bail petition
-
రన్యారావును నిద్రపోనివ్వడం లేదు!
బెంగళూరు: అక్రమ బంగారం రవాణా కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావు.. బెయిల్ కోసం ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. అయితే విచారణ పేరుతో అధికారులు ఆమెను నిద్రపోవడం లేదని ఆమె తరఫు న్యాయవాది బుధవారం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచారణ పేరుతో నా క్లయింట్ రన్యారావును డీఆర్ఐ అధికారులు నిద్రపోనివ్వడం లేదు. అరెస్టైన సమయంలో తనకున్న హక్కుల గురించి ఆమెకు పూర్తిగా తెలియదని. హత్యా అభియోగాలు దాఖలైన కేసుల్లోనూ నిందితులు మహిళలైతే బెయిల్ లభించిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. అలాంటప్పుడు నా క్లయింట్ కూడా బెయిల్ పొందడానికి అర్హురాలే. కాబట్టి ఆమెకు ఊరట ఇవ్వాలని వాదనలు వినిపించారాయన.మార్చి 3వ తేదీన.. దుబాయ్ నుంచి విమానంలో అక్రమంగా బెంగళూరుకు బంగారాన్ని తెస్తూ కెంపగౌడ ఎయిర్పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సీ(DRI) అధికారులకు రన్యారావు దొరికిపోయారు. నడుము చుట్టూ, కాళ్ల కిందిభాగం, షూలో 14 కేజీల బంగారాన్ని దాచారు. అయితే.. ఈ కేసు దర్యాప్తులో లోతుకు వెళ్లే కొద్దీ.. కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ఏడాది చివర్లో రెండుసార్లు దుబాయ్లో బంగారం కొనుగోలు చేసిన ఆమె.. దానిని తీసుకొని తాను స్విట్జర్లాండ్ వెళ్తున్నానని అక్కడి కస్టమ్స్ అధికారులకు వెల్లడించినట్లు తేలింది. ఆమె ప్రయాణ వివరాలను పరిశీలిస్తే, ఆమె భారత్కు వచ్చినట్లు వెల్లడైందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తన అరెస్ట్ మెమోలో పేర్కొంది. అలాగే.. స్మగ్లింగ్ చేసే సమయంలో ఎయిర్పోర్టులో వీఐపీ ప్రొటోకాల్ను దుర్వినియోగం చేసినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై విచారణ జరపాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. భద్రతా తనిఖీలను తప్పించుకునేందుకు ఆమె సవతి తండ్రి, సీనియర్ ఐపీఎస్ అధికారి కె.రామచంద్రరావు పేరును ఉపయోగించుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ డిస్మిస్
విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మరోసారి విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు తోసిపుచ్చింది. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేసింది కోర్టు. అదే సమయంలో వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 12 వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.ఈ కేసు విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేసేందుకు సత్యవర్థన్ తరపు న్యాయవాది రెండు రోజులు సమయం కోరారు. దాంతో బెయిల్ పిటిషన్ పై విచారణను 12కు వాయిదా వేసింది కోర్టు. అదే సమయంలో వల్లభనేని వంశీ ఉంటున్న బ్యారక్ మార్చాలని దాఖలు చేసిన పిటిషన్ పై కూడా విచారణ జరిగింది.అయితే ఇతర ఖైదీలు ఉంటున్న బ్యారక్ లోకి వంశీని మార్చడం కుదరదని జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. భద్రతా కారణాల రీత్యా బ్యారక్ మార్చలేమని జైలు అధికారులు స్పష్టం చేశారు. కాగా, మెత్తటి దిండు, దుప్పటి కావాలని వంశీ కోరగా, అందుకు జైలు అధికారులు అంగీకరించారు. కాగా, జైలు బ్యారక్లో తనను ఒంటరిగా ఉంచారని గత నెల చివర్లో పిటిషన్ దాఖలు చేశారు వంశీ. భద్రతాపరంగా తనకు ఇబ్బంది లేనప్పటికీ అందరూ ఉన్న సెల్లోకి తనను మార్చాలని కోరారు.సీసీ ఫుటేజ్ను భద్రపరచండితన భర్త అరెస్టు అక్రమమని తేల్చేందుకు అవసరమైన సీసీ ఫుటేజ్ ను భద్రపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వల్లభనేని వంశీ భార్య.. హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సీసీ ఫుటేజ్ను భద్రపరచాలంటూ పోలీసుల్ని ఆదేశించింది హైకోర్టు. -
పోసాని కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్లపై నేడు ఆదోని కోర్టులో విచారణ
-
పోసానిపై కేసు.. బయటపడ్డ మరో కుట్ర
అన్నమయ్య జిల్లా, సాక్షి: ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి(Posani KrishnaMurali)పై కూటమి కుట్ర ఎఫ్ఐఆర్ సాక్షిగా బయటపడింది. పల్నాడు జిల్లా నరసరావుపేట(Narasaraopeta) టూటౌన్ పోలీసులు.. ఈ ఉదయం రాజంపేట సబ్ జైలు నుంచి ఆయన్ని తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆయనపై అక్కడ నమోదైన ఎఫ్ఐఆర్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. టీడీపీ ప్రధాన కార్యదర్శి కొట్టు కిరణ్ ఈ ఫిర్యాదు చేశారు. 2022లో తమ నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్(అప్పటికీ ఇంకా పొత్తులో లేరు), నారా లోకేష్లపై పోసాని అసభ్యపదజాలంతో పోస్టులు పెట్టారని, అవహేళనగా మాట్లాడారని.. కాబట్టి చర్యలు తీసుకోవాలని కిరణ్ కోరారు. అయితే.. 2024 నవంబర్ 13వ తేదీనే ఆయన ఫిర్యాదు చేయగా.. ఆ మరుసటిరోజే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అదీ బీఎన్ఎస్ సెక్షన్ల మీద కాకుండా.. ఐపీసీ సెక్షన్ల కింద. ఇక.. అరెస్ట్ మాత్రం రెండు నెలల తర్వాతే చేశారు. అదీ మరో కేసులో అరెస్టైన టైం చూసుకుని మరీ. మరోపక్క.. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై 30 ఫిర్యాదులకుగానూ.. 16 కేసులు నమోదయ్యాయి. అన్నమయ్య జిల్లా జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు ఓబులవారీ పోలీసులు కేసు నమోదు చేసుకుని మరీ ఆయన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న పోసాని విషయంలో కూటమి పెద్దలు ఇంత కక్ష పూరితంగా వ్యవహరిస్తారని ఎవరూ ఊహించలేరు. గుండె సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలున్న ఆయన్ని కావాలనే పీఎస్లకు తిప్పుతున్నారనే వాదన వినిపిస్తోంది. అదే టైంలో.. మిగతా చోట్ల పోలీసులు వారెంట్లను సిద్ధం చేస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వక చర్య కాకుంటే మరేమిటి? అని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ పోసాని బెయిల్ పిటిషన్ అంశం చర్చకు రావడం.. మరోవైపు వైఎస్సార్సీపీ నేతలు ములాఖత్కు దరఖాస్తు చేసుకున్నందునే ఇలా మరో కేసుతో ఆయన్ని జిల్లా తరలించారనే చర్చ నడుస్తోందక్కడ. మార్చి 5వ తేదీకి కడప కోర్టు ఆయన బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా వేసింది. ఈలోపు ఆయన్ని మరింత ఇబ్బంది పెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.పోలీసుల పోటీ.. అవసరమా?నరసరావుపేటకు పోసానిని తరలించే ముందు రాజంపేట సబ్ జైలులో పోలీసుల హైడ్రామా నడిచింది. నరసరావుపేటతో పాటు అల్లూరి జిల్లా, అనంతపురం రూరల్ పోలీసులు ఒకేసారి జైలు వద్దకు చేరుకున్నారు. పోసానిపై నమోదైన కేసులకు సంబంధించి పీటీ వారెంట్లు జైలు అధికారులకు సమర్పించారు. ‘మేం కోర్టు అనుమతి తీసుకున్నాం.. ముందుగా మాకే పోసానిని అప్పగించాలి..’ అని కోరారు. దీంతో ఉన్నతాధికారులతో మాట్లాడిన అనంతరం నరసరావుపేట పోలీసులకు అనుమతి ఇచ్చారు. తనకు ఛాతీలో నొప్పిగా ఉందంటూ పోసాని చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించారు. 👉పోసానిపై అక్రమ కేసులు బనాయిస్తూ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ మొదటి నుంచి మండిపడుతున్న సంగతి తెలిసిందే. అనారోగ్యం గురించి పట్టించుకోగా.. పోసానిని అపహాస్యం చేసేలా మీడియా ముందు మాట్లాడుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వ పెద్దల(Kutami Peddalu) డైరెక్షన్లోనే ఇలా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఇటు వైఎస్సార్సీపీ నేతలు, అటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
ఎస్సీ ,ఎస్టీ ప్రత్యేక కోర్టులో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్
సాక్షి, విజయవాడ : తనకు బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ ఎస్సీ ,ఎస్టీ స్పెషల్ కోర్టును ఆశ్రయించారు. ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో వంశీ తరుపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ)కు కోర్టు ఆదేశించింది. అయితే, వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసేందుకు మూడు రోజులు సమయం కావాలని పీపీ కోరారు. దీంతో కోర్టు తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది. -
వల్లభనేని వంశీ పిటిషన్లపై నేడు విచారణ
సాక్షి, విజయవాడ: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్లపై విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో నేడు విచారణ జరగనుంది. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు వంశీ. అలాగే, ఆరోగ్య కారణాల రీత్యా ఇంటి నుంచి ఆహారం తెచ్చుకునేందుకు అనుమతి కోరుతూ వంశీ మరో పిటిషన్లో పేర్కొన్నారు.గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. తను బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఒక పిటిషన్.. అలాగే, ఆరోగ్య కారణాల రీత్యా ఇంటి నుంచి ఆహారం తెచ్చుకునేందుకు అనుమతి కోరుతూ వంశీ మరో పిటిషన్ వేశారు. ఇదే సమయంలో తనకు బ్యారక్లో బెడ్ అనుమతించాలని పిటిషన్లో కోరారు. ఇదిలా ఉండగా.. వంశీని కస్టడీకి కోరుతూ పటమట పోలీసుల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 10 రోజుల కస్టడీకి కోరుతూ విజయవాడ పటమట పోలీసులు పిటిషన్లో కోరారు. -
వంశీ అరెస్ట్ ముందస్తు వ్యూహమే
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ను అరెస్ట్ ముందస్తు వ్యూహమే. ఆయన్ని∙అరెస్టు చేయాలని, జైల్లో పెట్టాలని ముందుగానే కొందరు తీసుకున్న నిర్ణయాన్ని విజయవాడ పోలీసులు అమలు చేశారు. వంశీపై ఫిర్యాదు చేసిన వ్యక్తిని, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై విచారణ చేయకుండానే కేసులు పెట్టారు. ఇదంతా ఆయన్ని ఉద్దేశపూర్వకంగా కేసుల్లో ఇరికించేందుకు పన్నిన కుట్ర మాత్రమే.వీటన్నింటినీ పరిశీలించి బెయిల్ మంజూరు చేయండి’ అని వంశీ తరపున దాఖలు చేసిన బెయిల్పిటిషన్లో న్యాయవాది తానికొండ చిరంజీవి కోరారు. ‘రెండేళ్ల క్రితం గన్నవరంలో జరిగిన ఓ ఘటనపై సత్యవర్ధన్ అనే వ్యక్తి వల్లభనేని వంశీమోహన్, మరికొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదును ఈ నెల పదో తేదీన న్యాయమూర్తి ఎదుట వాపసు తీసుకున్నాడు. అతన్ని వంశీ బెదిరించి ఫిర్యాదును ఉపసంహరించుకునేలా చేశాడంటూ అతని సోదరుడు కిరణ్ ఈ నెల 12న పటమట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఫిర్యాదు చేసిన కిరణ్ను, బాధితుడిగా అందులో పేర్కొన్న సత్యవర్ధన్ను విచారించకుండానే అదే రోజు హడావుడిగా కిడ్నాప్, ఎక్స్ట్రాక్షన్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం విజయవాడ పోలీసులకే చెల్లింది. అదే రోజు (12వ తేదీ) రాత్రే విజయవాడ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. వంశీ ఇంటి వద్ద రాత్రంతా పహారా కాసి 13వ తేదీ తెల్లవారుజామునే బెడ్రూంలో ఉన్న ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం విజయవాడ భవానిపురం పోలీస్ స్టేషన్కు తెచ్చారు. అక్కడి నుంచి కృష్ణలంక పోలీసు స్టేషన్కు తీసుకొచ్చి రాత్రి 9 గంటల వరకు విచారణ పేరుతో కూర్చోబెట్టారు. ఆ తరువాత న్యాయస్థానంలో హాజరుపర్చారు. ఇదంతా కొందరు పెద్దల మెప్పు కోసం పోలీసులు పడిన ఆరాటం మాత్రమే.పోలీసుల అభియోగంలో ఎలాంటి వాస్తవం లేదు. సత్యవర్థన్తో పోలీసులు బలవంతంగా సెకండ్ ఏసీఎంఎం కోర్టులో వాంగ్మూలం చెప్పించినట్లు అనుమానాలు ఉన్నాయి. సత్యవర్ధన్ను బెదిరించేందుకు వంశీ, అతని అనుచరులు ఓ వ్యక్తిని పురమాయించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అదే నిజమైతే అసలైన ఆ నిందితుడు ఎక్కడున్నాడు? ఈ కేసు పూర్తిగా కల్పితమనడానికి ఇదే నిదర్శనం. కొన్నేళ్లుగా వంశీ అనారోగ్యంతో, టెయిల్ బోన్ గాయంతో బాధపడుతున్నారు.కరోనా సమయం నుంచి బ్రీతింగ్ సమస్యలు ఉన్నాయి. నేలపై కూర్చోవడం, పడుకోవడానికి కష్టంగా ఉంటుంది. అందువల్ల ఆయనకు వెంటనే బెయిల్ ఇవ్వండి’ అని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈలోగా ఆయనకు టాయిలెట్, బెడ్, ఇంటి నుంచి ఆహారం, మందుల సౌకర్యం కల్పించాలని కోరారు. జైల్లోని బ్యారక్లో వంశీని ఒంటరిగా ఉంచి మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని, రూమ్లో అసిస్టెంట్ను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.పది రోజుల కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్ జ్యుడిíÙయల్ రిమాండ్లో ఉన్న వల్లభనేని వంశీమోహన్ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయవాడ పోలీసులు కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో వంశీ, అతని అనుచరుల నుంచి మరిన్ని వివరాలను రాబట్టాల్సి ఉందని, పది రోజులు కస్టడీకి అప్పగించాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. -
వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు
-
వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై కీలక అంశాలు
-
వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు
సాక్షి, విజయవాడ: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తరపున ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్తో పాటుగా వంశీ మెడికల్ రిపోర్టులతో మరో పిటిషన్ కూడా ఇచ్చారు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా ప్రత్యేక వైద్య వసతులు, ఇంటి నుంచే ఆహారం అందించే సదుపాయం కల్పించాలని కోరారు. మరోవైపు.. ఇప్పటికే వంశీని కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.తన బెయిల్ పిటిషన్లో వంశీ కీలక అంశాలను వెల్లడించారు. బెయిల్ పిటిషన్లో భాగంగా వంశీ..‘తనపై రాజకీయ, వ్యక్తిగత కక్షతో కేసులు నమోదు చేశారు. సత్య వర్ధన్ను తాను కిడ్నాప్ చేశాననేది అక్రమంగా పెట్టిన కేసు. తన తల్లితో కలిసి ఆటోలో కోర్టుకి వచ్చినట్టు సత్య వర్ధన్ కోర్టుకు తెలిపాడు. గతంలో కోర్టుకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు కోర్టు ఇస్తే సత్య వర్ధన్ వచ్చారు. కేసుతో తనకు సంబంధం లేదని తనను ఎవరూ తిట్టలేదని పోలీసులకు కూడా గతంలోనే సత్య వర్ధన్ స్టేట్ మెంట్ ఇచ్చారు. అదే విషయాన్ని మళ్లీ కోర్టుకు సత్య వర్ధన్ తెలిపారు తప్ప నా ప్రమేయం లేదు’ అని తెలిపారు.ఇక, మెడికల్ గ్రౌండ్స్లో బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని మరో పిటిషన్ దాఖలు చేశారు. వెన్నుపూస నొప్పి కారణంగా జైలులో తనకు బెడ్ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించాలని, ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్పటికే జైలు అధికారులతో తనకు వెన్నుపూస నొప్పి ఉందని మంచం కావాలని జైలు అధికారులను కోరారు. జైలు అధికారులు కోర్టులో పిటిషన్ వేసుకోవాలని సూచించడంతో వంశీ పిటిషన్ దాఖలు చేశారు. -
‘సహ జీవన’ సంబంధాలకు తగు పరిష్కారం కనుగొనాలి
ప్రయాగ్రాజ్: సమాజం ఆమోదించకున్నా నేటి యువత సహ జీవన సంబంధాలకు మొగ్గు చూపుతోందని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఇటువంటి సందర్భాల్లో నైతిక విలువలను కాపాడేందుకు తగు పరిష్కారం లేదా నిబంధనలను రూపొందించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. వివాహం పేరుతో మహిళతో శారీరక సంబంధం కొనసాగించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారణాసి వాసి ఆకాశ్ కేసరి బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ నళిన్ కుమార్ శ్రీవాస్తవ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సహ జీవనం వైపు యువతీయువకులు ఆకర్షితులవుతున్నారు. కొన్నాళ్లు కలిసున్నాక ఇష్టం లేకుంటే అతడు లేక ఆమె చాలా సులువుగా ఈ బంధం నుంచి బయటపడేందుకు అవకాశముంది. అందుకే, ఇలాంటి బంధాలకు యువత తొందరగా లొంగిపోతోంది. అందుకే, సమాజంలో నైతిక విలువలను పరిరక్షించేందుకు సహ జీవన సంబంధాలకు ఒక పరిష్కారం కనుగొనాల్సిన సమయమిదే’అని పేర్కొన్నారు. ఓ మహిళతో ఆకాశ్ కేసరి ఆరేళ్లపాటు సహజీవనం చేశాడు. అనంతరం పెళ్లికి నిరాకరించాడంటూ బాధిత మహిళ సార్నాథ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సీ, ఎస్టీ చట్టంతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు కేసరిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఆ మహిళ మేజర్ అనీ, అంగీకారంతోనే ఆమె సహజీవనం చేసిందని కేసరి లాయర్ వాదించారు. ఆమెకు కేసరి అబార్షన్ చేయించలేదని, పెళ్లి చేసుకుంటానని అతడు మాట కూడా ఇవ్వలేదని చెప్పారు. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి కేసరికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. -
మాజీ మంత్రి పేర్ని నాని ముందస్తు బెయిల్పై నేడు విచారణ
సాక్షి, అమరావతి : రేషన్ బియ్యం కేసులో మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య అలియాస్ నానిపై ఎలాంటి కఠిన చర్యలేవీ తీసుకోవద్దంటూ ఇటీవల తామిచ్చిన ఉత్తర్వులను హైకోర్టు బుధవారం వరకూ పొడిగించింది. నాని ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఉత్తర్వులిచ్చారు. రేషన్ బియ్యం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ నాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రావాల్సి ఉన్నా.. రాకపోవడంతో అత్యవసర విచారణ కోసం నాని తరఫు న్యాయవాది వీసీహెచ్ నాయుడు కోర్టును అభ్యర్థించారు. దీంతో న్యాయమూర్తి లంచ్మోషన్ రూపంలో విచారణకు అంగీకరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యర్థన మేరకు న్యాయమూర్తి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.పెనాల్టీ నోటీసులపై పూర్తి వివరాలివ్వండి.. ఇదే వ్యవహారంలో రూ.1.67 కోట్లు పెనాల్టీ చెల్లించాలంటూ పౌర సరఫరాల శాఖ ఇచి్చన నోటీసులను సవాలు చేస్తూ పేర్ని నాని సతీమణి, గోడౌన్ యజమాని జయసుధ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలను తమ ముందుంచాలని పౌర సరఫరాల శాఖను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు సోమవారం ఉత్తర్వులిచ్చారు. ముందస్తు బెయిల్ పిటిషన్ల కొట్టివేత సాక్షి, అమరావతి : గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసులో పలువురు నిందితులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. పిటిషనర్లపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదై ఉన్నందున చట్ట నిబంధనల ప్రకారం కింది కోర్టులోనే పిటి షన్లు దాఖలు చేసుకోవాలంది. అందువల్ల ఈ వ్యాజ్యాలకు విచారణార్హత లేదని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ సోమవారం తీర్పు వెలువరించారు. 2023లో గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ ఘ టనలో పోలీసులు పలువురిపై కేసులు నమో దు చేశారు. దీంతో కృష్ణారావు మరో 32 మంది హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దా ఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి సోమవారం నిర్ణయాన్ని వెలువరించారు. వారికి నెల రోజుల్లో ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేయండిసాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘించని మైనర్ మినరల్ లీజుదారులకు నెల రోజుల్లో ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేయాలని గనుల శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. గత ఏడాది అక్టోబర్లో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు లోబడి ఈ ట్రాన్సిట్ పర్మిట్లు ఉండాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ కుంఢజడల మన్మథరావు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. చట్ట ప్రకారం అన్ని అనుమతులు ఉన్నప్పటికీ తమకు ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ ఫెడరేషన్ ఆఫ్ మైనర్ మినరల్స్ ఇండస్ట్రీ (ఫెమ్మీ) సెక్రటరీ జనరల్ చట్టి హనుమంతరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం విచారణ జరిపిన జస్టిస్ మన్మథరావు నిబంధనల ప్రకారం ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేశారు. అంబటి పిటిషన్లో పూర్తి వివరాలివ్వండి పోలీసులకు హైకోర్టు ఆదేశం సాక్షి, అమరావతి: తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు తనను, తన కుటుంబ సభ్యులను కించపరుస్తూ, అసభ్యకరంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలంటూ తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ మాజీ మంత్రి అంబటి రాంబాబు దాఖలు చేసిన వ్యాజ్యంలో పూర్తి వివరాలు సమరి్పంచాలని హైకోర్టు సోమవారం పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి ఉత్తర్వులు జారీచేశారు. తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధ్యులపై కేసు నమోదు చేసేలా గుంటూరు పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని రాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచి్చంది. అంబటి రాంబాబు స్వయంగా వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణ ఈ నెలాఖరుకి వాయిదా వేశారు. -
నాంపల్లి కోర్టు తీర్పుపై ఉత్కంఠ
-
రాజకీయ దురుద్దేశాలతోనే కేవీ రావు తప్పుడు ఫిర్యాదు
సాక్షి, అమరావతి: కాకినాడ డీప్ సీ వాటర్ పోర్టు వాటాల బదిలీ వ్యవహారంలో కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు) రాజకీయ దురుద్దేశాలతోనే తనపై సీఐడీకి ఫిర్యాదు చేశారని వైవీ విక్రాంత్రెడ్డి హైకోర్టుకి నివేదించారు. ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టి, కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు. ఆయన చేస్తున్న ప్రతీ ఆరోపణను తోసిపుచ్చుతున్నట్టు విక్రాంత్రెడ్డి తెలిపారు. ‘నా ప్రతిష్టను దెబ్బతీయాలన్న అజెండాతోనే కేవీ రావు నాపై నిరాధార, తప్పుడు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం కోర్టులో జరుగుతున్న లీగల్ ప్రొసీడింగ్స్ ద్వారా అనుచిత లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే అలా చేశారు. నాపై చేసిన ఏ ఒక్క ఆరోపణకు కూడా ఆధారం చూపలేదు. తద్వారా చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేశారు. ఈ కేసులో నిర్ణయం వెలువరించేందుకు అత్యావశ్యకమైన పలు కీలక విషయాలను ఆయన తొక్కిపెట్టారు. వాటాల బదిలీ జరిగిన నాలుగేళ్ల తరువాత సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఇంత జాప్యం ఎందుకు జరిగిందో ఆయన ఎక్కడా చెప్పలేదు. వాటాల బదిలీ ప్రక్రియలో, మూల్యాంకనంలో, ఒప్పందాల తయారీలో కేవీ రావు క్రియాశీలకంగా వ్యవహరించారు. గత ప్రభుత్వంతో నాకున్న రాజకీయ సంబంధాల దృష్ట్యా నా ప్రతిష్టను దెబ్బతీయడానికే రాజకీయ దురుద్దేశాలతో ఆయన ఫిర్యాదు చేశారు. కేవీ రావు తన స్వీయ చర్యల నుంచి దృష్టిని మరల్చేందుకే, తన తప్పులను కప్పించుకునేందుకే నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. తను బాధితుడినంటూ చెప్పుకుంటున్న కేవీరావు అందుకు ప్రాథమిక ఆధారాలను చూపడంలో విఫలమయ్యారు. న్యాయ సలహాదారులు, ఆడిటర్ల సమక్షంలోనే వాటాల బదిలీ జరిగింది’ అని విక్రాంత్రెడ్డి వివరించారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, ముందస్తు బెయిల్ కోసం తాను దాఖలు చేసిన పిటిషన్ను అనుమతించాలని కోర్టును కోరారు. ఈ అనుబంధ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయదలచుకుంటే చేయవచ్చని న్యాయస్థానం స్పష్టం చేయడంతో విక్రాంత్రెడ్డి తన వాదన వినిపిస్తూ సోమవారం ఈ మేరకు కౌంటర్ దాఖలు చేశారు. విక్రాంత్ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ జరపనుంది. -
అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా
-
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
-
‘రిమాండ్’ను కొట్టివేయలేం
సాక్షి, హైదరాబాద్: లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి జిల్లాకోర్టు విధించిన రిమాండ్ను కొట్టివేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పట్నం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని.. తామిచ్చిన ఉత్తర్వుల ప్రభావం ఉండబోదని ఆదేశించింది. మెరిట్స్ ఆధారంగా తీర్పు వెలువరించాలని ట్రయల్ కోర్టుకు సూచించింది. పిటిషన్ను కొట్టివేసింది. లగచర్ల ఘటనలో తనను అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ నరేందర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు డాకెట్(రిమాండ్) ఆర్డర్ను క్వాష్ చేయాలని కోరారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ గత నెల తీర్పు రిజర్వు చేశారు. పిటిషన్ను కొట్టివేస్తూ బుధవారం తీర్పునిచ్చారు. అయితే, బెయిల్ పిటిషన్పై వికారాబాద్ కోర్టు చేసిన వ్యాఖ్యలను నరేందర్రెడ్డి న్యాయవాది జస్టిస్ కె.లక్ష్మణ్ దృష్టికి తీసుకొచ్చారు. బెయిల్ పిటిషన్లు తమ పరిధిలోకి రావని స్పెషల్ కోర్టు చూస్తుందని వెల్లడించిందన్నారు. దీంతో స్పెషల్ కోర్టు వివరాలు తెలపాలని న్యాయమూర్తి నరేందర్రెడ్డి న్యాయవాదిని ఆదేశించారు. గత నెల 13న నరేందర్రెడ్డిని అరెస్టు చేయగా, ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న విషయం తెలిసిందే. -
నేడు సుప్రీంకోర్టులో మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ పై విచారణ
-
పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
వికారాబాద్: వికారాబాద్ జిల్లా కొడంగల్ పరిధిలోని ‘లగచర్ల కేసు’కు సంబంధించి సోమవారం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాడిలో పాలుపంచుకున్నాడనే కారణంతో పోలీసులు ఓ పంచాయతీ కార్యదర్శిని అరెస్టు చేయగా, అతన్ని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 11న లగచర్ల ఘటన చోటుచేసుకోగా, ఇందులో 42 మంది పాల్గొన్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. మరుసటి రోజున 21 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.ఇందులో సంగాయిపల్లి పంచాయతీ కార్యదర్శి కావలి రాఘవేందర్ ఏ– 26గా ఉన్నాడు. అతని స్వగ్రామం లగచర్ల కాగా సంగాయిపల్లిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. రిమాండ్ రిపోర్టులో అతని వృత్తి పంచాయతీ కార్యదర్శి అని కూడా పోలీసులు మెన్షన్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులు తమకు తెలియజేయలేదని, శనివారం కలెక్టర్కు తెలియడంతో అతన్ని సస్పెండ్ చేశారని డీపీఓ జయసుధ తెలిపారు. ఇదిలావుండగా రిమాండ్ రిపోర్టులో తాను ఇచి్చనట్టుగా పేర్కొన్న వాంగ్మూలం వాస్తవం కాదని, మూడురోజుల క్రితం నరేందర్రెడ్డి అందజేసిన అఫిడవిట్ను న్యాయవాదులు సోమవారం కొడంగల్ కోర్టులో దాఖలు చేశారు. మరోవైపు నరేందర్రెడ్డి బెయిల్ పిటిషన్పై సోమవారం వికారాబాద్ జిల్లా కోర్టులో వాదనలు జరగగా, న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 25వ తేదీకి వాయిదా వేశారు. కస్టడీ పిటిషన్పై రేపు విచారణ నరేందర్రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్పై విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు. ఇంకోవైపు లగచర్లలో ఘటనలో నిందితుల అరెస్టులు కొనసాగుతుండగానే.. పోలీసు ఉన్నతాధికారులు పరిగి డీఎస్పీ కరుణాసాగర్రెడ్డిపై వేటు వేశారు. ఆయనను డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఉత్తర్వుల్లో సాధారణ బదిలీగా పేర్కొనడం గమనార్హం. కాగా కొత్త డీఎస్పీగా శ్రీనివాస్కు బాధ్యతలు అప్పగించారు. -
ప్రజ్వల్ రేవణ్ణకు చుక్కెదురు
ఢిల్లీ: లైంగిక దాడుల కేసుల్లో కర్ణాటక నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు భంగపాటు ఎదురైంది. బెయిల్ విజ్ఞప్తిని సోమవారం సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఇంతకు ముందు.. కర్ణాటక హైకోర్టు కూడా ఆయన బెయిల్ అభ్యర్థనను తిరస్కరించింది. -
జానీ మాస్టర్కు భారీ షాక్
-
నేషనల్ అవార్డు తీసుకోవాలి బెయిల్ ఇవ్వండి..
-
సీబీఐపై ఘాటు వ్యాఖ్యలు.. సుప్రీం నోట మళ్లీ అదే మాట!
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే. ఈ మేరకు సుప్రీంకోర్టు జస్టిస్లు సూర్యకాంత్, ఉజ్జల్ భూయన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కేజ్రీవాల్కు శుక్రవారం పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.బెయిల్పై విచారణ సందర్భగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐను ఉద్ధేశిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ విషయంలో సీబీఐ వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. దేశంలో సీబీఐ పరిస్థితిని వర్ణిస్తూ.. ‘పంజరంలో ఉన్న చిలుక (caged parrot) మాదిరి వ్యవహరించకూడదని సూచించారు.సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్సీబీఐ అంటే స్వతంత్రంగా వ్యహరించడం లేదని, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థగా పనిచేస్తుందనే అర్థంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే సీబీఐ.. కేంద్ర ప్రభావంతో పనిచేసే ‘బోనులో ఉన్న చిలుక’ కాదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీబీఐ అంటే ‘స్వేచ్ఛగా విహరించే చిలుకలా’ వ్యవహరించాలని తెలిపారు. తనపై వ్యక్తం అయిన అనుమానాలను సీబీఐ నివృత్తి చేసుకోవాలన్నారు. అలాగే సీఎం కేజ్రీవాల్ను సీబీఐ అరెస్ట్ చేసిన విధానంపై జస్టిస్ భూయాన్ విమర్శలు గుప్పించారు. ఆయన్ను కేవలం జైలులో ఉంచి వేధించాలన్న ఉద్దేశంతో ప్లాన్ ప్రకారం అరెస్ట్ జరిగినట్లు కనిపిస్తోందన్నారు. అయితే ‘పంజరంలో బంధించిన చిలుక’ పదాన్ని 2013లో సీబీఐపై సుప్రీంకోర్టు ఉపయోగించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ స్వతంత్రమైనది కాదని కేంద్ర ప్రభుత్వ ప్రభావంతో పని చేస్తుందని వ్యాఖ్యానించింది. కోర్టు పరిశీలనతో ఏకీభవించిన అప్పటి సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా.. ఈ వ్యాఖ్యను అంగీకరించారు. సీబీఐ విధుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందన్న భావనతో ప్రతిపక్షాలు సీబీఐని ‘పంజరంలో చిలుక’ అనే మాటను తరచుగా ఉపయోగిస్తుంటాయి. తాజాగా సుప్రీంకోర్టు విచారణతో ఈ పదబంధం మళ్లీ తెరపైకి వచ్చింది.చదవండి: ఆరు నెలల తర్వాత బయటకు మరోవైపు విచారణ సందర్భంగా బెయిల్పై జస్టిస్ సూర్యకాంత్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. సీబీఐ అరెస్టు సక్రమైందని తెలిపిన న్యామూర్తి.. సుదీర్ఘంగా జైలులో నిర్బంధించడం అంటే.. వ్యక్తి హక్కులను హరించినట్లే అవుతుందని వ్యాఖ్యానించింది. విచారణ ప్రక్రియ శిక్షగా మారకూడదని.. ఈడీ కేసులో బెయిల్ లభించిన వెంటనే సీబీఐ అరెస్ట్ చేయడం సరైంది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 21 ప్రకారం సాధారణంగా కోర్టులు స్వేచ్ఛ వైపే మొగ్గుచూపుతాయని తెలిపారు.కాగా లిక్కర్ పాలసీకి చెందిన మనీలాండరింగ్ కేసులో తొలుత కేజ్రీవాల్ను మార్చి 21న ఈడీ అదుపులోకి తీసుకుంది. అనంతరం జైలులో ఉన్న కేజ్రీవాల్ను జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే ఈడీ కేసులో సీఎంకు జూలై 12న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయగా.. సీబీఐ కేసులో ఇప్పటి వరకు బెయిల్ రాకపోవడంతో ఆయన జైలులోనే ఉన్నారు.సీబీఐ అరెస్ట్ను సవాల్ చేస్తూ, బెయిల్ కోసం అభ్యర్థిస్తూ రెండు పిటిషన్లు వేశారు. ఈ రెండు పిటిషన్లపై ఈ నెల 5న విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో ఆరు నెలల తర్వాత కేజ్రీవాల్ బయటకు రానున్నారు.ఇదీ చదవండి: అభయ కేసు.. సీబీఐ సంచలన నిర్ణయం -
రేపే కేజ్రీవాల్ బెయిల్ తీర్పు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో అరెస్టై.. తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్పై సుప్రీం కోర్టు రేపు(శుక్రవారం) తీర్పు వెల్లడించనుంది. సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలని అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు ఇప్పటికే విచారణ పూర్తి చేసింది. రేపు బెయిల్ మంజూరు అయితే అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కానున్నారు. సెప్టెంబర్ 5వ తేదీన చేపట్టిన విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం బెయిల్ తీర్పును రిజర్వ్ చేసి రేపు (సెప్టెంబర్ 10)న వెల్లడిస్తామని పేర్కొంది.చదవండి: కేజ్రీవాల్ బెయిల్పై సుప్రీంలో వాడీవేడి వాదనలు -
Supreme Court: బెయిల్ ఇవ్వడమంటే హైకోర్టును తక్కువ చేయడం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో బెయిల్ ఇవ్వడమంటే హైకోర్టును తక్కువ చేయడం కాదని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిలు పిటిషన్పై విచారణలో భాగంగా న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై సుదీర్ఘ విచారణ జరిపి తీర్పు రిజర్వు చేసింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిõÙక్ మను సింఘ్వి, సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. తొలుత ఎస్వీ రాజు వాదనలు ప్రారంభిస్తూ... ఈ అంశాన్ని తొలుత ట్రయల్ కోర్టు విచారించాలని కోరారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల బెయిల్ ప్రస్తావన తీసుకొస్తూ....బెయిల్ మంజూరుకు ట్రయల్ కోర్టుకు వెళ్లమనడం సరికాదని సింఘ్వి పేర్కొన్నారు. బెయిల్ కోసం మళ్లీ ట్రయల్ కోర్టుకు పంపడం వైకుంఠపాళి ఆటలా ఉంటుందని సిసోడియా కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తుచేశారు. దీనిపై ఎస్వీ రాజు అభ్యంతరం చెబుతూ సిసోడియా ట్రయల్ కోర్టుకు వెళ్లి మళ్లీ సుప్రీంకోర్టుకు వచ్చారని కేజ్రీవాల్ కూడా పద్ధతి ప్రకారం వ్యవహరించాల్సిందేనని పేర్కొన్నారు. ట్రయల్ కోర్టును బైపాస్ చేయడం కేవలం ప్రత్యేక పరిస్థితుల్లోనే జరుగుతుందని ఇక్కడ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావడం తప్ప ఇంకేం లేదని రాజు తెలిపారు. బెయిల్ కోసం కేజ్రీవాల్ నేరుగా హైకోర్టుకు వెళ్లారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో, సీబీఐ వైకుంఠపాళి ఆట ఆడాలని చూస్తోందని సింఘ్వి ఆరోపించారు. సుప్రీంకోర్టు ఒకవేళ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేస్తే.. అరెస్టును సమర్థించిన ఢిల్లీ హైకోర్టు నైతికస్థైర్యాన్ని అది దెబ్బతీస్తుందని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు అన్నారు. ‘అలా అనకండి. బెయిల్ ఇస్తే హైకోర్టును తక్కువ చేసినట్లు కాదు. ఎలాంటి ఆదేశాలు జారీచేసినా హైకోర్టుకు భంగం కలగనివ్వం’ అని ధర్మాసనం రాజుకు హామీ ఇచ్చింది. అనంతరం తీర్పు రిజర్వుచేస్తున్నట్లు ప్రకటించి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. -
కేజ్రీవాల్ బెయిల్పై సుప్రీంలో వాడీవేడి వాదనలు.. తీర్పు రిజర్వు
న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజీవాల్ బెయిల్ పిటిషన్తో పాటు సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్పీ రాజు వాదించారు. ఇరు వర్గాల నుంచి సుధీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు.. కేజ్రీవాల బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నెల 10న తీర్పు వెల్లడించనుంది.ఎలాంటి ఆధారాలు లేకుండా సీబీఐ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిందని అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు. ఇది అరుదైన సంఘటనగా అభివర్ణించారు. కఠినమైన మనీలాండరింగ్ చట్టం కింద ఢిల్లీ ముఖ్యమంత్రి రెండుసార్లు బెయిల్ పొందారని, కానీ సీబీఐ ఆయన్ను ‘బీమా అరెస్టు’(ముందస్తు) చేసిందని మండిపడ్డారు.సింఘ్వీ వాదనలు..ఈ కేసులో రెండేళ్ల తర్వాత కేజ్రీవాల్ను సీబీఐ అరెస్టు చేసింది. మూడు కోర్టు ఉత్తర్వులు మాకు అనుకూలంగా ఉన్నాయి. అయినా బీమా అరెస్టు కింద( ఆకస్మిక) సీబీఐ కేజ్రీవాల్ను అదుపులోకి తీసుకుంది. కాబట్టి ఆయన్ని ఎప్పటికీ జైలులో ఉంచవచ్చని దర్యాప్తు సంస్థ భావిస్తోంది.41ఏ కింద కేజ్రీవాల్ను నిందితుడిగా విచారించాలని సీబీఐ దరఖాస్తు చేసుకుంది. అరెస్ట్ చేయాలని ముందుగా అనుకోలేదు. కేజ్రీవాల్ కస్టడీలో ఉన్నప్పుడు కేవలం ఆయన్ను విచారించేందుకు మాత్రమే కోర్టు అనుమతించింది.41ఏ దరఖాస్తు ప్రకారం సీబీఐ సీఎంను మూడు గంటలు విచారించారు. కానీ వారి దగ్గర 41ఏ నోటీసు లేదు. మరి అంత అకస్మాత్తుగా కేజ్రీవాల్ను ఎందుకు అరెస్ట చేశారు. ఇది బీమా అరెస్ట్, హడావిడి అరెస్ట్ కాకుంటే మరెంటీ?కేజ్రీవాల్ దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందా? సాక్ష్యాలను తారుమారు చేస్తాడా? అతను సాక్షులను ప్రభావితం చేస్తాడా? సుప్రీంకోర్టు మూడు ప్రశ్నల గురించి సుప్రీంకోర్టు ఆలోచించాలి.సీబీఐ అరెస్టుకు ప్రధాన కారణం కేజ్రీవాల్ సహకరించకపోవడమే. ఒక వ్యక్తి తనను తాను నేరారోపణ చేసుకోవాలని ఎలా అనుకుంటారు.అరవింద్ కేజ్రీవాల్ ఒక రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వ్యక్తి. ఎక్కడికి పారిపోలేడు. ట్యాంపరింగ్ కుదరదు, లక్షల డాక్యుమెంట్లు ఉన్నాయి, ఐదు చార్జిషీట్లు దాఖలయ్యాయి. సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం కూడా ఉండదు. బెయిల్ కోసం మూడు తీర్పు మాకు అనుకూలంగా ఉన్నాయి.కేజ్రీవాల్కు రెండుసార్లు బెయిల్ పొందారు. పీఎంఎల్ఏ సెక్షన్ 45 కింద సుప్రీంకోర్టు ఓసారి బెయిల్ ఇచ్చింది. కేవలం ఇన్సురెన్స్ (ముందస్తు, హడావిడీ) అరెస్టు మాత్రమే. అతని అరెస్ట్ను సమర్ధించేందుకు అంతకుముంచి దర్యాప్తు సంస్థ కోర్టు ముందు ఎలాంటి ఆధారాలు చూపించలేదు. ఈ కేసులో మిగతా నిందితులందరూ(విజయ్ నాయర్, మనీష్ సిసోడియా, బుచ్చి బాబు, సంజయ్ సింగ్, కవిత) విడుదలయ్యారు.లిక్కర్ పాలసీకి సబంధించిన ఈడీ కేసులో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా.. సీబీఐ ఆయన్ను అరెస్ట్ చేయడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ‘ఒకరు కస్టడీలో ఉన్నప్పుడు .. మళ్లీ అరెస్ట్ చేయాలంటే కోర్టు అనుమతి కావాలి. క్రిమినల్ ప్రోసీజర్ కోడ్లో ఏదో ఉంది’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.సీబీఐ సెక్షన్ 41, 41ఏ లను పాటించకుండా అర్నేష్ కుమార్, యాంటిల్ తదితర తీర్పులను ఉల్లంఘించి కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది.సీబీఐ తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్పీ రాజు.. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై అభ్యంతరం వ్యక్తం చేశారు. బెయిల్ కోసం ముందు మనీష్ సిసోడియా ట్రయల్ కోర్టుకు వెళ్లారు కానీ కేజ్రీవాల్ ఒక్కసారి కూడా ఆ పని చేయవలేదని ఆయన ప్రస్తావించారు. ఇలాంటి కేసుల్లో తాము జోక్యం చేసుకోలేం తిరిగి ట్రయల్ కోర్టుకు వెళ్లండి అంటూ సుప్రీంకోర్టు చెప్పిన కేసులు చాలా ఉన్నాయని పేర్కొన్నారు.కేజ్రీవాల్ ను సెషన్స్ కోర్టుకు వెళ్లకుండానే హైకోర్టును ఆశ్రయించాడు. ఇది నా ప్రాథమిక అభ్యంతరం. మెరిట్ల దృష్ట్యా ట్రయల్ కోర్ట్ దీనిని మొదట విచారించాల్సి ఉంది. అసాధారణమైన కేసుల్లో మాత్రమే హైకోర్టు పరిశీలిస్తుంది. సాధారణ కేసుల్లో ముందుగా సెషన్స్ కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది.కేజ్రీవాల్ ముందు సుప్రీంకోర్టుకు వచ్చారు. తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు మళ్లీ సుప్రీంకోర్టుకు వచ్చారు, ఇప్పుడు ఇక విషయాన్ని ఈ కోర్టు నిర్ణయించాలి. ఈ మేరకు కవిత కేసును ప్రస్తావిస్తూ.. ముందుగా ఆమె ట్రయల్ కోర్టుకు వెళ్లారు. అక్కడ తిరస్కరణ ఎదురవ్వడంతో హైకోర్టు మెట్లెక్కారు. అక్కడా ఊరట లభించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు.ఎస్పీ రాజు వాదనలపై జస్టిస్ కాంత్ స్పందిస్తూ..ఒకరిని ట్రయల్ కోర్టుకు పంపాలనుకుంటే అప్పుడే హైకోర్టు నిర్ణయాత్మకంగా ఆలోచించాల్సి ఉండేది. ఇక్కడ మెయింటెనబిలిటీకి సంబంధించిన ప్రశ్న కూడా నిర్ణయించుకోవాలి.చట్టం ముందు అందరూ సమానులే. ఎవరూ ప్రత్యేక వ్యక్తులు కారు. ఏ వ్యక్తికి ప్రత్యేక ట్రీట్మెంట్ ఉండదు. కేవలం ముఖ్యమంత్రి కావడం వల్లే కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. సాధారణ ప్రజలు ట్రయల్ కోర్టుకు వెళతారు. వారంతా సుప్రీంకోర్టుకు రాలేరు.కేజ్రీవాల్ రిమాండ్ దరఖాస్తును అందించాం, అందులో అరెస్టుకు సంబంధించిన వివరణాత్మక ఆధారాలు ఉన్నాయి. సాక్ష్యాలను తారుమారు చేసిప్పుడు లేదా సాక్షులను బెదిరించినప్పుడు. వారెంట్ లేకుండా సరైన దర్యాప్తు కోసం అరెస్టు చేయవచ్చు. ఈ కేసు ఆ వర్గంలోకి వస్తుంది.అరవింద్ కేజ్రీవాల్ ఛార్జ్ షీట్ కాపీని జతచేయలేదు. దానిని దాచినందున అతని బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలిఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తే, అది ఢిల్లీ హైకోర్టును నిలదీసినట్టే’ అంటూ వాదనలు వినిపించారు.అయితే లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించి కేజ్రీవాల్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులో సీఎంకు సుప్రీంకోర్టు గతంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే సీబీఐ కేసులో కేజ్రీవాల్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. ఈ కేసులోనూ సుప్రీం ముఖ్యమంత్రి బెయిల్ మంజూరు చేస్తే కేజ్రీవాల్ ఐదు నెలల తర్వాత జైలు నుంచి బయటకు రానున్నారు. -
బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కోల్కతా ఆర్జీ కర్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనపై విద్యార్థి సంఘాలు చేపట్టిన ‘చలో సెక్రటేరియట్’ నిరసన హింసాత్మంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ నిరసనల్లో అరెస్టైన ‘పశ్చిమ్ బంగా ఛత్ర సమాజ్’ సంస్థ విద్యార్థి నాయకుడికి ఇటీవల కోల్కతా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ను వ్యతిరేకిస్తూ.. బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు సోమవారం కోట్టివేసింది. ఈ క్రమంలో బెంగాల్ ప్రభుత్వ తీరుపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం.. కేవలం ఒక్క సయన్ లాహిరినే ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించింది. ‘‘ ఇది బెయిల్ ఇచ్చే కేసు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలా? వద్దా? అనే విషయంలో విద్యార్థి నేత తల్లి దాఖలు చేసిన పిటిషన్లో హైకోర్టు తెలిపింది’ అని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ పిటిషన్కు విచారణ అర్హత లేదని సుప్రీం కోర్టు పేర్కొంది.‘‘చలో సెక్రటేరియట్’’ మార్చ్ నిర్వహించిన రోజు రాత్రి ఛత్ర సమాజ్ నిర్వాహకుల్లో ఒకరైన సయన్ లాహిరిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆయన తల్లి కలకత్తా హైకోర్టును ఆశ్రయించగా.. శుక్రవారం ఉన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీనిపై బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
సుప్రీంకోర్టులో కాసేపట్లో కవిత బెయిల్ - పిటిషన్పై విచారణ
-
బెయిల్పై ఉత్కంఠ.. ఢిల్లీకి KTR
-
కవితకు బెయిల్ వచ్చేనా?
-
బెయిల్ వస్తే ఓకే.. రాకుంటే ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ దాదాపు 150 రోజులకు పైగా తీహార్ జైలులో ఉన్న ఆమె బెయి లు పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కవిత బెయిల్ విషయంలో కౌంటర్లు దాఖలు చేసేందుకు ఆలస్యమెందుకంటూ ఈనెల 12న సుప్రీంకోర్టు ఈడీని ప్రశ్నించింది. దీనితో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోర్టును ఈడీ అడగ్గా.. విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది.మంగళవారం కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు జరగనున్న నేప థ్యంలో.. కేటీఆర్, హరీశ్ తదితరులు సోమవారం ఢిల్లీ లో న్యాయవాదులతో భేటీ అయ్యా రు. 2 గంటల పాటు సుప్రీం కోర్టులో వాదించబోయే అంశాలపై చర్చించారు. కాగా, కోర్టు నిర్ణయం అనంతరం సాయంత్రం ఎమ్మెల్యేల అనర్హత అంశంపై మరోమారు న్యాయబృందంతో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బెయిల్పై ఆశాభావంతో..: కవిత 154 రోజుల నుంచి తీహార్ జైలులోనే ఉన్నారు. మంగళవారం సుప్రీంకోర్టులో ఆమె బెయిల్ పిటిషన్పై వాదనల నేపథ్యంలో ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్, హరీశ్లు న్యాయవాది మోహిత్రావు బృందంతో సుదీర్ఘమైన చర్చలు జరిపారు. ‘బెయిల్ వస్తే ఓకే.. ఒకవేళ బెయిల్ రాని పక్షంలో తదుపరి కార్యాచరణ ఏమిటి? న్యాయ పోరాటం ఎలా చేయాలి’అనే అంశాలపై చర్చించారు. బెయిల్పై కౌంటర్ దాఖలు విషయంలో ఆలస్యం ఎందుకు చేస్తున్నారంటూ ఈడీని సుప్రీంకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ఈ సారి కవితకు బెయిల్ వస్తుందని ఆమె కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలు ఆశాభావంతో ఉన్నారు. మహిళగా కవితకు మినహాయింపు ఇవ్వండిపీఎంఎల్ఏ సెక్షన్–45లోని కఠిన నిబంధనల నుంచి మహిళగా ఎమ్మెల్సీ కవితకు మినహాయింపు ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ్గ సుప్రీంకోర్టును కోరారు. ఇప్పటికే కవిత హైబీపీతో బాధ పడుతున్నారు. పదికేజీలకు పైగా బరువు తగ్గారు. మరోపక్క జ్వరంతో బాధపడుతూనే ఉన్నారు. వీటన్నింటికంటే ఆమె దీర్ఘకాలికంగా ఉన్న గైనిక్ సమస్యల వల్ల మరింత ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని న్యాయబృందం సుప్రీంకోర్టుకు నివేదించనుంది.పీఎంఎల్ఏ సెక్షన్–45లోని కఠిన నిబంధనల నుంచి కవితకు మినహాయింపు ఇచ్చి బెయిల్ మంజూరు చేయాలని సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించేందుకు ఆమె తరఫు న్యాయవాదులు సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా కవితకు ఉన్న అనారోగ్య సమస్యలపై ఢిల్లీ ఎయిమ్స్ ఇచ్చిన రిపోర్టులను ఈడీ అధికారులు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని న్యాయస్థానం బెయిలు మంజూరు చేస్తుందా లేక వాయిదా వేస్తుందా అన్న అంశంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. -
కవితకు మళ్లీ నిరాశే!
-
కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఇవాళ్టి విచారణ సందర్భంగా కవిత బెయిల్ పిటిషన్కు సీబీఐ కౌంటర్ దాఖలు చేయగా. ఈడీ దాఖలు చేయలేదు. దీంతో.. శుక్రవారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని కోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం.ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిలు ఇవ్వాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. జూలై 1న న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 12న పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని తెలిపింది. దీంతో.. ప్రతివాదులుగా ఉన్న దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్ట్ 20కి వాయిదా వేసింది. దీంతో ఇవాళ కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది.Supreme Court posts the hearing for August 27 on the plea of BRS leader K Kavitha seeking bail in corruption and money laundering cases linked to the alleged Delhi excise policy scam. pic.twitter.com/0Klk3lvDJV— ANI (@ANI) August 20, 2024మరోవైపు కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి , మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాలు ఢిల్లీకి చేరుకున్నారు.ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. అదే కేసులో ఏప్రిల్ 11న కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే సీబీఐ,ఈడీ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కవిత సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు..ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో విచారణను వాయిదా వేసింది. -
ఏపీ హైకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట లభించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. ఈ నెల 20 వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హూకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 20కి న్యాయస్థానం వాయిదా వేసింది.చదవండి: నాడు అత్యుత్సాహం.. నేడు అతి వినయం -
లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట
-
కవిత బెయిల్ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
-
నేడు కవిత బెయిలుపై సుప్రీంకోర్టు విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బెయిలు కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటి షన్పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ నిర్వహించనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కవిత దాఖ లు చేసిన పిటిషన్ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారించనుంది.ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత కు కూడా బెయిలు దక్కుతుందని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. సిసోడియాకు బెయి లు ఇచ్చిన సమయంలో.. సత్వర విచారణ హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ గురించి సుప్రీంకోర్టు ప్రస్తావించిన నేపథ్యంలో కవిత బెయిలు అంశం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. -
ఢిల్లీ లిక్కర్ కేసు: కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై తీర్పు నేడే
ఢిల్లీ:ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు రిజర్వులో పెట్టిన తీర్పును ఇవాళ(సోమవారం) ఇవ్వంది. లిక్కర్ ఈడీ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో కేజ్రీవాల్ ఇంకా తీహార్ జైల్లోనే ఉన్నారు. గతవారం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై వాదానులు ముగియడంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. ‘‘ఎక్సైజ్ కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్. ఆయన్ను విడుదల చేస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారు. ఆయన అరెస్టయితేనే ఈ కేసు విచారణ ముగింపునకు వస్తుంది. నెలలోగా చార్జిషిటు వేస్తాం’అని సీబీఐ లాయర్ డీపీ సింగ్ తెలిపారు. కేజ్రీవాల్ను జైలు నుంచి బయటకు రాకుండా చేసేందుకే సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారని ఆయన తరఫు సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదించారు. ఊహాకల్పనలతోనే కేజ్రీవాల్కు అరెస్ట్ చేశారే తప్ప, ఆయనకు వ్యతిరేకంగా ప్రత్యక్షంగా ఎటువంటి ఆధారాలు లేవన్నారు. వాదనలు విన్న అనంతరం జస్టిస్ నీనా బన్సన్ కృష్ణ తీర్పును రిజర్వులో ఉంచుతూ ఆదేశాలిచ్చారు. -
కేజ్రీవాల్ బెయిల్పై తీర్పు రిజర్వు
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వులో ఉంచింది. సోమవారం కేజ్రీవాల్, సీబీఐ తరఫు లాయర్లు తమ వాదనలు వినిపించారు. ‘ఎక్సైజ్ కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్. ఆయన్ను విడుదల చేస్తే సాకు‡్ష్యలను ప్రభావితం చేస్తారు. ఆయన అరెస్టయితేనే ఈ కేసు విచారణ ముగింపునకు వస్తుంది. నెలలోగా చార్జిషిటు వేస్తాం’అని సీబీఐ లాయర్ డీపీ సింగ్ తెలిపారు. కేజ్రీవాల్ను జైలు నుంచి బయటకు రాకుండా చేసేందుకే సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారని ఆయన తరఫు సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదించారు. ఊహాకల్పనలతోనే కేజ్రీవాల్కు అరెస్ట్ చేశారే తప్ప, ఆయనకు వ్యతిరేకంగా ప్రత్యక్షంగా ఎటువంటి ఆధారాలు లేవన్నారు. వాదనలు విన్న అనంతరం జస్టిస్ నీనా బన్సన్ కృష్ణ తీర్పును రిజర్వులో ఉంచుతూ ఆదేశాలిచ్చారు. ఆఖరి చార్జిషీటు అంతకుముందు, సీబీఐ అధికారులు మద్యం కుంభకోణం కేసులో ఆఖరి చార్జిషిటును రౌజ్ అవెన్యూ కోర్టులో దాఖలు చేశారు. ఇందులో సీఎం కేజ్రీవాల్, ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్తోపాటు అరబిందో ఫార్మా డైరెక్టర్ పి.శరత్ చంద్రారెడ్డి, బడ్డీ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అమిత్ అరోరా, హవాలా ఆపరేటర్ వినోద్ చౌహాన్, వ్యాపారవేత్త ఆశిష్ మాథుర్పేర్లున్నాయి. -
వైఎస్సార్సీపీ నేతలపై అప్పటివరకు చర్యలొద్దు: ఏపీ హైకోర్టు
సాక్షి, విజయవాడ: తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వైఎస్సార్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఎంపీ నందిగం సురేష్, వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది.సజ్జల రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలను కేసుల్లో ముద్దాయిలుగా లేరని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ ముద్దాయిలుగా చేర్చితే అరెస్ట్ చేసే అవకాశం ఉందని పిటిషనర్ తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. సజ్జల, ఆర్కేలను ముద్దాయిలుగా చేర్చితే నోటీసులు ఇవ్వాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు ఇచ్చిన 5 రోజులు వరకు అరెస్ట్ చేయవద్దని హై కోర్టు స్పష్టం చేసింది.ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్, నందిగాం సురేష్కు సంబంధించిన విచారణను ఆగస్టు 2వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. అప్పటివరకు చర్యలు ఏమీ తీసుకోవద్దని హైకోర్టు తెలిపింది. మాజీ మంత్రి జోగి రమేష్ పిటిషన్పై 14వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసిన హైకోర్టు.. అప్పటివరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. -
నేడు ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ విచారణ
సాక్షి,ఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై బుధవారం(జులై 17) విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కేజ్రీవాల్ తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ధర్మాసనం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ను విచారించనుంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో సీఎం కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయినా ఇదే స్కామ్లో సీబీఐ కేసులో ఇంకా జ్యుడీషియల్ రిమాండ్లో ఉండటంతో కేజ్రీవాల్ తీహార్ జైలులోనే ఉండాల్సి వచ్చింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక తీర్పు
-
కవిత బెయిల్ తీర్పు.. ఉత్కంఠ
-
సత్యేందర్ జైన్ బెయిల్ పిటిషన్పై నిర్ణయం తీసుకోండి: సుప్రీం
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ సీనియర్ నేత సత్యేందర్ జైన్ బెయిల్ పిటిషన్ను అనవసరంగా వాయిదా వేయకుండా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు మంగళవారం ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది.కాగా తన బెయిల్ పిటిషన్పై హైకోర్టు ఆరువారాలు వాయిదా వేయడాన్ని సవాల్ చేస్తూ సత్యేందర్ జైన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు జస్టిస్ మనోజ్ మిశ్రా, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం బెయిల్ వ్యవహారాలను అనవసరంగా వాయిదా వేయొద్దని.. తదుపరి విచారణ తేదీ అయిన జులై 9న పిటిషన్పై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.అయితే సుప్రీంకోర్టులో ఇప్పటికే పెండింగ్లో ఉన్న ఇలాంటి కేసుతో తన పిటిషన్ను ట్యాగ్ చేయాలన్న జైన్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.ఇక 28న జైన్ బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఈడీ స్పందన కోరింది. ఈ అంశంపై స్టేటస్ రిపోర్ట్ను దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను జూలై 9వ తేదీకి వాయిదా వేసింది. అవినీతి నిరోధక చట్టం కింద సత్యేందర్ జైన్పై 2017లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ కేసులో ఈడీ ఆయనను 2022లో మే 20న అరెస్టు చేసింది. సీబీఐ దాఖలు చేసిన కేసులో 2019లో సెప్టెంబర్ 6న ట్రయల్ కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: నాంపల్లి కోర్టులో హైడ్రామా
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టులో హైడ్రామా నడిచింది. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ను కోర్టు వెనక్కి పంపగా.. ఇదే అదనుగా ఈ కేసులో నిందితుడు ప్రణీత్రావు బెయిల్ కోసం ప్రయత్నించాడు. అయితే ఇక్కడే ఊహించని ట్విస్టు చోటు చేసుకుంది.ఛార్జ్షీట్లో కొన్ని తప్పిదాలను గుర్తించిన నాంపల్లి కోర్టు.. దానిని పోలీసులకు తిప్పి పంపించింది. అయితే ఈ గ్యాప్లో ప్రణీత్ రావు కోర్టును ఆశ్రయించాడు. తొంభై రోజుల్లో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు కాబట్టి బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించాడు. అయితే ఈలోపే తప్పులు కరెక్ట్ చేసిన పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అంతేకాదు.. బెయిల్ ఇస్తే ప్రణీత్రావు సాక్ష్యాల్ని తారుమారు చేస్తారని వాదించారు. కొత్త ఛార్జ్షీట్ పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా.. పోలీసుల వాదనతో నాంపల్లి కోర్టు ఏకీభవించింది. ఫలితంగా.. ప్రణీత్రావు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. -
కేజ్రీవాల్కు మరో షాక్
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్.. మధ్యంతర బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. కాగా వైద్య పరీక్షలు నిర్వహించుకునేందుకు ఏడు రోజుల పాటు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కేజ్రీవాల్ ఈ పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. కేజ్రీవాల్కు వైద్య పరీక్షలు నిర్వహించాలని తీహార్ జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 7కు వాయిదా వేసింది. -
ప్రచారానికి కేజ్రీవాల్ ఆరోగ్యం అడ్డురాలేదా?: కోర్టులో ఈడీ
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో సాధారణ బెయిల్ కోరుతూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో గురువారం పిటిషన్ దాఖలుచేశారు. దీనిపై న్యాయస్థానం మద్యాహ్నం 2 గంటలకు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వ్యతిరేకించింది. ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ఆయన ఆరోగ్యం అడ్డురాలేదని పేర్కొంది.అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ.. కేజ్రీవాల్ ప్రస్తుతం పంజాబ్లో ఎన్నికల ప్రచారంలో ఉన్నారని .. అక్కడ ప్రచారం చేసేందుకు ఆయన బెయిల్ ఇవ్వలేదని తెలిపారు. పంజాబ్లో ప్రచారం చేస్తున్న కేజ్రీవాల్కు ఆయన ఆరో గ్యం ఆటంకం కలిగించలేదని అన్నారు. ‘ఇప్పటి వరకు సీఎం చాలా ప్రచారం నిర్వహించారు. చివరి నిమిషయంలో బెయిల్ దాఖలు చేశారు. అయన ప్రవర్తన బెయిల్కు అర్హత కాదు’ అని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. తదపరి విచారణను జూన్1కు వాయిదా వేసింది.కాగా లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను మార్చి 21న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తన అరెస్ట్ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం మే 10న కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూ 1 వరకూ బెయిల్ మంజూరు చేసింది. ఇక జూన్ 2న ఆయన లొంగిపోవాలని ఆదేశించింది.అయితే, తీవ్రమైన అనారోగ్య కారణాల దృష్ట్యా తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను మరో 7 రోజులు పొడిగించాలని కోరుతూ కేజ్రీవాల్ ఇటీవల సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ను అత్యవసరంగా లిస్టింగ్ చేసేందుకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది. రెగ్యులర్ బెయిలు కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకు కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు స్వేచ్ఛనిచ్చిందని, అందువల్ల ఈ పిటిషన్కు విచారణార్హత లేదని వివరించింది. దీంతో ఈ కేసులో మధ్యంతర, సాధారణ బెయిల్ను కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. -
సీజేఐ పరిశీలనకు.. కేజ్రీవాల్ పిటిషన్
న్యూఢిల్లీ: మధ్యంతర బెయిల్ గడువును పొడిగించాలంటూ ఆప్ నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పరిశీలనకు పంపించనున్నట్లు వెల్లడించింది. మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన కేజ్రీవాల్కు అనారోగ్య కారణాలతో సుప్రీంకోర్టు జూన్ ఒకటో తేదీ వరకు బెయిలిచ్చిన విషయం తెల్సిందే.జూన్ 2వ తేదీన తిహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాల్సి ఉంది. మంగళవారం కేజ్రీవాల్ పి టిషన్ వెకేషన్ బెంచ్లోని జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ విశ్వనాథన్ల ముందుకు వచ్చింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కేజ్రీవాల్ కొన్ని అత్యవసర వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని, బెయిల్ మరో వారం పొడిగించాలంటూ ఆయన తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మనుసింఘ్వి కోరారు. పిటిషన్పై బుధవారం విచారణ చేపట్టాలని తెలిపారు. అయితే, ధర్మాసనం ‘వాదనలు విన్నాం. తీర్పు రిజర్వు చేశాం. ఈ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఉంచుతున్నాం’ అని తెలిపింది. -
ఎమ్మెల్సీ కవిత బెయిల్.. తీర్పు రిజర్వ్
-
పిన్నెల్లి బెయిల్పై నేడే తీర్పు
సాక్షి, విజయవాడ: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్పై నేడు(మంగళవారం) ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. నిన్నటి వాదనలలో పోలీసుల కుట్రలు బట్టబయలు అయ్యాయి. పిన్నెల్లి విషయంలో పోలీసుల తీరు రోజురోజుకి దిగజారుతోంది. పిన్నెల్లి కౌంటింట్లో పాల్గోకుండా పోలీసులతో కలిసి పచ్చముఠా కుట్ర పన్నుతోంది. ఈవీఎం డ్యామేజ్ కేసులో జూన్ 6 వరకు పిన్నెల్లిపై చర్యలు తీసుకోవద్దని 23న హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పు తర్వాతే అదే రోజు పిన్నెల్లిపై పోలీసులు మరో మూడు కేసులు నమోదు చేశారు. ఇందులో రెండు హత్యాయత్నం కేసులు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్కి హైకోర్టుని మరోసారి పిన్నెల్లి ఆశ్రయించారు. హైకోర్టు విచారణలో మూడు కేసులని మే 22న నమోదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. చదవండి: చంద్రబాబు సేవలో బదిలీ బలగాలు!హైకోర్టు తీర్పు తర్వాతే 23న తప్పుడు కేసులు నమోదు చేశారని పిన్నెల్లి న్యాయవాది తెలిపారు. రికార్డులు పరిశీలించడంతో రికార్డులు తారుమారు చేసినట్లు బయడపడింది. మే 23న కేసులు నమోదు చేసి 24న స్ధానిక మేజిస్డ్రేట్కు తెలియపరిచినట్లుగా రికార్డులలో నమోదు చేశారు. హైకోర్టుని తప్పుదోవ పట్టించే విధంగా పోలీసుల వ్యవహరించిన తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. మరోవైపు ప్రభుత్వ జీఓ లేకుండా పోలీసుల తరపున ప్రైవేట్ న్యాయవాది అశ్వినీకుమార్ వాదించారు. తొలిరోజు వాదనలు వినిపించి రెండవ రోజు వాదనలకి అశ్వినీకుమార్ గైర్హాజరయ్యారు. ఆసక్తికరంగా బాదితుల తరపున టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు ఇంప్లీడ్ పిటీషన్ వేసి వాదనలు వినిపించారు. -
కవిత బెయిల్ పై ఉత్కంఠ
-
కవిత కేసులో నేడు ఏం జరగనుందో?
ఢిల్లీ, సాక్షి: లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. ఈడీ కేసులో ట్రయల్ కోర్టు(రౌస్ అవెన్యూ కోర్టు) తనకు బెయిల్ తిరస్కరించడాన్ని ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారామె. పిటిషన్ను విచారణకు స్వీకరించిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ ఇవాళ విచారణ జరపనుంది. లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. అప్రూవర్ల స్టేట్మెంట్లను ఆధారం చేసుకుని తనని ఈ కేసులో ఇరికించారని, స్టేట్మెంట్లు మినహా తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని కవిత తన బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై కేసు పెట్టారని ఆమె మొదటి నుంచి వాదిస్తున్నారు. తనకు పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, అన్నింటికి మించి ఒక మహిళ అయినందున బెయిల్తో ఊరట ఇవ్వాలని పిటీషన్ ద్వారా కవిత విజ్ఞప్తి చేశారు. ఈడీ ఇప్పటికే చార్జిషీటు దాఖలు చేసింది కాబట్టి ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ అవసరం లేదన్నారు.అయితే.. లిక్కర్ కేసులో కవితే సూత్రధారి , పాత్రధారి అని ఈడీ తొలి నుంచి వాదిస్తోంది. లిక్కర్ పాలసీని అనుకూలంగా తయారు చేయించేందుకు 100 కోట్ల రూపాయలు సౌత్ గ్రూప్ ద్వారా ఆప్ కు చెల్లింపులు చేయడంలో కవితే ముఖ్య భూమిక పోషించారని, పైసా పెట్టుబడి లేకుండా ఇండో స్పిరిట్ లో కవిత 33శాతం వాటా సంపాదించారని ఈడీ ఛార్జ్షీట్లో పేర్కొంది. అంతేకాదు.. కవితకు బెయిల్ ఇస్తే సాక్షాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తిగా సాక్షులనూ ప్రభావితం చేయొచ్చని బెయిల్ పిటిషన్పై గతంలో ఈడీ వాదనలు వినిపించింది కూడా. ఈ నేపథ్యంలో నేటి విచారణ ద్వారా బెయిల్ పిటిషన్పై వాదనలు ఓ కొలిక్కి వస్తాయా? లేకుంటే విచారణ మళ్లీ వాయిదా పడుతుందా? అనేది చూడాలి.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ.. మార్చి 15న ఆమెను హైదరాబాద్లోని నివాసంలో అరెస్టు చేసింది. మార్చి 26 నుంచి తీహార్ జైలులోనే ఉన్నారు. జూన్ 3 వరకు కవిత జ్యూడీషియల్ రిమాండ్ను పొడిగించారు. మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఈడీ ఏడు చార్జిషీట్లు దాఖలు చేసింది. -
కవిత బెయిల్ పిటిషన్పై సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్లను గురువారం జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారించారు.కవిత తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తూ.. ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలోవున్న పిటిషనర్ను సీబీఐ కూడా అరెస్టు చేసిందన్నారు. కవిత అరెస్టుకు అనుమతిస్తూ.. సీబీఐకి ట్రయల్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. అనంతరం కవిత బెయిల్ పిటిషన్పై వైఖరి తెలపాలంటూ సీబీఐకి న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. -
ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. సీబీఐ కేసులో తన అరెస్ట్ను వ్యతిరేకిస్తూ, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఈ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం.. సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మే24 వాయిదా వేసింది.కాగా ఇప్పటికే లిక్కర్ పాలసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై మే 10న ఢిల్లీ హైకోర్టు ఈడీకి నోటీసులు ఇచ్చింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ కవిత బెయిల్ పిటిషన్ల విచారణను మే 24న చేపట్టనుంది. ప్రస్తుతం లిక్కర్ పాలసీ ఈడీ సీబీఐ కేసుల్లో అరెస్ట్ అయి జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైలులో ఉన్నారు. లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లను మే 6న ట్రయల్ కోర్టు కొట్టివేసింది. ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇక మద్యం పాలసీకి సంబంధించి ఈడీ కేసులో మార్చి 15న, సీబీఐ కేసులో ఏప్రిల్11న కవిత అరెస్ట్ అయ్యారు. -
ఢిల్లీ హైకోర్టు: కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణను మే 24వ తేదీకి ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. కవిత బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి కోర్టు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారణ జరిపింది.తనకు బెయిల్ నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టులో కవిత సవాల్ చేసింది. లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో తనకు వ్యతిరేకంగా ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని,కేసు వాస్తవాలు పరిశీలించి తనకు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో కవిత పేర్కొంది. తనకు పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని పిటిషన్లో ఆమె ప్రస్తావించింది.హైపర్ టెన్షన్, గైనిక్ సమస్యలకు చికిత్స అవసరమని పిటిషన్ లో కవిత కోరారు. తాను జైల్లో ఉండడం వల్ల మైనర్ కుమారుడు షాక్ లో ఉన్నాడని పిటిషన్లో వెల్లడించారు.1149 పేజీలతో కవిత న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ అప్లికేషన్ వేశారు. త్వరితగతిన తన పిటిషన్ పై విచారణ జరపాలని కవిత తన పిటిషన్లో పేర్కొన్నారు. -
ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కవితను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆమె తరఫు న్యాయవాది మోహిత్రావు గురువారం 1,149 పేజీలతో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి జస్టిస్ స్యూర్యకాంత శర్మ శుక్రవారం విచారణ చేపట్టనున్నారు. లిక్కర్ కేసులో కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసిన విషయం విదితమే. గతంలో ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు (రౌజ్ అవెన్యూ కోర్టు) కవిత బెయిల్ పిటిషన్ను నిరాకరిస్తూ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. -
కవిత బెయిల్పై మే మొదటి వారంలో తీర్పు
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై బుధవారం రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన పిటిషన్పై కోర్టులో వాదనలు ముగిశాయి. లిక్కర్ స్కామ్కు సంబంధించి సీబీఐ కేసులో మే 2న తీర్పు వెల్లడించనుంది. అదే విధంగా ఈడీ కేసులో బెయిల్పై మే6న తీర్పు వెల్లడిస్తామని కోర్టు పేర్కొంది. కాగా మే7తో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియనుంది.ఈడీ వాదనలుపీఎంఎల్ఏ చట్టం సెక్షన్ 19 కింద కవితను చట్టబద్దంగా అరెస్ట్ చేశాంఅక్రమంగా అరెస్ట్ చేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదుఈ కేసులో క్విడ్ ప్రో కో జరిగింది.రూ. 581 కోట్ల రూపాయలు హోల్ సేల్ వ్యాపారులు సంపాదించారు.అయిదు నుంచి 12 శాతానికి కమీషన్ పెంచారు.దానివల్ల ప్రభుత్వానికి, ప్రజలకి నష్టం జరిగింది.ఈ పాలసీలో ఇండో స్పిరిట్కు మేజర్ షేర్ దక్కింది. దీని ద్వారా ఈ అక్రమాలకు పాల్పడ్డారు.పాత పాలసీని పక్కన పెట్టి అక్రమ సంపాదన కోసం కొత్త పాలసీ తెచ్చారు.విజయ్ నాయర్, మనీష్ సిసోడియా ద్వారా బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై కథ నడిపారు.విజయ్ నాయర్ మద్యం వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేశారు.అసాధారణ లాభాలు గడించారు.బలవంతంగా మహదేవ్ డిస్ట్రిబ్యూటర్ నుంచి పక్కకు తప్పించారు.ఈ కేసులో మనీష్ సిసోడియా, కేజ్రీవాల్కు బెయిల్ దక్కలేదు.ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల లంచం అందింది.మాగుంట శ్రీనివాసులురెడ్డి కీలక స్టేట్మెంట్ ఇచ్చారు.అరవింద్ కేజ్రీవాల్ను మాగుంట శ్రీనివాసులురెడ్డి మద్యం వ్యాపారం కోసం ఢిల్లీ సెక్రటేరియట్ కలిశారు. కవిత ను కలవాలని కేజ్రీవాల్ చెప్పారని మాగుంట చెప్పారు.కవితను కలిసినప్పుడు 100 కోట్లు ఆప్ కి ఇస్తే ఢిల్లీ మద్యం వ్యాపారం ఇస్తారని ఆమె చెప్పింది.అందులో 25 కోట్లు కవిత మనిషి బుచ్చిబాబుకు మాగుంట చెల్లించారు.ఎల్ 1 లైసెన్స్లో మేజర్ షేర్ దక్కించుకేందుకు కవిత ప్రయత్నించారు.అయితే, సమీర్ మహేంద్రకు 33, మాగుంట 33, కవిత 33 శాతం వాటాలను పొందారు.బుచ్చిబాబు, మాగుంట రాఘవ వాట్సాప్ మెసేజ్లో ఈ సాక్షాలు దొరికాయి.మాగుంట రాఘవ అప్రూవర్ గా మారి అన్ని విషయాలను ధృవీకరించారు.ఒకసారి 15 కోట్లు, మరోసారి 10 కోట్లు బుచ్చిబాబుకు, అభిషేక్ బోయినపల్లి కి మాగుంట సిబ్బంది ఇచ్చారుఅనుకూలంగా లిక్కర్ పాలసీ తయారీ కోసం ఈ లంచాలు ఇచ్చారుకోర్టు అనుమతి తోనే నిందితులు అప్రూవర్ గా మారారుఅప్రూవర్ను ప్రలోభ పెట్టారని అనుమానిస్తే అంటే కోర్టు నిర్ణయాన్ని తప్పు పట్టడమే. అప్రూవర్లపై చేస్తున్న ఆరోపణలు ప్రచారం కోసం చేస్తున్న రాజకీయ వాదనలే తప్పు వాటిలో పస లేదు.ఎవరు ఎవరికి ఎలక్టొరల్ బాండ్స్ ఇచ్చారనేది ఈ కేసులో అనవసరం.చట్టం ప్రకారమే ఈ కేసు ముందుకి వెళ్ళాలి.అనేక సార్లు అరుణ్ పిళ్లై స్వచ్ఛందంగా వాంగ్మూలం ఇచ్చారు.ఈడీ బెదరించిందని ఎప్పుడూ చెప్పలేదు.కవితకు నోటీసు ఇచ్చిన తర్వాతే అరుణ్ పిళ్లై తన వాంగ్మూలం ఉపసంహరించుకున్నారుకవిత ఒత్తిడితోనే ఆరు నెలల తర్వాత అరుణ్ పిళ్లై వాంగ్మూలం వెనక్కి తీసుకున్నారు ఈడీ బెదిరిస్తే , అప్పుడే వెనక్కి తీసుకోకుండా ఆరు నెలలు తర్వాత వాంగ్మూలం వెనక్కి తీసుకుంటారా ?కవిత, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా మధ్య రాజకీయ అవగాహన ఉందని బుచ్చి బాబు స్టేట్మెంట్ ఇచ్చారుదీని ద్వారా విజయ్ నాయర్ తో కలిసి లిక్కర్ పాలసీ తయారు చేశారుపబ్లిక్ లోకి రాకముందే లిక్కర్ పాలసీ వీరికి వచ్చిందికవిత చెప్పిన అంశాలే మద్యం పాలసీలో పెట్టారుకవిత బంధువు మేకా శరణ్ ను ఇండో స్పిరిట్ లో ఉద్యోగిగా పెట్టారుఉద్యోగానికి హాజరు కాకుండా జీతం తీసుకున్నారువిచారణ కోసం పిలిస్తే ఏడెనిమిది రోజుల పాటు మిస్ అయ్యాడుఈ కేసుకు సంబంధించి అనేక మంది వాంగ్మూలాలు ఇచ్చారుహవాలా ఆపరేటర్స్ వాంగ్మూంలాలు ఇచ్చారుకవిత ఇచ్చిన 9 ఫోన్లలో డేటా డిలీట్ చేశారుఎందుకు డిలీట్ చేశారంటే కవిత సమాధానం చెప్పలేదుతన ఫోన్లను పని మనుషులకు ఇచ్చారని కవిత పొంతన లేని సమాధానాలు చెపుతున్నారుపని మనుషులు డేటా ఎందుకు డిలీట్ చేస్తారు?ఫోన్లు ఇవ్వాలని కోరిన వెంటనే డేటా ఫార్మాట్ చేశారుసాక్ష్యాలు ధ్వంసం చేశారు, సాక్షులను బెదిరించారుకాగా మంగళవారం మధ్యాహ్నం సైతం ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగాయి. అనంతరం న్యాయమూర్తి విచారణ నేటికివాయిదా వేశారు. మరోవైపు లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించిన విషయం తెలిసిందే. మరో 14 రోజులపాటు పొడిగిస్తూ మంగళవారం న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశారు. మే 7న ఉదయం ఆమెను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు.బెయిల్ పిటిషన్పై మంగళవారం నాటి వాదనలు..ఈడీ తరఫున న్యాయవాది జొహెబ్ హొస్సేన్ వాదనలు వినిపిస్తూ కీలకపాత్ర పోషించిన కవితకు బెయిలు నిరాకరించాలని కోరారు. కవిత అరెస్టు విషయంలో చట్టవిరుద్ధంగా, కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని స్పష్టంచేశారు. కవితను అరెస్టు చేయబోమని ఎక్కడా అండర్టేకింగ్ ఇవ్వలేదని, సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పామన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు.డీ తరఫున న్యాయవాది జొహెబ్ హొస్సేన్ వాదనలు వినిపిస్తూ కీలకపాత్ర పోషించిన కవితకు బెయిలు నిరాకరించాలని కోరారు. కవిత అరెస్టు విషయంలో చట్టవిరుద్ధంగా, కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని స్పష్టంచేశారు. కవితను అరెస్టు చేయబోమని ఎక్కడా అండర్టేకింగ్ ఇవ్వలేదని, సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పామన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు.ఈడీ పరిధి దేశమంతా ఉంటుందని, అందుకే కవిత అరెస్టు విషయంలో ట్రాన్సిట్ ఆర్డర్ అవసరం రాలేదన్నారు. అరెస్టు ప్రక్రియ చట్టబద్ధంగానే జరిగిందని, సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ ఉపసంహరణే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ కేసులో పలువురి వాంగ్మూలాల ఆధారంగానే కవిత పాత్రపై స్పష్టత వచ్చిదని ఆ తర్వాతే అరెస్టు చేశామన్నారు. ఇండో స్పిరిట్స్లో 33.5 శాతం వాటాను తన ప్రాక్సీ అరుణ్ పిళ్లై ద్వారా కవిత కలిగి ఉన్నారని జొహెబ్ హొస్సేన్ చెప్పారు. హోల్సేలర్లకు కమీషన్లు పెంచుతూ మద్యం విధానంలో మార్పులు చేసి సౌత్గ్రూప్నకు అనుకూలంగా మారేలా ఒప్పందం జరిగిందని, కుంభకోణంలో రూ.100 కోట్లు లావాదేవాలు జరిగాయన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆమె ఆదేశాల మేరకే రూ.25 కోట్లు ఇచ్చారని, ఈ మేరకు వారిద్దరూ వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు.ఈ కుంభకోణానికి సంబంధించి ఆప్ నేత కేజ్రీవాల్, కవిత మధ్య కుదరిన ఒప్పందం మేరకే రూ.100 కోట్లు ఆమ్ ఆద్మీ పారీ్టకి ఇచ్చారని మరో నిందితుడు దినేష్ ఆరోరా తన వాంగ్మూలంలో చెప్పారన్నారు. నగదు లావాదేవీలకు సంబంధించి కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఫోన్ చాట్లోనూ సమాచారం లభ్యమైందని పేర్కొన్నారు. ఆర్థిక నేరాల్లో నగదుకు సంబంధించి ఆధారాలు దొరకడం చాలా కష్టమన్నారు. నిందితుల వాంగ్మూలాలు, సాక్ష్యాల ఆధారంగా కోర్టులు తీర్పులిచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో సూత్రధారి, పాత్రధారి అయిన కవితకు సంబంధించి పలు సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని కోర్టుకు తెలిపారు. వాదనల తర్వాత కోర్టు బెయిల్ పిటిషన్పై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. సిబిఐ కేసులో మే 2న, ఈడీ కేసులో మే 6న తీర్పు వెల్లడిస్తామని చెప్పింది. మే 7న కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది. -
కవిత బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా
ఢిల్లీ: లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి(ఏప్రిల్ 24) వాయిదా పడింది. బుధవారం తిరిగి వాదనలు కొనసాగనున్నాయి. మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గంటన్నర సేపు వాదనలు వినిపించింది. ఈడీ వాదనలు: కవితను అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు ఎప్పుడూ చెప్పలేదు మేము కోర్టు ధిక్కరణకు పాల్పడలేదు అరెస్టు చేయబోమని మేము కోర్టుకు అండర్టేకింగ్ ఇవ్వలేదు కేవలం పది రోజుల వరకు సమన్స్ ఇవ్వబోమని చెప్పాం ఈ అంశంపై కవిత తాను వేసిన పిటిషన్ ఉపసంహరించుకుంది , అరెస్టు ప్రక్రియ అంతా చట్టబద్దంగా జరిగింది సెక్షన్ 19 ప్రకారం మాకు అరెస్టు చేసే అధికారం ఉంది ఈ స్కామ్లో సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చింది కవిత ఆదేశాల మేరకు మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ 25 కోట్ల రూపాయలు ఇచ్చారు దీనిపై వారు వాంగ్మూలం ఇచ్చారు పాలసీని సౌత్ గ్రూప్నకు అనుకూలంగా మార్చారు ఇండో స్పిరిట్ కంపెనీ ద్వారా లంచాల సొమ్ము కవిత తిరిగి రాబట్టుకున్నారు ఈడీ జాతీయ దర్యాప్తు సంస్థ, దీనికి దేశమంతా పరిధి ఉంది ట్రాన్సిట్ రిమాండ్లో ఎలాంటి ఉల్లంఘన జరగలేదు అరెస్టు చేసిన 24 గంటల్లో కవితను కోర్టులో హాజరుపరిచాం పీఎంఎల్ఎ ప్రత్యేక చట్టం కనుక ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదు ఈ చట్టం కింద మహిళలకు ప్రత్యేక హక్కులు ఏమీ లేవు అరుణ్ పిళ్లై కవితకు బినామీ ఇండో స్పిరిట్ లో 33.5 అరుణ్ పిళ్లై పేరు మీద కవిత తీసుకున్నారు ఈ వ్యవహారంలో కవిత, కేజ్రీవాల్ మధ్య రాజకీయ అవగాహన ఉంది డీల్ లో భాగంగా 100 కోట్లు ఇచ్చినట్లు దినేష్ అరోరా దర్యాప్తులో అంగీకరించారు బుచ్చి బాబు వాట్సాప్ చాట్లో కూడా ఈ విషయం బయటపడింది ఆర్థిక నేరాల కుట్ర గుట్టుగా జరుగుతుంది ఈ కేసుల్లో నేరుగా నగదు వ్యవహారాల ఆధారం దొరికే అవకాశం ఉండదు వివిధరకాల వ్యక్తుల స్టేట్మెంట్స్, ఇతర సాక్షాల ఆధారంగా అక్రమ సొమ్ము ను గుర్తించవచ్చు గతంలో పై కోర్టులు తీర్పు ఇచ్చాయి ఈ కేసు ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు దశలోనే ఉంది కవిత ఈ కేసులో పూర్తి స్థాయిలో సంబంధం ఉందని అనే దానికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి -
MLC Kavitha: కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ, సాక్షి: లిక్కర్ స్కాం కేసులో నిందితురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. ఆమె జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులపాటు పొడిగించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. నేటితో ఆమె జ్యూడీషియల్ కస్టడీ ముగియగా.. తీహార్ జైలు నుంచి ఆమెను వర్చువల్గా కోర్టు ముందు హాజరు పరిచారు. అయితే కస్టడీ పొడిగించాలంటూ ఇటు ఈడీ, అటు సీబీఐ కోరడంతో కోర్టు అందుకు అంగీకరించింది. కవిత బెయిల్పై వాదనలు లిక్కర్ స్కాంలో తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అక్రమంగా మార్చి 15వ తేదీన తనను అరెస్ట్ చేసిందని, తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు వాదనలు వినిపించారు. కవిత బెయిల్ పిటిషన్పై ఈడి వాదనలు కవితను అరెస్టు చేయవద్దని సుప్రీం కోర్టు ఎప్పుడూ చెప్పలేదు మేము కోర్టు ధిక్కరణకు పాల్పడలేదు అరెస్టు చేయమని మేము కోర్టుకు అండర్ టేకింగ్ ఇవ్వలేదు కేవలం పది రోజుల వరకు సమన్స్ ఇవ్వమని చెప్పాం ఈ అంశంపై కవిత తాను వేసిన పిటిషన్ ఉపసంహరించుకున్నారు దీని అర్థం అంతా చట్టబద్దంగా జరిగింది సెక్షన్ 19 ప్రకారం మాకు అరెస్టు చేసే అధికారం ఉంది ఈ స్కాంలో సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చింది కవిత ఆదేశాల మేరకు మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ 25 కోట్ల రూపాయలు ఇచ్చారు దీనిపై వారు వాంగ్మూలం ఇచ్చారు పాలసీని తమకు అనుకూలంగా మార్చారు ఇండో స్పిరిట్ ద్వారా లంచాల సొమ్ము తిరిగి రాబట్టుకున్నారు ఈడి జాతీయ దర్యాప్తు సంస్థ, దీనికి దేశమంతా పరిధి ఉంది ట్రాన్సిట్ రిమాండ్ లో ఎలాంటి ఉల్లంఘన జరగలేదు అరెస్టు చేసిన 24 గంటల్లో కోర్టులో హాజరుపరిచాము పిఎంఎల్ఎ ప్రత్యేక చట్టం కనుక ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదు ఈ చట్టం కింద మహిళలకు ప్రత్యేక హక్కులు ఏమీ లేవు అరుణ్ పిళ్లై కవితకు బినామీ ఇండో స్పిరిట్ లో 33.5% అరుణ్ పిళ్లై పేరు మీద కవిత తీసుకున్నారు ఈ వ్యవహారంలో కవిత, కేజ్రీవాల్ మధ్య రాజకీయ అవగాహన ఉంది డీల్ లో భాగంగా రూ.100 కోట్లు ఇచ్చినట్లు దినేష్ అరోరా దర్యాప్తులో అంగీకరించారు బుచ్చి బాబు వాట్సాప్ చాట్ లో కూడా ఈ విషయం బయటపడింది ఆర్థిక నేరాల కుట్ర గుట్టుగా జరుగుతుంది ఈ కేసుల్లో నేరుగా నగదు వ్యవహారాల ఆధారం దొరికే అవకాశం ఉండదు వివిధరకాల వ్యక్తుల స్టేట్మెంట్స్, ఇతర సాక్షాలు ఆధారంగా అక్రమ సొమ్ము ను గుర్తించవచ్చు అని గతంలో పై కోర్టులు తీర్పు ఇచ్చాయి ఈ కేసులో కూడా కవిత నేరం చేయలేదు అనే దానికి ఎలాంటి ఆధారం లేదు ఈ కేసు ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు దశలోనే ఉంది ఈ కేసులో కవితకు పూర్తి స్థాయిలో సంబంధం ఉందని అనే దానికి సాక్ష్యాలున్నాయి కవిత తరపు లాయర్ వాదనలు మరోవైపు కస్టడీ పొడిగింపు అవసరం లేదని, ఈడీ కొత్తగా ఏ అంశాలను జత చేయలేదని కవిత తరఫు న్యాయవాది వాదించారు. అయితే.. ఆమె బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, కేసు విచారణ పురోగతిపైనా ప్రభావం ఉంటుందని ఈడీ తరఫు న్యాయవాది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరారు. అయితే.. సాక్ష్యాలను తారుమారు చేస్తారని అరెస్ట్ చేసిన రోజునుంచి ఆరోపిస్తున్నారు, కొత్తగా ఏమీ చెప్పడం లేదంటూ కవిత తరపు న్యాయవాది రాణా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కేసు దర్యాప్తు పురోగతిని ఈడీ కోర్టుకు అందజేసింది. అంతేకాదు 60 రోజుల్లో కవిత అరెస్ట్ పై చార్జిషీట్ సమర్పిస్తామని ఈ సంద్భంగా ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో.. మే 7 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు లిక్కర్ కేసులో సీబీఐ ఏప్రిల్ 11వ తేదీన కవితను అరెస్ట్ చేసింది. ఈ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై మే 2 వ తేదీ తీర్పు వెల్లడించన్నారు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా. -
నేడు కవిత బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ
-
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన నలుగురు పోలీస్ అధికారులు బెయిల్ పిటిషన్ను విత్ డ్రా చేసుకున్నారు.నలుగురు నిందితులపై పోలీసులు సెక్షన్ 70 ఐటీ యాక్ఠ్ కింద కేసు నమోదు చేయగా.. 10 ఏళ్ల కంటే ఎక్కువ శిక్షపడే సెక్షన్ కావడంతో సెషన్ కోర్టుకు వెళ్లాలన్న నాంపల్లి కోర్టు సూచించింది. దీంతో నాంపల్లి ఏసీఎంఎం కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు. మంగళవారం నాంపల్లి సెషన్ కోర్టులో కొత్తగా బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు నిందితులు. కాగా గత ఎన్నికల సందర్భంగా పోలీసు వాహనాల్లో నగదును అక్రమంగా తరలించిన విషయం ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సందర్భంగా వెలుగుచూడటంతో హైదరాబాద్ పోలీసులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. దీనికి సంబంధించి మరో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. ఈ కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా కొందరు ప్రజాప్రతినిధులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావు నేతృత్వంలో సాగిన ఈ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే సిట్ అధికారులు పలు కీలక ఆధారాలు సేకరించారు. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2020లో జరిగిన దుబ్బాక, 2021 అక్టోబర్లో జరిగిన హుజూరాబాద్, 2022 అక్టోబర్ రెండో వారంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలతో పాటు గత ఏడాది డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో ఈ నగదు అక్రమ రవాణా ఎక్కువగా జరిగినట్లు తేల్చారు. ఇక ట్యాపింగ్ కేసు దర్యాప్తు పూర్తి పారదర్శకంగా జరుగుతోందని నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే.. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే అంశం పైనా త్వరలో వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ కొట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్ జరిగిందన్న కేసులో ప్రమేయమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో సాక్ష్యాలు నాశనం చేయడంతోపాటు సాక్షులను ప్రభావితం చేయడంలో కవిత ప్రమేయం ప్రాథమికంగా కనిపిస్తోందని... ఆమెను బలిపశువుగా మార్చే యత్నం జరుగుతోందనేందుకు వీల్లేదని వ్యాఖ్యానించింది. కవిత నిస్సందేహంగా పలుకుబడిగల మహిళ అయినందున బెయిల్ ఇస్తే మరోసారి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందిన పేర్కొంది. అందువల్ల ఆమెకు మధ్యంతర బెయిల్ నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. మైనర్ కుమారుడి వార్షిక పరీక్షల నేపథ్యంలో తల్లిగా తన పర్యవేక్షణ అవసరమైనందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించారు. బెయిల్ నిరాకరణకు కారణాలను 21 పేజీల తీర్పులో పేర్కొన్నారు. చిన్న కుమారుడికి బంధువుల అండ ఉందిగా ‘‘పిటిషనర్ (కవిత) 16 ఏళ్ల మైనర్ కుమారుడికి ఇప్పటికే 50 శాతం పరీక్షలు పూర్తయ్యాయని న్యాయవాదులు తెలిపారు. కానీ కుమారుడి చదువు, మధ్యంతర బెయిల్ కోరిన రోజుల సంఖ్య, ఇతర కుటుంబ సభ్యుల వివరాలు పొంతన లేకుండా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మైనర్ కుమారుడు అన్నయ్య, తండ్రి, అత్తలను కలిగి ఉన్నాడు. వారంతా అతనికి తగిన మద్దతు ఇవ్వలేరనడానికి ఎలాంటి కారణం కనిపించట్లేదు. చిన్న కుమారుడి పరీక్షల వేళ తల్లి నైతిక మద్దతు ఎంతో అవసరమని న్యాయవాదులు చెబుతున్నారు. కానీ 19 ఏళ్ల వయసున్న కవిత పెద్ద కుమారుడు స్పెయిన్లో చదువుతున్నాడు. భౌతికంగా తల్లిదండ్రులు దగ్గర లేకున్నా విదేశాల్లో అతను చదువుకోగలుతున్నప్పుడు బంధువుల సమక్షంలో ఉంటున్న చిన్న కుమారుడు పరీక్షలు రాయలేడనడం సమంజసంగా కనిపించట్లేదు. పిల్లల పరీక్షల ఆందోళన పరిష్కరించడానికి తల్లి తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదనడం మధ్యంతర బెయిల్ మంజూరుకు తగిన కారణంగా కనిపించట్లేదు. కవిత కేసు పరిష్కారం విషయంలో మైనర్ తండ్రి బిజీగా ఉన్నారన్న కారణం సైతం ఆమోదయోగ్యం లేదు. అందుకే మైనర్ కుమారుడికి అతని అత్తలు తగిన మద్దతు ఇవ్వాల్సిందిగా కోర్టు సూచిస్తోంది. కేసులో ప్రాథమికంగా ప్రమేయం కనిపిస్తోంది ‘‘మాజీ ఎంపీగా, ప్రస్తుత ఎమ్మెల్సీగా, ఉన్నత విద్యావంతురాలిగా కవిత సమాజంలో పలుకుబడి గలవారని నిస్సందేహంగా చెప్పొచ్చు. అంతేకానీ ఈ కేసులో ఓ నిస్సహాయ మహిళను బలిపశువును చేస్తున్నారని ఏ ప్రమాణాల ప్రకారమూ చెప్పేందుకు వీలు కనిపించట్లేదు. నేరాల విషయంలో కవిత చురుకైన ప్రమేయం, సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నంతోపాటు ఉద్దేశపూర్వకంగా సాక్ష్యాలు ధ్వంసం చేస్తారనే విషయంలో కోర్టు ముందుంచిన అంశాలను పరిశీలిస్తే కవిత ప్రమేయం ప్రాథమికంగా కనిపిస్తోంది. అందువల్ల మహిళ కాబట్టి పీఎంఎల్ఏ చట్టం సెక్షన్ 45 (1) ప్రకారం విచక్షణకు ఆమె అర్హురాలు కాదు. ఈ పరిశీలనలతో బెయిల్ దరఖాస్తు తిరస్కరిస్తున్నా’’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. నేడు న్యాయమూర్తి ముందుకు కవిత జ్యుడీషియల్ కస్టడీ పూర్తి కానుండటంతో మంగళవారం ఉదయం ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలు అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ముందు హాజరుపరచనున్నారు. అంతకుముందు మధ్యంతర బెయిల్ను కోర్టు నిరాకరించడంతో రెగ్యులర్ బెయిల్ కోసం కవిత వేసిన పిటిషన్ను త్వరగా విచారించాలని ఆమె తరఫు న్యాయవాదులు జడ్జిని కోరారు. దీంతో గత విచారణ సమయంలో రెగ్యులర్ బెయిల్పై ఈ నెల 20న విచారిస్తానన్న న్యాయమూర్తి... తాజాగా ఈ నెల 16న విచారణ చేపడతానని పేర్కొన్నారు. -
కవిత లిక్కర్ కేసు లో దూకుడు పెంచిన సీబీఐ
-
కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
-
Delhi Liquor Scam: ఢిల్లీ కోర్టులో కవితకు దక్కని ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టులో చుక్కెదురైంది. కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ వాయిదా వేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 4న చేపడతామని తెలిపింది. తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నాయని, ఈ సమయంలో కుమారుడికి తన అవసరం ఉందని, అందుకే ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ లేదా సాధారణ బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. బెయిల్ పిటిషన్పై కోర్టులో వాదనలు వాడీవేడీగా జరిగాయి. కవిత తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. కవిత విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని, ఈ కేసులో ఆమెను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు. సమన్లకు స్పందించినా, విచారణకు సహకరించినా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. సీఆర్పీసీ 160 ప్రకారం తొలి సమన్లలోనే ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఈడీ అధికారులు కవితను ఒక్కోసారి రాత్రి కూడా విచారించారని చెప్పారు. ఈ సందర్భంగా అరుణ్ పిళ్లై స్టేట్మెంట్ అంశాలను సింఘ్వీ కోర్టు ముందుకు తెచ్చారు. ఆయన తొమ్మిది స్టేట్మెంట్లు ఒక రకంగా ఉంటే పదో స్టేట్మెంట్ పూర్తి విరుద్దంగా ఉందన్నారు. 18 నెలల ముందు దాఖలు చేసిన చార్జ్ షీట్, అడిషనల్ చార్జ్ షీట్లో నిందితురాలిగా, ముద్దాయిగా కవిత పేరు లేదన్నారు. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఏప్రిల్ 4కు వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 15న హైదరాబాద్లోని నివాసంలో కవితను ఈడీ అరెస్టు చేసింది. మార్చి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. ఈడీ 10 రోజుల కస్టడీ ఇవ్వాలని కోరగా, ఏడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఆ తర్వాత మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. మూడురోజులకే అనుమతించింది. కస్టడీ ముగియడంతో కవితను మార్చి 26వ తేదీన ఈడీ అధికారులు న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఆపై కోర్టు కవితకు ఏప్రిల్ 9వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. -
తీహార్ జైలుకు కల్వకుంట్ల కవిత
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు 15 జ్యూడీషియల్ రిమాండ్ విధించింది ట్రయల్ కోర్టు. ఏప్రిల్ 9 వరకు జ్యూడీషియర్ రిమాండ్ విధించింది. దీంతో ఆమెను తీహార్ జైలుకు అధికారులు తరలించనున్నారు. లిక్కర్ స్కాం కేసులో కస్టడీ ముగియడంతో ఈడీ ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈడీ జ్యూడీషియల్ కస్టడీ కోరగా.. అదే సమయంలో కవిత వేసిన బెయిల్ పిటిషన్పైనా వాదనలు జరిగాయి. అయితే.. ఈడీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఆమెకు జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ‘‘సమాజంలో కవిత చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆమెను విడుదల చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. సాక్షాధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉంది. దీనివల్ల దర్యాప్తుకు తీవ్ర విఘాతం కలుగుతుంది. లిక్కర్ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. కవిత పాత్రకు సంబంధించి ఇంకా లోతైన దర్యాప్తు చేస్తున్నాం. అక్రమ సొమ్ము గుర్తించే పనిలో ఉన్నాం. ఆర్థిక నేరాల దర్యాప్తు చాలా కఠినమైనది. ఆర్థిక నేరస్తులు చాలా వనరులు, పలుకుబడి ఉన్నవారు. పథకం ప్రకారం ప్రణాళికతో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. అందుకే దర్యాప్తు అనేది చాలా జఠిలమైనది. ఇందుకోసమైనా కవితను జ్యూడిషియల్ కస్టడీ కి పంపాలి’’ :::కవిత ఈడీ జ్యుడీషియల్ రిమాండ్ రిపోర్ట్ ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. ఏప్రిల్ 9వ తేదీ దాకా కవితకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. అలాగే.. కవిత బెయిల్ పిటిషన్పై మరోసారి వాదనలు వినాల్సి ఉందని చెబుతూ.. ఏప్రిల్ 1వ తేదీకి ఆ మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసింది. బెయిల్పై వాదనల సందర్భంగా.. తన పిల్లలకు పరీక్షలు ఉన్నాయని.. మధ్యంతర బెయిల్ అయినా మంజూరు చేయాలని కవిత బెయిల్ పిటిషన్ ద్వారా అభ్యర్థించారు. అయితే.. కేసు దర్యాప్తు పురోగతి లో ఉందని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లుగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈడీ తరఫు న్యాయవాది జోయబ్ హుస్సేన్. ఇక విచారణ సందర్భంగా.. కోర్టు ప్రాంగణంలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్షతో ఉద్దేశపూర్వకంగానే తనపై కేసు పెట్టారని అన్నారామె. అదే సమయంలో ఆమె తన భర్త అనిల్, బంధువులను కలిసి మాట్లాడేందుకు ఈడీ అనుమతించింది. ఇదీ చదవండి- అప్రూవర్గా మారను.. క్లీన్గా బయటకొస్తా: కవిత కవిత మేనల్లుడి అరెస్ట్కు రంగం సిద్ధం? మరోవైపు ఇవాళ లిక్కర్ స్కాం కేసులో ఇంకో కీలక పరిణామం చోటు చేసుకుంది. కవిత మేనల్లుడు మేకా శరణ్ను ఈడీ విచారణ చేపట్టింది. లిక్కర్ స్కాం కేసులో అక్రమ సొమ్ము బదిలీలో శరణ్ కీలక పాత్ర పోషించారని ఈడీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో.. శరణ్ను కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. -
Delhi: సత్యేంద్రజైన్ వెంటనే లొంగిపోవాలి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జెయిన్ బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం(మార్చ్ 18) కొట్టివేసింది. జైన్ వెంటనే లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. జస్టిస్ బేలా ఎమ్. త్రివేది, పంకజ్ మిట్టల్లతో కూడిన ధర్మాసనం జైన్ బెయిల్ పిటిషన్ను విచారించింది.‘బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నాం, పిటిషనర్ వెంటనే లొంగిపోవాలి’ అని కోర్టు వ్యాఖ్యానించింది. అనారోగ్య కారణాల వల్ల తన క్లైంట్ లొంగిపోయేందుకు కొంత సమయం కావాలని సత్యేంద్ర జైన్ తరపు న్యాయవాది కోరగా సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. గత సంవత్సరం మే 26 నుంచి సత్యేంద్రజైన్ మధ్యంతర మెడికల్ బెయిల్పై బయటే ఉన్నారు. ఈయనకు గతేడాది జులై 21న వెన్నెముక ఆపరేషన్ జరిగింది. కాగా, 2015 నుంచి 2017 వరకు ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో తన పదవిని దుర్వినియోగం చేస్తూ అక్రమ ఆస్తులు పోగేశారన్న అభియోగాలపై 2022 జైన్ అరెస్టయ్యారు. ఇదే కేసుకు సంబంధించి జైన్ తన కంపెనీల ద్వారా మనీలాండరింగ్కు పాల్పడి అక్రమ లావాదేవీలు చేశారని ప్రాథమికంగా తేల్చిన ఈడీ ఆయనపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇదీ చదవండి.. ఎన్నికల బాండ్లు.. ఎస్బీఐకి సుప్రీం డెడ్లైన్ -
చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీం కోర్టులో విచారణ
-
చంద్రబాబు జైలు.. లోకేష్ బెయిల్: బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి
-
చంద్రబాబుకు ఊరట ఇవ్వడానికి నిరాకరణ
-
సెక్షన్ 17A వర్తిస్తుందన్న చంద్రబాబు తరపులాయర్లు
-
పల్లవి ప్రశాంత్ బెయిల్ పై హైకోర్టులో కీలక వాదనలు
-
దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్పై నేడు విచారణ
-
భర్త చేసినా అత్యాచారమే
అహ్మదాబాద్: ‘అత్యాచారం ఎవరు చేసినా అత్యాచారమే. భర్త అత్యాచారానికి పాల్పడినా అది నేరమే’ అని గుజరాత్ హైకోర్టు పేర్కొంది. మహిళలపై లైంగిక హింస పట్ల నిశ్శబ్దాన్ని ఛేదించాల్సిన అవసరముందని న్యాయమూర్తి జస్టిస్ దివ్యేశ్ జోషి అన్నారు. ఓ మహిళ బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా ఇటీవల ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కోడలి పట్ల క్రూరత్వం, నేరపూరిత ప్రవర్తన కారణంగా పిటిషనర్కు బెయిలిచ్చేందుకు నిరాకరించారు. భర్త, కొడుకు కలిసి కోడలిపై అత్యాచారం చేస్తూ వాటిని వీడియోలు తీసి పోర్నోగ్రఫీ సైట్లలో పెట్టి డబ్బు సంపాదిస్తున్నారని తెలిసినా ఆమె మిన్నకుండిపోవడంపై జడ్జి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
టీడీపీ నేత నారాయణ ముందస్తు బెయిల్ పై నేడు హైకోర్టులో విచారణ
-
చంద్రబాబుకు సుప్రీం కోర్ట్ నోటీసులపై పొన్నవోలు కామెంట్స్
-
ఐటెం నెంబర్ 64..సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ
-
చంద్రబాబు నాయుడు: తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు
-
బాబు షూరిటీ..జైలు గ్యారెంటీ..చంద్రబాబు కొత్త ప్రోగ్రాం: గోరంట్ల మాధవ్
-
500 పేజీల కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ
-
ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కాంలో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్
-
140 మంది సాక్షులను విచారించింది
-
చట్ట ప్రకారం విచారించాలని సూచించిన హైకోర్టు
-
స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్
సాక్షి, గుంటూరు: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు వెలువరించింది. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ సోమవారం మధ్యాహ్నం తీర్పు ఇచ్చింది. ఇప్పటికే చంద్రబాబు మధ్యంతర బెయిల్ మీద ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. మంజూరు చేస్తూ జస్టిస్ టి.మల్లికార్జున్రావు ఇవాళ తీర్పు వెల్లడించారు. ఈ కేసులో చంద్రబాబు ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని.. అయితే ఈ నెల 30 ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరుకావాలని ఆదేశించారు. మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో షరతులు ఈనెల 28 వరకే వర్తిస్తాయని తెలిపిన హైకోర్టు.. చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టులో అందించాలని స్పష్టం చేసింది. ఈనెల 29 నుంచి రాజకీయ ర్యాలీలు, సభల్లో పాల్గొనవచ్చవని, సాక్షులను ప్రభావితం చేస్తారన్న ప్రాసిక్యుషన్ వాదనకు ఆధారాల్లేవని హైకోర్టు పేర్కొంది. నిధులు విడుదల చేయమన్నంత మాత్రాన నేరంలో పాత్ర ఉందని చెప్పలేమని, ఉల్లంఘనలపై అధికారులు సీఎంకు చెప్పినట్లు ప్రాథమిక ఆధారాల్లేవని హైకోర్టు పేర్కొంది. ఈ కేసు విచారణ మొదలయ్యాక 22 నెలలు చంద్రబాబు బయటే ఉన్నారని, కొద్ది రోజుల ముందే కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని, విచారణ కాలంలో కేసును ప్రభావితం చేశారనేందుకు ఒక్క ఆధారం లేదని హైకోర్టు పేర్కొంది. చంద్రబాబు జడ్ ప్లస్ కేటగిరిలో ఎన్ఎస్జీ భద్రతలో ఉన్నారన్న హైకోర్టు.. కేసు విచారణ నుంచి చంద్రబాబు తప్పించుకునే అవకాశం లేదని తెలిపింది. చంద్రబాబు బెయిల్ ఆర్డర్లో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చంద్రబాబు బెయిల్ ఆర్డర్ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష అనడం సరికాదని పేర్కొంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్కిల్ స్కామ్ కేసు వెలుగులోకి వచ్చిందన్న సీఐడీ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఇది బెయిల్ పిటిషన్ మాత్రమే కాబట్టి స్కిల్ స్కామ్ కేసు లోతుల్లోకి వెళ్లి పూర్తి విచారణ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్న హైకోర్టు.. ట్రయల్ కోర్టులో కేసు విచారణ సందర్భంగా అన్ని అంశాలు లోతుగా విచారణకు వస్తాయని తెలిపింది. ఈ కేసులో పరారీలో ఉన్న చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ను చట్ట ప్రకారం విచారించాలని హైకోర్టు సూచించింది. కాగా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. జ్యూడీషియల్ రిమాండ్ మీద 52 రోజుల పాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే ఆరోగ్య కారణాలు చూపించడంతో మానవతా కోణంలో ఏపీ హైకోర్టు బాబుకి అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. బెయిల్ పిటిషన్పై వాదనలు సాగాయిలా.. సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘ఈ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ కండిషన్స్ ఉల్లంఘించి ర్యాలీలు చేశారు. ర్యాలీలు చేయడంపై తెలంగాణ పోలీసులు కేసులు కూడా పెట్టారు. లొంగిపోయేటప్పుడు రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్కు సీల్డ్కవర్లో వైద్యనివేదికలు అందజేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పిటిషనర్ ఉల్లంఘించారు. ఆ నివేదికలు నమ్మశక్యంగా లేవు. ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించాలి. బెయిలు మంజూరుకు వాటిని పరిగణనలోకి తీసుకోనక్కర్లేదు. స్కిల్ స్కామ్ రూ.10 నోట్లు వాడి హవాలా రూపంలో డబ్బు తరలించారు. చిన్నప్ప అనే వ్యక్తి ద్వారా మూడు 10 రూపాయల నోట్లు ఉపయోగించి హవాలా ద్వారా కోట్ల రూపాయలు హైదరాబాద్కు తరలించారు. బోస్ అనే వ్యక్తి ఫోన్ మెస్సేజ్ల ద్వారా ఈ విషయం బయటపడింది. బోస్, కన్వేల్కర్ మెస్సేజ్ల ఆధారంగా డబ్బు హైదరాబాద్కు చేరినట్లు తెలిసింది. స్కిల్ స్కామ్లో మెన్స్ వారే నిధులు మళ్లింపు జరిగిందని నిర్థారించారు. చంద్రబాబు ఆదేశాల మేరకే ఆ విధంగా వ్యవహరించారు. అప్పటి చీఫ్ సెక్రటరీ తన లెటర్లో అప్పటి సీఎం రూ.270 కోట్లు విడుదల చేయమని చెప్పారని ఫైనాన్స్ సెక్రటరీకి లేఖ రాశారు. చంద్రబాబు పలు అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది. చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తారు చట్టం ముందు అందరూ సమానులే. ఈ కేసు తీర్పు ద్వారా సమాజానికి ఒక మెసేజ్ వెళ్లాలి. అందుకే చంద్రబాబుకు బెయిల్ ఇవ్వకూడదు. చంద్రబాబు తరఫున లూథ్రా వాదనలు వినిపిస్తూ.. రాజకీయ పెద్దలు చెప్పినట్లు ఏపీ సీఐడీ నడుచుకుంటోంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ దురుద్దేశపూర్వకంగా, రాజకీయ కక్షతో చంద్రబాబుపై తప్పుడు కేసులు నమోదు చేశాయి. బెయిల్పిటిషన్పై విచారణ చేసినప్పుడు.. కేసు మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ కేసులో 2018 నుంచి విచారణ జరిపి సాధించింది ఏంటి?. ఇప్పుడు మళ్లీ విచారణ ఎందుకు? సీఐడీ డీఐజీ, ఏఏజీలు ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి అసత్యాలు ప్రచారం చేశారు. ఇది అడ్వకేట్స్ ఎథిక్స్కు విరుద్ధం. వృత్తి విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందున బార్ కౌన్సిల్కు ఫిర్యాదు చేయవచ్చు గానీ, ఆ పని చేయం. పోలీస్ వ్యవస్థ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అధికారంలో ఉన్నవారికి తొత్తులుగా వ్యవహరించకూడదు. -
బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టు తీర్పు..
-
చంద్రబాబు బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్
సాక్షి, గుంటూరు: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. పిటిషన్పై గురువారం హైకోర్టులో వాదనలు కొనసాగాయి. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కౌంటర్ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు ముగియడంతో.. ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు.. ఈ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ కండిషన్స్ ఉల్లంఘించి ర్యాలీలు చేశారు. ర్యాలీలు చేయడంపై తెలంగాణ పోలీసులు కేసులు కూడా పెట్టారు. స్కిల్ స్కామ్ రూ.10 నోట్లు వాడి హవాలా రూపంలో డబ్బు తరలించారు. చిన్నప్ప అనే వ్యక్తి ద్వారా మూడు 10 రూపాయల నోట్లు ఉపయోగించి హవాలా ద్వారా కోట్ల రూపాయలు హైదరాబాద్కు తరలించారు. బోస్ అనే వ్యక్తి ఫోన్ మెస్సేజ్ల ద్వారా ఈ విషయం బయటపడింది. బోస్, కన్వేల్కర్ మెస్సేజ్ల ఆధారంగా డబ్బు హైదరాబాద్కు చేరినట్లు తెలిసింది. స్స్కిల్ స్కామ్లో మెన్స్ వారే నిధులు మళ్లింపు జరిగిందని నిర్థారించారు. చంద్రబాబు ఆదేశాల మేరకే ఆ విధంగా వ్యవహరించారు. అప్పటి చీఫ్ సెక్రటరీ తన లెటర్లో అప్పటి సీఎం రూ.270 కోట్లు విడుదల చేయమని చెప్పారని ఫైనాన్స్ సెక్రటరీకి లేఖ రాశారు. చంద్రబాబు పలు అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది. చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తారు చట్టం ముందు అందరూ సమానులే. ఈ కేసు తీర్పు ద్వారా సమాజానికి ఒక మెసేజ్ వెళ్లాలి. అందుకే చంద్రబాబుకు బెయిల్ ఇవ్వకూడదు లూథ్రా వాదనలు ఎన్నికల ముందు కావాలనే అక్రమ కేసుల్లో చంద్రబాబును అరెస్ట్ చేశారు. బెయిల్పిటిషన్పై విచారణ చేసినప్పుడు.. కేసు మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ కేసులో 2018 నుంచి విచారణ జరిపి సాధించింది ఏంటి?. ఇప్పుడు మళ్లీ విచారణ ఎందుకు? సీఐడీ డీఐజీ, ఏఏజీలు ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి అసత్యాలు ప్రచారం చేశారు. ఇది అడ్వకేట్స్ ఎథిక్స్కు విరుద్ధం. పోలీస్ వ్యవస్థ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అధికారంలో ఉన్నవారికి తొత్తులుగా వ్యవహరించకూడదు. పొన్నవోలు, లూథ్రా తమ తమ వాదనలు ముగించడంతో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. -
బెయిల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న చంద్రబాబు
-
స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా
-
నేడు హైకోర్టులో చంద్రబాబు, నారాయణ కేసుల విచారణ
-
చంద్రబాబు పూర్తిగా బరి తెగించాడు: సజ్జల రామకృష్ణారెడ్డి
-
చంద్రబాబు బెయిల్ కండీషన్లు పెంచిన ఏపీ హైకోర్టు
-
జైలు నుంచి విడుదలైన చంద్రబాబు..కానీ..!
-
బెయిల్ ప్లీజ్..హైకోర్టులో వాదనలు
-
చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ
-
Delhi Liquor Policy Case: సిసోడియా బెయిల్పై 30న సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: ఢిల్లీలో మద్యం విధానంలో అవకతవకలు, మనీల్యాండరింగ్ కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 30వ తేదీన తీర్పు వెలువరించనుంది. ఈ కేసును సీబీఐ, ఈడీలు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో అరెస్టయిన సిసోడియా తిహార్ జైలులో కస్టడీలో ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్పై అక్టోబర్ 17వ తేదీతో వాదనలు ముగిశాయి. తీర్పు సోమవారం ఉదయం వెలువడుతుందని సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. -
బెడిసికొట్టిన చంద్రబాబు నాట్ బిఫోర్ అస్త్రం..
-
ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ 9కి వాయిదా
-
చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ
-
అవినీతిపరులకు '17ఏ' రక్షణ కవచం కాదు
-
నేడు సుప్రీం కోర్టులో ఫైబర్ నెట్ స్కామ్ కేసు విచారణ
-
బిగ్ ఫ్రైడే..బిగ్ సస్పెన్స్ ఇంకా మిగిలే ఉంది
-
బెయిల్, క్వాష్ పిటిషన్లపై నేడే విచారణ
-
క్యాష్ పిటిషన్ పై విచారణ మంగళవారానికి వాయిదా
-
స్కిల్ స్కామ్లో లోకేష్ బెయిల్ పిటీషన్ డిస్పోజ్
-
చంద్రబాబును అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులివ్వండి..!
-
ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు
-
మూడోరోజు ఏసీబీ కోర్టులో ఇరుపక్షాల వాదనలు
-
టీడీపీకి.. స్కిల్ కార్పొరేషన్కు ఒక్కరే అడిటర్
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి. గత రెండు రోజులుగా ఇరపక్షాలు సుదీర్ఘ వాదనలు వినిపించగా.. ఇవాళ(శుక్రవారం) అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి తుది వాదనలు వినిపించారు. అయితే వాదనల సమయంలో ఇవాళ కూడా కొన్ని సంచలన విషయాల్ని బయటపెట్టారాయన. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. స్కిల్ స్కామ్లో టీడీపీ ఖాతాలోకి మళ్లిన నిధుల వ్యవహారాన్ని నిన్న వాదనల సందర్భంగా డాక్యుమెంట్లతో సహా బయటపెట్టిన ఏఏజీ సుధాకర్రెడ్డి.. మూడవ రోజు వాదనలోనూ సంచలనాలు వెలుగులోకి తెచ్చారు. టీడీపీకి.. స్కిల్ స్కామ్లో ఆడిటర్గా పని చేసిన వ్యక్తి ఒక్కరేనని.. ఆయన్ని విచారిస్తే కేసులో చాలా విషయాలు బయటకు వస్తాయని కోర్టుకు తెలియజేశారు ఏఏజీ పొన్నవోలు. ఈ కేసులో టీడీపీ అడిటర్ వెంకటేశ్వర్లుని విచారించాల్సి ఉంది. ఈ నెల 10వ తేదీన సీఐడీ విచారణకి రావాలని ఆయనకి నోటీసులిచ్చాం. ఆడిటర్ వెంకటేశ్వర్లే స్కిల్ కార్పోరేషన్కి ఆడిటర్ గా పనిచేశారు. ఈ రెండింటికీ ఒక్కరే ఆడిటర్ కావడంతో నిధులు దారి మల్లింపు వ్యవహారం బయటపడకుండా మేనేజ్ చేశారు. తద్వారా చంద్రబాబు కుట్రపూరిత నేరానికి పాల్పడ్డారు. పైగా సీఎం హోదాని చంద్రబాబు అడ్డు పెట్టుకుని షెల్ కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాకి నిధులు మళ్లించారు. జీవో నెంబర్ 4 ని అడ్డం పెట్టుకుని నిధులు దిగమింగారు. కాబట్టి.. చంద్రబాబుకి ఈ కేసులో సెక్షన్ 409 వర్తిస్తుంది అని పొన్నవోలు కోర్టులో వాదించారు. ఈ దశలో చంద్రబాబుకి బెయిల్ ఇవ్వొద్దని.. ఆయన్ని మరింత విచారించాల్సిన అవసరం ఉందని, మరీ ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలపై చంద్రబాబును విచారించాల్సి ఉందని ఏఏజీ పొన్నవోలు ఏసీబీ కోర్టుకు తెలియజేశారు. చంద్రబాబు ఆదాయపన్ను వివరాలు కూడా తీసుకుంటున్నామని చెప్పారాయన. చంద్రబాబు సహకరించలేదు బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిసిన తర్వాత.. చంద్రబాబు కస్టడీ పిటీషన్పై ఏఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపించారు. స్కిల్ కుంభకోణం కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది. చంద్రబాబు గత రెండు రోజులకస్టడీలో సీఐడీకి సహకరించలేదు. సెంట్రల్ జైలులోనే చంద్రబాబుని మరోసారి విచారించడానికి అవకాశమివ్వండి. [di చంద్రబాబుని కనీసం మూడు రోజుల కస్టడీకి ఇవ్వండి. చంద్రబాబుని విచారణ చేస్తేనే కొంతవరకైనా నిజం బయటకి వస్తుంది అని కోర్టును కోరారాయన. ఇక బ్యాంకర్ల నుంచి వివరాలు సేకరించారన్న చంద్రబాబు లాయర్ల ఆరోపణలపై ఏఏజీ పొన్నవోలు స్పందించారు. చంద్రబాబు ఎన్నికల కమిషన్కు సమర్పించిన ఐటీ రిటర్స్ని మాత్రమే డౌన్ లోడ్ చేశాం. బ్యాంకర్ల నుంచి ఎక్కడా తీసుకోలేదని స్పష్టత ఇచ్చారాయన. -
సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న ఏజీ శ్రీరామ్
-
కాసేపట్లో తేలనున్న చంద్రబాబు భవితవ్యం ?
-
పీటీ వారెంట్లు..చంద్రబాబుకి మరో చిక్కు
-
Oct 5th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu Arrest, Remand, Cases, Scams And Ground updates 6:05 PM, అక్టోబర్ 05 2023 మెదక్ : చంద్రబాబునాయుడిని జనమే బ్యాన్ చేశారు : మంత్రి హరీష్ రావు ► మెదక్ జిల్లా సభలో మాట్లాడిన తెలంగాణ మంత్రి హరీష్రావు ► కులాలు, జాతుల గురించి చంద్రబాబు ఎప్పుడు ఆలోచించలేదు ► చంద్రబాబు నాయుడు పందులను, మేకలను బ్యాన్ చేశాడు ► చివరకు ప్రజలు ఆయన్నే బ్యాన్ చేశారు, ఇప్పుడు జైలుకు పంపారు ► చంద్రబాబు ఇప్పుడు జైల్లో ఉన్నాడు, ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుకోవడం వద్దు 6:00 PM, అక్టోబర్ 05 2023 ఎట్టకేలకు ఢిల్లీ వదిలిన లోకేష్ ► ఢిల్లీ నుంచి రాజమండ్రికి నారా లోకేష్ ► చంద్రబాబు అరెస్ట్ తర్వాత 22 రోజుల పాటు ఢిల్లీకే పరిమితమైన లోకేష్ ► రఘురామకృష్ణరాజుతో కలిసి సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లతో చర్చలు జరిపిన లోకేష్ ► వీడ్కోలు పలికిన టీడీపీ ఎంపీలు కనకమేడల, కేశినేని నాని, ఎంపీ రఘురామ ► రేపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో తండ్రి చంద్రబాబును ములాఖత్లో కుటుంబసభ్యులతో పాటు కలవనున్న లోకేష్ ► చంద్రబాబుకు మరో 14 రోజులు పాటు రిమాండ్ విధించిన న్యాయస్థానం ► ఆదివారం మళ్లీ లోకేష్ ఢిల్లీకి వెళ్లిపోతాడని ప్రచారం ► సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానున్న చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ ► విచారణ సమయంలో సుప్రీంకోర్టుకు లాయర్లతో కలిసి వెళ్లనున్న నారా లోకేష్ 5:10 PM, అక్టోబర్ 05 2023 చంద్రబాబు నేర చరిత్రపై YSRCP విమర్శలు ► పదవిని అడ్డుపెట్టుకుని రూ.6 లక్షల కోట్లు దోచుకున్నాడని విమర్శ ► దోపిడిలో లోకేష్, పవన్ కళ్యాణ్లకు వాటా ఉందని విమర్శ Presenting India’s biggest and most notorious scamster Mr. Nara Chandra Babu Naidu @ncbn, who looted a whopping ₹6 Lakh Crores of Public Money! Costarring his coterie of co-looters Guru - Mr Ramoji Rao Biological Son - Mr @NaraLokesh Adopted Son - Mr @PawanKalyan And… pic.twitter.com/tuQHUCEFPy — YSR Congress Party (@YSRCParty) October 5, 2023 5:00 PM, అక్టోబర్ 05 2023 రేపు ACB కోర్టులో చంద్రబాబు బెయిల్పై వాదనలు ► విజయవాడ : చంద్రబాబు పిటిషన్లపై విచారణ రేపు మధ్యాహ్నానికి వాయిదా ► రేపు మధ్యాహ్నం బాబు న్యాయవాది దూబే వాదనలకి రిప్లై ఇవ్వనున్న AAG పొన్నవోలు ► రేపు మధ్యాహ్నం తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ PT వారెంట్లపైనా విచారణ జరిగే అవకాశం 4:45 PM, అక్టోబర్ 05 2023 హైకోర్టు : చంద్రబాబు బెయిల్పై తీర్పు రిజర్వ్ ► హైకోర్టులో ఫైబర్ గ్రిడ్ కేసుపై ముగిసిన వాదనలు ► చంద్రబాబు ముందస్తు బెయిల్ పై తీర్పు రిజర్వు ► చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దంటూ CID తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరాం వాదనలు ► స్కిల్ కేసులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు ఇచ్చిన చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్, పార్థసాని ఇప్పటికే పరారీలో ఉన్నారు ► చంద్రబాబు ప్రమేయంతోనే వారిద్దరూ పరారైనట్లు మాకు సమాచారం ఉంది ► చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దు ► చంద్రబాబు బయటకు వస్తే సాక్షులు ప్రభావితం చేస్తారు 4:45 PM, అక్టోబర్ 05 2023 స్కిల్ స్కాం నిధులన్నీ చంద్రబాబు ఖాతాలకు చేరాయి : సజ్జల ► స్కిల్ స్కామ్ కేసులో CID ఆధారాలు సేకరించినట్టు కోర్టుకు తెలిపింది ► స్కామ్లో డబ్బులు చంద్రబాబు ఖాతాలోకి వెళ్లినట్టు CID ఆధారాలు సేకరించింది ► ఈ కుంభకోణంలో లోకేష్ సన్నిహితుడు కిలారి రాజేష్ పాత్ర కీలకంగా ఉందని CID దర్యాప్తులో తేలింది ► NDA కూటమి నుంచి బయటకొచ్చినట్టు పవన్ కళ్యాణ్ చెబుతున్నారు ► పవన్ తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది ► టీడీపీ బలహీనపడిందని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు ► పవన్ ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో చెప్పాలి ► అసలు టీడీపీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో తెలియాలి ► చంద్రబాబును జైల్లో పెట్టింది జగన్ కాదు కోర్టు ► ప్రభుత్వానికి చంద్రబాబు కేసులతో సంబంధం లేదు : సజ్జల 4:38 PM, అక్టోబర్ 05 2023 స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు రిమాండ్ పొడిగింపు ► ఈ నెల 19 వరకు రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు ► చంద్రబాబు రిమాండ్ మరో 14 రోజులు పొడిగింపు 4:31 PM, అక్టోబర్ 05 2023 చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా ► రేపు మధ్యాహ్నానికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ► రేపు మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు వింటానన్న న్యాయమూర్తి ► ఇవాళ హోరాహోరీగా సాగిన ఇరుపక్షాల వాదనలు 2:50 PM, అక్టోబర్ 05 2023 బుద్ధా వెంకన్న కేసు @ హైకోర్టు ► ఏపీ హైకోర్టులో బుద్ధా వెంకన్న పిటిషన్ ► పేర్నినాని పెట్టిన కేసుపై హైకోర్టును ఆశ్రయించిన బుద్ధా వెంకన్న ► వల్లభనేని వంశీ, కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బుద్ధా వెంకన్నపై కేసు ► గన్నవరం ఆత్కూరు స్టేషన్లో కేసు పెట్టిన పేర్నినాని ► బుద్దా వెంకన్నకు 41A కింద నోటీసు ఇవ్వాలన్న హైకోర్టు 2:50 PM, అక్టోబర్ 05 2023 బండారు కేసు @ హైకోర్టు ► ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి బండారు పిటిషన్ ► తనపై పెట్టిన కేసును సవాలు చేసిన టిడిపి నేత బండారు ► బండారు పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని అడ్వొకేట్ జనరల్కు హైకోర్టు సూచన ► ఇటీవల మంత్రి రోజాపై నీచ వ్యాఖ్యలు చేసిన టిడిపి నేత బండారు ► మహిళలను కించపరిచినవారు బాగుపడ్డ దాఖలాలు చరిత్రలో లేవన్న మంత్రి రోజా ❝ స్త్రీ కన్నీటి బొట్టు గురించి చాగంటి వారి ప్రవచనం ❞ pic.twitter.com/6rshDIRACU — Roja Selvamani (@RojaSelvamaniRK) October 3, 2023 2:45 PM, అక్టోబర్ 05 2023 లంచ్ తర్వాత వాదనలు పునఃప్రారంభం ► ఏపీ హైకోర్టులో ఫైబర్ గ్రిడ్ కేసు ► ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ► CID తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు 2:15 PM, అక్టోబర్ 05 2023 తెలుగుదేశం, జనసేనలకు YSRCP చురకలు ► ఎన్నికలు రాగానే ప్యాకేజీ రాజకీయాలా? ► ఇవేం పార్టీలు, ఇవేం పొత్తులు : అంబటి జనసేన రాజకీయ పార్టీ కాదు ! తెలుగుదేశం బలహీనపడినప్పుడు వాడే బలం మందు! @PawanKalyan @naralokesh @JaiTDP — Ambati Rambabu (@AmbatiRambabu) October 5, 2023 1:50 PM, అక్టోబర్ 05 2023 బాబు బయటకు వస్తే.. సాక్ష్యాధారాలు తారుమారే ► ఏపీ హైకోర్టు: ఫైబర్గ్రిడ్ కేసు సిఐడి తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు ► ప్రాథమిక విచారణలో చంద్రబాబు పేరు లేదు కాబట్టి కేసులో లేరు అనటం సరికాదు ► పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత చంద్రబాబు ప్రమేయం గుర్తించాం ► అందుకే నిందితుడుగా చంద్రబాబు పేరును చేర్చాం ► టెరా సాప్ట్ కు పనులు ఇవ్వటం మొదలు అన్నీ చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగాయి ► నిబంధనలు పాటించకుండా నిర్ణయాలు అమలు చేసి అక్రమాలకు పాల్పడ్డారు 1:40 PM, అక్టోబర్ 05 2023 మద్ధతివ్వండి ప్లీజ్.. CPIని రిక్వెస్ట్ చేసిన TDP ► గుంటూరు జిల్లా CPI కార్యాలయానికి వెళ్లిన TDP నాయకులు ► ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్తో TDP నేతల భేటీ ► TDP బృందంలో నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా, తెనాలి శ్రావణ్ ► ఈ నెల 7న జరిగే శాంతి ర్యాలీకు CPI మద్దతు కోరిన TDP నాయకులు 1:20 PM, అక్టోబర్ 05 2023 ఓట్ల కోసం కక్కుర్తి పడతారా? మీలో మీకైనా కనీస గౌరవముందా? ► తెలుగుదేశం, జనసేన నాయకులపై YSRCP విమర్శలు ► మీలో మీకే గౌరవం లేదు, ప్రజలను ఏం గౌరవిస్తారని ప్రశ్న మనసులో లేని ప్రేమ, అభిమానాన్ని నటిస్తూ అధికారం కోసం @JaiTDP, @JanaSenaParty పొత్తు పెట్టుకున్నాయి. కానీ.. ఎంత సీనియర్ నటులైనా లేని గౌరవాన్ని అన్నివేళలా నటించడం సాధ్యం కాదు కదా..? చంద్రబాబుని గాడు అని @PawanKalyan సంభోదిస్తే.. ఆ పవన్ కళ్యాణ్ని మరింత వెటకారంగా గాడూ అంటూ నందమూరి… pic.twitter.com/VXuaS4QYhQ — YSR Congress Party (@YSRCParty) October 4, 2023 1:10 PM, అక్టోబర్ 05 2023 కార్పోరేషన్ తప్పు చేస్తే.. చంద్రబాబుకేంటీ సంబంధం : బాబు లాయర్ వాదన ► చంద్రబాబు తరపున మరో సీనియర్ లాయర్ ప్రమోద్ కుమార్ దూబే వాదనలు ► దూబే : సాంకేతికంగా చంద్రబాబుకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు ► న్యాయమూర్తి : చంద్రబాబు ప్రభుత్వం స్కిల్ కార్పోరేషనుకు ఇచ్చిన బ్యాంకు గ్యారంటీల సంగతేంటీ? ► దూబే : స్కిల్ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడంతోనే సీఎంగా చంద్రబాబు పాత్ర పూర్తయింది ► బ్యాంకు గ్యారెంటీలను స్కిల్ కార్పోరేషన్కు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది ► సీమెన్స్తో ఒప్పందం చేసుకుంది స్కిల్ కార్పోరేషనే తప్ప.. ప్రభుత్వం కాదు ► స్కిల్ కార్పోరేషన్, సీమెన్స్ ఇండియా, డిజైన్ టెక్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది ► అక్కడ అవినీతి, అక్రమాలు జరిగితే చంద్రబాబుకు సంబంధం ఎలా ఉన్నట్టు? : దూబే 12:50 PM, అక్టోబర్ 05 2023 హైకోర్టు : ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు లాయర్ సిద్ధార్థ అగర్వాల్ వాదనలు ► ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్పై హైకోర్టులో వాదనలు ► ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్టులను నిబంధనలు ప్రకారమే బిడ్డర్కు ఇచ్చారు ► ఇందులో చంద్రబాబు తప్పేమీ లేదు, ► ఈ కేసులో కొందరికి బెయిల్ లభించింది ► చంద్రబాబుకు కూడా బెయిల్ ఇవ్వాలి : లాయర్ అగర్వాల్ 12:38 PM, అక్టోబర్ 05 2023 చంద్రబాబు పాత్రకు ఇవే ఆధారాలు : ACB కోర్టులో పొన్నవోలు ► విజయవాడ : రెండో రోజు ACB కోర్టులో సంచలన నిజాలు బయటపెట్టిన అడిషనల్ అడ్వొకేట్ జనరల్ ► నైపుణ్య శిక్షణ పేరుతో 370 కోట్ల నిధులని దిగమింగారు ► చంద్రబాబు పాత్రను బయటపెట్టే డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పణ ► ఏ రకంగా డొల్ల కంపెనీల నుంచి ఈ నిధులు నేరుగా టిడిపి ఖాతాలోకి వచ్చాయన్న దానిపై ఆధారాల సమర్పణ ► రూ.27 కోట్లు మళ్లించిన బ్యాంకు ఖాతాల డాక్యుమెంట్లని ACB కోర్టుకు సమర్పణ ► దీనికి సంబంధించిన ఆడిటర్ను విచారణకు పిలిచాం ► ఈ నెల 10 న విచారణకు ఆడిటర్ వస్తానన్నారు ► డొల్ల కంపెనీలని సృష్టించి హవాలా రూపంలో నిధులు దిగమింగిన వైనాన్ని వివరించిన పొన్నవోలు 12:30 PM, అక్టోబర్ 05 2023 ఫైబర్నెట్ స్కాంలో చంద్రబాబుదే కీలక పాత్ర ► ఏపీ హైకోర్టులో ఫైబర్ నెట్ కుంభకోణంలో వాదనలు ► తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు నాయుడు పిటిషన్ ► CID తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు ► చంద్రబాబు నాయుడు బెయిల్ విజ్ఞప్తిని తిరస్కరించాలన్న AG శ్రీరామ్ 12:30 PM, అక్టోబర్ 05 2023 భువనేశ్వరీ ప్రకటనపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి : YSRCP ► భువనేశ్వరీ ఇటీవల చేసిన ప్రకటనపై నారుమల్లి పద్మజ విమర్శలు ►ఎన్టీఆర్ కన్నీళ్లు కార్చితేనే స్పందించని భువనేశ్వరి ఇతర మహిళల కష్టాలకు స్పందిస్తుందా? ►హెరిటేజ్లో 2% అమ్మితే రూ.400 కోట్లు వస్తాయని భువనేశ్వరి అంటున్నారు ►దీనిపై ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించాలి, ఆస్తుల అఫిడవిట్లపై విచారణ జరపాలి ►బండారు సత్యనారాయణ లాంటి కీచకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతన్నారు ►ఇలాంటి వారిని ఎవరు ప్రోత్సాహిస్తున్నారు? ►ఒక మహిళ కన్నీరు తమకు సంతోషాన్నిస్తోందని అంటున్నారంటే టీడీపీ వారి పైశాచికత్వాన్ని ఏం అనాలి? ►భువనేశ్వరి సభలో ఒక పిల్లాడితో చండాలంగా మాట్లాడించారు ►భువనేశ్వరి చప్పట్లు కొడుతుంటే అసలు వీరు మహిళలేనా అనిపిస్తోంది ►చంద్రబాబు చేసిన స్కాంలలో కూడా భువనేశ్వరి పాత్ర ఉందనే అనుమానం వస్తోంది ►విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్ జరిగినప్పుడు ఈ భువనేశ్వరి ఎందుకు మాట్లాడలేదు? 12:24 PM, అక్టోబర్ 05 2023 బెయిల్ ఇవ్వొద్దు, కస్టడీకి అప్పగించండి : CID లాయర్ పొన్నవోలు ► స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై ఆధారాలున్నాయి ► స్కిల్ స్కామ్ కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబే ► కస్టడీకి ఇస్తే కేసుకు సంబంధించి లోతైన విచారణ జరుగుతుంది ► బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరిన అదనపు అడ్వకేట్ జనరల్ 12:10 PM, అక్టోబర్ 05 2023 ఇవ్వాళ ACB కోర్టు ముందుకు చంద్రబాబు ► స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్పై నేడు కోర్టు నిర్ణయం ► ఇవాళ ACB కోర్టు ముందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు హాజరు ► ఈ సాయంత్రానికి రాజమండ్రికి నారా లోకేష్ ► రేపు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖత్ కానున్న లోకేష్ ► చంద్రబాబు అరెస్ట్ తర్వాత 21 రోజులుగా ఢిల్లీలోనే నారా లోకేష్ 12:04 PM, అక్టోబర్ 05 2023 ACB కోర్టులో CID తరపున పొన్నవోలు వాదనలు ► స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై ఆధారాలున్నాయి ► చంద్రబాబు స్వయంగా 13 చోట్ల సంతకాలు పెట్టారు ► రూ.27 కోట్లు నేరుగా టిడిపి ఖాతాలో జమ అయ్యాయి ► ఆర్టికల్ 14 ని ప్రస్తావించిన పొన్నవోలు ► న్యాయం ముందు అందరూ సమానమే.... ముఖ్యమంత్రైనా...సామాన్యుడికైనా న్యాయమొక్కటే ► ముఖ్యమంత్రి హోదాను అడ్డుకుని ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎలా? ► ఇది మామూలు కేసు కాదు...తీవ్ర ఆర్ధిక నేరం కలిగిన కేసు ► చంద్రబాబు తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేశారు 11:43 AM, అక్టోబర్ 05 2023 జైల్లో చంద్రబాబు, క్షేత్రస్థాయిలో తమ్ముళ్ల కుస్తీలు ► కృష్ణా జిల్లా : పెనమలూరు టీడీపీలో టిక్కెట్ చిచ్చు ► ఇటీవల కాలంలో పెనమలూరు నియోజకవర్గంలో యాక్టివ్గా తిరుగుతున్న దేవినేని గౌతమ్ ► జనసేన మద్ధతుతో పెనమలూరు టిడిపి టిక్కెట్ దేవినేని గౌతమ్కు ఇస్తారని ప్రచారం ► పార్టీలో పరిస్థితుల పై నియోజకవర్గ ఇంఛార్జి బోడే ప్రసాద్ అసహనం ► దేవినేని గౌతమ్కు టిడిపి టికెట్ ఇస్తే.. పార్టీని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా : బోడే ► క్రమశిక్షణను ఉల్లంఘించే వారిని పార్టీ క్యాడర్ అంగీకరించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా 11:43 AM, అక్టోబర్ 05 2023 ఎల్లో మీడియా తప్పుడు కథనాలపై కోర్టుకు ఫిర్యాదు ► విజయవాడ : ACB కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటీషన్లపై వాదనలు ► ఎల్లో మీడియా తప్పుడు కథనాలను కోర్టు ముందు ప్రస్తావించిన అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి ► ACB జడ్జి తనపై ఆగ్రహం వ్యక్తం చేశారంటూ తప్పుడు కథనాలు రాశారని తెలిపిన పొన్నవోలు ► తప్పుడు కవరేజీపై కోర్టు ఆగ్రహం ► విచారణ జరుగుతున్న హాలులో న్యాయవాదులు కాకుండా ఇంకెవరూ వుండకూడదని న్యాయమూర్తి ఆదేశం 11:40 AM, అక్టోబర్ 05 2023 TDP, జనసేన అట్టర్ఫ్లాప్: జోగి రమేష్ ► తాడేపల్లి : టీడీపీ, జనసేన కలయిక వైరస్ కంటే ప్రమాదకరం ► టీడీపీ, జనసేన కలిసిన తర్వాత పెట్టిన మీటింగ్ ప్లాప్ అయింది ► పవన్ మీటింగ్ అట్టర్ ప్లాప్ షోలా మారిపోయింది ► పవన్ తాట తీస్తానని చెప్పి రెండు చోట్లా ఓడిపోయాడు ► ఎలాంటి విలువలు, విశ్వసనీయత లేని మనిషి పవన్ ► రంగాను చంపించిన వారికి అమ్ముడుపోతావా పవన్? ► కాపుల కోసం పోరాడిన ముద్రగడను చంద్రబాబు వేధించారు ► పవన్ మీటింగ్ పెడితే కనీసం రెండు వేల మంది రాలేదు ► చేసిన తప్పుకు చంద్రబాబు జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు టీడీపీ, జనసేన పార్టీల కలయిక వైరస్ లాంటిది కాబట్టే.. రెండు పార్టీలు కలిసి మీటింగ్ పెట్టుకున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ పెడన సభ అట్టర్ ఫ్లాప్ అయింది. - మంత్రి జోగి రమేష్ #PackageStarPK#PoliticalBrokerPK#EndOfTDP pic.twitter.com/FwjhTPedU2 — YSR Congress Party (@YSRCParty) October 5, 2023 11:35 AM, అక్టోబర్ 05 2023 NDA నుంచి ఎందుకు బయటకు వచ్చానంటే : పవన్ కళ్యాణ్ ► నాకు చాలా ఇబ్బందులున్నాయి ► NDAలో భాగస్వామి ఉండి కూడా.. నేను బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్ధతు తెలిపాను ► వంద శాతం నా మద్ధతు ఎందుకు ప్రకటించానంటే.. ► ఎందుకంటే తెలుగుదేశం చాలా బలహీన పరిస్థితుల్లో ఉంది కాబట్టి ► తెలుగుదేశం నాయకులు చాలా బలహీనంగా ఉన్నారు ► మీ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జనసేన పోరాట పటిమ టిడిపికి అవసరం కాబట్టి మద్ధతిచ్చాను #PawanaKalyan #TDP #JanaSenaParty pic.twitter.com/DAH2BJIgjd — Vattikoti Vishnu (@Vattikoti1989) October 5, 2023 11:30 AM, అక్టోబర్ 05 2023 NDAకు పవన్ కళ్యాణ్ రాం రాం.! ► తెలుగుదేశం కోసం పవన్కళ్యాణ్ NDAకు గుడ్బై ► ప్రకటించిన జాతీయ న్యూస్ ఏజెన్సీ ANI Actor, Politician Pawan Kalyan exits NDA to support Chandrababu Naidu Read @ANI Story | https://t.co/K8qOh21K9Y#PawanKalyan #NDA #ChandrababuNaidu pic.twitter.com/Ojlq1ylmg1 — ANI Digital (@ani_digital) October 5, 2023 11:20AM, అక్టోబర్ 05 2023 ACB కోర్టులో రిమాండ్ మెమో ► విజయవాడ : చంద్రబాబు రిమాండ్ పొడిగించాలని కోరుతూ మెమో దాఖలు చేసిన CID ► 15 రోజుల పాటు రిమాండ్ పొడిగించాలంటూ మెమో దాఖలు చేసిన సీఐడీ 11:00AM, అక్టోబర్ 05 2023 ఏపీ హైకోర్టులో ప్రారంభమైన విచారణ ►ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ►ఏపీ హైకోర్టులో ప్రారంభమైన విచారణ ►చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తున్న లాయర్ సిద్ధార్థ అగర్వాల్, లూథ్రా 10:40AM, అక్టోబర్ 05 2023 బాబు స్కీంలు ఇవ్వలేదు.. స్కాంలు చేశారు ►చంద్రబాబు స్కీం లు ఇవ్వలేదు, స్కాంలకు పాల్పడ్డారు ►తాను కట్టిన జైల్లో చంద్రబాబు శిక్ష అనుభవిస్తున్నారు ►మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండారును ఉరి తీయాలి ►మహిళల్ని కించపరిచేలా మాట్లాడితే నాలుక చీరేస్తాం ►పవన్ కల్యాణ్ కొట్టే.. సినిమా డైలాగ్ లకు వైఎస్సార్సీపీ భయపడదు :::వంగపండు ఉష, రాష్ట్ర సంస్కృతిక విభాగం అధ్యక్షురాలు 10:24AM, అక్టోబర్ 05 2023 కోర్డుకి చేరుకున్న ఏఏజీ సుధాకర్ రెడ్డి ►విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరుకున్న అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి ►సీఐడీ తరపున నిన్న బలమైన వాదనలు వినిపించిన ఏఏజీ ►స్కిల్ కుంభకోణం అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది ►స్కిల్ స్కామ్ ఫిక్షన్ కాదు.. ప్రభుత్వ నిధులు కొల్లగొట్టిన అవినీతి వ్యవహారం ►బాబు చేసిన 13 సంతకాలతో సహా బలమైన ఆధారాలున్నాయి ►చెప్పినట్లు చేయాలని అధికారులను బెదిరించారు ►బాబు ఆదేశాలతోనే.. మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని పరారయ్యారు ►బెయిల్పై బయటకొస్తే మిగిలిన సాక్షులను బెదిరించి కేసు దర్యాప్తును ప్రభావితంచేయొచ్చని వాదనలు ►మరికాసేపట్లో చంద్రబాబు పిటిషన్పై ప్రారంభం కానున్న వాదనలు 09:56AM, అక్టోబర్ 05 2023 ముందస్తుపై కాసేపట్లో వాదనలు ►ఏపీ హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ►మరికాసేపట్లో వాదనలు ప్రారంభం ►ఫైబర్ నెట్ కుంభకోణంలో కేసులో నిందితుడిగా చంద్రబాబు ►ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు 09:22AM, అక్టోబర్ 05 2023 చంద్రబాబు రిమాండ్ పొడిగింపు ఉంటుందా? ►స్కిల్ స్కామ్ కేసులో సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ అయిన నారా చంద్రబాబు నాయుడు ►26 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ 7691గా బాబు ►సెప్టెంబర్ 10వ తేదీ నుంచి చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ►రెండుసార్లు పొడిగించిన ఏసీబీ కోర్టు ►రిమాండ్లో, సీఐడీ కస్టడీ ఇంటరాగేషన్లో ఎలాంటి ఇబ్బందులు పడలేదని స్వయంగా జడ్జికి చెప్పిన చంద్రబాబు 09:00AM, అక్టోబర్ 05 2023 పరిటాల సునీతపై కేసు నమోదు ►టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటా సునీతపై కేసు నమోదు ►శ్రీసత్యసాయి కనగానపల్లి లో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహణ ►సునీతతో పాటు తనయుడు శ్రీరామ్ సహా 119 మందిపై కేసు 08:29AM, అక్టోబర్ 05 2023 నేడు రాజమండ్రికి లోకేష్? ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►ఇవాల్టితో పూర్తి కానున్న చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ► బ్లూ జీన్ యాప్ ద్వారా ఏసీబీ జడ్జి ఎదుట ప్రవేశపెట్టనున్న అధికారులు ►ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఇవాళ జరుగనున్న విచారణ ►నేడు రాజమండ్రి రానున్న నారా లోకేష్? ►రేపు చంద్రబాబుతో ములాఖత్ కానున్న లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి 08:08AM, అక్టోబర్ 05 2023 బాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ►ఫైబర్ నెట్ స్కామ్ కేసులో నిందితుడిగా చంద్రబాబు నాయుడు ►ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన బాబు లాయర్లు ►నేడు విచారణకు వచ్చే అవకాశం 07:53AM, అక్టోబర్ 05 2023 తాడు లేని బొంగరంగా.. టీడీపీ ►అసలు ఎమ్మెల్యేగా కూడా గెలవలేని యనమల ►యనమలే పార్టీకి దిక్కంటూ వార్తలు ►టీడీపీ తాడు బొంగరంలేని పార్టీ అని అర్థమౌతుంది. ►తండ్రి స్కాం చేసి జైలుకెళ్తే.. కొడుకు పలాయనం చిత్తగించాడు. ►టీడీపీ క్యాడర్ అడ్రస్సే లేదు ::: వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అసలు ఎమ్మెల్యేగా కూడా గెలవలేని యనమలే దిక్కంటూ వస్తున్న వార్తలు చూస్తుంటే టీడీపీ తాడు బొంగరంలేని పార్టీ అని అర్థమౌతుంది. తండ్రి స్కాం చేసి జైలుకెళ్తే, కొడుకు పలాయనం చిత్తగించాడు. క్యాడర్ అడ్రస్సే లేదు. — Vijayasai Reddy V (@VSReddy_MP) October 4, 2023 07:48AM, అక్టోబర్ 05 2023 డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందు తొడ కొట్టిందట! ►మహానేత వైఎస్సార్పై పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ►వైఎస్సార్ మేరు పర్వతం.. పవన్ కంకర కుప్ప ►ప్యాకేజీ తీసుకుని గంపగుత్తగా ఓట్లను తాకట్టు పెట్టేది పవన్.. ప్రజలకోసం జీవించిన వ్యక్తి వైఎస్సార్ ►2009 నాటికి నువ్వు కనీసం వార్డు మెంబర్ కూడా కాదు..కానీ జగన్ అప్పటికే కడప ఎంపీ ►నువ్వు అంత గొప్పోడివి అయితే ప్రజలు ఓడించరు కదా!. ►సొల్లు కబుర్లు మానేసి నాలుగు ఓట్ల కోసం ట్రై చేయు నువ్వెంత? నీ స్థాయి ఎంత? మేరు పర్వతం ముందు కంకర కుప్పంత! వైయస్సార్ తో నీకు పోలికా? ప్యాకేజీ తీసుకుని గంపగుత్తగా ఓట్లను తాకట్టు పెట్టేసిన నీకు ప్రజలకోసం జీవించిన మహానేతతో పోలిక దేనికీ @Pawankalyan? డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందు తొడ కొట్టకూడదు. నువ్వు చెప్పిన 2009 నాటికి… pic.twitter.com/pmEetPK8K1 — YSR Congress Party (@YSRCParty) October 4, 2023 07:26AM, అక్టోబర్ 05 2023 రాజమండ్రిలో పోలీసుల అలర్ట్ ►ఛలో రాజమండ్రి పేరిట టీడీపీ, నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ పిలుపు ►ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలకు పర్మిషన్ లేదని నిన్ననే స్పష్టం చేసిన జిల్లా ఎస్పీ జగదీష్ ►శాంతి భద్రతలకు భంగం వాటిల్లే చర్యలను ఉపేక్షించమని హెచ్చరిక ►144 సెక్షన్తో పాటు పోలీస్ సెక్షన్ 30 అమలు ►రాజమండ్రిలో పలు చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు 07:18AM, అక్టోబర్ 05 2023 సూత్రధారి చంద్రబాబే: ఏఏజీ సుధాకర్రెడ్డి ►ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటీషన్లపై నేడు కూడా కొనసాగనున్న విచారణ ►నేడు ఉదయం 11.15 గంటలకి ప్రారంభం కానున్న వాదనలు ►స్కిల్ కుంభకోణంలో చంద్రబాబుకి సంబంధం లేదని వాదనలు వినిపించిన చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే ►చంద్రబాబుకి కనీసం కండిషనల్ బెయిల్ అయినా ఇవ్వాలని కోరిన దూబే ►స్కిల్ కుంభకోణంలో చంద్రబాబే ప్రధాన సూత్రధారి అని ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు ►చంద్రబాబు బెయిల్ పిటీషన్ డిస్మిస్ చేయాలని కోరిన పొన్నవోలు ►చంద్రబాబుకి బెయిల్ ఇస్తే సాక్షులని ప్రభావితం చేస్తారని ప్రస్తావన ►తీవ్రమైన ఆర్ధిక నేరాలలో బెయిల్ ఇవ్వకూడదన్న సుప్రీం తీర్పుని ఉదహరించిన పొన్నవోలు ►చంద్రబాబు రెండు రోజుల కస్టడీలో సహకరించలేదని వివరణ ►చంద్రబాబుని మరో అయిదు రోజుల కస్ఢడీకి ఇవ్వాలని కోరిన పొన్నవోలు ►పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్ధసాని విదేశాలకి పారిపోవడం వెనక చంద్రబాబు హస్తముందన్న పొన్నవోలు ►ఇరువర్గాల వాదనలు పూర్తికాకపోవడంతో విచారణ నేటికి వాయిదా ►చంద్రబాబు బెయిల్, కస్టడీ విచారణల తర్వాత ఇన్నర్ రింగ్చరోడ్, ఫైబర్ నెట్ పిటి వారెంట్లపైనా విచారణ జరిగే అవకాశం 06:58AM, అక్టోబర్ 05 2023 చంద్రబాబు పిటిషన్లపై నేడు కొనసాగనున్న విచారణ ►చంద్రబాబు బెయిల్, కస్టడీ, పీటీ వారెంట్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ ►నిన్న సుదీర్ఘంగా సాగిన ఇరువైపుల వాదనలు ►నేటికి విచారణ వాయిదా వేసిన కోర్టు 06:52AM, అక్టోబర్ 05 2023 రిమాండ్ పొడిగింపుపై నేడు ఆదేశాలు ►నేటితో ముగియనున్న చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ►పొడిగింపుపై ఆదేశాలు ఇవ్వనున్న విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ►వర్చువల్గా చంద్రబాబును ఏసీబీ జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ►ఇంతకు ముందు రెండుసార్లు రిమాండ్ ముగిసినప్పుడు వర్చువల్గానే ప్రవేశపెట్టిన వైనం ►రిమాండ్ పొడిగింపు కోరుతూ.. మెమో దాఖలు చేయనున్న సీఐడీ అధికారులు 06:40AM, అక్టోబర్ 05 2023 జైల్లో భద్రంగా చంద్రబాబు ►జైల్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ చంద్రబాబు ►స్నేహ బ్లాక్లో ప్రత్యేక వసతులు ►ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు ►కోర్టు అనుమతితో.. ఇంటి భోజనానికి అనుమతి ►కుటుంబ సభ్యులతో ములాఖత్లు 06:30AM, అక్టోబర్ 05 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @26 ►స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ►ఏపీ సీఐడీ అరెస్ట్.. జ్యూడీషియల్ రిమాండ్ విధించిన అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం ►26వ రోజుకి చేరిన చంద్రబాబు రిమాండ్ -
చోట్లా చంద్రబాబు సంతకాలు..కీలక ఆధారాలు లభ్యం
-
దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారు.. సాక్షులను బెదిరిస్తున్నారు
సాక్షి, విజయవాడ: ‘స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసు కీలక దశలో ఉంది. రూ.371 కోట్లు కొల్లగొట్టిన ఈ సామాజిక, ఆర్థిక కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా తానై చంద్రబాబు వ్యవహరించారు. ఈ కేసులో ఇప్పటికే ఆయన సాక్షులను బెదిరిస్తున్నారు. ఈ తరుణంలో ఆయన బెయిల్పై బయటకొస్తే మిగిలిన సాక్షులను బెదిరించి కేసు దర్యాప్తును ప్రభావితంచేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను తిరస్కరించాలని కోరుతున్నా’.. అని రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు బెయిల్ పిటిషన్ను విజయవాడ ఏసీబీ న్యాయస్థానం బుధవారం విచారించింది. ఈ సందర్భంగా అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తూ చంద్రబాబుకు బెయిల్ పిటిషన్ను తిరస్కరించేందుకు ఉన్న బలమైన కారణాలను న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర సుస్పష్టమన్నారు. జీఓ జారీ, అందుకు విరుద్ధంగా ఒప్పందం కుదుర్చుకోవడం, అధికారుల నియామకం, ఆర్థిక శాఖ అధికారుల అభ్యంతరాలను తోసిపుచ్చుతూ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిధుల విడుదల.. ఇలా అన్ని దశల్లోనూ చంద్రబాబే ప్రధాన పాత్ర పోషించారని చెప్పారు. అందుకు 13 నోట్ఫైళ్లపై చంద్రబాబు సంతకాలు చేయడమే నిదర్శనమన్నారు. జీఓ నంబర్ 4 కంటే ముందే ఒప్పందం కుదుర్చుకున్నారని.. కానీ, ఆ ఒప్పందాన్ని జీఓలో ఎందుకు ప్రస్తావించలేదన్నది ఈ కేసులో కీలకమన్నారు. ఆర్థిక శాఖ అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలను చంద్రబాబు దురుద్దేశపూరితంగానే తన విచక్షణాధికారాలు (వీటో)తో తోసిపుచ్చారని న్యాయస్థానానికి వివరించారు. బాబు బెదిరింపులపై ఆధారాలున్నాయి.. అంతేకాదు.. తాను చెప్పినట్లు చేయకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని.. వారిని పదవుల నుంచి తొలగిస్తానని ఆనాడు సీఎంహోదాలో చంద్రబాబు అధికారులను బెదిరించినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని కూడా పొన్నవోలు న్యాయస్థానానికి వివరించారు. స్కిల్ కుంభకోణం ఏమీ ఫిక్షన్ కథ కాదని, ప్రభుత్వ నిధులు కొల్లగొట్టిన అవినీతి వ్యవహారమని చెప్పారు. ఆ మేరకు సమగ్ర దర్యాప్తు ద్వారా సీఐడీ గుర్తించి నివేదించిన ఆధారాలను పరిశీలించాలని న్యాయస్థానాన్ని కోరారు. షెల్ కంపెనీలు, నకిలీ ఇన్వాయిస్ల ద్వారా పన్ను ఎగవేతను 2017లోనే జీఎస్టీ అధికారులు గుర్తించారన్నారు. ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థల దర్యాప్తులో ఉండగానే 2018లో 17వ సవరణ చేశారనే విషయాన్ని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి ఈ కేసులో చంద్రబాబుకు 17ఏ వర్తించదన్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే వారిద్దరు పరార్.. ఇక నిధులను అక్రమంగా తరలించడంలో కీలక వ్యక్తులైన చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని దేశం విడిచి పరారైన ఉదంతాన్ని ప్రస్తావించారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని వారిని సీఐడీ నోటీసులు ఇవ్వగానే దేశం విడిచిపెట్టి పోవడం తీవ్రమైన పరిణామమన్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే వారిద్దరూ పరారయ్యారని చెప్పారు. పెండ్యాల శ్రీనివాస్ పాస్పోర్ట్ను సీజ్ చేసేలా న్యాయస్థానం ఆదేశించాలని కోరారు. ఇక ఈ కేసులో గతంలో 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చిన అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ ప్రస్తుతం అందుకు భిన్నంగా మీడియా చానళ్లలో చర్చల్లో మాట్లాడుతుండటం వెనుక చంద్రబాబు ఒత్తిడి ఉందన్నారు. కాబట్టి ఈ తరుణంలో చంద్రబాబుకు బెయిల్ ఇస్తే ఆయన తన రాజకీయ పలుకుబడితో సాక్షులను బెదిరించి కేసు దర్యాప్తును పక్కదారి పట్టించే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయన్నారు. కాబట్టి ఈ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ను తిరస్కరించాలని న్యాయస్థానాన్ని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి కోరారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశంలేదు : దూబే అంతకుముందు.. ఈ కేసులో ముద్దాయి చంద్రబాబు తరపున ఢిల్లీ నుంచి వచ్చిన న్యాయవాది ప్రమోద్కుమార్ దూబే వాదనలు వినిపిస్తూ.. ఆర్థిక శాఖ అధికారులు గుజరాత్ వెళ్లి అధ్యయనం చేసి ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదన్నారు. ఈ ప్రాజెక్టు విలువను నిర్ణయించిన కాస్ట్ వేల్యూయేషన్ కమిటీలో చంద్రబాబు లేరన్నారు. ఆ కమిటీలో సభ్యుడిగా ఉన్న భాస్కరరావు ప్రస్తుతం బెయిల్పై ఉన్నారని చెప్పారు. కేబినెట్ నిర్ణయం మేరకు చేసుకున్న ఒప్పందంలో చంద్రబాబును తప్పుబట్టడానికి లేదన్నారు. సాక్షులను ప్రభావితం చేయడంగానీ, ఆధారాలను ధ్వంసం చేయడంగానీ పరారయ్యే అవకాశంగానీ లేనందున చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. అనంతరం.. చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణను న్యాయస్థానం గురువారానికి వాయిదా వేసింది. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆయనకు పీటీ వారంట్ జారీచేయాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లపై కూడా న్యాయస్థానం గురువారం విచారించే అవకాశాలున్నాయి. వాదనలపై వక్రీకరణలా!? ఏబీఎన్, టీవీ–5పై ఏఏజీ పొన్నవోలు ఆగ్రహం మరోవైపు.. న్యాయస్థానంలో జరిగిన వాదనలను వక్రీకరిస్తూ ఏబీఎన్, టీవీ–5 చానళ్లు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి మండిపడ్డారు. ఆ రెండు చానళ్లు తనను లొంగదీసుకోవాలని చూస్తున్నాయని.. అది సాధ్యం కాకపోవడంతో తనపై బురద జల్లుతున్నాయని ఆయన విమర్శించారు. విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ప్రాంగణంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు విచారణ సమయంలో న్యాయస్థానం తనపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు ఏబీఎన్, టీవీ–5 చానళ్లు దుష్ప్రచారం చేశాయని విమర్శించారు. అత్యంత కీలకమైన ఈ కేసులో ప్రభుత్వం తరఫున తాను బుధవారం మధ్యాహ్నం 2.30గంటల నుంచి 5గంటల వరకు వినిపించిన వాదనను న్యాయస్థానం ఓపిగ్గా విందన్నారు. ఆ సమయంలో న్యాయస్థానం తనపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని.. నిరూపించలేకపోతే ఏం చేస్తారని ఏబీఎన్, టీవీ–5 చానళ్లకు పొన్నవోలు సవాల్ విసిరారు. ఆ రెండు చానళ్లు టీవీ చర్చల్లో తనను తిట్టిస్తున్నా సహించానని కానీ, ఏకంగా న్యాయస్థానంలో వాదనలను వక్రీకరించడాన్ని మాత్రం ఉపేక్షించేది లేదన్నారు. ఈ విషయాన్ని గురువారం విచారణ సమయంలో న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఆ రెండు చానళ్లకు ధైర్యం ఉంటే గురువారం న్యాయస్థానం విచారణ సమయంలో రావాలని సవాల్ విసిరారు. -
ఏపీ హైకోర్టులో చంద్రబాబు, లోకేష్, నారాయణ బెయిల్ పిటిషన్లపై విచారణ
-
ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
-
Sep 29, 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu And Nara Lokesh Bail Petition Hearings and Ground updates 7:07 PM, సెప్టెంబర్ 29, 2023 కోర్టులపై వక్రభాష్యాలకు సమాధానాలు ఇవిగో ► కోర్టులకు ఎదురవుతున్న సవాళ్లకు ఇటీవల ఇండియా టుడే కాంక్లేవ్లో సూటిగా, స్పష్టంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్ సమాధానాలు ప్రశ్న : కోర్టుల స్వతంత్రత గురించి మీరేమంటారు? తీర్పు ఇచ్చే సమయంలో మీపై ఒత్తిడులుంటాయా? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్ : ► ఒక జడ్జిగా నాకు 23ఏళ్లుగా అనుభవం ఉంది. ► ఒక కేసులో ఇలా ఉండండి, ఇలా తీర్పు చెప్పండి అని ఏ ఒక్కరు మాపై ఒత్తిడి తీసుకురారు, తీసుకురాలేదు. ► ప్రతీ రోజూ సుప్రీంకోర్టులో ఉదయాన్నే బెంచ్ మీదకు వెళ్లకముందు జడ్జిలందరూ కలిసి కాఫీ తాగుతాం. ► కానీ ఏ ఒక్కరు ఇంకొకరి కేసు గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చించబోరు ► ఇక హైకోర్టులోనయితే ఈ సున్నితమైన పరిస్థితి మరింత ఎక్కువ. ► కొన్ని సార్లు సింగిల్ బెంచ్లో జడ్జి ఇచ్చిన తీర్పును అదే హైకోర్టులోని మరో ఇద్దరు జడ్జిలు సమీక్షించాల్సి ఉంటుంది. ► ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసుకోరు. ► ఎవరి కేసునయితే నేను సమీక్షించబోతున్నానో.. అదే జడ్జితో కలిసి భోజనం చేయవలిసిన పరిస్థితి ఉంటుంది. ► భోజనం షేర్ చేసుకుంటాం. అయితే కేసులను మాత్రం షేర్ చేసుకోం. ► అది మేం తీసుకున్న శిక్షణలో భాగం. ► అంతెందుకు మాపై ప్రభుత్వంలో ఉన్న ఏ వ్యవస్థ నుంచి ఒత్తిడి రాదు. ► ఇది నా ఒక్కరి గురించి చెప్పడం లేదు. మొత్తం దేశంలోని న్యాయవ్యవస్థ గురించి చెబుతున్నాను. 7:02 PM, సెప్టెంబర్ 29, 2023 లోకేష్ ఎక్కడ.? ► ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో A14 లోకేష్ ► 41ఏ కింద నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీకి వెళ్లిన CID బృందం ► ఇప్పటివరకు బస చేసిన ITC మౌర్య హోటల్లో రూమ్ ఖాళీ ► మీటింగ్లు పెట్టే గల్లా జయదేవ్ కంపెనీ గెస్ట్ హౌజ్లో లేడు ► రెగ్యులర్గా వాడే కారు మార్చేశాడు ► CID కంటికి కనిపించకుండా లోకేష్ దాగుడు మూతలు 6:32 PM, సెప్టెంబర్ 29, 2023 అభివృద్ధి తరలిపోతోందన్న బ్రాహ్మణి.. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పగలరా? ► బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యలకు YSRCP సూటి ప్రశ్నలు 1) బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో కేంద్ర సంస్థ ఆదాయంపన్ను అధికారులు ఫిబ్రవరి 13 ,2020న సోదాలు జరిపినపుడు రూ.2 వేల కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించి నల్లధన వివరాలు లభ్యమయ్యాయని ఫిబ్రవరి 17, 2020న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు. దీన్ని మీరు అంగీకరించారా? లేదా? 2) అమరావతి కాంట్రాక్టర్ల నుంచి రూ.600 కోట్ల సచివాలయం బిల్డింగ్ లో రూ.119 కోట్లు (20%) ముడుపులు బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని షాపుర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు. అవును, నిజమే ఆ డబ్బు బాబుకు ఇచ్చాను అని అని శ్రీనివాస్ చౌదరీ ఒప్పుకున్నాడు అని ఆగష్టు 4 న కేంద్ర సంస్థ ఇన్కంటాక్స్ సంస్థ చంద్రబాబుకు నోటీస్ ఇచ్చింది. దీనిమీద మీ మాటేంటీ? 3) రూ.371 కోట్ల స్కిల్ కుంభకోణంలో కేంద్ర సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నలుగురిని అరెస్ట్ చేసింది. మరి మీరు అంతా సవ్యంగా జరిగిందని ఎలా అంటారు? 4) CID నోటీసులు అందుకున్న వెంటనే పెండ్యాల శ్రీనివాసచౌదరి, మనోజ్ వాసుదేవ్ , యోగి విదేశాలకు ఎందుకు పారిపోయారు? 6:23 PM, సెప్టెంబర్ 29, 2023 పళ్లాలను గరిటలతో కొట్టండి : బ్రాహ్మణి ► చంద్రబాబు అరెస్ట్ అయినందుకు నిరసన తెలపాలంటూ పిలుపు ► బ్రాహ్మణి తీరును తప్పుబట్టిన మంత్రి అంబటి ► నాడు పళ్లాలను గరిటలతో కొట్టిన కాపులను దెబ్బతీశారు, ఇప్పుడు విధి ప్రకారం మీ వంతొచ్చిందంటూ చురకలు విధి విచిత్రమైనది ! కాపు ఉద్యమంలో పళ్ళాలు కొట్టినవారిని మక్కెలిరగొట్టి బొక్కలో వేసావ్ ! అవినీతి కేసులో బొక్కలో పడి పళ్ళాలు కొట్టమంటున్నావ్ ! వారే వాహ్ !@ncbn@naralokesh @iTDP_Official — Ambati Rambabu (@AmbatiRambabu) September 29, 2023 5:23 PM, సెప్టెంబర్ 29, 2023 భువనేశ్వరీకి నోటీసులు ఇవ్వాలి : కోర్టును కోరిన లూథ్రా ► రింగ్ రోడ్ అక్రమ అలైన్మెంట్ కేసులో చంద్రబాబు తరపున సిద్ధార్ధ్ లూద్రా వాదనలు ► భువనేశ్వరి అకౌంట్ నుంచే లింగమనేనికి అద్దె చెల్లింపులు జరిగాయి ► చంద్రబాబు, భువనేశ్వరికి 91 నోటీసు ఇవ్వొచ్చు కదా అని కోరిన లూథ్రా ► బాబు బెయిల్ నిరాకరణకు లింగమనేని వ్యవహారానికి లింకు పెట్టొద్దు లూథ్రా 5:20 PM, సెప్టెంబర్ 29, 2023 లోకేష్ ఢిల్లీలో ఎందుకు ఉంటున్నారంటే.? : అచ్చెన్నాయుడు ► ఎన్నికేసులు వేసినా లోకేష్ భయపడడు ► సుప్రీంకోర్టు లాయర్లకు బ్రీఫింగ్ ఇవ్వడానికే లోకేష్ ఢిల్లీలో ఉంటున్నాడు ► లాయర్లతో చర్చించాలి కాబట్టే లోకేష్ పాదయాత్ర వాయిదా 5:00 PM, సెప్టెంబర్ 29, 2023 తప్పులు చేసిన చంద్రబాబు జైలుకు వెళ్లారు : రఘువీరారెడ్డి ► శ్రీసత్యసాయి జిల్లా: చంద్రబాబు అరెస్ట్పై సీనియర్ నేత N.రఘువీరారెడ్డి వ్యాఖ్యలు ► స్వీయ తప్పిదాల వల్లే చంద్రబాబు జైలుకు వెళ్లారు ► తాను తవ్విన గోతిలో తనే పడ్డారు చంద్రబాబు ► ప్రత్యేక హోదా కోసం 2017లో గుంటూరులో సభ నిర్వహిస్తే చెప్పులు, రాళ్లు వేయించారు ► టీడీపీ దీక్షల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.. చంద్రబాబు విడుదల కాలేరు ► న్యాయస్థానంలో తప్పు చేయలేదని చంద్రబాబు నిరూపించుకోవాలి 4:25 PM, సెప్టెంబర్ 29, 2023 హైకోర్టు : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసు అక్టోబర్ 3కు వాయిదా ► చంద్రబాబు ముందస్తు బెయిల్పై హైకోర్టులో విచారణ వచ్చే నెల 3కు వాయిదా ► CID తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు ► రింగ్ రోడ్ మార్గంలో లింగమనేనికి భారీగా భూములు ► లింగమనేని భూముల పక్కనుంచి వెళ్లేలా అలైన్మెంట్ మార్పులు ► అలైన్మెంట్ మార్పు తర్వాత లింగమనేని భూముల విలువ భారీగా పెరిగింది ► లింగమనేని, హెరిటేజ్ సంస్థలు భూఅక్రమాలకు పాల్పడ్డాయి ► చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ లూథ్రా వాదనలు 3:25 PM, సెప్టెంబర్ 29, 2023 స్టేబిఎన్ ఇన్నాళ్లకు జైలుకెళ్లాడు : బొత్స ► విజయనగరంలో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ ► స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టిడిపి నేతలు కలిసి దోచుకుతిన్నారు ► ఇప్పడు సెక్షన్లు వర్తించవని అంటున్నారు తప్ప.. అవినీతి జరగలేదని చెప్పడం లేదు ► చంద్రబాబు ఇప్పటివరకు స్టే లు తెచ్చుకొని బ్రతికాడు ► స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో కూడా అలాగే తప్పించుకోవడానికి ప్రయత్నించాడు ► జైలుకు వెళ్లిన తర్వాత సానుభూతి పొందాలని చూస్తున్నాడు ► శాసనసభలో చర్చకు అవకాశం ఉన్నప్పటికీ టిడిపి ఎమ్మెల్యేలు చర్చించకుండా పారిపోయారు ► అవినీతి జరిగిందని అసెంబ్లీలో ఉన్న టిడిపి ఎమ్మెల్యేలకి కూడా తెలుసు 3:15 PM, సెప్టెంబర్ 29, 2023 తెలుగుసేనలో అయోమయం ► రాజమండ్రిలో జైలుకు పరిమితమైన చంద్రబాబు ► ఢిల్లీ నుంచి కదలనంటున్న లోకేష్ బాబు ► రాజమండ్రి నుంచి హైదరాబాద్కు భువనేశ్వరి ► రాజమండ్రి లోకేష్ క్యాంప్లో నారా బ్రాహ్మణి ► రెండు రోజుల హడావిడి తర్వాత కనిపించని బాలకృష్ణ ► జైలు ముందు పొత్తు ప్రకటన చేసి సైలంట్ అయిన పవన్ కళ్యాణ్ 3:10PM, సెప్టెంబర్ 29, 2023 హైకోర్టు : ఫైబర్ గ్రిడ్ కేసులో బాబు, లోకేష్ పిటిషన్లు వాయిదా ► చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ ► కేసు విచారణను అక్టోబర్ 4, 2023, బుధవారానికి వాయిదా వేసిన హైకోర్టు ► ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ను కూడా అక్టోబర్ 4కు వాయిదా వేసిన హైకోర్టు 3:00PM, సెప్టెంబర్ 29, 2023 హైకోర్టు : స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో 4వరకు ఆగండి ► స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో లోకేష్ వేసిన ముందస్తు బెయిల్పై విచారణ ► లోకేష్ను అరెస్ట్ చేసే విషయంలో అక్టోబర్ 4వరకు ఆగాలని హైకోర్టు సూచన ► ముందస్తు బెయిల్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులిచ్చిన హైకోర్టు 2:50PM, సెప్టెంబర్ 29, 2023 హైకోర్టు : అమరావతి రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసు ► చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ జరుపుతున్న హైకోర్టు ► CID తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు 2:40PM, సెప్టెంబర్ 29, 2023 లోకేష్ లోకేషన్ ఎక్కడ? ► ఢిల్లీ: మీడియాకు కంటపడకుండా తిరుగుతున్న లోకేష్ ► కార్లు మారుస్తూ రహస్యంగా మీటింగులు ► నిన్నటి నుంచి గల్లా జయదేవ్ ఇంటికి రాని లోకేష్ ► ఐటీసి మౌర్య నుంచి మరో చోటకు మకాం మార్పు ► జయదేవ్ కంపెనీ గెస్ట్ హౌస్లో ఉన్నారని సమాచారం ► ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హైకోర్ట్ ఎదురుదెబ్బ తగలడంతో న్యాయవాదులతో మంతనాలు ► CID బృందం వస్తుందని తెలిసి ఢిల్లీలో అలర్ట్ 2:30PM, సెప్టెంబర్ 29, 2023 ►లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ ప్రారంభం ►స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ గ్రిడ్ స్కామ్ కేసుల్లో లోకేష్ బెయిల్ పిటిషన్ 2:15 PM, సెప్టెంబర్ 29, 2023 హైకోర్టు : ఫైబర్ గ్రిడ్ కేసులో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ► ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు ► హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన బాబు లాయర్లు ► ఫైబర్ నెట్ స్కాంలో A25గా ఉన్న చంద్రబాబు ► A25గా చేరుస్తూ ఏసీబీ కోర్టులో ఇప్పటికే సిఐడి మెమో ► తాజా పరిణామాలతో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు ► అత్యవసరంగా విచారించాలని ఇప్పటికే హైకోర్టును కోరిన లోకేష్ లాయర్లు ► కాసేపట్లో హైకోర్టు బెంచ్ ముందుకు విచారణకు వచ్చే అవకాశం 2:00 PM, సెప్టెంబర్ 29, 2023 ఫైబర్ గ్రిడ్ కేసు గురించి పది పాయింట్లు.. తండ్రీ కొడుకులు ఏం చేశారంటే.? 1. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును 2016 డిసెంబర్ 29న తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు ప్రారంభించారు. రూ.149కే కేబుల్ ప్రసారాలు, 200 చానళ్లతో టీవీ, ఫోన్ సౌకర్యం ఇస్తామని ప్రకటించారు. 2. ఫైబర్నెట్ ప్రాజెక్టును బ్లాక్ లిస్టులో ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టారు. రూ.333 కోట్ల బిడ్డింగ్ ముగియటానికి ఒక్క రోజు ముందు టెరాసాఫ్ట్ను బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు. దీనిపై అభ్యంతరం తెలిపిన APTS వీసీ సుందర్ను బదిలీ చేశారు. టెండర్ ప్రక్రియ ముగిశాక హరికృష్ణప్రసాద్ను టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్ నుంచి డైరెక్టర్గా తొలగించారు. 3. టెరాసాఫ్ట్ సంస్థకు 14 ఏళ్లు డైరెక్టర్ ఎవరంటే హెరిటేజ్ సంస్థల్లో డైరెక్టర్గా పనిచేసిన దేవినేని సీతారామయ్య 4. బహిరంగ మార్కెట్లో అత్యంత నాణ్యమైన సెట్టాప్ బాక్స్ రూ.2,200కే దొరుకుతుండగా చంద్రబాబు సర్కారు మాత్రం రూ.4,400 చొప్పున కొనుగోలు చేసింది. వీటిని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కంపెనీలో ఉత్పత్తి చేసినట్లు వేమూరి అంగీకరించారు. 5. APSFL నుంచి టెరా సాప్ట్కి రూ.284 కోట్లు విడుదల చేశారు. అందులో రూ.117 కోట్లు ఫాస్ట్ లైన్ అనే సంస్థకి ఇచ్చారు. ఆగస్టులో టెండర్లు జరిగితే సెప్టెంబర్లో ఆ కంపెనీ ఏర్పాటైంది. నెట్వర్క్, ఎక్స్వైజెడ్, కాపీ మీడియా లాంటి షెల్ కంపెనీల ద్వారా డబ్బును బదిలీ చేశారు. ఈ డబ్బంతా హరికృష్ణప్రసాద్ కుటుంబ సభ్యులు వేమూరి అభిజ్ఞ, వేమూరి నీలిమ తదితరులకు వెళ్లినట్లు తేలింది. ఈ కంపెనీలన్నింటి చిరునామా, టెరా సాఫ్ట్వేర్ అడ్రస్ ఒక్కటే. 6. ఈ డబ్బంతా పెండ్యాల శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు రూటు అయినట్టు గుర్తించారు. దీనికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఇన్కమ్ టాక్స్ కూడా శ్రీనివాస్కు, చంద్రబాబుకు నోటీసులిచ్చింది. 7. హెరిటేజ్తో సంబంధాలున్న వేమూరి హరికృష్ణప్రసాద్కి టెరా సాఫ్ట్తో అనుబంధం ఉంది. ఈవీఎంల దొంగతనం కేసు నమోదైన వ్యక్తికి చెందిన సంస్థకు ఈ ప్రాజెక్టును ఇచ్చారు. టెండర్ల పర్యవేక్షణ కమిటీలో ఆయన్ను సభ్యుడిగా నియమించారు. ఆయనే టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్ సంస్థ డైరెక్టర్గానూ వ్యవహరిస్తున్నాడు. పర్యవేక్షణ కమిటీ సభ్యుడుగా ఉంటూ తన సొంత సంస్థ టెరా సాఫ్ట్కు పనులు ఇచ్చేసుకున్నారు. 8. ఐదేళ్లూ చంద్రబాబు వద్దే పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ఉండింది. ఆ శాఖ పరిధిలోనిదే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్. నిబంధనల మేరకు సంబంధిత శాఖను నిర్వహిస్తున్న మంత్రి మాత్రమే ఆ శాఖలోని ఫైళ్లపై సంతకం చేయాలి. ఇతర మంత్రులు సంతకం చేయకూడదు. 9. లోకేశ్ మంత్రి కాగానే హరికృష్ణ ప్రసాద్ను 2017 సెప్టెంబర్ 14న APSFLకు సలహాదారుగా నియమించారు. అప్పటి నుంచి టెండర్లలో గోల్ మాల్ పెద్ద ఎత్తున జరిగినట్టు తేలింది. లోకేశ్ వద్ద ఉన్న శాఖలకు, APSFLకు సంబంధం లేదు. అయినా తన తండ్రి శాఖలోని ఫైల్ తెప్పించుకున్న లోకేశ్.. 2017 నవంబర్ 12న బీబీఎన్ఎల్తో ఎంవోయూ ఫైల్పై సంతకం చేశారు 10. కేంద్రం అనుమతి లేకుండా అంచనా వ్యయం రూ.500 కోట్లకుపైగా పెంచేసి వేమూరి సంస్థకు ఖరారు చేశారు. BBNL మార్గదర్శకాలను తుంగలో తొక్కి.. టెండర్ షరతులను సడలించి.. నిబంధనలు ఉల్లంఘించి.. అర్హత లేని టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్కు 11.26 శాతం అధిక ధరలకు పనులు అప్పగించారు. దీనివల్ల అంచనా వ్యయం రూ.907.94 కోట్ల నుంచి రూ.1410 కోట్లకు పెరిగింది. 1:40 PM, సెప్టెంబర్ 29, 2023 లోకేష్ ఇప్పటికైనా బయటకు రావాలి : మంత్రి రోజా ► ఈ 20 రోజుల్లో లోకేష్ ముఠా నానా యాగీ చేసింది ► తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాలి ► తప్పు చేయక పోతే ముందస్తు బెయిల్కు ఎందుకు దరఖాస్తు చేస్తుకున్నారు? ► యువగళం పాదయాత్ర ఆపేసి ఢిల్లీలో ఎందుకు దాక్కున్నారు? ► ఎన్టీఆర్ కూతురు, మనవరాలిగా భువనేశ్వరి, బ్రాహ్మణిలను అభిమానిస్తాం, ► టిడిపి స్క్రిప్ట్ చదివితే మాత్రం తప్పులు ఎత్తి చూపిస్తాం ► ఎర్ర బుక్లో రాసుకున్నాము, తాట తీస్తాం అన్న లోకేష్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? 1:35PM, సెప్టెంబర్ 29, 2023 కుంభకోణం గురించి మాట్లాడరెందుకు? : సజ్జల రామకృష్ణారెడ్డి ► ఈ 20 రోజుల్లో లోకేష్ ముఠా నానా యాగీ చేసింది ► ప్రజలకు సంబంధించిన సొమ్ము దోపిడీకి గురైంది ► సాక్ష్యాధారాలతో దొరికితే చంద్రబాబును కోర్టు రిమాండ్కు పంపింది ► జరిగిన కుంభకోణంపై వీరంతా మాట్లాడడం లేదు ► దొంగతనం చేసి సానుభూతి కోరుకుంటున్నారు ► మేధావులు అనుకుంటున్న కొందరితో స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు ► చంద్రబాబు అరెస్టును దేశ సమస్యలా చిత్రీకరిస్తున్నారు ► రాష్ట్రపతికి వినతి పత్రం ఇచ్చారు, ఐక్యరాజ్యసమితికి ఇచ్చినా ఆశ్చర్యం లేదు ► మూడేళ్లు దర్యాప్తు చేశాక ఆధారాలతో అరెస్ట్ చేశారు ► స్కిల్ స్కామ్ లో పూర్తి ఆధారాలు ఉన్నాయి ► తమకు సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ స్టేట్మెంట్ ఇచ్చింది ► గంటా సుబ్బారావుకు నాలుగు పదవులిచ్చారు ► మొత్తం నాలుగు కేసుల్లో అన్ని ఆధారాలున్నాయి ► డిజైన్ టెక్ ద్వారా కోట్లు కొట్టేశారు 1:25PM, సెప్టెంబర్ 29, 2023 ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబు మరో బెయిల్ పిటిషన్ ► హైకోర్టులో మరో పిటిషన్ వేసిన చంద్రబాబు నాయుడు ► ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ ► ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టయి రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు 12:55PM, సెప్టెంబర్ 29, 2023 ఇండియా కూటమి వైపు సైకిల్ వెళ్తొందా.? బయటకొస్తున్న అసలు ఎజెండాలు ► చంద్రబాబు అరెస్ట్పై ఇప్పటివరకు తెగ ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్ ► హైదరాబాద్లో ధర్నాలను పోలీసులు నిలిపివేయడంపై టి కాంగ్రెస్ చీఫ్ రేవంత్ ఆగ్రహం ► చంద్రబాబును వెనకేసుకొస్తూ ప్రకటనలు చేస్తోన్న రేవంత్ ► గతంలో చంద్రబాబుతో కలిసి ఓటుకు కోట్లు పంపిణీ చేసి రెడ్ హండెడ్గా దొరికిన రేవంత్ ► తాజాగా చంద్రబాబు కోసం తెగ ఆరాట పడ్డ మోత్కుపల్లి ► బాబును తిట్టిన నోటితోనే ప్రశంసలు కురిపించి తెలుగుదేశం పార్టీనే ఆశ్చర్యపరిచిన మోత్కుపల్లి ► ఇవ్వాళ బెంగళూరుకు వెళ్లిన మోత్కుపల్లి నర్సింహులు ► డీకే శివకుమార్ తో భేటీ అయిన మోత్కుపల్లి నర్సింహులు ► పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అంటోన్న మోత్కుపల్లి ► డీకే శివకుమార్ డైరెక్షన్తోనే చంద్రబాబుకు మోత్కుపల్లి మద్ధతిచ్చారా? 12:45PM, సెప్టెంబర్ 29, 2023 ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో యార్లగడ్డ క్వాష్ పిటిషన్లు ► లోకేష్ యువగళం పాదయాత్రలో రెచ్చిపోయిన యార్లగడ్డ వెంకట్రావు ► తన మనుష్యులతో కలిసి వీరంగం సృష్టించినట్టు యార్లగడ్డపై అభియోగాలు ► గన్నవరం నియోజకవర్గంలోని రంగన్నగూడెం, వీరవల్లి పోలీస్ స్టేషన్లు ముట్టడి ► ఏపీ హైకోర్టును ఆశ్రయించిన యార్లగడ్డ వెంకట్రావు ► మూడు కేసుల్లో క్వాష్ పిటిషన్ వేసిన యార్లగడ్డ ► యార్లగడ్డ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నాగముత్తు 12:25PM, సెప్టెంబర్ 29, 2023 విజయవాడ వేదికగా కురుక్షేత్ర సంగ్రామ శంఖారావాన్ని పూరించిన CM వైఎస్ జగన్ ► ప్రస్తుత సంక్షేమ ప్రభుత్వానికి, గత ప్రభుత్వంలోని స్కాముల నేతలకు మధ్య యుద్ధం ► ఫైబర్ గ్రిడ్ స్కామ్, స్కిల్ స్కామ్, అసైన్డ్ భూముల స్కామ్... ► అమరావతి పేరుతో స్కాములు చేసిన గత నాయకులతో యుద్ధం ► గతంలోనూ ఇదే బడ్జెట్, మారిందల్లా సీఎం ఒక్కడే ► గతంలో ఎందుకు ఈ పథకాలు ఇవ్వలేకపోయారు? ► దోచుకోవడానికి వాళ్లకు అధికారం కావాలి ► దోచుకున్నది పంచుకునేందుకే వాళ్లకు అధికారం కావాలి ► వాళ్లకు మాదిరిగా నాకు గజదొంగల ముఠా తోడుగా లేదు ► వంత పాడేందుకు వాళ్లకున్నట్టు దత్త పుత్రుడు లేడు ► పేదవాడి ప్రభుత్వం నిలబడాలి, పెత్తందారుల ప్రభుత్వం రాకూడదు ► మీ ఇంట్లో మంచి జరిగిందనిపిస్తే నాకు తోడుగా నిలవండి ► ఈ కురుక్షేత్ర యుద్ధంలో నాకు అండగా నిలవండి ► ఓటు వేసే ముందు జరిగిన మంచి గురించి ఆలోచించండి 12:15PM, సెప్టెంబర్ 29, 2023 రాజమండ్రి జైలుకు నారాయణ, చంద్రబాబుతో ములాఖత్ ► 20 రోజులుగా జైల్లో ఉన్నా చంద్రబాబు మనో ధైర్యం కోల్పోలేదు ► ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్కు సంబంధించి లోకేష్పై కేసు పెట్టారు ► ఇన్నర్ రింగ్రోడ్లో నా సొంత భూమి పోయింది, దాని ఖరీదు ఏడు కోట్ల రూపాయలు ► జనసేనతో పొత్తుపై ఉమ్మడి కమిటీ వేస్తాం ► కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు ముందుకు వెళ్తాం ► అన్ని విషయాలు కోర్టులోనే తేలుతాయి, బాబు జైల్లో ధైర్యంగా ఉన్నారు 12:05PM, సెప్టెంబర్ 29, 2023 ఎక్కడ దాక్కున్నా తప్పుంటే అరెస్ట్ కావాల్సిందే : లోకేష్ ఛాలెంజ్కు పేర్ని నాని కౌంటర్ ► ఢిల్లీకి వచ్చి అరెస్ట్ చేసే దమ్ము CIDకి లేదా ? : లోకేష్ ఛాలెంజ్ ► ఢిల్లీ కాదు.. సప్త సముద్రాల అవతల చెట్టు తొర్రలో దాక్కున్నా తప్పు చేస్తే అరెస్ట్ కావాల్సిందే : పేర్ని నాని నారా లోకేష్ని అరెస్ట్ చేయాలంటే ఢిల్లీలోనే కాదు.. చెట్టు తొర్రలో దాక్కున్నా దర్యాప్తు అధికారులు నిమిషాల్లో అరెస్ట్ చేసి తీసుకురాగలరు. చంద్రబాబు కంటే నువ్వేమీ పోటుగాడివి కాదు కదా @naralokesh..? కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎప్పుడు ముద్దాయిని అరెస్ట్ చేయాలి? అనేది దర్యాప్తు… pic.twitter.com/dLLF8HcNj3 — YSR Congress Party (@YSRCParty) September 28, 2023 12:00PM, సెప్టెంబర్ 29, 2023 పచ్చమీడియాకు ఇంత పక్షపాతమా? : YSRCP ► ఏ కేసులోనయినా ఏ మీడియా అయినా రెండు వర్షన్లను కవర్ చేస్తారు ► కానీ స్కిల్ స్కాంలో పచ్చమీడియా నిజాలు దాచిపెడుతోంది ► మేం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తే కవర్ చేయలేదు ► టిడిపి వాళ్లు అసత్యాల ప్రజంటేషన్కు మాత్రం ఎల్లో మీడియా పట్టం కట్టింది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం గురించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రజెంటేషన్ రూపంలో క్లియర్గా ప్రభుత్వం చూపించినా.. ఎల్లో మీడియా మాత్రం ప్రసారం చేయలేదు. కేవలం టీడీపీ వాళ్లు చెప్పింది మాత్రమే ప్రజలకి చూపించారు. బాబు అరెస్ట్ తర్వాత ఎల్లో మీడియా పిచ్చి పీక్స్కి చేరిపోయింది. దీన్ని… pic.twitter.com/mimAxmJcXA — YSR Congress Party (@YSRCParty) September 28, 2023 11:40AM, సెప్టెంబర్ 29, 2023 మరో రెండు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన లోకేష్ ►హైకోర్టులో మరో రెండు పిటిషన్లు వేసిన లోకేష్ లాయర్లు ►స్కిల్ డెవలప్మెంట్ స్కాం, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో నిందితుడు లోకేష్ ►ఈ రెండు కేసుల్లో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి ►అరెస్ట్ చేస్తారు, అత్యవసరంగా విచారించండి : హైకోర్టుకు అభ్యర్థన ►మధ్యాహ్నం తర్వాత బెంచ్ ముందుకు పిటిషన్లు వచ్చే అవకాశం 11:20AM, సెప్టెంబర్ 29, 2023 లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు : హైకోర్టు : BIG BREAKING ►IRR కేసులో నారా లోకేష్కు 41ఏ కింద నోటీసులు ►దర్యాప్తుకు లోకేష్ సహకరించాల్సిందే : హైకోర్టు ►ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్కు నోటీసులు ►కేసు దర్యాప్తుకు లోకేష్ సహకరించాలన్న హైకోర్టు ►కుంభకోణంలో లోకేష్ పాత్రను స్పష్టం చేస్తూ 129 ఆధారాలు సేకరించిన సిట్ ►ముందస్తు బెయిల్ పిటిషన్కు అంగీకరించని న్యాయస్థానం ►దర్యాప్తు అధికారి FIRలో మార్పు చేశారని నివేదించిన అడ్వొకేట్ జనరల్ ►41ఏ నిబంధనలు పూర్తిగా పాటిస్తామని చెప్పిన అడ్వొకేట్ జనరల్ 11:15AM, సెప్టెంబర్ 29, 2023 ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా? ► ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్పై టిడిపికి YSRCP ఏడు ప్రశ్నలు 1. అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని ఎకరాను రూ.8 లక్షలకు విక్రయించారు, అలైన్మెంట్ తర్వాత రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చూపించారు. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లకు పైగా పెరిగింది వాస్తవం కాదా? 2. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతంగా రూ.887.50 కోట్లకు పెరిగింది వాస్తవం కాదా? 3. అమరావతి నిర్మాణం పూర్తయితే సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా విలువ రూ.4 కోట్లకు చేరుతుందని నాడు సీఎం హోదాలో చంద్రబాబే ప్రకటించింది వాస్తవం కాదా? 4. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది వాస్తవం కాదా? 5. అమరావతి నిర్మాణం పూర్తయితే ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కనున్న 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా వాస్తవం కాదా? 6. ఆ ప్రకారం మార్కెట్ ధరను బట్టి హెరిటేజ్ఫుడ్స్ 10.4 ఎకరాల మార్కెట్ విలువ రూ.5.20 కోట్ల నుంచి రూ.41.6 కోట్లకు కోట్లు పెరిగిందన్నది వాస్తవం కాదా? 7. ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు.. స్కాం జరగలేదంటారు.. మరి ఇన్నాళ్లు ప్రజలకు రాజధాని కట్టామని ఎందుకు చెప్పారు? చంద్రబాబు సృష్టించిన సంపద అంటే మాయా ప్రపంచమేనా? 11:02AM, సెప్టెంబర్ 29, 2023 41 ఏ కింద లోకేష్కు నోటీసులు: ఏజీ శ్రీరామ్ ►IRR కేసులో నారా లోకేష్కు 41ఏ కింద నోటీసులు ►కోర్టులో వెల్లడించిన అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ ►హైకోర్టులో ఏపీ సీఐడీ తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు ►నోటీసుల కాపీ హైకోర్టుకు అందజేత ► ఇన్నర్ రింగ్రోడ్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై కొనసాగుతున్న విచారణ ► లోకేష్ తరపున వాదనలు వినిపించిన దమ్మాలపాటి శ్రీనివాస్ 10:55AM, సెప్టెంబర్ 29, 2023 బటన్ నొక్కడంలో తేడాలు గమనించండి: YSRCP ► జగనన్న బటన్ నొక్కితే సంక్షేమ పథకాల రూపంలో పేద ప్రజల ఖాతాల్లో నగదు జమ ► అదే చంద్రబాబు బటన్ నొక్కితే.. ఫస్ట్ కార్పోరేట్ సంస్ధల ఖాతాల్లోకి నగదు జమ ► మళ్లీ ఆ డబ్బు షెల్ కంపెనీల ద్వారా తిరిగి బాబు జేబులోకే వెళ్తుంది. ► స్కిల్ డెవలప్మెంట్ స్కాం, ఫైబర్ గ్రిడ్ స్కాం, అమరావతి అసైన్డ్ భూమల స్కాం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కాంలో అంతర్లీనంగా జరిగింది ఇదే..! జగనన్న బటన్ నొక్కితే సంక్షేమ పథకాల రూపంలో పేద ప్రజల ఖాతాల్లో నగదు జమ అవుతుంది. కానీ.. చంద్రబాబు బటన్ నొక్కితే తొలుత కార్పోరేట్ సంస్ధల ఖాతాల్లోకి నగదు జమ అవుతుంది. మళ్లీ ఆ డబ్బు డొల్ల కంపెనీల ద్వారా తిరిగి బాబు జేబులోకే వెళ్తుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం, ఫైబర్ గ్రిడ్ స్కాం,… pic.twitter.com/mQ8rlC4JfQ — YSR Congress Party (@YSRCParty) September 29, 2023 10:50AM, సెప్టెంబర్ 29, 2023 IRR కేసులో లోకేష్ పిటిషన్పై విచారణ ప్రారంభం ►ఏపీ హైకోర్టులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ప్రారంభం ►లోక్ష్ తరపున వాదనలు వినిపిస్తున్న దమ్మాలపాటి శ్రీనివాస్ ► ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ14గా ఉన్న నారా లోకేష్ ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణంతో లబ్ధి పొందినట్లు ఏపీ సీఐడీ అభియోగం 10:04AM, సెప్టెంబర్ 29, 2023 కుటుంబ సభ్యుల ములాఖత్ నేడు! ►నేడు చంద్రబాబుతో ములాఖత్ కానున్న కుటుంబసభ్యులు ►రాజమండ్రి జైలులో ఉ.11 గం.కు చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్ ► సతీమణ భువనేశ్వరి, కోడలు బ్రహ్మణితో పాటు మాజీ మంత్రి నారాయణ కూడా 08:58AM, సెప్టెంబర్ 29, 2023 విధుల్లో చేరిన జైలు సూపరిండెంట్ ►రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిండెంట్ విధుల్లో చేరిన రాహుల్ ►కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో భార్య మృతి చెందడంతో విధులకు దూరంగా ఉన్న సూపరిండెంట్ రాహుల్ ►జైలు సూపరిండెండెంట్ భార్య అనారోగ్య కారణాలతో సెలవు పెడితే విపరీతార్థాలు తీసిన పచ్చ మీడియా ►పచ్చ మీడియా తీరుపై వెల్లు వెత్తిన విమర్శలు 08:45AM, సెప్టెంబర్ 29, 2023 సుప్రీంలో బాబుకు మరో దెబ్బ! ►సుప్రీం కోర్టులో చంద్రబాబు SLP లిస్టింగ్కే మరింత ఆలస్యం ►అక్టోబర్ 3 కాదు.. 6? ►ఇంతకు ముందు స్పెషల్ లీవ్ పిటిషన్ అక్టోబరు 3కి వాయిదా ►కానీ, అక్టోబర్ 6వ తేదీ.. అదీ లిస్టింగ్కు వచ్చే ఛాన్స్ ► అంటే ఆరోజు.. పిటిషన్ను విచారణకు స్వీకరిస్తారా? అని చెప్పే ఛాన్స్ ► ఒకవేళ విచారణ చేపడితే.. ఏ రోజు విచారణ చేపడతారో ప్రకటిస్తుంది బెంచ్ ►సుప్రీం కోర్టు వెబ్సైట్లో ఈ మేరకు కంప్యూటర్ జనరేటెడ్ ధృవీకరణ 08:33AM, సెప్టెంబర్ 29, 2023 శతవిధాల ప్రయత్నాలు ►చంద్రబాబు బెయిల్ కోసం విస్తృతమైన ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ వర్గాలు ►లోకేష్ అరెస్టు అవుతాడని రాజమండ్రిలో వదంతులు ►అరెస్టు అవుతాడనే కారణం తోనే ఢిల్లీ నుంచి రాకుండా జాప్యం చేస్తున్నారంటూ వార్తలు ►ఇవాళ నుంచి ప్రారంభం కావలసిన యువగళం వాయిదా ►సుప్రీంకోర్టులో క్వాష్ ఫలితం తేలిన తర్వాతే రాజమండ్రి కి రానున్న లోకేష్ ►రాజమండ్రి టిడిపి శిబిరంలో నారా బ్రాహ్మణి భువనేశ్వరుని ముందు పెట్టుకుని కార్యక్రమాలు కొనసాగిస్తున్న టీడీపీ శ్రేణులు ►‘‘బాబుతో మేము’’, ‘‘పోస్ట్ కార్డు ఉద్యమం’’ తో పాటు రిలే నిరాహార దీక్షలు ,దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు ►ప్రజల నుంచే కాదు.. టీడీపీ కార్యకర్తల నుంచి కూడా కనిపించని స్పందన 07:10AM, సెప్టెంబర్ 29, 2023 లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ►ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ►నేడు హైకోర్టులో వాదనలు జరిగే అవకాశం ►అమరావతి ఇన్నర్ రింగ్రోడ్ కేసులో ఏ14గా లోకేష్ పేరు చేర్చిన ఏపీ సీఐడీ ► అరెస్ట్ భయంతో.. ఢిల్లీ నుంచే యాంటిసిపేటరీ బెయిల్కు దరఖాస్తు ► బెయిల్ వస్తేనే యువగళం పాదయాత్ర.. లేకుంటే మరిన్ని రోజులు ఢిల్లీలోనే 07:05AM, సెప్టెంబర్ 29, 2023 చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు విచారణ ►చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ► మధ్యాహ్నం 2.15కి ప్రారంభంకానున్న విచారణ ►ఇప్పటికే వాదనలు పూర్తి చేసిన చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా ►మరోసారి వాదనలు వినిపించనున్న ఏజీ ►చంద్రబాబు కేసులు..బెయిల్ పిటిషన్లతో టీడీపీ(TDP) శ్రేణుల్లో టెన్షన్ పెరుగుతోంది. 07:00AM, సెప్టెంబర్ 29, 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @20 ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ►ఏసీబీ కోర్టు విధించిన జ్యూడీషియల్ రిమాండ్ 20వ రోజుకి చేరిక ► సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో అదుపులోకి తీసుకుంది ఏపీ సీఐడీ ► ఏసీబీ కోర్టు రిమాండ్తో ఖైదీ నెంబర్ 7691గా రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహా బ్లాక్లో చంద్రబాబు ► అక్టోబర్ 5వ తేదీ వరకు జైల్లోనే చంద్రబాబు -
నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసు విచారణ
-
చంద్రబాబుకు మరో షాక్.. బెయిల్ కు బ్రేక్..
-
చంద్రబాబును మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలి: సీఐడీ
-
చంద్రబాబు పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా
-
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. బాబు బెయిల్ పిటిషన్పై విచారణ 26కి వాయిదా
సాక్షి, అమరావతి: అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ డిజైన్ల ముసుగులో సాగిన భూ దోపిడీపై సీఐడీ 2022 లో నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్లో తదుపరి విచారణ ఈ నెల 26కి వాయిదా పడింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై జస్టిస్ సురేష్రెడ్డి విచారణ జరిపారు. చంద్రబాబు తరఫు న్యాయవాది ఎస్.ప్రణతి స్పందిస్తూ.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్ కోసం సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టు ఈరోజే (గురువారం) విచారణ జరపనుందని, అందువల్ల ఈ బెయిల్ పిటిషన్పై విచారణను సోమవారానికి వాయిదా వేయాలని కోర్టును కోరారు. సీఐడీ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యడవల్లి నాగ వివేకానంద స్పందిస్తూ.. పీటీ వారెంట్తో పాటు చంద్రబాబును కస్టడీకి అప్పగించాలంటూ కూడా పిటిషన్ వేశామని చెప్పారు. ఏసీబీ కోర్టులో ఉన్న వ్యాజ్యాల విచారణకు హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ అడ్డంకి కాదని ఉత్తర్వుల్లో నమోదు చేయాలని కోర్టును కోరారు. విచారణను వాయిదా వేయడానికి అభ్యంతరం లేదన్నారు. సీఐడీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ జోక్యం చేసుకుంటూ.. సోమవారం తాను ఇతర కేసుల్లో వాదనలు వినిపించాల్సి ఉన్నందువల్ల విచారణను బుధవారానికి వాయిదా వేయాలని కోరారు. ఇరుపక్షాల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి మధ్యే మార్గంగా విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. ఆరోజు మద్యాహ్నం 2.15 గంటలకు విచారణ జరుపుతానని చెప్పారు. ఈ బెయిల్ పిటిషన్ ప్రభావానికి లోను కాకుండా ఏసీబీ కోర్టు తన ముందు వ్యాజ్యాల్లో విచారణను కొనసాగించవచ్చునని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో తేల్చి చెప్పారు. -
బెయిల్ మంజూరు చేయాలని బాబు హైకోర్టులో పిటీషన్
-
బాబు బెయిల్ పిటిషన్లో కౌంటర్ వేయండి
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వేసిన పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. ఆ పిటిషన్కు విచారణార్హతే లేదు : సీఐడీ పీపీ చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై శుక్రవారం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీఐడీ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వైఎన్ వివేకానంద వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతున్నారని తెలిపారు. ఈ మేర ఆయన దాఖలు చేసిన పిటిషన్కు అసలు విచారణార్హతే లేదన్నారు. సీఆర్సీపీ సెక్షన్ 437, సెక్షన్ 439 కింద బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని.. అయితే, ఈ సెక్షన్ల కింద మధ్యంతర బెయిల్ ఇవ్వడమన్న ప్రశ్నే తలెత్తదన్నారు. ఈ సెక్షన్లలో ఎక్కడా కూడా మధ్యంతర బెయిల్ ప్రస్తావనేలేదని ఆయన తెలిపారు. మధ్యంతర బెయిల్ తమ హక్కు అన్నట్లు చంద్రబాబు న్యాయవాదులు వాదిస్తున్నారని.. ఇప్పటికే అరెస్టయి జైలులో ఉన్న వ్యక్తి మధ్యంతర బెయిల్ ఇవ్వడం ఎంతమాత్రం సరికాదన్నారు. తాము ఇప్పటికే పోలీసు కస్టడీ పిటిషన్ దాఖలు చేశామని, అందులో కౌంటర్లు దాఖలు చేయాలని ఈ కోర్టు ఆదేశించినా చంద్రబాబు న్యాయవాదులు దాఖలు చేయలేదని వివేకానంద కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పైపెచ్చు హైకోర్టును ఆశ్రయించి, ఈ కోర్టు (ఏసీబీ కోర్టు) కౌంటర్ కోసం ఒత్తిడి చేస్తోందన్నట్లు హైకోర్టుకు చెప్పి, పోలీసు కస్టడీ పిటిషన్లో ఈ కోర్టు (ఏసీబీ కోర్టు)ను ముందుకెళ్లకుండా నియంత్రిస్తూ ఉత్తర్వులు తెచ్చారని తెలిపారు. వాస్తవానికి పోలీసు కస్టడీ పిటిషన్లో తామే కౌంటర్ కోసం ఒత్తిడి చేశామే తప్ప, ఈ కోర్టు ఎవరినీ ఒత్తిడి చేయలేదన్నారు. హైకోర్టు ఉత్తర్వులతో తమ పోలీసు కస్టడీ పిటిషన్ను ఏసీబీ కోర్టు విచారించలేని పరిస్థితిలో ఉండటంతో, దానిని అడ్డంపెట్టుకుని బెయిల్ కోసం పిటిషన్ వేసి మధ్యంతర బెయిల్ కోరుతున్నారని వివేకానంద తెలిపారు. వాస్తవాలను కోర్టు ముందుంచాలన్న ఉద్దేశంతోనే ఇవన్నీ చెబుతున్నామన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని విచారణను వాయిదా వేయాలని వివేకానంద కోరారు. మధ్యంతర బెయిల్పై విచారణ సబబేనా? అనంతరం.. చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, ప్రధాన బెయిల్ కౌంటర్ దాఖలు చేసి, వాదనలు విని దాన్నితేల్చేలోపు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ సమయంలో న్యాయస్థానం స్పందిస్తూ.. సీఐడీ కేసు కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, ఇదే సమయంలో చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ తమ ముందు పెండింగ్లో ఉందని, ఈ పరిస్థితుల్లో బెయిల్పై విచారణ జరపడంపై స్పష్టత కావాలని తేల్చిచెప్పింది. పోలీసు కస్టడీ పిటిషన్లో ముందుకెళ్లకుండా హైకోర్టు ఉత్తర్వులున్నాయని గుర్తుచేసింది. అందువల్ల ఈ దశలో మధ్యంతర బెయిల్పై వాదనలు వినడం సబబా? కాదా? అన్న సందేహం కలుగుతోందని ఏసీబీ తెలిపింది. కానీ, మధ్యంతర బెయిల్పై నిర్ణయం తీసుకునే విచక్షణాధికారం ఏసీబీ కోర్టుకుందని దమ్మాలపాటి తెలిపారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాం కాబట్టి, మధ్యంతర బెయిల్పై కింది కోర్టు విచారణ జరపకూడదన్న నిషేధం ఏదీలేదన్నారు. న్యాయస్థానం స్పందిస్తూ.. మంగళవారం హైకోర్టులో విచారణ జరుగుతున్నందున, క్వాష్ పిటిషన్లో విచారణ తరువాత హైకోర్టులో వచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఈ బెయిల్పై తదుపరి విచారణ జరుపుతామని స్పష్టంచేస్తూ విచారణను 19కి వాయిదా వేసింది. -
చంద్రబాబు మధ్యంతర బెయిల్పై ఏసీబీ కోర్టులో విచారణ
-
Live: చంద్రబాబు కేసు అప్డేట్స్.. Click & Refresh
Khaidi No 7691.. LIVE UPDATES 7:15 PM, సెప్టెంబర్ 15, 2023 రేపు జనసేన విస్తృతస్థాయి సమావేశం ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుతో ఏం మాట్లాడారు? ►జైలు బ్రీఫింగ్ను జనసేన కార్యవర్గానికి వివరించనున్న పవన్ కళ్యాణ్ ►చంద్రబాబు సూచనలు, పొత్తు అంశాలపై సుదీర్ఘ ప్రజంటేషన్కు రెడీ ►పొత్తు వల్ల ఎక్కడెక్కడ రాజీ పడాలో వివరించనున్న పవన్ కళ్యాణ్ ►మీరనుకున్నట్టు అందరికీ టికెట్లు ఇవ్వలేనని చెప్పనున్న పవన్ ►పొత్తులో టిడిపి ఎన్ని టికెట్లు ఇస్తే.. అక్కడ మాత్రమే జనసేన పోటీ ►ఏ ఏ స్థానాలన్నది ఉమ్మడి కార్యాచరణలో నిర్ణయించుకోనున్న పార్టీలు ►30 స్థానాలకు జనసేన పరిమితం అని రాజకీయవర్గాల్లో ప్రచారం ►ఇప్పటివరకు ఆశలు పెట్టుకుని నియోజకవర్గాల్లో తిరిగిన కొందరు ►తాజా పొత్తు నిర్ణయంతో ఖర్చు పెట్టుకున్న వారికి తీవ్ర నిరాశ ►రేపు మధ్యాహ్నం మంగళగిరిలో జనసేన విస్తృతస్థాయి సమావేశం ►టీడీపీతో కలిసి వెళ్లాల్సిందే, రాజీ పడదామని చెప్పనున్న పవన్ 7:10 PM, సెప్టెంబర్ 15, 2023 జైల్లో చంద్రబాబు.. ఏ ఏ సౌకర్యాలు ఉన్నాయంటే.? ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు అన్ని సౌకర్యాలు ► స్పెషల్ మెడికల్ టీం ను నియమించిన ప్రభుత్వం ►అత్యవసర ఔషధాలు ఓ పాజిటివ్ బ్లడ్, అంబులెన్స్ రెడీ ►అన్ని వేళల్లో సన్నద్ధంగా పదిమంది వైద్య నిపుణుల బృందం ►చంద్రబాబు ఆరోగ్య భద్రతకు సంబంధించి సకల ఏర్పాట్లు ►టీవీ, న్యూస్ పేపర్లు, ఇంటి భోజనం, వేడి నీళ్లు ఏర్పాటు 6:55 PM, సెప్టెంబర్ 15, 2023 సెలవుపై రాజకీయమా? ► రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవుపై జైళ్లశాఖ ప్రకటన ► రాహుల్ భార్య కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఉన్నారు ► రాహుల్ భార్య నిన్న ఉదయం ఆస్పత్రిలో చేరారు ►ఆస్పత్రిలో ఉన్న భార్యను చూసుకునేందుకు రాహుల్ సెలవు పెట్టారు ►4 రోజుల సెలవు అభ్యర్థనను జైళ్ల శాఖ అంగీకరించింది ►దీనిపైనా కొన్ని మీడియాలు రాజకీయం చేయడం అర్థరహితం 6:40 PM, సెప్టెంబర్ 15, 2023 కింకర్తవ్యం ? : లోకేష్ @ ఢిల్లీ ►మరో రెండు రోజులూ ఢిల్లీలోనే ఉండనున్న నారా లోకేష్ ►ఇవ్వాళ అంతగా సక్సెస్ కాని అపాయింట్మెంట్లు ►చంద్రబాబు అరెస్ట్పై జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టేందుకు విశ్వ ప్రయత్నాలు ►పలువురు పార్టీల నేతలను కలవాలని ప్రయత్నాలు ►అపాయింట్మెంట్ల విషయంలో కలిసిరాని పరిచయాలు ►మొత్తం టిడిపి నేతలను, మద్ధతుదారులను ఉపయోగిస్తున్న లోకేష్ ►రేపు సుప్రీంకోర్టు న్యాయవాదులతో సమావేశమయ్యే ఛాన్స్ 5:24PM, సెప్టెంబర్ 15, 2023 వారంలో మూడో ములాఖత్ కుదరదు: జైళ్ల ఉప శాఖాధికారి, కోస్తా ఆంధ్ర ప్రాంతం, రాజమండ్రి ►నారా భువనేశ్వరి ములాఖత్ పై జైళ్ల శాఖ స్పష్టత ►వారంలో మూడో ములాఖత్ నిబంధనలు రీత్యా సాధ్యం కాదు ►అందుకే ఈరోజు నారా భువనేశ్వరి ములాఖత్ దరఖాస్తు తిరస్కరించాం ►ఈ వారం లో రిమాండ్ ఖైదీ నెంబర్ 7691 కి రెండు ములాఖత్ లు పూర్తయ్యాయి ►ఈ నెల 12 న నారా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి లకు ములాఖత్ ఇచ్చాం ►ఈ నెల 14 న పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ లు ములాఖత్ అయ్యారు ►అత్యవసర పరిస్థితులు ఉంటేనే వారంలో మూడో ములాఖత్కు అవకాశం ►ప్రస్తుతం రిమాండ్ ఖైదీ చంద్రబాబుకి అలాంటి అత్యవసర కారణాలు లేవు ►అందుకే నారా భూబనేశ్వరి ములాఖత్ దరఖాస్తు ని తిరస్కరించాం 4:50 PM, సెప్టెంబర్ 15, 2023 కింకర్తవ్యం ? : లోకేష్ @ ఢిల్లీ ►ఉదయం నుంచి బీజేపీ నేతల అపాయింట్మెంట్ల కోసం ప్రయత్నం ►బీజేపీ నుంచి రాని స్పందన, బీజేపీలో ఉన్న టిడిపి నేతలతో లాబీయింగ్ ►చంద్రబాబు కేసులపై పలువురు సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చలు ►రఘురామ కృష్ణరాజుతో సుదీర్ఘ మంతనాలు ►రేపు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనున్న లోకేష్ 4:30 PM, సెప్టెంబర్ 15, 2023 టీడీపీ, జనసేన పొత్తు ప్రకటనపై సజ్జల కౌంటర్ ►రాజకీయాల్లో చంద్రబాబుకు పవన్ కల్యాణ్ డూప్ ►ఇంతకాలం విడివిడిగా ఉన్నట్లు నటించారు ►బీజేపీని తీసుకొచ్చే బాధ్యత పవన్కు బాబు అప్పగించారమో ►ఏపీలో అధికార పార్టీకి ఈసారి పాజిటివ్ ఓటు ఉంది ►ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం 4:15 PM, సెప్టెంబర్ 15, 2023 నారాయణ పిటిషన్ 25కు వాయిదా ►నారాయణ క్వాష్, ముందస్తు బెయిల్ పిటిషన్ల పై విచారణ 25కి వాయిదా ►అసైన్డ్ భూముల స్కాంలో సీఐడీ నమోదు చేసిన 2 కేసులు క్వాష్ చేయాలని పిటిషన్ ►ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసిన మాజీ మంత్రి నారాయణ ► నారాయణతో పాటు ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన అంజనీకుమార్ ►విచారణను ఈ నెల 25కి వాయిదా వేసిన కోర్టు 3:15 PM, సెప్టెంబర్ 15, 2023 తాడేపల్లిగూడెం: ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ►జైలుకు వెళ్లి సాష్టాంగ నమస్కారంతో పవన్ కళ్యాణ్ ప్యాకేజీ మాట్లాడుకున్నాడు ►పవన్ కళ్యాణ్ ఇంతకాలం పెళ్లి ఒకరితో సంసారం ఒకరితో అన్నట్లుగా ఉన్నాడు ►పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉండి సేవ చేయాలనుకున్న జనసైనికులు చంద్రబాబుకి సేవ చేయండని చెప్పగానే సగం మంది నీకు నీ పార్టీకి దండం అని జారిపోయారు ►జనసేనతో టీడీపీ కలవడం వల్ల చాలామంది తెలుగుదేశం పార్టీ నుండి బయటకు పోయేందుకు రెడీగా ఉన్నారు 1:15 PM, సెప్టెంబర్ 15, 2023 వివేకానంద, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, CID, సుదర్శన్ రెడ్డి, డైరక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ►చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లకు విచారణ అర్హత లేదు ►రెండు బెయిల్ పిటిషన్లలో ఒకే సెక్షన్ల ద్వారా అప్లై చేశారు ►ఈ రెండు పిటిషన్లలో బెయిల్ కోసం నిర్ణీత కారణం చెప్పలేదు ►హైకోర్టులో సీఐడీ కస్టడీ పిటిషన్పై స్టే ఉండగా మళ్లీ ఇక్కడ బెయిల్ వేయటం విరుద్ధం ►నిందితుడి కుటుంబ సభ్యులకు ఏమైనా జరిగితేనే మధ్యంతర బెయిల్ అడుగుతారు ►మధ్యంతర బెయిల్ కూడా 24 లేదా 48గంటలు ఇస్తారు ►హైకోర్టులో వేసిన పిటిషన్ నే ఇక్కడ వేశారు ►నిందితుడు ఇప్పటికే రిమాండ్ లో ఉన్నారు ►ఇప్పుడు చెప్తున్న సెక్యూరిటీ రీజన్స్ రిమాండ్ టైంలోనే చెప్పారు ►కౌంటర్ దాఖలు చేయటానికి మంగళవారం వరకూ సమయం ఇచ్చారు ►కోర్టు ఏం చెప్తుందో 19వ తేదీ వరకూ వేచి చూడాలి 12:10PM, సెప్టెంబర్ 15, 2023 చంద్రబాబు పిటిషన్లపై విచారణ వాయిదా ►చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా ►ఈ పిటిషన్ విచారణ సైతం 19వ తేదీకే వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన కోర్టు ►హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉండటాన్ని ప్రస్తావించిన న్యాయమూర్తి ►కస్డడీ పిటిషన్ ఏసీబీ కోర్టులో పెండింగ్ లో ఉందన్న న్యాయమూర్తి ►బెయిల్ పిటిషన్ నూ ఈనెల 19నే విచారిస్తామన్న న్యాయమూర్తి ►మధ్యంతర బెయిల్, బెయిల్ పిటిషన్లు రెండూ వాయిదా 12:00PM, సెప్టెంబర్ 15, 2023 మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా ► స్కిల్ స్కాం కేసులో ఏ1 చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా ►విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు 11:30 AM, సెప్టెంబర్ 15, 2023 బెయిల్ పిటిషన్ @ ACB కోర్టు, విజయవాడ ► చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ ► బెయిల్ పై వాదనలు వినాలన్న చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ ► కౌంటర్ దాఖలుకు సమయం కోరిన సీఐడీ తరపు న్యాయవాది 11:00 AM, సెప్టెంబర్ 15, 2023 బెయిల్ పిటిషన్ @ ACB కోర్టు, విజయవాడ ► చంద్రబాబుకు ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్ ► బెయిల్ పిటిషన్పై కాసేపట్లో విచారణ ► స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి ఈ బెయిల్ పిటిషన్ ► ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసిన న్యాయవాది సుబ్బారావు ► బాబు బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని CIDకి కోర్టు సూచన 10:30 AM, సెప్టెంబర్ 15, 2023 డామిట్.. కథ అడ్డం తిరిగిందా.? ► రాజమండ్రి సెంట్రల్ జైలు లోపల మాట్లాడింది వేరు, బయట జరిగింది వేరు ► ఇంకొన్నాళ్లు దొంగాట ఆడుకుందామని పవన్కు బాబు సూచించినట్టు సమాచారం ► ఇప్పుడే పొత్తు ప్రకటిస్తే బీజేపీకి కోపం వస్తుందని చెప్పిన చంద్రబాబు ► లోపల ఓకే చెప్పి బయట ప్లేటు ఫిరాయించిన పవన్ కళ్యాణ్ ► జైలు బయట ప్రెస్ మీట్లో ఫ్లోలో అసలు విషయం చెప్పేసిన పవన్ ► ఒక వైపు లోకేష్, మరో వైపు బాలయ్యను పెట్టుకుని పవన్ పొత్తు ప్రకటన ► పవన్ నోట పొత్తు వినగానే షాక్కు గురయిన బాలయ్య, లోకేష్ ► పవన్ మాట్లాడిన తర్వాత ఏం చేయాలో పాలుపోక బాలయ్య, లోకేష్ మౌనం ► ఇప్పటికిప్పుడు గట్టిగా గెలిచే స్థానాలు 20 కూడా లేకపోవడంతో కంగారు ► డ్యామేజీ కంట్రోల్ కోసం హడావిడి ప్రయత్నాలు మొదలెట్టిన లోకేష్, బాలయ్య ► సాయంత్రం తర్వాత ఢిల్లీ ప్లాన్ తెర మీదికి ► లోకేష్ ఢిల్లీ టూరు లక్ష్యం ఒకటే : ఎలాగైనా బీజేపీ నేతల అపాయింట్మెంట్ 09:30AM, సెప్టెంబర్ 15, 2023 విశ్వసనీయతకు యూటర్న్కు మధ్య యుద్ధం ► జైలు ముందు పొత్తు ప్రకటన చేసిన పవన్, లోకేష్ ► పవన్, లోకేష్ తీరు తప్పుబట్టిన విజయసాయిరెడ్డి ► ఈ యుద్ధం వైఎస్సార్సిపి x టిడిపి, జనసేన.... ► సింగిల్గా వచ్చే సింహాం x నక్కల గుంపు ► ప్రజా సంక్షేమం x అధికార దాహం ► విశ్వసనీయత x యూటర్న్ రాజకీయాలు ► స్థిరమైన పాలన x అస్థిరమైన నాయకత్వం ► నీతి నిజాయతీ x అవకాశవాదం ► సమైక్యత x కుల రాజకీయం The 2024 AP elections is going to be between TDP vs. YSRCP respectively which can be compared as a pack of wolves versus a lion, greed for power vs. public welfare, U-turn politics vs. credibility, instability vs. stability, opportunism vs. honesty, caste politics vs. unity,… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 15, 2023 09:15AM, సెప్టెంబర్ 15, 2023 ఢిల్లీలో నారా లోకేష్ బిజీ బిజీ ► ఢిల్లీ పర్యటనలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ► చంద్రబాబు అరెస్ట్ గురించి జాతీయ మీడియాలో వార్తలు వచ్చేలా లాబీయింగ్ ► పలువురు సుప్రీంకోర్టు న్యాయవాదుల అపాయింట్మెంట్లు అడిగిన టీడీపీ టీం ► కక్ష రాజకీయంగా కలరింగ్ ఇచ్చేందుకు ఢిల్లీలో లోకేష్ మంతనాలు ► పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహణ ► లోక్సభలో బాబు అరెస్ట్పై చర్చ కోసం పట్టుబట్టాలని ఎంపీలకు హితబోధ 09:29AM, సెప్టెంబర్ 15, 2023 పొత్తు ప్రకటన చెప్పేశా.. ఇక ఏం చేద్దాం! ► రాజమండ్రి సెంట్రల్ జైలు బయట శుక్రవారం టీడీపీ పొత్తు ప్రకటన చేసిన పవన్ ► పవన్ ప్రకటనపై పార్టీలో ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు శనివారం(రేపు) జనసేన విస్తృత స్థాయి సమావేశం ► నెక్ట్స్ ఏంటన్న దానిపైనా భేటీలో చర్చించే అవకాశాలు ► మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ అధ్యక్షతన భేటీ ► పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుల దగ్గరి నుంచి సంయుక్త కార్యదర్శుల దాకా అంతా హజరయ్యే ఛాన్స్ ► ఇప్పటివరకు టికెట్ ఆశ చూపెట్టి ఇప్పుడు పొత్తు అంటే ఎలా అని జనసేన కార్యవర్గం అసంతృప్తి 09:21AM, సెప్టెంబర్ 15, 2023 చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై వాదనలు ఆలస్యం? ►ఏసీబీ కోర్టులో బాబు తరపున రెండు పిటిషన్లు దాఖలు ►స్కిల్ స్కాం కేసులో బెయిల్, మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిసషన్లు ►బెయిల్పై ఇప్పటికే సీఐడీకి కోర్టు నోటీసులు ►పూర్తి వివరాలు ఉంచేందుకు సమయం కోరనున్న సీఐడీ ►పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసిన తర్వాతే.. ఇరువైపులా వాదనలు మొదలయ్యే అవకాశం 08:00AM, సెప్టెంబర్ 15, 2023 జైలులో చంద్రబాబు @6వరోజు ► రాజమండ్రి సెంట్రల్ జైలు సమీపంలోనే చంద్రబాబు భార్య భువనేశ్వరి బస ► ఈ వారం ముగిసిన చంద్రబాబు ములాఖత్లు 06:44am, సెప్టెంబర్ 15, 2023 చంద్రబాబు పిటిషన్లపై సీఐడీ కౌంటర్ ►చంద్రబాబు పిటిషన్లపై నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ కౌంటర్ ►బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లు వేసిన చంద్రబాబు లాయర్లు ► ఏసీబీ కోర్టులో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయనున్న సీఐడీ తరపు న్యాయవాదులు 5:15am, సెప్టెంబర్ 15, 2023 చంద్రబాబు అరెస్టుపై ఢిల్లీకి లోకేష్ ►చంద్రబాబు అరెస్టుకు విస్తృత ప్రచారం చేయాలని ఢిల్లీకి లోకేష్ ►నిన్న రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరిక లోకేష్ ►లోకేష్ కోసం జాతీయ పార్టీల నేతల అపాయింట్మెంట్ ప్రయత్నం చేస్తున్న టీడీపీ లీడర్ లు ► నిన్న చంద్రబాబుతో పవన్ ములాఖత్ తర్వాతనే ఈ నిర్ణయం 5:05am, సెప్టెంబర్ 15, 2023 మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ ► రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో తనపై పెట్టిన 2 కేసులు కొట్టివేయాలని పిటిషన్ ►విచారణ ను ఈ నెల 25 కు వాయిదా వేసిన న్యాయస్థానం ►మధ్యంతర ఉత్తర్వులు పొడిగించిన న్యాయస్థానం 5:00am, సెప్టెంబర్ 15, 2023 చంద్రబాబుకు బెయిల్ కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ ►విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ వేసిన న్యాయవాది సుబ్బారావు ►పిటిషన్ ను విచారణకు స్వీకరించిన విజయవాడ ఏసీబీ కోర్టు ►పిటిషన్ పై నేడు విచారణ చేపట్టనున్న ఏసీబీ కోర్టు. -
బెయిల్ పిటిషన్ ఎలా వేస్తారు?
-
అంగుళ్లు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
-
శవ రాజకీయాల కోసమే టీడీపీ విధ్వంసకాండ
మదనపల్లె: పోలీసులను రెచ్చగొట్టి, కాల్పులకు ప్రేరేపించి, ఆ కాల్పుల్లో పదుల సంఖ్యలో అమాయక టీడీపీ కార్యకర్తలు చనిపోతే వారి శవాలతో కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పరేడ్ నిర్వహించి రాజకీయంగా లబ్ధి పొందే వ్యూహంతోనే అంగళ్లు, పుంగనూరుల్లో టీడీపీ నాయకులు విధ్వంసకాండకు పాల్పడ్డారని అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి చెప్పారు. అంగళ్లు, పుంగనూరు విధ్వంసకాండలో అరెస్టయిన 120 మంది టీడీపీ నాయకుల బెయిల్ పిటిషన్లపై గురువారం మదనపల్లె రెండో ఏడీజే కోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏఏజీ సుధాకర్రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్రెడ్డి, ఏపీపీలు రామకృష్ణ, జనార్ధనరెడ్డి, చంద్రకుమార్రెడ్డి వాదనలు వినిపించారు. ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు వాదనలు కొనసాగాయి. పుంగనూరు, అంగళ్లులో విధ్వంసాన్ని, టీడీపీ అధినేత చంద్రబాబు పిచ్చలవాండ్లపల్లె ప్రాజెక్టు ఆయకట్టు రైతులపైకి టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టిన వీడియోలను న్యాయమూర్తి అబ్రహాంకు ఏఏజీ సుధాకర్రెడ్డి చూపించారు. ఆగస్టు 4న చంద్రబాబు ములకలచెరువు హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ను పరిశీలించి అంగళ్లు, మదనపల్లె, పుంగనూరు బైపాస్ మీదుగా చిత్తూరు వెళ్లేందుకు డీజీపీ నుంచి అనుమతి తీసుకున్నారన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గం పిచ్చలవాండ్లపల్లె ప్రాజెక్టు నిర్మాణంపై చంద్రబాబు ఎన్జీటీ కోర్టులో స్టే తేవడంపై నిరసన తెలిపేందుకు ఆయకట్టు రైతులు నల్లబ్యాడ్జీలు ధరించి అంగళ్లుకు రాగా, వారిని చూసిన చంద్రబాబు ‘కొట్టండి.. చంపండంటూ’ టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టినందుకే అల్లర్లు చెలరేగాయన్నారు. అంగళ్లులో మొదలైన విధ్వంసకాండ 30 కిలోమీటర్ల మేర కొనసాగి పుంగనూరులో పరాకాష్టకు చేరిందన్నారు. పుంగనూరు టీడీపీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి 5,000 మంది కార్యకర్తలతో చంద్రబాబును పట్టణంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని చెప్పారు. బాబు పర్యటనలో పట్టణం లేదని, బైపాస్ వరకే ఉందని పోలీసులు అడ్డుకొన్నారని, వెంటనే టీడీపీ శ్రేణులు విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై విచక్షణారహితంగా దాడిచేసి, విధ్వంసం సృష్టించారన్నారు. ఈ ఘటనలో 47 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని, మహిళా ఎస్ఐ కాలు విరిగిందని, ఓ కానిస్టేబుల్ కన్ను కోల్పోయారని తెలిపారు. ఎస్పీలు రిశాంత్రెడ్డి, గంగాధరరావు సంయమనం పాటించి కాల్పులు జరపకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. కాల్పులు జరిగి కార్యకర్తలు చనిపోతే శవ రాజకీయాలు చేసి, శాంతిభద్రతలు క్షీణించాయంటూ రాష్ట్రపతి పాలన కోరాలన్నదే టీడీపీ నేతల వ్యూహమని చెప్పారు. ఇందులో ప్రైవేటు వ్యక్తులు సాక్షులుగా ఉన్నారని, అరెస్ట్ చేయాల్సిన వారు ఇంకా పరారీలో ఉన్న కారణంగా బెయిల్ ఇస్తే కేసును ప్రభావితం చేస్తారని, సమాజంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని చెప్పారు. పోలీసులపై దాడులు చేసి చట్టంలోని సెక్షన్ 438 ద్వారా బెయిల్ తీసుకోవచ్చనే ధైర్యం నిందితులకు ఉందన్నారు. బెయిల్ మంజూరు చేస్తే చట్టం ఏమీ చేయలేదనే సందేశం సమాజంలోకి వెళ్లి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ప్రభుత్వం తరపున కాకుండా ఓ సాధారణ పౌరుడిగా సమాజశ్రేయస్సు, భద్రతను కాంక్షించి బెయిల్ నిరాకరించాల్సిందిగా కోరామన్నారు. నిందితుల తరపున హైకోర్టు న్యాయవాదులు హరిబాబు, కోటేశ్వరరావు తదితరులు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును సోమవారానికి వాయిదా వేశారు. బాబు అధికారంలోకి రావాలనే ఈ కుట్రంతా అనంతరం డీఎస్పీ కార్యాలయంలో ఏఏజీ సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చి అధికారంలోకి రావాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. గతంలో ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తి సమాజంలో అల్లకల్లోలం సృష్టించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, క్షీణించాయని ఎలా ఫిర్యాదు చేస్తారని ప్రశ్నించారు. ప్రజలను భయò³ట్టి అధికారంలోకి వచ్చిన దాఖలాలు ఎక్కడా లేవన్నారు. చట్టం ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి సమాజాన్ని నెట్టవద్దని అన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ కేశప్ప, సీఐలు సత్యనారాయణ, శివాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్...సీబీఐ న్యాయవాదికి హైకోర్టు సూటి ప్రశ్నలు
-
అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ
-
సుప్రీంకోర్టులో నేడు అవినాష్ పిటిషన్ విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: ముందస్తు బెయిలు కోరుతూ ఎంపీ అవినాష్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించనుంది. అవినాష్కు ముందస్తు బెయిలు ఇవ్వొద్దంటూ మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్తో కలిపి ఈ పిటిషన్ను జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహాలుతో కూడిన వెకేషన్ బెంచ్ విచారించనుంది. ఇదిలా ఉంటే, తమ పిటిషన్ విచారించాలంటూ అవినాష్ తరఫు న్యాయవాది సోమవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహాలతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు. మరో వెకేషన్ బెంచ్కు వెళ్లాలని ధర్మాసనం సూచించడంతో జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సంజయ్కరోల్లతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు. తాను సభ్యుడిగా లేని ధర్మాసనం జాబితాలో చేర్చాలని జస్టిస్ సంజయ్ కరోల్ రిజిస్ట్రీకి సూచించారు. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది. సంఖ్య విషయం సంబంధిత సమాచారం 1 డైరీ నెంబర్ 20416/2023 2 కేసు నెంబర్ MA 00 1285 3 విచారణ తేదీ 23 మే 2023 4 CL నెంబర్ 36 5 కేటగిరీ క్రిమినల్ మ్యాటర్స్ 6 సబ్జెక్ట్ బెయిల్ 7 బెంచ్ 1. జస్టిస్ J.K.మహేశ్వరీ 8 2. జస్టిస్ పమిడిగంఠం శ్రీ నరసింహా పిటిషనర్ సునీత నర్రెడ్డి 09 రెస్పాండెంట్స్ 1. Y.S.అవినాష్ రెడ్డి 2. డైరెక్టర్, CBI 10 సునీత తరపు న్యాయవాది జెసల్ వాహి 11 అవినాష్ తరపు న్యాయవాది ముకుంద్ P.ఉన్నీ -
అవినాష్రెడ్డి పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: అవినాష్రెడ్డి పిటిషన్పై ఈ సమయంలో వాదనలు వినలేమని తెలంగాణ హైకోర్టు తెలిపింది. హైకోర్టుకు రేపటి నుంచి వేసవి సెలవులు ఉన్నాయని, ఈ రోజు వాదనలు వినిపించినా తీర్పు ఇవ్వడం కుదరదని న్యాయమూర్తి తెలిపారు. ఈ రోజు విచారణ సందర్భంగా హైకోర్టుకు ఇంప్లీడ్ పిటిషనర్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డితో పాటు సీబీఐ ఎస్పీ వికాస్ కుమార్ వచ్చారు. ఇప్పటికే అవినాష్ రెడ్డి తరపు వాదనలు విన్న జస్టిస్ సురేంద్ర .. ఇవ్వాళ విచారణ మొదలు కాగానే.. కొన్ని వ్యాఖ్యలు చేశారు. రేపటి నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు ఉన్నాయని, ఈ దృష్ట్యా జూన్ 5కు ఈ పిటిషన్ ను వాయిదా వేస్తున్నామని తెలిపారు. బెయిల్ పై తీర్పు అన్ని రోజులు రిజర్వ్ లో పెట్టలేమని చెప్పారు. తెలంగాణ హైకోర్టుకు మే 1 నుంచి జూన్ 2వరకు సెలవులు ఇప్పటికే ప్రకటించారు. ప్రతి గురువారం మాత్రం అత్యవసర కేసుల విచారణ చేపడతారు. దాన్ని బట్టి మే 4,11,18,25, జూన్ 1న ప్రత్యేక కోర్టు నిర్వహణ ఉంటుంది. దీనిపై స్పందించిన అవినాష్ తరపు న్యాయవాది, తన క్లయింట్ ను సిబిఐ అరెస్టు చేసే అవకాశం ఉందని, ఆ దృష్ట్యా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. సిబిఐ కావాలనుకుంటే కస్టోడియల్ ఇంటరాగేషన్ కు సహకరిస్తామని తెలిపారు అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది. సమయం తక్కువగా ఉంది కాబట్టి.. అత్యవసరంగా ఉత్తర్వులు కావాలంటే వెకేషన్ బెంచ్కు పిటిషన్ మార్చుకుంటారా అని జస్టిస్ సురేంద్ర పార్టీలను అడిగారు. మీ విజ్ఞప్తి అత్యవసరమయితే ప్రధాన న్యాయమూర్తి ఎదుట మెన్షన్ చేసి అర్జెన్సీ ఉందని చెప్పాలని, దాన్ని బట్టి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారని జస్టిస్ సురేంద్ర స్పష్టం చేశారు. -
టెన్త్ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్కు ఊరట
సాక్షి, హన్మకొండ: టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్కు ఊరట లభించింది. బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ను హన్మకొండ కోర్టు కొట్టివేసింది. కాగా బండి సంజయ్కు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు ఈనెల 17న హన్మకొండ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం కోర్టు విచారణ చేపట్టింది. బెయిల్ మంజూరు చేసిన సమయంలో చేసిన సూచనలను బండి సంజయ్ ఉల్లంఘించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. విచారణకు సహకరించడం లేదని తెలిపారు. ప్రాసిక్యూషన్ వాదనలతో విబేధించిన మెజిస్ట్రేట్.. బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. చదవండి: వారికే టికెట్లు.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ హెచ్చరిక! -
అవినాష్రెడ్డి పిటిషన్పై విచారణ వాయిదా.. మరో ఇద్దరికి సీబీఐ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానంద కేసులో కడప ఎంపీ అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ కేసు విచారణ తెలంగాణ హైకోర్టులో గురువారానికి వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 3.30 నిమిషాలకు విచారణ చేపడతామని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ రోజు జాబితాలో లేని పిటిషన్లపై విచారణ చేపట్టలేమని తెలిపింది. దీంతో పిటిషన్పై రేపు విచారణ చేపట్టాలని అవినాష్రెడ్డి తరపు లాయర్ కోరగా.. కోర్టు అందుకు అంగీకరించింది. గురువారం మధ్యాహ్నం విచారిస్తామని హైకోర్టు పేర్కొంది. మరో ఇద్దరికి సీబీఐ నోటీసులు వైఎస్ వివేకా కేసులో సీబీఐ తాజాగా మరో ఇద్దరిని విచారణకు పిలిచింది. వైఎస్ వివేకా కంప్యూటర్ ఆపరేటర్ ఇనయ తుల్లా, ఉదయ్ కుమార్ తండ్రి ప్రకాష్ రెడ్డిని సిబిఐ ప్రశ్నిస్తోంది. ఇద్దరి స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తోంది. వైఎస్ వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి స్టేట్ మెంట్ను సీబీఐ మంగళవారం రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే. (బాబుకు విజనూ లేదు.. విస్తరాకుల కట్టా లేదు: కురసాల కన్నబాబు) కాగా, అవినాష్రెడ్డి పిటిషన్పై మంగళవారమే హైకోర్టు విచారణ చేపట్టాల్సి ఉండగా.. సుప్రీంకోర్టు సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతి ఇంకా అందకపోవడంతో హైకోర్టు విచారణను బుధవారానికి వాయిదా వేసింది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల సారాంశం మేరకే తదుపరి విచారణ ఉంటుందని పేర్కొన్న హైకోర్టు తాజాగా గురువారానికి విచారణ వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. వివేకా హత్య కేసులో A1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ వేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో బుధవారంతో వాదనలు పూర్తయ్యాయి. దీంతో తీర్పు రేపటికి వాయిదా వేసిన హైకోర్టు. (అనంతపురం: సీఎం జగన్ హెలికాప్టర్లో సాంకేతిక లోపం) -
వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్..సీబీఐకి హై కోర్టు కీలక ఆదేశాలు
-
వివేకా హత్య కేసు.. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ తప్పక పాటించాలి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: వివేకా హత్య కేసులో అరెస్టయిన భాస్కర్రెడ్డి, ఉదయ్కుమార్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సీబీఐ విచారణ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కస్టడీలో సీబీఐ సుప్రీం గైడ్లైన్స్ పాటించకపోవడంపై అభ్యంతరం తెలిపారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తప్పకుండా పాటించాలని పేర్కొంది. విచారణ సమయంలో న్యాయవాది ఉండాలన్న హైకోర్టు.. వీడియో, ఆడియో రికార్డ్ చేయాలని ఆదేశించింది. భాస్కర్రెడ్డి అనారోగ్యం దృష్ట్యా వైద్య పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు పేర్కొంది. ఇదిలా ఉంచితే, దస్తగిరిని అప్రూవర్గా పరిగణించడాన్ని భాస్కర్రెడ్డి సవాల్ చేయగా, దాని సంబంధించిన తదుపరి విచారణ జూన్ మూడో వారానికి వాయిదా పడింది. చదవండి: టీడీపీ నేత బండారం బట్టబయలు.. సింగర్తో సహజీవనం చేసి.. -
హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన ఎంపీ అవినాష్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ పిటిషన్ను చీఫ్ జస్టిస్ బెంచ్ అనుమతించింది. సోమవారం మధ్యాహ్నం 3.45 గంటలకు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టనున్నట్టు బెంచ్ స్పష్టం చేసింది. అవినాష్ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్లోని కీలక అంశాలు ఇవే.. ‘నాకు 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. 161 సీఆర్సీసీ కింద సీబీఐ అధికారులు నా స్టేట్మెంట్ రికార్డు చేశారు. వివేకా కుమార్తె సునీత స్థానిక ఎమ్మెల్సీ ద్వారా చంద్రబాబు, సీబీఐ ఆఫీసర్తో కుమ్మకయ్యారు. ఈ కేసులో కుట్ర పన్ని నన్ను ఇరికిస్తున్నారు. నాకు ముందస్తు బెయిల్ మంజూరు చేయండి. గూగుల్ టేకౌట్ ఆధారంగానే నన్ను నిందితుడిగా చేర్చే ప్రయత్నం జరుగుతోంది. దస్తగిరిని ఢిల్లీకి పిలిచి చాలా రోజులు సీబీఐ తన వద్ద ఉంచుకుంది. అక్కడే దస్తగిరిని అప్రూవర్గా మార్చారు. ఈ కేసులో నాపై ఎలాంటి ఆధారాలు లేవు. దస్తగిరి స్టేట్మెంట్ ఒక్కటే ప్రాముఖ్యంగా సీబీఐ తీసుకుంది. ఈ కేసులో ఇప్పటి వరకు నేను నిందితుడిగా లేను. 2021 సీబీఐ ఛార్జ్షీట్లో నన్ను అనుమానితుడిగా చేర్చారు. నాపై నేరం రుజువు చేయడానికి సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. వివేకా తన రెండో భార్యతో ఆర్థికంగా పాలుపంచుకుంటున్నాడని సునీత కక్ష గట్టింది. వివేకా కుమార్తె సునీత, స్థానిక ఎమ్మెల్సీ ద్వారా ప్రతిపక్ష నేతతో కుట్ర పన్ని నన్ను, నా కుటుంబాన్ని దెబ్బతీయడానికి ప్లాన్ చేశారు. సునీత, వివేకా రెండో భార్యకు మధ్య విభేదాలు ఉన్నాయి. వివేకా రెండో భార్య కుమారుడికి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సీటు ఇప్పిస్తామని వివేకా హామీ ఇచ్చారు. స్కూల్ పక్కనే విల్లా కొనుగోలు చేసేందుకు వివేకా ప్లాన్చేశారు. వివేకా రెండో భార్య కుటుంబానికి డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేసే ప్లాన్ తెలిసి వివేకాతో సునీత గొడవ పడ్డారు. వివేకా హత్యలో నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు ముందస్తు బెయిల్ మంజూరు చేయండి’ అని పేర్కొన్నారు. -
కౌంటర్ దాఖలు చేయండి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు అక్రమం అని, హనుమకొండ కోర్టు ఇచ్చిన డాకెట్ ఆర్డర్ను కొట్టివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు గురువారం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అయితే కింది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు ఉన్నత న్యాయ స్థానం అనుమతి ఇచ్చింది. అక్కడ బెయిల్ రాకుంటే హైకోర్టులో హౌస్మోషన్ పిటిషన్ దాఖలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్ను అరెస్టు చేసిన పోలీసులు హనుమకొండ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచిన విషయం తెలిసిందే. విచారణ తర్వాత బండికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ సంజయ్ గురువారం లంచ్మోషన్ రూపంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మధ్యాహ్నం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. సంజయ్కు వ్యతిరేకంగా ఆధారాల్లేవు.. ‘సుప్రీంకోర్టు, హైకోర్టు పలు ఉత్తర్వుల్లో చెప్పినా.. పోలీసులు 41ఏ నోటీసులు ఇవ్వకుండానే సంజయ్ను రాత్రి 12 గంటల సమయంలో అరెస్టు చేశారు. కరీంనగర్లో అరెస్టు చేసి నేరుగా హనుమకొండకు తరలించకుండా, బొమ్మల రామారం పోలీస్ స్టేషన్కు తరలించారు. వైద్య పరీక్షల పేరిట బొమ్మలరామారం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మళ్లీ హనుమకొండకు తీసుకొచ్చారు. వేధింపులకు గురిచేయాలనే ఉద్దేశంతోనే దాదాపు 300 కిలోమీటర్లు ఆయన్ను తిప్పారు. ఎక్కడి తీసుకెళుతున్నారు? ఎందుకు తిప్పుతున్నారో కూడా బండికి చెప్పలేదు. మరోవైపు పేపర్ లీకేజీపై పోలీసులు నమోదు చేసిన రిమాండ్ రిపోర్టులో సంజయ్ నేరం చేసినట్లు పేర్కొనలేదు. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవు. మంగళవారం రాత్రి అరెస్టు చేస్తే.. బుధవారం సాయంత్రం వరకు మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టలేదు. పార్లమెంట్ సమావేశాలకు ఎంపీ బండి హాజరుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హనుమకొండ మేజిస్ట్రేట్ ఇచ్చిన డాకెట్ ఆర్డర్ కొట్టివేయాలి. తక్షణమే సంజయ్ను విడుదల చేయాలి..’అని రామచందర్ రావు వాదించారు. మొబైల్ ఫోన్ ఇస్తే మరిన్ని వివరాలు ‘బండి మొబైల్ ఫోన్ నుంచి ఇతర నిందితుల ఫోన్కు వాట్సాప్ మెసేజ్ల బదిలీ జరిగింది. పేపర్ లీకేజీ జరిగేలా ఆయన ప్రోత్సహించారన్న సమాచారం ఉంది. మొబైల్ ఫోన్ ఇస్తే వివరాలన్నీ తెలుస్తాయి. ఆధారాలు లభ్యమవుతాయి. పేపర్ లీక్ అయి ఆయనకు వచ్చిన మెసేజ్ను ఎంపీ పలువురికి పంపించారు’అని ఏజీ పేర్కొన్నారు. ‘ఒకసారి ప్రజా బహుళ్యంలోకి వివరాలు వచ్చాక అవి ఎవరు ఎవరికైనా పంపొచ్చు కదా..?’అని సీజే ప్రశ్నించారు. అయితే ఎంపీగా ఉన్న సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలే గానీ, ఇతరులకు పంపడం సరికాదని ఏజీ నివేదించారు. ‘హెబియస్ కార్పస్’లోనూ నోటీసులు.. బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ భాగ్యనగర్ అధ్యక్షుడు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై జస్టిస్ అభినంద్కుమార్ షావిలి, జస్టిస్ పుల్లా కార్తీక్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ పేర్కొన్న అంశాలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర సర్కార్కు నోటీసులు జారీచేసింది.నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
సంజయ్కు బెయిల్
సాక్షి ప్రతినిధి, వరంగల్/ వరంగల్ లీగల్: పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్కు హనుమకొండ నాలుగో మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం రాత్రి బెయిల్ మంజూరు చేసింది. కమలాపూర్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి హిందీ పరీక్ష పత్రం లీక్, కాపీ కుట్ర కేసులో పోలీసులు బుధవారం బండి సంజయ్ను అరెస్టు చేసి, రిమాండ్కు పంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో సంజయ్ తరఫు న్యాయవాదులు వేసిన బెయిల్ పిటిషన్పై గురువారం సుదీర్ఘంగా విచారణ సాగింది. పలుమార్లు వాయిదాలతో.. సుమారు 8 గంటల పాటు జరిగిన వాదోపవాదాల అనంతరం రాత్రి 10 గంటల సమయంలో జడ్జి రాపోలు అనిత తీర్పు ఇచ్చారు. రూ.20 వేల చొప్పున ఇద్దరు జమానతుదారుల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. దేశం విడిచి వెళ్లకూడదని, కేసు విచారణ నిమిత్తం ప్రాసిక్యూషన్కు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, సాక్ష్యాలను చెరిపివేయకూడదని షరతులు విధించారు. బెయిల్ ప్రక్రియ పూర్తయ్యేసరికి గురువారం రాత్రి అవడంతో.. బండి సంజయ్ శుక్రవారం ఉదయం కరీంనగర్ జైలు నుంచి విడుదల కానున్నారు. దురుద్దేశంతో ఇరికించారు..: సంజయ్ లాయర్లు బండి సంజయ్ బెయిల్ విషయమై కోర్టులో గురువారం లంచ్ విరామం తర్వాత మొదలైన వాదనలు రాత్రి 8 గంటల వరకు కొనసాగాయి. రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్ సభ్యుడైన బండి సంజయ్ను అప్రతిష్టపాలు చేసేందుకు దురుద్దేశపూర్వకంగా పోలీసులతో అక్రమ కేసు బనాయించిందని ఆయన తరఫు న్యాయవాదులు శ్యాంసుందర్రెడ్డి, విద్యాసాగర్రెడ్డి, రామకృష్ణ, సునీల్లు వాదించారు. రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న ఆరోపణలుగానీ, ఫిర్యాదుదారు పిటిషన్లో ఆరోపించిన విషయాలుగానీ బండి సంజయ్కు వర్తించవని.. దురుద్దేశంతోనే కేసులో ఇరికించారని పేర్కొన్నారు. ఇప్పటికే కేసుకు సంబంధించి విచారణ పూర్తయిందని, నివేదిక మాత్రమే కోర్టులో దాఖలు చేయాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. సాక్షులను ప్రభావితం చేయడంగానీ, సాక్ష్యాధారాలను చెరిపేయడంగానీ చేసే ఆస్కారం లేనందున సంజయ్కు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్న సందర్భంగా ఎంపీగా, సంబంధిత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంజయ్ ఆ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. బెయిలిస్తే శాంతిభద్రతల సమస్య: పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరోవైపు సంజయ్కు బెయిల్ ఇవ్వకూడదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రేవతిదేవి కోర్టును కోరారు. ‘‘తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఇదే తీరుగా నేరాలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడాల్సి ఉంది. నిందితుడు బండి సంజయ్కు బెయిల్ ఇస్తే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆయనపై తీవ్రమైన చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. అది రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యగా మారే ప్రమాదం ఉంది. అంతేగాకుండా ఈ కేసులో మరికొందరు సాక్షులను విచారించాలి. నిందితులు ముందస్తుగా కుట్రపన్ని ప్రశ్నపత్రాల లీక్, కాపీకి పాల్పడ్డారు. వారి ఫోన్కాల్స్, వాట్సాప్ చాట్ల వివరాలను విశ్లేషించడం ద్వారా వారి పాత్ర బయటపడింది. ఇంకా సాంకేతిక ఆధారాలు లభించాల్సి ఉంది. వాస్తవాలను వెలికితీసేందుకు లోతైన దర్యాప్తు అవసరం. ఏ1 నిందితుడికి బెయిలిస్తే సాక్షులను బెదిరించి, దర్యాప్తునకు ఆటంకం కల్పించడంతోపాటు సాంకేతిక ఆధారాలను చెరిపేసే అవకాశం ఉంది. సంజయ్ బెయిల్ పిటిషన్ను తిరస్కరించాలి’’ అని కోరారు. బెయిల్ మంజూరు.. కస్టడీ పిటిషన్ వాయిదా ప్రాసిక్యూషన్, బండి సంజయ్ తరఫు న్యాయవాదుల వాదనల అనంతరం గురువారం రాత్రి 10 గంటల సమయంలో జడ్జి తీర్పు ఇచ్చారు. సంజయ్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. జమానతుదారుల పూచీకత్తు పత్రాలను సంజయ్ తరఫు న్యాయవాదులు సమర్పించగా.. కోర్టు విడుదల ఆదేశాలు (రిలీజ్ ఆర్డర్) జారీ చేసింది. మరోవైపు సంజయ్ను విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్పై తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. శనివారం ఉదయం విడుదల బండి సంజయ్ బెయిల్ పేపర్లు ఇంకా మాకు అందలేదు. అందినా రాత్రి పూట విడుదల చేసే అవకాశం లేదు. శుక్రవారం ఉదయం బెయిల్ పేపర్లు అందే అవకాశాలు ఉన్నాయి. రాగానే వాటిని పరిశీలించి సంజయ్ను విడుదల చేస్తాం. – సమ్మయ్య, కరీంనగర్ జైలు సూపరింటెండెంట్ చదవండి: బండి సంజయ్ చేసిన తప్పేంటి?.. అది లీకేజీ ఎలా అవుతుంది: హైకోర్టు -
కేటీఆర్ను కలిసిన ప్రీతి కుటుంబసభ్యులు
సాక్షి, మహబూబాబాద్/ వరంగల్ లీగల్: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కాకతీయ వైద్య కళాశాల విద్యార్థి ని ప్రీతి కుటుంబసభ్యులు మహబూబాబా ద్ జిల్లా తొర్రూరులో బుధవారం మంత్రి కేటీఆర్ను కలిశారు. ప్రీతి స్వగ్రామం పాలకుర్తి నియోజకవ ర్గంలోని గిరిజన తండా. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఎర్ర బెల్లి దయాకర్రావు.. ప్రీతి తల్లిదండ్రులు నరేందర్, శారద తదితరులను ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో కేటీఆర్ దగ్గరికి తీసుకెళ్లారు. అంతకు ముందు ప్రీతి చిత్రపటానికి కేటీఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రీతి తల్లిదండ్రులను ఓదార్చి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సైఫ్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ ప్రీతి మృతి కేసులో నిందితుడు సైఫ్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను వరంగల్ రెండో అదనపు జిల్లా కోర్టు ఇన్చార్జి జడ్జి సత్యేంద్ర బుధవారం తిరస్కరించారు. నిందితుడు సైఫ్ను పోలీస్ కస్టడీ కోరుతూ ప్రాసిక్యూషన్ దాఖలు చేసిన పిటిషన్ కూడా కోర్టు తిరస్కరించింది. రెండు గంటలకుపైగా సాగిన సుదీర్ఘ వాదనల అనంతరం ఉభయుల పిటిషన్లను తిరస్కరిస్తూ జడ్జి సత్యేంద్ర ఆదేశాలు జారీ చేశారు. బాధితులు నేరుగా కోర్టుకు విన్నవించే అవకాశంతో ప్రీతి తండ్రి నరేందర్.. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఎం.సత్యనాయణగౌడ్ను కలిశారు. కేసు పురోగతి, తన సందేహాలపై ఆయనతో చర్చించారు. -
Liquor Scam: లిక్కర్ స్కాం నిందితులకు బెయిల్ నిరాకరణ
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన నిందితులకు ఊరట దక్కలేదు. మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయిన ఐదుగురికి గురువారం బెయిల్ నిరాకరించింది కోర్టు. లిక్కర్ స్కాంలో విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, సమీర్ మహేంద్రు, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబులను దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. అయితే బెయిల్ కోసం వీళ్లు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ Rouse Avenue Court కోర్టును ఆశ్రయించగా.. కోర్టు బెయిల్కు తిరస్కరించింది. 123 పేజీలతో కూడిన తీర్పును వెలువరించారు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగ్పాల్. ఐదుగురు నిందితులపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. నిందితులు మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 3 కింద.. ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. కాబట్టి, ఈ ఐదుగురు నిందితులు బెయిల్కు అర్హులు కాదు. అందుకే బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తున్నాం అని స్పెషల్ కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు. Delhi's Rouse Avenue Court dismisses bail petitions of Vijay Nair, Abhishek Bonipally, Sameer Mahendru, Sarath P Reddy and Binoy Babu who were arrested in the money laundering probe emerging out of the Delhi govt new excise policy case — ANI (@ANI) February 16, 2023 -
ఎమ్మెల్సీ అనంతబాబుకు మధ్యంతర బెయిల్
ఢిల్లీ:డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ మంజూరైంది. అనంతబాబుకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు.. మే నెలాఖరు నుంచి రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. -
హేమంత్ హత్యకేసులో నిందితులకు బెయిల్ నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: ఇంటీరియర్ డిజైనర్ హేమంత్ హత్య కేసులో నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. చందానగర్కు చెందిన హేమంత్ అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి అనంతరం వారిద్దరూ గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో నివాసం ఉండేవారు. అయితే కూతురు తమ కులం కాని వాడిని ప్రేమ పెళ్లి చేసుకోవడంపై యువతి తండ్రి తీవ్ర కోపంతో ఉండేవాడు. హేమంత్ను ఎలాగైనా అంతమొందించాలని అనుకునేవాడు. ఈ నేపథ్యంలో కిరాయి గూండాలు హేమంత్ను కిడ్నాప్ చేసి.. 2020, సెప్టెంబర్ 24న సంగారెడ్డిలో దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో పోలీసులు మొత్తం 14 మందిని నిందితులుగా చేర్చడంతో పాటు వారిని అరెస్టు చేశారు. వీరిలో ఎరుకుల కృష్ణ, సోమయాల రాజు, బిచ్చు యాదవ్, మహ్మద్ పాషాలు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నాగార్జున్ విచారణ చేపట్టారు. హేమంత్ హత్యలో వీరు కూడా భాగస్వాములే అనేందుకు బలమైన ఆధారాలున్నాయని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తు ప్రభావితం అయ్యే అవకాశముందని వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి నలుగురి బెయిల్ పిటిషన్ను రద్దు చేశారు. -
అనంతబాబు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్
సాక్షి, అమరావతి: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరుతూ ఎమ్మెల్సీ అనంతబాబు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసులు 90 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయనందున డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలంటూ అనంతబాబు దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై జస్టిస్ రవి బుధవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కలిగినీడి చిదంబరం వాదనలు వినిపిస్తూ.. 90 రోజులకు రెండు రోజుల ముందు పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారని, సాంకేతిక కారణాలతో కోర్టు దానిని తిరస్కరించిందని తెలిపారు. ఇది అసంపూర్ణ చార్జిషీట్ కిందకే వస్తుందని, అందువల్ల డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని కోరారు. పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చార్జిషీట్లో లోపాలున్నాయని కోర్టు తిరస్కరించిందని, వాటిని సవరించి తిరిగి దాఖలు చేశామన్నారు. గడువులోపు దాఖలు చేసిన చార్జిషీట్ను సాంకేతిక కారణాలతో కోర్టు తిరస్కరిస్తే, దానిని సకాలంలో దాఖలు చేసినట్లుగానే భావించాలన్నారు. ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదికలు అందాల్సి ఉందన్నారు. ఈ కేసులో తాను ఎవరినీ సమర్థిస్తూ వాదనలు చెప్పడంలేదని, కోర్టుకు సహాయకారిగా వ్యవహరిస్తున్నానని న్యాయమూర్తి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నేరచరిత్రను పరిగణనలోకి తీసుకోండి అనంతబాబు బెయిల్ పిటిషన్ను వ్యతిరేకిస్తూ డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయగా, ఆమె తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. అనంతబాబుకు నేర చరిత్ర ఉందన్నారు. పోలీసులు గడువు లోపే చార్జిషీట్ దాఖలు చేశారని తెలిపారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే కేసులో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలంటూ అనంతబాబు దాఖలు చేసిన మరో పిటిషన్పై తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేశారు. -
నేడు వరవరరావు పిటిషన్పై సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ: భీమా కోరేగావ్–ఎల్గార్ పరిషత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విప్లవ రచయిత వరవరరావు దాఖలు చేసిన శాశ్వత బెయిల్ పిటిషన్పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరపనుంది. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు మెడికల్ బెయిల్ ఇవ్వడానికి బోంబే హైకోర్టు ఏప్రిల్ 13న నిరాకరించింది. ఆ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ వరవరరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ముగ్గురు సభ్యుల సుప్రీం బెంచ్ విచారిస్తుంది. 83 ఏళ్ల వయసున్న వరవరరావు నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతూ కదలలేని స్థితిలో ఉన్నారు. -
‘ఆశారాంకు జైలులోనే ఆయుర్వేద చికిత్స అందించండి’
న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను సుప్రీం కోర్టు మంగళవారం తిరస్కరించింది. కాగా, ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని.. దీనికోసం ఉత్తర ఖండ్ వెళ్లి చికిత్స తీసుకోవడానికి రెండు నెలల పాటు మధ్యంతర బెయిల్ను కోరుతూ ఆశారాం బాపూ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు ఆయన బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తూనే ఆయనకు జైలులోనే ఆయుర్వేద చికిత్సను అందించాలని జైలు అధికారులను ఆదేశించింది.. ఆశారాం బాపూ 2013 తన ఆశ్రమంలో 16 ఏళ్ల మైనర్ బాలికను అత్యాచారం చేశారు. ఈ ఘటన రుజువు కావడంతో ఆయనకు జోధ్పూర్ కోర్టు జీవిత ఖైదు శిక్షను విధించిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మరో ఇద్దరు నిందితులకు జోధ్పూర్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. గతంలో.. ఆశారాం బాపూకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన 9 మందిపై ఆయన అనుచరులు దాడిచేశారు. దీనిలో ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. ఆయన గతంలో కూడా పలుసార్లు ఆరోగ్యం నిలకడగా లేదని బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు కోరారు. అయితే, దీనిపై గతంలో సుప్రీంకోర్టు ఆయన ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించడానికి ప్రత్యేక వైద్యులను నియమించింది. కాగా, ఆశారాం బాపూను పరీక్షించిన వైద్యులు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సుప్రీం కోర్టుకు తెలియజేశారు. చదవండి: అన్నీ తెరిచాక ఇంకేం... డ్రామా మాత్రమే -
మాతృత్వం స్త్రీ హక్కు.. బెయిల్ ఇస్తే ఏం కాదు: హైకోర్టు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. గౌరవప్రదమైన మాతృత్వం ప్రతి స్త్రీ హక్కు.. గర్భిణీ స్త్రీలకు కావాల్సింది జైలు కాదు.. బెయిల్ అని స్పష్టం చేసింది. నార్మాటిక్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ (ఎన్డిపిఎస్ యాక్ట్) కింద నమోదైన కేసులో సహ నిందితురాలిగా ఉన్న గర్భిణీ స్త్రీకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ అనూప్ చిట్కర మాట్లాడుతూ.. నిందితురాలికి తాత్కాలిక బెయిల్ మంజూరు చేసి.. శిక్షను ప్రస్తుతం నిలిపివేసి.. డెలివరీ తర్వాత ఒక సంవత్సరం వరకు పొడిగించవచ్చని తెలిపారు. అంతేకాక నేరాలు చాలా ఘోరంగా ఉన్నప్పుడు, ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు కూడా దీన్ని అనుమతించాలన్నారు. ‘‘జైలు శిక్షను వాయిదా వేయడం ద్వారా రాష్ట్రానికి, సమాజానికి ఏదైనా హానీ జరుగుతుందా.. జైలు శిక్ష వాయిదా వేస్తే ఆకాశం ఊడి పడదు. సమాజంలోని ప్రతి స్త్రీ గౌరవప్రదమైన మాతృత్వానికి అర్హురాలు. గర్భం దాల్చిన నాటి నుంచి డెలివరీ తరువాత ఏడాది వరకు ఆమె మీద ఎలాంటి పరిమితులు ఉండకూడదు” అన్నారు చిట్కరా. ‘‘జైలులో ప్రసవిస్తే.. ఆ బిడ్డ సామాజిక ద్వేషాన్ని చవి చూస్తుంది. పుట్టుక గురించి ప్రశ్నించి.. జైలులోనే జన్మించాడని తెలిస్తే.. సమాజం ఆ బిడ్డను ఎంత చీదరించుకుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇవన్ని ఆ బిడ్డ మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఇక జైలులో మంచి ఆహారం అందించడం ద్వారా శారీరక ఆరోగ్యం బాగానే ఉండవచ్చు.. కానీ మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది’’ అన్నారు. ‘‘ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 37 లోని ఆదేశం నిందితులు నిర్దోషులుకు క్లీన్ చీట్ ఇవ్వడానికి.. రెండు షరతులను సంతృప్తి పరచాలని సూచిస్తుంది. దర్యాప్తుదారులు సేకరించిన సాక్ష్యాలు నిందితులకు బెయిల్ నిరాకరించడానికి చట్టబద్ధంగా సరిపోకపోవడమే కాక, వారి మీద మరే ఇతర దోషపూరిత సాక్ష్యాలు, ఆరోపణలు లేనప్పుడు.. నిందితులను నిర్దోషులుగా భావించవచ్చు. దీని ప్రకారం, పిటిషనర్ మొదటి షరతును సంతృప్తిపరిచారు. కనుక ఆమెకు తక్కువ వ్యవధి బెయిల్ మంజూరు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. దీని ఆధారంగా కోర్టు నిందితురాలికి బెయిల్ మంజూరు చేస్తుంది’’ అని తెలిపారు. కేసేంటంటే.. గర్భిణీ స్త్రీని, మాదకద్రవ్యాల వ్యాపారంలో తన భర్తతో కలిసి కుట్రపన్నారనే ఆరోపణలపై అరెస్టు చేశారు పోలీసులు. అంతేకాక వారి ఇంట్లో సోదాలు నిర్వహించి 259 గ్రాముల హెరాయిన్, 713 గ్రాముల ట్రామడోల్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నిందితురాలు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీని కంటే ముందు బాధితురాలు కంగ్రా జిల్లా ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. కానీ కోర్టు ఈ ఏడాది జనవరి, 19న దాన్ని కొట్టేసింది. దాంతో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించారు. -
బెయిల్ ఉత్తర్వుల కాపీల జారీలో ప్రత్యామ్నాయ యంత్రాంగం
సాక్షి, అమరావతి: న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నప్పటికీ, ఆ ఉత్తర్వుల సర్టిఫై కాపీలు జైలు అధికారులకు సకాలంలో అందకపోవడంతో అండర్ ట్రయిల్ ఖైదీలు, నిందితులు ఇబ్బందిపడుతున్నారని హైకోర్టు పేర్కొంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులిచ్చింది. హైకోర్టులో సిబ్బంది తక్కువగా ఉన్నందువల్ల కోర్టు ఉత్తర్వుల కాపీల జారీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ఈ ఏర్పాటు చేసింది. సకాలంలో ఉత్తర్వుల కాపీని అందజేయకుండా బెయిల్ పిటిషన్ను పరిష్కరించడం నిందితుడిని సౌకర్యవంతమైన స్థానంలో ఉంచదని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కోర్టులు సరికొత్త పద్ధతులను అన్వయించుకుంటూ ఈ సమస్యపై దృష్టిసారించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపింది. ఇటీవల హైకోర్టులో కోర్టు మాస్టర్లు ఏ రోజు జరిగిన కోర్టు ప్రొసీడింగ్స్ను, వెలువరించిన ఉత్తర్వులను, తీర్పులను ఆ రోజే నెట్లో అప్లోడ్ చేస్తున్నారంది. ► ఈ పరిస్థితుల్లో కక్షిదారులు, న్యాయవాదులు ఉత్తర్వుల కాపీలను హైకోర్టు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చంది. నిందితుల తరఫున పూచీకత్తులు సమర్పించడానికి మెమో దాఖలు చేసే సమయంలో న్యాయవాది ఉత్తర్వుల కాపీని హైకోర్టు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న విషయాన్ని ప్రస్తావించాలి. ► సంబంధిత కోర్టు అడ్మినిస్ట్రేటివ్ అధికారి లేదా చీఫ్ మినిస్టీరియల్ అధికారి హైకోర్టు వెబ్సైట్లోకి వెళ్లి ఆ ఉత్తర్వులను పరిశీలించాలి. ► కోర్టు ప్రిసైడింగ్ అధికారి అదే రోజు రిలీజ్ ఆర్డర్ను ఈ–మెయిల్ లేదా ఎలక్ట్రానిక్ పద్ధతిలో జైలు అధికారికి పంపాలి. ముందస్తు బెయిల్ విషయంలో కోర్టు ఉత్తర్వుల కాపీల పరిశీలన బాధ్యత సంబంధిత స్టేషన్ హౌజ్ ఆఫీసర్దే. ► ఈ ఉత్తర్వుల కాపీని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, డైరెక్టర్ ప్రాసిక్యూషన్, అన్ని జిల్లాల ప్రిన్సిపల్ జడ్జిలకు పంపాలని హైకోర్టు రిజిస్ట్రార్(జ్యుడీషియల్)ను ఆదేశించింది. ► జిల్లా జడ్జిల ద్వారా ఈ ఉత్తర్వుల కాపీని ఆయా న్యాయవాద సంఘాలకు కూడా పంపాలని సూచించింది. ఈ నెల 26 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయంది. ► న్యాయాధికారులు ఈ ఉత్తర్వుల అమలులో ఇబ్బందులు ఎదుర్కొంటే.. రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) దృష్టికి తీసుకురావాలంది. ముందస్తు బెయిళ్ల విషయంలో ఎస్హెచ్వోలు తమ ఇబ్బందులను హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దృష్టికి తీసుకురావచ్చంది. ఆ ఇబ్బందులను రిజిస్ట్రార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆగస్టు 31 నాటికి హైకోర్టు ముందుంచాలని ఆదేశించింది. ► ఉత్తర్వుల్లో మార్పులు చేర్పులు కావాలంటే తదుపరి విచారణ సమయంలో చూస్తామంటూ విచారణను ఆగస్టు 31కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ కన్నెగంటి లలిత గురువారం ఉత్తర్వులిచ్చారు. నార్కోటిక్ డ్రగ్స్ కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేసేటప్పుడు న్యాయమూర్తి ఈ ఉత్తర్వులిచ్చారు. -
నిష్పక్షపాతంగా విచారించండి
సాక్షి, బెంగళూరు: పాత్రికేయురాలు గౌరి లంకేశ్ హత్య కేసులో నిందితుడు మోహన్ నాయక్ బెయిల్ పిటిషన్పై ఎలాంటి ప్రభావాలకు లోనుకాకుండా పరిష్కరించాలని కర్ణాటక రాష్ట్ర హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. గౌరి లంకేశ్ సోదరి కవితా లంకేశ్ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా నిందితుడు మోహన్ నాయక్పై కేసు కొట్టివేతను నిష్పక్షపాతంగా విచారించాలని సూచించింది. సంఘటిత నేరాల నియంత్రణ చట్టం ప్రకారం మోహన్ నాయక్పై దాఖలైన కేసును కర్ణాటక హైకోర్టు ఏప్రిల్ 22న రద్దు చేసింది. దీన్ని ప్రశ్నిస్తూ కవితా లంకేశ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు చేయాని మోహన్ నాయక్ కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు పిటిషనర్ కవిత లంకేశ్ ఎస్ఎల్పీ (స్పెషల్ లీవ్ పిటిషన్) దాఖలు చేయడంతో పాటు బెయిల్ రద్దు చేస్తూ మధ్యంతర ఆదేశాలివ్వాలని కోరగా దీనిపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలపాలని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 15కు వాయిదా వేసింది. కాగా, 2017 సెప్టెంబర్ 5న గౌరి లంకేశ్ బెంగళూరు రాజరాజేశ్వరి నగరలోని తన నివాసంలో దండుగుల కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే.