పంద్రాగస్టు వేడుకలకు బెజవాడ ముస్తాబు | Indira Gandhi Municipal Stadium Vijayawada Independence Day | Sakshi

పంద్రాగస్టు వేడుకలకు బెజవాడ ముస్తాబు

Aug 11 2022 4:28 AM | Updated on Aug 11 2022 12:44 PM

Indira Gandhi Municipal Stadium Vijayawada Independence Day - Sakshi

ఏర్పాట్లపై సమీక్షిస్తున్న ఎమ్మెల్సీ తలశిల, ఎమ్మెల్యే విష్ణు, కలెక్టర్‌ ఢిల్లీరావు, సీపీ రాణా తదితరులు

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియం 75వ స్వాతంత్య్ర దినోత్సవాలకు ముస్తాబవుతోంది. ముఖ్యమంత్రి సీఎం వైఎస్‌ జగన్‌ కార్యక్రమాల కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు, నగర పోలీస్‌ కమిషనర్‌ టీకే రాణా, జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌లు బుధవారం ఈ వేడుకల ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.

తలశిల మాట్లాడుతూ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. వీటిని తిలకించేందుకు ఈ ఏడాది సామాన్య ప్రజలకూ అనుమతిస్తున్నట్టు చెప్పారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాలపై 15 శకటాలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement