Independence Day celebrations
-
మారిషస్ స్వాతంత్య్ర వేడుకలకు ప్రధాని మోదీ
పోర్ట్ లూయిస్/న్యూఢిల్లీ: మార్చి 12వ తేదీన జరిగే మారిషస్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. మారిషస్ ప్రధానమంత్రి రాం గులామ్ శుక్రవారం జాతీయ అసెంబ్లీలో ఈ విషయం ప్రకటించారు. ద్వైపాక్షిక సన్నిహిత సంబంధాలకిది నిదర్శనమన్నారు. ‘నా ఆహ్వానం మేరకు మన దేశ 57వ స్వాతంత్య్ర దినం సందర్భంగా జరిగే జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సహృదయంతో అంగీకరించారని తెలిపేందుకు ఎంతో సంతోషిస్తున్నాను’అని ఆయన తెలిపారు. ఇటీవలే ఫ్రాన్స్, అమెరికాల్లో పర్యటనలు ముగించుకుని వచ్చిన మోదీ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తన ఆహా్వనాన్ని మన్నించారన్నారు. -
గోల్కొండ కోటపై ఘనంగా పంద్రాగష్టు పండుగ (ఫొటోలు)
-
...అలా పంచుకున్నారు!
1947. బ్రిటిష్ వలస పాలన నుంచి మనకు విముక్తి లభించిన ఏడాది. అఖండ భారతదేశం రెండుగా చీలిన ఏడాది కూడా. ఒక రాష్ట్ర విభజన జరిగితేనే ఆస్తులు, అప్పులు తదితరాల పంపకం ఓ పట్టాన తేలదు. అలాంటి దేశ విభజన అంటే మాటలా? అది కూడా అత్యంత ద్వేషపూరిత వాతావరణంలో జరిగిన భారత్, పాకిస్తాన్ విభజన గురించైతే ఇక చెప్పేదేముంటుంది! ఆస్తులు, అప్పులు మొదలుకుని సైన్యం, సాంస్కృతిక సంపద దాకా అన్నీ రెండు దేశాల మధ్యా సజావుగా పంపకమయ్యేలా చూసేందుకు నాటి పెద్దలంతా కలిసి భారీ యజ్ఞమే చేయాల్సి వచి్చంది. రేపు దేశమంతా 78వ స్వాతంత్య్ర దిన వేడుకలు జరుపుకోనున్న నేపథ్యంలో దేశ విభజన జరిగిన తీరుతెన్నులపై ఫోకస్... ముందుగానే కమిటీ విభజన సజావుగా సాగేలా చూసేందుకు స్వాతంత్య్రానికి ముందే 1947 జూన్ 16న ‘పంజాబ్ పారి్టషన్ కమిటీ’ ఏర్పాటైంది. తర్వాత దీన్ని విభజన మండలి (పారి్టషన్ కౌన్సిల్)గా మార్చారు. ఆస్తులు, అప్పులతో పాటు సైన్యం, ఉన్నతాధికారులు మొదలుకుని కార్యాలయ సామగ్రి, ఫరి్నచర్ దాకా అన్నింటినీ సజావుగా పంచడం దీని బాధ్యత. కమిటీలో భారత్ తరఫున కాంగ్రెస్ నేతలు సర్దార్ వల్లబ్బాయ్ పటేల్, బాబూ రాజేంద్రప్రసాద్; పాక్ తరఫున ఆలిండియా ముస్లిం లీగ్ నేతలు మహ్మదాలీ జిన్నా, లియాకత్ అలీ ఖాన్ ఉన్నారు. ఇంతటి బృహత్కార్యాన్ని కేవలం 70 రోజుల్లో ముగించాల్సిన గురుతర బాధ్యత కమిటీ భుజస్కంధాలపై పడింది! హాస్యాస్పదంగా భౌగోళిక విభజన! దేశ విభజనలో తొట్టతొలుత తెరపైకొచి్చన అంశం భౌగోళిక విభజన. ఈ బాధ్యతను బ్రిటిష్ న్యాయవాది సర్ సిరిల్ రాడ్క్లిఫ్కు అప్పగించారు. ఆ మహానుభావుడు హడావుడిగా కేవలం నాలుగే వారాల్లో పని ముగించానని అనిపించాడట. బ్రిటిష్ ఇండియా మ్యాప్ను ముందు పెట్టుకుని, తనకు తోచినట్టుగా గీత గీసి ‘ఇదే సరిహద్దు రేఖ’ అని నిర్ధారించినట్టు చెబుతారు. దాన్నే రాడ్క్లిఫ్ రేఖగా పిలుస్తారు. ముస్లిం సిపాయిలే కావాలన్న పాక్...కమిటీ ఎదుర్కొన్న అతి పెద్ద సవాళ్లలో సాయుధ బలగాల పంపిణీ ఒకటి. చర్చోపచర్చల తర్వాత దాదాపు మూడింట రెండొంతుల సైన్యం భారత్కు, ఒక వంతు పాక్కు చెందాలని నిర్ణయించారు. ఆ లెక్కన 2.6 లక్షల బలగాలు భారత్కు దక్కాయి. పాక్కు వెళ్లిన 1.4 లక్షల మంది సైనికుల్లో అత్యధికులు ముస్లింలే ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. తమ వంతుకు వచి్చన కొద్ది మంది హిందూ సైనికులను కూడా పాక్ వీలైనంత వరకూ వెనక్కిచ్చి బదులుగా ముస్లిం సిపాయిలనే తీసుకుంది. సైనిక పంపకాలను పర్యవేక్షించిన బ్రిటిష్ సైనికాధికారుల్లో జనరల్ సర్ రాబర్ట్ లాక్హార్ట్ భారత్కు, జనరల్ సర్ ఫ్రాంక్ మెసెర్వీ పాక్కు తొలిసైన్యాధ్యక్షులయ్యారు!...బగ్గీ భారత్కే! భారత్, పాక్ మధ్య పురాతన వస్తువులు, కళాఖండాల పంపకం ఓ పట్టాన తేలలేదు. మరీ ముఖ్యంగా బంగారు తాపడంతో కూడిన వైస్రాయ్ అందాల గుర్రపు బగ్గీ తమకే కావాలని ఇరు దేశాలూ పట్టుబట్టాయి. దాంతో చివరికేం చేశారో తెలుసా? టాస్ వేశారు! అందులో భారత్ నెగ్గి బగ్గీని అట్టిపెట్టుకుంది!80:20 నిష్పత్తిలో చరాస్తులు ఆఫీస్ ఫర్నిచర్, స్టేషనరీ వంటి చరాస్తులన్నింటినీ భారత్, పాక్ మధ్య 80:20 నిష్పత్తిలో పంచారు. చివరికి ఇదే నిష్పత్తిలో కరెంటు బల్బులను కూడా వదలకుండా పంచుకున్నారు! ఆస్తులు, అప్పులు ఆస్తులు, అప్పుల పంపకంపై కమిటీ తీవ్రంగా మల్లగుల్లాలు పడింది. చివరికి బ్రిటిíÙండియా తాలూకు ఆస్తులు, అప్పుల్లో 17.5 శాతం పాక్కు చెందాలని తేల్చారు. దీనికి తోడు అదనంగా కొంత నగదు చెల్లించాల్సిందేనంటూ పాక్ భీషి్మంచుకుంది. అందుకు పటేల్ ససేమిరా అన్నారు. కశీ్మర్ పూర్తిగా భారత్కే చెందుతుందంటూ ఒప్పందంపై సంతకం చేస్తేనే నగదు సంగతి చూస్తామని కుండబద్దలు కొట్టారు. కానీ గాంధీ మాత్రం ఒప్పందం మేరకు పాక్కు డబ్బు చెల్లించాల్సిందేనంటూ ఏకంగా నిరాహార దీక్షకు దిగారు. దాంతో పటేల్ వద్దని మొత్తుకుంటున్నా 1947 జనవరి 20వ తేదీనే నెహ్రూ తాత్కాలిక సర్కారు పాక్కు రూ.20 కోట్లు చెల్లించింది. కానీ కశీ్మర్పై పాక్ దురాక్రమణ నేపథ్యంలో మరో రూ.75 కోట్ల చెల్లింపును నిలిపేసింది.ఇప్పటికీ ఒకరికొకరు బాకీనే! అప్పటికి చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లు, నాణేలు 1948 మార్చి 31 దాకా ఇరు దేశాల్లోనూ చెల్లేలా ఒప్పందం జరిగింది. కానీ ఐదేళ్ల దాకా రెండు కరెన్సీలూ అక్కడా, ఇక్కడా చెలామణీ అవుతూ వచ్చాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నగదు పంపకాల గోల ఇప్పటికీ తేలలేదు! రూ.300 కోట్ల ‘విభజన ముందటి మొత్తం’ పాక్ బాకీ ఉందని భారత్ అంటోంది. 2022–23 కేంద్ర ఆర్థిక సర్వేలో కూడా ఈ మొత్తాన్ని పేర్కొనడం విశేషం. కానీ భారతే తనకు రూ.560 కోట్లు బాకీ అన్నది పాక్ వాదన!జోయ్మొనీ, ద ఎలిఫెంట్! జంతువులను కూడా రెండు దేశాలూ పంచేసుకున్నాయి. ఈ క్రమంలో జోయ్మొనీ అనే ఏనుగు పంపకం ప్రహసనాన్ని తలపించింది. దాన్ని పాక్కు (తూర్పు బెంగాల్కు, అంటే నేటి బంగ్లాదేశ్కు) ఇచ్చేయాలని నిర్ణయం జరిగింది. దాని విలువ ఓ రైలు బోగీతో సమానమని లెక్కగట్టారు. అలా ఓ రైలు బోగీ భారత్కు దక్కాలన్నది ఒప్పందం. కానీ విభజన వేళ జోయ్మొనీ మాల్డాలో ఉండిపోయింది. ఆ ప్రాంతం భారత్ (పశి్చమబెంగాల్) వాటాకు వచ్చింది. దాంతో అది భారత్కే మిగిలిపోయింది.కొసమెరుపుభారత్, పాక్ విభజన ‘పగిలిన గుడ్లను తిరిగి అతికించడ’మంత అసాధ్యమంటూ అప్పట్లో ఓ ప్రఖ్యాత కాలమిస్టు పెదవి విరిచారు. అంతటి అసాధ్య కార్యం ఎట్టకేలకు సుసాధ్యమైంది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
9 నుంచి 15 వరకు ‘హర్ ఘర్ తిరంగా’
సాక్షి, న్యూఢిల్లీ: ‘హర్ ఘర్ తిరంగా’ప్రచారంలో భాగంగా ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు ప్రతీ ఒక్కరూ తమ ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతేగాక ప్రజలు త్రివర్ణ పతాకంతో దిగిన సెలీ్ఫలను ‘హర్ ఘర్ తిరంగా’వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని శనివారం ఆయన ‘ఎక్స్’లో కోరారు. ప్రధాని మోదీ ప్రారంభించిన హర్ ఘర్ తిరంగా ప్రచారం రెండేళ్లలో జాతీయ ఉద్యమంగా మారిందని అమిత్ షా పేర్కొన్నారు. -
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి ఆదిమూలపు సురేష్
-
హైదరాబాద్ బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో వేడుకలు
-
CM Jagan: గౌరవం చేతల్లోనూ..
సాక్షి, కృష్ణా: ఎదుటివారిని వాళ్ల వాళ్ల అర్హతను బట్టి గౌరవించడం, ప్రేమించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్న ప్రత్యేకత. మాటల్లోనే కాదు.. ఒక్కోసారి చేతల్లోనూ అది చూపిస్తుంటారాయన. అందుకోసం తన స్థాయిని పక్కనపెట్టి మరీ ఆయన ఓ మెట్టు కిందకు దిగుతుంటారు కూడా. తాజాగా.. మంగళవారం ఉదయం విజయవాడలో జరిగిన 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆసక్తికర దృశ్యం ఒకటి చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ పలువురు పోలీసు సిబ్బందికి పోలీస్ మెడల్స్ ప్రదానం చేశారు. ఈ క్రమంలో ఓ పోలీస్ అధికారికి మెడల్ కిందపడిపోయింది. అది గమనించకుండా ఆయన వెళ్లిపోసాగాడు. అయితే.. సీఎం జగన్ అది గమనించి ఆయన్ని ఆపారు. కిందకు దిగి ఆపి మరీ ఆ పోలీసుకు మెడల్ను తీసి మళ్లీ ఆ అధికారి గుండెలకు అంటించారు. ప్రస్తుతం ఈ వీడియో జగనన్న అభిమానుల నుంచి విపరీతంగా వైరల్ అవుతోంది. -
‘దేశభక్తి కలిగిన పార్టీ వైఎస్సార్సీపీ’
సాక్షి, గుంటూరు: దేశ సరిహద్దుల్లో సైనికులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని, దేశంలోని ప్రతి పౌరుడూ సైనికుల్లా దేశభక్తి కలిగి ఉండాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఎగరేశారాయన. అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ప్రతి రాజకీయ పార్టీ కూడా దేశభక్తితో ఉండాలన్నారు. కానీ, దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు కుయుక్తులు, కుతంత్రాలతో పనిచేస్తున్నాయన్నారు. అయితే దేశభక్తి కలిగిన పార్టీ వైఎస్సార్సీపీ అని, దేశ సమగ్రత, సౌరభౌమత్వాన్ని సీఎం జగన్ కాపాడుతున్నారు. దేశ సమగ్రతకు సంబంధించిన అంశాల్లో ఇటు అసెంబ్లీలోనైనా, పార్లమెంటులోనైనా వైఎస్సార్సీపీ ముందు ఉంటుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. చదవండి: పేదలు గెలిచి, వారి బతుకులు బాగుపడే వరకూ యుద్ధం: సీఎం జగన్ -
నేడు జెండా ఎగరేస్తాం! జనవరి 26న ఆవిష్కరిస్తాం! ఏంటీ తేడా అంటే..
నేడు జెండా ఎగరేయడానికి జనవరి 26 నాడు జెండా ఆవిష్కరించడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకిలా? ఈ రోజు ప్రధాని న్యూఢిల్లీలో ఎర్రకోట వద్ద జెండా ఎగరేస్తే..జనవరి 26న మాత్రం రాష్ట్రపతి జెండా ఆవిష్కరిస్తారు. నేడు జెండా ఎగరేసాం అంటాం. మరీ గణతంత్ర దినోత్సవం రోజున మాత్రం జెండా ఆవిష్కరిస్తున్నాం అని అంటాం ఎందుకని? వాటి మధ్య ఉన్న తేడా ఏంటంటే.. ఆగస్టు 15, 1947న స్వేచ్ఛావాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది. అందుకే, ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు... అలాగే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలులోకి రావడంతో.. ప్రతి ఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం.ఈ రోజున దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. అయితే ఆగస్టు 15న జెండా ఎగరవేయడానికి.. జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది. ఆ తేడా ఏంటంటే.. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఆగస్ట్ 15 రోజున, జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు మాత్రం రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు... కాబట్టి దీన్ని జెండా ఆవిష్కరించడం అంటున్నాం. దీని అర్థం ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేయడం. అంతేగాదు ఈ రెండు తేదీలలో జెండాను రెపరెపలాడిస్తారు. ( గమనిక: ఇక్కడ జనవరి 26 నాడు జెండాను ముందుగానే కర్ర/పోల్ కి పైన కట్టి ఉంచుతాము కనుక ఆగస్ట్ 15 లాగా జెండాను కింది నుండి పైకి లాగము అనేది గమనించాలి ). నేడు ప్రధాని.. ఆ రోజు రాష్ట్రపతి చేయడానికి ప్రధాన కారణం దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవం రోజున జండా ఎగురవేయడానికి.. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది. స్వాతంత్య్రం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు. అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సిన వ్యత్యాసం ఏమిటంటే.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు(Flag Hoisting). గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు(Flag Unfurling). (చదవండి: అక్కడ మాత్రం అర్థరాత్రే.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు) -
అమెరికా, చైనా తర్వాత భారతదేశమే: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి త్రివిధ దళాధిపతులు, క్యాబినెట్ మంత్రులు, రాజకీయ నాయకులు, అధికారులతో పాటు వివిధ రంగాలకు చెందిన ముఖ్య అతిధులు హాజరయ్యారు. వరుసగా పదోసారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమం ప్రారంభానికి ముందు రాజ్ ఘాట్ వద్ద స్వాతంత్య్ర సమరయోధలకు నివాళులు అర్పించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న స్వాతంత్య్ర వేడుకల కావడంతో జాతినుద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగంలో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. #WATCH | PM Narendra Modi says, "...I firmly believe that when the country will celebrate 100 years of freedom in 2047, the country would be a developed India. I say this on the basis of the capability of my country and available resources...But the need of the hour is to fight… pic.twitter.com/IbODcqlW6b — ANI (@ANI) August 15, 2023 దేశ ప్రజలందరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మొదటగా మణిపూర్ అంశాన్ని ప్రస్తావిస్తూ దేశం మణిపూర్ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. ఈశాన్య రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడిప్పుడే మణిపూర్లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ దేశం స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగం చేశారు. వారందరి త్యాగఫలమే ఈ స్వాతంత్య్రం. ఈ సందర్బంగా ప్రపంచ దేశాలు భారత దేశం వైపు చూస్తున్నాయని గడిచిన పదేళ్లలో భారత్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. #WATCH | PM Modi speaks on dynastic politics during his Independence Day speech "Today, 'parivarvaad' and appeasement has destroyed our country. How can a political party have only one family in charge? For them their life mantra is- party of the family, by the family and for… pic.twitter.com/xxmumTCc4Z — ANI (@ANI) August 15, 2023 ఈ పదేళ్లలో భారత దేశ గొప్పతనాన్ని ప్రపంచం గుర్తిస్తోంది. శాటిలైట్ రంగంలో దూసుకుపోతున్నాం, రాబోయే కాలాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ శాసిస్తోంది. 30 ఏళ్ల లోపు యువతే భారత్కు దిశానిర్దేశం చేయాలి. సాంకేతికంగానే కాదు వ్యవసాయ రంగంలోనూ దేశం చాలా అభివృద్ధి చెందుతోందని అన్నారు. నారీ శక్తి, యువశక్తి భారత్కు బలమని భారత్లో యువశక్తి ఎంతో అద్భుతంగా ఉందని అన్నారు. డెమోగ్రఫీ, డెమోక్రసీ, బయోడైవర్సిటీ ఈ మూడు అంశాలు భారత దేశానికి ఎంతో ముఖ్యమైనవి. టెక్నాలజీ విషయంలో భారత్ ఎంతో మెరుగుపడి డిజిటల్ ఇండియా దిశగా భారత్ దూసుకెళ్తోన్నట్లు తెలిపారు. క్రీడా రంగంలో సైతం యువత ప్రపంచ పాఠం మీద తన సత్తా చాటుతోంది. అలాగే సాంకేతికంగా స్టార్టప్స్ రంగంలో భారత్ టాప్-3లో ఉంది. ఇక ఈ ఏడాది జరగబోయే ప్రతిష్టాత్మక జీ-20 సమావేశానికి ఆతిధ్యమిచే అరుదైన అవకాశం భారత్కు లభించిందని అన్నారు. #WATCH | PM Narendra Modi says, "In 2019, on the basis of performance, you blessed me once again...The next five years are for unprecedented development. The biggest golden moment to realise the dream of 2047 is the coming five years. The next time, on 15th August, from this Red… pic.twitter.com/PtwL73Sahg — ANI (@ANI) August 15, 2023 కేవలం అవినీతి రాక్షసి వలననే దేశం వెనక్కు వెళ్లిందని అందుకే ప్రజలు సుస్థిరమైన అవినీతిరహిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. పేద, మధ్య తరగతి వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందని.. పీఎం సహాయనిధి పథకం ద్వారా 50 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. సైన్యంలో వన్ ర్యాంక్-వన్ పెన్షన్ అమలు చేస్తూ ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తున్నామని దేశ ఆర్థిక వ్యవస్త బాగుంటేనే దేశం బాగుంటుందని రూ. 4 లక్షల కోట్లతో పేదలకు ఇళ్లు నిర్మించామని రూ. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చినట్లు తెలిపారు. #WATCH | ..."Chalta chalata kaal chakra, Amrit kaal ka bhaal chakra, sabke sapne apne sapne, panpe sapne saare, dheer chale veer chale, chale yuva humare, neeti sahi reeti naayi, gati sahi raah nayi, chuno chunauti seena taan, jag mein badhao desh ka naam..." PM Modi on 77th… pic.twitter.com/o6KUmBe0Mt — ANI (@ANI) August 15, 2023 కరోనా లాంటి అక్షిత సమయంలో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందని అన్నారు. కరోనా మనకు ఎన్నో పాఠాలను నేర్పింది. కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచానికి భారత దేశం దిక్సూచిగా మారింది. కరోనా సమయంలో ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొని ముందుకెళ్లాం ప్రపంచాన్ని మార్చడంలో భారత్ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తోందని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే భారత్ బలమని ప్రతి నిర్ణయంలో దేశ ప్రగతికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. దేశంలో సుస్థిరమైన, శక్తివంతమైన ప్రభుత్వం ఉంది. గత పదేళ్లలో ఎన్నో కీలక సంస్కరణలు తీసుకురావడంతో అన్ని రంగాల్లో దేశం ముందుకు వెళ్తోందన్నారు. ఇక వైద్య రంగానికి వస్తే జన ఔషధితో ప్రజలందరికీ చౌకగా మందులు అందజేస్తున్నామని, అందుకు వీలుగా జన ఔషధి కేంద్రాల సంఖ్య 10 వేల నుంచి 25 వేలకు పెంచామన్నారు. జన్ధన్ ఖాతాలో పేదల బతుకుల్లో వెలుగులు నింపామని తెలిపారు. #WATCH | ..."Chalta chalata kaal chakra, Amrit kaal ka bhaal chakra, sabke sapne apne sapne, panpe sapne saare, dheer chale veer chale, chale yuva humare, neeti sahi reeti naayi, gati sahi raah nayi, chuno chunauti seena taan, jag mein badhao desh ka naam..." PM Modi on 77th… pic.twitter.com/o6KUmBe0Mt — ANI (@ANI) August 15, 2023 మారుమూల గ్రామాలకు విద్యుత్ సదుపాయం కల్పించామన్నారు. దేశ ప్రజలందరికీ ఇంటర్నెట్ను అందుబాలోకి తీసుకువచ్చామని వచ్చే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ఆర్థిక వ్యవస్థలో అమెరికా, చైనా తర్వాత భారత దేశమే ఉంటుందని భారత్ అభివృద్ధిపై నాకు పూర్తి విశ్వాసం ఉందని చెబుతూ ప్రసంగాన్ని ముగించారు. ఇది కూడా చదవండి: అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ -
న్యూజెర్సీలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!
అమెరికాలోని న్యూజెర్సీలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇండియన్ బిజినెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇండియా డే పరేడ్ నిర్వహించారు. ఓక్ ట్రీ రోడ్ లోని ఎడిసన్ టు ఇసేలిన్ ఏరియాలో ఇండియా డే పరేడ్ వైభవంగా కొనసాగింది. ఈ వేడుకలకు గ్రాండ్ మార్షల్గా ప్రముఖ నటి మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హాజరయ్యారు. తమన్నా ఇటువంటి పరేడ్ కార్యక్రమంలో పాల్గొనడం తొలిసారి కావడం విశేషం. ఇక న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీతో పాటు పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై.. శుభాకాంక్షలు తెలిపారు. ఇండియా పరేడ్ డే కార్యక్రమంలో భాగంగా అమెరికాలోని ప్రవాస భారతీయులంతా న్యూజెర్సీలోని ఓక్ ట్రీ రోడ్ కు చేరుకున్నారు. మువ్వన్నెల జెండాను చేతబూని వందేమాతరం, భారతమాతకి జై అంటూ నినాదాలు చేశారు. పలువురు చిన్నారులు భారతమాత వేషాధరణలో.. స్వాత్రంత్య యోధుల గెటప్పులలో ఆకట్టుకున్నారు. ఒకరికొకరు స్వాత్రంత్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పరేడ్ లో భాగంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పలు శకటాలను ప్రదర్శించారు. భారీ జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఇక న్యూజెర్సీ ప్రాంతం మినీ ఇండియాగా మారిందా అనేలా అక్కడి వాతావరణం కనిపించింది. న్యూజెర్సీలోని ఓక్ ట్రీ రోడ్ లో జరిగిన ఇండియా డే పరేడ్ కార్యక్రమం విజయవంతం అవటం పట్ల నిర్వహకులతో పాటు ప్రవాసులు హర్షం వ్యక్తం చేశారు. (చదవండి: -
రూ.99,999 వరకు రుణమాఫీ క్లియర్
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇచ్చిన హామీ మేరకు రూ.99,999 లోపు ఉన్న పంట రుణాలన్నింటినీ మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సదరు రైతుల రుణాలున్న బ్యాంకుల్లో తక్షణమే సొమ్ము జమ చేయాలని సీఎం కేసీఆర్ సోమవారం ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ సోమవారం రూ.5,809.78 కోట్ల విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక ఇబ్బందులతో జాప్యమైనా.. 2018 ఎన్నికల సమయంలో రైతులకు రూ.లక్ష వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే విడతల వారీగా రుణమాఫీ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే దీని అమల్లో జాప్యం జరిగింది. కరోనా మహమ్మారి విజృంభణ, లాక్డౌన్లతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం, పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో దేశవ్యాప్తంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దిగజారి రుణమాఫీ ప్రక్రియ ఆలస్యమవుతోందని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఇటీవల ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన నేపథ్యంలో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ ప్రక్రియ మొదలుపెడుతున్నట్టు చెప్పారు. 45 రోజుల కార్యాచరణతో ఆగస్టు 2న సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించి రుణమాఫీ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. వెంటనే ఆర్థిక మంత్రి హరీశ్రావు, ఆ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేసి.. 45 రోజుల కార్యాచరణ రూపొందించారు. సెపె్టంబర్ 15వ తేదీ నాటికి మొత్తం రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించారు. అయితే ఇంతకు ముందే తొలి విడతగా 5,42,609 మంది రైతులకు సంబంధించి రూ.1,207.37 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో రెండో విడతగా.. ఆగస్టు 3, 4, 11 తేదీల్లో కలిపి 1,76,878 మంది రైతులకు సంబంధించి రూ. 736.27 కోట్లను బ్యాంకుల్లో జమ చేసింది. తాజాగా 9,02,843 మంది రైతులకు సంబంధించి రూ.99,999 వరకు ఉన్న రుణాలను మాఫీ చేశారు. మొత్తంగా ఇప్పటివరకు 16,66,899 మంది రైతుల రుణాలకు సంబంధించి రూ.7,753.43 కోట్లను విడుదల చేశారు. రాష్ట్రంలో రైతు రాజ్యం తెలంగాణ రాష్ట్రం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని రుణమాఫీతో మరోసారి రుజువైందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 2014లోనూ రైతుల రుణమాఫీ చేశామని, 35,32,000 మంది రైతులకు లబ్ధి చేకూరిందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సాగునీటి వసతుల కల్పనలో భాగంగా.. మిషన్ కాకతీయ కింద 35వేల చెరువుల పునరుద్ధరణ, కాళేశ్వరం వంటి బహుళార్థ సాధక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని వివరించారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడం, నకిలీ విత్తనాల తయారీ, సరఫరాదారులపై పీడీ చట్టం ప్రయోగించి జైళ్లకు పంపడం, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడం, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం వంటివాటితో రైతులకు ప్రభుత్వం అండగా నిలిచిందని తెలిపారు. రుణమాఫీకి సంబంధించి సీఎం కేసీఆర్ నిర్ణయం, ఈ సందర్భంగా ఆయన పేర్కొన్న అంశాలతో సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రైతు బంధు, బీమా, ఉచిత విద్యుత్తో.. దుఃఖంతో ఉన్న రైతు కుటుంబాలను ఆదుకోవాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమాను అమలు చేస్తోందని, రైతు ఏ కారణంతో మరణించినా వారి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందుతోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు మరణించిన రైతులకు రూ.5,402.55 కోట్లు పరిహారంగా అందినట్టు వివరించారు. ఇక రాష్ట్రంలో 27.49 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ అందిస్తూ పంటల సాగుకు అండగా నిలిచామని.. గత తొమ్మిదేళ్లలో ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం రూ.96,288 కోట్లను భరించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులకు ‘రైతుబంధు’తో ప్రత్యక్ష ప్రయోజనం కలుగత్తోందని.. ఎకరానికి ఏటా రూ.10వేల చొప్పున.. ఇప్పటివరకు 11 విడతల్లో రూ.71,552 కోట్లను రైతులకు అందించామని తెలిపారు. -
హోం మంత్రి పతకానికి ధనుంజయుడు ఎంపిక
పశ్చిమ గోదావరి: కేంద్ర హోం శాఖ ఏటా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో ఇచ్చే కేంద్ర హోం మంత్రి పతకానికి జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఎం.ధనుంజయుడు ఎంపికయ్యారు. 2023 సంవత్సరానికి అత్యుత్తమ నేరపరిశోధన చేసిన రాష్ట్రానికి చెందిన ఐదురుగు పోలీసు అధికారులు ఈ పతకానికి ఎంపిక కాగా వారిలో ఒకరు ధనుంజయుడు. నేర పరిశోధనల్లో ఉన్నత ప్రమాణాల్ని ప్రోత్సహించడం కోసం 2018 నుంచి పోలీసు అధికారులకు కేంద్ర హోం శాఖ ఈ పతకాలు అందిస్తోంది. 2020లో ప్రకాశం జిల్లా ఒంగోలులో దిశ డీఎస్పీగా ధనుంజయుడు పని చేస్తున్న సమయంలో రెండు కీలకమైన కేసులను చేధించడంలో విశేష కృషిచేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఈ పతకం అందిస్తున్నారు. ఎస్సై నుంచి డీఎస్పీ వరకూ బాపట్ల జిల్లా చీరాల మండలం చీపురుపాలెం ధనుంజయుడి స్వగ్రామం. చీరాలలో బీఎస్సీ డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ పట్టా పొందారు. 1991లో ఎస్సైగా డీటీసీలో శిక్షణ పొందారు. గుంటూరు జోన్ నుంచి ఎంపికై న ఈయన నెల్లూరు జిల్లాలో ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేశారు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి తాలూకా సీతారామపురం పోలీస్స్టేషన్కు ఎస్సైగా నియమితులయ్యారు. ఆ తరువాత ఉదయగిరి, కావలి టూటౌన్, సంగం, ఆత్మకూరు పోలీస్స్టేషన్లలో ఎస్సై పనిచేశారు. నాయుడుపేట పోలీస్స్టేషన్పై దాడి జరగడంతో ఆ సమయంలో ధనుంజయుడిని అక్కడికి పంపారు. ఆ తరువాతి కాలంలో నెల్లూరు త్రీ టౌన్కు బదిలీ అయ్యారు. సీఐగా పదోన్నతి చెంది విజయవాడలో సీఐడీ విభాగంలో ఆరు సంవత్సరాలు పనిచేశారు. అనంతరం మూడేళ్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేశారు. 2014లో డీఎస్పీగా పదోన్నతి పొంది కృష్ణా జిల్లా ఇంటిలిజెన్స్ డీఎస్పీగా ఐదేళ్లు పనిచేశారు. అలాగే విశాఖ ట్రాఫిక్ ఏసీపీగా 10 నెలలు పనిచేశారు. సాంకేతిక ఆధారాలతో కేసుల నిరూపణలో ప్రతిభ 2020లో ప్రకాశం జిల్లా ఒంగోలు దిశ డీఎస్పీగా రెండేళ్లపాటు పనిచేశారు. ఈ సమయంలోనే రెండు కీలకమైన కేసులు చేధించడంలో కీలకంగా పనిచేశారు. గిద్దలూరు మండలం అంబవరంలో ఏడేళ్ల చిన్నారిపై ఒక వ్యక్తి అత్యాచారం చేసి హత్యచేశాడు. ఈ కేసును ధనుంజయుడు చాలెంజింగ్ తీసుకున్నారు. కేసును లోతుగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా సాక్ష్యాధారాలు సమర్పించారు. దీంతో నిందితుడికి గత జనవరిలో కోర్టు ఉరిశిక్ష విధించింది. అలాగే కందుకూరులో 15 ఏళ్ల బాలికను నిర్భంధించి వ్యభిచారం కూపంలోకి నెట్టారు. వారం రోజుల పాటు బాలికపై 25 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసును కూడా చాలెంజింగ్గా తీసుకుని సెల్ఫోన్, ఫోన్పే ఆధారంగా నిందితులను గుర్తించారు. 25 మంది ఆ వారం రోజుల పాటు వినియోగించిన కండోమ్లు డీఎస్పీ స్వాధీనం చేసుకుని డీఎన్ఏ పరీక్షలకు పంపారు. మేజిస్ట్రేట్ సమక్షంలో బాలికతో ఐడెంటిఫికేషన్ పెరేడ్ ఏర్పాటు చేశారు. దీంతో 25 మందిని బాలిక గుర్తించింది. అన్ని ఆధారాలతో ఈ కేసును నిరూపించారు. ఈ కేసును చేధించడంలో సాంకేతిక ప్రమాణాలు పాటించారు. ఈ రెండు కేసులు చేధించడంలో డీఎస్పీ విజయం సాధించారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ప్రకాశం జిల్లా ఎస్పీ.. డీజీపీ ద్వారా వీటి వివరాలను కేంద్రానికి పంపారు. నేర పరిశోధనలో అత్యుత్తమ సేవలను గుర్తించిన కేంద్రం ధనుంజయుడిని కేంద్ర హోం మంత్రి పతకానికి ఎంపిక చేసింది. ప్రకాశం జిల్లా నుంచి ఆయన తాడేపల్లి సిట్కు డీఎస్పీగా బదిలీ అయ్యారు. అక్కడ కూడా అత్యంత ప్రతిభ కనబర్చి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో రూ.250 కోట్ల దుర్వినియోగాన్ని వెలికి తీశారు. ప్రస్తుతం ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది. ఇటీవల బదిలీల్లో భాగంగా మే నెలలో జంగారెడ్డిగూడెం డీఎస్పీగా బదిలీపై వచ్చారు. -
mann ki baat: ‘మేరీ మాటీ.. మేరీ దేశ్’
న్యూఢిల్లీ: మన అమర జవాన్లను, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పౌరులను గౌరవించుకోవడానికి స్వాతంత్య్ర దినోత్సవం(ఆగస్టు 15) వరకూ దేశవ్యాప్తంగా మేరీ మాటీ.. మేరీ దేశ్ (నా మట్టి.. నా దేశం) పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. వారి జ్ఞాపకార్థం ప్రతి గ్రామ పంచాయతీలో స్మారకాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆదివారం ‘మన్ కీ బాత్’లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. మేరీ మాటీ.. మేరీ దేశ్ కార్యక్రమంలో భాగంగా అమృత్ కలశ్ యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. దేశమంతటా వివిధ ప్రాంతాల నుంచి 7,500 కలశాల్లో పవిత్ర మట్టిని, దాంతోపాటు మొక్కలను దేశ రాజధాని ఢిల్లీకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఆ పవిత్ర మట్టితో ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం సమీపంలో ‘అమృత్ వాటిక’ను నిర్మించబోతున్నట్లు చెప్పారు. అక్కడే మొక్కలను నాటనున్నట్లు వివరించారు. ఈ అమృత్ వాటిక ‘ఏక్ భారత్.. శ్రేష్ట్ భారత్’కు ఒక గొప్ప చిహ్నం అవుతుందని స్పష్టం చేశారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలి ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఇప్పటికే 2 లక్షలకుపైగా కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. అమృత్ మహోత్సవ్ నినాదం అంతటా ప్రతిధ్వనిస్తోంది. గత ఏడాది ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమం కోసం దేశమంతా ఒక్కతాటిపైకి వచి్చంది. ప్రజలంతా తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాలు ఎగరేశారు. ఆ సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి ప్రయత్నాలతో మన బాధ్యతలను మనం గుర్తించగలుగుతాం. దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన బలిదానాలను స్మరించుకుంటాం. స్వేచ్ఛా స్వాతంత్య్రాల విలువను గుర్తిస్తాం. అందుకే ప్రతి పౌరుడూ ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలి. ప్రజల్లో సాంస్కృతి చైతన్యం ఇనుమడిస్తోంది. పుణ్య క్షేత్రాలను సందర్శించే యాత్రికుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కాశీని ప్రతిఏటా 10 కోట్లకు పైగా యాత్రికులు సందర్శిస్తున్నారు. అయోధ్య, మథుర, ఉజ్జయిని లాంటి క్షేత్రాలను సందర్శించే భక్తుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీనివల్ల లక్షలాది మంది పేదలకు ఉపాధి లభిస్తోంది. మరో 50,000 అమృత్ సరోవరాలు ఇటీవల దేశంలో భారీ వర్షాలు కురిశాయి. వరదలు ముంచెత్తాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. జనం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుకోవడానికి వారు కలిసికట్టుగా పని చేశారు. అలాగే జల సంరక్షణ కోసం జనం కృషి చేయడం సంతోషకరం. ఉత్తరప్రదేశ్లో ఒక్కరోజులో 30 లక్షల మొక్కలు నాటారు. జల సంరక్షణ కోసం దేశంలో ఇప్పటికే 60,000 అమృత్ సరోవరాలు నిర్మించారు. మాదక ద్రవ్యాలకు ప్రజలు దూరంగా ఉండాలని కోరుతున్నా. భవిష్యత్తు తరాలను కాపాడుకోవాంటే డ్రగ్స్ను దూరం పెట్టాల్సిందే. ఇందుకోసం 2020 ఆగస్టు 15న ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ ప్రారంభించాం. 11 కోట్ల మందికిపైగా జనం ఈ అభియాన్తో అనుసంధానమయ్యారు. రూ.12,000 కోట్ల విలువైన 10 లక్షల కిలోల డ్రగ్స్ను అధికారులు ధ్వంసం చేశారు. ఇదొక విశిష్టమైన రికార్డు. మధ్యప్రదేశ్లోని బిచార్పూర్ అనే గిరిజన గ్రామం ఒకప్పుడు అక్రమ మద్యం, డ్రగ్స్కు అడ్డాగా ఉండేది. ఇప్పుడు ఆ గ్రామస్థులు వ్యసనాలు వదిలేశారు. ఫుట్బాల్ ఆటలో నిష్ణాతులుగా మారారు. మనసుంటే మార్గం ఉంటుంది’ అని మోదీ ఉద్ఘాటించారు. కళాఖండాలు తిరిగొచ్చాయి మన దేశానికి చెందిన వందలాది అరుదైన, ప్రాచీన కళాఖండాలు ఇటీవలే అమెరికా నుంచి తిరిగివచ్చాయి. అమెరికా వాటిని తిరిగి మనకు అప్పగించింది. దీనిపై సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. అమెరికా నుంచి వచ్చిన వాటిలో 2,500 నుంచి 250 ఏళ్ల క్రితం నాటికి కళాఖండాలు ఉన్నాయి. 2016, 2021లో అమెరికాలో పర్యటించా. మన కళాఖాండలను వెనక్కి తీసుకురావడానికి కృషి చేశా. -
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు అరుదైన గౌరవం..
-
ఎర్రకోట వీరుడు
మాటలతో కోటలు కడుతూ, మనసు గెలవడం సులభమేమీ కాదు. కానీ, చారిత్రక ఎర్ర కోట బురుజుపై నుంచి ప్రసంగించినప్పుడల్లా ప్రధాని మోదీ తన మాటల మోళీతో సామాన్యుల్ని మెప్పిస్తూనే ఉన్నారు. స్వతంత్ర భారత అమృతోత్సవ వేళ తాజాగా ప్రసంగిస్తూ శతవసంత భారతా వనికి గంభీర లక్ష్యం నిర్దేశించారు. 2047 కల్లా భారత్ను ‘అభివృద్ధి చెందిన దేశం’ చేయాలన్నారు. ‘దేశాభివృద్ధి, బానిసత్వ మూలాల్ని వదిలించుకోవడం, వారసత్వ వైభవ స్ఫురణ, సమైక్యత, బాధ్య తల నిర్వహణ’ అంటూ 5 ప్రతిజ్ఞల మహాసంకల్పమూ చెప్పారు. లక్ష్య సాధనకు స్పష్టమైన సర్కారీ ప్రణాళిక ఏమిటో చెప్పడం మాత్రం అలవాటుగానో, పొరపాటుగానో విస్మరించారు. పొరుగున పొంచి ఉన్న ముప్పు, అంతర్జాతీయ సమస్యల ప్రస్తావన చేయలేదు. రెండేళ్ళలో జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, ప్రతిపక్షాలపై పరోక్ష విమర్శలు చేయడం మర్చిపోలేదు. అవినీతి, బంధుప్రీతి, వంశపాలనపై పోరాడేందుకు ఆశీస్సులు కావాలని షరా మామూలుగా అభ్యర్థించడమూ ఆపలేదు. 2017లో కేదార్నాథ్ పర్యటనప్పుడే 2022 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా చేస్తా మని ప్రధాని సంకల్పం చెప్పారు. ఇప్పుడదే లక్ష్యాన్ని కొత్త కాలావధితో ప్రవచించారు. ఏది, ఎన్నిసార్లు చెప్పినా స్వభావసిద్ధ నాటకీయ హావభావ విన్యాసాలతో సామాన్యుల్ని ఆకట్టుకొనేలా చెప్పడం మోదీకి వెన్నతో పెట్టిన విద్య. వరుసగా తొమ్మిదో ఏట చారిత్రక ఎర్రకోటపై జెండా ఎగరేసి, సందేశమిచ్చిన ఆయన ఈసారి సంప్రదాయంగా చేసే ప్రత్యేక పథకాల ప్రకటనల జోలికి పోలేదు. స్వచ్ఛతా అభియాన్, జాతీయ విద్యావిధానం, కరోనా టీకాల లాంటి అంశాల్లో ప్రభుత్వ పురోగతినే పునశ్చరణ చేశారు. ఇటీవలి తన అలవాటుకు భిన్నంగా టెలీప్రాంప్టర్ లేకుండా 82 నిమిషాల సుదీర్ఘ ప్రసంగం చేశారు. ‘జై జవాన్, జై కిసాన్’కు గతంలో వాజ్పేయి ‘జై విజ్ఞాన్’ను జోడిస్తే, తాజాగా మోదీ ‘జై అనుసంధాన్’(నూత్న పరిశోధన)ను చేర్చారు. కొన్నేళ్ళుగా మాటలు ఎర్రకోట దాటాయే కానీ, చేతలు సభా వేదికలైనా దాటట్లేదన్నది నిష్ఠుర సత్యం. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని 2017లోనే మాట ఇచ్చారు. విదేశాల్లోని నల్లధనం వెలికి తెచ్చి, ఇంటింటికీ రూ. 15 లక్షలు పంచడమే తరువాయని ఊరించారు. అమృతో త్సవం నాటికి అందరికీ ఇళ్ళు వచ్చేస్తాయని ఊహల్లో ఊరేగించారు. తీరా అన్నీ నీటి మీద రాతల య్యాయి. ఉచితాలన్నీ అనుచితాలంటూ, ప్రజాసంక్షేమ పథకాలపై ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్న వారు కొత్తగా ఏవో ఒరగబెడతారనుకోలేం. కానీ ‘అవినీతి, బంధుప్రీతి, చీకటిబజారు... అలము కున్న ఈ దేశం ఎటు దిగజారు’ అంటూ దశాబ్దాల క్రితం కవి వ్యక్తం చేసిన ఆవేదననే నేటికీ వల్లె వేస్తుంటే, ఎవరిపైనో నెపం మోపుతుంటే ఏమనాలి? దేశంలో ఏ మంచి జరిగినా గత 8 ఏళ్ళ లోనే జరిగినట్టూ, ప్రతి చెడుకూ ఆ మునుపటి 67 ఏళ్ళే కారణమన్నట్టు ఎన్నాళ్ళు నమ్మబలుకుతారు? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విశేష ప్రగతికి దోహదపడిందంటూ ఎర్రకోటపై అనేక అంశాల్ని ప్రస్తావించారు. వాటిలో కొన్ని సత్యశోధనకు నిలవట్లేదు. ‘పర్యావరణంపై భారత కృషి ఫలితాలి స్తోంది. అడవుల విస్తీర్ణం, పులులు, ఆసియా సింహాల సంఖ్య పెరగడం ఆనందాన్నిస్తోంది’ అంటూ చెప్పుకున్న గొప్పల్లో నిజం కొంతే! దేశ భూభాగంలో మూడోవంతులో అడవులను విస్తరింపజేస్తా మన్న పాలకులు సాధించింది స్వల్పమే. అటవీ విస్తీర్ణం 24.6 శాతానికి పెరిగిందని ప్రభుత్వ లెక్క. 2002 – 2021 మధ్య భారత్లో చెట్ల విస్తీర్ణం 19 శాతం మేర తగ్గిందని నాసా, గూగుల్ వగైరాల సమాచారమంతా క్రోడీకరించే ‘గ్లోబల్ ఫారెస్ట్ వాచ్’ మాట. పర్యావరణ విధానానికి వస్తే – బొగ్గు మీదే అతిగా ఆధారపడే మన దేశం అమెరికా, చైనాల తర్వాత అధిక కర్బన ఉద్గార దేశాల్లో ఒకటి. అలాగే, రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు భారత సంస్థలను ప్రోత్సహిస్తున్నామ న్నారు. దేశీయ రక్షణ ఉత్పత్తుల ప్రోత్సాహం బీజేపీ హయాంలో జరిగింది. కానీ, విదేశాల నుంచి భారీగా ఆయుధాల కొనుగోలులో ఇప్పటికీ మనం ముందున్నాం. 2017 – 2021 మధ్య ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో 11 శాతం వాటా మనదే. దేశంలో పులులు, సింహాల సంఖ్య పెరిగిన మాట నిజమైనా, జాతీయ చిహ్నంలో సరికొత్త ఉగ్రనరసింహం దేనికి ప్రతీకంటే జవాబివ్వడం కష్టం. స్వాతంత్య్ర కాలపు ‘స్వదేశీ’, నేటికి ‘స్వావలంబన’ (ఆత్మనిర్భరత)గా రూపాంతరమైనా నేతన్న ఖద్దరును కాదని జెండాలు సైతం దిగుమతి చేసుకొనే దుఃస్థితి ఏమిటి? విదేశీ బొమ్మలు వద్దంటు న్నారని సంబరంగా చెబుతున్నవారు విదేశీ తయారీ జాతీయజెండాల వైపు మొగ్గడమేమిటి? అవినీతి, ఆశ్రితపక్షపాతం, ఆత్మనిర్భర భారత్ మోదీ ప్రసంగాల్లో నిత్యం దొర్లే మాటలు. నారీ శక్తి ప్రస్తావనా నిత్యం చేస్తున్నదే! ఆచరణలో చేసిందేమిటంటే ప్రశ్నార్థకమే! అవినీతిపై యుద్ధం మాటకొస్తే – 2015 మొదలు 2017, 2018, 2019... ఇలా ఏటా ఆ మాట మోదీ తన ప్రసంగంలో చెబుతూనే ఉన్నారు. ప్రసంగ పాఠాలే అందుకు సాక్ష్యం. ప్రతిపక్షపాలిత బెంగాల్లో బయటపడ్డ గుట్టలకొద్దీ నోట్లకట్టల్ని ఎవరూ సమర్థించరు కానీ, కాషాయ జెండా కప్పుకోగానే పచ్చి అవినీతి పరులు సైతం పరిశుద్ధులైపోతున్న ఉదాహరణలే అవినీతిపై పోరాటస్ఫూర్తిని ప్రశ్నిస్తున్నాయి. సమై క్యతను ప్రవచిస్తున్న పార్టీలు భిన్నభాషలు, సంస్కృతులు, కులాలు, మతాలున్న దేశంలో రకరకాల ప్రాతిపదికన మనుషుల్ని విడదీస్తూ, మనసుల్ని ఎలా దగ్గరచేయగలవు? వాగాడంబరం కట్టిపెట్టి, ఆచరణలోకి దిగాలి. స్వతంత్ర భారత శతమాన లక్ష్యం చేరాలంటే అన్నిటికన్నా ఆ ప్రతిజ్ఞ ముఖ్యం! -
జెండా పండుగలో విషాదం
యశవంతపుర: జెండా పండుగ వేళ పలుచోట్ల విషాదాలు చోటుచేసుకున్నాయి. గుండెపోటుతో ఒకరు, జెండా కడుతూ కిందపడి మరొకరు ప్రాణాలు విడిచారు. దక్షిణ కన్నడ జిల్లా కడబ తాలూకా కుట్రుపాడి గ్రామ పంచాయతి ఆఫీసులో సోమవారం ఉదయం జెండాను ఎగురవేస్తుండగా మాజీ జవాన్ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. మాజీ జవాన్ గంగాధర గౌడను ఈ కార్యక్రమానికి అతిథిగా ఆహ్వానించారు. అతిథి ప్రసంగిస్తుండగా గంగాధరగౌడ కిందపడిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశాడు. సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జారిపడి గాయాలతో టెక్కీ మృతి హర్ ఘర్ తిరంగాలో భాగంగా ఇంటిపై జెండా కడుతూ కిందపడి టెక్కీ చనిపోయాడు. ఈ ఘటన బెంగళూరు హెణ్ణూరు పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. దక్షిణకన్నడ జిల్లా సుళ్యకు చెందిన విశ్వాస్కుమార్ భట్ (33) బెంగళూరులో టెక్కీగా పని చేస్తున్నాడు. హెచ్బీఆర్ లేఔట్ ఐదో బ్లాక్లో భార్య వైశాలితో కలిసి రెండేళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. ఆదివారం ఇంటి మీద పతాకాన్ని కడుతూ అదుపుతప్పి కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పోందుతూ సోమవారం మృతి చెందాడు. (చదవండి: కాల్చేస్తాం, జరిమానా కట్టేస్తాం ) -
Indian Flag: ప్రపంచాన మెరిసిన త్రివర్ణం
బీజింగ్/సింగపూర్/అమెరికా: ప్రపంచ దేశాల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. వివిధ దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు భారత స్వాతంత్య్ర దినోత్సవాలను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించుకున్నారు. చైనాలో భారత రాయబారి ప్రదీప్ రావత్ వేడుకల్లో పాల్గొన్నారు. భారత ఎంబసీలో జాతీయ జెండాను ఎగురవేశారు. చైనాలోని భారతీయులు అధిక సంఖ్యలో విచ్చేసి, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. భారత నావికా దళానికి చెందిన నిఘా నౌక ‘ఐఎన్ఎస్ సరయూ’ బ్యాండ్ సిబ్బంది సింగపూర్లో భారత రాయబార కార్యాలయంలో దేశభక్తి గేయాలు ఆలపించారు. కెనడా, బంగ్లాదేశ్, నేపాల్, ఇజ్రాయెల్ తదితర దేశాల్లోను భారత స్వాతంత్య్ర దినోత్సవాలు నిర్వహించారు. అమెరికాలోని బోస్టన్లో ‘ఇండియా డే’ పరేడ్ సందర్భంగా 220 అడుగుల ఎత్తున ఎగురవేసిన భారత జాతీయ జెండా ప్రజలను ఆకట్టుకుంది. భారత్కు శుభాకాంక్షల వెల్లువ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత్కు ప్రపంచదేశాల అధినేతల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తదితరులు భారత్కు అభినందనలు తెలియజేశారు. ‘సత్యం, అహింసా అని గాంధీజీ ఇచ్చిన సందేశం విలువైనది. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్, అమెరికా ప్రజల శాంతిభద్రతల కోసం ఇరుదేశాలూ కలిసికట్టుగా పనిచేయాలి’ అని బైడెన్ సందేశమిచ్చారు. ఆస్ట్రేలియా ప్రధాని అల్బానీస్, ఆస్ట్రేలియా రక్షణ శాఖ మంత్రి రిచర్డ్ మార్లెస్, మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్, సోలిహ్, సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ తదితర ప్రముఖులు భారత ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇదీ చదవండి: వివాదంలో బ్రిటన్ ప్రధాని అభ్యర్థి రిషి సునాక్! -
మా తుఝే సలాం
-
పోలీసులకు సేవా పతకాల ప్రదానం (ఫోటోలు)
-
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్న టీమిండియా
Team India Celebrates Independence Day In Harare: 3 వన్డేల సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న టీమిండియా.. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అక్కడే ఘనంగా జరుపుకుంది. జట్టు సభ్యులతో పాటు కోచింగ్, సహాయక సిబ్బంది అంతా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రెగ్యులర్ కోచ్ రాహుల్ ద్రవిడ్ గైర్హాజరీలో ఈ సిరీస్కు కోచ్గా వ్యవహరిస్తున్న నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. కేఎల్ రాహుల్ నాయకత్వంలో టీమిండియా సభ్యులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భారత బృంద సభ్యులంతా జాతీయ జెండా ముందు నిల్చొని ఫోటోలు దిగారు. ఇదిలా ఉంటే, జింబాబ్వే పర్యటనలో టీమిండియా ఈ నెల (ఆగస్ట్) 18, 20, 22 తేదీల్లో మూడు వన్డేలు ఆడనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటన ముగిసిన అనంతరం టీమిండియా నేరుగా యూఏఈ వెళ్లి ఆసియా కప్లో పాల్గొంటుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా టీమిండియా ఈనెల 28న తమ తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్ధి దాయాది పాకిస్థాన్తో తలపడనుంది. చదవండి: 'విండీస్ సిరీస్లో అతడు అదరగొట్టాడు.. అయినప్పటికీ ఓపెనర్గా నో ఛాన్స్' -
డిజిటల్ దేశభక్తి: మువ్వన్నెల జెండా సెల్ఫీలతో రికార్డు బద్ధలు!
ఢిల్లీ: కోట్లాదిమంది పౌరులు తమ దేశభక్తిని డిజిటల్ రూపంలోనూ చూపించారు. తాము ఎగరేసిన త్రివర్ణ పతాకంతో కలిసి సెల్ఫీలు, ఫొటోలు దిగి హర్ ఘర్ తిరంగా వెబ్సైట్కు పంపాలని ఇటీవల కేంద్ర సాంస్కృతిక శాఖ పిలుపునిచ్చింది. ఈ పిలుపునకు స్పందన అనూహ్యరీతిలో వచ్చింది. ఏకంగా ఐదు కోట్లకుపైగా పౌరులు త్రివర్ణ పతాక సెల్ఫీలను ‘హర్ ఘర్ తిరంగా’ వెబ్సైట్లోకి అప్లోడ్ చేశారని సాంస్కృతిక శాఖ సోమవారం పేర్కొంది. ‘ఇళ్ల వద్ద జెండావిష్కరణ జరపాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు వచ్చిన స్పందన అనుపమానం. కోటానుకోట్ల స్వీయచిత్రాలతో వెబ్సైట్ నిండిపోతోంది. సోమవారం సాయంత్రం నాలుగింటికే ఐదు కోట్ల మార్క్ దాటాం’ అని పౌరులను అభినందించింది. మంగళవారం ఉదయం కూడా వెబ్సైట్లోకి ఫోటోలు అప్లోడ్ అవుతుండడం విశేషం. సాధారణంగా అధిక జనాభా ఉన్న(రెండో దేశం) భారత్ నుంచి.. ప్రపంచ స్థాయిలోనే ఇదొక కొత్త రికార్డు అయ్యి ఉంటుందని సాంస్కృతిక శాఖ అంచనా వేస్తోంది. ఇదీ చదవండి: స్వాతంత్ర వేడుకల్లో గాంధీ ఎందుకు పాల్గొనలేదో తెలుసా? -
పోలీసులకు సేవా పతకాల ప్రదానం
సాక్షి, అమరావతి: విధి నిర్వహణలో విశిష్ట సేవలు, ధైర్య సాహసాలు ప్రదర్శించిన పలువురు రాష్ట్ర పోలీసులకు సోమవారం సీఎం జగన్ పతకాలను ప్రదానం చేశారు. 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో 2020–21 సేవా పతకాలను గ్రహీతలు అందుకున్నారు. వారి వివరాలు.. ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ (పీపీఎం)–2020 ► కేవీ రాజేంద్రనాథ్రెడ్డి, రాష్ట్ర డీజీపీ ► డాక్టర్ ఎ.రవిశంకర్, ఏడీజీపీ, శాంతిభద్రతలు ► కుమార్ విశ్వజిత్, ఏడీజీపీ, రైల్వే ► కె. సుధాకర్, డీఎస్పీ, ఇంటెలిజెన్స్ ► ఎం.శ్రీనివాసరావు, ఏఆర్ఎస్ఐ, ఏసీబీ, విజయవాడ పోలీస్ మెడల్–2021 ► జి. గిరీష్కుమార్, అసిస్టెంట్ కమాండో, గ్రేహౌండ్స్ ఇండియన్ పోలీస్ మెడల్ (ఐపీఎం)–2020, 2021 ► పీహెచ్డి రామకృష్ణ, డీఐజీ, ఏసీబీ ► ఎస్. వరదరాజు, రిటైర్డ్ ఎస్పీ ► ఆర్. విజయ్పాల్, రిటైర్డ్ ఏఎస్పీ, సీఐడీ ► ఎ. జోషి, ఏఎస్పీ, ఐఎస్డబ్ల్యూ, విజయవాడ ► ఎల్వీ శ్రీనివాసరావు, రిటైర్డ్ ఏఎస్పీ ► ఎన్. వెంకటరామిరెడ్డి, రిటైర్డ్ ఏఎస్పీ ► ఎంకేఎస్. రాధాకృష్ణ, అడిషనల్ కమాండెంట్, పీటీసీ, తిరుపతి ► ఈ. సత్యసాయిప్రసాద్, అడిషనల్ కమాండెంట్, ఆరో బెటాలియన్, మంగళగిరి ► సీహెచ్వీఏ రామకృష్ణ, అడిషనల్ కమాండెంట్, ఐదో బెటాలియన్, ఏపీఎస్పీ ► కే ఈశ్వరరెడ్డి, ఏఎస్పీ, విజిలెన్స్ ► ఎం. భాస్కర్రావు, రిటైర్డ్ డీఎస్పీ, సీఐడీ ► జి. వెంకటరమణమూర్తి, ఏసీపీ విజయవాడ ► జి. విజయ్కుమార్, డీఎస్పీ కమ్యూనికేషన్స్ ► ఎం. మహేశ్బాబు, రిటైర్డ్ అడిషనల్ కమాండెంట్ ► వై. శ్యామ్సుందరం, సీఐ పీటీసీ, తిరుపతి ► కె. జాన్మోషెస్ చిరంజీవి, ఆర్ఐ, విజయవాడ ► ఎన్. నారాయణమూర్తి, ఎస్ఐ, శ్రీకాకుళం ► ఎస్. శ్రీనివాసులు, ఎస్ఐ, ఏసీబీ తిరుపతి ► వి. నేతాజి, ఎస్ఐ, శ్రీకాకుళం ► ఎస్ఎస్ కుమారి, ఎస్ఐ, ఒంగోలు ► ఎన్. గౌరిశంకరుడు, ఆర్ఎస్సై, నెల్లూరు ► వై. శశిభూషణ్రావు, ఆర్ఎస్సై, ఏపీఎస్పీ ఐదో బెటాలియన్ ► పి.విక్టోరియా రాణి, ఎస్సై విశాఖపట్నం రూరల్ ► కెఎన్ కేశవన్, ఏఎస్సై, చిత్తూరు ► బి. సురేశ్బాబు, ఏఎస్సై, నెల్లూరు ► జె. నూర్ అహ్మద్బాషా, ఏఎస్సై, చిత్తూరు ► జె. విశ్వనాథం, ఏఆర్ఎస్సై, ఇంటెలిజెన్స్ ► కె. వాకలయ్య, ఏఆర్ఎస్సై, మచిలీపట్నం ► ఎం. వెంకటేశ్వరరావు, ఆర్ఎస్సై, విజయవాడ ► జె. శ్రీనివాసులు, ఏఆర్ఎస్సై, అనంతపురం ► ఎస్. రామచరణయ్య, ఏఆర్ఎస్సై, అనంతపురం ► వైకుంఠేశ్వరరావు, ఏఆర్ఎస్సై, 6వ బెటాలియన్ ఏపీఎస్పీ ► వై. చంద్రశేఖర్, హెడ్ కానిస్టేబుల్, ఒంగోలు ► పి.విజయభాస్కర్, హెడ్ కానిస్టేబుల్, విజయవాడ ► ఎన్.రామకృష్ణరాజు, ఆర్హెచ్సీ, విజయనగరం ► సీహెచ్. రంగారావు, హెచ్సీ, ఏసీబీ, విజయవాడ ► కె.గురువయ్య బాబు, ఏఆర్హెచ్సీ, విశాఖపట్నం ► ఎ.సూర్యనారాయణరెడ్డి, ఏఆర్హెచ్సీ, విజయవాడ ► డి. మౌలాలి, ఏఆర్హెచ్సీ, విజయవాడ ► ఎం. జనార్థన్, హెచ్సీ, ఆక్టోపస్ ► వై. నాగేశ్వరరెడ్డి, ఏఆర్హెచ్సీ, విజయవాడ ► జి. రమణ, కానిస్టేబుల్, కర్నూల్ ► ఎన్. సూర్యనారాయణ, ఆర్పీసీ, విజయవాడ ► ఎంవి సత్యనారాయణరాజు, కానిస్టేబుల్, విశాఖపట్నం స్వాతంత్య్ర దినోత్సవ కవాతులో మొదటి బహుమతి అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్ ప్రెసిడెంట్ ఫైర్ సర్వీసెస్ మెడల్–2020 ► లేట్ కె. జయరామ్ నాయక్ ఫైర్ సర్వీసెస్ మెడల్ ► ఎం. భూపాల్రెడ్డి, రీజనల్ ఫైర్ ఆఫీసర్ ► వి. శ్రీనివాసరెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి, అనంతపురం ► సీహెచ్ కృపవరం, జిల్లా అగ్నిమాపక అధికారి, విశాఖపట్నం ► బి. వీరభద్రరావు, అసిస్టెంట్ డీఎఫ్ఓ, శ్రీకాకుళం ► బి. గొల్లడు, రిటైర్డ్ లీడింగ్ ఫైర్మ్యాన్ ముఖ్యమంత్రి శౌర్య పతకాలు : ఏపీ అవతరణ దినోత్సవం–2021 ► జి. నాగశంకర్, కానిస్టేబుల్, గ్రేహౌండ్స్ ► జి. ప్రసాద్, కానిస్టేబుల్, గ్రేహౌండ్స్ ► బి. రమేశ్, ఆర్ఎస్ఐ, గ్రేహౌండ్స్ ► ఎం. శ్రీనివాసరావు, కానిస్టేబుల్, గ్రేహౌండ్స్ ► ఎస్. సురేశ్, కానిస్టేబుల్, గ్రేహౌండ్స్ ► జిఎస్ రామారావు, ఆర్ఐ, గ్రేహౌండ్స్ ► కె. జగదీష్, హెడ్ కానిస్టేబుల్, గ్రేహౌండ్స్ ► డి. గోవిందబాబు, కానిస్టేబుల్, గ్రేహౌండ్స్ ► జె. ఈశ్వరరావు, ఆర్ఎస్ఐ, గ్రేహౌండ్స్ ► పి. పెంచల ప్రసాద్, కానిస్టేబుల్, గ్రేహౌండ్స్ ► డి. నాగేంద్ర, ఎస్ఐ, గ్రేహౌండ్స్ -
CM YS Jagan: దశాబ్దాల ప్రశ్నలకు మూడేళ్లలో జవాబిచ్చాం
రాష్ట్రంలో ప్రతి కుటుంబం నిన్నటి కంటే నేడు.. నేటి కంటే రేపు.. రేపటి కంటే భవిష్యత్తులో బాగుండటమే అభివృద్ధి. అదే మన స్వతంత్రానికి అర్థమని నమ్మాం. ఎన్నికల వరకే రాజకీయాలు.. అధికారంలోకి వచ్చిన తరవాత అంతా మన ప్రజలే అని విశ్వసించాం. ప్రతి ఒక్క పథకంలోనూ శాచ్యురేషన్ విధానాన్ని అమలు చేశాం. ఎక్కడా కులం, మతం, వర్గం, ప్రాంతీయ భేదాలను చూడలేదు కాబట్టే లంచాలు, వివక్ష, కమీషన్లు లేకుండా రూ.1.65 లక్షల కోట్లు అర్హులందరి ఖాతాల్లోకి వెళ్లాయి. దేశ చరిత్రలో పారదర్శకంగా ఇంత డబ్బు లబ్ధిదారులకు చేరటం కనీవినీ ఎరుగనిది – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జెండా.. భారతీయుల గుండె ‘‘ఈ జెండా కేవలం దారాల కలనేత కాదు.. ఇది భిన్నత్వంలో ఏకత్వానికి, భారతీయతకు, దేశభక్తికి, దేశ స్వాతంత్య్ర పోరాటానికి, మనకు మన దేశంపై ఉన్న నిబద్ధతకు, ఈ దేశ భవిష్యత్తుకు ఉండాల్సిన చిత్తశుద్ధికి ప్రతీక. మన తెలుగువాడు పింగళి వెంకయ్య తయారు చేసిన ఈ జెండా.. ఇప్పుడు 141 కోట్ల భారతీయుల గుండె’’. స్వతంత్రానికి నిజమైన అర్థం ‘‘రాష్ట్రంలో ప్రతి కుటుంబం నిన్నటి కంటే నేడు.. నేటి కంటే రేపు.. రేపటి కంటే భవిష్యత్తులో బాగుండటమే అభివృద్ధి. అదే మన స్వతంత్రానికి అర్థమని నమ్మాం. ఎన్నికల వరకే రాజకీయాలు.. అధికారంలోకి వచ్చిన తరవాత అంతా మన ప్రజలే అని విశ్వసించాం. ప్రతి ఒక్క పథకంలోనూ శాచురేషన్ విధానాన్ని అమలు చేశాం. ఎక్కడా కులం, మతం, వర్గం, ప్రాంతీయ భేదాలను చూడలేదు. కాబట్టే ఎటువంటి లంచాలు, వివక్ష, కమీషన్లు లేకుండా రూ.1.65 లక్షల కోట్లు అర్హులందరి ఖాతాల్లోకి వెళ్లాయి. బహుశా భారతదేశ చరిత్రలో ఇంత పారదర్శకంగా ఇంత డబ్బు లబ్ధిదారులకు చేరటం కనీవినీ ఎరుగనిది’’. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి సంక్షేమమే మానవ అభివృద్ధి ‘‘సంక్షేమ పథకాలను మానవ వనరులపై పెట్టుబడిగా భావించి ప్రతి రూపాయినీ కుటుంబాలను నిలబెట్టే, పేదరికం సంకెళ్లను తెంచే సాధనంగా పేదల చేతిలో ఉంచాం. ప్రతి పథకాన్నీ కూడా ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు(ఎస్డీజీ) సాధించేలా అమలు చేస్తున్నాం’’. –వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సాక్షి, అమరావతి: భారతదేశ స్వాతంత్ర్యానికి 75 ఏళ్ల చరిత్ర ఒకవైపు ఉంటే.. మరోవైపు ఇదే గడ్డపై సమ సమాజం కోసం, సామాజిక న్యాయం కోసం, చదువుకునే హక్కు, మహిళా సాధికారత, మనుషులుగా గుర్తింపు, దోపిడీకి గురికాకుండా జీవించే రక్షణల కోసం జరుగుతున్న పోరాటాలకు వందల, వేల ఏళ్ల చరిత్ర ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇవన్నీ పరాయి దేశంపై చేసిన స్వాతంత్య్ర పోరాటాలు కావని, మన సమాజంలో జరుగుతున్న సామాజిక స్వాతంత్య్ర పోరాటాలని ఆయన చెప్పారు. ఏడు దశాబ్దాల్లో స్వతంత్ర దేశంగా భారత్ తిరుగులేని విజయాలను, అనేక రంగాల్లో అభివృద్ధిని సొంతం చేసుకున్నప్పటికీ ఎన్నో ప్రశ్నలు వెంటాడుతూనే ఉన్నాయన్నారు. వీటికి లభించిన సమాధానాల ప్రతీకే.. ఈ మూడేళ్ల రాష్ట్ర ప్రభుత్వ పాలనగా స్పష్టం చేశారు. రాష్ట్ర చరిత్రలో గానీ, దేశ చరిత్రలో గానీ ఏ ఒక్క ప్రభుత్వంలోనూ కనిపించనంతటి సామాజిక, ఆర్థిక, రాజకీయ విద్యా న్యాయాలను ప్రజలందరి ప్రభుత్వంలో చేసి చూపించామన్నారు. ఇంతటి విప్లవాత్మక మార్పులు ఒకరిద్దరు వ్యక్తులకో, కొంత మందికి ప్రయోజనం కల్పించేందుకు చేసినవి కావని.. ఇవన్నీ వ్యవస్థనే మార్చే మార్పులని ఉద్ఘాటించారు. వచ్చే కొన్ని దశాబ్దాల్లో వ్యవసాయ, విద్య, వైద్యం, గృహ నిర్మాణ రంగాన్ని, సామాజిక వర్గాలకు అందే రాజకీయ అధికారాన్ని నిర్ణయించే విధంగా ఉంటాయన్నారు. మహిళల అభివృద్ధి ప్రాధాన్యంగా 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్లోనే ఆవిర్భవించాలన్న లక్ష్యంతో మహిళా సాధికారతలో వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు. రాజధాని స్థాయిలో పరిపాలన వికేంద్రీకరణే తమ విధానమని, ప్రాంతాల ఆకాంక్షలు, ప్రాంతీయ ఆత్మగౌరవానికి, అన్ని ప్రాంతాల మధ్య సమతౌల్యంతోపాటు పటిష్ట బంధానికి వికేంద్రీకరణే పునాదిగా నమ్ముతున్నామన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ ప్రభుత్వ విభాగాలు రూపొందించిన శకటాల ప్రదర్శనను తిలకించారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఇవీ.. మతసామరస్యానికి ప్రతీక నేడు ఎగిరిన ఈ జాతీయ జెండా మన స్వాతంత్య్రానికి, గొప్పదైన మన ప్రజాస్వామ్యానికి ప్రతీక. ఇది దేశ ప్రజల సార్వభౌమాధికారానికి ప్రతీక. భారతదేశపు ఆత్మకు, మనందరి ఆత్మగౌరవానికి ప్రతీక. ఈ దేశం హిందూ, ఇస్లాం, క్రైస్తవం వంటి అనేక మతాలు, అనేక ధర్మాల సమ్మేళనం అని ఆ జెండా చెబుతుంది. మన జెండా మన సమరయోధుల త్యాగనిరతికి, మనం కోరుకునే సుస్థిర శాంతికి, ఈ దేశం పైరుపచ్చలతో కళకళలాడాలన్న భావనకు ప్రతీక. ఈ జెండా.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం గొప్పదనానికి ప్రతీక. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్న సీఎం సతీమణి వైఎస్ భారతి మన పోరాటం మహోన్నతం మన స్వాతంత్య్ర పోరాటం మహోన్నతం. ఈ ఏడాది మనం భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను సంపూర్ణం చేసుకుంటున్న సమయం. ఒక జాతి యావత్తు పోరాడుతున్నా.. అంతటి పోరాటంలో కూడా చెక్కుచెదరని అత్యున్నత మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శనం మన స్వాతంత్య్ర పోరాటం. ఇందులో వర్గాలు వేరైనా.. వాదాలు వేరైనా.. అతివాదమైనా, మితవాదమైనా, విప్లవ వాదమైనా.. గమ్యం ఒక్కటే, అది స్వతంత్రమే. అహింసే ఆయుధంగా, సత్యమే సాధనంగా సాగిన ఆ శాంతియుత పోరాటం... ఒక్క భారతదేశానికి మాత్రమే కాదు మొత్తంగా ప్రపంచ మానవాళికి మహోన్నత చరిత్రగా, తిరుగులేని స్ఫూర్తిగా కలకాలం నిలిచే ఉంటుంది. సంకల్ప విప్లవ సంగ్రామం స్వాతంత్య్రం నా జన్మహక్కు.. దాన్ని సాధించి తీరుతానన్న బాలగంగాధర తిలక్ సంకల్పానికి, ఏకంగా ప్రవాస ప్రభుత్వాన్నే ఏర్పాటు చేసి బ్రిటిష్ వారిపై యుద్ధం ప్రకటించిన ఆజాద్ హింద్ ఫౌజ్ అధినేత సుభాస్ చంద్రబోస్ సాహసానికి, జలియన్ వాలాబాగ్ మారణకాండకు బాధ్యుడైన జనరల్ డయ్యర్ను లండన్ నడివీధుల్లో శిక్షించిన ఉధంసింగ్ తెగువకు, దేశం కోసం ఉరికంబం ఎక్కిన సర్దార్ భగత్సింగ్ త్యాగానికి ప్రతీక మన స్వతంత్ర పోరాటం. జన సమూహాలే ఆయుధాలుగా.. మన సామాన్యుడి దేహం మీద వేసుకోడానికి నూలు పోగులు లేకున్నా.. మా దేశం మీద మీరు దేవతా వస్త్రాలు కప్పాం అంటే కుదరదన్న భావాలకు నిలువెత్తు రూపం గాంధీజీ. అణువణువూ స్వాతంత్య్ర కాంక్ష నిండిన జన సమూహాలే ఆయుధాలని.. అవి అణ్వాయుధాల కంటే శక్తిమంతమని నిరూపించిన మహాత్ముడు మన గాంధీజీ. మహాయోధుల త్యాగాలు, రక్తంతో తడిసిన పుణ్యభూమి భారతీయతకు ప్రతినిధులుగా నిలిచిన ఒక మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఒక ఖాన్ అబ్దుల్ గఫర్ఖాన్, సైమన్ కమిషన్ రాక సందర్భంగా తుపాకులకు ఎదురొడ్డి నిలిచిన టంగుటూరి ప్రకాశం, మన్నెం వీరుడిగా ప్రాణాలే అర్పించిన అల్లూరి.. ఇలా వందలు వేల మహాయోధుల త్యాగాలు, భావాలతో, వారి స్వేదంతో–రక్తంతో తడిసి ఈ పుణ్యభూమి పునీతమయింది. ఆ పునాదులమీదే స్వతంత్ర దేశంగా ఇండియా అవతరించింది. వంద కోట్ల జెండాలు ఎగురుతున్నాయి 1857లో తొలి స్వతంత్ర సంగ్రామంగా సిపాయిల తిరుగుబాటు జరిగితే, 1885లో భారత జాతీయ కాంగ్రెస్ పుట్టిన నాటి నుంచి 1947లో దేశ స్వాతంత్య్రం వరకు 62 సంవత్సరాల కాలం జాతీయోద్యమం, స్వాతంత్య్ర పోరాటం జరిగింది. అంటే తొలి స్వాతంత్య్ర పోరాటానికి, ఆ తరవాత– మితవాద, అతివాద, విప్లవ వాద సమరాలకు 90 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. ఈ పోరాటాల ఫలితంగా 1947 ఆగస్టు 15న మన ఎర్రకోటమీద మన పాలనలో మన తొలి జెండా ఎగిరింది. నేడు 75 ఏళ్ల తర్వాత ఈ రోజున.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 100 కోట్ల జెండాలు ఎగురుతున్నాయి. మానవ చరిత్రలోనే మహోన్నతమైన స్వతంత్ర పోరాటాన్ని స్మరించుకుంటూ దేశం ఈ రోజున ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని జరుపుకుంటోంది. తిరుగులేని విజయాల భారత్ గత 75 ఏళ్లలో దేశంగా ఇండియా తిరుగులేని విజయాలను, అనేక రంగాల్లో అభివృద్ధిని సొంతం చేసుకుంది. స్వాతంత్య్రం వచ్చేనాటికి మన జనాభా కేవలం 35 కోట్లు అయితే ఈ రోజున అది మరో 106 కోట్లు పెరిగి ఏకంగా 141 కోట్లకు చేరింది. ఇంత అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి కావాల్సిన ఆహారం, నీరు, దుస్తులు, విద్య, వైద్యం, పరిశ్రమ, సేవలు ఇలా ఏది తీసుకున్నా తయారు చేయటం, అందించటం, మిగతా ప్రపంచంతో పోటీపడి ప్రగతి సాధించటం.. ఇవన్నీ అతి పెద్ద సవాళ్లే. రైతన్నలకు దేశం సెల్యూట్ చేయాలి మన దేశంలో 1947లో అప్పుడున్న 35 కోట్ల ప్రజలకు సరిపడా ఆహార ధాన్యాలు లేని దుస్థితి. దాన్ని అధిగమించి.. ఈ రోజు ప్రపంచంలో ఏకంగా 150 దేశాలకు ఆహార ధాన్యాలను ఎగుమతి చేయగల పరిస్థితిని తీసుకొచ్చిన మన రైతన్నలకు మన దేశమంతా సెల్యూట్ చేయాలి. ఒకప్పుడు పీఎల్ 480 స్కీమ్ కింద గోధుమ నూకను మానవతా సహాయంగా అందుకున్న మన దేశం.. ఈ రోజున ఏకంగా ఏటా 70 లక్షల టన్నుల గోధుమను, ఏడాదికి 210 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రపంచానికి ఎగుమతి చేస్తోంది. స్వాతంత్య్రం వచ్చే నాటికి కేవలం 18 శాతం వ్యవసాయ భూమికి నీటి సదుపాయాలుంటే ఇప్పుడు 49 శాతానికి పైగా భూమికి సాగునీరందుతోంది. అగ్ర దేశాలతో పోటీ 1947లో వంద మందికి కేవలం 12 శాతం అక్షరాస్యులు ఉంటే.. ఈ రోజున మన అక్షరాస్యత, తాజా సర్వేల ప్రకారం 77 శాతానికి పైగా ఉంది. స్మార్ట్ ఫోన్ల వినియోగంలో ప్రపంచంలోనే రెండో స్థానం మనది. స్వాతంత్య్రం వచ్చే నాటికి మన దేశంలో 99 శాతం ప్రజల ఇంటికి కరెంటు లేదు. ఈ రోజు... కరెంటు లేని ఇళ్లు.. దేశం మొత్తంలో కేవలం ఒక శాతం కంటే తక్కువే. చిన్న జ్వరం తగ్గే మాత్ర కావాలన్నా అప్పట్లో అన్నీ దిగుమతి అయిన ట్యాబ్లెట్లే ఉంటే.. ఈ రోజు ప్రపంచ ఫార్మా రంగంలో ఇండియా టాప్ 3 దేశాల్లో ఒకటి. అమెరికాలో వాడుతున్న ప్రతి మూడు ట్యాబ్లెట్లలో ఒకటి, మనల్ని పాలించిన బ్రిటన్లో ప్రజలు వాడుతున్న ప్రతి నాలుగు ట్యాబ్లెట్లలో ఒకటి ఇండియా తయారు చేసిందే. స్ఫూర్తిని నింపిన విజయాలు అంతరిక్ష రంగంలో ఇస్రో సాధిస్తున్న ఘన విజయాలు, ఎంతటి శత్రువునైనా ఎదుర్కొనేలా మన శాస్త్రవేత్తలు తయారు చేసిన శక్తిమంతమైన అణ్వాయుధాలు–క్షిపణులు, మన తేజస్ వంటి యుద్ధ విమానాల కొనుగోలుకు అమెరికా ఆసక్తి కనబరచటం మొదలు... ఎందరో ఇండియన్లు అమెరికన్ కంపెనీల సీఈవోలుగా ఎదగటం వరకు, అలాగే 190 సంవత్సరాలు మన దేశాన్ని తన చేతిలోకి తీసుకున్న బ్రిటన్కు.. ఒక భారతీయ సంతతి పౌరుడు ప్రధాని రేసులో నిలవటం, ఒక భారతీయ సంతతి మహిళ అమెరికా ఉపాధ్యక్ష పదవిలో ఉండటం వరకు ఇవన్నీ భారతీయులు గర్వించే అంశాలే. ఇవన్నీ మనకు కొండంత స్ఫూర్తిని నింపే విజయాలే. జెండా వందనం చేస్తున్న సీఎం జగన్. చిత్రంలో డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి నిండు మనసుతో దిద్దుబాట్లు స్వతంత్ర దేశంగా ఇండియా, అంతర్జాతీయంగా భారతీయులు సాధించిన విజయాలకు కొదవ లేదన్నది ఎంత వాస్తవమో.. దేశంగా ఇండియాకు వచ్చిన ఈ స్వాతంత్ర్యం వ్యక్తులుగా, కులాలుగా, ప్రాంతాలుగా, జెండర్గా తమకు పూర్తిగా అందలేదన్న భావన కొన్ని సమూహాల్లో, కొన్ని ప్రాంతాల్లో, అనేకమంది ప్రజల్లో నేటికీ ఉండిపోయిందన్నది కూడా అంతే వాస్తవం. దేశ స్వాతంత్ర్యానికి 75 ఏళ్ల చరిత్ర ఉంటే... వందలు, వేల ఏళ్లుగా ఎన్నో సంఘ సంస్కరణ, సమాన హక్కుల పోరాటాలు జరుగుతున్నాయి. ఇంకొన్ని అణచివేతల మీద తిరుగుబాట్లు.. ఇవన్నీ మనం మాట్లాడకపోయినా, మనం దాచేసినా దాగని సత్యాలు. ఇవన్నీ నిజానికి... మనం నిండు మనసుతో చేసుకోవాల్సిన దిద్దుబాట్లు. మాటలతో కాకుండా చేతలతో సమాధానాలు ఇవ్వాల్సిన అంశాలు. ఇలాంటి సమాధానాల అన్వేషణే ఆంధ్రప్రదేశ్లో మన మూడేళ్ల పాలన. దశాబ్దాల ప్రశ్నలకు సమాధానం ఆహారాన్ని పండించే రైతు అర్ధాకలితో ఉండటాన్ని, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు తరతరాలుగా గుడిసెల్లో మాత్రమే జీవించటాన్ని, గవర్నమెంటు బడికి వెళ్లే పేదల పిల్లలు కేవలం తెలుగు మీడియంలోనే చదవక తప్పని పరిస్థితిని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలు ఎప్పటికీ పనివాళ్లుగా మిగిలిపోవాలనే పెత్తందారీ పోకడల్ని, వైద్యం ఖర్చు భరించలేక, అమ్ముకునేందుకు ఏమీలేక.. అప్పటికే అప్పులపాలై నిస్సహాయంగా చనిపోవటాన్ని, చదువులకు అయ్యే ఖర్చు భరించలేక పిల్లల్ని చదువులు మాన్పించి పనిలో పెట్టాల్సివస్తే తల్లి హృదయం తల్లడిల్లటాన్ని, ఎస్సీల్లో 36 శాతం, ఎస్టీల్లో 51 శాతం నేటికీ నిరక్షరాస్యులుగానే మిగిలిపోవటాన్ని, కార్పొరేట్ విద్యా సంస్థలకోసం, అంతకంటే మెరుగైన టీచర్లు ఉన్న ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలి పెట్టటాన్ని, మనలో సగం ఉన్న అక్కచెల్లెమ్మలకు, వారి వాటాగా సగం ఉద్యోగాలు, సగం పదవులు, చట్ట సభల్లో సగం స్థానాలు కేటాయించకపోవటాన్ని, కొన్ని సామాజిక వర్గాల వారికి అధికార పదవుల్లో, పరిపాలనలో ఏనాటికీ వాటా దక్కకపోవటాన్ని, సంపద కేంద్రీకరణ ధోరణులకు తోడుగా, అధికార కేంద్రాలన్నీ ఒకేచోట ఉండాలన్న వాదనల్ని, గ్రామాల్లో ప్రభుత్వ సేవల విస్తరణ చేయకుండా పల్లెల్ని, రైతుల్ని గాలికి వదిలేయటాన్ని, ప్రతి పనికీ లంచాలు, కమీషన్ల వ్యవస్థ ఏర్పడటాన్ని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవటం ద్వారా రాజకీయ పార్టీలు ఆయా వర్గాలకు చేసిన నష్టాన్ని, ఇలాంటి దుర్మార్గాలన్నింటినీ, మన స్వతంత్ర దేశంలో... మన దేశం వాడే, మన రాష్ట్రం వాడే. మన ప్రజలకు అన్యాయం చేస్తే... దాన్నే పరిపాలన అంటాడని... ఇండిపెండెంట్గా ఉండాల్సిన మీడియా, తమ స్వార్థ ప్రయోజనాల కోసం దానికి భజన చేస్తుందని... మన స్వాతంత్య్ర సమర యోధులు, మన రాజ్యాంగ నిర్మాతలు ఏనాడైనా ఊహించారా? ఇవన్నీ మన ముందున్న ప్రశ్నలు. దశాబ్దాలుగా అనేక వర్గాల అనుభవాల నుంచి, ఆయా వర్గాలకు జరిగిన అన్యాయాల నుంచి పుట్టిన ఈ ప్రశ్నలకు.. మనందరి ప్రభుత్వంలో.. గత మూడేళ్ల పాలనతో సాధ్యమైనంత మేరకు శక్తి వంచన లేకుండా సమాధానం ఇవ్వగలిగామని సగర్వంగా తెలుపుతున్నాను. పౌర సేవల్లో విప్లవాత్మక మార్పులు మన గ్రామానికి, మన నగరానికి అందే పౌరసేవల్లో మార్పులు తీసుకువచ్చాం. ఒకటవ తేదీన సూర్యోదయానికి ముందే అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువుల పింఛన్లు వారి తలుపు తట్టి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి మరీ ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా 2.70 లక్షల మంది వలంటీర్లు ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్లే వ్యవస్థ ఏర్పాటు చేశాం. ప్రతి 2000 మందికి పౌర సేవలందించేలా గ్రామ/వార్డు సచివాలయం, అక్కడి నుంచి నాలుగు అడుగులు వేస్తే రైతులకు విత్తనం నుంచి పంట అమ్మకం వరకు అన్ని విధాలా సహాయం చేసే రైతు భరోసా కేంద్రాలు, మరో నాలుగు అడుగుల్లో కనిపించే వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు, ఇంకో నాలుగు అడుగులు వేస్తే కనిపించే ఇంగ్లిష్ మీడియం స్కూల్, మరో నాలుగు అడుగుల దూరంలోనే మీ గ్రామంలోనే నిర్మాణం కాబోతున్న డిజిటల్ గ్రంథాలయాలు, మరో నాలుగు అడుగుల దూరంలో ఇంగ్లిష్లో బోధించే ప్రీ ప్రైమరీలు, ఫౌండేషన్ స్కూళ్లు, ప్రతి మండలానికీ ఒక అధునాతన 108, ప్రతి మండలానికి రెండు పీహెచ్సీలు, ప్రతి పీహెచ్సీకీ ఒక అధునాతన 104.. అందులో ఇద్దరు డాక్టర్లను పెట్టి వారిని విలేజ్ క్లినిక్తో అనుసంధానించి అమలు కానున్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్.. ఇవన్నీ గడచిన 75 ఏళ్లలో కాదు.. కేవలం ఈ మూడేళ్లలో మనం తీసుకొచ్చిన మార్పులు. పరిపాలన వికేంద్రీకరణే మా విధానం ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేస్తూ, పర్యవేక్షణను మెరుగుపరుçస్తూ.. గ్రామాలూ, నగరాల్లో మార్పులే కాక, గత ఏడాది వరకు కేవలం 13 జిల్లాలుంటే మరో 13 జిల్లాల ఏర్పాటు ద్వారా పరిపాలన వికేంద్రీకరణలో మరో అధ్యాయాన్ని ఆరంభించాం. రాజధాని స్థాయిలో పరిపాలన వికేంద్రీకరణే మా విధానం అని.. ప్రాంతీయ ఆకాంక్షలకు, ప్రాంతాల ఆత్మగౌరవానికి, అన్ని ప్రాంతాల మధ్య సమతౌల్యంతోపాటు పటిష్ట బంధానికి ఇదే పునాది అని గట్టిగా నమ్మి అడుగులు వేస్తున్నాం. ఇదీ.. మూడేళ్లలోనే మనందరి ప్రభుత్వం మనసు పెట్టి తీసుకువచ్చిన మార్పు. వ్యవసాయానికి రూ.1.27 లక్షల కోట్ల సాయం వైఎస్సార్ రైతు భరోసాతో ఏకంగా 52 లక్షల రైతు కుటుంబాలకు ఏటా రూ.13,500 చొప్పున సహాయం అందిస్తున్నాం. రైతు భరోసా కేంద్రాలను గ్రామస్థాయిలో తీసుకువచ్చి ఈ–క్రాప్ మొదలు, ఉచిత పంటల బీమా, ఏ సీజన్లో నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోగానే అంచనా వేసి ఇన్పుట్ సబ్సిడీ అందించటం, సున్నా వడ్డీ పంట రుణాలు, పగటిపూటే 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు వంటివి అందిస్తూ మూడేళ్లలో రైతు ప్రభుత్వంగా రైతు సంక్షేమానికి మనం చేసిన ఖర్చు ఏకంగా రూ.83 వేల కోట్లు. ఇది కాకుండా ధాన్యం సేకరణకు మరో రూ. 44 వేల కోట్లకు పైగానే ఖర్చు చేసి గిట్టుబాటు ధర కల్పించాం. మొత్తంగా మూడేళ్లలో ఏకంగా రూ. 1.27 లక్షల కోట్లను వ్యవసాయంపై ఖర్చు చేశాం. దీని ఫలితంగా అంతకుముందు ఐదేళ్ల పాలనతో పోలిస్తే మన మూడేళ్ల పాలనలో ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున ఏటా 16 లక్షల టన్నులు పెరిగింది. ఇది మన ప్రభుత్వం వ్యవసాయంలో వేసిన ముందడుగు. అక్కచెల్లెమ్మలకు రూ.2–3 లక్షల కోట్ల ఆస్తి 75 ఏళ్ల స్వాతంత్య్రం తరవాత మూడేళ్ల క్రితం శాచురేషన్ పద్ధతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మన ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందులో ఏకంగా 31 లక్షల కుటుంబాలకు అంటే దాదాపు 1.25 కోట్ల జనాభాకు సొంత ఇల్లు లేదని తేలింది. వీరందరికీ ఇప్పటికే ఇళ్ళ పట్టాలు ఇచ్చాం. అది కూడా ఆ కుటుంబంలో అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్టర్ చేశాం. ఇందులో 21 లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇవి పూర్తయితే ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.7 లక్షల నుంచి రూ. 10 లక్షలు వేసుకుంటే.. 31 లక్షల మంది అక్కచెల్లెమ్మల చేతుల్లో అక్షరాలా దాదాపుగా రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల సంపదను ఉంచుతున్నాం. ఇదీ రాష్ట్ర ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు ఇస్తున్న కానుక. పిల్లల చదువులతో పేదల తలరాతల మార్పు పిల్లల చదువులతోనే ఇంటింటా పేదల తలరాతలు మార్చాలని, వారి ఇంట వెలుగులు నింపాలనే మంచి సంకల్పంతో, రూపం మార్చుకున్న అంటరానితనాన్ని తుదముట్టించాలన్న నిశ్చయంతో.. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు ఎప్పటికీ పనివాళ్లుగా మిగిలిపోవాలనే పెత్తందారీ పోకడల నడ్డివిరుస్తూ గవర్నమెంటు బడులన్నింటిలో ఇంగ్లి్ష్ మీడియంను అమలు చేయాలని నిర్ణయించాం. దీనితోపాటు పిల్లలను చదివించే తల్లులకు అండగా, తోడుగా నిలుస్తూ దేశంలోనే ఎక్కడా లేనివిధంగా జగనన్న అమ్మ ఒడి పథకాన్ని తొలిసారిగా అమలు చేస్తున్నాం. ఇవి కాకుండా వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, మనబడి–నాడు నేడు, సీబీఎస్ఈ సిలబస్, బైజూస్ సంస్థతో ఒప్పందం, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన.. ఇన్ని పథకాలతో విద్యారంగంలో తీసుకు వస్తున్న ప్రతి మార్పు వెనకా మన రాష్ట్రంలోని పిల్లలందరి భవిష్యత్తుపై మనందరి ప్రభుత్వం తీసుకున్న బాధ్యత కనిపిస్తుంది. ఇందుకోసం మూడేళ్లలో విద్యారంగంపై ఏకంగా రూ. 53 వేల కోట్లకు పైనే వ్యయం చేశాం. 95 శాతం ప్రజలకు ఆరోగ్యశ్రీతో భరోసా వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉన్నవారందరికీ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వర్తింపజేయటం ద్వారా 95 శాతం ప్రజలకు ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం. రూ. వెయ్యి ఖర్చు దాటితే ఉచితంగా వైద్యం అందించాలన్న తపనతోనే 2,434 ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీలో చేర్చాం. వీటిని ఈ నెలలోగా 3,133కు పెంచుతున్నాం. ఆపరేషన్ తర్వాత రోగులు కోలుకునే సమయంలో వారికి దన్నుగా నెలకు రూ.5 వేలు వైఎస్సార్ ఆరోగ్య ఆసరాగా ఇస్తున్నాం. ఎమర్జెన్సీలో ప్రాణాలు రక్షించే 108, 104 సేవలకు అర్థం చెపుతూ ఏకంగా 1,088 వాహనాల్ని ప్రతి మండలానికీ పంపాం. వీటిని మరింతగా పెంచుతూ మరో 432 వాహనాలను పంపనున్నాం. గ్రామగ్రామానా వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు ఏర్పాటవుతున్నాయి. వీటితో పీహెచ్సీలు అనుసంధానమై గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్కు బీజం పడనుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 11 టీచింగ్ ఆస్పత్రులు ఉంటే, కొత్తగా మరో 16 వైద్య బోధనాస్పత్రులను నిర్మిస్తున్నాం. గ్రామం నుంచి జిల్లా వరకు ఆసుపత్రుల రూపాన్ని, సేవల్ని, సదుపాయాల్ని మార్చేస్తూ.. జాతీయ ప్రమాణాలతో వైద్యాన్ని అందించటానికి వైద్య రంగంలో రూ.16వేల కోట్లతో నాడు–నేడు అమలు చేస్తున్నాం. ఈ ఒక్క రంగంలోనే అక్షరాలా 40 వేల కొత్త ఉద్యోగాలు ఇచ్చాం. మూడేళ్లలో 6.03 లక్షల మందికి ఉద్యోగాలు ఒకవైపు ప్రభుత్వ బడుల్ని, మరో వైపు ప్రభుత్వ ఆస్పత్రుల్ని మెరుగుపరచడమే కాకుండా ఈ మూడేళ్లలోనే మొత్తంగా 6.03 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇందులో 1.84 లక్షల శాశ్వత ప్రభుత్వోద్యోగాలతోపాటు, 20 వేల కాంట్రాక్టు ఉద్యోగాలు, 4 లక్షల ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించాం. వీరంతా మన కళ్ల ఎదుటే గ్రామ/వార్డు సచివాలయాల్లో, గ్రామాల్లో వలంటీర్లుగా, ఆర్టీసీలో, మారుతున్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనిపిస్తారు. పారిశ్రామిక రంగానికి ఊతం దాదాపు నాలుగు దశాబ్దాల తరవాత ప్రభుత్వ రంగంలో మరో నాలుగు సీ పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం. సువిశాల సముద్ర తీరంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక సీ పోర్టు, ఫిషింగ్ హార్బర్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. కుదేలైన ఎంఎస్ఎంఈ రంగాన్ని నిలబెడుతూ 10లక్షల మంది ఉపాధికి భరోసానిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాం. ఏపీ నుంచే 21వ శతాబ్దపు ఆధునిక మహిళ 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్లోనే ఆవిర్భవించాలన్న లక్ష్యంతో మహిళా సాధికారతలో దేశంలో ఏ ప్రభుత్వం వేయని అడుగులు వేస్తున్నాం. 44.5 లక్షల తల్లులకు, 85 లక్షల పిల్లలకు మంచి జరిగేలా మూడేళ్లలో జగనన్న అమ్మ ఒడి ద్వారా రూ.19,618 కోట్లు, వైఎస్సార్ ఆసరా ద్వారా 78.74 లక్షల డ్వాక్రా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రూ. 12,758 కోట్లు, వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా కోటీ రెండు లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.3,615 కోట్లు అందించాం. వైఎస్సార్ చేయూత ద్వారా 24.96 లక్షల మంది 45–60 మధ్య వయసున్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఇప్పటికే రూ. 9,180 కోట్ల లబ్ధి చేకూర్చాం. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా మరో రూ. 1,492 కోట్లు, వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా రూ.589 కోట్లతో తోడ్పాటునందించాం. ఈ సొమ్ముకు బ్యాంకుల ద్వారా మరింత రుణ సదుపాయంతో, ప్రముఖ కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబనకు చేయూత ఇస్తున్నాం. అక్కచెల్లెమ్మలకు దన్నుగా నిలిచాం అక్కచెల్లెమ్మలకు ఆలయ బోర్డుల నుంచి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల వరకు ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల వరకు ప్రతి ఒక్క రాజకీయ నియామకంలోనూ, నామినేషన్ కాంట్రాక్టుల్లోను 50 శాతం రిజర్వేషన్లు చట్టం చేసి మరీ అమలు చేసిన ప్రభుత్వం కూడా భారతదేశ చరిత్రలో మనం మాత్రమే. దిశ చట్టానికి రూప కల్పన, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం, ప్రతి రెండు వేల జనాభాకూ గ్రామంలోనే ఒక మహిళా పోలీస్ నియామకం.. ఇవన్నీ మహిళా రక్షణపరంగా మనందరి ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలు. సామాజిక న్యాయ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదటి విడత 56 శాతం, రెండో విడతలో 70 శాతం మంత్రిమండలి పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చాం. రెండు మంత్రివర్గాల్లోనూ ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే.. నాలుగు(80శాతం) నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకే అవకాశం కల్పించాం. శాసనసభ స్పీకర్గా ఒక బీసీ, శాసన మండలి చైర్మన్గా ఎస్సీని నియమించడమే కాకుండా శాసన మండలి డిప్యూటీ ౖచైర్పర్సన్గా మైనార్టీ అక్కకు స్థానం ఇచ్చి సామాజిక న్యాయ చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించాం. ఈ మూడేళ్లలో రాజ్యసభకు 8 మందిని పంపిస్తే అందులో నలుగురు బీసీలు, శాసన మండలికి అధికారపార్టీ నుంచి పంపిన 32 మందిలో 18 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే. పరిషత్ ఎన్నికల్లో 13కు 13 జిల్లా పరిషత్లను అధికారపార్టీ దక్కించుకుంటే వీటిలో చైర్పర్సన్ పదవుల్లో ఏకంగా తొమ్మిది (70శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించాం. నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసి అమలు చేసిన తొలి ప్రభుత్వం కూడా మనదే. అందులోనూ 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించిన మొదటి ప్రభుత్వం కూడా మనదే. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58 శాతం పదవులు ఇచ్చాం. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్ను నూతనంగా ఏర్పాటు చేశాం. వీటితోపాటు శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ను నియమించిన ఘనత, 139 బీసీ కులాలకు సంబంధించి కొత్తగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వం కూడా మనదే. మండల పరిషత్ చైర్మన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్లు ఇలా ఎక్కడ చూసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఎక్కువగా కనిపిస్తున్నారన్నది సత్యం. 95 శాతం హామీలు అమలు మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావించి మూడేళ్లలోనే 95 శాతం వాగ్దానాలు అమలు చేశాం. పేదవాడి ఆర్తిని, అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకున్నాం. ఈ దేశంలోని అత్యంత నిస్సహాయుడి కంటిలో నీరు తుడవటానికి మన ప్రభుత్వాలు, వాటి అధికారం ఉపయోగపడాలన్న మహాత్ముడి మాటల్ని తొలి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఉటంకించారు. ఈ భావాలను మనసా వాచా కర్మణా.. త్రికరణ శుద్ధిగా అమలు చేస్తున్నాం. ప్రజాస్వామ్యానికి అర్థం చెబుతూ ప్రజలతోపాటు ప్రాంతాలకూ న్యాయం చేస్తూ గడపగడపకూ సంక్షేమం, అభివృద్ధి ఫలాలను అందిస్తూ మన సమాజంలో వెనుకబాటు, నిరక్షరాస్యత, సామాజిక అభద్రత, రాజకీయ అణచివేత, ఆర్థిక అవకాశాల లేమి వంటి ప్రతి అంశంపై సంపూర్ణమైన విజయం సాధించే దిశగా భావపరమైన పోరాటం కొనసాగుతుంది. గొప్పదైన ఈ దేశానికి, దేశ ప్రజలకు ప్రణామాలు సమర్పించుకుంటూ, దేవుడి ఆశీస్సులు, ప్రజలందరి చల్లని దీవెనలు మనందరి ప్రభుత్వానికీ కలకాలం ఉండాలి. ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ కె మోషేన్రాజు, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతిరెడ్డి కూడా హాజరయ్యారు. -
సుసంపన్న భారతం.. పాతికేళ్ల లక్ష్యం.. పంచ ప్రతిజ్ఞలతో సాకారం
న్యూఢిల్లీ: అమృతోత్సవ సంబరాల్లో ఆసేతుహిమాచలం తడిసి ముద్దయింది. ఏ ఇంటిపై చూసినా త్రివర్ణ పతాక రెపరెపలే కన్పించాయి. ఎక్కడ చూసినా స్వాతంత్య్ర స్ఫూర్తి వెల్లివిరిసింది. 76వ స్వాతంత్య్ర దినాన్ని సోమవారం దేశమంతా ఘనంగా జరుపుకుంది. ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని, రాష్ట్రాల రాజధానుల్లో ముఖ్యమంత్రులు జెండా ఎగురవేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు సర్వత్రా మువ్వన్నెల జెండా సగర్వంగా ఎగిరింది. చిన్నా పెద్దా అంతా ఉత్సవాల్లో పాల్గొని జోష్ పెంచారు. జెండాలు చేబూని ర్యాలీలు, ప్రదర్శనలతో అలరించారు. వలస పాలనను అంతం చేసేందుకు అమర వీరులు చేసిన అపూర్వ త్యాగాలను మనసారా స్మరించుకున్నారు. దేశాభివృద్ధికి, జాతి నిర్మాణానికి పునరంకితమవుతామంటూ ప్రతిజ్ఞ చేశారు. భారత నౌకా దళం ఆరు ఖండాల్లో పంద్రాగస్టు వేడుకలు జరిపి దేశవాసుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచింది. ‘అమృతోత్సవ భారతం ఇక అతి పెద్ద లక్ష్యాలనే నిర్దేశించుకోవాలి. రానున్న పాతికేళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు సంకల్పించుకోవాలి’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఇందుకు పంచ ప్రతిజ్ఞలు చేసుకుందామంటూ పిలుపునిచ్చారు. ‘మన ఘన వారసత్వం, తిరుగులేని ఐక్యతా శక్తి, సమగ్రత పట్ల గర్వపడదాం. ప్రధాని, ముఖ్యమంత్రులు మొదలుకుని సామాన్యుల దాకా పూర్తి చిత్తశుద్ధితో బాధ్యతలను నెరవేరుద్దాం. తద్వారా వందేళ్ల వేడుకల నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకుందాం’’ అని ప్రజలను కోరారు. ‘‘అవినీతి, బంధుప్రీతి జాతిని పట్టి పీడిస్తున్నాయి. వారసత్వ పోకడలు దేశం ముందున్న మరో అతి పెద్ద సవాలు. రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లోనూ తిష్ట వేసిన ఈ అతి పెద్ద జాఢ్యాల బారినుంచి దేశాన్ని విముక్తం చేయాల్సిన సమయమిదే’ అన్నారు. 76వ స్వాతంత్య్ర దినం సందర్భంగా సోమవారం ఉదయం ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా సంప్రదాయ కుర్తా, చుడీదార్, బ్లూ జాకెట్, త్రివర్ణాల మేళవింపుతో కూడిన అందమైన తలపాగా ధరించారు. అనంతరం పూర్తిగా దేశీయంగా తయారు చేసిన ఏటీఏజీఎస్ శతఘ్నుల ‘21 గన్ సెల్యూట్’ నడుమ జాతీయ జెండాకు వందనం చేశారు. ప్రధానిగా పంద్రాగస్టున ఆయన పతాకావిష్కరణ చేయడం ఇది వరుసగా తొమ్మిదోసారి. అనంతరం గాంధీ మొదలుకుని అల్లూరి దాకా దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధులందరికీ పేరుపేరునా ఘన నివాళులర్పించారు. తర్వాత జాతినుద్దేశించి 82 నిమిషాల పాటు ప్రసంగించారు. గత ప్రసంగాల్లా ఈసారి కొత్త పథకాలేవీ ప్రధాని ప్రకటించలేదు. దోచిందంతా కక్కిస్తాం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ కక్షసాధింపు కోసం కేంద్రం వాడుకుంటోందన్న విపక్షాల విమర్శలను మోదీ తిప్పికొట్టారు. ‘ఒకవైపు దేశంలో కోట్లాది మందికి తలదాచుకునే నీడ లేదు. మరోవైపు కొందరు మాత్రం దాచుకోవడానికి ఎంతటి చోటూ చాలనంతగా అక్రమార్జనకు పాల్పడ్డ తీరును ప్రజలంతా ఇటీవల కళ్లారా చూశారు’ అంటూ విపక్ష నేతలు తదితరుల నివాసాలపై ఈడీ, ఐటీ దాడుల్లో భారీ నగదు బయట పడుతుండటాన్ని ప్రస్తావించారు. ‘అవినీతిని సంపూర్ణంగా ద్వేషిస్తే తప్ప ఇలాంటి ధోరణి మారదు. అవినీతిని, అవినీతిపరులను సమాజమంతా అసహ్యించుకోవాలి’ అని పిలుపునిచ్చారు. ‘గత ఎనిమిదేళ్లలో రూ.2 లక్షల కోట్ల నల్ల ధనాన్ని వెలికితీసి ప్రత్యక్ష పథకాల ద్వారా నగదు రూపేణా బదిలీ చేసి దేశాభివృద్ధికి పెట్టుబడిగా పెట్టాం. బ్యాంకులను దోచి దేశం వీడి పారిపోయిన వారిని వెనక్కు రప్పించే పనిలో ఉన్నాం. వారి ఆస్తులను ఇప్పటికే జప్తు చేశాం. దేశాన్ని దోచుకున్న వాళ్లనుంచి అంతకంతా కక్కించి తీరతాం. అందుకు రంగం సిద్ధం చేస్తున్నాం. వాళ్లెంత పెద్దవాళ్లయినా సరే, తప్పించుకోలేరు’’ అని హెచ్చరించారు. ‘దేశ నైపుణ్యానికి, సామర్థ్యానికి బంధుప్రీతి తీరని హాని చేస్తోంది. దేశ ఉజ్వల భవిత కోసం దీనికి అడ్డుకట్ట వేయాల్సిందే. దీన్ని నా ప్రజాస్వామిక, రాజ్యాంగపరమైన బాధ్యతగా కూడా భావిస్తా. రాజకీయాల్లో కూడా వారసత్వాలు దేశ సామర్థ్యాన్ని ఎంతగానో కుంగదీశాయి. వారసత్వ రాజకీయాలకు పాల్పడే వారికి కుటుంబ క్షేమమే పరమావధి. దేశ సంక్షేమం అసలే పట్టదు’’ అంటూ దుయ్యబట్టారు. రాజకీయాలను, వ్యవస్థలను పరిశుభ్రం చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలంతా తనతో చేతులు కలపాలన్నారు. అలసత్వం అసలే వద్దు స్వాతంత్య్రం సిద్ధించిన ఈ 75 ఏళ్లలో ఎంతో సాధించేశామన్న అలసత్వానికి అస్సలు తావీయొద్దని ప్రధాని అన్నారు. ‘‘మన వ్యక్తిగత కలలను, ఆకాంక్షలను, సామాజిక లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు వచ్చే పాతికేళ్ల కాలం సువర్ణావకాశం. స్వతంత్య్ర యోధుల కలలను సాకారం చేసేందుకు కంకణబద్ధులవుదాం. స్వాతంత్య్ర ఫలాలను, అధికార ప్రయోజనాలను చిట్టచివరి నిరుపేదకు కూడా సంపూర్ణంగా అందించాలన్న మహాత్ముని ఆకాంక్షను నెరవేర్చేందుకు నేను కట్టుబడ్డా’’ అని చెప్పారు. సమాఖ్య భావనకే పెద్దపీట బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలను బలహీన పరుస్తోందన్న విమర్శలను మోదీ తిప్పికొట్టారు. ‘‘కేంద్ర రాష్ట్రాలు కలసికట్టుగా పని చేయాలనే సహకారాత్మక సమాఖ్య భావనను, ‘టీమిండియా’ స్ఫూర్తిని నేను సంపూర్ణంగా నమ్ముతానన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో గుజరాత్ సీఎంగా దాన్ని ఆచరణలో చూపించా’’నని చెప్పారు. దేశాన్ని కలసికట్టుగా అభివృద్ధి చేద్దామని విపక్షాలకు పిలుపునిచ్చారు. ఈ విషయంలో పోటీపడదామని సూచించారు. త్వరలో 5జీ సేవలు ఇది టెక్నాలజీ దశాబ్ది. ఈ రంగంలో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ ప్రపంచ సారథిగా ఎదుగుతున్నాం. 5జీ మొబైల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఊరూరికీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్, కామన్ సర్వీసెస్ సెంటర్లు అందనున్నాయి. కొత్త పారిశ్రామిక వృద్ధి విప్లవం మారుమూలల్లోంచే రానుంది. విద్య, వైద్య సేవల్లో డిజిటల్ మాధ్యమం విప్లవాత్మక మార్పులు తేనుంది. పరిశోధన, నవకల్పనలే అజెండాగా ‘జై అనుసంధాన్’కు సమయమిదే. ప్రపంచ డిజిటల్ పేమెంట్లలో 40 శాతం వాటా మనదే. యూపీఐల విస్తృతే అందుకు కారణం. మిషన్ హైడ్రోజన్, సౌర శక్తిని అందిపుచ్చుకోవడం తదితరాల ద్వారా ఇంధన రంగంలో స్వావలంబన సాధిద్దాం. క్రమశిక్షణ, జవాబుదారీతనమే విజయానికి మూలసూత్రాలు. సేంద్రియ సాగుకు జై కొడదాం. రక్షణరంగం సూపర్ మేకిన్ ఇండియా, ఆత్మనిర్భరత లక్ష్యాల సాధనకు రక్షణ బలగాలు ఎంతగానో పాటుపడుతున్నాయి. ఫలితంగా బ్రహ్మోస్ వంటి సూపర్సోనిక్ క్షిపణులను దేశీయంగా తయారు చేసి ఎగుమతి చేసే స్థాయికి చేరాం. ఇందుకు మన సైనికులకు మనస్ఫూర్తిగా అభినందనలు. ఎలక్టాన్రిక్ వస్తువులు మొదలుకుని అత్యాధునిక క్షిపణుల దాకా తయారు చేసే హబ్గా భారత్ మారుతోంది. విదేశీ బొమ్మలొద్దని, దేశీయ ఆట బొమ్మలతోనే ఆడుకుంటామని తమ పిల్లలంటున్నారని ఎంతోమంది తల్లిదండ్రులు చెబుతుంటే విని పులకించిపోతున్నా. ఆ ఐదారేళ్ల చిన్నారులకు నా సెల్యూట్. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తికిది తిరుగులేని సంకేతం. మహిళలే వృద్ధికి మూలం ప్రజాస్వామ్యాలన్నింటికీ మాతృక మన దేశమే. భిన్నత్వంలో ఏకత్వమే మన మూల బలం. అంతటి కీలకమైన ఐక్యతను సాధించాలంటే లింగ సమానత్వం అత్యంత కీలకం. మహిళలను అవమానించే ధోరణి మనలో అప్పుడప్పుడూ తొంగి చూస్తుండటం దురదృష్టకరం. ఈ జాఢ్యాన్ని మనలోంచి పూర్తిగా పారదోలుతామంటూ ప్రతినబూనుదాం. మాటల్లో గానీ, చేతల్లో గానీ మహిళల ఔన్నత్యాన్ని కించపరచొద్దు. కొడుకును, కూతురినీ సమానంగా చూడటం ద్వారా ఇందుకు ఇంట్లోనే పునాది పడాలి. ఎందుకంటే మన కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శం. స్త్రీలను గౌరవించడం మన దేశ వృద్ధికి ముఖ్యమైన మూల స్తంభమని గుర్తుంచుకోవాలి. మెరిసిన ఎర్రకోట పంద్రాగస్టు వేడుకల సందర్భంగా మువ్వన్నెల అలంకరణలతో ఎర్రకోట మెరిసిపోయింది. స్వాతంత్య్ర పోరాటంలోని కీలక ఘట్టాలకు సంబంధించిన చిత్రాలు కోట గోడలపై కనువిందు చేశాయి. కోట ప్రాంగణం, పరిసరాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చదవండి: సంక్షేమ తెలంగాణం.. ఎన్నో పథకాల్లో దేశానికే ఆదర్శం -
త్వరలో ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం పద్రాగస్టు రోజున తీపి కబురు చెప్పింది. పెండింగ్లో ఉన్న డీఏను త్వరలో అందజేయనున్నట్లు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్రెడ్డి తెలిపారు. సోమవారం బస్భవన్లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సెప్టెంబర్ నెల జీతభత్యాలతో పాటు డీఏను కూడా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగులకు చెల్లించవలసిన రూ.వెయ్యి కోట్ల బకాయీలను కూడా అందజేయనున్నట్లు చెప్పారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను బస్భవన్లో ఘనంగా నిర్వహించారు. సంస్థ ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులు, ఉద్యోగులు, కండక్టర్లు, డ్రైవర్లు ఈ వేడుకలలో పాల్గొన్నారు. గ్రేటర్లో అల్బియాన్ బస్సు.. డెక్కన్ క్వీన్గా పేరొందిన 1932 నాటి అల్బియాన్ బస్సును హైదరా బాద్లోని ప్రధాన రోడ్లపై ప్రదర్శించనున్నట్లు చైర్మన్ బాజిరెడ్డి తెలిపారు. అలాగే ఈ బస్సు విశేషాలను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు తెలియజేయనున్నట్లు చెప్పారు. మరోవైపు ఆర్టీసీలో బీడబ్ల్యూఎస్ పథకం ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆయన వివరించారు. త్వరలో 300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఘన సన్మానం.. ఈ వేడుకలలో భాగంగా నిజాం ప్రభుత్వ రోడ్డు రవాణా విభాగంలో పని చేసిన నరసింహ (97), ఎం.సత్తయ్య (92)లను ఆర్టీసీ ఘనంగా సన్మానించింది. తమను గుర్తించి సన్మానించడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఆర్టీసీ నుంచి లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. -
హైదరాబాద్లో మురిసిన మువ్వన్నెల జెండా (ఫొటోలు)
-
75 ఏళ్ల స్వతంత్ర భారతంలో.. రోడ్డుకు నోచుకోని తండాలు
సాక్షి, వికారాబాద్: స్వాతంత్య్రం వచ్చి వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నా గిరిపుత్రులు నేటికీ కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదు. తండాలు పంచాయతీలుగా మారినా వాటి దుస్థితి మారలేదు. రోడ్డు సౌకర్యంలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణాపాయ పరిస్థితుల్లోనూ కనీసం అంబులెన్స్లు కూడా రాలేని దుర్భర పరిస్థితులు కొనసాగుతున్నాయి. బషీరాబాద్ మండలంలోని ఐదు గిరిజన తండాలకు నేటికీ రవాణా వ్యవస్థ లేకపోవడంతో కాలినడకనే దిక్కవుతోంది. మండలంలోని బోజ్యానాయక్తండా, బాబునాయక్ తండా, హంక్యానాయక్ తండా, వాల్యానాయక్తండా, పర్శానాయక్, తౌర్యనాయక్తండాలకు రోడ్డు సౌకర్యాలు లేవు. ప్రభుత్వం 2018లో ఎస్టీఎస్డీఎఫ్ (గిరిజన సొసైటీ డెవలప్మెంట్ ఫండ్) కింద రూ.4.28 కోట్ల నిధులను విడుదల చేస్తూ జీఓ 369 విడుదల చేసింది. అయితే ఆ యేడాదిలో వరుసగా వచ్చిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ పనులకు సంబంధించిన టెండర్లు వాయిదా పడుతూవచ్చాయి. తీరా 2020 మేలో పనులకు టెండర్లు పిలువగా అప్పట్లోనే ఇద్దరు కాంట్రాక్టర్లు అగ్రిమెంట్లు చేసుకున్నారు. దీంతో 2020 జూన్ 5న మంత్రి సబితారెడ్డి రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు. రెండు నెలల్లో రోడ్లువేసి బస్సు సర్వీసులు కూడా నడిపిస్తామని అప్పట్లో మంత్రి గిరిజనులకు హామీ ఇచ్చారు. అయితే వాల్యానాయక్తండా రోడ్డు తప్ప నేటికీ మిగతా ఐదు తండాలకు రోడ్డు పనులు ప్రారంభించలేదు. స్వాతంత్య్రం వచ్చి వజ్రోత్సవాలు ఒకవైపు జరుపుతుండగా గిరిజన తండాల రోడ్లకు మోక్షం లభించడంలేదని తండావాసులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. ఈ తండాలకు చెందిన గిరిజనులు బషీరాబాద్కు రావాలంటే రెండు మూడు కిలోమీటర్లు నడవాల్సిందే. ప్రాణాలు పోతున్నా పట్టింపులేదు మాసన్పల్లి అనుబంధ గ్రామం తౌర్యనాయక్తండాకు రోడ్డు సౌకర్యంలేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యం బారిన పడిన ముగ్గురు వ్యక్తులు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో సకాలంలో ఆస్పత్రికి చేరుకోక ప్రాణాలు కోల్పోయారు. కనీసం ద్విచక్రవాహనం కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. ఎన్నోసార్లు రోడ్డు వేయాలని ఆందోళనలు చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదు. – భీమప్ప, సర్పంచ్, మాసన్పల్లి కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు మండలంలోని బోజ్యానాయక్, బాబునాయక్, హంక్యానాయక్, తౌర్యానాయక్, వాల్యానాయక్తండాలకు రూ.4.28 కోట్ల ఎస్టీఎస్డీఎఫ్ నిధులు మంజూరు అయ్యాయి. ఈ పనులకు 2020లోనే అగ్రిమెంట్లు పూర్తిఅయ్యాయి. వాల్యానాయక్తండా పనులు పూర్తి అయ్యాయి. తౌర్యానాయక్తండా రోడ్డులో కల్వర్టు పనులు చేశాం. అయితే నిధులులేమి కారణంతో కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకు రావడంలేదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – వంశీ కృష్ణ, ఏఈ, పీఆర్ గిరిజన భావాలకు అక్షరమేదీ? బొంరాస్పేట: గిరిజన తెగళ్లోని లంబాడీ, గోండు, ఎరుకల వారికి ఇప్పటికీ లిపి లేకపోయింది. ఈ తెగల వారు మాతృభాషలో మాట్లాడుకోవడం తప్ప అక్షరాలు రాయలేని పరిస్థితి. మాతృభాష ఒకటి, చదువు నేర్చేది మరో భాష కావడంతో తోటి విద్యార్థులతో తగినంత ప్రతిభ కనబర్చలేకపోతున్నారు. వివిధ మండలాల్లో గోండు, నాయకి, పర్జీ, గదవ వంటి మాృభాష కలిగిన వారున్నారు. లంబాడీ, ఎరుకల, బుడగజంగం తెగల వారికి లిపి లేదు. కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల కంటే బొంరాస్పేటలో అత్యధికంగా 70కిపైగా గిరిజన తండాలున్నాయి. గిరిజన పిల్లలు మాతృభాషను మాట్లాడుకోవడానికే పరిమితమవుతున్నారు. చదువుకోవడంలో తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలపై ఆధారపడాల్సి వస్తోంది. గిరిజన విద్యార్థులకు విద్యాబోధనలో ఉపాధ్యాయులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం ఆలోచించి గిరిజన తెగల మాతృభాషలకు లిపి కల్పించాలని కోరుతున్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేళ పలువురి అభిప్రాయాలు ఇలా.. లిపి రూపొందించాలి జనాభాలో 25 శాతానికిపైగా గిరిజన తెగల వారు ఉన్నారు. ముఖ్యంగా జిల్లాలో ఎక్కువగా గిరిజనులు ఉన్నారు. లంబాడీ భాషలో మాట్లాడే వారికి తెలుగులో చదవడం ఇబ్బంది ఏర్పడుతోంది. తోటి విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నారు. లంబాడీతోపాటు గిరిజనుల భాషకు లిపి రూపొందించాలి. – విజయలక్షి, గిరిజన ఉపాధ్యాయురాలు తోటివారితో పోటీపడలేక.. మాతృభాష లంబాడీని సునాయాసంగా మాట్లాడుతున్నాం. తెలుగు, ఇతర భాషల్లో అంతగా మాట్లాడలేక పోతున్నాం. లంబాడ యాసలో మాట్లాడితే నవ్వుకుంటున్నారు. చదువులో ఇంకా ఇబ్బందిగా ఉంది. మిగతా విద్యార్థులకు మాతృభాష, చదువుకునే భాష ఒకటేకావడంతో చురుకుగా ఉన్నారు. – శాంతి, గిరిజన విద్యార్థిని, బాపల్లి -
జానపద కళాకారులతో సీఎం మమతా బెనర్జీ డ్యాన్స్.. వీడియో వైరల్
కోల్కతా: భారత్కు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. చిన్న, పెద్ద, ధనిక, పేద తేడా లేకుండా సంబరాలు చేసుకుంటున్నారు. ఈక్రమంలో ఎప్పుడు రాజకీయాలతో బిజీగా ఉండే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వాతంత్ర్య వేడుకల్లో సరదాగా గడిపారు. కోల్కతాలో స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మమతా బెనర్జీ.. జానపద నృత్య కళాకరులతో కలిసి డ్యాన్స్ చేశారు. అక్కడి మహిళల చేతుల్లో చేయి కలిపి స్టెప్పులేశారు. ఇక వారితో డ్యాన్స్ అనంతరం ఆమెకు గౌరవంగా.. అక్కడ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులంతా నిలబడి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. చదవండి: సావర్కర్ పోస్టర్ ఏర్పాటుపై ఉద్రిక్తత.. కర్ఫ్యూ విధింపు! #WATCH | West Bengal CM Mamata Banerjee joins the folk artists as they perform at the #IndependenceDay celebrations in Kolkata.#IndiaAt75 pic.twitter.com/9bvyxFm4qz — ANI (@ANI) August 15, 2022 -
సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
-
76 వ ఇండిపెండెన్స్ డే: తొలిసారి మేడిన్ ఇండియా గన్
న్యూఢిల్లీ: 75వ స్వాతంత్ర్య దినోత్సవం మరో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆగస్టు 15న ఎర్రకోట వద్ద గౌరవ వందనం కోసం మేడ్-ఇన్-ఇండియా తుపాకీని తొలిసారి ఉపయోగించారు. ఇప్పటి వరకు సెర్మోనియల్ సెల్యూట్ కోసం బ్రిటీష్ తుపాకులను ఉపయోగించారు. అంతేకాదు ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తొలిసారిగా ఎంఐ-17 హెలికాప్టర్లు ఎర్రకోటపై పూల వర్షం కురిపించాయి. స్వదేశీ అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ హోవిట్జర్ గన్ను కేంద్రం ఆధ్వర్యంలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) రూపొందించింది. ఈ గన్తోనే స్వాతంత్ర్య దినోత్సవం రోజున చారిత్రాత్మకమైన ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకానికి 21-షాట్ల గౌరవ వందనం లభించింది. "మనం ఎప్పటినుంచో వినాలనుకునే శబ్దాన్ని 75 ఏళ్ల తర్వాత వింటున్నాం. 75 ఏళ్ల తర్వాత ఎర్రకోట వద్ద తొలిసారిగా భారత్లో తయారు చేసిన తుపాకీతో త్రివర్ణ పతాకానికి గౌరవ వందనం లభించింది" అని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ఈ మేడ్-ఇన్-ఇండియా తుపాకీ గర్జనతో భారతీయులందరూ స్ఫూర్తి పొంది, మరింత శక్తివంతం అవుతారని మోదీ పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నందుకు సాయుధ దళాల సిబ్బందిని ప్రధాని ప్రశంసించారు. #WATCH | Made in India ATAGS howitzer firing as part of the 21 gun salute on the #IndependenceDay this year, at the Red Fort in Delhi. #IndiaAt75 (Source: DRDO) pic.twitter.com/UmBMPPO6a7 — ANI (@ANI) August 15, 2022 For the first time, MI-17 helicopters shower flowers at the Red Fort during Independence Day celebrations. #IDAY2022 #IndependenceDay2022 #स्वतंत्रतादिवस pic.twitter.com/j1eQjIoZAn — PIB India (@PIB_India) August 15, 2022 -
విశాఖలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి విడదల రజని
-
నెల్లూరు జిల్లాలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
-
పోలీసులకు సేవా పతకాలను అందజేసిన సీఎం జగన్
-
భారత్కు అంతరిక్ష కేంద్రం నుంచి వెల్లువెత్తిన శుభాకాంక్షలు
India celebrates its Independence Day not world But Space Well: భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేవలం ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా అంతరిక్షం నుంచి కూడా భారత్కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు భారతీయ అమెరికన్ వ్యోమోగామి రాజా చారి ట్విట్టర్లో విదేశాల్లో నివశిస్తున్న భారతీయులకు శుభాకాంక్షల సందేశాలతోపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో భారతీయ జెండా ఫోటోను కూడా పోస్ట్ చేశారు. రాజా చారి ఇటీవల ఐఎస్ఎస్లో ఆరునెలల మిషన్ తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. మే నెలలో గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో సురక్షితంగా ల్యాండ్ చేసిన స్పేఎక్స్ అంతరిక్ష నౌకలో నలుగురు వ్యోమోగాములలో అతను కూడా ఉన్నారు. ఈ మేరకు చారి ట్విట్టర్లో.... " భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నా పూర్వీకుల మూలాలను గుర్తుతెచ్చుకుంటునమ్నాను. వలస వచ్చిన తన తండ్రి స్వస్థలం హైదరాబాద్ ఈ రోజు మెరిసిపోతుంది. యూఎస్లో ఉండే ప్రతి భారతీయ అమెరికన్కి ప్రతిరోజు ఒక వైవిధ్యంగా ఉంటుంది. తాను యూఎస్లోని ఇండియన్ ఎంబసీ వేడుకల కోసం ఎదురుచూస్తున్నాను. అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులందరికి స్వాతంత్య్ర శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు. చారి తాతగారిది తెలంగాణలోని మహబూబ్ నగర్. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో గణిత శాస్త్ర ప్రోఫెసర్గా పనిచేశారు. చారి తండ్రి శ్రీనివాస్ అదే యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివి ఆ తర్వాత అమెరికా వెళ్లారు. ఆ తర్వాత చారీ అక్కడే యూఎస్లోని విస్కాన్సిన్లోని మిల్వాకీలో జన్మించాడు. అయోవాలోని వాటర్లూలో కొలంబస్ హై స్కూల్ నుంచి ప్రాధమిక విద్యను, కొలరాడోలోని యూఎస్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుంచి ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశడు. ఆ తర్వాత అతను కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటిక్స్, ఆస్ట్రోనాటిక్స్లో మాస్టర్స్ డిగ్రీని అందుకున్నాడు. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా కోసం పనిచేస్తున్న రాజా చారి 2017లో వ్యోమోగామిగా ఎంపికయ్యాడు. On Indian Independence eve I’m reminded of Indian diaspora that I could see from @Space_Station where my immigrant father’s home town of Hyderabad shines bright. @nasa is just 1 place Indian Americans make a difference every day. Looking forward to @IndianEmbassyUS celebration pic.twitter.com/4eXWHd49q6 — Raja Chari (@Astro_Raja) August 14, 2022 (చదవండి: భారత్తో పాటు ఇతర దేశాలకు హృదయ పూర్వక కృతజ్ఞతలు) -
ఇలాంటి సమాధానాల అన్వేషణే మన మూడేళ్ల పాలన: సీఎం జగన్
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు. దీనిలో భాగంగా ముందుగా జాతీయ జెండా ఆవిష్కరించారు సీఎం జగన్. అనంతరం ఆయన సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఆపై తన అద్భుతమైన ప్రసంగంతో సీఎం జగన్ ఆకట్టుకున్నారు.( చదవండి: స్వాతంత్ర పోరాటం మహోన్నతం.. ప్రపంచంతో పోటీపడి ప్రగతి సాధన: ఏపీ సీఎం జగన్) అంతర్జాతీయంగా భారత్ సాధించిన విజయాలకు కొదవ లేదన్నది ఎంత వాస్తవమో, దేశంగా ఇండియాకు వచ్చిన ఈ స్వతంత్రం... వ్యక్తులుగా, కులాలుగా, ప్రాంతాలుగా, జెండర్లగా తమకు పూర్తిగా అందలేదన్న భావన కొన్ని సమూహాల్లో, కొన్ని ప్రాంతాల్లో, అనేకమంది ప్రజల్లో నేటికీ ఉండిపోయిందన్నది కూడా అంతే వాస్తవమన్నారు. దేశ స్వాతంత్రానికి 75 ఏళ్ల చరిత్ర ఉంటే... మరోవంక, సమ సమాజం కోసం, సామాజిక న్యాయం కోసం, చదువుకునే హక్కు కోసం, మహిళల సమాన హక్కుల కోసం, మనుషులుగా గుర్తింపు కోసం, దోపిడీకి గురి కాకుండా జీవించే రక్షణల కోసం... ఈ గడ్డమీద జరుగుతున్న పోరాటాలకు వందలూ వేల ఏళ్ళ చరిత్ర ఉందని సీఎం జగన్ మరోసారి గుర్తు చేశారు. ఇవన్నీ పరాయి దేశం మీద మనం చేసిన స్వాతంత్య్ర పోరాటాలు కావని, ఇవన్నీ మన సమాజంలో జరుగుతున్న సామాజిక స్వాతంత్ర్య పోరాటాలన్నారు. ఈ పోరాటాల్లో కొన్ని సంఘ సంస్కరణ పోరాటాలు!ఇందులో కొన్ని సమాన హక్కుల పోరాటాలు! మరి కొన్ని అణచివేతల మీద మాట్లాడకపోయినా, మనం తిరుగుబాట్లు! ఇవన్నీ మనం దాచేసినా దాగని సత్యాలు! ఇవన్ని నిజానికి... మనం నిండు మనసుతో చేసుకోవాల్సిన దిద్దుబాట్లు అని అన్నారు. ఇలాంటి సమాధానాల అన్వేషణే ఆంధ్రప్రదేశ్ లో మన మూడేళ్ల పాలన అని సీఎం జగన్ పేర్కొన్నారు. మనమంతా నిజాయితీగా ఆలోచించాల్సిన కొన్ని అంశాలను ఈ విలువైన సందర్భంలో ప్రస్తావిస్తున్నాను: సీఎం జగన్ ఆహారాన్ని పండించే రైతు అర్ధాకలితో ఉండటాన్ని... భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు తరతరాలుగా గుడిసెల్లో మాత్రమే జీవించటాన్ని... గవర్నమెంటు బడికి వెళ్ళే పేదల పిల్లలు కేవలం తెలుగు మీడియంలోనే చదవక తప్పని పరిస్థితిని... ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు ఎప్పటికీ పనివాళ్ళుగా మిగిలిపోవాలనే పెత్తందారీ పోకడల్ని... - వైద్యం ఖర్చు భరించలేక, అమ్ముకునేందుకు ఏమీలేక... అప్పటికే అప్పులపాలై నిస్సహాయంగా చనిపోవటాన్ని... చదువులకు అయ్యే ఖర్చు భరించలేక పిల్లల్ని చదువులు మాన్పించి పనిలో పెట్టాల్సివస్తే తల్లి హృదయం తల్లడిల్లటాన్ని... ఎస్సీల్లో 36 శాతం, ఎస్టీల్లో 51 శాతం నేటికీ నిరక్షరాస్యులుగానే మిగిలిపోవటాన్ని... కార్పొరేట్ విద్యా సంస్థల కోసం, అంతకంటే మెరుగైన టీచర్లు ఉన్న ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలి పెట్టటాన్ని... మనలో సగం ఉన్న అక్కచెల్లెమ్మలకు, వారి వాటాగా సగం ఉద్యోగాలు, సగం పదవులు, చట్ట సభల్లో సగం స్థానాలు కేటాయించకపోవటాన్ని... - కొన్ని సామాజిక వర్గాల వారికి అధికార పదవుల్లో, పరిపాలనలో ఏనాటికీ వాటా దక్కకపోవటాన్ని... సంపద కేంద్రీకరణ ధోరణులకు తోడుగా, అధికార కేంద్రాలన్నీ ఒకే చోట ఉండాలన్న వాదనల్ని... గ్రామాల్లో ప్రభుత్వ సేవల విస్తరణ చేయకుండా పల్లెల్ని, రైతుల్ని గాలికి వదిలేయటాన్ని... ప్రతి పనికీ లంచాలు, కమిషన్ల వ్యవస్థ ఏర్పడటాన్ని... ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవటం ద్వారా రాజకీయ పార్టీలు ఆయా వర్గాలకు చేసిన నష్టాన్ని... ఇలాంటి దుర్మార్గాలన్నింటినీ, మన స్వతంత్ర దేశంలో... మన దేశం వాడే, మన రాష్ట్రం వాడే... మన ప్రజలకు అన్యాయం చేస్తూ దాన్నే పరిపాలన అంటాడని... ఇండిపెండెంట్గా ఉండాల్సిన మీడియా, తమ స్వార్థ ప్రయోజనాల కోసం దానికి భజన చేస్తుందని మన స్వాతంత్య్ర సమర యోధులు, మన రాజ్యాంగ నిర్మాతలు ఏనాడైనా ఊహించారా? ఇవన్నీ మన ముందున్న ప్రశ్నలు. దశాబ్దాలుగా అనేక వర్గాల అనుభవాలనుంచి, ఆయా వర్గాలకు జరిగిన అన్యాయాలనుంచి పుట్టిన ఈ ప్రశ్నలకు... మనందరి ప్రభుత్వంలో, గత మూడేళ్ళ పాలనతో... సాధ్యమైనంత మేరకు, శక్తి వంచన లేకుండా... సమాధానం ఇవ్వగలిగామని సగర్వంగా తెలియజేస్తున్నాను! మన గ్రామానికి, మన నగరానికి అందే పౌర సేవల్లో మార్పులు తీసుకువచ్చాం 1వ తేదీన సూర్యోదయానికి ముందే అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువుల పింఛన్లు వారి తలుపు తట్టి చిరునవ్వుతో గుడ్మాణింగ్ చెప్పి మరీ... ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా, 2.7 లక్షల మంది వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్ళే వ్యవస్థ ఏర్పాటు చేశాం! - ప్రతి 2000 మందికి పౌర సేవలు అందించే గ్రామ/వార్డు సచివాలయం; అక్కడి నుంచి నాలుగు అడుగులు వేస్తే రైతులకు విత్తనం నుంచి పంట అమ్మకం వరకు అన్ని విధాలా సహాయం చేసే రైతు భరోసా కేంద్రాలు... అక్కడినుంచి మరో నాలుగు అడుగులు వేస్తే కనిపించే వైఎస్సార్ విలేజి క్లినిక్లు... ఇంకో నాలుగు అడుగులు వేస్తే కనిపించే ఇంగ్లీష్ మీడియం స్కూల్... మరో నాలుగు అడుగుల దూరంలోనే మీ గ్రామంలోనే నిర్మాణం కాబోతున్న డిజిటల్ గ్రంథాలయాలు, మరో నాలుగు అడుగుల దూరంలో ఇంగ్లీష్ లో బోధించే ప్రీ ప్రెమరీలు, ఫౌండేషన్ స్కూళ్ళు... ప్రతి మండలానికీ ఒక అధునాతన 108, ప్రతి పీహెచ్సీకీ ఒక అధునాతన 104... అందులో ఇద్దరు డాక్టర్లు; వీరిని విలేజి క్లినిక్తో అనుసంధానించి అమలు కానున్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్... ఇవన్నీ గడచిన 75 ఏళ్ళలో కాదు... కేవలం ఈ మూడు సంవత్సరాల కాలంలో మనం తీసుకువచ్చిన మార్పులు! పరిపాలనను మరింత చేరువ చేస్తూ, పర్యవేక్షణను మరింత మెరుగుపరుస్తూ... గ్రామాలూ నగరాల్లో మార్పులే కాక, గత ఏడాది వరకు కేవలం 13 జిల్లాలుంటే... మరో 13 జిల్లాల ఏర్పాటు ద్వారా పరిపాలన వికేంద్రీకరణలో మరో అధ్యాయాన్ని ఆరంభించాం. రాజధాని స్థాయిలో పరిపాలన వికేంద్రీకరణే మా విధానం అని... ప్రాంతీయ ఆకాంక్షలకు, ప్రాంతాల ఆత్మ గౌరవానికి, అన్ని ప్రాంతాల మధ్య సమతౌల్యంతోపాటు పటిష్ఠ బంధానికి ఇదే పునాది అని గట్టిగా నమ్మి అడుగులు వేస్తున్నాం. ఇదీ... ఈ మూడేళ్ళలోనే మనందరి ప్రభుత్వం మనసు పెట్టి తీసుకువచ్చిన మార్పు! అన్నంపెట్టే రైతన్నకు అండగా... వ్యవసాయానికి సాయంగా... వైఎస్సార్ రైతు భరోసాతో ఏకంగా 52 లక్షల రైతు కుటుంబాలకు ఏటా రూ. 13,500 చొప్పున సహాయం అందిస్తున్నాం. రైతు భరోసా కేంద్రాలను గ్రామ స్థాయిలో తీసుకువచ్చి... ఈ-క్రాప్ మొదలు, ఉచిత పంటల బీమా, ఏ సీజన్ లో నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోగానే అంచనా వేసి ఇన్పుట్ సబ్సిడీ అందించటం, సున్నా వడ్డీ పంట రుణాలు, పగటి పూటే 9 గంటలు నాణ్యమై ఉచిత విద్యుత్తు వంటివి అందిస్తూ... ఈ మూడేళ్లలో రైతు ప్రభుత్వంగా రైతు సంక్షేమానికి మనం చేసిన ఖర్చు... ఏకం రూ. 83 వేల కోట్లు! ఇది కాక, ధాన్యం సేకరణమీద చేసిన వ్యయం మరో రూ. 44 వేల కోట్లకు పైగానే! మొత్తంగా ఈ మూడేళ్లలో మనందరి ప్రభుత్వం కేవలం వ్యయవసాయం మీద చేసిన ఖర్చు ఏకంగా రూ. 1.27 లక్షల కోట్లు. -ఫలితంగా, అంతకు ముందు పాలన అయిదేళ్ళతో పోలిస్తే మన మూడేళ్ల పాలనలో ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున ఏటా 16 లక్షల టన్నులు పెరిగింది! ఇదీ... ఈ మూడేళ్ళలోనే మనందరి ప్రభుత్వం వ్యవసాయంలో వేసిన ముందడుగు! 72 సంవత్సరాల స్వాతంత్ర్యం తరువాత, మూడేళ్ల క్రితం... ఒక శాచురేషన్ పద్ధతిలో పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని మన ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తే... ఏకంగా 31 లక్షల ఇల్లు కుటుంబాలకు... అంటే దాదాపు 1.25 కోట్ల జనాభాకు... సొంత లేదని తేలింది! వీరందరికీ ఇప్పటికే ఇళ్ళ పట్టాలు ఇచ్చాం. అది కూడా ఆ కుటుంబంలో అక్కచెల్లెమ్మల పేరుమీద ఇచ్చాం. ఇందులో 21 లక్షల ఇళ్ళు వివిధ దశల్లో ఇప్పటికే నిర్మాణమవుతున్నాయి. ఈ ఇళ్ళ నిర్మాణాలు పూర్తి అయిన తరువాత ఒక్కో ఇంటి విలువా కనీసం రూ.7 నుంచి 10 లక్షలు ఉంటుందనుకుంటే... ఈ 31 లక్షల మంది అక్కచెల్లెమ్మల చేతుల్లో అక్షరాలా దాదాపుగా రూ. 2 లక్షల కోట్ల నుంచి - రూ.3 లక్షల కోట్ల సంపదను ఉంచుతున్నాం. ఇదీ... ఈ మూడేళ్ళలోనే మనందరి ప్రభుత్వం మనసు పెట్టి తీసుకువచ్చిన ఇంకో మార్పు! పేదల తలరాతలు మార్చాలనే లక్ష్యంతో.. పిల్లల చదువులతోనే ఇంటింటా పేదల తల రాతలు మార్చాలని, వారి ఇంట వెలుగులు నింపాలనే మంచి సంకల్పంతో... రూపం మార్చుకున్న అంటరాని తనాన్ని తుద ముట్టించాలన్న నిశ్చయంతో... ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు ఎప్పటికీ పనివాళ్ళుగా మిగిలిపోవాలనే పెత్తందారీ పోకడల నడ్డి విరుస్తూ... గవర్నమెంటు బడులన్నింటిలో ఇంగ్లీష్ మీడియంను అమలు చేయాలని నిర్ణయించాం. ఈ నిర్ణయంతోపాటు... చదివించే తల్లులకు అండగా, తోడుగా నిలుస్తూ... జగనన్న అమ్మఒడి పథకాన్ని దేశంలోనే తొలిసారిగా అమలు చేస్తున్నాం. ఇవి కాక, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, మనబడి- నాడు నేడు, సీబీఎస్ఈ సిలబస్, బైజూస్ సంస్థతో ఒప్పందం - 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన... ఇన్ని పథకాలతో విద్యారంగంలో తీసుకు వస్తున్న ప్రతి మార్పు వెనకా... మన రాష్ట్రంలోని పిల్లలందరి భవిష్యత్తు పట్ల మనందరి ప్రభుత్వం తీసుకున్న బాధ్యత కనిపిస్తుంది! ఇలా ఈ మూడేళ్లలోనే విద్యారంగం మీద చేసిన వ్యయం ఏకంగా రూ.53 వేల కోట్లకు పైనే! ఇదీ... ఈ మూడేళ్ళలోనే విద్యారంగంలో మనందరి ప్రభుత్వం మనసు పెట్టి తీసుకువచ్చిన మార్పు మరో మంచి మార్పు! మన వైద్యం-ఆరోగ్యం కోసం... వార్షిక ఆదాయం 5 లక్షలలోపు ఉన్నవారందరికీ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వర్తింపజేయటం ద్వారా 95 శాతం ప్రజలకు ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం. రూ.1000 ఖర్చు దాటితే ఉచితంగా వైద్యం అందించాలన్న తపనతోనే 2434 ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీలో చేర్చాం. వీటిని ఈ నెలలోనే 3,133కు పెంచుతున్నాం. ఆపరేషన్ తరవాత రోగులు కోలుకునే సమయంలో వారికి దన్నుగా నెలకు రూ.5000 వైఎస్సార్ ఆరోగ్య ఆసరాగా ఇస్తున్నాం. ఎమర్జెన్సీలో ప్రాణాలు రక్షించే 108, 104సేవలకు అర్థం చెపుతూ ఏకంగా 1088 వాహనాల్ని ప్రతి మండలానికీ పంపాం. వీటిని మరింతగా పెంచుతూ మరో 432 వాహనాలను పంపనున్నాం. గ్రామ గ్రామానా వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు ఏర్పాటు అవుతున్నాయి. వీటితో పీహెచ్సీలు అనుసంధానమై గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్కు బీజం పడనుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 11 టీచింగ్ ఆసుపత్రులు ఉంటే, కొత్తగా మరో 16 వైద్య బోధనాసుపత్రులను నిర్మాణం చేస్తున్నాం. గ్రామం నుంచి జిల్లా వరకు ఆసుపత్రుల రూపాన్ని, సేవల్ని, సదుపాయాల్ని మార్చేస్తూ జాతీయ ప్రమాణాలతో వైద్యాన్ని అందించటానికి వైద్య రంగంలో రూ.16,000 కోట్లతో నాడు-నేడు అమలు చేస్తున్నాం. ఈ ఒక్క రంగంలోనే అక్షరాలా 40 వేల కొత్త ఉద్యోగాలు ఇచ్చాం. ఇదీ... ఈ మూడేళ్ళలోనే... వైద్య ఆరోగ్య రంగంలో వచ్చిన మార్పు ప్రభుత్వం మనసు పెట్టి తీసుకువచ్చిన మార్పు! ఒకవంక ప్రభుత్వ బడుల్ని, మరో వంక ప్రభుత్వ ఆసుపత్రుల్ని మెరుగుదిద్దటమే కాకుండా... ఈ మూడేళ్లలోనే మొత్తంగా 6.03 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. మొత్తంగా గత మూడేళ్లలోనే 1.84 లక్షల శాశ్వత ప్రభుత్వోద్యోగాలతోపాటు; 20 వేల కాంట్రాక్టు ఉద్యోగాలు; 4 లక్షల ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. వీరంతా మన కళ్ళ ఎదురుగానే గ్రామ/వార్డుసచివాలయాల్లో కనిపిస్తారు. ఆర్టీసీ ఉద్యోగులుగా కనిపిస్తారు. మెరుగుపరుస్తున్న కనిపిస్తారు. ఔట్ సోర్సింగ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనిపిస్తారు. గ్రామ/వార్డు వాలంటీర్లుగా ఉద్యోగులుగా కూడా మన కళ్ళెదుటే కనిపిస్తారు! అంతే కాకుండా, దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత, ప్రభుత్వ రంగంలో మరో నాలుగు సీ పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం. సువిశాల సముద్ర తీరంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక సీ పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎంఎస్ఎంఈ రంగాన్ని నిలబెడుతూ... లక్షల మంది ఉపాధికి భరోసానిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇదీ... ఈ మూడేళ్ళలో మనందరి ప్రభుత్వం తీసుకువచ్చిన మరో మార్పు! మహిళా సాధికారతకు పెద్దపీట 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్లోనే ఆవిర్భించాలన్న లక్ష్యంతో మహిళా సాధికారత అంశంలో దేశంలో ఏ ప్రభుత్వం వేయని అడుగులు వేస్తున్నాం. 44.5 లక్షల తల్లులకు, 85 లక్షల పిల్లలకు మంచి జరిగేలా ఈ మూడేళ్లలోనే జగనన్న అమ్మ ఒడి ద్వారా రూ. 19,618 కోట్లు; వైఎస్సార్ ఆసరా ద్వారా 78.74 లక్షల కోట్లు, డ్వాక్రా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రూ.12,758 కోట్లు; వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా 1కోటీ 2లక్షల అక్క చెల్లెమ్మలకు రూ.3,615 కోట్లు అందించాం. వైఎస్సార్ చేయూత ద్వారా 24.96 లక్షల మంది 45-60 మధ్య వయసున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఇప్పటికే అందించిన లబ్ధి - 9,180 కోట్లు! వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా మరో రూ. 1492 కోట్లు; వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా రూ. 589 కోట్లు ఇప్పటికే అందజేయటం జరిగింది. ఈ సొమ్ముకు బ్యాంకుల ద్వారా మరింత రుణ సదుపాయంతో, ప్రముఖ కార్పొరేట్ సంస్థలతో టై-అప్లద్వారా, అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబనకు చేయూత ఇస్తున్నాం. అంతే కాకుండా, అక్కచెల్లెమ్మలకు ఆలయ బోర్డులనుంచి, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల వరకు... ప్రభుత్వ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల వరకు ప్రతి ఒక్క రాజకీయ నియామకంలోనూ; నామినేషన్ కాంట్రాక్టుల్లోను 50 శాతం రిజర్వేషన్లు చట్టం చేసిమరీ అమలు చేసిన ప్రభుత్వం కూడా భారతదేశ చరిత్రలో మన ప్రభుత్వం మాత్రమే. దిశ చట్టానికి రూప కల్పన, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసెక్యూటర్ల నియామకం... ప్రతి 2000 జనాభాకూ మన గ్రామంలోనే ఒక మహిళా పోలీస్ నియామకం... ఇవన్నీ మహిళా రక్షణ పరంగా మనందరి ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలు. ఇవీ... ఈ మూడేళ్ళలోనే అక్కచెల్లెమ్మలకు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణ పరంగా దన్నుగా ఉంటూ మనందరి ప్రభుత్వం మనసు పెట్టి తీసుకువచ్చిన వ్యవస్థాపరమైన మార్పులు! ఇక సామాజిక న్యాయం విషయానికి వస్తే... మన మూడేళ్ల పాలనలోనే... ఏపీ రాష్ట్ర చరిత్రలోగానీ, బహుశా దేశ చరిత్రలోగానీ ఏ ఒక్క ప్రభుత్వంలోనూ కనిపించనంతటి సామాజిక ఆర్థిక రాజకీయ విద్యా న్యాయాలను మనందరి ప్రభుత్వంలో చేసి చూపించాం! మంత్రి మండలినే తీసుకుంటే... మొదటి విడత 56 శాతం, రెండో విడతలో 70 శాతం మంత్రిమండలి పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చాం. ... - అలాగే, రెండు మంత్రివర్గాల్లోనూ ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే.. నాలుగు (80%) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే అవకాశం కల్పించాం. శాసనసభ స్పీకర్గా ఒక బీసీ; శాసన మండలి చైర్మన్గా ఎస్సీని నియమించటమే కాకుండా; శాసన మండలి డిప్యూటీ ఛైర్పర్సన్ మైనార్టీ చెల్లెమ్మకు ఇవ్వటం కూడా సామాజిక న్యాయ చరిత్రలో సరికొత్త అధ్యాయం. ఈ మూడేళ్లలో రాజ్యసభకు మనం 8 మందిని పంపితే, అందులో నలుగురు బీసీలు. శాసన మండలికి అధికార పార్టీ నుంచి పంపిన 32 మందిలో 18 మంది... ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారే! పరిషత్ ఎన్నికల్లో 13కు 13 జిల్లా పరిషత్లను వైఎస్సార్సీపీ దక్కించుకుంటే, వీటిలో చైర్ పర్సన్ పదవుల్లో తొమ్మిది (70%) , ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించాం. ఎస్సీ-నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసి అమలు చేసిన తొలి ప్రభుత్వం కూడా మనదే. అందులోనూ 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించిన మొదటి ప్రభుత్వం కూడా మనదే! ప్రభుత్వ కార్పొరేషన్ల 137 చైర్మన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, వివిధ బీసీ, మైనార్టీలకు మొత్తం 58% పదవులు ఇచ్చాం. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. -ఇవి కాక, 139 బీసీ కులాలకు సంబంధించి కొత్తగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వం కూడా మనదే. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషను నియమించిన ప్రభుత్వం కూడా మనదే! ఇవీ... ఈ మూడేళ్ళలోనే... సామాజిక న్యాయంలో మనందరి ప్రభుత్వం మనసు పెట్టి తీసుకు వచ్చిన మార్పులు! ఇవన్నీ ఒకరిద్దరు వ్యక్తులకో, కొద్దిమంది వ్యక్తులతో ప్రయోజనం కల్పించేందుకు చేసిన మార్పులు కావు. ఇవన్నీ వ్యవస్థనే మార్చే మార్పులు. ఇవన్నీ వచ్చే కొన్ని దశాబ్దాల్లో వ్యవసాయ రంగాన్ని, విద్యా రంగాన్ని, వైద్య రంగాన్ని, మహిళల అభ్యుదయాన్ని, సామాజిక వర్గాలకు అందే రాజకీయ అధికారాన్ని నిర్ణయించే మార్పులు! ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబం నిన్నటి కంటే నేడు... నేటి కంటే రేపు... రేపటి కంటే భవిష్యత్తులో బాగుండటమే రాష్ట్ర అభివృద్ధి అని... అదే మన స్వతంత్రానికి అర్థం అని నమ్మాం. ఎన్నికల వరకే రాజకీయాలు... అధికారంలోకి వచ్చిన తరవాత అంతా మన ప్రజలే అని నమ్మి, ప్రతి ఒక్క పథకంలోనూ శాచురేషన్ విధానాన్ని అమలు చేశాం. కాబట్టే, రూ. 1.65 లక్షల కోట్లు... ఎలాంటి లంచాలు, ఎలాంటి వివక్ష, ఎలాంటి కమిషన్లు లేకుండా... అర్హులందరి ఖాతాలకూ వెళ్ళాయి! బహుశా భారతదేశ చరిత్రలో ఇంత పారదర్శకంగా ఇంత డబ్బు లబ్ధిదార్లకు చేరటం కనీవినీ ఎరుగనిది! సంక్షేమ పథకాలను మానవ వనరులమీద పెట్టుబడిగా భావించి ప్రతి రూపాయినీ కుటుంబాలను నిలబెట్టే, కుటుంబాల పేదరికం సంకెళ్ళను తెంచే సాధనంగా పేదల చేతిలో ఉంచాం. ప్రతిపథకాన్నీ కూడా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎసీజీ) సాధించేలా అమలు చేస్తున్నాం. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావించి... ఈ మూడేళ్ల కాలంలోనే 95 శాతం వాగ్దానాలు అమలు చేశాం. పేదవాడి ఆర్తిని, అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకున్నాం. అధికారం ఈ దేశంలోని అత్యంత నిస్సహాయుడి కంటిలో నీరు తుడవటానికి మన ప్రభుత్వాలు, వాటి ఉపయోగపడాలన్న మహాత్ముడి మాటల్ని 1947 ఆగస్టు 15న తొలి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఉటంకించిన విషయాన్ని సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. The ambition of the greatest man of our generation has been to wipe "every tear from every eye." That may be beyond us, but so long as there are tears and suffering, so long our work will not be over. ఈ భావాలను మనసా వాచా కర్మణా... త్రికరణ శుద్ధిగా అమలు చేస్తున్నాం. ప్రజాస్వామ్యానికి అర్థం చెపుతూ, ప్రజలతోపాటు ప్రాంతాలకూ న్యాయం చేస్తూ, గడపగడపకూ సంక్షేమం, అభివృద్ధి ఫలాలను అందిస్తున్న మనందరి ప్రభుత్వం... మన సమాజంలో వెనకబాటు, నిరక్షరాస్యత, సామాజిక అభద్రత, రాజకీయ అణచివేత, ఆర్థిక అవకాశాల లేమి వంటి ప్రతి అంశంమీదా సంపూర్ణమైన విజయం సాధించే దిశగా భావపరమైన పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేస్తూ... గొప్పదైన దేశానికి, దేశ ప్రజలకు ప్రజలకు ప్రణామాలు సమర్పించుకుంటూ... దేవుడి ఆశీస్సులు, మీ అందరి చల్లని దీవెనలు మనందరి ప్రభుత్వానికీ కలకాలం ఉండాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. -
మన ఆత్మగౌరవానికి జాతీయ జెండా ప్రతీక
-
వజ్రోత్సవాల వేళ ఆంటిలియాకు కొత్త కళ: మనవడితో అంబానీ సందడి
సాక్షి, ముంబై: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగు తున్నాయి. దేశవ్యాప్తంగా పిల్లా పెద్దా అంతా త్రివర్ణ పతాకాలు చేబూని, మాతృదేశ స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కూడా ఈ సంబరాల్లో పాలు పంచుకున్నారు. భార్య నీతా అంబానీ, మనవడు పృథ్వీ అంబానీతో కలిసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకను ఉత్సాహంగా జరుపుకున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వాతంత్య్ర అమృత్ మహోత్సవ్ను జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా దేశంలోని చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ భవనాలు త్రివర్ణ కాంతులతో దేదీప్యమానంగా ఆకర్ణణీయంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేశ్ అబానీ ఇల్లు ఆంటిలియా కూడా త్రివర్ణ పతాక కాంతులతో వెలిగిపోతోంది. యాంటిలియా వెలుపల ఉన్న రహదారి మొత్తం త్రివర్ణ వెలుగులతో అందంగా ముస్తాబు చేశారు. దీంతో జనం తమ కార్లను ఆపి మరీ సెల్ఫీలు తీసుకోవడం విశేషం. అంతేకాదు ఆంటిలియా ఇంటి బయట శీతల పానీయాలు, చాక్లెట్లు అందిస్తున్నారు. దీంతో అటు సెల్ఫీలు, ఇటు కూల్ డ్రింక్స్, చాక్లెట్లతో జనం ఎంజాయ్ చేస్తున్నారు. #WATCH | Reliance Industries chairman Mukesh Ambani along with his wife Nita Ambani and grandson Prithvi Ambani celebrates Independence Day pic.twitter.com/QNC8LmtoHL — ANI (@ANI) August 15, 2022 -
ఏపీ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ‘ప్రత్యేక జెండా’
విజయవాడ: ఏపీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక జెండా ఆకర్షణగా నిలిచింది. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 100 మీటర్ల ఎత్తులో జాతీయ జెండా ఎగురవేశారు. ప్రత్యేక వాహనంలో ఉంచిన జాతీయ జెండాను అగ్ని మాపక, పోలీస్ సిబ్బంది ఎగురవేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్న వేడుకల్లో ఈ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
ఏపీ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వివిధ శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన
-
జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
-
జాతీయ జెండా.. భారతీయుల గుండె: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: స్వాతంత్ర దినోత్సవ సంబురాలు దేశం మొత్తం అట్టహాసంగా సాగుతున్నాయి. ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా.. సోమవారం ఉదయం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండా ఆవిష్కరించారు సీఎం జగన్. అనంతరం ఆయన సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శకటాల ప్రదర్శనను వీక్షించి.. ప్రసంగించారు. సీఎం జగన్ ప్రసంగం స్వాతంత్ర పోరాటానికి నిలువెత్తు రూపం జాతీయ జెండా. పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా.. భారతీయుల గుండె అని సీఎం జగన్ పేర్కొన్నారు. జాతీయ జెండా మన స్వాతంత్రానికి, అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక. సార్వభౌమత్వానికి, ఏకత్వానికి, దేశభక్తికి, మన ఆత్మగౌరవానికి ప్రతీక. వాదాలు వేరైనా దేశ స్వాతంత్రం గమ్యంగా పోరాడారు ఆనాటి యోధులు. వాళ్లను స్మరించుకుంటూ.. హ్యాట్సాఫ్ చెప్పాల్సిన అవసరం ఉంది. అహింసే ఆయుధంగా, సత్యయే సాధనంగా సాగిన శాంతియుత పోరాటం.. ప్రపంచ మానవాళికి మోహోన్నత చరిత్రగా నిలిచే ఉంటుంది. 75 ఏళ్లలో దేశం తిరుగులేని విజయాలు సాధించిందని, ప్రపంచంతో పోటీ పడి మరీ ప్రగతి సాధిస్తోందని కొనియాడారు సీఎం జగన్. రైతన్నలకు సెల్యూట్. ఆహారం, ఔషధాలు, ఆఖరికి స్మార్ట్ ఫోన్ల రంగంలోనూ దేశం టాప్ లిస్ట్లో కొనసాగుతోందని గుర్తుచేశారు సీఎం జగన్. ఇక ఏపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై సీఎం జగన్ మాట్లాడారు. సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు మూడేళ్లలో 40 వేల కొత్త ఉద్యోగాలు ఇవ్వగలిగాం అనేక పాలనా సంస్కరణలు తీసుకొచ్చాం పౌర సేవల్లో మార్పు తీసుకొచ్చాం ప్రతీనెలా ఒకటో తేదీనే ఇంటివద్దకే పింఛన్ ఇస్తున్నాం విత్తనం కొనుగోలు దగ్గర్నుంచి పంట అమ్మకం వరకూ ఆర్బీకేల ద్వారా సేవలు అన్నం పెట్టే రైతన్నకు రైతు భరోసా అందిస్తున్నాం రైతు సంక్షేమానికి రూ. 1.27 లక్షల కోట్లు ఖర్చు చేశాం ప్రతి మండలానికి రెండు పీహెచ్పీలు తీసుకొచ్చాం అమ్మ ఒడితో చదువుకు భరోసా కల్పించాం ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీకే పంట రుణాలు అందిస్తున్నాం సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశాం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు పెద్ద పీట వేశాం నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేశాం మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వం మనది ప్రాంతీయ ఆకాంక్షలకు, ప్రాంతాల ఆత్మ గౌరవానికి అన్ని ప్రాంతాల సమతుల్యత అవసరం పటిష్ట బంధానికి ఇదే పునాది అని గట్టిగా నమ్మి అడుగులు వేస్తున్నాం నేడు ఎగిరిన జాతీయ జెండా మన స్వాతంత్ర్యానికి ప్రతీక. గొప్పదైన మన ప్రజాస్వామ్యానికి, దేశ ప్రజల సార్వభౌమాధికారానికి ప్రతీక. భారత దేశ ఆత్మకు, మన ఆత్మగౌరవానికి ప్రతీక. రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.#IndiaIndependenceDay,#IndiaAt75, #స్వాతంత్ర్యదినోత్సవం, — YS Jagan Mohan Reddy (@ysjagan) August 15, 2022 -
నిజాం రాజ్యంలో నిశ్శబ్దం!
సాక్షి, హైదరాబాద్: అది 1947 ఆగస్టు 15. పరాయి పాలన నుంచి విముక్తి పొంది దేశమంతా ఆనందోత్సాహాలతో పండగ జరుపుకొంటున్న వేళ. వినువీధుల్లో మువ్వన్నెల జెండా సగర్వంగా, సమున్నతంగా రెపరెపలాడిన తరుణం. ఆబాలగోపాలం స్వాతంత్య్ర వేడుకల్లో మునిగిపోయారు. కానీ.. ఆ రోజు హైదరాబాద్లో మాత్రం నిశ్శబ్దం రాజ్యమేలింది. నగరవాసులు ఇళ్లకే పరిమిత మయ్యారు. ఎక్కడో ఒకచోట కొంతమంది దేశభక్తులు రహస్యంగా త్రివర్ణ పతాకలతో సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఎక్కడా జాతీయ జెండాలను ఎగురవేయలేదు. నగరంలో కర్ఫ్యూ విధించినట్లుగా రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అప్పటికే నిజాం నియంతృత్వ పాలనలో మగ్గుతున్న జనం ఆశావహ దృక్పథంతో స్వాతంత్య్రం కోసం ఎదురుచూశారు. శుక్రవారమూ ఓ కారణమే! దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు శుక్రవారం. హైదరాబాద్కు అది సెలవు దినం. దాంతో నగరంలోని ప్రభు త్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, కళాశాలలు మూసి ఉన్నాయి. వ్యాణిజ్య సంస్థలు కూడా మూసి వేయడంతో సాధారణంగానే జనసంచారం లేకుండా పోయింది. ‘ఒకవేళ అది వర్కింగ్ డే అయి ఉంటే వాతావరణం మరోలా ఉండేది. ఎందుకంటే అప్పటికే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జాతీయోద్యమ భావాలు వెల్లువెత్తాయి. విద్యార్ధులు ఉద్యమాలు చేప ట్టారు. వందేమాతర ఉద్యమం పెద్ద ఎత్తున నడిచింది. బ్రిటిష్ ప్రభుత్వానికి బలమైన మద్దతుదారుగా నిలిచిన నిజాం వందేమాతర గీతాన్ని నిషేధించడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఆ శుక్రవారం యూనివర్సిటీకి సెలవు కావడంతో విద్యార్థులు వేడుకలను నిర్వహించలేకపోయారు’ అని ఇంటాక్ సంస్థ ప్రతినిధి అనురాధారెడ్డికి ఆమె చిన్నతనంలో తన తల్లి స్నేహలత చెప్పినట్లు గుర్తు చేశారు. దక్కన్ రేడియో మూగనోము... అప్పటికి హైదరాబాద్లో ఉన్న ముఖ్య మైన ప్రసారమాధ్యమం దక్కన్ రేడియో. ఆ రోజు యథావిధిగా అన్ని రకాల కార్యక్రమాలను ప్రసారం చేశా రు. కానీ స్వాతంత్య్ర వేడుకలను గురించి ఒక్క మాటైనా రేడియోలో ప్రస్తావించకపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా జరుగుతున్న వేడుకలను దక్కన్ రేడియో ప్రసారం చేయలేదు. దీంతో నగరవాసులు ఆల్ ఇండియా రేడి యో, బీబీసీ రేడియోలను ఆ శ్రయించారు. ‘ఆ రోజు మా అమ్మ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు వెళ్లారట. కానీ అక్క డా ఎలాంటి సందడి లేదు. కొద్దిమంది ప్రయాణికులు తప్ప రైల్వేస్టేషన్ చాలా వరకు నిర్మానుష్యంగా ఉంది’ అని చెప్పినట్లు అనురాధ గుర్తు చేశారు. అదే సమయంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, ఆర్యసమాజ్ల ఆధ్వర్యంలో మాత్రం సికింద్రాబాద్, నారాయణగూడలలో కొద్దిమంది నాయకులు త్రివర్ణ పతాకలను ఎగురవేశారని ఆమె పేర్కొన్నారు. (చదవండి: అమృతోత్సాహం.. 76వ స్వాతంత్య్ర దినోత్సవాలకు దేశం సిద్ధం ) -
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబైన గోల్కొండ
-
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
-
భారత్.. ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది: ప్రధాని మోదీ
సాక్షి, ఢిల్లీ: చరిత్ర విస్మరించిన స్వాతంత్ర్య యోధులను ఇవాళ భారత దేశం గౌరవించుకుంటోంది అని ఉద్వేగపూరితంగా ప్రసంగించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా.. సోమవారం ఉదయం ఎర్రకోట నుంచి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన.. దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కర్తవ్య మార్గంలో తమ ప్రాణాలను అర్పించిన బాపు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబాసాహెబ్ అంబేద్కర్, వీర్ సావర్కర్ తదిరత మహోన్నతులకు దేశ పౌరులం కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. దేశం కోసం పోరాడిన వీరనారీమణులకు సెల్యూట్. ఈ పోరాటంలో ఎంతో మంది ప్రముఖులు దేశాన్ని జాగృతం చేశారు. త్యాగధనుల పోరాటల ఫలితమే మన స్వాతంత్రం. మంగళ్ పాండే, తాత్యా తోపే, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్, అష్ఫాఖుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, బ్రిటిష్ పాలన పునాదిని కదిలించిన మన అసంఖ్యాక విప్లవకారులకు ఈ దేశం కృతజ్ఞతలు తెలుపుతోంది. మాతృ భూమి కోసమే అల్లూరి సీతారామరాజు జీవించారు. గిరిజనలు దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. ఎర్రకోటపై ప్రధాని మోదీ ప్రసంగం.. 76th Independence Day ఇవాళ త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఆవిష్కరిస్తున్నాం. దేశంలోనే కాదు.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. సంబురాలలో మన మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. 75 ఏళ్ల స్వాతంత్ర భారతం ఇవాళ ఓ మైలు రాయిని దాటింది. ఈ 75 ఏళ్లు మనం ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నాం. ఎలాంటి సమస్య వచ్చినా ఓటమిని అంగీకరించలేదు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది. భారతదేశం తన 75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, తనకు అమూల్యమైన సామర్థ్యం ఉందని నిరూపించుకుంది. ఈ 75 ఏళ్ల ప్రయాణంలో, ఆశలు, ఆకాంక్షలు, ఎత్తులు, కనిష్ఠాల మధ్య అందరి కృషితో మేము చేయగలిగిన చోటికి చేరుకున్నాము. 2014లో, పౌరులు నాకు బాధ్యత ఇచ్చారు. స్వాతంత్ర్యం తర్వాత జన్మించిన నాకు.. ఎర్రకోట నుండి ఈ దేశ పౌరులను ప్రశంసించే మొదటి వ్యక్తిగా ఓ అవకాశాన్ని ఇచ్చారు. పేదవాళ్లకు సాయం అందించడమే నా లక్ష్యం. దేశ ప్రజలు పునరుత్తేజంతో ఉండడమే మన బలం. మన ముందు ఉన్న మార్గం కఠినమైంది. ప్రతీ లక్ష్యాన్ని సకాలంలో సాధించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇప్పుడు నవసంకల్పంతో ముందుకు వెళ్తున్నాం అని ప్రధాని మోదీ తెలిపారు. ప్రధాని మోదీలో తొమ్మిదవ సారి నరేంద్ర మోదీ పతాకాన్ని ఆవిష్కరించారు. వచ్చే 25 ఏళ్లు ఐదు అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టాలి వచ్చే 25 ఏళ్లులో ప్రధానంగా ఐదు అంశాలపై దృష్టిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. 1. దేశంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి 2. బానిసత్వపు ఆలోచనల్ని మనసులో నుంచి తీసిపారేయండి 3. మన దేశ చరిత్రి, సంస్కృతిని చూసి గర్వ పడాలి 4. ఐకమత్యంతో ప్రజలంతా ముందుకెళ్లాలి 5. ప్రతి ఒక్క పౌరుడు తమ బాధ్యతను గుర్తించి పని చేయాలి #WATCH Live: Prime Minister Narendra Modi addresses the nation from the ramparts of the Red Fort on #IndependenceDay (Source: DD National) https://t.co/7b8DAjlkxC — ANI (@ANI) August 15, 2022 -
ఏపీ పోలీసులకు పతకాల పంట
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి చెందిన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ట్రైనింగ్ పి.వెంకట్రామిరెడ్డి సేవలను గుర్తించిన కేంద్ర హోం శాఖ ఆయనకు రాష్ట్రపతి పోలీస్ మెడల్ ప్రకటించింది. ఏటా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ ఈ పతకాలు ప్రకటిస్తుంది. ఏపీకి చెందిన ఏఏసీ మండ్ల హరికుమార్కు పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంటరీ (పీఎంజీ), జేసీ ముర్రే సూర్యతేజకు ఫస్ట్ బార్ టు పీఎంజీ, జేసీ పువ్వుల సతీష్కు పీఎంజీ ప్రకటించింది. రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శాంతారావు (ఎస్ఎస్జీ ఐఎస్డబ్ల్యూ, విజయవాడ), ఎస్ఐ వి.నారాయణమూర్తి (ఎస్ఐబీ, విజయవాడ)లకు పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకాలు దక్కాయి. -
ఎర్రకోటపై ప్రధాని మోదీ జెండా ఆవిష్కరణ
Independence Day celebrations ఢిల్లీ అప్డేట్స్ ►వచ్చే 25 ఏళ్లు ఐదు అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టాలి: ప్రధాని మోదీ ►1. దేశంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి ►2. బానిసత్వపు ఆలోచనల్ని మనసులో నుంచి తీసిపారేయండి ►3. మన దేశ చరిత్రి, సంస్కృతిని చూసి గర్వ పడాలి ►4. ఐకమత్యంతో ప్రజలంతా ముందుకెళ్లాలి ►5. ప్రతి ఒక్క పౌరుడు తమ బాధ్యతను గుర్తించి పని చేయాలి ►మనదేశం టెక్నాలజీ హబ్గా మారుతోంది ►జై జైవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్తో పాటు జై అనుసంధాన్ ►ప్రజలంతా నిలదొక్కుకోవడమే ఆత్మ నిర్బర్ లక్ష్యం ►డిజిటల్ ఇండియాతో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి ►వాళ త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఆవిష్కరిస్తున్నాం. దేశంలోనే కాదు.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. ►సంబురాలలో మన మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. 75 ఏళ్ల స్వాతంత్ర భారతం ఇవాళ ఓ మైలు రాయిని దాటింది. ►ఈ 75 ఏళ్లు మనం ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నాం. ఎలాంటి సమస్య వచ్చినా ఓటమిని అంగీకరించలేదు. ►భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది. ► స్వాతంత్రం కోసం పోరాడిన యోధులను స్మరించుకుంటూ ముందుకు వెళ్లాలి. నారీ శక్తికి ప్రత్యేకంగా గౌరవం ప్రకటించుకోవాలి. ► దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఆవిష్కరిస్తున్నాం. దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగానూ సంబురాలు జరుగుతున్నాయి. ► ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఆవిష్కరించిన ప్రధాని మోదీ #WATCH PM Narendra Modi hoists the National Flag at Red Fort on the 76th Independence Day pic.twitter.com/VmOUDyf7Ho — ANI (@ANI) August 15, 2022 ►ఎర్రకోట వేదికకు చేరుకున్న ప్రధాని మోదీ ► ఎర్రకోటలో ఇంటర్ సర్వీసెస్, పోలీస్ గార్డ్ ఆఫ్ హానర్ను ప్రధాని నరేంద్ర మోదీ తనిఖీ చేశారు. Delhi | PM Modi inspects the inter-services and police Guard of Honour at Red Fort pic.twitter.com/IxySt0G0r4 — ANI (@ANI) August 15, 2022 ► ఎర్రకోట వద్దకు చేరుకున్న ప్రధాని మోదీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ స్వాగతం పలికారు. జాతీయ జెండాను ఎగురవేసేందుకు ఆయన ఎర్రకోట ప్రాకారం వైపు వెళ్తున్నారు. ► 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా.. రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోదీ Delhi | PM Modi pays tribute to Mahatma Gandhi at Rajghat on the 76th Independence Day pic.twitter.com/1UFpkoVoAR — ANI (@ANI) August 15, 2022 ► భారత స్వాతంత్రం 1947 సంవత్సరపు మొదటి వేడుకలను కలిపి చూసుకున్నా.. ఇప్పుడు భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది 76వ ఏడాది వేడుకలు. ► 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలు మార్చి 2021లో ప్రారంభమైన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే మెగా కార్యక్రమం ద్వారా గుర్తించబడుతున్నాయి. ► 75 వసంతాల స్వాతంత్రాన్ని పూర్తి చేసుకుని 76వ వడిలోకి అడుగుపెట్టింది భారత్. దేశం మొత్తం గత నాలుగైదు రోజులుగా సందడి వాతావరణం నెలకొంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
IDAY2022: ఈ పాటలు విన్నప్పుడల్లా ఉప్పొంగే దేశభక్తి
పంద్రాగస్టు దేశానికి పెద్ద పండుగ. కుల, మత, జాతి, వర్గాలన్నీ కలిసి చేసుకునే సందర్భం. స్కూల్ పిల్లల దగ్గరి నుంచి పెద్దల దాకా అందరినీ.. ఏళ్ల తరబడి అలరిస్తూ వస్తున్న కొన్ని దేశభక్తి సినీ గేయాలను ఈ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా గుర్తు చేసుకుందాం. సగటు భారతీయుడి నరనరాలను కదలించి.. దేశభక్తిని ఉప్పొంగేలా చేశాలు కొన్ని సినీ గేయాలు.. -
Azadi ka Amrit Mahotsav: వీరుల త్యాగ ఫలం
న్యూఢిల్లీ: దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో సమర యోధులు సర్వస్వాన్ని ధారపోశారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కొనియాడారు. వారి అమూల్య త్యాగాలను స్మరించుకునేందుకు ఆజాదీ కా అమృతోత్సవ్ సరైన సందర్భమన్నారు. వారి స్ఫూర్తి గాథలను యువ తరానికి వినిపించి వారిలో దేశభక్తి, సేవా భావం, త్యాగ గుణం వంటి విలువలను పెంపొందించాల్సిన అవసరముందన్నారు. స్వాతంత్య్ర సిద్ధికి ఎంతగా పోరాడాల్సి వచ్చిందో ఎన్నడూ మరవకూడదన్నారు. 76వ స్వాతంత్య్ర దినం సందర్భంగా ధన్ఖడ్ ఆదివారం ప్రజలకు సందేశమిచ్చారు. ‘‘క్రూరమైన బ్రిటిష్ వలస నుంచి దేశాన్ని విముక్తం చేసిన వీరుల ధైర్య సాహసాలు, త్యాగాలను పంద్రాగస్టు సందర్భంగా మరోసారి గుర్తు తెచ్చుకుని వారికి ఘనంగా నివాళులర్పిద్దాం. నేటి భారతం అంతులేని శక్తి సామర్థ్యాలను కళకళలాడుతోంది. సర్వతోముఖ వృద్ధి పథంలో వడివడిగా పరుగులు పెడుతోంది. జాతి విలువలను, రాజక్యాంగ విలువలను సమున్నతంగా నిలిపేందుకు మరోసారి ప్రతినబూనుదాం. దేశ నిర్మాణ క్రతువుకు పునరకింతం అవుదాం’’ అంటూ పిలుపునిచ్చారు. -
Azadi Ka Amrit Mahotsav: అమృత్ సెల్యూట్
మువ్వన్నెల రెపరెపల నడుమ స్వాతంత్య్ర అమృతోత్సవ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. 76వ స్వాతంత్య్ర దినాతోత్సవాలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఢిల్లీలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన చారిత్రక ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్నారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. అమృతోత్సవాల్లో భాగంగా కేంద్రం చేపట్టిన పలు కార్యక్రమాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా పంద్రాగస్టు జోష్ను పతాక స్థాయికి తీసుకెళ్లాయి. హర్ ఘర్ తిరంగా పిలుపును ప్రజలంతా ఉద్యమ స్ఫూర్తితో అందిపుచ్చుకున్నారు. దాంతో త్రివర్ణ పతాక రెపరెపలతో ప్రతి ఇల్లూ పండుగ చేసుకుంటోంది. రెండేళ్లుగా కరోనా కల్లోలం మధ్యే పంద్రాగస్టు వేడుకలు జరిగాయి. దాని పంజా నుంచి బయట పడుతుండటం ఈసారి పంద్రాగస్టు ఉత్సహాన్ని రెట్టింపు చేస్తోంది. పంద్రాగస్టు ప్రసంగంలో కేంద్ర సాఫల్యాలను ప్రస్తావించడంతో పాటు పలు కొత్త పథకాలు ప్రకటించడం మోదీకి ఆనవాయితీగా వస్తోంది. 2021 ప్రసంగంలో గతి శక్తి మాస్టర్ప్లాన్, నేషనల్ హైడ్రోజన్ మిషన్ వంటివాటిని ఆయన ప్రకటించారు. 2020లో దేశంలోని 6 లక్షల గ్రామాలను ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్తో అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. త్రివిధ దళాల పనితీరును మరింత మెరుగు పరిచేందుకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకాన్ని 2019లో ప్రకటించారు. ఆ క్రమంలో ఈసారి మోదీ ఆరోగ్య రంగానికి సంబంధించి హీల్ ఇన్ ఇండియా, హీల్ బై ఇండియా పేరిట కొత్త పథకాలు ప్రకటిస్తారంటున్నారు. ఆయన ఎర్రకోటపై జెండా ఎగరేయడం, పంద్రాగస్టు ప్రసంగం చేయడం ఇది వరుసగా తొమ్మిదోసారి. రక్షణ వలయంలో ఢిల్లీ పంద్రాగస్టు నేపథ్యంలో కశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి దాకా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరిగాయి. ఢిల్లీలో శుక్రవారం ఆరుగురు అనుమానిత ఉగ్రవాదుల అరెస్టు నేపథ్యంలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. 144వ సెక్షన్ అమల్లో ఉంది. అడుగడుగునా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎర్రకోట వద్ద పతాకావిష్కరణ వేడుకకు 7,000 మందికి పైగా అతిథులు రానుండటంతో 10 వేల మంది భద్రతా సిబ్బంది కోటను శత్రు దుర్భేద్యంగా మార్చేశారు. 2017లో మోదీ పంద్రాగస్టు ప్రసంగ సమయంలో ఓ పతంగి ఆయన ముందున్న పోడియంపై వచ్చి పడింది. ఈ నేపథ్యంలో ఈసారి వేడుక ముగిసేదాకా ఎర్రకోటకు 5 కిలోమీటర్ల పరిసర ప్రాంతాల్లో పతంగులు, బెలూన్లు, డ్రోన్లు ఎగరేయడాన్ని పూర్తిగా నిషేధించారు. పంద్రాగస్టు వేడుకలను బహిష్కరించాలన్న పిలుపుల నేపథ్యంలో కశ్మీర్లో భద్రతను మరింతగా పెంచారు. సరిహద్దుల వెంబడి సైన్యం, బీఎస్ఫ్ మరింత అప్రమత్తమయ్యాయి. – న్యూఢిల్లీ -
AP: సర్వం.. త్రివర్ణ శోభితం
మువ్వన్నెల పతాకాలతో రాష్ట్రం ముస్తాబైంది.. మన స్వేచ్ఛా జీవితానికి బాటలు వేసిన అమర వీరులకు జోహార్.. భారత్ మాతాకు జై.. అన్న నినాదాలు అన్ని ఊళ్లలోనూ ప్రతిధ్వనిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, ఇళ్లు, వాహనాలపై జాతీయ జెండా గర్వంగా తలెత్తుకుని రెపరెపలాడుతోంది.. అన్ని వర్గాల ప్రజల్లో భావోద్వేగం ఉట్టిపడుతోంది. మహనీయుల త్యాగనిరతిని స్మరించుకుంటూ ప్రజానీకం అడుగులు ముందుకు వేస్తోంది. సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ/ సాక్షి నెట్వర్క్: ‘దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే.. ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా దేశమంటే ఏకమవుతాం అంతా ఈ వేళ’.. అంటూ యావత్ దేశ ప్రజానీకం మొత్తం త్రివర్ణ పతాకాన్ని చేతబట్టింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్– హర్ ఘర్ తిరంగా పిలుపునందుకుని ఊరూ వాడా నాటి త్యాగధనులను స్మరిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వాతంత్య్ర దినోత్సవ సంబరానికి రాష్ట్ర ప్రజానీకం సిద్ధమైంది. ప్రభుత్వ స్ఫూర్తితో పెద్ద సంఖ్యలో ప్రజలు జెండాలను ఇళ్లపై ఎగురవేశారు. ఎటు చూసినా అదే వేడుక స్వాతంత్య్ర దిన వజ్రోత్సవ వేడుకలకు రాష్ట్ర శాసనసభ, సచివాలయ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. బందరు రోడ్డు, సీఎం క్యాంప్ కార్యాలయం విద్యుత్ దీప కాంతులతో ప్రకాశిస్తోంది. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్, ఎస్పీ బంగ్లాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, చారిత్రక కట్టడాలు దీప కాంతులను నింపుకున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లలో జాతీయ జెండా ఆకృతులను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ ఉత్సవాల సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన 195 మంది ఖైదీలు రాష్ట్రంలోని వివిధ జైళ్ల నుంచి విడుదలవుతున్నారు. వివిధ రంగాల్లో సేవలందించిన అనేక మంది ప్రభుత్వం నుంచి పతకాలు అందుకోనున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో వెయ్యి అడుగుల త్రివర్ణ పతాకంతో ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం 3 కి.మీ పొడవునా జాతీయ పతాకం ఒంగోలులో ఆదివారం ‘త్రివర్ణ ప్రకాశం’ పేరుతో 600 కేజీల బరువు, మూడు మీటర్ల వెడల్పు, 3 కి.మీ పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో విద్యార్థులు వెయ్యి అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. నరసరావుపేటలోని ఆజాదీపార్కులో 109 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. శ్రీకాళహస్తిలో వెయ్యి అడుగుల జెండాను ప్రదర్శిస్తున్న జనం ఇందిరా గాంధీ స్టేడియం ముస్తాబు రాష్ట్ర స్థాయిలో స్వాతంత్య్ర దినోత్సవానికి విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం ఇక్కడ జాతీయ జెండాను ఎగుర వేయనున్నారు. వేడుకలను తిలకించేందుకు ఈ ఏడాది ప్రజలకు అనుమతి ఇస్తున్నారు. 300 అడుగుల ఎత్తులో జెండాను ఎగుర వేస్తున్నట్లు ఎమ్మెల్సీ తలశిల రఘురాం తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం సాయంత్రం ఐదున్నర గంటలకు రాజ్భవన్లో గవర్నర్ ఇచ్చే తేనీటి విందు (ఎట్ హోమ్)కు సీఎం వైఎస్ జగన్ హాజరవుతారు. ‘తూర్పు’లో ఆకట్టుకుంటున్న ‘కూర్పు’ తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీలు స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తిని చాటే విధంగా మొక్కల కూర్పులతో ఆకట్టుకుంటున్నాయి. కడియపులంకలో సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పుల్లా సత్యనారాయణ (చంటియ్య), పెద సత్యనారాయణలకు చెందిన శ్రీ సత్యదేవ నర్సరీలో పలు రకాల మొక్కలతో కూర్పు ఏర్పాటు చేశారు. హర్ ఘర్ తిరంగా, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, 75 వసంతాల జెండా పండగలను ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేసిన ఈ ఆకృతి చూపరులను ఆకట్టుకుంటోంది. – కడియం ‘జల’ జెండా! 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం హసన్బాద జెడ్పీ హైస్కూల్ డ్రాయింగ్ టీచర్ జి.శ్రీను నీటితో జెండాను రూపొందించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ ‘జల’ జెండాను తాకి చిన్నారులు మురిసిపోతున్నారు. జెండా అమరికకు అనుగుణంగా తొలుత ఒక గొయ్యి తవ్వి, కింద హైలమ్ షీట్ అమర్చారు. ఆ గొయ్యిని 3 భాగాలుగా విభజించి, త్రివర్ణ పతాకం రంగులు వచ్చేలా నీటిని నింపారు. – రామచంద్రపురం రూరల్ -
శతమానం భారతి: స్వర్ణశకం
అమృత మహోత్సవం ముగిసింది! స్వర్ణ శకం ప్రారంభమైంది! కొత్త సంకల్పాలతో, కొత్త సంతోషాలతో, నవయుగంలోకి ప్రవేశిస్తున్నాం. వచ్చే 25 ఏళ్ల ప్రయాణాన్ని గతిశక్తితో, అగ్నిపథంలో ఆరంభిస్తున్నాం. ఈ స్ఫూర్తి 130 కోట్ల ప్రజల సమీకరణ, అనుసంధానం ద్వారా స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను చేపట్టడంతో మొదలైంది. ఈ వేడుకల ప్రధాన స్ఫూర్తి ప్రజా భాగస్వామ్యమే. ఈ 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం ఒక జాతీయ పండుగగా మారి, స్వాతంత్య్ర సమర స్ఫూర్తి, త్యాగం, అంకిత భావం నేటి తరానికి అనుభవంలోకి వచ్చాయి. తద్వారా ఈ మహోత్సవం సనాతన భారత ఆత్మవిశ్వాసం సాక్షాత్కరించే పండుగగా రూపుదాల్చింది. అమృత మహోత్సవంలో భాగమైన కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు దేశాన్ని సమైక్యంగా ఉంచేవి. మరికొన్ని దేశానికి పురోగతిని అందించేవి. ఇండియా గేట్ వద్ద నేతాజీ హోలోగ్రామ్, వినియోగదారులకు సాధికారత, విద్యార్థుల ద్వారా ప్రధానికి పోస్ట్ కార్డులు రాయించడం, ఎర్రకోట వద్ద వేడుకలు.. దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపి, భవిష్యత్తు తరాల జాతీయ భావనకు ప్రేరణనిస్తాయి. ‘‘ఈ 21 వ శతాబ్దంలో ప్రపంచం వేగంగా మారిపోతోంది. కొత్త అవసరాలకు అనుగుణంగా భారతదేశ ప్రజానీకంలో, యువతరంలో ఆశలు, ఆకాంక్ష పెరిగిపోతున్నాయి. వాటిని నెరవేర్చవలసిన ప్రజాస్వామ్య వ్యవస్థల్ని వచ్చే పాతికేళ్ల కోసం సంసిద్ధం చేసుకోవాలి. అందుకు ఈ అమృత మహోత్సవాల కృషి, చిత్తశుద్ధి తోడ్పడతాయి’’ అని ప్రధాని మోదీ అన్నారు. మనం ఇక కలిసికట్టుగా స్వర్ణోత్సవ స్వాతంత్య్ర భారతంలోకి పయనించవలసిన తరుణం ఆసన్నమైంది. (చదవండి: ఆ రోజు.. ఐదు నదులకు పోటీగా పంజాబ్లో నెత్తురు పారింది!) -
సర్వజ్ఞాని కోసమే వేడుకలు ఎత్తేశారు
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం రోజున పార్లమెంట్ సెంట్రల్ హాల్లో తప్పక నిర్వహించాల్సిన ప్రత్యేక కార్యక్రమాలను మోదీ సర్కార్ ఉద్దేశ్యపూర్వకంగా రద్దుచేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ‘సెంట్రల్ హాల్ వేడుకలు అంతర్థానమవుతున్నాయి. సర్వజ్ఞాని కీర్తి ప్రతిష్టలు పెంచడం పైనే దృష్టిపెట్టారు. ఇదంతా ఆ సర్వజ్ఞాని పుణ్యమే’ అంటూ ప్రధాని మోదీని పరోక్షంగా ఉద్దేశిస్తూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ‘గతంలో 25వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు సెంట్రల్ హాల్లో ప్రత్యేకంగా జరిగాయి. అలాగే 50వ, 60వ వేడుకలూ కొనసాగాయి. దురదృష్టంకొద్దీ ఈ సారి బీజేపీ సర్కార్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను హాల్లో రద్దుచేసింది. సర్వజ్ఞానికే పేరొచ్చేలా వ్యవహరిస్తోంది. ఆ జ్ఞాని ఎవరో అందరికీ తెలుసు’ అంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర వేడుకల నిర్వహణ విధానంపై కాంగ్రెస్, బీజేపీ పరస్పర విమర్శలు చేసుకోవడం కొనసాగుతోంది. చీకటి కోణాన్ని దాచేందుకే.. : అఖిలేశ్ బీజేపీ తనలోని చీకటి కోణాన్ని కప్పిపుచ్చేందుకే ఇలా హర్ ఘర్ తిరంగా అని నినదిస్తోందని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ‘ స్వాతంత్య్రం సిద్ధించాకా జాతీయ జెండాను, భారత రాజ్యాంగాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అంగీకరించలేదు. బ్రిటిష్వారికి అనుకూలంగా వ్యవహరించారు. అలాంటి ఆర్ఎస్ఎస్–బీజేపీ తమ చరిత్రలోని చీకటి అధ్యాయాలను వెనుక వైపు దాచేస్తూ ముందువైపు త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తున్నాయి’ అని అఖిలేశ్ అన్నారు. -
Independence Day 2022:నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం
న్యూఢిల్లీ: 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం జాతినుద్దేశించి మొట్టమొదటిసారిగా ప్రసంగించనున్నారు. ఆమె ప్రసంగం రాత్రి 7 గంటలకు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా రేడియో(ఏఐఆర్)తోపాటు, దూరదర్శన్ అన్ని చానళ్లలో హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రసారమవుతుందని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. అనంతరం ప్రసంగాన్ని దూరదర్శన్ ప్రాంతీయ చానళ్లు ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తాయని వివరించింది. ఏఐఆర్ కూడా రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రాంతీయ నెట్వర్క్ల ద్వారా రాత్రి 9.30 గంటలకు ప్రసారం చేయనుందని పేర్కొంది. ఒడిశాకు చెందిన ముర్ము జూలై 25వ తేదీన రాష్ట్రపతిగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. -
Azadi Ka Amrit Mahotsav: 10 వేల మందితో పహారా
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద సోమవారం జరగనున్న భారత 75వ స్వాతంత్య్రదిన వేడుకలకి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఎర్రకోట ప్రవేశ ద్వారం వద్ద ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం ఈ వేడుకల్ని ప్రత్యక్షంగా తిలకించడానికి 7 వేల మంది ఆహుతులు వస్తూ ఉంటే ఎర్ర కోట చుట్టుపక్కల 10 వేల మంది పోలీసు సిబ్బంది పహారా కాస్తున్నారు. సోమవారం జాతీయ జెండాను ఆవిష్కృతం చేసేంతవరకు ఎర్రకోట చుట్టూ అయిదు కిలో మీటర్ల మేర ఎలాంటి పతంగులు ఎగరవేయకూడదని ఆంక్షలు విధించారు. డ్రోన్లతో కూడా నిరంతరం పహారా ఉంటుంది. ఎర్రకోట ప్రాంగణంలోకి లంచ్ బాక్సులు, వాటర్ బాటిల్స్, రిమోట్ కంట్రోల్డ్ కారు కీస్, సిగరెట్ లైటర్స్, బ్రీఫ్కేసెస్, హ్యాండ్బ్యాగ్స్, కెమెరాలు, బైనాక్యులర్స్, గొడుగులు తీసుకురావడంపై నిషేధం విధించారు. వీవీఐపీలు వచ్చే మార్గంలో దాదాపుగా వెయ్యి హైస్పెసిఫికేషన్ కెమెరాలను అమర్చారు. 400కి పైగా కైట్ కేచర్స్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. -
గోల్కొండలో వజ్రోత్సవాల రిహార్సల్స్
సాక్షి, హైదరాబాద్: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల నేపథ్యంలో ఈనెల 15న నిర్వహించే 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి సంబంధించి పూర్తిస్థాయి రిహార్సల్స్ను శనివారం గోల్కొండ కోటలో నిర్వహించారు. పంద్రాగస్టున ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు గోల్కొండ కోట నుంచి జాతీయ పతాకావిష్కరణ చేయ నున్న నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించి పూర్తి డ్రెస్ రిహార్సల్స్ జరిపారు. ప్రదర్శనను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలసి పరిశీలించారు. 10.30 గంటలకు సీఎంకు గౌరవవందనం ఈనెల 15న ఉదయం పదిన్నరకు గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ పోలీస్ శాఖ నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం పతాకావిష్కరణ కోసం సీఎం వచ్చేటప్పుడు వేయిమంది జానపద కళాకారులు స్వాగతం పలుకుతారు. జాతీయ పతా కావిష్కరణ చేసిన అనంతరం సీఎంకు రాష్ట్రీయ సెల్యూట్ను పోలీస్ దళాలు అందజేస్తాయి. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారికి ప్రత్యేకపాసులు జారీ చేశారు. కార్యక్రమాన్ని వీక్షించడానికి వీలుగా సమాచార శాఖ ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేసింది. హాజరయ్యేవారికి మంచినీటి సౌకర్యంతోపాటు వాటర్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేశారు. రిహార్సల్స్ను పరిశీలించినవారిలో పోలీస్ శాఖ అదనపు డీజీ జితేందర్, ఇంటెలిజెన్స్ అడిషల్ డీజీ అనిల్ కుమార్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, హైదరాబాద్ పోలీస్ కమి షనర్ సీవీ ఆనంద్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అమ య్ కుమార్, సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ రాజమౌళి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు ఉన్నారు. -
ఊరూవాడ.. వజ్రోత్సవాల జాడ!
సాక్షి, హైదరాబాద్: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వజ్రోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఊరూవాడ, పట్టణం, వీధి అనే తేడా లేకుండా అంతటా దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ నెల 12 నుంచి జాతీయ పతాకాల ఆవిష్కరణతోపాటు భారీర్యాలీలు చేపట్టారు. పౌరులందరినీ భాగస్వామ్యం చేస్తూ నిర్వహిస్తున్న మహోత్సవాలు రాష్ట్రంలో అత్యద్భుతంగా కొనసాగుతున్నాయి. ‘హర్ ఘర్ కా తిరంగా’అంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు తోపాటు సీఎం కేసీఆర్ ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఎంపీ కె.కేశవరావు ఆధ్వర్యంలో కమిటీ వేయడం తెలిసిందే. అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో భారీ ఊరేగింపు నిర్వహిçÜ్తున్నారు. ఫ్రీడం రన్ పేరుతో కార్యక్రమాలు నిర్వహించడమేకాక రాష్ట్రంలో దాదాపు కోటీ 20 లక్షల పతాకాలను రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి పంపిణీ చేసి ప్రతీ ఇంటిపై ఎగురవేసే కార్యక్రమం జోరుగా సాగుతోంది. రాష్ట్రంలోని చరిత్రాత్మక కట్టడాలు, ఫ్లై ఓవర్లు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుద్దీ పాలంకరణతో వెలిగిపోతున్నాయి. వినూత్న కార్యక్రమాలతో... వజ్రోత్సవాల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వినూత్న కార్యక్రమాలతో దేశ భక్తిని చాటుకుంటున్నాయి. వాణిజ్య సముదాయాలు, వివిధ కంపెనీల కార్యాలయాలు మూడు రంగుల కాంతులతో ముస్తాబయ్యాయి. ప్రతిచోట మూడు వర్ణాల జాతీయజెండా రెపరెపలా డుతూ కనిపిస్తున్న దృశ్యం పౌరులందరిలో దేశభక్తిని ఉప్పొంగేలా చేస్తోంది. స్వాతంత్య్ర సంగ్రామం జరిగిన తీరు, ఉద్యమ స్ఫూర్తి తదితర అంశాలపై విద్యాసంస్థల్లో ఉపన్యాసాలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీ లు నిర్వహిస్తుండగా విద్యా ర్థులు పెద్దసంఖ్యలో పాల్గొంటున్నారు. కొన్నిచోట్ల వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తున్నారు. దేశభక్తిని ఇనుమడింపజేసే గాంధీ చిత్రాన్ని రాష్ట్రంలో 542 థియేటర్లలో ప్రదర్శిస్తుండగా, విద్యా ర్థుల నుంచి కూడా స్పందన వస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు జాతీయతను చాటేలా చే సిన అలంకరణలు కనువిందు చేస్తున్నాయి. -
స్వాతంత్య్ర దినోత్సవ సంరంభం: పిల్లల్లారా పాపల్లారా భావి భారత పౌరుల్లారా
రేపు ఆగస్టు 15. భారత దేశ పురోగామి పథంలో ఒక అమృత ఘట్టం. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు నిండాయి. పెద్దలు సాధించారు. యువకులు నిర్మించారు. బాలలు భవిష్యత్తుకు వెలుతురై ప్రసరిస్తారు. ఆగస్టు 15న పిల్లలతో ఉపన్యాసాలు ఇప్పించండి. ఫ్యాన్సీ డ్రెస్సులు వేయించండి. పాటలు పాడించండి. దేశభక్తిని తెలిపే ఆటలు ఆడించండి. వారికి ఈ ఆగస్టు 15 చిరస్మరణీయం చేయండి. ప్రతి భారతీయ గుండె ఉప్పొంగే క్షణాలివి. ప్రతి కన్ను ఆనందంతో చమర్చే అనుభూతి ఇది. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ మువ్వన్నెలు నిండిపోయే అపూర్వఘట్టం ఇది. మొన్నటి తరం, నిన్నటి తరం, నేటి తరం, రేపటి తరం... అందరూ అనిర్వచనీయమైన ఉద్వేగంతో ఊగిపోయే సందర్భం ఇది. దేశమా... నీ సమున్నత కీర్తిని చూసి గర్విస్తున్నాం. దేశమా... నీ ఘన వారసత్వానికి పులకించిపోతున్నాం. దేశమా... నీ విలువల ఔన్నత్యానికి శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాం. దేశమా... నీవు ఇచ్చిన ఈ పిడికెడు మట్టికి హృదయాల్ని అర్పణం చేస్తున్నాం. ‘సారే జహా సే అచ్ఛా హిందూస్తాన్ హమారా’... ప్రపంచ దేశాలలోనే అందమైన దేశం, సుందర దేశం, సమృద్ధి దేశం మన దేశం. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తామని ఈ 75 ఏళ్ల అమృత మహోత్సవం సందర్భంగా వాగ్దానం చేయాలి. నేటి బాలల హృదిలో ఈ కొనసాగింపునకు పాదులు వేయాలి. ఎందుకంటే వారే కదా భావిపౌరులు. ‘నేటి బాలలే రేపటి పౌరులు’ అని నెహ్రూ అన్నది– బాలల్లో దేశభక్తిని పెంపొందించాలని సూచించినది. అందుకే ప్రతి ఇంట ఉన్న బాలబాలికలందరినీ తప్పనిసరిగా ఆగస్టు 15 ఉదయం నాటి పతాకావిష్కరణకు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడండి. వారి చేత వందేమాతరం, జనగణమన పాడించండి. మాట్లాడనివ్వండి రేపటి ఘట్టం మాట్లాడే ఘట్టం. పిల్లల్ని మాట్లాడించాల్సిన ఘట్టం. మీ ఇళ్లల్లో, వీధుల్లో, వాడల్లో, అపార్ట్మెంట్లలో పిల్లలకు వక్తృత్వ పోటీలు పెట్టండి. ‘నేను నా దేశం’, ‘నాకు నచ్చిన మహనీయుడు’, ‘ఈ దేశానికి నేను ఏమి ఇస్తాను’, ‘దేశమంటే మట్టి కాదోయ్... మనుషులోయ్’... వంటి అంశాలు ఇచ్చి, ప్రిపేర్ అయ్యి, మాట్లాడమనండి. ఏం మాట్లాడాలో కొంత సహాయం చేయండి. ఎలా మాట్లాడాలో నేర్పించండి. గొప్ప వక్త గొప్ప నాయకుడు కాగలడు... మార్గనిర్దేశనం చేయగలడు... అని చెప్పి ప్రోత్సహించండి. బాగా మాట్లాడిన వారికి బహుమతులు ఇవ్వండి. ఆగస్టు 15న వారిలోని కొత్త ప్రతిభకు పాదు వేయండి. నేనే ఆ నాయకుణ్ణయితే పిల్లల్ని పరకాయప్రవేశం చేయించండి. మోనో యాక్షన్... ఏకపాత్రాభినయం పోటీలు పెట్టండి. దేశ నాయకులుగా వేషం కట్టి వారిలా మారి వారు ఎలా మాట్లాడతారో దేశం కోసం ఏం సందేశం ఇస్తారో ఇమ్మనమని చెప్పండి. గాంధీ, నెహ్రూ, అల్లూరి, భగత్ సింగ్, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్... ఒక్కొక్కరు ఒక్కో నేతలా మారనివ్వండి. స్వాతంత్య్రం కోసం పోరాడిన వారే కాదు సమాజం కోసం పాటుపడిన వారు కూడా దేశభక్తులే అని చెప్పి సుందరలాల్ బహుగుణ, మదర్ థెరిసా, సావిత్రిబాయ్ పూలే, స్వామి వివేకానంద, రాజా రామ్మోహన్ రాయ్ వంటి మహనీయుల వేషాలు వేయమనండి. దేశకీర్తిని ఇనుమడింప చేసిన చిత్రకారులు, గాయకులు, కవులు రవీంద్రనాథ్ టాగోర్, మంగళంపల్లి, ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, బిస్మిల్లా ఖాన్ వంటి వారి రూపంలో పిల్లల్ని వేదిక మీదకు రమ్మనండి. అద్భుతం ఆ దృశ్యం. మహనీయుల పసిరూపం. పర్వతాలు, నదులు... దేశమే చిత్రలేఖనం పోటీ పెట్టండి. ఇందిరాగాంధీ, అబ్దుల్ కలామ్ బొమ్మలే కాదు హిమాలయాలు, గంగానది, వింధ్య పర్వతాలు, హిందూ మహాసముద్ర తీరాలు... వీటిని కూడా గీయమనండి. దేశంలోని ప్రకృతిని కాపాడటం దేశభక్తి అని చెప్పండి. రాజస్తాన్ ఎడారి, గుజరాత్ శ్వేత మైదానాలు, మధ్యప్రదేశ్ ఘోరారణ్యాలు, తెలంగాణ పీఠభూములు, ఆంధ్రప్రదేశ్ నదీ ప్రవాహాలు జాతి సంపదలేనని చాటుతూ గీయమనండి. ‘టీ షర్ట్ పెయింటింగ్’ కూడా మంచి ఆలోచన. తెల్లటి టీషర్ట్ మీద దేశభక్తిని తెలియచేసే బొమ్మ గీసి వేసుకోవడం, బహుమతిగా ఇవ్వడం చేయమనండి. జాతీయ జంతువు, పక్షి, చిహ్నం వీటిని గీయమని చెప్పండి. అంతే కాదు, వీటన్నింటికి అర్హుడయ్యేలా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుంటామని పిల్లల చేత ప్రతిజ్ఞ చేయించండి. క్విజ్లు, థీమ్ పార్టీలు స్వాతంత్య్ర పోరాటం ఒక సుదీర్ఘ ఘట్టం. దీని మీద ఎన్ని క్విజ్లైనా నిర్వహించవచ్చు. సరైన సమాధానాలు చెప్పిన పిల్లలకు మంచి బహుమతి ఇవ్వండి. అలాగే ఆ మధ్యాహ్నం లేదా సాయంత్రం థీమ్ పార్టీ చేసుకోవచ్చు. ఖాదీ బట్టలు, మూడు రంగుల బట్టలు లేదా గాంధీ టోపీ... ఇలాంటి థీమ్ పెట్టుకొని పిల్లలు స్నాక్స్ పార్టీ చేసుకోవచ్చు. ఆ సాయంత్రం ‘చరిత్ర నడక’– అంటే మీకు దగ్గరలో ఉన్న ఏదైనా చారిత్రక స్థలం అంటే కూడలి, దేశభక్తుని విగ్రహం, లేదా గతంలో మహనీయులు వచ్చి వెళ్లిన చోటు అక్కడి వరకు పిల్లలు పెద్దలు కలిసి వాక్ చేయవచ్చు. అలాగే ఆ సాయంత్రం అందరూ కలిసి మంచి దేశభక్తి సినిమా తిలకించవచ్చు. పాటల పోటీ, డాన్స్ పోటీలు ఎలాగూ ఉత్సాహాన్ని నింపుతాయి. పిల్లలు వేసిన బొమ్మలతో సాయంత్రం ప్రదర్శన ఏర్పాటు చేయాలి. సంకల్పం దేశ స్వాతంత్య్రం ఒక్కరోజులో రాలేదని, ఎందరో త్యాగాలు చేస్తే... కష్టాలు ఎదుర్కొంటే వచ్చిందని పిల్లలకు చెప్పాలి. జీవితంలో కూడా ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని, వాటిని ఎదుర్కొని దేశం గర్వించేలా ఎదగడమే దేశభక్తి అని కూడా వారికి చెప్పాలి. ‘నాకు జన్మనిచ్చిన దేశానికి నేను పెద్దయ్యి ఏం చేయాలి’ అనే భావన ఎప్పుడూ కలిగి ఉండాలని వారికి చెప్పాలి. భారత్ మాతా కీ జై అనే నినాదం వారి హృదయంలో సదా మార్మోగేలా పెద్దల సహకారంతో పిల్లలు ఈ అమృత మహోత్సవాన్ని జరుపుకునేలా నేడంతా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నాం. సంస్కృతులకు స్వాగతం చెప్పండి సాటి సంస్కృతిని గౌరవించడమే దేశభక్తి అని కూడా చెప్పండి. భిన్న సంస్కృతుల వేషధారణల పోటీ పెట్టండి. అస్సామీలు, మణిపురిలు, తమిళులు, మలయాళీలు, మహరాష్ట్రీయులు, కశ్మీరీలు... వీరంతా వేదిక మీదకు రావాలి. హిందూ ముస్లిం శిక్కు క్రైస్తవ ధర్మాలు మన దేశంలో ఉన్నాయని, అందరూ కలిసి మెలిసి జీవించాలని తెలియచేసే రూపకాలు, పాత్రలు వేయించండి. భిన్నత్వంలో ఏకత్వం... ఏకత్వంలో భిన్నత్వం బోధించండి. -
ఢిల్లీకి తప్పిన ఉగ్ర ముప్పు! ఆయుధాలతో చిక్కిన ఆరుగురు
కోల్కతా: స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ ఢిల్లీకి భారీ ఉగ్ర ముప్పు తప్పింది! ఆయుధాలను అక్రమంగా రవాణా చేస్తూ ఆరుగురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. పంద్రాగస్టు సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో భాగంగా ఆనంద్ విహార్ ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపించిన వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏకంగా 2,000 పై చిలుకు తూటాలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇవి చాలావరకు విదేశాల నుంచి తెప్పించిన అత్యాధునిక తూటాలని తేల్చారు. నిందితులను యూపీలోని జౌన్పూర్కు చెందిన అజ్మల్ (20), రషీద్ అలియాస్ లలన్ (20), సద్దాం, ఢిల్లీకి చెందిన కమ్రాన్, రూర్కీకి చెందిన నాసిర్, డెహ్రాడూన్కు చెందిన పరీక్షిత్ నేగిగా గుర్తించారు. ఓ ఆటో డ్రైవర్ అందించిన సమాచారం మేరకు వీరిని పట్టుకున్నట్టు అదనపు పోలీస్ కమిషనర్ విక్రంజీత్సింగ్, డీసీపీ ప్రియాంక కశ్యప్ శుక్రవారం మీడియాకు చెప్పారు. ‘‘ఆనంద్ విహార్ బస్టాప్ వద్ద ఇద్దరు వ్యక్తులు భారీ బ్యాగులతో అనుమానాస్పదంగా ఉన్నట్టు 6న సాయంత్రం సమాచారం అందింది. దాంతో రంగంలోకి దిగి అజ్మల్ ఖాన్, రషీద్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాం. వారి బ్యాగుల్లో తూటాలు దొరికాయి. లక్నోకు చేర్చాల్సిందిగా వాటిని డెహ్రాడూన్లోని ఓ వ్యక్తి వాటిని ఇచ్చినట్టు విచారణలో వెల్లడించారు. వీళ్లు గతంలో కనీసం నాలుగుసార్లు ఇలా ఆయుధాలను చేరవేసినట్టు తేలింది. వారి సమాచారం ఆధారంగా లక్నో, జౌన్పూర్ తదితర చోట్లMమిగతా నలుగురిని అదుపులోకి తీసుకున్నాం. నేగి డెహ్రాడూన్లో ఆయుధ డెన్ నిర్వహిస్తున్నాడు. చాలాకాలంగా ఆయుధాలు, మందుగుండు చేరవేశాడు. అనుమానం రాకుండా ఆయుధ రవాణాకు ఈ ముఠా పబ్లిక్ ట్రాన్స్పోర్టునే వాడుకుంటోంది’’ అని వెల్లడించారు. ఉగ్ర కోణాన్నీ కొట్టిపారేయలేమన్నారు. మరోవైపు కోల్కతాలో ప్రఖ్యాత విక్టోరియా మెమోరియల్ హాల్, పరిసర ప్రాంతాలను డ్రోన్తో ఫొటోలు తీస్తున్న ఇద్దరు బంగ్లాదేశీలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని బంగ్లాదేశ్లోని రాజ్షాహీకి చెందిన వారిగా గుర్తించారు. కోర్టు వారిని ఆగస్టు 23 దాకా పోలీసు కస్టడీకి అప్పగించింది. ఆర్మీ తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయమైన ఫోర్ట్ విలియంకు విక్టోరియా హాల్ కూతవేటు దూరంలోనే ఉంటుంది! పతంగులపై నిషేధం స్వాతంత్య్ర వేడుకలు జరిగే చారిత్రక ఎర్రకోట ప్రాంతంలో సున్నిత ప్రాంతాలపై నిఘాను తీవ్రతరం చేశారు. ఆ పరిసరాల్లో శనివారం నుంచి సోమవారం దాకా పతంగులు, బెలూన్లు, డ్రోన్ల వంటివాటిని ఎగరేయడాన్ని నిషేధించారు. రాడార్లనూ రంగంలోకి దించారు. ఇప్పటికే ప్రకటించిన, మొదలైన పతంగుల పోటీలు తదితరాలను ఆగస్టు 15 సాయంత్రం నుంచి నిర్వహించుకోవాలని సూచించారు. -
5.2 కిలోమీటర్ల జాతీయ పతాకం
రాజమహేంద్రవరం సిటీ/తణుకు అర్బన్/చిత్తూరు రూరల్/ విజయవాడ కల్చరల్ : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్రంలోని పలు చోట్ల అత్యంత భారీ జాతీయ జెండాలతో ప్రదర్శనలు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో 5.200 కిలోమీటర్ల పొడవున సాగిన జాతీయ పతాక ప్రదర్శన అబ్బురపరచింది. ఇంతటి భారీ పతాకంతో ప్రదర్శన చేయడం దక్షిణ భారత దేశంలోనే రికార్డు కావడం విశేషం. జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్, గొందేసి పూర్ణచంద్రరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో దేశభక్తి గీతాలాపనలతో ఈ ప్రదర్శన సాగింది. దారి పొడవునా విద్యార్థులు, నగర ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. కార్యక్రమంలో సుమారు 25 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. దేశభక్తిని ప్రబోధించే జ్యోతిని ఈ ర్యాలీలో ప్రదర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, హోం మంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్రామ్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పార్టీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, కలెక్టర్ మాధవీలత, నగర పాలక సంస్థ కమిషనర్ దినేష్కుమార్ తదితరులు ప్రసంగించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు ఆధ్వర్యంలో 1,500 మీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించారు. సుమారు 15 వేల మంది విద్యార్థులు, ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు నగరంలో శుక్రవారం ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్(నీతి ఆయోగ్), స్వామి వివేకానంద ఫౌండేషన్, స్పీక్ నేచర్ లవర్స్, స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో 3 వేల అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో జెడ్పీ బాలుర, బాలికల పాఠశాల విద్యార్థులు, ప్రజా ప్రతినిధుల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. దేశభక్తిని ప్రేరేపించిన శోభాయాత్ర 75వ స్వాతంత్య్ర దినోత్సవం, అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా అమరావతి బాలోత్సవ్ కమిటీ, అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం, ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్, ఎన్జీవో అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముత్యాలంపాడు అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం నుంచి దుర్గాపురంలోని ఘంటసాల సంగీత కళాశాల వరకు నిర్వహించిన శోభాయాత్ర ఆకట్టుకుంది. నగరానికి చెందిన 75 పాఠశాలల నుంచి దాదాపు వెయ్యి మంది విద్యార్థులు జాతీయ జెండాలు చేతబూని శోభాయాత్రలో పాల్గొన్నారు. విద్యార్థుల జాతీయ నాయకుల వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
పంద్రాగస్టు వేడుకలకు బెజవాడ ముస్తాబు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం 75వ స్వాతంత్య్ర దినోత్సవాలకు ముస్తాబవుతోంది. ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్ కార్యక్రమాల కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, నగర పోలీస్ కమిషనర్ టీకే రాణా, జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్లు బుధవారం ఈ వేడుకల ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. తలశిల మాట్లాడుతూ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. వీటిని తిలకించేందుకు ఈ ఏడాది సామాన్య ప్రజలకూ అనుమతిస్తున్నట్టు చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాలపై 15 శకటాలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. -
16న ఏకకాలంలో ‘జనగణమన’ ఎక్కడివాళ్లు అక్కడే పాల్గొందాం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రజలందరిలో దేశభక్తి భావన, స్వాతంత్య్ర పోరాటస్ఫూర్తి మేల్కొలిపేలా అంగరంగ వైభవంగా దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. 15 రోజుల ఉత్సవాల్లో భాగంగా ఆగస్టు 16న రాష్ట్రమంతటా ఏకకాలంలో ‘తెలంగాణ రాష్ట్ర సామూహిక జాతీయ గీతాలాపన’నిర్వహించాలని, ఎక్కడివాళ్లక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఆగస్టు 21న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయితీలు, మండల, జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీలు, అన్ని రకాల స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్య్ర పోరాట వీరులకు ఈ సమావేశాల్లో ఘన నివాళులు అర్పించాలని సూచించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆగస్టు 8 నుంచి 22 వరకు నిర్వహించనున్న ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’కార్యక్రమంపై మంగళవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ కె. కేశవరావు నేతృత్వంలోని ఉత్సవ కమిటీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు మొదలు ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువత యావత్ తెలంగాణ సమాజం ఈ ఉత్సవాలల్లో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఇంటింటికీ ఉచితంగా జాతీయ జెండాలు... ఈ నెల 15న ఇంటింటిపై జాతీయ జెండాను ఎగరేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, రాష్ట్రంలోని మొత్తం ఒక కోటీ 20 లక్షల గృహాలకు జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ నెల 9 నుంచి మున్సిపాలిటీలు, పంచాయతీల ఆధ్వర్యంలో జెండాల పంపిణీ చేపట్టాలన్నారు. 8న ఘనంగా ఉత్సవాల ప్రారంభం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ఆగస్టు 8న వజ్రోత్సవ ప్రారంభ సమారోహాన్ని ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్మీ, పోలీస్ బ్యాండుతో రాష్ట్రీయ సెల్యూట్, జాతీయ గీతాలాపన, స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. అనంతరం స్వాగతోపన్యాసంతోపాటు, సభాధ్యక్షుడి తొలిపలుకులు, సీఎం కేసీఆర్ వజ్రోత్సవ వేడుకల ప్రత్యేక సందేశ ప్రసగం, వందన సమర్పణ ఉండనుంది. సీఎం తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు.. ► బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఎయిర్పోర్టులు సహా వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక అలంకరించడంతోపాటు ప్రభుత్వ భవనాలు, ఇతర ప్రతిష్టాత్మక భవనాలపై జాతీయ జెండాలు ఎగరేయాలి. ► ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలు, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు వక్తృత్వ, వ్యాస రచన, చిత్రలేఖనం, దేశభక్తి గీతాల పోటీలు నిర్వహించాలి. ► ప్రతిరోజూ ప్రార్ధన సమయంలో విద్యాసంస్థల్లో ఎంపిక చేసిన దేశభక్తి గీతాలను మైకుల ద్వారా వినిపించాలి. ► రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో ‘గాంధీ’సినిమాను ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులకు ప్రతిరోజూ ప్రదర్శించాలి. ► స్వాతంత్య్ర సమరం ఇతివృత్తంగా రాష్ట్రవ్యాప్తంగా కవి సమ్మేళనాలను, ముషాయిరాలు చేపట్టాలి. ► ప్రముఖ గాయకులు, సంగీత విధ్వాంసులతో సంగీత విభావరి. ► సమాజంలో నిరాదరణకు గురైన వర్గాలను గుర్తించి ఆదుకోవడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు. ► జిల్లాకో ఉత్తమ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, పాఠశాల, రైతు, డాక్టర్, ఇంజనీర్, పోలీస్ తదితర ఉద్యోగులు, కళాకారుడు, గాయకుడు, కవిని గుర్తించి సత్కరించాలి. ► రవీంద్ర భారతిలో 15 రోజులపాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలి. స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా నిర్వహించే రోజువారీ కార్యక్రమాలు.. ► ఈ నెల 8: స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం ప్రారంభోత్సవం ► ఈ నెల 9న: ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ మొదలు ► 10: వన మహోత్సవంలో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటడం, ఫ్రీడం పార్కుల ఏర్పాటు ► 11: యువత, క్రీడాకారులు, ఇతరులతో ఫ్రీడం 2కే రన్ ► 12: రాఖీ సందర్భంగా వివిధ మీడియాల సంస్థల ద్వారా ప్రత్యేక వజ్రోత్సవ కార్యక్రమాల ప్రసారాలకు విజ్ఞప్తి ► 13: వివిధ సామాజిక వర్గాల భాగస్వామ్యంతో వజ్రోత్సవ ర్యాలీలు ► 14: సాంస్కృతిక సారథి కళాకారులతో నియాజకవర్గ కేంద్రాల్లో జానపద కార్యక్రమాలు. ట్యాంక్బండ్ సహా రాష్ట్రవ్యాప్తంగా బాణాసంచా వెలుగులు ► 15: స్వాతంత్య్ర వేడుకలు ► 16: ఏకకాలంలో తెలంగాణవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన. సాయంత్రం కవి సమ్మేళనాలు, ముషాయిరాలు ► 17: రక్తదాన శిబిరాలు ► 18: గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ‘ఫ్రీడం కప్’పేరుతో ఆటల పోటీలు ► 19: దవాఖానాలు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, జైళ్లలో ఖైదీలకు పండ్లు, మిఠాయిల పంపిణీ ► 20: దేశభక్తిని, జాతీయ స్ఫూర్తిని చాటేలా ముగ్గుల పోటీలు ► 21: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. ఇతర స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు ► 22: ఎల్బీ స్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకలు -
గూగుల్ని తిట్టిపోస్తున్న నెటిజన్లు...నివాళి ఇచ్చే పద్ధతి ఇదేనా!
Google's July 4 Animation: అమెరికాలో జులై 4న స్వాతంత్య్ర దినోత్సవం రోజున జరిగిన వేడుకల్లో ఒక దుండగుడు ఇండిపెండెన్స్ డే పరేడ్ పై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తదనంతరం ఒక నెటిజన్ జులై 4వ తేదికి సంబంధించిన కంటెంట్ కోసం వెతుకుతున్నప్పుడూ...గూగుల్కి సంబంధించిన ప్రత్యేక సెలబ్రేషన్ యానిమేషన్ పేజీ కనిపించింది. అది నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఐతే ఆ పేజిలో జులై 4న యూఎస్లో జరిగిన కాల్పులకు సంబంధించిన తాజా వార్తల పోటో లే అవుట్లతో పాటు కలర్ఫుల్ బాణ సంచాలతో రూపొందించింది. దురదృష్టకరమైన ఘటనలు జరిగినప్పుడూ ఇలా బాణాసంచాలతో కలర్ఫుల్గా ఇవ్వకూడదు. షికాగోలోని ఐలాండ్ పార్క్లో జరిగిన సాముహిక కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు, పైగా ప్రజలు భయంతో పరుగులు తీయడం వంటి బాధకరమైన వార్తలను ప్రజెంట్ చేస్తూ... రంగరంగుల బాణాసంచా కాల్పుతో కలర్ఫుల్గా సంబరంలా ఇవ్వడం పలువురికి ఆగ్రహం తెప్పించింది. ఈ విషయమై మండిపడుతూ.. నెటిజన్లు ఫిర్యాదులు చేశారు కూడా. అంతేకాదు ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందడమే కాకుండా చిన్నారుల దగ్గర నుంచి పెద్దల వరకు సుమారు 24 మంది ఈ ఘటనలో తీవ్రంగా గాయపడితే ఇవ్వాల్సిన నివాళి ఇదేనా! అంటూ విరుచుకుపడుతున్నారు. ఈ మేరకు సంబంధిత గూగుల్ యానిమేషన్ పేజీ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. God bless America pic.twitter.com/BjVbymWJ1F — Sawbuck Wine (@sawbuckwine) July 4, 2022 (చదవండి: అమెరికాలో కాల్పులకు పాల్పడిన వ్యక్తి అరెస్టు) -
US Parade Shooting: అమెరికాలో కాల్పులకు పాల్పడిన వ్యక్తి అరెస్టు
High-Powered Rifle Is US Shooting Suspect: అగ్రరాజ్యం అమెరికాలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఒక దుండగుడు షికాగో నగర శివారులోని హైల్యాండ్ పార్కు వద్ద జరుగుతున్న ఇండిపెండెన్స్ డే పరేడ్పై కాల్పులకు జరిపాడు. ఈ నేపథ్యంలోనే అనుమానితుడు 22 ఏళ్ల రాబర్ట్ క్రిమోగా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతను హైపవర్ రైఫిల్తో వేడుకలకు వచ్చిన ప్రేక్షక్షులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితుడు జరిపిన కాల్పుల్లో ఆరుగురుమృతి చెందారని వెల్లడించారు. అంతేకాదు ఈ ఘటనలో పిల్లలతో సహా దాదాపు రెండు డజన్ల మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, కొందరి పరిస్థితి మాత్రం విషమంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. నిందితుడు క్రిమో వద్ద ఆయుధాల ఉన్నాయని, అతను అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని కూడా చెబుతున్నారు. అమెరికన్లకు బహిరంగంగా తుపాకీని తీసుకెళ్లే ప్రాథమిక హక్కు ఉందని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన కొద్ది రోజులకే ఇలాంటి ఘటనలు అధికమవ్వడం బాధాకరం. అదీకూడా అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం రోజున జరగడమే అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. అమెరికన్లే తమ దేశ వేడుకలను భగ్నపరిచి విధ్వంసానికి పాల్పడటం అత్యంత హేయం అంటూ... ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ప్రిట్జ్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఘటన పట్ల కలత చెందానన్నారు. బైడెన్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అంతేకాదు తాను తుపాకీ హింసకు వ్యతిరేకంగా పోరాడతానని వెనక్కి తగ్గేదేలేదని బైడెన్ నొక్కి చెప్పారు. (చదవండి: America Celebrates Independence Day: అమెరికాలో మళ్లీ కాల్పులు... ఆరుగురు దుర్మరణం) -
America Celebrates Independence Day: అమెరికాలో మళ్లీ కాల్పులు... ఆరుగురు దుర్మరణం
షికాగో: అమెరికాలో మళ్లీ తుపాకుల మోత మోగింది. దేశ స్వాతంత్య్ర దినం సందర్భంగా సోమవారం ఉదయం షికాగో నగర శివారులోని ఐలండ్ పార్కు వద్ద జరుగుతున్న ఇండిపెండెన్స్ డే పరేడ్పై ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు దిగాడు. వీటిలో కనీసం ఆరుగురు మరణించగా 30 మందికి పైగా గాయపడ్డట్టు సమాచారం. కాల్పుల సమయంలో పరేడ్ను చూసేందుకు జనం భారీగా వచ్చిన నేపథ్యంలో క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరగవచ్చంటున్నారు. కాల్పులతో భయాందోళన లోనై వారంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. దుండగుడు పరారీలో ఉన్నాడు. అతను కాల్పులు జరిపిన తుపాకీ దొరికినట్టు పోలీసులు చెప్పారు. కాల్పుల్లో ఎవరూ మరణించలేదని తొలుత అధికారులు చెప్పినా, రక్తం మడుగులో పడున్న మూడు మృతదేహాలను చూశామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నైట్క్లబ్లో కాల్పుల్లో మరొకరు అమెరికాలో శాక్రిమాంటో నగరంలో సోమవారం తెల్లవారుజామున ఓ నైట్క్లబ్లో జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించగా నలుగురు గాయపడ్డారు. డెన్మార్క్లో ముగ్గురు... కోపెన్హాగెన్: డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్లోని షాపింగ్ మాల్లో ఆదివారం రాత్రి ఓ వ్యక్తి విచ్చలవిడిగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. -
వైరల్: కొడుక్కు సెల్యూట్ చేసిన తల్లి, నెటిజన్లు ఫిదా
గాంధీనగర్: పిల్లలు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తే.. సహజంగానే తల్లిదండ్రుల ఆనందానికి అవధులుండవు. అయితే, పిల్లలను తమే గౌరవించాల్సిన ఉన్నత స్థితికి వారు చేరుకుంటే తల్లిదండ్రులకు పట్టపగ్గాలు ఉండవని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ఈ మధ్యకాలంలో ఉద్యోగరిత్యా కొడుకును తండ్రి గౌరవించడం, ఉన్నతాధికారి అయిన కుమార్తెకు తండ్రి సెల్యూట్ చేయడం వంటి సన్నివేశాలను మనం చూసాం. అయితే ఇప్పుడు మనం చూడబోయే ఓ చిత్రంలో కన్నతల్లి.. ఉన్నతాధికారి అయిన కొడుకుకు సెల్యూట్ చేస్తూ మురిసిపోతుంటుంది. చదవండి: భారత ఎంబసీల్లో తాలిబన్ల సోదాలు వివరాల్లోకి వెళితే.. గుజరాత్లోకి అరవల్లి ప్రాంత డీఎస్పీకి (పోలీస్ శాఖ).. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ మహిళా ఏఎస్సై సెల్యూట్ చేస్తుంది. ఇందులో విశేషం ఏముందని అనుకుంటున్నారా. అక్కడ పరస్పరం సెల్యూట్ చేసుకున్న వారు తల్లి కొడుకు కావడమే విశేషం. ఈ సందర్భంగా తల్లి మురిసిపోతూ, కళ్ల నిండా ఆనందంతో కొడుకుకు సెల్యూట్ చేస్తున్న దృశ్యం హైలైట్గా నిలిచింది. ఈ అపురూప దృశ్యాన్ని గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ దినేశ్ దాస ట్వీట్ చేయడంతో సోషల్మీడియాలో వైరల్గా మారింది. మనస్సుకు హత్తుకునే ఈ ఫోటోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అమ్మ కళ్లల్లో అసలుసిసలైన ఆనందాన్ని చూడాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: తండ్రితో పెళ్లికూతురు హుషారైన స్టెప్పులు.. ఫిదా అవ్వాల్సిందే -
‘జనగణమన’ మరిచిపోయి దిక్కులు చూసిన ఎంపీ..!
లక్నో: స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలు ఆదివారం దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో పలుచోట్ల అపశ్రుతి, తప్పులు దొర్లాయి. తాజాగా ఓ లోక్సభ సభ్యుడు జాతీయ గీతం ‘జనగణమన’ మరచిపోయారు. జెండా ఎగురవేసిన అనంతరం జాతీయ గీతం ఆళపిస్తుండగా ఎంపీ నోరు తిరగలేదు. ఆయనతో పాటు ఆయన అనుచరులు, కార్యకర్తలు కూడా జాతీయ గీతం పాడలేక అవస్థలు ఎదుర్కొన్నారు. కొందరు గీతం మరచిపోయి మధ్యలోనే ఆపివేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ఎస్టీ హసన్ ఉత్తరప్రదేశ్ మొరదాబాద్లోని గుల్షాహీద్ పార్క్ సమీపంలో స్వాతంత్ర్య వేడుకలకు హాజరయ్యారు. జెండా ఎగురవేసిన అనంతరం ఎంపీ హసన్తో పాటు ఆయన కార్యకర్తలు జనగణమన ప్రారంభించారు. వారు జాతీయ గీతాన్ని.పాడుతూ మధ్యలో మరచిపోయి ఇష్టమొచ్చినట్టు పాడారు. చివరకు జయ జయహే అనేది పూర్తిగా అనకుండానే ముగించారు. ఈ గీతం ఆళపిస్తుండగా ఎంపీ హసన్ బిత్తిరిచూపులు చూస్తుండడం వైరల్గా మారింది. ఈ సంఘటన రాజకీయ దుమారం రేపింది. ‘ఎంపీ, ఆయన కార్యకర్తలు జాతీయ గీతాన్ని పాడలేకపోయారు. మన నేతల పరిస్థితి ఇలా ఉంది’ అని బీజేపీ సీనియర్ నాయకుడు సంబిత్ పాత్ర ట్వీట్ చేస్తూ ఎద్దేవా చేశారు. So finally they thought that the best way out of the mess that they had created was to quickly move on to “जय है” ..and then move out .. वाह समाजवादियों वाह!! pic.twitter.com/BbqFffanMi — Sambit Patra (@sambitswaraj) August 15, 2021 -
అబుదాబిలో ఘనంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అబుదాబిలో ప్రవాస భారతీయులకు కేంద్ర బిందువైన ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో, కళా ప్రాంగణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ వేడుకలను జరుపుకునేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతినిచ్చిందని సంస్థ ప్రధాన కార్యదర్శి జోజో అంబూకెన్ తెలియజేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కమ్యూనిటీ డెవలప్మెంట్ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మెహ్రా అల్ మెహ్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు జార్తి వరీస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జార్తీ వరీస్ మాట్లాడుతూ.. ఎందరో త్యాగ మూర్తుల బలి దానాల ఫలితమే ఈ రోజు మనమందరము అనుభవిస్తున్న స్వేచ్చ వాయువులని, భావి భారత నిర్మాణం లో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతయినా ఉందని తెలియ జేశారు. 75 వ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా కోవిడ్ సమయం లో సంస్థ సభ్యులు బీరన్, యూనిస్ వారు చూపిన సమాజ స్పూర్తి కి గౌరవ పురస్కారాన్ని అందజేశామని సంస్థ సంక్షేమ కార్య దర్శి రాజా శ్రీనివాసరావు వెల్లడించారు. భారత ప్రభుత్వ పిలుపు మేరకు సాయంత్రం జరిగిన ఆజాది కి అమృత్ మహోత్సవ్ లో భాగంగా దేశం లోని వివిధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ గాన, నాట్య కళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం లో గుజరాత్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల వారి కళలను ప్రతిబింబించేలా ప్రదర్శనలు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన చిన్నారుల ప్రదర్శన చూపరులను ఎంతగానో ఆకర్షించింది. భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ గాన నాట్య కళా ప్రదర్శన జరిగింది. సాయంత్రం జరిగిన కార్యక్రమానికి లూలూ గ్రూపుల సంస్థ చైర్మన్ , ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ చైర్మన్ పద్మశ్రీ డా యూసుఫ్ అలీ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో సంస్థ క్రీడా కార్యదర్శి ఫ్రెడీ, ఉప ప్రధాన కార్య దర్శి జార్స్ వర్గీస్, ఉప కోశాధికారి దినేష్, జనరల్ మేనేజర్ రాజు తదితర ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. -
సాక్షి మీడియా గ్రూప్ ప్రధాన కార్యాలయం లో స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు
-
జాతీయ జెండా విలువేంటో తెలుసా?
జాతీయ జెండా అంటే.. ప్రతీ దేశానికి ఒక గుర్తింపు. మన మువ్వెన్నెల జెండా.. జాతి ఔనత్యానికి ప్రతీక. స్వాతంత్య్ర పోరాటంలో అసువులు బాసిన వీరుల త్యాగానికి ప్రతీకల్లో ఒకటి. అందుకే జాతీయ పతాకాన్ని గౌరవించుకోవడం మన అందరి బాధ్యత కూడా. పంద్రాగష్టు, గణతంత్ర దినోత్సవాలప్పుడు ఉప్పొంగే దేశభక్తి.. జెండాను గుండెలపైకి చేరుస్తుంది. కానీ, ఈరోజుల్లో అయినా జాతీయ జెండాకు నిజమైన గౌరవం అందుతోందా? అని వజ్రోత్సవాల వేడుకల(75వ) సందర్భంగా సోషల్మీడియా #RespectNationalFlag హ్యాష్ట్యాగ్తో ప్రశ్నిస్తోంది. ఎవరైనా, ఎప్పుడైనా గౌరవానికి భంగం కలగని రీతిలో జాతీయ జెండా(National flag)ను ఎగరేయవచ్చు. 2002 కంటే ముందు భారతీయ పౌరులు స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో జెండా ఎగరేయడానికి వీలుండేది కాదు. కానీ, 2002లో సుప్రీం కోర్టు ఫ్లాగ్ కోడ్ను మార్చింది. మిగిలిన రోజుల్లోనూ జెండాను అవమానం కలగకుండా.. పగటి పూట ఎగరేయవచ్చని స్పష్టం చేసింది. Vande Mataram 🇮🇳 pic.twitter.com/xGsfMMKat3 — Flt Lt Anoop Verma (Retd.) 🇮🇳 (@FltLtAnoopVerma) August 14, 2021 దేశ పండుగల నాడు జెండాను గౌరవించుకోవాలనుకోవడం మంచిదే!. కానీ, ఆ వంకతో రంగుల్ని ప్రదర్శించడం ఎంత వరకు సమంజసం. జెండా అంటే పిల్లలు ఆడుకునే బొమ్మ కాదు. డ్రస్సుల్లో, ముఖానికి రంగులుగా పులుముకోవడం, వాట్సాప్, ఫేస్బుక్కుల్లో ప్రచారం కోసం జెండాపై రాతలు, ఫొటోలతో నింపడం అపవిత్రం చేసినట్లే అవుతుంది. జాతీయ జెండాను అగౌరవపరిచారంటూ ఈ-కామర్స్ సైట్లపై అగ్గిమీద గుగ్గిలం అయ్యేవాళ్లకు.. జాతీయ జెండాను అవమానించడమూ నాన్-బెయిలబుల్ నేరం అని తెలుసో లేదో. జెండాను తిరగేసి ఎగరేయడం, కింద పడుకోబెట్టడం లాంటివి చేస్తే చట్టం సహించదు కూడా. #RespectNationalFlag pic.twitter.com/dq5Ry8gu3O — Brahmaiah (@Brahmai45382593) August 15, 2021 “Our flag does not fly because the wind moves it, it flies with the last breath of each soldier who died protecting it.” Happy Independence day to everyone...#IndiaAt75 #IndependenceDay #15August #स्वतंत्रतादिवस #RespectNationalFlag #AmritMahotsav pic.twitter.com/J6s5nozDsq — Faizal Peraje 🇮🇳 (@Faizal_Peraje) August 15, 2021 జెండా ఎగరేసే ఆత్రుతలో, నిర్లక్క్ష్యంతో ఉల్టా-పల్టా ఎగరేసి అవమానించేవాళ్లు ఎలాగూ ఉంటారు. అది వాళ్ల విచక్షణకే వదిలేద్దాం. కానీ, కమర్షియల్ మార్కెటింగ్, ప్రచారాల కోసం జెండాను ఉపయోగించుకునేవాళ్లు, జెండాలను రోడ్డున పడేసే వాళ్ల సంగతి ఏంటి?. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఎవరూ అతీతులు కాదు.. అంతా జాతీయ పతాకాన్ని-గేయాన్ని గౌరవించి తీరాల్సిందే. పిల్లలకే కాదు.. పెద్దలకూ ఈ విషయంలో పాఠాలు చెబితే బాగుండు. జై హింద్. -ట్విటర్లో ఉవ్వెత్తున ఎగసిన #RespectNationalFlag -
దేశమాతకు గళార్చన స్వతంత్ర గేయాలు
‘‘భరతమాత బిడ్డలం అందరం భరతమాత బిడ్డలమేమందరం కలసి ఉంటె కలదు సుఖం కలహిస్తే దుఃఖమయం...’’ హైదరాబాద్, గచ్చిబౌలిలో ఓ ప్రసిద్ధ పాఠశాల. పేరు నాజర్ బాయ్స్ స్కూల్. దానికి ఎదురుగా ఓ అధునాతనమైన అపార్ట్మెంట్ లో దేశభక్తి గీతాలాపన జరుగుతుంటుంది. కొన్నేళ్లుగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఓ పెద్దావిడ దేశభక్తి గీతాలు ఆలపిస్తున్నారు. ఆ పెద్దావిడ పేరు గుంటూరు ఈశ్వరమ్మ. పాట ఆగకూడదు! అరవై ఎనిమిదేళ్ల ఈశ్వరమ్మ కు మాటలతోపాటే పాటలు కూడా వచ్చి ఉంటాయి. ఎందుకంటే వాళ్ల అమ్మ దమయంతికి పాటలు పాడడం ఇష్టం. ఇంట్లో పనులు చేసుకుంటూ, పిల్లలను ఆడిస్తూ పాటలు పాడుతూనే ఉండేవారామె. అలా మొదలైన ఈశ్వరమ్మ పాట నేటికీ అంతే శ్రావ్యంగా జాలువారుతూనే ఉంది. ఇంట్లో వేడుకలు ఈశ్వరమ్మ పాట లేనిదే సంపూర్ణతను సంతరించుకోవు. ఆమె స్కూలుకెళ్లే రోజుల నుంచి ఆగస్టు 15, రిపబ్లిక్ డే, గాంధీ జయంతి... ఇలా ఏ వేడుక అయినా సరే ఈశ్వరమ్మ పాట తప్పకుండా ఉండేది. ఆమె పాడడంతోపాటు ఆసక్తి ఉన్న పిల్లలకు నేర్పిస్తున్నారు కూడా. ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాటలు పాడడానికి సిద్ధమవుతున్న పిల్లలకు ఆమె దేశభక్తి గేయాలు నేర్పిస్తున్నారు. ‘‘నా దగ్గర ఉన్న పాటల్లో చాలా పాటలు బయట ఎక్కడా దొరకవు. అంతమంచి పాటలు నా దగ్గరే ఆగిపోతే ఎలాగ? పిల్లలకు నేర్పిస్తే మరొక తరం తయారవుతుంది. నా దగ్గర నేర్చుకున్న పిల్లల్లో ఏ నలుగురైనా దీక్షగా నేర్చుకుని మరింత మందికి నేర్పిస్తే నాకదే తృప్తి’’ అన్నారు ఈశ్వరమ్మ. పాటల పుటలు ఈశ్వరమ్మది నల్గొండ జిల్లా, మిర్యాలగూడ. ఆమె చిన్నప్పటి నుంచి ఆటగా పాటలు పాడుతుండడంతో పదేళ్లకే మాస్టార్ని పెట్టి సంగీతం నేర్పించారు. ‘‘మా మాస్టారి పేరు పెంటపాటి సర్వేశ్వరరావు. ఆయన గేయ రచయిత కూడా కావడంతో పాటలు సొంతంగా రాసి మాకు నేర్పించేవారు. మా అమ్మ దగ్గర నేర్చుకున్నవి, నేను సేకరించినవి, మాస్టారు రాసిచ్చినవి అన్నీ కలిపి నా దగ్గర చాలా పాటలు ఉన్నాయి. పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యతల్లో పడి హార్మోనియం మీటడం మర్చిపోయాను. కానీ పాడడం మర్చిపోలేదు. నేను చదివింది ఎనిమిదవ తరగతి వరకే. కానీ మా వారు తెలుగు పండిట్ కావడంతో ఖాళీగా ఉన్నప్పుడు పద్యాలు పాడుకోవడం ఆయన అలవాటు. అలా నేనూ పద్యాలు నేర్చుకున్నాను. పాటలు, పద్యాలు పాడి పాటలు రాయడం వచ్చేసింది. పిల్లల ను ఉయ్యాలలో వేసేటప్పుడు సొంతంగా పాటలు రాసి పాడాను. సంక్రాంతి ముగ్గుల పాటలు, బతుకమ్మ పాటలు... మొత్తం 15 పాటలు రాశాను. జెండావందన గేయం మా మిర్యాలగూడలో జెండావందనానికి నాలుగు రోజుల ముందే నేను పాట పాడడానికి సిద్ధంగా ఉన్నానా లేదా అని కబురు చేసేవాళ్లు. హైదరాబాద్లో మా అబ్బాయి ఇంట్లో.. అపార్ట్మెంట్ జెండా ఆవిష్కరణలో దేశభక్తి గేయాలు పాడుతున్నాను. కరోనా వల్ల గతేడాది అపార్ట్మెంట్ లో ఉండే వాళ్లలో చాలామంది పతాకావిష్కరణకు రాలేదు. నేను వెళ్లి పాటలు పాడాను. కార్యవర్గ సభ్యులు నాతో గొంతు కలిపారు’’ అన్నారు ఈశ్వరమ్మ. అంతా నా బిడ్డలే! ఈ ఏడాది పిల్లలకు పాటలను జూమ్ సెషన్స్లో నేర్పిస్తున్నారామె. ‘‘దేశమాతను గౌరవిస్తూ పాట పాడడానికి పిల్లలు ముందుకు రావడమే గొప్ప సంతోషం. అలా ముందుకొచ్చిన పిల్లలందరూ నా మనుమళ్లు, మనుమరాళ్ల వంటి వాళ్లే’’ అంటున్న ఈశ్వరమ్మ భరతమాతకు ప్రతిరూపంగా కనిపించారు. – వాకా మంజులారెడ్డి -
WETA ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
కాలిఫోర్నియాలోని "విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ స్వాతంత్ర దిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా సంస్థ ప్రెసిడెంట్ ,ఫౌండర్ హనుమండ్ల ఝాన్సీ రెడ్డి మట్లాడుతూ దేశం అన్నింటా అభివృద్ధి చెందుతున్న సమయం లో ఒక వైరస్ అస్థిత్వానికి సవాల్ విసిరింది .కోవిడ్ సెకండ్ వేవ్ లో WETA ఎన్నో గ్రామాలలో సేవాకార్యక్రమాలని చేయగలిగిందని,సహాయం చేసిన దాతలకు ఈ సమయంలో ముందు ఉండి పని చేసిన కోవిడ్ వారియర్స్ కి ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి , WETA వాలంటీర్స్ కి కృతజ్ఞత తెలిపారు. కోవిడ్ కష్ట కాలంలో చురుకు గా పని చేసిన కొంత మంది వాలంటీర్స్ ని అవార్డ్స్ తో సత్కరించామని తెలిపారు.స్వాతంత్ర దినోత్సవంలో ఝాన్సీ రెడ్డి పాల్గొని జాతీయ పథకాన్ని ఎగరవేశారు. ఈ వేడుకలలో పలువురు ఎగ్జిక్యూటివ్ టీం సభ్యులు, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శైలజ కల్లూరి పాల్గొని ..శుభాకాంక్షలు తెలిపారు. -
ఈ దేశభక్తి స్టిక్కర్లతో స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేయండి
Independence Day 2021: 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపడం కోసం ఇమేజ్లు, వాట్సాప్ స్టిక్కర్లు కోసం చూస్తున్నారా? ఈ ప్రాసెస్తో మీరు వాట్సాప్ ద్వారా స్వాతంత్య్ర దినోత్సవానికి సంబంధించిన స్టిక్కర్స్ సులభంగా పంపించుకోవచ్చు. దీని కోసం, మీరు ప్లే స్టోర్ నుండి థర్డ్ పార్టీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. వాట్సాప్ లో కేవలం కొన్ని ప్రాథమిక స్టిక్కర్ ప్యాక్లు మాత్రమే లభిస్తాయి. ఇండిపెండెన్స్ డే స్టిక్కర్ల కోసం మీరు థర్డ్ పార్టీ యాప్ లపై ఆధారపడాలి. ఇప్పుడు 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి సంబందించిన కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ కొన్ని అందుబాటులో ఉన్నాయి. వీటిని డౌన్లోడ్ చేసుకున్నాక ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం. స్టెప్1: గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్లి ఇండిపెండెన్స్ డే స్టిక్కర్స్ అని సెర్చ్ చేయాలి. మీకు కావాల్సిన స్కిక్కర్స్ కోసం “Independence Day – August 15 Stickers WA & Frames” అనే యాప్ను డౌన్ లోడ్ చేసుకోండి. స్టెప్ 2: మీకు కావాల్సిన యాప్ను డౌన్ లోడ్ చేసుకొని ఓపెన్ స్టిక్కర్స్ ప్యాక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. స్టెప్ 3: స్టిక్కర్స్ ప్యాక్ మీద ట్యాప్ చేస్తే మీకు కావాల్సిన స్కిక్కర్స్ డిస్ ప్లే అవుతాయి. స్టెప్ 4: ఆ తర్వాత డిస్ ప్లే అయిన స్కిక్కర్స్ పై ప్లస్ సింబల్ పై ట్యాప్ చేస్తే మీకు కావాల్సిన విజిబిలిటీని సరిచేసుకోవచ్చు. స్టెప్ 5: విజబులిట్ ఆప్షన్ వెరిఫై చేసుకున్న తరువాత వాట్సాప్ లేదా సిగ్నల్ యాప్ ద్వారా మీ స్నేహితులకు సెండ్ చేసే సదుపాయం ఉంటుంది. ఇండిపెండెన్సె డే ఫ్రేమ్స్ మనం పైన చెప్పుకున్న యాప్ను డౌన్ లోడ్ చేసిన తర్వాత.. యాప్ లో స్టార్ట్ ఫ్రేమ్ క్రియేషన్ అనే సెక్షన్ కనిపిస్తుంది. ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇండిపెండెన్స్ డే ఫ్రేమ్స్ డిస్ ప్లే అవుతాయి. ఆ ఫ్రేమ్ ఆప్షన్ క్లిక్ చేసి మీ వ్యక్తిగత ఫోటోలు లేదంటే మీ కుటుంబసభ్యుల ఫోటోల్ని అప్లోడ్ చేసి.. ఆ ఫోటోలపై ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు చెప్పవచ్చు. ఇండిపెండెన్స్డే జిఫ్ ఇమేజెస్ వాట్సాప్ ద్వారా జిఫ్ ఇమేజెస్ ను సులభంగా పంపించుకోవచ్చు. ఎమోజీ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మనకు జిఫ్ ఇమేజ్లు డిస్ ప్లే అవుతాయి. మీకు కావాల్సిన జిఫ్ ఇమేజెస్ ను సెలక్ట్ చేసుకొని మీకు కావాల్సిన వారికి సెండ్ చేసుకోవచ్చు. ఆ జిఫ్ ఇమేజెస్ నచ్చకపోతే జిప్ఫర్.కామ్ సైట్ ను విజిట్ చేసి.. ఆ సైట్ ద్వారా మీకు కావాల్సిన ఫోటోల్ని సెలక్ట్ చేసుకోవచ్చు. -
పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన డీజీపీ గౌతమ్ సవాంగ్
సాక్షి, విజయవాడ: 75వ స్వాత్రంత్య వేడుకలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ముస్తాబవుతోంది. పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లను డీజీపీ గౌతమ్ సవాంగ్, సీపీ బత్తిన శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ నివాస్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడుతూ, వేడుకలకు వీవీఐపీ, వీఐపీలతో పాటు కొందరికే అనుమతి ఉంటుందని, మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పాస్లు ఉన్నవారికే వేడుకలు వీక్షించేందుకు అనుమతి ఉంటుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. -
హైదరాబాద్: పంద్రాగస్టు వేడుకలు.. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా
సాక్షి, హైదరాబాద్ : గోల్కొండ కోటలో ఆదివారం పంద్రాగస్టు వేడుకలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంపై పోలీసు విభాగం డేగకన్ను వేసింది. గోల్కొండ కోటలో ప్రతి అణువూ రికార్డు అయ్యేలా చర్యలు తీసుకుంది. మొత్తమ్మీద 120 అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నగర పోలీసులు వీటినీ బషీర్బాగ్లోని పోలీసు కమిషనరేట్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో (సీసీసీ) అనుసంధానించింది. స్థానిక పోలీసుస్టేషన్, కోట వద్ద ఉన్న కంట్రోల్ రూమ్లోనూ దృశ్యాలను చూసేలా ఏర్పాటు చేశారు. ఈ తాత్కాలిక సీసీ కెమెరాల పని తీరుపై సీసీసీ అధికారులు శుక్రవారం ట్రయల్ రన్ నిర్వహించి సంతృప్తి వ్యక్తం చేశారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో నగర వ్యాప్తంగా నిఘా, గస్తీ ముమ్మరం చేశారు. గోల్కొండ కోటలోకి ప్రవేశించే ప్రతి ద్వారం దగ్గరా డోర్ఫ్రేమ్, మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసి తనిఖీ చేయనున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా ► 15న ఉ. 7 నుంచి మ. 12 గంటల వరకు కో ట వైపునకు వాహనాలకు అనుమతి లేదు. ► రాందేవ్గూడ నుంచి కోటకు ఎ, బి, సి, పాస్ హోల్డర్స్ వాహనాలకే అనుమతి. ► కింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్ట్యాంక్, మెహిదీపట్నం నుంచి వచ్చే పాస్ హోల్డర్లు రేతిబౌలి,నానల్నగర్ జంక్షన్ నుంచి లంగర్హౌస్ ఫ్లైఓవర్, టిప్పు ఖాన్ బ్రిడ్జి, రాందేవ్గూడ జంక్షన్ మీదుగా రావాలి. ► మక్కై దర్వాజ వద్ద ఎ– కారు పాస్ హోల్డర్లు మెయిన్ రోడ్డు పక్కన, బి– పాస్ హోల్డర్లు గోల్కొండ కోట బస్టాప్ వద్ద, సి– కారు పాస్ హోల్డర్లు గోల్కొండ బాయ్స్ గ్రౌండ్ ఫుట్బాల్ గ్రౌండ్లో పార్క్ చేయాలి. ► డి– పాస్ హోల్డర్లు ప్రియదర్శిని స్కూల్ వద్ద వాహనాలను పార్క్ చేయాలి. ఇ– కారు పాస్ హోల్డర్లు సెవన్ టూంబ్స్ బంజారా దర్వాజ మీదుగా రేతిగల్లిలోని ఒౖవైసి గ్రౌండ్లో వాహనాలను పార్క్ చేయాలి. ► లంగర్హౌస్ మీదుగా వచ్చే ఇ– పాస్ హోల్డర్లు బడాబజార్, బల్దియా ఐలాండ్ మీదుగా ఒవైసి గ్రౌండ్కు వెళ్లాలి. ఎఫ్– కారు పార్క్ హోల్డర్లు లంగర్హౌస్ మీదుగా ఫతే దర్వాజ నుంచి హుడా పార్కు వద్ద వాహనాలను పార్క్ చేయాలి. ► షేక్పేట్, టోలిచౌకికి చెందిన వారు బంజారా దర్వాజ నుంచి ఆర్టీసి బస్సుల ద్వారా కోటకు చేరుకోవాలి. ► వేడుకలు పూర్తయిన తర్వాత ఏ,బీ,సీ– కారు పాస్ హోల్డర్లు మక్కై దర్వాజ, రాందేవ్గూడ, లంగర్హౌస్ నుంచి వెళ్లాలి. డి కారు పాస్ హోల్డర్లు బంజారదర్వాజ మీదుగా సెవన్ టూంబ్స్ వైపు వెళ్లాలి. ఇ– కారు పాస్ హోల్డరు బడాబజార్, ఫతే దర్వాజ గుండా వెళ్లాలి. ఎఫ్– కారు పాస్ హోల్డర్లు తమ తమ పార్కింగ్ ప్రదేశాల నుంచి వచ్చిన మార్గం గుండానే వెనక్కి వెళ్లిపోవాలి. అన్ని రకాల పాస్ హోల్డర్లు తమ పాస్ను తమ కారుపై డిస్ప్లే చేయాలి. -
ఎర్రకోట శత్రు దుర్భేద్యం
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాలకు దేశం సన్నద్ధమవుతోంది. ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎర్రకోటను శత్రుదుర్భేద్యంగా మారుస్తున్నట్లు పోలీసు అధికారులు శనివారం చెప్పారు. ప్రధాన ద్వారం వద్ద షిప్పింగ్ కంటైనర్లతో తాత్కాలిక రక్షణ గోడను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటిని దాటుకొని లోపలికి అడుగుపెట్టడం అసాధ్యమని పేర్కొన్నారు. చాందినీ చౌక్ ప్రాంతం నుంచి అనుమతి లేకుండా ఎర్రకోటలోకి ప్రవేశించలేని విధంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. చరిత్రాత్మక ఎర్రకోట వద్ద కంటైనర్లతో తాత్కాలికంగా భారీ గోడను సిద్ధం చేస్తుండడం ఇదే మొదటిసారి. ఇవి ఆకర్షణీయంగా కనిపించేలా రంగులు వేస్తున్నారు. గ్రాఫిటీ కళతో కనులకు ఇంపుగా తీర్చిదిద్దుతున్నారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిన డిమాండ్తో రైతులు నెలల తరబడి ఢిల్లీలో ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వారు తమ నిరసనను వ్యక్తం చేయడానికి ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్య్ర దినోత్సవాలను వేదికగా మార్చుకొనే అవకాశం ఉందన్న సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినం సందర్భంగా ఎర్రకోట వద్ద రైతులు, భద్రతా సిబ్బంది మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. నిరసనకారులు అక్కడే మతపరమైన జెండా ఎగురవేయడం సంచలనం సృష్టించింది. అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఢిల్లీలో డ్రోన్లు, పారా గ్లైడర్స్, ఎయిర్ బెలూన్లు ఎగురవేయడంపై నిషేధం విధిస్తూ గత నెలలో అప్పటి ఢిల్లీ కమిషనర్ బాలాజీ శ్రీవాస్తవ ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 16వ తేదీ దాకా ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఇటీవల ఎర్రకోట వెనుక భాగంలోని విజయ్ఘాట్ వద్ద అనుమానాస్పదంగా ఎగురుతున్న ఓ డ్రోన్ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
బైడెన్ అట్టర్ ఫ్లాప్!
వైట్హౌజ్లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే పాలనాపరమైన దూకుడును ప్రదర్శించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్పై.. ఇప్పుడు విమర్శలు మొదలయ్యాయి. కరోనా వ్యాక్సినేషన్ విషయంలో టార్గెట్ మిస్ అయ్యాడంటూ బైడెన్ను ఉతికి ఆరేస్తున్నారు ప్రత్యర్థులు. వాషింగ్టన్: ఎన్నికల వాగ్ధానాల్లో.. అధ్యక్షుడిగా అధికారంలోకి రాగానే బైడెన్ చేసిన కీలక ప్రకటన.. అమెరికన్లకు వ్యాక్సిన్ డోసులు అందించడం. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం నాటికి 70 శాతం అమెరికన్లను(పెద్దలకు..27 ఏళ్లు పైబడిన వాళ్లు) వ్యాక్సిన్ డోసులు అందిస్తానని ప్రమాణం చేశాడు. అందుకే తగ్గట్లే తొలినాళ్లలో ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లతో డ్రైవ్ జోరు మాములుగా కనిపించలేదు. అయితే.. ఈ ప్రణాళికలో బైడెన్ టార్గెట్ను చేరుకోలేదని తెలుస్తోంది. జులై 3 నాటి ఫాక్స్ న్యూస్ రిపోర్ట్ ప్రకారం.. 67 శాతం పెద్దలకు మాత్రమే ఇప్పటిదాకా వ్యాక్సిన్ అందినట్లు సమాచారం. అయితే అమెరికాకే చెందిన మరో రెండు ప్రముఖ దినపత్రికలు మాత్రం అది 60 శాతం లోపే ఉందని కథనాలు వెలువరించడం విశేషం. ఇక దాదాపు 35 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో.. 15.7 కోట్ల మందికి పూర్తి డోసులు, 18.2 కోట్ల మందికి ఒక్క డోసైన అంది ఉంటుందని మీడియా గణాంకాలు చెప్తున్నాయి. మరోవైపు.. ఇతర దేశస్తులకు వ్యాక్సిన్లు డోసులు అందినప్పటికీ, వాటిలో చాలావరకు లెక్కలకు తీసుకోకపోవడం.. ఈ కారణం వల్లే అమెరికన్లను డోసులు పూర్తిగా అందలేదని, పైగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే లెక్కల్లో గందరగోళం నెలకొందని రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రా నుంచి పూర్తి స్థాయిలో నివేదికలు అందలేదన్న వైట్హౌజ్ ప్రతినిధి వ్యాఖ్యలతో మీడియా కథనాలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. కరోనా యుద్ధం ముగియలేదు నన్ను తప్పుగా అనుకోకండి.. కరోనాతో యుద్ధం ఇంకా ముగియలేదు. డెల్టా లాంటి రకరకాల వేరియెంట్లు పుట్టుకొస్తున్నాయి అని అమెరికా ఇండిపెండెన్స్ డే సందర్భంగా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించాడు. వెయ్యి మంది అతిథుల మధ్య వైట్ హౌజ్లోని జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘‘245 ఏళ్ల క్రితం బ్రిటిష్చెర నుంచి స్వాతంత్ర్యం సంపాదించుకున్నాం. అలాగే ఇవాళ ప్రమాదకరమైన కరోనా వైరస్ నుంచి విముక్తి కోసం పోరాటంలో చివరి దశకు చేరుకున్నాం. పోరాటం ఆపొద్దు. వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలి’’ అని జాతిని ఉద్దేశించి ప్రసంగించాడు బైడెన్. మరోవైపు అమెరికా వ్యాప్తంగా సంబురాలు మాత్రం అంబురాన్ని అంటాయి. మాస్క్లు లేకుండా గుంపులుగా జనాలు వేడుకలు చేసుకున్నారు. పబ్లలో, బీచ్లలో కోలాహలం కనిపించింది. ఇక భారత ప్రధాని మోదీ సహా పలు దేశాల అధినేతలు అమెరికన్లను శుభాకాంక్షలు తెలియజేశారు. Warm felicitations and greetings to @POTUS @JoeBiden and the people of the USA on their 245th Independence Day. As vibrant democracies, India and USA share values of freedom and liberty. Our strategic partnership has a truly global significance. — Narendra Modi (@narendramodi) July 4, 2021 -
పింగళి కుటుంబసభ్యులకు సీఎం సన్మానం
సాక్షి, అమరావతి బ్యూరో/మాచర్ల: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సన్మానించనున్నారు. 75వ స్వాతంత్య్ర దిన వేడుకల ప్రారంభంలో భాగంగా జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి కుటుంబసభ్యులను సన్మానించేందుకు శుక్రవారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా మాచర్లకు సీఎం జగన్ వస్తున్నారని గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పింగళి వెంకయ్య కుమార్తె ఘంటశాల సీతామహాలక్ష్మి మాచర్ల వాసి. సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ గురువారం మాచర్ల వెళ్లి పర్యవేక్షించనున్నారు. ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏర్పాట్లలో పాలుపంచుకుంటున్నారు. -
నాట్స్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య వేడుకలు
చికాగో: 'ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని..' అంటూ చికాగోలోని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) చికాగో భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించింది. ప్రవాస భారతీయులు ఈ ర్యాలీలో పాల్గొని జన్మభూమి పట్ల వారికి ఉన్న మమకారాన్ని చాటుకున్నారు. ఈ ర్యాలీ అనంతరం ప్రవాస భారతీయుల పిల్లలు జనగణమన అధినాయక జయహే.. అంటూ భారత జాతీయ గీతం పాడి భారత్ పై తమకున్న ప్రేమను చాటారు. కన్నతల్లిని, జన్మభూమిని ఎన్నటికి మరిచిపోరాదని చాటేందుకు మాతృభూమిపై ఉన్న ప్రేమను వ్యక్త పరిచేందుకు ఈ ర్యాలీ నిర్వహించామని నాట్స్ నాయకులు మదన్ పాములపాటి అన్నారు. ఈ ర్యాలీ పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. (కోవిడ్ టైం.. ఆయనో ధైర్యం) నాట్స్ బోర్డు డైరెక్టర్లు మూర్తి కొప్పాక, విజయ్ వెనిగళ్ల, రవి శ్రీకాకుళం, నాట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నాయకులు కృష్ణ నిమ్మగడ్డ, లక్ష్మి బుజ్జా ఈ ర్యాలీ విజయవంతం కావడానికి కీలక పాత్ర పోషించారు. చికాగో నాట్స్ విభాగ నాయకులు వేణు కృష్ణార్ధుల, ప్రసుధ సుంకర, బిందు వీధులమూడి, హరీశ్ జమ్ముల, కార్తీక్ మోదుకూరి, భారతీ పుట్టా, పాండు చెంగళశెట్టి, మూర్తి కొగంటి తదితరులు తమ పూర్తి సహాయ సహకారాలు అందించి ఈ ర్యాలీని దిగ్విజయం చేశారు. చికాగో యునైటెడ్ కమ్యూనిటీ నాయకులు చాందిని దువ్వూరి, లింగయ్య మన్నెలు కూడా ఈ ర్యాలీకి తమ వంతు తోడ్పాటు అందించారు. (పారిశుధ్య కార్మికులకు నాట్స్ సాయం) -
యూఏఈలో భారత స్వాతంత్ర్య వేడుకలు
అబుదాబీ: 74వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో నిరాడంబరంగా జరిగాయి. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న వేళ యూఏఈ ప్రభుత్వం ఇచ్చిన పరమితమైన అనుమతుల మేరకు ఐఎస్సీ యాజమాన్యం మొత్తం వేడుకలను రెండు భాగాలుగా విభజించి నిర్వహించింది. ఉదయం 7.30 నిమిషాలకు ఐఎస్సీ యాజమాన్య కార్యవర్గం, సెంటర్ ఉద్యోగుల సమక్షంలో ఐఎస్సీ అధ్యక్షుడు యోగేష్ ప్రభు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందరో వీరుల త్యాగ ఫలితమే మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ వాయువులని, అందరం దేశ ప్రగతికి తోడ్పడిననాడే వారికి నిజమైన నివాళి అర్పించినవాళ్లమవుతామని తెలిపారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని సాంకేతిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్షంగా వీక్షిస్తున్న సంఘ సభ్యులు, యూఎన్ఈలో ఉంటున్న ఎంతోమంది భారతీయులందరికీ 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కరోనా ప్రభావం, ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల మేరకు ఇలా జరుపుకోవాల్సి వచ్చిందని సంఘ ప్రధాన కార్యదర్శి జోజో అంబూకేన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెండో భాగమైన సాంస్కృతిక కార్యక్రమం సాయంత్రం 7.30 నిమిషాల నుంచి రెండు గంటలపాటు జరుపుకున్నారని సాంస్కృతిక కార్యదర్శి జయప్రదీప్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 10 రాష్ట్రాల సాంస్కృతిక సంఘాల పాలు పంచుకున్నాయని దక్షిణ భారత కార్యదర్శి రాజా శ్రీనివాసరావు తెలిపారు. ఈ ప్రోగ్రామ్లో తెలుగు వారి తరపున పావని ఆధ్వర్యంలో వర్షిణి, ఆముక్త, కువీర, సంస్కృతి, అక్షర, కవీష్, అభిరామ్ పాల్గొని ప్రేక్షకులను వారి నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తెలుగు వారి ప్రదర్శన ఈ కార్యక్రమానికే వన్నె తెచ్చిందని ఉపాధ్యక్షులు జార్జి వర్గీస్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని జూమ్ ద్వారా యూఏఈలో ఉన్న ఎందరో భారతీయులు వీక్షించారని సెంటర్ జనరల్ మేనేజర్ రాజు అన్నారు. అలాగే భారత దౌత్య కార్యాలయం 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిపిన ఆన్లైన్ దేశ భక్తి గీతాల, చిత్ర లేఖన ప్రదర్శనలో కవీష్ పాడిన పాటను కాన్సులేట్ జనరల్ అభినందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన తెలుగు మిత్రులు, వారి కుటుంబ సభ్యులందరికీ రాజా శ్రీనివాసరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
ప్రగతి భవన్లో నిరాడంబరంగా జెండా వందనం
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధికారిక నివాసం ప్రగతి భవన్లో స్వాతంత్య్ర వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రగతి భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ పరేడ్ మైదానంలోని సైనిక అమర వీరుల స్మారకాన్ని సందర్శించి నివాళులర్పించారు. సైనిక అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కోవిడ్–19 మహమ్మారిపై పోరాటం చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. సీనియర్ సైనిక అధికారులు లెఫ్టినెంట్ జనరల్ టీఎస్ఏ నారాయణ్, మేజర్ జనరల్ ఆర్కే సింగ్, బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఏటా గోల్కొండ కోటలో స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. అయితే కరోనా నేపథ్యంలో ఈసారి ప్రగతి భవన్లో నిరాడంబరంగా నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాన్ని సైతం సీఎం కేసీఆర్ రద్దు చేసుకున్నారు. -
మార్పు దిశగా అడుగులు
సాక్షి, అమరావతి: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 74వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నా రాజ్యాంగంలోని ముందుమాటలో చెప్పుకున్న స్ఫూర్తి ఇప్పటికీ అమలు కావడం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం అందరికీ సమానంగా అందాలని రాజ్యాంగంలోని ప్రియాంబుల్లో రాసుకున్న తొలిపలుకులనే అమలుచేయలేని దుస్థితి కనిపిస్తోందన్నారు. ఈ పరిస్థితిని మార్చడానికే, మార్పు దిశగా అడుగులు వేస్తున్నామని, గత 14 నెలల్లో తీసుకున్న ప్రతి నిర్ణయం, చేపట్టిన ప్రతి పథకం ఇందుకు నిదర్శనమని సీఎం తెలిపారు. అంటరానితనం ఇపుడు రూపు మార్చుకుందని, పేదలకు ఇంగ్లిష్ మీడియం అవసరం లేదన్న వాదనలు అందులో భాగమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. స్వాతంత్య్ర సమరయోధులకు పాదాభివందనం. స్వాతంత్య్రం ప్రాణవాయువు లాంటిదని గాంధీజీ చెప్పారు. రాజ్యాంగం, చట్టం, ప్రజాస్వామ్యం ప్రకారం వ్యవస్థలను నడిపిస్తేనే ఏ మనిషికైనా రక్షణ ఉంటుంది. ఏ సమాజానికైనా అభివృద్ధి అందుతుంది. దేశ ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలను సమానంగా అందిస్తామని, అవకాశాల్లో, హోదాల్లో ప్రజలందరి మధ్య సమానత్వం పెంపొందిస్తామని రాజ్యాంగంలోని తొలి పలుకులుగా నిర్దేశించుకున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే సమాజంలో 62 శాతం ఉన్న రైతాంగానికి, 50 శాతం ఉన్న అక్క చెల్లెమ్మలకు అండగా నిలిస్తే, వారి జీవితాల్లో మంచి మార్పులు వస్తాయని నమ్మాం. అందుకే రైతు భరోసా, చేయూత, అమ్మ ఒడి, ఆసరా వంటి పథకాలు అమలు చేస్తున్నాం. ఇబ్బందికర ఆర్థిక పరిస్థితులను తట్టుకుంటూ పార్టీలు, కులాలు, మతాలు చూడ కుండా శాచ్యురేషన్ ప్రాతిపదికన అందిస్తున్నాం. ఇదీ గ్రామ స్వరాజ్యమంటే.. ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్న గ్రామ స్వరాజ్యాన్ని దేశంలోనే తొలిసారిగా అమలు చేసి చూపించాం. గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా.. పరిపాలన వికేంద్రీకరణలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిం చాం. ఏకంగా లక్షా నలభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ఆ ఉద్యోగాల్లో 82.5 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చాం. ప్రభుత్వం తరపున సంక్షేమం అందించడానికి ప్రతి 50 కుటుంబాలకు ఒకరు చొప్పున వలంటీర్లను ఏర్పాటు చేశాం. 2 లక్షల 70 వేల వలంటీర్లతో దేశంలోనే అత్యున్నతమైన డెలివరీ మెకానిజమ్ ఏర్పాటు చేశాం. ప్రభుత్వ పథకాల కోసం లంచాలు ఇచ్చుకుని, చెప్పులు అరిగేలా తిరిగే పరిస్థితిని మార్చి, పథకాలే ఇంటికి వచ్చి తలుపుతట్టి అందించే పరిస్థితిలోకి తెచ్చాం. ఒకటో తేదీన సూర్యోదయానికి ముందే ఇంటి వద్దే పింఛన్లు అందుకుంటున్న ఆ అవ్వాతాతల మొహాల్లో ఆనందమే మన ప్రభుత్వానికి కొండంత ఆస్తి. అదే తృప్తి. ఈ వ్యవస్థకు మెరుగులు దిద్దుతూ రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన, తినగలిగే బియ్యాన్ని డిసెంబరు నుంచి డోర్ డెలివరీ చేయనున్నాం. సామాజిక న్యాయానికి ఎంతగా కట్టుబడ్డామంటే.. సామాజిక న్యాయానికి అర్ధం చెబుతూ మన క్యాబినెట్లోనే దాదాపుగా 60 శాతం ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు కేటాయించాం. ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు. రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్లు,, ఏది తీసుకున్నా ఇదే కనిపిస్తుంది. నామినేటెడ్ పదవులు, నామినేషన్ పద్ధతిలో ఇచ్చే పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇస్తున్నాం. అందులోనూ 50 శాతం మహిళలకు ఇస్తున్నాం. బీసీల కోసం శాశ్వత కమిషన్ ఏర్పాటు చేస్తూ చట్టం చేశాం. ఎస్సీ, ఎస్టీలకు విడివిడిగా కమిషన్లు.. మాల, మాదిగ, రెల్లి కులాలకు విడివిడిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం విడి విడిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి త్వరలో నియామకాలు పూర్తి చేయబోతున్నాం. ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ సేవలను పూర్తిగా ప్రక్షాళన చేశాం. ఏజెన్సీల అక్రమాలకు చెక్ పెడుతూ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. రూపం మార్చుకున్న అంటరానితనం ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం నేరం. అయినా విద్యాపరంగా అంటరానితనం పాటించాల్సిందే అన్నట్లుగా కొందరి వాదనలు ఉంటున్నాయి. మా పిల్లలు, మా మనవళ్లు మాత్రమే ఇంగ్లిష్ మీడియంలో చదవాలి. పేద పిల్లలు మాత్రం ఇంగ్లిష్ మీడియంలో చదవడానికి వీల్లేదు అన్న వాదనలు చూస్తే రూపం మార్చుకున్న అంటరానితనం బాహాటంగా కనిపిస్తోంది. ఇది ధర్మమేనా అని మనమంతా ప్రశ్నించుకోవాలి. దేశంలో నిరక్షరాస్యత 27 శాతంగా ఉంటే, మన రాష్ట్రంలో అది ఏకంగా 33 శాతంగా ఉంది. ఎస్సీలలో ఇది 36 శాతం, ఎస్టీలలో 51.2 శాతం నిరక్షరాస్యత ఉంది. ఇప్పటికీ దాదాపు 33 శాతం పేదలకు చదువుకునే అవకాశం లేదంటే.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండే ఇంగ్లిష్ మీడియం చదువులు వీరెవరికీ అందడం లేదంటే రాజ్యాంగంలోని ప్రియాంబుల్లో, ప్రాథమిక హక్కుల్లో, ఆదేశిక సూత్రాల్లో చెప్పినవన్నీ ఎవరి కోసం అనే సందేహం కలుగుతోంది. -
వర్షం కురుస్తున్నా టాప్ లేని వాహనంలోనే..
సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో: 74వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం ఘనంగా నిర్వహించింది. వర్షం కురుస్తున్నా ముందుగా నిర్ణయించిన సమయానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సభాస్థలికి చేరుకున్నారు. ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాయుధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించే సమయంలో వర్షం కురుస్తున్నా కూడా గొడుగు వినియోగించలేదు. టాప్ లేని వాహనంలోనే సీఎం గ్రౌండ్ మొత్తం తిరిగారు. వివిధ బెటాలియన్లకు చెందిన బృందం వర్షంలో తడుస్తుంటే.. తాను టాప్ ఉన్న వాహనంలో వెళ్లడానికి సీఎం సున్నితంగా తిరస్కరించారు. దీంతో వివిధ బెటాలియన్లకు చెందిన పోలీసుల బృందంతోపాటే ఆయన కూడా వర్షంలో తడిచిపోయారు. అలాగే, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై వివిధ ప్రభుత్వ విభాగాలు రూపొందించిన శకటాల ప్రదర్శనను సీఎం తిలకించారు. వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాతృమూర్తి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతీరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ షరీఫ్ అహ్మద్, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
గట్టిగా బుద్ధి చెప్పాం
న్యూఢిల్లీ: దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోట వేదికగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా, పాకిస్తాన్లకు గట్టి హెచ్చరికలే పంపారు. ఎల్ఓసీ (నియంత్రణ రేఖ) నుంచి ఎల్ఏసీ (వాస్తవాధీన రేఖ) వరకు దేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేసిన వారికి సాయుధ బలగాలు గట్టిగా బుద్ధి చెప్పాయన్నారు. లద్దాఖ్లో మన సైనికుల శౌర్య పరాక్రమాలు యావత్ ప్రపంచం చూసిందన్నారు. శనివారం ఢిల్లీలో ఎర్రకోటలో జరిగిన దేశ 74వ స్వాతంత్ర దిన వేడుకలకు సంప్రదాయబద్ధంగా కాషాయం, తెలుపు రంగుల్లో ఉన్న కుర్తా, పైజామా తలపాగా ధరించి వచ్చిన ప్రధాని గంటా 26 నిమిషాల సేపు ప్రసంగించారు. కేంద్ర పథకాలైన ఆత్మ నిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్, మేకిన్ ఇండియా టు మేక్ ఫర్ వరల్డ్, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్లు, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్థిక రంగ పురోగతికి చేపట్టిన సంస్కరణల గురించి వివరించారు. కరోనా వ్యాక్సిన్ నుంచి మహిళా సాధికారత వరకు ప్రతీ అంశాన్ని స్పృశిస్తూ ఆయన ప్రసంగం సాగింది. తూర్పు లద్దాఖ్లో చైనాతో ఇటీవల చెలరేగిన హింసాత్మక ఘర్షణల్లో 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో దేశ కోసం ప్రాణాలర్పించిన వారికి ఎర్రకోట నుంచి సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. సరిహద్దుల్లో ఉగ్రవాదమైనా, విస్తరణ వాదమైనా భారత్ వాటిపై యుద్ధం చేస్తుందని స్పష్టం చేశారు. అయితే పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలకే తాము ప్రాధాన్యం ఇస్తామన్నారు. గత ఏడాది విదేశీ పెట్టుబడుల్లో రికార్డు స్థాయిలో 18 శాతం వృద్ధి సాధించామని ప్రపంచ దేశాలు భారత్పై విశ్వాసం ఉంచాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. అయోధ్యలో రామ మందిర భూమి పూజను ప్రస్తావిస్తూ శతాబ్దాల సమస్యను శాంతియుతంగా పరిష్కరించమన్నారు. జమ్మూకశ్మీర్కు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్న ఫ్రంట్లైన్ వారియర్లను ప్రధాని మోదీ అభినందించారు. మోదీ కొత్త మంత్ర మేక్ ఫర్ వరల్డ్ మోదీ తన ప్రసంగంలో ఆత్మనిర్భర్ భారత్పై అత్యధికంగా దృష్టి పెట్టారు. కరోనా వంటి సంక్షోభ పరిస్థితులు కూడా దేశ సంకల్ప బలాన్ని అడ్డుకోలేవని ధీమాగా చెప్పారు. ఇంక ఎక్కువ కాలం దిగుమతులు మీద ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించాలన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అంటే దిగుమతులు తగ్గించుకోవడమే కాదు, మన సామర్థ్యం, సృజనాత్మకత, నైపుణ్యం ప్రపంచం గుర్తించేలా చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఇక మేకిన్ ఇండియా కాదు, మేక్ ఫర్ వరల్డ్ దిశగా భారత్ ప్రయాణం సాగాలని అన్నారు. ప్రపంచం ఆదరించేలా భారత్లో నాణ్యమైన వస్తువుల్ని ఉత్పత్తి చేయాలని మోదీ అన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఎన్–95 మాస్కులు, పీపీఈ కిట్లు, వెంటిలేటర్ల తయారీలో నాలుగు నెలల్లోనే భారత్ స్వయం సమృద్ధి సాధించడమే కాదు, ఎగుమతులు కూడా చేస్తోందని అన్నారు. దీంతో యువతకి ఉపాధి అవకాశాలను కల్పించామని ప్రధాని చెప్పారు. మౌలిక సదుపాయాల రంగంలో విప్లవం సృష్టించేలా రూ. 110 లక్షల కోట్లతో వివిధ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఏడు వేల నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ (ఎన్ఐపీ) ప్రాజెక్టుల్ని ప్రారంభించామని అన్నారు. కోవిడ్ విసిరిన ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్లో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామన్న ప్రధాని రైతులే పారిశ్రామికవేత్తలుగా మారడానికి వీలుగా లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక నిధిని ప్రారంభించామని చెప్పారు. దీనివల్ల గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. వెయ్యిరోజుల్లో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ రాబోయే మూడేళ్ల కాలంలో దేశంలో ఆరు లక్షలకు పైగా గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించే ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ ప్రాజెక్టుని ప్రకటించారు. గత అయిదేళ్లలో 1.5 లక్షల గ్రామ పంచాయితీలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించామని మరో మూడేళ్లలో ప్రతీ గ్రామానికి నెట్ సదుపాయం ఉంటుందని అన్నారు. ఆన్లైన్ కార్యకలాపాలు అధికమైన నేపథ్యంలో సైబర్ భద్రతపై త్వరలోనే కొత్త విధానాన్ని తీసుకొస్తామన్నారు. తయారీలో మూడు కరోనా వ్యాక్సిన్లు కరోనా వ్యాక్సిన్ త్వరలోనే ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుందని ప్రధాని మోదీ వెల్లడించారు. భారత్లో మూడు వ్యాక్సిన్ల ప్రయోగాలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. వ్యాక్సిన్ విజయవంతంగా పనిచేస్తోందని శాస్త్రవేత్తలు ప్రకటించిన వెంటనే భారీ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు. దేశంలో ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ అందేలా ఇప్పటికే మౌలిక సదుపాయాల ఏర్పాటు పూర్తి చేశామన్నారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ తయారీలో అహరహం శ్రమిస్తున్న శాస్తవేత్తల్ని ప్రధాని రుషులు, మునులతో పోల్చారు. కరోనాపై విజయం సాధించడానికి వారు ల్యాబొరేటరీల్లో తీవ్రంగా శ్రమిస్తున్నారని అన్నారు. సాధ్యమైనంత తక్కువ సమయంలో వ్యాక్సిన్ దేశ ప్రజలందరికీ చేరేలా చూస్తామన్నారు. భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా రూపొందించిన వ్యాక్సిన్లు ఒకటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతం నడుస్తున్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్కు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు అనుమతులు లభించాయి. రక్షణ రంగంలో స్వావలంబన దిశగా రక్షణ రంగంలో స్వావలంబన దిశగా గట్టి చర్యలు చేపడుతున్నట్లు మోదీ తెలిపారు. వందకు పైగా ఆయుధాలు, రక్షణ పరికరాల దిగుమతిని నిషేధించామన్నారు. క్షిపణుల నుంచి తేలికపాటి సైనిక హెలికాప్టర్లు, రైఫిల్స్, యుద్ధ రవాణా విమానాలను భారత్లో తయారుచేస్తామన్నారు. తేలికపాటి యుద్ధవిమానం తేజస్ ఆధునీకరణ జరుగుతోందన్నారు. దేశ రక్షణలో సరిహద్దు, తీరప్రాంత మౌలికసదుపాయాలు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. హిమాలయ పర్వతశ్రేణుల్లో, హిందూ మహాసముద్రంలోని దీవుల మధ్య, లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు రహదారుల నిర్మాణం జరిగిందని, రవాణా సదుపాయాలకు ప్రాధాన్య మిచ్చామన్నారు. జల్ జీవన్ మిషన్ కింద ఏడాదిలో 2 కోట్ల కుటుంబాలకు నల్లా కనెక్షన్లు ఇచ్చామని, ముఖ్యంగా గిరిజన, మారుమూల ప్రాంతాల్లో నివాసం ఉండే వారికి సురక్షిత మంచినీరు అందించామని తెలిపారు. రూపాయికే శానిటరీ ప్యాడ్ స్వాతంత్య్రదిన ప్రసంగంలో ఈ సారి ప్రధాని ఏనాడూ ఎవరూ మాట్లాడని మహిళల రుతు స్రావం అంశాన్ని లేవనెత్తారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన మహిళా సాధికారత గురించి వివరిస్తూ నిరుపేద మహిళలకు 6 వేల జన ఔషధి కేంద్రాల ద్వారా రూపాయికే శానిటరీ ప్యాడ్లు అందిస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది మహిళలకు ఈ ప్యాడ్లు అందుతున్నాయని తెలిపారు. ప్రస్తుతమున్న 18 ఏళ్లుగా ఉన్న అమ్మాయిల పెళ్లి వయసును మార్చడానికి సన్నాహాలు చేస్తున్నామని, దీనికోసం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. నేవీ, ఎయిర్ఫోర్స్లో మహిళా అధికారుల్ని కీలక పదవుల్లో తీసుకున్నామని, ట్రిపుల్ తలాక్ని రద్దు చేశామన్నారు. ప్రధాని శానిటరీ ప్యాడ్ల ప్రస్తావనపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. 40 కోట్ల ‘జన్ధన్ బ్యాంకు అకౌంట’్లలో 22 కోట్ల అకౌంట్లు మహిళలవేనని, ఈ మహమ్మారి కాలంలో వారి ఖాతాల్లో రూ.30 వేలకోట్ల నిధులను వేసినట్లు ప్రధాని పేర్కొన్నారు. ‘ముద్ర’రుణాల్లో 70 శాతం చెల్లెళ్ళు, తల్లులకే ఇచ్చామని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అత్యధిక రిజిస్ట్రేషన్లు మహిళల పేరిటే ఉన్నాయన్నారు. అందరికీ హెల్త్ కార్డులు ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోదీ ఆరోగ్య రంగాన్ని డిజిటలైజ్ చేసే పథకానికి శ్రీకారం చుట్టారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కింద ప్రతీ పౌరుడికి హెల్త్ ఐడీ నంబర్ ఇస్తారు. ఈ హెల్త్ ఐడీ డిజిటల్ రూపంలోనే ఉంటుంది. అందులో వారి ఆరోగ్య సమాచారం, వాడే మందులు, మెడికల్ రిపోర్ట్స్ నిక్షిప్తం చేస్తారు. ఈ ఐడీలన్నింటినీ దేశ వ్యాప్తంగానున్న ఆరోగ్య కేంద్రాలు, రిజిస్టర్డ్ వైద్యులతో అనుసంధానం చేస్తారు. దీనివల్ల దేశంలో ఎవరైనా అనారోగ్యంతో వైద్యుల్ని సంప్రదిస్తే ఒక్క క్లిక్తో వారి సమస్యలన్నీ తెలుసుకోవచ్చు. ఈ్త ఐడీలతో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని మోదీ చెప్పారు. ఎన్సీసీ కేడెట్లకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ ఎర్రకోట వద్ద 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల దృశ్యం విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్న రాష్ట్రపతి నివాస ప్రాంతం రైసినా హిల్స్ -
రాష్ట్రపతి భవన్లో ఎట్ హోం కార్యక్రమం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో 74 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎట్ హోం కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, స్పీకర్ ఓం బిర్లా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వంది మంది వరకు అతిథులు హాజరయ్యారు. అయితే ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం రోజున రాష్ట్రపతి భవన్లో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. -
నిరుద్యోగులకు శుభవార్త
చండీగఢ్ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వరాల జల్లు ప్రకటించారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో సీఎం మాట్లాడుతూ.. నిరుద్యోగులకు 6లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వీటిలో ప్రభత్వ రంగంలో లక్ష ఉద్యోగాలు, ప్రయివేట్ రంగంలో 5లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం ఘర్ ఘర్ రోజ్గర్ పథకం ద్వారా 13లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించిందని, భూమి లేని రైతులు, కూలీలకు రూ.520కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. త్వరలోనే కౌలు రైతుల కోసం తమ ప్రభుత్వం కొత్త చట్టాన్ని ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే మౌలిక సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు జాతీయ రహదారుల కల్పనకు రాబోయే రెండేళ్లలో రూ.12,000కోట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఆరోగ్య కార్యకర్తలు ధైర్యంతో సేవలందిస్తున్నారని అమరీందర్ సింగ్ కొనియాడారు. చదవండి: విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ఫోన్లు -
అర్హులైన లబ్దిదారులకు పథకాలు అందించడమే లక్ష్యం
-
ఎర్రకోటలో జాతీయ జెండా ఎగురవేసిన మోదీ
-
చంద్రబాబును ఒకటే కోరుతున్నా..
సాక్షి, పాయకరావుపేట: నక్కపల్లి, ఎస్ రాయవరం, పాయకరావుపేటలలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొల్ల బాబురావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నక్కపల్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'రాష్ట్రంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు చేష్టలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నారు. పేదల ఇళ్ల పట్టాలు పంపిణీని కోర్టుల ద్వారా అడ్డుకున్నారు. స్థానిక సంస్థలు ఎన్నికలను అడ్డుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చంద్రబాబును ఒకటే కోరుతున్నా..అభివృద్ధిని అడ్డుకోవద్దు ప్రజల తీర్పును గౌరవించాలి' అంటూ హితవు పలికారు. (కుల, మతాలకు అతీతంగా సంక్షేమం: సజ్జల) -
కుల, మతాలకు అతీతంగా సంక్షేమం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనాను ఆంధ్రప్రదేశ్ సమర్థంగా ఎదుర్కొంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆయన తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు, వైఎస్సార్సీపీ శ్రేణులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మిగతా రాష్ట్రాలు కంటే మిన్నగా కోవిడ్ నియంత్రణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు చేపట్టారని తెలిపారు. (ఆ ఘనత సీఎం జగన్దే: మంత్రి సురేష్) కోవిడ్ నివారణకు తీసుకుంటున్న చర్యలపై దేశ విదేశాల నుంచి ప్రశంసలు వస్తున్నాయని పేర్కొన్నారు. కోవిడ్ పరిస్థితిని సీఎం జగన్ నిత్యం పర్యవేక్షిస్తున్నారని, సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టామని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలు ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారని, వైఎస్ జగన్ సీఎం అయ్యాక రాష్ట్రానికి స్వర్ణ యుగం ప్రారంభమైందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ను చిన్నాభిన్నం చేసిందన్నారు. గ్రామ సచివాలయం వ్యవస్థను సీఎం జగన్ తీసుకువచ్చారని, ఏడాది కాలంలో పేదలను అనేక సంక్షేమ కార్యక్రమాలు ద్వారా ఆదుకున్నారని పేర్కొన్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు రూ. 36 వేల కోట్లు ప్రజలు నేరుగా ప్రజల ఖాతాల్లో వేశారని తెలిపారు. రైతులు, మహిళను అన్ని విధాలుగా సీఎం జగన్ ఆదుకున్నారన్నారు. ‘‘కుల, మతాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. వైఎస్సార్ పాలనకు మూడు, నాలుగు రెట్లు సంక్షేమ కార్యక్రమాలు జగన్ పాలనలో ప్రజలకు అందుతున్నాయి. అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని సీఎం జగన్ ముందుకు తీసుకువెళ్తున్నారని’ తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవడానికి టీడీపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు. 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలను కోర్టులకు వెళ్లి టీడీపీ అడ్డుకుందని మండిపడ్డారు. త్వరలోనే పేదలకు ఇళ్ళ పట్టాలు అందిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇళ్ళు లేని వారు ఉండకూడదని సీఎం జగన్ భావిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. -
వారి అభివృద్ధిలో సీఎం కేసీఆర్ నిర్ణయాలే కీలకం
సాక్షి, మెదక్: జిల్లాలో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం రోజున కలెక్టరేట్ కార్యాలయంలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జెండా పండుగను సంతోషంగా దేశవ్యాప్తంగా చేసుకుంటారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సంక్షేమం, అభివృద్ధి దిశగా వెళ్తోంది. గత పాలకులు తెలంగాణ అభివృద్ధి నిర్లక్ష్యం చేసాయి. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగం వెలకట్టలేనిది.. వారి ఆశయాలను సాధిస్తాం. దేశంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్ర అభివృద్ధిని చూసి వరుణదేవుడు కూడా కరుణిస్తున్నాడు. తెలంగాణలో కుల వృత్తులు అభివృద్ధి చెడుతున్నాయంటే సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే కారణం. ('చేతకాని దద్దమ్మలు కుట్రలు పన్నుతున్నారు') ఒకప్పుడు మెదక్ జిల్లా విద్యారంగంలో వెనుకబడింది. ప్రస్తుతం 33 శాతం పెరిగింది. పేద విద్యార్ధులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని మధ్యాహ్న భోజన పథకం అమలు చేశాం. నియంత్రణ సాగు ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. రైతులకు పెట్టుబడి ఇవ్వాలనే గొప్ప సంకల్పం గల నాయకుడు కేసీఆర్. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటి ఇంటికీ తాగునీరు అందిస్తున్నాం. గర్భిణీలకు కేసీఆర్ కిట్ అందిస్తున్నాము. షాదీముబారక్, కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా పేద ఆడపిల్లలను తెలంగాణ సర్కార్ ఆదుకుంటోంది. కరోనాను అదుపు చేయడంలో తెలంగాణ సర్కారు అన్ని రకాల చర్యలు చేపడుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం తెలంగాణ సర్కార్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోంది. గతంలో వర్షాలు లేక, గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసున్న పరిస్థితి ఉండేది. కాగా.. ప్రస్తుతం లేదు ఆ పరిస్థితి లేదు అని మంత్రి తలసాని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ పాల్గొన్నారు. -
జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్
-
వైఎస్ జగన్ పేదల సంక్షేమానికి పాటుపడుతున్నారు
సాక్షి, నెల్లూరు: నెల్లూరులోని పోలీస్ పెరేడ్ మైదానంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి, శాంతి కపోతాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి సుచరిత మాట్లాడుతూ.. 'నవరత్నాలతో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పేదల సంకేమానికి పాటుపడుతున్నారు. జిల్లాలో రూ.211 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి వసతి కల్పిస్తున్నాం. జిల్లాలోని సంగం బ్యారేజీ పనులను ఈ ఏడాదిలో పూర్తి చేస్తాం. కరోనా నివారణకు కోవిడ్ ఆసుపత్రుల్లో అధునాతన వసతులు కల్పిస్తున్నాం. సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం' అని మంత్రి సుచరిత తన ప్రసంగంలో వివరించారు. కార్యక్రమంలో ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు, ఎస్పీ భాస్కర్ భూషణ్ పాల్గొన్నారు. (ఆ ఘనత సీఎం జగన్దే: మంత్రి సురేష్) 74th Independence Day Celebrations at Nellore District, Andhra Pradesh. #IndependenceDay pic.twitter.com/DtaPHTowBP — Mekathoti Sucharitha (@SucharitaYSRCP) August 15, 2020 -
ఆ ఘనత సీఎం జగన్దే: మంత్రి సురేష్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. శనివారం ఆయన 74వ స్వాతంత్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగిస్తూ 30 లక్షల మంది నిరుపేదలకు ఇంటిపట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. మన దేశానికి స్వతంత్రం రావడం వెనుక ఎంతో మంది అమరవీరుల త్యాగాలు ఉన్నాయని, వారందరినీ స్మరించుకోవాలన్నారు. ‘‘నేను విన్నాను.. నేను ఉన్నాను’’ అన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటలు నేడు అక్షరాల నిజమవుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్ధానాలను మాత్రమే కాకుండా చెప్పనివి కూడా చేసి చూపిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. (జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్) వైఎస్సార్ జిల్లాలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని, పులివెందుల ప్రాంతంలో అరటి పరిశోధనా కేంద్రం, కోడూరు ప్రాంతంలో ఉద్యాన పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జిల్లాలో అన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు యుద్ధప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. ‘‘మహిళల జీవితాల్లో వెలుగులు నింపడానికి వైఎస్సార్ చేయూత పథకం ప్రారంభించాం. క్యాన్సర్ బాధితులు కోసం కడపలో క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి అన్న నినాదంతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చర్యలు చేపట్టాం. జగనన్న గోరుముద్ద ద్వారా పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. వైఎసార్ కంటివెలుగు ద్వారా విద్యార్థులకు మెరుగైన కంటిచూపు చికిత్స కోసం చర్యలు తీసుకున్నామని’ ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్ జిల్లాలో రైతులకు సాగునీటితో పాటు అనేక గ్రామాలకు తాగునీరు అందించే దిశగా అనేక ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల నిర్మాణం, కాలువల తవ్వకం ద్వారా ఆయకట్టు స్థిరీకరణకు చర్యలు చేపట్టామని మంత్రి సురేష్ తెలిపారు. -
కనీస వివాహ వయస్సు: త్వరలోనే నిర్ణయం
న్యూఢిల్లీ: మహిళల కనీస వివాహ వయస్సు నిర్ధారణ అంశంలో కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ అంశాన్ని పునః పరిశీలించేందుకు ఓ ప్రత్యేక కమిటీ నియమించినట్లు పేర్కొన్నారు. కనీస వివాహ వయస్సు పెంపుపై అధ్యయనంతో పాటు.. కిశోర బాలికల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ కమిటీ అధ్యయనం చేస్తోందని వెల్లడించారు. (ఎర్రకోటలో జాతీయ జెండా ఎగురవేసిన మోదీ) నేడు 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ మహిళా సాధికారికతకై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ప్రస్తావించారు. మహిళల ఆరోగ్యం, అభ్యున్నతికై పాటుపడుతున్నట్లు తెలిపారు. ‘‘దాదాపు 5 వేలకు పైగా జన్ ఔషధి కేంద్రాల ద్వారా పేద మహిళలకు 5 కోట్లకు పైగా శానిటరీ ప్యాడ్లను కేవలం ఒక రూపాయికే అందించాం. మహిళా సాధికారికతకు పెద్దపీట వేశాం. ట్రిపుల్ తలాక్ వంటి చట్టాలు తీసుకువచ్చాం. నావికా దళం, వాయుసేనలో సముచిత స్థానం కల్పించాం. అదే విధంగా మన కూతుళ్ల కనీస వివాహ వయస్సు నిర్ధారణ గురించి అధ్యయనం చేసేందుకు కమిటీని నియమించాం. ఇందుకు సంబంధించిన నివేదిక అందగానే నిర్ణయం తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు.(‘భరత మాత’ విముక్తికై పోరాడిన ధీర వనితలు) ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రత్యేక హోదా సాధనపై ధృడసంకల్పంతో ఉన్నాం: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: దేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆంధ్రప్రదేశ్లో శనివారం ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ప్రత్యేక వాహనంపై ప్రభుత్వ సంక్షేమ పథకాల శకటాలను సీఎం వైఎస్ జగన్ వీక్షించారు. సంక్షేమ పథకాలు ప్రతిధ్వనించేలా ఏర్పాటు చేసిన శకటాలతో పాటు కరోనా కష్ట కాలంలో ఆరోగ్య సేవలకు గాను ఏర్పాటు చేసిన శకటాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీనిలో భాగంగా ముందుగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్.. అనంతరం ప్రసంగిస్తూ ‘స్వాతంత్ర్య సమరయోధులకు పాదాభివందనం. స్వాతంత్ర్యం ప్రాణవాయువు లాంటిందని గాంధీజీ చెప్పారు. రాజ్యాంగం, చట్టప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యం. ప్రజాస్వామ్యం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలి’ అని అన్నారు. సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ♦సామాజిక, ఆర్ధిక భరోసాను రాజ్యాంగం కల్పించింది ♦సమానత్వం పదాన్ని పుస్తకాలకే పరిమితం చేయకూడదు ♦పేదల జీవితాలు మార్చడానికి కృషి చేస్తున్నాం ♦రైతు భరోసా, వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి, ఆసరా పథకాలు ప్రవేశపెట్టాం ♦కులం, మతం, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నాం ♦ప్రజలందరి సంక్షేమమే ధ్యేయంగా 14 నెలల పాలన సాగింది ♦ఆర్ధిక పరిస్థితులు లేకున్నా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాం ♦విద్యాపరమైన అంటరానితనాన్ని రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నాం ♦ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం ♦రైతు భరోసా ద్వారా అన్నదాతలకు ఆర్ధిక సాయం చేస్తున్నాం ♦పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు అందిస్తున్నాం ♦అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకే పాలనా వికేంద్రీకరణ ♦సమన్యాయం జరిగేలా మూడు రాజధానుల బిల్లును చట్టంగా మార్చాం ♦త్వరలో విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని ♦కర్నూలు కేంద్రంగా న్యాయ రాజధాని ఏర్పాటుకు పునాదులు వేస్తాం ♦పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం.. ప్రత్యేక హోదాను అమలు చేయాలని గట్టిగా అడుగుతూనే ఉంటాం ♦కేంద్ర ప్రభుత్వం మిగతా పార్టీలపై ఆధారపడే పరిస్థితి లేదు.. కాబట్టి ఇప్పటికిప్పుడు హోదా ఇచ్చే అవకాశం కనిపించకపోయినా.. ప్రత్యేక హోదాను ఖచ్చితంగా సాధించాలనే ధృడసంకల్పంతో ఉన్నాం ♦ఈరోజు కాకపోతే భవిష్యత్లోనైనా..కేంద్ర ప్రభుత్వం మనసు మారి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకంతో హోదా కోసం కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే ఉంటాం ♦అవినీతి లేని వ్యవస్థ కోసం రివర్స్ టెండరింగ్, జ్యుడీషియల్ ప్రివ్యూ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానాన్ని అమలు చేస్తున్నాం ♦కేవలం మొదటి 14 నెలల పాలనలోనే వివిధ పథకాల ద్వారా దాదాపు రూ.46వేల కోట్లు ప్రజలకు నేరుగా అందించాం ♦చెట్టు ఎంత బాగా ఎదిగినా చీడ పురుగు పడితే ఎండిపోతుంది. అవినీతి అనేది చీడపురుగు. అవినీతి వల్ల ప్రజలకు అందాల్సిన ఫలాలు అందకుండా పోతాయి ♦ఈ నిజాన్ని గమనించబట్టే రివర్స్ టెండరింగ్, జ్యుడీషియల్ ప్రివ్యూ గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష ద్వారా రూ.4వేల కోట్లకు పైగా ఆదా చేశాం ♦ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు పూర్తిస్థాయి ఫలాలు మరో 10 నుంచి 20 ఏళ్లకు వస్తాయి. కాబట్టి ఇవి ఎన్నికల పథకాలు కావు ♦రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్ధిక రాజకీయ చరిత్రలో మెరుగైన మార్పుల కోసం.. బాధ్యతతో, మనసుతో అమలు చేస్తున్న పథకాలు ♦స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా దాదాపు 33శాతం పేదలకు చదువుకునే అవకాశం లేదు. విద్యాపరమైన అంటరానితనాన్ని రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నాం ♦నాడు-నేడు ద్వారా పాఠశాలలు, కాలేజీల రూపురేఖలు మారుస్తున్నాం ♦100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు వసతి దీవెన అమలు చేస్తున్నాం ♦ప్రతి ఇంటా చదువుల దీపాలు వెలిగించేందుకు.. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం ♦స్కూల్ విద్యార్ధులకు పుస్తకాలు, షూస్ వరకు అన్నీ ఉచితంగా ఇస్తున్నాం ♦తల్లిదండ్రుల కోరిక మేరకు ఇంగ్లీష్ మీడియంను ఓ హక్కుగా అమలు చేస్తున్నాం ♦చదువే నిజమైన ఆస్తి, సంపద అని నమ్మి విద్యావిధానంలో మార్పులు తీసుకొచ్చాం ♦ప్రత్యేక మెనూతో గోరుముద్ద పథకం అమలు చేస్తున్నాం ♦కంటి వెలుగు కార్యక్రమం ద్వారా విద్యార్ధులకు పరీక్షలు చేస్తున్నాం ♦వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం ♦గతంలో మసకబారిన ఆరోగ్యశ్రీకి కొత్త వెలుగులు తీసుకొచ్చాం. రూ.5లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ వర్తింపజేశాం. ♦బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో ఆరోగ్యశ్రీ ద్వారా.. సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తున్నాం ♦రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 1088 వాహనాలను ఒకేసారి 108, 104 సేవల కోసం పంపాం ♦ఆపరేషన్ అయిన రోగులకు రూ.5వేలు ఆరోగ్య ఆసరా అందిస్తున్నాం ♦దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10వేల పింఛన్ అందిస్తున్నాం ♦కొత్తగా 16 మెడికల్ కాలేజీల నిర్మాణానికి నిర్ణయాలు తీసుకున్నాం ♦జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్ట్లను పూర్తి చేస్తాం ♦2022 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం ♦ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పల్నాడు కరువు నివారణ ప్రాజెక్ట్.. రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్ట్ల పనులు మొదలుపెట్టబోతున్నాం ♦ఈ ఏడాదిలో వంశధార ఫేజ్-2, వంశధార-నాగావళి అనుసంధానం.. వెలిగొండ ఫేజ్-1, అవుకు టన్నెల్ -2, సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజీల్ని పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాం ♦రాష్ట్రానికి సంబంధించిన నీటి ప్రయోజనాల విషయంలో.. రాజీ లేదని ఆచరణ ద్వారా చూపిస్తున్నాం అని సీఎం వైఎస్ జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఏపీలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
సాక్షి, అమరావతి: భారతదేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఏపీలో శనివారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా శాసనసభా ప్రాంగణంలో స్పీకర్ తమ్మినేని సీతారాం జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ బాలకృష్ణమాచార్యులు, అసెంబ్లీ ఉద్యోగులు పాల్గొన్నారు. ►శాసన మండలి ఆవరణలో మండలి చైర్మన్ షరీఫ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ►సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లమ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శులు ధనుంజయ్ రెడ్డి, సాల్మన్ ఆరోఖ్య రాజ్, జే మురళి, సీఎస్ఓలు జోషి, పరమేశ్వర రెడ్డి పాల్గొన్నారు. ►సచివాలయ ఆవరణలో సీఎస్ నీలం సాహ్ని జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జీఏడీ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. -
స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సన్నద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లుచేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలనుద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. ప్రదర్శన కోసం వివిధ శాఖలకు చెందిన 10 శకటాలను స్టేడియంలో సిద్ధంచేశారు. కోవిడ్ విపత్కర పరిస్థితులను ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నది, తదితర కార్యక్రమాలు ప్రతిబింబించేలాగా ఈ శకటాలను రూపొందించారు. అలాగే.. ► కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించారు. ► కోవిడ్ వారియర్స్లో భాగంగా పోలీసులు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు ఈ వేడుకల్లో ప్రత్యక్షంగా భాగస్వాములు కానున్నారు. ► కరోనా నుంచి కోలుకున్న వారిని కూడా వేడుకలకు ఆహ్వానించారు. భౌతిక దూరం పాటిస్తూ స్టేడియంలో సీటింగ్ ఏర్పాట్లుచేశారు. ► ఉ.9 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్న దృష్ట్యా ఆహ్వానితులు, పాస్లున్న వారు ఉ.8 గంటలకల్లా సభా ప్రాంగణంలో కేటాయించిన సీట్లలో కూర్చోవాలని అధికారులు కోరారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్న వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం రాజ్భవన్లో ‘ఎట్ హోం’ రద్దు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో ‘ఎట్హోం’ కార్యక్రమం ఈ ఏడాది నిర్వహించకూడదని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నిర్ణయించారు. ఏటా ఆగస్టు 15, జనవరి 26న ‘ఎట్హోం’ కార్యక్రమం పేరిట ప్రముఖులకు రాజ్భవన్లో విందు ఇవ్వడం సంప్రదాయం. కానీ, కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది దీనిని నిర్వహించకూడదని గవర్నర్ నిర్ణయించినట్టు రాజ్భవన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. -
కోవిడ్ ప్రొటోకాల్తో వేడుకలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తూ ఉండడంతో ఢిల్లీ ఎర్రకోటలో ఇవాళ జరిగే 74వ స్వాతంత్య్ర దిన వేడుకలకు రక్షణ శాఖ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. జాతీయ పతాకం ఎగుర వేయడం దగ్గర్నుంచి, ప్రధాని ప్రసంగం, జాతీయ గీతాలాపన వరకు ప్రతీ కార్యక్రమంలో భౌతిక దూరం పాటించడం, మాస్కులు, పీపీఈ కిట్లు ధరించేలా మార్గదర్శ కాలను రూపొందించింది. ఎర్రకోట పరిసరా ల శానిటైజేషన్ దగ్గర్నుంచి హాజరయ్యే అతిథుల పాటించే భౌతిక దూరం వరకు ప్రతీ అంశంలోనూ జాగ్రత్తలు తీసుకుంది. పోలీసు సిబ్బందితో వివిధ అంచెల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది. ప్రతీ ఏడాది జరిగే పంద్రాగస్టు వేడుకలకి, ఈసారి జరిగే వేడుకలు ఎలా భిన్నమో వివరిస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరసగా ఏడోసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఎర్రకోట వేదికగా ఆయన శనివారం చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. కోవిడ్ సంక్షోభం, చైనాతో ఉద్రిక్తతలు, ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో మోదీ ఏం మాట్లాడతారని ఆసక్తిగా చూస్తున్నారు. ► ఈసారి వేడుకలకి దౌత్యప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులు కలిపి 4 వేల మందికి ఆహ్వా నం అందింది. ఏటా హాజరయ్యే వారిలో ఇది 20% మాత్రమే. ► పాఠశాల విద్యార్థులకు బదులుగా ఎన్సీసీ సిబ్బంది ఈసారి వేడుకల్లో పాల్గొంటారు ► ఇద్దరి అతిథుల మధ్య 6 అడుగుల దూరం ఉండేలా సీట్ల ఏర్పాటు. అతిథులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ► ఎర్రకోట లోపలికి వచ్చే ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు. కరోనా లక్షణాలున్న వారిని వెంటనే ఆస్పత్రికి తరలించేలా అంబులెన్స్లు సిద్ధం. ► భద్రత విధుల్లో పాల్గొనే పోలీసులందరికీ పీపీఈ కిట్లు. ► ఈసారి వేడుకల్ని చూసే అవకాశం కరోనా వైరస్తో పోరాడి విజేతలైన 1,500 మందికి కల్పించారు. వారిలో 500 మంది పోలీసు సిబ్బంది. -
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సన్నద్ధం
సాక్షి, అమరావతి : రేపు (శనివారం ) జరగనున్న 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సర్వం సిద్ధమైంది. వర్షం కారణంగా వాతావరణ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేలా యంత్రాంగం ఏర్పాట్లను పూర్తిచేసింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరిస్తారు. తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సందేశాన్నిస్తారు. ప్రదర్శన కోసం స్టేడియంలో 10 శకటాలను అధికారులు సిద్దం చేశారు. వీటి ద్వారా కోవిడ్ పరిస్థితులను ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నది, కరోనా కట్టడి కోసం తీసుకున్న చర్యలు తదితర అంశాలను ప్రతిబింబిచేలాగా శకటాల ప్రదర్శన ఉండనుంది. (కరోనాను కట్టడి చేయగలిగాం) -
దేశ ప్రజలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ : 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా మహమ్మారితో ప్రపంచమంతా పోరాడుతోందని, ఈ వ్యాధితో ముందుండి పోరాడుతున్న యోధులకు దేశం రుణపడిఉందని అన్నారు. కోవిడ్-19తో ప్రజల జీవనస్ధితిగతులు మారిపోయాయని చెప్పారు. ఈ విపత్కర పరిస్ధితుల్లో కేంద్రం పలు పధకాల ద్వారా ప్రజలకు సాయం చేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో స్పందించి స్ధానిక పరిస్ధితులకు అనుగుణంగా చర్యలు చేపట్టడంతో కరోనా ప్రభావాన్ని కొంతమేర కట్టడి చేయగలిగామని చెప్పారు. వేగవంతంగా మనం తీసుకున్న చర్యలతో ఎందరో ప్రాణాలు నిలబెట్టామని, దీనిపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయని గుర్తుచేశారు. చదవండి : అగ్నిప్రమాదం కలచివేసింది వందేభారత్ మిషన్ ద్వారా విదేశాల్లో చిక్కుకున్న పది లక్షల మంది స్వదేశానికి చేరకున్నారని తెలిపారు. ప్రజారోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మెరుగైన మార్పులకు శ్రీకారం చుడుతోందన్నారు.ఇక గల్వాన్లో అమరులైన సైనికులకు జాతి సెల్యూట్ చేస్తోందని చెప్పారు. ప్రత్యర్ధుల దూకుడుకు దీటుగా బదులిస్తామని గల్వాన్లో మన సైనికుల ధైర్యసాహసాలు సుస్పష్టం చేశాయని అన్నారు. ప్రపంచమంతా మహమ్మారితో ఐక్యంగా పోరాడుతున్న వేళ పొరుగు దేశం తన విస్తరణ కార్యకలాపాలను చేపట్టేందుకు దుస్సాహసానికి ఒడిగట్టిందని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ మనం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. వారి త్యాగాల ఫలితంగానే మనం స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నామని చెప్పారు. దేశ ప్రజలందరికీ రాష్ట్రపతి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. -
ఎర్రకోట వేదికగా కీలక ప్రకటన!
సాక్షి, న్యూఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఎర్రకోట వేదికగా కీలక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. దేశ 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి తన ప్రసంగంలో ఒక దేశం ఒక ఆరోగ్య కార్డు పధకాన్ని ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరిచేందుకు ఈ పధకాన్ని చేపడుతున్నారు. ఒక దేశం ఒక ఆరోగ్య కార్డు పధకంలో భాగంగా వ్యక్తికి జరిగిన చికిత్సలు, పరీక్షలు సహా వైద్య చరిత్ర అంతటినీ డిజిటలీకరించి ఈ కార్డులో భద్రపరుస్తారు. ఆస్పత్రులు, క్లినిక్లు, వైద్యులను కేంద్ర సర్వర్తో అనుసంధానిస్తారు. అయితే ఈ పధకాన్ని ఉపయోగించుకోవాలా లేదా అనే నిర్ణయాన్ని పూర్తిగా ఆస్పత్రులు, పౌరులకే వదిలివేస్తారు. ఈ కార్డును కోరుకున్న వారికి ఓ యూనిక్ ఐడీని కేటాయిస్తారు. ఈ ఐడీ ద్వారా వారు సిస్టమ్లోకి లాగిన్ అవుతారు. దశలవారీగా అమలు చేసే ఈ పధకానికి రూ 300 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిపారు. ఈ పథకం ప్రయోజనాల్లో కీలకమైనది ఏంటంటే దేశంలో ఏ వైద్యుడు, ఆస్పత్రిని సందర్శించే వ్యక్తి తన వెంట వైద్య పరీక్షల రిపోర్టులు, ప్రిస్క్రిప్షన్లు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు. యూనిక్ ఐడీ ద్వారా రోగికి సంబంధించిన పూర్తి వివరాలు, రికార్డులను వైద్యులు పరిశీలిస్తారు. ఆధార్ కార్డు తరహాలో హెల్త్ కార్డును జారీ చేస్తారు. దేశంలో వైద్యారోగ్య పరిస్ధితిని పూర్తిగా మార్చేందుకు ఉద్దేశించిన ఈ పధకంలో పౌరుల వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉండేలా చర్యలు చేపడతారు. ఈ పధకాన్ని ఆపై మందుల షాపులు, వైద్య బీమా కంపెనీలకూ సర్వర్లో అనుసంధానిస్తారు. రోగి అనుమతితోనే వైద్యులు, ఆస్పత్రి వర్గాలు వ్యక్తి రికార్డులను పరిశీలించేందుకు అనుమతిస్తారు. చదవండి : మరో మైలురాయి అధిగమించిన మోదీ -
ఆగస్టు 15: క్వారంటైన్, కరోనా టెస్టులు
న్యూఢిల్లీ: కరోనా విజృంభణతో ప్రస్తుతం దేశంలో ఏ వేడుకలు జరిగే పరిస్థితి లేదు. అయితే ఏది ఎలా ఉన్నా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించడం మాత్రం తప్పనిసరి. ఈ నేపథ్యంలో అధికారులు వేడుక నిర్వహణ కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ రోజు విధులు నిర్వహించే భద్రతా అధికారులు ఆగస్టు 15 ఉదయం వరకు క్వారంటైన్లో ఉండనున్నారు. అంతేకాక జెండా ఎగరవేసే సమయంలో ప్రధానికి సమీపంగా ఉండే వారికి కరోనా టెస్టులు చేయిస్తున్నారు అధికారులు. ఆగస్టు 15న ఎర్రకోటలో జెండా ఎగురవేసే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సమీపంగా ఓ మహిళా సైనిక అధికారి ఉండనున్నారు. సదరు అధికారిణి జెండా తాడును మోదీకి అందిస్తారు. ఆ తర్వాత ప్రధాని జెండాను ఎగువేస్తారు. ఈ క్రమంలో తాడు ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి మహిళా అధికారికి కోవిడ్-19 పరీక్ష చేయించారు అధికారులు. (కరోనా.. పాఠం నేర్వాలి) ఆగస్టు 15 వేడుకల్లో విధులు నిర్వహించే భద్రతా సిబ్బంది అందరికి కరోనా టెస్టులు చేయించారు అధికారులు. ఎర్రకోటలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కొందరు వీవీఐపీ ప్రముఖులు మాత్రమే హాజరుకానున్నారు. దాంతో వారి క్షేమం దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉన్న వారిలో భారత సైన్యం, వైమానిక దళం, నావికా దళం, ఢిల్లీ పోలీసు అధికారులు, ఇతర సిబ్బంది ఉన్నారు. వీరితో పాటు డ్రైవర్లు, ఆపరేటర్లు, కుక్, ట్రైనర్స్, ఇతర సిబ్బంది కూడా ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారు. -
తానా ఆధ్వర్యంలో స్వాతంత్ర్య భారతీ- సాహిత్య హారతి
వాషింగ్టన్ : తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో 74వ పంద్రాగస్టు వేడుకలను వినూత్నంగా, ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటామని తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ అన్నారు. భిన్న మతాలు, కులాలు, భాషలు, ప్రాంతాలు కలిగిన భారతీయులందరూ ఒక్కటై భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించటానికి, జాతీయ సమైక్యతా భావాన్ని ప్రోదిగొల్పటం ఈనాడు అత్యంత ఆవశ్యకమైన విషయమని ఆయన పేర్కొన్నారు. పౌరుల్లో దేశభక్తి లేనిదే ఏ జాతి రాణించలేదని వ్యాఖ్యానించారు. ప్రజల్లో దేశ భక్తి, సామాజిక స్పృహ కల్పించడంలో సాహిత్యం ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు. ఇది ఆది కవులు, రచయితల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. తానా పూర్వాధ్యక్షులు, తానా ప్రపంచ సాహిత్య వేదిక సంచాలకులు డా. ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ నిర్వహణలో ఈ అపూర్వమైన సాహిత్య సమ్మేళనం జరుగుతుందని తాళ్లూరి తెలియజేశారు. (తానా ఆధ్వర్యంలో తెలుగు సాంస్కృతిక మహోత్సవం) 39వ తానా ప్రపంచ సాహిత్య వేదిక సంచాలకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ - 74వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా - ఆగస్టు 15వ తేదిన, అంతర్జాలం ద్వారా, వివిధ దేశాల నుంచి 74 మంది సాహితీవేత్తలు వచన కవిత్వం, గేయ కవిత్వం, పద్య కవిత్వం, గజల్స్, పాటలలాంటి వివిధ ప్రక్రియలతో భరతమాతకు సాహిత్య హారతి సమర్పించనున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా మన తెలుగు సంతతికి చెందిన గవర్నర్లు - హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు పూర్వ గవర్నర్ కొణిజేటి రోశయ్య, కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర పూర్వ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు, ఆంధ్రప్రదేశ్ మాజీ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్, తమిళనాడు పూర్వ గవర్నర్ పి.ఎస్. రామ్మోహన్ రావు, ఐపీఎస్ తమ సందేశాలు అందజేస్తారని ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో హాజరవుతున్న 74 మంది సాహితీ వేత్తలలో పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, ప్రఖ్యాత సినీ గేయ రచయితలు.. డాక్టర్ సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్, అనంతశ్రీరామ్, రామజోగయ్యశాస్త్రి, భువనచంద్ర, వెన్నెలకంటి, చైతన్య ప్రసాద్, జె.కె.భారవి, శ్యామ్ కాసర్ల, సిరాశ్రీ, డా. వడ్డేపల్లి కృష్ణ, రసరాజు, డా. ముయిద ఆనందరావు (మిథునం చిత్ర నిర్మాత) విశిష్ట అతిథులుగా ఉన్నారు. డా. కడిమెళ్ళ వరప్రసాద్, డా. పాలపర్తి శ్యామలానందప్రసాద్, డా. మీగడ రామలింగస్వామి, డా. రాంభొట్ల పార్వతీశ్వర శర్మ, డా. పూదూర్ జగదీశ్వరన్, కళారత్న గుమ్మడి గోపాలకృష్ణ అవధానులుగా వ్యవహరించనున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే గాక మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి, అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, దుబాయ్, ఒమన్, కెనడా వంటి దేశాల నుంచి కూడా ప్రముఖ రచయితలు, సాహితీవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని డా. ప్రసాద్ తోటకూర ప్రకటించారు. (వికలాంగుల కష్టాలు తీర్చే వైకుంఠం ‘విర్డ్’ ఆసుపత్రి) సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి ఆహ్వానం పలుకుతూ, ఈ అద్భుత కార్యక్రమం భారత కాలమానం ప్రకారం ఆగస్టు 15 రాత్రి 7:30 నిమిషాలకు ప్రారంభం అవుతుందని, ఆయా దేశాల కాలమానాల ప్రకారం అంతర్జాలంలో యూట్యూబ్, ఫేస్బుక్(https://www.facebook.com/TANA.ORG/) ద్వారా అందరూ వీక్షించవచ్చని తెలియజేశారు. -
స్వాతంత్య్ర వేడుకలు భారీగా వద్దు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరమవుతూ ఉండడంతో ఈ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర వేడుకలను భారీగా నిర్వహించవద్దని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, పరిసరాల శానిటైజేషన్ వంటి నిబంధనల్ని పాటిస్తూ కార్యక్రమాల నిర్వహణకు టెక్నాలజీని వినియోగించుకోవాలని చెప్పింది. ఈ సారి స్వాతంత్య్రదిన వేడుకలకు కోవిడ్–19పై ముందుండి పోరాటం చేస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల్ని ఆహ్వానించి, ఈ సంక్షోభ సమయంలో వారు చేస్తున్న సేవల్ని గుర్తించాలని పిలుపునిచ్చింది. వైరస్పై పోరాడి కోలుకున్న వారిని కూడా పిలవాలని చెప్పింది. ఆన్లైన్ ద్వారా కార్యక్రమాలను టెలికాస్ట్ చేయాలని వివరించింది. కాగా, ఎర్రకోటలో కూడా చాలా సాధారణంగానే వేడుకలు జరగనున్నాయి. సాయుధ బలగాల గౌరవ వందనం అనంతరం ప్రధాని జెండా ఎగురవేస్తారు. ప్రధాని మోదీ ప్రసంగం, జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. అనంతరం రాష్ట్రపతి భవన్లో ఎట్ హోమ్ రిసెప్షన్ నిర్వహిస్తారు. -
వీరిద్దరూ ‘భళే బాసులు’
వీరిద్దరూ జిల్లా బాసులు. ఒకరు ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్. మరొకరు నగర పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్. వీరిద్దరు కాసేపు తమ హోదాను పక్కన పెట్టి చిన్న పిల్లల్లా మారిపోయారు. బ్యాటరీ బైక్లు నడిపి ముచ్చట తీర్చుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమానికి పలు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు బ్యాటరీ బైక్లను రూపొందించి... ప్రదర్శన కోసం తీసుకువచ్చారు. వాటిని ఆసక్తిగా తిలకించిన కలెక్టర్, ఎస్పీ వాటిపై కాసేపు మైదానంలో కలయతిరిగారు. వీరు బైక్ నడపడాన్ని చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఈ దృశ్యాన్ని ఖమ్మం సాక్షి ఫోటో జర్నలిస్ట్ తన కెమెరాలో బంధించారు. పేపర్ బేబీ.... ఇదేదో మోడ్రన్ ఫ్యాషన్ కాదు...ఫ్యాషన్ షో అంతకన్నా కాదు. ఈ చిన్నారి వేసుకున్న డ్రెస్ను చూసిన వారంతా వావ్ అన్నారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో నిన్న జరిగిన స్వాతంత్ర్య వేడులకు బూర్గంపాడు పాఠశాలకు చెందిన సాలేహా న్యూస్పేపర్తో తయారు చేసిన డ్రెస్ ధరించి వచ్చింది. ఆ చిన్నారిని చూసి వారేవా పేపర్ డ్రస్ అంటూ మెచ్చుకున్నారు. -
ఆఫీసర్.. నేను ఎమ్మెల్యేనయ్యా
సాక్షి, కరీంనగర్ : ‘ఆఫీసర్ నేను ఎమ్మెల్యేను.. కార్యక్రమ ఆహ్వానితుడను..’ అంటూ తన ను అడ్డుకున్న పోలీస్ అధికారికి చొప్పదండి ఎమ్మెల్యే చెప్పుకోవాల్సి వచ్చింది. స్వాత్రంత్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వేడుకలకు పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు. జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులుకు ఆహ్వాన లేఖలు పంపిం చారు. గురువారం వేడుకలకు హాజరయ్యేం దుకు వచ్చిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ను వారికి కేటాయించిన ప్రాంతంలోకి రాగా ఓ సీఐ అనుమతించలేదు. దీం తో ఆఫీసర్ నేను చొప్పదండి ఎమ్మెల్యేనంటూ తనను తాను చెప్పుకోవాల్సి వచ్చింది. తర్వాత సదరు అధికారి లోనికి అనుమతించారు. ప్రధాన గేట్ వద్ద ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ గార్డ్ కార్యక్రమానికి వస్తున్న పలువురిపై దురుసుగా మాట్లాడుతూ నెట్టివేయడం కనిపించింది. ఈవిషయం అధికారుల దృష్టికి తీసుకపోయినా స్పందన కరువైంది. -
కశ్మీర్లో త్రివర్ణ పతాకం రెపరెపలు
శ్రీనగర్/లెహ్: జమ్మూకశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి రద్దు కారణంగా రాష్ట్ర ప్రజల ప్రత్యేక గుర్తింపుపై ఎలాంటి ప్రభావం ఉండబోదని గవర్నర్ సత్యపాల్ మాలిక్ స్పష్టం చేశారు. గురువారం షేర్–ఇ–కశ్మీర్ స్టేడియంలో నిర్వహించిన 73వ స్వాతంత్య్ర జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు జమ్మూకశ్మీర్ ప్రజల గుర్తింపుపై ఎలాంటి ప్రభావం చూపబోవని హామీ ఇస్తున్నాను. పైపెచ్చు, రాష్ట్రంలోని భిన్న ప్రాంతాల ప్రజల భాషా సాంస్కృతిక వికాసానికి అవి సాయపడతాయి. నవ కశ్మీర్ నిర్మాణంలో పాలుపంచుకోవాలని యువతను కోరుతున్నాను’అని పేర్కొన్నారు. కార్యక్రమానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. ముందు జాగ్రత్తగా ముఖ్య నేతలందరినీ నిర్బంధంలోకి తీసుకున్నందున వారెవరూ రాలేకపోయారు. నగరంలో అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రద్దయ్యాయి. కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడనున్న లదాఖ్లో ప్రజలు మొట్టమొదటి స్వాతంత్య్ర వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. లదాఖ్లో జరిగిన వేడుకల్లో ప్రజలు తమ ఏకైక ఎంపీ జమ్యంగ్ త్సెరింగ్ నంగ్యా(24)తో కలిసి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. -
‘పరిమితం’.. దేశహితం
ఎర్రకోటలో ఆరోసారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం జనాభా పెరిగితే రాబోయే తరాలకు లెక్కలేనన్ని సమస్యలు, సవాళ్లు ఎదురవుతాయి. జనాభా విస్ఫోటనాన్ని నియంత్రించేందుకు కేంద్రంతోపాటు రాష్ట్రాలూ చర్యలు చేపట్టాలి. ఒక్కో కుటుంబంలో మనుషులు ఎక్కువగా ఉంటే వారికి సరైన విద్య, వైద్య సౌకర్యాలు అందవు. ఇప్పటికే దేశంలో కొంత భాగం ప్రజలు చిన్న కుటుంబాలుగా ఉంటూ సుఖంగా జీవిస్తున్నారు. వారిని చూసి మిగతా వారు నేర్చుకోవాలి. దీన్ని అనేక మంది వ్యతిరేకించినా.. దేశ ప్రజలకు మంచి భవిష్యత్తును అందివ్వడం కోసం ఇది తప్పదు. కశ్మీరీల కలలకు రెక్కలు జమ్మూకశ్మీర్ అంశంలో కేవలం ప్రజలు అప్పజెప్పిన బాధ్యతను పూర్తి చేశా. జమ్మూకశ్మీర్, లదాఖ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాల్సిన, వారి కలలకు కొత్త రెక్కలను ఇవ్వాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. 370వ అధికరణం రద్దవ్వడంతో ఇప్పుడు భారత్ ఒక దేశం, ఒకే రాజ్యాంగంగా మారింది. సాహసోపేత, పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి మా ప్రభుత్వం సంశయించదు. ‘సీడీఎస్’ రూపకల్పన.. త్రివిధ దళాలకు కలిపి కొత్తగా ఓ అధిపతిని నియమిస్తాం. సీడీఎస్ (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్)గా నియమితులయ్యే వ్యక్తి సైనిక, వాయుసేన, నౌకాదళానికి సంయుక్త అధిపతిగా ఉంటారు. త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని మరింత పెంచడం కోసం సీడీఎస్ను నియమించాల్సిన సమయం వచ్చింది. సీడీఎస్ నియామక విధి విధానాలను మా ప్రభుత్వం ఇంకా రూపొందిస్తోంది. దేశంలోనే విహారం ఏడాదికి దాదాపు 2 కోట్ల మంది భారతీయులు విదేశాలకు విహారయాత్రలకు వెళ్తున్నారు. వారంతా 75వ స్వాతంత్య్ర దినోత్సవం వచ్చే నాటికి దేశంలోనే కనీసం 15 పర్యాటక కేంద్రాలను సందర్శించాలి. దీంతో దేశీయంగా పర్యాటక రంగానికి ప్రోత్సాహం లభించి దేశం అభివృద్ధి చెందుతుంది. ఒకే దేశం.. ఒకే ఎన్నిక.. దేశం గొప్పగా మార్చేందుకు లోక్సభతోపాటు అన్ని శాసనసభలకూ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి. ప్రస్తుతం జమిలి ఎన్నికల ప్రస్తావన వస్తుండటం శుభపరిణామం. ఒక దేశం, ఒక ఎన్నిక అంశంపై అన్ని భాగస్వామ్య పక్షాల్లో చర్చలు జరగాలి. న్యూఢిల్లీ దేశం ఎదుర్కొంటున్న వేలాది సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పుడు భారత్కు ఎంతో బలమైన ప్రభుత్వం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని ఎర్రకోట నుంచి వరుసగా ఆరోసారి, 73వ స్వాతంత్య్ర దినోత్సవాన ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. రంగురంగుల తలపాగాతో గురువారం వేదిక మీదకు వచ్చిన మోదీ.. త్రివిధ దళాల మధ్య సమన్వయం కోసం ఆ మూడింటికీ కలిపి కొత్తగా ఒక అధిపతిని (చీఫ్ ఆఫ్ డిఫెన్స్స్టాఫ్ – సీడీఎస్) నియమించడం, దేశంలో జనాభా విస్ఫోటనాన్ని అరికట్టడం, జమ్మూ కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం తదితర అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు. దేశంలోని ప్రతి ఇంటికీ పైపుల ద్వారా నీరు అందించేందుకు తమ ప్రభుత్వం రాబోయే కొన్నేళ్లలో రూ. 3.5 లక్షల కోట్లను ఖర్చు చేయనుందని మోదీ చెప్పారు. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న నేపథ్యంలో, రాబోయే ఐదేళ్లలో ఏకంగా వంద లక్షల కోట్ల రూపాయలను మౌలిక వసతుల రంగంలో పెట్టి, ఆర్థిక వ్యవస్థ ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ వెల్లడించారు. ఒక దేశం, ఒకే కార్డు వ్యవస్థతో ఒకే కార్డుతో దేశంలో ఎక్కడైనా ప్రయాణాలకు చెల్లింపులు చేసే వ్యవస్థను తమ ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. దాదాపు 95 నిమిషాల పాటు, సుదీర్ఘంగా సాగిన మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... జనాభాను నియంత్రించాల్సిందే.. ‘జనాభా పెరిగితే రాబోయే తరాల వారికి లెక్కపెట్టలేనన్ని సమస్యలు, సవాళ్లు ఎదురవుతాయి. జనాభాను నియంత్రించేందుకు కేంద్రంతోపాటు రాష్ట్రాలు కూడా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దేశం నేరుగా ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటైన జనాభా విస్ఫోటన సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన సమయం వచ్చింది. కుటుంబాలు చిన్నగా ఉండాలి. ఒక్కో కుటుంబంలో మనుషులు ఎక్కువగా ఉంటే వారికి సరైన విద్య, వైద్య సౌకర్యాలు అందవు. వారి ఇళ్లతోపాటు మొత్తంగా దేశం కూడా సంతోషంగా ఉండదు. ఇప్పటికే దేశంలో కొంత భాగం మంది ప్రజలు జనాభాను తగ్గించుకుని, చిన్న కుటుంబాలుగా ఉంటూ సుఖంగా జీవిస్తున్నారు. వారిని చూసి మిగతా వారు నేర్చుకోవాలి. ఈ నిర్ణయాన్ని అనేక మంది వ్యతిరేకించినా సరే, దేశ, ప్రజలకు మంచి భవిష్యత్తును అందివ్వడం కోసం ఇది తప్పదు’. ‘సీడీఎస్’విధివిధానాలను రూపొందిస్తున్నాం ‘త్రివిధ దళాలకు కలిపి కొత్తగా ఓ అధిపతిని నియమిస్తాం. సీడీఎస్ (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్)గా నియమితులయ్యే వ్యక్తి ఆర్మీ, వాయుసేన, నౌకాదళం.. మూడింటికి కలిపి సంయుక్త అధిపతిగా ఉంటారు. త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని మరింత పెంచడం కోసం సీడీఎస్ను నియమించాల్సిన సమయం వచ్చింది. సీడీఎస్ నియామక విధి విధానాలను మా ప్రభుత్వం ఇంకా రూపొందిస్తోంది’అని మోదీ చెప్పారు. ప్రస్తుత విధానంలో త్రివిధ దళాల మధ్య సమన్వయం కోసం మూడు సేనల చీఫ్ల కమిటీ (చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ–సీవోఎస్సీ) ఉంది. ఆ ముగ్గురు అధిపతుల్లో ఎవరు అత్యంత సీనియర్ అయితే వారు సీవోఎస్సీ చైర్మన్గా ఉంటారు. కొత్తగా నియమితులయ్యే సీడీఎస్ త్రివిధ దళాల మధ్య సమన్వయం కోసం కృషి చేయడంతోపాటు ప్రధాని, రక్షణ మంత్రులకు సైనిక సలహాదారుగానూ ఉంటారు. కశ్మీరీల కలలకు కొత్త రెక్కలు ఇవ్వాలి ‘జమ్మూ కశ్మీర్ అంశంలో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఉద్దేశం, భావం లేదు. కేవలం ప్రజలు అప్పజెప్పిన బాధ్యతను పూర్తి చేశా. జమ్మూ కశ్మీర్, లదాఖ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాల్సిన, వారి కలలకు కొత్త రెక్కలను ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. 370వ అధికరణం రద్దవ్వడంతో ఇప్పుడు భారత్ ఒక దేశం, ఒకే రాజ్యాంగంగా మారింది. సాహసోపేత, పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి మా ప్రభుత్వం సంశయిం చదు. ఆర్టికల్ 370పై గత 70 ఏళ్లలో చేయలేని దానిని మేము ఇప్పుడు చేసి చూపించాం’ దేశంలోనే విహారయాత్రలకు వెళ్లండి.. ‘ఏడాదికి దాదాపు 2 కోట్ల మంది భారతీయులు విదేశాలకు విహారయాత్రలకు వెళ్తున్నారు. వారంతా 2022 నాటికి దేశంలోనే కనీసం 15 పర్యాటక కేంద్రాలను సందర్శించాలి. దీనివల్ల దేశీయంగా పర్యాటక రంగానికి ప్రోత్సాహం లభించి దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం విదేశాల్లో మాదిరిగా దేశంలోని పర్యాటక కేంద్రాల్లో చాలా మంచి హోటళ్లు ఉండకపోవచ్చు. కానీ, ప్రజలు వెళ్లడం మొదలుపెడితే వాటంతట అవే వస్తాయి. దేశం గొప్పగా మారాలంటే తప్పదు.. ‘దేశం గొప్పగా మార్చేందుకు లోక్సభతోపాటు అన్ని శాసనసభలకూ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి. ప్రస్తుతం జమిలి ఎన్నికల ప్రస్తావన వస్తుండటం శుభపరిణామం. ‘ఒక దేశం, ఒక ఎన్నిక’ అంశంపై అన్ని భాగస్వామ్య పక్షాల్లో చర్చలు జరగాలి’అని మోదీ అన్నారు. అయితే రాజ్యాంగం మార్చకుండానే జమిలి ఎన్నికలు అసాధ్యమని న్యాయ కమిషన్ గతేడాది ఆగస్టులోనే తేల్చి చెప్పడం తెలిసిందే. ఆరేళ్లు.. ఆరు తలపాగాలు స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలప్పుడు ప్రసంగం చేసే సమయంలో వైవిధ్యమైన తలపాగాలు ధరించడం మోదీ ప్రత్యేకత. 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ప్రసంగం చేసే సమయంలోనూ మోదీ ఆ ప్రత్యేకతను చాటుకున్నారు. పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగులున్న తలపాగాను, సగం వరకే చేతులున్న తెల్ల కుర్తా, పైజామా, కాషాయ రంగు అంచులున్న కండువాను ధరించి మోదీ వేదికపైకి వచ్చారు. 2014లో తొలిసారి ఎర్రకోటపై నుంచి ప్రసంగించినప్పుడు మోదీ తల భాగం ఎర్రగా, తోక భాగం ఆకుపచ్చ జోధ్పురీ తలపాగా పెట్టుకున్నారు. 2015లో పసుపు రంగు వస్త్రంపై ఎరుపు, ముదురు ఆకుపచ్చ రంగు గీతలున్న తలపాగాను, 2016లో పసుపు, గులాబీ రంగు తలపాగాను మోదీ ధరించారు. 2017లో దట్టమైన ఎరుపు, పసుపు రంగులపై బంగారు వర్ణం గీతలున్న తలపాగాను, 2018లో కాషాయ తలపాగాతో మోదీ ఎర్రకోటపైకి వచ్చారు. ఆహ్లాద వాతావరణంలో ఉత్సాహంగా.. 73వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమం ఎర్రకోటలో ఆహ్లాద వాతావరణంలో ఉత్సాహంగా సాగింది. మోదీ ఎర్రకోటకు చేరుకుని తిరిగి వెళ్లే వరకూ కార్యక్రమం జరిగిన తీరు ఇలా... ► చారిత్రక కోట వద్దకు ప్రధాని చేరుకోగానే సందర్శకులంతా లేచి నిలబడ్డారు. ► కార్యక్రమానికి నరేంద్ర మోదీ తెల్లని పైజామా–కుర్తా, రాజస్తానీ తరహా రంగురంగుల తలపాగా ధరించి వచ్చారు. ► రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మోదీకి స్వాగతం పలికారు. ► తర్వాత మోదీ ఇంటర్ సర్వీసెస్, పోలీస్గార్డ్ల వందనం స్వీకరించారు ► అనంతరం ప్రధాని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ► తర్వాత మోదీ జాతిని ఉద్దేశించి 95 నిమిషాల పాటు ప్రసంగించారు. వరుసగా ఆరోసారి బుల్లెట్ ప్రూఫ్ పోడియం రక్షణ లేకుండా ప్రసంగించారు. ► ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, ఎస్ జైశంకర్, నితిన్ గడ్కరీ, రమేశ్ పోఖ్రియాల్, ప్రహ్లాద్ సింగ్ పటేల్ త్రివిధ దళాధిపతులు బిపిన్ రావత్, బి.ఎస్. ధనోవా, కర్మబీర్ సింగ్ హాజరయ్యారు. ► ఎర్రకోట ముందు వేలాది మంది పాఠశాల పిల్లలు ’నయా భారత్’ అనే హిందీ అక్షరాల ఆకారంలో నిలబడ్డారు. ► తెల్లవారుజామున కురిసిన వర్షం వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చింది. అమరవీరులకు సలాం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్దనున్న అమర్జవాన్ జ్యోతి వద్ద నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి కోవింద్ వందనం ఆసేతు హిమాచలం జమ్మూలో జరిగిన స్వాతంత్య్రదిన వేడుకల్లో అలరించిన పాఠశాల విద్యార్థుల ప్రదర్శన భారీ త్రివర్ణం ముంబైలోని హిరానందాని గార్డెన్స్లో భారీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్న ప్రజలు తల్లీ భారతి వందనం మహారాష్ట్ర కొల్హాపూర్లోని ఓ పాఠశాలలో విద్యార్థులతో కలిసి జెండా వందనం చేస్తున్న నటి ఊర్మిళ మతోండ్కర్ -
ఆహ్లాదకరంగా ‘ఎట్ హోం’
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ నరసింహన్ దంపతులు గురువారం రాజ్భవన్లో ఇచ్చిన తేనీటి విందుకు (ఎట్ హోం) సీఎం కేసీఆర్తోపాటు పలువురు మంత్రులు, వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. సుమారు గంటన్నర పాటు సాగిన ఎట్హోం కార్య క్రమంలో గవర్నర్ దంపతులు నరసింహన్, విమలా నరసింహన్ అతిథుల వద్దకు వెళ్లి పేరుపేరునా స్వాగతం పలికారు. జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభం కాగా.. సీఎం కేసీఆర్తోపాటు గవర్నర్ దంపతులు ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన వేదిక వద్దకు చేరుకున్నారు. తమిళనాడు మాజీ గవర్నర్, మాజీ సీఎం రోశయ్యతో పాటు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర మంత్రులు జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ పార్టీల నేతలను పలకరించిన సీఎం కేసీఆర్.. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, ఐటీ కంపెనీ అధినేత బీవీఆర్ మోహన్రెడ్డితో సుదీర్ఘంగా సంభాషించారు. అతిథులను పలకరించిన అనంతరం.. గవర్నర్ నరసింహన్, కేసీఆర్ 25నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఇద్దరి నడుమ ఆసక్తికర చర్చ సాగిందని చెబుతున్నా.. భేటీ వివరాలు మీడియాకు వెల్లడి కాలేదు. కేసీఆర్తో జానారెడ్డి కరచాలనం, పక్కన ఉత్తమ్కుమార్రెడ్డి కలిసే సందర్భం రావట్లేదు! ఎట్హోం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వివిధ పార్టీల నేతలను గవర్నర్, సీఎం కేసీఆర్ పలకరించారు. ఆహ్లాదకరంగా సాగిన కార్యక్రమంలో గవర్నర్, సీఎం, నేతల నడుమ పలుసార్లు ఆసక్తికర సంభాషణ జరిగింది. సీఎల్పీ మాజీ నేత జానారెడ్డిని ఎలా ఉన్నారంటూ సీఎం కేసీఆర్ పలకరించగా.. ఇప్పుడు మనం కలిసే సందర్భం రావడం లేదని జానారెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో అసెంబ్లీలో అప్పుడో, ఇప్పుడో కలిసే సందర్భం వచ్చేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మమ్ములను కూడా దృష్టిలో పెట్టుకోండని గవర్నర్తో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ వ్యాఖ్యానించగా.. అలాంటిదేమీ లేదని గవర్నర్ అన్నారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, గవర్నర్ మధ్య కూడా సుమారు 2 నిమిషాల పాటు ఆసక్తికర సంభాషణ కొనసాగింది. తరలివచ్చిన ప్రముఖులు కార్యక్రమంలో తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు నేతలతో పాటు, ప్రభుత్వాధికారులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఉమ్మడి ఏపీ శాసన మండలి మాజీ ఛైర్మన్ చక్రపాణి, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, బడుగుల లింగయ్య యాదవ్, బండ ప్రకాశ్, సంతోష్కుమార్, ఎంపీలు నామా నాగేశ్వర్రావు, రేవంత్రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, క్రీడాకారులు మిథాలీరాజ్, పుల్లెల గోపీచంద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్రెడ్డి, సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పాల్గొన్నారు. -
బిగ్బాస్ ఇంట్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్
పంద్రాగస్టు.. దేశం మొత్తం స్వాతంత్య్ర వేడుకల్లో తేలిపోయింది. అలాగే.. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్న బిగ్బాస్ ఇంటి సభ్యులు కూడా స్వాతంత్య్ర వేడకులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏదైన సామాజకి కోణాన్ని స్పృశిస్తూ.. సమస్యలపై స్కిట్చేయవల్సిందిగా బిగ్బాస్ ఆదేశించాడు. హౌస్మేట్స్ రెండు టీమ్స్గా విడిపోయిన వేసిన స్కిట్స్లో డెప్త్ లేకపోయినా.. కంటెంట్ మాత్రం కరెక్ట్గానే ఉంది. గురువారం నాటి ఎపిసోడ్ సాగిందిలా.. బాత్రూం సెక్షన్ను క్లీనింగ్ చేస్తున్న బాబా భాస్కర్ పనుల్లో శ్రీముఖి అనవసరంగా వేలు పెట్టడంతో.. లివింగ్ ఏరియాను క్లీనింగ్ చేసిన శ్రీముఖిపై సెటైర్లు వేసుకుంటూ ఉన్నాడు. లివింగ్ ఏరియాలో ఉన్న టేబుల్, టీవీల దుమ్ము ఉండటంతో వాటిని చూపిస్తూ.. ఏం పని చేశారంటూ హౌస్మేట్స్తో చెప్పుకొచ్చాడు. బాబా భాస్కర్ చేస్తున్న పనిలో ఎవరు తలదూర్చమన్నారు.. అందుకే మీరు చేసిన పనిలో ఇప్పుడు బాబా భాస్కర్ వేలు పెడుతున్నాడంటూ కెప్టెన్ అలీరెజా పేర్కొన్నాడు. లగ్జరీ బడ్జెట్లో భాగంగా ఇంటి సభ్యులకు ఏ వస్తువులు కావాలో.. అలీరెజా వెల్లడించాలని బిగ్బాస్ ఆదేశించాడు. ప్రతీ హౌస్మేట్స్కు అవసరమైన, ఇష్టమైన తిండి పదార్థాలను లగ్జరీ బడ్జెట్లో పేర్కొన్నాడు. అనంతరం ఇండిపెండెన్స్ డేకు సంబంధించిన టాస్క్ను చేయవల్సిందిగా బిగ్బాస్ ఆదేశాలు జారీ చేశాడు. స్త్రీ పురుష సమానత్వాన్ని తెలియజేసేట్టుగా మహేష్, రవికృష్ణ, అషూ , పునర్నవి, వితికాలు ఓ స్కిట్ వేశారు. అయితే ఈ స్కిట్ ఏ మాత్రం ఆకట్టుకునేలా లేకపోయింది. ప్రేమికులు వారి మధ్య గొడవలు, ఇద్దరూ ఆధిపత్యం కోసం వాదనలు వినిపించడం.. తాము గొప్పంటే తాము గొప్ప అని చెప్పుకోవడం తప్పా.. స్కిట్ను ఆసక్తికరంగా మలచలేకపోయారు. స్వాతంత్య్రానికి ముందు, స్వాతంత్య్రానంతరం పరిస్థితులను తెలియజేసేందుకు ప్రయత్నించారు. అసలు నిజంగా స్వాతంత్ర్యం వచ్చిందా? అమ్మాయిలు అర్థరాత్రి నడుస్తున్నారు.. కానీ అబ్బాయిలు మాత్రం నడవనివ్వడం లేదు..? ఇక్కడే పుట్టి ఇక్కడే చదివి.. మన ప్రతిభను పక్క దేశాలకు తాకట్టు పెడతున్నామని చెప్పే ప్రయత్నం చేశారు. కొంతలోకొంత శ్రీముఖి గ్యాంగ్ చేసిన స్కిట్ పర్వాలేదనిపించింది. అనంతరం దేశ భక్తి గీతాలను ప్లే చేయగా.. ఇంటి సభ్యులందరూ నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇక రేపటి ఎపిసోడ్లో బిగ్బాస్హౌస్లో విజ్ఞాన ప్రదర్శన జరగనున్నట్లు తెలుస్తోంది. ఇంటిసభ్యులకు జనరల్ నాలెడ్జ్కు సంబంధించిన ప్రశ్నలను సంధిస్తుండగా.. అందరూ తెల్లమొహం వేసినట్లు కనిపిస్తోంది. మరి ఈ విజ్ఞాన ప్రదర్శనలో ఎవరు సమాధానాలు చెప్పి విజేతగా నిలుస్తారో తెలియాలంటే శుక్రవారం ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే. -
ఈనాటి ముఖ్యాంశాలు
సాక్షి, హైదరాబాద్ : జమ్మూకశ్మీర్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు... ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జాతీయ జెండాను ఆవిష్కరించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘వాలంటీర్ల’ వ్యవస్థను లాంఛనంగా ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి... రాజ్భవన్లో తేనీటి విందు ఏర్పాటు చేసిన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్.. గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగరవేసిన తెలంగాణా సీఎం కే చంద్రశేఖర్రావు.. రక్షాబంధన్ పర్వదినాన ఢిల్లీ మహిళలకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ శుభవార్త.. పూర్తి వివరాల కోసం కింది వీడియోను వీక్షించండి.. -
బిగ్బాస్: ఆడదానివి.. అంత నోరెందుకు?
కావలసినన్ని గొడవలు, కాసిన్ని అలకలు, మరికాసిన్ని బుజ్జగింపులతో సాగుతున్న బిగ్బాస్ హౌస్లో నేడు పంద్రాగస్టు వేడుకలు నిర్వహించనున్నారు. గత ఎపిసోడ్లో కెప్టెన్సీ టాస్క్లో అలీ రెజా, రవి, రాహుల్ ముగ్గురు పాల్గొన్నప్పటికీ యుద్ధం మాత్రం అలీ, రాహుల్ మధ్యే జరిగింది. ముఖ్యంగా శ్రీముఖి, శివజ్యోతి, హిమజలు అలీకి మద్దతుగా నిలిచారు. వీరిని దాటి ముందుకెళ్లడం రాహుల్కు కష్టంగానే మారింది. ఎంత పోరాడినప్పటికీ విజయం అలీనే వరించింది. ఈ వారం రోహిణి ఎలిమినేట్ అవుతుంది అన్న శ్రీముఖి మాటలతో రోహిణి కంటనీరు పెట్టుకుంది. తన స్నేహితురాలు అయి వుండి మొహం మీదే నువ్వు ఎలిమినేట్ అవుతావు అని చెప్తే ఎలా అంటుంది అని బాధపడింది. కాసేపు దీనిపై గొడవ జరిగినా రోహిణి, శ్రీముఖిలు కలిసి మాట్లాడుకుని గొడవ సెటిల్ చేసుకున్నారు. ఇక శ్రీముఖి పదేపదే రాహులనుద్దేశించి నమ్మి మోసపోయానని విసుగు వ్యక్తం చేసింది. ఇక ప్రోమో విషయానికొస్తే స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఇంటిని రంగురంగుల బెలూన్లతో అందంగా అలంకరించారు. ‘భారత్ మాతాకీ జై..’ అంటూ ప్రారంభమైన ఈ ప్రోమో చూస్తుంటే ఇంటి సభ్యులు అంబరాన్నంటేలా సంబరాలు చేసుకున్నారనిపిస్తుంది. వారి మధ్య వైరాలను పక్కనపెట్టి మరీ ఉల్లాసంగా గడిపినట్టు తెలుస్తోంది. స్టేజ్పై ఆటలు, పాటలతో నేడు ఫుల్ జోష్లో ఎపిసోడ్ కొనసాగనుంది. కెప్టెన్సీ టాస్క్లో గెలుపు నీదా, నాదా? అని కొట్టుకునే స్థాయికి వెళ్లిన కంటెస్టెంట్లు నేటి ఎపిసోడ్లో కాస్త కూల్ అయినట్టుగా ఉన్నారు. ఇక రెండో కెప్టెన్గా ఎన్నికైన అలీ రెజా, శ్రీముఖితో కలిసి ఇంటి సభ్యులందరి తరపున ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా విడుదల చేసిన మరో ప్రోమోలో వేడుకలు, వినోదంతోపాటు సందేశాత్మకంగా కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా బిగ్బాస్ ఇంటి సభ్యులతో స్కిట్ చేయించారు. ఇందులో ప్రేమికుల పాత్ర పోషించిన రవి, వితిక ఇద్దరూ ఒకరిపై ఒకరు అరుస్తారు. వారి మాటలను బట్టి స్త్రీ వివక్ష గురించి స్కిట్ చేస్తున్నట్టుగా ఉంది. స్వాతంత్ర్యం వచ్చి 74 ఏళ్లు గడిచినా సమాజం పురుషులను, స్ర్తీలను సమానంగా చూడట్లేదు. స్త్రీని దేవతగా పూజించే భారతదేశంలో అతివ అవమానాల పాలవుతోంది. చులకనగా మారుతోంది. వీటన్నింటికి మూల కారణాన్ని ఇంటి సభ్యులు కనుగొంటారా.! మరోవైపు ఆడపిల్ల ఎన్ని బాధలు ఎదుర్కొన్నా మౌనంగానే అన్నీ భరించాలా? ఎదుటివారు తప్పుచేసి తనను నిందిస్తున్నా సర్దుకుపోవాలా? ఆడపిల్లకు కనీసం స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కూడా లేదా..? అన్న ప్రశ్నలను లేవనెత్తేలా ఉంది. ఆడపిల్లవై ఉండి అంత నోరేసుకుని అరుస్తావా? అని మహేశ్ ఎందుకు మండిపడతాడు? చివర్లో వరుణ్ అడిగిన ప్రశ్నకు ఇంటి సభ్యులు ఏం సమాధానమిస్తారు? అసలు వీరు చెప్పాలనుకున్న సందేశమేంటి? ఈ చిక్కు ప్రశ్నలన్నింటికీ నేటి ఎపిసోడ్ బదులివ్వనుంది. #IndependenceDay celebrations in the house 🇮🇳#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/GVvMCmYgXp — STAR MAA (@StarMaa) August 15, 2019 #BiggBossTelugu3 house celebrates #IndependenceDay 🇮🇳 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/h4C0jTg92F — STAR MAA (@StarMaa) August 15, 2019 మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం క్లిక్ చేయండి -
ఒక్కొక్కటిగా అన్నీ నెరవేర్చుతాం : బాషా
సాక్షి, వైఎస్సార్ కడప: పోలీసు పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ వలంటీర్ వ్యవస్థను నేడు ప్రారంభిస్తున్నామన్నారు. సీఎం జగన్ పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుతో పాటు మూతపడ్డ చక్కెర పరిశ్రమను తెరిపించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని అభివృద్ధి పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. -
స్వేచ్ఛాబంధన్
భలే మంచి రోజు ఇది. బానిస శృంఖలాలు తెంచుకుని భరతమాత స్వేచ్ఛావాయువులు పీల్చిన రోజు. అంతేనా! రాఖీ పండుగ కూడా కలిసి వచ్చిన రోజు. ఈ రెండు వేడుకలను కలుపుకుంటూ భరతమాత చేసిన ఈ స్వగత రచనను ఆస్వాదించండి. ఎంతోమంది దేశభక్తులు తమ చేతులకు రాఖీలు కట్టించుకున్న రోజు ఇది. రుక్సానా తన చేతికి కట్టిన రాఖీ కోసం పురుషోత్తముడు గ్రీకువీరుడు అలెగ్జాండరును చంపకుండా విడిచిపెట్టాడు. ఎంత అద్భుతమైన పండుగ. కేవలం రాఖీ కారణంగానే అలెగ్జాండరును విడిచిపెట్టాడా. కాదు.. అదొక్కటే కారణం కాదు.. రాఖీలో దాగి ఉన్న విడదీయరాని ప్రేమ కారణంగానే పురుషోత్తముడు అంత ఉత్తమంగా ప్రవర్తించాడు. అందుకే ఈ రోజు నాకు రెండు పండుగల సంబరాలు జరుగుతున్నాయి. నా బిడ్డలందరూ నన్ను ‘భరతమాత’ అంటూ ఆప్యాయంగా పెనవేసుకుపోతున్నారు. నేను మాత్రం నా పుత్రసంతానం చేతులకున్న రాఖీలు చూస్తూ మురిసిపోతున్నాను. నా ఆడపిల్లలకు ఎంతో భరోసా ఇస్తున్న శుభ పండుగ ఇది. ఆడపిల్లలు అస్వతంత్రులేమీ కాదు, చేతకానివారూ కాదు. ఆప్యాయతను కోరే సున్నిత మనస్కులు. అందుకే సోదరుల ప్రేమను స్వార్థంగా ఆశిస్తారు. నిస్వార్థంగా వారికి సేవలు అందిస్తారు. మన ఇంటి ఆడపడుచులను కంటికి రెప్పలా చూసుకోవాలని ఒక తల్లిగా నేను నిరంతరం ఆకాంక్షిస్తుంటాను. ఒక పక్కన మువ్వన్నెల జెండాలతో నగరాలు, గ్రామాలు, పల్లెలు కళకళలాడుతుంటే, మరోపక్క నా పిల్లలు చేసుకుంటున్న అన్నచెల్లెళ్ల పండుగతో నాకు కన్నులపండువుగా ఉంది. నా అంతరంగం పరవళ్లు తొక్కుతోంది. రంగురంగుల మిఠాయి బిళ్లలతో బడిపిల్లలు నోళ్లు తీపి చేసుకుంటుంటే ఎర్రగా మారిన వారి నోళ్లు చూసి నా హృదయం పసిపిల్లలా గెంతుతుంటే, పరవశించిపోతాను. ‘హిమగిరీంద్రము నుండి అమృతవాహిని దాకా అఖిల భారత జనుల అలరించు తల్లీ’ అంటూ దేశభక్తి గీతాలు ఆలపిస్తుంటే, నా మేను పులకరించిపోతోంది. ‘కల గంటినే నేను కలగంటినే, కలలోన తల్లిని కనుగొంటినే, ఎంత బాగున్నదో నా కన్నతల్లి ఎన్నాళ్లకెన్నాళ్లకగుపించె మళ్లీ’ అని కొన్ని సుస్వరాల ఆలాపన వింటుంటే, నా మనసు కోకిల గానం చేస్తోంది. ఇంతలోనే ‘అన్నయ్య హృదయం దేవాలయం, చెల్లెలె ఆ గుడి మణిదీపం’ అంటూ చెల్లెమ్మలు అన్నయ్యను పొగడ్తలతో ముంచెత్తుతుంటే, నా బిడ్డలంతా అనురాగ బంధాన్ని పటిష్టం చేసుకుంటున్నందుకు నా మాతృహృదయం పరవశించపోతోంది. ‘ఎందరో వీరుల త్యాగఫలమే మన నేటి స్వేచ్ఛకే మూల బలం, వారందరినీ తలచుకుని మన మానసవీధిని నిలుపుకుని’ అంటూ వీరుల త్యాగాలను స్మురించుకుంటున్నారు నా వారంతా. నా మీద ఎంత ప్రేమ. కలం పట్టిన ప్రతి కవి సిరాలో నుంచి స్వేచ్ఛాసుమాల వర్ణాలు జాలువారుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో నాకు స్వతంత్రం వచ్చిందనే విషయం పిల్లలకు గుర్తు చేయాలన్న లక్ష్యంతో పాఠశాలల్లో జెండాలు ఎగురవేస్తూ, బిళ్లలు పంచుతుంటే, పిల్లలంతా ముద్దుముద్దు మాటలతో నన్ను కీర్తిస్తూ పాడుతుంటే, నా గురించి నా ఒళ్లే గగుర్పొడిచేలా ఉపన్యాసాలు చెబుతుంటే, నా మాతృహృదయం ద్రవించిపోదా. నాకు ఉత్తరాన ఉన్న హిమాలయాలు అవే కదా. ఈ చిన్నారుల మాటలకు అవి ద్రవించకుండా ఉంటాయా. ఈ పండుగతో పాటు నా పిల్లలంతా మరో పండుగ సంబరంగా జరుపుకుంటుటే, నా ఆనందం ద్విగుణీకృతమవుతోంది. నా నొసట అశోకుని ధర్మచక్రాన్ని కుంకుమగా దిద్దుతూ, మరోపక్క సోదరుల నుదుటన నిలువుగా కస్తూరీ తిలకం అద్దుతుంటే... అబ్బో... మళ్లీ ఎన్నాళ్లకు ఇంతటి సుందర దృశ్యాన్ని కళ్లారా చూసే అదృష్టం కలుగుతుందో అనిపిస్తోంది. శ్రీకృష్ణుడు ద్రౌపదిని కాపాడి అన్నాచెల్లెళ్ల అనుబంధంలోని మాధుర్యాన్ని ఆస్వాదించాడు. సుభద్ర కోరుకున్న అర్జునుడికి ఇచ్చి వివాహం జరిపించి, పితృవాత్సల్యాన్ని అనుభూతి చెందాడు. ఒక తల్లిగా నేను ఇంతకంటె ఏం కోరుకుంటాను. ఇంతటి ఆనందానుభూతులన్నీ ఈ రోజు నా మనసు పొరల్లోంచి బయటకు వస్తున్నాయి. ఈ రోజు నాకు మాత్రమే కాదు నా సంతానానికి కూడా జేజేలు పలుకుదాం. నా వారందరికీ రక్షాబంధన శుభాశీస్సులు పలుకుతున్నాను. ఒక పక్కన మువ్వన్నెల జెండాలతో నగరాలు, గ్రామాలు, పల్లెలు కళకళలాడుతుంటే.. మరోపక్క నా పిల్లలు చేసుకుంటున్న అన్నాచెల్లెళ్ల పండుగతో నాకు కన్నుల పండువుగా ఉంది. నా అంతరంగం పరవళ్లు తొక్కుతోంది.సృజనాత్మక రచన: వైజయంతి పురాణపండ -
బిగుసుకుపోయిన జెండా.. పట్టించుకోని కలెక్టర్
సాక్షి, నిర్మల్: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. పాలకవర్గం గడువు తీరి పోవడంతో జిల్లా పాలనాధికారి ఎం.ప్రశాంతి జెండాను ఆవిష్కరించారు. అయితే జాతీయ పతాకం అక్కడే బిగుసుకుపోవడంతో సరిగా ఎగర లేదు. అయినప్పటికీ జెండా వందనం పూర్తి చేసి హడావిడిగా అక్కడి నుంచి వెళ్లిపోయారు కలెక్టర్ ప్రశాంతి. అందరూ వెళ్లిన తర్వాత సిబ్బంది కర్రసాయంతో జెండాను బాగుచేసి ఎగిరేలా చేశారు. -
గ్రామ సచివాలయం నుంచే పరిపాలన
సాక్షి, గుంటూరు: తాడేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర ప్రజలకు 73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవానికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. ఒకటి.. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుతో దేశానికి పూర్తి స్థాయి స్వతంత్రం లభించిగా.. రెండు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. పంచాయతీలకు పూర్తి స్థాయి అధికారాలు అందజేసి.. గ్రామ సచివాలయం నుంచే పరిపాలన అందించనున్నారని పేర్కొన్నారు. గ్రామ వలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందజేయనున్నారని తెలిపారు. రెండున్నర నెలల పాలనలో సీఎం జగన్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని ప్రశంసించారు. యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా అభివృద్ధి: గట్టు శ్రీకాంత్ రెడ్డి 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లోటస్ పాండ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. గట్టు శ్రీకాంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజలకు 73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది, బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యలు పరిష్కరించుకొని యావత్తు దేశం తమ వైపు చూసే విధంగా అభివృద్ధి చెందాలని కోరారు. -
ఏపీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. శాసనమండలి ఆవరణలో మండలి చైర్మన్ షరీఫ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. శాసనసభ ఆవరణలో స్పీకర్ తమ్మినేని సీతారాం మువన్నెల పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో షరీఫ్, తమ్మినేని సీతారాం మొక్కలు నాటారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ అధికారులు పాల్గొన్నారు. ఒంగోలు జిల్లా వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లామంత్రి అనిల్ కుమార్ యాదవ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా ప్రజలందరికీ ఆయన 73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, కలెక్టర్ పోలా భాస్కర్, ఎస్పీ సిద్ధార్ద్ కౌసల్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జిల్లా ఇంఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ పోలీస్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మనూరు జయరాం, జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా విశాఖలోని పోలీస్ బెరక్స్లో జిల్లా ఇంఛార్జ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు వారు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠాశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. -
నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో గురువారం గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్భవన్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో సాయంత్రం 4.30 గంటల నుంచి నుంచి రాత్రి 8 గంటల వరకు రాజ్భవన్ రూట్లో ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది. సోమాజిగూడలోని రాజీవ్గాంధీ విగ్రహం నుంచి ఖైతరాబాద్ చౌరస్తా వరకు రాజ్భవన్ రోడ్డు రెండువైపుల రహదారి రద్దీ ఉంటుంది, దీంతో ఈ రూట్లో ఆ సమయంలో వెళ్లే వాహనాదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లడం మంచిందని అదనపు సీపీ (ట్రాఫిక్) అనిల్కుమార్ సూచించారు. ఈ దారిలోట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో పాటు కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులు, అతిథులకు ప్రత్యేక పార్కింగ్, ప్రవేశాలు కల్పించినట్లు తెలిపారు. ♦ వీవీఐపీలు ముఖ్యమంత్రి, సీఎంలు, డిప్యూటీ సీఎంలు, హైకోర్టు చీఫ్ జస్టిస్, శాసన మండలి ఛైర్మన్, స్పీకర్, కేంద్ర మంత్రి, క్యాబినెట్ మంత్రులు హాజరవుతారు. వీరి వాహనాలు గేట్ నెం.1 నుంచి రాజ్భవన్లోకి వెళ్లి, గేట్–2 నుంచి బయటకు రావాలి. ఆ తరువాత ఈ వాహనాలను రాజ్భవన్ కేటాయించిన పార్కింగ్ స్థలంలో పార్కు చేయాలి. ♦ పింక్ కారు పాస్ కలిగిన ఇతర అతిథులు, గేట్ నెం.3 నుంచి లోపలికి వెళ్లి, లోపలే పార్కు చేయాలి. అదే గేట్ నుంచి బయటకు వెళ్లాలి. వైట్ కారు పాసు కల్గిన వారు గేట్ నెం.3 వద్ద ఆగి, ఆయా వాహనాలను ఎంఎంటీఎస్ పార్కింగ్ లాట్, ఎంఎంటీఎస్ సమీపంలోని పార్క్ హోటల్, మెట్రో రెసిడెన్సీ నుంచి నాసర్ స్కూల్ వరకు సింగిల్ లైన్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఎదురుగా సింగిల్ లైన్లో పార్కింగ్ చేసుకోవాలి. -
ఆ రాత్రి హైదరాబాద్లో ఏం జరిగింది?
1947, ఆగస్టు 14 అర్ధరాత్రి... హైదరాబాద్ సంస్థానం భారత్లో భాగంగా లేదు. దేశమంతటా మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్య్ర సంబరాల్లో మునిగి తేలుతుంటే హైదరాబాద్ నిజాం నిరంకుశ పాలనతో సతమతం అవుతోంది. అటు పాకిస్తాన్లోనూ, ఇటు భారత్లోనూ భాగం కాబోమనీ, హైదరాబాద్ స్వతంత్రంగానే కొనసాగుతుందని నిజాం రాజైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రకటించుకున్నాడు. అంతకు ముందే ఎలాగైనా దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సంకేతంగా ఆగస్టు 15న హైదరాబాద్లో జాతీయ జెండా ఎగురవేయాలని భావించిన నాటి కాంగ్రెస్ నాయకులు రామానంద తీర్థ తదితరులు ఢిల్లీ వెళ్లారు. స్వయంగా జవహర్ లాల్ నెహ్రూ జాతీయ జెండాని రామానంద తీర్థకి ఇచ్చారు. హైదరాబాద్ తిరిగి వచ్చి ఆగస్టు 15న హైదరాబాద్లోని సుల్తాన్ బజార్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించేందుకు రామానంద తీర్థ ఇతర కాంగ్రెస్ సభ్యులతో కలసి రహస్యంగా అన్ని ఏర్పాట్లూ చేశారు. అయితే అప్పటికే హైదరాబాద్లో 144 సెక్షన్ అమలులో ఉంది. కాంగ్రెస్ పార్టీ, ఆర్య సమాజ్ కార్యకర్తల రహస్య స్థావరాలపై దాడులు చేసిన పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఆగస్టు 15 తెల్లవారు ఝామున 3 గంటలకు రామానంద తీర్థని అరెస్టు చేశారు. ఆ తరువాత జీ.ఎస్. మేల్కొటేని సైతం అదుపులోకి తీసుకున్నారు. కృష్ణమాచార్య జోషిని కూడా అరెస్టు చేశారు. ఇంకా హైదరాబాద్ అంతటా అరెస్టుల పర్వం కొనసాగింది. అరెస్టు చేసిన వారిని చెంచల్గూడ జైలులో ఉంచారు. అయితే అరెస్టయిన వారు జైలు గోడల మధ్యనుంచి సైతం నినాదాలతో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆహ్వానించారు. 1947, ఆగస్టు 14న యావత్ భారతదేశం ఆ అమూల్యమైన ఘడియల కోసం ఎదురుచూస్తోంది. అర్ధరాత్రి 12 గంటలకు అన్ని రేడియోలూ ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ ఉపన్యాసం కోసం వేచి చూస్తున్నాయి. నెహ్రూ, డాక్టర్ రాధాక్రిష్ణన్ నవభారత నిర్మాణం ఆవిష్కృతమవుతోందని ప్రకటించినప్పుడు ఎంతో ఉద్వేగానికి లోనయ్యాము అంటూ రామానంద తీర్థ తన పుస్తకంలో రాసుకున్నారు. -
ఆర్టికల్ 370 రద్దు.. కశ్మీర్కు ఎంతో మేలు: కోవింద్
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్, లధాఖ్ విభజన తదితర కేంద్ర నిర్ణయాలు.. ఆ రెండు ప్రాంతాలకు విశేషంగా లబ్ధి చేకూరుస్తాయని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విశ్వాసం వ్యక్తం చేశారు. 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి రామ్నాథ్ కోవింద్ బుధవారం సాయంత్రం ప్రసంగించారు. జమ్మూకశ్మీర్, లధాఖ్లో తీసుకొచ్చిన మార్పులతో.. తోటి దేశ ప్రజలతో సమానంగా హక్కులు, ప్రభుత్వ ఫలాలను ఆ రెండు ప్రాంతాల ప్రజలు కూడా పొందుతారని, దీనితో ఆ రెండు ప్రాంతాలు విశేషంగా లబ్ధి పొందుతాయని చెప్పారు. దేశ ప్రజలకు తోడ్పాటు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తోందని కోవింద్ తెలిపారు. ‘దేశ నిర్మాణం నిరంతర ప్రక్రియ. ఇందులో స్వాతంత్ర్యం ప్రధాన మైలురాయి. దేశ నిర్మాణం కోసం ప్రతి సంస్థ, ప్రతి పౌరుడూ చేయి-చేయి కలిపి.. సామరస్యంతో, ఐక్యతతో కృషి చేయాలి. ఓటర్లకు, ప్రజాప్రతినిధులకు, పౌరులకు, ప్రభుత్వానికి, పౌరసమాజానికి, రాజ్యానికి మధ్య సముచితమైన భాగస్వామ్యం ఉండేలా కృషి చేయాలి’ అని కోవింద్ పిలుపునిచ్చారు. ‘ఓ ప్రత్యేక తరుణంలో మనం స్వాతంత్ర్య దేశంగా 72 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నాం. మరికొన్ని వారాల్లో అక్టోబర్ 2వ తేదీన దేశానికి స్వాతంత్ర్యం సముపార్జించిన మార్గదర్శి జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు నిర్వహించుకోనున్నాం’ అని అన్నారు. అదేవిధంగా సిక్కుయిజాన్ని స్థాపించిన గురువు నానాక్ దేవ్జీ 550 జయంతి వేడుకలను కూడా ఈ సంవత్సరమే జరుపుకున్నామని ఆయన స్మరించుకున్నారు. -
కశ్మీర్లో నిషేధాజ్ఞలు కొనసాగుతాయి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయి. జమ్మూలో ఆంక్షలు పూర్తిగా తొలిగించామని.. కశ్మీర్లో మాత్రం కొన్ని రోజులపాటు నిషేధాజ్ఞలు కొనసాగుతాయని జమ్మూకశ్మీర్ అడిషనల్ డీజీపీ మునీర్ ఖాన్ తెలిపారు. ప్రస్తుతం పంద్రాగస్టుపై దృష్టిసారించామని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఈ వేడుకలను నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా సోషల్మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మునీర్ఖాన్ తెలిపారు. 2010, 2016 నాటి వీడియోలను వైరల్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన తెలిపారు. ఇలాంటి ప్రయత్నాలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అక్కడక్కడ స్వల్ప ఘటనలు మినహాయిస్తే.. కశ్మీర్లో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని కేంద్రహోంశాఖ కూడా ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్ విభజన అనంతరం జమ్మూకశ్మీర్లో భారీగా బలగాలు మోహరించి.. పలు నిషేధాజ్ఞలు, ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. జమ్మూలో క్రమంగా పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నప్పటికీ.. కశ్మీర్లోనే ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి. -
స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి : ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిసారిగా ఆగస్టు 15న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, వీవీఐపీలు, విద్యార్థులు పాల్గొనే ఈ వేడుకలకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. మరోవైపు.. పంద్రాగస్టు రోజున దేశంలో ఉగ్రవాదుల దాడులు చోటుచేసుకునే అవకాశముందని ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న స్వాతంత్య్ర వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డీజీపీ గౌతమ్ సవాంగ్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. వేడుకలు జరుగుతున్న మున్సిపల్ స్టేడియంతోపాటు నగరంలోనూ భద్రతాపరమైన చర్యలు తీసుకున్నారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ వంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే పరేడ్ కోసం గత వారం రోజులుగా మున్సిపల్ స్టేడియంలో రిహార్సల్స్ చేస్తున్నారు. అలాగే, శాఖల వారీగా ప్రభుత్వ పథకాలను వివరించే ప్రత్యేక శకటాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈసారి 13 శకటాలు ప్రదర్శించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, భారీ వర్షాలు కురిస్తే వేడుకలు జరిగే స్టేడియం జలమయం కాకుండా ఉండేందుకు యుద్ధప్రాతిపదికన అవసరమైన పనులు పూర్తిచేశారు. విజయవాడ నగర పోలీసులు, మున్సిపల్, ఆర్ అండ్ బీ తదితర శాఖల సమన్వయంతో ఏర్పాట్లు ముగింపు దశకు చేరుకున్నాయి. -
భరతమాత
సరిగ్గా దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న రోజు. అప్పుడే పుట్టిన ఒక పసికందు, వాన నీరు నిలిచేందుకు తీసి పెట్టుకున్న ఒక చిన్న గుంతలో ఇరుక్కున్నాడు. ఇరుక్కున్నాడు కాదు, వదిలేసి పోయారు. ఆ గుంత సిమెంటు దిమ్మెతో కప్పేసి ఉంది. చెన్నైలోని వలసర్వాకమ్లో ఉండే గీత ఆ పసికందుని చూసి ఉండకపోతే ఏమయ్యేదో! ఎక్కణ్నుంచో అరుపు వినిపిస్తోందని తొంగి చూసింది గీత. ఆ గుంతలో, ఆ సిమెంటు దిమ్మె కింద కొట్టుకుంటున్నాడు ఆ పసికందు. గీత తన చేతిని ఆ గుంత లోపలికి పోనిచ్చి బాబుని బయటకు లాగింది. తల్లితో పంచుకున్న పేగు ఆ మెడను చుట్టుకొని ఇంకా అలాగే ఉంది. వెంటనే ఆసుపత్రిలో చేర్పించి చికిత్సను అందించింది. బాబు ఇప్పుడు బాగున్నాడు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున తను కాపాడిన బాబుకి గీత ‘సుగంథిరమ్’ (స్వాతంత్య్రం అని.) అని పేరు పెట్టుకుంది. ఆమె సుగంథిరమ్ను బయటకు లాగుతూ ఉండగా తీసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
కాన్సాస్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
కాన్సస్ : అమెరికాలోని కాన్సస్ సిటీలో తెలుగు అసొసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సస్ సిటీ(టీఏజీకేసీ) ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలతోపాటూ, వనభోజనాలు కార్యక్రమం నిర్వహించారు. హెర్టిటేజ్ పార్క్ పార్క్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందమందికి పైగా హాజరయ్యారు. వనభోజనాలతో పాటూ భారత జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిపారు. విశేషు రేపల్లె ఆధ్వర్యంలో సరదాగా బొట్టుపెట్టు గిఫ్ట్ కొట్టు, ఔట్ నాటౌట్, మెదడుకు మేత, చికుబుకు చికుబుకు పిల్ల, లోగో క్విజ్ ఆటలపోటీలు నిర్వహించారు. ఫుడ్ కమిటీ ఆధ్వర్యంలో చేసిన ప్రత్యేక వంటకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. -
కళాదీప్తి.. భళాకీర్తి
వనపర్తి క్రైం: జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని పరేడ్ మైదానంలో బుధవారం నిర్వహించిన 72వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలను తిలకించేందుకు పట్టణ ప్రజలు భారీగా తరలొచ్చారు. సమరయోధులు కడుకుంట్ల వేణయ్య, వెంకటాపురం నారాయణరెడ్డిని నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యేలు జి.చిన్నారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, కలెక్టర్ శ్వేతామహంతి శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రారంభమైన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. కొత్తకోట మండలం ఉల్లెంకొండ రాజాబహద్దూర్ వెంకట్రామిరెడ్డి పాఠశాల విద్యార్థులు బోనాలు, బతుకమ్మ, ఆర్మీ జవాన్ వేషధారణతో ప్రదర్శన ఇచ్చారు. అలాగే వనపర్తి రేడియంట్ పాఠశాల విద్యార్థులు రైతుల కష్టసుఖాలు, దేశం భక్తి ఉట్టిపడేలా జయహో అనే పాటతో కళ్లకు కట్టినట్లు చూపించారు. వనపర్తి బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, మహిళల గొప్పతనాన్ని చాటిచెప్పారు. వనపర్తి కస్తూర్బా గాంధీ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు గిరిజన జానపద గేయంపై కళాప్రదర్శన ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంది. పాన్గల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తిరోక్క పూలతో బతుకమ్మను తయారుచేసి పల్లె వాతావరణాన్ని రంజింపజేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలో మువ్వన్నెల పతకాలను ప్రదర్శించారు. సంబరాలు ముగిసే వరకు జయహో..జయహో భారత్ అంటూ జనాలు నినాదాలు చేశారు. వైభవంగా పంద్రాగస్టు సంబరాలు వనపర్తి అర్బన్ : స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు బుధవారం పట్టణంలోని జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులు జాతీయ జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ జె.శ్రీనివాసులు, జిల్లా ప్రోగ్రామ్స్ ఆఫీసర్ డాక్టర్ శివశంకర్, చంద్రశేఖర్, సిబ్బంది మద్దిలేటి, సాయిరెడ్డి, శ్రీనివాస్జీ, నర్సింహరావు, వెంకటయ్యతో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఆస్పత్రిలో సూపరింటెండెంట్ రవూఫ్ జాతీయ జెండాను ఎగరవేశారు. తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు మద్దిరాల విష్ణువర్ధన్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో నియోజవర్గ ఇన్చార్జ్ జింకల కృష్ణయ్య జెండాను ఎగరవేశారు. -
‘బంగారు హైదరాబాద్’ మన లక్ష్యం
సాక్షి,సిటీబ్యూరో : ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందించడంలో అధికారులు, ఉద్యోగులు కలిసికట్టుగా పనిచేసి జిల్లాను బంగారు హైదరాబాద్గా తీర్చిదిద్దుదామని కలెక్టర్ యోగితా రాణా పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి కలెక్టర్ ప్రసంగించారు. తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకోవడంలో అనేక మంది ప్రాణ త్యాగం చేశారని, ఇప్పుడు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక ప్రతిష్టాత్మక పథకాలను ప్రజలకు చేరవేయడంలో మరింత సమర్థవంతంగా పనిచేసి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడంలో భాగస్వాములవ్వాలని సూచించారు. సంక్షేమ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి అర్హులందరూ లబ్ధి పొందేలా చూడాలన్నారు. బేటి బచావో–బేటి పడావో కార్యక్రమం అమలుతో హైదరాబాద్ను సేఫ్ సిటీగా తీర్చిదిద్ది జాతీయ అవార్డు సాధించామన్నారు. అవార్డు గ్రహీతలకు ప్రశంసలు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అవార్డు అందుకున్న అధికారులు, ఉద్యోగులను మరింత ప్రోత్సహించే విధంగా విధి నిర్వహణ, వ్యక్తిగత పనితీరుపై కలెక్టర్ యోగితా రాణా పేరుపేరునా ప్రశంసలు కరిపించారు. అవార్డు స్ఫూర్తితో ప్రజలకు సేవలందించేందుకు మరింతగా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్, ఎన్జీఓలకు కూడా కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు, మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో ఇంచార్జి జాయింట్ కలెక్టర్ శ్రీవత్స కోటæ, డీఆర్వో రాధిక రమణి, పరిపాలనాధికారి జానికి, డీఈఓ వెంకటనర్సమ్మ, డీఎంఅండ్హెచ్ఓ వెంకటి, డీఐఓ నాగార్జున, జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ యాదవ్ పాల్గొన్నారు. -
‘రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోంది’
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన రాష్ట్రమై నా అన్ని రంగాల్లో తెలంగాణ పురోగమిస్తోందని రాష్ట్ర పరిశ్రమల, మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీఎస్ఐఐసీ) చైర్మన్ గ్యాదరి బాల మల్లు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం పరిశ్రమల భవన్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామిక రంగంలో రాష్ట్రం దేశంలోనే ముందుందన్నారు. భవిష్యత్లో పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పనలో మరిన్ని మైలు రాళ్లను చేరుకోవడానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ సీఈవో వి.మధుసూదన్రావు, సీఈ శ్యామ్ సుందర్, సీజీఎం గీతాంజలి, జీఎం కళావతి తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధిలో దేశం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తోంది
-
రేపిస్టుల వెన్నులో వణుకు : మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : మహిళలపై లైంగిక దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించడంలో రాజీపడే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి చట్ట నిబంధనలే అత్యున్నతమని చెప్పారు. లైంగిక దాడులకు పాల్పడాలనే మృగాళ్లలో భయం కలిగించడం ముఖ్యమని అన్నారు. లైంగిక దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. 72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బుధవారం ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని ప్రసంగించారు. లైంగిక దాడుల ఆలోచన లేని సమాజం ఆవిష్కృతం కావాలన్నారు. లైంగిక దాడి కేసుల విచారణకు మధ్యప్రదేశ్, రాజస్తాన్లలో త్వరితగతిన విచారణ చేపట్టి రోజుల వ్యవధిలోనే నిందితులకు మరణ దండన విధిస్తున్నారని, ఈ కేసులపై విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా ఈ తరహా నేరాలకు వేరొకరు పాల్పడకుండా నిరోధించవచ్చన్నారు. ఎంత ప్రచారం కల్పిస్తే అంతగా నిందితుల్లో భయం నెలకొంటుందన్నారు. మహిళలను వేధించే వారి వెన్నులో వణుకుపుట్టేలా రేపిస్టులను ఉరితీసిన ఉదంతాలపై ప్రచారం జరగాలన్నారు. మహిళలపై నేరాలను మనం నిరోధించాల్సి ఉందన్నారు. -
త్రివర్ణం.. వివర్ణం!
రేపు స్వాతంత్య్ర దినోత్సవం. కార్పొరేట్..ప్రైవేటు స్కూళ్లలో చిన్నారులకు ఆటలపోటీలు, సాంస్కృతి పోటీలు నిర్వహిస్తున్నారు. విజేతలకు మువ్వన్నెల పండుగ రోజు బహుమతులిచ్చేందుకు అంతా సిద్ధం చేశారు. కానీ సర్కారు స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు మాత్రం జేబులు తడుముకుంటున్నారు. పాఠశాలల ఖాతాల్లో రూపాయి కూడా లేకపోవడంతో చిన్నారుల నోరు తీపి చేసేందుకు కూడా డబ్బుల్లేక ఆలోచనలో పడ్డారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని సంబరంగా జరుపుకోనివ్వని అసమర్థ సర్కారుపై మండిపడుతున్నారు. అనంతపురం ఎడ్యుకేషన్ : ఏటా ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ కోసం స్కూల్ గ్రాంటు విడుదలవుతుంది. పాఠశాల మెయింటెనెన్స్ గ్రాంటు, స్కూల్ కాంప్లెక్స్ గ్రాంటుల పేరుతో పాఠశాల స్థాయిని బట్టి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. కానీ ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా కొత్తగా రూపాయి కూడా విడుదల చేయలేదు. పైగా గతంలో మంజూరు చేసిన నిధులనూ వెనక్కు తీసుకుంది. దీంతో ఖాతాలన్నీ ఖాళీ కాగా ప్రధానోపాధ్యాయుల జేబుకు చిల్లు పడుతోంది. రూ.10.56 కోట్లు వెనక్కు జిల్లాలో 2,773 ప్రాథమిక, 590 ప్రాథమికోన్నత, 570 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 3,933 పాఠశాలలున్నాయి. స్టేషనరీ, రిజిస్టర్లు, క్వశ్చన్ పేపర్లు, చాక్పీస్, డస్టర్, లైబ్రరీ పుస్తకాలు కొనుగోలుకు స్కూల్ గ్రాంట్, కరెంటు బిల్లుల చెల్లింపు, చిన్నచిన్న మరమ్మతులు, స్పోర్ట్స్ మెటీరియల్ కొనుగోలుకు నిర్వహణ గ్రాంట్ను ప్రభుత్వం ఏటా విడుదల చేస్తోంది. రెండు గ్రాంట్లు కలిపి ప్రాథమిక పాఠశాలలకు రూ. 10 వేలనుంచి రూ.15 వేలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.22 వేలు, ఉన్నత పాఠశాలలకు రూ. 17 వేలు జమ చేయాల్సి ఉంది. ఇదికాకుండా స్కూల్ కాంప్లెక్స్ గ్రాంటు కింద ఒక్కో కాంప్లెక్స్కు రూ. 22 వేలు మంజూరు చేయాల్సి ఉంది. 2017–18 విద్యా సంవత్సరంలో స్కూల్ గ్రాంటు తప్ప... మిగతా ఏ నిధులూ జిల్లాకు విడుదల కాలేదు. మరోవైపు ఎస్ఎంసీ ఖాతాల్లో ఉన్న రూ. 10.56 కోట్లు నిధులనూ 15 రోజుల కిందట ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. దీంతో స్కూళ్ల ఖాతాలన్నీ ‘0’ బ్యాలెన్స్ చూపిస్తున్నాయి. మురిగిపోయిన రూ.3 కోట్లు ఎస్ఎస్ఏ అధికారుల అలసత్వం.. రాష్ట్ర అధికారులు పట్టింపులేనితనం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు శాపంగా మారింది. 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘పాఠశాలల నిర్వహణ నిధులు’ రూ. 3 కోట్లు రావాల్సి ఉండగా.. పైసా కూడా కేటాయించలేదు. మూడు గదులున్న పాఠశాలకు ఏడాదికి రూ. 5 వేలు, నాలుగు అపైన గదులున్న పాఠశాలలకు రూ. 10 వేలు నిర్వహణ నిధులు మంజూరు చేయాల్సి ఉంది. వీటిని మరుగుదొడ్లు నిర్వహణ, కొళాయిలు, కిటీకీలు, వాకిళ్ల మరమ్మతు, వైట్వాష్, కరెంటు బిల్లులు, కంప్యూర్ల మరమ్మతుల కోసం ఖర్చు చేయాల్సి ఉంది. అయితే ఎస్ఎస్ఏ అధికారులు పంపిన తుది ప్రణాళికలో ‘పాఠశాల నిర్వహణ నిధుల’ కాలం ఖాళీగా పంపడం కొంప ముంచింది. పట్టించుకోని ప్రభుత్వం పాఠశాలల నిర్వహణను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దుతామని, మౌలిక వసతుల కల్పనకు ఎన్ని నిధులైనా కేటాయిస్తామంటూ చెబుతున్న ప్రభుత్వం ప్రస్తుతం కనీసం చాక్పీస్ కొనేందుకు డబ్బులు లేక అల్లాడుతున్నా... పట్టించుకోవడం లేదని హెచ్ఎంలు వాపోతున్నారు. కనీస అవసరాలకు ఉపయోగించాల్సి నిధులను చెప్పాపెట్టకుండా వెనక్కు తీసుకోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. నిర్వహణ కష్టమే.. స్కూల్ ఖాతాల్లోని నిధులను వెనక్కు తీసుకున్న ప్రభుత్వం.. కొత్త నిధులు విడుదల చేయకపోవడం అన్యాయం. మౌళిక వసతులతో పాటు అభివృద్ధికి నిధులు కేటాయిస్తేనే నిర్వహణ ఇబ్బందిగా ఉంది. నిధులన్నీ తీసేసుకుంటే పాఠశాలల పరిస్థితి ఏం కావాలి. చాక్పీసులు కొనేందుకూ డబ్బు లేకపోతే ఎలా..?– బి.నరసింహులు,హెచ్ఎం, రాప్తాడుజెడ్పీహెచ్ఎస్ -
నిధులు లేకుండా వేడుకలు ఎలా?
నిడమర్రు : స్వాతంత్య్ర దినోత్సవం వస్తుందటే మూడురోజుల ముందు నుంచే పాఠశాలల్లో సందడే సందడి. పిల్లలకు ఆటలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించడం, బహుమతులు అందించడం, మువ్వన్నెల జెండాలు ఎగురవేయడం, చాక్లెట్లు, స్వీట్లు పంపిణీ చెయ్యడం, దేశభక్తిని, జాతీయ నాయకులను స్మరించుకునే ఏర్పాట్లు ఉంటాయి. కానీ ఈ ఏడాది ఆటల పోటీల విజేతలకు బహుమతులివ్వాలన్నా.. చిన్నారులకు చాక్లెట్లు పంచాలన్నా.. పాఠశాలకు వచ్చిన అతిథులకు అల్పాహారం ఇవ్వాలన్నా ప్రధానోపాధ్యాయులు అప్పులు చేయాల్సిందే. ప్రచారానికి, ఆర్భాటాలకు రూ.కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. పాఠశాలల్లో సంబరాల కోసం నయాపైసా విదల్చలేదు. కానీ ప్రతి స్కూల్లో స్వాత్రంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు మాత్రం జారీ చేశారు. నేటికీ నిర్వహణ నిధుల ఊసేలేదుపాఠశాల తెరిచి రెండు నెలలవుతున్నా నేటికీ పాఠశాల నిర్వహణ నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో స్వాతంత్య్ర వేడుకలను ఎలానిర్వహించాలో తెలియక ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాల బ్యాంకు ఖాతాలు చూస్తే చిల్లిగవ్వ లేదు. రేపు 72వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోలేని పరిస్థితిలో ఉన్నామని వారు వాపోతున్నారు. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వానికి నిధులు మంజూరు చేయాలనే అంశం గుర్తుకు రాలేదా అంటూ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. నిధులు మంజూరు ఇలా పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ఏటా సర్వశిక్ష అభియాన్ ద్వారా నిధులు ఎస్ఎంసీ ఖాతాల్లో జమ చేసేది. విద్యా సంవత్సరం ప్రారంభంలో పాఠశాల గ్రాంటు, నిర్వహణ గ్రాంటులను పాఠశాల స్థాయి, విద్యార్ధుల సంఖ్యను బట్టి విడుదల చేసేవారు. ఈ నిధులతో పాఠశాలకు రంగులు వేయడం, మైనర్ రిపేర్లు, విద్యా బోధనకు అవసరమైన చాక్పీసులు, డస్టర్లు, రికార్డులు, విద్యార్థుల హాజరుపట్టీలు కొనుగోలు చేస్తారు. విద్యుత్ బిల్లులు, జాతీయ పండుగలు జరుపుకునేందుకు అవసరమైన ఖర్చులకు ఈ నిధులు వినియోగించుకోవచ్చు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు పూర్తయినా నేటికీ ఒక్క పైసా ఇవ్వకపోగా గత నెలలో ఎస్ఎంసీ ఖాతాల్లో నిల్వ ఉన్న మొత్తం నిధులు ప్రభుత్వం వెనక్కి లాగేసుకుంది. నిధుల కోసం ఎదురు చూపులు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులకు ఇప్పటికే ఆటలు, క్విజ్, వ్యాసరచన, డిబేట్ తదితర పోటీలు నిర్వహించారు. ఈ మేరకు విద్యాశాఖాధికారులు పాఠశాల స్థాయిలో పోటీలు నిర్వహించి స్వాతంత్య్ర దినోత్సవం నాడు బహుమతులు అందించాలని ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. కానీ నిధులు విషయం మాత్రం ప్రస్తావించలేదు. ఇప్పటికే పాఠశాలల్లో విద్యుత్ బిల్లులు, పారిశుధ్యం తదితర నిర్వహణ ఖర్చులు హెచ్ఎంలే భరిస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లో స్వాతంత్య్ర దినోత్సవ ఖర్చులు రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకూ ఉంటాయని ఉపాధ్యాయులు చెపుతున్నారు. కొన్ని చోట్ల బహుమతులు అందించేందుకు హెచ్ఎంలు దాతల సహకారం కోరుతున్నారు. పోటీలు నిర్వహించి బహుమతులు అందించాల్సిందే విద్యాశాఖ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పాఠశాల స్థాయిలో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అం దించాల్సిందే. పలువురు హెచ్ఎంలు బహుమతుల ఖర్చుల కోసం స్థానికంగా ఉండే దాతల సహాయం కోరుతున్నారు. ఇందులో తప్పేమీ లేదు. ఎస్ఎస్ఏ, ఆర్ఎంఎస్ఏలను మిళితం చేస్తూ సమగ్ర శిక్షా అభియాన్గా మార్పుకోసం ఖాతాల్లో ఉన్న నిధులను ప్రభుత్వం వెనక్కి తీసుకున్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోక తప్పదు. – వంగపండు నర్శింహారావు, ఎంఈఓ -
పంద్రాగస్టు.. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా
సాక్షి, హైదరాబాద్: గోల్కొండ కోటలో నిర్వహించనున్న పంద్రాగస్టు వేడుకలకు పోలీస్ విభాగం పకడ్బందీగా భద్రతా చర్యలు చేపడుతోంది. ‘కోట’ను పూర్తి స్థాయిలో నిఘా నీడలో ఉంచనుంది. పరిసర ప్రాంతాలు, రహదారుల పర్యవేక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆయా మార్గాలో ఇప్పటికే ఉన్న ట్రాఫిక్, కమ్యూనిటీ సీసీ కెమెరాలకు తోడు తాత్కాలిక ప్రాతిపదిక 120 అదనపు కెమెరాలు ఏర్పాటు చేసిన పోలీసులు... వీటిని బషీర్బాగ్ పోలీస్ కమిషనరేట్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ)తో అనుసంధానించారు. గోల్కొండ కోటలో ప్రతి అణువూ రికార్డు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్, గోల్కొండ కోట వద్ద ఉన్న కంట్రోల్ రూమ్లోనూ దృశ్యాలను వీక్షించేలాఏర్పాటు చేశారు. కోటతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ ఏవైనా సవాళ్లు ఎదురైతే వ్యూహాత్మకంగా ఎదుర్కోవడానికి ఈ ని«ఘా ఉపకరిస్తుంది. సీసీసీలో ఉండే మ్యాప్ల ద్వారా కోట చుట్టుపక్కల మార్గాలనూ అధ్యయనం చేసే అవకాశం ఉంది. వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తుండే సీసీసీలోని అధికారులు అవసరానికి తగ్గట్టు స్థానిక పోలీసుల్ని అప్రమత్తం చేయడంతో పాటు అదనపు బలగాలను మోహరిస్తారు. ఈ తాత్కాలిక సీసీ కెమెరాల పనితీరుపై సీసీసీ అధికారులు సోమవారం ట్రయల్ రన్ నిర్వహించి సంతృప్తి వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సోమవారం అన్ని విభాగాల అధికారులతో భేటీ అయ్యారు. ఈ చర్యల్లో భాగంగా కోటతో పాటు రాజ్భవన్కు పటిష్ట భద్రత ఏర్పాటు చేయనున్నారు. బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షించడానికి సిటీ సీపీ ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం కోట, రాజ్భవన్ను సందర్శించి అవసరమైన మార్పుచేర్పులు సూచించనున్నారు. క్షుణ్ణంగా తనిఖీ... గోల్కొండ కోట, పరేడ్గ్రౌండ్స్కు వచ్చే సందర్శకులు తమ వెంట హ్యాండ్బ్యాగ్లు, కెమెరాలు, టిఫిన్ బాక్సులు, వాటర్ బాటిళ్లు తదితర ఎలాంటి వస్తువులు తీసుకురావడానికి వీల్లేదు. అత్యవసరమై ఎవరైనా తీసుకువచ్చినా కచ్చితంగా తనిఖీ చేయాలని నిర్ణయించారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో నగరవ్యాప్తంగా నిఘా, గస్తీ ముమ్మరం చేశారు. అడుగడుగునా నాకాబందీ, తనిఖీలు నిర్వహిస్తున్నారు. జనసమ్మర్థ ప్రాంతాలతో పాటు బస్సులు, రైళ్లల్లోనూ పోలీసులు సోదాలు చేస్తున్నారు. లాడ్జీలు, అనుమానిత ప్రాంతాలపై డేగకన్ను వేశారు. పెద్ద ఎత్తున మఫ్టీ పోలీసులను మోహరించారు. గోల్కొండ కోటలోకి దారితీసే ప్రతి ద్వారం దగ్గరా డోర్ఫ్రేమ్, మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేయనున్నారు. ట్రాఫిక్ నిర్వహణకు ఏర్పాట్లు... పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో గోల్కొండ కోట, పరేడ్గ్రౌండ్స్, రాజ్భవన్ వద్ద ట్రాఫిక్ విభాగం తరఫున పటిష్ట ఏర్పాట్లు చేశామని ట్రాఫిక్ వింగ్ చీఫ్ అనిల్కుమార్ వెల్లడించారు. 900 మంది సిబ్బంది బందోబస్తు విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. డీసీపీలు ఎల్ఎస్ చౌహాన్, బాబూరావులతో కలిసి సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గోల్కొండ, సికింద్రాబాద్, రాజ్భవన్లో జరిగే మూడు కార్యక్రమాల్లోనూ సీఎం కేసీఆర్ పాల్గొంటారని వెల్లడించారు. ముందుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, అక్కడి నుంచి గోల్కొండ కోటకు వెళ్తారన్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు, ట్రాఫిక్ నిలిపివేత ఆయా రూట్లలో చేపడుతున్నట్లు వివరించారు. వీఐపీల కోసం ఏ,బీ,సీ,డీ,ఈ,ఎఫ్ విభాగాలుగా ప్రభుత్వం పాసులు జారీ చేసిందన్నారు. పాస్ల వెనకాల పార్కింగ్ స్థలం, వేడుకలకు వచ్చే మార్గం తదితర సూచనలు ఉన్నాయన్నారు. పార్కింగ్ స్థలాల నుంచి వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేశారన్నారు. వర్షం పడితే ఇబ్బందులు ఎదురుకాకుండా జీహెచ్ఎంసీ గొడుగులను అందుబాటులో ఉచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఆయన గోల్కొండకు వచ్చే వారి కోసం రూట్మ్యాప్ విడుదల చేశారు. పాస్లున్న వారు స్పష్టంగా కన్పించే విధంగా కారుకు ముందుభాగంలో అంటించుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో పోలీసులకు సహకరించాలని కోరారు. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా...గోల్కొండ చుట్టుపక్కల... ♦ బుధవారం ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు రాందేవ్గూడ–గోల్కొండ కోటకు వెళ్లే రోడ్డును మూసివేస్తారు. ఏ,బీ,సీ స్టిక్కర్స్ ఉన్న వాహనాలను మాత్రమే ఉదయం 7:30–10గంటల వరకు ఈ రూట్లోకి అనుమతిస్తారు. ♦ సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్ట్యాంక్, మోహిదీపట్నం వైపు నుంచి వచ్చే ఏ,బీ,సీ పాస్ కలిగిన వాహనాలను వయా రేతిబౌలి జంక్షన్, నాలానగర్ జంక్షన్ నుంచి లెఫ్ట్టర్న్ తీసుకొని బాలికా భవన్, ఆంధ్ర ఫ్లోర్ మిల్స్, ప్లైఓవర్, లంగర్హౌస్, టిప్పుఖాన్ బ్రిడ్జ్, రాందేవ్గూడ రైట్ టర్న్తో మాకై దర్వాజ నుంచి గోల్కొండ పోర్ట్కు చేరుకోవాలి. అక్కడ వారికి కేటాయించిన స్థలాలలో వాహనాలను పార్కింగ్ చేయాలి. రాజ్భవన్ రోడ్డులో... ♦ రాజ్భవన్లో జరిగే కార్యక్రమాల నేపథ్యంలో సాయంత్రం 4:30గంటల నుంచి రాత్రి 10గంటల వరకు రాజ్భవన్ రూట్లో ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది. సోమాజిగూడలోని రాజీవ్గాంధీ విగ్రహం నుంచి ఖైరతాబాద్ చౌరస్తా వరకు రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో వాహనాదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లడం మంచిదని అదనపు సీపీ సూచించారు. ♦ తెలుగు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, స్పీకర్లు, శాసన మండలి చైర్మన్లు, హైకోర్టు చీఫ్ జస్టిస్ వేడుకకు హాజరవుతారు. వీరి వాహనాలు గేట్–1 నుంచి రాజ్భవన్లోకి వెళ్లి గేట్–2 నుంచి బయటకు రావాలి. ఆ తర్వాత వీటిని కేటాయించిన స్థలంలో పార్కు చేయాలి. ♦ పింక్ కారు పాస్ కల్గిన ఇతర అతిథులు గేట్–3 నుంచి లోపలికి వెళ్లి అక్కడే పార్కు చేయాలి. అదే గేట్ నుంచి బయటకు వెళ్లాలి. వైట్ కారు పాసు కల్గినవారు గేట్–3 వద్ద ఆగి ఆయా వాహనాలను ఎంఎంటీఎస్ పార్కింగ్ లాట్, సమీపంలోని పార్క్ హోటల్, మెట్రో రెసిడెన్సీ నుంచి నాసర్ స్కూల్ వరకు సింగిల్ లైన్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఎదురుగా సింగిల్ లైన్లో పార్కింగ్ చేసుకోవాలి. సికింద్రాబాద్లో... పరేడ్ గ్రౌండ్లో జరిగే వేడుకల సందర్భంగా టివోలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ను బ్రూక్బాండ్, ఎన్సీసీ జంక్షన్ వైపు మళ్లిస్తారు. ఈ ఆంక్షలు ఉదయం 8 గంటల నుంచి 10గంటల వరకు అమలులో ఉంటాయి. -
మంత్రి యనమలకు ఘోర అవమానం!
సాక్షి, అమరావతి : ఏపీ ప్రభుత్వంలో సీనియర్ మంత్రి అయిన యనమల రామకృష్ణుడికి ఘోర అవమానం జరిగింది. దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించే మంత్రుల విషయంలో యనమలకు సీఎం చంద్రబాబు అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం యనమల కృష్ణా జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నారు. అయితే, కృష్ణా జిల్లాలో పంద్రాగస్టు నాడు జెండా ఎగరేసే అవకాశం మంత్రి పరిటాల సునీతకు ముఖ్యమంత్రి ఇచ్చారు. సీనియర్ మంత్రి, బీసీ నేతను కాదని జూనియర్ మంత్రి అయిన సునీతకు సీఎం అవకాశం ఇవ్వడం గమనార్హం. ఫిరాయింపు మంత్రి అమర్నాథ్రెడ్డికి సైతం జెండా ఎగురవేసే అవకాశం దక్కింది. కానీ యనమలకు అవకాశం ఇవ్వలేదు. గత ఏడాది సీనియర్ మంత్రి అయిన కేఈ కృష్ణమూర్తికి కూడా ఇదేవిధంగా అవకాశం ఇవ్వలేదు. ఈ ఏడాది జెండా ఆవిష్కరణ విషయంలో తనకు అవమానం జరగడంతో మంత్రి యనమల మనస్తాపంతో ఉన్నట్టు తెలుస్తోంది. సొంత జిల్లా తూర్పు గోదావరిలో యనమలకు అవకాశమున్నా.. చంద్రబాబు ఇవ్వకపోవడంతో యనమల కినుకు వహించినట్టు తెలుస్తోంది. అవకాశం దక్కని మంత్రులు! మంత్రి యనమల రామకృష్ణుడితోపాటు తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జి మంత్రి కళా వెంకట్రావు, చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి కే అచ్చెన్నాయుడులకు అవకాశం దక్కలేదు. కర్నూలు జిల్లా ఇన్చార్జి మంత్రి కాల్వ శ్రీనివాసులుకు మంత్రి కళా వెంకట్రావు స్థానంలో తూర్పుగోదావరి జిల్లాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అవకాశం ఇచ్చారు. ఇక ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి కర్నూలు జిల్లా ఇన్చార్జి మంత్రి కాకపోయినప్పటికీ.. ఆయనకు జిల్లాలోనే జాతీయ పతాకం ఆవిష్కరించే అవకాశం ఇచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాల వారీగా జెండా ఎగురవేయనున్న మంత్రుల జాబితా ఇదే విజయనగరం- గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం - నిమ్మకాయల చినరాజప్ప తూర్పుగోదావరి - కాల్వ శ్రీనివాసులు పశ్చిమగోదావరి - ప్రత్తిపాటి పుల్లారావు కృష్ణా - పరిటాల సునీత గుంటూరు- సీహెచ్ అయ్యన్నపాత్రుడు ప్రకాశం - పీ. నారాయణ నెల్లూరు - ఎన్. అమర్నాథ్రెడ్డి కడప - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కర్నూలు - కేఈ కృష్ణమూర్తి అనంతపురం- డీ ఉమామహేశ్వరరావు చిత్తూరు - ఎన్ ఆనందబాబు -
అటు పంద్రాగస్టు... ఇటు సీఎం టూర్...
విజయనగరం గంటస్తంభం: జిల్లాలో గడచిన నాలుగైదు రోజులుగా అధికారులు, సిబ్బంది తెగ హడావుడి పడుతున్నారు. ఓవైపు ముఖ్యమంత్రి ఈ నెల 14వ తేదీన వస్తుండటం, మరోవైపు ఈ నెల 15న స్వాతంత్య్రదిన వేడుకలు నిర్వహించాల్సి రావడంతో రెండింటిపనులూ చేయాల్సి రావడంతో హైరానా పడాల్సి వస్తోంది. రెండింటిలో ఏ కార్యక్రమం విఫలమైనా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంద ని ఆందోళన చెందుతున్నారు. దీనివల్ల సెలవురోజుల్లోనూ విధుల్లోనే ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 14వ తేదీన జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ రోజు 10.30గంటల నుంచి సాయంత్రం 4గంటల వర కు సాలూరు నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి విజయనగరం చేరుకుని నగరదర్శిని, తర్వాత జెడ్పీ అతిథి గృహంలో అధికారులతో సమావేశమవుతారు. రాత్రికి ఇక్కడే బస చేసి ఉదయాన్ని శ్రీకాకుళం జిల్లా వెళతారు. ఇక ఆగస్టు 15వ తేదీన సోతంత్య్రదినోత్సవం ఉంది. ఆ రోజున పోలీసు పరేడ్ మైదానంలో వేడుకలు నిర్వహించాల్సి ఉంది. జిల్లా ఇన్చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు జెండా ఆవిష్కరిస్తారు. శకటాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిం చాల్సి ఉంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలవద్ద సైతం పతాకావిష్కరణ చేయాల్సి ఉంటుంది. రెండింటికి సన్నద్ధత కావాల్సిందే రెండు కార్యక్రమాలు యంత్రాంగానికి కీలకమైనవే. స్వాతంత్య్ర వేడుకలకే పదిరోజుల ముందునుంచి సిద్ధమవడం పరిపాటి. మంత్రి ప్రసంగాని కి ప్రగతి నివేదికలు ఇవ్వడం, ఉత్తమ పనితీరు కనపరిచిన వారికి ప్రశంసా పత్రాలకోసం కసరత్తు, ప్రగతిని చూపే శకటాల ఏర్పాటు, ఆస్తులు పంపిణీకి స్టాల్స్ ఏర్పాటు తదితర వాటిని ముందే చేసుకోవాలి. ఇది ఏటా జరిగేదే. ఈసారి ముఖ్యమంత్రి పర్యటన తోడవడంతో అధికారులు సతమతం అవుతున్నారు. నాలుగు రోజులుగా సాలూరులో సీఎం పర్యటన ఏర్పాట్లు చూస్తున్నారు. గదబ బొ డ్డవలసలో గ్రామదర్శిని విజయవంతం చేసేందు కు సన్నాహాలు చేస్తున్నారు, బహిరంగ సభకు జనాలను తరలించే పనిలో నిమగ్నమయ్యారు.సెలవు రోజునా తప్పని విధులు ఈ కార్యక్రమాల పుణ్యమాని అధికారులతోపాటు సిబ్బంది కూడా రెండో శనివారం సెలవు తీసుకోలేకపోయారు. గ్రామదర్శిని జరిగే గ్రామంలో రోడ్లు బాగు చేయడం, కాలువలు శుభ్రపరచడం, రంగులు పూయడం, అంతా బాగుందని జనాలతో చెప్పించేందుకు సమావేశాలు పెట్టడం వంటివాటితో బీజీగా కొందరున్నారు. విజయనగరం పట్టణంలో రోడ్లు, కాలువలు బాగు చేయడం, లైట్లు వేయడం, గోడలకు రంగులు వేయడం, బస ఉండే జెడ్పీ అతిథిగృహంలో ఏర్పాట్లు చేయడంలో మరికొందరు ఉన్నారు. మొత్తమ్మీద ఈ రెండు కార్యక్రమాలు అధికారులు, సిబ్బందికి కత్తిమీద సాములా మారాయి. -
స్వాతంత్య్ర వేడుకలకు పక్కాగా ఏర్పాట్లు
శ్రీకాకుళం పాతబస్టాండ్ : రాష్ట్ర స్వాతంత్య్ర దినో త్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ కె.ధనంజయరెడ్డి అధికారులకు ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో జిల్లా అధికారులతో రాష్ట్ర స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో త్వరితగతిన పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ శ్రీరాములునాయుడును ఆదేశించారు. మొక్కలు కడియం నుంచి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు మున్సిపల్ కమిషనర్ కలెక్టర్కు వివరించారు. వీఐపీల సిటింగ్, పార్కింగ్ తదితర వాటిపై కలెక్టర్కు ఆయన వివరించారు. మైదానంలో పేరెడ్ వద్ద రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆర్అండ్బీ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. డయాస్ ఏర్పాట్లుకు ఏజెన్సీని గుర్తించాలని, వాటర్ ప్రూఫ్ టెంట్స్ ఉండాలన్నారు. ఎన్సీసీ కేడెట్లు 500 మంది వస్తారని, వారికి వసతి సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ చెప్పగా, వారికి పెద్దపాడు, సింగుపురం రోడ్డు మార్గంలో ఒక కళాశాల ఉందని శ్రీకాకుళం తహసీల్దార్ మురళీకృష్ణ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను శకటాలలో చూపించేందుకు 12 చక్రాలు గల 12 వాహనాలు ఉండాలని ఉప రవాణా కమిషనర్కు ఆదేశించారు. వాహనాలను ముందుగా పరిశీలించి ఏర్పాట్లు చేయాలన్నారు. ఒకసారి ట్రైల్ కూడా వేయాలన్నారు. శానిటేషన్, తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాట్లును మున్సిపల్ కమిషనర్, ఆర్డబ్ల్యూఎస్, ఎస్ఈలు చూసుకోవాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు స్వాతంత్య్ర దినోత్సవానికి సంబంధించిన జాతీయ గీతం, రాష్ట్రానికి సంబంధించిన గీతం, శ్రీకాకుళం జిల్లాకు సంబం ధించిన గీతాలు ఉండాలని డీపీఆర్వో ఎల్.రమేష్కు ఆదేశించారు. వచ్చే అతిథులకు, అధికారులకు వసతిపై చర్చించారు. వివిధ శాఖ అధికారులను, కమిటీలుగా నియమించాలని జాయింట్ కలెక్టర్–2 రజనీకాంతరావును ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధరబాబు, జిల్లా ఏఎస్పీ టి.పనసారెడ్డి డీఆర్వో కె.నాగేంద్రబాబు, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్ట ర్ జి.సి.కిషోర్కుమార్, జెడ్పీ సీఈవో బి.నగేష్, శ్రీకాకుళం, టెక్కలి ఆర్డీవోలు, తదితర అధికారులు పాల్గొన్నారు. -
ఇక జాతీయ జెండా ఎగిరేది ఎక్కడ?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్మహల్ను 1830లో అప్పటి బ్రిటీష్ ‘గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా’ విలియం బెంటింక్ అమ్మేస్తున్నారనే వార్త సంచలనం రేపింది. తమ అలవెన్సుల్లో విలియం కోత విధించారన్న కోపంతో అప్పట్లో బెంగాల్ ఆర్మీ ఈ వదంతును సష్టించింది. అది ఎంతగా ప్రచారం జరిగిందంటే భారత జాతీయవాదులు తాజ్ మహల్ను అమ్మవద్దంటూ ధర్నా చేశారు. బ్రిటీష్ పాలకులు ఏర్పాటు చేసిన భారత పురాతత్వ సంస్థ (ఏఎస్ఐ)కూడా ఆ వదంతిని నమ్మింది. ఆ తర్వాత అదంతా అబద్ధమని తేలింది. ఇప్పుడు ఢిల్లీలోని ఎర్రకోటను ‘దాల్మియా భారత్ గ్రూప్’నకు కేంద్ర ప్రభుత్వం నిజంగా అమ్మేసిన ఎవరు నమ్మరు. ఐదేళ్లపాటు ఎర్రకోటను పరిరక్షించాల్సిన బాధ్యతను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాల్మియా సంస్థకు అప్పగించడం పట్ల వివాదం చెలరేగుతున్న విషయం తెల్సిందే. చక్కెర, సిమ్మెంట్, విద్యుత్ వ్యాపారాలను చేసుకొనే దాల్మియా సంస్థకు ఓ అద్భుత చారిత్రక కట్టడం పరిరక్షణ బాధ్యతలు అప్పగించడం ఏమిటీ? దాని పట్ల ఆ సంస్థ ఆసక్తి చూపడం ఏమిటీ? అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసానికి విస్తత ప్రచారం చేయడమే కాకుండా, కేసులో నిందితుడు కూడా అయిన విష్ణు దాల్మియాకు చెందిన సంస్థకు చారిత్రక కట్టడాల పట్ల ఆసక్తి ఎందుకు ఉంటుంది? పోనీ బాబ్రీ విధ్వంసానికి ప్రతిఫలంగానే బీజేపీ ప్రభుత్వం ఈ కట్టడాన్ని దాల్మియా సంస్థకు అప్పగిస్తుందా? మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన తాజ్ మహల్ను కూలగొట్టాలంటూ మాట్లాడిన బీజేపీ ప్రభుత్వ నేతలు అదే షాజహాన్ 1639లో నిర్మించిన ఢిల్లీ కోటను ఎందుకు పరిరక్షించాలనుకుంటున్నారో అర్థం కాదు? ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం ఏటా ఐదు కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్లపాటు దత్తత పేరిట ఎర్రకోటను దాల్మియా సంస్థకు లీజుకు ఇచ్చింది. ఎర్రకోట ఎంట్రీ టిక్కెట్పై వచ్చిన డబ్బులను విధిగా ఎర్రకోట పరిరక్షణకే ఖర్చు పెట్టాలన్నది అందులో ఓ షరతు. నిర్మాణం దెబ్బతినకుండా మిగతా కోటలో ఎన్ని రెస్లారెంట్లనైనా, ఎన్ని హోటళ్లనైనా నడుపుకోవచ్చు. ఎంత రేటైన పెట్టుకోవచ్చు. ఖరీదైన పర్యాటకుల కోసం సకల కళలను పోషించవచ్చు. ఎంత సొమ్మయిన ఆర్జించవచ్చు. ప్రస్తుతం ఎర్రకోట సందర్శనకు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయానికి భారతీయులు ఒక్కరికి 35 రూపాయలు, విదేశీయులకు 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. రేపు భారతీయుల నుంచే 500 రూపాయలు వసూలు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రతి ఎంట్రీకి రెండు స్నాక్స్ ఇస్తామంటూ ఆ స్నాక్ల బిల్లును కంపెనీ తన ఖాతాలో కూడా వేసుకోవచ్చు. హైదరాబాద్లో ఫలక్నుమా ప్యాలెస్ ద్వారా తాజ్ గ్రూప్ ఎంత సంపాదిస్తుందో, అంతకన్నా పదింతలు ఎర్రకోట ద్వారా సంపాదించవచ్చన్నది ఎవరైనా ఊహించవచ్చు. సమైక్య భారత్ చిహ్నంగా ఏటా స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై త్రివర్ణ ప్రతాకాన్ని ఎగురవేసి దేశ ప్రధాని ప్రసంగించడం ఆనవాయితీ. ఆ ఆనవాయితీని బీజేపీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా కొనసాగిస్తూ వచ్చారు. మహారాష్ట్ర మీదుగా అఫ్ఘానిస్తాన్ వరకు విస్తరించిన మొఘల్ చక్రవర్తుల చరిత్రను చెరిపేసి ఆధునిక మహారాష్ట్రలో కొన్ని జిల్లాల విస్తీర్ణానికి మాత్రమే పరిమితమైన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ చరిత్రను విస్తరించేందుకు 210 మీటర్ల విగ్రహాన్ని నిర్మిస్తున్న బీజేపీ పాలకులు....ఎర్రకోటను దాల్మియా స్వాధీనం చేసుకున్నాక శివాజీ రాజ్యానికి రాజధాని అయిన ‘రాయ్గఢ్’ నుంచి స్వాతంత్య్ర దినోత్సవం జాతీయ జెండాను ఎగురవేస్తారా?! -
54 మంది ఐఏఎస్లకు నోటీసులు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారులపై చర్యలకు సిద్ధమైపోయింది. రాజ్యాంగాన్ని అగౌరవ పరిచారంటూ పేర్కొంటూ ఉన్నతాధికారులందరికీ షో కాజ్ నోటీసులు జారీ చేసింది. వీరిలో 54 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉండటం విశేషం. ఆగష్టు 15 సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డెహ్రాడూన్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పలువురు అధికారులు గైర్హాజరయ్యారు. ఇది గమనించిన ముఖ్యమంత్రి తివేంద్ర సింగ్ రావత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా చీఫ్ సెక్రటరీ రామస్వామిని ఆదేశించారు. దీంతో స్పందించిన సీఎంవో కార్యాలయం 87 మంది ఐఏఎస్ ఆఫీసర్లకు నోటీసులు పంపింది. వీరిలో 10 మంది డిప్యూటేషన్ మీద ఉండగా, 46 మంది అదనపు సెక్రటరీలు, ఐదుగురు సెక్రటరీ ఇన్ ఛార్జీలు, ఒక ప్రిన్సిపాల్ సెక్రటరీ, మరో ఇద్దరు సెక్రటరీలు ఉన్నారు. వీరి నుంచి వివరణ కోరిన ప్రభుత్వం అది సహేతుకంగా లేని పక్షంలో వార్షిక నివేదిక సమయంలో వారిపై చర్యలు తీసుకునే ఆస్కారం ఉందని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గైర్హాజయ్యారయిన ఉద్యోగులపై కూడా తీసుకోవాలంటూ అధికారులకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రం ఏర్పడి 17 ఏళ్లు గడుస్తున్నా ఇంతకాలం అధికారిక కార్యక్రమాలకు హాజరుకాని వాళ్లను హెచ్చరించి వదిలేశారేగానీ, ఇలా క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం ఇదే ప్రథమమని ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి స్పందించారు. -
సాక్షి ప్రధాన కార్యాలయంలో జెండా పండుగ
హైదరాబాద్: సాక్షి మీడియా గ్రూపు ప్రధాన కార్యాలయంలో మంగళవారం 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ కార్యాలయంలో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కే రాంచంద్రమూర్తి జాతీయ జెండాను ఎగరవేసి, స్వాత్రంత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ దిలీప్ రెడ్డి, సాక్షి మార్కెటింగ్ డైరెక్టర్లు కేఆర్పీ రెడ్డి, వైఈపీ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో సాక్షి పత్రిక, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియా సిబ్బంది పాల్గొన్నారు. -
బీ అలెర్ట్!
♦ నిఘా వర్గాల హెచ్చరిక ♦ రాష్ట్రంలో భద్రత కట్టుదిట్టం ♦ తనిఖీలు ముమ్మరం ♦ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రిహార్సల్స్ తమిళనాట స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల విచ్ఛి్చన్నానికి పాకిస్తానీ ముష్కరులు కుట్ర చేసినట్టుగా నిఘా వర్గాలకు సమాచారం అందింది. కేంద్రం హెచ్చరికలతో రాష్ట్రంలో గురువారం నుంచే భద్రతను కట్టుదిట్టం చేశారు. వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. చెన్నైతోపాటు మీనాక్షి అమ్మవారు కొలువుదీరిన మదురైలో ఐదు అంచెల భద్రతను పెంచారు. సాక్షి, చెన్నై : రాష్ట్ర రాజధాని నగరం చెన్నై, ఆధ్యాత్మిక నగరం మదురై తీవ్రవాదుల హిట్లిస్ట్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ దృష్ట్యా, పోలీసు యంత్రాంగం అప్రమత్తంగానే వ్యవహరిస్తూ వస్తోంది. కేంద్రం, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చే సమాచారంతో ఎప్పటికప్పుడు నిఘాతో వ్యవహరిస్తూ వస్తోంది. అయితే, ఇటీవల రాష్ట్రంలో వెలుగుచూస్తున్న పరిణామాలు భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. గతంలో జరిగిన బెంగళూరు బాంబు పేలుళ్ల కేసు రాష్ట్రం చుట్టూ తిరగడం, ఐఎస్ఐఎస్ మద్దతుదారుల కార్యకలాపాలు వెలుగులోకి రావడం వంటి పరిణామాల నేపథ్యంలో ఆందోళన తప్పడం లేదు. అలాగే, హిందూ సంఘాలు, బీజేపీ నేతల్ని గురి పెట్టి దాడులకు వ్యూహ రచనలు జరిగినట్టుగా సంకేతాలు వస్తుండడాన్ని బట్టి చూస్తే, రాష్ట్రం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతోందనే అనుమానాలున్నాయి. చాప కింద నీరులా సంఘ విద్రోహశక్తులు కార్యకలాపాల్ని విస్తృతం చేస్తున్నారా? అన్న ఆందోళన తప్పడం లేదు. భద్రత కట్టుదిట్టం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల విచ్ఛిన్నానికి కుట్ర జరిగిన సమాచారం ఆందోళన కల్గిస్తోంది. పాకిస్తానీ ముష్కరులు సముద్రమార్గం గుండా రాష్ట్రంలో చొరబడేందుకు వ్యూహరచన చేసినట్టు కేంద్ర నిఘా వర్గాలు పసిగట్టినట్టు సమాచారం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సముద్ర తీరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు సంయుక్తంగా గస్తీలో నిమగ్నం అయ్యారు. ఇక రాష్ట్రంలోని చెన్నై, మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటుగా, మదురై, తిరుచ్చి, కోయంబత్తూర్, సేలం విమానాశ్రయాల్లో, ఆ నగరాల్లో భద్రతను పటిష్టం చేశారు. ఎలాంటి విధ్వంసకర సంఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా రైల్వే స్టేషన్లు, బస్టాండులు, ఆలయాలు, పర్యాటక కేంద్రాల్లో భద్రతను పెంచారు. ఆయా నగరాల సరిహద్దుల్లో ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటుచేసి వాహనాల తనిఖీల్లో నిమగ్నమయ్యారు. చెన్నైలో అయితే, మెరీనాతీరంలో భద్రత పెంచారు. సెంట్రల్, ఎగ్మూర్, తాంబరంలతో పాటుగా అన్ని రైల్వే స్టేషన్లను నిఘా వలయంలోకి తీసుకొచ్చారు. కోయంబేడు బస్టాండ్లో భద్రతపరంగా పటిష్ట చర్యలు తీసుకున్నారు. ప్రతి ప్రయాణికుడ్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరం అనుమతిస్తున్నారు. సెంట్రల్, ఎగ్మూర్లకు వచ్చే రైళ్ల మీద నిఘా పెంచారు. రిహార్సల్ స్వాతంత్ర దినోత్సవ వేడుకకు నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ దృష్ట్యా, సచివాలయం నుంచి కామరాజర్ సాలై వైపుగా ఏర్పాట్ల మీద అధికారులు దృష్టి పెట్టారు. సచివాలయంలో ప్రప్రథమంగా సీఎం హోదాలో పళని స్వామి ఈసారి జాతీయ పతాకాన్ని ఎగుర వేయనున్నారు. ఈ వేడుకలు మరింత ఘనంగా సాగే విధంగా ఏర్పాట్లు విస్తృతం అయ్యాయి. ఇందులో త్రివర్ణ దళాలు, రాష్ట్ర పోలీసు శాఖలోని వివిధ విభాగాల కవాతులు, విద్యార్థుల నృత్య ప్రదర్శనలు సాగనున్నాయి. ఈ ప్రదర్శనల నిమిత్తం రిహార్సల్స్కు శ్రీకారం చుట్టారు. గురువారం పోలీసుల నేతృత్వంలో ఉదయాన్నే రిహార్సల్స్ సాగాయి. ఇక, శుక్రవారం నుంచి అన్ని విభాగాల నేతృత్వంలో రిహార్సల్స్ ఓవైపు, శకటాల ముస్తాబు మరోవైపు సాగనున్నాయి. ఈ పనులు జరిగే ప్రాంతాల్లోనూ భద్రత పటిష్టం చేశారు. -
పంద్రాగస్టు వేడుకలకు వెళ్లొస్తుంటే దారుణం
చండీగఢ్: హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరై వస్తున్న పన్నెండో తరగతి విద్యార్ధినిపై సామూహిక లైంగిక దాడి జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం హర్యానాలోని కియోరా అనే గ్రామానికి చెందిన పన్నెండో తరగతి విద్యార్థిని తన పాఠశాలలో పంద్రాగస్టు వేడుకలకు హాజరై తిరిగొస్తుండగా బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అడ్డగించారు. బైక్ కు కొద్ది దూరంలో మరో ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చారు. ఆ తర్వాత అందరూ కలిసి ఆ అమ్మాయిని కత్తితో బెదిరించి ఎత్తుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. కిడ్నాప్ చేసిన ప్రాంతం నుచి టిక్ అనే గ్రామంలోని ఓ ఇంట్లో వాళ్లు ఆకృత్యానికి దిగారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. -
'నేను వీఐపీనీ..జెండా ఎగురవేసింది నేనే'
-
'నేను వీఐపీనీ..జెండా ఎగురవేసింది నేనే'
భువనేశ్వర్: ఒడిశా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి జోగీంద్ర బెహరా ఓ వివాదంలో చిక్కుకున్నారు. వ్యక్తిగత సెక్యూరిటీ అధికారితో షూ లేస్ కట్టించుకుంటూ స్థానిక మీడియాకు చిక్కారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున జరిగిన ఈ ఘటనపై పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. అయితే తాను చేసిన పనికి సమర్థించుకున్న మంత్రివర్యులు పైపెచ్చు తాను వీఐపీ నంటూ చెప్పుకొచ్చారు. వివరాల్లోకి వెళితే...కియోంజర్లోని హెడ్ క్వార్టర్స్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మంత్రి జోగీంద్ర బెహరా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకం ఆవిష్కరించిన అనంతరం జోగీంద్ర బెహరా షూ తొడుక్కుంటున్న సమయంలో ఆయన పీఎస్వో మంత్రి షూ లేసును కట్టడం వీడియోలో కనిపించింది. దీంతో ప్రతిపక్షాలు మంత్రిపై చర్యలపై విమర్శలు ఎక్కుపెట్టాయి. స్వాతంత్ర్య దినోత్సవం రోజున జరిగిన ఈ ఘటనను చూస్తుంటే ఇది బ్రిటిష్ మనస్తత్వానికి ప్రత్యక్ష నిదర్శనమని న్యాయవాది ప్రహ్లాద్ సింగ్ వ్యాఖ్యనించారు. కాగా తనపై వచ్చిన విమర్శలకు స్పందించిన మంత్రి జోగీంద్ర .. తానో వీఐపీనని, జెండా ఎగురవేసింది తానే కానీ పీఎస్వో కాదని పేర్కొనడం గమనార్హం. మరోవైపు మంత్రి వ్యవహారంపై ఒడిశా ప్రభుత్వం స్పందించలేదు. -
గోల్కొండ కోటలో ఘనంగా పంద్రాగస్టు
సాక్షి, హైదరాబాద్: కోట గోడ మీద సైనికుల పహారా.. పక్కనే స్వాగత ద్వారంపై భేరీలు, నగారాలు మోగిస్తూ జయజయధ్వానాలు.. సంప్రదాయ వాద్య, సంగీత, నృత్య విన్యాసాలు.. చిందు యక్షగాన మాధుర్యం.. ఒగ్గుడోలు లయబద్ధ శబ్ద విన్యాసం.. వీటన్నింటికీ సొగసులద్దుతున్నట్టుగా లంబాడీ యువతుల నృత్యాలు.. మేమేమీ తీసిపోమన్నట్టు యువకుల గుస్సాడీ నృత్యాలు.. ఆ పక్కనే కొమ్ముబూరల పలకరింపు.. హైదరాబాదీ ప్రత్యేక మార్ఫీ ఉల్లాసం.. రాజన్న డోలు, డప్పుల శబ్దాలు.. ఆ ఊపును మరింత పెంచే షేరీబాజా బృందం.. ఖవ్వాలీ సంగీతం.. ముజ్రా నృత్యం... ఇదీ గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకల దృశ్యం. 70వ స్వాతం త్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, వేడుకలు అలరించాయి. అమర జవాన్లకు నివాళులర్పించి.. తొలుత సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ పరేడ్ మైదానం వద్ద ఉన్న అమర జవాన్ల స్మారక స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఉదయం పది గంటల సమయంలో గోల్కొండ కోటకు చేరుకున్నారు. పోలీసు సమ్మాన్ గార్డ్స్ స్వాగతిస్తుండగా కోటలోకి వచ్చారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆహూతులను ఉద్దేశించి ప్రసంగించి, పోలీసు వందనం స్వీకరిం చారు. హరితహారం కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న వారికి హరితమిత్ర పురస్కారాలు ప్రదానం చేశారు. రాష్ట్రపతి పోలీసు పతకాలు సాధించిన పోలీసు అధికారులు, సిబ్బందికి మెడల్స్ ప్రదానం చేశారు. స్థలాభావం.. అంతా హడావుడి.. స్వాతంత్య్ర దినోత్సవం అనగానే పోలీసు వందనం, వివిధ విభాగాల పోలీసులు, ఎన్సీసీ సిబ్బంది కవాతు, ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన, చిన్నారుల నృత్య విన్యాసాలు ఉంటాయి. వాటిని వీక్షించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో వేడుకలు నిర్వహించినప్పుడు ఆ సందడి కనిపించేది. కానీ గోల్కొండ కోటలో దిగువన రాణీమహల్ వద్ద కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అక్కడ సరిపడినంత స్థలం లేక పోలీసు కవాతు, శకటాలు, నృత్యాలకు అవకాశం లేకుండా పోయింది. సోమవారం వందల మంది కళాకారులు ప్రదర్శించిన సంగీత, నృత్య విన్యాసాలు ఆకట్టుకున్నా... వాటికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయారు. సీఎం కేసీఆర్ కోట వద్దకు కొద్ది సేపట్లో చేరుకుంటారనగా కళాకారులకు అవకాశమిచ్చారు. కానీ రెండు, మూడు నిమిషాల్లోనే ముగించాలనడంతో వారంతా ఉసూరుమన్నారు. తమ విన్యాసాల్లో మునిగిపోయిన కళాకారులకు ‘చాలు.. ఇక ఆపండి’ అని పలుమార్లు సూచించడంతో.. సందర్శకులు విస్మ యం వ్యక్తం చేశారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల చిన్నారులు ప్రత్యేక విన్యాసాలకు సిద్ధమైనా.. ప్రదర్శించే అవకాశం లేకపోవటంతో సీఎం ప్రసంగానికి చప్పట్లు కొట్టడానికే పరిమితమయ్యారు. ప్రసంగం అనంతరం అర నిమిషం పాటు అలల తరహాలో విన్యాసంతో ఆకట్టుకున్నారు. స్థలంలేక సాధారణ సందర్శకులను లోనికి అనుమతించకపోవడంతో కోటకు దూరంగానే ఉండిపోయారు. వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, వారి కుటుంబసభ్యులు, అమెరికా, ఇరాన్ ఎంబసీల ప్రతినిధులు పాల్గొన్నారు. పురస్కార గ్రహీతలు వీరే.. హరిత మిత్ర పురస్కారాలు అందుకున్నవారు.. నిజామాబాద్ కలెక్టర్ యోగితారాణా, నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం గిద్ద జెడ్పీ పాఠశాల, సిద్దిపేట పురపాలక సంఘం, ఆర్మూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ, గ్రామీణాభివృద్ది శాఖ జాయింట్ కమిషనర్, హయత్నగర్ డిస్పెన్సరీ అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్ వంశీకృష్ణారెడ్డి, మెదక్ గ్రామీణ నీటి పారుదల విభాగం ఎస్ఈ విజయ్ప్రకాశ్. రాష్ట్రపతి పురస్కారం పొందిన సూక్ష్మ కళాఖండాల నిపుణుడు మారుతికి ప్రశంసా పత్రం అందజేశారు. పోలీసు సేవాపతకాలు పొందినవారు రవి గుప్తా (ఐపీఎస్), నవీన్ చంద్ (ఐపీఎస్), గోవింద్ సింగ్ (ఐపీఎస్), వై.గంగాధర్ (ఐపీఎస్), నాగరాజు (అదనపు డీసీపీ), అనూప్ కుమార్మిశ్రా (డీఎస్పీ), ఆర్.వెంకటయ్య (గ్రేహౌండ్స్ అసిస్టెంట్ కమాండర్), బి.జనార్దన్ (డీఎస్పీ), నారాయణ (ఏసీపీ), డి.రామ్గోపాల్ (ఇన్స్పెక్టర్), ఎండీ గౌస్ (ఆర్ఎస్ఐ-పీటీసీ), తిరుపతిరెడ్డి (ఏఎస్సై), లక్ష్మారెడ్డి (హెడ్కానిస్టేబుల్), వెంకటేశ్వరరావు (హెడ్కానిస్టేబుల్), లునావత్ గోపి (కానిస్టేబుల్), ఐలమల్లు (ఫైర్మ్యాన్), ఎంఏ రవూఫ్ (డ్రైవర్ ఫైర్ ఆపరేటర్) -
ఉప్పొంగిన ఉత్సాహం
కనులపండువగా పంద్రాగస్టు వేడుకలు పరేడ్గ్రౌండ్స్లో మిన్నంటిన సంబురాలు అలరించిన విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్న శకటాలు సాక్షి, సంగారెడ్డి: జిల్లా కేంద్రం సంగారెడ్డిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. సంగారెడ్డిలోని పోలీసు పరేడ్గ్రౌండ్స్లో జరిగిన వేడుకలకు జిల్లా మంత్రి హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మంత్రి హరీష్రావు పోలీసులు గౌరవవందనం స్వీకరించారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను మంత్రి హరీశ్రావు సన్మానించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను కలెక్టర్, ఎస్పీ, ఎంపీ, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి వీక్షించారు. సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొన్న విద్యార్థులకు మంత్రి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కలెక్టర్ రోనాల్డ్ రోస్, ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి జ్ఞాపికలను అందజేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సాంస్కృతి ప్రదర్శనల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ రూ.5వేల చొప్పున నగదు పురస్కారాలను అందజేశారు. అలరించిన ప్రదర్శనలు పోలీసు పరేడ్గ్రౌండ్స్లో నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతి ప్రదర్శలు ఆకట్టుకున్నాయి. చిట్కుల్ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థులు జాతీయసమైక్యత, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున పథకాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. మిషన్ భగీరథను ప్రధాని మోడీ ప్రారంభించటం, మిషన్కాకతీయ పథకం అమలు, భ్రూణహత్యల నివారణ, బేటీబచావో..బేటీపడావో కార్యక్రమాలను వివరిస్తూ విద్యార్థులు ఇచ్చిన ప్రదర్శనలు అలరించాయి. సంగారెడ్డికి చెందిన శ్రీచైతన్య హై స్కూల్ విద్యార్థిని కౌశిక భరతనాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. కేజీవీబీ నర్సాపూర్, సంగారెడ్డి జెడ్పీ బాలికల ఉన్నతపాఠశాల, సంగారెడ్డి విద్యాభారతి హైస్కూల్, సెయింట్ ఆంథోనీ హై స్కూల్, పటాన్చెరు శిశు విహార్ విద్యార్థుల ప్రదర్శనలను అందరినీ అలరింపజేశాయి. శకటాల ప్రదర్శన వివిధ ప్రభుత్వశాఖలు ప్రదర్శించిన శకటాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉద్యానవనశాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన, మహిళా శిశు సంక్షేమం, ఉపాధి హామీ పథకం, అటవీశాఖ, వైద్య ఆరోగ్యశాఖ, ఆర్బీఎస్ఏ, 108,104, ఫైర్ డిపార్టుమెంట్ శకటాలు ప్రదర్శించాయి. ఇదిలా ఉంటే ఐసీడీఎస్, అటవీశాఖల శకటాలపై జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మురళీయాదవ్ చిత్రాలను ముద్రించకపోవటం విమర్శలకు దారితీసింది. స్టాల్స్ను తిలకించిన మంత్రి పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో ప్రభుత్వ శాఖలు తమ పనితీరును వివరిస్తూ స్టాల్స్ను ఏర్పాటు చేశాయి. మంత్రి హరీశ్రావు స్టాల్స్ను తిలకించి అధికారుల పనితీరును అభినందించారు. జిల్లా సమాచార పౌరసంబంధాలశాఖ, డీఆర్డీఏ, ఈజీఎస్, ఐసీడీఎస్, ఎస్ఎస్ఏ, డీఎంహెచ్ఓ, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, ఎస్సీ,బీసీ, మైనార్టీ కార్పొరేషన్, పశుసంవర్థకశాఖ, వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ, వికలాంగుల సంక్షేమశాఖ, అటవీశాఖలు స్టాల్స్ను ఏర్పాటు చేశాయి. ఆయా స్టాల్స్ను మంత్రి హరీష్రావు, కలెక్టర్, ఎస్పీ, ఎంపీ, ఎమ్మెల్యేలు తిలకించారు. అనంతరం మంత్రి హరీష్రావు ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు కారు తాళాలు అందజేశారు. బీసీ, ఎస్సీ కార్పొరేషన్లోని వివిధ పథకాల కింద ఎంపికైన లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. -
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం
సిద్దిపేట జోన్: జిల్లాలో సోమవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజకీయ పార్టీలు, ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు జాతీయ జెండాను ఎగురవేశాయి. సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఆర్టీఓ ఏసురత్నం, న్యాయమూర్తులు, విద్యుత్ డీఈ శ్రీనివాస్రెడ్డి. డాక్టర్ శివానందం జెండాలను ఎగురవేశారు. మంత్రి హరీశ్రావు ఇంటి వద్ద టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నయ్యర్ పటేల్ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో మున్సిపల్ రాజనర్సు, కౌన్సిలర్లు బర్ల మల్లికార్జున్, వెంకట్గౌడ్, అక్తర్ పటేల్, తాళ్లపల్లి సత్యానారాయణ, శేషుకుమార్, రాంచందర్రావు, మంత్రి ఓఎస్డీ బాల్రాజు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గంప మహేందర్రావు జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు సికిందర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్వర్మ జెండాను ఆవిష్కరించారు. బీజేపీ కార్యాలయం వద్ద ఆ పార్టీజిల్లా మాజీ అధ్యక్షుడు వంగ రాంచంద్రారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రన్సిపాల్ శ్రీనివాస్రెడ్డి జెండా ఆవిష్కరించారు, పట్టణంలోని బీసీ స్టడీ సర్కిల్ వద్ద డైరెక్టర్ రాములు జెండా ఎగురవేశారు.శివాజీ నగర్లో, పట్టణంలో పలు చోట్ల వైఎస్సార్ సీపీ జగన్ సేన నాయకులు విజయ్, రాజలింగం, రఘు, మధు, తిరుపతి జెండా ఆవిష్కరణ చేశారు. లోక్సత్తా పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో జిల్లా అధ్యక్షుడు రాజు పాల్గొన్నారు. సిద్దిపేట ఫర్నిచర్ అసోసియేషన్, ఎలియన్స్ క్లబ్, వాసవీ క్లబ్, పద్మశాలి చేనేత సంఘం ఆధ్వర్యంలో, భారత్ నగర్ షాప్, నీలకంఠ యూత్, వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేరువేరుగా జెండాలను ఎగురవేశారు. -
'2050 నాటికి అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీ'
అనంతపురం: ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురంలో 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. నీలం సంజీవరెడ్డి స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఓపెన్ టాప్ జీపులో నిల్చొని పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అత్యుత్తమ సేవలు అందించిన పోలీసులకు సీఎం మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా వేడుకల్లో ప్రదర్శించిన వివిధ శాఖలకు చెందిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఎందరో మహనీయులను స్మరించుకోవాల్సి ఉందన్నారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామన్నారు. ఎన్టీఆర్ భరోసా పేరుతో పేదవారికి పింఛన్లు ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. వ్యాపార అనుకూల రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు. 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ఎవ్వరూ ఇవ్వని విధంగా పెన్షన్లు అందిస్తున్నామన్నారు. అగ్రవర్ణాల్లో పేదవారికి రిజర్వేషన్ల అమలును పరిశీలిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. -
తెలంగాణ అసెంబ్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
-
తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్