కుప్పంలో టీడీపీ నేతల ఓవరాక్షన్ | TDP Leaders Tried To Attack On MLC Bharat At Kuppam | Sakshi
Sakshi News home page

కుప్పంలో టీడీపీ నేతల ఓవరాక్షన్.. ఎమ్మెల్సీ భరత్‌పై దాడికి యత్నం

Published Thu, Aug 1 2024 7:04 PM | Last Updated on Thu, Aug 1 2024 8:20 PM

TDP Leaders Tried To Attack On MLC Bharat At Kuppam

సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పం  నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఓవరాక్షన్ చేశారు. రామకుప్పంలో ఎంపీటీసీల సమావేశానికి వెళ్లిన ఎమ్మెల్సీ భరత్‌పై దాడికి యత్నించారు. వైఎస్సార్‌సీపీ నేత, రామకుప్పం ఎంపీపీ చంద్రా రెడ్డి ఇంట్లో ఎంపీటీసీలతో ఎమ్మెల్సీ భరత్ హాజరయ్యారు. 

ఈ క్రమంలో ఎంపీపీ ఇంట్లోకి తెలుగు తమ్ముళ్లు దౌర్జన్యంగా ప్రవేశించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలపై దురుసుగా ప్రవర్తించారు. వైఎస్సార్‌సీపీ నేతలు వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. ఎంపీపీ ఇంటికి చేరుకున్న పోలీసులు టీడీపీ నేతలను అక్కడి నుంచి పంపించేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement