Top Stories
ప్రధాన వార్తలు
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
తెలుగుదేశం పార్టీ అధికారిక పత్రికగా గుర్తింపు పొందిన, ఆ పార్టీ అనధికార ప్రతినిధిగా పేరొందిన ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణకు ఏపీ శాసనసభ ఎన్నికల ఫలితాలపై గజిబిజి ఉందట. ఆంధ్ర ఓటర్లు ఏ తీర్పు ఇస్తారో అర్ధం కావడం లేదట. అంటే తెలుగు దేశం గెలవడం లేదన్న సంకేతం అందుతున్నట్లే కదా!అందుకు భిన్నంగా ఉంటే ఈయన ఎగిరి గంతేసి రచ్చ,రచ్చ చేసేవారు కదా! అంతేకాదు. ఆయన జర్నలిస్టులకు సుద్దులు, పత్తిత్తు కబుర్లు కూడా చెప్పారు. కొత్త పలుకు పేరుతో వ్యాసాలు రాసే ఆయన పచ్చి అబద్దాలను ఇంతకాలం ప్రచారం చేస్తూ వచ్చారు. తెలుగుదేశం గెలుపు తన గెలుపు అని భావించి , ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంట్లో మనిషి మాదిరిగా వ్యవహరించే ఈయన తాజాగా చెప్పిన నీతులు వింటే ఆశ్చర్యం చెందాల్సిందే. అదే టైమ్ లో ఆయన యధాప్రకారం వైఎస్సార్సీపీపైన, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపైన విషం కక్కారు. అయినా జర్నలిజం గురించి మాట్లాడగలరు. తను తప్ప మిగిలినవారంతా ఎర్నలిస్టులు అని రాయగలరు. అసలు తానేమిటో, తన మూలాలేమిటో మర్చిపోయి, ఒక ఆగర్భ శ్రీమంతుడు మాదిరి, సత్య సంధుడు మాదిరి. హరిశ్చంద్రుని తమ్ముడి మాదిరి ,అత్యంత నీతిమంతుడు మాదిరి ఆయన రాసే పలుకులు చూస్తే ఔరా అనుకోవల్సిందే. ఏపీ ప్రజలలో ఈ శాసనసభ ఎన్నికలలో ఎవరు గెలుస్తారన్నదానిపై ఎవరి అభిప్రాయం వారికి ఉండవచ్చు. కొందరు వైఎస్సార్సీపీకి, మరి కొందరు టీడీపీకి అనుకూలంగా ఆలోచించవచ్చు. కాని చంద్రబాబుకు నమ్మిన బంటు తరహాలో ఉండే ఆంధ్రజ్యోతి యజమానికి టీడీపీ గెలుపుపై ఎందుకు సందేహం వచ్చిందో తెలియదు. అందుకే గెలుపు అంచనాలలో గజిబిజి అని హెడింగ్ పెట్టుకున్నట్లు ఉన్నారు. ఎన్నికల వరకు ఉన్నవి, లేనివి పచ్చి అబద్దాలు రాసి ప్రజలను మోసం చేసే యత్నం చేసిన రాధాకృష్ణ ఇప్పుడు జర్నలిజం ఎలా ఉండాలో నీతులు వల్లెవేస్తున్నారు. దీనిని బట్టే అర్దం అవుతోంది. ఆయనకు టీడీపీ అధికారంలోకి రావడం లేదన్న సమాచారం వచ్చి ఉండాలి. పైకి ఏవో కబుర్లు చెప్పినా, అంతర్లీనంగా చదివితే రాధాకృష్ణ ఎంత భయపడుతున్నది తెలుస్తుంది. వైఎస్సార్సీపీ గెలుస్తుందని అనేవారికి శాపనార్ధాలు పెడుతున్న తీరే ఆయన బలహీనతను తెలియపరుస్తుంది. ప్రతి పత్రికకు సొంత నెట్ వర్క్ ఉంటుంది. ఆంధ్రజ్యోతి కి కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో నెట్ వర్క్ ఉంది కదా!. ఆ నెట్ వర్క్ లో పనిచేసే ప్రతినిధులుఉంటారు కదా!వారితో పోలింగ్ కు ముందు, పోలింగ్ జరిగే రోజున, అవసరమైతే పోలింగ్ తర్వాత కూడా అభిప్రాయ సేకరణ అనండి, ఎగ్జిట్ పోల్ అనండి..పేరేదైనా పెట్టండి ..ప్రజల నాడి ఎలా ఉందో పసికట్టడానికి ప్రయత్నించి ఉంటారు కదా!. ఒక వేళ అది టీడీపీకి పూర్తి అనుకూలంగా ఉంటే ఆంధ్రజ్యోతిలో పతాక శీర్షికలలో కదనాలు ఇచ్చే వారే కదా?. అలా చేయలేకపోగా, గజిబిజి గా పరిస్తితి ఉందని రాసుకున్నారంటే తెలుగుదేశంలో ఉన్న గందరగోళం ఏమిటో తెలుసుకోవచ్చు. ఆంధ్రజ్యోతి రాసిందంటే టీడీపీ రాసినట్లే కదా!. రాధాకృష్ణ రాసిన కొన్ని అంశాలు చూద్దాం. అనుభవం ఉన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సైతం అనేక సందర్భాలలో లెక్క తప్పాయని ఆయన అన్నారు. అందులో కొన్నిసార్లు నిజం ఉండవచ్చు. కాని ఎక్కువసార్లు వాస్తవమే అయ్యాయనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఎగ్జిట్ పోల్స్ తో సంబంధం లేకుండా కాంగ్రెస్ కు పట్టం కట్టారట. ఇది కూడా అసత్యమే. తెలంగాణలో అత్యధిక ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కు విజయావకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. కనీస అవగాహన లేనివారు, జనం నాడి తెలియని వారు అంచనాలు రూపొందించడం రాధాకృష్ణకు ఆశ్చర్యం కలిగించిందట. చంద్రబాబుకు, జగన్ కు లేని టెన్షన్ ను ఈ తరహా ఎర్నలిస్టులు ప్రదర్శిస్తుండడం విశేషం అని రాశారు. తాను ఎలా సంపాదించి పైకి వచ్చింది. తను రిపోర్టర్గా పనిచేసిన పత్రికకే తాను ఎలా యజమాని అయింది రాధాకృష్ణకు తెలియదా! మళ్లీ ప్రత్యేకంగా ఎర్నలిస్టులు అంటూ ఎవరినో అనడం దేనికి? ప్రభుత్వ పని తీరుతో సంబంధం లేకుండా సోషల్ మీడియా సైన్యం మాత్రమే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయజాలదని రాధాకృష్ణ రాసుకొచ్చారు. సోషల్ మీడియా వరకు దేనికి!. మిమ్మల్ని మీరు మెయిన్ మీడియా అనుకుంటారుగా? ఇంతకీ మీరు రాసిన పచ్చి అబద్దాలను జనం నమ్మారనుకుంటున్నారా? నమ్మ లేదని అనుకుంటున్నారా?ఉదాహరణకు లాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి, స్టాంప్ రిజిస్ట్రేషన్ గురించి ఆంధ్రజ్యోతితో పాటు ఈనాడు రాసిన దారుణమైన అబద్దాలను ప్రజలు నమ్మలేదన్న సంగతి మీకు తెలిసిందా? అనే అనుమానం వస్తుంది. పనిలో పనిగా యూట్యూబ్ చానల్స్ గురించి కూడా తెగ వాపోయారు. ముందు మీరు మీ యూట్యూబ్ చానల్ లో నిజాలు చెప్పడం అలవాటు చేసుకుని అప్పుడు ఎదుటివారి గురించి మాట్లాడండి. తెలుగుదేశం పార్టీ ఐటిడిపి పేరుతో ఎంత నీచమైన ఆరోపణలతో వైఎస్సార్సీపీపైన, జగన్ పైన ప్రచారం చేస్తే సమర్దించిన రాధాకృష్ణ నంగనాచి కబుర్లు చెబుతున్నారు. యూట్యూబ్ ఛానెల్స్ను రాజకీయ పార్టీలు స్పాన్సర్ చేస్తున్నాయట. ఈనాడు, ఆంద్రజ్యోతివంటి ఎల్లో మీడియాను తెలుగుదేశం పార్టీ స్పాన్సర్ చేసిన విషయాన్ని తొలుత రాసి ఆ తర్వాత మిగిలినవారి గురించి మాట్లాడితే బాగుండేది. సోషల్ మీడియాలో వ్యూస్ ను బట్టి కూడా ఎవరికి మద్దతు ఉందో చెప్పవచ్చని మళ్లీ ఇదే కొత్త పలుకు లో ఈయన చెబుతున్నారు. ఐదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన జగన్ కు అనుకూలంగా ఉండే వార్తలు, కధనాలకు రెండే క్రితం వరకు అధికంగా వ్యూస్ ఉండేవని, రాను..రాను అవి తగ్గిపోయాయని మరో అబద్దం రాసుకొచ్చారు.ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్ ఇంటర్వ్యూని టీవీ9లోను, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటర్వ్యూని ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలోనూ ఒకే రోజు, ఒకే సమయంలో ప్రసారం చేశారు. చంద్రబాబును ఇదే రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. జగన్ చేసిన ఇంటర్వ్యూకు టీవీ9 యూట్యూబ్ ఛానల్లో 11లక్షల వ్యూస్ వస్తే, చంద్రబాబు ఇంటర్వ్యూకు నాలుగైదు లక్షల వ్యూసే వచ్చాయి. ఇది ఎవరయినా గమనించవచ్చు. లైవ్ జరుగుతున్నప్పుడు కూడా ఎబిఎన్ కంటే టీవీ9 కంటెంట్ను ఎన్నోరెట్ల మంది యుట్యూబ్లో చూసినట్లు లెక్కలు చెబుతున్నాయి కదా! ఈయన థియరీ ప్రకారం చూసుకున్నా జగన్ గెలుస్తున్నట్లే కదా!. తెలంగాణను మించిన నిర్భంధం ఏపీలో ఉందట. నిజంగా ఆ పరిస్థితి ఉంటే ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇంత అరాచకంగా, జర్నలిజానికి తలవంపులు తెచ్చేరీతిలో వార్తలు,కధనాలు ఇచ్చి ఉండేవారా?. ఎందుకు వీరు ఆత్మవంచన చేసుకుంటున్నారు!. ఉద్యోగ సంఘాల నేతలు జగన్కు అనుకూలమైనా ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు. పాపం ఉద్యోగులపై అంత ప్రేమ ఉంటే,వారిని పనిపాట లేనివారని, వారికి ఊరికే వందల కోట్ల జీతాలు కూర్చోబెట్టి ఇస్తున్నారన్నట్లుగా చంద్రబాబుతో మాట్లాడింది రాధాకృష్ణే కదా! 2019 లో ఎన్నికలలో తాను మళ్లీ అధికారంలోకి వస్తానని ప్రకటించి బోల్తా కొట్టిన చంద్రబాబు ఈ పర్యాయం మాత్రం ఎన్నికల ఫలితాల జోస్యం చెప్పలేదని ఈయన అంటున్నారు. నిజానికి అప్పుడు చంద్రబాబే కాదు. ఆంధ్రజ్యోతి, ఈనాడు తదతితర ఎల్లో మీడియా అంతా ఇదే మాట ఊదరగొట్టాయి. చంద్రబాబు ఇచ్చిన పసుపు-కుంకుమ తో మహిళలంతా టీడీపీ కి ఓటు వేశారని ఈయన పత్రికలోరాశారో లేదో ఒక్కసారి వెనక్కి వెళ్లి చూసుకోమనండి కానీ, 2019లో జగన్ చెప్పినట్లు వైసిపి భారీ మెజార్టీతో గెలుపొందిందన్న ఒక్క సత్యాన్ని ఒప్పుకున్న ఈయన అక్కడ కూడా వక్రీకరించారు. జగన్ అండ్ కో అప్పుడు అసత్య ప్రచారం మీద నమ్మకం పెట్టుకుందని ఈ సత్యసంధుడు రాస్తున్నాడు. చంద్రబాబు అండ్ కో లో భాగస్వామి అయిన రాధాకృష్ణ అబద్దాల సృష్టికర్తలలో ఒకడన్న సంగతి ప్రజలందరికి తెలుసు. 2024 ఎన్నికల ప్రచారంలో జగన్ అసత్యాలు చెప్పారో, చంద్రబాబు అబద్దాలు చె్ప్పారో, ప్రజలు ఏమి అనుకుంటున్నారో ఒక సర్వే చేయించుకుంటే తెలుస్తుంది. రాధాకృష్ణ ఎంతసేపు ఆత్మ వంచన చేసుకుంటూ ప్రజలను కూడా అలాగే మోసం చేయాలని చూస్తున్నారు. 2019 ఎన్నికలలో జగన్ ఆశ్రిత పక్షపాతం, భావోద్వేగాలు ప్రేరేపించడం, విమర్శనాత్మక ఆలోచనా ధోరణి నశింప చేయడం.. వంటివాటివల్ల గెలిచారట.ఎంత అక్కసో చూడండి. జగన్ గెలిస్తే ఆలోచన సరిగా లేనట్లట. చంద్రబాబు గెలిస్తే మేధావితనం అట. ఈయనకు వందల కోట్ల ప్రయోజనం చేకూర్చుతారు కాబట్టి చంద్రబాబు పాలన గొప్పదిగా కనిపించవచ్చు. కాని జగన్ ప్రజలకు లక్షల కోట్ల మేర మేలు చేశారు. కాబట్టి ఆయన తనవల్ల మేలు జరిగితేనే ఓటు వేయండని ధైర్యంగా చెప్పారు. ఆ మాట చంద్రబాబుతో ఎందుకు చెప్పించలేకపోయారు.? మళ్లీ జన్మభూమి కమిటీల పాలన తెస్తానని, వలంటీర్లను రద్దు చేస్తానని, గ్రామ, వార్డు సచివాలయాలను ఎత్తివేస్తానని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోయారు. రాధాకృష్ణ ఎందుకు చెప్పించలేకపోయారు? అమ్మ ఒడి ఇస్తుంటే బటన్ నొక్కడం తప్ప జగన్ ఏమి చేస్తున్నారని ఆ రోజుల్లో రాధాకృష్ణ తెగ బాధపడ్డారు. అదే చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏమన్నాడు? ఇంటిలో ఒకరికి కాదు.. ఎంత మంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం పేరుతో పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తానని చంద్రబాబు చెబితే రాధాకృష్ణ మాత్రం వైఎస్సార్సీపీపైన రోధిస్తున్నారు. జగన్ స్కీములతో రాష్ట్రం నాశనం అయితే, వాటన్నిటిని కొనసాగిస్తామని చంద్రబాబు, పవన్ లతో ఎందుకు చెప్పించారు.? ప్రొఫెసర్ నాగేశ్వర్, తెలకపల్లి రవి వంటి వారి పేర్లు రాయకుండా సిపిఎం సంబంధాలు కలిగిన వారు జగన్కు అనుకూలంగా విశ్లేషణలు వదలుతున్నారట. జగన్ కు అనుకూలంగా విశ్లేషణలు ఇస్తున్నవారు వ్యతిరేక ఫలితాలు వస్తే మొహం ఎక్కడ పెట్టుకుంటారు అని అమాయకంగా ప్రశ్నించారు.2019 లో రాధాకృష్ణ ఎక్కడ మొహం పెట్టుకున్నారు? 2024లో జగన్ కు అనుకూల ఫలితం వస్తే ఈయన ఎక్కడ మొహం పెట్టుకుంటారు! ప్రశాంత కిషోర్ లో రాధాకృష్ణకు ఇప్పుడు విశ్వసనీయత కనిపిస్తోంది. అంత గొప్ప ప్రశాంత కిషోర్ తెలంగాణలో బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఎలా చెప్పారో, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రాదని ఎలా చెప్పారో కూడా ఈయన వివరించాలి. చంద్రబాబు ఎన్నికల ముందు మహిళలకు పదివేల రూపాయలు చొప్పున ఇచ్చినా ఓడిపోయారని, జగన్ పధకాల పేరుతోడబ్బు పంచితే ఓట్లు వేస్తారా అని రెంటిని సమం చేసే దిక్కుమాలిన ఆలోచన చేశారు. చంద్రబాబు ఎన్నికల కోసం పదివేల రూపాయలు ఇచ్చారు. జగన్ తను ఇచ్చిన హామీ ప్రకారం ఐదేళ్లపాటు స్కీముల ద్వారా లబ్ది చేకూర్చారు. ఆ మాత్రం జ్ఞానం లేకుండా రాధాకృష్ణ వ్యాసాలు రాసిపడేసి, చేతిలో పత్రిక ఉందని అచ్చేసి, టీవీ ఛానెల్ ఉంది కదా అని ఊదరగొట్టేస్తే జనం నమ్ముతారా? ఎన్నికలకు ముందు ఆ సర్వే అని,ఈ సర్వే అని తెలుగుదేశంకు డప్పు వాయించిన రాధాకృష్ణ తినబోతూ రుచులు అడగకూడదని అంటున్నారు. ఆయన రాసిన చివరిమాటలోని అంగుళీమాలుడు అనే దొంగ పాత్ర అమరావతి పేరుతో మూడు పంటలు పండే వేలాది ఎకరాలను ధ్వంసం చేసిన చంద్రబాబు అవుతారు లేదా ఆయన సేవలో తరించే రాధాకృష్ణ అవుతారు తప్ప ఇంకొకరు కారు. జగన్ ను దూషించడం తప్ప, ఈయన చెత్తపలుకులో చేసిన విశ్లేషణ ఏముంది? ఏపీ ఫలితాలపై ఈయనకు గజిబిజి ఉందేమో కాని, ప్రజలకు మాత్రం కాదని చెప్పవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపుల కేసులో ఇరుకున్న హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజల్వ్ రేవణ్ణ త్వరలోనే భారత్కు తిరిగి రానున్నారు. ఈనెల 31న సిట్ ముందు విచారణకు హాజరు కానున్నట్లు స్వయంగా తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.‘నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మే 31 ఉదయం 10 గంటలకు సిట్ ముందు హాజరవుతాను. విచారణకు సహకరిస్తాను. నాపై నమోదైనవి తప్పుడు కేసులు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంది.’ అని సోమవారం పేర్కొన్నారు.అయితే తనపై వచ్చిన ఆరోపణలను రాజకీయ కుట్రగా రేవణ్ణ పేర్కొన్నాడు. తాను మానసిక ఒత్తిడి, ఒంటరిగా ఉన్నట్లు చెప్పాడు. తన ఆచూకీ వివరాలు చెప్పనందుకు జేడీఎస్ నేతలు, పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు కూడా చెప్పారు.‘విదేశాల్లో నేను ఎక్కడ ఉన్నానో సరైన సమాచారం అందించనందుకు నా కుటుంబ సభ్యులకు, మా కుమారన్న (కుమారస్వామి],పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఏప్రిల్ 26వ తేదీన ఎన్నికలు ముగిసినప్పుడు, నాపై ఎటువంటి కేసు లేదు. సిట్ ఏర్పాటు చేయలేదు. నేను వెళ్లిన రెండు, మూడు రోజుల తర్వాత యూట్యూబ్లో నాపై ఈ ఆరోపణలను చూశాను. అలాగే ఏడు రోజుల సమయం కావాలని నా లాయర్ ద్వారా సిట్కి లేఖ రాశాను.’ అని పేర్కొన్నారు.కాగా మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మనవడైన ప్రజ్వల్ రేవణ్ణ(36) మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనేక మహిళలను లైంగికంగా వేధించినట్లు వీడియో బయటకు రావడంతో ప్రజ్వల్ ఏప్రిల్ 26న దేశం విడిచి వెళ్లిపోయారు.కాగా తనను లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు హాసన్ జిల్లా హొళె నరసీపుర పోలీస్ స్టేషన్లో ప్రజ్వల్తోపాటు ఆయన తండ్రి, జేడీఎస్ ఎమ్మెల్యే రేవణ్ణపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. రేవణ్ణ రాసలీలలపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అతనిపై లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. అనంతరం అతనిపై బ్లూ కార్నర్ నోటీసు' కూడా జారీ అయ్యింది.తన మనవడిని భారతదేశానికి తిరిగి రావాలని, పోలీసులకు లొంగిపోవాలని లేదా అతని ఆగ్రహాన్ని ఎదుర్కోవాలని కోరుతూ హెచ్డి దేవెగౌడ తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు. ఇది జరిగిన మూడు రోజుల తర్వాత అతని ప్రకటన రావడం గమనార్హం. అంతేగాక ప్రజ్వల్ దౌత్య పాస్పోర్ట్ను రద్దు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గత వారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
ఉద్యోగంలోనే కాదు.. ఉద్యోగుల ఎంపికలోనూ ఏఐ - ఎలా అంటే?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతున్న తరుణంలో చాలా కంపెనీలు ఈ టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఏఐను ఉద్యోగాలలో ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఉద్యోగులను ఎంపిక చేసే విషయంలో కూడా వినియోగించుకోవడం మొదలుపెట్టారు.సాధారణంగా ఏదైనా సంస్థలో ఉద్యోగం కావాలంటే రెస్యూమ్స్ పంపిస్తారు. వీటిని ఆ కంపెనీ రిక్రూట్మెంట్ పరిశీలించి, అర్హత ఉన్నవారిని ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఆ తరువాత ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఇది అసలైన ప్రక్రియ. కానీ ఏఐ వాడకంలోకి వచ్చిన తరువాత ఇంటర్వ్యూల విషయంలో కూడా టెక్నాలజీని వాడేస్తున్నారు.GenAI బాట్లు మేనేజర్లకు ఇంటర్వ్యూలు నిర్వహించడంలో సహాయపడుతున్నాయి. సరైన క్వాలిఫికేషన్స్ ఉన్న వారిని ఎంపిక చేయడంలో ఏఐ చాలా అద్భుతంగా ఉపయోగపడుతోంది హెచ్ఆర్ అధికారులు చెబుతున్నారు. దీంతో ఉద్యోగుల ఎంపిక కూడా చాలా వేగంగా జరుగుతుందని పేర్కొంటున్నారు.కొత్త నియామకాలలో దాదాపు 40 శాతం అభ్యర్థులను ఏఐ ద్వారానే ఎంచుకున్నట్లు, దీంతో ఇంటర్వ్యూలు చాలా వేగంగా జరుగుతున్నాయని జెన్ఫ్యాక్ట్ గ్లోబల్ హైరింగ్ లీడర్ రీతు భాటియా పేర్కొన్నారు. ఒకేసారి నియమాలకు చేపట్టడానికి 63 రోజులు పట్టేది, అయితే ఏఐ సాయం వల్ల ఇది 43 రోజుల్లోనే ముగిసిందని కూడా భాటియా పేర్కొన్నారు.రిక్రూట్మెంట్ సర్వీసెస్ ప్రొవైడర్ పీపుల్ఫై చీఫ్ ఎగ్జిక్యూటివ్ 'రాజేష్ భారతీయ' ప్రకారం.. జెన్ఏఐ ఉద్యోగులను ఇంటర్వ్యూలు చేసే సమయంలో చాలా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మాన్యువల్గా రెస్యూమ్ పరిశీలన చేపడితే ఎక్కువ సమయం పడుతుంది. ఆ పనిని ఏఐ చాలా వేగంగా చేస్తుంది. తద్వారా ఇంటర్వ్యూ చాలా వేగంగా ముగుస్తుందని పేర్కొన్నారు.
శెభాష్ శ్రేయస్.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతడే
ఐపీఎల్-2024 ఛాంపియన్స్గా కోల్కతా నైట్రైడర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం చెన్నై వేదికగా జరిగిన ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్ను 8 వికెట్ల తేడాతో ఓడించిన కేకేఆర్.. మూడో సారి ట్రోఫీని ముద్దాడింది. కేకేఆర్ మూడో సారి టైటిల్ సాధించడంలో ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ది కీలక పాత్ర. అయ్యర్ వ్యక్తిగత ప్రదర్శన పరంగా పర్వాలేదన్పంచటప్పటకి.. సారథిగా మాత్రం జట్టును అద్భుతంగా నడిపించాడు. అయ్యర్ కెప్టెన్సీ 100కు 100 మార్కులు పడాల్సిందే. తన వ్యూహాలతో ప్రత్యర్ధి జట్లను అయ్యర్ చిత్తు చేశాడు. ఈ ఏడాది సీజన్లో కేకేఆర్ కేవలం మూడు మ్యాచ్ల్లో మాత్రం ఓడిపోయిందంటే అయ్యర్ కెప్టెన్సీ ఏ విధంగా ఉందో ఆర్ధం చేసుకోవచ్చు. ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు అయ్యర్కు ఏది కలిసిరాలేదు. బీసీసీఐ ఆదేశాలను దిక్కరించడంతో జట్టులో చోటుతో పాటు వార్షిక కాంట్రాక్ట్ ను కూడా కోల్పోయాడు. అయితే పడిలేచిన కేరటంలా తన కెప్టెన్సీ మార్క్ను చూపించాడు. జట్టును విజయ పథంలో నడిపిస్తూ ఏకంగా టైటిల్ను అందించాడు. ఈ ఏడాది సీజన్లో శ్రేయస్ 14 ఇన్నింగ్స్ల్లో 351 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అయ్యర్పై భారత మాజీ బ్యాటర్ రాబిన్ ఉతప్ప ప్రశంసల వర్షం కురిపించాడు. శ్రేయస్ను కెప్టెన్గా చాలా మంది తక్కువగా అంచనా వేశారని ఉతప్ప అభిప్రాయపడ్డాడు. "శ్రేయస్ అయ్యర్కు అద్బుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అతడు భవిష్యత్తులో కచ్చితంగా భారత జట్టు కెప్టెన్ అవుతాడు. నా వరకు అయితే ఫ్యూచర్ కెప్టెన్సీ రేసులో శుబ్మన్ గిల్ కంటే అయ్యరే ముందుంటాడు. అతడు జట్టును నడిపించే విధానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అతడు ఈ ఏడాది సీజన్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాడు. అయ్యర్.. గౌతమ్ గంభీర్, చంద్రకాంత్ పండిట్, అభిషేక్ నాయర్ దిగ్గజాలతో కలిసి పనిచేశాడు. కాబట్టి ఆ అనుభవం శ్రేయస్కు కచ్చితంగా కలిసిస్తోంది. ఈ ఏడాది సీజన్కు ముందు అయ్యర్ పరిస్ధితి అంతగా బాగోలేదు. ఫిట్నెస్ లోపించడంతో జట్టులో చోటు కూడా కోల్పోయాడు. వెన్ను నొప్పితో బాధపడుతూనే అయ్యర్ ఆడుతున్నాడు. ముఖ్యంగా సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోవడం, వరల్డ్కప్ చోటు దక్కకపోవడం అయ్యర్ను మానసికంగా దెబ్బతీశాయి. అయినప్పటకి అయ్యర్ తన బాధను దిగమింగుకుని కేకేఆర్ను ఛాంపియన్స్గా నిలిపాడని" జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉతప్ప పేర్కొన్నాడు.
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు యువతి దుర్మరణం
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ యువతి మృతిచెందింది. ఈ ఘటన న్యూయార్క్ నగరంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మృతురాలిని యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట సమీపంలోని యాదగిరిపల్లెకు చెందిన గుంటిపల్లి సౌమ్యగా(25) గుర్తించారు.గుంటిపల్లి సౌమ్య ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. అక్కడ అట్లాంటిక్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతోంది. చదువుతోపాటు పార్ట్టైమ్ జాబ్ కూడా చేస్తోంది. ఈ క్రంమలో ఆదివారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అతివేగంగా వచ్చిన కారు ఆమెను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సౌమ్య మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో యాదగిరిపల్లి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
అమ్మ బతికుండగా పట్టించుకోలేదు.. కానీ: జాన్వీ కపూర్
దేవర భామ, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావుకు జంటగా కనిపించనుంది. క్రికెట్ నేపథ్యంలో అపూర్వ మోహతా, కరణ్జోహార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. మే 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జాన్వీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన తల్లి మరణం తర్వాత నా లైఫ్ స్టైల్లో చాలా మార్పులు వచ్చాయని వెల్లడించారు. అంతే కాకుండా తిరుమలకు తరచుగా వెళ్లడానికి గల కారణాన్ని వివరించారు.జాన్వీ కపూర్ మాట్లాడుతూ..'అమ్మకు దైవ భక్తి ఎక్కువ. కొన్ని విషయాలను బాగా నమ్మేది. స్పెషల్ డేస్లో కొన్ని పనులు చేయనిచ్చేది కాదు. శుక్రవారం జుట్టు కత్తిరించుకోకూడదని అని చెప్పేది. అలా చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదని చెప్పేది. అంతే కాదు ఆ రోజు నల్ల దుస్తులు వేసుకోవద్దనేది. కానీ అమ్మ బతికి ఉండగా ఇలాంటివన్నీ నేను పట్టించుకోలేదు. మూఢనమ్మకాలు అని లైట్ తీసుకున్నా. కానీ అమ్మ దూరమయ్యాక నమ్మడం మొదలుపెట్టా. ఇప్పుడు నేనే నేనే ఎక్కువగా విశ్వసిస్తున్నానని' తెలిపింది.జాన్వీ కపూర్ తిరుమలరు వెల్లడంపై మాట్లాడుతూ..' అమ్మ తిరుమల దేవుడి పేరును ఎక్కువగా తలచేది . షూటింగ్ గ్యాప్లో కూడా నారాయణ, నారాయణ అనుకుంటూ ఉండేది. ప్రతి ఏటా పుట్టినరోజు స్వామి వారిని దర్శించుకునేది. అమ్మ చనిపోయిన తర్వాత తన పుట్టినరోజుకి నేను తిరుమల సన్నిధికి వెళ్లాలని నిర్ణయించుకున్నా. అమ్మ లేకుండా మొదటిసారి తిరుమల వెళ్లినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యా. కానీ తిరుమలకు వెళ్లిన ప్రతిసారి ఏదో మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందుకే తరచుగా వెళ్తుంటానని' చెప్పుకొచ్చింది. కాగా.. మరోవైపు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో కనిపించనుంది.
May 27th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 26th AP Elections 2024 News Political Updates..5:36 PM, May 27th, 2024పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్పై తీర్పు రిజర్వ్రేపటికి తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టుతనపై నమోదైన కేసుల్లో బెయిల్ ఇవ్వాలంటూ పిన్నెల్లి పిటిషన్ 4:00 PM, May 27th, 2024చెప్పేదేమో శుద్ధ పూస మాటలు చేసేవన్నీ తప్పుడు పనులు..!.@JaiTDP చెప్పేదేమో శుద్ధ పూస మాటలు చేసేవన్నీ తప్పుడు పనులు..!ఓటమి భయంతో పోలింగ్ జరిగిన మరుసటి రోజు కారంపూడిలో గుంపులు గుంపులుగా రోడ్ల మీదకు వచ్చి వైయస్ఆర్ సీపీ కార్యకర్తల షాపులను ధ్వంసం చేసి తగలబెట్టింది మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాదా?#TDPLosing#TDPGoons pic.twitter.com/nFbNNxxvt7— YSR Congress Party (@YSRCParty) May 27, 2024 3:30 PM, May 27th, 2024విచారణకు రఘురాజు గైర్హాజరు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీ రఘురాజును విచారణకు పిలిచిన మండలి ఛైర్మన్ మోషేన్ రాజుఅనర్హత వేటు పిటిషన్ విచారణకు ఎమ్మెల్సీ ఇందుకురి రఘురాజు గైర్హాజరు.ఈ నెల 31వ తేదీకి విచారణ వాయిదా.వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి రఘురాజు పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. 3:00 PM, May 27th, 2024ఓట్ల లెక్కింపు కార్యక్రమంపై అధికారులతో సీఈసీ రాజీవ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమంపై అధికారులతో సీఈసీ రాజీవ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్.సీఈసీ మార్గదర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను త్వరగా ప్రకటించేలా చర్యలు చేపట్టాలని దిశా నిర్దేశంసీఈసీతో పాటు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఈసీలు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్ బీర్ సింగ్, ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా.2:00 PM, May 27th, 2024పోస్టల్ బ్యాలెట్లు కృష్ణా యూనివర్సిటీ తరలింపు..కృష్ణా జిల్లా..మచిలీపట్నం పార్లమెంట్ సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లను కలెక్టరేట్ నుండి కృష్ణా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్కి తరలింపురాజకీయ పార్టీల సభ్యుల సమక్షంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్కి పోస్టల్ బ్యాలెట్లు తరలించిన అధికారులు 1:30 PM, May 27th, 2024ఈసీకి పేర్ని నాని ప్రశ్నలు..ఎన్నికల సంఘానికి ప్రశ్నలు సంధించిన పేర్ని నాని.పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తే 13వ తేదీనే ఎందుకు కేసు నమోదు చేయలేదు?పోలింగ్ ఆగినట్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగ్ బుక్లో ఎందుకు లేదు?డీజీపీకి సిట్ ఇచ్చిన నివేదికలో కూడా పిన్నెల్లి ప్రస్తావన లేదు? ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది.-మాజీ మంత్రి పేర్ని నాని#TDPLosing… pic.twitter.com/VS0ESyDEMz— YSR Congress Party (@YSRCParty) May 26, 2024 11:20 AM, May 27th, 2024పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్లపై నేడు విచారణ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్లపై హైకోర్టులో నేడు కొనసాగనున్న విచారణపిన్నెల్లిపై అక్రమంగా మూడు కేసులు నమోదుపచ్చ బ్యాచ్ సూచనల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు. 11:00 AM, May 27th, 2024దాడులపై చోద్యం చూస్తున్న ఈసీ..టీడీపీ దాడులపై ఇంకా చోద్యం చూస్తున్న ఎన్నికల సంఘం. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పచ్చ మూకల అరాచకాలు. ఈసీ, పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ శ్రేణుల దారుణాలు. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసిన టీడీపీ అనుకూల పోలీసులు. పోలింగ్, ఆ తర్వాత మాచర్లలో పచ్చ మూకల అరాచకాలు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి హత్యకు కుట్ర పన్నిన పచ్చ మూకలు. దాడులకు పరోక్షంగా వత్తాసు పలికిన పోలీసులు. 10:30 AM, May 27th, 2024ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అనర్హతపై నేడు విచారణఇందుకూరి రఘురాజు అనర్హతపై నేడు విచారణపార్టీ ఫిరాయించిన రాఘురాజు వ్యక్తిగత విచారణను రావాలని ఆదేశం.విచారణ అనంతరం అనర్హతపై నిర్ణయం తీసుకోనున్న మండలి చైర్మన్నేడు 11 గంటలకు విచారించనున్న మండలి చైర్మన్ మోషేన్ రాజు.వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి పార్టీ ఫిరాయించిన రఘురాజు. 9:30 AM, May 27th, 2024ఎన్నికల దృష్ట్యా పోలీసుల కార్డన్ సెర్చ్..ఎన్టీఆర్ జిల్లా:గంపలగూడెం మండలం సొబ్బాల గ్రామంలో తిరువూరు సీఐ అబ్దుల్ నబీ ఆధ్వర్యంలో పోలీసుల కార్డన్ సెర్చ్..ఎన్నికల ఫలితాల భద్రతా దృష్యా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు..రికార్డులు లేని 11 వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలింపు.. 8:50 AM, May 27th, 2024బరితెగించిన పచ్చ గూండాలు..ఎన్నికల్లో ఓటమి భయంతో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్కారంపూడిలో బరితెగించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలుపోలింగ్ జరిగిన మరుసటి రోజే వైఎస్సార్సీపీకి చెందిన కార్యకర్తలను టార్గెట్ చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల షాపులను ధ్వంసం చేసి తగలపెట్టారు. ఓటమి భయంతో కారంపూడిలో బరితెగించిన @JaiTDP నాయకులుపోలింగ్ జరిగిన మరుసటి రోజున వైయస్ఆర్ సీపీకి చెందిన కార్యకర్తల షాపులను ధ్వంసం చేసి తగలపెట్టిన టీడీపీ గుండాలు.#TDPLosing#TDPGoons pic.twitter.com/BzBkJBOkT1— YSR Congress Party (@YSRCParty) May 26, 2024 7:45 AM, May 27th, 2024పిన్నెళ్లిపై పోలీసుల అక్రమ కేసులు..తాడేపల్లి..మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిపై వరుస కేసులుఎమ్మెల్యే అరెస్టే లక్ష్యంగా అక్రమ కేసులు పెడుతున్న పోలీసులుటీడీపీకి అనుబంధ సంఘాలుగా మారిన ఈసీ, పోలీసు శాఖఈవీఎం కేసులో బెయిల్ రాగానే వెంటనే మరో మూడు హత్యాయత్నం కేసులు పెట్టిన పోలీసులుసీఐ నారాయణస్వామి చౌదరి ఆధ్వర్యంలోనే కుట్ర జరుగుతోందన్న వైఎస్సార్సీపీఏదోలా ఎమ్మెల్యే పిన్నెళ్లిని అరెస్టు చేసి హతమార్చేందుకే కుట్రలంటున్న వైఎస్సార్సీపీ నేతలు 7:00 AM, May 27th, 2024ఓటు తెచ్చిన చేటు..కౌలురైతులపై ‘మంగళగిరి’లో ఓ సామాజికవర్గం దుర్మార్గంసాగు కోసం పొలాల వద్దకు రావొద్దని హెచ్చరికలుఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు టీడీపీకి చెందిన ఆ వర్గీయుల అల్టిమేటందశాబ్దాలుగా కౌలుకు చేస్తున్న పేదలపై బరితెగింపువ్యవసాయ సీజన్ ఆరంభంలో ఒక్కసారిగా రోడ్డునపడ్డ కౌలుదారులునారా లోకేశ్కు ఓట్లు వేయకపోవడమే వారు చేసిన నేరంఆ సామాజికవర్గానికి చెందిన సంస్థల్లో పనిచేసే వారికీ ఇదే అనుభవంనీ పేరు లోకేశ్ రెడ్బుక్లోకి ఎక్కిందంటూ బెదిరింపులు‘ఫ్యాను’కు ఓటేసినందుకే అంటూ లబోదిబోమంటున్న బాధితులుఇల్లు కట్టుకుంటున్నా ఓర్వలేకపోతున్నారని.. మాకిష్టమైన వారికి ఓటు వేసుకునే స్వేచ్ఛ కూడా లేదా అని ఆవేదనఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులు వస్తున్నాయని కూడా ఏడుపు 6:50 AM, May 27th, 2024సీల్ లేదని పోస్టల్ బ్యాలెట్ తిరస్కరించొద్దుడిక్లరేషన్పై అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, పేరు, హోదా ఉంటే ఆమోదించండి అనుమానం వస్తే పోస్టల్ ఫెసిలిటేషన్ సెంటర్లోని కౌంటర్ ఫాయిల్తో సరిచూడండిడిక్లరేషన్పై ఓటరు, అటెస్టింగ్ ఆఫీసర్ సంతకాలు లేకపోయినా తిరస్కరించండి డిక్లరేషన్ ఫారం విడిగా కవర్–బీలో లేకపోతే ఓపెన్ చేయకుండానే తిరస్కరించొచ్చు బ్యాలెట్ పేపర్ నెంబరు డిక్లరేషన్పైన ఒకలాగా, ఫారం–13బీ పైన మరొకటి వుంటే తిరస్కరించాలి.. బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేసిన తర్వాత ఒకరి కంటే ఎక్కువమందికి సంతకాలు చేసినా తిరస్కరించొచ్చు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు 6:40 AM, May 27th, 2024‘పిన్నెల్లి’కి మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వండిఈవీఎంల కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వగానే హత్యాయత్నం కేసులు పెట్టారు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా నిరోధించేందుకే ఈ తప్పుడు కేసులు ఎన్నికల సంఘం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది.. పరిధి దాటి పనిచేస్తోంది ఆయన్ను అరెస్టు చేసి తీరాలన్న లక్ష్యంతోనే ఇలా చేస్తోంది ఘటనలు జరిగిన పది రోజుల తర్వాత నిందితుడిగా చేర్చారు అంత జాప్యం ఎందుకు జరిగిందో పోలీసులు చెప్పడం లేదు ఈవీఎంల కేసులో కల్పించిన రక్షణే ఈ కేసుల్లో కూడా కల్పించండి హైకోర్టుకు నివేదించిన సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి మరోవైపు.. టీడీపీ నేత అస్మిత్పై హత్యాయత్నం కేసున్నా బెయిల్ను వ్యతిరేకించని పోలీసులు 6:30 AM, May 27th, 2024తాపీగా తప్పుడు కేసులుపిన్నెల్లికి బెయిల్ రావడంతో మరో మూడు అక్రమ కేసులు.. కారంపూడిలో సీఐ తలకు గాయమైతే వారానికిపైగా ఏం చేస్తున్నట్లు? నరసరావుపేటలో ఇంట్లో బాంబులు దాచిన టీడీపీ నేత అరవిందబాబును వదిలేసి గోపిరెడ్డిపై కేసులా?టీడీపీ గూండాలకు చట్టం చుట్టమా?
'జయ జయహే తెలంగాణ'.. కీరవాణి వద్దు!
తెలంగాణ రాష్ట్ర గీతంగా 'జయ జయహే తెలంగాణ'ని ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ పాటని స్వరపరిచే బాధ్యతల్ని టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణికి తాజాగా అప్పగించారు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రిని కీరవాణి కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా కొన్ని బయటకొచ్చాయి. కానీ ఇప్పుడు ఈ పాట విషయంలో లేనిపోని కాంట్రవర్సీలు చోటుచేసుకుంటున్నాయి.తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ తాజాగా ఓ లేఖ విడుదల చేసింది.''జయ జయహే తెలంగాణ' పాటకు కీరవాణిని సంగీతం అందించమని కోరటం చారిత్రక తప్పిదం అవుతుంది. తెలంగాణ అస్తిత్వం మీకు తెలియంది కాదు, మన ఉద్యోగాలు, మన అవకాశాలు మనకే కావాలి అనే నినాదంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. సకల జనుల సహకారంతో ఎంతో మంది అమర వీరుల త్యాగ ఫలంగా ఏర్పడింది మన తెలంగాణ రాష్ట్రం. ఇంతటి ఖ్యాతి గడించిన మన రాష్ట్ర గీతాన్ని పక్క రాష్ట్రాల వాళ్ళు పాడటమేంటి? అలా చేయడం అంటే మన తెలంగాణ కళాకారులని అవమానించడమే అవుతుంది. ఎంతో ప్రతిభావంతులు మన తెలంగాణాలో ఉన్నారు మన తెలంగాణ కళాకారులకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చి తెలంగాణ కళాకారులకి గౌరవాన్ని ఇస్తారని ఆశిస్తున్నాం' అని తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ రెండు మాత్రం స్పెషల్)ఇకపోతే 'జయ జయహే తెలంగాణ' పాటని అన్ని పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యక్రమాలలో ఆలపించే విధంగా రూపొందించాలని ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం ఉంది. అంతలో ఈ పాటను రూపొందించాలని కీరవాణికి సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు వార్తలు వస్తున్నాయి.అయితే తెలుగులో ఎన్నో దశాబ్దాల నుంచి సంగీత దర్శకుడు, గాయకుడిగా పేరు తెచ్చుకున్న కీరవాణి.. 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు' గీతంతో అత్యంత ప్రతిష్ఠాత్మక ఆస్కార్ కూడా అందుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బాధ్యతల్ని కీరవాణికి అప్పగించి ఉంటారు. కానీ ఇప్పుడు వస్తున్న విమర్శల దృష్ట్యా తర్వాత ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ఆమె నా కూతురు కాదంటూ బాంబు పేల్చిన స్టార్ హీరోయిన్)
స్వాతి మలివాల్ ‘ఆప్’ను వీడతారా..?
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)కి రాజీనామా చేసే విషయమై ఆ పార్టీ ఎంపీ స్వాతిమలివాల్ స్పందించారు. తాను ఆప్ను వీడటం లేదని క్లారిటీ ఇచ్చారు. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మలివాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.మే13న సీఎం కేజ్రీవాల్ ఇంట్లో ఆయన అనుచరుడు బిభవ్కుమార్ చేతిలో మలివాల్ దాడికి గురైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమెను బీజేపీ నేతలు తమ పార్టీలోకి ఆహ్వానించారని, ఆమె త్వరలో పార్టీ మారనున్నట్లు ప్రచారం జోరందుకుంది. అయితే ఈ ప్రచారాన్ని ఆమె తాజాగా ఖండించారు. బీజేపీ నేతలు తనతో టచ్లోకి రాలేదని చెప్పారు.తాను ఆప్లోనే కొనసాగుతానని, ఆ పార్టీ ఏ ఒకరిదో ఇద్దరిదో కాదన్నారు. పార్టీ కోసం తన చెమట, రక్తాన్ని ధారపోశానన్నారు. నిజానికి తనపై దాడి తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మాత్రమే తనతో మాట్లాడారని, ఆయన ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తని మలివాల్ చెప్పుకొచ్చారు.
దీన్నే పిచ్చి అంటారండి ! మహిళా టీచర్ క్రేజీ రీల్ వైరల్
సోషల్మీడియాలో పాపులర్ అవ్వడం కోసం, లైక్ల కోసం యూజర్లు చేస్తున్న పనులకు హద్దు లేకుండా పోతోంది. తాజాగా ఒక ఉపాధ్యాయురాలు పేపర్లు దిద్దుతూ కూడా రీల్ చేసింది. దీన్ని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దీనిపై చాలామంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.. కట్ చేస్తే...బిహార్లోని పాటలీ పుత్ర యూనివర్శిటీ (పీపీయూ) చెందిన టీచర్ పరీక్ష పేపర్ కరెక్షన్స్ చేస్తోంది. దీన్ని ఏకంగా ఇన్స్టాగ్రామ్ రీల్ చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఇది వైరల్గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు విచిత్ర విచిత్రమైన ఫన్నీ కామెంట్స్ చేశారు. पीपीयू एग्जाम का कॉपी जांचने का रील्स इंस्टाग्राम पर वायरल, मैडम पर FIR दर्ज। pic.twitter.com/GlnZhH4Yuk— छपरा जिला 🇮🇳 (@ChapraZila) May 26, 2024 హే మేడమ్, కొత్తగా పెళ్లైన పెళ్లికూతురులా కనిపిస్తోంది' అని ఒకరంటే, దీన్నే పిచ్చి అంటారండి అంటూ మరొకరు ఫన్నీగా వ్యాఖ్యానించారు. ఒక టీచర్గా మీరు చేయాల్సిన పని ఇదేనా అంటూచాలామంది మండి పడ్డారు. ఇలాంటివాళ్లు సిగ్గుతో చచ్చిపోవాలి.. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు నమోదైనాయి అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు. చివరికి ఇది ఉన్నతాధికారులదాకా చేరడంతో టీచర్పై ఎఫ్ఐఆర్ నమోదైంది.
తప్పక చదవండి
- హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో శృతి భావోద్వేగ ప్రసంగం: చప్పట్లతో మారుమోగిన క్యాంపస్
- ఇండస్ట్రీలో విషాదం.. నటుడిని కాల్చిచంపిన దుండగులు!
- ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
- యుద్ధ ట్యాంకుల రేసులో భారత్ ఘన విజయం
- గంభీర్ కాదు!.. కేకేఆర్ విజయాల్లో అతడిది కీలక పాత్ర.. ముగ్గురు హీరోలు
- భారత్ నుంచి 40 దేశాలకు మేడ్ ఇన్ ఇండియా కార్లు
- అతనితో రవితేజ హీరోయిన్ పెళ్లి.. ఇప్పుడేమో వేల కోట్లకు!
- పాయింట్ బ్లాంక్లో డీజేపై కాల్పులు
- IPL 2024: ఓ పక్క స్టార్క్.. మరోపక్క అయ్యర్..!
- అదిరిపోయే ఫీచర్లతో.. త్వరలో విడుదల కానున్న మరో రెడ్మీ సిరీస్ ఫోన్
సినిమా
తప్పు చేయకపోవడానికి మేమేం దేవుళ్లం కాదు.. హేమ మరో వీడియో
ఈ మధ్య కాలంలో డ్రగ్స్ కేసు మరోసారి టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నటి హేమ ఇందులో ఉండటంతో అందరూ ఈ విషయమై తెగ మాట్లాడుకున్నారు. అయితే బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విచారణకి హాజరు కావాలని హేమకు పోలీసులు నోటీసులు పంపించారు. సోమవారమే దీనికి హాజరు కావాల్సి ఉండగా, తాను జ్వరంతో బాధపడుతున్నానని చెప్పి డుమ్మా కొట్టింది. మరోవైపు ఈమెకు సంబంధించిన లేటెస్ట్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ రెండు మాత్రం స్పెషల్)వీడియోలో ఏముందంటే?'మనమేం దేవుళ్లం కాదు. ఒకవేళ తప్పు చేసినా, పొరపాటు జరిగినా సారీ చెప్పొచ్చు. అప్పుడు మనం చాలా ఫ్రెష్గా ఉంటాం. అలానే అబద్దం చెబితే దాన్ని కవర్ చేయడానికి 100 అబద్దాలు ఆడాలి. అందుకని 99.9 శాతం అబద్దాలు ఆడకుండా ఉంటే బెటర్. అందుకని నేను చాలా హ్యాపీగా ఉన్నానని' హేమ చెబుతున్న వీడియో ఒకటి వైరల్గా మారింది. ఇదంతా కూడా డ్రగ్స్ కేసు గురించేనని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.కేసు సంగతేంటి?మే 19న బెంగళూరులోని ఓ ఫామ్ హౌసులో రేవ్ పార్టీ నిర్వహించారు. పోలీసులు రైడ్ చేసి దాదాపు 103 మంది బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. వీళ్లలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు రిపోర్ట్స్లో తేలింది. ఇందులో నటి హేమ కూడా ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఈ క్రమంలోనే పోలీసులు నోటీసులు జారీ చేయగా, తాను రాలేకపోతున్నానని మరికొంత సమయం కావాలని లేఖ రాసింది. కానీ దీన్ని పోలీసులు పరిగణలోకి తీసుకోకుండా మరోసారి నోటీసులు జారీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆరేళ్ల తర్వాత తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)
శ్రీదేవికి ఇష్టమైన ఆలయంలో జాన్వీ కపూర్.. ఫోటోలు వైరల్!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా పాల్గొన్నారు. ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు సరసన నటిస్తోంది. ఈ సినిమాలో మహిమ అనే పాత్రలో జాన్వీ కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 31న థియేటర్లలో సందడి చేయనుంది.అయితే ప్రమోషన్లతో బిజీగా ఉన్న ఒక్కసారిలో చెన్నైలో వాలిపోయింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కు హాజరై కేకేఆర్కు మద్దతుగా సందడి చేసింది. ప్రస్తుతం చెన్నైలో ఉన్న జాన్వీ కపూర్ ప్రముఖ ముప్పాతమ్మన్ ఆలయాన్ని మొదటిసారి దర్శించుకుంది. శ్రీదేవి సిస్టర్ మహేశ్వరితో కలిసి ఆలయానికి వెళ్లింది. అమ్మ ఎంతగానో ఇష్టపడే ఆలయాన్ని మొదటిసారి సందర్శించానని జాన్వీ కపూర్ తన ఇన్స్టాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. జాన్వీ కపూర్ టాలీవుడ్లో దేవర చిత్రంలో నటిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతోంది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor)
ఓటీటీలోకి ఆరేళ్ల తర్వాత తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
తెలుగు హీరో సందీప్ కిషన్ అప్పుడెప్పుడో చేసిన ఓ హిట్ సినిమా.. దాదాపు ఆరేళ్ల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. దీంతో మూవీ లవర్స్ ఎగ్జైట్ అవుతున్నారు. కొన్నాళ్ల ముందు ఓటీటీ ఫ్లాట్ఫామ్ ఫిక్స్ చేయగా, తాజాగా స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఆ మూవీ ఏంటి? ఏ ఓటీటీలో రాబోతుంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ రెండు మాత్రం స్పెషల్)సందీప్ కిషన్ హీరోగా చేసిన 'మాయావన్' అనే తమిళ థ్రిల్లర్ సినిమా.. 2017లో రిలీజై హిట్ అయింది. దీన్ని 'ప్రాజెక్ట్ Z' పేరుతో తెలుగులో డబ్ చేశారు. కానీ పెద్దగా రీచ్ కాలేకపోయింది. ఆ తర్వాత మాత్రం ఓటీటీలో బాగా రీచ్ వచ్చింది. ప్రస్తుతం హిందీ వెర్షన్ అమెజాన్ ప్రైమ్, తమిళ వెర్షన్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో మాత్రం ఇప్పుడు ఆహా ఓటీటీలోకి రాబోతుంది.ఈ వీకెండ్ అంటే మే 31 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంటే దాదాపు ఆరేళ్ల తర్వాత తెలుగు వెర్షన్ ఓటీటీలోకి వస్తుందనమాట. ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ ఇప్పటికే షూటింగ్ జరుపుకొంటోంది. 'మాయా-వన్' టైటిల్తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఇది థియేటర్లలోకి రావొచ్చు.(ఇదీ చదవండి: ఓటీటీలో రవితేజ సినిమా అరుదైన ఘనత.. తొలిసారి దివ్యాంగుల కోసం)Mystery, suspense, and a gripping thriller! "Project Z" premieres May 31st on @ahavideoIN @sundeepkishan @Itslavanya @bindasbhidu @DanielBalaje @icvkumar @ThirukumaranEnt @GhibranVaibodha @BhavaniHDMovies @bhavanidvd pic.twitter.com/G3s8w9yW2y— ahavideoin (@ahavideoIN) May 27, 2024
విచారణకు రాలేనంటూ లేఖ రాసిన హేమ
బెంగళూరు శివార్లలోని జీఆర్ ఫామ్హౌస్లో ఈ నెల 19న జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు నటి హేమ పేరు బయటకు రావడంతో టాలీవుడ్లో సంచలనంగా మారింది. రేవ్ పార్టీలో పాల్గొన్నవారి రక్త నమూనాలను ల్యాబ్లో పరీక్షించగా 86 మంది డ్రగ్స్ సేవించినట్లు తేలింది. ఈ క్రమంలో హేమ బ్లడ్ షాంపిల్స్లో కూడా డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో హేమ నేడు మే 27న విచారణకు వెళ్లాల్సి ఉంది. అయితే, ఆమె విచారణకు హాజరుకాలేనని లేఖ ద్వారా తెలిపింది.వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు లేఖ ద్వారా పోలీసులకు హేమ తెలిపింది. అయితే ఆ లేఖను సీసీబీ పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, విచారణకు మరికొంత సమయం ఇవ్వాలని హేమ కోరింది. అయితే, నేడు సాయంత్రం హేమకు మరో నోటీసు జారీ చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి.
ఫొటోలు
TG MLC By-Election 2024 Photos: ఎమ్మెల్సీ ఉప ఎన్నిక : పోటెత్తిన పట్టభద్రులు (ఫొటోలు)
Anupama Parameswaran: కవులకందని అందమా..అనుపమా! అదిరిపోయే ఫోటోలు
కెన్వర్త్ సూపర్ట్రక్2 అదిరిపోయే ఫొటోలు
తెలంగాణలో గాలివాన బీభత్సం (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో విశ్వక్ సేన్ (ఫొటోలు)
క్రీడలు
శెభాష్ శ్రేయస్.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతడే
ఐపీఎల్-2024 ఛాంపియన్స్గా కోల్కతా నైట్రైడర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం చెన్నై వేదికగా జరిగిన ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్ను 8 వికెట్ల తేడాతో ఓడించిన కేకేఆర్.. మూడో సారి ట్రోఫీని ముద్దాడింది. కేకేఆర్ మూడో సారి టైటిల్ సాధించడంలో ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ది కీలక పాత్ర. అయ్యర్ వ్యక్తిగత ప్రదర్శన పరంగా పర్వాలేదన్పంచటప్పటకి.. సారథిగా మాత్రం జట్టును అద్భుతంగా నడిపించాడు. అయ్యర్ కెప్టెన్సీ 100కు 100 మార్కులు పడాల్సిందే. తన వ్యూహాలతో ప్రత్యర్ధి జట్లను అయ్యర్ చిత్తు చేశాడు. ఈ ఏడాది సీజన్లో కేకేఆర్ కేవలం మూడు మ్యాచ్ల్లో మాత్రం ఓడిపోయిందంటే అయ్యర్ కెప్టెన్సీ ఏ విధంగా ఉందో ఆర్ధం చేసుకోవచ్చు. ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు అయ్యర్కు ఏది కలిసిరాలేదు. బీసీసీఐ ఆదేశాలను దిక్కరించడంతో జట్టులో చోటుతో పాటు వార్షిక కాంట్రాక్ట్ ను కూడా కోల్పోయాడు. అయితే పడిలేచిన కేరటంలా తన కెప్టెన్సీ మార్క్ను చూపించాడు. జట్టును విజయ పథంలో నడిపిస్తూ ఏకంగా టైటిల్ను అందించాడు. ఈ ఏడాది సీజన్లో శ్రేయస్ 14 ఇన్నింగ్స్ల్లో 351 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అయ్యర్పై భారత మాజీ బ్యాటర్ రాబిన్ ఉతప్ప ప్రశంసల వర్షం కురిపించాడు. శ్రేయస్ను కెప్టెన్గా చాలా మంది తక్కువగా అంచనా వేశారని ఉతప్ప అభిప్రాయపడ్డాడు. "శ్రేయస్ అయ్యర్కు అద్బుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అతడు భవిష్యత్తులో కచ్చితంగా భారత జట్టు కెప్టెన్ అవుతాడు. నా వరకు అయితే ఫ్యూచర్ కెప్టెన్సీ రేసులో శుబ్మన్ గిల్ కంటే అయ్యరే ముందుంటాడు. అతడు జట్టును నడిపించే విధానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అతడు ఈ ఏడాది సీజన్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాడు. అయ్యర్.. గౌతమ్ గంభీర్, చంద్రకాంత్ పండిట్, అభిషేక్ నాయర్ దిగ్గజాలతో కలిసి పనిచేశాడు. కాబట్టి ఆ అనుభవం శ్రేయస్కు కచ్చితంగా కలిసిస్తోంది. ఈ ఏడాది సీజన్కు ముందు అయ్యర్ పరిస్ధితి అంతగా బాగోలేదు. ఫిట్నెస్ లోపించడంతో జట్టులో చోటు కూడా కోల్పోయాడు. వెన్ను నొప్పితో బాధపడుతూనే అయ్యర్ ఆడుతున్నాడు. ముఖ్యంగా సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోవడం, వరల్డ్కప్ చోటు దక్కకపోవడం అయ్యర్ను మానసికంగా దెబ్బతీశాయి. అయినప్పటకి అయ్యర్ తన బాధను దిగమింగుకుని కేకేఆర్ను ఛాంపియన్స్గా నిలిపాడని" జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉతప్ప పేర్కొన్నాడు.
SRH: ‘హృదయం ముక్కలైంది.. బాధ పడొద్దు మామయ్యా’! ఫొటో వైరల్
ఐపీఎల్-2024 సీజన్ ఆసాంతం విధ్వంసకర బ్యాటింగ్తో దుమ్ములేపిన సన్రైజర్స్ హైదరాబాద్.. అసలు సమయం వచ్చేసరికి చేతులెత్తేసింది. ఏదైతే తమ బలం అనుకుందో అదే బలహీనతగా మారిన వేళ ప్రత్యర్థి ముందు తలవంచింది.ముఖ్యంగా బ్యాటింగ్ లైనప్లో పెట్టనికోటగా ఉన్న ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అనూహ్య రీతిలో పూర్తిగా విఫలం కావడంతో 113 పరుగులకే కుప్పకూలింది. కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్ల దెబ్బకు అభిషేక్ శర్మ ఐదు బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులకే నిష్క్రమించగా.. పరుగుల విధ్వంసానికి మారుపేరుగా నిలిచిన హెడ్ మరీ ఘోరంగా డకౌట్ అయ్యాడు.వీరితో పాటు వన్డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి(13 బంతుల్లో 9) కూడా త్వరగానే పెవిలియన్ చేరగా.. మిగతా వాళ్లలో ఐడెన్ మార్క్రమ్(20), హెన్రిచ్ క్లాసెన్(17 బంతుల్లో 16), కెప్టెన్ ప్యాట్ కమిన్స్(19 బంతుల్లో 24) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు.ఈ క్రమంలో ఐపీఎల్ ఫైనల్లోనే అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా చెత్త రికార్డు తన పేరిట లిఖించుకుంది సన్రైజర్స్. ఈ సీజన్లో ఏకంగా 287 పరుగులతో లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా ప్రశంసలు అందుకున్న కమిన్స్ బృందం.. ఫైనల్లో ఇలా తేలిపోయింది. దీంతో ఆరెంజ్ ఆర్మీ హృదయం ముక్కలైంది.ఇక ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న కేకేఆర్ సన్రైజర్స్ను ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి చాంపియన్గా నిలిచింది. ఏకపక్ష విజయంతో ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది.ఈ నేపథ్యంలో కేకేఆర్ శిబిరంలో సంతోషాలు వెల్లివిరియగా.. సన్రైజర్స్ క్యాంపు నిరాశలో కూరుకుపోయింది. జట్టు యజమాని కావ్యా మారన్ ఓటమిని జీర్ణించుకోలేక కన్నీళ్లు పెట్టుకోగా.. ఆటగాళ్లు కూడా ఇంచుమించు ఇదే స్థితికి చేరుకున్నారు.ఇక ఈ సీజన్లోనే అత్యధిక సిక్సర్లు(42) బాదిన సన్రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ సమయంలో అభిషేక్ చిన్నారి మేనకోడలు అమైరా చేసిన పని నెటిజన్ల మనసు దోచుకుంది.‘‘ఏం కాదులే మామయ్య’’ అన్నట్లుగా అభిషేక్ను హత్తుకున్న అమైరా అతడిని ఓదార్చింది. తర్వాత ఇద్దరూ కలిసి కాసేపు ముచ్చటించుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను అభిషేక్ రెండో అక్క కోమల్ శర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు.కాగా పంజాబ్కు చెందిన అభిషేక్ శర్మ తండ్రి రాజ్కుమార్ శర్మ కూడా క్రికెటర్. దేశవాళీ క్రికెట్ ఆడిన ఆయన తన కుమారుడికి మొదటి కోచ్. ఇక అభిషేక్ తల్లి పేరు మంజు శర్మ. అభిషేక్కు ఇద్దరు అక్కలు సానియా, కోమల్ ఉన్నారు. పెద్దక్క సానియా శర్మ కూతురే ఈ అమైరా!Tough day, Never give up 😔Win or lose part of the game!Chin up guys, you fought hard. ♥️ #KKRvsSRHFinal #IPLFinal #IPL2024 pic.twitter.com/ar96np1klB— Dr. Komal Sharma (@KomalSharma_20) May 26, 2024Such a sweet moment heartwarming hug Amayra encouraging his uncle. 🫂So proud of you bhaiya ❤️🥹#KKRvsSRH #IPL2024 pic.twitter.com/DlE62WtaZu— Dr. Komal Sharma (@KomalSharma_20) May 26, 2024
T20 WC 2024: న్యూయార్క్ చేరుకున్న టీమిండియా.. వీడియో
ఐపీఎల్-2024 సీజన్కు తెరపడిన వారం రోజుల వ్యవధిలోపే మరో టీ20 ప్రపంచకప్-2024 రూపంలో మరో మహా సంగ్రామానికి తెరలేవనుంది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్ జూన్ 1 మొదలుకానుంది.ఈ ఐసీసీ టోర్నీలో ఈసారి ఏకంగా 20 జట్లు పాల్గొనబోతున్నాయి. ఇదిలా ఉంటే.. వరల్డ్కప్నకు సిద్ధమయ్యే క్రమంలో ఇప్పటికే అమెరికాకు బయల్దేరిన టీమిండియా సోమవారం న్యూయార్క్లో ల్యాండ్ అయింది.కాగా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, శుబ్మన్ గిల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్ తదితరులు ఆదివారమే విమానం ఎక్కేసిన విషయం తెలిసిందే.ముంబైలో నుంచి వీళ్లంతా అమెరికాకు బయల్దేరగా అక్కడి సిబ్బంది కేక్ కట్ చేసి ఆటగాళ్లకు ఆల్ ది బెస్ట్ చెబుతూ సెండాఫ్ ఇచ్చారు. ఈ క్రమంలో సోమవారం టీమిండియా న్యూయార్క్లో అడుగుపెట్టినట్లు తెలుపుతూ బీసీసీఐ ఓ వీడియో విడుదల చేసింది.కాగా మిగిలిన ఆటగాళ్లలో స్టార్లు విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, యజువేంద్ర చహల్, రింకూ సింగ్ తదితరులు రెండో బ్యాచ్లో అమెరికాకు పయనం కానున్నట్లు సమాచారం.ఇక జూన్ 5న ఐర్లాండ్తో మ్యాచ్ సందర్భంగా భారత జట్టు తమ వరల్డ్కప్ ప్రయాణం మొదలుపెట్టనుంది. అంతకు ముందు బంగ్లాదేశ్తో జూన్ 1 వార్మప్ మ్యాచ్ ఆడనుంది. టీ20 ప్రపంచకప్-2024కు భారత జట్టు:రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.రిజర్వ్: శుబ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.✈️ Touchdown New York! 🇺🇸👋#TeamIndia 🇮🇳 have arrived for the #T20WorldCup 😎 pic.twitter.com/3aBla48S6T— BCCI (@BCCI) May 27, 2024
IPL 2024: ఓ పక్క స్టార్క్.. మరోపక్క అయ్యర్..!
ఐపీఎల్ 2024 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ ఛాంపియన్గా అవతరించింది. నిన్న జరిగిన ఫైనల్లో ఈ జట్టు సన్రైజర్స్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, మూడో ఐపీఎల్ టైటిల్ను సొంతం చేసుకుంది. అంతిమ సమరంలో మిచెల్ స్టార్క్ (3-0-14-2), వెంకటేశ్ అయ్యర్ (26 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆరెంజ్ ఆర్మీని చెడుగుడు ఆడుకున్నారు. వీరికి రసెల్ (2.3-0-19-3), హర్షిత్ రాణా (4-1-24-2), సునీల్ నరైన్ (4-0-16-1), వరుణ్ చక్రవర్తి (2-0-9-1), రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా తోడవ్వడంతో కేకేఆర్ సునాయాస విజయం సాధించింది.క్వాలిఫయర్ మ్యాచ్లోనూ వీరిద్దరే.. నిన్నటి ఫైనల్లో సన్రైజర్స్ను డామేజ్ చేసిన స్టార్క్, వెంకటేశ్ అయ్యర్లు ఇదే సన్రైజర్స్ను క్వాలిఫయర్-1లోనూ ముప్పుతిప్పలు పెట్టారు. నాటి మ్యాచ్లోనూ స్టార్క్ అద్భుతమైన గణాంకాలు (4-0-34-3) నమోదు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు ఎంపిక కాగా.. వెంకటేశ్ అయ్యర్ సైతం ఫైనల్లోలానే మెరుపు ఇన్నింగ్స్తో (28 బంతుల్లో 51 నాటౌట్) విరుచుకుపడ్డాడు. ఈ ఇద్దరు పోటీపడి మరీ సన్రైజర్స్పై దండయాత్ర చేసి వారికి టైటిల్ దక్కకుండా చేశారు.సీజన్ ఆరంభ మ్యాచ్ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన స్టార్క్ కీలకమైన ప్లే ఆఫ్స్లో ఫామ్లోని వచ్చి కేకేఆర్ పాలిట గెలుపు గుర్రంగా మారగా.. వెంకటేశ్ అయ్యర్ సీజన్ స్టార్టింగ్ నుంచి ఓ మోస్తరు ప్రదర్శనలతో అలరించాడు. ప్లే ఆఫ్స్లో తిరుగులేని అయ్యర్.. నిన్నటి ఫైనల్తో వెంకటేశ్ అయ్యర్ ప్లే ఆఫ్స్ హీరో అని మరోసారి నిరూపించుకున్నాడు. అయ్యర్కు ప్లే ఆఫ్స్లో ఇది వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ (55, 50, 51*, 52*). ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఘనత మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనాకు దక్కుతుంది. రైనా ప్లే ఆఫ్స్లో ఏడు 50కి పైగా స్కోర్లు సాధించాడు.ఫైనల్స్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మిచెల్ స్టార్క్ ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో కమిన్స్ (24) టాప్ స్కోరర్గా నిలువగా.. మెరుపు వీరులు అభిషేక్ శర్మ (2), ట్రివిస్ హెడ్ (0) దారుణంగా విఫలమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ అజేయమైన మెరుపు అర్దశతకంతో విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్ ఆడగా.. భీకర ఫామ్లో ఉన్న సునీల్ నరైన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ అహ్మద్లకు తలో వికెట్ దక్కింది.
బిజినెస్
‘మీ జీవితం ఎలా ఉందో చూసుకోండి’.. సీఈఓ గుప్తా ఆసక్తికర వ్యాఖ్యలు
మీ జీవితం ఎలా ఉందో మీరే చూసుకోవాలి. పక్కవారి జీవితాల్లో తొంగి చూడడం ఎందుకు? అంటూ ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధికా గుప్తా నేటి తరం యువత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.గత దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ కాలంగా భారత్తో పాటు, ఇతర దేశాల్లో నివసించే వారిలో మానసిక ఆరోగ్యం ఓ కీలక సమస్యగా మారింది. అనేక కారణాల వల్ల డిప్రెషన్, యాంగ్జయిటీ డిజార్డర్స్ వంటి విభిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా యువతీ యువకులు పక్క వారి జీవితంపై దృష్టిపెట్టడమే అందుకు కారణం. ఎందుకంటే వారి జీవితం ఎలా ఉందో పట్టించుకోవడలేదు. కానీ ఇన్ స్ట్రాగ్రామ్లో ఇతరుల జీవితాలు వారికి మెరుగ్గా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. మీకు మీరు ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా భావించడం లేదు. పైగా ఇన్స్టాగ్రామ్లో ఇతరుల జీవితాలు తమకన్నా బాగున్నాయని వారు అభిప్రాయ పడుతున్నారు. కాబట్టే తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారంటూ ఎక్స్ వేదికా ట్వీట్ చేశారు. ప్రస్తుతం, ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధికా గుప్తా ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.
అనంత్-రాధిక ప్రీవెడ్డింగ్ ప్లాన్.. ఈసారి ఏకంగా సముద్రంలో సెలబ్రేషన్స్!
ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ జూలై 12న రాధికా మర్చంట్ను పెళ్లి చేసుకోనున్నారు. ఇప్పటికే ఓ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ పూర్తి చేసుకున్న ఈ జంట.. మరో ప్రీ వెడ్డింగ్ కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. ఇది మే 29న ప్రారంభమై జూన్ 1న ముగియనుంది.మొదటి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జామ్నగర్లో జరిగాయి. రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు క్రూయిజ్ షిప్లో జరగనున్నాయి. ఈ వేడుకకు అలియా భట్, రణబీర్ కపూర్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, అయాన్ ముఖర్జీ మొదలైన బాలీవుడ్ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు హాజరుకానున్నారు. ఈ వేడుకలకు సెలబ్రెటీలు ఇప్పటికే ముంబై నుంచి బయలుదేరారు.మే 29న ప్రారంభమై జూన్ 1న ముగియనున్న ఈ వేడుకలు ఎలా సాగనున్నాయి, డ్రెస్ ఎలా ఉంటుందనే వివరాలతో పాటు సెకండ్ ప్రీ వెడ్డింగ్ ఇన్విటేషన్ షెడ్యూల్ కూడా లీక్ అయ్యింది. ఈ ప్రయాణం ఇటలీ నుంచి దక్షిణ ఫ్రాన్స్కు సుమారు 4,380 కిలోమీటర్లు సాగుతుందని సమాచారం. ఈ వేడుకలకు దాదాపు 800 మంది అతిథులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.మే 29, బుధవారం: వెల్కమ్ లంచ్తో వేడుక ప్రారంభం కానుంది. డ్రెస్ కోడ్ క్లాసిక్ క్రూయిజ్. ఆ తరువాత 'స్టార్రీ నైట్' థీమ్ ఈవెంట్ జరుగుతుంది. దీనికి డ్రెస్ కోడ్ వెస్ట్రన్ ఫార్మల్స్.మే 30, గురువారం: అతిథులందరూ రోమ్లో దిగుతారు. అప్పుడు టూరిస్ట్ చిక్ డ్రెస్ ధరించాల్సి ఉంటుంది. సాయంత్రం 'టోగా పార్టీ'తో రెండో రోజు ముగుస్తుంది.మే 31, శుక్రవారం: మూడో రోజు థీమ్ 'వీ టర్న్స్ వన్ అండర్ ది సన్', 'లే మాస్క్వెరేడ్' అండ్ 'పార్డన్ మై ఫ్రెంచ్'. ఇది క్రూయిజ్లో ఆఫ్టర్పార్టీతో ముగుస్తుంది.జూన్ 1, శనివారం: వేడుక చివరి రోజు థీమ్ 'లా డోల్స్ వీటా'. అతిథులు ఇటాలియన్ సమ్మర్ డ్రెస్ కోడ్ను అనుసరించాల్సి ఉంటుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)
అప్పు చేసి జిరాక్స్ షాప్.. వందల కోట్ల వ్యాపారవేత్త సక్సెస్ స్టోరీ
ఎక్కడ మొదలు పెట్టాం అన్నది ముఖ్యం కాదు.. ఎక్కడికి చేరుకున్నాం అన్నదే ప్రధానం. పట్టుదల, కృషి, తెలివితేటలతో వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలకు చేరిన ఎందరో వ్యాపారవేత్తలు ఉన్నారు. అయితే నడకకు దూరం చేసిన విధికి తన విజయంతో గుణపాఠం చెప్పిన స్ఫూర్తిదాయక వ్యాపారవేత్త విశాల్ మెగా మార్ట్ వ్యవస్థాపకుడు రామచంద్ర అగర్వాల్.పోలియో బాధితుడైన రామచంద్ర తన వైకల్యానికి ఎప్పుడూ కుంగిపోలేదు. తన కాళ్ల మీద తాను నిలబడాలన్న కసితో తెలిసినవారి వద్ద అప్పు చేసి 1986లో ఒక చిన్న ఫోటోస్టాట్ దుకాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కోల్కతాలో 15 ఏళ్ల పాటు బట్టల వ్యాపారం చేశారు. అక్కడి నుంచి ఢిల్లీకి మకాం మార్చిన ఆయన 2001-02లో విశాల్ రిటైల్ సంస్థను స్థాపించారు. ఆ వ్యాపారంలో విజయం సాధించి క్రమంగా విశాల్ రిటైల్స్ విశాల్ మెగా మార్ట్ గా మారింది.రెండో దెబ్బరూ.1000 కోట్ల ల ఆయన కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. అయితే 2008లో స్టాక్ మార్కెట్ పతనం కారణంగా ఆయన కంపెనీ విశాల్ మెగా మార్ట్ అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో ఆయన తన కంపెనీని శ్రీరామ్ గ్రూపునకు విక్రయించాల్సి వచ్చింది. ఎవరైనా అయితే ఇంత పెద్ద దెబ్బ తగిలితే ఇక్కడితో ఆగిపోతారు. కానీ రామచంద్ర అలా ఆగిపోలేదు.మరోసారి విధి కొట్టిన దెబ్బను తట్టుకుని ముందుకు సాగి వీ2 రిటైల్ సంస్థను స్థాపించి రిటైల్ మార్కెట్లో మరోసారి తనదైన ముద్ర వేశారు. ఆయన కంపెనీ వీ2 రిటైల్ మార్కెట్ ప్రస్తుతం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ కంపెనీలలో ఒకటిగా ఉంది. రూ .800 కోట్ల టర్నోవర్ను నమోదు చేసింది.
అదిరిపోయే ఫీచర్లతో.. త్వరలో విడుదల కానున్న మరో రెడ్మీ సిరీస్ ఫోన్
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ రెడ్మీ త్వరలో మరో స్మార్ట్ఫోన్ సిరీస్ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెడ్మీ 12 4జీ ఫోన్ యూజర్లను ఆకట్టుకుంటోంది. అదే తరహాలో రెడ్మీ 13 4జీ ఫోన్ను మార్కెట్కి పరిచయం చేయనుందంటూ పలు మీడియా కథనాలు చెబుతున్నాయి.రెడ్మీ 13 4జీ ధర, కలర్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే?6జీబీ ప్లస్ 128జీబీ ఆప్షన్తో రెడ్మీ 13 4జీ ధర రూ.16,500 ఉండనుంది. 8జీబీ ప్లస్ 256జీబీ వేరియంట్ ధర రూ.19,000గా ఉండనుందని తెలుస్తోంది.బ్లాక్,బ్లూ కలర్స్తో యూజర్లను అలరించనుంది.వాటికి అదనంగా పింక్, ఎల్లో కలర్స్ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేయనుందని సమాచారం.రెడ్మీ 13 4జీ డిజైన్స్ రెడ్మీ 13 4జీ డిజైన్స్ విషయానికొస్తే ఫోన్ టాప్ లెప్ట్ కార్నర్లో రెండు సర్కిల్ కెమెరా యూనిట్స్, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్లు ఉన్నాయి.ఫోన్ బాడీ గ్లోసీ ఫినీష్తో రానుంది.ఫోన్ ఛార్జర్ యూఎస్బీ టైప్-సీకి సపోర్ట్ చేస్తోంది. ఫోన్ ముందు భాగంలో ఫ్లాట్ డిస్ప్లే, థిక్ బెజెల్స్,ఫోన్ పై భాగంగా సెంటర్డ్ హోల్ పంచ్ కటౌట్, సెల్ఫీ కెమెరా సెన్సార్లు ఉన్నాయి.రెడ్మీ 13 4జీ స్పెసిఫికేషన్స్, ఫీచర్లురెడ్మీ 13 4జీ 6.79 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ సన్ స్క్రీన్, మీడియా టెక్ హీలియా జీ91 అల్ట్ రా, 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజ్, స్టోరేజ్ 1టీబీ వరకు పొడిగించుకోవచ్చు. మైక్రోఎస్డీ కార్డ్, ఆండ్రాయిడ్ ఐపర్ ఓఎస్,108 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్,2 సెకండరీ సెన్సార్,ఫోన్ ముందు భాగంలో 13 మెగా పిక్సెల్ సెన్సార్తో విడుదల కానుందని పలు జాతీయ మీడియా కథనాలు హైలెట్ చేస్తున్నాయి.
వీడియోలు
MLC ఎన్నికల్లో ఘర్షణ డబ్బులు పంచుతున్న నేతలు
తెలంగాణ గేయంపై వివాదం
టీడీపీ అరాచకాలు కళ్లకు కట్టినట్టు చూపించిన పేర్నినాని
హైకోర్టులో పిన్నెల్లి అత్యవసర పిటిషన్
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు
డ్రగ్స్ కేసులో ఎంతోమంది దొరికినా సినీ పరిశ్రమ పైనే ఎందుకు టార్గెట్ ?
మిల్లర్లను భయపెట్టి టెండర్లు నిర్వహించారు
టీడీపీ సోమిరెడ్డి వీడియో లైవ్ లో బయటపెట్టిన మంత్రి కాకాణి
కూటమి ఓటమిని ఒప్పుకున్న ABN రాధాకృష్ణ
కేజీవాల్ బెయిల్ పొడగింపు..సుప్రీంలో పిటిషన్
ఫ్యామిలీ
కేన్స్ రెడ్కార్పెట్పై సంప్రదాయ చీరలో మెరిసిన ప్రీతి జింటా!
ఫ్రాన్స్లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకలో వివిధ రకాల సెలబ్రిటీలు, ప్రముఖులు విభిన్నమైన డిజైనర్వేర్ దుస్తులతో సందడి చేశారు. కానీ అస్సాం నటి, వ్యాపారవేత్త భారతీయ సంప్రదాయ చీరలో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. వీరి సరసన బాలీవుడ్ నటి, ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ జట్టు ఓనర్ ప్రీతీ జింటా కూడా చేరింది ఆమె కూడా దేశీ ష్యాషన్ రూట్నే సెలక్ట్ చేసుకుంది. చాలా విరామం తర్వాత ఈ 77 ఫ్రాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్పై మెరిసింది. ఆమె ఈ చీరలుక్లో లేత గులాబీలా అందంగా కనిపించింది. డిజైనర్ సీమా గుజ్రాల్ చేతిలో రూపుదిద్దుకున్న ఓండ్రే పింక్ సీక్విన్ జార్జెట్ చీరలో అద్భుతంగా కనిపించింప్రీతి. ఈ చీరపై చక్కటి ముత్యాలు, సీక్విన్, బీడ్వర్క్ ఉన్నాయి. ఇది ఎంబ్రాయిడరీ బ్లౌజ్తో జత చేయబడింది. ఈ చీర ధర ఏకంగా రూ. 118,000/. ఈ వేడుకలో ప్రీతి జంటా తన అభిమానులకు ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చింది. ఈ స్టైలిష్ మిలీనియల్ చీరకు తగ్గట్టుగా స్లీవ్లెస్ వి నెక్ బ్లౌజ్ మంచి లుక్ తెచ్చిపెట్టింది ఆమెకు. వాటన్నింటకీ అనుగుణంగా కర్లీ హెయిర్ని వదులుగా ఉంచడం ఓ డిఫెరెంట్ లుక్ తెప్పించింది ప్రీతికి. అంతేగాదు ఆమె ఈ కేన్స్లో ఇంతలా సింప్లిసిటీగా రెడీ అయ్యి రావడం అందర్నీ ఆశ్యర్యానికి గురిచేసినా..ఆమె స్టన్నింగ్ లుక్ అందర్నీ చూపుతిప్పుకోనివ్వ లేదు. ఇద వేడుకలో మరో డిజైన డ్రెస్లో కూడా కనిపించింది. ఈ ఈవెంట్లో తొలి ప్రదర్శనలో పెళ్లి కూతురు మాదిరి నైరా బ్రైడల్ గౌనులో మెరిసింది. దీని ధర ఏకంగా రూ. 5,57,600/-. ఇక ప్రీతీ కేన్స్ వేడుకలో మాట్లాడుతూ..ఇది అద్భుతమైనది. ఈ కేన్స్ వేడుకలతో తనకు విడదీయలేని సంబంధం ఉందన్నారు. తాను మళ్లీ మూవీస్లోకి రీ ఇంట్రీ ఇచ్చానని, ఇది తనకు సినీ జీవితంలో సెకండ్ లైఫ్ అని అన్నారు. అందువల్లే తాను సంతోష్తో కలిసి లాహోర్ 1947లో నటించానని చెప్పుకొచ్చారు. ఈ అద్భుతమైన ప్రతిష్టాత్మకమైన అవార్డను రాజ్కుమార్ సంతోష్కి అందించే అవకాశం తరకు లభించడంతో ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఈ అవార్డు పొందిన తొలి భారతీయుడు కాదు, తొలి ఆసియా వ్యక్తి కాబట్టి నేను చాలా గొప్పగా భావిస్తున్నానని అన్నారు ప్రీతి. కాగా, బాలువుడ్ నటుడు షారుఖ్ ఖాన్ సరసన ప్రీతి జింటా నటించిన తొలి చిత్రం దిల్ సే(1998) మూవీకి సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు రాజ్కుమార్ సంతోష్. ప్రేక్షకుల ముందుకు రానున్న పీరియాడికల్ డ్రామా లాహోర్ 1947 కోసం రాజ్కుమార్ సంతోషితో మరోసారి కలిసి పనిచేశారు.(చదవండి: ‘మిట్టీకూల్’: మట్టితో ఫ్రిడ్జ్!..కరెంట్తో పనిలేదు..!)
బోర్డర్లు చెరిపేసిన బామ్మ: క్రికెట్ అరంగేట్రంలోనే రికార్డు
గల్లీ నుంచి ఢిల్లీ దాకా, పసిపిల్లల నుంచి పండుముసలాళ్ల దాకా క్రికెట్ ఆటకున్న క్రేజే వేరు. గత కొన్ని రోజులుగా సందడి ఐపీఎల్ 2024 సీజన్ ముగిసింది. ఫైనల్పోరు కోలకత్తా నైట్ రైడర్స్ సునాయాసంగా సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది టైటిట్ను కైవసం చేసుకుంది. ఇదంతా ఒక ఎత్తయితే లండన్కు చెందిన 66 ఏండ్ల సల్లీ బార్టన్(Sally Barton) విశేషంగా నిలుస్తోంది. ఈ కథా కమామిష్షు ఏంటో చూద్దాం రండి! ముగ్గురు మనువరాళ్లున్న ఈ అమ్మమ్మ క్రికెట్ అరంగేట్రం చేసిన రికార్డులు బద్దలు కొట్టింది గత నెలలో యూరోపా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఎస్టోనియాతో జరిగిన 3-మ్యాచ్ల మహిళల T20 సిరీస్లో గిబ్రాల్టర్ తరపున అరంగేట్రం చేసింది సాలీ బార్టన్. తద్వారా 66 ఏళ్ల 334 రోజుల వయసులో అత్యంత వృద్ధ అంతర్జాతీయ క్రికెటర్గా కూడా అవతరించింది. ఆ మాటలు విన్నవాళ్లంతా ‘బామ్మ నీ సంకల్పానికి జోహార్’. ‘నువ్వు నిజంగా సూపర్’ అంటూ ఆమెను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ఏజ్ అనేది ఒక నంబరు మాత్రమేబీబీసీ స్పోర్ట్ కథనం ప్రకారం ‘‘అరవైల్లోకి వచ్చాక నేను క్రికెట్ ఆడుతానని అస్సలే ఉహించలేదు ‘నా డిక్షనరీలో ‘అతి పెద్ద వయస్కురాలు’ అనే పదమే లేదు. అందుకే 66 ఏళ్ల వయసులో క్రికెట్లో అరంగేట్రం చేశాను’’ అని బార్టన్ తెలిపింది. 2012లో పోర్చుగల్కు చెందిన అక్బర్ సయ్యద్ (Akbar Saiyed) పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టింది. అక్బర్ 66 ఏండ్ల 12 రోజుల వయసులో క్రికెట్లో అరంగేట్రం చేసి రికార్డు సృష్టించాడు.అయితే ఈ సిరీస్లో వికెట్ కీపర్ అయిన బార్టన్కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అంతేకాదు ఏ ఒక్కరిని ఔట్ చేయలేకపోయింది. కానీ ఈ మ్యాచ్లో గిబ్రాల్టర్ 128 పరుగుల తేడాతో విజయం సాధించింది. 3-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. బార్టన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో గణితంలో లెక్చరర్గా రిటైర్ అయ్యారు సాలీ. అనంతరం క్రికెట్ బ్యాట్ పట్టి సరికొత్త రికార్డును సృష్టించడం విశేషం.
పంజాబ్లో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ... నమ్మబుద్ధి కావడం లేదా, ఇదిగో వీడియో వైరల్
ప్రపంచ ప్రఖ్యాత కట్టడం స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఎక్కడ ఉంది అంటే అమెరికాలోని న్యూయార్క్ సిటీలో అని ఠక్కున సమాధానం వచ్చేస్తుంది కదా. మరి మన ఇండియాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూడాలని ఉందా? అయితే మీరు పంజాబ్ వెళ్లాల్సిందే. అవును మీరు చదివింది నిజమే. ఇదేమి చోద్యం అనుకుంటున్నారా? అయితే మీరీ కథనం చదవి తీరాల్సిందే.ఇండ్లు, భవనాల పైకప్పులపై భిన్నమైన ఆకృతుల్లో నిర్మాణాలు చేపట్టడం, విగ్రహాల్ని ఏర్పాటు చేయడం చాలా చోట్ల, ముఖ్యంగా పంజాబ్లో చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. తాజాగా పంజాబ్లోని ఒక భవనంపై ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ని అచ్చం అమెరికాలో ఉన్నట్టే నిర్మిస్తున్నారు. న్యూయార్క్ నగరంలో ఉన్నంతగా కాకపోయినా తమ గ్రామంలో అత్యంత ఎత్తుగా ఉన్న భవనంపై దీన్ని నిర్మిస్తున్నట్టు స్థానిక గ్రామస్థులు తెలిపారు.Some where in Punjab the THIRD liberty statue is installed.😂 pic.twitter.com/WZqrXpK9Jb— Alok Jain ⚡ (@WeekendInvestng) May 26, 2024పంజాబ్ లోని తర్న్ తరణ్ లో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ నమూనా లేటెస్ట్ సెస్సేషన్. దీన్ని చూసేందుకు స్థానికులు భారీగా తరలివస్తున్నారు. విగ్రహాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. ‘అది మంచినీళ్ల ట్యాంకు అయ్యుంటుంది అని ఒకరు, పంజాబ్లో చాలా మంది ఇళ్లపై మంచి నీళ్ల ట్యాంకులు విమానాలు, ఎస్ యూవీల ఆకారంలోనే కనిపిస్తాయి’ అని పేర్కొన్నాడు. మరొకరేమో ‘నయాగారా ఫాల్స్ ను నిర్మించాల్సింది.. అప్పుడు కెనడాను మిస్ అయ్యే వాళ్లు కాదు’ అని చమత్కరించాడు. ‘ఇక ప్రజలు న్యూయార్క్ కు వెళ్లాల్సిన అవసరం లేదు.పంజాబ్ లోని ఈ ఇంటిని చూసేందుకు వెళ్తే సరిపోతుందన్నమాట’ అని కామెంట్ చేయడం విశేషం. మూడో పెద్ద లిబర్టీ విగ్రహం పంజాబ్లో అంటూ అలోక్ జైన్ఎక్స్లోదీన్ని పోస్ల్ చేశారు. ప్రపంచంలోని రెండవ ఎత్తైన విగ్రహం, చైనాలోని స్ప్రింగ్ టెంపుల్ వద్ద ఉన్న అద్భుతమైన వైరోకానా బుద్ధుని విగ్రహం. ఇది తామరపువ్వు ఆకారం ఆసనంలో బుద్ధుడు ఆసీనుడై ఉంటాడు.. ఫోడుషాన్ సీనిక్ ఏరియాలో ఉన్న ఈ విగ్రహ నిర్మాణం 1997లో ప్రారంభమై 2008లో పూర్తి అయిందట.
గ్రీన్ కాఫీని తయారు చేసిన విద్యార్థులు!ఐతే టేస్ట్లో..
గ్రీన్టీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని విన్నాం. పైగా దీన్ని తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుంది, ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు కూడా. ఐతే గ్రీన్ టీ ఉన్నట్లే..గ్రీన్ కాఫీ కూడా ఉందని విన్నారా..?. కాఫీ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు. అందుకని టీ ఉన్నట్లే కాఫ్లీ కూడా ఉంటే బాగుండనన్న ఆ ఆలోచనకు రూపం ఇచ్చారు ఈ కేరళ విద్యార్థులు. అలానే గ్రీన్ టీ మాదిరిగానే ఈ గ్రీన్ కాఫీ కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాల అందించేదిగా ఉండాలని భావించారు. అందుకోసం వాళ్లు ఏం చేశారు. ఎలాంటి ప్రయోగాలు చేశారు? విజయవంతమయ్యారా తదితరాల గురించి చూద్దాం.!లారస్ ఇన్స్టిట్యూట్ ఫర్ లాజిస్టిక్స్కు చెందిన పది మంది సభ్యుల విద్యార్థి బృందం ఈ గ్రీన్ కాఫీని తయారు చేసే ప్రయోగాలకు నాంది పలికారు. వాళ్లు మంచి ఆరోగ్యకరమైన కాఫీని తయారు చేయడం, ఉత్పత్తులు మంచిగా కొనగోలు అయ్యేలా ప్యాకింగ్ వంటి వాటిపై దృష్టి సారించారు. ముఖ్యంగా ఇలాంటి కొత్త ప్రయోగాల్లో కంపెనీలు తమవంత సహాయ సహకారాలు అందిస్తుంది. అలానే కలమ్సేరి ఆధారిత ప్రైవేటు కంపెనీ ఒకటి ఈ బృందానికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఇక ఈ బృందం ఇన్స్టిట్యూట్ ఛైర్మన్ డాక్టర్ అజయ్ శంకర్ సలహాలు, సూచనలతో మంచి గ్రీన్ కాఫీని తయారు చేశారు. అయితే రుచి మాత్రం తాగేలా టేస్టీగా లేదు. ప్రజలు ఆసక్తిచూపి తాగే విధంగా అస్సలు లేదు. దీంతో విద్యార్థుల బృందం తీవ్ర ఆందోళనకు లోనయ్యింది. అయితే దీనికి రోజ్ ఫ్లేవర్, యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలు జోడించి చూశారు. అవి జోడిస్తే ప్రొడక్ట్ నిల్వ ఉండే వ్యవధి కాలం తగ్గిపోవడంతో ఇక ఆ ప్రయత్నం మానేశారు. దీంతో ఈ అరబికా కాఫీ గింజలను చిన్న చిన్న ఉండలుగా చేసి ప్యాక్ చేయాలని నిర్ణయించారు. తీరా మార్కెట్లోకి రిలీజ్ చేశాక పూర్తిగా నష్టాల ఎదురయ్యాయి. దీంతో ప్రతి కస్టమర్కి గ్రీన్ కాఫీ వల్ల కలిగే ప్రయోజనాల వివరించి అమ్మడం ప్రారంభించారు. కొద్ది రోజుల్లో వారిలో కూడా ఈ ప్రోడక్ట్పై నమ్మకం ఏర్పడి కొనుగోలు చేసేందుకు ఆసక్తికనబర్చారు.ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..గ్రీన్ కాఫీ గింజలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. క్లోరోజెనిక్ యాసిడ్ ఉండటం వల్ల కొవ్వును బర్న్ చేయడంలో సహాయపడుతుంది. గ్రీన్ కాఫీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. అందువలన, ఇది బరువు తగ్గడానికి, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది.గ్రీన్ కాఫీ గింజల్లో క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, గ్రీన్ కాఫీ వంటి ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను చాలా వరకు బ్యాలెన్స్ చేయవచ్చు.గ్రీన్ కాఫీ అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది రక్త నాళాలను విస్తరిస్తుంది. రక్తపోటును పెంచే కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిని తగ్గిస్తుంది. రోజూ గ్రీన్ కాఫీ తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.గ్రీన్ కాఫీ గింజలలో అవసరమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కోవడంలో సహాయపడతాయి. ఫ్రీ రాడికల్స్ క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. అధ్యయనాల ప్రకారం, గ్రీన్ కాఫీ గింజలలోని క్లోరోజెనిక్ యాసిడ్ ట్యూమర్ సెల్స్ ఏర్పడకుండా.. క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది.గ్రీన్ కాఫీ గింజలు సహజమైన డిటాక్సిఫైయర్గా పనిచేస్తాయి. ఇవి శరీరం నుంచి టాక్సిన్స్, అదనపు కొవ్వు, కొలెస్ట్రాల్ను బయటకు పంపడంలో సహాయపడతాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.(చదవండి: ఆ బామ్మ అమ్మే ఇడ్లీల ధర తెలిస్తే షాకవ్వుతారు! ఈ వయసులో..)
న్యూస్ పాడ్కాస్ట్
ఎన్నికల్లో విపక్ష ‘ఇండియా’ కూటమి గెలిస్తే హిందువులు రెండో తరగతి పౌరులే.. ప్రధాని మోదీ ఆందోళన.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల ఆరో విడతలో 61.11 శాతం ఓటింగ్ నమోదు.. ఇంకా ఇతర అప్డేట్స్
దేశ అభివృద్ధి కోసమే మూడోసారి బీజేపీ ప్రభుత్వం, ఈ ఎన్నికల్లో గెలుపు నా కోసం, నా కుటుంబం కోసం కాదు.. ప్రధాని మోదీ స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం వీడియో లీక్తో ఎన్నికల సంఘానికి సంబంధం లేదు... ఆంధ్రప్రదేశ్ సీఈవో ముకేష్ కుమార్ మీనా స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరులు... ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
విపక్షాలది మతతత్వ, కులతత్వ, వారసత్వ కూటమి.. ప్రధాని మోదీ విమర్శలు.. ఇంకా ఇతర అప్డేట్స్
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం
దక్షిణాదిలో బీజేపీకే అత్యధిక లోక్సభ సీట్లు... ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ విశ్వాసం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలన్న ఆలోచన మానుకోండి... కాంగ్రెస్ పార్టీకి హితవు పలికిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
ప్రేమ పేరుతో మోసం.. యువకుడి ఆత్మహత్య
కాజీపేట: ప్రేమ పేరుతో యువతి మోసం చేసిందనే మనస్తాపంతో ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ సమీపంలో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. కాజీపేట మండలం సోమిడికి చెందిన మంతుర్తి రమేశ్, రాజమ్మ దంపతుల కుమారుడు రాజ్కుమార్ (28) దాదాపు ఏడేళ్లుగా హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పనిచేసే చోట పరిచమైన ఓ యువతితో కొద్దికాలంగా చనువుగా ఉంటున్నాడు. సూర్యాపేట జిల్లాకు చెందిన సదరు యువతి కుటుంబీకులకు ఇటీవల వీరి ప్రేమ విషయం తెలియడంతో రాజ్కుమార్ను హెచ్చరించారు. దీంతో రాజ్కుమార్ ఎదురు తిరగడంతో యువతి బంధువులు సూర్యాపేట పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రేమించిన యువతి.. కుటుంబీకుల ఒత్తిడికి తలొగ్గి ఎదురు తిరుగడం, బంధువులు చంపేస్తామంటూ బెది రించడంతో రాజ్కుమార్ మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఏడేళ్లుగా సాగిన ప్రేమాయణం.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ సెల్ఫీ వీడియోను రికార్డు చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బంధు, మిత్రులకు పంపించాడు. వెంటనే అప్రమత్తమైన సన్నిహితులు రాజ్కుమార్ను వెతకడానికి ప్రయత్నించగా సూర్యాపేటలో చిక్కాడు. ఎంత నచ్చ చెప్పినా వినకుండా తనకు ఆత్మహత్యే శరణ్యమని చెప్పి పరారయ్యాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం నల్లగొండ సమీపంలో గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన విషయం వెలుగు చూసింది. యువతి కుటుంబీకుల బెదిరింపుల వల్లే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, చెట్టంత ఎదిగిన కుమారుడు ప్రేమ కోసం బలయ్యాడని, తనను బెదిరించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు కోరారు.
కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య
శివమొగ్గ : బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన శివమొగ్గ జిల్లా సొరభలో జరిగింది.భద్రావతికి చెందిన అక్షిత(30) సొరభ పట్టణానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకొని ఇదే పట్టణంలోని విద్యుత్ నగరలో నివాసం ఉంటోంది. పట్టణంలోనే బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతూ పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందింది. అయినా నయం కాలేదు. దీంతో ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సొరభ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
అసలు ‘రేవ్’ రచ్చ గురించి తెలుసా?
బనశంకరి: ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న మాట రేవ్ పార్టీ. బెంగళూరు నగరంలో నిర్వహించిన రేవ్ పార్టీలో పాల్గొన్నవారిలో అధిక మంది తెలుగువాళ్లే ఉన్నారని అందులోనూ రాజకీయ, సినీప్రముఖులు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అసలు రేవ్ పార్టీలు అంటే ఏమిటి, ఇందులో కేవలం సెలబ్రెటీలే ఎందుకు పాల్గొంటారు, ఆ పార్టీలో ఎలాంటి పనులు చేస్తారు, ఎందుకు సంపన్నులకు అంత వెర్రి అని ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్కాగా.. క్లారిటీ ఇచ్చే యత్నమే ఈ కథనం. నైట్ క్లబ్లు, పబ్లు అనే పాశ్చాత్య సంస్కతి దేశంలో వేళ్లూనుకున్నాయి. సెలబ్రెటీలు, బడాబాబులు.. వాటిలో తనివితీరా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అంతకుమించి కావాలనుకునేవారి కోసం రేవ్ పార్టీలు రెడీగా ఉంటాయి. రేవ్ పార్టీ అనే సంస్కృతి 1950లో ఇంగ్లండ్లో ప్రారంభమై మెల్లగా ప్రపంచమంతా విస్తరించింది. ఈ కల్చర్ ప్రారంభమైన కొత్తల్లో పెద్ద హాల్, లేదా ఎక్కడైనా చుట్టూ మూసి ఉన్న ప్రదేశంలో పెద్దగా మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్సులు చేయడం, కావలసినంత మద్యం తాగడమే. ఆ షోలో నృత్యాలు చేసే కళాకారులు కూడా ఉండేవారు. అయితే..రానురాను ఈ పార్టీకి అర్థం మారుతూ వస్తుంది. ఇందులోకి విచ్చలవిడి సంస్కృతి ప్రవేశించింది. నెమ్మదిగా ఈ రేవ్ పార్టీల్లోకి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జత అయ్యాయి. అతిథులు ఈ పారీ్టల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ సేవిస్తూ అశ్లీల నృత్యాలు చేయడం ఉంటాయని సమాచారం. అన్నింటికీ తెగించేవారే ఈ పార్టీల్లో పాల్గొంటారని సమాచారం. అన్ని రకాల హడావుడిముంబై, చెన్నై, బెంగళూరు,హైదరాబాద్ లాంటి నగరాల్లోనే ఈ కల్చర్ పెరిగిపోతుంది. ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పార్టీలు చేసుకోవడం సబబే, కానీ పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకోవడం, అరుపులు, కేకలతో స్థానికులకు ఇబ్బంది పెట్టడం చట్ట విరుద్ధమే అవుతుంది. పైగా డ్రగ్స్, జూదం వంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని పోలీసులు అడుగు పెడుతున్నారు. సాధారణమైనా, రేవ్ అయినా పార్టీలపై పోలీసులు రైడ్చేసి అందులో డ్రగ్స్ వినియోగం ఏమైనా జరిగిందా లేదా అన్నది చూస్తారు. అశ్లీలత జరిగిందా, మైనర్లు పాల్గొన్నారా అన్నది కూడా ఆరాతీస్తారు. అనుమానం ఉంటే రక్తం, వెంట్రుకల నమూనాలను తీసుకుని టెస్టులకు పంపిస్తారు. ఆపై కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తారు. డ్రగ్స్ వాడినట్లు తేలితే చట్టప్రకారం చర్యలు ఉంటాయి. టికెట్ చాలా రేటు సాధారణంగా రేవ్ పార్టీలంటే చాలా ఖరీదైన వ్యవహారం. బెంగళూరులో జరిగిన రేవ్పార్టీకి ఎంట్రీ ఫీజు సుమారు రూ.50 లక్షలు అని ప్రచారం సాగుతోంది. ఇంత డబ్బు పోసి టికెట్ కొనాలి. వాటిని చాలా గోప్యంగా నిర్వహిస్తారు. ఈ పారీ్టలో పరిమిత సంఖ్యలో పాల్గొనేలా ప్లాన్ చేస్తారు. అతిథుల అభిరుచులను బట్టి పార్టీలో ఏర్పాట్లు ఉంటాయి. మద్యం, డ్రగ్స్, ఇంకా కొన్ని అంశాలు లభిస్తాయి. రేవ్పార్టీని బడా బాబుల ఫాంహౌస్, గెస్ట్ హౌస్లలో నిర్వహిస్తారు. 24 గంటల నుంచి 3 రోజుల వరకు కొనసాగవచ్చు. ఆహారం, ఆల్కహాల్ వంటి అన్ని వసతులూ లభిస్తాయి. ఊహల్లో మాత్రమే లభించే రకరకాల ఫాంటసీ కార్యక్రమాలు కూడా అందుబాటులో ఉన్నా ఆశ్చర్యం లేదు. అందుకే అంత మోజు అంటారు. పార్టీలోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు అనుమతించరు.ఉద్యానగరిలో దందా గత కొన్నేళ్లుగా సిలికాన్ సిటీలో రేవ్పార్టీలు గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. ఇక్కడ అనువైన వాతావరణం ఉండడమే కారణం. రెండేళ్ల క్రితం నగర పోలీసులు దాడిచేసి పలువురు సినీ సెలబ్రెటీలను అరెస్ట్ చేయడంతో పాటు డ్రగ్స్ను కూడా పట్టుకున్నారు. టెక్కీలు, ధనవంతును లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ఖరీదైన పార్టీలను సాగిస్తున్నారు. వాటి నిర్వాహకులకు అటు నాయకులు, ఇటు ఖాకీలతో సంబంధాలు ఉండడంతో చూసీచూడనట్లు ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏవో కొన్నిసార్లు మాత్రమే దాడులు జరుగుతున్నాయి. కొన్నిరోజులు హడావుడి జరగడం, ఆపై సద్దుమణగడం షరా మామూలుగా మారుతోంది.
షేర్ల పేరుతో రూ.30 కోట్లు స్వాహా
యశవంతపుర: జనం ఆశను ఘరానా దంపతులు సొమ్ము చేసుకున్నారు. షేర్లలో పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించిన దంపతులు ప్రజలకు రూ.30 కోట్ల వరకూ వసూలు చేసి పరారు కావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కలబురగి నగరంలోని రోజా పోలీసుస్టేషన్ పరిధిలో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గాంధీ నగరలో ఉత్కృష్ట, సావిత్రి అనే భార్యాభర్తలు ఒక వాణిజ్య కాంప్లెక్స్లో షేర్ల ట్రేడింగ్ ఆఫీసును పెట్టారు.యువతీ యువకులను లక్ష్యంగా చేసుకొని దంపతులు తమ వద్ద షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టాలని, కొంతకాలంలో పెట్టుబడి రెట్టింపు అవుతుందని మాయమాటలు చెప్పేవారు. రూ. 25 వేల నుంచి రూ.25 లక్షల వరకూ ఇలా పెట్టుబడులు పెట్టించారు. వీరికి విజయసింగ్ హజారె, సుధా అనే దంపతులు సహరించేవారు. సుమారు 500 మంది నుంచి పెట్టుబడుల పేరుతో రూ. 30 కోట్ల వరకూ వసూలు చేశారు. శనివారం ఎవరికీ చెప్పకుండా అపార్ట్మెంట్లో ఉంటున్న ఒక వ్యక్తి కారులో సావిత్రి దంపతులు పరారయ్యారు. కేవైసీ అంటూ రూ.1.80 లక్షలు డ్రా మైసూరు: మీ బ్యాంకు ఖాతా బ్లాక్ అయ్యింది, కేవైసీ చేయాలి అని మహిళకు ఫోన్ చేసిన సైబర్ దుండగులు ఆమె ఆధార్ కార్డు నంబర్, బ్యాంకు ఓటీపీని చెప్పడంతో రూ. 1.80 లక్షలను దోచుకున్నారు. ఈ ఘటన మైసూరు నగరంలోని మహాదేవపురలో జరిగింది. బాధితురాలు లత మొబైల్కు కేవైసీ గురించి ఒక మెసేజ్ వచ్చింది. ఆమె నిజమేననుకుని అందులోని నంబర్కు కాల్ చేసింది. మోసగాళ్లు అడగడంతో ఆధార్, ఓటీపీ వివరాలను చెప్పింది, క్షణాల్లోనే ఆమె బ్యాంకు ఖాతాలో నుంచి రూ. 1.80 లక్షలను దుండగులు డ్రా చేశారు. బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.