kuppam
-
కుప్పంలో బాబుకు షాక్.. వర్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు
-
‘మా ఎంపీటీసీల బస్సును అడుగడుగునా అడ్డగించారు’
కుప్పం(చిత్తూరు జిల్లా): కుప్పం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భరత్ ధ్వజమెత్తారు. ఎంపీటీసీలను ఎంపీడీవో కార్యాలయం ఆవరణలోకి ఆడ్డుకున్నారని మండిపడ్డారు. ఎంపీపీ ఉప ఎన్నికల్లో భాగంగా కుప్పంలో కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరును భరత్ ఎండగట్టారు.‘పోలీసులు నామమాత్రంగా బందోబస్తు నిర్వహించారు. మా ఎంపీటీసీలు వెళ్తున్న బస్సును అడుగు అడుగునా అడ్డగించారు. పోలీసులు సెక్యూరిటీ ఉన్నా చోద్యం చూస్తున్నారు. టీడీపీ సీనియర్ నేతలు గంజాయి కేసులు పెడతాము అని ఎంపీటీసీలను బెదిరించారు. రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతోందని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో ఏం జరుగుతుందో అందరూ చూశారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను భయభ్రాంతులకు గురి చేశారు. ఈరోజు మాపై దాడి కూడా చేయాలని కుట్ర చేశారు. ఈ ఎన్నికలపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తాం. కోరం లేకుండా ఎంపీపీ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు’ అని భరత్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వాదులు ఒకసారి కుప్పం వైపు చూడండిప్రజాస్వామ్య వాదులుగా చెప్పుకుంటున్న వారు ఒకసారి కుప్పం వైపు చూస్తే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు\ చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు. ‘కోరం లేకుండా రామకుప్పం ఎంపిపి ఎన్నికలు నిర్వహించారు. టీడీపీ నాయకులతో కుమ్మక్కు రాజకీయం చేశారు. కుప్పం నియోజకవర్గం లో ప్రజాస్వామ్యంను ఖూనీ చేశారు. టీడీపీ కుట్ర రాజకీయాలు చేస్తోంది’ అని మండిపడ్డారు గోవిందప్ప.ఇంత దారుణమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదుఈ తరహా ఇంత దారుణమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు.. జరగలేదన్నారు రామకుప్పం ఎంపీపీ కుందనందన రెడ్డి,. ‘ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అంటే ఒక ఆదర్శంగా ఉండాలి. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీటీసీలు అందరినీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. మాపై కేసులు పెడతాం అని బెదిరించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం’ అని రామకుప్పం ఎంపీపీ కుందనందన రెడ్డి స్పష్టం చేశారు. -
నిలువ నీడ లేకుండా.. కుప్పంలో పేదల ఇళ్లపై దౌర్జన్యం!
కుప్పం(చిత్తూరు జిల్లా) : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో పేదల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేసింది కూటమి ప్రభుత్వం. శాంతిపురం మండలం మఠం పంచాయితీ సంతూరు గ్రామంలోని నిరుపేదల ఇళ్లను బలవంంతగా ఖాళీ చేయించి కూల్చివేసే పనులను ఆరంభించింది. కీనీసం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయించిన అధికారులు, టీడీపీ నేతలు.. ఆపై కూల్చివేసే కార్యక్రమం చేపట్టారు. అది చెరువు స్థలమని అందుచేత కూల్చివేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.30 ఏళ్లుగా ఉంటున్న తమను బలవంతంగా ఖాళీ చేయించడం అన్యాయం అంటున్నారు బాధితులు. 10 కుటుంబాలకు చెందిన ఇళ్లను జేసీబీల సాయంతో కూల్చివేశారు అధికారులు. దీనిపై వైఎస్సార్ సీపీ ఆందోళన చేపట్టింది. బాధిత కుటుంబాలకు అండగా నిలిచింది. బాధిత కుటుంబాలు ఉండటానికి మరొకచేట స్థలం కేటాయించక ముందే ఇళ్లను కూల్చివేయడం దారుణమని వైఎస్సార్ సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని పేద ప్రజలకు మరొకచోట స్థలం కేటాయించాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోంది. -
కుప్పంలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై అమ్మాయి తండ్రి దాడి
సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పంలో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న జంటపై అమ్మాయి తండ్రి కత్తితో దాడి చేశారు. అడ్డుకున్న మరో ఇద్దరిపైనా కూడా దాడికి పాల్పడ్డాడు. పెద్దల సమక్షంలో రాజీ పంచాయితీ అంటూ పిలిచి నలుగురిపై విచక్షణరహితంగా కత్తితో దాడి చేశారు.ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కత్తి కడుపులో ఇరుక్కుపోయింది. బాధితులను గుడుపల్లి మండలం అగరం గ్రామానికి చెందిన చంద్రశేఖర్, రమేష్, కౌసల్య, సీతారామప్పగా గుర్తించారు. వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
కూటమి నేతల దౌర్జన్యాలకు తగిన గుణపాఠం చెబుతాం: భూమన
సాక్షి, తిరుపతి: కూటమి నేతల ఉడత బెదిరింపులకు వైఎస్సార్సీపీ బెదిరే అవకాశమే లేదని హెచ్చరించారు పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి. కూటమి నాయకుల బెదిరింపులకు, దౌర్జన్యాలకు తగిన రీతిలో గుణపాఠం చెబుతామని కౌంటరిచ్చారు. నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో శేఖర్ రెడ్డి సునాయాసంగా గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో మున్సిపల్ డిప్యూటీ మేయర్లు, చైర్మన్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఫిబ్రవరి మూడో తేదీన తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ పదవికి శేఖర్ రెడ్డిని వైఎస్సార్సీపీ తరపున బరిలో దింపుతాం. సౌమ్యుడైన శేఖర్ రెడ్డి పేరు ప్రకటించగానే స్థానిక కూటమి నాయకులు ఫోన్లు చేసి బెదిరించారు. మీ ఆస్తులు ధ్వంసం చేస్తాం ఎలా పోటీ చేస్తావ్ నీ అంతు చూస్తాం అని శేఖర్ రెడ్డిని బెదిరిస్తున్నారు.ఇలాంటి ఉడత బెదిరింపులకు వైఎస్సార్సీపీ బెదిరే అవకాశమే లేదు. కూటమి నాయకుల బెదిరింపులకు, దౌర్జన్యాలకు తగిన రీతిలో గుణపాఠం చెబుతాం. నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో శేఖర్ రెడ్డి సునాయాసంగా గెలుస్తారు. మాకు స్పష్టమైన మెజారిటీ ఉంది. మీరు భయబ్రాంతులకు గురి చేయాలని చూస్తే రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానులు తిరుపతిలోనే ఉంటారు. ఆ సునామీని మీరు తట్టుకోలేరు’ అంటూ హెచ్చరించారు.మరోవైపు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని చంద్రబాబుపై కుప్పం వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ హయంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందజేశారు. సూపర్ సిక్స్ పథకాల పేరుతో ఎన్నికల్లో ప్రజలను మోసం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో గ్రామ సచివాలయాలను నిర్మించారు, గ్రామ స్వరాజ్య పాలన సాగించారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలోనూ వైఎస్ జగన్ ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేశారని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
సీఎం సొంత నియోజకవర్గంలో అక్రమ గ్రానైట్ రవాణా
-
అక్రమ కేసుల కుప్పం
శాంతిపురం: ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి, శాంతితో వర్ధిల్లడం సహజం. అక్కడి ప్రజలు కూడా ఇదే కోరుకుంటారు. అక్కడి ప్రజలు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను మెరుగ్గా అందుకోవాలని ఏ ముఖ్యమంత్రి అయినా ఆశిస్తారు. కానీ సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. రాజకీయ వేధింపులు, కక్షలు, అక్రమ కేసులతో అట్టుడికిపోతోంది.తప్పుడు కేసులను ఉపేక్షించేది లేదని చంద్రబాబు పైకి చెబుతున్నా, ఆయన సొంత నియోజకవర్గంలోనే అనేక అక్రమ కేసులు పెడుతున్నారు. విపక్ష నేతలు, కార్యకర్తలు, పథకాల గురించి అడిగిన సామాన్యులపై అక్రమ కేసులు, బైండోవర్ కేసులు, ఆంక్షలు, పోలీసుల వేధింపులు, నిర్బంధాలు, పథకాల నిలిపివేత వంటి చర్యలు ఎదుర్కోవాల్సిందే. రాష్ట్రంలో అధికార మార్పు జరిగిన తొలిరోజు నుంచే కుప్పంలో ఆటవిక రాజ్యం సాగుతోంది. పోలీసులను అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు దౌర్జన్యకాండను సాగిస్తున్నారు. అందుకు ఉదాహరణలు కొన్ని.. ఊరి నుంచి తరిమేసి.. రాష్ట్రంలో చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రామకుప్పం మండలం 89 పెద్దూరు పంచాయతీ దళిత మహిళా సర్పంచి మల్లిక రాజీనామా చేయాలంటూ ఆమె ఇంటిపై దాడిచేసి, సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేశారు. ఆమె కుటుంబాన్ని గ్రామం నుంచి వెళ్లగొట్టారు. దీనిపై స్థానిక పోలీసులతో పాటు జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. ప్రాణ భయంతో ఆ కుటుంబం దూరప్రాంతానికి వెళ్లడంతో గ్రామంలో అందుబాటులో లేరని, మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు రాలేదంటూ సర్పంచి చెక్ పవర్ను రద్దు చేశారు. పైగా ఇసుక అక్రమ రవాణాపై టీడీపీలోని రెండు వర్గాలు ఘర్షణ పడగా, గాయపడిన వారితో మల్లిక భర్త గోవిందప్పపై తప్పుడు ఫిర్యాదు చేయించి, ఆయనపై హత్యాయత్నం కేసు పెట్టారు. దీనిపై న్యాయం కోరుతూ బాధితులు మానవ హక్కుల కమిషన్, ఎస్సీ కమిషన్ను ఆశ్రయించారు.పొలానికి మట్టి తోలారనితమిళనాడు సరిహద్దుల్లోని ఓ ఎన్ కొత్తూరుకు చెందిన వైఎస్సార్సీపీ సర్పంచి దేవప్పనాయుడు బంధువులు తమిళనాడు భూభాగంలోని చెరువు నుంచి అదే రాష్ట్రంలోని వారి పొలాలకు మట్టి తోలుకున్నారు. అయితే గుడుపల్లె మండలం తలిఅగ్రహారంలోని ఆంధ్ర భూభాగం గుండా మట్టిని రవాణా చేశారంటూ దేవప్పనాయుడు, ఆయన బంధువులపై తప్పుడు కేసు పెట్టారు. తమిళనాడు అధికారుల నుంచి అన్ని అనుమతులు తీసుకుని, మట్టిని తరలిస్తున్నామని చెప్పినా పట్టించుకోలేదు. దేవప్పనాయుడు, ఆయన తమ్ముడు పొండప్పనాయుడును రోజంతా పోలీసు స్టేషన్లో కూర్చోపెట్టారు.రెండు ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఇలాంటి కేసులు, వేధింపులతో కుప్పంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సామాన్యులను అధికార పక్షం నిత్యం వేధిస్తోంది. వైఎస్సార్సీపీ నాయకులు వారి అభిమాన నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను కూడా జరుపుకోనివ్వకుండా పలుచోట్ల పోలీసులను మోహరించారు. తమ పార్టీ వారిపై పదుల సంఖ్యలో అక్రమ కేసులు, బైండోవర్ కేసులు పెట్టారని వైఎస్పార్సీపీ నాయకులు చెబుతున్నారు. అయినా వైఎస్సార్సీపీ నాయకులు భయపడకుండా న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇసుక రవాణా కేసులో ఇరికించి నాయనపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ డైరెక్టర్ కృష్ణమూర్తి పైనా తప్పుడు కేసు పెట్టి వేధింపలకు గురిచేస్తున్నారు. ఎప్పుడూ ఇసుక వ్యాపారం చేయని ఆయనపై కర్ణాటకకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారంటూ ఓ తప్పుడు కేసు పెట్టారు. సొంతిల్లు కట్టుకొనేందుకు ఆయన బంధువులు చట్టబద్ధంగా పన్నులు చెల్లించి, బైరెడ్డిపల్లి స్టాక్ యార్డు నుంచి తెచ్చుకున్న ఇసుకను చూపి జైలుకు పంపారు. ఉదయం అదుపులోకి తీసుకుని, సాయంత్రం వీఆర్వో నుంచి ఫిర్యాదు రాయించుకుని, నిబంధనలు పాటించకుండా తనను అరెస్టు చేశారని కృష్ణమూర్తి చెప్పారు. పార్టీ మారాలని, లేదంటే ఊరు వదిలి వెళ్లిపోవాలని అధికారులు బెదిరించారని వాపోయారు. పైగా, సీజ్ చేసిన ఇసుకను కూడా అక్రమ మార్గంలో తరలించేశారని కృష్ణమూర్తి బంధువులు చెబుతున్నారు.హామీలపై మాట్లాడితే బైండోవర్ కేసుగుడుపల్లె మండలం బోయనపల్లికి చెందిన రవి కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయడంలేదని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేయడంతో ఓ రోజు ఆయన్ని పోలీసుల ఇంటి నుంచి పట్టుకెళ్లిపోయారు. ఆయనపై బైండోవర్ కేసు పెట్టి, సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. మళ్లీ ఇలా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
కుప్పంలో వైఎస్ జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్
-
జగన్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తే కఠిన చర్యలే!: కుప్పం పోలీసులు
సాక్షి, కుప్పం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలపై చిత్తూరు జిల్లా కుప్పంలో పోలీసు శాఖ ఆంక్షలు విధించింది. కుప్పంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకల నిర్వహణకు అనుమతివ్వాలంటూ వైఎస్సార్సీపీ నేతలు ముందస్తుగా పోలీసులకు వినతిపత్రం అందజేశారు.ఈ క్రమంలో.. వినతి పత్రంపై కుప్పం డీఎస్పీ అభ్యంతరం వ్యక్తంచేస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భరత్ పీఏ మురుగేష్కు లేఖను అందజేశారు. సీఎం చంద్రబాబు భార్య భువనేశ్వరి ఈ నెల 19 నుంచి 22 వరకు కుప్పంలో పర్యటిస్తున్నారని, ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీ సంబరాలు చేయకూడదని లేఖలో పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో వైఎస్ జగన్ జన్మదిన సంబరాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. -
శిలాఫలకం ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు
-
చంద్రబాబు ఇలాకాలో రైస్ మాఫియా
-
పచ్చ పచ్చాని దారిలో సాగిపోదామా..
కనువిందు చేసే పచ్చని చెట్లు... బడలికను పోగొట్టే చల్లగాలి... ఎవరైనా సరే ఆ మార్గంలో ఒకసారి ప్రయాణిస్తే ఫిదా అవ్వాల్సిందే. మళ్లీ మళ్లీ ఆ దారిలో వెళ్లాలనే కోరిక తట్టాల్సిందే. రహదారికి పచ్చటి తోరణం కట్టినట్లుండి.. వాటి కిందకు వెళ్లగానే ఏదో గుహలోకి ప్రవేశించినట్లుగా కలిగే అనుభూతి ప్రయాణికులను కొద్దిసేపు అక్కడ ఆగేలా చేస్తోంది. అనంతపురం జిల్లా గార్లదిన్నె నుంచి మిడ్పెన్నార్ డ్యాంకు వెళ్లే మార్గంలో రోడ్డుకిరువైపులా చెట్లు ప్రయాణికులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురంగుంటూరు జిల్లా ప్రత్తిపాడు పరిసర ప్రాంతాలు అంటే గుర్తుకువచ్చేది పత్తి, మిర్చి సాగు. దశాబ్దాలుగా ఇవే పంటలు ఈ ప్రాంతంలో సాగుచేస్తుంటారు. కానీ ఇటీవల ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగానే బంతి పూల తోటలు కూడా సాగుచేశారు. గుంటూరు పర్చూరు పాత మద్రాసు రోడ్డు వెంబడి పుల్లడిగుంట సమీపంలో పండించిన బంతి పూలు పసుపు, ఆరెంజ్ రంగుల్లో చూపరులను ఆకర్షిస్తున్నాయి.నిత్యం అలలతో ఎగసి పడే సంద్రం.. వెనక్కు తగ్గింది. ఇప్పటి వరకు అలల మాటున ఉన్న శిలలు అందమైన ఆకృతులతో సరికొత్తగా పరిచయం చేసుకున్నాయి. వాతావరణ మార్పులతో సముద్రం వెనక్కు వెళ్లడంతో విశాఖ బీచ్లోని వైఎంసీఏ ప్రాంతంలో నల్లని రాళ్లు కనువిందు చేశాయి. దీంతో సందర్శకులు సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం కాకినాడ జిల్లా తుని పట్టణంలోని ఓ రైతుకు చెందిన నాటుకోడి అతి చిన్న గుడ్డు పెట్టడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. రైతు గండి రమణ నాటు కోళ్లు పెంచుతున్నారు. ఇందులో ఒక పెట్ట ముందు రోజు సాధారణ పరిమాణం కలిగిన గుడ్డు పెట్టగా.. మంగళవారం చిన్న గుడ్డు పెట్టింది. జన్యుపరమైన లోపం వల్ల ఇలా జరుగుతుందని పశు వైద్యుడు శ్రీధర్ చెప్పారు.విశాఖ కేంద్ర కారాగారం ఆవరణలో సీజనల్ పంటలు పండిస్తున్నారు. ప్రస్తుతం శీతాకాలం కూరగాయల పంటలు ప్రారంభమయ్యాయి. కొన్ని కాపు దశకు వచ్చాయి. జైలులో ఉండే ఓపెన్ ఎయిర్ ఖైదీలచే రసాయనిక ఎరువుల్లేకుండా అధికారులు ఇక్కడ పంటలు పండిస్తుంటారు. జైలు లోపల మామిడి, కొబ్బరితోపాటు, బయట ఆవరణ సుమారు 20 ఎకరాల్లో సీజనల్ పంటలు పండించి వాటిని ఖైదీలకు వినియోగిస్తుంటారు. మిగిలిన వాటిని జైలు గేటు ముందు బీఆర్టీఎస్ పక్కన సుధార్ కేంద్రంలో విక్రయిస్తుంటారు. ప్రస్తుతం వంగ, బీర, క్యాబేజీ, టమాటా, ఆనప (సొర) సాగు చేస్తున్నారు. ఈ పంటలతో జైలు ఆవరణ అన్ని కాలాల్లోను పచ్చదనంతో కళకళలాడుతోంది.తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కిన ఘటన సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. మండలంలోని వీర్నమల ఎస్సీ కాలనీలో మూడు నెలలుగా తాగునీటి సమస్యతో సతమతమవుతున్నామని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. ఎస్సీ కాలనీలో ఉన్న బోరులో నీరు ఇంకిపోవడంతో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చిందని, డబ్బులిచ్చి నీళ్లు కొనుక్కోవాల్సిన ఖర్మ పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోకపోవడంతో వారంతా ఖాళీ బిందెలతో ఆంధ్ర–తమిళనాడు సరిహద్దు రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఈ కారణంగా వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది.చౌక దుకాణాల వద్ద రేషన్ కోసం లబ్ధిదారులు గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి మళ్లీ ఎదురైంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో ఇంటి వద్దకే రేషన్ పథకాన్ని అమలు చేసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాల్లో ఈ వ్యవహారాన్ని తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. చిత్తూరులోని 27వ వార్డు చామంతిపురం రేషన్షాపు వద్ద మంగళవారం ప్రజలు రేషన్ కోసం గంటల కొద్దీ పడిగాపులు కాశారు. గంటల కొద్దీ నిలబడలేక తాము తెచ్చుకున్న సంచులను వరుస క్రమంలో పెట్టారు. సమీపంలోని 28వ వార్డులో, మరికొన్ని మండలాల్లో సైతం ఇదే పరిస్థితులు ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రజలు గత ప్రభుత్వ పాలనే బాగుందని వ్యాఖ్యానిస్తున్నారు. చదవండి: ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు 1,027.58 కిలో మీటర్లు -
కుప్పంలో సీజ్ ది థియేటర్
చిత్తూరు, సాక్షి: సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో.. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి కోపమొచ్చింది. తమ అభిమాన నటుడి సినిమా ప్రదర్శించకుండా అధికారులు ఓ థియేటర్ను సీజ్ చేయడంపై రగిలిపోతున్నారు. స్థానికంగా ఓ నేతకు చెందిన రెండు థియేటర్లలో పుష్ప 2 చిత్రం ప్రదర్శిస్తున్నారు. అయితే.. ఎన్వోసీ సర్టిఫికెట్ లేకుండా సినిమా ప్రదర్శిస్తున్నారంటూ అధికారులు షోలను అర్ధాంతరంగా నిలిపివేయించి మరీ తాళాలు వేశారు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. లైసెన్సు రెన్యూవల్ చేసుకోకుండా థియేటర్ రన్ చేస్తున్నారని అధికారులు చెబుతుండగా.. ఇది కక్ష సాధింపు చర్యలో భాగమై ఉండొచ్చంటూ ఫ్యాన్స్ వాదిస్తున్నారు. మరోవైపు వారాంతం కావడంతో కొత్త సినిమా చూద్దామని థియేటర్కు వస్తున్న ప్రేక్షకులు.. గేటుకు తాళాలు చూసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇదీ చదవండి: టార్గెట్ అల్లు అర్జున్.. రాజకీయ సెగ! -
చిత్తూరు జిల్లా కుప్పంలో కాంట్రాక్ట్ లెక్చరర్ల వినూత్న నిరసన
-
ఎన్టీఆర్ కోసం ఫ్యాన్స్ వందల కిలోమీటర్ల పాదయాత్ర
తనని ప్రేమించే ఫ్యాన్స్ అంటే జూనియర్ ఎన్టీఆర్కు ఎనలేని అభిమానం. ఈ క్రమంలో వారి కుటుంబసభ్యులపై కూడా ఆయన ఎంతో ఆప్యాయత కనబరుస్తుంటారు. అందుకే తారక్ ప్రతి ఆడియో ఫంక్షన్లో అభిమానులు అందరూ క్షేమంగా ఇంటికి చేరుకోవాలని, వారి కోసం ఇంటి వద్ద ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు ఉంటారని సూచిస్తాడు. ఫ్యాన్స్పై ఆయన చూపించే ఇలాంటి ప్రేమనే నేడు 650 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా చేసింది.కుప్పంలోని గుడుపల్లి మండలానికి చెందిన నలుగురు యువకులు తమ అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ను కలిసేందుకు హైదరాబాద్కు పాదయాత్ర చేశారు. సోడిగానిపల్లి పంచాయతీ పాళెం గ్రామానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు శివ, హరి, లక్ష్మీపతి, కదిరప్ప పాద యాత్ర ద్వారా హైదరాబాద్ చేరుకుని జూనియర్ ఎన్టీఆర్ను కలిశారు. నవంబర్ 3న వారు తమ ఇంటి నుంచి ప్రయాణించారు. తమ స్వగ్రామం నుంచి హైదరాబాద్లోని జూనియర్ ఎన్టీఆర్ నివాసం వరకూ ‘వేసే ప్రతి అడుగు జూనియర్ ఎన్టీఆర్ అన్న కోసం’ పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. దాదాపు 650 కిలోమీటర్లు పైగా కాలినడకన హైదరాబాద్ చేరుకుని ఎన్టీఆర్ కలుసుకున్నారు. కుప్పం నుంచి హైదరాబాద్ చేరుకునేందుకు వారికి సుమారు 13 రోజుల సమయం పట్టింది. తారక్పై వారు చూపించిన ప్రేమకు కుప్పం జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు శివరాయల్ వారికి సంఘీభావం తెలిపారు.This is why he’s the PEOPLE’S HERO ❤️❤️MAN OF MASSES @Tarak9999 met fans who walked all the way from Kuppam. He spent time with them and made their day with his warmth 😍✨ #ManOfMassesNTR #NTR pic.twitter.com/FmR7vok8w8— Vamsi Kaka (@vamsikaka) November 15, 2024 -
కుప్పంలో హైడ్రామా !
-
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాషా రాసలీలలు
-
కుప్పం: ప్రియురాలు పిలిచిందని లేడీస్ హాస్టల్లో దూరి..
సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పం పిఈఎస్ మెడికల్ కళాశాల నర్సింగ్ హాస్టల్లోకి యువకుడు చొరబడిన ఘటన కలకలం రేపింది. కేరళ నుంచి ప్రియుడిని యువతి, పిలిపించుకుంది. ఒకే గదిలో ఆరుగురు నర్సింగ్ విద్యార్థినులు ఉండగా, బురఖా వేసుకొని మారు వేషంలో లేడీస్ హాస్టల్కు ప్రియుడు వెళ్లాడు.ఆటో దిగి వ్యక్తి వెళ్తుండగా, గమనించిన ఆటో డ్రైవర్లు వార్డెన్కు సమాచారం అందించారు. దీంతో కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది ఆ యువకుడిని పట్టుకున్నారు. గుడిపల్లి పోలీసులకు హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఇదీ చదవండి: మానవత్వమా.. కళ్లు మూసుకో! -
కుప్పంలో గంజాయి ‘మత్తు’.. తెలుగు తమ్ముళ్ల మధ్య ఘర్షణ
సాక్షి, చిత్తూరు జిల్లా: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గంజాయి మత్తులో తెలుగు తమ్ముళ్లు ఘర్షణ పడటంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఇరువర్గాలు ఒకరిపై మరొకరు కత్తులు, రాడ్డులతో దాడులు చేసుకున్నారు. దాడిలో కుప్పం మాజీ జడ్పీటీసీ రాజ్ కుమార్ తమ్ముడు వినయ్ తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘర్షణలో న్యాయవాది కుమారుడు, రాజకీయ నేతల కుమారులు ఉన్నట్లు తెలిసింది. టీడీపీ కార్యకర్త వినయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్నివివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఘర్షణలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఇదీ చదవండి: గనుల శాఖలో బదిలీల ‘వేలం’ -
కుప్పంలో క్షుద్ర పూజల కలకలం..
-
టీడీపీలో చేరమని ఒత్తిడి చేస్తున్నారు: కుప్పం ఎంపీపీ
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సోమవారం కుప్పం ఎంపీపీ అశ్విని, ఎంపీటీసీలు కలిశారు. తన తండ్రి కుప్పం వైఎస్ఆర్ కాంగ్రెస్ మండలం కన్వీనర్ మురుగేశ్, సోదరుడు శ్రీను రాజేంద్ర ప్రసాద్ అక్రమంగా అరెస్టు చేశారంటూ ఎంపీపీ ఆవేదన వ్యక్తం చేశారు. మిథున్రెడ్డిని కలిసిన అనంతరం ఎంపీపీ అశ్విని మీడియాతో మాట్లాడారు. ‘‘ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా నిలుస్తుందని ఎంపీ మిథున్రెడ్డి చెప్పారు. తప్పుడు కేసులతో ఇబ్బంది పెడుతున్నారు. జనవరి నెలలో మల్లనూరు పంచాయితీ ట్రాక్టర్ పోయిందని మేము పిర్యాదు చేశాం, ఇప్పుడు మాపైనే కేసు పెట్టారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరమని ఒత్తిడి చేస్తున్నారు, లేదంటే కుప్పం ఎంపీపీ పదవికి రాజీనామా చేయమంటున్నారు. కుప్పంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలుపై తప్పుడు కేసులు బనాయించి సీఐ ఇబ్బందులు పెడుతున్నారు. అన్ని రోజులు ఒకేలా ఉండవు.. ఐదేళ్ల తర్వాత పరిస్థితి మారుతుంది.. అప్పుడు మీ పరిస్థితి ఆలోచన చేసుకోండి’’ అని ఆమె అన్నారు. -
కుప్పంలో జల్లికట్టు నిర్వహణ.. 10 మందికి గాయాలు
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో జల్లికట్టు నిర్వహించారు. టీడీపీ నేతల కనుసన్నల్లో ఈ జల్లికట్టు నిర్వహణ జరిగింది. చెక్కునత్తం గ్రామంలో నిర్వహించిన జల్లికట్టులో 10 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
రాజకీయ కక్షతోనే కేసు.. అంత దౌర్భాగ్యం నాకు పట్టలేదు: ఎమ్మెల్సీ భరత్
సాక్షి, కుప్పం: తిరుమల శ్రీవారి దర్శనం, పూజ టికెట్లు అమ్ముకునేంత దౌర్భాగ్యం తనకు పట్టలేదని అన్నారు వైఎస్సార్సీపీ కుప్పం ఎమ్మెల్సీ కేఆర్జే భరత్. తాను ఒక బ్యూరోక్రట్ ఫ్యామిలీ నుంచి వచ్చానని, తన తండ్రి ఒక ఐఏఎస్ అధికారి అని తెలిపారు. ఉన్నత విలువలతో బతికే వ్యక్తినని చెప్పారు.తన వద్ద మల్లికార్జునరావు అనే పీఆర్ఓ ఎవరూ లేరని, అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదని అన్నారు భరత్. కేవలం కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేయడం, అక్కడ ఆయనను ఎదుర్కొంటూ రాజకీయాల్లో నిలబడుతున్నానన్న కక్షతోనే తనపై కేసులు నమోదు చేసి అప్రతిష్టపాలు జేసేందుకు ఈ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తనపై జరుగుతున్న కుట్రలను కచ్చితంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. అసలు తనపై ఫిర్యాదు చేసిన వారెవరు? పోలీసులు కేసులో రాసిన వాళ్లు ఎవరు? అవన్నీ ఆరా తీస్తానని చెప్పారు. పూర్తి వివరాలతో మళ్లీ మీడియా ముందుకు వస్తానని తన వీడియో సందేశంలో తెలిపారాయన. -
కుప్పంలో టీడీపీ నేతల ఓవరాక్షన్
సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఓవరాక్షన్ చేశారు. రామకుప్పంలో ఎంపీటీసీల సమావేశానికి వెళ్లిన ఎమ్మెల్సీ భరత్పై దాడికి యత్నించారు. వైఎస్సార్సీపీ నేత, రామకుప్పం ఎంపీపీ చంద్రా రెడ్డి ఇంట్లో ఎంపీటీసీలతో ఎమ్మెల్సీ భరత్ హాజరయ్యారు. ఈ క్రమంలో ఎంపీపీ ఇంట్లోకి తెలుగు తమ్ముళ్లు దౌర్జన్యంగా ప్రవేశించారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలపై దురుసుగా ప్రవర్తించారు. వైఎస్సార్సీపీ నేతలు వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. ఎంపీపీ ఇంటికి చేరుకున్న పోలీసులు టీడీపీ నేతలను అక్కడి నుంచి పంపించేశారు. -
సోనూ సూద్ బర్త్ డే.. ఏపీ విద్యార్థుల స్పెషల్ విషెస్!
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఇవాళ 51వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆయన బర్త్ డే సందర్భంగా సినీతారలు, టాలీవుడ్ ప్రముఖులు సైతం ఆయనకు విషెస్ తెలిపారు. అరుంధతి మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సోనూసూద్.. బాలీవుడ్లో బిజీగా ఉన్నారు. అయితే సినిమాలతో పాటు సమాజ సేవలోనూ ఆయన ముందున్నారు. సోనూసూద్ ఫౌండేషన్ స్థాపించిన నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు.తాజాగా ఇవాళ సోనూ పుట్టిన రోజు కావడంతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కుప్పంలోని హాకింగ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ఆయన రూపంలో నిలబడి విషెస్ చెప్పారు. దాదాపు 1200 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హ్యాపీ బర్త్ డే రియల్ హీరో అంటూ తమ అభిమానం చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విధంగా కార్యక్రమంలో విద్యార్థుల సృజనాత్మకత, ఉత్సాహాన్ని పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. కాగా.. ఇటీవలే సోనూసూద్ ఏపీకి చెందిన విద్యార్థికి చదువుకు సాయమందించిన సంగతి తెలిసిందే. నటుడు @SonuSood పుట్టినరోజు సందర్భంగా అద్భుత రీతిలో శుభాకాంక్షలు తెలిపిన కుప్పం విద్యార్థులుసోను సూద్ ముఖ చిత్రాన్ని ప్రతిబింబించేలా విద్యార్థుల అద్భుత ప్రదర్శనహాకింగ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం#sonusoodbirthday #Kuppam pic.twitter.com/tGLKlhF7ym— Telugu Galaxy (@Telugu_Galaxy) July 30, 2024 -
YSRCP నాగార్జున యాదవ్ అరెస్ట్..
-
నాగార్జున యాదవ్ అరెస్ట్
సాక్షి చిత్తూరు: వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను ఆదివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అర్థరాత్రి ఆయనను కుప్పం పోలీస్ స్టేషన్కు తరలించారు. నాగార్జునయాదవ్ ఓ టీవీ ఛానెల్ చర్చలో సీఎం చంద్రబాబు గురించి మాట్లాడినందుకు టీడీపీకి చెందిన ఓ వ్యక్తి కుప్పం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దానిపై అక్కడి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ, ఈ కేసును కొట్టివేయాలని హైకోర్టులో వైఎస్సార్సీపీ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం ఈనెల 25 వరకు అతన్ని అరెస్టు చేయరాదని ఆదేశించిన విషయం తెలిసిందే. నాగార్జున యదావ్పై 196(1), 351(2)BNS సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.ఇంతలోనే బెంగళూరు నుంచి విజయవాడ వస్తుండగా ఆదివారం రాత్రి చిత్తూరు జిల్లా వికోట సమీపంలో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆయన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇది హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని, పోలీసులిచ్చిన 41ఏకి కూడా విరుద్ధంగా ఉందని వైఎస్సార్సీపీ తప్పుబడుతోంది. దీనిపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలిపింది. -
కుప్పంలో దారుణం..
-
చంద్రన్న నాటుసారా.. కుప్పంలో కొత్త లిక్కర్
-
తల్లికి పెన్షన్ తీసేశారని.. కుప్పంలో దారుణం..
-
కుప్పం ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం
-
కుప్పాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
సాక్షి, చిత్తూరు/కుప్పం: రానున్న ఐదేళ్లల్లో కుప్పాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన సీఎం హోదాలో తొలిసారిగా సొంత నియోజకవర్గం కుప్పానికి మంగళవారం వచ్చారు. అక్కడి నుండి శాంతిపురం మండలం జెల్లిగానిపల్లి చేరుకుని హంద్రీనీవా కాలువను సందర్శించారు. అనంతరం సా.4 గంటలకు స్థానిక ఆర్టీసీ బస్టాండు ఆవరణలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ఐదేళ్లల్లో కుప్పాన్ని అగ్రస్థానంలో నిలబెట్టి, ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. పేదరికం లేని సమాజం చేస్తానన్నారు. గత ప్రభుత్వంలో అప్రజాస్వామ్యం, రౌడీయిజం, అన్నా క్యాంటీన్పై దాడులు, ఏకంగా తననే బెదిరించే స్థాయి దౌర్జన్యాలతో కుప్పాన్ని భ్రష్టు పట్టించారన్నారు. కేజీఎఫ్ గనులు, గ్రానేట్ దోపిడీ చేశారన్నారు. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదని, అభివృద్ధి బాధ్యత తనేదన్నారు. తనకు ఎవరిపైనా కోపంలేదని, ప్రశాంతమైన పట్టణంగా అభివృద్ధికే కట్టుబడి ఉన్నానన్నారు. ఇకపై కుప్పంలో ఎవరు రౌడీయిజం చేసినా అదే కడపటి రోజు అవుతుందని చంద్రబాబు హెచ్చరించారు. గంజాయి, అక్రమ వ్యాపారాలు చేస్తే అణచివేస్తామన్నారు. కుప్పం అభివృద్ధికి ‘కడా’ ఏర్పాటు..ఇక కుప్పం అభివృద్ధి కోసం గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కడా) ఏర్పాటుచేశానని, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. మళ్లీ ‘కడా’ను ఏర్పాటుచేస్తానని, ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారిని నియమించి అభివృద్ధి చేస్తామన్నారు. కుప్పం నియోజకవర్గంలో మరో రెండు మండలాలుగా మల్లానూరు, రాళ్ళబూదుగూరులను ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు. ఆర్టీసి డిపోను ఆధునీకరించి, ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తామన్నారు. కుప్పంలోని ప్రధాన ఆలయాలను అభివృద్ధి చేస్తానన్నారు. అలాగే, కుప్పంలో విమానాశ్రయం నిర్మించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. కుప్పంలో ఉత్పత్తి చేసే కూరగాయలు, పండ్లు, పూలు, ఇతర వస్తువులు ఇక్కడి నుంచి దేశవిదేశాలకు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పూలకు ప్రత్యేకంగా మార్కెట్ సదుపాయం కల్పిస్తామన్నారు. కోళ్ళు, గొర్రెల పెంపకం పరిశ్రమలు ఏర్పాటుచేసి రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని 10 లక్షల లీటర్ల వరకు పెంచే చర్యలు చేపడతామన్నారు. కుప్పంలో ప్రతి కుటుంబాన్ని లక్షలాధికారులుగా తీర్చిదిద్దే బాధ్యత తాను తీసుకుంటున్నట్లు చంద్రబాబు చెప్పారు.కుప్పం–బెంగళూరు మధ్య గ్రీన్ఫీల్డ్ హైవే..కుప్పం నియోజకవర్గాన్ని తమిళనాడు, కర్ణాటకలతో అనుసంధానం చేసేందుకు ఫోర్వే రోడ్లను అభివృద్ది చేయనున్నట్లు సీఎం చెప్పారు. ఇందులో భాగంగా కుప్పం–బెంగళూరు మధ్య గ్రీన్ఫీల్డ్ హైవే, పలమనేరు–క్రిష్ణగిరి మధ్య ఫోర్ వే రోడ్లను నిర్మించనున్నట్లు చెప్పారు. అలాగే, హంద్రీ–నీవా కాలువ అభివృద్ధి పనులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి, ట్రాక్టర్లతో నీటిని నింపి సినిమా షో చేసిందని విమర్శించారు. కానీ, తాను ఈ ఏడాదిలోనే పూర్తిస్థాయిలో కృష్ణాజలాలు కుప్పానికి తీసుకొస్తానన్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు భారీ మెజారిటీలు రాగా.. తనకు ఆ స్థాయిలో మెజారిటీ రాకపోవడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లాలోని 4 లక్షల డ్వాక్రా పొదుపు సంఘాలు అమరావతి నిర్మాణం కోసం రూ.4.5 కోట్లు విరాళం చెక్కులను సీఎంకు అందజేశారు. -
మా పెన్షన్లు అడ్డుకున్న చంద్రబాబు ఇక రాకూడదు
-
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
నారా చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్కు కౌంటింగ్ భయం పట్టుకుందా? కుప్పం ఫలితంపై ఇప్పటి నుంచే ఆందోళన మొదలైందా? వైఎస్ జగన్ పాలనలో కుప్పం ప్రజలు గతంలో ఎన్నడూ చూడని విధంగా లబ్ది పొందడమే టీడీపీ భయానికి కారణమా? మూడున్నర దశాబ్దాలుగా కుప్పంలో గెలుస్తూ వచ్చిన చంద్రబాబులో కూడా భయం ప్రారంభమైందా? కౌంటింగ్ రోజు ఏం జరుగుతుందా అంటూ టీడీపీలో మొదలైన భయానికి కారణం అదేనా? ఎన్నికల ఓట్లు లెక్కించే గడువు దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు గెలుపు ఓటములపై లెక్కలు వేసుకోవడంలో తల మునకలుగా ఉన్నాయి. ప్రధానంగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో మూడు దశాబ్దాలకు పైబడి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గెలుస్తూ వస్తున్నారు. సొంత నియోజకవర్గం చంద్రగిరిలో 1983లో ఓటమి తర్వాత చంద్రబాబు తన రాజకీయ ప్రస్థానాన్ని 1989లో కుప్పం నుంచి ప్రారంభించారు. ఎక్కువగా బడుగు బలహీన వర్గాల ప్రజలే ఉన్న కుప్పంలో చంద్రబాబు మాయమాటలకు ఎదురులేకుండా పోయింది. అయితే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 2019 నుంచి కుప్పం వాసుల్లో మార్పు మొదలైంది. ఇందుకు వైయస్సార్ సీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే ప్రధాన కారణం. కుప్పంలో తిరుగులేని నాయకుడిగా చలామణి అవుతూ వచ్చిన చంద్రబాబు గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వచ్చింది.ఈ ఎన్నికల్లో కుప్పంలో చోటు చేసుకున్న పరిణామాలు టీడీపీ వర్గాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఫలితాలు ఎలా ఉంటాయో అని చంద్రబాబుకు సైతం టెన్షన్ పట్టుకుందని టీడీపీ వర్గాల సమాచారం. కుప్పంలో ఈసారి పోలింగ్ శాతం 89.88గా నమోదైంది. గతంలో కుప్పంలో తెలుగుదేశం పార్టీ 30 వేలకు పైగా దొంగ ఓట్లను నమోదు చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దొంగ ఓట్లతోనే చంద్రబాబు విజయం సాధిస్తూ వచ్చారన్న వాదనా ఉంది. ప్రధానంగా తమిళనాడుకు చెందిన వానంబాడి, తిరుపత్తూరు, నాట్రంపల్లితో పాటు కర్ణాటక రాష్ట్ర పరిధిలోని కే జి ఎఫ్, బంగారు పేట, బెంగళూరు, బేతమంగళం వంటి ప్రాంతాల నుంచి వేలాదిమంది వచ్చి కుప్పంలో టిడిపికి ఓట్లు వేసేవారు. 2019 ఎన్నికలకు ముందు దివంగత వైఎస్సార్సీపీ నేత చంద్రమౌళి టీడీపీ దొంగ ఓట్ల వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్కు పూర్తి వివరాలతో సహా అందించారు. విచారణ జరిపిన ఎన్నికల కమిషన్ దాదాపు 20 వేల ఓట్లను తొలగించింది. ఈ కారణంగానే 2019 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు మెజార్టీ భారీగా తగ్గిందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో 46 వేల మెజార్టీ రాగా, 2019 ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ 30 వేలకు పడిపోయింది. 2019 ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా కుప్పంలో దాదాపు 20వేల టిడిపి దొంగ ఓట్లు ఉన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పరిశీలనలో తేలింది. వీటిలో కేవలం 7, 8 వేల దొంగఓట్లను మాత్రమే ఈసీ ద్వారా తొలగించగలిగారు. ఇదిలా ఉంటే..ఈ ఎన్నికల్లో కుప్పంలో పోలింగ్ శాతం భారీగా నమోదు కావడం టీడీపీ వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఐదేళ్ళ పాలనా కాలంలో కుప్పం వాసులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా వేలాదిమందికి ఇంటి పట్టాలతో పాటు గృహాలు మంజూరు చేశారు. అలాగే పంచాయతీగా ఉన్న కుప్పంను మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసి కుప్పం వాసుల చిరకాల వాంఛ నెరవేర్చారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయించారు. ప్రధానంగా కృష్ణా జలాలను కుప్పం వాసులకు అందించారు. ఈ కారణాలతో కుప్పం వాసుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల సంపూర్ణంగా నమ్మకం ఏర్పడింది. అందువల్లే ఈ ఎన్నికల్లో కుప్పం వాసులు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు అని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో టీడీపీ వర్గాలలో టెన్షన్ ప్రారంభమైంది.కౌంటింగ్ రోజు ఏమి జరుగుతుందో అన్న ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. కొద్ది మెజారిటీతో అయినా చంద్రబాబు గెలవడం ఖాయం అంటూ కుప్పం పచ్చ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి కుప్పం ఏమవుతుందా అని చంద్రబాబు ఆందోళన చెందుతుంటే టీడీపీ క్యాడర్ లెక్కల మీద లెక్కలు కడుతున్నట్లు సమాచారం. 2019లో చంద్రబాబు మెజార్టీ భారీగా తగ్గింది. అందుకే ఈసారి టీడీపీ నేతలు బయటికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోన మాత్రం ఆందోళనకు గురవుతున్నారనే టాక్ నడుస్తోంది. -
చంద్రబాబుకు కుప్పంలో ఓటమి భయం!
నారా చంద్రబాబు నాయుడు మూడున్నర దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈసారి ఓటమి భయం చంద్రబాబును వెంటాడుతోంది. చంద్రబాబు కంచుకోటగా చెబుతున్న కుప్పంలో ఈసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు ఈసారి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యే అవకాశం లేదా? చంద్రబాబుకు పట్టిన ఈ దుస్థితికి కారణం ఏంటి?చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి 35 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చంద్రబాబునాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి..ఇప్పుడు మూడోసారి ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. దొంగ ఓట్లను చేర్పించి భారీ మెజారిటీతో ఎన్నికవుతూ వస్తున్న చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ ఆవిర్భావంతో చెక్ పడింది. క్రమంగా మెజారిటీ తగ్గుతూ...ఆయన గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఈసారి దొంగ ఓట్లు భారీగా తొలగించడంతో గెలుపు మీదే నమ్మకమే పోయింది. తనను ఏడు సార్లు గెలిపించి అసెంబ్లీకి పంపించిన కుప్పం ప్రజల్ని చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాకే కుప్పం నియోజకవర్గానికి మహర్దశ పట్టింది. ఐదేళ్ళలో పూర్తిగా అభివృద్ధి చెందింది. అందుకే చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో ఫేడ్ అవుట్ లీడర్ గా మారిపోయారు.కుప్పంలో 1989 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చిన చంద్రబాబు అక్కడి ప్రజల్ని మోసం చేస్తూ...తాను మాత్రం ఉన్నత పదవులు అనుభవిస్తున్నారు. రాష్ట్రంలో మారుమూల తమిళనాడు బోర్డర్లో ఉన్న కుప్పం ప్రజల ఉపాధి గురించి ఏనాడూ పట్టించుకోలేదు. అందుకే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో కుప్పం ప్రజలు చంద్రబాబుకు బుద్ది చెప్పడానికి నిర్ణయించుకున్నారు. 2019 ఎన్నికల్లో 73 శాతం పోలింగ్ నమోదు అయితే, ఈసారి కుప్పంలో 89.88 శాతం ఓటింగ్ నమోదైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సిఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపునకు మహిళా ఓటర్లు, వృద్దులు పెద్ద ఎత్తున స్పందించారు. కుప్పం నియోజకవర్గానికి హంద్రీ నీవా కాలువల ద్వారా కృష్ణాజలాలు తీసుకువచ్చిన తర్వాతనే మళ్లీ ఓటు అడగటానికి వస్తాను అని చెప్పిన మాటలు కుప్పం ప్రజలు మనసుల్లో పెను మార్పును తీసుకువచ్చాయంటున్నారు. హామీలో భాగంగా ఈ ప్రాంతంను సస్యశ్యామలం చేస్తూ, కుప్పం ప్రజల చిరకాల వాంఛ అయిన తాగు, సాగు నీరు అందించిన సిఎం జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకునేందుకు ఓటు రూపంలో తమ కృతజ్జత చూపారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం పట్ల వివక్షత అనేది లేకుండా కుప్పంను మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా రెవెన్యూ సమస్యలతో సతమతం అవుతున్న ఈప్రాంత ప్రజలు కష్టాలు తీరుస్తూ కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా అందించారు. అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేశారు. ఇవన్నీ గమనించిన కుప్పం ప్రజల మనసుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిలిచిపోయారు. అందుకే ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. కుప్పం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 89.88 శాతం పోలింగ్ నమోదు కావడమే ఫ్యాన్ గాలి జంఝామారుతంలా వీచిందనడానికి సాక్ష్యం అని విశ్లేషకులు చెబుతున్నారు.కుప్పం ప్రాంతంలో బలంగా ఉన్న వన్నెకుల సామాజికవర్గానికి వైఎస్ జగన్ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. భరత్కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో పాటుగా చంద్రబాబు మీద పోటీ చేసే ఛాన్స్ కల్పించారు. వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో మొన్నటి వరకు లక్ష మెజారిటీ సాధనే లక్ష్యం అన్న కుప్పం టీడీపీ నాయకులు... ఎన్నికలు జరిగిన సాయంత్రం నుంచి సైలెంట్ అయిపోయారు. భారీగా పెరిగిన మహిళా ఓటింగ్ అటు టీడీపీకి, ఇటు చంద్రబాబుకు పెను ప్రమాదంగా మారిందనే భయాందోళనలు టీడీపీని వెంటాడుతున్నాయి. -
కుప్పంలో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి సిద్ధమవుతున్న ఓటర్లు
-
కుప్పంలో కోట్లు కుమ్మరించినా చంద్రబాబుకు ఓటమి ?
-
కుప్పంలో విజయం నాదే
-
కుప్పంలో బరితెగించిన టీడీపీ గుండాలు..
-
కుప్పంలో టీడీపీ గూండాయిజం
సాక్షి, చిత్తూరు: కుప్పంలో టీడీపీ బరితెగించింది. టీడీపీ నేతలు గూండాయిజంతో చెలరేగిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు వైస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.టీడీపీ నేతల దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. టీడీపీ నేతల దౌర్జన్యకాండపై వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ఎత్తున నిరసన తెలిపారు. గాయపడ్డ వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ పరామర్శించారు. -
కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి
-
జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు
-
బాబు వద్దు బాబోయ్.. కుప్పం ప్రజల మనసులో మాట
-
35 ఏళ్లుగా అద్దె కుప్పమే
సాక్షి, అమరావతి/సాక్షి, తిరుపతి: కుప్పం నియోజకవర్గ ప్రజలు 35 ఏళ్లుగా టీడీపీ అధినేత చంద్రబాబును వారి సొంత మనిషిలా ఆదరిస్తూ, ఆయన్ని గెలిపిస్తున్నప్పటికీ.. చంద్రబాబు మాత్రం ఆ నియోజకవర్గాన్ని కనీసం పట్టించుకోలేదు. ఇప్పటికీ అదేదో అద్దె ఇంటిలానో, తనకు పట్టని ప్రాంతంలాగానో వ్యవహరిస్తున్నారు తప్పితే, ఆ నియోజకవర్గ ప్రజలకు దగ్గరగా ఉండాలని, అక్కడ తనకంటూ ఒక స్థిర నివాసం ఏర్పరచుకోవాలని ఎప్పుడూ భావించలేదు. చంద్రబాబునాయుడు 1983 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 1989 నుంచి కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఆ నియోజకవర్గాన్ని ఓ ఓట్ల యంత్రంగానే చూసి, ఏమాత్రం అభివృద్ధి చేయకపోయినప్పటికీ, అక్కడి ప్రజలు మాత్రం చంద్రబాబును ఆదరిస్తూనే వచ్చారు. అయినా చంద్రబాబు ఆ ప్రాంతంపై శీతకన్నే వేశారు. ఆ ప్రాంతం తనను ఆదరిస్తున్నందుకు గుర్తుగా అయినా ఒక ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన కూడా ఎప్పుడూ చేయలేదు. 1984లో టీడీపీలో చేరగానే హైదరాబాద్ జూబ్లీహిల్స్లో స్థలం కొని, అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోనూ ఆయన సొంతిల్లు కట్టుకోలేదు. తాను రాజధానిని నిర్మిస్తానని గొప్పలు చెప్పుకొన్న అమరావతిలోనూ కట్టుకోలేదు. విభజిత ఆంధ్రప్రదేశ్కు సీఎంగా ఉండగానే హైదరాబాద్లోనే మరో అత్యాధునిక భవంతిని నిర్మించుకున్నారు. అటు సొంత నియోజకవర్గం కుప్పంని, ఇటు ఆయన రోజూ చెప్పే అమరావతి పైనా ఆయనకు ఓట్ల యావే తప్ప వాటిపై ప్రేమ లేదన్న విషయాన్ని బయటపెట్టుకున్నారు. ఆయన సొంతింటితోపాటు ఆస్థిపాస్తులు చాలావరకు హైదరాబాద్లోనే ఉన్నాయి. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కుప్పం ప్రజలకూ తొలిసారి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాయి. దీంతో కుప్పం ప్రజల్లోనూ ఆలోచన మొదలైంది. దీంతోపాటు సొంత నియోజకవర్గంలో ఇల్లు లేదా అని అందరూ ఎండగట్టడం ప్రారంభించారు. దీంతో 2022లో అక్కడ స్థలాన్ని కొని, ఇల్లు కడుతున్నట్లు చంద్రబాబు హడావుడి చేశారు. అక్కడ తాను ఇల్లు కట్టుకుంటున్నట్లు శుక్రవారం సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోనూ పేర్కొన్నారు. శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ పరిధిలో వ్యవసాయేతర భూమి 95.23 సెంట్లు ఉందని, దాని విలువ రూ.77.33 లక్షలుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. అక్కడే ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇంటి నిర్మాణం ప్రారంభమై సంవత్సరంన్నర అవుతోంది. సాధారణంగా ఒక సొంతింటి నిర్మాణం కొన్ని నెలల్లో పూర్తవుతుంది. కానీ, చంద్రబాబు ఇంటి నిర్మాణం మాత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు. పూర్తి చేస్తారో లేదో కూడా తెలియదు. భారీగా పెరిగిన ఆస్తులు అధికారంలో ఉండగా రాష్ట్రంలో ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల్లో భారీగా ముడుపులు దండుకున్నారన్న ఆరోపణలు, కేసులు ఉన్న చంద్రబాబు.. అధికారంలో లేకున్నా ఆదాయానికి లోటు లేదన్న విషయాన్ని ఆయన ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన ఆస్తుల విలువలు చెబుతున్నాయి. తనపై ఉన్న కేసులు, తన ఆస్థిపాస్తుల వివరాలను అఫిడవిట్లో చంద్రబాబు పేర్కొన్నారు. అఫిడవిట్లో పేర్కొన్న ప్రకారం గత ఐదేళ్లలో చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి ఆస్తుల విలువ 40 శాతం పెరిగింది. 2014లో రూ.176 కోట్లున్న వారి ఆస్తుల విలువ 2019 ఎన్నికల అఫిడవిట్లో రూ.700 కోట్లుగా చూపించారు. ప్రస్తుతం వారిద్దరి ఆస్తుల విలువ రూ.936.58 కోట్లుగా అఫిడవిట్లో తెలిపారు. రూ.121.41 కోట్ల చరాస్తులు, రూ.815.17 కోట్ల స్థిరాస్తులు చూపించారు. భువనేశ్వరికి హెరిటేజ్ ఫుడ్స్లో ఉన్న షేర్ల విలువే రూ.763 కోట్లుగా పేర్కొన్నారు. అలాగే ఆమెకు రూ.1.84 కోట్ల విలువైన బంగారం, 1.09 కోట్ల విలువైన ముత్యాలు, వజ్రాభరణాలు, రూ.30 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నట్లు తెలిపారు. అప్పులు రూ. 10.31 కోట్లుగా పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో చంద్రబాబుకు తన కొడుకు లోకేశ్తో ఉమ్మడిగా ఉన్న ఇంటి ప్రస్తుత విలువ రూ.70.20 కోట్లుగా చూపించారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లి వద్ద 96.23 సెంట్ల భూమి విలువ రూ.77.33 లక్షలుగా చూపించారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దీని విలువ రూ.2 కోట్లకుపైనే ఉంటుంది. నారావారిపల్లె శేషాపురంలో ఉన్న ఇల్లు విలువ రూ.43.66 లక్షలుగా చూపారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఇది కూడా సుమారు రూ.2 కోట్లు ఉంటుందని అంచనా. తన చేతిలో రూ.11,560 నగదు, బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 2,45,378, ఒక అంబాసిడర్ కారు ఉన్నట్లు పేర్కొన్నారు. 24 క్రిమినల్ కేసులు.. అందులో 8 అవినీతి కేసులే తాను 24 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు అఫిడవిట్లో చంద్రబాబు పేర్కొన్నారు. అందులో 8 కేసులు తీవ్రమైన అవినీతి ఆరోపణలతో కూడినవి. ఆయన అరెస్టయి జైల్లో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు అందులో ఒకటి. ఉచిత ఇసుక పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం, మద్యం డిçస్టలరీలు, బ్రాండ్లకు అక్రమంగా అనుమతులివ్వడం, రాజధాని ఇన్నర్ రింగురోడ్డు అలైన్మెంట్ కుంభకోణం, ఏపీ ఫైబర్నెట్ కాంట్రాక్టు జారీలో అక్రమాలు, రాజధాని అసైన్డ్ భూముల కుంభకోణానికి సంబంధించిన కేసులు తనపై విచారణలో ఉన్నట్లు ఆయన అఫిడవిట్లో తెలిపారు. -
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్
-
బాబు హామీల్..అన్నీ ఉడాల్..!
అరిగిన హామీల క్యాసెట్టు.. వేశాడే మళ్లీ పెసరట్టు.. జనం అంతా అదిరేట్టు..! పలమనేరు: అని కుప్పం, పలమనేరు ప్రెజలు మళ్లీ తల్కాయలు పట్టుకున్నారు. చెంద్రబాబు ఎప్పుడు జూసినా చెప్పిందే చెప్పీ..చెప్పీ బేజారెత్తిస్తాండప్పా..ఏందోబ్బా.. ఈ పార్టీ ఇయర్సు ఇండస్టిరీ అని నిస్టూరమాడినారు. అధికార పచ్చం పారిటీ వోల్ల ప్రెచారానికి నిద్ర పట్టక కుప్పానికి, పలమనేరుకు వచ్చిన చెంద్రబాబు ‘ప్రెజాగలం’లో కొత్తగా ఏమైనా చెప్తాడనుంటే ఏం చెప్పలేదప్పా..మళ్లీ పాత గలమే ఇప్పినాడు. కుప్పంలో అరచేతిలో సింగపూరు సొక్కాయి చూపిచ్చినాడు..ఇమానాలు ఎగిరిపిచ్చినాడు..బెంగలూరుకు నాలుగ్గీతల రోడ్డేసినాడు..అంద్రీ–నీవా నీల్లు పారిచ్చినాడు..అని ఎకసెక్కాలాణ్నారు. పోనీ పలమ్నేర్లో అయినా కొత్తగా ఏమైనా చెప్తాడా అన్కుంటే ఈడ కూడా అరిగిపోయిన పాత హామీల క్యాసెట్టేసినడబ్బా! ప్యాకట్రీలు కట్టించి, ఉజ్జోగాలిప్పిస్తాడంట..ఈడుంటే వోల్లు బెంగలూరుకు పనుల కోసం పోయేది కాదు..బెంగలూరోల్లే ఈడికి ఉజ్జోగాలు, పనులకు వచ్చేలా చేస్తాడంట! ఓయమ్మా..ఇది నమ్మే మాటేనా..చెప్పుయా!? బాబు చెప్పేవన్నీ ఉడాల్ మాట్లేయా! అని జెనాలు ఎండ చుర్రుమనేకాడికి తల మీద గుడ్డేసుకుని ‘ప్రెజాగలం’ నుంచి ఎలబారి ఇల్లకు పోయినారు. -
కుప్పంలో వైఎస్ఆర్సీపీ విజయం తథ్యం- భరత్
-
మీ మగాళ్లకు అన్నం పెట్టకండి.. కుటుంబంలో చిచ్చు పెడుతున్న చంద్రబాబు
-
Chandrababu Naidu: కుప్పంలో కదులుతున్న కూసాలు
కుప్పం నియోజకవర్గంలో ఏళ్ల తరబడి కొనసాగిన చంద్రబాబు ఆధిపత్యం అంత్యదశకు చేరిందా..? బురిడీ మాటలకు కాలం చెల్లిందా..? దశాబ్దాలుగా మోసిన ప్రజలకు టీడీపీ అధినేత అసలు తత్వం బోధపడిందా..? వాస్తవాలు గ్రహించిన జనంలో మార్పు మొదలైందా..? ఇన్నేళ్లుగా నల్లేరుపై నడకలా సాగిన చంద్రబాబు గెలుపు ఇకపై కష్టంగా మారబోతోందా..? కుప్పంలో మారిన లెక్కలను గమనిస్తే అసలు నిజం అర్థమవుతోంది. స్థానిక.. పురపాలక ఎన్నికల్లో వచ్చిన ఫలితమే మార్పునకు దర్పణం పడుతోంది. అందుకే టీడీపీ అధినేత వరుస పర్యటనలకు వస్తున్నట్లు ఆ పార్టీ క్యాడర్ భావిస్తోంది. సాక్షి, తిరుపతి: కుప్పం నియోజకవర్గ ప్రజల్లో మార్పు కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం వాసులు ఇచ్చిన తీర్పే ఇందుకు నిదర్శనం. నేటి పాలనకు.. నాటి టీడీపీ పాలనను బేరీజు వేసుకుంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఐదేళ్లలో డీబీటీ ద్వారా 4,32,067 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.1,244.23 కోట్లు నేరుగా జమ చేసింది. నాన్ డీబీటీ ద్వారా 3,03,080 మంది లబ్ధిదారులకు రూ.1,175.21 కోట్లు అందించింది. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా, ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నా చెప్పుకోదగ్గ ఒక్క మంచి పథకం తీసుకురాలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. 35 ఏళ్లుగా కుప్పానికి నీళ్లు తీసుకొస్తా అని చెప్పుకుంటూ వచ్చారే తప్ప మాట నిలబెట్టుకున్న దాఖలాలు లేవు. సీఎం వైఎస్ జగన్ ఐదేళ్లలోనే కుప్పానికి కృష్ణా జలాలను తీసుకువచ్చి స్థానికుల మనన్ననలు పొందుతున్నారు. ఇన్నేళ్లు గెలిపించింది దొంగ ఓట్లే చంద్రబాబు 1989 నుంచి కుప్పం నుంచి పోటీ చేసి గెలుపొందుతూ వచ్చారు. ఈయన గెలుపునకు కుప్పం వాసుల అమాయకత్వమే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడుకు చెందినవారిని వేల సంఖ్యలో ఓటర్లుగా నమోదు చేయించడమే బాబు విజయానికి ప్రధాన కారణంగా ఆరోపిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని వైఎస్సార్సీపీ అభ్యర్థిగా చంద్రబాబుపై పోటీకి దింపారు. ఎన్నికల సమయంలో కర్ణాటక, తమిళనాడు నుంచి భారీగా వచ్చి ఓట్లు వేసి వెళ్లడం గమనించిన చంద్రమౌళి దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయా ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లు పోలైనట్లు అధికారుల విచారణలో తేలింది. దీంతో 18 వేల ఓట్లు ఒకసారి, 34 వేల ఓట్లు మరోసారి తొలగించారు. కుప్పం నియోజకవర్గ సమాచారం 2019 ఎన్నికల్లో మొత్తం ఓట్లు 2,13,145 టీడీపీకి పోలైనవి 1,00,164 వైఎస్సార్సీపీకి వచ్చినవి 69,426 స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం ఓట్లు 1,78,948 టీడీపీ 21,038 వైఎస్సార్సీపీ 79,633 కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం ఓట్లు 38,213 టీడీపీ 12,377 వైఎస్సార్సీపీ 15,696 ప్రస్తుతం ప్రచురితమైన తుది ఓటరు జాబితా ప్రకారం నియోజకవర్గంలోని మొత్తం ఓట్లు 2,23,174 రావడానికి ఓ లెక్కుంది? కుప్పంలో 2014 ముందు ఒక లెక్క ఆ తర్వాత మరో లెక్క అన్న చందంగా మారింది. అప్పటి వరకు అన్ని గ్రామాలు చంద్రబాబు చెప్పిందే వేదంలా.. వేరొకరికి స్థానం లేకుండా భయపెడుతూ.. బెదిరిస్తూ ప్రత్యర్థి లేకుండా జాగ్రత్తపడుతూ వచ్చారు. 35 ఏళ్ల పాటు కుప్పం వాసులను ఆడిస్తూ వస్తున్న చంద్రబాబుకు వైఎస్సార్సీపీ ప్రస్థానం ప్రారంభమైన తర్వాత వరుస షాక్లు తగలడం మొదలైంది. ప్రతి గ్రామంలో టీడీపీకి పోటీగా వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేసేవారు ముందుకు వచ్చారు. 2019 తర్వాత జరిగిన స్థానిక సంస్థలు, కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్ అందరూ వైఎస్సార్సీపీ మద్దతుదారులే విజయం సాధించడంతో చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయ్యింది. దీంతో 35 ఏళ్లుగా కుప్పంలో సొంత ఇల్లు నిర్మించుకోవాలనే ఆలోచనే చేయని చంద్రబాబుకు అప్పటికి జ్ఞానోదయమైంది. దీంతో హుటాహుటి ఇంటి నిర్మాణం చేపట్టారు. అలాగే తరచూ కుప్పానికి వస్తున్నారు. 2014–19 మధ్య కాలంలో సీఎం హోదాలో చంద్రబాబు 8 పర్యాయాలు మాత్రమే కుప్పంలో పర్యటించారు. 2019–2024 మధ్య కాలం 13 పర్యాయాలు కుప్పం వచ్చి కనీసం అంటే రెండు, మూడు రోజులు ఉండి వెళ్తున్నారు. ఓటమి భయంతోనే కుప్పానికి పరుగులు పెడుతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
కుప్పం టీడీపీలో ఏం జరుగుతోంది? రగిలిపోతున్న బీసీ నేతలు!
టీడీపీ అధినేత చంద్రబాబుకు తనసామాజికవర్గ నేతలు ఉంటే.. ఇంక ఎవరితోనూ పని ఉండదు. బీసీలను అసలు పట్టించుకోరు. మూడున్నర దశాబ్దాలుగా కుప్పంలో చంద్రబాబును మోస్తున్న బీసీ నేతలు ఆయన తీరుతో మండిపడుతున్నారు. ఇంతకాలం తమతో పార్టీకి ఊడిగం చేయించుకుని ఇప్పుడు బయటి వ్యక్తులకు ప్రాధాన్యం ఇస్తారా అంటూ ఆగ్రహిస్తున్నారు. స్థానికంగా ఉన్నవారిని పక్కన పెట్టి ఇతర జిల్లాల నుంచి ఇంపోర్ట్ చేస్తే సహించేది లేదంటున్నారు. అసలు కుప్పం టీడీపీలో ఏం జరుగుతోంది? తెలుగుదేశం అనే ప్రాంతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా చెప్పుకునే నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గంలో ఆయన కుర్చీ కదిలిపోతోంది. ఏడుసార్లుగా ఎమ్మెల్యేగా ఎన్నుకున్న కుప్పం ప్రజలకు చంద్రబాబు ఏమీ చేయలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెలగబెట్టినా కూడా సొంత నియోజకవర్గానికి కనీసం తాగు, సాగునీరు కూడా తీసుకురాలేకపోయారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కుప్పం దశ తిరిగింది. అన్నివిధాలుగానూ కుప్పం నియోజకవర్గాన్ని వైఎస్ జగన్ అభివృద్ధి చేస్తున్నారు. హంద్రీనీవా ద్వారా కృష్ణా నది నీటిని కుప్పంకు తీసుకువచ్చి వారి దాహార్తిని తీర్చుతున్నారు. పొలాల్ని సస్యశ్యామలం చేస్తున్నారు. నియోజకవర్గం గురించి ఏనాడూ పట్టించుకోని చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించారు. గండం నుంచి గట్టెక్కడానికి కుప్పం పార్టీని తన సామాజికవర్గానికి చెందిన ప్రకాశం జిల్లా నేత, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్కు అప్పగించారు. దీంతో దశాబ్దాలుగా పార్టీకి ఊడిగం చేసిన తాము పనికిరాకుండా పోయామా అంటూ అక్కడి బీసీ నేతలు చంద్రబాబు మీద మండిపడుతున్నారు. నియోజకవర్గంలోని బీసీ నేతలతో పాటు..కుప్పంలో ఆయనకు పీఏలుగా పనిచేసినవారిని కూడా పక్కన పెట్టేశారు. వారికి ఎలాంటి ప్రాధాన్యం లేకుండా చేసేశారు. దీంతో వారు లోపల ఉండలేక..బయటకు పోలేక అల్లాడిపోతున్నారు. ఇన్నేళ్ళుగా తమను వాడుకుని..ఇప్పుడు నిర్లక్ష్యం చూపిస్తున్నందుకు తామేంటో ఎన్నికల్లో చూపిస్తామని చంద్రబాబును హెచ్చరిస్తున్నారు కుప్పంలోని బీసీ సామాజికవర్గ నేతలు. తమను నమ్మకుండా బాధ్యతలు లేకుండా చేసినపుడు ఇంకా తాము టీడీపీకి, చంద్రబాబుకు ఎందుకు సేవ చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు ఇంతకాలం భారీ మెజారిటీ రావడానికి, అసలు ఆయన విజయం సాధించడానికి అక్కడ చేర్పించిన దొంగ ఓట్లే కారణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫిర్యాదుతో కుప్పంలో చంద్రబాబు చేర్పించుకున్న దొంగ ఓట్లలో 33 వేలకు పైగా తొలగించారు. అందుకే ఓటమి తప్పదని చంద్రబాబు భయపడుతున్నారు. ఎన్నికల్లో తమ తడాఖా చూపిస్తామంటున్నారు అక్కడి బీసీ నేతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో కుప్పంలో అధికార పార్టీ బాగా బలం పుంజుకుంది. దీంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో నిరాశా నిస్పృహలు ఆవరించాయి. ఒకవైపు కేడర్లో నైరాశ్యం..బీసీ నేతల్లో పార్టీ అధినేత పట్ల ఆగ్రహం..ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత...మొత్తం కలిపి కుప్పంలో చంద్రబాబు కోట కూలడం ఖాయమనే టాక్ నడుస్తోంది. -
40 ఇయర్స్ ఇండస్ట్రీ భ్రమరావతి వర్సెస్ రియల్ సీఎం
ఏపీలో చిట్టచివరి నియోజకవర్గం, ఒక మూలకు విసిరేసినట్లు ఉండే కుప్పానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను చెప్పినట్లే తాగునీరు, సాగునీరు విడుదల చేశారు. ఇందుకు అవసరమైన కాల్వలను తవ్వించి, ఇతర ఏర్పాట్లు చేసి హంద్రీనీవా సుజల స్రవంతిలో భాగంగా నీటిని కుప్పం వరకు తీసుకువెళ్లగలిగారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, ముప్పైఐదేళ్లు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన చంద్రబాబు నాయుడు పూర్తి చేయలేని పనిని జగన్ చేసి చూపించారు. తద్వారా ఈ ప్రజల దాహార్తిని తీర్చే యత్నం చేశారు. అలాగే ఆరువేల ఎకరాలకు సాగు నీరు కూడా ఇవ్వడానికి సంకల్పించారు. ఇందుకోసం సుమారు అరు వందల కోట్ల రూపాయలను వ్యయం చేశారు. కుప్పంలో జరిగిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ "ఇంతకాలం చంద్రబాబును ఈ నియోజకవర్గ ప్రజలు భరించినందుకు జోహార్లు" అని వ్యంగ్య వ్యాఖ్య చేశారు. ఈ సభలో చంద్రబాబు టైమ్లో కుప్పంకు జరిగిన పనులు, తన హయాంలో జరిగిన కార్యక్రమాలను వివరించారు. ప్రత్యేకించి కుప్పం నియోజకవర్గ ప్రజలకు వివిధ స్కీముల ద్వారా 1400 కోట్ల మేర లబ్ది జరిగిన విషయాలను లెక్కలతో సహా వివరించారు. తాను ప్రాంతం, కులం, మతం, పార్టీ చూడకుండా, ఎలాంటి వివక్ష లేకుండా స్కీములు అమలు చేశానని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు తనపై కోపం వచ్చినప్పుడల్లా, పులివెందుల , కడప, రాయలసీమ ప్రజలను దూషిస్తుంటారని, తాను మాత్రం ఎప్పుడు అలా చేయలేదని ప్రజల మనసులను ఆకట్టుకునే యత్నం చేశారు.ఇంతవరకు ఒప్పుకోవలసిందే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుని వద్ద కాపు ఉద్యమకారులు రైలును దగ్దం చేస్తే, ఆ పని చేసింది కడప రౌడీలంటూ మీడియా సమావేశం పెట్టి ఆరోపించారు. కాని పోలీసులు అన్నిటిని విచారించి ఉభయ గోదావరి జిల్లాలకు చెందినవారిని అరెస్టు చేశారు. అలాగే ఆయన తనకు ఓటు వేయని వారికి తాను ఎందుకు సదుపాయాలు కల్పించాలని అనేవారు. తనకు ఓటు వేయకపోతే తాను వేసిన రోడ్డు, తాను మంజూరు చేసిన మరుగు దొడ్డి ఎలా వాడతారని చంద్రబాబు ప్రజలను ప్రశ్నించేవారు. కానీ జగన్ అందుకు విరుద్దంగా తనకు ఓటు వేసినా, వేయకపోయినా, తన ప్రభుత్వ స్కీములు ప్రాంతం, కులం, పార్టీ,మతం వంటివాటితో సంబంధం లేకుండా అమలు చేస్తున్నారు. కుప్పం ప్రజలు సైతం అందులో భాగమేనని, అందుకే మాట ఇచ్చిన ప్రకారం నీరు అందించానని, వివిధ అబివృద్ది పనులు చేపట్టానని సీఎం జగన్ చెప్పారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. కుప్పంలోని గ్రామీణ ప్రాంతంలో మీటింగ్ పెట్టినా భారీ ఎత్తున జనం రావడం, వారు ఆయా సమయాలలో అనుకూల నినాదాలతో హోరెత్తించడం కనిపించింది. దీంతో టిడిపి అధినేత కుప్పంలో తన పోటీపై గట్టిగా ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. కుప్పం ప్రజలు చంద్రబాబును ఇంతకాలం భరించినందుకు వారికి జోహార్లు అని జగన్ చమత్కరించారు. కుప్పం ఎమ్మెల్యేగా భరత్ను గెలిపిస్తే మంత్రిని చేస్తానని ఆయన హామీ ఇవ్వడం ద్వారా కుప్పం ప్రాముఖ్యత తగ్గదని ప్రజలకు ఆయన సంకేతం ఇచ్చారు. గత సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక ఎన్నికలలో YSRCP విజయఢంకా మోగించడం, కుప్పానికి నీరు, బలహీనవర్గాలకు ఇళ్ల పట్టాలు, ఇళ్లు, కుప్పం మున్సిపాలిటీగా మారడం, రెవెన్యూ డివిజన్ ఇవ్వడం వంటివి పార్టీకి ప్లస్ అవుతాయి. జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కుప్పంలో చంద్రబాబును ఓడించాలన్న పట్టుదలతో పనులు చేశారు. దాని ప్రభావం ఏ రకంగా ఉంటుందన్నది చర్చనీయాంశంగా ఉంది. ఇప్పటికైతే చంద్రబాబు గతంలో మాదిరి నల్లేరు మీద బండి మాదిరి ఎన్నిక చేసుకోలేకపోవచ్చని, తీవ్రమైన పోటీని ఎదుర్కోక తప్పదన్న విశ్లేషణలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు తన టైమ్ లో కుప్పం బ్రాంచ్ కెనాల్ ను పూర్తి చేయలేకపోవడం పెద్ద వైఫల్యంగా చెప్పాలి. హంద్రీ-నీవా ప్రాజెక్టు ప్రతిపాదన ఎన్.టి.ఆర్.టైమ్ లో వచ్చినా,దానిని ఆచరణ లో పెట్టింది వైఎస్ రాజశేఖరరెడ్డి. ఇప్పుడు ఈ ప్రాజెక్టు చివరిలో ఉన్న కుప్పంకు సైతం నీరు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. కుప్పం ప్రాంతానికి శాశ్వతంగా నీటి సమస్య తీర్చడానికి వీలుగా రెండు రిజర్వాయర్లను నిర్మించడానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ రకంగా కుప్పం ప్రజల అభిమానం పొందడానికి జగన్ యత్నించారు. కాగా చంద్రబాబు మాత్రం పులివెందుల ప్రజలను తరచుగా అవమానించేవారు. కుప్పంకు నీరు ఇవ్వడంపై చంద్రబాబు స్పందించిన తీరు కూడా సరిగా లేదు. నిజానికి ఆయన హర్షం వ్యక్తం చేసి ఉంటే హుందాగా ఉండేది. ఆ పని చేయకపోగా, కుప్పం ప్రజలను దోచుకున్నారంటూ, ఏదో హింస జరిగిందంటూ పిచ్చి ఆరోపణలను చంద్రబాబు చేసి తన విలువను మరింత తగ్గించుకున్నారు. పులివెందులలో పొలాలు ఎండిపోతున్నాయని అంటూ ఏవేవో మాట్లాడారు. రాయలసీమలో నీటి పారుదల ప్రాజెక్టులకు అదికంగా ఖర్చు చేసింది తానేనని ఆయన ప్రకటించుకున్నారు. పదమూడు శాతం పనులు కుప్పం బ్రాంచ్ కెనాల్ కు సంబంధించి మిగిలాయని, కాని జగన్ మొత్తం తానే చేసేసినట్లు చెప్పుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. అంతే తప్ప తాను పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పం కు ఎందుకు నీళ్లు తేలకపోయింది మాత్రం చెప్పలేకపోయారు. దీంతో ఆయన ఆత్మరక్షణలో పడ్డారు. కాకపోతే బుకాయింపులో దిట్ట కనుక యధాప్రకారం డబాయిస్తూ ప్రకటన చేశారు. దానిని ఈనాడు,ఆంధ్రజ్యోతి బాకా మీడియాలు ప్రచారం చేశాయి. ఈనాడు అయితే కుప్పంను తానే ఉద్దరించినట్లు జగన్ మాట్లాడడం విని స్థానికులు విస్మయం చెందుతున్నారని ఒక దిక్కుమాలిన కధనాన్ని ఇచ్చింది. కుప్పంకు 35 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు పద్నాలుగేళ్లు సీఎంగా ఉన్నప్పటికీ పట్టణాన్ని ఎందుకు మున్సిపాలిటీ చేయలేకపోయారు? ఎందుకు రెవెన్యూ డివిజన్ చేయలేకపోయారు? ఎందుకు 15వేలమందికి ఇళ్ళ స్థలాలు ఇవ్వలేకపోయారు? అసలు కుప్పంలో కొన్ని వార్డులకు వెళ్లడానికి సరైన రోడ్లే ఎందుకు లేవు? రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టి ఎందుకు పూర్తి చేయలేకపోయారు? కుప్పం కన్నా పులివెందుల ఎంత చక్కగా ఉంటుందో స్వయంగా ఎవరైనా వెళ్లి చూడవచ్చు. పులివెందుల చుట్టూ రోడ్డు, పరిశ్రమలు, పలు విద్యా సంస్థలు, మెడికల్ కాలేజీ మొదలైనవి ఏర్పాటు చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్మోహన్రెడ్డి కాదా? కుప్పంకు ఎయిర్ పోర్టు ఇస్తానని పిచ్చి ప్రకటనలు చేస్తున్న చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతంలో ఒక పరిశ్రమనైనా ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? వీటన్నిటిని కప్పిపుచ్చుతూ, జగన్ కుప్పం కు నీళ్లు ఇవ్వడాన్ని చూసి ఓర్వలేక ఈనాడు ఇలాంటి దద్దమ్మ వార్తలు ఇస్తోంది. చంద్రబాబు ఇంతకాలం దొంగ ఓట్లపై ఆధారపడి ఎక్కువ మెజార్టీ పొందగలిగారన్నది బహిరంగ రహస్యం. ప్రస్తుతం ఆ దొంగ ఓట్లను చాలావరకు తొలగించినట్లు చెబుతున్నారు. దాంతో ఇప్పుడు ఆయన తీవ్రమైన పోటీని ఎదుర్కునే పరిస్థితి ఏర్పడింది. అందుకే చంద్రబాబు ఎక్కువగా కంగారు పడుతున్నారు. దానికి తోడు జగన్ కుప్పంపై దృష్టి పెట్టి అభివృద్ది పనులు, సంక్షేమ స్కీములు అమలు చేశారు. కుప్పంకు నీరు కూడా వచ్చేలా చేశారు. ఇది YSRCPకి ప్లస్ గా మారే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టిడిపి మీడియాలు నీరు విడుదల చేసిన మరుసటి రోజు కాల్వలో నీరు లేదంటూ ఒక తప్పుడు కదనాన్ని వండి జనాన్ని ఏమార్చడానికి యత్నించారు. ఇంకా నీళ్లురాని కాల్వలో దిగి టిడిపి నేతలు యాగీ చేశారు. దీనిని బట్టే వారు ఎంత భయపడుతున్నదీ తెలుసుకోవచ్చు. గెలుపు ఓటములు సంగతి ఎలా ఉన్నా, జగన్ మాత్రం కచ్చితంగా తన రాజకీయ ప్రత్యర్ధి అని కూడా చూడకుండా, తన పార్టీకి ఓటు వేశారా? లేదా? అన్నదానితో నిమిత్తం లేకుండా కుప్పం ప్రజలకు కూడా మేలు చేశారన్నది నిజం. అందుకు ఎవరైనా అభినందించాల్సిందే. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు -
Fact Check: కుప్పం ప్ర'జల నవ్వుల'పై కుళ్లు రాతలు!
సాక్షి, తిరుపతి: ముప్పైఐదు ఏళ్లుగా తనను ఎన్నుకుంటున్న కుప్పం వాసుల కష్టాలను టీడీపీ అధినేత చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోకపోయినా కరువు సీమలో కనకధారలు కురిపించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కంకణం కట్టుకున్నారు. ప్రతిపక్ష నేత ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గానికి కేవలం 57 నెలల కాలంలోనే కృష్ణాజలాలను అందించి అక్కడి ప్రజల పెదవులపై చిరునవ్వులు చిందేలా చేశారు. దీనిని తట్టుకోలేని ఈనాడు రామోజీ కుళ్లు రాతలతో విషం చిమ్మారు. నవ్విపోదురుగాక.. నాకేటి సిగ్గు అన్నట్టు కుప్పం బ్రాంచ్ కాలువలో కృష్ణా జలాలు ప్రవహిస్తున్నా నీరు రాలేదంటూ కథనం ప్రచురించింది. నిస్సిగ్గుగా ‘కుప్పం ఫక్కున నవ్వింది’ అంటూ ఏడుపుగొట్టు రాతలు రాసి రాక్షసానందం పొందింది. నాటి లీలలు గుర్తున్నాయా బాబూ అండ్ రామోజీ! కుప్పానికి కృష్ణాజలాలు అందించే 207.800 కి.మీ కుప్పం బ్రాంచ్ కెనాల్ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ మీదుగా 123.641 కి.మీ ప్రవహించి కుప్పం పట్టణం సమీపంలో పరమసముద్రం దగ్గర కలుస్తుంది. ఈ పని అంచనా విలువ రూ.468.53 కోట్లుగా నిర్ణయించారు. రూ.460.881కోట్లతో చేపట్టేలా హైదరాబాద్కు చెందిన ఆర్కే హెచ్ఈఎస్–కోయా సంస్థతో 2016 జనవరి 4న అప్పటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ సీఎం అండ్ సీడీ పనులు చేపట్టకుండానే పనులు పూర్తయినట్టు చేతులు దులుపుకుంది. ప్రశ్నించాల్సిన అప్పటి ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థకు వంతపాడింది. నాడు ఏర్పాటు చేసిన పైప్లైన్కు ఎయిర్ రిలీఫ్ వాల్యూమ్లు, స్కోర్ ఛాంబర్లూ నాసిరకంవి అమర్చారు. 2019 ఫిబ్రవరిలో కుప్పం బ్రాంచ్ కెనాల్కు నీటిని విడుదల చేశారు. కానీ ఆ పైప్లైన్ పలు చోట్ల పూర్తిగా దెబ్బతినడంతో ప్రభుత్వం నీటి విడుదలను ఆపివేసింది. ప్రభుత్వ నిబంధల ప్రకారం కెనాల్ డిజైన్, ఎస్ఎల్ఆర్బీ, డీఎల్ఆర్బీ, పైప్ కల్వర్ట్ క్రాస్ వర్క్లు ప్రణాళికాబద్ధంగా చేయడకపోవడమే దీనికి ప్రధాన కారణమని తేలింది. దీంతోపాటు రోడ్డు క్రాసింగ్ వద్ద, డ్రెయినేజీ కాలువల వద్ద పైప్లైన్ పనుల్లో నాణ్యతాలోపం వల్ల నీరు కలుషితమైంది. ఇవేమీ గుర్తులేని బాబు, రామోజీ ఇప్పుడు ప్రజా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. జగన్ చెబితే చేస్తారంతే.. సీఎం జగన్ 2022 సెప్టెంబర్ 22న కుప్పంలో పర్యటించినప్పుడు బ్రాంచ్ కెనాల్ పనులపై స్థానికులు ఆయనకు ఫిర్యాదు చేశారు. దీంతో పెండింగ్ పనులు పూర్తిచేసి త్వరలో కృష్ణాజ లాలను తీసు కువస్తానని సీఎం మాట ఇచ్చారు. వెంటనే గత ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్ట్ కంపెనీకి పనులను రద్దు చేసి హైదరా బాద్కు చెందిన ప్రముఖ ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి పనులను అప్పగించింది. సాంకేతిక నిపుణుల కమిటీ సూచనల ప్రకారం గతంలో వేసిన నాసిరకం ఎయిర్ రిలీఫ్ వాల్యూ మ్ల స్థానంలో 500 ఎంఎం సామర్థ్యంగల ఎ యిర్ వాల్యూమ్లను ఏర్పాటు చేయాలని సూ చించింది. రోడ్డు క్రాసింగ్, డ్రెయి నేజ్, ప్రధాన కాలువలు వద్ద వేసే పైప్లైన్ పను లను నాణ్యంగా చేపట్టేలా పర్యవేక్షించి సకాలంలో పనులు పూర్తిచేసింది. శ్రీశైలం నుంచి 676 కి.మీ. పొడువున, 733 మీటర్ల ఎత్తులో 27 ప్రాంతాల్లో లిఫ్టింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. కృష్ణా జలాలతో నిండిన 2 చెరువులు మూడు రోజుల క్రితం కుప్పంలో పర్యటించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రామకుప్పం మండలం రాజుపేట వద్ద గేట్లు ఎత్తి కృష్ణా జలాలను విడుదల చేశారు. మరుసటి రోజు (మంగళవారం) శాంతిపురం మండలం వెంకటేష్పురం వద్ద ఉన్న శెట్టికుంట చెరువు నిండింది. అంతకు ముందే అధికారులు ట్రయల్ రన్లో భాగంగా నీటిని విడుదల చేశారు. సీఎం వైఎస్ జగన్ వచ్చాక అధికారికంగా నీటిని విడుదల చేశారు. అప్పటికే అధికారులు ట్రయల్ రన్ కోసం విడుదల చేసిన నీరు ఉండటంతో అదే రోజు సాయంత్రానికి రామకుప్పం మండలం దాటి శాంతిపురం మండలంలోకి కృష్ణా జలాలు ప్రవేశించాయి. గుండిశెట్టిపల్లి సమీపంలో ఉన్న వంతెన దాటి నీరు ముందుకు సాగింది. ఆ సమయంలో స్థానికులు పూజలు కూడా చేశారు. వెంకటేష్పురం వద్ద శెట్టివానిగుంట చెరువుకు ఉన్న పాయింట్ తెరిచి ఉండటంతో మంగళవారం మధ్యాహ్నానికి చెరువు కృష్ణా జలాలతో నిండిపోయింది. ఈ చెరువు నిండిపోయిందని, నీటిని మల్లించాలని స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. ఆ తరువాతే అధికారులు ఆ నీటిని రామకుప్పం మండలం మిట్టపల్లి వద్ద ఉన్న మద్దికుంట చెరువుకు మళ్లించారు. నీటిని మళ్లించటంతో ఆ కాలువపై నీటి ప్రవాహం ఉండదు. దీన్ని టీడీపీ, డ్రామోజీ, ఎల్లో మీడియా బూతద్దంలో చూపించటం ప్రారంభించాయి. కట్టుకథలు వల్లెవేశాయి. దీనిపై కుప్పం ప్రజలు మండిపడుతున్నారు. ఈనాడులో ప్రచురించిన కథనం పూర్తిగా సత్యదూరమని రాష్ట్ర జలవ నరులశాఖ పేర్కొంది. సీఎం గేటు ప్రారంభించిన ప్రాంతంలో తాత్కాలికంగా అమర్చిన స్విచ్లు, డెకరేషన్లనే తొలగించామంది. కృష్ణానీటితో 2 చెరువులు నిండాయని వెల్లడించింది. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన పనులు ఇలా.. ► పలమనేరు నియోజకవర్గం అప్పినపల్లి వద్ద 0 పాయింట్ నుంచి కుప్పం మండలం పరమసముద్రం వరకు సుమారు 124 కిమీ వరకు హంద్రీనీవా కాలువ తవ్వారు. ► 5.కి.మీ పశు పత్తురు వద్ద లిఫ్ట్ ఏర్పాటు.. 39వ కి.మీ. కృష్ణాపురం వద్ద లిఫ్ట్ ఏర్పాటు ► వి.కోట మండలం ఆదిరేపల్లి 54.కి.మీ. వద్ద లిఫ్ట్లు ► కుప్పం నియోజకవర్గంలో 110 చెరువులకు నీళ్ళు, 6500 ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చేలా పనులు ► 4 లక్షలు జనాభాకు తాగునీరు అందించేందుకు చర్యలు ► అనంతపురం జిల్లా చెర్లోపల్లి రిజర్వాయర్ 300 క్యూసెక్కుల నీరు హంద్రీనీవా కాలువలు ద్వారా తరలింపు -
కుప్పం నియోజకవర్గంలో కృష్ణమ్మ పరవళ్లు
-
కుప్పానికి జల కళ..పచ్చ బ్యాచ్ విల విల
-
కుప్పంలో కృష్ణమ్మ.. కృష్ణా జలాలను విడుదల చేసిన సీఎం జగన్
కుప్పం ప్రజలు చంద్రబాబుకు చాలా ఇచ్చారు. అలాంటి కుప్పానికి ఆయన చేసింది పెద్ద సున్నా. 35 ఏళ్లలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. పధ్నాలుగేళ్లు సీఎంగా, ఏడు సార్లు ఎమ్మెల్యేని చేసిన కుప్పం ప్రజలకే మంచి చేయని బాబుతో రాష్ట్రానికి ఏం ప్రయోజనం? ఆయన ఎలాంటి మనిషో చంద్రగిరి ప్రజలు ఎప్పడో తెలుసుకున్నారు. కుప్పానికి ఎవరి వల్ల మంచి జరిగిందో ఆలోచన చేయాలి. కుప్పానికి కృష్ణమ్మ నీళ్లను తీసుకొచ్చింది ఎవరంటే.. మీ జగన్. కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది మీ జగన్. కుప్పానికి రెవెన్యూ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది మీ జగనే. ‘‘చంద్రబాబుకు నామీద కోపం వచ్చినప్పుడల్లా పులివెందులను, కడపను తిడతాడు. చివరికి రాయలసీమను కూడా తిడుతూ ఉంటాడు. మీ జగన్ ఏనాడూ ఇక్కడి ప్రజల్ని గానీ, కుప్పం నియోజకవర్గాన్నిగానీ ఒక్క మాట కూడా అనలేదు. పులివెందుల, కుప్పం, అమరావతి, ఇచ్చాపురం.. ఏ ప్రాంతమైనా సరే పేదలను పేదలుగానే చూశాం. కుప్పం నియోజకవర్గంలో 82,039 కుటుంబాలకు (93.29 శాతం) నవరత్నాల పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాం. కులమతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. – సీఎం జగన్ సాక్షి, తిరుపతి: కనీసం సొంత నియోజకవర్గానికైనా మేలు చేయని రాజకీయ నాయకుడు ఇక రాష్ట్రానికి ఏం ఒరగబెడతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు 35 ఏళ్లలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను సైతం పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. కుప్పానికే ప్రయోజనం లేని ఆ నాయకుడి వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ బాగా ఆలోచన చేయాలని సూచించారు. కరువు తాండవమాడిన కుప్పం నేలకు కృష్ణా జలాలను తరలిస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ తాగు, సాగునీటి కోసం దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ ముఖ్యమంత్రి జగన్ కుప్పం నియోజకవర్గానికి సోమవారం కృష్ణా జలాలను విడుదల చేశారు. కుప్పం పరిధిలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీటితోపాటు కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని 4.02 లక్షల మందికి తాగునీరు అందిస్తూ అనంత వెంకటరెడ్డి హంద్రీ–నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ.560.29 కోట్లతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను సీఎం జగన్ వాయువేగంతో పూర్తి చేశారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. అనంతరం శాంతిపురం మండలం గుండుశెట్టిపల్లె వద్ద జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. మాట నిలబెట్టుకుంటున్నా.. కొండలు, గుట్టలు దాటుకుని ఏకంగా 672 కి.మీ. దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది. ఏకంగా 540 మీటర్ల ఎత్తు అంటే 1,600 అడుగుల ఎత్తు పైకెక్కి కృష్ణమ్మ మన కుప్పంలోకి బిరబిరా వచ్చింది. 2022 సెప్టెంబర్ 23న ఇదే కుప్పంలో బహిరంగ సభ సందర్భంగా నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తామని, కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను పూర్తి చేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా. మరో మూడు ప్రాజెక్టులకు శ్రీకారం కుప్పానికి కృష్ణా జలాలను తీసుకురావడమే కాకుండా ఇక్కడ మరో రెండు ప్రాజెక్టుల పనులకు కూడా శ్రీకారం చుట్టేలా పరిపాలన అనుమతులిచ్చాం. కుప్పంలో రెండుచోట్ల రిజర్వాయర్ల నిర్మాణానికి అనువుగా ఉన్నట్లు గుర్తించాం. గుడుపల్లి మండలంలోని యామగానిపల్లె వద్ద ఒక రిజర్వాయర్ను, శాంతిపురం మండలం మాదనపల్లె వద్ద మరో రిజర్వాయర్ను రూ.535 కోట్లతో నిర్మించడం ద్వారా అదనంగా మరో 5 వేల ఎకరాలకు తాగు, సాగునీరు అందించేందుకు మనందరి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటికి పరిపాలన అనుమతులు ఇప్పటికే మంజూరు చేశాం. పాలారు ప్రాజెక్టుకు సంబంధించి 0.6 టీఎంసీల కెపాసిటీతో చిన్నపాటి రిజర్వాయర్ను రూ.215 కోట్లతో నిర్మించేందుకు కూడా పరిపాలన అనుమతులు మంజూరు చేశాం. వచ్చే టర్మ్లో ఈ మూడు ప్రాజెక్టులూ పూర్తి చేసి మీబిడ్డ మీకు అందిస్తాడు. ముడుపులపై రీసెర్చ్ కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు 2015లో జలవనరుల శాఖ పరిపాలన అనుమతులు మంజూరు చేస్తే చంద్రబాబు అంచనాలను అమాంతం రూ.561 కోట్లకు పెంచేసి తన పార్టీ వారికి, బినామీలకు అప్పజెప్పాడు. నీళ్లు పారే కాలువగా కాకుండా తన జేబులో నిధులు పారించే కాలువగా మార్చుకున్నారు. ఎంత ముడుపులు పుచ్చుకోవాలనే అంశంపైనే చంద్రబాబు రీసెర్చ్ చేశారు. తన నియోజకవర్గ ప్రజలనే దోచుకుని కనీసం దాహార్తి తీర్చని నాయకుడిని ఇంతకాలం భరించిన కుప్పం ప్రజల సహనానికి, మంచితనానికి జోహార్లు చెబుతున్నా. మీకు మేలు చేసిందెవరు..? 35 ఏళ్లు ఎమ్మెల్యేగా, 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు వల్ల కుప్పానికి మంచి జరిగిందా? లేక మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం 57 నెలల వ్యవధిలో కుప్పానికి మేలు జరిగిందా? అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. చంద్రబాబు హెరిటేజ్ కోసం మూసివేసిన చిత్తూరు డెయిరీని తెరిపించడమే కాకుండా అమూల్ను తెచ్చి కుప్పం, పలమనేరు పాడి రైతులందరికీ గిట్టుబాటు ధర అందించింది ఎవరంటే మీ జగన్. ప్రతిష్టాత్మక వెల్లూర్ సీఎంసీ మెడికల్ కాలేజీని చిత్తూరు జిల్లాకు రాకుండా, కుప్పం, పలమనేరు ప్రజలకు అందుబాటులో లేకుండా చేసింది ఎవరంటే చంద్రబాబు, ఈనాడు రామోజీరావు వియ్యంకుడు, చంద్రబాబు పార్టనర్. ఆ కాలేజీని చిత్తూరులో పునఃప్రారంభించేలా చేసింది ఎవరంటే మీ జగన్. కుప్పంలో మరో రెండు విద్యుత్తు సబ్ స్టేషన్లు, ఇంటిగ్రేటెడ్ ఆఫీసు కాంప్లెక్సులు నిర్మిస్తోంది ఎవరంటే మీ జగన్. కుప్పం మున్సిపాలిటీకి రూ.66 కోట్లు ఇచ్చి పనులు చేయిస్తోంది ఎవరంటే మీ జగన్. బాబుకు ఓటేసిన పేదలూ నావాళ్లే కుప్పంలో చంద్రబాబుకు ఓటేసిన పేదలందరికీ ఓ మాట చెబుతున్నా. మీరందరూ నావాళ్లే అని భావిస్తూ మీకు మంచి చేశా. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 87,941 కుటుంబాలుంటే నవరత్నాల పథకాలను ఏకంగా 82,039 కుటుంబాలు (93.29 శాతం) అందుకున్నాయి. మనసున్న పాలన అంటే ఇది కాదా? 2019 జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా డీబీటీతో నేరుగా రూ.2.55 లక్షల కోట్లు పేదల ఖాతాల్లోకి జమ చేస్తే ఒక్క కుప్పం నియోజకవర్గంలోని నా అక్కచెల్లెమ్మలకు రూ.1,400 కోట్లు అందచేశాం. భరత్ను ఎన్నుకోండి.. గుండెల్లో పెట్టుకుంటా బలహీన వర్గాలకు చెందిన భరత్ను ఎమ్మెల్సీగా చేసి కుప్పానికి ఐదేళ్లలో మంచి చేశాం. భరత్ను కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి. నా కేబినెట్లో మంత్రిగా స్థానం ఇస్తా. గుండెల్లో పెట్టుకుంటా. తన ద్వారా కుప్పం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందిస్తామని మాట ఇస్తున్నా. మీలో ప్రతి ఒక్కరూ మీకు జరిగిన మంచిని వివరిస్తూ ఇంకో వంద మందితో మనకు ఓటు వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని విన్నవిస్తున్నా. ‘కుప్పానికి మాటిచ్చా .. నిలబెట్టుకున్నా’ సీఎం వైఎస్ జగన్ ‘కుప్పం నియోజకవర్గానికి నీరందించే గొప్ప కార్యక్రమాన్ని నేడు మన ప్రభుత్వంలో నిర్వహించాం’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ‘హంద్రీనీవా సుజల స్రవంతిలో భాగంగా 672 కి.మీ. దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కృష్ణా నది నీటిని కుప్పానికి తీసుకొచ్చాం. 2022 సెపె్టంబర్ 23న కుప్పంలో మాట్లాడుతూ ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకొస్తానని మాటిచ్చాను. నేడు ఆ మాట నిలబెట్టుకున్నాను’ అని సీఎం జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్లో సోమవారం ట్వీట్ చేశారు. బ్యాంకు స్టేట్మెంట్లే సాక్ష్యం కుప్పంలో ప్రతి పేద కుటుంబాన్నీ అడుగుతున్నా. మీ బ్యాంకులకు వెళ్లి గత పదేళ్ల అకౌంట్ స్టేట్మెంట్ తీసుకోండి. చంద్రబాబు హయాంలో ఐదేళ్లు, మీ బిడ్డ వచ్చాక ఐదేళ్లు కలిపి మొత్తం పదేళ్ల స్టేట్మెంట్ను పరిశీలించండి. చంద్రబాబు పాలనలో మీ బ్యాంకు ఖాతాల్లోకి కనీసం ఒక్క రూపాయైనా వచ్చిందేమో చూడాలని కోరుతున్నా. మీ బిడ్డ గత 57 నెలలుగా నవరత్నాలతో అందించిన సాయాన్ని చూడండి. చంద్రబాబు ఎంత అన్యాయస్తుడంటే ఇచ్చే అరకొర సొమ్మును కూడా తన నియోజకవర్గంలో తనవారు, కానివారు అని ఎలా విభజించారో ఇవాళ ప్రతి పథకంలో పెరిగిన లబ్ధిదారులను చూస్తే అర్థం అవుతుంది. ► చంద్రబాబు హయాంలో అరకొరగా రూ.1,000 ఫించన్ కుప్పంలో కేవలం 31 వేల మందికి మాత్రమే ఇచ్చారు. ఇవాళ ఏకంగా 45,374 మంది ఇదే కుప్పంలో పెన్షన్లు తీసుకుంటున్నారు. నాడు రూ.200 కోట్లూ సరిగ్గా ఇవ్వని పరిస్థితుల నుంచి ఈరోజు రూ.507 కోట్లు మీ బిడ్డ ప్రభుత్వం ఇస్తోంది. ► ఒక్క కుప్పంలోనే 44,640 మంది రైతన్నలకు వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ఏకంగా రూ.214 కోట్లు పెట్టుబడి సాయంగా అందచేశాం. ఇవాళ కుప్పంలో 83 ఆర్బీకేలు, 93 గ్రామ, వార్డు సచివాలయాలు, 76 విలేజ్ క్లినిక్స్ ఏర్పాటయ్యాయి. దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు లభించాయి. ► చంద్రబాబు డ్వాక్రా రుణమాఫీ పేరుతో అక్క చెల్లెమ్మలను దగా చేస్తే మనందరి ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా ద్వారా ఆదుకుంది. పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రూ.26 వేల కోట్లు పొదుపు సంఘాల మహిళలకు ఇవ్వగా ఒక్క కుప్పంలోనే 44,888 మంది అక్కచెల్లెమ్మలకు రూ.172 కోట్లు అందించాం. బాబు సున్నావడ్డీని ఎగ్గొడితే మన ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు మరో రూ.30 కోట్లు ఇచ్చింది. అమ్మ ఒడి ద్వారా కుప్పంలో 35,951 మంది తల్లులకు రూ.155 కోట్లు అందచేశాం. ► కుప్పంలో చంద్రబాబు పాలనలో అందించిన ఇళ్ల పట్టాలు సున్నా. మీ బిడ్డ ప్రభుత్వం కుప్పంలో ఇప్పటికే 15,721 ఇళ్ల పట్టాలు ఇచ్చింది. మరో 15 వేలకుపైగా ఇళ్ల పట్టాలు కూడా నెల తిరగకుండానే ఇవ్వబోతున్నాం. మొత్తం 30 వేలకుపైగా ఇళ్ల పట్టాలు ఇవ్వగలుగుతున్నాం. చంద్రబాబు హయాంలో కుప్పంలో పేదలకు మంజూరు చేసిన ఇళ్లు 3,547 కాగా కట్టింది కేవలం 2,968 మాత్రమే. అదే మీ బిడ్డ ప్రభుత్వం 7,898 ఇళ్లు మంజూరు చేసి ఇప్పటికే 4,871 ఇళ్లను పూర్తి చేసింది. ► వైఎస్సార్ చేయూత ద్వారా కుప్పంలో 19,921 మంది కుటుంబాల ఖాతాల్లోకి ఇప్పటికే రూ.85 కోట్లు జమ చేశాం. ► నాడు కుప్పంలో 7,002 మందికి ఆరోగ్యశ్రీతో రూ.28 కోట్లు విదిలిస్తే మన ప్రభుత్వం ఆరోగ్యశ్రీని 3,350 ప్రొసీజర్లకు విస్తరించి ఆరోగ్య ఆసరా కూడా అందిస్తూ 17,552 మందికి రూ.64 కోట్ల మేర మేలు చేసింది. ► బాబు హయాంలో అరకొర ఫీజు రీయింబర్స్మెంట్ కింద 8,459 మందికి రూ.27 కోట్లు ఇస్తే.. మనందరి ప్రభుత్వం వంద శాతం రీయింబర్స్మెంట్తో 12,093 మందికి విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా చెల్లించిన సొమ్ము రూ.61 కోట్లు. బీసీల సీటు బాబు కబ్జా చంద్రగిరిలో చంద్రబాబును 1983లోనే ఏకంగా 17 వేల ఓట్లతో ప్రజలు ఓడగొట్టారు. తర్వాత ఇక్కడ (కుప్పం) ధనబలం చూపిస్తూ వలస వచ్చారు. బీసీల సీటును కబ్జా చేశారు. కుప్పం ప్రజలు చంద్రబాబుకు 35 ఏళ్లుగా చాలా ఇచ్చారు. కానీ కుప్పానికి ఆయన ఏమిచ్చారో ప్రతి ఒక్కరూ నిలదీయాలి. సొంత నియోజకవర్గానికే మంచి చేయని ఆ మనిషి 75 ఏళ్ల వయసు వచ్చాక మరో నలుగురితో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి దిగుతున్నాడు. రాష్ట్రంలో ఏ గ్రామానికైనా వెళ్లి ఫలానా మంచి చేశానని చెప్పలేడు. పొత్తులు, దత్తపుత్రుడితో ప్యాకేజీ గురించి తలుపులు బిగించుకొని మాట్లాడతారు. కాపులకు మీరు చేసిన మంచి ఏమిటి బాబూ? వంగవీటి రంగా హత్యకు పురిగొల్పింది మీరే కదా? కుప్పంలో జన జాతర సాక్షి, తిరుపతి: కుప్పంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అపూర్వ ఆదరణ లభించింది. దశాబ్దాల కల నెరవేర్చడం పట్ల జనం నీరాజనం పలికారు. కుప్పానికి కృష్ణా జలాలను విడుదల చేసేందుకు సీఎం వైఎస్ జగన్ సోమవారం రామకుప్పం మండలం రాజుపేట సమీపంలోని కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్దకు వస్తున్నారని తెలుసుకుని పరిసర ప్రాంతాల రైతులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాలువ పొడవునా జగన్కు జేజేలు పలికారు. పలమనేరు, కుప్పం నియోజక వర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనంతో శాంతిపురం మండలం గుండశెట్టిపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ ప్రాంతం నిండిపోయింది. సీఎం వైఎస్ జగన్ హెలిపాడ్ నుంచి బస్సులో కూర్చొని దారిపొడవునా జనానాకి అభివాదం చేస్తూ బహిరంగ సభ ప్రాంగణానికి వచ్చారు. జగన్కు దారిపొడవునా పూలు చల్లుతూ జనం ఘనంగా స్వాగతం పలికారు. నృత్యాలు చేస్తూ.. ఈలలేస్తూ, చప్పట్లు కొడుతూ.. వైఎస్ జగన్ ఫ్లెక్సీలు చేత పట్టుకుని జై జగన్ అంటూ నినాదాలు చేశారు. 35 ఏళ్లుగా చంద్రబాబు కుప్పం ప్రజల ఓట్లతో గెలుస్తూ.. కుప్పం ప్రజలకు చేస్తున్న అన్యాయం, మోసం గురించి సీఎం జగన్ వివరిస్తున్న సమయంలో జనం పెద్ద ఎత్తున ఈలలు వేస్తూ.. నిజమే.. నిజమే.. అని అరస్తూ కనిపించారు. 2022 సెప్టెంబర్ 23న కుప్పంకు వచ్చిన సమయంలో తాను ఇచ్చిన మాట ప్రకారం కృష్ణా జలాలను తీసుకొచ్చానని చెప్పటంతో ‘మళ్లీ సీఎం మీరే’ అంటూ హర్షం వ్యక్తం చేశారు. మరో మూడు రిజర్వాయర్లు నిర్మించేందుకు పరిపాలన అనుమతులు ఇస్తున్నట్లు ప్రకటించటం పట్ల, చంద్రబాబు 35 ఏళ్లుగా చేయలేని కుప్పం రెవెన్యూ డివిజన్, మున్సిపాలిటీ, డీఎస్పీ డివిజన్ ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించిన సమయంలో జనం మరింత బిగ్గరగా కృతజ్ఞతలు తెలిపారు. నమ్మలేక పోతున్నాం మా గ్రామాల మీదుగా కృష్ణా జలాలు ప్రవహిస్తాయని ఇప్పటి వరకు ఊహించలేదు. నీటి ప్రవాహన్ని చూస్తుంటే నమ్మలేక పోతున్నాం. హంద్రీ–నీవా కాలువలో నీళ్లు చూస్తుంటే చెప్పలేని ఆనందం కలుగుతోంది. కరువు కాటకాలతో ‡బతుకుతున్న మా జీవితాల్లో సీఎం జగన్మోహన్రెడ్డి వెలుగులు నింపారు. జగనన్న రుణం ఎన్ని జన్మలెత్తిన్నా తీర్చుకోలేనిది. తాగడానికి నీళ్లతో పాటు వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు బతుకు కల్పించారు. – చంద్రశేఖర్, పెద్దబళ్దార్, రామకుప్పం మండలం వైఎస్సార్సీపీని గెలిపిస్తాం రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తున్న జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం. ప్రతిపక్ష నేత నియోజకవర్గమైనా రూ.250 కోట్లతో కాలువ పనులు పూర్తిచేసి కుప్పం ప్రజలకు నీళ్లు ఇచ్చిన దేవుడు జగన్. సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదుగుదలకు సహాయం చేస్తున్నారు. ఇలాంటి మంచి నాయకుడిని మళ్లీ సీఎం చేసుకోవడం అందరి బాధ్యత. భరత్ను గెలిపించుకుంటాం. – సుబ్రమణ్యం, రామకుప్పం మండలం రుణం తీర్చుకుంటాం 40 ఏళ్ల మా కలను నెరవేర్చిన మ్యుమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రుణం తీర్చుకునేందుకు కుప్పం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మేము చిన్నప్పటి నుంచి ఈ నీళ్ల కోసం ఎదురు చూస్తున్నాం. ఇన్నాళ్లకు మా కోరిక నెరవేరింది. మంచి చేసిన వారిని ఆదరించడమే కుప్పం ప్రజలకు తెలుసు. తాగు, సాగునీటి సమస్య తీర్చిన సీఎం జగన్ను మరవలేం. – గురుస్వామి, వెదురుగుట్టపల్లి, శాంతిపురం మండలం -
సీఎం జగన్ కుప్పం బహిరంగ సభ డ్రోన్ విజువల్స్
-
ఇక్కడ ఏమీ చేయని బాబు.. ఎమ్మెల్యేగా అర్హుడేనా?
-
కుప్పం ప్రజలకు తాగు, సాగునీటి కష్టాలు లేకుండా చూడాలన్నదే సీఎం జగన్ లక్ష్యం
-
సీమను తిట్టే బాబు కావాలా? కుప్పంలో సీఎం జగన్ పంచులు
సాక్షి, కుప్పం/శాంతిపురం: కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది మీ బిడ్డ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కుప్పానికి 35ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ఏం చేశాడని సీఎం జగన్ ప్రశ్నించారు. ప్రజల గురించి, పేద వాడి గురించి ఆలోచన చేసే మీ బిడ్డ మార్క్ రాజకీయం కావాలా? లేక మోసం చేసే చంద్రబాబు కావాలా? అని ముఖ్యమంత్రి జగన్ కుప్పం ప్రజలను అడిగారు. సీఎం జగన్ పంచ్ కామెంట్స్.. కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది మీ జగన్ కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్ చంద్రబాబును ఇంతకాలం భరించిన కుప్పం ప్రజల సహనానికి జోహార్లు. చిత్తూరు పాల డెయిరీని పున:ప్రారంభించింది మీ జగన్. కుప్పం ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూశాం. ►చంద్రబాబుకు నా మీద కోపం వచ్చినప్పుడల్లా కొన్ని మాటలు వస్తుంటాయి. పులివెందులను, కడపను తిడతాడు. చివరికి రాయలసీమను కూడా తిడుతూ ఉంటాడు. కానీ, అందుకు భిన్నంగా మీ జగన్ ఏనాడూ కూడా ఇక్కడి ప్రజల్ని గానీ, కుప్పం నియోజకవర్గాన్ని కానీ ఒక్క మాట అనలేదు. పైగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని మంచి చేస్తున్నది మీ బిడ్డ. ►చంద్రబాబు ఎంత అన్యాయస్తుడంటే ఇచ్చే అరకొర సొమ్ముకూడా తన నియోజకవర్గంలో కూడా తనవారు, తనకు కాని వారు అని ఎలా విభజించాడో నేను చెప్పిన ప్రతి పథకంలో పెరిగిన లబ్ధిదారులను చూస్తే అందరికీ అర్థం అవుతుంది. ఈ పెద్దమనిషి బీసీలు ఎక్కువగా ఉన్న ఇక్కడ, తన ధనబలం చూపిస్తూ ఈ నియోజకవర్గానికి వచ్చి బీసీల సీటు కబ్జా చేసి 35 ఏళ్లుగా రాజ్యం ఏలుతున్నాడు. ►కనీసం ఇక్కడ సొంత ఇళ్లు అయినా కట్టుకున్నాడా? ఆయన ఎమ్మెల్యేగా గెలవడం కోసం మీతో పని కావాలి. కానీ ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని ఆలోచన కూడా ఏరోజూ రాలేదంటే ఈ మనిషి మీ మీద చూపిస్తున్న ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకోవాలి. ►సొంత నియోజకవర్గానికే మంచి చేయని ఈ మనిషి 75 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మరో నలుగురితో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి దిగుతున్నాడు. పొత్తులెందుకు అని అడిగితే మాట్లాడడు. మీ పేరు చెబితే ఒక్క మంచి పని అయినా ఉందా? ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడిగితే మాట్లాడడు. ఏ గ్రామం మధ్య అయినా నిలబడి ఈ గ్రామంలో నా మార్క్ ఫలానా మంచి చేశాను అని చెప్పగలడా అంటే అదీ మాట్లాడడు. ►ప్రజల గురించి, పేద వాడి గురించి ఆలోచన చేసే మీ బిడ్డ మార్క్ రాజకీయం కావాలా? లేకపోతే ఎన్నికల్లో మిమ్మల్ని ఉపయోగించుకొని తర్వాత గాలికి వదిలేసే రాజకీయం చంద్రబాబు చేస్తున్నది కావాలా? ►14 సంవత్సరాలు తాను చేసింది ఏంటంటే ఒక పెద్ద సున్నా కనిపిస్తుంది. ఎన్నికలు వచ్చే సరికే ప్రజల్ని వెన్నుపోటు పొడవడం కోసం, మోసం చేయడం కోసం రంగులతో మేనిఫెస్టో తెస్తాడు. ప్రతీ ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు కొనిస్తానంటాడు. కేవలం అవసరానికి వాడుకుని వదిలేసే చంద్రబాబు ఎందుకు?’ అని వ్యాఖ్యలు చేశారు. -
ప్రత్యర్థి శిబిరంతో సీఎం జగన్ చెడుగుడు
సాధారణంగా రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రత్యర్థికి చెందిన నియోజకవర్గంలో పర్యటించేందుకు పెద్దగా ఇష్టపడరు. ఎంతసేపూ తమకు చెల్లుబాటు అయ్యే ప్రాంతాలు, తమకు ఆదరాభిమానాలు మెండుగా ఉండే చోట్లకు మాత్రమే వెళ్లేందుకు ఇష్టపడతారు. పైగా వైరిపక్షమన్న పేరుతో ఆయా నియోజకవర్గాలకు పనులు చేయని సందర్భాలూ గతంలో కోకొల్లలు. రాజకీయ వైరి అయిన నాయకుడి ఇలాకాలోకి వెళ్ళడానికి ఇష్టపడరు.. ఎందుకంటే అక్కడి ప్రజల అప్పటికే తన ప్రత్యర్థిని తమ నాయకుడిగా ఎన్నుకుని ఆదరించారని, తాను ఇప్పుడు అక్కడికి వెళ్లినా తనను అక్కడి ప్రజలు ఆత్మీయంగా రిసీవ్ చేసుకోరని, పైగా ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకుల నుంచి తిరస్కారం.. వ్యతిరేకత వంటి అనుభవాలు ఎదురయ్యే ప్రమాదం ఉందన్న సందేహంతో అక్కడికి వెళ్లరు. వెళ్లినా ఎక్కువసేపు అక్కడ గడపడానికి ఇష్టపడరు.. ఇలా వెళ్లి అలా సేఫ్గా వచ్చేద్దాం అనుకుంటారు.. అయితే ఇప్పుడు రాజకీయం మారిపోయింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా రాజకీయ ప్రత్యర్థి బాబు ఇలాకాలోనే సింహనాదం చేశారు. చంద్రబాబును 1989 నుంచి వరుసగా గెలిపిస్తూ వస్తున్న కుప్పంలో కాసేపటి క్రితం పర్యటించారు. హంద్రీ నివా కాలువ ద్వారా కుప్పానికి సాగు నీరుతోబాటు నాలుగైదు లక్షలమందికి తాగునీరు అందించే ప్రాజెక్టును ప్రారంభించారు. అంతేకాకుండా ఆ తరువాత అయన సుదీర్ఘంగా అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గత 35 ఏళ్లుగా చంద్రబాబును గెలిపిస్తున్న ప్రజలను చంద్రబాబు ఏ విధంగా వాడుకుని వదిలేశారు..? వాళ్ళను ఎలా మోసం చేస్తూ వచ్చింది అన్నది పూసగుచ్చినట్లు జగన్ వివరించారు.. కుప్పాన్ని తమ ప్రభుత్వం వచ్చాక ఏ విధంగా అభివృద్ధి చేసిందీ... అప్పట్లో కేవలం పంచాయతీగా ఉన్న కుప్పాన్ని తామే మున్సిపాలిటీగా,, రెవెన్యూ డివిజన్ కేంద్రంగా.. పోలీస్ డివిజన్ కేంద్రంగా అప్ గ్రేడ్ చేసిన విషయాన్నీ అయన వివరించారు. అంతేకాకుండా బాబు హయాంలో ప్రాజక్టుల పనులను చంద్రబాబు , అయన అనుచరులు ఏ విధంగా వాడుకుని లబ్ది పొందినది చెబుతూనే తాము వచ్చాక పథకాలు, సంక్షేమం ఇంటింటికీ ఎలా అందిస్తున్నది ప్రతి పాయింటునూ వివరించారు. జగనన్న ఇళ్ళు, పెన్షన్లు, ఉద్యోగాలు, ఉపాధి వ్యవసాయం, రైతుభరోసా కేంద్రాలు... చిత్తూరు డైరీ ఇలా ప్రతి అంశంలోనూ తన ప్రభుత్వ పనితీరును, దాని ద్వారా లబ్ధిపొందిన విధానాన్ని లెక్కలతో వివరించారు. తాను చంద్రబాబు మాదిరిగా తనవాళ్లకు మాత్రమే ప్రయోజనం కలిగించే నాయకుడిని కాదని, ఇచ్చాపురం నుంచి కుప్పం వరకూ అందర్నీ సమదృష్టితో చూస్తూ అందరికీ ప్రభుత్వ సేవలు, పథకాలు అందిస్తాం అని చెబుతూ వారి నుంచి చప్పట్ల రూపంలో మద్దతు పొందారు. అంతేకాకుండా మీ నియోజకవర్గానికి ఏమీ ఉపయోగపడని చంద్రబాబును ఇన్నేళ్లు మోసిన ప్రజలకు జోహార్లు అనడం ద్వారా మీరంతా ఇలాంటి పనికిరాని నాయకుడిని ఇన్నాళ్లూ ఎలా మోశారబ్బా అనే ప్రశ్న కూడా వేసినట్లయింది. ఇక ఆయన్ను వదిలించుకోవాలని, సమర్ధుడైన భరత్ను గెలిపించుకుని కుప్పాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు తోడ్పడాలని కోరారు. భరత్ గెలిస్తే ఆయనకు మంత్రిపదవి ఇస్తామని హామీ ఇవ్వడం ద్వారా కుప్పాన్ని తన సొంత ప్రాంతంగా భావిస్తానని చెప్పేసారు. తాను ఎన్నడూ కుప్పం ప్రజలను పల్లెత్తు మాట అనలేదు కానీ చంద్రబాబు మాత్రం నిత్యం రాయలసీమతోబాటు పులివెందుల ప్రజలను చిన్నచూపు చూస్తూ కించపరుస్తుంటారు అని గుర్తు చేసారు.. అలా చెప్పడం ద్వారా 'చూసారా... అయన మన ప్రాంతాన్ని ఎలా అవమానిస్తున్నారో' అని ప్రజలకు గుర్తు చేసారు.. ఫైనల్ గా జగన్ కుప్పంలో అడుగుపెట్టి అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూనే చంద్రబాబును కడిగిపారేశారు. :::సిమ్మాదిరప్పన్న -
కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది మీ జగన్
-
చంద్రబాబు హయంలో లాభాలు ఉన్న పనులు మాత్రమే చేశారు
-
కుప్పం ప్రజల సాక్షిగా బాబుకు బుల్లెట్ దింపిన భరత్
-
Watch Live : కుప్పంకు కృష్ణా జలాలిచ్చిన సీఎం జగన్
కుప్పంకు కృష్ణా జలాలు అందాయి. తాగు, సాగునీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కుప్పం ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ... కరువు తాండవమాడిన కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తానన్న మాట నిలబెట్టుకుంటూ... సీఎం జగన్ కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి విడుదల చేశారు. అనంతరం చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండలం రాజుపేట గ్రామంలో బహిరంగసభలో పాల్గొన్నారు. కుప్పం నియోజవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయుకట్టుకు సాగునీరు, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 4.02 లక్షల జనాభాకు త్రాగునీరు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. అనంత వెంకటరెడ్డి హంద్రీ–నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ.560.29 కోట్ల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తిచేశామని తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్రెడ్డి ప్రసంగం మీ చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ఆప్యాయతలు, ప్రేమానురాగాలు చూపిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, తాతకూ, ప్రతి సోదరుడికీ, స్నేహితుడికీ ముందుగా రెండు చేతులూ జోడించి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. దేవుడి దయతో ప్రజలందరిక చల్లని దీవెనలతో ఈరోజు మన కుప్పంలో మరో మంచి కార్యక్రమం జరుపుకొంటున్నాం. ఈ కుప్పం నియోజకవర్గానికి నీళ్లందించే ఒక గొప్ప కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో ఈరోజు జరుపుకొంటున్నాం. కొండలు, గుట్టలు దాటుకొని ఏకంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా సుజల శ్రవంతిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది. ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు, ఎక్కడ కుప్పం? 672 కిలోమీటర్ల దూరంలో ఉండి 540 మీటర్ల ఎత్తు అంటే 1600 అడుగుల ఎత్తు.. పైకెక్కి ఈరోజు కృష్ణమ్మ మన కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది. 2022, సెప్టెంబర్ 23న ఇదే కుప్పం నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభకు.. ఆరోజునేను హాజరైనప్పుడు ఆనాడు మీ అందరికీ ఒక మాటిచ్చాను. చంద్రబాబు హయాంలో లాభాలున్న పనులు మాత్రమే చేసి, దోచేసుకొని ఆ తర్వాత ఆపేసిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు మనమే పూర్తి చేస్తామని, కృష్ణా జలాలు తరలిస్తామని, కుప్పం నియోజకవర్గానికి ఆ నీళ్లు తెస్తామని ఆ నాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని కుప్పానికి ఈరోజు కృష్ణా జలాలు తీసుకురాగలిగానని సగర్వంగా తెలియజేస్తున్నా. కృష్ణా జలాలను తీసుకు రావడమే కాకుండా మరో రెండు ప్రాజెక్టులను కూడా మరింత స్టోరేజీ క్రియేట్ చేస్తూ మరో రెండు రిజర్వాయర్ల ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు కూడా శ్రీకారం చుట్టే దిశగా దానికి కూడా పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది. దాదాపు 6300 ఎకరాలకు సాగునీరు అందిస్తూ, కుప్పం నియోజకవర్గం, పలమనేరు నియోజకవర్గాల్లో 110 చెరువులు నింపుతూ ఇప్పటికే అడుగులు పూర్తి కావచ్చాయి. ఈరోజు మరింత స్టోరేజీ క్రియేట్ చేస్తూ కుప్పం నియోజకవర్గంలో 1 టీఎంసీ సామర్థ్యంతో అన్ని కోణాల్లోనూ పరిశీలన, సర్వే అండ్ లెవలింగ్ ఆపరేషన్స్ పూర్తి చేసి రెండు చోట్ల రిజర్వాయర్ల నిర్మాణానికి అనువుగా ఉందని గుర్తించడం జరిగింది. గుడిపల్లి మండలంలోని యామగానిపల్లె వద్ద ఒక రిజర్వాయర్, శాంతిపురం మండలం మాదనపల్లె వద్ద మరో రిజర్వాయర్ ను 535 కోట్లతో నిర్మించడానికి, అదనంగా దీని వల్ల మరో 5 వేల ఎకరాలకు తాగు, సాగు నీరు అందించేందుకు మనందరి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పరిపాలన అనుమతులు కూడా ఇవ్వడం జరిగిపోయింది. ఈ 2 ప్రాజెక్టులే కాకుండా రాబోయే రోజుల్లో మరో ముఖ్యమైన ప్రాజెక్టు పాలారు ప్రాజెక్టుకు సంబంధించి .6 టీఎంసీల కెపాసిటీతో చిన్నపాటి రిజర్వాయర్ కట్టి 215 కోట్లతో కట్టడానికి కూడా పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది. కుప్పం నియోజకవర్గానికి మీ బిడ్డ నీళ్లు తెచ్చాడు. వచ్చే టర్మ్ లో ఈ మూడు ప్రాజెక్టులూ పూర్తి చేసి మీకు అందిస్తాడు. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రబాబు.. మీరందరూ చూశారు. కొత్త కాదు. 14 ఏళ్లు ఈ పెద్దమనిషి సీఎంగా కూడా చేశాడు. మూడుసార్లు సీఎం అయ్యాడు. 35 సంవత్సరాల్లో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయాడంటే, కుప్పానికే నీరు తీసుకొనిరాలేదు అంటే, కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడి వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా బాగా ఆలోచన చేయాలి. చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఎలా జరిగాయో మీ అందరికీ తెలుసు. దాన్ని నీరుపారే కాల్వగా కాకుండా తన జేబులో నిధులు పారే కాలువగా మార్చుకున్న పరిస్థితులు కనిపిస్తాయి. ఈ కాంట్రాక్టును తనకు భారీ వాటా ఇచ్చేవారిలో ఎవరికి ఇవ్వాలి, అంచనాలు ఎలా పెంచాలి, మట్టి పనులు ఎలా పెంచుకోవాలి, ఇలా ఎంత ముడుపులు పుచ్చుకోవాలనే అంశంపైనే చంద్రబాబు రీసెర్చ్ చేశాడు. ఇక్కడి ప్రజలకు గానీ, పక్కనే ఉన్న పలమనేరులో ఉన్న 2 లక్షలమంది ప్రజలకు గానీ వీరికి మంచి నీళ్లు ఎలా అందించాలి, సాగునీరు ఎలా అందించాలన్న అంశంపై కనీసం ఆయన దృష్టి కూడా లేదంటే ఆలోచన చేయమని అడుగుతున్నా. కుప్పం, పలమనేరు ప్రజలు కలలుగన్న ఈ స్వప్నాన్ని పూర్తిచేసింది ఈరోజు చిత్తశుద్ధి చూపించింది మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వపడుతున్నా. ఇదే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు 2015లో జలవనరుల శాఖ పరిపాలన అనుమతులు మంజూరు చేసిన తర్వాత 2015 నుంచి 2018 మధ్యలో రకరకాల కారణాలు చూపిన చంద్రబాబు.. అంచనాలను అమాంతం పెంచుకుంటూ పోయాడు. 561 కోట్లకు పెంచుకుంటూ తనకు కావాల్సిన కాంట్రాక్టర్లకు, తన పార్టీ వారికి, బినామీలకు పనులు అప్పజెప్పాడు. 2019 ఎన్నికలకు ముందు పనులు పూర్తిచేయకపోగా, లాభాలు వచ్చే పనులు మాత్రమే చేసి మిగిలిన ముఖ్యమైన పనులు వదిలేసి తన అస్మదీయ కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు సొమ్ములు ఇచ్చాడు చంద్రబాబు. కుప్పం, పలమనేరులో 4 లక్షల ప్రజలకు నీరందే కాలవ కాకుండా చంద్రబాబు జేబులోకి నిధులు పారే కాలువగా ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ ను తన సొంత నియోజకవర్గాన్ని కూడా ఉపయోగపెట్టుకున్నాడంటే ఇంతకన్నా అన్యాయమైన వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తాడా? ఇంత అన్యాయపు నాయకుడిని, తన నియోజకవర్గ ప్రజల్నే దోచుకున్న నాయకుడిని, దాహార్తిని కూడా తీర్చని ఈ నాయకుడిని, ఇంతకాలం భరించిన ఈ కుప్పం ప్రజలందరికీ మీ సహనానికి, మీ మంచితనానికి నా జోహార్లు చెబుతున్నా. ఎవరి వల్ల కుప్పానికి మేలు జరిగిందో ఆలోచన చేయాలి. 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉంటూ, 14 సంవత్సరాలు సీఎంగా పరిపాలన చేసిన చంద్రబాబు వల్ల కుప్పానికి మంచి జరిగిందా? కేవలం 58 నెలలు మాత్రమే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పానికి మేలు జరిగిందా? ఆలోచన చేయాలి. కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది ఎవరంటే మీ జగన్ కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీజగన్ చంద్రబాబు తన హెరిటేజ్ డెయిరీ లాభాల కోసం మూసేయించిన చిత్తూరు డెయిరీని తెరిపించడమే కాకుండా అమూల్ ను తీసుకొచ్చి ఇదే కుప్పం, ఇదే పలమనేరు పాడి రైతులందరికీ గిట్టుబాటు ధరను అందించే ఏర్పాటు చేసింది ఎవరంటే మీ జగన్. ఇదే చిత్తూరు జిల్లాకు ఈ జిల్లా ప్రజలకు అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ అయిన వెల్లూర్ సీఎంసీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ రాకుండా చిత్తూరు జిల్లాకు రాకుండా కుప్పం ప్రజలకు అందుబాటులోకి రాకుండా, పలమనేరు ప్రజలకు రాకుండా చేసింది ఎవరంటే చంద్రబాబు, ఈనాడు రామోజీరావు వియ్యంకుడు, చంద్రబాబు పార్టనర్. వీళ్లిద్దరూ కలిసి ఆ కాలేజీ నిర్మాణం ముందుకు తీసుకెళ్లకపోతే మళ్లీ ఆ కాలేజీని చిత్తూరులో పున:ప్రారంభించేట్టటుగా చేసింది ఎవరంటే మీ జగన్. కుప్పంలో మరో రెండు విద్యత్తు సబ్ స్టేషన్లు నిర్మించింది ఎవరంటే మీ జగన్. కుప్పంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీసు కాంప్లెక్సులు నిర్మిస్తోంది ఎవరంటే మీ జగన్. కుప్పం మున్సిపాలిటీకి 66 కోట్లు ఇచ్చి పనులు జరిగిస్తున్నది ఎవరంటే మీ జగన్. చంద్రబాబుకు నా మీద కోపం వచ్చినప్పుడల్లా కొన్ని మాటలు వస్తుంటాయి. పులివెందులను, కడపను తిడతాడు. చివరికి రాయలసీమను కూడా తిడుతూ ఉంటాడు. కానీ అందుకు భిన్నంగా మీ జగన్ ఏనాడూ కూడా ఇక్కడి ప్రజల్ని గానీ, కుప్పం నియోజకవర్గాన్ని కానీ ఏనాడూ మీ జగన్ ఒక్క మాట అనలేదు. పైగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని మంచి చేస్తున్నది మీ బిడ్డ. పులివెందులలో ఉన్నా, కుప్పంలో ఉన్నా, అమరావతిలో ఉన్నా, ఇచ్చాపురంలో ఉన్నా.. పేదల్ని పేదలుగా చూశామే తప్ప వారి కులం, వారి మతం, ప్రాంతం, చివరికి వారి పార్టీ కూడా చూడకుండా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటేసిన కుప్పంలో ఉన్న పేదలందరికీ ఓ మాట చెబుతున్నా.. మీరందరూ నావాళ్లే. బాబుకు మించి ప్రతి విషయంలోనూ కూడా ఇక్కడి ప్రజలకు మనసు చూపాం. మంచి చేశాం. ఇదే కుప్పాన్ని తీసుకోండి. నేను చెప్పే ఈ అంశాలన్నా ఒక్కసారి టైమ్ తీసుకొని ఆలోచన చేయండి. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 87,941 కుటుంబాలుంటే ఈ 57 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో మన ప్రభుత్వ పథకాలు, నవరత్నాలు అందుకున్న కుటుంబాలు.. అక్షరాలా ఏకంగా 82,039. అంటే 93.29 శాతం కుటుంబాలు మన ప్రభుత్వ పథకాలు అందుకున్నారు. మన నవరత్నాలు అందుకున్నారు. మన మనసున్న పాలన అంటే ఇదీ కాదా? అని అడుతున్నా. మనందరి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2019 జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా డీబీటీ ద్వారా లంచాలు, వివక్ష లేకుండా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి రూ.2.55 లక్షల కోట్లు నేరుగా వెళ్లింది. ఇందులో కుప్పం నియోజకవర్గంలోని నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేసిన మొత్తం అక్షరాలా 1400 కోట్లు. కుప్పంలో ఉన్న ప్రతి పేద కుటుంబాన్నీ అడుగుతున్నా. ఇక్కడున్న మిమ్మల్నందరినీ అడుగుతున్నా. మీ బ్యాంకులకు మీరు వెళ్లండి. 10 సంవత్సరాల మీ బ్యాంకు అకౌంట్ స్టేట్ మెంట్ కావాలని అడగండి. చంద్రబాబు 5 సంవత్సరాల పరిపాలకు సంబంధించింది, ఈ 5 సంవత్సరాలు మీ బిడ్డ పాలనకు సంబంధించినది అడగండి. మీ బ్యాంకు ఖాతాల్లో గతంలో చంద్రబాబు హయాంలో కనీసం ఒక్క రూపాయి అయినా మీ బ్యాంకు అకౌంట్లలోకి వచ్చిందా? చూసుకోమని అడుగుతున్నా. అదే మీ బిడ్డ ప్రభుత్వం ఈ 57 నెలల కాలంలోనే నవరత్నాల పాలనలో మీ ఖాతాలకు అందించిన సాయాన్ని అదే మీ బ్యాంక్ స్టేట్ మెంట్ లో చూడండి. ఎన్ని లక్షలు మీరు అందుకున్నారో కనిపిస్తుంది. మరి ఎవరిది మనసున్న పాలన? ఎవరికది పేదల ప్రభుత్వం అన్నది ఆలోచన చేయమని అడుగుతున్నా. గతంలో మాదిరిగా ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. క్యూల్లో నిలబడాల్సిన పని లేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా మీ ఇంటికే వచ్చి వాలంటీర్లు చిక్కటి చిరునవ్వుతో పలకరిస్తూ మీ ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ నెల నెలా ఇచ్చే పెన్షన్ నే తీసుకుంటే చంద్రబాబు హయాంలో వాలంటీర్ వ్యవస్థే లేదు. అరకొర పెన్షన్ రూ.1000 కుప్పంలో కేవలం 31 వేల మందికి ఇచ్చిన పరిస్థితులు. మీ బిడ్డ ప్రభుత్వంలో 57 నెలల్లో ఏకంగా 1000 పెన్షన్ ను 3 వేలకు పెంచింది మీ బిడ్డ ప్రభుత్వమే. గతంలో 30 వేల మందికి ఇస్తుంటే మీ బిడ్డ హయాంలో ఏకంగా 45374 మంది ఇదే కుప్పంలో పెన్షన్లు తీసుకుంటున్నారు. చంద్రబాబు 5 సంవత్సరాల్లో మీ బిడ్డ ఈ 57 నెలల కాలం గమనిస్తే చంద్రబాబు హయాంలో 200 కోట్లు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితుల నుంచి ఈరోజు ఏకంగా 507 కోట్లు నా అవ్వాతాతలకు, వికలాంగ సోదరులకు, అక్కచెల్లెమ్మలకు, వింతువులకు ఈరోజు మీ బిడ్డ ఇస్తున్నాడు. మనందరి ప్రభుత్వంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతు భరోసాగా ఒక్క కుప్పంలోనే ఏకంగా 44,640 మంది రైతన్నలకు రైతు భరోసా పథకం ద్వారా ఏకంగా రూ.214 కోట్లు నేరుగా ఇవ్వడం జరిగింది. చంద్రబాబు హయాంలో రైతన్నలకు ఇలా రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఏరోజూ జరగలేదు. రైతు భరోసానే లేదు. ఒక రైతు భరోసా కేంద్రం కూడా లేదు. మన గ్రామ స్థాయిలో ఆర్బీకేలు ఏకంగా 83 మన కుప్పంలోనే కనిపిస్తాయి. కుప్పంలో ప్రతి గ్రామంలో ఒక విలేజ్ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్లు 93 కనిపిస్తాయి. వాలంటీర్ వ్యవస్థ, ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్. ఏకంగా 76 విలేజ్ క్లినిక్స్ కుప్పం నియోజకవర్గంలోనే కనిపిస్తున్నాయి. ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే సచివాలయాల్లో పని చేస్తున్న మన పిల్లలు 942 మంది. ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్ లు వీటిలో పని చేస్తున్న పిల్లలు మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నారు. ఇవన్నీ గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జరగలేదు కేవలం 57 నెలల మీ బిడ్డ పాలనలోనే జరుగుతోంది. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రుణాలన్నీ కూడా మొదటి సంతకంతోనే మాఫీ చేస్తానని చంద్రబాబు దగా చేస్తే, 2016 అక్టోబర్ నుంచి సున్నా వడ్డీ పథకాన్ని కూడా రద్దు చేశాడు. అక్కచెల్లెమ్మల జీవితాలు చిన్నాభిన్నమైన పరిస్థితి గతంలో ఉంటే మనందరి ప్రభుత్వం వైయస్సార్ ఆసరా కింద రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల కోట్లు ఇస్తే, ఒక్క కుప్పంలోనే అక్షరాలా 44,888 మంది అక్కచెల్లెమ్మలకు 172 కోట్లు ఇచ్చాం. మనందరి ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం కింద నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది మరో 30 కోట్లు. దీని వల్ల 6055 సంఘాలకు మంచి జరిగిస్తూ 59662 మంది అక్కచెల్లెమ్మలకు మరో 30 కోట్లు ఇచ్చి తోడుగా నిలబడింది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే. చంద్రబాబు హయాంలో చదివించే తల్లులకు అమ్మ ఒడి అనే స్కీమే లేదు. మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న అమ్మ ఒడి ద్వారా కుప్పం నియోజకవర్గంలో చదివించే తల్లులు 35951 మందిని ప్రోత్సహిస్తూ ఇచ్చినది అక్షరాలా రూ.155 కోట్లు. కుప్పంలో 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు పాలనలో అందించిన ఇళ్ల పట్టాలు ఓ సున్నా. అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 57 నెలల కాలంలోనే కుప్పం నియోజకవర్గంలోనే ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఇప్పటికే 15721 పట్టాలిచ్చాం. ఈనెలలోనే మరో 15 వేల ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వబోతున్నాం. మీ బిడ్డ జగనన్న ప్రభుత్వంలో నా అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ మొత్తం 30755 ఇళ్ల పట్టాలు ఇవ్వగలుగుతున్నాం. బాబు హయాంలో కుప్పంలో ఇళ్లు మంజూరు చేసింది పేదలకు కేవలం 3547 మాత్రమే. అందులో కట్టింది కేవలం 2968 మాత్రమే. అదే మీ బిడ్డ ప్రభుత్వంలో అక్షరాలా 7898 ఇళ్లు మంజూరు చేసి వాటిలో ఇప్పటికే 4871 ఇళ్లు పూర్తి చేశాం. చంద్రబాబు హయాంలో 45-60 సంవత్సరాల మధ్య వయసున్న అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారత కోసం ఆయన చేసింది ఒక సున్నా. మీ బిడ్డ హయాంలో ఈ 45-60 సంవత్సరాల అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ వైయస్సార్ చేయూత ద్వారా కుప్పంలో ఏకంగా 19921 మందికి మంచి జరిగిస్తూ వారి కుటుంబాల ఖాతాల్లోకి పంపింది 85 కోట్లు. వైద్య ఆరోగ్య రంగాన్ని చూసుకోండి. నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీని.. పునర్జీవింపజేసి కుప్పంలో కొత్త 108, 104 వాహనాలు కుయ్ కుయ్ కుయ్ అని తిరుగుతున్నాయంటే కేవలం మీ అన్న పాలనలోనే. ఆరోగ్య ఆసరా, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలు అమలవుతున్నాయంటే మనసున్న మన పాలనలోనే జరుగుతున్నాయి. చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీ పేరు మార్చి నిర్వీర్యం చేసి ఎన్టీఆర్ వైద్య సేవ అని మార్చాడు. కుప్పంలో 7002 మందికి అందించిన సాయం 28 కోట్లు అయితే, మీ బిడ్డ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని మెరుగుపర్చి 1000 ప్రొసీజర్లను 3350కి తీసుకుపోయి విస్తరింపజేసి, ఆరోగ్య ఆసరా కూడా ఇస్తూ వీటి ద్వారా ఏకంగా కుప్పంలోనే 17552 మందికి మంచి జరిగిస్తూ 64 కోట్లు నేరుగా ఇచ్చాం. పేదవాడి కోసం, పిల్లల చదువుల కోసం బాబు ఏరోజూ ఆరాటపడలేదు. అరకొర ఫీజు రీయింబర్స్ మెంట్ కింద కేవలం 8459 మందికి మాత్రమే రూ.27 కోట్లు. మనందరి ప్రభుత్వం 57 నెలల కాలంలోనే ప్రతి పిల్లాడికీ 100 శాతం పూర్తి ఫీజురీయింబర్ష్ మెంట్ ఇస్తూ 12093 మందికి విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా చెల్లించిన సొమ్ము అక్షరాలా రూ.61 కోట్లు. చంద్రబాబు ఎంత అన్యాయస్తుడంటే ఇచ్చే అరకొర సొమ్ముకూడా తన నియోజకవర్గంలో కూడా తనవారు, తనకు కాని వారు అని ఎలా విభజించాడో నేను చెప్పిన ప్రతి పథకంలో పెరిగిన లబ్ధిదారులను చూస్తే అందరికీ అర్థం అవుతుంది. ఈ ప్రయోజనాలు మన ప్రభుత్వ హయాంలో ఈ మాదిరిగా పెంచి ప్రతి ఒక్కరికీ జల్లెడ పడుతూ ఏ ఒక్కరికీ మిస్ కాకుండా ఇస్తూ ప్రతి గ్రామ సచివాలయంలో లబ్ధిదారుల జాబితా పెట్టడం జరిగింది. ఇంత పారదర్శకంగా ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా ప్రతి పేదవాడికీ అందుతున్న పరిస్థితులు మన గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి ఒక్కరికీ కనిపిస్తాయి. సొంత నియోజకవర్గంలోనే పేదలకు మంచి చేయని ఈ వ్యక్తి 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మూడు సార్లు 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నా కూడా కుప్పం నియోజకవర్గ ప్రజలకే ఎలాంటి మేలు జరగలేదంటే ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా, కుప్పం నియోజకవర్గానికి అర్హుడేనా? ఆలోచన చేయండి. బాబు ఎలాంటి వాడో తెలుసుకున్న చంద్రగిరి ప్రజలు.. చంద్రగిరిలో ఎమ్మెల్యేగా మంత్రిగా పని చేసి పోటీ చేస్తే 1983లోనే ఏకంగా 17 వేల ఓట్లతో ప్రజలు ఓడగొట్టారు. ఆ తర్వాత ఈ పెద్దమనిషి బీసీలు ఎక్కువగా ఉన్న ఇక్కడ, తన ధనబలం చూపిస్తూ ఈ నియోజకవర్గానికి వచ్చి బీసీల సీటు కబ్జా చేసి 35 ఏళ్లుగా రాజ్యం ఏలుతున్నాడు. కనీసం ఇక్కడ ఒక ఇల్లయినా కట్టుకున్నాడా? ఆయన ఎమ్మెల్యేగా గెలవడం కోసం మీతో పని కావాలి. కానీ ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని ఆలోచన కూడా ఏరోజూ రాలేదంటే ఈ మనిషి మీ మీద చూపిస్తున్న ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకోవాలి. కుప్పం ప్రజలు చంద్రబాబుకు 35 సంవత్సరాలుగా చాలా ఇచ్చారు. కానీ కుప్పానికి బాబు ఏమిచ్చాడో నిలదీయాల్సిన అవసరం ఉంది. సొంత నియోజకవర్గానికే మంచి చేయని ఈ మనిషి 75 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మరో నలుగురితో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి దిగుతున్నాడు. పొత్తులెందుకు అని అడిగితే మాట్లాడడు. మీ పేరు చెబితే ఒక్క మంచైనా ఉందా? ఒక్క స్కీమైనా ఉందా అని అడిగితే మాట్లాడడు. ఏ గ్రామం మధ్య అయినా నిలబడి ఈ గ్రామంలో నా మార్క్ ఫలానా మంచి చేశాను అని చెప్పగలడా అంటే అదీ మాట్లాడడు. సామాజికవర్గాలకు మీరు చేసిన న్యాయం ఏంటని అడిగితే చివరకు కుప్పంలో కూడా బీసీ ఎమ్మెల్యేను పెట్టని తీరు చూస్తే సామాజిక న్యాయం ఎక్కడ చేశారని అడిగితే అదీ మాట్లాడడు. పేద ఇంటికి వెళ్దాం. ప్రతి పేద ఇంట్లోనూ అడుగుదాం. 14 ఏళ్లు మీరు చేసిన మంచి ఏంటో ఆ ఇంటికి కనీసం ఒక్క రూపాయి అయినా మీరు ఇచ్చారా అని గట్టిగా నిలదీస్తే అదీ మాట్లాడడు. పొత్తుల గురించి మాట్లాడతాడు. ఎవరితో అంటే దత్తపుత్రుడితో మాట్లాడతాడు. ఏ విషయం మాట్లాడతాడంటే తలుపులు బిగించుకొని ప్యాకేజీ ఎంత అని మాట్లాడతాడు. పోనీ కాపులకు మీరు చేసిన మంచి ఏమిటి? వంగవీటి రంగాను హత్య చేయించింది మీరే కదా.. అందుకే మిమ్మల్ని వారంతా వర్గ శత్రువుగా భావిస్తున్నారని అడిగితే దానికి కూడా మాట్లాడడు. ఇదీ బాబు మార్క్ రాజకీయం. చంద్రబాబు మార్క్ రాజకీయం ఇది. వంచన, మోసం, కుట్ర, వెన్నుపోటు. కుప్పం ప్రజలకు కూడా మంచి చేశానని చెప్పే పరిస్థితి లేకపోవడం బాబు మార్క్ రాజకీయం అయితే, కుప్పంలో గత ఎన్నికల్లో బాబుమీద గెలవలేకపోయినా కూడా మీలో ఒకరిని, బలహీనవర్గాల ప్రతినిధిగా భరత్ ను ఎమ్మెల్సీగా చేసి, అతడిని ముందు పెట్టి ఇక్కడి పేద కుటుంబాలన్నింటికీ కూడా చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ప్రతి కుటుంబానికీ మంచి చేయడం మీ జగన్ మార్క్ రాజకీయం అని చెప్పడానికి గర్వపడుతున్నా. భరత్ ను, మన బలహీనవర్గాలకు చెందిన నాయకుడిని, మీ వాడిని ప్రతినిధిగా చేసి ఆయన 2019లో గెలవలేకపోయినా ఎమ్మెల్సీగా చేసి కుప్పానికి 5 సంవత్సరాల్లో మంచి చేశాం. భరత్ ను కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి. నా కేబినెట్ లో మంత్రిగా స్థానం ఇస్తాను. నా గుండెల్లో పెట్టుకుంటాను. తన ద్వారా కుప్పం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి, సంక్షేమం చేస్తానని మాట ఇస్తున్నా. ఏ మార్క్ రాజకీయం కావాలి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ప్రజల గురించి, పేద వాడి గురించి ఆలోచన చేసే మీ బిడ్డ మార్క్ రాజకీయం కావాలా? లేకపోతే ఎన్నికల్లో మిమ్మల్ని ఉపయోగించుకొని తర్వాత గాలికి వదిలేసే రాజకీయం చంద్రబాబు చేస్తున్నది కావాలా? 14 సంవత్సరాలు తాను చేసింది ఏంటంటే ఒక పెద్ద సున్నా కనిపిస్తుంది. ఎన్నికలు వచ్చే సరికే ప్రజల్ని వెన్నుపోటు పొడవడం కోసం, మోసం చేయడం కోసం రంగులతో మేనిఫెస్టో తెస్తాడు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు కొనిస్తానంటాడు. ఏరోజైనా ఏ మంచీ చేయని ఈ వ్యక్తి రంగు రంగుల మేనిఫెస్టోతో ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నాడో ఈ వ్యక్తిని నమ్మగలమా. 57 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం చూశారు. ప్రతి ఇంటికీ జరిగిన మంచి చూశారు. పేదవాడి భవిష్యత్ కోసం మీ బిడ్డ పడుతున్న తాపత్రయం చూశారు. మీ బిడ్డను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటే పేదవాడి బతుకు బాగుపడుతుంది. పేదవాడి భవిష్యత్ బాగుపడుతుంది. మీలో ప్రతి ఒక్కరూ మంచి జరిగిన ప్రతి విషయం కూడా ఇంకో వంద మందితో చెప్పి ఓటు వేయించే కార్యక్రమానికి అందరూ పూనుకోవాలని విన్నవిస్తున్నా. దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, మీ అందరికీ ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. -
కొండలు ధాటి కోనలు దాటి... ఈ రోజు కుప్పం చరిత్రలో నిలిచిపోతుంది
-
కుప్పంలో కృష్ణ జలాలను విడుదల చేసిన సీఎం జగన్
-
కుప్పంలో సీఎం జగన్ క్రేజ్
-
కుప్పానికి ‘కృష్ణా’ జలాలు
సాక్షి, అమరావతి: కుప్పం నియోజకవర్గ ప్రజలకు 2022, సెప్టెంబరు 23న ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ–నీవా కాలువల మీదుగా కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా ఇప్పటికే కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలానికి చేరుకున్నాయి. కృష్ణమ్మ స్పర్శతో దుర్భిక్ష కుప్పం పరవశించిపోతోంది. కుప్పం బ్రాంచ్ కెనాల్లో 68.466 కిమీ వద్ద క్రాస్ రెగ్యులేటర్ (రామకుప్పం మండలం రాజుపాలెం వద్ద) నుంచి మద్దికుంటచెరువు (2.91 ఎంసీఎఫ్టీ), నాగసముద్రం చెరువు (0.25 ఎంసీఎఫ్టీ), మనేంద్రం చెరువు (13.78 ఎంసీఎఫ్టీ), తొట్లచెరువు (33.02 ఎంసీఎప్టీ)లకు సోమవారం సీఎం జగన్ కృష్ణాజలాలను విడుదల చేసి, జాతికి అంకితం చేయనున్నారు. ఆ తర్వాత మిగతా 106 చెరువులకు కృష్ణాజలాలను విడుదల చేసి.. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరు అందించనున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్ తమకు సాగు, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారని ఆ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గత 57 నెలలుగా నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారనడానికి కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తే తార్కాణమని ప్రశంసిస్తున్నారు. అంచనాల్లోనే బాబు వంచన.. జలయజ్ఞంలో భాగంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ను చేపట్టి.. సాగు, తాగునీరు అందిస్తానని కుప్పం ప్రజలకు 2015లో అప్పటి సీఎం చంద్రబాబు నమ్మబలికారు. హంద్రీ–నీవాలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్లో చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం అప్పినపల్లి (207.8 కిమీ వద్ద) నుంచి రోజుకు 216 క్యూసెక్కులను మూడు దశల్లో ఎత్తిపోసి.. 123.641 కిమీల పొడవున తవ్వే కాలువ ద్వారా తరలించి, 110 చెరువులను నింపడం ద్వారా కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరు అందిస్తామని ప్రకటించారు. రాజకీయ భిక్ష పెట్టిన పురిటిగడ్డకు నీళ్లందించే పథకంలోనూ చంద్రబాబు దోపిడీకి తెరతీశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ను 123.641 కిమీల పొడవున తవ్వేందుకు మట్టి, కాంక్రీట్ పనులకు రూ.203.11 కోట్లు వ్యయం అవుతుంది. మూడు పంప్హౌస్ల నిర్మాణం, మోటార్లు, ప్రెజర్మైన్లు, విద్యుత్ సరఫరా ఏర్పాటుకు రూ.90 కోట్ల వ్యయం అవుతుంది. ఈ లెక్కన 2015–16 ధరల ప్రకారం ఈ పనుల విలువ రూ.293.11 కోట్లు. ఆ మేరకు జలవనరుల శాఖ అధికారులు 2015, మేలో అంచనాలు రూపొందించారు. కానీ.. చంద్రబాబు ఒత్తిడితో పనుల అంచనా వ్యయాన్ని రూ.413 కోట్లకు పెంచేశారు. అంటే.. టెండర్ల దశలోనే రూ.120 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. బినామీతో కలిసి యథేచ్ఛగా దోపీడీ.. ఇక కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను అప్పటి కడపజిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్. శ్రీనివాసరెడ్డికి చెందిన ఆర్కే ఇన్ఫ్రాకు కట్టబెట్టి ఆ రూ.120 కోట్లు కాజేయడానికి చంద్రబాబు స్కెచ్వేసి 2015, ఆగస్టులో టెండర్లు పిలిచారు. ఆర్కే ఇన్ఫ్రా సంస్థకే పనులు దక్కేలా టెండర్లులో నిబంధనలు రూపొందించారు. దాంతో టెండర్లలో ఆ సంస్థ ఒక్కటే నాలుగు శాతం అధిక (ఎక్సెస్) ధరకు కోట్చేస్తూ షెడ్యూలు దాఖలు చేసింది. నిబంధనల ప్రకారం సింగిల్ బిడ్ దాఖలైతే ఆ టెండర్ను రద్దుచేయాలి. కానీ.. చంద్రబాబు ఒత్తిడి మేరకు ఆ టెండర్ను ఆమోదించి రూ.430.26 కోట్ల పనులను ఆర్కే ఇన్ఫ్రాకు కట్టబెట్టారు. మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద ఆర్కే ఇన్ఫ్రాకు రూ.43 కోట్లు ఇచ్చేలా చక్రం తిప్పిన చంద్రబాబు.. వాటిని ఎవరి జేబులో వేసుకున్నారన్నది బహిరంగ రహస్యమే. ఇక ఈ పనులను శ్రీనివాసరెడ్డికి కట్టబెట్టడంపై చంద్రబాబు బినామీ సీఎం రమేష్ అలకబూనారు. దీంతో50 శాతం పనులను సీఎం రమే‹Ùకు చెందిన రితి్వక్ ప్రాజెక్ట్స్కు సబ్ కాంట్రాక్టు కింద అప్పగించారు. కానీ.. ఆ తర్వాత శ్రీనివాసరెడ్డిని వెళ్లగొట్టి మొత్తం పనులను సీఎం రమే‹Ùకు చంద్రబాబు కట్టబెట్టారు. కానీ, రమేష్ మట్టి తవ్వకం పనులను సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చేసి భారీగా లబ్ధిపొందారు. దోచేసిన సొమ్ములో చంద్రబాబుకు ఎప్పటికప్పుడు వాటాలు పంపారని అప్పట్లో టీడీపీ వర్గాలే కోడై కూశాయి. చెప్పారంటే చేస్తాడంతే.. వరుసగా ఏడుసార్లు గెలిపించిన కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు అడ్డగోలుగా దోచేసి అభివృద్ధికి ఆమడదూరంలో నిలిపారు. కానీ, వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఈ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కుప్పంను మున్సిపాల్టీని చేయడంతోపాటు దీని కేంద్రంగా రెవెన్యూ డివిజన్ను, పోలీసు సబ్ డివిజన్ను ఏర్పాటుచేశారు. రూ.66 కోట్లతో రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. ఈ నేపథ్యంలో.. 2022, సెపె్టంబరు 23న కుప్పంలో సీఎం జగన్ పర్యటించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ను పూర్తిచేసి.. కృష్ణా జలాలను అందించి సుభిక్షం చేస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే ఆ పనులను 2023, డిసెంబరు 15 నాటికే పూర్తిచేయించారు. పుంగనూరు బ్రాంచ్ కెనాల్ నుంచి మూడు దశల్లో కుప్పం బ్రాంచ్ కెనాల్కు కృష్ణా జలాలను ఎత్తిపోయడం 2023, డిసెంబర్ 18న ప్రారంభించారు. పాలార్ రిజర్వాయర్కు శ్రీకారం.. కుప్పం నియోజకవర్గాన్ని సుభిక్షం చేయడమే లక్ష్యంగా కుప్పం మండలం గణేశ్వరపురం వద్ద పాలార్ నదిపై 0.6 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. రూ.214.81 కోట్లతో పాలార్ రిజర్వాయర్ పనులు చేపట్టేందుకు శుక్రవారం పరిపాలనా అనుమతినిస్తూ జీఓ జారీచేశారు. ఇందులో రిజర్వాయర్ నిర్మాణానికి సర్వే, డీపీఆర్ తయారీకి రూ.0.432 కోట్లు.. ముంపునకు గురయ్యే 90 ఎకరాల భూసేకరణకు, 258 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కలి్పంచడానికి, 357.06 ఎకరాల అటవీ భూమికి పరిహారం చెల్లించడానికి రూ.47.878 కోట్లు కేటాయించారు. దీంతోపాటు.. కుప్పం బ్రాంచ్ కెనాల్లో అంతర్భాగంగా గుడిపల్లి మండలం యామిగానిపల్లి వద్ద 0.710 టీఎంసీల సామర్థ్యంతో ఓ రిజర్వాయర్ నిర్మించి 2,500 ఎకరాలకు నీళ్లందించడం.. శాంతిపురం మండలం మాదనపల్లి వద్ద 0.354 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించి 2,500 ఎకరాలకు నీళ్లందించే పనులు చేపట్టడానికి రూ.535.435 కోట్లతో పరిపాలనా అనుమతి ఇచ్చారు. ఇందుకు సంబంధించిన జీఓ–100ను ఆదివారం రాత్రి జారీచేశారు. వాస్తవానికి.. పాలార్ రిజర్వాయర్కూ చంద్రబాబు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఇది పూర్తయితే కుప్పంలో తనకు రాజకీయంగా ఉనికిలేకుండా పోతుందని ఆందోళనతో ఆయన తమిళనాడు సర్కారును ఉసిగొల్పి సుప్రీంకోర్టులో కేసులూ వేయించారు. కుప్పం నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం : పెద్దిరెడ్డి శాంతిపురం (చిత్తూరు జిల్లా) : కుప్పం ప్రాంతంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కుప్పం పర్యటన ఏర్పాట్లను మంత్రి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కుప్పం కాలువ పనులను పూర్తిచేసి, సోమవారం నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేస్తారన్నారు. వీటితో కుప్పం ప్రజలకు తాగు, సాగునీటి కష్టాలు లేకుండా చూడాలన్నదే సీఎం ఉద్దేశమన్నారు. ఎంపీ రెడ్డెప్ప, కలెక్టర్ షన్మోహన్, ఎమ్మెల్సీ భరత్, సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాంలతో కలిసి మంత్రి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. సభకు వచ్చే రైతులు, ప్రజలకు ఇబ్బందిలేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రూ.30 కోట్లు అధికంగా చెల్లింపు.. ఇక ఈ పనుల్లో సీఎం రమేష్ సంస్థకు రూ.460.88 కోట్లను 2019, ఏప్రిల్ నాటికి చంద్రబాబు ప్రభుత్వం బిల్లుల రూపంలో చెల్లించింది. అంటే.. కాంట్రాక్టు విలువ కంటే రూ.30 కోట్లు ఎక్కువగా చెల్లించినా పనులు పూర్తి కాలేదు. రూ.99.41 కోట్ల విలువైన పనులు మిగిలిపోయాయి. పనుల్లో నాసిరకమైన పైపులు వేయడంవల్ల వర్షపు నీటికి ఆ పైపులు పగిలిపోయాయి. -
కుప్పంలో చంద్రబాబు కుర్చీని మడతపెట్టేసిన భువనేశ్వరి
-
ఎన్నికల నుండి తప్పుకోవడమే బెటర్
-
కుప్పం నుంచి బాబు పరార్..
-
కుప్పంలో బాబు హ్యాండ్సప్
-
బాబుకు రెస్ట్! నేనే పోటీ చేద్దామని అనుకుంటున్నా: నారా భువనేశ్వరి
(సాక్షి, అమరావతి–తిరుపతి–శాంతిపురం) :‘జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక రోజు వస్తుంది. అప్పటిదాకా ఓపిక పట్టాలంతే!’ అంటారు పెద్దలు. బహుశా! కుప్పం ప్రజలకు కూడా 35 ఏళ్ల తరవాత ఆ రోజు వచ్చినట్లుంది. దశాబ్దాలుగా తాము గెలిపిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని.. రెండేళ్ల కిందటిదాకా కనీసం సొంతిల్లు కూడా కట్టు కోలేదని వాళ్లకి అర్థమయింది. బ్రాంచ్ కెనాల్ ద్వారా నీళ్లు తెస్తానని ఇన్నాళ్లూ మోసపు మాటలు చెప్పారే తప్ప.. ఆ పనిని చేసి చూపించింది వైఎస్ జగన్మోహన్రెడ్డేనని వాళ్లకు అనుభవంలోకి వచ్చింది. అందుకే రాబోయే ఎన్నికల్లో బాబుకు బైబై చెప్పేందుకు వాళ్లంతా సిద్ధమవటంతో.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ నక్కజిత్తుల నారా వారు తనను ఓడించక ముందే ఆ నియోజకవర్గానికి ‘బై’ చెప్పటానికి సిద్ధమయ్యారు. ‘‘35 ఏళ్లుగా మీరు చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తున్నారు. ఇక ఆయనకు రెస్ట్ ఇవ్వాలనిపిస్తోంది. అందుకే ఈ సారి ఇక్కడి నుంచి నేను పోటీ చేయాలనుకుంటున్నాను’’ అంటూ చంద్రబాబు నాయుడి భార్య నారా భువనేశ్వరి బుధవారం కుప్పంలో ఓ బహిరంగ సభలో స్పష్టంగా చెప్పారు. స్కిల్ కుంభకోణంలో వేల కోట్లు నేరుగా విత్డ్రా చేసుకుని మింగేసిన కేసులో ఈ మధ్య చంద్రబాబు నాయుడిని పోలీసులు అరెస్టు చేయటంతో ఆయన జైలుకు వెళ్లటం తెలిసిందే. అది జరిగిన 10–15 రోజుల తరవాత కూడా ఆయన జైలు జీవితాన్ని చూసి తట్టుకోలేక కొందరు మరణించారన్నది టీడీపీ–ఎల్లో మీడియా వ్యాఖ్యానం. వారందరికీ సాయం చెయ్యడానికి నేరుగా నారా భువనేశ్వరి ఓ యాత్ర చేస్తున్నారు. ఆమేమీ రాజకీయ నాయకురాలు కాదు. దీంతో యాత్రలో భాగంగా ఎక్కడికి వెళ్లాలి? ఎవరెవరిని కలవాలి? ఎవరికి చెక్కులివ్వాలి? ఏమేం మాట్లాడాలి? అనేది మొత్తం స్క్రిప్టు ప్రకారమే చేస్తున్నారు. బుధవారం మాట్లాడిన మాటలు కూడా ఆ స్క్రిప్టులో భాగమే. కళ్లెదుట ఓటమి స్పష్టంగా కనిపిస్తుండడంతో ఏదో ఒక వంకతో అక్కడి నుంచి పోటీ చేయకుండా జారుకోవాలనేది బాబు పన్నాగమని, అందుకే భార్య చేత ఆ మాటలు మాట్లాడించారు తప్ప అవేమీ చమత్కారమో, యథాలాపమో కావని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. కుప్పంలో పడిపోయిన బాబు గ్రాఫ్... కుప్పం బరి నుంచి పక్కకు తప్పుకొని వేరే నియోజకవర్గం చూసుకోవాలని, లేకపోతే ఈ సారి ఎన్నికల్లో పోటీయే చేయకుండా నాన్ ప్లేయింగ్ కెపె్టన్గా వ్యవహరించాలని బాబు ఆలోచిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కుప్పంలో బాబు గ్రాఫ్ అంతకంతకూ దారుణంగా పడిపోవటం దీనికి మొదటి కారణం. నిజానికి 2019 ఎన్నికల్లోనే ఆయన మెజారిటీ బాగా తగ్గిపోవటం నుంచి ఈ గ్రాఫ్ పతనం మొదలయింది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు చేతి నుంచి కుప్పం జారిపోయింది. మున్సిపల్ ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీని వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంది. 25 వార్డుల్లో టీడీపీ కేవలం 7 వార్డుల్లో గెలవగా మిగిలిన 18 వార్డుల్లోనూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. అంతకుముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 89 పంచాయతీలకు గాను 70 పంచాయతీలను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. నాలుగు జెడ్పీటీసీలు, నాలుగు ఎంపీపీ స్థానాల్లో కూడా టీడీపీ ఓడిపోయింది. ఈ ఫలితాలన్నీ కుప్పంలో చంద్రబాబు పని అయిపోయినట్లేనని స్పష్టంగా చెప్పాయి. వాస్తవానికి తనను ఏడుసార్లు గెలిపించిన కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు ఎప్పుడూ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఆ ప్రాంతానికి మేలు చేయలేదు. కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా హంద్రీనీవా నీళ్లు తెస్తానని మోసం చేశారే తప్ప పని చేయలేదు. కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా ద్వారా నీళ్లు వచ్చినా, దాన్ని మున్సిపాలిటీగా మార్చినా, రెవెన్యూ డివిజన్గా అప్గ్రేడ్ చేసినా.. అవన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నపుడే జరిగాయి. ఇక్కడ 20వేల మందికి ఇళ్ల పట్టాలివ్వటంతో పాటు వాటిలో 10వేల ఇళ్ల నిర్మాణం కూడా పూర్తయింది. దాదాపు 90 శాతం ఇళ్లకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. సుదీర్ఘకాలం సీఎంగా ఉన్నా బాబు ఈ స్థానాన్ని పట్టించుకోలేదు సరికదా... కనీసం సొంతిల్లు కూడా కట్టుకోలేదు. వరస పరిణామాలతో కుప్పం తనకు గుడ్బై చెప్పబోతోందోని అర్థమై రెండేళ్ల కిందట సొంతిల్లు కట్టారు. అయినా పరిస్థితి మారకపోవటంతో ఓటమిని తప్పించుకోవటానికి కుప్పం నియోజకవర్గానికి గుడ్బై చెప్పే ఆలోచన చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ‘సిద్ధం’ సభలతో ఉక్కిరి బిక్కిరి చంద్రబాబు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ‘రా... కదలిరా’ పేరిట సభలు నిర్వహించారు. మరోవైపు లోకేశ్ ‘శంఖారావం’ పేరుతో సభలు పెట్టారు. ఇక నారా భువనేవ్వరి ‘నిజం గెలవాలి’ అంటూ సమావేశాలు పెడుతున్నారు. వైఎస్పార్ సీపీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే... ‘సిద్ధం’ అంటూ సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మూడు ప్రాంతాల్లో సభలు నిర్వహించారు. బాబు...లోకేశ్... భువనేశ్వరి సభలన్నిట్లోనూ కలిపినా... రాప్తాడులో జరిగిన సిద్ధం సభకు వచ్చిన జనాల్లో సగం కూడా రాలేదు. ‘సిద్ధం’ సభలు మూడూ ఒకదాన్ని మించి మరొకటి జనసంద్రాలయ్యాయి. జనం నాడి అర్థమైన చంద్రబాబుకు వణుకు మొదలైంది. అందుకే పొత్తులతోనైనా ఎలాగోలా పరువు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కుప్పంలో కూడా తాను ఓడిపోతే పరిస్థితి దయనీయంగా మారుతుందని, పార్టీ చేజారిపోతుందని అర్థమై.. ఈ సారికి వేరే చోట నుంచి పోటీ చెయ్యడమో... లేకపోతే ఎక్కడా పోటీ చేయకుండా నాన్ ప్లేయింగ్ కెపె్టన్లా వ్యవహరించి పరువు నిలుపుకోవటమో చేయాలని చూస్తున్నారన్నది పార్టీ వర్గాల మాట. – చంద్రబాబుకి రెస్ట్ ఇచ్చి.. తానే పోటీ చేయాలనుందన్న భువనేశ్వరి! – కుప్పంలో పర్యటనలో బాబు సతీమణి వ్యాఖ్యలతో టీడీపీలో ఆందోళన – ఓటమి భయంతోనే.. బాబు అలా పలికించారనే ప్రచారం సాక్షి, తిరుపతి/శాంతిపురం: ‘‘కుప్పానికి వచ్చాను. ఇక్కడ నాకొక కోరిక ఉంది. నా మనస్సులో ఎప్పటి నుంచో ఆ కోరిక ఉంది, నేనేమీ మిమ్మల్ని కొట్టను.. తిట్టను.. 35 ఏళ్లుగా చంద్రబాబు గారు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు నాకొక కోరిక ఉంది. ఆయన్ను రెస్ట్ తీసుకోమని చెబుతున్నా. నేనే ఇక్కడి నుంచి పోటీ చేద్దామని అనుకుంటున్నా’’ (కుప్పం నియోజక వర్గం శాంతిపురం బహిరంగ సభలో నారా భువనేశ్వరి) నారా భువనేశ్వరి చేసిన కీలకమైన వ్యాఖ్యలు టీడీపీలో దుమారాన్ని రేపుతున్నాయి. ఆమె సరదాగా చేసిన వ్యాఖ్యలే అనుకుంటే పొరబడ్డట్టేనని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఆమె ఎప్పుడూ బహిరంగ సభలో ప్రసంగించలేదు. చంద్రబాబు అరెస్ట్ తరువాత జనంలోకి వచ్చిన నారా భువనేశ్వరి ఏం మాట్లాడాలో స్క్రిప్ట్ రాసిస్తారు. ఆ స్క్రిప్్టని ఆమె బట్టీ పట్టి సభలో మాట్లాడుతారని టీడీపీలోని ఓ ముఖ్య నేత స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో రెండు రోజులుగా పర్యటిస్తున్న నారా భువనేశ్వరి బుధవారం శాంతిపురంలో ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించారు. ఆమె ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలపై టీడీపీలో చర్చ జరుగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక.. 35 ఏళ్ల కాలంలో చంద్రబాబు కుప్పానికి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయారని స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు చేయలేని ఎన్నో అభివృద్ధి పనులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసి చూపించడంతో పాటు.. కుప్పం వాసుల కలగా మిగిలిన హంద్రీ–నీవాకు కృష్ణా జలాలు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. సీఎం వైఎస్ జగన్ కేవలం ఐదేళ్ల కాలంలో కాలువ పనులు పరుగెత్తించి నీరు తీసుకురావడంతో కుప్పం వాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. కుప్పాన్ని మున్సిపాలిటీతో పాటు రెవెన్యూ డివిజన్గా చేశారు. చంద్రబాబు చేయలేని ఎన్నో కార్యక్రమాలు సీఎం వైఎస్ జగన్ వల్లే కావడంతో కుప్పం వాసుల్లో మార్పు కనిపించింది. అందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పట్టారు. కుప్పంలో నాలుగు జెడ్పీటీసీ స్థానాలు, ఎంపీపీలు, మున్సిపాలిటీని వైఎస్సార్సీపీ కైవశం చేసుకుంది. పంచాయతీల్లోనూ అత్యధికంగా వైఎస్సార్సీపీ బలపరచిన అభ్యర్థులే విజయం సాధించారు. కుప్పంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించిన సమయంలో స్థానికుల నుంచి అనూహ్య స్పందన లభించడం వంటి పరిణామాలు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టించాయి. అప్పటి నుంచి చంద్రబాబు నియోజకవర్గాన్ని మార్చాలని భావించారు. అందులో భాగంగా స్థానిక, జిల్లా, రాష్ట్ర నాయకులతో పలుమార్లు ఈ విషయం గురించి చర్చించారు. సతీమణి చేత చెప్పిండం వెనుక మర్మమం అదే ఎన్నికలకు సరిగ్గా రెండు నెలలు కూడా లేని సమయంలో నిజం గెలవాలి అనే కార్యక్రమం పేరుతో తన సతీమణి భువనేశ్వరిని కుప్పానికి పంపించారు. కుప్పంలో ఏం మాట్లాడాలో స్క్రిప్ట్ రాసి పంపారని, అందులో భాగంగా భార్యతో స్పష్టంగా చెప్పించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు అనారోగ్యంతో బాధపడుతున్నారని కోర్టుకు నివేదికలు సమర్పించిన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. అనారోగ్యం, ఆపై వయస్సు మీద పడడంతో వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు తప్పుకోవడమే మేలని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. కుప్పంలో పోటీచేసి ఓడిపోతే మొదటికే మోసం వస్తుందనే భయంతో భార్యతో చెప్పించారని, ఆ తరువాత పారీ్టతో ప్రకటన చేయించే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. నారా భువనేశ్వరి చేసిన ప్రకటనతో చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో అస్త్ర సన్యాసం చేస్తారని సొంత జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. -
బాబు రాజకీయాలకు పనికిరాడని ఇప్పుడు తెలిసిందా.. భువనేశ్వరీ?
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఇప్పటికే మూడు ‘సిద్ధం’ సభలు జరిపామని, తమ నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అమలు చేసిన విప్లవాత్మక సంస్కరణలను.. నవరత్నాల్లోని ప్రతీ అంశాన్ని ప్రజలకు వివరించామని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు (మహిళాశిశు సంక్షేమం) నారమల్లి పద్మజ అన్నారు. ‘2019 మ్యానిఫెస్టోలో మేము చెప్పిన ప్రతీ వాగ్దానాన్నీ.. చేసి చూపించాం. మా పాలనే సాక్ష్యంగా 2024 ఎన్నికల్లో ప్రజల ముందుకెళ్ళి.. కాలర్ ఎగరేసి మరీ ఓట్లు అడుగుతామని ఆరోజు చెప్పాం.. ఈరోజూ అదే చెబుతున్నాం’ అని అన్నారు. మూటాముల్లె సర్దేసిన తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాం.. మా పాలనే దానికి సాక్ష్యం.. మమ్మల్ని మరోమారు ఆశీర్వదించడానికి సిద్ధమా..? అని మా నాయకుడు జగన్ గారు ప్రజలను కోరినప్పుడు వాళ్ల నుంచి వచ్చిన రెస్పాన్స్ను చూసి తెలుగుదేశం పార్టీకి వెన్నులో చలి పుట్టిందేమో.. ఇప్పటికే మూటాముల్లె సర్దేసింది. దాని పరిణామాలు కూడా ఒక్కొక్కటిగా ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. చంద్రబాబు రెస్టు తీసుకోవాలని భువనమ్మే చెబుతోంది ఈరోజు నారా భువనేశ్వరి కూడా ఇదే విషయాన్ని మరోమారు ధృవీకరించింది. మా ఆయన చంద్రబాబు రెస్ట్ తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పింది. తన భర్త రాజకీయాలకు ఇక పనికిరాడని.. అలసిపోయాడని.. మీడియా ముందుకొచ్చి ఆమె మాట్లాడిన సందర్భాన్ని చూశాం. ఇది నిజమే.. హైదరాబాద్లోని ఏఏజీ ఆస్పత్రి కూడా చంద్రబాబు గురించి అదే చెప్పింది. ‘నీకు సకల రోగాలు ఉన్నాయి. నువ్వు గానీ నడవాలంటే.. వెనుక ఒక అంబులెన్స్ ఉండాలి. ఇక, బిజీ రాజకీయాలకు నువ్వు పనికిరావు.. రెస్టు తీసుకోవాలి..’ అని ఆస్పత్రి రిపోర్టు ద్వారానే చెప్పారు. అయినా.. ఆయన విన్లేదు. అందుకే.. చంద్రబాబు బైబై.. అని ఓపెన్గా చెప్పింది తన భార్యను ఎవరూ ఏమీ అనకుండానే వెక్కి వెక్కి ఏడుస్తాడు చంద్రబాబు నాయుడు. మా నాన్నను ముసలోడంటున్నారని లోకేశ్ కూడా వెక్కివెక్కి ఏడుస్తున్నాడు. తండ్రీ కొడుకులు ఎంతగా ఏడ్చినా.. మొత్తుకున్నా.. ప్రజల నుంచి వారు ఆశించినంత స్పందన రాకపోవడంతో ఇక, చివరికి కుర్చీలు మడత పెట్టుకునే పనిలో పడ్డారు. పాపం, తన భర్త, కొడుకు పడుతున్న పాట్లు గమనించిన భువనేశ్వరి ఈరోజు ఓపెన్గానే చంద్రబాబు బైబై.. అని చెప్పారు. ఆయన కూడా రాజకీయాలకు బైబై చెప్పాల్సిన అవసరముందని.. రెస్టు తీసుకోవాల్సిన వయసొచ్చిందని.. నీకు ప్రజల నుంచి ఆదరణ కరువైందని తన భర్తకూ ఆమె గుర్తుచేశారు. వెన్నుపోటుకు బదులు చెప్పిందా..? లోకేశ్ మాట్లాడించాడా..? సుదీర్ఘకాలం కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ఇక పనికిరాడని స్వయంగా ఆయన భార్యే చెబుతున్న క్రమంలో.. అందరిలోనూ ఓ ప్రశ్న ఉత్పన్నమౌతోంది. ఆయన ఎమ్మెల్యేగానే పనికిరాడా..? లేదంటే, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడిగా పనికిరాడా..? అని భువనేశ్వరి మాటల అంతరార్థాన్ని విశ్లేషిస్తున్నారు. ఆమె ఇవన్నీ నిజంగానే చెబుతుందా..? లేదంటే, తండ్రి ఎన్టీఆర్కు పొడిచిన వెన్నుపోటుకు బదులుగా చెబుతుందా..? ఒకవేళ.. లోకేశ్బాబే తన తల్లి చేత ఇలా మాట్లాడిస్తున్నాడా..? మా నాన్న పని అయిపోయింది. నేటి రాజకీయాలకు ఆయనెటూ పనికిరాడని.. ఎలాగైనా మూలన కూర్చోబెట్టాలని తల్లికి చెప్పాడా..? అనేది తేలాల్సిన సందర్భమిది. అబద్ధాలాడటంలో తండ్రీకొడుకుల్ని మించిపోయింది భువనేశ్వరి అక్క పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంది. అలాగే, టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కూడా భువనేశ్వరి చేపడితే బాగుంటుందేమో.. ఎందుకంటే, ఆమె మాటల్లోని అబద్ధాల్ని చూస్తుంటే.. ఖచ్చితంగా రాజకీయాల్లోకి పనికొస్తుందని చెప్పొచ్చు. కన్నార్పకుండా అబద్ధాలు అల్లి ప్రచారం చేయడంలో తన భర్త, తన కొడుకును మించిపోయింది. మహిళల పక్షాన అప్పుడెందుకు నోరుమెదపలేదు..? ఆడపిల్ల ఆర్థరాత్రి నడవాలంటే మంచి ప్రభుత్వం రావాలంటున్న నువ్వు.. నీ బుద్ధి, నీ విచక్షణను నీ భర్త పాలనలో ఎక్కడ పెట్టుకున్నావని మేం ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు పాలన లేకుంటే మహిళలు వీధుల్లో నడవలేని పరిస్థితుల్లేవని మాట్లాడుతున్న నీకు మేము కొన్ని ప్రశ్నలడుగుతున్నాం. జవాబివ్వగలవా..? నీ భర్త చంద్రబాబు హయాంలో మహిళలపై అనేక దురాగతాలు జరిగినప్పుడు నువ్వెక్కడున్నావు..? కాల్మనీ, సెక్స్రాకెట్లో నీ తెలుగుదేశం పార్టీ నాయకులే దాదాపు 200 మంది మహిళల్ని లైంగికంగా హింసించి.. బెదిరించి బ్లూ ఫిల్మ్లు తీసినప్పుడు నువ్వెందుకు స్పందించలేకపోయావు..? తహశీల్దార్ వనజాక్షిని నీ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏవిధంగా దాడిచేసి అవమానించాడో మీడియా సాక్షిగా నువ్వు చూసినా.. బయటకొచ్చి ఇది తప్పు అని మహిళల పక్షాన ఎందుకు మాట్లాడలేకపోయావు..? రిషితేశ్వరి అనే విద్యార్థినిని అత్యంత పాశవికంగా హింసిస్తే.. ఆమె ఆత్మహత్య చేసుకుని మరణిస్తే చదువుకునే బాలికల తరఫున నువ్వెందుకు నీ భర్తను నిలదీయలేదు..? వీటన్నింటికీ.. నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరముంది. బీసీ, దళిత మహిళల్ని అవమానిస్తే.. నువ్వు స్పందించలేదేం..? కుప్పంలో ఓ బీసీ మహిళ వైఎస్ఆర్సీపీ మీటింగ్కు హాజరైందని .. ఆమెను వివస్త్రను చేసి వీడియోలు చిత్రించి హింసించిన వైనం నీకు తెలియదా ..? ఆ ఘటనను కుప్పం ప్రజలు మరిచిపోగలరా..? అదేవిధంగా పెందుర్తిలో ఓ దళిత మహిళ.. తన అసైన్డ్ స్థలాన్ని లాక్కోవద్దని కాళ్లు పట్టుకుని ప్రాధేయపడితే నీ పార్టీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ఎలా కిరాతకంగా ప్రవర్తించాడో నీకు మీడియాలో నువ్వు చూడలేదా.? నీ సొంత తమ్ముడు మహిళల గురించి ఏం మాట్లాడాడో.. వినలేదా..? వాటిని చూసి ఒక మహిళగా స్పందించలేదెందుకు..? మీ హయాంలో జరిగిన తప్పులకు క్షమాపణ చెప్పు సభా వేదికపైనే ఒక మహిళను చూస్తే ముద్దెట్టుకోవాలి.. కడుపైనా చేయాలని నీ సోదరుడు మాట్లాడిన సంగతి నీకు తెలిసీ ఎందుకు మౌనంగా ఉన్నావు..? సాటి మహిళగా స్పందించి.. నీ తమ్ముడుకి గడ్డిపెట్టాలని అనిపించలేదా..? నీ తమ్ముడు బాలకృష్ణలాంటి అచ్చోసిన ఆంబోతుల్ని ఏం చేయాలి..? నిలువునా కాల్చేయాల్నా..? వీటన్నింటికీ నువ్వు స్పందించి.. నీ పార్టీ హయాంలో జరిగిన తప్పులను ఒప్పుకుని.. మీ తెలుగుదేశం పార్టీ తరఫున.. నీ తమ్ముడి తరఫున బహిరంగంగా క్షమాపణ చెప్పాలని భువనేశ్వరిని మేము డిమాండ్ చేస్తున్నాం. పక్క రాష్ట్రాల్లో జరిగిన నేరాలనూ ఆంధ్రకు అంటగడతారా..? చంద్రబాబుకు మూటలు మోసే నాయకుడున్న పక్క రాష్ట్రం తెలంగాణలో కిందటేడాది ఆగస్టు 22న జరిగిన అత్యాచారం గురించి ఈరోజు ఇక్కడ భువనేశ్వరి మాట్లాడింది. అక్కడ ఓ బాలికపై గంజాయి తాగిన ఉన్మాదులు అఘాయిత్యానికి పాల్పడితే.. ఆ నేరాన్ని తెచ్చి ఇప్పుడు ఆంధ్రలో ఉన్న ప్రభుత్వంపై అంటకట్టడానికి ప్రయత్నించడం నీకు సిగ్గనిపించడం లేదా..? అని భువనేశ్వరిని అడుగుతున్నాను. అబద్ధాల్లో నీ భర్త, నీ కొడుకును మించి పోయావు గనుక.. ఇప్పుడు నిలువునా మునిగిపోతున్న తెలుగుదేశం పార్టీకి నువ్వు అధ్యక్షరాలివయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి కనుక పగ్గాలు చేపట్టమని చెప్తున్నాం. -
భువనేశ్వరి వ్యాఖ్యల అంతరార్థం ఏంటి?
-
మంగళగిరిలో ఓటమి భయంతో రెండుచోట్ల పోటీపై లోకేష్ స్కెచ్?
-
సొంత నియోజకవర్గం కుప్పంలో ఓటమి భయం చంద్రబాబును వెంటాడుతోందా?
-
‘చంద్రబాబు ఫ్యూచర్ భువనేశ్వరి ముందే కనిపెట్టేశారు’
సాక్షి, విజయవాడ: భువనేశ్వరి ఆమె మనసులో మాట బయటపెట్టారని, రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబును అసహ్యించుకుంటున్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు. నారా భువనేశ్వరి వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలని ప్రజలంతా నిర్ణయించుకున్నారు. భువనేశ్వరి ఈ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ప్రజల మనసులో ఉన్న ఆకాంక్షను ఆమె గమనించారని మంత్రి వ్యాఖ్యానించారు. భువనేశ్వరి సరదాగా చెప్పిన మాట కాదు.. ఆమె మనసులో ఉన్న భావనే బయటపెట్టారు. 35 ఏళ్ల నుంచి కుప్పానికి చంద్రబాబు ఏం చేయలేదు. చంద్రబాబు కుప్పానికీ పనికిరాడు. రాష్ట్రానికీ పనికిరాడని సొంత భార్యే చెప్పేసింది. సిద్ధాంతం, విలువలు, విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు. 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు 175 స్థానాల్లో టీడీపీని నిలబెట్టలేని అసమర్ధుడయ్యాడు. టీడీపీని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేశాడు. పవన్కు 50, 60 పంచాలి.. మరో పార్టీకి ఇంకొన్ని పంచాలనే ఆలోచనలో ఉన్నాడు. చంద్రబాబు దిక్కులేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇవన్నీ గమనించారు కాబట్టే చంద్రబాబును పక్కకు తోసేయాలని భువనేశ్వరి ఆలోచన’’ అని జోగి రమేష్ పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్ పనికిరాడు.. ఎన్టీఆర్ కూతురుగా తానే బెటర్ అని భువనేశ్వరి భావిస్తున్నట్లున్నారు. చంద్రబాబు ఓడిపోతున్నాడని భువనేశ్వరి ముందే కనిపెట్టారు. ఎన్టీఆర్ కూతురుగా తనకైనా ఓట్లేస్తారని భువనేశ్వరి అనుకుంటున్నారు. ఈసారి కుప్పంలో చంద్రబాబు అడ్రస్ గల్లంతవ్వడం ఖాయం’’ అని జోగి రమేష్ చెప్పారు. ఇదీ చదవండి: చంద్రబాబుకి రెస్ట్.. కుప్పం బరిలో భువనేశ్వరి? -
కుప్పంలో చంద్రబాబా పోటీపై కుండబద్దలుకొట్టిన భువనేశ్వరి
-
చంద్రబాబు పై నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు
-
కుప్పంలో తుస్సుమన్న టీడీపీ గాండ్ల కుల సమావేశం
-
కుప్పంలో తుస్సుమన్న టీడీపీ గాండ్ల కుల సమావేశం
-
నీడనిచ్చిన కుప్పాన్ని కూడా చప్పరించేసిన చంద్రబాబు
-
కుప్పానికి చంద్రబాబు దగా
-
కుప్పంలో చంద్రబాబుకు గుణపాఠం తప్పదా?
ఏడుసార్లు అందలం ఎక్కించిన కుప్పం ప్రజలు ఈసారి ఓడించి హైదరాబాద్కే పరిమితం చేస్తారని చంద్రబాబు భయపడుతున్నారా? ఓటమి భయంతోనే కుప్పంతో పాటు మరో నియోజకవర్గం కూడా చంద్రబాబు వెతుక్కుంటున్నారా? 35 ఏళ్ళపాటు ఏకధాటిగా ఎన్నుకున్నా పట్టించుకోనందుకు కుప్పం ప్రజలు చంద్రబాబుకు గట్టి గుణపాఠం చెప్పబోతున్నారా? కుప్పంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుందన్న భయంతోనే బలమైన సీటు కోసం వేట ప్రారంభించారా? అసలు కుప్పంలో ఏం జరుగుతోంది? 1983 ఎన్నికల్లో తన సొంత నియోజక వర్గం చంద్రగిరిలో ఘోర పరాజయం పొందిన చంద్రబాబు నాయుడు.. 1989 ఎన్నికల నాటికి కుప్పం ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఇపుడు ఎమ్మెల్యేలను కూడా బదిలీ చేస్తారా అంటూ కామెడీ చేస్తోన్న చంద్రబాబు మూడున్నర దశాబ్ధాల క్రితమే చంద్రగిరి నుంచి కుప్పం నియోజక వర్గానికి బదలీ అయిన నాయకుడిగా చరిత్ర సృష్టించారు. రాష్ట్రంలోనే అత్యంత వెనకబడిన నియోజక వర్గంగా కుప్పాన్ని మూడున్నర దశాబ్ధాల పాటు చంద్రబాబు తన స్వప్రయోజనాలకే వాడుకున్నారు. 35ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చంద్రబాబు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అయినా కుప్పం నియోజక వర్గాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. అందుకే కుప్పం ప్రజలు ఉపాధిలేక ఉస్సూరు మంటూ ఉండేవారు. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం లో సంక్షేమ పథకాల అమలుతో దాని ముఖచిత్రం మారింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేతుల్లోనే అధికారం ఉన్నప్పుడు ఆయన కుప్పానికి ఏమీ చేయలేదు. కుప్పాన్ని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేయలేదు. రెవిన్యూ డివిజన్గా చేసుకోలేకపోయారు. హంద్రీ నీవా నీళ్లు కుప్పం వరకు తేలేకపోయారు. 2019లో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కుప్పం నియోజక వర్గం తలరాత మారిందని చెప్పాలి. ముందుగా మున్సిపాలిటీని చేశారు. ఆ వెంటనే రెవిన్యూ డివిజన్ గా ప్రకటించారు. కుప్పం కాలువలకు హంద్రీ నీవా ద్వారా నీటిని అందించే బృహత్ పథకం కూడా సాకారం చేశారు జగన్మోహన్రెడ్డి. ఫలితంగా నియోజక వర్గంలోని 44 కాలువలు జలకళతో మెరవనున్నాయి. ఇక నవరత్న పథకాలతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అర్హులైన అందరికీ అందిస్తున్నారు జగన్మోహన్రెడ్డి. ఈ మార్పు కారణంగానే కుప్పం ప్రజలు వైఎస్సార్సీపీవైపు మొగ్గు చూపారు. పంచాయతీ, మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీని పక్కన పెట్టి వైఎస్సార్సీపీ అభ్యర్ధులను గెలిపించారు కుప్పం ప్రజలు. ఈ వరుస ఓటముల కారణంగానే చంద్రబాబు వెన్నులో చలి మొదలైంది. అంత వరకు కుప్పానికి చుట్టపు చూపుగా కూడా రాని చంద్రబాబు ఏడాదిలో మూడు సార్లు కుప్పం వచ్చి రెండు మూడు రోజులు గడిపి వెళ్తున్నారు. ఇంత వరకు కుప్పంలో ఇల్లుకూడా కట్టుకోని చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల్లో పరాజయాల తర్వాతనే నియోజక వర్గంలో ఇంటి నిర్మాణం మొదలు పెట్టారు. కేవలం ఎన్నికల్లో ఓట్లకోసమే చంద్రబాబు ఇలా డ్రామాలు చేస్తున్నారని నియోజక వర్గ ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ నియోజక వర్గంలోనూ వైఎస్సార్సీపీజెండా ఎగరేస్తామని పాలక పక్షం ధీమా వ్యక్తం చేస్తోంది. కుప్పాన్ని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వై నాట్ 175 అన్ని నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రులు కుప్పం నియోజక వర్గంలో ఎన్ని అక్రమాలు జరిగినా దొంగ ఓట్ల వ్యవహారాలు ఉన్నా పట్టించుకోలేదు. కానీ జగన్మోహన్రెడ్డి అన్నీ పకడ్బందీగా చూస్తూ ఉండడంతో చంద్రబాబుకు కస్టాలు తప్పేలా లేవంటున్నారు మేథావులు. కుప్పం ప్రజలపై కానీ.. కుప్పంలోని టిడిపి నాయకులపై కానీ చంద్రబాబుకు నమ్మకం లేనట్లుంది. అందుకే నియోజక వర్గ ఇన్ ఛార్జ్ గా ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తిని నియమించుకున్నారు. దీనిపైనా టిడిపి శ్రేణుల్లోనూ ప్రజల్లోనూ వ్యతిరేకత పెల్లుబుకుతోంది. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో ఓడినా ఓడిపోవచ్చని గ్రహించిన చంద్రబాబు ఎన్టీయార్ కృష్ణా జిల్లాలో ఏదైనా బలమైన నియోజక వర్గం నుంచి కూడా పోటీచేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి చంద్రబాబులో భయం అయితే తీవ్ర స్థాయిలో ఉందన్నది భయంకర వాస్తవం. -
కుప్పంలోకి ప్రవేశించిన కృష్ణమ్మ జలాలు
-
కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయం: బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
-
బాబు వేన్నులో కుప్పం భయం
-
కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు ఎదురుగాలి
-
కుప్పంలో వైఎస్ఆర్సీపీ గెలవడం ఖాయం: పెద్దిరెడ్డి
-
కుప్పం కూరగాయలు విదేశాలకు పంపిస్తాడట..కుప్పం తాత కథలు !
-
కుప్పంలో జనసేన నేతల బాహాబాహీ
కుప్పం: జనసేన పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కుప్పంలో శుక్రవారం రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో జనసేన కార్యకర్తల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. వేదికపై పవన్కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, జనసేన కుప్పం కార్యదర్శి నరేష్ కూర్చున్నారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా నేతలను పసుపులేటి హరిప్రసాద్ వేదికపైకి అహ్వనించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలను కాకుండా జిల్లా నేతలను మాత్రమే వేదికపైకి పిలవడంపై నరేష్ అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమం ముగిసి చంద్రబాబు వెళ్లిపోయిన తరువాత హరిప్రసాద్, నరేష్ మధ్య వాగ్వాదం మొదలైంది. పార్టీ కోసం కష్టపడే స్థానిక నేతలను కాకుండా జిల్లా నేతలను ఎందుకు పిలిచారంటూ నరేష్ ఆయన అనుచరులు వాదనకు దిగారు. రెండువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరస్పర దాడులు, తోపులాటలకు దిగారు. హరిప్రసాద్ ప్రాణభయంతో కారులో దాక్కున్నారు. కుప్పం జనసేన కార్యకర్తలు పసుపులేటి కారుపై దాడిచేశారు. ఆయన కారు స్వల్పంగా ధ్వంసమైంది. దీంతో ఆయన ఆ కారులోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో జనసేన కార్యకర్తల విభేదాలు భగ్గుమనడం సర్వత్రా చర్చకు దారితీసింది. -
చిత్తూరు: ఏనుగుల గుంపు హల్చల్.. టెన్షన్లో ప్రజలు!
సాక్షి, కుప్పం: చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. కర్ణాటక సరిహద్దుల్లో 70 ఏనుగుల గుంపు హల్చల్ చేసి కుప్పం వైపు దూసుకొస్తున్నట్టు కర్ణాటక ఫారెస్ట్ అధికారులు తెలిపారు. దీంతో, ఏపీ సరిహద్దు ప్రాంత అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజల్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు.. గ్రామ సరిహద్దులోను, పొలాల్లో రాత్రి పూట ప్రజలు ఉండకూడదని హెచ్చరికలు ముందస్తుగా జారీ చేసి, గ్రామాల్లో ఏనుగులు కంట పడితే వెంటనే సంబంధిత పారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇక, ఫారెస్ట్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. -
నిరసనల పేరుతో టీడీపీ నేతల సంబరాలు!
కుప్పం(చిత్తూరు జిల్లా): చంద్రబాబు అరెస్ట్పై టీడీపీ నేతలు నిరసనల పేరిట చేపట్టిన కార్యక్రమాలు.. సంబరాల్నే మించిపోతున్నాయి. సాధారణంగా గ్రామాల్లో అమ్మవారి జాతరలో సంబరాలు జరుపుకొంటారు. మారెమ్మ, గంగమ్మ వేషధారణలతో వేపాకు చేతపట్టి.. అమ్మవారి రికార్డింగ్ పాటలతో డ్యాన్స్లు వేసి భక్తులను అలరింపజేస్తారు.అదే తరహాలో చంద్రబాబు అరెస్ట్కు నిరసనగా కుప్పంలో శుక్రవారం ఆందోళన చేస్తున్న శిబిరం వద్ద.. తెలుగు మహిళలు వేపాకు చేతబట్టి.. అమ్మవారి వేషధారణలో రికార్డు డ్యాన్స్లతో మురిపింపజేశారు. అటువైపు వెళుతున్న బాటసారులు ఆసక్తిగా వారి డ్యాన్సులను తిలకిస్తూ ముచ్చటపడ్డారు. స్థానికులు మాత్రం ఇదంతా నిరసన చేసినట్టు లేదని, సంబరాలు, విందు భోజనాలు చేస్తున్నట్టుందంటూ ముక్కున వేలేసుకోవడం కనిపించింది. చదవండి: స్కిల్ కార్పొరేషన్కు, టీడీపీకి ఒకరే ఆడిటర్ -
ఇసుకాసురుడు ‘నారా’సురుడే..!
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీరియస్ అయ్యారు. ఇసుక మీద మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని విమర్శలు చేశారు. వంశధార, నాగావళి, పెన్నా నదుల్లో ఇసుకను టీడీపీ నేతలు పెద్ద ఎత్తున దోపిడీ చేశారు. ప్రతీ నెల ఇసుక మీద నారా లోకేష్ ముడుపులు తీసుకునేవాడు అని అన్నారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర విద్యుత్, అటవీ, మైనింగ్ శాఖల మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీపీటీ(పవర్ పాయింట్ ప్రజెంటేషన్) ద్వారా, ఇసుక పాలసీపై పూర్తి గణాంకాలతో సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఉచిత ఇసుక పేరుతో జరిగిన దోపిడీ- సీఎం జగన్ ప్రభుత్వంలో అత్యంత పారదర్శకంగా అమలవుతున్న ఇసుక పాలసీ, తద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని వివరించారు. ఇసుకపై బాబు, లోకేశ్ల ఓవరాక్షన్ ఇసుక తవ్వకాలు, అక్రమాలంటూ చంద్రబాబు ఆయన కొడుకు లోకేశ్ ఇటీవల ఆరోపణలు చేస్తున్నారు. అనుమతులున్న ఓపెన్ రీచ్ల దగ్గరకు కూడా వెళ్లి సెల్ఫీలంటూ వాళ్లు ఓవర్ యాక్షన్ చేయడం అందరూ చూస్తున్నారు. ఇసుక దోపిడీపై మాకు గడువిచ్చామని.. 48 గంటల్లో సమాధానం చెప్పకపోతే.. తదుపరి చర్యలుంటాయని రంకెలేస్తున్నారు. అనుమతులున్న ఇసుక రీచ్ల దగ్గరకు పోయి టీడీపీ నేతలు ధర్నాలు చేయడాన్ని చూశాం. అందుకే, ఈ సందర్భంలో ఇసుక పాలసీకి సంబంధించి ఎవరి హయాంలో ఏం జరిగిందనేది నేను పీపీటీ ద్వారా వివరిస్తున్నాను. బాబు హయాంలో 19 జీవోలతో దోపిడీ ఇసుక గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. బాబు ఐదేళ్ల పాలనలో ఇసుక తవ్వకాలు ఇష్టానుసారంగా జరిగాయి. ఇసుక పాలసీకి సంబంధించి ఆయన హయంలో దాదాపు 19 సార్లు జీవోలు ఇచ్చారు. ఎప్పటికప్పుడు వారికి అనుకూలంగా జీవోలను మార్చుకుని మైనింగ్ దోపిడీ ఎలా చేశారనేది.. అప్పట్లో ప్రభుత్వ ఖజానాకు చేరిన ఆదాయమేంటి..? ఇప్పుడున్న ఆదాయమేంటనేది మేమూ పీపీటీ ద్వారా వివరిస్తున్నాం. పేరుకే ఉచితం.. బ్లాక్ మార్కెట్ తో రాష్ట్ర ఖజానాకు సున్నం చంద్రబాబు ఇసుక పాలసీపై మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యమేస్తుంది. ఆయన నోటి వెంట ఇసుక దోపిడీ గురించి మాటలు వినిపిస్తుంటే.. దొంగే.. దొంగా దొంగా.. అని కేకలేసినట్లుగా ఉంది. 2014 నుంచి 2019 వరకు కృష్ణానది కరకట్ట మీదనున్న చంద్రబాబు ఇంటి వెనుకే కృష్ణా నదీ గర్భంలో ఇసుక తవ్వకాలు పెద్దఎత్తున జరగలేదా..? అని ప్రశ్నిస్తున్నాను. మొదట్లో డ్వాక్రా మహిళల ద్వారా ఇసుక సప్లై అన్నాడు. ఆ తర్వాత ఉచిత ఇసుక విధానం అన్నాడు. పేరేమో ఉచితమన్నాడు గానీ.. ఇసుక బ్లాక్మార్కెట్ ను అమాంతం పెంచి ప్రభుత్వ ఖజనాకు సున్నంపెట్టిన వ్యక్తి ఈ చంద్రబాబు అని చెప్పుకోవాలి. నాడు పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇల్లు కట్టుకోవాలంటే.. సామాన్యులకు ఇసుక దొరక్క, టీడీపీ నేతలు చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఉండేవి. టీడీపీ హయాంలో నెలవారీ మామూళ్ళు చంద్రబాబు హయాంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాల్ని జరిపారు. నెలవారీగా తమకు ఆదాయవనరుల్లో ఇసుకను ఒక భాగంగా చేసుకున్నారు కనుకే.. పశ్చిమగోదావరి జిల్లాల్లో అప్పట్లో తహశీల్దార్ వనజాక్షి గారు ఇసుక అక్రమ తవ్వకాల్ని అడ్డుకుంటే ఆమెపై దాడిచేశారు. ప్రభుత్వ అధికారిణి అని కూడా చూడకుంటా ఆమెను టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈడ్చిపడేశాడు. అప్పట్లో వారిద్దర్నీ రాష్ట్ర సచివాలయానికి పిలిపించుకుని రాజీ చేసింది ఈ చంద్రబాబు కదా..? మహిళా అధికారిణిపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. బాధితురాల్నే బెదిరించి రాజీచేసిన నీచుడు చంద్రబాబు అని గుర్తుచేస్తున్నాను. లోకేశ్కు ప్రతీనెలా రూ.500 కోట్లు కప్పం చంద్రబాబు హయాంలో, ఇసుక అక్రమ తవ్వకాలపై, ఎవరైనా ఫిర్యాదు చేయాలన్నా అది ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియకుండా చేశాడు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వారి అనుచరుల్ని పెట్టి కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి, గోదావరి నదుల్లో ఇష్టానుసారంగా ఇసుకను తవ్వేశారు. ఇదంతా చంద్రబాబు కొడుకు లోకేశ్ కనుసన్నల్లోనే జరిగిందని.. ఆయనకు ఇసుక దోపిడీకి సంబంధించి ప్రతీనెలా రూ.500 కోట్లు కప్పం కట్టి మరీ ఇసుకమాఫియా ముఠా వ్యాపారం చేసిందని అప్పట్లో మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలుసు. బాబు హయాంలో ఎన్జీటీ రూ.100 కోట్ల జరిమానా శ్రీకాకుళం దగ్గర్నుంచి తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి నేషనల్ గ్రీన్ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విచారణ కూడా జరిపింది. అప్పట్లో ఇసుక తవ్వకాలపై ఆధారాలు రుజువైనందునే చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్జీటీ తీర్పు సైతం వచ్చింది. దాదాపు రూ.100 కోట్ల జరిమానాను విధిస్తూ తీర్పిచ్చింది. ఈ కేసులో చంద్రబాబు ఇంటి వద్ద కరకట్ట పక్కన జరిగిన ఇసుక తవ్వకాలకు సంబంధించిన ఆధారాల్ని కూడా అప్పట్లో ఎన్జీటీ పరిగణలోకి తీసుకుంది. మరి, ఎన్జీటీ విధించిన రూ.100 కోట్ల జరిమానాపై చంద్రబాబు ఏం సమాధానం చెబుతాడు..? పారదర్శక ఇసుక పాలసీని సీఎం జగన్ తెచ్చారు ఆన్లైన్, ఆఫ్లైన్లో ఇసుకను బుక్ చేసుకుని కొనుగోలు చేసుకునే మెరుగైన పారదర్శక ఇసుక పాలసీని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక అమలు చేశాం. ప్రస్తుతం కూడా అమలు చేస్తున్నాం. సీఎం జగన్ ఇసుక తవ్వకాలకు సంబంధించి గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ సరిదిద్ది నూతన పాలసీని తేవడం జరిగింది. ఇసుకపై 04.09.2019న మెరుగైన నూతన పాలసీని తెచ్చారు. ఆ తర్వాత ఈ పాలసీపై 17.07.2020న మంత్రుల సబ్కమిటీ నియమించి ప్రజాభిప్రాయసేకరణ చేసి ప్రభుత్వానికి నివేదికనిచ్చారు. దీంతో మరింత మెరుగైన ఇసుక విధానంపై 12.11.2020న జీవో.నెం. 78ను జారీ చేశాం. పాలసీ అమలును పరిశీలిస్తూనే.. నిబంధనల్లో మార్పులు చేస్తూ మరలా 16.04.2021న జీవో నెం. 25ను తెచ్చాం. ప్రస్తుతం ఇదే జీవో ద్వారా ఇసుక పాలసీని కొనసాగిస్తున్నాం. కేంద్రప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలోనే టెండర్లు ఇసుక తవ్వకాలకు సంబంధించి గతంలో టీడీపీ మాదిరిగా మేము దొంగచాటుగానో.. ఎవరికీ తెలియకుండానో టెండర్లు ప్రక్రియను పూర్తిచేయలేదు. కేంద్రప్రభుత్వానికి సంబంధించిన మెటల్ అండ్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంటీసీ) ద్వారా టెండర్లును ఆహ్వానించడం, నిర్వహణ, పర్యవేక్షణ జరుగుతుంది. ఎవరైనా ఈ టెండర్లలో పాల్గొనేలా అవకాశమిచ్చాం. అత్యంత పారదర్శకంగా టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి.. అత్యధిక బిడ్ కోట్ చేసిన జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ కంపెనీకి టెండర్ను ఖరారు చేయడం జరిగింది. చంద్రబాబు,రామోజీ టెండర్లలో పాల్గొనలేదేం..? ఇసుక తవ్వకాలకు సంబంధించి ఇప్పుడు ఆరోపణలు గుప్పిస్తున్న చంద్రబాబు, రామోజీరావులు అప్పట్లో ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో ఎందుకు పాల్గొనలేదు..? రామోజీ కూడా పెద్ద వ్యాపార వేత్తనే కదా.. మరి ఆ టెండర్లో పాల్గొంటే.. ఎంత పారదర్శకంగా ఇసుక టెండర్ ప్రక్రియ జరుగుతుందో స్వయంగా తెలుసుకునే వారు కదా..? ఇలాంటి పారదర్శక పాలసీని చంద్రబాబు గతంలో ఏనాడైనా తెచ్చాడా..? అని నిలదీస్తున్నాను. దీనిపై దమ్ముంటే చంద్రబాబు, రామోజీ సమాధానం చెప్పాలి. టన్ను రూ. 475కే.. ఇంత పారదర్శకంగా ఇసుక పాలసీని తెస్తే చంద్రబాబు, పచ్చమీడియా కలిసి రోజుకో పిచ్చి ప్రేలాపన చేస్తుంది. రకరకాలుగా ఆరోపణలతో కథనాలు రాస్తున్నాయి. ఇసుక నూతన పాలసీ ప్రకారం ఒక కంపెనీ టెండర్ దక్కించుకుంది. ఎక్కడ తవ్వకాలు జరిపినా అదే కంపెనీ బాధ్యత తీసుకుంటుంది. అలాంటప్పుడు ఆ కంపెనీ అక్కడ తవ్వుతుంది..? ఇక్కడ తవ్వుతుంది..? అన్న వాదనలకు ఆస్కారం ఎక్కడుందని అడుగుతున్నాం. ఈ కంపెనీ ప్రస్తుతం టన్నుకు రూ.375 ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉన్నారు. దీనిపై వారు రూ.100 కలుపుకుని టన్ను ఇసుకను రూ.475కు అమ్ముకుంటున్నారు. వారు కలుపుకుంటున్న రూ.100లోనే అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు, ఇతర నిర్వహణ వ్యయం మొత్తాన్ని భరించుకోవాల్సి ఉంటుంది. మరి, టీడీపీ నేతలు, చంద్రబాబుతో సహా ఎల్లోమీడియా ఇసుకకు సంబంధించి ఏదో జరిగిపోతుందని ఎందుకు ఆరోపణలు చేస్తుంది..? అని అడుగుతున్నాను. ఇసుక సొమ్మంతా బాబు, లోకేష్ జేబుల్లోకే... ఇసుక నూతన పాలసీ ప్రకారం ప్రభుత్వానికి ఏటా రూ.765 కోట్లు ఆదాయం వస్తుంది. అంటే, ఐదేళ్లకు రూ.3825 కోట్లు జమ అవుతున్నాయి. మరి, చంద్రబాబు హయాంలో ఇన్ని వేల కోట్లు ఏమయ్యాయి..? ఎక్కడ జమ అయ్యాయి..? లోకేశ్ జేబులోనా... చంద్రబాబు జేబులోనా..? అని నిలదీస్తున్నాను. ఇంత ఆదాయం ప్రభుత్వం కోల్పోయినప్పుడు ప్రశ్నిస్తానన్న నేతలు గానీ.. మీడియా గానీ ఎందుకు కళ్లుమూసుకుంది. అప్పట్లో టెండర్లు ఎందుకు పిలవలేదు..? ఇలాంటి మెరుగైన పారదర్శక విధానాన్ని చంద్రబాబు ఎందుకు తేలేదు..? దీనిపై వారు సమాధానం చెప్పాలి. ఇసుక తవ్వకాల అక్రమాలపై ఉక్కుపాదం ఇసుక తవ్వకాలకు సంబంధించి అక్రమాలు ఎక్కడైనా జరిగితే... ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇందుకు కఠిన చట్టాల్ని సైతం అమలు చేస్తున్నాం. ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఎవరైనా ఎక్కువ అమ్మితే చట్టప్రకారం చర్యలు తీసుకునేలా వ్యవస్థను నడిపిస్తున్నాము. అటువంటివారికి రూ.2 లక్షల జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష విధించేలా కఠిన చట్టాన్ని తెచ్చాం. అక్రమాలపై ఎవరైనా ఫిర్యాదులు చేయాలన్నా టోల్ఫ్రీ నెంబర్ 14500ను అందుబాటులో ఉంచి ప్రచారం కూడా చేయిస్తున్నాం. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ద్వారా ఇప్పటికే 18వేల కేసులు నమోదు చేశాం. 6.36 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను సీజ్ చేయడం జరిగింది. చాలామందికి శిక్షలు కూడా పడటం జరిగింది. మరి, చంద్రబాబు హయాంలో ఇలాంటి కఠిన చట్టాలు అమలు చేయడం, జరిమానాలు, శిక్షలు విధించడం చేశారా..? నాడు ఆయన హయాంలో పట్టాభూముల్లో కూడా ఇసుకను యథేచ్ఛగా తవ్వుకుని అమ్ముకున్న దాఖలాలున్నాయి. ఇసుక కొరత లేకుండా చూస్తున్నాం... ఇసుక కొరత, అక్రమ తవ్వకాలు అంటూ.. చంద్రబాబు చేస్తున్న తప్పుడు ఆరోపణల్ని మేం ఖండిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి గారు రాష్ట్రంలో నిర్మాణ రంగానికి అండగా ఉన్నారు. వర్షాకాలంలో కూడా ఎక్కడా ఇసుక కొరత రాకుండా అన్నిరకాల జాగ్రత్త చర్యలు చేపట్టి.. ఎండాకాలంలోనే స్టాక్యార్డుల్లో ఇసుక నిల్వలు ఉంచేలా ఆదేశాలిచ్చారు. కనుకే, ఇప్పటి వరకు మాకు ఇసుక దొరకడం లేదని ఎవరూ చిన్నపాటి కంప్లైంట్ కూడా చేయలేదు. ఇసుక కొరత రాష్ట్రంలో లేనేలేదు. ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలింపుపై చెక్పోస్టుల ద్వారా ప్రత్యేక నిఘాను కట్టుదిట్టం చేశాం. చంద్రబాబుకు బంపర్ఆఫర్ ఇసుకపై చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. సంబంధంలేని అంశాలతో శిరోముండనం అంటూ ముడేస్తాడు. అన్నమయ్య ప్రాజెక్టుకూ ఇసుకకు ఏం సంబంధం ఉంది. ఆయన మతిచలించి మాట్లాడుతున్నాడు..? ఒక్కపక్కన లోకేశ్ ఏమో ఇసుక దోపిడీ రూ.4వేల కోట్లంటాడు. చంద్రబాబునేమో రూ.40వేల కోట్ల ఇసుక అక్రమాలంటాడు. కనుక, ఈ ఆరోపణలన్నీ పక్కనబెడితే.. ప్రభుత్వానికి రూ.4వేల కోట్లు ఇస్తే ఇసుక కాంట్రాక్ట్ను మొత్తం చంద్రబాబుకే అప్పగిస్తాం. ఆయనకు ఇది మా బంపర్ ఆఫర్. బాబూ.. వాస్తవాలివిగో.. ఈ నాలుగున్నరేళ్లలో ఇప్పటివరకు రాష్ట్రంలో 6.70 కోట్ల టన్నులు ఇసుకను తవ్వితే మొత్తం రూ.2300 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. బాబు అడుగుతున్న జీఎస్టీ లెక్కలతో ప్రభుత్వానికేం సంబంధం ఉంటుంది. ఆ కాంట్రాక్టు సంస్థ కేంద్రానికి చెల్లిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 136 స్టాక్ పాయింట్లు ఉంటే.. వాటిల్లో ఇప్పుడు సుమారు 64 లక్షల టన్నుల ఇసుక నిల్వలున్నాయి. ప్రస్తుతం 110 ఓపెన్రీచ్ల్లో సుమారు 77 లక్షల టన్నుల తవ్వకాలకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లున్నాయి. కానీ, వరదలు, వర్షాల కారణంగా కొన్నిచోట్ల తవ్వకాలు నిలిచిపోయాయి. 42 డీసెల్టింగ్ పాయింట్లలో జరుగుతున్న ఇసుకకు సంబంధించి 90 లక్షల టన్నులకు అనుమతులున్నాయి. మైనింగ్ ఆదాయంలో పురోగతి మైనింగ్ రెవెన్యూ విషయానికొస్తే జగన్మోహన్రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టిన నూతన సంస్కరణలు మెరుగైన ఫలితాల్ని తెచ్చిపెట్టాయి. చంద్రబాబు పాలనలో కంటే ఇప్పుడు మైనింగ్ రెవెన్యూలో చాలా పురోగతిని సాధించామని చెబుతున్నాం. 2018–19లో అంటే చంద్రబాబు హయాంలో రూ.1950 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి వస్తే.. 2022–23 నాటికి అంటే, ఇప్పుడు జగన్ గారి హయాంలో రూ.4756 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఏపీఎండీసీ విషయానికొస్తే చంద్రబాబు ఉన్నప్పుడు (2018–19) రూ.833 కోట్లు వస్తే.. మా హయాంలో (ప్రస్తుతం) రూ.1806 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి చేరింది. -ఇలా మేము ప్రభుత్వానికి ఆదాయం వచ్చే సంస్కరణలతో ముందుకు పోతున్నాం. మరోవైపు చంద్రబాబు మాత్రం అసత్యాల్ని అల్లుతూ ప్రభుత్వంపై బురదజల్లే ఆరోపణలు చేస్తున్నారు. ఆయనకు అధికారం లేదనే తీవ్రమైన ఫ్రస్టేషన్తో ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా ఉన్నాడు. -ఇసుక తవ్వకాలపై గతంలో పవన్కళ్యాణ్, లోకేశ్లు కూడా మాట్లాడినప్పటికీ.. వారిద్దరికీ ఈ విషయంపై అంతగా అవగాహన ఉండదు కనుక పెద్దగా పట్టించుకునేదిలేదు. చంద్రబాబు ఊహాజనితమైన లెక్కలతో ఆరోపణలు చేసి తన స్థాయిని మరింత దిగజార్చుకోవద్దని.. ఇలాగే మాట్లాడితే.. ప్రజల చేతుల్లో పరాభవం కావడం ఖాయమని హెచ్చరిస్తున్నాను. మీడియా ప్రశ్నలకు సమాధానంగా.. జేపీ కాంట్రాక్టు కాలపరిమితి ఏడాది పెంపు జేపీ పవర్ వెంచర్స్ కంపెనీ కాంట్రాక్టు కాలపరిమితిని మరో ఏడాదికి పొడిగించాం. ఆ ఉత్తర్వులతోనే ప్రస్తుతం జేపీ సంస్థ తవ్వకాలు జరుపుతుంది. సబ్ కాంట్రాక్టు అగ్రిమెంట్లతో ప్రభుత్వానికి ఏమీ సంబంధంలేదు. ప్రభుత్వంతో కాంట్రాక్టు కుదుర్చుకున్న కంపెనీ, వారికి అనుబంధంగా ఇతర సంస్థలకిచ్చిన సబ్కాంట్రాక్టుల వ్యవహారాలు కూడా మా దృష్టికి రాలేదు. ఇది కూడా చదవండి: వైఎస్సార్ సీపీలో చేరిన జనసేన అభ్యర్థి -
అభివృద్ధికి కేరాఫ్.. పులివెందులా? కుప్పమా?
ఆంధ్రప్రదేశ్కు ఆయన దాదాపు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి ఆయన సుమారు 35 ఏళ్లు ఎమ్మెల్యే. అందువల్ల కుప్పం అద్భుతమైన ప్రగతి సాధించి ఉంటుందని ప్రజలు అనుకోవచ్చు. కానీ కుప్పం వెళ్లి చూస్తే పనికి తక్కువ ప్రచారానికి ఎక్కువ అన్నట్లుగా అర్థమవుతుంది. మీడియా అకాడమీ చైర్మన్ హోదాలో నేను ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గాన్ని.. అలాగే కుప్పం ఎమ్మెల్యే అయినా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంను పరిశీలిద్దామని వెళ్లాను. పులివెందుల-కుప్పం మధ్య పోల్చి ఎవరి అభివృద్ధి ఎలా ఉంది అనేది విశ్లేషించాలన్నది నా ఈ ప్రయత్నం. ఈ రెండిటిలో పులివెందుల అభివృద్ధి అద్భుతంగా ఉందనిపిస్తుంది. అదే టైంలో కుప్పం ప్రగతి జరగలేదని చెప్ప జాలం. కానీ.. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నియోజకవర్గం ఆ స్థాయిలో అభివృద్ధి చెందలేదని మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే పులివెందులలో సైలెంట్గా పనులు జరిగితే.. కుప్పంలో మాత్రం అభివృద్ధి కన్నా ప్రచారానికే అధిక ప్రాధాన్యం లభించినట్లు తెలుస్తుంది. ✍️ వైఎస్సార్ జిల్లాలో పులివెందుల ఒక మూల ఉంటుంది. దానికి సమీపంలోనే బెంగళూర్ చెన్నై లాంటి నగరాలు గాని ఇతర రాష్ట్రాల సరిహద్దులు గాని ఉండవు. కుప్పం కూడా చిత్తూరు జిల్లాలో ఒక మూలకున్నట్టుగా అనిపించినా.. బెంగళూరుకు అతి సమీపంలో, అలాగే తమిళనాడుకి దగ్గరలో ఉండడం తోటి అదొక సెంటర్ పాయింట్గానే ఉందని చెప్పాలి. అలాంటి చోట చంద్రబాబునాయుడు అనేక పరిశ్రమలను తీసుకొని వచ్చి ఉండాలి. కానీ అక్కడ అసలు పారిశ్రామిక ప్రగతి అన్నదే తు.. తూ.. మంత్రంగానే ఉన్నది. ✍️అలాగే అనేక విద్యా సంస్థలను కూడా నెలకొల్పి ఉండవచ్చు. కానీ కేవలం ప్రైవేట్ రంగంలో ఒక మెడికల్ కళాశాల ఒక ఇంజనీరింగ్ కళాశాల వంటివి మాత్రం కనబడ్డాయి. కాకపోతే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన ద్రావిడ విశ్వవిద్యాలయం మాత్రం ఉంది. అక్కడ 1600 ఎకరాల స్థలం ఉన్న దాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు చాలా తక్కువ మంది విద్యార్థులు ప్రస్తుతం అక్కడ అభ్యసిస్తున్నారు. దానికి కారణం కోర్సులు తక్కువగా ఉండడమే. దాన్ని జనరల్ యూనివర్సిటీగా కూడా మార్చి మరింత వెలుగులోకి తీసుకురావాలని అక్కడ స్థానికులు ఎప్పటినుంచో కోరుతున్నారు. ఇక కుప్పం వేరే కార్యక్రమాలు చూస్తే.. కుప్పానికి రింగ్ రోడ్ ఒకటి ప్రతిపాదించి చంద్రబాబు తన సమయంలో దాన్ని పూర్తి చేయలేకపోయారు. దానితోటి అది ఉపయోగంలోకి రాకుండా పోయింది. పైగా ప్రతిపాదిత రింగ్ రోడ్డు సమీపాన తెలుగుదేశం నేతల భూ దందా కూడా సాగిందట!. ఒక మాజీ మంత్రి అక్కడ ముందస్తుగానే పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని కొందరు చెబుతున్నారు. కుప్పానికి ప్రధానమైన సమస్యలలో సాగునీరు తాగునీరు కొరత ఉంది. అయితే.. హంద్రీనీవా ద్వారా నీటిని తీసుకువెళ్లాలని గతంలో ప్రభుత్వాలు ప్రయత్నించాయి. రాజశేఖర్ రెడ్డిది ఒరిజినల్ స్కీం. ఆ స్కీం లేకపోతే కుప్పానికి నీరు వచ్చే అవకాశం లేదు. ✍️ చంద్రబాబు 1995 నుంచి 2004 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో దానికి సంబంధించి పెద్ద కదలిక లేదు. 2014 నుంచి 2019 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేగంగా కాలువ పనులు చేపట్టి పథకానికి అవసరమైన లిఫ్ట్ను కూడా పూర్తి చేసి ఉంటే.. ఈపాటికే కుప్పంకు నీరు వచ్చుండేది. తద్వారా ఆయన ప్రజల అభిమానాన్ని చూరకొనేవారు. కానీ, దురదృష్టవశాత్తు ఆ పని చేయలేకపోయారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం కుప్పానికి నీటిని తీసుకురావడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దీనిని పూర్తి చేయగలిగితే ప్రతిపక్ష నేత నియోజకవర్గానికి నీరిచ్చిన ఘనత జగన్కు దక్కుతుంది. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రచారం హడావిడి చేసారు. అంతేతప్ప వాస్తవానికి నీరు రాలేదు. కాకపోతే అప్పట్లో అక్కడ కాంట్రాక్టు చేసిన ఒక టీడీపీ ఎంపీకి బాగా గిట్టుబాటు అయిందని చెబుతారు. ✍️ ఇక సంక్షేమ కార్యక్రమాల విషయానికి వస్తే చంద్రబాబు టైం లో అమలు చేసిన స్కీములకన్నా కనీసం ఐదారు రెట్లు జగన్ పాలనలో ప్రజలు లబ్ధి పొందారు. ఒక్క కుప్పం పట్టణంలోనే అమ్మబడి చేయూత పలు స్కీముల కింద 100 కోట్లు ప్రజలు పొందారు కుప్పంలో ఇది ఒక రికార్డు గాని భావించాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అన్నేళ్లు ఉన్నప్పటికీ అక్కడ ప్రభుత్వ స్కూళ్లను బాగు చేయాలన్న ఆలోచన చేయలేదు. కుప్పం సెంటర్ లోనే ఉన్న ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎంతో అధ్వాన్నంగా ఉండేది. దాన్ని ఇప్పుడు జగన్ ప్రభుత్వం నాడు-నేడు కింద పూర్తిగా మార్చివేసి అభివృద్ధి అంటే ఇది అని ప్రజలకు తెలియచెప్పింది. ఆ స్కూలుకు ఇప్పుడు వెళ్లి చూస్తే మంచి బల్లలు మంచి ఆహారం ఇతర సదుపాయాలతో కళకళలాడుతోంది. అక్కడ టాయిలెట్లు ఫైవ్ స్టార్ హోటల్లో టాయిలెట్ల రేంజ్ లో ఉన్నాయంటే ఆశ్చర్యం కాదు. రాష్ట్రవ్యాప్తంగా వీటిని ఒకే తరహాలో అభివృద్ధి చేస్తున్నారు జగన్. ✍️ అంతేకాదు.. ఆ మధ్య కుప్పం వెళ్లి సుమారు 70 కోట్ల మేర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి వచ్చారు. పేదలకు ఇళ్ల నిర్మాణంలో కూడా జగనే ముందంజలో ఉన్నారు. చంద్రబాబు టైంలో కేవలం అతి తక్కువ మందికి మాత్రమే ఇళ్లు ప్రభుత్వపరంగా లభించగా.. ఇప్పుడు 800 లకు పైగా ఇళ్లను జగన్ ప్రభుత్వం నిర్మిస్తోంది. తెలుగుదేశం టైంలో ఎంత ప్రయత్నం చేసినా ఇంటి జాగా ఇవ్వలేదని.. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే కులం, మతం, పార్టీ వంటివి చూడకుండా అర్హులైనటువంటి వారికి ఇచ్చారని కొందరు లబ్ధిదారులు చెప్పారు. కుప్పాన్ని పులివెందులని పోల్చి చూస్తే పులివెందుల అభివృద్ధి ముందు.. కుప్పం అసలు నిలబడలేదు. ✍️ ఎందుకంటే.. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయ్యాక పులివెందుల అభివృద్ధికి పునాదులు వేయడమే కాకుండా పరుగులు పెట్టించారు. అక్కడ రింగ్ రోడ్లు పలు పరిశోధనా సంస్థలు విద్యాసంస్థలు పరిశ్రమలు నైపుణ్య అభివృద్ధి సంస్థ తదితర ఎన్నో సంస్థలు అక్కడ కనిపిస్తాయి. నగరవనం పేరిట ఏర్పాటు చేసిన పార్కు అందరిని ఆకర్షిస్తుంది. ఇప్పుడు కొత్తగా నిర్మించిన బస్టాండ్ ఒక కొత్త ఆకర్షణగా మారింది. మార్కెట్ యార్డునూ ఆధునికరించారు. ఇవేవీ కుప్పంలో జరగలేదు. కుప్పం పులివెందుల రెండిటికీ నీటి సమస్య ఉన్నా వైఎస్సార్ చూపించిన చొరవతో సొరంగ మార్గం ద్వారా గండికోట వరకు నీరు తెచ్చి అక్కడి నుంచి లిఫ్టులు కూడా అమలు చేసి పులివెందులకు నీరు ఇచ్చి చూపించారు. అదే చంద్రబాబు కుప్పంలో కాలవలు కూడా పూర్తి చేయలేకపోయారు. పులివెందుల బస్టాండ్ ✍️ పులివెందులలో కూడా నాడు నేడు కింద అభివృద్ధి చేసిన స్కూలు చూస్తే ముచ్చట వేస్తుంది. పులివెందులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంటే.. కుప్పంలో అలా లేదు. ఒకప్పుడు చంద్రబాబు వ్యవసాయ రంగంలో ఇజ్రాయిల్ టెక్నాలజీ అంటూ హడావిడి చేశారు. కానీ అది ఇప్పుడు ఏమైందో తెలియదు. గత టర్మ్లో ఆ ఊసే వచ్చినట్టుగా లేదు. అయితే కుప్పంలో బోగస్ ఓటర్ల విషయంలో మాత్రం తెలుగుదేశందే రికార్డ్ అని చెబుతున్నారు. ఇప్పటికే సుమారు 17 వేల బోగస్ ఓట్లు తొలగించినా.. ఇంకా ఉన్నాయని, పైగా తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల వారిని కూడా చేర్చిన ఘనత టీడీపీదేనని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ కుప్పంకిచ్చిన ప్రాధాన్యతతో ఎన్నో పనులు చేపట్టామని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ వివరించారు. దానికి తోడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం పై ప్రత్యేక దృష్టి సారించారని.. అందువల్లే వైఎస్సార్సీపీ స్థానిక ఎన్నికలలో ఘన విజయం సాధించిందని చెప్పారు. పులివెందుల మున్సిపల్ ఎన్నికలలో మొత్తం ఏకగ్రీవంగా వైసిపి మున్సిపాలిటీని కైవసం చేసుకుంటే చంద్రబాబు తన మున్సిపాలిటీలో ఓటమికి గురి అయ్యారు. దానితో అసెంబ్లీ ఎన్నికలలో ఏమవుతుందో అన్న భయం ఆయనను వెంటాడుతుండగా.. పులివెందులలో జగన్ నిబ్బరంగా ముందుకు సాగుతున్నారు. పులివెందులలో సైలెంట్ గా అభివృద్ధిని చేసి చూపిన ఘనత రాజశేఖర్ రెడ్డి.. ఆ తరువాత జగన్లకు దక్కితే.. చంద్రబాబు అట్టహాసం ప్రచార ఆర్భాటంతో కుప్పం ప్రజల్ని భ్రమల్లో ఉంచుతున్నారన్న విషయం ఈ పరిశీలన ద్వారా ఎవరికైనా అర్థమైపోతుంది. కుప్పంలో ప్రచార ఆర్భాటం.. పులివెందులలో ప్రగతిపై విశ్లేషణ ::: కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
దొంగ ఓట్ల చరిత్ర చంద్రబాబుది: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: దొంగ ఓట్లతోనే కుప్పంలో చంద్రబాబు గెలుస్తూ వస్తున్నాడని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కుప్పంలో ఇప్పటికీ దొంగ ఓట్లు ఉన్నాయని, దొంగ ఓట్లను తొలగించి ఎన్నికల కమిషన్ ప్రక్షాళన చేస్తుందని ఆయన పేర్కొన్నారు. దొంగ ఓట్ల చరిత్ర చంద్రబాబుదని.. 2019కి ముందు రాష్ట్రంలో 60 లక్షల దొంగ ఓట్లను నమోదు చేయించారు.. ఇప్పుడు చంద్రబాబు తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి దుయ్యబట్టారు. ద్వేషంతో రాయలసీమకు చంద్రబాబు అన్యాయం: శ్రీకాంత్రెడ్డి వైఎస్సార్ జిల్లా: వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు అని, ఆయన పాలనలో ఒక్క ప్రాజెక్టయినా రూపకల్పన చేశారా? అంటూ ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు నీళ్లు అందించిన గొప్ప నేత వైఎస్సార్. ద్వేషంతో రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేశారు. పోతిరెడ్డిపాడును వ్యతిరేకిస్తూ ధర్నా చేయించిన వ్యక్తి చంద్రబాబు. రాయలసీమకు అభివృద్ధి చూపిన నాయకులు వైఎస్సార్, జగన్’’ అని శ్రీకాంత్రెడ్డి అన్నారు. చదవండి: విజయవాడలో టీడీపీ నేత ఘరానా మోసం.. రూ.6 కోట్లతో పరార్! -
కుప్పం వాసులకు చంద్రబాబు శూన్యం: మంత్రి పెదిరెడ్డి
-
కుప్పం నుంచే ఎన్నికలకు పిలుపునిస్తారా?
సాక్షి, తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతి ఒక్కరినీ తన కోసం వాడుకుని వదిలేసే రకం అని మరోసారి రుజువు చేసుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో మొదటి నుంచి చంద్రబాబు గెలుపు కోసం అహర్నిశలు పనిచేస్తున్న నాయకులను పక్కనబెట్టి.. ఇతర జిల్లా నివాసి, ప్రస్తుత ఎమ్మెల్సీకి కుప్పం బాధ్యతలు అప్పగించనున్నారు. ఎమ్మెల్సీ చెప్పినట్లు ప్రతిఒక్కరూ వినాలని చెప్పి ఒప్పించేందుకు చంద్రబాబు కుప్పం పర్యటనకు వస్తున్నారు. అందులో భాగంగానే మూడు రోజుల పర్యటనలో కేవలం ఒకే ఒక బహిరంగ సభ మాత్రం ఏర్పాటు చేసి.. మిగిలిన సమయం అంతా గ్రామ, వార్డు, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులతో విడివిడిగా సమావేశం కానున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకులంతా చంద్రబాబు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో ఓటమిపాలైన తర్వాత 1989లో కుప్పంకు వలస వెళ్లారు. అప్పటి నుంచి మొన్నటి వరకు ఎన్నికల నామినేషన్కు వచ్చినా.. రాకపోయినా, ప్రచారం చేసినా.. చేయకపోయినా కుప్పంకు చెందిన నాయకులే అహర్నిశలు కష్టపడి గెలిపించారు. ఆ ఓటమిని స్థానిక నేతలపై రుద్దే ఉద్దేశం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలకు జనం ఆకర్షితులయ్యారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నా చేయలేని పనులు ఈ నాలుగేళ్లలో చేసి చూపించారు. దీంతో సీఎం జగన్మోహన్రెడ్డిపై ప్రజలు నమ్మకం పెంచుకున్నారు. అందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని మట్టికరిపించారు. చంద్రబాబుని నమ్మని కుప్పం ప్రజలు వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పట్టారు. ఈ ఘోర పరిణామాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు స్థానిక సంస్థల ఓటమిని కుప్పం నియోజకవర్గ టీడీపీ నేతలపై మోపి చేతులు దులుపుకున్నారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికై న కంచర్ల శ్రీకాంత్కు కుప్పం నియోజకవర్గ పూర్తి బాధ్యతలు అప్పగించారు. స్థానిక నాయకులందరినీ కరివేపాకులా తీసిపడేశారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపట్ల అసంతృప్తిగా ఉన్న కుప్పం టీడీపీ నేతలను నయానో, భయానో ఒప్పించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే బుధ, గుర, శుక్రవారాల్లో కుప్పంలోనే మకాం వేయనున్నారు. ఈ మూడు రోజుల్లో గురవారం మాత్రమే బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. మిగిలిన సమయం అంతా కుప్పంలోని బీసీఎన్ కల్యాణ మండంలో నాయకులు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశం ముఖ్యఉద్దేశ్యం.. కుప్పం నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులంతా ఎమ్మెల్సీ చెప్పినట్లు నడుచుకోవాలని చంద్రబాబు హుకుం జారీచేయడమేనని స్థానికులు చెవులు కొరుక్కుంటున్నారు. బాబు నిర్ణయం పట్ల కుప్పం టీడీపీ శ్రేణుల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కుప్పం నుంచే ఎన్నికలకు పిలుపునిస్తారా? మరో వైపు 2024 ఎన్నికలకు చంద్రబాబు కుప్పం నుంచే పిలుపు ఇవ్వనున్నట్లు టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉచిత విద్యుత్ హామీని కుప్పంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అదే తరహాలో చంద్రబాబు కుప్పంలో కొత్తగా హామీలను ప్రకటించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంకా.. రాష్ట్రస్థాయి నాయకులను కుప్పానికి రమ్మని సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. వారందరి సమక్షంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. నమ్మించడానికి రెడీ! చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి భారీ చేరికలు ఉంటాయని జోరుగా ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు చేరుతున్నారని టీడీపీ శ్రేణులను నమ్మించారు. అందుకు అనుగుణంగా సాధారణ జనాన్ని పిలిపించుకుని టీడీపీ కండువాలు వేసి వారంతా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అని ఎల్లోమీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మరో వైపు వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టి గొడవలు సృష్టించి, ఆపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురదజల్లేందుకు కుట్రలు పన్నినట్లు టీడీపీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. -
కుప్పంలో కాళహస్తి తమ్ముళ్ల పంచాయితీ.. బాబు సమక్షంలో తగాదా..
తిరుపతి:ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది కాళహస్తి నాయుడు స్థితి. ఉన్నచోట ఉండకుండా అటు ఇటు వెళ్లి..ఇప్పడు ఎటూ కాకుండా పోయారు పాపం. టీడీపీలో ఉంటూ వైఎస్సార్సీపీలోకి వచ్చిన నాయుడు ఇప్పుడు అక్కడ ఇమడలేక టీడీపీలోకి మళ్లీ వద్దాం అని చూస్తున్నారు. అంతా అనుకున్నట్లు సాగితే ఈరోజే అయన టీడీపీలోకి మళ్లీ వచ్చి చేరేవారు కానీ అక్కడి టీడీపీ ఇంఛార్జ్ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి మోకాలు అడ్డం వేయడంతో పాపం నాయుడు గారు టీడీపీలోకి రాలేక, వైసీపీలో ఇమడలేక చాలా అవస్థలు పడుతున్నారు. గుర్తింపు రాకపోయేసరికి.. వాస్తవానికి ఎస్సీవీ నాయుడు 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో టీడీపీ అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో ఆయన టీడీపీలోకి చేరారు. అయినా సీటు ఇవ్వకపోవడంతో ఊరుకుని, 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. కానీ ఇన్నాళ్లున్నా ఆయనకు పార్టీలో ఎలాంటి గుర్తింపు రాకపోయేసరికి మళ్లీ టీడీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇష్టపడని సుధీర్ రెడ్డి.. ఈమేరకు గురువారమే టీడీపీలో చేరేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారు. చంద్రబాబు అనుమతులు, ఎపాయింట్మెంట్ సైతం ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పటికే తన క్యాడర్ కు సైతం సమాచారం అందించి మళ్లీ తాను టీడీపీలోకి వెళ్తున్నట్లు చెప్పేసారు. అయితే ఇంఛార్జీని తానూ ఉండగా తనకు కనీసం చెప్పకుండా, తన అంగీకారం లేకుండా నాయుడు మళ్లీ టీడీపీలో చేరడాన్ని ఇష్టపడని సుధీర్ రెడ్డి తన పవర్ చూపించారు. నియోజకవర్గ ఇంఛార్జీని అయిన తనకు చెప్పకుండా ఎస్సీవీ నాయుడును పార్టీలో ఎలా చేర్చుకుంటారని సుధీర్ రెడ్డి నేరుగా అధిష్ఠానాన్ని ప్రశ్నించడమే కాకుండా ఒక వాయిస్ మెసేజ్ కూడా విడుదల చేసారు. కార్యకర్తలు ఎవరూ పోవద్దని సుధీర్ రెడ్డి వాయిస్ మెసేజ్ కార్యకర్తలతోబాటు అధిష్టానానికి చేరింది. ఈతకాయ తెచ్చుకుని తాటికాయ వదిలేసుకోవడం ఎందుకని భయపడిన చంద్రబాబు, అధిష్ఠానం ఎన్సీవీ నాయుడు చేరికను తాత్కాలిక వాయిదా వేసింది. కుప్పంలో తేల్చుకుందాం రమ్మని చంద్రబాబు కబురంపడంతో ఇరువర్గాలు తమ బలాబలాలు తేల్చడానికి సిద్ధమయ్యాయి. రెండువర్గాల నేతలు..కార్యకర్తలు బరిలోకి దూకడానికి రెడీగా ఉన్నారు.దీంతో బొజ్జల సుధీర్ రెడ్డితోపాటు ఎన్సీవీ నాయుడు గ్రూపు తమ బలాబలాలు అక్కడ తెల్చుకోనున్నాయి. ఇదీ చదవండి:బాబు.. దేవుడితో పరాచకాడితే ఇంకా పాతాళానికి పోతావ్: కొట్టు సత్యనారాయణ -
చంద్రబాబును భయపెడుతోంది ఇదే..!
వై నాట్ 175 ప్రచారం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును భయపెడుతోందా? వచ్చే ఎన్నికల్లో కుప్పం కూడా జారిపోతుందని ఆందోళన చెందుతున్నారా? కుప్పం గురించి చంద్రబాబు సొంత సర్వేలు ఏం చెబుతున్నాయి? ఎన్నడూ లేనిది పచ్చపార్టీ బాస్ ఎందుకింత భయపడుతున్నారు? హఠాత్తుగా కుప్పానికి కమిటీలు ఎందుకు వేస్తున్నారు? ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి గడపను తాకుతున్నాయి. ప్రతి ఇంటికి లంచాలకు తావు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పుడు మనం ఎందుకు వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 నియోజకవర్గాలు గెలవలేమని సీఎం జగన్ ప్రశ్నించుకున్నారు. 175 సీట్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇదే నినాదంతో వైఎస్సార్సీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఇటీవల టైమ్స్ నౌ సర్వేలో వైఎస్సార్సీపీకి 24 లేదా 25 ఎంపీ స్థానాలు వస్తాయని తేలింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైనా అనుకుంటే అది కచ్చితంగా చేసి తీరుతాడని భావించిన చంద్రబాబుకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం గురించి భయం పట్టుకుంది. కుప్పంలో 2014 ఎన్నికల్లో 47 వేల మెజార్టీ సాధించిన చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో 30 వేల ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు చేయని విధంగా కుప్పంను రెవెన్యూ డివిజన్గా సీఎం జగన్ చేసి చూపించారు. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ఇదంతా చూస్తున్న చంద్రబాబుకు కుప్పం భయం వెంటాడుతోంది. అందుకే సొంతంగా చేయించుకున్న అంతర్గత సర్వేలో కుప్పంలో కూడా టీడీపీకి ఎదురుగాలి వీస్తుందని తేలింది. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సైతం గెలవడం కష్టమేనని పార్టీ నేతలు కూడా బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఉన్నఫలంగా కమిటీ.. కుప్పం గురించి ఆందోళన చెందుతున్న చంద్రబాబు ఉన్నఫలంగా పార్టీ తరపున ముగ్గురితో ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. మరో 31 మందితో జంబో కమిటీ వేసుకున్నారు. అంతేకాకుండా కుప్పం పట్టణంలో టీడీపీ బలోపేతం కోసం ఎనిమిది మందితో మరొక కోర్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలను వచ్చే ఎన్నికల్లో లక్ష మెజార్టీ సాధించడం కోసం ఏర్పాటు చేశామని టీడీపీ నేతలు చెబుతుంటే జనం నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఏడాది క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో కూడా టీడీపీ నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోవడమే కారణం. నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీతో సహా, పంచాయితీలు, మండలాలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ ఖాతాలో చేరిపోయాయి. గత ఎన్నికల్లో చంద్రబాబుకు 30 వేల మెజారిటీ వస్తే..స్థానిక ఎన్నికల్లో నాలుగు మండలాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులకు 62 వేల మెజారిటీ వచ్చింది. స్థానిక ఎన్నికలు జరిగినప్పటినుంచి చంద్రబాబులో కుప్పం భయం మొదలైంది. ఎన్నికలకు ఏడాది సమయమే ఉండడంతో కుప్పం నియోజకవర్గం అయినా చేజారిపోకూడదని చంద్రబాబు తాపత్రయపడుతున్నారు. కుప్పం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏమి బాగోలేదని, సర్వేలు కూడా ఆశాజనకంగా లేవని లోకేష్ సమక్షంలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒకరు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కుప్పంలో తనకు ఎదురుగాలి వీస్తున్నదని చంద్రబాబుకు స్పష్టంగా అర్థమైంది. అందుకే నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. చూడాలి ఏం జరుగుతుందో..? చదవండి: ఓటమిలో టీడీపీ రికార్డు.. 50 నియోజకవర్గాల్లో హ్యాట్రిక్ పరాజయం! -
కుప్పం నియోజకవర్గ ప్రజలకు కుచ్చుటోపీ పెట్టిన చంద్రబాబు
-
చంద్రబాబు భయపడ్డారు కాబట్టే అక్కడ ప్రత్యేక కమిటీ..!
ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో జాగ్రత్తలు తీసుకోవడం ఆరంభించారు.ఆయన ఎంత భయపడకపోతే ప్రత్యేక కమిటీని నియమించుకుంటారు! గతం 35 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా కుప్పంలో పార్టీ నేతలు కొందరితో ఎన్నికల కమిటీని నియమించారు. నియోజకవర్గ ఇన్ చార్జీగా ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్సీ కె.శ్రీకాంత్ ను పెట్టుకోవడం మరో విశేషం. కుర్రవాడైన ఇతనిని ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు తన నియోజకవర్గానికి బాద్యుడిగా పెట్టుకుని ఎన్నికలకు వెళుతుండడం విశేషం. ఇదంతా కుప్పంలో తాను ఎక్కడ ఓడిపోతానో అన్న భయంతోనే చేస్తున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ప్రత్యేక కమిటీ గతంలో చంద్రబాబు కేవలం తన పీఏ మనోహర్ ద్వారా కథ నడిపేవారు. ఎన్నికల సమయంలో అవసరమైన డబ్బు,దస్కం అన్ని వ్యయం చేయడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకునేవారు. అలాంటిది ఎన్నికలకు ఏడాది ముందు ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడం, కుప్పం పట్టణంలో పార్టీని బలోపేతం చేయడానికి మరో కమిటీని నియమించడం అన్నీ కూడా టీడీపీ అక్కడ బలహీనంగా ఉన్న సంగతిని తెలియచేస్తాయి. ఇందులో ఒక ప్రత్యేకత ఏమిటంటే చంద్రబాబు నియోజకవర్గంలో పార్టీ బాధ్యులను ఎవరినైనా మార్చే అధికారం ఎమ్మెల్సీ శ్రీకాంత్కు అప్పగించారట. మాజీ ఎమ్మెల్సీ జి.శ్రీనివాసులు ఆ ప్రాంతం వారైనప్పటికీ, ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీకాంత్కు అధికారం ఇవ్వడం కూడా గమనించవలసిన అంశం. కుప్పం ప్రాంతంవారిని నమ్మే పరిస్థితి చంద్రబాబుకు లేకపోయిందేమోనని అంటున్నారు. 1983లో కాంగ్రెస్ఐ తరపున చంద్రగిరిలో పోటీచేసి ఓడిపోయిన తర్వాత, టీడీపీలో చేరి బీసీలు అధికంగా ఉండే కుప్పం నియోజకవిర్గానికి మారి ఎమ్మెల్యేగా 1989 లో ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన అక్కడనుంచి ఎమ్మెల్యేగాగెలుస్తూ వస్తున్నారు. తనకు ఇంతకాలం ఎదురు లేకుండా ఆయన చేసుకోగలిగారు. కాని ఇప్పుడు కధ కొంత మారినట్లుగా ఉంది. అందుకే ఆయన తన సామాజికవర్గానికే చెందిన వేరే జిల్లాకు చెందిన వ్యక్తిని కుప్పంలో బాధ్యుడిగా నియమించడం అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. కుప్పం నియోజకవర్గంలో 32 మందితో సమన్వయ కమిటీని వేశారు. సాధారణంగా పార్టీ బలహీనంగా ఉన్నచోటే ఈ స్థాయిలో కమిటీలు వేస్తుంటారు. చంద్రబాబు బిజీగా ఉంటారు కనుక ఈ ఏర్పాటు అని అనుకున్నా, గతంలో ఎప్పుడూ ఇలా కమిటీలు వేయలేదు కదా!వేరే జిల్లా వారిని తీసుకు వచ్చి ఇక్కడ పెత్తనం అప్పగించలేదు కదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. బాబు నోట.. కుప్పంలో ఇల్లు అట..! గత స్థానిక ఎన్నికలలో కుప్పం ప్రాంతం అంతా వైసీపీ వశం అవడం ఆయనకు ఆందోళన కలిగించింది. చివరికి కుప్పం మున్సిపాల్టీని వైసీపీ గెలుచుకోవడం పరువు తక్కువ అయింది. ఆ నేపద్యంలోనే చంద్రబాబు కుప్పంలోనే ఇల్లు కట్టుకుంటానని ప్రకటించారు. కొంత ఏర్పాటు కూడా చేసుకున్నారు. 1989 నుంచి కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నా, ఆయన ఎప్పుడూ ఇల్లు కట్టుకోలేదు. ప్రస్తుతం ఓటమి భయం ఎదురు అవుతుండడంతో ప్రజలను తనకు అనుకూలంగా మలచుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వైపు పులివెందులలో కూడా గెలుస్తామని బీరాలు పలుకుతూ, ఇంకో వైపు కుప్పం రాజకీయ పరిస్థితిపై ఆయన ఒకరకంగా వణుకుతున్నారని అనుకోవాలి. అంతేకాదు.ఆయా చోట్ల చంద్రబాబు ప్రసంగాలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్ను నోటికి వచ్చినట్లు తిడుతున్నారు. కుప్పంలో ఓడిపోతాననే భావనలో.. చివరికి ప్రజలను కూడా దూషిస్తున్నారు. ప్రజలకు దయ్యం బట్టి వైసీపీని ఎన్నుకున్నారని అంటున్నారట. ఇప్పుడు కుప్పంలో కూడా ప్రజలకు దెయ్యం పడితే తనను ఓడిస్తారేమోనన్న భయం ఏర్పడి ఉండాలి. జగన్ అమలు చేస్తున్న వివిద సంక్షేమ పధకాల ప్రభావం కుప్పంలో కూడా ఉంది. కుప్పంలో వివిధ అభివృద్ది పనులకు జగన్ నిదులు మంజూరు చేశారు.మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంపై దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. ఆయనను పవర్ పుల్ నేతగా పరిగణిస్తారు. ఆయన పట్టుబట్టి తనను ఓడిస్తారన్న భావన చంద్రబాబులో ఉండడంతోనే ఈ ముందస్తు చర్యలని అంటున్నారు. ఇంత భారీ కమిటీని వేసి మొత్తం అధికారాలు శ్రీకాంత్కు అప్పగించడం ద్వారా ఇప్పటి నుంచే ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేయవచ్చని, అలాగే గతంలో మాదిరి మళ్లీ బోగస్ ఓటర్లను చేర్పించే యత్నం చేయవచ్చని కొందరు అనుమానిస్తున్నారు. బాబుకు భయం అంటే ఏమిటో చూపించారు.. ఇంతకాలం తమిళనాడు, కర్నాటకలలోని సరిహద్దు గ్రామాల నుంచి జనాన్ని తెచ్చి బోగస్ ఓట్లు పోల్ చేయించేవారన్న ప్రచారం ఉంది. ఆ బోగస్ ఓట్లను ప్రస్తుత ప్రభుత్వం చాలావరకు తీసివేయించింది. దాంతో ప్రత్యామ్నాయ పద్దతులలో ఓటర్లకు అవసరమైన ఆర్దిక వనరులు సమకూర్చి ఇప్పటి నుంచే వారిని ప్రసన్నం చేసుకోవడానికే చంద్రబాబు ఇలా చేస్తున్నారా అన్న సంశయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం తనకు కుప్పంలో ఎదురు లేదని అనుకునే చంద్రబాబుకు భయం అంటే ఏమిటో చూపించిన ఘనత మాత్రం జగన్దే అవుతుందన్న అబిప్రాయం వ్యక్తం అవుతోంది. చివరిగా మరో మాట. మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి ఆంబోతు అని చంద్రబాబు దూషిస్తే ఆయన టిట్ ఫర్ టాట్ అన్నట్లు సమాదానం ఇచ్చారు. చంద్రబాబు ఆంబోతులకు ఆవులను సరఫరా చేసే వ్యక్తా అని రాంబాబు ప్రశ్నించారు. అంటే దాని అర్ధం తెలుస్తూనే ఉంది కదా! అధికార యావతో ఏది పడితే అది మాట్లాడి చంద్రబాబు ఎదుటివారితో తిట్టించుకుంటున్నారు. ఎంత అప్రతిష్ట! -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడెమీ చైర్మన్ -
చిత్తూరు జిల్లా కుప్పంలో రెచ్చిపోయిన టిడిపి కార్యకర్తలు
-
కుప్పంలో టీడీపీ గూండాగిరి
సాక్షి, చిత్తూరు/కుప్పం: ప్రశాంతమైన కుప్పంలో టీడీపీ నేతలు గూండాగిరి ప్రదర్శించారు. పోలీస్ అధికారులపైనే దాడులకు తెగబడ్డారు. అర్బన్ సీఐ శ్రీధర్, ఎస్ఐ శివకుమార్ కిందపడేలా తోసేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద మంగళవారం తెలుగు తమ్ముళ్లు సుమారు 150 మందికిపైగా గుమికూడారు. టీడీపీ కుప్పం ఇన్చార్జ్ పి.ఎస్.మునిరత్నం, ప్రతిపక్షనేత చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ నేతృత్వంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజ్కుమార్, మాజీ ఎంపీపీ వెంకటేష్ , మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ సత్యేంద్రశేఖర్, యూత్ ప్రెసిడెంట్ మణి, నాయకులు త్రిలోక్, గోపీనాథ్ కార్యకర్తలతో కలిసి పోలీసుల అనుమతి తీసుకోకుండానే టీడీపీ జెండాలతో రోడ్డుపైకి ప్రదర్శనగా వచ్చారు. సీఎం డౌన్డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. దీన్ని అడ్డుకున్న పోలీసు అధికారులపై తెలుగుదేశం కార్యకర్తలు దాడికి దిగారు. పోలీసులు, టీడీపీ నేతల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. టీడీపీ వారు బలంగా నెట్టేయడంతో అర్బన్ సీఐ శ్రీధర్, ఎస్ఐ శివకుమార్ కింద పడిపోయారు. వారిపైన టీడీపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా పెద్ద ఎత్తున పడ్డారు. పోలీసులు సీఐ, ఎస్ఐలను పైకి లేపడంతో వారు తేరుకున్నారు. టీడీపీ నేతలు అరుపులు కేకలతో నినాదాలు చేస్తూ మరింతగా రెచ్చిపోతూ.. దిష్టిబొ మ్మ దహనానికి ప్రయత్నించారు. పోలీసులు ఆ దిష్టిబొ మ్మను స్వాదీనం చేసుకుని దూరంగా పడేశారు. టీడీపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోయి ఆ దిష్టిబొ మ్మను తగులబెట్టి సీఎం డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలకు సంబంధించి 60 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడులకు తెగబడిన మరింతమందిని గుర్తించేపనిలో నిమగ్నమయ్యారు. -
కుప్పం పీఎస్పై దాడికి యత్నించిన టీడీపీ నాయకులు
సాక్షి, చిత్తూరు: టీడీనీ నేతలు మరోసారి రెచ్చిపోయారు. తమకేంటి అడ్డు అన్నట్లుగా పోలీస్ట్ స్టేషన్పైనే దాడికి యత్నించారు టీడీపీ నాయకులు. అడ్డుకోబోయిన పోలీసుల్ని నెట్టేశారు. ఈరోజు(మంగళవారం) స్థానిక టీడీపీ నాయకులు కుప్పం పోలీస్ స్టేషన్ వద్దకు మూకుమ్ముడిగా వచ్చారు. అక్కడ హల్చల్ చేస్తూ పోలీస్ స్టేషన్లోకి వెళ్లేందుకు యత్నించారు. దీన్ని అక్కడ ఉన్న సీఐ శ్రీధర్, ఎస్ఐ శివకుమార్లు అడ్డుకున్నారు. అయితే టీడీపీ నేతలు ఒక్కసారిగా దూసుకురావడంతో సీఐ, ఎస్లు కిందపడిపోయారు. ఈ క్రమంలోనే వారు పోలీస్ స్టేషన్లోకి వెళ్లేందుకు యత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థతి నెలకొంది. -
కుప్పంలో వైఎస్సార్సీపీలోకి టీడీపీ కుటుంబాలు
చిత్తూరు: కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలంలోని బల్ల పంచాయతీకి చెందిన 15 టీడీపీ కుటుంబాలు ఆదివారం స్థానిక సర్పంచ్ విజయ్ థామస్, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ విజలాపురం బాబురెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త, చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ భరత్ వారికి వైఎస్సార్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం.. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన వారు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ గెలుపునకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కుప్పం ఏఎంసీ చైర్మన్ విద్యాసాగర్, రెస్కో డైరెక్టర్ థామస్, మైనారిటీ నేతలు అల్లాభక్షు, షేక్ అహ్మద్, మాజీ సర్పంచ్ గోవిందప్ప తదితరులు పాల్గొన్నారు. చదవండి: పేదల కల నెరవేరుస్తున్న సీఎం జగన్ -
కుప్పంలో లక్ష మెజార్టీతో గెలుస్తా
నెల్లూరు (టౌన్): వచ్చే ఎన్నికల్లో తాను కుప్పం నియోజకవర్గంలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చెప్పారు. ఆయన శుక్రవారం ఇక్కడ ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని క్లస్టర్, యూనిట్ ఇన్చార్జ్ లు, పార్టీ మండల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు మా ట్లాడుతూ రానున్న రోజుల్లో ఫండ్ రైజింగ్ పేరుతో రూ.5 వేలు చెల్లిస్తే పార్టీ పర్మినెంట్ మెంబర్షిప్ ఇస్తామన్నారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో వైఎస్సార్సీపీ పతనం ప్రారంభమైందన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రజలు 175 నియోజకవర్గాల్లో టీడీపీని గెలిపించి వైఎస్సార్సీపీని ఇంటికి పంపిస్తారని చెప్పారు. సీఎం జగన్మోహన్రెడ్డి వైనాట్ కుప్పం అని చెబుతున్నారని, తాము వైనాట్ పులివెందుల అనే లక్ష్యంతో పనిచేస్తామని తెలిపారు. 2024 ఎన్నికల్లో క్లస్టర్, మండల, బూత్ ఇన్చార్జిలు ఎన్ని ఓట్లు సంపాదిస్తామో అన్న ప్రణా ళికను రచించుకోవాలన్నారు. ప్రజా సంబంధాలు ముఖ్యమని, ఆర్థికవేత్త అయిన మన్మోహన్సింగ్ ప్రజలతో సంబంధం లేకనే లోక్సభ ఎన్నికల్లో గెలవలేదన్నారు. తనకు మనుషులే లేరని చెబుతున్న సీఎం జగన్మోహన్రెడ్డికి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, 9 మంది రాజ్యసభ సభ్యులను ప్రజలే ఇచ్చారన్నారు. తాము 7.70 లక్షల ఇళ్లు పేదలకు కట్టిస్తే వాటిని గత నాలుగేళ్లుగా వారికి ఇచ్చిన పాపాన పోలేదన్నారు. జగనే రాష్ట్రానికి దరిద్రం, శని, సైతాన్ అని అన్నారు. పోస్టింగ్లు పెట్టినా, వార్తలు రాసినా జైలుకు పంపిస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీని ప్రజలు నిలదీయాలన్నారు. వలంటీర్ వ్యవస్థ ప్రజల కోసం పెట్టారని, ప్రజలు కట్టిన పన్నులతోనే వారికి జీతాలు ఇస్తున్నారన్నారు. వలంటీర్లు జగన్కు, వైఎస్సార్సీపీకి సేవలు చేయాల్సిన అవసరం లేదన్నారు. వలంటీర్ల వ్యవస్థను వ్యతిరేకించడంలేదని, వారు జవాబుదారీతనంగా ఉండాలని అన్నారు. వైఎస్సార్సీపీకి పనిచేసే వారిని క్లస్టర్ ఇన్చార్జ్ లు, మండల, గ్రామ నాయకులు నిలదీయాలన్నారు. దేశంలో 100 నగరాల్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. 100వ కార్యక్రమంలో భాగంగా మే 31న రాజమండ్రిలో మహానాడు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర నాయకులు పాల్గొన్నారు. నాలుగేళ్లలో ఎన్ని ఇళ్లు కట్టారు సాక్షి, అమరావతి : ఈ నాలుగేళ్లలో మీరు ఎన్ని ఇళ్లు కట్టారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ట్విటర్లో ప్రశ్నించారు. నెల్లూరులో నిర్మించిన టిడ్కో ఇళ్ల వద్ద సెల్ఫీ దిగి దాన్ని సీఎం జగన్ ట్విటర్కు ట్యాగ్ చేసారు. తమ ప్రభుత్వ హయాంలో పేదలకు ఒక్క నెల్లూరులోనే వేలాదిగా కట్టిన టిడ్కో ఇళ్లు ఇవేనని, లక్షల టిడ్కో ఇళ్లకు ఇవి సజీవ సాక్ష్యాలని తెలిపారు. మీరు కట్టిన ఇళ్లు ఎన్నో చెప్పాలని ప్రశ్నించారు. -
వైఎస్సార్సీపీలోకి వెంకటాపురం
శాంతిపురం: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కర్లగట్ట పంచాయతీలోని వెంకటాపురంలో దాదాపు 60 కుటుంబాలు మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్సీపీలో చేరాయి. గ్రామంలో గురువారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ భరత్ సమక్షంలో వీరంతా పార్టీ మారారు. రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దన్న ఆధ్వర్యంలో పార్టీలోకి వచ్చిన వీరికి ఎమ్మెల్సీ భరత్ కండువాలు వేసి ఆహ్వానం పలికారు. ప్రజలు, పేదల కోసం ప్రతిక్షణం తపిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని ఆశీర్వదించాలని ఆయన కోరారు. దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న గ్రామంలో ఇప్పటివరకు మూడు కుటుంబాలు మాత్రమే వైఎస్సార్సీపీలో ఉండేవి. ఇప్పుడు ఒక్కసారిగా దాదాపు 60 కుటుంబాల వారు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. గ్రామంలో పట్టున్న తమ్మన్నగారి వెంకటస్వామి, కోళ్లఫారం పెద్దన్నగారి జయవేలు, గొర్లెప్పగారి వెంకటస్వామి, గురుస్వామి వెంకటేష్, సుబ్బక్కగారి సుబ్రమణ్యం, గురుస్వామప్పగారి వెంకటేశు, మునివెంకట, రంగస్వామి, ఎ.వి.రమేష్, ఎన్.సుబ్బన్న సహా పలు కుటుంబాల పెద్దలు పార్టీలో చేరారు. సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో వివక్షకు తావులేకుండా తమకు లబ్ధిచేకూరడం, ఎమ్మెల్సీ భరత్ నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలు తీర్చడంతో తాము పార్టీలో చేరుతున్నామని గ్రామస్తులు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వసుంధర, జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బుల్లెట్ దండపాణి, రాష్ట్ర కార్పొరేషన్ల డైరెక్టర్లు చంగప్ప, కృష్ణమూర్తి, స్థానిక సర్పంచ్ గోవింద్, ఎంపీటీసీ సభ్యుడు చలం, బెంగళూరు మురుగేష్ తదితరులు పాల్గొన్నారు. -
చిత్తూరు: లోకేష్ యాత్రలో టీడీపీ కార్యకర్తల షాక్
చిత్తూరు: టీడీపీ నేత నారా లోకేష్కు పాదయాత్రలో షాకిచ్చారు ఆ పార్టీ కార్యకర్తలు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు జరిగిన అన్యాయంపై భానుమూర్తి అనే కార్యకర్త లోకేష్ను నిలదీశాడు. చంద్రబాబు హయాంలో బీసీలకు సంక్షేమ పథకాలు అందలేదని చెప్పాడు. టీడీపీ నేతలు వాళ్లకు వాళ్లే సంక్షేమ పథకాలు పంచుకున్నారని పేర్కొన్నాడు. టీడీపీ హయాంలో సంక్షేమ పథకాలు అందక బీసీలు ఎంతో ఇబ్బందిపడ్డారని భానుమూర్తి అన్నాడు. కుప్పంలో పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదని లోకేష్కు నిర్మొహమాటంగా చెప్పాడు. కుప్పంపై పార్టీ నాయకులు తప్పుడు రిపోర్టు ఇస్తున్నారని వివరించాడు. తాను వాస్తవం చెబుతున్నానని, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదని భానుమూర్తి తేల్చి చెప్పాడు. బీసీలకు జరిగిన అన్యాయాన్ని బహిరంగంగా భానుమూర్తి మాట్లాడటంతో టీడీపీ నేతలు మొహాలు తెల్లబోయాయి. నిజాలు చెప్పిన భానుమూర్తిపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కుప్పంలో గ్రౌండ్ రిపోర్టు ఎందుకు బాగోలేదంటూ మండిపడ్డాడు. చదవండి: నేను మూర్ఖుడిని -
నేను మూర్ఖుడిని
శాంతిపురం (చిత్తూరు జిల్లా): తాను మూర్ఖుడినని, తమ వారిపై కేసులు పెట్టిన అధికారులను వదలిపెట్టేది లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చెప్పారు. చక్రవడ్డీతో కలిపి రుణం తీర్చుకుంటామని అన్నారు. భయం తమ బ్లడ్లోనే లేదని అన్నారు. కేసులకు భయపడకుండా పోరాటం చేయాలని పార్టీ కార్యకర్తలకు చెప్పారు. లోకేశ్ యువగళం పాదయాత్ర శనివారం ఉదయం గుడుపల్లె మండలంలోని పీఈఎస్ ఆస్పత్రి వద్ద ప్రారంభమై సాయంత్రం శాంతిపురం మండలంలోని టి.కొత్తూరు క్రాస్ వద్ద ముగిసింది. ఆయన టీడీపీకి చెందిన కురబ, బీసీ నాయకుల సమావేశాల్లో, పలుచోట్ల రోడ్లపై మాట్లాడారు. తమ హయాంలో కుప్పంలో పరిశ్రమలు తెచ్చామని, 25వేల మందికి ఉపాధి కల్పించామని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక బీసీల కుల వృత్తులకు కావాల్సిన పరికరాలు ఇస్తామని, తొలి ఏడాదిలోనే అన్ని కులాలకు కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తామని అన్నారు. వ్యవసాయ బోర్లకు మీటర్ల పేరుతో రైతులకు ఉరి వేస్తున్నారని, అకౌంట్లలో వేస్తామన్న బిల్లు సొమ్ము గ్యాస్ సబ్సిడీలాగా తగ్గిపోతోందని విమర్శించారు. 80శాతం రైతులకు రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. -
మీకు ప్రాణభిక్ష పెట్టింది పోలీసులే,, ఆ విశ్వాసం మరిచి అసభ్యంగా తిడతారా?
చిత్తూరు రూరల్/కుప్పం(చిత్తూరు జిల్లా)/తిరుపతి మంగళం: టీడీపీ నేత అచ్చెన్నాయుడికి ప్రాణభిక్ష పెట్టింది పోలీసులేనని.. ఆ విశ్వాసం మరిచి ఇప్పుడు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని చిత్తూరు జిల్లా పోలీసు యూనియన్ అసోసియేషన్ ధ్వజమెత్తింది. కుప్పంలో శుక్రవారం జరిగిన నారా లోకేశ్ పాదయాత్రలో అచ్చెన్నాయుడు పోలీసులను అసభ్య పదజాలంతో దూషించడం పట్ల పోలీసు సంఘం నేతలు తీవ్రంగా మండిపడ్డారు. శనివారం వారు చిత్తూరు నగరంలోని ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు. సంఘం అధ్యక్షుడు ఉదయ్ మాట్లాడుతూ పోలీసులు భద్రత విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తారన్నారు. ఆ విషయంలో దేశంలోనే రాష్ట్ర పోలీసుశాఖ మొదటిస్థానంలో ఉందన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం లోకేశ్ పాదయాత్రకు దాదాపు 700 మంది భద్రత సిబ్బందిని కేటాయించిందన్నారు. అచ్చెన్నాయుడు పోలీసులపై అసభ్య పదజాలంతో మాట్లాడడం సరికాదన్నారు. పోలీసులంతా తిండి కోసం రాలేదన్నారు. ఆయన సోదరుడు కూడా ఓ పోలీసు అధికారి అని.. ఈ మాట అతన్ని అడిగి మాట్లాడాలని సూచించారు. గతంలో అచ్చెన్నాయుడిని కొందరు చితకబాది పడేసుంటే.. ప్రాణభిక్ష పెట్టింది పోలీసులేనని గుర్తుచేశారు. ఇటీవల టీడీపీ నేతలంతా పోలీసులను తిట్టడం ఓ ఫ్యాషన్గా మార్చుకున్నారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు పోలీసులకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ రిషాంత్రెడ్డిని కలిసి అచ్చెన్నాయుడుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఖాదర్బాషా, శరవణ, రమేష్ పాల్గొన్నారు. కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదు.. కులమతాలు, అధికార, ప్రతిపక్ష పార్టీలు అన్న తేడా లేకుండా నిత్యం ప్రజాసేవే పరమావధిగా సేవలందిస్తున్న పోలీసులను ఎవరైనా కించపరిచేలా మాట్లాడితే సహించేదిలేదని పోలీసు అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి సోమశేఖర్రెడ్డి హెచ్చరించారు. తిరుపతిలో ఏపీ పోలీసు అసోసియేషన్ నాయకులు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుప్పంలో అచ్చెన్నాయుడు పోలీసులపై చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా, పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయన్నారు. అసోసియేషన్ రాష్ట్ర సలహాదారు శంకర్రెడ్డి మాట్లాడుతూ పోలీసులను లెక్కచేయకపోవడం వల్ల చంద్రబాబు సభల్లో 11 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసి పోలీసులకు క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. అచ్చెన్నపై కేసు .. నారా లోకేశ్ పాదయాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో అచ్చెన్నాయుడు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారని సీఐ శ్రీధర్ వెల్లడించారు. కుప్పం ఎస్ఐ శివకుమార్ చేసిన ఫిర్యాదు మేరకు సెక్షన్ 153 కింద పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. -
తేలిపోయిన యువ గళం!.. పాదయాత్రకు స్పందన అంతంత మాత్రమే
కుప్పం రూరల్(చిత్తూరు జిల్లా): యువగళం పాదయాత్ర మొదటరోజే తేలిపోయింది. దాదాపు రెండు నెలలుగా ఆహా..ఓహో.. అంటూ ఊదరగొట్టినా జనాలను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. శనివారం టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు స్పందన అంతంతమాత్రంగా కనిపించింది. ఆయన కుప్పంలోని లక్ష్మీపురం నుంచి పాదయాత్ర ప్రారంభించగా.. సాయంత్రం కమతమూరు సమీపంలో జరిగిన బహిరంగ సభ జనాలు లేక వెలవెలబోయింది. తమిళనాడు, కర్ణాటక నుంచి జనాలను తరలించినా ఫలితం లేకపోయింది. సభాప్రాంగణం సగభాగం వరకు దాదాపు ఖాళీగా కనిపించింది. లోకేష్ బాబు ప్రసంగిస్తుండగా మధ్యలోనే జనం వెళ్లడం చర్చనీయాంశమైంది. అడుగడుగునా యువగళం వలంటీర్లు జనాలపై విరుచుకుపడడం స్థానిక టీడీపీ కార్యకర్తలకు విసుగుపుట్టించింది. పాదయాత్ర మార్గంలోని రోడ్లపై చిరుదు కాణాలను కార్యకర్తలు తొక్కుకుంటూ వెళ్లడంతో వ్యాపారులు కన్నీళ్లు పెట్టుకున్నారు. పలమనేరు–క్రిష్ణగిరి హైవేపై ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోయింది. చదవండి: ఎక్కడికక్కడ గొడవలకు దిగండి.. ఎలాగైనా సరే లోకేశ్ పాదయాత్రకు హైప్ తేవాలి.. బాబు కుయుక్తులు? -
కుప్పం పోలీస్స్టేషన్లో అచ్చెన్నాయుడిపై కేసు నమోదు
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్స్టేషన్లో అచ్చెన్నాయుడిపై కేసు నమోదైంది. నిన్న కుప్పం బహిరంగ సభలో పోలీసులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. కుప్పం ఎస్ఐ శివకుమార్ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, యువగళం పాదయాత్ర మొదటరోజే తేలిపోయింది. దాదాపు రెండు నెలలుగా ఆహా..ఓహో.. అంటూ ఊదరగొట్టినా.. జనాలను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. శనివారం టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు స్పందన అంతంతమాత్రంగా కనిపించింది. ఆయన కుప్పంలోని లక్ష్మీపురం నుంచి పాదయాత్ర ప్రారంభించగా.. సాయంత్రం కమతమూరు సమీపంలో జరిగిన బహిరంగ సభ జనాలు లేక వెలవెలబోయింది. చదవండి: లోకేశ్ పాదయాత్ర: ఎక్కడికక్కడ గొడవలకు దిగండి.. చంద్రబాబు కుయుక్తులు? -
నారా లోకేష్ యాత్రలో తారకరత్నకు తీవ్ర అస్వస్థత
సాక్షి, కుప్పం: నారా లోకేష్ పాదయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. నటుడు నందమూరి తారకరత్న స్పృహ తప్పి పడిపోయారు. లక్ష్మిపురం మసీదు వద్ద అదుపు తప్పి వాహనంపై నుంచి కిందకిపడిపోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను చికిత్స కోసం కుప్పం కేసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకున్న నందమూరి బాలకృష్ణ.. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. -
Nara Lokesh Padayatra: తొలి రోజు రూ.10 కోట్లు!
కుప్పం(చిత్తూరు జిల్లా): టీడీపీ నేత నారా లోకేశ్ కుప్పం నుంచి శుక్రవారం ప్రారంభిస్తున్న యువగళం పాదయాత్రకు రూ.10కోట్ల భారీ వ్యయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి రోజు కేవలం సభా ప్రాంగణంలో వేదిక, కటౌట్లు, హోర్డింగులకు రూ.5 కోట్ల మేర ఖర్చు చేస్తున్నారు. జన సమీకరణ కోసం మరో రూ.5 కోట్లు వెచ్చిస్తున్నట్లు సమాచారం. కుప్పంలోని కమతమూరు రోడ్డులో టీడీపీ నేతలకు చెందిన 10 ఎకరాల విస్తీర్ణంలో బహిరంగ సభకు వారం రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు. పాదయాత్రకు కుప్పం నియోజకవర్గంలో ఒక్కో పంచాయతీ నుంచి 300 మందిని తరలించాలని టీడీపీ క్యాడర్కు అధిష్టానం ఆదేశాలు జారీచేసింది. చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ జన సమీకరణపై క్యాడర్తో నేరుగా మాట్లాడుతున్నారు. బహిరంగ సభకు వచ్చిన వారికి నగదు, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేలా టీడీపీ చర్యలు చేపట్టింది. తొలిరోజు పాదయాత్ర ఇలా.. నారా లోకేశ్ గురువారం రాత్రి కుప్పం చేరుకుని ఆర్ అండ్ బీ అతిథిగృహంలో బస చేస్తారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం మున్సిపాలిటీ లక్ష్మీపురంలోని వరదరాజులు దేవాలయంలో పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభిస్తారు. కమతమూరు రోడ్డులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం గుడుపల్లె మండలం శెట్టిపల్లి చేరుకుంటారు. రాత్రి పీఈఎస్ మెడికల్ కళాశాల ఎదుట ఓ ప్రైవేట్ స్థలంలో లోకేశ్ బస చేస్తారు. రెండో రోజు అక్కడి నుంచి శాంతిపురం మండలంలోకి ప్రవేశిస్తారు. ‘ఈనాడు’ తప్పుడు కథనాలు : ఎస్పీ చిత్తూరు అర్బన్: నారా లోకేశ్ పాదయాత్రపై ఈనాడు తప్పుడు కథనాలను ప్రచురించిందని చిత్తూరు ఎస్పీ రిశాంత్రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లోకేశ్ పాదయాత్రకు సాధారణ షరతులతో అనుమతి ఇచ్చామని తెలిపారు. -
వైఎస్ జగన్ లాంటి కొడుకు లేడని చంద్రబాబుకు కుళ్లు: మంత్రి పెద్దిరెడ్డి
-
‘చిత్తూరు జిల్లాలో చంద్రబాబు మళ్లీ పోటీ చేసే పరిస్థితే ఉండదు’
తిరుపతి: చిత్తూరు జిల్లాలో చంద్రబాబు మళ్లీ పోటీ చేసే పరిస్థితే ఉండదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు పని ఎప్పుడో అయిపోయిందని, చిత్తూరు జిల్లాను వదిలేసి చంద్రబాబు ఎప్పుడో వెళ్లిపోయారన్నారు మంత్రి పెద్దిరెడ్డి. ఈరోజు(సోమవారం) పెద్దిరెడ్డి తిరుపతిలో నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారు. చంద్రబాబును చిత్తూరు జిల్లా ప్రజలు ఏనాడు విశ్వసించలేదు. చంద్రబాబు ప్రజాకంఠక పరిపాలన చేశారు. చంద్రబాబు ఏడుపులను ప్రజలు విశ్వసించరు. చంద్రబాబుకు మమ్మల్ని తిట్టడం తప్ప వేరే పనేమీ లేదు. చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు కారుకూతలు కూస్తున్నారు. చంద్రబాబు తన కోసం, తన ఎల్లో మీడియా కోసమే పని చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు మళ్లీ పోటీ చేసే పరిస్థితే ఉండదు. కుప్పంలో వైఎస్సర్సీపీనే గెలుస్తుంది. కుప్పంలో టీడీపీ జెండా పీకేయడం ఖాయం. ప్రజాస్వామ్మం గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదం. చంద్రబాబు ప్రజాకంఠక పాలనపై రాష్ట్రంలో అందరికీ తెలుసు. చంద్రబాబుకు ప్రజలు రాజకీయ సమాధి కట్టడం ఖాయం. ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడమే చంద్రబాబు అజెండా. ప్రజా సంక్షేమ కోసమే సీఎం జగన్ పని చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలంతా మా పక్షానే ఉన్నారు’ అని పేర్కొన్నారు. -
గన్ షాట్ : కుప్పం డ్రామా ఎందుకు బెడిసికొట్టింది..?
-
కుప్పం వేదికగా చంద్రబాబు కని‘కట్టు’ కథ
సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పం వేదికగా నిన్నటి నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న హడావుడి అంతా ఇంతాకాదు. కందుకూరు, గుంటూరు టీడీపీ సభల్లో జనం చనిపోయిన ఉదంతాలను మరిపించి ప్రజల్లో సానుభూతి కోసం చంద్రబాబు చేస్తున్న డ్రామాలు పతాక స్థాయికి చేరాయి. పోలీసుల లాఠీఛార్జీలో తమ కార్యకర్తలు గాయపడ్డారంటూ నిన్నటి నుంచి గగ్గోలు పెట్టిన చంద్రబాబు… కనికట్టు కథ బట్టబయలైంది. చంద్రబాబు రాకముందు చేతికి, తలకు ఎటువంటి కట్లు లేకుండా ఎదురుచూస్తున్న టీడీపీ కార్యకర్తలు గురువారం కుప్పంలో ఆ కార్యకర్తలను పరామర్శించే ఒక సీన్ను చంద్రబాబు క్రియేట్ చేశారు. చంద్రబాబు పరామర్శకు వచ్చే సరికి మహానటులైన టీడీపీ కార్యకర్తలు ఆస్పత్రిలో బెడ్ల మీద తమకు గాయాలతో బాధపడుతున్నట్టుగా ఒక స్టిల్ ఇచ్చారు. తీరా చంద్రబాబు రాగానే.. యథాలాపంగా తన వంతు పాత్రను రక్తికట్టించారు. వారిని ఓదారుస్తున్నట్టుగా, భరోసానిస్తున్నట్టుగా బ్రహ్మాండంగా స్టిల్స్ ఇచ్చారు. ఈ పరామర్శ ముగిసిన తర్వాత చంద్రబాబు తన దైన శైలిలో రెచ్చిపోతూ మీడియాతో మాట్లాడారు. ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడారు. అంత వరకూ చూసేవాళ్లకు బాగానే ఉంది. కాకపోతే.. ఇక్కడే ఒక ట్విస్ట్. చంద్రబాబు కనికట్టు కథ… బట్టబయలైంది. ఇలా చంద్రబాబు వెళ్లారో లేదో… ఆ వెంటనే మహా నటులైన టీడీపీ కార్యకర్తలు తమ బెడ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. చంద్రబాబు పరామర్శ సమయంలో కనికట్టు కన్నీరు పాలైన ఆ వార్డు.. తర్వాత ఖాళీగా దర్శనమిచ్చింది. బాబు వచ్చారు..పరామర్శ డ్రామా మొదలెట్టారు చంద్రబాబు వెళ్లగానే వార్డులో ఖాళీగా దర్శనమిస్తున్న బెడ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్ డ్రామాను చంద్రబాబు రక్తికట్టిస్తున్న తీరు.. -
కుప్పంలో ఐరన్ లెగ్
-
ప్రచార పిచ్చితో పిచ్చ పిచ్చగా వ్యవహరిస్తున్న చంద్రబాబు
-
రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు..పోలీసులతో వాగ్వాదం
-
Sakshi TV: సాక్షి టీవీపై చంద్రబాబు అక్కసు
సాక్షి, చిత్తూరు జిల్లా: సాక్షి టీవీపై చంద్రబాబు అక్కసు వెళ్లగక్కారు. సాక్షి టీవీనా.. వాడిని లాగి బయట పడేయండన్న చంద్రబాబు.. వారిది అమానుషం, బయట తిరగకుండా చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. కుప్పంలో పోలీసులపై కూడా చంద్రబాబు వీరంగం సృష్టించారు. పోలీసులపై ఆయన రెచ్చిపోయారు. మీ అంతు చూస్తానంటూ పోలీసులను బెదిరించారు. నిబంధనలు పాటించాల్సిందేనని బాబుకు పోలీసులు స్పష్టం చేయగా, ‘నాకే రూల్స్ చెబుతారా’ అంటూ పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం వెళ్లగక్కారు. కాగా, చంద్రబాబు కుప్పం పర్యటనలో ఓవరాక్షన్పై ఎమ్మెల్సీ భరత్ ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలు వీధి రౌడీల్లా ప్రవర్తించారని మండిపడ్డారు. చంద్రబాబు ఫ్రస్టేషన్ పీక్స్కు వెళ్లింది. ఇటీవలే 11 మంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు. మళ్లీ చంద్రబాబు ఏం చేద్దామని కుప్పం వచ్చారంటూ ప్రశ్నించారు. అమాయకుల మరణాలకు సంబంధించి పోలీసులపై నెపం నెట్టి ప్రజలను డైవర్ట్ చేయాలన్నదే బాబు ఉద్దేశం. పేద ప్రజల ప్రాణాలంటే చంద్రబాబు విలువలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: అందుకే ఆ జీవో తెచ్చాం: మంత్రి జోగి రమేష్ -
బాబుకు కుప్పంలో చెప్పుకునేందుకు ఏమీలేదు : మంత్రి జోగి రమేష్
-
పోలీసులను కొట్టేలా కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారు: మంత్రి పెద్దిరెడ్డి
-
కుప్పం: పోలీసులపై రెచ్చిపోయిన చంద్రబాబు
-
నాకే రూల్స్ చెబుతారా..? కుప్పంలో పోలీసులపై చంద్రబాబు వీరంగం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: పబ్లిసిటీనే ప్రధాన అజెండాగా చంద్రబాబు మరో షోకు తెరతీశారు. తన పబ్లిసిటీ కోసం కందుకూరు, గుంటూరులో 11 మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యిందే కాక.. ప్రశాంతంగా ఉన్న కుప్పంలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు కల్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, డీజీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ మూకలు పోలీసులపై దాడులకు తెగబడేలా రెచ్చగొట్టారు. వెరసి.. ఎల్లో మీడియా ద్వారా పబ్లిసిటీ చేయించుకొని, రాజకీయ మైలేజీ పొందడానికి విఫలయత్నం చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుప్పం శాసనసభ్యుడిగా మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించాలని భావించారు. కందుకూరు, గుంటూరు ఘటనల నేపథ్యంలో రోడ్ల మీద బహిరంగ సభలను నిషేధిస్తూ ప్రభుత్వం జీఓ ఇచ్చిన విషయం తెలిసిందే. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసులు.. ఆయన పీఏ మనోహర్కు ముందస్తు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు కార్యక్రమాల వివరాలు ఏమిటి? ఎక్కడెక్కడ పర్యటించనున్నారు? బహిరంగ సభలు ఎక్కడ నిర్వహించనున్నారు? రోడ్షోలు ఎక్కడ? అనే వివరాలు తెలియజేసి, అనుమతి తీసుకోవాలని సోమవారం రాత్రే నోటీసు ఇచ్చారు. అయితే మంగళవారం అర్ధరాత్రి వరకు చంద్రబాబు నుంచి కానీ, ఆయన పీఏ నుంచి కానీ పోలీసులకు ఎటువంటి సమాచారం లేదు. దీంతో సభలు, సమావేశాలకు అనుమతులు లేవంటూ పోలీసులు లిఖిత పూర్వకంగా సమాచారం ఇచ్చారు. అంతా పథకం ప్రకారమే.. టీడీపీ శ్రేణులు ఏపీ, కర్ణాటక సరిహద్దులోని శాంతిపురం మండలం 121 పెద్దూరు, గడ్డూరు క్రాస్ వద్ద హంగామా చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. చంద్రబాబు పర్యటనకు కుప్పం వాసుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో టీడీపీ శ్రేణులు మదనపల్లె, వీ.కోట, కర్ణాటక నుంచి ప్రత్యేక వాహనాల్లో జనాన్ని తీసుకు రావడం ప్రారంభించారు. దీంతో పోలీసులు అనుమతి లేని వాహనాలకు ప్రవేశం లేదని, వాటిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఇక్కడి విషయాలను మాజీమంత్రి అమర్నాథ్రెడ్డి, చంద్రబాబు పీఏ, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు ఎప్పటికప్పుడు చంద్రబాబుకు ఫోన్ ద్వారా చెబుతూ వచ్చారు. డ్రామాను రక్తి కట్టించాలని.. కుప్పం వాసుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడం గ్రహించిన చంద్రబాబు.. తన ఎల్లో మీడియా ద్వారా విస్తృత ప్రచారానికి తెరతీశారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటున్నారంటూ.. టీడీపీ శ్రేణుల ద్వారా హడావుడి చేయించారు. తన జనాన్ని రెచ్చగొట్టి పోలీసుల పైకి ఉసిగొల్పారు. పోలీసులు లాఠీచార్జ్ చేస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచవచ్చనే ఉద్దేశంతో కొందరు టీడీపీ శ్రేణులను సామాన్య జనం రూపంలో గడ్డూరు క్రాస్ వద్దకు పంపించారు. వారి వద్ద రాడ్లు, కర్రలు, రాళ్లు కనిపించాయి. వారి ద్వారా గొడవ సృష్టించి లబ్ధి పొందడానికి విఫల యత్నం చేశారు. 1861 పోలీసు చట్టమే వర్తించదంటూ వక్రభాష్యం చంద్రబాబుకు చట్టాల పట్ల కనీస అవగాహన లేదని మరోసారి నిరూపితమైంది. రోడ్లపై సభలకు అనుమతులు రద్దు చేస్తూ ప్రభుత్వం 1861 పోలీసు చట్టం ప్రకారం జీవోను జారీ చేసింది. అయితే ఆ చట్టం ఆంధ్రప్రదేశ్కు వర్తించదని చంద్రబాబు పోలీసులతో వాగ్వాదం పెట్టుకోవడం విస్మయ పరిచింది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం 30 పోలీస్ యాక్ట్ను ఇక్కడ ఎలా అమలు చేస్తారని కూడా ఆయన ప్రశ్నించారు. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు.. కేంద్ర పోలీసు బలగాలతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పోలీసు వ్యవస్థలు 1861 పోలీస్ యాక్ట్ ప్రకారమే పని చేస్తున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న రోజుల్లో కూడా రాష్ట్రంలో ఎన్నోసార్లు 30 పోలీస్ యాక్ట్ అమలు చేశారు. జనం ముసుగులో పోలీసులపై దాడి బుధవారం ఉదయం నుంచే గడ్డూరు వద్ద వందలాది మంది టీడీపీ కార్యకర్తలు, అద్దె మనుషులు ఇరుకైన రోడ్లపై గుమికూడారు. దీనిపై పోలీసులు అభ్యంతరం తెలిపారు. అయినప్పటికీ టీడీపీ కార్యకర్తలు ససేమిరా అన్నారు. మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు తెలుగు తమ్ముళ్లను మరింత రెచ్చగొట్టారు. పోలీసులపై దాడికి దిగేలా ఉసిగొల్పారు. దీంతో కార్యకర్తలు మరింత ఆగ్రహంతో ఊగిపోయారు. రోడ్డుపై ఏర్పాటు చేసిన బందోబస్తు బ్యారికేడ్లను పక్కకు లాగేశారు. రోడ్డుపై బైఠాయించారు. ‘సీఎం డౌన్డౌన్.. ఇదేం ఖర్మ.. ఇదేం ఖర్మ..’ అంటూ నినాదాలతో రెచ్చిపోయారు. ఈ గందరగోళం మధ్య కొందరు టీడీపీ కార్యకర్తలు పోలీసులపై పిడిగుద్దులతో దాడి చేశారు. పోలీసులు కూడా లాఠీలను పైకెత్తి వారిని తరిమే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, టీడీపీ కార్యకర్తల నడుమ తోపులాట జరిగింది. సాయంత్రం 4 గంటలకు కర్ణాటక సరిహద్దు నుంచి చంద్రబాబు 121 పెద్దూరు చేరుకున్నాక టీడీపీ శ్రేణులు మరింతగా రెచ్చిపోయాయి. ఇంకో వైపు తమను అడ్డుకుంటున్నారంటూ ఎల్లో మీడియా ద్వారా బ్రేకింగ్ న్యూస్లు వేయించారు. ఉదయం నుంచి ఇలా జరిగేలా చంద్రబాబు ప్రణాళిక రచించి, అమలు చేయించారని స్పష్టమైంది. ఇలా గొడవ చేయడం ద్వారా పోలీసులు తనను అరెస్టు చేసేలా వ్యూహం పన్నారు. అయితే పోలీసులు ఏమాత్రం సంయమనం కోల్పోకుండా చంద్రబాబు, టీడీపీ నేతలు, శ్రేణులను సమర్థవంతంగా కట్టడి చేశారు. చదవండి: చంద్రబాబు కుప్పం పర్యటనలో ఓవరాక్షన్పై ఎమ్మెల్సీ భరత్ ఫైర్ -
కుప్పంలో పచ్చ బ్యాచ్ వీరంగం
-
కుప్పం: పోలీసులపై చేయి చేసుకున్న టీడీపీ నేతలు
-
కుప్పం: ‘మనకు ఇదేం ఖర్మరా బాబూ’
టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కుప్పం నియోజకవర్గ ప్రజలు హడలిపోతున్నారు. ఆయన పాదం పెట్టిన చోటల్లా అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతుండడంతో భయాందోళనకు గురవుతున్నారు. మొన్న నెల్లూరు జిల్లా కందుకూరులో ఎనిమిది మంది, నిన్న గుంటూరు ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంపై మదనపడుతున్నారు. ఇప్పుడు కుప్పం వస్తే ఎలాంటి అనర్థాలు జరుగుతాయోనని చర్చించుకుంటున్నారు. స్థానికులనే కాకుండా..టీడీపీ నేతలు సైతం ఎప్పుడు.. ఎలాంటి ఘటనలు ఎదురవుతాయోనని ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయంపై టీడీపీ ముఖ్యనేతలు వరుసగా రెండు రోజులు సమావేశాలు నిర్వహించి..'మనకు ఇదేం ఖర్మరా బాబూ' అంటూ విస్మయం చెందినట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి, తిరుపతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారైంది. బుధ, గురు, శుక్రవారాల్లో ఆయన కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బాబు పర్యటన షెడ్యూల్ ఇప్పటికే పలుమార్లు ఖరారైనా స్థానిక నేతలు సుముఖంగా లేకపోవడం.. జన సమీకరణకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో వాయిదాలు పడుతూ వచ్చింది. జన సమీకరణ, పర్యటన ఖర్చులు పార్టీ శ్రేణులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేయడంతో తప్పని పరిస్థితుల్లో ఒప్పుకున్నట్లు టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. వస్తే.. గమ్మనుండడుగా? గతంలో చంద్రబాబునాయుడు తన నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించిన సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అలజడి సృష్టించారు. ప్రశాంతంగా ఉన్న కుప్పంలో చిచ్చుపెట్టి కేసులు పెట్టే స్థాయికి తెచ్చారు. అనుచిత వ్యాఖ్యలతో జనాన్ని ఉసిగొలిపి కొట్లాటలకు కారణమయ్యారు. పచ్చని పల్లెల్లో వర్గవైషమ్యాలు సృష్టించి వేడుక చూసి వెళ్లిపోయారు. ఇప్పుడు మళ్లీ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో.. ఎవరెవరిని ఉసిగొల్పుతారో.. ఈ పర్యటన ఎక్కడికి దారితీస్తుందోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఏదో ఒకచోట తాను చెప్పాల్సింది చెప్పి వెళ్లితే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. చంద్రబాబు ప్రచార ఆర్భాటానికి జనాన్ని బలిపశువులు చేస్తున్నారని జనం గట్టిగా నమ్ముతున్నారు. గోదావరి పుష్కరాల్లో ఫొటో షూట్ కోసం 28 మంది.. ఇటీవల నెల్లూరు జిల్లా కందుకూరులో ఎనిమిది మందిని పొట్టనబెట్టుకోవడం చూస్తే ఆయన పాదం మామూలుది కాదని స్థానికులు చెప్పుకుంటున్నారు. అలాగే గుంటూరులో కానుకలను ఎరవేసి ముగ్గురి ప్రాణాలను హరించేశాడని గుర్తుచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కుప్పం పర్యటన ఖరారు కావడంతో స్థానికులు ‘ఐరన్ లెగ్’ వ్యాఖ్యలపై చర్చించుకుంటున్నారు. పబ్లిసిటీ కోసం బలవంతంగా జనాన్ని తరలించి చంపేస్తారేమోనని భయపడుతున్నారు. పర్యటనను వాయిదా వేసుకోమని టీడీపీ శ్రేణులు బ్రతిమలాడినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు చంద్రబాబు ససేమిరా అనడంతో చేసేదిలేక సభలకు ఓకే అన్నట్టు సమాచారం. (చదవండి: రామోజీ.. తప్పుడు రాతలు కట్టిపెట్టు) -
మూడుసార్లు సీఎంగా చేసినా కుప్పానికి సరైన బస్టాండ్ కట్టించలేని బాబు
-
యశ్వంతపూర్ - హౌరా ఎక్స్ప్రెస్ లో మంటలు
-
హౌరా ఎక్స్ప్రెస్లో మంటలు.. కుప్పం రైల్వేస్టేషన్లో ప్రయాణికుల పరుగులు
సాక్షి, చితూర్తు జిల్లా: బెంగళూరు నుంచి కుప్పం మీదగా యశ్వంత్పూర్ వెళ్తున్న హౌరా ఎక్స్ప్రెస్ ఏసీ బోగీలో మంటలు చెలరేగాయి. ఎస్9 బోగీలో మంటలు వ్యాపించాయి. దీంతో కుప్పం రైల్వేస్టేషన్లో రైలు నిలిచిపోయింది. రైలు దిగిన ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చిన రైల్వే సిబ్బంది.. వెంటనే మరమ్మతులు చేపట్టారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం అంతా ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: ఎవరు హోల్డ్? ఎవరు ఓపెన్?.. అసలు కథేంటో తర్వాత అర్థమైందట.. -
కుప్పంలోనూ గెలుపు మాదే : కొడాలి నాని
-
కుప్పం కాలువ పనులు షురూ
బి.కొత్తకోట: అనంత వెంకటరెడ్డి (ఏవీఆర్) హంద్రీ–నీవా ప్రాజెక్టు రెండో దశ పనుల్లో భాగమైన కుప్పం ఉపకాలువ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. గత మూడున్నరేళ్లుగా పనులు నిలిపేసిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ను రాష్ట్ర ప్రభుత్వం తప్పించింది. ఈ పనులను పాత ఒప్పందానికే ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.25 కోట్లు ఆదా అవుతాయి. పనులు కూడా ఆరు నుంచి 9 నెలల్లో పూర్తికానున్నాయి. క్షేత్ర స్థాయిలో పుంజుకుంటున్న పనులు అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం నుంచి పుంగనూరు ఉపకాలువ ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలో కుప్పం ఉపకాలువ మొదలవుతుంది. ఈ ఉపకాలువ గుడిపల్లె మండలంలోని పరమ సముద్రం చెరువు వద్ద ముగుస్తుంది. పనులపై గత ప్రభుత్వం శీతకన్ను వేయగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో క్షేత్రస్థాయిలో పనులు వేగం పుంజుకున్నాయి. ఈ పనులు పూర్తయ్యాక ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలించనున్నారు. అదనపు పనుల పేరుతో నిధులను కొల్లగొట్టి.. కుప్పం ఉపకాలువ పనులకు 2015లో రూ.413.27 కోట్లకు టెండర్లు పిలిచింది. దీంతో రూ.430.27 కోట్లకు హెచ్ఈఎస్–ఆర్కే–కోయా జాయింట్ వెంచర్ సంస్థ పనులు దక్కించుకుంది. మధ్యలో ఈ పనుల్లో నాటి టీడీపీ ఎంపీ సీఎం రమేష్కు చెందిన రిత్విక్ ప్రాజెక్టŠస్కు నాటి టీడీపీ ప్రభుత్వం భాగస్వామ్యం కల్పించింది. 2016 అక్టోబర్ నాటికి పనులన్నీ పూర్తి చేయాలని ఒప్పందం చేసుకున్నప్పటికీ పూర్తి చేయలేదు. టీడీపీ ప్రభుత్వం.. కాంట్రాక్టు సంస్థకు అదనపు పనుల పేరుతో రూ.122.75 కోట్లు మంజూరు చేస్తూ 2018 సెప్టెంబర్ 7న జీవో నంబర్ 626 జారీ చేసింది. మళ్లీ కాలువ గట్ల మీద మట్టిపనులు చేశారని 2019 జనవరి 28న జీవో 68 జారీ చేసి రూ.21.95 కోట్లు అదనంగా ఇచ్చింది. ఈ నిధులను తీసుకున్న కాంట్రాక్టు సంస్థ ఆ తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పనులను నిలిపివేసింది. పనులు చేపట్టాలని ఎన్ని నోటీసులు ఇచ్చినా కదలిక లేకపోవడంతో పనుల నుంచి ఆ సంస్థను ప్రభుత్వం తప్పించింది. వేగంగా పనులు పూర్తి చేసేందుకు.. హెచ్ఈఎస్–ఆర్కే–కోయా జాయింట్ వెంచర్ సంస్థ పనులు చేయకపోవడంతో ఆ పనులను సత్వరమే పూర్తి చేయించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పలు సంస్థలతో సంప్రదింపులు జరిపింది. ఈ క్రమంలో హైదరాబాద్కు చెందిన ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ గత ఒప్పంద విలువకే పనులు చేసేందుకు ముందుకు రావడంతో రూ.117.17 కోట్ల విలువైన పనులను అప్పగించారు. దీనివల్ల ప్రభుత్వానికి రూ.25 కోట్ల మేర ఆదా అయ్యింది. కాలువకు సంబంధించి 4.800 కిలోమీటర్ల కాలువ తవ్వకం, 101 స్ట్రక్చర్స్ నిర్మాణ పనులు, 8,32,141 క్యూబిక్ మీటర్ల మట్టి పనులు, 40,360 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు, మూడు ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పెండింగ్ పనులు, రోడ్ కటింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. మొత్తం ఒప్పంద విలువ రూ.430.27 కోట్లు అయినా గత ప్రభుత్వం అదనంగా రూ.144.7 కోట్లు పెంచుకోవడంతో పనుల అంచనా విలువ రూ.574.97 కోట్లకు చేరింది. 2019 వరకు 79.62 శాతం పనులు పూర్తి చేశారు. మిగిలిన రూ.117.17 కోట్ల పనులను ప్రస్తుతం పూర్తి చేయనున్నారు. దీనిపై ప్రాజెక్టు మదనపల్లె సర్కిల్ ఎస్ఈ సీఆర్ రాజగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వం ఈ పనులు పూర్తి చేయించి కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు తరలించాలన్న ఆశయంతో ఉందని చెప్పారు. పనులను వేగంగా పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీనిపై సీఈ హరినారాయణరెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని వెల్లడించారు. -
రెండు నెలల క్రితం లవ్ మ్యారేజ్.. అంతలోనే షాకింగ్ ఘటన.. అసలు ఏం జరిగింది?
కుప్పం(చిత్తూరు జిల్లా): పట్టణంలో గురువారం రాత్రి వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు.. ఆజాద్ రోడ్డులో ఉంటున్న రోహిత్కుమార్, భువనేశ్వరి రెండు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత పెద్దలు అంగీకరించడంతో రోహిత్కుమార్ ఇంట్లోనే కాపురం ఉంటున్నారు. గురువారం రాత్రి భువనేశ్వరి ఇంట్లో ఉరి వేసుకుని శవమై కనిపించింది. తమ కుమార్తెను రోహిత్ కుటుంబ సభ్యులే కడతేర్చారని భువనేశ్వరి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి మృతురాలి తండ్రి శరవణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. చదవండి: వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య -
ఇక కుప్పం పోలీసు సబ్డివిజన్.. విడుదలైన రాజపత్రం
సాక్షి, పలమనేరు/కుప్పం: కుప్పం ఇక పోలీసు సబ్డివిజన్ కానుంది. ఆమేరకు కొత్తగా కుప్పం పోలీసు సబ్ డివిజన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నం.147 గెజిట్ నోటిఫికేషన్ను జారీచేసింది. ఈ సబ్ డివిజన్కు ఎస్పీడీఓ కార్యాలయం కుప్పంగా అందులో పేర్కొన్నారు. పలమనేరు పోలీసు సబ్డివిజన్లోని కుప్పం నియోజకవర్గంలో కుప్పం, గుడపల్లి, రాళ్లబూదుగూరు, రామకుప్పంతో పాటు పలమనేరు నియోజకవర్గంలోని వీకోట, బైరెడ్డిపల్లితో కలిపి మొత్తం ఆరు స్టేషన్లు రూపొందించారు. సబ్ డివిజన్పరిధిలో కుప్పం, వీకోట రెండు సర్కిళ్లుంటాయి. త్వరలో ఇక్కడ డీఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పోస్టింగ్ ఇవ్వనున్నారు. చదవండి: (జనసేనకు కుప్పం ఇన్చార్జి రాజీనామా) -
ఆ రెండు నియోజకవర్గాలపై చంద్రబాబుకు దిగులు
సాక్షి, అమరావతి: కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలపై టీడీపీ అధినేతకు దిగులు పట్టుకుందని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి. విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ రెండు చోట్ల 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే పరువుపోతుందనే దిగులు చంద్రబాబుకు పట్టుకుందని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల సీఎం వైఎస్ జగన్ కుప్పం పర్యటన సందర్భంగా వచ్చిన జనం స్థానికులు కాదనే మాటతోపాటు అనేక అభాండాలు వేశారని.. తన పాత నియోజకవర్గం చంద్రగిరి మాదిరిగానే కుప్పం కూడా వచ్చే ఎన్నికల్లో తనను ఓడిస్తుందనే భయం బాబుకి పట్టుకున్నట్లు కనిపిస్తోందన్నారు. ఇక 2019 ఎన్నికల్లో లోకేశ్ ఓడిపోయినప్పటి నుంచి మంగళగిరిలో పార్టీ కార్యక్రమాలు పెరిగిపోయాయని ఇటీవల సమీక్షలో చంద్రబాబు తెగ సంబరపడిపోయారన్నారు. పొత్తుల కారణంగానే మంగళగిరిలో టీడీపీ బలహీనపడిందని, గత ఎన్నికల్లో ఓడిపోయిందని చెప్పడం నమ్మశక్యంగా లేదన్నారు. వాస్తవానికి తెలుగదేశం పుట్టినప్పటి నుంచి చూస్తే, మిత్రపక్షాలైన సీపీఎం, బీజేపీకి మంగళగిరి సీటు కేటాయించింది కేవలం నాలుగుసార్లు మాత్రమేనని తెలిపారు. -
జూన్లో కుప్పానికి హంద్రీ-నీవా జలాలు
సాక్షి, అమరావతి: హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ద్వారా కుప్పం నియోజకవర్గానికి వచ్చే ఏడాది జూన్ నాటికి నీళ్లందించేలా పనులు పూర్తి చేయాలని జలవనరుల శాఖకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను జూన్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిని సమీక్షించి గడువులోగా పూర్తయ్యేలా తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. వంశధార ప్రాజెక్టు ఫేజ్–2, స్టేజ్–2 పూర్తి స్థాయి ఫలాలను ముందస్తుగా అందించడానికి గొట్టా బ్యారేజీ నుంచి హిరమండలం రిజర్వాయర్కు నీటి ఎత్తిపోత పనుల టెండర్ల ప్రక్రియను ప్రారంభించామని అధికారులు తెలిపారు. ఈ ఎత్తిపోతలకు డిసెంబర్లో శంకుస్థాపన నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. విజయనగరం జిల్లా తారకరామ తీర్థ సాగరంలో మిగిలిన పనులకు టెండర్లు పిలిచామని, నవంబర్లో పనులు ప్రారంభిస్తామని వివరించారు. మహేంద్ర తనయ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అన్ని చర్యలు చేపట్టి రూ.852 కోట్లతో అంచనాలను సవరించామని, మిగిలిన పనుల పూర్తికి చర్యలు చేపట్టామని తెలిపారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్ పనులు కూడా పూర్తి కావస్తున్నాయని వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్లో 3.4 కి.మీ. మేర పనులు మిగిలాయని అధికారులు పేర్కొనగా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణా నదిపై కొత్త బ్యారేజీ నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనులు చేపట్టడానికి అవసరమైన భూ సేకరణకు నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాధాన్యతగా పనులు చేపట్టాలని సూచించారు. కొత్తవి పూర్తి చేయటంతోపాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలన్నారు. ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి ఒక కార్యాచరణ రూపొందించి క్రమం తప్పకుండా తనిఖీలతో అవసరమైన పనులు చేపట్టాలని నిర్దేశించారు. అత్యంత ప్రాధాన్యతగా పోలవరం.. పోలవరంను అత్యంత ప్రాధాన్యతగా పరిగణిస్తూ పనుల పురోగతిపై సీఎం జగన్ సమీక్షించారు. ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యాం నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతం(అగాధాలు), డయాఫ్రమ్వాల్ పటిష్టతను తేల్చడం, ఆ తర్వాత ఈసీఆర్ఎఫ్ పనులు చేపట్టే ప్రణాళికపై అధికారులతో చర్చించారు. ఇప్పటికీ గోదావరిలో వరద కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ రోజు కూడా గోదావరిలో 2.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోందన్నారు. ఈసీఆర్ఎఫ్ డ్యాంలో ఎలాంటి పనులు చేపట్టాలన్నా తొలుత కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చేందుకు పరీక్షలు, వాటిలో వెల్లడైన అంశాల ఆధారంగా సీడబ్ల్యూసీ డిజైన్లు ఖరారు చేస్తేగానీ చేపట్టమలేమన్నారు. కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చటానికి, డయాఫ్రం వాల్ పటిష్టతపై నిర్ధారణల కోసం సీడబ్ల్యూసీ సూచించిన మేరకు పరీక్షలను నవంబర్ మధ్యలో ప్రారంభిస్తామన్నారు. వాటి తుది ఫలితాలు డిసెంబరు ఆఖరుకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆ ఫలితాల ఆధారంగా కోతకు గురైన ప్రాంతం పూడ్చివేత విధానం, డిజైన్లను సీడబ్ల్యూసీ ఖరారు చేస్తుందన్నారు. పరీక్షల్లో వెల్లడయ్యే ఫలితాల ఆధారంగా డయాఫ్రమ్ వాల్పై సీడబ్ల్యూసీ ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ పరీక్షలు చేస్తున్న సమయంలోనే దిగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. దిగువ కాఫర్ డ్యాం పూర్తి కాగానే.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల మధ్య నిల్వ ఉన్న నీటిని తోడివేసి సీడబ్ల్యూసీ ఖరారు చేసిన డిజైన్ల మేరకు ఈసీఆర్ఎఫ్ పనులు ప్రారంభిస్తామన్నారు. ఆలోగా 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. గోదావరికి రెండో అతి పెద్ద వరద ప్రవాహం గోదావరిలో వరద ప్రవాహం నిరంతరం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. 1990 తర్వాత అత్యధికంగా ఈ ఏడాది గోదావరికి అతి పెద్ద వరద ప్రవాహం వచ్చిందన్నారు. ఈ ఏడాది జులై 18న అత్యధికంగా 25.92 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందన్నారు. ఆ తర్వాత ఆగస్టు 14న కూడా 15.04 లక్షల క్యూసెక్కులు, ఆగస్టు 19న 15.92 లక్షల క్యూసెక్కులు, సెప్టెంబరు 16న 13.78 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని తెలిపారు. ఇప్పటికీ రెండున్నర లక్షల క్యూసెక్కులకు పైగా వరద కొనసాగుతోందన్నారు. ధవళేశ్వరం బ్యారేజీకి 1990లో 355 రోజుల పాటు ప్రవాహం రాగా 7,092 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిశాయన్నారు. 1994లో ధవళేశ్వరం బ్యారేజీకి 188 రోజులు వరద ప్రవాహం రాగా 5,959 టీఎంసీలు కడలిలో కలిశాయి. 2013లో 213 రోజులు వరద రాగా 5,921 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. ఈ ఏడాది ధవళేశ్వరం బ్యారేజీకి 136 రోజుల పాటు వరద ప్రవాహంతో 6,010 టీఎంసీలు సముద్రంలో కలిశాయన్నారు. సమర్థంగా నియంత్రిస్తూ ఆయకట్టుకు నీళ్లు ప్రకాశం బ్యారేజ్ నుంచి 1,164.10 టీఎంసీలు కృష్ణా జలాలు, గొట్టా బ్యారేజ్ నుంచి 119.2 టీఎంసీల వంశధార జలాలు, నారాయణపురం ఆనకట్ట నుంచి 34.8 టీఎంసీల నాగావళి జలాలు, నెల్లూరు బ్యారేజ్ నుంచి 92.41 టీఎంసీల పెన్నా జలాలు ఇప్పటిదాకా కడలిలో కలిశాయని అధికారులు వెల్లడించారు. నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోందని, ఇంకా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రిజర్వాయర్లలో 90 శాతాన్ని నీటిని నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తున్నామన్నారు. వరదను సమర్థంగా నియంత్రిస్తూ ఆయకట్టుకు నీటిని అందించి రైతులకు ప్రాజెక్టుల ఫలాలు అందించాలని సీఎం జగన్ సూచించారు. ఎత్తిపోతల నిర్వహణపై ప్రత్యేక దృష్టి ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఐడీసీ) పరిధిలోని ఎత్తిపోతల పథకాలు ఏళ్ల తరబడి నిర్వహణ సరిగ్గా లేక మూలనపడుతున్నాయని అధికారులు పేర్కొనగా నిర్వహణపై ఎస్వోపీ (నిర్దిష్ట నిర్వహణ ప్రణాళిక)లు రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు. సంబంధిత ఎత్తిపోతల పథకాల పరిధిలో రైతులతో కమిటీలు ఏర్పాటు చేసి వారి పర్యవేక్షణలో నిర్వహించడంపై కసరత్తు చేయాలని సూచించారు. కర్ణాటక, మహారాష్ట్రతోపాటు వివిధ రాష్ట్రాల్లో ఎత్తిపోతల నిర్వహణకు అమలు చేస్తున్న విధానాలపై అధ్యయనం చేసి మెరుగైన పద్ధతి రూపొందించాలన్నారు. ఈ పథకాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలన్నారు. కరెంట్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తున్నందున రైతుల పర్యవేక్షణలో ఎత్తిపోతలను సమర్థంగా నిర్వహించేలా అవగాహన కల్పించి శిక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, వివిధ ప్రాజెక్టుల సీఈలు ఈ సమీక్షకు హాజరయ్యారు. -
ద్రావిడ సంస్కృతిపై శోధన సాగాలంటే...
ఈ దేశ మూలవాసులైన ద్రావిడులు మొదట్లో ఉత్తర భారతంలో నివసించేవారు. ఆర్యుల రాక తర్వాత వారు దక్షిణ ప్రాంతానికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుని ఒక విలక్షణమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోది చేశారు. దక్షిణ భారతీయ సమాజం వేల సంవత్సరాలుగా అనేక జాతులతో కలిసి జీవన గమనాన్ని సాగించినప్పటికీ వారి సాంస్కృతిక విలక్షణత మాత్రం పుస్తె కట్టడం నుండి పాడె కట్టడం వరకు కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ద్రవిడ జాతులు అత్యంత ప్రాచీనమైన సాంస్కృతిక నేపథ్యం కలిగి ఉన్నప్పటికీ ఈ భాషల్లో సాహిత్యం మాత్రం పదో శతాబ్దానికి అటూ ఇటుగా మాత్రమే లభిస్తోంది. తమిళులు మాత్రమే తమ సంగ సాహిత్యం అత్యంత ప్రాచీనమైనదనీ, ఈ సాహిత్యం క్రీ.పూ. 500 నుండి కనిపిస్తున్నదనీ ప్రకటించుకున్నారు. దాదాపుగా క్రీస్తుశకం ఒకటో శతాబ్దం వాడైన శాతవాహన చక్రవర్తి హాలుడు సేకరించి గుదిగుచ్చిన ‘గాథా సప్తశతి’ అనే ప్రాకృత గ్రంథంలో పిల్ల, పొట్ట, కరణి వంటి తెలుగు పదాలు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి ఆనాటికే తెలుగు భాష సమాజంలో బాగా స్థిరపడిన వ్యవహారిక భాషగా ఉందని చెప్పవచ్చు. అంతేగాకుండా, సాహిత్య భాషలుగా పేరుపడిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రంథ రూపంలో లభిస్తున్న సాహిత్యం కంటే ముందే మౌఖిక రూపంలో నిక్షిప్తమైన జానపద సాహిత్యం పుంఖానుపుంఖాలుగా తప్పకుండా ఉండి ఉంటుంది. ఉదా హరణకు ఇప్పటివరకు ఉన్న ఆధారాలను అనుసరించి తెలుగులో నన్నయ భారతాన్ని ఆది గ్రంథంగా భావిస్తున్నాం. అయితే, నన్నయ తల్లి పాడిన జోల పాట కూడా మౌఖిక వాఙ్మయంలో ఆనాటికే నెలకొని ఉంది అన్న సత్యాన్ని ఇక్కడ మనం మరచిపోకూడదు. కాబట్టి, నన్నయకు పూర్వమే తెలుగువారికి విస్తృతమైన మౌఖిక సాహిత్యం కూడా తప్పకుండా ఉంది. ఇటువంటి సాహిత్యం మాత్రమే ఒక జాతికి సంబంధించిన సహజమైన సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. అందుచేత, పరిశోధకులు ప్రధానంగా మూల వాసులు మౌఖికంగా నిక్షిప్తం చేసిన జానపద సాహిత్యంపై విరివిగా పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉంది. నేటి భాషా శాస్త్ర పరిశోధకుల అంచనాలకు అందినంతవరకు ద్రావిడ భాషలు 27 కనిపిస్తున్నాయి. ఈ విషయంలో కూడా మరింత పరిశోధన జరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంతే కాకుండా, ఈ ఆదిమ జాతులు అందించిన సంస్కృతిపై తగినంత పరిశోధన జరగలేదు అన్నది నిర్వివాదాంశం. ఈ లోటును భర్తీ చేయడం కోసమే ప్రొఫెసర్ వీఐ సుబ్రహ్మణ్యం, ఐఏఎస్ అధికారి కాశీ పాండ్యన్ వంటి మేధావులు కొందరు ద్రవిడ సంస్కృతిపై పరిశోధన కోసం ఒక కేంద్రాన్ని మంజూరు చేయాలని నాటి సీఎం నందమూరి తారక రామారావుని కోరారు. అయితే ద్రవిడ సంస్కృతిపై అత్యంత ఆదరాభిమానాలు కలిగిన రామారావు ఏకంగా ఒక విశ్వవిద్యాలయాన్నే మంజూరు చేశారు. అది 1997 అక్టోబర్ 20న కుప్పంలో ప్రారంభమైంది. ద్రావిడ విశ్వవిద్యాలయం ప్రధాన లక్ష్యాలలో కొన్ని... ద్రవిడ సంస్కృతిలోని ప్రాచీనత, విలక్షణతను, విశిష్టతను లోక విదితం చేయడం; ద్రవిడ సంస్కృతిపై వివిధ భాషల్లో నేటి వరకు జరిగిన పరి శోధనలు, ప్రచురణలను పదిల పరచడం, ప్రచారం చేయడం; తద్వారా, భావ వినిమయానికి, సంస్కృతీ పరిరక్షణకు బాటలు వేయడం. ద్రావిడ కుటుంబానికి చెందిన గిరిజన భాషలతో సహా లిఖిత భాషలు, మాట్లాడే ద్రావిడ భాషల సమగ్ర అభివృద్ధికి కృషి చేయడం; ద్రావిడ భాషలు, సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన కళలు, హస్తకళలు, అనుబంధ విషయాలలో ఉన్నత స్థాయిలో బోధనను, శిక్షణను అందించడం. భారత దేశం లోపల, వెలుపల ద్రావిడ భాషలు, సాహిత్యం, సంస్కృతి, ఆధునిక శాస్త్రాలు, వైద్యం, ఇంజనీరింగ్, సాంకేతికత వాటి అనుబంధ విషయాలపై అధ్యయనం చేయాలనుకునే వారికి శిక్షణ ఇవ్వడం. విశ్వ విద్యాలయ లక్ష్యాలకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా ఇతర భాషల సాహిత్యాన్ని ద్రావిడ భాషలలోకి అనువదించడం అలాగే ద్రావిడ భాషల సాహిత్యాన్ని ఇతర భాషలలోకి అనువదించడం. ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఇప్పటికే మూలికా వనం ఏర్పాటయింది. ఈ వనంలో ద్రవిడ సాహిత్యంలోనూ, వైద్యంలోనూ కనిపించే చాలా అరుదైన, వివిధ జాతులకు చెందిన 250 వన మూలికలు సేకరించి, పెంచుతున్నారు. జానపద గిరిజన విజ్ఞానాలపై ప్రత్యేకమైన మ్యూజియం ఏర్పాటు చేశారు. అరుదైన తాళ పత్రాలను సేకరించి భద్రపరిచారు. ఒక ద్రావిడ భాషలో ప్రచురితమైన విలువైన పుస్తకాలను, పదకోశాలను ఇతర ద్రావిడ భాషల్లోకి అనువదించి ముద్రించారు. ద్రావిడ సంస్కృతిని మరింత మూలాల్లోకి వెళ్లి పరిశోధించడానికి తగిన విధంగా ఏపీ ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని ‘తెలుగు ప్రాచీన హోదా కేంద్రా’న్ని ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయడానికి గట్టి కృషి చేయాలి. అలాగే, తెలుగు అకాడమీని (ప్రస్తుతం తెలుగు సంస్కృత అకాడమీని) కూడా ద్రావిడ విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేయడం ద్వారా తెలుగు భాషా సాహిత్యాలపై జరిగిన, జరుగుతున్న విశేష కృషిని సమన్వయం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. సంస్కృత సాహిత్యంలో ప్రవేశించిన ద్రావిడ సాంస్కృతిక మూలాలను కూడా మరింత లోతుగా అన్వేషించే అవకాశం ఏర్పడుతుంది. ఇటువంటి అంశాలపై చొరవను చూపినట్లయితే ప్రభుత్వం ద్రావిడ సంస్కృతి పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నట్లవుతుంది. (క్లిక్ చేయండి: ఆనీ ఎర్నౌ.. ఆమె కథ మన జీవిత కథ) – డాక్టర్ వేలం పళని సహాయ ఆచార్యులు, తెలుగు శాఖ, ద్రావిడ విశ్వవిద్యాలయం (అక్టోబర్ 20న ద్రావిడ విశ్వవిద్యాలయం రజతోత్సవాల సందర్భంగా) -
కుప్పంలో ఎవరు లోకల్? ఎవరు నాన్లోకల్?
కుప్పం పచ్చ కోట కూలిపోతోందా? కుప్పం నా అడ్డా అన్న చంద్రబాబు వేరే దారి చూసుకుంటున్నారా? ముఖ్యమంత్రి జగన్ సభ తర్వాత తెలుగు తమ్ముళ్ళు తీవ్ర నిరాశలో కూరుకుపోయారా? కుప్పంలో పచ్చ పార్టీ పని ముగిసిందని భావిస్తున్నారా? ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానం వస్తోంది. కుప్పంలో వైఎస్ జగన్ టూర్ తర్వాత రాజకీయ సమీకరణాల్లో జరిగిన మార్పులేంటి? చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ఒకప్పుడు పచ్చ పార్టీకి కంచుకోట. మూడు దశాబ్దాలకు పైగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే కుప్పంకు నాన్ లోకల్గా పేరుపడ్డ చంద్రబాబు ఏనాడూ కుప్పం అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుప్పం నియోజకవర్గం అభివృద్ధి బాట పట్టింది. రెవిన్యూ డివిజన్ ఏర్పడింది. కుప్పం మున్సిపాలిటీ అయింది. చంద్రబాబు ఏలుబడి కంటే వైఎస్ జగన్ పాలనలోనే తమ జీవితాలు బాగుతున్నాయని కుప్పం ప్రజలు భావిస్తున్నారు. అందుకే జగన్ వచ్చాక జరిగిన స్థానిక ఎన్నికలన్నింటా తెలుగుదేశం దారుణంగా ఓడిపోయింది. ముప్పయి సంవత్సరాలుగా కుప్పం నా అడ్డా అని చెప్పుకు తిరుగుతున్న చంద్రబాబును అక్కడి ప్రజలు ఘోరంగా తిరస్కరించారు. ఇక కుప్పంలో నిర్మించుకున్న పచ్చ కోటలన్నీ కూలిపోతుండటంతో కళ్ళు తెరిచిన చంద్రబాబు కొంతకాలం క్రితం అక్కడకు వెళ్ళినా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో గూండాగిరీ కూడా చేయించారు పచ్చ పార్టీ నేతలు. కుప్పం ప్రజలు తనను మర్చిపోతున్నారనే భయం, ఆందోళన చంద్రబాబులో మొదలయ్యాయి. వారం క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుప్పం టూర్తో టీడీపీ పతనం పరిపూర్ణం అయిందని పరిశీలకులు భావిస్తున్నారు. వైఎస్ జగన్ సభకు వచ్చినంత మంది ప్రజలు గతంలో ఏనాడూ చంద్రబాబు సభలకు రాలేదని అందరూ ఏకోన్ముఖంగా చెబుతున్నారు. కుప్పంను తన సొంత నియోజకవర్గం మాదిరిగా అభివృద్ధి చేస్తానని జగన్ ఇచ్చిన హామీతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుప్పం లో సీఎం వైఎస్ జగన్ సభ సూపర్ సక్సెస్ కావడంతో టిడిపి శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయారు. కుప్పంలో వారం రోజులుగా ఎక్కడ చూసినా సీఎం సభ గురించే చర్చ జరుగుతుండడం విశేషం. చంద్రబాబు రాజకీయ జీవితంలో కుప్పంలో నిర్వహించిన సభలకు ఎప్పుడూ ఇంత జనం హాజరు కాలేదని టిడిపి కార్యకర్తలు చెప్పుకుంటున్నారట. కుప్పంతోనే నా రాజకీయ జీవితం ముడిపడి ఉందని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఎలా వ్యవహరిస్తారో చూడాలి అని టిడిపి కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారట. ఇదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. నియోజవర్గంలోని 4 మండలాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సమరోత్సహంలో ఉన్నారట. గతం కంటే సీఎం సభ తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్సాహంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కుప్పంలో సీఎం జగన్ సభ సూపర్ సక్సెస్ కావడంతో టిడిపి వర్గాల్లో గుబులు ప్రారంభమైంది. చంద్రబాబు అడ్డాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా రెపరెపలాడే పరిస్థితులు కనిపిస్తుండటంతో... చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేస్తారా లేదా అన్నదానిపై టిడిపి వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. అందుకే కుప్పంతో పాటు మరో సురక్షితమైన నియోజకవర్గాన్ని కూడా చంద్రబాబు వెతుక్కుంటున్నారని పచ్చ పార్టీలో టాక్ నడుస్తోందట. -
వైఎస్సార్సీపీలోకి కుప్పం టీడీపీ నేతలు
తిరుపతి మంగళం: వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయమని విద్యుత్, అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల కుప్పం వచ్చి వెళ్లాక నియోజకవర్గ ప్రజలు వైఎస్సార్సీపీలో చేరేందుకు తండోపతండాలుగా వస్తున్నారని తెలిపారు. ఆదివారం తిరుపతిలోని మంత్రి కార్యాలయంలో కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లే మండలం కొడతనపల్లి గ్రామ పంచాయతీకి చెందిన 50 టీడీపీ కుటుంబాలు ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరాయి. వారికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైఎస్సార్సీపీలో చేరామని టీడీపీ నాయకులు తెలిపారు. గత 30 ఏళ్లుగా టీడీపీ జెండా మోశామని, అయినా ఏనాడూ ఇన్ని సంక్షేమ పథకాలు పొందలేదని వివరించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాకే కుప్పం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నా మరో 30 ఏళ్లకు కూడా కుప్పంలో ఇంత అభివృద్ధి జరగదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్తోనే కుప్పం ప్రజలు నడుస్తారని చెప్పారు. ఇన్నేళ్లు కళ్లు మూసుకుపోయి టీడీపీకి పని చేశామని, చేసిన తప్పులు తెలుసుకున్నామని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో వరుసగా టీడీపీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయన్నారు. మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయఢంకా మోగించడంతో చంద్రబాబు కంచుకోట బద్దలయిందని చెప్పారు. కుప్పంలో భరత్ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కుప్పం నియోజకవర్గ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ 14 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎంగా ఉన్నా కుప్పం అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. పేర్నాటి విజయానికి కృషి చేయాలి: పెద్దిరెడ్డి వైఎస్సార్సీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ప్రసాద్రెడ్డి విజయానికి కృషి చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతిలో ఆదివారం చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల వైఎస్సార్సీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేర్నాటి శ్యామ్ప్రసాద్రెడ్డి పేరును ప్రకటించారు. అనుకున్న సమయానికి ఓటర్ల నమోదు పూర్తి చేయాలని చెప్పారు. ఓటర్ కార్డ్కు ఆధార్ని అనుసంధానం ద్వారా దొంగ ఓట్లకు చెక్ పెట్టవచ్చని చెప్పారు. కుప్పంలో దొంగ ఓట్లు తొలగించడానికి కృషి చేయాలని ఎమ్మెల్సీ భరత్కు సూచించారు. డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి, మంత్రి ఆర్కే రోజా, ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి, ఎమ్మెల్సీ భరత్, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి, ఆదిమూలం, అరణి శ్రీనివా సులు, వరప్రసాద్, ఎంఎస్.బాబు, డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి పాల్గొన్నారు. -
కుప్పంలో టీడీపీకి మరో షాక్
సాక్షి, చిత్తూరు: కుప్పంలో టీడీపీకి మరో షాక్ తగలింది. ఇటీవల కుప్పంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన తర్వాత వైఎస్సార్సీపీలోకి భారీగా వలసలు నమోదవుతున్నాయి. కాగా, ఆదివారం కుప్పం నియోజకవర్గంలోని గుడిచంబగిరికి చెందిన 50 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. ఈ సందర్బంగా వారికి మంత్రి పెద్దిరెడ్డి.. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భరత్ కూడా పాల్గొన్నారు. -
పొలిటికల్ కారిడార్ : కుప్పంకు నాన్ లోకల్ గా పేరుపడ్డ చంద్రబాబు
-
కుప్పంలో చంద్రబాబుకు డిపాజిట్లు కూడా దక్కవు : వెల్లంపల్లి
-
వెన్నుపోటు, దొంగ ఓట్లకు బాబు కేరాఫ్
కుప్పం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పే చంద్రబాబు.. తాను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 33 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండడానికి కారణమైన కుప్పం నియోజకవర్గంలో ప్రజలు పంపులు తిప్పితే తాగడానికి నీరు వచ్చే పరిస్థితిని మాత్రం తీసుకు రాలేకపోయారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. రాష్ట్రపతులను.. ప్రధాన మంత్రులను కూడా తానే నియమించానని చెప్పుకునే ఆయన సొంత నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. చంద్రబాబు అనుభవం అంతా ప్రతి ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించడానికి మాత్రం బాగా ఉపకరించిందని ఈ జిల్లాలో కథలు కథలుగా చెబుతారని ఎద్దేవా చేశారు. వెన్నుపోటు, దొంగ ఓట్లకు 30 ఏళ్లుగా కేరాఫ్ అడ్రస్ చంద్రబాబే అని చెప్పారు. రాష్ట్రంలో 45–60 ఏళ్ల మధ్య ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు అందించే వైఎస్సార్ చేయూత పథకం మూడో విడత నిధులను చిత్తూరు జిల్లా కుప్పంలో శుక్రవారం ఆయన విడుదల చేశారు. కంప్యూటర్లో బటన్ నొక్కి 26,39,703 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.4,949.44 కోట్లు నేరుగా జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో తమ బతుకులు బాగు పడ్డాయని లబ్ధిదారులు స్వయంగా చెప్పే ఈ చేయూత పండుగ కార్యక్రమం వారం రోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు. ఈ వేదికపై నుంచి సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏం చెప్పారంటే.. కుప్పంపై కూడా బాబుకు వెన్నుపోటు ప్రేమే సొంత మామ మీద చంద్రబాబు చూపించే వెన్నుపోటు ప్రేమే కుప్పం మీద కూడా చూపారు. ఇంతకాలం కుప్పం నుంచి తనకు కావాల్సింది పిండుకున్నాడు. ప్రజలకు ఏం చేయాలన్న దానిపై మాత్రం ఆలోచించ లేదు. 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా కుప్పంలో కరువుకు పరిష్కారం చూపలేకపోయారు. కుప్పంలో కరువు, నీటి సమస్య నివారణకు హంద్రీ–నీవా జలాలను తీసుకురావడం ఒక్కటే పరిష్కారం అని తెలిసినా.. అది చేస్తే ప్రజలు తన మాట వినరని భయపడిపోయారు. అందుకే ఆ హంద్రీ–నీవా పనులకు ఆయనే అవరోధంగా మారారు. ఎన్నికలు వచ్చేసరికి తన పార్టీకి చెందిన వారికి మాత్రం కాంట్రాక్టు ఇచ్చి వందల కొద్దీ ట్రాక్టర్లతో నియోజకవర్గంలో తాగునీరు సరఫరా చేశానని చెప్పుకొని, దొంగ అకౌంట్లతో దోచేశారు. కుప్పంతో మొదలు ప్రతి చోటా బీసీలకు అన్యాయమే.. కుప్పం నియోజకవర్గంలో అత్యధికులు బీసీలే ఉన్నారు. ఈ నియోజకవర్గం ఓసీలు పోటీ చేయాల్సిన సీటు కాకపోయినా.. బీసీలకు ఇవ్వకుండా అన్యాయం చేస్తూ తనే లాక్కొన్నారు. బీసీలకు న్యాయం చేశానని రెండు రోజుల క్రితం చంద్రబాబు పెద్ద పెద్ద డైలాగ్లు చెప్పాడు. 1983 నుంచి 2019 వరకూ ఈ 36 సంవత్సరాల్లో ఒక్కసారంటే ఒక్కసారి కూడా కుప్పం అసెంబ్లీ టికెట్ను బీసీలకు ఇవ్వలేదు. ఇది బాబు మార్కు సామాజిక న్యాయం. కుప్పంతో మొదలు పెడితే బీసీలకు ప్రతిచోటా అన్యాయం చేశారు. బీసీలను వాడుకుని, విడిచి పెడుతున్నది ఎవరో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. బాబు చేయలేనిది మేం చేస్తున్నాం కుప్పానికి చంద్రబాబు ఏం చేశాడో చెప్పడానికి ఏమీ లేదు. ఏం చేయలేదో చెప్పడానికి చాలా ఉన్నాయి. ఆరు నెలల్లో హంద్రీ–నీవా కుప్పం బ్రాంచ్ కెనాల్ను పూర్తి చేస్తున్నాం. కుప్పంను మున్సిపాలిటీ చేయడంతో పాటు.. దాని అభివృద్ధి కోసం రూ.66 కోట్లు ఇచ్చింది మీ బిడ్డ జగనే. 55 ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆర్డీఓ కార్యాలయాన్ని ఈ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. రూ.6.5 కోట్లతో రెడ్డిపల్లి– రామకుప్పం విద్యుత్ సబ్స్టేషన్ ఇచ్చాం. కొత్తపేట నుంచి డీకే పల్లి రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తి చేశాం. రూ.10 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ పూర్తి చేశాం. ఒకేషనల్ జూనియర్ కాలేజీ పనులు పూర్తి చేసిందీ.. రాళ్లమడుగూరు జూనియర్ కాలేజీ పనులు పూర్తి చేసిందీ.. కుప్పంలో ద్రవిడ విశ్వవిద్యాలయానికి రూ.20 కోట్లు కేటాయించింది కూడా ఈ ప్రభుత్వమే. నవరత్నాల పథకాలన్నీ కులం, మతం, ప్రాంతం, రాజకీయం చూడకుండా.. కుప్పంలో అంతా నావాళ్లే అని అమలు చేశాం. రాష్ట్రమంతటితో పాటు కుప్పం నియోజకవర్గానికి వివిధ డీబీటీ పథకాల ద్వారా రూ.866 కోట్లు.. నాన్ డీబీటీ పథకాల ద్వారా మరో రూ.283 కోట్లు.. మొత్తంగా ఈ నియోజకవర్గ ప్రజలకు రూ.1,149 కోట్లు పంపిణీ చేసింది మీ బిడ్డ జగనే. ఎమ్మెల్సీగా ఉంటూనే తన ద్వారా కుప్పానికి నాతో అన్నీ చేయిస్తున్న భరత్ను ఈసారి ఎన్నికల్లో గెలిపించండి. మంత్రిగా మీ ముందుకు పంపిస్తాను. ఈ ప్రభుత్వానికీ, ఆ ప్రభుత్వానికి తేడా గమనించండి సమాజాన్ని చంద్రబాబు చూస్తున్న విధానానికీ, మీ ఈ ముఖ్యమంత్రి చూస్తున్న విధానానికీ మధ్య తేడాను ప్రజలు గమనించాలి. అభివృద్ధి అన్నది ప్రతి ఇంట్లో పిల్లల చదువులో, రైతుల్లో, ఆరోగ్య రంగంలో, అక్కచెల్లెమ్మల సాధికారతలో, అవ్వాతాతల సంక్షేమంలో కనిపించాలి. సామాజిక వర్గాల ఆర్తిని ఈ ప్రభుత్వం అర్థం చేసుకుని అడుగులు వేస్తోంది. బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్ అని గుర్తించిన ప్రభుత్వం ఇది. నవరత్నాలు అమలు, డీబీటీ, పదవులు, కాంట్రాక్టులు.. ఇలా ఏది తీసుకున్నా పారదర్శకత కనిపిస్తుంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు ఏకంగా చట్టాలు చేసి మేలు చేశాం. కానీ, చంద్రబాబు మాత్రం తనకు కావాల్సిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడిని చూసుకుంటే చాలనుకున్నారు. ఎవరూ చూపరు, రాయరు.. ప్రజలకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోరని భావించారు. చంద్రబాబు చేస్తున్న మోసానికి, అన్యాయానికి ఇక తల వంచేది లేదని కుప్పం ప్రజలు నిర్ణయించుకొని అభివృద్ధికి మద్దతిస్తే ఎలా ఉంటుందో మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో చూపించారు. అన్నింటా కూడా వైఎస్సార్సీపీనే క్లీన్ స్వీప్ చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే, కుప్పం ప్రజలు దోచుకో.. పంచుకో.. తినుకో.. డీపీటీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. చేతకానితనమా.. చేయకూడదనే దుర్బుద్ధా.. చంద్రబాబు మాత్రం కుప్పం మున్సిపాలిటీలో కనీసం డబుల్ రోడ్డు కూడా వేయలేకపోయారు. కృష్ణగిరి నుంచి పలమనేరు హైవేకు లింక్ ఇస్తానన్నాడు. అది చేయలేదు. ఎన్నిసార్లు సీఎం అయినా కుప్పంలో రోడ్డు వేసే మనసు లేదు. అయితే ఎన్నికలప్పుడు మాత్రం ఏకంగా కుప్పంలో ఎయిర్పోర్టు కడతానని ప్రజల చెవిలో పువ్వు పెట్టాడు. జాబు కావాలంటే.. బాబు రావాలని ఈయనే అంటాడు. ఈ నియోజకవర్గం నుంచి నిత్యం 5 వేల మంది ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లొస్తుంటారు. వీరికి సొంత నియోజకవర్గంలో ఉద్యోగాలు, ఉపాధి చూపించాలన్న ఆలోచన ఈయనకు రాదు. చంద్రబాబు ఏ రోజూ ఈ నియోజకవర్గంలో ఉండరు. ఇక్కడకు రారు. పట్టించుకోరు. 14 ఏళ్లు సీఎంగా ఉండేందుకు తనకు కుప్పం సహకరించినా, చివరకు రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేయలేకపోయారు. చివరకు రెవెన్యూ డివిజన్ కోసం జగన్కు లేఖ రాస్తాడు. మీ కోసం కుప్పంను రెవిన్యూ డివిజన్ చేశాం. చంద్రబాబు కంటే చేతకాని నాయకుడు ఎక్కడైనా ఉంటాడా? చేయకూడదనే నాయకుడు ఎక్కడైనా ఉంటాడా? దీన్ని చేతకానితనం అనాలా? లేక చేయకూడదనే దుర్బుద్ధి అనాలా? కుప్పంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ లేదు.. మెడికల్ కాలేజీ లేదు. పుట్టింటోళ్లు కూడా ఇలా ఆదుకోలేదు మూడేళ్ల క్రితం వరకు మా కుటుంబంలో నేను కూలీ పనులే చేసుకునేదాన్ని. చేయూత పథకంలో నాకు మొదటి విడతలో రూ.18,750 ఇచ్చారు. దానికి బ్యాంకు లోన్ కలిపి ఒక ఆవును కొనుక్కున్నాను. రెండో విడత వచ్చిన డబ్బులతో గడ్డి కటింగ్ మెషిన్ తీసుకొన్నాను. మా మహిళా సంఘం గ్రూప్ సీ గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్కు వచ్చింది. బ్యాంకు వారు మాకు రూ.20 లక్షలు ఇస్తే నాకు రూ.2 లక్షలు వచ్చాయి. దాంతో మరో నాలుగు ఆవులు కొనుక్కున్నా. స్త్రీనిధి డబ్బులు కూడా వచ్చాయి. మా పాపకు విద్యా దీవెన డబ్బులు వచ్చాయి. తను బీఎస్సీ (హార్టికల్చర్) చదువుతోంది. ఇవాళ నేను మొత్తం 10 ఆవులతో రోజుకు 110, 120 లీటర్ల పాలు పోస్తున్నాను. ఖర్చులు పోను నెలకు రూ.60 వేలు మిగులుతున్నాయి. ఈ ఘనత మా జగన్మోహన్రెడ్డిదే. నా పుట్టింటి వాళ్లు కూడా ఇలా సాయం చేయలేదు. మళ్లీ మళ్లీ జగన్నే సీఎంగా గెలిపించుకుందాం. – సుబ్బమ్మ, గుడిపల్లె మండలం, మహాలక్ష్మి గ్రూపు సభ్యురాలు ఈసారి కూడా జగనే సీఎం.. గతంలో మేం కూలికి వెళ్లే వాళ్లం. మాకు మొదటి విడత చేయూత పథకం కింద ఇచ్చిన డబ్బుతో ఆవును కొనుక్కున్నా. రెండో విడతలో వచ్చిన డబ్బుతో మరో ఆవును కొనుక్కుని నెలకు రూ.15 వేలు సంపాదిస్తున్నా. ఇప్పుడు మా ముఖ్యమంత్రి అన్న ఉన్నారన్న ధైర్యం మాకు ఉంది. నేను, మా ఆయన.. ఇద్దరం ప్రతి రోజూ మిమ్మల్ని తలుచుకుంటాం. వాళ్ల మేనమామ (సీఎం) వల్ల పిల్లలు కూడా పెద్ద చదువులు చదువుతున్నారు. ఇప్పుడు మూడో విడత వచ్చే డబ్బులతో మరో ఆవును కొనుక్కుంటాను. మీ వల్ల పాలకు కూడా మంచి ధర వస్తోంది. మా మహిళలతో పాటు ప్రతి ఒక్కరూ మీతోనే ఉంటారు. మళ్లీ కూడా మీరే సీఎం. – మరియమ్మ, బంగారుపాళ్యం, చిత్తూరు జిల్లా ప్రజల కష్టాలన్నీ తీరేలా మంచి పాలన జగన్మోహన్రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో ఇప్పుడు నేను ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గం కే.కోటపాడులో వైఎస్సార్ చేయూత పథకం ప్రకటించారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే సంతృప్త స్థాయిలో కులం, మతం, రాజకీయాలు చూడకుండా అందరికీ పథకాలు వర్తింప చేస్తూ అండగా నిలుస్తున్నారు. బటన్ నొక్కి లక్షలాది మంది మహిళలకు వారి అకౌంట్లలోకి నగదు జమ చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల కష్టాలన్నీ తీరేలా మంచి పరిపాలన అందిస్తున్న సీఎం జగన్కు రాష్ట్ర ప్రజలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. – బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ సీఎం టీడీపీ వాళ్లకూ లబ్ధి కలిగించాం చంద్రబాబూ.. నువ్వు పులివెందులకు వెళ్లొచ్చు కానీ, సీఎం కుప్పం రాకూడదా? మీ మామ దయాదాక్షిణ్యాలతో ఇక్కడ రంగస్వామినాయుడనే పెద్ద మనిషి ఎమ్మెల్యేగా ఉంటే ఆయనతో బలవంతంగా రాజీనామా చేయించి, సులువుగా గెలవచ్చని ఇక్కడ పాతుకుపోయావు. ఇక్కడి బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు అన్యాయం చేశావు. వైఎస్ జగన్ ప్రభుత్వం కులం, మతం, పార్టీలు, రాజకీయాలు చూడకుండా టీడీపీ నాయకులకు సైతం సంక్షేమ పథకాలు వర్తింప చేసింది. అందుకే ఈ రోజు కుప్పం ప్రజలు సీఎం జగన్కు మంగళ హారతులతో స్వాగతం పలికారు. తప్పనిసరిగా కుప్పంలో విజయం సాధిస్తాం. ఇన్నేళ్లలో చంద్రబాబు ఏం చేశాడని మీరంతా ఆలోచించాలి. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూగర్భ వనరుల శాఖా మంత్రి బాబు ఎప్పుడూ అందుబాటులో లేరు 33 ఏళ్లుగా చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉంటూ.. అందులోనూ 14 ఏళ్లు సీఎంగా పని చేసినప్పటికీ.. ఇక్కడి వారికి ఎప్పుడూ అందుబాటులో లేరు. ఎమ్మెల్యేగా ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోలేదు. పైగా సీఎం జగన్ కుప్పంకు ఏం చేశారని అడుగుతున్నారు. మీతోనే (చంద్రబాబు) ఇక్కడ ఇల్లు కట్టుకుంటానని ప్రకటన చేయించారు. ఇది చాలదా.. ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం ఎంతగా కృషి చేస్తున్నారో చెప్పడానికి. – భరత్, ఎమ్మెల్సీ ఎంఐజీ లేఅవుట్లలో.. 60% ధరకే విక్రయ ఒప్పందం సాక్షి, అమరావతి : పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న ఎంఐజీ లే అవుట్లు, జగనన్న స్మార్ట్ టౌన్షిప్లలో భూమి ధరలను రెండు భాగాలుగా విభజించుకోవడానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇక నుంచి పట్టణాభివృద్ధి సంస్థలు భూమి ధరను మొత్తం విక్రయ ధరలో 60 శాతం, అభివృద్ధి రుసుములు కింద మొత్తం విక్రయ ధరలో 40 శాతంగా విభజించుకోవడానికి అనుమతిస్తూ రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీచేశారు. జిల్లా స్థాయి కమిటీలు నిర్ణయించిన ధర ఆధారంగా ఈ విభజన ఉండాలని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. గతంలో పూర్తి విక్రయ ధర చెల్లిస్తే గానీ కొనుగోలు ఒప్పందం చేసుకోవడానికి అవకాశం ఉండేది కాదని.. కానీ, ఇప్పుడు మొత్తం విక్రయ ధరలో 60 శాతం చెల్లించడం ద్వారా ఒప్పందం చేసుకోవచ్చు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంవల్ల రిజి్రస్టేషన్ శాఖకు ఎటువంటి నష్టం ఉండదని.. సేల్డీడ్ ఇచ్చేటప్పుడు మొత్తం విక్రయ ధర అంటే భూమి ధర 60 శాతం, అభివృద్ధి రుసుము 40 శాతం చెల్లించిన తర్వాతే జరుగుతుందని ఆ ఉత్తర్వుల్లో వై. శ్రీలక్ష్మి స్పష్టంచేశారు. -
చంద్రబాబు కు కౌంటర్ ఇచ్చిన కుప్పం ఎమ్మెల్సీ భరత్
-
జనవరి నుంచి పింఛన్ రూ.2,750
కుప్పం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రస్తుతం రూ.2,500 చొప్పున ఇస్తున్న అవ్వాతాతల పింఛన్ను వచ్చే జనవరి నుంచి రూ.2,750కి పెంచబోతున్నామని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రూ.3 వేల వరకు తీసుకుపోతామని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన కుప్పంలో వైఎస్సార్ చేయూత పథకం మూడో విడత నిధుల జమ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఈ ఏడాది అందిస్తున్న రూ.4,949.44 కోట్లతో కలిపి ఈ పథకం కింద ఇప్పటి దాకా మొత్తం రూ.14,110.62 కోట్ల ఆర్థిక సహాయం అందజేశామని చెప్పారు. మూడు విడతలలో కలిపి ఒక్కొక్కరికీ ఇప్పటికే రూ.56,250 అందజేశామన్నారు. అత్యంత బాధ్యతాయుతమైన 45–60 ఏళ్ల మధ్య ఉన్న అక్క చెల్లెమ్మలు కుటుంబాన్ని ఒక బాధ్యతతో మోస్తున్నారని.. వాళ్ల చేతిలో డబ్బులు పెడితే ఆ కుటుంబం ఎదుగుతుందని విశ్వసించామన్నారు. 60 ఏళ్లు నిండిన వారు పెన్షన్ జాబితాలోకి వెళ్లిపోతారని, కొత్తగా 45 ఏళ్లు నిండిన వారు ఈ పథకంలోకి చేరుతారని చెప్పారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. అమ్మ కడుపులో బిడ్డ మొదలు అవ్వ వరకు.. అమ్మ కడుపులోని బిడ్డ మొదలు అవ్వ వరకు అందరికీ ఈ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అక్కచెల్లెమ్మల సాధికారతే లక్ష్యంగా ఈ ప్రభుత్వం అడుగులు ముందు కేసింది. అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, పొదుపు సంఘాల వైఎస్సార్ సున్నా వడ్డీ.. ఈ నాలుగు పథకాల ద్వారానే కేవలం 39 నెలల్లో ఈ ప్రభుత్వం రూ.51 వేల కోట్లు ఇచ్చింది. అమ్మ ఒడి ద్వారా 44.5 లక్షల మందికి రూ.19,617 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ ఆసరా ద్వారా 78.74 లక్షల మందికి రెండు విడతల్లో రూ.12,757 కోట్లు ఇప్పటికే ఇచ్చాం. మూడో దఫా జనవరి నెలలో ఇవ్వనున్నాం. చేయూత ద్వారా 26.4 లక్షల మందికి రూ.14,111 కోట్లు, సున్నా వడ్డీ పథకం ద్వారా రూ.3,615 కోట్లు ఇచ్చాం. ఇందులో ఎక్కడా లంచాలు, వివక్షకు తావే లేదు. మొత్తంగా ఈ 39 నెలల్లో అన్ని రకాల పథకాల ద్వారా బటన్ నొక్కి మహిళలకు అందించిన సొమ్ము రూ.1,17,667 కోట్లు. అన్న దమ్ములకు కూడా ఇచ్చింది కలుపుకుంటే రూ.1.71 లక్షల కోట్లు. అర్హత ఒక్కటే ప్రామాణికంగా పథకాలన్నీ అమలు చేస్తున్నాం. ఆరు నాన్ డీబీటీ పథకాలైన ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, సంపూర్ణ పోషణ, గోరుముద్ద, విద్యా కానుక, జగనన్న తోడు ద్వారా ఇచ్చిన రూ.1.41 లక్షల కోట్లు కలుపుకుంటే.. మొత్తం రూ.3,12,764 కోట్లు. ఇందులో అక్కచెల్లెమ్మలకే రూ.2.39 లక్షల కోట్లు నేరుగా లబ్ధి చేకూరింది. రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇచ్చాం. 21 లక్షల ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ఇళ్లు పూర్తయితే ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల ఆస్తి ఇచ్చినట్టు అవుతుంది. ఇళ్ల ద్వారా అక్క చెల్లెమ్మలకు రూ.2.3 లక్షల కోట్ల లబ్ధి చేకూర్చినట్టు అవుతుంది. చదవండి: కుప్పం అంటే ఇప్పుడు అభివృద్ధి: సీఎం జగన్ చేయూతతో 5.82 లక్షల మందికి ఆర్థిక సాధికారత వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ప్రభుత్వం అందజేసే డబ్బుతో చిన్న వ్యాపారాలు పెట్టుకోవాలా? జీవనోపాధికి వాడుకోవాలా? అన్నది పూర్తిగా మహిళల నిర్ణయానికే వదిలేశాం. అయితే, చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి సాంకేతిక, బ్యాంకుల పరంగా మార్కెటింగ్ పరంగా ప్రభుత్వం సహకారం అందిస్తోంది. కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారికి ఐటీసీ, హిందుస్థాన్ లీవర్, ప్రాక్టర్ అండ్ గాంబెల్, రిలయన్స్ లాంటి కార్పొరేట్ కంపెనీలతో టై అప్ చేశాం. మార్కెటింగ్లో శిక్షణ ఇవ్వడంతోపాటు బ్యాంకులతో రుణాలు అందించేలా చేస్తున్నాం. ప్రతి అక్కా, చెల్లెమ్మ రూ.7 వేల నుంచి రూ.10 వేలు ప్రతినెలా ఆదాయం పొందడానికి మార్గాన్ని చూపిస్తున్నాం. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెల కొనుగోలుకు సహకరిస్తున్నాం. వీరిని ప్రోత్సహించేందుకు అమూల్ సంస్థతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం. గతంలో కన్నా కనీసం లీటర్ పాలకు రూ.5–15 ఎక్కువ రేటుకు అమూల్ సంస్థ కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అమూల్ రంగ ప్రవేశం చేశాక ఇప్పుడు హెరిటేజ్ సంస్థ కూడా రేట్లు పెంచక తప్పని పరిస్థితి కూడా వచ్చింది. వైఎస్సార్ ఆసరా, చేయూత ద్వారా అందిన డబ్బుతో 1.10 లక్షల మంది మహిళలు కిరాణా దుకాణాలు పెట్టారు. మరో 60,995 మంది వస్త్ర వ్యాపారం చేసుకుంటున్నారు. 2.96 లక్షల మంది ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు పెంచుకుంటూ సంపాదిస్తున్నారు. 1.15 లక్షల మంది ఇతర జీవనోపాధి మార్గాల్లో ఉపాధి పొందుతున్నారు. మొత్తం 5,82,662 మంది ఆర్థిక సాధికారత సాధించడానికి వైఎస్సార్ చేయూత పథకం ఉపయోగపడింది. అప్పుడు, ఇప్పుడు అదే బడ్జెట్ ఇంతకు ముందు పరిపాలనలో ముఖ్యమంత్రి ఉన్నారు. అప్పుడూ, ఇప్పుడూ అదే బడ్జెట్. అప్పుడు చేసిన అప్పుల కన్నా, ఇప్పుడు చేసిన అప్పులు తక్కువే. కానీ అప్పటి ప్రభుత్వంలో ఇంతగా లబ్ధి ఎందుకు జరగలేదు.. ఇప్పుడు ఎలా జరుగుతోంది.. మీరే ఆలోచించండి. è ఆ రోజుల్లో దోచుకో.. పంచుకో.. తినుకో.. పద్ధతి ఉండేది. కేవలం నలుగురు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడు.. వారికి తోడు గ్రామాల్లో జన్మభూమి కమిటీలు ఉండేవి. అప్పుడు ప్రజలకు డబ్బు పోయేది కాదు. ఇవాళ బటన్ నొక్కుతున్నాం.. నేరుగా మీ (లబ్ధిదారుల) ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయి. -
కుప్పంను రెవెన్యూ డివిజన్ గా కూడా బాబు చేయలేదు