
చిత్తూరు జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో బ్లడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ భరత్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగానికి తెరలేపిన కూటమి ప్రభుత్వం.. కుప్పంలో మాత్రం బ్లడ్ బుక్ రాజ్యాంగంతో మరింత అరాచకం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై వైఎస్సార్ సీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన ర్యాలీకి వేలాదిగా ప్రజలు తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారని స్పష్టం చేశారు.
‘ కుప్పంలో 32 మందిపై తప్పుడు కేసులు పెట్టారు. చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. పోలీసులు ఒత్తిడి చేసి మరీ వేధింపులు పర్వం కొనసాగిస్తున్నారు. కుప్పంలో మేం ప్రశాంతంగా నిరసన ర్యాలీ చేపట్టాం. మేము పోలీసులపై దాడి చేసినట్లు తప్పుడు కేసులు పెడుతున్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేసే వరకూ ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం’అని ఎమ్మెల్సీ భరత్ స్పష్టం చేశారు.