-
చంద్రబాబుకు కుప్పంలో ఓటమి భయం!
నారా చంద్రబాబు నాయుడు మూడున్నర దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈసారి ఓటమి భయం చంద్రబాబును వెంటాడుతోంది. చంద్రబాబు కంచుకోటగా చెబుతున్న కుప్పంలో ఈసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు ఈసారి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యే అవకాశం లేదా? చంద్రబాబుకు పట్టిన ఈ దుస్థితికి కారణం ఏంటి?చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి 35 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చంద్రబాబునాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి..ఇప్పుడు మూడోసారి ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. దొంగ ఓట్లను చేర్పించి భారీ మెజారిటీతో ఎన్నికవుతూ వస్తున్న చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ ఆవిర్భావంతో చెక్ పడింది. క్రమంగా మెజారిటీ తగ్గుతూ...ఆయన గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఈసారి దొంగ ఓట్లు భారీగా తొలగించడంతో గెలుపు మీదే నమ్మకమే పోయింది. తనను ఏడు సార్లు గెలిపించి అసెంబ్లీకి పంపించిన కుప్పం ప్రజల్ని చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాకే కుప్పం నియోజకవర్గానికి మహర్దశ పట్టింది. ఐదేళ్ళలో పూర్తిగా అభివృద్ధి చెందింది. అందుకే చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో ఫేడ్ అవుట్ లీడర్ గా మారిపోయారు.కుప్పంలో 1989 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చిన చంద్రబాబు అక్కడి ప్రజల్ని మోసం చేస్తూ...తాను మాత్రం ఉన్నత పదవులు అనుభవిస్తున్నారు. రాష్ట్రంలో మారుమూల తమిళనాడు బోర్డర్లో ఉన్న కుప్పం ప్రజల ఉపాధి గురించి ఏనాడూ పట్టించుకోలేదు. అందుకే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో కుప్పం ప్రజలు చంద్రబాబుకు బుద్ది చెప్పడానికి నిర్ణయించుకున్నారు. 2019 ఎన్నికల్లో 73 శాతం పోలింగ్ నమోదు అయితే, ఈసారి కుప్పంలో 89.88 శాతం ఓటింగ్ నమోదైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సిఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపునకు మహిళా ఓటర్లు, వృద్దులు పెద్ద ఎత్తున స్పందించారు. కుప్పం నియోజకవర్గానికి హంద్రీ నీవా కాలువల ద్వారా కృష్ణాజలాలు తీసుకువచ్చిన తర్వాతనే మళ్లీ ఓటు అడగటానికి వస్తాను అని చెప్పిన మాటలు కుప్పం ప్రజలు మనసుల్లో పెను మార్పును తీసుకువచ్చాయంటున్నారు. హామీలో భాగంగా ఈ ప్రాంతంను సస్యశ్యామలం చేస్తూ, కుప్పం ప్రజల చిరకాల వాంఛ అయిన తాగు, సాగు నీరు అందించిన సిఎం జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకునేందుకు ఓటు రూపంలో తమ కృతజ్జత చూపారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం పట్ల వివక్షత అనేది లేకుండా కుప్పంను మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా రెవెన్యూ సమస్యలతో సతమతం అవుతున్న ఈప్రాంత ప్రజలు కష్టాలు తీరుస్తూ కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా అందించారు. అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేశారు. ఇవన్నీ గమనించిన కుప్పం ప్రజల మనసుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిలిచిపోయారు. అందుకే ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. కుప్పం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 89.88 శాతం పోలింగ్ నమోదు కావడమే ఫ్యాన్ గాలి జంఝామారుతంలా వీచిందనడానికి సాక్ష్యం అని విశ్లేషకులు చెబుతున్నారు.కుప్పం ప్రాంతంలో బలంగా ఉన్న వన్నెకుల సామాజికవర్గానికి వైఎస్ జగన్ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. భరత్కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో పాటుగా చంద్రబాబు మీద పోటీ చేసే ఛాన్స్ కల్పించారు. వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో మొన్నటి వరకు లక్ష మెజారిటీ సాధనే లక్ష్యం అన్న కుప్పం టీడీపీ నాయకులు... ఎన్నికలు జరిగిన సాయంత్రం నుంచి సైలెంట్ అయిపోయారు. భారీగా పెరిగిన మహిళా ఓటింగ్ అటు టీడీపీకి, ఇటు చంద్రబాబుకు పెను ప్రమాదంగా మారిందనే భయాందోళనలు టీడీపీని వెంటాడుతున్నాయి. -
కుప్పంలో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి సిద్ధమవుతున్న ఓటర్లు
-
కుప్పంలో కోట్లు కుమ్మరించినా చంద్రబాబుకు ఓటమి ?
-
కుప్పంలో విజయం నాదే
-
కుప్పంలో బరితెగించిన టీడీపీ గుండాలు..
-
కుప్పంలో టీడీపీ గూండాయిజం
సాక్షి, చిత్తూరు: కుప్పంలో టీడీపీ బరితెగించింది. టీడీపీ నేతలు గూండాయిజంతో చెలరేగిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు వైస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.టీడీపీ నేతల దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. టీడీపీ నేతల దౌర్జన్యకాండపై వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ఎత్తున నిరసన తెలిపారు. గాయపడ్డ వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ పరామర్శించారు. -
కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి
-
జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు
-
బాబు వద్దు బాబోయ్.. కుప్పం ప్రజల మనసులో మాట
-
35 ఏళ్లుగా అద్దె కుప్పమే
సాక్షి, అమరావతి/సాక్షి, తిరుపతి: కుప్పం నియోజకవర్గ ప్రజలు 35 ఏళ్లుగా టీడీపీ అధినేత చంద్రబాబును వారి సొంత మనిషిలా ఆదరిస్తూ, ఆయన్ని గెలిపిస్తున్నప్పటికీ.. చంద్రబాబు మాత్రం ఆ నియోజకవర్గాన్ని కనీసం పట్టించుకోలేదు. ఇప్పటికీ అదేదో అద్దె ఇంటిలానో, తనకు పట్టని ప్రాంతంలాగానో వ్యవహరిస్తున్నారు తప్పితే, ఆ నియోజకవర్గ ప్రజలకు దగ్గరగా ఉండాలని, అక్కడ తనకంటూ ఒక స్థిర నివాసం ఏర్పరచుకోవాలని ఎప్పుడూ భావించలేదు. చంద్రబాబునాయుడు 1983 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 1989 నుంచి కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఆ నియోజకవర్గాన్ని ఓ ఓట్ల యంత్రంగానే చూసి, ఏమాత్రం అభివృద్ధి చేయకపోయినప్పటికీ, అక్కడి ప్రజలు మాత్రం చంద్రబాబును ఆదరిస్తూనే వచ్చారు. అయినా చంద్రబాబు ఆ ప్రాంతంపై శీతకన్నే వేశారు. ఆ ప్రాంతం తనను ఆదరిస్తున్నందుకు గుర్తుగా అయినా ఒక ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన కూడా ఎప్పుడూ చేయలేదు. 1984లో టీడీపీలో చేరగానే హైదరాబాద్ జూబ్లీహిల్స్లో స్థలం కొని, అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోనూ ఆయన సొంతిల్లు కట్టుకోలేదు. తాను రాజధానిని నిర్మిస్తానని గొప్పలు చెప్పుకొన్న అమరావతిలోనూ కట్టుకోలేదు. విభజిత ఆంధ్రప్రదేశ్కు సీఎంగా ఉండగానే హైదరాబాద్లోనే మరో అత్యాధునిక భవంతిని నిర్మించుకున్నారు. అటు సొంత నియోజకవర్గం కుప్పంని, ఇటు ఆయన రోజూ చెప్పే అమరావతి పైనా ఆయనకు ఓట్ల యావే తప్ప వాటిపై ప్రేమ లేదన్న విషయాన్ని బయటపెట్టుకున్నారు. ఆయన సొంతింటితోపాటు ఆస్థిపాస్తులు చాలావరకు హైదరాబాద్లోనే ఉన్నాయి. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కుప్పం ప్రజలకూ తొలిసారి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాయి. దీంతో కుప్పం ప్రజల్లోనూ ఆలోచన మొదలైంది. దీంతోపాటు సొంత నియోజకవర్గంలో ఇల్లు లేదా అని అందరూ ఎండగట్టడం ప్రారంభించారు. దీంతో 2022లో అక్కడ స్థలాన్ని కొని, ఇల్లు కడుతున్నట్లు చంద్రబాబు హడావుడి చేశారు. అక్కడ తాను ఇల్లు కట్టుకుంటున్నట్లు శుక్రవారం సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోనూ పేర్కొన్నారు. శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ పరిధిలో వ్యవసాయేతర భూమి 95.23 సెంట్లు ఉందని, దాని విలువ రూ.77.33 లక్షలుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. అక్కడే ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇంటి నిర్మాణం ప్రారంభమై సంవత్సరంన్నర అవుతోంది. సాధారణంగా ఒక సొంతింటి నిర్మాణం కొన్ని నెలల్లో పూర్తవుతుంది. కానీ, చంద్రబాబు ఇంటి నిర్మాణం మాత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు. పూర్తి చేస్తారో లేదో కూడా తెలియదు. భారీగా పెరిగిన ఆస్తులు అధికారంలో ఉండగా రాష్ట్రంలో ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల్లో భారీగా ముడుపులు దండుకున్నారన్న ఆరోపణలు, కేసులు ఉన్న చంద్రబాబు.. అధికారంలో లేకున్నా ఆదాయానికి లోటు లేదన్న విషయాన్ని ఆయన ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన ఆస్తుల విలువలు చెబుతున్నాయి. తనపై ఉన్న కేసులు, తన ఆస్థిపాస్తుల వివరాలను అఫిడవిట్లో చంద్రబాబు పేర్కొన్నారు. అఫిడవిట్లో పేర్కొన్న ప్రకారం గత ఐదేళ్లలో చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి ఆస్తుల విలువ 40 శాతం పెరిగింది. 2014లో రూ.176 కోట్లున్న వారి ఆస్తుల విలువ 2019 ఎన్నికల అఫిడవిట్లో రూ.700 కోట్లుగా చూపించారు. ప్రస్తుతం వారిద్దరి ఆస్తుల విలువ రూ.936.58 కోట్లుగా అఫిడవిట్లో తెలిపారు. రూ.121.41 కోట్ల చరాస్తులు, రూ.815.17 కోట్ల స్థిరాస్తులు చూపించారు. భువనేశ్వరికి హెరిటేజ్ ఫుడ్స్లో ఉన్న షేర్ల విలువే రూ.763 కోట్లుగా పేర్కొన్నారు. అలాగే ఆమెకు రూ.1.84 కోట్ల విలువైన బంగారం, 1.09 కోట్ల విలువైన ముత్యాలు, వజ్రాభరణాలు, రూ.30 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నట్లు తెలిపారు. అప్పులు రూ. 10.31 కోట్లుగా పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో చంద్రబాబుకు తన కొడుకు లోకేశ్తో ఉమ్మడిగా ఉన్న ఇంటి ప్రస్తుత విలువ రూ.70.20 కోట్లుగా చూపించారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లి వద్ద 96.23 సెంట్ల భూమి విలువ రూ.77.33 లక్షలుగా చూపించారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దీని విలువ రూ.2 కోట్లకుపైనే ఉంటుంది. నారావారిపల్లె శేషాపురంలో ఉన్న ఇల్లు విలువ రూ.43.66 లక్షలుగా చూపారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఇది కూడా సుమారు రూ.2 కోట్లు ఉంటుందని అంచనా. తన చేతిలో రూ.11,560 నగదు, బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 2,45,378, ఒక అంబాసిడర్ కారు ఉన్నట్లు పేర్కొన్నారు. 24 క్రిమినల్ కేసులు.. అందులో 8 అవినీతి కేసులే తాను 24 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు అఫిడవిట్లో చంద్రబాబు పేర్కొన్నారు. అందులో 8 కేసులు తీవ్రమైన అవినీతి ఆరోపణలతో కూడినవి. ఆయన అరెస్టయి జైల్లో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు అందులో ఒకటి. ఉచిత ఇసుక పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం, మద్యం డిçస్టలరీలు, బ్రాండ్లకు అక్రమంగా అనుమతులివ్వడం, రాజధాని ఇన్నర్ రింగురోడ్డు అలైన్మెంట్ కుంభకోణం, ఏపీ ఫైబర్నెట్ కాంట్రాక్టు జారీలో అక్రమాలు, రాజధాని అసైన్డ్ భూముల కుంభకోణానికి సంబంధించిన కేసులు తనపై విచారణలో ఉన్నట్లు ఆయన అఫిడవిట్లో తెలిపారు. -
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్
-
బాబు హామీల్..అన్నీ ఉడాల్..!
అరిగిన హామీల క్యాసెట్టు.. వేశాడే మళ్లీ పెసరట్టు.. జనం అంతా అదిరేట్టు..! పలమనేరు: అని కుప్పం, పలమనేరు ప్రెజలు మళ్లీ తల్కాయలు పట్టుకున్నారు. చెంద్రబాబు ఎప్పుడు జూసినా చెప్పిందే చెప్పీ..చెప్పీ బేజారెత్తిస్తాండప్పా..ఏందోబ్బా.. ఈ పార్టీ ఇయర్సు ఇండస్టిరీ అని నిస్టూరమాడినారు. అధికార పచ్చం పారిటీ వోల్ల ప్రెచారానికి నిద్ర పట్టక కుప్పానికి, పలమనేరుకు వచ్చిన చెంద్రబాబు ‘ప్రెజాగలం’లో కొత్తగా ఏమైనా చెప్తాడనుంటే ఏం చెప్పలేదప్పా..మళ్లీ పాత గలమే ఇప్పినాడు. కుప్పంలో అరచేతిలో సింగపూరు సొక్కాయి చూపిచ్చినాడు..ఇమానాలు ఎగిరిపిచ్చినాడు..బెంగలూరుకు నాలుగ్గీతల రోడ్డేసినాడు..అంద్రీ–నీవా నీల్లు పారిచ్చినాడు..అని ఎకసెక్కాలాణ్నారు. పోనీ పలమ్నేర్లో అయినా కొత్తగా ఏమైనా చెప్తాడా అన్కుంటే ఈడ కూడా అరిగిపోయిన పాత హామీల క్యాసెట్టేసినడబ్బా! ప్యాకట్రీలు కట్టించి, ఉజ్జోగాలిప్పిస్తాడంట..ఈడుంటే వోల్లు బెంగలూరుకు పనుల కోసం పోయేది కాదు..బెంగలూరోల్లే ఈడికి ఉజ్జోగాలు, పనులకు వచ్చేలా చేస్తాడంట! ఓయమ్మా..ఇది నమ్మే మాటేనా..చెప్పుయా!? బాబు చెప్పేవన్నీ ఉడాల్ మాట్లేయా! అని జెనాలు ఎండ చుర్రుమనేకాడికి తల మీద గుడ్డేసుకుని ‘ప్రెజాగలం’ నుంచి ఎలబారి ఇల్లకు పోయినారు. -
కుప్పంలో వైఎస్ఆర్సీపీ విజయం తథ్యం- భరత్
-
మీ మగాళ్లకు అన్నం పెట్టకండి.. కుటుంబంలో చిచ్చు పెడుతున్న చంద్రబాబు
-
Chandrababu Naidu: కుప్పంలో కదులుతున్న కూసాలు
కుప్పం నియోజకవర్గంలో ఏళ్ల తరబడి కొనసాగిన చంద్రబాబు ఆధిపత్యం అంత్యదశకు చేరిందా..? బురిడీ మాటలకు కాలం చెల్లిందా..? దశాబ్దాలుగా మోసిన ప్రజలకు టీడీపీ అధినేత అసలు తత్వం బోధపడిందా..? వాస్తవాలు గ్రహించిన జనంలో మార్పు మొదలైందా..? ఇన్నేళ్లుగా నల్లేరుపై నడకలా సాగిన చంద్రబాబు గెలుపు ఇకపై కష్టంగా మారబోతోందా..? కుప్పంలో మారిన లెక్కలను గమనిస్తే అసలు నిజం అర్థమవుతోంది. స్థానిక.. పురపాలక ఎన్నికల్లో వచ్చిన ఫలితమే మార్పునకు దర్పణం పడుతోంది. అందుకే టీడీపీ అధినేత వరుస పర్యటనలకు వస్తున్నట్లు ఆ పార్టీ క్యాడర్ భావిస్తోంది. సాక్షి, తిరుపతి: కుప్పం నియోజకవర్గ ప్రజల్లో మార్పు కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం వాసులు ఇచ్చిన తీర్పే ఇందుకు నిదర్శనం. నేటి పాలనకు.. నాటి టీడీపీ పాలనను బేరీజు వేసుకుంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఐదేళ్లలో డీబీటీ ద్వారా 4,32,067 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.1,244.23 కోట్లు నేరుగా జమ చేసింది. నాన్ డీబీటీ ద్వారా 3,03,080 మంది లబ్ధిదారులకు రూ.1,175.21 కోట్లు అందించింది. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా, ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నా చెప్పుకోదగ్గ ఒక్క మంచి పథకం తీసుకురాలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. 35 ఏళ్లుగా కుప్పానికి నీళ్లు తీసుకొస్తా అని చెప్పుకుంటూ వచ్చారే తప్ప మాట నిలబెట్టుకున్న దాఖలాలు లేవు. సీఎం వైఎస్ జగన్ ఐదేళ్లలోనే కుప్పానికి కృష్ణా జలాలను తీసుకువచ్చి స్థానికుల మనన్ననలు పొందుతున్నారు. ఇన్నేళ్లు గెలిపించింది దొంగ ఓట్లే చంద్రబాబు 1989 నుంచి కుప్పం నుంచి పోటీ చేసి గెలుపొందుతూ వచ్చారు. ఈయన గెలుపునకు కుప్పం వాసుల అమాయకత్వమే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడుకు చెందినవారిని వేల సంఖ్యలో ఓటర్లుగా నమోదు చేయించడమే బాబు విజయానికి ప్రధాన కారణంగా ఆరోపిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని వైఎస్సార్సీపీ అభ్యర్థిగా చంద్రబాబుపై పోటీకి దింపారు. ఎన్నికల సమయంలో కర్ణాటక, తమిళనాడు నుంచి భారీగా వచ్చి ఓట్లు వేసి వెళ్లడం గమనించిన చంద్రమౌళి దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయా ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లు పోలైనట్లు అధికారుల విచారణలో తేలింది. దీంతో 18 వేల ఓట్లు ఒకసారి, 34 వేల ఓట్లు మరోసారి తొలగించారు. కుప్పం నియోజకవర్గ సమాచారం 2019 ఎన్నికల్లో మొత్తం ఓట్లు 2,13,145 టీడీపీకి పోలైనవి 1,00,164 వైఎస్సార్సీపీకి వచ్చినవి 69,426 స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం ఓట్లు 1,78,948 టీడీపీ 21,038 వైఎస్సార్సీపీ 79,633 కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం ఓట్లు 38,213 టీడీపీ 12,377 వైఎస్సార్సీపీ 15,696 ప్రస్తుతం ప్రచురితమైన తుది ఓటరు జాబితా ప్రకారం నియోజకవర్గంలోని మొత్తం ఓట్లు 2,23,174 రావడానికి ఓ లెక్కుంది? కుప్పంలో 2014 ముందు ఒక లెక్క ఆ తర్వాత మరో లెక్క అన్న చందంగా మారింది. అప్పటి వరకు అన్ని గ్రామాలు చంద్రబాబు చెప్పిందే వేదంలా.. వేరొకరికి స్థానం లేకుండా భయపెడుతూ.. బెదిరిస్తూ ప్రత్యర్థి లేకుండా జాగ్రత్తపడుతూ వచ్చారు. 35 ఏళ్ల పాటు కుప్పం వాసులను ఆడిస్తూ వస్తున్న చంద్రబాబుకు వైఎస్సార్సీపీ ప్రస్థానం ప్రారంభమైన తర్వాత వరుస షాక్లు తగలడం మొదలైంది. ప్రతి గ్రామంలో టీడీపీకి పోటీగా వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేసేవారు ముందుకు వచ్చారు. 2019 తర్వాత జరిగిన స్థానిక సంస్థలు, కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్ అందరూ వైఎస్సార్సీపీ మద్దతుదారులే విజయం సాధించడంతో చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయ్యింది. దీంతో 35 ఏళ్లుగా కుప్పంలో సొంత ఇల్లు నిర్మించుకోవాలనే ఆలోచనే చేయని చంద్రబాబుకు అప్పటికి జ్ఞానోదయమైంది. దీంతో హుటాహుటి ఇంటి నిర్మాణం చేపట్టారు. అలాగే తరచూ కుప్పానికి వస్తున్నారు. 2014–19 మధ్య కాలంలో సీఎం హోదాలో చంద్రబాబు 8 పర్యాయాలు మాత్రమే కుప్పంలో పర్యటించారు. 2019–2024 మధ్య కాలం 13 పర్యాయాలు కుప్పం వచ్చి కనీసం అంటే రెండు, మూడు రోజులు ఉండి వెళ్తున్నారు. ఓటమి భయంతోనే కుప్పానికి పరుగులు పెడుతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
కుప్పం టీడీపీలో ఏం జరుగుతోంది? రగిలిపోతున్న బీసీ నేతలు!
టీడీపీ అధినేత చంద్రబాబుకు తనసామాజికవర్గ నేతలు ఉంటే.. ఇంక ఎవరితోనూ పని ఉండదు. బీసీలను అసలు పట్టించుకోరు. మూడున్నర దశాబ్దాలుగా కుప్పంలో చంద్రబాబును మోస్తున్న బీసీ నేతలు ఆయన తీరుతో మండిపడుతున్నారు. ఇంతకాలం తమతో పార్టీకి ఊడిగం చేయించుకుని ఇప్పుడు బయటి వ్యక్తులకు ప్రాధాన్యం ఇస్తారా అంటూ ఆగ్రహిస్తున్నారు. స్థానికంగా ఉన్నవారిని పక్కన పెట్టి ఇతర జిల్లాల నుంచి ఇంపోర్ట్ చేస్తే సహించేది లేదంటున్నారు. అసలు కుప్పం టీడీపీలో ఏం జరుగుతోంది? తెలుగుదేశం అనే ప్రాంతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా చెప్పుకునే నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గంలో ఆయన కుర్చీ కదిలిపోతోంది. ఏడుసార్లుగా ఎమ్మెల్యేగా ఎన్నుకున్న కుప్పం ప్రజలకు చంద్రబాబు ఏమీ చేయలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెలగబెట్టినా కూడా సొంత నియోజకవర్గానికి కనీసం తాగు, సాగునీరు కూడా తీసుకురాలేకపోయారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కుప్పం దశ తిరిగింది. అన్నివిధాలుగానూ కుప్పం నియోజకవర్గాన్ని వైఎస్ జగన్ అభివృద్ధి చేస్తున్నారు. హంద్రీనీవా ద్వారా కృష్ణా నది నీటిని కుప్పంకు తీసుకువచ్చి వారి దాహార్తిని తీర్చుతున్నారు. పొలాల్ని సస్యశ్యామలం చేస్తున్నారు. నియోజకవర్గం గురించి ఏనాడూ పట్టించుకోని చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించారు. గండం నుంచి గట్టెక్కడానికి కుప్పం పార్టీని తన సామాజికవర్గానికి చెందిన ప్రకాశం జిల్లా నేత, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్కు అప్పగించారు. దీంతో దశాబ్దాలుగా పార్టీకి ఊడిగం చేసిన తాము పనికిరాకుండా పోయామా అంటూ అక్కడి బీసీ నేతలు చంద్రబాబు మీద మండిపడుతున్నారు. నియోజకవర్గంలోని బీసీ నేతలతో పాటు..కుప్పంలో ఆయనకు పీఏలుగా పనిచేసినవారిని కూడా పక్కన పెట్టేశారు. వారికి ఎలాంటి ప్రాధాన్యం లేకుండా చేసేశారు. దీంతో వారు లోపల ఉండలేక..బయటకు పోలేక అల్లాడిపోతున్నారు. ఇన్నేళ్ళుగా తమను వాడుకుని..ఇప్పుడు నిర్లక్ష్యం చూపిస్తున్నందుకు తామేంటో ఎన్నికల్లో చూపిస్తామని చంద్రబాబును హెచ్చరిస్తున్నారు కుప్పంలోని బీసీ సామాజికవర్గ నేతలు. తమను నమ్మకుండా బాధ్యతలు లేకుండా చేసినపుడు ఇంకా తాము టీడీపీకి, చంద్రబాబుకు ఎందుకు సేవ చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు ఇంతకాలం భారీ మెజారిటీ రావడానికి, అసలు ఆయన విజయం సాధించడానికి అక్కడ చేర్పించిన దొంగ ఓట్లే కారణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫిర్యాదుతో కుప్పంలో చంద్రబాబు చేర్పించుకున్న దొంగ ఓట్లలో 33 వేలకు పైగా తొలగించారు. అందుకే ఓటమి తప్పదని చంద్రబాబు భయపడుతున్నారు. ఎన్నికల్లో తమ తడాఖా చూపిస్తామంటున్నారు అక్కడి బీసీ నేతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో కుప్పంలో అధికార పార్టీ బాగా బలం పుంజుకుంది. దీంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో నిరాశా నిస్పృహలు ఆవరించాయి. ఒకవైపు కేడర్లో నైరాశ్యం..బీసీ నేతల్లో పార్టీ అధినేత పట్ల ఆగ్రహం..ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత...మొత్తం కలిపి కుప్పంలో చంద్రబాబు కోట కూలడం ఖాయమనే టాక్ నడుస్తోంది. -
40 ఇయర్స్ ఇండస్ట్రీ భ్రమరావతి వర్సెస్ రియల్ సీఎం
ఏపీలో చిట్టచివరి నియోజకవర్గం, ఒక మూలకు విసిరేసినట్లు ఉండే కుప్పానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను చెప్పినట్లే తాగునీరు, సాగునీరు విడుదల చేశారు. ఇందుకు అవసరమైన కాల్వలను తవ్వించి, ఇతర ఏర్పాట్లు చేసి హంద్రీనీవా సుజల స్రవంతిలో భాగంగా నీటిని కుప్పం వరకు తీసుకువెళ్లగలిగారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, ముప్పైఐదేళ్లు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన చంద్రబాబు నాయుడు పూర్తి చేయలేని పనిని జగన్ చేసి చూపించారు. తద్వారా ఈ ప్రజల దాహార్తిని తీర్చే యత్నం చేశారు. అలాగే ఆరువేల ఎకరాలకు సాగు నీరు కూడా ఇవ్వడానికి సంకల్పించారు. ఇందుకోసం సుమారు అరు వందల కోట్ల రూపాయలను వ్యయం చేశారు. కుప్పంలో జరిగిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ "ఇంతకాలం చంద్రబాబును ఈ నియోజకవర్గ ప్రజలు భరించినందుకు జోహార్లు" అని వ్యంగ్య వ్యాఖ్య చేశారు. ఈ సభలో చంద్రబాబు టైమ్లో కుప్పంకు జరిగిన పనులు, తన హయాంలో జరిగిన కార్యక్రమాలను వివరించారు. ప్రత్యేకించి కుప్పం నియోజకవర్గ ప్రజలకు వివిధ స్కీముల ద్వారా 1400 కోట్ల మేర లబ్ది జరిగిన విషయాలను లెక్కలతో సహా వివరించారు. తాను ప్రాంతం, కులం, మతం, పార్టీ చూడకుండా, ఎలాంటి వివక్ష లేకుండా స్కీములు అమలు చేశానని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు తనపై కోపం వచ్చినప్పుడల్లా, పులివెందుల , కడప, రాయలసీమ ప్రజలను దూషిస్తుంటారని, తాను మాత్రం ఎప్పుడు అలా చేయలేదని ప్రజల మనసులను ఆకట్టుకునే యత్నం చేశారు.ఇంతవరకు ఒప్పుకోవలసిందే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుని వద్ద కాపు ఉద్యమకారులు రైలును దగ్దం చేస్తే, ఆ పని చేసింది కడప రౌడీలంటూ మీడియా సమావేశం పెట్టి ఆరోపించారు. కాని పోలీసులు అన్నిటిని విచారించి ఉభయ గోదావరి జిల్లాలకు చెందినవారిని అరెస్టు చేశారు. అలాగే ఆయన తనకు ఓటు వేయని వారికి తాను ఎందుకు సదుపాయాలు కల్పించాలని అనేవారు. తనకు ఓటు వేయకపోతే తాను వేసిన రోడ్డు, తాను మంజూరు చేసిన మరుగు దొడ్డి ఎలా వాడతారని చంద్రబాబు ప్రజలను ప్రశ్నించేవారు. కానీ జగన్ అందుకు విరుద్దంగా తనకు ఓటు వేసినా, వేయకపోయినా, తన ప్రభుత్వ స్కీములు ప్రాంతం, కులం, పార్టీ,మతం వంటివాటితో సంబంధం లేకుండా అమలు చేస్తున్నారు. కుప్పం ప్రజలు సైతం అందులో భాగమేనని, అందుకే మాట ఇచ్చిన ప్రకారం నీరు అందించానని, వివిధ అబివృద్ది పనులు చేపట్టానని సీఎం జగన్ చెప్పారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. కుప్పంలోని గ్రామీణ ప్రాంతంలో మీటింగ్ పెట్టినా భారీ ఎత్తున జనం రావడం, వారు ఆయా సమయాలలో అనుకూల నినాదాలతో హోరెత్తించడం కనిపించింది. దీంతో టిడిపి అధినేత కుప్పంలో తన పోటీపై గట్టిగా ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. కుప్పం ప్రజలు చంద్రబాబును ఇంతకాలం భరించినందుకు వారికి జోహార్లు అని జగన్ చమత్కరించారు. కుప్పం ఎమ్మెల్యేగా భరత్ను గెలిపిస్తే మంత్రిని చేస్తానని ఆయన హామీ ఇవ్వడం ద్వారా కుప్పం ప్రాముఖ్యత తగ్గదని ప్రజలకు ఆయన సంకేతం ఇచ్చారు. గత సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక ఎన్నికలలో YSRCP విజయఢంకా మోగించడం, కుప్పానికి నీరు, బలహీనవర్గాలకు ఇళ్ల పట్టాలు, ఇళ్లు, కుప్పం మున్సిపాలిటీగా మారడం, రెవెన్యూ డివిజన్ ఇవ్వడం వంటివి పార్టీకి ప్లస్ అవుతాయి. జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కుప్పంలో చంద్రబాబును ఓడించాలన్న పట్టుదలతో పనులు చేశారు. దాని ప్రభావం ఏ రకంగా ఉంటుందన్నది చర్చనీయాంశంగా ఉంది. ఇప్పటికైతే చంద్రబాబు గతంలో మాదిరి నల్లేరు మీద బండి మాదిరి ఎన్నిక చేసుకోలేకపోవచ్చని, తీవ్రమైన పోటీని ఎదుర్కోక తప్పదన్న విశ్లేషణలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు తన టైమ్ లో కుప్పం బ్రాంచ్ కెనాల్ ను పూర్తి చేయలేకపోవడం పెద్ద వైఫల్యంగా చెప్పాలి. హంద్రీ-నీవా ప్రాజెక్టు ప్రతిపాదన ఎన్.టి.ఆర్.టైమ్ లో వచ్చినా,దానిని ఆచరణ లో పెట్టింది వైఎస్ రాజశేఖరరెడ్డి. ఇప్పుడు ఈ ప్రాజెక్టు చివరిలో ఉన్న కుప్పంకు సైతం నీరు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. కుప్పం ప్రాంతానికి శాశ్వతంగా నీటి సమస్య తీర్చడానికి వీలుగా రెండు రిజర్వాయర్లను నిర్మించడానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ రకంగా కుప్పం ప్రజల అభిమానం పొందడానికి జగన్ యత్నించారు. కాగా చంద్రబాబు మాత్రం పులివెందుల ప్రజలను తరచుగా అవమానించేవారు. కుప్పంకు నీరు ఇవ్వడంపై చంద్రబాబు స్పందించిన తీరు కూడా సరిగా లేదు. నిజానికి ఆయన హర్షం వ్యక్తం చేసి ఉంటే హుందాగా ఉండేది. ఆ పని చేయకపోగా, కుప్పం ప్రజలను దోచుకున్నారంటూ, ఏదో హింస జరిగిందంటూ పిచ్చి ఆరోపణలను చంద్రబాబు చేసి తన విలువను మరింత తగ్గించుకున్నారు. పులివెందులలో పొలాలు ఎండిపోతున్నాయని అంటూ ఏవేవో మాట్లాడారు. రాయలసీమలో నీటి పారుదల ప్రాజెక్టులకు అదికంగా ఖర్చు చేసింది తానేనని ఆయన ప్రకటించుకున్నారు. పదమూడు శాతం పనులు కుప్పం బ్రాంచ్ కెనాల్ కు సంబంధించి మిగిలాయని, కాని జగన్ మొత్తం తానే చేసేసినట్లు చెప్పుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. అంతే తప్ప తాను పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పం కు ఎందుకు నీళ్లు తేలకపోయింది మాత్రం చెప్పలేకపోయారు. దీంతో ఆయన ఆత్మరక్షణలో పడ్డారు. కాకపోతే బుకాయింపులో దిట్ట కనుక యధాప్రకారం డబాయిస్తూ ప్రకటన చేశారు. దానిని ఈనాడు,ఆంధ్రజ్యోతి బాకా మీడియాలు ప్రచారం చేశాయి. ఈనాడు అయితే కుప్పంను తానే ఉద్దరించినట్లు జగన్ మాట్లాడడం విని స్థానికులు విస్మయం చెందుతున్నారని ఒక దిక్కుమాలిన కధనాన్ని ఇచ్చింది. కుప్పంకు 35 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు పద్నాలుగేళ్లు సీఎంగా ఉన్నప్పటికీ పట్టణాన్ని ఎందుకు మున్సిపాలిటీ చేయలేకపోయారు? ఎందుకు రెవెన్యూ డివిజన్ చేయలేకపోయారు? ఎందుకు 15వేలమందికి ఇళ్ళ స్థలాలు ఇవ్వలేకపోయారు? అసలు కుప్పంలో కొన్ని వార్డులకు వెళ్లడానికి సరైన రోడ్లే ఎందుకు లేవు? రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టి ఎందుకు పూర్తి చేయలేకపోయారు? కుప్పం కన్నా పులివెందుల ఎంత చక్కగా ఉంటుందో స్వయంగా ఎవరైనా వెళ్లి చూడవచ్చు. పులివెందుల చుట్టూ రోడ్డు, పరిశ్రమలు, పలు విద్యా సంస్థలు, మెడికల్ కాలేజీ మొదలైనవి ఏర్పాటు చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్మోహన్రెడ్డి కాదా? కుప్పంకు ఎయిర్ పోర్టు ఇస్తానని పిచ్చి ప్రకటనలు చేస్తున్న చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతంలో ఒక పరిశ్రమనైనా ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? వీటన్నిటిని కప్పిపుచ్చుతూ, జగన్ కుప్పం కు నీళ్లు ఇవ్వడాన్ని చూసి ఓర్వలేక ఈనాడు ఇలాంటి దద్దమ్మ వార్తలు ఇస్తోంది. చంద్రబాబు ఇంతకాలం దొంగ ఓట్లపై ఆధారపడి ఎక్కువ మెజార్టీ పొందగలిగారన్నది బహిరంగ రహస్యం. ప్రస్తుతం ఆ దొంగ ఓట్లను చాలావరకు తొలగించినట్లు చెబుతున్నారు. దాంతో ఇప్పుడు ఆయన తీవ్రమైన పోటీని ఎదుర్కునే పరిస్థితి ఏర్పడింది. అందుకే చంద్రబాబు ఎక్కువగా కంగారు పడుతున్నారు. దానికి తోడు జగన్ కుప్పంపై దృష్టి పెట్టి అభివృద్ది పనులు, సంక్షేమ స్కీములు అమలు చేశారు. కుప్పంకు నీరు కూడా వచ్చేలా చేశారు. ఇది YSRCPకి ప్లస్ గా మారే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టిడిపి మీడియాలు నీరు విడుదల చేసిన మరుసటి రోజు కాల్వలో నీరు లేదంటూ ఒక తప్పుడు కదనాన్ని వండి జనాన్ని ఏమార్చడానికి యత్నించారు. ఇంకా నీళ్లురాని కాల్వలో దిగి టిడిపి నేతలు యాగీ చేశారు. దీనిని బట్టే వారు ఎంత భయపడుతున్నదీ తెలుసుకోవచ్చు. గెలుపు ఓటములు సంగతి ఎలా ఉన్నా, జగన్ మాత్రం కచ్చితంగా తన రాజకీయ ప్రత్యర్ధి అని కూడా చూడకుండా, తన పార్టీకి ఓటు వేశారా? లేదా? అన్నదానితో నిమిత్తం లేకుండా కుప్పం ప్రజలకు కూడా మేలు చేశారన్నది నిజం. అందుకు ఎవరైనా అభినందించాల్సిందే. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు -
Fact Check: కుప్పం ప్ర'జల నవ్వుల'పై కుళ్లు రాతలు!
సాక్షి, తిరుపతి: ముప్పైఐదు ఏళ్లుగా తనను ఎన్నుకుంటున్న కుప్పం వాసుల కష్టాలను టీడీపీ అధినేత చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోకపోయినా కరువు సీమలో కనకధారలు కురిపించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కంకణం కట్టుకున్నారు. ప్రతిపక్ష నేత ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గానికి కేవలం 57 నెలల కాలంలోనే కృష్ణాజలాలను అందించి అక్కడి ప్రజల పెదవులపై చిరునవ్వులు చిందేలా చేశారు. దీనిని తట్టుకోలేని ఈనాడు రామోజీ కుళ్లు రాతలతో విషం చిమ్మారు. నవ్విపోదురుగాక.. నాకేటి సిగ్గు అన్నట్టు కుప్పం బ్రాంచ్ కాలువలో కృష్ణా జలాలు ప్రవహిస్తున్నా నీరు రాలేదంటూ కథనం ప్రచురించింది. నిస్సిగ్గుగా ‘కుప్పం ఫక్కున నవ్వింది’ అంటూ ఏడుపుగొట్టు రాతలు రాసి రాక్షసానందం పొందింది. నాటి లీలలు గుర్తున్నాయా బాబూ అండ్ రామోజీ! కుప్పానికి కృష్ణాజలాలు అందించే 207.800 కి.మీ కుప్పం బ్రాంచ్ కెనాల్ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ మీదుగా 123.641 కి.మీ ప్రవహించి కుప్పం పట్టణం సమీపంలో పరమసముద్రం దగ్గర కలుస్తుంది. ఈ పని అంచనా విలువ రూ.468.53 కోట్లుగా నిర్ణయించారు. రూ.460.881కోట్లతో చేపట్టేలా హైదరాబాద్కు చెందిన ఆర్కే హెచ్ఈఎస్–కోయా సంస్థతో 2016 జనవరి 4న అప్పటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ సీఎం అండ్ సీడీ పనులు చేపట్టకుండానే పనులు పూర్తయినట్టు చేతులు దులుపుకుంది. ప్రశ్నించాల్సిన అప్పటి ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థకు వంతపాడింది. నాడు ఏర్పాటు చేసిన పైప్లైన్కు ఎయిర్ రిలీఫ్ వాల్యూమ్లు, స్కోర్ ఛాంబర్లూ నాసిరకంవి అమర్చారు. 2019 ఫిబ్రవరిలో కుప్పం బ్రాంచ్ కెనాల్కు నీటిని విడుదల చేశారు. కానీ ఆ పైప్లైన్ పలు చోట్ల పూర్తిగా దెబ్బతినడంతో ప్రభుత్వం నీటి విడుదలను ఆపివేసింది. ప్రభుత్వ నిబంధల ప్రకారం కెనాల్ డిజైన్, ఎస్ఎల్ఆర్బీ, డీఎల్ఆర్బీ, పైప్ కల్వర్ట్ క్రాస్ వర్క్లు ప్రణాళికాబద్ధంగా చేయడకపోవడమే దీనికి ప్రధాన కారణమని తేలింది. దీంతోపాటు రోడ్డు క్రాసింగ్ వద్ద, డ్రెయినేజీ కాలువల వద్ద పైప్లైన్ పనుల్లో నాణ్యతాలోపం వల్ల నీరు కలుషితమైంది. ఇవేమీ గుర్తులేని బాబు, రామోజీ ఇప్పుడు ప్రజా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. జగన్ చెబితే చేస్తారంతే.. సీఎం జగన్ 2022 సెప్టెంబర్ 22న కుప్పంలో పర్యటించినప్పుడు బ్రాంచ్ కెనాల్ పనులపై స్థానికులు ఆయనకు ఫిర్యాదు చేశారు. దీంతో పెండింగ్ పనులు పూర్తిచేసి త్వరలో కృష్ణాజ లాలను తీసు కువస్తానని సీఎం మాట ఇచ్చారు. వెంటనే గత ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్ట్ కంపెనీకి పనులను రద్దు చేసి హైదరా బాద్కు చెందిన ప్రముఖ ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి పనులను అప్పగించింది. సాంకేతిక నిపుణుల కమిటీ సూచనల ప్రకారం గతంలో వేసిన నాసిరకం ఎయిర్ రిలీఫ్ వాల్యూ మ్ల స్థానంలో 500 ఎంఎం సామర్థ్యంగల ఎ యిర్ వాల్యూమ్లను ఏర్పాటు చేయాలని సూ చించింది. రోడ్డు క్రాసింగ్, డ్రెయి నేజ్, ప్రధాన కాలువలు వద్ద వేసే పైప్లైన్ పను లను నాణ్యంగా చేపట్టేలా పర్యవేక్షించి సకాలంలో పనులు పూర్తిచేసింది. శ్రీశైలం నుంచి 676 కి.మీ. పొడువున, 733 మీటర్ల ఎత్తులో 27 ప్రాంతాల్లో లిఫ్టింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. కృష్ణా జలాలతో నిండిన 2 చెరువులు మూడు రోజుల క్రితం కుప్పంలో పర్యటించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రామకుప్పం మండలం రాజుపేట వద్ద గేట్లు ఎత్తి కృష్ణా జలాలను విడుదల చేశారు. మరుసటి రోజు (మంగళవారం) శాంతిపురం మండలం వెంకటేష్పురం వద్ద ఉన్న శెట్టికుంట చెరువు నిండింది. అంతకు ముందే అధికారులు ట్రయల్ రన్లో భాగంగా నీటిని విడుదల చేశారు. సీఎం వైఎస్ జగన్ వచ్చాక అధికారికంగా నీటిని విడుదల చేశారు. అప్పటికే అధికారులు ట్రయల్ రన్ కోసం విడుదల చేసిన నీరు ఉండటంతో అదే రోజు సాయంత్రానికి రామకుప్పం మండలం దాటి శాంతిపురం మండలంలోకి కృష్ణా జలాలు ప్రవేశించాయి. గుండిశెట్టిపల్లి సమీపంలో ఉన్న వంతెన దాటి నీరు ముందుకు సాగింది. ఆ సమయంలో స్థానికులు పూజలు కూడా చేశారు. వెంకటేష్పురం వద్ద శెట్టివానిగుంట చెరువుకు ఉన్న పాయింట్ తెరిచి ఉండటంతో మంగళవారం మధ్యాహ్నానికి చెరువు కృష్ణా జలాలతో నిండిపోయింది. ఈ చెరువు నిండిపోయిందని, నీటిని మల్లించాలని స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. ఆ తరువాతే అధికారులు ఆ నీటిని రామకుప్పం మండలం మిట్టపల్లి వద్ద ఉన్న మద్దికుంట చెరువుకు మళ్లించారు. నీటిని మళ్లించటంతో ఆ కాలువపై నీటి ప్రవాహం ఉండదు. దీన్ని టీడీపీ, డ్రామోజీ, ఎల్లో మీడియా బూతద్దంలో చూపించటం ప్రారంభించాయి. కట్టుకథలు వల్లెవేశాయి. దీనిపై కుప్పం ప్రజలు మండిపడుతున్నారు. ఈనాడులో ప్రచురించిన కథనం పూర్తిగా సత్యదూరమని రాష్ట్ర జలవ నరులశాఖ పేర్కొంది. సీఎం గేటు ప్రారంభించిన ప్రాంతంలో తాత్కాలికంగా అమర్చిన స్విచ్లు, డెకరేషన్లనే తొలగించామంది. కృష్ణానీటితో 2 చెరువులు నిండాయని వెల్లడించింది. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన పనులు ఇలా.. ► పలమనేరు నియోజకవర్గం అప్పినపల్లి వద్ద 0 పాయింట్ నుంచి కుప్పం మండలం పరమసముద్రం వరకు సుమారు 124 కిమీ వరకు హంద్రీనీవా కాలువ తవ్వారు. ► 5.కి.మీ పశు పత్తురు వద్ద లిఫ్ట్ ఏర్పాటు.. 39వ కి.మీ. కృష్ణాపురం వద్ద లిఫ్ట్ ఏర్పాటు ► వి.కోట మండలం ఆదిరేపల్లి 54.కి.మీ. వద్ద లిఫ్ట్లు ► కుప్పం నియోజకవర్గంలో 110 చెరువులకు నీళ్ళు, 6500 ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చేలా పనులు ► 4 లక్షలు జనాభాకు తాగునీరు అందించేందుకు చర్యలు ► అనంతపురం జిల్లా చెర్లోపల్లి రిజర్వాయర్ 300 క్యూసెక్కుల నీరు హంద్రీనీవా కాలువలు ద్వారా తరలింపు -
కుప్పం నియోజకవర్గంలో కృష్ణమ్మ పరవళ్లు
-
కుప్పానికి జల కళ..పచ్చ బ్యాచ్ విల విల
-
కుప్పంలో కృష్ణమ్మ.. కృష్ణా జలాలను విడుదల చేసిన సీఎం జగన్
కుప్పం ప్రజలు చంద్రబాబుకు చాలా ఇచ్చారు. అలాంటి కుప్పానికి ఆయన చేసింది పెద్ద సున్నా. 35 ఏళ్లలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. పధ్నాలుగేళ్లు సీఎంగా, ఏడు సార్లు ఎమ్మెల్యేని చేసిన కుప్పం ప్రజలకే మంచి చేయని బాబుతో రాష్ట్రానికి ఏం ప్రయోజనం? ఆయన ఎలాంటి మనిషో చంద్రగిరి ప్రజలు ఎప్పడో తెలుసుకున్నారు. కుప్పానికి ఎవరి వల్ల మంచి జరిగిందో ఆలోచన చేయాలి. కుప్పానికి కృష్ణమ్మ నీళ్లను తీసుకొచ్చింది ఎవరంటే.. మీ జగన్. కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది మీ జగన్. కుప్పానికి రెవెన్యూ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది మీ జగనే. ‘‘చంద్రబాబుకు నామీద కోపం వచ్చినప్పుడల్లా పులివెందులను, కడపను తిడతాడు. చివరికి రాయలసీమను కూడా తిడుతూ ఉంటాడు. మీ జగన్ ఏనాడూ ఇక్కడి ప్రజల్ని గానీ, కుప్పం నియోజకవర్గాన్నిగానీ ఒక్క మాట కూడా అనలేదు. పులివెందుల, కుప్పం, అమరావతి, ఇచ్చాపురం.. ఏ ప్రాంతమైనా సరే పేదలను పేదలుగానే చూశాం. కుప్పం నియోజకవర్గంలో 82,039 కుటుంబాలకు (93.29 శాతం) నవరత్నాల పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాం. కులమతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. – సీఎం జగన్ సాక్షి, తిరుపతి: కనీసం సొంత నియోజకవర్గానికైనా మేలు చేయని రాజకీయ నాయకుడు ఇక రాష్ట్రానికి ఏం ఒరగబెడతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు 35 ఏళ్లలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను సైతం పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. కుప్పానికే ప్రయోజనం లేని ఆ నాయకుడి వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ బాగా ఆలోచన చేయాలని సూచించారు. కరువు తాండవమాడిన కుప్పం నేలకు కృష్ణా జలాలను తరలిస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ తాగు, సాగునీటి కోసం దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ ముఖ్యమంత్రి జగన్ కుప్పం నియోజకవర్గానికి సోమవారం కృష్ణా జలాలను విడుదల చేశారు. కుప్పం పరిధిలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీటితోపాటు కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని 4.02 లక్షల మందికి తాగునీరు అందిస్తూ అనంత వెంకటరెడ్డి హంద్రీ–నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ.560.29 కోట్లతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను సీఎం జగన్ వాయువేగంతో పూర్తి చేశారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. అనంతరం శాంతిపురం మండలం గుండుశెట్టిపల్లె వద్ద జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. మాట నిలబెట్టుకుంటున్నా.. కొండలు, గుట్టలు దాటుకుని ఏకంగా 672 కి.మీ. దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది. ఏకంగా 540 మీటర్ల ఎత్తు అంటే 1,600 అడుగుల ఎత్తు పైకెక్కి కృష్ణమ్మ మన కుప్పంలోకి బిరబిరా వచ్చింది. 2022 సెప్టెంబర్ 23న ఇదే కుప్పంలో బహిరంగ సభ సందర్భంగా నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తామని, కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను పూర్తి చేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా. మరో మూడు ప్రాజెక్టులకు శ్రీకారం కుప్పానికి కృష్ణా జలాలను తీసుకురావడమే కాకుండా ఇక్కడ మరో రెండు ప్రాజెక్టుల పనులకు కూడా శ్రీకారం చుట్టేలా పరిపాలన అనుమతులిచ్చాం. కుప్పంలో రెండుచోట్ల రిజర్వాయర్ల నిర్మాణానికి అనువుగా ఉన్నట్లు గుర్తించాం. గుడుపల్లి మండలంలోని యామగానిపల్లె వద్ద ఒక రిజర్వాయర్ను, శాంతిపురం మండలం మాదనపల్లె వద్ద మరో రిజర్వాయర్ను రూ.535 కోట్లతో నిర్మించడం ద్వారా అదనంగా మరో 5 వేల ఎకరాలకు తాగు, సాగునీరు అందించేందుకు మనందరి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటికి పరిపాలన అనుమతులు ఇప్పటికే మంజూరు చేశాం. పాలారు ప్రాజెక్టుకు సంబంధించి 0.6 టీఎంసీల కెపాసిటీతో చిన్నపాటి రిజర్వాయర్ను రూ.215 కోట్లతో నిర్మించేందుకు కూడా పరిపాలన అనుమతులు మంజూరు చేశాం. వచ్చే టర్మ్లో ఈ మూడు ప్రాజెక్టులూ పూర్తి చేసి మీబిడ్డ మీకు అందిస్తాడు. ముడుపులపై రీసెర్చ్ కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు 2015లో జలవనరుల శాఖ పరిపాలన అనుమతులు మంజూరు చేస్తే చంద్రబాబు అంచనాలను అమాంతం రూ.561 కోట్లకు పెంచేసి తన పార్టీ వారికి, బినామీలకు అప్పజెప్పాడు. నీళ్లు పారే కాలువగా కాకుండా తన జేబులో నిధులు పారించే కాలువగా మార్చుకున్నారు. ఎంత ముడుపులు పుచ్చుకోవాలనే అంశంపైనే చంద్రబాబు రీసెర్చ్ చేశారు. తన నియోజకవర్గ ప్రజలనే దోచుకుని కనీసం దాహార్తి తీర్చని నాయకుడిని ఇంతకాలం భరించిన కుప్పం ప్రజల సహనానికి, మంచితనానికి జోహార్లు చెబుతున్నా. మీకు మేలు చేసిందెవరు..? 35 ఏళ్లు ఎమ్మెల్యేగా, 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు వల్ల కుప్పానికి మంచి జరిగిందా? లేక మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం 57 నెలల వ్యవధిలో కుప్పానికి మేలు జరిగిందా? అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. చంద్రబాబు హెరిటేజ్ కోసం మూసివేసిన చిత్తూరు డెయిరీని తెరిపించడమే కాకుండా అమూల్ను తెచ్చి కుప్పం, పలమనేరు పాడి రైతులందరికీ గిట్టుబాటు ధర అందించింది ఎవరంటే మీ జగన్. ప్రతిష్టాత్మక వెల్లూర్ సీఎంసీ మెడికల్ కాలేజీని చిత్తూరు జిల్లాకు రాకుండా, కుప్పం, పలమనేరు ప్రజలకు అందుబాటులో లేకుండా చేసింది ఎవరంటే చంద్రబాబు, ఈనాడు రామోజీరావు వియ్యంకుడు, చంద్రబాబు పార్టనర్. ఆ కాలేజీని చిత్తూరులో పునఃప్రారంభించేలా చేసింది ఎవరంటే మీ జగన్. కుప్పంలో మరో రెండు విద్యుత్తు సబ్ స్టేషన్లు, ఇంటిగ్రేటెడ్ ఆఫీసు కాంప్లెక్సులు నిర్మిస్తోంది ఎవరంటే మీ జగన్. కుప్పం మున్సిపాలిటీకి రూ.66 కోట్లు ఇచ్చి పనులు చేయిస్తోంది ఎవరంటే మీ జగన్. బాబుకు ఓటేసిన పేదలూ నావాళ్లే కుప్పంలో చంద్రబాబుకు ఓటేసిన పేదలందరికీ ఓ మాట చెబుతున్నా. మీరందరూ నావాళ్లే అని భావిస్తూ మీకు మంచి చేశా. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 87,941 కుటుంబాలుంటే నవరత్నాల పథకాలను ఏకంగా 82,039 కుటుంబాలు (93.29 శాతం) అందుకున్నాయి. మనసున్న పాలన అంటే ఇది కాదా? 2019 జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా డీబీటీతో నేరుగా రూ.2.55 లక్షల కోట్లు పేదల ఖాతాల్లోకి జమ చేస్తే ఒక్క కుప్పం నియోజకవర్గంలోని నా అక్కచెల్లెమ్మలకు రూ.1,400 కోట్లు అందచేశాం. భరత్ను ఎన్నుకోండి.. గుండెల్లో పెట్టుకుంటా బలహీన వర్గాలకు చెందిన భరత్ను ఎమ్మెల్సీగా చేసి కుప్పానికి ఐదేళ్లలో మంచి చేశాం. భరత్ను కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి. నా కేబినెట్లో మంత్రిగా స్థానం ఇస్తా. గుండెల్లో పెట్టుకుంటా. తన ద్వారా కుప్పం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందిస్తామని మాట ఇస్తున్నా. మీలో ప్రతి ఒక్కరూ మీకు జరిగిన మంచిని వివరిస్తూ ఇంకో వంద మందితో మనకు ఓటు వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని విన్నవిస్తున్నా. ‘కుప్పానికి మాటిచ్చా .. నిలబెట్టుకున్నా’ సీఎం వైఎస్ జగన్ ‘కుప్పం నియోజకవర్గానికి నీరందించే గొప్ప కార్యక్రమాన్ని నేడు మన ప్రభుత్వంలో నిర్వహించాం’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ‘హంద్రీనీవా సుజల స్రవంతిలో భాగంగా 672 కి.మీ. దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కృష్ణా నది నీటిని కుప్పానికి తీసుకొచ్చాం. 2022 సెపె్టంబర్ 23న కుప్పంలో మాట్లాడుతూ ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకొస్తానని మాటిచ్చాను. నేడు ఆ మాట నిలబెట్టుకున్నాను’ అని సీఎం జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్లో సోమవారం ట్వీట్ చేశారు. బ్యాంకు స్టేట్మెంట్లే సాక్ష్యం కుప్పంలో ప్రతి పేద కుటుంబాన్నీ అడుగుతున్నా. మీ బ్యాంకులకు వెళ్లి గత పదేళ్ల అకౌంట్ స్టేట్మెంట్ తీసుకోండి. చంద్రబాబు హయాంలో ఐదేళ్లు, మీ బిడ్డ వచ్చాక ఐదేళ్లు కలిపి మొత్తం పదేళ్ల స్టేట్మెంట్ను పరిశీలించండి. చంద్రబాబు పాలనలో మీ బ్యాంకు ఖాతాల్లోకి కనీసం ఒక్క రూపాయైనా వచ్చిందేమో చూడాలని కోరుతున్నా. మీ బిడ్డ గత 57 నెలలుగా నవరత్నాలతో అందించిన సాయాన్ని చూడండి. చంద్రబాబు ఎంత అన్యాయస్తుడంటే ఇచ్చే అరకొర సొమ్మును కూడా తన నియోజకవర్గంలో తనవారు, కానివారు అని ఎలా విభజించారో ఇవాళ ప్రతి పథకంలో పెరిగిన లబ్ధిదారులను చూస్తే అర్థం అవుతుంది. ► చంద్రబాబు హయాంలో అరకొరగా రూ.1,000 ఫించన్ కుప్పంలో కేవలం 31 వేల మందికి మాత్రమే ఇచ్చారు. ఇవాళ ఏకంగా 45,374 మంది ఇదే కుప్పంలో పెన్షన్లు తీసుకుంటున్నారు. నాడు రూ.200 కోట్లూ సరిగ్గా ఇవ్వని పరిస్థితుల నుంచి ఈరోజు రూ.507 కోట్లు మీ బిడ్డ ప్రభుత్వం ఇస్తోంది. ► ఒక్క కుప్పంలోనే 44,640 మంది రైతన్నలకు వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ఏకంగా రూ.214 కోట్లు పెట్టుబడి సాయంగా అందచేశాం. ఇవాళ కుప్పంలో 83 ఆర్బీకేలు, 93 గ్రామ, వార్డు సచివాలయాలు, 76 విలేజ్ క్లినిక్స్ ఏర్పాటయ్యాయి. దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు లభించాయి. ► చంద్రబాబు డ్వాక్రా రుణమాఫీ పేరుతో అక్క చెల్లెమ్మలను దగా చేస్తే మనందరి ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా ద్వారా ఆదుకుంది. పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రూ.26 వేల కోట్లు పొదుపు సంఘాల మహిళలకు ఇవ్వగా ఒక్క కుప్పంలోనే 44,888 మంది అక్కచెల్లెమ్మలకు రూ.172 కోట్లు అందించాం. బాబు సున్నావడ్డీని ఎగ్గొడితే మన ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు మరో రూ.30 కోట్లు ఇచ్చింది. అమ్మ ఒడి ద్వారా కుప్పంలో 35,951 మంది తల్లులకు రూ.155 కోట్లు అందచేశాం. ► కుప్పంలో చంద్రబాబు పాలనలో అందించిన ఇళ్ల పట్టాలు సున్నా. మీ బిడ్డ ప్రభుత్వం కుప్పంలో ఇప్పటికే 15,721 ఇళ్ల పట్టాలు ఇచ్చింది. మరో 15 వేలకుపైగా ఇళ్ల పట్టాలు కూడా నెల తిరగకుండానే ఇవ్వబోతున్నాం. మొత్తం 30 వేలకుపైగా ఇళ్ల పట్టాలు ఇవ్వగలుగుతున్నాం. చంద్రబాబు హయాంలో కుప్పంలో పేదలకు మంజూరు చేసిన ఇళ్లు 3,547 కాగా కట్టింది కేవలం 2,968 మాత్రమే. అదే మీ బిడ్డ ప్రభుత్వం 7,898 ఇళ్లు మంజూరు చేసి ఇప్పటికే 4,871 ఇళ్లను పూర్తి చేసింది. ► వైఎస్సార్ చేయూత ద్వారా కుప్పంలో 19,921 మంది కుటుంబాల ఖాతాల్లోకి ఇప్పటికే రూ.85 కోట్లు జమ చేశాం. ► నాడు కుప్పంలో 7,002 మందికి ఆరోగ్యశ్రీతో రూ.28 కోట్లు విదిలిస్తే మన ప్రభుత్వం ఆరోగ్యశ్రీని 3,350 ప్రొసీజర్లకు విస్తరించి ఆరోగ్య ఆసరా కూడా అందిస్తూ 17,552 మందికి రూ.64 కోట్ల మేర మేలు చేసింది. ► బాబు హయాంలో అరకొర ఫీజు రీయింబర్స్మెంట్ కింద 8,459 మందికి రూ.27 కోట్లు ఇస్తే.. మనందరి ప్రభుత్వం వంద శాతం రీయింబర్స్మెంట్తో 12,093 మందికి విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా చెల్లించిన సొమ్ము రూ.61 కోట్లు. బీసీల సీటు బాబు కబ్జా చంద్రగిరిలో చంద్రబాబును 1983లోనే ఏకంగా 17 వేల ఓట్లతో ప్రజలు ఓడగొట్టారు. తర్వాత ఇక్కడ (కుప్పం) ధనబలం చూపిస్తూ వలస వచ్చారు. బీసీల సీటును కబ్జా చేశారు. కుప్పం ప్రజలు చంద్రబాబుకు 35 ఏళ్లుగా చాలా ఇచ్చారు. కానీ కుప్పానికి ఆయన ఏమిచ్చారో ప్రతి ఒక్కరూ నిలదీయాలి. సొంత నియోజకవర్గానికే మంచి చేయని ఆ మనిషి 75 ఏళ్ల వయసు వచ్చాక మరో నలుగురితో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి దిగుతున్నాడు. రాష్ట్రంలో ఏ గ్రామానికైనా వెళ్లి ఫలానా మంచి చేశానని చెప్పలేడు. పొత్తులు, దత్తపుత్రుడితో ప్యాకేజీ గురించి తలుపులు బిగించుకొని మాట్లాడతారు. కాపులకు మీరు చేసిన మంచి ఏమిటి బాబూ? వంగవీటి రంగా హత్యకు పురిగొల్పింది మీరే కదా? కుప్పంలో జన జాతర సాక్షి, తిరుపతి: కుప్పంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అపూర్వ ఆదరణ లభించింది. దశాబ్దాల కల నెరవేర్చడం పట్ల జనం నీరాజనం పలికారు. కుప్పానికి కృష్ణా జలాలను విడుదల చేసేందుకు సీఎం వైఎస్ జగన్ సోమవారం రామకుప్పం మండలం రాజుపేట సమీపంలోని కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్దకు వస్తున్నారని తెలుసుకుని పరిసర ప్రాంతాల రైతులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాలువ పొడవునా జగన్కు జేజేలు పలికారు. పలమనేరు, కుప్పం నియోజక వర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనంతో శాంతిపురం మండలం గుండశెట్టిపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ ప్రాంతం నిండిపోయింది. సీఎం వైఎస్ జగన్ హెలిపాడ్ నుంచి బస్సులో కూర్చొని దారిపొడవునా జనానాకి అభివాదం చేస్తూ బహిరంగ సభ ప్రాంగణానికి వచ్చారు. జగన్కు దారిపొడవునా పూలు చల్లుతూ జనం ఘనంగా స్వాగతం పలికారు. నృత్యాలు చేస్తూ.. ఈలలేస్తూ, చప్పట్లు కొడుతూ.. వైఎస్ జగన్ ఫ్లెక్సీలు చేత పట్టుకుని జై జగన్ అంటూ నినాదాలు చేశారు. 35 ఏళ్లుగా చంద్రబాబు కుప్పం ప్రజల ఓట్లతో గెలుస్తూ.. కుప్పం ప్రజలకు చేస్తున్న అన్యాయం, మోసం గురించి సీఎం జగన్ వివరిస్తున్న సమయంలో జనం పెద్ద ఎత్తున ఈలలు వేస్తూ.. నిజమే.. నిజమే.. అని అరస్తూ కనిపించారు. 2022 సెప్టెంబర్ 23న కుప్పంకు వచ్చిన సమయంలో తాను ఇచ్చిన మాట ప్రకారం కృష్ణా జలాలను తీసుకొచ్చానని చెప్పటంతో ‘మళ్లీ సీఎం మీరే’ అంటూ హర్షం వ్యక్తం చేశారు. మరో మూడు రిజర్వాయర్లు నిర్మించేందుకు పరిపాలన అనుమతులు ఇస్తున్నట్లు ప్రకటించటం పట్ల, చంద్రబాబు 35 ఏళ్లుగా చేయలేని కుప్పం రెవెన్యూ డివిజన్, మున్సిపాలిటీ, డీఎస్పీ డివిజన్ ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించిన సమయంలో జనం మరింత బిగ్గరగా కృతజ్ఞతలు తెలిపారు. నమ్మలేక పోతున్నాం మా గ్రామాల మీదుగా కృష్ణా జలాలు ప్రవహిస్తాయని ఇప్పటి వరకు ఊహించలేదు. నీటి ప్రవాహన్ని చూస్తుంటే నమ్మలేక పోతున్నాం. హంద్రీ–నీవా కాలువలో నీళ్లు చూస్తుంటే చెప్పలేని ఆనందం కలుగుతోంది. కరువు కాటకాలతో ‡బతుకుతున్న మా జీవితాల్లో సీఎం జగన్మోహన్రెడ్డి వెలుగులు నింపారు. జగనన్న రుణం ఎన్ని జన్మలెత్తిన్నా తీర్చుకోలేనిది. తాగడానికి నీళ్లతో పాటు వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు బతుకు కల్పించారు. – చంద్రశేఖర్, పెద్దబళ్దార్, రామకుప్పం మండలం వైఎస్సార్సీపీని గెలిపిస్తాం రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తున్న జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం. ప్రతిపక్ష నేత నియోజకవర్గమైనా రూ.250 కోట్లతో కాలువ పనులు పూర్తిచేసి కుప్పం ప్రజలకు నీళ్లు ఇచ్చిన దేవుడు జగన్. సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదుగుదలకు సహాయం చేస్తున్నారు. ఇలాంటి మంచి నాయకుడిని మళ్లీ సీఎం చేసుకోవడం అందరి బాధ్యత. భరత్ను గెలిపించుకుంటాం. – సుబ్రమణ్యం, రామకుప్పం మండలం రుణం తీర్చుకుంటాం 40 ఏళ్ల మా కలను నెరవేర్చిన మ్యుమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రుణం తీర్చుకునేందుకు కుప్పం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మేము చిన్నప్పటి నుంచి ఈ నీళ్ల కోసం ఎదురు చూస్తున్నాం. ఇన్నాళ్లకు మా కోరిక నెరవేరింది. మంచి చేసిన వారిని ఆదరించడమే కుప్పం ప్రజలకు తెలుసు. తాగు, సాగునీటి సమస్య తీర్చిన సీఎం జగన్ను మరవలేం. – గురుస్వామి, వెదురుగుట్టపల్లి, శాంతిపురం మండలం -
సీఎం జగన్ కుప్పం బహిరంగ సభ డ్రోన్ విజువల్స్
-
ఇక్కడ ఏమీ చేయని బాబు.. ఎమ్మెల్యేగా అర్హుడేనా?
-
కుప్పం ప్రజలకు తాగు, సాగునీటి కష్టాలు లేకుండా చూడాలన్నదే సీఎం జగన్ లక్ష్యం
-
సీమను తిట్టే బాబు కావాలా? కుప్పంలో సీఎం జగన్ పంచులు
సాక్షి, కుప్పం/శాంతిపురం: కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది మీ బిడ్డ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కుప్పానికి 35ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ఏం చేశాడని సీఎం జగన్ ప్రశ్నించారు. ప్రజల గురించి, పేద వాడి గురించి ఆలోచన చేసే మీ బిడ్డ మార్క్ రాజకీయం కావాలా? లేక మోసం చేసే చంద్రబాబు కావాలా? అని ముఖ్యమంత్రి జగన్ కుప్పం ప్రజలను అడిగారు. సీఎం జగన్ పంచ్ కామెంట్స్.. కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది మీ జగన్ కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్ చంద్రబాబును ఇంతకాలం భరించిన కుప్పం ప్రజల సహనానికి జోహార్లు. చిత్తూరు పాల డెయిరీని పున:ప్రారంభించింది మీ జగన్. కుప్పం ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూశాం. ►చంద్రబాబుకు నా మీద కోపం వచ్చినప్పుడల్లా కొన్ని మాటలు వస్తుంటాయి. పులివెందులను, కడపను తిడతాడు. చివరికి రాయలసీమను కూడా తిడుతూ ఉంటాడు. కానీ, అందుకు భిన్నంగా మీ జగన్ ఏనాడూ కూడా ఇక్కడి ప్రజల్ని గానీ, కుప్పం నియోజకవర్గాన్ని కానీ ఒక్క మాట అనలేదు. పైగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని మంచి చేస్తున్నది మీ బిడ్డ. ►చంద్రబాబు ఎంత అన్యాయస్తుడంటే ఇచ్చే అరకొర సొమ్ముకూడా తన నియోజకవర్గంలో కూడా తనవారు, తనకు కాని వారు అని ఎలా విభజించాడో నేను చెప్పిన ప్రతి పథకంలో పెరిగిన లబ్ధిదారులను చూస్తే అందరికీ అర్థం అవుతుంది. ఈ పెద్దమనిషి బీసీలు ఎక్కువగా ఉన్న ఇక్కడ, తన ధనబలం చూపిస్తూ ఈ నియోజకవర్గానికి వచ్చి బీసీల సీటు కబ్జా చేసి 35 ఏళ్లుగా రాజ్యం ఏలుతున్నాడు. ►కనీసం ఇక్కడ సొంత ఇళ్లు అయినా కట్టుకున్నాడా? ఆయన ఎమ్మెల్యేగా గెలవడం కోసం మీతో పని కావాలి. కానీ ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని ఆలోచన కూడా ఏరోజూ రాలేదంటే ఈ మనిషి మీ మీద చూపిస్తున్న ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకోవాలి. ►సొంత నియోజకవర్గానికే మంచి చేయని ఈ మనిషి 75 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మరో నలుగురితో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి దిగుతున్నాడు. పొత్తులెందుకు అని అడిగితే మాట్లాడడు. మీ పేరు చెబితే ఒక్క మంచి పని అయినా ఉందా? ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడిగితే మాట్లాడడు. ఏ గ్రామం మధ్య అయినా నిలబడి ఈ గ్రామంలో నా మార్క్ ఫలానా మంచి చేశాను అని చెప్పగలడా అంటే అదీ మాట్లాడడు. ►ప్రజల గురించి, పేద వాడి గురించి ఆలోచన చేసే మీ బిడ్డ మార్క్ రాజకీయం కావాలా? లేకపోతే ఎన్నికల్లో మిమ్మల్ని ఉపయోగించుకొని తర్వాత గాలికి వదిలేసే రాజకీయం చంద్రబాబు చేస్తున్నది కావాలా? ►14 సంవత్సరాలు తాను చేసింది ఏంటంటే ఒక పెద్ద సున్నా కనిపిస్తుంది. ఎన్నికలు వచ్చే సరికే ప్రజల్ని వెన్నుపోటు పొడవడం కోసం, మోసం చేయడం కోసం రంగులతో మేనిఫెస్టో తెస్తాడు. ప్రతీ ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు కొనిస్తానంటాడు. కేవలం అవసరానికి వాడుకుని వదిలేసే చంద్రబాబు ఎందుకు?’ అని వ్యాఖ్యలు చేశారు.
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
రిజిస్ట్రేషన్ల జోరు
ముంపు ప్రాంతాలపై అప్రమత్తంగా ఉండాలి
కౌంటింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
యూనిఫాం స్టిచింగ్ వేగవంతం చేయాలి
ఇరిగేషన్ ఎస్ఈ ఎవరు?
జీపీని తనిఖీ చేసిన డీపీఓ
పెట్టుబడి తగ్గి.. దిగుబడి పెరిగి
మార్పుతో మంచి ఫలితాలు..
పెదనందిపాడులో నాట్స్ మెగా కంటి ఉచిత వైద్య శిబిరం!
బ్రిజ్భూషణ్ కుమారుడు కరణ్ కాన్వాయ్ బీభత్సం.. ఇద్దరు మృతి
తప్పక చదవండి
- అదుపుతప్పి లోయలో పడిన బస్సు.. 28 మంది మృతి
- నీటి వృథాపై ఢిల్లీ జల్బోర్డు కీలక నిర్ణయం
- నీటి వృథాపై ఢిల్లీ జల్బోర్డు కీలక నిర్ణయం
- సుధీర్ బాబు సినిమా.. మిస్డ్ కాల్తో ఐఫోన్, జీప్ గెలుచుకోండి
- అమీర్ ఖాన్ కుమారుడి ఫస్ట్ సినిమా.. నేరుగా ఓటీటీలోనే విడుదల
- T20 World Cup 2024: సూపర్-8లో టీమిండియా ప్రత్యర్థులు వీరే..!
- 16కు తగ్గదు.. 30కి పెరగదు.. ఏసీతో ఎందుకలా?
- పెరుగుతున్న బంగారం ధరలు.. రూ.లక్ష మార్కు చేరిన వెండి
- కేజ్రీవాల్కు బిగ్ షాక్
- చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో నిందితులుగా పేరెంట్స్!
Advertisement