Flexi
-
టీడీపీలో అసమ్మతి.. ఎమ్మెల్యే ఫ్లెక్సీలు చించేసిన పచ్చ నేతలు
సాక్షి, నెల్లూరు: టీడీపీ ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలే తిరగబడుతున్నారు. అసమ్మతి నేతలు టీడీపీ ఎమ్మెల్యే ఫ్లెక్సీలను చించివేయడం ఆసక్తికరంగా మారింది. కాగా, సదరు ఎమ్మెల్యే.. అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమాలే ఇందుకు కారణమని అసమ్మతి వర్గం నేతలు చర్చించుకుంటున్నారు.ఉదయగిరి నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి పీక్ స్టేజ్ చేరుకుంది. ఉదయగిరిలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఫ్లెక్సీలను అసమ్మతి నేతలు చించివేశారు. కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మరో వర్గం టీడీపీ నేతలు చించేయడంతో రాజకీయం వేడెక్కింది. అంతకుముందు.. జలదంకి, వరికుంటపాడుతో పాటు తాజాగా ఉదయగిరిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు.అయితే, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమాలపై సొంత పార్టీ నేతలే ఆగ్రహంగా ఉన్నట్టు స్థానిక నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా తమను పట్టించుకోవడం లేదని కార్యకర్తలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, సొంత పార్టీలోనే ఇలా అసమ్మతి నేతలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే సురేష్కు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. -
నల్లగొండ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
రోజా ఇంటి వద్ద టీడీపీ ఉన్మాదం..
-
పూలగుచ్ఛం అడ్డుపెట్టి.. కూటమి సర్కార్ నీచ రాజకీయం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులకు అవమానం జరిగింది. ఫ్లెక్సీపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఫోటోలు వేశారు. అయితే వారి ఫొటోలు కనిపించకుండా ముఖాలపై కూటమి నేతలు పూల గుచ్చం అడ్డుగా పెట్టారు. టీడీపి, బీజేపీ నేతల ఫోటోలు మాత్రమే కనిపించేలా డెకరేషన్లో ఎత్తుగడ వేశారు.జమ్మలమడుగులో మహిళా సంఘాలతో కేంద్రమంత్రి భేటీకాగా, కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్సీలను ప్రభుత్వ అధికారులు అవమానించారు. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించడంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారిక కార్యక్రమం కావడంతో ఫ్లెక్సీలపై ఎంపీ, ఎమ్మెల్సీ ఫొటోలు వేయక తప్పని పరిస్థితి. పూలగుచ్ఛం అడ్డుపెట్టి పట్టి కూటమి ప్రభుత్వం నీచ రాజకీయానికి ఒడిగట్టింది. జిల్లా అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు -
YSRCP ఫ్లెక్సీలను చించేసిన దుండగులు
-
బ్యాంకోళ్ల జబర్దస్తీ!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: రైతులు తీసుకున్న దీర్ఘకాలిక రుణాల వసూలు కోసం సహకార బ్యాంకు అధికారులు జబర్దస్తీకి దిగుతున్నారు. తనఖాలో ఉన్న భూములను వేలం వేస్తున్నట్టుగా రైతులకు నోటీసులు ఇవ్వడమే గాకుండా, పొ లాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. బ్యాంకోళ్ల జబర్దస్తీతో తమ పరువు పోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (ఎన్డీసీసీబీ) అధికారులు కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండా, సంగెం, మైలారం, దుర్కి, బస్వాయిపల్లి, అంకోల్, హాజీపూర్ తదితర గ్రామాల్లో రైతులకు నోటీసులు జారీ చేశారు.రైతుల భూములను వేలం వేస్తున్నట్టు నోటీసులు జారీ చేశారు. అంతటితో ఆగకుండా కుదువ పెట్టిన భూములను వేలం వేయడానికి తాము అ«దీనంలోకి తీసుకున్నట్టు కొందరు రైతుల భూముల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జూన్లో లింగంపేట మండలంలోని పోల్కంపేట గ్రామంలో రైతుల భూములను వేలం వేస్తున్నట్టు పొలాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయంపై ‘సాక్షి’ప్రచురించిన కథనంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి సహకార బ్యాంకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పరువు తీసేలా వ్యవహరించవద్దని ఆదేశించారు.దీంతో రైతుల భూముల వేలం నిలిచిపోయింది. తాజాగా నస్రుల్లాబాద్ మండలంలో సహకార బ్యాంకు అధికారులు తిరిగి అదే పద్ధతిని మొదలుపెట్టారు. ఈనెల 26న పలువురు రైతుల భూములను వేలం వేయనున్నట్టు రైతులకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. రైతుల ఆవేదన..: బ్యాంకు అధికారులు తమ భూములను వేలం వేస్తున్నట్టు నోటీసులు ఇవ్వడంతో పాటు భూముల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు బయట అప్పులు చేసి బ్యాంకు రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తుండగా, మరికొందరు ఆస్తులు అమ్ముకుని అయినా కడతామని, తమ భూములు వేలం వేసి పరువు తీయద్దని వేడుకుంటున్నారు. -
జగన్ ఫ్లెక్సీలను తీసేసిన రేణిగుంట పోలీసులు
-
మహబూబాబాద్లో హైటెన్షన్.. కేటీఆర్ ఫ్లెక్సీలు చింపేసిన దుండగులు
సాక్షి,మహబూబాబాద్జిల్లా: లగచర్ల బాధితులకు మద్దతుగా మహబూబాబాద్ పట్టణంలో తహసిల్దార్ ఆఫీసు ఎదుట బీఆర్ఎస్ నేతలు సోమవారం(నవంబర్25) ధర్నా చేయనున్నారు. మహధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు ,ఎమ్మెల్సీలు,మాజీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.అయితే ధర్నా సందర్భంగా మహబూబాబాద్లో ఏర్పాటు చేసిన కేటీఆర్ ఫ్లైక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు.ఫ్లెక్సీల రగడపై పోలీసులు ఆరా తీస్తున్నారు.మరోవైపు గో బ్యాక్ కేటీఆర్ అని పోస్టర్లు వెలిశాయి.దీంతో మహాధర్నాకు భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.ధర్నాలో ఏమి జరుగుతుందోనని స్థానికంగా టెన్షన్ నెలకొంది.ధర్నాను అడ్డుకొని తీరుతామని స్థానిక గిరిజనులు,కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరించారు.ఇదీ చదవండి: నేడు బీఆర్ఎస్ మహాధర్నా -
రిస్క్ తక్కువ.. రాబడులు స్థిరం
రిస్క్ పెద్దగా భరించలేని వారు, అదే సమయంలో ఈక్విటీ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేయాలని భావించే వారు యూటీఐ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ను పరిశీలించొచ్చు. దీర్ఘకాలంలో రాబడుల చరిత్ర స్థిరంగా ఉంది. గతంలో యూటీఐ ఈక్విటీ ఫండ్గా కొనసాగిన ఈ పథకం, 2017 అక్టోబర్లో సెబీ తీసుకొచ్చిన పునర్వ్యవస్థీకరణ నిబంధనల అనంతరం ఫ్లెక్సీక్యాప్గా మారింది.ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ స్మాల్క్యాప్, మిడ్క్యాప్, లార్జ్క్యాప్ విభాగాల్లో స్వేచ్ఛగా ఇన్వెస్ట్ చేయగలవు. మెరుగైన అవకాశాలున్న చోట ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు నిబంధనల పరంగా వెసులుబాటు ఉంటుంది. రిస్క్–రాబడుల సమతుల్యానికి ఈ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు ఈ పథకం 2008, 2011, 2020 కరెక్షన్ సమయాల్లో నష్టాలను పరిమితం చేయడాన్ని గమనించొచ్చు. ఐదేళ్లు, ఏడేళ్లు, పదేళ్ల కాలంలో చూస్తే సగటున మెరుగైన రాబడులు ఉన్నాయి. ఈ పథకం రాబడులకు ఎస్అండ్పీ నిఫ్టీ 500 సూచీ ప్రామాణికం. ఏడాది కాలంలో ఈ పథకం 24 శాతం మేర రాబడులు అందించింది. ఐదేళ్ల కాలంలో సగటున వార్షికంగా 16.47 శాతం రాబడులు ఇచ్చింది.ఏడేళ్ల కాలంలో ఏటా 14 శాతం, పదేళ్ల కాలంలో ఏటా 12.50 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. పోటీ పథకాలతో పోల్చితే రాబడులు కొంత తక్కువగా కనిపించినప్పటికీ.. కరెక్షన్ సమయాల్లో నష్టాలను పరిమితం చేయడంలో ఈ పథకం మెరుగైన పనితీరు చూపిస్తోంది. రాబడుల చరిత్ర గొప్పగా లేకున్నా, దీర్ఘకాలానికి మెరుగ్గా ఉంది. స్థిరంగా తక్కువ ఆటుపోట్లతో ఉన్నందున రిస్క్ తక్కువ కోరుకునే వారికి మంచి ఎంపిక అవుతుంది. ముఖ్యంగా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేసుకుంటే మరింత మెరుగైన రాబడులు అందుకోవచ్చు. పెట్టుబడుల విధానం/ పోర్ట్ఫోలియో ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.27,706 కోట్ల పెట్టుబడులు (నిర్వహణ ఆస్తులు/ఏయూఎం) ఉన్నాయి. దీర్ఘకాల చరిత్ర ఉండడంతో పెద్ద పథకాల్లో ఒకటి కావడం గమనార్హం. నిర్వహణ ఆస్తుల్లో 96 శాతం మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, 0.52 శాతం మేర డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టింది. 3.45 శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉంది. ప్రస్తుత మార్కెట్ దిద్దుబాటులో ఆకర్షణీయ అవకాశాలకు వీలుగా నగదు నిల్వలు కలిగి ఉన్నట్టు అర్థమవుతోంది.ఈక్విటీ పెట్టుబడులు గమనించగా, 70 శాతం వరకు లార్జ్క్యాప్లో ఉంటే, మిడ్క్యాప్లో 28 శాతం, స్మాల్క్యాప్లో 2 శాతం వరకు పెట్టుబడులు పెట్టింది. టాప్–10 స్టాక్స్లోనే 42 శాతం మేర పెట్టుబడులు ఉన్నాయి. పెట్టుబడులను గమనించినట్టయితే.. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి ఎక్కువ వెయిటేజీ ఇస్తూ, 22 శాతం పెట్టుబడులను ఈ రంగాలకు చెందిన కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత టెక్నాలజీ కంపెనీలకు 22 శాతం, కన్జ్యూమర్ డిస్క్రీషినరీ రంగానికి 18 శాతం, హెల్త్కేర్ కంపెనీలకు 12 శాతం చొప్పున పెట్టుబడులు కేటాయించింది. -
కొడాలి నాని పుట్టిన రోజు.. ఫ్లెక్సీలను అడ్డుకున్న పోలీసులు
-
కాంగ్రెస్లో చిచ్చురేపిన దసరా ఫ్లెక్సీలు
గీసుకొండ: దసరా పండుగ సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ ధర్మారంలో శనివారం కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి వర్గీయుల మధ్య చిచ్చు రేపాయి. «కొండా అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కాంగ్రెస్కు చెందిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి ఫొటోలు లేకపోవడంతో రేవూరి వర్గం వారు ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ వివాదంపై రేవూరి వర్గం గీసుకొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కొండా వర్గం సైతం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లింది. అయితే వారిని పోలీస్స్టేషన్లోనే అదుపులోకి తీసుకుని బయటకు పంపడం లేదనే సమాచారం రావడంతో కొండా వర్గం కార్యకర్తలు, నాయకులు ధర్మారంలో ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి సురేఖ తమ వారిని విడిపించేందుకు ఆదివారం సాయంత్రం గీసుకొండ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. తమ కార్యకర్తలు ఫిర్యాదు చేయడానికి వస్తే, బంధించి బూట్లతో తన్నుతారా.. విచారణ చేయరా? అని ఆమె పోలీసు అధికారులను నిలదీశారు. ఎమ్మెల్యేకు తొత్తుగా వ్యవహరిస్తున్నారంటూ ఆమె ఆరోపించినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్లో సీఐ కురీ్చలో కూర్చుని ఆమె అధికారులతో వాదిస్తున్నట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మంత్రి పోలీస్ స్టేషన్కు వెళ్లిన విషయం తెలిసిన సీపీ అంబర్ కిషోర్ఝా అక్కడికి వెళ్లి ఆమెతో మాట్లాడారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా రేవూరి వర్గీయుడు పిట్టల అనిల్పై దాడి చేసిన విషయంలో కొండా వర్గానికి చెందిన ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు గీసుకొండ పోలీసులు తెలిపారు. ఇందులో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఇద్దరు పరారీలో ఉన్నారు. కొండా వర్గీయుల నుంచి తనకు ప్రాణహాని ఉందని పిట్టల అనిల్ చేసిన వీడియో వైరల్ అయింది. -
ఒంగోలు: వాసన్నకు వరుస అవమానాలు!
ప్రకాశం, సాక్షి: జనసేనలో చేరకముందే ప్రత్యర్ధి వర్గం చేష్టలతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ చేరిక కూటమిలో ఇప్పటికే చిచ్చును రాజేయగా.. మరోవైపు బాలినేనికి భవిష్యత్తులో ‘రాజకీయ సహకారం’ అందడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ క్రమంలోనే ఫ్లెక్సీల రగడ కొనసాగుతోంది. తాజాగా.. నగరం అంతటా బాలినేని అభిమానులు కట్టిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేయడం మళ్లీ చర్చనీయాంశమైంది. బాలినేని గురువారం అధికారికంగా జనసేనలో చేరాల్సి ఉంది. ఆయనకు స్వాగతం చెబుతూ.. ఆయన అభిమానులు నగరం అంతటా ఫ్లెక్సీలు వేశారు. కానీ, నిన్న రాత్రి వాటిని ఎవరో చించేశారు. మొన్న చర్చి సెంటర్లో.. ఈ మంగళవారం లాయరు పేటలో.. ఇలాగే బాలినేని వెల్కమ్ ఫ్లెక్సీలు చించివేయడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. గత శుక్రవారం రాత్రి నగరంలోని చర్చి సెంటర్ వద్ద బాలినేనిని జనసేనలోకి ఆహ్వానిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తెలుగు దేశం నాయకులు మున్సిపల్ సిబ్బంది సాయంతో తొలగించారు. ఆ ఫ్లెక్సీలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫొటో వేయడాన్ని తెలుగు యువత వ్యతిరేకించింది. మరోసారి ఇలాంటి ఫ్లెక్సీలు వేస్తే సహించేది లేదని హెచ్చరించింది. ఈ పరిణామం పెద్ద దుమారమే రేపింది. అయితే మంగళవారం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో దామచర్ల జనార్దన్ ఫొటో లేదు. కానీ.. చంద్రబాబు ఫొటో మాత్రం ముద్రించారు. వాటినీ ఎవరో చించేశారు. గత కొద్దిరోజులుగా టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, బాలినేని వర్గాల మధ్య వైరం కొనసాగుతోంది. ఇప్పుడు దామచర్ల వర్గీయులు జనసేనలోకి బాలినేని వెళ్లడాన్ని భరించలేకపోతున్నారు. మరోవైపు.. భవిష్యత్తులో జనసేనలోనూ బాలినేని వల్ల వర్గపోరు తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ ఫ్లెక్సీల చించివేత వ్యవహారాలపై ఇప్పటిదాకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతుండడం గమనార్హం. -
‘బాలినేని.. నిన్ను వదల’
ఒంగోలు టౌన్/టంగుటూరు: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను కలిసిన బాలినేని ఆ పారీ్టలో చేరేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఒంగోలు రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. మొదట్నుంచి ఉప్పు నిప్పులా ఉండే బాలినేని, దామచర్ల ఇప్పుడు ఒక కూటమిలో కత్తులు దూసుకుంటున్నారు. ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. శుక్రవారం బాలినేని అభిమానులు కొందరు నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదాన్ని మరింత రాజేశాయి. ఈ ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే దామచర్ల ఫొటో కూడా ముద్రించడం టీడీపీ శ్రేణులకు మింగుడు పడలేదు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసి వెంటనే వాటిని తొలగించడమే కాకుండా ఇలాంటి ఫ్లెక్సీలు మరోసారి వేస్తే ఊరుకునేది లేదని వారి్నంగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆలూ లేదు సూలు లేదు అన్నట్లు ఇంకా పారీ్టలో చేరక ముందే ఇలా ఉంటే రానురాను ఈ ఇరుపార్టీల మధ్య పరిస్థితి ఇంకెలా ఉండబోతుందో చూడాలి.ఏ పార్టీలోకి వెళ్లినా వదలను..: ఎమ్మెల్యే దామచర్ల బాలినేని వంటి అవినీతిపరుడిని ఏ పార్టీలోకి వెళ్లినా వదిలేదే లేదని, అతనిని, అతని కుమారుడిని చట్టపరంగా శిక్షిస్తామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెం గ్రామంలో ఆదివారం నిర్వహించిన దామచర్ల ఆంజనేయులు 17వ వర్ధంతి సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ ‘‘గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు పోరాటం చేశాం, ఒంగోలులో టీడీపీ శ్రేణులు, నాపై బాలినేని 32 కేసులు పెట్టారు, మా నాయకుడు చంద్రబాబుని కూడా దూషించారు, అధికారం పోయి వంద రోజులు గడవక ముందే పార్టీ మారుతున్నారు. జనసేన పార్టీలో చేరకముందే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఏ పార్టీలోకి వెళ్లినా కేసుల్లో నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కొడుకు తప్పించుకోలేరు. గత ఐదేళ్లలో ఆయన చేసిన అక్రమాలను బయటకు తీస్తాం, వాటి నుంచి పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేరు. ఎన్నికల్లో కష్టపడి పని చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకి అండగా ఉంటాం. పారీ్టలు మారే పరిస్థితి వస్తే మేము రాజకీయాలు కూడా మానుకుంటాం..’’ అని దామచర్ల జనార్దన్ అన్నారు. నేనెప్పుడూ కాంప్రమైజ్ కాను.. బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి ‘‘నేనెప్పటికీ కాంప్రమైజ్ కాను. జనసేన ఫ్లెక్సీలు ఎవరు వేశారో నాకు తెలియదు. ఆయన బొమ్మేశారని తీసేయమన్నాడంటా, సంతోషమే... ఆయన బొమ్మ వద్దంటే తీసేద్దాం’’ అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ నుంచి ఒంగోలు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేసిన కామెంట్స్పై వివరణ ఇచ్చారు. స్థానికంగా టీడీపీ ఎమ్మెల్యే ఉన్నాడని, జనసేన నాయకులకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అడిగానని, అంతకుమించి తానేమీ మాట్లాడలేదన్నారు. దానిమీద కూడా ఆయన అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నారని, ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. తాను జనసేనలోకి వెళ్లడం ఇష్టం లేకనే రెచ్చగొట్టేందుకు కావాలని ఆయన మాట్లాడుతున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా ఏం చేస్తాడో చూస్తానంటూ ఏదేదో మాట్లాడుతున్నాడని విన్నానని, అంతపనికి రాదు... ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ప్రశ్నించేందుకే జనసేన పార్టీ పెట్టానని పవన్ కళ్యాణ్ చెబుతున్నారని, ఇప్పుడు కూడా ఏదైనా తప్పులు జరిగితే తాను ప్రశి్నస్తానన్నారు. జనసేన పార్టీలో ఉన్న పాతవారిని, తనతో పాటు వస్తున్న వారిని కలుపుకొని జనసేన బలోపేతం కోసం కృషి చేస్తానని తెలిపారు. -
ట్యాంక్బండ్ వద్ద ఉద్రిక్తత.. గణేశ్ ఉత్సవ సమితి Vs పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ట్యాంక్బండ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్యాంక్బండ్ పై వినాయక నిమజ్జనం లేదంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, భారీ కేడ్లను భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతలు తొలగించారు. ట్యాంక్ బండ్ ఏర్పాటుచేసిన జాలీలను తొలగించిన సమితి నేతలు.. వినాయకుని నిమజ్జనం చేశారు.ట్యాంక్బండ్పై వినాయక నిమజ్జనం అనేక సంవత్సరాలుగా జరుగుతుందని.. కొత్త రూల్స్ తీసుకువచ్చి భక్తుల మనోభావాలను ప్రభుత్వం, పోలీసులు దెబ్బతీస్తున్నారని ఉత్సవ సమితి నేతలు మండిపడుతున్నారు. 2022, 23లో కూడా ఇదే విధంగా చెప్పారు. కానీ చివరకు ట్యాంక్ బండ్లో గణేష్ నిమజ్జనాలు జరిగాయన్నారు.‘‘ప్రభుత్వం వెంటనే ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జన ఏర్పాట్లు ఈ రోజు మధ్యాహ్నం వరకు చేయాలి.. లేని పక్షంలో ఈ రోజు అన్ని వినాయక మండపాల నిర్వాహకులకు సమాచారం తెలియజేసి రేపు నగరా వ్యాప్తంగా ఆందోళన చేసి నగరాన్ని స్తంభింప చేస్తాం. ఎక్కడికక్కడ మండపాల్లో వినాయకులను అదే విధంగా ఉంచుతాం’’ అంటూ భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రాజావర్ధన్ రెడ్డి హెచ్చరించారు.ఇదీ చదవండి: గణేశ్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు -
వాట్సాప్లో.. వైరల్ అవుతున్న నిజామాబాద్ షాప్ ఫ్లెక్సీ!
ఖలీల్వాడి: నగరంలోని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఢిల్లీవాలా స్వీట్ హోంపై కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్వో విజయ్బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వీట్ హోమ్ వద్ద పార్కింగ్ సదుపా యం లేకపోవడంతో కొనుగోలుదారులు వాహనాలను రోడ్డుపైనే నిలుపుతూ ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నారని పేర్కొన్నారు.ఆదివారం రోజున గాంధీచౌక్ నుంచి మమత సర్కిల్ వరకు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులతో స్వీట్హోం నిర్వాహకులు గొడవపడ్డారని, ఆ తరువాత పోలీసుల వేధింపుల కారణంగా స్వీట్హోంను మూసివేస్తున్నామని ఫ్లెక్సీ ఏర్పాటు చేసి న్యూసెన్స్ చేసినట్లు తెలిపారు. ఢిల్లీ వాలా స్వీట్ హోంపై బీఎన్ఎస్ కింద క్రైం నంబర్ 343/2024, యూ/ఎస్ 221, 224, 285 కింద కేసు నమోదు చేసి చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు నివేదిక పంపించినట్లు ప్రకటనలో తెలిపారు. ఢిల్లీవాలా స్వీట్ హోం వారు పోలీసులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారి ని శాఖ సిబ్బంది ఎటువంటి ఇబ్బందులకు గురి చేయలేదని పేర్కొన్నారు. -
సిద్దిపేటలో ఫ్లెక్సీ వార్
సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సిద్దిపేటలో మొదలైన ఫ్లెక్సీ వివాదం చినికిచినికి గాలివానలా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమాలు, సవాళ్లతో సిద్దిపేట శనివారం రణరంగంగా మారింది. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఇరుపార్టీలకు చెందిన నేతలను అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. బీఆర్ఎస్ నిరసన ర్యాలీ: రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15 కల్లా పూర్తి చేసినందున ఎమ్మెల్యే పదవికి హరీశ్రావు రాజీనామా చేయాలంటూ సిద్దిపేటలో కాంగ్రెస్ కార్యకర్తలు పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిని తొలగించాలంటూ బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం రాత్రి నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించి, తెల్లవారుజామున వదిలి పెట్టారు. మరోవైపు శుక్రవారం అర్ధరాత్రి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తు ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే హరీశ్ క్యాంప్ కార్యాలయంలోకి చొరబడ్డాయి.అక్కడ కేసీఆర్, హరీశ్రావు చిత్రాలతో ఉన్న ఫ్లెక్సీని చించేశాయి. దీంతో శనివారం సిద్దిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి పాత బస్టాండ్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీని నిర్వహించారు. హరీశ్ రాజీనామాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని దగ్ధం చేశారు. తర్వాత బీజేఆర్ చౌరస్తాలో ఉన్న ఫ్లెక్సీలను బీఆర్ఎస్ నాయకులు చించివేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీలను ఝుళిపించారు. బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు.ర్యాలీగా కాంగ్రెస్: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ ఫ్లెక్సీని ఏర్పాటు చేసేందుకు నియోజకవర్గ ఇన్చార్జి హరికృష్ణ కార్యాలయం నుంచి ర్యాలీగా బయల్దేరిన కాంగ్రెస్ శ్రేణులను బీజేఆర్ చౌరస్తాలో పోలీ సులు అడ్డుకున్నారు. పోలీసుల కన్నుగప్పి క్యాంప్ ఆఫీస్ వైపు చొచ్చుకొచ్చేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. క్యాంప్ ఆఫీస్ గేట్ వద్దకు చేరు కున్న కాంగ్రెస్ నాయకుడు మహేందర్పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయ డంతో పరిస్థితి చేయిదాటిపోతుందనే ఆందోళన నెలకొంది. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. ఇరుపార్టీలు పరస్పర ఫిర్యాదులతో పోలీసులు కేసులు నమోదు చేశారు. -
రాజీనామా ఏది..? హరీశ్రావుపై వెలసిన ఫ్లెక్సీలు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్రావుపై హైదరాబాద్ నగరంలో శుక్రవారం(ఆగస్టు16) ఫ్లెక్సీలు వెలిశాయి. రుణమాఫీ అయిపోయే నీ రాజీనామా ఏడబోయే అంటూ ఫ్లెక్సీల్లో హరీశ్రావును ప్రశ్నించారు. ఫ్లెక్సీలపై కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అభిమానుల పేర్లున్నాయి. కాగా, ఆగస్టు 15 లోపు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని గతంలో హరీశ్రావు ప్రకటించారు. తుదివిడత రూ.2 లక్షల రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా హరీష్రావు రాజీనామా అంశాన్ని సీఎం రేవంత్రెడ్డి గురువారం వైరా సభలో ప్రస్తావించారు. మొత్తం 3 విడతల్లో రూ. 2లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
కుక్కలకు మీ ఇంటి వద్దే భోజనం పెట్టండి
వెంగళరావునగర్: ‘వీధి కుక్కలకు మీ ఇంటి వద్దనే ఆహారాన్ని పెట్టండి మహాప్రబో.. రోడ్ల మీద పెట్టకండి.. కుక్కల నుంచి ప్రజల ప్రాణాలను రక్షించండి’అంటూ మధురానగర్ కాలనీలో స్థానికులు వినూత్నరీతిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల ఏర్పాటుకు గత ఏడాది నుంచి జరుగుతున్న కాలనీవాసుల ఆందోళనే ప్రధాన కారణం. దాదాపు ఏడాదిన్నర నుంచి కాలనీలో కుక్కల బెడద మరీ ఎక్కువగా ఉంది. శునకాలు పదుల సంఖ్యలో సంచరిస్తూ ఇప్పటికే 50 మందిపై దాడి చేసి గాయపర్చాయి. ఆందోళన చెందిన కాలనీవాసులు అసోసియేషన్కు మొర పెట్టుకున్నారు. కొందరు రోడ్ల మీదనే కుక్కలకు ఆహారాన్ని ఇవ్వడం వల్ల అవి కాలనీలో తిష్ట వేశాయని, కనిపించిన ప్రతి ఒక్కరిపై దాడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే పోలీసుస్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి. ప్రజల ఆవేదన దృష్టిలో పెట్టుకుని మధురానగర్కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ విధమైన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వీధి కుక్కలను తమ ఇంటి వద్దకు తీసుకెళ్ళి ఆహారాన్ని అందించినట్టయితే వాటికి కడుపు నిండుతుందని, కాలనీవాసులకు రక్షణ ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నట్టుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని అసోసియేషన్ నేతలు పేర్కొన్నారు. ఇప్పటికైనా కుక్కల ప్రేమికులు కాలనీవాసుల సమస్యను కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. పెంపుడు కుక్కలు వీధుల్లో మల విసర్జన చేస్తే తక్షణమే యజమానులు వాటిని తొలగించాలని కోరారు. కాలనీ వీధుల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చూసిన ప్రజలు అసోసియేషన్కు అభినందనలు తెలియజేస్తున్నారు. -
రైతు భూమిలో బ్యాంకు ఫ్లెక్సీ!
సాక్షి, కామారెడ్డి/లింగంపేట: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నుంచి తీసుకున్న దీర్ఘకాలిక రుణాలు రికవరీ కాకపోవడంపై బ్యాంకు అధికారులు కఠిన చర్యలకు దిగుతున్నారు. తనఖా పెట్టిన భూములను వేలం వేస్తామంటూ ఆ భూముల్లో ఏకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని లింగంపేట మండలంలోని పోల్కంపేట, పర్మల్ల, శెట్పల్లి సంగారెడ్డి తదితర గ్రామాల రైతులు 2010 ప్రాంతంలో పెద్ద మొత్తంలో దీర్ఘకాలిక రుణాలు తీసుకున్నారు. కొందరు కొన్ని వాయిదాలు చెల్లించి మానుకోగా, మరికొందరు అసలే చెల్లించలేదు. కొందరు మాత్రం పూర్తిగా చెల్లించారు. అయితే భూమిని తనఖా పెట్టి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాల్సిందేనని బ్యాంకు అధికారులు కొన్నేళ్లుగా రైతులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ మేరకు పలుమార్లు నోటీసులిచ్చారు. భూములను వేలం వేస్తామని హెచ్చరించారు. అయితే అప్పులు తీసుకుని పది పదిహేనేళ్లు కావడంతో వడ్డీలు పెరిగిపోయాయి. అప్పట్లో రూ.5 లక్షలు అప్పు తీసుకుంటే ఇప్పుడది రూ.15 లక్షలు దాటింది. ఇంత పెద్ద మొత్తం చెల్లించడం రైతులకు భారంగా మారింది. వడ్డీ తగ్గించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా అప్పులు చెల్లించడం లేదంటూ బ్యాంకర్లు ప్రత్యక్ష చర్యలకు దిగుతున్నారు. పోల్కంపేటలో ఓ రైతు పొలంలో భూమిని వేలం వేస్తామంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో ఆ గ్రామానికి చెందిన రైతులంతా ఆందోళనకు గురవుతున్నారు. వడ్డీలు తగ్గిస్తే అప్పు తిరిగి చెల్లిస్తామని పేర్కొంటున్నారు. చట్ట ప్రకారమే వ్యవహరిస్తున్నాం బ్యాంకుకు భూమి తనఖా పెట్టి అప్పు తీసుకున్న రైతు తిరిగి చెల్లించకపోవడమే గాక, ఆ భూమిని అమ్ముకోవడం చట్టరీత్యా నేరం. బ్యాంకు తనఖాలో ఉన్న భూమిని ఎలా అమ్ముకుంటారు? ఆ భూమిపై బ్యాంకుకే హక్కు ఉంటుంది. లింగంపేట మండలంలో దాదాపు 7 వందల మంది రైతులు దీర్ఘకాలిక రుణాలు తీ సుకున్నారు. వారిలో చాలామంది అప్పులు తి రిగి చెల్లించలేదు. సహకార చట్టం ప్రకారం వా రందరికీ నోటీసులిచ్చాం. వారి ఆస్తులను జప్తు చేయడం, లేదా వేలం వేయడం జరుగుతుంది. – కుమారస్వామి, బ్రాంచి మేనేజర్, ఎన్డీసీసీబీ, లింగంపేట -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
కందుకూరు: చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీ కడుతూ విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందిన ఘటన శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా కందుకూరు మండలం మాచవరంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఇనకొల్లు గజపతి, అనూరాధ దంపతుల కుమారుడు నరసింహ (21) తోటి యువకులతో కలిసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ భారీ ఫ్లెక్సీ ఏర్పాటుకు సంకల్పించారు.తన ఇంటి సమీపంలో ఫ్లెక్సీ కట్టేందుకు యత్నిస్తుండగా, ఒక్కసారిగా పెద్ద గాలి వచ్చింది. దీంతో ఫ్లెక్సీ బ్యాలెన్స్ తప్పి పక్కనే వెళ్తున్న 11 కేవీ విద్యుత్ లైన్పై పడింది. ప్రమాదంలో ఫ్లెక్సీకి ఉన్న ఇనుప బోర్డుకు విద్యుత్ సరఫరా కావడంతో నరసింహ అక్కడికక్కడే మృతి చెందారు. చేతికి అందివచ్చిన కుమారుడు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. -
ఇదేనా ప్రజాస్వామ్యం!?
రాష్ట్రంలో టీడీపీ నేతలు, కార్యకర్తల దౌర్జన్యాలు రోజురోజుకూ మితిమీరి పోతున్నాయి. చంద్రబాబు, లోకేశ్ కనుసన్నల్లో ఇష్టానుసారం దాడులు చేస్తూ పేట్రేగిపోతున్నారు. అధికారంలోకి వచ్చింది వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను చితకబాదడానికే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఊరూరా ఆస్తుల ధ్వంసం, ప్రభుత్వ కార్యాలయాల బోర్డుల తొలగింపు, శిలాఫలకాల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఎప్పుడో చరిత్ర పుస్తకాల్లో చదువుకున్న ఆటవిక రాజ్యాన్ని తలపిస్తూ పోటీపడి మరీ దాడులు చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ కార్యకర్త దుస్తులు విప్పి కొట్టడమే కాకుండా, లోకేశ్ ఫ్లెక్సీ ఎదుట మోకాళ్లపై కూర్చోబెట్టి బూతులు తిట్టారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కనకాద్రి పల్లెలో 50 ఇళ్లకు మంచి నీరు బంద్ చేశారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలో అర్చకత్వ బాధ్యతలు తమ వర్గీయులకు అప్పగించాలంటూ ఓ పూజారి ఇంటిపై దాడి చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ వర్గీయుల దాషీ్టకాలు ఊరూరా కనిపిస్తున్నాయి. సభ్య సమాజం ఏమనుకుంటుందనే విచక్షణ మరచి బరితెగింపుతో వ్యవహరిస్తున్నారు. మహిళలని కూడా చూడకుండా ఇళ్లలోకి చొరబడి కొడుతున్నారు. ఎక్కడో సినిమాల్లో కనిపించే ఇలాంటి దృశ్యాలు ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో నిజ జీవితంలోనూ చోటుచేసుకోవడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం చోద్యం చూస్తుండటం దారుణం, దుర్మార్గం. పైగా కొన్ని చోట్ల వారే టీడీపీ కార్యకర్తలుగా మారి పూనకం వచ్చినట్లు ఊగిపోతుండటం గమనార్హం. ఏ తప్పూ చేయకపోయినా పల్నాడు జిల్లాలో ఊరు విడిచి వెళ్లాలని ఒక ఉప సర్పంచ్ను ఓ సీఐ తీవ్రంగా హెచ్చరించడం, బాధితుడు ఒత్తిడి తాళలేక ఆత్మహత్య చేసుకోవడం అరాచకానికి పరాకాష్ట. పరిస్థితి చూస్తుంటే రాష్ట్రం రావణ కాష్టం అవ్వాలన్నదే బాబు, లోకేశ్ల అభిమతంగా అనిపిస్తోంది. -
గాలి భానుప్రకాష్ అతి.. ఓట్ల లెక్కింపునకు ముందే..!
నగరి: నగరి నియోజకవర్గం పుత్తూరులో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓట్ల లెక్కింపు జరగముందే తానే ఎమ్మెల్యే అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేయించారు. కొందరు దీన్ని చూసి అంత తొందరేల భానూ.. అంటూ నవ్వుకున్నారు. ఇందంతా ఒక పథకం ప్రకా రం రెచ్చగొట్టడమేనని భావిస్తున్నారు. నేర చరిత కలిగిన వారిని జనంలోకి రప్పించడం.. గతంలో గంజాయి సరఫరా జరిగిందని ప్రచారం జరిగిన ప్రాంతంలో బ్యాడ్మింటన్ కోర్టు ప్రారంభించడం ఏంటని చర్చించుకుంటున్నారు. అది బ్యాడ్మింటన్ కోర్టు కాదు.. విధ్వంస కుట్రలకు కేంద్రంగా చేసుకున్నారని అనుమానిస్తున్నారు. ఇదంతా ఎన్నికల కమిషన్కు కనబడలేదా అని జనం ప్రశి్నస్తున్నారు.ఆలూ లేదు, చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది టీడీపీ నేతల పరిస్థితి. ఓట్ల లెక్కింపు జరగలేదు. గెలుస్తారో లేదో కూడా తెలియదు. నగరిలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ ఎమ్మెల్యే అంటూ పుత్తూరు పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం హాస్యాస్పదంగా మారింది. ఇదేం విడ్డూరం అంటూ జనం నవ్వుకుంటున్నారు.బ్యాడ్మింటన్ కోర్టు ప్రారంభోత్సవంలో గాలి భానుప్రకాష్పుత్తూరు మున్సిపాలిటీ చింతలగుంటలో గతంలో బీఎస్ జిమ్ నిర్వహించేవారు. ఏడాది క్రితం ఈ జిమ్ నిర్వాహకుడు టీడీపీ నేత హరి విశాఖపట్నం అరకు వద్ద గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఆ తర్వాత ఆ జిమ్ నిరుపయోగంగా మారింది. ఈ జిమ్ నుంచే గంజాయి సరఫరా జరిగేదంటూ అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అనంతరం ప్రచారాల్లోను, పలు కార్యక్రమాల్లోను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్తో పాటు గంజాయి స్మగ్లర్, అతని అనుచరులు పాల్గొనడం అప్పట్లో వివాదాస్పదమైంది. వివాదాలకు చిరునామాగా ఉన్న వీరంతా తాజాగా మరో వివాదానికి తెరతీశారు. నిరుపయోగంగా ఉన్న జిమ్ను బ్యాడ్మింటన్ కోర్టుగా మార్చి ఎన్ని కల కోడ్ ఉండగానే టీడీపీ అభ్యరి్థతో ప్రారం¿ోత్సవం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో భానుప్రకాష్ ఎమ్మెల్యే, నగరి అంటూ ముద్రించి ప్రదర్శనగా ఉంచారు.కోడ్ వర్తించదా? ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్న టీడీపీ నాయకులకు ఎన్నికల నిబంధనలు వర్తించవా అంటూ నగరి నియోజకవర్గ ప్రజలు ప్రశి్నస్తున్నారు. బహిరంగంగా ఒక అభ్యర్థి ఎమ్మెల్యే అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి ప్రారం¿ోవాలు చేస్తుంటే వారిపై చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.రెచ్చగొట్టి విధ్వంసాలకు పాల్పడేందుకేనా?ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే పుత్తూరు టీడీపీ నాయకుల దుశ్చర్యను చూసి వైఎస్సార్సీపీ నాయకులు, స్థానిక ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. రాజకీయ పారీ్టలను రెచ్చగొట్టి.. గొడవలు సృష్టించి విధ్వంసాలకు పాల్పడేందుకే పథకం వేశారని స్థానికులు భయపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించేందుకే నేరచరిత కలిగిన వారిని టీడీపీ నాయకులు జనంలోకి తీసుకొస్తున్నట్టు సమాచారం. -
లోకేష్, బాబు ఫ్లెక్సీలు చించేసిన టీడీపీ క్యాడర్
-
కూటమిలో క్రోధాగ్ని నిరసనల భగభగలు
సాక్షి, రాజమహేంద్రవరం/నూజివీడు/కాళ్ల: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో కుమ్ములాటల పర్వం కొనసాగుతోంది. తెలుగు సంవత్సరాది వేళా నిరసనల సెగ చల్లారలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి స్వపక్ష శ్రేణుల్లోనే విభేదాల అగ్గి రాజేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలోని ద్వారకామాయి ఫంక్షన్ హాలులో సోమవారం రాత్రి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సమన్వయ సమావేశం రసాభాసగా మారింది. రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన తరువాత తొలిసారి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పురందేశ్వరి పాల్గొన్నారు. సభా వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, పురందేశ్వరి, కూటమి రాజానగరం నియోజకవర్గ అభ్యర్థి, జనసేన నేత బత్తుల బలరామకృష్ణ ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీనిలో టీడీపీ రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి ఫొటో లేకపోవడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ కోసం సీటు త్యాగం చేసిన నేత ఫొటో ఎందుకు పెట్టలేదని పురందేశ్వరిని నిలదీస్తూ ఆ ఫ్లెక్సీని చించి పారేశారు. ఫ్లెక్సీలో ఉన్న మోదీ ఫొటోనూ చించివేస్తున్నా వారిని వారించేందుకు పురందేశ్వరి కనీసం యత్నించకపోగా, చిరునవ్వులు చిందిస్తూ అలాగే వేదికపై కూర్చోవడం విమర్శలకు దారి తీసింది. ఆమె తీరుపై బీజేపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ శ్రేణుల నిరసనల నేపథ్యంలో ఫంక్షన్ హాలు నుంచి ఆమె మెల్లగా జారుకున్నారు. సాధారణంగా పార్టీ అగ్రనేతల ఫొటోలు, ఫ్లెక్సీలను ఎవరైనా చించితే నాయకులు, కార్యకర్తలు సహించలేరు. కానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వైఖరి ఇందుకు భిన్నంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ► పశ్చిమగోదావరి జిల్లా ఉండి సీటు మార్చే యోచనలో టీడీపీ అధిష్టానం ఉండటంతో ఎమ్మెల్యే మంతెన రామరాజు భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. కాళ్ల మండలం పెదఅమిరం నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో మంగళవారం నిర్వహించిన టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. సమావేశంలో టీడీపీ నాయకులు స్పందిస్తూ.. ఉండి అభ్యర్థిని మారిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజీనామాలకూ వెనుకాడబోమని స్పష్టం చేశారు. సమావేశానికి పార్టీ పరిశీలకుడిగా వచ్చిన ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు సమక్షంలోనే వారు ఈ విషయాన్ని తేల్చిచెప్పడం గమనార్హం. ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ.. తన సీటును వదులుకోవడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. ఏ తప్పూ చేయకుండా త్యాగానికి సిద్ధం కావాలనడం న్యాయం కాదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్నీ విధిగా చేయడం తన తప్పా అని ప్రశ్నించారు. కార్యకర్తల నిర్ణయమే తనకు శిరో«దార్యమని, వేరే వ్యక్తికి సీటు కేటాయిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పార్టీ నేతల అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళతానని గన్ని వీరాంజనేయులు చెప్పారు. తొలి నుంచీ పురందేశ్వరికి చుక్కెదురు వాస్తవానికి ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన పురందేశ్వరికి మొదటి నుంచీ ఇక్కడ చుక్కెదురవుతూనే ఉంది. రాజమహేంద్రవరం వచ్చిన వెంటనే ఆమె స్థానిక బీజేపీ నాయకులను కలుపుకొని వెళ్లాల్సింది పోయి.. వేరుకుంపటి పెట్టారు. పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును పూర్తిగా పక్కన పెట్టారు. ఈ పరిణామం సోము వర్గంతోపాటు పార్టీ శ్రేణులను దూరం చేసింది. దీంతో సభలు, సమావేశాల్లో ఆమెకు నిరసనల సెగ ఎదురవుతూనే ఉంది. అనపర్తి ఎమ్మెల్యే టికెట్ను తొలుత టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కేటాయించి.. పొత్తు అనంతరం బీజేపీకి ఇవ్వడంపైనా టీడీపీ వర్గాల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. అక్కడ ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి, స్థానిక బీజేపీ నాయకులను వ్యతిరేకిస్తూ రామకృష్ణారెడ్డి స్వతంత్రంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినా పురందేశ్వరి పెదవి విప్పకపోవడంపై ఆమె టీడీపీకి లాభం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఫ్లెక్సీలో ప్రధాని మోదీ ఫొటో చించుతున్నా స్పందించకపోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోందని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. -
దీర్ఘకాలంలో నమ్మకమైన లాభాలనిచ్చే ఫండ్.. ఓ లుక్కేయండి..
లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ వేల్యుయేషన్లను అర్థం చేసుకోవడం సాధారణ ఇన్వెస్టర్లకు కష్టమైన విషయమే. భవిష్యత్తులో వీటిల్లో ఏ విభాగం, మిగిలిన విభాగాలతో పోలిస్తే మంచి పనితీరు చూపిస్తుందని ముందుగా గుర్తించడం కూడా కష్టమే. గత 15 ఏళ్ల కాలంలో లార్జ్క్యాప్ ఇండెక్స్ నాలుగేళ్ల కాలంలో మంచి పనితీరు చూపించగా, మిడ్క్యాప్ ఇండెక్స్ కూడా నాలుగు సంవత్సరాలలో మంచి పనితీరు ప్రదర్శించింది. కానీ, స్మాల్క్యాప్ మాత్రం ఏడేళ్లలో మంచి పనితీరు చూపించింది. కనుక ప్రతీ విభాగంలోనూ ఇన్వెస్టర్ దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా రాబడులు ఆర్జించడానికి మంచి అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇలా లార్జ్, మిడ్, స్మాల్క్యాప్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టి మంచి రాబడులు ఇచ్చేవే ఫ్లెక్సీక్యాప్, మలీ్టక్యాప్ ఫండ్స్. ఈ విభాగంలో ఎంతో కాలంగా పనిచేస్తూ, మంచి పనితీరు చూపుతున్న పథకాల్లో హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ గురించి తప్పకుండా చెప్పుకోవాలి. రాబడులు ఈ పథకం ఏ కాలంలో చూసినా కానీ, బెంచ్ మార్క్ అయిన బీఎస్ఈ 500 టీఆర్ఐ కంటే మెరుగైన పనితీరు చూపించింది. గడిచిన ఏడాది కాలంలో 37.58 శాతం రాబడిని ఇన్వెస్టర్లకు తెచ్చి పెట్టింది. మూడేళ్లలో కాలంలో వార్షిక రాబడి 24.27 శాతంగా ఉంది. ఇక ఐదేళ్ల కాలంలో 19.40 శాతం, ఏడేళ్లలో 16.44 శాతం, పదేళ్లలో 17.13 శాతం చొప్పున వార్షిక రాబడి ఈ పథకంలో భాగంగా ఉంది. ఫ్లెక్సీక్యాప్ విభాగం సగటు రాబడితో పోల్చి చూస్తే, ఈ పథకమే 3 శాతం నుంచి 8 శాతం మేర అధిక రాబడిని వివిధ కాలాల్లో అందించినట్టు తెలుస్తోంది. ఇక బీఎస్ఈ 500 టీఆర్ఐతో చూసినా కానీ, ఈ పథకంలోనే 1–6 శాతం మేర వివిధ కాలాల్లో అధిక రాబడి కనిపిస్తుంది. ఈ పథకం 1995 జనవరి 1న ప్రారంభమైంది. గతంలో హెచ్డీఎఫ్సీ ఈక్విటీ ఫండ్ కాగా, అనంతరం ఫ్లెక్సీక్యాప్గా మారింది. ఆరంభం నుంచి వార్షిక రాబడి 19 శాతం మేర ఉండడం గమనించొచ్చు. పెట్టుబడుల విధానం/ఫోర్ట్ఫోలియో హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్కు దేశ ఈక్విటీ మార్కెట్లో సుదీర్ఘ ట్రాక్ రికార్డు ఉండడం గమనార్హం. తొలుత రూ.52 కోట్లతో ఆరంభమైన ఈ పథకంలో ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఈ ఏడాది జనవరి చివరికి రూ.47,642 కోట్లుగా ఉన్నాయి. ప్రతి మార్కెట్ సైకిల్లో మంచి పనితీరు చూపించే అవకాశం ఉన్న రంగాలు, కంపెనీలను గుర్తించి ఇన్వెస్ట్ చేయడం ఈ పథకం ప్రత్యేకత. ప్రస్తుతం ఈ పథకం తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 87.5 శాతమే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. డెట్ సాధనాల్లో 0.42 శాతం పెట్టుబడులు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ సాధనాల్లోనూ 3.79 శాతం మేర ఇన్వెస్ట్ చేసింది. నగదు, నగదు సమానాల రూపంలో 8.29 శాతం పెట్టుబడులు ఉన్నాయి. ఈక్విటీల్లో 91 శాతం పెట్టుబడులను లార్జ్క్యాప్ కంపెనీలకే కేటాయించింది. మిడ్క్యాప్ కంపెనీల్లో 7.61 శాతం, స్మాల్క్యాప్ కంపెనీల్లో 1.52 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. పోర్ట్ఫోలియోలో 41 స్టాక్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లో 32 శాతం పెట్టుబడులు పెట్టింది. హెల్త్కేర్ కంపెనీలకు 12.59 శాతం, టెక్నాల జీ కంపెనీలకు 9.5 శాతం, క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు 7.39 శాతం చొప్పున కేటాయించింది. -
టీడీపీలో ఫ్లెక్సీల లొల్లి
కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు టీడీపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ తన పుట్టిన రోజును వేదికగా చేసుకుని నియోజకవర్గవ్యాప్తంగా గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఫ్లెక్సీల్లో జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నట్లు వ్యక్తుల పేర్లు కాకుండా గ్రామ టీడీపీ అని పేర్కొనడం వివాదానికి కారణమైంది. నియోజకవర్గ టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న పెండ్యాల అచి్చబాబు స్వగ్రామమైన దొమ్మేరులో ఆయన ఫొటో లేకుండా ఈ తరహా ఫ్లెక్సీల ఏర్పాటును ఆ పార్టీ స్థానిక నాయకులు తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో అచ్చిబాబు వర్గీయులు శుక్రవారం గ్రామంలో సమావేశమై మరీ జవహర్పై బహిరంగ విమర్శలకు దిగారు. గ్రామ కమిటీ, స్థానిక నాయకుల ప్రమేయం లేకుండా ‘దొమ్మేరు టీడీపీ’ అని పేర్కొంటూ తమ గ్రామంలో ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారని, ఇది జవహర్ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. పార్టీని రెండు గ్రూపులుగా చేసేందుకు ఆయన ప్రయతి్నస్తున్నారని సీనియర్ నాయకుడు, ఎంపీటీసీ సభ్యుడు యలమర్తి శ్రీరామచంద్రమూర్తి (రాంబాబు)మండిపడ్డారు. దొమ్మేరు గ్రామ కమిటీని సంప్రదించకుండా ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అచి్చబాబు చెప్పినట్లే నడుస్తాం తప్ప, జవహర్ చెప్పినట్లు కాదని స్పష్టం చేశారు. సీనియర్ నాయకుడు కేవీకే రంగారావు, ఉప సర్పంచ్ కలగర సుబ్బారావు, టీడీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కొక్కిరిపాటి శ్రీహరి కూడా జవహర్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పారీ్టకి, ఆ ఫ్లెక్సీలకు ఎటువంటి సంబంధమూ లేదని ప్రకటించారు. గతంలో అచ్చిబాబు చెబితేనే జవహర్కు 13 రోజుల ముందు టికెట్ ఇచ్చినా ఎమ్మెల్యేగా గెలిపించామని అన్నారు. దొమ్మేరులో జవహర్కు మద్దతుదారులు లేరని ప్రకటించారు. అందువల్లే సొంతంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారన్నారని అన్నారు. కొవ్వూరులో శుక్రవారం జరిగిన జవహర్ పుట్టిన రోజు వేడుకలకు సైతం అచి్చబాబు వర్గీయులు దూరంగానే ఉన్నారు. ఇటీవల అభ్యర్థుల ఖరారులో భాగంగా అధిష్టానం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో కూడా జవహర్ పేరు ప్రస్తావించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజా వివాదానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎనిమిదేళ్లుగా..: జవహర్, అచ్చిబాబు వర్గాల మధ్య ఏడెనిమిదేళ్లుగా వివాదం నడుస్తోంది. దీంతో నియోజకవర్గంలో టీడీపీ రెండు గ్రూపులుగా పనిచేస్తోంది. గతంలో అచి్చబాబు వర్గం వ్యతిరేకించినందునే జవహర్ను అధిష్టానం కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గానికి పంపింది. అక్కడ ఓటమి చవిచూసిన ఆయన మళ్లీ కొవ్వూరుపై దృష్టి సారించారు. పేరుకు జిల్లా అధ్యక్షుడి పదవి కట్టబెట్టినప్పటికీ కొవ్వూరు నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని అధిష్టానం షరతు విధించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
కోపంతో ఊగిపోయిన బాలయ్య
-
చంద్రబాబు గుండెల్లో...జూనియర్ పేలుస్తున్న బాంబు..!
-
జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని తీసేయాలంటూ బాలకృష్ణ హుకుం
-
‘వెయ్యి మంది బాలకృష్ణలు వచ్చినా జూ.ఎన్టీఆర్ను ఏం చేయలేరు’
సాక్షి, కృష్ణా జిల్లా: లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపుపై ఆయన స్పందిస్తూ.. వాళ్లది నీచాతినీచమైన బుద్ధి. వెయ్యిమంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ను ఏం చేయలేరు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన ఏమీ చేయలేరు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన వారు ఎన్టీఆర్ వర్ధంతి చేస్తారా?’’ అంటూ కొడాలి నాని మండిపడ్డారు. ఎన్టీఆర్ సమాధి సాక్షిగా నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు బాలకృష్ణ అనుచరులు. బాలకృష్ణ ఆదేశాల మేరకే ఫ్లెక్సీలు తొలగించినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ వచ్చి వెళ్లిన మరుక్షణమే ఫ్లెక్సీలు తొలగించారు. -
ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపు
-
జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పీకిపాడేసిన టీడీపీ గ్యాంగ్
-
నందమూరి ఫ్యామిలీలో బయటపడ్డ విభేదాలు
సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్ సమాధి సాక్షిగా నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ చూసిన ఆగ్రహంతో ఊగిపోయిన బాలయ్య.. ఫ్లెక్సీని తీసేయాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో బాలకృష్ణ అభిమానులు.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. బాలకృష్ణ వచ్చి వెళ్లిన మరుక్షణమే ఫ్లెక్సీలు తొలగించారు. ఫ్లెక్సీలు తొలగించడంపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్కు మధ్య గ్యాప్ మరింత పెరిగింది. గతంలో చంద్రబాబు అరెస్ట్ విషయంలో నందమూరి వంశానికి చెందిన జూనియర్ ఎన్టీయార్ సైతం మౌనంగా ఉండిపోవడంతో నందమూరి, నారా కుటుంబాలకు పెద్ద షాకే ఇచ్చింది. చంద్రబాబు అరెస్ట్ విషయంలో తారక్ స్పందించకపోవడంతో ఆయనపై బాలకృష్ణ బహిరంగంగానే ఐ డోంట్ కేర్ అంటూ ఫైర్ అయిన విషయం తెలిసిందే. 👉: తాత వర్థంతికి సిసలైన మనవడు ఎన్టీఆర్ నివాళి.. బాలయ్య సీరియస్ (ఫొటోలు) -
జూ.ఎన్టీఆర్ X టీడీపీ
సాక్షి, భీమవరం/పెనుగొండ/తిరువూరు: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ‘రా... కదలి రా..’ పేరిట ఆదివారం నిర్వహించిన సభకు హాజరైన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. వారు తీసుకొచ్చిన ఫ్లెక్సీలు, జెండాలను లాక్కుని వారిపై వీరంగం సృష్టించి అక్కడినుంచి తరిమేశారు. ఆచంటలో వారిని అడ్డుకునేందుకు వచ్చిన జనసేన కార్యకర్తలపైనా టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఆచంటలో లక్ష మంది జనంతో ఈ సభ నిర్వహించాలని టీడీపీ నాయకత్వం విస్తృత ప్రచారం నిర్వహించినా కనీసం 12 వేల మంది కూడా హాజరుకాకపోవడంతో క్యాడర్లో నిరుత్సాహం నెలకొంది. ఈ తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జై ఎన్టీఆర్ పేరుతో జూనియర్ ఎన్టీఆర్ బొమ్మతో రూపొందించిన ఫ్లెక్సీలు తీసుకుని సభాస్థలికి వచ్చారు. టీడీపీ క్యాడర్ వారిని అడ్డుకున్నారు. వారి చేతిలోని ఫ్లెక్సీని లాక్కుని వారితో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జై ఎన్టీఆర్, జై జూనియర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో జనసేన అభిమానులు సైతం వారి పార్టీ జెండాలతో రావడంతో వారి చేతుల్లోని జెండాలను కూడా టీడీపీ క్యాడర్ లాక్కుని బయటకు విసిరేశారు. ఈ తరుణంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆచంటలో కానరాని జనసేన టీడీపీ, జనసేన నాయకత్వం మధ్య అంతర్గత పోరు జరుగుతున్నట్టు ఆచంటలో జరిగిన చంద్రబాబు సభ ద్వారా బయటపడింది. ఈ సభకు సంబంధించి జనసేనకు సరైన సమాచారం ఇవ్వలేదన్న భావనతో ఆ పార్టీ నాయకులు బహిరంగ సభకు దూరంగా ఉన్నారని తెలియవచ్చింది. నియోజకవర్గ జనసేన ఇన్చార్జి చేగొండి సూర్యప్రకాష్ సైతం రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. వెలవెలబోయిన రెండు సభలు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన రెండు సభలకు జనం నుంచి ఆదరణ కరువైంది. రెండు చోట్లా ఆశించిన రీతిలో జనం రాకపోవడంతో నాయకులు హతాశులయ్యారు. ఆచంటలో చంద్రబాబు జనంకోసం ఎదురు చూస్తూ హెలీప్యాడ్ వద్దే నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో ఆలస్యంగా సభ ప్రారంభం కావడంతో వచ్చిన జనం కాస్తా వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇక తిరువూరులో 20 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సభ జనం లేక వెలవెలబోయింది. సగానికి పైగా స్థలంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. సభకు వచ్చిన జనం కూడా చంద్రబాబు ప్రసంగం ప్రారంభించకముందే వెనుదిరగడం గమనార్హం. ఎంపీ కేశినేని నాని రావడం లేదన్న సమాచారంతో ద్వితీయ వర్గం నాయకులు, కార్యకర్తలు డుమ్మా కొట్టారు. విసుగెత్తించిన ‘బాబు’ ప్రసంగం రెండు సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించిన తీరు హాజరైన ప్రజలను విసుగెత్తించింది. ఆరు హామీల అమలుపై ‘బాబు’ ప్రసంగంపై మహిళలు పెదవి విరిచారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అమలుచేసే సంక్షేమ పథకాలు తమకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయంటూ బాహాటంగానే విమర్శించడం గమనార్హం. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు విమర్శించిన తీరుని సైతం పలువురు తప్పుపట్టారు. ప్రసంగం ఆద్యంతం ఆత్మస్తుతి పరనిందగా సాగింది. ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది తానేనని చెప్పుకొచ్చారు. అంబులెన్సుకూ దారివ్వని తమ్ముళ్లు తిరువూరు సభకు వచ్చిన వాహనాలు విజయవాడ–జగదల్పూర్ జాతీయ రహదారిపై అడ్డదిడ్డంగా నిలిపివేయడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. దూరప్రాంతాల నుంచి వచ్చిపోయే భారీవాహనాలతో పాటు అత్యవసర చికిత్స నిమిత్తం రోగులను తరలించే అంబులెన్సుకు కూడా దారి ఇవ్వకుండా తెలుగుతమ్ముళ్ళు అవరోధాలు కల్పించారు. తిరువూరు సీఐ అబ్దుల్ నబీ తన సిబ్బందితో ట్రాఫిక్ నియంత్రణ చేసి అంబులెన్సును పంపారు. అధికారమిస్తే ఆరుపథకాలు తిరువూరు, ఆచంట సభల్లో చంద్రబాబు నాయుడు తిరువూరు/సాక్షి, భీమవరం/పెనుగొండ: రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిని గెలిపించి అధికారం కట్టబెడితే ఆరు పథకాలను అమలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో ఆదివారం నిర్వహించిన రా కదలిరా పేరిట టీడీపీ నిర్వహించిన సభల్లో ఆయన ప్రసంగించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, మూడు వంటగ్యాస్ సిలిండర్లు ఉచిత సరఫరా, రైతులకు ఏడాదికి రూ.50 వేల ఆర్థికసాయం ప్రధానంగా అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికీ అండగా నిలబడటమే టీడీపీ, జనసేన లక్ష్యమని చెప్పుకొచ్చారు. తెలుగు జాతిని తిరుగులేని శక్తిగా తయారు చేసే బాధ్యతను తీసుకుంటామని పేర్కొన్నారు. ఆక్వారంగాన్ని వైఎస్సార్సీపీ అతలాకుతలం చేసిందనీ, తాము అధికారంలోకి వస్తే ఆక్వా రంగానికి పూర్వ వైభవం తెస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వంలో సమర్థుడైన మంత్రి ఒకరూ లేరన్నారు. తాము అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు తెస్తామని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తన విజన్ కారణంగానే హైదరాబాద్ సాఫ్ట్వేర్ రంగానికి ప్రధాన కేంద్రమైందని, లక్షలాదిమంది ఉద్యోగాలు పొందడానికి తానే కారణమని గొప్పగా చెప్పారు. తిరువూరు సభలో వేదికపై ఎంపీ కేశినేని నానికి ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబు పక్కనే సీటు కేటాయించారు. కానీ ఆయన డుమ్మాకొట్టారు. తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు సైతం సభ వైపునకు రాకపోవడం చర్చనీయాంశమైంది. తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ప్రకటిస్తారని ఆశించిన ప్రస్తుత ఇన్చార్జి శావల దేవదత్ ఆ ఊసే లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆచంట సభలో పాలకొల్లు, ఉండి ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, కేఎస్ జవహర్, పీతల సుజాత తదితరులు ప్రసంగించారు. -
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఫ్లెక్సీ, పోస్టర్ వార్
-
బుద్ధప్రసాద్కు షాకిచ్చిన దివిసీమ రైతులు
సాక్షి, కృష్ణా జిల్లా: అవనిగడ్డలో టీడీపీ నేత మండలి బుద్ధప్రసాద్కు దివిసీమ రైతాంగం షాకిచ్చింది. పులిగడ్డ ఆక్విడెక్ట్ వద్ద రైతు సమస్యలపై సామూహిక సత్యాగ్రహ దీక్ష పేరిట బుద్ధ ప్రసాద్ డ్రామాకు తెరతీశారు. బుద్ధ ప్రసాద్కు వత్యిరేకంగా పులిగడ్డ సెంటర్లో దివిసీమ రైతులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నాడు-నేడు పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన దివిసీమ రైతాంగం.. చంద్రబాబు ప్రభుత్వంలో రైతుల పరిస్థితి, సీఎం జగన్ ప్రభుత్వంలో రైతుల పరిస్థితులపై ఫోటోలు ప్రదర్శించారు. రైతులకు మేలు చేయకపోగా దొంగ దీక్షలు ఎందుకంటూ మండలి బుద్ధ ప్రసాద్ను దివిసీమ రైతులు నిలదీశారు. చదవండి: ఆర్జీవీ థర్డ్ గ్రేడ్ అంటూ లోకేశ్ వ్యాఖ్యలు.. రివర్స్ కౌంటర్ ఇచ్చిన వర్మ -
శ్రీకాకుళం జిల్లా వంశధార పర్యటనలో చంద్రబాబుకు నిరసన సెగ
-
డామిట్!.. కథ అడ్డం తిరిగింది.. టీడీపీకి పెద్ద షాకే తగిలింది..
ఏపీలో ఉనికి కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ రకరకాల విన్యాసాలు చేస్తోంది. ఎంతకీ ప్రజలు గుర్తించడం లేదని దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. అధికార పార్టీ మీద బురద జల్లి లబ్ది పొందే ప్రయత్నాలు చేస్తోంది. ఒంగోలులో లోకేష్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వైఎస్సార్సీపీపై నెట్టే ప్రయత్నం చేసింది. విషయం తెలిసి ప్రజలు అసహ్యించుకోవడంతో సైలెంట్గా వాటిని తొలగించింది. ఇంతకీ ఒంగోలులో జరిగిందేంటి? ప్రకాశం జిల్లాలో రాజకీయ భవిష్యత్ వెతుక్కుంటున్న తెలుగుదేశం, జనసేన నానా రకాల పాట్లు పడుతున్నాయి. ఎప్పటికప్పుడు అధికార పార్టీ మీద విషం చిమ్మడం, ప్రజలతో చీవాట్లు తినడంతో తాజాగా ఫ్లెక్సీల వివాదానికి తెర తీశాయి. వైఎస్సార్సీపీ మీద విషం చిమ్ముతూ ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు టీడీపీ, జనసేనలు సాగిస్తున్న కుట్ర రాజకీయాలను తెలియచేస్తున్నాయి. ఒంగోలు నగరంతో పాటు మార్కాపురం, దర్శి, కొండెపి పట్టణాల్లో నరకాసుర వధ అంటూ కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని కించరిచేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పైశాచికానందం పొందారు. ఈ ఫ్లెక్సీలపై అధికార పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు తొలగిస్తున్న పోలీసులపై కూడా దాడికి ప్రయత్నం చేసారు జనసేన కార్యకర్తలు. ఆ గొడవతో మైలేజ్ పొందుదామనుకున్నవారికి ప్రజల్లో అవమానాలు తప్పలేదు. ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న నారా లోకేష్ పాదయాత్రకు ప్రజల నుండి స్పందనే కనిపించడంలేదు. పాదయాత్ర వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు టీడీపీ ఫ్లెక్సీల వివాదంను తెరపైకి తెచ్చింది. ఒంగోలు, కనిగిరి, దర్శి నియోజకవర్గాల్లో జూనియర్ ఎన్టీఆర్కు మద్దతుగా రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు వెలిశాయి. నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్.. అసలోడు వచ్చేవరకే.. కొసరోడుకి పండగ అనే కామెంట్స్తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. తెల్లవారు జాము నుండే ఎల్లో మీడియాకు లీకులిస్తూ.. వైఎస్సార్సీపీ నేతలే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ ప్రచారం ప్రారంభించారు. అయితే తాము ఒకటి అనుకుంటే మరొకటి జరగడంతో ఉదయం 8 గంటలకల్లా టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలను తొలగించేశారు. చదవండి: ‘పురంధేశ్వరి బీజేపీలో ఉంటూ టీడీపీకి పనిచేస్తున్నారా?’ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు ద్వారా లబ్దిపొందుదామనుకున్న తెలుగు తమ్ముళ్లకు పెద్ద షాకే తగిలింది. నారా లోకేష్ను కొసరోడు అంటూ తెలుగు తమ్ముళ్లే ప్రచారం చేస్తున్నారనే ప్రచారం జిల్లాలో మొదలైంది. తమ నాయకుడిని తామే ఎగతాళి చేస్తున్నట్లుగా ఫ్లెక్సీలు పెట్టారని టీడీపీ ఆఫీసుల్లోనే చర్చ జరిగింది. పార్టీకి జరిగిన డ్యామేజ్ గురించి అర్థం చేసుకునేలోగా.. చంద్రబాబు నుంచి చీవాట్లు రావడంతో సైలెంట్ అయిపోయారు. కొందరు వాలంటీర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ మీడియాకు చెప్పి మిన్నకుండిపోయారు. తర్వాత వాటిని తొలగించేశారు. తమ పార్టీని పైకి లేపుతూ...అధికార పార్టీ పరువు తీయాలని టీడీపీ వాళ్లు చేసే ప్రతి పనీ వారికే ఎదురుకొడుతోంది. ఎప్పటికప్పుడు తమ పరువును తామే తీసుకుంటున్నారంటూ టీడీపీ దీనస్థితిపై టాక్ నడుస్తోంది. -
యువగళంలో నారా లోకేష్కు షాక్ ఇచ్చిన తమ్ముళ్లు
-
యువగళంలో నారా లోకేష్ బిత్తరపోయేలా..
సాక్షి, ప్రకాశం: యువగళం పేరుతో జనాదరణకు దూరంగా.. సెల్ఫీ(ల్ఫ్) పాదయాత్ర చేసుకుంటూ పోతున్న తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్కు బిత్తరపోయే దృశ్యం కనిపించింది. ఒంగోలులో లోకేష్కు ఝలక్ ఇచ్చేలా కొందరు తెలుగు తమ్ముళ్లే ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ను హైలెట్ చేస్తూ పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన టీడీపీ కార్యకర్తలు.. ‘‘అసలోడు వచ్చేవరకూ కొసరోడికి పండగే’’ అంటూ ప్రధాన కూడలలో వాటిని ఏర్పాటు చేశారు. ఒకవేళ.. భవిష్యత్తులో ఎప్పుడైనా టీడీపీ అధికారంలోకి వస్తే ఎన్టీఆరే సీఎం అవుతాడంటూ అందులో రాసి ఉంచారు. దీంతో ఫ్లెక్సీని చూసి ఉలిక్కిపడ్డ లోకేష్ అనుచరగణం దానిని తొలగించే యత్నం చేసింది. బహుశా ఇది జూనియర్ ఫ్యాన్స్ పని అయ్యి ఉండొచ్చనే చర్చ నడుస్తోంది. ఇదే ఫ్లెక్సీ లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్(స్వర్గీయ) ఫొటోతో పాటు .. లోకేష్ తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు బొమ్మ కూడా ఉండడం గమనార్హం. ఇక లోకేష్ను ఎన్టీఆర్ రాజకీయ వారసుడిగా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని.. సిసలైన వారసులకే పార్టీ పగ్గాలు అప్పజెప్పాంటూ ఓ వర్గం మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. -
ఈ పేద జీవితంలో ఆశలు చిగురించాయి
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): ‘నేను నిరుపేదను. ఎలాంటి స్థిరాస్తులు లేవు. రోజువారీ కూలీ అయిన నేను కుటుంబ అవసరాలు తీర్చలేకపోవడంతో పాటు పిల్లల చదువుల కోసం ఎంతో ఇబ్బందులు పడుతుండేవాడిని. ఇలాంటి నా జీవితంలో సంక్షేమ పథకాలతో వెలుగులు నింపారు. సగర్వంగా తలెత్తుకుని జీవించేలా చేశారు. ఆర్థికంగా చితికిపోకుండా జీవితంపై ఆశలు చిగురింప చేసిన జగనన్నా ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి. మా కుటుంబం మొత్తం మీ వెనుక నడుస్తాం’ అంటూ ఓ నిరుపేద తన అభిమానాన్ని ఫ్లెక్సీ రూపంలో తెలిపాడు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందిన ఎస్ఎన్ మీరా (సుభానీ) కుటుంబం కూలి పనులు చేసుకుని జీవిస్తుంటుంది. అన్నింటికీ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సమయంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ంది. అతనికి పలు పథకాల ద్వారా లబ్ధి అందించింది. దీంతో అతను దీన స్థితి నుంచి బయటపడి సగౌరవంగా జీవిస్తున్నాడు. తన కుటుంబానికి ప్రభుత్వం ఏమి లబ్ధి చేకూర్చిందో ఫ్లెక్సీ వేసి తన ఇంటి గోడకి అతికించాడు. ‘మీ ఉప్పు తింటున్నాం.. మీకు విశ్వాసంగా ఉంటాం’ అంటూ ప్లెక్సీ వేయించి సీఎం జగన్కు, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు కృతజ్ఞతలు తెలిపారు. ఫ్లెక్సీలో ఇలా రాశాడు.. ♦ వైఎస్సార్ చేయూత పథకంలో వచ్చి న రూ. 56,250తో నా భార్య జక్రియా బేగం కిరాణా షాపు ఏర్పాటు చేసుకుంది. ♦ డ్వాక్రా రుణమాఫీతో రూ.36 వేలు లబ్ధి. ♦ కుమార్తె ఫాతిమా జేఎన్టీయూలో ఎంటెక్ చదువుకు వసతి దీవెన కింద రూ.40 వేలు, ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.30వేలు, కుమారుడు బీకాం కంప్యూటర్స్ చదువుకు రూ.45 వేలు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద రూ.30 వేలు, మరో కుమార్తె నబీనా ఎమ్మెస్సీ బీఈడీ చదువుకు ఫీజు రూ. 30 వేల లబ్ధి చేకూరింది. -
యువగళం..అత్యుత్సాహం!
నాయుడుపేట: యువగళం పాదయాత్రలో తెలుగు తమ్ముళ్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. తమ అధినేత నారా లోకేష్ దృష్టిలో పడేందుకు నానాయాగీ చేశారు. జనాలు కరువైనా పాదయాత్ర విజయవంతం చేసేందుకు నానాతంటాలు పడ్డారు. ఇందులో భాగంగా నాయుడపేటలో కొందరు తమ్ముళ్లు అరాచకం సృష్టించారు. గతంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ బ్యానర్లను ఇష్టారాజ్యంగా చించివేశారు. మరికొన్ని తొలగించి ఎత్తుకెళ్లారు. దీనిపై స్థానిక నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలేం జరిగిందంటే నాయుడుపేట గడియారం సెంటర్ వద్ద పెత్తందారులు.. పేదల మధ్య యుద్ధం అనే బ్యానర్ను గతంలో వైఎస్సార్సీపీ నేతలు ఏర్పాటు చేశారు. నారా లోకేష్ స్థానికంగా బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో టీడీపీ నేతలు ఆ బ్యానర్ను చించివేశారు. ఆపై పక్కనే ఏర్పాటు చేసిన బ్యానర్లనూ నాశనం చేశారు. ఇదే అదునుగా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య బ్యానర్లను చించివేయడమేకాకుండా అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. తమ అధినేత దృష్టిని ఆకర్షించాలని పూనకంతో ఊగిపోయారు. అక్కడే ఉన్న ఎస్ఐ శ్రీకాంత్ వారిని వారించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. యువగళం..నిరుత్సాహం యువగళం పాదయాత్రకు జనాల్ని తరలించేందుకు ఆ పార్టీ నేతలు నానా తంటాలు పడ్డారు. సభకు ఎవరూ రాకపోవడంతో గ్రామాల నుంచి ఆటోల్లో తరలించాల్సి వచ్చింది. ఒక్కొక్కరికీ రూ.200 చొప్పున ఇచ్చి తరలించిన నేతలు.. అందులో కొందరికి డబ్బులివ్వకపోవడంతో మండిపడ్డారు. సంబంధిత చోటామోటా నేతలపై తిట్లదండకం అందుకోవడం కనిపించింది. దీనికితోడు జనాలను తరలించేందుకు పార్టీ ఫండ్గా ఒక్కో పంచాయతీకి రూ.4వేలే ఇవ్వడం.. దాన్ని స్థానిక నేతలు తిరస్కరించడం చర్చనీయాంశమైంది. యువగళం సభలో లోకేష్ మాట్లాడుతున్నా జనం నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. దీంతో చివరిలో డీజే పాటలతో చేతులు ఊపించే ప్రయత్నం చేశారు. రాజ్యాంగ నిర్మాతను మరిచిన లోకేష్ పట్టణంలోని గాంధీమందిరం వద్ద నారా లోకేష్ బహిరంగ సభ జరిగింది. ఆపై పది అడుగుల దూరం నడిచిన ఆయన ఎదురుగా ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని చూసి పటీపట్టనట్టు వెళ్లిపోయారు. అక్కడే ఉన్న కొందరు ఎస్సీ నాయకులు పూలమాల తెచ్చి అంబేడ్కర్ విగ్రహానికి వేయాలని సూచించినా ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. టీడీపీలో ఎస్సీలకు సముచిత స్థానం లేదనడానికి ఇదే నిదర్శనమని కొందరు నేతలు చెవులు కొరుక్కోవడం కనిపించింది. లోకేష్కు రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత లేదు అంబేడ్కర్ను గౌరవించలేని నారా లోకేష్కు ఆయన రాసిన రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హతే లేదని దళిత విద్యావేత్త, దళిత సంఘాల నాయకులు పేర్నాటి సాగర్ తీవ్రంగా విమర్శించారు. దళితోద్ధారకుడినని చెప్పిన లోకేష్కు అంబేడ్కర్ కనిపించలేదా? అని ప్రశ్నించారు. రాజకీయాలకు మాత్రం రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ను వాడుకుంటారా..అని నిలదీశారు. దళితులపై అంకితభావం లేని టీడీపీ నేతలు, దళితోద్ధారకులు ముసుగులు తీయాలని సూచించారు. దళితులు రానున్న ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం నేర్పుతారన్నారు. వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీల చించివేత నాయుడుపేటటౌన్:పట్టణంలోని గాంధీపార్కు సమీపంలో, ఆర్అండ్బీ అతిథి గృహం సమీపంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలను శనివారం అర్ధరాత్రి టీడీపీ నేతలు కొందరు చించి వేశారు. టీడీపీ నేత నారా లోకేష్ జరుపుతున్న యువగళం పాదయాత్రకు ఆ పార్టీ నాయకులు గాంధీపార్కు సెంటర్ తదితర చోట్ల టీడీపీ నేతల ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు. గాంధీపార్కు కూడలి సమీపంలో లోకేష్ బహిరంగ సభను ఏర్పాటు చేయడంతోనే ఈ దుశ్చర్యకు పాల్పడి నట్లు తెలిసింది. ఫ్లెక్సీల చించివేతపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
ఫ్లెక్సీ వార్..! అధికార పక్షం హామీలపై ప్రతిపక్షాల యుద్ధం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార పార్టీపై విమర్శలు గుప్పించేందుకు విపక్షాలు ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం మొదలు క్షేత్రస్థాయిలో నువ్వానేనా అనే విధంగా పోటాపోటీ నడుస్తోంది. కొన్ని చోట్ల ప్రత్యక్ష పోరాటాలు, ఘర్షణలు సైతం చోటుచేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మీడి యా ద్వారా సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకోవడం పరిపాటిగా మారింది. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా సోషల్ మీడియా ద్వారా ఆయా పార్టీల శ్రేణులు, కార్యకర్తలు ప్రచారం చేసుకోవడంతో పాటు ప్రత్యర్థి పార్టీలను విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడా ది ఎన్నికలు జరుగనుండడంతో క్షేత్రస్థాయి పోరు లో సరికొత్తగా ఫ్లెక్సీల యుద్ధానికి దిగుతున్నారు. తెల్లారేపాటికి పట్టణాలు, గ్రామాల్లో పలుచోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లాలో ఈ ఫ్లెక్సీల వార్ రోజురోజుకూ పెరుగుతోంది. నాలుగు నెలల కిందట పసుపు బోర్డు విషయమై ఎంపీ అరవింద్ గురించి బీఆర్ఎస్ శ్రేణులు జిల్లాలో పలుచోట్ల ఫ్లెక్సీలు వేశారు. దీంతో బీజేపీ శ్రేణులు జిల్లాలోని అన్ని మండలాల్లో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై భారీ ఎత్తున ఫ్లెక్సీలు వేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మళ్లీ తాజాగా ఈ ఫ్లెక్సీల వార్ స్పీడందుకుంటోంది. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యేలు గ్రామాలకు వస్తున్న నేపథ్యంలో మంగళవారం జిల్లాలోని నందిపేట మండలం తల్వేద గ్రామం, మోపాల్ మండలం బాడ్సి గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీలు వేశారు. ఎమ్మెల్యే జీవన్రెడ్డి పర్యటన నేపథ్యంలో తల్వేదలో వేసిన ఫ్లెక్సీలో హామీలు మరిచిన ఎమ్మెల్యే తమ గ్రామానికి ఎందుకొస్తున్నావంటూ రాశారు. దీంతో ఎమ్మెల్యే జీవన్రెడ్డి పో లీసు బందోబస్తుతో గ్రామంలో పర్యటించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఎందుకు ఇవ్వలేదంటూ ఒక మహిళ జీవన్రెడ్డిని నిలదీసింది. పలు సమస్యలపై గ్రామ స్తులు నిలదీశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోల ను పోలీసులు డిలీట్ చేయించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇక బాడ్సిలో సైతం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గ్రామ పర్యటన రద్దయ్యింది. ● మీడియా, సోషల్ మీడియా స్థాయి పోరు ఇప్పు డు ఫ్లెక్సీల వరకు రావడం గమనార్హం. ఈ ఫ్లెక్సీల అంశాలు సైతం మీడియాలో, సోషల్ మీడియాలో వస్తుండడంతో ఈ రకమైన సంస్కృతికి పలువురు ఉత్సాహం చూపిస్తుండడం విశేషం. రానున్న రోజుల్లో ఈ ఫ్లెక్సీల పోరుకు అన్ని పార్టీల శ్రేణులు రంగం సిద్ధం చేసుకుంటుండడం గమనార్హం. -
ఎమ్మెల్యేలకు ఫ్లెక్సీల సెగ
మోపాల్/నందిపేట: ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డిలకు ఫ్లెక్సీల సెగ తగిలింది. తమ గ్రామాల అభివృద్ధి ఏం చేశారంటూ ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మోపాల్ మండలం బాడ్సిలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తూ ప్రతిపక్ష పార్టీల నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం సృష్టించింది. బాడ్సి చౌరస్తాతో పాటు స్కూల్ వద్ద ఫ్లెక్సీలు వెలిశాయి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బాడ్సి ప్రైమరీ పాఠశాలకు బాజిరెడ్డి వస్తున్నారని సమాచారం వచ్చింది. దీంతో ప్రతిపక్ష పార్టీల నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఒక్కసారి కూడా బాడ్సికి రాలేదని, ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదని వారు ఆరోపిస్తున్నారు. కానీ అప్పటికే ఎమ్మెల్యే పర్యటన రద్దయ్యింది. ఆర్మూర్ మండలం తల్వెదలో.. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి తల్వెదలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జీవన్రెడ్డికి వ్యతిరేకంగా గ్రామంలో ఫ్లెక్సీలు వెలియడం కలకలం రేపింది. ఇచ్చిన హామీలు మరిచి తమ గ్రామానికి ఏమి చేశారంటూ ఎందుకు వస్తున్నావు అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఫ్లెక్సీలో ఏడు ప్రధాన డిమాండ్లను ప్రస్తావించారు. -
వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో ఫ్లెక్సీ వార్
-
వివాదాస్పదంగా మారిన తెలంగాణ ఆర్టీసీ ఫ్లెక్సీలు
-
చింపేస్తాం.. పీకేస్తాం.. నారా లోకేష్ ఓవర్ యాక్షన్
సాక్షి, వైఎస్సార్(చాపాడు): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ఆదివారం వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో ఈవెనింగ్ వాక్లా సాగింది. మూడు రోజులపాటు సాయంత్రం 5 గంటల తర్వాతే లోకేశ్ పాదయాత్ర జరిగింది. ఇదేం పాదయాత్ర అని స్థానికులు పెదవి విరుస్తున్నారు. ఇలా అయితే ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని వారు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. పాదయాత్ర పొడవునా ప్రతి గ్రామం వద్ద అక్కడికి వచ్చే కొద్దిపాటి మందిని లోకేశ్ దగ్గరకు రప్పించుకుని సెల్ఫీలు తీయించుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సీఎం ఫ్లెక్సీపై లోకేశ్ వాగ్వాదం.. రాత్రికి చించివేత ఇదిలా ఉంటే.. మండల కేంద్రమైన చాపాడులో శనివారం రాత్రి జరిగిన పాదయాత్రలో చాపాడు వద్ద వెలసిన పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం పేరుతో ఉన్న సీఎం వైఎస్ జగన్ ఫ్లెక్సీపై పోలీసులతో లోకేశ్ వాగ్వాదం చేశారు. తమ తండ్రిని కించపరిచేలా ఉన్న ఫ్లెక్సీని చింపేస్తాం.. పీకేస్తాం.. అంటూ మైదుకూరు అర్బన్ సీఐ చలపతి, రూరల్ సీఐ నరేంద్రరెడ్డిలతో ఆయన వాగ్వాదం చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో చాపాడు కూడలిలో ఉన్న ఇద్దరు పోలీసులను కారులో వచ్చిన కొందరు వ్యక్తులు బెదిరించి అక్కడి సీఎం జగన్ ఫ్లెక్సీని చించేశారు. దీనిపై స్థానిక వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేయగా ఆదివారం పోలీసులు ఖాజీపేట ప్రాంతంలో ఆ కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. ఖాజీపేట మండలంలోనూ వైఎస్సార్సీపీ ఫ్లెక్సీనీ టీడీపీ కార్యకర్త చించివేయడం వివాదాస్పదమైంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. చదవండి: RBI Report: అలర్ట్.. నకిలీ నోట్లపై ఆర్బీఐ కీలక రిపోర్ట్ -
వైఎస్ఆర్ సీపీ, జనసేన ఫ్లెక్సీల వివాదంపై మాజీ మంత్రి బాలినేని స్పందన
-
రెచ్చిపోయిన జనసేన కార్పొరేటర్.. ఫ్లెక్సీలను చించివేస్తూ..
సాక్షి,ఒంగోలు టౌన్: ఒంగోలు నగరంలో జనసేనకు చెందిన కార్పొరేటర్, ఇతర నాయకులు సోమవారం తీవ్రంగా రెచ్చిపోయారు. నగరంలో వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను చించివేస్తూ గందరగోళం సృష్టించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతూ ఫ్లైఓవర్ బ్రిడ్జి, చర్చి సెంటర్, ఇతర ప్రధాన కూడళ్లలో వైఎస్సార్సీపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిని చూసి రెచ్చిపోయిన జనసేన నాయకులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడమే కాకుండా పలుచోట్ల వివాదానికి దిగారు. వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను తొలగించాలంటూ పోలీసులతో అడ్డగోలుగా వాదించారు. చర్చి సెంటరుకు చేరుకున్న జనసేన కార్యకర్తలు గొడవలు సృష్టించేందుకు ప్రయత్నించారు. జనసేనకు చెందిన 38వ డివిజన్ కార్పొరేటర్ మునగాల రమేష్ కర్నూలు రోడ్డులోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేశారు. అక్కడ ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న పోలీసులు వారిస్తున్నా వినలేదు. దాంతో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు. రమేష్ను పోలీసులు అదుపులోకి తీసుకొని, ఆ తర్వాత వదిలేశారు. వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను చించివేసిన రమేష్ పై వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. చదవండి: కీలక పరిణామం.. భారీగా ‘మార్గదర్శి’ చరాస్తుల జప్తు! -
‘ఆ ఎమ్మెల్యే కామ పిశాచి’.. హైదరాబాద్లో ఫ్లెక్సీల కలకలం..
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా హైదరాబాద్లో వెలసిన ఫ్లైక్సీలు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ భవన్, పలు మీడియా సంస్థల కార్యాలయాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు పెట్టడంతో సంచలనంగా మారింది. దుర్గం చిన్నయ్య లాంటి కామ పిశాచి బారి నుంచి బెల్లంపల్లి ప్రజలను కాపాడండి అంటూ ఆరిజన్ డెయిరీ పేరుతో ఫ్లైక్సీలు ఏర్పాటు చేశారు. ‘‘కేసీఆర్, కేటీఆర్, మీడియా సంస్థలకు విన్నపం. మాకు న్యాయం చేయాలి’’ అని ప్లెక్సీలో ఉంది. ఎమ్మెల్యేపై ఓ మహిళా తీవ్ర ఆరోపణలు చేయడంతో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తమను నమ్మించి మోసం చేశారంటూ అరిజిన్ పాల సంస్థ భాగస్వామి శైలజ ఆరోపించారు. తమ డబ్బులు తీసుకొని, తిరిగి తమ మీదనే కేసులు బనాయించి రిమాండ్కు పంపించాడని తెలిపారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో తనకు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఆడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఆడియో -
తాడికొండ టీడీపీలో ఫ్లెక్సీల వివాదం
-
చంద్రబాబూ సిగ్గు.. సిగ్గు
పెదకూరపాడు : అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబుకు చుక్కెదురైంది. చంద్రబాబు మంగళశారం పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలంలో సభ నిర్వహించనున్నారు. ఆయన రాకను నిరసిస్తూ అమరావతి ప్రజలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆయన పాలనలో అవినీతిని, గతంలో ఇచ్చిన హామీలను, చేసిన మోసాలను ప్రస్తావిస్తూ సిగ్గు.. సిగ్గు.. అంటూ అమరావతి పట్టణం మొత్తం ఫ్లెక్సీలతో నింపేశారు. టదళితులుగా పుట్టడం తప్పా.. చెప్పండి చంద్రబాబు, లోకేశ్బాబు.. మా జగనన్న సంక్షేమ పాలనలో మేం దళితులుగా పుట్టినందుకు గర్విస్తున్నాం రుణమాఫీ పేరుతో రైతుల గొంతు కోసిన నీ ప్రభుత్వం ఎక్కడ? పెట్టుబడి సాయం, పంట బీమాతో రైతు భరోసా కేంద్రాలతో రైతులకు అండగా నిలుస్తున్న జగనన్న పాలన ఇక్కడ 600 హామీలతో అందుబాటులో లేని నీ మేనిఫెస్టో ఎక్కడ? నవరత్నాలతో 98 శాతం హామీలను అమలు చేసిన మా జగనన్న మేనిఫెస్టో ఇక్కడ... డ్వాక్రా రుణమాఫీ పేరుతో ఆడబిడ్డలను లక్షాధికారులను చేస్తానని కల్లబొల్లి కబుర్లు చెప్పి వారిని నిట్టనిలువునా ముంచిన నీ ప్రభుత్వం ఎక్కడ? ఇచ్చిన మాటకు కట్టుబడి మహిళాభ్యుదయానికై సున్నా వడ్డీ, ఆసరా, చేయూత, వంటి పథకాలను అమలుచేస్తున్న మా జగనన్న ప్రభుత్వం ఇక్కడ... అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు సాయం, డ్వాక్రా మహిళలకు అందుతున్న∙చేయూత, రైతులు, వ్యాపారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు చంద్రబాబు పాలనలో జరిగిన మోసం, సీఎం వైఎస్ జగన్ పాలనలో కలుగుతున్న లబ్ధిని వివరిస్తూ కూడా భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. వాస్తవాలను చాటుతూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను చూసి గత ప్రభుత్వంలో జరిగిన నష్టం, ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ ఫ్లెక్సీల ఏర్పాటుపై టీడీపీ కార్యకర్తలు అమరావతిలో ధర్నా చేపట్టారు. -
అమరావతిలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు
-
రసమయికి ఫ్లెక్సీ షాక్
-
బోధన్ ఎమ్మెల్యే vs మున్సిపల్ చైర్మన్ ఫ్లెక్సీ వార్
-
ఒడిదుడుకుల్లో లాభాల్ని ఒడిసిపట్టే ఫ్లెక్సీక్యాప్ ఫండ్!
మార్కెట్లు అస్థిరతల మధ్య ఉన్నప్పుడు, ఆకర్షణీయమైన అవకాశాలు ఎక్కడ ఉంటే అక్కడకు పెట్టుబడులను మళ్లించే ఫ్లెక్సీక్యాప్ పథకాలు ఎంతో ఆకర్షణీయమని చెప్పుకోవాలి. అన్ని కాలాల్లోనూ పెట్టుబడులకు ఫ్లెక్సీక్యాప్ పథకాలను ఇన్వెస్టర్లు పరిశీలించొచ్చు. ఏదో ఒక విభాగంలో ఇంత చొప్పున ఇన్వెస్ట్ చేయాలనే షరతుల్లేని విభాగం ఇది. పీజీఐఎం ఇండియా ఫ్లెక్సీక్యాప్ ఫండ్ ఈ విభాగంలో మెరుగ్గా రాణిస్తోంది. ఏడేళ్లు అంతకుమించిన కాలానికి పెట్టుబడులు పెట్టుకోవాలని భావించే ఇన్వెస్టర్లు ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. మోస్తరు రిస్క్ తీసుకునే వారికి ఈ విభాగం అనుకూలం. రాబడులు ఈ పథకంలో గడిచిన ఏడాది కాలంలో రాబడులు లేకపోగా, 6 శాతానికి పైగా నికర నష్టాలు చూపిస్తున్నాయి. కానీ, ఈక్విటీ ఫండ్స్ పనితీరును ఎప్పుడూ ఏడాది కాలానికి పెద్దగా పరిగణనలోకి తీసుకోకూడదు. మూడేళ్ల కాలంలో ఇదే పథకం ఏటా 35 శాతం చొప్పున రాబడిని ఇవ్వడాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఐదేళ్ల కాలంలో వార్షిక రాబడి 13 శాతానికి పైనే ఉంది. ఇక ఏడేళ్లలోనూ ఏటా 15 శాతం రాబడిని ఇన్వెస్టర్లకు తెచ్చి పెట్టింది. ఫ్లెక్సీక్యాప్ విభాగం సగటు రాబడితో పోలిస్తే 7 శాతం అధిక ప్రతిఫలం ఈ పథకంలోనే ఉంది. బీఎస్ఈ 500 టీఆర్ఐ సూచీ కంటే మెరుగైన పనితీరు చూపించింది. పెట్టుబడుల విధానం ఈ పథకం పెట్టుబడుల విషయంలో సౌకర్యంగా వ్యవహరిస్తుంది. మిడ్క్యాప్ విభాగం ఎక్కువ దిద్దుబాటుకు గురై ఆకర్షణీయంగా అనిపిస్తుంటే, సదరు విభాగంలోని కంపెనీలకు పెట్టుబడులను పెంచుతుంది. ఇదే మాదిరి స్మాల్క్యాప్, లార్జ్క్యాప్ కంపెనీల విషయంలోనూ వ్యవహరిస్తుంది. అయినప్పటికీ లార్జ్క్యాప్ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. దీనివల్ల పథకం పెట్టుబడుల్లో స్థిరత్వం ఎక్కువ ఉంటుందని భావించొచ్చు. 2020 ఆరంభం వరకు ఈ పథకం తన నిర్వహణ పెట్టుబడుల్లో 60 శాతాన్ని లార్జ్క్యాప్ కంపెనీల్లోనే కలిగి ఉండేది. మిగిలిన మొత్తాన్ని మిడ్క్యాప్, స్మాల్క్యాప్ కంపెనీలకు కేటాయించింది. 2020 మార్చి మార్కెట్ పతనం తర్వాత తన విధానంలో కొంత మార్పు చేసింది. లార్జ్క్యాప్ పెట్టుబడులను 50 శాతం లోపునకు తగ్గించి, స్మాల్, మిడ్క్యాప్ విభాగాలకు కేటాయింపులు పెంచింది. ఆ కాలంలో మిడ్, స్మాల్క్యాప్ గణనీయంగా దిద్దుబాటుకు గురికావడంతో ఈ పని చేసింది. కానీ, గత ఏడాది కాలంలో మార్కెట్లలో అస్థిరతలు పెరిగిపోవడంతో.. తిరిగి లార్జ్క్యాప్ పెట్టుబడులను 60 శాతానికి పైగా పెంచింది. గ్రోత్, వ్యాల్యూ రెండు రకాల పెట్టుబడుల విధానాలను అనుసరిస్తుంటుంది. మూమెంటమ్గా (తాత్కాలికంగా) వచ్చే అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటుంది. ఇందుకు ఉదాహరణ కరోనా వైరస్ కాలంలో ఫార్మాలో పెట్టుబడులు పెంచుకోవడాన్ని ప్రస్తావించొచ్చు. పోర్ట్ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.5,199 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో ఈక్విటీలకు 89 శాతం కేటాయించి, 9.74 శాతం డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసింది. ఒకవేళ ఈక్విటీలు మరింత దిద్దుబాటుకు గురైతే అప్పుడు డెట్ నుంచి ఈక్విటీలకు ఎక్స్పోజర్ పెంచుకునే అవకాశం ఉంటుంది. పైగా వడ్డీ రేట్లు పెరగడం వల్ల డెట్ సాధనాలు కూడా ఆకర్షణీయంగా మారాయి. ఈక్విటీ పెట్టుబడుల్లోనూ లార్జ్క్యాప్లో 66 శాతం పెట్టుబడులు ఉంటే, మిడ్క్యాప్ కంపెనీలకు 22 శాతం, స్మాల్క్యాప్ కంపెనీలకు 12 శాతం మేర కేటాయింపులు చేసింది. పోర్ట్ఫోలియోలో 40 స్టాక్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లో 20 శాతం, క్యాపిటల్ గూడ్స్ కంపెనీల్లో 17 శాతం, ఆటోమొబైల్ కంపెనీల్లో 10 శాతం, టెక్నాలజీ కంపెనీల్లో 9 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. -
ఫ్లెక్సీలు పెట్టగానే మేము ఉరుకుంటాము అనుకున్నావా ?
-
Garam Garam Varthalu: పసుపుబోర్డ్ వచ్చేసిందోచ్
-
సైకో చంద్రబాబు గో బ్యాక్.. పీలేరులో ఫ్లెక్సీల ఏర్పాటు
సాక్షి, అన్నమయ్య: చంద్రబాబు గో బ్యాక్ అంటూ పీలేరులో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. మత కలహాలు సృష్టిస్తున్న సైకో చంద్రబాబు గోబ్యాక్ అంటూ ఫ్లెక్సీల దర్శనమిచ్చాయి. ‘ గోబ్యాక్ చంద్రబాబు.. పుంగనూరులో మత కలహాలు సృష్టిస్తున్న చంద్రబాబు గో బ్యాక్.. సైకో చంద్రబాబు గో బ్యాక్’ అని కొందరు బాబు రాకను వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీలతో నిరసించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ గుండాలు దాడులు చేస్తే ఊరుకోవాలా అని ప్రశ్నిస్తూ గాయపడిన వారి ఫోటోలను ఫ్లెక్సీల్లో ఉంచారు. కాగా, పీలేరు సబ్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పుంగనూరు టీడీపీ కార్యకర్తలను పరామర్శించడానికి సోమవారం చంద్రబాబు వెళ్లారు. ములాఖత్కు బాబుతోపాటు ఆరుగురు అధికారులకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో సైకో చంద్రబాబు గోబ్యాక్ అంటూ పీలేరు రైల్వే ట్రాక్ వద్ద ఫ్లెక్సీలు కనిపించాయి. బాబు పీలేరు పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు, బ్యానర్లు హాట్టాపిక్గా మారాయి. -
ఫ్లెక్సీపెట్టి.. అన్నదానం చేసి
సాక్షి, ఖమ్మం: ఎవరైనా కన్నుమూస్తే సంతాప సూచకంగా వారి ఫొటోతో ఫ్లెక్సీ చేయించి కూడళ్లలో ఏర్పాటు చేయడం తెలిసిందే. అయితే ఖమ్మంలో మృతిచెందిన ఓ కోతికి సైతం ఫ్లెక్సీ చేయించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తిరుగుతూ, నిత్యం హమాలీల మధ్య ఉంటూ.. వారు పెట్టే భోజనం తింటూ గడిపే ఓ కోతి ఇటీవల మృతి చెందింది. దీంతో హమాలీలు ఆ వానరానికి అంత్యక్రియలు నిర్వహించడమే కాకుండా శుక్రవారం అన్నదానం సైతం నిర్వహించారు. ఇంతటితో సరిపెట్టకుండా ఆ కోతి ఫొటోతో ఫ్లెక్సీ చేయించి మార్కెట్ ప్రధాన గేటుకు పెట్టగా పలువురు ఆసక్తిగా పరిశీలించారు. చదవండి: మహబూబాబాద్: టమాటా కూర అత్త ప్రాణం మీదకు తెచ్చింది -
పల్నాడు జిల్లా గురజాలలో టీడీపీ నేతల ఫ్లెక్సీ వార్
-
పల్నాడు జిల్లాలో టీడీపీ ఫ్లెక్సీ వార్
-
ఢిల్లీ: బీఆర్ఎస్ ఫ్లెక్సీల తొలగింపు
ఢిల్లీ: భారత రాష్ట్ర సమితికి ఆదిలోనే షాక్ తగిలింది. బీఆర్ఎస్ కార్యాలయం ముందు ఫ్లెక్సీలను తొలగించింది న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్. ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్డులో ఉన్న పార్టీ కార్యాలయం ఎదుట అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని చెప్తూ.. అధికారులు మంగళవారం వాటిని తొలగించారు. ఎన్డీఎంసీ ఫ్లెక్సీల తొలగింపు వ్యవహారంపై గులాబీ పార్టీ శ్రేణులు స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం కోసం హస్తినకు చేరుకున్న ఆ పార్టీ అధినేత కేసీఆర్ యాగాల్లో పాల్గొననున్నారు. ఈ నెల 14న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం కానుంది. తెలంగాణ నుంచి జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడం లక్ష్యంగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ని ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
అన్న డబ్బులు ఇస్తున్నారహో..!
పుంగనూరు(చిత్తూరు జిల్లా): గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రూ.2వేల టోకెన్లు పంపిణీ చేసిన అప్పటి జనసేన అభ్యర్థి బి.రామచంద్ర యాదవ్ను ఉద్దేశించి బుధవారం పట్టణంలో ప్లెక్సీ లు వెలిశాయి. ప్రధాన కూడళ్లు, మార్గాల్లో ప్లెక్సీలు భారీగా కనిపించాయి. చదవండి: తక్కువ సమయంలో అధిక ఆదాయం.. నెలకు లాభం ఎంతంటే? అందులో రామచంద్రయాదవ్ అన్నా.. ఎన్నికలప్పుడు మీరిచ్చిన టోకన్లకు ఇప్పుడైనా డబ్బులు ఇవ్వండి అంటూ పేర్కొన్నారు. రామచంద్రయాదవ్ అన్నగారు.. ఎన్నికలలో ఇచ్చిన టోకెన్లకు కొత్తయిండ్లులోని తన నివాసం వద్ద 7వ తేదీన ఉదయం 10 గంటల నుంచి టోకెన్లు ఉన్న వారికి డబ్బులు ఇస్తున్నారు అంటూ మరికొన్ని ఫ్లెక్సీల్లో ఉంది. ఈ క్రమంలో టోకెన్లు తీసుకుని డబ్బులు ఇవ్వాలంటూ పెద్దసంఖ్యలో మహిళలు ఆందోళనకు దిగడం గమనార్హం. టోకెన్లకు డబ్బు ఇవ్వాలని వెలసిన ప్లెక్సీ -
ఏలూరు జిల్లాలో చంద్రబాబుకు నిరసన సెగ
సాక్షి, ఏలూరు జిల్లా: ఏలూరు జిల్లాలో చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ ఫ్లెక్సీలు భారీగా వెలిశాయి. జగనన్న పాలనే మా అదృష్టమంటూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ రోడ్లకు ఇరువైపుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చదవండి: జేసీ ప్రభాకర్రెడ్డికి ఈడీ షాక్.. భారీగా ఆస్తుల అటాచ్ -
మునుగోడులో పోస్టర్ వార్
చౌటుప్పల్ మండలంలో ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటుకు 2016లోనే హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయలేదంటూ.. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫ్లెక్సీ పెట్టి, దాని ముందు సమాధిలా ఏర్పాటు చేశారు. అంతకుముందు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రూ.18 వేల కోట్లకు అమ్ముడు పోయారంటూ పోస్టర్లు వేశారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉప ఎన్నికల నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో ఫ్లెక్సీలు, బ్యానర్ల వార్ ఉధృతమైంది. మొన్నటివరకు ప్రజా సమస్యలను పరిష్కరించాలని, రోడ్డు వేస్తేనే మా ఊళ్లో ఓట్లు అడగాలని గ్రామాల్లో ప్రజలు ఫ్లెక్సీలు పెట్టారు. ఇప్పుడు రాజకీయ పార్టీల కార్యకర్తలు, నేతలు పరస్పర విమర్శలు, ఆరోపణలతో పోస్టర్లు వేసుకుంటున్నారు. మొన్నటివరకు బీజేపీ నేతలు, ఆ పార్టీ అభ్యర్థిని ఉద్దేశిస్తూ పోస్టర్లు వెలియగా.. తాజాగా టీఆర్ఎస్ నేతలను ఉద్దేశిస్తూ పోస్టర్లు పడ్డాయి. ఆగస్టు నుంచే పోస్టర్ల గోల షురూ.. మునుగోడు నియోజకవర్గంలో ఆగస్టు నెల నుంచే పోస్టర్ల గోల మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే కొన్ని గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని బ్యానర్లు పెట్టగా.. మరికొన్ని గ్రామాల్లో మాకు డబ్బులు వద్దు రోడ్డే కావాలి అంటూ ఫ్లెక్సీలు కట్టారు. మరోచోట రోడ్డు వేస్తేనే మా గ్రామంలోకి రావాలంటూ ఊరి బయట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తర్వాత రాజగోపాల్రెడ్డిని విమర్శిస్తూ పోస్టర్లు వెలిశాయి. ‘మునుగోడు ప్రజలారా మేం మోసపోయాం.. మీరూ మోసపోకండి.. ఇట్లు దుబ్బాక, హుజూరాబాద్ ప్రజలు’అంటూ సెప్టెంబర్ 15న పోస్టర్లు కనిపించాయి. తర్వాత ‘రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు పే’అంటూ రాజగోపాల్రెడ్డిపై పోస్టర్లు వేశారు. ఆ తర్వాత ఫ్లెక్సీలు, బొమ్మలతో సమాధులు, కాష్టాల వంటివీ జరిగాయి. తాజాగా శనివారం నాంపల్లి మండల కేంద్రం శివారులో కల్వకుంట్ల కుటుంబం పేరుతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత బొమ్మలతో ఫ్లెక్సీ పెట్టి.. కాష్టాన్ని పేర్చి తగలబెట్టారు. ఇదీ చదవండి: ఇదేందయ్యా ఇది.. మద్యం మత్తులో రెచ్చిపోయిన మునుగోడు యూత్.. వీడియో వైరల్ -
రైతు ట్రెండీ ఐడియా.. పంట పొల్లాల్లో హీరోయిన్ల ఫొటోలు పెట్టి..!
రైతులు తమ పంటను కాపాడుకునేందుకు వింత వింత ఆలోచనలతో సరి కొత్త ప్రయోగాలను చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె డివిజన్లో రైతులు అధికంగా టమాటను సాగు చేస్తారు. తంబళ్లపల్లె మండలం రెడ్డివారిపల్లెకు చెందిన మల్రెడ్డి తనకున్న అర ఎకరా పొలంలో టమాట సాగు చేపట్టారు. పంట తొలి దశలోనే చూసేందుకు పచ్చగా, ఏపుగా పెరగడంతో ఇతరుల దిష్టి తగిలి ఎక్కడ చేతికందకుండా పోతుందోనన్న భయంతో పొలం చుట్టూ సినీ హీరోయిన్లు తమన్నా, రాశీఖన్నా తదితర యువ హీరోయిన్ల పోస్టర్లను ఫ్లెక్సీల రూపంలో నాలుగువైపులా ఏర్పాటుచేశారు. అలాగే కురబలకోట మండలం దాదంవారిపల్లెకు చెందిన లీలమ్మ అర ఎకరా టమట, అర ఎకరా బంతిపూలను సాగు చేస్తున్నారు. ఈమె కూడా మల్రెడ్డి బాటలోనే పంటకు దిష్టి తగకుండా హీరోయిన్ల పోస్టర్లు పెట్టింది. రోడ్డుపై వెళుతున్న ప్రయాణికులు, ద్విచక్రవాహనదారులు వీటిని వింతగా చూస్తూ ఎవరి వెర్రి వారికి ఆనందం అంటూ నవ్వుకుని వెళుతున్నారు. -
అమరావతి రైతుల పాదయాత్రకు తాడేపల్లిగూడెంలో నిరసన సెగ
-
ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లపై నిషేధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నవంబర్ 1వ తేదీ నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లను నిషేధిస్తూ ప్రభుత్వం గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నిషేధం అమలు, ఉల్లంఘనలు, వాటిపై చర్యలు, ప్రత్యామ్నాయాలు తదితరాలకు సంబంధించిన మార్గదర్శకాలను నోటిఫికేషన్లో వివరించారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీల ఉత్పత్తి, దిగుమతులతోపాటు వినియోగం, ముద్రణ, రవాణా, ప్రదర్శనలకు నిషేధం వర్తిస్తుంది. నిషేధం అమలును పట్టణాలు, నగరాల్లో కాలుష్య నియంత్రణ అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, శానిటేషన్ సిబ్బంది పర్యవేక్షిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యవేక్షణ బాధ్యతను కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, పంచాయతీలు, గ్రామ సచివాలయాల సిబ్బందికి అప్పగించారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లకు బదులుగా కాటన్, నేత వ్రస్తాలను వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. ఉల్లంఘిస్తే జరిమానా నిబంధనలు ఉల్లంఘిస్తే ఫ్లెక్సీ చదరపు అడుగుకు రూ.100 జరిమానా విధిస్తారు. ఉల్లంఘనులపై పర్యావరణ చట్టం–1986 ప్రకారం చర్యలు తీసుకుంటారు. సీజ్చేసిన బ్యానర్లను శాస్త్రీయంగా డిస్పోజ్ చేయడానికి అవసరమైన ఖర్చును నిబంధనలు ఉల్లంఘించిన వారినుంచి వసూలుచేస్తారు. పోలీస్, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్, జీఎస్టీ అధికారులు ప్లాస్టిక్ ఫెక్సీల నిషేధాన్ని పర్యవేక్షించే అధికారులకు సహాయపడతారు. -
మూడే ముద్దు.. అమరావతి యాత్రలో ఊహించని షాక్
సాక్షి, గుంటూరు: అమరావతి పేరుతో పాదయాత్ర చేస్తున్న వాళ్లకు ఊహించని షాక్ తగిలింది. యాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలంటూ.. ఉమ్మడి గుంటూరులోని చాలా చోట్ల వ్యతిరేక ఫ్లెక్సీలు వాళ్లకు స్వాగతం పలికాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇవాళ ఆ యాత్ర సాగనుంది. అయితే.. రాత్రికి రాత్రే జంపని, వేమూరు ప్రాంతాల్లో కారుమూరు వెంకటరెడ్డి పేరిట ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అంటూ అందులో హైలైట్ చేసి ఉంది. మూడు రాజధానుల వల్ల కలిగే ఉపయోగాలు, అభివృద్ధిని పూసగుచ్చినట్లు వివరిస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మరోసారి హైదరాబాద్లాగా దెబ్బ తినకూడదనే ఉద్దేశంతోనే.. మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఆ అభివృద్ధి అన్ని ప్రాంతాలకు అందుతుందని ఆ ఫ్లెక్సీ ద్వారా యాత్ర చేసేవాళ్లకు అర్థం అయ్యేలా వివరించింది ఉంది. అంతేకాదు అసలు మీ యాత్ర ఎందుకంటే వేసిన ప్రశ్నతో.. యాత్ర చేసే వాళ్లు కంగుతిన్నారు. స్థానికంగా వీటి గురించి చర్చ నడుస్తోంది. ఇదీ చదవండి: పేదలంతా కళ్యాణమస్తు వినియోగించుకోండి -
సీఎం కేసీఆర్ పర్యటనలో ఫ్లెక్సీల వార్
-
బీజేపీ సభ వేళ ఫ్లెక్సీల రగడ.. అర్ధరాత్రి చించిపడేశారు!
సాక్షి, వరంగల్: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర నేటితో ముగియనుంది. వరంగల్ జిల్లాలోని భద్రకాళీ ఆలయం వద్ద పాదయాత్ర ముగియనుంది. కాగా, పాదయాత్ర ముగింపు సందర్భంగా హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్లో బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. ఇక, వరంగల్ సభ అనంతరం జేపీ నడ్డా.. హైదరాబాద్కు తిరుగు పయనం అవుతారు. ఈ క్రమంలో జేపీ నడ్డా.. నటుడు నితిన్, టీమిండియా ఉమెన్స్ టీమ్ మాజీ కెప్టెన్ మిథాలీరాజ్తో భేటీ కానున్నారు. వీరి భేటీ మరోసారి ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, కొద్ది రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. మునుగోడులో సభకు హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అమిత్ షా.. నటుడు జూనియర్ ఎన్టీఆర్తో భేటీ అయిన విషయం తెలిసిందే. దీంతో, వీరి మధ్య పొలిటికల్ మీటింగ్ జరిగిందంటూ రాజకీయ నేతలు విశ్లేషించారు. అయితే, ఈ సభ కోసం బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. బీజేపీ నేతలు ఓరుగల్లును కాషాయ జెండాలతో నిపేంశారు. ఎటు చూసినా బీజేపీ నేతల ఫ్లెక్సీలు, కాషాయ పార్టీ జెండాలే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్లో మళ్లీ ఫ్లెక్సీల రగడ మొదలైంది. కాగా, బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా బీజేపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సంజయ్కు స్వాగతం పలుకుతూ భారీగా కట్ అవుట్స్, ఫ్లెక్సీలు పెట్టారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి బీజేపీ ఫ్లెక్సీలను చించేశారు. అయితే, ఫ్లెక్సీలను చించివేసింది టీఆర్ఎస్ నేతలే అంటూ బీజేపీ లీడర్స్ ఆరోపిస్తున్నారు. ఇది కూడా చదవండి: వరంగల్లో బీజేపీ సభకు హైకోర్టు అనుమతి -
ప్లాస్టిక్ కాలుష్యంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
Andhra Pradesh: ప్లాస్టిక్ బ్యానర్లు బ్యాన్
సాక్షి, విశాఖపట్టణం: రాష్ట్రవ్యాప్తంగా ఇకపై ప్లాస్టిక్ బ్యానర్లను నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. అందరూ క్లాత్ బ్యానర్లు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. 2027 నాటికి ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో అడుగులు వేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ దిశగా ప్రజలందరినీ భాగస్వాములను చేసి అవగాహన పెంపొందించాలని అధికార యంత్రాగానికి సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్, అప్ సైక్లింగ్తో సాగరతీర ప్రాంతాల పరిరక్షణ కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘పార్లే ఫర్ ది ఓషన్స్’తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) సందర్భంగా శుక్రవారం విశాఖలో సీఎం జగన్ ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా ప్లాస్టిక్ నియంత్రణ కోసం ఒప్పందం చేసుకున్నామని, తద్వారా విశాఖలో పార్లే ఫ్యూచర్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు కానుందని తెలిపారు. మూడు దశల్లో రాష్ట్రంలో రూ.16 వేల కోట్ల పెట్టుబడులతో (2 బిలియన్ డాలర్లు) 20 వేల మందికి ఉపాధి కల్పించేలా పార్లే సూపర్ హబ్, రీ సైక్లింగ్, అప్సైక్లింగ్ యూనిట్లు ఏర్పాటవుతాయని చెప్పారు. యువత నైపుణ్యాలకు పదును పెట్టేలా ప్రపంచంలోనే తొలిసారిగా 1.62 లక్షల మందికి మైక్రోసాఫ్ట్ ద్వారా సాఫ్ట్స్కిల్స్లో ఉచిత శిక్షణ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో తొలి విడతలో 35,980 మందికి శిక్షణ పూర్తైంది. ఈ నేపథ్యంలో విశాఖలో సీఎం జగన్ చేతుల మీదుగా సర్టిఫికెట్ల ప్రదానం జరిగింది. ప్లాస్టిక్ వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి తయారుచేసిన కళ్లద్దాలను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్ ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే ఇంత మందికి ఎన్నడూ శిక్షణ అందించలేదని సీఎం తెలిపారు. చదివిన డిగ్రీకి అనుగుణంగా ప్రతి విద్యార్థికీ ఉద్యోగం వచ్చేలా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్, సిరిపురంలోని ఏయూ కాన్వొకేషన్ హాల్లో జరిగిన కార్యక్రమాల్లో సీఎం పాల్గొని మాట్లాడారు. పార్లే సంస్థ ప్లాస్టిక్ నుంచి తయారు చేసిన వివిధ ఉత్పత్తులను (బూట్లు, కళ్లద్దాలు, టీ షర్టులు) సీఎం స్వయంగా పరిశీలించారు. ఎంవోయూపై రాష్ట్ర ప్రభుత్వం తరపున పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, పార్లే ఫర్ ఓషన్స్ సంస్థ సీఈవో సిరిల్ గచ్చ్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. అతిపెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమం.. పార్లే ఫర్ ది ఓషన్స్ సంస్థకు చెందిన సిరిల్, గ్లోబల్ అలయన్స్ సహకారంతో రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చేసేలా ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ రోజు ఎప్పటికీ గుర్తుంటుంది. బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న విశాఖ ప్రజలకు అభినందనలు. గోకుల్ బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు 28 కి.మీ. పరిధిలో 40 ప్రాంతాల్లో సుమారు 22 వేల మంది ప్రజలు పాల్గొని 76 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించడం గొప్ప విషయం. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమం. ఈ సామాజిక స్ఫూర్తి చాలా అద్భుతం. అదే విశాఖను ప్రత్యేక నగరంగా నిలబెట్టింది. అటు పర్యావరణం.. ఇటు ఆర్థికం నాణేనికి రెండు వైపులా అన్నట్లు ఒకవైపు పర్యావరణం, మరోవైపు ఆర్థిక వ్యవస్థ రెండూ కీలకం. పర్యావరణాన్ని పరిరక్షించుకోకుంటే మనకు మనుగడ లేదు. సుస్థిరత, సమగ్రత మన ప్రధాన లక్ష్యాలు. స్వల్పకాలిక లక్ష్యాల కోసం రాజీపడితే దీర్ఘకాలిక మనుగడ సాగించలేం. అందుకే మన ప్రభుత్వం మానవ, ఆర్థిక వనరులతో సుస్థిర ప్రగతి కోసం కృషి చేస్తోంది. పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ‘క్లాప్’ (క్లీన్ ఏపీ – జగనన్న స్వచ్ఛ సంకల్పం) కార్యక్రమాన్ని గతేడాది అక్టోబరు 2న ప్రారంభించింది. 4,097 చెత్త సేకరణ వాహనాలను అందచేసింది. గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా ఈ కార్యక్రమాలను ప్రారంభించడంతో చెత్త సేకరణ 22 శాతం నుంచి 62 శాతానికి పెరిగింది. వంద శాతం సేకరణ లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. ప్లాస్టిక్ వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి తయారుచేసిన బూటును చూపిస్తున్న ముఖ్యమంత్రి జగన్ సాగరాన్ని కాపాడుకుందాం.. భూమి మీద ఆక్సిజన్లో 70 శాతం సముద్ర మొక్కల నుంచే లభిస్తోంది. రెయిన్ ఫారెస్ట్ నుంచి కేవలం 28 శాతం ఆక్సిజన్ మాత్రమే వస్తుంది. మెరైన్ ప్లాంట్స్లో ఫైటో ప్లాంక్టన్, కెల్ఫ్, ఆల్గల్ ప్లాంక్ట్ లాంటి మొక్కలు కిరణజన్య సంయోగ ప్రక్రియతో ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఫైటో ప్లాంక్ట్లో ముఖ్యమైనదైన ప్లోక్లోరో కాకస్ వాతావరణంలోకి అత్యధికంగా ప్రాణ వాయువును ఉత్పత్తి చేస్తోంది. సముద్రంలోకి చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలు నానాటికీ పెరుగుతూ విస్తరిస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల మత్స్య సంపద, సముద్ర పక్షులు, సముద్ర క్షీరదాలు లాంటి దాదాపు 267 జాతులకు ముప్పు వాటిల్లుతోంది. రూ.16 వేల కోట్లు.. 20 వేల మందికి ఉపాధి సముద్రతీరంతో పాటు సాగర గర్భంలో కూడా ప్లాస్టిక్ కనిపిస్తోంది. దీనికి స్థిరమైన పరిష్కారం దిశగా తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తోంది. గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్ వర్క్స్ (జీఏఎస్పీ), పార్లే ఫర్ ది ఓషన్స్తో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యమైంది. భాగస్వాములను ఎంపిక చేయడం, ఆర్థిక వనరులను సమకూర్చడంలో గ్లోబల్ అలయన్స్ సంస్థ కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ ఒప్పందంలో భాగంగా విశాఖలో పార్లే ఫ్యూచర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు కానుంది. ఇది దేశానికే కాకుండా ప్రపంచానికే దిక్సూచిగా నిలుస్తుంది. అత్యాధునిక పద్ధతుల్లో కొత్త మెటీరియల్ కనుగొనడానికి సంబంధించిన పరిశోధన ఇక్కడ జరుగుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో బూట్లు, అద్దాలు లాంటి మెటీరియల్ తయారు చేసే రీసైక్లింగ్, అప్ సైక్లింగ్ హబ్ ఏర్పాటవుతుంది. వ్యర్థాలతో ఉత్పత్తుల తయారీకి 10 ఇన్నోవేషన్ హబ్స్ ఏర్పాటవుతాయి. వీటిద్వారా ఆరేళ్లలో రూ.16 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి. స్ధానికంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా 20 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఒప్పందపత్రాలు మార్చుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు, పార్లే ఫర్ ది ఓషన్స్ ప్రతినిధులు ప్రఖ్యాత కంపెనీలకు పార్లే ఉత్పత్తులు.. అందమైన బ్యాగుల నుంచి షూస్, కంటి అద్దాల వరకూ రీసైకిల్డ్ ప్లాస్టిక్ నుంచే తయారవుతున్నాయి. పార్లే ఫర్ ది ఓషన్స్ సంస్థ వీటిని తయారు చేస్తోంది. ఈ సంస్థకు ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు మెర్సిడెస్ బెంజ్, లూయిస్ విట్ట¯, ఆడిడాస్, అమెరికా ఎక్స్ప్రెస్ లాంటి కంపెనీలతో వ్యాపార అనుబంధం ఉంది. వారికి కావాల్సిన ఉత్పత్తులను పార్లే సంస్థ తయారు చేసి అందచేస్తోంది. రీ సైక్లింగ్, అప్ సైక్లింగ్లోకి చాలా ఎంఎన్సీలు వస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ రాజీవ్కుమార్, గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్ (జీఏఎస్పీ) సెక్రటరీ జనరల్ సత్య ఎస్ త్రిపాఠి, పార్లే ఫర్ ది ఓష¯న్స్ సీఈవో సిరిల్ గచ్చ్తో పాటు అందరికీ హృదయపూర్వక అభినందనలు. దారంతా ఫ్లెక్సీలే ‘‘విశాఖ విమానాశ్రయం నుంచి కారులో వస్తుంటే దారిపొడవునా నా ఫొటోలతో ఫ్లెక్సీలు కనిపించాయి. ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమానికి వెళ్తూ ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ప్రజలకు తప్పుడు మెసేజ్ పంపించినట్లు అవుతుందని కలెక్టర్ మల్లికార్జునకు చెప్పా. అయితే అవి ప్లాస్టిక్ ఫ్లెక్సీలు కాదని, క్లాత్తో తయారైనవని ఆయన చెప్పారు. ప్లాస్టిక్ ఫెక్సీకి రూ.8 ఖర్చయితే.. క్లాత్కు రూ.32 ఖర్చవుతుందన్నారు. ఎవరైనా ఫ్లెక్సీలు పెట్టాలనుకుంటే కాస్త ఖర్చు ఎక్కువైనా క్లాత్తో తయారైనవే ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో ప్లాస్టిక్ నిర్మూలనలో తొలి అడుగు వేస్తున్నాం. ఇప్పటికే తిరుమలను ప్లాస్టిక్ రహితంగా చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయి’’ – సీఎం జగన్ రీసైక్లింగ్ ద్వారా తయారు చేసిన కళ్లజోడును పెట్టుకున్న సీఎం జగన్ హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, విడదల రజని, ఆదిమూలపు సురేష్, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతి, జీవీఎంసీ మేయర్ హరి వెంకటకుమారి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హామీలను నెరవేరుస్తున్న నాయకుడు ఇది ఆరంభం మాత్రమే. లక్ష్యాన్ని చేరుకోవాలంటే చాలా కష్టపడాలి. అది సాకారమైతే ప్రపంచంలోనే ప్లాస్టిక్ రహిత తొలి రాష్ట్రంగా ఏపీ ఆవిర్భవిస్తుంది. 2027 నాటికి సాధించేలా బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి జగన్కు అభినందనలు. పలు దేశాల్లో ఎంతో మంది రాజకీయ నేతలను కలిశాం. అందరూ అనేక హామీలిచ్చి మర్చిపోవడాన్ని చూశా. ముఖ్యమంత్రి జగన్ మాత్రమే ఇచ్చిన హామీలను అమలు చేయడాన్ని చూస్తున్నాం. – సత్య ఎస్ త్రిపాఠి, జీఏఎస్పీ సెక్రటరీ జనరల్ చాలా ముఖ్యమైన సందర్భమిది. నేను భారత్కు రాకపోతే కీలక ఘట్టాన్ని మిస్ అయ్యే వాడిని. పర్యావరణం ప్రమాదంలో ఉందంటూ అనేక దేశాల ముఖ్యులు రోజుల తరబడి చర్చించడం, భారీగా నిధులు వెచ్చించినా పూర్తి స్థాయిలో విజయవంతం కాలేదు. ఆంధ్రప్రదేశ్లో పర్యావరణ పరిరక్షణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో జరిగిన సమావేశం చాలా భిన్నంగా అనిపించింది. సీఎం సమక్షంలో అధికార యంత్రాంగం కేవలం రెండు గంటల్లోనే సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసింది. భవిష్యత్తులో వ్యర్థాల నిర్మూలనలో విశాఖ నంబర్ వన్ స్థానంలో ఉంటుంది. వ్యర్థాల రీసైక్లింగ్ ద్వారా మానవ జీవనానికి అవసరమయ్యే వస్తువులను తయారు చేసుకోవచ్చు. ఆరేళ్ల పాటు నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం పనిచేస్తే ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దగలం. మరో పదేళ్లలో ప్లాస్టిక్ కనిపించదు. ప్రపంచంలోనే ఇది ఒక విప్లవాత్మక మార్పుగా పరిణమించనుంది. – సిరిల్ గచ్చ్, పార్లే ఫర్ ఓషన్స్ సీఈవో ‘‘దేశంలోనే రెండో అతిపెద్ద తీర ప్రాంతం 975 కి.మీ. పొడవు కలిగి ఉన్న మన రాష్ట్రంలో విశాలమైన ఇసుక బీచ్లు, వన్య మృగాలు, పక్షుల కేంద్రాలున్నాయి. రాష్ట్ర పౌరులుగా తీర ప్రాంతాన్ని పరిరక్షించుకోవడం మనందరి విధి. ప్లాస్టిక్ వ్యర్థాలు లేని సముద్రాలు మన లక్ష్యం కావాలి’’ – సీఎం జగన్ ఇదీ చదవండి: విశాఖలో మెగా బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం.. -
టీడీపీలో కలవరపెడుతున్న ఫ్లెక్సీలు
-
విజయనగరం టీడీపీలో ఫ్లెక్సీ వార్.. అశోక్ గజపతి రాజుపై ధిక్కార స్వరం
సాక్షి, విజయనగరం: విజయనగరం టీడీపీలో విభేదాలు మదిరిపాకాన పడ్డాయి. మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుపై బీసీ మహిళా, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత గత కొద్ది రోజుల క్రితం ధిక్కార స్వరం వినిపించారు. బీసీలు ఎక్కువగా ఉన్న విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీలకే టికెట్ ఇవ్వాలన్నది ఆమె డిమాండ్. ఈ నేపథ్యంలో అశోక్ గజపతి రాజు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఆమె డుమ్మా కొడుతున్నారు. నేరుగా చంద్రబాబుతోనే అమె టచ్లో ఉంటున్నారు. చదవండి: ‘చంద్ర’గ్రహణం వీడుతున్న కుప్పం మరోపక్క నియోజకవర్గంలో అశోక్ గజపతి రాజును వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో బీసీలు లక్షా అరవైవేల మంది ఉన్నారంటూ, రాజ్యాధికారం బీసీలకే ఇవ్వండంటూ బీసీ ఐక్యవేదిక పేరుతో ఫ్లెక్సీలు విజయనగరం పట్టణంలో కీలక ప్రాంతాల్లో వెలిశాయి. అయితే ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే ఇది మీసాల గీత వర్గీయుల పనే అంటూ అశోక్ గజపతి వర్గం కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టింది. -
బీజేపీ, టీఆర్ఎస్ ప్రచార పోరు.. బల్దియాకు 30 లక్షల రాబడి
సాక్షి, హైదరాబాద్: దాదాపు వారం రోజులుగా జరిగిన హడావుడి ముగిసింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, విజయ సంకల్ప సభ నేపథ్యంలో బీజేపీ స్వాగత ఆర్భాట హోర్డింగులు, ఫ్లెక్సీలు.. అందుకు ప్రతిగా టీఆర్ఎస్ సంక్షేమ కార్యక్రమాల ఫ్లెక్సీలు, హోర్డింగుల యుద్ధం ముగిసింది. వీటి ఏర్పాటుకు సంబంధించి జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగానికి ట్విట్టర్ ద్వారా అందిన ఫిర్యాదులకు స్పందించిన సీఈసీ ఈ– చలానాలు జారీ చేస్తోంది. సోమవారం సాయంత్రం వరకు బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగులకు దాదాపు రూ. 22 లక్షలు, టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగులకు రూ. 3 లక్షలకు పైగా ఈచలానాలు జారీ చేసినట్లు సంబంధిత అధికారి ఒకరు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఫిర్యాదుల వరద కూడా తగ్గడంతో దాదాపుగా ఇక వీటికి బ్రేక్ పడినట్లే భావిస్తున్నారు. కాషాయం అలా.. గులాబీ ఇలా.. ► బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతరత్రా అతిరథ మహారథులు హాజరు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ పార్టీ ప్రధానిని ఆహ్వానిస్తూ స్వాగత తోరణాలతో పాటు భారీయెత్తున ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేయడం తెలిసిందే. అందుకు ప్రతిగా తామేం తక్కువ తినలేదన్నట్లు బీజేపీ ప్రభావం కనిపించకుండా నగరమంతా గులాబీరంగు కనిపించేలా టీఆర్ఎస్ శ్రేణులు సైతం నగరంలో అమల్లో లేని పథకాలతో సహ ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ ప్రచార యుద్ధం ముగిసింది. ► వీటి ప్రభావం ఏమేరకు పడిందో పరిశీలిస్తే రెండు పార్టీలకు వెరసీ.. రూ. 25 లక్షల పెనాల్టీలు పడ్డాయి. వీటిల్లో రూ. 2వేల నుంచి మొదలుకొని లక్ష రూపాయల వరకు పెనాల్టీలున్నప్పటికీ, రూ. 5 వేల పెనాల్టీలు అధికసంఖ్యలో ఉన్నాయి. సగటున రూ. 5 వేలు లెక్కలోకి తీసుకున్నా రెండు పార్టీలవి మొత్తం కలిపి దాదాపు 500 ఫ్లెక్సీలకు పెనాల్టీలు విధించారు. వీటిలో ఏపార్టీ ఎన్నింటికి చెల్లిస్తుంది.. ఎంత మొత్తం చెల్లిస్తుంది అనేది తెలియడానికి సమయం పట్టనుంది. గతంలోనూ ఆయా పార్టీలకు భారీగా ఈ–చలానాలు జారీ చేసినా ఎవరు ఎన్ని చెల్లించారో సంబంధిత అధికారులు వెల్లడించలేదు. ప్రైవేట్ సంస్థలు పెనాల్టీలు చెల్లించకపోతే వాటిని సీజ్ చేస్తున్న సీఈసీ విభాగం వీరి విషయంలో ఏం చేయనుందో వేచి చూడాల్సిందే. చెత్త చార్జీలు రూ. 5 లక్షలు.. ► సీఈసీ పెనాల్టీలు విధిస్తుంది తప్ప ఫ్లెక్సీలు, హోర్డింగులు తొలగించడం లేదు. వీటి తొలగింపు బాధ్యతలు జీహెచ్ఎంసీలోని సంబంధిత సర్కిళ్లకు అప్పగించారు. గత రెండు రోజులుగా వీటి తొలగింపు పనులు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీలో సాధారణ రోజుల్లో సగటున 6500 మెట్రిక్టన్నుల వ్యర్థాలు వెలువడేవి కాగా వర్షాకాలం మొదలయ్యాక సగటున రోజుకు 7000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ► గడచిన రెండు రోజుల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు, ఇతరత్రా ప్రచార సామగ్రి తొలగింపు మొదలయ్యాక సగటున 7600 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు జవహర్నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. రెండు రోజుల్లో మొత్తం 1223 మెట్రిక్ టన్నుల చెత్త అదనంగా డంపింగ్ యార్డుకు చేరింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి జవహర్నగర్కు వ్యర్థాలు తరలించేందుకు జీహెచ్ఎంసీ మెట్రిక్ టన్నుకు రూ. 400 ఖర్చు చేస్తోంది. ఈ లెక్కన పార్టీల ప్రచార సామగ్రి వ్యర్థాల తరలింపునకు దాదాపు రూ. 5 లక్షలు ఖర్చయింది. అంటే ప్రధానమంత్రి నగర పర్యటన ప్రభావం దాదాపు రూ. 30 లక్షలన్న మాట! బీజేపీ నేతల తిరుగు పయనం మూడ్రోజుల పాటు నగరంలోనే మకాం వేసి గ్రేటర్ కేడర్లో జోష్ నింపిన బీజేపీ జాతీయ నేతలు సోమవారం ఉదయం తిరుగుముఖం పట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఏపీలోని భీమవరం బయలుదేరారు. హోం మంత్రి అమిత్షా సహా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర మంత్రులు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిపోయారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇతర ముఖ్యమంత్రులు వారి రాష్ట్రాలకు పయనమయ్యారు. ఆదివారం జరిగిన విజయ సంకల్ప సభకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భారీగా జనం తరలిరావడం, రెండు గంటల పాటు పరేడ్ గ్రౌండ్ ప్రాంతమంతా మోదీ నామస్మరణలతో మార్మోగడం కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. (క్లిక్: పదవి కాపాడుకునేందుకు మేయర్ పడరాని పాట్లు!)