గాలి భానుప్రకాష్‌ అతి.. ఓట్ల లెక్కింపునకు ముందే..! | TDP Leader Gali Bhanuprakash Is Flexed By Saying That He Is An MLA, More Details Inside | Sakshi

గాలి భానుప్రకాష్‌ అతి.. ఓట్ల లెక్కింపునకు ముందే..!

Published Fri, May 24 2024 9:06 AM | Last Updated on Fri, May 24 2024 1:16 PM

Tdp Leader Gali Bhanuprakash Is Flexed By Saying That He Is An MLA

ఓట్ల లెక్కింపునకు ముందే ఎమ్మెల్యే భానుప్రకాష్‌ అంటూ ఫెక్సీలు

అంత తొందరెందుకు భాను అంటున్న నగరి ప్రజలు

పట్టించుకోని ఎన్నికల అధికారులు

కోడ్‌ ఉల్లంఘించి గతంలో మూసివేసిన జిమ్‌లో బ్యాడ్మింటన్‌ కోర్టు ప్రారంభం

గంజాయి కేసులో అరెస్టయిన వారే బాడ్మింటన్‌ కోర్టు నిర్వాహకులు

విధ్వంసాలు సృష్టించేలా టీడీపీ చర్యలు

ఎమ్మెల్యే భానుప్రకాష్‌ అంటూ టీడీపీ నేతలు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ

నగరి: నగరి నియోజకవర్గం పుత్తూరులో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్‌ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓట్ల లెక్కింపు జరగముందే తానే ఎమ్మెల్యే అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేయించారు. కొందరు దీన్ని చూసి అంత తొందరేల భానూ.. అంటూ నవ్వుకున్నారు. ఇందంతా ఒక పథకం ప్రకా రం రెచ్చగొట్టడమేనని భావిస్తున్నారు. నేర చరిత కలిగిన వారిని జనంలోకి రప్పించడం.. గతంలో గంజాయి సరఫరా జరిగిందని ప్రచారం జరిగిన ప్రాంతంలో బ్యాడ్మింటన్‌ కోర్టు ప్రారంభించడం ఏంటని చర్చించుకుంటున్నారు. అది బ్యాడ్మింటన్‌ కోర్టు కాదు.. విధ్వంస కుట్రలకు కేంద్రంగా చేసుకున్నారని అనుమానిస్తున్నారు. ఇదంతా ఎన్నికల కమిషన్‌కు కనబడలేదా అని జనం ప్రశి్నస్తున్నారు.

ఆలూ లేదు, చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది టీడీపీ నేతల పరిస్థితి. ఓట్ల లెక్కింపు జరగలేదు. గెలుస్తారో లేదో కూడా తెలియదు. నగరిలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్‌ ఎమ్మెల్యే అంటూ పుత్తూరు పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం హాస్యాస్పదంగా మారింది. ఇదేం విడ్డూరం అంటూ జనం నవ్వుకుంటున్నారు.

బ్యాడ్మింటన్‌ కోర్టు ప్రారంభోత్సవంలో గాలి భానుప్రకాష్‌

పుత్తూరు మున్సిపాలిటీ చింతలగుంటలో గతంలో బీఎస్‌ జిమ్‌ నిర్వహించేవారు. ఏడాది క్రితం ఈ జిమ్‌ నిర్వాహకుడు టీడీపీ నేత హరి విశాఖపట్నం అరకు వద్ద గంజాయి స్మగ్లింగ్‌ చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఆ తర్వాత ఆ జిమ్‌ నిరుపయోగంగా మారింది. ఈ జిమ్‌ నుంచే గంజాయి సరఫరా జరిగేదంటూ అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అనంతరం ప్రచారాల్లోను, పలు కార్యక్రమాల్లోను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్‌తో పాటు గంజాయి స్మగ్లర్, అతని అనుచరులు పాల్గొనడం అప్పట్లో వివాదాస్పదమైంది. వివాదాలకు చిరునామాగా ఉన్న వీరంతా తాజాగా మరో వివాదానికి తెరతీశారు. నిరుపయోగంగా ఉన్న జిమ్‌ను బ్యాడ్మింటన్‌ కోర్టుగా మార్చి ఎన్ని కల కోడ్‌ ఉండగానే టీడీపీ అభ్యరి్థతో ప్రారం¿ోత్సవం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో భానుప్రకాష్‌ ఎమ్మెల్యే, నగరి అంటూ ముద్రించి ప్రదర్శనగా ఉంచారు.

కోడ్‌ వర్తించదా? 
ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్న టీడీపీ నాయకులకు ఎన్నికల నిబంధనలు వర్తించవా అంటూ నగరి నియోజకవర్గ ప్రజలు ప్రశి్నస్తున్నారు. బహిరంగంగా ఒక అభ్యర్థి ఎమ్మెల్యే అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి ప్రారం¿ోవాలు చేస్తుంటే వారిపై చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

రెచ్చగొట్టి విధ్వంసాలకు పాల్పడేందుకేనా?
ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే పుత్తూరు టీడీపీ నాయకుల దుశ్చర్యను చూసి వైఎస్సార్‌సీపీ నాయకులు, స్థానిక ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. రాజకీయ పారీ్టలను రెచ్చగొట్టి.. గొడవలు సృష్టించి విధ్వంసాలకు పాల్పడేందుకే పథకం వేశారని స్థానికులు భయపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించేందుకే నేరచరిత కలిగిన వారిని టీడీపీ నాయకులు జనంలోకి తీసుకొస్తున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement