అని వెల్లడించారు. తమ మతాచారాలకు విఘాతం కలిగించేదిగా ఉంది కాబట్టే ప్రీ వెడ్డింగ్ షూట్లను బ్యాన్ చేశామని జైన్, సింధ్ సమాజ్ అధ్యక్షులు తెలిపారు. కాగా, ప్రీ వెడ్డింగ్ షూట్లపై నిషేధం విధిస్తూ గతేడాది చత్తీస్గఢ్ సింధ్ సమాఖ్య కూడా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
అరకు ఎంపీ ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్
సాక్షి, విశాఖపట్నం : అతి పిన్న వయసులో పార్లమెంట్లో అడుగుపెట్టిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం ఈ నెల 17న జరగనున్న సంగతి తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితుడైన శివప్రసాద్ను పెద్దల అంగీకారంతో విహహం చేసుకోబోతున్నారు. మాధవి స్వగ్రామం శరభన్నపాలెంలో ఈ వివాహ వేడుక జరగనుంది. రిసెప్షన్ను ఈ నెల 22న రుషికొండలోని సాయిప్రియ బీచ్ రిసార్ట్స్లో ఏర్పాటు చేయనున్నారు. గొలుగొండ మండలం కెడిపేట గ్రామానికి చెందిన శివప్రసాద్ బి.టెక్, ఎంబీఏ పూర్తిచేశారు. ప్రస్తుతం కరస్పాండెట్గా ఓ కాలేజ్ నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ పెళ్లికి ముందు తమ స్నేహాన్ని, ప్రేమను తెలియజేసేలా ఓ ప్రీ వెడ్డింగ్ వీడియో తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రేమ ముందు అందరూ సమానమే అని ఈ వీడియో రుజువు అయింది. పాతికేళ్ల ప్రాయంలోనే మాధవి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నిక అయ్యారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గొడ్డేటి మాధవి అరకు పార్లమెంట్ నుంచి భారీ ఆధిక్యతతో ఎంపీగా విజయం సాధించారు. ఉపాధ్యాయురాలిగా ప్రస్థానం ప్రారంభించిన మాధవి... ఈ ఎన్నికల్లో ముప్ఫై ఏళ్లుగా రాజకీయ చక్రం తిప్పిన కిశోర్చంద్రదేవ్ని ఇంటికి సాగనంపారు. -
అరకు ఎంపీ ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్
-
ఈ పోలీస్ ‘మామూలోడు’ కాదు!
జైపూర్: వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది. అందుకే ఓ పోలీస్ అధికారి తన ప్రీ వెడ్డింగ్ను అంతే వినూత్నంగా ప్లాన్ చేసుకున్నారు. కానీ అది కాస్తా బెడిసి కొట్టింది. పోలీస్ యూనిఫామ్లోనే షూటింగ్ చేయడంపై కేసు నమోదైంది. రాజస్తాన్కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) ధన్పత్ సింగ్ వివాహం నిశ్చయమైంది. అందుకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్ షూట్ను మూడు నెలల కిందట జరిపారు. ఇది కాస్తా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయింది. ఈ వీడియోలో తనకు కాబోయే భార్య స్కూటీపై వెళ్తుండగా ఆ ఎస్సై ఆమెను ఆపుతాడు. హెల్మెట్ పెట్టుకోనందుకు ఫైన్ కట్టమంటాడు. దీంతో అతని చొక్కా జేబులో కొంత డబ్బు పెట్టి వెళ్లిపోతుంది. ఇదంతా ఎస్సై పోలీస్ యూనిఫాంలోనే షూట్ చేయడంతో ఉన్నతాధికారులు ఆయనపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. యూనిఫాంలో ఉండి లంచం తీసుకోవడం దాన్ని ప్రోత్సహించేలా ఉందని మందలిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు నమోదైందని, దర్యాప్తు చేస్తామని ఐజీ హవా సింగ్ గుమారియా తెలిపారు. దీనిపై ఎస్సై ధన్పత్ స్పందిస్తూ.. ‘ఈ వీడియో కావాలని తీసింది కాదు. నేను యూనిఫాంలో ఉన్న సన్నివేశాన్ని తీసేయాల్సిందిగా వీడియో గ్రాఫర్కు చెప్పాను. కానీ తాను మొత్తం వీడియోను అలాగే సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు’అని చెప్పారు. -
భార్య దగ్గరే లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
జైపూర్: నేటి కాలంలో వివాహ వేడుక ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. జీవితాంతం గుర్తు పెట్టుకోవాల్సిన అందమైన జ్ఞాపకం కావడంతో పెళ్లి వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రస్తుత కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్ చాలా సర్వ సాధరణమయ్యింది. ఉన్నత కుటుంబాల నుంచి మధ్యతరగతి ప్రజల వరకు ప్రీ వెడ్డింగ్ షూట్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకోసం భిన్నమైన పద్దతులను అనుసరిస్తున్నారు. అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ ఓ అధికారి పాలిట సమస్యగా పరిణమించింది. ప్రీ వెడ్డింగ్ షూట్లో భాగంగా కాబోయే భార్య దగ్గర నుంచి లంచం తీసుకుంటున్నట్లు తీసిన వీడియో కాస్తా ఓ పోలీసు అధికారి కొంపముంచింది. ఆ వివరాలు.. ఓ పోలీసు అధికారికి వివాహం నిశ్చయమయ్యింది. వేడుకలో భాగంగా కాబోయే భార్యతో కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్లో పాల్గొన్నాడు. పోలీసు కదా అందుకే ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఓ భిన్నమైన కాన్సెప్ట్ను ఎన్నుకున్నాడు. దానిలో భాగంగా.. సదరు అధికారి హెల్మెట్ పెట్టుకోలేదనే కారణంతో తనకు కాబోయే భార్యను ఆపుతాడు. హెల్మెట్ లేదు.. ఫైన్ కట్టాలని చెప్తాడు. అప్పుడామే తనకు కాబోయే భర్త, సదరు అధికారి జేబులో కొంత డబ్బు పెట్టి వెళ్లిపోతుంది. అలా వెళ్తూ తన భర్త జేబులో నుంచి వాలెట్ కొట్టేస్తుంది. ఇది గమనించిన అధికారి తన వాలెట్ను తిరిగి తెచ్చుకోవడం కోసం ఆమెను కలుసుకుంటాడు. అలా వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఈ కాన్సెప్ట్తో తీసిన వీరి ప్రీ వెడ్డింగ్ షూట్ స్నేహితులకు, బంధువులకు విపరీతంగా నచ్చింది. దాంతో యూట్యూబ్లో పోస్ట్ చేశారు. నెటిజనులకు కూడా ఈ వీడియో తెగ నచ్చింది. అందరికి నచ్చిన ఈ వీడియో పోలీసు శాఖకు మాత్రం ఆగ్రహం తెప్పించింది. డిపార్ట్మెంట్ పరువు తీసేలా లంచం తీసుకుంటూ వీడియో తీయడమే కాక దాన్ని యూట్యూబ్లో పోస్ట్ చేసినందుకు సదరు అధికారి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోటీసుల ఇవ్వడమే కాక తగిన చర్యలు తీసుకుంటామని తెలుపుతున్నారు. అసలు యూనిఫామ్ని ఇలా వ్యక్తిగత కార్యక్రమాల కోసం వినియోగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక మీదట ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తుండగా.. అనూహ్యంగా!
-
ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తుండగా.. అనూహ్యంగా!
తిరువనంతపురం: వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్న జంట మధ్య ప్రేమ, ప్రణయాలను చాటుతూ.. చిత్రీకరిస్తున్న ప్రీవెడ్డింగ్ ఫొటో షూట్స్ ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్నాయి. చాలామంది జంటలు పెళ్లికి ముందే తమ మధ్య మధురానుభూతులను ఇలా ఫొటోల్లో బంధిస్తున్నారు. అయితే, ఇటీవల కేరళలోని ఓ జంటపై చిత్రీకరించిన ప్రీవెడ్డింగ్ షూట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అందుకు కారణం షూటింగ్ సందర్భంగా జరిగిన ఒక చిన్న అపశ్రుతి.. ప్రీ వెడ్డింగ్ షూట్లో భాగంగా ఓ నదిలో పడవలో కూర్చుని జంట ముద్దుపెట్టుకోబోతుండగా.. పడవ బ్యాలెన్స్ తప్పి.. ఇద్దరు అమాంతంలో నీళ్లలో పడిపోయారు. అదృష్టం బావుండి పెద్దగా లోతు లేకపోవడంతో జంటకు పెద్దగా గాయాలు కాలేదు. కానీ వారు అమాంతం నీటిలో పడిపోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. థిరువల్లకు చెందిన తిజిన్ థాంకచెన్, చంగనచెర్రీకి చెందిన శిల్ప వచ్చేనెల ఆరో తేదీన పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో వారు పథనంతిట్టు జిల్లాలోని పంబా నది ఒడ్డును ప్రీవెడ్డింగ్ షూట్లో పాల్గొన్నారు. షూట్లో భాగంగా ఫొటోగ్రాఫర్ సూచనల మేరకు పడవలో కూర్చున్న వారు ముద్దుపెట్టుకునేందుకు సమీపిస్తుండగానే.. అమాంతం పడవ అదుపుతప్పి.. నీళ్లలో పడిపోయారు. అయితే ఇలా నీళ్లలోకి పడిపోవడం అనేది తమ ‘ప్లానింగ్’లో భాగమేనని, ఆ విషయం ముందుగానే జంటకు తెలియకుండా ట్విస్టు ఇచ్చామని.. ఈ ప్రీవెడ్డింగ్ షూట్ బాగా వచ్చిందని షూట్ ఆర్గనైజర్ ఓ మీడియా చానెల్కు తెలుపడం కొసమెరుపు. -
దీపిక ఇంట.. పెళ్లి సంబరాలు షురూ!
బెంగళూరు: బాలీవుడ్ ప్రేమ పక్షులు దీపిక పదుకొనె-రణ్వీర్ సింగ్ త్వరలోనే వివాహ బంధంతో ఓ ఇంటివాళ్లు కాబోతున్నారు. వారిద్దరి వివాహ వేడుక నవంబర్ 14,15 తేదీల్లో ఇటలీలో జరగనుండడం తెలిసిందే. పెళ్లికి పది రోజుల ముందే బెంగుళూరులోని దీపిక పదుకొనె ఇంట ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. దీపిక ప్రీవెడ్డింగ్కు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోల్లో తమ కుటుంబీకులతో దీపిక ఎంజాయ్ చేస్తోంది. శుక్రవారం దీపిక ఇంట్లో సాంప్రదాయకంగా పూజను నిర్వహించారు. దీనితో వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయని దీపిక సన్నిహితులు పేర్కొన్నారు. ఇటలీలో జరిగే దీపిక వివాహ వేడుకకు 200 మంది అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారు. నవంబర్ 13న సంగీత్, 14న సౌత్ ఇండియన్ స్టైల్లో వివాహం, 15న నార్త్ ఇండియన్ స్టైల్లో వివాహం, డిసెంబర్ 11న ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. -
ఆ వేడుకలో బాలీవుడ్ చిందులు
మొన్నామధ్య సోనమ్ కపూర్ పెళ్లితో బాలీవుడ్ దద్దరిల్లింది. తారాగణం అంతా కదిలివచ్చి పెళ్లి వేడుకల్లో సందడి చేసింది. ఆ వేడుకలకు సంబంధించిన వీడియోలు అప్పట్లో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వ్యాపారదిగ్గజం ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ వివాహ వేడుకకు హాజరై సందడిచేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా ప్రీ వెడ్డింగ్ వేడుకలు శనివారం అట్టహాసంగా జరిగాయి. ముంబైలో జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్, అర్జున్ కపూర్ చేసిన డ్యాన్స్లు వైరల్గా మారాయి. ఈ వీడియోల్లో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్లు హైలెట్గా నిలిచారు. ఈ కార్యాక్రమానికి ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్, టైగర్ ఫ్రాఫ్, కరణ్ జోహార్, విద్యాబాలన్, మాధురి దీక్షిత్, అలియాభట్ ఇలా భారీ తారాగణం విచ్చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతాలు చిన్ననాటి స్నేహితులు. శ్లోకా మెహతా కుటుంబం వజ్రాల వ్యాపారంలో పేరుగాంచినవారన్న సంగతి తెలిసిందే. ఈ నూతన జంట ఈ ఏడాది చివరికల్లా పెళ్లిబంధంతో ఒక్కటవ్వనున్నారు. -
అంబానీ ఇంట హోరెత్తిన పెళ్లి సంబరాలు
-
పెళ్లి పార్టీలో కాల్పులు.. వధువు మృతి
చంఢీఘడ్ : పంజాబ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి సంబరాల్లో ఒకరి అత్యుత్సాహం పెళ్లికూతురు ప్రాణాలను తీసింది. ఈ ఘటన హోషియార్ పూర్లో గత శనివారం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన చరణ్జిత్ తన కూతురు సాక్షి అరోరా వివాహం వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. పెళ్లి వేడుకల్లో భాగంగా శనివారం డీజే పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ వేడుకను వధువు భవనంపై నుంచి తిలకిస్తోంది. ఇంతలో పెళ్లికి వచ్చిన అతిధుల్లో ఒకరు అత్యుత్సాహంతో తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లోని ఓ బుల్లేట్ భవనంపై ఉన్న వధువు తలకు తగలడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో పెళ్లి వేడుకలో విషాదం అలముకుంది. మృతురాలి తండ్రి చరణ్జిత్ ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 302, 34, ఆయుధాల వినియోగ చట్టాల కింద కేసు నమోదు చేశారు. చరణ్ జిత్ స్నేహితుడు, నిందితుడైన ఖోస్లాను అరెస్టు చేసి లైసెన్స్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు అశోక్ పరారీలో ఉన్నాడు. ఇక వివాహ వేడుకల్లో గన్ కల్చర్ శృతి మించుతోంది. గతంలో హర్యానాలోని ఓ పెళ్లి సంగీత్లో ఇలానే అత్యుత్సాహంతో గాల్లోకి కాల్పులు జరపడంతో వరుడు మృతి చెందాడు. -
పెళ్లి అని కాస్త టెన్షన్ పడ్డాను: నటి
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్లి విజయాలబాట పట్టిన బ్యూటీ తాప్సీ పన్ను. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ తనకు ఎంతో థ్రిల్లింగ్గా అనిపించిందని చెబుతోంది ఈ బ్యూటీ. అదేంటీ తాప్సీ పెళ్లి వార్తలు బయటకు రాకుండానే ప్రీ వెడ్డింగ్ ప్లాన్లో ఉందని అనుకుంటున్నారా. ప్రస్తుతం తాప్సీ 'రన్నింగ్ షాదీ.కామ్' మూవీలో నటిస్తోంది. అయితే మూవీ ప్రమోషన్లో భాగంగా పెళ్లికి ముందు జరిపే సంగీత్ ఇతరత్రా ఈవెంట్లలో పాల్గొనాల్సి వచ్చింది. దీంతో తనకు నిజంగానే పెళ్లి జరుగుతుందని ఆందోళన చెందానని, కేవలం మూవీ కోసమే ఇలా చేస్తున్నానని గుర్తుకొచ్చి అదే సమయంలో చాలా ఎంజాయ్ చేశానంటోంది తాప్సీ. సంగీత్ వేడుకలో అయితే తాప్సీ నిజమైన పెళ్లికూతురు అని భావించి అదే తరహాలో తనను ట్రీట్ చేయడాన్ని.. ఈ పెళ్లిని కూడా ఎప్పటికీ మరిచిపోలేననని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. తమ సంగీత్లో పాల్గొనడంతో గుజరాతీ వధూవరులు ఆశ్చర్చపోయారని, తాను వస్తున్న సంగతి వారికి తెలియదని చెప్పింది. సడన్ సర్ ప్రైజ్ ఇవ్వడంతో పాటు డాన్స్ చేసి అక్కడివారిలో ఉత్సాహాన్ని పెంచింది. మూవీ ప్రమోషన్లో భాగంగా కొద్దిసేపు తాప్సీ వధువుగా ఈవెంట్లో పాల్గొంది. ఆ సందర్భంగా తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది 'పింక్' ఫేమ్ తాప్సీ. 1971లో జరిగిన భారత్ , పాకిస్థాన్ యుద్ధ సమయంలో సముద్ర గర్భంలో అదృశ్యమయిన సబ్ మెరైన్ 'ఘాజీ' నేపథ్యంలో తెరకెక్కుతున్న ఘాజీ మూవీలోనూ ఆమె నటిస్తోంది.